breaking news
Nizamabad
-
పాస్ పుస్తకాలు ఎప్పుడొస్తాయ్?
● నెలల తరబడి నిరీక్షిస్తున్న రైతులు ● పట్టా పాస్బుక్లు లేకపోవడంతో రుణాలివ్వని బ్యాంకులు ● ఇబ్బందులు పడుతున్న అన్నదాతలుమోర్తాడ్(బాల్కొండ) : పట్టాదారు పాస్ పు స్తకాలు అందక రైతులు అవస్థలు పడుతున్నారు. జిల్లాలో కొత్తగా భూములను కొ నుగోలు చేసిన అనేక మంది పాస్ పుస్త కాల కోసం మూడు, నాలుగు నెలల నుంచి ఎదురుచూస్తున్నారు. వ్యవసా య భూమి రిజిస్ట్రేషన్ సందర్భంగా కొత్త పట్టాదా రు పాస్ పుస్తకం కోసం రూ.300 వసూలు చేస్తున్నా రు. గతంలో పాస్ పుస్తకం ఉన్న వారు భూమిని కొనుగోలు చేస్తే అందులోనే వివరాలను నమోదు చేసి ఇస్తున్నారు. ఒక్కో మండలంలో 5 నుంచి 10 రిజిస్ట్రేషన్లు.. ధరణి పోర్టల్ అమల్లోకి వచ్చిన తర్వాత వ్యవసా య భూములను తహసీల్ కార్యాలయంలోనే రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ చేసిన వెంటనే మ్యు టేషన్ ప్రక్రియను పూర్తి చేసి, రిజిస్ట్రేషన్ పత్రాలు, ప్రొసీడింగ్ కాపీ, డూప్లికేట్ పీపీలను అందిస్తున్నా రు. అనంతరం రిజిస్ట్రేషన్ వివరాలు సీసీఎల్ కార్యాలయం ద్వారా బెంగళూరులోని ఏజెన్సీకి వెళ్తాయి. అక్కడ భూమి కొనుగోలు చేసిన వ్యక్తి పేరిట కొత్త పాస్ పుస్తకం ముద్రించి పోస్టులో ఇంటికి పంపిస్తారు. జిల్లాలోని చిన్న మండలాల్లో రోజుకు ఐదు, పెద్ద మండలాల్లో 10 చొప్పున రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ఇలా గత నాలుగైదు నెలల నుంచి రిజిస్ట్రేషన్లు చేయించుకున్న సుమారు వెయ్యి మందికి ఇప్పటి వరకు పట్టా పాస్ పుస్తకాలు అందలేదు. బ్యాంకర్ల విముఖత కొత్తగా భూములు కొనుగోలు చేసిన వారు పంట రుణాలు తీసుకునేందుకు ఇబ్బందులు పడుతున్నా రు. తహసీల్ కార్యాలయంలో ఇచ్చే రిజిస్ట్రేషన్ ప త్రాలు, ప్రొసీడింగ్ కాపీలను చూపినా పంట రుణా లు ఇచ్చేందుకు బ్యాంకర్లు విముఖత చూపుతున్నా రు. వాస్తవానికి భూ భారతి వెబ్పోర్టల్లో రైతు వి వరాలను పరిశీలించి పంట రుణం ఇవ్వాలని ప్ర భుత్వం నిబంధన విధించింది. కానీ, బ్యాంకర్లు మాత్రం ఉన్నతాధికారుల సూచనల ప్రకారం పట్టా పాస్ పుస్తకం పరిశీలన తర్వాతే రుణాలు ఇస్తామని స్పష్టం చేస్తున్నారు. వ్యవసాయ భూమి రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి వెంటనే ప్రొసీడింగ్ కాపీ, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఇస్తున్నాం. రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ ప్రక్రియ పూర్తి చేసి ఆన్లైన్లో వివరాలను నమోదు చేస్తున్నాం. పాస్ పుస్తకం లేకపోయినా ఆన్లైన్లో వివరాలను పరిశీలించి బ్యాంకర్లు పంట రుణాలు ఇవ్వాలి. పాస్ పుస్తకాలు పోస్టులో రావడానికి కొంత సమయం పడుతుంది. – కృష్ణ, తహసీల్దార్, మోర్తాడ్ఏర్గట్ల మండలం తొర్తి గ్రామానికి చెందిన రైతు నవీన్ ఎకరం వ్యవసాయ భూమిని కొనుగోలు చేసి తహసీల్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. తహసీల్దార్ ప్రొసీడింగ్ కాపీ, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ అందజేశారు. కొత్త పట్టాపాస్ పుస్తకం పోస్టులో వస్తుందని చెప్పగా, నెల రోజులు గడచినా ఇంకా రాలేదు. రైతు తహసీల్ కార్యాలయంలో అడిగితే అది తమ పరిధిలో లేదని సమాధానం ఇచ్చారు. -
గొంతు నొక్కాలని చూస్తే ప్రజలే గుణపాఠం చెబుతారు
ఏపీలో ప్రజాస్వామ్యానికి పాతర వేస్తున్నా రని ఇప్పటి చర్యల వల్ల అర్థం అవుతోంది. జర్నలిస్టు లు వారి బాధ్యతల ను వారు సక్రమంగా నిర్వహిస్తే క్రిమినల్ కేసులు న మోదు చేయడం సరికాదు. ప్రజల గొంతుకగా ఉ న్న జర్నలిస్టులపై కేసులు నమోదు చేస్తే ప్రజలే గు ణపాఠం చెబుతారు. ఉమ్మడి ఏపీలో చంద్రబాబు కు రెండుసార్లు ప్రజలు గుణపాఠం చెప్పిన విష యం మరిచిపోయినట్లు ఉన్నారు. ప్రజల సంక్షేమ కార్యక్రమాలపై కాకుండా పగతో ఊగిపోవడం సరికాదు. – తక్కూరి సతీష్, జిల్లా టెలికం బోర్డు మాజీ సభ్యుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మోర్తాడ్ -
రోగుల బారులు..
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని జీజీహెచ్లో ఓపీ వద్ద బారులు తీరిన రోగులుఇటీవల కురిసిన వర్షాల వల్ల సీజనల్ వ్యాధుల ప్రభావంతో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో గురువారం 2,156 మంది అవుట్ పేషెంట్లు నమోదయ్యారు. జ్వరాలు, దగ్గు, వాంతులు, విరేచనాలతో ఆస్పత్రికి వస్తున్నారు. ఒకే రోజు రెండువేలకుపైగా ఓపీ నమోదు కావడం ఈనెలలో తొలిసారి అని ఆస్పత్రి అధికారులు పేర్కొన్నారు. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, నిజామాబాద్ -
మృత్యు అంచున చేపపిల్లలు
బాల్కొండ: జిల్లాలో చేప పిల్లల పంపిణీ ప్రక్రియ సందిగ్ధంలో పడింది. టెండర్ల నిర్వహణలో జాప్యం కారణంగా మత్స్యకారులకు చేపపిల్లల సరఫరా ఆలస్యమవుతోంది. దీంతో ఎస్సారెస్పీ దిగువన ఉన్న జాతీయ చేప పిల్లల ఉత్పత్తి కేంద్రంలో చేపపిల్లల సైజు పెరిగి కుండీల్లో ఇమడలేక చనిపోయే ప్రమాదం నెలకొంది. 180 చెరువులు, 65 సంఘాలు.. ఎస్సారెస్పీ చేపపిల్లల ఉత్పత్తి కేంద్రం పరిధిలో నందిపేట్, బాల్కొండ, ముప్కాల్, మెండోరా, ఏర్గట్ల, మోర్తాడ్, కమ్మర్పల్లి మండలాల్లోని 180 చెరువులు, 65 మత్స్య సహకార సంఘాలు ఉన్నాయి. అయితే ప్రస్తుత సంవత్సరం 54 లక్షల చేపపిల్లల ఉత్పత్తి లక్ష్యంగా అధికారులు నిర్ణయించారు. కాగా 30 లక్షల చేప పిల్లలను ఉత్పత్తి చేసి నర్సరీల్లో వేశారు. సాధారణంగా 35–40 ఎంఎం సైజు పెరగగానే చేప పిల్లలను చెరువుల్లో వదలాలి. ఇప్పటి వరకు చేపపిల్లలు మత్స్యసహకార సంఘాలకు చేరలేదు. దీంతో నర్సరీల్లోని చేప పిల్లల సైజు 80–100 ఎంఎంకు చేరుకుంటోంది. తద్వారా నర్సరీ కుండీల్లో చేపపిల్లలకు స్థలం సరిపడక చనిపోయే ప్రమాదం నెలకొంది. మరోవైపు చేపపిల్లలకు దాణా కూడా సరిపోయే పరిస్థితి లేదు. దీంతో చేపపిల్లలు చేతికందకుండా పోతాయని మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టెండర్లతో లింకు వద్దురాష్ట్ర వ్యాప్తంగా చెరువులు, ప్రాజెక్ట్లకు ప్రభుత్వం నీలి విప్లవంలో భాగంగా ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేస్తుంది. ఇందుకోసం టెండర్లను నిర్వహిస్తారు. టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ చేపపిల్లలను సరఫరా చేస్తారు. అయితే ఇప్పటి వరకు టెండర్లు పూర్తికాలేదు. ఆ టెండర్లకు, ఉత్పత్తి కేంద్రంలోని చేపపిల్లలకు లింకు పెట్టడంతో పంపిణీకి నోచు కోవడం లేదు. టెండర్లు కూడా ఇప్పట్లో పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు. టెండర్లకు సంబంధం లేకుండా త్వరగా చేపపిల్లలను పంపిణీ చేయాలని మత్స్యకారులు డిమాండ్ చేస్తున్నారు.కేంద్రంలోని చేప పిల్లలకు సరిపడా దాణా అందించలేకపోతున్నాం. సైజ్ ఎక్కువగా పెరిగినట్లు ఉన్నతాధికారులకు నివేదించాం. ఆదేశాలు రాగానే చేపపిల్లల పంపిణీ చేపడతాం. – దామోదర్, మత్స్య అభివృద్ధి అధికారి, పోచంపాడ్ ఉత్పత్తి కేంద్రంలోనే చేప పిల్లలు సైజు పెరిగి కుండీల్లో ఇమడని వైనం సరిపడా ఆహారం అందించలేకపోతున్న అధికారులు చేప పిల్లలు పంపిణీ చేయాలని మత్స్యకారుల డిమాండ్ టెండర్ల జాప్యంతో ఇబ్బందులు -
అప్రజాస్వామిక పద్ధతులు విడనాడాలి
పత్రికలు, మీడియాపై దాడులు చేయడమంటే పత్రికా స్వే చ్ఛను హరించడమే అవుతుంది. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒ క్కరి హక్కులను కాపా డాల్సిన బాధ్యత ప్రభుత్వా లపైనే ఉంటుంది. కుట్రతో అక్రమ కేసులు బనాయించడం, భయభ్రాంతులకు గురిచేయడం ప్రజాస్వా మ్య విరుద్ధం. చట్టసభలు, పత్రికలు, బ్యూరోక్రాట్లు ప్రధాన అంగాలు. వీటిలో ఏ ఒక్కటి దెబ్బతిన్నా ప్రజాస్వామ్య వ్యవస్థ దెబ్బతింటది. ప్రభుత్వాలు అప్రజాస్వామిక పద్ధతులు విడనాడాలి. పత్రికలపై దాడులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. – ఎ.రమేష్బాబు, సీపీఎం జిల్లా కార్యదర్శి -
బ్యాక్టీరియా బారిన వరి
డొంకేశ్వర్(ఆర్మూర్): చిరు పొట్ట దశకు వచ్చిన వరి పంటపై ఎండాకు తెగులు బ్యాక్టీరియా దాడి చేస్తోంది. మోతాదుకు మించి యూరియా వాడకం, తీవ్రమైన ఎండలు, అధిక వానలతో ఎండాకు తెగులు సోకే అవకాశం ఉందని వ్యవసాయాధికారులు చెప్తున్నారు. దీనిని నివారించే మందులు లేకపోగా.. ఒక మొక్కనుంచి మరో మొక్కకు వ్యాపించకుండా యాంటీ బయాటిక్స్ రసాయనిక మందులు పిచికారీ చేయడమే మార్గమని సూచిస్తున్నారు. 4,34,695 ఎకరాల్లో సాగు.. ఖరీఫ్ సీజన్లో జిల్లా వ్యాప్తంగా 4,34,695 ఎకరాల్లో రైతులు వరిని సాగు చేస్తున్నారు. ప్రస్తుతం పొలాలన్నీ చిరు పొట్ట దశకు చేరుకున్నాయి. విత్త నాలు బయటికి వచ్చే సమయంలో ఎండాకు తెగు లు సోకడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మొక్క పైభాగంలో తెచ్చటి మచ్చలు ఏర్పడి ఆకు లు పూర్తిగా ఎండిపోతున్నాయి. ఇది ఒకటి, రెండు మొక్కలతో మొదలై పొలమంతా వ్యాపిస్తోంది. త ద్వారా దిగుబడిపై ప్రభావం పడుతుంది. అయితే, ఇటీవల కురిసిన భారీ వర్షాలు, ఆ వెంటనే తీవ్రమైన ఎండలతో వాతావరణం నిలకడగా లేదు. దీనికి తోడు రైతులు పరిమితికి మించి యూరియా చల్లారు. వాస్తవానికి ఎకరానికి మూడు డోసులు కలిపి రెండు నుంచి మూడు బస్తాలు సరిపోతుంది. కానీ, రైతులు పొలం త్వరగా ఎదగాలనే ఉద్దేశంతో ఎకరానికి నాలుగైదు, అంతకుమించి బస్తాల యూరియా వేశారు. దీంతో తెగుళ్లు, చీడపీడలు సోకుతున్నాయని వ్యవసాయాధికారులు పేర్కొంటున్నారు. పంటకు సోకిన బ్యాక్టీరియా పూర్తిగా వ్యాపించకుండా రైతులు యాంటీ బయాటిక్స్ మందులను స్ప్రే చేస్తున్నారు. ఎండాకు తెగులు వ్యాప్తిని అరికట్టే యాంటీ బయా టిక్స్ రసాయనాలు అందుబాటులో ఉన్నాయి. అగ్రి మైసన్ లేదా ప్లాంటమైసిన్తో కాపర్ ఆక్సిక్లోరైడ్ పిచికారీ చేయాలి. సొంత నిర్ణయాలు తీసుకోవద్దు. స్థానిక వ్యవసాయాధికారులను రైతులు సంప్రదించాలి. పూత దశలో ఉన్నప్పుడు కాపర్ సంబంధిత శీలింధ్ర నాశినులు వాడొద్దు. – మధుసూదన్, ఏవో, డొంకేశ్వర్ చిరు పొట్ట దశలో సోకిన ఎండాకు తెగులు అధిక యూరియా, వాతావరణ మార్పులే కారణమంటున్న వ్యవసాయ అధికారులు విస్తరించకుండా యాంటీబయాట్సిక్ వినియోగిస్తున్న రైతులు -
బిల్లులు సకాలంలో చెల్లించాలి
● అధికారులకు కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆదేశం ● సిరన్పల్లిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పరిశీలన నవీపేట: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ బిల్లులను సకాలంలో చెల్లించాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. నవీపేట మండలంలోని సిరన్పల్లి గ్రామంలో గురువారం ఆయన పర్యటించి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. లబ్ధిదారులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. గ్రామంలో 93 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా 69 గ్రౌండింగ్ అయ్యాయని, 12 ఇళ్లు స్లాబ్ దశకు చేరుకున్నాయన్నారు. ఇంకా 24 మంది లబ్ధిదారులతో మాట్లాడి వెంటనే నిర్మాణాలను ప్రారంభించాలని సూచించారు. ప్రభుత్వ కార్యాలయాల తనిఖీ నవీపేటలోని ఎంపీడీవో, తహసీల్ కార్యాలయాల ను కలెక్టర్ తనిఖీ చేశారు. గ్రామాలలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల వేగాన్ని పెంచేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. పెండింగ్లో ఉన్న భూభారతి అర్జీలను పరిశీలించాలన్నారు. అదనపు కలెక్టర్ కిరణ్కుమార్, హౌసింగ్ పీడీ పవన్కుమార్, ఎంపీడీవో నాగనాథ్, తహసీల్దార్ వెంకట రమణ ఉన్నారు. -
కొండ చిలువ పట్టివేత
నందిపేట్(ఆర్మూర్): మండలంలోని అయిలాపూర్ గ్రామంలో గురువారం 9 అడుగుల కొండ చిలువను పట్టుకున్నారు. అయిలాపూర్ గ్రామంలోని ప్రధాన రహదారి వెంబడి గల డ్రెయినేజీలో అలికిడి రావడంతో గ్రామస్తులు చూడగా భారీ పాముగా గుర్తించారు. వెంటనే నందిపేటకు చెందిన పాములు పట్టే సర్వర్కు సమచారం అందించారు. వెంటనే సర్వర్ అయిలాపూర్కు చేరుకుని గ్రామస్తుల సహకారంతో డ్రెయినేజీలోని కొండ చిలువను పట్టుకుని రోడ్డుపై పడవేశాడు. కొంతసేపు కొండచిలువ అటుఇటుగా తిరగడంతో గ్రామస్తులు భయంతో కేకలు వేశారు. చివరికి దానిని అదుపులోకి తీసుకుని సంచిలో వేశాడు. పట్టుకున్న కొండ చిలువను అటవీ ప్రాంతంలో వదిలేయనున్నట్లు సర్వర్ వివరించాడు. -
గోదావరిలోకి నిలిచిన నీటి విడుదల
బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లోకి ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు తగ్గుముఖం పట్టడంతో ప్రాజెక్ట్ నుంచి వరద గేట్ల ద్వారా నీటి విడుదలను ప్రాజెక్ట్ అధికారులు గురువారం ఉదయం నిలిపివేశారు. బుధవారం రాత్రికి ప్రాజెక్ట్లోకి వరద నీరు పోటెత్తడంతో గోదావరిలో 75 వేల క్యూసెక్కుల నీటిని వదిలారు. తర్వాత క్రమంగా నీటి విడుదలను తగ్గించారు. గురువారం ఉదయం పూర్తిగా నీటి విడుదలను నిలిపి వేశారు. ప్రస్తుత సంవత్సరం ఇప్పటి వరకు ప్రాజెక్ట్లోకి 385 టీఎంసీల నీరు వచ్చి చేరింది. అందులో 245 టీఎంసీల నీటిని గోదావరిలోకి వదిలారు. ప్రాజెక్ట్ నుంచి వరద కాలువ ద్వారా 19 వేల క్యూసెక్కులు , సరస్వతి కాలువ ద్వారా 800 క్యూసెక్కులు, కాకతీయ కాలువ ద్వారా 5500 క్యూసెక్కులు, ఎస్కెప్ గేట్ల ద్వారా 2500 క్యూసెక్కులు, లక్ష్మి కాలువ ద్వారా 200 క్యూసెక్కులు, గుత్ప లిప్టు ద్వారా 270 క్యూసెక్కులు, అలీసాగర్ లిప్టు ద్వారా 360 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 684క్యూసెక్కులు, మిషన్ భగీరథ ద్వారా తాగునీటి అవసరాల కోసం 231 క్యూసెక్కుల నీరు పోతుంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091(80.5 టీఎంసీలు) అడుగులు కాగా గురువారం సాయంత్రానికి అంతేస్థాయి నీటిమట్టంతో ప్రాజెక్ట్ నిండుకుండలా ఉందని ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు. -
యువకుడి అదృశ్యం
ఖలీల్వాడి: నగరంలోని వినాయక్ నగర్కు చెందిన కాంపెల్లి రాము అదృశ్యం అయినట్లు నాలుగో టౌన్ ఎస్సై శ్రీకాంత్ గురువారం తెలిపారు. వినాయక్ నగర్లోని అంగిటి హోటల్ వద్ద రాము అదృశ్యమయ్యాడని, అతడి మానసిక స్థితి బాగాలేదని సోదరుడు తిరుపతి పేర్కొన్నాడు. తిరుపతి ఫిర్యాదు మేరకు కేసు, నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. ఎవరికై నా రాము ఆచూకీ తెలిస్తే 8712659840, 8712659836కు సమాచారం అందించాలని ఎస్సై తెలిపారు. అక్రమ మద్యం స్వాధీనం మోర్తాడ్: భీమ్గల్ మండలం బాబాపూర్లో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ఇద్దరిని అరెస్టు చేసినట్లు ఎకై ్సజ్ ఎస్సై గోవర్ధన్ గురువారం తెలిపారు. బాబాపూర్కు చెందిన జంగిటి నరేష్, సుమలత వద్ద 7.92 లీటర్ల అక్రమ మద్యంను స్వాధీనం చేసుకున్నామని, వారిపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. అక్రమ మద్యం స్వాధీనం ఘటనలో సిబ్బంది దత్తాద్రి, శ్రీనివాస్రెడ్డి, జగదీష్, రాణిలు పాల్గొన్నారని ఆయన వెల్లడించారు. బోధన్ ఎస్బీఐలో రూ. 5లక్షల నగదు చోరీ బోధన్టౌన్(బోధన్): పట్టణంలోని ఎస్బీఐ బ్యాంకులో రూ. 5లక్షలు చోరీ జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పట్టణ సీఐ వెంకటనారాయణ తెలిపిన వివరాలు ఇలా.. పట్టణంలోని ఎస్బీఐ బ్యాంకులో ఈ నెల 8న బ్యాంకు కార్యకలాపాలు నిర్వహిస్తున్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు కౌంటర్ నుంచి రూ. 5లక్షలను చోరీ చేశారు. ఈ విషయాన్ని బ్యాంకు అధికారులు 10వ తేదీన గుర్తించగా, పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారని సీఐ గురువారం తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. బ్యాంకు కార్యాకలాపాలు జరిగే సమయంలో బ్యాంకు అధికారులు ఎవరు ఏమి చేస్తున్నారో గమనించాలని, బ్యాంకు సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సీఐ తెలిపారు. -
క్రైం కార్నర్
ట్రాక్టర్ బోల్తాపడి ఇద్దరు జీపీ కార్మికుల మృతి ● విద్యుత్ స్తంభాలు తరలిస్తుండగా ఘటన బోధన్రూరల్: బోధన్ మండలం బిక్నెల్లీ గ్రామ పంచాయతీ ట్రాక్టర్లో విద్యుత్ స్తంభాలను తరలిస్తుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తా పడి ఇద్దరు జీపీ కార్మికులు అక్కడిక్కడే మృతి చెందారు. స్థానికులు, అధికారులు తెలిపిన వివరాలు ఇలా.. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా బిక్నెల్లీ గ్రామ శివారులోని పొలాల్లో విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నాయి. దీంతో కొత్త స్తంభాలను తీసుకురావడానికి జీపీ డ్రైవర్ రాజు (అవుట్ ఓర్సింగ్), జీపీ కార్మికులు బాగారే బాలాజీ (42) (మల్లీపర్పస్ వర్కర్), బాగారే యాదు (40) (ఔట్సోర్సింగ్ వర్కర్) గురువారం రాంపూర్ సబ్సేష్టన్కు వెళ్లారు. అక్కడి నుంచి ట్రాక్టర్పై విద్యుత్ స్తంభాలను తీసుకొని గ్రామానికి బయలుదేరారు. కల్దుర్కి శివారులో ఓవర్ లోడ్ కారణంతో ట్రాక్టర్ బోల్తాపడింది. ఈ ఘటనలో ట్రాక్టర్ను నడిపిస్తున్న రాజు గాయాలతో బయటపడగా, ట్రాలీలో ఉన్న బాగారే బాలాజీ, బాగారే యాదుపై స్తంభాలు పడటంతో అక్కడిక్కడే మృతి చెందారు. బోధన్ రూరల్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను బోధన్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. జీపీ కార్యదర్శి సుధాకర్ ఆదేశాల మేరకే జీపీ సిబ్బంది ట్రాక్టర్లో స్తంభాలను తరలించారని ప్రచారం జరుగగా, ఘటనపై వివరాల కోసం జీపీ కార్యదర్శిని ఫోన్లో సంప్రదించగా ఆయన స్పందించలేదు. గుండెపోటుతో టీఏ మృతి బాల్కొండ: మండల కేంద్రంలో ఉపాధి హామీ పథకం టెక్నికల్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్న ధనుంజయ్(45) గుండెపోటుతో మృతిచెందారు. విధుల్లో భాగంగా గురువారం ధనుంజయ్ బైక్పై బస్సాపూర్ గ్రామానికి బయలుదేరాడు. గ్రామంలో పర్యటిస్తుండగా అస్వస్థతకు గురై గుండెపోటు వచ్చింది. వెంటనే స్థానికులు అతడిని చికిత్సకు తరలించేలోపు మృతి చెందాడు. సమయానికి జీతాలు రాక ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఒత్తిడికి గురికావడంతోనే ధనుంజయ్కి గుండెపోటు వచ్చిందని తోటి ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రియుడు మోసం చేశాడని ఆత్మహత్య ఎల్లారెడ్డి: ప్రియుడు మోసం చేయడంతో మనస్తాపం చెందిన ప్రియురాలు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని సబ్దల్పూర్ గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై మహేష్ తెలిపిన వివరాలు ఇలా.. సబ్దల్పూర్ గ్రామానికి చెందిన బత్తుల సావిత్రి (20) బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కొద్దిసేపటికి తండ్రి రాంచందర్ ఇంటికి రాగా, ఉరివేసుకున్న కూతురును చూసి బోరున విలపించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని, వివరాలు సేకరించారు. సావిత్రికి లింగంపేట మండలం శెట్పల్లి సంగారెడ్డికి చెందిన ఓ యువకుడితో ప్రేమ వ్యవహారం కొనసాగుతున్నదని, అతడు నిరాకరించడంతోనే ఆత్మహత్యకు పాల్పడిందని మృతురాలి తండ్రి రాంచందర్ ఫిర్యాదు చేశాడు. ఈమేరకు కేసు నమోదు చేసుకొని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎల్లారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు ఎస్సై తెలిపారు. మద్యానికి బానిసై యువకుడు.. నిజామాబాద్ రూరల్: రూరల్ పోలీస్స్టేషన్ పరిధిలోని గూపన్పల్లిలో ఓ వ్యక్తి మద్యానికి బానిసై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రూరల్ ఎస్హెచ్వో ఆరీఫ్ తెలిపిన వివరాలు ఇలా.. గూపన్పల్లికి చెందిన చింతకుంట రాజు(30) ఆటోడ్రైవర్గా జీవనం కొనసాగిస్తున్నాడు. కొన్నిరోజులుగా రాజు ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యల కారణంగా తాగుడుకు బానిసయ్యాడు. ఈక్రమంలో గురువారం తీవ్ర మనస్తాపానికి గురై, ఇంటిలో ఎవరు లేని సమయంలో రాజు ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి తల్లి గంగామణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్హెచ్వో వివరించారు. -
బీసీ రిజర్వేషన్కు కట్టుబడి ఉన్నాం
● ఈనెల 15న కామారెడ్డిలో జరిగే బహిరంగసభను విజయవంతం చేయాలి ● డీసీసీ అధ్యక్షుడు, సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్రెడ్డి నిజామాబాద్ సిటీ: కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్కు కట్టుబడి ఉందని, కామారెడ్డి డిక్లరేషన్ ప్రకా రం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని డీసీసీ అధ్యక్షుడు, సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ భవన్లో గురువారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా మానాల మాట్లాడుతూ.. జనాభా ప్రకారం రిజ ర్వేషన్లు అమలు చేయాలన్న ఏఐసీసీ అగ్రనేత రా హుల్గాంధీ ఆలోచనకు అనుగుణంగా రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లు అమలుచేస్తున్నామన్నారు. బీసీ రి జర్వేషన్లపై అసెంబ్లీలో జరిగిన చర్చకు బీజేపీ ఎమ్మెల్యేలు మద్ధతు పలికితే, బీజేపీ ఎంపీలు మాత్రం రిజర్వేషన్లను అడ్డుకుంటున్నారని, ద్వంద్వ నీతిని అవలంభిస్తున్నారని మండిపడ్డారు. యూరియా కొ రతకు కేంద్రప్రభుత్వానిదే బాధ్యత అన్నారు. యూ రియా కొరత జిల్లాలో పెద్దగా లేదన్నారు. బీసీల రిజర్వేషన్ల నుంచి ముస్లింలను తీసివేయాలని బీజే పీ ఎంపీలు వితండవాదం చేస్తున్నారన్నారు. బీసీ రిజర్వేషన్లు ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, పీ సీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రివర్గానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈనెల 15న కామారెడ్డిలో ముఖ్యమంత్రి హాజరయ్యే బీసీ గర్జనను విజయవంతం చేయాలని కోరారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి, ఓబీసీ అధ్యక్షుడు రాజనరేందర్ గౌడ్, జిల్లా ఎస్టీసెల్ అధ్యక్షుడు కెతావత్ యాదగిరి, సీనియర్ నాయకులు మహ్మద్ ఖుద్దూ స్, ప్రమోద్ కుమార్, వేణురాజ్, బోదిరే స్వామి, కేశ మహేష్, తిప్పిరెడ్డి శ్రీనివాస్, ఈసా, అబ్దుల్ ఎ జాజ్, సుభాష్ జాదవ్, సంగెం సాయిలున్నారు. -
విద్యారంగంలో తెయూ గణనీయమైన ప్రగతి
● వీసీ యాదగిరిరావు ● ఘనంగా వర్సిటీ ఆవిర్భావ దినోత్సవం తెయూ(డిచ్పల్లి):విద్యారంగంలో తెలంగాణ యూ నివర్సిటీ గణనీయమైన ప్రగతి సాధించిందని తె యూ వీసీ యాదగిరిరావు అన్నారు. క్యాంపస్ ఆవరణలో గురువారం తెలంగాణ యూనివర్సిటీ ఆవి ర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వీసీ యాదగిరిరావు, రిజిస్ట్రార్ యాదగిరితో కలిసి కేక్ కట్ చేసి సంబురాలు జరుపుకున్నారు. అనంతరం వీసీ మాట్లాడుతూ.. తెలంగాణ యూనివర్సిటీ 11 సెప్టెంబర్ 2006న 6 కోర్సులు, 12 మంది రెగ్యులర్ అధ్యాపకులతో ప్రారంభం కా గా, గడిచిన 19 ఏళ్లలో రాష్ట్రంలో మూడో అతిపెద్ద యూనివర్సిటీగా పరిణామం చెందడం గర్వకారణంగా ఉందన్నారు.ప్రస్తుతం 60 మందికి పైగా రెగ్యులర్ అధ్యాపకులు, 50 మందికి పైగా కాంట్రా క్టు అధ్యాపకులు, 13 మంది నాన్ టీచింగ్ సిబ్బంది, 275 మంది అవుట్ సోర్సింగ్ సిబ్బంది, మూడు క్యాంపస్లలో 31 కోర్సులకు విస్తరించిందన్నారు. అందరి సహకారంతో రాబోయే రోజుల్లో మరిన్ని కోర్సులను తెలంగాణ యూనివర్సిటీలో ప్రారంభించేందుకు కృషి చేస్తామన్నారు. కంట్రోలర్ సంపత్ కుమార్, యూజీసీ కోఆర్డినేటర్ ఆంజనేయు లు,ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపాల్ సీహెచ్ ఆరతి, అధ్యాపకులు అపర్ణ,రవీందర్రెడ్డి,ఎల్లోసా,అతీక్ సుల్తాన్ ఘోరి,సత్యనారాయణరెడ్డి,వాణి,భ్రమరాంబిక,స్రవంతి,నీలిమ,అసిస్టెంట్ రిజిస్ట్రార్ సా యాగౌడ్, ఏఈ వినోద్, తదితరులు పాల్గొన్నారు. -
కుక్కర్ పేలి ఎండీఎం కార్మికురాలికి గాయాలు
మాక్లూర్: పాఠశాలలో మధ్యాహ్న భో జనం (ఎండీఎం) వండుతున్న కార్మికురాలికి తీవ్ర గాయాలు అయ్యాయి. వివరాలు ఇలా.. మండలంలోని అమ్రాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బుధవారం మధ్యాహ్నం రాంపూర్ లలిత అనే కార్మికురాలు వంట చేస్తుండగా ప్రమాదవశాత్తు కుక్కర్ పేలింది. దీంతో కుక్కర్లోని పప్పు ముఖంపై చిల్లి తీవ్రంగా గాయపడింది. ఉపాధ్యాయులు వెంటనే గమనించిన ఆమెను చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం ఆమె కుటుంబ సభ్యులు ప్రయివేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతంలలిత ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు కుటుంబసభ్యులు తెలిపారు. విషయం తెలిసిన ఏఐటీయూసీ, మధ్యాహ్న భోజన కార్మిక సంఘం నాయకులు గురువారం ఆస్పత్రిలో లలితను పరామర్శించారు. లలిత వైద్యఖర్చులన్ని జిల్లా విద్యాశాఖ భరించాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఓమయ్య, మధ్యాహ్న భోజన కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చక్రపాణి డిమాండ్ చేశారు. లేనిచో జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. గోడ కూలి వృద్ధ దంపతులకు .. మద్నూర్(జుక్కల్): మండలంలోని హండేకేలూర్లో ఇంట్లోని గోడ కూలడంతో వృద్ధ దంపతులకు గాయాలయ్యాయి. వివరాలు ఇలా.. హండేకేలూర్లోని ఇంట్లో తుమ్మల్వార్ హన్మండ్లు, రుక్మిణీబాయి అనే వృద్ధ దంపతులు నివాసం ఉంటున్నారు. గురువారం ప్రమాదవశాత్తు ఇంట్లోని గోడ కూలి వారిపై పడటంతో గాయపడ్డారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ ముజీబ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దరాస్ సాయిలు ఘటన స్థలానికి చేరుకొని, బాధితులను చికిత్స నిమిత్తం మద్నూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కొన్ని రోజుల క్రితం భారీ వర్షాలు కురవడంతో హన్మండ్లు ఇంటి గోడ నాని తడిసిపోవడంతో కూలిపోయిందని స్థానికులు తెలిపారు. వర్షాలకు దెబ్బతిన్న ఇళ్లలో ఉండరాదని, ప్రమాదాన్ని కొనితెచ్చుకోవద్దని దరాస్ సాయిలు సూచించారు. గ్రామంలో శిథిలావస్థకు చేరిన ఇళ్లను పరిశీలించారు. బైక్ను ఆటో ఢీకొనడంతో దంపతులకు.. ఖలీల్వాడి: నగరంలోని కుమార్గల్లీ వద్ద ఆటో, బైక్ను ఢీకొడంతో ఇద్దరికి గాయాలైన్నట్లు ఒకటో టౌన్ ఎస్హెచ్వో రఘుపతి తెలిపారు. వివరాలు ఇలా.. నగరంలోని కుమార్గల్లీ వద్ద బైక్పై సాయిలు, అతడి భార్య వెళుతుండగా వెనుక నుంచి ఆటో వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో సాయిలు, అతడి భార్యకు తీవ్రగాయాలు అయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్హెచ్వో తెలిపారు. -
చిత్రం.. సందేశాత్మకం
ఆర్మూర్లోని రోడ్డు పక్కన గోడలపై వేసిన చిత్రాలుఆర్మూర్టౌన్ : మొన్నటి వరకు కళావిహీనంగా కనిపించిన గోడలు.. ప్రస్తుతం సందేశాత్మక చిత్రా లతో ఆకట్టుకుంటున్నాయి. ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రితోపాటు వివిధ కార్యాలయాలు, కూరగాయల మార్కెట్ ప్రహరీలు కొత్తందాలను సంతరించుకుంటున్నాయి. సర్కారీ గోడలపై అద్భుతమైన పెయింటింగ్స్ వేస్తూ పట్టణ పురపాలక సంస్థ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చు ట్టింది. రూ. 4 లక్షలతో శుభ్రత, పారిశుద్ధ్యం, ప ర్యావరణ పరిరక్షణ, మాదక ద్రవ్యాలను మాన్పించడం, తెలంగాణ సంస్కృతి, రైతుల గౌరవం వంటి అంశాలు ప్రతిబింబించేలా చిత్రాలను గీయిస్తున్నారు. ఇలాంటి చిత్రాలతో గోడ సమీపంలో చెత్త వేయాలనే ఆలోచన రాదని, అవగాహన సైతం పెరుగుతుందని పుర ప్రజలు చెబుతున్నారు. ఆర్మూర్ పట్టణాన్ని అందంగా మార్చడమే లక్ష్యం. ప్రజల్లో వివిధ అంశాలపై అవగాహన పెంపొందించేందుకు చిత్రాలు వేస్తున్నాం. దీంతో పరిసరాలు శుభ్రంగా ఉంటాయి. చెత్త వేయాలన్న ఆలోచన రాదు. – రాజు, మున్సిపల్ కమిషనర్, ఆర్మూర్ -
గెస్ట్ ఫ్యాకల్టీ నియామకం కోసం ఇంటర్వ్యూలు
తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాలలో మ్యాథమెటిక్స్, ఫిజి క్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్, ఈసీఈ, ఈఈఈ, మెకా నికల్, సివిల్ ఇంజినీరింగ్ సబ్జెక్టులు బోధించటానికి గెస్ట్ ఫ్యాకల్టీ నియామకం కోసం గురువారం అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. సుమారు వందమంది అభ్యర్థులు రాగా, వర్సిటీ పరిపాలన భవనంలోని కాన్ఫరెన్స్ హాల్లో ఉదయం నుంచి ఇంటర్వ్యూలు చేశారు. తెయూ వీసీ యాదగిరిరావు, రిజిస్ట్రార్ యాదగిరి, ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఆరతి విషయనిపుణులను సమన్వయం చేశారు. వివిధ విభాగాల కోఆర్డినేటర్స్ నందిని, అతిక్ సుల్తాన్ ఘోరి, భ్రమరాంభిక, నీలిమ సాంకేతిక సహాయం అందించారు. ప్రశాంతంగా ఎంఈడీ పరీక్షలు తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో కొనసాగుతున్న ఎంఈడీ సెమిస్టర్ పరీక్షలు గురువారం ప్రశాంతంగా జరిగినట్లు అకడమిక్ ఆడిట్సెల్ డైరెక్టర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. ఎంఈడీ 4వ సెమిస్టర్ రెగ్యులర్, 1, 2, 3, 4వ సెమిస్టర్ బ్యాక్లాగ్ పరీక్షల్లో ఒక విద్యార్థికి గానూ ఒకరు హాజరైనట్లు ఆయన తెలిపారు. జాతీయస్థాయి బాస్కెట్బాల్ ఎంపికలకు జిల్లా జట్టు ఖరారు నిజామాబాద్నాగారం: నగరంలోని డీఎస్ఏ మైదానంలో గురువారం జిల్లా బాస్కెట్బాల్ సంఘం ఆధ్వర్యంలో సబ్ జూనియర్ బాలబాలికల జాతీయస్థాయి బాస్కెట్ బాల్ ఎంపికలకు జిల్లా క్రీడాకారులను ఎంపిక చేశారు. బాలుర విభాగంలో 13 మంది, బాలిక విభాగంలో ఏడుగురు ఎంపికయ్యారు. వీరిని ఈనెల 12న హైదరాబాద్లో నిర్వహించే జాతీయ స్థాయి ఎంపిక పోటీలకు పంపనున్నట్లు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బీరెల్లి విజయ్ రావు, బొబ్బిలి నరేష్ రావు, కార్యనిర్వాహక కార్యదర్శి నిఖిల్ తెలిపారు. సంఘ సభ్యులు శ్రీనివాస్, బెనర్జీ , విశాల్, ప్రణీత్, అరుణ్, నవీన్ పాల్గొన్నారు. -
దరఖాస్తులు పెండింగ్లో ఉంచొద్దు
● కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ● మున్సిపల్ అధికారులతో సమీక్ష నిజామాబాద్ సిటీ: మున్సిపల్ కార్పొరేషన్ పాలనపై కలెక్టర్, మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేక అధికారి వినయ్ కృష్ణారెడ్డి దృష్టి సారించారు. బల్దియా పాలన అస్తవ్యస్తంగా మారడంతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. రెండ్రోజుల క్రితం రెవెన్యూ అధికారులతో సమావేశమైన కలెక్టర్ తాజాగా గురువారం టౌన్ ప్లానింగ్ విభాగ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎల్ఆర్ఎస్, బిల్డింగ్ పర్మిషన్, ఆక్రమణల తొలగింపు, పెండింగ్ ఫైళ్లపై ఆరా తీశారు. పెండింగ్ ఫైళ్లను క్లియర్ చేయాలని ఏసీపీలు శ్రీనివాస్, శ్రీధర్రెడ్డిని ఆదేశించారు. ఎల్ఆర్ఎస్ ఫీజు తీసుకున్న వారికి వెంటనే ప్రొసీడింగ్స్ ఇవ్వాలని సూచించారు. సమావేశంలో కమిషనర్ దిలీప్ కుమార్, ఏసీపీలు శ్రీనివాస్, శ్రీధర్రెడ్డిలతోపాటు టీపీవో ప్రదీప్కుమార్, టీపీఎస్లు, టీపీబీవోలు పాల్గొన్నారు. నేడు జిల్లాకు మంత్రి వాకిటి శ్రీహరి ● ఐదు నియోజకవర్గాల్లో విస్తృత స్థాయి సమావేశాలు నిజామాబాద్ సిటీ: రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి శుక్రవారం జిల్లాలో పర్యటించనున్నట్లు డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్రెడ్డి తెలిపారు. నియోజకవర్గస్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొననున్నట్లు పేర్కొన్నారు. ఉదయం 11 గంటలకు నిజామాబాద్ రూరల్, మధ్యాహ్నం 12.30 గంటలకు ఆర్మూర్, 2.30కు బాల్కొండ, 3.45కు బోధన్, సాయంత్రం 5.30 గంటలకు నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ స్థాయి సమావేశాలకు హాజరవుతారు. మంత్రితోపాటు బోధన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యేలు డాక్టర్ భూపతిరెడ్డి, సుదర్శన్రెడ్డి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, నియోజకవర్గ ఇన్చార్జిలు వినయ్రెడ్డి, ముత్యాల సునీల్ రెడ్డి పాల్గొంటారని మానాల పేర్కొన్నారు. ‘సాగర్’ నుంచి 6వేల క్యూసెక్కుల నీటి విడుదల నిజాంసాగర్(జుక్కల్): ఎగువ నుంచి వరద వస్తుండడంతో నిజాంసాగర్ ప్రాజెక్టు ఒక గేటు ఎత్తి మంజీరలోకి నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు గురువారం సాయంత్రం తెలిపారు. ప్రాజెక్టులోకి 6,022 క్యూసెక్కుల ఇన్ఫ్లోగా వస్తుండగా, అదే స్థాయిలో అవుట్ ఫ్లో ఉందన్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1405 అడుగులు (17.8 టీఎంసీలు)కాగా ప్రస్తుతం 1404.99 అడుగుల (17.788 టీఎంసీలు) నీరు నిల్వ ఉంది. -
వాక్ స్వాతంత్య్రంపై దాడి
నూతన ఆర్థిక విధానా లు వచ్చిన తర్వాత కార్మికవర్గ సమస్య లు, రైతాంగ సమస్యలు పెరిగిపోతున్నాయి. వీటికోసం జరుగుతున్న ఉద్యమాలను బయటపెడుతున్న పత్రికలను తమ గుప్పిట్లో పెట్టుకోవడానికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అక్రమకేసులు పెడుతోంది. ఇది ఖచ్చితంగా వాక్ స్వాతంత్య్రంపై దాడిగానే పరిగణిస్తాం. పత్రికా స్వేచ్ఛపై దాడులు చేయడమంటే నాలుగో స్తంభానికి ప్రమాదం పొంచివున్నట్లే. దీనికి ప్రధాన బాధ్యత ప్రభుత్వాలదే. నిర్బంధం, అణచివేతలు ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు. ఇటువంటి అప్రజాస్వామిక చర్యలను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. అక్రమ కేసులను బేషరతుగా రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. – వుప్పల ప్రభాకర్, సీపీఐఎంఎల్ (ప్రజాపంథా) జిల్లాకమిటీ కార్యదర్శి -
అద్దె బస్సులతో ఆదాయం
డొంకేశ్వర్(ఆర్మూర్): సెర్ప్ అందిస్తోన్న రుణంతో మండల సమాఖ్యలు త్వరలోనే అద్దె బస్సులు కొనుగోలు చేసి ఆర్టీసీకి ఇవ్వనున్నాయని జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి సాయాగౌడ్ తెలిపారు. జిల్లా పరిషత్ మీటింగ్ హాల్లో గురువారం జిల్లా సమాఖ్య సమావేశం నిర్వహించారు. డీఆర్డీవో మాట్లాడుతూ ప్రభుత్వం ఒక్కో మండల సమాఖ్యకు రూ.30 లక్షల రుణమిచ్చి బస్సులు కొనుగోలు చేయిస్తుందని, ఈ బస్సులను ఆర్టీసీకి అద్దెకు ఇస్తే నెలకు రూ.70 వేల వరకు ఆదాయం వస్తుందన్నారు. మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీ, సీ్త్రనిధి రుణాలను లక్ష్యానికి అనుగుణంగా పంపిణీ చేయాలన్నారు. మేకలు, గొర్రెలు, పెరటి కోళ్ల పెంపకానికి సీ్త్రనిధి ద్వారా రుణాలు అందజేయాలన్నారు. సమావేశంలో ఏపీడీ మధుసూదన్, డీపీఎంలు నీలిమా, కిరణ్, సంధ్యారాణి, మోహన్, రాజేశ్వర్, జెడ్ఎస్ అధ్యక్షురాలు హేమలత, కార్యదర్శి మమత పాల్గొన్నారు. ● డీఆర్డీవో సాయాగౌడ్ -
భావప్రకటనపై పాశవిక దాడి
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : భావ ప్రకటన స్వేచ్ఛను హరించేలా ఆంధ్రప్రదేశ్లోని చంద్రబా బు ప్రభుత్వం ‘సాక్షి’ ఎడిటర్ ఆర్ ధనంజయ్రెడ్డి, ఇతర పాత్రికేయులపై అక్రమంగా కేసులు బనా యించడంపై అన్ని వర్గాలు ముక్తకంఠంతో ఖండిస్తున్నాయి. 2024 జూన్ లో టీడీపీ ఆధ్వర్యంలోని కూట మి ప్రభుత్వం వచ్చాక పత్రికా స్వేచ్ఛను, ప్రశ్నించే గొంతులను భౌతిక దాడుల ద్వారా, పోలీసులను ఉపయోగించి తప్పుడు కేసులు పెట్టి తీవ్రంగా అణిచివేస్తున్నారు. ప్రజాసమస్యలు, వివి ధ సామాజిక అంశాలపై ప్రతిపక్ష పార్టీల నాయ కులు నిర్వహించిన ప్రెస్మీట్లకు సంబంధించిన వా ర్తలు రాసిన సందర్భంలో ‘సాక్షి’ దినపత్రికతో పా టు ఎడిటర్, ఇతర జర్నలిస్టులపై కేసులు నమోదు చేస్తూ, భావ ప్రకటనా స్వేచ్ఛను తమ గుప్పిట్లోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల పక్షాన పనిచేసే జర్నలిస్టుల గొంతులను నొక్కేస్తున్న అప్రజాస్వామిక చర్యలపై పలువురి స్పందనలు.. పత్రికా స్వేచ్ఛను హరించడం దుర్మార్గం సాక్షి ఎడిటర్, పాత్రికేయులపై అక్రమ కేసుల నేపథ్యంలో పలువురి సంఘీభావం చంద్రబాబు ప్రభుత్వ తీరుపై ఖండన -
సాక్షి జర్నలిస్టులపై దాడులు హేయమైన చర్య
ఆంధ్రప్రదేశ్లో సాక్షి పత్రిక, ఛానల్ కార్యాలయాలతో పాటు జర్నలిస్టులపై రాజకీయ క క్షతో దాడులకు పా ల్పడటం హేయమైన చర్య. పత్రికా వ్యవస్థపై దాడులను జర్నలిస్టు సంఘాలు సహించవు. నిజాలు రాస్తే జీర్ణించుకోలేని పాలకులు ఇలాంటి దాడుల తో రాబోయే తరాలకు ఏం సందేశం ఇస్తున్నారో అ ర్థం కాని పరిస్థితుల్లో సమాజం ఉంది. తప్పులు రాస్తే కోర్టులను ఆశ్రయించే అవకాశం ఉన్నప్పటికీ.. ప్రశ్నించే గొంతుకను అణచివేసేందుకు దాడు లు జరిపినంత మాత్రాన జర్నలిస్టులు భయప డతారని అనుకోవడం భ్రమనే అవుతుంది. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధులుగా వ్యవహరిస్తు న్న జర్నలిస్టులపై దాడులను ప్రతిఒక్కరు ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. – దురిశెట్టి నర్సింహా చారి, సీనియర్ జర్నలిస్టు, నిజామాబాద్ -
అడ్డూఅదుపూ లేని స్కానింగ్ దందా
నిజామాబాద్నాగారం: జిల్లాలో స్కానింగ్ సెంటర్లు ఇష్టారాజ్యాంగా వ్యవహరిస్తూ ప్రజలను దోచుకుంటున్నాయి. ధరల నియంత్రణ లేకపోవడంతో ఒ క్కో సెంటర్లో ఒక్కో రకంగా దోపిడీ కొనసాగుతోంది. రోగుల అత్యవసరాన్ని ఆసరాగా చేసుకుంటూ డబ్బులు వసూలు చేస్తున్నాయి. రిఫరల్ డాక్టర్లకు కమీషన్లు ముట్టజెబుతూ అందినంత దోచేస్తున్నారు. అర్హతలేని వారితో సెంటర్లను నిర్వహిస్తూ లక్షల్లో సంపాదిస్తున్నారు. కన్నెత్తి చూడని అధికారులు.. గర్భిణులతోపాటు కడుపునకు సంబంధించి ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తినా స్కానింగ్ చేయించాల్సిందే. చెస్ట్, గ్యాస్ట్రో, లివర్ తదితర సమస్యలు తెలుసుకునేందుకూ సంబంధిత వైద్యులు స్కానింగ్కు రిఫర్ చేస్తున్నారు. అందులో వచ్చే రిపోర్టు ఆధారంగానే వైద్యులు చికిత్స చేస్తారు. గాయాలు, తలనొప్పి, చెస్ట్, నరాల సమస్య ఎదుర్కొనే రోగులకు ఆర్థో వైద్యులు ఎక్కువగా ఎక్స్ రే, సీటీ స్కాన్, ఎమ్ఆర్ఐలను రాస్తుంటారు. ● ఎక్స్ రే కోసం రూ.500 నుంచి రూ.1200, స్కానింగ్కు రూ.800 నుంచి రూ.2000 వరకు రోగుల నుంచి నిర్వాహకులు వసూలు చేస్తున్నారు. ఇక సీటీస్కాన్, ఎమ్ఆర్ఐల విషయానికొస్తే ఫీజులు వేలల్లో ఉంటున్నాయి. జిల్లా వ్యాప్తంగా 137 స్కానింగ్ సెంటర్లు, 29 ఎక్స్రే, 16 సీటీ స్కాన్, 4 ఎమ్ఆర్ఐలు ఉన్నాయి. పలు సెంటర్లలో ధరల నియంత్రణ పాటించడం లేదు. పేరుకు మాత్రమే ధరల బోర్డు ప్రదర్శిస్తూ ఇష్టారీతిన వసూలు చేస్తున్నారని రోగుల బంధువులు ఆరోపిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న స్కానింగ్ సెంటర్లలో తనిఖీలు చేయాల్సిన వైద్యారోగ్యశాఖ అటువైపు కన్నెత్తి చూడటం లేదనే విమర్శలు వస్తున్నాయి. అంతా రిఫరల్ జిల్లాలో సీనియర్ వైద్యులు సొంతగా ఆస్పత్రులు నడుపుతూ అవసరం ఉంటేనే ఎక్స్రే, స్కానింగ్, సీటీస్కాన్, ఎమ్ఆర్ఐ చేయించుకోవాలని రోగులకు సలహా ఇస్తున్నారు. కానీ, మేనేజ్మెంట్ ఆస్పత్రుల్లోని వైద్యులు మాత్రం ప్రతి చిన్న సమస్యకు ఎక్స్రే, సీటీస్కాన్, స్కానింగ్, ఎమ్ఆర్ఐలు రాస్తున్నారు. ఇలా రిఫరల్ దందా చేస్తూ కొంతమంది వైద్యులు కమీషన్లు తీసుకుంటున్నారని బహిరంగంగా చర్చించుకుంటున్నారు. రూ.1000 ఫీజుకు రూ.200 చొప్పున కమీషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. బోర్డుపై ఓ రేటు.. వసూలు చేసేది మరో రేటు ఎక్స్రే, సీటీస్కాన్, ఎమ్మారైలకీ రిఫరల్ టెక్నీషియన్లుగా జూనియర్ల చెలామణి అంతంత మాత్రంగానే తనిఖీలు తనిఖీలు చేస్తున్నాం.. జిల్లాలోని అన్ని స్కానింగ్ సెంటర్లలో ఇప్పటికే తనిఖీలు చేశాం. పలుమార్లు హెచ్చరించాం. స్కానింగ్ విషయంలో తప్పుడు రిపోర్టులు ఇచ్చినట్లు మా దృష్టికి వస్తే కచ్చితంగా చర్యలు తీసుకుంటాం. సెంటర్లలో మళ్లీ తనిఖీలు చేయిస్తాము. ప్రత్యేక బృందం సైతం తనిఖీలు చేస్తూనే ఉంది. – రాజశ్రీ, జిల్లా వైద్యాధికారి జూనియర్లతోనే నిర్వహణ.. ఎక్స్రే, స్కానింగ్, సీటీస్కాన్, ఎమ్ఆర్ఐ ఏదీ తీ యాలన్నా అనుభవం ఉన్న టెక్నీషియన్ ఉండాలి. డీఎమ్ఐటీ (డిప్లొమా ఇన్ మెడికల్ ఇమేజింగ్ టెక్నాలజీ) కోర్సు చేసి, శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే మల్టీ, సూపర్ స్పెషాలిటీ, పెద్ద పెద్ద ప్రైవేట్ ఆస్పత్రుల్లో టెక్నీషియన్లకు రూ. 35 వేల నుంచి రూ. 50 వేల వరకు వేతనాలు ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో జూనియర్లకు రూ.20 వేల లోపు జీతాలు ఇచ్చి నిబంధనలకు విరుద్ధంగా నడిపిస్తున్నారు. జూనియర్లు ఇచ్చే స్కానింగ్ రిపోర్టులో తేడా వస్తే ఎవరు బాధ్యత వహిస్తారనేది ప్రశ్నార్థకంగా మిగులుతోంది. -
ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి
● కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి నిజామాబాద్అర్బన్: జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగంగా జరిగేలా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి బుధవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో మాట్లాడారు. వివిధ కారణాలతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు ముందుకురాని వారి స్థానంలో అర్హులైన కొత్త లబ్ధిదారులకు ఇళ్లను మంజూరు చేశామని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ఇందిరమ్మ కమిటీల ద్వారా కొత్త లబ్ధిదారులకు తెలియజేస్తూ, అందరూ మార్కింగ్ చేసుకొని నిర్మాణాలు ప్రారంభించేలా ప్రోత్సహించాలన్నారు. లబ్ధిదారులకు సెర్ప్, మెప్మా ద్వారా రుణాలు మంజూరయ్యేలా చొరవ చూపాలన్నారు. డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపు ప్రక్రియను సైతం వేగవంతం చేయాలని, ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా లబ్ధిదారులను గుర్తించి జాబితాలు సమర్పించాలని కలెక్టర్ సూచించారు. పంట పొలాల్లో ఉన్న ఇసుక మేటలను ఉపాధి హామీ కూలీలతో తొలగింపజేయాలన్నారు. పనుల జాతరలో భాగంగా మెటీరియల్ కాంపోనెంట్ కింద మంజూరైన మేజిక్ సోక్పిట్లు, పశువుల కొట్టాలు, వర్మీ కంపోస్ట్ తదితర నిర్మాణ పనులను వెంటనే చేపట్టి, సకాలంలో పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల భవనాలపై సౌర విద్యుత్ పలకాలను ఏర్పాటు చేసేందుకు వీలుగా మరోసారి క్షేత్రస్థాయిలో పరిశీలించి, సమగ్ర వివరాలతో నివేదికలు అందించాలన్నారు. వీసీలో అదనపు కలెక్టర్ అంకిత్, ట్రెయినీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావీ, డీఆర్డీవో సాయాగౌడ్, హౌసింగ్ పీడీ పవన్ కుమార్, ఈఈ నివర్తి, డీపీవో శ్రీనివాస్, డీఏవో గోవిందు తదితరులు పాల్గొన్నారు. -
ఉపాధ్యాయుల సర్దుబాటు
నిజామాబాద్అర్బన్: జిల్లా విద్యాశాఖలో నేటి నుంచి మరోసారి సర్దుబాటు ప్రక్రియ నిర్వహించనున్నారు. గతంలో చేపట్టిన ఉపాధ్యాయుల సర్దుబాటు, ఇటీవల చేపట్టిన పదోన్నతులతో కేటాయింపుల్లో గందరగోళం ఏర్పడింది. దీంతో సర్దుబాటు ప్రక్రియ మళ్లీ మొదటికి వచ్చింది. 182 మందికి పదోన్నతులు.. వారం రోజుల క్రితం విభాగాల వారీగా మొత్తం 182 మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు లభించాయి. వీరిని సీనియారిటీ ప్రకారం పాఠశాలలకు కేటాయించారు. ఐతే, అంతకుముందే జిల్లాలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా 252 మంది టీచర్లను సర్దుబాటు చేశారు. రెండు ప్రక్రియలతో కేటాయింపుల్లో గందరగోళం ఏర్పడింది. పదోన్నతి పొందిన వారు, సర్దుబాటులోని ఉపాధ్యాయులు ఒకే పాఠశాలలకు కేటాయించబడ్డారు. దీంతో సర్దుబాటులో భాగంగా వెళ్లిన టీచర్లను విద్యాశాఖ మళ్లీ వెనక్కి పిలిపించి ఇతర ప్రాంతాలకు సర్దుబాటు చేసే ప్రక్రియ మొదలుపెట్టింది. పదోన్నతి పొందిన వారు వారికి కేటాయించిన పాఠశాలల్లోనే ఉండేలా ఆదేశాలు జారీ చేశారు. కాగా, 46 మంది టీచర్లు పదోన్నతులను తిరస్కరించారు. దీంతో వీరిని పక్కనపెట్టి 136 టీచర్లకు సర్దుబాటు ప్రక్రియ చేపట్టనున్నారు. ఐతే, పదోన్నతులు తిరస్కరించిన టీచర్ల స్థానంలో అంతకుముందే సర్దుబాటులో వెళ్లిన టీచర్లు విధులు నిర్వర్తించనున్నారు. కాగా, మరోసారి సర్దుబాటు ప్రక్రియ నిర్వహించేందుకు నిజామాబాద్, బోధన్, ఆర్మూర్ ఎంఈవోలతో కమిటీని ఏర్పాటు చేశారు. వీరు నేటి నుంచి సర్దుబాటు ప్రక్రియ చేపట్టనున్నారు. అవసరమైన పాఠశాలలకు.. పదోన్నతి పొందిన టీచర్లకు పాఠశాలలు కేటాయించాం. అప్పటికే సర్దుబాటు ద్వారా అక్కడ ఉన్న టీచర్లను వెనక్కి పిలిపించి మళ్లీ అవసరమైన పాఠశాలలకు కేటాయిస్తాం. పదోన్నతి వదులుకున్న టీచర్లను వారి సర్వీస్ బుక్కుల్లో నాట్ విల్లింగ్ నమోదు చేస్తాం. – అశోక్, డీఈవో పదోన్నతులతో కేటాయింపుల గందరగోళం ప్రమోషన్లు తిరస్కరించిన 46 మంది టీచర్లు 136 మందికి మరోసారి కేటాయింపులు నేటి నుంచి ముగ్గురు ఎంఈవోలతో పరిశీలన -
జలసిరులు
డొంకేశ్వర్(ఆర్మూర్): జిల్లాలో భూగర్భ జలాలు పెరిగాయి. ఆగస్టు నెలలో కురిసిన భారీ వర్షాలు భూగర్భ జలాల పెరుగుదలకు ఎంతో దోహదప డ్డాయి. లోటు పరిస్థితి నుంచి మేలైన స్థాయికి తీ సుకొచ్చాయి. జూలై వరకు 11.76 మీటర్ల లో తులో ఉన్న జలాలు ఆగస్టు ముగిసే నాటికి సరా సరి 8.48 మీటర్లకు వచ్చాయి. అంటే ఒక్క నెలలోనే ఏకంగా 3 మీటర్ల వరకు పెరిగాయి. ఇది గ తేడాది ఆగస్టు (8.66 మీటర్లు)తో పోలిస్తే మెరుగైన పరిస్థితి. వర్షాకాలంలో ఇప్పటి వరకు 78 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవగా, ఇందులో సగం మేర ఆగస్టులోనే వర్షం కురిసింది. వరదలు పోటెత్తి భూగర్భంలో ఊట భా రీగా చేరింది. మే నెల నుంచి ఆగస్టు నాటికి వచ్చే సరికి మొత్తంగా 4 మీటర్లు పెరిగాయి. వచ్చే ఏడాది వరకు బోరుబావులు, సాగునీటికి ఎలాంటి ఢోకా ఉండదని గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ అధికారి శ్రీనివాస్ బాబు పేర్కొన్నారు. 53 ఫిజోమీటర్లలో పుష్కలంగా జలం... ఆగస్టు మాసానికి సంబంధించిన భూగర్భ జలాల లెక్కలను ఇటీవల గ్రౌండ్వాటర్ డిపార్ట్మెంట్ తీసింది. జిల్లా వ్యాప్తంగా 82 ఫిజోమీటర్ల ద్వారా నీటి లెక్కలను సేకరించింది. ఇందులో 53 ఫిజోమీటర్లలో 10 మీటర్ల లోపు నీటి మట్టాలున్నాయి. 25 ఫిజోమీటర్లలో 10–20 మీటర్ల లోపు, నాలుగు ఫిజో మీటర్లలో 20 మీటర్ల లోతులో జలాలున్నాయి. జిల్లా వ్యాప్తంగా 65–85 శాతం వరకు భూగర్భ జలాలు పుష్కలంగా విస్తరించి ఉన్నాయి. ఇది వరకు కురిసిన వర్షాలతోపాటు మున్ముందు కూడా పడే అవకాశం ఉండడంతో మరికొంత మేర భూరగ్భ జలాలు పెరిగే అవకాశం ఉంది. నెలల వారీగా భూగర్భ జలాలు (మీటర్లలో) భూగర్భ జలాలు ౖపైపెకి.. జిల్లాలో సరాసరి నీటిమట్టం 8.48 మీటర్లు భారీ వర్షాలతో తీరిన నీటి లోటు -
ఐలమ్మ స్ఫూర్తి అందరికీ ఆదర్శం
● కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి నిజామాబాద్అర్బన్: తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి అందరికీ ఆదర్శమని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఐలమ్మ వర్ధంతిని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. వినాయక్నగర్లోని ఐలమ్మ విగ్రహానికి కలెక్టర్, అదనపు కలెక్టర్ అంకిత్, ఇతర అధికారులు, వివిధ కుల సంఘాల ప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పెత్తందారి వ్యవస్థకు వ్యతిరేకంగా చాకలి ఐలమ్మ స్ఫూర్తిదాయకమైన పోరాటం చేశారని గుర్తుచేశారు. కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి నర్సయ్య, వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. మరోసారి ఇంటర్ అడ్మిషన్ లాగిన్ ● మార్పులకు రెండ్రోజులు అవకాశం నిజామాబాద్అర్బన్: ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్, ఇతర అన్ని సాంఘిక సంక్షేమ గు రుకుల కళాశాలలో ఇంటర్ అడ్మిషన్ల లాగిన్ ఓపె న్ చేస్తున్నట్లు డీఐఈవో రవికుమార్ తెలిపారు. ఈ నెల 11, 12 తేదీలలో అడ్మిషన్ లాగిన్ మార్పులు, ఇతర పనులు పూర్తి చేసుకోవాలని సూచించారు. ప్రైవేటు కళాశాలలో నామినల్ రోల్ కరెక్షన్ కోసం ప్రతి విద్యార్థికి రూ.200 చొప్పున చెల్లించాల్సి ఉంటుందని, ప్రభుత్వ కళాశాల విద్యార్థులకు ఎలాంటి రుసుము ఉండదని తెలిపారు. మరోసారి అడ్మిషన్ లాగిన్ ఉండదని, ప్రక్రియ పూర్తి చేసుకోవాలన్నారు. -
సేవ చేసేందుకు ఇష్టం లేక హత్య
బోధన్రూరల్: వృద్ధురాలికి సేవ చేసేందుకు ఇష్టం లేని కుటుంబీకులు హత్య చేసిన ఘటన సాలూర మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఘటనకు సంబంధించి బోధన్రూరల్ ఎస్సై మచ్చేందర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. సాలూర మండల కేంద్రానికి చెందిన కట్టం నాగవ్వ(65) అనారోగ్యంతో బాధపడుతోంది. ఆమెకు భర్త, కుమారులు లేకపోవడంతో మరిది చిన్న గంగారాం వద్ద ఉంటోంది. ఆమెకు సేవలు చేసేందుకు ఇష్టం లేని గంగారాం, భార్య, కుమారుడు గొంతు నులిమి హత్య చేశారు. వృద్ధురాలి వద్ద ఉన్న డబ్బు, బంగారం కోసమే నిందితులు హత్య చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. నిజామాబాద్ రూరల్: ప్రేమ విఫలమై ఓ యువకుడు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు రూరల్ ఎస్హెచ్వో మహ్మద్ ఆరిఫ్ బుధవారం తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. రూరల్ పీఎస్ పరిధిలోని చంద్రశేఖర్ కాలనీకి చెందిన సూరజ్రావు(22), అదే కాలనీకి చెందిన ఓ అమ్మాయి గత ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇటీవల ఆ అమ్మాయి వేరే యువకుడితో ప్రేమలో ఉందని తెలిసి తట్టుకోలేక మంగళవారం రాత్రి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్హెచ్వో తెలిపారు. నిజామాబాద్ రూరల్: మండలంలోని మాధవనగర్ రైల్వే గేటును బుధవారం టాటా ఏఎస్ వాహనం ఢీకొనడంతో మధ్యలో విరిగిపోయింది. ఉదయం 11:30 ప్రాంతంలో రైలు వస్తుందని గేట్మన్ గేటు వేస్తుండగా గేటు దాటి త్వరగా వెళ్లాలని నిజామాబాద్ నుంచి కామారెడ్డి వైపు వెళ్తున్న టాటా ఏస్ వాహనం గేటును ఢీకొన్నదని గేట్మన్ తెలిపారు. గేట్ మధ్యలో విరిగిపోవడంతో సిబ్బంది పునరుద్ధరణ పనులు చేపడుతున్నారు. ప్రస్తుతం తాత్కాలిక గేటు వేసి రైలు వచ్చిన ప్రతిసారి ప్రయాణికులను సిబ్బంది ఆపుతున్నారు. మరమ్మతులు ఇంకా పూర్తికాకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. -
గోడకూలి ఒకరి మృతి
భిక్కనూరు: మండల కేంద్రంలో గోడకూలి ఒకరు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. మండల కేంద్రానికి చెందిన జాగీర్సింగ్(37) రేకుల షెడ్డుల నిర్మాణంతో పాటు షటర్లను తయారు చేస్తూ కుటుంబంతో కలిసి జీవిస్తున్నాడు. గత నెలలో కురిసిన భారీ వర్షానికి జాగీర్సింగ్ ఇల్లు కూలిపోవడంతో పక్కనే ఉన్న బంధువుల ఇంట్లో ఉంటున్నారు. బుధవారం వేకువజామున కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్తుండగా వర్షానికి కూలిన ఇంటి గోడ జాగీర్సింగ్పై పడింది. విషయాన్ని గమనించిన స్థానికులు, కుటుంబీకులు వెంటనే కామారెడ్డి ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అతను మృతి చెందినట్లు తెలిపారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు. మృతుడికి భార్య, నలుగురు కుమార్తెలు, అంధుడైన ఓ కుమారుడు ఉన్నారు. రుద్రూర్: మండల కేంద్రంలోని పెద్ద చెరువులో ప్రమాదవశాత్తు గాండ్ల సావిత్రి అలియాస్ సాయమ్మ (52) అనే మహిళ పడి మృతి చెందినట్లు ఎస్సై సాయన్న బుధవారం తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన సాయమ్మ మంగళవారం చెరువులో బట్టలు ఉతకడానికి వెళ్లి జారి పడిపోయిందని తెలిపారు. బుధవారం చెరువులో మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించినట్లు ఎస్సై తెలిపారు. ఖలీల్వాడి: నగరంలోని జడ్పీ చౌరస్తా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందినట్లు మూడో టౌన్ ఎస్సై హరిబాబు బుధవారం తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. నగరంలోని ఖిల్లా రోడ్డుకు చెందిన మహేశ్(32) పని నిమిత్తం అశోక్ లీలాండ్ వెహికల్పై వస్తున్నాడు. డ్రైవర్ గాటే ఖండూ వాహనాన్ని అతివేగంగా నిర్లక్ష్యంగా నడపడంతో వాహనం వెనకాల కూర్చొని ఉన్న మహేశ్ వాహనం పైనుంచి కిందపడ్డాడు. ఈ ఘటనలో అతని తలకు తీవ్రగాయం కావడంతో స్థానికులు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. నవీపేట: మండలంలోని యంచ శివారులో జరుగుతున్న జాతీయ రహదారి(బీబీ 161)విస్తరణ పనుల కోసం డంప్ చేసిన స్టీల్ నుంచి పీరాజీ అనే వ్యక్తి 2 టన్నులు దొంగిలించినట్లు ఎస్సై తిరుపతి తెలిపారు. పనులు నిర్వహిస్తున్న అనూష ప్రాజెక్ట్స్ లిమిటెడ్ మేనేజర్ పార్థసారధి ఫిర్యాదు మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు. -
ఓ నాన్న నువ్వెక్కడున్నవే..
సదాశివనగర్: నాన్న నేను మన ఊరికి వస్తున్న.. ఆ క్షేమంగా రా బిడ్డ నీకోసం మేమంతా ఎదురుచూస్తున్నాం అంటూ ఫోన్లో ప్రేమగా మాట్లాడిన ఆ తండ్రి ఇక లేడని తెలిసిన ఆ కుమారుడి హృదయం ఎంతో తల్లడిల్లిపోయింది. కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగా లేని ఓ కుమారుడు దుబాయికి వెళ్లి మొదటిసారిగా ఇంటికి వస్తుండడంతో ఆ కుటుంబం ఎంతో సంతోషంతో నిండిపోయింది. మరుసటి రోజు కుమారుడు ఇంటికి చేరుతాడనే కొన్ని గంటల వ్యవధిలోనే మృత్యువు గుర్తు తెలియని వాహన రూపంలో తండ్రిని కబళించింది. ఈ ఘటన సదాశివనగర్ మండలం కుప్రియల్ జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని పద్మాజీవాడి గ్రామానికి చెందిన మ్యాదరి బాలయ్య(53) ఆరేపల్లి శివారులోని ఓ ఆయిల్ కంపెనీలో పనిచేస్తున్నాడు. మంగళవారం రాత్రి పని ముగించుకొని బైక్పై స్వగ్రామానికి వస్తుండగా దారి వెంట రోడ్డుపై నడుచుకుంటు వెళ్తున్న బోధన్ ప్రాంతానికి చెందిన సయ్యద్ బాసిద్ను ఢీకొన్నాడు. దీంతో వాహనం అదుపు తప్పి బాలయ్య రోడ్డు పై పడడంతో కామారెడ్డి నుంచి నిజామాబాద్ వైపునకు వస్తున్న గుర్తు తెలియని వాహనం అతనిపై నుంచి వెళ్లింది. ఈ ఘటనలో బాలయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్ ఢీకొన్న ఘటనలో బాసిద్కు గాయాలు కావడంతో స్థానికులు ఆస్పత్రికి తరలించారు. కాగా బాసిద్ మతిస్థిమితం కోల్పోయి కొంత కాలంగా రోడ్డుపై తిరుగుతున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా బుధవారం ఉదయం దుబాయి నుంచి స్వగ్రామానికి చేరిన కుమారుడు శివకుమార్ తండ్రి బాలయ్య మృతదేహాన్ని చూసి బోరున విలపించాడు. డాడీ ఫ్లయిట్ ఎక్కుతున్న అంటే జాగ్రత్తగా రా బిడ్డ అన్నవు.. నువ్వెక్కడున్నవే నాన్న అంటూ ఆ కుమారుడు రోదన తీరు స్థానికులను కంటతడి పెట్టించింది. మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పుష్పరాజ్ పేర్కొన్నారు.● రోడ్డు ప్రమాదంలో తండ్రి మృతి ● కుమారుడు దుబాయి నుంచి వస్తున్న రోజే ఘటన ● పద్మాజీవాడిలో విషాదం -
‘వరద’ సద్వినియోగం
● వరద కాలువ ద్వారా నీటి విడుదల ● నిండుతున్న చెరువులు ● హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు బాల్కొండ: ఎస్సారెస్పీ నుంచి మిగులు జలాలను సద్వినియోగం చేసుకునేందుకు నిర్మించిన వరద కాలువ ప్రస్తుత సంవత్సరం సద్వినియోగమవుతోంది. ఈ వరద కాలువ నిర్మాణం ప్రాజెక్ట్ మిగులు జలాలు గోదావరిలోకి వదలకుండా కాలువ ద్వారా వదిలి నల్గొండ జిల్లాలో 2.2 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించేందుకు చేపట్టారు. కానీ మారిన అనేక పరిణామాల్లో వరద కాలువ ఎస్సారెస్పీ పునరుజ్జీవనానికి రివర్స్ పంపింగ్ కోసం నీటి సరఫరా చేసే కాలువ అయింది. ప్రస్తుతం ప్రాజెక్ట్లోకి ఎగువ ప్రాంతాల నుంచి వరద వచ్చి చేరుతుండటంతో 28 రోజుల నుంచి కాలువ ద్వారా నీటి విడుదలను చేపడుతున్నారు. వరద కాలువ ద్వారా విడుదలవుతున్న నీరు సద్వినియోగం అవుతోంది. బాల్కొండ నియోజక వర్గంలోని 16 చెరువులను నింపేందుకు 9 తూంలను ఏర్పాటు చేశారు. 9 చెరువుల తూం ల ద్వారా చెరువులకు నీటి సరఫరా జరుగుతోంది. నియోజక వర్గంలో 1529 ఎకరాలకు సాగునీరు అందుతోంది. వరద కాలువ ద్వారా నీటి విడుదల కొనసాగుతుండడంతో వరద కాలువ పరివాహక ప్రాంతంలోని భూగర్భ జలాలు సమృద్ధిగా పెరుగుతాయని రైతులు పేర్కొంటున్నారు. మధ్యమానేరు నింపేందుకు.. ప్రాజెక్ట్ నుంచి వరద కాలువ ద్వారా నీటి విడుదలను చేపట్టి మధ్యమానేరు డ్యాం(ఎంఎండీ) నింపుతున్నారు. గత నెల రోజుల వ్యవధిలో 45 టీఎంసీల నీటిని వరద కాలువ ద్వారా వదిలారు. వరద కాలువ 122 కిలోమీటర్ల పొడవున ఉంది. కాలువ మొత్తం 35 తూంలు, 16 చెక్ డ్యాంలు ఉన్నాయి. ప్రస్తుతం అన్నింటికి నీటి సరఫరా జరిగేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మిగులు జలాలు వరద కాలువ ద్వారా విడుదలవుతున్నాయి. ఎస్సారెస్పీ నీటి వివరాలను తెలుసుకోవడానికి నీటి విడుదల ప్రారంభ సమయంలో ఎంఎండీ ఎస్ఈ సుమతి ప్రాజెక్ట్కు వచ్చారంటే నీటి ఆవశ్యకత ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. వరద కాలువ ద్వారా విడుదలవుతున్న ప్రతి నీటి చుక్కను సద్వినియోగం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. కొన్ని చోట్ల నీటి అవసరం లేక పోవడంతో ప్రస్తుత తూంలను ఓపెన్ చేయలేదు. రైతులు అధికారులకు సహకరించాలి. – గణేశ్, డిప్యూటీ ఈఈ, వరద కాలువ -
భార్యపై హత్యాయత్నం కేసులో భర్తకు ఐదేళ్ల జైలు
నిజామాబాద్ లీగల్: భార్యను మానసికంగా వేధించి కత్తితో గాయపర్చిన భర్తకు ఐదేళ్ల కఠిన కారాగార శిక్షను విధిస్తూ నిజామాబాద్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి సాయిసుధ బుధవారం తీర్పు వెల్లడించారు. వివరాలిలా ఉన్నాయి. నగరంలోని అంబేడ్కర్ కాలనీకి చెందిన తురేకార్ రాజమణికి, కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం సిర్పూర్కు చెందిన సోన్ కాంబ్లె యాదవ్తో 2018 లో వివాహమైంది. కాంబ్లె మద్యం తాగుతూ భార్య సంపాదనపై ఆధారపడేవాడు. ఆమె నిజామాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తుండేది. 27మే2021న ఆస్పత్రికి వెళ్లి తన వెంట రావాలని గొడవ చేశాడు. దీంతో ఆమె రాను అనడంతో తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆమైపె దాడి చేశాడు. పోలీసులు కాంబ్లైపె కేసు నమోదు చేశారు. బుధవారం నిందితుడు నేరం చేసినట్లు రుజువు కావడంతో జడ్జి ఐదేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ. వెయ్యి జరిమానాను విధించారు. జరిమానా చెల్లించకుంటే అదనంగా నెల రోజుల జైలు శిక్ష అనుభవించాలని జడ్జి తీర్పులో పేర్కొన్నారు. -
ఇంజినీరింగ్ విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పిస్తాం
తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం కల్పిస్తామని వైస్ చాన్స్లర్ టి.యాదగిరిరావు తెలిపారు. బుధవారం తెయూ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ సీహెచ్ ఆరతి అధ్యక్షతన నిర్వహించిన నూతన విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో పరిచయ కార్యక్రమంలో వీసీ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. వర్సిటీలో ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటు 18 ఏళ్ల సుధీర్ఘ కల అని, ఈ ప్రాంతంలో బడుగు బలహీన వర్గాలకు ఇంజినీరింగ్ విద్యను అందించేందుకు తెయూలో ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటుకు సీఎం అనుమతించారన్నారు. విద్యార్థులకు అధునాతన సాంకేతిక బోధనా పద్ధతులతో నాణ్యమైన విద్యను అందిస్తామన్నారు. కౌన్సిలింగ్ సమయంలో హాస్టల్ వసతి లేదని ప్రకటించామని, అయితే విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపకుల వినతి మేరకు ఇంజినీరింగ్ విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పించాలని నిర్ణయించినట్లు తెలిపారు. అలాగే తల్లిదండ్రులు సైతం తమ పిల్లలను నిరంతరం పర్యవేక్షించాలన్నారు. ప్రవేశపరీక్షలో వచ్చిన ర్యాంకు ముఖ్యం కాదని, ఇంజినీరింగ్లో చేరిన తర్వాత ఏం నేర్చుకున్నాం.. ఎలా జీవితంలో స్థిరపడ్డారనేదే ముఖ్యమని అన్నారు. ఫస్ట్ బ్యాచ్ విద్యార్థులైన మీరు తర్వాత వచ్చే బ్యాచ్ల విద్యార్థులకు ఆదర్శంగా నిలువాలని పిలుపునిచ్చారు. తెయూలో ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటుకు కృషి చేసిన టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్, రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, సహకరించిన రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డికి వీసీ ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో అధ్యాపకులు నందిని, అతిక్ సుల్తాన్ ఘోరి, భ్రమరాంబిక, నీలిమ, విద్యార్థులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
చాకలి ఐలమ్మ చరిత్ర మరువలేనిది
ఖలీల్వాడి: తెలంగాణ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ చరిత్ర మరువలేనిదని డీసీపీ బస్వారెడ్డి అన్నారు. నగరంలోని నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో చాకలి ఐలమ్మ వర్ధంతి నిర్వహించారు. ఆమె చిత్రపటానికి డీసీపీ పూలమాల వేసి నివాళులు అర్పించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ ప్రదర్శించిన ధైర్యసాహసాలు, ప్రజాస్వామిక పోరాటాలకు స్ఫూర్తిగా నిలిచాయన్నారు. కార్యక్రమంలో కార్యాలయ సూపరింటెండెంట్ శంకర్, బషీర్, వనజ రాణి, స్పెషల్ బ్రాంచ్ సీఐ శ్రీశైలం, రిజర్వ్ సీఐలు శ్రీనివాస్, తిరుపతి, సిబ్బంది పాల్గొన్నారు. -
చదువులో వెనుకబడ్డ వారిపై శ్రద్ధ వహించాలి
నిజామాబాద్అర్బన్: చదువులో వెనుకబడ్డ విద్యార్థులపై అధ్యాపకులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా ఇంటర్మీడియట్ అధికారి రవికుమార్ అన్నారు. నగరంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలను బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం అధ్యాపకులు, బోధనేతర సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ప్రతి అధ్యాపకుడు విద్యార్థుల హాజరుపై ప్రత్యేక శ్రద్ధ వహించి, ఫేస్ రికగ్నేషన్ సిస్టం ద్వారా హాజరు తీసుకోవాలని ఆదేశించారు. స్లిప్టెస్ట్లు నిర్వహించి మార్కులను రిజిస్టర్లలో ఎంట్రీ చేయాలని సూచించారు. కళాశాలలో నెలకొన్న అదనపు అధ్యాపకుల కొరతను ఇంటర్ బోర్డు అధికారుల దృష్టికి తీసుకెళ్తానని అన్నారు. సమావేశంలో బుద్ధిరాజ్, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు. -
కేఎఫ్సీలో ఫుడ్సేఫ్టీ అధికారుల తనిఖీలు
నిజామాబాద్ సిటీ/ నిజామాబాద్లీగల్: జిల్లా కేంద్రంలోని పలు హోటళ్లపై జిల్లా ఫుడ్సేప్టీ అధికారులు దాడులు చేశారు. బుధవారం సాయంత్రం నగరంలోని వేణుమాల్లో నిర్వహిస్తున్న కేఎఫ్సీపై ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్ సునీత బృందం తనిఖీలు చేపట్టారు. చికెన్, ఫాస్ట్ఫుడ్ తయారీలో ఉపయోగించే పదార్థాల శాంపిల్స్ సేకరించి ల్యాబ్కు పంపారు. మున్సిపల్ శానిటేషన్ అధికారులు సైతం తనిఖీలు చేశారు. కిచెన్ అపరిశుభ్రంగా ఉండటంతో రూ.10 వేల జరిమానా విధించారు. గత రెండు రోజుల క్రితం కేఎఫ్సీ చికెన్ ముక్కలు కుళ్లిపోయి ఉండ టం, పాచి వాసన వస్తుండటంతో కస్టమర్లు యజమానిని నిలదీశారు. నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో వీడియో తీసి వైరల్ చేశారు. దీంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు కేఎఫ్సీపై తనిఖీలు నిర్వహించారు. అనారోగ్యకర ఆహార పదార్థాలు సరఫరాచేస్తే చట్టరీత్యా చర్యలు తప్పవని శానిటరీ ఇన్స్పెక్టర్ సాజిద్ అలీ హెచ్చరించారు. తనిఖీల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు జి. నవీత, జి. విక్రమ్, శానిటరీ ఇన్స్పెక్టర్ ఆకుల సునీల్, సిబ్బంది ఉన్నారు. -
వైద్య సిబ్బందికి హెపటైటిస్ టీకాలు
నిజామాబాద్నాగారం: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో హెపటైటిస్ బి టీకాల కార్యక్రమాన్ని డీఎంహెచ్వో రాజశ్రీ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో మొదటి విడతలో హెపటైటిస్ బి వ్యాక్సిన్ను ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందికి ఇచ్చినట్లు పేర్కొన్నారు. వైద్య సిబ్బంది వారి విధుల్లో భాగంగా హెపటైటిస్ బి వ్యాధికి గురికాకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యగా ఈ టీకాలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో జీజీహెచ్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు, డీసీహెచ్ శ్రీనివాస ప్రసాద్, ప్రోగ్రామ్ ఆఫీసర్ తుకారం రాథోడ్, డీఐవో అశోక్, డిప్యూటీ డీఎంహెచ్వో అంజన, డీటీసీ దేవి నాగేశ్వరి, డాక్టర్ రాజు, డాక్టర్ సుప్రియ, వివిధ విభాగాల అధిపతులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. కామారెడ్డి రూరల్: కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని పాతరాజంపేటలో మంగళవారం మృతి చెందిన సల్మా బేగం అంత్యక్రియలు బుధవారం గ్రామస్తులు, దత్తత తీసుకున్న కుమార్తె కరిష్మా చేతుల మీదుగా నిర్వహించారు. సల్మాబేగం మృతి చెందగా హైదరాబాద్ నుంచి ఓ వ్యక్తి వచ్చి తానే సల్మాబేగం కుమారుడని తానే అంత్యక్రియలు చేస్తానని తెలుపగా అందుకు గ్రామస్తులు అంగీకరించలేదు. అయితే దత్తత తీసుకున్న కరిష్మా బేగంతో గ్రామస్తులు అంత్యక్రియలు నిర్వహించారు. ఇదిలా ఉండగా తానే కొడుకునని చెప్పుకొనే వ్యక్తి అంత్యక్రియల అనంతరం హైదరాబాద్ నుంచి వచ్చిన తన బంధువులతో కలిసి తిరిగి వెళ్లిపోయినట్లు గ్రామస్తులు తెలిపారు. -
సమస్య పరిష్కారం కోసం.. సాష్టాంగ నమస్కారం
● న్యాయం చేయాలని సబ్ కలెక్టర్ ఆఫీస్ ఎదుట వినూత్న నిరసనఆర్మూర్టౌన్: తమ భూమిని కబ్జా చేసిన కొందరు 12 ఏళ్లుగా ఇబ్బందులు పెడుతున్నారని నీరడి సాయన్న అనే వ్యక్తి కుటుంబ సభ్యులతో కలిసి సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట వినూత్న నిరసన తెలిపాడు. ఆర్మూర్ మండలంలోని ఇస్సాపల్లికి చెందిన నీరడి సాయన్న మంగళవారం సబ్ కలెక్టర్ కార్యాలయా నికి చేరుకొని కుటుంబ సభ్యులతో కలిసి సాష్టాంగ నమస్కారం చేస్తూ తన సమస్యను వివరించాడు. అనంతరం న్యాయం చేయాలని కోరుతూ సబ్కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియాకు వినతిపత్రం అందజేశారు. వివరాలు తెలుసుకున్న సబ్కలెక్టర్ న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద సాష్టాంగ నమస్కారం చేస్తున్న నీరడి సాయన్నసబ్కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియాకు తమ సమస్యను వివరిస్తూ.. -
ఉప రాష్ట్రపతి ఎన్నిక.. ఓటేసిన ఎంపీ అర్వింద్
వర్చువల్గా జీజీహెచ్లో క్యాన్సర్ సెంటర్ ప్రారంభం నిజామాబాద్నాగారం: జిల్లా కేంద్ర ప్రభుత్వ జ నరల్ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన డే కేర్ క్యాన్సర్ సెంటర్ను ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహా మంగళవారం వర్చువల్గా ప్రారంభించారు. సెంటర్లో క్యాన్సర్ రోగులకు ఉదయం నుంచి సాయంత్రం వరకు చికిత్స అందుతుందని, ఇప్పటివరకు హైదరాబాద్లోని ఎమ్జే క్యాన్సర్ ఆస్పత్రిలో మొదటి డోస్ చికిత్స పొందిన రోగులు రెండో డోస్ నుంచి డే కేర్ సెంటర్లోనే చికిత్స పొందవచ్చిన మంత్రి అన్నారు. అలాగే అవసరమైన సెంటర్లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. జీజీహెచ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్, ఆర్థో హెచ్వోడీ రాములు, డాక్టర్లు కిశోర్, చైతన్య, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
అంతా ఒక్కటయ్యారు..!
డొంకేశ్వర్(ఆర్మూర్): ఈ ఏడాది చేప పిల్లల పంపిణీ కోసం ప్రభుత్వానికి కాంట్రాక్టర్లు సహకరించడం లేదు. పాత బకాయిలు ఇవ్వకపోవడంతో కాంట్రార్లందరూ ఒక్కటై టెండర్లకు దూరంగా ఉన్నారు. మొదటగా ఆగస్టు 18నుంచి సెప్టెంబర్ 1వ తేదీ వరకు రాష్ట్ర శాఖ ఈ–ప్రొక్యూర్మెంట్ ద్వారా టెండర్లను ఆహ్వానించగా, ఒక గుత్తేదారు కూడా బిడ్ దాఖలు చేయలేదు. దీంతో టెండర్ల గడువు తేదీని ఈ నెల 8వ తేదీ వరకు పొడగించింది. రెండోసారి పొడిగించిన గడువు సైతం ముగియగా కాంట్రాక్టర్లు బిడ్లు వేయలేదు. ప్రభుత్వం మళ్లీ ఈనెల 12వ తేదీ వరకు గడువును పెంచింది. మూడోసారైనా టెండర్లు దాఖలవుతాయో లేదో చూడాలి. గత రెండేళ్లలో చేప పిల్లలు సరఫరా చేసిన కాంట్రాక్టర్లకు బకాయి బిల్లులు రావాల్సి ఉంది. వాటిని చెల్లించకుండా ప్రభుత్వం ఈ ఏడాది టెండర్లు చేపట్టడంపై కాంట్రాక్టర్లు అసంతృప్తితో ఉన్నారని తెలిసింది. ఈ పరిస్థితి నిజామాబాద్ జిల్లాతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. జిల్లాకు సంబంధించిన కాంట్రాక్టర్లకు పాత బకాయిలు రూ.4కోట్లకు పైగా రావాల్సి ఉంది.లక్ష్యం.. 4.54 కోట్ల చేప పిల్లలు..ఈ ఏడాది జిల్లాలోని 976 చెరువుల్లో 4.54కోట్ల చేప పిల్లలు వదలాలని మత్స్య శాఖ లక్ష్యంగా పెట్టుకుని రాష్ట్ర శాఖకు ప్రతిపాదనలు పంపింది. ఇందులో 35 నుంచి 40ఎంఎం అలాగే 80 నుంచి 100 ఎంఎం చేప పిల్లలున్నాయి. వాస్తవానికి జూలైలో టెండర్లు పూర్తి చేసి ఆగస్టులో చేప పిల్లలను చెరువుల్లో వదలాలి. కానీ.. టెండరు ప్రక్రియను ప్రభుత్వం ఆలస్యం చేసింది. దీనికి తోడు కాంట్రాక్టర్లు టెండర్లు వేయకపోవడంతో మరింత ఆలస్యమవుతోంది. గడువు పొడిగించిన ప్రభుత్వం కొత్త గుత్తేదార్లను సముదాయించి టెండర్లు వేయించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. పెంచిన గడవు తేదీ వరకు కూడా ఎవరూ టెండరు వేయకపోతే చేప పిల్లల పంపిణీ మరింత ఆలస్యమయ్యే అవకాశముంది. సెప్టెంబర్ నెలలోనే చెరువుల్లో చేప పిల్లలు వేయకపోతే అదును దాటి పోతుందని మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతేడాది 4.45 కోట్ల చేప పిల్లలను 967 చెరువుల్లో వదలాలని లక్ష్యం ఉండగా, ప్రభుత్వం 1.92కోట్ల చేప పిల్లలను 799 చెరువుల్లో మాత్రమే పోసేందుకు అనుమతి ఇచ్చింది. మరి ఈ ఏడాది పూర్తి లక్ష్యానికి అనుమతి ఇస్తుందో లేదో వేచి చూడాలి.టెండర్లే ఆలస్యంఈ ఏడాది చేప పిల్లలను చెరువుల్లో వదిలేందుకు ప్రణాళికలు సిద్ధం చేసి పెట్టుకున్నాం. టెండర్ల ప్రక్రియ పూర్తయితే ప్రభుత్వం మార్గదర్శకాలు ఇస్తుంది. వాటి ప్రకారం కాంట్రాకర్ల ద్వారా చేప పిల్లలను పంపిణీ చేస్తాం.– ఆంజనేయస్వామి, జిల్లా మత్స్యశాఖ అధికారిఅదును దాటితే ఇబ్బందులుగతేడాది కూడా చేప పిల్లలను ఆలస్యంగా చెరువుల్లో పోశారు. ఇప్పుడు కూడా అంతకు మించి ఆలస్యం చే స్తున్నారు. ప్రభుత్వం త్వర గా టెండర్లను పూర్తి చేసి చేప పిల్లలను పంపిణీ చేయాలి. ఇప్పటికే ఆలస్యం కాగా అదును దాటిపోతోంది. చెరువుల్లో లేటుగా పోస్తే చేప పిల్లల్లో సరైన ఎదుగుదల ఉండదు. – మోహన్, మత్స్యకారుడు, డొంకేశ్వర్ -
దక్కని ఆత్మీయ భరోసా
మోర్తాడ్(బాల్కొండ): మోర్తాడ్ మండలం గాండ్లపేట్కు చెందిన ఎల్లయ్య అనే ఉపాధి హామీ కూలీకి ఇందరమ్మ భరోసా సాయం మంజూరైనట్లు అధికారులు పత్రాన్ని అందజేశారు. నాటి నుంచి ప్రభుత్వం ఇచ్చే సాయం కోసం ఎల్లయ్యతోపాటు జిల్లా వ్యాప్తంగా అనేక మంది కూలీలు నిరీక్షిస్తున్నారు. భూమి లేని కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద రెండు విడతల్లో రూ.6వేల చొప్పున సాయం అందించాలని నిర్ణయించిన ప్రభుత్వం.. పథకాన్ని ఈ ఏడాది జనవరి 26న (గణతంత్ర దినోత్సవం సందర్భంగా) ప్రారంభించింది. ఒక్కో మండలం నుంచి ఒక గ్రామాన్ని ఎంపిక చేసి అక్కడి ఉపాధి కూలీలకు సాయం అందించారు. ఆ తరువాత ఆత్మీయ భరోసా ఊసేలేకుండాపోయింది. అప్పట్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో సాయం సొమ్ము జమ చేయడానికి బ్రేక్ పడింది. అయితే ఎన్నికల తంతు ముగిసి కోడ్ ఎత్తివేసినా సాయం సొమ్మును విడుదల చేసే విషయంలో ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు స్పందన లేదు. జిల్లా వ్యాప్తంగా 38,787 మంది ఉపాధి కూలీలకు ఇందరమ్మ భరోసా సాయం అందించేందుకు అధికారులు ఎంపిక పూర్తి చేశారు. 31 మండలాల్లోని 31 గ్రామాల్లో కేవలం 1,675 మందికి మాత్రమే సాయం సొమ్మును ఖాతాల్లో జమ చేశారు. మిగిలిన గ్రామాల్లోని 37,112 మంది కూలీలకు సాయం అందించాల్సి ఉన్నా ఇప్పటి వరకు నిధులను ప్రభుత్వం విడుదల చేయలేదు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అమలులోకి తీసుకువచ్చి ఎనిమిది నెలలు గడుస్తున్నా లబ్ధిదారులకు పూర్తి స్థాయిలో సాయం అందించే విషయాన్ని ప్రభుత్వం మరిచిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్తో బ్రేక్ ఆ తరువాత ఊసెత్తని ప్రభుత్వం గణతంత్ర దినోత్సవాన ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ప్రారంభం మండలానికి ఒక గ్రామంలో ఎంపిక చేసిన వారికి అందిన సాయం మిగతా లబ్ధిదారుల ఎదురు చూపులు -
దిద్దుబాటు
నిజామాబాద్ సిటీ: నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లోని రెవె న్యూ విభాగంపై ఓ వైపు తీవ్రస్థాయి లో అవినీతి ఆరోపణలు వ్యక్తం అవుతు న్నాయి. మరోవైపు ఇటీవలే రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కా రు. కార్పొరేషన్లో పరిస్థితులపై కలెక్టర్, కార్పొరేషన్ ప్రత్యేకాధికారి వినయ్కృష్ణారెడ్డితోపాటు వరంగల్లోని రీజినల్ డైరెక్టర్ కార్యాలయం ఆరా తీశారు. దీంతో మున్సిపల్ కమిషనర్ దిలీప్కుమార్ నేరుగా రంగంలోకి దిగి దిద్దుబాటు చర్యలు చేపట్టారు.మ్యుటేషన్కు అక్షరాలా లక్ష..?ఆస్తి ఒకరి పేరు మీద నుంచి మరొకరి పేరు మీదకు మార్చేందుకు(మ్యుటేషన్)కు రెవెన్యూ సిబ్బంది రూ.లక్ష డిమాండ్ చేస్తున్నారని పలువురు వాపోతున్నారు. కిందిస్థాయి నుంచి పైస్థాయి వరకు ఇదే పరిస్థితి ఉందని, పేర్లలో కరెక్షన్ చేయాలంటే రూ.30 వేలు డిమాండ్ చేస్తున్నారని అంటున్నారు. డబ్బులిచ్చినవారి పనులు మాత్రమే అవుతున్నాయని, డబ్బులివ్వని వారిని నెలల తరబడి తిప్పుకుంటున్నారని, గట్టిగా ప్రశ్నిస్తే మీ ఫైల్ కనపడటం లేదని నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ప్రముఖ న్యాయవాది కుటుంబానికి చేదు అనుభవంగతేడాది డిసెంబర్లో మృతి చెందిన ప్రముఖ న్యాయవాది, మానవ హక్కుల నాయకుడు గొర్రెపాటి మాధవరావు కుటుంబానికి చేదు అనుభవం ఎదురైంది. ఎల్లమ్మగుట్టలోని ఇంటిని మాధవరావు పేరు పైనుంచి తన పైరుపైకి మార్చాలని ఆయన భార్య మీనా సహానీ 25న మార్చి 2025న దరఖాస్తు చేశారు. ఇప్పటివరకు వారికి మ్యుటేషన్ సర్టిఫికేట్ ఇవ్వకపోగా.. డబ్బులిస్తేనే మీ పని అవుతుందని నేరుగా చెప్పారు. దీంతో మీనా సహానీ మున్సిపల్కమిషనర్కు, జిల్లా కలెక్టర్కు ఫిర్యాదుచేసినా ఇప్పటివరకు పని కాలేదు.ఆన్లైన్ పేమెంట్..పని చేయాలంటే డబ్బులు డిమాండ్ చేస్తున్న పలువురు అధికారులు లంచం మొత్తాన్ని నేరుగా తమ అకౌంట్లోకి ఆన్లైన్ చేయించుకుంటున్నట్లు సమాచారం. ఇటీవల ఏసీబీకి చిక్కిన ఆర్ఐ శ్రీనివాస్ సైతం ఆర్మీ జవాన్ను ఫోన్ పే చేయమని కోరారు. ఏసీబీ దాడి తరువాత ఓ బాధితుడు నేరుగా ఏసీబీ అధికారిని కలిసి తాను ఆన్లైన్ ద్వారా రూ.17వేలు చెల్లించినట్లు ఫిర్యాదు చేశాడని తెలిసింది. మీ పని కావాలంటే తన కిందిస్థాయి అధికారిని కలిసి రా వాలని రెవెన్యూ విభాగం ఉన్నతాధికారి ఒకరు సూ చిన్నారనే ఆరోపణలున్నాయి. 20 ఏళ్లకుపైగా బల్ది యా రెవెన్యూ విభాగాన్ని శాసించిన ఆర్ఐ దాసరి నరేందర్ శిష్యులు ఇప్పటికీ చక్రం తిప్పుతున్నారని, అన్ని స్థాయిల్లో వారున్నారని పలువురు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. బల్దియాలోని రెవెన్యూ, టౌన్ప్లానింగ్, శానిటేషన్ విభాగాల్లో ఫిర్యాదులు స్వీకరించేందుకు గ్రివెన్స్ సెల్ ఏర్పాటు చేస్తే వంద ల సంఖ్యలో ఫిర్యాదులు అందుతాయంటున్నారు.ఫైళ్లపై రిపోర్టు..మ్యుటేషన్, అసెస్మెంట్, రీ అసెస్మెంట్, అలాట్మెంట్, నేమ్ చేంజెస్, ట్రేడ్ లైసెన్స్ల జారీ తదితర అనుమతులకు సంబంధించి ఫైళ్లన్నీ కమిషనర్ తెప్పించారు. రెవెన్యూ సెక్షన్ నుంచి ఈ సంవత్సరం జనవరి నుంచి ఇప్పటివరకు అనుమతులు మంజూరు చేసిన ఫైళ్ల వివరాలు తెలుసుకున్నారు. మ్యుటేషన్కు సంబంధించిన ఫైళ్లను రీ వెరిఫికేషన్ చేయాలని అడిషనల్ కమిషనర్ రవీంద్రసాగర్కు సూచించారు. వాటితోపాటు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉంచిన ఫైళ్లను కూడా తెప్పించి వాటిపై రిపోర్టు సిద్ధం చేయాలని రెవెన్యూ ఆఫీసర్ ఖయ్యూంను ఆదేశించారు.కలెక్టర్ ప్రత్యేక సమీక్షనిజామాబాద్ సిటీ: మున్సిపల్ కార్పొరేషన్లోని రెవెన్యూ విభాగం అధికారులు, సిబ్బందితో జిల్లా కలెక్టర్, మున్సిపల్ ప్రత్యేక అధికారి టి.వినయ్కృష్ణారెడ్డి సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. మంగళ వారం సాయంత్రం రెండుగంటల పాటు సమావేశమయ్యారు. ఇటీవలే రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ఏసీబీకి పట్టుబడిన విషయం తెలిసిందే. ఈ అంశంపై వరంగల్లోని రీజనల్ డైరెక్టర్ (రెవె న్యూ) రిపో ర్టు అడిగినట్లు తెలిసింది. దీంతో ము న్సిపల్ కమిషనర్, రెవెన్యూ టీంతో కలెక్టర్ ప్రత్యే క సమావేశం నిర్వహించారు. మ్యుటేషన్, అసెస్ మెంట్, రీ అసెస్మెంట్, అలాట్మెంట్, పేరుమార్పులు, ట్రేడ్ లై సెన్సులపై నివేదిక తీసుకున్నారు. రెవెన్యూ విభా గం ఇన్చార్జి డిప్యూటీ కమిషనర్ రవి బాబు, రెవెన్యూ అధికారులతో మాట్లాడారు. మ్యుటేషన్ల జారీ, పెండింగ్ పనులకు సంబంధించిన ఫైళ్లను తీసి చెక్ చేశారు. సర్కిళ్ల వారీగా పెండింగ్ రెవెన్యూ ఫైళ్లపై ఆరా తీశారు. సుదీర్ఘ కాలం నుంచి పలు మ్యుటేషన్ ఫైళ్లు పెండింగ్ లో ఉండడాన్ని గమనించిన కలెక్టర్, వాటి విషయమై సంబంధిత జోన్ల రెవెన్యూ ఇన్స్పెక్టర్లను ప్రశ్నించారు. సత్వరమే పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించాలని, తద్వారా నగర పాలక సంస్థకు ఆదాయం కూడా సమకూరుతుందని కలెక్టర్ సూచించారు. పన్ను వసూళ్లపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని సూచించారు. భవన నిర్మాణాలకు అనుమతులు, క్రమబద్ధీకరణ, ఎల్ఆర్ఎస్, ఇంజినీరింగ్ పనుల పురోగతిపై ఆరా తీశారు.ప్రక్షాళన చేపట్టాంబల్దియాలో ఇటీవల జరిగిన పరిణామాలు బాధాకరం. రెవెన్యూలో జరుగుతున్న అవకతవకలపై దృష్టి సారించాం. ఇప్పటివరకు అనుమతి ఇచ్చిన ఫైళ్లను తెప్పించాం. అని ఫైల్లను రీ వెరిఫికేషన్ చేయిస్తున్నా. పెండింగ్లో ఉన్న ఫైళ్లపై వివరణ తీసుకుంటున్నా. తప్పుచేస్తే ఎంత పెద్ద అధికారి అయినా చర్యలు తప్పవు.– దిలీప్కుమార్, బల్దియా కమిషనర్ -
ఉత్తమ గురువులకు సన్మానం
● ఘనంగా గురుపూజోత్సవం ● విద్యలో జిల్లాను అగ్రభాగాన నిలపాలని రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి పిలుపు నిజామాబాద్అర్బన్: గురుపూజోత్సవాన్ని విద్యాశాఖ ఆధ్వర్యంలో మంగళవారం ఘ నంగా నిర్వహించారు. సమీకృత జిల్లా కార్యా లయాల సముదాయం కాన్ఫరెన్స్ హాల్లో కా ర్యక్రమాన్ని నిర్వహించగా.. ముఖ్య అతిథు లుగా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి పాల్గొన్నారు. జిల్లా స్థాయిలో ఉత్తమ టీచర్లుగా ఎంపికైన 40 మందిని ఘనంగా సన్మానించి జ్ఞాపికలను అందజేశారు. అంతకుముందు మాజీ రాష్ట్ర పతి సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూ లమాలలు వేసి నివాళులర్పించారు. భూపతి రెడ్డి మాట్లాడుతూ.. ఉపాధ్యాయ వృత్తికి మించిన వృత్తి సమాజంలో మరేదీ లేదని, విద్యార్థులకు నాణ్యమైన విద్యనందిస్తూ జిల్లాను వి ద్యా రంగంలో అగ్రభాగాన నిలుపుదామని పిలుపునిచ్చారు. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమైందని, గురు వు స్థానానికి ఉన్న గౌ రవాన్ని మరింత ఇనుమడింపజేయాలని హితవు పలికారు. అదన పు కలెక్టర్ అంకిత్, ఉపాధ్యాయ సంఘాల నాయకులు మోహన్రెడ్డి, కిషన్, వెనిగళ్ల సురేశ్, గద్దల రమేశ్, వెంకటేశ్వర్గౌడ్, జలంధర్, హెచ్ఎంలు, టీచర్లు పాల్గొన్నారు. -
ఎల్వోసీ విధానంలో చెల్లింపులకు చర్యలు చేపట్టాలి
● మార్కెట్ కమిటీ చైర్మన్ల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు ముప్ప గంగారెడ్డి ● మంత్రి తుమ్మల నాగేశ్వర్రావుకు వినతిసుభాష్నగర్: మార్కెట్ కమిటీ చైర్మన్, ఉద్యోగుల వేతనాలు, అలవెన్సులు, మార్కెట్యార్డు నిర్వహణ, ఇతరత్ర చెల్లింపులు ఈ–పోర్టల్లోని ఐఎఫ్ఎంఎస్ ద్వారా కాకుండా, ఎల్వోసీ విధానంలో చెల్లింపులు చేసేలా చర్యలు చేపట్టాలని మార్కెట్ కమిటీ చైర్మన్ల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు ముప్ప గంగారెడ్డి కోరారు. ఈమేరకు ఫోరం ఆధ్వర్యంలో మంగళవారం ఆయన హైదరాబాద్లో రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావును కలిసి, పలు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన విధానంతో మార్కెట్యార్డుల్లో చేపట్టే అభివృద్ధి పనుల చెల్లింపుల్లో జాప్యం జరుగుతుందని, కావున ట్రెజరీ ద్వారా నేరుగా చెల్లింపులు జరిపే విధంగా చూడాలని కోరారు. పాలకమండలి పదవీకాలాన్ని మూడేళ్లకు పొడగించాలని విజ్ఞప్తిచేశారు. మార్కెట్యార్డుల్లో అవసరమైన పోస్టులను భర్తీ చేసుకునే అధికారం చైర్మన్లకు కల్పించాలని, చైర్మన్లకు ప్రొటోకాల్ వర్తింపజేయాలని, అలాగే పలు సమస్యలను విన్నవించారు. మంత్రి తుమ్మల సానుకూలంగా స్పందించారని అధ్యక్షుడు ముప్ప గంగారెడ్డి తెలిపారు. ప్రధానకార్యదర్శి నర్సింహాయాదవ్, గౌరవాధ్యక్షుడు చిలుక మధుసూదన్రెడ్డి, కార్యవర్గ సభ్యులు, మార్కెట్ కమిటీ చైర్మన్లు పాల్గొన్నారు. -
ఎస్సారెస్పీకి తగ్గిన వరద
బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లోకి ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు తగ్గుముఖం పట్టింది. ప్రాజెక్ట్లోకి ఎగువ ప్రాంతాల నుంచి 42వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. క్రితం రోజు సోమవారం సాయంత్రం పెరిగిన వరద మంగళవారం ఉదయం నుంచి క్రమంగా తగ్గింది. దీంతో ప్రాజెక్ట్ నుంచి గోదావరిలోకి నీటి విడుదలను ప్రాజెక్ట్ అధికారులు తగ్గించారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ నుంచి గోదావరిలోకి 8 వరద గేట్ల ద్వారా 12500 క్యూసెక్కుల నీరు పోతుంది. వరద కాలువ ద్వారా 19 వేల క్యూసెక్కులు, కాకతీయ కాలువ ద్వారా 5500 క్యూసెక్కులు, ఎస్కెప్ గేట్ల ద్వారా 2500 క్యూసెక్కులు, సరస్వతి కాలువ ద్వారా 800 క్యూసెక్కులు, లక్ష్మికాలువ ద్వారా 200 క్యూసెక్కులు, గుత్ప లిప్ట్ ద్వారా 270 క్యూసెక్కులు, మిషన్ భగీరథ ద్వారా 231 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 684 క్యూసెక్కుల నీరు పోతుంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091(80.5 టీఎంసీలు) అడుగులు కాగా మంగళవారం సాయంత్రానికి ప్రాజెక్ట్లో అంతే స్థాయి నీటి మట్టంతో ప్రాజెక్ట్ నిండుకుండలా ఉంది. -
విపత్కర పరిస్థితుల్లోనూ విధులు!
● ఉత్సవాలైనా, సహాయక చర్యలైనా ముందుంటున్న పోలీసులు ● రాత్రి, పగలు తేడాలేకుండా శాంతిభద్రతల రక్షణ కోసం కృషిఖలీల్వాడి: సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణే కాకుండా విపత్కర పరిస్థితుల్లోనూ పోలీసులు నిరాటంకంగా విధులు నిర్వహిస్తున్నారు. ప్రజలకు సేవ చేయడానికి, చట్టాన్ని అమలు చేయడానికి, నేరాలను నివారించడానికి, శాంతిభద్రతలను కాపాడటా నికి పోలీసులు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. కానీ అత్యవసర పరిస్థితులు, పండుగలు, ప్రమాదలు, వ రదలు వచినప్పుడు పగలు, రాత్రి తేడా లే కుండా విధులు నిర్వహిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఒక వైపు వరదలు, మరో వైపు ఉత్సవాలు.. పండుగల వేళ అందరూ కుటుంబాలతో వేడుకలను వైభవంగా జరుపుకుంటారు. కానీ పోలీసులు మాత్రం పండుగలు, పర్వదినాల వేళ కుటుంబాలకు దూరంగా విధులు నిర్వహిస్తున్నారు. ఎలాంటి పరిస్థితి ఎదురైనా ఉన్నతాధికారుల ఆదేశాలను అనుసరించి, సమాజ శ్రేయస్సు కోసం డ్యూటీలు చేస్తున్నారు. ఇటీవల గణేష్ ఉత్సవాలకు ముందు జిల్లాలో భారీవర్షాలు కురవడంతో వరదలు సంభవించాయి. దీంతో అటు ఉత్సవాలు, ఇటు వరదలు ఒకేసారి వచ్చినా పోలీసులు తమ విధులను సమయస్ఫూర్తితో నిర్వహించారు.వరదల కారణంగా కొన్ని గ్రామాల్లోకి నీరు వచ్చి చేరడం, రోడ్లు ధ్వంసం కావడంతో జిల్లా అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టించాయి. వాగులు వంతెనల పైనుంచి ప్రవహించడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఈక్రమంలో రోడ్లపై నీరు వచ్చి చేరడంతో పోలీసులు వాహనాదారులకు హెచ్చరికలు జారీ చేస్తూనే, తగిన సహాయక చర్యలు చేపట్టారు. అలాగే గణేష్ నవరాత్రి ఉత్సవాల దృష్ట్యా ఎలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు యంత్రాంగం పటిష్ట చర్యలు చేపట్టింది. అన్ని వర్గాల ప్రజలకు, గణేష్ మండళ్లకు, శాంతికమిటీలకు సమావేశాలు నిర్వహించి ప్రశాంతంగా ఉత్సవాలు ముగించారు. సీపీ సాయిచైతన్య పకడ్బందీగా వ్యవహరించి, నవరాత్రుల్లో వినాయక మండపాలు సందర్శించి, అక్కడ ఉన్న యువతకు మార్గనిర్ధేశం చేశారు. గణేష్ ఉత్సవాలపై ఎప్పటికప్పుడు సమీక్షలు, సూచనలు చేశారు. దీంతో ఉత్సవాలతోపాటు నిమజ్జనోత్సవ శోభాయాత్రలనూ విజయవంతంగా పూర్తి చేశారు. గతంలో వినాయక నిమజ్జనం సందర్బంగా పలు హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడంతో పోలీసులు సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి పోలీస్ ఫోర్స్తో గట్టి బందోబస్తు, నిఘాను ఏర్పాటు చేసి, ప్రత్యేక ప్రణాళికలను రూపొందించారు. ఉదయం, రాత్రివేళల్లో ప్రతీ గణేశ్ మండపం వద్దకు పోలీసులు గస్తీ తిరిగారు. నిజామాబాద్ పోలీస్కమిషనరేట్ పరిధిలోని ఆర్మూర్, బోధన్, నిజామాబాద్లో వినాయక ఉత్సవాలు ప్రారంభమైనప్పటినుంచి ముగింపు వరకు సీపీ పోతరాజు సాయిచైతన్య పర్యటించారు. ఒకవైపు వరదలు, మరో వైపు వినాయక ఉత్సవాల్లో వారంరోజుల నుంచి పోలీసులు కంటిమీద కునుకు లేకుండా, రోడ్లపైనే నిల్చుని సమర్థవంతంగా డ్యూటీలు చేశారు. నిజామాబాద్ కమిషనరేట్లో నిమజ్జన వేడుకల్లో పోలీసులు రెండురోజులు ఆన్డ్యూటీలోనే ఉండటంతో ప్రజలు పోలీస్లకు హాట్సాప్ అంటూ కృతజ్ఞతలు తెలుపుతున్నారు.జిల్లాలోని అధికారులు, సిబ్బంది సహకారంతో సమిష్టిగా పని చేయడంతో గణేష్ ఉత్సవాలు విజయవంతంగా పూర్తిచేశాం. ఆలాగే భారీ వర్షాలకు ప్రజల వద్దకు వెళ్లి సహకారం అందించాం. ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా చూశాం. నగరంలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, నిమజ్జనం సమయంలో ప్రత్యేకంగా పర్యవేక్షించాం. వరదలు, ఉత్సవాలకు ప్రతీ పోలీసు తమ విధులను సమర్థవంతంగా నిర్వర్తించారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావివ్వకుండా పనిచేశారు. – పోతరాజు సాయిచైతన్య, సీపీ, నిజామాబాద్ -
పోలీసులు నిక్కచ్చిగా విధులు నిర్వహించాలి
బోధన్రూరల్: పోలీస్ ఇమేజ్ పెంచేవిధంగా ప్రతీ సిబ్బంది నిక్కచ్చిగా విధులు నిర్వహించాలని నిజామాబాద్ సీపీ సాయి చైతన్య అన్నారు. బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్ను మంగళవార సీపీ సందర్శించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ.. అండర్ ఇన్వెస్టిగేషన్లో ఉన్న కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి కేసులో నాణ్యమైన ఇన్వెస్టిగేషన్ చేయాలని సిబ్బందికి సూచనలు చేశారు. ప్రజలకు గేమింగ్ యాప్స్, సైబర్ మోసాలపై అవగాహన కల్పించాలన్నారు. గ్రామాలలో విలేజ్ పోలీస్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తూ ప్రజలతో మమేకమై గ్రామాలలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించే దిశగా ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. అట్టి గ్రామాలలో ఉన్నటువంటి సమాచారం తమ పైస్థాయి అధికారులకు ఎల్లప్పుడూ చేరవేయాలన్నారు. అధికారులు, సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. ట్రాఫిక్ రూల్స్ను పాటిస్తూ ఇతరులకు ఆదర్శంగా ఉండాలని సూచించారు. బోధన్ ఏసీపీ శ్రీనివాస్, రూరల్ సీఐ విజయ్ బాబు, ఎస్హెచ్వో వెంకట నారాయణ, ట్రాఫిక్ సీఐ చందర్ రాథోడ్, ఏస్సైలు మచ్చేందర్, రమ, చంద్రమోహన్, సిబ్బంది పాల్గొన్నారు. -
బైక్ను ఢీకొన్న కారు: ఒకరికి గాయాలు
ఖలీల్వాడి: నగరంలోని గాజులపేట్లోగల ఏఆర్ జిరాక్స్ వద్ద బైక్ను కారు ఢీకొనడంతో ఒకరికి గాయాలయ్యాయి. ఒకటో టౌన్ ఎస్హెచ్వో రఘుపతి తెలిపిన వివరాలు ఇలా.. నగరంలోని గాజులపేట్కు చెందిన ప్రేమ్కుమార్(45) మంగళవారం బైక్పై కంఠేశ్వర్కు బయలుదేరాడు. గాజులపేట్లోని ఏఆర్ జిరాక్స్ వద్ద ఓ కారు యూటర్న్ తీసుకుంటుండగా, బైక్పై వెళుతున్న ప్రేమ్కుమార్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో అతడికి తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాధితుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. జక్రాన్పల్లి మండలంలో ఇద్దరికి.. జక్రాన్పల్లి: మండల పరిధిలో బైక్ను కారు ఢీకొనడంతో బైక్పై ప్రయాణిస్తున్న ఇద్దరికి గాయాలయ్యాయి. వివరాలు ఇలా.. ఆర్గుల్ గ్రామానికి చెందిన జైడి నర్సయ్య, అతని కోడలుతో కలిసి బైక్పై మంగళవారం ఆర్మూర్కు బయలుదేరారు. మార్గమధ్యలో ఆర్మూర్ వైపు వెళ్తున్న కారు వేగంగా వచ్చి బైక్ను వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్ పై ప్రయాణిస్తున్న ఇద్దరికి గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు జక్రాన్పల్లి ఎస్హెచ్వో తెలిపారు. ● కాపాడిన పోలీసులు ఆర్మూర్టౌన్: ఆత్మహత్యకు యత్నించిన ఓ మహిళలను పోలీసులు కాపాడారు. వివరాలు ఇలా.. పెర్కిట్ గ్రామానికి చెందిన సిరిగాల లక్ష్మీ ఆర్థిక, కుటుంబ సమస్యల కారణంగా జీవితంపై విరక్తి చెందింది. దీంతో సోమవారం రాత్రి స్థానిక చెరువులో దూకి ఆత్మహత్యకు ప్రయత్నించింది. కానీ స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకున్న పోలీసులు మహిళను చెరువులో దూకకుండా అడ్డుకొని కాపాడి, కుటుంబ సభ్యులకు అప్పగించారు. నిండు ప్రాణాలు కాపాడిన ఆర్మూర్ ఎస్బీ కానిస్టెబుల్ విజయ్కుమార్, ఏఎస్సై రాందాస్ను స్థానికులు అభినందించారు. డిచ్పల్లి: మండలంలోని బీబీపూర్ తండా సమీపంలోగల 44వ నంబరు జాతీయ రహదారిపై కంకర లోడ్తో వెళుతున్న టిప్పర్ అదుపుతప్పి సైడ్వాల్ను ఢీకొట్టింది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా.. కంకర లోడ్తో టిప్పర్ మంగళవారం ఇందల్వాయి నుంచి నిజామాబాద్ బయలుదేరింది. బీబీపూర్ తండా సమీపంలో టిప్పర్ అతివేగంతో అదుపుతప్పి సైడ్వాల్ను ఢీకొట్టి నిలిచిపోయింది. ఈ ఘటనలో డ్రైవర్కు గాయాలు కాగా, టిప్పర్ ముందుభాగం దెబ్బతింది. స్థానికులు బాధితుడిని వెంటనే చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రికి తరలించారు. నందిపేట్ (ఆర్మూర్): మండలంలోని ఆంధ్రనగర్ గ్రామంలో డివైడర్ ఢీకొని కారు బోల్తా పడగా, అందులోని ముగ్గురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. నిజామాబాద్ నుంచి నందిపేట్ వైపు వస్తున్న కారు మంగళవారం ఆంధ్రనగర్ గ్రామంలో డివైడర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు పల్టీలు కొడుతూ కొద్ది దూరం వెళ్లి బోల్తా పడింది. వెంటనే స్థానికులు కారు వద్దకు వెళ్లి అందులోని ముగ్గురు ప్రయాణికులను బయటకు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కారులో ప్రయాణిస్తున్న వ్యక్తులు డొంకేశ్వర్ గ్రామానికి చెందిన వారీగా సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
ఇందల్వాయి: మండల పరిధి లోని 44వ నంబరు జాతీయ ర హదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందాడు. ఎస్సై సందీప్ తెలిపిన వివరాలు ఇలా.. అదిలా బాద్ జిల్లాలోని ఇచ్చోడకు చెందిన నరసింహారెడ్డి(21), విశాల్ అనే ఇద్దరు యువకులు హైదరా బాద్లో బీటెక్ చదువుతున్నారు. వారు మంగళవారం వేకువజామున కారులో హైదరాబాద్ నుంచి ఇచ్చోడకు బయలుదేరారు. ఇందల్వాయి మండలంలోని దేవితండా హైవే వద్ద వారు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కన నిలిపి ఉంచిన లారీని వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నరసింహరెడ్డి అక్కడికక్కడే మృతి చెందగా, కారు నడుపుతున్న విశాల్కు స్వల్ప గా యాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసు లు ఘటన స్థలానికి చేరుకొని, వివరాలు సేకరించా రు. మృతదేహాన్ని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి తండ్రి కృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు నిర్లక్ష్యంగా కారు నడిపిన విశాల్పై, లారీ పార్క్ చేసిన హర్యానాకు చెందిన లారీ డ్రైవర్ ఆలాంపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై సందీప్ తెలిపారు. చెరువులో పడి వృద్ధుడు.. సిరికొండ: మండలంలోని కొండాపూర్ గ్రామ చెరువులో ఓ వృద్ధుడు పడి మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. వివరాలు ఇలా.. గోప్య తండాకు చెందిన బుక్యా శంకర్(59) అనే వృద్ధుడు సోమవారం చేపలు పట్టడానికి చెరువుకు వెళ్లాడు. రాత్రి అయిన అతడు ఇంటికి రాకపోవడంతో కుటుంబీకులు చెరువు వద్దకు వెళ్లి చూడగా శంకర్ కనిపించలేదు. చెరువు కట్టపై అతడి బట్టలు ఉండటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. గజ ఈతగాళ్ల సహాయంతో చెరువులో వెతకగా చెరువులో శంకర్ మృతదేహం లభ్యమైంది. మృతుడి కొడుకు సుమన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రామకృష్ణ తెలిపారు. -
రాష్ట్రస్థాయి క్రీడల్లో విద్యార్థుల ప్రతిభ
ఇందల్వాయి: మండలంలోని ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాల విద్యార్థినులు రాష్ట్ర స్థాయి క్రీడల్లో విజేతలుగా నిలిచినట్లు ప్రిన్సిపాల్ రమేశ్ కుమార్ మంగళవారం తెలిపారు. ఈ నెల 6 నుంచి 8వ తేదీ వరకు రాజన్న సిరిసిల్ల జిల్లా టీజీ ఈఎంఆర్ఎస్ మరిమడ్లలో నిర్వహించిన 5వ రాష్ట్రస్థాయి క్రీడల్లో పాఠశాల విద్యార్థినులు పాల్గొన్నట్లు ఆయన పేర్కొన్నారు. అండర్–19 వాలీబాల్ విభాగంలో విద్యార్థినులు జి. కృష్ణవేణి, బి. పూజ, ఆర్. అఖిల, పి.సంగీత, ఆర్. వైష్ణవి, ఎ. వాణి ప్రథమ స్థానంలో నిలిచి విన్నర్ ట్రోఫీని అందుకున్నారని అన్నారు. ఈ బృందం జాతీయ పోటీలకు ఎంపికై ందన్నారు. అలాగే ఖోఖో లో రన్నరప్గా విద్యార్థినులు ఎల్. సౌందర్య, సావిత్రి, సింధు, బిందు, అమూల్య, అక్షయ, సోనియా, సరస్వతి, అపూర్వ నిలిచారు. వీరిని హెచ్ఎం అభినందించి హర్షం వ్యక్తం చేశారు. బాక్సింగ్ అండర్ 19లో తేజశ్విని, హారిక, అండర్ 14లో షణ్ముఖ ప్రియ, జూడో అండర్ 19లో హారిక, తేజశ్విని, అండర్ 14లో ప్రసన్న, అర్చన, రెజ్లింగ్ అండర్ 19లో హారిక, శిరీష అండర్ 14లో మాధవి, వెయిట్ లిఫ్టింగ్ అండర్ 19లోసోని, హారిక, శిరీష, తేజశ్విని, తైక్వాండో అండర్ 14లో నిత్య, సౌందర్య, అండర్ 19లో రజిత, షార్ట్ పుట్ అండర్ 19లో కృష్ణవేణి, డిస్కస్ థ్రో అండర్ 14లో బిందు, లాంగ్ జంప్ అండర్ 14లో శృతితోపాటు పలువురు రన్నింగ్ యోగా పోటోల్లో ప్రతిభ చాటారన్నారు. ఈ క్రీడల్లో విద్యార్థులు 9 బంగారు పతకాలు, 6 వెండి పతకాలు, 10 రజత పతకాలు సాధించినట్లు పేర్కొన్నారు. అనంతరం విజయాలను సాధించడంలో ముఖ్య పాత్ర పోషించిన పీఈటీ దివ్య, రోహిత్లను ప్రిన్సిపాల్ అభినందించారు. నిజామాబాద్నాగారం: నిర్మల్లో ఈనెల 5, 6, 7 తేదీల్లో నిర్వహించిన రాష్ట్రస్థాయి యోగాసన పోటీల్లో నిజామాబాద్ జిల్లా క్రీడాకారులు పతకాల పంట తెచ్చారు. జిల్లాకు చెందిన క్రీడాకారులు వివిధ విభాగాల్లో ప్రతిభ చాటి రెండు బంగారు, 7 రజత, 8 కాంస్య పతకాలు మొత్తం 17 పతకాలు సాధించి సత్తా చాటారు. రాష్ట్రస్థాయి విజేతలను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందనమ్ కృపాకర్, కార్యనిర్వాక కార్యదర్శి రామ్రెడ్డి, జిల్లా గౌరవ అధ్యక్షుడు యోగ రామచందర్, అధ్యక్షుడు ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి బాలశేఖర్, కార్యనిర్వాహక కార్యదర్శి సంగీత, భూమాగౌడ్, రఘువీర్, జ్యోతి, ఉమారాణి తదితరులు క్రీడాకారులను అభినందించారు. తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో ఏర్పాటు చేసిన ఐదు పరీక్షా కేంద్రాల్లో బీఈడీ, ఎంఈడీ సెమిస్టర్ పరీక్షలు మంగళవారం ప్రశాంతంగా ముగిసినట్లు అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఘంటా చంద్రశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. బీఈడీ 2, 4వ సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్లాగ్ పరీక్షల్లో మొత్తం 1145 మంది విద్యార్థులకు గానూ 1088 మంది హాజరైనట్లు తెలిపారు. ఎంఈడీ నాలుగవ సెమిస్టర్ రెగ్యులర్, 1, 2, 3, 4వ సెమిస్టర్ బ్యాక్లాగ్ పరీక్షల్లో మొత్తం ముగ్గురు విద్యార్థులకు ముగ్గురు హాజరైనట్లు ఆయన తెలిపారు. నిజామాబాద్ సిటీ: నగర మున్సిపల్ కార్పొరేషన్లో వార్డు ఆఫీసర్లుగా విధులు నిర్వహిస్తున్న 18 మంది సిబ్బంది జీపీవోలుగా ఎంపికయ్యారు. వీరంతా కలెక్టర్ను కలిసి ఇటీవల నియామక పత్రాలు పొందారు. దీంతో మంగళవారం 18 మంది వార్డు ఆఫీసర్లను మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ రిలీవ్ చేశారు. వీరంతా గ్రామ పాలన అధికారులుగా విధులు నిర్వహించనున్నారు. -
క్షయవ్యాధి నిర్మూలనే ధ్యేయం
● జిల్లా వైద్యాధికారిణి రాజశ్రీ ● బెటాలియన్లో ఆరోగ్య శిబిరండిచ్పల్లి: దేశంలో క్షయవ్యాధిని పూర్తిగా నిర్మూలించడానికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని నిజామాబాద్ జిల్లా వైద్యాధికారిణి (డీఎంహె చ్వో) రాజశ్రీ అన్నారు. డిచ్పల్లి మండలం టీజీఎస్పీ ఏడో బెటాలియన్లో మంగళవారం టీబీముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా క్షయవ్యాధి నిర్ధారణ వైద్య శిబిరాన్ని డీఎంహెచ్వో ప్రారంభించి మాట్లాడారు. సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. వారానికి మించి ఎవరైనా దగ్గు, జ్వరంతో బాధపడుతున్నట్లయితే వెంటనే సమీపంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి వెళ్లి తెమడ పరీక్ష చేయించుకోవాలని సూచించారు. వైద్య శిబిరంలో పలువురికి క్షయవ్యాధి పరీక్షలు నిర్వహించారు. అలాగే బెటాలియన్లోని సిబ్బంది ఇంటింటికి వెళ్లి కుటుంబసభ్యులకు జ్వర పరీక్షలు నిర్వహించారు. కమాండెంట్ సత్యనారాయణ, అసిస్టెంట్ కమాండెంట్ శరత్, జిల్లా క్షయ వ్యాధి నివారణ అధికారిణి అవంతి, బెటాలియన్ యూనిట్ మెడికల్ ఆఫీసర్ అనుపమ, ఇందల్వాయి పీహెచ్సీ వైద్యాధికారి షారోన్ షైని క్రిస్టినా, జిల్లా టీబీ కోఆర్డినేటర్ రవి, ఆయుష్మాన్ ఆరోగ్యం మందిర్ డాక్టర్ అరుణ్, స్వప్న, సుచరిత, హెచ్ఈవో శంకర్, సూపర్వైజర్లు దేవపాలం, రాజేందర్, పద్మ, ఏఎన్ఎంలు అరుంధతి, సంధ్య, సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రమాదకరంగా విద్యుత్ వైర్లు
నందిపేట్(ఆర్మూర్): నందిపేట మండలం కౌల్పూర్ గ్రామంలో గృహాల మీదుగా ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు ప్రమాదకరంగా మారాయి. ఇళ్ల సమీపంలో నుంచి వెళ్తున్న వైర్లు చేతికి అందే దగ్గరలో ఉన్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. వైర్లు కిందకు ఉండటంతో విద్యుత్ ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆవేదన చెందుతున్నారు. సమస్యను విద్యుత్ అధికారులకు తెలిపినా పరిష్కారం కావడం లేదని, ఇప్పటికై నా స్పందించి సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు. నవీపేట: నవీపేట శివారులోని పంట పొలంలో రైతు గోపాల్ ఆధునిక డ్రోన్ల సహాయంతో మంగళవారం క్రిమిసంహారక మందులను పి చికారి చేశారు. 20 ఎకరాల వరి పొలంలో తక్కువ ఖర్చుతో క్రిమిసంహారక మందులను పిచికారి చేశారు. ఎకరానికి రూ. 300 నుంచి రూ.350 వరకు ఖర్చు అయిందని రైతు తెలిపారు. కేవలం రెండున్నర గంటలలో 20 ఎకరాల వరి పొలంలో క్రిమిసంహారక మందుల ను డ్రోన్ ద్వారా స్ప్రే చేసినట్లు పేర్కొన్నారు. డ్రోన్ల వాడకంతో సమయం ఆదా అవడంతోపాటు ఖర్చులు తగ్గాయని అన్నారు. నిజామాబాద్నాగారం: ఇటీవల మహబూబ్నగర్లో జరిగిన 11వ రాష్ట్ర సబ్ జూనియర్ బ్యాడ్మింటన్ చాపియన్ షిప్ పోటీల్లో నిజామాబాద్ జిల్లాకు చెందిన అనుముల శ్రీవైభవి సింగిల్స్ విభాగంలో రన్నర్గా నిలిచింది. ఈసందర్బంగా జిల్లా బాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు కర్నాటి వాసు, సెక్రెటరీ కిరణ్ కుమార్, కోశాధికారి సాయరెడ్డిలు మంగళవారం ఆమె కు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. శ్రీ వైభవి జూన్లో గోవాలో జరిగిన అండర్ 13 నే షనల్ ర్యాంకింగ్ టోర్నమెంట్, ఆగస్టులో ముంబాయి లో జరిగిన అండర్ 13 నేషనల్ ర్యాంకింగ్ టోర్నమెంట్లో కూడా ప్రతిభ కనబర్చి రెండు బంగారు పతకాలు సాధించి జిల్లాకి, రాష్ట్రానికి వన్నె తెచ్చిందన్నారు. ● గ్రామంలో మృతిచెందిన సల్మాబేగం ● ఏళ్ల క్రితం ఇంట్లోంచి వెళ్లిన మృతురాలి కుమారుడు ● అంత్యక్రియలు చేయడానికి తిరిగిరాగా, ఒప్పుకోని స్థానికులు ● దత్తత కుమార్తె కరిష్మా బేగం చేయాలని నిర్ణయించిన గ్రామస్తులు కామారెడ్డి రూరల్: తల్లిని కంటికి రెప్పలా కాపాడుకొని ఆసరాగా ఉండాల్సిన కుమారుడు 20 ఏళ్ల క్రితం ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. కుమారుడు వెళ్లిపోయాడని ఆ తల్లి కుంగిపోలేదు. కామారెడ్డిలో దొరికిన ఒక అమ్మాయిని పెంచుకుని పెళ్లి చేసి పంపించింది. మంగళవారం ఆ తల్లి మృతి చెందగా చెందగా ‘తానే కొడుకునని అంత్యక్రియలు నేనే చేస్తాను. మా ఊరికి తీసుకెళ్తాను’ అని వచ్చిన కొడుకును నువ్వెవరో తెలియదు అని వెల్లగొట్టారు. ఈ ఘటన కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని పాత రాజంపేటలో చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన సల్మాబేగంను 20 సంవత్సరాల క్రితం కుమారుడు వదిలి వెళ్లిపోయాడు. ఒక్కగానొక్క కొడుకు తనను వదిలి వెళ్లిపోవడంతో కొద్దిరోజులు బాధపడింది. తన రాత ఇంతే అనుకుని జీవిస్తుండగా కొద్దిరోజులకు కామారెడ్డి పట్టణంలో దొరికిన కరిష్మా బేగం అనే చిన్నారిని పెంచుకుంది. పెద్దయ్యాక సల్మాబేగం.. కరిష్మాకు పెళ్లి చేసి బాధ్యత తీర్చుకుంది. పెళ్లయినా పెంచిన తల్లి మంచి చెడులన్నీ కరిష్మానే చూసుకుంది. గ్రామంలో కూడా మంచి పేరు తెచ్చుకుంది. అయితే మంగళవారం సల్మాబేగం మృతి చెందింది. 20 ఏళ్లుగా అటువైపు రాని కొడుకు తల్లి చనిపోయిన విషయం తెలుసుకొని, అంత్యక్రియలు చేస్తానని తల్లి శవాన్ని తీసుకొని వెళ్లేందుకు గ్రామానికి వచ్చాడు. దాంతో కొడుకుతో గ్రామస్తులు వాగ్వాదానికి దిగారు. 20 ఏళ్ల తర్వాత తల్లి ఇప్పుడు గుర్తుకొచ్చిందా అంటూ నిలదీశారు. అయితే ఇన్నేళ్ల పాటు సల్మాబేగం మంచి చెడులు చూసిన కరిష్మాయే అంత్యక్రియలు చేయాలని నిర్ణయించారు. ఇన్నాళ్లుగా లేని ప్రేమ తల్లి చనిపోయాక రావడంతో ఆస్తి కోసమే వచ్చి ఉంటాడని గ్రామస్తులు అనుమానిస్తున్నారు. ఈ విషయం పోలీసుల దాకా వెళ్లడంతో అంత్యక్రియలు నిలిచిపోయాయి. -
బోధనలో ప్రత్యేకం మా‘స్టారు’
● విద్యతోపాటు నైతిక విలువలకు పెద్దపీటనిజామాబాద్అర్బన్: బోధనలో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. పిల్లలకు విద్యతోపాటు నైతిక విలువలూ ముఖ్యమని భావిస్తాడు. 29 ఏళ్లుగా ఈయన బోధనలో నైతిక విలువలకు పెద్దపీట వేస్తూ విద్యార్థులను తీర్చిదిద్దుతున్నాడు. ఆ విధానంతోనే భీమ్గల్ మండలం చేంగల్ గ్రామానికి చెందిన నంబి శ్రీనివాస్ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. 1997లో ఆగస్టు 28న టీచర్ ఉద్యోగంలో చేరాడు. ప్రస్తుతం వేల్పూర్ మండలం మోతె మండల పరిషత్ పాఠశాలలో ఎస్టీటీగా విధులు నిర్వర్తిస్తున్నాడు. విద్యార్థులకు పాఠ్యపుస్తకాలతోపాటు వివిధ సామాజిక సేవా కార్యక్రమాలు, సాంస్కృతిక విధానాలు, క్రమశిక్షణ అలవర్చారు. సమాజంలో మారుతున్న విధానాలపై విద్యార్థులకు బోధిస్తారు. వారంలో ఒకరోజు క్వీజ్ పోటీలను నిర్వహిస్తూ సొంత డబ్బులతో వారికి బహుమతులు ప్రదానం చేసేవారు. విద్యార్థులతో మొక్కలు నాటించి, వాటి సంరక్షణకు కృషి చేస్తున్నారు. ‘పిల్లలకు విద్యతోపాటు నైతిక విలువలు ఎంతో ముఖ్యం, క్రమశిక్షణ తోడైతే బంగారు భవిష్యత్తు లభిస్తుంది’ అని చెబుతున్నారు నంబి శ్రీనివాస్. జిల్లాస్థాయి అవార్డు రావడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. -
హుండీ ఆదాయం లెక్కింపు
నిజామాబాద్ రూరల్: నగరంలోని జెండా బాలాజీ దేవస్థానం హుండీ ఆదాయాన్ని సోమవారం లెక్కించారు. ఆగస్టు 24 నుంచి సెప్టెంబర్ 7 వరకు నోట్ల ద్వారా రూ.5,79,130, నాణెములు రూ. 93,081, మొత్తం రూ. 6,72,211 ఆదాయం వచ్చినట్లు దేవాదాయ శాఖ పరిశీలకురాలు కమల వెల్లడించారు. ఆరు గ్రాముల మిశ్రమ బంగారం, 305 గ్రాముల మిశ్రమ వెండి వచ్చిందని తెలిపారు. కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వాహణాధికారి ఎ.వేణు, ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ లవంగ ప్రమోద్ కుమార్, ధర్మకర్తలు పోలకొండ నర్సింగ్ రావు, సిరిపురం కిరణ్ కుమార్, పవర్ విజయ, కొర్వ రాజ్కుమార్, అర్చకులు నాగరాజాచార్యులు, జూనియర్ అసిస్టెంట్లు ప్రశాంత్ కుమార్, ఆంజనేయులు, రఘునాథ్, సహస్రనామ పారాయణ భక్తులు పాల్గొన్నారు. -
పంటలను గట్టెక్కించారు
● యూరియా కొరత తీర్చిన సొసైటీ ● హర్షం వ్యక్తం చేస్తున్న రైతులుమాక్లూర్: ఖరీఫ్ సీజన్లో యూరియా కొరత రాకుండా తీసుకున్న జాగ్రత్తలు పంటలను గట్టెక్కించాయి. జిల్లాలో పలు మండలాల్లో యూరియా కొరత ఏర్పడినప్పటికీ మాక్లూర్లో మాత్రం రైతులు ఆ సమస్య ఎదుర్కోకుండా సొసైటీ చైర్మన్ బూరోల్ల అశోక్ సఫలీకృతులయ్యారు. మాక్లూర్ మండలంలో మొత్తం 19,500 ఎకరాల్లో రైతులు వరి సాగు చేస్తుండగా, సుమారు 2,500 మెట్రిక్ టన్నుల యూరియా అవసరమవుతుంది. దీంతో నిత్యం ఉన్నతాధికారులతో మాట్లాడుతూ సొసైటీ పరిధిలోని రైతాంగానికి కావాల్సిన యూరియాను తెప్పించారు. గ్రామాలకు వెళ్లి యూరియా అవసరం ఉన్నంత వరకే కొనుగోలు చేసుకోవాలని ఆ తర్వాత మళ్లీ అవసరానికి యూరియా అందించే బాధ్యత తనదని రైతులకు హామీ ఇచ్చారు. ఆ దిశగా విడుతల వారీగా పంటకు కావాల్సిన యూరియాను అందించారు. ప్రస్తుతం కొన్ని చోట్ల వరి పొట్టదశలో ఉండగా, మరికొన్ని చోట్ల కంకి పూర్తిగా బయటికి వచ్చింది. కాగా, గతంలో సొసైటీకి వచ్చిన యూరియా పక్కదారి పట్టేదని, సమయానికి ఎరువులు వేయక దిగుబడి తగ్గి నష్టపోయామని పలువురు రైతులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం సరిపడా యూరియా అందించి పంటలను గట్టెక్కించడంపై రైతులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. -
కాంగ్రెస్ రాష్ట్ర ఇన్చార్జి మీనాక్షి నటరాజన్తో భేటీ
మోపాల్(నిజామాబాద్రూరల్): కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్తో పీసీసీ డెలిగేట్, నిర్మల్ జిల్లా పార్టీ పరిశీలకులు బాడ్సి శేఖర్గౌడ్ సోమవారం హైదరాబాద్లోని గాంధీభవన్లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నిర్మల్ జిల్లాలో పార్టీ పరిస్థితి, జిల్లా, మండల కమిటీల ఎన్నిక, తదితర అంశాలను మీనాక్షి నటరాజన్కు వివరించారు. కామారెడ్డిలో ఈ నెల 15న నిర్వహించే బహిరంగసభకు జిల్లా నుంచి పెద్ద ఎత్తున బీసీలు, కాంగ్రెస్ కార్యకర్తలను తరలించాలని, సభ విజయవంతం కోసం ప్రతిఒక్కరూ కృషి చేయాలని ఆమె సూచించినట్లు శేఖర్ గౌడ్ తెలిపారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పార్టీ గెలుపు కోసం బాధ్యతలు అప్పగిస్తే పని చేయాలన్నారని పేర్కొన్నారు. కాగా, అంతకుముందు గాంధీభవన్లో జరిగిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ, ఆఫీస్ బేరర్ల సమావేశానికి శేఖర్గౌడ్ హాజరయ్యారు. -
జార్ఖండ్లో అబ్బాపూర్తండా వాసి మృతి
● మృతుడు పోస్టల్ ఉద్యోగి నవీపేట: మండలంలోని అబ్బాపూర్ తండాకు చెందిన సభావాత్ శ్రీహరి(20) సోమవారం జార్ఖండ్లో జరిగిన నీటి ప్రమాదంలో మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి. అబ్బాపూర్ తండాకు చెందిన సభావత్ కై లాస్ కుమారుడు జార్ఖండ్ రాష్ట్రంలోని చక్రధర్ఫూల్ పరిధి ఒటాదిరి బ్రాంచ్లో పోస్టల్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్నారు. సోమవారం ఆయన స్నేహితులతో కలిసి సమీపంలోని వాటర్ఫాల్కు వెళ్లాడు. స్నానం చేస్తుండగా ఒక్కసారిగా నీటి ప్రవాహం పెరిగి నీటమునిగాడు. ఊపిరాడకపోవడంతో మృతి చెందాడు. జార్ఖండ్ పోలీసులు మృతుడి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. శ్రీహరి మృతితో అబ్బాపూర్తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఖలీల్వాడి: నగరంలోని కంఠేశ్వర్ ప్రాంతంలో సోమ వారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందినట్లు మూడో టౌన్ ఎస్సై హరిబాబు తెలిపారు. వి వరాలు ఇలా ఉన్నాయి. ఆగ్రాకు చెందిన సంతోష్(32) సోమవారం బైక్పై ఆర్మూర్ వైపు నుంచి నిజామాబాద్కు వస్తున్నాడు. కంఠేశ్వర్లోని అయ్య ప్ప స్వామి ఆలయ సమీపంలో ముందున్న ఓ స్కూల్ బస్సును బైక్ ఢీకొట్టింది. ఆ వెంటనే వెనుక నుంచి వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో బైక్పై ఉన్న సంతోష్ తలకు తీవ్రగాయాలయ్యాయి. హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే సంతోష్ మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కామారెడ్డి క్రైం: అంగన్వాడీ కేంద్రం నుంచి ఇంటికి వస్తూ దారి మరిచి తప్పిపోయిన చిన్నారిని పట్టణ పోలీసులు గుర్తించి కుటుంబసభ్యులకు అప్పగించారు. ఈ ఘటన జిల్లా కేంద్రంలోని ఆర్బీనగర్ కాలనీలో సోమవారం చోటు చేసుకుంది. కాలనీకి చెందిన తూర్పాటి లక్ష్మి–చింటులకు 4 ఏళ్ల కుమార్తె సాయిపల్లవి ఉంది. ఆమె ప్రతిరోజు ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల సమీపంలోని అంగన్వాడీ కేంద్రానికి ఉదయం 10 గంటలకు వెళ్లి మధ్యాహ్నం 2.45 గంటలకు తిరిగి వచ్చేది. సోమవారం ఇంటికి వస్తుండగా దారి తప్పి ఎక్కడికో వెళ్లిపోయింది. బాలిక కనిపించకపోవడంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు, అంగన్వాడీ కేంద్రం సిబ్బంది గాలించడంతోపాటు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సిరిసిల్లా రోడ్డులోని యూనియన్ బ్యాంకు వద్ద ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ శ్రీకాంత్ బాలికను చేరదీసి పట్టణ పోలీస్స్టేషన్కు తీసుకువచ్చాడు. పట్టణ ఎస్హెచ్వో నరహరి కుటుంబసభ్యులకు సమాచారం అందించి చిన్నారిని అప్పగించారు. -
ఫోన్ హ్యాక్.. ఖాతా షేక్..
మోర్తాడ్ (బాల్కొండ) : మనోడే కదా వాట్సాప్లో ఏపీకే ఫైల్ పంపింది.. ఓపెన్ చేద్దామని క్లిక్ చేశారో ఇక అంతే సంగతులు. క్షణాల్లోనే సైబర్నేరగాళ్లు మీ ఫోన్ను హ్యాక్ చేసేస్తారు. ఎంచక్కా మొబైల్లోని పాస్వర్డులు, ఓపీటీలను తెలుసుకొని మీ ఖాతాల్లోని డబ్బులను దోచేస్తుంటారు. ఇలా ఒకరి తర్వాత మరొకరి మొబైల్లోని కాంటాక్ట్ నంబర్లన్నింటికీ ఏపీకే ఫైల్ పంపుతూ సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు. మోసం జరుగుతోంది ఇలాగే.. ● సైబర్ మోసగాళ్లు వాట్సాప్కు ‘పీఎం కిసాన్ సమ్మాన్ నిధి’, ఎస్బీఐ, ఇతర బ్యాంకులు, ఆఫర్ల పేరిట ఓ ఏపీకే ఫైల్ను పంపిస్తారు. ● ఆ ఫైల్ను క్లిక్ చేయగానే మన మొబైల్ హ్యాక్ అవుతుంది. అనంతరం మన ప్రమేయం లేకుండానే సైబర్ నేరగాళ్లు ఫోన్ను వాడేస్తుంటారు. గుట్టుగా మన సమాచారాన్ని దొంగిలిస్తారు. ఆ తర్వాత బ్యాంకు పిన్, పాస్వర్డుల సహాయంతో మన ఖాతాను ఖాళీ చేస్తారు. ● హ్యాక్ చేసిన మొబైల్లోని కాంటాక్ట్ నంబర్లన్నింటికీ వాట్సాప్ ద్వారా ఏపీకే ఫైల్స్ను పంపిస్తూ ఇలాగే మోసం చేస్తుంటారు. భద్రమైన యాప్స్ను మాత్రమే ఇన్స్టాల్ చేసుకోవాలి. పాస్వర్డులు, పిన్ నంబర్లు, క్రెడిట్ కార్డులు ఇతరత్రా కీలక సమాచారాన్ని మొబైల్లో సేవ్ చేసుకోవద్దు. ఫోన్లకు ఇతరులు ఊహించలేని, కఠినతరమైన పాస్వర్డులు పెట్టుకోవాలి. ప్రధానంగా ఏపీకే ఫైల్స్, లింక్లను అసలే క్లిక్ చేయొద్దు.సైబర్ నేరాలపై అవగాహన పెంచుకొని, సైబర్ మోసగాళ్లకు చిక్కకుండా అప్రమత్తంగా ఉండాలి. ఏపీకే ఫైల్స్ ఓపెన్ చేయొద్దు. ఓటీపీ నంబర్లు ఎవరికీ చెప్పొద్దు. – పొన్నం సత్యనారాయణ, సీఐ, భీమ్గల్ రెచ్చిపోతున్న సైబర్ మోసగాళ్లు ఏపీకే ఫైల్స్ పంపి ఫోన్లను హ్యాక్ చేస్తున్న కేటుగాళ్లు పాస్వర్డులు, ఓటీపీలతో ఖాతాల్లోని డబ్బులను దోచుకుంటున్న వైనం -
అప్పులబాధతో ఒకరి ఆత్మహత్య
ఖలీల్వాడి: నగరంలోని నాందేవ్వాడకు చెందిన మానేయకుర్ రమేశ్(44) అప్పులబాధతో ఆదివారం గడ్డి మందు తాగినట్లు మూడో టౌన్ ఎస్సై హరిబాబు తెలిపారు. గమనించిన కుటుంబసభ్యులు జీజీహెచ్కు తరలించగా చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం మృతి చెందాడన్నారు. మృతుడి భార్య పద్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.కామారెడ్డి క్రైం: తండ్రిని చంపిన కేసులో ఓ కుమారుడికి కామారెడ్డి కోర్టు జీవిత ఖైదు విధించింది. వివరాలిలా ఉన్నాయి. నాగిరెడ్డిపేట మండలం జలాల్పూర్ మండలానికి చెందిన జాన్కంపల్లి విఠల్ 2021 మార్చి 16న హత్యకు గురయ్యాడు. మృతుడికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉండగా చిన్న కుమారుడు సంగమేశ్వర్తో తరుచూ గొడవలు జరిగేవి. సంగమేశ్వర్ తన తండ్రిని హత్య చేసి ఉరివేసుకున్నట్లుగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. కానీ అనుమానించిన కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణలో హత్యగా తేలింది. దీంతో సంగమేశ్వర్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. అప్పటి నుంచి కేసు కోర్టు పరిశీలనలో ఉంది. నేరం రుజువు కావడంతో జిల్లా జడ్జి సీహెచ్వీఆర్ఆర్ వరప్రసాద్ నిందితునికి జీవిత ఖైదు, రూ.10 వేల జరిమానా విధిస్తూ సోమవారం తీర్పు వెల్లడించారు. పోలీసుల తరఫున వాదనలు వినిపించిన పీపీ రాజగోపాల్గౌడ్, కేసును సరైన పద్ధతిలో విచారణ జరిపిన సీఐలు రాజశేఖర్, రాజారెడ్డి, ఎస్సై రాజయ్య, భార్గవ్ గౌడ్, కోర్టు లైజనింగ్ అధికారి రామేశ్వర్రెడ్డి, సిబ్బంది సాయిలును ఎస్పీ రాజేశ్చంద్ర అభినందించారు. -
జాతీయ లోక్అదాలత్ను ఉపయోగించుకోవాలి
ఖలీల్వాడి: జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని సీపీ సాయి చైతన్య సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. చిన్నచిన్న కేసులు, ట్రాఫిక్ చలానాలు, మైనర్ క్రిమినల్ కేసులు, సివిల్ డిస్ప్యూట్లు వంటి వివాదాలకు లోక్ అదాలత్ ద్వారా సులభంగా పరిష్కారం పొందవచ్చని పేర్కొన్నారు. ఈ నెల 13న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ పాల్గొని న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న కేసులను తక్కువ సమయంలో ముగించుకోవచ్చని తెలిపారు. తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో బీఈడీ, ఎంఈడీ సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్లాగ్ పరీక్షలు సోమవారం ప్రశాంతంగా జరిగినట్లు ఆడిట్ సెల్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. బీఈడీ 2, 4వ సెమిస్టర్ పరీక్షల్లో మొత్తం 27 మంది విద్యార్థులకు 18 మంది హాజరుకాగా, 9 మంది గైర్హాజరయ్యారు. ఎంఈడీ 4వ సెమిస్టర్ రెగ్యులర్, 1, 2, 3, 4వ సెమిస్టర్ బ్యాక్లాగ్ పరీక్షల్లో మొత్తం 31 మందికి గానూ 30 మంది హాజరుకాగా ఒకరు గైర్హాజరైనట్లు తెలిపారు. వర్సిటీ కళాశాలలో సోమవారం జరిగిన ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం 4వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల్లో మొత్తం 39 మంది విద్యార్థులకు 34 మంది హాజరుకాగా నలుగురు గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. -
విద్యతోపాటు క్రీడలు కూడా ముఖ్యమే
● ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డికమ్మర్పల్లి: విద్యార్థులకు విద్యతోపాటు క్రీడలు కూడా ముఖ్యమేనని, ఆటలతో శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతత లభిస్తుందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి పేర్కొన్నారు. కమ్మర్పల్లి మండలం అమీర్నగర్ గ్రామంలో సోమవారం నిర్వహించిన మండల అంతర పాఠశాలల క్రీడాపోటీలను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లలను విద్యతోపాటు క్రీడల్లో కూడా ప్రోత్సహించాలన్నారు. ఇక్కడి విద్యార్థులు జాతీయస్థాయి క్రీడల్లో రాణించడానికి వ్యాయామ ఉపాధ్యాయుల కృషి ఎంతో ఉందని అభినందించారు. మార్చ్ఫాస్ట్లో మొదటిస్థానంలో చౌట్పల్లి జెడ్పీహెచ్ఎస్, ద్వితీయ స్థానంలో బషీరాబాద్, కోనసముందర్, తృతీయ స్థానంలో హసకొత్తూర్ పాఠశాలలు నిలిచాయి. ప్రైవేట్ పాఠశాలల విభాగంలో మొదటిస్థానంలో విజ్ఞాన జ్యోతి, ద్వితీయ స్థానంలో క్రిష్ణవేణి, తృతీయ స్థానంలో శ్రీవిద్యాసాయి పాఠశాలలు నిలిచాయి. వీరికి ఎమ్మెల్యే బహుమతులు ప్రదానం చేశారు. గదుల నిర్మాణానికి కృషి.. అమీర్నగర్ మండల పరిషత్ ఉన్నత పాఠశాలలో గదుల కొరత తీవ్రంగా ఉందని, గదుల నిర్మాణం కోసం ప్రభుత్వానికి విన్నవించి నిధులు మంజూరయ్యేలా కృషి చేస్తానని హామీనిచ్చారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ నర్సయ్య, వైస్ చైర్మన్ సుంకెట బుచ్చన్న, సొసైటీ చైర్మన్ సామ బాపురెడ్డి, రేగుంట దేవేందర్, వైస్ చైర్మన్ ఆకుల రాజన్న, ఎంఈవో ఆంధ్రయ్య, డీఎస్డీవో పవన్, నాయకులు స్వామి తదితరులు పాల్గొన్నారు. -
ప్రపంచ దేశాలకు మన ఆర్థిక వ్యవస్థ ఆదర్శం
సుభాష్నగర్: ప్రపంచ దేశాలకు భారత ఆర్థిక వ్యవస్థ ఆదర్శంగా నిలుస్తోందని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పేర్కొన్నారు. దేశ ప్రజలకు దీపావళి కానుకగా జీఎస్టీలో సంస్కరణలు తీసుకొచ్చినందుకు బీజేపీ ఆధ్వర్యంలో ప్రధాని మోదీ, ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్ చిత్రపటాలకు నగరంలోని గాంధీచౌక్లో సోమవారం పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ పటేల్ కులాచారితోకలిసి అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడారు. జీఎస్టీపై గగ్గోలు పెట్టిన ప్రతిపక్షాలకు ఇది చెంపపెట్టన్నారు. పేద, మధ్యతరగతి కుటుంబాలు ఉపయోగించే షాంపు నుంచి లగ్జరీ కార్ల వరకు భారీ ఊరట కల్పించారని హర్షం వ్యక్తంచేశారు. తద్వారా దేశంలో దీపావళి పండుగ సంబరాలు ఇప్పుడే మొదలయ్యాయన్నారు. ప్రధానంగా ఆరోగ్య, జీవిత బీమాలతోపాటు 33 రకాల అత్యవసర మందులపై జీరో జీఎస్టీ ఒక విప్లవాత్మక నిర్ణయమని పేర్కొన్నారు. మేక్ ఇన్ ఇండియాలో భాగస్వాములవుతూ మన దేశ ఉత్పత్తులు పెంచి, గ్రామీణస్థాయి నుంచి మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దాలన్న మోదీ సంకల్పానికి తోడ్పాటునందించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు న్యాలం రాజు, నాగోళ్ల లక్ష్మీనారాయణ, జిల్లా ఉపాధ్యక్షుడు బంటు రాము, నాయకులు జ్యోతి, వనిత, ఇప్పకాయల కిశోర్, తారక్ వేణు, హరీశ్రెడ్డి, పంచరెడ్డి శ్రీధర్, మాస్టర్ శంకర్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ప్రధాని మోదీ, ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్ చిత్రపటానికి పాలాభిషేకం -
పిప్రిలో గౌడ కులస్తుల బహిష్కరణ
ఆర్మూర్టౌన్: ఆర్మూర్ మండలం పిప్రి గ్రామంలో గౌడ కులస్తులపై గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు బహిష్కరణ వేటు వేశారు. కల్లు ధర పెంపు విషయంలో గ్రామానికి చెందిన తమను వీడీసీ బహిష్కరించినట్లు సోమవారం 54 గౌడ కుటుంబాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. ప్రస్తుతం ఉన్న ధర సరిపోవడం లేదని, ధర పెంచుకుంటామని వీడీసీ దృష్టికి తీసుకెళ్లగా, తెల్లకాగితంపై సంతకాలు పెట్టి ఇవ్వాలని లేదంటే తాము చెప్పినట్లు వినాలని హకుం జారీ చేసినట్లు తెలిపారు. తెల్లకాగితంపై సంతకాలు చేయకపోవడంతో తమను బహిష్కరించినట్లు పేర్కొన్నారు. తమకు సంబంఽధించిన హోటళ్లు, దుకాణాలు, ఆటోల్లోకి ఎవరినీ రానివ్వకుండా ఆంక్షలు పెట్టినట్లు గౌడ కులస్తులు తెలిపారు. -
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
బాల్కొండ: జీవాలకు సోకే సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని జిల్లా పశువైద్యాధికారి రోహిత్రెడ్డి పేర్కొన్నారు. బాల్కొండ మండలం బోదేపల్లి గ్రామంలో గొర్రెలకు, మేకలకు సోమ వారం పశుసంవర్థక శాఖ ఆధ్వర్యంలో ఉచితంగా టీకాలు వేశారు. జీవాలకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను తప్పకుండా వేయించాలన్నా రు. గ్రామంలో 850 గొర్రెలు, 140 మేకలకు టీకా లు వేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో పశువైద్యాధికారి గౌతంరాజు, ఎల్ఎస్ఏ ప్రవీణ్, గోపాలమిత్రలు మల్లేశ్, షకీల్, ప్రణీత్, రైతులు పాల్గొన్నారు.కామర్స్ విభాగం డీన్గా ప్రొఫెసర్ యాదగిరితెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ సీనియర్ ప్రొఫెసర్ ఎం యాదగిరి కామర్స్ విభాగం డీన్గా నియామకమయ్యారు. ఈ మేరకు వీసీ ప్రొఫెసర్ టి.యాదగిరిరావు నియామక ఉత్తర్వులు అందజేశారు. కామర్స్ విభాగంలో మూడు దశాబ్దాల బోధన, పరిశోధన అనుభవం కలిగిన ప్రొఫెసర్ యాదగిరి తెయూలో అనేక అడ్మినిస్ట్రేటివ్, అకడమిక్ పదవులు సమర్థంగా నిర్వహించారు. ప్రస్తుతం ప్రొఫెసర్ యాదగిరి తెయూ రిజిస్ట్రార్గా కొనసాగుతున్నారు.సోషల్ సైన్స్ డీన్గా ప్రొఫెసర్ రవీందర్రెడ్డితెలంగాణ యూనివర్సిటీ అర్ధశాస్త్ర విభా గం ప్రొఫెసర్ కే.రవీందర్రెడ్డి సోషల్ సైన్స్ డీన్గా నియమితులయ్యారు. వీసీ ప్రొఫెసర్ టీ.యాదగిరిరావు ఆదేశాల మేరకు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యాదగిరి సోమవారం రవీందర్రెడ్డికి నియామక ఉత్తర్వులు అందజేశారు. రవీందర్రెడ్డి ప్రస్తుతం తెయూ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్గా కొనసాగుతున్నారు.‘గిరిరాజ్’ వైస్ ప్రిన్సిపాల్ రంగరత్నానికి డాక్టరేట్ నిజామాబాద్అర్బన్: గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ రంగరత్నానికి డాక్టరేట్ లభించింది. రసాయనశాస్త్రంలో ‘పాలిమర్ మాట్రిక్స్తో ఔషధాలను జతచేసి, వాటి జీవప్రక్రియలపై అధ్యయనం’ అనే అంశంపై ప్రొఫెసర్ ఎస్బీ పట్వారీ పర్యవేక్షణలో పరిశోధన చేశారు. నాందేడ్లోని ఎస్ఆర్టీఎం యూనివర్సిటీ నుంచి పీహెచ్డీ పట్టా అందుకున్నారు. డాక్టరేట్ అందుకున్న రంగరత్నాన్ని అధ్యాపక బృందం సోమవారం సన్మానించింది. కార్యక్రమంలో పరీక్షల నియంత్రణాధికారి భరత్రాజ్, కార్యాలయ ఉద్యోగులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
నేడు ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు
● జిల్లా స్థాయిలో 40 మంది టీచర్ల ఎంపికనిజామాబాద్అర్బన్: జిల్లా స్థాయిలో 40 మంది ఉత్తమ టీచర్లుగా ఎంపికయ్యారు. ఈమేరకు జిల్లా విద్యాశాఖ సోమవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. కలెక్టరేట్లో మంగళవారం ఉత్తమ టీచర్లను ఉన్నతాధికారులు సన్మానించనున్నారు. ఉత్తమ ఉపాధ్యాయులు వీరే.. హెచ్ఎం కేటగిరి : టి హరిచరణ్ (కుకునూర్, వేల్పూర్), టి సురేశ్కుమార్ (డొంకేశ్వర్), డి రవీందర్ (మామిడిపల్లి, ఆర్మూర్), సీహెచ్ రాంప్రసాద్ (కోనాపూర్, కమ్మర్పల్లి). స్కూల్ అసిస్టెంట్: జి.రాజశేఖర్ (జెడ్పీహెచ్ఎస్, ఏర్గట్ల), ఎస్ మల్లేశ్ (రెంజర్ల), శ్రీనివాస్, ఎం.ప్రశాంత్కుమార్ (బాల్కొండ), ఏ శ్రీనివాస్ (మెండోరా), పి గణేశ్ (ఆలూర్), సయ్యద్ అబ్దుల్ నహీం (నీలా), పి గంగాధర్ (కుకునూర్), ఎం సుజాత (ముచ్కూర్), ఏ లక్ష్మీనారాయణ(ఎడపల్లి), టి సాయిలు (డొంకేశ్వర్), స్వప్న (డిచ్పల్లి), శ్రీనివాసరాజు (టీజీఎంఎస్, బాల్కొండ), ఎస్.స్రవంతి (కేజీబీవీ, ఆర్మూర్). ఎస్జీటీ: బి.శివకుమార్ (శివతండా, నవీపేట్), పెద్ది రమణ (కుర్నాపల్లి). ఎస్కే అబ్దుల్ (వెల్మల్), ప్రవీణ్ కుమార్రెడ్డి (గుంజిలి), శ్రీనివాస్ (మోతె), ఎన్ విజయలక్ష్మి (నాగేపూర్), రాజు (ఇస్సాపల్లి), వి.సునీత (ఆర్మూర్), టి.వెంకటేశ్వర్లు (బర్ధిపూర్, బోధన్), శృతిమ (శ్రీరాంపూర్), బాల్కొండ, అల్తాఫుద్దీనన్(ఫతేపూర్), డి.నరేంద్ర శేఖర్ (బాగేపల్లి). ప్రత్యేక అవార్డులు సీహెచ్ శంకర్ (బోర్గాం, మోపాల్), టి.సాయన్న (ఖిల్లా జీహెచ్ఎస్), హఫీజుద్దీన్న(బెజ్జోరా), ఆదిల్ అహ్మద్ (నిజాంకాలనీ, నిజామాబాద్), శ్రీనివాస్ (చౌట్పల్లి), జి.కిషన్న్ (నారాయణపేట్, జక్రాన్పల్లి), శ్రీనివాస్ (వేంపల్లి, ముప్కాల్), డి.సునీత (నాళేశ్వర్), కే సుజాత (పులాంగ్, నిజామాబాద్), రమేశ్ (మానవతా సదన్, కేర్టేకర్, డిచ్పల్లి). -
ప్రజావాణికి 114 ఫిర్యాదులు
నిజామాబాద్అర్బన్: ప్రజావాణికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో 114 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్తోపాటు అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, ట్రెయినీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావీ, డీఆర్డీవో సాయాగౌడ్, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్కుమార్, డీపీవో శ్రీనివాస్, ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్రెడ్డికి అర్జీలు అందజేశారు. ఫిర్యాదులను పెండింగ్లో పెట్ట కుండా ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఖలీల్వాడి: జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావా ణి కార్యక్రమానికి 11 ఫిర్యాదులు వచ్చాయి. బాధితుల సమస్యలను విన్న సీపీ సాయిచైతన్య వాటిని చట్టప్రకారం పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ప్రజలు పోలీసుల సేవలను స్వచ్ఛందంగా వినియోగించుకోవాలని పేర్కొన్నారు. శాంతిభద్రతలను పరిరక్షిస్తూ ముందుకు సాగడమే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ పని చేస్తోందని సీపీ పేర్కొన్నారు. నిజామాబాద్ నాగారం: జిల్లా కబడ్డీ అసో సియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 13న శని వారం ఉదయం 10 గంటలకు నగరంలోని క్రీడా మైదానంలో అండర్–16 బాలుర జట్ల ఎంపికలు జరుగుతాయని అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు లింగయ్య, గంగాధర్ రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికలో పాల్గొనేవారు 16 సంవత్సరాల్లోపు వయస్సు, 55 కేజీల బరువు ఉండాలన్నారు. ఆధార్ కార్డుతోపాటు జనన ధ్రువీకరణ పత్రం తప్పనిసరిగా తీసుకురావాలన్నారు. ఎంపికై న క్రీడాకారులు జిల్లాలో జరగబోయే రాష్ట్రస్థాయి అంతర్ జిల్లాల కబడ్డీ చాంపియన్షిప్ పోటీల్లో పాల్గొంటారన్నారు. నిజామాబాద్అర్బన్: ఈ నెల 12వ తేదీ వరకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూ నివర్సిటీలో డిగ్రీ, పీజీ కోర్సులకు ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకోవాలని రీజినల్ కో ఆర్డినేటర్ రంజిత సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. డిగ్రీలో బీఎస్సీ, ఎంపీసీ, బీజెడ్సీ, పీజీలో ఎంకాం, ఎమ్మెస్సీ, ఎంబీఏ కో ర్సులు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ఆసక్తిగల వారు దూర విద్యను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
అంగన్వాడీ కేంద్రాల ఆధునికీకరణ
● రూ. రెండు కోట్లతో పనులు ● పాత భవనాల్లో మరుగుదొడ్ల నిర్మాణం.. తాగునీటి సదుపాయం ● 10 నూతన భవనాల నిర్మాణం నిజామాబాద్నాగారం: జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల్లో ఇప్పటి వరకు మరుగుదొడ్ల సదుపాయం లేకపోగా, తాగునీటి సరఫరా అంతంతే. అరకొర సదుపాయాల మధ్య అంగన్వాడీ కేంద్రాలు కొనసాగుతుండడంతో ప్రభు త్వం కేంద్రాల బలోపేతంపై దృష్టి సారించింది. రూ.2 కోట్ల నిధులతో జిల్లాలోని సెంటర్లను ఆధునికీకరించడంతోపాటు 10 నూతన భవనాలను నిర్మించాలని నిర్ణయించింది. జిల్లాలో నిజామాబాద్ రూరల్, నిజామాబాద్ అర్బన్, బోధన్, ఆర్మూర్, భీమ్గల్ మొత్తం ఐదు సీడీపీవో(చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్) కార్యాలయాలు ఉండగా, వీటి పరిధిలో 1501 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. 400 సెంటర్లకు సొంత భవనాలు ఉండగా, మిగతా చోట్ల అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. అయితే 400 అంగన్వాడీ కేంద్రాల్లో మరుగుదొడ్ల నిర్మాణం, 216 కేంద్రాల్లో తాగునీటి సదుపాయం కల్పించడంతోపాటు 10 నూతన భవన నిర్మాణ పనులను ప్రా రంభించారు. ఇప్పటికే 156 మరుగుదొడ్ల నిర్మాణ పూర్తయ్యాయని, 244 చోట్ల పనులు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. రెండు నెలల్లో పనులు పూర్తవుతాయని పేర్కొంటున్నారు. సెంటర్ల ఆధునీకరణలో భాగంగా భవనాలకు రంగులు వేయించడంతోపాటు గోడలపై పిల్లలకు అర్థమయ్యేలా చిత్రాలు గీయించారు. 216 సెంటర్లలో తాగునీటి సదుపాయం కల్పించేందుకు పనులు చేపట్టగా 35 సెంటర్లలో పనులు పూర్తయ్యాయి. మొత్తం 10 చోట్ల నూతన భవనాల నిర్మాణ పనులు ప్రారంభించగా, ఇప్పటికే ఐదు చోట్ల పనులు పూర్తయ్యాయి. రూపురేఖలు మారుతున్నాయి జిల్లాలో అంగన్వాడీ కేంద్రాల రూపురేఖలు మారుతున్నాయి. మరమ్మతులతో పాటు ఆధునీకరణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. సొంత భవనాలు ఉన్న చోట్ల మరుగుదొడ్ల నిర్మాణ పనులు, తాగునీటి సదుపాయం కల్పిస్తున్నాం. అలాగే కొత్త భవనాలు సైతం నిర్మిస్తున్నాం. – రసూల్బీ, జిల్లా సంక్షేమాధికారిణి -
వరదలే వరదలు
● దశాబ్దాలుగా కళకళలాడుతున్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ● 47 ఏళ్లుగా ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో ● చరిత్రలో అత్యధికంగా 1983లో.. అతి తక్కువ 1987, 2015లో.. ● రెండుసార్లు డెడ్ స్టోరేజీకన్నా తక్కువ నీటిమట్టంబాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు దశాబ్దాలుగా నీటితో కళకళలాడుతోంది. 47 ఏళ్ల చరిత్రలో కేవ లం రెండేళ్లు మాత్రమే స్వల్ప ఇన్ఫ్లో వచ్చింది. ప్రా జెక్టుకు 1983 నుంచి వరదలు ప్రారంభమయ్యా యి. 1978 నుంచి కాలువల ద్వారా నీటి విడుదల ప్రారంభించినప్పటికీ ఆ సమయంలో ప్రాజెక్ట్ ని ర్మాణం పూర్తి కాలేదు. గడిచిన 47 ఏళ్లలో 10 సంవత్సరాలు మాత్రమే స్వల్పంగా వరద నీరు వచ్చి చే రింది. 1987, 2015లో మాత్రమే ప్రాజెక్ట్ నీటి మ ట్టం డెడ్ స్టోరేజీ (5 టీఎంసీలు) కన్నా తక్కువ నీటి మట్టానికి పడిపోయింది. దశాబ్ద కాలంగా ప్రతి ఏడాది ప్రాజెక్ట్ నిండుకుండలా మారుతుండగా మిగులు జలాలను దిగువకు విడుదల చేస్తున్నారు. బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లోకి ఎగువ నుంచి వరద మళ్లీ పోటెత్తింది. ఆదివారం సా యంత్రం 28 వేల క్యూసెక్కులుగా ఉన్న ఇన్ఫ్లో క్రమంగా 50 వేల క్యూసెక్కులకు పెరిగింది. ఆదివారం రాత్రి 7గంటలకు 8 గేట్లను ఎత్తి 12,500 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. అర్ధరాత్రి తరువాత 54 వేల క్యూసెక్కుల కు పెరగడంతో అవుట్ఫ్లోను 25వేల క్యూసెక్కు లకు పెంచారు. సోమవారం రోజంతా నిలకడగా కొనసాగిన ఇన్ఫ్లో సాయంత్రానికి 66,685 క్యూ సెక్కులకు పెరిగింది. దీంతో 12 వరద గేట్ల ద్వా రా 37,500 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. ఎగువ నుంచి వరద మరింత పెరిగే అవకాశం ఉందని ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు. కాలువల ద్వారా.. వరద కాలువ ద్వారా 19 వేల క్యూసెక్కులు, కా కతీయ కాలువ ద్వారా 5500, ఎస్కేప్ గేట్ల ద్వారా 2500, సరస్వతి కాలువ ద్వారా 800, లక్ష్మికాలువ ద్వారా 200, గుత్ప లిఫ్ట్కు 270 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మిషన్ భగీరథ అవసరాలకు 231 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తుండగా, ఆవిరి రూపంలో 684 క్యూసెక్కుల నీరు పోతోంది. ప్రాజెక్ట్పూర్తి స్థాయి నీటి మట్టం 1091(80.5 టీఎంసీలు) అడుగులు కాగా సోమవారం సాయంత్రానికి అంతే స్థాయి నీటి మట్టంతో ప్రాజెక్ట్ నిండుకుండలా ఉంది. మళ్లీ పోటెత్తిన వరద.. 12 వరద గేట్ల ద్వారా 37,500 క్యూసెక్కుల నీటి విడుదల ఎగువ నుంచి 66,685 క్యూసెక్కుల ఇన్ఫ్లో బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లోకి ఎగువ నుంచి వరద మళ్లీ పోటెత్తింది. ఆదివారం సా యంత్రం 28 వేల క్యూసెక్కులుగా ఉన్న ఇన్ఫ్లో క్రమంగా 50 వేల క్యూసెక్కులకు పెరిగింది. ఆదివారం రాత్రి 7గంటలకు 8 గేట్లను ఎత్తి 12,500 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. అర్ధరాత్రి తరువాత 54 వేల క్యూసెక్కుల కు పెరగడంతో అవుట్ఫ్లోను 25వేల క్యూసెక్కు లకు పెంచారు. సోమవారం రోజంతా నిలకడగా కొనసాగిన ఇన్ఫ్లో సాయంత్రానికి 66,685 క్యూ సెక్కులకు పెరిగింది. దీంతో 12 వరద గేట్ల ద్వా రా 37,500 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. ఎగువ నుంచి వరద మరింత పెరిగే అవకాశం ఉందని ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు. కాలువల ద్వారా.. వరద కాలువ ద్వారా 19 వేల క్యూసెక్కులు, కా కతీయ కాలువ ద్వారా 5500, ఎస్కేప్ గేట్ల ద్వారా 2500, సరస్వతి కాలువ ద్వారా 800, లక్ష్మికాలువ ద్వారా 200, గుత్ప లిఫ్ట్కు 270 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మిషన్ భగీరథ అవసరాలకు 231 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తుండగా, ఆవిరి రూపంలో 684 క్యూసెక్కుల నీరు పోతోంది. ప్రాజెక్ట్పూర్తి స్థాయి నీటి మట్టం 1091(80.5 టీఎంసీలు) అడుగులు కాగా సోమవారం సాయంత్రానికి అంతే స్థాయి నీటి మట్టంతో ప్రాజెక్ట్ నిండుకుండలా ఉంది. -
రేపు ‘స్థానిక’ తుది ఓటరు జాబితా
● కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి నిజామాబాద్అర్బన్: జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల తుది ఓటరు జాబితాను ఈ నెల 10వ తేదీన వెలువరించనున్నట్లు కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా ఇప్పటికే ముసాయిదా ఓటరు జాబి తా విడుదల చేయడం జరిగిందని తెలిపారు. ము సాయిదా జాబితా, పోలింగ్ కేంద్రాలకు సంబంధించి ఏవైనా అభ్యంతరాలు ఉంటే తెలుపాలని సూ చించారు. అభ్యంతరాలను పరిశీలించి, అవసరమై న మార్పులు, చేర్పులు చేసిన తరువాత 10వ తేదీ న తుది జాబితా వెలువరిస్తామని అన్నారు. మండల స్థాయిలో నిర్వహించిన రాజకీయ పార్టీల ప్రతి నిధుల సమావేశంలో సైతం అభ్యంతరాలు ఉంటే తెలుపాలన్నారు. తుది ఓటరు జాబితా రూపకల్పనకు రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు. సమావేశంలో అదనపు కలెక్టర్ అంకిత్, జెడ్పీ సీఈవో సాయాగౌడ్, డిప్యూటీ సీఈవో సాయన్న, రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. -
యూరియా.. లేదయ!
● వేధిస్తున్న కొరత ● ఇబ్బందిపడుతున్న రైతులు ● బస్తా కోసం గంటల తరబడి బారులు ● అయినా దక్కక నిరాశ సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : వానాకాలంలో సాగు చే సిన పంటలకు అవసరమైన మేర యూరియా సర ఫరా కాకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవలి కాలంలో ఎక్కడ చూసినా రైతులు ఎరువుల కోసం సహకార సంఘాల వద్ద బారులు తీరి కనిపిస్తున్నారు. కొన్ని చోట్ల రాత్రి వేళలోనే సొసైటీకి చేరుకుని అక్కడే ఉండి పొద్దున్నే వరుసలో నిల్చుంటున్నారు. మరికొన్ని చోట్ల చెప్పులు, రాళ్లు, చెట్లకొమ్మలు, పాసుపుస్తకాల జిరాక్సులను వరుస లో పెడుతున్నారు. జిల్లాలోని మాచారెడ్డి, రామారె డ్డి, బీబీపేట, భిక్కనూరు, దోమకొండ, కామారెడ్డి తదితర మండలాల్లో సమస్య తీవ్రంగా ఉంది. ఆయా మండలాల్లో యూరియా కోసం రైతులు పది రోజులుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నా రు. ఇటీవల భారీ వర్షాలు కురవడంతో చెరువు లు, ప్రాజెక్టు లు నిండాయి. వర్షాలతో కొంత న ష్టం జరిగినా, ఉన్న పంటలకు ఎరువులు వేయాలని రైతులు సహ కార సంఘాల చుట్టూ తిరుగుతున్నారు. స్టాక్కు మించి రైతులు వస్తుండడంతో ఒక్కో బస్తా చొప్పు నే పంపిణీ చేస్తున్నారు. ఆ ఒక్క బస్తా కూడా చాలామందికి దక్కడం లేదు. ఆందోళనకు దిగుతున్న రైతులు.. ఎరువులు దొరక్క ఇబ్బందులు పడుతున్న రైతు లు ఆందోళనకు దిగుతున్నారు. రామారెడ్డి మండలం ఉప్పల్వాయి గ్రామంలో రైతులు సోమ వారం యూరియా కోసం ధర్నా చేశారు. అధికారుల తీరు పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మాచారె డ్డి మండల కేంద్రంలోనూ రైతులు రోడ్డెక్కారు. పోలీసు పహారాలో పంపిణీ... మాచారెడ్డి మండల కేంద్రంలోని సహకార సంఘానికి సోమవారం భారీ సంఖ్యలో రైతులు తరలిరావడంతో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కూపన్లు ఇవ్వడానికి అధికారులు పోలీ సుల సాయం తీసుకున్నారు. అక్కడ రైతులు, పోలీసులకు మధ్య పలుమార్లు వాగ్వాదం జ రిగింది. అలాగే వ్యవసాయశాఖ, సహకార శాఖ అధికారులతోనూ రైతులు గొడవకు దిగారు. ప్రైవేటు వ్యాపారుల బ్లాక్ దందా.... కొందరు వ్యాపారులు ముందుగానే యూరియాను బ్లాక్ చేసి ఉంచారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఎ క్కువ డబ్బులు తీసుకుని విక్రయిస్తున్నట్లు తెలు స్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో కొందరు దళారులు పెద్ద మొత్తంలో ఎరువులు స్టాక్ చేసి ఉంచారన్న ప్రచారం జరుగుతోంది. మాచారెడ్డిలో.. మాచారెడ్డి : మండలకేంద్రానికి సోమవారం యూరియా వస్తుందని అధికారులు చెప్పడంతో వేకువజామునే అన్ని గ్రామాల నుంచి సింగిల్విండోకు వచ్చి బారులు తీరారు. యూరియా రాకపోవడంతో విసిగి వేసారిన రైతులు ఇటుకలను క్యూలో ఉంచి ఆందోళనకు దిగారు. మండల కేంద్రంలోని రోడ్డుపై రాస్తారోకో చేశారు. జిల్లాలో 48 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవ సరం ఉండగా.. ఇప్పటికే 46 వేల మెట్రిక్ టన్నులు వచ్చింది. దానిని రైతులకు అందించాం. మంగళవా రం మరో 800 మెట్రిక్ టన్ను ల యూరియా రానుంది. ఆయా సొసైటీలకు సరఫరా చేసి రైతులకు పంపిణీ చేస్తాం. బ్లాక్ మార్కెట్ విషయం మా దృష్టికి రాలేదు. ఎవరైనా బ్లాక్మార్కెట్లో అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటాం. – మోహన్రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి -
గ్రామ పాలనాధికారులకు పోస్టింగ్లు
నిజామాబాద్అర్బన్: గ్రామ పాలనాధికారులు(జీపీవో)గా నియమితులైన వారికి సోమ వారం పోస్టింగ్లు ఇచ్చారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ప్రధాన సమావేశ మందిరంలో కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి సమక్షంలో కౌన్సెలింగ్ ప్రక్రియ ద్వా రా ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరిస్తూ జీపీవోలకు పోస్టింగ్లను ఖరారు చేశారు. ఉదయం నుంచి రాత్రి వరకు ఈ ప్రక్రియ కొనసాగింది. అదనపు కలెక్టర్లు అంకిత్, కిర ణ్ కుమార్, కలెక్టరేట్ ఏవో ప్రశాంత్, ఇతర అధికారులు కౌన్సెలింగ్ ప్రక్రియ నిర్వహించారు. -
కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా బస్వా
● జిల్లా నేతలకు కీలక పదవులు ● బీజేపీ పూర్తిస్థాయి కార్యవర్గం ప్రకటన సుభాష్నగర్: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కి సాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా బస్వా లక్ష్మీనర్స య్య నియ మితులయ్యారు. బీజేపీ పూ ర్తిస్థాయి కార్యవర్గంతోపాటు ఏడు మోర్చాల రాష్ట్ర అధ్యక్షుల ను పార్టీ అధ్యక్షుడు ఎన్ రాంచందర్రావు సోమవా రం ప్రకటించారు. బస్వా లక్ష్మీనర్సయ్య పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన కాలంలోనే ఎంపీగా అర్వింద్ ధర్మపురి (2019లో) విజయం సాధించారు. మెదక్ పార్లమెంట్ ఇన్చార్జీగా 2024 ఎన్నికల్లో వ్యవహరించారు. ఆ ఎన్నికల్లో ఎంపీగా రఘునంద న్రావు గెలుపొందా రు. ప్రస్తుతం వివిధ విభాగాలకు సంగారెడ్డి, నిర్మ ల్, పెద్దపల్లి జిల్లాల ఇన్చార్జీగా కొనసాగుతున్న ఆయన.. స్టేట్ యాక్టివ్ మెంబర్స్ కో కన్వీనర్గా కూడా ఉన్నారు. తనను కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించినందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్రావు, రాష్ట్ర సంఘటన మంత్రి చంద్రశేఖర్కు బస్వాలక్ష్మీనర్సయ్య ప్రత్యేక ధన్యవాదా లు తెలిపారు. రాష్ట్రంలో రైతాంగ సమస్యల పరిష్కా రం కోసం ప్రభుత్వంపై ఉద్యమిస్తామని ఆయన పేర్కొన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా గోపిడి స్రవంతిరెడ్డి బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఫ్లోర్లీడర్ గోపిడి స్రవంతిరెడ్డి నియమితులయ్యారు. స్రవంతిరెడ్డి 2020 సంవత్సరంలో పార్టీలో చేరి కార్పొరేటర్గా గెలుపొందారు. ఆ తర్వాత మున్సిపల్ కార్పొరేషన్లో ఫ్లోర్లీడర్గా వ్యవహరించారు. 2021లో బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమితులయ్యారు. తనను పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నియమించినందుకు అధ్యక్షుడు ఎన్ రాంచందర్రావు, ఎంపీ అర్వింద్ ధర్మపురికి స్రవంతిరెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. -
విద్యార్థులే లక్ష్యంగా గంజాయి విక్రయాలు
● నాందేడ్ నుంచి ప్రతి వారం అక్రమంగా రవాణా ● ఇటీవల భీమ్గల్లో విక్రేతను అరెస్టు చేసిన పోలీసులు మోర్తాడ్(బాల్కొండ): విద్యార్థులు, యువతే లక్ష్యంగా గంజాయి వ్యాపారులు తమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. దీంతో చదువుకోవాల్సిన విద్యార్థు లు గంజాయి మత్తుకు బానిసై జీవితాన్ని నాశ నం చేసుకుంటున్నారు. తమపై తల్లిదండ్రులు పెంచుకున్న ఆశలను విద్యార్థి దశలోనే తుంచివేస్తున్నారు. రుచి చూపించి.. ఇటీవల భీమ్గల్ డిగ్రీ కళాశాల వెనుక భాగంలో గం జాయి విక్రయిస్తున్న కారెపల్లికి చెందిన బూక్యా ర ఘును మూడు రోజుల కింద ఎకై ్సజ్ పోలీసులు అ రెస్టు చేశారు. రఘును విచారించగా విస్తుపోయే ని జాలు వెలుగులోకి రావడం గమనార్హం. భీమ్గల్లో ని ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల్లో చదువుకుంటు న్న కొందరు విద్యార్థులకు గంజాయి రుచి చూపించిన దుండగులు తమ దందాను యథేచ్చగా కొనసాగిస్తున్నారని తేలింది. దాదాపు 40 మంది విద్యార్థు లు కొన్ని నెలలుగా గంజాయికి బానిసలైనట్లు అధికారులు గుర్తించారు. నిందితుడు ప్రతి వారం గంజా యిని నాందేడ్ నుంచి తీసుకువచ్చి విద్యార్థులకు వి క్రయిస్తాడని తెలిసింది. ఒక్కో ప్యాకెట్ను రూ.100 కు తీసుకవచ్చి రూ.500లకు విక్రయిస్తుండటంతో అధిక ఆదాయం రావడంతో ప్రతి వారం తీసుకువచ్చేవాడు. అలా నాందేడ్కు వెళ్లినప్పుడు కనీసం 10 నుంచి 20 ప్యాకెట్లు తీసుకవచ్చి తన దందా కొనసాగించేవాడు. ఇదిలా ఉండగా గంజాయికి బానిసై న విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులను ఎకై ్సజ్ స్టేషన్కు రప్పించి కౌన్సెలింగ్ నిర్వహించారు. వారి లో మార్పు రాకపోతే డీ అడిక్షన్ సెంటర్కు తప్పనిసరిగా పంపించాలని అధికారులు యోచిస్తున్నారు. గంజాయిని పూర్తిగా నిర్మూలించాలంటే ప్రజల సహకారం ఎంతో అవసరం. గంజాయి విక్రేతలపైనా, బానిసలపైనా ప్రజలు దృష్టిపెట్టి మాకు, పోలీసులకు సమాచారం అందించాలి. గంజాయి విక్రయించేవారు, వారికి మద్దతు ఇచ్చేవారు ఎంతటివారైనా వదలిపెట్టేది లేదు. – పి. వేణుమాధవ్ రావు, ఎకై ్సజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్, భీమ్గల్ పెద్దలకు వేరే ముఠా.. పెద్దలకు గంజాయిని వేరే ముఠా సరఫరా చేస్తుండగా, వీరికి కొందరు నాయకుల అండదండలు ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి. గంజాయి విక్రేతలు ఎక్కడ అరెస్టు అయినా భీమ్గల్ మండలానికి చెందిన ఒక నాయకుడు అధికారులపై ఒత్తిడి తీసుకవచ్చి వారిని విడిపించడం, కేసులు నమోదు కాకుండా చూసుకోవడం చేసేవాడని సమాచారం. భీమ్గల్ ప్రాంతంలో రాజకీయ నాయకుల ప్రోద్బలంతోనే గంజాయి దందా సాగడంతో మత్తుకు అడ్డు అదుపు లేకుండా సాగిందనే వాదన వినిపిస్తోంది. ఇప్పటికై నా అధికారులు పారదర్శకంగా విచారణ చేపట్టి గంజాయి వెనుక దాగి ఉన్న నాయకుల బండారం బయటపెడితేనే ఈ దందాకు చెక్ పెట్టవచ్చనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. -
ఆపన్నహస్తం అందించండి
దోమకొండ: నిరుపేద కుటుంబానికి చెందిన ఓ యువకుడు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడగా, ఆస్పత్రిలో చికిత్స కోసం సుమారు రూ.10 లక్షలు వరకు అవుతాయని వైద్యులు పే ర్కొన్నారు. దీంతో బాధిత కుటుంబీకులు దాతల చేయూత కోసం ఎదురుచూస్తున్నా రు. దోమకొండకు చెందిన బలవత్రి శ్రీధర్తోపాటు మరో ఇద్దరు వ్యక్తులు కలిసి శనివారం రాత్రి రామారెడ్డి నుంచి దోమకొండకు ట్రాక్టర్ ట్రాలీని తీసుకువస్తున్నారు. కా మారెడ్డి పట్టణ శివారులోని క్యాసంపల్లి వద్ద ట్రాక్టర్ ట్రాలీని వెనుక నుంచి వేగంగా వ చ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీధర్ తీవ్రంగా గాయపడగా చికిత్స నిమిత్తం హైదరాబాద్లోని సురారం మల్లారెడ్డి ఆస్పత్రికి తరలించారు. కాగా శ్రీధర్కు బ్రెయిన్ సర్జరీ చేయాలని, ఇందుకు దాదాపు రూ. 10లక్షల వరకు ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు. దీంతో తాము పేద కుటుంబానికి చెందిన వారిమని, తమకు రూ.10 లక్షలు ఖర్చుపెట్టుకునే స్తోమత లేదని శ్రీధర్ తండ్రి శ్రీనివాస్, తల్లి వెంకటలక్ష్మి ఆవేదన చెందుతున్నారు. తమ కుమారుడికి దాతలు ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలన్నారు. సహాయం చేయవలసిన దాతలు శ్రీధర్ అన్న శ్రీకాంత్ ఫోన్నెంబర్ 7013951924కు ఫోన్పే, లేదా గూగుల్ పే చేసి సహాయం అందించాలని కోరారు. ● రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ దోమకొండకు చెందిన శ్రీధర్ ● బ్రెయిన్ సర్జరీ కోసం రూ.10లక్షలు అవసరం ● దాతల కోసం బాధిత కుటుంబీకుల ఎదురుచూపులు -
క్రైం కార్నర్
మాచారెడ్డి: మండలంలోని సోమారంపేటకు చెందిన ఓ యువకుడు దుబాయిలో అనుమానాస్పదంగా మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. గ్రామానికి చెందిన గూగులోతు రవి (32) మూడేళ్ల క్రితం బతుకుదెరువు కోసం దుబాయి వెళ్లాడు. తన గదిలో ఆదివారం అతడు అనుమానాస్పదంగా మృతి చెందినట్లు గ్రామస్తులు ద్వారా తెలిసింది. ప్రభుత్వం స్పందించి రవి మృతదేహాన్ని త్వరగా స్వగ్రామానికి తెప్పించాలని గ్రామస్తులు కోరారు. తాడ్వాయి(ఎల్లారెడ్డి): మండలంలోని కన్కల్ గ్రామ శివారులో పేకాట స్థావరంపై దాడిచేసి పేకాడుతున్న ముగ్గురిని అరెస్టు చేయగా, ఇద్దరు పరారయ్యారని ఎస్సై మురళి తెలిపారు. విశ్వసనీయ సమాచారం రావడంతో పేకాట స్థావరంపై దాడిచేసినట్లు పేర్కొన్నారు. ఐదుగురు పేకాడుతుండగా పోలీసులు దాడి చేయగా ఇద్దరు పరారయ్యారు. మిగిలిన ముగ్గురిని పోలీసులు పట్టుకొని, వారి వద్ద ఉన్న రూ.2850 నగదు, మూడు బైక్లు, మూడు ఫోన్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై వివరించారు. బాన్సువాడ: పట్టణంలోని కోనా బాన్సువాడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహించే పురుషోత్తం అనే ఉపాధ్యాయుడిపై కేసు నమోదు చేసినట్లు సీఐ అశోక్ తెలిపారు. పాఠశాలలో ఇన్చార్జి హెచ్ఎంగా విధులు నిర్వహిస్తున్న తారాచంద్కు పురుషోత్తంకు మధ్య శనివారం గొడవ జరిగింది. తారాచంద్ తలపై పురుషోత్తం వాటర్ బాటిల్తో కొట్టగా ఆయనకు తీవ్ర గాయమైంది. దీంతో తారాచంద్ బాన్సువాడ పోలీస్టేషన్లో పురుషోత్తంపై ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. అలాగే తారాచంద్ తనను ఇష్టం వచ్చినట్లు దూషించడని పురుషోత్తం కూడా ఆయనపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఆర్మూర్టౌన్: పట్టణంలో ఆదివారం నిర్వహించిన వినాయకుడి నిమజ్జన శోభాయాత్రలో ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి విద్యుత్ షాక్తో గాయపడ్డాడు. రాంనగర్ మండప నిర్వహకులు వినాయకుడిని నిమజ్జనానికి ప్రత్యేక వాహనంలో తీసుకువెళ్లారు. హుస్సాబాద్కాలనీకి రాగానే రోడ్డు మధ్యలో ఉన్న విద్యుత్ వైర్లు వినాయకుడికి తగిలాయి. దీంతో వినాయకుడి పక్కనే పడుకొని ఉన్న నితిన్ అనే వ్యక్తికి కరెంట్ షాక్ తగలంతో గాయపడ్డాడు. వెంటనే స్థానికులు గమనించి అతడిని చికిత్స నిమిత్తం ఓ ప్రయివేట్ ఆస్పత్రికి తరలించారు. -
మరో ఐదేళ్లు అధికారంలో మేమే..
● టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ వర్ని: ప్రస్తుత పదవీకాలంతోపాటు రాబోయే మరో ఐదేళ్లపాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. మోస్రా మండల కేంద్రంలోని సీతారామ ఆలయంలో ఆదివారం ఆయన ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు అన్నింటినీ నెరవేరుస్తున్నామని, రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజలు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మద్దతు తెలుపుతున్నారని వివరించారు. పదేళ్ల బీఆర్ఎస్ దోపిడీ రాజ్యానికి ప్రజలు చరమగీతం పాడారని, రాష్ట్రంలో రేవంత్రెడ్డి ప్రజాపాలన కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. అన్నివర్గాల వారికి సమన్యాయం చేస్తూ ప్రభుత్వం ముందుకు వెళ్తోందని, ఇదే స్ఫూర్తితో మరో ఐదేళ్లపాటు పాలన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. -
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
జక్రాన్పల్లి: మండలంలోని అర్గుల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2007–08 బ్యాచ్ పదో తరగతి విద్యార్థులు ఆదివారం ‘పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం’ నిర్వహించారు. మిత్రులంతా ఏళ్ల త ర్వాత కలుసుకోవడంతో ఆలింగనం చేసుకొని ఆత్మీయంగా పలకరించుకున్నారు. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుని ఆనందంగా గడిపారు. ఆనాటి ఉపాధ్యాయులను సత్కరించారు. అనంతరం సాంస్కృతిక కార్యకమ్రాలు, వింధులతో ఉత్సాహంగా గడిపారు. భిక్కనూరు: మండలంలోని పెద్దమల్లారెడ్డి ప్రభుత్వ ఉన్నత పాఠశాల 1996–97 విద్యార్థులు ఆదివారం స్థానిక వీరభద్ర ఫంక్షన్హాల్లో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈసందర్భంగా విద్యార్థులంతా 28 ఏళ్ల తర్వాత కలుసుకోవడంతో భావోద్వేగానికి గురయ్యారు.ఒకరినొకరు ఆ ప్యాయంగా పలుకరించుకుంటూ యోగక్షేమాలు తెలుసుకున్నారు.అనంతరం తమకు చదువు చెప్పి న ఆనాటి ఉపాధ్యాయులను సత్కరించి వారి ఆశీ ర్వాదం పొందారు. వచ్చే ఏడాది కుటుంబీకులతో క లిసి సమ్మేళనం నిర్వహించాలని తీర్మానించుకున్నా రు. పాఠశాల అభివృద్ధికి సైతం కృషిచేస్తామన్నారు. -
భీమ్గల్లో పోలీస్ వాహనం ధ్వంసం
మోర్తాడ్(భీమ్గల్): భీమ్గల్లో వినాయక నిమజ్జనం సందర్బంగా పోలీసులు బందోబస్తు నిర్వహించగా తమ వినోదానికి అడ్డు చెప్పారనే కక్షతో ముగ్గురు యువకులు పోలీసుల వాహనంపై రాళ్లు రువ్వి అద్దాలను పగులగొట్టారు. శనివారం రాత్రి చోటు చేసుకున్న ఘటనను దృష్టిలో ఉంచుకున్న ముగ్గురు యువకులు ఆదివారం ఉదయం భీమ్గల్ పోలీసుల వాహనంపై రాళ్లు రువ్వారు. ఈ విషయమై ఎస్సై సందీప్ మాట్లాడుతూ.. తమ వాహనంపై రాళ్లతో దాడి చేసి తమ విధులకు ఆటంకం కలిగించిన ముగ్గురు యువకులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. -
లిఫ్ట్లను వెంటనే ప్రారంభించాలి
వేల్పూర్: మండలంలోని కుకునూర్, నవాబు ఎత్తిపోతల పథకాల ద్వారా నీటి సరఫరాను వెంటనే ప్రారంభించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి నీటి పారుదల శాఖ అధికారులను ఆదేశించారు. వేల్పూర్లోని ఆయన నివాసంలో ఎమ్మెల్యేను కుకునూర్ గ్రామస్తులు, నవాబు లిఫ్ట్ కమిటీ సభ్యులు ఆదివారం కలిసి ఎత్తిపోతల పథకాల ద్వారా నీటి సరఫరాను ప్రారంభించాలని విన్నవించారు. దీంతో ఆయన నీటి పారుదల శాఖ సీఈ మధుసూదన్, ఈఈ భానుప్రకాశ్తో ఫోన్లో మాట్లాడారు. సీజన్ ప్రారంభించకముందే మోటార్లు, ట్రాన్స్ఫార్మర్లు సిద్ధంగా ఉన్నది, లేనిది చూసుకోవాల్సిన బాధ్యత అధికారులదేనని అన్నారు. వెంటనే ట్రాన్స్ఫార్మర్ను తెప్పించి నవాబు లిఫ్ట్ను ప్రారంభించాలన్నారు. కుకునూర్ లిఫ్ట్ మోటార్లు ఇసుకలో కూరుకుపోయినట్లు గ్రామస్తులు ఎమ్మెల్యే దృష్టికి తేగా, సమస్యను పరిష్కరించాలని అధికారులకు సూచించారు. శ్రీరాంసాగర్లో 45 టీఎంసీల నీరున్నప్పుడే లిఫ్ట్ల ద్వారా చెరువులు నింపి ఉంటే ఇప్పుడు సమస్య వచ్చేది కాదన్నారు. వందల టిఎంసీల నీరు సముద్రం పాలవుతోందన్నారు. ఎస్సారెస్పీలో పూర్తిస్థాయిలో నీరున్నందున వెంటనే గుత్ప, చౌట్పల్లి హన్మంత్రెడ్డి లిఫ్ట్లు ప్రారంభించి చెరువులు నింపాలని అన్నారు. నిర్వహణ లేక వేంగంటి లిఫ్ట్కు సంబంధించిన కాపర్ కాయిల్స్, ఇతర సామగ్రిని దుండగులు ఎత్తుకుపోయారని, వాటికి మరమ్మతులు చేసి పల్లికొండ లిఫ్ట్ను కూడా ప్రారంభించాలని అధికారులకు సూచించారు. -
ఆర్మూర్ గణేశ్ శోభాయాత్రలో ఉద్రిక్తత
● లాఠీచార్జ్ చేసిన పోలీసులు ● రోడ్డుపై బైఠాయించి, నిరసన తెలిపిన యువకులు ఆర్మూర్టౌన్: ఆర్మూర్ పట్టణంలో ఆదివారం తెల్లవారుజామున గణేష్ శోభాయాత్రలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో గణేశ్ మండలి యువకులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో సుమారు రెండు గంటలపాటు శోభాయాత్ర నిలిచిపోయింది. వివరాలు ఇలా.. పట్టణంలోని కంఠేశ్వర యూత్ గణేష్ మండలి వద్ద ఓ పోలీసు అధికారి దురుసుగా వ్యవహరిస్తూ అసభ్య పదజాలంతో దూషించడంతో మండలి సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులకు, నిర్వాహకులకు మధ్య వాగ్వాదం నెలకొంది. దీంతో పోలీసులు యూత్ సభ్యులపై లాఠీచార్జ్ చేశారు. దీంతో మండపాల నిర్వాహకులు రెండు గంటల పాటు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు తమకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మరోవైపు గణేష్ శోభాయత్ర సైతం నిలిచిపోవడంతో పాటు వివిధ మండపాల నిర్వాహకులు కంఠేశ్వర్ యూత్ సభ్యులకు మద్దతు తెలిపారు. అనంతరం యూత్ సభ్యులను పలువురు సముదాయించి శోభాయాత్రను కొనసాగే విధంగా చేశారు. -
ఎస్సారెస్పీ నీటి విడుదల
● 28,500 క్యూసెక్కుల నీరు ఇన్ఫ్లో ● 8 వరద గేట్ల ద్వారా 12500 క్యూసెక్కులు అవుట్ ఫ్లోపర్యాటకుల సందడి శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ను సందర్శించేందుకు ఆ దివారం పర్యాటకులు అధిక సంఖ్యలో తరలివ చ్చారు. డ్యామ్పై ఫొటోలు, సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు. జిల్లాతోపాటు నిర్మల్, జగిత్యాల, కరీంనగర్, హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి పర్యాటకులు తరలివచ్చారు. బాల్కొండ: ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు పెరుగుతుండటంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లోని ఎనిమిది వరద గేట్ల ద్వారా 12,500 క్యూసెక్కుల నీటి విడుదలను అధికారులు ఆదివారం సాయంత్రం ప్రారంభించారు. ఎగువ ప్రాంతాల నుంచి 28,500 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోందని, రాత్రికి మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కాగా, ఎస్సారెస్పీ వరద కాలువకు 18 వేల క్యూసెక్కుల నుంచి 19 వేల క్యూసెక్కులకు నీటి విడుదలను పెంచారు. కాకతీయ కాలువకు 5500, ఎస్కెప్ గేట్ల ద్వారా 2500, సరస్వతి కాలువకు 500, గుత్ప లిఫ్ట్ ద్వారా 270, మిషన్ భగీరథ ద్వారా 231 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. 684 క్యూసెక్కుల నీరు ఆవిరి రూపంలో పోతోంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091(80.5 టీఎంసీలు) అడుగులు కాగా ఆదివారం సాయంత్రానికి నిండుకుండలా ఉంది. గేట్ల ద్వారా కొనసాగుతున్న నీటి విడుదల -
నిజాంసాగర్లోకి రికార్డు స్థాయి వరదలు
● ఈ సీజన్లో 125 టీఎంసీల ఇన్ఫ్లో ● 111.53 టీఎంసీల అవుట్ఫ్లో ● కొనసాగుతున్న నీటి విడుదలనిజాంసాగర్: నిజాంసాగర్ ప్రాజెక్టులోకి ఈ ఏడాది రికార్డు స్థాయిలో వరద నీరు వచ్చి చేరింది. ఇప్పటికే 125 టీఎంసీల ఇన్ఫ్లో రావడం గమనార్హం. ఇంకా వర్షాకాలం మిగిలి ఉన్నందున ఇన్ఫ్లో రికార్డు మరింత మెరుగయ్యే అవకాశాలున్నాయి. 1920 సంవత్సరంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కరువు కోరల్లో చిక్కుకుంది. వర్షాలు సకాలంలో కురవకపోవడంతో ఉమ్మడి జిల్లా ప్రజలు ఇబ్బందులు పడ్డారు. సాగు నీరు లేక పంటలు సాగు చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో అప్పటి పాలకులు భారీ సాగు నీటి ప్రాజెక్టు నిర్మించాలని నిర్ణయించారు. ఏడాది పాటు సర్వే చేసి అచ్చంపేట– బంజపల్లి గ్రామాల మధ్య గోదావరి ఉపనదిపై సాగునీటి ప్రాజెక్టుకు అనువైన స్థలం ఉందని గుర్తించారు. 2.75 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీటిని అందించాలన్న లక్ష్యంతో 1923 సంవత్సరంలో చీఫ్ ఇంజినీర్ నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ నిజాంసాగర్ ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రారంభించారు. డిప్యూటి చీఫ్ ఇంజినీర్ సీసీ పాలె, అసిస్టెంట్ ఇంజినీర్ ఎస్జే తారాపూర్ల పర్యవేక్షణలో ప్రాజెక్టు పనులు సాగాయి. 1931 సంవత్సరంలో నిర్మాణం పూర్తయ్యింది. నిజాంసాగర్ ప్రాజెక్టును ‘ఎన్’ ఆకారంలో 1,405.05 అడుగుల నీటిమట్టం, 30 టీఎంసీల నీరు నిలువ ఉండేలా నిర్మించారు. ఇది రెండోసారి.. నిజాంసాగర్ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టిన తర్వాత ఈ స్థాయిలో వరద నీరు రావడం ఇదే రెండోసారి. గతంలో 1998 సంవత్సరంలో నిజాంసాగర్ ప్రాజెక్టుకు 167 టీఎంసీ ఇన్ప్లోగా వచ్చింది. అప్పట్లో నిజాంసాగర్ వరద గేట్లతో పాటు ప్రధాన కాలువ ద్వారా 157 టీఎంసీల నీటిని మంజీర నదిలోకి వదిలారు. 1998 తర్వాత ఈ ఏడాది మళ్లీ భారీ వరదలు వస్తున్నాయి. ఈ ఏడాది ఇప్పటికే ప్రాజెక్టులోకి 125 టీఎంసీల వరద నీరు వచ్చి చేరింది. కర్ణాటక, మహారాష్ట్రలతో పాటు ఎగువన ఉన్న పాత మెదక్ జిల్లాలో వానలు దంచికొట్టడంతో రికార్డు స్థాయిలో వరదలు వచ్చాయి. గత నెల 28 న ఒకరోజులో గరిష్టంగా 2.5 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చింది. అంతే స్థాయిలో 27 వరద గేట్ల ద్వారా నీటిని దిగువకు వదిలారు. ఇది ప్రాజెక్టు చరిత్రలో రికార్డుగా నిలిచింది.గత నెల 18 నుంచి నిజాంసాగర్ ప్రా జెక్టు వరద గేట్ల ద్వారా నీటి విడుదల ప్రారంభమైంది. గతనెల 25న ఒక్క రోజు మాత్రమే వరద గేట్లను మూసివేశారు. ఇన్ఫ్లో వస్తుండడంతో నీటి విడుదలను కొనసాగిస్తున్నారు. ఈ మూడు వారాల్లోనే 111.53 టీఎంసీల నీటిని నిజాంసాగర్ ప్రాజెక్టు గేట్ల ద్వారా మంజీర నదిలోకి వదిలారు. ఎగువ ఉన్న సింగూరు ప్రాజెక్టు గేట్ల ద్వారా నీటి విడుదల చేపట్టడంతోపాటు హల్దీవాగు, ఘనపురం ఆనకట్ట ద్వారా నిజాంసాగర్ ప్రాజెక్టులోకి ఆదివారం 23,220 క్యూసెక్కుల వరద నీరు ఇన్ప్లోగా వస్తోంది. దీంతో ప్రాజెక్టు 3 వరద గేట్ల ద్వారా 17,865 క్యూసెక్కుల నీటిని మంజీర నదిలోకి వదులుతున్నారు. -
ఘనంగా జెండాజాతర
ఊరేగింపుగా జెండాను పులాంగ్ వైపు తీసుకెళుతున్న భక్తులునిజామాబాద్ రూరల్ : నగరంలోని జెండా బాలాజీ ఆలయంలో 15 రోజులపాటు విశే ష పూజలందుకున్న జెండా ఆదివారం ఉద యం భక్తజన సందోహం మధ్య పులాంగ్కు తరలింది. భక్తుల దాండియా, కోలాటాలు, భాజాభజంత్రీల చప్పుళ్లతో ఆలయ అర్చకులు ఉత్సవ విగ్రహాల ఊరేగింపు నిర్వ హించారు. ఈ సందర్భంగా జెండాను మో సేందుకు భక్తులు పోటీ పడ్డారు. ఆనవాయి తీ ప్రకారం వారం రోజులపాటు పులాంగ్ వద్ద ప్రతిష్టించిన జెండా పూజలందుకోను న్నది. అనంతరం తిరుపతికి తరలివెళ్తుంది. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ప్రమోద్, కా ర్యనిర్వహణాధికారి వేణు పాల్గొన్నారు.రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బొమ్మ మహేశ్ కుమార్గౌడ్ జెండా బాలాజీ ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తోందన్నారు. ఆయన వెంట పీసీసీ డెలిగేట్ బాడ్సి శేఖర్ గౌడ్ తదితరులు ఉన్నారు. భక్తుల కోలాహలం మధ్య పులాంగ్కు తరలింపు జెండాను మోసేందుకు పోటీపడ్డ భక్తజనం -
ఆలయాల మూసివేత
● సంపూర్ణ చంద్రగ్రహణం నేపథ్యంలో.. ● నేడు సంప్రోక్షణ, భక్తులకు దర్శనాలు నిజామాబాద్ రూరల్ : సంపూర్ణ చంద్రగ్రహణం కా రణంగా ఆలయాలను ఆదివారం ఉదయం నుంచి మూసివేశారు. సో మవారం తెల్లవా రుజామున సంప్రోక్షణ, దేవతలకు అభిషేకం అనంతరం భక్తులకు దర్శనం కల్పించనున్నారు. నిజామాబాద్ నగరంలోని జెండా బాలాజీ, గోల్హనుమాన్, నీలకంఠేశ్వరాలయం, శంభు లింగేశ్వర ఆలయం, నాందేవ్వాడ, మాధవనగర్ సాయిబాబా ఆలయాలతోపాటు జిల్లాలోని అన్ని ఆలయాలను ఆదివారం ఉదయం 9గంటల నుంచి మూసివేశారు.గోల్హనుమాన్ ఆలయం -
పాఠశాలల బలోపేతానికి కృషి అభినందనీయం
బాల్కొండ : రాజకీయాలతో సంబంధం లేకుండా సేవా దృక్పథంతో ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి పారిశ్రామికవేత్త ఏనుగు దయానంద్రెడ్డి చేస్తు న్న కృషి అభినందనీయమని మాజీ మంత్రి, ఎమ్మె ల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. బాల్కొండ మండలం చిట్టాపూర్ గ్రామానికి చెందిన దయానంద్రె డ్డి సేవారంగంలో ఆదర్శప్రాయుడని కొనియాడా రు. దయానంద్రెడ్డి ఉచితంగా 40 ప్రభుత్వ పాఠశాలలకు సరఫరా చేసిన క్రీడా సామగ్రిని ఎమ్మెల్యే ఆదివారం మండల కేంద్రంలో విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్ప న కోసం దయానంద్రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని, ఆయన తనకు వియ్యంకుడు కావడం అదృష్టమన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన టీ–వర్క్స్ కోసం రూ. 2.5 కోట్లతో మిషన్ను కొనుగోలు చేసి ఇచ్చిన గొప్ప వ్యక్తి అని అన్నారు. సంపన్నులు ఆయనను ఆదర్శంగా తీసుకుని సేవారంగంలో ముందుకు రావాలని కోరారు. తనవంటి వారు రాజకీయాల్లోకి వచ్చి చెడిపోయామని బాధపడుతున్నామని, ఎలాంటి రాజకీయాలు లేకుండా దయానంద్రెడ్డి మాదిరిగా సేవ చేస్తే ఎంతో సంతృప్తి ఉండేదన్నారు. కబడ్డీ అసోసియేషన్ జిల్లా ప్రధాన కా ర్యదర్శి గంగాధర్, పీడీ రాజ్కు మార్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ప్రవీణ్రెడ్డి, నాయకులు దాసరి వెంకటేశ్, శేఖర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కనువిప్పు కలిగిస్తాం
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : బీసీ రిజర్వేషన్ల విషయంలో కేంద్ర ప్రభుత్వానికి కనువిప్పు కలిగించేందుకు కామారెడ్డిలో ఈనెల 15న నిర్వహించే సభను విజయవంతం చేయాలని పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్కుమార్గౌడ్ పిలుపునిచ్చారు. ఆదివారం పట్టణంలోని కన్వెన్షన్ సెంటర్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ముఖ్య నేతలు, కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మహేశ్కుమార్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బడుగు, బలహీన వర్గాల పార్టీ అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేసి తీరుతామన్నారు. బీస్థానిక సంస్థల ఎన్నికల్లోనే కాకుండా విద్య, ఉద్యోగాల్లోనూ రిజర్వేషన్ల అమలు కోసం తీర్మానం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. దానికి చట్టబద్ధత ఇవ్వాల్సిన కేంద్రం మోకాలడ్డుతోందని ఆరోపించారు. బీసీ బిల్లును ఆపుతున్న వారి భరతం పట్టడానికి 15న కామారెడ్డిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో రెండు లక్షల మందితో సభ నిర్వహించాలని నిర్ణయించామన్నారు. ఈ రోజు మోదీని పట్టుకుని బీసీ బిల్లును ఆపగలుగుతున్నారని, రాహుల్ గాంధీ ప్రధాని అవగానే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని స్పష్టం చేశారు. అందరూ కృషి చేయాలి కామారెడ్డిలో నిర్వహించే బహిరంగ సభకు భారీ ఎత్తున జనం తరలివచ్చేలా పార్టీ నేతలు, కార్యకర్తలు కృషి చేయాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి సూచించారు. రాష్ట్రంలో కులగణన శాసీ్త్రయంగా జరిగిందన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని కారుకూతలు కూసినా, ఎన్ని కుట్రలు చేసినా చిత్తశుద్ధితో బీసీ బిల్లు తీర్మానం చేశామన్నారు. నిజాయితీగా బిల్లును ఆమోదించాం ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయడానికి ఉద్దేశించిన బిల్లును నిజాయితీగా ఆమోదించామని జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క పేర్కొన్నారు. రాష్ట్రం నుంచి పంపిన బిల్లును కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అడ్డుకుంటోందని ఆరోపించారు. సామాజిక న్యాయం జరగాలనే ఉద్దేశంతో పదవుల్లో బీసీలకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. అమలు చేసి తీరుతాం.. ఇచ్చిన మాట ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు అమ లు చేసి తీరుతామని రవాణా, బీసీ వెల్ఫేర్ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. బీసీ బిల్లు కు కేంద్రం చట్టబద్ధత కల్పించాలని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ డిమాండ్ చేశారు. బీసీలు పెద్ద సంఖ్యలో సభకు తరలివచ్చి ఐక్యత చాటాల్సిన అవసరం ఉందని పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే బొజ్జు, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, కార్పొరేషన్ల చైర్మన్లు మానాల మోహన్రెడ్డి, ఈరవత్రి అనిల్, తాహెర్బిన్ హందాన్, కాసుల బాల్రాజ్, డీసీసీ అధ్యక్షుడు కై లాస్ శ్రీనివాస్, మాజీ ఎ మ్మెల్యేలు ఏనుగు రవీందర్రెడ్డి, ఆకుల లలిత, నా యకులు అరికెల నర్సారెడ్డి, చంద్రకాంత్రెడ్డి, చంద్రశేఖర్రెడ్డి, ఇందుప్రియ తదితరులు పాల్గొన్నారు. రేవంత్రెడ్డి సారథ్యంలో బీసీలకు న్యాయం సీఎం రేవంత్రెడ్డి సారథ్యంలోని ప్రభుత్వం బీసీలకు న్యాయం చేస్తోందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీ పేర్కొన్నారు. కామారెడ్డిలోనే బీసీ డిక్లరేషన్ ప్రకటించారన్నారు. బీసీ బిల్లును ఆమోదించిన తర్వాత కామారెడ్డిలోనే సభ నిర్వహించే అవకాశం రావడం తన అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. ఎంపీ సురేశ్ షెట్కార్, ఎమ్మెల్యేలు మదన్మోహన్రావు, లక్ష్మీకాంతారావు, సుదర్శన్రెడ్డి, భూపతిరెడ్డి, ఆది శ్రీనివాస్ తదితరులు మాట్లాడారు. కామారెడ్డిలో రెండు లక్షల మందితో సభ నిర్వహిస్తాం కేంద్రంపై సమర శంఖం పూరిస్తాం బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత సాధించడమే లక్ష్యం మోదీ ఇవ్వకపోతే రాహుల్ ప్రధాని కాగానే అమలు చేస్తాం పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ -
అక్కాచెల్లెళ్లకు రేవంతన్న కానుక!
డొంకేశ్వర్(ఆర్మూర్) : మహిళలందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉచితంగా చీరలు పంపిణీ చేయనుంది. ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా మహిళా సంఘాల (ఎస్హెచ్జీ) సభ్యులకు ‘రేవంతన్న’ కానుక పేరుతో ఇవ్వనున్నారు. ఈ మేరకు జిల్లాలో సంఘాలు.. వాటిలో సభ్యుల సంఖ్య ఎంత? ఏయే ప్రాంతాలకు సరఫరా చేయాలనే వివరాలను రాష్ట్ర అధికారులు సేకరించారు. ఈ చీరలను చేనేత, జౌళి శాఖ తయారు చేయిస్తుండగా, పలు జిల్లాలకు సరఫరా కూడా ప్రారంభమైంది. జిల్లాకు ఈ వారంలోనే చీరలు రానుండగా, వాటిని భద్రపరిచేందుకు నిజామాబాద్, బోధన్, మోర్తాడ్, పెర్కిట్, డిచ్పల్లిలో గోదాములను గుర్తించారు. ఆయా గోదాముల నుంచి మండలాలకు రవాణా చేసి గ్రామాల్లో పంపిణీ చేయనున్నారు. మహిళలకు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం త్వరలో అధికారులకు మార్గదర్శకాలు ఇవ్వనుంది. ప్రతి సభ్యురాలికి రెండు చీరలు ఇస్తామని ప్రభుత్వం గతంలో ప్రకటించగా ప్రస్తుతం ఒకటి ఇచ్చి మరోటి తర్వాత ఇవ్వనున్నారు. అయితే.. ఈ చీర ఒకే రంగులో, ఒకే డిజైన్లో ఉండనుంది. ఎస్హెచ్జీ మహిళలు సమావేశాలు, కార్యక్రమాలకు వెళ్లినప్పుడు దీనినే యూనిఫాంగా వినియోగించాల్సి ఉంటుంది. మహిళా సంఘాల సభ్యులందరికీ చీరలు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం జిల్లా నుంచి వివరాలను సేకరించింది. జిల్లాలో ఎక్కడెక్కడికి సరఫరా చేయాలో గోదాముల వివరాలను పంపించాం. ఈ వారంలోనే జిల్లాకు చీరలు రానుండగా, ప్రభుత్వం ఇచ్చే మార్గదర్శకాల ప్రకారం మహిళలకు అందజేస్తాం. – సాయాగౌడ్, డీఆర్డీవో,నిజామాబాద్ ఎస్హెచ్జీ సభ్యులకు ఉచితంగా ‘యూనిఫాం’ చీరలు త్వరలో పంపిణీ చేయనున్న రాష్ట్ర ప్రభుత్వం ఈ వారంలోనే జిల్లాకు సరఫరా.. -
చెల్లుబాటు కాని చెక్కులు
పెండింగ్లో బిల్లులు ● గ్రామ పంచాయతీ ఖాతాల్లోని సొమ్ము వినియోగించుకోలేని పరిస్థితి ● ఆర్థిక శాఖ నుంచి చెల్లింపులకు దక్కని అనుమతి ● ఆరు నెలలుగా ఇదే స్థితి ● రూ.కోట్లున్నా అక్కరకు రాని వైనంమోర్తాడ్(బాల్కొండ): కమ్మర్పల్లి మండలంలోని ఒక గ్రామ పంచాయతీ ట్రెజరీ ఖాతాలో రూ.3లక్షల నిధులు ఉన్నాయి. వివిధ అభివృద్ధి పనులకు బిల్లులు చెల్లించేందుకు చెక్కులను భీమ్గల్ ట్రెజరీ కార్యాలయానికి పంపించారు. ఆరు నెలలు గడుస్తున్నా ఒక్క చెక్కు కూడా చెల్లుబాటు కాలేదు. ట్రెజరీ ఖాతాలో నిధులు ఉన్నా వినియోగించే పరిస్థితి లేదు. ఇదేమిటని ట్రెజరీ అధికారులను ప్రశ్నిస్తే నిధులు వినియోగించకుండా ఫ్రీజింగ్ విధించారని చెబుతున్నారు. ఇది ఒక్క కమ్మర్పల్లి మండలంలోని పంచాయతీ పరిస్థితే కాదు. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని పంచాయతీల ట్రెజరీ ఖాతాల్లో నిధులున్నా వినియోగించేందుకు వీలులేని పరిస్థితి నెలకొంది. పునర్విభజనకు ముందు జిల్లాలో 530 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. రాష్ట్ర ఆర్థిక సంఘం, రిజిస్ట్రేషన్ చార్జీలు, ఇతర రకాల ఆదాయం అంతా ట్రెజరీ ఖాతాల్లోనే జమ అ వుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా పంచాయతీల ఖాతాల్లో రూ.20 కోట్ల వరకు నిధులు ఉన్నాయి. ఈ నిధులను పంచాయతీల నిర్వహణ, చిన్నచిన్న అభివృద్ధి పనులు, సామగ్రి కొనుగోలు, విద్యుత్ బిల్లుల చెల్లింపులు, ట్రాక్టర్ల ఈఎంఐలు ఇలా ఎన్నో రకాల వాటికి వినియోగించడానికి అవకాశం ఉంది. పంచాయతీ సిబ్బంది వేతనాల కోసం ప్రభుత్వం జమచేస్తున్న సొమ్ము చెల్లింపులకు మాత్రమే చెక్కులు చెల్లుబాటు అవుతున్నాయి. ఇతర బిల్లుల చెల్లింపులకు పంపించిన చెక్కులు ఆరు నెలల నుంచి అలాగే ఉంటున్నాయి. రాష్ట్ర ఆర్థిక శాఖ నుంచి బిల్లుల చెల్లింపులకు ఆమోదం లభించకపోవడంతో ట్రెజరీ కార్యాలయాలకు పంపించిన చెక్కులు అలాగే ఉండిపోయాయి. నెలల తరబడి చెక్కులు చెల్లుబాటు కాకపోవడంతో పంచాయతీల నిర్వహణ కష్టంగా ఉందని కార్యదర్శులు చెబుతున్నారు. రాష్ట్ర ఆర్థిక శాఖ పంచాయతీ నిధులను వినియోగించకుండా ఫ్రీజింగ్ విధించడంతో ఖాతాల్లో నిధులు ఉన్నా అక్కరకు రావడం లేదనే వాదన బలంగా వినిపిస్తోంది. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి పంచాయతీ నిధుల వినియోగంపై విధించిన ఫ్రీజింగ్ను తొలగించాలని పలువురు కోరుతున్నారు. గ్రామ పంచాయతీ ట్రెజరీ ఖాతాల నుంచి సిబ్బంది జీతాల చెల్లింపునకు ఇబ్బంది లేదు. ఫ్రీజింగ్ అమలులో ఉన్న కారణంగా అనేక బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. ప్రభుత్వం నుంచి అనుమతి లభించిన తరువాతనే నిధులను వినియోగించడానికి వీలు ఉంటుంది. – శివకృష్ణ, డివిజనల్ పంచాయతీ అధికారి, ఆర్మూర్ గ్రామ పంచాయతీకి నిధులు వస్తాయనే ఉద్దేశంతో ఎన్నో పనులు చేశాం. నిధులు మంజూరైన తరువాత కూడా బిల్లులు చెల్లించడం లేదు. ఆరు నెలల కింద ట్రెజరీకి పంపించిన చెక్కు ఇప్పటి వరకు డ్రా కాలేదు. ప్రభుత్వం స్పందించి బిల్లులు మంజూరు చేయాలి. నిధులు ఉన్నా ఫ్రీజింగ్ కారణంగా ఆర్థికంగా ఇబ్బంది కలుగుతోంది. – కడారి శ్రీనివాస్, మాజీ సర్పంచ్, సుంకెట్ -
ఉమ్మడి జిల్లా జట్ల ఎంపిక పోటీలు
నిజామాబాద్నాగారం: నగరంలోని జిల్లా క్రీడా మైదానంలో శనివారం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బాల్ బ్యాడ్మింటన్ సంఘం ఆధ్వర్యంలో బాలుర, బాలికల క్రీడాకారుల ఎంపిక పోటీలను ప్రారంభించారు. ఎంపికై న క్రీడాకారులకు శిక్షణ శిబిరాన్ని నిర్వహించి ఉమ్మడి జిల్లా తుది జట్టును ఎంపిక చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. తుది జట్టుకు ఎంపికై న క్రీడాకారులు ఈనెల 12 నుంచి 14 వరకు జనగాం జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ బాల, బాలికల బాల్ బ్యాడ్మింటన్ పోటీల్లో పాల్గొంటారన్నారు. జిల్లా అధ్యక్షుడు మానస గణేష్, కార్యదర్శి శ్యామ్, కామారెడ్డి జిల్లా కార్యదర్శి కృష్ణమూర్తి, కోశాధికారి రాజేశ్వర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ నాగేష్, కార్యవర్గం సభ్యులు భాగ్యశ్రీ,, సీనియర్ క్రీడాకారులు ఆనంద్, కార్తిక్, జిల్లా వ్యాయమ సంఘం అధ్యక్షుడు విద్యాసాగర్రెడ్డి తదితరులు ఉన్నారు. కొనసాగుతున్న బీఈడీ, ఎంఈడీ పరీక్షలు తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో బీఈడీ, ఎంఈడీ సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్లాగ్ పరీక్షలు శనివారం ప్రశాంతంగా జరిగినట్లు అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. ఉదయం జరిగిన బీఈడీ 2, 4వ సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్లాగ్ పరీక్షల్లో మొత్తం 279 మంది విద్యార్థులకు గానూ 261 మంది హాజరైనట్లు తెలిపారు. అలాగే మధ్యాహ్నం జరిగిన ఎంఈడీ 1, 2, 3, 4వ సెమిస్టర్ బ్యాక్లాగ్, 4వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల్లో ఒక విద్యార్థి హాజరైనట్లు ఆయన తెలిపారు. నిండుకుండలా ఎస్సారెస్పీ బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ను పూర్తిస్థా యి నీటినిల్వకు అధికారులు పెంచారు. ప్రస్తు తం ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి నిల్వ 80.5 టీఎంసీలతో నిండుకుండలా ఉంది. ప్రాజెక్ట్లోకి ఎగువ ప్రాంతాల నుంచి వరద తగ్గుముఖం పట్టింది. 27వేల 650 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. ప్రాజెక్ట్ నుంచి వరద కాలువ ద్వారా 18 వేల క్యూసెక్కులు, కాకతీయ కాలువ ద్వారా 5500 క్యూసెక్కులు, ఎస్కెప్ గేట్ల ద్వారా 2500 క్యూసెక్కులు, మిషన్ భగీరథ ద్వారా 231 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 666 క్యూసెక్కుల నీరు పోతుంది. ఆర్మూర్: మలేషియా దే శంలోని కౌలాలంపూర్ లో ఈ నెల 26 నుంచి 29 వరకు నిర్వహించనున్న బతుకమ్మ, దసరా సంబురాలకు హాజరుకావాలని ఆర్మూర్కు చెందిన నటరాజ నృత్య నికేతన్ నాట్య గురువు బాశెట్టి మృణాళినికి శని వారం ఆహ్వానం అందింది. తమ విద్యార్థులతోపాటు వారు హాజరై గౌరవ ప్రదమైన సన్మానాన్ని పొందాలని యునైటెడ్ హెరిటేజ్ ఆర్ట్స్ అండ్ కల్చర్ ఆర్గనైజేషన్ తరఫున ఆహ్వానించినట్లు నిర్వాహకులు దేవులపల్లి పవన్ వివరించారు. ఈ ఆహ్వానంతో శిక్షణ పొందుతున్న చిన్నారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
ముత్యాల చెరువు పరిశీలన
ధర్పల్లి: మండలంలోని హోన్నాజీపేట్ అటవీ ప్రాంతంలోగల ముత్యాల చెరువు కట్ట ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తెగిపోవడంతో ఆ ప్రదేశాన్ని జిల్లా అదనపు కలెక్టర్ అంకిత్, ఇరిగేషన్ అధికారులతో కలిసి శనివారం పరిశీలించారు. అనంతరం బీరప్ప తండాలో నష్టపోయిన పంటలను, ఇళ్లను, రోడ్లను పరిశీలించారు. బీరప్పతండాకు అదన కలెక్టర్ వచ్చి న విషయాన్ని తెలుసుకున్న వాడి, హోన్నాజీపేట్ ప్రజలు ఆయన వద్దకు వచ్చారు. ముత్యాల చెరువు కట్ట నిర్మాణం మళ్లీ చేపడితే తమ గ్రామాలు మళ్లీ ముంపునకు గురవుతాయని ప్రజలు అదనపు కలెక్టర్కు విన్నవించారు. ఎట్టి పరిస్థితుల్లో కట్ట నిర్మా ణం చేపట్టవద్దని ఆందోళన చేపట్టారు. తమ సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిస్థితులను వివరిస్తానని అదనపు కలెక్టర్ హామీ ఇవ్వడంతో ప్రజలు ఆందోళన విరమించారు. ఆర్డీవో వినోద్, ఇరిగేషన్ ఎస్ఈ రామారావు, ఈఈ నరేందర్, డీఈ ప్రేమ్ కుమార్, ఎంపీడీవో లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. -
క్రైం కార్నర్
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి ● మరో ఇద్దరికి గాయాలు బాల్కొండ: మెండోరా మండలం పోచంపాడ్ చౌరస్తాలోగల 44వ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందాడు. మెండోరా ఎస్సై జాదవ్ సుహాసిని తెలిపిన వివరాలు ఇలా.. ని ర్మల్ జిల్లా సోన్ మండలం గాంధీనగర్కు చెందిన సాస్కిన్ అభినాష్(25) శుక్రవారం మధ్యాహ్నం బైక్పై తన బంధువుల పిల్లలైన రుసునకంటే గణేష్, ఆంబ్లే లోకేష్లతో కలిసి శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ దిగువన గోదావరిలో చేపలు వేటాడడానికి వచ్చారు. వేట ముగిసిన తర్వాత అర్ధరాత్రి వేళ బైక్పై ఇంటికి బయలుదేరారు. పోచంపాడ్ చౌరస్తాలోగల హైవేపై వీరి బైక్ను ఆర్మూర్ నుంచి నిర్మల్ వైపు వెళ్తున్న గుర్తుతెలియని వాహనం వెనుక నుంచి వేగంగా ఢీకొట్టడంతో ముగ్గురు కిందపడ్డారు. ఈ ఘటనలో బైక్పై మధ్యలో కుర్చున్న అభినాష్ తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరికి గాయాలు కాగా నిర్మల్జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మంజీర బ్రిడ్జికి వేలాడిన మృతదేహం బోధన్రూరల్: మంజీర నది బ్రిడ్జికి శనివారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం వేలాడుతూ కనిపించడంతో కలకలం రేపింది. అటువైపుగా వెళ్లిన కొందరు ప్రయాణికులు మృతదేహాన్ని గమనించి బోధన్ రూరల్ పోలీసులు సమాచారం అందించారు. వెంటనే వారు ఘటన స్థలానికి చేరుకొని, పరిసరాలను పరిశీలించారు. ఘటన స్థలం మహారాష్ట్ర పరిధిలోకి రావడంతో మహారాష్ట్ర పోలీసులకు సమాచారం అందించారు. స్వగ్రామం చేరిన అన్వేష్రెడ్డి మృతదేహం బాల్కొండ: మెండోరా మండల కేంద్రానికి చెందిన సామ అన్వేష్రెడ్డి(30) పది రోజుల క్రితం గుండెపోటుతో ఐర్లాండ్లో మృతి చెందాడు. ఆయన మృతదేహం శనివారం ఉదయం స్వగ్రామానికి చేరుకుంది. కుటుంబసభ్యుల రోధనలు మధ్యే అంత్యక్రియలను నిర్వహించారు. అన్వేష్రెడ్డి నాలుగు నెలల క్రితమే సెలవుపై వచ్చి వివాహం చేసుకుని ఇటీవల వెళ్లాడు. -
నత్తనడకన ఆర్యూబీ పనులు
● నవీపేట మండలంలో మూడు చోట్ల నిర్మాణాలకు నిధుల కేటాయింపు ● పనుల్లో కనిపించని పురోగతి నవీపేట: రైల్వే సేవల విస్తరణలో భాగంగా రైల్వే శాఖ ఇటీవల పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది.అందులో భాగంగా నవీపేట మండల పరిధిలో రైలు పట్టాల పెంపు, అవసరమైన చోట ఆర్యూబీ(రైల్వే అండర్ బ్రిడ్జి) పనులను నాలు గు నెలల కిందట ప్రారంభించింది. రైల్వేట్రా క్ (బ్రాడ్గేజ్) లైన్ విస్తరణలో భాగంగా రైల్వేగేట్లను తొలగించాలని నిర్ణయం తీసుకుని ముందడుగు వేసింది. కానీ పనులు నత్తనడకన కొనసాగుతుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రైల్వే గేట్ల ఇబ్బందులు తొలగించడానికి.. మండలంలోని ధర్యాపూర్, మహంతం, ధర్మారం(ఏ),నాగేపూర్, ఫకీరాబాద్, మిట్టాపూర్ గ్రామాల లో రైల్వేగేట్లు ఉన్నాయి. రైలు వస్తున్న సమయంలో ఈ గేట్లు వేయడంతో ప్రయాణికుల రాకపోకల కు ఇబ్బంది అవుతుంది. నవీపేట, రెంజల్, నంది పేట, ఎడపల్లి, నిజామాబాద్ సరిహద్దు గ్రామాలకు చెందిన వేలమంది ప్రయాణికులు ఈ రహదారుల వెంబడి నిత్యం రాకపోకలు సాగిస్తున్నారు. ప్రయాణికుల ఇబ్బందులను తప్పించాలనే నేపథ్యంలో రైల్వేశాఖ ఆర్యూబీ పనులకు శ్రీకారం చుట్టింది. రూ.15 కోట్ల నిధులు.. మొదట ధర్యాపూర్, మహంతం, ధర్మారం(ఏ) గ్రామాలలోని రైల్వేగేట్లను తొలగించాలనే లక్ష్యంతో ఈ మూడు ప్రాంతాలలో ఆర్యూబీ పనులను ప్రారంభించింది. రూ. 5 కోట్ల చొప్పున మూడు ఆర్యూబీ పనులకు మొత్తం రూ. 15 కోట్లు నిధులను ఆరు నెలల కిందట కేటాయించారు. నాలుగు నెలల క్రితం పనులు ప్రారంభ మయ్యాయి. కానీ పనులలో వేగం పుంజుకోవడం లేదు. ధర్మారం(ఏ) వద్ద ఒకవైపు తవ్వి వదిలేయగా అందులో పూర్తిగా వర్షపు నీరు నిలిచింది. మహంతం ప్రాంతంలో ఒక వైపు పనులను ప్రారంభించినా మందకొడిగా సాగుతోంది. ధర్యాపూర్లో ఒక వైపు మొరం తవ్వి పనులు చేస్తున్నారు. మరోవైపు కొద్దిమేర సీసీ వేసి వదిలేశారు. రైల్వే అధికారుల అజమాయిషీ కరువవ్వడంతో సంబంధిత గుత్తేదారులు ఇష్టానుసారం పనులు నిర్వహిస్తున్నారు. మరో మూడు నెలల్లో పనులు పూర్తి కావాల్సి ఉండగా ఎలాంటి పురోగతి కనపించడం లేదు. పనులు చేపట్టడంతో సంతోషపడిన చుట్టు పక్కల గ్రామాల వాసులు పనులు మందకొడిగా సాగడంతో ఇబ్బంది పడుతున్నారు. తాత్కలికంగా గేట్లు మూసివేయడంతో దూరభారం పెరిగి ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి ఆర్యూబీ పనులను వేగవంతం చేయాలని ప్రజలు కోరుతున్నారు. మా గ్రామం నుంచి నవీపేట, నిజామాబాద్లకు వెళ్లాలంటే మహంతం రైల్వే గేటు మీదుగా వెళ్తాం. ప్రస్తుతం రైల్వే గేటును ఆర్యూబీ పనుల నిమిత్తం మూసి వేశారు. దీంతో కమలాపూర్ మీదుగా తిరిగి వెళ్తున్నాం. ఇప్పటికై నా రైల్వే అధికారులు స్పందించి ఆర్వోబీ పనులను వేగంగా నిర్వహిస్తే బాగుంటుంది. –సతీష్, మహంతం రాంపూర్లో బీడీ కార్కానా నడిపిస్తాను. వృత్తిరీత్య ప్రతిరోజు రాంపూర్ నుంచి పోతంగల్కు ధర్యాపూర్ గేటు మీదుగా రాకపోకలు సాగిస్తాను. కొన్ని నెలలుగా గేటును మూసివేశారు. రెంజల్ మండలంలోని కళ్యాపూర్ మీదుగా పోతంగల్కు వెళ్లాల్సి వస్తుంది. అండర్ గ్రౌండ్ మార్గాన్ని నిర్మిస్తున్నారని సంతోషపడ్డాం. కానీ పనులను ఆలస్యంగా నిర్వహిస్తున్నారు. –బైండ్ల శ్యామ్, రాంపూర్ -
మరమ్మతులు త్వరితగతిన చేపట్టాలి
బోధన్: ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల దెబ్బతిన్న రోడ్లకు, విద్యుత్ లైన్లకు మరమ్మతులు త్వరితగతిన చేపట్టాలని బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సాలూర మండలంలోని సాలూర క్యాంప్లో శనివారం ఆయన మందర్నా, హున్సా, ఖాజాపూర్, సాలూర, తగ్గేల్లి గ్రామాలతోపాటు ఇతర గ్రామాల్లో వరదలతో జరిగిన నష్టాలపై, పునరుద్ధరణ పనులపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయా గ్రామాల రైతులు, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అధికారులతో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దెబ్బతిన్న రోడ్లను వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. విద్యుత్, తాగునీటి సౌకర్యాలకు సంబంధించిన పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. పంట నష్టం వివరాలను సమగ్రంగా నమోదు చేయాలని తెలిపారు. రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్బిన్ హందాన్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, ఏఎంసీ చైర్మన్ చీల శంకర్, టీపీసీసీ డెలిగేట్ గంగాశంకర్, అధికారులు ముక్తార్, వెంకటేశ్వర్లు, మున్నినాయక్, శశిభూషణ్, శ్రీనివాస్, శ్వేత, నాయకులు మొబిన్ఖాన్, మందర్నా రవి, నాగేశ్వర్రావు, పులి శ్రీనివాస్, నాయకులు అల్లె రమేష్, చిద్రపు అశోక్, సంజీవ్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి -
ఆలయంలో చోరీ
మాక్లూర్: మండలంలోని అమ్రాద్ తండాలోగల వీర హనుమాన్ ఆలయంలో శుక్రవారం రాత్రి గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడినట్లు తండావాసులు తెలిపారు. ఆలయం తాళాలను పగులగొట్టి, ఆలయంలోని బీరువాలో ఉన్న అరకిలో వెండి కిరీటంతోపాటు చేతిలో ఉన్న గధను అపహరించుకపోయారు. అంతేకాకుండా ఆలయంలో పసుపు, కుంకుమ కలిపి వండిన అన్నం ఉండటంతో తండాకు ఏదైన కీడు జరగాలని దుండగులు ఇలా చేసి ఉంటారేమోనని తండావాసులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఘటనపై ఆలయ చైర్మన్ మూడ గోవింద్నాయక్ మాక్లూర్ పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. -
బీజేపీలో టిక్కెట్ల పంచాయితీ
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: స్థానిక సంస్థల ఎ న్నికల నేపథ్యంలో బీజేపీలో టిక్కెట్ల పంచాయితీ నెలకొంది. తమకు టిక్కెట్టు వస్తుందంటే.. తమ కు హామీ దక్కిందంటూ పలువురు ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులు చెప్పుకుంటున్నారు. ఆయా నియోజకవర్గాల ముఖ్య నాయకుల నుంచి తమకు ఇప్పటికే హామీ లభించిందంటూ ప్ర చారం చేసుకుంటుండడంతో పలువురు నాయకుల మధ్య కోల్డ్వార్ మాదిరి పంచాయితీ నెలకొంది. దీంతో ఈ విషయం రాష్ట్ర పార్టీ వరకు చేరింది. కీలకమైన నిజామాబాద్ జిల్లాలో స్థానిక టిక్కెట్ల కేటాయింపు విషయమై రాష్ట్ర అధ్యక్షుడు ప్రత్యేకంగా దృష్టి సారించడం గమనార్హం. గెలుస్తామనే ఆశతో... గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి బీజేపీలో స్థానిక సంస్థల టిక్కెట్ల కోసం పోటాపోటీ నెలకొంది. వరుసగా రెండుసార్లు లోక్సభ సీటు గెలవడం, ఉమ్మడి జిల్లాలో మూడు ఎమ్మెల్యే సీట్లు గెలవడంతోపాటు గ్రామాల్లో పార్టీ మరింత బలోపేతం కావడంతో టిక్కెట్లకు డిమాండ్ పెరిగింది. పైగా గ్రామాల్లో యువత పార్టీకి దన్నుగా నిలబడుతుండడంతో గెలుస్తామనే ఆశతో పలువురు పోటీకి ఆసక్తి చూపుతున్నారు. ఎవరికి వారే ఆయా నియోజకవర్గాల్లో టిక్కెట్ల కోసం పట్టుపడుతున్నారు. అయితే సదరు నియోజకవర్గాల నాయకులు తమ అనుచరులకు టిక్కెట్లు ఇస్తామని హామీలు ఇస్తున్నట్లు పార్టీ శ్రేణుల్లో చర్చ నడుస్తోంది. ఈ వ్యవహారాలన్నీ పార్టీ రాష్ట్ర నాయకత్వానికి చేరడంతో టిక్కెట్ల కేటాయింపు అనేది ఏ ఒక్క నాయకుడి చేతిలో ఉండదని, కోర్ కమిటీ ఎంపికలు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి ఆమోదం తప్పనిసరి అని స్పష్టం చేసినట్లు సమాచారం. దీంతో టిక్కెట్టు హామీ వచ్చిందంటూ సంతోషపడితే కుదరదని కార్యకర్తల్లో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో జిల్లాకు చెందిన కీలక నేత మనసులో ఏముందో అనే అంతర్గత చర్చ పార్టీ శ్రేణుల్లో జరుగుతోంది. స్థానిక ఎన్నికల నిర్వహణ విషయమై నోటిఫికేషన్ జారీ చేసే విషయంలో ఇప్పటికీ స్పష్టత రాలేదు. అయినప్పటికీ ముందే కమలం పార్టీలో టిక్కెట్ల కుస్తీ నడుస్తుండడంతో వ్యవహారం రసకందాయంగా మారింది. ఆశావహుల్లో టెన్షన్.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసేందుకు జిల్లాలో పలువురు ఉవ్విళ్లూరుతున్నారు. ఈ నేపథ్యంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ, కౌన్సిలర్, కార్పొరేటర్ టిక్కెట్లు ఆశిస్తున్న ఆశావహులు మాత్రం, తమకు టిక్కెట్టు విషయమై హామీ వచ్చిందంటూ పలుచోట్ల చెప్పుకుంటున్నారు. అయితే ఇలా చెప్పుకుంటున్న నాయకులకు మాత్రం కీలక నాయకత్వం నుంచి ఝులక్ వచ్చింది. క్రమశిక్షణ కలిగిన బీజేపీలో టిక్కెట్ల కేటాయింపు కోర్ కమిటీ చేతిలో ఉంటుందని, కోర్ కమిటీ తయారు చేసిన ఆశావహుల జాబితా మేరకు అన్ని కోణాల్లో పరిశీలించి రాష్ట్ర అధ్యక్షుడు ఫైనల్ చేశాకే టిక్కెట్టు దక్కుతుందని పార్టీ శ్రేణులకు మెసేజ్ పాస్ అయింది. దీంతో తమకే టిక్కెట్టు అని చెప్పుకుంటున్న ఆశావహుల్లో టెన్షన్ నెలకొంది. స్థానిక సంస్థల్లో కమలం తరఫున పోటీ చేసేందుకు ఆశావహుల పాట్లు హామీ వచ్చిందంటూ చెప్పుకుంటున్న పలువురు నాయకులు కోర్ కమిటీ ఆమోదిస్తేనే టిక్కెట్లని తేల్చి చెప్పిన రాష్ట్ర నాయకత్వం -
ప్రజా సంక్షేమమే ధ్యేయం
పెర్కిట్: ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని రా ష్ట్ర మార్క్ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి అన్నారు. అంకాపూర్లోని రాజారాంనగర్ కాలనీలో నూతనంగా మంజూరైన చౌక ధరల దుకాణాన్ని మార గంగా రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. త్వరలో ఇందిర మ్మ ఇళ్ల పథకంలో నిరుపేదలకు ఇళ్లను పంపిణీ చే యనున్నట్లు వెల్లడించారు. జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ మార చంద్రమోహన్, ఏఎంసీ డైరెక్టర్ అమృత్ రావు, వీడీసీ అధ్యక్షుడు కుంట గంగారెడ్డి, ఎంసీ గంగారెడ్డి, మురళీ, గోపాల్, సృజన్, శృంగారం నర్సయ్య, కిషన్, భూమేశ్ పాల్గొన్నారు. -
సర్వం సిద్ధం..
నేడు వినాయక నిమజ్జనం ఖలీల్వాడి/నిజామాబాద్ రూరల్ : లంబోదరుడి నిమజ్జనానికి జిల్లా వ్యాప్తంగా సర్వం సిద్ధమైంది. విశేష పూజలందుకున్న వినాయకుడు శనివారం గంగమ్మ ఒడికి చేరనున్నాడు. నిజామాబాద్ నగరంలో సార్వజనిక్ గణేశ్ మండలి ఆధ్వర్యంలో శోభాయాత్ర వైభవంగా నిర్వహించనున్నారు. 11 జతల ఎడ్లతో రథం కదులుతుంది. దుబ్బా నుంచి ప్రారంభమయ్యే వినాయక శోభాయాత్ర శివాజీచౌక్, గాంధీచౌక్, నెహ్రూపార్క్, గాజుల్పేట్, పెద్దబజార్, గోల్హన్మాన్, పులాంగ్ మీదుగా వినాయక్నగర్లోని వినాయకుల బావి వద్దకు చేరుకుంటుంది. ఈ నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. రోడ్ల మరమ్మతులు, విద్యుత్ వైర్లు విగ్రహాలకు తగలకుండా సరిచేశారు. పటిష్ట బందోబస్తు వినాయక నిమజ్జనం సందర్భంగా కమిషనరేట్ పరిధిలోని ఆయా పోలీస్ స్టేషన్ల సిబ్బందితోపాటు ఏసీపీలు, సీఐలు, ఎస్సైలు, ఏఎస్సైలు, హెడ్కానిస్టేబుళ్లు, హోంగార్డులు సుమారు 1300 మంది బందోబస్తులో పాల్గొననున్నారు. శోభాయాత్రలో ట్రాఫిక్ నియంత్రణకు ఎకై ్సజ్, ఫారెస్ట్ సిబ్బందితోపాటు ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ వలంటీర్లు సేవలందించనున్నారు. సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలతో నిరంతరం పర్యవేక్షించనున్నారు. గణేశ్ నిమజ్జనం సందర్భంగా బాసర, ఉమ్మెడ బ్రిడ్జి ప్రాంతాలను శుక్రవారం రాత్రి సీపీ సాయిచైతన్య పరిశీలించారు. ట్రాఫిక్ డైవర్షన్ వినాయక నిమజ్జనం రోజు నిజామాబాద్కు వచ్చే ఆర్టీసీ బస్సులను డైవర్షన్ చేస్తున్నట్లు ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ ఆలీ తెలిపారు. బోధన్ నుంచి వచ్చే బస్సులు అర్సపల్లి రైల్వేగేట్ నుంచి, కలెక్టర్ ఆఫీస్, కంఠేశ్వర్ బైపాస్, రైల్వే అండర్ పాస్, ఎన్టీఆర్ చౌరస్తా, రైల్వే స్టేషన్ మీదుగా బస్టాండ్ వైపు వెళతాయి. బాన్సువాడ, డిచ్పల్లి నుంచి వచ్చే బస్సులు ప్రస్తుత రూట్లోనే నడువనున్నాయి. లారీలు, భారీ వాహనాలు బైపాస్ నుంచి వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. భారీ విగ్రహాల రూట్లు .. నగరం నుంచి భారీ విగ్రహాల నిమజ్జనం కోసం బాసర వద్ద, ఉమ్మెడలోని గోదావరి వద్ద ఏర్పాట్లు చేశారు. ఉమ్మెడలో ఆరు క్రేన్లు, బాసరలో నాలుగు క్రేన్ల ద్వారా వినాయక విగ్రహాల నిమజ్జనం చేయనున్నారు. కాగా, 8 ఫీట్ల లోపు గణపతి విగ్రహాలను నగరంలోని నెహ్రూపా ర్క్, అర్సపల్లి, జాన్కంపేట్, నవీపేట మీదుగా బాసరకు తరలించాలి. అనంతరం ఖాళీ వాహనాలు బాసర, ధర్మాబాద్, కందకుర్తి, సాటాపూర్, రెంజల్, నవీపేట మీదుగా రావాల్సి ఉంటుంది. ఎనిమిది ఫీట్ల కంటే ఎత్తుగా ఉన్న విగ్రహాలను నగరం నుంచి నందిపేట మండలం ఉమ్మెడకు తీసుకెళ్లాలి. పూలాంగ్, ఎన్టీఆర్ చౌరస్తా, రైల్వే స్టేషన్, బస్స్టేషన్, రైల్వే ఓవర్ బ్రిడ్జి, శివాజీ చౌక్, దుబ్బా, జీజీ కాలేజీ చౌరస్తా, బైపాస్ రోడ్డు, డీఎస్ చౌరస్తా, ముబారక్నగర్, మాణిక్బండార్, దాస్నగర్, మాక్లూర్, మాదాపూర్, నందిపేట్ మీదుగా ఉమ్మెడ సరిహద్దులోని గోదావరి బ్రిడ్జి వద్దకు వెళ్లాలి. ఇదే రూట్లో నందిపేట, నవీపేట్ మీదుగా బాసర గోదావరి బ్రిడ్జికి వెళ్లొచ్చు. నగరంలో శోభాయాత్రకు ఏర్పాట్లు పూర్తి 8 ఫీట్ల విగ్రహాలు బాసరకు.. 8 ఫీట్ల కంటే ఎత్తు ఉన్న విగ్రహాలు ఉమ్మెడ గోదావరికి 1300 మంది పోలీసులతో బందోబస్తు -
కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరిక
బాన్సువాడ : స్థానిక సంస్థల ఎన్నికల్లో బాన్సువాడలో గులాబీ జెండా ఎగురవేయాలని కార్యకర్తలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించా రు. సిద్దిపేట జిల్లాలోని కేసీఆర్ ఫాంహౌస్లో మా జీ ఎమ్మెల్యే బాజిరెడ్డి ఆధ్వర్యంలో బాన్సువాడ ని యోజకవర్గ కాంగ్రెస్ నాయకులు శుక్రవారం బీఆర్ఎస్లో చేరారు. బాన్సువాడకు చెందిన మాజీ జెడ్పీటీసీ, మాజీ సర్పంచ్ నార్ల రత్నకుమార్తోపాటు ఇషాక్, గులెపల్లి మొగులయ్య, మల్లిబాబుతో పా టు కోటగిరి, వర్ని మండలాలకు చెందిన కాంగ్రెస్ నాయకులకు కేటీఆర్ కండువా కప్పి పార్టీలోకి ఆ హ్వానించారు. బీఆర్ఎస్ నాయకులు జుబేర్, అంజిరెడ్డి, యలమంచలి శ్రీనివాస్రావు, కోటగిరి శ్రీనివాస్రావు, కిషన్, ఎర్రవాటి సాయిబాబా, మోచీ గణేష్, గాండ్ల కృష్ణ, బోడ చందర్, ఉమామహేష్, రమేష్యాదవ్, శివసూరి తదితరులున్నారు. -
తులం బంగారం @ రూ.లక్షా10 వేలు
● రికార్డు స్థాయికి చేరిన ధరలు ● శుభకార్యాలు దగ్గర పడుతుండడంతో తలలు పట్టుకుంటున్న సామాన్యులునిజామాబాద్ రూరల్: బంగారం ధరలు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పట్లో ఆగేటట్లు కనిపించడం లేదు. తాజాగా మార్కెట్లో బంగారం తులం ధర రూ.లక్షా10 వేలకు చేరుకుంది. వారం రోజుల క్రితం బంగారం తులం రూ.లక్షా 5 వేలు పలికింది. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో పసిడి ధరలు ౖపైపెకి దూసుకెళ్తున్నాయి. పెళ్లిళ్లు, దసరా, దీపావళి పండుగల సీజన్ వేళ బంగారం కొనుగోలు చేసేవాళ్లను ప్రస్తుత ధరలు బెంబేలెత్తిస్తున్నాయి. వారం రోజుల బంగారం ధరలు తేదీ ధర(తులం) 30.08.2025 1,05,900, 01.09.2025 1,07,200 02.09.2025 1,07,300 03.09.2025 1,08,400 04.09.2025 1,09,400 05.09.2025 1,10,000 -
అవార్డులందుకున్న ఉత్తమ ‘గురువులు’
తెయూ(డిచ్పల్లి)/ నిజామాబాద్ రూరల్: అవార్డు లు మరింత బాధ్యతను పెంచుతాయని రాష్ట్రస్థాయి ఉత్తమ అధ్యాపక, ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలు ప్రొఫెసర్ గోపిశెట్టి రాంబాబు, సీహెచ్ శంకర్, రా ఘవపురం గోపాలకృష్ణ పేర్కొన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శుక్రవారం హైద రాబాద్లో నిర్వహించిన గురుపూజోత్సవం కార్యక్రమంలో వారు విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ యోగితారాణా, ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్రెడ్డి చేతుల మీదు గా అవార్డులను అందుకున్నారు. అధికారులు అవార్డుతోపాటు శాలువా, మెమోంటో, పూలమాలతో ఘనంగా సత్కరించి ప్రోత్సహకంగా నగదు పారితోషికాన్ని అందజేశారు. అవార్డు గ్రహీతలు మాట్లాడుతూ విద్యాశాఖ ఉత్తమమైన ఫలితాలు సాధించేలా తమ వంతు కృషి చేస్తామన్నారు. అవార్డులు అందుకున్న ప్రొఫెసర్ రాంబాబుకు తెలంగాణ వ ర్సిటీలోని వివిధ విభాగాల హెచ్వోడీలు, డైరెక్టర్లు, వర్సిటీ టీచర్స్ అసిసోయేషన్ ప్రతినిధులు, ఉద్యోగులు శుభాకాంక్షలు తెలిపారు. సీహెచ్ శంకర్, ఆర్ గోపాలకృష్ణలను ఉపాధ్యాయ సంఘాల బాధ్యులతోపాటు ఉపాధ్యాయులు అభినందించారు. -
గ్యాస్ ట్యాంకర్ను ఢీకొన్న బస్సు
భిక్కనూరు: మండలంలోని జంగంపల్లి గ్రామశివారులో జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు, గ్యాస్ ట్యాంకర్ను ఢీకొట్టింది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా.. నిజామాబాద్ డిపో–1కు చెందిన ఆర్టీసీ బస్సు శుక్రవారం సికింద్రాబాద్ నుంచి నిజామాబాద్ వైపు వస్తోంది. జంగంపల్లి గ్రామశివారులోని జాతీయ రహదారిపై బస్సు ముందున్న గ్యాస్ ట్యాంకర్ను వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో బస్సు అదుపుతప్పి డివైడర్ను ఢీకొని, రోడ్డు అవతలి వైపునకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో బస్సు ముందర భాగం, ప్రవేశ ద్వారం తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో ప్రయాణికులు అత్యవసర ద్వారం గుండా బ యటకు వచ్చారు. ఈ ప్రమాదంలో గ్యాస్ ట్యాంకర్ నుంచి గ్యాస్ లీకేజీ కాకపోవడంతోపా టు పేలకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీ ల్చుకున్నారు. ఒకవేళ ట్యాంకర్ పేలి ఉంటే భారీ ప్రమాదం జరిగేదని పలువురు పేర్కొన్నారు. దెబ్బతిన్న ఆర్టీసీ బస్సు ముందుభాగంగ్యాస్ ట్యాంకర్ -
నేడు జిల్లాకు పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ రాక
నిజామాబాద్ సిటీ: పీసీసీ అధ్యక్షుడు బొ మ్మ మహేశ్ కుమార్గౌడ్ శనివారం జి ల్లాకు రానున్నారు. వి నాయక నిమజ్జనం సందర్భంగా నగరంలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2 గంటలకు జిల్లా కేంద్రంలోని దుబ్బలో సార్వజనిక్ గణేశ్ మండలి వినాయకుడికి మహేశ్ కుమార్ గౌడ్ ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం వినాయక నిమజ్జన శోభాయాత్రను ప్రారంభిస్తారని నగర కాంగ్రెస్ అధ్యక్షుడు, నుడా చైర్మన్ కేశ వేణు తెలిపారు. నేడు వైన్స్ షాపులు బంద్ ఖలీల్వాడి: వినాయక నిమజ్జనం సందర్భంగా శనివారం నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలోని వైన్స్షాపులు, కల్లు దుకాణాలు, బార్లు బంద్ చేస్తున్నట్లు సీపీ పోతరాజు సాయిచైతన్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం ఉదయం 6 నుంచి ఆ దివారం సాయంత్రం 4 గంటల వరకు దు కాణాలను మూసి ఉంచాలన్నారు. నిబంధనలు పాటించని వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మోర్తాడ్: భీమ్గల్ మండలంలోని లింబాద్రి గుట్ట శ్రీలక్ష్మి నర్సింహస్వామి ఆలయాన్ని శుక్రవారం హైకోర్టు న్యాయమూర్తి ప్రవీణ్రావు కుటుంబసమేతంగా దర్శించుకున్నా రు. ఆలయ ధర్మకర్తలు నంబి పార్థసారథి, వాసు పంతులు వారికి ఘన స్వాగతం పలి కారు. సంప్రదాయబద్ధంగా ప్రత్యేక పూజలను నిర్వహించి స్వామివారి తీర్థ ప్రసాదాలను ప్రవీణ్రావుకు, ఆయన కుటుంబసభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎ స్సై సుభాష్ బందోబస్తును నిర్వహించారు. హత్య కేసులో నిందితుల రిమాండ్ ఆర్మూర్టౌన్: పట్టణంలోని మామిడిపల్లిలో ఇటీవల జరిగిన వృద్ధుడి హత్యకేసులో ముగ్గురు నిందితులను రిమాండ్కు తరలించినట్లు ఎస్హెచ్వో సత్యనారాయణ గౌడ్ శుక్రవారం తెలిపారు. కామారెడ్డికి చెందిన అంగర లక్ష్మి, భర్త వేణుకుమార్తో కలిసి మామిడిపల్లిలో నివాసం ఉంటున్నారు. కా గా మోర్తాడ్ మండలం సుంకెట్ గ్రామానికి చెందిన పోతు నరేందర్ (65) మామిడిపల్లిలోని వీరి నివాసానికి తరచూ వస్తుండేవాడు. గత నెల 20న నరేందర్ వారి ఇంటికి వెళ్లగా, లక్ష్మి, ఆమె భర్త వేణుకుమార్, అల్లుడు రాజశేఖర్, కొడుకు నవీన్, కుమార్తె నవ్య కలిసి హత్యచేశారు. నరేందర్పై ఉన్న బంగారు గొలుసు, రెండు ఉంగరాలను కాజేశారు. మృతదేహాన్ని గోనెసంచిలో కుక్కి ఎవరికి అనుమానం రాకుండా మామిడిపల్లి వద్ద నిజాంసాగర్ కెనాల్లో వదిలేశారు. మోర్తాడ్లో మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులకు నిందితులైన లక్ష్మి, అల్లుడు రాజశేఖర్, కుమారుడు నవీన్ పట్టుబడ్డారు. కాగా, వేణుకుమార్, నవ్య పరారీలో ఉన్నారని, గాలింపు చేపట్టామని ఎస్హెచ్వో తెలిపారు. -
నిజామాబాద్లో సైబర్ క్రైమ్.. రూ. 10 లక్షలు కాజేశారు!
నిజామాబాద్: సైబర్ క్రైమ్ కేటుగాళ్లు చెలరేగిపోతున్నారు. తాము ఆర్థిక వ్యవహారాలు చూసే ఆషీసర్లుగా చెప్పుకుంటూ సామాన్య ప్రజల నుంచి లక్షల్లో దోచుకుంటున్నారు. తాము ఫలాన ప్రభుత్వ ఆపీసు నుంచి పోన్ చేస్తున్నామని, తాము అందులో అధికారులమని డ్రామాకు తెరలేపుతున్నారు. దాంతో అకౌంట్లో అవసరాల కోసం డబ్బు దాచుకున్న వారు భయపడిపోతున్నారు. ఈ క్రమంలో సైబర్ నేరగాళ్ల ఇంకాస్త భయపెట్టి.. ప్రజల అకౌంట్ల నుంచి లక్షల్లో డబ్బులు గుంజుతున్నారు. తాజాగా నిజామాబాద్లో సైబర్ నేరగాళ్లు.. ఒక కుటుంబానికి ఫోన్ చేసి రూ. 10 లక్షల వరకూ లాగేశారు. డిజిటల్ అరెస్టు పేరుతో సదరు కుటుంబాన్ని బెదిరించి.. మనీలాండరింగ్ కేసులో అరెస్టు చేస్తామని బెదిరించారు. రూ. 30 లక్షలు ఇవ్వకపోతే అరెస్ట్ కావాల్సి వస్తుందంటూ భయపెట్టారు. దాంతోభయపడిపోయిన ఆ కుటుంబం నుంచి రూ. 10 లక్షలను కాజేశారు. అయితే దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఆ సైబర్ నేరగాళ్ల అకౌంట్ను ఫ్రీజ్ చేశారు పోలీసులు. ఈ తరహా మోసాలకు బలి కావొద్దని పోలీసులు పదే పదే చెబుతున్నా, కాలర్ ట్యూన్స్ రూపంలో మనకు రోజుకు వినిపిస్తున్నా ప్రజల్లో ఇంకా అవగాహన రావడం లేదు. దాంతో అకౌంట్లో అవసరాల కోసం డబ్బులు దాచుకున్న వారే లక్ష్యంగా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. అసలు ఎవరు ఫోన్ చేశారు.. ఎందుకు ఫోన్ చేశారు అనే దానిపై కాస్త ఆగి ఆడుగులు వేస్తే లక్షల్లో సొమ్మును సైబర్ నేరగాళ్లు కాజేసే పరిస్థితి ఉండదు. ఈ తరహా కాల్స్ వచ్చినప్పుడు, పదే పదే వేధింపులకు గురౌవుతున్నప్పుడు ముందుగా పోలీసులకు ఫిర్యాదు చేస్తే సమస్యకు ఆదిలోనే చెక్ పెట్టే అవకాశం ఉంటుంది. చేతులు కాలిపోయాక.. ఆకులు పట్టుకుంటే ఎంత వరకూ ప్రయోజనం ఉంటుందనేది ప్రజలు ఆలోచించాలనేది విశ్లేషకుల మాట. -
క్రైం కార్నర్
తండ్రి వద్దు.. పింఛన్ కావాలి ● పెన్షన్ డబ్బులను తీసుకొని తండ్రిని వదిలేసిన కూతురు ● కుమారుడికి ఫోన్ చేసి తండ్రిని తీసుకెళ్లాలని సూచించిన ఎస్సైనిజాంసాగర్(జుక్కల్): ఓ కూతురు తన తండ్రికి వచ్చే పింఛన్ డబ్బులు తీసుకొని, తండ్రిని వదిలేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు ఇలా.. మహమ్మద్ నగర్ మండలం తుంకిపల్లి గ్రామానికి చెందిన ఎరుకల పోచయ్య, దుర్గవ్వ దంపతులకు ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. దుర్గవ్వ, ఒక కొడుకు కొన్నెళ్ల కిందట మృతి చెందారు. మరో కొ డుకు నారాయణ పెళ్లి చేసుకొని ఇళ్లరికం వెళ్లాడు. అప్పటి నుంచి వృద్ధుడైన పోచ య్య నిజాంపేటలోని కూతురు నర్సవ్వ వద్ద ఉంటున్నాడు. నాల్గు రోజుల కిందట తండ్రి పింఛన్ కోసం నర్సవ్వ తన తండ్రిని తీసుకొని తుంకిపల్లి గ్రామ పంచాయతీకి వచ్చింది. సిబ్బంది డబ్బులు ఇవ్వకపోవడంతో తండ్రిని అక్కడే వదిలివేసి వెళ్లిపోయింది. దీంతో పోచయ్య గ్రామ పంచాయతీ వద్దనే ఉన్నాడు. బుధవారం జీపీ కా ర్యాలయం వద్ద పోస్టాఫీసు సిబ్బంది పింఛన్ పంపిణీ చేస్తుండటంతో నర్సవ్వ వచ్చి, పింఛన్ డబ్బులను తీసుకొని తండ్రిని అక్కడే వదిలేసి వెళ్లింది. పోచయ్య అనాథగా మారి రోధించడంతో విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రవీందర్రెడ్డి ఎస్సై శివకుమార్కు సమాచారం అందించారు. కూతురుకు ఎస్సై ఫోన్ చేయగా లిఫ్ట్ చేయలేదు. కుమారుడికి ఫోన్ చేసి తండ్రిని తీసుకువెళ్లాలని చెప్పారు. -
రైళ్లను పొడిగించండి
నిజామాబాద్ అర్బన్: పలు రైళ్లను నిజామాబాద్ మీదుగా పొడిగించాలని సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ జోనల్ స్థాయి సభ్యులు రావులపల్లి జగదీశ్వరరావు కోరారు. సికింద్రాబాద్లో గురువారం సౌత్ సెంట్రల్ రైల్వే జోనల్ స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఆయన హాజరై సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ పలు వినతులు అందించారు. నాందేడ్ వరకు వస్తున్న వందే భారత్ రైలును నిజామాబాద్ వరకు పొడిగించాలన్నారు.తిరుపతికి వందే భారత్ సౌక ర్యం కల్పించాలన్నారు. ఆర్మూర్, డిచ్పల్లి మధ్య ట్రాక్ లింకు కల్పించి రైల్వే బైపాస్ నివారించి భూసేకరణలో ప్లాట్ల యజమాన్లకు న్యాయం చేయాలన్నారు. తపోవన్ ఎక్స్్ప్రెస్, పూణే, ముంబై ఎక్స్్ప్రెస్లను, బెంగుళూరు, ఢిల్లీ రైళ్లను నాందేడ్ నుంచి నిజామాబాద్ వరకు పొడిగించాలన్నారు. ముంబై సికింద్రాబాద్ మధ్య మరొక రైలు నడపాలన్నారు. నిజామాబాద్ రైల్వే స్టేషన్లో లిఫ్ట్, సీసీ కెమెరాలు స్కానింగ్ ప్రయాణికుల వసతులు తదితర వాటిని అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ప్రయాణికుల భద్రత చర్యలు తీసుకోవాల ని కోరారు. జనరల్ మేనేజర్ వాటిని సానుకూలంగా విని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. నిజామాబాద్ అర్బన్: నగరంలోని జిల్లా బాలభవన్లో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క ళా ఉత్సవ్ కార్యక్రమం గురువారం ముగిసింది. ఇందులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారిని ఎంపిక చేసి రాష్ట్రస్థాయి పోటీలకు పంపించనున్నారు. వివి ధ విభాగాలలో 11 మంది విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై నట్లు డీఈవో అశోక్ తెలిపారు. అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులున్నారు. -
పరిసరాలను శుభ్రంగా ఉంచాలి
మోపాల్ : గ్రామాల్లో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, విధులను నిర్లక్ష్యం చేయొద్దని జిల్లా పంచాయతీ అధికారి డి శ్రీనివాస్రావు సూచించారు. మండలంలోని కులాస్పూర్ గ్రామాన్ని గురువారం ఆయన సందర్శించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పల్లె ప్ర కృతివనం, నర్సరీలో నీరు నిలిచి ఉండటంతో సమస్య పరిష్కారానికి పలు సూచన లు చేశారు. వీలైనంత త్వరగా నిల్వ ఉన్న నీటిని తొ లగించాలని పంచాయతీ కార్యదర్శి హనుమరాజ్ ను ఆదేశించారు. అలాగే మురుగుకాల్వకు ఆనుకు ని ఉన్న మిషన్ భగీరథ పైప్లైన్ను మార్చాలన్నా రు. వాటర్ ట్యాంకుల్లో ఎప్పటికప్పుడు క్లోరినేషన్ చేపట్టాలని అన్నారు. అనంతరం గ్రామ పంచాయతీలో రికార్డులను పరిశీలించారు. ఆయన వెంట ఎంపీవో కిరణ్కుమార్, సిబ్బంది ఉన్నారు. బోధన్: తరగతి గదిలో విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా పాఠాలను బోధించాలని డీఈవో అశోక్ ఉపాధ్యాయులకు సూచించారు. పట్టణంలోని రాకాసీపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల (జేపీ) లో గురువారం మండల స్థాయి ఎఫ్ఎల్ఎన్( ఫండమెంట్ లిటరసీ), టీచింగ్ లెర్నింగ్ మేళా నిర్వహించారు. కార్యక్రమానికి డీఈవో ముఖ్య అతిగా విచ్చేసి, ఉపాధ్యాయులు రూపొందించిన బోధన పరికరాలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బోధన పరికరాల ప్రదర్శనలో ప్రతిభ చాటిన ఉపాధ్యాయులకు ప్రశంసాపత్రాలు అందించి అభినందించారు. ఎంఈవో నాగయ్య, కాంప్లెక్స్ స్కూల్ హెచ్ఎంలు సూర్యకుమార్, ఆరిఫ్ఉద్దీన్, సీఆర్పీలు, ఉపాధ్యాయ సంఘ నాయకులు పాల్గొన్నారు. -
పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించాలి
● కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ● భూ భారతిపై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్లో సమీక్షనిజామాబాద్ అర్బన్: భూభారతి పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. నగరంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుంచి గురువారం ఆయన అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్తో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. జిల్లాలోని ఆర్డీవోలు, తహసీల్దార్లతో భూభారతిపై సమీక్ష నిర్వహించారు. భూభారతి రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తుల పురోగతిని తెలుసుకున్నారు. నిర్ణీత గడువు లోపు అన్ని దరఖాస్తులు పరిష్కారం అయ్యేలా చూడాలన్నారు. దరఖాస్తులు తిరస్కరణ అయితే, అందుకు గల కారణాలు స్పష్టంగా పేర్కొనాలని సూచించారు. సాదా బైనామా, పీవోటీలకు సంబంధించిన అప్లికేషన్లను క్షుణ్ణంగా పరిశీలన జరపాలని, వెంటవెంటనే నోటీసులు జారీ చేస్తూ, క్షేత్రస్థాయిలో పరిశీలన జరపాలని ఆదేశించారు. కాగా, హెల్త్ సబ్ సెంటర్ల భవన నిర్మాణాల కోసం అవసరమైన స్థలాలను గుర్తించాలని తహసీల్దార్లకు సూచించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఇళ్లు కూలిపోయిన, పశు సంపద కోల్పోయిన బాధిత కుటుంబాలకు తక్షణ సహాయం కింద వెంటనే పరిహారం అందేలా చూడాలన్నారు. కొత్త రేషన్ కార్డుల కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తూ అర్హులకు వెంటనే ఆమోదం తెలపాలన్నారు. జాతీయ కుటుంబ ప్రయోజన పథకం కింద అర్హత ఉన్న వారందరూ దరఖాస్తు చేసుకునేలా చొరవ చూపాలని సూచించారు. కాగా, గ్రామ పాలన అధికారులుగా ఎంపికై న వారు నియామక పత్రాల కోసం ప్రత్యేక బస్సులలో సకాలంలో హైదరాబాద్ చేరుకునేలా చూడాలన్నారు. బోధన్, ఆర్మూర్ సబ్ కలెక్టర్లు వికాస్ మహతో, అభిజ్ఞాన్ మాల్వియా, నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రకృతి వ్యవసాయంతోనే ఆరోగ్యం
నిజామాబాద్ రూరల్: ప్రకృతి వ్యవసాయంతోనే ఆరోగ్యం లభిస్తుందని సీపీ సాయి చైతన్య అన్నారు. మండలంలోని గూపన్పల్లి శివారులో సేంద్రియ పద్ధతి ద్వారా సాగు చేస్తున్న చిన్ని కృష్ణుడి వ్యవసాయ క్షేత్రాన్ని గురువారం సీపీ సందర్శించారు. అనంతరం చిన్ని కృష్ణుడితో మాట్లాడి సేంద్రియ సాగు వివరాలను అడిగి తెలుసుకున్నారు. 22 వంగడాలతో ఏర్పాటు చేసిన సూచన చక్రాన్ని, 23 వంగడాలతో చిన్ని కృష్ణుడి వివరాలను ఏర్పాటు చేసిన తీరును అభినందించారు. సీపీ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ సేంద్రియ పద్ధతిలో సాగుచేసిన పంటలను ఆహారంగా తీసుకోవాలని సూచించారు. యువత సైతం సేంద్రియ వ్యవసాయం వైపు అడుగులు వేయాలని అన్నారు. పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
కేరళ సంస్కృతికి ప్రతీక ‘ఓనం’
● రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి ● తిరుమల నర్సింగ్ కళాశాలలో ఘనంగా ఓనం వేడుకలు డిచ్పల్లి: కేరళ మలయాళీ ప్రజల సంస్కృతి, సాంప్రదాయానికి ‘ఓనం’ పండుగ ప్రతీకగా నిలుస్తుందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి అన్నారు. డిచ్పల్లి మండలం బర్ధిపూర్ శివారులోని తిరుమల నర్సింగ్ కళాశాలలో గురువారం ‘ఓనం’ పండుగ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి వెలిగించి వేడుకలను ప్రారంభించారు. కేరళ రాష్ట్ర యువతీ, యువకులు తమ సంప్రదాయ దుస్తులు ధరించి ఆకర్షణగా నిలిచారు. కేరళ వాయిద్య పరికరాలను వాయిస్తూ విద్యార్థినులు చేసిన నృత్యాలు ఆహుతుల్ని ఎంతగానో అలరించాయి. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తాను ఒక డాక్టర్నే అని నర్సింగ్ విద్య అభ్యసిస్తున్న మీకు మంచి భవిష్యత్ ఉంటుందన్నారు. కరోనా సమయంలో తిరుమల మెడికల్ ఇన్స్ట్యూట్స్ చైర్మన్ పరమేశ్వర్రెడ్డి ధైర్యంగా ముందుకు వచ్చి ప్రజలకు వైద్య సేవలందించారని ప్రశంసించారు. కరస్పాండెంట్ పద్మావతి, నర్సింగ్ కాలేజ్ ప్రిన్సిపాల్ ప్రతిభ, ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, పీసీసీ డెలిగేట్ శేఖర్గౌడ్, నాయకులు మునిపల్లి సాయిరెడ్డి, కంచెట్టి గంగాధర్, సీహెచ్ నర్సయ్య, పొలసాని శ్రీనివాస్, అమృతాపూర్ గంగాధర్, వాసుబాబు, ధర్మాగౌడ్, రాంచందర్గౌడ్ పాల్గొన్నారు. -
పనితీరు బాగా లేని పాలకవర్గాలకు గుడ్బై
మోర్తాడ్(బాల్కొండ) : సహకార సంఘాల పాలకవర్గాల పాలన తీరు బాగుంటేనే పదవీకాలాన్ని పొడిగించాలనే నిబంధనను విధించడంతో కొన్ని పాలకవర్గాలకు ఉద్వాసన పలుకుతూ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. సహకార సంఘాల పదవీ కాలం గత ఫిబ్రవరిలో ముగియగా, సకాలంలో ఎన్నికలను నిర్వహించని కారణంతో పదవీ కాలాన్ని ఆగస్టు 14 వరకూ పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే పొడిగించిన పదవీకాలం గడువు కూడా ముగియడంతో మరోసారి పొడిగింపు ఉత్తర్వులను ప్రభుత్వం ఆగస్టు 14వ తేదీన జారీ చేసినప్పటికీ గతంలో మాదిరిగా అన్ని సంఘాల పాలకవర్గాలకు పొడిగింపు ఇవ్వకుండా ప్రభుత్వం కొత్త నిబంధన విధించింది. పాలకవర్గాల పాలన తీరు ఎలా ఉంది, సంఘాల ఆర్థిక పరిస్థితి, ఎక్కడైన పాలకవర్గాలు అక్రమాలకు పాల్పడ్డాయా, నిధుల దుర్వినియోగం తదితర అంశాలపై ప్రభుత్వం సహకార శాఖ నివేదికను కోరింది. జిల్లాలో 89 సహకార సంఘాలు ఉండగా అన్ని పాలకవర్గాల పనితీరును సహకార శాఖ విశ్లేషించింది. చివరకు 43 సంఘాల పాలకవర్గాలకు పొడిగింపు ఆదేశాలను గురువారం ఇచ్చింది. మరో 20 సంఘాల పాలకవర్గాల పనితీరును పరిశీలిస్తుండగా, వీటికి రెండు మూడు రోజుల్లో పొడిగింపు ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది. 26 సంఘాల పాలకవర్గాల పనితీరు అసలే బాగోలేదని నిర్ధారణకు వచ్చిన అధికారులు సహకార శాఖ అధికారులకు పర్సన్ ఇన్చార్జీ బాధ్యతలను అప్పగించనున్నారు. ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం పాలకవర్గాల పనితీరుపై ఉన్నతాధికారులు తమ ఆడిటర్లు, వివిధ హోదాల్లో ఉన్న ఉద్యోగులతో వివరాలను సేకరించారు. సహకార శాఖ రిజిస్ట్రార్కు నివేదికను పంపించడంతో పాలకవర్గాల పొడిగింపునకు వారు నిర్ణయం తీసుకున్నారు. నిధులను సొంతానికి వాడుకోవడం, సకాలంలో ఎరువుల కంపెనీలకు బకాయిలు చెల్లించకపోవడం, రుణాల వసూళ్లలో వెనుకబడి ఉండటం ఇలా పలు కారణాలతో కొన్ని సంఘాల పాలకవర్గాల స్థానంలో అధికారులకు బాధ్యతలు అప్పగించనున్నారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పాలక వర్గాల పనితీరును పరిశీలించి సహకార శాఖ రిజిస్ట్రార్కు నివేదికను అందించాం. అక్కడి నుంచి వచ్చిన ఆదేశాలు, సూచనల మేరకు కొన్ని సంఘాల బాధ్యతను ఉద్యోగులకే అప్పగించనున్నాం. పదవీ కాలం పొడిగింపు వర్తించే పాలకవర్గాలకు ఉత్తర్వులను జారీ చేశాం. – శ్రీనివాస్రావు, జిల్లా సహకార అధికారి సహకార సంఘాల పదవీకాలాన్ని పొడిగిస్తూ ఉత్తర్వులు తాజాగా 43 సంఘాల పాలకవర్గాలకు వర్తింపు పరిశీలనలో 20 పాలకవర్గాలు 26 పాలకవర్గాలకు నో చెప్పిన అధికార యంత్రాంగం -
రాష్ట్రస్థాయి అవార్డులకు ఎంపిక
మోపాల్(నిజామాబాద్రూరల్) : ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం ప్రతిఏడాది ప్రకటించే రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు జిల్లాకు చెందిన ఇద్దరు ఉపాధ్యాయులు ఎంపికయ్యారు. మోపాల్ మండలం బోర్గాం(పి) జెడ్పీహెచ్ఎస్ హెచ్ఎం సీహెచ్ శంకర్ (ప్రిన్సిపాల్ కేటగిరి), కంజర్ జెడ్పీహెచ్ఎస్ గణితం ఉపాధ్యాయు డు రాఘవపురం గోపాలకృష్ణ (ఉపాధ్యాయుల కేటగిరి)ఎంపికయ్యారు. మొత్తం 9 అంశాల్లో ఉపాధ్యాయుల రెండేళ్ల పనితీరును పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపిక చేసింది. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శు క్రవారం హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో సీఎం రేవంత్రెడ్డి, మంత్రుల చేతుల మీదుగా వీరు అవార్డులు అందుకోనున్నారు. బోధనోపకరణాలతో.. బోధన్కు చెందిన రాఘవపురం గోపాలకృష్ణ పేద కుటుంబంలో పుట్టాడు. పేపర్ వేస్తూ, పాల ప్యాకె ట్లు పంచుతూ, హోటల్లో, మేసీ్త్రగా పని చేసుకుంటూనే కుటుంబానికి చేదోడువాదోడుగా నిలిచారు. 1998లో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం సా ధించిన ఆయన నిజాంసాగర్ మండలంలోని తుర్కపల్లిలో మొదట పోస్టింగ్లో చేరారు. ఆ తర్వాత 2009లో స్కూల్ అసిస్టెంట్గా పదోన్నతి పొందాడు. కళా ఆధారిత విద్యను ప్రోత్సహించ డం, బోధనోపకరణాలు తయారు చేయడం, పని చేసే పాఠశాలల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేయడం ఆయన అంకితభావానికి నిదర్శనం. నిజాయితీ, నిబద్ధత శంకర్ సొంతం.. ఎక్కడ పని చేసినా నిజాయితీ, నిబద్ధత, క్రమశిక్షణ కు ఆయన పెట్టింది పేరు శంకర్. పని చేసిన చోట గ్రామస్తులు, ప్రజాప్రతినిధుల సహకారంతో పాఠశాలను అన్నిరంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నారు. తోటి ఉపాధ్యాయులతో సమన్వయం, సహకారంతో 1000 మందికిపై గా విద్యార్థులు ఉన్న బోర్గాం(పి) జెడ్పీ ఉన్నత పా ఠశాలను విజయవంతంగా నడిపిస్తున్నారు. 1997 లో స్కూల్ అసిస్టెంట్గా ఉద్యోగం సాధించారు. ఉత్తమ ఉపాధ్యాయులుగా జిల్లా టీచర్లు ప్రిన్సిపాల్ కేటగిరిలో బోర్గాం(పీ) జెడ్పీహెచ్ఎస్ హెచ్ఎం శంకర్ ఉపాధ్యాయుల కేటగిరిలో కంజర్ జెడ్పీహెచ్ఎస్ గణితం టీచర్ గోపాలకృష్ణ -
పటిష్ట నిఘా.. పర్యవేక్షణ
● గణేశ్ శోభాయాత్రకు 1300 మంది సిబ్బంది ● డ్రోన్, సీసీ కెమెరాల ఏర్పాటు ఖలీల్వాడి: గణేశ్ నిమజ్జన శోభాయాత్ర సందర్భంగా నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని సీపీ పోతరాజు సాయిచైతన్య తెలిపారు. శోభాయాత్ర ప్రశాంత వాతావరణంలో కొనసాగేలా చర్యలు తీసుకుంటున్నామననారు. సుమారు 1300 మందికి పైగా సిబ్బందిని నియమించామని, సీసీ కెమెరాలు, నిఘా డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నామన్నారు. ట్రాఫిక్ నియంత్రణ కోసం పోలీస్ సిబ్బందితోపాటు ఎకై ్సజ్, ఫారెస్ట్, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్తో బందోబస్తు ఏర్పా టు చేశామన్నారు. శోభాయాత్రలో ఎక్కడైనా అనుమానాస్పద రీతిలో వ్యక్తులు, వస్తువులు కనిపిస్తే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని, ఆడియో సిస్టమ్స్ను నిర్ణీత స్థాయిలో ఉపయోగించాలన్నారు. డీజేలు పూర్తిగా నిషేధమని, పుకార్లను నమ్మొద్దని సూచించారు. అత్యవసర సమయంలో డయల్ 100, పోలీస్ కంట్రోల్ రూమ్ 87126 59700, సంబంధిత పోలీస్ స్టేషన్లలో సంప్రదించాలని అన్నారు. -
యుద్ధప్రాతిపదికన మరమ్మతులు
● తాత్కాలిక, శాశ్వత ప్రాతిపదికన పనులను విభజించాలి ● వరద నష్టం ప్రభుత్వానికి నివేదిస్తాం ● కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డిసిరికొండ : వరదల కారణంగా దెబ్బతిన్న రోడ్లు, వంతెనలకు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు పూ ర్తి చేయాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అధికారుల ను ఆదేశించారు. మండలంలోని కొండూర్ వద్ద కప్పలవాగుపై తెగిపోయిన వంతెన, రోడ్డును, పెద్ద వాల్గోట్ వద్ద కోతకు గురైన రోడ్డును, ఇసుక మేట లు వేసిన పొలాలను, ధ్వంసమైన విద్యుత్ స్తంభా లను, ట్రాన్స్ఫార్మర్లను ఆయన గురువారం పరిశీలించారు. తక్షణమే చేపట్టాల్సిన పనుల జాబితాలో కొండూర్ రోడ్డును చేర్చి, వెంటనే పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. తాత్కాలిక ప్రాతిపదికన తక్షణమే చేపట్టాల్సిన, శాశ్వత ప్రాతిపదికన చేపట్టాల్సిన పనులను విభజించి ప్రాధాన్యతా క్రమంలో చేపట్టేలా పర్యవేక్షించాలన్నారు. పెద్దవాల్గోట్లో కొనసాగుతున్న రోడ్డు పునరుద్ధరణ పనులను పరిశీలించారు. వరద నష్టంపై సమగ్ర వివరాలతో నివేదికను రూపొందించి ప్రభుత్వానికి సమర్పిస్తామన్నారు. అనంతరం పెద్దవాల్గోట్లో సొసైటీ గోదాముతోపాటు పల్లె దవాఖానను, అంగన్వాడీ కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. కలెక్టర్ వెంట పీఆర్ ఈఈ శంకర్నాయక్, డీఈ హైమద్ హుస్సేన్ తదితరులున్నారు. -
అవినీతికి కేరాఫ్గా బల్దియా
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ నగరపాలక సంస్థలో రెవెన్యూ, టౌన్ ప్లానింగ్ సిబ్బంది అక్రమ వసూళ్ల పర్వానికి అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. బల్దియా అంటేనే అవినీతికి కేరాఫ్గా మారిపోయింది. స్థానిక ఎమ్మెల్యే ధన్పాల్ ధన్పా ల్ సూర్యనారాయణ గుప్తా బహిరంగంగానే పలుమార్లు ఈ విషయం చెప్పడం పరిస్థితికి అద్దం పడుతోంది. ఇటీవల మున్సిపల్ కమిషనర్ దిలీప్కుమార్ను బదిలీ చేయించేందుకు కొందరు అవినీతిపరు లైన ఉద్యోగులు, అధికారులు చేసిన కుట్రలు చూసి అధికార పార్టీ నేతలైన ఎమ్మెల్సీ మహేశ్కుమార్ గౌడ్, ఎమ్మెల్యేలు పొద్దుటూరి సుదర్శన్రెడ్డి, డాక్టర్ భూపతిరెడ్డిలు సైతం ఆశ్చర్యపోవడం గమనార్హం. దీన్ని బట్టే చూస్తే బల్దియాలో ఉద్యోగులు చేస్తున్న అవినీతి అక్రమాలు ఎలా ఉన్నాయో తెలుస్తోంది. బల్దియా చరిత్రలో ఇప్పటివరకు పదుల సంఖ్యలో ఏసీబీ దాడులు జరిగాయి. 2024 ఆగస్టు 9న ఆర్వో దాసరి నరేందర్ రూ.3 కోట్ల నగదుతో పట్టుబడడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తాజాగా ఆర్ఐ శ్రీనివాసరావు ఆర్మీ జవాన్ నుంచి రూ.7వేలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. ఫైలుకో రేటు.. బల్దియాలో పైసలిస్తేనే ఫైళ్లు కదిలే పరిస్థితి. ప్రభు త్వ ఫీజులు చెల్లించినప్పటికీ అనుమతులు ఇవ్వడం లేదు. నెలల తరబడి తిప్పుతున్నారు. బోర్గాం(పి) కు చెందిన ఓ వ్యక్తి తన పాత ఇంటిని తొలగించి కొత్త ఇంటిని కట్టుకోవడానికి అనుమతి కోసం రెండేళ్లుగా తిరుగుతున్నాడు. చివరికి ఫైలు కనిపించ డంలేదని తెలిపారు. అయితే ముడుపులు ఇవ్వగానే రెండు రోజుల్లో అనుమతి పత్రం చేతిలో పెట్టారు. నగరంలోని కవిత కాంప్లెక్స్లో ఓ దుకాణదారుడు పన్ను చెల్లిస్తానని ముందుకు వచ్చినప్పటికీ ఆయనను ముప్పుతిప్పలు పెట్టడం గమనార్హం. కొలత లు సరిగా లేవని, కొత్త మెజర్మెంట్స్ తీసుకోవాల ని, సైట్ పనిచేయడం లేదంటూ పలు కారణాలు చె బుతూ ఆరు నెలలు తిప్పారు. చివరకు సంబంధిత శానిటరీ ఇన్స్పెక్టర్ ఒకరిని కలిసి ముడుపులు ఇవ్వ డంతో రెండు రోజుల్లో పని పూర్తి చేశారు. ఇటీవల వినాయక్నగర్కు చెందిన ఓ వ్యక్తి అసెస్మెంట్ కో సం వెళ్తే తిప్పి తిప్పి, చివరకు రూ.30 వేలు తీసు కుని అనుమతి ఇచ్చారు. ఎల్లమ్మగుట్టకు చెందిన ఓ తాజా మాజీ కార్పొరేటర్కు సంబంధించిన సొంత పనిని కూడా చేయకుండా నెలల తరబ డి తిప్పుతున్నారు. కార్పొరేటర్లను సైతం ముప్పుతిప్పలు పెట్టి న సందర్భాలు కోకొల్లలు. 60 డివిజన్లకుగాను 60 మంది వార్డు ఆఫీసర్లను ని యమించి వారికి రెవెన్యూ బాధ్యతలు అప్పగించా రు. పన్ను వసూలు చేయడం, ట్రేడ్ లైసెన్సులు లేనివారికి కొత్తగా లైసెన్సులు ఇప్పించడం, పాతవాటి ని రెన్యువల్ చేయించడంతో పాటు పలు పనులు అప్పగించారు. అయితే వీరిలో కొందరు లంచగొండులుగా మారారు. ఇందిరమ్మ ఇళ్ల వ్యవహారంలో ఒక్కో లబ్ధిదారు నుంచి రూ.20 వేల నుంచి రూ.30 వేలు వసూలు చేసినట్లు పలు ఫిర్యాదులు అందా యి. ముఖ్యంగా నాగారం, అర్సపల్లి, సారంగాపూ ర్ వంటి అటవీ భూములున్న చోట, పేదలున్న డివిజన్లలో వార్డు ఆఫీసర్లు డబ్బులు ఇవ్వనిదే పనులు చేయడం లేదు. వార్డు ఆఫీసర్లలో కొందరు బిల్ కలెక్టర్లు కూడా ఉన్నారు.రెండేళ్ల క్రితం ఇక్కడే విధులు నిర్వహించి అప్పటి మేయర్ భర్తతో గొడవ పెట్టుకుని వెళ్లిపోయిన ఓ కీలక అధికారి, మళ్లీ ఇక్కడికి వ చ్చేందుకు అన్నిరకాలుగా ప్రయత్నించాడు. ఎ ట్టకేలకు మళ్లీ బదిలీపై వచ్చాడు. తనకు నచ్చిన విభాగానికి వచ్చేందుకు సదరు స్థానంలో ఉన్న మరో అధికారిని బదిలీ చేయించినట్లు బహిరంగంగానే చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఉన్న అధికారి పెండింగ్ ఫైళ్లు తెప్పించుకుని ముడుపులు తీసుకుని క్లియర్ చేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. పదిరోజుల్లో వందల సంఖ్యలో ఫైళ్లను క్లియర్ చేయడం గమనార్హం. ప్రస్తుతం ఆర్ఐగా ఉన్న శ్రీనివాస్రావును తన ఏజెంట్గా నియమించుకుని మరీ డబ్బులు వసూలు చేసినట్లు బల్దియా వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఎవరు వచ్చి తనను కలిసినా, ముందుగా ఆర్ఐ శ్రీనివాస్ను కలిసిన తర్వాతే ఇక్కడికి రావాలనే నిబంధన పెట్టాడు. ఈ వసూళ్ల అధికారిని ఏసీబీకి పట్టించేందుకు పలువురు ప్రయత్నాలు చేశారు. అయితే ఇతని తరుఫున లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన శ్రీనివాస్, సదరు అధికారి పేరు చెప్పినప్పటికీ ఏసీబీ అధికారులు చివరి నిమిషంలో సదరు అధికారి పేరు తొలగించడం గమనార్హం.ఒక్కో ఫైల్కు ఒక్కో రేటు రెవెన్యూ, టీపీవో సిబ్బందిపై తీవ్ర ఆరోపణలు పదేళ్లుగా ఒకే విభాగం నుంచి కదలని సిబ్బంది.. భారీగా పెండింగ్ ఫైళ్లు ఏకంగా కార్యాలయంలోనే డబ్బులు తీసుకుంటున్న వైనం -
కొడంగల్ లెక్కనే అభివృద్ధి జేస్త..
‘‘ఎన్నడూ లేనంత వరదలతో వాటిల్లిన ఇబ్బందులను చూసి ఆదుకోవాలన్న ఉద్దేశంతోనే ఇక్కడిదాకా వచ్చా. మీకు జరిగిన నష్టాన్ని చూశా. మళ్లీ ఇలాంటి సమస్య ఎదురు కావొద్దు. సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. అందుకోసం అవసరమైన నిధులు ఇస్తా. అధైర్యపడకండి అండగా ఉంటా’’ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పేర్కొన్నారు. గురువారం ఎల్లారెడ్డి, కామారెడ్డి నియోజకవర్గాల్లో పర్యటించిన సీఎం.. వరదలతో దెబ్బతిన్న పంటలు, వంతెనలు, ఇళ్లను పరిశీలించారు. బాధితులను కలిసి వారి గోడును విన్నారు. ‘‘మీ కష్టాలు తీర్చడానికే వచ్చా’’నంటూ వారికి భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. – సాక్షి ప్రతినిధి, కామారెడ్డి/కామారెడ్డి టౌన్/ లింగంపేటజిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలు, వచ్చిన వరదలతో జరిగిన నష్టాన్ని పరిశీలించేందుకు సీఎం రేవంత్రెడ్డి హైదరాబాద్నుంచి హెలీకాప్టర్ ద్వారా జిల్లాకు చేరుకున్నారు. లింగంపేట మండలంతోపాటు కామారెడ్డి పట్టణంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో అధికారులందరూ సమన్వయంతో ముందుకువెళ్లడంతో ప్రాణనష్టం జరగలేదన్నారు. వరదలు వచ్చిన రోజునే మంత్రి సీతక్క, ఎంపీ షెట్కార్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీలకు ఫోన్ చేసి బాధితులకు అండగా ఉండాలని సూచించానన్నారు. వరద సహాయక చర్యల్లో కామారెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యేలు కృషి చేశారన్నారు. వరదల్లో పిల్లల పుస్తకాలు తడిచిపోయాయని చెప్పారని, కాంటింజెన్సీ ఫండ్ నుంచి వి ద్యార్థులకు అవసరమైన పుస్తకాలు ఇవ్వాలని కలెక్టర్ను ఆదేశించారు. అలాగే ఫార్మా కంపెనీలు, బీడీ పరిశ్రమలతో మాట్లాడి వారి సహకారంతో కాలనీ వాసులను ఆదుకోవాలని కలెక్టర్, ఎస్పీలకు సూ చించారు. ‘‘కంపెనీలు ఇచ్చే సాయం తీసుకోండి, ఇంకా ఏది కావాలన్నా నేను ఇస్తా’’ అని అన్నారు. వందేళ్ల కింద కట్టినా.. పోచారం ప్రాజెక్టును 103 ఏళ్ల కిందట రూ. 26 లక్షలతో నిర్మించినా అది ఇంతటి వరదలను తట్టుకుని నిలబడడం మజ్బూత్గా ఉందన్నారు. జిల్లాలో వరదలతో దెబ్బతిన్న చెరువులు, కుంటలు, రోడ్లకు అన్ని మరమ్మతులు చేయిస్తానన్నారు. వరద బాధితులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని పేర్కొన్నారు. ‘‘మంచిగా ఉన్నపుడు కాదు, కష్టం వచ్చినపుడు వెన్నంటి నిలబడేవాడే నాయకుడు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి వరదల సమయంలో ప్రజలకు అండగా నిలిచారు’’ అంటూ అభినందించారు. ఒక్కో శాఖపై సుదీర్ఘంగా సమీక్ష కలెక్టరేట్లో అధికారులతో సీఎం దాదాపు గంటన్నర పాటు సమీక్ష నిర్వహించారు. కలెక్టరేట్లో మొదట ఫొటో ప్రదర్శనను తిలకించిన అనంతరం భోజనం చేశారు. అనంతరం జరిగిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వరదలతో జరిగిన నష్టం, చేసిన పనిని వివరించారు. ఈ సందర్భంగా సీఎంఆర్అండ్బీ, పంచాయతీరాజ్, ఎన్పీడీసీఎల్, ఆర్డబ్ల్యూఎస్, వైద్యారోగ్యశాఖ, వ్యవసాయం, నీటి పారుదల శాఖలపై సుదీర్ఘంగా సమీక్షించారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, సీతక్క, ఎంపీ సురేశ్ షెట్కార్, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్అలీ, పోచారం శ్రీనివాస్రెడ్డి, పీసీసీ అధ్యక్షు డు మహేశ్కుమార్గౌడ్, ఎమ్మెల్యేలు వెంకటరమణారెడ్డి, మదన్మోహన్రావు, లక్ష్మీకాంతారావు, సు దర్శన్రెడ్డి, భూపతిరెడ్డి, ఉమ్మడి జిల్లా ప్రత్యేకాధికా రి రాజీవ్గాంధీ హన్మంతు, కామారెడ్డి డీసీసీ అధ్యక్షు డు కైలాస్ శ్రీనివాస్రావ్, కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఎస్పీ రాజేశ్చంద్ర తదితరులు పాల్గొన్నారు. జీఆర్ కాలనీ ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతాం నష్టపోయిన రైతులను ఆదుకుంటాం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి లింగంపల్లి కుర్దు, బూరుగిద్ద, కామారెడ్డిలలో పర్యటన వరదలతో దెబ్బతిన్న పంటలు, వంతెన, రోడ్ల పరిశీలన బాధితులకు భరోసా కల్పించిన సీఎం‘‘ఎన్నికల సమయంలో చెప్పినట్లే కొడంగల్తో సమానంగా కామారెడ్డిని చూస్తా.. అభివృద్ధి చేస్తా. ఏ సమస్య ఉన్నా కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి దృష్టికి తీసుకురండి. ఆయన సహకారంతో కామారెడ్డిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు అవసరమైన నిధులు ఇస్తా. కామారెడ్డిలో ఏ కష్టమొచ్చినా ఆదుకునే బాధ్యత నాది’’ అని సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు. -
అసలు నష్టం ఎంత!
డొంకేశ్వర్(ఆర్మూర్) : భారీ వర్షాల కారణంగా జి ల్లాలో 48,429 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లిందని వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వే సింది. వర్షాలు, వరద తగ్గుముఖం పట్టి ముంపున కు గురైన పంటలు బయటకు తేలడంతో తుది నివేదికను వ్యవసాయశాఖ రూపొందిస్తోంది. అసలు న ష్టం ఎంత అని తెలుసుకునేందుకు వ్యవసాయ అధికారులు రైతు వారీగా సర్వే చేపట్టి వివరాలు సేకరిస్తున్నారు. 33శాతానికి మించి పంటలు నష్టపోయి న రైతుల నుంచి ఆధార్, పట్టాపాస్ పుస్తకం, బ్యాంకు ఖాతాల జిరాక్స్ కాపీలను తీసుకుంటున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 33 శాతానికి మించి పంట నష్టం జరిగిన రైతులకే పరిహారం అందే అవకాశాలున్నాయి. రెండు రోజుల్లో సర్వే పూర్తి చేసి తు ది జాబితాను కలెక్టర్ అనుమతితో ప్రభుత్వానికి వ్య వసాయ శాఖ పంపనుంది. 33 శాతానికి మించి దెబ్బతిన్న పంటలను గుర్తిస్తున్నాం. పంట, రైతు పే రు, తదితర వివరాలను సేకరించి తుది నివేదికను రెండు రోజుల్లో తయారు చేస్తాం. కలెక్టర్ అనుమతి తో ప్రభుత్వానికి పంపుతాం. – మేకల గోవింద్, జిల్లా వ్యవసాయాధికారి భారీ వర్షాలు పంటలను తీవ్రంగా దెబ్బతీశాయి. చెరువులు, కుంటలు, వాగులు పొంగడంతో పాటు వరద నీరు పోటెత్తి ప్రాజెక్టుల బ్యాక్ వాటర్ ప్రాంతాల్లోని పంటలు పెద్ద ఎత్తున నీట మునిగాయి. బోధన్, నిజామాబాద్ రూరల్, భీమ్గల్ నియోజకవర్గాల్లో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. పంట పొలాల్లో ఇసుక మేటలు వేయడంతోపాటు నీటికి కొట్టుకుపోయి ధ్వంసమయ్యాయి. అత్యధికంగా వరికి నష్టం వాటిల్లగా సోయా, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. ప్రాథమిక అంచనా ప్రకారం జిల్లా వ్యాప్తంగా 23 మండలాల పరిధిలోని 183 గ్రామాల్లో ఈ పంట నష్టం జరుగగా, 24,778మంది రైతులు బాధితులుగా ఉన్నారు. పంటనష్టంపై తుది నివేదిక రూపొందిస్తున్న వ్యవసాయ శాఖ రైతు వారీగా వివరాలు సేకరిస్తున్న క్షేత్రస్థాయి సిబ్బంది ప్రాథమిక అంచనా ప్రకారం 48,429 ఎకరాల్లో నష్టం.. 33 శాతానికి మించి నష్టపోయిన రైతులకే పరిహారం! -
మహిళ హత్య కేసులో నిందితుడి రిమాండ్
ధర్పల్లి: మండల కేంద్రంలో మహిళపై కత్తెరతో దాడి చేసి హత్య చేసిన ఘటనలో నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ భిక్షపతి తెలిపారు. బుధవారం పోలీస్ సర్కిల్ కార్యాలయంలో ఎస్సై కళ్యాణితో కలిసి నిర్వహించిన సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. ధర్పల్లికి చెందిన కోటగిరి దాసుకు గంగామణితో 17 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. గత కొన్నేళ్లుగా దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండడంతో విడాకులు తీసుకొని వేర్వేరుగా ఉంటున్నారు. తన భార్య దూరం కావడానికి ధర్పల్లికి చెందిన మచ్చ లక్ష్మి, భోజేశ్వర్ అని అనుమానం పెంచుకున్న దాసు వారిని చంపేందుకు ఈనెల 2న లక్ష్మి ఇంటికి వెళ్లాడు. కత్తెరతో ఆమైపె, భోజేశ్వర్ పై దాడి చేశాడు. దాడిలో తీవ్రంగా గాయపడ్డ లక్ష్మిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. దాడిని అడ్డుకునేందుకు వచ్చిన నాలుగురికి సైతం గాయాలు కావడంతో వారు చికిత్స పొందుతున్నట్లు పేర్కొన్నారు. నిందితుడిని బుధవారం పట్టుకుని రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు. -
పబ్లిక్ ప్రాసిక్యూటర్లను సన్మానించిన సీపీ
ఖలీల్వాడి: జిల్లా కేంద్రంలోని పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సీపీ సాయిచైతన్య ఐదుగురు పబ్లిక్ ప్రాసిక్యూటర్లను బుధవారం సన్మానించారు. మాక్లూర్, నవీపేట్, మెండోరా, మోపాల్, నిజామాబాద్ రూరల్, ఆర్మూర్, కోటగిరి పీఎస్లలో 15 హత్య కేసుల్లో 11 కేసులలో నేరస్తులకు జీవిత కారాగార శిక్ష పడేలా పబ్లిక్ ప్రాసిక్యూటర్లు కృషి చేసినట్లు సీపీ తెలిపారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్లు రాజేశ్వర్ రెడ్డి, లక్ష్మీ నర్సయ్య, డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూటర్ వసంత్, అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజారెడ్డి, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్యామ్ రావును సన్మానించారు. ‘స్థానిక’ ఎన్నికలపై 8న అఖిలపక్ష సమావేశం నిజామాబాద్ రూరల్ : స్థానిక ఎన్నికల నిర్వహణపై అన్ని పార్టీలతో ఈనెల 8వ తేదీన స మావేశం నిర్వహించనున్నట్లు జిల్లా పరిషత్ సీఈవో సాయాగౌడ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం ఉదయం 10.30 గంటలకు ప్రారంభం కానున్న సమా వేశానికి అన్ని పార్టీల నాయకులు హాజరు కావాలని, అన్ని పార్టీల నిర్ణయం తర్వాత ఈ నెల 10వ తేదీన పోలింగ్ కేంద్రాల తుది జాబితాను జిల్లా ఎన్నికల అధికారి ఖరారు చేస్తారని పేర్కొన్నారు. -
ఎత్తిపోతల పున:ప్రారంభానికి కసరత్తు
● పథకం పంప్హౌస్ను సందర్శించిన ఇరిగేషన్, ఐడీసీ అధికారులు ● త్వరలో మోటార్ల ప్రారంభానికి చర్యలు బోధన్:సాలూర శివారులోని మంజీర నదిపై నిర్మించిన ఎత్తిపోతల పథకం పున:ప్రారంభానికి సంబంధిత అధికారులు కసరత్తు చేపట్టారు. మంజీర నదిపై నిర్మించిన ఎత్తిపోతల పథకం ఈ ఏడాది వర్షాకాలానికి ముందు ఆర్థిక, సాంకేతిక కారణాల వల్ల మూతపడింది. ప్రతి ఏటా వర్షాకాలం ప్రారంభ అనంతరం మంజీరలో వరద ప్రవాహం ప్రారంభం కాగానే ఎత్తిపోతల పథకం మోటార్లు ప్రారంభించి ఎత్తిపోసిన నీటిని చెరువుల్లో నింపుకొని అవసరాల మేరకు పంటల సాగుకు వినియోగించుకునే వారు. కాగా మూడు నెలల క్రితం ప్రధాన పంప్హౌస్లో ఎలక్ట్రికల్ ప్యానెల్ బోర్డు, ఇతర సామగ్రిని దుండగులు చోరీకి పాల్పడ్డారు. పథకం నిర్వహణ కమిటీ వద్ద నిధులు లేకపోవడంతో మరమ్మతులు చేపట్టలేదు. దీంతో ఎత్తిపోతల పథకం ఉపయోగంలోకి రాకుండా పోయింది. రైతుల స మాచారం మేరకు బుధవారం ఐడీసీ, ఇరిగేషన్ శాఖల అధికారులు పథకం కమిటీ సభ్యులతో కలి సి ప్రధాన పంప్హౌస్ను సందర్శించారు. కమిటీ సభ్యులతో సమావేశమై సమర్ధవంతంగా నిర్వహణకు ఐడీసీ ఏఈ గజానంద్ సూచనలు చేశారు. కొత్త కమిటీ ఎన్నిక పథకాన్ని పున:ప్రారంభించేందుకు రైతులు ఇటీవల సమావేశమై నిర్వహణకు సొసైటీ మాజీ చైర్మన్ శివకాంత్ పటేల్ చైర్మన్గా కొంత మంది సభ్యులతో కొత్త కమిటీని ఎన్నుకున్నారు. దీంతో పంప్హౌస్లో మరమ్మత్తులు మొదలు పెట్టారు. రూ.లక్ష 50 వేల వరకు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. పథకం నీటిని వినియోగించుకుంటున్న రైతులు మెట్టభూమికి ఎకరానికి రూ.600, మాగాణికి రూ.800 చొప్పున చెల్లించాల్సిన బకాయిలు పేరుకుపోయాయి. దీంతో ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి. రైతులు చెల్లించిన డబ్బులతో పంప్హౌస్ మరమ్మతులు, నిర్వహణ కార్మికులకు వేతనాలు చెల్లిస్తారు. గతంలో రెండు దఫాలు పథకానికి సంబంధించిన కరెంట్ ట్రాన్స్ఫార్మర్ను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసి ఆయిల్, రాగి తీగలను దొంగలించడంతో పథకం నిర్వహణకు అవాంతరాలు ఏర్పడ్డాయి.పంటల సాగుకు భరోసాదశాబ్దాన్నర కాలంగా రైతులు ఐక్యంగా ఎత్తిపోతల పథకం నిర్వహణలో పట్టు సాధించారు. నిర్వహణ క్రమంలో అనేక సమస్యలు ఎదురైనా పరిష్కరించుకుని ముందుకెళ్లారు. ఎత్తిపోతల పథకం కోసం మూడు దశాబ్దాలుగా రైతులు శతవిధాల ప్రయత్నాలు చేశారు. దివంగత సీఎం వైఎస్ఆర్ హయాంలో రూ.3 కోట్లు మంజూరు చేయగా పథకం రూపుదిద్దుకుంది. 2006–07 పథకం పనులు పూర్తి చేసి ప్రారంభించారు. ఈ పథకం కింద 1600 ఎకరాలు స్థిరీకరించారు. వర్షాధార మెట్టభూములు సస్యశ్యామలంగా మారాయి. వానాకాలం, యాసంగి సీజన్లో పంటల సాగుకు ఎత్తిపోతల పథకం నీటితో భరోసా ఏర్పడింది. తాజాగా పంప్హౌస్లో ఎలక్ట్రికల్ ప్యానెల్ బోర్డు, ఇతర మరమ్మతులు పూర్తిచేసి త్వరలో మోటార్లు ప్రారంభించేందుకు అన్ని విధాల ప్రయత్నాలు చేస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. సొసైటీ చైర్మన్ అల్లె జనార్దన్, పథకం కమిటీ చైర్మన్ శివకాంత్ పటేల్, సభ్యులు డిస్కో సాయిలు, ఇల్తెపు సాయన్న, కాంగ్రెస్ సీనియర్ నాయకులు అల్లె రమేశ్, మాజీ ఎంపీటీసీ గాండ్ల పెద్ద రాజేశ్వర్, సభ్యులు పాల్గొన్నారు. -
క్రైం కార్నర్
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి పిట్లం: పటాన్చెరు సమీపంలో బొలెరో వాహనం ఢీ కొని పిట్లం మండలం హస్నాపూర్కు చెందిన శివ(28) అనే యువకుడు మృతి చెందిన ఘటన బువారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. పటాన్చెరు సమీపంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న శివను వేగంగా వచ్చిన ఓ బొలెరో వాహనం ఢీకొన్నది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన శివ అక్కడికక్కడే మృతి చెందాడు. శివ మృతితో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. గుర్తు తెలియని వ్యక్తి..ఖలీల్వాడి: సారంగపూర్ హనుమాన్ ఆలయం గోశాల వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతి(65–70) చెందినట్లు ఆరో టౌన్ ఎస్సై వెంకట్రావు బుధవారం తెలిపారు. ఈ నెల 1న గోశాల వద్ద గుర్తు తెలియని వ్యక్తి అపస్మారక స్థితిలో ఉన్నట్లు గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సదరు వ్యక్తిని జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి పోలీసులు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి వివరాలు తెలిసిన వారు 8712659848, 8712659734 నంబర్లకు సమాచారం అందించాలని ఎస్సై కోరారు. పేకాట స్థావరాలపై దాడి బాల్కొండ: మండలంలోని పలు గ్రామాల్లో పేకాట స్థావరాలపై దాడులు చేసినట్లు బాల్కొండ ఎస్సై శైలేందర్ బుధవారం తెలిపారు. బాల్కొండ మండలం వన్నెల్(బి)లోని గురడి కాపు సంఘం భవనం ఎదుట ఉన్న ఖాళీ స్థలంలో పేకాట ఆడుతున్నట్లు సమాచారం అందడంతో దాడి చేసినట్లు పేర్కొన్నారు. ఈ దాడిలో ఏడుగురిని అరెస్టు చేయగా వారి నుంచి రూ. 17వేల నగదు, 6 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పై పేర్కొన్నారు. అలాగే మండల కేంద్రంలోని మున్నూరు కాపు సంఘ భవనంలో పేకాట ఆడుతున్న ఇద్దరిని అదుపులోకి తీసుకొని వారి నుంచి రూ. 4,710 నగదు, ఒక బైక్, ఆటోను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపా రు. కిసాన్నగర్లోని మేదరి సంఘ భవనంలో పేకాట ఆడుతున్న ఆరుగురిని అరెస్టు చేయగా వారి నుంచి రూ. 3,800 నగదు, నాలుగు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు. పాత కలెక్టరేట్ ప్రాంతంలో గంజాయి విక్రయం! ఖలీల్వాడి: నగరంలోని పాత కలెక్టరేట్ మైదానంలో గుర్తు తెలియని వ్యక్తులు గంజాయిని విక్రయించేందుకు వచ్చినట్లు ఎస్హెచ్వో రఘుపతి బుధవారం తెలిపారు. పాత కలెక్టరేట్ మైదానంలో గంజాయి విక్రయాలు జరుగుతున్నట్లు సమాచారం అందడంతో ఒకటో టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, పట్టుకోవడానికి ప్రయత్నించారు. పోలీసులు వస్తున్నారనే సమాచారంతో గంజాయి విక్రయానికి వచ్చిన వారు అక్కడి నుంచి పరారయ్యారు. పోలీసులు రావడంతో పరారైన చోట ఉంచిన బైకులో 20 ప్యాకెట్ల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం బైక్ ను సీజ్ చేసినట్లు ఎస్హెచ్వో తెలిపారు. బైక్, చుట్టూ పక్కల ఉండే సీసీటీవీ పుటేజీ ఆధారంగా గంజాయి అమ్మే వారి వివరాలను పోలీసులు సేకరిస్తున్నట్లు తెలిసింది. -
సులభ బోధనకు టీఎల్ఎంలు ఉపయోగకరం
నిజామాబాద్ రూరల్: బోధనాభ్యాసన ఉపకరణాలు విద్యార్థులకు జ్ఞానాన్ని సులభంగా అందించే సాధనాలని డీఈవో అశోక్ అన్నారు. బుధవారం గూపన్పల్లి ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన మండల స్థాయి టీఎల్ఎం మేళాలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు ప్రదర్శించిన బోధన అభ్యసన ఉపకరణాలను పరిశీలించారు. తరగతి గదిలో విద్యార్థులకు ఏ విధంగా ఉపయోగపడుతుందో ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పది ఉత్తమ టీఎల్ఎమ్లను ప్రదర్శించిన ఉపాధ్యాయులను సత్కరించారు. కార్యక్రమంలో ఎంఈవో ఎం. సేవుల, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు పొద్దుటూరి మోహన్రెడ్డి, ఘనపురం దేవేందర్, మంజులత, జయసాగర్, కృష్ణారెడ్డి, కాంప్లెక్స్ హెచ్ఎం హనుమంతరావు, సారంగపూర్ జెడ్పీ ఉన్నత పాఠశాల హెచ్ఎం పోశన్న, స్థానిక పాఠశాల హెచ్ఎం రమాదేవి, వరప్రసాద్, అంజయ్య, నాయకులు డాక్టర్ సల్ల సత్యనారాయణ, రవీందర్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో మాట్లాడుతున్న డీఈవో అశోక్ -
అంగన్వాడీ టీచర్ ఆత్మహత్య
మోపాల్: మండలంలోని న్యాల్కల్ గ్రామానికి చెందిన బెల్లెడిగి చిన్ను (44) స్థానిక చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు బుధవారం తెలిసింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన చిన్ను, పోతన్న భార్యాభర్తలు. చిన్ను కంఠేశ్వర్లోని అంగన్వాడీ కేంద్రంలో టీచర్గా పనిచేస్తోంది. పోతన్న చేపలు పడుతూ జీవనం సాగిస్తున్నారు. గ్రామంలో ఇల్లు చిన్నది కావడంతో న్యాల్కల్ రోడ్లోని లలితానగర్లో అద్దె ఇంట్లో ముగ్గురు పిల్లలతో ఉంటున్నారు. కొంతకాలంగా కుటుంబసభ్యుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈక్రమంలో మంగళవారం అర్ధరాత్రి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఉదయం చిన్ను ఇంట్లో కనిపించకపోయే సరికి భర్త పలుచోట్ల వెతికాడు. పశువుల కాపరులు చెరువులో మృతదేహాన్ని గుర్తించి కుటుంబీకులకు, పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహానికి పంచనామ నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్కు తరలించారు. డ్రంకన్ డ్రైవ్లో నలుగురికి జైలు ఖలీల్వాడి: డ్రంకన్ డ్రైవ్లో పట్టుబడ్డ 13 మందిలో నలుగురికి సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ నూర్జహాన్ జైలు శిక్షను విధించినట్లు ట్రాఫిక్ సీఐ ప్రసాద్ బుధవారం తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడిపిన 13 మందిని ట్రాఫిక్ పీఎస్లో కౌన్సిలింగ్ నిర్వహించి కోర్టులో హాజరుపర్చినట్లు పేర్కొన్నారు. ఆధారాలను పరిశీలించిన మెజిస్ట్రేట్ 9 మందికి రూ. 13 వేల జరిమానా విధించగా, నలుగురికి ఒక రోజు, రెండు, మూడు రోజుల జైలు శిక్షను విధించినట్లు సీఐ తెలిపారు. రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్ నవీపేట: గణేశ్ నిమజ్జనోత్సవాలను పురస్కరించుకుని పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లకు నిజామాబాద్ నార్త్ రూరల్ సీఐ శ్రీనివాస్, ఎస్సై తిరుపతి బుధవారం కౌన్సెలింగ్ ఇచ్చారు. ఉత్సవాల్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులకు సహకరించాలని సూచించారు. -
డీజేలు సీజ్.. కేసులు నమోదు
ఖలీల్వాడి/ రెంజల్/ నవీపేట్/ నందిపేట్: గణేశ్ నిమజ్జనాల్లో డీజేలను నిషేధించినట్లు సీపీ పోతరా జు సాయిచైతన్య బుధవారం తెలిపారు. రెంజల్, నవీపేట్, నందిపేట్లో మంగళవారం రాత్రి, బుధవారం గణేశ్ మండపాల్లో పెట్టిన డీజేలను సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. రెంజల్ మండలంలోని కళ్యాపూర్లో సోమవారం నిర్వహించిన గణేశ్ నిమజ్జన శోభాయాత్రలో నిర్వాహకులు ఏర్పాటు చేసిన మూడు డీజేలను స్వాధీనం చేసుకొని సీజ్ చేసినట్లు తెలిపారు. అలాగే నవీపేట్ మండలం నిజాంపూర్లో మంగళవారం రాత్రి రెండు డీజే సిస్టంలతో పరిమితికి మించి సౌండ్ పెట్టి ప్రజలకు ఇబ్బందికి గురిచేసిన మట్టయ్యఫారానికి చెందిన దారావత్ రమేశ్, షాపూర్కు చెందిన పుల్ల అరవింద్లపై కేసు నమోదు చేసి డీజేలను సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. నందిపేట్ మండలం అయిలాపూర్లో మంగళవారం నిర్వహించిన గణేశ్ నిమజ్జనంలో అధిక సౌండ్తో ప్రజలను ఇబ్బందులకు గురిచేసని రెండు డీజేలను సీజ్ నిర్వాహకులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మండపాల నిర్వాహకులు డీజేలను ఏర్పాటు చేసుకోవద్దని సూచించారు. ఉత్సవాలను ప్రజలు ప్రశాంతంగా జరుపుకోవాలని, విధి నిర్వహణలో ఉన్న పోలీసులకు సహకరించాలని సీపీ కోరారు. -
335 టీఎంసీల వరద..!
బాల్కొండ: శ్రీరాంసాగర్ జలాశయానికి ఎగువ ప్రాంతాల నుంచి ఈ సంవత్సరం ఇప్పటి వరకు 335 టీఎంసీల వరద నీరు వచ్చి చేరింది. ఇంకా వరద నీరు రాక కొనసాగుతూనే ఉంది. ప్రస్తుత సంవత్సరం గరిష్టంగా 5.4 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చింది. జూన్, జూలై నెలల్లో ప్రాజెక్ట్లోకి ఆశించినంత వరద నీరు రాకపోవడంతో ఆయకట్టు రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. కానీ, జూలై చివరి మాసంలో కొద్దిమేర వరదలు రావడంతో ఆగస్టు 7 నుంచి ఆయకట్టుకు నీటి విడుదలను చేపట్టారు. ఆ తర్వాత మళ్లీ స్థానిక ఎగువ ప్రాంతాలతోపాటు, మహారాష్ట్ర ప్రాంతం నుంచి భారీగా వరద నీరు రావడంతో ప్రాజెక్ట్ నిండుకుండలా మారింది. అంతే కాకుండా ఆగస్టు 18 నుంచి మిగులు జలాలను గోదావరిలోకి వదిలారు. 27 నుంచి ప్రాజెక్ట్లోకి వరద నీరు పోటెత్తింది. గతేడాది సీజన్ ముగిసే వరకు 292 టీఎంసీల వరద నీరు వచ్చి చేరింది. నాలుగు రోజుల్లో 165 టీఎంసీలు.. ఎస్సారెస్పీలోకి ఆగస్టు 27 నుంచి వరద ప్రారంభమైంది. ఆ రోజంతా 50 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చింది. 28, 29, 30, 31, సెప్టెంబర్ 1, 2 తేదీల్లో 165 టీఎంసీల నీరు వచ్చి చేరింది. ఆదివారం మధ్యాహ్నం నుంచి వరద నీరు తగ్గుముఖం పట్టింది. ఆరు రోజుల్లోనే 165 టీఎంసీల వరద నీరు రావడం చరిత్రలో ఇదే తొలిసారని ప్రాజెక్ట్ అధికారుల రికార్డులు తెలుపుతున్నాయి. 215 టీఎంసీలు గంగపాలు.. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి ఎగువ ప్రాంతాల నుంచి భారీ వరదలు రావడంతో అంతే స్థాయిలో గోదావరిలోకి నీటి విడుదలను చేపట్టారు. ప్రాజెక్ట్ నుంచి గరిష్టంగా 39 వరద గేట్ల ద్వారా 5.75 లక్షల క్యూసెక్కుల నీటిని గోదారికి వదిలారు. గడిచిన ఆరు రోజుల వ్యవధిలో 165 టీఎంసీల నీటిని గోదావరిలోకి వదిలారు. ఇంకా నీటి విడుదల కొనసాగుతుంది. ప్రస్తుత సంవత్సరం ఎస్సారెస్పీకి భారీ ఇన్ఫ్లో 270 టీఎంసీలు అవుట్ ఫ్లో అందులో 215 టీఎంసీలు గోదావరి పాలు -
మరోసారి ఉపఎన్నిక!
నిజామాబాద్ఎత్తిపోతల పున:ప్రారంభానికి.. సాలూర శివారులోని మంజీర నదిపై నిర్మించిన ఎత్తిపోతల పథకం పున:ప్రారంభానికి సంబంధిత అధికారులు కసరత్తు చేపట్టారు. గురువారం శ్రీ 4 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025– IIలో uఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి మరోసారి ఉప ఎన్నిక అనివార్యం కానుంది! బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్ తరువాత ఎమ్మెల్సీ స్థానానికి రాజీనామా చేస్తున్నట్లు కవిత ప్రకటించడంతో ‘ఉప ఎన్నిక’ చర్చ తెరపైకి వచ్చింది. ఎమ్మెల్సీ స్థానానికి 2020లో ఒక సారి ఉప ఎన్నిక జరిగిన విషయం తెలిసిందే. సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: బీఆర్ఎస్ నుంచి కవిత సస్పెన్షన్ వ్యవహారం మరో ఉప ఎన్నికకు దారితీసింది. పార్టీ నుంచి వేటుపడిన వెంటనే ఆమె తన శాసన మండలి సభ్యత్వానికి సైతం రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఉప ఎన్నికపై జోరుగా చర్చ సాగుతోంది. 2019లో ఎంపీగా ఓటమిపాలైన కవిత.. 2020లో జరిగిన ఉప ఎన్నికలో స్థానికసంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్సీగా ఉన్న డాక్టర్ భూపతిరెడ్డిపై అనర్హత వేటుపడడంతో ఉప ఎన్నిక రాగా, కవిత బరిలో నిలిచి గెలిచారు. ఆ స్థానం కాలపరిమితి ముగియడంతో 2022 జనవరిలో నిర్వహించిన ఎన్నికల్లో కవిత మరోసారి స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2028 వరకు కాలపరిమితి ఉన్నప్పటికీ తాజా పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్కు గురైన కవిత ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు బుధవారం ప్రకటించారు. శాసనమండలి చైర్మన్ ఆమె రాజీనామాను ఆమోదిస్తే ఉప ఎన్నిక నిర్వహించాల్సిందే. ప్రస్తుతం రాష్ట్రంలో ‘స్థానిక’ ఎన్నికల వాతావరణం ఉండగా.. అదే కోటాలో నిర్వహించాల్సిన ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఆలస్యం అవడం ఖాయం. ఉప ఎన్నిక నిర్వహించాలంటే స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి కావాల్సి ఉంటుంది. ఏసీబీకి చిక్కిన మున్సిపల్ ఆర్ఐ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.. ఉప ఎన్నికలకు ఆస్కారమిచ్చారు.. 2016 జనవరిలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా డాక్టర్ భూపతిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే భూపతిరెడ్డి కాంగ్రెస్ నుంచి నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యేగా పోటీ చేయడంతో 2020లో అనర్హత వేటుకు గురయ్యారు. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఆ సమయంలో నిర్వహించిన ఉప ఎన్నికల్లో గెలుపొందిన కవిత, తరువాత జరిగిన సాధారణ ఎన్నికల్లోనూ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్ వేటుకు గురైన కవిత తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. స్పీకర్ ఆమోదిస్తే, స్థానిక ఎన్నికలు పూర్తయ్యాక ఉప ఎన్నిక నిర్వహించాల్సిన పరిస్థితి ఉంటోంది. రాజీనామా చేసిన ఎమ్మెల్సీ కవిత మండలి చైర్మన్ ఆమోదిస్తే ఉప ఎన్నిక పెట్టాల్సిందే 2020 ఉప ఎన్నికలు, 2022 ఎన్నికల్లో కవిత విజయం స్థానిక సంస్థల ఎన్నికల తరువాతే ఉప ఎన్నికకు అవకాశం తాజా పరిస్థితులపై జోరుగా చర్చలు -
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలి
● క్షేత్రస్థాయిలో పనులను పర్యవేక్షించాలి ● కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ● ఎరువుల గోదాం, పల్లె దవాఖానా తనిఖీ జక్రాన్పల్లి/డిచ్పల్లి: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. జక్రాన్పల్లి మండలం పడకల్లో అర్గుల్ సొసైటీ ఎరువుల గోదామును, డిచ్పల్లి మండలం నడిపల్లిలో పల్లె దవాఖానను బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. సొసైటీలో గోదాములో నిల్వ ఉన్న ఎరువులను పరిశీలించిన కలెక్టర్.. ఈ సీజన్లో ఇంకా ఎంత మొత్తంలో యూరియా అవసరం పడుతుందని ఆరా తీశారు. స్టాక్ మిగిలి ఉండగానే, ఇండెంట్ పెట్టి కొత్త స్టాక్ తెప్పించుకోవాలని జక్రాన్పల్లి మండల వ్యవసాయ అధికారిణి దేవికకు సూచించారు. పడకల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల ప్రగతి వివరాలను గ్రామ పంచాయతీ కార్యదర్శి రాకేశ్ను అడిగి తెలుసుకున్నారు. లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలు చేపట్టేలా క్షేత్రస్థాయిలో పక్కాగా పర్యవేక్షించాలన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించాలని నడిపల్లి పల్లెదవాఖాన సిబ్బందికి సూచించారు. ఆయన వెంట జక్రాన్పల్లి తహసీల్దార్ కిరణ్మయి, ఏవో దేవిక, జీపీ కార్యదర్శి భాస్కర్, సొసైటీ సీఈవో తిరుపతిరెడ్డి, ఎంఎల్హెచ్పీ డాక్టర్ వినీత్, ఏఎన్ఎంలు సుజాత, రజిత తదితరులు ఉన్నారు. -
రైతులకు న్యాయం చేస్తాం
నవీపేట: వరద నీటి ఉధృతితో పంట నష్టపోయిన రైతులకు న్యాయం చేస్తామని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి భరోసా ఇచ్చారు. మండలంలోని నాళేశ్వర్, తుంగిని, బినోల గ్రామాలలో ఆయన పర్యటించా రు. రైతులతో మాట్లాడి పంట నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. బినోలాలో విలేకరులతో మాట్లాడారు. ఎస్సారెస్పీలో ఎగువ ప్రాంతం నుంచి వరద ఉధృతి పెరగడంతో ప్రతి సంవత్సరం నది తీరంలోని పంటలు నీట మునుగుతాయని, కానీ ఎన్నడూ పంటలకు నష్టం చేకూరలేదన్నారు. ఈసా రి ఉధృతి రెట్టింపవడంతో నాలుగు రోజులకు మించి పంటలు నీటిలో మునిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. నష్టపోయిన రైతుల వివరాలను సేకరించా లని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. బినోలా శివారులో 67 ట్రాన్స్ఫార్మర్లు, 10 విద్యుత్ స్తంభాలు ధ్వంసమయ్యాయని, వెంటనే వాటికి మరమ్మతులు చేపట్టాలని ట్రాన్స్కో అధికారులకు సూచించారు. ఆయన వెంట ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, నిజామాబాద్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ జంగిటి రాంచందర్, నాయకులు శ్రీనివాస్ గౌడ్, గోవర్ధన్రెడ్డి, బాల్రాజుగౌడ్, సంజీవ్రెడ్డి, నర్సింగ్రావ్, చిన్నదొడ్డి ప్రవీన్, సంజీవ్రావ్, సాయారెడ్డి తదితరులు ఉన్నారు.● బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి బినోలాలో వరి పైరును పరిశీలిస్తున్న ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి -
వరద బాధితులను ఆదుకుంటాం
● రూ.మూడున్నర కోట్లతో రోడ్లు, వంతెనలకు మరమ్మతులు ● రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డిసిరికొండ/ధర్పల్లి: కప్పలవాగు వరదతో నష్టపోయిన బాధితులను అన్నివిధాలా ఆదుకుంటామని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి తెలిపారు. ధర్పల్లి మండలం వాడి, సిరికొండ మండలంలోని పెద్దవాల్గోట్, కొండూర్, గడ్కోల్, తూంపల్లి, పాకాల, కొండాపూర్, ముషీర్నగర్ గ్రామాల్లో బుధవారం ఆయన పర్యటించారు. ఆయా గ్రామా ల్లో వర్షానికి కోతకు గురైన రోడ్లు, దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. కొండూర్లో వరద ముంచె త్తి నిరాశ్రయులైన బాధితులను పరామర్శించి ఓదార్చారు. ఇళ్లు కూలిన వారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం కొండూర్లో మీడియాతో మాట్లాడారు. ముత్యాల చెరు వు కట్ట తెగిపోవడం, 30 సెం.మీ వర్షం కురవడంతో భారీ నష్టం ఏర్పడిందన్నారు. 55 ఇళ్లు పూర్తిగా కూలిపోయి, సామగ్రి అంతా కొట్టుకుపోవడంతో బాధితులకు ఆస్తి నష్టం వాటిల్లినట్లు వెల్లడించారు. మూడున్నర కోట్లతో రోడ్లు, వంతెనలకు మరమ్మతులు చేయిస్తున్నట్లు తెలిపారు. ఎంపీ అర్వింద్ చేసి న విమర్శలు బాధ్యతారాహిత్యంగా ఉన్నాయన్నా రు. వర్షాలతో జరిగిన నష్టాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లి నిధులు తేవాల్సింది పోయి రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరికాదన్నారు. బీఆర్ఎస్ నుంచి కవిత సస్పెన్షన్ వారి కుటుంబ డ్రామా అని విమర్శించారు. అనంతరం పాకాలలో మాజీ సర్పంచ్ కీరిబాయి, కొండూర్లో పార్టీ నాయకుడు చెల్లెం నడ్పి గంగయ్య కుటుంబాలను ఎమ్మెల్యే పరామర్శించారు. కార్యక్రమంలో నాయకులు వెల్మ భాస్కర్రెడ్డి, శేఖర్గౌడ్, ఉమ్మజీ నరేశ్, ఎర్రన్న, బాకారం రవి, సొసైటీ చైర్మన్ గంగాధర్, దేగాం సాయన్న, దశరథ్రెడ్డి, సంతోష్నాయక్, బాల్సింగ్, భానుచందర్, దేవరాజు, శ్రీధర్, జగన్, బుచ్చన్న, రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అంగన్వాడీ పిల్లలకు యూనిఫామ్స్
● జిల్లా వ్యాప్తంగా 81,262 మంది చిన్నారులు ● టీచర్లు, ఆయాలకు మారిన చీరల రంగులునిజామాబాద్నాగారం: అంగన్వాడీ కేంద్రాలను బ లోపేతం చేసేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తుంది. అందులో భాగంగా ఆరేళ్లలోపు చిన్నారులకు యూనిఫామ్స్ అందించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే జిల్లా సంక్షేమాధికారి కార్యాలయానికి యూనిఫామ్ క్లాథ్ను సరఫరా చేసింది. జిల్లాలో బోధన్, నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, భీమ్గల్, ఆర్మూర్ సీడీపీవో కార్యాలయాలు ఉండగా, వాటి పరిధిలో 1501 అంగన్వాడీ కేంద్రాలు నడుస్తున్నాయి. వీటిలో 81,262 మంది పిల్లలు చదువు తున్నారు. గతేడాది 30 శాతం చిన్నారులకే యూని ఫామ్స్ రాగే, ఈ ఏడాది మాత్రం 100శాతం పిల్లలకు పంపిణీ చేసేందుకు క్లాథ్ను సిద్ధం చేశారు. ఒక్కొక్కరికి రెండు జతల చొప్పున పిల్లల కొలతల ఆధారంగా కుట్టించి త్వరలోనే పంపిణీ చేయనున్నా రు. కాగా, డీఆర్డీవో సహకారంతో మహిళా సంఘాల సభ్యులతో యూనిఫామ్స్ కుట్టించనున్నారు. 2,328 మందికి చీరలుయూనిఫామ్స్ కచ్చితంగా ధరించాలి జిల్లాలోని టీచర్లు, ఆయాలు కచ్చితంగా యూనిఫామ్స్ ధరించి విధులకు హాజరుకావాలి. అంగన్వాడీకి వచ్చే పిల్లలందరికీ రెండు జతల చొప్పున యూనిఫామ్స్ త్వరలోనే అందజేస్తాం. – రసూల్బీ, జిల్లా సంక్షేమాధికారిణిఅంగన్వాడీ టీచర్లు, ఆయాలకు గత కొన్నేళ్లుగా ఒకే రకమైన చీరలను ప్రభుత్వం పంపిణీ చేసేది. ఐతే ఈ సంవత్సరం చీరల రంగులు మారాయి. జిల్లాలో 1,427 అంగన్వాడీ టీచర్లు, 901 మంది ఆయాలు పనిచేస్తున్నారు. ఒక్కొక్కరికి రెండు జతల చొప్పున చీరలు, బ్లౌజులు అందజేశారు. -
నేడు కామారెడ్డికి సీఎం రాక
● వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : భారీ వర్షాలతో కామారె డ్డి జిల్లా అతలాకుతలమైంది. వరద ఇళ్లను చుట్టేసింది. పంటలను ముంచేసింది. రోడ్లను ధ్వంసం చే సింది. వాగుల ప్రవాహ ఉధృతికి వంతెనలు కొట్టు కుపోయాయి. మునుపెన్నడూ చూడని వరదలతో జిల్లాలో భారీ నష్టం వాటిల్లింది. నష్టాన్ని పరిశీలించడానికి సీఎం రేవంత్రెడ్డి గురువారం జిల్లాకు వస్తున్నారు. ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చి ఆదుకోవాలని జిల్లావాసులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. సీఎం పర్యటన ఇలా... సీఎం రేవంత్ హెలీకాప్టర్లో 11.30 గంటలకు తాడ్వాయి మండలం ఎర్రాపహడ్కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన లింగంపేట మండలం లింగంపల్లి కుర్దుకు చేరుకొని దెబ్బతిన్న ఆర్అండ్బీ శాఖకు సంబంధించిన వంతెనను పరిశీలిస్తారు. బూరుగిద్ద శివారులో వరదలతో దెబ్బతి న్న పంటలను పరిశీలించి రోడ్డు మార్గాన 1.10 గంటల వరకు కామారెడ్డి పట్టణ శివారులోని జీఆర్ కా లనీని సందర్శించి, బాధితులతో మాట్లాడతారు. 2 గంటలకు కలెక్టరేట్ భవనానికి చేరుకొని ఫొటో ఎగ్జిబిషన్ను సందర్శిస్తారు. కలెక్టరేట్లో మధ్యాహ్న భోజనం ముగించిన అనంతరం సమావేశ మందిరంలో 2.20 గంటల నుంచి 3 గంటల వరకు అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. సీఎం రాక సంద ర్భంగా బుధవారం కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఎస్పీ రాజేశ్ చంద్ర లింగంపేట మండలంలో పర్యటించారు. -
కవిత వ్యాఖ్యలు బాధాకరం
● ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి వేల్పూర్: మాజీ మంత్రి హరీశ్ రావు, జోగినపల్లి సంతోష్కుమార్పై కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలు బాధాకరమని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి బుధవారం రాత్రి మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. కేసీఆర్ నాయకత్వంలో ఉద్యమం అయినా, పాలన అయినా ప్రజల క్షేమం కోసం, పార్టీ కోసం, తెలంగాణ కోసం హరీశ్ రావు నిర్విరామంగా కృషి చేశారని తెలిపారు. కేసీఆర్ వెన్నంటి ఉంటూ 25 సంవత్సరాలుగా నిస్వార్థంగా పార్టీ కోసం సంతోష్కుమార్ పాటుపడుతున్నారని తెలిపారు. అటువంటి వారి వ్యక్తిత్వం, కమిట్మెంట్పై కవిత విమర్శలు చేయడం బాధాకరమని పేర్కొన్నారు. తగ్గిన నీటి విడుదల ● ఎస్సారెస్పీలోకి లక్షా 16 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లోకి ఎగు వ ప్రాంతాల నుంచి ఇన్ఫ్లో తగ్గుముఖం ప ట్టడంతో వరద గేట్ల ద్వారా నీటి విడుదలను అధికారులు తగ్గించారు. ఎగువ లక్షా 16 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా, 23 గే ట్ల ద్వారా లక్ష క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. వరద కాలువ ద్వారా 18 వేలు, కాకతీయకాలువ ద్వారా 4500, ఎస్కేప్ గేట్ల ద్వారా 3500 క్యూసెక్కు ల నీటిని విడుదల చేస్తుండగా, మిషన్ భగీరథ అవసరాలకు 231 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నా రు. ఆవిరి రూపంలో 666 క్యూసెక్కుల నీరు పోతోంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 1091(80.5 టీఎంసీలు) అడుగులు కాగా బుధవారం సాయంత్రానికి 1089.9(76.10 టీఎంసీలు) అడుగుల నీరు నిల్వ ఉందని అధికారులు తెలిపారు. ప్రతిభను వెలికి తీసేందుకు ‘కళా ఉత్సవ్’ నిజామాబాద్అర్బన్: విద్యార్థుల్లో దాగి ఉన్న కళా ప్రతిభను వెలికితీసేందుకు జిల్లాస్థాయి కళా ఉత్సవ్ సాంస్కృతిక పోటీలు ఎంతో దోహదం చేస్తాయని డీఈవో అశోక్ పేర్కొన్నారు. నగరంలోని బాల్ భవన్లో బుధవారం కళా ఉత్సవ్ కార్యక్రమం నిర్వహించారు. రెండు రోజులపాటు గ్రూప్ డ్యా న్స్, సోలో డ్యాన్స్, గ్రూప్ సాంగ్స్, సోలో సాంగ్, స్కిట్, 2డీ , 3డీ డ్రాయింగ్ తదితర పోటీలు నిర్వహించనున్నట్లు డీఈవో తెలి పారు. ఏఎంవో బాలకృష్ణారావు, అర్బన్ ఎంఈవో సాయిరెడ్డి, జ్యూరీ కమిటీ మెంబ ర్స్ లక్ష్మీనాథం, ఆర్.గోపాలకృష్ణ, కాసర్ల నరేశ్రావు, లక్ష్మణ్, చింతల శ్రీనివాస్, డాక్ట ర్ శారద, న్యాయ నిర్ణేతలు పాల్గొన్నారు. నేడు వైన్షాపులు బంద్ ఖలీల్వాడి: వినాయక నిమజ్జనం సందర్భంగా జిల్లాలో వైన్ షాపులు, కల్లు దుకాణాలు, బార్లను గురువారం మూసివేయనున్నట్లు సీపీ సాయిచైతన్య బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం ఉదయం 6గంటల నుంచి శుక్రవారం ఉదయం 6గంటల వరకు వైన్స్లు, బార్లు, కల్లు దుకాణాలను మూసి ఉంచాలని, లేనిపక్షంలో చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు. -
సబ్సిడీపై సంచార వాహనాలు
డొంకేశ్వర్(ఆర్మూర్): ఎస్హెచ్జీ మహిళలను కోటీ శ్వరులను చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇప్పటికే బ్యాంకు లింకేజీ, సీ్త్రనిధి రుణాలందించి ఆర్థిక తోడ్పాటునందిస్తుండగా.. మ హిళాశక్తి కార్యక్రమం కింద సంచార చేపల విక్రయ వాహనాలను 60శాతం సబ్సిడీపై అందజేస్తోంది. ఇందులో భాగంగా జిల్లాకు రెండు యూనిట్లు ప్ర భుత్వం మంజూరు చేసింది. ఈ నెల 1వ తేదీన హైదరాబాద్లో మంత్రి సీతక్క లబ్ధిదారులకు వా హనాలను అప్పగించారు. ఆర్మూర్ మండలం ఫత్తేపూర్కు చెందిన తొండాకూర్ లావణ్య, నిజామాబా ద్ మండలం మల్లారం గ్రామానికి చెందిన దుబ్బా క గంగామణి వాహనాలు పొందిన వారిలో ఉన్నా రు. ఒక్కో వాహనం విలువ రూ.10 లక్షలు కాగా, ప్రభుత్వం రూ.6లక్షలు సబ్సిడీ పోను మిగతా రూ.4 లక్షలు లబ్ధిదారులు చెల్లించారు. లబ్ధిదారుల వాటా డబ్బులకు కూడా గ్రామీణాభివృద్ధి శాఖ రు ణం అందజేసింది. ఈ సంచార చేపల విక్రయ వా హనాలను నియోజకవర్గానికి ఒకటి అందజేసి, దశ ల వారీగా మండలాల్లో కూడా ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోందని అధికారులు చెబుతున్నారు. వాహనంతో వ్యాపారం.. ఎస్హెచ్జీ మహిళలు వ్యాపారం కోసం ఉపయోగించాలనే ఉద్ధేశంతో ప్రభుత్వం సబ్సిడీపై చేపల విక్రయ వాహనాలను అందిస్తోంది. చేపల రవాణాతోపాటు రోడ్సైడ్ బిజినెస్ చేసుకునేందుకు వీలుగా అన్ని సదుపాయాలు ఇందులో సమకూర్చింది. చేప ల ఫ్రై, కూరలు వండి విక్రయించేందుకు ప్రత్యేకంగా కిచెన్ కిట్, ఫ్రిడ్జ్, వాటర్, ఐస్ బాక్సులు, ఇన్వర్టర్తో విద్యుత్ సౌకర్యం ఉన్నాయి. వ్యాపారంలో నై పుణ్యం పొందేందుకు మహిళలకు శిక్షణ కూడా ఇ స్తున్నారు. సంచార వాహనాలు కావాలనుకునే ఎస్హెచ్జీ మహిళలు ఐకేపీకి సంబంధించిన మండల, జిల్లా కార్యాల యాల్లో అధికారులను సంప్రదిస్తే సరిపోతుంది. ఈ అవకాశాన్ని జిల్లాలోని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి సాయాగౌడ్ కోరారు. ఎస్హెచ్జీ మహిళలకు అందిస్తున్న ప్రభుత్వం తొలి విడతగా జిల్లాలో ఇద్దరికి.. దశల వారీగా మంజూరు చేసేందుకు ప్రణాళిక -
గ్రామపంచాయతీ ఓటర్లు 8,51,417
● తుది ఓటరు జాబితా విడుదలసుభాష్నగర్: గ్రామ పంచాయతీలకు సంబంధించి తుది ఫొటో ఓటరు జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లా పంచాయతీ అధికారులు మంగళవారం విడుదల చేశారు. జాబితా ప్రకారం 8,51,417 మంది ఓటర్లు ఉన్నారు. అందులో 3,96,778 మంది పురుషులు, 4,54,621 మంది మహిళలు, 18 మంది ఇతరులు ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా 31 మండలాల్లో 545 గ్రామ పంచాయతీలు, 5022 వార్డు స్థానాలు ఉన్నాయి. గత నెల 28న డ్రాఫ్ట్ ఓటరు జాబితా విడుదల చేయగా, గత నెల 28 నుంచి 30 వరకు అభ్యంతరాలు స్వీకరించారు. 31న అభ్యంతరాలను పరిశీలించి పరిష్కరించారు. జిల్లాలో అత్యధికంగా డిచ్పల్లిలో 46,893 మంది ఓటర్లు ఉండగా, అత్యల్పంగా చందూర్ 8,816 మంది ఓటర్లు ఉన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మంగళవారం వార్డు వారీగా తుది ఓటరు జాబితా, పోలింగ్ స్టేష న్ల జాబితాలను అన్ని గ్రామపంచాయతీల్లో, ఎంపీడీవో కార్యాలయాల్లో ప్రదర్శించామని జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్రావు తెలిపారు. మహిళా ఓటర్లే అధికం.. అన్ని మండలాల్లో అధికంగా ఉన్న మహిళా ఓటర్లే కీలకం కానున్నారు. జిల్లా వ్యాప్తంగా 57,843 మంది మహిళా ఓటర్లు పురుషుల కంటే అధికంగా ఉన్నట్లు తుది ఓటరు జాబితా ప్రకారం వెల్లడైంది. -
శోభాయాత్రకు ఆటంకాలు కలగొద్దు
నిజామాబాద్అర్బన్/నవీపేట/నందిపేట్: ప్రశాంత వాతావరణంలో ఆనందోత్సాహాల నడుమ గణే శ్ నిమజ్జనోత్సవాన్ని జరుపుకోవాలని కలెక్టర్ టి.వినయ్ కృ ష్ణారెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం ప్రత్యేక బస్సులో పోలీస్ కమిషనర్ పి.సాయిచైతన్యతోపాటు ఇతర అధికారులతో కలిసి ప్రయాణిస్తూ శోభాయాత్ర రూట్ను కలెక్టర్ పరిశీలించారు. నిజా మాబాద్ నగరంలోని వినాయకబావి వద్ద అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, సార్వజనిక్ గణేశ్ మండలి ప్రతినిధులతో కలిసి నిమ్మజన ఏ ర్పాట్లపై చర్చించారు. నిమజ్జన శోభాయాత్రకు అవసరమైన అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో చర్యలు తీసుకుంటున్నామని ఈ సందర్భంగా కలెక్టర్ వెల్లడించారు. యంచ, నందిపేట మండలం ఉమ్మెడ గోదావరి బ్రిడ్జీల వద్ద నది ప్రవాహాన్ని పరిశీలించారు. అక్కడక్కడ చెడిపోయిన రోడ్లకు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేయించాలని పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. శోభాయాత్రకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా రోడ్లకు ఇరువైపులా అడ్డంగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించాలని, తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్ తీగలను పైకి బిగించాలని సూచించారు. ఎనిమిది అడుగులకు పైగా ఎత్తున్న ప్రతిమలను నందిపేట మండలం ఉమ్మెడ గోదావరి బ్రిడ్జి వద్దకు తరలించి నిమజ్జనం చేయాలన్నారు. గోదావరి బ్రిడ్జిల క్రేన్లు, గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచాలని, లైటింగ్ సౌకర్యం కల్పించాలన్నారు. వారి వెంట అదనపు కలెక్టర్ అంకిత్, కిరణ్కుమార్, ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాల్వియా, భైంసా డివిజన్ సబ్ కలెక్టర్ సంకేత్ కుమార్, అదనపు డీసీపీ బస్వారెడ్డి, నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్రకుమార్, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, ఏసీపీలు రాజా వెంకట్రెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి, మస్తాన్ రావు, మున్సిపల్, ఆర్ అండ్ బీ, అగ్నిమాపక, ఫిషరీస్, పంచాయతీరాజ్, రెవెన్యూ తదితర శాఖల అధికారులు ఉన్నారు. ఉమ్మెడ బ్రిడ్జి వద్ద ఏర్పాట్లను పరిశీస్తున్న కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి, సీపీ సాయిచైతన్య నిజామాబాద్లోని వినాయకుల బావిని పరిశీలిస్తున్న అర్బన్ ఎమ్మెల్యే, కలెక్టర్, సీపీ -
పార్టీకి కవిత నష్టం కలిగించారు
● ఆమె ఆరోపణలను ఎవరూ పట్టించుకోవడం లేదు ● మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్నిజామాబాద్అర్బన్: ఎమ్మెల్సీ కవిత పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పనిచేయడంతోనే కేసీఆర్ ఆ మైపె సస్పెన్షన్ వేటు వేశారని నిజామాబాద్ రూర ల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. జి ల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. హరీశ్రావు, సంతోష్రావుపై కవిత చేసిన ఆరోపణలను ఖండిస్తున్నామన్నారు. కవిత సస్పెన్షన్ విషయంలో పార్టీ సరైన నిర్ణయం తీసుకుందని, కేసీఆర్ తన కూతురు కన్నా పార్టీ భవిష్యత్ ముఖ్యమని ఈ ని ర్ణయం తీసుకున్నారని అన్నారు. కవిత ఆరోపణలను ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. ఎంపీగా కవిత జిల్లాకు ఎన్నో సేవలు అందించినప్పటికీ పా ర్టీ సిద్ధాంతాలు, నియమాలకు వ్యతిరేకంగా పనిచేయడంతో చర్యలు తప్పలేదన్నారు. ఈ వ్యవహారం స్థానిక సంస్థల ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూ పబోదని స్పష్టం చేశారు. బీజేపీ, కాంగ్రెస్ కుట్రలో భాగంగానే కాళేశ్వరం ప్రాజెక్టు విచారణను సీబీఐకి అప్పగించడమని ఆరోపించారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ తెలంగాణను ఎంతో అభివృద్ధి చేసి దేశంలోనే నంబర్వన్ స్థానంలో నిలిపారని అన్నారు. సమావేశంలో పార్టీ నగర అధ్యక్షుడు రాజు, నుడా మాజీ చైర్మన్ ప్రభాకర్రెడ్డి, మాజీ జె డ్పీటీసీ బాజిరెడ్డి జగన్, తదితరులు పాల్గొన్నారు. కవిత ఫొటో కనిపించకుండా స్టిక్కర్ బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో అధినేత కేసీఆర్, కేటీఆర్, కవిత చిత్రాలతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో కవిత ఫొటో కనిపించకుండా స్టిక్కర్ అతికించారు. పార్టీ సస్పెన్షన్ వేటు వేయడంతో స్టిక్కర్ వేశారు. -
అభివృద్ధి పనులను పూర్తి చేయాలి
● ఇందిరమ్మ లబ్ధిదారులు పనులు ప్రారంభించేలా చొరవ చూపాలి ● సమీక్షలో కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి నిజామాబాద్అర్బన్: జిల్లాలో వివిధ శాఖల ఆధ్వర్యంలో చేపట్టాల్సిన అభివద్ధి పనులను తక్షణమే ప్రారంభించి శరవేగంగా పూర్తి చేయించాలని క లె క్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించా రు. నిజామాబాద్ నగర పాలక సంస్థతోపాటు బోధన్, ఆర్మూర్, భీమ్గల్ మున్సిపాలిటీల్లో డబు ల్ బెడ్ రూం ఇళ్లకు సంబంధించిన పెండింగ్ పనులను పూర్తి చేయాలన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కు మార్, ఇతర అధికారులతో ఇందిరమ్మ ఇళ్లు, డబుల్ బెడ్ రూం ఇళ్ల అసంపూర్తి పనులు, పెండింగ్లో ఉన్న ఇతర అభివృద్ధి పనులపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చే నాటికే సాధ్యమైనంత వరకు పెండింగ్ పనులను పూర్తి చేసి, ప్రారంభోత్సవాలకు సిద్ధం చేయాలని అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఇళ్లు మంజూరైన వారు వెంటనే మార్కింగ్ చేసుకుని నిర్మాణ పనులు చేపట్టేలా చొరవచూపాలన్నారు. లబ్ధిదారులకు ఐకేపీ, మెప్మా ద్వారా విరివిరిగా రుణాలు మంజూరయ్యేలా చూ డాలన్నారు. అదేవిధంగా అసంపూర్తిగా ఉన్న ఆరో గ్య ఉప కేంద్రాలు, అంగన్వాడీ సెంటర్ల భవనాల నిర్మాణాలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయించాలని సూచించారు. ఈ సందర్భంగా ఒక్కో శాఖ వారీగా పనుల ప్రగతిని కలెక్టర్ సమీక్షిస్తూ, అధికారులకు సూచనలు చేశారు. జెడ్పీ సీఈవో సాయా గౌడ్, హౌసింగ్ పీడీ పవన్కుమార్, డీపీవో శ్రీనివాస్, డీఎంహెచ్వో రాజశ్రీ పాల్గొన్నారు. -
ధర్పల్లిలో కత్తెర పోట్ల కలకలం..
● ఒకరి మృతి, నలుగురికి గాయాలుధర్పల్లి: మండల కేంద్రంలోని ఎన్టీఆర్ కాలనీలో మంగళవారం దారుణం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ధర్పల్లి గ్రామానికి చెందిన కోటగిరి దాసు అనే వ్యక్తి టైలరింగ్ చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. అతడికి భార్య గంగామణి ఇద్దరు పిల్లలు ఉన్నారు. దాసుకు తన భార్యతో మనస్పర్థలు రావడంతో రెండేళ్ల క్రితం విడాకులు తీసుకున్నాడు. అతని భార్య గంగామణి ధర్పల్లిలోనే నివాసం ఉంటోంది. దాసు అదే గ్రామంలో ఓ ఆశ్రమంలో ఉంటున్నాడు. తన భార్య విడిపోవడానికి అదే గ్రామానికి చెందిన లక్ష్మి అనే మహిళ కారణమని ఆగ్రహించిన దాసు మంగళవారం ఉదయం లక్ష్మి ఇంటికెళ్లి కత్తెరతో ఆమె పై దాడి చేశాడు. అడ్డుగా వచ్చిన ఆమె కుమార్తె గౌతమి, అదే కాలనీకి చెందిన శెట్పల్లి నాగరాజు, అతని భార్య శోభ, మరో వ్యక్తి శెట్టిపల్లి భోజేశ్వర్ పై దాసు కత్తెరతో దాడి చేశాడు. దాడిలో తీవ్ర గాయాలైన లక్ష్మిని స్థానికులు నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. గాయపడ్డ మరో నలుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారికి ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. ఘటన స్థలాన్ని ధర్పల్లి సీఐ భిక్షపతి, ఎస్సై కళ్యాణి పరిశీలించి వివరాలను సేకరించారు. మృతురాలి కుమార్తె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
సమాచార హక్కు చట్టం వజ్రాయుధం
నిజామాబాద్ నాగారం: సమాచార హక్కు చట్టం ప్రజలకు వజ్రాయుధమని సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ సలీం అన్నారు. నగరంలోని ప్రెస్క్లబ్లో మంగళవారం సమాచార హక్కు చట్టం – 2005 పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించి కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సలీం మాట్లాడుతూ.. అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో సమాచార హక్కు బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. చట్టం పరిధిని అంతర్జాతీయ స్థాయిలో విస్తరించాలన్నారు. జిల్లా కార్యవర్గం సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ జిల్లా అధ్యక్షుడిగా కాంతపు గంగాధర్, మహిళా విభాగం అధ్యక్షురాలిగా వై సునీత, న్యాయ విభాగం సలహాదారులుగా శ్యామల, కార్యదర్శిగా రషీదా, ముఖ్య సలహాదారులుగా మహ్మద్, బోధన్ డివిజన్ అధ్యక్షురాలిగా తస్లీమ్, రాష్ట్ర స్పోక్స్ పర్సన్గా న్యాయవా ది శ్రీనివాసరావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. -
మద్యానికి బానిసై ఒకరి ఆత్మహత్య
బోధన్రూరల్: మద్యానికి బానిసైన ఓ మహిళ చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు బోధన్ రూరల్ ఎస్సై మచ్చేందర్రెడ్డి మంగళవారం తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. సాలూర మండలం జాడిజమాల్పూర్ గ్రామానికి చెందిన వన్నెల జ్యోతి(35) భర్త ఆరేళ్ల క్రితం మృతి చెందాడు. గ్రామంలో చిన్న చిన్న పనులు చేసుకుంటు జీవిస్తోంది. కొంత కాలంగా ఆమె మద్యానికి బానిస కావడంతో అనారోగ్యానికి గురైంది. సోమవారం గ్రామ శివారులోని చెరువులో పడి ఆత్మహత్యకు పాల్పడింది. మృతదేహం చెరువులో లభ్యం కావడంతో కుటుంబీకులు పోలీసులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఇందల్వాయి: మండలంలోని పడకల్ వద్ద వాహనం ఢీకొని మృత్యువాత పడ్డ నాలుగేళ్ల చిరుతకు పోస్టుమార్టం నిర్వహించి తిర్మన్పల్లి నర్సరీలో అంత్యక్రియలు నిర్వహించినట్లు డీఎఫ్వో వికాస్ మీనా, ఇందల్వాయి రేంజ్ ఆఫీసర్ రవి మోహన్ భట్ మంగళవారం పేర్కొన్నారు. వాహనదారులు దట్టమైన అటవీ ప్రాంతంలో నెమ్మదిగా వెళ్లాలని సూచించారు. జాతీయ రహదారుల అథారిటీకి ఇందల్వాయి రేంజ్ పరిధిలో ఉన్న దట్టమైన ఫారెస్ట్లో ఫెన్సింగ్, ఆరు అండర్ పాస్ లకు ప్రతిపాదనలు పంపినట్లు ఎఫ్ఆర్వో తెలిపారు. రుద్రూర్: ఎదురుగా వస్తున్న స్కూల్ బస్సుకు సైడ్ ఇవ్వడానికి యత్నించి రోడ్డు కిందకు దించిన ఆర్టీసీ బస్సు పొలంలోకి వంగిపోయిన ఘటన మంగళవారం రుద్రూర్ మండలం అంబం(ఆర్) శివారులో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అంబం(ఆర్) నుంచి రుద్రూర్కు బోధన్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వస్తుండగా ఎదురుగా స్కూల్ బస్సు వచ్చింది. స్కూల్ బస్సుకు దారి ఇద్దామనే ప్రయత్నంలో ఆర్టీసీ డ్రైవర్ బస్సును పక్కకు తీశాడు. వర్షాలకు రోడ్డు పక్క మట్టి తడిసి ఉండడంతో ఒక్క సారిగా పొలంలోకి వంగిపోయింది. దీంతో అప్రమత్తమైన డ్రైవర్ చాకచాక్యంగా వ్యవహరించి బస్సులోని ప్రయాణికులకు కిందకు దింపి వేశాడు. మరో బస్సులో ప్రయాణికులను పంపించి వేశారు. -
నష్టం అంచనాను ప్రభుత్వానికి నివేదిస్తాం
● మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ● ఖాజాపూర్, హున్సా, మందర్నా శివారులో దెబ్బతిన్న పంటల పరిశీలనబోధన్: భారీ వర్షాలకు నీట మునిగి నష్టపోయిన పంటల వివరాలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందిస్తామని మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. మంగళవారం మంజీర నది తీరంలో సాలూర మండలంలోని ఖాజాపూర్, హున్సా, మందర్నా శివారులో వరద నీట మునిగి దెబ్బతిన్న పంటలను వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి పరిశీలించారు. ఆయా గ్రామాల్లో రైతులతో మాట్లాడారు. పంట నష్ట వివరాలను అడిగి తెలుసుకున్నారు. మందర్నా శివారులో పంట పొలాల మధ్య దెబ్బతిన్న పొతంగల్ మండలంలోని సుంకిని వెళ్లే రోడ్డును పరిశీలించారు. మంజీర, గోదావరి నదులకు ఒకే సమయంలో భారీ వరద చేరి ఉధృతంగా ప్రవహించడం వల్ల పరీవాహక ప్రాంతంలో నియోజక వర్గంలోని సాలూర, బోధన్, రెంజల్, నవీపేట మండలాల్లో పంటలు నీట మునిగి నష్టం వాటిల్లిందని అన్నారు. ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ ఉధృతిని నిలువరించేందుకు అధికార యంత్రాంగం ప్రయత్నాలు చేశారని పేర్కొన్నారు. నియోజక వర్గంలో సోయా 14 వేలు, వరి పంట 18 వేల ఎకరాల్లో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేపడతామన్నారు. రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్బిన్ హందాన్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, ఏఎంసీ చైర్మన్ చీల శంకర్, టీపీసీసీ డెలిగేట్ గంగాశంకర్, డీఏవో గోవింద్, ఏసీపీ శ్రీనివాస్, ట్రాన్స్కో డీఈ ముక్తార్, పీఆర్ డీఈ వెంకటేశ్వర్లు, తహీల్దార్ శశిభూషణ్, ఎంపీడీవో శ్రీనివాస్, మండల నాయకులు మందర్నా రవి, అల్లె రమేశ్, ఇల్తెపు శంకర్, చిద్రపు అశోక్ తదితరులు పాల్గొన్నారు. -
పంటలను పరిశీలించిన శాస్త్రవేత్తలు
రెంజల్/ నవీపేట్: ఇటీవల కురిసిన వర్షాలు, వరదలతో నీట మునిగిన వరి, సోయా పంటలను సోమవారం రుద్రూర్ ప్రాంతీయ చెరుకు, వరి పరిశోధన స్థానం శాస్త్ర వేత్తలు పరిశీలించారు. రెంజల్ మండలం తాడ్బిలోలి, బోర్గాం, కందకుర్తి, నవీపేట మండలంలోని నందిగామ, అల్జాపూర్ గ్రామాలను సందర్శించి వరి రైతులకు సూచనలు, సలహాలు అందించారు. వరద నీటిలో ముంపునకు గురైన పొలాలకు మురుగు నీటి కాల్వల ద్వారా నీటిని తీసి వేసుకోవాలని రుద్రూర్ పరిశోధనా స్థానం అధిపతి సమతా పరమేశ్వరి, శాస్త్ర వేత్తలు సాయిచరణ్, రమ్యరాథోడ్ సూచించారు. పలు అంశాలపై సూచనలు చేశారు. వారి వెంట రెంజల్ మండల ఇన్చార్జి వ్యవపాయాధికారి సిద్ధిరామేశ్వర్, నవీపేట ఏవో నవీన్కుమార్, ఏఈవోలు, రైతులు ఉన్నారు. -
అంతర్రాష్ట్ర దొంగల ముఠా సభ్యుడి అరెస్ట్
● మధ్యప్రదేశ్ నుంచి వచ్చి జిల్లాలో దొంగతనాలు ● వివరాలు వెల్లడించిన ఎస్పీ రాజేశ్ చంద్రకామారెడ్డి క్రైం: మధ్యప్రదేశ్ నుంచి వచ్చి జిల్లాలో దొంగతనాలకు పాల్పడుతున్న ఓ ప్రమాదకర ము ఠా సభ్యుడిని పోలీసులు మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. జిల్లా పోలీస్ కార్యాల యంలో ఎస్పీ రాజేశ్ చంద్ర కేసు వివరాలు వెల్లడించారు. గత జూలై 18న అర్ధరాత్రి సదాశివనగర్ మండలం మర్కల్లో తాళం వేసి ఉన్న రెండిళ్లలో చోరీలు జరిగాయి. దీంతో బాధితులు గుండ్రెడ్డి గంగాధర్, గుర్రపు మహేశ్ల ఫిర్యాదు మేరకు పోలీ సులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించా రు. సీసీ కెమెరాలు, సాంకేతిక పరిజ్ఞానం, ఇతర ఆధారాలతో అనుమానితుల కదలికలపై ఆరా తీశా రు. సదాశివనగర్ మండలం కల్వరాల్ స్టేజీ వద్ద మంగళవారం పోలీసులు వాహనాల తనిఖీ చేపడు తుండగా పారిపోయేందుకు ప్రయత్నించిన ఓ నిందితుడిని పట్టుకుని విచారించారు. నిందితుడు జిల్లా లో చేసిన నేరాలను అంగీకరించినట్లు తెలిపారు. రాజస్థాన్ పాసింగ్ కారులో తిరుగుతూ.. పోలీసులకు చిక్కిన సికిందర్ సోన్లాల్ దర్బార్, అతని స్నేహితులు సంజు, విశాల్, అభిషేక్, ప్యూస్, అనిల్, ఉమేశ్ బాయ్, గోవింద్ బాయ్, మరొకరు కలిసి ముఠాగా ఏర్పడి దొంగతనాలకు పాల్పడుతున్నట్లు విచారణలో తేలింది. మధ్యప్రదేశ్కు చెందిన ఈ ముఠా రాజస్థాన్ నంబర్ ప్లేట్ ఉన్న కారును కొనుగోలు చేసి, దాంట్లో ప్రయాణిస్తూ కామారెడ్డి జిల్లాలో దొంగతనాలకు పాల్పడుతున్నట్లు తెలిపా రు. చోరీలు చేసేందుకు అనువైన ప్రాంతాలను ఎంపిక చేసుకునే క్రమంలోనే నిందితుడు పోలీసులకు చిక్కాడని పేర్కొన్నారు. నిందితుని నుంచి కారు, సె ల్ఫోన్, కత్తి, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కేసు విచారణలో చాకచక్యంగా వ్యవహరించిన సీఐలు సంతోష్ కుమార్, శ్రీనివా స్, ఎస్సైలు పుష్పరాజ్, ఉస్మాన్, ఐటీ కోర్ కానిస్టే బుల్ శ్రీనివాస్, సిబ్బంది లక్ష్మీకాంత్, శ్రీనివాసు, మైసయ్య, శ్రావణ్, రవిలను ఎస్పీ అభినందించారు. -
కాళేశ్వరం కొట్టుకుపోలేదు.. కూలిపోలేదు
కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేసిన నేపథ్యంలో ఎక్కడ చూసినా ఇదే అంశంపై చర్చ సాగుతోంది. ఇదిలా ఉండగా.. ‘కాళేశ్వరం కొట్టుకుపోలేదు.. కూలిపోలేదు’ అంటూ బాల్కొండ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. బాల్కొండ నియోజకవర్గానికి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా చేకూరిన మేలు చేకూరిందంటూ ఫ్లెక్సీల్లో పేర్కొన్నారు. ప్యాకేజీ 20, 21, 21ఏ(1), 21ఏ(2) పనుల కోసం రూ.6వేల కోట్లు, మెంట్రాజ్పల్లి పంప్హౌజ్ కోసం రూ.1,750 కోట్లు కేటాయించినట్లు అందులో వివరించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, ప్రశాంత్రెడ్డిల ఫొటోలను ప్రచురించారు. – మోర్తాడ్(బాల్కొండ) -
గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం
మోపాల్: మండలంలోని న్యాల్కల్ గ్రామ చెరువులో గల్లంతైన శ్రీగంధం పోశెట్టి (62) మృతదేహం లభ్యమైనట్లు ఎస్సై సుస్మిత తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. పోశెట్టి సోమవారం ఉదయం ఏడు గంటల సమయంలో చేపలు పట్టేందుకు వెళ్లాడు. సాయంత్రమైనా ఇంటికి తిరిగి రాకపోవడంతో కొడుకు భూమేశ్ చెరువు వద్దకు వెళ్లి వెతికాడు. పోశెట్టి బట్టలు, చెప్పులు చెరువు కట్టపై కనిపించడంతో ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. మంగళవారం ఉదయం పోశెట్టి మృతదేహం నిజాంసాగర్ కెనాల్ గేట్ల వద్ద కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహానికి పంచనామ నిర్వహించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్కు తరలించారు. కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించారు. -
విభిన్న రూపాయ.. వినాయకాయ
నిజామాబాద్ రూరల్ : నగరంలోని వివిధ మండపాల నిర్వహకులు విభిన్న రకాల వినాయకులను ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఖిల్లా రోడ్డులో శ్రీమహ్మదేవి యూత్ ఆధ్వర్యంలో పద్మనాభస్వామి రూపంలో గణేశ్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అలాగే వర్నిచౌరస్తాలో భక్త హిందూ యూత్ గణేష్ మండలి ఆధ్వర్యంలో విభూతి గణేశ్, ఖిల్లా చౌరస్తాలోని శ్రీశివసేన యూత్ గణేష్ మండలి ఆధ్వర్యంలో చిరుధాన్యాలతో గణేశ్, మహ్మదేవినగర్లో శ్రీభజరంగ్ యూత్ గణేష్ మండలి ఆధ్వర్యంలో గోమతి చక్రాల గణేశ్, బురుడుగల్లి గాజులపేటలో శ్రీరవీంద్రగణేష్ మండలి ఆధ్వర్యంలో పసుపుకొమ్ములతో గణేశ్, ఖిల్లా రోడ్డు చౌరస్తాలో రైజింగ్ స్టార్ యూత్ గణేష్ మండలి ఆధ్వర్యంలో మట్టి దీపాలతో గణేశ్, వినాయక్నగర్లోని హైందవ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో బాలగణపతి మట్టి విగ్రహం, చంద్రశేఖర్కాలనీలో శ్రీ సిద్ధివినాయక గణేశ్ మండలి ఆధ్వర్యంలో పద్మనాభస్వామి గణేశ్, ఠాణాగల్లిలో ఏర్పాటు చేసిన శ్రీమారుతి గణేష్ మండలి ఆధ్వర్యంలో పేపర్, మైదా పిండితో చేసిన గణేశ్ విగ్రహాలు ఆకట్టుకుంటున్నాయి.మండపాలను నిర్వహకులు రాత్రిసమయంలో విద్యుత్ దీపాలతో సెట్టింగ్స్తో తీర్చిదిద్దడంతో ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. దీంతో విభిన్న వినాయక విగ్రహాలను వీక్షించేందుకు ప్రజలు తరలివస్తున్నారు. -
బాధ్యతలు స్వీకరించిన ఐకేపీ సీసీలు
డిచ్పల్లి: టీజీ సెర్ప్ ఉద్యోగుల సాధారణ బదిలీల నేపథ్యంలో డిచ్పల్లి మండల సమాఖ్య లో పనిచేసిన క్లస్టర్ కోఆర్డినేటర్లు (సీసీ)లు ఇతర మండలాలకు బదిలీపై వెళ్లగా వారి స్థానాల్లో బదిలీపై వచ్చిన సీసీ లు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. మండలంలోని 8 క్టసర్లలో సీసీ లు ఎస్.హరిబాబు (మెంట్రాజ్పల్లి క్లస్టర్), ఎ.అశోక్ (సుద్దపల్లి), కే.సురేశ్ (రాంపూర్), కే.శ్రీధర్రెడ్డి (ఘన్పూర్), బి.గోవింద్ (మిట్టపల్లి), ఎస్.హరి (డిచ్పల్లి), ఎం.ఆరోగ్యరాణి (యానంపల్లి), టి.గిరీష్ కుమార్ (ధర్మారం(బి) క్లస్టర్) వీరు బాధ్యతలు నిర్వహించనున్నారు. ఏపీఎం రవీందర్రెడ్డిని సీసీలు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి సత్కరించారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు బ్యాంకు లింకేజీ, సీ్త్రనిధి రుణాలను సక్రమంగా అందేలా కృషి చేయాలని ఏపీఎం సూచించారు. -
బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడం చారిత్రక నిర్ణయం
నిజామాబాద్ సిటీ : రాష్ట్రంలోని బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయడం చారిత్రక నిర్ణయమని పీసీసీ ప్రధాన కార్యదర్శి నరేశ్ జాదవ్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ భవన్లో నగర కాంగ్రెస్ అధ్యక్షుడు, నుడా చైర్మన్ కేశ వేణుతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 42 శాతం రిజర్వేషన్లతో బీసీల చిరకాల వాంఛ నెరవేరిందన్నారు. అనంతరం నుడా చైర్మన్ కేశ వేణు మాట్లాడుతూ కాంగ్రెస్పార్టీ అంటేనే బడుగు, బలహీనవర్గాల అభివృద్ధి అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు బీఆర్ఎస్, బీజేపీలు జీర్ణించుకోలేకపోతున్నాయని విమర్శించారు. సీఎం రేవంత్రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్కుమార్, డిప్యూటీ సీఎం మల్లుభట్టి విక్రమార్క, మంత్రివర్గానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు విపుల్ గౌడ్, నాయకులు నరేందర్ గౌడ్, జావెద్ అక్రమ్, సేవాదళ్ సంతోష్, ప్రమోద్, మధుసూదన్, విఘ్నేష్ యాదవ్ తదతరులు పాల్గొన్నారు. -
ఖైరతాబాద్ గణేశ్ను దర్శించుకున్న ధన్పాల్
సుభాష్నగర్: హైదరాబాద్లోని ఖైరతాబాద్ వినాయకుడిని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, పాల్వాయి హరీష్, రామారావు పాటిల్తో కలిసి సోమవారం దర్శించుకున్నారు. ఈసందర్భంగా ప్రత్యేక పూజ, హారతి కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. తెలంగాణ హిందూ ధర్మ సంస్కృతీ సాంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తున్న ఖైరతాబాద్ గణేశ్ని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. గణేశ్ని ఆశీర్వాదంతో తెలంగాణ ప్రజలందరూ సుభిక్షంగా, ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని వేడుకున్నట్లు తెలిపారు. అంతకుముందు ఉత్సవ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేలను ఘనంగా సన్మానించారు. -
నిత్యవసర సరుకుల పంపిణీ
ధర్పల్లి/సిరికొండ : వరదల కారణంగా ఇబ్బందులు పడుతున్న మండలంలోని వాడి గ్రామస్తులకు వర్ష, ప్రమీల, ప్రవీణ్ ల సహకారంతో వందమంది కుటుంబాలకు ధర్పల్లి సీఐ భిక్షపతి, ఎస్సై కల్యాణి నిత్యవసర సరుకులను పంపిణీ చేశారు. వారికి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. సిరికొండ మండలం పెద్దవాల్గోట్ గ్రామంలో దాతలు అందించిన విరాళాలతో కొనుగోలు చేసిన సరుకులను 70 కుటుంబాలకు అందజేశారు. కొండూర్ గ్రామంలోని బాధితులకు మోపాల్ మండలం నర్సింగ్పల్లికి చెందిన కాంట్రాక్టర్ రాములు రూ. 25 వేలు అందించారు. ధర్పల్లి మండలం ప్రాజెక్టు రామడుగు గ్రామానికి చెందిన ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో బాధితులకు ఒక రోజుకు సరిపడా నిత్యావసర సరుకులను అందజేశారు. చీమన్పల్లి శివబాలాజీ ట్రేడర్స్, సిరికొండ రాజరాజేశ్వర ట్రేడర్స్ కలిపి పది వేలు, చీమన్పల్లి గ్రామస్తులు ఏడు ఆయిల్ ప్యాకెట్ల కాటన్లు నిత్యావసర వస్తువులు, 25 కిలోల పప్పు, ధర్పల్లికి చెందిన గణేష్ మండలి వారు బాధితులకు ఒక పూట భోజనం, చిన్నవాల్గోట్కు చెందిన రొండ్ల సంతోష్రెడ్డి 15 చీరలు బాధితులకు అందజేశారు. -
లండన్లో ఘనంగా గణేశ్ ఉత్సవాలు
నిజామాబాద్ రూరల్ :లండన్లో ప్రవాస భారతీయులు వినాయక చవితి ఉత్సవాలను సోమవారం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. గణేశ్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు నరేష్ మెడిచేట్టి ఆధ్వర్యంలో 200 మంది సభ్యులు ఘనంగా పూజలు జరిపారు. ఈ సందర్భంగా నరేశ్ మాట్లాడుతూ.. సంస్కృతి సంప్రదాయాలను పాటించాలన్నారు.వేలం పాటలో లడ్డూ ను రూ.3.60 లక్షలకు సికింద్రాబాద్ వారాసిగూడకి చెందిన వేదశ్రీ బాణాల దక్కించుకున్నారని, లక్కీ డ్రాలో ఐదు గ్రాముల గోల్డ్ను అఖిల్ బండి గెలుచుకున్నారని తెలిపారు. ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథులుగా సౌతాల్ మాజీ ఎంపీ.వీరేందర్ శర్మ, యూరప్ మహిళా అధ్యక్షురాలు,యూత్.సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గురుమిందర్,కుమిలి ప్రెసిడెంట్ జాన్సన్ ఎడ్మన్ లు హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో బండి అఖిల్, చరణ్, కార్తిక్, అన్విత్, వినోద్, తదితరులు పాల్గొన్నారు. -
పూజలందుకుంటున్న గణనాథులు
తెయూ(డిచ్పల్లి)/మోపాల్/సిరికొండ : తెలంగాణ యూనివర్సిటీ గణేశ్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏ ర్పాటు చేసిన వినాయకుడికి వీసీ ప్రొఫెసర్ యాదగిరిరావు, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యాదగిరి, అధ్యాపకులు, విద్యార్థులు సోమవారం ప్రత్యేక పూజలు ని ర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం ని ర్వహించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ.. విద్యార్థులు తమ సంస్కృతి, సాంప్రదాయాలను పాటించడం అభినందనీయమన్నారు. మోపాల్ మండలం మోపాల్, కంజర్, కులాస్పూర్, మంచిప్ప, సిర్పూర్, న్యాల్కల్, ముదక్పల్లి, బాడ్సి, సింగంపల్లి, తదితర గ్రామాల్లో, సిరికొండ మండల కేంద్రంతో పాటు గడ్కోల్, పెద్దవాల్గోట్ గ్రామాల్లో వినాయక మండపాల వద్ద నిర్వహకులు అన్నదానం చేశారు. గణేశ్ నిమజ్జనానికి బల్దియా అధికారుల ఏర్పాట్లు నిజామాబాద్ సిటీ : వినాయక నిమజ్జనం సందర్భంగా మున్సిపల్ అధికారులు తగిన ఏర్పాట్లు పూర్తిచేశారు. ఈనెల 6న నిర్వహించే గణేశ్ శోభాయాత్ర ప్రారంభం నుంచి గమ్యస్థానం వరకు రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. మొదలు నుంచి చివరి వరకు ఇంజినీరింగ్, శానిటేషన్ సిబ్బందిని నియమిస్తూ మున్సిపల్ కమిషనర్ దిలీప్కుమార్ ఆదేశాలు జారీచేశారు. దుబ్బ బాలగంగాధర్ తిలక్ జంక్షన్ నుంచి పాత గంజ్ మీదుగా బోధన్బస్టాండ్, గురుద్వారా, పెద్దబజార్, గోల్హనుమాన్, ఫులాంగ్ చౌరస్తా, వినాయకుల బావి వరకు రూట్మ్యాప్లో అధికారులను నియమించారు. మున్సిపల్ డీఈలు సుదర్శన్రెడ్డి, భూమేశ్వర్, నరేందర్, సయ్యద్ వాజిద్, సాయిచంద్, పావని, టీపీఎస్లు అనుపమ, జి.శ్రీకాంత్, తదితరులున్నారు.