breaking news
Nizamabad
-
15న ఇన్చార్జి మంత్రి సీతక్క పర్యటన
నిజామాబాద్ అర్బన్: జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క ఈనెల 15వ తేదీన జిల్లాలో పర్యటించనున్నారు. ముందుగా కామారెడ్డి జిల్లాలో నిర్వహించే పలు కార్యక్రమాల్లో పా ల్గొని మధ్యాహ్నం 2.30గంటలకు జిల్లాకు చేరుకుంటారు. కమ్మర్పల్లి మండలం నాగా పూర్ గ్రామంలో గ్రామపంచాయతీ భవనా న్ని ప్రారంభిస్తారు. మోర్తాడ్లో నిర్వహించే సభలో పాల్గొంటారు. కార్యక్రమాల అనంతరం ములుగుకు తిరిగి బయల్దేరుతారు. మెడికల్ కళాశాలకు మరో 30 సీట్లు నిజామాబాద్ అర్బన్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలకు నేషనల్ మెడికల్ కౌన్సిల్ (ఎన్ఎంసీ) మరో 30 సీట్లను కేటాయించింది. కళాశాలలో 150 మె డికల్ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. 2013లో 100 సీట్లతో మెడికల్ కళాశాల ప్రారంభం కాగా, 2019లో ఈడబ్ల్యూఎస్ కోట కింద 20 సీట్లను కేటాయించారు. ప్ర స్తుత 30 సీట్లను కేటాయించారు. ప్రస్తుతం మెడికల్ కళాశాలలో 81 ీపీజీ సీట్లు ఉన్నాయి. అదనపు సీట్లు కేటాయించడంపై మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ కృష్ణమోహన్ హర్షం వ్యక్తం చేశారు. నేత్రాలయానికి ఆరు ఎకరాల భూమి నందిపేట్ (ఆర్మూర్): మండల కేంద్రంలోని పలుగు గుట్ట ప్రాంతంలో నేత్రాలయం నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆరు ఎకరాల భూమిని కేటాయించినట్లు కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు కేదారానంద స్వామి తెలిపారు. భూమి కేటాయింపునకు కృషి చేసిన ప్రభుత్వ సలహాదారు పొద్దుటూరు సుదర్శన్రెడ్డిని శనివారం హైదరాబాద్లో కే దారానంద స్వామి మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. కేదారేశ్వర ఆశ్రమానికి తమ సహాయ సహకారాలు ఎప్పటికీ ఉంటాయని, ఆస్పత్రి నిర్మాణం కోసం ప్రభు త్వం నుంచి నిధులు ఇప్పించేందుకు కృషి చేస్తానని సుదర్శన్రెడ్డి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి వినయ్కుమార్రెడ్డి, ఆశ్రమ కమిటీ సభ్యులు సాయికృష్ణారెడ్డి, సంజీవ్, లక్ష్మణ్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఆరు వారాల్లో 1784 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నిజామాబాద్ అర్బన్: జిల్లా వ్యాప్తంగా గడిచిన ఆరు వారాల్లో 1784 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదైనట్లు సీపీ సాయిచైతన్య శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రూ.కోటీ 45 లక్షల ఇరవై వేల రూపాయల జరిమాను విధించినట్లు వివరించారు. అలాగే 124 మందికి న్యాయస్థానాలు జైలు శిక్ష, మిగతా వారికి జరిమానా విధించాయని తెలిపారు. ఆగస్టు 2 నుంచి సెప్టెంబర్ 12వ తేదీ వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదైనట్లు వివరించారు. సబ్స్టేషన్ ముట్టడిడిచ్పల్లి: విద్యుత్ సరఫరాలో కోతలను నిరసిస్తూ మండలంలోని మెంట్రాజ్పల్లి, నాకా తండా, వెస్లీ తండా గ్రామాలకు చెందిన రైతులు శనివారం 33/11 కేవీ విద్యుత్ సబ్స్టేషన్ను ముట్టడించారు. వరి పొట్ట దశలో ఉందని, విద్యుత్ సరఫరాలో తరచూ అంతరాయం కారణంగా పంటలు నష్టపోయే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పంటలను కాపాడేందుకు కనీసం 14 గంటలపాటు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలని రైతుల డిమాండ్ చే శారు. వారం రోజులుగా కేవలం నాలుగైదు గంటలు విద్యుత్ సరఫరా ఇస్తుండడంతో పంటలకు సాగునీరందడం లేదన్నారు. ఎస్సై ఎండీ ఆరిఫ్ ఘటన స్థలానికి చేరుకుని రైతులతో మాట్లాడారు. సబ్ స్టేషన్లో సంబంధిత అధికారులు అందుబాటులో లేకపోవడంతో ఫోన్లో చర్చించారు. ఇకనుంచి విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. -
ప్రతి ఒక్కరూ మట్టి గణపతులనే ప్రతిష్ఠించాలి
● సీనియర్ సివిల్ జడ్జి శ్రీదేవి ఆర్మూర్ టౌన్: పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మట్టి గణపతులనే ప్రతిష్ఠించి పూజలు చేయాలని సీనియర్ సివిల్ జడ్జి శ్రీదేవి పిలుపునిచ్చారు. ఆర్మూర్ పట్టణంలోని చిన్న బజార్లో చౌల్ సాయిప్రభాస్ ఆధ్వర్యంలో ఉచిత మట్టి గణపతుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా జడ్జి శ్రీదేవి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లా డుతూ.. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ గణపతులను ప్రతిష్టించడం వల్ల పర్యావరణం కలుషితమవుతుందని, అందుకే మట్టి గణపతులనే పూజించాలని సూచించారు. అలాగే న్యాయ సేవా సంస్థ అందిస్తున్న సేవలు, చట్టాల గురించి ప్రజలకు వివరించారు. అనంతరం జడ్జి శ్రీదేవి, ఆర్మూర్ ఎస్హెచ్వో సత్యనారాయణ గౌడ్, ట్రాఫిక్ ఎస్సై రఘుపతి, క్షత్రియ సమాజ్ అధ్యక్షుడు గటాడి ఆనంద్ చేతుల మీదుగా ప్రజలకు మట్టి గణపతులను పంపిణీ చేశారు. -
రోడ్డు వేయడం మరిచారు
నిధులు సరిపోలేవు గంగరమంద వంతెన నిర్మాణం కోసం ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు సరిపోలేదు. నిధులు ఉన్న మేరకు పనులు జరిగాయి. వంతెనకు ఇరువైపులా సీసీ చేయటానికి కొత్తగా ప్రతిపాదనలు పెట్టాలి. చిన్నాపూర్ వంతెన ఆర్అండ్బీ అధికారుల ఆధ్వర్యంలో చేట్టారు. దాంతో నాకు సంబంధం లేదు. – సాయి సూర్య, పంచాయతీరాజ్ ఏఈ, మాక్లూర్ఇరువైపులా సీసీ వేయాలి గంగరమంద వంతెన పూర్తయి సుమారు 2 సంవత్సరాలు కావస్తోంది. ఇంతవరకు వంతెనకు ఇరువైపులా సీసీ వేయలేదు. ఫలితంగా వంతెనకు ఇరువైపులా మట్టిరోడ్డుకు గుంతలు పడి చిందరవందర కావటంతో పది గ్రామాల వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే సీసీ వేయించాలి. – కరిపే రాజు, గంగరమంద, మాక్లూర్ -
రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది
వర్ని: రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుందని, ని యోజకవర్గంలోని ప్రతి గుంటకూ సాగు నీరందించడమే తన లక్ష్యమని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రె డ్డి అన్నారు. నిజాంసాగర్ ప్రధాన కాలువపై చందూర్ శివారులో నిర్మించిన లిఫ్ట్ను జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్తో కలిసి పోచారం శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో 1.45 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నానన్నారు. నిజాంసాగర్ కాలువల ద్వారా అందించే సాగునీటితోపాటు నిజాంసాగర్ కాలువ ఎగువన ఉన్న నాన్ కమాండ్ ఏరియా పంట పొలాలకు సాగునీరందించేందుకు రూ.106 కోట్లతో చందూర్, జాకోరా, చింతకుంట లిఫ్ట్ ఇరిగేషన్ల నిర్మాణం చేపట్టినట్లు వెల్లడించారు. తన రాజకీయ జీవితంలో వ్యక్తిగత స్వార్థం కోసం ఏనాడూ పనిచేయలేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎక్కడా లేని వి ధంగా సాగునీటి రంగానికి అధిక నిధులు మంజూ రు చేయించానని, ఇళ్లు లేని పేదల కోసం వేలాది ఇళ్లు మంజూరు చేయించి నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. అభివృద్ధి పనులు ప్రారంభం చందూర్ నుంచి లక్ష్మాపూర్ వరకు చేపట్టనున్న బీటీ రోడ్డు పనులను పోచారం శ్రీనివాస్రెడ్డి ప్రారంభించారు. చందూర్ బస్టాండ్ వద్ద శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించడంతోపాటు లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఆగ్రో ఇండస్ట్రీస్ మాజీ చైర్మన్ కాసుల బాలరాజు, డీసీసీబీ మాజీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి, వర్ని మార్కెట్ కమిటీ చైర్మన్ సురేశ్బాబా, చందూర్ సర్పంచ్ మాధవరెడ్డి, సహకార సంఘం అధ్యక్షుడు ప్యారం అశోక్, మాజీ ఎంపీపీ శ్రీనివాస్గౌడ్, మాజీ సర్పంచ్ సాయిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రతి గుంటకూ నీరందించడమే లక్ష్యం ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్రెడ్డి ఎంపీ షెట్కార్తో కలిసి చందూర్ లిఫ్ట్ ప్రారంభం -
కాంగ్రెస్ నాయకుల సంబరాలు
ఆర్మూర్టౌన్: ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో శనివారం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కౌన్సిలర్లు సంబరాలు జరుపుకున్నారు. మున్సిపల్ కార్యాలయ భవన నిర్మాణానికి రూ.7.5 కోట్లు మంజూరు చేసినందుకు సీఎం రేవంత్రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం మున్సిపల్ చైర్పర్సన్ గోనె లహరి, మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబాగౌడ్ మాట్లాడుతూ.. నిధులు మంజూరుకు కృషి చేసిన పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్రెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క, నియోజకవర్గ ఇన్చార్జి వినయ్రెడ్డికి ప్రత్యేక ధన్యవాదలు తెలిపారు. బీజేపీ నేతల ఆధ్వర్యంలో.. ఆర్మూర్టౌన్: పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద శనివారం బీజేపీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పైడిరాకేష్రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈసందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షుడు మందుల బాలు మాట్లాడుతూ.. నూతన మున్సిపల్ భవనానికి రూ. ఏడున్నర కోట్లు నిధులు తీసుకొచ్చిన ఘనత ఎమ్మెల్యే పైడి రాకేష్రెడ్డికే చెందుతుందన్నారు. అసెంబ్లీ సాక్షిగా నిధుల కోసం పోరాడి తీసుకొచ్చారన్నారు. అలాగే రోడ్ల మరమ్మతులకు సైతం నిధులు తెచ్చారన్నారు. బీజేపీ నాయకులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. -
స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
కమ్మర్పల్లి(భీమ్గల్): భీమ్గల్ మండలం గోన్గొప్పులలోని పలువురు లబ్ధిదారులకు మంజూరైన నూతన స్మార్ట్ రేషన్కార్డులను స్థానిక సర్పంచ్ సేపూర్ చరణ్గౌడ్ శనివారం పంపిణీ చేశారు. నాయకులు శ్రీనివాస్, భోజాగౌడ్, మహేష్, శేఖర్, స్వామి, నాయక్, భూమేష్, సుదర్శన్గౌడ్, బొర్రన్న, శంకర్, తదితరులు పాల్గొన్నారు. రుద్రూర్: అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రుద్రూర్, రాణంపల్లి సర్పంచ్లు ఇందూరు సునీత చంద్రశేఖర్, కొండల్వాడీ శంకర్ అన్నారు. శనివారం గ్రామ పంచాయతీల వద్ద నూతనంగా మంజూరైన స్మార్ట్ రేషన్ కార్డులను లబ్ధిదారులకు సర్పంచ్లు అందజేశారు. రాయకూర్ విండో వైస్ చైర్మన్ తోట అరుణ్, ఉపసర్పంచ్లు షేక్ నిస్సార్, షాదుల్, వార్డు సభ్యులు పాల్గొన్నారు. -
వ్యవసాయానికి 18 గంటల విద్యుత్ ఇవ్వాలి
● లో ఓల్టేజీ సమస్య లేకుండా చూడండి ● విద్యుత్ ఎస్ఈకి బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ వినతిసుభాష్నగర్: వ్యవసాయ రంగానికి విద్యుత్ సరఫరాలో లో ఓల్టేజీ సమస్య లేకుండా చూడాలని, రో జుకు 18 గంటలపాటు నాణ్యమైన విద్యుత్ను సర ఫరా చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ పటే ల్ కులాచారి డిమాండ్చేశారు. ఈమేరకు శనివారం నగరంలోని విద్యుత్భవన్లో ఎన్పీడీసీఎల్ ఎస్ఈ పీవీ రాజేశ్వర్రావును కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా దినేశ్ మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా రైతాంగం సుమారు 2.5 లక్షల వ్యవసాయ పంపుసెట్ల కింద దాదాపు 6 లక్షల ఎకరాల్లో వివిధ పంటలను సాగు చేశారని తెలిపారు. ప్రభు త్వం రైతులకు అవసరమైన విద్యుత్ను అందించడంలో ఘోరంగా విఫలమైందని, ప్రస్తుతం సరఫరా చేస్తున్న 7 నుంచి 8 గంటల కరెంట్ కూడా లో ఓల్టేజీతో వస్తుండటంతో బోరుమోటార్లు కాలిపో తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పంటలకు సకాలంలో నీరందక అన్నదాతలు తీవ్ర ఆర్థిక నష్టాలను చవిచూస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం, విద్యుత్ అధికారులు స్పందించి ఎలాంటి లో ఓల్టేజీ, సరఫరా అంతరాయం లేకుండా రోజుకు 18 గంటల నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. పరిస్థితిలో మార్పు లే కుంటే రైతుల పక్షాన బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తు న ఆందోళన కార్యక్రమాలు, ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. నాయకులు, కార్పొరేటర్లు లక్ష్మీనారాయణ, ప్రమోద్కుమార్, తిరుపతిరెడ్డి, గంగారెడ్డి, కర్క గంగారెడ్డి, తోట చిన్నయ్య, రాజేశ్వ ర్ రెడ్డి, అన్నం గోపి, పద్మారెడ్డి, జగన్రెడ్డి, ఆనంద్, శంకర్ రెడ్డి, నాయిడి రాజన్న, చిరంజీవి, తదితరులు పాల్గొన్నారు. -
కొత్త ఓటర్ల నమోదుకు ప్రత్యేక క్యాంపెయిన్
రుద్రూర్: కొత్త ఓటర్ల నమోదుకు గ్రామాల్లో స్పెషల్ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు. చిక్కడపల్లి పోలింగ్ కేంద్రాన్ని తహసీల్దార్ తారాబాయి శనివారం సందర్శించారు. ఓటర్ల నమోదు ప్రక్రియపై బీఎల్వో అశోక్ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సర్పంచుల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా లింగం నందిపేట్ (ఆర్మూర్): నందిపేట గ్రామ సర్పంచ్ ఎర్రం లింగంను ఉన్నత పదవి వరించింది. నందిపేట సర్పంచ్గా ఎన్నికై న ఎర్రం లింగం నందిపేట మండలం సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా కొనసాగుతూ నేడు రాష్ట్ర సర్పంచ్ల ఫోరం రాష్ట్ర కార్యదర్శిగా నియమితులయ్యారు. హైదరాబాదులో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో సంఘం అధ్యక్షుడు భూమన్న యాదవ్ చేతుల మీదుగా ఆయన ఎన్నిక పత్రాన్ని అందుకున్నారు. అంక్సాపూర్ గ్రామశాఖ అధ్యక్షుడిగా నేరెళ్ల రాజేశ్వర్ వేల్పూర్: అంక్సాపూర్లో కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడిగా ఉప సర్పంచ్ నేరెళ్ల రాజేశ్వర్ను శనివారం నియమించారు. ఈ మేరకు ఆయనకు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రంగు అనిల్గౌడ్ నియామకపత్రం అందజేశారు. సర్పంచ్ తీట్ల శ్రీనివాస్, నాయకులు పాశపు రమేశ్బాబు, చరణ్, రమేశ్, బుట్టి మధు, అరుణ్ తదితరులున్నారు. ముగిసిన శివనామ సప్తాహం రుద్రూర్: కోటగిరి మండల కేంద్రంలోని పోచా రం కాలనీలో శ్రీ అభయ బసవేశ్వర ఆలయం వద్ద శ్రావణ మాసం పురస్కరించుకుని నిర్వహిస్తున్న అఖండ శివనామ సప్తాహం శనివారం ముగిసింది. బాన్సువాడ నియోజకవర్గ బీజేపీ నాయకుడు, ఎన్ఆర్ఐ కోనేరు శశాంక్ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తుల కోసం అన్నదానంచేపట్టారు. బీజేపీ నేతలు ఏముల నవీన్, ఆలపాటి హరికృష్ణ పాల్గొన్నారు. అన్నప్రసాదం పంపిణీ వేల్పూర్(బాల్కొండ): బాల్కొండ మండలం కిసాన్నగర్లో శనివారం స్థానిక వీడీసీ ఆధ్వర్యంలో అన్న ప్రసాదం పంపిణీ చేశారు. ప్రతి ఏటా ఎడ్ల పొలాల అమావాస్య మరుసటి రోజున వీడీసీ ఆద్వర్యంలో అన్నప్రసాదం పంపిణి చేయడం ఆనవాయితీగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా హనుమాన్ ఆలయంలో పూజలు నిర్వహించారు. వీడీసీ అధ్యక్షుడు కొండా అశోక్, తదితరులు పాల్గొన్నారు. రోడ్డు మరమ్మతులకు రూ.4.40 కోట్లు డొంకేశ్వర్(ఆర్మూర్): మండలంలోని తొండాకూర్ నుంచి గాదేపల్లి వరకు బీటీ రోడ్డుకు మోక్షం కలిగింది. దత్తాపూర్, మారంపల్లి, గంగాసముందర్, నూత్పల్లి మీదుగా మొత్తం 9.4 కిలో మీటర్ల రోడ్డు మరమ్మతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.4.40 కోట్లు మంజూరు చేసింది. ఆర్అండ్బీ అధికారులు త్వరలో పనులు ప్రారంభించనున్నారు. ప్రతిపాదనలు పంపి నిధులు మంజూరు చేయించినందుకు ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డికి పలువురు కృతజ్ఞతలు తెలిపారు. -
చిరుత కోసం అటవీ సిబ్బంది గాలింపు
ఆర్మూర్ సీపీఎం కార్యాలయంలో సీతారాం చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న నాయకులునవీపేటలో.. డిచ్పల్లి: మండలంలోని దూస్గాం గ్రామంలోగల శివాలయం గుట్టపై చిరుత కోసం శనివారం అటవీ సిబ్బంది గ్రామస్తులతో కలిసి గాలింపు చేపట్టారు. ఈసందర్భంగా సెక్షన్ ఆఫీసర్ సాయికుమార్ మాట్లాడుతూ.. డీఎఫ్వో ఆదేశాల మేరకు గ్రామాన్ని సందర్శించినట్లు తెలిపారు. గుట్టపై చిరుత పాదముద్రలు కనిపించకపోవడంతో ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మొదట గ్రామస్తులు పంపిన ఫోటో ఏఐ జనరేటెడ్ కావడంతో పట్టించుకోని అటవీ శాఖ ఉన్నతాధికారులు.. ఫోన్లో ఫొటో కరెక్టేనని నిర్ధారించారు. గత ఐదు రోజుల్లో చిరుత రెండు మేకలపై దాడి చేసి చంపివేసినట్లు గ్రామస్తులు తెలిపారు. రైతులు పంట పొలాల వద్దకు వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని అటవీశాఖ అధికారులు సూచించారు. గాలింపు చర్యల్లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ శశిధర్, హరీష్, సురేష్, బేస్ క్యాంపు సిబ్బంది రవి, సర్పంచ్ సువర్ణ వెంకట్, ఉప సర్పంచ్ మురళి, వీడీసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సిరికొండ రేంజ్ పరిధిలో చిరుత సంచారం సిరికొండ: సిరికొండ రేంజ్ పరిధిలోని మహిపాల్ తండా సమీపంలోని అటవీ ప్రాంతంలో చిరుత పులి సంచరిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. అటవీ ప్రాంతంలోకి వెళ్లిన తండావాసులకు చిరుత పులి పాదముద్రలు కనిపించడంతో అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. డిప్యూటీ రేంజర్ గంగారం తన సిబ్బందితో కలిసి అక్కడికి వెళ్లి అవి చిరుత పాదముద్రలుగా గుర్తించారు. అనంతరం ఆయన స్థానికులకు అవగాహన కల్పిస్తూ చిరుతను చంపేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేపట్టవద్దని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. -
మత్తు వీడితేనే మంచి భవిష్యత్తు
కమ్మర్పల్లి(మోర్తాడ్): జీవితాలను చిత్తు చేస్తున్న మత్తును వీడితేనే మంచి భవిష్యత్తు సాధ్యమవుతుందని ఈగల్ ఫోర్స్ అడ్వైజర్ కొండవీటి శ్యామ్ ప్రసాద్ స్పష్టం చేశారు. కొందరి లాభాపేక్ష మరి కొందరికి ప్రాణ సంకటంగా మారిందన్నారు. శనివారం మోర్తాడ్, భీమ్గల్ లింబాద్రి గుట్ట దేవస్థానం వద్ద యాంటీ డ్రగ్స్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డ్రగ్స్ సేవించడం వల్ల నష్టమే జరుగుతుందని పల్లె పొలిమేరలోకి చేరిన గంజాయిని తరిమేందుకు ప్రజలు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. గుర్తుతెలియని వ్యక్తులు ఇచ్చిన ఎలాంటి పదార్థాలు స్వీకరించకూడదని ఆయన సూచించారు. చిన్నారులను తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు గమనిస్తుండాలన్నారు. మోర్తాడ్ ఎస్సై రాము, భీమ్గల్ ఎస్సై–2 శంకర్, సర్పంచ్ బోగా ఆనంద్, ఉప సర్పంచ్ శ్రీనివాసరెడ్డి, ఊట్నూర్ సాగర్, అడ్వాల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. -
పుష్కరకాలంగా మట్టి ప్రతిమల పంపిణీ
● బోధన్లో లయన్స్ క్లబ్ల ఆధ్యాత్మిక సేవ ● నేటి నుంచి 4వేల విగ్రహాల పంపిణీ బోధన్: పట్టణంలో సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుంటున్న లయన్స్ క్లబ్ ఆఫ్ బోధన్, ఆచన్పల్లి క్లబ్లు ఆధ్యాత్మిక సేవలోనూ తరిస్తున్నాయి. ప్రతి ఏడాది వినాయక చవితి సందర్భంగా వేల సంఖ్యలో మట్టి గణేశ్ ప్రతిమలను పంపిణీ చేస్తూ సంప్రదాయాన్ని కాపాడుతూ పర్యావరణ హితానికి కృషి చేస్తున్నాయి. గత పన్నెండేళ్లుగా ప్రతి సంవత్సరం 4వేల వరకు మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేస్తున్నారు. ఈసారి మట్టి వినాయక ప్రతిమలను పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తాలో ఉన్న అంకుటవర్ వద్ద ఆదివారం సాయంత్రం 4 గంటలకు మట్టి ప్రతిమల పంపిణీకి ఏర్పాట్లు చేసినట్లు క్లబ్ల ప్రతినిధులు తెలిపారు. ఆర్డీవో విజయకుమారి, ఏసీపీ శ్రీనివాస్, టౌన్ సీఐ వెంకట నారాయణ, తహసీల్దార్ విఠల్, లయన్స్ కంటి ఆస్పత్రి వ్యవస్థాపకులు పోలవరపు బసవేశ్వర్రావుల చేతుల మీదుగా ప్రతిమలను పంపిణీ చేస్తామని, పట్టణవాసులు మట్టి ప్రతిమలను పూజించాలని వారు కోరారు. పర్యావరణాన్ని రక్షిద్దాం నిజామాబాద్ అర్బన్: మట్టి గణపతులను పూజించి పర్యావరణాన్ని రక్షిద్దామని టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు సుమన్ అన్నారు. నగరంలోని టీఎన్జీవోస్ భవన్లో శనివారం మట్టి గణేశ్ ప్రతిమలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ.. గణపతి ప్రతిమలను ఉచితంగా పంపిణీ చేసి ఉద్యోగులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. మట్టి గణపతిని పూజించి పర్యావరణాన్ని రక్షించాలని కోరారు. టీఎన్జీవోస్ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు సంజీవయ్య, జాఫర్ హుస్సేన్, టీఎన్జీవోస్ అర్బన్ యూత్ అధ్యక్షులు సృజన్ కుమార్ పాల్గొన్నారు. -
లోక్ అదాలత్తో కేసుల సత్వర పరిష్కారం
● జిల్లా ఇన్చార్జి జడ్జి దుర్గాప్రసాద్ నిజామాబాద్ లీగల్ : పెండింగ్లో ఉన్న కోర్టు కేసుల పరిష్కారంలో లోక్అదాలత్లు ప్రముఖ పాత్ర పోషిస్తాయని జిల్లా ఇన్చార్జి జడ్జి, నాల్గవ అదనపు జిల్లా కోర్టు జడ్జి ధరావత్ దుర్గాప్రసాద్ అన్నారు. లోక్అదాలత్ ద్వారా పెండింగ్ కేసులను పరిష్కరించుకొని కక్షిదారులు మానసిక ప్రశాంతత పొందాలని సూచించారు. శనివారం జిల్లా కోర్టు ప్రాంగణంలోని న్యాయ సేవా సంస్థలో అదనపు కలెక్టర్ భుజంగ రావు, ఏసీపీ ప్రకాశ్, జిల్లా న్యాయసేవా సంస్థ కార్యదర్శి నీలిమతో కలిసి లోక్ అదాలత్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా జడ్జి దుర్గాప్రసాద్ మాట్లాడుతూ లోక్ అదాలత్తో ఇరువర్గాలకు న్యాయం జరుగుతుందని, త్వరితగతిన కేసులు పరిష్కారం అవుతాయన్నారు. లోక్అదాలత్లో బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు ఆవుల నారాయణ, పబ్లిక్ ప్రాసిక్యూటర్ రజనీ, న్యాయవాదులు పాల్గొన్నారు. 7,408 కేసుల పరిష్కారం జిల్లాలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ కోర్టుల్లో 7,408 కేసులను పరిష్కరించి రాష్ట్రస్థాయిలో ఆరో స్థానంలో నిలిచింది. పరిష్కరించిన కేసుల్లో 73 సివిల్, 7,228 క్రిమినల్, 107 ప్రీలిటిగేషన్ కేసులు ఉన్నాయి. 41 మోటారు వాహన ప్రమాద కేసుల్లో రూ.6,76,91,500 పరిహారంగా అందజేశారు. 43 సైబర్ క్రైమ్ కేసుల్లో బాధితులకు రూ.5,12,488, బ్యాంకు కేసుల్లో రూ.47,38,292ను బ్యాంకర్లు–కక్షిదారులకు మధ్య సెటిల్ చేశారు. -
ఆధ్యాత్మిక జీవనాన్ని అలవర్చుకోవాలి
బోధన్: ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక జీవనం అలవర్చుకోవాలని మహారాష్ట్ర ప్రాంత తమ్లూర్ మఠాధిపతి షటస్థల బ్రహ్మ 108 శ్రీ శివానంద శివాచార్య మహారాజ్ ప్రబోధించారు. పట్టణ కేంద్రంలోని జంగం గల్లీలో గల పురాతన చారిత్రిక పురాణే మఠం నిర్వాహకులు పురాణే అజయ్కుమార్ ఆధ్వర్యంలో శ్రావణ మాస ఉద్దీపన ముగింపు కార్యక్రమాన్నిఅత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పురాణే మఠం నిర్వాహకులు 18 ఏళ్లుగా శ్రావణ మాసంలో నెల రోజుల పాటు తమ శిష్యుల ఇళ్లలో వీరశైవ సంప్రదాయం ప్రకారం శివలింగానికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉద్దీపన ముగింపు కార్యక్రమానికి విచ్చేసిన మఠాధిపతి భక్తులనుద్దేశించి ప్రవచనాలు చేశారు. అనంతరం అన్నప్రసాద వితరణ చేశారు. వీరశైవుల గురువు సుంకిని గ్రామానికి చెందిన సిద్ధిలింగప్ప మహారాజ్, సంతోష్ మహారాజ్, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. -
బాల్కొండ అభివృద్ధికి రూ.250 కోట్లతో ప్రతిపాదనలు
కమ్మర్పల్లి(భీమ్గల్): బాల్కొండ నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులకు సంబంధించి సుమారు రూ. 250 కోట్ల నిధుల ప్రతిపాదనలను నియోజకవర్గ ఇన్చార్జి ముత్యాల సునీల్ కుమార్ శనివారం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అందజేశారు. హైదరాబాద్లో మంత్రిని కలిసి అభివృద్ధి పనుల గురించి వివరించారు. పెండింగ్లో ఉన్న రోడ్ల పనులను త్వరితగతిన పూర్తి చేయడంతో పాటు, దెబ్బతిన్న రహదారులకు మరమ్మతులు చేపట్టాలని మంత్రిని కోరారు. రానున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకొని రహదారులను బాగు చేయాలని విజ్ఞప్తి చేశారు. మంత్రి సానుకూలంగా స్పందించినట్లు సునీల్ కుమార్ తెలిపారు. -
మార్కండేయ మందిర పునర్నిర్మాణానికి భూమిపూజ
బోధన్: ఎడపల్లి మండలంలోని జానకంపేటలో శనివారం మార్కండేయ మందిరం పునర్నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. మందిర పునర్నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసి భక్తులు మరింత సౌకర్యంగా అందుబాటులోకి తీసుకువస్తామని మందిరం అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు చిలుక వినో ద్ కుమార్ తెలిపారు. గ్రామస్తులు విఠల్, చిలుక నారాయణ, ప్రవీణ్, లక్ష్మణ్, మల్లేశ్, నగేశ్, అనంతస్వామి తదితరులు పాల్గొన్నారు. ప్రమాదాల నివారణకు విద్యుత్ స్తంభాల ఏర్పాటు వేల్పూర్: మండల కేంద్రంలో అంబేడ్కర్ వి గ్రహం సమీపంలో ప్రధా న రహదారిపై విద్యుత్ ప్రమాదాలు జరగకుండా ఎత్తయిన విద్యుత్ స్తంభాలను ట్రాన్స్కో సిబ్బంది శనివారం ఏర్పాటు చేశారు. ప్రధాన రహదారికి ఇరువైపులా విద్యుత్ స్తంభాలు తక్కువ ఎత్తువి ఉండడంతో వినాయక విగ్రహాలు తెచ్చినప్పుడు, నిమజ్జనానికి తరలించిననప్పుడు, భారీ వాహనాలు వెళ్లినప్పుడు వైర్లు తాకుతున్నాయి. ప్రమాదం జరిగే అవకాశం ఉండటంతో ఎత్తయిన విద్యుత్తు స్తంభాలను అమర్చారు. గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. మంత్రి సీతక్కను కలిసిన సర్పంచ్ల ఫోరం ప్రతినిధులు కమ్మర్పల్లి: మంత్రి సీతక్కను జిల్లా సర్పంచ్ల ఫోరం ప్రతినిధులు శనివారం హైదరాబాద్లో కలిశారు. తాము క్షేత్రస్థాయిలో ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను మంత్రికి వివరించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. అనంతరం సన్మానించారు. సర్పంచ్ల ఫోరం ప్రతినిధులు రాజు, జన్ము జనార్దన్, బేల్దారి నవీన్, మునిపల్లి సాయి రెడ్డి, అరిగెల జనార్దన్ మంత్రిని కలిసిన వారిలో ఉన్నారు. బోధన్: ఎడపల్లి మండలం జానకంపేటలో ఈ నెల 8న రాత్రి సమయంలో కిరాణ దుకాణంలో జరిగిన దొంగతనం కేసులో వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించినట్టు ఎడపల్లి ఎస్సై ముత్యాల రమ శనివారం తెలిపారు. వివరాలు.. జానకంపేటకు చెందిన పూలపల్లి వీరేశం తన కిరాణ దుకాణంలో గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి రూ.7 వేలు నగదు దొంగలించారని ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గద్ద గంగారాం అనే వ్యక్తిని పట్టుకుని విచారించగా దొంగతనం చేసినట్టు అంగీకరించాడని ఎస్సై తెలిపారు. ఆయన నుంచి రూ.1500 స్వాధీనం చేసుకుని బోధన్ కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి రిమాండ్కు పంపించినట్టు పేర్కొన్నారు. వేల్పూర్(బాల్కొండ): బాల్కొండ మండల కేంద్రంలోని వినాయక్నగర్లో యూనియన్ బ్యాంకు దగ్గర ఒక గదిలో పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను శనివారం రాత్రి అరెస్టు చేసినట్లు ఎస్సై శైలేందర్ తెలిపారు. వారి నుంచి రూ. 3,460, నాలుగు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. జగిత్యాలక్రైం: జగిత్యాల జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్లో ఈ నెల 7న సెల్ఫోన్ దొంగతనం చేసిన బాలుడిని శనివారం అరెస్ట్ చేసి జువైనల్ కోర్టుకు తరలించినట్లు పట్టణ ఎస్సై కుమారస్వామి తెలిపారు. నిజామాబాద్ జిల్లా మోర్తాడ్కు చెందిన బండ రాహుల్ జగిత్యాలలోని ఓ ఆస్పత్రిలో పనిచేస్తున్నాడు. జగిత్యాల కొత్తబస్టాండ్లో ఈనెల 7న ఆర్టీసీ బస్సు ఎక్కుతుండగా సెల్ఫోన్ దొంగిలించారు. పోలీసులు సీసీ ఫుటేజీలను పరిశీలించి దొంగతనానికి పాల్పడింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం హిందూపూర్కు చెందిన బాలుడిగా గుర్తించి అరెస్ట్ చేశారు. సెల్ఫోన్ స్వాధీనం చేసుకుని జువైనల్ కోర్టుకు తరలించినట్లు ఎస్సై తెలిపారు. -
ఉత్సవాల్లో భద్రతా ప్రమాణాలు పాటించాలి
● బోధన్ ఏసీపీ శ్రీనివాస్ బోధన్: రాబోయే గణేశ్ నవరాత్రి ఉత్సవాలను అ త్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకోవడంతో పాటు భ ద్రతా ప్రమాణాలు పాటించాలని బోధన్ ఏసీపీ శ్రీనివాస్ సూచించారు. శనివారం సాలూర మండ ల కేంద్రంలోని టీటీడీ కల్యాణ మండపంలో నిర్వ హించిన మండల స్థాయి గణేశ్ మండపాల నిర్వాహకులతో సమన్వయ సమావేశానికి ముఖ్య అతిథి గా విచ్చేసి ఏసీపీ మాట్లాడారు. గణేశ్ మండపాల నిర్వాహకులు ఆన్లైన్లో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని సూచించారు. మండపాలు, నిమజ్జన శోభాయాత్రల్లో డీజీలకు అనుమతి లేదన్నారు. ఉత్సవాల్లో ఆధ్యాత్మిక సంబంధ సాంస్కృతిక కార్యక్రమాలు మాత్రమే నిర్వహించాలని సూచించారు. ఎలాంటి సమస్యలు తలెత్తినా అధికారులకు సమాచారం అందించాలని తెలిపారు. గణేశ్ మండపాలకు ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పిస్తున్నందున నాణ్యమైన వైర్లు ఎంసీబీలతో బిగించుకుంటే ప్రమాదాలు జరుగకుండా ఉంటుందని విద్యుత్ శాఖ ఏఈ కల్యాణ్ సూచించారు. బోధన్ రూరల్ సీఐ విజయ్ బాబు, ఎస్సై రాజశేఖర్, తహసీల్దార్ అజ్మత్ నవాజ్, తదితరులు పాల్గొన్నారు. -
క్రైం కార్నర్
బోధన్టౌన్(బోధన్): నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గుర్తు తెలియని వ్యక్తి(సుమారు 60 ఏళ్లు) శనివారం మృతి చెందారు. పట్టణ సీఐ వెంకట నారాయణ తెలిపిన వివరాలు.. ఈనెల 10న బోధన్ బస్టాండ్ సమీపంలో యాచిస్తున్న ఓ వ్యక్తిని ద్విచక్రవాహనం ఢీకొట్టడంతో 108 అంబులెన్స్లో నిజామాబాద్లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతుడి కుడి చేతిపై శివుని పచ్చబొట్టు, చేతికి కడియం ఉంది. ఆచూకీ తెలిసిన వారు 871265 69778, 87126 59870లకు సంప్రదించాలని సీఐ తెలిపారు. వేల్పూర్(బాల్కొండ): బాల్కొండ మండలం చిట్టాపూర్లో నిబంధనలకు విరుద్ధంగా శుక్రవారం అర్ధరాత్రి డీజే సౌండ్ సిస్టమ్తో న్యూసెన్స్కు కారణమైన గణేష్ మండప నిర్వాహకులపై శనివారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై శైలేందర్ తెలిపారు. గణేష్ ఆగమన కార్యక్రమంలో నిర్వాహకులు డీజే సౌండ్ సిస్టమ్ వినియోగిస్తూ శబ్ద కాలుష్యం సృష్టించారని పేర్కొన్నారు. గణేష్ ఉత్సవాల్లో డీజేలకు అనుమతి లేదని మరోసారి ఆయన స్పష్టం చేశారు. నవీపేట: మండల కేంద్రంలోని ధర్యాపూర్ కాలనీలో తాళం వేసిన ఇంట్లో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడినట్లు ఎస్సై శ్రీకాంత్ శనివారం తెలిపారు. వివరాలు.. కాలనీకి చెందిన డాంగె నాగమణి ఈనెల 8న ఇంటికి తాళం వేసి ధర్మాబాద్లోని కుమార్తె ఇంటికి వెళ్లింది. శనివారం ఉదయం ఇంటికి వచ్చి చూడగా తాళం పగలగొట్టి ఉంది. గుర్తు తెలియని దుండగులు తాళం పగులగొట్టి లోపలకు వెళ్లి, బీరువా తాళాలు పగులగొట్టి అందులో ఉన్న రూ.30 వేల నగదుతో పాటు 7 గ్రాముల బంగారు నగలను ఎత్తుకెళ్లారని బాధితులు పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
డెంగీ కలవరం..
జిల్లాలో డెంగీ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఆగస్టులో జిల్లా వ్యాప్తంగా 88 కేసులు నమోదు కాగా, ఈ నెల 11వ తేదీ వరకు 52 మంది డెంగీ బారినపడ్డారు. జనవరి నుంచి ఇప్పటి వరకు మొత్తం 161 డెంగీ కేసులు నమోదయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 31 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉండగా వీటి పరిధిలో రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఆర్మూర్ పీహెచ్సీ పరిధిలో 15, రాకాసీపేట 10, అర్సపల్లి 7, దుబ్బా 9, పాన్గల్లి 9, ఇందల్వాయి 9, మెండోరా, మోస్రా, పోతంగల్ తదితర పీహెచ్సీల పరిధిలో ఏడు చొప్పున కేసులు నమోదయ్యాయి. డెంగీతోపాటు రెండు చికున్గున్యా కేసులు సైతం నమోదు కావడం గమనార్హం. -
వైరల్ ఫీ‘వర్రీ’
నిజామాబాద్వంతెనలు నిర్మించారు.. నూతనంగా నిర్మించిన వంతెనలకు ఇరువైపులా సీసీ వేయకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.ఆదివారం శ్రీ 13 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026– 8లో uనిజామాబాద్అర్బన్: వాతావరణంలో మార్పులతో ప్రజలు జ్వరాలతో విలవిలలాడుతున్నారు. జిల్లా లో వైరల్ ఫీవర్ కేసులు ఉన్నఫలంగా రెండింతలయ్యాయి. గత నెల నుంచి వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతోంది. చిన్నారుల నుంచి మొదలుకొని పెద్దలు సైతం జ్వరాల బారినపడుతున్నారు. ప్రధానంగా డెంగీ, మలేరియా, టైఫాయిడ్ తదితర కేసులతో ప్రభుత్వ ఆస్పత్రులతోపాటు ప్రయివేటు ఆస్పత్రులకు రోగుల తాకిడి పెరిగింది. ఆగస్టు నుంచి ఈ నెల 11 వరకు జీజీహెచ్కు డెంగీతో బాధపడుతున్న 53 మంది, మలేరియా బాధితులు నలుగురు చేరారు. వైరల్ ఫీవర్తో 2,609 మంది చికిత్స పొందారు. కరువైన పర్యవేక్షణ.. సీజనల్ వ్యాధుల నియంత్రణకు చర్యలు తీసుకోవాల్సిన సంబంధిత శాఖల పర్యవేక్షణ కొరవడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. పీహెచ్సీల పరిధిలోని గ్రామాల్లో దోమల పెరుగుదలను అరికట్టి, మురికి కూపాలను నిరోధించాల్సిన అవసరం ఉంది. ఇళ్లల్లో నీటి నిల్వ ప్రాంతాలను నివారించడం, వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాల్సి ఉన్నా అవేమీ క్షేత్రస్థాయిలో కనిపించడం లేదు. వైద్య ఆరోగ్య శాఖ ప్రతి శుక్రవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తూనే ఇంటింటి సర్వేలను చేపట్టి నివారించాల్సి ఉంటుంది. అయితే, కార్యక్రమంపై సంబంధిత అధికారుల పర్యవేక్షణ సక్రమంగా లేదనే ఆరోపణలున్నాయి. పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా ఖాళీ స్థలాల్లో నీరు నిలువడం, డ్రెయినేజీలు అస్తవ్యస్తంగా ఉండటమే వ్యాధుల బారినపడేందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. జిల్లాలోని ప్రభుత్వ, ప్రయివేటు ఆస్పత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. ప్రధానంగా ప్రయివేటు ఆస్పత్రులకు జ్వరం, గొంతు నొప్పి, ద గ్గు, కళ్ల కలక ఇతర సమస్యలతో జనం వస్తున్నారు. చిన్న పిల్లల ఆస్పత్రులు సైతం రో గులతో నిండిపోతున్నాయి. ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలోనూ ఉదయం వేళ ఓపీ పెరిగింది. కిటకిటలాడుతున్న ఆస్పత్రులురోగుల తాకిడి పెరిగింది జీజీహెచ్కు రోగులు తాకిడి పెరిగింది. కొన్నిరోజులుగా జ్వరాలు, ఇతర వ్యాధులు పెరిగాయి. జిల్లాలో నలువైపులా రోగులు ఆస్పత్రికి వస్తున్నారు. అందుకు అనుగుణంగా వైద్య సేవలు అందిస్తున్నాం. వ్యాధులపై అవగాహన కలిగి ఉంటే ఎంతో మేలు. – డాక్టర్ రాములు, జీజీహెచ్ ఇన్చార్జి సూపరింటెండెంట్ -
వర్షం..హర్షం
● జిల్లా వ్యాప్తంగా కురిసిన వాన ● నేడు భారీ వర్షం కురిసే అవకాశంనగరంలోని కోర్టు చౌరస్తాలో రోడ్డుపై నిలిచిన వర్షపు నీరునిజామాబాద్ అర్బన్: జిల్లాలో ఆదివారం భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కాగా శనివారం ఉదయం నుంచి జిల్లా వ్యాప్తంగా వర్షం కురుస్తూనే ఉంది. మేఘావృతమై పలు చోట్ల భారీ వర్షం, కొన్ని ప్రాంతాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. ఎడపల్లిలో అత్యధికంగా 42.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఆ తర్వాత నందిపేట్, నిజామాబాద్, డొంకేశ్వర్, డిచ్పల్లి, సాలూర, మోస్రా, ఇందల్వాయి, బోధన్, ఆర్మూర్, ఆలూర్, ముప్కాల్ మండలాల్లో మోస్తరు వర్షం కురిసింది. దాదాపు నెలన్నర తర్వాత వర్షం కురవడంతో వరి పంటలకు మేలు చేకూర్చినట్లయ్యింది. కాగా, ఆదివారం భారీ వర్ష సూచన నేపథ్యంలో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. -
లోక్ అదాలత్లో పలు కేసుల పరిష్కారం
ఆర్మూర్టౌన్: పట్టణంలోని కోర్టులో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో మొత్తం 2,615 కేసులు పరిష్కారం అయ్యాయి. లోక్ అదాలత్లో సీనియర్ సివిల్ జడ్జి శ్రీదేవి, జూనియర్ సివిల్ జడ్జి సరళ రాణి, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి భవ్యశ్రీ, సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ గట్టు గంగాధర్ కేసులను పరిశీలించారు. బోధన్లో 483 కేసులు.. బోధన్టౌన్(బోధన్): బోధన్ కోర్టులో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో 483 కేసులు పరిష్కారం కాగా రూ. 32 లక్షల 99 వేలు ఆదాయం సమకూరింది. ఈ లోక్ ఆదాలత్లో ఐదవ అదనపు న్యాయమూర్తి, బోధన్ మండల సేవా కమిటీ చైర్పర్సన్ వరూధిని, సీనియర్ సివిల్ న్యాయమూర్తి కాంచన రెడ్డి, ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి మర్కల్ పూజిత, అదనపు జూనియర్ సివిల్ జడ్జీ సాయి శివ హాజరయ్యారు. -
డ్రగ్స్ నిర్మూలనకు దాడులు చేపట్టాలి
● సీపీ సాయి చైతన్య కమ్మర్పల్లి/ బోధన్ టౌన్: జిల్లాలో డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు ప్రత్యేక దాడులు చేపట్టాలని సీపీ సాయిచైతన్య పోలీసు అధికారులను ఆదేశించా రు. ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధుల్లో పెండింగ్లో ఉన్న కేసుల పురోగతిపై శుక్రవారం ఆయన భీంగల్, బోధన్లో వేర్వేరుగా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా సీపీ మాట్లాడుతూ.. సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, ఆన్లైన్ మోసాలకు గురైన బాధితు లకు వెంటనే సహాయం అందించాలని సూచించా రు. పెండింగ్లో ఉన్న కేసులను వేగవంతంగా పూర్తి చేసి బాధితులకు త్వరితగతిన న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రౌడీషీటర్లు, పాత నేరస్తులు, బెయిల్పై విడుదలైన వారిపై పర్యవేక్షణ కొనసాగించాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ఎక్కువ గా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాల్లో బ్లా క్ స్పాట్లను గుర్తించి, సైన్ బోర్డులు ఏర్పాటు చేయా లన్నారు. ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి, సీసీఆర్ బీ ఏసీపీ గురునాయుడు, ఇన్స్పెక్టర్ ఆర్ అంజయ్య, భీమ్గల్ సీఐ పొన్నం సత్యనారాయణగౌడ్, బోధన్ ఏసీపీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
పరిశ్రమలను ఏర్పాటు చేయండి
● రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి డిచ్పల్లి: అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి లేవనెత్తిన వ్యవసాయ ఆధారిత పరిశ్రమల ఏర్పాటు అంశంపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల మంత్రి శ్రీధర్ బాబు సానుకూలంగా స్పందించారు. జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న గుండారం–ఖానాపూర్ ప్రాంతంలో సుమారు 500 ఎకరాల భూమిని పరిశ్రమల ఏర్పాటుకు అనువైన ప్రాంతంగా గుర్తించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. పరిశ్రమల ఏర్పాటుకు ఉన్న అవకాశాలపై జిల్లా కలెక్టర్ ద్వారా ఫిజిబిలిటీ అధ్యయనం నిర్వహించి, సమగ్ర ప్రతిపాదనను సిద్ధం చేసి.. మంత్రికి సమర్పించినట్లు పేర్కొన్నారు. ఎమ్మెల్యే పేర్కొన్న అంశాలపై సానుకూలంగా స్పందించిన మంత్రి శ్రీధర్బాబు పరిశ్రమ ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. -
దూస్గాంలో చిరుత సంచారం?
● సోషల్ మీడియాల్లో వైరల్ అవుతున్న ఫొటో ● ఫేక్ అంటున్న అటవీ అధికారులుడిచ్పల్లి: మండలంలోని దూస్గాం గ్రామంలో చిరుత సంచరిస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రచా రం కావడంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. అటవీ అధికారులు మాత్రం అదంతా ఫేక్ అంటూ కొట్టిపడేస్తున్నారు. సర్పంచ్ సువర్ణ, గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా.. ఐదు రోజుల క్రితం గ్రామాన్ని ఆనుకుని ఉన్న శివాలయం గుట్ట పై చిరుతను గమనించిన ఒక యువకుడు మొబైల్ ఫోన్లో ఫొటో తీశాడు. గ్రామంలోని వాట్సాప్ గ్రూ పుల్లో ఫొటో వైరల్ కావడంతో గురువారం సర్పంచ్, ఉప సర్పంచ్, వీడీసీ సభ్యులు యువకుడి ఇంటికి వెళ్లి ఖరారు చేసుకున్నారు. వెంటనే అటవీ అధికారులకు సమాచారం అందించగా, వారు వచ్చి శివాలయం గుట్టపై పరిశీలించగా ఆనవాళ్లు లభించలేవు. దీంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. మూడు రోజులుగా శివాలయంలో పూజలు సైతం నిర్వహించడం లేదు. ఈ విషయమై నిజామాబాద్ సౌత్ అటవీ అధికారిని సంప్రదించగా, చిరుత సంచారం ఆనవాళ్లు లేవని, అదంతా ఫేక్ అన్నారు. టపాకాయలు కాలుస్తూ అప్రమత్తంగా ఉండాలని గ్రామస్తులకు సూచించినట్లు తెలిపారు. -
ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలి
డిచ్పల్లి: మండల శివారులో జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు చేపట్టి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పోలీసు అధికారులకు సూచించారు. డిచ్పల్లి మండల శివారు నాగ్పూర్ గేట్ సమీపంలోని జాతీయ రహదారిపై నిలిపి ఉన్న ట్యాంకర్ను వెనుక నుంచి వచ్చిన కారు ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే.. శుక్రవారం ఉదయం ఈ ఘోర రోడ్డు ప్రమాదంపై సీపీ ఘటన స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను డిచ్పల్లి సీఐ కే వినోద్, ఎస్సై ఎండీ ఆరిఫ్ లను అడిగి తెలుసుకున్నారు. ట్యాంకర్ డ్రైవర్ ఎలాంటి ముందస్తు సూచనలు, హెచ్చరికలు లేకుండా వాహనాన్ని నిలిపివేయడం, ఈ క్రమంలో వెనుక నుంచి వచ్చిన కారు ఢీకొన్నట్లు ప్రాథమికంగా తెలిసినట్లు ఆయన పేర్కొన్నారు. వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సీపీ సూచించారు. -
80ల ట్రెండ్లో.. మన ఎమ్మెల్యేలు
సోషల్ మీడియాలో ప్రస్తుతం 1980ల ట్రెండ్ నడుస్తోంది. ఏఐ ఆధారిత యాప్లలో ఫొటోలను అప్లోడ్ చేస్తే చాలు 1980 నాటి ట్రెండుకు తగ్గట్లుగా మార్పులు చేస్తున్నాయి. దీంతో యువతతోపాటు పలువురు ప్రముఖులు సైతం తమ ఫొటోలను అప్లోడ్ చేసి వస్తున్న చిత్రాలను చూసి మురిసిపోతూ సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. నిజామాబాద్ అర్బన్, ఆర్మూర్ ఎమ్మెల్యేలు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, పైడి రాకేశ్రెడ్డి సైతం ఏఐ ఫొటోలను అప్పటి లుక్తో షేర్ చేశారు. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, నిజామాబాద్ -
వెనకడుగు..
నిజామాబాద్ఫీజుల ప్రదర్శనకు ప్రయివేటు విద్యా సంస్థలు అనాసక్తిఅటవీ అమరుల త్యాగాలు.. అడవులు, వన్యప్రాణుల రక్షణకు ప్రాణాలను త్యాగం చేసిన ఫారెస్ట్ అధికారులు, సిబ్బంది సేవలు వెలకట్టలేనివని డీఎఫ్వో అన్నారు.శనివారం శ్రీ 12 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026– 8లో uఖలీల్వాడి: ప్రయివేటు, కార్పొరేట్ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణకు విద్యాశాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. అందులో భాగంగా ప్రయివేటు యాజమాన్యాలు తమ పాఠశాలల్లోని తరగతుల వారీగా ఫీజుల వివరాలను తప్పనిసరిగా బహిరంగ పర్చాలని స్పష్టం చేసింది. పాఠశాల ప్రాంగణంలోని నోటీసు బోర్డుతోపాటు స్కూల్ అధికారిక వెబ్సైట్లో ప్రదర్శించాలని ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా విద్యాశాఖ అధికారిక వెబ్సైట్ Schooledu.telangana.gov.inలో వివరాలు అప్లోడ్ చేయాలని ఆదేశించింది. అయితే, జిల్లాలోని అత్యధిక స్కూళ్లు ఫీజుల వివరాలను ప్రదర్శించేందుకు ముందుకు రావడం లేదు. దీంతో వివరాలు పొందుపర్చని స్కూళ్లపై కొరఢా ఝులిపించేందుకు విద్యాశాఖ సిద్ధమైంది. ఫిర్యాదు చేసే అవకాశం.. తల్లిదండ్రులు తమ పిల్లల ఫీజులు, ఇతర సమస్యలపై ఆన్లైన్లో ఫిర్యాదు చేసేందుకు పోర్టల్ ఉపయోగపడనున్నది. సమస్యలు, ఫిర్యాదులను అధికారిక వెబ్సైట్ లో మొబైల్ నంబర్ ద్వారా సమర్పించాలి. ఫిర్యాదుతోపాటు తగిన ఆధారాలను జతచేయాల్సి ఉంటుంది. దీంతో అధికారులు ఫిర్యాదును పరిశీలించి అవసరమైతే పాఠశాల యాజమాన్యానికి నోటీసులు జారీచేస్తారు. తదనంతరం స్కూల్పై చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. కారణాలు ఇవేనా? జిల్లాలోని పలు ప్రయివేటు పాఠశాలలు తోక పేర్లతో రూ. 40 వేల నుంచి రూ. లక్షల వరకు ఫీజులు వసూలు చేస్తున్నట్లు సమాచారం. జిల్లా లోని నాలుగైదు స్కూళ్లకు మాత్రమే సీబీఎస్ఈ అనుమతి ఉండగా, చాలా స్కూళ్లు అనుమతి లేకుండానే కొనసాగిస్తున్నారు. దీంతో పోర్టల్లో ఫీజుల వివరాలు నమోదు చేయడం లేదనే చర్చ జరుగుతోంది.పాఠశాలల ఫీజుల వివరాలను బహిర్గతం చేసేందుకు ప్రయివేటు విద్యా సంస్థలు వెనకడుగు వేస్తున్నాయి. ఫీజుల దోపిడీకి అడ్డుకట్ట వేస్తూ, పారదర్శకతను పెంచేందుకు రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసినప్పటికీ జిల్లాలోని పలు స్కూళ్లు వివరాల వెల్లడికి ఆసక్తి చూపడం లేదు. నోటీసులకు సన్నాహాలు.. ప్రయివేటు పాఠశాలల్లో ఫీజుల పేరుతో తల్లిదండ్రులపై ఆర్థిక భారం పడుతోందని ప్రభుత్వానికి ఫిర్యాదులు వచ్చాయి. స్కూల్ ఫీజుతోపాటు వివి ధ రకాల పేర్లతో యాజమాన్యాలు అదనపు రు సుములు వసూలు చేస్తున్నాయని, ముందస్తుగా భారీ మొత్తాలను చెల్లించాలని ఒత్తిడి చేయ డంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. పా ఠ్య పుస్తకాలు, నోట్బుక్లు, యూనిఫాం, షూ, ఇతర విద్యా సామగ్రి తాము సూచించిన దుకా ణాల్లో కొనుగోలు చేయాలని ప్రయివేటు స్కూళ్ల నిర్వాహకులు ఒత్తిడి తీసుకువచ్చారు. ఈ క్రమంలో ప్రయివేటు విద్యాసంస్థల ఆగడాలకు చెక్పెట్టేలా ప్రభుత్వం ఆన్లైన్ పోర్టల్ విధానం తీసుకొచ్చింది. అయితే, పోర్టల్లో ఫీజుల వివరాలను పొందుపర్చేందుకు పలు ప్రయివేటు స్కూళ్లు ముందుకు రావడం లేదు. జిల్లాలో మొత్తం 588 ప్రయివేటు స్కూళ్లు ఉండగా, అందులో 83 స్కూ ళ్లు మాత్రమే పోర్టల్లో ఫీజుల వివరాలను డిస్ప్లే చేశారు. మిగితా 505 స్కూళ్లు ఫీజుల ప్రదర్శనకు దూరంగా ఉన్నాయి. దీంతో ఆ పాఠశాలలకు షో కాజ్ నోటీసులు జారీ చేసేందుకు జిల్లా విద్యా శాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. నోటీసులకూ స్పందించని స్కూళ్లపై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. చర్యలు తీసుకోవాలి విద్యాశాఖ ఇచ్చిన జీవో ప్రకారం ప్రయివేటు స్కూళ్లు వివరాలను పోర్టల్లో నమోదు తరగతుల వారిగా ఫీజు వివరాలను నోటీసు బోర్డులతోపాటు వెబ్సైట్లో తప్పనిసరిగా ప్రదర్శించాలి. లేకుంటే జిల్లా విద్యాశాఖ చర్యలు తీసుకోవాలి. – కృపాల్ సింగ్ సోడి, జిల్లా పీఆర్టీయూ తెలంగాణ గౌరవ అధ్యక్షుడు ఫీజు వివరాలు ప్రదర్శించాలి పాఠశాల విద్యాశాఖ పోర్టల్లో జిల్లాలోని 85 స్కూళ్లు మాత్రమే వివరాలు నమోదు చేశాయి. మిగతా 505 పాఠశాలలు నమోదు చేయలేదు. వీటికి నోటీసులు అందిస్తాం. నోటీసులకు జవాబుతోపాటు పోర్టల్లో నమోదు చేసి, ఫీజు వివరాలను ప్రదర్శించాలి. లేకుంటే తదుపరి చర్యలు తీసుకుంటాం. – పార్శి అశోక్, డీఈవో, నిజామాబాద్ జిల్లాలో మొత్తం 588 ప్రయివేటు విద్యాసంస్థలు ఇప్పటి వరకు పోర్టల్లో నమోదు చేసుకున్నవి 83 మిగతా 505 విద్యా సంస్థలకు జారీ కానున్న షోకాజ్ నోటీసులు -
ట్రాన్స్ఫార్మర్ కాయిల్స్ చోరీ ముఠా అరెస్టు
● 52 ట్రాన్స్ఫార్మర్లను కొల్లగొట్టిన నిందితులు ● వివరాలు వెల్లడించిన ఎస్పీ రాజేశ్ చంద్ర కామారెడ్డి క్రైం: కామారెడ్డి, మెదక్ జిల్లాల పరిధిలో 52 ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసి, కాపర్ వైర్ చోరీ చేసిన అంతర్ జిల్లా ముఠాను కామారెడ్డి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో ఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపిన వివరాలిలా ఉన్నాయి. భిక్కనూరు మండల పరిధిలోని పలు గ్రామాల శివారు ప్రాంతాల్లో ఐదు నెలలుగా ట్రాన్స్ఫార్మర్ కాయిల్స్, వైరు, ఇతర వస్తువులు చోరీకి గురవుతున్నాయని ఫిర్యాదులు వస్తున్నాయి. ఇలాంటి ఘటనలు భిక్కనూరు ప్రాంతంలో మొత్తం 29, మెదక్ జిల్లా పరిధిలో 23 చోట్ల నమోదయ్యాయి. దీంతో నిందితులను గుర్తించేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాలు, సాంకేతిక పరిజ్ఞానం ద్వారా అనుమానితులను గుర్తించారు. మరోసారి చోరీ చేసేందుకు భిక్కనూరు సమీపంలోని పరివార్ హోటల్ ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారించగా నేరం అంగీకరించారు. నిందితులను మేడ్చల్కు చెందిన బల్జీర్ సింగ్, రూప్సింగ్, లకన్ సింగ్లుగా గుర్తించినట్లు ఎస్పీ తెలిపారు. మరొకరు పరారీలో ఉన్నాడన్నారు. ముఠా సభ్యులు.. అన్నదమ్ములు.. అంతర్ జిల్లా ముఠా సభ్యులు నలుగురూ సొంత అన్నదమ్ములు కావడం గమనార్హం. నిందితులు గతంలో జైలుకు వెళ్లి వచ్చారని ఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపారు. బల్జీర్ సింగ్పై తూప్రాన్ పోలీస్స్టేషన్ పరిధిలో దోపిడీ, రూప్సింగ్పై మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2 దొంగతనం, ఒక దోపిడీ కేసు నమోదై ఉన్నాయన్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని వారి నుంచి 30 కిలోల కాపర్ వైరు, రాడ్లు, దొంగతనానికి ఉపయోగించిన పరికరాలు, బైక్, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. కేసు ఛేదనలో చాకచక్యంగా వ్యవహరించిన కామారెడ్డి డీఎస్పీ మధుసూదన్, సీఐలు నరేశ్, సంతోష్ కుమార్, ఎస్సైలు అనిల్, మహేశ్, వెంకట్రావు, గంగారెడ్డి, ఐటీకోర్ సిబ్బంది శ్రీనివాస్, బాలకృష్ణ, శ్రీకాంత్, కిషన్, గణేశ్, రమేశ్, శేఖర్, లక్ష్మీకాంత్, చేతన్, స్వామి, రాజేందర్, మైసయ్య, మహేందర్లను ఎస్పీ అభినందించారు. -
నిధుల మంజూరులో పక్షపాత ధోరణి
● ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి ఆర్మూర్: జిల్లాకు అభివృద్ధి నిధులు మంజూరు చేయడంలో రాష్ట్ర ప్రభు త్వం పక్షపాత ధోర ణిని ప్రదర్శిస్తోందని ఆర్మూర్ ఎమ్మె ల్యే రాకేశ్ రెడ్డి ఆరోపించారు. రాష్ట అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శుక్రవారం ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి మాట్లాడారు. జిల్లాలో నూతన కంపెనీలు పెట్టుబడుల విషయంలో రాష్ట్ర ప్రభు త్వం పక్షపాత ధోరణి అవలంబిస్తోందన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో జక్రాన్పల్లి ఎయిర్ పోర్ట్ ప్రతిపాదనలు సిద్ధం చేసి 20 ఏళ్లు గడుస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వానికి సహకారం అందించడం లేదని ఆరోపించారు. అనంతరం మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. కేంద్ర మంత్రికి జక్రాన్పల్లి ఎయిర్పోర్టు కోసం ప్రతిపాదనలు పంపుతామని తెలిపారు. -
పోగొట్టుకున్న పర్సు అందజేత
కమ్మర్పల్లి: ఆటోలో పోగొట్టుకున్న ఓ బాధితురాలి పర్సును కమ్మర్పల్లి పోలీసులు సాంకేతిక సాయంతో గుర్తించి అందజేశారు. ఎస్సై సతీశ్ తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రానికి చెందిన జులేఖా బేగం అనే మహిళ కమ్మర్పల్లి మండలం చౌట్పల్లిలోని తన బంధువుల వివాహానికి గురువారం రాత్రి ఆటోలో వస్తుండగా తన పర్సును పోగొట్టుకున్నారు. అందులో తులం బంగారు కమ్మలు, రూ. వెయ్యి నగదుతో పాటు ఒక సెల్ ఫోన్ ఉంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎస్సై సతీశ్ వెంటనే స్పందించి ఏఎస్సై వెంకట్కుమార్, కానిస్టేబుల్ దినేశ్తో కలిసి గాలింపు చేపట్టారు. సెల్ఫోన్ సిగ్నల్ ఆధారంగా పర్సును ట్రేస్ చేసి స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం పీఎస్లో బాధితురాలికి పర్సుతోపాటు అందులోని బంగారు కమ్మలు, నగదు, సెల్ ఫోన్ను అందజేశారు. పర్సును తక్కువ సమయంలో గుర్తించి బాధితురాలికి అప్పగించడంలో సమర్థవంతంగా వ్యవహరించిన ఎస్సై సతీశ్, ఏఎస్సై, వెంకట్కుమార్, కానిస్టేబుల్ దినేశ్లను ఉన్నతాధికారులు అభినందించారు. అత్యవసర సమయాల్లో ప్రజలు ‘డయల్ 112’ సేవలను వినియోగించుకోవాలని పోలీసులు సూచించారు. -
క్రైం కార్నర్
నిజామాబాద్ అర్బన్: బస్టాండ్ ప్రాంతంలో స్పృహ తప్పి కిందపడిపోయిన ఓ హిజ్రా(40) చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఒకటో టౌన్ ఎస్హెచ్వో రఘుపతి తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. ఈ నెల 8న స్పృహ తప్పి కిందపడిపోయిన హిజ్రాను స్థానికులు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది. కుడిచేతిపై అమ్మ అని పచ్చబొట్టు ఉందన్నారు. వివరాలు తెలిసిన వారు 8712659714 నంబర్కు సమాచారం అందించాలని కోరారు. నిజామాబాద్ అర్బన్: పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన ఓ మహిళను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు రెండో టౌన్ పోలీసులు శుక్రవారం తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. శివాజీనగర్కు చెందిన శివానీ అనే మహిళ ఇటీవల రెండో టౌన్ పీఎస్లో ఓ కేసు విషయమై వచ్చింది. కేసు విషయంలో పోలీసులతో దురుసుగా ప్రవర్తించి వీడియో చిత్రీకరించింది. దీంతో ఆమైపె కేసు నమోదు చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు. -
దళితులను మోసం చేసింది బీఆర్ఎస్సే..
● ప్రజాధనాన్ని వృఽథా చేసిన ఘనత కేసీఆర్కే దక్కుతుంది ● పీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఇందిర శోభన్నిజామాబాద్ రూరల్: బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న పదేళ్లలో దళితులను అన్ని రకాలుగా మోసం చేసిందని పీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఇందిర శోభన్ ఆరోపించారు. కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనలో మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి మూడు రోజులే వచ్చారని ఎద్దేవా చేశారు. నగరంలోని కాంగ్రెస్ భవన్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీకి రాకుండా ప్రజాధనాన్ని వృథా చేసున్న తీరును ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి రాకముందు రాష్ట్ర ఆర్థిక స్థితి బాగుండేదని కేసీఆర్ వచ్చాక రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణగా మార్చారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పులను చెల్లిస్తూ, సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తోందని, ఇది ప్రతిపక్ష నాయకులకు కనపడట్లేదా అని ప్రశ్నించారు. శాసనసభ వ్యవహారాల మంత్రిగా చేసిన హరీశ్రావుకు సభలో ఎలా ఉండాలో తెలియకపోవడం విచారకరమన్నారు. అసెంబ్లీ ఎదుట కేటీఆర్ కోపం ఎవరిపైనని ప్రశ్నించారు. అధికారం పోయిందనే దురాహంకారంతో వ్యవహరించారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనను అసెంబ్లీలో చర్చిస్తారనే ఉద్దేశంతో హరీశ్రావు, కేటీఆర్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ ఎదుట ఇష్టం వచ్చినట్లు వ్యవహరించరని, స్పీకర్పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆవేదన వ్యక్తంచేశారు. ఎమ్మెల్యేలు సబితమ్మ, సునీత లక్ష్మారెడ్డి, కోవా లక్ష్మిలను అడ్డం పెట్టుకొని బీఆర్ఎస్ డ్రామాలు చేస్తోందని దుయ్యబట్టారు. బీజేపీ ప్రభుత్వం దళితులపై కపట ప్రేమ చూపుతోందని, బీఆర్ఎస్, బీజేపీ రెండు ఒకే ధోరణిలో వెళ్తున్నాయన్నారు. రాబోయే రోజుల్లో రెండు పార్టీలకు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు కాటిపల్లి నగేశ్ రెడ్డి, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ, ఉపాధ్యక్షులు శరత్, రత్నాకర్ గౌడ్, గాదారి గోపి, జిల్లా ప్రధాన కార్యదర్శులు ప్రవీణ్ గౌడ్, బున్నే రవీందర్, జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షుడు యాదగిరి, సేవాదళ్ అధ్యక్షుడు సంతోష్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు లింగం, ఫిషరీస్ చైర్మన్ శ్రీనివాస్, కోశాధికారి భక్తవత్సలం పాల్గొన్నారు. -
సీ్త్రనిధి ఆన్లైన్ చెల్లింపుల్లో డిచ్పల్లికి ప్రథమ స్థానం
● డీఆర్డీవో సాయన్న ● మండల సమాఖ్య అధ్యక్షురాలికి సన్మానం డిచ్పల్లి: సీ్త్రనిధి కార్యక్రమాల అమలులో డిచ్పల్లి మండల సమాఖ్య విశేష ప్రతిభ కనబరుస్తూ ‘మన సీ్త్రనిధి’ యాప్ ద్వారా ఆన్లైన్ రుణ చెల్లింపుల్లో జిల్లా స్థాయిలో ప్రథమ స్థానాన్ని సాధించింది. ఈ సందర్భంగా జిల్లా సమాఖ్యలో నిర్వహించిన కార్యక్రమంలో డీఆర్డీవో సాయన్న చేతుల మీదుగా డిచ్పల్లి మండల సమాఖ్య అధ్యక్షురాలు ఆరేపల్లి స్వప్నను ఘనంగా సన్మానించారు. డీఆర్డీవో మాట్లాడుతూ.. 2025–26 ఆర్థిక సంవత్సరంలో రూ. 9.36 కోట్ల రుణ పంపిణీ లక్ష్యానికి గాను రూ. 9.46 కోట్ల రుణాలను అందించి 105 శాతం లక్ష్యాన్ని సాధించడం ద్వారా డిచ్పల్లి మండల సీ్త్రనిధి సమాఖ్య మరో విశిష్ట విజయాన్ని నమోదు చేసిందన్నారు. మండలంలో 3 ఎలక్ట్రికల్ ఆటోలు, 10 ఎలక్ట్రికల్ స్కూటీలను సీ్త్రనిధి రుణాల ద్వారా మహిళా సభ్యులకు అందించడం హర్షనీయమన్నారు. మండల సమాఖ్య అధ్యక్షురాలు స్వప్న మాట్లాడుతూ.. సమాఖ్య కార్యవర్గ సభ్యులు, వీవోఏలు, ఎస్హెచ్జీ సభ్యులు, సీ్త్రనిధి సిబ్బంది సమష్టి కృషి, సహకారంతోనే ఈ విజయాన్ని సాధించినట్లు తెలిపారు. మండలాన్ని ప్రథమ స్థానంలో నిలిపేందుకు కృషి చేసిన సీ్త్రనిధి అసిస్టెంట్ మేనేజర్ రాఘవ, ఏపీఎం రవీందర్రెడ్డి, సీసీలు, వీవోఏలు, ఎస్హెచ్జీ సభ్యులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ డీఆర్డీవో మధుసూదన్, డీపీఎంలు సంధ్య, నీలిమ, ఆర్ఎం రాందాస్, అసిస్టెంట్ మేనేజర్ రాఘవ, ఏపీఎం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
‘సర్’ విచారణ వేగవంతం చేయాలి
● 22–ఏ ఫిర్యాదులపై సత్వరమే స్పందించాలి ● కలెక్టర్ భవేశ్ మిశ్రా ● తహసీల్దార్లతో సమీక్షనిజామాబాద్ అర్బన్: ఓటరు జాబితా ప్రత్యేక సమ గ్ర సవరణ (సర్)లో భాగంగా అనామలీస్, నో మ్యాపింగ్ కేటగిరీలో గుర్తించిన ప్రతి ఓటరుకు నో టీసులు అందించి, పారదర్శకంగా విచారణ నిర్వహించాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా సూచించారు. కలెక్టరేట్లోని ప్రధాన సమావేశ మందిరంలో శుక్రవారం సాయంత్రం తహసీల్దార్లతో సమీక్ష నిర్వహించారు. అనామలీస్, నో మ్యాపింగ్ ఓటర్ల కు నోటీసుల జారీ, వాటి పంపిణీ, విచారణ ప్రక్రియపై ఒక్కో మండలం వారీగా సమీక్షించారు. ఎస్ఐఆర్ ప్రక్రియకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని అన్నారు. నోటీసుల విచారణ ప్రక్రియలో ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని, ప్రతి కేసుకు సంబంధించిన ధ్రువపత్రాలు క్షుణ్ణంగా పరిశీలించాల ని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పర్యటించాలని, పోలింగ్ స్టేషన్ల వారీగా ప్రతిరోజూ బీఎల్వోలు, సూపర్వైజర్ల పనితీరును పర్యవేక్షించాలని తహసీల్దార్లకు సూచించారు. కాగా, 22–ఏ నిషేధిత భూ ములకు సంబంధించి ప్రజల నుంచి వచ్చే ఫిర్యా దులు, అర్జీలపై సత్వరమే స్పందించాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా ఆదేశించారు. భూభారతి చట్టం మార్గ దర్శకాలను పాటిస్తూ, రెవెన్యూ రికార్డులను క్షు ణ్ణంగా పరిశీలిస్తూ అర్జీలను వెంటదివెంట పరిష్కరించాలని హితవు పలికారు. అలసత్వ వైఖరిని ప్రద ర్శిస్తే ఉపేక్షించబోమని కలెక్టర్ స్పష్టం చేశారు. అదనపు కలెక్టర్ భుజంగరావు, ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియా, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, డీఆర్వో గీత, ఆర్డీవోలు రాజేంద్రకుమార్, విజయ కుమారి, డీఆర్డీవో సాయన్న, డీఎస్వో శ్రీకాంత్రెడ్డి, సివిల్ సప్లయీస్ డీఎం ప్రవీ ణ్, డీసీవో శ్రీనివాస్, డీఏవో వీరాస్వామి, మార్కెటింగ్ శాఖ అధికారి గంగుబాయి పాల్గొన్నారు.ధాన్యం సేకరణకు ఏర్పాట్లు ప్రస్తుత వానాకాలం సీజన్లో రైతులు పండించి న ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించే ప్రక్రియ సజావుగా సాగేలా అధికారులు కృషి చేయాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా సూచించారు. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో పకడ్బందీ చర్యలు చేపట్టాలని అన్నా రు. వరి ధాన్యం సేకరణపై కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అక్టోబర్ మొదటి వారంలో కొనుగోలు కేంద్రాలను అందుబాటులోకి తేస్తామన్నారు. ఈ సారి సుమారు 6.50 లక్షల మెట్రిక్ టన్నుల ధా న్యం కొనుగోలు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నామన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని జిల్లాలో 736 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రణాళికలు రూపొందించినట్లు పేర్కొన్నారు. వీటిలో ఐకేపీ ద్వారా 249 కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ధాన్యాన్ని నిల్వ చేసేందుకు వీలుగా గిడ్డంగులను గుర్తించాలన్నారు. -
కొనసాగుతున్న ఎంఈడీ పరీక్షలు
తెయూ(డిచ్పల్లి): తెయూ పరిధిలో కొనసాగుతు న్న ఎంఈడీ 4వ సెమిస్టర్ రెగ్యులర్, 1, 2, 3, 4వ సెమిస్టర్ బ్యాక్లాగ్ పరీక్షలు శుక్రవారం ప్రశాంతంగా జరిగినట్లు అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. పరీక్షలకు 28 మందికి 28 మంది విద్యార్థులు హాజరైనట్లు ఆయన పేర్కొన్నారు. తెయూ(డిచ్పల్లి):ఎన్ఎస్యూ ఐ తెలంగాణ రాష్ట్ర జాయింట్ సెక్రెటరీగా బానోత్ సాగర్ నాయక్ నియమితులయ్యారు. ప్రస్తుతం అడ్వకేట్గా న్యాయవాద వృత్తిలో కొనసాగుతున్న బానోత్ సాగర్ నాయక్, గతంలో తెయూ అధ్యక్షుడిగా పనిచేశారు. తెయూ విద్యార్థుల సమస్యలు, విద్యా రంగానికి సంబంధించిన అంశాలు, విద్యార్థుల హక్కుల పరిరక్షణకు ఆయన చురుకుగా పనిచేశారు. విద్యార్థి నాయకుడిగా, నాయకత్వ అనుభవాన్ని గుర్తించిన ఎన్ఎస్యూఐ జాతీయ, రాష్ట్ర నాయకత్వం ఆయనకు రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా కీలక బాధ్యతలు అప్పగించింది. బానోతు సాగర్ మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి రాష్ట్ర జాయింట్ సెక్రెటరీగా అవకాశం కల్పించిన జాతీయ అధ్యక్షుడు వినోద్ జకార్, రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ స్వామి తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు. ● హైదరాబాద్ ఏసీబీ కోర్టు జడ్జీగా నియామకం నిజామాబాద్ లీగల్: రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా సెషన్స్ జడ్జీల బదిలీల్లో భాగంగా నిజామాబాద్ మొదటి అడిషనల్ డిస్ట్రిక్ సెషన్స్ జడ్జి హరీష బదిలీ అయ్యారు. హైదరాబాద్లోని స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్, ఏసీబీ కేసుల విచారణ విభాగంలో ప్రిన్సిపల్ స్పెషల్ జడ్జీగా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఆదేశాల జారీ చేశారు. హారిష ఏడాదిన్నరగా నిజామాబాద్ మొదటి అడిషనల్ జిల్లా సెషన్స్ జడ్జీగా, ఫ్యామిలీ కోర్టు జడ్జీగా విధులు నిర్వహించారు. -
భారీ గణేశ్ విగ్రహాల రాకపై ప్రత్యేక నిఘా
● సీపీ సాయిచైతన్య కమ్మర్పల్లి: వినాయక చవితి ఉత్సవాల నేపథ్యంలో జగిత్యాల, కోరుట్ల వైపు నుంచి నిజామాబాద్ వైపు తరలిస్తున్న భారీ గణేశ్ విగ్రహాలకు సంబంధించి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని సీపీ సాయి చైతన్య పోలీసులకు సూచించారు. కమ్మర్పల్లిలో ఏర్పాటు చేసిన చెక్పోస్ట్ను శుక్రవారం తనిఖీ చేశారు. ప్రతి భారీ గణేశ్ విగ్రహానికి సంబంధించిన వివరాలను పద్ధతిగా నమోదు చేయడంతో పాటు, విగ్రహాల తరలింపు సమయంలో ట్రాఫిక్కు ఎలాంటి అంతరాయం కలుగకుండా, ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. నిర్వాహకులు విధి నిర్వహణలో ఉన్న పోలీసులకు సహకరించాలని సీపీ కోరారు. భీమ్గల్: పట్టణంలోని పోలీస్స్టేషన్ను సీపీ సాయి చైతన్య తనిఖీ చేశారు. సిబ్బందితో మాట్లాడి, పనితీరును క్షుణ్ణంగా తెలుసుకున్నారు. రోడ్డు ప్రమాదాలు నివారణ, గంజాయి నిర్మూలనకు తగిన చర్యలు చేపట్టాలన్నారు. సిబ్బందిని సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి, భీమ్గల్ సీఐ పొన్నం సత్యనారాయణ గౌడ్, ఎస్సై తిరుపతి ఉన్నారు. -
దాడులు ఆపకపోతే ఉద్యమం ఉధృతం
సుభాష్నగర్: రాష్ట్రవ్యాప్తంగా రైస్మిల్లుల్లో జరుగుతున్న విజిలెన్స్ దాడులను వెంటనే ఆపాలని, లేకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని జిల్లా రైస్మిల్ అసోసియేషన్, రైస్మిల్లర్ల వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు మోటూరి దయానంద్ గుప్తా, వడ్డి మోహన్ రెడ్డి, కాపర్తి శ్రావణ్, ధన్పాల్ దత్తాద్రి డిమాండ్ చేశారు. రైస్మిల్లర్లపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శుక్రవారం నగరంలోని ధర్నా చౌక్లో భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నల్ల కండువాలు ధరించి, ప్లకార్డులు ప్రదర్శించి నిరసన తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ రైస్మిల్లుల్లో మిల్లింగ్, ధాన్యం సేకరణ, సీఎంఆర్ బియ్యం, రైస్మిల్లర్ల సమస్యలు, ఇతర పరిస్థితులపై ప్రభుత్వం నిజనిర్ధారణ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. నాణ్యత లేని ధాన్యానికి నాణ్యమైన బియ్యం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. జిల్లాలోని రైస్మిల్లుల్లో గత ఖరీఫ్, రబీ సీజన్లకు సంబంధించి దాదాపు ఏడు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వ ఉందని, ఆ బియ్యం పూర్తిగా మిల్లింగ్ చేసి సీఎంఆర్ వంద శాతం ప్రభుత్వానికి ఇచ్చిన తర్వాతే వచ్చే సీజన్లో ధాన్యం కేటాయించాలని కోరారు. ఇప్పటి వరకు బకాయిలు ఉన్న మిల్లర్లకు 25 శాతం ఫెనాల్టీ, 12 శాతం ఇంట్రెస్ట్ను వెంటనే మాఫీ చేయాలన్నారు. 30 ఏళ్ల క్రితం నిర్ణయించిన మిల్లింగ్ చార్జీలను పెరిగిన పెట్టుబడులు, కరెంట్ చార్జీలు, హమాలీ చార్జీలకు అనుగుణంగా రూ.10 నుంచి రూ.150కి పెంచాలని డిమాండ్ చేశారు. క్వింటాలుకు 60 కిలోల బియ్యం ఇవ్వడం సాధ్యమవుతుందని, దీనిపై ప్రభుత్వం నిజనిర్ధారణ కమిటీ వేసి రైస్మిల్లుల్లోనే టెస్ట్ మిల్లింగ్ చేసి ఎంత ఔటర్న్ వస్తే అంతే తీసుకోవాలని డిమాండ్చేశారు. ధర్నాలో బోధన్, ఆర్మూర్, నిజామాబాద్ తాలూకా అధ్యక్ష, కార్యదర్శులు, రైస్మిల్లర్లు లాభిశెట్టి శ్రీనివాస్, వాసవి ప్రణయ్, శ్రీనివాస్ గౌడ్, చిదుర ప్రమోద్, ప్రవీణ్, వెంకన్న, 300 మందికిపైగా రైస్మిల్లర్లు పాల్గొన్నారు. మిల్లింగ్ చార్జీలను రూ.150కి పెంచాలి ఎఫ్సీఐ కఠిన నిబంధనలను సవరించాలి రైస్మిల్ అసోసియేషన్, రైస్మిల్లర్ల వెల్ఫేర్ అసోసియేషన్ ధర్నా -
పిల్లలకు పౌష్టికాహారం అందించాలి
● కలెక్టర్ భవేశ్ మిశ్రా నిజామాబాద్ రూరల్: అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు సరైన పౌష్టికాహారాన్ని అందించాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో జిల్లా సంక్షేమ అధికారి సౌందర్య, జిల్లా వైద్యాధికారి రాజశ్రీలతో కలిసి కలెక్టర్ పోషక మాస పోస్టర్లను శుక్రవారం ఆవిష్కరించారు. కలెక్టర్ మట్లాడుతూ.. గర్భిణులు, బాలింతలు, చిన్న పిల్లలు, కౌమారదశలో ఉన్న బాలికలలో పౌష్టికాహార లోపం రక్తహీనతను నివారించే విధంగా ఆహారాన్ని అందించాలన్నారు. అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, ఇళ్ల వద్ద తాజా కూరగాయలు, ఆకుకూరలు పెంచడానికి కిచెన్ గార్డెన్ల ఏర్పాటును ప్రోత్సహించాలన్నారు. పోషణ మాసం ఈ నెల 9 నుంచి అక్టోబర్ 8 వరకు మన అంగన్వాడీ మన బాధ్యత పేరిట కార్యక్రమాలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి అశోక్, అర్బన్ ిసీడీపీవో విజయలక్ష్మి, పోషణ్ అభియాన్ జిల్లా సమన్వయకర్తలు రాంబాబు, ప్రసాద్, ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ప్రణతి పాల్గొన్నారు. -
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
● డీఈవో అశోక్ కుమార్ మాక్లూర్:పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్య త అని డీఈవో అశోక్ కుమార్ అన్నారు. మండలంలోని అమ్రాద్ ప్రభుత్వ పాఠశాలలో హె చ్ఎం సురేశ్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ఉచిత మట్టి గణపతుల పంపిణీ కార్యక్రమానికి డీఈవో హాజరై మాట్లాడారు. కెమికల్తో కూడిన గణేశ్ విగ్రహాల వల్ల పర్యావర ణం దెబ్బతింటుందని, మట్టి గణపతులను పూజించాలని అన్నారు. కార్యక్రమంలో పాఠశాల క్రాఫ్ట్ టీచర్ తర్ల రమేశ్, పీఆర్టీయూ మండల కార్యదర్శి లక్ష్మీనారాయణ, ఉపాధ్యాయులు పవన్, రమేశ్, సాయన్న, నీరజ, విద్యార్థులు పాల్గొన్నారు. డొంకేశ్వర్: వినాయక చవితి పండుగను పుర స్కరించుకుని డొంకేశ్వర్ మండలం మారంపల్లి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు పర్యావరణ పరిరక్షణపై తమకున్న బాధ్యతను చాటుకున్నారు. పాఠశాల ఆవరణలో తోటి విద్యార్థులతో కలిసి తమ చిట్టి చేతులతో, భక్తిశ్రద్ధలతో, నైపుణ్యంతో మట్టి వినాయక విగ్రహాలను తయారు చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యా యులు విద్యార్థులను అభినందించారు. ● డీఎఫ్వో ప్రశాంత్ బాజీరావు పాటిల్ డొంకేశ్వర్: అడవులు, పర్యావరణం, వన్యప్రాణుల రక్షణకు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా త్యాగం చేసిన ఫారెస్ట్ అధికారులు, సిబ్బంది సేవలు వెలకట్టలేనివని జిల్లా అటవీ అధికారి(డీఎఫ్వో) ప్రశాంత్ బాజీరావు పాటిల్ అన్నారు. శుక్రవారం జిల్లా కార్యాలయంలో జాతీయ అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించారు. అమరుల స్థూపం వద్ద చిత్రపటానికి డీఎఫ్వో పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం అటవీ శాఖ అధికారులు, సిబ్బంది రెండు నిమిషాల పాటు మౌనం పాటించి అమరుల త్యాగాలను స్మరించుకున్నారు. అంతకు ముందు అటవీ శాఖ సిబ్బంది నగరంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. నిజామాబాద్ ఎఫ్డీవో సుధాకర్, నార్త్ రేంజ్ ఆఫీసర్ సంజయ్గౌడ్, సిబ్బంది ఉన్నారు. -
క్రైం కార్నర్
గంజాయి పట్టివేత నిజామాబాద్ అర్బన్: నగరంలోని 6వ టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో గంజాయిని గురువారం పట్టుకున్నట్లు ఎస్సై సందీప్ తెలిపారు. తమ సిబ్బందితో జన్నేపల్లి రైల్వే గేటు వద్ద వాహనాల తనిఖీ చేస్తుండగా ఒక షిప్ట్కారును తనిఖీ చేయగా ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనబడి పారిపోయే ప్రయత్నం చేశారు. దీంతో వారిని పట్టుకొని విచారించగా రాజేందర్, సదామ్ నాందేడ్కు చెందిన వీరు శంషాబాద్నుంచి గంజాయిని తక్కువ ధరకు కొనుగోలు చేసి నిజామాబాద్లో అమ్మడానికి రాగా పట్టుకున్నట్లు తెలిపారు. నాలుగు కేజీల గంజాయి, కారు, రెండు సెల్ఫోన్లు సీజ్ చేసి అరెస్టు చేయగా రిమాండ్కు తరలించినట్లు పేర్కొన్నారు. -
డిచ్పల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం
● ఆగి ఉన్న ట్యాంకర్ను ఢీకొన్న కారు ● ఒకరు మృతి.. ఇద్దరికి తీవ్రగాయాలు డిచ్పల్లి: డిచ్పల్లి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్నేహితుడిని ఎయిర్పోర్టులో దింపి తిరిగి ఇంటికి వస్తున్న కారు అదుపు తప్పి రహదారిపై ఆగి ఉన్న ట్యాంకర్ను బలంగా ఢీకొన్నది. దీంతో కారులో ఉన్న ముగ్గురిలో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఎస్సై ఆరిఫ్ తెలిపిన వివరాల ప్రకారం.. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం మన్మద్ గ్రామానికి చెందిన పైడిపల్లి భోజన్న (47) దిలావర్పూర్ మండలం కంజర్ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో హెచ్ఎంగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఆయన నిర్మల్ జిల్లా కేంద్రంలోని మంజులాపూర్లో నివాసం ఉంటున్నారు. అదే కాలనీకి చెందిన స్నేహితులు గురుపల్లి గంగాధర్, మనోజ్ లతో కలిసి దుబాయికు వెళ్తున్న మరో స్నేహితుడు రాజేశ్వర్ను శంషాబాద్ ఎయిర్పోర్టులో దింపడానికి బుధవారం రాత్రి రాజేశ్వర్ బంధువుకు చెందిన కారులో బయలుదేరారు. రాజేశ్వర్ను ఎయిర్పోర్టులో దింపి గురువారం ఉదయం తిరిగి నిర్మల్కు వస్తుండగా ఉదయం 10 గంటల సమయంలో డిచ్పల్లి వద్ద రహదారిపై ఆగి ఉన్న ట్యాంకర్ను కారు వెనుక నుంచి ఢీ కొన్నది. కారు డ్రైవర్ పక్క సీట్లో కూర్చున్న భోజన్న అక్కడికక్కడే మృతి చెందగా డ్రైవింగ్ చేస్తున్న గంగాధర్, వెనుక సీట్లో కూర్చున్న మనోజ్లకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదంలో కారు మొత్తం ధ్వంసమైంది. డిచ్పల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన ఇద్దరిని చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య సంగీత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
నేరస్తులకు శిక్ష పడేలా చర్యలు
● రోడ్డు ప్రమాదాలను నివారించాలి ● కామారెడ్డి ఎస్పీ రాజేశ్ చంద్ర నిజాంసాగర్: నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలని, నేరస్తులకు శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ రాజేశ్ చంద్ర అన్నారు. గురువారం సాయంత్రం నిజాంసాగర్ పోలీస్స్టేషన్ను ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ భవనాన్ని, స్ట్రాంగ్ రూం గదులను పరిశీలించారు. స్టేషన్లో రిజిష్టర్ల నిర్వహణ, రోల్ కాల్, సిబ్బంది పనితీరును తెలుసుకున్నారు. ఎస్పీ మాట్లాడుతూ.. పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితులపై బాధ్యతాయుతంగా వ్యవహరించి సత్వర న్యాయం అందించాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. గణేశ్ నవరాత్రుల సందర్భంగా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. బాన్సువాడ డీఎస్పీ విఠల్రెడ్డి, బాన్సువాడ రూరల్ సీఐ తిరుపతయ్య, ఎస్సై శివకుమార్, ఏఎస్సై నర్సయ్య తదితరులు ఉన్నారు. -
కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు
● ప్రభుత్వ సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి ● కందకుర్తి, యంచ పుష్కరఘాట్లు, రోడ్ల పనులకు భూమి పూజరెంజల్/ నవీపేట: ఉత్తరప్రదేశ్ లో నిర్వహించిన కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్రెడ్డి అన్నారు. రెంజల్ మండలం కందకుర్తి త్రివేణి సంగమ క్షేత్రం, నవీపేట మండలం యంచ శివారులో నూతనంగా నిర్మించే పుష్కర ఘాట్, రోడ్డు పనులకు కలెక్టర్ భవేశ్ మిశ్రాతో కలిసి గురువారం భూమి పూజ నిర్వహించారు. కందకుర్తి త్రివేణి సంగమ క్షేత్రం వద్ద అన్ని శాఖలకు సంబంధించి పనులకు సుమారు రూ.30 కోట్ల నిధులతో పుష్కర, ఘాట్, రోడ్డు పనులు, యంచలో రూ. 2.15 కోట్ల ఇరిగేషన్ నిధులతో నూతనంగా ఘాట్, రూ. 70 లక్షల పంచాయతీరాజ్ నిధులతో రహదారిని నిర్మిస్తున్నట్లు తెలిపారు. అభివృద్ధి పనులకు భూమిపూజ, శంకుస్థాపనలు చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వచ్చే ఏడాది జూన్, జూలై మాసాల్లో నిర్వహించే గోదావరి పుష్కరాల సందర్భంగా పుణ్య స్నానాల కోసం జిల్లాలోని వివిధ పుష్కర క్షేత్రాలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చే అవకాశాలున్నందున పుష్కర ఘాట్ల వద్ద సదుపాయాల కల్పన కోసం అవసరమైన అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని కలెక్టర్ ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. కార్యక్రమాల్లో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్బిన్ హందాన్, డీసీసీ అధ్యక్షుడు నగేశ్రెడ్డి, బోధన్ ఆర్డీవో విజయకుమారి, తహసీల్దార్ శ్రావణ్, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. -
మోడల్ కూరగాయల మార్కెట్ ఏర్పాటు చేయాలి
ఆర్మూర్: ఆధునిక వ్యవసాయంలో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామంలో మోడల్ కూరగాయల మార్కెట్ను ఏర్పాటు చేసి రైతులకు సౌకర్యాలు కల్పించాలని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా క్వశ్చన్ హవర్లో గురువారం ఎమ్మెల్యే రాకేశ్రెడ్డి హార్టికల్చర్ అంశంపై మాట్లాడారు. అంకాపూర్ అంటే దేశంలోని ఆదర్శ గ్రామమని ప్రత్యేక గ్రాంట్ ద్వారా ఏడాదికి రూ.5 లక్షలు వస్తాయని పేర్కొన్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు స్పందిస్తూ మోడల్ కూరగాయల మార్కెట్ గురించి చర్చించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. ● ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి మధు యాష్కీగౌడ్ను కలిసిన రూరల్ ఎమ్మెల్యే నిజామాబాద్ రూరల్: ఆలిండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ చైర్మన్గా ఎంపికై న మధు యా ష్కీగౌడ్ను నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూ పతిరెడ్డి హైదరాబాద్లో గురువారం మర్యాద పూర్వకంగా కలిసి సన్మానించారు. ఆయన వెంట పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. లింగంపేట: మండలానికి చెందిన ఇద్ద రు బాలురపై గురువారం పోక్సో కేసు నమోదు చే సినట్లు ఎస్సై దీపక్కుమార్ తెలిపారు. పదో తరగతి విద్యార్థినికి వీరు మాయమాటలు చెప్పి మోసం చేశారని, సదరు బాలిక గర్భవతి అయిన ట్లు గుర్తించి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసిందని పేర్కొన్నారు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు విచారణ జరిపి, ఇద్దరు బాలురపై కేసు పెట్టినట్లు తెలిపారు. -
రోడ్లపై నడకా కష్టమే..
● ఇష్టారాజ్యంగా వాహనాల పార్కింగ్ ● పాదచారులకు ఇబ్బందులు నగరంలోని రోడ్లపై పాదచారుల నడక కష్టంగా మారుతోంది. ప్రధాన రహదారులకు ఇరువైపులా ఫుట్పాత్లు ఉన్నా అవి ఆక్రమణలకు గురికావడంతో నడిచేందుకు వీలు లేకుండా పోయింది. దీంతో పాదచారులు రోడ్డు పైనే నడవాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు ద్విచక్ర వాహనాలు, ఆటోలు, ఇతర వాహనాలను ఇష్టారాజ్యంగా పార్కింగ్ చేయడంతో సమస్య మరింత తీవ్రమవుతోంది. బస్టాండ్ పరిసరాల్లో ఆటోస్టాతండ్ కోసం ప్రత్యేకంగా స్థలం కేటాయించినప్పటికీ కొందరు డ్రైవర్లు నడిరోడ్డుపైనే ఆటోలను నిలుపుతున్నారు. దీంతో రద్దీ సమయాల్లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. నగరంలోని రద్దీ ప్రాంతాలైన ఖలీల్వాడి, బస్టాండ్, గాంధీచౌక్ ప్రాంతాల్లో ట్రాఫిక్ అస్తవ్యస్తంగా మారింది. ఫుట్పాత్లను వ్యాపారులు ఆక్రమించడంతో రోడ్లపై నడిచేవారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఫుట్పాత్ల ఆక్రమణలను తొలగించి, రోడ్లపై వాహనాలను నిలుపకుండా చూడాలని నగరవాసులు కోరుతున్నారు. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్ – నిజామాబాద్ -
నిధుల వినియోగంలో జాప్యానికి చెక్
డిచ్పల్లి: జీపీలకు వచ్చే నిధులను మరింత సులభంగా, వేగంగా వినియోగించుకునేలా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 (నాలుగో సవరణ) బిల్లు 2026కు రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి శాసనసభలో మద్దతు తెలిపారు. స్థానిక సంస్థలను బలోపేతం చేయడం, గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు నిధుల కొరతతో పాటు నిధుల వినియోగంలో జాప్యాన్ని తొలగించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. కొత్త సవరణతో జీపీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి, జాతీయ బ్యాంకులు, పోస్టాఫీసుల్లో జమ చేసుకునే అవకాశం కలుగుతుందని అన్నారు. ● రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి -
రాష్ట్ర స్థాయి సాఫ్ట్ బాల్ పోటీలకు ఎంపిక
సిరికొండ: రాష్ట్ర స్థాయి సాఫ్ట్ బాల్ పోటీలకు సిరికొండ సత్యశోధక్ పాఠశాలకు చెందిన నలుగురు విద్యార్థులు ఎంపికై నట్లు ప్రిన్సిపాల్ ఆర్ నర్సయ్య గురువారం తెలిపారు. ఆర్మూర్లో ఈ నెల 6న నిర్వహించిన జిల్లా స్థాయి సాఫ్ట్బాల్ ఎంపిక పోటీల్లో ప్రతిభ కనబర్చిన బీ హర్షిత్, కే అజయ్, జీ సాయితేజ, డీ శ్రీకాంత్ రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. తెలంగాణ సాఫ్ట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని తిలక్ స్టేడియంలో ఈ నెల 12 నుంచి 14 వరకు నిర్వహించే రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ అండర్–15 పోటీల్లో వీరు పాల్గొంటారని ప్రిన్సిపాల్ తెలిపారు. విద్యార్థులను పాఠశాలలో అభినందించారు. పీఈటీలు అనిల్, అనికేత్, మౌనిక, విద్యార్థులు పాల్గొన్నారు. తెయూ(డిచ్పల్లి): రాష్ట్ర ఉత్తమ అధ్యాపకురాలు అవార్డు గ్రహీత తెలంగాణ యూనివర్సిటీ తెలుగు అధ్యయన శాఖ ప్రొఫెసర్ కరిమిండ్ల లావణ్యను గురువారం పార్ట్టైమ్ అధ్యాపకుల సంఘం సభ్యులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో అధ్యక్షురాలు ప్రసన్న, ప్రధాన కార్యదర్శి సయ్యద్ తాహెర్, గంగాధర్, రఘువీర్, శ్రీనివాస్ గౌడ్, అశోక్ చవాన్ తదితరులు పాల్గొన్నారు. ఐక్యంగా హక్కులను సాధించుకుందాం జక్రాన్పల్లి: జిల్లాలోని సర్పంచులు ఐక్యంగా ఉండి తమ హక్కులను సాధించుకోవాలని సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షుడు మునిపల్లి చిన్న సాయిరెడ్డి అన్నారు. గురువారం అర్గుల్ పీవీఆర్ ఫంక్షన్ హాల్లో జిల్లా సర్పంచుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. జిల్లాలోని వివిధ గ్రామాల్లోని సర్పంచులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సర్పంచుల ప్రధా న సమస్య ఉప సర్పంచులకు చెక్ పవర్ ఉండడంతో అభివృద్ధిలో ఆటంకాలు ఎదురవుతున్నాయని అన్నారు. చెక్ పవర్ రద్దు కోసం రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క దృష్టికి తీసుకెళ్తామన్నారు. హక్కుల సాధనలో ఎ లాంటి ఒత్తిళ్లకు లొంగేది లేదన్నారు. సర్పంచు ల న్యాయమైన డిమాండ్ల సాధనకు అందరూ ఐక్యంగా కలిసి ముందుకు వెళదామని అన్నా రు. అనంతరం పలు అంశా లపై తీర్మానాలు చేశారు. కార్యక్రమంలో మోహన్ రెడ్డి, అంకాపూర్ దేవేందర్ రెడ్డి, సంతోష్, జనార్దన్, గొట్టిపాటి వాసు, మోహన్, రాజుగౌడ్, జలంధర్ రెడ్డి, ఉమారాణి సంజీవ్, గడ్డం అనిల్, రాజు, శ్రీనివాస్, సుదర్శన్, కొ మ్ముల శ్రీనివాస్, భూమేశ్వర్, సాయిరెడ్డి, చందర్, నీలిమ సాయిరెడ్డి, సర్పంచులు పాల్గొన్నారు. -
యూనివర్సిటీలను నిర్వీర్యం చేస్తోన్న ప్రభుత్వం
తెయూ(డిచ్పల్లి): కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రభుత్వ యూనివర్సిటీలకు తగిన నిధులు ఇవ్వకుండా నిర్వీర్యం చేస్తోందని తెయూ ఏబీవీపీ అధ్యక్షుడు సమీర్ విమర్శించారు. గురువారం రాష్ట్ర శాఖ పిలుపు మేరుకు తెయూ ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు వర్సిటీ పరిపాలనా భవనాన్ని ముట్టడించి నిరసన, ధర్నా నిర్వహించారు. అనంతరం రిజిస్ట్రార్ ఎం యాదగిరికి వినతిపత్రం అందజేశారు. ఏబీవీపీ అధ్యక్షుడు సమీర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం యూనివర్సిటీల అభివృద్ధి విషయంలో మొండి వైఖరిని అవలంబిస్తూ ఉన్నత విద్యను నిర్లక్ష్యం చేస్తోందన్నారు. వర్సిటీలకు సరైన నిధులు విడుదల చేయకుండా, బోధన, బోధనేతర ఖాళీలను భర్తీ చేయకుండా, సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులను కొనసాగిస్తూ ఫిక్స్డ్ డిపాజిట్లను కాజేయాలని కుట్ర పన్నుతుందని ఆరోపించారు. కార్యక్రమంలో వర్సిటీ ఏబీవీపీ కార్యదర్శి మోహన్, ఉపాధ్యక్షులు అనిల్, లెనిన్, నాయకులు విఘ్నేశ్, కిరిటి, ప్రీతం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
వార్షిక రుణ ప్రణాళికను అమలు చేయాలి
నిజామాబాద్ రూరల్: వార్షిక రుణ ప్రణాళిక 2026–27 సంవత్సరానికి చెందిన రుణ ప్రణాళికను పకడ్బందీగా చేపట్టాలని అదనపు కలెక్టర్ భుజంగరావు అన్నారు. గురువారం కలెక్టరేట్లో లీడ్ బ్యాంక్ మేనేజర్ కే రాజు ఆధ్వర్యంలో బ్యాంకుల మేనేజర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రూ. 19,943 కోట్ల రుణ ప్రణాళిక రివకరీ చేయవల్సి ఉండగా 30.6.2026 వరకు రూ. 6137 కోట్లు రెన్యువల్స్ చేశామని ఆయన పేర్కొన్నారు. ఇందులో భాగంగా 17.39 శాతం రికవరీ చేయడం జరిగిందన్నారు. వివిధ రుణాలు, రైతులకు సంబంధించి రుణాలు, కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ రుణాలు సకాలంలో చెల్లించిన వారికి తిరిగి మళ్లీ రుణాలు ఇవ్వాలని తెలిపారు. కార్యక్రమంలో డీఆర్డీఏ సాయన్న, జిల్లా వ్యవసాయ అధికారి వీరస్వామి, బ్యాంకు మేనేజర్లు, అధికారులు పాల్గొన్నారు. -
ఎస్సారెస్పీ నీటిని విడుదల చేయాలి
వేల్పూర్: ఎస్సారెస్పీలో 46 టీఎంసీల నీరున్నందున తక్షణమే 6 టీఎంసీల నీటిని విడుదల చేసి ప్రాజెక్టు కింద రెండు లక్షల ఆయకట్టును కాపాడాలని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం ఆయన హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. గుత్ప, అలీసాగర్, లక్ష్మి, చౌట్పల్లి హన్మంత్రెడ్డి, బోదెపల్లి, వేంపల్లి, నవాబు ఎత్తిపోతల పథకాలను ప్రారంభించాలని, వ్యవసాయానికి 24 గంటల కరెంటును సరఫరా చేయాలన్నారు. రైతులు, ప్రజా సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడం దారుణమని అన్నారు. ● ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి -
పాఠశాలల్లో వసతులపై సమీక్ష
ఖలీల్వాడి: నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్ జిల్లాలోని పాఠశాలను తనిఖీ చేసిన బాలల హక్కుల పరిరక్షణ కమిటీ చైర్పర్సన్ కే సీతాదయాక్రెడ్డి, సభ్యులు అధికారులతో గురువారం సమీక్ష నిర్వహించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో నిర్వహించిన సమావేశంలో కమిటీ సభ్యులు వందనగౌడ్, చందన, బండి అపర్ణ, సరిత, ప్రేమలత అగర్వాల్, పవన్కుమార్ తోపాటు అధికారులు పాల్గొన్నారు. మూడు జిల్లాల్లోని కేజీబీవీలు, ప్రభుత్వ పాఠశాలలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వెల్ఫేర్లలో పరిస్థితులపై సమీక్షించారు. క్షేత్రస్థాయిలో విద్యార్థుల స్థితిగతులు, పాఠశాలల్లోని మౌలిక వసతులపై అధికారులతో చర్చించారు. సమస్యలపై ప్రభుత్వానికి నివేదిస్తామని చైర్పర్సన్ అన్నారు. సంబంధిత అధికారులు పాల్గొన్నారు. -
సంగమక్షేత్రానికి మెరుగులు
పుష్కరాల సందర్భంగా జిల్లాలోని రెంజల్ మండలం కందకుర్తి ప్రాంతానికి మెరుగులు దిద్ది మ రింత శోభాయమానంగా తీర్చిదిద్దనున్నారు. గో దావరి, మంజీర, హరిద్రా నదుల త్రివేణి సంగమంగా విరాజిల్లుతున్న ఈ క్షేత్రానికి భారీ సంఖ్య లో భక్తులు తరలివచ్చే అవకా శం ఉంది. ఇక్కడ పుష్కర ఘాట్ల నిర్మాణం, రహదారుల నిర్మా ణం తదితర అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం రూ.30 కోట్లు కేటాయించింది. కందకుర్తిలో గతంలో నిర్మించిన మూడు పు ష్కరఘాట్లకు మరమ్మతులతోపాటు అదనంగా స్నానఘాట్లను నిర్మించనున్నారు. రూ. 6.05 కోట్లతో పుష్కరఘాట్ల నిర్మాణం చేపట్టనుండ గా, రోడ్ల అభివృద్ధికి రూ.3.90 కోట్లు వెచ్చించ నున్నారు. మరో రూ.5 కోట్లతో పురాతన శివాలయం అభివృద్ధి, సుందరీకరణ పనులను చేపట్టనున్నారు. సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : గోదావరి పుష్కరాల కు విస్త్రృత ఏర్పాట్లు చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. వచ్చే ఏడాది జూన్ 26 నుంచి జూలై 7వ తేదీ వరకు గోదావరి పుష్కరాలను నిర్వహించ నున్నారు. అలాగే జూలై 13 నుంచి 24 వరకు అంత్య పుష్కరాలను నిర్వహిస్తారు. ఈ క్రమంలో లక్షల సంఖ్యలో హాజరయ్యేభక్తులకు సౌకర్యాలను కల్పించేందుకు అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. జిల్లాలోని గోదావరి తీర ప్రాంతాల్లో పుష్కర ఘాట్ ల నిర్మాణం, ఘాట్లకు చేరేందుకు రహదారుల నిర్మాణం, టాయిలెట్లు తదితర ఏర్పాట్లు చేసేందుకు అవసరమైన పనులు మొదలుకానున్నాయి. జిల్లాలోని గోదావరి తీర ప్రాంతాల్లో భక్తుల కోసం విస్త్రృతంగా ఏర్పాట్లు పూర్తిచేయనున్నారు. రెంజల్ మండలంలోని కందకుర్తితోపాటు తాడ్బిలోలి వద్ద స్నాన ఘాట్ల నిర్మాణం చేపడతారు. నవీపేట మండలం యంచ వద్ద స్నానఘాట్లతోపాటు తీరం వరకు చేరుకునేలా రహదారుల అభివృద్ధి, మహిళలకు డ్రెస్సింగ్ రూమ్ల, మొబైల్ టాయిలెట్స్, తాగునీరు, 24 గంటలపాటు వైద్యసేవల సౌకర్యాలను కల్పించనున్నారు. అన్ని చోట్ల భక్తుల వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేకంగా స్థలాన్ని కేటాయించనున్నారు. పనుల నాణ్యతే కీలకం పుష్కరాల ఏర్పాట్ల కోసం చేపడుతున్న పనుల ను శాశ్వత ప్రాతిపదికన చేస్తున్నట్టు చెబుతు న్నా నాణ్యత విషయంలో ఎక్కువగా తాత్కాలి క పనులకే పరిమితమవుతున్నాయి. రూ.కోట్లు వెచ్చించి చేపట్టే పనులు నాణ్యతగా చేపట్టాల్సి ఉంది. భక్తుల రద్దీ దృష్ట్యా ఈసారి కొత్తగా ఘా ట్లను ఏర్పాటు చేయాల్సి ఉండగా ప్రభుత్వం పాత ఘాట్ల అభివృద్ధికే మొగ్గుచూపుతోంది. గోదావరి తీర ప్రాంతాలైన కోస్లి, బినోల, తుంగిని, తడ్పాకల్, ఉమ్మెడ తదితర ప్రాంతాల్లో నూ కొత్తగా ఘాట్ల నిర్మాణం చేపడితేనే విపరీతమైన రద్దీ, ట్రాఫిక్ ఇబ్బందులు తొలగనున్నాయి. గోదావరి పుష్కరాలకు ఏర్పాట్లు కందకుర్తి వద్ద రూ. 30 కోట్లతో పనులు యంచలో ఘాట్ల నిర్మాణానికి రూ. 2.15 కోట్లు వచ్చే ఏడాది జూన్ 26 నుంచి గోదావరి పుష్కరాలు కుంభమేళాను తలపించనున్న గోదావరి తీర ప్రాంతాలు -
నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవు
● డీఎంహెచ్వో రాజశ్రీబోధన్టౌన్(బోధన్): పీసీపీఎన్డీటీ యాక్ట్ నిబంధనలు పాటించని స్కానింగ్ సెంటర్లపై చర్యలు తప్పవని జిల్లా వైద్యాధికారి రాజశ్రీ హెచ్చరించారు. బోధన్ పట్టణంలోని మూడు స్కానింగ్ కేంద్రాలను ఆమె గురువారం తనిఖీ చేశారు. రికార్డులు, రిజిస్టర్లను పరిశీలించారు. స్కానింగ్ సమయంలో గర్భస్థ శిశువు ఆడ, మగ అనే విషయాన్ని తెలపడం విరుద్ధమని, ఫాం–ఎఫ్ను పూర్తి వివరాలతో తప్పులు లేకుండా నమోదు చేయాలని సూచించారు. సరైన రిఫరల్ మేరకు మాత్రమే ఆల్ట్రా సౌండ్ స్కానింగ్ నిర్వహించాలన్నారు. కాగా, శ్రీకృష్ణ స్కానింగ్ సెంటర్లో రికార్డులు పరిశీలిస్తుండగా దురుసుగా మాట్లాడిన నిర్వాహకులపై డీఎంహెచ్వో మండిపడ్డారు. రికార్డుల నిర్వహణతోపాటు రిజస్టర్లు సక్రమంగా నిర్వహించకపోతే సహించేది లేదని హెచ్చరించారు. ఆమె వెంట డిప్యూటీ డీఎహెచ్వో విద్య, పీసీపీఎన్డీటీ అధికారులు ఉన్నారు. -
చేయూత క్రాస్ చెక్!
డొంకేశ్వర్(ఆర్మూర్) : జిల్లాలో చేయూత పింఛన్ల కోసం వచ్చిన దరఖాస్తుల వడపోతకు అధికారులు రంగం సిద్ధం చేశారు. దరఖాస్తుదారుల్లో అర్హులను గుర్తించడానికి నాలుగైదు రోజుల్లో గ్రామాలు/వార్డుల్లో క్షేత్రస్థాయి పరిశీలన చేయనున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఆయా శాఖల మండల అధికారులను నియమించారు. ఈ మేరకు సంబంధిత అధికారులకు హైదరాబాద్ సెర్ప్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శిక్షణ ఇచ్చారు. అధికారులు నేరుగా దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్లి అర్హతలను నిష్పక్షపాతంగా క్రాస్చెక్ చేయనున్నారు. క్షేత్రస్థాయిలో సేకరించిన నిజమైన వివరాలను అక్కడిక్కడకే అధికారి ‘చేయూత’ మొబైల్ యాప్లో నమోదు చేస్తారు. ఇందుకోసం అధికారులకు యాప్కు సంబంధించిన లాగిన్ ఐడీ, పాస్వర్డ్లు సైతం ఇచ్చారు. దరఖాస్తుదారు ఆదాయం, రేషన్కార్డు, సాగుభూమి ఉందా, కుటుంబంలో ఎవరికై నా ప్రభుత్వ ఉద్యోగం ఉందా, వృత్తి ఏమిటి తదితర వివరాలు యాప్లో అవును/కాదు ఆప్షన్ల రూపంలో ఉన్నాయి. అధికారులు ఆప్షన్లను ఎంచుకోగానే చివరగా వెరిఫికేషన్ చేస్తున్న ఫొటోను అప్లోడ్ చేయగానే రిపోర్టు మొత్తం సెర్ప్ లాగిన్లోకి వెళ్తుంది. క్రాస్ చెక్ పూర్తయిన తర్వాత సెర్ప్ అధికారులు కూడా 360డిగ్రీ సాఫ్ట్వేర్తో అసలైన లబ్ధిదారులను ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే, దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ మొత్తాన్ని ఈ నెల 25వ తేదీలోగా పూర్తి చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలించారు. ఈ నెల 15వ తేదీతో పింఛన్ల దరఖాస్తుకు గడువు తేదీ ముగియనుండగా, వెంటనే క్షేత్రస్థాయి పరిశీలన ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నారు. మండల స్థాయి అధికారులతో దరఖాస్తుల పరిశీలన ఇళ్ల వద్దకే వెళ్లనున్న ఆఫీసర్లు ప్రత్యేక యాప్ ద్వారా అర్హుల గుర్తింపు ఈ నెల 25లోగా పూర్తి చేయాలని ఆదేశాలు -
దీన్ దయాళ్ స్పర్శ్ యోజన క్విజ్ పోటీలు
● తపాలా శాఖ ఆధ్వర్యంలో 6 నుంచి 9వ తరగతి విద్యార్థులకు..● విజేతలకు ఏడాదికి రూ.6వేల స్కాలర్షిప్నిజామాబాద్ రూరల్ : తపాలా శాఖ ఆధ్వ ర్యంలో 6 నుంచి 9వ తరగతి వరకు చదివే విద్యార్థులకు దీన్ దయాళ్ స్పర్శ్ యోజన క్విజ్ పోటీలు నిర్వహించనున్నట్లు సీనియర్ సూపరింటెండెంట్ జనార్దన్ రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘అభిరుచులలో ఫిలాట లి రారాజు’’ స్టాంపుల సేకరణ అభిరుచిపై రీజినల్ స్థాయి క్విజ్ పోటీలు ఉంటాయన్నా రు. పోటీల్లో పాల్గొనాలనుకునే విద్యార్థికి ‘‘ఫిలాటలి డిపాజిట్ ఖాతా’’ తప్పనిసరిగా పొంది ఉండాలని, గెలుపొందిన విద్యార్థు లు ‘‘ఫిలాటలి ప్రాజెక్టు వర్క్’’ సమర్పించా ల్సి ఉంటుందని తెలిపారు. విజేతలకు సంవత్సరానికి రూ.6 వేల స్కాలర్షిప్ అందజేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 21వ తే దీలోపు సమీపంలోని పోస్టాఫీసులో దరఖా స్తు చేసుకోవాలని సూచించారు. ఎన్ఎస్యూఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా వేణురాజ్ ఖలీల్వాడి: ఎన్ఎస్యూఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నిజామాబాద్ నగరానికి చెందిన వరదబట్టు వేణురాజ్ను నియమిస్తూ జాతీయ అధ్యక్షుడు కన్నయ్య కుమార్ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న వేణురాజ్ను రాష్ట్ర కమిటీలోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమించిన జాతీయ, రాష్ట్ర కమిటీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. కామారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా వెంకటేశ్గౌడ్ భిక్కనూరు: ఎన్ఎస్యూఐ జిల్లా అధ్యక్షుడిగా భిక్కనూరు మండల కేంద్రానికి చెందిన జేపీ వెంకటేశ్గౌడ్ నియామకం అయ్యారు. ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు యాడవల్లి వెంకటస్వామి గురువారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ సందర్భంగా వెంకటేశ్గౌడ్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో నియామకానికి కృషి చేసిన ప్ర భుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, రాష్ట్ర యు వజన కాంగ్రెస్ నాయకుడు ఇలియాస్, రాష్ట్ర అధ్యక్షుడు వెంకటస్వామికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజ లందరికీ వివరించడంతోపాటు కాంగ్రెస్ అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈవీఎం గోదాం పరిశీలన నిజామాబాద్ అర్బన్ : జిల్లా కేంద్రంలోని వి నాయకనగర్లో ఉన్న ఈవీఎం గోదామును అదనపు కలెక్టర్ భుజంగరావుతో కలిసి కలెక్టర్ భవేశ్ మిశ్రా గురువారం పరిశీలించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎం గోదాము సీల్ను తెరిపించి ఈవీఎంలు, బ్యాలెట్ యూనిట్ లు, ఎన్నికల సామగ్రిని భద్రపరిచిన గదుల ను క్షుణ్ణంగా పరిశీలించారు. సీసీ కెమెరాలు నిరంతరం పనిచేసేలా చూడాలని, ఈవీఎంలు, బ్యాలెట్ యూనిట్లు, ఇతర సామగ్రికి ఎ లాంటి నష్టం వాటిల్లకుండా జాగ్రత్తలు తీ సుకోవాలని అధికారులను ఆదేశించారు. క లెక్టర్ వెంట అగ్నిమాపక శాఖ అధికారి శంక ర్, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు బాలరా జ్, సిబ్బంది సాత్విక్, విజయేందర్, ఆయా రాజకీయ పార్టీల ప్రతినిధులు, అధికారులు ఉన్నారు. దరఖాస్తుల ఆహ్వానం ఖలీల్వాడి : జవహర్ నవోదయ విద్యాలయంలో 9, 11వ తరగతుల్లో (2027–28 వి ద్యా సంవత్సరం) ఖాళీ ఉన్న సీట్లను భర్తీ చే సేందుకు నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల కు చెందిన విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన విద్యార్థులు ఎటువంటి దరఖాస్తు రుసుము లేకుండా ఆన్లైన్లో ఈనెల 30వ తేదీ వరకు https:// cbseitims.nic. in/2026/nvsi ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎల్ఈఎస్టీ– 2027లో ఎంపికైన విద్యార్థులు కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ జవహర్ నవోదయ విద్యాలయంలో విద్యనభ్యసించేందుకు అర్హ త సాధిస్తారని తెలిపారు. -
కొండంత అండ పంటకుంట
● జిల్లాలో ముమ్మరంగా పంట కుంటల నిర్మాణం ● సవాల్గా తీసుకున్న అధికారులు ● 40 రోజుల్లోనే 68 పనులు పూర్తి డొంకేశ్వర్(ఆర్మూర్): జిల్లాలో సాగునీటి ఎద్దటి ని వారించడంతోపాటు భూగర్భ జలాలను పెంపొందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చే పట్టిన ‘జలసిరి’ కార్యక్రమం ముందుకు సాగుతోంది. రైతుల వ్యవసాయ భూముల్లో పంట కుంటల నిర్మాణాన్ని (ఫామ్ పాండ్) జిల్లా అధికారులు సవాల్గా తీసుకుని పనులను ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. ప్రతి గ్రామంలో ఐదు పంట కుంటలు తవ్వించి జిల్లా వ్యాప్తంగా 2,725 కుంటలు నిర్మించాలని ప్రధాన లక్ష్యం ఉంది. రైతులను మెప్పించి, క్షేత్రస్థాయిలో పనులను పరిశీలిస్తున్న అధికారులు ఇప్పటి వరకు 68 పంట కుంటలను ఉపాధి కూలీలతో తవ్వించి పూర్తి చేయించారు. ఈ పనులు కేవ లం 40 రోజుల్లోనే పూర్తి చేయడం గమనార్హం. మ రో 439 పనులు పురోగతిలో ఉన్నాయి. యంత్రాంగం వేగంగా కదలడంతో వీటిని కూడా త్వరగా పూర్తి చేస్తున్నారు. వందశాతం లక్ష్యాన్ని చేరుకోకపోయినా, సంతృప్తికర స్థాయిలో పంట కుంటలు ని ర్మించే అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. రైతుకు ఉచితం.. కూలీలకు ఉపాధి సాగు భూముల్లో పంట కుంటలను ప్రభుత్వం రైతులకు ఉచితంగా నిర్మించి ఇస్తోంది. కుంటను స్థానిక ఊరి ఉపాధి కూలీలతో తవ్వించి వారికి ఉపాధిని కల్పిస్తున్నారు. పంట కుంట సైజు వెడల్పు 12 మీటర్లు, పొడవు 12 మీటర్లు, లోతు 2 మీటర్లు ఉంటుంది. దీని ద్వారా వర్షాభావ పరిస్థితుల్లో, నీటి ఎద్దటి సమయాల్లో అత్యవసర సాగునీరందుతుంది. ఉపాధి అవకాశాలు మెరుగుపర్చుకోవడానికి రైతులు ఇందులో చేపల పెంపకాన్ని కూడా చేసుకోవచ్చు. మరో అదనపు ఆదాయం కింద పశువుల/గొర్రెల షెడ్డును కూడా నిర్మించుకోవడానికి అధికారులు అవకాశం కల్పిస్తున్నారు. రైతులు ముందుకు రావాలి సాగునీటి కొరతను అధిగమించడానికి ప్రభుత్వం చేపట్టిన పంట కుంటలు నిర్మించుకోవడానికి రైతులు ముందుకు రావాలి. ఆసక్తి ఉన్న అర్హులైన రైతులు గ్రామ పరిధిలోని అధికారులను సంప్రదించి పేర్లు నమోదు చేసుకోవాలి. రైతుల సహకారంతో లక్ష్యానికి అనుగుణంగా పంట కుంటలను నిర్మిస్తాం. – సాయన్న, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి -
నేరాల నియంత్రణపై దృష్టి సారించాలి
బోధన్రూరల్: నేరాల నియంత్రణపై పోలీస్ అధికారులు, సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించాలని పోలీస్ కమిషనర్ పి సాయిచైతన్య అన్నారు. బోధనన్ డివిజన్ పరిధిలో నేరాల నియంత్రణ, పెండింగ్ కేసుల పురోగతిపై సర్కిల్ కార్యాలయంలో గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. డ్రగ్స్, గంజాయి రవాణాను నివారించేందుకు ప్రత్యేక దాడులు కొనసాగించాలని, అవసరమైతే పీడీ యాక్ట్ కింద కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించడంతోపాటు బాధితులకు తక్షణ సహాయం అందించాలన్నారు. పాత నేరస్తులు, రౌడీషీటర్లు, బెయిల్పై ఉన్న నేరస్తులపై నిరంతర నిఘా ఉంచాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని, బ్లాక్స్పాట్లను గుర్తించి సైన్న్ బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. హైవేలకు అనుసంధానంగా ఉన్న లింక్ రోడ్ల వద్ద స్పీడ్ బ్రేకర్లు, రోడ్డు పక్కన పొదల తొలగింపు వంటి చర్యలు చేపట్టాలన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్, ఓవర్స్పీడ్, ట్రిపుల్ డ్రైవింగ్, మైనర్ డ్రైవింగ్ను నివారించేందుకు ప్రత్యేక డ్రైవ్లు చేపట్టాలన్నారు. పండుగల సందర్భంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడంతోపాటు 24 గంటలపాటు వాహనాల తనిఖీలు చేపట్టాలన్నారు. సమావేశంలో బోధన్న్ ఏసీపీ పి శ్రీనివాస్, సీఐలు, ఎస్హెచ్వోలు, ఎస్సైలు, తదితరులు పాల్గొన్నారు. -
నీటి వనరులు వృథా కానివ్వొద్దు
● ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డినిజామాబాద్ అర్బన్: ఎల్నినో ప్రభావంతో వర్షాభావం నెలకొని ఉన్న ప్రస్తుత తరుణంలో అందుబాటులో ఉన్న నీటి వనరులు వృథా కాకుండా నిరంతరం పర్యవేక్షించాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి సూచించారు. కలెక్టరేట్లో గురువారం కలెక్టర్ భవేశ్మిశ్రాతో కలిసి వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. వివిధ జలాశయాలలో అందుబాటులో ఉన్న నీటి నిల్వలపై ఇరిగేషన్ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. గతేడాదితో పోలిస్తే శ్రీరాంసాగర్ సహా ఇతర ప్రాజెక్టులలో అతి తక్కువ నీటి నిల్వలు ఉన్నాయన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని చుక్క నీరు సైతం వృథా కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సూచించారు. తాగునీటి అవసరాలకు నీటిని నిలువ ఉంచుతూ, పంటలను కాపాడేందుకు వీలుగా రెండు తడుల వరకు సాగు నీటిని విడుదల చేయాలని నిర్ణయించామన్నారు. నిజాంసాగర్, శ్రీరాంసాగర్ జలాలు చివరి ఆయకట్టు వరకు చేరేలా గట్టి నిఘా ఉంచాలన్నారు. రైతుల ప్రయోజనాలతో ముడిపడి ఉన్న అంశాలలో ఏమాత్రం రాజీ పడబోమని, నీటి వృథా జరిగి పంటలు ఎండితే సంబంధిత అధికారులను బాధ్యులుగా పరిగణిస్తామని తేల్చి చెప్పారు. నీటి వృథాను నిలువరించేందుకు అవసరమైన చోట కాలువలు, తూముల మరమ్మతులు వంటి పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని, పనులకు కావాల్సిన నిధులను సమకూరుస్తామని సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. ఖరీఫ్ పంట సేకరణకు ఇబ్బందులు లేకుండా ఉండేందుకు వీలుగా గోదాములలో నిలువ ఉన్న బియ్యం నిల్వలను నిర్దేశిత ప్రాంతాలకు వేగంగా తరలించాలని సూచించారు. ప్రభుత్వ విద్యా సంస్థలలో చదువుకుంటున్న బాలబాలికలకు ఏకరూప దుస్తులను త్వరితగతిన అందించాలని సూచించారు. సమావేశంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, డీఆర్వో గీత, జెడ్పీ సీఈవో సాయాగౌడ్, డీఆర్డీవో సాయన్న, పౌర సరఫరాల శాఖ అధికారి అరవింద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కొలువు.. సాధనతో సులువు
● కలెక్టర్ భవేశ్ మిశ్రా, సీపీ సాయి చైతన్యఖలీల్వాడి: పోటీ పరీక్షలకు ప్రిపేరవుతున్న అభ్య ర్థులు ఉద్యోగ సాధనే ధేయ్యంగా ప్రయత్నించాలని, లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఆ దిశగా పయనించాల ని కలెక్టర్ భవేశ్ మిశ్రా, సీపీ సాయి చైతన్య అన్నా రు. జిల్లా కేంద్రంలోని జీజీ కాలేజీ ఆడిటోరియంలో ఫ్రీ రిక్రూట్మెంట్ ప్రోగ్రాంను కలెక్టర్, సీపీ బుధవారం ప్రారంభించారు. పోటీ పరీక్షల మెలుకవలు తెలిస్తే పోలీసు శాఖలో ఉద్యోగం ఈజీగా సా ధించవచ్చని వారు అన్నారు. ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులలో సుమారు 200 మందిని ఎంపిక చేశారు. జిల్లా యంత్రాంగం తోడ్పాటుతో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రీ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ను ఏర్పాటు చేశారు. అనవసర భయాలను వీడి ఆత్మవిశ్వాసా న్ని పెంపొందించుకోవాలని సూచించారు. కార్యక్ర మంలో జీజీ కాలేజ్ ప్రిన్సిపాల్ రామ్మోహన్రెడ్డి, భాగ్యకిరణ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ భాగ్య కిరణ్, నిజామాబాద్ ఏసీపీ ప్రకాశ్ యాదవ్ పాల్గొన్నారు. -
ఇంటర్లో ఎఫ్ఆర్ఎస్కు బ్రేక్
ఖలీల్వాడి: ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో హాజరు పర్యవేక్షణకు గత విద్యాసంవత్సరం ప్రవేశపెట్టిన ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్(ఎఫ్ఆర్ఎస్)కు బ్రేక్ పడింది. సంస్కరణల్లో భాగంగా విద్యార్థులు, లెక్చరర్లు, సిబ్బంది హాజరును డిజిటల్గా నమోదు చేసేందుకు తీసుకొచ్చిన విధానం ఏడాదికే నిలిచిపోయింది. 2026–27 విద్యాసంవత్సరంలో ఎస్ఆర్ఎస్ అమలు చేయకపోవడంతో జూనియర్ కాలేజీల్లో మళ్లీ పాత పద్ధతిలో రిజిస్టర్లలోనే హాజరు నమోదు చేస్తున్నారు. గత విద్యాసంవత్సరంలో జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఎఫ్ఆర్ఎస్ ద్వారా హాజరు నమోదు చేశారు. జిల్లాలో సుమారు 260 మంది ఫ్యాకల్టీ, సిబ్బంది, ఫస్ట్ ఇయర్లో 4,331 మంది, సెకండ్ ఇయర్లో 3,300 మంది విద్యార్థులకు ఈ విధానం అమలైంది. ఫేషియల్ అటెండెన్స్ అందుబాటులో ఉండటంతో విద్యార్థులు, లెక్చరర్ల హాజరుపై పర్యవేక్షణ పెరిగిందని అధికారులు పేర్కొన్నారు. మళ్లీ పాత పద్ధతిలో.. గతేడాది ఎఫ్ఆర్ఎస్ నిర్వహించిన ఏజెన్సీతో ఇంటర్ విద్యాశాఖ ఈ విద్యాసంవత్సరం కాంట్రాక్ట్ను రెన్యువల్ చేయలేదు. దీంతో జూన్ నెలాఖరు నుంచి యాప్ పనిచేయడం లేదని కాలేజీ వర్గాలు చెబుతున్నాయి. ఫలితంగా డిజిటల్ హాజరు నమోదు, పర్యవేక్షణ పూర్తిగా నిలిచిపోయింది. ఫేషియల్ అటెండెన్స్ నిలిచిపోవడంతో జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో విద్యార్థులు, లెక్చరర్లు, సిబ్బంది మళ్లీ రిజిస్టర్లలో హాజరు వేస్తున్నారు. డిజిటల్ పర్యవేక్షణ లేకపోవడంతో హాజరు విషయంలో నిర్లక్ష్యం పెరిగే అవకాశం ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంటర్ బోర్డు నుంచి నాలుగైదు రోజుల్లో ఎఫ్ఆర్ఎస్కు అనుమతి వస్తుంది. దీంతో విద్యార్థులు, లెక్చరర్లకు అమలు చేస్తాం. లెక్చరర్లు, సిబ్బంది కాలేజీలకు క్రమం తప్పకుండా హాజరు అవుతున్నారు. – రవికుమార్, డీఐఈవో, నిజామాబాద్ జూన్ నుంచి మళ్లీ రిజస్టర్లలోనే హాజరు ఎఫ్ఆర్ఎస్ కాంట్రాక్ట్ రెన్యువల్ చేయని ఇంటర్ విద్యాశాఖ ఏడాదికే నిలిచిన డిజిటల్ అటెండెన్స్ విధానం విద్యార్థులు, లెక్చరర్ల హాజరుపై తగ్గిన పర్యవేక్షణ -
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
బోధన్ రూరల్: సాలూర మండల కేంద్రంలోని విద్యుత్ సబ్స్టేషన్ సమీపంలో సాలంపాడ్ గ్రామానికి చెందిన బొర్ర గంగారాం(45) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. బోధన్ రూరల్ ఎస్సై రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గంగారాం కూలీ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. బుధవారం రాత్రి బైక్పై సాలూర–బోధన్ రహదారిపై ఇంటికి వెళ్తుండగా ప్రమాదవశాత్తు బైక్పై నుంచి పడి మృతి చెందాడు. రహదారిపై ఇసుక కుప్పలు వేయడం వల్లే ప్రమాదం జరిగిందని ఆరోపిస్తూ మృతుడి కుటుంబీకులు, బంధువులు రాస్తారోకో నిర్వహించారు. విషయం తెలుసుకున్న ఎస్సై రాజశేఖర్ ఘటన స్థలానికి చేరుకొని చట్టపరంగా చర్యలు తీసుకొని న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. మృతుడికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఒకరి అదృశ్యం నిజామాబాద్అర్బన్: రైలులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి అదృశ్యమైనట్లు రైల్వే ఎస్సై సాయిరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మహారాష్ట్రలోని ధర్మాబాద్కు చెందిన బాలాజీ బాబురావు ఈనెల 7న తిరుపతి నుంచి నాందేడ్ రైలులో ప్రయాణిస్తున్న సమయంలో నిజామాబాద్ రైల్వే స్టేషన్లో దిగి వెళ్లిపోయాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. అతని ఆచూకీ తెలిసిన వారు 8712658591 నంబర్కు సమాచారం అందించాలని కోరారు. ● 98 రకాల పక్షులు స్వాధీనంనిజామాబాద్ రూరల్: మండలంలోని మల్లారం, మాలపల్లి ప్రాంతాల్లో అటవీ శాఖ అధికారులు బుధవారం తనిఖీలు నిర్వహించారు. మాలపల్లిలో ఉన్న ఓ అక్వేరియం, పెట్ దుకాణంలో అక్రమంగా ఉంచి విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న 98 రకాల పక్షులను అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. నిందితులు సయ్యద్ కలీం, సయ్యద్ బిన్ ఖాలీద్ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. పక్షులను ఎక్కడి నుంచి తీసుకొచ్చారు. ఎవరు సరఫరా చేస్తున్నారు అనే అంశాలపై విచారణ చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. -
రైస్ మిల్లులపై అధికారుల దాడులు ఆపాలి
బోధన్: రైస్ మిల్లులపై విజిలెన్స్ అధికారుల దాడులు, కేసుల నమోదు తక్షణమే నిలిపివేయాలని తాలూకా రైస్మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరారు. రైస్ మిల్లులపై అధికారుల దాడులకు నిరసనగా బుధవారం పట్టణ కేంద్రంలోని పెద్ద హనుమాన్ మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రైస్మిల్లులను బంద్పాటించారు. అనంతరం వారు మాట్లాడుతూ. తమకు ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు విడుదల చేయడం లేదన్నారు. రైస్మిల్లులపై విజిలెన్స్ దాడులు, కేసుల నమోదుతో తమ కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం రైస్మిల్లులకు అప్పగించిన తరహాలోనే వెంటనే మిల్లింగ్ చేసిన బియ్యం గోదాంలకు తరలించాలని తెలిపారు. డివిజన్ పరిధిలోని 56 రైస్ మిల్లర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. తమ సమస్యలను పరిష్కరించే వరకు రైస్మిల్లుల బంద్ను కొనసాగిస్తామని రైస్మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధి తెలిపారు. తాలూకా రైస్మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సాంబిరెడ్డి, ప్రతినిధులు బోనాల బలరాంరెడ్డి, శ్యామ్కుమార్, ఇనాని, నాగరాజు, సచిన్, శ్రీహరి, అశోక్, శ్రీనివాస్, అరవింద్ ఇనాని, సాయి కుషాల్, నరేశ్ తదితరులు పాల్గొన్నారు. -
హైవేపై లారీ బోల్తా
● నాలుగు కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు ఇందల్వాయి: మండలంలోని చంద్రాయన్పల్లి శివారులో 44వ నంబర్ జాతీయ రహదారిపై బుధవారం వేకువ జామున హైదరాబాద్ నుంచి నాగ్పూర్ వైపు వెళ్తున్న లారీ బోల్తా పడింది. దీంతో ఆ దారిలో నాలుగు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచి ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగింది. టోల్ ప్లాజా సిబ్బంది, స్థానిక పోలీసులు ఘటనా స్థలికి వెళ్లి క్రేన్ సహాయంతో బోల్తాపడ్డ లారీని పక్కకు తొలగించి ట్రాఫిక్ని తొలగించారు. వాన నీరు వెళ్లేందుకు రహదారిపై టోల్ప్లాజా యాజమాన్యం తవ్విన గుంత వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపించారు. ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టకుండా రోడ్డుని మళ్లించడంతో రాత్రి వేళల్లో వాహనదారులు గందరగోళానికి గురవుతున్నారని తెలిపారు. ప్రమాదంలో లారీ డ్రైవర్కి తీవ్ర గాయాలు కాగా చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు టోల్ ప్లాజా సిబ్బంది తెలిపారు. -
పీహెచ్సీ ఫార్మసీ అధికారికి పీహెచ్డీ పట్టా
పెర్కిట్: ఆర్మూర్ మండలం గోవింద్పేట్ పీహెచ్సీలో ఫార్మసీ అధికారిగా విధులు నిర్వహిస్తున్న లక్ష్మణ్ రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా మంగళవారం పీహెచ్డీ పట్టా అందుకున్నారు. హైదరాబాద్లో నిర్వహించిన ఉస్మానియా యూనివర్సిటీ 85వ స్నాతకోత్సవ వేడుకల్లో గవర్నర్ లక్ష్మణ్కు పీహెచ్డీ పట్టాను అందజేశారు. ప్రొఫెసర్లు శ్రీకృష్ణ, నాయుడు అశోక్, లింబాద్రి పర్యవేక్షణలో ‘సైకాలాజికల్ క్యాపిటల్ అకడమిక్ ఎంగేజ్మెంట్, అచీవ్మెంట్ మోటివేషన్ లత కొర్రెలేట్స్ ఆఫ్ సైకాలాజికల్ వెల్ బీయింగ్ ఇన్ హైస్కూల్ స్టూడెంట్స్’ అనే అంశంపై పీహెచ్డీ చేశారు. గోవింద్పేట్ పీహెచ్సీలో వైద్యాధికారిణి మానస లక్ష్మణ్ను బుధవారం ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో హెచ్ఈవో శంకర్, సిబ్బంది నళిని దేవి, సంధ్య, మాజీద్ పాల్గొన్నారు. నిజామాబాద్ అర్బన్: ముదక్పల్లి పీహెచ్సీ పరిధిలోని ఖానాపూర్ బస్తీ దవాఖానాను డీఎంహెచ్వో రాజశ్రీ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాజరు పట్టిక, రికార్డులు, ఓపెన్ రిజిస్టరు, ఔషధాల స్టాక్ రిజిస్టర్ను పరిశీలించారు. సీజనల్ వ్యాధుల నివారణకు సరిపడా మందులను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. సిబ్బంది సమయపాలన పాటిస్తూ ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించాలన్నారు. -
నీటకుంటలో మునిగి రైతు మృతి
నిజాంసాగర్: పంట పొలానికి నీరు పారించేందుకు కుంటలోకి దిగిన సుంకె సాయిలు (38) అనే రైతు బుధవారం ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందాడు. ఎస్సై శివకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మహమ్మద్నగర్ మండలం హసన్పల్లి గ్రామానికి చెందిన సుంకె సాయిలు గ్రామ శివారులో వరి పంట సాగు చేశాడు. పొలానికి నీరు పారించేందుకు ఉదయం ఇంటి నుంచి వెళ్లాడు. గ్రామ శివారులోని బోయినోళ్ల తూమును ఎత్తేందుకు నీటిలోకి దిగాడు. తూమును ఎత్తేందుకు నీటిలోకి వెళ్లిన సాయిలు ప్రమాదవశాత్తు నీట మునిగి గల్లంతయ్యాడు. అదే సమయంలో కుంట వద్ద ఉన్న రైతులు గమనించి నీటమునుగుతున్న సాయిలును కాపాడేందుకు ప్రయత్నించారు. అప్పటికే అతను నీటమునగడంతో కుటుంబీకులు, గ్రామస్తులకు సమచారం అందించారు. విషయం తెలుసుకున్న ఎస్సై శివ కుమార్ ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని బయటకు తీయించారు. మృతుడి భార్య అనిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి భార్యతో పాటు కుమార్తె, కుమారుడు ఉన్నారు. -
చి‘వరి’కి సాగునీరందేనా?
● జాడలేని వర్షాలు.. ఎండుతున్న పంటలు ● ట్యాంకర్లతో నీరందిస్తున్న రైతులు మాక్లూర్: వాన జాడ లేక రైతులు సాగు చేసిన వరి పంటలు ఎండిపోతున్నాయి. 20 రోజులుగా వర్షాలు కురవకపోవడంతో పంటలను రక్షించుకునేందుకు రైతులు తంటాలు పడుతున్నారు. రెండు రోజులుగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకొని వర్షం పడే సూచనలు కనిపిస్తుండటంతో కనీసం వర్షం పడేవరకై నా ఎండుతున్న పొలాన్ని కాపాడుకుంటే ఆ తర్వాత వర్షపు నీటితో పంట గట్టెక్కుతుందన్న ధీమాతో రైతులు ట్యాంకర్ల ద్వారా నీరందిస్తున్నారు. మాక్లూర్ మండలంలో మొత్తం 19 వేల ఎకరాల్లో ఆయా రకాల పంటలను సాగు చేస్తుండగా, అందులో అత్యధికంగా వరి పండిస్తున్నారు. జూలై నెలాఖరులో కురిసిన వర్షంతో నీటి అవకాశం లేని రైతులు సైతం హడావిడిగా నాట్లు వేసుకున్నారు. నాటి నుంచి వర్షాలు లేకపోవడంతో అందుబాటులో ఉన్న చిన్న కుంటలు, ఒర్రెల నుంచి నీటిని వాడుకొని పంటలను దక్కించుకున్నారు. ప్రస్తుతం వాటిలో కూడా నీరు అడుగంటిపోవటంతో మండలంలోని చిక్లి, గుంజ్లి, మదన్పల్లి, బొంకన్పల్లి, ముల్లంగి(బి), వల్లభాపూర్ తదితర గ్రామాల్లో సాగు చేసిన వరి పంటలు ఎండిపోతున్నాయి. ఈ చిత్రంలోని రైతు పేరు పంగెర చిన్న రాజన్న. మాక్లూర్ మండలం చిక్లి గ్రామం. నాలుగు ఎకరాల్లో వరి సాగు చేస్తున్నాడు. ఆశించిన వర్షాలు కురువకపోవడంతో నేల నెర్రలుబారుతోంది. దీంతో పంటను కాపాడుకోడానికి ట్యాంకర్ ద్వారా నీటిని అందిస్తున్నాడు. అయితే, గుత్ప లిఫ్ట్ ఆయకట్టు చివరి భాగంలో ఉన్న ఈ పొలానికి నీరు చేరాలంటే కాలువలు నిండుగా ప్రవహించాల్సి ఉంటుందని రాజన్న చెబుతున్నాడు. చివరి ఆయకట్టు వరకు అందించాలి వర్షం పడే సూచనలు కన్పించినట్టే కన్పించి మాయం అవుతున్నాయి. గుత్ప ఎత్తిపోతల ద్వారా విడుదల చేసిన నీరు చివరి ఆయకట్టు వరకు అందేలా చూడాలి. లేకపోతే మా గ్రామ శివారులోని 150 ఎకరాల మేర పంటలు ఎండిపోతాయి. – పంగెర చిన్న రాజన్న, రైతు, చిక్లి -
క్రీడలకు అధిక ప్రాధాన్యమిస్తున్న సీఎం
● డీవైఎస్వో పవన్కుమార్ వేల్పూర్: రాష్ట్రంలో క్రీడలకు సీఎం రేవంత్రెడ్డి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని జిల్లా యువజన సంక్షేమ క్రీడల అభివృద్ధి అధికారి పవన్కుమార్ అన్నారు. మండలంలోని పడగల్ ఉన్నత పాఠశాలలో బుధవారం ప్రారంభమైన 70వ ఎస్జీఎఫ్ మండల అంతర్ పాఠశాల క్రీడల పోటీలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సీఎం రేవంత్రెడ్డి క్రీడలపై ఉన్న ఆసక్తితో రాష్ట్రంలో క్రీడా యూనివర్సిటీ నెలకొల్పినట్లు పేర్కొన్నారు. విద్యార్థులు, యువకులు సెల్ఫోన్లకు బానిసలు కాకుండా ఆటలపై ఆసక్తి పెంచుకోవాలన్నారు. క్రీడల్లో ప్రతిభ చూపే విద్యార్థులకు చదువుల్లో, ఉద్యోగాల్లో ప్రత్యేక అవకాశాలు ఉంటాయన్నారు. క్రీడల కన్వీనర్ పీ జలంధర్, వేల్పూర్ ఎంపీడీవో రఘురాం, సర్పంచ్ నల్లరాజు, ఎంఈవో రేణుక జ్యోతి వెలిగించి క్రీడలను ప్రారంభించారు. మార్చ్పాస్ట్ పోటీలు నిర్వహించగా పడగల్ హైస్కూలుకు ప్రథమ, వేల్పూర్, పచ్చలనడ్కుడ స్కూళ్లకు ద్వితీయ, అంక్సాపూర్కు తృతీయ, మిగతా పాఠశాలలు కన్సోలేషన్ బహుమతులు పొందాయి. కార్యక్రమంలో ఉపసర్పంచ్ గైని నరేందర్, వీడీసీ సభ్యులు రాజారావు, ఎర్రం గంగాధర్, నర్సారెడ్డి, వినోద్, బింగి శ్రీకాంత్, వార్డు సభ్యులు, ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం సరోజిని, ఎస్ఎంసీ చైర్మన్ ప్రవళిక, పీడీలు, పీఈటీలు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. -
పరీక్షా కేంద్రం తనిఖీ
తెయూ(డిచ్పల్లి): తెయూ పరిధిలో కొనసాగుతున్న ఎంఈడీ 4వ సెమిస్టర్ రెగ్యులర్, 1, 2, 3, 4వ సెమిస్టర్ బ్యాక్లాగ్ పరీక్షలు బుధవారం ప్రశాంతంగా జరిగినట్లు అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. పరీక్షలకు మొత్తం 29 మందికి 29 మంది విద్యార్థులు హాజరైనట్లు ఆయన పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాన్ని సందర్శించిన కంట్రోలర్ సంపత్కుమార్, ఆడిట్ సెల్ డైరెక్టర్ ఘంటా చంద్రశేఖర్ పరీక్షలు జరుగుతున్న తీరును తనిఖీ చేశారు. పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని వారు సూచించారు. నిజామాబాద్అర్బన్: నగరంలోని జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో ఈ నెల 11న ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు ఉపాధి కల్పన శాఖ అధికారి విజేత బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రైవేట్ కంపెనీలలో ఉద్యోగల కోసం ఈ మేళాను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. మెడ్ప్లస్లో ఫార్మసిస్టు, ఇతర పోస్టుల భర్తీ చేస్తామన్నారు. ఆసక్తి గల వారు కార్యాలయంలో ఉదయం 10 నుంచి సాయంత్రం 4 వరకు నిర్వహించే ఉద్యోగ మేళాలో పాల్గొనాలని కోరారు. ఇందల్వాయి: తమ గ్రామానికి వచ్చిన యూరియా బస్తాలను తమ గ్రామ రైతులకే ఇవ్వాలని సిర్నాపల్లి రైతులు ఎరువుల గోదాము ఎదుట టెంట్ వేసుకొని బైఠాయించి బుధవారం నిరసన తెలిపారు. ఆన్లైన్లో ఉంచిన యూరియా నిరక్షరాస్యులైన రైతులు బుక్ చేసుకునే లోపే అయిపోతుందని పక్క గ్రామాల రైతులు వచ్చి యూరియా తీసుకెళ్తుంటే తమ రైతులు నిస్సహాయంగా చూస్తున్నారని వారు వాపోయారు. పొలానికి యూరియా అందించే సమయం దాటిపోతుందని అదును దాటి ఎరువులు అందిస్తే దిగుబడులు తగ్గే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఇకనైనా వ్యవసాయ అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి తమ సమస్యకు పరిష్కారం చూపాలని రైతులు కోరారు. నిజామాబాద్ రూరల్: సాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని గుత్ప, అలీసాగర్ ఎత్తిపోతల ద్వారా నీటి విడుదలకు కృషి చేసిన టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్కు కాంగ్రెస్ నాయకులు, రైతులు కృతజ్ఞతలు తెలిపారు. సాగునీటి సమస్యపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో నీటి విడుదలకు చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు. ఫీజు బకాయిలు చెల్లించాలి బోధన్ టౌన్: పెండింగ్లో ఉన్న విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం తక్షణమే చెల్లించాలని తెలంగాణ రాష్ట్ర ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలల యాజమాన్యాలు డిమాండ్ చేశాయి. బుధవారం రాష్ట్ర ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలల సంఘం పిలుపు మేరకు పట్టణంలోని ఉషోదయ డిగ్రీ కళాశాలలో విద్యార్థులు మానవహారం నిర్వహించి నిరసన తెలిపారు. గత నాలుగేళ్లుగా కళాశాలలకు రావాల్సిన ట్యూషన్ ఫీజులను చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో ఉషోదయ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతి కిడ్నాప్ ● సినీఫక్కీలో ఎత్తుకెళ్లిన అమ్మాయి కుటుంబ సభ్యులు ● జగిత్యాల రూరల్ పీఎస్లో ఫిర్యాదు జగిత్యాలక్రైం: ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ యువతిని కుటుంబసభ్యులు, బంధువులు రెండు కార్లలో వచ్చి కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్లిన ఘటన జగిత్యాల రూరల్ మండలం అంతర్గాంలో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. అంతర్గాం గ్రామానికి చెందిన బందెల ప్రశాంత్ 15 రోజుల క్రితం కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం సీతారాంపల్లికి చెందిన కావ్యను ప్రేమవివాహం చేసుకున్నాడు. యువతి కుటుంబ సభ్యులు అక్కడి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. యువతి మేజర్ కావడంతో ప్రశాంత్తోనే పంపించారు. నాటి నుంచి ప్రశాంత్, కావ్య అంతర్గాంలో ఉంటున్నారు. ఈ క్రమంలో యువతి కుటుంబ సభ్యులు, బంధువులు బుధవారం ఉదయం రెండు కార్లలో అంతర్గాం వచ్చి ప్రశాంత్ తల్లి భారతమ్మపై దాడి చేసి కావ్యను బలవంతంగా తీసుకెళ్లారు. ఈ ఘటనపై భారతమ్మ జగిత్యాల రూరల్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
ప్రేమించిన అమ్మాయి దక్కలేదని యువకుడి ఆత్మహత్య
ధర్పల్లి: తాను ప్రేమించిన యువతికి మరొకరితో వివాహం నిశ్చయమైందన్న విషయాన్ని తట్టుకోలేక, మనస్తాపానికి గురైన ఓ యువకుడు సెల్ఫీ వీడియో తీసుకొని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన ధర్పల్లి మండలం మరియా తండాలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మరియా తండాకు చెందిన బనావత్ విజయ్ కుమార్ (22) కొన్నేళ్లుగా ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. సదరు అమ్మాయికి వేరే వ్యక్తితో పెళ్లి కుదిరింది. విషయం తెలుసుకున్న విజయ్ తీవ్ర మనస్థాపానికి గురై మూడు రోజుల క్రితం ఆవేదనతో సెల్ఫీ వీడియో తీసుకుంటూ తన మనసులోని బాధను వ్యక్తం చేశాడు. తాను ప్రేమించిన అమ్మాయికి బలవంతంగా పెళ్లి చేయకండి.. మేమిద్దరం ప్రేమించుకున్నాం.. ప్లీజ్ నాకు ఇచ్చి పెళ్లి చేయండి.. అమ్మ నాన్న క్షమించండి అంటూ వీడియో చివరిలో తన వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన కుటుంబీకులు జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. మృతుడి తండ్రి సీతారాం ఫిర్యా దు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
వీడియోలతో మాయాజాలం!?
డొంకేశ్వర్(ఆర్మూర్): ప్రభుత్వం ఎన్ని పకడ్బందీ విధానాలు తీసుకొచ్చినా వీబీజీ రామ్జీ (ఉపాధిహామీ) పథకంలో అవినీతికి అడ్డుకట్ట పడడం లేదని తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో ఫీల్డ్ అసిస్టెంట్లు అక్రమాలకు పాల్పడకుండా దారులన్నీ మూసినప్పటికీ ఏదో ఒక విధంగా కొత్త ద్వారాలను తెరుస్తున్నారు. జిల్లాలో కొందరు పటిష్టమైన యాప్లను సైతం బురిడీ కొట్టించి కూలీలకు దొంగ హాజరు వేస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. పారదర్శకత కోసం ప్రభుత్వం ఇటీవల తెచ్చిన నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టం (ఎన్ఎంఎంఎస్) యాప్లో సాంకేతిక లొసుగులను ఆసరా చేసుకుని కూలీలు పనులకు రాకపోయినా హాజరు వేస్తున్నారనే విమర్శలున్నాయి. నిబంధనల ప్రకా రం పనులు జరుగుతున్న ప్రదేశంలో కూలీల ముఖచిత్రాన్ని లైవ్లో క్యాప్చర్ చేసి యాప్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ నిబంధనను కొందరు ఫీల్డ్ అసిస్టెంట్లు చాకచక్యంగా పక్కదారి పట్టిస్తున్నట్లు తెలిసింది. ముందుగా తీసిపెట్టుకున్న వీడియోలను పని ప్రదేశంలో యాప్ ఓపెన్ చేసి ప్లే చేస్తూ ఫొటోలు క్యాప్చర్ చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విధంగా పనులకు రాకుండానే దొంగ హాజరు వేయిస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లు, ఆ తర్వాత సదరు కూలీల బ్యాంకు ఖాతాల్లో డబ్బు లు పడగానే రంగంలోకి దిగుతున్నారు. కూలీలకు సమాచారం ఇచ్చి మొత్తం డబ్బులో సింహభాగాన్ని వాటా రూపంలో తీసేసుకుంటున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. పని చేయకుండానే డబ్బులు వస్తుండడంతో కొందరు కూలీలు సైతం ఈ అక్రమ సంపాదనకు సహకరిస్తున్నట్లు తెలుస్తోంది. సాంకేతికతను సైతం తలదన్నేలా సాగుతున్న ఈ సరికొత్త అవినీతి దందాపై ఇప్పటి వరకు అధికారుల దృష్టికి రాకపోవడం గమనార్హం. యాప్లో ఫొటోలు అప్లోడ్ అవుతుండడంతో అంతా సవ్యంగానే సాగుతోందని అధికారులు భావిస్తున్నారు. నవీపేట్ మండలంలోని ఓ గ్రామ పంచాయతీకి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ పనులు చేస్తున్నప్పుడు పలువురు కూలీల వీడియోలను తీసి వారు పనికిరాని సమయంలో యాప్లో వాటిని ఫొటో క్యాప్చర్గా మార్చినట్లు సమాచారం. ఇటీవల ఓ మహిళా కూలీ బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ కాగా, డబ్బులను తిరిగి ఫీల్డ్ అసిస్టెంట్కు అందజేసింది. జిల్లాలో మరికొందరు ఫీల్డ్ అసిస్టెంట్లు సైతం ఇదే పద్ధతిని అనుసరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. యాప్నే బురిడీ కొట్టిస్తున్న కొందరు ఫీల్ట్ అసిస్టెంట్లు కూలీలు రాకపోయినా వీడియో క్లిప్పింగులతో హాజరు? ఖాతాల్లో డబ్బులు పడగానే వాటాల వసూళ్లు ఎన్ని విధానాలు వచ్చినా క్షేత్రస్థాయిలో ఆగని అవినీతి -
చెక్పవర్ మాకే ఇవ్వండి..
నిజామాబాద్ అర్బన్: గ్రామాల అభివృద్ధి సజావుగా జరగాలంటే తమకే ‘చెక్కు’ అధికారం ఉండాలని సర్పంచులు కోరారు. చెక్ పవర్ తమకే ఉండేలా చూడాలని కోరుతూ జిల్లాలోని పలు గ్రామాల సర్పంచులు బుధవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్ భవేశ్ మిశ్రాకు వినతిపత్రం అందజేశారు. ఉపసర్పంచులతో జాయింట్ చెక్ పవర్ కల్పించడంతో గ్రామ పంచాయతీల పరిపాలనలో తమ అధికారాలు గణనీయంగా తగ్గిపోయి అభివృద్ధి పనులు సాగడం లేదని సర్పంచ్లు ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టరేట్ ఎదుట ధర్నా చేస్తున్న సర్పంచ్లు -
లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలి
నిజామాబాద్ లీగల్ : ఈనెల 12న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకుని, పెండింగ్ లో ఉన్న కేసులను రాజీమార్గం ద్వారా పరిష్కరించుకోవాలని జిల్లా న్యాయ సేవా సంస్థ చైర్పర్సనన్, జిల్లా కోర్టు ప్రధాన న్యా యమూర్తి జీవీఎన్ భారతలక్ష్మి అన్నారు. జిల్లా కోర్టు ప్రాంగణంలో బుధవారం మీడియాతో మాట్లాడారు. ఈ సారి నిర్వహించ నున్న జాతీయ లోక్అదాలత్లో 200 బ్యాంకు రుణాల రికవరీ కేసులు, 1,900 క్రిమినల్ కేసులు, 780 ప్రమాద బీమా కేసులు, ఇ తర సివిల్ కేసులు, చెక్ బౌన్స్ కేసులు కలిపి మొత్తం 4,500కు పైగా కేసులను రాజీమా ర్గం ద్వారా పరిష్కరించేందుకు గుర్తించినట్లు న్యాయమూర్తి వివరించారు. వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కాలేని స్థితిలో ఉన్న కక్షిదారులు తమ న్యాయవాది లేదా పోలీసుల ద్వారా లేదా వాట్సాప్ వీడియో కాల్ ద్వారా తమ గుర్తింపు (ఐడెంటిఫికేషన్) పూర్తి చేసి లోక్ అదాలత్లో పాల్గొని కేసులను పరిష్కరించుకోవాలని సూచించారు. న్యాయ సేవా సంస్థ కార్యదర్శి నీలిమ ముద్దసాని, సూపరింటెండెంట్ శైలజ పాల్గొన్నారు. వ్యవసాయ క్షేత్రాలను సందర్శించాలి నిజామాబాద్ రూరల్: డీసీఎస్ (డిజిటల్ క్రాప్ సర్వే) వలంటీర్లు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పంటలను పరిశీలించాలని జిల్లా వ్యవసాయాధికారి వీరాస్వామి అన్నారు. మండల వ్యవసాయ అధికారిణి హీరా జాదవ్తో కలి సి గుండారం శివారులోని పంటపొలాలను కలిసి పరిశీలించారు. డీసీఎస్ వలంటీర్లు గ్రామంలోని వ్యవసాయ క్షేత్రాలను సందర్శించి, పంటల వివరాలను డిజిటల్ క్రాప్ సర్వే యాప్ ద్వారా క్షేత్రస్థాయిలో నమోదు చేశారు. రైతులు సాగు చేస్తున్న పంటల వివ రాలు డిజిటల్ క్రాప్ సర్వే ద్వారా నమోదైతే ప్రభుత్వ వ్యవసాయ పథకాల అమలు, రైతులకు అందాల్సిన ప్రయోజనాలను సమ ర్థవంతంగా అందించేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందని డీఏవో అన్నారు. ఏఈవో కృష్ణరెడ్డి, రైతులు పాల్గొన్నారు. పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలి నిజామాబాద్ అర్బన్: పండుగల నేపథ్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని సీపీ సాయి చైతన్య అన్నారు. నేరాల నియంత్రణ చర్యలపై కమిషనరేట్ కార్యాలయంలో బుధవారం నిజామాబాద్ డివిజన్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీ పీ మాట్లాడుతూ.. వాహనాల తనిఖీలు ని రంతరం కొనసాగాలని, డ్రగ్స్, గంజాయి ని ర్మూలన కోసం ప్రత్యేక దాడులు కొనసాగించాలన్నారు. నిషేధిత మత్తుపదార్థాలను రవాణా చేసే వారిపై పీడీ యాక్ట్ వంటి కఠిన చట్టాల కింద చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఏసీపీ ప్రకాశ్యాదవ్, సీసీఆర్బీ ఏసీపీ గురునాయుడు, ఆయా విభాగాల ఇన్స్పెక్టర్లు, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు. -
దవాఖానా వైపు రావాలంటే దడ
జీజీహెచ్ ఎదుట యూటర్న్ వద్ద ఇష్టారాజ్యంగా వాహనాల రాకపోకలు.. భయంభయంగా రోడ్డు దాటుతున్న రోగులు, వారి సహాయకులుజిల్లా కేంద్రంలోని బస్టాండ్ – జీజీహెచ్ మధ్య ట్రాఫిక్ జామ్ జిల్లా కేంద్రంలోని బస్టాండ్ – ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి మధ్య రోడ్డు దాటాలన్నా, ప్రయాణం సాగించాలన్నా చుక్కలు కనిపిస్తాయి. ఆస్పత్రి ముందే యూ టర్న్ ఉండడంతో వాహనదారులు ఇష్టారాజ్యంగా దూసుకొస్తుండడంతో ట్రాఫిక్ స్తంభిస్తోంది. జీజీహెచ్లోకి వెళ్లే, లోని నుంచి బయటికి వచ్చే రోగులు, వారి సహాయకులు భయంభయంగా రోడ్డు దాటాల్సి వ స్తోంది. ఎక్కడ పడితే అక్కడ వాహనాలు నిలుపుతుండడంతో ఈ ప్రాంతంలోకి రావాలంటేనే జంకుతు న్నారు. వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించి స మస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, నిజామాబాద్ -
కార్పొరేట్కు దీటుగా..
తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు ● ప్రభుత్వ బడులకు మహర్దశ ● ఉమ్మడి జిల్లాలో 7 పాఠశాలలు ఎంపిక ● నిధులు మంజూరు చేసిన ప్రభుత్వం కమ్మర్పల్లి: ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్ర భుత్వం చర్యలు తీసుకుంటోంది. అంతర్జాతీయ ప్ర మాణాలతో కూడిన పాఠశాలలుగా తీర్చిదిద్దడ మే లక్ష్యంగా తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల ఏర్పాటుకు శ్రీకా రం చుట్టింది. అత్యాధునిక సౌకర్యాలతో కా ర్పొరే ట్ స్కూళ్లకు ధీటుగా తీర్చిదిద్దేందుకు పలు పాఠశాలలను టీపీఎస్లుగా ఎంపిక చేసింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మొత్తం ఏడు ప్రభుత్వ పాఠశాలలను తెలంగాణ పబ్లిక్ స్కూళ్లుగా ఏర్పా టు చేసేందుకు పరిపాలనా అనుమతులు జారీ చేసింది. ఎంపిక చేసిన పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన తదితర అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణకు నిధులు మంజూరు చేసింది. ప్రీప్రైమరీ నుంచి ఇంటర్ వరకు.. పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్లో ప్రీ ప్రైమరీ నుంచి 12వ తరగతి వరకు ఒకే ప్రాంగణంలో విద్యార్థులు విద్యను అభ్యసించేలా ప్రణాళిక రూపొందించింది. వివిధ మౌలిక వసతుల పనులు చేపట్టేందుకు ఒక్కో పాఠశాలకు రూ. 5 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు పరిపాలన అనుమతికి ఉత్తర్వులు జారీచేశారు. ఈ నిధులతో కొత్త భవనాలు లేదా అదనపు తరగతి గదులు, ఫర్నీచర్, డెస్కులు, బెంచీలు ఏర్పాటు చేయనున్నారు. కంప్యూటర్ ల్యాబ్లు, ఆధునిక డిజిటల్ తరగతి గదులు, సైన్స్ ప్రయోగశాలలు, గ్రంథా లయాలు, విద్యుత్, వైరింగ్, తాగునీరు, అధునాతన మరుగుదొడ్లు, వంటశాల, ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం పోషకాలతో కూడిన భోజనం, సాయంత్రం స్నాక్స్ వంటి సదుపాయాలు సమకూర్చనున్నారు. విద్యార్థులకు ఉచిత బస్సు ర వాణా, క్రీడా మైదానాలు, క్రీ డాకారులకు కిట్లు, దివ్యాంగ విద్యార్థులకు ర్యాంపులు, ఇత ర అనుకూల సదుపాయాలు కల్పించనున్నారు. పాఠశాల ప్రాంగణం, ప్రహరీ ఆధునికీక రణ పనులు చేపట్టనున్నారు. కార్పొరేట్ పాఠశాలలకు ప్ర త్యామ్నాయంగా ఇంగ్లిష్ మీడియంలో నాణ్యమైన ఆధునిక సాంకేతిక పద్ధతులతో బోధన అందించనున్నారు. సమగ్ర అభివృద్ధి కోసం క్రీడలు, కళలు, సాంకేతిక పరిజ్ఞానం, వ్యక్తిత్వ వికాసం, నైపుణ్యాలు, క్రీడలను ప్రోత్సహించే క్యాంపస్లుగా టీపీఎస్లను తీర్చిదిద్దనున్నారు. కామారెడ్డి జిల్లా కామారెడ్డి జెడ్పీహెచ్ఎస్(బాయ్స్), కామారెడ్డి 10.10 కోట్లు బాన్సువాడ జీహెచ్ఎస్, బాన్సువాడ 8.90 కోట్లు ఎల్లారెడ్డి జీహెచ్ఎస్, ఎల్లారెడ్డి 9.90 కోట్లు జుక్కల్ జెడ్పీహెచ్ఎస్, పిట్లం 9.90 కోట్లు నిజామాబాద్ జిల్లా నియోజకవర్గం పాఠశాల మంజూరైన నిధులు నిజామాబాద్ రూరల్ జెడ్పీహెచ్ఎస్, ధర్పల్లి 8.10 కోట్లు ఆర్మూర్ జెడ్పీహెచ్ఎస్, డొంకేశ్వర్ 9.10 కోట్లు బాల్కొండ జెడ్పీహెచ్ఎస్, గోన్గొప్పుల 9.60 కోట్లు టీజీపీఎస్గా గుర్తింపు పొందిన పాఠశాలలు, మంజూరైన నిధుల వివరాలు -
లిఫ్ట్ల ద్వారా నీటి విడుదల
● 53వేల ఎకరాలకు అలీసాగర్ భరోసానవీపేట: తీవ్ర వర్షాభావ నేపథ్యంలో సాగునీటిని పొదుపుగా వాడుకోవాలని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్రెడ్డి సూచించారు. మండలంలోని కోస్లి గో దావరి తీరాన ఉన్న అలీసాగర్ ఎత్తిపోతల పథకం ద్వారా బుధవారం ఆయన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డితో కలిసి సాగునీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంటలు ఎండిపోవడంతో సీఎం రేవంత్రెడ్డితో పాటు బోర్డు ప్రతినిధులను కలిసి సాగునీటి విడుదలకు మెప్పించామన్నారు. 10 రోజులకు ఒక తడి చొప్పున రెండు తడులలో నీటిని విడుదల చేస్తామ ని పేర్కొన్నారు. ఆరు మండలాల్లోని 53,000 ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో అన్ని ఆటంకాలను ఎదుర్కొని సాగు నీటిని విడుదల చే శామన్నారు. మాజీ మంత్రి మండవ, ఉర్దూ అకాడ మీ చైర్మన్ తాహెర్, డీసీసీ అధ్యక్షుడు నగేశ్రెడ్డి, నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజినీర్ ప్రమీల, ఎస్ఈ గుణవంత్రావ్, ఈఈ రమేశ్ కుమార్, డీఈఈ బల రాం, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
అర్బన్ అభివృద్ధికి నిధులివ్వండి
సుభాష్నగర్: నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు చేసి సహకరించా ల ని ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ సీఎం రేవంత్రెడ్డిని కోరారు. ఈ మేరకు బుధవారం అసెంబ్లీలో సీఎంను కలిసి వినతిపత్రం అందజేశారు. నగర అభివృద్ధికి స్పెషల్ ఫండ్ కింద రూ.200 కోట్లు విడుదల చేయాలని, అలాగే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్, తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఫార్మసీ కళాశాలను మంజూరు చే యాలని ధన్పాల్ కోరారు. నగరంలో ట్రాఫిక్ సమ స్యను దృష్టిలో పెట్టుకొని ఔటర్ రింగ్ రోడ్ల నిర్మా ణం చేపట్టాలని, ఈవిషయమై గతంలోనూ అనేకసార్లు ప్రభు త్వం దృష్టికి తీసుకొచ్చానని గర్తుచేశారు. మాస్టర్ప్లా న్ అమలు, కళాభారతి పెండింగ్ బిల్లుల మంజూ రు, రాజారాం స్టేడియం ఆధునికీక ర, డీఎస్ఏ మై దానంలో సింథటిక్ ట్రాక్తో కూడిన స్టేడియం, ఇండోర్ స్టేడియం నిర్మాణం చేపట్టాలని కోరారు. ఖిల్లా రామాలయాన్ని అభివృద్ధి చేయాలని, జిల్లా జన రల్ ఆస్పత్రిలో మరమ్మతులు, మౌలిక సౌకర్యాలకు నిధులు విడుదల చేయాలని, వైద్యులు, సిబ్బంది కొరత లేకుండా చూడాలని, బస్టాండ్ ఆధునికీకరణపై ప్రత్యేక దృష్టి సారించాలని విన్నవించారు. హెచ్ఆర్ఏ వర్తింపజేయాలి... మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలో విలీనమైన గ్రామాలు, ప్రాంతాల్లోని ఉద్యోగులకు సవరించిన ఇంటి అద్దె భత్యం (హెచ్ఆర్ఏ)ను తక్షణమే వర్తింపజేయాలని ఎమ్మెల్సీ మల్క కొమరయ్య కోరారు. శాసనమండలిలో బుధవారం జరిగిన చర్చలో కొమరయ్య.. ప్రజోపయోగ, ఉద్యోగ సమస్యలను సభ దృష్టికి తీసుకొచ్చారు. మున్సిపాలిటీల్లో విలీనమైన గ్రామాల ఉద్యోగుల హెచ్ఆర్ఏ సవరణ, రాష్ట్రంలో నూతన ఇథనాల్ పాలసీ రూపకల్పన, అనుమతులు లేని కార్పొరేట్ విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మున్సిపాలిటీల పరిధి విస్తరించిన నేపథ్యంలో ఉద్యోగుల హెచ్ఆర్ఏ రేట్ల ను సమీక్షించాలని, నిబంధనల ప్రకారం అందాల్సి న ప్రయోజనాలు జాప్యం లేకుండా అందేలా ఉత్తర్వులు జారీ చేయాలని ఆయన విజ్ఞప్తిచేశారు. -
ఖతార్లో ఉద్యోగావకాశాలు
వేములవాడ: ఖతార్లో వివిధ ఉద్యోగాల భర్తీకి జీటీఎం ఇంటర్నేషనల్ సంస్థ ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ ప్రతినిధి చీటి సతీశ్రావు తెలిపారు. బాగేజ్ హ్యాండ్లర్లు, క్లీనర్లు, వెయిట్రెస్లు, సౌస్చెఫ్లు, కుక్లు, క్యాటరింగ్ సూపర్వైజర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు వివ రించారు. బాగేజ్ హ్యాండ్లర్, క్లీనర్ పోస్టులకు ఖతార్ కరెన్సీ రూ.వెయ్యి రియాల్స్ బేసిక్ వేతనం ఉండగా, సౌస్ చెఫ్కు రూ.5వేల రియాల్స్, సీనియర్ సీడీపీకి రూ.4వేల రియాల్స్, చీఫ్ స్టీవర్డ్కు రూ.3,500 రియాల్స్ వరకు వేతనం ఉంటుందని వివరించారు. ఇతర పోస్టులకు పోస్టును బట్టి రూ.1,600 నుంచి రూ.3,200 రియాల్స్ వరకు గ్రాస్ వేతనం ఉంటుందని పేర్కొన్నారు. ఉచిత భోజనం, వసతి, రవాణాతోపాటు వీసా, టికెట్, వైద్య సదుపాయాలను సంస్థ కల్పిస్తుందని వెల్లడించారు. వివరాలకు సికింద్రాబాద్ 83320 52299, నిజామాబాద్ 86868 60999, ఆర్మూర్ 83320 13999, జగిత్యాల 83320 42299, సిరిసిల్ల 93476 61522, ఆఫీస్ 040–42029999 నంబర్లను సంప్రదించాలని సూచించారు. ఇంటర్వ్యూ తేదీ వేదిక సెప్టెంబర్ 17 సికింద్రాబాద్ – జీటీఎం ఇంటర్నేషనల్ కార్యాలయం 18 సిరిసిల్ల, జగిత్యాల– క్లీనర్ (బాగేజ్ హ్యాండ్లర్ పోస్టులు) 19 నిజామాబాద్, ఆర్మూర్ (క్లీనర్, బాగేజ్ హ్యాండ్లర్ పోస్టులు) -
రైస్మిల్లుల్లో టెస్ట్ మిల్లింగ్ చేయాలి
● విజిలెన్స్ దాడులు ఆపాలి ● రైస్మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధుల డిమాండ్సుభాష్నగర్ : ప్రభుత్వం రైస్మిల్లుల్లో టెస్ట్ మిల్లింగ్ చేసి ఎంత ఔటర్న్ వస్తే అంతే తీసుకోవాలని రైస్మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు మోటూరి దయానంద్ గుప్తా, కాపర్తి శ్రవణ్, వడ్డి మోహన్రెడ్డి, ధన్పాల్ దత్తాద్రి డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని శ్రద్ధానంద్ గంజ్లోగ ఉన్న రైస్భవన్లో రైస్మిల్లర్లతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా రైస్మిల్లర్లు ఎదుర్కొంటున్న సమస్యలను సమావేశంలో ప్రస్తావించారు. అంతకుముందు పలు తీర్మానాలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. రైస్మిల్లర్లకు 2016 నుంచి రావాల్సిన మిల్లింగ్ చార్జీల బకాయిలను వెంటనే విడుదల చేయాలన్నారు. అలాగే మిల్లింగ్ చార్జీని రూ.150కి పెంచాలని కోరారు. సీఎంఆర్ కింద క్వింటాల్కు ఇవ్వాల్సిన ఔటర్న్ 67 కిలోల బియ్యంతో రైస్మిల్లర్కు తీవ్ర నష్టం జరుగుతోందని వాపోయారు. గతంలో జరిపిన టెస్ట్ మిల్లింగ్ రిపోర్టులను బహిర్గతం ఎందుకు చేయడం లేదో చెప్పాలన్నారు. తప్పనిసరిగా టెస్ట్ మిల్లింగ్ చేసి ఎంత ఔటర్న్ వస్తుందో అంతే ఇస్తామని స్పష్టం చేశారు. ఔటర్న్ నిష్పత్తిని ఖరీఫ్, రబీ పంటలకు వేర్వేరుగా నిర్ధారించాలని డిమాండ్ చేశారు. విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్, టాస్క్ఫోర్స్ ఆకస్మిక దాడులను వెంటనే నిలిపేయాలని, మిల్లర్లతో ప్రభుత్వం చర్చలు జరపాలన్నారు. ఎఫ్సీఐ కఠినమైన నిబంధనలను కొంతమేర సడలించాలని, ఖరీఫ్ ధాన్యాన్ని పూర్తిగా రా రైస్గా, రబీ ధాన్యాన్ని పూర్తిగా బాయిల్డ్ రైస్గా మాత్రమే స్వీకరించాలన్నారు. 2022–23 రబీ టెండర్ ధాన్యం ధరను న్యాయబద్ధంగా నిర్ణయించాలని డిమాండ్ చేశారు. మిల్లర్లను ఇబ్బందులకు గురి చేయొద్దని, సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు. త్వరలోనే సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్కు అందజేస్తామన్నారు. బుధవారం నుంచి రైస్మిల్లులను బంద్ చేస్తున్నామని, మిల్లర్ల సమస్యలు పరిష్కరించే వరకూ బంద్, నిరసనలను కొనసాగిస్తామని తెలిపారు. సమావేశంలో జిల్లాలోని 340 మంది రైస్మిల్లర్లు పాల్గొన్నారు. -
ఎమ్మెల్సీ తాతా మధును బర్తరఫ్ చేయాలి
● ఆయన వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ ● డీసీసీ అధ్యక్షుడు కే నగేష్రెడ్డిడిచ్పల్లి(నిజామాబాద్రూరల్): అసెంబ్లీ స్పీకర్పై ఎమ్మెల్సీ తాత మధు చేసిన అనుచిత వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ అని, ఆయనను వెంటనే బర్తరఫ్ చేయాలని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కాటిపల్లి నగేష్రెడ్డి డిమాండ్ చేశారు. డిచ్పల్లిలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ నాయకులు నల్ల టీ షర్ట్లు ధరించి వాటి పైన అభ్యంతరకర స్లోగన్స్ రాసుకుని అసెంబ్లీలోకి వెళ్లేందుకు యత్నించడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మహిళల ముందే టీ షర్ట్స్ విప్పి పోలీసుల పైకి విసిరి అసభ్యకరంగా ప్రవర్తించారని, సోమవారం నాటి ఘటన తెలంగాణకు చీకటి రోజని పేర్కొన్నారు. ప్రతిపక్షనాయకుడి హోదాలో ఉన్న మాజీ సీఎం కేసీఆర్ ఏ ఒక్క రోజు కుడా అసెంబ్లీకి రాలేదని, ఆయనపై సుమారు రూ.22 కోట్ల ప్రజాధనం వృథా అయ్యిందని, దీనికి బీఆర్ఎస్ నాయకులు సమాధానం చెప్పాలన్నారు. కాంగ్రెస్ వెయ్యి రోజు ల పాలనలో ప్రజల కోసం అనేక సంక్షేమ ఫలాలు అందిస్తుంటే ప్రతిపక్ష నాయకులు అసత్య ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం రేవంత్రెడ్డి పలుమార్లు చెప్పినట్లు ప్రతిపక్ష నాయ కులు అనవసర విమర్శలు, రాద్ధాంతం చేయడం మాని అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని హితవు పలికారు. ప్రభుత్వం ఏవైనా తప్పులుచేస్తే సరైన సూచనలివ్వాలని.. స్వీకరిస్తామన్నారు. టీపీసీసీ చీఫ్దే ఘనత.. జిల్లాకు నాలుగు ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు, తెయూలో ఇంజినీరింగ్, వ్యవసాయ కళాశాల తెచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్కుమార్గౌడ్కు దక్కుతుందన్నారు. ఇప్పటికైనా బీఆర్ఎస్ నాయకులు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని, ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. డీసీసీ ఉపాధ్యక్షుడు బాల్రాజ్, జిల్లా నాయకులు గాంధారి గోపి, ఎస్టీసెల్ అధ్యక్షుడు యాదగిరి, ప్రధాన కార్యదర్శి బున్నె రవీందర్, జిల్లా కార్యదర్శి గణేశ్, సొసైటీ చైర్మన్ గ్యానాజి గంగారెడ్డి, సర్పంచ్ సూదం శ్రీనివాస్, మాజీ ఎంపీపీ చిన్నోల్ల శ్రీనివాస్, మధు, అశోక్, శ్రీనివాస్గౌడ్, నరేందర్ తదితరులు పాల్గొన్నారు. -
అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి
● ఎమ్మెల్యే మదన్మోహన్రావు ● మున్సిపల్, ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి, ఆరోగ్యశాఖకు సంబంధించిన పనులను నిర్ణీత గడువులో నాణ్యత ప్రమాణాలతో పూర్తి చేయాలని ఎమ్మెల్యే మదన్ మోహన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్ లోని ఎమ్మెల్యే నివాసంలో మున్సిపల్, ఆరోగ్యశాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. అమృత్ 2.0 పథకం పనులు, వాటర్ బాడీ రిజువెనేషన్ (నీటి వనరుల పునరుద్ధరణ) పనులు, సీసీ రోడ్లు, సీసీ డ్రెయినేజీలు, మున్సిపల్ అభివృద్ధికి సంబంధించిన పనుల పురోగతిని తెలుసుకున్నారు. పనుల ప్రస్తుత స్థితి, ఎదురవుతున్న సమస్యలు, పెండింగ్లో ఉన్న అంశాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు నిర్దేశిత గడువులోనే పనులను పూర్తి చేస్తామని మున్సిపల్, ఆరోగ్య శాఖ అధికారులు ఎమ్మెల్యేకు తెలిపారు. నిర్ణీత గడువులో పనులు పూర్తి చేయకుండా నిర్లక్ష్యం చేసే కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే కాంట్రాక్టులను రద్దు చేసే చర్యలకు వెనుకాడవద్దని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. -
ఖో–ఖో రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక
కామారెడ్డి అర్బన్: ఉమ్మడి జిల్లా ఖోఖో అసోసియేషన్ ఆధ్వర్యంలో ఖేలో ఇండియా జిల్లా స్థాయి ఖో–ఖో ఎంపికలు మంగళవారం కామారెడ్డి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో నిర్వహించగా భారీగా క్రీడాకారులు తరలివచ్చారు. ఉమ్మడి జిల్లాల నుంచి దాదాపు 500 పైగా క్రీడాకారులు ఖోఖో ఎంపికల్లో పాల్గొనగా అత్యుత్తమ ప్రతిభ చూపిన 12 బాలురు, 12 మంది బాలికలను ఎంపిక చేశారు. అసోసియేషన్ చైర్మన్ బిల్లా అనిల్, ప్రధాన కార్యదర్శి అతీకుల్లా, ఆర్గనైజింగ్ కార్యదర్శి నాగేశ్వర్, మోహన్రెడ్డిలతో ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. ఎంపికై న క్రీడాకారులు ఉమ్మడి జిల్లా తరపున రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని ప్రతినిధులు ప్రకటించారు. -
ఎత్తిపోతలను పూర్తి చేయించండి
ఆర్మూర్ : నియోజకవర్గానికి సాగునీటిని అందించేందుకు రూపొందించిన ఎత్తిపోతల పథకాల ని ర్మాణాలను పూర్తి చేయించాలని కోరుతూ రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డికి ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్రెడ్డి వినతి పత్రాన్ని అందజేశారు. హైదరాబాద్లో మంత్రిని మంగళవారం కలిసి పలు సమస్యలపై చర్చించారు. గుత్ప బ్యాలెన్సింగ్ ట్యాంక్, ఎత్తిపోతల పథకం మిగిలిన పనులను వెంటనే పూర్తి చేసి గుత్ప, మామిడిపల్లి, రామచంద్రాపల్లి, అంకాపూర్, మదన్పల్లి, చిన్నాపూర్, ఒడ్యాట్పల్లి, అమ్రాద్, జక్రాన్పల్లి, అర్గుల్, లక్ష్మాపూర్, మునిపల్లి గ్రామాల పరిధిలోని 2,642 ఎకరాలకు నీటిని అందించాలని కోరారు. అలాగే నియోజకవర్గంలోని నిజాంసాగర్ కాల్వల ఆధునికీకరణ పనుల కోసం మంజూరైన రూ.22 కోట్ల విలువైన పనులను తక్షణమే ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని కోరారు. బినోల, కంఠం, చిక్లీ లిఫ్ట్ ఇరిగేషన్ కోసం రూ.80 కోట్ల అంచనా వ్యయంతో మంజూరైన పనులను వెంటనే ప్రారంభించి 5,550 ఎకరాల కొత్త ఆయకట్టుకు నీటిని అందించాలని కోరారు. ఈ పథకం ద్వారా బినోల(బోధన్ నియోజకవర్గం) గ్రామ పరిధిలో రెండు వేల ఎకరాలు, కంఠం, చిక్లీ గ్రామాల (ఆర్మూర్ నియోజకవర్గం) పరిధిలోని 3,550 ఎకరాలకు సాగునీరందుతుందని వివరించారు. అదేవిధంగా ఆర్మూర్ నియోజవర్గంలోని పలు పెండింగ్ పనులను వెంటనే పూర్తిచేసేలా చర్యలు చేపట్టాలని మంత్రిని కోరారు. -
వేడుకలకు గణనాథులు సిద్ధం
● విభిన్న రూపాల్లో లభ్యం ● సందడిగా మారుతున్న విక్రయ కేంద్రాలు నిజామాబాద్ రూరల్: వినాయక చవితి పండుగ సమీపిస్తుండడంతో వేడుకలకు గణనాథులు సిద్ధమవుతున్నా యి. ఈ నెల 14న సోమవారం వినాయక చవితి ప ర్వదినాన్ని పురస్కరించుకొని వినాయక విగ్రహాల తయారీ కేంద్రాల వద్ద విగ్రహాల అమ్మకాలకు నిర్వాహకులు ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల నుంచి వినాయక విగ్రహాల కమిటీ వారు వచ్చి చాలా వరకు విగ్రహాలను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. జిల్లా కేంద్రంలోని కంఠేశ్వర్ బైపాస్ రోడ్డు, పెద్ద బజార్, ఫులాంగ్, బోర్గాం బ్రిడ్జి ప్రాంతాల్లో భక్తులను ఆకట్టుకునేలా కళాకారులు వివిధ ఆకృతులు, రంగులు, అలంకరణలతో గణనాథులను తయారు చేసి విక్రయాని కి సిద్ధం చేశారు. చిన్న విగ్రహాల నుంచి భారీ విగ్ర హాల వరకు.. సంప్రదాయ గణపతి రూపాలతో పాటు బాల గణపతి, రాజ గణపతి, లంబోదరు డు, నత్య గణపతి వంటి భిన్న రూపాలు మార్కెట్లో లభ్యం కానున్నాయి. విగ్రహాల కొనుగోళ్లతో విక్రయ కేంద్రాలు సందడిగా మారుతున్నాయి. గణేశ్ చతుర్థి సందర్భంగా లక్షల సంఖ్యలో విగ్రహాలను ప్రతిష్టించి పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. గతంలో కొన్ని గల్లీలోనే విగ్రహాలను ప్రతిష్ఠించి పూజలు చేసేవారు. ఏడాదికేడాది గల్లీకి మూడు నుంచి నాలుగు విగ్రహాలను ప్రతిష్ఠించి వైభవంగా వేడుకలు నిర్వహిస్తునఆనరు. ఇందుకు యువత ముందుకు రావడంతో గణేశ్ ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. జిల్లా కేంద్రంలోని కంఠేశ్వర్ బైపాస్, వినాయక్నగర్, పెద్దబజార్, బోర్గాం(బి) బ్రిడ్జి ఏర్పాటు చేసిన విక్రయ కేంద్రాల్లో విగ్రహాలు అందుబాటు లో ధరల్లో ఉన్నాయి. రెండు అడుగుల గణపతి ప్ర తిమ గతంలో రూ.2,500 ఉండగా, ప్రస్తుతం రూ.1800, 5 నుంచి ఆరు అడుగుల ప్రతిమలు గ తంలో రూ.35 వేల నుంచి రూ.45 వరకు ఉండగా ప్రస్తుతం రూ.25 వేల వరకు ఉన్నాయి. మట్టిగణపతులకు ప్రాధాన్యత ఇవ్వాలి పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి గణపతులను ఉపయోగించాలని విద్యావేత్తలు, పర్యావరణ పరిరక్షకులు పేర్కొంటున్నారు. ప్లాస్టరఫ్ ప్యారీస్ తయారు చేసిన రంగుల గణపతులు చెరువులో నిమజ్జనం చేస్తే చెరువులో ఉన్న వివిధ రకాల చేపలు, మిగిత చలరాశులకు హాని కలుగుతుంది. దీంతో మట్టి గణపతులకు ప్రాధాన్యతను ఇవ్వాలని పర్యావరణ వేత్తలు పేర్కొంటున్నారు. మట్టి గణపతుల ధర రంగుల గణపతుల ధరలకు తీవ్ర వ్యత్యాసం ఉంటుంది. 5, 6 అడుగుల మట్టి గణపతి రూ.10వేలలోపు అందుబాటులో ఉన్నాయి.పూలాంగ్ వద్ద వివిధ ఆకృతుల్లో ఆకట్టుకుంటున్న గణనాథులు పది రోజుల ముందు నుంచే.. ప్రతి ఏడాది కంటే ఈ సారి పది రోజుల ముందు నుంచే విగ్రహాల విక్రయాలు మొద లయ్యాయి. మండపాల ని ర్వాహకులు సైతం ముందు గానే విగ్రహాలను తీసుకెళ్తున్నారు. ధరలు నామమాత్రంగా ఉండడంతో గిరాకీ బాగానే ఉంది. – కే శివ, గణపతి విగ్రహాల విక్రయదారుడు -
ఎయిమ్స్లో అత్యాధునిక వైద్యసేవలు
● అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ● ఎయిమ్స్ దవాఖానసుభాష్నగర్: కేంద్ర ప్రభుత్వం బీబీనగర్లో నిర్మించిన ఎయిమ్స్లో అత్యాధునిక వైద్యసేవలు అందిస్తున్నట్లు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ తెలిపారు. భువనగిరి జిల్లా బీబీనగర్లోని ఎయిమ్స్ను ఆయన మంగళవారం పరిశీలించారు. ఆస్పత్రిలో అందుతున్న సేవల గురించి వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రయివేటు ఆస్పత్రులకు ధీటుగా వైద్యసేవలు అందుతున్నాయని పేర్కొన్నారు. 750 బెడ్లతో నిర్మించిన ఎయిమ్స్లో ప్రస్తుతం 260 బెడ్లు అందుబాటులో ఉన్నాయన్నారు. మరో ఆరు నెలల్లో పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ప్రధానంగా రూ.10 ఫీజుతో ఏడాదిపాటు ఓపీ పొందవచ్చన్నారు. అలాగే ఇన్ పేషెంట్గా అడ్మిట్ అయితే ఒక రోజుకు బెడ్ఛార్జీ కేవలం రూ.35 తీసుకుంటారన్నారు. పేద, మధ్య తరగతి కుటుంబాల వారు వైద్య సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ప్రస్తుతం 25 ప్రధాన విభాగాల్లో వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉన్నారని పేర్కొన్నారు. దీర్ఘకాలిక వ్యాధులు, అత్యవసర వైద్యం కావాల్సిన వారు ఎయిమ్స్లో చికిత్స పొందాలన్నారు. అవసరమైన వారు తమను సంప్రదిస్తే రిఫర్ చేస్తామని తెలిపారు. -
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలి
● డీజేలపై నిషేధం అమలు ● అదనపు కలెక్టర్ భుజంగరావు, సీపీ సాయిచైతన్యనిజామాబాద్ అర్బన్: గణేష్ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో ఆనందోత్సాహాల నడుమ ఘనంగా జరుపుకోవాలని అదనపు కలెక్టర్ భుజంగరావు, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సూచించారు. నగరంలోని కలెక్టరేట్లో మంగళవారం శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉత్సవాల నిర్వహణకు అధికార యంత్రాంగం తరఫున పూర్తిస్థాయిలో సహాయ సహకారాలు అందిస్తామని, రోడ్ల మరమ్మతులు, శోభాయాత్రకు అడ్డంకిగా ఉండే చెట్ల కొమ్మలను తొలగించడం వంటి పనులను యుద్ధ ప్రాతిపదికన చేపడతామన్నారు. ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. 8 అడుగుల కంటే తక్కువ ఎత్తు కలిగిన విగ్రహాలను మాత్రమే బాసర గోదావరిలో నిమజ్జనానికి అనుమతిస్తామని, అంతకంటే ఎక్కువ ఎత్తు ఉన్న విగ్రహాలను ఉమ్మెడ వద్ద నిమజ్జనం చేయాలని సూచించారు. మండపాల వద్ద డీజే సౌండ్లను నిషేదించామన్నారు. మండపాల వద్ద లేదా సోషల్ మీడియాలో ఇతరులను కించపరిచేలా, అసభ్యకరంగా వ్యవహరిస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. సమస్యాత్మక ప్రాంతాలు, ప్రార్థనాలయాల వద్ద సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేస్తామని తెలిపారు. సామాజిక మాధ్యమాల పోస్టింగ్లపై ప్రత్యేక నిఘా ఉంచుతామని, అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నించే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామన్నారు. నిమజ్జన వేళ గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచుతూ క్రేన్, లైటింగ్ వ్యవస్థ, అత్యవసర వైద్యం, అంబులెనన్స్, తాగునీరు, బారికేడింగ్, ట్రాఫిక్ క్రమబద్దీకరణ, పారిశుద్ధ్యం వంటి చర్యలు ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని సంబంధిత శాఖల అధికారులను అదనపు కలెక్టర్ భుజంగరావు ఆదేశించారు. గణేష్ ఉత్సవాలు, జెండా బాలాజీ వేడుకల సందర్భంగా నిర్ణీత రోజుల్లో మద్యం విక్రయాలు జరుగకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఎకై ్సజ్ అధికారులకు సూచించారు. అనంతరం మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్టించాలని అవగాహన కల్పిస్తూ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో రూపొందించిన గోడప్రతులను ఆవిష్కరించారు. మేయర్ ఉమారాణి, ట్రెయినీ కలెక్టర్ సురేష్, డీఆర్వో గీత, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, ఆర్డీవోలు రాజేంద్ర కుమార్, విజయ కుమారి, ఏసీపీలు ప్రకాష్, వెంకటేశ్వర్ రెడ్డి, శ్రీనివాస్, మస్తాన్ అలీ, వివిధ శాఖల అధికారులు, గణేష్ మండలి ప్రతినిధులు, శాంతి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
ఏం కష్టమొచ్చిందో..
బోధన్: ఆ తల్లికి ఏ కష్టమొచ్చిందో ఏమో కానీ నాలుగేళ్ల కూతురితో కలిసి తనువు చాలించింది. జానకంపేట్ ప్రాంతంలోని అశోక్సాగర్ నీ టిపై తేలియాడుతున్న తల్లీకూతుళ్ల మృతదేహాలను చూసిన వారు కంటతడి పెట్టారు. ఎడపల్లి ఎస్సై ముత్యాల రమ తెలిపిన వివరాలు ఇ లా ఉన్నాయి.. నిజామాబాద్నగరంలోని హశ్మీ కాలనీకి చెందిన ఇమ్రానా బేగం(40) భర్త ఆసి ఫ్ ఉపాధి కోసం కువైట్కు వెళ్లగా.. ముగ్గురు పిల్లలతో కలిసి ఇమ్రానాబేగం అత్తవారింట్లో ఉంటోంది. శారీరక వైకల్యం ఉండడంతో ఇ మ్రానాబేగం మానసికంగా బాధపడుతూ ఉండేది. ఎస్ఐఆర్ (ఓటరు న మోదు) ఫామ్ పనిపై బ యటికి వెళ్తున్నానని నా లుగేళ్ల కూతురితో కలిసి మంగళవారం మధ్యాహ్నం ఇంట్లో నుంచి బయటికి వచ్చింది. సాయంత్రం సమయంలో అశోక్సాగర్ నీటిపై రెండు మృతదేహాలు తేలియాడుతున్నాయనే సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకుని బయటికి తీయించారు. విచారణ చేపట్టి మృతులను తల్లీకూతుళ్లు ఇమ్రానాబేగం, నేహా అజ్లిన్గా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం బోధన్ పట్టణంలోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తల్లీకూతుళ్ల బలవన్మరణానికి కారణా లు తెలియరాలేదు. మృతురాలి బావ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. నాలుగేళ్ల కూతురితో కలిసి తల్లి బలవన్మరణం అశోక్సాగర్లో తేలియాడిన మృతదేహాలు మృతులు నిజామాబాద్ నగరవాసులు -
భూ రీసర్వేను పకడ్బందీగా చేపట్టాలి
● ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాల్వియా నందిపేట్: భూముల రీ సర్వే ప్రక్రియను ఎలాంటి లోపాలకు తావు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాల్వియా అధికారులను ఆదేశించారు. మండలంలోని మల్లా రం గ్రామంలో కొనసాగుతున్న భూముల రీ సర్వే ప్రక్రియను మంగళవారం సబ్ కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం మండల తహ సీల్ కార్యాలయంలో ఇప్పటి వరకు చేపట్టిన సర్వే వివరాలను తెలుసుకున్నారు. సర్వే సమయంలో భూముల విస్తీర్ణం, సర్వే నంబర్లు, గ్రామ సరిహద్దులు, గ్రామ కంఠం తదితర వివరాలను పరిశీలించి సంబంధిత రికార్డులతో సరిపోల్చాలని సూచించారు. అదే విధంగా గ్రామాల్లో కొనసాగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియను, కుద్వాన్పూర్లో మహాత్మా జ్యోతీబా ఫూలే గురుకుల పాఠశాల భవన నిర్మాణానికి ఏర్పాటు చేసిన స్థలాన్ని పరిశీలించారు. మండల కేంద్రంలోని పలుగుట్ట ప్రాంతంలో మినీస్టేడియం కోసం కేటాయించిన ఐదెకరాల స్థలాన్ని పరిశీలించారు. ఆయన వెంట తహసీల్దార్ లక్ష్మణ్, రెవెన్యూ సిబ్బంది, లాండ్ సర్వే అధికారులు, స్థానిక నాయకులు బైండ్ల ప్రశాంత్, మంగ్లారపు ధర్మన్న ఉన్నారు. కోమట్పల్లిలో.. డొంకేశ్వర్(ఆర్మూర్): పైలెట్ ప్రాజెక్టు కింద చేపడుతున్న భూముల రీ సర్వేను త్వరగా పూర్తి చేయా లని ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాల్వియా సర్వేయర్లకు సూచించారు. డొంకేశ్వర్ మండలం కోమట్పల్లిలో కొనసాగుతున్న సర్వేను ఆయన పర్యవేక్షించారు. రైతులు స్థానికంగా ఉండి భూముల సర్వేను పూర్తి చేయించుకోవాలన్నారు. సర్వే పూర్తయితే భూవివాదాలు, హ ద్దుల సమస్యలు ఉండవని పేర్కొన్నారు. ఎక్కువ సర్వే నంబర్లు ఉన్నందునా అక్టోబర్ రెండో వారానికల్లా సర్వేను పూర్తి చేస్తామని సర్వేయర్ కిషన్నాయక్ సబ్ కలెక్టర్కు వివరించారు. తహసీల్దార్ ప్రసాద్, ఆర్ఐ నితీశ్రెడ్డి, సర్పంచ్ సుమలత ఉన్నారు. -
వివాదాస్పద స్థలం పరిశీలన
సిరికొండ: మండలంలోని కొండాపూర్ గ్రామంలో గ్రామస్తులకు, బంజారాలకు మధ్య నెలకొన్న వివాదాస్పద స్థలాన్ని నిజామాబాద్ ఏసీపీ ప్రకాశ్ మంగళవారం పరిశీలించారు. వివాదాస్పద స్థలం గురించి సోమవారం జరిగిన ఘటనపై స్థానిక పోలీస్ అధికారులను ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఘటనకు దారితీసిన పరిస్థితులు, చేపట్టిన చర్యలు తదితర అంశాలపై ఏసీపీ వివరాలు సేకరించారు. గ్రామంలో శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా తగిన చర్యలు చేపట్టాలని స్థానిక అధికారులకు సూచించారు. ఏసీపీ వెంట ధర్పల్లి సీఐ భిక్షపతి, స్థానిక ఎస్సై రామకృష్ణ ఉన్నారు.ఇంటెలిజెన్స్ సీఐ బదిలీ నిజామాబాద్ అర్బన్: ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేస్తున్న ఎండీ సాజిదుల్లా మంగళవారం బదిలీ అయ్యారు. ఈ మేరకు ఉత్తర్వులు వెలువడ్డాయి. హైదరాబాద్కు చెందిన సాజిదుల్లా నాలుగేళ్లుగా డిప్యుటేషన్పై జిల్లాలో ఇంటెలిజెన్స్ సీఐగా పనిచేస్తున్నారు. కాగా అతనిని బదిలీ చేస్తూ హైదరాబాద్ జోన్కు కేటాయిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. విద్యాశాఖ సూపరింటెండెంట్..ఖలీల్వాడి: జిల్లా విద్యాశాఖలో సూపరింటెండెంట్గా విధులు నిర్వహిస్తున్న మురళీ మనోహర్కృష్ణను బదిలీ చేస్తూ ఆర్జేడీ మదన్ మోహన్ ఉత్తర్వులు జారీ చేశారు. సదరు అధికారి డిసెంబర్లో పదవీవిరమణ చేయా ల్సి ఉంది. సోమవారం బదిలీ ఆర్డర్ రావడంతో సూపరింటెండెంట్ మురళి మనోహర్ కృష్ణ డైట్లో జాయిన్ కావడానికి నాట్ విలింగ్ ఇస్తూ ఆర్జేడీకి మంగళవారం దరఖాస్తు చేసుకున్నట్లు తెలిసింది. బంద్ విజయవంతం బోధన్: విద్యార్థుల పెండింగ్ బోధనా రుసుం విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ తెలంగాణ రాష్ట్ర డిగ్రీ, పీజీ కళాశాలల యా జమాన్య ఐక్యవేదిక మంగళవారం కళాశాలల బంద్కు పిలుపు నిచ్చింది. ఇందులో భాగంగా పట్టణ కేంద్రంలోని ఉషోదయ డిగ్రీ కళాశాలల, ఉషోదయ మహిళ డిగ్రీ కళాశాలలను యాజమాన్యం బంద్ పాటించాయి. ఉషోదయ విద్యా సంస్థల చైర్మన్ సూర్యప్రకాశ్ మా ట్లాడుతూ.. 2021 నుంచి విద్యార్థులకు రావాల్సిన బోధనా రుసుం అందకపోవడం వల్ల వి ద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఎదురవుతు న్న ఇబ్బందులను వివరించారు. అధ్యాపకులు, విద్యార్థులు బంద్లో పాల్గొన్నారు. నియామకంలింగంపేట: జిల్లా కేంద్రంలో నిర్వహించిన జాతీయ బీసీ సంక్షేమ సంఘం ముఖ్య నాయకుల సమావేశంలో మంగళవారం జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా మాకం రాములుకు నియామాక పత్రాన్ని జిల్లా అధ్యక్షుడు శంకర్ అందజేశారు. జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ఆదేశాల మేరకు రిటైర్డ్ ఎస్టీవోగా, మాజీ పీఏసీఎస్ వైస్చైర్మన్గా పనిచేసిన మాకం రాములు సేవలను గుర్తించి జిల్లా ఉపాధ్యక్షునిగా నియమించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బీసీ సంక్షేమ సంఘం బలోపేతాపేతానికి కృషి చేయాలని సూచించారు. కా ర్యక్రమంలో అధ్యాపకుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కాముని సుదర్శన్, జిల్లా మహిళా అధ్య క్షురాలు సునిత, నాయకులు పాల్గొన్నారు. -
స్కూటీని ఢీకొన్న స్కూల్ బస్
మాక్లూర్: మండలంలోని మాణిక్బండార్చౌరస్తా వద్ద మంగళవారం ఉదయం స్కూటీని ఎదురుగా వస్తున్న ఓ స్కూల్ బస్సు ఢీకొన్నది. ప్రమాదంలో స్కూటీపై ఉన్న మహిళకు గాయాలయ్యాయి. హె ల్మెట్ ఉండడంతో ఆమెకు ప్రాణాలతో బయటపడినట్లు స్థానికులు తెలిపారు. ముబారక్నగర్కు చెందిన కవిత డిచ్పల్లి మండలంలోని ఓ జీపీ కార్యదర్శిగా పని చేస్తున్నారు. ఉదయం రోజు మాదిరిగానే స్కూటీపై డిచ్పల్లికి వెళ్తుండగా మాణిక్బండార్ చౌరస్తా వద్ద ఎదురుగా వస్తున్న ఓ స్కూల్ బస్ ఢీకొన్నది. బస్సు ముందు చక్రం కింద స్కూటీ పడింది. దీంతో ఆమెకు గాయాలయ్యాయి. హెల్మె ట్ ఉండడంతో ఆమె ప్రాణాలతో బయటపడినట్లు స్థానికులు తెలిపారు. చికిత్స నిమిత్తం అంబులెన్స్లో జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. -
తెయూ సమాచారం
● కళాశాలలపై చర్యలు తీసుకోవాలి తెయూ(డిచ్పల్లి): నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్సీటీఈ) నిబంధనలను ఉల్లంఘిస్తున్న బీఈడీ కళాశాలలపై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, ఏఐపీఎస్యూ, డీఎస్వో విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో తెయూ అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఘంటా చంద్రశేఖర్కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు విఘ్నేశ్, రఘురాం, అనిల్, గోపిచంద్, గోపాల్ సింగ్ ఠాగూర్, చందు, వినీత్, సూర్యపాల్, ఆజాద్, సునీల్, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ● డాక్టరేట్ అందుకున్న సువర్చల తెయూ(డిచ్పల్లి): తెయూ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ (సారంగపూర్)లో అసిస్టెంట్ ప్రొఫెసర్(కాంట్రాక్టు) గా విధులు నిర్వహిస్తున్న యెండల సువర్చల ప్రదీప్ ఉస్మానియా యూనివర్సిటీ 85వ స్నాతకోత్సవంలో డాక్టరేట్ పట్టా అందుకున్నారు. సోమవారం ఓయూలో నిర్వహించిన స్నాతకోత్సవంలో వీసీ కుమార్ మొలుగురాం, సువర్చలకు డాక్టరేట్ పట్టా అందజేశారు. అనంతరం సువర్చల మాట్లాడుతూ.. తన కుటుంబం అందించిన సహకారంతో పీహెచ్డీ పూర్తి చేసి పట్టా అందుకున్నట్లు తెలిపారు. ఆమెను తెయూ ఎడ్యుకేషన్ కళాశాల బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు అభినందించారు. ● సీఎం దిష్టిబొమ్మతో శవయాత్ర తెయూ(డిచ్పల్లి): పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ తెలంగాణ యూనివర్సిటీ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం క్యాంపస్లో సీఎం రేవంత్రెడ్డి దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించారు. వర్సిటీ ప్రధాన గేటు వరకు శవయాత్ర నిర్వహించి దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో ఏబీవీపీ తెయూ అధ్యక్ష, కార్యదర్శులు సమీర్, మోహన్, ఏబీవీపీ ప్రాంత వనవాసి కన్వీనర్ అశోక్, స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ శివ, వైస్ ప్రెసిడెంట్ విజయ్, లెనిన్, అనిల్ జాయింట్ సెక్రెటరీ విఘ్నేశ్, కిరిటి, రాజేందర్, కార్యకర్తలు పవన్, రామకృష్ణ, అశ్విత్, టిల్లు, కిరణ్, ప్రీతం, నితిన్ తదితరులు పాల్గొన్నారు. ● కొనసాగుతున్న ఎంఈడీ పరీక్షలు తెయూ(డిచ్పల్లి): తెయూ పరిధిలో కొనసాగుతున్న ఎంఈడీ 4వ సెమిస్టర్ రెగ్యులర్, 1, 2, 3, 4వ సెమిస్టర్ బ్యాక్లాగ్ పరీక్షలు మంగళవారం ప్రశాంతంగా జరిగినట్లు అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. పరీక్షలకు ఒక విద్యార్థికి గాను ఒక విద్యార్థి హాజరైనట్లు ఆయన పేర్కొన్నారు. -
సర్పంచ్ లాల్సింగ్కు డాక్టరేట్
నిజామాబాద్ రూరల్: చందూర్ మండలం కారేగాం తండా సర్పంచ్ డాక్టర్ రమావత్ లాల్సింగ్ డాక్టరేట్ పొందారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం హిందీ విభాగంలో ‘సమకాలీన హిందీ ఉపన్యాస్ మే సంప్రదాయిక్ సంఘర్స్’ అనే అంశంపై పరిశోధన పూర్తి చేసిన ఆయనకు ఉస్మానియా విశ్వవిద్యాలయం నిర్వహించిన 85వ స్నాతకోత్సవంలో డాక్టరేట్ను అందజేశారు. విశ్వవిద్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, భారతీయ బయోటెక్నాలజీ చైర్మన్ కృష్ణ మిలా విసి మొగలయ్య చేతుల మీదుగా లాల్సింగ్ డాక్టరేట్ను అందుకున్నారు. ఒకవైపు సర్పంచ్గా గ్రామ అభివృద్ధికి కృషి చేస్తూనే, మరోవైపు ఉన్నత విద్యను కొనసాగించి పీహెచ్డీ సాధించడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. -
ఫిజియోథెరపీకి ఎంతో ప్రాధాన్యత ఉంది
● సీపీ సాయిచైతన్య సుభాష్నగర్: ప్రజల ఆరోగ్య పరిరక్షణలో ఫిజియోథెరపీకి ఎంతో ప్రాధాన్యత ఉందని సీపీ సాయిచైతన్య అన్నారు. మంగళవారం వరల్డ్ ఫిజియోథెరపీ డే వేడుకలను రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో నిజామాబాద్ జిల్లా ఫిజియోథెరపీ అసోసియేషన్ సభ్యు లు నిర్వహించారు. కార్యక్రమానికి సీపీ ముఖ్య అతి థిగా హజరై మాట్లాడారు. ప్రమాదాలు, గాయాలు, శస్త్రచికిత్సలు, కీళ్ల, కండరాల సమస్యలు, నడకకు సంబంధించిన ఇబ్బందులు తదితర సమస్యల నుంచి కోలుకోవడంలో ఫిజియోథెరపీ చికిత్స ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. ప్రతి ఒక్కరూ తమ రోజువారీ జీవితంలో తగినంత శారీరక వ్యాయామం, నడక, ఆరోగ్యకరమైన జీవనశైలికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించడంలో వైద్యులు, ఫిజియో థెరపీస్టులు, ఆరోగ్య సిబ్బంది చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. అనంతరం రక్తదానం చేసిన దాతలకు ప్రశంస పత్రాలు ఇచ్చి అభినందించారు. కార్యక్రమంలో మేయర్ ఉమారాణి, ఫిజియోథెరపీ అసోసియేషన్ ప్రెసిడెంట్ శివకుమార్, వైస్ ప్రెసిడెంట్ అశ్విని జోషి, జనరల్ సెక్రెటరీ ప్రమోద్ కుమార్, ట్రెజరర్ కీర్తి గుప్తా, ఫిజియోథెరపీస్టులు, వైద్యులు, ఆరోగ్య సిబ్బంది, విద్యార్థులు, నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. -
ప్లాస్టిక్ కవర్ల దుకాణాలపై దాడులు
సుభాష్నగర్: నిజామాబాద్ నగరంలోని పలు ప్లాస్టిక్ కవర్ల దుకాణాలు, సింగిల్ యూజ్ కవర్లు వినియోగిస్తున్న జ్యూస్, టిఫిన్ సెంటర్లు, ఫాస్ట్ఫుడ్ కేంద్రాలు, కిరాణా దుకాణాలపై కార్పొరేషన్ ఏఎంసీ నజీరుద్దీన్ ఆ ధ్వర్యంలో మంగళవారం దాడులు చేశారు. నగరంలోని పెద్దబజార్, శివాజీనగర్, కిసా న్ గంజ్, ఖలీల్వాడి, గాజుల్పేట్, తదితర ప్రాంతాల్లో దుకాణాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. సింగిల్ యూజ్ క వర్లు వినియోగిస్తున్న, విక్రయిస్తున్న దుకాణాలకు జరిమానాలు విధించారు. మొత్తం రూ.15వేల వర కు జరిమానాలు విధించినట్లు అధికారులు తెలిపారు. శానిటరీ సూపర్వైజర్ సాజిద్ అలీ, శానిటరీ ఇన్స్పెక్టర్ మహిపాల్, కృష్ణ, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. -
టెంపోను ఢీకొన్న మిల్క్ ట్యాంకర్
● పదిమందికి గాయాలు ఆమనగల్లు: టెంపో ట్రావెలర్ను మిల్క్ ట్యాంకర్ ఢీకొన్న ఘటనలో పదిమందికి గాయాలయ్యాయి. వివరాలిలా ఉన్నాయి. నిజామాబాద్ నుంచి శ్రీౖ శెలం దేవస్థానానికి సోమవారం టెంపో ట్రావెలర్లో 17 మంది వెళ్తున్నారు. అర్ధరాత్రి రంగారెడ్డి జి ల్లా ఆమనగల్లులోని రాజీవ్చౌరస్తా వద్ద మాడ్గుల నుంచి హైదరాబాద్కు వెళ్తున్న మిల్క్ ట్యాంకర్ వే గంగా వచ్చి ఢీకొన్నది. ఈ ఘటనలో టెంపో ట్రావెలర్లో ఉన్న నిజామాబాద్కు చెందిన కై లాస్, క న్నా, నాగరాజు, ధన్రాజ్, గోపాల్, శ్రీరామ్, భూ మి తదితరులకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను 108 అంబులెన్స్లో చికిత్స నిమిత్తం కల్వకుర్తి ప్రభు త్వ ఆస్పత్రికి తరలించారు. నిజామాబాద్కు చెందిన సంతోష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. -
సీఎంఆర్ పంచాయితీ
నిజామాబాద్వేడుకలకు గణనాథులు..నవరాత్రి వేడుకలకు గణేశ్ ప్రతిమలు ముస్తాబయ్యాయి. వేర్వేరు ప్రాంతాల నుంచి జిల్లాకు ప్రతిమలు తీసుకొస్తున్నారు.బుధవారం శ్రీ 9 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026– 8లో uసాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : ప్రభుత్వం రైస్మిల్లులకు కేటాయించే కస్టమ్స్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్) ధాన్యం వ్యవహారం ‘పంచాయితీ’కి దారి తీసింది. పలు మిల్లుల నుంచి ప్రభుత్వానికి రావాల్సిన సీఎంఆర్ ఏళ్లు గడిచినా రాక బకాయిలు పేరుకుపోవడంతో ప్రభుత్వం రికవరీకి కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు చేస్తున్నారు. పలు రైస్మిల్లుల్లో అసలు ధాన్యమే లేకపోవడాన్ని గుర్తించిన అధికారులు కేసులు నమోదు చేశారు. గడువులోగా పెండింగ్ బకాయిలను ప్రభుత్వానికి తిరిగి అప్పగించకుంటే మిల్లర్లపై క్రిమినల్ కేసులతో పాటు పీడీ యాక్ట్ నమోదుచేసి జైలుకు పంపుతామని ప్రభుత్వం హెచ్చరిస్తోంది. అయితే ప్రభుత్వం ఏకపక్షంగా దాడులను నిలిపివేయాలని తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ మిల్లర్లు నిరసనకు దిగుతున్నారు. బుధవారం నుంచి జిల్లాలోని మిల్లులను మూసివేస్తామని, ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించేవరకు నిరసన తెలుపుతామని జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ప్రకటించారు. కొంత మంది రైస్మిల్లర్ల కారణంగా అందరికీ చెడ్డపేరు వస్తోందని రైస్మిలర్స్ అసోసిషియేషన్ ప్రతి నిధులు వాపోతున్నారు. ప్రభుత్వం తమతో చర్చిస్తే గడువులోగా ధాన్యం అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నామని అంటున్నారు. ప్రభుత్వం నుంచి అందాల్సిన మిల్లింగ్ చార్జీలను చెల్లించడంతోపాటు మిల్లర్లకు జరుగుతున్న నష్టాలను పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. విజిలెన్స్ దాడులను తక్షణమే నిలిపివేయాలని.. ప్రభుత్వం స్పందించేవరకు మిల్లులను మూసివేయనున్నట్టు ప్రకటించారు. జిల్లాలోని పలు రైస్మిల్లుల్లో ధాన్యం మాయం విజిలెన్స్ దాడులు, కేసులతో ప్రభుత్వం, అధికారుల ఒత్తిడి బ్లాక్లిస్టింగ్, కేసులకు బెదరని మిల్లర్లు ప్రభుత్వం వర్సెస్ మిల్లర్లుగా పరిస్థితి నేటి నుంచి రైస్మిల్లుల బంద్కు పిలుపు -
కేసుల పరిష్కారంలో మీడియేషన్ ది కీలక పాత్ర
నిజామాబాద్ లీగ ల్ : జిల్లా కోర్టు పరిధిలో చాలాకాలంగా వివాదాల్లో ఉన్న పలు కేసులను రాజీమార్గం ద్వారా పరిష్కరించడంలో మీడియేషన్ (మధ్యవర్తిత్వం) కీలక పాత్ర పోషిస్తుందని జిల్లా న్యా య సేవా సంస్థ చైర్పర్సన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జీవీఎన్ భారతలక్ష్మి అన్నారు. జిల్లా కోర్టు సముదాయంలోని త న చాంబర్లో మంగళవారం జిల్లా న్యాయ సేవ సంస్థ కార్యదర్శి నీలిమ ముద్దసానితో కలిసి మీడియేషన్కు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఇరుపక్షాల అంగీకారంతో రాజీమార్గం ద్వారా కేసులను పరిష్కరించుకుంటే కక్షిదారులకు సమయం, ఖ ర్చు ఆదా కావడంతోపాటు పరస్పర సత్సంబంధాలు కొనసాగించేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ మీ డియేషన్ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని, వివాదాల పరిష్కారంలో మీడియేషన్ పాత్ర అమోఘమన్నారు. జిల్లా న్యా య సేవా సంస్థ సిబ్బంది పాల్గొన్నారు. విద్యార్థుల భవిష్యత్ను నిర్మించే శిల్పులు గురువులు తెయూ(డిచ్పల్లి): గురువు అంటే కేవలం పాఠాలు చెప్పేవారు మాత్రమే కాదని, విద్యార్థుల భవిష్యత్ను నిర్మించే శిల్పులని తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ టి యాదగిరిరావు అన్నారు. ఎన్ఎస్యూఐ ఆధ్వర్యంలో వర్సిటీ లా కళాశాల సెమినార్ హాల్లో మంగళవారం ‘గురు వందనం– 2026’ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వీసీ మాట్లాడుతూ.. విద్యార్థులు గురువులను గౌరవించడంతోపాటు వారి సూచనలను పాటించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని హిత వు పలికారు. గురువందనం వంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో కృతజ్ఞతా భావాన్ని పెంపొందిస్తాయని రిజిస్ట్రార్ ఎం యాదగిరి అన్నారు. అనంతరం ఎన్ఎస్యూఐ ఆధ్వర్యంలో వీసీతోపాటు రిజిస్ట్రార్ను సన్మానించారు. అధ్యాపకులు ప్రసన్నరాణి, జెట్లింగ్ యెల్లోస, స్రవంతి, ప్రొఫెసర్లు సీహెచ్ ఆరతి, రాంబాబు, స్వప్న, రమణాచారి, విద్యార్థ్ధులు తదితరులు పాల్గొన్నారు. ప్రమోద్కుమార్కు ఘన నివాళి నిజామాబాద్ అర్బన్: పోలీస్ కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్ గతేడాది నేరస్థుడు చేతిలో హత్యకు గురయ్యాడు. మంగళవారం ప్రమోద్ మొదటి వర్ధంతి కార్యక్రమాన్ని ఎల్లమ్మ గుట్టలోని ఆయన నివాసంలో నిర్వహించారు. పోలీస్ కమిషనర్ సాయిచైతన్య పాల్గొని ప్రమోద్కుమార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. సీపీ మాట్లాడుతూ.. ప్రమోద్కుమార్ పోలీస్ శాఖకు అందించిన సేవలను గుర్తు చేశారు. విధి నిర్వహణలో ఆయన చూపిన అంకితభావం, క్రమశిక్షణ ఎంతో గొప్పదని కొనియాడారు. కార్యక్రమంలో ఏసీపీ ప్రకాశ్ యాదవ్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ రెడ్డి, మల్లేశం తదితరులు పాల్గొన్నారు. -
సమస్యల పరిష్కారంలో జాప్యం
● ఉద్యోగుల డిమాండ్లను నెరవేర్చాలి ● సెప్టెంబర్ 10న చలో హైదరాబాద్ ● టీజీఈ జేఏసీ రాష్ట్ర చైర్మన్ మారం జగదీశ్వర్ఆర్మూర్టౌన్ : సమస్యల పరిష్కారాన్ని ప్రభుత్వం జాప్యం చేస్తుండడంతో ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని టీజీఈ జేఏసీ రాష్ట్ర చైర్మన్ మారం జగదీశ్వర్, జనరల్ సెక్రెటరీ ఏలూరి శ్రీనివాస్ అ న్నారు. చలో హైదరాబాద్ మహాధర్నాను ఈనెల 10వ తేదీన నిర్వహించనున్న నేపథ్యంలో ఆర్మూర్ పట్టణంలోని టీఎన్జీవోస్ యూనిట్ కార్యాలయంలో మంగళవారం సన్నాహక సమావేశాన్ని నిర్వ హించారు. ఈ సందర్భంగా జగదీశ్వర్ మాట్లాడు తూ.. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను నెరవే ర్చాలని కోరుతూ చేపట్టనున్న మహాధర్నాను విజ యవంతం చేయాలన్నారు. 2023 జూలై నుంచి 51 శాతం ఫిట్మెంట్తో రెండో పీఆర్సీ అమలు చేయాలని, పెండింగ్లో ఉన్న ఆరు డీఏలు వెంటనే విడు దల చేయాలని, రూ.10 వేల కోట్ల పెండింగ్ బిల్లులను చెల్లించాలని, సీపీఎస్ను రద్దు చేసి ఓపీఎస్ పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల ఆ రోగ్య పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయడంతోపాటు ఉద్యోగ సంఘాల గుర్తింపును పునరుద్ధరించాలన్నారు. సమావేశంలో టీజీఈ జేఏసీ రాష్ట్ర నాయకుడు దామోదర్రెడ్డి, టీన్జీవో జిల్లా అధ్యక్షుడు నాశెట్టి సుమన్, కార్యదర్శి శేఖర్, ఆర్మూర్ యూనిట్ అధ్యక్షుడు శశికాంత్రెడ్డి, కార్యదర్శి విశాల్ తదితరులు పాల్గొన్నారు. -
పోలీస్ ప్రజావాణిలో 37 ఫిర్యాదులు
నిజామాబాద్ అర్బన్: జిల్లాకేంద్రంలోని సీపీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పోలీస్ ప్రజావాణిలో 37 ఫిర్యాదులను స్వీకరించినట్లు సీపీ సాయిచైతన్య అన్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలను విన్నవించుకున్నారన్నారు. తక్షణమే చట్టపరంగా సమస్యలను పరిష్కరించాలని పోలీస్ కమిషనర్ సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు. నిజామాబాద్అర్బన్: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఈనెల 5, 6 తేదీలలో తెలంగాణ సైక్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్రస్థాయి మౌటైన్ బైక్ సైక్లింగ్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు ప్రతిభ కనబర్చినట్లు జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి విజయ్కాంత్ రావ్ అన్నారు. జిల్లాకు చెందిన శిల్పచౌహాన్ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చి బంగారు, వెండి పతకాలు సాధించారన్నారు. ఈసందర్భంగా వారికి జిల్లా సైక్లింగ్ సంఘం ప్రతినిధులు కృపాకర్ రెడ్డి, విజయ్ కాంత్ రావ్, సురేందర్, సూర్య ప్రకాష్ అభినందనలు తెలిపారు. మాదిగ ఉద్యోగుల సమాఖ్య జాతీయ ఉపాధ్యక్షుడిగా సురేశ్ నిజామాబాద్ అర్బన్: మాదిగ ఉద్యోగుల సమైక్య జాతీయ ఉపాధ్యక్షుడిగా సిలుమల సురేశ్ నియమితులయ్యారు. ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చే శారు. తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ మాదిగ ఉద్యోగుల సంక్షేమం, హక్కుల సాధన, సామాజిక న్యాయం కోసం నిరంతరం కృషి చేస్తానని సురేశ్ అన్నారు. జాతీయ కోర్ కమిటీ సభ్యులుగా గంగారాం మాదిగ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జాతీయ కోర్ కమిటీ సభ్యులుగా జిల్లాకు చెందిన తెడ్డు గంగారాం నియమితులయ్యారు. ఈ మేరకు ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ నియామకపత్రం అందజేశారు. నిజామాబాద్ రూరల్: రూరల్ పోలీస్స్టేషన్పరిధిలోని ఆటోనగర్కు చెందిన ఓ మహిళకు బంగారంపై లోను ఇస్తానని చెప్పి బురిడికొట్టించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రూరల్ ఎస్హెచ్వో శ్రీనివాస్ తెలిపిన వివరాలు ఇలా.. నగరంలోని ఆటోనగర్కు చెందిన మహిళ రెండున్నర తులాల బంగారంపై ప్రైవేట్ బ్యాంకులో లోన్ తీసుకుంది. సోషల్మీడియాలో బంగారంపై ఎక్కువ రుణాలు ఇస్తామంటూ వచ్చి ప్రకటనకు ఆమె స్పందించి, వారిని సంప్రదించింది. దీంతో ప్రకటన చేసిన వ్యక్తులు ఆమె బ్యాంకులో పెట్టిన బంగారంను విడిపించి సగం డబ్బులు చెల్లించి మిగిత డబ్బులు ఆదివారం ఇస్తామని చెప్పారు. సదరు మహిళ ఆ వ్యక్తులను సంప్రదించగా ఆ బంగారం 22 క్యారెట్లు కాదని 18 క్యారెట్లు అని మిగిత డబ్బులు మాకే తిరిగి చెల్లించాలని బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ ఘటనపై బాధిత మహిళ రూరల్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా, నగరంలోని ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. -
మహిళా జర్నలిస్ట్పై దాడి సరికాదు
నిజామాబాద్ రూరల్: ఢిల్లీలో ఇటీవల ముస్లిం మ హిళా జర్నలిస్టులపై పోలీసులు విచక్షణ రహితంగా దాడులు చేయడం సరికాదని నిజామాబాద్ ప్రెస్క్లబ్ ప్రతినిధులు అన్నారు. జాతీయ జర్నలిస్ట్ సంఘాల పిలుపుమేరకు సోమవారం దాడిని ఖండిస్తూ నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిరసన కార్య క్రమం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. బాధ్యులపై శాఖామైన చర్యలు చేపట్టి వారిని విధుల నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం సీపీ, అదనపు కలెక్టర్కు వినతిపత్రాలు అందజేశారు. ప్రెస్క్లబ్ ప్రతినిధులు శ్రీకాంత్, సుభాష్, రాజ్కుమార్, రాజు, భా స్కర్ గౌడ్, స్వా మి, ప్రీతంరెడ్డి, రవిచరణ్ రెడ్డి, రత న్ రెడ్డి, వివిధ జర్నలిస్ట్ సంఘాల నాయకులు ఉన్నారు. -
బైక్ అదుపుతప్పి ఒకరి మృతి
డొంకేశ్వర్(ఆర్మూర్): బైక్పై వెళ్తున్న ఓ వ్యక్తికి అడవిపందికి అడ్డురావడంతో దానిని తప్పించబోయి కిందపడి మృతిచెందాడు. ఎస్సై వినయ్ తెలిపిన వివరాలు ఇలా.. మండలంలోని గంగాసముందర్ గ్రామానికి చెందిన మీరొల్ల సాకలి ఊశన్న(45) మారంపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ పంప్హౌస్లో ఆపరేటర్గా పని చేస్తున్నాడు. ఈనెల 6న సాయంత్రం తన విధులు ముగించుకొని మోపెడ్పై ఇంటికి బయలుదేరాడు. మార్గమధ్యలో అడవిపంది అడ్డురావడంతో మోపెడ్ వాహనం అదుపుతప్పి కిందపడిపోయాడు. ఈ ఘటనలో అతడు తీవ్రగాయాలతో అక్కడికక్కడే మరణించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని, వివరాలు సేకరించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. తాడ్వాయి(ఎల్లారెడ్డి): రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. వివరాలు ఇలా.. తాడ్వాయి మండల కేంద్రానికి చెందిన లింగవోల జీవన్(30)అనే వ్యక్తి ఈనెల 3న బైక్పై తాడ్వాయి నుంచి చందాపూర్ వైపు బయలుదేరాడు. ఇదే సమయంలో బ్రహ్మాజివాడి గ్రామానికి చెందిన దేవునిపల్లి శ్రావణ్ తన బైక్పై తాందాపూర్ నుంచి తాడ్వాయికి వస్తున్నాడు. ఈక్రమంలో మండలంలోని బాలికల గురుకుల పాఠశాల ఇరువురి బైక్లు ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి. ఈ ఘటనలో జీవన్కు తీవ్రగాయాలు కాగా, శ్రావణ్కు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే వారిని చికిత్స నిమిత్తం కామారెడ్డిలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. జీవన్ పరిస్థితి విషమించడంతో అక్కడి వైద్యులు అతడిని హైదరాబాద్లోని నిమ్స్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారు జామున జీవన్ మృతిచెందాడు. మృతుడికి భార్య గంగమణి, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై వివరించారు. మాక్లూర్: మండలంలోని మాణిక్భండార్లో రాజు అనేవ్యక్తి అదృశ్యమైనట్లు ఎస్సై అనిల్రెడ్డి సోమవారం తెలిపారు. డిచ్పల్లి గ్రామానికి చెందిన రాజు కొన్నేళ్లుగా మాణిక్భండార్లో నివాసం ఉంటూ, స్థానిక ప్రభుత్వ పాఠశాలలో కాంట్రాక్టు పద్ధతిలో అటెండర్గా పనిచేస్తున్నాడు. గత నెల 31న డిచ్పల్లిలో చిట్టీ డబ్బులు చెల్లించి వస్తానని చెప్పి ఇంటి నుంచి వెళ్లిన రాజు ఇప్పటికీ తిరిగిరాలేదు. కుటుంబసభ్యులు ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై అనిల్రెడ్డి తెలిపారు. -
మండపాల వివరాలు పోర్టల్లో..
నమోదు తప్పనిసరి ● వీసీలో డీజీపీ సీవీ ఆనంద్ నిజామాబాద్అర్బన్: గణేశ్ మండపాల వివరాలను పోలీస్ పోర్టల్లో నమోదు చేయాలని డీజీపీ సీవీ ఆనంద్ ఆదేశించారు. విగ్రహాల ప్రతిష్ఠాపన నుంచి నిమజ్జనం వరకు అప్రమత్తంగా ఉండాలని జిల్లా పోలీసు అధికారులకు సూచించారు. వినాయక ఉత్సవాల నేపథ్యంలో సోమవారం హైదరాబాద్ నుంచి ఆయన వీడియోకాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఉత్సవాల సందర్భంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూడాలన్నారు. ప్రతి మండపం వద్ద భద్రతను ముందుగానే పరిశీలించాలన్నారు. అవసరమైన చోట్ల ట్రాఫిక్ మళ్లింపు చేపట్టాలని, నిమజ్జన ప్రాంతాల్లో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. సీపీ సాయిచైతన్య, సీసీఆర్బీ ఏసీపీ గురునాయుడు, ఏఆర్ ఏసీపీ రాములు, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీధర్రెడ్డి, మల్లేశం తదితరులు పాల్గొన్నారు. -
కొండాపూర్లో ఉద్రిక్తత
● గ్రామస్తులకు, బంజారాలకు మధ్య స్థల వివాదం ● గ్రామస్తులపై పోలీసుల లాఠీచార్జీ సిరికొండ: స్థల వివాదం నేపథ్యంలో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. స్థలం కోసం ఆందోళన చేస్తున్న ఇరు వర్గాలపై పోలీసులు లాఠీచార్జీ చేసి చెదరగొట్టారు. వివరాలు ఇలా.. కొండాపూర్ గ్రామంలో చుట్టుపక్కల గల తండాలకు చెందిన బంజారా భవనం ఉంది. అలాగే భవనం ఎదుట ఖాళీ స్థలం ఉండగా, అది మాదంటే మాదని బంజారాలు, గ్రామస్తుల మధ్య వివాదం నెలకొంది. ఈక్రమంలో బంజారా భవనం ఎదుట బంజారాలు ఆదివారం వారి సంప్రదాయ జెండాల చుట్టూ గద్దె నిర్మించడం చేపట్టారు. గద్దె నిర్మాణాన్ని గ్రామస్తులు అడ్డుకోవడంతో వివాదం నెలకొంది. ఆదివారం ఎస్సై రామకృష్ణ సిబ్బందితో వెళ్లి ఘర్షణ తలెత్తకుండా చూశారు. సోమవారం బంజారాలు జెండాల వద్ద పూజలు చేయడంతో మళ్లీ వివాదం తలెత్తింది. విషయం తెలిసిన ఎస్సై రామకృష్ణ సిబ్బందితో అక్కడికి వెళ్లి బంజారాలను అక్కడి నుంచి పంపించివేశారు. అనంతరం అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని గ్రామస్తులు ఆందోళన చేయడం మొదలు పెట్టారు. ధర్పల్లి సీఐ భిక్షపతి, ధర్పల్లి, ఇందల్వాయి, డిచ్పల్లి, జక్రాన్పల్లి ఎస్సైలు సిబ్బందితో గ్రామానికి వెళ్లారు. ఎలాంటి అల్లర్లు జరగకుండా తగిన చర్యలు చేపట్టారు. గ్రామస్తులు ఒక వైపున, బంజారాలు మరో వైపున రోడ్డుపై బైఠాయించారు. గ్రామస్తులు రోడ్డుపై టెంట్ వేయకుండా పోలీసులు అడ్డుకుంటుండగా వారు ఎంతకీ వినకపోవడంతో పోలీసులు లాఠీచార్జీ చేసి గ్రామస్తులను చెదరగొట్టారు. అక్కడి నుంచి ఇరు వర్గాలు వెళ్లిపోయిన అనంతరం ముఖ్య నాయకులతో ధర్పల్లి సీఐ భిక్షపతి, తహసీల్దార్ రవీందర్రావు, ఎంపీడీవో రఫీ అహ్మద్, ఎస్సై రామకృష్ణ చర్చలు జరిపారు. వివాదం పెంచుకోవద్దని చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. శుక్రవారం సిరికొండ పోలీస్ స్టేషన్లో చర్చిద్దామని, ఇరువర్గాల వారు అక్కడికి రావాలని అధికారులు వారికి తెలిపారు. అప్పటి వరకు వివాదాస్పద స్థలం వద్దకు ఎవరు కూడా వెళ్లవద్దని సీఐ తెలిపారు. అందుకు సమ్మతించి ఇరువర్గాల వారు అక్కడి నుండి వెళ్లిపోయారు. -
ఎరువుల రవాణా భారాన్ని ప్రభుత్వమే భరించాలి
నిజామాబాద్ రూరల్: ఎరువుల రవాణా ఖర్చును ప్రభుత్వమే భరించాలని జిల్లా ప్రైమరీ అగ్రికల్చర్ కో–ఆపరేటివ్ సొసైటీ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రతినిధులు కోరారు. ఈమేరకు వారు సోమవారం నగరంలోని కలెక్టరేట్కు తరలివచ్చి, అదనపు కల్టెక్టర్ భుజంగరావుకు వినతిపత్రం అందజేశారు. అ నంతరం అధ్యక్షుడు ఎ్స్కే బాబా మాట్లాడుతూ.. ఎరువుల రవాణా భారం సొసైటీల మీద పడటంతో ఆర్థికంగా నష్టపోతున్నట్లు పేర్కొన్నారు. రైతుల నుంచి రవాణా, హమాలీ చార్జీలు అదనంగా వసూలు చేయడానికి అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అసోసియేషన్ ప్రతినిధులు నర్సయ్య, మహమ్మద్ పాషా, వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
నిజామాబాద్
పులుల సంరక్షణ.. పులుల సంరక్షణతోపాటు ఆవాసాల సంరక్ష ణ అందరి బాధ్యత అని కవ్వాల్ టైగర్ రిజ ర్వ్ ఫీల్డ్ డైరెక్టర్ శాంతారాం అన్నారు.మంగళవారం శ్రీ 8 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026– 8లో uరాజకీయం గరంగరంసాక్షి ప్రతినిధి, నిజామాబాద్: పాలనలో ప్రభుత్వం వెయ్యి రోజుల మైలురాయిని దాటగా.. మూడు ప్రధాన పార్టీలు తమ కార్యక్రమాలతో హోరెత్తిస్తున్నాయి. కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనలో విఫలమైందని, ఇవిగో వైఫల్యాలు అంటూ ‘బాకీ కార్డు’లతో బీఆర్ఎస్ వారం రోజులుగా ‘పోరుబాట’ పట్టింది. నిరసన కార్యక్రమాలను ఉధృతంగా చేపట్టింది. మరోవైపు కాంగ్రెస్ తమ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనకు మైలురాయిగా ‘ప్రజాపాలన విజయోత్సవ’ ర్యాలీలను నిర్వహిస్తోంది. ఇరు పార్టీల పోటాపోటీ కార్యక్రమాలతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఎడతెగని నిరసనలతో గులాబీ పోరు.. కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనలో అమలుకానీ హామీలను ఎత్తిచూపుతూ, వైఫల్యాలను ఎండగడుతూ బీఆర్ఎస్ నిరసనల పర్వాన్ని కొనసాగిస్తోంది. కాంగ్రెస్బాకీ కార్డుల పంపిణీ, వైఫల్యాలపై ధర్నాలు, నిరసనలు, ర్యాలీలు, ప్రజావాణిలో వినతుల కార్యక్రమాలను చేపట్టింది. మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, గణేశ్గుప్తా, జీవన్రెడ్డి, షకీల్ క్షేత్రస్థాయిలో చేపట్టిన నిరసనల్లో పాల్గొన్నారు. ఈనెల 2న ప్రారంభించిన కార్యక్రమాలు 10వ తేదీ వరకు కొనసాగనున్నాయి. సోమవారం జిల్లాలో చేపట్టిన నిరసనల సందర్భంగా సీఎం దిష్టిబొమ్మలను దగ్ధం చేయడంతో పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. మంగళవారం సైతం బీఆర్ఎస్ నేతలు జిల్లాకేంద్రంతోపా టు మండలాల్లో అంబేడ్కర్ విగ్రహాలకు వినతిపత్రా లు సమర్పించి ప్రెస్మీట్లు ఏర్పాటు చేయనున్నారు. 10వ తేదీన ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల నిరసనలకు సంఘీభావం తెలుపనున్నారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు మరింత దగ్గరయ్యేందుకు బీఆర్ఎస్ వరుస కార్యక్రమాలను నిర్వహిస్తూనే పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణుల సమీకరణతో బలప్రదర్శన చూపుతోంది. ఫీజు బకాయిలపై ‘బీజేపీ లడాయి’ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై బీజేపీ పోరు చేపట్టింది. ‘ఫీజు బకాయి – బీజేపీ లడాయి’ పేరుతో నిరసనలను నిర్వహిస్తోంది. ఇప్పటికే ఫీజు రియింబర్స్మెంట్ బకాయిలపై జిల్లాకేంద్రంలో విద్యార్థులతో ధర్నా కార్య క్రమాన్ని చేపట్టగా, 22 ఏ భూములపై నిరసనలకు సిద్ధమైంది. ఎంపీ అర్వింద్, ఎమ్మెల్యేలు సూర్యనారాయణ, రాకేశ్రెడ్డి, ముఖ్య నేతల ఆధ్వర్యంలో నిరసనల పర్వాన్ని కొనసాగించనున్నారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులను సమీకరించి క్షేత్రస్థాయిలో కార్యక్రమాలు చేపట్టేందుకు బీజేపీ ప్రణాళికలు రూపొందించింది. ఎన్నికలకు ఇంకా రెండేళ్లకు పైగా సమయం ఉన్నా అప్పుడే పార్టీల నడుమ హోరాహోరు పోరు మొదలైంది. ప్రభుత్వ వెయ్యి రోజులపాలన కేంద్రంగా మూడు ప్రధాన పార్టీలు క్షేత్రస్థాయిలో రంగంలోకి దిగడంతో రాజకీయ వాతావరణం గరం అయ్యింది.వెయ్యి రోజుల పండగతో చేరువయ్యేలా..కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన మైలురాయిని అభివృద్ధిమంత్రంతో ప్రజాపాలన విజయోత్సవ ర్యాలీలను చేపట్టింది. జిల్లాకేంద్రంతోపాటు మండలాలు, నియోజకవర్గకేంద్రాల్లో బైక్ ర్యాలీ లు, కార్నర్ మీటింగ్లను నిర్వహిస్తోంది. ఇందుకోసం పార్టీ శ్రేణులు, కార్యకర్తలను సమీకరించి ప్రభుత్వ పథకాల ప్రచారాన్ని ఉధృతం చేసింది. టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్కుమార్గౌ డ్, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు కాటిపల్లి నగేశ్రెడ్డి, ఎమ్మెల్యేలు భూపతిరెడ్డి ఆధ్వర్యంలో ప్రజాపాలన విజయోత్సవ కార్యక్రమాలను చేపట్టారు. ప్రధానంగా ఇందిరమ్మ ఇళ్లు, ఉచిత కరెంట్, ఉచిత బస్సు ప్రయాణం, రైతు భరోసా, రుణమాఫీ తదితర పథకా లను క్షేత్రస్థాయిలో ప్రజలకు తెలిసేలా కార్యక్రమాలను చేపట్టింది. రైతులు, మహిళలు, యు వ త, విద్యార్థులే లక్ష్యంగా ప్రభుత్వ పథకాల ప్రచారానికి క్షేత్రస్థాయిలో నేతలు రంగంలోకి దిగారు. జిల్లాలో పోటాపోటీగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ కార్యక్రమాలు ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనపై పెరిగిన రాజకీయ వేడి ప్రభుత్వం విఫలమైందని నిరసనలతో రోడ్డెక్కిన గులాబీ శ్రేణులు ఫీజు రీయింబర్స్మెంట్, 22ఏ భూములపై బీజేపీ ప్రజాపాలన విజయోత్సవాల్లో కాంగ్రెస్ జోరు క్షేత్రస్థాయిలోకి మూడు పార్టీల నేతలు -
ప్రజావాణి.. మళ్లీమళ్లీ..
● సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్కు వస్తూనే ఉన్న దరఖాస్తుదారులు ● నెలల తరబడి నిరీక్షిస్తున్నా పనులు కాక ఆవేదనసాక్షి ప్రతినిధి, నిజామాబాద్: జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి వస్తున్న ఫిర్యాదుదారుల్లో కొందరు మళ్లీమళ్లీ వస్తూనే ఉన్నా వారి సమస్యలు పరిష్కారా నికి నోచుకోవడం లేదు. తమ సమస్యలను ఉన్నతాధికారులకు నివేదించేందుకు రెండు, మూడు సార్లు ప్రజావాణికి వచ్చినా సమస్యలు పరిష్కారం కావ డం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా భూభారతి కింద భూసమస్యల పరిష్కారం, నిషేధి త భూముల జాబితా నుంచి తొలగింపు, పెన్షన్లు, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు కోసం ఎక్కువ మంది ప్రజావాణికి వస్తున్నారు. కొంతమంది దరఖాస్తుదారులు గతంలో నివేదించిన సమస్యలు పరిష్కారం కాక మళ్లీమళ్లీ వస్తుండటం కనిపించింది. -
చేయూత పెన్షన్ల పెంపుదల ప్రకటన చేయాలి
బోధన్: కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లోనే దివ్యాంగులతో పాటు చేయూత లబ్ధిదారుల నెలసరి పెన్షన్లను పెంచుతూ ప్రకటన చేయాలని దివ్యాంగుల హక్కుల జాతీయ వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడివయ్య డిమాండ్ చేశారు. సోమవారం పట్టణ కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్ లో వేదిక రాష్ట్ర స్థాయి ప్రతినిధుల సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు.అసెంబ్లీలో పెన్షన్ల పెంపుదల ప్రకటన చేయకుంటే జిల్లాలో ఎమ్మెల్యే,మంత్రులను అడ్డుకుంటామని చెప్పారు. కాంగ్రెస్ ప్రజాపాలనలో దివ్యాంగులకు ఒరిగిందేమి లేదని పేర్కొన్నారు. కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తారో తేదీని ప్రకటించాలన్నారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో దివ్యాంగులకు ప్రాతినిధ్యం కల్పించేందుకు అసెంబ్లీలో ప్రత్యేక చట్టం చేయాలని పేర్కొన్నారు. ఖాళీగా ఉన్న దివ్యాంగుల బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ చేసేందుకు ప్రత్యేక నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్తో ఈ నెల 23న రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల ముట్టడి చేపడుతామని వెల్లడించారు. వేదిక రాష్ట్ర, జిల్లా ప్రతినిధులు యేశాల గంగాధర్, బస్వరాజు పాటిల్, ఉపేందర్, బాలేశ్వర్, యశోద, ఆరిఫా, గైని రాములు, నజీర్, సాయమ్మ, గోపాల్, హన్మాండ్లు పాల్గొన్నారు. -
కాంగ్రెస్ ప్రభుత్వానిది నిరంకుశ పాలన
● బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై పోలీసుల దౌర్జన్యం సరికాదు ● నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా నిజామాబాద్ అర్బన్: కాంగ్రెస్ ప్రభుత్వం నిరంకుశ పాలన చేపడుతోందని నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా అన్నారు. శాంతియుతంగా అసెంబ్లీకి వెళ్తున్న బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులపై దౌర్జన్యం చేయడం సరికాదన్నారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ సోమవారం ఆయన పార్టీ శ్రేణులతో కలిసి కలెక్టరేట్ ఎదుట బైఠాయించి కాంగ్రెస్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈసందర్భంగా బిగాల మాట్లాడుతూ.. నరసాపూర్ మాజీ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరు సరైనది కాదన్నారు. మాజీ మంత్రులు కేటీఆర్ హరీష్ రావు, జగదీశ్ రెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలను కిందపడేసి తీవ్రంగా గాయపరచాలని ఆరోపించారు. దాడులకు సీఎం రేవంత్రెడ్డి తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలు నెరవేర్చడం చేతకాకపోతే సీఎం పదవికి రాజీనామా చేయాలన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కలెక్టరేట్ ఎదుట బైఠాయించిన బీఆర్ఎస్ శ్రేణులను అరెస్టు చేసే యత్నం చేయగా, తోపులాట జరిగింది. మాజీ ఎమ్మెల్యేను నిరసన చేస్తున్న స్థలం నుంచి తీసుకువెళ్లారు. కొద్దిసేపటికి బిగాల గణేష్ గుప్తా ప్రజావాణిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని వినతిపత్రం ఇచ్చారు. అనంతరం అక్కడి నుంచి పులాంగ్ చౌరస్తాకు వెళ్లి అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చారు. హామీల అమలుపై ప్రభుత్వం స్పందించకపోవడంతోనే అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశామన్నారు. మాజీ మేయర్ నీతూకిరణ్, ప్రభాకర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. దాడులు చేయడం సిగ్గుచేటు.. డొంకేశ్వర్(ఆర్మూర్): అసెంబ్లీకి వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రభుత్వం అడ్డుకుని వారిపై దాడులు చేయించడం సిగ్గుచేటని పార్టీ నాయకులు అన్నారు. కాంగ్రెస్ హామీల అమలులో విఫలం కావడంతోపాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై దాడులకు నిరసనగా సోమవారం డొంకేశ్వర్లో ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈక్రమంలో సీఎం దిష్టిబొమ్మను బీఆర్ఎస్ నాయకులు దహనం చేయడానికి ప్రయత్నిస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఇరువర్గాల మధ్య తోపులాట జరుగగా బీఆర్ఎస్ శ్రేణులకు చిక్కిన సగం దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయంలో ప్రజావాణిలో అధికారులకు వినతిపత్రం అందజేశారు. -
పులుల సంరక్షణ అందరి బాధ్యత
● ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం కీలకం ● కేటీఆర్ ఫీల్డ్ డైరెక్టర్ శాంతారాం నిర్మల్టౌన్: పులుల సంరక్షణతోపాటు వాటి ఆవాస ప్రాంతాలను కాపాడడం అందరి బాధ్యతని కవ్వాల్ టైగర్ రిజర్వ్ (కేటీఆర్) ఫీల్డ్ డైరెక్టర్ శాంతారాం, బాసర సర్కిల్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అర్పణ అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని సమీకృత భవనంలో సోమవారం అటవీశాఖ ఆధ్వర్యంలో ‘ఫారెస్ట్ ప్రొటెక్షనన్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ టైగర్ ల్యాండ్స్కేప్’ అంశంపై అంతర్ జిల్లా సమన్వయ వర్క్షాప్ నిర్వహించారు. వ్యవసాయ, పశుసంవర్ధక, పంచాయతీరాజ్, డీఆర్డీఏ, విద్యుత్, పోలీస్ తదితర శాఖల జిల్లా, డివిజనల్ స్థాయి అధికారులు హాజరై, పులుల సంరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పులుల సంరక్షణ, అటవీ పరిరక్షణకు అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయం కీలకమన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పులుల సంచారానికి అత్యంత అనుకూలమైన ప్రాంతమని తెలిపారు. ప్రస్తుతం తిప్పేశ్వర్, తడోబా టైగర్ రిజర్వ్ల నుంచి పులులు ఈ ప్రాంతంలోకి వస్తున్నాయన్నారు. అటవీ ప్రాంతాల్లో పులుల సంచారం, వన్యప్రాణుల రక్షణ, మానవ–వన్యప్రాణి సంఘర్షణల నివారణకు అన్ని శాఖల మధ్య సమన్వయం ఎంతో అవసరమన్నారు. డీఎఫ్వోలు సుశాంత్ సుఖదేవ్ బోబ్డే(నిర్మల్), ప్రశాంత్ పాటిల్(నిజామాబాద్), రాహుల్ జాదవ్(మంచిర్యాల), నీరజ్ టెబ్రివాల్ (కామారెడ్డి), రవిప్రసాద్(జగిత్యాల), పీడీ డీఆర్డీఏ విజయలక్ష్మి, డీపీవో శ్రీనివాస్, డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ప్రతినిధి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
అక్షర కాంతులు ప్రసరించాలి
అక్షరాస్యతే అభివృద్ధికి తొలిమెట్టు. చదువుతో సమాజంలో చైతన్యం వస్తుంది. ఆర్థికాభివృద్ధి పెరుగుతుంది. అయితే, జిల్లాలో అక్షరాస్యత అంతంత మాత్రంగానే ఉంది. అక్షరాస్యత పెంపొందించేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నా ఆశించిన ఫలితాలు కానరావడం లేదు. రాష్ట్రంలోనే జిల్లా అక్షరాస్యతలో 11వ స్థానంలో ఉంది. ఇటీవల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్న ‘ఉల్లాస్’తో అక్షరాస్యుల సంఖ్య పెరుగుతోంది. నేడు అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.. ఖలీల్వాడి : జిల్లాలో నిరక్షరాస్యులు 1,32,592 మంది ఉన్నట్లు వయోజన విద్యాశాఖ అధికారు లు చెబుతున్నారు. ఇందులో పురుషులు 33,075 మంది ఉండగా, మహిళలు 99,517 మంది ఉన్నారు. అయితే, 2011 జనాభా లెక్కల ప్రకా రం అక్షరాస్యతలో జిల్లా 11వ స్థానంలో ఉన్నట్లు చెబుతున్నారు. అత్యల్ప అక్షరాస్యత ఉన్న మండలాలుగా ఇందల్వాయి 42.90 శాతం, సిరికొండ 43, మోపాల్ 43.72, రూద్రూర్ 43.88 శాతం ఉన్నాయి. జిల్లాలోని 33 మండలాల్లో 50 శాతం కన్నా ఎక్కువగా అక్షరాస్యులున్నారు. అత్యధికంగా ఉన్న జాబితాలో నిజామాబాద్ నార్త్ 77.33 శాతం, నిజామాబాద్ సౌత్ 79.79, ఆర్మూర్ 69.28, బోధన్ 68.70, నిజామాబాద్ రూరల్ 63.27 శాతం ఉన్నాయి. ఉల్లాస్తో కాస్త మెరుగు.. అక్షరాస్యత పెంపొందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నవ భారత అక్షరాస్యత కార్యక్రమం(ఉల్లాస్) నిర్వహిస్తున్నాయి. గతేడాది నుంచి జిల్లాలో ఈ కార్యక్రమం అమ లవుతోంది. గ్రామాలు, పట్టణాల్లోని మహిళా సంఘాల సభ్యులతో కాలనీలు, వార్డులలో నిరక్షరాస్యులను గుర్తించి వారికి అక్షరాలు నేర్పిస్తున్నారు. అయితే, ఉల్లాస్లో భాగంగా ఇటీవల ఎన్ఐవోఎస్ పరీక్ష నిర్వహించగా మొత్తం 27,050 మంది హాజరుకాగా 22,740 మంది ఉత్తీర్ణులయ్యారు. 4,310 మంది ఫెయిల్ అయ్యారు. రెండో విడతలో భాగంగా ఈ నెల 20న ఎఫ్ఎల్ నెట్ పరీక్షకు 31,702 మంది అభ్యాసకులు హాజరయ్యేలా అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. మొదటి విడత పరీక్షకు హాజరుకాని, హాజరై ఉత్తీర్ణత సాధించని అభ్యాసకులతోపాటు మిగిలిన నిరక్షరాస్యులను పరీక్షకు సిద్ధం చేస్తున్నారు. కాగా, ఉల్లాస్ కార్యక్రమం మరో నాలుగేళ్లపాటు కొనసాగనుంది. అప్పటికై నా వందశాతం అక్షరాస్యత గల జిల్లాగా మారాలని ఆశిద్దాం. జిల్లా అక్షరాస్యత 63.46 శాతం పురుషుల అక్షరాస్యత 74.08శాతం మహిళల అక్షరాస్యత 54.95 శాతం సంపూర్ణ అక్షరాస్యత జిల్లాగా మార్చడమే లక్ష్యం సంపూర్ణ అక్షరాస్యత జిల్లాగా మార్చడమే లక్ష్యంగా చర్యలు చేపడుతున్నాం. ఉల్లాస్లో భాగంగా మ హిళా సంఘ సభ్యుల ద్వారా నిరక్షరాస్యులకు అ క్షరాలు నేర్పిస్తున్నాం. ఈ నెల 20న ఎన్ఐవోఎస్ పరీక్ష జరగనుంది. అక్షరాస్యత పెరిగితే సామాజిక అవగాహన, ఆర్థికాభివృద్ధి, బాల్య వివాహాలు తదితర వాటిని నిర్మూలించవచ్చు. – పురుషోత్తం, డీడీ, వయోజన విద్యాశాఖ జిల్లాలో 64.25 శాతం అక్షరాస్యత రాష్ట్రంలో 11వ స్థానం నిరక్షరాస్యత నిర్మూలనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలు ఆశించినంతరాని ఫలితం నేడు అక్షరాస్యత దినోత్సవం -
‘దళితులకు అన్యాయం చేస్తున్న ప్రభుత్వం’
కామారెడ్డి టౌన్ : కాంగ్రెస్ ప్రభుత్వం దళితులకు తీవ్ర అన్యాయం చేస్తోందని ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ విమర్శించారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. దళితబంధు స్థానంలో తెస్తామన్న అంబేడ్కర్ అభయహస్తం కింద రూ.12 లక్షల ఆర్థిక సాయాన్ని 12 మందికై నా ఇచ్చారా అని ప్రశ్నించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ రూ.12 లక్షలు అందించాలని డిమాండ్ చేస్తూ అక్టోబర్లో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో మహాదీక్ష చేపడతామని తెలిపారు. కార్యక్రమంలో ఎంఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కొల్లూరు వెంకటేశ్, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు కొత్తూరి సాయిలు, నాయకులు దుబ్బాక లక్ష్మీనారాయణ, దామెర రాజేశ్, స్వామి, నారాయణ, రవి తదితరులు పాల్గొన్నారు. -
కలగానే డిగ్రీ కాలేజీ నిర్మాణం
ఇందల్వాయి: మండలంలోని పేద గిరిజన విద్యార్థినులకు సొంత మండలంలో డిగ్రీ చదువు కలగానే మిగిలిపోతోంది. మహిళా డిగ్రీ కళాశాల భవన నిర్మాణం కోసం స్థల సేకరణ పూర్తయినా పనులు ప్రారంభం కాలేదు. గిరిజనుల వినతి మేరకు 2019లో అప్పటి ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ గిరిజన మహిళా డిగ్రీ కాలేజీ ఏర్పాటుకు గన్నారం గ్రామ శివారులో జాతీయ రహదారి పక్కన స్థల సేకరణ చేయించారు. ఆ తరువాత కరోనా పరిస్థితుల కారణంగా కాలేజీ ఏర్పాటు ప్రక్రియ పూర్తిస్థాయిలో ముందుకు సాగలేదు. దీంతో కాలేజీని జిల్లా కేంద్రంలోని నాగారం ప్రాంతానికి తరలించి తరగతులు అక్కడ నిర్వహిస్తున్నారు. భూ నిర్వాసితులకు పరిహారమూ లేదు మహిళా డిగ్రీ కాలేజీ ఏర్పాటు కోసం గన్నారం శివారులోని 1186 సర్వే నంబరులో సుమారు ఏడెకరాల స్థలాన్ని సేకరించి తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ గర్ల్స్ రెసిడెన్షియల్ కాలేజీకి అప్పగించారు. ఏళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు అక్కడ కనీసం ప్రహరీ కట్టడానికి కూడా నిధులు మంజూరు కాలేదు. భూ నిర్వాసితులకు నయా పైసా పరిహారం, పునరావాసం దక్కలేదని కుంట రవీందర్, సాకలి సిద్ధయ్య తెలిపారు. విద్యార్థులకు తప్పని ఇబ్బందులు కాలేజీ నిర్మాణంలో తీవ్ర జాప్యం కారణంగా ఉన్నత చదువుల కోసం గిరిజన బాలికలు పక్క మండలాలకో, జిల్లా కేంద్రానికో వెళ్తూ ఇబ్బందులు పడుతున్నారు. తమ సమయం అంతా ప్రయాణానికి సరిపోతోందని, చదువుకోవడానికి సమయం ఉండటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజా ప్రతినిధులు స్పందించి మహిళా డిగ్రీ కాలేజీ నిర్మాణానికి నిధులు మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలని గిరిజనులు కోరుతున్నారు. వెంటనే భవనాన్ని నిర్మించాలి మండలంలో 10 గిరిజన గ్రామాలు ఉన్నాయి. అందులో వందల మంది గిరిజన బాలికలు ఉన్నత చదువులు చదవాలనుకుంటున్నారు. వారి ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వం సేకరించిన స్థలంలో అధునాతన సౌకర్యాలతో డిగ్రీ కాలేజీ నిర్మాణం చేపట్టాలి. వెంటనే నిధులు విడుదల చేయాలి. – రమావత్ మోహన్నాయక్, గుట్టకింది తండాపరిహారం అందించాలి డిగ్రీ కాలేజీ కోసం మా నాలుగు ఎకరాలతోపాటు మా గ్రామానికి చెందిన సాకలి సిద్ధయ్యకు చెందిన సుమారు ఏడు ఎకరాల వరకు భూమిని సేకరించా రు. మొదట్లో పరిహారం వస్తుందని అధికారులు చె ప్పినా ఇప్పటివరకు అందలేదు. మా బాధలను ప్రభుత్వం అర్థం చేసుకొని తగిన న్యాయం చేయాలి. – కుంట రవీందర్, భూ నిర్వాసితుడు, గన్నారం స్థల సేకరణ పూర్తయి ఆరేళ్లు.. ప్రారంభం కాని పనులు పక్క మండలాలకు వెళ్తున్న ఇందల్వాయి మండల గిరిజన విద్యార్థులు -
ఉదయం 5 గంటల నుంచే రెక్కీ..!
నిజామాబాద్అర్బన్: జిల్లా కేంద్రంలోని మా తా శిశు సంరక్షణ కేంద్రం (ఎంసీహెచ్) నుంచి కిడ్నాప్ అయిన బాలుడు వేదాన్ష్ను పోలీసు లు క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. నిందితులైన మెదక్ జిల్లా నిజాంపేట్కు చెందిన కోతడి సుజాత, కోతడి ఎల్లం దంపతులను పోలీసులు విచారిస్తున్నారు. మేడ్చల్ నుంచి నిజామాబాద్కు శనివారం తెల్లవారుజామునే చేరుకున్న సుజాత, ఎల్లం మాతాశిశు సంరక్షణ కేంద్రంలో 5గంటల నుంచే రెక్కీ నిర్వహించినట్లు తెలుస్తోంది. ఆస్పత్రిలోని అన్ని విభాగాలతోపాటు, అక్క డ రద్దీ, సెక్యూరిటీ, ఒక వేళ పిల్లలను కిడ్నాప్ చేస్తే ఎక్కడి నుంచి ఎలా వెళ్లిపోవాలని పక్కా ప్లా న్ రూపొందించుకుని అక్కడి నుంచి బయటికి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. తిరిగి 10గంటల ప్రాంతంలో ఎంసీహెచ్కు చేరుకున్న దంపతులు ప్రసూతి విభాగం వద్ద అన్నాదమ్ములు వేదాన్ష్, నియాన్ష్ను గమనించి చాక్లెట్ ఆశ చూపారు. మొదట పిల్లలిద్దరూ సదరు మహిళ వెంట వెళ్లినప్పటికీ.. కొద్దిసేపటికే నియాన్ష్ వెనక్కి వచ్చి తన తల్లికి విషయం తెలిపాడు. 5 నిమిషాల్లోనే బాలుడు కనిపించకుండాపోవడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఆస్పత్రి ప్రవేశ మార్గం వద్ద సీసీ కెమెరాలు లేకపోవడంతో బాబుని ఎటు వైపు తీసుకెళ్లారని గుర్తించేందు కు పోలీసులు మొద ట ఇబ్బంది పడ్డారు. అనంతరం చుట్టు పక్కల ప్రాంతాల్లో ఉన్న సీసీ ఫుటేజీలను పరిశీలించగా పులాంగ్ ప్రాంతం వరకు ఆటోలో వెళ్లి అక్కడి నుంచి మరో ఆటోలో డిచ్పల్లి వరకు వెళ్లినట్లు నిర్ధారణకు వచ్చారు. అక్కడి నుంచి బస్సులో మెదక్కు ఆ తరువాత సంగరెడ్డి జిల్లా దౌల్తాబాద్ వెళ్లినట్లు గుర్తించారు. సీసీఎస్, ఒకటో టౌన్ పోలీసులు సంయుక్తంగా గాలింపు చేపట్టారు. కిడ్నాప్ ఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజీలో రికార్డయిన చిత్రాలు మీడియాతోపాటు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దౌల్తాబాద్లో నిందితులను గుర్తించిన ఒకరు పోలీసులకు సమాచారం అందించగా, సంగారెడ్డి పోలీసులతో కలిసి జిల్లా నుంచి వెళ్లిపోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని బాలుడిని క్షేమంగా తీసుకువచ్చారు. పోలీసులు కిడ్నాప్ వెనుక ఇంకా ఎవరు ఉన్నారనే కోణంలో నిందితులను పోలీసులు విచారిస్తున్నారు. బాలుడు వేదాన్ష్ను 5 నిమిషాల్లో కిడ్నాప్ చేసిన దంపతులు సంగారెడ్డి జిల్లా దౌల్తాబాద్లో ఆచూకీ గుర్తింపు క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగింత -
పదేళ్ల నిరుద్యోగాన్ని తరిమికొట్టాం
కమ్మర్పల్లి(భీమ్గల్): రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాదిలోనే పదేళ్ల నిరుద్యోగాన్ని తరిమికొట్టామని డీసీసీ అధ్యక్షుడు కాటిపల్లి నగేష్రెడ్డి అన్నారు. రాష్ట్రంలో వెయ్యి రోజుల పాలన పూర్తయిన సందర్భంగా ప్రజా ప్రభుత్వానికి మద్దతుగా భీమ్గల్లో నిర్వహించిన బైక్ ర్యాలీలో నియోజకవర్గ ఇన్చార్జి ముత్యాల సునీల్కుమార్తో కలిసి నగే ష్రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన సభలో మాట్లాడారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం యువత కోసం ఉద్యోగాలు, స్వయం ఉపాధి, నైపుణ్యాభివృద్ధి, విద్య, క్రీడలు, పారిశ్రామిక అవకాశాలు వంటి రంగాల్లో పలు కార్యక్రమాలు చేపట్టిందన్నారు. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీతో విద్యార్థులకు వృత్తి నైపుణ్యాలను కల్పించినట్లు పేర్కొన్నారు. 2024 డీఎస్సీ ద్వారా 11,062 ఉపాధ్యాయ పోస్టులకు నియామక ప్రక్రియ నిర్వహించామని, అధికారం చేపట్టిన ఏడాదిలోనే 70 వేల ఉద్యోగాలను భర్తీ చేసినట్లు తెలి పారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా మార్చి గ్రూప్ –1, 2, 3 వంటి నియామక పరీక్షలను నిర్వహించే చర్యలు చేపట్టినట్లు వివరించారు. 2026–27 బడ్జెట్లో రాజీవ్ యువ వికాసానికి రూ.5,800 కోట్లు కేటాయించడం జరిగిందన్నారు. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీతో క్రీడలు, మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇచ్చిందన్నారు. ప్రతి రంగంలో యువతకు అవకాశాలు క ల్పిస్తూ యువ తెలంగాణ నిర్మాణానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. మున్సిపల్ చైర్ పర్సన్ బొదిరే నాగమణి, వైస్ చైర్పర్సన్ సంటి లత, ఏఎంసీ చైర్మన్ నర్సయ్య, పార్టీ మండలాధ్యక్షుడు మల్లెల లక్ష్మణ్, నాయకులు బొదిరే స్వామి, కన్నె సురేందర్, నాగేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. యువ తెలంగాణ నిర్మాణానికి ప్రభుత్వం కృషి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీతో వృత్తి నైపుణ్యాలు డీసీసీ అధ్యక్షుడు కాటిపల్లి నగేష్రెడ్డి -
త్రిలింగేశ్వరాలయాన్ని అభివృద్ధి చేస్తాం
● పురావస్తుశాఖ రాష్ట్ర డైరెక్టర్ అర్జున్రావునాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి) : కాకతీయుల కాలంనాటి మహిమాన్విత క్షేత్రమైన త్రిలింగేశ్వరాలయాన్ని అభివృద్ధి చేస్తామని పురావస్తుశాఖ రాష్ట్ర డైరెక్టర్ అర్జున్రావు పేర్కొన్నారు. నాగిరెడ్డిపేట మండలంలోని తాండూర్ సమీపంలో ఉన్న త్రిలింగేశ్వరాలయాన్ని ఆదివారం ఆయన తన బృందంతో సందర్శించారు. ఆలయ పరిసరాలను పరిశీలించడంతో పాటు ఆలయ చరిత్రను స్థానికుల ద్వారా తెలుసు కున్నారు. అనంతరం అర్జున్రావు మాట్లాడుతూ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశాలతోపాటు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు సూచనల మేర కు తాము త్రిలింగేశ్వరాలయాన్ని సందర్శించామన్నారు. ఆలయం వద్ద అభివృద్ధి పనులు చేపట్టేందు కు ప్రభుత్వం నిధులు కేటాయించిందన్నారు. పు రావస్తు శాఖ డీడీ నాగరాజు, ఏడీ మల్లునాయక్, ఆలయ కమిటీ చైర్మన్ కొమ్మ దత్తు, సర్పంచుల ఫో రం మండలాధ్యక్షుడు మురళీమోహన్గౌడ్, సర్పంచ్లు యాదాగౌడ్, వెంకాగౌడ్ తదితరులు ఉన్నారు. -
తప్పిన పెను ప్రమాదం
● విద్యుత్ తీగలకు తగిలిన భారీ వినాయక ప్రతిమ ● విరిగిన విద్యుత్ స్తంభం.. రోడ్డుపై పడిన విద్యుత్ తీగలు ఆర్మూర్టౌన్: ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని కోటార్మూర్ సమీపంలో 63వ నంబర్ జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం పెను ప్రమాదం తప్పింది. కోరుట్ల నుంచి కామారెడ్డికి భారీ వినాయక ప్రతిమను యువకులు ట్రాక్టర్ సహాయంతో తీసుకెళ్తుండగా.. కోటార్మూర్ సమీపంలో 11 కేవీ విద్యుత్ తీగలు తగిలాయి. ప్రతిమ దెబ్బతినగా.. అదే సమయంలో 11 కేవీ విద్యుత్ వైర్లు సైతం తెగి వాహనాలపై పడ్డాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. విద్యుత్ సరఫరా ఉండిఉంటే పదుల సంఖ్యలో ప్రాణాలు పోయేవని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు, విద్యుత్ శాఖ అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని విద్యుత్ తీగలను తొలగించారు. వందలాది వాహనాలు నిలిచిపోయాయి. ఎస్హెచ్వో సత్యనారాయణగౌడ్ సిబ్బందితో కలిసి ట్రాఫిక్ను క్లియర్ చేశారు. -
ఖరీఫ్సాగు
అత్యధికంగా 4.36 లక్షల ఎకరాల్లో వరినాట్లు ● కొంత మేర పెరిగిన పత్తి, పప్పుదినుసుల సాగు విస్తీర్ణం ● సరైన సమయానికి వర్షాలు కురవడంతో పంటలకు ఊపిరిడొంకేశ్వర్(ఆర్మూర్): ఎల్నినోకు ఎదురెళ్లి మరీ రైతులు ఖరీఫ్ పంటల సాగును ప్రారంభించగా.. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఆగస్టు నెలలో వానలు కురిపించి పంటలకు ప్రాణం పోసిన వరుణుడు.. సాగును ముందుకు నడిపించాడు. దీంతో వ్యవసాయ శాఖ అంచనాకు మించి జిల్లాలో పంట లు సాగవుతున్నాయి. 5.24లక్షల ఎకరాల్లో ఆయా పంటలు (ఉద్యాన పంటలు కాకుండా) సాగవుతా యని అంచనా కాగా, 5.28 లక్షల ఎకరాల్లో సాగవుతుండడం గమనార్హం. అయితే వర్షాకాలం తొలినాళ్లలో చినుకుల జాడ లేకపోవడంతో పంటలు సాగు చేయడానికి రైతులు సంకోచించారు. జూలై మొదటి వారం వరకు 2లక్షల ఎకరాల్లోనే వరినాట్లు పడ్డా యి. జూలై చివరి రెండు రోజులతోపాటు ఆగస్టు మొదటి వారంలో పడిన వర్షాలతో వరినాట్లు ఊపందుకుని 25 రోజుల్లోనే వరి సాగు రెండింతలు పెరిగింది. అంచనాకు మించి 4.36లక్షల ఎకరాలు దాటగా, ప్రస్తుతం పొట్టదశలో ఉంది. భూగర్భ జ లాలు పెరగడం, ప్రాజెక్టుల్లో నీరు ఉండడంతో వరి పంటకూడా బయటపడినట్లేనని రైతులు అంటున్నారు. ఇటు ఆరుతడి పంటలైన పత్తి, పప్పుదిను సుల సాగు కొంత మేర పెరిగింది. ఖరీ ఫ్లో సాగవుతున్న పంటల వివరాలను వ్యవసాయాధికారు లు ఆన్లైన్లో న మోదు చేస్తున్నారు. పంట ఎకరాలు వరి 4,36,000మొక్కజొన్న 54,255సోయాబీన్ 35,203పత్తి 1,060కంది 986పెసర 160మినుము 191చెరుకు 130జిల్లాలో ప్రధాన పంటల సాగు ఇలా.. మొక్కజొన్న, సోయా జోరు జిల్లా రైతులు వరి తర్వాత మొక్కజొన్న, సోయాబీన్ పంటల ను అధికంగా సాగు చేస్తున్నారు. అప్పుడప్పుడు కురిసిన వర్షాలతో పాటు వాతావరణం కలిసి రావడంతో ఈ రెండు పంట లు ఎలాంటి ఆటంకాలు లేకుండా సమృద్ధిగా సాగుతున్నా యి. అంచనాకు మించి జిల్లాలో సాగవుతున్నాయి. మొక్కజొ న్న పంట పలు ప్రాంతాల్లో చేతికి వచ్చింది. త్వరలో కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి. సోయా ఆశించిన దానికన్నా ఎక్కువ కాత రావడంతో దిగుబడి పెరిగే అవకాశం ఉందని రైతులు అంటున్నారు. మార్కెట్లో మంచి రేటు దక్కేలా చూడాలని అధికారులను కోరుతున్నారు. -
రాష్ట్రంలో పాలన కుప్పకూలింది
నిజామాబాద్అర్బన్: రాష్ట్రంలో పాలన కుప్పకూలిందని నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా అన్నారు. ఎన్నికల సమయంలో ఆటో కార్మికులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నగరంలో ఆదివారం ర్యాలీ నిర్వహించారు. ఆటో కార్మికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బిగాల మాట్లాడుతూ.. కాంగ్రెస్ మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చి ఇప్పుడు ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాల కారణంగా ఆటో కార్మికులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ నిరంతరం పోరాటం చేస్తుందన్నారు. మాజీ మేయర్ నీతూకిరణ్, నుడా మాజీ చైర్మన్ ప్రభాకర్రెడ్డి, సుజిత్సింగ్, తదితరులు పాల్గొన్నారు. ట్రెసా రాష్ట్ర కార్యదర్శిగా రమణ్రెడ్డి నిజామాబాద్అర్బన్: తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీ సెస్ అసోసియేషన్ (ట్రెసా) రాష్ట్ర కార్యదర్శిగా జిల్లాకు చెందిన రమణ్రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. హైదరాబాద్లో ఆదివారం ఎన్నికలు నిర్వహించారు. జిల్లా ట్రెసా అధ్యక్షుడిగా పని చేసిన రమణ్రెడ్డి గత కొంత కాలంగా మంత్రులు, ఉన్నతాధికారులను కలుస్తూ రెవె న్యూ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కో సం కృషి చేస్తున్నారు. రమణ్రెడ్డి రాష్ట్ర స్థాయి బాధ్యతలు చేపట్టనుండడంతో జిల్లా రెవెన్యూ ఉద్యోగులు సంఘం నాయకులు ప్రశాంత్, శ్రీనివాస్రావు, బాలరాజు తదితరులు హర్షం వ్యక్తం చేశారు. దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించాలి వేల్పూర్(బాల్కొండ): ఓటరు జాబితా ప్ర త్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) ప్రక్రియను బాల్కొండ మండల కేంద్రంలో ఆదివారం అడిషనల్ కలెక్టర్ భుజంగరావు పరిశీలించా రు. పోలింగ్ కేంద్రాల వారీగా ఓటర్ల నమో దు, సవరణకు సంబంధించిన వివరాలను బీఎల్వోల ద్వారా తెలుసుకున్నారు. ఫామ్ – 6,7,8 దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. ఓటర్ల జాబితా సవరణను పొరపాట్లకు తావులేకుండా పారదర్శకంగా నిర్వహించాలని పేర్కొన్నారు. ఆ యన వెంట ఆర్.ఐ. గంగాధర్, జూనియర్ అసిస్టెంట్ సాయి ఉన్నారు. మైనారిటీ గురుకులం తనిఖీ బాల్కొండలోని మైనారిటీ గురుకులాన్ని అదనపు కలెక్టర్ భుజంగరావు తనిఖీ చేశా రు. భోజనం నాణ్యతపై విద్యార్థులను అడి గి తెలుసుకున్నారు. ప్రతి విద్యార్థికి యూని ఫామ్ను సకాలంలో అందించాలని వార్డెన్ భాగ్యలక్ష్మికి సూచించారు. అనంతరం గ్రంథాలయాన్ని పరిశీలించారు. -
ఇసుక మాఫియా బరితెగింపు
● అధికారుల హెచ్చరికలు బేఖాతరు ● అక్రమ రవాణాను అడ్డుకున్న సిబ్బందితో వాగ్వాదంబోధన్: సాలూర మండలంలోని తగ్గేల్లి గ్రామ శివారులోని మంజీర తీరంలో ఇసుక మాపియా ఆగడాలు మితిమీరిపోయాయి. నిబంధనలు, అధికారుల హెచ్చరికలను ఖాతరు చేయడం లేదు. గ్రామ అంచున ఉన్న మంజీర నది నుంచి ఇష్టారీతిన ఇసుకను తరలిస్తున్నారు. అక్రమ రవాణాను అడ్డుకునే అధికారులతో వాగ్వాదానికి దిగుతున్నారు. సాలూర మండలం తగ్గేల్లి గ్రామ శివారులో డంప్ చేసిన ఇసుకను ట్రాక్టర్ డోజర్తో బొలేరోలో లోడ్ చేస్తుండగా విశ్వసనీయ సమాచారం మేరకు శనివారం రాత్రి తహసీల్దార్ అజ్మత్ నవాజ్ సిబ్బందిని ఆదేశించారు. ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్స్, ఒక వీఆర్ఏ ఘటన స్థలానికి వెళ్లి, వాహనాలను పట్టుకున్నారు. దీంతో పదుల సంఖ్యలో ఇసుక వ్యాపారులు అక్కడి వచ్చి ఎంఆర్ఐతో వాగ్వాదానికి దిగి నట్టు సమాచారం. పట్టుకున్న బొలేరో, డోజర్ను ఎంఆర్ఐ కారును ఓవర్ టేక్ చేసి తీసుకువెళ్తుండగా పోలీసు కానిస్టేబుల్స్ వెంబడించి పట్టుకున్నట్టు తెలిసింది. వాటిని తహసీల్దార్ ఆఫీస్కు తరలించారు. ఈ ఘటనపై ఎంఆర్ఐ శంకర్ను ‘సాక్షి’ ఫోన్లో వివరణ కోరగా పదుల సంఖ్యలో ఇసుక వ్యాపారులు వచ్చి రెండు గంటల పాటు ఇబ్బందులకు గురి చేశారని తెలిపారు. తహసీల్దార్కు రిపోర్టు చేశానని వివరించారు. -
కిడ్నాప్ కేస్.. బాలుడు సేఫ్
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: చాక్లెట్ కొనిస్తానని ఆశచూపి మూడేళ్ల బాలుడిని ఓ మహిళ శనివారం కిడ్నాప్ చేసిన కేసును పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. నిందితులైన భార్యాభర్తలను అదుపులోకి తీసుకుని బాలుడిని తల్లిదండ్రులకు క్షేమంగా అప్పగించారు. వివరాలను జిల్లా కేంద్రంలోని వన్టౌన్ పోలీస్స్టేషన్లో సీపీ సాయి చైతన్య వెల్లడించారు. బాలుడి ఆచూకీపై ఆదివారం ఉదయం సమాచారం రావడంతో సంగారెడ్డి జిల్లా దౌల్తాబాద్లో నిందితుల ఉనికిని గుర్తించామన్నారు. సంగారెడ్డి జిల్లా నిజాంపేట్కు చెందిన కోతాడి సుజాత, ఎల్లం దంపతులను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా ఫొటోలను మీడియా విస్తృతంగా ప్రచారం చేయడంతో గంటల వ్యవధిలోనే బాలుడి ఆచూకీ లభ్యమైందన్నారు. కేసు దర్యాప్తులో కీలకంగా పనిచేసిన సీసీఎస్ ఏసీపీ శ్రీశైలం, సీఐ రఘుపతి, సాంకేతిక సిబ్బందిని అభినందించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి బాల్కొండ మండలం నాగేపూర్కు చెందిన సంధ్య, నరేశ్ దంపతులు మూడో కాన్పు కోసం వచ్చారు. వీరి చిన్న కుమారుడు వేదాన్ష్ ను చాక్లెట్ ఆశ చూపుతూ మహిళ బయటకు తీసుకెళ్లడం సీసీ కెమెరాల్లో రికార్డయింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు నిందితుల ఫొటోలను మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేశారు. సంగారెడ్డి జిల్లా దౌల్తాబాద్లో వీరి ఉనికిని గమనించిన ఒకరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఫలితంగా 24 గంటల్లోనే బాలుడిని తల్లిదండ్రులకు క్షేమంగా అప్పగించారు. -
చాక్లెట్ ఆశచూపి బాలుడి కిడ్నాప్
నిజామాబాద్ అర్బన్: చాక్లెట్ కొనిస్తానని చెప్పి మూడేళ్ల బాలుడిని కిడ్నాప్ చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి మాతాశిశు సంరక్షణ కేంద్రంలో శనివారం ఉదయం 10 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బాల్కొండ మండలం నాగేపూర్ గ్రామానికి చెందిన సంధ్య, నరేశ్ దంపతులకు ఇద్దరు కుమారులు. సంధ్య మూడో కాన్పు కోసం ఈనెల 2న నిజామాబాద్లోని జీజీహెచ్లో చేరింది. శనివారం ఉదయం నరేశ్ ప్రసూతి విభాగం ముందు టీ తాగి, ఇద్దరు పిల్లలను అక్కడే ఉండమని చెప్పి ఖాళీ గ్లాసులను చెత్తకుండీలో వేసేందుకు వెళ్లాడు. అంతలోనే ఓ మహిళ పిల్లల వద్దకు వచ్చి చాక్లెట్ కొనిస్తానని చెప్పి వారిని తీసుకువెళ్లింది.మూడేళ్ల వేదాన్ష్ ఆమె వెంట వెళ్లగా.. అతడి అన్న ఐదేళ్ల నియాన్ష్ తల్లి వద్దకు వెళ్లి విషయం చెప్పాడు. అక్కడికి వచ్చిన నరేశ్ కంగారుగా ఆస్పత్రి అంతా వెతికినా ఆచూకీ లభించకపోవడంతో ఒకటో టౌన్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఎస్హెచ్వో రఘుపతి ఆస్పత్రికి వచ్చి సీసీ ఫుటేజీలను పరిశీలించారు. అపరిచిత మహిళతో పాటు మరో మగ వ్యక్తి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పది ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. -
దివ్యాంగుల సంక్షేమాన్ని విస్మరిస్తున్న కేంద్రం
● సీపీఎం కేంద్ర కమిటీ సభ్యురాలు టీ జ్యోతి విమర్శ ● బోధన్లో ప్రారంభమైన దివ్యాంగుల రాష్ట్రస్థాయి తరగతులు బోధన్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమాన్ని విస్మరిస్తోందని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యురాలు టి జ్యోతి విమర్శించారు. ప్రజలు పోరా డి సాధించుకున్న చట్టాలను పెట్టుబడిదారుల ప్ర యోజనాలకు అనుకూలంగా మారుస్తున్నారని వి మర్శించారు. మూడు రోజులపాటు నిర్వహిస్తున్న దివ్యాంగుల హక్కుల జాతీయ వేదిక రాష్ట్ర స్థాయి విద్యా వైజ్ఞానిక శిక్షణ తరగతులు పట్టణంలోని ఆచన్పల్లి ప్రాంతంలో ఉన్న ఓ ఫంక్షన్లో శనివారం ప్రారంభమయ్యాయి. కార్యక్రమానికి ముఖ్య అథి తిగా హాజరైన జ్యోతి మాట్లాడుతూ.. పేదల ఆదాయాన్ని పెంచుకుండా నరేంద్రమోదీ ప్రభుత్వం పెట్టుబడిదారుల ఆదాయాన్ని పెంచుతోందని ఆరోపించారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హా మీ ఇచ్చిన మోదీ ప్రభుత్వం.. కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఖాళీ ఉద్యోగాలను ఎందుకు భర్తీ చేయడం లే దని ప్రశ్నించారు. సెప్టెంబర్ 17 తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారసత్వాన్ని గుర్తు చేసుకునే రోజని, ఈ చారిత్రాత్మక పోరాటాన్ని బీజేపీ హిందూ, ముస్లిముల మధ్య పోరాటంగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటానికి సిద్ధం కావాలని ప్రజలను కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజు లు పూర్తవుతున్నా దివ్యాంగులకు ఇచ్చిన నాలుగు హామీల్లో ఏ ఒక్క హామీ అమలు చేయలేదని ది వ్యాంగుల హక్కుల జాతీయ వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడివయ్య అన్నారు. పింఛన్ పెంచుతా రని వెయ్యి రోజులుగా దివ్యాంగులు ఎదురు చూస్తున్నారన్నారు. విద్య, ఉద్యోగాల్లో దివ్యాంగులకు రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. వేదిక కేంద్ర కమిటీ సభ్యుడు జే రాజు, జిల్లా గౌరవ అధ్యక్షుడు రమేశ్బాబు, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గైని రాములు, యేశాల గంగాధర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కవిత, ప్రతినిధులు నజీర్, ఉపేందర్, బాలేశ్వర్, ఆ రీఫా, బస్వరాజు, రాధమ్మ, భుజంగారెడ్డి, భాగ్యలక్ష్మి, బంగారయ్య, చెన్నయ్య, సంగప్ప పాల్గొన్నారు. -
అక్రమంగా తరలిస్తున్న కలప పట్టివేత
● ముగ్గురు నిందితులపై కేసు నమోదునిజామాబాద్ రూరల్: మండలంలోని గుండారం చౌరస్తా ప్రాంతంలో అక్రమంగా తరలిస్తున్న టేకు కలపను టాస్క్ఫోర్స్ అధికారులు పట్టుకున్నట్లు జిల్లా అటవీశాఖ అధికారి ప్రశాంత్ బాజీరావు పాటిల్, నార్త్ అటవీ రేంజ్ అధికారి సంజయ్ గౌడ్ తెలిపారు. స్వాధీనం చేసుకున్న టేకు కలప విలువ రూ.73,210 గా నిర్ధారించారు. అక్రమ రవాణాకు ఉపయోగించిన ఆటోను స్వాధీనం చేసుకొని, జిల్లాకు చెందిన అబ్రహర్ అలీఖాన్, మహ్మద్ ముక్తర్, సద్దాం షేక్లపై కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. అటవీ సంపదను అక్రమంగా రవాణా చేయడం, నిల్వ చేయడం, విక్రయించడం చట్టరీత్యా నేరమని తెలిపారు. అటవీ సంపద పరిరక్షణకు ప్రజలు సహకరించాలని కోరారు. మంచిప్పలో.. మోపాల్: మండలంలోని మంచిప్ప అటవీ ప్రాంతంలో కలప దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు సెక్షన్ ఆఫీసర్ సాయికుమార్ తెలిపారు. శనివారం అటవీ ప్రాంతంలో చెట్లను నరికేస్తున్న సమాచారం అటవీ అధికారులకు అందింది. అధికారులు ఆ ప్రాంతానికి చేరుకున్న విషయం తెలుసుకున్న దుండగులు ఆటో, 12 కలప దుంగలను వదిలేసి పారిపోయారు. సెక్షన్ ఆఫీసర్ సాయికుమార్, బీట్ ఆఫీ సర్ సురేశ్ కుమార్ వాటిని స్వాధీనం చేసుకొని సౌ త్ రేంజ్ ఎఫ్ఆర్వో కార్యాలయానికి తరలించారు. చెట్లను నరికిన ఒకరిపై కేసు ఇందల్వాయి: ఇందల్వాయి ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని మెఘ్యానాయక్ తండాను ఆనుకొని ఉన్న రిజర్వ్ ఫారెస్ట్లో చెట్లను నరికిన గన్నారం గ్రామానికి చెందిన కుంట లక్పతి రెడ్డిపై శనివారం కేసు నమోదు చేసినట్లు ఎఫ్ఆర్వో రవి మోహన్ భట్ తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు శివాలయం వద్ద ఉన్న లక్పతి ఇంటికి వెళ్లి తనిఖీ చేయగా ఐదు టేకు, మూడు చీనంగా దుంగలను స్వాధీనం చేసుకొని రేంజ్ కార్యాలయానికి తరలించినట్లు తెలిపారు. సెక్షన్ అధికారి ప్రభాకర్, బీట్ అధికారి నగేశ్ను ఎఫ్ఆర్వో అభినందించారు. 18 వేల జరిమానా మాక్లూర్: మండలంలోని అడివి మామిడిపల్లి శివారులో అనుమతి లేకుండా చెట్టును నరికిన అదే గ్రా మానికి చెందిన బొనేకర్ శ్రీనివాస్కు రూ. 18 వేల జరిమానా విధించినట్టు ఆర్మూర్ ఫారెస్టు రేంజ్ అధికారి అరుణ్కుమార్ శనివారం తెలిపారు. అను మతి లేకుండా చెట్లను నరికితే చట్టపరమైన చర్యలతోపాటు జరిమానా విధిస్తామని హెచ్చరించారు. భీమ్గల్లో రూ.21 వేలు.. కమ్మర్పల్లి: భీమ్గల్ మండలం పురానీపేట్లో అనుమతి లేకుండా టేకు చెట్లను నరికిన నవీన్కుమార్ అనే వ్యక్తికి రూ. 21 వేలు జరిమానా విధించినట్లు కమ్మర్పల్లి ఎఫ్ఆర్వో కె. అనిత శనివారం తెలిపారు. సొంత స్థలమైనా, పబ్లిక్ స్థలాల్లోనైనా అనుమతి లేకుండా చెట్లను నరికితే కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. -
యోగా గురువును సన్మానించిన కేంద్రమంత్రి
రుద్రూర్ : గురు పూజోత్సవం సందర్భంగా రుద్రూర్ మండల కేంద్రానికి చెందిన ప్రముఖ యోగా గురువు డాక్టర్ విశ్వనాథ్ మహజన్ను కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్రెడ్డి సన్మానించారు. శనివారం సికింద్రాబాద్ కవాడీగూడలోని సీజీవో టవర్స్లో కార్యక్రమం నిర్వహించారు. 2026లో యోగా శిక్షణ, యోగా రంగంలో విశిష్ట సేవలు అందించినందుకు విశ్వనాథ్ మహజన్ను సన్మానించారు. తెలంగాణలో యోగా సర్టిఫికేషన్ బోర్డు ద్వారా శిక్షణ కార్యక్రమాలను నిర్వహించడంతోపాటు అసిస్టెంట్ యోగా టీచర్లు, విద్యార్థులకు శిక్షణ అందించి ఉపాధి అవకాశాలు కల్పించడంలో విశ్వనాథ్ కీలకపాత్ర పోషించారు. పెండింగ్ కేసులపై దృష్టి సారించాలి ● ఎస్పీ రాజేశ్చంద్రదోమకొండ: పెండింగ్ కేసులపై దృష్టి పెట్టాలని, శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులు కృషి చేయాలని ఎస్పీ రాజేశ్ చంద్ర అన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా శనివారం దోమకొండ పీఎస్ను తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. రికార్డులను నిబంధనల ప్రకారం సక్రమంగా నిర్వహించాలన్నారు. పోలీస్ శాఖలో సీసీటీఎన్సీ అప్లికేషన్ ప్రాధాన్యతను ఎస్పీ వివరించారు. పోలీస్ స్టేషన్న్లో నమోదయ్యే కేసులు, దర్యాప్తు పురోగతి, అరెస్టులు, చార్జ్షీట్లు, ప్రాపర్టీ, ఇతర సంబంధిత వివరాలను సీసీటీఎన్సీలో ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయాలని సూచించారు. డేటాఎంట్రీ, అప్డేటింగ్లో ఎలాంటి జాప్యం లేకుండా చూసుకోవాలని ఆదేశించారు. పెట్రోలింగ్, బీట్ వ్యవస్థ బలోపేతం చేయాలన్నారు. ముఖ్యమైన ప్రాంతాల్లో సీసీ కెమెరాల కవరేజ్పై నిరంతర పర్యవేక్షణ ఉండాలని తెలిపారు. గతంలో ప్రాపర్టీ నేరాలకు పాల్పడిన వ్యక్తుల కదలికలపై నిఘా ఉంచాలని ఆదేశించారు. అనంతరం పీఎస్లోని వివిధ విభాగాలు, పరిసర ప్రాంతాలను పరిశీలించి స్టేషన్ నిర్వహణ, పరిశుభ్రత, సిబ్బంది విధుల నిర్వహణపై తగు సూచనలు చేశారు. కామారెడ్డి డీఎస్పీ మధుసూదన్, భిక్కనూరు సీఐ నరేశ్, దోమకొండ ఎస్సై ప్రభాకర్ పాల్గొన్నారు. మొరం తరలింపుపై ఆగ్రహం రామారెడ్డి: ఇసన్నపల్లి గ్రామంలో గంగమ్మ వాగు బ్రిడ్జి పనుల కోసమంటూ మొరాన్ని అక్రమంగా ప్రైవేటు వెంచర్లకు తరలించడంపై శని వారం గ్రామస్తులు అడ్డుకున్నారు. ఇందిరమ్మ ఇళ్లు, సొంతంగా నిర్మించుకునే ఇళ్లకు మొరం అనుమతి ఇవ్వని రెవెన్యూ, పోలీస్ అధికారు లు అక్రమంగా వెంచర్ లోకి తరలిస్తుంటే ఏం చేస్తున్నారని ఇసన్నపల్లి గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. రామారెడ్డి తహసీల్దార్ను ‘సాక్షి’ ఫోనులో వివరణ కోరగా స్పందించలేదు. మద్నూర్ (జుక్కల్): మద్నూర్ మాజీ ఎంపీపీ ప్రజ్ఞకుమార్(మిలన్) (52) శనివారం చికిత్స పొందుతూ హైదరాబాద్లోని ఓ ఆస్పత్రిలో మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రజ్ఞకుమార్కు నాలుగు రోజుల క్రితం బీపీ ఎక్కువ కావడంతో తీవ్ర అస్వస్థతకు గురికావడంతో వైద్యం కోసం హైదరాబాద్కు తరలించారు. నాలుగు రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం సాయంత్రం మృతి చెందినట్లు తెలిపారు. ప్రజ్ఞకుమార్కు భార్య అరుణ, కొడుకు, కూతురు ఉన్నారు. -
ఉపాధ్యాయ దినోత్సవం రోజే గురువు ఆత్మహత్య
● అనారోగ్య సమస్యలతో బలవన్మరణం భిక్కనూరు: ఉపాధ్యాయ దినోత్సవం రోజే ఉపాధ్యాయుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కామారెడ్డి పట్టణంలో చోటు చేసుకుంది. పట్టణంలోని కల్కినగర్కు చెందిన లింబాద్రి(51) భిక్కనూరు మండలం జంగంపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడుగా పని చేస్తున్నాడు. 30 యేళ్లుగా ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్నాడు. 2018 నుంచి జంగంపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఇన్చార్జి హెచ్ఎంగా పలుమార్లు పనిచేశాడు. రెండేళ్ల క్రితం ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు అందుకున్న లింబాద్రి కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. శనివారం వేకువజామున అనారోగ్య సమస్య తట్టుకోలేక ఇంట్లోనే ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న తోటి ఉపాధ్యాయులు, విద్యార్థులు కంటతడిపెట్టారు. లింబాద్రికి భార్య పద్మ, ఇద్దరు కుమారులు ఉన్నారు. -
కాంరగ్రెస్ యూత్ డిక్లరేషన్ డ్రామా
● మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి నందిపేట్(ఆర్మూర్): యూత్ డిక్లరేషన్ పేరుతో ఎన్నికలకు ముందు ఓట్ల కోసం కాంగ్రెస్ ఆడిన అతి పెద్ద డ్రామా అని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి అన్నారు. శనివారం నందిపేట మండల కేంద్రంలో ఫీజు రీయింబర్స్మెంట్, జాబ్ క్యాలెండర్, యూత్ డిక్లరేషన్ కోసం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులతో వివేకానంద చౌరస్తా నుంచి నంది విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం చేపట్టిన ధర్నాలో జీవన్రెడ్డి మాట్లాడుతూ సీఎం రేవంత్రెడ్డి యువత, నిరుద్యోగులు, విద్యార్థుల కడుపు కొట్టారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ వెయ్యి రోజుల చీటింగ్పై యువత ఫైటింగ్ చేసేందుకు సిద్ధమవుతున్నారన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ రూ.10వేల కోట్ల బకాయిలు ఉన్నాయని ఆరోపించారు. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని కాంగ్రెస్ వంచించిందన్నారు. ఉద్యోగాలిచ్చిన ఘనత కేసీఆర్ది అని కొనియాడారు. కాగా, బీఆర్ఎస్ చేపట్టిన ర్యాలీలో పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు పాల్గొనకుండా పోలీసులు కళాశాల గేట్కు తాళాలు వేయడంపై జీవన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులతో వాగ్వాదానికి దిగి గేట్ను తెరిపించి విద్యార్థులతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. కార్యక్రమంలో జెడ్పీ మాజీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు, సీనియర్ నాయకులు రాజారాం యాదవ్, యువజన విభాగం నాయకులు అభిలాష్, మచ్చర్ల సాగర్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు. -
హామీల అమలులో కాంగ్రెస్ విఫలం
● ప్రభుత్వ మెడలు వంచైనా హామీలు అమలు చేయిస్తాం ● కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ కామారెడ్డి క్రైం: కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో విద్యార్థులు, యువతకు ఇచ్చిన హామీ లను అమలు చేయకుండా మోసం చేస్తోందని కా మారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ధ్వజమెత్తారు. ప్రభుత్వ మెడలు వంచైనా విద్యార్థుల, నిరుద్యోగుల సమస్యల పరిష్కారం జరిగేలా పోరాటం చేస్తామన్నారు. కాంగ్రెస్ మోసాలపై బీఆర్ఎస్ పోరుబాటలో భాగంగా శనివారం పార్టీ యువజన, విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానం నుంచి భారీ ర్యాలీ, నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ మాట్లాడుతూ.. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నేడు హామీల అమలులో ఘోరంగా విఫలమైందని విమర్శించారు. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ 11 వేల కోట్లు, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గంప శశాంక్, పార్టీ జిల్లా అధ్యక్షుడు ముజీబొద్దీన్, మున్సిపల్ వైస్ చైర్మన్ కాసర్ల గోదావరి, సీనియర్ నాయకులు ప్రభాకర్ రెడ్డి, ప్రభాకర్ యాదవ్, రవి యాదవ్, సంగి మోహన్, లక్ష్మీనారాయణ, బల్వంత్ రావు, బీఆర్ఎస్ నియోజకవర్గ విద్యార్థి, యువజన విభాగం అధ్యక్షుడు భాను ప్రసాద్, ప్రతినిధులు మాజీద్, అనిల్ రెడ్డి, రంజిత్ వర్మ పాల్గొన్నారు. -
కాంగ్రెస్ మెడలు వంచే వరకు పోరాటం
● ‘చలో ఇందిరాపార్క్’ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించిన ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణసుభాష్నగర్: రాష్ట్రంలోని రైతులు, అమాయకుల భూములను రాష్ట్ర ప్రభుత్వం 22(ఏ) నిషేధిత జా బితాలో చేర్చి ఇబ్బందులకు గురి చేయడం సిగ్గు చేటని, కాంగ్రెస్ మెడలు వంచే వరకూ తమ పోరాటం కొనసాగుతుందని నిజామాబాద్ అర్బన్ ఎమ్మె ల్యే ధన్పాల్ సూర్యనారాయణ పేర్కొన్నారు. బీజే పీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి నేతృత్వంలో హైదరాబాద్లో ని ఇందిరాపార్క్ వద్ద చేపట్టిన దీక్షకు జిల్లా నుంచి భారీగా తరలివెళ్లారు. ఇందల్వాయి టోల్గేట్ వద్ద దీక్షకు తరలివెళ్లే వాహనాలను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అమాయక ప్రజల భూములతో చెలగాటం ఆడుతున్న ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెప్తారన్నా రు. ప్రభుత్వ భూములను కాపాడాలని 22 ఏ చ ట్టం చెబితే... ప్రభుత్వం మాత్రం రైతుల భూము లను నిషేధిత జాబితాలో చేర్చి ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు. జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ పటేల్ కులాచారి, నాయకులు నాగోళ్ల లక్ష్మీనారాయణ, వె ల్మ గంగారెడ్డి, పద్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కేబుల్ వైర్ల దొంగల ముఠా అరెస్టు
భిక్కనూరు: వ్యవసాయ పొలాల్లోని బోరు మోటర్ కేబుల్ వైర్లను దొంగిలిస్తున్న నలుగురు ముఠా సభ్యులను శనివారం భిక్కనూరు పోలీసులు అరెస్టు చేశారు. సీసీ కెమెరాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్హెచ్వో ఎస్.అనిల్ వెల్లడించారు. అంతంపల్లి గ్రామానికి చెందిన రైతు జీడి భీమయ్య పొలంలోని గదికి ఉన్న తాళాన్ని పగులగొట్టిన దుండగులు బోరు మోటర్ స్టార్టర్, కేబుల్ వైర్లను అపహరించారు. చుట్టుపక్కల పొలాల్లోనూ కేబుల్ వైర్లు చోరీకి గురైనట్లు గుర్తించిన బాధిత రైతు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఎస్పీ రాజేశ్ చంద్ర ఆదేశాల మేరకు కామారెడ్డి డీఎస్పీ పర్యవేక్షణలో, భిక్కనూర్ సీఐ నరేశ్ ఆధ్వర్యంలో దర్యాప్తు ప్రారంభించారు. భిక్కనూరు బస్టాండ్ వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న నలుగురిని శనివారం పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా కేబుల్ వైర్ల చోరీకి పాల్పడినట్లు ఒప్పుకున్నారన్నారు. నిందితులను బోరెడ్డి నరేందర్ రెడ్డి (లింగాయపల్లి), మోహన్(కామారెడ్డి) అలియాస్ బైరాం మోహన్ అలియాస్ రాజు, అండాసి శ్రీకాంత్ (కామారెడ్డి), బంటు రామ్ చరణ్ (చిన్నమల్లారెడ్డి)గా గుర్తించారు. అయితే, వీరంతా కల్లు కాంపౌండ్లో ఒకరికొకరు పరిచమై, డబ్బుల కోసం వైర్ల చోరీకి పాల్పడుతున్నట్లు ఎస్హెచ్వో తెలిపారు. రాత్రివేళ బోరు మోటర్ కేబుల్ వైర్లను కట్ చేసి, వాటిని కాల్చి రాగి తీగలను వేరు చేసి స్క్రాప్ షాపుల్లో విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల నుంచి రాగి తీగలు, కేబుల్ కట్టర్లు, ఇనుప రాడ్ సహా పలు వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. కేసును ఛేదించిన సీసీఎస్ కామారెడ్డి, భిక్కనూరు పోలీసు సిబ్బందిని ఎస్పీ రాజేశ్ చంద్ర అభినందించారు. -
రెండు నిమిషాల్లో 460 బస్తాల యూరియా బుకింగ్
● సొసైటీ వద్ద రైతుల ఆందోళనడిచ్పల్లి: ఆన్లైన్లో స్టాక్ పెట్టిన రెండు నిమిషాల్లోనే 460 బస్తాల యూరియా బుకింగ్ పూర్తికావడం, గంట నుంచి అక్కడే ఉన్న వారికి ఒక్క బస్తా యూరియా దక్కకపోవడంతో రైతులు ఆందోళనకు దిగారు. డిచ్పల్లి మండలం మెంట్రాజ్పల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (సొసైటీ)కి శనివారం 460 యూరియా బస్తాలు వచ్చాయి. సొసైటీ చైర్మన్ బోధునపు నవీన్, సిబ్బంది ఈ విషయాన్ని రైతులకు సంబంధించిన వాట్సాప్ గ్రూపులలో పె ట్టి ఉదయం 10 గంటలకు బుకింగ్ యాప్లో స్టాక్ అందుబాటులో ఉంటుందని, రైతులు బుక్ చేసుకోవాలని సూచించారు. దీంతో లారీ నుంచి యూరి యా అన్లోడ్ చేయడానికి ముందే సొసైటీ పరిధిలోని రైతులు అక్కడికి చేరుకున్నారు. 10 గంటల కు యాప్లో బుకింగ్ మొదలైన వెంటనే రైతులు తమ ఫోన్లలో యూరియా బుక్ చేసుకునేందుకు యత్నించారు. అయితే, కేవలం రెండు నిమిషాల్లోనే 460 యూరియా బస్తాల బుకింగ్ పూర్తయిపోయినట్లు యాప్లో చూయించడంతో అక్కడే ఉన్న రైతు లు అవాక్కయ్యారు. వెంటనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రైతులు ఆందోళనకు దిగారు. యూరియా బుకింగ్ యాప్ ను రద్దు చేసి, పాత పద్ధతిలో పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. సొసైటీ పరిధిలోని రైతులకు మా త్రమే యూరియా ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. చైర్మన్ నవీన్ మాట్లాడుతూ యాప్ ద్వారా బుకింగ్ చేసుకునే అవకాశం ఉండటంతో తాము ఏం చేయలేకపోతున్నామన్నారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. -
నిండా నిర్లక్ష్యం
● జీజీహెచ్, ఎంసీహెచ్లో భద్రత కరువు ● సక్రమంగా పనిచేయని సీసీ కెమెరాలు నిజామాబాద్ అర్బన్: బాలుడి కిడ్నాప్ ఘటన జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రితోపాటు మతాశిశు సంరక్షణ కేంద్రంలో భద్రతా వైఫల్యాలను ఎత్తిచూపింది. జీజీహెచ్ నుంచి గతంలో పిల్లలు కిడ్నాప్ అయిన ఘటనల నుంచి ఆస్పత్రి అధికారులు అప్రమత్తత పాఠాలు నేర్చుకోలేదనేందుకు ఈ ఘటన నిదర్శనంగా నిలిచింది. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో సెక్యూరిటీ విభాగంతో పాటు సీసీ కెమెరాలను పెంచాలని ఒకటో టౌన్ పోలీసులు ఆసుపత్రి అధికారులకు రెండుసార్లు విన్నవించారు. సీపీ సాయిచైతన్య గత మూడు నెలల కిందట ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసి సమీక్ష ని ర్వహించారు. రక్షణ చర్యలపై పలు సలహాలు, సూ చనలు అందించారు. బాలుడి కుటుంబ సభ్యుల ఆందోళనకిడ్నాప్కు గురైన వేదాన్ష్ బంధువులు ఆస్పత్రి ఎదుట రోడ్డుపై బైఠాయించారు. పోలీసులు వెంటనే బాబును తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. వేదాన్ష్ తల్లిదండ్రులను సీపీ సాయి చైతన్య శనివారం రాత్రి పరామర్శించారు. బాలుడి ని సురక్షితంగా అప్పగిస్తామని ధైర్యం చెప్పారు. జీజీహెచ్లో 750 పడకలు ఉన్నాయి. అన్ని విభాగాలకు సంబంధించి రోగులు, వారి బంధువులతోపాటు ఓపీ పేషెంట్లు ఇలా 2వేల మందికిపైగానే వస్తూ వెళ్తుంటారు. నవజాత శిశువులు, బాలింతలు, గర్భిణులకు వైద్యం అందించేందు కు ఏర్పాటైన ఎంసీహెచ్కు సైతం తాకిడి ఎక్కువగానే ఉంటుంది. పాత భవనంలో సీసీ కెమెరాలు ఉన్నా, కొన్ని చోట్ల, వెనుక ప్రాంతంలో పనిచేయడం లేదు. మాతశిశు సంరక్షణ కేంద్రం పైఅంతస్తుల్లో సీసీ కెమెరాలు ఉన్నా.. ప్రవేశ మార్గంలో లేకపోవడంతో బాలుడిని ఎటువైపు తీసుకెళ్లారనేది అంతుచిక్కడం లేదు. గత కొన్ని నెలల కిందట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో బురఖాలు ధరించి మహిళలు బాలుడిని కిడ్నాప్చేసి ఆటోలో పారిపోయారు. పోలీసులు గాలించగా మహారాష్ట్ర ప్రాంతంలో పట్టుబడ్డారు. ఇదే ఆసుపత్రి నుంచి చికిత్స కోసం వచ్చిన ఓ బాధితుడు తన నాలుగేళ్ల బాలుడిని ఆసుపత్రి ఆవరణలో తనతో పాటు పడుకొబెట్టుకున్నాడు. అర్ధరాత్రి సమయంలో ఇద్దరు వ్యక్తులు బాలున్ని కిడ్నాప్ చేశారు. ఇదే ఆసుపత్రిలో ప్రసూతి వార్డులో ప్రసవం కోసం వచ్చిన మహిళ కుమార్తెను ఓ మహిళ, మరో వ్యక్తి కిడ్నాప్ చేశారు. -
సర్ నోటీసుల జారీలో జాప్యం
● ఇప్పటివరకు 58 శాతమే జారీ ● నోటీసులకు స్పందించే విషయంలోనూ గందరగోళం ● ఎస్ఐఆర్ ప్రక్రియపై ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్ట్ సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) ప్రక్రియలో అసాధారణ (అనామలిస్) జాబితాలో ఉన్న ఓటర్లకు నోటీసుల జారీ ప్రక్రియలోనూ జాప్యం జరుగుతోంది. జాబితాలో ఉన్న ఓటర్లకు నోటీసులు జారీచేయడం, సంబంధిత ఓటర్లతో హియరింగ్ నిర్వహించడం, వారి నుంచి సంబంధిత ధ్రువీకరణ పత్రాలు తీసుకోవడం మరింత ఆలస్యమవుతోంది. ఓటరు వివరాల్లో వ్యత్యాసాలు ఉన్న వారికి నోటీసులు ఇచ్చి హియరింగ్ చేపట్టేందుకు వారం రోజుల గడువు ఇస్తుండగా, హియరింగ్కు హాజరయ్యేందుకు ఓటర్లు ఆసక్తి చూపడం లేదు. నోటీసులు అందుకున్న ఓటర్లు పదో తరగతి, కులం, స్థానికత సర్టిఫికెట్లు, పాస్పోర్ట్, పట్టా పాస్బుక్ తదితర 12 రకాల పత్రాలను సమర్పించాల్సి ఉండగా క్షేత్రస్థాయిలో చాలామంది ఓటర్లు పత్రాలు ఇచ్చేందుకు ముందుకు రావడం లేదు. హియరింగ్కు రాక రీ షెడ్యూల్ ఎస్ఐఆర్ నోటీసులు అందుకున్న ఓటర్ల నుంచి అభ్యంతరాల స్వీకరణకు ఈనెల 16వరకు మాత్రమే గడువు మిగిలి ఉంది. ఈ క్రమంలో బీఎల్వో ద్వారా నోటీసుల జారీలో జాప్యంతోపాటు హియరింగ్ కోసం ఓటర్లు హాజరుకావడం లేదు. దీంతో మరోసారి హియరింగ్కు రీ షెడ్యూల్ చేయాల్సి వస్తోంది. పూర్తిభారం బీఎల్వోల పైనే ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ సమయంలో బీఎల్వోలతో పాటు ప్రభుత్వంలోని ఇతర అధికారులు, సిబ్బందిని ఫారాల పంపిణీకి వినియోగించారు. నోటీసుల జారీ ప్రక్రియను మాత్రం బీఎల్వోలకే వదిలేయడంతో ఈ ప్రక్రియలో ఆలస్యమవుతోంది. యాప్లో నోటీసుతో పాటు ఓటరు సమర్పించే పత్రాలు, హియరింగ్కు హాజరైన ఓటరు ఫొటోలను మూడు విడతలుగా బీఎల్వోలే అప్లోడ్ చేయాల్సి వస్తోంది. పదేపదే నిబంధనలు మారుతుండటం, నోటీసులు వచ్చిన ఓటర్లు ఎన్ని ధృవపత్రాలు సమర్పించాలన్న విషయంలో ఓటర్లతో పాటు బీఎల్వోల్లోనూ గందరగోళం నెలకొంది.మూడోస్థానంలో జిల్లా.. రాష్ట్రంలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల త ర్వాత అనామలిస్ జాబితాలో ఎక్కువ మంది ఉంది నిజామాబాద్ జిల్లాలోనే. ఇక్కడ 4,32,405 మందికి నోటీసులు ఇవ్వాల్సి ఉంది. ఇందులో ఇప్పటివరకు 2,50,058 మందికి నోటీసులు ఇచ్చామని అధికారులు చెబుతున్నారు. ఇంకా 1,82,347 మందికి నోటీసులు అందాల్సి ఉంది. నోటీసులు అందుకున్న వారిలో ఇప్పటివరకు 45,019 మంది మాత్రమే హియరింగ్కు హాజరయ్యారు. ఇప్పటికే 1,16,325 మందికి కేటాయించిన హియరింగ్ డేట్ ముగిసింది. వీరిలో 17 మందికి మాత్రమే రీషెడ్యూల్ చేశారు. -
ఈ రోడ్డు దాటేదెలా?
జిల్లా కేంద్రంలోని వివేకానంద కాలనీలో డ్రెయినేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో మురుగు నీరు రోడ్డుపై నిలిచిపోతోంది. దీంతో ఆ ప్రాంతమంతా దుర్గంధం వ్యాపిస్తోంది. మున్సిపల్ కార్యాలయానికి సమీపంలో రైల్వే స్టేషన్ వెనకాల ఉన్న ఈ రోడ్డు మీదుగా నిత్యం వందలాది మంది కోర్టు, జెడ్పీ, తహసీల్, ఆర్డీవో కార్యాలయాలకు వెళ్తుంటారు. ఈ మార్గంలో నడవడానికి పాదచారులు నానా పాట్లు పడుతున్నారు. అధికారులు స్పందించి రోడ్డుపై నీరు నిల్వకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు. – సాక్షి ప్రతినిధి, కామారెడ్డి -
యువతను ప్రభుత్వం మోసం చేసింది
కమ్మర్పల్లి(భీమ్గల్): ఎన్నికల సమయంలో నిరుద్యోగ యువతకు, విద్యార్థులకు ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన రేవంత్రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం యువతను నిలువునా మోసం చేసిందని మాజీ మంత్రి, బా ల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి విమర్శించా రు. వెయ్యి రోజుల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసనలు కొనసాగుతున్నాయి. శనివారం భీమ్గల్ పట్టణంలో విద్యార్థులు, యువతీయవకులతో కలి సి బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ‘విద్యార్థి, నిరుద్యోగ సదస్సు‘లో ప్రశాంత్రెడ్డి మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మొత్తం 2,32,328 ఉద్యోగాలకు ఆర్థిక శాఖ అనుమతులు రాగా, 2,02,735 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేశామని తెలిపారు. అందులో 1,60,083 ప్రభుత్వ ఉద్యోగాలను కేసీఆర్ ప్రభుత్వం విజయవంతంగా భర్తీ చేసిందని, మరో 42,652 పోస్టులకు రాత పరీక్షల వరకు ప్రక్రియను పూర్తి చేసిందన్నారు. అధికారంలోకి రాగానే 70 వేల ఉద్యోగాలు భర్తీ చేశామంటూ సీఎం రేవంత్రెడ్డి పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇటీవల అసెంబ్లీ 8వ సెషన్లో ఎమ్మెల్యే కేటీఆర్ అడిగిన ప్రశ్నకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బదులిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 31,798 పోస్టులకు 16 నోటిఫికేషన్లు ఇచ్చి అందులో భర్తీ చేసింది 16,978 ఉద్యోగాలు అని అసెంబ్లీ సాక్షిగా భట్టి సమాధానం ఇచ్చారన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల వీడియోలను ఎల్ఈడీ స్క్రీన్పై ప్రదర్శిస్తూ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. కళాశాలలకు వెళ్లే ప్రతి యువతికి ఉచిత ఎలక్ట్రిక్ స్కూటర్ ఇస్తామని ప్రియాంక గాంధీ సమక్షంలో రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటించి, నేడు ఒక్క విద్యార్థినికి కూడా ఇవ్వకుండా విస్మరించారన్నారు. ఉన్నత విద్యాభ్యాసం, ల్యాప్టాప్లు, ఐపా డ్లు, రూ.5 లక్షల బ్యాంక్ గ్యారెంటీ విద్యా భరోసాకార్డు ఎక్కడికి వెళ్లాయని ప్రశ్నించారు. ‘తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూళ్లను అటకెక్కించారని, యూత్ డిక్లరేషన్లో ప్రకటించిన ఎస్సెస్సీ పాసైన వారికి రూ.10 వేలు, ఇంటర్కు రూ.25 వేలు, డిగ్రీకి రూ.50 వేలు, పీజీకి రూ.లక్ష, పీహెచ్డీ పూర్తిచేసిన వారికి రూ.5 లక్షల ఆర్థిక సాయం హామీలను పూర్తిగా గాలికొదిలేశారని మండిపడ్డా రు. నిరుద్యోగ భతి ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కో నిరుద్యోగికి రూ.1.32 లక్షలు బాకీ పడిందన్నారు. కేసీఆర్ ఇచ్చిన జాబ్లకు, నిర్మించిన ఫ్లైవర్లకు రిబ్బన్లు కత్తిరిస్తూ సీఎం రేవంత్ రెడ్డి రిబ్బన్రెడ్డి మారారని ప్రశాంత్రెడ్డి విమర్శించారు. సదస్సుకు హాజరైన విద్యార్థులు, యువత చేతులెత్తి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎమ్మెల్యే చేసిన డిమాండ్లను మద్దతు తెలిపారు.ఎన్నికల హామీలను విస్మరించిన కాంగ్రెస్.. నిజామాబాద్ అర్బన్ : కాంగ్రెస్ ఎన్నికల హామీలను విస్మరించిందని నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేశ్గుప్తా విమర్శించారు. విద్యార్థులు, యువతకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేశారని నిరసిస్తూ నగరంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. మాజీ మేయర్ దండు నీతూకిరణ్ శేఖర్, నగర అధ్యక్షుడు సిర్ప రాజు, నుడా మాజీ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, సత్య ప్రకాశ్, సుజిత్సింగ్, నవీద్ ఇక్బాల్, జగత్రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నిరుద్యోగులకు రూ.1.32 లక్షలు బాకీ పడ్డ రేవంత్ సర్కార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు కేవలం 16,978 మాత్రమే.. కేసీఆర్ ఇచ్చిన జాబ్లకు,కట్టిన ఫ్లై ఓవర్లకు రిబ్బన్లు కట్ చేస్తున్నారు ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శ -
ఉనికి కోసమే బీఆర్ఎస్ నాయకుల ఆరాటం
● డీసీసీ మాజీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డినిజామాబాద్ రూరల్: ఉనికి కోసమే బీఆర్ఎస్ నాయకులు ఆరాటపడుతున్నారని డీసీసీ మాజీ అధ్యక్షుడు మానాల మోహన్రెడ్డి విమర్శించారు. ప్రజా సంక్షేమంపై సమష్టిగా, మరింత నిబద్ధతతో ముందుకెళ్తామని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా జిల్లా అభివృద్ధికి పెద్దపీట వేసిన సీఎం రేవంత్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అమలు చేసిన వాగ్ధానాలపై చర్చకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తే 2023లో మాదిరిగానే 2028 జరిగే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తారని అన్నారు. కార్యక్రమంలో జిల్లా సేవాదళ్ అధ్యక్షుడు సంతోష్, జెండా గుడి చైర్మన్ లవంగ ప్రమోద్, కార్పొరేటర్ మనోహర్ పాల్గొన్నారు. -
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
వర్ని: నియోజకవర్గంలో అర్హులైన ప్రతి నిరుపేదకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని ప్రభుత్వ వ్య వసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచా రం శ్రీనివాస్రెడ్డి అన్నారు. వర్ని, చందూర్, మో స్రా మండలాలకు చెందిన 121 మంది లబ్ధిదారు లకు శనివారం ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రా లను బాన్సువాడలోని తన నివాసంలో పోచారం అందజేశారు. అలాగే మోస్రా మండలానికి చెందిన ఐదుగురికి, చందూరుకు చెందిన ముగ్గురికి, వర్నికి చెందిన 21 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశా రు. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా బాన్సువా డ నియోజకవర్గంలో గత ప్రభుత్వ హయాంలో 11 వేల ఇళ్లు మంజూరు చేశామని, ప్రస్తుత ప్రభుత్వం నేతృత్వంలో వేలాది ఇళ్లను మంజూరు చేయిస్తున్నట్లు ఆయన తెలిపారు. వర్ని మార్కెట్ కమిటీ చై ర్మన్ సురేశ్బాబా, వైస్ చైర్మన్ లక్ష్మణ్, జిల్లా కాంగ్రె స్ కార్యదర్శి పిట్ల శ్రీరాములు, సాయాగౌడ్, జాకో రా సర్పంచ్ సాయిలు, చందూర్ సొసైటీ చైర్మన్ అ శోక్, నాయకులు గిరి, బాలు, గంగాధర్, సాయారెడ్డి, సాయాగౌడ్, సత్యనారాయణ పాల్గొన్నారు. -
ఉత్తమ అధ్యాపకులకు అవార్డులు
తెయూ(డిచ్పల్లి)/ఖలీల్వాడి: రాష్ట్రస్థాయి ఉత్తమ అధ్యాపకులుగా ఎంపికైన తెలంగాణ యూనివర్సిటీ తెలుగు అధ్యయన శాఖ ప్రొ ఫెసర్ కె.లావణ్య, డైట్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్ శనివారం హైదరాబాద్లో అవార్డు లు అందుకున్నారు. కొడంగల్ జూనియర్ క ళాశాలలో నిర్వహించిన ఉపాధ్యాయ దినో త్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్రెడ్డి ఉత్త మ ఉపాధ్యాయులు, అధ్యాపకులను సన్మానించి అవార్డులను అందజేశారు. రాష్ట్ర వై ద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డా క్టర్ యోగితా రాణా, కళాశాల కమిషనర్ దే వసేన, అన్ని యూనివర్సిటీల వైస్ చాన్సలర్స్, అవార్డు గ్రహీతలు పాల్గొన్నారు. సంస్థ అభివృద్ధికి సమష్టిగా కృషి చేయాలి ● నిజామాబాద్ రీజియన్ అభివృద్ధికి కార్యాచరణ ● టీజీఎస్ఆర్టీసీ ఈడీ సోలమన్ నిజామాబాద్ రూరల్: నిజామాబాద్ రీజియ న్ అభివృద్దికి ప్రభుత్వం కట్టుబడి ఉందని టీజీఎస్ఆర్టీసీ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ సోలమన్ అన్నారు. రీజియన్ పరిధిలోని నిజామాబా ద్ –1,2, ఆర్మూర్, కామారెడ్డి, బోధన్, బా న్సువాడ డిపోల మేనేజర్లతో జిల్లా కేంద్రంలోని ఆర్ఎం కార్యాలయంలో శనివారం ఆ యన సమావేశమయ్యారు. డిపోల పనితీరు ను మరింత మెరుగుపర్చాలన్నారు. ప్రయాణికులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన స మయపాలనతో కూడిన ప్రజా రవాణా సేవ లు అందించాలని సూచించారు. రీజియన్ పనితీరుపై చర్చించిన ఈడీ.. ఆదాయాన్ని పెంచడంతోపాటు ఖర్చులను నియంత్రిస్తూ సంస్థ అభివృద్ధికి ప్రతి ఒక్క రూ సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆర్ఎం కృష్ణమూర్తి, డిప్యూటీ ఆర్ఎం తదితరులు పాల్గొన్నారు. ఐదేళ్లలోపు పిల్లల మరణాలను నివారించాలి సుభాష్నగర్: జిల్లాలో ఐదేళ్లలోపు పిల్లల మరణాలను నివారించాలని, గర్భిణులు, చిన్న పిల్లల్లో ప్రమాదకర లక్షణాలను ముందే గుర్తించాలని డీఎంహెచ్వో రాజశ్రీ సూచించారు. ఐదేళ్లలోపు పిల్లల మరణాలపై నగరంలోని సమీకృత కార్యాలయాల సముదాయంలో ఉన్న వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో శనివారం ఆమె సమీక్షించారు. బాలింతలను క్రమం తప్పకుండా ఇంటి వద్దే వైద్య పరీక్షలు నిర్వహించాలని, ఎంసీపీ కార్డు ప్రతినెలా అప్డేట్ చేయాలన్నారు. గర్భిణులు, బాలింతలను పరీక్షిస్తున్న సమయంలో తల్లిపాల ప్రాముఖ్యతను తెలుపాలన్నారు. మదర్ ఇన్, మదర్ అవుట్ సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకోవాలని, తద్వారా గర్భిణులు, శిశువుల ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుందన్నారు. డొంకేశ్వర్, కిసాన్నగర్, పోచంపాడ్, రెంజల్, జక్రాన్పల్లి, వినాయక్నగర్, గోవింద్పేట్, ఇందల్వాయి, వేల్పూర్, మోస్రా, తదితర 11 పీహెచ్సీ వైద్యాధికారులు, సూపర్వైజర్లు, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లతోపాటు డీఐవో ఎం అశోక్, డిప్యూటీ డీఎంహెచ్వోలు రవీందర్, విద్య, సికందర్నాయక్, సీ్త్ర, పిల్లల వైద్యనిపుణులు, సీడీపీవోలు, తదితరులు పాల్గొన్నారు. ఖలీల్వాడి: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ గిరి రాజ్ ప్రభుత్వ కళాశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి అతిథి అధ్యాపకులను నియమించేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దర ఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ రాంమోహన్ రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అరబిక్, గణితం, బీసీఏ (కంప్యూటర్ సైన్స్– అప్లికేషన్స్)లో ఖాళీలు ఉన్నాయని పేర్కొన్నారు. సంబంధిత సబ్జెక్టులో పీజీ, నెట్, సెట్ లేదా పీహెచ్డీతోపాటు బోధనా అనుభవం కలిగిన వారికి ప్రాధాన్యతనిస్తామని తెలిపారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు తమ బయోడేటాను ఈ నెల 8 లోపు కార్యాలయంలో సమర్పించాలని ఆయన పేర్కొన్నారు. తెయూ ప్రొఫెసర్ లావణ్యడైట్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్ -
నకిలీ సర్టిఫికెట్లు సృష్టిస్తున్న ఇద్దరి అరెస్ట్
నిజామాబాద్ అర్బన్: నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న ఇద్దరిని అరెస్టు చేసినట్లు సీపీ సాయిచైతన్య తెలిపారు. కమిషనరేట్ కార్యాలయంలో శనివారం ఆయన వివరాలు వెల్లడించారు. బోధన్లోని రాకాసీపేట్ ప్రాంతంలో ఉన్న సహరా మీ సేవ కేంద్రంలో నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు, సీసీఎస్ ఏసీపీ శ్రీశైలం, బోధన్ పోలీసులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారన్నారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే దురాశతో మీ సేవ ఆప రేటర్ షేక్ వసీమ్ గత రెండేళ్ల నుంచి యజమాని మహమ్మద్ ముక్రమ్, ఇతరులతో కలిసి ఇంటి వద్ద నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్నట్లు గుర్తించడం జరిగిందన్నారు. ఒక్కో సర్టిఫికెట్కు రూ.5వేల నుంచి రూ.10వేల వరకు వసూలు చేస్తున్నట్లు తేలింనద్నారు. నిందితులైన షేక్ వసీమ్, మహమ్మద్ ము క్రమ్ను అరెస్టుచేసి రిమాండ్కు తరలించామన్నా రు. ఐదు నకిలీ మీసేవ సర్టిఫికెట్లతోపాటు అప్పటికే విక్రయించిన 22 జనన ధ్రువీకరణ పత్రాలు, 38 మీ సేవ ఖాళీ ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఒక రబ్బర్ స్టాంప్, 13 బోనాఫైడ్లు, షాదీ ముబారక్కు సంబంధించి తయారు చేసిన నకిలీ జిరాక్స్ కాపీలు, నకిలీ సర్టిఫికెట్ల తయారీకి ఉపయోగించిన ల్యాప్ టాప్, కలర్ ప్రింటర్, నిందితుల సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. పరారీలో ఉన్న మి గతా వారి కోసం గాలిస్తున్నామని తెలిపారు. సమావేశంలో బోధన్ ఏసీపీ శ్రీనివాస్, సీఐ అజయ్, ఎస్సై శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
మతసామరస్యాన్ని కాపాడాలి
ఆర్మూర్: పండుగ అనేది ప్రజలందరినీ ఐక్యం చేసే కార్యక్రమమని, ప్రతి ఒక్కరూ పరస్పరం సహరించుకుంటూ మత సామరస్యాన్ని కాపాడాలని సీపీ సాయిచైతన్య సూచించారు. వినాయక నవరాత్రుల నేపథ్యంలో పట్టణంలోని క్షత్రియ కళ్యాణ మండపంలో శనివారం శాంతి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన సీపీ.. ఉత్సవాల నిర్వహణ, భద్రతా ఏర్పాట్లు, శాంతి భద్రతలు, ట్రాఫిక్ నియంత్రణ తదితర అంశాలపై శాంతి కమిటీ సభ్యులు, గణేశ్ ఉత్సవాల నిర్వాహకులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గణేశ్ ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో నిర్వహించుకోవాలన్నారు. గణేశ్ మండపాలు ఏర్పాటు చేసే వారు ముందస్తుగా పోలీసు శాఖ అనుమతులు తీసుకోవడంతోపాటు నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. మండపాల వద్ద డీజేలు, సౌండ్ సిస్టమ్ల వినియోగంలో ప్రభుత్వం నిర్దేశించిన శబ్ధ పరిమితులు, సమయ నిబంధనలు పాటించాలని స్పష్టం చేశారు. గణేశ్ నిమజ్జనం సందర్భంగా నిర్వాహకులు పోలీస్శాఖతో సమన్వయం చేసుకొని ముందుగా నిర్ణయించిన మార్గాలు, సమయాన్ని పాటించాలని సూచించారు. ఉత్సవాల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని అన్నారు. ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాల్వియా, ఏసీపీ వెంకటేశ్వరరెడ్డి, ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీధర్రెడ్డి , ఆర్మూర్ ఎస్హెచ్వో సత్యనారాయణగౌడ్, రూరల్ సీఐ జాన్రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ గోనె లహరిరఘు, వైస్ చైర్మన్ కాటిపల్లి వెంకట్రెడ్డి, ఆర్మూర్, బాల్కొండ, మెండోర ఎస్సైలు రజనీకాంత్, శైలందర్, సుహాసిని పాల్గొన్నారు. శాంతియుత వాతావరణంలో గణేశ్ ఉత్సవాలను నిర్వహించాలి పోలీసులకు సహకరించాలి శాంతి కమిటీ సమావేశంలో సీపీ సాయిచైతన్య -
క్రైం కార్నర్
ప్రమాదవశాత్తు ఒకరు మృతిరోడ్డు ప్రమాదంలో ఒకరు..నవీపేట: మండల శివారులో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో పోతంగల్ గ్రామానికి చెందిన మావూరి లక్ష్మి (60) మృతి చెందినట్లు ఎస్సై శ్రీకాంత్ శనివారం తెలిపారు. నవీపేటలో శుక్రవారం వారాంతపు సంతకు వచ్చిన లక్ష్మి తిరుగు ప్రయాణంలో ఆటోలో వెళ్తుండగా ఎదురుగా వచ్చిన మరో ఆటో ఢీకొట్టిందన్నారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన లక్ష్మిని జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. మృతురాలి కుమారుడు మావూరి శ్రీకాంత్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. -
రచయితలుగా మారుస్తూ..
నిజామాబాద్ రూరల్: తరగతి గదిలో విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ.. అదే విద్యార్థులను రచయితలుగా తీర్చిదిద్దుతున్నారు మోపాల్ మండలం సిర్పూర్ ఉన్నత పాఠశాల తెలుగు ఉపాధ్యాయుడు కాసర్ల నరేశ్ రావు. కవిగా, రచయితగా, వ్యాఖ్యాతగా, పరిశోధకులుగా, బాల సాహితీవేత్తగా, సాహి త్య విమర్శకుడిగా, ప్రేరణవక్తగా, రిసోర్స్ పర్సన్గా బహుముఖ ప్రజ్ఞ చూపుతున్నారు. 2024లో రాష్ట్ర ఉ త్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకున్న కాసర్ల నరేశ్.. కవనకిరీటి బిరుదు కలిగిన కవిగా ఇప్పటికే పది పుస్తకాలను రచించారు. మరో ఐదు పుస్తకాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటి వరకు సు మారు 30 రాష్ట్ర, జాతీయ స్థాయి సాహిత్య పురస్కారాలు అందుకున్నారు. తాను పనిచేసిన సు ద్దులం, గుండారం హైస్కూ ల్ విద్యార్థులతో బాల లేఖి ని, గుండారం గువ్వలు, సిరి లేఖలు, సజనసిరి అనే పుస్తకాలను రాయించారు. ఇటీవల జిల్లా విద్యాశాఖ రూపొందించిన బడిబాట షార్ట్ఫిలింలో కాసర్ల విభిన్న పాత్రలు పోషించారు. -
ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి
నందిపేట్ (ఆర్మూర్): రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తూ ప్రతి వర్గానికి న్యాయం చేసే దిశగా అడుగులు వేస్తోందని డీసీసీ అధ్యక్షుడు నగేష్రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా నందిపేటలో మండల పార్టీ అధ్యక్షుడు దూడ వెంకటేష్ ఆధ్వర్యంలో శుక్రవారం విజయోత్సవ ర్యాలీ, సంబురాలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటుచేసిన సభలో నగేష్రెడ్డి హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల కాలంలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు ప్రాధాన్యత ఇస్తూ సంక్షేమం, అభివృద్ధిని సమన్వయం చేస్తూ ముందుకు సాగుతోందన్నారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణను అప్పుల ఊబిలోకి నెట్టివేశారని, ప్రజల అవసరాల కంటే ప్రచారానికే ప్రాధాన్యత ఇచ్చారని విమర్శించారు. అనంతరం ఆర్మూర్ నియోజకవర్గ ఇన్చార్జి వినయ్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజల ఆశయాలకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం మరింత సమర్థవంతంగా పాలన కొనసాగిస్తుందన్నారు. నాయకులు ఎర్రం లింగం, మారా చంద్రమోహన్, వెంకట్రాంరెడ్డి, గోపి, యాదగిరి, గంగాధర్గౌడ్, దయాకర్, మహిపాల్, సాయిరెడ్డి, సాయిబాబాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
ఆరు గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ మోసం
● బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్రెడ్డి ● మోర్తాడ్లో వంటావార్పుతో నిరసనకమ్మర్పల్లి(మోర్తాడ్): ఎన్నికల సమయంలో ఆరు గ్యారంటీలను ప్రకటించి, అధికారంలోకి వచ్చాక ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. గ్రామాల్లోకి వచ్చే కాంగ్రెస్ నాయకులను బాకీ కార్డులతో నిలదీయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం మోర్తాడ్లో వంటా–వార్పు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ప్రశాంత్రెడ్డి మహిళలతో కలిసి కూరగాయలు కోయడంతోపాటు, బతుకమ్మ ఆడి నిరసన తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 18ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ. 2,500 చొప్పున నేటికీ రూ. 82,500, రూ. 4వేలకు పెంచుతామన్న చేయూత పింఛన్ డబ్బులు రూ. 66వేలు, దివ్యాంగులకు రూ. 66వేలు ప్రభుత్వం బాకీ పడిందన్నారు. అదేవిధంగా సిలిండర్ బాకీ రూ. 16,500, నియోజకవర్గంలో 5వేల మంది కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు తులం బంగారం బాకీ పడ్డారన్నారు. ఆడపిల్లలకు స్కూటీలు బాకీ ఉన్నారని తెలిపారు. ఎన్నికల సమయంలో రాష్ట్ర బడ్జెట్, అప్పుల స్థితిగతులపై అవగాహన ఉందని వీడియోల్లో స్వయంగా చెప్పిన రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్కలు.. ఇప్పుడు అధికారం చేపట్టాక కేసీఆర్ ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తూ కాలం గడుపుతున్నారని దుయ్యబట్టారు. భారీ ఎల్ఈడీ స్క్రీన్పై నాటి వీడియోలను ప్రదర్శించి, ప్రజల సాక్షిగా పాలకుల ద్వంద్వ వైఖరిని ఎండగట్టారు. అనంతరం ప్రజలకు బాకీ పడ్డ బకాయిలను చెల్లించాలని ప్రభుత్వానికి పలు కీలక డిమాండ్లతో పోస్టర్లను విడుదల చేశారు. నగరంలో.. నిజామాబాద్ అర్బన్: ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయని డిమాండ్ చేస్తూ నగరంలో బీఆర్ఎస్ శ్రేణులు శుక్రవారం ధర్నా చౌక్లో వంటా–వార్పు కార్యక్రమం నిర్వహించారు. మాజీ మేయర్ నీతూకిరణ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తుందన్నారు. నాయకులు ప్రభాకర్రెడ్డి, విశాలినిరెడ్డి మంజుల పాల్గొన్నారు. -
స్కూల్కు రాకుంటే విద్యార్థి ఇంటికి..
ధర్పల్లి మండలంలోని వాడి ప్రాథమిక పాఠశాలలో ఎస్జీటీగా పనిచేస్తున్నారు ప్రసన్న కుమార్. రెండేళ్ల క్రితం స్కూల్లో 24 మంది విద్యార్థులు ఉండగా.. ఇప్పుడు ఆ సంఖ్య 44 కు చేరింది. విద్యార్థులు డ్రాప్అవుట్ లేకుండా తల్లిదండ్రులకు అవగాహన కల్పించి బడిమానేసిన వారిని తిరిగి బడిలో చేర్పించడంపై ప్ర త్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. ప్రైవేట్ పాఠశాలలకు పిల్లలను పంపిస్తున్న తల్లిదండ్రులను ఒప్పించి ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు. రోజూ ఉదయం 8 గంటల పాఠశాలకు చేరుకునే ప్రసన్నకుమార్.. ఎవరైనా విద్యార్థి పాఠశాలకు రాకుంటే ఇంటికి వెళ్లి బైక్పై స్కూల్కు తీసుకువస్తారు. -
భూమాతకు రాయండి ఓ లేఖ..
నిజామాబాద్ రూరల్: ‘‘ప్రకృతిని రక్షిస్తానంటూ ప్రమాణం చేస్తూ.. భూమాతకు లేఖ రాయండి’’ నగదు బహుమతులు అందుకోండి అంటోంది తపాలా శాఖ. విషయమం ఏమిటంటే.. లేఖలు రాసే అలవాటును ప్రోత్సహిస్తూనే సృజనాత్మకతను వెలికి తీసేందుకు తపాలాశాఖ ప్రతి ఏడాది ‘ఢాయ్ అఖర్’ లేఖల పోటీని నిర్వహిస్తోంది. ఈ ఏడాదిసైతం 18 ఏళ్లలోపు, 18 ఏళ్లు దాటిని వారికి రెండు కేటగిరీల్లో (ఒక్కో కేటగిరీలో ఇన్లాండ్, ఎన్వలప్ విభాగాలు) పోస్టల్ డిపార్ట్మెంట్ పోటీలు నిర్వహిస్తోందని నిజామాబాద్ తపాలాశాఖ సీనియర్ సూపరింటెండెంట్ కే జనార్దన్రెడ్డి శుక్రవారం తెలిపారు. ‘భూమాతకు లేఖ.. ప్రకృతిని రక్షిస్తానని నా ప్రమాణం’ (A Letter to Mother Earth: My Promise to Protect Nature) అనే అంశంపై ఇన్లాండ్ లెటర్లో 500 పదాలు, ఎన్వలప్ ఏ4 సైజ్ పేపర్పై వెయ్యి పదాలకు మించకుండా హిందీ, ఇంగ్లిష్, ఏదైనా వాడుక భాషలో లేఖ రాయాలని సూచించారు. లెటర్లను The chief postmaster general, Telangana circleకు అక్టోబర్ 31వ తేదీలోగా పంపించాలని.. ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను నాలుగు విభాగాల్లో విజేతలకు సర్కిల్, జాతీయస్థాయిలో బహుమతులు అందిస్తామని తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు, యువత సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.తపాలా రాత పూర్వక పోటీలు సృజనాత్మకతను వెలికి తీస్తూ.. లేఖలు రాసే అలవాటుకు ప్రోత్సాహం లేఖలు పంపేందుకు అక్టోబర్ 31 వరకు అవకాశం -
ఆన్లైన్లో అబ్దుల్ సార్..
నందిపేట్(ఆర్మూర్): మండలంలోని వెల్మల్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పని చేస్తున్న షేక్ అబ్దుల్ అటు తరగతి గదిలో, ఇటు ఆన్లైన్లో తన పాఠాలతో విద్యార్థులను ఆకట్టుకుంటున్నారు. పాఠాలకు ఆటలను మేళవించి బోర్డ్ గే మ్స్, పజిల్స్తోపాటు తక్కువ ఖర్చు తో సృజనాత్మకత టీచింగ్ లర్నింగ్ మెటీరియల్ రూపకల్పన చేసి తరగతులను ఆకర్షణీయంగా మార్చారు. పాఠ్యాంశాల బోధనకు దోహదపడే పరికరాలను సొంత డబ్బులతో కొ నుగోలు చేశాడు. కరోనా సమయంలో విద్యార్థుల కోసం ఆయన ప్రారంభించిన ‘అబ్దుల్ సార్ క్లాస్ రూమ్’ యూట్యూబ్ చానల్ ఎల్లలు దాటింది. 31వేల మంది వరకు సబ్స్క్రైబర్లు ఉండగా.. ఆయన అప్లోడ్ చేసిన పాఠ్యాంశాల వీడియోలను ఇప్పటి వరకు ఏకంగా 75 లక్షల మంది వీక్షించారు. తెలుగు, ఇంగ్లిష్, గణితం, సామాన్యశాస్త్రం పాఠ్యాంశాలతోపాటు తోటి ఉపాధ్యాయుల కోసం కూడా బోధన పద్దతులపై వీడియోలు రూపొందిస్తున్నారు. గురుకుల పరీక్షల కోసం చేసిన వీడియోలు విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడ్డాయి. 2025లో జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు అందుకున్నారు. -
దివ్యాంగులకు అభయం
ఆర్మూర్: దివ్యాంగ విద్యార్థులకు అవసరమైన సహాయ పరికరాలు (ఉపకరణాలు) అందించేందుకు గుర్తింపు శిబిరాలను తెలంగాణ సమగ్ర శిక్ష సహిత విద్యా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ఇందుకోసం సంబంధిత అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దివ్యాంగుల సౌకర్యార్థం రెవెన్యూ డివిజన్ల వారీగా 7వ తేదీన ఆర్మూర్లో, 8న బోధన్, 9న నిజామాబాద్ నగరంలో శిబిరాల నిర్వహణకు ఉన్నతాధికారులు అనుమతించారు. శారీరక, మానసిక వైకల్యం, వినికిడిలోపం, అంధత్వంతో బాధపడుతున్న పిల్లలకు అవసరమైన వీల్ చైర్స్, చంక కర్రలు, ట్రై సైకిళ్లు, రొలేటర్స్, హియరింగ్ ఎయిడ్స్, బ్రెయిలీ కిట్, బ్రెయిలీ ప్లేట్స్, బ్రెయిలీ కిట్, ఎమ్మార్ కిట్లతోపాటు కృత్రిమ అవయవాలు అందించడమే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో శిబిరాలను నిర్వహిస్తున్నారు. ఆర్టిఫిషియల్ లింబ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (అలిమ్కో) సహకారంతో శిబిరాలను నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లా వ్యాప్తంగా సుమారు 4,125 మంది ప్రత్యేక అవసరాలు గల పిల్లల్లో వివిధ కేటగిరీల్లో పరికరాలు అవసరం ఉన్న వారిని ఇన్క్లూసీవ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్ (ఐఈఆర్పీ)లు గుర్తించారు. పిల్లల తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. వారిని శిబిరాలకు తరలించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. శిబిరాలకు హాజరయ్యే విద్యార్థులు ఇన్కం, సదరం సర్టిఫికెట్లు, యూడీఐడీ కార్డు, తెల్లరేషన్ కార్డు, ఆధార్ కార్డు జిరాక్స్లతోపాటు మూడు పాస్పోర్ట్ సైజ్ ఫొటోలు వెంట తీసుకెళ్లాలి. సదరం సర్టిఫికెట్ లేని వారు సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రి వైద్యునితో ధ్రువీకరించిన పత్రంపై ఎంఈవో లేదా ప్రధానోపాధ్యాయుడి అటెస్టేషన్ చేయించుకొని వెళ్లాలి. 60 శాతం కేంద్ర ప్రభుత్వ నిధులు, 40 శాతం సహిత విద్యా విభాగం నిధులు వెచ్చించి పరికరాలను అందిస్తారు. గతేడాది తీసుకున్న వారు అనర్హులు గతేడాది సహాయ ఉపకరణాలు తీసుకున్న దివ్యాంగు లు ప్రస్తుతం అనర్హులు. కొ త్తగా అవసరం ఉన్న వారు మాత్రమే క్యాంపునకు రావాలి. గుర్తించిన వారికి పరికరాలను అతి త్వరలో ఉచితంగా అందజేస్తాం. – పడకంటి శ్రీనివాస్రావు, సహిత విద్యావిభాగం జిల్లా ఇన్చార్జి కో ఆర్డినేటర్ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మాత్రమే.. ప్రభుత్వ పాఠశాలల్లో చది వే దివ్యాంగ విద్యార్థుల కోసం మాత్రమే నిర్వహించే శిబిరాలను సద్వినియో గం చేసుకోవాలి. వైకల్యంతో బాధపడుతున్న పిల్లలకు పరికరాలు ఎంతగానో ఉపయోగపడతాయి. – అశోక్, డీఈవో, నిజామాబాద్ ఉపకరణాలు అందించేందుకు ఎంపిక కోసం ప్రత్యేక శిబిరాలు 7న ఆర్మూర్, 8న బోధన్, 9న జిల్లా కేంద్రంలో.. నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్న అలిమ్కో ప్రతినిధులు -
జయ జనార్దన కృష్ణ!..
● జిల్లావ్యాప్తంగా ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు ● పలు ఆలయాల్లో డోలారోహణం, ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులునిజామాబాద్ రూరల్ : జిల్లా వ్యాప్తంగా శుక్రవారం శ్రీకృష్ణా ష్టమి వేడుకలను భక్తులు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించా రు. జిల్లాకేంద్రంతో పాటు ఆ యా మండలాలు, గ్రామాల్లో ని కృష్ణ మందిరాలకు ప్ర జలు తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలు ప్రాంతా ల్లోని ప్రధాన వీధుల్లో స్థానిక యువకులు, చి న్నారులు ఉట్టి కొట్టి సంబురాలు నిర్వహించారు. న గరంలోని శివాజీ నగర్ వద్ద గల శ్రీకృష్ణ ఆలయం, గంగాస్థాన్ వద్ద గల కృష్ణ మందిరం వద్ద స్వామి వా రి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. ఆలయాల్లో అర్చకులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు, డోలారోహణం, సామూహిక విష్ణుపారాయణం వంటి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. స్వా మివారికి ప్రత్యేక నైవేద్యాలు, చప్ప న్ భోగ్ సమర్పించారు. తల్లిదండ్రులు తమ చిన్నారులను కృష్ణ, గోపికల వేషధారణతో అలంకరించారు. ఇస్కాన్ కంఠేశ్వర్ ఆధ్వర్యంలో.. నగరంలోని కంఠేశ్వర్ బైపాస్ రోడ్డులో గల పైడి క న్వెన్షన్ హాల్లో ఇస్కాన్ కంఠేశ్వర్ కేంద్రం ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఆ ర్ఎస్ఎస్ తెలంగాణ సహ ప్రాంత ప్రచారక్ ప్రభు కుమార్ మాట్లాడుతూ.. స్వధర్మ పరిరక్షణ బాధ్యత ను హిందువులకు గుర్తు చేయడమే ఏకై క లక్ష్యంగా ఆర్ఎస్ఎస్ పనిచేస్తున్నట్లు తెలిపారు. ఇస్కాన్ సే వా, ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో ఆధ్యా త్మికతతోపాటు దేశభక్తిని చాటుతున్నాయన్నారు. ఇస్కాన్ కంఠేశ్వర్ కేంద్ర అధ్యక్షుడు రామానంద రాయ్ గౌరదాస్, స్వామి యాదవ్ పాల్గొన్నారు. -
మాస్టార్లు
విద్యాబుద్ధులు నేర్పడంలోదూపల్లి హైస్కూల్లో విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్న ప్రభాకర్ల్యాబ్లో ఫిజిక్స్ పాఠాలు రెంజల్ మండలం దూపల్లి హైస్కూల్ టీచర్ ప్రభాకర్ విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో పాఠాలు బో ధించడంలో ఆయనకు ఆయనే సాటి. ఫిజిక్స్ పాఠాలను ఆయన ప్రయోగశాలలో బోధిస్తున్నారు. రాష్ట్ర స్థాయి అవార్డునూ అందుకున్నారు. ఎస్సెస్సీ విద్యార్థులు ఫిజిక్స్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించారు. అత్యవసర పరిస్థితి అయితేనే సెలవు పెట్టే ప్రభాక ర్.. ఉదయం బడికి వెళ్లినప్పటి నుంచి సమయం ముగిసే వరకు విద్యార్థులే లోకంగా ఉంటారు. విద్యార్థులకు పాఠాలు అర్థమయ్యేలా వినూత్న బోధన సాంకేతికతను అందిపుచ్చుకొని ప్రయోగాత్మక పాఠాలు.. పిల్లలకు బంగారు బాటలు.. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కృషి చేస్తున్న టీచర్లు నేడు జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం -
బోధనలో అపార అనుభవం
తెయూ(డిచ్పల్లి): రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపికై న తెయూ తెలుగు అధ్యయన శాఖ ప్రొఫెసర్ లావణ్య డిగ్రీ కాలేజ్తో పాటు వర్సిటీ ప్రారంభమైన 2006 నుంచి 29 సంవత్సరాలుగా అపారమైన బోధనానుభవం గడించింది. ప్రస్తుతం కేంద్ర సాహిత్య అకాడమి మెంబర్గా రాష్ట్రం నుంచి ఎన్నుకోబడి, ప్రతిష్ఠాత్మకమైన జాతీయ అవార్డులను ప్రదానం చేయడంలో కీలకపాత్ర వహిస్తూ తెలుగు సాహిత్య సేవ చేస్తున్నారు. అలాగే దేశంలోని వివిధ యూనివర్సిటీలలో బోర్టు ఆఫ్ స్టడీస్ మెంబర్గా బాధ్యతలు నిర్వహిస్తూ పాఠ్యప్రణాళికలను, సిలబస్ తయారీలో ప్రముఖ పాత్ర వహిస్తున్నారు. విశ్వవిద్యాలయాలలో జరిగే కాన్ఫరెన్స్ లలో పాల్గొని 250కి పైగా పరిశోధక పత్రాలను సమర్పించారు. 16 తెలుగు సాహిత్య గ్రంథాలను ఇప్పటివరకు రచించి ముద్రించారు. ఆమె దగ్గర సాహిత్య పరిశోధనలో చేరిన 8 మంది పరిశోధకులకు పీహెచ్డీ ప్రదానం కాగా, ఇంకా 8 మంది పరిశోధకులకు గైడ్గా వ్యవహరిస్తున్నారు. -
నిత్యనూతనం బాలరాజ్ పాఠాలు
రుద్రూర్ : విద్యార్థులకు క్లిష్టమైన విషయాలను సైతం ఎంతో సులభంగా, ఆసక్తికరంగా బోధిస్తూ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు సాంఘిక శాస్త్రం ఉపాధ్యాయుడు నూతిపల్లి బాలరాజ్. రుద్రూర్కు చెందిన బాలరాజ్.. ప్రస్తుతం కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పని చేస్తున్నారు. ఆయన ఇప్పటికే రెండుసార్లు మండల స్థాయి, ఒకసారి జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా పురస్కారాలు అందుకున్నారు. ఆధునిక సాంకేతికతను జోడించి యూట్యూబ్ ద్వారా పాఠ్యాంశాలను డిజిటల్ రూపంలో విద్యార్థులకు చేరువ చేస్తున్నారు. యూట్యూబ్లో సుమారు 21 వేల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఆయన అప్లోడ్ చేసే వీడియోలకు విశేష ఆదరణ లభిస్తోంది. కరోనా సమయంలో విద్యార్థులు చదువు దూరం కాకుండా రాష్ట్ర సాంఘిక శాస్త్ర ఫోరం ఆధ్వర్యంలో వర్క్షీట్లను రూపొందించారు. ఈయన తయారు చేసిన పాఠ్యాంశాల వీడియోలు ’టీ శాట్’ లో ప్రసారమయ్యాయి. ప్రజాస్వామ్య వ్యవస్థపై విద్యార్థులకు ప్రత్యక్ష అవగాహన క ల్పిస్తున్నారు. 2024 రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా విద్యార్థులతో స్వయంగా రాజ్యాంగ ప్రతిని తయారు చేయించగా, ఈ ప్రతిభను గుర్తించిన ఎస్సీఈఆర్టీ తన వార్షిక మ్యాగజైన్లో ప్రత్యేకంగా ప్రచురించింది.


