breaking news
Nizamabad
-
కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ
సుభాష్నగర్/నిజామాబాద్ రూరల్ : నేషనల్ హెరాల్డ్ కేసు విషయంలో బీజేపీ కార్యాలయాల ముట్టడికి కాంగ్రెస్ పిలుపునిచ్చిన నేపథ్యంలో గురువారం నగరంలోని బీజేపీ కా ర్యా లయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ముట్టడి సమాచారం ముందుగానే తెలుసుకు న్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ పటేల్ కులా చారి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. దీంతో బీజేపీ శ్రేణులు పెద్దసంఖ్యలో కార్యాలయానికి చేరుకున్నాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు బీజేపీ కార్యాలయం వద్ద భారీగా మో హరించారు. కాంగ్రెస్ నాయకులు రాకుండా.. బీజేపీ నాయకులు వెళ్లకుండా.. బారీకేడ్లు ఏర్పాటుచేశారు. అయినప్పటికీ కాంగ్రెస్ నాయకులు బీజేపీ కార్యాలయం వద్దనున్న వేణుమాల్కు చేరుకున్నారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్తత ఏర్పడింది. ఈ నేపథ్యంలో డీసీసీ అధ్యక్షుడు కాటిపల్లి నగేశ్రెడ్డి, పట్టణ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ, యువజన అధ్యక్షుడు విపుల్ గౌడ్ తదితర నాయకులను పోలీసులు ఎల్లమ్మగుట్ట చౌరస్తా, పోచమ్మగల్లీ ప్రాంతాల్లో అరెస్టు చేసి ఒకటో టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించారు. మరోవైపు బీజేపీ నాయకులు బారీకేడ్లను దాటుకుంటూ కాంగ్రెస్ నాయకుల వద్దకు చొ చ్చుకొచ్చారు. ఈ క్రమంలో పోలీసులు, నాయకుల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు అప్రమత్తమై బీజేపీ నాయకులను సముదా యించిన తిరిగి వారి పార్టీ కార్యాలయానికి పంపించారు. మోదీ, రాహుల్గాంధీ, కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేకంగా పరస్పరం నినాదాలు చేసుకున్నారు. బీజేపీ నాయకులు నాగోళ్ల లక్ష్మీనారాయణ, స్వామి యాదవ్, న్యాలం రాజు, కోడూరు నాగరాజు, ఆమంద్ విజయ్ కృష్ణ, చిరంజీవి, శంకర్రెడ్డి తదితరులు ఉన్నారు. 70 మందిపై కేసు నమోదు నిజామాబాద్ అర్బన్: బీజేపీ కార్యాలయం ముట్టడి ఘటనలో 70 మంది కాంగ్రెస్ నాయకులపై కేసు నమోదైంది. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కాటిపల్లి నగేశ్ రెడ్డి, నగర అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణతోపాటు మిగతా నాయకులపై ఒకటో టౌన్ పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేశారు. బీజేపీ కార్యాలయ ముట్టడికి కాంగ్రెస్ నాయకుల యత్నం నగరంలో ఉద్రిక్తత పోలీసులు, నాయకుల మధ్య తోపులాట కాంగ్రెస్ నాయకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు -
అందరి సహకారంతో ప్రశాంతంగా ఎన్నికలు
● కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డిసుభాష్నగర్ : జిల్లాలోని అందరి సహకారంతో పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించామని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి పేర్కొన్నారు. మూడు విడతల్లో జరిగిన ఎన్నికలు సాఫీగా ముగిసిన నేపఽథ్యంలో గురువారం కలెక్టరేట్లో కలెక్టర్, అదనపు కలెక్టర్లు, ఇతర నోడల్ అధికారులను జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ రావు సత్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అధికారులు, సిబ్బంది సమన్వయంతో ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా పంచాయతీ ఎన్నికలను సజావుగా నిర్వహించామన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఇదే తరహాలో సమష్టిగా కృషి చేయా లని సూచించారు. అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, నిజా మాబాద్ ఆర్డీవో రాజేంద్రకుమార్, డీఎల్పీవోలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.చెత్త సేకరణ ప్రక్రియను పర్యవేక్షించాలిఅందరికీ కృతజ్ఞతలు సీపీ సాయిచైతన్య నిజామాబాద్ అర్బన్ : ప్రజల సహకారంతోనే గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించామని సీపీ సాయిచైతన్య ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి ఈ నెల 17 వరకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా కృషి చేసిన అన్ని రాజకీయ పార్టీల నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. శాంతిభద్రతల కోసం కిందిస్థాయి ఉద్యోగుల నుంచి ఉన్నతాధికారుల వరకు ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు. ప్రజలు, పోలీస్ అధికారుల సమన్వయంతో ఎన్నికలు సజావుగా నిర్వహించినట్లు వివరించారు. -
సమన్వయం అంతంతే
నిజామాబాద్భత్యంపై ఉద్యోగుల.. ఉద్యోగులకు ఎన్నికల సంఘం నిర్దేశించిన ప్రకారం కాకుండా తక్కువ భత్యం చెల్లించడంపై సర్వత్రా అసంతృప్తి వ్యక్తమవుతోంది. శుక్రవారం శ్రీ 19 శ్రీ డిసెంబర్ శ్రీ 2025– 8లో uసాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జిల్లాలో అధికార కాంగ్రెస్ ఆధిపత్యం సాధించినప్పటికీ కీలక నాయకుల మధ్య మాత్రం సమన్వయ లేమి కొట్టొచ్చినట్లు కనిపించింది. ముఖ్యంగా పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ సొంత నియోజకవర్గమైన బాల్కొండలో నాయకులతో సమన్వయం చేసుకోవడంలో నియోజకవర్గ ఇన్చార్జి సునీల్రెడ్డి విఫలమవ్వడంతో కీలకమైన కమ్మర్పల్లి, వేల్పూర్, ఏర్గట్ల, బాల్కొండ, మోర్తాడ్ తదితర మేజర్ గ్రామ పంచాయతీల్లో కాంగ్రెస్ మద్దతుదారులు ఓడిపోయారని పార్టీ కార్యకర్తలు చెబుతున్నారు. ఆ జీపీలను ఎమ్మెల్యే ప్రశాంత్రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ మద్దతుదారులు గెలుచుకున్నారు. ఇదిలా ఉండగా బాల్కొండ నియోజకవర్గం నుంచి ముగ్గురు రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నారు. అయితే సునీల్రెడ్డి తమను పట్టించుకోలేదని పార్టీ అభ్యర్థులు చెబుతున్నారు. మరోవైపు రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లను అడిగితే మాత్రం తాము పట్టించుకున్నప్పటికీ అభివృద్ధి నిధుల విడుదలకు సంబంధించిన ప్రొసీడింగ్స్ ఇచ్చే స్థితిలో తాము లేమని చెప్పినట్లు కార్యకర్తలు చెబుతున్నారు. దీంతో నాయకులు ఎక్కువగా ఉన్నప్పటికీ ఫలితం లేదని పార్టీ శ్రేణులు పేర్కొంటున్నాయి. రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ ఈరవత్రి అనిల్ సొంత గ్రామమైన కిసాన్నగర్, నియోజకవర్గ ఇన్చార్జి ముత్యాల సునీల్రెడ్డి ఉండే మోర్తాడ్, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్రెడ్డి ఓటు ఉన్న నర్సాపురంలో బీఆర్ఎస్ మద్దతుదారులు గెలుపొందారు. రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ సుంకేట అన్వేష్రెడ్డి సొంత గ్రామం పచ్చల నడ్కుడలో స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. దీంతో ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్కు ఆధిక్యం వచ్చినప్పటికీ ఆ పార్టీ కార్యకర్తలకు, కీలక నాయకులకు మాత్రం నిరాశను మిగిల్చింది. ● నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్బిన్ హందాన్ సొంత గ్రామం సిరికొండ మండల కేంద్రంలో బీఆర్ఎస్ మద్దతుదారుడు గెలు పొందాడు. గడ్కోల్ పంచాయతీలో కాంగ్రెస్ నాయకుడు భాస్కర్రెడ్డి మాత్రం తాను నిలబెట్టిన అభ్యర్థిని గెలిపించుకున్నారు. ఇక్కడ ఉత్కంఠ పో రు నడిచింది. ఇక్కడ భాస్కర్రెడ్డి నిలబెట్టిన అభ్యర్థికి పోటీగా బీజేపీ, బీఆర్ఎస్, వామపక్షాలకు చెందిన రాష్ట్ర, జిల్లా నాయకులు ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టారు. అయినప్పటికీ భాస్కర్రెడ్డి నిలబెట్టిన కాంగ్రెస్ అభ్యర్థే గెలుపొందారు. జక్రాన్పల్లి మండలం మునిపల్లి మేజర్ పంచాయతీని సీనియర్ నా యకుడు మునిపల్లి సాయిరెడ్డి ఏకగ్రీవం చేయించు కుని తన పట్టును నిలబెట్టుకున్నారు. నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి సొంత గ్రామం ముదక్పల్లిలో ఆయన నిలబెట్టిన అభ్యర్థిపై స్వతంత్ర అభ్యర్థి గెలిచాడు. పీసీసీ డెలిగేట్ బా డ్సి శేఖర్గౌడ్ సొంత గ్రామం బాడ్సిలో బీఆర్ఎస్ గెలిచింది. మోపాల్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సాయిరెడ్డి సొంత గ్రామమైన మోపాల్లో బీజేపీ గె లిచింది. కాంగ్రెస్ ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు, మా జీ ఎంపీపీ యాదగిరి సొంత గ్రామం ఎల్లమ్మకుంటలో బీజేపీ గెలిచింది. డీసీసీ అధ్యక్షుడు నగేశ్రెడ్డి సొంత గ్రామం ముల్లంగిలో తన అభ్యర్థిని గెలిపించుకున్నారు. అంకాపూర్లో కాంగ్రెస్ సీనియర్ నేత మార చంద్రమోహన్రెడ్డి తాను నిలబెట్టిన అభ్యర్థిని 1,545 ఓట్ల ఆధిక్యంతో గెలిపించుకున్నారు. బీజేపీ విషయానికి వస్తే కీలక నాయకులు అంతగా పట్టించుకోలేదని పార్టీ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. బీజేపీ జిల్లా అధ్యక్షుడు కులాచారి దినేశ్ సొంత గ్రామం అమృతాపూర్లో బీఆర్ఎస్ గెలిచింది. ఇక ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్రెడ్డి సొంత గ్రామం అంకాపూర్కు మాత్రమే పరిమితమయ్యారు. ఇక్కడ రాకేశ్రెడ్డి నిలబెట్టిన అభ్యర్థిపై కాంగ్రెస్ అభ్యర్థి 1,545 ఓట్ల తేడాతో గెలిచారు. జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి మద్దతు ఉన్నప్పటికీ బీజేపీ ఓడిపోయింది. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డి పనితీరుపై పార్టీ కార్యకర్తల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. జీవన్రెడ్డి సొంత నియోజకవర్గం ఆర్మూర్లో బీఆర్ఎస్ అట్టర్ ఫ్లాప్ అయింది. బోధన్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే షకీల్ అడ్రస్ లేకపోవడంతో బీఆర్ఎస్ పూర్తిగా చతికిలపడింది. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోనూ బాజిరెడ్డి గోవర్ధన్ నిలబెట్టిన అభ్యర్థులు అత్యధిక సంఖ్యలో ఓటమి చెందారు. బాజిరెడ్డి గోవర్ధన్ సొంత గ్రామం చీమన్పల్లిలో స్వతంత్ర అభ్యర్థి గెలిచాడు. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే ప్రశాంత్రెడ్డి మాత్రమే మంచి విజయాలు సాధించేలా సక్సెస్ అయ్యారు. జీపీ ఎన్నికల్లో అధికార పార్టీ ఆధిపత్యం సాధించినా.. మేజర్ గ్రామాల్లో ఓటమి పీసీసీ అధ్యక్షుడి సొంత నియోజకవర్గంలో ఇన్చార్జీ పనితీరుపై అసంతృప్తి! రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ల సొంత పంచాయతీల్లో మద్దతుదారులను వరించని విజయం మరోవైపు కీలక మండల కేంద్రాల్లో బీజేపీ, బీఆర్ఎస్ మద్దతుదారుల గెలుపు బీఆర్ఎస్లో తగ్గిన నాయకుల పోరాట పటిమ వేముల ప్రశాంత్రెడ్డి మినహా మిగిలిన నేతల వైఫల్యం బాన్సువాడ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పో చారం శ్రీనివాసరెడ్డి, ఏనుగు రవీందర్రెడ్డి వ ర్గాల మధ్య పోరు నేపథ్యంలో కీలకమైన మోస్రా, పొతంగల్ మండల కేంద్రాల్లో బీజేపీ గెలిచింది. చందూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ గెలిచింది. -
పెద్దపులి జాడ కోసం గాలింపు
మాచారెడ్డి: పాల్వంచ మండలం ఇసాయిపేట గ్రామశివారులో బుధవారం దూడపై పెద్దపులి దాడి చేసి చంపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అటవీ శాఖ రెస్క్యూ టీం ట్రాకర్స్ ట్రాప్ కెమెరాలను గురువారం అమర్చి గాలింపు ముమ్మరం చేశారు. ఇసాయిపేట శివారులో పెద్దపులి సంచరిస్తున్నట్టు ఇటీవల అమర్చిన ట్రాప్ కెమెరాలో రికార్డయినట్టు డిప్యూటీ రేంజ్ అధికారి రమేశ్ తెలిపారు. స్థానికులు భయాందోళనకు గురికావొద్దని, రాత్రివేళలో ఒంటరిగా పంట చేల వద్దకు వెళ్లొద్దని సూచించారు. పశువులు, గొర్రెల కాపర్లు అటవీ ప్రాంతానికి వెళ్లొద్దని తెలిపారు. -
జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక
ఖలీల్వాడి: జాతీయ స్థాయి రన్నింగ్ పోటీల కు జిల్లా కేంద్రంలో ని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థిని కుమారి పీ అంబిక ఎంపికై నట్లు ప్రిన్సిపాల్ బుద్ధిరాజ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల వరంగల్లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి 1500 మీటర్ల పరుగు పందెం పోటీల్లో పాల్గొని ప్రతిభ చాటిందన్నారు. వచ్చే ఏప్రిల్లో నిర్వహించే జాతీయ స్థాయి పరుగుపందెం పో టీల్లో పాల్గొనడానికి తమ కళాశాల విద్యార్థిని వెళ్లడం గర్వకారణంగా ఉందన్నారు. అనంతరం అంబికను ప్రిన్సిపాల్, సిబ్బంది అభినందించారు. ప్రిన్సిపాల్, అధ్యాపకుల సహకారంతో తాను ముందుకు వెళ్లగలుగుతున్నానని అంబిక అన్నారు. ధర్పల్లి: ధర్పల్లి నూతన ఎస్సైగా సామ శ్రీనివా స్ గురువారం బాధ్యత లు చేపట్టారు. ఇది వర కు విధులు నిర్వహించి న ఎస్సై కళ్యాణి సెల వులపై వెళ్లడంతో ఆమె స్థానంలో సామ శ్రీనివాస్ నియమితులయ్యా రు. ఈ సందర్భంగా ఎస్సై శ్రీనివాస్ మాట్లాడుతూ.. మండల ప్రజలకు అందుబాటులో ఉంటూ శాంతిభద్రతులు పరిరక్షించడానికి కృషి చేస్తానన్నారు. శాంతి భద్రతలకు ఎవరైనా విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటించాలని సూచించారు. నేరాల నియంత్రణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. సుభాష్నగర్: జిల్లాలో రేషన్కార్డుదారులు తమ వేలిముద్ర సహాయంతో ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని అడిషనల్ కలెక్టర్ కిరణ్కుమార్ గురువారం సూచించారు. జిల్లాలో 4,67,295 కార్డుల్లో 15,72,176 లబ్ధిదారులు ఉన్నారని పేర్కొన్నారు. అందులో 11,03,928 (70.22 శాతం) లబ్ధిదారులు మాత్రమే ఈకేవైసీ పూర్తి చేసుకున్నారన్నారు. 4,68,251(29.78) లబ్ధిదారులు చేయించుకోవాల్సి ఉందని పేర్కొన్నారు. మిగిలిపోయిన కార్డుదారుల్లో ఐదేళ్లు పైబడిన వారందరూ సమీపంలోని రేషన్షాపునకు వెళ్లి ఈకేవైసీని తప్పకుండా చేయించుకోవాలని సూచించారు. ఐదేళ్లలోపు పిల్లలకు ఈకేవైసీ నుంచి ప్రభుత్వం మినహాయింపు ఇచ్చిందని తెలిపారు. రేషన్షాపు డీలర్లు కూడా షాపులను తెరిచి ఉంచి ఈకేవైసీకి సహకరించాలన్నారు. రేషన్షాపుల్లో ఈకేవైసీకి సంబంధించి ఫ్లెక్సీలను ఏర్పాటు చేయాలని అదనపు కలెక్టర్ సూచించారు. రైల్వే కమాన్లో ఇరుక్కున్న లారీ బోధన్: బోధన్ నుంచి నిజామాబాద్ కేంద్రానికి వెళ్లే ప్రధాన మార్గంలో ఉన్న ఎడపల్లి రై ల్వేగేట్ వద్ద కమాన్ దాటే క్రమంలో నిజామాబాద్ వైపు నుంచి బోధన్ వస్తున్న పత్తి లోడ్ లా రీ గురువారం ఇరుక్కుంది. దీంతో రైల్వేగేట్కు ఇరువైపులా భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. లారీలోని పైభాగంలో ఉన్న పత్తి సంచులను తీసివేయగా కమాన్ దాటి వెళ్లింది. అరగంట పాటు రైల్వేగేట్ వద్ద ట్రాఫిక్ స్తంభించి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. -
రాజకీయ కక్షసాధింపు కాదు..
● బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ కులాచారి సుభాష్నగర్: నేషనల్ హెరాల్డ్ కేసు రాజకీయ కక్ష సాధింపు కాదని, కాంగ్రెస్ అధినేత్రి కుటుంబం చేసిన ఆర్థిక అవినీతికి సంబంధించిన కేసు అని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ కులాచారి అన్నారు. నగరంలోని బీజేపీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘నేషనల్ హెరాల్డ్’ ద్వారా రూ.కోట్ల ప్రజాధనం ఒక కుటుంబానికి ఎలా దారి మళ్లిందో దేశ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత కాంగ్రెస్పై ఉందన్నారు. ఈడీ, కోర్టులు విచారిస్తున్న కేసును ప్రతీకారం అని కాంగ్రెస్ నేతలు చెప్పడం న్యాయవ్యవస్థను అవమానించడమేనని మండిపడ్డారు. బీజేపీ కార్యాలయాల ముట్టడి ఒక డ్రామా అని, దమ్ముంటే అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని దినేశ్ సవాల్ విసిరారు. సమావేశంలో జిల్లా ప్రధానకార్యదర్శి నాగోళ్ల లక్ష్మీనారాయణ, మాజీ కార్పొరేటర్లు న్యాలం రాజు, ప్రమోద్ కుమార్, నాయకులు స్వామి యాదవ్, పద్మారెడ్డి, శంకర్రెడ్డి, నారాయణ యాదవ్, తారక్ వేణు, కోడూరు నాగరాజు, పంచరెడ్డి శ్రీధర్, ఇప్పకాయల కిశోర్, ఆమంద్ విజయ్ కృష్ణ, పల్నాటి కార్తిక్ తదితరులు పాల్గొన్నారు. -
చైనా మాంజా విక్రయిస్తే చర్యలు
బోధన్టౌన్: బోధన్ పట్టణ పోలీస్స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన గాలి పటాల దుకాణాల్లో నిర్వాహకులు చైనా మాంజాను విక్రయిస్తే చర్యలు తప్పవని పట్టణ సీఐ వెంకటనారాయణ గురువారం తెలిపారు. సీపీ సాయి చైతన్య ఆదేశాల మేరకు పట్టణంలో ఏర్పాటు చేసిన గాలి పటాల దుకాణాలను తనిఖీ చేయగా పలు దుకాణాల నిర్వాహకులకు సిబ్బందితో కలిసి నోటీసులు అందించినట్లు ఆయన పేర్కొన్నారు. దుకాణాల నిర్వాహకులు చైనా మాంజా విక్రయిస్తే చర్యలు తప్పవని సీఐ హెచ్చరించారు. కామారెడ్డి అర్బన్: జిల్లాలో విద్యుత్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని, ప్రతిరోజు 18 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా అధ్యక్షుడు పైడి విఠల్రెడ్డి విద్యుత్శాఖ ఎస్ఈ రవీందర్కు గురువారం వినతిపత్రం అందజేశారు. ఎస్ఈతో రైతులకు సంబంధించిన వివిధ విద్యుత్ సమస్యలపై చర్చించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి శంకర్రావు, జిల్లా ప్రతినిధలు, మండలాల అధ్యక్షులు పాల్గొన్నారు. -
నేషనల్ హెరాల్డ్ కేసు కుట్రపూరితం
● కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కాటిపల్లి నగేశ్రెడ్డి, నగర అధ్యక్షుడు రామకృష్ణనిజామాబాద్ రూరల్: నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలపై సహా మరికొందరిపై ఈడీ కేసు నమోదు చేయడం కుట్రపూరితమేనని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కాటిపల్లి నగేశ్రెడ్డి, నగర అధ్యక్షుడు రామకృష్ణ అన్నారు. తెలంగాణ పీసీసీ ఇచ్చిన పిలుపులో భాగంగా బీజేపీ జిల్లా కార్యాలయ ముట్టడి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు గురువారం చేపట్టారు. ఈ సందర్భంగా నగశ్రెడ్డి మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని అన్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో గత పదేళ్లుగా ఏఐసీసీ అగ్ర నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై బీజేపీ ప్రభుత్వం వేధిస్తోందని అన్నారు. ఈడీ బీజేపీకి అనుకూలంగా పనిచేస్తోందని ఆరోపించారు. నేషనల్ హెరాల్డ్ అనే పత్రిక సంస్థను కొనుగోలు చేయడానికి పార్టీ నిధులను దుర్వనియోగం చేశారనే ఆరోపణలపై సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై బీజేపీ నేత సుబ్రమణ్యన్ స్వామి 2012లో ఫిర్యాదు చేశారన్నారు. ఇందులో ఎలాంటి అవినీతికి పాల్పడలేదని, నిధుల దుర్వినియోగం చేయలేదని సుప్రీం కోర్టు గతంలోనే కేసు రద్దు చేసిందన్నారు. రాహుల్ గాంధీ కాబోయే ప్రధాని అని అతన్ని ఎవరూ అడ్డుకోలేరని ఆయన పేర్కొన్నారు. -
తెలుగు విభాగంలో ఇద్దరికి డాక్టరేట్
తెయూ(డిచ్పల్లి): తెలంగాణ విశ్వవిద్యాలయంలోని తెలుగు అధ్యయనశాఖలో పరిశోధక విద్యార్థులు నాయకోటి సుజాత, కటుకొజ్జ్వల ఎల్బీ శాస్త్రి డాక్టరేట్ సాధించారు. ఆర్ట్స్ డీన్, తెలుగు విభాగం ప్రొఫెసర్ కే లావణ్య పర్యవేక్షణలో పరిశోధక విద్యార్థి నాయకోటి సుజాత ‘తెలంగాణలో దేవులపల్లి రామానుజారావు గారి స్థానం’, ప్రొఫెసర్ త్రివేణి పర్యవేక్షణలో కటుకొజ్జ్వల ఎల్బీ శాస్త్రి ‘సిద్దిపేట జిల్లా సాహిత్య చైతన్యం–సమగ్ర పరిశీలన’ అనే అంశంపై పరిశోధన పూర్తిచేసి సిద్ధాంత గ్రంథాలు సమర్పించారు. బుధవారం ఆర్ట్స్ అండ్ సైన్స్ కాన్ఫరెన్స్ సెమినార్ హాల్లో నిర్వహించిన బహిరంగ మౌఖిక పరీక్షకు ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు విభాగాధిపతి ప్రొఫెసర్ సాగి కమలాకర శర్మ ఎక్స్ టర్నల్ ఎగ్జామినర్గా వ్యవహరించారు. అనంతరం సుజాత, ఎల్బీ శాసీ్త్రలను అధ్యాపకులు అభినందించారు. కార్యక్రమంలో ఆర్ట్స్ డీన్ కరిమిండ్ల లావణ్య, ప్రొఫెసర్ కనకయ్య, తెలుగు అధ్యయనశాఖ విభాగాధిపతి, బీవోఎస్ చైర్మన్ సీహెచ్ లక్ష్మణ చక్రవర్తి, కంట్రోలర్ కే సంపత్ కు మార్, ప్రొఫెసర్ సీహెచ్ ఆరతి, ప్రొఫెసర్ కే రవీందర్ రెడ్డి, ప్రొఫెసర్ కే అపర్ణ, అబ్దుల్ ఖవి, గుల్ ఏ రానా, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
భత్యంపై ఉద్యోగుల అసంతృప్తి
● పోలింగ్ విధులు నిర్వహించిన వారికి తక్కువ భత్యం చెల్లింపు ● అసహనం వ్యక్తం చేస్తున్న ఉద్యోగులు, సిబ్బంది మోర్తాడ్: పంచాయతీ ఎన్నికల విధులు నిర్వహించిన ఉద్యోగులకు ఎన్నికల సంఘం నిర్దేశించిన ప్రకారం కాకుండా తక్కువ భత్యం చెల్లించడంపై సర్వత్రా అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఎన్నికల విధులను సజావుగా నిర్వహించిన తమకు సరైన టీఏ, డీఏ చెల్లించకపోవడంలో ఆంతర్యం ఏమిటని ఉద్యోగులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం తుది విడత పోలింగ్ బాల్కొండ, ఆర్మూర్ నియోజకవర్గాల్లో జరిగింది. 1501 పోలింగ్ కేంద్రాల్లో 5,285 మంది ఉద్యోగులు వివిధ హోదాల్లో ఎన్నికల బాధ్యతలను నిర్వర్తించారు. స్టేజ్ వన్ రిటర్నింగ్ అధికారికి ఎనిమిది రోజుల పాటు విధులు నిర్వహించినందుకు రోజుకు రూ.500ల చొప్పున రూ.4వేలు చెల్లించాల్సి ఉంది. అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు ఏడు రోజుల విధులకు రూ.3,500, రిటర్నింగ్ అధికారి స్టేజ్–2 వారికి రూ.4వేలు, ప్రిసైడింగ్ అధికారికి రూ.2,500, పోలింగ్ అధికారులకు రూ.1,300ల భత్యం చెల్లించాలని ఎన్నికల సంఘం ఆయా జిల్లాల అధికార యంత్రాంగానికి ఆదేశాలను జారీ చేసింది. కానీ ఎక్కడైనా రూ.2 వేలు మాత్రమే భత్యం చెల్లించి అధికారులు చేతులు దులుపుకొన్నారని ఉద్యోగులు వాపోతున్నారు. ఎ న్నికల భత్యం తక్కువగా చెల్లించడంపై అసహనం వ్యక్తం చేస్తున్న ఉద్యోగులు తమ వాట్సాప్ గ్రూపుల్లో పోస్టులను చేస్తూ చర్చను కొనసాగిస్తున్నారు. మొదటి దశ పోలింగ్ సిబ్బందికి రూ.2,500 చొప్పున భత్యం చెల్లించగా, రెండో విడతలో రూ.1,500లకే పరిమితం చేశారు. మూడో విడతలో గొడవ చేస్తారనే ఉద్దేశంతో రూ.2 వేల చొప్పున భత్యం చెల్లించారని తెలుస్తోంది. ఈ విషయమై ఉద్యోగులు పంచాయతీ అధికారులను ప్రశ్నిస్తే ఎలాంటి సమాధానం లేదని ఎన్నికల విధుల్లో పాల్గొన్న పలువురు ఉద్యోగులు వెల్లడించారు. ఎన్నికల సంఘం సూచించే భత్యం ఒకలాగా ఉంటే అధికారులు చెల్లించే భత్యానికి తేడా ఉందన్నారు. అసలు ఈ నిధులు ఎటు మళ్లిపోతున్నాయని ఉద్యోగులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఖలీల్వాడి: ఎన్నికల విధి నిర్వహణకు సంబంధించి రెమ్యునరేషన్ తక్కువ చెల్లించిన ఎన్నికల సిబ్బందికి తక్షణమే మిగతా డబ్బులు చెల్లించాలని జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాసరావు వివిధ మండలాల ఎంపీడీవోలను ఆదేశించారు. గురువారం జిల్లా కేంద్రంలోని జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాసరావుని డీటీఎఫ్ జిల్లా శాఖ పక్షాన కలిశారు. రెమ్యునరేషన్ చెల్లింపు ఫిర్యాదులపై ఆయనతో చర్చించారు. మొదటిసారి పీవోలు, ఆర్వోలుగా విధులు నిర్వర్తించిన వారికి రూ. 2500లు చెల్లించగా రెండవసారి, మూడోసారి పనిచేసిన వారికి రూ.2 వేలు మాత్రమే చెల్లించారు. మిగతా నగదును ఫోన్ పే ద్వారా గాని చెల్లింపులు జరపాలని డీపీవో ఆదేశాల ప్రకారం కార్యాలయ సిబ్బంది ఎంపీడీవోలకు తగు సమాచారాన్ని తెలియజేశారు. ముప్కాల్, డిచ్పల్లి ఎంపీడీవోలకు మిగతా రెమ్యునరేషన్ చెల్లింపునకు ఆదేశించడం జరిగింది. డీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శంతన్, జిల్లా ఉపాధ్యక్షుడు పెంటన్న ఉన్నారు. -
రేపు బోధన్లో కమ్యూనిస్టు ఉద్యమ స్ఫూర్తి ర్యాలీ
బోధన్: దేశంలో కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భావించి వందేళ్లు పూర్తి అవుతున్న సందర్భంగా సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో శనివారం పట్టణ కేంద్రంలో కమ్యూనిస్టు ఉద్యమ స్ఫూర్తి ర్యాలీ నిర్వహించనున్నట్టు ఆ పార్టీ డివిజన్ కమిటీ కార్యదర్శి జీ నడ్పి భూమయ్య తెలిపారు. గురువారం పట్టణంలోని ఎల్బీఎస్ నగర్ కాలనీలో ఉన్న పార్టీ కార్యాలయంలో జిల్లా, డివిజన్ నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. ఆ రోజు ఉదయం 11 గంటలకు స్థానిక శక్కర్నగర్ చౌరస్తా నుంచి ఆర్టీసీ కొత్త బస్టాండ్ మీదుగా అంబేడ్కర్ చౌరస్తా వరకు ర్యాలీ కొనసాగుతుందని పేర్కొన్నారు. వందేళ్ల కమ్యూనిస్టు ఉద్యమంలో ఎర్రజెండా పేద ప్రజలకు అండగా నిలిచిందని, ఎన్నో హక్కులు సాధించిందన్నారు. పార్టీ సభ్యులు, ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో ర్యాలీకి తరలి రావాలని పిలుపునిచ్చారు. నాయకులు ఎల్ చిన్న పర్వయ్య, పీరోళ్ల పోశెట్టి, గౌతం కుమార్, సుధాకర్, మనోహర్ తదితరులు పాల్గొన్నారు. -
అంచనాలను మించి ఎన్నికల ఖర్చు
● తుది విడతలో పోటీ చేసిన అభ్యర్థుల ఖర్చు రూ.30 కోట్లకు పైమాటే మోర్తాడ్: పంచాయతీ ఎన్నికల్లో తమ భవితవ్యం పరీక్షించుకున్న అభ్యర్థులు చేసిన ఖర్చులను అంచనా వేస్తే రూ.30 కోట్లకు దాటిపోతుంది. ఏ గ్రామంలో చూసినా సర్పంచ్, వార్డు స్థానాలకు పోటా పోటీగా చేసిన ఖర్చు అభ్యర్థులకు తడిసి మోపైడెంది. తుది విడతలో 146 సర్పంచ్ స్థానాలకు, 1,130 వార్డు స్థానాలకు ఎన్నికలు జరుగగా ఒక్కో గ్రామంలో ఇద్దరు, ముగ్గురు అభ్యర్థులు పోటీపడ్డారు. ప్రతి అభ్యర్థి కనీసం రూ.10లక్షలకు మించి ఖర్చు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. మోర్తాడ్, నందిపేట్, ముప్కాల్లో మాత్రం సర్పంచ్ అభ్యర్థుల ఖర్చు తలా రూ.కోటి దాటినట్లు సమాచారం. ఈ గ్రామాల్లో సర్పంచ్, వార్డు అభ్యర్థులు విచ్చలవిడిగా డబ్బులను పంపిణీ చేసినట్లు సమాచారం. బాల్కొండ, అంకాపూర్లో అభ్యర్థులు రూ.50లక్షల వరకూ ఖర్చు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. వేల్పూర్ మండలం మోతెలో సర్పంచ్ పదవికి పోటీ పడిన అభ్యర్థుల్లో ఇద్దరు మాత్రం రూ.80లక్షల వరకూ ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. అంక్సాపూర్, దొన్కల్, దోంచంద, గుమ్మిర్యాల్లో సర్పంచ్ పదవులకు వేలం నిర్వహించగా రూ. 20లక్షల నుంచి రూ. 35లక్షల వరకూ అభ్యర్థులు వీడీసీలకు విరాళంగా చెల్లించినట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఉప సర్పంచ్ పదవిని దక్కించుకునేందుకు ఒకరు రూ.22లక్షలు ఖర్చు చేశారు. మోర్తాడ్ మండలం పాలెం సర్పంచ్ పదవి ఎస్సీ మహిళకు రిజర్వు చేశారు. ఇక్కడ ఉప సర్పంచ్ పదవిని దక్కించుకోవడానికి పోటీ పడిన అభ్యర్థి వార్డు సభ్యులకు రూ.2లక్షల చొప్పున అందించాడు. మరికొన్ని గ్రామాల్లో ఒక్కో వార్డు సభ్యునికి రూ.50వేల వరకూ ఇచ్చి ఉప సర్పంచ్ పదవిని దక్కించుకున్నట్లు సమాచారం. మునుపెన్నడూ లేని విధంగా పంచాయతీ పోరు ఈసారి రసవత్తరంగా సాగిందని చెప్పడానికి అభ్యర్థులు చేసిన ఖర్చులే నిదర్శనం. -
ఎత్తొండలో మహారాష్ట్ర వాసి అదృశ్యం
రుద్రూర్: మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా సావులి గ్రామానికి చెందిన ఓమాజీ వడాయి అనే వ్యక్తి కోటగిరి మండలం ఎత్తొండ గ్రామంలో అదృశ్యమైనట్టు ఎస్సై సునీల్ గురువారం తెలిపారు. ఓమాజీ వడాయి తన భార్యతో కలిసి వారం రోజుల క్రితం మహారాష్ట్ర నుంచి వరినాట్లు పని నిమిత్తం ఎత్తొండ గ్రామానికి వచ్చాడు. ఈ నెల 16న సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. పలుచోట్ల వెతికినా ఆచూకీ లభించలేదు. ఆయన భార్య జీజాబాయి ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు. -
క్రైం కార్నర్
లారీ ఢీకొని ఒకరి మృతి ఇందల్వాయి: కాలినడకన రోడ్డు గుండా ఇంటికి వెళ్తున్న ఓ వ్యక్తిని లారీ వెనుక నుంచి ఢీకొనడంతో మృతి చెందిన ఘటన ఇందల్వాయి టోల్ప్లాజా ప్రాంతంలో చోటు చేసుకుంది. ఇందల్వాయి ఎస్సై సందీప్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని మేఘ్యనాయక్ తండాకు చెందిన లకావత్ లింబ్య(70) అనే వృద్ధుడు గురువారం ఉదయం చికిత్స కోసం ఇందల్వాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చాడు. మందులు తీసుకొని స్వగ్రామానికి కాలినడకన రోడ్డు గుండా వెళ్తుండగా టోల్ప్లాజా ప్రాంతంలో హైదరాబాద్ నుంచి వస్తున్న లారీ వెనుక నుంచి అతన్ని ఢీకొన్నది. దీంతో ఘటన స్థలిలోనే లింబ్య మృతి చెందాడు. లారీ డ్రైవర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతుడి కుమారుడు మోజీరాం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. చికిత్స పొందుతూ ఒకరు.. దోమకొండ: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఓ వ్యక్తి చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతి చెందాడు. దోమకొండ మండల కేంద్రానికి చెందిన సన్నిది యాదగిరి(52) అనే వ్యక్తి ఈ నెల 15న పనినిమిత్తం సిరిసిల్లా జిల్లా కేంద్రానికి మరో యువకుడితో కలిసి బైక్పై వెళ్లారు. తిమ్మాపూర్ వద్ద బైక్ అదుపుతప్పి కిందపడిపోయారు. ఈ ఘటనలో యాదగిరి తలకు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స కోసం సిరిసిల్లా ఆస్పత్రికి, అక్కడి నుంచి గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. రుద్రూర్: మండల కేంద్రంలోని జవహార్నగర్ కాలనీ వద్ద రెండు కార్లు గురువారం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. ఐతే ప్రమాదంలో కార్లు దెబ్బతిన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కార్లను పోలీస్స్టేషన్కు తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపడుతున్నారు. -
సమాచార హక్కుతో పాలనలో పారదర్శకత
సుభాష్నగర్: ఆర్టీఐతో పాలనలో పారదర్శకత పెరుగుతుందని, ఇది ఒక బ్రహ్మాస్త్రం లాంటిదని సమాచార హక్కు చట్టం ప్రచార ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు కోయడి నర్సింహులు గౌడ్ అన్నారు. గురువారం నగరంలోని ఆర్అండ్బీ గెస్ట్ హౌస్లో ఆర్టీఐ ఉద్యమకారుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సమాచార హక్కు చట్టం ప్రచార ఐక్యవేదిక జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సమాచార హక్కు చట్టంపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలన్నారు. సమాచార హక్కు చట్టం ప్రచార ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడిగా కోయేడి నర్సింహులు గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్గా శ్రీరాంరాజ్, ఉపాధ్యక్షులుగా వై గోవర్ధన చారి, సోయల్ ఖాన్, డీఎల్ఎన్ చారి, కట్ట నరేశ్, ప్రధాన కార్యదర్శిగా మిర్జా అఫ్సర్ బేగ్, జాయింట్ సెక్రెటరీగా మౌలాకాన్, సుశీల్ కుమార్, తళవేద నరేశ్, గంగాధర్, చంద్రశేఖర్, కార్యవర్గ సభ్యులుగా శ్రీరామ్గౌడ్, సయ్యద్ అక్బర్, అనిల్ కుమార్, జాఫర్ అహ్మద్ ఎన్నికయ్యారు. -
అనారోగ్య సమస్యలతో ఒకరి ఆత్మహత్య
బిచ్కుంద(జుక్కల్): అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఓ వ్యక్తి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని గుండెనెమ్లిలో చోటు చేసుకుంది. ఎస్సై మోహన్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మాటూరి రారెండ్డి (45) కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో పాటు వ్యక్తిగత కారణాలతో ఇబ్బందులు పడుతున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. నిజామాబాద్ అర్బన్: డ్రంకెన్ డ్రైవ్లో పట్టుబడ్డ ఐదుగురికి మెజిస్ట్రేట్ వారం రోజుల పాటు జైలు శిక్షను విధించినట్లు ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్అలీ గురువారం తెలిపారు. జిల్లా కేంద్రంలో నిర్వహించిన వాహనాల తనిఖీల్లో పట్టుబడ్డ 17 మందిలో ఐదుగురికి వారం రోజుల పాటు జైలు శిక్ష విధించగా 11 మందికి రూ. పదివేలు, మరొకరికి రూ. పదిహేను వేలు చొప్పున జరిమానా విధించినట్లు పేర్కొన్నారు. తనిఖీల్లో పట్టుబడ్డ మహ్మద్ సోఫియన్, నగేశ్, ఇంతియాజ్, ఒడ్డె రాజు, విజయ్కుమార్కు వారం రోజుల పాటు మెజిస్ట్రేట్ జైలు శిక్షను విధించినట్లు ఏసీపీ తెలిపారు. -
ఇరిగేషన్ ఉద్యోగుల నూతన కార్యవర్గం ఎన్నిక
నిజామాబాద్ అర్బన్: నీటిపారుదల శాఖ ఉద్యోగుల జిల్లా నూతన కార్యవర్గాన్ని గురువారం టీఎన్జీవోఎస్ కార్యాలయంలో ఎన్నుకున్నారు. ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా కే జనార్దన్, కార్యదర్శిగా సామ్యూల్ వెస్లీ, కోశాధికారిగా ఇక్బాల్, సహాధ్యక్షుడిగా శ్రీనివాస్ మోరె, ఉపాధ్యక్షులుగా వెంకట్రాంరెడ్డి, జగన్మోహన్, వసంత, సంయుక్త కార్యదర్శులుగా సంపత్, మల్లయ్య, శమంత, ఆర్గనైజింగ్ సెక్రెటరీగా జయరాజ్, ప్రచార కార్యదర్శిగా శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులుగా అజ్మీమ్, ఆశన్న, చిన్న గంగారాం, శివరాజ్ ఏకగ్రీవంగా ఎన్నకున్నారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని టీఎన్జీవోఎస్ జిల్లా అధ్యక్షుడు సుమన్ అభినందించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఆయన అన్నారు. కార్యక్రమంలో టీఎన్జీవోఎస్ నాయకులు నారాయణరెడ్డి, అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. -
బుక్ చేసుకుంటేనే యూరియా
డొంకేశ్వర్(ఆర్మూర్)/డిచ్పల్లి : యూరియా పంపిణీ కోసం ఇప్పటికే ఈ–పాస్ విధానాన్ని అమలు చేస్తున్న ప్రభుత్వం తాజాగా మొబైల్ యాప్ను కూడా అందుబాటులోకి తీసుకురానుంది. రైతులు పంపిణీ కేంద్రాలకు వెళ్లకుండానే మొబైల్ ఫోన్ ద్వారా యూరియాను బుక్ చేసుకునే సదుపాయం రానుంది. ముందుగా బుక్ చేసుకున్న వారే ఇక నుంచి యూరియా పొందే అవకాశం ఉంటుంది. నూతన విధానం ఈ నెల 20వ తేదీ నుంచి అమలులోకి రానున్నట్లు వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి గురువారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో వెల్లడించారు. జిల్లాలోని అన్ని మండలాల రైతు వేదికల నుంచి వీసీకి వ్యవసాయ అధికారులు, డీలర్లు హాజరయ్యారు. రైతుకు ఉన్న వ్యవసాయ భూమి ఆధారంగా మొబైల్ యాప్లో వివరాలు నమోదు చేస్తే యూరియా ఇవ్వనున్నట్లు డైరెక్టర్ వెల్లడించారు. దీని ద్వారా యూరియా పక్కదారి పట్టకుండా ఉంటుందని, రైతులు ఇంటి వద్దే ఉండి బుకింగ్ చేసుకోవచ్చన్నారు. యాప్లో రైతు ఫోన్ నెంబర్, ఆధార్, పట్టాపాస్పుస్తకం, పంట పేరు వివరాలు ఎంట్రీ చేసిన వెంటనే ఎకరానికి కావాల్సిన బస్తాలను కావాల్సిన కేంద్రాల్లో కొనుగోలు చేసే ఆప్షన్లు ఉన్నట్లు తెలిపారు. సొసైటీలు, డీలర్ షాపుల్లో నిల్వలను కూడా చూసుకోవచ్చన్నారు. దీని ద్వారా చిన్న, సన్నకారు రైతులకు ఒకేసారి యూరియా పొందే అవకాశం ఉందన్నారు. పెద్ద రైతులు రెండు, మూడు విడతల్లో తీసుకోవచ్చన్నారు. ఎంపిక చేసుకున్న సొసైటీ, డీలరు షాపునకు బుకింగ్ ఐడీ నంబర్ పంపిన వెంటనే వాహనం ద్వారా ఇంటికి, పొలానికి యూరియా బస్తాలు వస్తాయన్నారు. డీఏపీ, ఇతర ఎరువులు సాధారణంగా కొనుగోలు చేసుకోవచ్చని తెలిపారు.మోపాల్(నిజామాబాద్రూరల్): జిల్లాలో యా సంగి సీజన్కు సరిపడా యూరియా అందుబాటులో ఉందని జిల్లా వ్యవసాయ అధికారి వీరా స్వామి తెలిపారు. మోపాల్ మండలకేంద్రంలో ని రైతువేదికలో గురువారం ఏఈవోలు, ఎరువుల దుకాణాల డీలర్లు, సొసైటీ సీఈవోలకు యూరియా బుకింగ్ మొబైల్ యాప్పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డీఏవో మా ట్లాడుతూ రైతులకు పంట ఆధారంగా అవసరమైన యూరియాను ఇకపై ఇంటి నుంచే బుకింగ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. మొబైల్ యాప్ను అందుబాటులోకి తెచ్చిన ప్రభుత్వం రైతులు ఎక్కడి నుంచైనా కొనుగోలు చేసుకునే అవకాశం ఈ నెల 20 నుంచి సేవలు ప్రారంభం -
ప్రశాంత వాతావరణంలో ఓటింగ్
● విస్తృత ప్రచారంతో పెరిగిన పోలింగ్ శాతం ● జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆర్మూర్: జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు మూడు విడతల్లో ప్రశాంతంగా ముగిశాయని, ప్ర శాంత వాతావరణంలో ఓటర్లు తమ ఓటు హక్కు ను వినియోగించుకున్నారని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ టీ వినయ్ కృష్ణారెడ్డి అన్నారు. ఆర్మూర్ మండలం అంకాపూర్, బాల్కొండ మండల కేంద్రంలోని పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఓటర్లు, ఎన్నికల సిబ్బందితో మాట్లాడి పలు సూచనలు చే శారు. పోలింగ్ కేంద్రాల్లో హెల్ప్డెస్క్లు, మెడికల్ క్యాంపులతోపాటు ఇతర సదుపాయాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ.. మూడు విడతల్లోనూ పో లింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘ టనలు చోటుచేసుకోకుండా ఓటింగ్ ప్రక్రియ సజావుగా జరిగిందన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద అదనపు పోలీసు బలగాలతో బందోబ స్తు ఏర్పాటు చేయించడంతోపాటు వెబ్ క్యాస్టింగ్ జరిపించామన్నారు. కలెక్టరేట్ నుంచి సైతం ఆయా పోలింగ్ కేంద్రాల్లో వెబ్ క్యాస్టింగ్ ద్వారా ఓటింగ్ తీరును, స్థానిక పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించామని తెలిపారు. పరిశీలించిన జనరల్ అబ్జర్వర్.. ఎన్నికల సాధారణ పరిశీలకులు శ్యాంప్రసాద్ లాల్ సైతం పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఓటింగ్ తీరును పరిశీలించారు. భీమ్గల్, బడా భీమ్గల్, రామన్నపేట్, మోర్తాడ్, కమ్మర్పల్లి, అంకాపూర్, ముప్కాల్, బాల్కొండ తదితర పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. -
పంచాయతీ పోరు సమాప్తం
ఆర్మూర్: ఆర్మూర్ డివిజన్లో మూడో విడత పోలింగ్తో జిల్లాలో పంచాయతీ పోరు సమాప్తమైంది. డివిజన్ పరిధిలోని 12 మండలాల్లో బుధవారం పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఆర్మూర్, ఆలూ ర్, నందిపేట, డొంకేశ్వర్ మండలాలతోపాటు బాల్కొండ నియోజకవర్గంలోని బాల్కొండ, ము ప్కాల్, మెండోర, వేల్పూర్, భీమ్గల్, మోర్తాడ్, ఏ ర్గట్ల, కమ్మర్పల్లి మండలాల్లో ఉదయం 7 గంటలకు ఓటింగ్ ప్రక్రియను ప్రారంభించగా.. ఓటర్లు చలిని లెక్క చే యకుండా పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరా రు. ఆర్మూర్, బాల్కొండ ఎమ్మెల్యేలు పైడి రాకేశ్రెడ్డి, వేముల ప్రశాంత్రెడ్డి తమ స్వగ్రామాలైన ఆర్మూర్ మండలం అంకాపూర్, వేల్పూర్ మండల కేంద్రంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మహిళలు, వృద్ధులు, ది వ్యాంగులు తమ ఓటు హక్కును వినియోగించుకు నేందుకు ఆసక్తి కనబరిచారు. పలువురు ఆస్పత్రుల నుంచి నేరుగా ఓటు వేసేందుకు రాగా పోలింగ్ కేంద్రాల్లో వీల్ చైర్స్ను అందుబాటులో ఉంచారు. డివిజన్ పరిధిలో ఉదయం 9 గంటల సమయానికి సగటున 23.35 శాతం, 11 గంటల సమయానికి 54.69 పోలింగ్ శాతం నమోదైంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 74.36 శాతం ఓటింగ్ కాగా, నిర్ణీత సమయంలోగా క్యూలో ఉన్న వారందరికీ ఓటు వేసే అవకాశాన్ని అధికారులు కల్పించారు. 76.45 శాతం ఓటింగ్ జరిగినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. మూడో విడతలో మొత్తం 165 సర్పంచ్ స్థానాలకుగాను, 19 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 146 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. అలాగే 1620 వార్డు స్థానాలకు గాను 490 వార్డు స్థానాలు ఏకగ్రీవం కాగా, 1130 వార్డు స్థానాలకు ఎన్నికలు జరిగాయి. 1490 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.మండలాల వారీగా పోలింగ్ ఇలా.. సత్తా చాటుకున్న కాంగ్రెస్ ఆర్మూర్ డివిజన్లో ఏకగ్రీవాలతో కలిపి కాంగ్రెస్ 95, బీఆర్ఎస్ 36, బీజేపీ 16, స్వతంత్రులు 18 చోట్ల గెలుపు బాల్కొండ నియోజకవర్గంలో కీలకమైన మండల కేంద్రాల్లో బీఆర్ఎస్ పాగా పట్టు నిలుపుకున్న వేముల ప్రశాంత్రెడ్డి మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డికి కోలుకోలేని ఫలితాలు అంకాపూర్లో ఎమ్మెల్యే రాకేష్రెడ్డికి ఘోర పరాభవం జిల్లాలో ముగిసిన మూడో విడత పంచాయతీ ఎన్నికలు చలిని లెక్క చేయకుండా పోలింగ్ కేంద్రాల్లో బారులు తీరిన ఓటర్లు పోలింగ్ 76.45 శాతం నమోదు -
ఓటింగ్లో మహిళలే టాప్
● పోలైన ఓట్లలో పురుషుల కన్నా మహిళలే ఎక్కువ ● పంచాయతీ పోరును శాసించిన అతివలు!నిజామాబాద్అర్బన్: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఉత్సాహంగా ఓటేసిన మహిళా ఓటర్లు తమలోని చైతన్యాన్ని చాటిచెప్పారు. చాలా గ్రామాల్లో అభ్యర్థుల జయాపజయాలను మహిళా ఓట్లే శాసిస్తాయని మొదటి నుంచి అనుకున్నట్లుగానే జరిగింది. మూడు విడతల్లో పల్లెపోరు సాగగా.. అన్ని దశల పోలింగ్లోనూ పురుషులతో పోలిస్తే మహిళల ఓట్లే ఎక్కువ సంఖ్యలో పోలయ్యాయి. డివిజన్ల వారీగా ఓటింగ్ ఇలా..డివిజన్ మొత్తం ఓట్లు పోలైన ఓట్లు ఓటేసిన ఓటేసిన ఓటేసిన పోలింగ్ మహిళలు పురుషులు ఇతరులు శాతం బోధన్ 2,42,723 1,97,492 1,05,282 92,210 00 81.37 నిజామాబాద్ 2,38,838 183219 1,06,737 76,479 03 76.71 ఆర్మూర్ 306795 2,34,546 1,37,555 9,69,90 01 76.45 మొత్తం 7,88,356 6,15,257 3,49,574 2,65,679 04 78.04 -
ప్రజాస్వామ్య సేవకులు..
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో శాంతిభద్రతల పరిరక్షణతోపాటు ఓటర్లు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు వేసేందుకు చర్యలు చేపట్టిన పోలీసులు.. ప్రజాస్వామ్య వ్యవస్థ పటిష్టత కోసం తమ వంతు సేవలందించి ఆదర్శంగా నిలిచారు. సీపీ సాయి చైతన్య ఆధ్వర్యంలో 1,100 మంది వివిధ విభాగాలకు చెందిన పోలీసులు బందోబస్తు విధులు నిర్వర్తించారు. అయితే వారు బందోబస్తుకే పరిమితం కాకుండా ఓటు వేసేందుకు పోలింగ్ బూత్లకు వచ్చిన వృద్ధులు, దివ్యాంగులకు ఇలా తమ వంతు సహకారం అందించారు. పోలీసు సిబ్బందిని ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్రెడ్డి అభినందించారు. – ఆర్మూర్ -
ఓటేసేందుకు విదేశాల నుంచి..
ఉన్నత చదువులు చదివి విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్న పలువురు పుట్టి పెరిగిన పల్లెలో ఓటేసేందుకు వచ్చారు. డొంకేశ్వర్ మండలం గంగాసముందర్కు చెందిన దంపతులు మోహన్గాంధీ, మౌనికారెడ్డి అమెరికాలోని అట్లాంటాలో ఉంటున్నారు. అదే గ్రామానికి మరో యువకుడు పోలాండ్లో ఉద్యోగం చేస్తున్నాడు. ఎన్నికలు ఉన్నాయని సమాచారం అందడంతో ఓటు హక్కును వినియోగించుకునేందుకు గ్రామానికి చేరుకున్నారు. రాజ్యాంగం తమకు కల్పించిన హక్కును స్వేచ్ఛాయుత వాతావరణంలో గర్వంగా వినియోగించుకుని ప్రజాస్వామ్య గొప్పతనాన్ని చాటిచెప్పారు. – డొంకేశ్వర్(ఆర్మూర్) -
ఉమ్మడి జిల్లా హాకీ జట్టు ఎంపిక
ఆర్మూర్టౌన్: ఉమ్మడి జిల్లా హాకీ జట్టును పట్టణంలోని మినీస్టేడియంలో బుధవారం ఎంపిక చేసినట్లు హాకీ అసోసియేషన్ జిల్లా ప్రధానకార్యదర్శి సదమస్తుల రమణ తెలిపారు. ఎస్జీఎఫ్ఐ అండర్–19 విభాగంలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారిని ఎంపిక చేశామన్నారు. ఈనెల 20న రంగారెడ్డి జిల్లా సరూర్నగర్లో నిర్వహించే రాష్ట్రస్థాయి అంతర్ కళాశాలల పోటీల్లో ఎంపికై న జట్టు పాల్గొంటుందని తెలిపారు. ఫిజికల్ డైరెక్టర్ చిన్నయ్య, అంజు, హాకీ క్రీడాకారులు శ్రీను, వెంకేటేశ్ తదితరులు పాల్గొన్నారు. అన్నారంలో ఉద్రిక్తత డొంకేశ్వర్(ఆర్మూర్): మండలంలోని అన్నారంలో మంగళవారం అర్ధరాత్రి ఉద్రిక్త వాతా వరణం ఏర్పడింది. 144 సెక్షన్ను ఉల్లంఘించారనే ఫిర్యాదుతో పోలీసులు గ్రామానికి చేరుకున్నారు. ప్రచారంతోపాటు ఓటర్లకు డబ్బులు పంచుతున్నారనే ఆరోపణలు రావడంతో గుమిగూడిన వారిని లాఠీలతో చెదరగొట్టారు. గొడవ వాతావరణం ఏర్పడడంతో పరిస్థితి చేయిదాటిపోకుండా పోలీసు బలగాలను రంగంలోకి దించారు. బుధవారం రోజంతా పోలీసులు గ్రామంలోనే ఉన్నారు. బోధన్ ఏసీపీ శ్రీనివాస్, నిజామాబాద్రూరల్ సీఐ శ్రీనివాస్ ఓటింగ్ ప్రక్రియను పర్యవేక్షించారు. డ్రాలో గెలిచిన బీజేపీ సర్పంచ్ అభ్యర్థి నందిపేట్(ఆర్మూర్): మండలంలోని కంఠంలో కాంగ్రెస్ బలపర్చిన పెంట ఇంద్రు డు, బీజేపీ బలపరిచిన అజిగిరి సాయి నాథ్కు సమానంగా 711 ఓట్లు వచ్చాయి. లక్కీ డ్రా ద్వారా విజేతగా అజిగిరి సాయినాథ్ను రిటర్నింగ్ అధికారి జాన్ విల్సన్ ప్రకటించారు. కౌంటింగ్ తరువాత సాయినాథ్కు ఒక్క ఓటు ఎక్కువగా వచ్చింది. పెంట ఇంద్రుడు రీ కౌంటింగ్ కోరారు. ఓట్లు మళ్లీ లెక్కించగా సాయినాథ్ కు వచ్చిన ఒక్క ఓటు తప్పుడు మడతతో రెండు గుర్తులకు సిరా మరక అంటింది. ఉన్నతాధికారుల ఆ దేశాల మేరకు ఆ ఓటు రద్దు చేశారు. దీంతో ఇరువురికి 711 ఓట్లు సమానంగా వచ్చాయి. లక్కీ డ్రాలో సాయినాథ్ పేరు వచ్చింది. -
తెయూ–మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ మధ్య ఎంవోయూ
తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ, మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ మధ్య బుధవారం అవగాహన ఒప్పందం(ఎంఓయూ) కు దిరింది. ఈ ఎంఓయూపై తెయూ వైస్ చాన్స్లర్ టీ యాదగిరిరావు, రిజిస్ట్రార్ ఎం యాదగిరి, మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ డీజీఎం శేఖర్బాబు సంతకాలు చేశారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ.. ఈ ఎంఓయూ వర్సిటీ విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలను పెంపొందించే దిశగా ఒక ముఖ్యమైన ముందడుగని పేర్కొన్నారు. ఈ ఒప్పందం 17 డిసెంబర్ 2025 నుంచి 16 డిసెంబర్ 2026 వరకు చెల్లుబాటు అవుతుందన్నారు. ఇరుపక్షాల పరస్పర అంగీకారంతో ఈ కాలాన్ని పొడిగించే అవకాశం ఉందన్నారు. ఈ ఎంవోయూ ప్రకారం మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ అర్హత ప్రమాణాల ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేసి, ఆమోదించిన కోర్సుల ప్రకారం శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తుందన్నారు. విద్యార్థుల భవిష్యత్ వృత్తి అవకాశాలను బలోపేతం చేయడానికి ప్లేస్మెంట్ ఆధారిత శిక్షణ, ప్లేస్మెంట్ డ్రైవ్స్ నిర్వహించి అర్హులైన విద్యార్థులకు అవసరమైన సాయం అందిస్తుందని వీసీ యాదగిరి తెలిపారు. కార్యక్రమంలో ప్రి న్సిపాల్ ఎం ప్రవీణ్, ప్లేస్మెంట్ సెల్ డైరెక్టర్ పాత నాగరాజు, మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ డీజీఎం(లైవ్లీహుడ్ ఆపరేషన్స్–తెలంగాణ–ఆంధ్రప్రదేశ్) డీ శేఖర్బాబు, ప్రోగ్రామ్ మేనేజర్ ఎం సృజన్దా, ప్రొఫైలింగ్ ఆఫీసర్ డీ బాలమురళికృష్ణ తదితరులు పాల్గొన్నారు. ● స్పందించిన సివిల్ సప్లయ్ సంస్థ బోధన్: జిల్లాలో పాఠశాల విద్యార్థుల మధ్యాహ్న భోజన పథకానికి తూకంలో వ్యత్యాసం లేకుండా సన్న బియ్యం సరఫరా చేస్తున్నామని సివిల్ సప్లయ్ సంస్థ జిల్లా మేనేజర్ శ్రీకాంత్రెడ్డి బుధవారం ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్న భోజన బియ్యంలో తరుగు శీర్షికన బుధవారం ప్రచురితమైన కథనానికి జిల్లా సివిల్ సప్లయ్ శాఖ అధికారి స్పందించారు.జిల్లాలో మండల స్థాయి 8 గోదాం ల ద్వారా 1159 పాఠశాల 9 వేల 6112 మంది విద్యార్థులకు 200 మెట్రిక్ టన్నుల సన్న బియ్యం తమ సంస్థ నియమించిన రవాణా కాంట్రాక్టర్ ద్వారా సరఫరా జరుగుతుందని వివరించారు. గోదాంల్లో ఐదు మెట్రిక్ టన్నుల మిషన్ పై బియ్యం తూకం వేసి నిర్ధారించుకున్నంతరం ఈ–పాస్ యంత్రంపై ఎంఈవో లేదా పాఠశాల హెచ్ఎంల వేలి ముద్ర తీసుకుని బియ్యం సరఫరా ప్రక్రియ జరుగుతుందని పేర్కొన్నారు. గోదాం నుంచి బియ్యం తీసుకునే సమయంలో తూకం నిర్ధారణ తనిఖీ,స్వీకరణ రిజిస్టర్ లో నమోదు,సరైన బరువు ఉన్నట్టు ధ్రువీకరణ సంబంధిత పాఠశాల అధికారులదే బాధ్యతని ప్రభుత్వం స్పష్టంగా నిర్దేశిచిందని తెలిపారు. బోధన్: ఎడపల్లి మండలంలోని జానకంపేట గ్రామస్తురాలు దండ్ల నర్సవ్వపై పాత కక్షలు మనస్సులో పెట్టుకుని తన మేన మామ కుటుంబీకులు దాడి చేశారని ఫిర్యాదు చేసిందని ఎడపల్లి ఎస్సై ముత్యాల రమ బుధవారం తెలిపారు. కోరుట్ల మండలంలోని ఐలపూర్ గ్రామానికి చెందిన నర్సవ్వ మేన మామ,ఆయన కోడలు,మనమరాలు,మనుమడు అసభ్య పదజాలంతో తిట్టి ,రాయితో కుడి చెవిపై కొట్టి తనను చంపుతామని బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారని తెలిపారు.నర్స వ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై వెల్లడించారు. -
కొత్త సర్పంచులు వీరే..
మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ బుధవారం ప్రశాంతంగా ముగిసింది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత కౌంటింగ్ నిర్వహించిన పోలింగ్ అధికారులు విజేతల వివరాలను ప్రకటించారు. ఆర్మూర్ డివిజన్ పరిధిలో 165 సర్పంచ్ స్థానాలు ఉండగా 19 ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 146 సర్పంచ్ స్థానాల్లో గెలుపొందిన వారి వివరాలు ఇలా ఉన్నాయి.. – సాక్షి నెట్వర్క్గడ్డం చిన్నయ్య గాదేపల్లి స్వతంత్రమూడ్ ప్రకాశ్ దత్తాపూర్ స్వతంత్రతొగరి గంగామణి గంగాసముందర్ స్వతంత్రబానోత్ అనిత నికాల్ పూర్ కాంగ్రెస్సంజీవ్ అన్నారం బీజేపీవేముల లక్ష్మి చిన్నయానం స్వతంత్రబైండ్ల అనిత డొంకేశ్వర్ స్వతంత్రఅల్లారి గంగాధర్ తొండాకూర్ స్వతంత్రగంగాధర్ మారంపల్లి బీజేపీబట్టు సంజీవ్రాజు జీజీ నడ్కుడ కాంరగ్రెస్రాజారెడ్డి నూత్పల్లి స్వతంత్రసుమలత కోమట్పల్లి స్వతంత్రఆర్మూర్ మండలం.. డొంకేశ్వర్ మండలం.. -
మీడియేషన్ సెంటర్ ప్రారంభం
బోధన్: బోధన్ కోర్టు ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన మధ్యవర్తిత్వ కేంద్రాన్ని ఐదో జిల్లా అదనపు న్యాయమూర్తి, న్యాయసేవా అధికార సంస్థ మండల చైర్పర్సన్ వరూధిని మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న సివిల్, క్రిమినల్ కేసులలో పరిష్కారానికి అవకాశం ఉన్న వాటిని సదరు కోర్టు మధ్యవర్తిత్వ కేంద్రానికి పంపుతుందన్నారు. కక్షిదారులు మధ్యవర్తిత్వ కేంద్రం సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కేంద్రం నిర్వహణ బాధ్యతలు న్యాయవాది ధర్మయ్యకు అప్పగించారు. కా ర్యక్రమంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎం.పూజిత, అదనపు జూనియర్ సివిల్ జడ్జి సాయిశివ, స్పెషల్ మెజిస్ట్రేట్ సెకండ్ క్లాస్ శేషతల్పసాయి, మధ్యవర్తిత్వ కేంద్రం న్యాయవాది ధర్మయ్య, అడిషనల్ గవర్నమెంట్ ప్లీడర్ మహ్మద్ గౌసోద్దీన్, అడిషనల్ పబ్లిక్ ప్యాసిక్యూటర్ శ్యాంరావు తదితరులు పాల్గొన్నారు. -
పోలింగ్ శాతం పెరిగేలా..
● మూడో విడత ఆర్మూర్ డివిజన్లో 3.14లక్షల మంది ఓటర్లు ● దాదాపు అందరికీ పోలింగ్ స్లిప్పులు పంపిణీ చేసిన అధికారులు మోర్తాడ్(బాల్కొండ): పంచాయతీ తుది విడత పోలింగ్కు ఓటర్లు పోటేత్తెలా అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటుంది. మొత్తం ఓటర్లకు పోలింగ్ స్లిప్పులను పంపిణీ చేస్తూ వారు స్వచ్ఛందంగా పోలింగ్ బూత్కు వచ్చి ఓటు వేసేలా బూత్ లెవల్ అధికారులు(బీఎల్వో) అవగాహన కల్పిస్తున్నారు. మొదటి విడతలో 81.37 శాతం పోలింగ్ నమోదు కాగా రెండో విడతలో కాస్తా తగ్గిపోయింది. ఈ విడతలో 76.71 శాతం మాత్రమే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మూడో విడతలో 85 శాతంకు పోలింగ్ శాతం మించిపోవాలని అధికారులు భావిస్తున్నారు. బాల్కొండ, ఆర్మూర్ నియోజకవర్గాలలోని వివిధ గ్రామాలలో 3,14,091 మంది ఓటర్లు ఉండగా దాదాపు అందరికీ పోలింగ్ స్లిప్పులను బీఎల్వోలు పంపిణీ చేశారు. పోలింగ్ సమయంలో ఓటర్లకు ఎలాంటి తికమక ఉండకుండా ఉండేందుకు పోలింగ్ బూత్ చిరునామా, ఓటరు సంఖ్య అన్ని ఉండేలా స్లిప్పులను ఎన్నికల సంఘం ముద్రించి బీఎల్వోలకు అందించింది. ఈ స్లిప్పులు ఉంటే ఓటర్లకు తాము ఎక్కడి పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకోవచ్చనే విషయం సులభంగా తెలుస్తుంది. వారం రోజుల నుంచి బీఎల్వోలు తమకు నిర్దేశించిన పోలింగ్ స్టేషన్ పరిధిలోని ఓటర్లకు స్లిప్పులను ఇంటింటికి వెళ్లి అందిస్తున్నారు. మంగళవారం కూడా పోలింగ్ స్లిప్పులను పంపిణీ చేశారు. బీఎల్వోలు పోలింగ్ స్టేషన్ల వద్ద ఓటర్లకు అందుబాటులో ఉండి సమాచారం కూడా ఇవ్వనున్నారు. పోలింగ్ స్లిప్పులను పంపిణీ చేయడం వల్ల ఓటర్లకు తమ బాధ్యతను గుర్తుచేసినట్లు ఉంటుందనే ఆలోచనలో ఎన్నికల సంఘం ఉంది. పంచాయతీ ఎన్నికల పోలింగ్ మధ్యాహ్నం 1గంటకే ముగిసిపోనుంది. అందుకే ఉదయం నుంచే పోలింగ్ శాతం పెరిగేలా ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలిరావాలని అధికార యంత్రాంగం సూచిస్తుంది. ఓటర్లు బద్దకం వీడీ పోలింగ్ స్టేషన్లకు ఎలా తరలివస్తారో బుధవారం వెల్లడికానుంది. -
నేడు పెన్షనర్స్ డే ముగింపు ఉత్సవాలు
నిజామాబాద్ రూరల్: నగరంలోని న్యూ అంబేడ్కర్ ఆడిటోరియంలో నేడు (బుధవారం) సాయంత్రం అఖిల భారతీయ పెన్షనర్స్ డే ముగింపు ఉత్సవాలు నిర్వహించనున్నట్లు జిల్లా ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు పండరినాథ్, జిల్లా ప్రధాన కార్యదర్శి గంగాకిషన్ ఒక ప్రకటనలో తెలిపారు. వేడుకలకు జిల్లాలోని రిటైర్ట్ ఎంప్లాయీస్ అందరూ కుటుంబసమేతంగా హాజరు కావాలని కోరారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ సలహాదారు సుదర్శన్రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్గౌడ్, కలెక్టర్ వినయ్కృష్ణరెడ్డితోపాటు ముఖ్య నేతలు హాజరు కానున్నట్లు తెలిపారు. కొనసాగుతున్న క్రీడాపోటీలు నగరంలోని ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం కార్యాలయంలో రిటైర్డ్ ఉద్యోగుల క్రీడాపోటీలు కొనసాగుతున్నాయి. క్యారమ్, పరుగుపందెం, టేబుల్ టెన్నీస్, షటిల్, మ్యూజిక్ చైర్, స్కిల్ గేం, చెస్, పాటల పోటీలు వంటి అంశాల్లో రిటైర్డ్ ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రపంచ తెలుగు కవుల సమ్మేళనానికి ప్రేమ్లాల్ నిజామాబాద్ రూరల్: తెలుగు భాష రక్షణ వేదిక మాజీ అధ్యక్షు డు పొట్లూరి హరికృష్ణ ఆధ్వర్యంలో ఈ నెల 27, 28 తేదీలలో విజయవాడలో నిర్వహించే ప్ర పంచ తెలుగు కవుల సమ్మేళనానికి జిల్లాకు చెందిన కవి,రచయిత ప్రేమ్లాల్కు ఆహ్వానం అందింది. ఈ సందర్భంగా ఆయనకు సాహితీ మిత్రులు, శ్రేయోభిలాషులు అభినందనలు తెలిపారు. నిజామాబాద్ లీగల్: నిజామాబాద్ అదనపు సీనియర్ సివిల్ కోర్టు జడ్జి సాయిసుధను నిజామాబాద్ సీనియర్ సివిల్ కోర్టు జడ్జిగా బదిలీ చేస్తు తెలంగాణ హైకోర్టు విజిలెన్స్ రిజిస్ట్రార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు సాయిసుధ ఈ పదవిలో ఇన్చార్జిగా సీనియర్ సివిల్ కోర్టు జడ్జిగా కొనసాగుతుండగా, ప్రస్తుతం ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జిగా ఉంటు అదనపు సీనియర్ సివిల్ కోర్టు ఇన్చార్జ్జ్ జడ్జిగా బాధ్యతలు నిర్వహిస్తారు. సాయిసుధ నిజామాబాద్ జిల్లా న్యాయసేవ సంస్థ ఇన్చార్జిగా సైతం బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం జిల్లా న్యాయసేవ సంస్థ కార్యదర్శి పోస్టు ఖాళీగా ఉంది. బాన్సువాడ రూరల్: పంచాయతీ ఎన్నికల నే పథ్యంలో మంగళవారం కలెక్టర్ ఆశిష్ సంగ్వా న్ బాన్సువాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ని డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సిబ్బంది ఎలాంటి గందరగోళానికి గురికాకుండా ఎన్నికల నిర్వహణకు అవసరమైన సామగ్రి తీసుకెళ్లాలన్నారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా వెంటనే అధికారుల దృష్టికి తేవాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లో అన్ని రకాల ఏర్పాట్లు సరిచూసుకోవాలని ఆర్వోలకు సూచించారు. తప్పనిసరిగా మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభించాలన్నారు. సబ్ కలెక్టర్ కిరణ్మయి ఉన్నారు. -
మధ్యాహ్న భోజన బియ్యంలో తరుగు!
● ఒక్కో బస్తాలో 7 నుంచి 8 కిలోలు తక్కువగా వస్తున్న వైనం ● హెడ్మాస్టర్ల ఆవేదన బోధన్: మధ్యాహ్న భోజనానికి సరఫరా అవుతోన్న సన్నబియ్యంలో తరుగు వస్తోంది. దీంతో ప్రధానోపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా రు. ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల విద్యార్థుల మ ధ్యాహ్న భోజనం కోసం ప్రభుత్వం సన్న బియ్యం నేరుగా సివిల్ సప్లయ్ గోదాముల నుంచి సరఫరా చేస్తోంది. పాఠశాల విద్యార్థుల సంఖ్య మేరకు 50 కిలోల సంచితో నెలకు సరిపడా 2 నుంచి 4 క్వింటాళ్ల మేరకు సన్నబియ్యం సరఫరా జరుగుతుంది. ప్రతినెల లారీల్లో బియ్యాన్ని పాఠశాలలకు చేర్చుతున్నారు. అయితే 50 కిలోల సంచికి 7 నుంచి 8 కి లోల వరకు తరుగు వస్తోందని పాఠశాలల హెచ్ ఎంలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం పట్టణ కేంద్రంలోని ఓ పాఠశాల హెచ్ఎం బియ్యం సంచిని తూకం వేయించగా అందులో 7 కిలోల 50 గ్రాములు తక్కువ వచ్చింది. మధ్యాహ్న భోజనం పథకం పక్కాగా అమలు చేయాలని ప్రభుత్వం ఆ బాధ్యతలను హెచ్ఎంలకు అప్పగించింది. కాగా, తరుగు విషయంలో గతంలో రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా బియ్యం తూకం వేసుకొని తీసుకోవాలని సూచించారని హెచ్ఎంలు అంటున్నారు. పాఠశాలలో బియ్యం తూకం వేసే మిషన్ లేకపోవడం గమనార్హం. బియ్యం తరుగుతో క్షేత్రస్థాయిలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొంటున్నారు. ఇప్పటికై నా అధికారులు బియ్యం తరుగు సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. -
ఎట్టకేలకు మంజూరైన నిధులు
● మాధవనగర్ ఆర్వోబీకి రూ.3కోట్లు కేటాయించిన ప్రభుత్వం ● పున:ప్రారంభమైన పనులు నిజామాబాద్ రూరల్: మండలంలోని మాధవనగర్ రైల్వే ఓవర్ బ్రిడి్జ్ పనులు నిధుల కొరతతో కొన్ని నెలలుగా నిలిచిపోగా, పెండింగ్ బకాయిలను ప్రభుత్వం విడుదల చేయడంతో ఎట్టకేలకు పనులు పున:ప్రారంభమయ్యాయి. దీంతో ప్రయాణికులు బ్రిడ్జి పనులు త్వరగా పూర్తికానున్నాయని హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత పది రోజులనుంచి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. మాధవగర్ ఆర్వోబీ పనులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి రూ.93.12 కోట్లు కేటాయించినట్లు అధికారులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తమ వాటా నిధులు మంజూరు చేయగా, రాష్ట్ర ప్రభుత్వం తమ వాటా నిధులను పెండింగ్లో ఉంచింది. దీంతో పనులు అసంపూర్తిగా ఆగిపోయాయి. దీంతో ఇటీవల ఎంపీ అర్వింద్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు కులాచారి దినేష్ మాధవనగర్ ఆర్వోబీని సందర్శించి పనులు నిలిచిపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడంతో పనులు ఆలస్యంగా కొనసాగుతున్నాయని, నిధుల విడుదల కోసం ఆందోళనలు చేపడతామని అన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఇటీవల రూ. 3కోట్ల నిధులను విడుదల చేసింది. నిధులు రావడంతో అధికారులు పనులను ప్రారంభించి, శరవేగంగా చేపడుతున్నారు. రోడ్డుకు ఇరువైపులా గుంతలు తీసీ ఆర్వోబీ బ్రిడ్జి వద్ద ఫ్లోరింగ్ పనులు కొనసాగుతున్నాయి. ఆర్వోబీ పనుల్లో రైల్వే ట్రాక్ పైనుంచి వంతెన వేయడమే కీలకం. ఈ పనిని అధికారులు ప్రధానమైనదిగా తీసుకుంటున్నారు. హైవోల్టేజీ కరెంట్ తీగలు, ఫిల్లర్ల మార్కింగ్, వంటి సమస్మాత్మక పనులు అధికారులకు కీలకంగా మారనున్నాయి. దీనికితోడు వంతెనపై పెట్టే రెండు ఆర్చ్లు ఇప్పటికే సిద్దంగా ఉన్నాయి. వచ్చే సంవత్సరం నాటికై నా పనులు పూర్తయితే రాకపోకలకు ఇబ్బందులు తప్పుతాయని వాహనదారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. త్వరగా పూర్తి చేయాలి.. మాధవనగర్ వద్ద ఆర్వోబీ పనులు త్వరగా పూర్తి చేయాలి. ఇప్పటికే అసంపూర్తి పనులతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆర్వోబీ వద్ద సరైన లైటింగ్ లేక రాత్రివేళలో రోడ్డు ఎక్కడుందో తెలియక వాహనదారులు అయోమయానికి గురవుతున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి పనులను త్వరగా పూర్తిచేయాలి. –దండు సంజీవ్, బర్ధిపూర్ -
జంగంపల్లిలో వివాహిత ఆత్మహత్య
భిక్కనూరు: మండలంలోని జంగంపల్లి గ్రామంలో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడినట్లు భిక్కనూరు ఎస్సై అంజనేయులు తెలిపారు. వివరాలు ఇలా.. జంగంపల్లి గ్రామానికి చెందిన జంగం మహేశ్వరీ (30) ఐకేపీలో సీఏగా పనిచేస్తోంది. మంగళవారం మధ్యాహ్నం ఆమె ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె గత కొన్ని రోజులుగా మెడ నొప్పితో బాధపడుతోంది. అలాగే ఇటీవల ఒక ఇంటిని కొనుగోలు చేశారు. దీంతో వీరికి కొద్దిగా అప్పులు అయ్యాయి. అట్టి విషయాన్ని మనసులో పెట్టుకుని బాధపడుతుండేదని కుటుంబీకులు తెలిపారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని ధర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై వివరించారు. ధర్పల్లి: ఉపాధి కోసం విదేశాలకు వెళ్లి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి మృతదేహం మంగళవారం స్వగ్రామానికి చేరుకుంది. వివరాలు ఇలా.. ధర్పల్లి మండల కేంద్రానికి చెందిన మచ్చ రవి (45) గత కొన్నేళ్లుగా ఉపాధి నిమిత్తం సౌదీ అరేబియాకు వెళ్తున్నాడు. నెల రోజుల క్రితం సౌదీ అరేబియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో అతడు మృతి చెందాడు. నెల రోజుల తర్వాత మంగళవారం అతడి మృతదేహం స్వగ్రామానికి చేరుకుంది. మృతదేహాన్ని చూసిన కుటుంబీకులు, గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు. అంత్యక్రియల్లో ప్రజలు పాల్గొని రవికి కన్నీటి వీడ్కోలు పలికారు. హైబీపీతో మృతుడి బంధువు.. రవి మృతదేహం వస్తుందనడంతో కుటుంబీకులు ఇంట్లో రోధిస్తుండగా మృతుడి నడ్పి నాన్న మచ్చ రమేష్(60) హైబీపీకి గురయ్యాడు. వెంటనే కుటుంబీకులు అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించి అతడు చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఒకే కుటుంబంలోని ఇద్దరు మృతిచెందడంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. -
ప్రజలకు సమస్యలు రాకుండా చూడాలి
● బోధన్లో పారిశుధ్య పనులు పకడ్బందీగా నిర్వహించాలి ● ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి బోధన్టౌన్(బోధన్): పట్టణ ప్రజలకు ఎలాంటి సమస్యలు రాకుండా చూడాలని బోధన్ ఎమ్మెల్యే, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్రెడ్డి అన్నారు. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆవరణలో మంగళవారం నూతనంగా కొనుగోలు చేసిన 15 చెత్త సేకరణ ఆటోలకు పూజలు చేసి ప్రారంభించారు. అనంతరం సుదర్శన్రెడ్డి మాట్లాడుతూ.. ప ట్టణంలో పారిశుధ్య పనుల్లో ఇబ్బందులు తలెత్త కుండా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. పారిశుధ్య కార్మికులకు ఇందిరమ్మ ఇళ్లు ఇ చ్చేలా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. ప్రజ లు పన్నులను సకాలంలో చెల్లించి పట్టణ అభివృద్ధికి సహకరించాలన్నారు. బల్దియాకు నూతన భవ న నిర్మాణాన్ని త్వరలో నిర్మిస్తామన్నారు. అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అధ్యాపకులను నియమించాలని విద్యార్థులు, ప్రిన్సిపల్ కౌసర్ ఆయనకు విన్నవించారు. బోధన్లోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిని పరిశీలించి, డయాలసీస్ రోగులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామన్నారు. మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, కో అపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్రెడ్డి, మహిపాల్ రెడ్డి, తూము శరత్రెడ్డి, పాషా, నాగేశ్వరరావు, నరేందర్ రెడ్డి, శ్రీకాంత్ గౌడ్, మీర్ నజీర్ అలీ, ప్రమోద్ చిన్న, విష్ణు వర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నందిపేటకు చేరుకున్న గోదావరి పరిక్రమ
● సాధుసంతులకు ఘన సన్మానం ● భక్తిశ్రద్ధలతో కన్యాపూజలు నందిపేట్(ఆర్మూర్): ఉత్తర్ప్రదేశ్లోని మలూక్ పీఠాధిపతి రాజేంద్రనాథ్ దాస్జీ 500 మంది సాధుసంతులతో కలిసి చేపట్టిన పవిత్ర గోదావరి పరిక్రమ యాత్ర నందిపేటకు చేరుకుంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పీఠాధిపతులు, సాధుసంతులు కేదారేశ్వర ఆశ్రమంలో నిర్వహించిన కన్యాపూజలో పాల్గొన్నారు. ఆశ్రమ పీఠాధిపతి కేదారానంద స్వామి రాజేంద్రనాథ్ దాస్జీకి పాదపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా రాజేంద్రనాథ్దాస్ జీ భక్తులనుద్దేశించి మాట్లాడుతూ.. పరిక్రమ యాత్ర అంటే ఒక పవ్రితమైన ప్రదేశం (నది, పర్వతం, ఆలయం) చుట్టూ ప్రదక్షిణ చేసే ఆధ్యాత్మిక యాత్ర అని అన్నారు. సనాతన ధర్మ పరిరక్షణ, గో రక్షణ, హిందూధర్మ ప్రచారం యాత్ర ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఈ నెల 20వ తేదీన పరిక్రమ యాత్ర తిరిగి నాసిక్కు చేరుకుంటుందని, యజ్ఞంతో యాత్రను సంపూర్ణం చేస్తామన్నారు. కేదారేశ్వర ఆశ్రమ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం చేశారు. -
క్రైం కార్నర్
కరెంట్ షాక్తో మహిళ మృతి వేల్పూర్: వేల్పూర్ మండలం లక్కోర గ్రామ సమీపంలో కరెంటు షాక్తో ఓ మహిళ మృతిచెందింది. వేల్పూర్ ఎస్సై సంజీవ్ తెలిపిన వివరాలు ఇలా.. భీమ్గల్ మండలం సంతోష్నగర్కు చెందిన పాల్థియప్పి అంబి(58) అనే మహిళ లక్కోర పెట్రోలు పంపు వద్ద కూలీపని చేసుకుంటూ జీవించేది. ఈక్రమంలో మంగళవారం పనిలో భాగంగా చెత్తను పెట్రోలు పంపు వెనుక భాగంలో పారవేయడానికి వెళ్లింది. సమీపంలో కరెంటు వైర్లు తెగిపడి ఉండటంతో ఆమెకు ప్రమాదవశాత్తు కరెంటు షాక్ తగిలి అక్కడికక్కడే మృతిచెందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. కామారెడ్డిలో వృద్ధురాలు ..కామారెడ్డి క్రైం: పట్టణంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి గేటు వద్ద ఓ వృద్ధురాలు మృతిచెందింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రి గేటు వద్ద మంగళవారం ఓ వృద్ధురాలు పడి ఉండటంతో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే వారు ఆస్పత్రి వద్దకు చేరుకొని వృద్ధురాలిని ఆస్పత్రికి తీసుకెళ్లగా, వైద్యులు పరీక్షించి మృతిచెందినట్లు ధ్రువీకరించారు. మొదట ఆమెను గుర్తుతెలియని వృద్ధురాలిగా భావించారు. మృతురాలి వద్ద లభించిన ఆధార్ కార్డు ద్వారా ఆమె ఇందిరానగర్ కాలనీకి చెందిన గుంటి గంగవ్వ (65)గా గుర్తించారు. అనారోగ్య కారణాలతో మృతి చెంది ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై పట్టణ పోలీసులు విచారణ జరుపుతున్నారు. నస్రుల్లాబాద్: మండలంలోని కామిశెట్టిపల్లి గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు గాయపడ్డారు. వివరాలు ఇలా.. కామిశెట్టిపల్లి గ్రామానికి చెందిన మన్నె నాగరాజు మంగళవారం నస్రుల్లాబాద్ నుంచి స్వగ్రామానికి సైకిల్పై బయలుదేరాడు. గ్రామ శివారులో డీసీఎం వాహనం ఎదురుగా వచ్చి అతడిని ఢీకొట్టింది. ఈ ఘటనలో అతడు తీవ్రంగా గాయపడగా, సదరు వాహన డ్రైవర్ తనను పక్కకు పడేసి పారిపోయాడని బాధితుడు పేర్కొన్నాడు. స్థానికులు బాధితుడిని గుర్తించి చికిత్స నిమిత్తం బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి నిజామాబాద్కు తరలించారు. -
మోర్తాడ్ ఫలితంపై సర్వత్రా ఉత్కంఠ!
మోర్తాడ్: మోర్తాడ్లో గతంలో సర్పంచ్ స్థానానికి పోటీ చేసిన అభ్యర్థులకు ఇక్కడి ఓటర్లు భారీ మెజార్టీతో విజయం కట్టబెట్టారు. ఈక్రమంలో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో ఓటర్లు ఎలాంటి తీర్పు ఇవ్వనున్నారోనని ఉత్కంఠ నెలకొంది. నేడు జరుగనున్న పోలింగ్లో ఓటర్లు గతంలో లాగే ఏకపక్ష తీర్పును ఇస్తారా లేక భిన్నమైన తీర్పును ఇస్తారోననే అంశంపై సర్వత్రా చర్చ జరుగుతుంది. 2006లో జరిగిన ఎన్నికల్లో గోపిడి సత్యనారాయణపై అజీస్ వెయ్యికి పైగా ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అప్పట్లో ఇక్కడ లభించిన మెజార్టీ జిల్లాలో మొదటి స్థానంలో నిలిచింది. 2013 ఎన్నికల్లో అజీస్పై దడివె నవీన్ 2,300 ఓట్ల మెజార్టీతో విజయం సాధించి సరికొత్త రికార్డు సృష్టించారు. జిల్లాలో అత్యధిక మెజార్టీ సాధించిన సర్పంచ్గా రికార్డు నెలకొల్పారు. 2019 ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి పాపాయి నర్సుపై భోగ ధరణి 1033 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో వచ్చిన మెజార్టీ జిల్లాలో రెండో స్థానంలో నిలచింది. ఇప్పుడు సాగుతున్న పోరులో నలుగురు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ మద్దతుతో గిర్మాజి గోపి, బీఆర్ఎస్ మద్దతుతో భోగ ఆనంద్, మాజీ సర్పంచ్ అజీస్, బీజేపీ మద్దతుతో గట్ల సురేష్ పోటీలో నిలిచారు. అజీస్ బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నా ఆ పార్టీ నాయకులు మాత్రం ఆనంద్కే మద్దతుగా నిలిచారు. చతుర్ముక పోటీలో విజయం సాధించే అభ్యర్థి గతంలో లాగా భారీ మెజార్టీ దక్కించుకుంటారా లేక స్వల్ప ఓట్లతోనే విజయం సాధిస్తారా అనే అంశంపై గ్రామస్తులు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. మోర్తాడ్లో ప్రస్తుతం 9వేలకు పైగా ఓటర్లు ఉన్నారు. ఈక్రమంలో ఓటర్లు గతంలో లాగా ఏకపక్ష తీర్పు ఇస్తారో లేక భిన్నమైన ఫలితాలు వెల్లడిస్తారో మరికొన్ని గంటల్లో తేలనుంది. గత ఎన్నికల్లో భారీ మెజార్టీ సాధించిన విజేతలు జిల్లాలో మొదటి, రెండో స్థానాల్లో సర్పంచ్ల మెజార్టీ ఈసారి పోటీ తీవ్రం కావడంతో మెజార్టీపై ఆసక్తికరమైన చర్చ -
20న జీపీల తొలి సమావేశం
సుభాష్నగర్: జిల్లాలో నూతనంగా ఎన్నికై న సర్పంచ్లు, పాలకవర్గాల తొలి సమావేశాన్ని ఈనెల 20వ తేదీన నిర్వహించాలని డీపీవో శ్రీనివాస్రావు మంగళవారం ఒక ప్రకటనలో ఆదేశించారు. ముందుగా సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారం, బాధ్యతల స్వీకరణ కార్యక్రమాన్ని నిర్వహించాలని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని ఎంపీడీవో, ఎంపీవో, పంచాయతీ కార్యదర్శులను డీపీవో ఆదేశించారు. మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి తెయూ(డిచ్పల్లి): మాదకద్రవ్యాలు, మత్తుపదార్థాలకు విద్యార్థులు దూరంగా ఉండాలని తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ టీ యాదగిరిరావు సూచించారు. మాదకద్రవ్యాల నియంత్రణపై అవగాహన కల్పి స్తూ రూపొందించిన వాల్ పోస్టర్లను రిజిస్ట్రార్ ఎం యాదగిరితో కలిసి వీసీ తన చాంబర్లో మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాదకద్రవ్యాలపై సీఎం రేవంత్రెడ్డి చాలా సీరియస్గా ఉన్నారన్నారు. మాదకద్రవ్యాల కారణంగా తలెత్తే అనర్థాలపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు సదస్సులు నిర్వహించాలని సూచించారు. యూనివర్సిటీ క్యాంపస్లోని బాలుర, బాలికల హాస్టళ్ల గో డలపై వాల్పోస్టర్లను అతికించాలని ఆదేశించారు. కార్యక్రమంలో చీఫ్ వార్డెన్ కే.రవీందర్ రెడ్డి, ఎన్ఎస్ఎస్ కో ఆర్డినేటర్ అపర్ణ, కంట్రోలర్ కే సంపత్కుమార్, వార్డెన్లు కిరణ్రాథోడ్, జోత్స్న, హెల్త్ సెంటర్ ఇన్చార్జి డాక్టర్ గోపిరాజు తదితరులు పాల్గొన్నారు. సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ వాలీబాల్ పోటీలకు ఎంపిక జక్రాన్పల్లి: సౌత్ జోన్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ వాలీబాల్ పోటీలకు మండలంలోని కలిగోట్లోని జెడ్పీ హై స్కూల్ పాఠశాల పూర్వ విద్యార్థి భవ్య శ్రీ ఎంపికై నట్లు ప్రధానోపాధ్యాయుడు పురుషోత్తమాచారి, వ్యాయామ ఉపాధ్యాయుడు యాదగిరి బుధవారం తెలిపారు. తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లా ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఈ నెల 17 నుంచి 19 తేదీ వరకు నిర్వహించే పోటీల్లో పాల్గొననున్న భవ్యశ్రీని వీడీసీ సభ్యులు, ఉపాధ్యాయులు అభినందించారు. -
పోలీసుల అదుపులో మావోయిస్టు నేత!
● డివిజినల్ కమిటీ మెంబర్ హోదాలో పనిచేస్తున్న ఎర్రగొల్ల రవి ● రూ.5 లక్షల రివార్డు సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : రెండున్నర దశాబ్దాలుగా అజ్ఞాతంలో ఉన్న జిల్లాకు చెందిన మావోయిస్టు నేత ఎర్రగొల్ల రవి అలియాస్ సంతోష్ సోమవారం రాత్రి పోలీసులకు చిక్కినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పాల్వంచ మండలం ఆరెపల్లి గ్రామానికి చెందిన ఎర్రగొల్ల రామయ్య, భూమవ్వల కుమారుడైన ఎర్రగొల్ల రవి 2001 లో కామారెడ్డిలో ఇంటర్మీడియట్ చదువుతున్న సమయంలో అప్పటి పీపుల్స్వార్లో చేరి అజ్ఞాతంలోకి వెళ్లాడు. కొడుకుకోసం తల్లి భూమవ్వ ఎంతగానో తపించింది. లొంగిపోవాలని కొడుకును కోరి న ఆమె తన కోరిక తీరకుండానే ఇటీవల అనారోగ్యంతో మృతిచెందింది. ఎర్రగొల్ల రవి అలియాస్ సంతోష్పై రూ.5 లక్షల రివార్డు ఉందని పోలీ సు వర్గాలు తెలిపాయి. కాగా కామారెడ్డి జిల్లా నుంచి ఇస్రోజీవాడి గ్రామానికి చెందిన లోకేటి చందర్ అలి యాస్ స్వామి అలియాస్ ప్రభాకర్ దండకారణ్యంలో వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో కార్యదర్శిగా పనిచేస్తున్నాడు. -
పోలింగ్ పకడ్బందీగా నిర్వహించాలి
● కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ● ఆర్మూర్, ఆలూర్లో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల సందర్శనఆర్మూర్: మూడో విడత పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఎన్నికల సిబ్బందికి సూచించారు. ఆర్మూర్, ఆలూర్ మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ సామగ్రి డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను మంగళవారం ఆయన సందర్శించారు. కేంద్రాలలో అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. గందరగోళానికి తావులేకుండా సిబ్బందికి పోలింగ్ సామగ్రిని అందించాలని, చెక్లిస్టు ఆధారంగా సామగ్రిని జాగ్రత్తగా పరిశీలించుకోవాలని కలెక్టర్ హితవు పలికా రు. సకాలంలో నిర్దేశిత పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది చేరుకునేలా పర్యవేక్షణ జరపాలని అధికారులను ఆదేశించారు. పోలింగ్ సామగ్రి, ప్రత్యేకించి బ్యాలెట్ పేపర్లు తరలించే సమయంలో తప్పనిసరిగా సాయుధ పోలీసులతో కూడిన బందోబస్తు ఉండాలని అన్నారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తి నా వెంటనే తమ దృష్టికి తేవాలని ఆర్వోలకు సూ చించారు. ఎన్నికల సాధారణ పరిశీలకులు శ్యాంప్రసాద్ లాల్ కలెక్టర్తో కలిసి ఆలూర్, నందిపేట, డొంకేశ్వర్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ సామగ్రి పంపిణీ తీరును పరిశీలించారు. వీరి వెంట ఆర్మూర్, ఆలూర్ తహసీల్దార్లు సత్యనారాయణ, రమేశ్, ఎంపీడీవోలు బీ.శివాజీ, గంగాధర్, డీఎల్పీవో శివకృష్ణ, ఎంఈవో రాజగంగారాం తదితరులున్నారు. -
మద్యం.. మాంసం.. నగదు
● గత పదిరోజులుగా దావత్లు.. పలువిడతల్లో ఇంటింటికీ మాంసం ● చివరిరోజు ఓటర్లకు పోటాపోటీగా డబ్బుల పంపిణీసాక్షి ప్రతినిధి, నిజామాబాద్: రాజకీయంగా చైతన్యవంతమైన పసుపు నేల ఆర్మూర్ డివిజన్లో గ్రామ పంచాయతీ ఎన్నికల తుదివిడత పోలింగ్ బుధవా రం జరగనుంది. మొదటి రెండు విడతలతో పోలి స్తే ఈ విడతలో ఏకగ్రీవాల సంఖ్య తక్కువగా ఉంది. దీన్నిబట్టే డివిజన్లో ఎన్నికల వాతావరణం ఎ లా ఉందో అంచనా వేయొచ్చు. మొదటి విడతలో జిల్లావ్యాప్తంగా 29, రెండో విడతలో 38 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం కాగా మూడో విడతలో మాత్రం కేవలం 19 పంచాయతీ సర్పంచ్లు మాత్రమే ఏకగ్రీవమయ్యాయి. ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాల్లో వీడీసీల ప్రాబల్యం ఎక్కువగా ఉన్నప్పటికీ అధికారులు దృష్టి పెట్టడంతో వేలంపాటలు కొంతమేరకు తగ్గాయి. ఏకగ్రీవాల్లో అత్యధికం అధికార కాంగ్రెస్ పార్టీ ఖాతాలోకే వెళ్లాయి. మొదటి రెండు విడతల్లో పోలింగ్ జరిగిన చాలా చోట్ల కాంగ్రెస్ మ ద్దతుదారులు ఇద్దరు, ముగ్గురు సైతం సర్పంచ్ పదవికి పోటీ చేసిన పంచాయతీలు గణనీయంగానే ఉన్నాయి. అయినప్పటికీ కాంగ్రెస్ మద్దుతుదారులే ఎక్కువగా గెలుపొందారు. ఇదిలా ఉండగా తుది విడత పోలింగ్ జరగ నున్న ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాల్లో నోటి ఫికేషన్ వెలువడిన నాటి నుంచి మద్యం విచ్చలవిడిగా ప్రవహించింది. అభ్యర్థులు కులసంఘాల వా రీగా, గ్రూపుల వారీగా మద్యం సరఫరా చేశారు. దీంతో ప్రతిరోజూ దావత్లు జరిగాయి. అదేవిధంగా గత వారంరోజులుగా చాలా గ్రామాల్లో ఇంటింటికీ మాంసం ప్యాకెట్లు సరఫరా చేశారు. చివరి రో జైన మంగళవారం ఆయా గ్రామాల్లో పోటీని బట్టి నగదు పంపిణీ చేశారు. ఎట్టిపరిస్థితుల్లో గెలిచేందుకు అభ్యర్థులు బాగా ఖర్చు చేస్తున్నారు. గ్రామంలో ఆధిపత్యం కోసం ఎదురు చూసే కొందరు నాయకులు, ఎన్ఆర్ఐలు సైతం అభ్యర్థుల కోసం భారీగా ఖర్చు పెట్టారు. మరోవైపు రిజర్వ్డ్ సీట్లలోనూ ముఖ్య నాయకులు భారీగా ఖర్చు చేశారు. అంకాపూర్కే పరిమితమైన ఎమ్మెల్యే రాకేశ్రెడ్డి మొదటి రెండు విడతల్లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ మద్దతుదారులు సైతం గట్టిగా పోటీ ఇచ్చారు. చెప్పుకోదగిన స్థాయిలో పంచాయతీలు గెలుచుకున్నారు. కీలకమైన ఎడపల్లి, పొతంగల్, మోస్రా, మోపాల్ మండల కేంద్రాలతోపాటు మరికొన్ని మేజర్ పంచాయతీలను బీజేపీ మద్దతుదారులు గెలుచుకున్నారు. అయితే బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేశ్రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న ఆర్మూర్ నియోజకవర్గంలో మొదటి రెండు విడతలకు మించి బీజేపీ మద్దతుదారులు గెలుచుకుంటారా లే దా అనే విషయమై జిల్లాలో చర్చ జరుగుతోంది. అయితే ఎమ్మెల్యే రాకేశ్రెడ్డి మాత్రం తన సొంత గ్రామమైన అంకాపూర్ను దాటి రాలే దు. ఎమ్మెల్యే తమకు సహకరించడంలేదని బీజేపీ అభ్యుర్థులు, కార్యకర్తలు పలుచోట్ల ఆవేదన వ్యక్తం చేయడం గమనార్హం. అయితే అంకాపూర్లోనైనా సరే బీజేపీ మద్దతుదారును గెలిపించుకుంటారా లేదా అనేది వేచిచూడాలని పలువురు అంటున్నారు. ఇందుకోసం మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే. -
‘అర్బన్’ను ఆదర్శంగా తీర్చిదిద్దాలి
సుభాష్నగర్ : అభివృద్ధిలో నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దాలని ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ అన్నారు. నగరంలో చేపడుతున్న అభివద్ధి పనులు, టీయూఎఫ్ఐడీసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న పనుల పురోగతిపై సంబంధిత శాఖల అధికారులతో నగరంలోని క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే మంగళవా రం సమీక్షించారు. రహదారుల అభివృద్ధి, డ్రె యినేజీ వ్యవస్థ, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య పనులు, టీయూఎఫ్ఐడీసీ ద్వారా చేపడుతున్న పనుల నాణ్యత, పెండింగ్లో ఉన్న ప్రాజెక్టుల పురోగతిని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గాన్ని అభివృద్ధి లో రాష్ట్రంలోనే నంబర్ వన్గా తీర్చిదిద్దే బా ధ్యత ప్రతి ఒక్క అధికారిదని పేర్కొన్నారు. నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి ఇబ్బందు లు కలగకుండా, అభివద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. సమావేశంలో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ దిలీప్కుమార్, మున్సిపల్ ఈఈ సుదర్శన్ రెడ్డి, రోడ్లు భవనాల శాఖ డీఈ ప్రవీణ్, పబ్లిక్ హెల్త్ డీఈ నాగేశ్రెడ్డి, పబ్లిక్ హెల్త్ ఏఈ శివకృష్ణ, మున్సిపల్, ఆర్ అండ్ బి, పబ్లిక్ హెల్త్ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
పెద్దపులి జన్నారం నుంచే వచ్చింది
భిక్కనూరు: మంచిర్యాల జిల్లా జన్నారం అటవీ ప్రాంతం నుంచి రెండు నెలల క్రితం తప్పించుకుని వచ్చిన పెద్దపులి కామారెడ్డి జిల్లాలో సంచరిస్తోందని జిల్లా అటవీ అధికారి నిఖిత తెలిపారు. ఆమె మంగళవారం భిక్కనూరు మండలం పెద్దమల్లారెడ్డిలో పులి దాడిలో మృతి చెందిన ఆవు కళేబరాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జన్నారం నుంచి వచ్చిన పెద్దపులి భిక్కనూ రు, దోమకొండ, బీబీపేట, మాచారెడ్డి మండలాల్లో తిరుగుతోందన్నారు. పులిని వెతికేందుకు అటవీశాఖకు చెందిన నలుగురు ట్రాకర్స్ వచ్చారని, వారితోపాటు జిల్లా అటవీశాఖ అధికారులు, సిబ్బంది తీ వ్రంగా గాలిస్తున్నారన్నారు. ప్రజలు అత్యవసర ప రిస్థితుల్లో టార్చిలైట్తోపాటు శబ్దం చేస్తూ వెళ్లాలని సూ చించారు. రాత్రి వేళల్లో గ్రామ శివారులో మంటలు వెలిగించడం, దీపాలు పెడితే పులి గ్రామాల్లోకి రాదన్నారు. కుక్కలు అసహజంగా అరిస్తే నిర్లక్ష్యం చేయకుండా అప్రమత్తం కావాలన్నారు. పులి అడు గుజాడలు కనిపిస్తే ఫొటోలు తీయడానికి, వాటిని చూడడానికి వెళ్లవద్దన్నారు. ఆమె వెంట ఎఫ్డీవో రామకృష్ణ, ఎఫ్ఆర్వో రామకృష్ణ, డీఎఫ్ఆర్వో శ్రీధర్, సెక్షన్ అధికారులు సయ్యద్ బాబా, మోబేషర్ అలీ, బీట్ అధికారులు సురేశ్, దీపిక, పెద్దమల్లారెడ్డి సర్పంచ్ సాయగౌడ్ ఉన్నారు. గ్రామాల్లో చాటింపు దోమకొండ: మండల కేంద్రంనుంచి అంబారిపేట గ్రామానికి వెళ్లే దారిలో ఇటుకబట్టి వద్ద రైతు కొ మ్మాటి శ్రీనివాస్కు చెందిన బర్రెను మంగళవారం తెల్లవారుజామున పులి చంపివేసింది. సంఘమేశ్వర్ గ్రామ శివారులో రైతు గంప నారాయణకు చెందిన ఆవునూ చంపేసింది. అంబారిపేటలో బర్రెను చంపిన స్థలాన్ని జిల్లా అటవీ అధికారి నిఖిత, డివిజనల్ పారెస్ట్ అధికారి రామకృష్ణ, పశుసంవర్ధక శా ఖ అఽధికారి శివకుమార్ తదితరులు పరిశీలించారు. మాచారెడ్డి మండలం ఫరీద్పేట, దోమకొండ మండలం అంబారిపేట, గొట్టిముక్కుల, బీబీపేట మండలం మందాపూర్ ప్రాంతాల్లో ఎడ్లకట్ట వాగు పరిసరాల్లో పులి సంచరిస్తున్నట్లు గుర్తించామని వారు తెలిపారు. అంబారిపేట, సంఘమేశ్వర్ శివార్లలో ప శువులపై దాడి చేసిన పెద్దపులి చుక్కాపూర్, మాచారెడ్డి అటవీ ప్రాంతం వైపు వెళ్లిందని గుర్తించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఫారెస్ట్ బీట్ అధికారులు పద్మ, పారూఖ్, సర్పంచులు అరుట్ల కవిత, లోయపల్లి శ్రీనివాస్రావు అధికారుల వెంట ఉన్నారు. -
నేడే తుది పోరు
● మూడో విడత గ్రామ పంచాయతీ పోలింగ్కు ఏర్పాట్లు పూర్తి ● ఆర్మూర్ డివిజన్లోని 12 మండలాల్లో 1502 పోలింగ్ కేంద్రాలు పోలింగ్ సిబ్బందిపోలింగ్ సమయం : ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కౌంటింగ్ : మధ్యాహ్నం రెండు గంటల నుంచినందిపేట నుంచి పోలింగ్ విధులకు సామగ్రితో వెళుతున్న సిబ్బందిమండలం పోలింగ్ కేంద్రాలు ఆర్వోలు పీవోలు ఓపీవోలు ఇతర సిబ్బంది మొత్తం ఆర్మూర్ 142 15 165 271 00 451 ఆలూర్ 91 12 146 91 15 264 నందిపేట 212 24 255 301 208 783 డొంకేశ్వర్ 110 14 95 74 20 203 బాల్కొండ 116 11 140 220 173 544 ముప్కాల్ 74 08 74 113 163 358 మెండోర 110 11 133 154 25 333 వేల్పూర్ 144 18 144 234 262 658 భీమ్గల్ 218 25 262 308 15 610 మోర్తాడ్ 98 10 98 176 46 330 ఏర్గట్ల 54 05 66 94 35 200 కమ్మర్పల్లి 132 14 159 271 102 546 మొత్తం 1,501 167 1,737 2,317 1,064 5,285 -
పోలింగ్కు పటిష్ట బందోబస్తు
● పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ● ఆర్మూర్ ఏసీపీ జే వెంకటేశ్వర్రెడ్డి ఆర్మూర్: మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరగనున్న గ్రామాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని ఆర్మూర్ ఏసీపీ జే వెంకటేశ్వర్రెడ్డి తెలిపారు. పట్టణంలోని ఏర్పాటు చేసి పోలింగ్ సామగ్రి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఆవరణలో డివిజన్ పరిధిలోని పోలీసు అధికారులతో ఏసీపీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. ఎన్నికల నేపథ్యంలో అవాంచనీయ సంఘటనలు జరగకుండా సీపీ సాయిచైతన్య ఆదేశాల మేరకు చర్యలు చేపట్టామన్నారు. జిల్లా సరిహద్దుల్లోని పొతంగల్, సాలూర , ఖండ్గావ్లో మూడు చెక్ పోస్టులను ఏర్పాటు చేసి 24 గంటలు వాహనాల తనిఖీ నిర్వహిస్తున్నామని తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పటిష్టమైన నిఘా వ్యవస్థ ఏర్పాట్లు చేశామన్నారు. 24 ఎఫ్ఎస్టీ టీమ్స్తోపాటు నాలుగు ఎస్ఎస్టీ టీములను సైతం ఏర్పాటు చేసి బందోబస్తు నిర్వహిస్తున్నామన్నారు. ఇప్పటికే 100.24 లీటర్ల లిక్కర్ను, రూ.77,447 నగదును సీజ్ చేసి ఆరు కేసులు నమోదు చేసినట్లు వివరించారు. ఎలక్షన్ కోడ్ను ఉల్లంఘించినందుకు కమ్మర్పల్లి, నందిపేట్లో రెండు కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు భారతీయ న్యాయ సంహిత 163 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. ఐదుగురికంటే ఎక్కువ మంది గుమి గూడితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో ఆర్మూర్ రూరల్, భీమ్గల్ సీఐలు కే. శ్రీధర్రెడ్డి, సత్యనారాయణగౌడ్, బాల్కొండ, నందిపేట్, వేల్పూర్, ముప్కాల్, మెండోర, భీమ్గల్, మోర్తాడ్, కమ్మర్పల్లి, ఏర్గట్ల, మాక్లూర్ ఎస్సైలు శైలేందర్, శ్యామ్రాజ్, సంజీవ్, కిరణ్పాల్, సుహాసిని, సందీప్, రాము, అనిల్రెడ్డి, రాజేశ్వర్, రాజశేఖర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 60 సమస్యాత్మక ప్రాంతాలు నిజామాబాద్ అర్బన్: పోలింగ్ జరిగే గ్రామాల్లో 1100 మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు సీపీ సాయిచైతన్య తెలిపారు. 60 సమస్యాత్మక ప్రాంతాల్లో నిఘా వ్యవస్థ ఏర్పాటు చేశామన్నారు. 194 మందిని తహసీల్దార్ల ఎదుట బైండోవర్ చేశామని, 18 గన్లైసెన్సులు ఉండగా, 11 మందితో డిపాజిట్ చేయించామని తెలిపారు. అనుమతి లేకుండా ర్యాలీలు నిర్వహించొద్దని, నిబంధనలను ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. -
నిజామాబాద్: ఇందల్వాయిలో కాల్పుల కలకలం
నిజామాబాద్: జిల్లాలోని ఇందల్వాయిలో కాల్పుల కలకలం చోటు చేసుకుంది. పాతకక్షల కారణమా.. లేక వేరే ఏ కారణాలో కానీ లారీడ్రైవర్ సల్మాన్పై కొంతమంది దుండగులు కాల్పులకు దిగారు. ఈ ఘటనలో లారీ డ్రైవర్ సల్మాన్ మృతిచెందాడు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉండగా, కాల్పుల కలకలం అనేది తెలుగు రాష్ట్రాల్లోని జిల్లాల్లో కూడా చోటు చేసుకోవడం ఆందోళన రేకెత్తిస్తోంది. -
ఘనంగా ఫ్రెషర్స్ డే
రుద్రూర్: మండలంలోని ఆహార శాస్త్ర సాంకేతిక (ఫుడ్ సైన్స్ టెక్నాలజీ కాలేజీ) కళాశాలలో సోమవారం ఫ్రెషర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఆట పాటలతో సందడి చేశారు. ఈ సందర్భంగా కళాశాల అసోసియేట్ డీన్ కె. వెంకట్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి క్రమ శిక్షణతో మెలగాలని, లక్ష్యాన్ని నిర్దేశించుకొని సాధించుకోవాలని సూచించారు. వరి పరిశోధన సంస్థ ఇన్చార్జి హెడ్ పరమేశ్వరి, కళాశాల అధ్యాపకులు సాయిప్రసాద్, శ్రీలత, ప్రశాంతి, లక్ష్మీబాయి, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
పసుపు పరిశ్రమను సందర్శించిన నైజీరియా రైతు
జక్రాన్పల్లి: మండలంలోని మనోహరాబాద్ గ్రామంలో ఉన్న జేఎంకేపీఎం పసుపు రైతు ఉత్పత్తిదారుల సంఘాన్ని నైజీరియా దేశానికి చెందిన రైతు సాహె ఉల్లెనాన్ సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా జేఎంకేపీఎం చైర్మన్ పాట్కూరి తిరుపతిరెడ్డితో వారి దేశంలో పండించే పసుపు పంటపై చర్చించారు. నైజీరియాలో తనకు 3 వేల ఎకరాల భూమి ఉందని, అందులో దాదాపు 250 ఎకరాలు పసుపు పండిస్తున్నట్లు తెలిపారు. భారతదేశంలో వచ్చిన మాదిరిగా దిగుబడి రావడం లేదని పేర్కొన్నారు. ఇక్కడి రైతులు తమ దేశానికి వచ్చి మా రైతులకు సలహాలు, సూచనలు ఇవ్వాలని ఆహ్వానించారు. ఆయన వెంట హైదరాబాద్ బెస్ట్ ఇంజినీరింగ్ కంపెనీ అధిపతి పవన్ శేషసాయి ఉన్నారు. -
నైపుణ్యం ఉంటే స్థానికంగానే కంపెనీలు పెట్టొచ్చు
● ఏఐ, రోబోటిక్ సాంకేతిక పరిజ్ఞానంతోనే భవిష్యత్ ● రాష్ట్రప్రభుత్వ సలహాదారు పొద్దుటూరి సుదర్శన్రెడ్డిసాక్షి ప్రతినిధి, నిజామాబాద్: సాంకేతిక నైపుణ్యం పెంచుకునే దాంట్లో భాగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్ టెక్నాలజీ తదితర వాటిపై ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ప్రభుత్వ స లహాదారు పొద్దుటూరి సుదర్శన్రెడ్డి అన్నారు. జిల్లా లోని కళాశాలల విద్యార్థులకు ‘టెక్నోసాపియన్సిట్ సొల్యూషన్స్’ సాంకేతిక సంస్థ ద్వారా నైపుణ్యాభివృద్ధి కోసం శిక్షణ ఇచ్చేందుకు సన్నాహక సమావేశాన్ని జిల్లా కేంద్రంలోని ఐటీ హబ్లో సోమవారం నిర్వహించారు. ఇంజినీరింగ్, పాలిటెక్నికల్, అడ్వాన్స్ డ్ ట్రైనింగ్ సెంటర్ల ప్రిన్సిపాళ్లతో సుదర్శన్రెడ్డి మాట్లాడారు. కోర్సులు పూర్తి చేసే దశలో విద్యార్థులకు మా రుతున్న కాలానికి అనుగుణంగా మరింతగా సాంకేతి క నైపుణ్యం అందించేందుకు ఈ కార్యక్రమం చేపట్టిన ట్లు పేర్కొన్నారు. ఈ శిక్షణ ద్వారా కోర్సు పూర్తి కా గానే విద్యార్థులు మంచి ఉద్యోగాలు సాధించవచ్చని పేర్కొన్నారు. ఉద్యోగాలే కాకుండా స్థానికంగానూ కంపెనీలు ఏర్పాటు చేయొచ్చన్నారు. తద్వారా లోకల్ టాలెంట్ను ప్రోత్సహించి ఉద్యోగావకాశాలు సృష్టించవచ్చన్నారు. కోర్సులు పూర్తిచేశాక మరింత నైపుణ్యం కోసం ఇతర నగరాలకు వెళ్లకుండా ఇక్కడే శిక్షణ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నామన్నారు. ఈ అవకాశాన్ని పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవాలన్నారు. మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో ఆ లోచనలు పంచుకుంటే మంచి ఫలితాలు వస్తాయన్నారు.బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న సమయంలో చేసిన పాపాలను పోగొట్టడంతోపాటు అభివృద్ధి దిశగా ముందుకెళ్తున్నామన్నారు. గత ప్రభుత్వ హయాంలో పాఠశాలల్లో బాలికలకు బాత్రూమ్లు సైతం లేకపోవడంతో చాలా ఇబ్బంది పడ్డారని సుదర్శన్రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక నిధులు కేటాయించి సౌకర్యాలు మెరుగుపర్చడంతో విద్యలో ప్రమాణాలు మెరుగుపడ్డాయన్నారు. అడ్మిషన్లు పెరిగాయని తెలిపారు. చదువులో నాణ్యత, పనిలో నైపుణ్యం ఉంటేనే తగిన ఫలితాలు ఉంటాయన్నారు. లేకుంటే ఎన్ని కోర్సులు చేసినా ఉపయోగం ఉండదన్నారు. సమావేశంలో వ్యవసాయ కమిషన్సభ్యుడు గడుగు గంగాధర్, నుడా చైర్మన్ కేశ వేణు, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్బిన్ హందాన్, మాజీ మేయర్ ధర్మపురి సంజయ్, నరాల రత్నాకర్, రామర్తి గోపి, పారుపల్లి గంగారెడ్డి, వేణురాజ్ తదితరులు పాల్గొన్నారు. -
నిబంధనలు పాటించాలి: సీపీ
నిజామాబాద్అర్బన్: ప్రతి ఒక్కరూ పోలీసు శాఖ నిర్దేశించిన నిబంధనలు పాటించాలని సీపీ సాయి చైతన్య ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజలకు ఇబ్బందికలిగించేలా విగ్రహాలు ప్రతిష్టించొద్దని తెలిపారు. ఊరేగింపులు, సభల నిర్వహణకు తప్పనిసరిగా పోలీసుల అనుమతి తీసుకోవాలని సూచించారు. డ్రోన్ల వినియోగంపై ఆంక్షలు విధించామని తెలిపారు. నకిలీ గల్ఫ్ ఏజెంట్ల నుంచి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బోధన్రూరల్: మండలంలోని కల్దుర్కి గ్రామ సర్పంచ్ ఎన్నికలలో అవకతవకలు జరిగాయని, సర్పంచ్ ఓట్లు రీకౌటింగ్ చేయాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మేడపాటి ప్రకాశ్ రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెల్లని ఓట్లను జోడించి జొన్నల నరేందర్ రెడ్డి అనే వ్యక్తి గెలుపొందినట్లు ఎన్నికల అధికారి ప్రకటించారని ఆరోపించారు. ఉన్నతాధికారుల విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. వేల్పూర్: వేల్పూర్ మండలం వెంకటాపూర్, కోమన్పల్లి గ్రామాలలో స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ కేంద్రాలను ఆర్మూర్ సబ్కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియా సోమవారం పరిశీలించారు. పోలింగ్ కేంద్రాలలో ఓటర్లకు సరియైన సౌకర్యాలు ఉన్నవి లేనివి చూశారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు ఉండాలని మండలస్థాయి అధికారులకు సూచించారు. ఓటర్లకు తాగునీరు, నీడకోసం టెంట్, వైద్య సౌకర్యాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. ఆయన వెంట తహసీల్దార్ శ్రీకాంత్, ఎంపీడీవో బాలకిషన్, ఆర్.ఐ. గోపాల్,జీపీల కార్యదర్శులు ఉన్నారు. రాజేంద్రదాస్ మహరాజ్కు స్వాగతం ఆర్మూర్టౌన్: ఆర్మూర్ ప్రజలు సోమవారం స్వామీ రాజేంద్రదాస్ మహరాజ్కు స్వాగతం పలికారు. పెర్కిట్ బైపాస్ వద్ద ఆర్మూర్ ఎమ్మె ల్యే పైడిరాకేశ్రెడ్డి, పలుగుట్ట మంగిరాములు మహరాజ్, శ్రీనాథ్ సిద్ధుల గుట్ట కమిటీ సభ్యు లు, భక్తులు పాల్గొని మహరాజ్ ఉన్న వాహనంపై పూలు చల్లారు. గోదావరి నది పరిక్రమణ లోని బృందావనం, అయోధ్య, చిత్రకూట్, ఓంకారేశ్వర్, ఉజ్జయిని, ద్వారా, కాత్రాపురి నుంచి సుమారు 400మంది సాధువులు కార్ల లో ఆర్మూర్ మీదుగా నందిపేట్లోని పలుగుట్టకు బయలుదేరారు. నిజామాబాద్ అర్బన్: ఓ తల్లి రెండు నెలల కు మారుడిని విక్రయించిన ఘటన జిల్లా కేంద్రంలో వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్లమ్మగుట్టకు చెందిన శ్రీనివాస్ ఈ నెల 5న తన భార్య, కుమారుడు కని పించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా, ఈ నెల 10న సదరు మహిళ తిరిగి ఇంటికి వచ్చింది. అయితే తల్లితోపాటు కుమారుడు లేకపోవడంతో శ్రీనివాస్ ఆమెను నిలదీశాడు. అతని ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు తల్లే కుమారుడిని మహారాష్ట్ర పుణెలోని విశాల్ అనే వ్యక్తికి రూ.2.40 లక్షలకు విక్రయించినట్లు తేల్చారు. బాలుడి విక్రయంలో ఎల్లమ్మగుట్టకు చెందిన ఇద్దరు, హైదరాబాద్కు చెందిన మరో వ్యక్తి మధ్యవర్తిత్వం వహించారు. పోలీసులు బాలుడి తల్లిని, ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. బాలుడిని తండ్రికి అప్పగించారు. -
హామీల అమలులో ప్రభుత్వం విఫలం
● స్థానిక ఎన్నికల కోసం ప్రజలను మభ్యపెడుతున్నారు ● ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి వేల్పూర్: రెండేళ్లుగా అధికారంలో ఉన్న రేవంత్రెడ్డి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా సక్రమంగా అమలు చేయలేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల్యే ప్రశాంత్రెడ్డి విమర్శించారు. మానాల గ్రామం, బడితండా, దేగవంత్ తండా, సర్పంచ్ తండా, వీరుని తండాల నుంచి నూతనంగా ఎన్నికై న సర్పంచులు బుర్ర శంకర్గౌడ్, మాలవత్ రాందాస్, సరితా తిరుపతి, మాలవత్ రజిత, ఉపసర్పంచులు గుగులోత్ వినోద్, యశోదా బానోత్,గుగులోత్ బలరాం, లావుడియా గంగాధర్, సుమారు 30 మంది వార్డు సభ్యులు, ఇతర నాయకులు సోమవారం వేల్పూర్లో ఎమ్మెల్యేని మర్యాదపూర్వకంగా కలిశారు. వీరిని ఎమ్మెల్యే శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ప్రశాంత్రెడ్డి మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో గ్యారంటీ కార్డులు తీసుకొని ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అడిగిన కాంగ్రెస్ నాయకులు సర్పంచ్ ఎన్నికల్లో ఓట్లు వేయాలని ప్రజల ఇంటికి వస్తున్నారని విమర్శించారు. అధికారంలో తామే ఉన్నాం, తమకు ఓటు వేయకుంటే గ్రామావృద్ధికి నిధులు రావు అని భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. గత ఎన్నికల్లో మంజూరైన అనేక కుల సంఘాల భవనాలను ఈ ప్రభుత్వం రాగానే నిధులు ఇవ్వకుండా రద్దు చేసిందని ఆరోపించారు. మానాల, అక్కడి తండాలలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయని కాంగ్రెస్ పార్టీ బలపరచిన అభ్యర్థులను సర్పంచ్ ఎన్నికల్లో ఓడించారని పేర్కొన్నారు. అదే స్ఫూర్తితో నియోజకవర్గంలో బీఆర్ఎస్ బలపరచిన అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు. -
చలికాలం.. పిల్లలు జాగ్రత్త!
● తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయొద్దు ● ‘సాక్షి’తో పిల్లల వైద్య నిపుణురాలు డాక్టర్ అనిత చలికాలంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? డాక్టర్: పిల్లలను బయటికి తీసుకువెళ్లే క్రమంలో ఉన్ని దుస్తులు ధరించాలి. చలి తీవ్రత ఉంటే పిల్లలను బయటికి తీసుకెళ్లొద్దు. పాఠశాలలకు వెళ్లే పిల్లలకు స్వెట్టర్స్, మంకీ క్యాప్స్, చేతులకు గ్లౌజులు వంటివి ధరింపచేయాలి. చల్లని నీరు తాగకూడదు. పర్యాటక ప్రాంతాల సందర్శనను రద్దు చేసుకోవాలి. చల్లని నీటి, తీపి పదార్థాలకు దూరంగా ఉంచాలి. తాజా ఆహారం, పండ్లు పెట్టాలి. తల్లిపాలు తాగించాలి. అత్యవసర పరిస్థితులు ఎప్పుడు వస్తాయి? చలి తీవ్రతతో పిల్లల్లో ఎక్కువగా దమ్ము వస్తుంది. దీంతో బ్రాంకోలైటిస్ ఏర్పడుతుంది. రెండు నెలల పిల్లల్లో ఎక్కువగా వస్తుంది. జ్వరం ఉండదు కానీ జలుబు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడతారు. దీంతో జ్వరం లేదని తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేస్తే పిల్లల ఊపిరితిత్తుల్లోకి వెళ్లి ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి. ఇలాంటి వాటిని ముందుగానే గుర్తించి వైద్యుడిని సంప్రదించాలి. పిల్లలకు జలుబు ఉండి, పాలు తాగకపోతే వైద్యుని వద్దకు తీసుకెళ్లాలి. పాలు మధ్యలో మానేసిన పిల్లలు విపరీతంగా ఏడవడం ప్రమాదమే. దీనిని నిర్లక్ష్యం చేయొద్దు. ఊపిరితిత్తుల్లోకి తెమడ వెళితే శ్వాత తీసుకోవడం ఇబ్బందికరంగా మారుతుంది. ముక్కు కారితే ఎలాంటి సమస్యలు వస్తాయి? పిల్లలకు ముక్కు కారడంపై చాలామంది తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేస్తారు. ఇది సరికాదు. ముక్కు కారడం వల్ల పిల్లల్లో న్యుమోనియా వంటి సమస్యలు ఏర్పడతాయి. దీంతో శ్వాసకోస ఇబ్బంది ఏర్పడుతుంది. అస్తమా ఉన్న వారికి ఇది చాలా ప్రమాదకరం.రోజురోజుకూ చలితీవ్రత పెరుగుతోంది. ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఈ నేపథ్యంలో పిల్లల ఆరోగ్యంపై తల్లిదండ్రులు శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. చలిగాలుల వ్యాప్తితో చిన్నారులు వ్యాధుల బారినపడే ప్రమాదం ఉంది. ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదని చెబుతున్నారు కిడ్స్ కేర్ ఆస్పత్రి పిల్లల వైద్య నిపుణురాలు అనిత చెప్తున్నారు. చలి నుంచి పిల్లల రక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ‘సాక్షి’ ఇంటర్వ్యూలో వివరించారు. – నిజామాబాద్ అర్బన్ -
భిక్కనూరులో చిరుత పులి సంచారం
భిక్కనూరు: మండలంలోని లక్ష్మిదేవునిపల్లి, బంజర్ల, కాచాపూర్ శివారుల్లోని వ్యవసాయ క్షేత్రాల వద్ద చిరుతపులి సోమవారం వేకువజామున సంచరించింది. దూరం నుంచి చూసిన రైతులు పులి కనిపించిందని అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో అటవీశాఖ సెక్షన్ అధికారి బాబా, బీట్ అధికారులు దీపిక, సురేశ్ పరిశీలించి ఆనవాళ్లను సేకరించారు. చిరుతకు సంబంధించిన కాలి గుర్తులు కనిపించాయని అటవీశాఖాధికారులు తెలిపారు. దూడపై చిరుత దాడి ● దూడ మృతి తాడ్వాయి (ఎల్లారెడ్డి): తాడ్వాయి మండలంలోని ఎర్రాపహాడ్ శివారులో గల వ్యవసాయ పొలం వద్ద కట్టేసిన దూడపై చిరుత దాడిచేసింది. గ్రామానికి చెందిన భూంపల్లి సంగయ్య రోజూ మాదిరిగానే ఆదివారం సాయంత్రం దూడను గ్రామ శివారులోని తన కొట్టం వద్ద కట్టేసి ఇంటికి వచ్చారు. రాత్రి పశువులకు మేత(గడ్డి)ను వేసేందుకు వెళ్లగా కట్టేసిన దూడను చిరుత పులికొరికి చంపివేసినట్లు కనిపించింది. దీంతో సంగయ్య భయాందోళన చెంది గ్రామస్తులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న గ్రామస్తులు చిరుత దాడిచేసి చంపినట్లు నిర్ధారించారు. కాగా, ఎర్రాపహాడ్ శివారు పక్కనే ఉన్న మోతే శివారులో చిరుత తిరుగుతున్నట్లు ఇప్పటికే ప్రచారం ఉంది. సోమవారం ముస్తాపూర్ బీట్ ఆఫీసర్ కళ్యాణి, ఎర్రాపహాడ్ సెక్షన్ ఆఫీసర్ వినోద్, మండల పశువైద్యాధికారి రమేశ్ ఘటన స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించి, పోస్టుమార్టం చేయించారు. -
మూడో విడతకు ర్యాండమైజేషన్ పూర్తి
నిజామాబాద్ అర్బన్: జిల్లాలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం ర్యాండమైజేషన్ ద్వారా పోలింగ్ సిబ్బందిని కేటాయించారు. ఈ ప్రక్రియ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి, ఎన్నికల సాధారణ పరిశీలకులు శ్యాంప్రసాద్ లాల్ సమక్షంలో సోమవారం నిర్వహించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఎన్ఐసీ హాల్లో ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ర్యాండమైజేషన్ చేపట్టారు. ఏకగ్రీవమైన సర్పంచ్, వార్డు స్థానాలను మినహాయించి మిగిలిన స్థానాల్లో పోలింగ్ నిర్వహించేందుకు మండలం వారీగా పోలింగ్ కేంద్రాలకు ప్రిసైడింగ్ అధికారులు, ఓపీవోలను ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్రావు, నోడల్ అధికారి పవన్కుమార్, లీడ్ బ్యాంక్ మేనేజర్ సునీల్, సిబ్బంది పాల్గొన్నారు.మోపాల్: మండలంలోని ఎల్లమ్మకుంట అటవీ ప్రాంతంలో ఆవులను మేపుతున్న ఒకరిపై సోమవారం చిరుత దాడి చేసింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గాంధారి మండలంలోని చిన్నగుట్ట తండాకు చెందిన అశోక్ గ్రామంలోని కెతావత్ యాదగిరికి చెందిన ఆవులను రెండేళ్లుగా మేపుతున్నాడు. రోజూవారీలాగే సోమవారం కూడా మేత కోసం తోలుకొని వెళ్లాడు. ఆవులను మేపుతుండగా పొదల్లో దాగి ఉన్న చిరుత ఒక్కసారిగా వెనుక నుంచి వీపుపై పంజా విసిరింది. అప్రమత్తమైన అశోక్ అరవడంతో చిరుత అటవీ ప్రాంతంలోకి పరుగెత్తింది. ఘటనలో అశోక్కు స్వల్పంగా గాయమైంది. అటవీశాఖ సెక్షన్ అధికారులకు సమాచారమిచ్చారు. ఆర్మూర్టౌన్: ఆర్మూర్ మున్సిపల్ నూతన కమిషనర్గా శ్రావణి సోమవారం బాధ్యతలు చేపట్టారు. మేనేజర్ శ్రీనివాస్, ఆర్వో ఉమాదేవి, సీనియర్ అసిస్టెంట్ శేఖర్ తోపాటు సిబ్బంది నూతన కమిషనర్కు స్వాగతం పలికారు. పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. సుభాష్నగర్: సెలవుపై వెళ్లిన నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ దిలీప్కుమార్ సోమవారం తిరిగి విధుల్లో చేరారు. గత నెల 19వ తేదీ నుంచి ఈనెల 14వ తేదీ వరకు ఆయన దీర్ఘకాలిక సెలవులో ఉండగా, ఇన్చార్జి కమిషనర్గా అదనపు కలెక్టర్ అంకిత్ బాధ్యతలు నిర్వర్తించారు. దాదాపు 25 రోజుల తరువాత విధుల్లో చేరిన కమిషనర్ అభివృద్ధి పనులు, టౌన్ప్లానింగ్, ఇతర విభాగాల పనితీరుపై సమీక్షించారు. ఆర్మూర్: రష్యాలో నెలకు రూ.70 వేల వేతనంతో ఉ ద్యోగాలు ఇప్పిస్తామని కొందరు నకిలీ ఏజెంట్లు నిరుద్యోగులను మోసం చేస్తున్నారని ప్రవాస భార తీయుల సంక్షేమ, హక్కుల వేదిక రాష్ట్ర అఽ ద్యక్షుడు కోటపాటి నర్సింహనాయుడు అ న్నారు. మామిడిపల్లిలోని తన కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులో మా ట్లాడారు. మెండోర మండలం వెల్కటూర్కు చెందిన వెంకటేశ్ అనే యువకుడిని నందిపేట్కు చెందిన నకిలీ ఏజెంట్ మోసం చేసి రూ.3 లక్షలు తీసుకొని విజిట్ వీసాపై రష్యా కు పంపించాడన్నారు. తీరా అక్కడ ఏజెంట్ చెప్పిన స్థాయిలో ఉద్యోగం, వేతనం లేకపోవడంతో బాధితుడు 15 రోజుల్లో స్వగ్రామానికి తిరిగి వచ్చి తమ సంస్థను ఆశ్రయించాడన్నారు. నకిలీ ఏజెంట్ను పిలిపించి రష్యాకు వెళ్లి రావడానికి రూ.లక్ష ఖర్చు పోను మిగిలిన రూ.2 లక్షలను బాధితుడికి ఇప్పించామన్నారు. ఇప్పటికై నా నిరుద్యోగ యువత నకిలీ ఏజెంట్ల మాయ మాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు. -
పోలీసుల విస్తృత తనిఖీలు
నందిపేట్(ఆర్మూర్): స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నందిపేట మండలంలో సోమవారం పోలీసులు, ఎన్నికల అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఉమ్మెడ బ్రిడ్జి సమీపంలో అయిలాపూర్, కంఠం, నందిపేట, వెల్మల్ గ్రామాల సమీపంలోని ప్రధాన రోడ్ల వెంట అనుమానం వచ్చిన వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్సై శ్యాంరాజ్ మాట్లాడుతూ వాహనాల్లో మద్యం బాటిళ్లు, రూ. 50 వేలకు మించి నగదు తరలించరాదని హెచ్చరించారు. ఆర్మూర్లో..ఆర్మూర్టౌన్: పట్టణంలో సోమవారం రాత్రి ఎస్హెచ్వో సత్యనారాయణగౌడ్ ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. పాతబస్టాండ్లో ప్రయాణికుల బ్యాగులు, హోటళ్లు, పాన్షాపులతోపాటు పలు దుకాణాల్లో నిషేధిత మత్తు పదార్థాలు, చట్టవిరుద్ధ వస్తువులను గుర్తించేందుకు స్నిపర్ డాగ్స్ ద్వారా పరిశీలించారు. -
హాకీ ఉమ్మడి జిల్లా జట్ల ఎంపిక
కామారెడ్డి అర్బన్: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్జీఎఫ్) నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల బాలబాలికల అండర్–17 హాకీ ఎంపికలు సోమవారం కామారెడ్డి ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించారు. అత్యంత ప్రతిభ చూపిన క్రీడాకారులను జట్టుకు ఎంపిక చేశారు. వీరు రాష్ట్రస్థాయి అండర్–17 హాకీ క్రీడల్లో పాల్గొంటారని ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి కే హీరాలాల్ తెలిపారు. కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడల అధికారి ఆర్ వెంకటేశ్వరగౌడ్, వ్యాయామ ఉపాధ్యాయులు నోముల మధుసూదన్రెడ్డి, ఆంజనేయులు, స్వామి, నగేశ్ తదితరులు పాల్గొన్నారు. -
సర్పంచ్లకు సమస్యల స్వాగతం
రెంజల్(బోధన్): పల్లెసీమలే దేశానికి పట్టుకొమ్మలు. గ్రామాల్లో సర్పంచ్ పదవి బాధ్యతాయుతమైంది. గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా ప్రభుత్వం 1959లో జిల్లా, బ్లాక్, గ్రామ పంచాయత్ అనే మూడంచెల పంచాయత్రాజ్ వ్యవస్థను ఏర్పాటు చేసింది. స్థానిక ప్రజల అవసరాలకు అనుగుణంగా వనరుల వినియోగం, శాశ్వాతమైన పరిపాలన అమలుకు యంత్రాంగం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. గ్రామీణుల జీవన ప్రమాణాలను మెరుగుపర్చాలనే సంకల్పంతో ఏర్పాటైన పంచాయతీరాజ్ వ్యవస్థ రానురాను గాడి తప్పుతోంది. కొత్తగా గెలిచిన సర్పంచ్లు ఈ నెల 20న పదవి పగ్గాలు చేపట్టనున్నారు. అద్దె భవనాలు, పాత సమస్యలు స్వాగతం పలుకనున్నాయి. జిల్లాలో 545 గ్రామ పంచాయతీలు ఉండగా ప్రస్తుతం 140 జీపీలు అద్దె భవనాలు, అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలు, గ్రామాభివృద్ధి కమిటీ భవనాల్లో అరకొర వసతులతో కొనసాగుతున్నాయి. పరిపాలనా సౌలభ్యం కోసం గత ప్రభుత్వం తండాలను ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసింది. తండాలతోపాటు కొన్ని గ్రామ పంచాయతీలకు గూడు లేకుండా పొయింది. ప్రభుత్వం పలు జీపీలకు నూతన భవనాలను మంజూరు చేసినా నిధుల కొరత కారణంగా అర్ధంతరంగా నిలిచిపోయాయి. సుమారు రెండు సంవత్సరాలుగా గ్రామ పంచాయతీలకు పాలకవర్గాలు లేక పల్లెపాలన అస్తవ్యస్తంగా మారింది. ప్రభుత్వం ప్రత్యేకాధికారులను నియమించినా నిధులలేమి సమస్యతో ఇప్పటి వరకు పల్లెబాట పట్టలేదు. దీంతో స్థానిక కార్యదర్శులు ఎలాగోలా నెట్టుకువచ్చారు. కార్యదర్శులు తమకున్న అధికార పరిధిలో పరిపాలన అందించినా ప్రజాప్రతినిధులు లేక ప్రజలు సైతం సమస్యలను భరిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే నిధులు ఆలస్యమైనా పాలకవర్గాలు ఉంటే సర్పంచ్, వార్డు సభ్యులు తమ పలుకుబడిని ఉపయోగించి ప్రజల కనీస అవసరాలైన తాగునీరు, వీధిదీపాలు, మురుగుకాల్వలను శుభ్రం చేయించే పరిస్థితి ఉండేది. జిల్లా అధికారులు, ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీలకు స్థానిక సమస్యలు వివరించి అదనపు నిధులు రాబట్టేందుకు పాలకవర్గాలు ప్రయత్నించేవారు. 20వ తేదీ అనంతరం సర్పంచ్లు బాధ్యతలు స్వీకరించనున్న నేపథ్యంలో పల్లె పాలనలో గాడిలో పడనున్నది. జిల్లాలో గ్రామ పంచాయతీలు 545 అద్దె భవనంలో కొనసాగుతున్నవి 145 పక్కా భవనాలు ఉన్న జీపీలు 400 పలు పంచాయతీలకు సొంత భవనాలు కరువు అద్దె భవనాల్లో కొనసాగుతున్న 145 జీపీలు ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీల్లో జీపీల నిర్వహణ చెట్ల కిందే గ్రామసభలు -
సర్పంచ్ విధులు, బాధ్యతలు
మీకు తెలుసా..రామారెడ్డి: త్వరలోనే పంచాయతీ పాలకవర్గాలు కొలువుతీరనున్న తరుణంలో సర్పంచ్ విధులు, బాధ్యతల గురించి తెలుసుకుందాం. ● గ్రామ పంచాయతీ సమావేశాలకు అధ్యక్షత వహించడం.గ్రామ పంచాయతీ తీసుకున్న ని ర్ణయాలను,తీర్మానాలను అమలు చేయడం. ● గ్రామ పంచాయతీ కార్యనిర్వహణాధికారి (పంచాయతీ కార్యదర్శి) పనితీరును పర్యవేక్షించడం. ● గ్రామాభివృద్ధికి సంబంధించిన పనులు చేపట్టడం, పథకాలను అమలు చేయడం. ● గ్రామ పంచాయతీకి వచ్చే నిధుల వినియోగాన్ని, పన్నుల వసూలును పర్యవేక్షించడం, 100శాతం పన్ను వసూలుకు కృషి చేయడం. ● ప్రభుత్వ అధికారులకు, గ్రామీణ సమాజానికి మధ్య పరిచయ కేంద్రంగా, కీలక నిర్ణయాల రూపకర్తగా వ్యవహరించడం. ఇతర అధికారాలు ● ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహణలో పాత్ర వహించడం. గ్రామాభివృద్ధి అధికారి నుంచి అవసరమైన సమాచారాన్ని సేకరించడం. ● సభ్యుల అనర్హత లేదా ఖాళీలపై జిల్లా పరిషత్ అధికారులకు తెలియజేయడం. ● మండల పరిషత్ సమావేశాలకు శాశ్వత ఆహ్వానితులుగా హాజరుకావడం. ● సర్పంచ్ గ్రామ అభివృద్ధి, పరిపాలనలో కీలకపాత్ర పోషిస్తారు. -
ఎరువులను పక్కదారి పట్టిస్తే చర్యలు
డిచ్పల్లి(నిజామాబాద్రూరల్): ఎరువులు పక్కదారి పట్టకుండా గట్టి నిఘా ఉంచాలని, విక్రయాల్లో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి హెచ్చరించారు. జిల్లాలో ప్రస్తుత యాసంగి సీజన్ పంటల సాగు కోసం రైతుల అవసరాలకు సరిపడా యూరియా ఎరువుల నిల్వలు అందుబాటులో ఉన్నాయని, రైతులు ఆందోళన చెందొద్దన్నారు. డిచ్పల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో మండలంలోని సుద్దులం గ్రామంలో నిర్వహిస్తున్న ఎరువుల గోదామును కలెక్టర్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎరువుల నిల్వలను పరిశీలించారు. ఎరువుల కొనుగోలు చేసేందుకు వచ్చిన రైతులతో మాట్లాడి ఎరువులు అందుతున్నాయా అని ఆరా తీశారు. యాసంగి సీజన్ కు సంబంధించి జిల్లాకు 32 వేల మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయని, క్రమం తప్పకుండా ఎరువుల స్టాక్ జిల్లాకు వస్తోందని తెలిపారు. నానో యూరియా వాడకం పై రైతులకు అవగాహన కల్పించాలని, డ్రోన్ వినియోగం ద్వారా ఎరువుల వాడకం గురించి ప్రయోగాత్మకంగా అవగాహన కల్పించాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయ అధికారి వీరాస్వామి, తహసీల్దార్ సతీశ్రెడ్డి, మండల వ్యవసాయాధికారి ఆంజనేయులు, సొసైటీ సీఈవో సాయిచంద్, అసిస్టెంట్ సీఈవో సాయిలు, సిబ్బంది శ్రీకాంత్ తదితరులున్నారు. -
మహిళా ఓటర్లే కీలకం
● ఆర్మూర్ డివిజన్ పరిధిలో పురుషుల కన్నా మహిళా ఓటర్లు 24,911 మంది అధికంఆర్మూర్: మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్న ఆర్మూర్ డివిజన్లోని గ్రామాల్లో గెలిచేందుకు అభ్యర్థులు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. అయితే వారి జయాపజ యాలను ప్రభావితం చేసేది మాత్రం మహిళా ఓటర్లే! మొత్తం 3,14,091 మంది ఓటర్లు ఉండగా.. అందులో పురుషులు 1,44,587 మంది, మహిళలు 1,69,498 మంది, ఇతరులు ఆరుగురు ఉన్నారు. ఈ లెక్కన పురుషుల కన్నా మహిళా ఓటర్లు 24,911 మంది ఎక్కువగా ఉన్నారు. దీంతో మహిళలను ప్రసన్నం చేసుకోవడంతోపాటు మహిళా సంఘాలను తమ వైపు తిప్పుకొని ఓట్లు రాబట్టుకునేందుకు అభ్యర్థులు ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నారు. మండలం పురుషులు మహిళలు ఇతరులు మొత్తం ఆర్మూర్ 14,155 16,660 01 30,816 ఆలూర్ 9,400 11,292 00 20,692 నందిపేట 19,416 22,835 03 42,254 డొంకేశ్వర్ 7,696 9,064 00 16,760 బాల్కొండ 12,012 13,919 00 25,931 ముప్కాల్ 7,443 8,730 00 16,173 మెండోర 9,797 11,385 01 21,183 వేల్పూర్ 14,688 17,466 00 32,154 భీమ్గల్ 18,183 21,087 01 39,271 మోర్తాడ్ 12,740 14,903 00 27,643 ఏర్గట్ల 5,233 6,096 00 11,329 కమ్మర్పల్లి 13,824 16,061 00 29,885 మొత్తం 1,44,587 1,69,498 6 3,14,091 -
ఎన్నికల నియమావళిని పాటించాలి
ఆర్మూర్: గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఎన్నికల నియమావళిని పాటించాలని సీపీ సాయిచైతన్య సూచించారు. ఆర్మూర్లోని ఏసీపీ కార్యాలయంలో డివిజన్ పరిధిలోని పోలీసు అధికారులతో సీపీ సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు శాంతియుత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకొనే విధంగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. సమస్యాత్మక, అతిసమస్మాత్మక పోలింగ్ స్టేషన్లను గుర్తించి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని అన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రానికి నిర్దిష్ట దూరంలో మార్కింగ్ చేయించి, ప్రచారం, గుర్తులను ప్రదర్శించడాన్ని నివారించాలన్నారు. అవసరాన్ని బట్టి స్ట్రైకింగ్ ఫోర్స్ సేవలను వినియోగించుకొని గుంపులను చెదర గొట్టాలని ఆదేశించారు. ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని, విధినిర్వహణలో ఎలాంటి లోపాలు కనిపించినా సంబంధిత సిబ్బందిపై తక్షణ చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఆర్మూర్ ఏసీపీ జే వెంకటేశ్వర్రెడ్డి , ఆర్మూర్ ఎస్హెచ్వో పీ సత్యనారాయణగౌడ్ , ఆర్మూర్ రూరల్, భీమ్గల్ సీఐలు కే. శ్రీధర్రెడ్డి, సతీశ్గౌడ్, బాల్కొండ, నందిపేట్, వేల్పూర్, ముప్కాల్, మెండోర, భీమ్గల్, మోర్తాడ్, కమ్మర్పల్లి, ఏర్గట్ల, మాక్లూర్ ఎస్సైలు శైలేందర్, శ్యామ్రాజ్, సంజీవ్, కిరణ్ పాల్, సుహాసిని, సందీప్, రాము, అనిల్రెడ్డి, రాజేశ్వర్, రాజశేఖర్ పాల్గొన్నారు. -
పెద్దపులొచ్చింది
కామారెడ్డి జిల్లాలో మరోసారి పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. అది కూడా మైదాన ప్రాంతంలో తిరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. మాచారెడ్డి, పాల్వంచ, దోమకొండ, బీబీపేట మండలాల సరిహద్దు ప్రాంతంలోని ఎగువ మానేరు జలాశయం ఎగువ భాగాన పెద్దపులి తిరుగుతున్నట్టు స్పష్టమైంది. – సాక్షి ప్రతినిధి, కామారెడ్డిదోమకొండ మండలం అంబారిపేట శివారులోని పంట చేల వద్ద ఆదివారం దూడలపై దాడి నేపథ్యంలో అటవీ అధికారులు రంగంలోకి దిగారు. ఆ ప్రాంతంలో పాదముద్రలను పరిశీలించిన అధికారులు.. అవి కచ్చితంగా పెద్దపులివే అన్న నిర్ధారణకు వచ్చారు. వెంటనే అక్కడికి చుట్టుపక్కల ప్రాంతంలో కెమెరా ట్రాప్స్ ఏర్పాటు చేశారు. ఆదివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో దూడలను చంపిన ప్రాంతంలో పులి సంచరించినట్లు కెమెరాల్లో రికార్డయ్యింది. జిల్లా అటవీ అధికారి బోగ నిఖిత ఆ ప్రాంతాన్ని సందర్శించి, రైతులతో మాట్లాడారు. రైతుల్లో ఆందోళన జిల్లాలో పెద్దపులి సంచారం నేపథ్యంలో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. టైగర్ తిరిగిన ప్రాంతమంతా వ్యవసాయ క్షేత్రాలే కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. యాసంగి వరి నాట్లు వేయడానికి సన్నద్ధమవుతున్నవారు భయపడుతున్నారు. జూలై, ఆగస్టు మాసాల్లో రామారెడ్డి, మాచారెడ్డి, సిరికొండ మండలాల అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచరించి ఆవులపై దాడులు చేసింది. అయితే దాని జాడ కోసం దాదాపు నెల రోజుల పాటు అటవీ అధికారులు నిఘా వేసినా అది ఎటువైపు వెళ్లిందో తేల్చలేకపోయారు. నాలుగు నెలల తర్వాత మరో పులి రావడం సంచలనంగా మారింది. మైదాన ప్రాంతంలో తిరుగుతున్న పెద్దపులి ఎవరిపై పంజా విసురుతుందోనని ఆందోళన చెందుతున్నారు. పెద్దపులి జాడ వెలుగు చూసిన అంబారిపేటకు చుట్టుపక్కల గ్రామాలైన గోపాల్పేట, కోనాపూర్, యాడారం, ఫరీదుపేట, బండరామేశ్వర్పల్లి, లచ్చాపేట తదితర గ్రామాల పరిధిలో వేలాది ఎకరాల్లో పంటలు సాగు చేస్తారు. కవ్వాల్ నుంచి వచ్చిందా...? అంబారిపేట ప్రాంతంలో పెద్దపులి జాడలు బయటపడిన నేపథ్యంలో అది ఎక్కడి నుంచి వచ్చిందన్న వి షయమై అటవీ అధికారులు దృష్టి సారించారు. మన దగ్గర పులులు లేవన్న కచ్చితమైన అభిప్రాయంతో ఉన్న అటవీ అధికారులు.. అప్పట్లో జిల్లాలో తిరిగిన పెద్దపులి కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ నుంచి వివిధ జిల్లాలు తిరుగుతూ వచ్చిందని పేర్కొన్నారు. సిరికొండ, మాచారెడ్డి, రామారెడ్డి మండలాల్లో దాని క దలికలు బయటపడ్డాయి. అయితే అప్పట్లో ట్రాప్ కె మెరాల ద్వారా దాని కదలికలు కనుక్కునే ప్రయ త్నం చేసినా ఫలించలేదు. అది ఎటువైపు వెళ్లిందన్న దీ స్పష్టం కాలేదు. తాజాగా అంబారిపేట ప్రాంతంలో దూడలపై పెద్దపులి దాడి చేయడంతో అటవీ అ ధికారులు అప్రమత్తమయ్యారు. దాని కదలికలపై ని ఘా పెట్టారు. ఇప్పటికే కెమెరాలకు చిక్కడంతో పెద్ద పులి ఇదే ప్రాంతంలో ఉండి ఉంటుందన్న నిర్ధారణ కు వచ్చారు. మానేరు ప్రాజెక్టు బ్యాక్ వాటర్ పరీవాహక ప్రాంతంతో పాటు పాల్వంచ వాగు పరీవాహక ప్రాంతంలో తిరుగుతుండవచ్చని భావిస్తున్నారు.అంబారిపేట ప్రాంతంలో పెద్దపులి తిరుగుతోంది. చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ అది సంచరించే అవకాశం ఉంటుంది. అందుకే ఆయా ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలి. పెద్దపులి సంచారం గురించి ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చాం. దాని కదలికలను గమనిస్తున్నాం. ఎక్కడి నుంచి వచ్చిందన్న దానిపై ఆరా తీస్తున్నాం. – నిఖిత, జిల్లా అటవీ అధికారి, కామారెడ్డి మైదాన ప్రాంతంలో సంచారం లేగదూడలపై దాడితో వెలుగులోకి.. పాదముద్రలను పరిశీలించి కెమెరా ట్రాప్స్ ఏర్పాటు కెమెరాలో రికార్డయిన పెద్దపులి సంచరిస్తున్న దృశ్యాలు -
ఓటేసే అవకాశం కోల్పోయిన సీఆర్పీఎఫ్ జవాన్
మోపాల్: మండలంలోని మంచిప్పకు చెందిన సీఆర్పీఎఫ్ జవాన్ కెతావత్ ప్రవీణ్ ఓటేసే అవకాశం కోల్పోయాడు. గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా సెలవులో స్వగ్రామానికి విచ్చేసిన ప్రవీణ్ ఆదివారం ఓటేయకుండా వెనుదిరిగాడు. ఆయన కథనం ప్రకారం.. ప్రవీణ్ రాజమండ్రిలో విధులు నిర్వర్తిస్తున్నాడు. డిసెంబర్ 6న పంచాయతీ కార్యాలయ సిబ్బంది పోస్టల్ ఓటు కోసం ఫోన్ చేశారు. తనకు సెలవు మంజూరైందని, ఓటేసేందుకు స్వగ్రామానికి వస్తున్నానని సమాధానమిచ్చాడు. పోస్టల్ ఓటు వద్దని చెప్పాడు. అయినప్పటికీ రాజమండ్రిలో కార్యాలయ అడ్రస్ ఇవ్వాలని కోరగా, అడ్రస్ చెప్పాడు. ఆ అడ్రస్ను పంచాయతీ సిబ్బంది కలెక్టర్ కార్యాలయానికి పంపించారు. దీంతో ప్రవీణ్కు పోస్టల్ ఓటు విడుదలైంది. డిసెంబర్ 13న రాజమండ్రిలోని కార్యాలయానికి చేరినట్లు తోటి ఉద్యోగులు ఫోన్ ద్వారా తెలియజేశారు. పోస్టల్ బ్యాలెట్ ఆలస్యంగా రావడమే కాకుండా రిటర్న్ వచ్చేందుకు సరైన ఏర్పాట్లు చేయలేదు. తాను నిరాకరించినా.. పోస్టల్ ఓటు ఇష్యూ కావడంతో తాను ఓటేసే అవకాశం కోల్పోయానని ప్రవీణ్ ఆవేదన వ్యక్తంచేశాడు. ఈ విషయమై ఎంపీడీవో, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా ఒకసారి పోస్టల్ ఇష్యూ అయితే ఏమీ చేయలేమని వివరించారు. కాగా తాను పోస్టల్ ఓటు వద్దన్నా.. ఇష్యూ కావడానికి గ్రామ, మండల అధికారులే కారణమని ప్రవీణ్ వాపోయాడు. నిజామాబాద్అర్బన్: నగరంలోని బస్టాండ్ సమీపంలో ఉన్న పెట్రోల్బంక్లో శనివారం రాత్రి చోరీ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తి అర్ధరాత్రి రెండు గంటల సమయంలో పెట్రోల్బంక్ క్యాబిన్లోకి ప్రవేశించాడు.అందులో పనిచేస్తున్న వ్యక్తి నిద్రపోతున్న సమయంలో తలుపును పగులగొట్టి లోపలికి వెళ్లి రూ.లక్ష నగదును దోచుకుంటున్నట్లు ఒకటో టౌన్ ఎస్హెచ్వో రఘుపతి తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు. బోధన్టౌన్(బోధన్): బోధన్ మండలం సంగం గ్రామానికి చేందిన రొడ్డ సుచరిత పొలిటిక్ల్ సైన్స్లో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ అందుకుంది. పొలిటికల్ సైన్స్ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ శ్రీలత పర్యవేక్షణలో ఉమెన్ ఎన్పవర్మెంట్ ఇన్ తెలంగాణ స్టేట్, ఏస్టీడీ ఆన్ నిజామాబాద్ జిల్లా అనే అంశంపై సుచరిత చేసిన అధ్యాయనానికి ఉస్మానియా యూనివర్సిటీ డాక్టరేట్ను ప్రధానం చేసింది. తల్లి, భర్త కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతోనే తాను డాక్టరేట్ సాధించానని సుచరిత తెలిపింది. -
ధర్మారంలో ఉద్రిక్తత
● పోలింగ్ కేంద్రంలోకి చొచ్చుకు వచ్చిన పలువురు ● చెదరగొట్టిన పోలీసులుడిచ్పల్లి: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఆదివారం నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలంలోని ధర్మారం(బి) గ్రామంలోని పోలింగ్ కేంద్రం వద్ద ఉ ద్రి క్తత నెలకొంది. సర్పంచ్ అభ్యర్థి పోలింగ్ కేంద్రం లోపల ఉండి ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ మరో సర్పంచ్ అభ్యర్థి, అతడి మద్దతుదారులు అందోళనకు దిగారు. ఒక్కసారిగా పోలింగ్ కేంద్రంలో ని చొచ్చుకురావడంతో ఉద్రిక్తవాతావరణం ఏర్పడింది. దీంతో పోలీసులు వారిని అడ్డుకుని సముదాయించడానికి యత్నించారు. పెద్ద సంఖ్యలో పోలీసులు అక్కడికి చేరుకుని పోలింగ్ కేంద్రం నుంచి వారిని దూరంగా చెదరగొట్టారు. పోలింగ్ కేంద్రంలోపల అభ్యర్థులు ఎవరూ ఉండవద్దని హెచ్చరించి అందరినీ బయటకు వెళ్లగొట్టారు. సమాచారం అందుకున్న ఏసీపీ రాజావెంకట్రెడ్డి ధర్మారం(బి) పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు. -
నేటితో పంచాయతీ ప్రచారానికి తెర
● ముగియనున్న మూడో విడత ప్రచారం ● 17న పోలింగ్.. ఏర్పాట్లు చేస్తున్న యంత్రాంగం ఆర్మూర్/మోర్తాడ్: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మూడో విడత పోలింగ్ జరుగనున్న గ్రా మాల్లో నేటితో ప్రచారానికి తెరప డనుంది. ఆర్మూర్ రెవెన్యూ డివిజన్ పరిధి లోని ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాల పరిధిలో ఉన్న 12 ఆర్మూర్, ఆ లూర్, నందిపేట, డొంకేశ్వర్, బాల్కొండ, మెండోర, ము ప్కాల్, వేల్పూర్, భీమ్గల్, మోర్తాడ్, ఏ ర్గట్ల, కమ్మర్పల్లి మండలాల్లో ఏకగ్రీవ స్థానాలను మినహాయించి 146 సర్పంచ్, 1135 వార్డు స్థా నాలకు ఈనెల 17వ తేదీన పోలింగ్ జర గనుంది. ఇందుకు అధికార యంత్రాంగం ఏ ర్పాట్లు చేస్తోంది. సబ్ కలెక్టర్ అభిగ్నాన్ మాల్వియా ఎన్నికల నిర్వహణ ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు. బీఎన్ఎస్ సెక్షన్ 163 అమలు పోలింగ్ జరనున్న గ్రామాల్లో సోమవారం సా యంత్రం 5 గంటల నుంచి భారతీయ న్యా య సంహిత (బీఎన్ఎస్) 163 సెక్షన్ అమలులో ఉంటుందని ఏసీపీ వెంకటేశ్వర్రెడ్డి తె లిపారు. ఐదుగురు లేదా అంతకన్నా ఎక్కువ మంది ప్రజలు గుమిగూడి ఉండొద్దని హెచ్చరించారు. 17వ తేదీన పోలింగ్, కౌంటింగ్ పూ ర్తయి విజేతలను ప్రకటించే వరకు ఆంక్షలు అమలులో ఉంటాయన్నారు. కల్లు, మద్యం దుకాణాలు మూసి ఉంటాయని తెలిపారు. -
కీలక నేతల గ్రామాల్లో భిన్న ఫలితాలు
● కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ, బీఆర్ఎస్, వామపక్షాలు ● గడ్కోల్లో హోరాహోరీ పోరులో అధికార పార్టీకి భారీ మెజార్టీసాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : రెండో విడత పంచా యతీ పోరులో అధికార పార్టీ కాంగ్రెస్ ఆధిపత్యం చాటుకున్నప్పటికీ కొన్ని గ్రామాల్లో ఫలితాలు ప్రత్యేకతను చాటుకున్నాయి. సిరికొండ మండలం గడ్కో ల్ పంచాయతీలో కాంగ్రెస్ మద్దతుదారు సాధించిన విజయం చర్చనీయాంశంగా నిలిచింది. ఎస్సీ మహిళకు రిజర్వుడు అయిన ఈ పంచాయతీలో కాంగ్రెస్ తరుఫున డీసీసీ ప్రధాన కార్యదర్శి భాస్కర్రెడ్డి నిలబెట్టిన అభ్యర్థికి పోటీగా బీజేపీ, బీఆర్ ఎస్, వామపక్షాలకు చెందిన రాష్ట్ర, జిల్లా నాయకు లు ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టారు. ఆయా నాయకు లు సైతం ప్రచారం నిర్వహించారు. హోరాహోరీ పోరు జరిగినప్పటికీ భాస్కర్రెడ్డి నిలబెట్టిన కాంగ్రె స్ అభ్యర్థే 295 ఓట్ల భారీ ఆధిక్యంతో గెలుపొంద డం గమనార్హం. గడ్కోల్లో మొత్తం 2,716 ఓట్లు ఉన్నాయి. ఈ గ్రామంలో 12 వార్డులకు గాను 8 వార్డులు కాంగ్రెస్ మద్దతుదారులు, 3 వార్డులు బీఆర్ఎస్, బీజేపీ, వామపక్షాల కూటమి అభ్యర్థులు, ఒక స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. ఇదిలా ఉండగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు కులాచారి దినేష్ సొంత గ్రామం డిచ్పల్లి మండలం అమృతాపూర్లో బీ ఆర్ఎస్ మద్దతుదారు గెలుపొందారు. నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి సొంత గ్రామం మోపాల్ మండలం ముదక్పల్లిలో ఆయన నిలబెట్టిన అభ్యర్థిపై స్వతంత్ర అభ్యర్థి 398 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందడం విశేషం. పీసీసీ డెలిగేట్ బాడ్సి శేఖర్గౌడ్ సొంత గ్రామం మోపాల్ మండలం బాడ్సిలో బీఆర్ఎస్ మద్దతుదారుడు గెలుపొందారు. మోపాల్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సాయిరెడ్డి సొంత గ్రామమైన మోపాల్ కేంద్రంలో బీజేపీ అభ్యర్థి గెలుపొందారు. అదేవిధంగా కాంగ్రె స్ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎంపీపీ యాదగిరి సొంత గ్రామం మోపాల్ మండలం ఎల్లమ్మకుంటలో బీజేపీ మద్దతుదారుడు గెలుపొందారు. మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ సొంత గ్రామం సిరికొండ మండలం చీమన్పల్లిలో స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. డీసీసీ అధ్యక్షుడు నగేష్రెడ్డి సొంత గ్రామం డిచ్పల్లి మండలం ముల్లంగిలో మాత్రం కాంగ్రెస్ మద్దతుదారే గెలుపొందారు. అదేవిధంగా ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి సొంత గ్రామం నిజామాబాద్ రూరల్ మండలం జలాల్పూర్లో కాంగ్రెస్ నుంచి ఇద్దరు పోటీపడగా ఒకరు గెలిచారు. -
కాంగ్రెస్దే హవా..
డిచ్పల్లి మండలం ధర్మారంలో ఓటు వేసేందుకు క్యూ కట్టిన ఓటర్లు రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ హవా కొనసాగింది. మెజార్టీ సర్పంచ్ స్థానాలు హస్తం ఖాతాలోకి చేరాయి. ఏకగ్రీవ స్థానాలను మినహాయించి 158 గ్రామాల్లో ఎన్నికలు జరగగా.. కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులు 101 గ్రామాల్లో, బీఆర్ఎస్ మద్దతుదారులు 24 గ్రామాల్లో, బీజేపీ మద్దతుదారులు 15 గ్రామాల్లో, స్వతంత్రులు 18 గ్రామాల్లో విజయం సాధించారు.సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: జిల్లాలో రెండో విడతలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ అధి కార కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు తమ హవాను కొనసాగించారు. జిల్లాలో ఆదివారం నిర్వహించిన పోలింగ్లో కాంగ్రెస్ మద్దతుదారులు అత్యధిక పంచాయతీలను గెలుచుకున్నా రు. ఈ విడతలో మొ త్తం 8 మండలాల్లోని 196 పంచాయతీ సర్పంచ్ల కు గాను 38 ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 158 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. అదేవిధంగా ఈ పంచాయతీల్లో మొత్తం వార్డు స్థానాలు 1,760 ఉండగా, 5 వార్డు స్థానాలకు నామినేషన్లు దాఖలు కాలేదు. మరో 674 వార్డు స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 1,081 వార్డు స్థానాలకు పోలింగ్ జరిగింది. 1,476 పోలింగ్ బూత్ల ద్వారా ఓటింగ్ ప్రక్రియ నిర్వహించినట్లు కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి తెలిపారు. ● మాక్లూర్, నిజామాబాద్ రూరల్, డిచ్పల్లి, మో పాల్, జక్రాన్పల్లి, ఇందల్వాయి, ధర్పల్లి, సిరికొండ మండలాల్లో ఉదయం 7 గంటల నుంచి మధ్యా హ్నం ఒంటి గంట వరకు జరిగిన పోలింగ్లో 76.71 శాతం పోలింగ్ నమోదైంది. చలి తీవ్రతతో మొదటి రెండు గంటల వరకు ఒక మోస్తరుగా సాగిన ఓటింగ్ తరువాత వేగం పుంజుకుంది. ● డిచ్పల్లి మండలం ధర్మారంలో పోలింగ్ బూత్ వద్ద ఒక అభ్యర్థి ప్రచారం చేస్తున్నాడంటూ ప్రత్యర్థి వర్గం అభ్యర్థి అభ్యంతరం తెలపడంతో పాటు ఆందోళన చేశారు. ఇందల్వా యి మండలం సి ర్నాపల్లిలో ఒక అ భ్యర్థి దొంగ ఓ ట్లు వేయిస్తున్నాడంటూ మరో వర్గం అ భ్యర్థి గొడవ చేయడంతో అదనపు డీసీపీ బ స్వారెడ్డి, ఏసీపీ రా జావెంకటరెడ్డి గ్రా మానికి చేరుకుని వి చారణ చేయిస్తామన్నారు. ● పోలింగ్ అనంతరం లెక్కింపు నిర్వహించారు. ఏకగ్రీవాలతో కలిపి కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు 133, బీజేపీ 17, బీఆర్ఎస్ 26, స్వతంత్రులు 20 మంది సర్పంచ్ అభ్యర్థులు గెలుపొందారు. అధికార కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు పూర్తిస్థాయిలో ఆధిపత్యం ప్రదర్శించారు. దీంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో జోష్ నెలకొంది. పకడ్బందీ పర్యవేక్షణ.. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ టి వినయ్ కష్ణారెడ్డి మోపాల్, డిచ్పల్లి మండలాల్లోని ముల్లంగి, ధర్మా రం పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఏర్పాట్లను, పోలింగ్ సరళిని పరిశీలించారు. హెల్ప్ డెస్క్లు, మెడికల్ క్యాంపు, ఇతర అన్ని సదుపాయాలు అందుబాటులో ఉన్నాయా అని తనిఖీ చేశారు. వృద్ధు లను తరలించేందుకు వీల్చైర్లు వినియోగిస్తున్నారా లేదా అని గమనించారు. కలెక్టర్ మాట్లాడుతూ సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద అదనపు పోలీసు బలగాలను మొహరించామన్నారు. వెబ్ క్యాస్టింగ్ జరిపించామని, మైక్రో అబ్జర్వర్లతో పోలింగ్ తీరును నిశితంగా పరిశీలించామన్నారు. కలెక్టరేట్ నుంచి సైతం పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ తీరును, స్థానిక పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించామన్నారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగిందని, నిర్ణీత సమయం లోపు క్యూ లైన్లలో నిలుచున్న వారికి కూడా ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా ఓటు వేసే అవకాశం కల్పించామన్నారు. మరోవైపు ఎన్నికల సాధారణ పరిశీలకుడు శ్యాంప్రసాద్లాల్ సైతం పోలింగ్ కేంద్రాలను విస్తృతంగా సందర్శించి, ఓటింగ్ తీరుతెన్నులను పరిశీలించారు. మోపాల్, మాక్లూర్, గుండారం, డిచ్పల్లి మండలం ఘన్పూర్, ఇందల్వాయి మండలం గన్నారం, ధర్పల్లి, సిరికొండల్లో పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఓటింగ్ తీరుతెన్నులు పరిశీలించారు. పోలీస్ కమిషనర్ సాయి చైతన్య డిచ్పల్లి, మోపాల్, ఇందల్వాయి, జక్రాన్పల్లి, సిరికొండ, ఽమాక్లూర్, ధర్పల్లి మండలాల్లో పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. మండలం పురుషులు సీ్త్రలు ఇతరులు మొత్తం 9గంటల వరకు 11 గంటల వరకు ఒంటి గంట వరకు పోలైన మొత్తం ఓటర్లు పోలైన ఓట్లు పోలైన ఓట్లు పోలైన ఓట్లు మొత్తం ఓట్లు పోలింగ్ శాతం ధర్పల్లి 13,449 15,570 –– 29,019 6,092 15,550 19,821 21,049 72.54 డిచ్పల్లి 20,129 23,253 –– 43,382 5,866 15,339 27,190 33,111 76.32 ఇందల్వాయి 13,589 15,668 01 29,258 5,836 14,761 22,028 22,054 75.38 జక్రాన్పల్లి 14,427 16,839 –– 31,266 7,191 17,247 22.763 23,471 75.07 మాక్లూర్ 11,821 13,844 –– 25,665 5,725 14,436 19,674 20,255 78.92 మోపాల్ 13,342 15,720 –– 29,062 5,646 16,033 22,945 23,031 79.25 ని.రూరల్ 9,276 10,361 04 19,641 5,242 11,839 15,806 15,806 80.47 సిరికొండ 14,894 16,651 –– 31,545 7,331 12,143 23,069 24,442 77.48 మొత్తం 1,10,927 1,27,906 05 2,38,838 48,929 1,17,348 1,73,296 1,83,219 76.71ఫలితాలు ఇలా..జీపీలు కాంగ్రెస్ ఏకగ్రీవం కాంగ్రెస్ బీఆర్ఎస్ ఏకగ్రీవం బీఆర్ఎస్ బీజేపీ ఏకగ్రీవం బీజేపీ స్వతంత్రులు ఏకగ్రీవం స్వతంత్రులు 196 32 101 02 24 02 15 02 18 సింగిల్ డిజిట్తో విజయం.. సిరికొండ సర్పంచ్గా బీఆర్ఎస్ బలపర్చిన మల్లెల సాయిలు ఒక్క ఓటుతో గెలుపొందారు. ఇందల్వాయి మండలం రూప్లానాయక్తండా సర్పంచ్గా కాంగ్రెస్ బలర్చిన హరిసింగ్ 3 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. మోపాల్ మండలం ఒడ్డెర కాలనీ సర్పంచ్గా కాంగ్రెస్ బలపర్చిన సుమలత 8 ఓట్లతో గెలుపొందారు. రెండో విడత పోలింగ్ వివరాలు..వివిధ పార్టీల మద్దతుతో గెలుపొందిన సర్పంచ్లురెండో విడతలో అత్యధిక పంచాయతీలలో కాంగ్రెస్ మద్దతుదారుల విజయం మొత్తం 196 జీపీల్లో 38 ఏకగ్రీవం, 158 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు 76.71 శాతం పోలింగ్ నమోదు పర్యవేక్షించిన కలెక్టర్, సీపీ, సాధారణ ఎన్నికల పరిశీలకుడు లక్కీ విజేతలుఒడ్డెర కాలనీ గ్రామపంచా యతీలో 2, 5వ వార్డులో అభ్యర్థులకు సమాన ఓట్లు రావడంతో అధికారులు లక్కీ డ్రా తీశారు. ఆలకుంట వెంకమ్మ, దండుగుల ప్రమీల లక్కీ డ్రాలో విజేతలుగా నిలిచారు. -
బీజేపీ జెండా కనిపిస్తే భయపడుతున్నారు
సుభాష్నగర్: బీజేపీ జెండా కనిపిస్తే కాంగ్రెస్ నాయకులు భయపడుతున్నారని, సర్పంచ్ ఎన్నికల్లో తమ పార్టీ బలపర్చిన అభ్యర్థులను గెలిపిస్తే ప్రజల వద్దకు పాలన అందిస్తామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ పటేల్ కులాచారి అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. జిల్లాలో మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో బీజేపీ బలపర్చిన 48 మంది పోటీ చేయగా.. 18 మంది విజయం సాధించారని సంతోషం వ్యక్తంచేశారు. కొన్నిచోట్ల స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారని పేర్కొన్నారు. రెండు, మూడు విడతల్లో మరిన్ని సర్పంచ్ స్థానాలు భారీ మెజార్టీతో గెలుస్తామని ధీమా వ్యక్తంచేశారు. కేంద్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తుంటే.. ఆ అభివృద్ధిని కాంగ్రెస్ తమ ఖాతాలో వేసుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. అనంతరం మొదటి విడతలో గెలుపొందిన సర్పంచ్, వార్డుసభ్యులను సన్మానించారు. పదేళ్ల పాలనపై చర్చకు సిద్ధమా..? బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో చేసిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా అని అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేశ్గుప్తాకు దినేష్ సవాల్ విసిరారు. ఇటీవల ధన్పాల్ సూర్యనారాయణపై అవాస్తవ ఆరోపణలు చేసి గణేశ్గుప్తా తన రాజకీయ ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేశారని ఆరోపించారు. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ రెండేళ్లలో రూ.138 కోట్లకుపైగా నిధులు తీసుకొచ్చారని గుర్తుచేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి నాగోళ్ల లక్ష్మీనారాయణ, సీనియర్ నాయకులు న్యాలం రాజు, జిల్లా కార్యదర్శి జ్యోతి, రూరల్ కన్వీనర్ పద్మారెడ్డి, మాజీ కార్పొరేటర్లు ప్రమోద్కుమార్, ఎర్రం సుధీర్, బద్దం కిషన్, తారక్ వేణు, ఇప్పకాయల కిషోర్, కోడూరు నాగరాజ్, పంచరెడ్డి శ్రీధర్, పుట్ట వీరేందర్, ఆమందు విజయ్ కృష్ణ, కార్యకర్తలు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకుంటోంది మరిన్ని సర్పంచ్ స్థానాలను గెలుచుకుంటాం బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ కులాచారి -
స్వామియే అయ్యప్పో..
● నగరంలో వైభవంగా ఆరట్టు ఉత్సవం ● మార్మోగిన అయ్యప్ప నామస్మరణ నిజామాబాద్ రూరల్: నగరంలో అయ్యప్ప ఆ రట్టు ఉత్సవాన్ని మాలధారులు శనివారం వైభవంగా నిర్వహించారు. అయ్యప్ప స్వామి ఆల యం నుంచి ప్రారంభమైన శోభాయాత్ర రఘునాథ చెరువు వరకు భక్తిశ్రద్ధలతో సాగింది. అయ్యప్ప నామస్మరణతో నగరం మార్మోగింది. ముఖ్యఅతిథిగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొని రథాన్ని ప్రారంభించారు. స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆరోగ్యవంతులుగా ఉండాలని ఆకాంక్షించారు. ధర్మం, భక్తి, క్రమశిక్షణను పెంపొందించే ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో శాంతి, ఐక్యతను బలోపేతం చేస్తాయని పేర్కొన్నారు. ఆలయ చైర్మన్ భక్తవత్సలం, మాలధారులు మంచాల జ్ఞానేందర్ గుప్తా, గజవాడ ఆగమయ్య, యాంసాని రవీందర్, నేతి శేఖర్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగోల్ల లక్ష్మీనారాయణ, మాజీ కార్పొరేటర్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. -
తిమ్మాపూర్లో ఏకగ్రీవాలకు బ్రేక్
మోర్తాడ్: సమష్టి నిర్ణయంతో ఎలాంటి రాజకీయ కక్షలకు తావివ్వకుండా ఏకగ్రీవంగా ప్రజాప్రతినిధులను ఎంపిక చేసి రికార్డు నిలుపుకున్న తిమ్మాపూర్లో పోలింగ్ అనివార్యమైంది. ఏకగ్రీవ రికార్డులకు పోలీసుల చర్యలు బ్రేక్ వేయడంతో ఈనెల 17న పంచాయతీ ఎన్నికలలో గ్రామస్తులు ఓటు వేయనున్నారు. తిమ్మాపూర్ గ్రామ పంచాయతీ 1961లో ఆవిర్భవించింది. అప్పటి నుంచి 2001 వరకు వరుసగా జరిగిన అన్ని పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్లను, వార్డు సభ్యులను, ఉప సర్పంచ్ను ఏకగ్రీవంగానే ఎంపిక చేశారు. ఎంపీటీసీ ఎన్నికల్లో సైతం ఎంపీటీసీ సభ్యుడిని, సహకార సంఘం ఎన్నికల్లో డైరెక్టర్లను ఎంపిక చేయడానికి గ్రామస్తులు అంతా సమావేశం నిర్వహించేవారు. ఒక్క మాటపై ప్రజాప్రతినిధులను ఎంపిక చేసి వారి చేతనే నామినేషన్లు దాఖలు చేయించి ఏకగ్రీవంగా ఎంపిక చేసి రికార్డు సృష్టించారు. 2001లో రాజకీయ సమీకరణలు మారడంతో పోటీ అనివార్యమైంది. ఆ తరువాత 2006, 2013లో అభ్యర్థులు ఎక్కువ మంది సర్పంచ్, వార్డు స్థానాలకు పోటీ పడటంతో గ్రామస్తులు ఓట్లు వేసి తమ నాయకులను ఎన్నుకున్నారు. 2019 పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలను ప్రోత్సహించడానికి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.15 లక్షల బహుమతి ప్రకటించింది. అప్పట్లో మరోసారి గ్రామస్తులు సమావేశం నిర్వహించుకుని సర్పంచ్, వార్డు సభ్యులు, ఉప సర్పంచ్ను ఏకగ్రీవంగా ఎంపిక చేసి మరోసారి పాత సంప్రదాయాన్ని ఆచరించారు. ఇప్పటి పంచాయతీ ఎన్నికల్లో బీసీ జనరల్కు సర్పంచ్ స్థానం రిజర్వు చేశారు. సర్వ సమాజ్ కమిటీ సభ్యులు సమావేశం నిర్వహించి తమలో తామే ఓట్లు వేసి అశోక్ యాదవ్ అనే వ్యక్తిని సర్పంచ్ అభ్యర్థిగా ఖరారు చేశారు. సర్వ సమాజ్ కమిటీలో లేని మరో నాయకుడు పుప్పాల నరేష్ తాను కూడా సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్నట్లు ప్రకటించడంతో ఏకగ్రీవ ఎంపికకు చెక్ పెట్టినట్లు అయ్యింది. వార్డు స్థానాలకు ఉత్సాహం ఉన్నవారు నామినేషన్లు దాఖలు చేయడం, సర్పంచ్ పదవికి ఇద్దరు పోటీ పడుతుండటంతో ఈనెల 17న ఓటింగ్ జరుగనుంది. ఎన్నో ఏళ్లుగా ఏకగ్రీవ పద్ధతిలోనే ప్రజాప్రతినిధుల ఎంపిక 2001లో విరామం పలికి 2019లో మరోసారి ఏకగ్రీవ సంప్రదాయం పాటించిన గ్రామం ఈ ఎన్నికల్లో ఏకగ్రీవ ఎంపికకు పోలీసుల చెక్.. అనివార్యమైన పోటీ -
నేతల ఫొటోలు లేకుండానే ప్రచారం
మోర్తాడ్: పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అ భ్యర్థులకు రాజకీయ పార్టీల మద్దతు ఉన్నా ఆ పార్టీ స్థానిక నేతల ఫొటోలు లేకుండానే సొంతంగా ప్ర చారంలో దూసుకుపోతున్నారు. తమ పార్టీల ము ఖ్య నేతల ఫొటోలను కరపత్రాలు, డోర్ స్టిక్కర్స్పై ప్రదర్శించేందుకు ఆలోచిస్తున్నారు. ఒక వేళ ఆ నాయకులపై వ్యతిరేకత ఉంటే ఆ ప్రభావం తమపై చూపుతుందని భయపడుతున్నారు. పంచాయతీ ఎన్నికల్లో పార్టీల జోక్యం నేరుగా లేదు. ఎక్కువ మంది అభ్యర్థులు వారికి కేటాయించిన గుర్తులు, వారి ఫొటోలను కరపత్రాలు, డోర్ స్టిక్కర్స్పై ముద్రించి ప్రచారం కొనసాగిస్తున్నారు. అనేక గ్రామాల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ముఖ్య నేతలు, నియోజకవర్గం నాయకుల ఫొటోలు కనిపించడం లేదు. నాయకులపై వ్యతిరేకత ఉంటే తమకు ఎక్కడ దెబ్బ పడుతుందోననే అనుమానం, పార్టీలకు అతీతంగా ఓట్లు రాబట్టుకోవాలనే కాంక్షతో అభ్యర్థులు సొంతంగానే ప్రచారం సాగిస్తున్నారు. ముఖ్య నేతల ఆశీస్సులు ఉన్నా వారి ఫొటోలు లేకుండా ప్రచారం సాగుతుండటం గమనార్హం. పార్టీలకు దూరంగా ఉంటూ గుర్తు, తమ ఫొటోతోనే బరిలోకి.. పార్టీల నాయకులపై వ్యతిరేకత తమపై ఎక్కడ ప్రభావం చూపుతుందోననే భయం -
హైవేపై కంటైనర్ బోల్తా
భిక్కనూరు : జంగంపల్లి గ్రామ శివారులోని 44వ నంబర్ జాతీయ రహదారిపై శనివారం రాత్రి కంటైనర్ బోల్తాపడింది. కామారెడ్డి నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న కంటైనర్ ముందు వెళ్తున్న కారును ఢీ కొట్టి బోల్తా పడడంతో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు వ్యక్తులతోపాటు కంటైనర్ డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయి. జాతీయ రహదారిపై లారీ బోల్తా పడటంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్రేన్ సహాయంతో లారీని పక్కకు తప్పించి ట్రాఫిక్ను క్లియర్ చేశారు. -
సులేమాన్నగర్ శివారులో ఒకరి మృతి
రుద్రూర్: మండలంలోని సులేమాన్నగర్ శివారులో మన్నె శ్రీను (43) అనే వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఎడపల్లికి చెందిన మన్నె శ్రీను గత నాలుగేళ్ల నుంచి రుద్రూర్ మండలం కొందాపూర్లోని తన మేన మామ వద్ద గేదెలు మేపుతూ జీవిస్తున్నాడు. ఈ నెల 9వ తేదీన ఎడపల్లికి వెళ్లిన అతడు.. శనివారం ఉదయం సులేమాన్నగర్ శివారులో మృతదేహమై కనిపించాడు. మద్యం సేవించే అలవాటు ఉన్న శ్రీను.. మత్తులో మూత్ర విసర్జనకు నడుచుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు బోర్ల పడి మృతి చెంది ఉంటాడని భావిస్తున్నారు. మృతుడి మేనమామ బాల్రాజ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్ల ఎస్సై సాయన్న తెలిపారు. ప్రమాదవశాత్తు చెరువులో పడి వృద్ధురాలు.. బాన్సువాడ: పట్టణానికి చెందిన ఉప్పరి లక్ష్మి(65) అనే వృద్ధురాలు ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందింది. పట్టణంలో భిక్షాటన చేస్తూ జీవిస్తున్న లక్ష్మి అప్పుడప్పుడు కల్కి చెరువుకు వెళ్లి స్నానం చేసి బట్టలు ఉతుక్కునేది. ఈ నెల 12వ తేదీన చెరువు వద్దకు స్నానానికి వెళ్లిన లక్ష్మి ప్రమాదవశాత్తు కాలు జారి పడి నీట మునిగి చనిపోయింది. మృతురాలి కుమార్తె గంట లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శ్రీధర్ తెలిపారు. -
పోలీస్ ప్రజావాణి వాయిదా
నిజామాబాద్అర్బన్: ప్రతి సోమవారం నిర్వహించే పోలీసు ప్రజావాణిని వాయిదా వేసినట్లు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కార్యక్రమాన్ని వాయిదా వేశామని ప్రజలు గమనించాలని పేర్కొన్నారు. ప్రజావాణి మళ్లీ ఎప్పుడు నిర్వహించేది ప్రకటిస్తామని తెలిపారు. పెర్కిట్(ఆర్మూర్): ఆర్మూర్ మండలం మగ్గిడి ప్రభుత్వ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థులు సౌత్ ఇండియా యూనివర్సిటీ వాలీబాల్ పోటీలకు ఎంపికై నట్లు పీఈటీ మధు శనివారం తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఉమెన్స్ కళాశాలలో డిగ్రీ చదువుతున్న సంజూష, జీజీ కళాశాలలో డిగ్రీ చదువుతున్న కీర్తీ, ఎస్ఎస్ఆర్ కళాశాలలో డిగ్రీ చదువుతున్న స్పందన, నిషిత కళాశాలలో డిగ్రీ చదువుతున్న సాయిరాం, జీజీ కళాశాల విద్యార్థి అజయ్తోపాటు మేడ్చల్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతున్న నవీన సౌత్ ఇండియా యూనివర్సిటీ వాలీబాల్ పోటీలకు ఎంపికై నట్లు వివరించారు. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడలో త్వరలో నిర్వహించనున్న సౌత్ ఇండియా వాలీబాల్ పోటీల్లో అమ్మాయిలు, చైన్నైలో నిర్వహించనున్న పోటీల్లో అబ్బాయిలు పాల్గొంటారన్నారు. విద్యార్థులను పాఠశాల హెచ్ఎం హరిత, పీఈటీ మధు, వీడీసీ సభ్యులు అభినందించారు. ఇందల్వాయి: సమన్వయంతో పనిచేసి పంచాయతీ ఎన్నికలను విజయవంతంగా పూర్తి చేయాలని, తప్పిదాలు జరగకుండా చూడాలని ఎన్నికల సిబ్బందికి కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. ఇందల్వాయిలో ఏర్పాటు చేసిన ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని కలెక్టర్ శనివారం పరిశీలించారు. స్వేచ్ఛ వాతావరణంలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ఎంపీడీవో అనంత్రావు, తహసీల్దార్ వెంకట్రావు తదితరులు ఆయన వెంట ఉన్నారు. ● అప్రమత్తమైన ప్రయాణికులు సదాశివనగర్(ఎల్లారెడి): మండలంలోని పద్మాజివాడి చౌరస్తాలో ఓ ఆర్టీసీ బస్సులో పొగలు రావడంతో కలకలం రేగింది. 67 మంది ప్రయాణికులతో కామారెడ్డి వైపునకు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో నుంచి పద్మాజివాడి చౌరస్తాలో పొగలు వచ్చాయి. ప్రయాణికులు గమనించి వెంటనే డ్రైవర్ను అప్రమత్తం చేశారు. ఆందోళనతో కిందికి దిగారు. పద్మాజివాడి సర్పంచ్ లోకోటి సుబ్బారావు అక్కడికి చేరుకుని ప్రయాణికులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. -
కారు దహనం
ఆర్మూర్టౌన్: ఆలూర్ మండలం మచ్చర్లలో మాజీ ఎంపీపీ పస్క నర్సయ్యకు చెందిన కారుకు దుండగులు శుక్రవారం అర్ధరాత్రి నిప్పంటించారు. ఎప్పటిలాగే నర్సయ్య కారును పార్క్ చేసి ఇంటికి వెళ్లాడు. అర్ధరాత్రి వేళ కారు దహనమవుతున్నట్లు గమనించిన స్థానికులు అతడికి సమాచారం అందించారు. నర్సయ్య అక్కడికి చేరుకునే సరికి కారు మంటల్లో కాలిపోతోంది. అతడు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా ఎస్హెచ్వో సత్యనారాయణగౌడ్ ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. బాధితుడు నర్సయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్హెచ్వో తెలిపారు. -
ప్రజల దృష్టి మళ్లించేందుకే ఫుట్బాల్ మ్యాచ్
నిజామాబాద్అర్బన్: రాష్ట్రంలో పూర్తిగా విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఫుట్బాల్ ప్రాక్టీస్ మ్యాచ్ నిర్వహించిందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డి ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మెస్సి హైదరాబాద్కు వచ్చి ఫుట్బాల్ ఆడినందుకు రూ.వందల కోట్లు ఖర్చు చేయడం అవసరమా అని ప్రశ్నించారు. దీనిపై కేంద్రం విచారణ చేపట్టేలా రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీలు ఒత్తిడి తేవాలన్నారు. సీఎం రేవంత్రెడ్డి ఎమిరేట్స్ టీ షర్టు ధరించి ఆ సంస్థను ప్రమోట్ చేయడం అన్యాయమని అన్నారు. ఆయన కమీషన్ల వాటా ఎంత అని ప్రశ్నించారు. ఇది హైదరాబాద్ ప్రతిష్ట పెంచే ఈవెంట్ కాదని కోట్లు కొల్లగొట్టే పేమెంట్ కార్యక్రమమని విమర్శించారు. మెస్సి ఫుట్బాల్ ఆటగాడు అయితే.. రేవంత్రెడ్డి ఓటుకు నోటులో కేటుగాడని మండిపడ్డారు. తెలంగాణ ప్రజల సంపదను దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. ఎన్నికల హామీలను కాంగ్రెస్ పూర్తిగా విస్మరించిందని, తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఆ పార్టీకి ప్రజలు బ్రేక్ వేశారన్నారు. సమావేశంలో జెడ్పీ మాజీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు, మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్, ఆర్మూర్ పట్టణ అధ్యక్షుడు నరేందర్, ప్రభాకర్, రాజేశ్వర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఫుట్బాల్ మ్యాచ్కు రూ.వందల కోట్లా..? హైదరాబాద్ ప్రతిష్ట పెంచే మ్యాచ్ కాదు.. కోట్లు కొల్లగొట్టే పేమెంట్ కార్యక్రమం బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్రెడ్డి విమర్శలు -
రెబల్స్ గుబులు
నిజామాబాద్వాతావరణం ఉదయం శీతల గాలులు వీస్తాయి. ఆకాశం పాక్షికంగా మేఘావృతం అవుతుంది. రాత్రి పొగమంచు కురుస్తుంది. చలి తీవ్రత కొనసాగుతుంది.ప్రజల దృష్టి మళ్లించేందుకే.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఫుట్బాల్ మ్యాచ్ నిర్వహించిందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్రెడ్డి అన్నారు.ఆదివారం శ్రీ 14 శ్రీ డిసెంబర్ శ్రీ 2025– 8లో uఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలి నిజామాబాద్అర్బన్: గ్రామ పంచాయతీ రెండో విడత ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని ఆదేశించారు. శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కమిషనర్ మాట్లాడుతూ ఎలాంటి లోటుపాట్లు లేకుండా ప్రజలు ప్రశాంతంగా ఓటు వేసేవిధంగా చూడాలన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద సౌకర్యాలు కల్పించాలని, కౌంటింగ్ ప్ర క్రియ సజావుగా నిర్వహించాలన్నారు. తగి నంత సిబ్బందిని కేటాయించాలన్నారు. వీసీ లో ఎన్నికల సాధారణ పరిశీలకులు శ్యాంప్రసాద్లాల్, వ్యయ పరిశీలకులు కిషన్ తదిరులు పాల్గొన్నారు. రోడ్డుపైనే మేకల క్రయవిక్రయాలు ● నవీపేటలో ట్రాఫిక్కు అంతరాయం నవీపేట : నవీపేట మండల కేంద్రంలో ప్రతి శనివారం జరిగే మేకల సంతతో ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. మార్కెట్ ప్రాంగణం సరిపోకపోవడంతో బాసర రహదారి పక్కనే రోడ్డుపై క్రయవిక్రయాలు జరుపుతున్నారు. వాహనాలు అక్కడే నిలిపి బేరసారాలు కొనసాగిస్తున్నారు. కొద్ది దూరంలో రైల్వేగేటు ఉండడంతో గేటు వేసిన సమయంలో ట్రాఫిక్కు మరింత ఇబ్బంది ఎదురవుతోంది. పోలీసులు వ్యాపారులను హెచ్చరించినా వినడం లేదు. వ్యాన్ అద్దాలు పగులగొట్టి, రూ. 2.20 లక్షలు అపహరణ నవీపేట: మండల కేంద్రంలో శనివారం జరిగిన సంతకు వచ్చిన మేకల వ్యాపారికి చెందిన రూ. 2.20 లక్షల నగదును దుండగులు ఎత్తుకెళ్లారు. ధర్పల్లి మండలం రామడుగుకు చెందిన అబ్దుల్ ఖయ్యూమ్ తన వ్యాన్లో మేకలను తీసుకుని సంతకు వచ్చాడు. స్థాని క మెస్లో భోజనం చేసేందుకు వ్యాన్ను రోడ్డు పక్కన నిలిపి హోటల్లోకి వెళ్లాడు. అదే సమయంలో బైక్పై వచ్చిన ఇద్దరు దుండగులు వ్యాన్ అద్దాలు పగులగొట్టి అందు లోని రూ.2.20 లక్షలను ఎత్తుకెళ్లారు. అద్దం పగిలిన శబ్దం విని ఖయ్యూమ్ అక్కడికి రాగా దుండగులు పారిపోయారు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రేపటి నుంచి విశ్రాంత ఉద్యోగుల క్రీడాపోటీలు నిజామాబాద్ రూరల్: అఖిల భారత పెన్షన ర్స్ డే సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభు త్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఈనెల 15 నుంచి 17 వరకు జిల్లా స్థాయి క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా అ ధ్యక్షులు పండరినాథ్ ఒక ప్రకటనలో తెలి పారు. పోటీలు విశ్రాంత ఉద్యోగుల సంఘ భవనంతోపాటు ఆఫీసర్స్ క్లబ్లో నిర్వహిస్తామని పేర్కొన్నారు. మూడు రోజుల పా టు క్రీడాపోటీలు సాగుతాయన్నారు. 17న ముగింపు కార్యక్రమాన్ని న్యూ అంబేడ్కర్ భవన్లో నిర్వహిస్తామని తెలిపారు. చైనా మాంజా వినియోగిస్తే చర్యలు నిజామాబాద్అర్బన్: చైనా మాంజా వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీ పీ సాయి చైతన్య ఒక ప్రకటనలో హెచ్చరించారు. మాంజా కారణంగా ఎవరి ప్రాణాలకై నా హాని కలిగితే హత్యానేరం కింద కేసు నమోదు చేస్తామన్నారు. చైనా మాంజా కారణంగా జంతువులకు కూడా ప్రాణహాని ఉందని పేర్కొన్నారు. మాంజా అమ్మినా, తయారు చేసినా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో పార్టీ నుంచే రెబల్స్ ఉన్నప్పటికీ కాంగ్రెస్ మద్దతుదారులే ఆధిపత్యం ప్రదర్శించారు. అయితే కీలకమైన పంచాయతీలను బీజేపీ మద్దతుదారులు గెలుచుకున్నారు. ప్రస్తుతం జరుగనున్న రెండో విడత, మూడో విడత ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారులకు రెబల్స్ గుబులు పట్టుకుంది. మోపాల్(నిజామాబాద్రూరల్): మోపాల్ మండలంలోని అమ్రాబాద్ గ్రామపంచాయతీ ఏర్పడిన 45 ఏళ్లలో రెండోసారి మాత్రమే ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ పంచాయతీలో ఇప్పటికే ఏడుసార్లు ఏకగ్రీవమైంది. నిజామాబాద్ ఉమ్మడి మండలంలోని మంచిప్ప గ్రామపంచాయతీ నుంచి అమ్రాబాద్ (ఎల్లమ్మకుంటను కలుపుకుని) పంచాయతీ గా ఏర్పాటైంది. మొదటిసారి మోజీరాం నాయక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 1986 సంవత్సరంలో ఎన్నికలు జరగ్గా మోజీరాం నాయక్ విజయం సాఽ దించారు. 1995 వరకు మోజీరాం ఏకగ్రీవ సర్పంచిగా పని చేశారు. ఆ తర్వాత వరుసగా బొట్టు శంకర్, ఈశ్వర్ సింగ్ నాయక్, కెతావత్ యాదగిరి నాయక్, సంజీవ్ గౌడ్, గోకుల్ సింగ్ ఏకగ్రీవ సర్పంచులుగా పనిచేశారు. 2019లో అమ్రాబాద్ నుంచి ఎల్లమ్మకుంట ప్రత్యేక గ్రామపంచాయతీ ఏర్పాటైంది. 1986 తర్వాత మళ్లీ 2025వ సంవత్సరంలో అమ్రాబాద్లో పోటీ నెలకొంది. ఎస్టీ మహిళకు ఆ పంచాయతీ రిజర్వ్ కావడంతో ఏకంగా 8 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 1986వ సంవత్సరంలో మోజీరాంనాయక్పై పోటీ చేసిన ఈశ్వర్సింగ్ నాయక్.. తాజా ఎన్నికల్లోనూ పోటీ పడుతున్న 8 మంది అభ్యర్థుల్లో ఆయన భార్యను బరిలో నిలపడం గమనార్హం. పలు గ్రామపంచాయతీలలో అభ్యర్థుల నడుమ పోటీ హోరాహోరీగా ఉంది. మండల కేంద్రాలతో పాటు కొన్ని పెద్ద గ్రామాల్లో త్రిముఖ, మరికొన్ని గ్రామాల్లో ద్విముఖ పోటీ నెలకొంది. ఆయా మండలాల్లోని నడిపల్లి, డిచ్పల్లి, ధర్మారం(బి), ఇందల్వాయి, నల్లవెల్లి, గన్నారం, మెగ్యానాయక్ తండా, ఎల్లారెడ్డి పల్లి, సిర్నాపల్లి, రేకులపల్లి, దుబ్బాక్, హోన్నాజిపేట్, రామడుగు (ప్రాజెక్టు), ధర్పల్లి,మోపాల్,కంజర, న్యాల్కల్, అమ్రాబాద్, సింగంపల్లి, జక్రాన్పల్లి, పడకల్, కలిగోట్, బ్రాహ్మణపల్లి, అర్గుల్, సికింద్రాపూర్, గడ్కోల్, సిరికొండ, న్యావనంది, రావుట్ల, కొండూర్, గుండారం, ఆకుల కొండూర్, జలాల్పూర్, మల్లారం తదితర గ్రామాల్లో హోరాహోరీ పోరు నడుస్తోంది. ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. కొన్ని చోట్ల అధికార పార్టీకి చెందిన ఇద్దరేసి అభ్యర్థులు నామినేషన్లు వేశారు. భారీ ఎత్తున ఖర్చు చేశారు. ఆయా మండలాల్లోని పెద్ద గ్రామాల్లో సర్పంచ్ పదవితో పాటు వార్డుల్లోనూ గట్టి పోటీ నెలకొంది. డిచ్పల్లి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను పరిశీలిస్తున్న ఎన్నికల పరిశీలకులు జీవీ శ్యాంప్రసాద్లాల్డిచ్పల్లి సెంటర్లో సూచనలిస్తున్న ఆర్డీవో రాజేంద్రకుమార్డిచ్పల్లి మండలం ఘన్పూర్ పోలింగ్ కేంద్రానికి చేరుకున్న ఎన్నికల అధికారులు, సిబ్బంది45 ఏళ్లలో రెండో ఎన్నిక అమ్రాబాద్ గ్రామ పంచాయతీలో రికార్డు ఏకగ్రీవాలుపలు గ్రామాల్లో పోటాపోటీ..రెండో విడత పంచాయతీ ఎన్నికల ఓటర్లు..సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: మూడు ప్రధాన పార్టీ ల ప్రాబల్యం కలిగిన జిల్లాలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పా ర్టీ మద్దతుదారులు ఆధిపత్యం సాధించినప్పటికీ, రాబోయే కాలంలో రాజకీయ సమీకరణల్లో అనూ హ్య మార్పులకు సంకేతాలు కలిగించాయి. బోధన్ డివిజన్లోని బోధన్, బాన్సువాడ ని యోజకవర్గాల పరిధిలో పలుచోట్ల వెలువడిన ఫలితాలు ప్రత్యేకంగా నిలిచాయి. చాలాచోట్ల కాంగ్రెస్ పార్టీకి చెందినవారే పోటాపోటీగా తలపడ్డారు. బా న్సువాడ నియోజకవర్గం పరిధిలోని మండలాల్లో అయితే ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, ఏనుగు రవీందర్రెడ్డి వర్గాల మధ్య పంచాయతీ పోరు నడిచింది. ఈ పోరులో పోచారం వర్గీయులే ఆధిపత్యం నిలబెట్టుకున్నారు. కాగా కొన్ని కీలకమైన చోట్ల మా త్రం పోచారం, ఏనుగు వర్గాలు కలసికట్టుగా పోటీ చేసినప్పటికీ బీజేపీ మద్దతుదారులు విజయం సాధించడం విశేషం. ఇదిలా ఉండగా రెండో, మూ డో విడతల్లోనూ అధికార పార్టీకి ఈ రెబెల్స్ బెడద ఎక్కువగానే ఉండడంతో గుబులు పుట్టిస్తోంది. మోస్రా మండల కేంద్రంలో పోచారం, ఏనుగు వర్గీయులు కలిసే బరిలోకి దిగినప్పటికీ ఇక్కడ బీ జేపీ మద్దతుదారుడు గెలుపొందడం గమనార్హం. అదేవిధంగా మరో మండల కేంద్రమైన పొతంగల్ పంచాయతీలోనూ ఇరువర్గాలు కలిసి పోటీ చేసినప్పటికీ బీజేపీ మద్దతుదారుడు విజయం సాధించడంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రుద్రూర్ మండలం అంబం గ్రామపంచాయతీ లో పోచారం, ఏనుగు వర్గీయులు ఎవరికి వారు గా బరిలోకి దిగగా ఇద్దరూ ఓటమిపాలయ్యారు. ఇక్క డ బీజేపీ మద్దతుదారుడు విజయం సాధించారు. చందూర్లో త్రిముఖ పోరు జరుగగా కాంగ్రెస్, బీజేపీ మద్దతుదారులు ఓటమిపాలు కాగా, బీఆర్ఎస్ మద్దతుదారుడు గెలుపొందారు. రుద్రూర్ మండలం చిక్కడపల్లిలో పోచారం, ఏనుగు వర్గీయులు విడివిడిగా పోటీ చేయగా స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. మోస్రా మండ లం తిమ్మాపూర్లో కాంగ్రెస్, బీజేపీ మద్దతుదా రులు ఓడిపోగా, ఇక్కడ స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. వర్ని మండలం పైడిమల్ల పంచాయతీలో పోచారం వర్గీయుడు ఓడిపోగా స్వతంత్ర అభ్యర్థి గెలుపొందాడు. రుద్రూర్ మండలం సులేమాన్ ఫారం, రాణంపల్లి, వర్ని మండలం సత్యనారాయణపురం, హు మ్నాపూర్, జాకోరా, జలాల్పూర్, నెహ్రూనగర్ గ్రా మ పంచాయతీల్లో, మోస్రా మండలం చింతకుంట పంచాయతీలో పోచారం, ఏనుగు వర్గీయులు ఎవరికివారు పోటీ చేయగా పోచారం మద్దతుదారులు గెలుపొందారు. రుద్రూర్ మండలం రాయకూర్ క్యాంప్, వర్ని మండలం కునిపూర్ గ్రామపంచాయతీల్లో ఏనుగు వర్గీయులు గెలుపొందారు. రుద్రూర్ మండల కేంద్రంలో పోచారం వర్గానికి చెందిన వసంత సంజీవరెడ్డి ఓడిపోగా, ఏనుగు వ ర్గానికి చెందిన సునీత చంద్రశేఖర్ గెలుపొందారు. బోధన్ నియోజకవర్గం పరిధిలోని ఎడపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ముగ్గురు అభ్యర్థులు పోటీపడగా వాళ్లు ముగ్గురూ ఓటమిపాలయ్యారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి కందిగట్ల రాంచందర్ విజయం సాధించారు. నవీపేట మండలం జన్నేపల్లి పంచాయతీలో కాంగ్రెస్ నుంచి అన్నదమ్ములు రచ్చ సుదర్శన్, రచ్చ నర్సయ్య బరిలో నిలవగా ఇద్దరూ ఓడిపోయా రు. బీజేపీ అభ్యర్థి గంగాధర్ గెలుపొందారు. నవీపేట మండలంలోని నాళేశ్వర్లో కాంగ్రెస్ నుంచి ముగ్గురు, స్టేషన్ ఏరియాలో ఇద్దరు, రాంపూర్లో ఇద్దరు చొప్పున కాంగ్రెస్ మద్దతుదారులు నిలబడ్డారు. వీటిలో కాంగ్రెస్ మద్దతుదారులే గెలుపొందారు. రెంజల్ మండలం కందకుర్తి, అంబేద్కర్నగర్ పంచాయతీల్లో కాంగ్రెస్ నుంచి ఇద్దరు చొప్పున అభ్యర్థులు నిలబడ్డారు. వీటిలో కాంగ్రెస్ మద్దతుదారులే గెలుపొందారు. బోధన్ మండలంలోని సిద్ధాపూర్, రాంపూర్, బిక్నెల్లి, ఊట్పల్లి, పెంటాకూర్ పంచాయతీల్లో కాంగ్రెస్ మద్దతుదారులు ఇద్దరు చొప్పున నిలబడ్డారు. వీటిల్లో కాంగ్రెస్ మద్దతుదారులే గెలుపొందారు. ఇదే మండలంలోని బండారుపల్లి పంచాయతీలో కాంగ్రెస్ మద్దతుదారులు ఇద్దరు బరిలో నిలవగా బీఆర్ఎస్ మద్దతుదారుడు గెలుపొందారు. సాలూర మండలంలోని తగ్గెలి పంచాయతీలో కాంగ్రెస్ మద్దతుదారులు ముగ్గురు బరిలో నిలవగా ఈ ముగ్గురూ ఓడిపోయారు. ఇక్కడ స్వతంత్ర అభ్యర్థి అరుణ గెలుపొందారు. ఖాజాపూర్ పంచాయతీలో కాంగ్రెస్ నుంచి ఇద్దరు పోటీచేయగా ఇద్ద రూ ఓడారు. బీఆర్ఎస్ మద్దతుదారుడు గెలుపొందారు. సాలంపాడ్ క్యాంప్ పంచాయతీలో కాంగ్రెస్ నుంచి ఇద్దరు పోటీచేశారు. ఇక్కడ కాంగ్రెస్ మద్దతుదారుడే గెలిచారు. హున్సా పంచాయతీలో కాంగ్రెస్ నుంచి ఇద్దరు, బీజేపీ నుంచి ముగ్గురు బరిలో నిలవగా, కాంగ్రెస్ మద్దతుదారుడు గెలుపొందారు. రెండో, మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ మద్దతుదారుల్లో అంతర్మథనం మొదటి విడత ఎన్నికల్లో ట్రబుల్స్ను అధిగమించిన అధికార పార్టీ కీలకమైన పంచాయతీల్లో బీజేపీ మద్దతుదారుల పాగా -
అన్ని ఏర్పాట్లు పూర్తి
● డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను పరిశీలించిన కలెక్టర్, జనరల్ అబ్జర్వర్డిచ్పల్లి(నిజామాబాద్రూరల్): జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల రెండో విడత పోలింగ్ను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. పోలింగ్ నిర్వహణ, ఓటరు స మాచార స్లిప్పుల పంపిణీ, డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి పోలింగ్ సామగ్రితో సిబ్బంది తరలింపు, వెబ్ క్యాస్టింగ్ ఏర్పాట్లు, పోలింగ్ కేంద్రాలలో వస తులు, పోలీసు బందోబస్తు, ఎన్నికల ప్రవర్తనా ని యమావళి అమలు, నిఘా బృందాల పనితీరు ప ర్యవేక్షణ తదితర అంశాలపై ఇప్పటికే అన్ని కసరత్తులు పూర్తి చేశామన్నారు. గ్రామ పంచాయతీ రెండో విడత ఎన్నికలు ఆదివారం జరుగనున్న నేపథ్యంలో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, ఎన్నికల సాధారణ పరిశీలకులు జీవీ శ్యాంప్రసాద్ లాల్ శనివారం వేర్వేరుగా డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను సందర్శించా రు. నిజామాబాద్ డివిజన్లోని డిచ్పల్లి, ధర్పల్లి, ఇందల్వాయి, మోపాల్, నిజామాబాద్ రూరల్, సిరికొండ, మాక్లూర్, ఆర్మూర్ డివిజన్లోని జక్రాన్పల్ల్లి మండలాల పరిధిలోని గ్రామ పంచాయతీల కు జరిగే ఎన్నికలకు సంబంధించి పోలింగ్ సామగ్రి పంపిణీ తీరుతెన్నులను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇందల్వాయి డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని తనిఖీ చేసి అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. తాగునీటి వసతి, వైద్య శిబిరం, అల్పాహారం, భోజన వసతి, షామియానాలు ఇతర అన్ని వసతులు ఏర్పాటు చేయగా, పీఓ, ఓపీఓలతో కూడిన బృందాలు హాజరయ్యారా లేదా అని కలెక్టర్ ఆరా తీశారు. ఎలాంటి లోటుపా ట్లు, గందరగోళానికి తావులేకుండా సిబ్బందికి పోలింగ్ సామగ్రిని పక్కాగా అందించాలని, చెక్ లిస్టు ఆధారంగా ఎన్నికల నిర్వహణకు అవసరమైన సామగ్రి అందిందా లేదా అన్నది జాగ్రత్తగా పరిశీలించుకోవాలని సూచించారు. సిబ్బందిని తరలించేందుకు సిద్ధంగా ఉంచిన వాహనాలను పరిశీలించి, సకాలంలో నిర్దేశిత పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది చేరుకునేలా పర్యవేక్షణ జరపాలని అధికారులను ఆదేశించారు. డిచ్పల్లి, నిజామాబాద్ రూరల్, మాక్లూర్, మోపాల్ తదితర మండల పరిషత్ కార్యాలయాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను ఎన్నికల సాధారణ పరిశీలకులు శ్యాంప్రసాద్ లాల్ సందర్శించారు. పోలింగ్ మెటీరియల్ పంపిణీ తీరును పరిశీలించారు. పోలింగ్, కౌంటింగ్ పూర్తి పారదర్శకంగా జరిగేలా 56 మంది సూక్ష్మ పరిశీలకులు, 34 మంది జోనల్ అధికారులను నియమించారు. 61 పోలింగ్ కేంద్రాలలో వెబ్ క్యాస్టింగ్ చేయిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. -
లెక్క లేనంత ఖర్చు !
మోర్తాడ్(బాల్కొండ): సర్పంచులుగా పని చేసే వారికి ప్రతి నెలా రూ.6,500 చొప్పున గౌరవ వేతనాన్ని ప్రభుత్వం అందిస్తుంది. ఈ లెక్కన వారి పదవీ కాలంలో మొత్తం పొందే వేతనం రూ.3.90లక్షలు. కానీ పదవిని దక్కించుకునేందుకు ఎన్నికల సమయంలో అభ్యర్థులు మాత్రం లెక్క లేనంతగా ఉంటోంది. పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో సర్పంచ్ల వేతనం, గెలవడం కోసం వారు చేస్తున్న ఖర్చుపై పల్లెల్లో ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. మేజర్ పంచాయతీలు, మండల కేంద్రాల్లో సర్పంచ్లుగా బరిలో ఉన్న అభ్యర్థులు రూ.25 లక్షల నుంచి రూ.60లక్షల వరకూ ఖర్చు చేస్తున్నారు. చిన్న గ్రామాల్లో రూ.5 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ఖర్చు చేసేందుకు అభ్యర్థులు వెనుకాడటం లేదు. వేలం పాట ద్వారా సర్పంచ్ పదవిని పొందినవారు రూ.10 లక్షల నుంచి రూ.35లక్షల వరకూ గ్రామాభివృద్ధి కమిటీలకు చెల్లింపులు పూర్తి చేశారు. వేలం పాట లేని చోట ఓటర్లను ఆకట్టుకోవడానికి ఎంత ఖర్చుకై నా అభ్యర్థులు వెనుకాడటం లేదు. మద్యం, మాంసంతోపాటు ఓటుకు ఇంత అని ధర నిర్ణయించడం గమనార్హం. జనాభా ఎక్కువగా ఉన్న గ్రామాల్లో ఇద్దరు, ముగ్గురు అభ్యర్థులు పోటీ పడితే వారు అందరూ కలిసి చేస్తున్న ఖర్చు రూ.1.50 కోట్లు దాటిపోతోంది. సర్పంచ్ల గౌరవ వేతనానికి, వారు గెలవడానికి చేస్తున్న ఖర్చుకు తేడా ఎంతో ఉండటం ప్రజాస్వామ్యానికి కీడు అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. వేతనం నామమాత్రం.. సర్పంచుల గౌరవ వేతనం నెలకు రూ.6,500 ఎన్నికల్లో గెలిచేందుకు రూ.లక్షల్లో ఖర్చు వేతనం.. ఖర్చులపై పల్లెల్లో ఆసక్తికర చర్చ -
రెండో విడత పోలింగ్కు వేళాయే !
● 158 సర్పంచ్, 1081 వార్డులకు ఎన్నికలు ● 38 సర్పంచ్, 674 వార్డులు ఏకగ్రీవం ● పోలింగు కేంద్రాలకు చేరిన సిబ్బందిడిచ్పల్లి(నిజామాబాద్రూరల్): పంచాయతీ ఎన్నికల్లో భాగంగా రెండో విడత పోలింగ్ ఆదివారం ఉ దయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వర కు జరుగనుంది. మధ్యా హ్నం 2 గంటల నుంచి ఓ ట్ల లెక్కింపు మొదలవుతుంది. మొదట వార్డు స భ్యుల ఓట్లు లెక్కించిన తర్వాత సర్పంచ్ ఓట్ల లె క్కింపు చేస్తారు. మొదటి విడతలో పెద్ద గ్రామాల్లో కౌంటింగ్ ఆలస్యమైంది. ఈ సారి కౌంటింగులో ఆ లస్యం జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్టు అధికారులు పేర్కొన్నారు. రెండో విడతలో నిజామాబాద్ డివిజన్లోని డిచ్పల్లి, ఇందల్వాయి, ధర్పల్లి, సిరికొండ, మో పాల్, నిజామాబాద్ రూరల్, మాక్లూర్ ఆర్మూర్ డివిజన్లోని జక్రాన్పల్లి మండలాల్లోని 196 పంచాయతీలు, 1,760 వార్డులకు ఎన్నికలు జరగాల్సి ఉండగా, 38 గ్రామాల్లో సర్పంచ్ పదవులు, 674 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. ప్రస్తుతం 158 సర్పంచ్, 1,081 వార్డులకు పోలింగు జరుగుతుంది. 158 గ్రామాల్లో సర్పంచ్ పదవులకు 568 మంది, 1,081 వార్డులకు 2,634 మంది పోటీ పడుతున్నారు. ఆయా మండల కేంద్రాల నుంచి పోలింగు సిబ్బంది బ్యాలెట్ బాక్సులు, సామగ్రితో శనివారం పోలింగు కేంద్రాలకు చేరుకున్నారు. జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, ఎన్నికల సాధారణ పరిశీలకులు జీవీ శ్యాంప్రసాద్ లాల్ ఆయా మండలాల్లో పర్యటించి ఏర్పాట్లను పరిశీలించారు. -
గ్రామ బహిష్కరణ ఉన్నా ఎన్నికల బరిలో..
ఆర్మూర్: తన కుటుంబానికి గ్రా మ బహిష్కరణ విధించినా తాను ఎన్నికల బరిలో నిలిచానని ఆర్మూర్ మండలం పిప్రి గ్రామ సర్పంచ్ అభ్యర్థి అనమల సాయన్న తెలిపారు. పట్టణంలోని ప్రెస్క్లబ్లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. భూ తగాదాలో తన కుటుంబానికి వీడీసీ గ్రామ బహిష్కరణ విధించిందని, ఆగస్టులో తన తండ్రి చనిపోతే గ్రామస్తులు ఎవ్వరూ హాజరుకాకపోవడంతో పోలీసుల సమక్షంలో అంత్యక్రియలు పూర్తి చేశామన్నారు. ఎఫ్ఐఆర్ నమోదైనా వీడీసీ ప్రతినిధులపై పోలీసులు చర్యలు తీసుకోకపోవడంతో తనపై గ్రామ బహిష్కరణ యథావిధిగా కొనసాగుతోందన్నారు. ఎఫ్ఐఆర్ నమోదైనప్పటికీ ఆర్మూర్ సీఐ సత్యనారాయణగౌడ్ వీడీసీకి అనుకూలంగా వ్యవహరిస్తూ తనకు అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం తాను సర్పంచ్ బరిలో ఉండగా.. తప్పుకుంటే బహిష్కరణ ఎత్తివేయడంతోపాటు ఆర్థిక సాయం అందిస్తామని కాంగ్రెస్ నాయకులతో రాయబారం చేస్తున్నారన్నారు. బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి బందెల కిరణ్, వీడీసీ సభ్యుడు సోం భూమన్న తనపై గ్రామ బహిష్కరణ ఉందంటూ ప్రచారం చేస్తున్నారని వాపోయాడు. జిల్లా కలెక్టర్, సీపీ కలగజేసుకొని తనకు న్యాయం చేయాలని కోరారు. ఆర్మూర్టౌన్: ఆలూర్ మండల కేంద్రంలో శనివారం మల్లన్న జాతరలో పిల్లలను కిడ్నాప్ చే సేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తిని స్థానికులు పట్టుకొని దేహశుద్ధి చేశారు. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. మల్లన్న జాతరలో ఆ ట వస్తువులు కొనుగోలు చేసేందుకు వచ్చిన 10 సంవత్సరాల వయస్సును నలుగురు పిల్లలను ఓ ఆటోడ్రైవర్ చాక్లెట్లు ఇస్తానని చెప్పి ఆటోలో ఎక్కించుకొని వెళ్తుండగా.. ఇద్దరు పిల్లలు ఆటోలో నుంచి దూకి కేకలు వేశారు. దీంతో స్థానికులు గమనించి ఆటోలో ఉన్న మరో ఇద్దరు పిల్లలను దించి ఆటోడ్రైవర్కు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ విషయమై పోలీసులను సంప్రదించగా ఆటోలో చిన్నారులు ఆడుకుంటున్నారని.. డ్రైవర్ను ఆటోను కొంత ముందుకు తీసుకువెళ్లినట్లు తెలిపారు. -
తమ అభ్యర్థికి ఓట్లు వేయలేదని దాడి
● రెంజల్ మండలం వీరన్న గుట్టలో ఘటన ● నలుగురి అరెస్ట్.. రిమాండ్కు తరలింపు ● వివరాలు వెల్లడించిన బోధన్ ఏసీపీ శ్రీనివాస్ బోధన్రూరల్: తమ అభ్యర్థికి ఓట్లు వేయలేదనే కక్షతో రెంజల్ మండలంలోని వీరన్నగుట్ట గ్రామంలో పలువురిపై మారణాయుధాలతో దాడికి పాల్పడిన నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు బోధన్ ఏసీపీ శ్రీనివాస్ తెలిపారు. బోధన్ పట్టణంలోని సర్కిల్ కార్యాలయంలో శనివారం ఆయన వివరాలు వెల్లడించారు. వీరన్నగుట్ట గ్రామ సర్పంచ్గా పోటీ చేసిన రిజ్వానా బేగంకు మద్దతు ఇవ్వలేదని, అనుకూలంగా ఓట్లు వేయలేదని ఆమె కొడుకులు ఇబ్రహీం, అబు బాకర్ తమ అనుచరులు సిరాజ్, వాజీద్, ఇలియాస్, అవేజ్, ఆరిఫ్, మోయిన్ ఖాన్ తదితరులతో కలిసి జమీలుద్దీన్, అఫ్సర్, హైమద్పై మరణాయుధాలతో ఈ నెల 12వ తేదీన నూర్ మసీద్ వద్ద ప్రార్థనల అనంతరం దాడి చేసి గాయపరిచారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేశామని ఏసీపీ తెలిపారు. నిందితుల వద్ద నుంచి దాడికి ఉపయోగించిన ఎంహెచ్ 46 ఏఎల్ 6852 నంబర్ కారుతోపాటు రెండు కత్తులు, ఐరన్ రాడ్డులు, కర్రలు, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ఈ ఘటనలో ప్రమేయం ఉన్న మరికొంత పరారీలో ఉన్నారని.. వారిని త్వరలోనే పట్టుకుంటామని ఆయన వెల్లడించారు. సమావేశంలో బోధన్ రూరల్ సీఐ విజయ్బాబు, రెంజల్ ఎస్సై చంద్రమోహన్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
ఆర్థిక ఇబ్బందులతో యువకుడి ఆత్మహత్య
దోమకొండ: ఆర్థిక ఇబ్బందుల కారణంగా మండలంలోని అంచనూరు గ్రామానికి చెందిన యువకుడు భాస్కరి నందు (23) శుక్రవారం రాత్రి ఉరేసు కుని ఆత్మహత్యకు పాల్పడిన ట్లు ఎస్సై ప్రభాకర్ తెలిపారు. వివరాలిలా ఉన్నా యి. హైదరాబాద్లో కూలీ పనులు చేస్తూ జీవిస్తు న్న భాస్కర్ గురువారం గ్రామంలో జరిగిన పంచా యతీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు వచ్చాడు. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న అతడు మనోవేదన కు గురై ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డా డు. మృతుడి తల్లి భారతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. అనారోగ్యం కారణంతో.. భిక్కనూరు: అనారోగ్య సమస్యల కారణంగా ఇసన్నపల్లి గ్రామానికి చెందిన మందస్వామి(52) అనే వ్యక్తి పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై ఆంజనే యులు తెలిపారు.కొంతకాలంగా ఫిట్స్తో బాధపడుతున్న మందస్వామి జీవితంపై విరక్తి చెంది శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగాడు. కొద్ది సేపటికి వచ్చిన కుటుంబ సభ్యులు గమనించి అతడిని సిరిసిల్ల రాజన్న జిల్లా ఎల్లారెడ్డిపేటలోని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. భిక్కనూరు: మండలంలోని కా చాపూర్ గ్రామానికి చెందిన మె ట్టు నరేశ్ అనే యువకుడు అదృశ్యమైనట్లు ఎస్సై ఆంజనేయు లు శనివారం తెలిపారు.20 రో జుల క్రితం ఇంట్లో నుంచి బయటికి వెళ్లిన నరేశ్ తిరి గి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పలు చోట్ల వెతికారని తెలిపారు. ఆచూకీ లభించకపోవడంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యా దు చేశారని, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. -
నాట్య మయూరి.. ఆద్య
● కూచిపూడి, భరత నాట్యంలో రాణిస్తున్న మోర్తాడ్ చిన్నారి మోర్తాడ్: తను గజ్జె కట్టి ఆడితే.. చూడ్డానికి రెండు కళ్లూ చాలవు.. తాను నర్తిస్తుంటే బుజ్జి నెమలే పురివిప్పి నాట్యం చేస్తుందా అన్నట్లుంటుంది. చిరు ప్రాయంలోనే కూచిపూడి, భరత నాట్యంలో రాణిస్తూ అవార్డులు సాధిస్తోంది మోర్తాడ్ మండల కేంద్రానికి చెందిన చిన్నారి కాసర్ల ఆద్య. మూడు నెలల్లోనే రెండు చోట్ల నృత్య ప్రదర్శన చేసి అవార్డులను అందుకుంది. కాసర్ల ప్రియ, ప్రసాద్ కుమార్తె ఆద్య స్థానిక పాఠశాలలో రెండో తరగతి చదువుతోంది. సెలవు రోజుల్లో మెట్పల్లిలోని నటరాజ నృత్య కళానికేతన్లో మాస్టర్ భూపతి గౌడ్ వద్ద కూచిపూడి, భరత నాట్యంలో శిక్షణ పొందింది. ఇటీవల రవీంద్రభారతి, కరీంనగర్లోని కళాభారతిలో నృత్య ప్రదర్శన ఇచ్చి రెండు అవార్డులను అందుకుంది. చిన్న వయస్సులోనే నృత్య ప్రదర్శనలో ప్రావీణ్యం సంపాదించిన చిన్నారిని స్థానికులు అభినందిస్తున్నారు. -
ఆలోచించి ఓటు వేసేలా...
మోర్తాడ్: ఓటు అనే ఆయుధంను మీ చేతికి ఇచ్చాను.. పోరాడి రాజులు అవుతారో... ఆ ఓటును అమ్ముకుని బానిసలుగా మారుతారో నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది... అని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అలనాడు చెప్పిన సూక్తిని మరోసారి గుర్తుకు తెచ్చారు ప్రజాస్వామ్యవాదులు. పంచాయతీ ఎన్నికల వేళ ఏర్గట్ల మండలం తొర్తిలో అంబేడ్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ అందరిని ఆలోచించే విధంగా చేస్తుందని పలువురు పేర్కొంటున్నారు. ఈక్రమంలో ఓటర్లు ఎలాంటి తీర్పు ఇస్తారో తేలాలంటే ఈనెల 17వరకూ ఓపిక పట్టాల్సి ఉంది. -
ఏఐ ప్రచారం.. ఏదైనా సాధ్యం
● పంచాయతీ ఎన్నికల్లో సాంకేతిక పరిజ్ఞానం వినియోగం ● కృత్రిమ మేధా వీడియోలు, పాటలు, ఫొటోలతో హోరెత్తిస్తున్న అభ్యర్థులు నందిపేట్(ఆర్మూర్): ప్రస్తుతం పల్లెల్లో పంచాయతీ ఎన్నికల వేడి పెరిగింది. అభ్యర్థులు గ్రామాల్లో విస్తృత ప్రచారం చేపట్టడంతోపాటు సెల్ఫోన్లో ఏఐ ఆధారిత ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. సాధారణంగా ప్రజలకు సాధ్యంకాని చిత్రాలు, వీడియోలను సైతం కృత్రిమ మేధా ద్వారా క్రియేట్ చేసి, ఏఐతో ఏదైనా సాధ్యమేనని నిరూపిస్తూ కొత్త ప్రచారాలకు తెరలేపారు. కొత్త ట్రెండ్పై ఆసక్తి.. మండల కేంద్రాలతోపాటు మేజర్ గ్రామపంచాయతీలలో ముగ్గురు, నలుగురు పోటీపడటం ఎక్కువగా కనిపిస్తుంది. ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు బృందాలుగా వెళ్తు కరపత్రాలను పంపిణీ చేస్తూ ప్రచారం చేస్తున్నారు. అంతేకాకుండా కొత్తపుంతలతో ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. షార్ట్ వీడియోలు, ఏఐ చిత్రాలను సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృతంగా వినియోగిస్తూ ముమ్మరంగా ప్రచారం కొనసాగించడంపై అభ్యర్థులు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం అంతా షార్ట్ వీడియోల ట్రెండ్ నడుస్తుంది. కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయాత్నాలు ముమ్మరం చేస్తున్నారు. వాట్సాప్ గ్రూపులతో.. కొందరు అభ్యర్థులు గ్రామస్తుల సెల్ఫోన్ నంబర్లతో వాట్సప్ గ్రూపులు ఏర్పాటు చేస్తున్నారు. వాటిల్లో గ్రామాల్లో చేపట్టే పనుల వివరాలు, అభివృద్ధి సందేశాలు, హామీలు అయిదేళ్లలో చేపట్టబోయే కార్యక్రమాలతో వివిధ రకాల పోస్టులు పెడుతున్నారు. స్థానిక సమస్యలపై వీడియోలు చేస్తూ సమస్యలను పరిష్కరిస్తామని హామీలు గుప్పిస్తున్నారు. పోటీలో నిలబడే వారి గుర్తులు, పేర్లతో వీడియోలు, పాటలను రూపొందిస్తున్నారు. తమకు ఓటు వేసి గెలిపించాలంటూ అభ్యర్థి వాయిస్తో నిత్యం రోజుకు నాలుగు ఐదు సార్లు ఫోన్ద్వారా వాయిస్ మెసెజ్ ద్వారా అభ్యర్థిస్తున్నారు. మచ్చుకు కొన్ని.. ● నందిపేట మండల కేంద్రంలో సర్పంచి అభ్యర్థి ఒకరు 45 సెకన్ల నిడివితో రూపొందించిన ఏఐ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. దీన్ని కొందరు అభిమానులు స్టేటస్లుగా పెట్టుకున్నారు. మరికొందరు తమ గ్రూపులలో పోస్టు చేస్తున్నారు. ● నందిపేట మండలంలోని లక్కంపల్లి గ్రామంలో ఓ సర్పంచ్ అభ్యర్థి తనను గెలిపిస్తే చేపట్టబోయే అభివృద్ధిని ప్రస్తుతం ఉన్న పరిస్థితిని వివరిస్తూ పోస్టులు పెడుతున్నారు. ● నందిపేట మండలంలోని ఉమ్మెడ గ్రామంలో పలు రకాల పనులను సొంత ఖర్చులతో చేపడుతానని ప్రభుత్వ నిధులతో మరిన్ని అభివృద్ధి పనుల చేపడుతానని చెబుతూ గ్రామపంచాయతీ నిధులు ఒక్క రూపాయి వాడుకున్నా తన ఆస్తులను జప్తు చేస్తానని బాండు పేపరు రాసి ఇంటింటికి ప్రచారం చేస్తూ తన అనుయాయులతో సామాజిక మాధ్యమాల్లో ఏఐ ప్రచారం చేస్తున్నాడు. ● నందిపేటలో ఓ సర్పంచి అభ్యర్థి తన గుర్తుతో పా టు ప్రచారంలో పాల్గొ న్న వారి వీడియోలు, ఫోటోలను స్థానిక గ్రూ పుల్లో పాటలను జోడించి ఏఐ ద్వారా ప్రచారం చేస్తున్నారు. -
పల్లె ఓటర్లపై హామీల వర్షం
● సొంత మేనిఫెస్టోతో స్థానిక ఎన్నికల్లో ప్రచారం చేస్తున్న అభ్యర్థులు ● ఆడపిల్లలకు ప్రాధాన్యత ఇస్తూ పలు పథకాల ప్రకటన మోర్తాడ్(బాల్కొండ): సర్పంచ్ పదవిని గెలవడమే లక్ష్యంగా కొందరు అభ్యర్థులు ఓటర్లపై హామీల వర్షం కురిపిస్తున్నారు. ఇందులో భాగంగా సొంత మేనిఫెస్టోను రూపొందించుకొని మరీ ప్రచారం చేస్తున్నారు. బాల్కొండ నియోజకవర్గంలోని వివిధ గ్రామాలలో సర్పంచ్లుగా పోటీ చేస్తున్న అభ్యర్థులు రాజకీయ పార్టీల తరహాలో మేనిఫెస్టోలను విడుదల చేశారు. ఇందులో ఆడపిల్ల పుట్టినా, ఆడపిల్లకు పెళ్లి కుదిరినా తమ వంతు సాయంను అభ్యర్థులు ప్రకటించడం విశేషం. కొన్ని చోట్ల ఆడపిల్ల పుడితే రూ.5వేల నుంచి రూ.10వేల వరకూ జమ చేస్తామని హామీ ఇస్తున్నారు. పెళ్లి సాయం కింద రూ.5వేల వరకూ కట్నంను ప్రకటిస్తున్నారు. కొందరైతే సారె ఇస్తామని చెబుతున్నారు. మూడో విడత పోలింగ్ ఈనెల 17న జరుగనుంది. అన్ని రకాల ప్రచారానికి సోమవారంతో తెరపడనుంది. అప్పటిలోగా ఇంటింటికి తమ మేనిఫెస్టో చేరాలనే సంకల్పంతో అభ్యర్థులు కరపత్రాలను పంపిణీ చేస్తున్నారు. అవినీత రహిత పాలన, గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడం, నల్లా బిల్లును తామే చెల్లిస్తామని, ప్రభుత్వ పథకాలు ప్రతి ఇంటికి చేరేలా కృషి చేస్తామని హామీలు ఇస్తున్నారు. సాధారణంగా అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సందర్బంలో రాజకీయ పార్టీలు తమ ప్రభుత్వం ఏర్పడాలంటే ఓటర్లను ఆకర్షించేలా మేనిఫెస్టోను ఎన్నికలకు ముందు ప్రకటించడం సాంప్రదాయం. ఇదే వాతావరణంను పంచాయతీ ఎన్నికల సందర్భంలోనూ సర్పంచ్ అభ్యర్థులు గ్రామాలలో విస్తరింప చేయడం గమనార్హం. ఏదేమైనా ఎలాగైనా పంచాయతీ ఎన్నికల్లో నెగ్గాలంటే ఓటర్ల దయ దక్కించుకోవాలనే ఉద్దేశ్యంతో సొంత మేనిఫెస్టోతో అభ్యర్థులు ముందుకు సాగుతున్నారని చెప్పవచ్చు. -
కలవరపెడుతున్న ఫలితాలు
● మెజార్టీ గ్రామాలు హస్తగతమైనా మేజర్ పంచాయతీలో భిన్నంగా తీర్పు ● ఆందోళనలో మూడో విడత అభ్యర్థులుమేజర్ పంచాయతీలు.. ● పొతంగల్ మండల కేంద్రంలో బీజేపీ అభ్యర్థి శారద విజయం సాధించింది. ● కోటగిరి మండల కేంద్రంలో కాంగ్రెస్ మద్దతుదారులు బర్ల మధుకర్ను గెలిపించారు. ● రుద్రూర్ జీపీలో కాంగ్రెస్ మద్దతుదారులు ఇందూర్ సునీతను గెలిపించారు. ● వర్ని మండలం సత్యనారాయణపురంలో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి కనకదుర్గ విజయం సాధించారు. ● చందూర్లో బీఆర్ఎస్ అభ్యర్థి మాధవరెడ్డి సర్పంచ్గా విజయం సాధించారు. ● మోస్రాలో బీజేపీ అభ్యర్థి భూపాల్రెడ్డిని ఓటర్లు గెలిపించారు.బాన్సువాడ : మొదటి విడత ఫలితాలు కలవరపెడుతున్నాయి. మెజారిటీ గ్రామాల్లో పైచేయి ఉన్నప్పటికి మేజర్ పంచాయతీలలో మాత్రం అందుకు భిన్నంగా తీర్పు వెలువడింది. బాన్సువాడ నియోజకవర్గం నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో సగం సగం ఉంది. నిజామాబాద్ జిలాల్లో ఉన్న మండలాల్లో మొదటి విడత పంచాయతీ ఎన్నికలు జరుగగా మిగతా మండలాల్లో మూడో విడతలో ఎన్నికలు జరుగనున్నాయి. నియోజకవర్గంలోని పొతంగల్, కోటగిరి, రుద్రూర్, వర్ని, చందూర్, మోస్రా మండలాల్లో మొదటి విడత ఎన్నికలు జరిగాయి. ఆయా మండలాల్లో మెజారిటీ పంచాయతీలు హస్త గతమయ్యాయి. కానీ మేజర్ పంచాయితీల్లో మాత్రం ఓటర్ల తీర్పు భిన్నంగా వచ్చింది. మూడో విడతలో కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ, బీర్కూర్, నస్రుల్లాబాద్ మండలాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. అయితే ఆయా మండలాల్లో చాలా పంచాయతీలు, గిరిజన తండాలు ఏకగ్రీవమయ్యాయి. మిగతా గ్రామాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. మొదటి విడతలో వచ్చిన ఎన్నికల ఫలితాలు చూసి మూడో విడతలో ఎన్నికలు జరిగే గ్రామాల్లో అభ్యర్థులు భయాందోళనకు గురవుతున్నారు. ఓటర్ల నాడి తెలుసుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నప్పటికి వారి నాడి అంతుచిక్కడం లేదని తలలు పట్టుకుంటున్నారు. ఓటర్లకు రాచ మర్యాదలు చేస్తూ ఎక్కడా లేని ప్రేమలు ఒలకబోస్తున్నారు. భారీ సంఖ్యలో మహిళలను వెంట బెట్టుకుని ప్రచారం కొనసాగిస్తున్నారు. మేజర్ గ్రామ పంచాయతీల్లో ఓటర్ల తీర్పుపై సర్వత్రా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా బీర్కూర్, నస్రుల్లాబాద్, బాన్సువాడ మండలాల్లోని మేజర్ పంచాయతీలలో రెబెల్ బెడద ఉంది. -
బస్సు అద్దాలు ధ్వంసం చేసిన యువకుడు
పెద్దకొడప్గల్(జుక్కల్): మండల కేంద్రంలో ఓ యువకుడు బస్సు అద్దాలను ధ్వంసం చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలు ఇలా.. హైదరాబాద్ డిపో–2కు చెందిన బస్సు శుక్రవారం బిచ్కుంద నుంచి పెద్దకొడప్గల్ మీదుగా హైదరాబాద్కి బయలుదేరింది. మండలకేంద్రంలో ఓ యువకుడు బస్సెక్కి చిన్నకొడప్గల్కు టికెట్ ఇవ్వమని కండక్టర్ను కోరాడు. దీంతో కండక్టర్ చిన్నకొడప్గల్కు స్టాప్ లేదని చెప్పి, అతడిని బస్సు దిగమని సూచించాడు. సదరు యువకుడు బస్సు దిగి రాయితో బస్సు వెనక అద్దాలను ధ్వంసం చేశాడు. వెంటనే డ్రైవర్ బస్సు ఆపి, యువకుడిని వెంబడించి పట్టుకున్నారు. అతడిని పోలీసులకు అప్పగించి, ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. -
కుక్కను తప్పించబోయి అదుపుతప్పిన బైక్ : ఒకరి మృతి
రుద్రూర్: పోతంగల్ మండల కేంద్రంలో రోడ్డుపై అడ్డుగా వచ్చిన కుక్కను తప్పించబోచయే క్రమంలో బైక్ అదుపుతప్పి ఒకరు మృతిచెందారు. కోటగిరి ఎస్సై సునీల్ తెలిపిన వివరాలు ఇలా.. మద్నూర్ మండలం సలాబత్పూర్ గ్రామానికి చెందిన షేక్ ఖాసీం (42) అనే వ్యక్తి శుక్రవారం కూరగాయలు కొనుగోలు చేయడానికి బైక్ మీద పోతంగల్కు బయలుదేరాడు. మండలకేంద్రంలో రోడ్డుపై కుక్క అడ్డం రావడంతో దానిని తప్పించబోయి బైక్ అదుపు తప్పింది. ఈ ఘటనలో అతడు కిందపడిపోవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్థానికులు గుర్తించి అతడిని చికిత్స నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈమేరకు మృతుడి భార్య షేక్ హసీనా ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. కామారెడ్డి క్రైం: కామారెడ్డి మండలంలోని చిన్నమల్లారెడ్డిలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఎస్సై రంజిత్ తెలిపిన వివరాలు ఇలా.. రామాయంపేటకు చెందిన ఇబ్రహీం(35)కు బాన్సువాడకు చెందిన ఓ మహిళతో పదేళ్ల క్రితం వివాహం జరిగింది. దంపతుల మధ్య గొడవలు రావడంతో కొంతకాలంగా భార్య పిల్లలను తీసుకొని తల్లిగారింట్లో ఉంటోంది. దీంతో ఇబ్రహీం కొంతకాలంగా తన అమ్మమ్మ గ్రామమైన చిన్న మల్లారెడ్డిలో ఉంటూ ప్రైవేటుగా మెకానిక్ పనులు చేస్తున్నాడు. భార్య కాపురానికి రావడం లేదని కొద్దిరోజులుగా అతడు మనస్థాపానికి గురవుతున్నాడు. ఈక్రమంలో శుక్రవారం ఉదయం అతడు జీవితంపై విరక్తి చెంది చిన్నమల్లారెడ్డిలో పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. వెంటనే స్థానికులు గుర్తించి, అతడిని కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సాయంత్రం మృతి చెందాడు. దేవునిపల్లి పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. -
స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ వైపే ప్రజలు
● మొదటి విడతలో 140 సర్పంచ్ స్థానాలు కై వసం ● డీసీసీ అధ్యక్షుడు కాటిపల్లి నగేష్రెడ్డి నిజామాబాద్ రూరల్: స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వైపే ప్రజలు ఉన్నారని, ఇందుకు నిదర్శనం మొదటి విడత ఫలితాల్లో 140 స్థానాల్లో పార్టీ మద్ధతుదారులు గెలవడమేనని డీసీసీ అధ్యక్షుడు కాటిపల్లి నగేష్రెడ్డి అన్నారు. నగరంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో మొదటి విడతలో 184 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరిగితే అందులో సుమారు 140 స్థానాలు కాంగ్రెస్ పార్టీ కై వసం చేసుకుందన్నారు. సర్పంచులుగా గెలిచిన అభ్యర్థులకు అభినందనలు తెలుపుతూనే వారి విజయానికి కారకులైన ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చినప్పుడు రూ.14వేల కోట్ల మిగులు బడ్జెట్తో ఉన్న రాష్ట్రాన్ని 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.84 లక్షల కోట్ల అప్పులోకి లాగిందన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు ఒకపక్క గత ప్రభుత్వం చేసిన రుణాలకు వడ్డీలు కడుతూనే రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తోందన్నారు. పీసీసీ ప్రధాన కార్యదర్శి రాంభూపాల్, మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్పాగంగారెడ్డి, రాష్ట్ర ప్రచార కమిటీ మెంబర్ జావిద్ అక్రమ్, యువజన కాంగ్రెస్ అధ్యక్షులు విపుల్ గౌడ్, ఎన్ఎస్యూఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేణురాజ్, సేవాదల్ అధ్యక్షుడు సంతోష్, ఓబీసీ అధ్యక్షుడు రాజ నరేందర్ గౌడ్, మహమ్మద్ ఈసా, అబ్దుల్ ఎజాజ్, సాయికిరణ్, శివ, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. -
మక్కకు ‘కత్తెర’ కాటు
డొంకేశ్వర్(ఆర్మూర్): యాసంగి సీజన్లో రైతులు సాగు చేసిన మొక్కజొన్న పంటను చీడపీడలు ఆశి స్తున్నాయి. మొక్క దశలోనే కత్తెర పురుగు ఉధృతి ఎక్కువగా కనిపిస్తోంది. పురుగులు పంట ఆకులు, కాండాన్ని తినేస్తున్నాయి. దీంతో పంట ఎదుగుదలపై ప్రభావం కనిపిస్తోంది. కొంతకాలంగా తగ్గుముఖం పట్టిన కత్తెర పురుగు ఉధృతి మళ్లీ పెరగడం రైతాంగాన్ని కలవరపెడుతోంది. అధిక నష్టాన్ని కలిగించే ఈ పురుగు కారణంగా దిగుబడి ఎలా ఉంటుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో ప్రస్తుతం 25,202 ఎకరాల్లో మొక్కజొన్న సాగవుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేయగా దానికి మించి 30,168 ఎకరాల్లో రైతులు సాగు చేశారు. మొక్కదశలోనే కత్తెర పురుగు ఆశించడంతో రైతులు మందులు కొనుగోలు చేసి చల్లుతున్నారు. అయితే, తొలి దశలోనే దీనిని గుర్తించి తీసుకోవాల్సిన చర్యలు, ఉపయోగించే మందులను మండల వ్యవసాయాధికారి మధుసూదన్ సూచించారు. పురుగులను ఇలా గుర్తించాలి... ● మొదటి దశలో తల్లి రెక్కల పురుగు లేత మొక్కలపై పెట్టిన గుడ్లు పగిలి లద్దె పురుగులుగా మారి గుంపులుగా ఆకుల మీద పత్రహరితాన్ని గోకి తింటూ రంధ్రాలు చేస్తాయి. ఈ రంధ్రాలు ఆకులపై నిలువుగా కనిపిస్తాయి. ● రెండో దశలో లద్దె పురుగులు కాండం మొవ్వులో చేరి లోపల కాండాన్ని తినేస్తాయి. ఈ దశలో ఆశించిన కత్తెర పురుగు కాండాన్ని పూర్తిగా తినడంతో మొవ్వ కత్తించినట్లుగా ఉంటుంది. పురుగు తిని విసర్జించిన మల పదార్థంతో నిండి ఉంటుంది. మొవ్వ లోపల ఉన్న పూత కూడా నష్టపోయి కంకి తయారవదు. ● వాతావరణాన్ని బట్టి కత్తెర పురుగు జీవితకాలం మూడు నెలల వరకు ఉంటుంది. తల్లి రెక్కల పెరుగు జీవితకాంలో 900–1500 గుడ్లను పెడుతుంది. గుడ్ల సముదాయం దూది వంటి పదార్థంతో కప్పబడి ఉంటుంది. గుడ్లు ఆకుపచ్చ, నలుపు, బూడిద రంగులో ఉంటే వాటిని కత్తెర పురుగు గుడ్లుగా గుర్తించాలి. లద్దె పురుగులు కోశ్సార్త దశలో భూమిలో చేరుతాయి. ఆకులను తినేస్తున్న పురుగు నివారణ చర్యలు ఆలస్యంగా విత్తుకున్న మొక్కజొన్నలో అంతర పంటగా నేపియర్ గడ్డి వేసుకోవాలి. విత్తనం విత్తిన వారం రోజులకు ఎకరానికి 8–10 లింగాకర్షక బుట్టలు అమర్చి పురుగు ఉధృతిని గమనించాలి. వేపనూనె 5మిల్లీ లీటరు నీటిలో కలిపి పిచికారీ చేస్తే తొలిదశలో తల్లి పురుగు గుడ్లు పెట్టకుండా నివారించవచ్చు. విత్తనం విత్తిన 40–45 రోజుల దశలో స్పైనోసాడ్ ఎస్సీ 60ఎంఎల్ 200 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేయాలి. పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఎమమెక్టిన్ జెంబోయేట్ పిచికారీ చేయాలి. పెరుగుతున్న పురుగు ఉధృతి మొక్కదశలోనే దాడి చేయడంతో రైతుల్లో ఆందోళన జిల్లాలో 30,168 ఎకరాల్లో మొక్కజొన్న సాగు -
కీలక నేత అరాచకం
నిజామాబాద్అధికార పార్టీ ● మొరం, ఇసుక దందా అక్రమార్కుల చేరదీత ● ఏంచేసినా తలూపే డమ్మీలు సర్పంచ్లుగా ఉండేలా ప్లాన్ ● ఆర్మూర్ నియోజకవర్గం పార్టీ సీనియర్ల గగ్గోలు ● పీసీసీ అధ్యక్షుడికి ఫిర్యాదుల వెల్లువ స్థానిక సంస్థల్లో.. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయభేరి మోగించిందని డీసీసీ అధ్యక్షుడు కాటిపల్లి నగేశ్రెడ్డి అన్నారు.శనివారం శ్రీ 13 శ్రీ డిసెంబర్ శ్రీ 2025– 8లో uసాక్షి ప్రతినిధి, నిజామాబాద్: జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఇక రెండు, మూడు విడతల్లో జరుగనున్న పంచాయతీ పోరుపై చర్చ నడుస్తోంది. చివరి రెండు విడతల ఎన్నికలకు సంబంధించి కీలకమైన ఆర్మూర్ నియోజకవర్గంలో నెలకొన్న రాజకీయ వైచిత్రిపై అధికార పార్టీ సీనియర్ నాయకులే గుస్సా అవుతున్నారు. దశాబ్దాల తరబడి కాంగ్రెస్ పార్టీ కోసం పాటుపడిన తమకు ఏమాత్రం ప్రాధాన్యం దక్కడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీకి చెందిన నియోజకవర్గ కీలక నాయకుడు వీడీసీలను మించి ‘అంతా నా ఇష్టం’ అన్నట్లుగా వ్యవహరిస్తుండడంతో సీనియర్లందరూ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్కు ఫిర్యాదులు చేశారు. సదరు కీలక నాయకుడు పార్టీ అభివృద్ధి కోసం కృషి చేయకపోగా, గత పదేళ్లలో బీఆర్ఎస్లో ఇష్టారీతిన వ్యవహరించిన వారిని పార్టీలోకి తీసుకొచ్చి గ్రామాల్లో రాజకీయాలను భ్రష్టు పట్టించినట్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గత పదేళ్లలో మొరం, మట్టి, ఇసుక దందా విచ్చలవిడిగా చేసిన అక్రమార్కులను చేరదీసి వారి సహకారంతో గ్రామాల్లో అశాంతిని రేకెత్తించినట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో గ్రామ పాలన వ్యవస్థను నిర్వీర్యం చేసే దిశగా సాగుతున్నట్లు సీనియర్ నాయకులు చెబుతున్నారు. ఇందులో భాగంగా తన అనుయాయులే సర్పంచ్లుగా ఉండేందుకు గాను రాజకీయాలు చేస్తున్నట్లు ఆరోపిస్తున్నారు. తనకు అనుకూలమైన వాళ్లే సర్పంచ్లుగా ఎన్నికయ్యేలా కొన్ని డమ్మీ నామినేషన్లు వేయించినట్లు చెబుతున్నారు. ఈ విషయమై అధికారులకు ఫిర్యాదులు చేసినప్పటికీ ఫలితం లేదని వాపోతున్నారు. సీనియర్లమైన తమను ఏమాత్రం కలుపుకుని పోకుండా సదరు నాయకుడు పూర్తి ఏకపక్షంగా వెళుతూ కేవలం మొరం, ఇసుక దందా చేస్తున్న మాఫియాగాళ్లను ప్రోత్సహిస్తున్నట్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ముగ్గురిలో ఇద్దరి చేత నామినేషన్లు ఉపసంహరింపచేయించి తనకు అనుకూలమైన వ్యక్తిని సర్పంచ్గా ఏకగ్రీవం చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత ప్రభుత్వంలో అక్రమంగా సంపాదించిన వ్యక్తులను చేరదీసి ఇలాంటి పనులు చే యించడమేమిటంటూ పీసీసీ అధ్యక్షుడి వద్దకు ఫి ర్యాదులు వెళ్లాయి. నియోజకవర్గంలోని వివిధ గ్రా మాల్లో అక్రమ ఇసుక, మొరం దందా చేసేవారికి అడ్డంకులు లేకుండా చేసి, వారి నుంచి మామూళ్లు దండుకునేందుకు ఈ కీలక నాయకుడు కుయుక్తులు పన్నుతున్నట్లు చెబుతున్నారు. రెండో విడతలో ఎన్నికలు జరుగను న్న మాక్లూర్ మండలంలోని ఒక గ్రామంలో ఎన్నికల ప్రక్రియను సదరు కాంగ్రెస్ కీలక నాయకుడు అపహాస్యం చేయించినట్లు పార్టీ సీనియర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మొరం, ఇసుక దందాలో ఆరితేరిన ఓ మాజీ సర్పంచ్, అతని కుమారుల ద్వారా సదరు నాయకుడు అరాచకం చేసినట్లు చెబుతున్నారు. ఈ గ్రామంలో ముగ్గురు సర్పంచ్ అభ్యర్థులుగా నామినేషన్లు వేయగా వారందరినీ అపహరించి నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్లే రోడ్డులో ఓ హోటల్లో ఉంచి వ్యవహారం నడిపినట్లు తెలిపారు. -
రెండో విడత పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్
నిజామాబాద్అర్బన్: రెండో విడతలో ఎన్నిక లు జరిగే మండలాల పోలింగ్ సిబ్బంది తు ది ర్యాండమైజేషన్ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, జనరల్ అబ్జర్వర్ శ్యాంప్రసాద్ లాల్ సమక్షంలో శుక్రవారం నిర్వహించారు. కలెక్టరేట్లోని ఎన్ఐసీ హాల్లో ఎన్నికల సంఘం నిబంధనలను అనుసరిస్తూ ర్యాండమైజేషన్ చేపట్టా రు. ఏకగ్రీవమైన వాటిని మినహాయిస్తూ, ఎన్నికలు నిర్వహించాల్సిన గ్రామ పంచాయతీలకు సంబంధించి మండలాల వారీగా సర్పంచ్, వార్డు స్థానాల్లో పోలింగ్ విధులు నిర్వర్తించే ప్రిసైడింగ్ అధికారులు, వోపీవోలను ర్యాండమైజేషన్ ద్వా రా కేటాయించారు. కార్యక్రమంలో నోడల్ అధికారి పవన్ కుమార్, జిల్లా పంచాయతీ కార్యాలయం ఏవో రాజబాబు పాల్గొన్నారు. సుభాష్నగర్: విద్యుత్ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించి మెప్పు పొందాలని ఎన్పీడీసీఎల్ ఎస్ఈ పీవీ రాజేశ్వర్రావు అన్నారు. నగరంలోని పవర్హౌస్లో శుక్రవారం ఆయన విద్యుత్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఎస్ఈ మాట్లాడుతూ.. విద్యుత్ అధికారులు, సిబ్బంది అందరం కలిసి మన కంపెనీలోనే జిల్లాను ముందు వరుసలో ఉంచేందుకు కృషి చేయాలని తెలిపారు. పొలం బాట, పట్టణ బాట నిర్వహించి వినియోగదారులకు భద్రతపై వివరించాలన్నారు. వి ద్యుత్ సరఫరాలో అంతరాయాలు తగ్గించాలని, ట్రాన్స్ఫార్మర్లు పాడవకుండా ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయించాలన్నారు. సమావేశంలో డీఈ రమేశ్, ఎస్ఏవో శ్రీనివాస్, డీఈలు శ్రీనివాస్, ఎండీ ముక్తార్, వెంకటరమణ, హరిచంద్ర, రఘు తదితరులు పాల్గొన్నారు. ‘అమృత్ 2.0’ పనుల్లో వేగం పెంచాలి ● ఎన్ఎంసీ అదనపు కమిషనర్ రవీందర్ సాగర్సుభాష్నగర్: నగరంలో కొనసాగుతున్న అమృత్ 2.0 పనుల్లో వేగం పెంచాలని నగర పాలక సంస్థ అదనపు కమిషనర్ రవీందర్ సాగర్ అధికారులను ఆదేశించారు. మున్సిపల్ కార్పొరేషన్లో ఇంజినీరింగ్ అధికారులతో శుక్రవారం అమృత్ 2.0 పనులపై సమీ క్ష నిర్వహించారు. నెలల తరబడి పనులు నిలిచిపోవడంపై ఆయన అధికారులపై ఆగ్ర హం వ్యక్తం చేశారు. అనంతరం అదనపు కమిషనర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ నిధులు దాదాపు రూ.300 కోట్లతో అమృత్ 2.0 స్కీమ్లో భాగంగా చేపట్టిన తాగునీరు, యూజీపీ పనులు నత్తనడకన సాగుతున్నాయన్నారు. మార్చి 31లోపు పనులు పూర్తి చేసేలా అధికారులు సంబంధిత కాంట్రాక్టర్లపై ఒత్తిడి పెంచాలన్నారు. గడువులోపు పనులు పూర్తి కావాలని, లేకుంటే నిధులు వెనక్కి వెళ్లిపోయే అవకాశం ఉంటుందని తెలిపారు. సమావేశంలో ఇన్చార్జి ఈఈ సుదర్శన్రెడ్డి, డీఈలు, ఏఈలు తదితరులు పాల్గొన్నారు. -
పోలింగ్ విధులపై అవగాహన ఉండాలి
● కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ● మూడో విడత పీవోలకు శిక్షణబాల్కొండ: పోలింగ్ విధులపై ప్రిసైడింగ్ అధికారులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అన్నారు. ముప్కాల్ మండల కేంద్రంలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన ప్రిసైడింగ్ అధికారులకు శుక్రవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణలో ఎలాంటి అనుమానాలు ఉన్నా ముందుగానే నివృత్తి చేసుకోవాలన్నారు. హ్యాండ్బుక్లో పొందుపరిచిన అంశాలను క్షుణ్ణంగా చదివి పోలింగ్ విధులపై స్పష్టమైన అవగాహన ఏర్పరుచుకోవాలన్నారు. ఎలాంటి పొరపాట్లు లేకుండా పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియలు పూర్తి చేయాలన్నారు. ఎన్నికల నియమావళిని పాటించాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల వద్ద బీఎల్వోల సహాయక కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. ఎన్నికల కమిషన్ సూచించిన 18 రకాల ఐడీ కార్డులలో ఏదైనా ఒక దానిని ఓటరు తీసుకురావొచ్చన్నారు. సమావేశంలో ఆర్వోలు, స్థానిక అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
పోలింగ్కు పటిష్ట బందోబస్తు
● స్వేచ్ఛగా ఓటు వేసేలా ఏర్పాట్లు చేయాలి ● నిజామాబాద్ డివిజన్ పోలీసు అధికారులతో సీపీ సాయిచైతన్య డిచ్పల్లి(నిజామాబాద్రూరల్): రెండో విడత పోలింగ్కు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని సీపీ సాయిచైతన్య నిజామాబాద్ డివిజన్ పోలీసు అధికారులకు ఆదేశించారు. శాంతియుత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. రెండో విడత గ్రామ పంచాయతీ పోలింగ్ నేపథ్యంలో శుక్రవారం డిచ్పల్లి సర్కిల్ కార్యాలయంలో సంబంధిత పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఎన్నికల నియమావళిని తప్పకుండా పాటించాలన్నారు. ప్రధానంగా సమస్యాత్మక, అతిసమస్యాత్మకమైన పోలింగ్ స్టేషన్లను గుర్తించాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అవసరాన్ని బట్టి స్ట్రైకింగ్ ఫోర్స్ సేవలను వినియోగించుకొని గుంపులను చెదరగొట్టాలని సూచించారు. డబ్బు, మద్యం ఇతరత్రా అక్రమ రవాణా జరగడానికి విలులేకుండా అంతర్ రాష్ట్ర, అంతర్ జిల్లా సరిహద్దు చెక్పోస్ట్లను పకడ్బందీగా నిర్వహించాల న్నారు. విలేజ్ పోలీసు అధికారులు గ్రామాలపై నిఘా ఉంచి, ముందస్తు సమాచారాన్ని సేకరించి, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేలా కృషి చేయాలన్నారు. విధి నిర్వహణలో అశ్రద్ధ వహించే సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో నిజామాబాద్ ఏసీపీ రాజావెంకట్రెడ్డి, సీఐలు శ్రీనివాస్, సురేశ్, వినోద్, సీఐ భిక్షపతి, నిజామాబాద్ రూరల్ ఎస్హెచ్వో శ్రీనివాస్, ఎస్సైలు ఎండీ ఆరిఫ్, మహేశ్, సందీప్, రాజశేఖర్, రామకృష్ణ, కళ్యాణి, సుస్మిత తదితరులు పాల్గొన్నారు. -
ముగిసిన రెండో విడత ప్రచారం
డిచ్పల్లి మండలం నడిపల్లిలో ప్రచారం చేస్తున్న సర్పంచ్ అభ్యర్థిడిచ్పల్లి మండలం ధర్మారం(బి)లో ప్రచారం చేస్తున్న సర్పంచ్ అభ్యర్థిడిచ్పల్లి(నిజామాబాద్రూరల్): రెండో విడతలో జరిగే పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ప్ర చారం శుక్రవారం సాయంత్రంతో ముగిసింది. ఇక పోలింగ్కు ఒక్కరోజే మిగిలింది. దీంతో అ భ్యర్థులు ఓటర్లను ప్రభావితం చేసే పనిలో పడ్డా రు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని డిచ్పల్లి, ధర్పల్లి, ఇందల్వాయి, సిరికొండ, మోపాల్, నిజామాబాద్ రూరల్, జక్రాన్పల్లి మండలాలతో పాటు ఆర్మూర్ నియోజకవర్గంలోని మాక్లూర్ మండలాల్లో పోలింగ్ జరుగనుంది. ఇప్పటి వరకు ప్రచారం చేయడంతోపాటు ఇంటింటికీ తిరిగి ఓటర్లను వ్యక్తిగతంగా కలిసి తమకే ఓటు వేయాలని మద్దతు కోరారు. ఈ సారి చాలా చోట్ల పోటీ ఎక్కువగా ఉండడంతో అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా ఖర్చుకు వెనకాడకుండా రూ.లక్షలు వెచ్చిస్తున్నారు. చివరి రోజున మద్యం, నగదు పంపిణీ చేయడం ద్వారా ఓటర్లను పూర్తి స్థాయిలో ప్రభావితం చేసి గట్టెక్కే ప్రయత్నాల్లో అభ్యర్థులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. సర్పంచ్తోపాటు వార్డు సభ్యుల పదవులకు సైతం అడ్డగోలుగా ఖర్చు చేస్తున్నారు. కొందరు ఉపసర్పంచ్ పదవిపై కన్నేసిన వార్డు సభ్యులు తాము గెలువడంతోపాటు తమకు అనుకూలమైన వ్యక్తు లను బరిలో దింపి వారిని గెలిపించుకునే ప్రయత్నా లు చేస్తున్నారు. సర్పంచ్ అభ్యర్థులకు ఏమాత్రం తగ్గకుండా ఖర్చు పెడుతుండటం విశేషం. నేతలకు కీలకం.. గ్రామ పంచాయతీ ఎన్నికలు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు కాటిపల్లి నగేశ్రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ పటేల్ కులాచారిలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. డివిజన్లో కొ న్ని చోట్ల బీజేపీ, మరికొన్ని చోట్ల బీఆర్ఎస్ బలంగా ఉండటంతో మెజారిటీ పంచాయతీల ను కై వసం చేసుకొని మరోసారి సత్తా చాటాలని అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే భూపతిరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు నాగేశ్రెడ్డిలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. నిజామాబాద్ రూరల్ తన సొంత ని యోజకవర్గం కావడంతో దినేశ్ సైతం మెజార్టీ స్థానాలు గెలిచేందుకు ఈ ఎన్నికలను సవాల్గా తీసుకుంటున్నారు. రూరల్ మాజీ ఎమ్మెల్యే బా జిరెడ్డి గోవర్ధన్ పార్టీ అధినేత ఆదేశాల మేరకు బాన్సువాడ నియోజకవర్గానికే సమయం కేటాయిస్తున్నారు. దీంతో రూరల్ ఇన్చార్జి బాజిరెడ్డి జగన్ పార్టీ బలపర్చిన అభ్యర్థుల గెలుపుకోసం పట్టుదలగా ప్రయత్నిస్తున్నారు.పోలింగ్కు ఏర్పాట్లు పూర్తి డిచ్పల్లి(నిజామాబాద్రూరల్): రెండో విడత పంచాయతీ ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. నిజామాబాద్ డివిజన్లోని డిచ్పల్లి, ధర్పల్లి, ఇందల్వాయి, మోపాల్, నిజామాబాద్ రూరల్, సిరికొండ, మాక్లూర్, ఆర్మూర్ డివిజన్లోని జక్రాన్పల్లి మండలాల్లో పోలింగ్ జరగనుంది. నేడు పోలింగ్ సామగ్రి పంపిణీ ఓటర్లను ప్రభావితం చేసే పనిలో అభ్యర్థులు 8 మండలాల్లో ఎన్నికలు రూరల్ ఎమ్మెల్యే, డీసీసీ, బీజేపీ జిల్లా అధ్యక్షులకు ప్రతిష్టాత్మకం -
నిరుద్యోగుల కల్పతరువు.. జిల్లా గ్రంథాలయం
ఖలీల్వాడి : జిల్లా కేంద్ర గ్రంథాలయం నిరుద్యోగ యువతకు అండగా నిలుస్తోంది. ఉదయం 4 నుంచి రాత్రి 12 గంటలకు వరకు తెరిచి ఉంటోంది. నిరుద్యోగులకు అవసరమయ్యే నోట్స్ తయారీకి కంప్యూటర్లు, ఉచిత వైఫై సదుపాయం కల్పించారు. ప్రతి శుక్రవారం రెండు పుస్తక పఠన గదులకు మాత్రమే సెలవు ఉంటుండగా, మిగితా స్టడీ హాల్లో ఉద్యోగార్థులు చదువుకునే వెసలుబాటు కల్పించారు. ఇక్కడ చదువుకునే వారికి విద్యుత్, తాగునీటి సౌకర్యం, వాష్రూమ్లు అందుబాటులో ఉంచారు. ప్రస్తుతం ప్రయివేటు స్టడీ హాళ్లల్లో ఒకరికి రూ.2 వేలు నుంచి రూ.3 వేలు వసూలు చేస్తున్నారు. అయితే జిల్లా గ్రంథాలయంలో ఉచితంగానే అన్ని సేవలను అందిస్తున్నారు. వేసవిలో నిరుద్యోగుల చదువుకు ఇబ్బంది లేకుండా కూలర్లను అందుబాటులో ఉంచారు. ఏదైనా ప్రభుత్వ నోటిఫికేషన్ విడుదల చేస్తే ఆ సమయంలో పాత డీఈవో కార్యాలయంలోని హాల్ను తీసుకొని చదువుకునే వీలు కల్పిస్తున్నారు. భోజన వసతికి ముందుకురావాలి.. జిల్లా గ్రంథాలయంలో ఉద్యోగార్థులు, పాఠకులకు ఓ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన వసతిని నిర్వహించేవారు. ఏడాదిన్నర క్రితం వారు నిలిపివేయగా ఓ డాక్టర్ సహకారంతో మూడు నెలలపాటు భోజన వసతి కల్పించారు. ప్రస్తుతం ఉ ద్యోగార్థులు టిఫిన్ బాక్స్లను తీసుకొని వస్తున్నా రు. స్వచ్ఛంద సంస్థలు భోజన సదుపాయం ఏర్పా టు చేయాలని నిరుద్యోగులు కోరుతున్నారు. రోజూ 400 నుంచి 500 మంది ప్రిపరేషన్ ఉదయం 4 నుంచి రాత్రి 12 గంటల వరకు చదువుకునే అవకాశం అందుబాటులో పోటీ పరీక్షల మెటీరియల్ ప్రశాంత వాతావరణం, మౌలిక వసతుల ఏర్పాటు -
స్థానికంలోనూ త్రిముఖమే
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: జిల్లాలో రాజకీయ ముఖచిత్రం విడతలవారీగా మారుతూ వస్తోంది. గతంలో రెండు ప్రధాన పార్టీల మధ్య మాత్రమే ముఖ్యంగా పార్లమెంట్, అసెంబ్లీ, జిల్లా ప్రజాపరిషత్, మండల ప్రజా పరిషత్, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నువ్వా నేనా అనేవిధంగా పోటాపోటీ ఉండేది. అయితే గత ఆరేడు సంవత్సరాల కాలంలో ముఖాముఖి పోటీ బదులు త్రిముఖ పోటీ నెలకొంటోంది. తెలంగాణ ఆవిర్భావానికి ముందు కాంగ్రెస్–టీడీపీ, కాంగ్రెస్–బీఆర్ఎస్ల మధ్య పార్లమెంట్, శాసనసభ, పరిషత్, పంచాయతీ ఎన్నికల్లో పోరు నడిచింది. ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించాక మా త్రం ఉమ్మడి ఇందూరు జిల్లాలో కాంగ్రెస్, బీఆర్ఎ స్ పార్టీలతో బీజేపీ ఢీకొడుతూ వస్తోంది. ఈ క్రమంలో బీజేపీ గత రెండు పార్లమెంట్ ఎన్నికల్లో (2019, 2024) వరుసగా విజయకేతనం ఎగురవేసింది. అ యితే శాసనసభ, స్థానిక ఎన్నికల విషయానికి వస్తే పట్టణ ప్రాంతాల్లో మాత్రమే బీజేపీ ప్రభావం చూ పుతూ వచ్చింది. ఇదిలా ఉండగా గత శాసనసభ ఎన్నికల్లో మాత్రం రాష్ట్రంలో ఎక్కడా లేనవిధంగా బీజేపీ ఉమ్మడి జిల్లాలో మూడు ఎమ్మెల్యే సీట్లు గెలుచుకుంది. పలు నియోజకవర్గాల్లోనూ పార్టీ గణనీయమైన స్థాయిలో ఓట్లు సాధించింది. మరోవైపు గత మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ నిజామాబాద్ నగరపాలక సంస్థలో అతి పెద్ద పార్టీగా నిలిచింది. మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. గతంలో ఎన్నడూ లేనవిధంగా ప్రస్తుతం పంచాయతీ పోరులో బీజేపీ హోరాహోరీగా తలపడుతోంది. అధికార కాంగ్రెస్ తరువా త బీఆర్ఎస్కు సమానంగా జిల్లాలో బీజేపీ పంచా యతీల్లో పోటీ చేస్తోంది. మొదటి విడతలో ఉమ్మడి జిల్లాలోని పలు మండలాల్లో కీలక పంచాయతీలను బీజేపీ మద్దతుదారులు గెలుచుకున్నారు. దీంతో ఉమ్మడి జిల్లాలో స్థానిక ఎన్నికల్లో త్రిముఖ పోరు నడుస్తున్నట్లు స్పష్టమైంది. పంచాయతీ పోరులోనే త్రిముఖ పోరు ఉంటే రానున్న పరిషత్, మున్సిపల్ ఎన్నికల్లో హోరాహోరీ త్రిముఖ పోరు తప్పదని రాజకీయ, ఇతర వర్గాల్లో చర్చ నడుస్తోంది. పార్లమెంట్, అసెంబ్లీ మాదిరిగా పోటాపోటీ కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థుల హోరాహోరీ రానున్న పరిషత్, మున్సిపల్ ఎన్నికల్లో త్రిముఖ పోరు తప్పదనే చర్చ -
ఎరువులు అందుబాటులో ఉండేలా చర్యలు
బోధన్: రబీ సీజన్ పంటల సాగుకు సరిపడా ఎరువులు అందుబాటులో ఉండేలా ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టామని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. ఎడపల్లి మండలం జానకంపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎరువుల గోదామును కలెక్టర్ గురువారం సందర్శించారు. ఎరువుల నిల్వలు, రికార్డులను పరిశీలించారు. స్టాక్ కొంత మిగిలి ఉండగానే ఇండెంట్ సమర్పించి ఎరువులు తెప్పించుకోవాలని సూచించారు. నిల్వల వివరాలను స్టాక్ బోర్డుపై తప్పని సరిగా ప్రదర్శించాలన్నారు. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో రైతులకు ఎరువులు అందుబాటు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. యూరియా, ఇతర ఎరువుల కోసం రైతులు ఆందోళన చెందొద్దని ఆయన అన్నారు. సమస్యలను పరిష్కరించే సర్పంచ్ కావాలి.. సిరికొండ: ‘హామీలు కాదు.. మన గ్రామంలో ఉన్న సమస్యలను పరిష్కరించే సర్పంచ్ కావాలి’ అంటూ మండలంలోని తాళ్లరామడుగులో యువకులు ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. గ్రామంలోని సమస్యలను వివరిస్తూ ఫొటోలతో కూడిన ఫ్లెక్సీ ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తోంది. ఓటును నోటుకు అమ్ముకోకుండా గ్రామాన్ని అభివృద్ది చేసే వారికే వేయాలని యువకులు సూచిస్తున్నారు. నిజామాబాద్ డివిజన్లో ప్రత్యేక ఆంక్షలు నిజామాబాద్ అర్బన్: రెండో విడత గ్రామ పంచాయతీల ఎన్నికలు జరిగే నిజామాబాద్ డివిజన్లో ప్రత్యేక ఆంక్షలు విధించినట్లు పోలీస్ కమిషనర్ సాయిచైతన్య గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 163 బీఎన్ఎస్ఎస్ సెక్షన్ను అమలు చేస్తున్నామన్నారు. నిజామాబాద్ రూరల్, మాక్లూర్, డిచ్పల్లి, ఇందల్వాయి, జక్రాన్పల్లి, ధర్పల్లి, సిరికొండ మండలాల్లో ఈనెల 15వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని తెలిపారు. -
ఓటెత్తిన గ్రామాలు
● మొదటి విడతలో కాంగ్రెస్ ఖాతాలోకి సింహభాగం సర్పంచ్ స్థానాలుఎడపల్లిలోని ప్రాథమిక పాఠశాల పోలింగ్ బూత్లో ఓటు వేసేందుకు క్యూలో నిల్చున్న మహిళలుఎడపల్లిలో ఓటువేసిన యువతిబోధన్: తొలి విడత గ్రామపంచాయతీ పోరులో ఓటు వే సేందుకు మహిళలు పో టెత్తారు. తమలోని చైతన్యాన్ని చాటిచెప్పారు. ఎన్నికల జరిగిన గ్రామా ల పరిధిలో మొత్తం 2,42,723 ఓట్లకు గాను మ హిళా ఓటర్లు 1,27,757 మంది, పురుష ఓటర్లు 1,14,959 ఉన్నారు. అయితే మహిళా ఓటర్లు 1,05,282 (82.40శాతం), పురుష ఓటర్లు 92,210 (80.21శాతం) తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లాలోని బోధన్ డివిజన్ ప రిధిలో గల మండలాలతోపాటు నవీపేట మండలంలో పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియ గురువారం ప్రశాంత వాతావరణంలో ముగిసింది. మొత్తం 184 జీపీలకు గాను 29 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం కాగా.. మిగిలిన 155 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అలాగే మొత్తం 1642 వార్డులకుగాను 575 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. 7 వార్డులకు నామినేషన్లు దాఖలు కాలేదు. మిగిలిన 1060 వార్డు స్థానాలకు పోలింగ్ నిర్వహించారు. పోలింగ్, కౌంటింగ్కు అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన ఏ ర్పాట్లు చేయగా, ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ సాగింది. మేజర్ జీపీల్లో ఓటర్లు బారులు తీరారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయగా, ముందస్తుగా గుర్తించిన 71 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో అదనపు బలగాలను మోహరించారు. ఉద్యోగ, ఉపాధి కోసం దూర ప్రాంతాల్లో ఉన్న యువకులు స్వగ్రామానికి వచ్చి ఓటు వేశారు. పోలింగ్ ప్రశాంతంగా ముగియడంతో అధికా ర యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. సాలూర మండలంలో 86.45 శాతం, బోధ న్ మండలంలో 84.93 పో లింగ్ శాతం నమోదుకాగా, నవీపేటలో తక్కువగా 76.95 శాతం నమోదైంది. పర్యవేక్షణ.. పరిశీలన ఆయా గ్రామాల్లో పోలింగ్ సరళిని పర్యవేక్షించడంతోపాటు బందోబస్తును ఉన్నతాధికారులు పరిశీలించారు. అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. బోధన్ మండలం పెగడాపల్లి, నవీపేటలోని పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి పరిశీలించారు. రెంజల్ మండలం కందకుర్తి, బోధన్ మండలం భవానీపేట పోలింగ్ కేంద్రాలతోపాటు ఎడపల్లి, నవీపేట మండల కేంద్రాల్లోని పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తును సీపీ సాయిచైతన్య పర్యవేక్షించారు. రుద్రూర్, కోటగిరి, పోతంగల్, వర్ని, నవీపేట మండలాల్లో అడిషనల్ కలెక్టర్ అంకిత్ పోలింగ్ సరళిని పరిశీలించారు. ఎన్నికల జనరల్ అబ్జర్వర్ శ్యాంప్రసాద్లాల్, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో వర్ని మండలంలో వేర్వేరుగా పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. ఎంఎస్సీ ఫారం పోలింగ్ కేంద్రంలో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డితొలి విడత ఎన్నికల పోలింగ్ వివరాలు..ఓటు హక్కు వినియోగించుకున్న 82.40 శాతం మహిళలు పురుషుల ఓటింగ్ శాతం 80.21 మొత్తం పోలింగ్ 81.37 శాతం పటిష్ట బందోబస్తు మధ్య ఓటింగ్.. కౌంటింగ్ పోలింగ్ సరళిని పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి, ఉన్నతాధికారులు బందోబస్తును పర్యవేక్షించిన సీపీ సాయిచైతన్య అధికార పార్టీదే ఆధిపత్యంసాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : జిల్లాలో మెదటి విడత పంచాయతీ ఎన్నికల్లో త్రిముఖ పోరు నడిచినప్పటికీ అధికార కాంగ్రెస్ ఆధిపత్యం చూపించింది. ఏకగ్రీవాలతో కలిపి సింహభాగం గ్రామ పంచాయతీలను అధికార పార్టీ తన ఖాతాలో వేసుకుంది. 184 పంచాయతీలకు ఎన్నికలు జరగగా కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులు 137 చోట్ల విజయం సాధించారు. బీజేపీ, బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులు చెరో 13 చోట్ల గెలుపొందారు. 21 చోట్ల స్వతంత్రులు విజయం సాధించారు. -
పరిమితికి లోబడి ఖర్చు చేయాలి
వేల్పూర్: సర్పంచ్, వార్డు స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల నిబంధనల ప్రకారం ఖర్చు చేయాల ని ఎన్నికల పరిశీలకుడు రవికుమార్ అన్నారు. మండల కేంద్రంలోని స్థానిక రైతు వేదికలో గురువారం అభ్యర్థులకు ఎన్నికల వ్యయంపై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈసందర్బంగా ఆయన మా ట్లాడుతూ.. సర్పంచ్ అభ్యర్థి లక్షన్నర, వార్డు సభ్యు డు రూ. 30వేలు మాత్రమే ఖర్చు చేయాలని సూ చించారు. తహసీల్దార్ శ్రీకాంత్, ఎంపీడీవో బాలకిషన్, ఆర్.ఐ.గోపాల్, ఎంపీవో సాయిలు, అభ్యర్థులు పాల్గొన్నారు. డొంకేశ్వర్(ఆర్మూర్): డొంకేశ్వర్ మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో బుక్య లింగం గురువారం సర్పంచ్, వార్డు స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులతో సమావేశం నిర్వహించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించుకోవాలని, ర్యాలీలకు, సౌండ్ సిస్టంకు తప్పనిసరిగా అనుమతి తీసు కోవాలన్నారు. ఎన్నికల నిబంధనల మేరకే అభ్యర్థులు ఖర్చు చేయాలని సూచించారు. 45 రోజుల్లో పోటీ చేసిన అభ్యర్థులందరూ ఎన్నికల ఖర్చుల వివరాలను సమర్పించాలన్నారు. ఎంపీవో ప్రవీణ్, పరిశీలకులు లోకేశ్వర్ ఉన్నారు. డొంకేశ్వర్లో..వేల్పూర్లో మాట్లాడుతున్న అధికారులు -
తెయూ సమాచారం..
పుస్తకావిష్కరణ తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీలో ‘వికసిత భారత్–2047 డిజిటల్ యుగంలో వాణిజ్యాన్ని పునఃనిర్వచించడం’ అనే పుస్తకాన్ని గురువారం తెయూ వీసీ టీ యాదగిరిరావు, రిజిస్ట్రార్ ఎం యాదగిరి ఆవిష్కరించారు. తెయూ కామర్స్ డీన్ జి రాంబాబు, డాక్టర్ జి శ్రీనివాస్ ఈ పుస్తకానికి సంపాదకీయం వహించారు. 24 జూన్ 2025న తెయూ వాణిజ్య విభాగం నిర్వహించిన జాతీయ సదస్సు ‘వికసిత్ భారత్–2047 ద ట్రాన్స్ఫార్మాటివ్ రోల్ ఆఫ్ కామర్స్’ లో సమర్పించిన పరిశోధన పత్రాల ఆధారంగా పుస్తకంలో వ్యాసాలు సంకలనం చేశారు. పుస్తకాన్ని ఆవిష్కరించిన వీసీ యాదగిరిరావు మాట్లాడుతూ.. డిజిటల్ యుగంలో వాణిజ్యరంగ అభివృద్ధిని అర్థం చేసుకోవడంలో ఈ గ్రంథం ఒక విలువైనదిగా నిలుస్తుందని పేర్కొన్నారు. రిజిస్ట్రార్ ఎం యాదగిరి మాట్లాడుతూ.. కామర్స్ విద్యార్థులు, పరిశోధకులకు ఈ పుస్తకం మార్గదర్శకంగా నిలుస్తుందన్నారు. కార్యక్రమంలో కామర్స్ అధ్యాపకులు కే గంగాధర్, ఎన్ శ్వేత తదితరులు పాల్గొన్నారు. తెయూకు రూ.500 కోట్లు కేటాయించాలి తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.500 కోట్లు కేటాయించాలని వర్సిటీ పీడీఎస్యూ ప్రధాన కార్యదర్శి కే గౌతంరాజ్ డిమాండ్ చేశారు. గురువారం తెయూ సెంట్రల్ లైబ్రరీ ఎదుట ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధికి రూ.వేయి కోట్లు కేటాయించడం హర్షనీయమన్నారు. అలాగే గ్రామీణ పేద విద్యార్థులు చదువుకునే తెయూ అభివృద్ధికి రూ.500 కోట్లు కేటాయించడంతో పాటు సీఎం యూనివర్సిటీని సందర్శించాలని కోరారు. ఇంటిగ్రేటెడ్, పీజీ విద్యార్థులకు నెలకు రూ.2వేలు చొప్పున ఫెలోషిప్స్ అందజేయాలన్నారు. కార్యక్రమంలో నాయకులు హనుమాండ్లు, సాయికుమార్, దేవేందర్, తిరుపతి, సాయి, రాజు, సంతోష్, సాయికిరణ్, రాకేశ్, సురేశ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల సమ్మేళనాన్ని విజయవంతం చేయాలి తెయూ(డిచ్పల్లి): కాకతీయ యూనివర్సిటీలో ఈ నెల 22, 23వ తేదీల్లో నిర్వహించే ఏబీవీపీ తెలంగా ణ రాష్ట్ర యూనివర్సిటీల విద్యార్థుల సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని ఏబీవీపీ పూర్వ జాతీయ కార్యవర్గ సభ్యుడు బీ శివ కోరారు. గురువారం తెయూ ఏబీవీపీ ఆధ్వర్యంలో సమ్మేళన పోస్టర్లను వర్సిటీ వీసీ టీ యాదగిరిరావు చేతుల మీదుగా ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర కా ర్యవర్గ సభ్యుడు మోహన్, వర్సిటీ ఉపాధ్యక్షులు మనోజ్,అశోక్, సంయుక్త కార్యదర్శి అనిల్, నాయకులు శివ, దుర్గాదాస్, నితిన్, అజేందర్, మణి, పావని,శృతి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. శంకర్కు డాక్టరేట్ ప్రదానం తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ ఆంగ్ల విభాగంలో పరిశోధక విద్యార్థి గుజ్జరి శంకర్ డాక్టరేట్ సాధించారు. తెయూ రిటైర్డ్ ప్రొఫెసర్ జి మనోజ పర్యవేక్షణలో ‘ఏ క్రిటికల్ స్టడీ ఆన్ మేజర్ థీమ్స్ అండ్ ఇష్యూస్ ఇన్ ద సెలక్టెడ్ నావెల్స్ ఆఫ్ చేతన్ భగత్’ అనే అంశంపై శంకర్ పరిశోధన పూర్తి చేసి సిద్ధాంత గ్రంథం సమర్పించారు. గురువారం నిర్వహించిన మౌఖిక పరీక్షకు కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్ మేఘనా రావు ఎక్స్టర్నల్ ఎగ్జామినర్గా వ్యవహరించారు. అనంతరం శంకర్ను వీసీ యాదగిరిరావు, రిజిస్ట్రార్ యాదగిరి, కంట్రోలర్ సంపత్కుమార్ తదితరులు అభినందించారు. కార్యక్రమంలో ఆర్ట్స్ డీన్ లావణ్య, హెచ్వోడీ రమణాచారి, బీవోఎస్ చైర్మన్ సమత, అధ్యాపకులు స్వామిరావు, జ్యోత్స్న, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
జోరుగా ఎన్నికల ప్రచారం
డిచ్పల్లి: మండలంలోని ధర్మారం(బి) మేజర్ గ్రామపంచాయతీ ఎన్నికల్లో బ్యాటు గుర్తుకు ఓటేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని సర్పంచ్ అభ్యర్థి త్రిపురనేని సాయిప్రసాద్(సాయిబాబా) విజ్ఞప్తి చేశారు. గురువారం గ్రామంలోని పలు వార్డుల్లో తన మద్దతుదారులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ బ్యాటు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి సహకారంతో గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని అన్నారు. నాయకులు రామారావు, ఫిలిప్రాజ్, శ్రీనివాస్రెడ్డి, 3వ వార్డు అభ్యర్థి ఎర్రబచ్చుల పద్మ శ్రీనివాస్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్అర్బన్: జిల్లా కేంద్రంలోని ఖలీల్వాడిలో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ సిబ్బంది తమ నిజాయితీ చాటుకున్నారు. మాక్లూర్ మండలం జ్యోతినగర్కు చెందిన సుజాత గురువారం ప్రయివేట్ ఆస్పత్రిలో చికిత్స కోసం వచ్చింది. ఆమె వద్ద రూ. రెండు వేల నగదుతో ఉన్న పర్సు రోడ్డుపై పడిపోయింది. పర్సు పడిపోయిన విషయాన్ని ట్రాఫిక్ సిబ్బంది ఉదయ్, గోపాల్ గమనించారు. పర్సును తీసుకొని అందులోఉన్న అడ్రస్ కనుగొని ఆమెకు పర్సును అందించారు. అనంతరం ట్రాఫిక్ సిబ్బందిని ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ, ట్రాఫిక్ సీఐ ప్రసాద్ అభినందించారు. చెత్తను తొలగించరూ! ఆర్మూర్టౌన్: పట్టణంలోని పలు ప్రాంతాల్లో చెత్తాచెదారం పేరుకుపోవడంతో అపరిశుభ్ర వాతావరణం నెలకొంది. దీంతో దుర్వాసన వెలువడుతుండడంతో స్థానికులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పట్టణంలోని మల్లారెడ్డి చెరువు సమీపంలో, హుస్నాబాద్కాలనీలో, గోల్బంగ్లా వద్ద, మామిడిపల్లి శివారుతోపాటు తదితర ప్రాంతాల్లో చెత్త పేరుకుపోయినా మున్సిపల్ కార్మికులు తొలగించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులు పూర్తిస్థాయిలో చెత్తసేకరణ చేయడంలో నిర్లక్ష్యం వహించడంతో ఈ దుస్థితి నెలకొందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి, చెత్తను తొలగించాలని ప్రజలు కోరుతున్నారు. -
సైబర్ నేరాలపై అవగాహన తప్పనిసరి
● ఓటీపీలు చెప్పొద్దు● ఎస్బీఐ ఎల్హెచ్వో ఏజీఎం ప్రశాంత్కుమార్డిచ్పల్లి: సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ఎస్బీఐ ఎల్హెచ్వో(హైదరాబాద్) ఏజీఎం ప్రశాంత్కుమార్ సూచించారు. డిచ్పల్లి మండల కేంద్రంలోని ఎస్బీఐ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ(ఆర్ఎస్ఈటీఐ) ఆధ్వర్యంలో వివిధ కోర్సుల్లో శిక్షణ పొందుతున్న అభ్య ర్థులకు సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై న ప్రశాంత్కుమార్ మాట్లాడుతూ.. మొబైల్ ఫోన్ల ద్వారా ఎక్కువగా సైబర్ నేరాలు జరిగే అవకాశాలున్నాయని వాటిని వాడే సమయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేస్తే వారికి వ్యక్తిగత సమాచారం, ఓటీపీలు చెప్పవద్దన్నారు. ఎవరైనా సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930 నంబర్కు సమాచారం అందించాలన్నారు. కార్యక్రమంలో ఎస్బీఐ ఏవో నిజామాబాద్ చీఫ్ మేనేజర్లు సోమేశ్వరరావు, రామకృష్ణ, ఆర్ఎస్ఈటీఐ డైరెక్టర్ రవికుమార్, సిబ్బంది రామకృష్ణ, నవీన్, లక్ష్మీనారాయణ, లక్ష్మణ్, స్వరూప, రాధిక, సౌమ్యరెడ్డి, సంస్థలో శిక్షణ పొందుతున్న అభ్యర్థులు తదితరులు పాల్గొన్నారు. -
ఎమ్మెల్సీని కలిసిన కాంగ్రెస్ నగర అధ్యక్షుడు
నిజామాబాద్ రూరల్: నిజామాబాద్ జిల్లా పార్లమెంట్ ఇన్చార్జి, ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ను గురువారం నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ హైదరాబాద్లో మర్యాదపూర్వకంగా కలిశారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన బొబ్బిలిరామకృష్ణను ఎమ్మెల్సీ వెంకట్ శాలువాతో సన్మానించారు. అలాగే ఎమ్మెల్సీని రామకృష్ణ సన్మానించారు. పట్టణంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని బల్మూర్ వెంకట్ సూచించినట్లు ఆయన పేర్కొన్నారు. డిచ్పల్లి: తనను సర్పంచ్గా గెలిపిస్తే ఐదేళ్ల పదవీ కాలంలో గ్రామ పంచాయతీ పరిధిలో పుట్టే ఆడపిల్లకు రూ.ఐదు వేలు ప్రోత్సాహకంగా అందజేస్తానని నడిపల్లి మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థి చింతపంటి తేజుపా రాజారాం హామీ ఇచ్చారు. గురువారం నడిపల్లి పంచాయతీ పరిధిలోని డిచ్పల్లి రైల్వేస్టేషన్, గాంధీనగర్ కాలనీల్లో తన మద్దతుదారులతో కలిసి రాజారాం ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నడిపల్లి జీపీ పరిధిలో కుల, మతాలలకు అతీతంగా ఎవరి ఇంట్లో ఆడపిల్ల పుట్టినా తన సొంత డబ్బులు రూ.5వేలు పాప పేరిట డిపాజిట్ చేయిస్తానని తెలిపారు. గ్రా మాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తానని, బ్యా టు గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ప్రచారంలో అభ్యర్థి వెంట వార్డు సభ్యులు రాజారాం, మద్దతుదారులు పాల్గొన్నారు. ధర్పల్లి: గ్రామ అభివృద్ధే తన ధ్యేయమని ధర్పల్లి సర్పంచ్ అభ్యర్థి చెలిమెల శ్రీనివాస్ అన్నారు. గురువారం తన మద్దతుదారులతో కలిసి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. తన గుర్తు బ్యాటుకు ఓటు వేసి, ప్రజాసేవ చేసేందుకు సర్పంచ్గా ఆశీర్వదించాలని కోరారు. ఎమ్మెల్యే భూపతిరెడ్డి సహకారంతో ధర్పల్లి గ్రామానికి అదనపు నిధులు మంజూరు చేయించి మరింత అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు. అవినీతిని పూర్తిగా నిర్మూలిస్తానన్నారు. ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఆర్మూర్ బాలరాజ్, నాయకులు, చెలిమెల నర్సయ్య, మల్లికార్జున్ రెడ్డి, సుభాశ్ తదితరులు ఉన్నారు. నిజామాబాద్అర్బన్: నగరంలోని నిఖిల్ సాయి హోటల్ సమీపంలో గురువారం రాత్రి వినాయకనగర్ చెందిన సోని అకస్మాతుగా ఫిట్స్ వచ్చి రోడ్డుపై పడిపోయింది. వెంటనే గమనించిన ట్రాఫిక్ సిబ్బంది షాకీర్ ఆమెకు సహాయం అందించి రోడ్డు పక్కకు తీసుకెళ్లి సపర్యలు చేశారు. అనంతరం షాకీర్ను ట్రాఫిక్ పోలీసులు అభినందించారు. -
తాతపై నెగ్గిన మనవడు
నవీపేట: మండలంలోని అబ్బాపూర్(బి) తండాలో వరుసకు తాత మనవళ్ల మధ్య జరిగిన పోరులో మనుమడు గెలుపొందాడు. సర్పంచ్ స్థానాన్ని జనరల్కు కేటాయించడంతో మాజీ ఎంపీటీసీ గంగామణి భర్త నెనావత్ శంకర్ నాయక్, ఆయన మనవడు నెనావత్ ప్రేమ్సింగ్ సర్పంచ్గా పోటీ చేశారు. మొత్తం 1,095 ఓట్లు పోల్ అవ్వగా ప్రేమ్సింగ్కు 467 ఓట్లు, శంకర్ నాయక్కు 442 ఓట్లు వచ్చాయి. 25 ఓట్ల తేడాతో తాతపై మనుమడు విజయం సాధించాడు. నెనావత్ ప్రేమ్సింగ్ అబ్బాపూర్(బి) తండా -
కాంగ్రెస్ పాలన అవినీతిమయం
సిరికొండ: రాష్ట్రంలో కాంగ్రెస్పాలన పూర్తిగా అవినీతిమయంగా మారిందని రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఆరోపించారు. సిరికొండ మండలంలోని గడ్కోల్ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి గుద్దెటి లక్ష్మికి మద్దతుగా మాజీ ఎమ్మెల్యే గురువారం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఎక్కడా కూడా లంచాలు ఇవ్వనిదే పనులు కాని దుస్థితి నెలకొందన్నారు. గత ప్రభుత్వ హయాంలో మంజూరైన పనులను మేము మంజూరు చేశామని ఎమ్మెల్యే భూపతిరెడ్డి చెప్పుకుంటున్నారని అన్నారు. ఎమ్మెల్యే గ్రామానికో ఏజెంట్ను పెట్టుకొని అవినీతి చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి బుద్ధి రావాలంటే జేఏసీ అభ్యర్థిని సర్పంచ్గా గెలిపించాలని కోరారు. సీపీఐఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వి ప్రభాకర్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ కులాచారి, ధర్పల్లి మాజీ జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్, పిట్ల రామకృష్ణ, రామస్వామి, దేవరాం, గుద్దెటి నర్సయ్య, పెద్ద కొండయ్య, రామాగౌడ్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. -
మనోవికాస కేంద్రం ప్రారంభం
నిజామాబాద్అర్బన్: జిల్లా కేంద్రంలోని ఖలీల్వాడిలో డాక్టర్ ఏ విశాల్ నూతనంగా ఏర్పాటు చేసిన మనోవికాస కేంద్రాన్ని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. పిల్లల మనోవికాస కేంద్రం అందుబాటులోకి రావడం ఎంతో సంతోషకరమన్నారు. నేటి రోజుల్లో పిల్లలు అనేక రకాలుగా బుద్ధి మాంద్యం, ఆలోచన సరళి విధానంలో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఇలాంటి వారికి ఈ భవనం అందుబాటులోకి వస్తే మరింత ఉపయోగకరంగా ఉంటుందన్నారు. అనంతరం ఆస్పత్రిలోని వివిధ విభాగాలను డాక్టర్ రవీందర్ రెడ్డి, మాజీ ఐఎంఏ అధ్యక్షుడు జీవన్రావు, డాక్టర్ వై శ్రీధర్ రాజు, డాక్టర్ వి జార్జిరెడ్డి, డాక్టర్ అజ్జా శ్రీనివాస్, డాక్టర్ హరీశ్ స్వామి, ప్రారంభించారు. కార్యక్రమంలో అడ్వకేట్ ఆర్ జగదీశ్వర్, సిద్ధయ్య, డాక్టర్ రాజేశ్, డాక్టర్ పీబీ కృష్ణమూరి, డాక్టర్ కౌలయ్య, డాక్టర్ ఆకుల విశాల్, నాగ పద్మ తదితరులు పాల్గొన్నారు. -
రైతులకు అందుబాటులో ఎరువులు
డొంకేశ్వర్(ఆర్మూర్): యాసంగి పంటలకు సరిప డా ఎరువుల నిల్వలు అందుబాటులో ఉన్నాయని మండల వ్యవసాయాధికారి మధు సూదన్ తెలిపారు. మండల పరిధిలోని సిర్పూ ర్ ఎరువుల గోదాంను ఆయన గురువారం పరిశీలించారు. ఎరువుల అమ్మకాలు, నిల్వలను పరిశీలించారు. ప్రస్తుతం మండలంలో 146.28 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని, రైతులు అవసరం మేరకే కొ నుగోలు చేసి తీసుకెళ్లాలని సూచించారు. యూరియా కొరత రాకుండా ఎప్పటికప్పుడు మండలానికి తెప్పించి గ్రామాలకు సరఫరా చేస్తున్నట్లు ఏవో తెలిపారు. -
సర్పంచ్గా కొడుకు విజయం.. ఛాతి నొప్పితో తల్లి మృతి
రుద్రూర్: సర్పంచ్గా వి జయం సాధించిన కొ డుకు విజయోత్సవ సంబురాల్లో ఉండగా.. తల్లి ఛాతినొప్పితో మృతి చెందింది. ఈ వి షాదఘటన మండలంలోని రాణంపల్లిలో చోటు చేసుకుంది. సర్పంచ్గా విజయం సాధించిన కొండల్వాడి శంకర్ తన సోదరుడితో కలిసి గురువారం రాత్రి సంబురాలు జరుపుకుంటున్నారు. అదే సమయంలో ఇంటి నుంచి తల్లి లింగవ్వ తనకు ఛాతిలో నొప్పి వస్తోందని శంకర్ సోదరుడికి సమాచారం అందించింది. ఆయన వెంటనే ఇంటికి చేరుకుని లింగవ్వను బోధన్కు అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్కు తరలిస్తుండగా మార్గమధ్యంలో కన్నుమూసింది. దీంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. -
బలగమే బలం
డొంకేశ్వర్(ఆర్మూర్): గ్రామంచాయతీ ఎన్నికల సందర్భంగా బంధాలు బలపడుతున్నాయి. సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ చేస్తున్న తమ అభ్యర్థులకు బంధువులు తోడుగా నిలుస్తున్నారు. స్థానికంగా ఊళ్లలో ఉన్నవారే కాకుండా ఆయా గ్రామాల్లో ఉన్న తోబుట్టువులు, మామలు, అల్లుళ్లు, కోడళ్లు, వరుసయ్యే కొడుకులు, పెద్ద నాన్నలు, చిన్న నాన్నలు, చిన్నమ్మలు, పెద్దమ్మలు, మనుమళ్లు, మనువరాళ్లు, ఆఖరికి తాతలు, అమ్మమ్మలు, నాన్నమ్మలు కూడా ఎన్నికల రంగంలోకి దిగారు. హైదరాబాద్, ఇతర పట్టణాల్లో ఉన్నవారు సైతం పనులు వదులుకొని గ్రామాల్లోకి వచ్చి అభ్యర్థుల ఇళ్లలోనే ఉంటున్నారు. అందరూ ఒకచోట కూర్చొని ఏ విధంగా ప్రచారం చేయాలన్న దానిపై చర్చలు జరుపుకొని ముందుకు వెళ్తున్నారు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి సమయాల్లో గ్రూపులుగా వీడిపోయి వాడవాడ లా గుర్తుల ప్లకార్డులు పట్టుకొని జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. మహిళలు మహిళా ఓటర్లకు బొట్టుపెట్టి, పురుషులు పురుష ఓటర్లకు కండువాలు కప్పుతూ తమదైన శైలిలో ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. తమ బలగం బలంగా మారడంతో కొన్ని చోట్ల అభ్యర్థుల గెలుపు ఖాయమన్నట్లుగా కనిపిస్తోంది. కలిసి పెరిగిన దోస్తులు, కలిసి చదువుకున్న విద్యార్థులు... పంచాయతీ ఎన్నికల్లో స్నేహితులు కూడా అభ్యర్థుల గెలుపు కోసం పాటు పడుతున్నారు. గ్రామాల్లో కలిసి పెరిగిన దోస్తులు, కలిసి చదువుకున్న విద్యార్థులు ప్రచారంలో పాలు పంచుకుంటున్నారు. యువత ఓట్లు కీలకం కావడంతో స్నేహితులంతా ఒక్కటవుతున్నారు. వేరే ప్రాంతాల స్నేహితులు ఉద్యోగాలకు సెలవులు పెట్టి గ్రామాలకు వచ్చి ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల్లో తోడుగా నిలుస్తున్న అభ్యర్థుల బంధువులు సొంతవారి గెలుపు కోసం పనులు వదులుకొని ప్రచారం -
పొతంగల్ మండల సర్పంచులు వీరే
రుద్రూర్: పొతంగల్ మండలంలో 20 గ్రామపంచాయతీలు ఉండగా పీఎస్ఆర్నగర్ ఏకగ్రీవమైంది. 19 జీపీలకు ఎన్నికలు నిర్వహించారు. పొతంగల్ సర్పంచ్గా కల్లూరి సంధ్య(బీజేపీ), తిర్మలాపూర్ సర్పంచ్గా బోయి సైదవ్వ(బీజేపీ), బాకర్ ఫారం సర్పంచ్గా కనక మేడల శ్రీనివాస్రావు, హెగ్డోలి సర్పంచ్గా ఆర్ నాగరాజు, చేతన్నగర్ సర్పంచ్గా కే కాంత బాయి, సోంపుర్ సర్పంచ్గా కోమల్ పవర్, కొల్లూర్ సర్పంచ్గా కే జగన్, హంగర్గ సర్పంచ్గా ఎన్ ఉదయ భాస్కర్, హంగర్గ ఫారం సర్పంచ్గా రజియా బేగం, జల్లాపల్లితండా సర్పంచ్గా రాజు, జల్లాపల్లి సర్పంచ్గా లత, జల్లాపల్లి ఫారం సర్పంచ్గా దస్తగిరి, జల్లాపల్లి ఆబాది సర్పంచ్గా వివేక్, కల్లూర్ సర్పంచ్గా రాంరెడ్డి, కొడిచర్ల సర్పంచ్గా కవిత, దోమలెడ్గి సర్పంచ్గా కోడూరు దేవిక, కారేగాం సర్పంచ్గా నరహరి సునీల్, సుంకిని సర్పంచ్గా షజి పటేల్, టాక్లి సర్పంచ్గా పద్మావతి ఎన్నికయ్యారు. కోటగిరి మండలంలో.. కోటగిరి మండలంలో 16 జీపీలకు గాను ఐదు ఏకగ్రీవం కాగా 11 జీపీలకు ఎన్నికలు జరిగాయి. సుద్దులం సర్పంచ్గా గాయక్వాడ్ మీనా, బస్వాపూర్ సర్పంచ్గా పుట్ట శ్రీధర్, ఎక్లాస్పూర్ సర్పంచ్గా పడిగెల ఈర్వంత్రావు, ఎక్లాస్పూర్ క్యాంపు సర్పంచ్గా వెల్లంకి సీతాకుమారి, ఎత్తొండ సర్పంచ్గా ఎం శ్వేత, ఎత్తొండ క్యాంపు సర్పంచ్గా గైని వీరమణి, లింగాపూర్ సర్పంచ్గా దొడ్డిమీది శారద, ఎస్ఆర్ కాలనీ సర్పంచ్గా దేగాం హన్మంతు, యాద్గార్పూర్ సర్పంచ్గా షేక్ గౌస్, కొత్తపల్లి సర్పంచ్గా పుప్పాల చిన్న గంగారాం, కోటగిరి సర్పంచ్ గా మధుకర్ విజయం సాధించారు. -
రేపు నవోదయ ప్రవేశ పరీక్ష
ఖలీల్వాడి: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని నవోదయ విద్యాలయంలో 6వ తరగతి ప్రవేశానికి ఈ నెల 13న పరీక్షను నిర్వహించనున్నటలు డీఈవో అశోక్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్షకు మొత్తం 5,124 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, అందులో నిజామాబాద్ జిల్లాకు చెందిన వారు 2,240 మంది, కామారెడ్డి జిల్లాకు చెందిన 2,884 మంది విద్యార్థులు ఉన్నారు. విద్యార్థులు పరీక్ష కేంద్రానికి ఉదయం 11 గంటల లోపు చేరుకోవాలని, ఆ తర్వాత లోనికి అనుమతించబోమని తెలిపారు. ఉదయం 11.30 నుంచి 1.30 గంటల వరకు పరీక్ష ఉంటుందన్నారు. విద్యార్థులు హాల్ టికెట్తోపాటుగా ఆధార్, రేషన్కార్డు తప్పనిసరిగా తీసుకొని రావాలని సూచించారు. సందేహాలుంటే నవోదయ విద్యాలయ ప్రిన్సిపాల్ లేదా ఇంచార్జీ ప్రభాకర్ 97019 07749 నెంబర్లో సంప్రదించాలని పేర్కొన్నారు. ఖలీల్వాడి: అంబేడ్కర్ దూర విద్య పరీక్ష ఫీజు ఈ నెల 27 వరకు చెల్లించాలని ప్రిన్సిపాల్ డాక్టర్ రాంమోహన్ రెడ్డి, కోఆర్డినేటర్ డాక్టర్ రంజిత గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. బీఏ, బీకామ్, బీఎస్సీ ఒకటి, మూడు, ఐదో సెమిస్టర్ల ఫీజును చెల్లించాలని పేర్కొన్నారు. బీఎస్సీ, బీకాం కంప్యూటర్స్ విద్యార్థులు థియరీ పరీక్ష ఫీజుతోపాటు ప్రాక్టికల్స్ కోసం కూడా ఫీజు చెల్లించాలని సూచించారు. వివరాలకు 7382929612 నెంబర్లో సంప్రదించాలని తెలిపారు. ఎంబీఏ, బీఎల్ఐఎస్ఏ సెమిస్టర్– 2 విద్యార్థులు ఈ నెల 27లోగా పరీక్ష ఫీజు చెల్లించాలని సూచించారు. ● పోలింగ్ కేంద్రాలను సందర్శించిన నాగేశ్రెడ్డి సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: బోధన్ డివిజన్లోని వివిధ మండలాల్లో గురువారం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాటిపల్లి నాగేశ్ రెడ్డి పర్యటించారు. రెంజల్, ఎడపల్లి మండలా ల్లోని వివిధ పోలింగ్ కేంద్రాల వద్దకు వెళ్లి పరిశీలించారు. నాగేశ్రెడ్డితోపాటు జిల్లా గ్రంథాల య సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, మాజీ జె డ్పీటీసీ నాగభూషణ్రెడ్డి, పులి శ్రీనివాస్, యు వజన నాయకుడు వేణురాజ్, కౌశిక్, ఆయా మండలాల కాంగ్రెస్ అధ్యక్షులు పాల్గొన్నారు. సుభాష్నగర్: రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీపై పరికరాలు, ఇతర ప్రోత్సాహకాలు అందిస్తున్నాయని జేఎంకేపీఎం రైతు ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు పాట్కూరి తిరుపతిరెడ్డి పేర్కొన్నారు. గురువారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మహానందిలో అరటి, పసుపు రైతుల ఉత్పత్తిదారుల సంఘాన్ని రైతులతోపాటు తిరుపతిరెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఎఫ్పీవో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కల్పిస్తున్న సబ్సిడీలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రైతులు పండించిన పంటలు మార్కెటింగ్ అంశాలు, దిగుబడులు, పెట్టుబడి, ఆదాయ వ్యయాలపై తిరుపతిరెడ్డి వివరించారు. అనంతరం తిరుపతిరెడ్డిని ఎఫ్పీవో ప్రతినిధులు సన్మానించారు. -
క్రైం కార్నర్
పర్మిట్ రూంలో ఒకరి మృతి నిజాంసాగర్(జుక్కల్): మండల కేంద్రంలోని భ్రమరాబ వైన్స్షాపు ఆవరణలోని పర్మిట్ రూంలో మద్యం సేవించిన మంగళి సాయిలు(40) అనే వ్యక్తి బుధవారం రాత్రి మెట్ల కిందపడి చనిపోయినట్లు స్థానిక ఎస్సై శివకుమార్ తెలిపారు. ఒడ్డేపల్లి గ్రామానికి చెందిన సాయిలు స్థానిక వైన్స్షాపులో మద్యం కొనుగోలు చేసి వైన్స్ వెనుకభాగంలో ఉన్న పర్మిట్ రూంలో సేవించాడు. మెట్లపై కూర్చున్న సాయిలు ఆకస్మికంగా కిందపడటంతో తీవ్ర రక్తస్రావమై అక్కడిక్కడే మృతి చెందాడు. మృతుడి అన్న ఎల్లయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. -
సర్వీస్ ఓటర్లకు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు
డొంకేశ్వర్(ఆర్మూర్): కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న (ఆర్మీ, నేవీ) వారు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎన్నికల కమిషన్ పోస్టల్ బ్యాలెట్ ఓటు అవకాశాన్ని కల్పించింది. డొంకేశ్వర్ మండలంలో 11 మంది సర్వీస్ ఓటర్లను గుర్తించిన అధికారులు వారు పని చేస్తున్న చోటికి పోస్ట్ చేశారు. పోస్ట్ వారికి చేరిన వెంటనే బ్యాలెట్ పేపర్పై ఉన్న ఏదేని ఒక గుర్తుపై టిక్ చేసి రిటర్న్ పోస్ట్ చేస్తారు. ఈ నెల 17న ఎన్నికలు జరగనుండగా రెండు రోజుల ముందే పోస్టల్ బ్యాలెట్ ఓట్లు తమకు చేరుకుంటాయని, వాటిని పోలింగ్ రోజు తెరుస్తామని ఎంపీడీవో బుక్య లింగం తెలిపారు. -
నారుమడిపై చలి ప్రభావం
● జాగ్రత్తలు పాటించాలంటున్న వ్యవసాయ శాస్త్రవేత్తలు రుద్రూర్: జిల్లాలో చలితీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. దీంతో పంటలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పలు సూచనలను రుద్రూర్ వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ రమ్య రాథోడ్ రైతులకు వివరించారు. చలి తీవ్రత ఎ క్కువగా ఉంటే నారు సరిగ్గా ఎదగక, ఎర్రబడి కొ న్నిసార్లు చనిపోతుందని అన్నారు. యాసంగిలో వరి సాగు చేసే రైతులు నారుమడి యాజమాన్యంపై ప్ర త్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. వరి మొలకెత్తటానికి 25–45 డిగ్రీల సెల్సియస్, మొక్కల ఎదుగుదలకు 25–35 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు ఉండడం మంచిదని, కానీ జిల్లాల్లో వారం రోజుల నుంచి 4–5 డిగ్రీల సెల్సియస్ తక్కువగా నమోదు అవుతోంది. దీంతో భూమిలోని పోషకాలు మొక్కకు అందక ఆకులు పసుపు రంగు మారి ఆ తర్వాత ఎండిపోతాయన్నారు. రాత్రి ఉష్ణోగ్రతల్లో వరినారు ఎదగదని, ఈ పరిస్థితుల్లో రైతులు చేస్తున్న పలు రకాల మందుల పిచికారీలతో ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. నారు ఎర్రబడటం, తెగుళ్లు ఆశించడం కొన్ని రోజులు మాత్రమే ఉంటుందని, రాత్రి ఉష్ణోగ్రతలు కొద్దిగా పెరిగితే మళ్లీ సాధారణ స్థితికి వస్తాయని పేర్కొన్నారు. నారుమడి రక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ● చలి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు రాత్రివేళల్లో నారుమడిపై టార్పాలిన్, పాలిథిన్ షీట్ లేదా సంచులతో కుట్టిన పట్టాలను కప్పి ఉంచాలి. మరుసటి రోజు ఉదయాన్నే తీసివేయాలి. దీంతో చలి ప్రభావం తక్కువగా ఉండి నారు త్వరగా పెరుగుతుంది. ● చలికి నారు దెబ్బతినకుండా నారుమడికి సాయంత్రం నీటిని ఎక్కువగా పెట్టి మరుసటి రోజు ఉదయాన్నే చల్లటి నీటిని తీసేసి మళ్లీ కొత్తనీరు పెట్టాలి. ● అధిక చలితో జింక్ లోప లక్షణాలు కనిపిస్తే లీటరు నీటికి రెండు గ్రాముల జింక్ సల్ఫేట్ కలిపి నారుమడిలో పిచికారీ చేయాలి. ● వరి నారుమడికి పది గ్రాముల 19:19:19 పోష కాన్ని, 2.5గ్రాముల కార్బెండజిమ్, మ్యాంకోజ బ్ మిశ్రమాన్ని లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలని వ్యవసాయ శాస్త్రవేత్త సూచించారు. -
ప్రాణం తీసిన కంచె..
● విద్యుదాఘాతంతో రైతు మృతి నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): నారుమడి రక్షణ కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ కంచె తగిలి రైతు మృతి చెందిన ఘటన నాగిరెడ్డిపేట మండలం లింగంపల్లికలాన్లో బుధవారం చోటు చేసుకుంది. అల్లపురం లింగయ్య(59)అనే రైతు రోజూమాదిరిగానే ఉదయం గ్రామశివారులోని తన పొలంలో వరి నారుమడికి నీరు పెట్టేందుకు వెళ్లగా పందుల నుంచి రక్షణ కోసం ఏర్పాటు చేసిన కరెంట్ కంచెకు తగిలా డు. విద్యుత్ షాక్తో నారుమడి లో పడి ప్రాణాలు కోల్పోయా డు. మృతుడికి భార్య లస్మవ్వ, కొడుకు సురేశ్తోపాటు ముగ్గు రు కూతుళ్లు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఇంచార్జి ఎస్హెచ్వో మనోహర్ తెలిపారు. -
కోనాపూర్ సర్పంచ్ బరిలో 10 మంది అభ్యర్థులు
కమ్మర్పల్లి: కమ్మర్పల్లి మండలం కోనాపూర్ సర్పంచ్ ఎన్నికల బరిలో 10 మంది అభ్యర్థులు నిలిచారు. మూడో విడతలో జరగనున్న ఈ ఎన్నికల్లో సర్పంచ్ రిజర్వేషన్ జనరల్(అన్ రిజర్వుడ్)కు కేటాయించారు. గ్రామంలో 1,419 మంది ఓటర్లు ఉండగా, 10 వార్డులు ఉన్నాయి. ఇప్పటికే 4 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. సర్పంచ్ స్థానానికి పోటీచేస్తున్న వారిలో ఒకరు కాంగ్రెస్, మరొకరు బీఆర్ఎస్ మద్దతుదారులు ఉన్నారు. మిగతా ఆరుగురు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. సర్పంచ్ స్థానానికి 10 మంది అభ్యర్థులు పోటీ పడుతుండడంతో ఎన్నికలు ఆసక్తిగా మారాయి. తెయూ(డిచ్పల్లి): తెలంగాణ వర్సిటీ పరిధిలో డిగ్రీ రెగ్యులర్, బ్యాక్లాగ్ పరీక్షలు బుధవారం ముగిసినట్లు అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పరిధిలో మొత్తం 11 పరీక్ష కేంద్రాలలో మధ్యాహ్నం జరిగిన 4వ సెమిస్టర్ బ్యాక్లాగ్ పరీక్షకు 83 మంది విద్యార్థులకు 72 మంది విద్యార్థులు హాజరుకాగా 11 మంది గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. డిగ్రీ పరీక్షలు ముగిసేంత వరకు మొత్తం 20 మంది విద్యార్థులు డిబార్కు గురైనట్లు తెలిపారు. తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని పీజీ 3వ సెమిస్టర్ (థియరీ, ప్రాక్టికల్), ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్సులు (ఏపీఈ, ఐపీసీహెచ్, ఐఎంబీఏ) 3వ, 9వ సెమిస్టర్ పరీక్షల ఫీజు ఈ నెల 24 వరకు చెల్లించాలని కంట్రోలర్ ప్రొఫెసర్ సంపత్కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పీజీ మొదటి సెమిస్టర్, ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్సు (ఏపీఈ) అన్ని సబ్జెక్టుల కలిపి పరీక్ష ఫీజు రూ.500, ప్రాసెసింగ్ ఫీజు రూ.100 చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఇంటిగ్రేటెడ్ పీజీ ఐపీసీహెచ్ అన్ని సబ్జెక్టులు కలిపి పరీక్ష ఫీజు రూ.600, ప్రాసెసింగ్ ఫీజు రూ.100 చెల్లించాలన్నారు. పీజీ (ఎంఏ, ఎమ్మెస్డబ్ల్యూ, ఎంకాం) అన్ని సబ్జెక్టులు కలిపి రూ.500, ఇంటిగ్రేటెడ్ పీజీ ఏపీఈ, ఐఎంబీఎ అన్ని సబ్జెక్టులు కలిపి రూ.800 చెల్లించాలని తెలిపారు. రూ.100 అపరాధ రుసుముతో ఈ నెల 30 వరకు పరీక్ష ఫీజు చెల్లించే అవకాశం ఉంటుందన్నారు. పూర్తి వివరాలకు తెలంగాణ యూనివర్సిటీ వెబ్సైట్ను సందర్శించాలన్నారు. వేల్పూర్: అంక్సాపూర్ సంతమల్లన్నను సీపీ సాయిచైతన్య బుధవారం దర్శించుకున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రంగా పేరుగాంచిన సంతమల్లన్న జాతర బుధవారం వరకు జరిగింది. సంతమల్లన్నను దర్శించుకున్న సీపీ సాయిచైతన్యకు అంక్సాపూర్ వీడీసీ సభ్యులు, పూజారులు ఘనంగా స్వాగతం పలికి, శాలువాతో సన్మానించారు. అనంతరం సీపీ దత్తాశ్రమంలోని పాదరసలింగం శివాలయాన్ని దర్శించుకొని పూజలు చేశారు. ఆయన వెంట వేల్పూర్ ఎస్సై సంజీవ్, పోలీసు సిబ్బంది ఉన్నారు. -
దావత్లు.. తాయిలాలు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: పంచాయతీ పోరులో మొదటి దశ పోలింగ్కు కొన్ని గంటలే ఉండడంతో ఎన్నికలు జరుగుతున్న గ్రామాల్లో అభ్యర్థులు ఓట ర్లను ప్రసన్నం చేసుకునేందుకు అనేక ఫీట్లు చేస్తున్నారు. క్షణం తీరిక లేకుండా అభ్యర్థులతో పాటు వారి కుటుంబ సభ్యులు, సన్నిహిత మిత్రలు బిజీబిజీగా గడుపుతున్నారు. అభ్యర్థుల కుటుంబ సభ్యులే కాకుండా స్నేహితులూ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఖర్చు చేస్తున్నారు. గ్రామాల్లో పట్టు నిలుపుకునేందుకు అభ్యర్థులు, తమకు అనుకూలమైన వాళ్లే సర్పంచ్లుగా ఉండాలనే ఆకాంక్షతో వాళ్ల స్నేహితులు, పలుకుబడి కలిగిన వ్యక్తులు, వ్యాపారులు అంతా తామై వ్యవహరిస్తున్న పంచాయతీలు జిల్లాలో అనేకం ఉన్నాయి. ఎన్నికలు జరుగుతున్న గ్రామం చుట్టూనే కాకుండా మండల కేంద్రం, ని యోజకవర్గ కేంద్రం, జిల్లా కేంద్రంలో బుధవారం విడతలవారీగా అభ్యర్థుల తరుఫున ప్రత్యేకంగా డెన్లు ఏర్పాటు చేసుకుని దావత్లు ఏర్పాటు చేశారు. నిజామాబాద్కు అనుకుని ఉన్న కొన్ని మండలాలకు సంబంధించిన పలు గ్రామాల ఓటర్లు జిల్లా కేంద్రంలోనే అత్యధికంగా ఉన్నారు. దీంతో ఆయా గ్రామాలకు చెందిన అభ్యర్థుల తరుఫున పలువురు దావత్లు చేశారు. కొందరైతే ఏకంగా బడా హోటళ్లలో దావత్లు ఏర్పాటు చేసి తా యి లాలు సైతం ఇస్తున్నారు. మాక్లూర్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఓటర్లు 60 శాతం మంది నిజామాబాద్లోనే ఉండడంతో భారీ దావత్ ఏ ర్పాటు చేయడం గమనార్హం. ఈ దావత్ వ్యవహారాలన్నీ అభ్యర్థి స్నేహితులే చూసుకుని ఖర్చు చేశారు. అభ్యర్థుల గెలుపు కోసం వాళ్ల మిత్రులు అప్పులు చేసి ఖర్చు చేస్తున్నారు. స్నేహితులు గెలిస్తే తామే గెలిచినట్లుగా భావించి ఖర్చు చేస్తున్న వారున్నారు. వేర్వేరు పార్టీల్లో ఉంటున్న కుటుంబ సభ్యు లు, బంధువుల మధ్య రాజకీయ వైరం వ్యక్తిగతంగా ఉంటున్న నేపథ్యంలో.. కొందరు మాత్రం తమ స్నేహితుడైన సర్పంచ్ అభ్యర్థికే అధిక ప్రాధ్యానత ఇస్తున్నారు. స్నేహితుడిని గెలుపించుకునే లక్ష్యంతో అహర్నిశలు కష్టపడుతుండడం విశేషం. బోధన్ డివిజన్లోని మొదటి విడత పంచాయతీ పోరులోనే ఈ పరిస్థితి ఉంటే రాజకీయంగా మరింతగా ప్రభావి తం చేసే రెండో, మూడో విడతల్లో ఎన్నికలు జరుగనున్న నిజామాబాద్ రూరల్, బాల్కొండ, ఆర్మూర్ నియోజకవర్గాల్లో స్థానిక సమరం ఎలా ఉంటుందోననే చర్చ నడుస్తోంది.నిజామాబాద్అర్బన్: మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్న బోధన్ డివిజన్ పరిధిలో బందోబస్తు కోసం 1384 మంది పోలీసు సి బ్బందిని బందోబస్తు విధుల కోసం కేటాయించా రు. పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆధ్వర్యంలో అదనపు డీసీపీలు ఇద్దరు, ఏసీపీలు ఐదుగురు, స ర్కిల్ ఇన్స్పెక్టర్లు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు 17 మంది, సబ్ ఇన్స్పెక్టర్లు, ఆర్ఎస్ఐలు 71 మంది. ఏఎస్సై లు, ఏఆర్ ఎస్సైలు 74 మంది. హెడ్ కానిస్టేబుళ్లు 192 మంది, కానిస్టేబుళ్లు 789 మంది. హోంగార్డు లు 233 మందిని ఎన్నికల విధులకు కేటాయించా రు. పోలింగ్ కేంద్రాల వద్ద ఆంక్షలు విధించారు. ఐదుగురి కన్నా ఎక్కువ మంది గుమిగూడొ ద్దని పోలీస్ శాఖ ఆదేశించింది. సీపీ సాయిచైతన్య బుధవారం బోధన్లోని పలు ప్రాతంల్లో పర్యటించారు. ఎన్నికల సామగ్రి కేంద్రాలను పరిశీలించారు. 1384 మందితో బందోబస్తు మొదటి విడత పోలింగ్కు కొన్ని గంటలే.. తీరిక లేకుండా వ్యూహ ప్రతివ్యూహాల్లో సర్పంచ్ అభ్యర్థులు, బంధువులు, స్నేహితులు ఫలితాన్ని ప్రభావితం చేసే పరిస్థితి ఉండడంతో.. ప్రతి ఓటును వదులు కోకుండా ఫీట్లు జిల్లా కేంద్రంలో వివిధ గ్రామాల అభ్యర్థుల తరఫున దావత్ల సందడి -
మొక్కల పరిరక్షణకు కృషి చేయాలి
● బీఎస్ఐ డెక్కన్ రీజినల్ సెంటర్ అధిపతి, శాస్త్రవేత్త రాసింగం తెయూ(డిచ్పల్లి): జిల్లాలోని మొక్కల పరిరక్షణకు, వాటిని బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా (బీఎస్ఐ) ద్వారా సర్వే చేపట్టి మొక్కల ఉపయోగాల తోడ్పాటుకు కృషి చేస్తున్నట్లు బీఎస్ఐ డెక్కన్ రీజినల్ సెంటర్ అధిపతి శాస్త్రవేత్త ఎల్.రాసింగం తెలిపారు. తెలంగాణ యూనివర్సిటీ బోటనీ విభాగం ఆధ్వ ర్యంలో ‘హెర్బేరియం తయారీ – నేచర్ వాక్’పై బుధవారం కార్యశాల నిర్వహించారు. ఈ సందర్భంగా బీఎస్ఐ శాస్త్రవేత్త రాసింగం ప్రసంగిస్తూ.. బీఎస్ఐ ఆధ్వర్యంలో ఇటీవల సుమారు 40 కొత్త మొక్కల జాతులను కనుగొన్నామన్నారు. విద్యార్థులు పరిశోధనలు నిర్వహించి అంతరించిపోతున్న మొక్కల నమూనాలను సేకరించాలని పిలుపునిచ్చారు. స్వాతంత్య్రానంతరం ప్రసిద్ధ శాస్త్రవేత్త డా క్టర్ జానకీ అమ్మాళ్ ఆధ్వర్యంలో బీఎస్ఐ పునర్వ్యవస్థీకరణ జరిగిందన్నారు. ప్రస్తుతం బీఎస్ఐ దేశవ్యాప్తంగా 12 ప్రాంతీయ కేంద్రాలతో పనిచేస్తూ, 25 లక్షలకు పైగా మొక్కల నమూనాలను కలిగిన సెంట్రల్ నేషనల్ హెర్బేరియంను నిర్వహిస్తోంద న్నారు. బోటనీ హెచ్వోడీ అబ్దుల్ హలీమ్ ఖాన్, బీవోఎస్ చైర్మన్ ప్రొఫెసర్ అరుణ, ప్రొఫెసర్ విద్యా వర్ధిని, అధ్యాపకులు శ్రీనివాస్, జలందర్, క్యాంప స్ విద్యార్థులతోపాటు కళాశాలలకు చెందిన బోటనీ అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
లారీ బోల్తా
ఇందల్వాయి: లారీ టైరు పేలడంతో అదుపుతప్పి బోల్తా పడిన ఘటన ఇందల్వాయి మండల కేంద్రంలో బుధవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆలుగడ్డల లోడ్తో హర్యానా నుంచి హైదరాబాద్ వెళుతున్న లారీ 44 నెంబర్ జాతీయ రహదారిపై ఇందల్వాయి బస్టాండ్ వద్దకు రాగానే టైరు పంచర్ అయ్యింది. సర్వీస్ రోడ్డుపై లారీ బోల్తా పడటంతో డీజిల్ ట్యాంకులో మంటలు చెలరేగాయి. ప్రమాదంలో డ్రైవర్కు తీవ్ర గాయాలు కాగా, క్లీనర్కి స్వల్ప గాయాలైనట్లు తెలిపారు. గన్నారం అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పారు. క్షతగాత్రులను అంబులెన్సులో ఆస్పత్రికి తరలించారు. -
నేడు తొలి విడత పోరు
ఓటర్లు : 2,48,585పోలింగ్ కేంద్రాలు : 1440బోధన్: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా తొలి విడతలో బోధన్ రెవెన్యూ డివిజన్ లోని ఆయా మండలాలతోపాటు నిజామాబాద్ డివిజన్ పరిధిలోని నవీపేట మండలంలో సర్పంచ్, వార్డు స్థానాలకు గురువారం పోలింగ్ జరగనుంది. ఇందుకోసం అధికారయంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడికి ఽఅధికారులకు ఏర్పాట్లు చేశారు. పక్కాగా పోలింగ్ సామగ్రి పంపిణీ బోధన్, సాలూర, ఎడపల్లి, రెంజల్,రుద్రూర్, వర్ని ,కోటగిరి, పొతంగల్, మో స్రా, చందూర్ , నవీపేట మండల కేంద్రాల్లో పోలింగ్ సామగ్రి పంపి ణీని బుధవారం పక్కాగా చేపట్టారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు ఆర్వో, పీ వోలు, ఇతర సిబ్బందికి బ్యాలెట్బాక్స్లు, ఇతర మెటీరియల్, బ్యాలెట్ పేపర్లు అందజేశారు. ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. విధులు నిర్వర్తించే గ్రామాలకు సిబ్బంది వెళ్లేలా బస్సు సౌకర్యం కల్పించారు. సందర్శించిన కలెక్టర్, అధికారులు వర్ని, చందూర్, మోస్రా మండల కేంద్రాల్లో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, సాలూ ర, కోటగిరి మండల కేంద్రా ల్లో సబ్ కలెక్టర్ వికాస్ మహతో, ఎడపల్లిలో ఎన్నికల జిల్లా జనరల్ అబ్జర్వర్ శ్యాంప్రసాద్లాల్ పోలింగ్ సామగ్రి పంపిణీని పరిశీలించి పలు సూచనలు చేశారు. నిబంధనలు మేరకు సమర్ధవంతంగా విధులు నిర్వర్తించాలని అధికారులు సూచించారు. పోలింగ్కు సర్వం సిద్ధం ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఓటింగ్.. మధ్యాహ్నం 2గంటలకు కౌంటింగ్ ప్రారంభం మండల కేంద్రాల్లో పోలింగ్ సామగ్రి పంపిణీ పూర్తి గ్రామాలకు తరలిన ఎన్నికల సిబ్బంది -
మూడో విడత పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్
నిజామాబాద్ అర్బన్: గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా మూడో విడతలో ఎన్నికలు జరిగే మండలాల పోలింగ్ సిబ్బంది సెకండ్ ర్యాండమైజేషన్ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, జనరల్ అబ్జర్వర్ శ్యాంప్రసాద్ లాల్ సమక్షంలో బుధవారం నిర్వహించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఎన్ఐసీ హాల్లో ఎన్నికల సంఘం నిబంధనలను అనుసరిస్తూ ర్యాండమైజేషన్ చేశారు. ప్రక్రియను కలెక్టర్, అబ్జర్వర్ నిశితంగా పరిశీలించారు. ఏకగ్రీవమైన వాటిని మినహాయిస్తూ, ఎన్నికలు నిర్వహించాల్సిన గ్రామ పంచాయతీల్లో పోలింగ్ విధులు నిర్వర్తించే ప్రిసైడింగ్ అధికారులు, వోపీఓలను ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. ప్రక్రియలో నోడల్ అధికారి పవన్ కుమార్, జిల్లా పంచాయతీ కార్యాలయం ఏవో రాజబాబు పాల్గొన్నారు. -
భూమి తగాదాలతో ఒకరి దారుణ హత్య
● నిందితుల ఇంటి వద్ద బంధువుల ఆందోళన బీబీపేట: భూ తగాదాలతో ఒకరు హత్యకు గురైన ఘటన బీబీపేట గ్రామ పరిధిలోని రాంరెడ్డిపల్లిలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. బాధిత కుటుంబీకులు, ఎస్సై విజయ్ తెలిపిన వివరాల ప్రకారం.. రాంరెడ్డిపల్లికి చెందిన కోకట్ల సత్తయ్య (50), కాల్ల లచ్చయ్య, కాల్ల దేవయ్య వ్యవసాయ భూములు పక్కపక్కనే ఉంటాయి. కొంతకాలంగా భూ విషయమై తగాదాలు జరుగుతున్నాయి. మంగళవారం రాత్రి 11:30 గంటలకు కాలకృత్యాలు తీర్చుకునేందుకు సత్తయ్య ఇంటి నుంచి బయటికి రావడంతో నిందితులు బలమైన ఆయుధంతో దాడి చేశారు. దీంతో తీవ్రగాయాలపాలైన సత్తయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం కాల్ల లచ్చయ్య, కాల్ల దేవయ్య పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. బుధవారం గ్రామానికి చేరుకున్న మృతుడి బంధువులు నిందితుల ఇంటి ఎదుట ఆందోళనకు దిగారు. లచ్చయ్య, దేవయ్యలు సత్తయ్యను హత్య చేశారని, వారిని తమకు అప్పగించాలని బైఠాయించారు. బాధితులను పోలీసులు, కుల పెద్దలు సముదాయించారు. మృతుడి భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై విజయ్ తెలిపారు. -
పీహెచ్డీ నుంచి పంచాయతీకి..
ఖలీల్వాడి: ఉస్మానియా యూనివర్సిటీ నుంచి హిందీలో పీహెచ్డీ పట్టా పొందిన లాల్సింగ్ చందూర్ మండలం కారేగాం తండా సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇటీవలే పీహెచ్డీ పూర్తి చేసి న ఆయన.. రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ ఎన్నికల నగారా మోగించడంతో సర్పంచ్గా పోటీ చేసేందు కు ఆసక్తి కనబర్చారు. తన స్వగ్రామమైన కారేగాంలో సర్పంచ్ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. మొత్తం 11 మంది నామినేషన్లు దాఖలు చేసినప్పటికీ.. విద్యావంతుడికి అవకాశం కల్పిస్తే గ్రామాభివృద్ధికి కృషి చేస్తాడని భావించి మిగతా వారంతా తమ నామినేషన్లను విత్డ్రా చేసుకున్నారు. దీంతో డాక్టర్ రమావత్ లాల్సింగ్ సర్పంచ్ కావడం లాంఛనమైంది. ఏబీవీపీ, టీజీవీపీ, టీవీయూవీ వంటి విద్యార్థి సంఘాల్లో చురుగ్గా పనిచేసిన లాల్సింగ్ విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం పోరాడారు. అలాగే ప్రత్యేక తెలంగాణ కోసం వి ద్యార్థి సంఘాల తరఫున ఉద్యమించారు. ప్రస్తుతం టీవీయూవీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా పని చేస్తున్న ఆయన ప్రొఫెసర్ కోదండరామ్కు ప్రధాన అనుచరుడిగా ఉన్నారు. -
ఆటో బోల్తా పడి విద్యార్థి మృతి
● ఐదుగురికి గాయాలు నిజాంసాగర్: ఆటో బోల్తా పడిన ఘటనలో పదో తరగతి విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందగా, మరికొందరు గాయపడ్డారు. వివరాలిలా ఉన్నాయి. జుక్కల్ మండలం విఠల్వాడి తండా, సావర్గావ్ గ్రామ విద్యార్థులు ఖండెబల్లూర్ ఉన్నత పాఠశాలలో చదువుకుంటున్నారు. రోజులానే బుధవారం ఉదయం 15 మంది విద్యార్థులు ఆటోలో పాఠశాలకు బయలు దేరారు. సావర్గావ్ శివారులో ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో సావర్గావ్కు చెందిన పదో తరగతి విద్యార్థి కాంబ్లే ప్రణవ్ (17) అక్కడిక్కడే మృతి చెందాడు. మరో ఐదుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను బాన్సువాడ, నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించారు. డ్రైవర్ వినోద్ అతివేగంగా అజాగ్రత్తగా డ్రైవింగ్ చేయడం వల్లే ఆటో బోల్తాపడిందని స్థానికులు ఆరోపించారు. కేసు నమోదు చేసుకున్నామని జుక్కల్ ఎస్సై నవీన్ చంద్ర తెలిపారు. విషయం తెలుసుకున్న జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు డీఈవో రాజుతోపాటు వైద్యులు, పోలీసులతో ఫోన్ ద్వారా మాట్లాడారు. గాయపడినవారికి మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలన్నారు. మరణించిన విద్యార్థి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి, వారిని ఓదార్చారు. -
పోటాపోటీ.. రూ.కోటిపైనే ఖర్చు
రెంజల్(బోధన్): సర్పంచ్ ఎన్నికలను కొందరు అభ్యర్థులు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. నువ్వా నేనా అన్నట్లు తీవ్ర పోటీ ఉన్న గ్రామాల్లో అభ్యర్థులు ఖర్చుకు వెనుకాడటంలేదు. వ్యవసాయభూములు, ప్లాట్లు, బంగారం తాకట్టు పెట్టి మరీ ఎన్నికల్లో ఖర్చు చేస్తున్నారు. ఎలాగైన గెలిచి తీరాలనే కసితో పోటీ పడుతున్నారు. ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులతోపాటు వారి కుటుంబ సభ్యులకు కంటి మీద కునుకు కరువైంది. మొదటి విడత ఎన్నికలు జరుగనున్న బోధన్ డివిజన్లో ఇప్పటికే కుల సంఘాలను మచ్చిక చేసుకున్న అభ్యర్థులు వ్యక్తిగతంగా ఓటుకు రూ.వెయ్యి నుంచి రూ.2 వేల వరకు పంపిణీ చేస్తున్నట్లు సమాచారం. 1,500 నుంచి 2,000 వేల మంది ఓటర్లు ఉన్న గ్రామాల్లో ద్విముఖ, త్రిముఖ పోటీ ఉంది. ముగ్గురు పోటీ పడుతున్న మేజర్ గ్రామ పంచాయతీల్లో గ్రామాల్లో ఖర్చు రూ.కోటి దాటుతున్నట్లు సమాచారం. రెంజల్ మండలంలోని వీరన్నగుట్టలో త్రిముఖ పోటీ, సాటాపూర్లో ద్విము ఖ పోటీ ఉండగా.. కళ్యాపూర్, నీలా, కందకుర్తి, తాడ్బిలోలి గ్రామాల్లో త్రిముఖ పోటీ ఉంది. -
పశుగణన లెక్కలేవి..?
● ఏడాది క్రితం జిల్లాలో పూర్తయిన సర్వే ● ఇప్పటి వరకు వివరాలు వెల్లడించని కేంద్ర ప్రభుత్వం ● సమాచారం లేదంటున్న పశుసంవర్ధక శాఖ అధికారులు డొంకేశ్వర్(ఆర్మూర్): జిల్లాలో ఏడాది క్రితం చేపట్టిన 21వ అఖిల భారత పశు గణన వివరాలు ఇంకా బయటకు రాలేదు. సర్వే లెక్కలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో జిల్లాలో ఏ జాతి పశువులు ఎన్ని ఉన్నాయనే కొత్త సమాచారం పశుసంవర్ధక శాఖ వద్ద లేకుండా పోయింది. దీంతో అధికారులు పాత (2018–19 సర్వే) లెక్కలే చెప్పాల్సి వస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఐదేళ్లకోసారి దేశమంతటా పశుగణన నిర్వహిస్తోంది. 21వ సర్వేను 2024 నవంబర్లో ప్రారంభించగా 2025 ఏప్రిల్లో ముగిసింది. పశుసంవర్ధక శాఖ సిబ్బంది ఆరు నెలలు శ్రమించి ‘పశుధన్’ యాప్ ద్వారా మొత్తం 16 జంతు జాతుల వివరాలను సేకరించారు. 31 మండలాల్లోని 545 గ్రామ పంచాయతీలతోపాటు పట్టణాల్లో కూడా పశుగణన చేశారు. సుమారు 4లక్షల నివాస గృహాలకు వెళ్లారు. అయితే యాప్లో నమోదు చేసిన వివరాలన్నీ సెంట్రల్ సర్వర్లోకి వెళ్లిపోయాయి. సర్వే పూర్తయిన మూడు నెలల్లోనే వివరాలను విడుదల చేయాల్సి ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఆలస్యం చేస్తోంది. అంతకు ముందు (2018–19)లో జరిగిన పశుగణనలో కూడా కేంద్ర ప్రభుత్వం మూడేళ్ల తర్వాత (2022లో) లెక్కలను విడుదల చేసింది. ఇప్పుడు కూడా అంతే జరుగుతుందనే భావనలో పశుసంవర్ధక శాఖ ఉద్యోగులున్నారు. కేంద్రమే వెల్లడిస్తుంది ఏడాది క్రితం జిల్లాలో చేపట్టిన పశుగణన సర్వే వివరాలన్నీ కేంద్ర ప్రభుత్వం సర్వర్లోకి వెళ్లిపోయాయి. అయి తే దేశమంతటా ఒకేసారి మొత్తం 16 రకాల పశు జా తుల లెక్కలను విడుదల చేస్తుంది. అందుకు మరో నాలుగైదు నెలల సమయం పట్టొచ్చు. అప్పుడే జిల్లాలో ఏ పశువులు ఎన్ని ఉన్నాయనే లెక్కలు పక్కాగా చెప్పడానికి వీలుంటుంది. – రోహిత్రెడ్డి, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి -
విద్యాదానం గొప్పది
● విద్యార్థులకు తల్లిదండ్రులు, గురువే ముఖ్యం ● పద్మశ్రీ గరికపాటి నరసింహారావు బోధన్టౌన్(బోధన్): అన్నిదానాల కంటే విద్యాదానం గొప్పదని, విద్యార్థులు ప్రధానంగా తల్లిదండ్రులు, గురువులను దైవంతోపాటు పూజించాలని బ్రహ్మశ్రీ వేదమూర్తులు, పద్మశ్రీ గరికపాటి నరసింహారావు ఉద్బోధించారు. పట్టణంలోని ఆజాంగంజ్ విజయసాయి ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో విద్యాధనం, సర్వధనం, ప్రధానం అనే అంశాలపై బుధవారం ఏర్పాటు చేసిన ప్రవచన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. పిల్లల పట్ల తల్లిదండ్రులు ప్రత్యేకమైన పరిరక్షణతోపాటు బాధ్యతగా ఉండాలని, వారి దైనందిన కార్యక్రమాల్లో వెన్నంటి ఉండి భాగస్వాములు కావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పిల్లలను ఒంటరిగా ఉండన్విరాదని సూచించారు. తల్లిందడ్రులు చేసే ప్రతి పని వారిపై ప్రభావం పడుతుందని, పిల్లలు భవిష్యత్తులో వాటిని అనుసరించే అవకాశం ఉందని పేర్కొన్నారు. గురువులు విద్యార్థులకు మార్గదర్శకులుగా ఉండేలా బోధన సాగించాలని పేర్కొన్నారు. గరికపాటి ప్రవచనాలకు ముందుగా విద్యార్థుల భరతనాట్యం, కూచిపుడి నృత్యాలు అలరించాయి. కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం కృష్ణమోహన్, మేనేజర్ చక్రవర్తి, సీపీ సాయిచైతన్య, డీటీసీ ప్రమీల, అసిస్టెంట్ కలెక్టర్ శ్యాంప్రసాద్, ఏసీపీ శ్రీనివాస్, సీఐ వెంకట నారాయణ, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
చైన్ స్నాచింగ్ల కలకలం
నిజామాబాద్అర్బన్: జిల్లా కేంద్రంలో బుధవారం ఉదయం రెండు వేర్వేరు చోట్ల చైన్ స్నాచింగ్లు కలకలం రేపాయి. వినాయక్నగర్, కసాబ్గల్లీలో నంబర్ లేని పల్సర్ బైక్ పై వచ్చిన ఇద్దరు దుండగులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. అయితే, ఈ రెండుచోట్ల చోరీకి పాల్పడిన వ్యక్తులు ఒక్కరే అని పోలీసులు గుర్తించారు. ఉదయం 7:30 గంటల సమయంలో వినాయకనగర్లోని నాయుడి స్వరూప ఇంటి ఎదుట అలుకు వేస్తోంది. బైక్పై వచ్చిన ఇద్దరు దుండగుల్లో ఒకరు వచ్చి స్వరూపను తెలిసిన వారి అడ్రస్సు చెప్పాలని మాట్లాడుతూ మెడలోని తులంన్నర బంగారు చైన్ను లాక్కొని పారిపోయాడు. అనంతరం కసాబ్గల్లీలో ఇంటి ఎదుట ఉన్న లక్ష్మి అనే మహిళ మెడలోని రెండు తులాల బంగారు చైన్ను లాక్కెళ్లారు. ఆమె కేకలు వేసి పక్కింటి వారిని పిలిచే సరికి నిందితులు బైక్పై పరారయ్యారు. నాల్గో టౌన్ ఎస్హెచ్వో సతీశ్, రెండో టౌన్ ఎస్సై సయ్యద్ ముజాహిద్ ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. బాధితులు స్వరూప, లక్ష్మి ఫిర్యాదు మేరకు రెండు స్టేషన్లలో కేసులు నమోదు చేశారు. ● నగరంలో రెండు చోట్ల ఘటనలు ● ఇద్దరే చేసినట్లు పోలీసుల నిర్ధారణ -
వణికిస్తున్న చలి
నిజామాబాద్అర్బన్: జిల్లాలో చలి తీవ్రత పెరిగింది. గత వారం రోజులుగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చలిగాలులకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి వేళల్లో 8 గంటల వరకు ప్రజలు రోడ్లపై కనిపించడం లేదు. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. తేదీ ఉష్ణోగ్రత 9 12.1 8 12.6 7 14.8 6 15.2 5 17.5 4 17.4 -
మూడో విడత బరిలో 548
సుభాష్నగర్: గ్రామపంచాయతీ ఎన్నికల్లో మూడో విడతలో పోలింగ్ జరగనున్న సర్పంచ్, వార్డు స్థానాలకు నామినేషన్ల ఉపసంహరణ గడువు మంగళవారంతో ముగిసింది. 165 గ్రామ పంచాయతీలకుగాను 19 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 146 సర్పంచ్ స్థానాల్లో 548 మంది బరిలో ఉన్నారు. 1620 వార్డుస్థానాలకు గాను 490 స్థానాలు ఏకగ్రీవంగా కాగా.. 1130 స్థానాల్లో 3042 మంది బరిలో నిలిచారు. మూడో విడత పోలింగ్ ఈనెల 17న జరగనుంది. అభ్యర్థులకు అధికారులు గుర్తులు కేటాయించగా ప్రచార పర్వం మొదలైంది. మండలాల వారీగా బరిలో నిలిచిన సర్పంచ్ అభ్యర్థులు ఏకగ్రీవ గ్రామాలు 19.. పూర్తయిన నామినేషన్ల ఉపసంహరణ బరిలో నిలిచిన అభ్యర్థులకు గుర్తులు కేటాయింపు గ్రామాల్లో మొదలైన ప్రచార పర్వం -
మొదటి విడతకు పకడ్బందీ ఏర్పాట్లు
● బందోబస్తు మధ్య కేంద్రాలకు పోలింగ్ సామగ్రి చేరవేస్తాం ● జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి నిజామాబాద్అర్బన్: జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల మొదటి విడత పోలింగ్కు పకడ్బందీ ఏ ర్పాట్లు చేశామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వి నయ్ కృష్ణారెడ్డి తెలిపారు. రాష్ట్ర ఎన్నికల సంఘం క మిషనర్ రాణి కుముదిని పోలింగ్, కౌంటింగ్ ఏర్పాట్లపై జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంగళవారం మాట్లాడారు. పోలింగ్ నిర్వహణ, ఓటరు స్లిప్పుల పంపిణీ, డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల ఏర్పాటు, పోస్టల్ బ్యాలెట్, వెబ్ క్యాస్టింగ్ ఏర్పాట్లు, పోలీసు బందోబస్తు, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు, నిఘాబృందాల పనితీరు ప ర్యవేక్షణ తదితర అంశాలపై కమిషనర్ సూచనలు చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ..తొలి విడతలో జిల్లా లోని బోధన్, చందూర్, కోటగిరి, మోస్రా, పోతంగల్, రెంజల్, రుద్రూర్, సాలూర, వర్ని, ఎడపల్లి, నవీపేట మండలాల్లో ఈ నెల 11న పోలింగ్ నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు. పోలింగ్కు అవసరమైన సామగ్రిని డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలకు పంపించామని, బుధవారం ఉదయం నిర్దేశిత పోలింగ్ కేంద్రాలకు బందోబస్తు మధ్య చేరుకునేలా కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేశామ న్నారు. 31 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద గట్టి భద్రత ఏర్పాటు, వెబ్ క్యాస్టింగ్ చేయిస్తున్నా మని వివరించారు. వీసీలో సీపీ సాయిచైతన్య, ఎలక్షన్ అబ్జర్వర్ శ్యాంప్రసాద్లాల్, అదనపు కలెక్టర్ అంకిత్, జెడ్పీ సీఈవో సాయాగౌడ్, డీపీవో శ్రీనివాస్రావు, నోడల్ అధికారులు పాల్గొన్నారు. -
నిజామాబాద్
● జక్రాన్పల్లి ఎయిర్పోర్టు ఆశలపై నీళ్లు ● మూడడుగులు ముందుకు.. పది అడుగులు వెనక్కి చందంగా వ్యవహారం నిబంధనలు పాటించాలి జీపీ ఎలక్షన్స్లో ఎన్నికల కమిషన్ నిబంధనలను పోలింగ్ సిబ్బంది పాటించాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. బుధవారం శ్రీ 10 శ్రీ డిసెంబర్ శ్రీ 2025– 9లో uగ్రీన్ సిగ్నల్ ఇచ్చి కొర్రీలు!సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: జిల్లా ప్రజలు 20 ఏళ్లుగా ఎదరుచూస్తున్న జక్రాన్పల్లి విమానాశ్ర యం ఏర్పాటులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా (గత సోమవారం) పార్లమెంట్లో కేంద్రప్రభుత్వం చేసిన ప్రకటన జిల్లా వాసుల ఆశలపై నీళ్లు చల్లినట్లైంది. గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు నిర్మాణానికి గ్రీన్సిగ్నల్ ఇచ్చి, నాలుగేళ్లు గడిచాక రక్షణ శాఖ నుంచి నిరభ్యంతర పత్రం కావాలని చెప్పడంతో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. జక్రాన్పల్లి వద్ద విమానా శ్రయం నిర్మించేందుకు అన్నిరకాలుగా అనుకూలంగా ఉందని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో ప్రతిపాదనలు చేశారు. 2021 ఆగస్టులో గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయానికి కేంద్ర ప్రభు త్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. అదేవిధంగా ఎయిర్పోర్ట్స్ అథారిటీస్ ఆఫ్ ఇండియా(ఏఏఐ) సైతం ని వేదిక ఇచ్చింది. ‘టెక్నో ఎకనామిక్ ఫిజిబిలిటీ’ నివేదికను కేంద్ర పౌర విమానయాన శాఖకు, తెలంగాణ ప్రభుత్వానికి ఏఏఐ 2021లోనే అందజేసింది. ఎయిర్పోర్ట్ విషయమై సర్వే ప్రక్రియ సైతం పూర్తి చేశారు. జక్రాన్పల్లి మండలం తొర్లికొండ, కొలిప్యా క్, అర్గుల్, మనోహరాబాద్, జక్రాన్పల్లి రెవెన్యూ గ్రామాల పరిధిలోని 1,663.05 ఎకరాల్లో ఎయిర్పోర్టు నిర్మాణం చేపట్టేలా సర్వే చేశారు. సదరు భూమిలో 816.4 ఎకరాలు మాత్రమే ఉపయోగించబడుతుందని, ఈ 1,663.05 ఎకరాలకు చుట్టూ మరో 68 ఎకరాలు భూమి అవసరం ఉంటుందని నివేదికలో పేర్కొన్నారు. 2021లో ఇచ్చిన నివేదికలో మొదటి దశ విమానాశ్రయం నిర్మాణం కోసం రూ.321 కోట్లు అంచనా వ్యయంగా నివేదికలో పేర్కొన్నారు. ఈ ఎయిర్పోర్ట్ నిర్మిస్తే 2024–25 సంవత్సరానికి గాను ఏటా 0.105 మిలియన్ల మంది ప్రయాణికులు, 2054–55 సంవత్సరం నాటికి ఏటా 0.624 మిలియన్ల ప్రయాణికులు సేవలు పొందుతారనే అంచనాలను నివేదికలో వివరించారు. ఐదు గ్రామాల పరిధిలోని 700 మంది పట్టాదారులకు చెందిన 802.37 ఎకరాలు, మరో 913 అసైన్డ్ పట్టాదారులకు సంబంధించిన 860.08 ఎకరాలతో కలిపి 1,613 మంది పట్టాదారులు, అసైన్డ్ పట్టాదారులకు సంబంధించిన మొత్తం 1,663.05 ఎకరాల్లో సర్వే చేశారు. అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా.. రాష్ట్రంలో మొత్తం ఆరు చోట్ల విమానాశ్రయాలకు ప్రతిపాదనలు ఉండగా 2021లో ఏఏఐ ఇచ్చిన నివేదికలో మూడింటికి మాత్రమే అనుమతి లభించింది. వరంగల్ జిల్లా మామునూరు, ఆదిలాబాద్, పెద్దపల్లి జిల్లా బసంత్నగర్లలో బ్రౌన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్లు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మహబూబ్నగర్, నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లిలో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టులు నిర్మించేందుకు ప్రతిపాదనలు ఉన్నాయి. అయితే వీటిలో మామునూరు, ఆదిలాబాద్ బ్రౌన్ఫీల్డ్ విమానాశ్రయాలు, గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాల్లో జక్రాన్పల్లికి గ్రీన్సిగ్నల్ లభించింది. 2021 జూలై 23న అప్పటి నల్లగొండ ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డి పార్లమెంట్లో అడిగిన ప్రశ్నకు అప్పటి పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్యసింథియా బదులిస్తూ తెలంగాణలో విమానాశ్రయాల ఏర్పాటు ప్రక్రియ నడుస్తోందన్నారు. అయితే ఇప్పుడు మాత్రం పార్లమెంటులో మరోరకంగా ప్రకటించడం పట్ల విమర్శలు వస్తున్నాయి. నాలుగేళ్ల క్రితం తిరస్కరించిన పెద్దపల్లి (బసంత్నగర్) విమానాశ్రయానికి తాజాగా అనుకూలంగా ఉన్నట్లు ప్రకటించడం గమనార్హం. సర్వే నిర్వహించిన గ్రామాలు, భూముల వివరాలు.. మోసపోతూనే ఉంటాం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కు మ్మక్కై జిల్లా ప్రజలను మో సం చేస్తున్నాయి. మోచేతికి బెల్లం.. చందంగా 20 ఏళ్లుగా ఆశ చూపి ఊరిస్తూ, ఊరిస్తూ చివరకు మోసం చేశాయి. నాగ్పూర్తో పోలిస్తే నిజామాబాద్ చాలా లోపలికి ఉంటుంది. అయినప్పటికీ రక్షణ శాఖ నుంచి నిరభ్యంతర పత్రం ఎందుకో అర్థం కావడం లేదు. డిఫెన్స్ స్ట్రాటజీ అనే అడ్డంకిని కావాలనే సృష్టిస్తున్నారు. జిల్లా ప్రజల్లో చైతన్యం రాకపోతే అన్ని పార్టీల నాయకులు నిండా ముంచుతారు. విమానాశ్రయం విషయంలో ఇలా మోసం చేయడం దారుణం. గతంలో ఆయిల్ డిపో పోగొట్టారు. నిజాం షుగర్స్ తెరిపిస్తామని మోసం చేశారు. పామాయిల్ ఫ్యాక్టరీ అని చెబుతున్నారు. చివరకు టాల్కం పౌడర్ ఫ్యాక్టరీ కూడా పెట్టరు. నా యకులు ప్రజల ప్రయోజనార్థం దీర్ఘకాలిక ప్రణాళిక అనేదే లేకుండా వ్యవహరిస్తున్నారు. జిల్లా ప్ర జల్లో చైతన్యం రానంతవరకు ఇలా మోసపోవాల్సిందే. – నల్ల దినేశ్రెడ్డి, చాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షుడు -
కలెక్టరేట్లో తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ
నిజామాబాద్అర్బన్: సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్)లో తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొని తెలంగాణ గీతాన్ని ఆలపించారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆర్ అండ్ బీ ఎస్ఈ కె సర్దార్సింగ్ ఆవిష్కరించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా ఆకట్టుకునే రీతిలో, స్ఫూర్తిదాయకంగా ఉన్న తెలంగాణ తల్లి విగ్రహం అందరినీ ఆకర్షించింది. కలెక్టరేట్ ఏవో ప్రశాంత్, జిల్లా అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. ఆదర్శ మహిళ సోనియా నిజామాబాద్ రూరల్: దేశానికి ఆదర్శ మహి ళ సోనియా గాంధీ అని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కాటిపల్లి నగేశ్రెడ్డి అన్నారు. జి ల్లాకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మంగళవా రం ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోని యా గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వ హించారు. సోనియా చిత్రపటానికి క్షీరాభి షేకం చేశారు. నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేశారు. నగేశ్రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పాటులో సోనియా పాత్ర కీలకమని పేర్కొన్నారు. పార్టీ నగర అధ్యక్షుడు బొబ్బి లి రామకృష్ణ, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్బిన్ హందాన్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి రాంగోపాల్, నుడా చైర్మన్ కేశవేణు, ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, పీసీసీ డెలిగేట్ శేఖర్గౌడ్,నరాల రత్నకర్, ఎన్ఎస్యూఐ యూ త్ కాంగ్రెస్ అధ్యక్షుడు విపుల్గౌడ్, నాయకు లు వైశాక్షి సంతోష్, చంద్రకళ, రేవతి, పోల ఉష, సుజాత తదితరులు పాల్గొన్నారు. జాతీయస్థాయి శిక్షణలో ఉమ్మడి జిల్లా ఉపాధ్యాయులు ఖలీల్వాడి: దేశంలోని ఆయా ప్రాంతాల సంస్కృతులపై అవగాహన కల్పించేందుకు సెంటర్ ఫర్ కల్చరల్ రిసోర్స్ ట్రైనింగ్ రీజినల్ సెంటర్ ఆధ్వర్యంలో రాజస్థాన్లోని ఉ దయ్పూర్లో నిర్వహిస్తున్న శిక్షణలో ఉమ్మడి జిల్లాకు చెందిన ఇద్దరు ఉపాధ్యాయులు పా ల్గొంటున్నారు. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం అన్సాన్పల్లి జెడ్పీహెచ్ఎస్ హిందీ ఉపాధ్యాయుడు ప్రకాశ్ విస్లావత్, కామారెడ్డి జిల్లా బాణాపూర్ జెడ్పీహెచ్ఎస్ తెలుగు ఉపాధ్యాయుడు రవికుమార్ గ త నెల 26 నుంచి ఈనెల 16వరకు కొనసా గుతున్న శిక్షణలో రాష్ట్రానికి చెందిన మరో ఆరుగురు టీచర్లతో కలిసి పాల్గొంటున్నారు. 14న జాబ్మేళా ఖలీల్వాడి: ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థుల కోసం ఈనెల 14వ తేదీన హెచ్సీఎల్ టెక్ బీ ఉద్యోగ మేళా నిర్వహిస్తోందని డీఈఐవో ర వికుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2024–25లో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, ఏంఈసీ, సీఈసీతోపాటు ఒకేషన ల్ కంప్యూటర్ ఉత్తీర్ణత సాధించిన విద్యార్థు లు అర్హులని పేర్కొన్నారు. ఆదివారం ఉ ద యం 10గంటలకు జాబ్ మేళా ప్రారంభమవుతుందని, సాఫ్ట్వేర్ రంగాన్ని ఎంచుకు నే విద్యార్థులకు ఉపయోగపడుతుందని తెలి పారు. ఇంటర్లో 75శాతం మార్కులు, మ్యాథ్స్లో 60శాతం మార్కులు సాధించిన వారు అర్హులని, నగరంలోని వెంకటేశ్వర కంప్యూటర్ ఇన్స్టిట్యూట్లో నిర్వహించనున్న జాబ్ మేళాకు విద్యార్థులు హాజరుకావాలని సూచించారు. వివరాలకు 80740 65803 నంబర్ను సంప్రదించాలని పేర్కొన్నారు. ర్యాండమైజేషన్ పూర్తినిజామాబాద్అర్బన్: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మొదటి విడత పోలింగ్ జరిగే మండలాల పోలింగ్ సిబ్బంది తుది ర్యాండమైజేషన్ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి, జనరల్ అబ్జర్వర్ శ్యాంప్రసాద్లాల్ సమక్షంలో మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో నిర్వహించారు. సర్పంచ్, వార్డు స్థానాలకు ఎన్నికల పోలింగ్ విధులు నిర్వర్తించే ప్రిసైడింగ్ అధికారులు, వోపీవోలను ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. -
కేసీఆర్ దీక్షల ఫలితమే ప్రత్యేక తెలంగాణ
● కాంగ్రెస్, బీజేపీల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకుంటాం ● బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్రెడ్డి ● జిల్లాకేంద్రంలో ఘనంగా విజయ్ దివస్ నిజామాబాద్అర్బన్: మాజీ సీఎం కేసీఆర్ దీక్షల ఫ లితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, ఉద్యమంలో ఆయన సంతకం చెరగనిదని బీఆర్ ఎస్ జి ల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మంగళ వారం విజయ్ దివస్ను నిర్వహించారు. ఈ సందర్భంగా జీవన్రెడ్డి మాట్లాడుతూ.. నాడు కేసీఆర్ చే సిన దీక్షల ఫలితంగానే ఢిల్లీ పీఠాలు కదిలి డిసెంబ ర్ 9న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుపై చిదంబరం ప్రకటన చేశారన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రతి ఏటా నవంబర్ 29న దీక్ష దివస్, డిసెంబర్ 9న విజయ్ దివస్ నిర్వహిస్తున్నామన్నారు. తెలంగాణకు ప్రధాన విలన్ కాంగ్రెస్ అని విమర్శించారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును విఫల ప్రయోగంగా చిత్రీకరించేందుకు కాంగ్రెస్, బీజేపీలు కుట్రలు చేస్తున్నాయని, వారి నుంచి రాష్ట్రాన్ని కాపాడుకుంటామన్నారు. రా ష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నది తెలంగాణ రైసింగ్ గ్లో బల్ సమ్మిట్ కాదని తెలంగాణ క్లోజింగ్ కాంగ్రెస్ గోబెల్స్ సమ్మిట్ అని ఎద్దేవా చేశారు. ఫ్యూచర్ సిటీ వెనుక మోదీ, చంద్రబాబు ఉన్నారని ఆరోపించా రు. అంతకుముందు బీఆర్ఎస్ శ్రేణులు పూలంగ్ చౌరస్తాలోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. పార్టీ కార్యాల యంలోని తెలంగాణ తల్లి విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. జీజీహెచ్లో రోగులకు పండ్లు పంపిణీ చే శారు. మాజీ ఎమ్మెల్యే గణేశ్గుప్తా, మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్, జెడ్పీ మాజీ చైర్మన్ విఠల్రావు తదితరులు పాల్గొన్నారు. -
కోతుల బెడద లేకుండా చేస్తా
ఐదు గ్యారంటీలతో బరిలోకి..సిరికొండ(నిజామాబాద్ రూరల్): తనను సర్పంచ్గా గెలిపిస్తే గ్రామంలో కోతుల బెడద లేకుండా చేస్తానని సిరికొండ మండల కేంద్రం సర్పంచ్ అభ్యర్థి గంగాధర్ హామీ ఇచ్చారు. ఈ మేరకు కోతులు పట్టేవారితో బాండ్పై మంగళవారం ఒప్పందం చేసుకోవడం గమనార్హం. కోతుల బె డద నివారణకు ఏడాదికి రూ.4 లక్షల వరకు ఖర్చు చేస్తానని గంగాధర్ పేర్కొన్నారు. సిరికొండ: సర్పంచ్గా తనను గెలిపిస్తే ‘ఐదు గ్యారంటీలు’ అమలు చేస్తానంటున్నాడు మండలంలోని ముషీర్నగర్ గ్రామ అభ్యర్థి బట్టు భీమానాయక్. కాంగ్రెస్ మద్దతుతో ఎన్నికల బరిలో నిలిచిన ఆయన ‘భీమన్న పెండ్లి కానుక, ప్రసూతి కానుక, దసరా కానుక, నిరుపేద కుటుంబాలకు ఆర్థిక సాయం, విద్యార్థుల భవిష్యత్తు’ అంటూ ఐదు గ్యారంటీలను అమలు చేస్తానని హామీ ఇస్తున్నాడు. కరపత్రాలను రూపొందించి ప్రచారం చేస్తున్నాడు. -
పెరిగిన పల్లె ఓటర్ల సంఖ్య
మోర్తాడ్(బాల్కొండ): కొత్తవారి చేరికతో పల్లెల్లో ఓటర్ల సంఖ్య గతంలో కన్నా భారీగా పెరిగింది. యువతకు ఓటింగ్ అవకాశం లభించడంతో సర్పంచ్, వార్డు అభ్యర్థుల గెలుపోటములను వారు ప్రభావితం చేస్తారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 2019 జనవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించగా.. అప్పట్లో జిల్లాలో గ్రామ పంచాయతీల సంఖ్య 530 ఉండగా ఓటర్లు 6,69,834 మంది ఉన్నారు. జీపీల పునర్విభజన తర్వాత జీపీల సంఖ్య 545కు చేరింది. అలాగే కొత్తవారు ఓటు హక్కు కోసం నమోదు చేసుకోవడంతో ఓటర్ల సంఖ్య 8,51,417 నమోదైంది. గతంలో కన్నా 1,81,583 మంది ఓటర్లు పెరిగారు. జిల్లాలో వార్డుల సంఖ్య గతంలో 4,932 ఉండగా, ఇప్పుడు 5,022గా నమోదైంది. ఓటర్ల సంఖ్య అన్ని గ్రామాల్లో పెరగడంతో వార్డుల బదలాయింపు జోరుగా సాగింది. గతంలో పెద్ద పంచాయతీల్లో ఒక్కో వార్డుకు 300 మంది ఓటర్లు ఉంటే ప్రస్తుతం 400కు మించిపోయింది. చిన్న పంచాయతీల్లో ఒక్కో వార్డులో 100 నుంచి 150 మంది ఓటర్లు ఉండగా.. ప్రస్తుతం ఆ సంఖ్య 200కు వరకు చేరింది. -
పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలి
● సమస్యాత్మక, అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించండి ● పోలీస్ అధికారులతో సీపీ సాయిచైతన్యబోధన్రూరల్: పోలింగ్ కేంద్రాల వద్ద పకడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేయాలని, సమస్యాత్మక, అతిసమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించాలని సీపీ సాయిచైతన్య ఆదేశించారు. ఓటర్లు శాంతియుత వాతవరణంలో తమ ఓటు హక్కు వినియోగించుకునేలా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలన్నారు. మొదటి విడత గ్రామపంచాయతీల ఎన్నికలు బోధన్ డివిజన్ పరిధిలో జరగనున్న నేపథ్యంలో మంగళవారం పట్టణంలోని రూరల్ సర్కిల్ కార్యాలయంలో డివిజన్ పోలీస్ అధికారులతో సీపీ సమీ క్ష నిర్వహించారు. ప్రతి పోలింగ్ కేంద్రానికి నిర్దిష్ట దూరంలో మార్కింగ్ చేయించి , ప్రచారం, గుర్తులను ప్రదర్శించడాన్ని నివారించాలన్నారు. అవసరాన్ని బట్టి స్ట్రైకింగ్ ఫోర్స్ సేవలను వినియోగించుకొని గుంపులను చెదర గొట్టాలన్నారు. విధులను నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఏసీపీ శ్రీనివాస్, బోధన్ రూరల్, టౌన్ సీఐలు విజయ్బాబు, వెంకట్నారాయణ, నిజామాబాద్ నార్త్ సీఐ శ్రీనివాస్, రుద్రూర్ సీఐ కృష్ణ, ఎస్సైలు పాల్గొన్నారు. -
భక్తిశ్రద్ధలతో సంతమల్లన్నకు నైవేద్యాలు
వేల్పూర్: మండలంలోని అంక్సాపూర్ సంతమల్లన్న జాతరలో భక్తులు మంగళవారం భక్తిశ్రద్ధలతో నైవేద్యాలు సమర్పించారు. జాతర నిర్వహించిన మరుసటి రోజు నైవేద్యాలు సమర్పించి సంతమల్లన్నపై తమకున్న భక్తిని చాటుకుంటారు. ఇంటిల్లిపాది, బంధువులతో సహా సంతమల్లన్న ఆలయానికి వచ్చి నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఎస్సై సంజీవ్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. డీసీసీబీ చైర్మన్ కుంట రమేశ్రెడ్డి స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆయన వెంట అంక్సాపూర్ వీడీసీ సభ్యులు ఉన్నారు. -
తెలంగాణను మళ్లీ ఆంధ్రోళ్ల చేతిలో పెట్టే కుట్ర
● కేసీఆర్ పాలనలో అభివృద్ధి చెందితే రేవంత్ పాలనలో దోపిడీ నడుస్తోంది ● విజయ్ దివస్ కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిసాక్షి ప్రతినిధి, నిజామాబాద్: కేసీఆర్ దీక్ష ఫలితంగా సాధించిన తెలంగాణను మళ్లీ ఆంధ్రోళ్ల చేతిలో పెట్టే కుట్ర జరుగుతోందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. విజయ్ దివస్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం భీంగల్ పట్టణంలోని అంబేడ్కర్ విగ్రహానికి బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ప్రశాంత్రెడ్డి పూలమాలలు వేశారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యమ రథసారథి కేసీఆర్ దీక్ష ఫలితంగా వచ్చిన డిసెంబర్ 9 ప్రకటన తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిందన్నారు. తెలంగాణలో గుక్కెడు తాగునీరు, రైతులకు సాగు నీళ్లు లేక గోస పడుతున్న ఆనాటి పరిస్థితుల్లో ఉద్యోగాలు లేక నిరుద్యోగులు అడవిబాట పడుతున్న వేళ, దుర్భిక్ష పరిస్థితులను చూసి కలత చెందిన కేసీఆర్ మా తెలంగాణ మాకివ్వాలని కోట్లాడారన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట తప్పితే కేసీఆర్ చావు నోట్ల తలకాయ పెట్టి దీక్ష చేస్తే దిగొచ్చిన యూపీఏ సర్కార్ 2014లో తప్పనిసరి పరిస్థితుల్లో ప్రత్యేక రాష్ట్ర ప్రకటన చేసిందన్నారు. అంతేకానీ తెలంగాణను కాంగ్రెస్ ఇవ్వలేదన్నారు. ఈనకాచి నక్కల పాలు చేసినట్లు, కేసీఆర్ కడుపులో పెట్టుకుని సాదుకున్న తెలంగాణ నేడు దోపిడీ దొంగల పాలైందన్నారు. కేసీఆర్ పాలనలో జీఎస్డీపీలో 4వ స్థానంలో ఉన్న తెలంగాణ నేడు 12వ స్థానానికి దిగజారిపోయిందన్నారు. జీఎస్టీ వసూళ్లలో 1వ స్థానం నుంచి 28 వ స్థానానికి, తలసరి ఆదాయంలో 1వ స్థానం నుంచి 4వ స్థానానికి పడిపోయిందన్నారు. సగం మంది రైతులకు మాత్రమే రుణమాఫీ చేశారన్నారు. ఆడబిడ్డలకు రూ.2,500, ఆడబిడ్డ పెళ్లికి తులం బంగారం లేదన్నారు. ఆసరా పెన్షన్ రూ.4,000 ఇవ్వడంలేదన్నారు. కేసీఆర్ బ్రహ్మాండంగా మార్చిన తెలంగాణను మళ్లీ ఆంధ్రోళ్ల చేతుల్లో పెట్టే కుట్ర చేస్తున్నారన్నారు. ఇలాంటి కుట్రలను ప్రజలు గమనించి కాంగ్రెస్ పాలనకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. -
ఆదిలాబాద్ జిల్లా యువజన కాంగ్రెస్ ఇన్చార్జిగా విక్కీ యాదవ్
నిజామాబాద్ రూరల్: జిల్లా కేంద్రానికి చెందిన యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విక్కీ యాదవ్ను ఆదిలాబాద్ జిల్లా యువజన కాంగ్రెస్ ఇన్చార్జిగా రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివచరణ్రెడ్డి మంగళవారం నియామకం చేశారు. తన నియామకానికి కృషి చేసిన జాతీయ కార్యదర్శి, రాష్ట్ర ఇన్చార్జి ఖలీద్, రాష్ట్ర అధ్యక్షులకు విక్కీయాదవ్ కృతజ్ఞతలు తెలిపారు. నిజామాబాద్అర్బన్: జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించే ప్రాంతాల్లో మద్యం షాపుల బంద్ కొనసాగుతుందని ఎకై ్సజ్ శాఖ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. మొదటి విడత ఎన్నికలు నిర్వహించే బోధన్ డివిజన్లో ఈ నెల 11న సాయంత్రం వరకు మద్యం షాపులు బంద్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. రెండో విడత ఎన్నికలు నిర్వహించే నిజామాబాద్ డివిజన్లో ఈనెల 12న సాయంత్రం నుంచి 14వ తేదీ వరకు మద్యం షాపులు బంద్ ఉండనున్నట్లు తెలిపారు. మూడో విడత ఎన్నికలు నిర్వహించే ఆర్మూర్ డివిజన్లో ఈ నెల 15న సాయంత్రం నుంచి ఈ నెల 17 వరకు మద్యం షాపుల బంద్ ఉండనున్నట్లు పేర్కొన్నారు. కల్లు దుకాణాలు, బార్లు సైతం బంద్ పాటించాలన్నారు. -
పోలీసులకు బాలిక అప్పగింత
మాక్లూర్: ఎవరూ తోడు లేక అటూ ఇటూ తిరుగుతూ బస్టాండ్లో నిద్రిస్తున్న బాలికను ఆలూర్ మండలం కల్లెడి గ్రామస్తులు గుర్తించి చేరదీశారు. మూడు రోజులుగా బాలిక సంబంధీకులు ఎవరూ రాకపోవడంతో పోలీసులకు మంగళవారం అప్పగించగా వారు అనాథ బాలికల హోమ్కు తరలించారు. కల్లెడి గ్రామస్తుడు గంగోళ్ల ప్రళయ్తేజ్ తెలిపిన వివరాల ప్రకారం.. మూడు రోజుల నుంచి ఐదేళ్ల బాలిక గ్రామంలో ఒంటరిగానే తిరుగుతూ రాత్రికాగానే బస్టాండ్లో నిద్రిస్తుందని తెలిపారు. తాము గమనించి భోజనం, కప్పుకోడానికి దుప్పటి అందించి మూడు రోజులుగా ఇంటి వద్ద ఉంచుకున్నట్లు తెలిపారు. మంగళవారం నాటికి కూడా బాలిక సంబంధీకులు ఎవరూ రాకపోవటంతో పోలీసులకు అప్పగించగా వారు బాలికను అనాథ పిల్లల హోమ్కు తరలించినట్లు ప్రళయ్తేజ్ తెలిపారు. బాలిక వచ్చిరాని మాటలతో స్పష్టంగా మాట్లాడటం లేదన్నారు. ప్రళయ్తేజ్, గంగూలీ, నవీన్, గ్రామస్తులు ఉన్నారు. -
ఎన్నికల్లో స్టేజ్–2 ఆర్వోల విధులు కీలకం
బోధన్: గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో స్టేజ్–2 రిటర్నింగ్ అధికారుల విధులు చాలా కీలకం. ఈ ఎన్నికల ప్రక్రియలో కీలకమైన పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు నుంచి ఓటింగ్, కౌంటింగ్, ఫలితాల వెల్లడి, ఉపసర్పంచ్ ఎన్నిక వరకు నిబంధనల మేరకు ఆర్వోలు చాలా ముఖ్యమైన విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ప్రతి గ్రామ పంచాయతీల్లో పోలింగ్ నిర్వహణకు స్టేజ్–2 ఆర్వోను నియమించారు. పోలింగ్ ప్రక్రియ ప్రారంభానికి ముందు పోలింగ్ కేంద్రాల తనిఖీ, సిబ్బందికి శిక్షణ ఇవ్వాలి. అభ్యర్థుల రోజువారీ ఖర్చుల వివరాల తనిఖీ, నిబంధనలు ఉల్లంఘించిన వారికి నోటీసులు జారీ చేయడం, ఓటరు స్లిప్ల పంపిణీ, పోలింగ్ సామగ్రి స్వీకరించి పీవోలకు అందించాలి. పోలింగ్ సరళిని పర్యవేక్షణతో పాటు పై అధికారులకు ఎప్పటికప్పుడు నివేదికలు ఇవ్వాలి. ఓట్ల లెక్కింపు, కౌంటింగ్, ఫలితాల ప్రకటన ఆర్వోల పర్యవేక్షణలో కొనసాగుతుంది. ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులకు ఎన్నికల ధ్రువీకరణ పత్రం ఆర్వోలే అందించాలి. -
గడ్డపార గ్యాంగ్ అరెస్ట్
● 11 తులాల బంగారం, బైక్ స్వాధీనం ● వివరాలు వెల్లడించిన ఎస్పీ రాజేశ్ చంద్రకామారెడ్డి క్రైం: తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేస్తూ చోరీలకు పాల్పడుతున్న గడ్డపార గ్యాంగ్ను పోలీసులు పట్టుకున్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావవేశంలో ఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తాడ్వాయి మండలం చిట్యాల గ్రామానికి చెందిన మాసుల శ్రీనివాస్ అనే వ్యక్తికి చెందిన తాళం వేసిన ఇంట్లో ఈనెల 1 న రాత్రి చోరీ జరిగింది. గడ్డపారతో ఇంటి తాళం, బీరువాలను పగులగొట్టి చోరీ చేశారు. ఇదే తరహాలో జిల్లాలో తరచుగా కేసులు నమోదవుతుండడంతో పోలీసులు ఈ కేసును సవాల్గా తీసుకున్నారు. ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో 3 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మంగళవారం తాడ్వాయి సమీపంలో వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులకు అనుమానాస్పదంగా ఐదుగురు వ్యక్తులు కనిపించారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా దొంగతనాల విషయం బయటపడింది. నిందితులను గాంధారి మండలం గుర్జాల్ తండాకు చెందిన బస్సీ జోద్రాజ్, అంకుష్ ప్రేమ్సింగ్ సాబలే, చెన్నాపూర్ తండాకు చెందిన బామన్ మహేందర్, నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం కాల్పోల్ తండాకు చెందిన బి.హీరాలాల్, నునావత్ గణేష్లుగా గుర్తించామని ఎస్పీ తెలిపారు. వారి వద్ద నుంచి 11 తులాల బంగారు, 22 తులాల వెండి ఆభరణాలు, రూ.8,500 నగదు, ఒక బైక్, 5 సెల్ఫోన్లు, చోరీలకు ఉపయోగించిన గడ్డపారలను స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులను రిమాండ్కు తరలించామన్నారు. కేసు ఛేదనలో చాకచక్యంగా వ్యవహరించిన సదాశివనగర్ సీఐ సంతోష్ కుమార్, ఎస్సైలు నరేష్, ఆంజనేయులు, సిబ్బంది సాయిబాబా, రవి, సంజీవ్, వసంత్ రావులను ఎస్పీ అభినందించారు. వారికి రివార్డులను అందజేశారు. సమావేశంలో అదనపు ఎస్పీ నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.పోలీసులు పట్టుకున్న వారిలో అంకుష్ ప్రేమ్సింగ్ సాబలే అనే నిందితుడు మహారాష్ట్ర నుంచి చాలా ఏళ్ల క్రితం కుటుంబంతో సహా గుర్జాల్ తండాకు వచ్చి స్థిరపడ్డాడు. ముఠాలోని ప్రధాన నిందితులైన బస్సీ జోద్రాజ్, అంకుష్ ప్రేమ్సింగ్ సాబలేలు పగటి వేళ కాలనీల్లో తిరుగుతూ రెక్కీ నిర్వహిస్తారు. ఇళ్లను ఎంచుకుని రాత్రి వేళల్లో చోరీలకు పాల్పడతారు. చోరీలకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా గడ్డపార వెంట తీసుకుని వెళ్తారు. దాంతోనే తాళాలు పగులగొడతారు. వారు చోరీ చేసుకుని వచ్చిన సొత్తును ముఠాలోని మిగతా నిందితులు ఇతర ప్రాంతాలకు తరలించడం, విక్రయించడం చేస్తుంటారు. ఇలా ఈ ముఠా జిల్లా లోని గాంధారి, తాడ్వాయి, లింగంపేట్, రాజంపేట్, బాన్సువాడ పోలీస్ స్టేషన్ల పరిధిలో 9 చోరీలకు పాల్పడినట్లు విచారణలో తేలింది. -
చోరీ కేసుల్లో నిందితుల అరెస్టు
నిజామాబాద్ రూరల్: జిల్లా కేంద్రంలోని పలు కాలనీల్లో దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు రూరల్ ఎస్హెచ్వో శ్రీనివాస్ మంగళవారం తెలిపారు. ఎస్హెచ్వో తెలిపిన వివరాల ప్రకారం.. నిర్మల్ జిల్లా భైంసా పట్టణానికి చెందిన హైమద్ హుస్సేన్, అబూబకర్ అనే ఇద్దరు సోమవారం సాయంత్రం రూరల్ పోలీస్స్టేషన్ పరిధిలోని ఖానాపూర్ చౌరస్తా వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్నట్లు సమాచారం అందడంతో పట్టుకున్నట్లు తెలిపారు. విచారణలో వారు నగరంలోని 1, 3, 4వ పోలీస్స్టేషన్ల పరిధిలోని పలు ఇళ్లల్లో చోరీలకు పాల్పడ్డారని, దొంగిలించిన వస్తువులను భైంసాకు చెందిన నాంపల్లి వెంకటచారి, నాంపల్లి సాయిచరణ్కు విక్రయించినట్లు నిందితులు ఒప్పుకున్నారు. వీరి నుంచి 70 గ్రాముల బంగారం, వెండి వస్తువులు, ఏడు చేతిగడియారాలు, ఒక బైక్ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీరిపై కేసు నమోదుచేసి 14 రోజుల పాటు రిమాండ్కు తరలించినట్లు ఎస్హెచ్వో పేర్కొన్నారు. ప్రజలు ఎవరైనా వేరే గ్రామాలకు వెళ్తే ఇంట్లో బంగారు ఆభరణాలు, విలువైన వస్తువులు, నగదు ఉంచకూడదని సూచించారు. ఇద్దరు నిందితులు.. నిజామాబాద్అర్బన్: బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరి నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఒకటో టౌన్ ఎస్హెచ్వో రఘుపతి తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. బోధన్ పట్టణంలోని రాకాసిపేట్కు చెందిన అమీర్ఖాన్, కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన మహమ్మద్ హనీఫ్ అనే ఇద్దరు కొంత కాలంగా జిల్లా కేంద్రంలోని ఒకటో టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో తరచూ బైక్ దొంగతనాలకు పాల్పడుతున్నారు. పక్కా సమాచారం మేరకు వీరిపై నిఘా ఉంచి పట్టుకున్నట్లు తెలిపారు. వీరి నుంచి ఐదు బైక్లను స్వాధీనం చేసుకున్నామని అన్నారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్హెచ్వో తెలిపారు. -
‘కాయకల్ప’పై శిక్షణ
నిజామాబాద్ నాగారం: నగరంలోని జిల్లా వైద్యశాఖ కార్యాలయంలో మంగళవారం జిల్లాస్థాయి ‘కాయకల్ప ఓరియంటేషన్ ట్రైనింగ్ ప్రోగ్రాం’ నిర్వహించారు. ఈసందర్భంగా డీఎంహెచ్వో రాజరశ్రీ మాట్లాడుతూ.. ఆస్పత్రి పరిశుభ్రత, ఇన్ఫెక్షన్ ప్రివెన్షన్, వేస్ట్ మేనేజ్మెంట్, హైజిన్ ప్రమోషన్ గురించి సిబ్బందికి అవగాహన కల్పించారు. ప్రోగ్రాం ఆఫీసర్స్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ డాక్టర్ రాజు మాట్లాడుతూ.. జన ఆరోగ్య సమితి సమావేశం గురించి తెలిపారు. టీబీ ముక్త్ భారత్, వ్యాక్సినేషన్ తదితర అంశాలపై వివరించారు. కార్యక్రమంలో వైద్యాధికారులు దేవి నాగేశ్వరి, సామ్రాట్ యాదవ్, ఆశోక్, రాజు, అశ్విని, శ్వేత, ఎంఎల్హెచ్పీలు తదితరులు పాల్గొన్నారు. అందుబాటులో ఎరువులు నవీపేట: రబీ పంటల సాగుకు అవసరమైన ఎరువులు అందుబాటులో ఉన్నాయని డీఏవో వీరాస్వామి అన్నారు. మండలంలోని బినోల, నాగేపూర్, నవీపేట సొసైటీల గోదాములతోపాటు ప్రైవేట్ ఫెర్టిలైజర్ దుకాణాల ను ఆయన మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఈ పోస్’ పరికరం ద్వారా ఎరువుల అమ్మకాలను జరపాలని, రైతుల కు రసీదులను కచ్చితంగా ఇవ్వాలని సూ చించారు. గోదాములతోపాటు ఫెర్టిలైజర్ దుకాణాల్లోని రిజిస్టర్లను తనిఖీ చేశారు. ఆయన వెంట ఏవో నవీన్కుమార్ ఉన్నారు. తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో కొనసాగుతున్న డిగ్రీ రెగ్యులర్, బ్యాక్ లాగ్ సెమిస్టర్ పరీక్షలు మంగళవారం ప్రశాంతంగా జరిగాయని అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పరిధిలో మొత్తం 17 పరీక్ష కేంద్రాల్లో ఉదయం నిర్వహించిన ఐదవ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షకు 386 మందికి 374 మంది హాజరు కాగా 12 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ఆయన పేర్కొన్నారు. -
19 మంది సర్పంచ్లు ఏకగ్రీవం
● ప్రకటించిన అధికారులు ● ఎన్నికై న అభ్యర్థులకు ధ్రువీకరణ పత్రాలు అందజేతపెర్కిట్/వేల్పూర్/ కమ్మర్పల్లి/డొంకేశ్వర్/ బాల్కొండ: మూడో విడత నామినేష న్ల ఉప సంహరణ మంగళవారం ముగిసింది. 19 గ్రామాల సర్పంచ్లు ఏకగ్రీ వంగా ఎన్నికయ్యారు. మిగ తా 146 సర్పంచ్ స్థానాలకు 548 మంది బరిలో నిలిచారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన అనంతరం పోటీలో ఒక్కరే ఉన్న చోట సర్పంచ్ అభ్యర్థులు, వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు అధికారులు ప్రకటించారు. అధికారులు వారికి ధ్రువీకరణపత్రాలను అందజేశారు. -
రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి
డిచ్పల్లి: మండలంలోని కంచెట్టి దాబా సమీపంలో మంగళవారం తెల్లవారుజామున గుర్తుతెలియని వాహనం ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మతి చెందినట్లు ఎస్సై మహమ్మద్ ఆరిఫ్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాలు ప్రకారం.. తెల్లవారుజామున దాబా ఎదురుగా ఓ వ్యక్తి రోడ్డు దాటుతున్న సమయంలో గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి మెడ కుడి వైపునకు టాటూ, ఎడమ, కుడి చేయి మణికట్టుల వద్ద టాటూలు ఉన్నాయి. మృతుడి వివరాలు తెలిసిన వారు 8712659852, 8712659851 నంబర్లకు సమాచారం అందించాలని ఎస్సై కోరారు. గాంధారి(ఎల్లారెడ్డి): రోడ్డుపై నిలిపిఉంచిన ట్రాక్టర్ ట్రాలీని ఢీకొని ఓ వ్యక్తి మృతిచెందాడు. ఎస్సై ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం.. గాంధారి మండలంలోని నర్సాపూర్ గ్రామానికి చెందిన సోమార్పేట లింగయ్య(60) మంగళవారం తన టీవీఎస్ ఎక్సెల్పై పశువుల దాణా కోసం బాన్సువాడ వెళ్లాడు. రాత్రివేళ పశువుల దాణాను ఎక్సెల్పై తీసుకొని స్వగ్రామానికి బయలుదేరాడు. మొండిసడక్– బాన్సువాడ ప్రధాన రహదారిపై ఇసుక లోడుతో ఉన్న ట్రాక్టర్ టైర్ పంక్చర్ కావడంతో అక్కడే నిలిపిఉంచారు. ఈక్రమంలో లింగయ్య ఎక్సెల్పై అదే రోడ్డు గుండా వస్తుండగా ట్రాక్టర్ ట్రాలీని వెనుక నుంచి ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందిచారు. వారు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఇసుకను కిందికి తోడేసి ట్రాలీని పక్కకు తీసినట్లు ఎస్సై తెలిపారు. ప్రమాదంపై ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్సై తెలిపారు. నాగిరెడ్డిపేట: అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఓ వ్యక్తి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నాగిరెడ్డిపేట మండలం గోలిలింగాల గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై భార్గవ్గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పిట్ల పోచయ్య(42) గతేడాది పొలంలో పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు కిందపడి చేయి విరిగింది. విరిగిన చేయికి పలుచోట్ల వైద్యం చేయించినా సరికాలేదు. దీంతో మనస్తాపానికి గురైన పోచయ్య మంగళవారం వేకువజామున ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.● రూ.45 లక్షల నష్టం నిజామాబాద్ అర్బన్: నగరంలోని వినాయక్నగర్లో ఉన్న పేపర్ప్లేట్స్ తయారీ కేంద్రంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. సదరు కేంద్రంలో మంగళవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కార్మికులు పేపర్ప్లేట్స్ను తయారు చేశారు. మధ్యాహ్నం భోజన విరామంలో కార్మికులు మిషన్లను ఆఫ్ చేయకుండా అలాగే వదిలేసి వెళ్లిపోయారు. దీంతో మిషిన్లు వేడి కావడంతో అగ్నిప్రమాదం జరిగింది. మంటలు వ్యాపించి తయారీ కేంద్రంలోని పేపర్ప్లేట్స్ కాలిపోయాయి. వాటితో పాటు ఇతర సామగ్రి కూడా దగ్ధమైంది. సుమారు రూ.45 లక్షల నష్టం జరిగినట్లు నాలుగో టౌన్ ఎస్హెచ్వో తెలిపారు. -
పట్టు వదలని విక్రమార్కుడు లింగారెడ్డి
పెర్కిట్: ఆలూర్ మండలం దేగాం సర్పంచ్గా ఏకగ్రీవమైన ఇట్టెడి లింగారెడ్డి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయడానికి పట్టు వదలని విక్రమార్కుడిగా కృషి చేశాడు. గతంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడిగా, ఆర్మూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్గా పదవులు చేపట్టిన లింగారెడ్డికి ముగ్గురు సంతానం ఉండడంతో 1995 చట్టం ప్రకారం స్థానిక ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హత కలుగలేదు. దీంతో లింగారెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా అధిక సంతానం కలిగి ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే వారిని కూడగట్టి జేఏసీని ఏర్పాటు చేశాడు. జేఏసీకి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉంటూ 1995 చట్టాన్ని రద్దు చేయాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాడు. అంతేకాకుండా రాష్ట్ర మంత్రులకు జేఏసీ ఆధ్వర్యంలో పలుమార్లు వినతి పత్రాలను అందజేశారు. గత అక్టోబరు నెలలో ప్రభుత్వం ఈ చట్టాన్ని రద్దు చేసింది. దేగాం సర్పంచ్ స్థానం జనరల్ కావడంతో లింగా రెడ్డి బరిలో దిగాడు. పోటీల్లో లింగా రెడ్డితో పాటు ఏడుగురు అభ్యర్థులుండగా మంగళవారం వారు తమ నామినేషన్లను ఉప సంహరించున్నారు. దీంతో లింగారెడ్డి సర్పంచ్గా ఏకగ్రీవం అయ్యాడు. లింగారెడ్డి పట్టు వదలని విక్రమార్కుడిగా సర్పంచ్ పదవిని అలంకరించడంపై గ్రామస్తులు, రాష్ట్ర జేఏసీ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.


