breaking news
Nizamabad
-
మొగులు.. గుబులు
చేతికొచ్చిన పంటలు.. వాతావరణంలో మార్పులుడొంకేశ్వర్లో వర్షానికి రంగుమారి దెబ్బతిన్న సోయా పంట తొండాకూర్లో దిగుబడిని చూపుతున్న రైతు రాజన్నడొంకేశ్వర్(ఆర్మూర్)/బోధన్ రూరల్: ఈ ఏడాది సోయాను సాగు చేసిన రైతులకు కాలం కలిసి రాలేదు. గత నెలలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు పంట దెబ్బతినడంతో దిగుబడి పూర్తిగా తగ్గిపోయింది. ఖరీఫ్ సీజన్లో జిల్లా వ్యాప్తంగా 33,603 ఎకరాల్లో సోయా సాగు చేశారు. ఏటా ప్రతికూల వాతావరణంతోపాటు మార్కెట్లో సరైన ధర లభించకపోవడంతో ఈ ఏడాది సోయా సాగును మరింత తగ్గించారు. ఆగస్టు మొదటి వారం వరకు పంట పరిస్థితి బాగానే ఉన్నా, ఆ తర్వాత పడిన భారీ వర్షాలు తీవ్రనష్టం కలిగించాయి. కోత దశకు చేరుకున్న సమయంలో వర్షాలు అడ్డంకిగా మారి చేనులోనే గింజలు రంగు మారాయి. పలు ప్రాంతాల్లో కుళ్లిపోయి పంట చేతికిరాకుండా పోయింది. ఇటీవల వర్షాలు తగ్గుముఖం పట్టడంతో పంట కోతలు చేస్తున్నారు. దిగుబడిని చూసి రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఎకరానికి సాధారణంగా 10–12 క్వింటాళ్ల దిగుబడి వచ్చేదని, వర్షాల కారణంగా ఐదారు క్వింటాళ్లు మాత్రమే వస్తోందని నిరాశ వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్లో క్వింటాలుకు రూ.3,200 వరకు ధర పలుకుతుండగా, పంట దిగుబడులు అమ్మితే ఎకరానికి రూ.25వేలు కూడా రావడం లేదంటున్నారు. పంట సాగు చేయడానికే ఎకరానికి రూ.25వేల వరకు పెట్టుబడి అవుతుందని, ఇప్పుడు ఆ పెట్టుబడి కూడా రాని పరిస్థితి నెలకొందని అంటున్నారు. మరోవైపు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో ప్రైవేటు వ్యాపారులకు తక్కువ ధరకే అమ్ముకోవాల్సి వస్తోందని రైతులు చెప్తున్నారు. బోధన్ మండలంలోని హంగర్గ, కొప్పర్గ, ఖండ్గావ్, సిద్దాపూర్,కల్దుర్కి, మావందికాలన్, మా వందికుర్దు, రాంపూర్ గ్రామాల్లో సోయా పంటను అధికంగా సాగు చేశారు. ఇటీవల కురిసిన వర్షాలతో శ్రీరాంసాగర్ బ్యాక్ వాటర్, మంజీర నది వర ద ఉధృతిలో పంట నీటమునిగి దెబ్బతింది. మిగిలిన సోయా పంట కోతలు మెదలుపెట్టిన రైతులను ఆదివారం సాయంత్రం కురిసిన వర్షం ఇబ్బందుల పాలు చేసింది. ట్రాక్టర్లలో తరలిస్తుండగా వర్షం రావడంతో సోయాలు తడిసిపోయాయి. సోయా... గయా!నందిపేట్(ఆర్మూర్): ఖరీఫ్లో వ్యయప్రయాసలకోర్చి వరి సాగు చేసిన రైతులు కోతలకు శ్రీకారం చుట్టారు. పంట ఏపుగా పెరగడం, ఆరోగ్యంగా ఉండడంతో దిగుబడిపై భారీ ఆశలు పెట్టుకున్నారు. సాగునీరు అందుబాటులో ఉన్న ప్రాంత రైతులు సీజన్ ప్రారంభంలోనే వరి సాగు చేశారు. పంట చేతికందే దశలో వర్షాలు విరామం ఇవ్వడంతో వారం రోజుల నుంచి కోతలు ముమ్మరం చేశారు. అయితే, రెండ్రోజులుగా ఆకాశం మేఘావృతం అవుతుండడంతో రైతులు బెంబేలెత్తుతున్నారు. జిల్లాలో ఈ ఏడాది 4,36,695 ఎకరాల్లో వరి పంటను సాగు చేశారు. సుమారు 9.5 లక్షల పైచిలుకు మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు. ఒకవైపు పౌర సరఫరాల శాఖ కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తూ ధాన్యం సేకరణకు సన్నద్ధమవుతోంది. మరోవైపు రైతులు హార్వెస్టర్లతో వేగంగా కోతలు చేపడుతున్నారు. ఎస్సారెస్పీలోకి పుష్కలంగా నీరు.. ఈ ఏడాది ఖరీఫ్ ప్రారంభం నుంచి శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి పుష్కలంగా వరద నీరు రావడంతో వరి పంటకు నీటి సమస్య లేకుండా పోయింది. సా గు కోసం పెట్టిన పెట్టుబడులతోపాటు లాభాలు సై తం వస్తాయని ఎదురుచూస్తున్న తరుణంలో జిల్లా లో కురిసిన భారీ వర్షాలతో కొన్నిచోట్ల వరి పంట దెబ్బతిన్నది. రెండు రోజుల నుంచి అక్కడక్కడ వర్షాలు కురవడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. వర్షాలు కురిస్తే కోత మిషన్లు పొలంలోకి దిగే వీ లుండదు. దీంతో పనులు ఆగిపోయి తీవ్రంగా నష్ట పోతామంటున్నారు. మరోవైపు కోసిన తర్వాత వరి ధాన్యాన్ని ఆరబెట్టేందుకు భయపడుతున్నారు. బాల్కొండ: మక్క రైతులకు ధరాఘాతం తప్పడం లేదు. ప్రభుత్వం మద్దతు ధర క్వింటాలుకు రూ.2400 ప్రకటించింది. అయితే సీజన్ ప్రారంభం నుంచి వర్షాలు వెంటాడతుండటంతో రైతులు ది క్కుతోచని స్థితిలో పడిపోయారు. మొదట్లో నూర్పి ళ్లు చేసి ఆరబెట్టిన మక్కలు వర్షార్పణం కావడంతో క్వింటాల్కు రూ.2200 కు విక్రయించారు. ప్రస్తు తం మళ్లీ తుపాన్ ఉందంటూ వాతావరణశాఖ హె చ్చరించడంతో వ్యాపారులు ధరను మరింత తగ్గించారు. క్వింటాల్కు రూ.2030 లకే కొనుగోలు చేస్తు న్నారు. తుపాన్ దడ రైతుల్లో ఉండటంతో వ్యాపారులు చెప్పిన ధరకే విక్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదని పేర్కొంటున్నారు. ఎకరానికి రూ.9 వేల వరకు నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.రెంజర్లలో ఆరబెట్టిన మక్కలు వాతావరణ మార్పులు రైతుల్లో గుబులు పుట్టిస్తున్నాయి. జిల్లాలో అక్కడక్కడ కురుస్తున్న వర్షాలు నష్టాన్ని చేకూరుస్తున్నాయి. చేతికొచ్చిన పంటలు పొలాల్లో తడిసిముద్దవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. జిల్లాలోని పలుచోట్ల కోతకు వచ్చిన సోయా పంట నీటమునిగి సగానికి సగం దిగుబడులు తగ్గాయి. మరోవైపు తుపాను హెచ్చరికలతో మక్కల ధరలు పడిపోయాయి. వరి కోతలపైనా వాన ప్రభావం చూపుతోంది. రెండ్రోజులుగా జిల్లాలో ఆకాశం మేఘావృతం అవుతుండడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. కలిసి రాని కాలం ఆందోళన చెందుతున్న రైతన్నలు పలుచోట్ల వర్షాలతో నష్టాలు తగ్గుతున్న సోయా దిగుబడి పడిపోయిన మక్క ధరలు మొదలైన వరి కోతలు పెట్టుబడి కూడా రాదు.. మూడెకరాల్లో సోయా పంటను సాగు చేశాను. ఎకరానికి రూ.25వేల చొప్పున పెట్టుబడి అయ్యింది. వర్షాలకు పంట దెబ్బతిని చేతికిరాకుండా పోయింది. గింజలు కుళ్లిపోయి ఎకరానికి ఐదారు క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వచ్చింది. పంట అమ్మితే పెట్టుబడి ఖర్చు కూడా రాదు. – రాకేశ్, తొండాకూర్, డొంకేశ్వర్ రోజురోజుకూ తగ్గిస్తున్నారు.. మక్కల ధర రోజురోజుకూ తగ్గిస్తున్నారు. నిన్నటి వరకు క్వింటాల్కు రూ.2080 ఇచ్చి న వ్యాపారులు ఆదివారం రూ.2030కి తగ్గించారు. వ ర్షాల హెచ్చరికతో తక్కువ ధ రకై నా అమ్ముకుంటున్నాం. – రాజన్న, రైతు, రెంజర్ల -
కళామతల్లి సేవే లక్ష్యంగా..
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: జీవితాంతం కళా మతల్లికి సేవ చేసేందుకు నిర్ణయించుకొని కూచిపూడి నాట్యంలో శిక్షణ ఇస్తూ ముందుకు వెళుతున్నారు ఇందూరుకు చెందిన బంటు సుకన్య. చిన్నప్పటి నుంచే నాట్యం నేర్చుకుంటూ వచ్చిన సుకన్య.. వివాహం చేసుకుని, ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చాక మరో ఇన్నింగ్స్కు శ్రీకారం చుట్టా రు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాల యం నుంచి నాట్యంలో మాస్టర్ డిగ్రీ చేశారు. ఆంధ్రనాట్యంలో డిప్లొమా కోర్సు చేశారు. కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ చదివిన సుకన్యకు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసే అవకాశం వచ్చినప్పటికీ నాట్యం మీద ప్రేమ, నాట్యాన్ని మరింత మందికి అందించాలనే తన గురువు టంగుటూరి భీమన్న సూచనల మేరకు జీవితాంతం నాట్యంలో శిక్షణ ఇచ్చేందుకు నిశ్చయించుకున్నారు. నగరంలోని వినాయక్నగర్, సుభాష్నగర్లలో శ్రీ నటరాజ నృత్య తరంగిణి నాట్యాలయం ఏర్పాటు చేసి కూచిపూడిలో శిక్షణ ఇస్తున్నారు. సుకన్య వద్ద చిన్నారులతోపాటు డాక్టర్లు, సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, గ్రాడ్యుయేట్లు, వివాహమై పిల్లలు ఉన్నవారు సైతం శిక్షణ తీసుకుంటున్నారు. ఆన్లైన్లోనూ శిక్షణ ఇస్తున్నారు. ● సుకన్య రెండో తరగతిలోనే ప్రముఖ నాట్యాచార్యులు టంగుటూరి భీమన్న వద్ద ఆంధ్రనాట్యం, కూచిపూడి, జానపద నృత్యాలు నేర్చుకున్నారు. పదోతరగతి నుంచి నాట్యాచార్యులు దేవులపల్లి ప్రశాంత్ వద్ద కూచిపూడి నేర్చుకున్నారు. ఢిల్లీ, ముంబై, కోల్కత్తా, లక్నో తదితర రాష్ట్రాలతోపాటు శ్రీలంక, థాయ్లాండ్, మారిషస్ దేశాల్లో వందల సంఖ్యలో కూచిపూడి ప్రదర్శనలిచ్చారు. సిలికానాంధ్ర ఆధ్వర్యంలో హైదరాబాద్లో గిన్నిస్ రికార్డు సాధించిన ప్రదర్శనలో పాల్గొన్నారు. మహిషాసుర మర్దిని, గజేంద్ర మోక్షం, శకుంతల పరిణయం, సృష్టిబాలయ, శివలీలలు సృత్యరూపకాల్లో అనేక ప్రదర్శనలు ఇచ్చారు. అనేక బహుమతులు సాధించారు. మరోవైపు వివిధ రకాల దేవుడి భజన పాటలకు అప్పటికప్పుడే నృత్యం కంపోజ్ చేసి అనేక మందికి నేర్పుతున్నారు. మూడో తరగతి చదువుతున్న తన కుమార్తె అభ్యశ్రీకి సైతం నృత్యం నేర్పుతున్నారు. కాగా, సుకన్య అక్కలు లావణ్య, చైతన్య యోగా మాస్టర్లుగా వేలాదిమందికి శిక్షణ ఇస్తున్నారు. వీరి తండ్రి యోగారత్న ఎక్కొండ ప్రభాకర్ ప్రోత్సాహంతో ముందుకు వెళుతున్నామని చెబుతున్నారు. గురువు కోరిక మేరకు.. కళను బతికించడం, భావితరాలకు అందించడంలో మనవంతు పాత్ర నిబద్ధతతో పోషించాలని మా గురువు టంగుటూరి భీమన్న చెప్పారు. ఆయన కోరిక మేరకు జీవితాంతం నాట్యంలో శిక్షణ ఇచ్చేందుకు నిర్ణయించుకున్నా. కూచిపూడిలో పీహెచ్డీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నా. సనాతన భారతీయ కళను మరింతమందికి పంచేందుకు భగవంతుడు ఈ అవకాశం కల్పించడం అదృష్టంగా భావిస్తున్నా.– సుకన్య సాఫ్ట్వేర్ ఉద్యోగావకాశాలు వదులుకొని కూచిపూడి శిక్షణ ఇస్తున్న సుకన్య వివిధ రాష్ట్రాలు, దేశాల్లో అనేక ప్రదర్శనలిచ్చిన నాట్యాచారిణి గురువు సూచనల మేరకు జీవితకాలం శిక్షణ ఇచ్చేందుకు నిర్ణయం -
స్థానిక ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి
● సీపీ సాయి చైతన్య ● కమ్మర్పల్లి పోలీస్ స్టేషన్ తనిఖీ కమ్మర్పల్లి: త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని కమిషనర్ ఆఫ్ పోలీస్ సాయి చైతన్య పోలీస్ అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. కమ్మర్పల్లి పోలీస్స్టేషన్ను ఆదివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం పోలీస్ ఇమేజ్ పెంచేలా సిబ్బంది నిక్కచ్చిగా విధులు నిర్వర్తించాలన్నారు. స్థానిక ఎన్నికలు సజావుగా జరగడానికి కావాల్సిన అన్ని రకాల ముందస్తు ఏర్పాట్లను చేసుకోవాలన్నారు. గత ఎన్నికల్లో చెడు నడత కలిగిన వారిని బైండోవర్ చేయాలని సూచించారు. పోలీస్స్టేషన్ పరిధిలోని పోలింగ్ స్టేషన్లు, లోకేషన్లపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రతి పోలింగ్ స్టేషన్ను తప్పనిసరిగా సందర్శించి అక్కడి పరిస్థితులను తెలుసుకోవాలన్నారు. ప్రజలతో మమేకం కావాలి.. పోలీస్స్టేషన్ చుట్టుపక్కల బ్యారక్లను పరిశీలించారు. వివిధ రకాల రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ప్రతి కేసులో నాణ్యమైన ఇన్వెస్టిగేషన్ చే యాలని ఎస్సైకి సూచించారు. విలేజ్ పోలీస్ ఆఫీసర్ ప్రజలతో మమేకమై గ్రామాలలో ఉన్న సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేయాలన్నారు. కమ్మర్పల్లి పోలీస్స్టేషన్ జిల్లా సరిహద్దులో ఉన్నందున రాకపోకలపై నిఘా వ్యవస్థ పటిష్ట పరచాలన్నారు. ఆన్లైన్ బెట్టింగ్, గేమ్స్, సైబర్ మోసాల బారినపడకుండా అవగాహన కల్పించాలన్నారు. సీపీ వెంట భీమ్గల్ సీఐ సత్యనారాయణ, ఎస్సై అనిల్రెడ్డి తదితరులు ఉన్నారు. -
రైతులకు నష్టపరిహారం చెల్లించాలి
నవీపేట: గోదావరి నదితీర ప్రాంత రైతులకు ప్రభు త్వం వెంటనే నష్టపరిహారం చెల్లించాలని న్యాయవాది, రిటైర్డు డీఎస్పీ మనోహర్ డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని ఆర్ఆర్ గార్డెన్లో ఆదివారం నిజామాబాద్, నిర్మల్ ఉమ్మడి జిల్లాల ఎస్సారెస్పీ ముంపు ప్రాంత రైతుల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి మనోహర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నందిపేట మండలంలోని ఉమ్మెడలో నిర్మించిన బ్రిడ్జి కింద ఏటవాలు కాకుండా కట్టలు రూపంలో నిర్మాణం చేపట్టారని, దీంతో ఎగువ ప్రాంతం నుంచి వచ్చే వరద నీరు నదితీరంలోని పంట పొలాలు, నివాసిత గ్రామాలకు చేరుతున్నాయన్నారు. ఈ బ్రిడ్జి నిర్మాణంపై హైకోర్టు మాజీ న్యాయమూర్తితో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. గోదావరిలో పేరుకుపోయిన పూడికను తొలిగించేందుకు అనుమతివ్వాలని డిమాండ్ చేశారు. ముంపు ప్రాంత గ్రామాలు, రైతుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపట్టాలని కోరారు. -
సిరికొండ మండలంలో భారీ వర్షం
సిరికొండ: మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో ఆదివారం భారీ వర్షం కురిసింది. వర్షంతో కోతకు వచ్చిన పంటలకు ఇబ్బంది నెలకొంది. కొండూర్ గ్రామంలో వరి కోతలు నడుస్తుండటంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గడ్కోల్, న్యావనంది, నర్సింగ్పల్లి, చీమన్పల్లి గ్రామాల్లో మొక్కజొన్న, సోయాబీన్ కోతలు నడుస్తున్నాయి. వర్షానికి మక్కలు, సోయలు తడిచే అవకాశం ఉందని రైతులు పేర్కొంటున్నా. పంట ఉత్పత్తులు తడవకుండా వాటిని తాటిపత్రులు, పాలిథిన్ కవర్లతో కప్పి కాపాడుకుంటున్నారు. తాడ్వాయి(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలోని వేంకటేశ్వర ఆలయంలో ఆదివారం భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. అలాగే పల్లకీ సేవ కార్యక్రమాన్ని నిర్వహించారు. రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి ● మరో ఇద్దరికి గాయాలు భిక్కనూరు: మండలంలోని జంగంపల్లి గ్రామ శివారులోగల జాతీయ రహదారిపై జరిగిన రో డ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందినట్లు భిక్కనూరు ఎస్సై అంజనేయులు ఆదివారం తెలిపారు. వివరాలు ఇలా.. లక్ష్మినగర్ తండాకు చెందిన భానోత్శంకర్ (55) ఆదివారం జంగంపల్లి గ్రామశివారులోగల జా తీయ రహదారి పక్కన సీతాఫలాలు విక్రయిస్తూ, తన టీవీఎస్ మోపెడ్పై కూర్చున్నాడు. అదే సమయంలో నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న బ్రిజా కారును డ్రైవర్ అతివేగంగా నడుపుతున్నాడు. జంగంపల్లి శివారులో కారు ముందు వెళ్తున్న బైక్ను ఢీకొట్టింది. దీంతో బైక్పై ప్రయాణిస్తున్న మనోహర్, ని శాంత్లకు గాయలయ్యాయి. అనంతరం కారు సీతాఫలాలు విక్రయిస్తున్న బానోత్శంకర్ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో శంకర్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పో లీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం ని మిత్తం కామారెడ్డి ఏరియా ఆ స్పత్రికి తరలించా రు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న ట్లు ఎస్సైవివరించారు. -
గంగమ్మ ఒడికి దుర్గామాత
ఆర్మూర్టౌన్/రుద్రూర్: ఆర్మూర్ పట్టణంలోని దు ర్గామాతా శోభాయాత్ర ఆదివారం మూడో రోజూ కొనసాగింది. పట్టణంలో పలు మండపాల నిర్వాహకులు దుర్గామాత్ర శోభాయాత్రను డీజే పాటల తో, డప్పువాయిద్యాలతో దండియా ఆటలతో ని ర్వహించారు. యువ యూత్ నిర్వాహకులు దుర్గా మాత నిమజ్జనం కోసం లక్నో నుంచి అఘోరాల వేషధారణ విన్యాసకులను రప్పించారు. వీరి చేసిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ప్రిన్స్ యూత్ సభ్యు లు కాశీ తరహాలో గంగాహరతి కార్యక్రమం నిర్వ హించారు, రజక సంఘం ఆధ్వర్యంలో కళాకా రు లు కాళికామాత వేషధారణలో అలరించారు. ము న్సిపల్ ఆధ్వర్యంలో గూండ్ల చెరువు వద్ద ఏర్పాటు చేసిన క్రేన్ సహయంతో దుర్గామాత విగ్రహాలను ని మజ్జనం చేశారు. అలాగే కోటగిరిలోనూ దుర్గామా త నిమజ్జన శోభాయాత్ర ఘనంగా జరిగింది.ఆర్మూర్లోని గూండ్ల చెరువు వద్దకు నిమజ్జనం కోసం చేరుకున్న దుర్గామాత విగ్రహాలు కాళికామాత వేషధారణలో నృత్యం చేస్తున్న కళాకారిణిఅఘోరా వేషధారణలో కళాకారుడి విన్యాసాలు -
కుంట రెడ్డి సంఘం ఆధ్వర్యంలో అలయ్బలయ్
భిక్కనూరు: తిప్పాపూర్లో కుంట రెడ్డి సంఘం ఆధ్వర్యంలో అలయ్బలయ్ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. దసరా ఉత్సవాల సందర్భంగా స్థానిక గ్రామదేవతల ఆలయాల ప్రాంగణంలో ఈ అలయ్బలయ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ ప్రాంతాల్లో నివాసం ఉంటున్న కుంట రెడ్డి సంఘం సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామదేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం నుంచి సాయంత్రం వర కు మహిళలకు పలు పోటీలను నిర్వహించి ప్రతిభ చూపిన వారికి బహుమతులను అందజేశారు. నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): మాల్తుమ్మెదలో శబరిమాత ఆశ్రమానికి సంబంధించి ఆదివారం 36వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం గీతాపారాయణం, ధ్వజారోహణ కార్యక్రమాలను చేపట్టారు. దీంతోపాటు శబరిమాత చిత్రపటాన్ని పల్లకిలో ఉంచి గ్రామంలోని ప్రధానవీధుల గుండా ఊరేగింపు నిర్వహిస్తూ పల్లకిసేవ చేశారు. రాత్రి వివిధ భజన మండళ్లతో భజన కార్యక్రమాలను జరిపారు. -
ఎన్నికల్లో విజయ దుందుభి మోగించాలి
మాచారెడ్డి: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు విజయ దుందుభి మోగించాలని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. ఆదివారం పాల్వంచ మండల కేంద్రంలో మున్నూరు కాపు కల్యాణ మండపాన్ని ప్రారంభించిన అనంతరం కార్యకర్తలతో మాట్లాడారు. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ పదవులకు బీజేపీ అభ్యర్థులు బరిలో నిలవాలని పిలుపునిచ్చారు. ప్రతి కార్యకర్త సైనికుల్లా పని చేయాలని కోరారు. పాల్వంచ మండల శాఖ అధ్యక్షుడు అనిల్, ఓబీసీ జిల్లా అధ్యక్షుడు బాల్ రాజు, మండల ఇన్చార్జి పండ్ల ప్రవీణ్, నాయకులు మదనాల శ్రీనివాస్, నరసింహాచారి, నరేష్, శ్రీనివాస్ ఉన్నారు. -
దశాబ్దాల తర్వాత.. ఒక్కచోటికి..
● ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల సమ్మేళనాలు నిర్వహించిన పూర్వవిద్యార్థులు ● ఆత్మీయ పలకరింపులతో భావోద్వేగానికి గురైన చిన్ననాటి మిత్రులు భిక్కనూరు/బాన్సువాడ రూరల్/పిట్లం/పెర్కిట్: చిన్ననాటి మిత్రులందరూ ఏళ్ల తర్వాత మళ్లీ ఒ క్కచోటికి చేరడంతో హర్షం వ్యక్తం చేశారు. అరే ఎ న్నాళ్లయింది కలుసుకుని.. పూర్తిగా మారిపోయా వంటూ ఆనాటి స్నేహితులు ఆత్మీయ పలకరింపులు.. ఆపాత మధుర స్మృతులను గుర్తుకు తెచ్చుకుని భావోద్వేగానికి గురయ్యారు. బాన్సువాడలోని జీజేసీలో 1979–80 బ్యాచ్ ఎస్సెస్సీ విద్యార్థులు ఆది వారం తాడ్కోల్లో పూర్వ విద్యార్థుల ఆత్మీయ స మ్మేళనం నిర్వహించారు. ఈసందర్భంగా ఆనాటి గురువులు మధుసూదన్, వెంకటసుబ్బయ్యలను విద్యార్థులు సన్మానించారు. రామకృష్ణారెడ్డి, నార్ల భాస్కర్, రమేష్, బ్రహ్మం, రాంరెడ్డి, కృష్ణరెడ్డి పాల్గొన్నారు. భిక్కనూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల 1982–83 ఎస్సెస్సీ పూర్వ విద్యా ర్థులు మాసుపల్లి పోచమ్మ ఆలయం వద్ద ఆత్మీయ సమ్మేళనం నిర్వహించుకున్నారు. తమ పూర్వ విద్యార్థుల కమిటీ నూతన కార్యవర్గంను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా మల్లేషం, ఉపాధ్యక్షుడిగా సత్యనారాయణ, ప్రధానకార్యదర్శిగా కుష న్ మల్లేషం, కోఽశాదికారిగా ఉప్పరి యాదగిరితోపా టు పలువురిని ఎన్నుకున్నారు., అలాగే భిక్కనూరు లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల 2002–03 బ్యాచ్ ఏడో తరగతి విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. పిట్లం జెడ్పీహెచ్ఎస్ 1993– 96 బ్యాచ్ 8వ, 9వ, 10వ తరగతి విద్యార్థులు సమ్మేళనం నిర్వహించారు. పెర్కిట్ జెడ్పీహెచ్ఎస్ 1996–97 బ్యాచ్ ఎస్సెస్సీ విద్యార్థులు ఓ ఫంక్షన్హాల్లో సమ్మేళనం నిర్వహించారు. -
‘అభయహస్తం’ వాపస్ వచ్చేదెప్పుడో?
మోర్తాడ్(బాల్కొండ): మహిళా సంఘాల్లోని సభ్యులకు 55 ఏళ్ల వయస్సు నిండితే వారికి ఫించన్ పథ కం అమలు చేయడానికి ఉమ్మడి రాష్ట్రంలో ‘అభయహస్తం’ పథకాన్ని అప్పటి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి ప్రారంభించారు. కానీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నూతన ప్రభుత్వం ఆసరా పథకం అమలు చేసి వివిధ వర్గాల వారికి పింఛన్లను మంజూరు చేసింది. ఈక్రమంలో 2014 నుంచి 2017 వరకు అభయహస్తంను అమలు చేసి ఆకస్మాత్తుగా రద్దు చేసింది. పథకం రద్దు చేసినప్పుడు మహిళలకు వారి సభ్యత్వ సొమ్మును వాపసు చేయాల్సి ఉన్నా గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది. దీంతో ఏళ్లుగా డబ్బుల కోసం మహిళలకు ఎదురుచూపులు తప్పడం లేదు. జిల్లాలో 50వేలకు పైగా సభ్యులు.. అభయహస్తం పింఛన్ పథకం కింద ఉమ్మడి జిల్లాలో మొదట 13,506 మంది అర్హులుగా గుర్తించి వారితో రూ.3,685 చొప్పున జమ చేయించారు. వీరికి ప్రతి నెలా రూ.500ల చొప్పున ఫించన్ అందించారు. తర్వాత మరో 40వేల మందిని సభ్యులుగా చేర్చుకుని వారితో ప్రతి సంవత్సరం రూ.385 చొప్పున ఐదేళ్ల పాటు రూ.1,925ని జమ చేయించారు. కానీ అభయహస్తం పథకంను 2017లో నిలుపుదల చేశారు. అప్పటి నుంచి ఈ పథకం కింద పింఛన్ల పంపిణీ రద్దు చేయడంతో పాటు పింఛన్ పొందడానికి అర్హత వయస్సు వచ్చిన వారి సొమ్మును బ్యాంకులోనే ఉంచారు. ఇలా జిల్లాలోని మహిళలకు సంబంధించి రూ.12,67,69,610 బ్యాంకులోనే మూలుగుతున్నాయి. ఈ సొమ్ము సంబంధిత అర్జీదారులకు వాపసు చేయడానికి ఏడాది కింద మహిళా సంఘాల ప్రతినిధులు అభయహస్తం సభ్యత్వ రుసుం చెల్లించిన మహిళల వివరాలను నమోదు చేసుకున్నారు. కానీ ఇప్పటికీ కూడా సొమ్మును తిరిగి ఇవ్వలేదు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ద్వారా కొనసాగిస్తున్న మహిళా సంఘాల్లో మెజార్టీ మహిళలు పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందినవారే ఉన్నారు. ఇప్పటికై నా ప్రస్తుత ప్రభుత్వం స్పందించి మహిళల పరిస్థితిని అర్థం చేసుకుని అభయహస్తం సభ్యత్వ సొమ్మును వారి ఖాతాల్లో జమ చేయాలని పలువురు కోరుతున్నారు.2017లోనే రద్దయిన పథకం సభ్యులకు సొమ్ము తిరిగివ్వడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం జిల్లాలోని మహిళలకు రావాల్సిన బకాయి రూ.12.67 కోట్లు అభయహస్తం పథకం కింద తమవంతు వాటా ధ నం చెల్లించిన సభ్యుల వివరాలను గతంలోనే ప్ర భుత్వానికి పంపించాం. ప్రభుత్వం నిధులు విడు దల చేయగానే దరఖాస్తుదారుల ఖాతాల్లో వారు గతంలో చెల్లించిన సొమ్ము జమ అయ్యే అవకాశం ఉంది. వివరాలు పంపించి చాలా నెలలు అవుతుంది. ప్రభుత్వం నుంచి స్పందన రావాల్సి ఉంది. –తడకల శ్రీనివాస్, సీసీ సెర్ప్, మోర్తాడ్ -
ఎల్లారెడ్డిలో ప్రతియేటా..
బచ్పన్ దోస్తులను కలవ డం మరువలేని అనుభూతి. ప్రతియేటా బచ్పన్ దోస్తులను కలవడం ఆనందాన్ని కలిగిస్తుంది. కుటుంబం ఎంత ముఖ్యమో చిన్ననాటి స్నేహితులు కూడా అంతే ముఖ్యంగా అనిపిస్తుంది. –రేవంతప్ప, ఏవో, కలెక్టరేట్, సిరిసిల్లా నేను ఎల్లారెడ్డిలోనే బాల్యమి త్రులతో కలిసి ప్రభుత్వ పాఠ శాలలో చదువుకున్నాను. ప్ర స్తుతం రంగారెడ్డి జిల్లా కోర్టు న్యాయమూర్తిగా పని చేస్తున్నాను. ప్రతియేటా బాల్యమిత్రులను కలిసేందుకు ఎల్లారెడ్డికి వస్తున్నాను. బాల్యమిత్రులను కలిస్తే ఎనలేని సంతోషం కలుగుతుంది. – నామ సంతోష్కుమార్, రంగారెడ్డి జిల్లా కోర్టు న్యాయమూర్తిఎల్లారెడ్డిరూరల్: పట్టణంలోని ఎల్లారెడ్డి ప్రభుత్వ (బాలుర) ఉన్నత పాఠశాల 1992–93 బ్యాచ్ ఎస్సెస్సీ విద్యార్థులు గత ఐదేళ్లుగా ప్రతి సంవత్సరం సమ్మేళనం నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కార్యక్రమానికి పూర్వ విద్యార్థులందరూ పాల్గొని, ఆనందం వ్యక్తం చేశారు. అలాగే ఇటీవల మృతి చెందిన మిత్రులకు సంతాపం తెలుపుతూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. ప్రభుత్వ పాఠశాలలో చదివిన వీరంతా జీవితంలో మంచి స్థానంలో స్థిరపడ్డారు. దీంతో బాల్యమిత్రులలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందిస్తు అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఎన్ని పనులున్నా చిన్ననాటి మి త్రులను కలుసుకునేందుకు ఏ ర్పాటు చేసిన ఈ కార్యక్రమాని కి తప్పకుండా వస్తాను. చిన్ననా టి మిత్రులను కలుసుకోవడం ఆనందంగా ఉంటుంది.వారి తో సుఖసంతోషాలను పంచుకోవడం జరుగుతుంది. –చెన్నకేశవులు, సీబీఐ కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ మిత్రులను కలిస్తే ఎనలేని ఆనందం కలుగుతుంది. బాల్యమిత్రులందరు వివిధ ప్రాంతాలలో ఉంటు ప్రతియేటా గెట్టుగెదర్ కార్యక్రమానికి రావడం ఆనందంగా ఉంటుంది. –సిద్ధి శ్రీధర్, వ్యాపారవేత్త 05 వైఎల్లార్ 138: -
అయిలాపూర్లో వివాహిత ఆత్మహత్య
లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని అయిలాపూర్ గ్రామంలో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై దీపక్కుమార్ తెలిపారు. వివరాలు ఇలా.. అయిలాపూర్ గ్రామానికి చెందిన కొట్టంల భాగ్యలక్ష్మి(20) అనే వివాహిత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. దీంతో ఆమె జీవితంపై విరక్తి చెంది ఆదివారం ఉదయం ఇంట్లో ఫ్యానుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలికి కూతురు భవ్యశ్రీ ఉన్నట్లు తెలిపారు. మృతురాలి తండ్రి శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కొత్తపల్లిలో ఒకరు.. మాచారెడ్డి: మండలంలోని కొత్తపల్లి గ్రామంలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై అనిల్ తెలిపారు. వివరాలు ఇలా.. కొత్తపల్లి గ్రామానికి చెందిన బరిగే నాంపల్లి (54)కి కూతురు, కుమారుడు ఉండగా గతంలో మృతిచెందారు. ఈ బాధను తట్టుకోలేక తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఈక్రమంలో తాగుడుకు బానిసయ్యాడు. దీంతో శనివారం రాత్రి పొలం వద్ద వేపచెట్టుకు తాడుతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని, వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై వివరించారు. -
రూ.92 వేలు పలికిన గుమ్మడికాయ
మాక్లూర్: మండలంలోని ముల్లంగి (బి) గ్రా మంలో దుర్గామాత వద్ద ఉంచిన గుమ్మడి కాయను శనివారం నిర్వాహకులు వేలం వేశా రు. అదే గ్రామానికి చెందిన బూరోల్ల ధర్మపతి వేలంలో గుమ్మడికాయను రూ.92 వేలకు దక్కించుకున్నాడు. దుర్గామాత మండప నిర్వాహకులు ఽభక్తుల సమక్షంలో గుమ్మడికాయను ధర్మపతికి అందజేశారు. ధాన్యం దళారులకు అమ్మి నష్టపోవద్దు వర్ని : రైతులు కష్టపడి పండించిన ధాన్యా న్ని దళారులకు విక్రయించి నష్టపోవద్దని జిల్లా సహకార అధికారి శ్రీనివాస్ సూచించా రు. శనివారం వర్ని మండలంలోని పాత వర్ని సహకార సంఘంలో వరి ధాన్యం కొ నుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించా రు. రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో విక్రయించడం వల్ల గిట్టుబాటు ధర ఏ గ్రేడ్ రకానికి రూ. 2,389, బి గ్రేడ్ రకానికి రూ.2,369 చెల్లించడంతోపాటు సన్న రకాలకు రూ. 500 బోనస్ కూడా వస్తుందని సహకార అధికారి పేర్కొన్నారు. దళారులు రైతుల అవసరాలను ఆసరాగా చేసుకుని తక్కువ ధరకు ధాన్యాన్ని కొనుగోలు చేస్తూ రైతులను మోసం చేస్తున్నారని అన్నారు. తహసీల్దార్ సాయిలు, సొసైటీ చైర్మన్ సాయిబాబా పాల్గొన్నారు. సమన్వయంతో పరిష్కరించాలి వర్ని: మండలంలోని సిద్ధాపూర్ రిజర్వాయర్ వద్ద వివాదాస్పదంలో ఉన్న భూమిని బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో శనివా రం పరిశీలించారు. అటవీ, రెవెన్యూ శాఖల మధ్య వివాదంలో ఉన్న స్థలాన్ని పరిశీలించి, సమన్వయంతో రెండుశాఖల అధికారులు సమస్యను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. సమస్యను 15 రోజుల్లో పరి ష్కరించాలని లేకపోతే రిజర్వాయర్ పనులు ఆలస్యం అయ్యే ప్రమాదముందన్నారు. వరద గేట్ల ముందు జాలరి గల్లంతు బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ వరద గేట్ల ముందర గోదావరిలో చేపలు వేటాడుతున్న మత్స్యకారుడు శనివారం గల్లంతయ్యాడు. మెండోరా ఎస్సై సుహాసిని, స్థానిక మత్స్య కారులు తెలిపిన వివరాల ప్రకారం.. నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలం కాల్వా గ్రా మానికి చెందిన లింబోజి అనిల్ (25), లింబోజి ఆనంద్ అన్నదమ్ములు ఇద్దరు మధ్యా హ్నం నుంచి గోదావరిలో వరద గేట్ల ముందర చేపలు వేటాడుతున్నారు. ఈ క్రమంలో వరద గేట్ల ముందర ప్రవాహానికి ఎదురెళ్లడంతో తెప్ప తలకిందులు అయ్యింది. అనిల్ నీటి ప్రవాహంలో కొట్టుకు పోయాడు. ఆనంద్ ప్రవాహం పక్కన ఉన్న బండరాయిని పట్టుకుని బతికి పోయాడు. ప్రవాహం ఎక్కువగా ఉండటంతో ఒక తెప్ప పై ఇద్దరు వేటకు వెళ్లాల్సి ఉంటుందని మత్స్యకారులు తెలిపారు. గోదావరిలోనే చేపలు వేటాడుతున్న మత్స్యకారులు గమనించి వెంటనే ప్రాజెక్ట్ అధికారులకు సమాచారం అందించారు. ప్రాజెక్ట్ అధికారులు వెంటనే వరద గేట్లను మూసివేశారు. అనంతరం స్థానిక మత్స్యకారులు గాలింపు చర్యలు చేపట్టారు. చీకటి పడే వరకు ఆచూకీ లభించలేదు. దీంతో గాలింపు చర్యలను నిలిపి వేశారు. అనంతరం మళ్లీ రాత్రి వరద గేట్ల ద్వారా గోదావరిలోకి నీటి విడుదలను ప్రాజెక్ట్ అధికారులు ప్రారంభించారు. -
దేవీ మాతకు ఘనంగా వీడ్కోలు
నిజామాబాద్ రూరల్: నవరాత్రుల్లో విశేష పూజలు అందుకున్న దుర్గా మాత విగ్రహాల శోభాయాత్ర, నిమజ్జనోత్సవాలు నగరంలో ఘనంగా జరిగాయి. శనివారం మధ్యాహ్నం ప్రారంభమైన ఉత్సవాలు రాత్రి వరకు కొనసాగాయి. ప్రత్యేక పూజలు నిర్వహించి మహిళలు మంగళహారతులతో అమ్మవారికి వీడ్కోలు పలికారు. పిల్లలు, మహిళల నృత్యాలు, కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. మార్కండేయ మందిరం వద్ద దేవీ మాత శోభాయాత్రలో ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ ఈరవత్రి అనిల్, మానాల మోహన్రెడ్డి, నుడా చైర్మన్ కేశ వేణు, పద్మశాలి సంఘ నాయకులు పాల్గొన్నారు. -
హైవే పైనా ఆరబోత
● పంట దిగుబడులను పోస్తున్న రైతులు ● కల్లాలు లేకపోవడంతో తప్పని పరిస్థితిబాల్కొండ: ఆరుగాలం శ్రమించి పండించిన పంటల దిగుబడులకు అకాల వర్షాలు వెంటాడుతుండటంతో అన్నదాతలు హైవే పై కూడ ఆరబెడుతున్నా రు. బాల్కొండ మండలం శ్రీరాంపూర్ నుంచి మెండోరా మండలం దూదిగాం వరకు గల జాతీయ ర హదారి 44 పై రైతులు మక్కలను ఆరబెట్టారు. దీంతో ఎవుసం హైవే ఎక్కుతుందని అన్నదాతలే ఆవేదన చెందుతున్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారి నా రైతులకు సీసీ కల్లాలను అందించడంలో వి ఫ లం చెందుతున్నాయి. దీంతో రైతులు తారు రోడ్లనే కల్లాలు చేసుకుని మక్కలను ఆరబెడుతున్నా రు. గత కొంత కాలంగా వర్షాలు నిరంతరం కురవడంతో అన్నదాతలు పండించిన పంట నీటి పాలైంది. ప్రస్తుతం తుపాన్ హెచ్చరిక ఉండటంతో అన్నదాతల గుండెల్లో రైళ్లు పరు గెడుతున్నాయి. దీంతో అధికంగా మక్కలను నూర్పిళ్లు చేసి రోడ్లపై ఆరబెట్టారు. జాతీయ రహదారి పై వాహనాలు అతివేగంగా వెళ్తాయి. అలాంటి సందర్భంలో రైతులు ప్రమాదాలకు గురయ్యే ప్రమాదం ఉంది. ప్రభుత్వాలు సబ్సిడీపై సిమెంట్ కల్లాలను మంజూ రు చేస్తే ఇలాంటి పరిస్థితి ఉండదని రైతులు అంటున్నారు. ఉపాఽధి హామీ పథకంలో గతంలో సిమెంట్ కల్లాలను మంజూరు చేశారు. అయితే నిబంధన ల ప్రకారం కొలతలు చిన్నగా ఉండటంతో రైతులు ఆసక్తి చూపలేదు. రైతులకు అనుగుణంగా కొలతలు ఉంటే ఆసక్తి చూపేవారమంటున్నారు. ప్రభు త్వం స్పందించి సిమెంట్ కల్లాలను నిర్మించాలని రైతులు కోరుతున్నారు. తారు రోడ్లపై మక్కల సీజన్ నుంచి యాసంగిలో వరి ధాన్యం పంట దిగుబడులు ఆరబెట్టే వరకు అంటే మే నెల వరకు తారు రోడ్లు పంట దిగుబడులతో నిండిపోతుంటాయి. ప్రభుత్వాలు చర్యలు తీసుకుని వెంటనే సిమెంట్ కల్లాలు మంజూరు చేయాలని రైతు లు వేడుకుంటున్నారు. కల్లాలులేకనే రోడ్లపై ఆరబెడుతున్నాం అనుకూలంగా కల్లాలు లేక పోవడం వలనే హైవే రోడ్డుపై పంట దిగుబడులను ఆరబెడుతున్నాం. వాతావరణం కూడ రైతులను సతాయిస్తుంది. ప్రభుత్వాలు స్పందించి సిమెంట్ కళ్లాల మంజూరు చేయాలి. – శ్రీనివాస్, రైతు, శ్రీరాంపూర్ -
యోగాసనం.. అల్లాహ్ ఉచ్చారణ
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: యోగా చేయడాన్ని మొదట వ్యతిరేకించినవారే, ఇప్పుడు అవగాహనతో చేస్తున్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటూ ఉత్సాహంగా ముందుకు వస్తున్నారు. నిజామాబాద్ నగరంలోని అర్సపల్లిలో 2000 సంవత్సరంలో ‘యోగా రత్న’ ఎక్కొండ ప్రభాకర్ ఆధ్వర్యంలో మొదలైన ‘మైనారిటీ యోగా కేంద్రం’ ప్రత్యేకంగా నిలుస్తోంది. 25 సంవత్సరాల కిత్రం అర్సపల్లి ఐటీఐ కళాశాల ప్రాంగణంలో ఈ మైనారిటీ యోగా కేంద్రాన్ని మొదలుపెట్టారు. ప్రస్తుతం దీన్ని నాలెడ్జ్ పార్క్ స్కూల్లో నిర్వహిస్తున్నా రు. ప్రతిరోజూ యోగా చేస్తుండడంతో తామంతా అనేక దీర్ఘకాలిక వ్యాధుల నుంచి చాలావరకు స్వాంతన పొందుతున్నట్లు సీనియర్ సిటిజన్స్ చెబుతున్నారు. మొదట్లో ముస్లిం మైనారిటీ సమాజంలోని కొందరి నుంచి వ్యతిరేకత వచ్చినప్పటికీ తర్వాత అవగాహన వచ్చి కేంద్రాన్ని విజయవంతంగా నడుపుతున్నారు. అయితే యోగాసనాలు వేసే సమయంలో ఓంకారానికి బదులు అల్లాహ్ అని ఉచ్చారణ చేస్తున్నారు. ఇక్కడ విశేషమేమిటంటే ఈ కేంద్రంలో యోగా చేస్తున్నవారిలో రామాయణం, మహాభారతం, భాగవతం, భగవద్గీత తదితర పురాణాల గురించి అనర్గళంగా చెప్పేవారుండడం. -
ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలి
● ఎన్నికల సిబ్బందికి జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి దిశానిర్దేశం ● రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులకు శిక్షణ తరగతులు నిజామాబాద్అర్బన్: ఎన్నికల విధుల పట్ల పరిపూ ర్ణ అవగాహన కలిగి ఉండాలని, స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో, సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులకు సమీకృత జిల్లా కార్యాలయాల స ముదాయ సమావేశ మందిరంలో శనివారం శిక్షణ తరగతులు నిర్వహించారు. నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, ఉపసంహరణ, అభ్యర్థుల తుది జాబితా ప్రకటన, పోటీలో ఉన్న అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు, ఏజెంట్ల నియామకం, పోస్టల్ బ్యాలెట్ తదితర అంశాలపై మాస్టర్ ట్రైనర్లచే అవగాహన కల్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణ కోసం ముందస్తుగానే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసుకోవాలన్నారు. ఎలాంటి వివాదాలు, తప్పిదాలకు తావులేకుండా ఎన్నికల విధులను పారదర్శకంగా నిర్వర్తించాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో రిట ర్నింగ్ అధికారులు క్రియాశీల పాత్ర పోషించాల్సి ఉంటుందన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటనను అనుసరిస్తూ ఆర్వోలు నోటిఫికేషన్ జారీ చేసి, ఆ రోజు నుండే ప్రాదేశిక నియోజకవర్గ స్థానాల ఎన్నిక కోసం నామినేషన్లు స్వీకరించాల్సి ఉంటుందని తెలిపారు. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియకు సంబంధించి నోటిఫికేషన్ లో స్పష్టంగా వివరాలను పొందుపర్చాలన్నారు. నామినేషన్ల స్వీకరణ, స్క్రూటినీ, ఉపసంహరణ ప్రక్రియలను మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్వహించాలని, సమయ పాలనను పక్కాగా పాటించాలన్నారు. నామినేషన్ల దాఖలు సమయంలో అభ్యర్థి సహా ముగ్గురిని మాత్రమే లోనికి అనుమతించాలన్నారు. నామినేషన్ల ఉపసంహరణ కోసం అభ్యర్థులు కాకుండా, వారి తరఫున ప్రతిపాదకులు వచ్చిన సమయంలో మరిన్ని జాగ్ర త్తలు తీసుకోవాలని, ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తరువాతే ఉపసంహరణకు అనుమతించా లని కలెక్టర్ సూచించారు. బ్యాలెట్ పేపర్లో అభ్యర్థుల పేర్లను తెలుగు అక్షర క్రమం ఆధారంగా వరుసగా ముద్రించాల్సి ఉంటుందని అన్నారు.. అభ్య ర్థులు ఎన్ని సెట్ల నామినేషన్లు సమర్పిస్తే, అన్ని నామినేషన్ల దరఖాస్తులను తప్పనిసరిగా పరిశీలించాలని, వాటిలో ఎన్ని ఆమోదించబడ్డాయి, ఎన్ని తిరస్కరణకు గురయ్యాయి, అందుకు గల కారణా లు ఏమిటీ అనే అంశాలను వెల్లడించాల్సి ఉంటుందన్నారు. అభ్యర్థులు నామినేషన్లు సరైన పద్ధతిలో సమర్పించేలా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలన్నా రు. ఆర్వో, ఏఆర్వోల సందేహాలను నివత్తి చేసేందుకు వీలుగా జెడ్పీ సీఈవో కార్యాలయంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సంబంధిత వెబ్ సైట్లో అభ్యర్థుల నామినేష న్ పత్రాలను స్కాన్ చేసి అప్లోడ్ చేయాలని సూచించారు. అదనపు కలెక్టర్ అంకిత్, జెడ్పీ సీఈవో సాయాగౌడ్, డిప్యూటీ సీఈవో సాయన్న, డీఈవో అశోక్, హౌసింగ్ పీడీ పవన్ కుమార్ పాల్గొన్నారు. -
ఇప్పటివరకు 24 యోగా కేంద్రాలు..
ఖర్చు లేకుండా ఆరో గ్యం అందించాలనే లక్ష్యంతో యోగా కేంద్రాలు పెంచుకుంటూ వస్తున్నాం. ప్రస్తుతం 24 యోగా కేంద్రాలు నిర్వహిస్తున్నాం. యోగాతో అనేక వ్యాధులకు పరిష్కారం అభిస్తుంది. దీంతో పాటు ఆయుర్వేదం వాడితే ఎన్నో వ్యాధులు నయమవుతాయి. తుది శ్వాస వరకు యోగా, ఆయుర్వేదం ద్వారా సేవ చేసేందుకు నిర్ణయించుకున్నా. మైనారిటీ యోగా కేంద్రం నాకు అత్యంత ప్రత్యేకం. వీళ్లంతా నున్ను గురువుగా భావించి యోగా చేస్తున్నారు. దీంతో మరింతమంది నేర్చుకునేందుకు వస్తున్నారు. – ఎక్కొండ ప్రభాకర్, శిక్షకులు, యోగా రత్న అవార్డు గ్రహీత -
రాష్ట్రస్థాయి ట్రెక్కింగ్ శిక్షణ పూర్తి
డిచ్పల్లి: మండలంలోని రాంపూర్ ఉన్నత పాఠశాల 9వ తరగతి చదువుతున్న విద్యార్థు లు బి అభినయ్, ఎం అక్షయ్ (ఎన్సీసీ కేడెట్లు) రాష్ట్రస్థాయి ట్రెక్కింగ్ శిబిరంలో శిక్షణ తరగతులను విజయవంతంగా పూర్తి చేసినట్లు ఎన్సీసీ అధికారి, సెకండ్ ఆఫీసర్ శ్రీనివాస్ ఖత్రి ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతిలో సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 2 వరకు శిక్షణ శిబిరం కొనసాగిందన్నారు. శిక్షణ పూర్తి చేసుకుని పాఠశాలకు వచ్చిన విద్యార్థులను ఇన్చార్జి హెచ్ఎం మాధవ్ సర్టిఫికెట్లను అందజేసి అభినందించారు. బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లోకి ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు తగ్గుముఖం ప ట్టింది. శనివారం ఉదయం నుంచి క్రమంగా త గ్గుతూ సాయంత్రానికి 60 వేల క్యూసెక్కులకు పడిపోయింది. దీంతో వరద గేట్ల ద్వారా గోదావరిలోకి నీటి విడుదలను ప్రాజెక్ట్ అధికారులు తగ్గించారు. 9 వరద గేట్ల ద్వారా 25 వేల క్యూ సెక్కుల నీటి విడుదల జరుగుతుంది. కాకతీ య కాలువ ద్వారా 4 వేల క్యూసెక్కులు, ఎస్కె ప్ గేట్ల ద్వారా 4 వేల క్యూసెక్కులు, సరస్వతి కాలువ ద్వారా 650 క్యూసెక్కులు, లక్ష్మికాలువ ద్వారా 200 క్యూసెక్కుల నీటి విడుదల జరుగుతుంది. తాగు నీటి అవసరాల కు మిషన్భగీరథ ద్వారా 231 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 691 క్యూసెక్కుల నీరు పోతుంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి మట్టం 1091(80.5 టీఎంసీలు) అడుగులు కాగా ప్రస్తుతం 1090.90 ( 80 టీఎంసీలు) అడుగుల నీటిమట్టం ఉందని ప్రాజెక్ట్ అధికారులు పేర్కొన్నారు. బాల్కొండ: ఇంటి నిర్మాణాల కోసం ఇసుక తిప్పలు ఎక్కువయ్యాయి. దీంతో వాగులు, వంకలు కాకుండ ఏకంగా గోదావరి నుంచే ఇసుకును తరలిస్తున్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ వరద గేట్ల ముందర గోదావరి నుంచి ఇసుకను తీస్తు కుప్పలు వేస్తున్నారు. అనంతరం కుప్పలను తరలిస్తున్నారు. ప్రస్తుతం వర్షాలు అధికంగా కురవడంతో వాగుల నుంచి ఇసుకను తీసే అవకాశం లేదు. అంతేకాకుండ ఇసుక తరలింపునకు అనేక అనుమతుల అవసరం ఉండటంతో కనీసం ఇందిరమ్మ లబ్ధిదారులకు కూడ ఇసుక లభించడం లేదు. దీంతో కొందరు వ్యాపారులు గోదావరి నుంచి ఇసుకను తీస్తూ, వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఈక్రమంలో ఇసుకను అధిక ధరలకు విక్రయిస్తున్నారు. అయినా అధికారులెవరూ పట్టించుకోవడం లేదని పలువురు పేర్కొంటున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి గోదావరిలో ఇసుక తరలింపు పక్కదారి పట్టకుండ చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. -
ఆపన్న హస్తం అందించరూ!
● ఆర్మూర్కు చెందిన శాంతిలాల్కు ఫెయిలైన కిడ్నీలు ● వైద్యం కోసం రూ.లక్షల్లో ఖర్చు ● దాతలు ఆదుకోవాలంటూ కుటుంబీకుల వేడుకోలు ఆర్మూర్టౌన్: ఆర్మూర్కు చెందిన కల్యాణి పట్టణంలోని హెడ్ పోస్ట్ఆఫీస్లో కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తుంది. ఆమె భర్త దేదావత్ శాంతిలాల్ రెండు కిడ్నీలు చెడిపోవడంతో గత రెండేళ్లుగా నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందాడు. వైద్యానికి ఇంకా రూ.లక్షల్లో అవసరం ఉండగా పేదరికం కారణంగా స్థానిక ఏరియా ఆస్పత్రిలో ఒకరోజు విడిచి మరోజు డయాలసిస్ చేసుకుంటున్నాడు. ప్రస్తుతం ఏ పని చేయలేపోతున్నారు. కాగ కల్యాణి చిన్న కాంట్రాక్టు ఉద్యోగం చేస్తూ వచ్చిన జీతంతో కుటుంబాన్ని పోషిస్తుంది. భర్త వైద్యం కోసం చేసిన అప్పులు పేరుకుపోయాయి. కుటుంబానికి ఎలాంటి ఆసరా లేకపోవడం, పేదరికం కారణంగా అప్పులు తీర్చలేక, భర్తకు మెరుగైన వైద్యం అందించలేకపోతుంది. ఎవరైన దాతలు ముందుకువచ్చి తన భర్తను కాపాడాలని వేడుకుంటున్నారు. ఆర్థిక సహాయం అందించాలనుకునే వారు ఫోన్పే నంబర్: 9121744642కు చేయాలని కోరుతున్నారు. -
ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయించాలి
● కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ● నగరంలోని దుబ్బ ప్రాంతంలో ఇందిరమ్మ ఇళ్ల పనుల పరిశీలన నిజామాబాద్అర్బన్: జిల్లా కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయించాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని దుబ్బ ప్రాంతంలో శనివారం ఆయన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను క్షేత్రస్థాయి లో పరిశీలించారు. పునాది దశ వరకు నిర్మాణ పను లు పూర్తి చేసుకున్న లబ్ధిదారులను కలిసి, వారికి మొదటి విడత బిల్లు మంజూరు అయ్యిందా అని ఆరా తీశారు. పనులు ప్రారంభించని లబ్ధిదారుల తో మాట్లాడి, కారణాలు అడిగి తెలుసుకున్నారు. ల బ్ధిదారుల ఎంపిక, మంజూరు ప్రక్రియలలో జాప్యానికి తావు లేకుండా చూడాలన్నారు. ఆర్థిక స్తోమత లేని లబ్ధిదారులకు మెప్మా ఆధ్వర్యంలో బ్యాంకు లింకేజీ కింద రుణం అందించేలా చొరవ చూపాలని అన్నారు. ఇళ్ల నిర్మాణాలకు ఏమైన ఇబ్బందులు ఉంటే వాటిని పరిష్కరించుకుంటూ ముందుకెళ్లాలని, నిర్ణీత లక్ష్యానికి అనుగుణంగా పూర్తిస్థాయిలో ఇళ్ల నిర్మాణాలు జరిగేలా కృషి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. తాను తదుపరి తనిఖీలు జరిపే సమయానికి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలలో స్పష్టమైన పురోగతి కనిపించేలా అంకిత భావంతో కృషి చేయాలన్నారు. అనంతరం దుబ్బ ప్రాంతంలోని అభయహస్తం కాలనీని కలెక్టర్ సందర్శించారు. ప్రభుత్వ అసైన్డ్ భూమిని పరిశీలించి, హద్దులను నిర్ధారించాలని రెవెన్యూ, మున్సిపల్ అధికారులను ఆదేశించారు. నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, హౌసింగ్ పీడీ పవన్ కుమార్, డీఈ నివర్తి, మున్సిపల్ టౌన్ ప్రాజెక్టు అధికారి రమేష్, నార్త్ తహసీల్దార్ విజయ్ కాంత్ ఉన్నారు. -
ఎన్నికల విధులపై అవగాహన ఉండాలి
నిజామాబాద్ రూరల్: ఎన్నికల విధులపై సిబ్బంది పూర్తి అవగాహన కలిగి ఉండాలని జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ఽ సూచించారు. నగరంలోని రాజీవ్గాంధీ ఆడిటోరియంలో శనివారం రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో, సమర్థవంతంగా నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన అధికారులకు నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, ఉపసంహరణ, అభ్యర్థుల తుది జాబితా ప్రకటన, పోటీలో ఉన్న అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు, ఏజెంట్ల నియామకం, పోస్టల్ బ్యాలెట్ తదితర అంశాలపై మాస్టర్ ట్రైనర్లతో అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డీఎల్పీవోలు, ఆర్వోలు, ఏఆర్వోలు పాల్గొన్నారు. -
మెజార్టీ స్థానాలు గెలుపొందాలి
● ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైన కాంగ్రెస్ ● బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి డిచ్పల్లి: త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ స్థానాలను బీజేపీ అభ్యర్థులు గెలుచుకునేలా పార్టీ కార్యకర్తలు కృషి చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి పిలుపునిచ్చారు. శనివారం డిచ్పల్లి మండల కేంద్రంలోని ఎస్ఎల్జీ గార్డెన్స్లో బీజేపీ మండల కమిటీ సర్వసభ్య సమావేశంలో ఆ యన ముఖ్యఅతిథిగా హాజరై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త ఒక సైనికుడిలాగా అంకితభావంతో పని చేయాలన్నారు. వార్డులు, గ్రామాలు, మండలంలో బీజేపీ అభ్యర్థులను గెలిపించుకుంటేనే పార్టీ బలోపేతం అవుతుందన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైన కాంగ్రెస్ పార్టీని స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓడించేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని దినేష్ పటేల్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగుల లక్ష్మీనారాయణ, పార్లమెంట్ కన్వీనర్, మాజీ ఎంపీపీ గద్దె భూమన్న, పార్టీ మండల అధ్యక్షుడు కర్ని చంద్రకాంత్, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు పానుగంటి సతీష్రెడ్డి, సీనియర్ నాయకులు వెంకటరమణ, శ్యాంరావు, సతీష్రావు, శ్రీనివాస్గౌడ్, చౌకి లక్ష్మణ్, విఠల్, సురేష్, విష్ణు, నారాయణరెడ్డి, గాండ్ల లక్ష్మీనారాయణ, పరుశురాం, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జెడ్పీపై కాషాయ జెండా ఎగురవేయబోతున్నాం .. నిజామాబాద్ రూరల్: జిల్లా పరిషత్పై కాషాయ జెండా ఎగురవేయబోతున్నామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి ధీమా వ్యక్తం చేశారు. శనివారం జిల్లా పార్టీ కార్యాలయంలో రూరల్ మండల కార్యకర్తల సమావేశంతోపాటు మోపాల్ మండల కార్యకర్తల సమావేశం నర్సింగ్పల్లి గ్రామ శివారు ఎస్ఆర్ఎస్ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అ నుసరించాల్సిన వ్యూహాలు, విజయానికి కృషి చే యాల్సిన విధానాలపై ఆయన కార్యకర్తలకు మార్గనిర్దేశం చేశారు. సమావేశంలో పద్మరెడ్డి,జగన్ రెడ్డి, చింత శ్రీనివాస్ రెడ్డి, రవి,గోపి,బిలోజి నాయక్, ఆనంద్, సందీప్, మోపాల్ మండల ఇంచార్జి ప్రమోద్ కుమార్ మండలపార్టీ అద్యక్షుడు శాశంక్ రెడ్డి, సీనియర్ నాయకులు రవి,బోడ మహెంధర్, శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
బాత్రూమ్లో జారిపడి మహిళా కండక్టర్ మృతి
క్రైం కార్నర్బాన్సువాడ: ప్రమాదవశాత్తు బాత్రూమ్లో జారిపడి మహిళ కండక్టర్ మృతిచెందినట్లు సీఐ అశోక్ తెలిపారు. వివరాలు ఇలా.. పిట్లం మండలం కారేగాంకు చెందిన బేగరి సాయవ్వ(49) ఆర్టీసీలో కండక్టర్గా విధులు నిర్వహిస్తోంది. ఆమె భర్త కొన్నేళ్ల క్రితమే మృతిచెందగా, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. కుమార్తెలకు పెళ్లిళ్లు అయిపోగా, కుమారుడితో కలిసి కొన్ని నెలలుగా బాన్సువాడ పట్టణంలోని సంగమేశ్వర కాలనీలో నివాసముంటుంది. శుక్రవారం రాత్రి బాత్రూమ్కు వెళ్లిన సాయవ్వ ప్రమాదవశాత్తు జారిపడిపోయింది. ఈ ఘటనలో తలకు తీవ్ర గాయం కావడంతో వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి, అప్పటికే మృతిచెందినట్లు తెలిపారు. మృతురాలి కుమారుడు బేగరి సాయిచరణ్తేజ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. చెరువులో పడి ఒకరు.. రాజంపేట: చెరువులో ప్రమాదవశాత్తు నీటమునిగి ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన రాజంపేట మండలం పొందూర్తి గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్సై రాజు, కుటంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా.. పొందూర్తి గ్రామానికి చెందిన తుడం భూపాల్ (38)కు వివాహం జరుగగా, కొన్నేళ్ల క్రితమే భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. పిల్లలు లేరు. దీంతో భూపాల్ మద్యానికి బానిసయ్యాడు. అప్పుడప్పుడు జంగంపల్లి చెరువులో చేపలు పడుతూ తిరిగేవాడు. తరచూ ఇంట్లో చెప్పకుండ వెళ్లిపోయి రెండు, మూడు రోజుల వరకుతిరిగివచ్చేవాడు కాదు. ఈక్రమంలో సెప్టెంబర్ 30న ఇంట్లో ఎవరికి చెప్పకుండా వెళ్లిపోయాడు. శనివారం ఉదయం జంగంపల్లి చెరువులో ఓ వ్యక్తి మృతదేహం కనిపించగా, స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటన స్థలానికి చేరుకొని వివ రాలు సేకరించారు. మృతుడిని భూపాల్గా గుర్తించి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. భూపాల్ కాళ్లకు వల చుట్టుకొని ఉండటంతో చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో పడి వల చుట్టు కోవడంతో మృతిచెందినట్లు పేర్కొన్నారు. మృతుడి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమో దు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్సై తెలిపారు. రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి.. భిక్కనూరు: మండలంలోని బస్వాపూర్ గ్రామంలోని జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందినట్లు భిక్కనూరు ఎస్సై అంజనేయులు శనివారం తెలిపారు. బస్వాపూర్లోని హైవేపై ఉన్న జైకా హోటల్ దగ్గర గుర్తుతెలియని వ్యక్తిని గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు ఎస్సై వివరించారు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించామన్నారు. -
ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు
సాక్షి నెట్వర్క్: జిల్లాలోని పలు ప్రాంతాల్లో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆ ర్మూర్, బాల్కొండ, బోధన్ నియోజకవర్గాల్లోని ప లు గ్రామాల్లో దసరా మరుసటి రోజు సద్దుల బతుకమ్మ నిర్వహించడం ఆనవాయితీ. కానీ ఈసారి దసరా మరుసటి రోజు శుక్రవారం రావడంతో సద్దుల బతుకమ్మ వేడుకలను శనివారం జరుపుకున్నారు. ఈసందర్భంగా ఆయా గ్రామాల్లో మహిళలు, యువతులు ఉదయం రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చారు. సాయంత్రం గ్రామ కూడళ్లలో బతుకమ్మలను ఏర్పాటు చేసి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతం మహిళలు, యువతులు, చిన్నారులు వాటి చుట్టూ తిరుగుతూ బతుకమ్మ పాటలు పాడుతూ నృత్యం చేస్తూ సందడి చేశారు. అనంతరం బతుకమ్మలను ప్రజలందరూ ఊరేగింపుగా తీసుకెళ్లి, స్థానిక చెరువులు, కుంటల్లో భక్తిశ్రద్ధలతో నిమజ్జనం చేశారు. ముప్కాల్ మండల కేంద్రంలో నిర్వహించిన సద్దుల బతుకమ్మ వేడుకల్లో అరుణోదయ విమలక్క పాల్గొన్నారు. తెలంగాణలో బతుకమ్మ పండుగ అంటే ఆడ పడుచుల పండుగ అని ఆమె పేర్కొన్నారు. -
వైద్య సేవలు, టీకాలు సకాలంలో అందించాలి
● డీఎంహెచ్వో రాజశ్రీ ● నగరంలో ప్రజారోగ్య సంక్షేమ కార్యక్రమాలపై సమీక్ష నిజామాబాద్ నాగారాం: ప్రజలకు సకాలంలో వైద్య సేవలు, వ్యాధి నిరోధక టీకాలు అందించాలని డీఎంహెచ్వో రాజశ్రీ అన్నారు. నగరంలో శనివారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బందితో వివిధ ప్రజారోగ్య సంక్షేమ కార్యక్రమాలపై ఆమె సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా డీఎంహెచ్వో మాట్లాడుతూ.. మాతా, శిశు ఆరోగ్య సేవలు, వ్యాధి నిరోధక టీకాలు సకాలంలో అందించడం. సీజనల్ వ్యాధులు, కీటకజనిత వ్యాధులను వ్యాప్తి చెందకుండా నియంత్రించడం. డెంగీ పాజిటివ్ గుర్తించబడిన ప్రాంతాలలో దోమల నివారణ చర్యలు సహా పలు అంశాలపై చర్చించారు. రాష్ట్రీ య బాల స్వస్థ కార్యక్రమంలో భాగంగా ప్రతి టీం సంవత్సరంలో రెండు సార్లు ప్రతి అంగన్వాడీ కేందంలో, ప్రతి పాఠశాలలో విద్యార్థులందరికీ వైద్య పరీక్షలు నిర్వహించాలన్నారు. నూతనంగా నిర్మించిన పల్లె దవాఖానాలను త్వరగా ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. టీబి ముక్తభారత్లో భాగంగా గ్రామాల్లో నిర్వహిస్తున్న శిబిరాలను విజయవంతం చేసేలా ప్రతి ఒక్క సిబ్బంది పాల్గొనాలన్నారు. ప్రయివేట్ ఆస్పత్రులన్నీ అన్ని అనుమతులు పొందిన తర్వాతనే వైద్య సేవలు అందించాలన్నారు. స్కానింగ్ సెంటర్లు లింగ నిర్ధారణ పరీక్షలు చేయరాదని, చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. డీటీసీవో దేవీ నాగేశ్వరి, డిప్యూటీ డీఎంహెచ్వోలు రమేష్, సమత, అశోక్, తుకారాం రాథోడ్, రాజు, శ్వేత, భార్గవి, వెంకటేష్, శిఖర తదితరులు పాల్గొన్నారు. -
మహిళలకు అండగా, అందుబాటులో షీటీమ్
● నవరాత్రి ఉత్సవాల్లో 19 ఈవ్టీజింగ్ కేసులు నమోదు ● సీపీ పోతరాజు సాయిచైతన్య ఖలీల్వాడి: మహిళలు, బాలికలకు అండగా నిజామాబాద్ షీటీమ్ 24 గంటలు అందుబాటులో ఉంటూ సేవలందిస్తుందని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య శనివారం తెలిపారు. దుర్గా నవరాత్రి ఉత్సవాలలో రాత్రి సమయాల్లో మహిళలను ఆకతాయిలు వేధించగా 19 కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. గత నెలలో జిల్లా వ్యాప్తంగా షీటీం బృందాలు యువతులకు, విద్యార్థులకు, పని స్థలాలలో మహిళలకు ప్రత్యేకంగా 26 అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, చైతన్యపరిచినట్లు పేర్కొన్నారు. సెప్టెంబర్ నెలలో షీటీం బృందాల ద్వారా 11 ఈ–పెట్టీ కేసులు నమోదు చేశామని తెలిపారు. అలాగే జిల్లా వ్యాప్తంగా 80 హాట్ స్పాట్లను తనిఖీ చేశామని, పలు గ్రామాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని పేర్కొన్నారు. ఏడుగురికీ కౌన్సెలింగ్ ద్వారా కేసులలో పరిష్కారం చూపబడిందన్నారు. ఎవరైనా షీటీమ్ బృందాలను సంప్రదించాలంటే 87126 59795ను సంప్రదించాలన్నారు. -
యథేచ్ఛగా అక్రమ నియామకాలు!
నిజామాబాద్అర్బన్: జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖలో అక్రమ నియామకాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. ఏజెన్సీతో కుమ్మకై న ఇద్దరు అధికారులు నియమ, నిబంధనాలను తుంగలో తొక్కి ఈ అక్రమ నియామకాలు కొనసాగిస్తున్నారు. నిరుద్యోగుల నుంచి రూ.లక్షల్లో డబ్బులు వసూలు చేస్తూ, అర్హులకు అన్యాయం చేస్తూ ఉద్యోగాలను అమ్ముకుంటున్నారు. ఈ వ్యవహరం గత కొనేళ్లుగా సాగుతోందని సమాచారం. ఇటీవల పలు ఉద్యోగాలకు దరఖాస్తు చేసిన వారు అర్హత ఉండి ఉద్యోగం రాలేదని అనుమానంతో ఆరా తీయగా ఈ అక్రమాల నియామకాలు వెలుగులోకి వచ్చాయి. ఇదీ పరిస్థితి.. మైనారిటీ సంక్షేమ శాఖలో అవుట్సోర్సింగ్ పద్ధతిలో కళాశాలలో, పాఠశాలలో బోధన, బోధ నేతర సిబ్బందిని అవసరం మేర నియమించేందుకు అవకాశం ఉంది. సంబంధిత శాఖకు అగ్రిమెంట్ అయి ఉన్న అవుట్సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా నియామకాలు జరుపుతారు. అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించి, తుది నివేదికను సిద్ధం చేసి అర్హులకు ఉద్యోగం కల్పించాల్సి ఉంది. కానీ ఇది కూడా క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. ● కొన్ని రోజుల క్రితం జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖలో ఓ ఉద్యోగి ఔటోసోర్సింగ్లో నియమించబడ్డాడు. ఎలాంటి పేపర్ నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. దరఖాస్తులు స్వీకరించలేదు. ఎంప్లాయిమెంట్ కార్యాలయంలో నమోదు కూడ చేసుకోలేదు. ఓ అధికారి ఖాళీ పోస్టు భర్తీ కోసం మరో అధికారికి లేఖ పంపి ఔట్సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా నియామకం చేపట్టారు. సదరు అభ్యర్థి నుంచి రూ.1,50,000 వసూలు చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఇద్దరు అధికారులు ఒక ఔట్సోర్సింగ్ ఏజెన్సీ నిర్వాహకుడు వాటాలుగా పంచుకున్నారని తెలిసింది. ● మే నెలలో ఓ అవుట్సోర్సింగ్ ఉద్యోగిని ఎలాంటి నోటిస్ లేకుండానే తొలగించారు. కానీ సదరు ఉద్యోగికి సంబంధించిన వేతనాన్ని రూ.45000 ఓ అధికారి వాడుకున్నారు. ఈ విషయమై బాధితుడు ప్రశ్నిస్తే ఇదే స్థానంలో మరొక పనికి డబ్బులు వాడినట్లు తెలిసింది. వాస్తవానికి ఒక ఉద్యోగి వేతనాన్ని అనుమతి లేకుండా వాడుకునే నిబంధన లేనేలేదు. ● కొన్ని రోజుల క్రితం అవుట్సోర్సింగ్ పద్ధతిన జూనియర్ లెక్చరర్ నియామకాలు చేపట్టారు. ఇందులో ఓ అభ్యర్థికి మూడు సంవత్సరాల అనుభవం, పీజీ పూర్తి చేసి ఉండగా, ఈమెను కాదని కేవ లం బీఈడి చేసి రెండు సంవత్సరాల అనుభవం ఉన్న మరో అభ్యర్థికి ఉద్యోగం కల్పించారు. ఇందులో ఓ అధికారి సుమారు లక్షల రూపాయలు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ● గత నియామకాలకు సంబంధించి కామారెడ్డి జిల్లాకు చెందిన ఇద్దరు అభ్యర్థులు అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోకున్నా.. వారిని జిల్లాలోని నాగారం ప్రాంతంలో జూనియర్ లెక్చరర్గా నియమించారు. దీనిపై జిల్లాకు చెందిన ఓ యువతి సమాచార హక్కు చట్టం కింద వివరణ కోరగా నేటికీ సమాచారం ఇవ్వడం లేదు. ● అంతేకాక గత జులైలో నిర్వహించిన జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీలో దరఖాస్తు సమయానికి నిరుద్యోగులు దరఖాస్తులు ఇవ్వలేదు. కానీ ఇద్దరిలో ఒకరిని బోధన్లో మరొకరిని నాగారంలో నియమించారు. ఇందులో కార్యాలయంలో పనిచేసే ఉద్యోగి కీలకపాత్ర పోషించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలాగే ఏజెన్సీల నిర్వహణపై అధికారం ఉన్న మరో ఉద్యోగి సహకరించినట్లు తెలుస్తోంది. ● మైనార్టీ సంక్షేమ శాఖలో ఎక్కడైన పోస్టు ఖాళీగా ఉంటే, భర్తీ కోసం ఉద్యోగి కావాలని శాఖ అధికారులు ఉపాధి కల్పన శాఖ అధికారికి నివేదిస్తున్నారు. దానిని సంబంధిత ఏజెన్సీకి సమాచారం అందిస్తున్నారు. ఉపాధి కల్పన అధికారి ఏజెన్సీ నుంచి ఉద్యోగిని కోరుతున్నట్లు మరో నివేదిక ఇస్తున్నారు. ఇలా ముగ్గురు కలిసి తమకు సంబంధించిన వ్యక్తిని నియమించుకుంటారు. ఉద్యోగం పొందిన వ్యక్తి నుంచి ఏజెన్సీ నిర్వాహకులు డబ్బులు వసూలు చేసి ఇద్దరు అధికారులకు వాటాలు పంచుతున్నారు. ఇలా ఇప్పటివరకు 20 నుంచి 30 వరకు ఉద్యోగాలను నిబంధనలకు విరుద్ధంగా కల్పించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి అక్రమ నియామకాలపై క్షేత్రస్థాయిలో విచారణ జరిపి అర్హులకు న్యాయం చేయాలని పలువురు కోరుతున్నారు.ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే నియామకాలు జరుగుతున్నాయి. మేము కేవలం దరఖాస్తుల పరిశీలన చేసి పంపుతాము. ఇప్పటి వరకు జరిగిన నియామకాలు సక్రమంగానే జరిగాయి. కొందరు ఉద్యోగ నియామకాల్లో అక్రమలు జరిగినట్లు ఫిర్యాదులు చేశారు. వాటిపై విచారణ జరిపి, తగిన చర్యలు తీసుకుంటాం. – కృష్ణవేణి, జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారిణిమైనారిటీ శాఖలో అక్రమ నియామకాలపై విచారణ జరపాలి. సదు నియామకాలపై సమాచారం అడిగితే సంబంధిత శాఖ వారు స్పందించడం లేదు. నిరుద్యోగుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసి ఉద్యోగాలు కల్పిస్తున్నారు. అర్హులకు అన్యాయం చేస్తున్నారు. ఉన్నత స్థాయి విచారణ జరిపితే అక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. – రాజేశ్వర్, పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి మైనారిటీ సంక్షేమ శాఖలో అధికారులు, ఏజెన్సీ నిర్వాహకుడి దందా డబ్బులు ఇచ్చిన అభ్యర్థులకే ఉద్యోగాలు అర్హులకు అన్యాయం చేస్తున్న వైనం -
అలయ్ బలయ్లో చుక్కాపూర్ కళాకారుల ధూంధాం
మాచారెడ్డి: హైదరాబాద్లో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ నిర్వహించిన అలయ్ బలయ్ కార్యక్రమంలో చుక్కాపూర్ గ్రామానికి చెందిన బేడ బుడగ జంగాల కళాకారులు ఆటపాటలతో ధూంధాం చేశారు. ఈ సందర్భంగా బేడ బుడగ జంగాల ప్రతినిధి లక్ష్మీపతి మాట్లాడుతూ.. తమ వంశీకులు చాపలు అల్లుతూ, బుర్రకథలు చెబుతూ జీవనం సాగిస్తున్నారని, ప్రభుత్వం గుర్తింపు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సర్టిఫికెట్లు కూఆ ఇవ్వడం లేదన్నారు. ఈ సందర్భంగా మంద కృష్ణ మాదిగ, బండారు దత్తాత్రేయ, కల్వంకుంట్ల కవిత, తదితరులను కలిసి తమ గోడును వినిపించినట్టు ఆయన తెలిపారు. నేతలు శంకర్, రవి, తదితరులున్నారు. -
ఆకుల లలితకు ‘జెడ్పీ’ అవకాశం ఇవ్వాలి
మాక్లూర్: మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రవిప్రకాష్ ఆధ్వర్యంలో పార్టీ నేతలు, ఆకుల లలిత హైదరాబాద్కు తరలివెళ్లి పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డిని కలిశారు. త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో జిల్లా పరిషత్ చైర్పర్సన్గా ఆకుల లలితకు అవకాశం కల్పించాలని కోరారు. మండలంలోని మానిక్భండార్కు చెందిన ఆకుల లలితను మాక్లూర్ జెడ్పీటీసీగా గెలిపించుకుంటామన్నారు. దీనిపై పీసీసీ అధ్యక్షుడు సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. ఇదే విషయమై బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డిని కూడా కలిసి, చర్చించినట్టు ఆ పార్టీ సీనియర్ నాయకులు ‘సాక్షి’తో చెప్పారు. నాయకులు ఎనుగంటి గంగాధర్గౌడ్, వెంకటేశ్వరరావు, జంగిడి సతీష్, అమరేందర్రావు, రాజేందర్, రాజేశ్వర్, లచ్చారెడ్డి, దయాకర్రావు నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ నాయకులు
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): మాసాన్పల్లి మాజీ సర్పంచ్ శ్రీనివాస్, లింగంపల్లికలాన్ మాజీ సర్పంచ్ తనయుడు నీరుడి రాజు శుక్రవారం బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరారు. వీరితోపాటు గోపాల్పేటకు చెందిన బీఆర్ఎస్ నాయకుడు బాబూరావు సైతం కాంగ్రెస్లో చేరారు. ఈ మేరకు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మదన్ మోహన్ వారికి కాంగ్రెస్ కండువాలను కప్పి ఆహ్వానించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కష్టపడి పనిచేయాలని, పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని ఆయన సూచించారు. కాంగ్రెస్ మండలాధ్యక్షుడు శ్రీధర్గౌడ్, తాండూర్ సొసైటీ చైర్మన్ గంగారెడ్డి, నాయకులు విక్రాంత్రెడ్డి, బాల్రెడ్డి, బండ బాబు, బన్సి తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్ నేత భిక్కనూరు: రామేశ్వర్పల్లికి చెందిన కాంగ్రెస్ నేత కేతి మధు శుక్రవారం బీఆర్ఎస్లో తన అనుచరులతో కలి సి చేరారు. బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి అత్తెల్లి శ్రీనివాస్ పార్టీలో చేరిన వారికి పార్టీ కండువాలు కప్పి స్వాగతించారు. ఈ సందర్భంగా కేతి మధు మాట్లాడుతూ.. రుణమాఫీ చేయడం, యూరియా సరఫరాలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని అందుకే పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరుతున్నానన్నారు. విండో చైర్మన్ నాగార్తి భూంరెడ్డి, నేతలు అందె మహేందర్రెడ్డి, ద్యావర సాయిరెడ్డి, అనంత్ గౌడ్, తక్కళ్ల రవీందర్ రెడ్డి, పోతిరెడ్డి, జిల్లెల రవీందర్రెడ్డి, నర్సారెడ్డి పాల్గొన్నారు. -
కామారెడ్డిలో ఇరువర్గాల మధ్య ఘర్షణ
● గాజు ముక్కతో దాడిలో నలుగురికి తీవ్ర గాయాలు! ● కత్తిపోట్లంటూ పట్టణంలో ప్రచారంకామారెడ్డి క్రైం: జిల్లా కేంద్రంలో పండుగపూట జరిగిన ఇరు వర్గాల మధ్య ఘర్షణ కలకలం సృష్టించింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. పట్టణంలోని సుభాష్ రోడ్లో ఉన్న శాస్త్రి దుర్గామా త మండపం వద్ద నిత్యం వందల సంఖ్యలో జనం దాండియా కార్యక్రమంలో పాల్గొంటారు. దసరా రోజున గురువారం సైతం భారీ సంఖ్యలో ప్రజలు దాండియాలో పాల్గొన్నారు. ఈక్రమంలో అర్ధరాత్రి సమయంలో కేతన్ అనే యువకుడు, అతని స్నేహి తుడైన బృందన్తో కలిసి ఓ చోట మూత్రవిసర్జనకు చేస్తుండగా ప్రణయ్, వరుణ్, షణ్ముఖంలు వచ్చి దూరంగా వెళ్లాలని వారించారు. కేతన్ సమాచారం ఇవ్వడంతో అతని అన్న ప్రపుల్ అక్కడకు వచ్చాడు. వాగ్వాదం జరిగి ఇరు వర్గాల మధ్య గొడవకు దారి తీయగా, ఇరువర్గాలకు చెంది న చాలా మంది అక్కడ పోగ య్యారు. వారిలో నుంచి సి ద్ధార్థ్ అనే యువకుడు గాజు ముక్కను తీసుకుని ప్రపుల్, రాహుల్, మణికంఠ, మణిరాజులపై దాడి చేశాడు. వెంట నే సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చే రుకు ని ఇరువర్గాలను చెదరగొట్టా రు. గాయపడిన వారిని వెంటనే ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. కేతన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పట్టణ ఎస్హెచ్వో నరహరి తెలిపారు. కానీ పట్టణంలో మాత్రం కత్తిపోట్ల ఘటన జరిగిందని జోరుగా ప్రచారం జ రిగింది. నలుగురు వ్యక్తులు కత్తిపోట్లకు గురయ్యార ని స్థానికులు సైతం చెబుతున్నారు. పోలీసులు గాజుతో జరిగిన దాడి అని కేసు నమోదు చేయడంతో అనేక సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. -
యువత సన్మార్గంలో నడవాలి
మోపాల్(నిజామాబాద్రూరల్): యువత సన్మార్గంలో నడవాలని, అప్పుడే దేశ భవిష్యత్ బాగుంటుందని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అన్నారు. మోపాల్ పోలీసుల ఆధ్వర్యంలో మండల కేంద్రంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంలో భాగంగా క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేశారు. 13 గ్రామాల నుంచి 13 టీములు పాల్గొనగా, నాలుగు రోజులపాటు టోర్నమెంట్ కొనసాగింది. ముగింపు కార్యక్రమానికి సీపీ ముఖ్యఅతిథిగా హాజరై, మాట్లాడారు. సమాజంలో యువత పెద్ద ఎత్తున మత్తుపదార్థాల వైపు ఆకర్షితమవుతోందని, ఇది ప్రమాదకరమని ఆవేదన వ్యక్తం చేశారు. క్రీడలు యువతను వ్యసనాల నుంచి దూరంగా ఉంచి, క్రమశిక్షణను, మానవతను నేర్పుతాయన్నారు. క్రికెట్ టోర్నమెంట్లో ఉత్సాహంగా పాల్గొని, ఆటలో స్ఫూర్తిని చూపినందుకు అభినందనలు తెలియజేశారు. యువత కోసం దసరా సెలవుల్లో క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటుచేసిన ఎస్ఐ జడ్ సుస్మితను అభినందించారు. అనంతరం విజేతలకు సీపీ బహుమతులు ప్రదానం చేశారు. ఏసీపీ రాజావెంకట్రెడ్డి, సౌత్ రూరల్ సీఐ ఎన్ సురేష్కుమార్, ఎస్ఐ సుస్మిత, యువకులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
మహిళ దారుణ హత్య!
బోధన్: మహారాష్ట్రకు చెందిన ఓ మహిళ ఎడపల్లి మండలంలో దారుణ హత్యకు గురైన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఎడపల్లి ఎస్సై ముత్యాల రమ తెలిపిన వివరాలు ఇలా.. మహారాష్ట్ర ప్రాంతంలోని నాందేడ్ జిల్లా, బిలోలి తాలూకా, కొండల్వాడి గ్రామానికి చెందిన శీలంవార్ లింగవ్వ (55) బతుకమ్మ పండుగ కోసం కొన్నిరోజుల క్రితం ఎడపల్లి మండలంలోని జంలం గ్రామంలోని తన కూతురు ఇంటికి వచ్చింది. అనంతరం సెప్టెంబర్ 28న ఎడపల్లి మండలం పోచారం గ్రామంలోని తన చెల్లెలు కుమారుడైన బెజ్జంకి వెంకట్ వద్దకు బస్సులో బయలుదేరింది. ఆమె దూపల్లి గేట్ వద్దకు చేరుకోగా, అక్కడ గుర్తుతెలియని వ్యక్తి బైక్ మీద లిఫ్ట్ ఇచ్చాడు. ఆ వ్యక్తి అదను చూసి లింగవ్వ తలపై బలమైన ఆయుధంతో మోదీ హత్య చేశాడు. ఆమె ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను దోచుకొని, మృతదేహాన్ని జైతాపూర్ గ్రామ శివారులోని చెరుకుతోటలో పడేసి పారిపోయాడు. గురువారం అర్ధరాత్రి జైతాపూర్ గ్రామానికి చెందిన పురిమేటి బాలకృష్ణ అనే వ్యక్తి తన ఆటోలో మృతదేహాన్ని తరలిస్తుండగా గ్రామస్తులు పట్టుకున్నారు. మృతదేహం గోనె సంచిలో చుట్టి ఉండటంతో పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో ఉంది. ఈ విషయాన్ని గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈమేరకు నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తివివరాలు తెలియాల్సి ఉంది. -
ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలు
లింగంపేట(ఎల్లారెడ్డి): శెట్పల్లి గ్రామంలో గురువారం ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తాడ్వాయి ఖండ శారీరక్ ప్రముఖ్ రాజారాం రంజిత్ మాట్లాడారు. గ్రామాల్లో ప్రతీ యువకుడు ఆర్ఎస్ఎస్లో చేరాలని పిలుపునిచ్చారు. హిందుత్వ జీవన విధానం, విశ్వశాంతికి ఆధారమని, ప్రపంచంలోని వివిధ మతాలను సమన్వయపరిచే సనాతన జీవన విలువలు హిందుత్వంలో ఉన్నాయని వివరించారు. దేశ అభివృద్ధి, హిందువుల పంచ పరివర్తన కోసం పాటుపడాలని సూచించారు. రాబోయే రోజుల్లో ఇంటింటికి జన జాగరణ చేపడతామని చెప్పారు. ఎండ్రియాల్లో .. తాడ్వాయి(ఎల్లారెడ్డి): ఎండ్రియాల్లో ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రతినిధులు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు దేశభక్తి కలిగి ఉండాలన్నారు. ప్రతి గ్రామంలో ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. హిందు సంఘటన కోసమే ఆర్ఎస్ఎస్ నిజాంసాగర్(జుక్కల్): వ్యక్తి నిర్మాణం హిందూ సంఘటన కోసమే ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలుగా ప్రయత్నిస్తుందని జిల్లా బౌద్ధిక్ ప్రముఖ్ వక్త వేదమిత్ర అన్నారు. శుక్రవారం మహమ్మద్ నగర్ మండలంలోని బూర్గుల్, నర్వ గ్రామాల్లో ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వక్త మాట్లాడుతూ.. పౌర విధులు, పర్యావరణ పరిరక్షణ, స్వదేశీ భావన, సామాజిక సమరసత, కుటుంబ ప్రబోధన్ ఇలా సమాజంలో ఐదు పరివర్తనలు రావాలన్నారు. పిట్లం ఖండ సహ శరీరక ప్రముఖ్ పెంటబోయిన మోహన్, శాఖ కార్యవాహలు హోడిగె రవికిరణ్, సంతోష్, సీహెచ్. ఓంకార్ తదితరులు పాల్గొన్నారు. -
క్రైం కార్నర్
లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని ఆయా గ్రామాల్లోని బెల్టు షాపులపై దాడి చేసినట్లు ఎస్సై దీపక్కుమార్ శుక్రవారం తెలిపారు. మండలంలోని ఎక్కపల్లితండా, పర్మళ్ల, నల్లమడుగు, సజ్జన్పల్లి తదితర గ్రామాల్లో బెల్టు షాపులు నిర్వహిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం రావడంతో దాడులు చేసినట్లు తెలిపారు. నిర్వాహకుల వద్ద ఉన్న మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. నిర్వాహకులపై కేసులు నమోదు చేశామన్నారు. ధర్పల్లి: ఇంటి ఎదుట నిలిపిన బైకును గుర్తుతెలియని వ్యక్తులు దహనం చేసిన ఘటన ధర్పల్లి మండల కేంద్రంలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన శ్రీకాంత్ అనే వ్యక్తి గురువారం రాత్రి తన బైకును ఇంటి ఆవరణలో పార్క్ చేసి ఉంచాడు. గుర్తుతెలియని వ్యక్తులు తగలబెట్టడంతో బైకు పూర్తిగా కాలి బూడిదయ్యింది. మరుసటి రోజు ఉదయం బాధితుడు బైక్ కాలిపోయి ఉండటాన్ని చూసి, పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కళ్యాణి తెలిపారు. నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): మండలంలోని పోచారం ప్రాజెక్టు దిగువన ఉన్న పెద్దవాగులో చేపల వేటకు వెళ్లిన ఓ వ్యక్తి నీటిలో మునిగి గల్లంతయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. రాజంపేట మండలం సిద్ధాపూర్కు చెందిన మచ్చంటి శేఖర్(32)అనే వ్యక్తి తన ఏడేళ్ల కుమారుడు అనిల్తో కలిసి గురువారం చేపలు పట్టేందుకు పోచారం ప్రాజెక్టు దిగువన ఉన్న పెద్దవాగు వద్దకు వచ్చాడు. చేపలు పట్టేక్రమంలో కొడుకు అనిల్ కళ్లేదుటే నీటిలోకి దిగిన శేఖర్ ప్రమాదవశాత్తు మునిగిపోయాడు. కాగా శేఖర్ మృతదేహం కోసం నాగిరెడ్డిపేట ఎస్సై భార్గవ్గౌడ్ ఆధ్వర్యంలో ఎల్లారెడ్డి ఫైర్స్టేషన్ సిబ్బంది సహాకారంతో గాలింపు చర్యలు చేపట్టారు. శుక్రవారం రాత్రి వరకు కూడ అతని మృతదేహం లభ్యమవలేదు. -
ఘనంగా చక్కెర తీర్థం
మాచారెడ్డి : చుక్కాపూర్లో విజయదశమి సందర్భంగా లక్ష్మీ నర్సింహస్వామి చక్కెర తీర్థోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. అటవీ ప్రాంతంలో ఉన్న స్వామివారి ఉత్సవ విగ్రహాలను రథంపై ఊరేగింపుగా గ్రామానికి తరలించి ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారి రథం ముందు చక్క భజనలతో పాటు చక్కెరను పంచిపెట్టారు. చక్కెర తీర్థం సందర్భంగా భక్తులు వారి కోరికలు తీరిన అనంతరం చక్కెర పంచిపెట్టడం ఆనవాయితీగా వస్తోంది. ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ కమలాకర్రెడ్డి, ఈవో ప్రభు, డైరెక్టర్లు లక్ష్మీరాజం, రాజిరెడ్డి, గ్రామ పెద్దలు ఉన్నారు. దోమకొండ: దసరా పండుగ సందర్భంగా గురువారం దోమకొండ బురుజుపై జాతీయ జెండాను ఎగురవేశారు. విజయదశమి ఆనవాయితీ ప్రకారంగా ముందుగా గ్రామ శివారులో జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించి చావిడి వద్దకు తీసుకువచ్చారు. అక్కడ గ్రామ ప్రత్యేకాధికారి ప్రవీవ్కుమార్తో బురుజుపై జాతీయ జెండాను ఎగురవేశారు. చాముండేశ్వరి ఆలయ కమిటీ చైర్మన్ సిద్దారెడ్డి, సీడీసీ మాజీ చైర్మన్ ఐరేని నర్సయ్య, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కుంచాల శేఖర్, మాజీ సర్పంచ్ నల్లపు అంజలి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అనంతరెడ్డి, బీజేపీ మండల అధ్యక్షుడు భూపాల్రెడ్డి, అర్చకులు తదితరులు పాల్గొన్నారు. పిట్లం(జుక్కల్): మండల కేంద్రంలోని ఆర్య సమాజ్ భవనంలో దసరా సందర్భంగా గురువారం ఓంకార జెండాను ఆర్య సమాజ అధ్యక్షుడు పడిగల విజయకుమార్ ఉపాధ్యక్షులు నాజోజు శ్రీనివాస్ చారి ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు ఓంకా జెండాను పట్టుకుని గ్రామ పురవీధుల గుండా ఓంకార నానార్ నినాదాలు చేస్తూ ఊరేగించారు. విజయదశమి రోజు చెడుపై మంచి సాధించిన విజయానికి సూచికగా ఓంకార జెండాను ప్రతి సంవత్సరం విజయదశమి రోజు ఆవిష్కరిస్తామని తెలిపారు. -
ఘనంగా విజయదశమి
● ఊరూరా పండుగ సందడి ● భక్తులతో కిక్కిరిసిన ఆలయాలు ● శమీ (జంబి) వృక్షానికి పూజలు ● అట్టహాసంగా రావణ దహనం నిజామాబాద్ రూరల్: విజయదశమి వేడుకలు జిల్లా వ్యాప్తంగా గురువారం భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఉదయం నుంచే ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. నగరంలో జంబి హనుమాన్, బ్రహ్మంగారి గుడి, వినాయక్నగర్లో ఏడుపాయల దుర్గమ్మ, దేవీరోడ్లోని దేవీమాత ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. వాహన, ఆయుధ పూజలు చేసి సాయంత్రం శమీ (జంబి) వృక్షానికి పూజలు చేశారు. అనంతరం ఒకరికొకరు జంబి(బంగారం) ఇచ్చిపుచ్చుకొని పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రాత్రి గాయత్రినగర్లో రావణదహన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో మైదానం జనసంద్రమైంది. -
వ్యాపారులకు వరం.. రైతుకు నష్టం
మోర్తాడ్(బాల్కొండ): మక్కల కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ప్రారంభించకపోవడంతో వ్యాపారుల పాలిట వరంగా మారింది. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో రైతులు ధరను పట్టించుకోకుండా విక్రయిస్తూ నష్టపోతున్నారు. మహారాష్ట్ర, గుజరాత్లకు మక్కల ఎగుమతి సాగుతున్నా వ్యాపారులు ధర పెంచడం లేదు. ప్రభుత్వం మద్దతు ధరను అమలు చేస్తూ కొనుగోళ్లు ఆరంభిస్తేనే వ్యాపారులు ధర పెంచే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మద్దతు ధరతోనే మేలు.. జిల్లాలో ఈ సీజన్లో సోయా కంటే మొక్కజొన్న పంటను రైతులు అధికంగా సాగు చేశారు. గతంలో మార్క్ఫెడ్ సంస్థ సహకార సంఘాల ద్వారా కొనుగోళ్లు చేపట్టింది. ఈసారి కూడా కొనుగోళ్లు ఆరంభిస్తే మక్కలకు మద్దతు ధర లభిస్తుందనే అభిప్రాయం రైతుల్లో వ్యక్తమవుతోంది. అయితే, కొనుగోలు కేంద్రాల ఏర్పాటు ఆవశ్యకతను గుర్తించిన రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ సుంకెట్ అన్వేశ్ రెడ్డి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావును స్వయంగా కలిసి కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం వాతావరణం అనుకూలిస్తుండడంతో మక్కల విక్రయాలకు రైతులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ తరుణంలోనే కొనుగోలు కేంద్రాలను ఆరంభించాలని కోరుతున్నారు. కాగా, అన్వేశ్రెడ్డి వినతి మేరకు త్వరలోనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. పాలెం నుంచి ఎగుమతి అవుతున్న మక్కలుప్రతిపాదనలు పంపించాం మక్కలకు మార్కెట్లో మద్దతు ధర కంటే తక్కువ పలుకుతుంది. రైతులు నష్టపోతున్నారని దృష్టిలో ఉంచుకొని కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు అను మతి ఇవ్వాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. ప్రభుత్వం నుంచి ఆమోదం లభించగానే మక్కల కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తాం. – మహేశ్ కుమార్, మార్క్ఫెడ్ సంస్థ జిల్లా మేనేజర్52 వేల ఎకరాల్లో సాగు.. ఖరీఫ్ సీజన్లో జిల్లా వ్యాప్తంగా 52 వేల ఎకరాలకు మించి రైతులు మొక్కజొన్న సాగు చేశారు. ప్రభుత్వం మక్కలకు ప్రకటించిన మద్దతు ధర క్వింటాలుకు రూ.2,400 కాగా, మార్కెట్లో మాత్రం రూ.2 వేలకు మించడం లేదు. ఒక్కో క్వింటాలుకు రైతులు రూ.400 వరకు నష్టపోతున్నారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఉంటే మార్కెట్లో కనీసం మక్కలను రూ.2,300 వరకు చెల్లించి వ్యాపారులు కొనుగోలు చేసేవారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించకపోవడంతో రైతులకు తామే దిక్కు అనే ధీమా వ్యాపారుల్లో వ్యక్తమవుతోంది. మక్కల కొనుగోలు కేంద్రాల్లేక అన్నదాతల ఇబ్బందులు ఎగుమతులు ఉన్నా ధర తగ్గించిన వ్యాపారులు క్వింటాలుకు రూ.2 వేలకు మించని ధర -
ఎస్సారెస్పీలోకి 800 టీఎంసీల వరద
బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లోకి ప్రస్తు త సంవత్సరం ఇప్పటి వరకు 800 టీఎంసీల వరద నీరు వచ్చి చేరింది. ఎగువ ప్రాంతాల నుంచి 3 లక్షల క్యూసెక్కుల వరద నీరు ఇంకా కొనసాగుతుంది. దీంతో ప్రాజెక్ట్ నుంచి 33 వరద గేట్ల ద్వారా లక్షా 75 వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. వారం క్రితం ఇన్ఫ్లో తక్కువగా ఉన్నప్పటికీ గోదావరిలోకి భారీగా నీటిని వదిలిపెట్టారు. దీంతో ప్రాజెక్ట్ నీటిమట్టం భారీగా తగ్గింది. ప్రస్తుతం నీటిమట్టం పెంచడానికి అధికారులు ఔట్ ఫ్లోను తగ్గించారు. ఆయకట్టుకు కాలువల ద్వారా నీటి విడుదలను కొనసాగిస్తున్నారు. కాకతీయ కాలువ ద్వారా 4 వేలు, ఎస్కేప్ గేట్ల ద్వారా 4 వేలు, సరస్వతి కాలువ ద్వారా 400, లక్ష్మి కాలువ ద్వారా 200, ఆవిరి రూపంలో 616, మిషన్ భగీరథ ద్వారా 231 క్యూసెక్కుల నీరు పోతుంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 1091(80.5 టీఎంసీలు) అడుగులు కాగా శుక్రవారం సాయంత్రానికి ప్రాజెక్ట్లో 1089.70 (78.12 టీఎంసీలు) అడుగుల నీరు నిల్వ ఉందని ప్రాజెక్ట్ అఽధికారులు పేర్కొన్నారు. ‘సాగర్’కు తగ్గని వరద నిజాంసాగర్(జుక్కల్): పొరుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తుండడంతో సింగూరు ప్రాజెక్టు ద్వారా నిజాంసాగర్ ప్రాజెక్టులోకి లక్షా 8 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోందని ప్రాజెక్టు అధికారులు శుక్రవారం తెలిపారు. 10 గే ట్లను ఎత్తి 76,020 క్యూసెక్కుల నీటిని మంజీరా నదిలోకి వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1405 అడుగులు (17.8టీఎంసీలు) కాగా, శుక్రవారం సాయంత్రానికి 1402.25 అడుగుల (14.07 టీఎంసీలు) నీరు నిల్వ ఉందని అధికారులు వివరించారు. -
గిట్టుబాటు ధరతోనే రైతులకు మేలు
ఆర్మూర్: రేయింబవళ్లు కష్టపడి పంటలు పండించే రైతులకు గిట్టుబాటు ధరలు లభించాలని, రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి పేర్కొన్నారు. ఆర్మూర్ పట్టణం పెర్కిట్లోని మీనాక్షి ఫంక్షన్ హాల్లో తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ సుంకెట అన్వేశ్ రెడ్డి ఆధ్వర్యంలో అన్నదాతల ఆత్మీయ కలయిక (కిసాన్ మిలాప్) కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి మాట్లాడుతూ అన్నదాతలు కష్టపడి పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర లభిస్తే ఆనందం కలుగుతుందన్నారు. అంతకుముందు పసుపు బోర్డు జాతీయ అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి, మార్క్ఫెడ్ రాష్ట్ర చైర్మన్ మార గంగారెడ్డి, డీసీసీబీ చైర్మన్ రమేశ్ రెడ్డి, ఉర్దూ అకాడమీ రాష్ట్ర చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, బాల్కొండ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి సునీల్ రెడ్డి, సీపీఐ(ఎంఎల్) మాస్లైన్ ప్రజాపంథా రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ప్రభాకర్, టీడీపీ పార్లమెంటరీ అధ్యక్షుడు దేగాం యాదాగౌడ్ మాట్లాడారు. ఈసారి వర్షాలతో రైతులు పండించిన పంట కొంతమేర నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్మూర్ ప్రాంతంలో రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు ఇవ్వాలని చేసిన ఆందోళనల సందర్భాలను వారు గుర్తు చేశారు. అన్వేశ్ రెడ్డి మాట్లాడుతూ దసరా వేడుకలు, అన్నదాతల ఆత్మీయ కలయిక పార్టీలకతీతంగా నిర్వహించుకోవడం అభినందనీయమన్నారు. ఎన్నికల సమయంలోనే పార్టీలని, ఆ తర్వాత అందరం ఒక్కటే అని చాటి చెప్పాలన్నారు. రైతాంగ సమస్యలతోపాటు తెలంగాణ ఉద్యమం, కుటుంబ పరిస్థితులపై ఆర్కెస్ట్రా బృందం పాడిన పాటలు అలరించాయి. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎంఎల్) మాస్లైన్ రాష్ట్ర నాయకులు దేవారం, సత్యనారాయణ, బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు తిరుపతిరెడ్డి, టీడీపీ జిల్లా నాయకులు జక్క లింగారెడ్డి, మంథని గంగారాం, ఐసీడీఎస్ మాజీ చైర్మన్ మునిపల్లి సాయిరెడ్డి, మంథని శ్రీనివాస్ రెడ్డి, నందిపేట్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మంద మహిపాల్, మాజీ ఎంపీపీ దేవిదాస్, బీజేపీ పట్టణ అధ్యక్షుడు మందుల బాలు, ఆర్మూర్, బాల్కొండ, జక్రాన్పల్లి మండలాలకు చెందిన వివిధ పార్టీల నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. మాట్లాడుతున్న ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేశ్ రెడ్డి ‘కిసాన్ మిలాప్’లో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి పార్టీలకతీతంగా అన్నదాతల సమ్మేళనం పాల్గొన్న కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ(ఎంఎల్)మాస్లైన్, టీడీపీ నాయకులు -
రైల్వేస్టేషన్కు హెగ్డేవార్ పేరు పెట్టాలి
సుభాష్నగర్: నిజామాబాద్ ప్రధాన రైల్వేస్టేషన్ లేదా బస్టాండ్కు ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడు డాక్టర్ హెగ్డేవార్ కేశవరావు బలిరామ్ పేరు పెట్టాలని ఆయన ముని మనుమడు హెగ్డేవార్ దిలీప్ శాస్త్రి ఒక ప్రకటనలో కోరారు. దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన హెగ్డేవార్ పరివారానికి ప్రత్యేకత ఉందన్నారు. హెగ్డేవార్ పేరుతో ఇప్పటికే కందకుర్తిలో స్మృతి మందిరం నిర్మాణం కోసం తన తండ్రి హెగ్డేవార్ శ్రీరామశాస్త్రి ఆర్ఎస్ఎస్కు స్థలం ఇచ్చారన్నారు. అందులో భాగంగా ప్రధాన రైల్వేస్టేషన్ లేదా బస్టాండ్కు హెగ్డేవార్ పేరు పెట్టాలని ప్రభుత్వా లను దిలీప్ శాస్త్రి కోరారు. గాంధీ, శాస్త్రీలకు నివాళి నిజామాబాద్ అర్బన్: గాంధేయ మార్గం అందరికీ అనుసరణీయమని ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ, అదనపు కలెక్టర్ అంకిత్ పేర్కొన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని గురువారం నగరంలోని గాంధీచౌక్లో మహా త్ముని విగ్రహానికి పూలమాలలు వేసి ని వాళులర్పించారు. అనంతరం మాజీ ప్రధా ని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. మహాత్ముడు చూపిన బాటలో పయనిస్తూ దేశాభివృద్ధికి పాటుపడాలన్నారు. వేడుకలలో వివిధ శాఖ ల అధికారులు, పుర ప్రముఖులు, ఆయా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో నెమలి మృతి బాల్కొండ: బాల్కొండ మండల కేంద్ర శివారులో జాతీయ రహదారి 44 పై గురువారం గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో జాతీయ పక్షి నెమలి అక్కడిక్కడే మృతి చెందింది. స్థానికుల సమాచారంతో ఫారెస్ట్ అధికారులు నెమలికి పోస్టుమార్టం నిర్వహించి, అనంతరం దహన సంస్కారాలు చేశారు. జాతీయ రహదారికి ఇరువైపులా ఉన్న పంట భూముల్లో అధికంగా నెమళ్లు సంచరిస్తున్నాయి. దీంతో రోడ్డు దాటే క్రమంలో అవి ప్రమాదాల బారిన పడుతున్నాయి. 7న అవయవదానంపై అవగాహన సదస్సునిజామాబాద్ నాగారం: జిల్లాకేంద్రంలోని సుభాష్నగర్ పెన్షనర్స్ భవన్లో ఈనెల 7న అవయవ దానంపై అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు కె.రామ్మోహన్రావు, ఈవీఎల్నారాయణ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జన విజ్ఞాన వేది క, తెలంగాణ ఆల్ పెన్షనర్స్– రిటైర్డ్ పర్సన్ అసోసియేషన్, మల్లు స్వరాజ్యం మెమోరియల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమానికి అవయవదాన ప్రచారకర్తలు హాజరుకానున్నారు. -
వసతి అధ్వానం
● జిల్లా కేంద్రంలోని నాందేవ్వాడ బీసీ, ఎస్టీ వసతి గృహాల్లో గదులు, మరుగుదొడ్లకు తలుపులు సక్రమంగా లేవు. దీంతో విద్యార్థులు ఇతర వస్తువులను అడ్డుపెట్టుకొని స్నానాలు చేస్తున్నారు. పాత రేకుల షెడ్డులో వంటగది కొనసాగుతోంది. ● గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలో ఉన్న వసతి గృహం శిథిలావస్థకు చేరింది. పై పెచ్చులు ఊడుతున్నాయి. తక్షణమే మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉంది. ● నగరంలోని దుబ్బా, ఆర్మూర్ ప్రాంతాల్లోని బీసీ బాలికల వసతిగృహాల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. మౌలిక సదుపాయాలు సక్రమంగా లేవు. వర్షం పడితే గదులు ఊరుస్తున్నాయి. బోధన్లోని ఎస్సీ వసతి గృహంలోనూ ఇదే పరిస్థితి.నిజామాబాద్అర్బన్: సంక్షేమ వసతి గృహాల పరిస్థితి అధ్వానంగా మారింది. ఏటా మరమ్మతులకు ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులను కేటాయించి అభివృద్ధి చేసేది. నిధుల్లేక రెండేళ్లుగా సంక్షేమ వసతిగృహాలకు మరమ్మతులు కరువయ్యాయి. దీంతో శిథిలావస్థకు చేరిన భవనాల్లోనే విద్యార్థులు ఉంటున్నారు. గదుల తలుపులు, కిటికీలు, మరుగుదొడ్లు సరిగా లేకపోవడం, ఇతర సమస్యలతో సతమతమవుతున్నారు. అయితే, మరమ్మతుల నిధుల కోసం అధికారులు రెండుసార్లు నివేదికలు ప్రభుత్వానికి పంపినా అనుమతి మాత్రం రావడం లేదు. నివేదికలు పంపి ఏడాది.. జిల్లాలోని ఎస్సీ 42, బీసీ 20, ఎస్టీ 8 సంక్షేమ వసతి గృహాల్లో తక్షణమే మరమ్మతులు చేపట్టాల్సిన అవసరం ఉంది. అందుకు సంబంధించి 2024 మార్చి నెలలో అన్ని హాస్టళ్లను పరిశీలించిన అధికారులు రూ.8 కోట్లు అవసరం ఉంటాయని నివేదికలు రూపొందించి ఉన్నతాధికారులకు పంపారు. ఏడాది గడుస్తున్నా ఆ నివేదికలకు మోక్షం లభించలేదు. ప్రస్తుత ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు హాస్టళ్ల మరమ్మతులకు రూ.9కోట్ల70 లక్షలు అవసరమని మరోసారి నివేదిక పంపించారు. ఇప్పటి వరకు నిధులు మంజూరు కాలేదు. అనుమతులు ఆలస్యం.. జిల్లాలో 9 ఎస్సీ సంక్షేమ నూతన వసతిగృహాల నిర్మాణాలకు గతేడాది రూ.30 కోట్లు మంజూర య్యాయి. అయితే, నందిపేట మండలం ఐలాపూర్ వసతిగృహం అధ్వానస్థితిలో ఉందని, వెంటనే కొత్త భవనం నిర్మించాలని ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి అసెంబ్లీలో డిమాండ్ చేశారు. దీంతో ప్రభుత్వ ఆదేశాలు రాగా, పనులు కొనసాగుతున్నాయి. మిగతా ఎనిమిది వసతిగృహాలకు కొత్త భవనాల నిర్మాణాని కి పరిపాలన అనుమతులు ఇంకా రాలేదు. ఇదే అంశంపై జిల్లా అధికారులు పలుమార్లు నివేదికలు పంపించినా ఉన్నతాధికారుల నుంచి స్పందన లేదు. పలు హాస్టళ్ల పరిస్థితి ఇది..జిల్లాలో వసతిగృహాల వివరాలు సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు ఇబ్బందులు రెండేళ్లుగా మంజూరు కాని నిధులు నూతన భవనాలకు నిధులున్నా.. నిర్మాణానికి అనుమతి కరువు -
రూ.2 వేల కోసం హత్య
● నిందితుడి అరెస్ట్ ఖలీల్వాడి: రూ.2 వేల కోసం హత్య చేసిన నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్హెచ్వో రఘుపతి తెలిపారు. బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలు వెల్లడించారు. సెప్టెంబర్ 6న నిజామాబాద్ రైల్వేస్టేషన్ సమీపంలోని శ్రీనివాస కిరాణా షాప్ ఎదుట గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం పడి ఉన్నట్లు సమాచారం రావడంతో పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేపట్టారు. అనుమానితుడైన నవీపేట మండలం జల్లపల్లిఫారానికి చెందిన షేక్ అహ్మద్ను సెప్టెంబర్ 30న పట్టుకొని విచారించగా నేరాన్ని అంగీకరించాడు. షేక్ అహ్మద్ నగరంలోని రైల్వే స్టేషన్ పరిసరాల్లో నివసిస్తూ క్యాటరింగ్తోపాటు రోజువారీ కూలీ పనులు చేసేవాడు. మద్యం అలవాటు నేపథ్యంలో రైల్వేస్టేషన్ వద్ద ఒంటరిగా కనిపించే వ్యక్తులను బెదిరించి డబ్బులు దోచుకునే వాడు. గత నెల 6న అర్ధరాత్రి రైల్వేస్టేషన్ సమీపంలోని శ్రీనివాస కిరాణా షాప్ ఎదుట ఒక వృద్ధుడు డబ్బులు లెక్కబెడుతూ కనిపించగా దోచుకోవాలనే ఉద్దేశంతో అహ్మద్ అతని దగ్గరకు వెళ్లాడు. డబ్బులివ్వాలని బెదిరించగా వృద్ధుడు ఇవ్వలేదు. దీంతో అహ్మద్ ఒక బట్టతో వృద్ధుడి మెడకు ఉరి బిగించి హత్య చేశాడు. అనంతరం అతని వద్ద నుంచి రూ.2 వేల నగదు, ఫోన్ దోచుకున్నట్లు ఎస్హెచ్వో రఘుపతి తెలిపారు. నిందితుడిని కోర్టులో హాజరుపర్చి జ్యుడీషియల్ రిమాండ్కు పంపించినట్లు పేర్కొన్నారు. -
పేదింట్లో చదువుల ‘భాగ్య’ం!
● ఎంబీబీఎస్ సీటు సాధించిన చాయ్వాలా కూతురు ● ఉన్నత చదువులే లక్ష్యమంటున్న విద్యార్థిని సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : వాళ్లది నిరుపేద కుటుంబం. తండ్రి హోటల్లో చాయ్ తయారు చేస్తాడు. తల్లి బట్టలు కుడుతుంది. ముగ్గురు కూతుళ్లు. ఇద్దరిని టెన్త్, ఇంటర్ వరకు చదివించి పెళ్లి చేసేశారు. చిన్న కూతురు ప్రభుత్వ బడిలో పదో తరగతి వరకు చదివి 9.8 జీపీఏ సాధించింది. ప్రైవేటు కళాశాలలో ఇంటర్ పూర్తి చేసిన ఆమె, పట్టుదలతో చదివి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీటు సాధించింది. వివరాల్లోకి వెళితే... సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్కు చెందిన మడపతి నాగయ్యస్వామి, శ్రీశైల దంపతుల కూతురైన భాగ్యలక్ష్మి సిర్గాపూర్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకొని పదో తరగతిలో 9.8 జీపీఏ సాధించింది. దీంతో బాసరలోని ట్రిపుల్ ఐటీలో సీటు వచ్చింది. అక్కడికి వెళ్లి జాయిన్ అయిన వారం రోజులకే ఆ చదువు తనకొద్దంటూ ఇంటికి వచ్చేసింది. దీంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. అప్పటికే ఇంటర్ అడ్మిషన్ల ప్రక్రియ పూర్తవుతుండడంతో కామారెడ్డిలోని సాందీపని కాలేజీలో చేర్పించారు. తండ్రి నాగయ్య స్వామి కామారెడ్డి పట్టణంలోని ఓ హోటల్లో చాయ్ తయారు చేసే పనిలో చేరాడు. తల్లి ఇంటి దగ్గర ఉంటూ కూతురు చదువు చూసుకుంది. బైపీసీ బాగా చదివితే డాక్టర్ అవుతావంటూ ప్రోత్సహించింది. ఇంటర్లో 992 మార్కులు వచ్చాయి. కాలేజీ అధ్యాపకుల ప్రోత్సాహం, తల్లిదండ్రుల సహకారంతో భాగ్యలక్ష్మి నీట్ రాసి 406 మార్కులు సంపాదించింది. దీంతో మొదట నిర్మల్ మెడికల్ కాలేజీలో సీటు వచ్చింది. రెండో విడత కౌన్సిలింగ్లో ఆదిలాబాద్ రిమ్స్లో సీటు సాధించింది. మా నాన్న మా కోసం ఎంతో కష్టపడతాడు. అమ్మ రోజూ చదువుకోమంటూ ఎంతగానో ప్రోత్సహించింది. మెడిసిన్ సీటు సాధించాలంటూ నిత్యం గుర్తు చేస్తూ ఎంకరేజ్ చేసింది. సాందీపని కాలేజీ అధ్యాపకుల సహకారంతో మెడిసిన్ సీటు సాధించాను. ఎంబీబీఎస్ చదివిన తర్వాత కచ్చితంగా పీజీ కూడా సాధిస్తా. న్యూరో లేదా కార్డియాలజీ విభాగంలో సీటు సాధించి మంచి డాక్టర్గా ప్రజలకు సేవలందిస్తా. – భాగ్యలక్ష్మి, విద్యార్థిని -
గాంధీ జయంతి నాడే దసరా
● మాంసం విక్రయించొద్దని మున్సిపల్ అధికారుల నోటీసులు ● బెల్టుషాపులలో మద్యం స్టాక్ ఫుల్ బిచ్కుంద(జుక్కల్): ఉద్యోగ, ఉపాధి, వ్యాపారం నిమిత్తం పట్టణాలకు వెళ్లిన వారు దసరా పండుగకు స్వగ్రామాలకు చేరుకున్నారు. బంధుమిత్రులతో కలిసి ఆనందోత్సాహాలతో వేడుకలను జరుపుకునేందుకు సిద్ధమయ్యారు. వాహనాలు, యంత్రాలకు పూజలు చేసి మాంసంతో వంటకాలు, మిత్రులతో కలిసి మద్యం సేవించడం ఏటా ఆనవాయితీగా వస్తోంది. కాగా, ఈసారి గాంధీ జయంతి రోజునే దసరా పండుగ వచ్చింది. దీంతో జీవహింస చేయొద్దని, మద్యం దుకాణాలను మూసి ఉంచాలని ప్రభుత్వం నిబంధనలు విధించింది. అయితే, పండుగ రోజు కూడా మద్యం, మాంసం ముక్క లేకుంటే ఎలా అంటూ ప్రజల్లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. మాంసం దుకాణాలకు నోటీసులు ఈ నెల 2న గురువారం గాంధీ జయంతి సందర్భంగా మేకలు, కోళ్లు జీవహింస చేయవద్దని బుధవారం మున్సిపల్ అధికారులు మాంసం విక్రయ దుకాణదారులు, హోటళ్లకు నోటీసులు అందజేశారు. హోటళ్లలో సైతం మాంసం కూర వండరాదన్నారు. నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. బెల్టుషాపులలో స్టాక్... గాంధీ జయంతి రోజున మద్యం విక్రయాలపై గ్రా మాలలో అంతగా పట్టింపు ఉండదనే ఉద్దేశంతో బె ల్టుషాపుల నిర్వాహకులు మద్యం బాటిళ్లను నిల్వచే సి పెట్టారు. పట్ణణ, మండల కేంద్రాల నుంచి బెల్టుషాపులకు వచ్చి కొనుగోలు చేస్తారనే ఉద్దేశంతో బ్రాండెడ్ మద్యాన్ని తెచ్చిపెట్టినట్లు తెలిసింది. వైన్స్ లు బంద్ ఉండడంతో అధిక ధరలకు విక్రయించి లాభం పొందవచ్చని నిర్వాహకులు భావిస్తున్నారు. -
ప్రముఖుల విజయ దశమి శుభాకాంక్షలు
ఖలీల్వాడి: జిల్లా ప్రజలకు విజయదశమి పండుగ సందర్భంగా సీపీ పోతరాజు సాయిచైతన్య శుభాకాంక్షలు తెలిపారు. దుష్ట శక్తులపై విజయానికి సంకేతంగా జరుపుకునే ఈ పండుగను స్ఫూర్తిగా తీసుకొని ప్రజలందరూ ఐక్యత, సమగ్రతల కోసం కృషి చేయా లని పేర్కొన్నారు. కుటుంబసభ్యులతో నిండు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో కాలం గడపాలన్నారు. నిజామాబాద్, ఆర్మూ ర్, బోధన్ డివిజన్ పరిధిలలో శాంతి భద్రతలకు, మత విధ్వంసాలకు తావులేకుండా అందరూ సహకరించాలని కోరారు. ఎల్లప్పుడు ప్రజలు, పోలీస్ సిబ్బంది స్నేహ పూర్వకంగా సోదర స్వభావంతో మెలగాలని సూచించారు. వేల్పూర్: జిల్లా, బాల్కొండ నియోజకవర్గ ప్రజలకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో విజయదశమి (దసరా)శుభాకాంక్షలు తెలిపారు. విజయానికి ప్రతీకగా, అన్యాయంపై గెలుపునకు సంకేతంగా విజయదశమి జరుపుకుంటామన్నారు. చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధించాలని, కుటుంబాల్లో ఆనందాలు, సుఖశాంతులు వెల్లివిరియాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. -
ప్రయాణం భారం..
● బస్సులు నడవక ఇబ్బందులు ● కామారెడ్డి, ఎల్లారెడ్డికి వెళ్లాలంటే ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సిందే ● పండుగల పూట ప్రయాణికులకు అవస్థలు లింగంపేట(ఎల్లారెడ్డి): కామారెడ్డి జిల్లాలోని పలు మండలాల్లో నెల రోజులుగా రవాణా వ్యవస్థ అస్తవ్యస్తమైంది. ఆగస్టు 27 నుంచి దాదాపు నెల రోజులకుపైగా కురిసిన భారీ వర్షాలకు పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. లింగంపేట మండలం లక్ష్మాపూర్, అడ్విలింగాల వద్ద రోడ్డు కొట్టుకుపోయాయి. నాగిరెడ్డిపేట మీదుగా మెదక్, హైదరాబాద్ వెళ్లేదారిలో పోచారం ప్రాజెక్టు కింద వంతెనకు ఇరువైపులా రోడ్డు దెబ్బతిన్నది. దీంతో వారం, పది రోజులు రాకపోకలు నిలిచి ప్రయాణికులు నానా అవస్థలు పడ్డారు. ప్రభుత్వం స్పందించి తాత్కాలికంగా మొరం వేసి రోడ్లు మరమ్మతులు చేసి రాకపోకలు పునరుద్ధరించారు. లింగంపేట మండలం లింగంపల్లి(ఖుర్దు) వద్ద పాముల వాగు వంతెన, రోడ్డు కొట్టుకుపోవడంతో కామారెడ్డి నుంచి లింగంపేట, ఎల్లారెడ్డి, నిజాంసాగర్కు ప్రతి రోజు నడిచే బస్సులను అధికారులు నిలిపివేశారు. సుమారు నెల పది రోజులు అవుతున్నా బస్సులు నడపడంలేదు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కామారెడ్డి నుంచి గాంధారి, నల్లమడుగు మీదుగా లింగంపేట, ఎల్లారెడ్డి మీదుగా పిట్లంకు మూడు బస్సులు నడుపుతున్నారు. ఈ బస్సుల్లో వెళ్లాలంటే 30 కిలోమీటర్ల మేర దూరం, ఆర్థిక భారం పెరుగుతుంది. కామారెడ్డి నుంచి లింగంపేట మండలం పొల్కంపేట చౌరస్తా వరకు బస్సులు నడుపుతున్నారు. అక్కడి నుంచి ప్రయాణికులు మూడు కిలోమీటర్ల మేర ఆటోల్లో వెళ్లాల్సి వస్తుంది. ఇదే అదనుగా ప్రైవేటు వాహనాల్లో రెట్టింపు చార్జీ వసూలు చేస్తున్నారని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో ఆర్థిక భారం, దూరం, సమయం పెరిగి ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. అధికారులు చొరవ చూపి పనులు వేగవంతం చేయాలని కోరుతున్నారు. అయితే, రాకపోకలు పూర్తిస్థాయిలో పునరుద్ధరించేందుకు మరో 15 రోజులు పట్టవచ్చని అధికారులు చెప్తున్నారు. పొల్కంపేట రూట్లో బస్సులు నడపకపోవడంతో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. వివిధ పనుల నిమిత్తం లింగంపేట, కామారెడ్డికి వెళ్లాల్సి ఉంటుంది. దీంతో మూడు, నాలుగు కిలోమీటర్లు నడవాల్సి వస్తుంది. ప్రైవేటు వాహనాల్లో వెళ్లాలంటే చార్జీలు అధికంగా వసూలు చేస్తున్నారు. –వస్రాం(సురాయిపల్లి తండా) నెల రోజులుగా పొల్కంపేట వైపు బస్సులు రావడంలేదు. దీంతో లింగంపేటకు నడిచి వెళ్తున్నాం. ప్రై వేటు వాహనాల్లో చార్జీలు ఎక్కువ గా తీసుకుంటున్నారు. నిత్యావసర సరుకులు, బట్టలు, పండుగ సామ న్ల కొనుగోలుకు లింగంపేట వెళ్లాల్సి ఉంటుంది. పాము ల వాగు వద్ద రోడ్డు పనులు త్వరగా పూర్తి చేయాలి. – కంల్యానాయక్(ఒంటర్పల్లి) -
క్రైం కార్నర్
చెరువులో పడి వ్యక్తి మృతి లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని అయిలాపూర్ గ్రామానికి చెందిన జోగిని చిన్న మల్లయ్య(62) చెరువులో పడి మృతి చెందినట్లు ఎస్సై దీపక్కుమార్ తెలిపారు. మృతుడు రెండు నెలల క్రితం బతుకుదెరువు కోసం హైదరాబాద్కు వెళ్లాడు. బతుకమ్మ పండుగకు స్వగ్రామం వచ్చాడు. సెప్టెంబర్ 28న డబ్బుల విషయంలో భార్యతో గొడవపడి రంగంపేటలోని తన పెద్ద కొడుకు వద్దకు వెళ్లాడు. తిరిగి 30వ తేదీన అయిలాపూర్కు చేరుకున్నాడు. ఇంటికి వెళ్లకుండా గ్రామం పక్కనే ఉన్న చెరువులో బట్టలు ఉతుకుంటూ ప్రమాదవశాత్తు కాలుజారి నీటమునిగి చనిపోయినట్లు ఎస్సై పేర్కొన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ● జ్వరంతో బాలుడు మృతి మాచారెడ్డి : జ్వరంతో బాధపడుతూ పది నెలల బాలుడు మృతి చెందిన ఘటన మండలంలోని సర్దాపూర్ తండాలో బుధవారం చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. సర్దాపూర్ తండాకు చెందిన బానోత్ అశోక్, వెన్నెల దంపతుల కుమారుడు వేదాంశ్(10 నెలలు) జ్వరంతో ఐదురోజులుగా బాధపడుతున్నాడు. దీంతో రాజన్నసిరిసిల్లా జిల్లా కేంద్రంలోని ఓ పిల్లల ఆస్పత్రిలో చికిత్స చేయించారు. పరిస్థితి విషమంగా ఉందని నీలోఫర్కు తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. కొడుకు మృతి చెందడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. బాల్కొండ: మండలంలోని కిసాన్నగర్కు చెందిన మమత(38) వరద కాలువలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్సై శైలేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. మమత కొన్నాళ్లుగా కుటుంబకలహాలతో సతమతమవుతోంది. ఈ క్రమంలో మంగళవారం రాత్రి జీవితంపై విరక్తి చెంది ఎస్సారెస్పీ నుంచి ప్రవహించే వరద కాలువలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. -
రైతులు అవకాశాలను అందిపుచ్చుకోవాలి
● ఐఐఎంఏ పరిశోధకులు శ్రీరామ్ ● రైతు ఉత్పత్తిదారుల సంఘం సందర్శన జక్రాన్పల్లి : విలువ ఆధారిత వస్తువులు తయారు చేసే అవకాశాలను రైతులు అందిపుచ్చుకోవాలని ఐఐఎంఏ(అహ్మదాబాద్) పరిశోధకులు శ్రీరామ్ సూచించారు. మండలంలోని మనోహరాబాద్ గ్రామంలోని జేఎంకేపీఎం రైతు ఉత్పత్తిదారుల సంఘాన్ని బుధవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఎంఎస్ఎంఈ సహకారంతో తెలంగాణ రాష్ట్రంలోని ఒకే ఒక్క టర్మరిక్ క్లస్టర్ను మారుమూల ప్రాంతమైన మనోహరాబాద్లో ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. పసుపుతో ఎన్నో రకాల ఉత్పత్తులను తయారు చేయొచ్చని, దానిపై పరిశోధనలు జరుగుతున్నాయని వివరించారు. అందులో భాగంగానే జిల్లాలోని పసుపు రైతు ఉత్పత్తిదారుల సంఘాన్ని సందర్శించినట్లు తెలిపారు. కార్యక్రమంలో రైతు ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు పట్కూరి తిరుపతిరెడ్డి, నవ్యభారతి గ్లోబల్ స్కూల్ కరస్పాండెంట్ సంతోష్ పాల్గొన్నారు. -
పురాతన కట్టడాలు.. గత వైభవపు ఆనవాళ్లు
బాన్సువాడ రూరల్: ఆనాటి సంస్థానాధీశులు తమ ఆధీనంలోని రాజ్యాన్ని శత్రువుల బారి నుంచి కాపాడుకునేందుకు కాపాలా కోసం పెద్ద పెద్ద బు ర్జు(గడీ)లను నిర్మించారు. వృత్తాకార, చతురస్రాకార, దీర్ఘచతురస్రాకారాల్లో బురుజులను బండరా ళ్లు 20 నుంచి 25 మీటర్ల ఎత్తులో మట్టి, సున్నంతో కలిపి నిర్మించారు. వీటిపైకి ఎక్కడానికి ఒకరు లేదా ఇద్దరు మాత్రమే వెళ్లడానికి మార్గం ఉంటుంది. వీటిపై నుంచి చూస్తే గ్రామ పోలిమేరలు స్పష్టంగా కనిపిస్తాయి. బురుజుల పై భాగంలో చుట్టూ రంధ్రాలుండే రాళ్లతో కూడిన కట్టడం ఉంటుంది. వీటిలో నుంచి సైన్యం తుపాకులను శత్రు సైన్యంపై ఎక్కు పెట్టేవారని పూర్వీకులు పేర్కొన్నారు. మండల కేంద్రంలోని పాతబాన్సువాడ, బండగల్లీతో పాటు దేశాయిపేట్, పాత బాన్సువాడ, పోచారం, రాంపూర్, ఇబ్రహీంపేట్, బోర్లం, హన్మాజీపేట్, కోనాపూర్, సంగోజీపేట్ తదితర గ్రామాల్లో ఇప్పటికి బుర్జులు చెక్కుచెదరకుండా ఉన్నాయి. దసరా పండుగ నాడు వీటిపై జెండాలు ఎగురవేస్తారు. పోచారం గ్రామంలో ప్రతిఏటా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి తమ ఇంటి ఆవరణలో ఉన్న బురుజుపై ఉన్న దస్తగిర్ దర్గాలో ఆనవాయితీగా ప్రార్థన చేసి దసరా ఉత్సవాలను ప్రారంభిస్తారు. -
యువత డ్రగ్స్కు దూరంగా ఉండాలి
● బైక్ యాత్రకు స్వాగతం నిజామాబాద్ లీగల్: గంజాయి, మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలంటూ నల్గొండ జిల్లాకు చెందిన ఉపాధ్యాయుడు రాచకొండ ప్రభాకర్ చేపట్టిన బైక్ యాత్ర బుధవారం జిల్లాకు చేరుకుంది. సూర్యాపేట జిల్లా గోరంట్ల జెడ్పీ హైస్కూల్లో తెలుగు స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్న ప్రభాకర్ తన స్నేహితుడు గంజాయి వాడకంతో మృతి చెందడంపై కలత చెందాడు. దీంతో గంజాయి, డ్రగ్స్ వాడకంతో కలుగుతున్న అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు సొంత ఖర్చుతో రాష్ట్ర వ్యాప్తంగా బైక్ యాత్ర నిర్వహిస్తున్నాడు. యాత్ర లో భాగంగా రద్దీ ప్రదేశాలు, సంతలు, మార్కెట్లలో ప్రభాకర్ ఓ ప్రత్యేకమైన నల్లని షర్టు వేసుకుని, దానిపై పుర్రె గుర్తు ఉన్న దండ ధరించి గంజాయి, మత్తుపదార్థాలకు వ్యతిరేకంగా ప్రచారం నిర్వహిస్తున్నాడు. సెప్టెంబర్ 21న ప్రారంభమైన ఈ యాత్ర బుధవారం నిర్మల్ జిల్లా బాసర మీదుగా నిజామాబాద్ చేరుకుంది. ఈ సందర్భంగా ప్రభాకర్కు నిజామాబాద్ కోర్టు డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ లక్ష్మీనర్సయ్య, నిజామాబాద్ టౌన్ సీఐ శ్రీనివాస్ రాజ్, బార్ అసోసియేషన్ కార్యదర్శి మాణిక్ రాజ్, అడ్వొకేట్లు మాడవేడి శ్యామ్కుమార్, రవిప్రసాద్, ఆశా నారాయణ, రెంజర్ల సురేశ్ స్వాగతం పలికారు. యాత్ర నిర్వహణపై అభినందిస్తూ ప్రభాకర్ను సన్మానించారు. -
బస్సు, కారు ఢీ
● ఒకరికి తీవ్రగాయాలు కమ్మర్పల్లి: మండల కేంద్రంలోని లలిత ఆశ్ర మం దగ్గర జాతీయ రహదారిపై బుధవారం ఆర్టీసీ బస్సు, కారును ఢీ కొట్టిన ఘటనలో ఒ కరికి తీవ్రగాయాలయ్యాయి. జగిత్యాల జి ల్లా మెట్పల్లి మండలం రాజేశ్వరరావుపేట గ్రామానికి చెందిన దుంపల సాయికుమార్ మారుతి స్విఫ్ట్ డిజైర్ కారులో మోర్తాడ్ నుంచి రాజేశ్వరరావుపేటకు వెళ్తున్నాడు. కమ్మర్పల్లి పరిధిలోని లలిత ఆశ్రమం దగ్గర ఎదురుగా వస్తున్న కరీంనగర్ డిపో–2కు చెందిన ఆర్టీసీ బస్సు సాయికుమార్ కారును ఢీకొట్టింది. కారు ముందు భాగం నుజ్జునుజ్జు కాగా, సాయికుమార్ కుడి చేయికి తీవ్రగాయాలయ్యాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అనిల్రెడ్డి తెలిపారు. ● ఒకరికి తీవ్రగాయాలు మాక్లూర్: బైక్ను వెనుక నుంచి ఇటుక టిప్పర్ ఢీకొన్న ఘటన లో ఒకరికి తీవ్రగాయాలయ్యా యి. స్థానికుల కథనం ప్రకారం..మండలంలోని ధర్మోర గ్రా మానికి చెందిన కల్లెం నడ్పి సాయిలు బుధవారం ద్విచ క్ర వాహనంపై నవీపేట మండలం కమలాపూర్ వె ళ్లి తిరిగి వస్తున్నాడు. మెట్పల్లి, వల్లభాపూర్ గ్రా మాల మధ్యలో వెనుక నుండి వస్తున్న మినీ టిప్పర్ బలంగా ఢీకొట్టింది. దీంతో కల్లెం నడ్పి సాయిలు కాలు విరిగింది. గమనించిన వాహనదారులు క్షతగాత్రుడిని అంబులెన్స్లో ఆస్పత్రికి తరలించారు. -
భీముని గుట్టపై..
బోధన్: పాండవులు నడియాడిన ప్రదేశంగా ప్రత్యేక గుర్తింపు ఉన్న బోధన్ పట్టణంలోని రాకాసీపేట ప్రాంతంలోని భీమేశ్వరాలయం(భీమునిగుట్ట) విజయదశమి వేడుకలకు ముస్తాబైంది. ప్రతి ఏడాది దసరా వేడుకలను గుట్టపై ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆలయంలో శరన్నవరాత్రి ఉత్స వాలు ఘనంగా కొనసాగుతున్నాయి. బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన డీసీసీబీ మాజీ చైర్మన్, ప్రస్తుత పట్టణ అభివృద్ధి కమిటీ చైర్మన్ గంగాధర్రావు పట్వారీ కుటుంబం ఆనవాయితీగా దశాబ్దాలుగా పట్టణ ప్రముఖులతో కలిసి హోమం, ఆయుధ, జమ్మిచెట్టుకు పూజలు నిర్వహిస్తున్నారు. గురువారం సైతం దసరా ఉత్సవాలకు ఆలయ అభి వృద్ధి కమిటీ ఏర్పాట్లు చేసింది. బకాసురుడి సంహారం వనవాస సమయంలో పాండువులు ఏకచక్రపురం (బోధన్)లోని ఓ బ్రాహ్మణ కుటుంబం వద్ద ఆశ్ర యం పొందారని, ఆ సమయంలో బకాసురుడు ప్రజలను పీడించే వాడని చరిత్రకారులు చెబుతా రు. ప్రతి రోజూ బండెడు అన్నంతోపాటు ఓ వ్యక్తి ఆహారంగా వంతుల వారీగా వెళ్లాల్సి వచ్చేదని, ఈ క్రమంలో ఓ రోజు పాండువులకు ఆశ్రమిచ్చిన బ్రా హ్మణ కుటుంబం నుంచి ఆహారం, ఓ వ్యక్తి ఆహారంగా వెళ్లాల్సి రావడంతో ఆ కుటుంబం పాండవరాజులకు తమ పరిస్థితిని మొరపెట్టుకున్నా రని, దీంతో భీమునిగుట్ట(భీమేశ్వరాలయం)పై భీ ము డు యుద్ధం చేసి బకాసురుడిని సంహరించాడని చెబుతారు. -
విజయాల దశమి
● నేటి ఉత్సవాలకు సర్వం సిద్ధం ● ముస్తాబైన ఆలయాలు ● నిజామాబాద్, బోధన్, ఆర్మూర్లో రావణ దహనానికి ఏర్పాట్లు విజయాలను అందించే విజయదశమి వేడుకలకు సర్వం సిద్ధమైంది. మహిషాసురిడిని అమ్మవారు సహరించిందీ.. రావణుడితో యుద్ధం సమయంలో శ్రీరాముడికి సాక్షాత్కారం ఇచ్చింది దశమి రోజే. జిల్లా కేంద్రంలోని ఆలయాలతోపాటు ఆర్మూర్లోని జంబి హనుమాన్, బోధన్ పట్టణంలోని భీమునిగుట్టపై గురువారం నిర్వహించనున్న దసరా వేడుకలకు ఏర్పాట్లు చేశారు. ఆయా ప్రాంతాల్లో రావణ దహనం కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. బుధవారం ఆయా ప్రాంతాల్లో మార్కెట్లు కిటకిటలాడాయి. వస్త్ర దుకాణాలు కొనుగోలుదారులతో కిక్కిరిశాయి. వేర్వేరు ప్రాంతాల్లో స్థిరపడిన వారు సైతం దసరా వేడుకలను సొంత ఊళ్లలో నిర్వహించుకునేందుకు వచ్చేశారు. నగరంలో పండగ సందడి నిజామాబాద్ రూరల్: జిల్లా కేంద్రమైన నిజామాబాద్ నగరంలో దసరా సందడి నెలకొంది. వస్త్ర షోరూములు కొనుగోలు దారులతో కిటకిటలాడాయి. పూలు, గుమ్మడి కాయల వ్యాపారం జోరుగాసాగింది. బుధవారం వాహన, ఆయుధ పూజను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. గురువారం విజయ దశమి సందర్భంగా బ్రహ్మంగారి గుడి, జంబిహనూమాన్ ఆలయాల వద్ద ఏర్పాట్లు చేశారు. అలాగే ఆలయాల్లో శమీ పూజను నిర్వహించనున్నారు. అధికారులు విజయదశమికి సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేశారు. -
మూడు రోజుల్లో రూ.25 కోట్ల మద్యం..
● నేడు మూసి ఉండనున్న వైన్షాపులు ● మాంసం విక్రయాలూ బంద్ ● రూ.3 కోట్ల విలువైన జీవాల విక్రయంఖలీల్వాడి: జిల్లాలో మూడు రోజుల్లో రికార్డు స్థాయిలో మద్యం విక్రయాలు సాగాయి. మొ త్తం 102 మద్యం దుకాణాలు ఉండగా, రో జుకు రూ.4.50 కోట్ల వ్యాపారం జరుగుతుంది. అయితే గురువారం దసరా ఉండగా, ఇదే రోజు గాంధీ జయంతి కావడంతో వైన్షాపు లు, మాంసం దుకాణాలు మూసి ఉండనున్నాయి. దీంతో వైన్షాపుల వద్ద బారులు తీరారు. సోమ, మంగళ, బుధవారాల్లో రూ.25 కోట్ల విలువైన మద్యం విక్రయమైంది. సోమవారం రూ.4 కోట్లకు పై గా వ్యాపారం కాగా, మంగళవారం రూ.10.54 కోట్ల విలువైన, బుధవారం రూ.8 కోట్ల నుంచి రూ.10 కోట్లకు పైగా విలువైన మద్యం విక్రయాలు జరిగినట్లు ఎకై ్సజ్ వర్గాల ద్వారా తెలి సింది. గాంధీ జయంతి నేపథ్యంలో మద్యం దుకాణాలు మూసి ఉంటాయని ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి స్పష్టం చేశారు. గాంధీ జయంతి రోజున మాసం విక్రయం నిషేధమైనప్పటికీ.. దసరా ఉండడంతో మేక లు, గొర్రెల విక్రయాలు జోరుగా సాగాయి. నవీపేట్ మేకల సంతలో రూ.3 కోట్ల జీవాలు విక్రయమయ్యాయని అంచనా. -
వందేళ్లలో తొలిసారి..
నిజాంసాగర్: ఉమ్మడి జిల్లా వరప్రదాయని అయిన నిజాంసాగర్ ప్రాజెక్టుకు ఈ ఏడాది రికార్డు స్థాయిలో వరదలు వచ్చాయి. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో 44 రోజుల వ్యవధిలోనే 237.9 టీఎంసీల ఇన్ఫ్లో రావడం గమనార్హం. వందేళ్ల చరిత్ర కలిగిన ప్రాజెక్టుకు ఈ స్థాయిలో వరదలు రావడం ఇది తొలిసారి.. నిజాం కాలంలో మంజీర నదిపై అచ్చంపేట వద్ద భారీ జలాశయం నిర్మాణం ప్రారంభించారు. 1923లో ప్రారంభమైన నిర్మాణం 1931లో పూర్తయ్యింది. కర్ణాటక, మహారాష్ట్రల్లో కురిసిన వర్షాల తోపాటు మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో కురిసే వర్షాలతో ప్రాజెక్టులోకి నీరు వచ్చి చేరుతుంది. ఆగస్టు 18న ప్రారంభమైన ఇన్ఫ్లో.. నిజాంసాగర్ ప్రాజెక్టులోకి ఈ ఏడాది ఆగస్టులో ఇన్ఫ్లో ప్రారంభమైంది. ఆ నెలలో భారీ వర్షాలు కురవడంతో 111.53 టీఎంసీల నీరు వచ్చి చేరింది. సెప్టెంబర్లోనూ వరుణుడి జోరు కొనసాగడంతో మరో 126.41 టీఎంసీలు జత కలిసింది. మొత్తం 44 రోజుల వ్యవధిలో 237.94 టీఎంసీల ఇన్ఫ్లో రావడం గమనార్హం. వందేళ్ల ప్రాజెక్టు చరిత్రలో ఇది రికార్డ్ కావడం గమనార్హం. అంతకుముందు 1983 సంవత్సరంలో నిజాంసాగర్ ప్రాజెక్టు భారీ స్థాయిలో వరదలు వచ్చాయి. ఆ సంవత్సరం ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో కలిపి 163 టీఎంసీల వరద నీరు వచ్చి చేరింది. ఆ తర్వాత ఈ స్థాయికి మించి వరదలు రావడం ఇదే తొలిసారి. ఒక రోజులో రెండో అత్యధికం నిజాంసాగర్ ప్రాజెక్టులోకి 1962 సంవత్సరంలో భారీ వరదలు వచ్చాయి. ఒక రోజులో ప్రాజెక్టు చరిత్రలో గరిష్టంగా 4.32 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదయ్యింది. 1988 సంవత్సరంలో 2 లక్షల క్యూసెక్కులు వచ్చింది. ఆ తర్వాత ఎప్పుడూ ఒక రోజులో గరిష్ట ఇన్ఫ్లో 2 లక్షల క్యూసెక్కులు దాటలేదు. ఈసారి అగస్టు 28న 2.56 లక్ష క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చింది. లక్ష క్యూసెక్కుల ఇన్ఫ్లోనిజాంసాగర్: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు బుధవారం సాయంత్రం నిజాంసాగర్ ప్రాజెక్టులోకి 1,03,516 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు 15 గేట్లను ఎత్తి 1,00,056 క్యూసెక్కుల నీటిని మంజీర నదిలోకి వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1,405 అడుగులు(17.8 టీఎంసీలు) కాగా బుధవారం సాయంత్రానికి 1,402.40 అడుగులు (14.486 టీఎంసీలు) నీరు నిల్వ ఉంది. నిజాంసాగర్ ప్రాజెక్టులోకి 237.9 టీఎంసీల ఇన్ఫ్లో గతంలో 1983లో 163 టీఎంసీలు చేరిక నెలన్నరగా పరవళ్లు తొక్కుతున్న మంజీర నది -
ఆర్మూర్ జంబి హనుమాన్ ఆలయంలో..
ఆర్మూర్టౌన్: పట్టణంలోని జంబి హనుమాన్ ఆలయ ఆవరణలో నిర్వహించే దసరా వేడుకలకు ఎంతో ప్రత్యేకత ఉంది. ప్రతి సంవత్సరం ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించే రావణ సంహారం ప్రదర్శన ఆకర్షణగా నిలుస్తుంది. ఆర్మూర్ పట్టణానికి చెందిన వారితోపాటు పరిసర గ్రామాల ప్రజలు హాజరై ఉత్సవాల్లో పాల్గొంటారు. సర్వ సమాజ్ ఆధ్వర్యంలో వేంకటేశ్వర స్వామి ఉత్సవ విగ్రహాలను రథంపై ఊరేగించనున్నారు. జంబి హనుమాన్ ఆలయ ఆవరణకు రథం చేరుకోగానే రాముడు బాణం విసిరి రావణుని సంహరించే సన్నివేశం ప్రారంభమవుతుంది. రామరావణ యుద్ధం ముగిసిన తరువాత ప్రజలు ఒకరినొకరు ఆలింగనం చేసుకుని దసరా శుభాకాంక్షలు తెలుపుకుంటారు. ఆర్మూర్లో నిర్వహించే దసరా ఉత్సవం కేవలం భక్తి, ఆచారం మాత్రమే కాదు, సమాజ బాంధవ్యాలను, సాంస్కతిక వైభవాన్ని ప్రతిబింబిస్తుంది. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తారు. -
దశావతారాల్లో సర్వమంగళ..
సర్వమంగళ ప్రదాయిని, జగజ్జనని దశావతారాల రూపంలో చిన్నారులు ఆకట్టుకున్నారు. నిజామాబాద్ నగరంలోని గోనెరెడ్డి సంఘం ఆధ్వర్యంలో హనుమాన్ మందిరం ఆవరణలో నెలకొల్పిన దుర్గామాత మండపంలో బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారు మహిషాసురమర్దినిగా భక్తులకు దర్శనం ఇవ్వగా, చిన్నారులు అమ్మవారి దశావతారాలను ప్రదర్శించారు. సాయంత్రం మండపం వద్ద హోమం, కుంకుమార్చన నిర్వహించారు. భవానీ మాలధారులు అంతిరెడ్డి విజయపాల్రెడ్డి, బాల్రెడ్డి, రామ్రెడ్డి, సాయిరెడ్డి, సాగర్ రెడ్డి, ప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. – నిజామాబాద్ రూరల్ -
శతాబ్ది ప్రస్థానంలో కాషాయం రెపరెపలు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ఇందూరు నగరంలో 65 చోట్ల ఆర్ఎస్ఎస్ శాఖలు నడుస్తున్నాయి. ప్రతి బస్తీలో శాఖలు ఉండడంతో తెలంగాణలోనే సంపూర్ణ శాఖలున్న మొదటి నగరంగా నిలిచింది. జిల్లాలోని ఇతర మండలాలు, పట్టణాల్లో పెద్ద ఎత్తు న శాఖలు విస్తరించాయి. ● శతాబ్ది ఉత్సవాల నేపథ్యంలో ‘పంచ పరివర్తన్’ పేరిట (కుటుంబ ప్రబోధన, సామాజిక సమరసత, స్వ అధారిత జీవనం, బాధ్యతాయుత పౌరవిధు లు, పర్యావరణ పరిరక్షణ) అనే అంశాలను ప్రజ ల్లోకి తీసుకెళుతున్నారు. మరో నెలపాటు ఈ కార్యక్రమాలు జరుగనున్నాయి. ● హెడ్గేవార్ తాతగారైన నరహరి శాస్త్రి 169 సంవత్సరాల క్రితం రెంజల్ మండలం కందకుర్తి నుంచి వేదపండితులకు ప్రాధాన్యత ఇచ్చే భోంస్లే సంస్థానమైన నాగ్పూర్కు వలస వెళ్లారు. ఈ క్రమంలో కందకుర్తిలో స్మృతిమందిరంగా ఉన్న వారి ఇంటి వద్ద ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో 1989 నుంచి శ్రీ కేశవ శిశు విద్యామందిర్ పాఠశాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భరతమాత విగ్రహం, హెడ్గేవార్ కులదైవమైన చెన్నకేశవనాథ్ విగ్రహం, హెడ్గేవార్ విగ్రహం ప్రతిష్ఠించారు. కేశవ సేవాసమితి ఆధ్వర్యంలో గో దావరి హారతి కార్యక్రమం నిర్వహిస్తూ వస్తున్నారు. శతాబ్ది ఉత్సవాల నేపథ్యంలో హెడ్గేవార్ పూర్వీకుల ఇంటి స్థానంలో రూ.12 కోట్ల వ్యయంతో భా రీ స్మృతి మందిరం నిర్మిస్తున్నారు. దీని వద్దనే గో దావరి ఒడ్డున మరో 10 ఎకరాల్లో కేశవ స్ఫూర్తి కేంద్రం, పాఠశాల, వసతిగృహం, భరతమాత ఆలయం, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నారు. పేద పిల్లలు, రైతులు, మహిళలకు శిక్షణ ఇవ్వలని నిర్ణయించారు. పాఠశాలలో ముస్లిం విద్యార్థులు సైతం విద్యనభ్యసిస్తున్నారు. కేశవ సేవాసమితి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేపడుతున్న కందకుర్తి గ్రామాన్ని ఇప్పటికే పలువురు సర్సంఘ్ చాలక్ (ఆర్ఎస్ఎస్ చీఫ్)లు సందర్శించారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న స్మృతి మందిరం ప్రారంభానికి ఆర్ఎస్ఎస్ సర్సంఘ్ చాలక్ మోహన్ భగవత్జీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ త్వరలో హాజరు కానున్నారు. ● కేశవ్ బలిరాం పంత్ హెడ్గేవార్ నాగ్పూర్లోనే జన్మించారు. కోల్కతాలో వైద్య విద్యనభ్యసించారు. బెంగాల్లో అనుశీలన సమితి, జుగాంతర్ మొదలైనవాటి ప్రభావానికి లోనయ్యారు. కాంగ్రె స్, హిందూ మహాసభలలో సభ్యుడిగా పనిచేశారు. దేశ స్వాతంత్య్ర సమరంలో పాల్గొన్నందుకు రెండుసార్లు జైలు శిక్ష అనుభవించారు. హెడ్గేవార్ వైద్య విద్య అభ్యసించినా.. సమాజంలో ఉన్న రుగ్మతల పై ఎక్కువగా దృష్టి సారించారు. దేశం విదేశీయుల చేతుల్లోకి వెళ్లిపోవడానికి హిందువులు కులాలవారీగా విడిపోయి కలహించుకోవడం, ఆత్మన్యూనతలో మునిగిపోవడం కారణాలుగా భావించిన ఆ యన.. సమాజంలో ఐక్యత కోసం ఏదైనా చేయాల ని నిర్ణయించుకుని ఆర్ఎస్ఎస్ను స్థాపించారు. ఆయన నాటిన విత్తనం మొలకెత్తి అంచెలంచెలుగా ఎదిగి నేడు వటవృక్షమైంది.హెడ్గేవార్ 1940 జూన్ 21న మరణించారు. అక్షరాస్యత పెంచడంలో..1989లో శ్రీ కేశవ శిశు విద్యామందిర్ను ప్రారంభించారు. తరువాత 2004లో పాఠశాల నూతన భవనాన్ని అప్పటి సంఘ్ దక్షిణమధ్య క్షేత్ర కా ర్యాకారిణి సదస్యులైన శ్రీరాంబావ్ హల్దేకర్ జీ ప్రారంభించారు. 2013 నుంచి కంప్యూటర్ ల్యా బ్, డిజిటల్ ల్యాబ్, ఈ–తరగతులు, ఎల్ఈడీ టీ వీ సౌకర్యం కల్పించారు. ఉపాధ్యాయులకు స్పో కెన్ ఇంగ్లిష్ తరగతులు నిర్వహిస్తున్నారు. మ రో వైపు కందకుర్తి చుట్టుపక్కల గ్రామాల యువతీయువకులకు ఎండాకాలంలో ఉచిత కంప్యూట ర్ శిక్షణ తరగతులు నిర్వహించి సర్టిఫికెట్లు అందిస్తున్నారు. కందకుర్తి గ్రామం నుంచి మొదటి సైనికుడిగా ఎంపికై న జుబెర్ బాషా, రెంజల్ మండలం నుంచి మొదటిసారిగా నావికాదళానికి ఎంపికై న శశివర్ధన్ ఈ పాఠశాలలోనే విద్యనభ్యసించారు. కేశవ సేవాసమితి వివిధ సేవా కార్యక్రమాలు చేపడుతోంది. చుట్టుపక్కల 19 గ్రా మాల్లో బాలబాలికలలో సంస్కారం, చదువు కో సం బాల సంస్కార కేంద్రాలు, బాలికల కోసం కిషోరి వికాస్ కేంద్రాలు, ట్యూషన్ సెంటర్లు, పె ద్దవారికి భజన మండళ్లు, గృహిణులకు మాతృమండళ్లు, యువకులకు క్రీడాకేంద్రం, గ్రంథాలయం, నారాయణ సేవ వంటి కార్యక్రమాలు కొ న్నేళ్లుగా నిర్వహిస్తున్నారు. దీంతో రెంజల్ మండలంలో అక్షరాస్యత గణనీయంగా పెరిగింది. పేద యువతకు చేతివృత్తుల్లో శిక్షణ ఇస్తున్నారు. వందేళ్ల ప్రస్థానాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) గురువారం 101వ వసంతంలోకి అడుగు పెట్టింది. ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద సామాజిక, సాంస్కృతిక సంస్థగా ఉన్న ఆర్ఎస్ఎస్ను 1925లో విజయదశమి రోజున నాగ్పూర్లో ఐదుగురు పిల్లలతో కేశవ బలిరామ్ హెడ్గేవార్ స్థాపించారు. తరువాత కొన్నేళ్లకే ఇందూరు నగరంలోని గాజుల్పేట దత్తమందిర్లో ‘ఇందూరు శాఖ’ను ప్రారంభించారు. ఇందూరు జిల్లాలో ఉరకలెత్తుతున్న రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కందకుర్తిలో సంఘ్ వ్యవస్థాపకులు హెడ్గేవార్ మూలాలు జిల్లాకు గర్వకారణం హెడ్గేవార్ పూర్వీకుల ఇంటి స్థానంలో నిర్మాణంలో ఉన్న స్మృతి మందిరం సంఘ్ ఆధ్వర్యంలో ‘పంచ పరివర్తన్’ సూత్రాలతో శతాబ్ది ఉత్సవాలు నేడు 101వ వసంతంలోకి అడుగు పెట్టనున్న ఆర్ఎస్ఎస్ -
అనుబంధం.. ఆనందం
● దసరా వేడుకల కోసం స్వగ్రామానికి చేరుకున్న వ్యాపారవేత్త, రిటైర్డ్ ఏసీపీ ● మాక్లూర్ మండలం వల్లభాపూర్లో సందడి చేస్తున్న రెండు కుటుంబాలుమాక్లూర్: జీవితంలో ఎంత బిజీ ఉన్నా సొంతూ రులో దసరా వేడుకలు జరుపుకోవడం ఆ ఇద్దరికి ఎంతో ఇష్టం. తాము ఎంత బిజీ ఉన్నా, ఎక్కడ ఉ న్నా.. గ్రామంతో, గ్రామస్తులతో ఉన్న అనుబంధం తమను లాక్కొస్తుందని అంటున్నారు మండలంలోని వల్లభాపూర్ గ్రామానికి చెందిన వ్యాపారవేత్త జి సుధాకర్, రిటైర్డ్ ఏసీపీ గంగాధర్. సుధాకర్ 35 ఏళ్ల క్రితం గ్రామం నుంచి వెళ్లి హైదరాబాద్లో స్థిరపడ్డారు. తన మేనమామ, కంటోన్మెంట్ దివంగత ఎమ్మెల్యే జి సాయన్న సూచనల మేరకు మైన్స్ వ్యాపారంలోకి దిగి సక్సెస్ అయ్యారు. దసరా వేడుకలను మాత్రం గ్రామస్తులతో కలిసి చేసుకుంటున్నారు. గ్రామం కోసం ఏ సహాయం చేయడానికై నా ఆయన ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. ఈ ఏడాది కూడా భార్యా పిల్లలతో కలిసి గ్రామానికి చేరుకున్న ఆయన గ్రామస్తులతో కలిసి సందడి చేస్తున్నారు. ప్రతి ఏడాది దసరాకు సొంతూరికి వచ్చి అందరినీ కలిసి వెళ్లడం ఆనందంగా ఉంటుందని సుధాకర్ అంటున్నారు. గ్రామం నుంచి మొట్టమొదటి ప్రభుత్వ ఉద్యోగిగా ప్రత్యేక గుర్తింపు ఉన్న ఎస్ గంగాధర్ ఎస్సైగా విధుల్లో చేరి హైదరాబాద్లో సర్వీస్ పూర్తి చేశారు. ఏసీపీగా రిటైర్ అయిన ఆయన అక్కడే స్థిరపడ్డారు. రిటైర్ అయిన ప్రతి దసరాకు కుటుంబ సభ్యులతో కలిసి గ్రామానికి చేరుకుంటున్నారు. పిల్లలను మంచి చదువులు చది వించాలని గ్రామస్తులకు సూచించడంతోపాటు పేదలకు ప్రోత్సహకాలు అందజేస్తారు. ఈ ఏడాదిసైతం గ్రామానికి వచ్చిన ఆయన పిల్లలకు బుక్స్, పెన్నులు పంపిణీ చేశారు. సర్వీస్లో ఉన్న సమయంలో చాలా ఏళ్లపాటు గ్రామానికి రాలేకపోయానని, ధ్యాసంతా గ్రామంపైనే ఉండేదని గంగాధర్ అంటున్నారు. -
రేపు కిసాన్ మిలాప్
మోర్తాడ్(బాల్కొండ): రాజకీయ పార్టీలు, కు ల మతాలకు అతీతంగా అన్నదాతల ఆత్మీ య కలయిక కార్యక్ర మాన్ని శుక్రవారం ఆ ర్మూర్ వేదికగా నిర్వహించనున్నారు. దసరా సందర్భంగా అన్ని గ్రామాల రైతులను ఏకం చేస్తూ, వారి కష్టసుఖాలను స్వ యంగా తెలుసుకునేందుకు వరుసగా రెండో సంవత్సరం ‘కిసాన్ మిలాప్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ సుంకెట్ అన్వేశ్ రెడ్డి నేతృత్వంలో జిల్లాలోని అన్ని గ్రామాల రైతులను ఆహ్వానిస్తున్నారు. ‘కిసాన్ మిలాప్’ ద్వారా వ్యవసాయంలో జరుగుతున్న అభివృద్ధి, ఇబ్బందులు తెలుసుకోవడానికి అవకాశం ఉందని అన్వేశ్ రెడ్డి ‘సాక్షి’తో తెలిపారు. ఈ కార్యక్రమం ఏ రాజకీయ పార్టీకి సంబంధించినది కాదని, కేవలం రైతుల కోసమే నిర్వహించే వినూత్న సమ్మేళనమని వివిరంచారు. రైతు లు స్వయంగా హాజరుకావాలని కోరారు. పండుగకు ముందే అందిన వేతనాలు ● బల్దియా కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ సిబ్బంది ఆనందం నిజామాబాద్ సిటీ: ప్రతి నెలా 10వ తేదీ తరువాత అందే జీతాలు, ఇప్పుడు దసరాకు ముందు రోజే అందడంతో నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బల్దియా చరిత్రలో ఎన్నడూ ఒకటో తేదీన జీతాలు అందలేదని అంటున్నారు. సిబ్బందికి ఒక టో తేదీనే వేతనాలు ఇవ్వాలని కమిషనర్ ది లీప్కుమార్ అకౌంట్స్ సెక్షన్ అధికారులను ఆదేశించారు. దీంతో సెప్టెంబర్ 20వ తేదీ నాటికే ఉద్యోగుల హాజరు, వేతనాలను సి ద్ధం చేశారు. గత నెల 28వ తేదీనే బ్యాంక్లో చెక్కులు డిపాజిట్ చేయడంతో 1వ తేదీన సిబ్బంది ఖాతాల్లో వేతనాలు జమయ్యాయి. దసరాకు ఒక రోజు ముందే జీతాలు అందడంతో ఉద్యోగులు, సిబ్బంది కమిషనర్ దిలీప్కుమార్కు కృతజ్ఞతలు తెలిపారు. వేల్పూర్: జిల్లా, బాల్కొండ నియోజకవర్గ ప్రజలకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో విజయదశమి (దసరా)శుభాకాంక్షలు తెలిపారు. విజయానికి ప్రతీకగా, అన్యాయంపై గెలుపునకు సంకేతంగా విజయదశమి జరుపుకుంటామన్నారు. చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధించాలని, కుటుంబాల్లో ఆనందాలు, సుఖశాంతులు వెల్లివిరియాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. సీపీ శుభాకాంక్షలు.. ఖలీల్వాడి: జిల్లా ప్ర జలకు విజయదశమి పండుగ సందర్భంగా సీపీ పోతరాజు సాయిచైతన్య శుభాకాంక్షలు తెలిపారు. దుష్ట శక్తులపై విజయానికి సంకేతంగా జరుపుకునే ఈ పండుగను స్ఫూర్తిగా తీసుకొని ప్రజలందరూ ఐక్యత, సమగ్రతల కోసం కృషి చేయా లని పేర్కొన్నారు. కుటుంబసభ్యులతో నిండు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో కాలం గడపాలన్నారు. నిజామాబాద్, ఆ ర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలలో శాంతి భద్రతలకు, మత విధ్వంసాలకు తావులేకుండా సహకరించాలని కోరారు. ప్రజలు, పోలీస్ సిబ్బంది స్నేహ పూర్వకంగా సోదర స్వభావంతో మెలగాలని సూచించారు. -
వన్య ప్రాణుల రక్షణకు చర్యలు
ఇందల్వాయి: జాతీయ రహదారుల వెంట రోడ్డు దాటు తూ వాహనాలు ఢీ కొట్టి ఏటా పదుల సంఖ్యలో వన్య ప్రాణులు మృతి చెందుతున్నాయి. వీటి రక్షణకు అటవీ శాఖ వినతి మేరకు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా రహదారుల వెంట ఉన్న అటవీ భూములకు ఇరువైపులా కంచెల ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. నాలుగు చిరుతలు, ఒక ఎలుగు.. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉన్న 44వ నంబరు జాతీయ రహదారి వెంబడి ముఖ్యంగా కామారెడ్డి జిల్లా సదాశివ్నగర్ మండలం దగ్గి ప్రాంతం నుంచి ఇందల్వాయి మండలం తిర్మన్పల్లి శివారులోనే గత ఎనిమిదేళ్లలో ఐదు చిరుతలు, ఒక ఎలుగుబంటి రహదారిపై రాత్రి వేళల్లో రోడ్డు దాటుతూ గుర్తు తెలియని వాహనాలు ఢీకొని మృత్యువాత పడ్డాయి. అందుకే ఈ ప్రాంతంలో వన్యప్రాణులు రోడ్డు పైకి రాకుండా కంచెల ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. ఆహారం కోసం.. ఆహారం, నీటి కొరత వల్ల కొత్త ఆవాసాలను వెతుక్కుంటూ వన్య ప్రాణులు వాటి పరిధి దాటి రోడ్లపైకి, జనావాసాల్లోకి వస్తున్నాయి. ఈ క్రమంలో ప్రమాదాలకు గురై మరణిస్తున్నాయి. అవి ఎట్టి పరిస్థితుల్లో అడవుల ద్వారా రోడ్లపైకి రాకుండా 8 ఫీట్ల ఎత్తులో పటిష్టమైన చైన్లింక్ ఫెన్సింగ్ను ఏర్పాటు చేయనున్నారు. దీనివల్ల వన్యప్రాణులు అడవి దాటడానికి, దూకడానికి కాని వీలుపడదు. ఈ చర్యల వల్ల వన్యప్రాణులు రోడ్డు ప్రమాదాలకు గురి కాకుండా అడ్డుకోనున్నారు. ఇక్కడ మంచి ఫలితాలు వస్తే రాష్ట్రమంతట జాతీయ రహదారుల వెంట అడవులు ఉన్న ప్రతిచోట రెండు వైపుల ఫెన్సింగ్ వేయనున్నారు. మేలో చంద్రాయన్పల్లి వద్ద హైవేపై మృతి చెందిన చిరుతగత వేసవిలో తిర్మన్పల్లి వద్ద హైవేపై మృతి చెందిన ఎలుగుబంటిరహదారుల వెంట అటవీ భూములకు కంచెలు ఏర్పాటు చేయడంలో పైలట్ ప్రాజెక్ట్గా రాష్ట్రంలో మొదట 44వ నంబరు జాతీయ రహదారిని ఎంచుకున్నారు. ఇందులో ముఖ్యంగా గతంలో ఎక్కువ వన్యప్రాణులు మృతి చెందిన కామారెడ్డి–నిజామాబాద్ మార్గ మద్యలో ఐదు కిలోమీటర్ల మేర అటవీ ప్రాంతాన్ని గుర్తించి గ్రౌండ్ వర్కింగ్ పనులు చేయడంలో అటవీ, రహదారుల అధికారులు నిమగ్నమయ్యారు. చర్యలు వేగవంతంఅటవీ శాఖ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకొని హైవే అథారిటి ఆఫ్ ఇండియా ఫెన్సింగ్ ఏర్పాటుకు చర్యలు చేపట్టడం హర్షనీయం. ఉమ్మడి జిల్లాలో మంచిప్ప, చంద్రాయన్పల్లి రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాల్లో ఐదు కిలోమీటర్ల పొడవునా అడవులు ఉన్నాయి. రెండు వైపులా సుమారుగా పది కిలో మీటర్ల మేర ఫెన్సింగ్ ఏర్పాటుకు అటవీ, హైవే అథారిటీ అధికారులు గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. దసరా తర్వాత ఫెన్సింగ్ వేసే పనులు ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి. వాహనదారులు సైతం అటవీ ప్రాంతాల్లో నిర్దేశించిన వేగ నియంత్రణ పాటించాలి. – వికాస్ మీనా, జిల్లా ఫారెస్ట్ అధికారి రహదారుల వెంట అటవీ భూములకు కంచెలు ఉమ్మడి జిల్లాలో పది కిలోమీటర్ల పరిధిలో ఏర్పాటు ఎనిమిది ఫీట్ల ఎత్తులో పటిష్టమైన చైన్లింక్ ఫెన్సింగ్ రోడ్డు దాటుతూ వాహనాలు ఢీకొని మరణిస్తున్న చిరుతలు, ఇతర వన్య ప్రాణులు -
రిజర్వేషన్లు మారేనా?
నిజామాబాద్● రెండేళ్లలో ఉత్తీర్ణత కావాలన్న సుప్రీం కోర్టు ● లేదంటే సర్వీస్ నుంచి తొలగింపు ● ఆందోళన చెందుతున్న టీచర్లు అధిక వర్షాలతో పరేషాన్.. అధిక వర్షాలు రైతులను పరేషాన్ చేస్తున్నాయి. భూగర్భ జలాలు అధికమై పంట భూముల్లో నీరు ఉబికి వస్తోంది. బుధవారం శ్రీ 1 శ్రీ అక్టోబర్ శ్రీ 2025– 10లో uవాతావరణ పరిస్థితుల మేరకు వరికోతలు చేపట్టాలిబోధన్: వాతావరణ పరిస్థితుల మేరకు వరి కోతలను ప్రారంభించాలని జిల్లా వ్యవసా య శాఖ అఽధికారి గోవింద్ రైతులకు సూచించారు. ఎడపల్లి మండలంలోని జైతాపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం గోదాములో ఎరువుల నిల్వలను డీఏవో మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఎక్కడా యూరియా కొరత లేదని స్పష్టం చేశారు. వచ్చే యాసంగి సీజన్లో పంటల సాగుకు నానో యూరియా వాడాలని, దిగుబడి పెరు గుతుందని రైతులకు సూచించారు. ఆయన వెంట ఏవో సిద్ధి రామేశ్వర్, ఏఈవో శ్రీహరి, సొసైటీ సిబ్బంది ఉన్నారు. ● రెండురోజుల పాటు నగరంలోనే.. ● దసరా ఉత్సవాల్లో పాల్గొననున్న మహేశ్ కుమార్గౌడ్నిజామాబాద్ సిటీ: పీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ బుధవారం నగరంలో పర్యటించనున్న ట్లు జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు విఫుల్ గౌడ్ తెలిపారు. మున్సిపల్ కార్పొరేషన్, నుడా ఫండ్ నుంచి కేటాయించిన నిధులతో నిర్మించనున్న సీసీ డ్రైన్లు, సీసీ రోడ్లు, స్ట్రామ్వాటర్ డ్రైన్స్ పనులను ప్రారంభిస్తారు. అమ్మనగర్ బ్రిడ్జిని ప్రారంభించనున్నారు. కంఠేశ్వర్ ఆలయ పాలకమండలి కార్యక్రమంలో పాల్గొననున్నారు. సాయంత్రం 5 గంటల తర్వాత ఆర్అండ్బీ అతిథి గృహంలో కార్యకర్తలు, పార్టీ నాయకులకు అందుబాటులో ఉండనున్నట్లు విఫుల్గౌడ్ తెలిపారు. గురువారం జరిగే దసరా పండుగ వేడుకలో సైతం పీసీసీ చీఫ్ పాల్గొననున్నట్లు పేర్కొన్నారు. వైన్షాపులకు ఏడు దరఖాస్తులు ఖలీల్వాడి: జిల్లాలోని వైన్షాపులను లక్కీ డ్రా ద్వారా కేటాయించేందుకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోందని ఎకై ్సజ్ సూపరింటెండెంట్ కొమ్మూరి మల్లారెడ్డి తెలిపారు. మంగళవారం ఏడు దరఖాస్తులు అందాయన్నారు. నిజామాబాద్, ఆర్మూర్, మో ర్తాడ్ ఎక్సైజ్ స్టేషన్ల ఫరిధిలో రెండు చొ ప్పున, భీమ్గల్ స్టేషన్ పరిధిలో ఒక దరఖా స్తు అందిందని వివరించారు. ఇప్పటి వరకు మొత్తం 9 దరఖాస్తులు అందాయన్నారు. చెత్త వేరుచేసే ప్రక్రియను వేగవంతం చేయాలి నిజామాబాద్ సిటీ: చెత్తను వేరే చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని మున్సిపల్ రీజినల్ డైరెక్టర్ మసూద్ సూచించారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నాగారంలో ఉన్న డంపింగ్యార్డును మంగళవారం సాయంత్రం ఆయన పరిశీలించారు. డంపింగ్యార్డు ఇన్చార్జి ప్రభుదాస్తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఆయనవెంట డిప్యూటీ కమిషనర్ డీఈ ముస్తాక్ అహ్మద్, శానిటరీ సూపర్వైజర్ సాజిద్ అలీ తదితరులున్నారు. సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: స్థానిక సంస్థల రిజర్వేషన్లు.. షెడ్యూల్ విడుదల.. హైకోర్టులో కేసు.. సుప్రీం కోర్టుకు సైతం కేసు వెళ్లనుందనే వార్తల నేపథ్యంలో రిజర్వేషన్లు మారుతాయా? అనే చర్చ అన్ని పార్టీల శ్రేణుల్లో సాగుతోంది. ఎక్కడ చూసినా.. ఏ ఇద్దరు కలిసినా.. ఫోన్లలో మాట్లాడుకున్నా ఇవే సంభాషణలు జరుగుతున్నాయి. ఇక పోటీ చే యాలనుకుంటున్న వారిలో ఈ అంశం ఉత్కంఠను రేపుతోంది. వ్యవహారం హైకోర్టులో ఉండడం, దీ నిపై ఈ నెల 8న వాదనలు జరుగనున్న నేపథ్యంలో ప్రతిఒక్కరిలో ఆసక్తి నెలకొంది. పైగా కోర్టు నుంచి ఎలాంటి ఆదేశాలు వస్తాయో అనే విషయమై ఆశావహుల్లో ఆందోళన నెలకొనగా.. మరోవైపు మరుసటి రోజు నుంచే ఎంపీటీసీ, జెడ్పీటీసీ మొదటి విడత ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల, నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మొదలు పెట్టేందుకు యంత్రాంగం సిద్ధం అయ్యింది. దీంతో పరిణామాలు ఎలా మారుతాయోనని ముఖ్యంగా ఎన్నికల బరిలో నిలవాలనుకుంటున్న ఆశావహులు పరేషాన్ అవుతున్నారు. ఇదిలా ఉండగా డబ్బులు ఖర్చు చేయక తప్పని పరిస్థితి నెలకొనడంతో గందరగోళానికి గురవుతున్నారు. ఇక హైకోర్టు తీర్పును బట్టి సుప్రీం కోర్టుకు సైతం వెళ్లే అవకాశాలు ఉన్నాయని కొందరు అధికార పార్టీ నాయకులే మాట్లాడుతుండడం గమనార్హం. ఈటల వ్యాఖ్యలతో.. మహారాష్ట్రలో గతంలో స్థానిక ఎన్నికలు జరిగిన త రువాత సైతం కోర్టు రద్దు చేసిందంటూ మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో తాజా షెడ్యూల్, కోర్టు తీర్పు ఎలా వస్తుందోననే చర్చ జరుగుతోంది. మొదటి విడత నామినేషన్ల గడువు సమీపిస్తుండడం, ముందురోజే కోర్టు లో వాదనలు ఉన్నందున వ్యవహారం ఎలాంటి మ లుపులు తీసుకుంటుందోననే ఉత్కంఠ నెలకొంది. దీంతో డబ్బులు ఖర్చు చేసే విషయంలో ఆచితూచి వ్యవహరించాలని ఆయా పార్టీల నాయకులు, బరి లో నిలిచేందుకు సిద్ధమైనవారు నిర్ణయించుకున్నా రు. అయినప్పటికీ దసరా దావత్లు, అనుచరుల కోసం ఖర్చు చేయక తప్పని పరిస్థితి నెలకొందని చెబుతున్నారు. మొత్తంమీద షెడ్యూల్ వచ్చినప్పటికీ బంతి హైకోర్టులో ఉన్నందున ఎన్నికల వాతావరణంలో గతానికి భిన్నమైన ప్రత్యేకత నెలకొంది. పరిషత్, సర్పంచ్ స్థానాలకు పోటీ చేయాలనుకుంటున్న వారిలో ఇదే చర్చ బంతి హైకోర్టులో ఉండడంతో ఏమవుతుందోననే ఉత్కంఠ 8న కోర్టులో వాదనలు.. 9న పరిషత్ తొలివిడత నామినేషన్ల ప్రక్రియ కావడంతో ఆశావహుల్లో ఆందోళన మరోవైపు పార్టీ కోసం ఏళ్లతరబడి కష్టపడితే అవకాశాలు దక్కలేదంటున్న అధికార పార్టీ నాయకులు సుప్రీంకు సైతం కేసు వెళ్తుందంటున్న నేపథ్యంలో తర్జన భర్జనలు అధికార పార్టీ నేతల్లో నిరాశస్థానిక సంస్థల రిజర్వేషన్ల అంశం హైకోర్టులో ఉన్న నేపథ్యంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం ప్రభుత్వం ప్రకటించిన రిజర్వేషన్లలో అనుకూలంగా ఉన్న స్థానాలు ఎక్కడ మారుతాయోనని పరిషత్, పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. రిజర్వేషన్లపై హై కోర్టులో ఈ నెల 8న వాదనలు ఉండగా, మరుసటి రోజు నుంచే ఎంపీటీసీ, జెడ్పీటీసీ మొదటి విడత ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కానుంది. అధికార యంత్రాంగం నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను మొదలు పెట్టేందుకు అంతా సిద్ధం చేసుకుంది. ఏళ్ల తరబడి పార్టీ కోసం పనిచేసి, గత పదేళ్లలో ప లు కేసులు ఎదుర్కొన్నప్పటికీ తమకు పోటీ చేసే అవకాశాలు దక్కలేదని పలువురు అధికార పార్టీ నాయకులు గగ్గోలు పెడుతున్నారు. ఎంపీపీ స్థా నం దక్కించుకునే అవకాశం ఉన్నప్పటికీ ఎంపీటీ సీ స్థానంలో పోటీ చేసేందుకు అనుకూలంగా రిజర్వేషన్లు దక్కకపోవడంతో ఆయా మండలాల కీలక నాయకులు నిట్టూరుస్తున్నారు. ఎంపీటీసీ స్థానం అనుకూలంగా వచ్చినప్పటికీ ఎంపీపీ పీ ఠంపై కూర్చునేందుకు అవకాశాలు లేకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీకి చెందిన కీలక బీసీ నేత జెడ్పీ చైర్మన్ పీఠం దక్కించుకునేందుకు తగిన ఏర్పాట్లు చేసుకున్నారు. జె డ్పీటీసీ అనుకూలంగా వచ్చినప్పటికీ చైర్మన్ పీ ఠం బీసీ మహిళకు కేటాయించడంతో నిరాశ చెందుతున్నారు. అదేవిధంగా జెడ్పీ పీఠం ఆశించిన పలువురు ముఖ్య నేతలు సైతం అవకాశాన్ని కో ల్పోయామని మదన పడుతున్నారు. కాంగ్రెస్, బీ జేపీ, బీఆర్ఎస్లకు చెందిన పలువురు నాయకు లు తమ భార్యలను బరిలోకి దించే అవకాశాలు ఉన్నప్పటికీ అంతగా ఆసక్తి చూపడం లేదు. ఆచి తూచి అడుగేసేందుకే మొగ్గు చూపుతున్నారు. -
ఉపాధ్యాయుల్లో టెట్ గుబులు
నిజామాబాద్అర్బన్: ప్రభుత్వ ఉపాధ్యాయులు తప్పనిసరిగా టెట్ (టీచర్స్ ఎలిజిబిలిటి టెస్ట్) ఉత్తర్ణత కావాల్సిందేనని సుప్రీం కోర్టు ఇటీవల తీర్పు వెలువరించడంతో టీచర్లు ఆందోళన చెందుతున్నా రు. ప్రభుత్వం వెంటనే దీనిపై రిట్ పిటిషన్ వేయా లని గత కొన్ని రోజులుగా డిమాండ్ చేస్తున్నారు. అలాగే 2010కి ముందు నియమితులైన టీచర్లందరూ రెండేళ్లలో టెట్ అర్హత సాధించాలని సుప్రీం పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం 2012, 2017, 2024లో చేపట్టిన డీఎస్సీ నియామకాల్లో టెట్ను అమలు చేసింది. ఎలా సాధ్యమంటున్న టీచర్లు టెట్ మార్గదర్శకాలు తమకు వర్తించవని, సుప్రీం కోర్టు తీర్పు రూల్స్కు విరుద్ధమని విద్యా హక్కు చ ట్టం రాకముందు వివిధ నోటిఫికేషన్ల ద్వారా నియమితులైన ఉపాధ్యాయులు అంటున్నారు. ఇది ఎలా సాధ్యమని ప్రశ్నిస్తున్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రిట్ పిటిషన్ వేయాలని డిమాండ్ చేస్తు న్నారు. ప్రస్తుతం కొందరు నిరుద్యోగులే ఒకటి కంటే ఎక్కువసార్లు రాస్తేనే ఉత్తీర్ణత సాధిస్తున్నారని, అలాంటిది 10 నుంచి 15 సంవత్సరాల ఉపాధ్యాయ వృత్తి కొనసాగుతున్న వారు టెట్ ఎలా పాస్ అవుతామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యాహక్కు చట్టానికి ముందే ఉపాధ్యాయ వృత్తిలో చేరిన వారికి టెట్ మినహాయింపు ఇవ్వాలని, పదోన్నతులు పొందే వారికి టెట్ అమలు చేయాల ని ఉపాధ్యాయ సంఘాలు నాయకులు కోరుతున్నారు. విద్యా హక్కు చట్టంలో సవరణ చేయాలంటున్నారు. అయితే చట్ట సవరణ అధికారం కేవలం కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉండగా, అనేక రాష్ట్రాలు సుప్రీంలో రిట్ పిటిషన్ దాఖలు చేశాయి. పైలట్ ప్రాజెక్ట్గా ఎన్హెచ్ –44పాఠశాలలు 1176.. టీచర్లు 4576..జిల్లాలో 1176 పాఠశాలలు, 4576 మంది టీ చర్లు ఉన్నారు. ఇందులో టెట్ ఉత్తీర్ణత లేని వా రు 1671 మంది ఉన్నారు. విద్య హక్కు చట్టం సెక్షన్ 23(1) ప్రకారం 1 నుంచి 8 తరగతుల కు బోధించే ఉపాధ్యాయులకు టెట్ తప్పని సరి చేస్తూ ఎన్సీటీఈ (నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్) 2010 ఆగస్టు 23న నోటిఫికేషన్ విడుదల చేసింది.అనంతరం 2014 న వంబర్ 12న పైస్థాయి పదోన్నతుల కోసం టె ట్ తప్పనిసరి చేస్తూ ఎన్సీటీఈ మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. చాలా రాష్ట్రాల్లో టెట్ ఉత్తీర్ణత కాకుండా పదోన్నతులు ఇస్తుండడంతో కొందరు ఉపాధ్యాయులు కోర్టులో పిటిష న్ వేశారు. దీంతో టెట్ తప్పనసరి అంటూ కో ర్టు పేర్కొంది. రానున్న రెండేళ్లలో టెట్ పాస్ కాకుంటే వెంటనే సర్వీస్ నుంచి తొలగించాలని సుప్రీంకోర్టు పేర్కొంది. దీంతో ఉపాధ్యాయులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మినహాయింపు ఇవ్వాలి 2010కి ముందు ఉద్యోగంలో ప్రవేశించిన ఉపాధ్యాయుల ను ఉద్యోగంలో కొనసాగించేందుకు మానవతా దృక్పథంతో టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలి. ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం చట్టాన్ని సవరించాలి. – జి శ్రీనివాస్, పీఆర్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు రిట్ పిటిషన్ వేయాలి సుప్రీంకోర్టు తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రిట్ పిటిషన్ వేయాలి. స్టే ఆర్డర్ తీసుకువస్తే బాగుంటుంది. 2010 కి ముందు నియమితులైన ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలి. – సురేశ్, గెజిటెడ్ హెచ్ఎంల సంఘం రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు -
ఈనెల 5 నుంచి ధాన్యం సేకరణ
నిజామాబాద్ అర్బన్: కొనుగోలు కేంద్రాలను అందుబాటులోకి తీసుకువచ్చి ఈనెల 5వ తేదీ నుంచి ధాన్యం సేకరణ సజావుగా సాగేలా అంకితభావంతో కృషి చేయాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. సమీకత జిల్లా కార్యాలయాల సముదాయ మినీ కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముందస్తుగా నాట్లు పూర్తి చేసిన ప్రాంతాల్లో పంట దిగుబడి వస్తున్న దృష్ట్యా కొనుగోలు కేంద్రాలు రైతులకు అందుబాటులోకి తెచ్చేలా అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆయా ప్రాంతాల్లో ధా న్యం సేకరణ కేంద్రాలు అందుబాటులో ఉండే వి ధంగా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని అన్నా రు. రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని, అవసరమైన అన్నిమౌలిక సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. తేమ కొలిచే యంత్రాలు, టార్పాలిన్లు, తూకం యంత్రాలతోపాటు హమాలీలను అందుబాటులో ఉంచాలన్నారు. నాణ్యతా ప్రమాణాలకు లోబడి ధాన్యం తీసుకువచ్చే రైతులకు ప్రభుత్వం ప్రకటించిన మేరకు పూర్తి స్థాయి మద్దతు ధర అందేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని స్పష్టం చేశారు. సంబంధిత శాఖల అధికారులందరూ సమష్టిగా, సమన్వయంతో ప నిచేస్తూ ధాన్యం సేకరణ ప్రక్రియను విజయవంతం చేయాలన్నారు. అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, డీఎస్వో అరవింద్రెడ్డి, సివిల్ సప్లయీస్ డీఎం శ్రీకాంత్రెడ్డి, జిల్లా సహకార శాఖ అధికారి శ్రీనివా స్, జిల్లా వ్యవసాయ అధికారి జె గోవిందు, మార్కెటింగ్ శాఖ ఏడీ గంగుబాయి పాల్గొన్నారు. కొనుగోలు కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి అధికారులు సమన్వయంతో పని చేయాలి కలెక్టర్ టి వినయ్కృష్ణారెడ్డి -
పోలీస్ పరేడ్ రగ్రౌండ్లో చండీయాగం
● హాజరైన కలెక్టర్, సీపీఖలీల్వాడి: జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో ఏర్పాటు చేసిన దుర్గా పరమేశ్వరీ మాత మందిరంలో మంగళవారం మహా చండీయాగం నిర్వహించారు. యాగానికి కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, సీపీ పోతరాజు సాయిచైతన్యలు సతీమేతంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో అదనపు డీసీపీలు బస్వారెడ్డి, రామచంద్రరావు, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్కుమార్, ఆర్మూర్, బోధన్ సబ్ కలెక్టర్లు అభిజ్ఞాన్ మాల్వీయ, వికాస్ మహతో, డీఎంహెచ్వో రాజశ్రీ, ట్రెయినీ కలెక్టర్, ఏసీపీలు, సీఐలు, ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు. -
బీఎస్ఎన్ఎల్ సమృద్ధి జీపీగా వేల్పూర్
వేల్పూర్: బీఎస్ఎన్ఎల్ సమృద్ధి గ్రామ పంచాయతీగా వేల్పూర్ ఎంపికై నట్లు సంస్థ హైదరాబాద్ నోడల్ అధికారి నంబి మృదుపాణి పేర్కొన్నారు. మంగళవారం ఆమె వేల్పూర్ గ్రామ పంచాయతీలో బీఎస్ఎన్ఎల్ సమృద్ధి ద్వారా అందించే సేవలను వెల్లడించారు. సమృద్ధి ద్వారా అంతరాయం లేకుండా ఇంటర్నెట్ సేవలు లభిస్తాయన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, వ్యక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో నిజామాబాద్ సబ్ డివిజన్ ఇంజినీర్ హనుమాన్సింగ్, మోర్తాడ్ ఎస్డీఈ చిన్నయ్య, నెట్వర్క్ ఇంజినీర్ సుమన్రెడ్డి, మోర్తాడ్ ఫీల్డ్ టెక్నీషియన్ సతీశ్కుమార్, జేఈ రాకేశ్కుమార్, వేల్పూర్ టీఐపీ సుధాకర్ పాల్గొన్నారు. నవీపేట: మండలంలోని యంచ గోదావరి నది బ్రిడ్జిపై దుర్గామాత నిమజ్జన ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని బీజేపీ నాయకులు కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డికి జిల్లా కేంద్రంలో మంగళవాం వినతిపత్రం సమర్పించారు. దూర ప్రాంతంలోని దుర్గామాత విగ్రహాలను యంచ గోదావరి నదిలో నిమజ్జనం చేస్తారని, ఇంత వరకు ఎలాంటి ఏర్పాట్లు చేయలేదని కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గసభ్యులు వడ్డి మోహన్రెడ్డి, మండల నాయకులు ద్యాగ సరిన్, రాజేందర్గౌడ్, రాజశేఖర్, భూషన్ తదితరులు పాల్గొన్నారు. -
అధిక వర్షాలతో పరేషాన్
● పంటలను వెంటాడుతున్న వాన ● దెబ్బతిన్న మొక్కజొన్న, సోయా ● ఆందోళన చెందుతున్న రైతులుబాల్కొండ: జిల్లాలోని పలు ప్రాంతాల్లో రైతులను అధిక వర్షాలు ఇబ్బందుల్లో పడేశాయి. ఇటీవల కురిసిన వర్షాలతో భూగర్భ జలాలు అధికమై పంట భూముల్లో నీరు ఉబికి వస్తుంది. భూముల్లో తేమ శాతం అధికంగా ఉండటంతో పంటల ఎదుగుదల లేక రైతులు ఆందోళన చెందుతున్నారు. నిత్యం వర్షాలు కురుస్తుండటంతో పంట దిగుబడులు తడిసి ముద్దవుతున్నాయి. అతివృష్టితో పంటలను ఎలా కాపాడుకోవాలో తెలియక రైతులు తికమకపడుతున్నారు. తడుస్తున్న పంట దిగుబడులు సెెప్టెంబర్ చివరిలో సైతం వర్షాలు కురుస్తుండటంతో చేతికొచ్చిన మొక్కజొన్న, సోయాలు తడిసిపోతున్నాయి. నూర్పిడి చేసి ఆరబెట్టిన మక్కలు ముక్కిపోతున్నాయి. తడిసిన మక్కలను ఆరబెట్టడంలో రైతులు నిమగ్నమయ్యారు. మరోవైపు వర్షం కురుస్తుండడంతో వ్యాపారులు ధరలు తగ్గిస్తున్నారు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పసుపు పంటకు తేమ ఎఫెక్ట్.. అధిక పెట్టుబడి, గంపెడు ఆశలతో సాగు చేసే పసుపు పంట వర్షాలతో తీవ్రంగా దెబ్బతింటుంది. మోతాదు వర్షంతోనే పసుపు పంటకు మేలు. నిత్యం వర్షాలు కురుస్తుండటంతో నేలల్లో తేమ శాతం అధికమై పసుపు పంటకు దుంపకుళ్లు సోకుతుంది. అంతే కాకుండా ఎదుగుదల లేకుండా పోతోంది. ఇప్పటి వరకు 50 శాతం మేర పసుపు పంటలకు నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ ఏడాది పచ్చి కరువు వచ్చి పడింది. రోజూ వర్షం పడుతుండటంతో భూములన్నీ తడిగా ఉన్నాయి. పసుపు పంట నీరు పట్టి పోయింది. దుంపలు తీస్తే వాసన వస్తుంది. ఇంకా వానలు కురుస్తునే ఉన్నాయి. మక్కలు ముక్కిపోతున్నాయి. ప్రభుత్వమే మమ్మల్ని ఆదుకోవాలి. – నడ్కుడ నర్సయ్య, రైతు, రెంజర్ల -
ముగిసిన జిల్లాస్థాయి వాలీబాల్ పోటీలు
పెర్కిట్(ఆర్మూర్): ఆలూర్ మండలం మచ్చర్లలో గ్రామ యువత ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలు సోమవారం రాత్రి ముగిశాయి. పోటీల్లో జిల్లా వ్యాప్తంగా 24 జట్లు పాల్గొన్నాయి. తుది పోరులో జక్రాన్పల్లి మండలం పడ్కల్ తండా విజేతగా నిలువగా, మచ్చర్ల రెండో స్థానంలో నిలిచింది. విజేతలకు స్థానిక కాంగ్రెస్ నాయకుడు యెర్ర జితేందర్ రెడ్డి రూ.8,888 నగదు బహుమతిని అందజేశారు. కార్యక్రమంలో షేక్ సమీర్, వెల్మ రాజ్కుమార్, ఉప్పు గంగారెడ్డి, కొర్వ ప్రవీణ్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. -
విద్యుత్ శాఖ ఫిర్యాదుల కోసం...
వాట్సాప్ నంబర్: 8333818266తెలంగాణ నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్(టీజీఎన్పీడీసీఎల్) తన వినియోగదారుల ఫిర్యాదుల కోసం మొబైల్ వాట్సాప్ నెంబర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఫిర్యాదు చేయాలనుకునే వినియోగదారులు సర్వీస్ నెంబర్ను నమోదు చేయగానే వివరాలు వెల్లడవుతాయి. చేసిన ఫిర్యాదుకు సంబంధించి ఒక ఐడీ వస్తుంది. ఆ వివరాలు వెంటనే వినియోగదారులకు మెసేజ్ రూపంలో అందుతాయి. ఫిర్యాదు ఏ స్థాయిలో ఉందనేది తెలుసుకోవచ్చు. సమస్య పరిష్కరించిన తర్వాత వినియోగదారునికి ఐవీఆర్ఎస్ కాల్ వస్తుంది. ఫీడ్ బ్యాక్ ఇవ్వమని అడుగుతారు. -
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పేరిణి నాట్య ప్రదర్శన
బోధన్: తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో కొనసాగుతున్న శ్రీవారి సాలకట్ల బ్రహోత్సవాల్లో సోమవారం సాయంత్రం జిల్లాకు చెందిన ధనిత్ డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో పేరిణి సతీశ్ బృందం నాట్య ప్రదర్శన ఇచ్చారు. జిల్లా కేంద్రానికి చెందిన నాట్య గురువు ఆధ్వర్యంలో 25 మంది కళాకారులు ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. నీల, యశశ్రీ, హర్షిత, లక్ష్మీవైష్ణవి, లక్ష్మి, సుమీష, త్రిశాల, హాసిని, బీ.హర్షిత, సాయిశ్రద్ధ తదితరులు పేరిణి నాట్యాన్ని ప్రదర్శించారు. బ్రహోత్సవాల్లో భాగంగా టీటీడీ సంగీత కళాశాల ఆధ్వర్యంలో 10 రాష్ట్రాల నుంచి 463 మంది నృత్య కళాకారులతో కూడిన 21 బృందాలు పాల్గొనగా, అందులో జిల్లాకు చెందిన పేరిణి నాట్య బృందం ఒకటి. ఈ సందర్భంగా నాట్య గురువు సతీశ్ మాట్లాడుతూ ఈ అవకాశం దక్కడం గొప్ప గౌరవమని, కళాకారులందరూ సమన్వయంతో ప్రదర్శనను విజయవంతం చేశారని హర్షం వ్యక్తంచేశారు. -
ఉద్యోగులకు విరమణ తప్పదు
ఖలీల్వాడి: ఉద్యోగులకు పదవీ విరమణ తప్పదని, ఎలాంటి రిమార్క్ లేకుండా పనిచేయడం గొప్ప విషయమని సీపీ పోతరాజు సాయిచైతన్య పేర్కొన్నారు. జిల్లా పోలీస్ శాఖలో పదవీ విరమణ చేసిన ఎస్సైలు బాబూరావు, ఎండీ నసీరుద్దీన్, సీపీ ఆఫీస్ సూపరింటెండెంట్ వనజా రాణిలను మంగళవారం సీపీ ఘనంగా సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రిటైర్డ్ ఉద్యోగులకు ఎలాంటి అవసరం ఉన్నా పోలీస్ శాఖ అందుబాటులో ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో అదనపు పోలీస్ కమిషనర్ (అడ్మిన్) బస్వారెడ్డి, ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ, స్పెషల్ బ్రాంచ్ సీఐ శ్రీశైలం, వన్టౌన్ ఎస్హెచ్వో రఘుపతి, రూరల్ ఎస్సై ఎండీ ఆరీఫ్, రిజర్వ్ సీఐ తిరుపతి తదితరులు పాల్గొన్నారు. -
లక్ష్మీనర్సమ్మ అంత్యక్రియలు పూర్తి
● హాజరైన అర్బన్, ఆర్మూర్ ఎమ్మెల్యేలు ధన్పాల్, పైడి రాకేశ్ రెడ్డినిజామాబాద్ రూరల్: నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి తల్లి లక్ష్మీనర్సమ్మ అంత్యక్రియలు మంగళవారం పూర్తయ్యా యి. కంఠేశ్వర్ బైపాస్లోని అశోకా టౌన్షిప్లో ఉన్న ఎమ్మెల్యే స్వగృహం నుంచి గూపన్పల్లిలోని వైకుంఠధామం వరకు జరిగిన అంతిమయాత్రలో భారీ సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. అంతకుముందు నిజామాబాద్ అర్బన్, ఆర్మూర్ ఎమ్మెల్యేలు ధన్పాల్ సూర్యనారాయణ, పైడి రాకేశ్ రెడ్డి, విత్తనాభివృద్ధి డెవలప్మెంట్ చైర్మన్ అన్వేశ్ రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహర్బిన్హందాన్, రైతు కమిషన్ చైర్మన్ గడుగు గంగాధర్, మానాల మోహన్రెడ్డి, యెండల లక్ష్మీనారాయణ, మండవ వెంకటేశ్వర్రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, పీసీసీ డెలిగేట్ బాడ్సి శేఖర్గౌడ్ తదితరులు లక్ష్మీనర్సమ్మ పార్థివదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఎమ్మెల్యే భూపతిరెడ్డిని ఓదార్చారు. వర్ధనపేట్ ఎమ్మెల్యే నాగరాజు ఫోన్ ద్వారా భూపతిరెడ్డిని పరామర్శించారు. -
ట్రాన్స్కోను ముంచిన ‘మంజీర’
● వరద పోటెత్తడంతో నీటమునిగిన ట్రాన్స్ఫార్మర్లు, దెబ్బతిన్న స్తంభాలు ● సుమారు రూ.20 లక్షల నష్టంనాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): మండలంలోని మంజీర పరివాహాక ప్రాంతంలో నదికి వరద పోటెత్తడంతో ట్రాన్స్కోకు భారీ నష్టం వాటిల్లింది. గతనెలాఖరులో కురిసిన భారీ వర్షాలతో ఎగువ నుంచి వచ్చి న వరదనీటి ప్రవాహానికి మండలంలోని ట్రాన్స్ఫార్మర్లు, స్తంభాలు నేలకూలాయి. దీంతో విద్యుత్శాఖకు సుమారు రూ.20 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు ట్రాన్స్కో అధికారులు తెలిపారు. మండలంలోని 131 విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతినడంతోపాటు సుమారు 200 విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయని అధికారులు తెలిపారు. అలాగే మండలంలోని గోలిలింగాల, చీనూర్, వాడి, నాగిరెడ్డిపేట, లింగంపల్లికలాన్, వెంకంపల్లి, తాండూర్, మాటూ ర్, మాసాన్పల్లి, ఆత్మకూర్ తదితర గ్రామాల శివారుల్లోని పంట పొలాలు నీటమునిగాయి. కాగా, వరదనీటి నుంచి బయటపడ్డ పంటలను గట్టెక్కించాలనే ఉద్దేశ్యంతో తాత్కాలికంగా రెండు 100 కేవీ ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేసి వ్యవసాయ బోరుబావులకు కరెంట్ సరఫరా చేశారు. దీంతోపాటు సుమారు 80 ట్రాన్స్ఫార్మర్లకు మరమ్మతులు చేపట్టి తిరిగి బిగించారు. సుమారు నెలరోజులుగా పంటపొలాలు వరద నీటిలోనే ఉండడంతో మిగిలిన ట్రాన్స్ఫార్మర్లకు మరమ్మతులు చేపట్టలేకపోతున్నారు. వరదనీరు పూర్తిగా తొలగిపోయిన తర్వాత నీటమునిగిన ట్రాన్స్ఫార్మర్లకు మరమ్మతులు చేపట్టడంతోపాటు నేలకూలిన స్తంభాలను సరిచేస్తామని ట్రాన్స్కో అధికారులు పేర్కొంటున్నారు. -
సమస్య ఏదైనా వాట్సాప్లో పరిష్కారం
● సోషల్ మీడియాలో ప్రభుత్వ శాఖలు ● వాట్సాప్, యాప్ల ద్వారా సలహాలు, సూచనలుకమ్మర్పల్లి: సామాజిక మాధ్యమాల వినియోగంలోకి ప్రభుత్వ శాఖలు చేరాయి. సామాజిక మాధ్యమాల వేదికగా సలహాలు, సూచనలు ఇస్తూ, సమస్యలకు పరిష్కార మార్గాలు చూపుతూ ప్రజలకు చేరువవుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్మార్ట్ సేవలతోపాటు యాప్లను అందుబాటులోకి తీసుకువచ్చి శాఖల వారీగా ఒక నెంబర్ను కేటాయించాయి. అందులో మెసేజ్ చేస్తే చాలు.. అవసరమైన సలహాలు పొందడంతోపాటు సమస్యలు చెప్పుకొనే అవకాశం కల్పించారు. మరికొన్ని శాఖల్లో ఫిర్యాదు చేస్తే తక్షణమే పరిష్కరించి తిరిగి వినియోగదారులకు సమాచారం అందించేలా యాప్లను రూపొందించారు.జిల్లాలోని కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు సీజన్ల వారీగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాతావరణ సూచనలు, తదితర వాటిని నేరుగా రైతుల సెల్ఫోన్కు సందేశం రూపంలో పంపించేలా ఏర్పాట్లు చేశారు. సమాచారం పొందాలనుకునే రైతులు ముందుగా తమ పేరు, పూర్తి వివరాలు, ఫోన్ నంబర్లను కృషి విజ్ఞాన కేంద్రంలో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. జిల్లాలో వ్యవసాయ సమాచారం నిమిత్తం ప్రస్తుతం 100కు పైగా వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి. అందులో 10 వేల మందికి పైగా రైతులకు సమాచారం వెళ్తుందని రుద్రూర్ కృషి విజ్ఞాన కేంద్ర ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ విజయ్కుమార్ తెలిపారు. -
ఎన్నికల నిర్వహణకు సన్నద్ధం కావాలి
● కోడ్ను పక్కాగా అమలు చేయాలి ● అధికారులతో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి నిజామాబాద్అర్బన్: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అన్ని విధాలుగా సన్నద్ధం కావాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాలులో ఎంపీడీవోలు, ఎంపీవోలతో కలెక్టర్ మంగళవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎలక్షన్ కోడ్ పక్కాగా అమలయ్యేలా చూడాలని, నియమ, నిబంధనలపై పూ ర్తి అవగాహన కలిగి ఉండి విధులను జాగ్రత్తగా ని ర్వర్తించాలని అన్నారు. రాజకీయ పార్టీలకు సంబంధించిన హోర్డింగులు, పోస్టర్లతోపాటు ప్రభుత్వ కా ర్యాలయాలు, సంస్థల గోడలపై ఏవైనా రాతలు ఉంటే తొలగించాలని ఆదేశించారు. ఓటర్లను ప్రలో భాలకు గురిచేసే చర్యలపై నిఘా ఉంచాలన్నారు. ఓటరు జాబితాను మరోమారు నిశితంగా పరిశీలించాలని, ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నట్లు గమనిస్తే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపు కోసం రెవెన్యూ డివిజన్ కేంద్రాల వారీగా కౌంటింగ్ హాళ్లను గుర్తించాలన్నారు. అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్కుమార్, సబ్ కలెక్టర్లు వికాస్ మహతో, అభిగ్యాన్ మా ల్వియ, ట్రెయినీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మా వి, జెడ్పీ సీఈవో సాయాగౌడ్, ఆర్డీవో రాజేంద్రకుమార్, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్, నోడల్ అధికారులు, డీఎల్పీవోలు పాల్గొన్నారు. రాజకీయ పార్టీలు సహకరించాలి ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందు కు రాజకీయ పార్టీలు సహకరించాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి కోరారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ మంగళవారం సమావేశమైన కలెక్టర్ ఎన్నికల నిర్వహణ అంశాలపై మాట్లాడారు. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు సహకారం అందించాలని కోరారు. -
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
మాక్లూర్: అడ్డుగా వచ్చిన గేదెలను తప్పించబోయి ఓ యువకుడు బైక్పై నుంచి కిందపడి మృతి చెందిన ఘటన మండలంలోని మాదాపూర్లో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. మాక్లూర్ ఎస్సై రాజశేఖర్ కథనం మేరకు... నందిపేట మండలం వెల్మల్ గ్రామానికి చెందిన మద్దెపల్లి మోహన్ (44) ద్విచక్ర వాహనంపై రాత్రి 7 గంటలకు పని నిమిత్తం నిజామాబాద్ వెళుతున్నాడు. మాదాపూర్ గ్రామం వద్ద పాడి గేదెలను తప్పించబోయి ప్రమాదవశాత్తు కిందపడ్డాడు. తలకు బలమైన గాయాలు కావటంతో మోహన్ అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ● చిన్నారి పరిస్థితి విషమం ఆర్మూర్ టౌన్: ఆర్మూర్ పట్టణంలోని రాజారాంనగర్ శివారు ప్రాంతం, వెంకటేశ్వర కాలనీ, ఔటిగల్లీల్లో పిచ్చికుక్కల స్వైరవిహారం చేశాయి. మంగళవారం సుమారు 17 మందిపై దాడి చేశాయి. క్షతగాత్రులకు ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో వైద్యులు చికిత్స నిర్వహించారు. కాగా, ఓ చిన్నారి పరిస్థితి విషమంగా ఉండడంతో జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. మాక్లూర్ : మండలంలోని కొత్తపల్లి శివారులో ఉన్న ఓ మామిడి తోటలో పేకాట స్థావరంపై మంగళవారం సాయంత్రం ఎస్సై రాజశేఖర్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది దాడి చేశారు. పేకాడుతున్న ఏడుగురిని అదుపులోకి తీసుకొని రూ.4,620 నగదు, 4 ద్విచక్ర వాహనాలు, 5 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేశామని ఎస్సై తెలిపారు. -
ఇన్ ఫ్లో 720 టీఎంసీలు..
బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లోకి ఈ ఏడాది ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో 720 టీఎంసీల వరద వచ్చి చేరింది. 1983లో 1165 టీఎంసీలు, ఆ తరువాత 1988లో 912.95 టీఎంసీల ఇన్ ఫ్లో వ చ్చింది. ఈ ఏడాది వచ్చిన వరద మూడో అతిపెద్ద ఇన్ఫ్లోగా ప్రాజెక్టు చరిత్రలో నిలిచింది. సెప్టెంబర్లోనే 400 టీఎంసీల ఇన్ఫ్లో రాగా, ఇప్పటికీ ఎ గువ నుంచి వరద కొనసాగుతూనే ఉంది. 3.8 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం ఎగువన మహారాష్ట్రలో ఉన్న బా బ్లీగేట్లను అక్టోబర్ 28వ తేదీన మూసివేస్తే వరదకు బ్రేక్ పడుతుంది. ఈ లెక్కన మరో 27 రోజులపాటు వరద వస్తుంది. ఈనెలలో సైతం భారీ ఇన్ఫ్లో కొనసాగితే పాతరికార్డును సైతం తిరగరాసే అవకాశం ఉంది. 660 టీఎంసీల అవుట్ ఫ్లో ప్రాజెక్ట్ నుంచి ప్రస్తుత సంవత్సరం 660 టీఎంసీల నీటిని వరద గేట్లు, కాలువల ద్వారా ఇప్పటి వరకు విడుదల చేశారు. అందులో 570 టీఎంసీల నీరు గోదావరికిలోకి వెళ్లింది. అంటే ప్రాజెక్ట్ నీటి నిల్వ సామర్థ్యం కన్నా 5 రెట్ల నీరు గోదావరికి వెళ్లిపోయింది. ● ఎస్సారెస్పీ చరిత్రలో మూడోసారి రికార్డు స్థాయి వరద! ● 1983, 1988 తరువాత ఇదే అత్యధికం ● ఇప్పటికీ కొనసాగుతున్న ఇన్ఫ్లో -
ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభ దిగ్విజయం
నిజామాబాద్ సిటీ: ఏఐటీయూసీ రాష్ట్ర 2వ మహాసభను విజయవంతం చేయడానికి కృషిచేసిన కార్మికులకు, అధికారులకు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఓమయ్య అన్నారు. సోమవారం జిల్లాకేంద్రంలోని ఏఎంసీలో శ్రద్ధానంద్ గంజిలోని ఏఐటీయూసీ కార్యాలయంలో కృతజ్ఞతా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓమయ్య మాట్లాడారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడిగా వై.ఓమయ్య, అధ్యక్షుడిగా మునీశ్వర్, ప్రధాన కార్యదర్శిగా ఎస్.బాలరాజ్, రాష్ట్ర సహాయ కార్యదర్శిగా పరుశురాం, కార్యవర్గ కమిటీ సభ్యులుగా శ్రీనివాస్గౌడ్, బాలాంజనేయులు, శ్రీహరి, సుధాకర్ గౌడ్, అనసూయ, నరేష్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఓమయ్య తెలిపారు. -
మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి
నిజామాబాద్ నాగారం: ప్రతి ఒక్కరూ మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలని అడిషనల్ డీసీపీ బస్వారెడ్డి అన్నారు.వరల్డ్ హార్ట్ డే సందర్భంగా సోమవారం మెడికవర్ ఆస్పత్రి ఆధ్వర్యంలో రుక్మిణి ఛాంబర్స్ నుంచి ఖిల్లా చౌరస్తా వరకు 2కే వాకథాన్ను నిర్వహించారు.ఈకార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు.ఇలాంటి వాక్లు ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన పెంచడానికి ఉపయోగపడతాయన్నారు.కార్డియాలజిస్టులు స దానంద రెడ్డి, సందీప్రావులు మాట్లాడుతూ నిద్రలే మి, ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోవడంతో యువతలో గుండె సమస్యలు పెరుగుతున్నాయి. కార్యక్రమంలో డాక్టర్లు జగదీష్ చంద్ర బోస్, వారిస్ అలీ, ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు. ఆరోగ్యకరమైన జీవన విధానం అలవర్చుకోవాలి ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన జీవన విధానం అలవర్చుకోవాలని కార్డియాలజిస్టు, రొటీరియన్ సందీప్ రావు పేర్కొన్నారు. వరల్డ్ హార్ట్ డే సందర్బంగా రోటరీ క్లబ్ ఆఫ్ జేమ్స్ నిజామాబాద్ ఆధ్వర్యంలో నగరంలోని సత్యా ఒకేషనల్ జూనియర్ కాలేజీలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పౌష్టిక ఆహారం తీసుకోవాలని, వ్యాయామం చేయాలని, రెగ్యులర్ వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు పాకాల నరసింహారావు, క్లబ్ సెక్రటరీ గంజి రమేష్, సభ్యులు చంద్రశేఖర్, గిరిష్ కుమార్, గౌరీ శంకర్, ప్రిన్సిపల్, లెక్చరర్స్, విద్యార్థులు పాల్గొన్నారు. -
భవానీ స్వాముల సేవలో అర్బన్ ఎమ్మెల్యే
సుభాష్నగర్: నగరంలోని శ్రద్ధానంద్ గంజ్లో సోమవారం దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన భవానీ స్వాముల మహా అన్న ప్రసాదం, పూజా కార్యక్రమాలకు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ దంపతులు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా వారు ప్రత్యేక పూజలు చేసి, మాతా ఆశీర్వాదంతో జిల్లా ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని వేడుకున్నట్లు తెలిపారు. అనంతరం భవాని స్వాములకు ఎమ్మెల్యే స్వయంగా అన్నప్రసాదాలను వడ్డించారు. నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, మర్చంట్ అసోసియేషన్ అధ్యక్షుడు కమల్ కిషోర్ ఇనానీ, కార్యదర్శి మారుతీ మల్లేష్, నాయకులు మాస్టర్ శంకర్, నాగోళ్ల లక్ష్మీనారాయణ, మండలాల అధ్యక్షులు, భవానీ స్వాములు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. -
పోయిరావమ్మా గౌరమ్మ
● ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుక ● ఉత్సహంగా గడిపిన మహిళలు సిరికొండ/నిజామాబాద్ రూరల్/డిచ్పల్లి/సుభాష్నగర్/ధర్పల్లి/నిజామాబాద్ అర్బన్/జక్రాన్పల్లి: నిజామాబాద్ రూరల్, అర్బన్ నియోజకవర్గాల్లో సోమవారం సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి, సంప్రదాయ పాటలతో పండుగ జరుపుకున్నారు.ఆయా గ్రామాల శివారుల్లో గల చెరువుల్లో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. మహిళలు గౌరీ దేవిని కీర్తిస్తూ పాటలు పాడారు. మహిళలు ఒకరికొకరు వాయినాలు ఇచ్చి పుచ్చుకుని ముత్తైదువుల ఆశీర్వాదాలను అందుకున్నారు. కన్యకాపరమేశ్వరి ఆలయంలో వివిధ రకాల బతుకమ్మలు -
పసుపు బోర్డు చైర్మన్కు జన్మదిన శుభాకాంక్షల వెల్లువ
సుభాష్నగర్: జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి జన్మదినం పురస్కరించుకుని బీజేపీతోపాటు వివిధ పార్టీల నాయకులు సోమవారం ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఎంపీ ధర్మపురి అర్వింద్తోపాటు ఎమ్మెల్యేలు ధన్పాల్ సూర్యనారాయణ, పైడి రాకేష్రెడ్డి, ఇతర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ రాష్ట్ర నాయకులు కలిసి, ఫోన్ల ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. గంగారెడ్డి దంపతులు మామిడిపల్లిలోని అపురూప వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. బీజేపీ నాయకులు న్యాలం రాజు, ఆకుల శ్రీనివాస్, తారక్ వేణు, ఇప్పకాయల కిషోర్, సంగం అనిల్కుమార్, కార్యకర్తలు పుష్ఫగుచ్చమిచ్చి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. -
సరస్వతిమాతా విగ్రహప్రతిష్ఠాపన
మోపాల్: మండలంలోని న్యాల్కల్ ప్రాథమిక పాఠశాలలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో మూల నక్ష త్రం సందర్భంగా సరస్వతీమాతా విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఎంఈవో గేమ్సింగ్ మా ట్లాడుతూ విద్యార్థులు విద్యతోపాటు భక్తి భావన పెంపొందించుకోవాలని సూచించారు. ఎంపీవో కిరణ్కుమార్, ప్రధానోపాధ్యాయులు కొట్టూరు దేవిదాస్, పంచాయతీ కార్యదర్శి మల్లేషం, విగ్రహ దాత గంగామణి దంపతులు, వీడీసీ చైర్మన్ కిరణ్ రావు, గ్రామస్తులు శ్రీధర్, ఏఏపీసీ చైర్మన్ సునీత, ఉపాధ్యాయులు పోసాని, శారదా, మాధవి, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. డిచ్పల్లి: మండలంలోని ఘన్పూర్ గ్రామంలో సోమవారం ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులకు కాంగ్రెస్ నాయకులు భూమిపూజ నిర్వహించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు డాక్టర్ షాదుల్లా, రామకృష్ణ, న్యాసరాజేశ్వర్, డాక్టర్ లింబాద్రి, శక్కరికొండ సాగర్, దేవేందర్, పంచాయతీ కార్యదర్శి రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
రైటర్ రాజుకు జాతీయ ప్రతిభా పురస్కారం
తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ తెలుగు అధ్యయన శాఖ విద్యార్థి, యువ రచయిత, కవి రైటర్ రాజు ‘యువ సాహితీ కిరీటి ప్రతిభా పురస్కారాన్ని అందుకున్నారు. హైదరాబాద్ బిర్లామందిర్ భాస్కర ఆడిటోరియంలో శ్రీ శ్రీ కళావేదిక, ప్రపంచ తెలుగు–సంస్కృతి వేదిక, అసోసియేషన్ ఆఫ్ నేషనల్ అకాడమీ బుక్ ఆఫ్ రికార్డ్స్, తెలుగు రైటర్స్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి సాహితీ పట్టాభిషేక మహోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగు సాహిత్యంలో రైటర్ రాజు రాసిన కవితలు, వ్యాసాలు చేస్తున్న కృషిని గుర్తిస్తూ యువ సాహితీ కిరీటీ జాతీయ ప్రతిభా పురస్కారం అందజేశారు. శ్రీశ్రీ కళావేదిక మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కత్తిమండ ప్రతాప్ కుమార్, సభ్యులు రైటర్ రాజుకు ప్రశంసాపత్రం అందజేసి శాలువా, మెమోంటోతో ఘనంగా సత్కరించారు. అనంతరం రాజు ‘తెలుగు భాష గొప్పతనం’ శీర్షికతో కవితాగానం చేశారు. -
స్థానిక ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు
● కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి నిజామాబాద్అర్బన్: జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్ట ర్ టి వినయ్ కృష్ణారెడ్డి అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని సోమ వారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై సమీక్షించారు. కలెక్టర్తోపాటు సీపీ సాయిచైతన్య, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్కుమార్ తదితరులు హాజరయ్యారు. ఎన్నికల నిర్వహణకు సన్నద్ధమై ఉన్నా మని ఈ సందర్భంగా కలెక్టర్ కమిషనర్కు తెలిపారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలతోపాటు గ్రామ పంచాయతీ ఎన్నికలను కూడా జిల్లాలో రెండు విడతల్లో నిర్వహించనున్నామన్నారు. మొత్తం 545 గ్రామ పంచాయతీలకు గాను తొలి విడతలో 281, రెండో విడతలో 264 జీపీల్లో ఎన్నికలు నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించామని కలెక్టర్ తెలిపారు. ఎన్నికల నిర్వహణ సిబ్బందిని నియమిస్తూ, వారికి మలివిడత శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు.ఎలక్షన్ కోడ్ పకడ్బందీగా అమలు చేసేందుకు చర్య లు తీసుకుంటున్నామన్నారు. వీసీ అనంతరం నోడల్ అధికారులతో కలెక్టర్ సమావేశమయ్యారు. ఎన్నికల కమిషన్ మా ర్గదర్శకాలను పాటిస్తూ స్థానిక ఎన్నికలను ప్ర శాంత వాతావరణంలో పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఏవైనా సందేహాలు ఉంటే పైస్థాయి అధికారులను సంప్రదించి ముందుగానే నివృత్తి చేసుకోవాలన్నారు. డీఆర్డీవో సాయాగౌడ్, డీపీవో శ్రీనివాస్రావు, నోడల్ అధికారులు పాల్గొన్నారు. -
అమ్రాబాద్ శివారులో చిరుత సంచారం
● లేగ దూడపై దాడితో ఆలస్యంగా వెలుగులోకి.. మోపాల్(నిజామాబాద్రూరల్): మండలంలోని అమ్రాబాద్ శివారులోగల గుండ్యానాయక్ తండా అటవీ ప్రాంతంలో చిరుత సంచరిస్తున్నట్లు ఫారెస్ట్ అధికారులు సోమవారం తెలిపారు. రెండ్రోజుల క్రితం 9 నెలల లేగ దూడపై దాడి చేసి ఎత్తుకెళ్లగా, కళేబరం గుర్తించడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మెగావత్ రమేశ్ ప్రతిరోజూ 60 ఆవుల మందను మేత కోసం అటవీ ప్రాంతంలోకి తోలుకెళ్తాడు. మూడు రోజుల క్రితం ఆవుల మందలోని 9 నెలల లేగ దూడ కన్పించలేదు. సోమవా రం కూడా ఆవుల మందను మేత కోసం తీసుకెళ్లగా, చిరుత ఆవుపై దాడికి యత్నించింది. గమనించిన రమేశ్ అరుపులు వేయడంతో అడవిలోకి వెళ్లిపోయింది. దాడిలో ఆవుకు స్వల్పంగా గాయమైంది. లేగ దూడపై కూడా చిరుత దాడి చేసిందని నిర్ధారణకు వచ్చిన రమేశ్.. దాని కోసం వెతకగా బండరాళ్ల మధ్య కళేబరం కన్పించింది. వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారమివ్వగా, వారు ఘటనా స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించారు. చిరుత సంచరిస్తున్నట్లు సెక్షన్ ఆఫీసర్ సాయికుమార్, బీట్ ఆఫీసర్ సురేశ్కుమార్, వాచర్లు రవి, బీమా గుర్తించారు. ప్రజలు, గిరిజనులు అప్రమత్తంగా ఉండాలని, ఒంటరిగా అటవీ ప్రాంతంలోకి వెళ్లొద్దని సూచించారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నారు. -
ఆర్మూర్ కళాకారులకు అవార్డుల పంట
ఆర్మూర్: మలేషియా దేశంలోని కౌలాలంపూర్లో ఆదివారం రాత్రి నిర్వహించిన బతుకమ్మ, దసరా సంబురాల్లో ఆర్మూర్ పట్టణంలోని నటరాజ నృత్యనికేతన్లో శిక్షణ పొందిన చిన్నారులు కూచిపూడి, ఆంఽధ్ర నాట్యం ప్రదర్శనలతో అవార్డులను కై వసం చేసుకున్నట్లు నిర్వాహకులు సోమవారం తెలిపారు. యునైటెడ్ హెరిటేజ్ ఆర్ట్స్అండ్ కల్చర్ ఆర్గనైజేషన్ వారు నిర్వహించిన ఈ వేడుకల్లో నాట్య గురువు డాక్టర్ బాశెట్టి మృణాళినితోపాటు 20 మంది చిన్నారుల ప్రదర్శనకు మెచ్చిన నిర్వాహకులు ఫ్యూచర్ ఐకాన్ ఆఫ్ డ్యాన్స్ ఇంటర్నేషనల్ ఎక్సెలెన్స్ అవార్డులను ప్రదానం చేశారు. చిన్నారులను ఉన్నతంగా తీర్చిదిద్దుతున్న మృణాళిని విశిష్ట అతిథిగా కార్యక్రమానికి ఆహ్వానించి అవార్డును అందజేసి సన్మానించారు. గురువుతోపాటు చిన్నారులు అవార్డులను కై వసం చేసుకోవడంపై నటరాజ నృత్యనికేతన్ వ్యవస్థాపకులు మాడవేడి నారాయణ, చిన్నారుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. -
క్రైం కార్నర్
నిజామాబాద్ లీగల్: హత్యాయత్నం కేసులో ఒకరికి నిజామాబాద్ అడిషనల్ సెషన్స్ కోర్టు జడ్జి సాయి సుధా ఐదు సంవత్సరాల జైలు శిక్ష, రూ.500 జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. ఆదిలాబాద్ జిల్లా భక్తపూర్కు చెందిన షకీల్ తాగుడుగు బానిసై నిజామాబాద్ రైల్వేస్టేషన్ పరిసరాల్లో సంచరించేవాడు. 18 అక్టోబర్ 2021న నిజామాబాద్ రైల్వేస్టేషన్ సమీపంలో ఉన్న ఎస్ఎల్ఎస్ వైన్స్ వద్ద మద్యం తాగి గొడవచేస్తుండగా, షేక్ జలీల్ అనే వ్యక్తి గొడవ చేయొద్దంటూ షకీల్ను బెదిరించాడు. దీనిని మనస్సులో పెట్టుకున్న షకీల్, జలీల్పై దాడిచేయాలని నిర్ణయించుకొని తర్వాతి రోజు కత్తితో వైన్స్ వద్దకు వచ్చాడు. రెండో రోజు సైతం జలీల్ బెదిరించడంతో షకీల్ అతనిపై కత్తితో దాడిచేసి, కడుపులో పొడిచి తీవ్రంగా గాయపరిచాడు. వైన్స్లో పనిచేస్తున్న రమేశ్, సర్ఫరోజ్ ఖాన్ ఇద్దరినీ విడిపించి, జలీల్ను నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి షకీల్ను జైలుకు పంపారు. ఈ కేసులో పోలీసుల తరఫున డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ లక్ష్మినర్సయ్య వాదించారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయమూర్తి నిందితునికి ఐదు సంవత్సరాల జైలు శిక్ష, రూ.500 జరిమానా విధించారు. వర్ని: వర్ని పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకరిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్సై మహేశ్ సోమవారం తెలిపారు. చందూర్ మండలంలో ఆరేళ్ల బాలికపై వృద్ధుడు అఘాయిత్యానికి పాల్పడటంతో కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించామన్నారు. వేల్పూర్: వేల్పూర్ క్రాస్రోడ్డు వద్ద 63 నెంబర్ జాతీయ రహదారిపై అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీని సోమవారం పట్టుకున్నట్లు ఎస్సై సంజీవ్ తెలిపారు. క్రాస్రోడ్డు వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా కోరుట్ల నుంచి వచ్చిన ఇసుక లారీకి ఎలాంటి అనుమతులు లేకపోవడంతో స్వాధీనం చేసుకొని పోలీస్స్టేషన్కు తరలించినట్లు వెల్లడించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. -
నిలకడగా గోదారి.. నీటిలోనే పంటలు
రెంజల్(బోధన్): ఉగ్ర గోదావరి నిలకడగా మారింది. ఎగువన మహారాష్ట్ర నుంచి భారీ వరద వస్తుండగా, స్థానికంగా మంజీర నది నుంచి వరద ఉధృతి తగ్గుతోంది. దీంతో గోదావరి నది పరీవాహక గ్రామాల్లో వేసిన పంటలు నీటిలోనే ఉన్నాయి. మూడు రోజులుగా వరద నీరు వదలక పోవడంతో పంటలు పూర్తిగా దెబ్బతింటాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని తాడ్బిలోలి–బోర్గాం గ్రామాల మధ్య నిర్మించిన జాతీయ రహదారికి ఇరువైపులా పంట పొలాలు 15 ఫీట్ల లోతులో మునిగి ఉన్నాయి. నిలిచిన రాకపోకలు తాడ్బిలోలి–బోర్గాం గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. గోదావరి బ్యాక్వాటర్తో రెండు గ్రామాల మధ్య ఉన్న వంతెనకు ఇరువైపులా రోడ్డుపై వరద నీరు నిలిచిపోయింది. నిజామాబాద్ నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులను సాటాపూర్ నుంచి జాతీయ రహదారి మీదుగా గ్రామానికి నడుపుతున్నారు. -
ప్రజావాణికి 40 ఫిర్యాదులు
నిజామాబాద్అర్బన్: ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అధికారులకు సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సో మవారం నిర్వహించిన ప్రజావాణికి 40 ఫిర్యాదు లు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను కలెక్టర్తోపాటు అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, ట్రెయినీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావీ, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, ఏసీపీ రాజావెంకట్ రెడ్డిలకు విన్నవించారు. కాగా, ఫిర్యాదులను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ పరిష్కరించాలని కలెక్టర్ సూచించారు. ఎస్సైకి సన్మానం కలెక్టరేట్లో విధులు నిర్వర్తిస్తూ ఈ నెల 30న పదవీ విరమణ చేస్తున్న ఎస్సై ఎండీ నసీరుద్దీన్ను ఘనంగా సన్మానించారు. కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి పూల మాలలు, శాలువాతో సత్కరించి జ్ఞాపికను బహూకరించారు. నసీరుద్దీన్ అందించిన సేవలను కొనియాడారు. -
మత్స్య శాఖలో టెండర్ల వివాదం!
డొంకేశ్వర్(ఆర్మూర్): జిల్లా మత్స్య శాఖలో చేపపిల్లల పంపిణీకి సంబంధించిన టెండర్లపై లొల్లి నడుస్తోంది. ఈ నెల 25న పూర్తి కావాల్సిన టెండర్లు తెరుచుకోకుండానే వాయిదా పడ్డాయి. మత్స్య శాఖ అధికారికి, కాంట్రాక్టర్లకు మధ్య తలెత్తిన వివాదమే ఇందుకు కారణమని తెలుస్తోంది. మత్స్య శాఖ ఏడీ తనకు అనుకూలంగా ఉన్న వారికే కాంట్రాక్టు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తూ ఇటీవల మిగతా కాంట్రాక్టర్లు కలెక్టర్, అదనపు కలెక్టర్లకు ఫిర్యాదు చేశారు. దీంతో నాలుగు రోజుల క్రితం అ దనపు కలెక్టర్ చాంబర్లో జరుగుతున్న టెండర్లను రాత్రికి రాత్రే వాయిదా వేశారు. టెండర్లలో పాల్గొ న్న కాంట్రాక్టర్లకు సంబంధించిన చెరువులను పున: పరిశీలించి నివేదిక ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించినట్లు తెలిసింది. రీ ఎంక్వరీకి ఏడీని కాకుండా మరో అధికారిని పంపాలని సూచించినట్లు సమాచారం. చేపల చెరువుల పరిశీలనపై అనుమానాలు.. ఈ ఏడాది జిల్లాలోని 976 చెరువులను ఎంపిక చేసిన మత్స్యశాఖ అధికారులు 4.54 కోట్ల చేప పిల్లలు వదలాలని లక్ష్యంగా నిర్దేశించుకుని టెండర్లను ఆహ్వానించారు. ఈ–ప్రొక్యూర్మెంట్ విధా నం ద్వారా టెండర్లు జరుగగా, ముగ్గురు బిడ్లు వే శారు. ఇందులో ఏపీకి చెందిన ఇద్దరు, కరీంనగర్కు చెందిన ఒకరు ఉన్నారు. వీరు చూపిన చేప పిల్లల పెంపకం కేంద్రాలను పరిశీలించడానికి కమిటీ వే యగా, ఇందులో మత్స్యశాఖ ఏడీ, పశుసంవర్ధక శా ఖ అధికారి, రెవెన్యూ అధికారి, చీఫ్ ప్రమోటర్ ఉ న్నారు. చీఫ్ ప్రమోటర్ను పక్కన పెట్టి నిబంధనలు పాటించకుండా దగ్గర సంబంధాలున్న అధికారుల ను వెంట తీసుకెళ్లినట్లుగా ఏడీపై ఆరోపణలు న్నా యి. పరిశీలన చేసి నివేదిక తయారు చేసిన అధికారులు ఏపీకి చెందిన ఇద్దరు కాంట్రాక్టర్లను టెండర్ల నుంచి రద్దు చేయడంతోనే ఈ వివాదం మొదలైంద ని ప్రచారం జరుగుతోంది. సక్రమంగా ఉన్న చేపల చెరువుల్లో లేని లోపాలు చూపారని, వేరే కాంట్రాక్టర్కు బినామీగా ఉండి చేప పిల్లల పంపిణీ కాంట్రాక్ట్ను పొందే ప్రయత్నం చేసినట్లుగా బాధిత కాంట్రాక్టర్లు ఏడీపై ఆరోపణలు చేస్తున్నారు. దీనిపై ఏడీ ఆంజనేయస్వామిని వివరణ కోరేందుకు ప్రయ త్నించగా స్పందించలేదు. అదనపు కలెక్టర్ కిరణ్కుమార్ను సంప్రదించగా టెండర్లు వాయిదా పడ్డా యని, రీ ఎంక్వయిరీ చేయించనున్నట్లు తెలిపారు. అనుకూలంగా ఉన్నవారికి కట్టబెడుతున్నారని ఏడీపై ఆరోపణలు కలెక్టర్, అదనపు కలెక్టర్లకు కాంట్రాక్టర్ల ఫిర్యాదు వాయిదా పడిన టెండర్లు -
విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు ధ్వంసం
మోపాల్: మండలంలోని న్యాల్కల్ శివారులో ఉన్న పొలంలో నాలుగు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను గుర్తు తెలియని దుండగులు ఆదివారం రాత్రి ధ్వంసం చేశారు. ఎస్సై సుష్మిత తెలిపిన వివరాల ప్రకారం.. న్యాల్కల్ శివారులోని రెండు 25 కేవీ, మరో రెండు 16 కేవీ ట్రాన్స్ఫార్మర్లు ధ్వంసమయ్యాయి. సోమవారం ఉద యం గమనించిన రైతులు విద్యుత్ శాఖ ఏఈ నాగశైర్వానీ, లైన్మన్ మనోహర్కు సమాచా రం అందించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి, పంచనామా నిర్వహించారు. పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు. -
భూ భారతి దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలి
● అధికారులకు కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆదేశం ● ఎడపల్లి తహసీల్, ఎంపీడీవో కార్యాలయాల తనిఖీ బోధన్: భూ భారతి (రెవెన్యూ) సదస్సుల్లో స్వీకరించిన దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో కృషి చేయాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. రెవెన్యూ దరఖాస్తుల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. దరఖాస్తుల పరిష్కారంలో జాప్యం జరుగకుండా రోజువారీగా పర్యవేక్షించాలని తెలిపారు. ఎడపల్లి తహసీల్, ఎంపీడీవో కార్యాలయాలను సోమవారం ఆయన ఆకస్మికంగా సందర్శించారు. రెవెన్యూ దరఖాస్తులకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. తహసీల్దార్ దత్తాద్రి, ఉద్యోగులతో సమావేశమై దరఖాస్తులపై గ్రామాల వారీగా సమీక్షించారు. ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం సాదాబైనామా దరఖాస్తులను పరిష్కరించాలని పేర్కొన్నారు. ఓటర్ల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ చేపడుతున్న తీరును పరిశీలించి పలు సూచనలు చేశారు. గడువులోపు ఎస్ఐఆర్ను పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులకు ఆదేశించారు. అంతకుముందు ఎంపీడీవో ఆఫీస్ను సందర్శించి అధికారులు, ఉద్యోగులతో మండలంలోని కొనసాగుతున్న అభివృద్ధి పనులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల ప్రగతిపై ఆరా తీశారు. లబ్ధిదారులందరూ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించి త్వరితగతిన పూర్తి చేసుకునేలా ప్రోత్సహించాలన్నారు. ఇప్పటికే పూర్తయిన ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవాలకు సిద్ధం చేయాలని కలెక్టర్ సూచించారు. -
ప్రజల కోసమే పోరాటాలు చేస్తాం
● సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ● నగరంలో ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభనిజామాబాద్ సిటీ: కమ్యూనిష్టు పార్టీలెప్పుడూ ప్రజల కో సమే పోరాటాలు చేస్తాయని, ప్రపంచంలో ఎక్కడ చూసినా ఎర్రజెండా రెపరెపలాడుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. కాంగ్రెస్ మిత్రపక్షమైనా రాష్ట్రంలో సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్ని స్తూనే ఉంటామన్నారు. నిజామాబాద్ వ్యవసాయ మార్కె ట్ కమిటీలో శనివారం ఏఐటీయూసీ 2వ రాష్ట్ర మహాసభ నిర్వహించారు. కూనంనేని సాంబశివరావు ముఖ్య అతిథి గా హాజరై మాట్లాడారు. స్వార్థంలేని సిద్ధాంతాలున్న పార్టీ సీపీఐ అని అన్నారు. రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం మార్కెట్యార్డును పట్టించుకోలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మార్కెట్యార్డుకు పునర్జీవం వచ్చిందన్నారు. ఇళ్లులేని కార్మికుల కు డబుల్బెడ్ రూం ఇళ్లు ఇచ్చే ఏర్పాటుచేస్తానని తెలిపారు. ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి మాట్లాడుతూ.. మార్కెట్యార్డులోని సమస్యలను పరిష్కరిస్తున్నామని, కార్మికులకు ఎలాంటి కష్టం వచ్చినా వెంటనే పరిష్కరిస్తానని అన్నారు. రైతులకు, కార్మికుల కోసం ఉచిత భోజన వసతి కల్పించినట్లు తెలిపారు. ఏఐటీయూసీ నాయకుడు ఓమ య్య మాట్లాడుతూ.. ప్రభుత్వాలు మారినా కార్మికులకు తిప్ప లు తప్పడం లేదన్నారు. పెండింగ్ సమస్యలు వెంటనే పరిష్క రించేలా చొరవ తీసుకోవాలని ప్రభుత్వాలను కోరారు. నాయకులు బాల్రాజ్, నర్సింహా, ప్రవీణ్, కంకర భూమయ్య, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. -
చోరీ కేసులో నిందితుడి అరెస్ట్
జక్రాన్పల్లి: మండలంలో పలు చోరీలకు పాల్పడిన నిందితుడిని అరెస్టు చేసినట్లు డిచ్పల్లి సీఐ వినోద్ తెలిపారు. జక్రాన్పల్లి పోలీస్స్టేషన్లో శనివారం ఆయన వివరాలు వెల్లడించారు. జక్రాన్పల్లిలో ఎస్సై మాలిక్ రహమాన్ తన సిబ్బందితో బస్టాండ్ వద్ద వాహనాలు తనిఖీ చేపట్టారు. ఈక్రమంలో పాత నేరస్తుడు, మండలంలోని పడకల్ గ్రామానికి చెందిన కోనేటి నరేష్ అనుమానాస్పదంగా కనిపించాడు. దీంతో అతడిని పోలీసులు పట్టుకొని విచారించారు. రెండు నెలల క్రితం నల్లగుట్ట తండాలోని ఆలయంలో హుండీ చోరీ, ఈనెల 17న సికింద్రాపూర్లోని ఓ ఇంట్లో చోరీ చేసినట్లు అతడు అంగీకరించాడు. అతడి బ్యాగులో ఉన్న ఇనుప రాడ్ను, అతడి వద్ద నుంచి 9 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకుని నిందితుడిని రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. ఎస్సై మాలిక్ రహమాన్, ఏఎస్సై శంకర్, కానిస్టేబుళ్లు జీవన్, రాజేశ్వర్ ఉన్నారు. -
మక్కలకు గడ్డు పరిస్థితి
మోర్తాడ్(బాల్కొండ): మొక్కజొన్న పంటను సాగు చేసిన రైతులకు వరుసగా కష్టాలు వెంటాడుతున్నా యి. నిన్న మొన్నటి వరకు మక్కలకు ధరలేక అన్నదాతలు ఆందోళన చెందగా.. ప్రస్తుతం నిరాటంకంగా కురుస్తున్న వర్షాలతో పంటకు మొలకలు వచ్చి తీవ్ర నష్టం ఏర్పడుతుంది. వర్షాకాలం సీజన్లో మో ర్తాడ్, బాల్కొండ, కమ్మర్పల్లి, వేల్పూర్, ఏర్గట్ల, మెండోరా, ముప్కాల్ తదితర మండలాల్లో మొక్క జొన్న పంటను ఎక్కువగా సాగు చేశారు. కానీ పంట కోత దశకు చేరుకున్న నుంచి వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. వర్షాలతో పంట తడిసిపోగా, ఆరబెట్టినా వాతావరణంలో తేమ శాతం అధికంగా ఉండటంతో తొందరగా మొలకలు వస్తున్నాయి. దీంతోపాటు మక్కల ధర క్వింటాలుకు రూ.2,400ల నుంచి రూ.1,900లకు పడిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తడిసిన మక్కలను వ్యాపారులు కొనుగోలు చేసే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో తడిసిన మక్కలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ● మొన్నటివరకు పంటకు మద్ధతుధర కరువు ● ప్రస్తుతం వర్షాలతో ఆరబెట్టిన మక్కలకు మొలకలు ● ఆందోళనలో అన్నదాతలు -
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరి మృతి
సదాశివనగర్(ఎల్లారెడ్డి): మండల పరిధిలోని 44వ జాతీయ రహదారిపై శనివారం జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందారు. వివరాలు ఇలా.. డిచ్పల్లి మండలం రాంపూర్కు చెందిన మంజూరు హుస్సేన్(47) అనే వ్యక్తి కొంతకాలంగా మార్కెటింగ్ వృత్తి చేసుకుంటు జీవనం సాగిస్తున్నాడు. ఈక్రమంలో శనివారం అతడు బైక్పై నిజామాబాద్ వైపు బయలుదేరాడు. దగ్గి దర్గా శివారులో అతడు ఎడమ వైపు ఉన్న టాటా ఏస్ని ఓవర్టేక్ చేసి ముందుకు వెళ్లగా, ముందు వెళ్తున్న భారీ వాహనాన్ని ఢీకొట్టాడు. ఈ ఘటనలో అతడు కిందపడిపోయి, తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడు హెల్మెట్ ధరించినప్పటికీ, సరిగా లేకపోవడంతో ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని, మృతదేహాన్ని కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై పుష్పరాజ్ తెలిపారు. కుప్రియాల్ గ్రామ శివారులో.. మండలంలోని కుప్రియాల్ గ్రామ స్టేజీ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కామారెడ్డికి చెందిన ముత్తినే ని సూర్యరావు (రిటైర్డ్ ఆర్టీసీ కండక్టర్) కొన్నేళ్లుగా హైవేపై ఉన్న శ్రీ కృష్ణ ఉడిపి హోటల్లో పని చేస్తున్నారు. శనివారం ఉదయం అతడు కామారెడ్డి నుంచి తన ద్విచక్ర వాహనంపై హోటల్కు బయలుదేరాడు. కుప్రియాల్ శివారులో అతడిని హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వైపునకు వెళ్తున్న రెనాల్డ్ క్విడ్ కారు అతివేగంతో ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో సూర్యరావు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోలీసులు కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. -
పండుగ పూట పస్తులేనా..?
● ఉపాధిహామీ పథకం కూలీలకు నాలుగు నెలలుగా అందని కూలి సొమ్ము ● ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వైనం మోర్తాడ్(బాల్కొండ): ఉపాధిహామీ పథకం కింద పని చేస్తున్న కూలీలకు నెలల తరబడి కూలి సొమ్ము చెల్లింపులు నిలిచిపోయాయి. ఒక వారంలో పని చేసిన కూలీలకు మరుసటి వారంలో లేదా పక్షం రోజుల్లోనే చెల్లింపులు చేయాలని ఉపాధి హామీ చట్టంలోనే నిర్ధేశించారు. కానీ నాలుగు నెలలుగా కూలీలకు వారు చేసిన పనులకు కూలి చెల్లింపులో తీవ్ర జాప్యం జరుగుతుంది. అయినా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని కూలీలు ఆరోపిస్తున్నారు. జిల్లాలో రూ.16 కోట్ల బకాయిలు.. జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద 2.50లక్షల మంది కూలీలు ఉన్నారు. ఎండకాలంలో రోజుకు సగటున లక్ష మంది వరకూ కూలీలు ఉపాధి పనులు చేసేవారు. జూన్, జూలై మాసాల్లో వర్షాలు అంతగా కురవకపోవడంతో వన మహోత్సవ కార్యక్రమంలో కూలీలు పాలుపంచుకున్నారు. అప్పట్లో రోజుకు 50వేల మంది వరకు కూలీలు ఉపాధి పనులకు హాజరయ్యారు. మే 22 వరకు చేసిన ఉపాధి పనులకే కూలి సొమ్మును చెల్లించారు. అప్పటి నుంచి పనిచేసిన పనులకు నిధులు నిలిచిపోయాయి. దీంతో ఇప్పటి వరకూ జిల్లాలోని ఉపాధి కూలీలకు రూ.16 కోట్ల బకాయిలు పేరుకపోయాయి. కేంద్ర ప్రభుత్వమే నేరుగా.. రాష్ట్ర ప్రభుత్వానికి గతంలో కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తే అందులో నుంచి కూలీలకు సొమ్మును జమ చేసేవారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నిధులను పక్కదారి పట్టిస్తుందనే ఉద్దేశంతో కూలీలకే సొమ్మును నేరుగా జమ చేస్తామని కేంద్రం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో కూలీల ఖాతా నంబర్లను సేకరించి వారికి తపాల శాఖ, బ్యాంకు ఖాతాల్లో సొమ్మును జమ చేస్తున్నారు. క్షేత్ర స్థాయిలో సిబ్బంది ఎప్పటికప్పుడు ఉపాధి కూలీల కూలి సొమ్ము చెల్లింపుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తున్నా కేంద్రం నిధులను విడుదల చేయడం లేదు. దసరా పండుగ వస్తుండగా నాలుగు నెలల కూలి సొమ్ము జమ కాకపోవడంతో తాము పండుగ పూట పస్తులు ఉండాల్సిందేనా అని కూలీలు ప్రశ్నిస్తున్నారు. కేంద్రం స్పందించి కూలీలకు కూలి సొమ్ము వెంటనే జమ చేయాలని పలువురు కోరుతున్నారు. -
బీసీ కులగణన వివరాలు తెలపాలి
సుభాష్నగర్: రాష్ట్రంలో డెడికేటెడ్ కమిషన్ ద్వారా చేసిన వెనుకబడిన తరగతుల (బీసీ) కులగణన వివరాలను తెలియజేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి డిమాండ్ చేశారు. ఈమేరకు శనివారం ఆయన కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డికి లేఖ రాశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించాలని తీసుకున్న నిర్ణయాన్ని బీజేపీ తరపున పూర్తిగా స్వాగతిస్తున్నామన్నారు. అలాగే బీసీ కులగణన నివేదిక వివరాలను ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ వివరాలు ప్రజలకు తెలిస్తేనే రిజర్వేషన్ల ప్రక్రియ ఎంత పారదర్శకంగా, సమానత్వంతో అమలు చేయనున్నారో తెలుస్తోందన్నారు. జిల్లావాసికి ఇన్నోవేషన్ అవార్డు డొంకేశ్వర్(ఆర్మూర్): నిజామాబాద్ జి ల్లా కేంద్రంలోని పద్మానగర్కు చెందిన డాక్టర్ సింగం సుస్మితకు బెస్ట్ ఇన్నోవే షన్ ఐడియేషన్ అవార్డు లభించింది. వ్యవసాయ కీటక శాస్త్రంలో ఆమె పీహెచ్డీ చేయగా ఇటీవల ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఏరువాక ఫౌండేషన్ కిసాన్ మహోత్సవ్ ఈ అవార్డును అందుకున్నారు. అవార్డు రావడంపై ఆమె తల్లిదండ్రులు పోశెట్టి, లావణ్య సంతోషం వ్యక్తం చేశారు. ఖలీల్వాడి: జిల్లాలోని మద్యం షాపులకు ప్రభు త్వం టెండర్ నోటిఫికేషన్ను రెండు రోజుల క్రితం విడుదల చేసింది. అయితే ఈనెల 26 నుంచి అక్టోబర్ 18 వరకు దరఖాస్తులు స్వీకరించాలని రాష్ట్ర ఎకై ్సజ్ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. నగరంలోని సుభాష్నగర్లోగల ఎకై ్సజ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో శుక్ర, శనివారం రెండు రోజులుగా మద్యం షాపులకు దరఖాస్తులు రాలేవు. రెండు రోజులుగా అల్పపీడనంతోపాటు బతుకమ్మ, దేవినవరాత్రులు ఉండటంతో వివిధ పనుల కారణంగా టెండర్లకు దరఖాస్తు చేయలేదని తెలుస్తోంది. సోమవారం నుంచి వైన్స్షాపులకు దరఖాస్తులు వచ్చే అవకాశాలు ఉన్నట్లు ఎకై ్సజ్ అధికారుల ద్వారా తెలిసింది. -
క్రైం కార్నర్
కరెంట్షాక్తో బాలుడు మృతి మాక్లూర్: తండ్రితో కలిసి పొలానికి వెళ్లిన బాలుడు ప్రమాదవశాత్తు కరెంట్షాక్తో మృతిచెందాడు. మాక్లూర్ ఎస్సై రాజశేఖర్ తెలిపిన వివరాలు ఇలా.. మండలంలోని అడవి మామిడిపల్లి గ్రామానికి చెందిన చింత ప్రవీణ్రెడ్డి అనే రైతు శుక్రవారం సాయంత్రం పొలానికి వెళుతుండగా, కుమారుడు చింత అభినయ్ (15) తాను వస్తానని చెప్పడంతో అతడిని తీసుకువెళ్లాడు. ప్రవీణ్రెడ్డి పొలానికి నీరు పెడుతుండగా కొద్ది దూరంలో ఉన్న కుమారుడు కరెంట్ మోటార్ వద్దకు వచ్చాడు. దీంతో అభినయ్కు కరెంటువైర్లు తగిలి, షాక్తో కిందపడిపోయాడు. వెంటనే స్థానికులు కర్ర సాయంతో వైర్లను తీసివేసి, బాలుడిని చికిత్స నిమిత్తం జిల్లాకేంద్ర ఆస్పత్రికి తరలించారు. కానీ అభినయ్ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. బాలుడి తండ్రి శనివారం పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు. నవీపేట: మండలంలోని బినోల గ్రామానికి చెందిన ముంత పోశెట్టి(56) చికిత్స పొందుతూ శనివారం మృతి చెందినట్లు ఎస్సై తిరుపతి తెలిపారు. పోశెట్టి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుండగా జీవితంపై విరక్తి చెంది శుక్రవారం గడ్డి మందుతాగాడు. వెంటనే అతడు అస్వస్థతకు గురవడంతో కుటుంబసభ్యులు గమనించి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. మృతుడి భార్య విజయ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిజామాబాద్ సిటీ: నగరంలో మున్సిపల్ ఔట్సోర్సింగ్ కార్మికుడు వాటర్ట్యాంక్ పైనుంచి పడి గాయపడ్డాడు. వివరాలు ఇలా.. మున్సిపల్ కార్పొరేషన్లోని జోన్–4 వాటర్ వర్క్స్ విభాగంలో బింగి మధు అనే వ్యక్తి ఔట్సోర్సింగ్ కార్మికుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. శుక్రవారం అర్ధరాత్రి వాటర్ ట్యాంక్ నిండిపోవడంతో అతడు వాటర్ లెవల్ చెక్చేస్తుండగా ప్రమాదవశాత్తూ ట్యాంక్ పైనుంచి జారి కిందపడిపోయాడు. అతడికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం తోటి కార్మికులు జిల్లాకేంద్రంలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రికి తరలించారు. మధును మున్సిపల్ కమిషనర్ దిలీప్కుమార్ శనివారం ఉదయం పరామర్శించారు. వైద్య ఖర్చులను సంబంధిత ఏజెన్సీ భరిస్తుందని తెలిపారు. -
కుళ్లుతున్న సోయా..
డొంకేశ్వర్(ఆర్మూర్): ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో సోయా పంటకు తీవ్ర నష్టం జరుగుతోంది. ఖరీఫ్ సీజన్లో జిల్లా వ్యాప్తంగా 33,603 ఎకరాల్లో సోయాను సాగు చేశారు. వాతావరణం అనుకూలిస్తే ఎకరానికి 10 క్వింటాళ్లకు పైగా దిగుబడి వచ్చేది. కానీ, ఆగకుండా వర్షాలు పడడంతో విత్తన కాయలు రంగు మారుతున్నాయి. దీంతో రైతులు సోయాపై ఆశలు వదులుకుంటున్నారు. ఎకరానికి ఐదారు క్వింటాళ్ల దిగుబడి వస్తే అదే చాలనుకుంటున్నారు. వర్షాల కారణంగా సోయా పంట నష్టపోయిన వారికి పరిహారం అందించి ఆదుకోవాలని బాధిత రైతులు కోరుతున్నారు. దిగుబడి వస్తుందో లేదో.. రెండు ఎకరాల్లో సోయా పంట సాగు చేశాను. కురుస్తున్న వర్షాలకు పంట దెబ్బతింటోంది. వాన ఆగితేనే కోత కోయడానికి అవకాశముంది. దిగుబడి విషయానికి వస్తే ఎకరానికి ఐదు క్వింటాళ్లు కూడా వస్తుందో లేదో. పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం నష్ట పరిహారం అందించి ఆదుకోవాలి. –చిన్నారెడ్డి, గాదేపల్లి, డొంకేశ్వర్ మండలం -
బతుకమ్మ పాట
శ్రీ గౌరీ పూజ ఉయ్యాలో చేయబూనితిమి ఉయ్యాలో కాపాడి మమ్మేలు ఉయ్యాలో కై లాస వాసివి ఉయ్యాలో కాపాడి మమ్మేలు ఉయ్యాలో శంకరి పార్వతి ఉయ్యాలో శంభుని రాణి ఉయ్యాలో ధ్యానింతుమమ్మ ఉయ్యాలో మమ్ములను కరుణించు ఉయ్యాలో ఏటేటా పూజిస్తాం ఉయ్యాలో మా ఊరు చల్లంగా చూడు ఉయ్యాలో మనుసు పెట్టి ఉయ్యాలో మనువంత నిన్ను చేసుకొని ఉయ్యాలో నిండుగా మొక్కుతున్నాం ఉయ్యాలో మమ్మేలు మా అమ్మ గౌరమ్మ ఉయ్యాలో –ఉమారాణి వైద్య, అంగన్వాడీ టీచర్, లింగాపూర్, కామారెడ్డి -
ఆర్వోబీ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్
● రోడ్డుపై గుంతలో కూరుకుపోయిన బస్సు ● అరగంటపాటు నిలిచిన ట్రాఫిక్ నిజామాబాద్ రూరల్/డిచ్పల్లి: నగర శివారులోని మాధవనగర్ ఆర్వోబీ వద్ద శనివారం భారీగా ట్రా ఫిక్ జామ్ ఏర్పడింది. ఆర్వోబీ రోడ్డు గుంతలతో అధ్వానంగా మారడంతోపాటు ప్రస్తుతం కురుస్తు న్న వర్షాలకు రోడ్లపై వర్షపునీరు నిలిచి, గుంతలు కనిపించడం లేదు. కొందరు వాహనదారులు గుంతలను గమనించక వెళుతుండటంతో కొన్ని వాహ నాలు దిగబడిపోతున్నాయి. ఈ క్రమంలో ఆర్టీసీ బస్సు దిగబడిపోవడంతో బైపాస్ నుంచి డిచ్పల్లి వైపు, డిచ్పల్లి నుంచి నిజామాబాద్ వైపు వచ్చే వాహనాలు కిలోమీటర్ మేర నిలిచిపోయాయి. అరగంట పాటు వాహనాలు ఎటూ కదలక పోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. డిచ్పల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రాకపోకలను క్రమబద్దీకరించారు. నగరంలోని సారంగాపూర్ రహదారిపై సైతం గుంతల కారణంగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. -
వేగంగా పంటల నమోదు
● ఇప్పటి వరకు 3.55 లక్షల ఎకరాలు ఆన్లైన్లో ఎంట్రీడొంకేశ్వర్(ఆర్మూర్): జిల్లాలో పలు చోట్ల పంట కోతలు మొదలవగా, కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. అయితే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటయ్యే నా టికి డిజిటల్ క్రాప్ బుకింగ్ పూర్తి చేయాల్సి ఉంది. దీంతో వ్యవసాయాధికారులు వేగంగా పంటలను ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. జిల్లా లో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో 5.25 లక్షల ఎక రాలకు పైగా వివిధ పంటలను రైతులు సాగు చేశారు. ఇందులో అత్యధికంగా వరి 4.36 లక్షల ఎకరాలకు పైగా ఉంది. ప్రస్తుతం మొక్క జొన్న, సోయా, పప్పుదినుసుల పంట కోతలు మొదలయ్యాయి. డీసీఎస్ పోర్టల్లో ఎంట్రీ చేస్తున్న డేటా ప్రకారమే ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేస్తుంది. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 3.55 లక్షల ఎకరాల పంటల వివరాలను ఆన్లైన్లో ఎంట్రీ చేశారు. అక్టోబర్ 20 నాటికి డిజిటల్ క్రాప్ సర్వే పూర్తి చేయాలని గడువు విధించింది. మున్సిపల్ టూ మహిళా శిశుసంక్షేమ శాఖ ఈవోబోధన్టౌన్(బోధన్): తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ శనివారం ప్రకటించిన మహిళా శిశు సంక్షేమ శాఖ విస్తరణ అధికారి పరీక్ష ఫలితాల్లో బోధన్కు చెందిన ఆర్. మౌనిక ఎంపికై ంది. ఆమె గ్రూప్–4లో ఉత్తీర్ణత సాధించి బోధన్ మున్సిపల్ కార్యాలయంలో వార్డు ఆఫీసర్గా విధులు నిర్వహిస్తుంది. తండ్రి అప్పల నాయుడు బీఈడీ కళాశాల ప్రిన్సిపాల్గా కొనసాగుతున్నారు. తల్లి కమల కుమారి ఆధ్యాత్మిక శిక్షకురాలిగా ఉన్నారు. -
కోతకు ముందే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి
● జిల్లా సహకార అధికారి శ్రీనివాస్డిచ్పల్లి(నిజామాబాద్రూరల్): వరి పంట కోతకు ముందుగానే సహకార సంఘాల ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని జిల్లా సహకార అధికారి (డీసీవో) శ్రీనివాస్ సూచించారు. సహకార, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఖరీఫ్ సీజన్ వరి ధాన్యం కొనుగోలు కోసం కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆదేశాల మేరకు శనివారం డిచ్పల్లి పీఏసీఎస్లో నిజామాబాద్ డివిజన్ స్థాయి స న్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీవో మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ ధాన్యం కొనుగోలు చేయాలన్నారు. ధాన్యం కొ నుగోలు చేసిన వెంటనే సకాలంలో డబ్బులు చెల్లించాలన్నారు. కొనుగోలు కేంద్రాలలో టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని, రైతులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో క్లస్టర్ ఆఫీసర్ సత్యనారాయణ, మానిటరింగ్ ఆఫీసర్లు మయూరి, లావణ్య, మండల వ్యవసాయాధికారులు, ఏఈవోలు, సహకార సంఘాల కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. -
బీసీ మహిళకే జెడ్పీ పీఠం
● జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాల వివరాలు ప్రకటించిన కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ● ఎంపీటీసీ, సర్పంచ్ స్థానాలకు సైతం ● ఎన్నికల నోటిఫికేషన్ రావడమే తరువాయి.. ● ఇప్పటికే అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసిన యంత్రాంగం సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : జెడ్పీ చైర్పర్సన్, జె డ్పీటీసీ, ఎంపీపీ స్థానాలకు సంబంధించి రిజర్వేష న్లు ఖరారు అయ్యాయి. జెడ్పీ చైర్పర్సన్ స్థానాన్ని బీసీ మహిళకు రిజర్వ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శని వారం గెజిట్ విడుదల చేసింది. మరోవైపు కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాల రిజ ర్వేషన్లకు సంబంధించిన ప్రక్రియ నిర్వహించారు. జిల్లాలోని 31 మండలాలకు ఖరారైన రిజర్వేషన్లతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం రిజర్వేషన్లు ఖరా రు చేసినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ అంకిత్, జెడ్పీ సీఈవో సాయాగౌడ్, డిప్యూటీ సీఈవో సాయ న్నలతో కలిసి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో రిజర్వేషన్ల కేటాయింపు ప్రక్రియ నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ రిజర్వేషన్లను వీడియో రికార్డింగ్ చేస్తూ, నిబంధనలను అనుసరిస్తూ పూర్తి పారదర్శకంగా ఖరారు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. 2011 జనాభా లెక్కల ప్రాతిపదికన ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు, బీసీ డెడికేషన్ కమిషన్ నివేదికను అనుసరిస్తూ, రాష్ట్ర ఎన్నికల కమిషన్ సూచనలకు అనుగుణంగా బీసీ రిజర్వేషన్ల కేటాయించినట్లు వివరించారు. ● జిల్లాలోని మొత్తం 31 జెడ్పీటీసీ స్థానాలకు గాను ఎస్టీలకు మూడు స్థానాలు రిజర్వు కాగా, ఇందులో ఒకటి మహిళలకు కేటాయించినట్లు కలెక్టర్ తెలిపా రు. ఎస్సీలకు ఐదు జెడ్పీటీసీ స్థానాలు రిజర్వు కా గా, మహిళలకు రెండు స్థానాలు కేటాయించారు. బీసీలకు 13 స్థానాలు రిజర్వు కాగా, ఇందులో ఆ రు స్థానాలు మహిళలకు కేటాయించారు. మిగిలిన 10 మండలాలు జనరల్ కేటగిరిలో ఉండగా, ఇందులో ఐదు స్థానాలు మహిళలకు కేటాయించారు. ● జిల్లాలోని 31 ఎంపీపీ స్థానాలకు గాను ఎస్టీలకు మూడు స్థానాలు రిజర్వు అయ్యాయని, ఇందులో ఒకటి మహిళలకు రిజర్వు చేసినట్లు కలెక్టర్ తెలి పారు. ఎస్సీలకు ఐదు ఎంపీపీ స్థానాలు రిజర్వు కాగా, ఇందులో మహిళలకు రెండు స్థానాలు కేటా యించారు. బీసీలకు 13 స్థానాలు రిజర్వు కాగా, ఇందులో ఆరు స్థానాలు మహిళలకు కేటాయించారు. మిగిలిన 10 మండలాలు జనరల్ కేటగిరిలో ఉండగా, ఇందులో ఐదు స్థానాలు మహిళలకు కేటాయించారు. ఖరారైన రిజర్వేషన్ల వివరాలను ప్రభుత్వానికి, ఎన్నికల కమిషన్కు నివేదించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ● ఎంపీటీసీ, సర్పంచ్ స్థానాలకు ఎంపీడీవోలు, తహసీల్దార్లు రిజర్వేషన్లు ప్రకటించారు. ● అయితే బీసీ బిల్లు గవర్నర్ వద్ద పెండింగ్లో ఉ న్న నేపథ్యంలో రిజర్వేషన్లు ఎలా కేటాయింపులు చే స్తారని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ తరుణంలో నోటిఫికేషన్ విషయమై ఉత్కంఠ నెలకొంది. రిజర్వేషన్లు ఖరారుస్థానిక సంస్థల రిజర్వేషన్లు ఖరారు అయ్యాయి. జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ పదవి బీసీ మహిళకు దక్కనుంది. ఇందుకు సంబంధించి రిజర్వేషన్ ఖరారు చేస్తూ ప్రభుత్వం శనివారం గెజిట్ జారీ చేసింది. మరోవైపు జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలతోపాటు ఎంపీటీసీ, సర్పంచ్ స్థానాల రిజర్వేషన్లను అధికారులు ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. -
విశ్వ వేదికలపై ఆర్మూర్ ‘గజ్జె’
ఆర్మూర్ పట్టణంలోని నటరాజ నృత్యనికేతన్లో కూచిపూడి శిక్షణ పొందిన చిన్నారులు దేశ విదేశాల్లో తమ నాట్య ప్రదర్శనలతో వీక్షకులను ఆకట్టుకుంటున్నారు. యునైటెడ్ హెరిటేజ్ ఆర్ట్స్ అండ్ కల్చర్ ఆర్గనైజేషన్ ద్వారా స్పాన్సర్షిప్ ఇస్తూ ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నారు. పట్టణానికి చెందిన మాడవేటి నారాయణ స్థాపించిన నటరాజ నృత్యనికేతన్లో నాట్య గురువు డాక్టర్ బాశెట్టి మృణాళిని శి ష్యరికంగా చిన్నారులు కూచిపూడి, జానపద నృత్య రీ తులు, పేరిణి నాట్యాన్ని అభ్యసిస్తూ నాట్య మయూరాలుగా పేరొందారు. తల్లిదండ్రుల ప్రోత్సాహానికి నాట్య గురువు శ్రమ తోడవడంతో వీరి ప్రతిభను చాటి చెప్పడానికి స్పాన్సర్స్ సైతం స్వచ్ఛందంగా ముందుకు రావడం ప్రత్యేకత సంతరించుకుంది. గత జూన్ 8న దుబాయిలో యునైటెడ్ హెరిటేజ్ ఆర్ట్స్అండ్కల్చర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో నృత్యనికేతన్కు చెందిన 8 మంది చిన్నారులు ఆంధ్రనాట్యం, కూచిపూడి ప్రదర్శననిచ్చారు. తాజాగా ఈ నెల 28, 29వ తేదీల్లో మలేషియాలో యునైటెడ్ హెరిటేజ్ ఆర్ట్స్అండ్కల్చర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో దసరా, బతుకమ్మ సంబురాలను నిర్వహిస్తున్నారు. ఈ వేదికపై తమ శిశ్యులతోపాటు వచ్చి ప్రదర్శననివ్వాల్సిందిగా నాట్య గురువు డాక్టర్ మృణాళినితోపాటు 12 మంది చిన్నారులకు నిర్వాహకులు దేవులపల్లి పవన్ ఆహ్వానం పంపించారు. దీంతో సాయి శృతి, వైష్ణవి, హయాతి, సాన్నిధ్య, ప్రియాన్షి, పావని, శ్రీనిధి, శ్రీవల్ల్లి, నిశ్రుత, అనన్య, శ్రీలేఖ, నివృతి మలేషియాకు పయనమయ్యారు. -
కిక్కిరిసిన నవీపేట మేకల సంత
● దసరా నేపథ్యంలో జోరుగా కొనుగోళ్లు ● రూ. 3కోట్లకు పైగా లావాదేవీలు నవీపేట: మండల కేంద్రంలో శనివారం జరిగిన మేకల సంత వ్యాపారులు, వినియోగదారులతో కిక్కిరిసిపోయింది. అక్టోబరు 2న దసరా ఉండడంతో ఈ సంతలో క్రయవిక్రయాలు ఊపందుకున్నాయి. సంత ప్రాంగణం బురదమయంగా మారడంతో చుట్టుపక్కల రహదారులు, బస్టాండ్ ఆవరణలో జోరుగా క్రయవిక్రయాలు జరిపారు. ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడగా పోలీసులు క్లియర్ చేశారు. సుమారు రూ. 3 కోట్లకు పైగా లావాదేవీలు జరిగినట్లు వ్యాపారులు పేర్కొన్నారు. -
హాజరుశాతం పెంచడానికే ఎఫ్ఆర్ఎస్
● డీఐఈవో రవికుమార్ ● బోధన్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ బోధన్టౌన్(బోధన్): ప్రభుత్వ కళాశాలల్లో హాజరు శాతం పెంచి ఉత్తీర్ణత శాతాన్ని పెంచడానికే ఫేస్ రికగ్నైజేషన్ సిస్టమ్ (ఎఫ్ఆర్ఎస్) ఏర్పాటు చేసినట్లు డీఐఈవో రవికుమార్ అన్నారు. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ నిర్వహించారు. సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎఫ్ఆర్ఎస్ ద్వారా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో హాజరు శాతం మెరుగైందని, ఈ సిస్టమ్ ద్వారా విద్యార్థులు కళాశాలకు గైర్హాజరు అయితే తల్లిదండ్రులకు మెసేజ్ వెళుతుందన్నారు. దీంతో ఇటు అధ్యాపకులు, తల్లిదండ్రులు జాగ్రత్త పడతారన్నారు. విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సీఐ వెంకటనారాయణ సూచించారు. ఇంటర్ పరీక్ష ఫీజును మినహాయించి, మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయాలని తల్లిదండ్రులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళతానని డీఐఈవో తెలిపారు. ప్రిన్సిపాల్ నిఖత్ కౌసర్, ఏజీఎం అరింద్ తదితరులు పాల్గొన్నారు. -
పేరుకే డ్రగ్ స్టోర్.. మందులన్నీ బయటే..
● టీజీఎమ్ఎస్డీసీలో చిందరవందరగా మెడిసిన్స్ డబ్బాలు ● కలెక్టర్ పర్యవేక్షించినా మారని తీరు నిజామాబాద్నాగారం: జిల్లా కేంద్రంలోని గంగాస్థాన్–1లో ఉన్న టీజీఎమ్ఎస్డీసీ (తెలంగాణ స్టేట్ మెడికల్ సర్వీసెస్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్) సెంట్రల్ డ్రగ్ స్టోర్ ఆవరణలో మెడిసిన్ డబ్బాలను ఇష్టారాజ్యంగా పడేశారు. కొన్ని డబ్బాలు పగిలిపోయి గ్లూకోజ్లు, సిరంజీలు, ఇతర మెడిసిన్లు అన్ని బయట పడి ఉన్నాయి. గత కొన్ని నెలలుగా ఇదే పరిస్థితి ఉంది. ఈ నెల 12న కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి సెంట్రల్ డ్రగ్ స్టోర్ను తనిఖీ చేశారు. మందులను భద్రంగా ఉంచాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. అయినా సెంట్రల్ డ్రగ్స్టోర్ పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. ఇక్కడి అధికారుల పర్యవేక్షణ సక్రమంగా లేకపోవడంతో మందులు అన్ని ఇష్టారాజ్యాంగా పడేస్తున్నారు. ఇక్కడి నుంచి జిల్లాలోని జీజీహెచ్(ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి), బోధన్ జిల్లా ఆసుపత్రి, ఆర్మూర్ఏరియా ఆసుపత్రి ఇలా జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రులకు మెడిసిన్స్ సరఫరా చేస్తున్నారు. కార్యాలయ ఆవరణలోనే మందులు సగం చెడిపోతే.. ఆస్పత్రులకు ఏ విధంగా సరఫరా చేస్తారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. -
పసుపు పరిశోధన కేంద్రాన్ని సందర్శించిన మహారాష్ట్ర రైతులు
కమ్మర్పల్లి: మండల కేంద్రంలోని పసుపు పరిశోధన కేంద్రాన్ని శుక్రవారం ముంబై స్పైసెస్ బోర్డు ఆధ్వర్యంలో మహారాష్ట్రలోని హిగోళి, సాంగ్లీ, నాందేడ్ ప్రాంత రైతులు సందర్శించారు. పరిశోధన వివరాలను శాస్త్రవేత్తలను అడిగి తెలుసుకున్నారు. కేంద్రంలో పసుపు పంటపై చేస్తున్న పరిశోధనలు, నూతన ఆవిష్కరణలు, నూతన వంగడాల గురించి ప్రధాన శాస్త్రవేత్త మహేంధర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. కేంద్రం సూపరింటెండెంట్ ముఖేష్, సిబ్బంది శంకర్, సుభాష్ తదితరులు పాల్గొన్నారు. 3న కిసాన్ మిలాప్ ఆర్మూర్: పెర్కిట్లో వచ్చే నెల 3న కిసాన్ మిలాప్ పేరుతో అన్నదాతల ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించనున్నట్లు తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ సుంకెట అన్వేష్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. రెండో ఏడాది నిర్వహిస్తున్న ఈ సమ్మేళనాన్ని పెర్కిట్ శివారులోని నిర్మల్ రోడ్డులో గల కామాక్షి కన్వెన్షన్లో ఉదయం 11 గంటలకు నిర్వహిస్తున్నామన్నారు. రైతులు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. నిజామాబాద్ నాగారం: నగరంలో శుక్రవారం భారతీయ మజ్దూర్ సంఘ్ జిల్లా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సంఘ్ జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. నిజామాబాద్ జిల్లా బీఎంఎస్ అధ్యక్షుడిగా సాయరెడ్డి , ప్రధాన కార్యదర్శిగా శ్రీనివాస్ చారి, కోశాధికారిగా అంకుష్ ఎన్నికయ్యారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎర్ర స్వామికుమార్, బీడీ కార్మిక సంఘ్ జాతీయ అధ్యక్షులు సుధీర్ పాల్గొన్నారు. నవీపేట: మండలంలోని యంచ వద్ద గల గో దావరిలో ఆత్మహత్యకు యత్నించిన ఒకరిని త హసీల్దార్ వెంకటరమణ శుక్రవారం కాపాడా రు. నిర్మల్ జిల్లా కుంటాల మండలంలోని లింబా గ్రామానికి చెందిన మహేష్ ఇంట్లో తల్లిదండ్రులతో గొడవపడి బయటకు వెళ్లాడు. జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకునేందుకు యంచ గోదావరి బ్రిడ్జిపైకి వచ్చాడు. నదిలో దూకేందుకు యత్నించగా అటువైపు వెళ్లిన తహసీల్దార్ వెంకటరమణ బాధితుడిని కాపాడారు. అనంతరం అతడిని ఎస్సై తిరుపతి దగ్గరకు తీసుకొచ్చి కౌన్సెలింగ్ ఇప్పించారు. -
ఎస్సారెస్పీలోకి 610 టీఎంసీల వరద..!
బాల్కొండ: శ్రీరాంసాగర్ప్రాజెక్ట్లోకి ప్రస్తుత సంవత్సరం ఇప్పటి వరకు 610 టీఎంసీల వరద నీరు వచ్చి చేరింది. ఇంకా ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రాజెక్ట్లోకి ప్రస్తుత సంవత్సరం ఆగష్టు మాసంలోనే వరదలు ఎక్కువగా వచ్చాయి. అదే మాసంలో ప్రాజెక్ట్ నిండుకుండల మారడంతో మిగులు జలాలను గోదావరిలోకి వదలడం ప్రారంభించారు. ప్రాజెక్ట్కు గత పదిహేనేళ్లుగా సెప్టెంబర్ నెల వరదలకు సెంట్మెంట్గా ఉంటుంది. ప్రస్తుత సంవత్సరం కూడ ఇప్పటి వరకు 300 టీఎంసీల వరద నీరు కేవలం సెప్టెంబర్మాసంలోనే వచ్చి చేరింది. గతంలో సెప్టెంబర్ వరకు ప్రాజెక్ట్ ఖాళీగా ఉండేది. కొనసాగుతున్న వరద.. ఎస్సారెస్పీకి ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు కొనసాగుతుంది. మహారాష్ట్ర ప్రాంతంలోని ప్రాజెక్ట్ల నుంచి దిగువకు నీరు వదలడంతో లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. ప్రాజెక్ట్లోకి శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు నిలకడగా 3 లక్షల 15 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రాజెక్ట్ నుంచి 39 వరద గేట్ల ద్వారా లక్షా 61 వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. ప్రాజెక్ట్ నుంచి వరద కాలువ ద్వారా 2 వేల క్యూసెక్కులు, కాకతీయ కాలువ ద్వారా 5500 క్యూసెక్కులు, ఎస్కెప్ గేట్ల ద్వారా 2500 క్యూసెక్కులు, సరస్వతి కాలువ ద్వారా 400 క్యూసెక్కులు, అలీసాగర్ లిప్ట్ ద్వారా 360 క్యూసెక్కులు, మిషన్ భగీరథ ద్వారా 231 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 600 క్యూసెక్కుల నీరు పోతుంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి మట్టం 1091(80.5 టీఎంసీలు) అడుగులు కాగా శుక్రవారం సాయంత్రానికి ప్రాజెక్ట్లో 1086.50(65.12 టీఎంసీలు) అడుగుల నీరు నిల్వ ఉందని ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు. -
తులం బంగారం ఇచ్చే వరకు కొట్లాడుతా..!
● బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్రెడ్డి ● లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ బాల్కొండ: సీఎం రేవంత్రెడ్డి ఇచ్చిన హామీమేరకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు చెక్కులతోపాటు తులం బంగారం ఇచ్చేవరకు కొట్లాడుతానని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. బాల్కొండలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు ఆయన చెక్కులను పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కల్యాణలక్ష్మి పథకంలో భాగంగా రూ.లక్షతో పాటు తులం బంగారం ఇస్తామని రేవంత్రెడ్డి హామీ ఇచ్చాడన్నారు. కానీ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు ఒక్కరికి కూడా తులం బంగారం ఇవ్వలేదన్నారు. తులం బంగారం ఇవ్వాలని అడిగితే తనపై, బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులు చేశారన్నారు. ఎన్ని దాడులు చేసిన భయపడేది లేదన్నారు. భారీ బందోబస్తు.. భారీ బందోబస్తు మధ్య ఎమ్మెల్యే చెక్కులను పంపిణీ చేశారు. కోర్టు తీర్పు ప్రకారం ఎమ్మెల్యే ఒక్కరే చెక్కులను పంపిణీ చేయాలని తెలపడంతో ఎమ్మెల్యేనే పంపిణీ చేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ నాయకులకు లోపలికి అనుమతివ్వలేదు. కేవలం లబ్ధిదారులను మాత్రమే లోపలి పంపించారు. మీడీయాకు కూడ అనుమతివ్వలేదు. -
లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయం
బోధన్: పేదలు, బాధిత కుటుంబాలకు లయన్స్ క్లబ్ అందిస్తున్న సేవలు అభినందనీయమని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. పట్టణంలో లయన్స్ కంటి ఆస్పత్రి ద్వారా ఈ ప్రాంత ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలు హర్షణీయమన్నారు. పట్టణంలోని లయన్స్ కంటి ఆస్పత్రి రోగులకు ఉచితంగా రవాణా సౌకర్యం కల్పించేందుకు ఏర్పాటు చేసిన నూతన వాహనాన్ని శుక్రవారం ఎమ్మెల్యే, సబ్ కలెక్టర్ వికాస్ మహతో, ప్రజాప్రతినిధులు, క్లబ్ ప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. అనంతరం బోధన్ మండలంలోని హంగర్గ ప్రభుత్వ పాఠశాలలు, జీపీ కార్యాలయానికి లయన్స్ క్లబ్ వితరణ చేసిన ఫర్నీచర్ను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. అంగన్వాడీ కేంద్రాలకు రైస్కుక్కర్లను క్లబ్ వితరణ చేయగా ఎమ్మెల్యే అంగన్వాడీ టీచర్లకు అందించారు. పట్టణంలోని శక్కర్నగర్కు చెందిన విద్యార్థి ప్రణయ్ సాయి ఐఐటీలో సీటు సాధించగా క్లబ్ ప్రతినిధులు ఎమ్మెల్యే చేతుల మీదుగా విద్యార్థి తల్లిదండ్రులకు ల్యాప్టాప్ అందజేశారు. అంగన్వాడీ టీచర్లు ఏర్పాటు చేసిన పలు స్టాల్స్ను పరిశీలించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తూ చిన్నారులు, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. కంటి ఆస్పత్రి వ్యవస్థాపకులు పోలవరపు బసవేశ్వర్రావు, చైర్మన్ నర్సింహారెడ్డి, ప్రతినిధులు లక్ష్మి, ఉర్దూ అకాడమి చైర్మన్ తాహెర్బిన్ హందాన్, డీసీసీబీ చైర్మన్ రమేష్రెడ్డి, నిజామాబాద్ ఏఎంసీ మాజీ చైర్మన్ నగేష్ రెడ్డి, సీడీపీవో పద్మ, టీపీసీసీ డెలిగేట్ గంగాశంకర్, క్లబ్ ప్రతినిధులు సుబ్బారావు, ప్రతాప్గుప్తా, నాగేశ్వర్రావు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. -
ఐలమ్మకు ఘన నివాళి
జక్రాన్పల్లి: మండలంలోని అర్గుల్ గ్రామంలో వీరనారి చిట్యాల చాకలి ఐలమ్మ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఐలమ్మ విగ్రహానికి స్థానిక నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మాజీ సర్పంచ్ గోర్త రాజేందర్, యువజన సభ్యుడు పిండి సదానంద్ యాదవ్, వీడీసీ చైర్మన్ రాజేశ్వర్, అర్గుల్ రజక సంఘ సభ్యులు సాగర్, గంగాధర్, భాస్కర్ పాల్గొన్నారు. ఈరవత్రి అనిల్ జన్మదిన వేడుకలు.. అర్గుల్ గ్రామంలో కాంగ్రెస్ నాయకుడు ఈరవత్రి అనిల్ జన్మదిన వేడుకలను మాజీ సర్పంచ్ గోర్త రాజేంధర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టారు. -
నిజాంసాగర్లోకి భారీ ఇన్ఫ్లో
నిజాంసాగర్: మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో కురుస్తున్న వర్షాలతో పాటు సింగూరు ప్రాజెక్టు గేట్ల ద్వారా నిజాంసాగర్ ప్రాజెక్టులోకి శుక్రవారం భారీ వరద వచ్చి చేరుతోంది. శుక్రవారం రాత్రి 77,717 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ఇన్ఫ్లో కొనసాగుతుండడంతో ప్రాజెక్టు 13 గేట్లను ఎత్తి 87,709 క్యూసెక్కుల నీటిని మంజీర నదిలోకి వదులుతున్నారు. ప్రధాన కాలువకు 1,250 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1,405 అడుగులు (17.8 టీఎంసీలు) కాగా.. శుక్రవారం రాత్రి వరకు 1,401.51 అడుగుల (13.088 టీఎంసీలు) నీరు నిల్వ ఉందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. కౌలాస్ ప్రాజెక్టులోకి.. కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో జుక్కల్ మండలంలోని కౌలాస్ ప్రాజెక్టులోకి శుక్రవారం 4,838 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు మూడు వరద గేట్లను ఎత్తి 7,614 క్యూసెక్కుల నీటిని మంజీర నదిలోకి వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 458 మీటర్లు (1.237 టీఎంసీలు) కాగా 457.85 మీటర్లు (1.200 టీఎంసీలు) నీరు నిల్వ ఉంది. మంజీర నదిలో వరద పరవళ్లు నిజాంసాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో పాటు నల్లవాగు మత్తడి పొంగిపొర్లుతుండడం, కల్యాణి ప్రాజెక్టు, సింగితం రిజర్వాయర్ అలుగులు పారుతుండడంతో మంజీర నది వరద నీటితో పరవళ్లు తొక్కుతోంది. నదిలో దాదాపు 1.30 లక్షల క్యూసెక్కుల మేర వరద నీరు ప్రవహిస్తోంది. -
ఆలయాల దోపిడీ ముఠా సభ్యుల అరెస్టు
క్రైం కార్నర్● ఆటో, నగదు, వెండి వస్తువుల స్వాధీనం ● సీసీ ఫుటేజీల ద్వారా నిందితుల గుర్తింపు ● వివరాలు వెల్లడించిన ఎస్పీ రాజేష్ చంద్ర కామారెడ్డి టౌన్: ఆలయాలను టార్గెట్ చేస్తూ చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగల ముఠా సభ్యులలో ఇద్దరిని పట్టుకుని అరెస్టు చేసినట్లు ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. పట్టణంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం ఆయన వివరాలను వెల్లడించారు. ఈనెల 10న భిక్కనూరు మండలం బస్వాపూర్ గ్రామంలో పెద్దమ్మ గుడి హుండీలో నుంచి రూ.5వేలను గుర్తు తెలియని వ్యక్తులు దోచుకెళ్లారు. అలాగే ఎల్లమ్మ గుడి, ముత్యాలమ్మ ఆలయాల తాళాలు పగులగొట్టి హుండీల డబ్బులను చోరీ చేశారు. కేసు నమోదు చేసి పోలీసులు విచారణ చేపట్టగా ముగ్గురు వ్యక్తులు చోరీకి పాల్పడినట్లు సీసీ ఫుటేజీల ద్వారా గుర్తించారు. వారిని పట్టుకుని విచారించగా పలు చోరీల వివరాలు బయటకు వచ్చాయి. హైవేపై ఉన్న ఇళ్లు, ఆలయాలను టార్గెట్ చేసుకుని తాళాలు పగులగొట్టి విలువైన వస్తువులు చోరీలకు పాల్పడుతున్నటు గుర్తించారు. అలాగే గత నెల 19న రామాయంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో మల్లన్న గుడి, సదాశివనగర్ మండలంలో ఎల్లమ్మ గుడి, ఈ నెల 9న రామాయంపేట పరిధిలోని అయ్యప్ప ఆలయంలో హుండీలోని నగదు, వెండి పూజ సామగ్రి దొంగిలించారు. అదేరోజు భిక్కనూరు మండలం బస్వాపూర్లో ఎల్లమ్మ, పెద్దమ్మ, ముత్యాలమ్మ ఆలయాల్లో హుండీలో నగదు, అమ్మవారి వెండి కళ్లు చోరీ చేశారు. పక్కనే ఉన్న ఇంటిలో బంగారు ఆభరణాలు, నగదు దొంగిలించారు. జంగంపల్లి గ్రామంలో పెద్దమ్మ, ఎల్లమ్మ ఆలయాల్లో హుండీ డబ్బులు దొంగలించారు. బస్వాపూర్, రామాయంపేట్లోని ఆలయాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను పట్టుకున్నట్లు ఎస్పీ తెలిపారు. ముఠా సభ్యులలో ముగ్గురిని సదాశివనగర్ మండలం తిర్మన్పల్లి గ్రామానికి చెందిన గాంధారి సత్యం, మహారాష్ట్ర లాతూర్ జిల్లాకు చెందిన సయ్యద్ సమీర్, అహ్మద్ పఠాన్గా గుర్తించారు. సత్యం, సమీర్ పట్టుబడగా, అహ్మద్ పఠాన్ పరారీలో ఉన్నట్టు ఎస్పీ తెలిపారు. నిందితుల నుంచి రెండు ఫోన్లు, ఆటో, మూడు జతల అమ్మవారి వెండి కళ్లు, వెండి దీపాలు, వస్తువులు, రూ.5వేలు నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కేసును చేధించిన పోలీసులను ఎస్పీ అభినందించారు. అదనపు ఎస్పీ నర్సింహారెడ్డి, ఏఎస్పీ చైతన్య రెడ్డి, సీసీఎస్ పోలీసులు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఐలమ్మ జయంతిని అధికారికంగా నిర్వహించాలి
● నిజామాబాద్ జెడ్పీ మాజీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు ● జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో ఘనంగా ఐలమ్మ జయంతి వేడుకలు సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: వీరనారి చాకలి ఐలమ్మ జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి, జెడ్పీ మాజీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు డిమాండ్ చేశారు. నగరంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఐలమ్మ 131వ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా విఠల్రావు ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులు అర్పించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో వీరవనితగా గుర్తింపు పొందిన ఐలమ్మ జయంతిని అధికారికంగా నిర్వహించాలని గతంలో తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారన్నారు. ఐలమ్మ పోరాటాలను కొనియాడారు. అనంతరం రెంజల్ మండలం దూపల్లి గ్రామానికి చెందిన రిటైర్డ్ ప్రొఫెసర్ శ్రీనివాసరావును పార్టీలోకి ఆహ్వానించి కండువా కప్పారు. నాయకులు రమణరావు, బి.శ్రీనివాస్రావు, నీలంరెడ్డి, అగ్గు సంతోష్, మాకు రవి, న్యాలం రమేష్, బి.చలపతిరావు, షేక్ సాదిక్, కృష్ణ, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
బతుకమ్మ పాట
బతుకమ్మ, బతుకమ్మ ఉయ్యాలో... బంగారు గౌరమ్మ ఉయ్యాలో... మా ఇంట కొలువుండు ఉయ్యాలో... మా కష్టాలు తీర్చు ఉయ్యాలో... తంగేడు పూలమ్మ ఉయ్యాలో... తెలంగాణ శోభమ్మ ఉయ్యాలో... గునుగు పూల వైభవము ఉయ్యాలో... గుండెలనిండా నిలిచి ఉయ్యాలో... పసుపు పారాణమ్మ ఉయ్యాలో... ప్రాణాల తోడమ్మ ఉయ్యాలో... ప్రకృతిని పూజిద్దాం ఉయ్యాలో... పాటలతో కొలుద్దాం ఉయ్యాలో... తొమ్మిది రోజులమ్మ ఉయ్యాలో... తొమ్మిది రూపాలమ్మ ఉయ్యాలో... సద్దులొచ్చిన రోజు ఉయ్యాలో... సంతోషాల క్రాంతి ఉయ్యాలో... అట్లు సత్తుపిండ్లూ ఉయ్యాలో... ఆప్యాయత పంచె ఉయ్యాలో... అందరొక్కటై ఆడుదాం ఉయ్యాలో... ఆనందంగా పాడుదాం ఉయ్యాలో... చెరువు నీరు నిండే ఉయ్యాలో... చల్లగ లోకముండే ఉయ్యాలో... కన్నతల్లి భూమిని ఉయ్యాలో... కళకళలాడించే ఉయ్యాలో... మాంగల్యం నిలబెట్టు ఉయ్యాలో... మా మనసులు చూడమ్మ ఉయ్యాలో... నీ దీవెన మాకిచ్చి ఉయ్యాలో... తరతరాల సౌభాగ్యమై ఉయ్యాలో... బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో... మళ్లీ వచ్చేవరకు ఉయ్యాలో... మరల మరల తలచుచు బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో... – సుధ మర్రివాడ, టీచర్ హంగర్గాఫారం -
కలవారి కోడలు ఉయ్యాలో..
డొంకేశ్వర్ మండల కేంద్రంలోని మండపంలో రూ.21,11,111 నగదు అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారునగరంలోని కలెక్టరేట్లో శుక్రవారం నిర్వహించిన బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. పెద్ద సంఖ్యలో ఉద్యోగులు తరలివచ్చారు. దీంతో ప్రాంగణమంతా సందడి వాతావరణం నెలకొంది. రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి ఆడిపాడారు.శ్రీ మహాలక్ష్మీ.. నమోస్తుతేజిల్లాలో దుర్గామాత నవరాత్రోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. శుక్రవారం వివిధ రూపాల్లో దర్శనమిచ్చిన అమ్మవారికి భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. కుంకుమార్చనలు నిర్వహించారు. పలు మండపాల్లో కరెన్సీ నోట్లతో అమ్మవారిని అలంకరించారు. -
ఐలమ్మ ఆశయ సాధనకు కృషి చేయాలి
నిజామాబాద్ అర్బన్: తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మ ఆశయ సాధనకు అంకిత భావంతో కృషి చేయాలని అదనపు కలెక్టర్ అంకిత్ పిలుపునిచ్చారు. ఐలమ్మ జయంతి సందర్భంగా శుక్రవారం వినాయక్నగర్లోని విగ్ర హానికి అదనపు కలెక్టర్, అధికారులు, కుల సంఘా ల ప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం న్యూ అంబేడ్కర్ భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ పెత్తందారి వ్యవస్థకు వ్యతిరేకంగా చాకలి ఐలమ్మ సాయుధ పోరాటం చేశారని గుర్తు చేశారు. హక్కుల కోసం రాజీలేని పోరాటం చేసి స్ఫూర్తిని నింపారని కొనియాడారు. కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి నర్సయ్య, సహాయ అధికారి గంగాధర్, వివిధ కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
యువ వికాసమేదీ..?
మెండోరా మండల కేంద్రానికి చెందిన యమున రాజీవ్ యువ వికాసం పథకం కింద రూ.2లక్షల రుణం కోసం దరఖాస్తు చేసుకుంది. రాయితీ రుణం మంజూరైతే కిరాణ దుకాణం, లేడిస్ ఎంపోరియం ఏర్పాటు చేసుకోవచ్చని ఆశించింది. అయితే ఇప్పటి వరకు యువ వికాసం రుణం మంజూరు కాలేదు. స్వయం ఉపాధి పొందడానికి తనకు రాయితీ రుణం ఒక్కటే మార్గమని భావించే యమున వంటి వారెందరో వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. మోర్తాడ్(బాల్కొండ) : రాజీవ్ యువ వికాసం పేరుతో రాష్ట్ర ప్రభు త్వం కొత్త పథకాన్ని ప్రారంభించింది. రాష్ట్ర ఆవి ర్బావ దినోత్సవం సందర్భంగా యువతకు రాయి తీ రుణాలను పంపిణీ చేస్తామని ప్రకటించింది. జూ న్ 2కు ముందే దరఖాస్తులను స్వీకరించగా, జిల్లా వ్యాప్తంగా ఎంతో మంది యువత రాయితీ రుణాల కోసం నిరీక్షిస్తున్నారు. వాయిదా పడిన పథకం అమలుకు ఇప్పటి వరకు షెడ్యూల్ను ఖరారు చేయలేదు. కనీసం ఎప్పుడు రుణాలు అందిస్తారో ప్రభుత్వం వెల్లడించకపోవడం విచారకరం. రాజీవ్యువ వికాసం కోసం దరఖాస్తు చేసుకున్నవారికి సిబిల్ రికార్డు బాగుండాలని బ్యాంకర్లు స్పష్టం చేశారు. ఇప్పటి వరకూ ప్రభుత్వం రాయితీ కోసం నిధులను కేటాయించకపోవడంతో రుణాల పంపిణీ లక్ష్యం నెరవేరడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జిల్లాలో 58వేల దరఖాస్తులు రాజీవ్ యువ వికాసం పథకానికి జిల్లాలో 58వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో దరఖాస్తుదారుల సామాజిక వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఆయా కార్పొరేషన్ల ద్వారా రుణాలను అందించాలని నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా ఓసీలను మినహాయించి ఆయా సామాజికవర్గాల వారికి రాయితీ రుణాలను పంపిణీ చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రుణాలు పంపిణీ చేస్తామని ప్రకటన మూడు నెలలు గడుస్తున్నా జాడలేని నిధులు స్వయం ఉపాధి కోసం యువతకు తప్పని నిరీక్షణ -
పేదల సొంతింటి కల నెరవేరుస్తాం
● బోధన్, ఆర్మూర్ ఎమ్మెల్యేలు సుదర్శన్రెడ్డి, పైడి రాకేశ్రెడ్డి ● అంకాపూర్లో డబుల్ బెడ్రూం గృహ ప్రవేశాలు ఆర్మూర్ : పేదల సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని బోధన్, ఆర్మూర్ ఎమ్యె ల్యేలు సుదర్శన్రెడ్డి, పైడి రాకేశ్ రెడ్డి పేర్కొన్నారు. ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామంలో డబుల్ బెడ్రూం ఇళ్ల ప్రవేశాలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 92 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపు పత్రాలను కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డితో కలిసి ఎమ్మెల్యేలు అందజేశారు. అనంతరం అంకాపూర్ గ్రామాభివృద్ధి కమిటీ కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడారు. ఆదర్శ గ్రామం అంకాపూర్ నుంచి డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీకి శ్రీకారం చుట్టడం సంతోషంగా ఉందన్నారు. ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి మాట్లాడుతూ తన సొంత గ్రామంలో ప్రత్యేక చొరవతోనే డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీ సాధ్యమైందన్నారు. కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ అంకాపూర్ తరహాలో అన్ని నియోజకవర్గాల్లో అర్హులైన లబ్ధిదారులకు డబుల్ బెడ్రూం ఇళ్లను పంపిణీ చేస్తామన్నారు. అనంతరం అంకాపూర్లో బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, రాష్ట్ర సహకార సంఘాల యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మో హన్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ రమేశ్ రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, హౌసింగ్ పీడీ పవన్ కుమార్, డీఈ నివర్తి, ఆర్మూర్ ఎంపీడీవో శి వాజీ, తహసీల్దార్ సత్యనారాయణ పాల్గొన్నారు. -
24/7 నిఘా.. పెట్రోలింగ్
ప్రశ్న: పండుగ సెలవుల్లో.. – నరేశ్, సంజీవ్రెడ్డి నగర్, ఆర్యనగర్, నిజామాబాద్ ఏసీపీ: పండుగ సెలవుల్లో ఇళ్లు వదిలి గ్రామాలకు వెళ్లేవారు ముందుగా సమీప పోలీస్స్టేషన్లో సమా చారం అందించాలి. దీంతో పెట్రోలింగ్ బృందాలు ఇళ్లపై ప్రత్యేక నిఘా ఉంచుతాయి. పక్కింటి వారి తో మాట్లాడుతూ.. ఇంటి పరిసరాల్లో ఎవరైనా అనుమానాస్పదంగా తిరిగితే సమాచారం అందించాలని చెప్పాలి. ● డబ్బు, బంగారం భద్రతకు.. – వేముల సునీల్, చంద్రానగర్, నిజామాబాద్ ● ఊరికి వెళ్లితే ఇంట్లో బంగారం, డబ్బు ఉంచకుండా తమ వెంట తీసుకుపోవాలి. లేదంటే బ్యాంక్ లాకర్లో పెట్టుకోవడం ఉత్తమం. బీరువా తాళాలు ఇంట్లో ఉంచొద్దు. ఊరికి వెళుతున్నట్లు వాట్సాప్ స్టేటస్తోపాటు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియాలో పోస్టులు చేయొద్దు. ఊరెళ్లినప్పుడు ఇంట్లో లైట్లు ఆన్ చేసి ఉంచాలి. ఇంట్లో ఎవరైనా ఉన్నారని గ్రహించి దుండగులు చోరీకి సాహసించే అవకాశం ఉండదు. ● నగరం, గ్రామాల్లో పెట్రోలింగ్.. – గాండ్లపల్లి, నర్సారెడ్డి, ఆర్మూర్ ● పండుగలకు పెట్రోలింగ్ను ఎక్కువగా చేస్తాం. అదనపు బృందాలను ఏర్పాటు చేసి కాలనీలు, గ్రా మాల్లో పెట్రోలింగ్ చేసేలా చూస్తున్నాం. ఇప్పటికే కాలనీ పోలీసులు, గ్రామ పోలీసులు అందుబాటు లో ఉన్నారు. సీపీ పోతరాజు సాయిచైతన్య ఆదేశాల మేరకు శివారు కాలనీలపై ప్రత్యేక దృష్టి పెట్టాం. బ్లూకోల్ట్ టీమ్లు అందుబాటులో ఉన్నాయి. ● అత్యవసర సమయాల్లో.. – శ్రీకాంత్, చంద్రశేఖర్కాలనీ, నిజామాబాద్ ● దొంగతనాలు జరిగినప్పుడు, ఇతర సమస్యలు తలెత్తితే స్థానిక పోలీస్స్టేషన్కు లేదా ‘డయల్ 100’కు కాల్ చేయాలి. ● సీసీ కెమెరాల ఏర్పాటు.. – సాగర్, ఖుద్వాన్పూర్, నందిపేట్ ● ఇంటి పరిసరాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం శ్రేయస్కరం. దీంతో దొంగలు దొరికిపోతామని భావించి చోరీకి ప్రయత్నించరు. కాలనీలు, గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకు రా వాలి. రోడ్డు, ఇళ్లు కనిపించేలా సీసీ కెమెరాలను బి గించుకోవాలి. కొత్తగా ఇళ్లు నిర్మించుకునేవారు సెంట్రల్ లాకింగ్ సిస్టంను ఏర్పాటు చేసుకోవడం ఉత్తమం. అలారంను అమర్చుకుంటే పీఎస్తోపాటు యజమానిని ముందుగానే అప్రమత్తం చేస్తుంది. రాత్రివేళ ప్రయాణం.. – ప్రసాద్, గాయత్రినగర్, నిజామాబాద్ రాత్రివేళ ప్రయాణం చేయడం తగ్గించుకోవాలి. గమ్యం చేరుకోవడానికి కాస్త ముందుగానే బయల్దేరాలి. డ్రైవింగ్ చేస్తుండగా నిద్రమత్తు వస్తే.. అప్రమత్తమై రోడ్డు పక్కన వాహనం నిలిపి కాసేపు రెస్ట్ తీసుకోవాలి. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మీతోపాటు వెంట వచ్చేవారు సైతం ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. రాత్రివేళ భారీ వాహనాలు వెళుతుంటాయి. అందులో స్పీడ్గా వెళ్లే వాహనాలుంటాయి. బ్లాక్స్పాట్ల వద్ద వాహనాదారులు మెల్లిగా వెళ్లాలి. రాంగ్రూట్లో వెళ్లొద్దు. పండుగ పూట అప్రమత్తంగా ఉండాలి ఊరెళ్తే పోలీసులకు సమాచారమివ్వండి శివారు ప్రాంతాల భద్రతపై స్పెషల్ ఫోకస్ ఆపదలో ఉంటే పోలీసులు లేదా డయల్ 100 కు కాల్ చేయండి ‘సాక్షి’ ఫోన్–ఇన్లో నిజామాబాద్ ఏసీపీ రాజావెంకట్రెడ్డి -
దరఖాస్తుకు రూ.3 లక్షలు
● వైన్ షాపులకు అప్లికేషన్ల స్వీకరణ ప్రారంభం ● జిల్లాలో 102 మద్యం షాపులు ఖలీల్వాడి: జిల్లాలోని 102 మద్యం షాపులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి పేర్కొన్నారు. నగరంలోని సుభాష్నగర్లో తన కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం 2025–27 నూతన మద్యం పాలసీ ద్వారా జిల్లాలోని 102 వైన్ షాపులకు దరఖాస్తులు ఆహ్వానిస్తోందని, ఒక్కో దరఖాస్తు ధర రూ.3 లక్షలు చెల్లించాల్సి ఉంటుందన్నారు. దరఖాస్తు చేసుకున్నవారి రూ.3 లక్షలు నాన్ రీఫండబుల్గా నిర్ణయించామని తెలిపారు. జిల్లాలోని నిజామాబాద్ ఎకై ్సజ్ ఎస్హెచ్ పరిధిలో 36, ఆర్మూర్ 25, బోధన్ 18, భీంగల్ 12, మోర్తాడ్లో 11 మద్యం షాపులు ఉన్నాయన్నారు. గురువారం కలెక్టర్ సమక్షంలో జరిగిన సమావేశంలో గౌడ సామాజిక వర్గానికి 11, ఎస్టీలకు 2, ఎస్సీలకు 11 వైన్ షాపులు కేటాయించినట్లు తెలిపారు. నందిపేట్లో మద్యం షాపును తగ్గించి నూతనంగా ఏర్పాటు చేస్తున్నామన్నారు. జక్రాన్పల్లి మండలం కలిగోట్ గ్రామంలోని వైన్ షాపును తొలగించి మండల కేంద్రంలో, నిజామాబాద్ నగరంలోని ద్వారకానగర్ వైన్ షాపును ముబారక్నగర్లో, బాల్కొండ లోని వైన్షాపును మోపాల్లో ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. అక్టోబర్ 18 వరకు దరఖాస్తులను ఈఎస్ కార్యాలయంలో అందించాలని, 23న నగర శివారులోని భారతీ గార్డెన్లో డ్రా తీస్తా మని తెలిపారు. సమావేశంలో ఎకై ్సజ్ సీఐ స్వప్న, గుండప్ప, మల్లేశ్, భాస్కర్ రావు, పాల్గొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ(గౌడ)లకు కేటాయించిన వైన్ షాపులు (నంబర్లు)ఎస్టీ: అంకాపూర్, బషీరాబాద్(1) ఎస్సీ: ఖానాపూర్(3), నాందేవ్వాడ(2), ఆర్ఆర్ చౌరస్తా(3), మోపాల్(2), బోధన్ (5), కోటగిరి, ఆర్మూర్(5), బాల్కొండ(1), దూద్గాం, ధర్పల్లి(1, 3) బీసీ (గౌడ్స్): మోపాల్(1), సాటాపూర్(1), ఆర్మూర్(6), జక్రాన్పల్లి(1), రెంజల్, భీమ్గల్– 1,3,4, మోర్తాడ్(1), కమ్మర్పల్లి(1), బషీరాబాద్(2) దరఖాస్తుకు కావాల్సినవి.. రూ. 3 లక్షల (నాన్ రిఫండబుల్) డీడీ/చలాన్ ఆధార్/పాన్ కార్డు మూడు కలర్ పాస్పోర్ట్ సైజు ఫొటోలు ఎస్సీ, ఎస్టీ, బీసీ(గౌడ కులస్తులు) కుల ధ్రువీకరణ పత్రం -
ఆగమాగం.. ఫైళ్లు మాయం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : అది నిజామాబాద్ అర్బన్ రిజిస్ట్రేషన్ కార్యాలయం.. కొత్తవారు ఎవరైనా వస్తే చేపల మార్కెట్టా.. లేక కొత్త సినిమా టిక్కెట్లు బ్లాక్లో అమ్ముతున్నారా..? అనే సందేహం కలుగక మానదు. ఇదే తరహా రిజిస్ట్రేషన్ కార్యాలయంలో గురువారం గందరగోళ వాతావరణం నెలకొంది. ఓ తొమ్మిది నెలల నిండు గర్భిణి రిజిస్ట్రేషన్ నిమిత్తం రాగా, ఉదయం 11 గంటలకు స్లాట్ ఇ చ్చారు. సాయంత్రం 6.30 గంటల వరకు రిజిస్ట్రేషన్ చేయలేదు. విచిత్రమేమిటంటే కంప్యూటర్ గదిలో ఎంట్రీ చేసే సిస్టమ్ వద్ద ఉన్న ఫైల్ మాయమైంది. కొన్ని గంటల పాటు వెతకగా చివరకు హాల్లో ఉన్న టేబుల్ మీద ఈ ఫైల్ దొరికింది. కార్యాలయంలో ఏ ఫైళ్లు ఎక్కడ ఉన్నాయో అనేది అర్థం కాని పరిస్థితి. నిండు గర్భిణి రిజిస్ట్రేషన్ నిమి త్తం బుధవారం కూడా రోజంతా అనేక ఇబ్బందు లు కలిగినప్పటికీ వేచి చూసి వెళ్లారు. ఇలా రిజి స్ట్రేషన్ కోసం రెండ్రోజులుగా తిరుగుతున్నవారు చాలామంది ఉన్నారు.డాక్యుమెంట్ రైటర్ల పోటాపోటీ వ్యవహారంలో ఎవరి ఫైళ్లు వారు ముందు పెట్టుకోవాలనే పోట్లాడే పరిస్థితి నెలకొంది. కార్యాలయం మొత్తం డాక్యు మెంట్ రైటర్లదే హవా. దీంతో ఈ కార్యాలయంలో పనిచేసేందుకు సబ్ రిజిస్ట్రార్లు ముందుకు రావడం లేదు. ఏడాది కాలంగా ఇద్దరు సీనియర్ అసిస్టెంట్లకు ఇన్చార్జి ఇచ్చారు. ఈ ఇన్చార్జి సబ్ రిజిస్ట్రార్లతో నెట్టుకొస్తున్నారు. అయితే ఇంత గందరగోళ పరిస్థితులు నెలకొన్న రోజు కార్యాలయంలో రిజి స్ట్రార్ ఒక్కరు మాత్రమే విధులు నిర్వహించారు. దీంతో రిజిస్ట్రేషన్ల కోసం వచ్చినవారు రోజంతా వేచిచూడాల్సిన వచ్చింది. అంతకు ముందురోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు సర్వర్ పనిచేయలేదంటూ రిజి స్ట్రేషన్లు పూర్తి చేయలేదు. వందల మందికి ఎదురు చూ పులు తప్పలేదు. అ యితే నిజామాబాద్ రూరల్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో మాత్రం సర్వర్ పనిచేయడం గమనార్హం. నిజామాబాద్ అర్బన్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో జరుగుతున్న వ్యవహారాలకు సంబంధించి తాజా ఘటన ఒక ఉదాహరణ మాత్రమే.అద్దె భవనంలోనే..అత్యధిక ఆదాయం తీసుకొచ్చే రిజిస్ట్రేషన్ల విభాగానికి సంబంధించి సొంత కార్యాలయం ఏర్పాటు చేసే విషయంలో ప్రభుత్వం పట్టింపు లేకుండా వ్యవహరిస్తోంది. సమీకృత కలెక్టరేట్ కార్యాలయం ఏర్పాటు చేసి అందులోకి వివిధ ప్రభుత్వ కార్యాలయాలను తరలించారు. ఇలా తరలివెళ్లిన కార్యాలయాలకు సంబంధించి పలుచోట్ల పాత భవనాలు ఉన్నాయి. అయినప్పటికీ భారీగా అద్దెలు చెల్లిస్తూ తగిన సౌకర్యాలు లేని ప్రైవేటు భవనంలో నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్ కార్యాలయాలు నడిపిస్తున్నారు. రెండో ఫ్లోర్లో ఉన్న అర్బన్ కార్యాలయానికి వచ్చేందుకు గర్భిణులు, వృద్ధులు, వికలాంగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కుర్చీలు లేక గంటల తరబడి నిలబడుతున్నారు. మరుగుదొడ్లు, నీటి సౌకర్యం కూడా సక్రమంగా లేవని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డిని ‘సాక్షి’ సంప్రదించగా పరిశీలించి తగిన విధంగా పరిష్కారం చూపేందుకు ప్రభుత్వానికి నివేదిక ఇస్తామన్నారు.ఆర్టీసీ ఆన్లైన్ రిజర్వేషన్ఖలీల్వాడి: బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు ఆర్టీసీ రీజినల్ మేనేజర్ టి.జ్యోత్స్న గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రయాణికుల సౌకర్యార్థం ప్రతి రోజూ జేబీఎస్ నుంచి నిజామాబాద్ వరకు 15 నిమిషాలకు ఒక బస్సు అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. శుక్రవారం నుంచి అక్టోబర్ 1వ తేదీ వరకు, అలాగే తిరుగు ప్రయాణికులు 6వ తేదీ వరకు ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకోవచ్చని ఆర్ఎం తెలిపారు. రీజియన్ పరిధిలోని ఆరు డిపోలు నిజామాబాద్ – 1,2, బోధన్, ఆర్మూర్, బాన్సువాడ, కామారెడ్డికి జెబీఎస్ నుంచి బస్సులు న డుపుతున్నట్లు తెలిపారు. అలాగే ఇతర ప్రఽ దాన రూట్లలో సైతం అదనపు బస్సులు న డుస్తాయని, www.tg srtcbus.in వెబ్సైట్ ద్వారా రిజర్వేషన్ చేసుకోవాలని సూచించారు. ఆర్టీసీ సేవలను ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.నేడు కళాశాలల్లో టీచర్స్, పేరెంట్స్ మీటింగ్నిజామాబాద్ అర్బన్: జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మెగా పేరెంట్స్, టీచర్స్ సమావేశాన్ని శుక్రవారం నిర్వహించనున్నట్లు జిల్లా ఇంటర్ విద్యాధికారి తిరుమలపూడి రవికుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్ బోర్డ్ కమిషనర్ ఆదేశాల మేరకు నిర్వహించనున్న సమావేశాల్లో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొనాలని కోరారు. అధ్యాపకులు నేర్పాల్సిన అంశాలను, సమస్యలను తల్లిదండ్రులు తెలుపాలని డీఐఈవో కోరారు. విద్యార్థుల హాజరు, విద్యాభ్యాసం, ఇప్పటివరకు నిర్వహించిన పరీక్షల మార్కులను ఈ సమావేశంలో తల్లిదండ్రులకు వివరిస్తామని, తప్పకుండా హాజరు కావాలని ఆయన కోరారు. -
ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్లాలి
జక్రాన్పల్లి: మండలంలోని మనోహరాబాద్లో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఏర్పాటు చేసిన జేఏంకేపీఎం పసుపు రైతుల ఉత్పత్తిదారుల సంఘాన్ని ఇక్రిశాట్ శాస్త్రవేత్తలు గురువారం సందర్శించారు. ఇక్రిశాట్ శాస్త్రవేత్తలు తమిళసేలివి, ప్రియాంక, రాజశేఖర్ పరిశ్రమను సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. జిల్లా పరిశ్రమల శాఖ సీనియర్ ఆఫీసర్ ప్రశాంత్, పసుపు రైతుల ఉత్పత్తిదారుల సంఘం చైర్మన్ పాట్కురి తిరుపతిరెడ్డి క్లస్టర్ గురించి శాస్త్రవేత్తలకు వివరించారు. రైతులు సంఘటితంగా ఉండి ఆధునిక పద్ధతిలో వ్యవసాయ రంగాన్ని తీసుకెళ్లడానికి అవసరమైన సహాయ సహకారాలు అందజేస్తామని తెలిపారు. కార్యక్రమంలో డైరెక్టర్లు సంతోష్, పుప్పాల నాగేశ్, సూపర్వైజర్ రుత్విక్ తదితరులు పాల్గొన్నారు. -
వైన్షాపులకు నేటి నుంచి దరఖాస్తులు
ఖలీల్వాడి : వైన్షాపుల లైసెన్సుల జారీకి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మే రకు ఎకై ్సజ్ కమిషనర్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. లక్కీ డ్రా ద్వారా దుకాణాలను కే టాయించి 2025 డిసెంబర్ 1 నుంచి 2027 న వంబర్ 30 కాలానికి లైసెన్స్లు కేటాయిస్తారు. ప్రస్తుతమున్న వైన్షాపులు నవంబర్ 30 వరకు కొనసాగనున్నాయి. కలెక్టర్ పర్యవేక్షణలో దుకాణాల కేటాయింపులో రిజర్వేషన్లను ఖరారు చేస్తామని ఎకై ్సజ్ సూపరింటెండెంట్ కొమ్మూరి మల్లారెడ్డి తెలిపారు. జిల్లాలో 102 వైన్షాపులున్నాయి. గౌడ కులస్తులకు 15 శాతం, ఎస్సీలకు 10, ఎస్టీలకు 5 శాతం రిజర్వేషన్ ఉంటుంది. రూ.3 లక్షల డీడీ చెల్లించి దరఖాస్తు ఫారం పొందాల్సి ఉంటుంది. ఆరు శ్లా బుల్లో జనాభా ప్రాతిపదికన మ ద్యం షాపుల లైసెన్స్ ఫీజు ఉండనుంది. 2023 లో 102 దుకా ణాలకు మొత్తం 4 వేల దర ఖాస్తులు రాగా, ఈ సారి 5 వేల వరకు వస్తాయ ని ఎకై ్సజ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.జనాభా లైసెన్స్ ఫీజు (రూ.లక్షల్లో) 5 వేల వరకు 50 5 వేల నుంచి 50 వేలు 5550వేల నుంచి లక్ష వరకు 60లక్ష నుంచి 5 లక్షల వరకు 655 లక్షల నుంచి 20 లక్షల వరకు 85 జిల్లాలో 102 మద్యం షాపులు దరఖాస్తు ఫీజు రూ.3 లక్షలు లాటరీ ద్వారా దుకాణాల కేటాయింపు 2023లో 4 వేల దరఖాస్తులు -
ఏసీపీతో నేడు ‘సాక్షి’ ఫోన్ఇన్
దసరా సెలవుల్లో ఊరెళ్తున్నారా.. అయితే ఇళ్లు జాగ్రత్త ! చోరీలకు అవకాశం లేకుండా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పోలీసులకు సమాచారం ఇవ్వడం, ప్రయాణా ల్లో బ్లాక్ స్పాట్స్ వద్ద, నైట్ జర్నీలో ఇబ్బందులు కలగకుండా సలహాలు, సూచనల కోసం సాక్షి నిజామాబాద్ ఏసీపీ రాజావెంకట్ రెడ్డితో ఫోన్ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది. మీరు ఫోన్ చేసి సలహాలు పొందవచ్చు. తేది : 26–09–2025 (శుక్రవారం) సమయం: ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు..87126 59807 99484 03753ఫోన్ నం : -
‘రైతు డిక్లరేషన్’ హామీలు నెరవేర్చాలి
● మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి ● ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి వేల్పూర్: కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా వరంగల్ రైతు డిక్లరేషన్లో చెప్పిన ప్రకారం మొక్కజొన్న పంటకు మెరుగైన మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేయాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం ఆయన వేల్పూర్లో విలేకరులతో మాట్లాడారు. ప్రైవేటు కొనుగోలుదారుల చేతుల్లో మొక్కజొన్న రైతులు తీవ్రంగా నష్టపోతున్నందున ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలన్నారు. క్వింటాలుకు రూ. 2400 ఉన్న మద్దతు ధరకు మెరుగైన మద్దతు ధర రూ. 400 కలిపి క్వింటాలుకు రూ. 2800 చెల్లించి కొనుగోలు చేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం రూ. 2800 లకు మక్కలు కొనాలని, కానీ కొనుగోలు కేంద్రాలు లేక ప్రైవేటు వ్యాపారులు రూ. 1800కు కూడా కొనడం లేదన్నారు. వర్షాలు కురుస్తున్నందున వ్యాపారులు ధరను ఇంకా తగ్గించే అవకాశం ఉందన్నారు. దీంతో ఎకరానికి సుమారు 30 క్వింటాళ్ల మక్కలు పండించే రైతులు రూ. 30 వేలు నష్టపోతున్నారని పేర్కొన్నారు. గతంలో కేసీఆర్ మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులను ఆదుకున్నారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామగ్రామాన కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని సీఎం రేవంత్రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావును కోరారు. సోయాబీన్ పంట కూడా కోత దశలో ఉన్నందున కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ముందుగా ప్రణాళిక సిద్ధం చేయాలని కలెక్టర్ను కోరారు. మొక్కజొన్నకు వచ్చిన పరిస్థితులు సోయాబీన్కు రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కోరారు. -
పనితీరు మరింత మెరుగుపడాలి
ధర్పల్లి: ప్రభుత్వ ఆస్పత్రుల పనితీరు మరింత మెరుగుపడాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. ధర్పల్లి మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రం, తహసీల్ కార్యాలయాలను కలెక్టర్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సీహెచ్సీ ద్వారా అందిస్తున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. స్వస్థ్ నారీ– సశక్త్ పరివార్ అభియాన్ భాగంగా సీహెచ్సీలో నిర్వహిస్తున్న ప్రత్యేక ఆరోగ్య శిబిరంలో స్పెషలిస్టు డాక్టర్లు అందుబాటులో ఉన్నారా అని పరిశీలించారు. శిబిరాలను మహిళలు సద్వినియోగం చేసుకునేలా చూడాలన్నారు. అన్ని గ్రామాల్లో విస్తృత ప్రచారం చేయాలని ఆదేశించారు. మరింత మెరుగైన ఆరోగ్య సేవలు అవసరం ఉన్న వారిని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి రిఫర్ చేయాలన్నారు. అనంతరం కలెక్టర్ తహసీల్ కార్యాలయాన్ని సందర్శించి, మండలంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్న తీరును పరిశీలించారు. కొత్త ఓటరు జాబితాను జాగ్రత్తగా పరిశీలించి, ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్ణీత నమూనాలో వివరాలు రూపొందించాలని తహసీల్దార్ శాంతకు సూచించారు. తప్పిదాలకు తావు లేకుండా కంట్రోల్ టేబుల్ మ్యాపింగ్, ఎలక్టోరల్ టేబుల్ మ్యాపింగ్ పూర్తి చేయాలన్నారు. -
గోదావరిలోకి తగ్గిన నీటి విడుదల
బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి గోదావరిలోకి అధికారులు గురువారం నీటి విడుదలను తగ్గించారు. బుధవారం 4 లక్షల క్యూసెక్కులను విడుదల చేసిన అధికారులు గురువారం 2 లక్షల క్యూసెక్కులకు తగ్గించారు. 39 వరద గేట్ల ద్వారా 2 లక్షల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ఎగువ నుంచి 3 లక్షల 15 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. ఇన్ ఫ్లోతో ఎక్కువగా ఉండి, అవుట్ ఫ్లో తక్కువగా ఉండటంతో ప్రాజెక్ట్ నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. వరద కాలువ ద్వారా 5,834 క్యూసెక్కులు, కాకతీయ కాలువ ద్వారా 5,500, ఎస్కేప్ గేట్ల ద్వారా 2,500, సరస్వతి కాలువ ద్వారా 400, అలీసాగర్ లిఫ్ట్ ద్వారా 180 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండగా మిషన్భగీరథ అవసరాలకు 231 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నారు. ఆవిరి రూపంలో 591 క్యూసెక్కుల నీరు పోతోంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 1091(80.5 టీఎంసీలు) అడుగులు కాగా గురువారం రాత్రి సమ యానికి 1082.8000(52.8టీఎంసీలు) అడు గుల నీరు నిల్వ ఉందని అధికారులు తెలిపారు. -
పార్థీ దొంగల ముఠా సభ్యులపై పీడీ యాక్ట్
కామారెడ్డి క్రైం: జాతీయ రహదారులపై దొంగతనాలు, దారి దోపిడీలకు పాల్పడుతున్న పార్థీ దొంగల ముఠాకు చెందిన కొందరిని ఇటీవల కామారెడ్డి పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపిన విషయం తెలిసిందే. ఈ ముఠాలోని ముగ్గురు ప్రధాన నిందితులపై పీడీ యాక్ట్ నమోదు చేసినట్లు ఎస్పీ రాజేశ్ చంద్ర గురువారం తెలిపారు. కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్ జిల్లాలలో రహదారుల వెంబడి, దాబా హోటళ్ల వద్ద నిలిపి ఉంచిన వాహనాలను టార్గెట్ చేసుకొని మారణాయుధాలతో దాడులు చేయడం, విలువైన వస్తువులు, నగదు దోచుకోవ డం చేస్తుంటారు. అంతేకాకుండా జాతీయ రహదారుల వెంట ఉండే గ్రామాల్లో తాళాలు వేసి ఉన్న ఇళ్లను దోచేస్తారు. వీరిపై మహారాష్ట్రలోని ఉద్గిరి నీలం పోలీస్ స్టేషన్ల పరిధిలో హత్య, హత్యాయత్నం కేసులు కూడా ఉన్నాయి. ముఠాలోని ప్రధాన నిందితులైన కర్ణాటక రాష్ట్రం బీదర్ జిల్లా ఔరాద్కు చెందిన కృష్ణ బాబు షిండే, మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా మంగ్యాల్ తడాకు చెందిన నాందేవ్, వసూర్ గ్రామానికి చెందిన రాథోడ్ అజిత్ రమేశ్పై పీడీ యాక్టు నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు. పీడీ యాక్టు ఉత్తర్వులను నిజామాబాద్ జైలులో ఉన్న నిందితులకు అందజేశామన్నారు. -
వర్షానికి కూలిన ఇళ్లు
బాల్కొండ: బాల్కొండ మండల కేంద్రంలో మేక లక్ష్మికి చెందిన ఇంటి గోడ కూలింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. పురాతన ఇళళ్లు కావడంతో వర్షాలధాటికి దెబ్బతిని కూలింది. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని బాధితులు వేడుకుంటున్నారు. కాగా, గురువారం ఉదయం నుంచి భారీ వర్షం కురువడంతో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా మక్క రైతులు ఆందోళన చెందుతున్నారు. మక్క కోతలు కోసి నూర్పిళ్లు చేసి రోడ్లపై ఆరబెట్టారు. కొందరు రైతులు మక్క కంకులను కుప్పలు చేసి పెట్టారు. ఏకధాటి వర్షాలతో కుప్పలపై టార్ఫాలిన్లు కప్పి ఉంచారు. అయినా కంకులు తడిసి ముద్దవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్గా ఆనంద్కుమార్
నిజామాబాద్ నాగారం: ప్రభుత్వ ఉద్యోగం సాధించాలన్న కసితో ఢిల్లీలో 6 అంకెల జీతం వదులుకొని మరీ ఐదేళ్లు కఠోరంగా శ్రమించాడు. ఫలితంగా వరుసగా ప్రభుత్వ ఉద్యోగాలు సాధిస్తున్నారు. నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలంలోని ఉప్లూర్ గ్రామానికి చెందిన ఆనంద్– కరుణ కుమారుడు మాదరి ఆనంద్కుమార్. నిజాంసాగర్లో జవహర్ నవోదయ పాఠశాలలో 2003లో పదో తరగతి పూర్తిచేశారు. 2012లో హైదరాబాద్ నైపర్లో ఎంఫార్మసీ పూర్తి చేశారు. ఆ తర్వాత ఢిల్లీలో 7 సంవత్సరాలపాటు ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేశారు. ఐదేళ్ల క్రితం జిల్లాకు తిరిగి వచ్చిన ఆయన ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని భార్య తేజస్వీని(రెవెన్యూ శాఖలో ఆర్ఐ), ఏఆర్ఐ సంతోష్, రాయదాసు, హెచ్ఎం ఆనంద్, జీజీ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ రంగరత్నం, దేవా ప్రదీప్కుమార్ సలహాలు, సూచనలు తీసుకున్నారు. ప్రణాళికాబద్ధంగా చదువుకొని గ్రూప్–1, 2, 3, 4 పరీక్షలు రాశారు. 2024 డిసెంబర్లో విడుదలైన గ్రూప్–4 ఫలితాల్లో వాణిజ్య పన్నుల శాఖ జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగం సాధించారు. గ్రూప్–2లో రాష్ట్రస్థాయి 5వ ర్యాంకు, గ్రూప్–3లో రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంకు వచ్చింది. తాజాగా విడుదల చేసిన గ్రూప్–1 ఫలితాల్లో స్టేట్ అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్గా ఉద్యోగం సాధించారు. ‘నన్ను అమ్మానాన్న, భార్య తేజస్వీని ప్రోత్సహించారు. కుటుంబసభ్యులు, సన్నిహితుల సలహాలు, సూచనలు ఎంతగానో ఉపయోగపడ్డాయి.’ అని ఆనంద్ చెప్పారు. -
ఎకై ్సజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్గా..
కామారెడ్డి టౌన్: మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లికి చెందిన కొండపల్లి గాయత్రి బీసీ సంక్షేమ శాఖలో జూనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహి స్తోంది. ఓ వైపు జాబ్ చేస్తూనే గ్రూప్–1కు పట్టుదలతో సన్నద్ధమైంది. ఆమె పట్టుదలకు విజయం వరించింది. గ్రూప్–1కు ఎంపికై ంది. మల్జీజోన్–1లో 201వ ర్యాంకు, మహిళా విభాగంలో 4వ ర్యాంకు సాధించింది. రెండు రోజుల క్రితం టీజీపీఎస్సీ గ్రూప్–1 తుది ఫలితాలు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఉద్యోగానికి ఎంపికై న గాయత్రి మాటల్లోనే... మా నాన్న సీతారాములు ఆర్టీసీ కండక్టర్, అమ్మ రాజమణి ఏఎన్ఎంగా విధులు నిర్వహిస్తున్నారు. 7వ తరగతి వరకు రామారెడ్డిలో, 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీలో బీఎస్సీ, బీజెడ్సీ జిల్లా కేంద్రంలో చదివాను. ఉస్మానియాలో ఎమ్మెస్సీ, ఎంఎల్ఐఎస్సీ పూర్తి చేశాను. 2020లో గ్రూప్–4కి ఎంపికై కామారెడ్డి బీసీ సంక్షేమ శాఖలో జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగంలో చేరాను. డబుల్ పీజీ చదివి జూనియర్ అసిస్టెంట్గా ఎందుకమ్మా గ్రూప్–1 ప్రయత్నించి అధికారి కావొచ్చ ని తోటి ఉద్యోగులు చెప్పడంతో నేను అప్పటి నుంచి తీవ్రంగా ప్రయత్నించాను. సొంతంగా ప్రిపేర్ అయ్యాను. ఇటీవల గ్రూప్–1 ఫలితాల్లో నెగ్గాను. ఎకై ్సజ్ శాఖలో అసిస్టెంట్ సూపరింటెండెంట్గా ఎంపిక కావడం చాలా ఆనందంగా ఉంది. -
క్రైం కార్నర్
వర్ని: మోస్రా మండల కేంద్రంలో గురువారం పేకాట స్థావరాలపై స్పెషల్ పార్టీ పోలీసులు దాడి చేశారు. పేకాడుతున్న 16 మందిని అరెస్టు చేసినట్లు వర్ని ఎస్సై మహేశ్ తెలిపారు. పట్టుబడిన వారి నుంచి రూ. 24,230 నగదు, 16 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారన్నారు. నవీపేట: మండలంలోని నాగేపూర్ శివారులో పేకాట స్థావరంపై బుధవారం రాత్రి దాడి చేసినట్లు ఎస్సై తిరుపతి గురువారం తెలిపారు. పేకాడుతున్న ఎనిమిది మందిని అరెస్టు చేసి రూ.8,430 నగదు స్వాధీనం చేసి, 8 సెల్ఫోన్లు, 6 బైక్లను సీజ్ చేశామన్నారు. ఎవరైనా పేకాట ఆడితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. -
టీచర్.. డీపీవో అయ్యాడు..
నిజామాబాద్అర్బన్: రెంజల్ మండల కేంద్రంలో ఉపాధ్యాయుడి(ఎస్జీటీ)గా విధులు నిర్వర్తిస్తున్న వినోద్ గ్రూప్–1 ఫలితాల్లో ప్రతిభచాటి జిల్లా పంచాయతీ ఆఫీసర్గా ఎంపికయ్యారు. నవీపేట మండలం కోస్లి గ్రామానికి చెందిన వినోద్ తండ్రి సాయిలు రెండేళ్ల క్రితం చనిపోగా, తల్లి భోజమ్మ, తమ్ముడు దీపక్ ఉన్నారు. వీరిది వ్యవసాయ కూలీల కుటుంబం. 2022 నుంచి వినోద్ గ్రూప్–1 ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో ఆన్లైన్లో చదువుకుంటూ సొంతగా ప్రిపరేషన్ కొనసాగించారు. మొదటి ప్రయత్నంలోనే డీపీవోగా ఎంపికయ్యారు. కాగా, వినోద్ ఇదివరకే గ్రూప్–2, గ్రూప్–3 పరీక్షల్లో మెరుగైన ర్యాంకు సాధించగా, ఫలితాలు వస్తే డిప్యూటీ తహసీల్దార్, సూపరింటెండెంట్ పోస్టులకు ఎంపికయ్యే అవకాశం ఉంది. ‘చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు, నష్టాలను ఎదుర్కొని పెరిగాను. వాటిని అడ్డుగా భావించకుండా సంకల్పంతో ముందుకు సాగాను. అందుకు తగ్గట్టుగా ప్రిపేర్ అయ్యి గ్రూప్–1 ఉద్యోగాన్ని సాధించాను.’ అని వినోద్ హర్షం వ్యక్తం చేశారు. -
నవ నైవేద్యాల బతుకమ్మ
తొమ్మిదీ రోజులా లక్ష్మివే బతుకమ్మ దండాలు మాయన్ని నీకివే బతుకమ్మ.. శంకరుని ఇల్లాల బృహదమ్మ నీవేగ బతుకమ్మ పేరుతో వస్తివే బతుకమ్మ.. ఎంగిలీ పూలతో సంబురం తెస్తివీ నువ్వులూ, నూకలూ నీకివే బతుకమ్మ.. ఆశ్వయుజ మాసానా అటుకులా వస్తివీ సప్పిడీ, బెల్లమూ తీపివే బతుకమ్మ.. మూడవా రోజునా మెరిసేటి బొమ్మవే పాలబువ్వ అందుకునె పాపవే బతుకమ్మ.. నాలుగో రోజునా కమ్మనీ పాయసం అందించ వస్తిమీ తాగవే బతుకమ్మ.. చప్పట్ల జోరులో పాటలా హోరులో అట్లనే నైవేద్యం తింటివే బతుకమ్మ.. పంచమీ రోజునా అలిగినా బొడ్డెమ్మ పస్తుండి నీళ్ళన్న ముట్టవే బతుకమ్మ.. నూకలా పిండినీ నేతిలో వేయించి కమ్మటీ వేప్పల్లు నీకివే బతుకమ్మ.. ఎనిమిదో రోజునా వెన్నముద్దవమ్మా నువ్వులా లడ్డూలు నీకివే బతుకమ్మ.. తొమ్మిదో రోజునా సద్దులా తల్లివే బంగారి పూలతో సద్దివే బతుకమ్మ.. గంగమ్మ ఒడిలో సాగిపో హాయిగా మరుయేడు శిశువులా మారవే బతుకమ్మ.. మరుయేడు శిశువులా మారవే బతుకమ్మ.. డొంకేశ్వర్(ఆర్మూర్): రాసినవారు: సుజాత శేర్ల – హిందీ టీచర్, జెడ్పీహెచ్ఎస్, మారంపల్లి (డొంకేశ్వర్) -
తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే..
నిజామాబాద్అర్బన్/ మోర్తాడ్(బాల్కొండ): గ్రూప్–1 ఫలితాల్లో భీమ్గల్ మండలం చేంగల్ వాసికి ఉద్యోగం లభించింది. నంబి శ్రీనివాస్, శ్రావణి దంపతులు ఇద్దరు ప్రభుత్వ ఉపాధ్యాయులు. వీరి కుమారుడు నంబి ఆత్రేయబాబు గ్రూప్–1 ఫలితాల్లో 461.5 మార్కులు సాధించి ఎంపీడీవో ఉద్యోగానికి ఎంపికయ్యారు. ఆత్రేయబాబు ప్రస్తుతం చైన్నెలోని ఎయిర్పోర్టు రీజినల్ మేనేజర్గా విధులు నిర్వహిస్తున్నారు. ఆర్మూర్లో పదో తరగతి, హైదరాబాద్లో ఇంటర్, ఇంజినీరింగ్ పూర్తిచేసిన ఆయన ఎయిర్పోర్టు ఆఫ్ ఇండియాలో ఉద్యోగం సాధించారు. అనంతరం తండ్రి సూచన మేరకు గ్రూప్–1ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యారు. మొదటిసారిగా పరీక్ష రాయగా మెరుగైన మార్కులతో ఎంపీడీవో పోస్టుకు ఎంపికయ్యారు. ‘తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే ఉద్యోగం సాధించాను. గ్రూప్–1 ఉద్యోగం రావడం సంతోషంగా ఉంది.’ అని ఆత్రేయ బాబు తెలిపారు. -
కంటైనర్ను ఢీకొన్న ట్రావెల్స్ బస్సు
● 9 మందికి గాయాలు డిచ్పల్లి: డిచ్పల్లి మండలం సుద్దపల్లి గ్రామం వద్ద 44వ నెంబర్ జాతీయ రహదారిపై ఆగి ఉన్న కంటైనర్ను ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొన్న ఘటన గురువారం ఉదయం చోటు చేసుకుంది. డిచ్పల్లి ఎస్సై ఎండీ షరీఫ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్కు 27 మంది ప్రయాణికులతో ప్రైవేట్ టావెల్స్ బస్సు బయల్దేరింది. మధ్యప్రదేశ్ నుంచి తమిళనాడుకు వెళుతున్న కంటైనర్ను డ్రైవర్ సుద్దపల్లి వద్ద రహదారిపై నిలిపి పక్కనే ఉన్న దుకాణానికి సరుకుల కోసం వెళ్లాడు. అదే సమయంలో ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కంటైనర్ను వెనుక నుంచి ఢీకొట్టి అదుపుతప్పి డివైడర్ పైకి దూసుకెళ్లింది. దీంతో బస్సులో ఎడమవైపు కూర్చున్న ప్రయాణికులు తొమ్మిది మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను అంబులెన్స్లో జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఫారుఖ్, రవీందర్, లింగమ్మ, అల్తాఫ్ ఉన్నారు. కంటైనర్ డ్రైవర్పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
తెరిపినివ్వని వాన.. అన్నదాత హైరానా
నందిపేట్(ఆర్మూర్): ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు రైతుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. నందిపేట మండలంలో భారీ వర్షంతో పొలాలు నీట మునిగి పంటలు దెబ్బతింటున్నాయి. నందిపేట, బజార్కొత్తూర్, మాయాపూర్, ఉమ్మెడ, బాద్గుణ, అయిలాపూర్, కంఠం, తల్వేద, చింరాజ్పల్లి గ్రామాలలో వరి పంట నేలకొరిగింది. సోయా పంటలు నీట మునిగాయి. మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. మరోవైపు నందిపేట మండల కేంద్రంలోని బర్కత్పుర, ఎన్టీఆర్నగర్ కాలనీ, వెంకటేశ్వర కాలనీ, కాలువ కట్ట కాలనీలలో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ఉదయం నుంచి జన జీవనం స్తంభించింది. మండలంలోని తల్వేద, మల్లారం, శాపూర్ గ్రామాలలోని చెరువులు నిండి అలుగులు పారుతున్నాయి. శాంతించని గోదారి.. రెంజల్(బోధన్): గోదావరి ఉగ్రరూపంతో ప్రవహిస్తోంది. రెండు రాష్ట్రాల మధ్య నదిపై నిర్మించిన అంతర్రాష్ట్ర వంతెన పైనుంచి వరద నీరు వస్తోంది. దీంతో రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలు రద్దయ్యాయి. స్థానిక రైతులు నది వైపు వెళ్లకుండా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. గోదావరి పరీవాహక గ్రామాలైన కందకుర్తి, బోర్గాం, తాడ్బిలోలి గ్రామాల్లో వేలాది ఎకరాల సోయా, వరి పంటలు నీటమునిగాయి. ఆయా గ్రామాల్లో అధికారులు దండోరా వేయించి స్థానికులు నది వైపు వెళ్లకుండా అప్రమత్తం చేస్తున్నారు. -
తండ్రి కిరాణా వ్యాపారి.. కూతురు గ్రూప్–1 ఉద్యోగి
నిజామాబాద్అర్బన్: తండ్రి కిరాణా షాప్ నిర్వాహకుడు. కొడుకు, కూతుళ్లను ఉన్నత ఉద్యోగాల్లో చూడాలని కలలు కన్నాడు. అందుకు అనుగుణంగానే కూతురు గ్రూప్–1 ఉద్యోగం సాధించి తండ్రి ఆశయాన్ని నిలబెట్టింది. మాక్లూర్ మండలం మామిడిపల్లి గ్రామానికి చెందిన కోటగిరి శ్రీనిధి గ్రూప్–1 ఫలిత్లాలో ఎంపీడీవోగా ఉద్యోగం సాధించింది. చిన్నప్పటి నుంచి శ్రీనిధికి సివిల్స్ సాధించాలనే పట్టుదల ఉండేది. దానికి అనుగుణంగానే తల్లిదండ్రులు కూడా ప్రోత్సాహించారు. తండ్రి నరేందర్ గ్రామంలో కిరాణాషాప్ నిర్వహిస్తుండగా తల్లి కృష్ణవేణి గృహిణి. పదో తరగతి వరకు గ్రామంలోని చదివిన శ్రీనిధి, ఇంటర్, డిగ్రీ హైదరాబాద్లో పూర్తి చేసింది. అనంతరం ఐఏఎస్ అకాడమీలో శిక్షణకు చేరింది. సివిల్స్ సాధించాలని లక్ష్యం పెట్టుకున్న ఆమె.. మొదటిసారిగా గ్రూప్–1 పరీక్ష రాసింది. నిధి ఎంపీడీవోగా ఉద్యోగం సాధించడంపై మామిడిపల్లి గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు. ‘తల్లిదండ్రుల ప్రోత్సాహమే నన్ను ఈ స్థాయికి తీసుకువచ్చింది. వారి ఆశయాలకు అనుగుణంగా చదివాను. నన్ను ఎంతో కష్టపడి చదివించారు. సివిల్స్ సాధించే వరకు విశ్రమించను.’ అని శ్రీనిధి చెబుతోంది. -
డిపాజిట్ల పేరిట రూ. 8.5 కోట్ల టోకరా
● యూఎస్ డాలర్, క్రిప్టో కరెన్సీ, ట్రేడింగ్ అంటూ ఆన్లైన్ దందా ● ఇద్దరు నిందితుల అరెస్ట్ ఖలీల్వాడి: అనుమతి లేకుండా కంపెనీలు పెట్టి 125 మంది నుంచి డిపాజిట్ల పేరిట డబ్బులు వసూలు చేసిన ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు క్రైం బ్రాంచ్ ఏసీపీ నాగేంద్ర చారి తెలిపారు. జిల్లా కేంద్రంలోని సీసీఎస్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. నగరంలోని హస్మీ కాలనీకి చెందిన మొయిజ్ ఖాన్, మహమ్మదీయ కాలనీకి చెందిన సయ్యద్ మహ్మద్ హాసన్ ఇద్దరు స్నేహితులు. 2022–23లో షైన్ ఎవర్ గ్రీన్ కంపెనీ పేరిట సంస్థను ఏర్పాటు చేశారు. తమ కంపెనీలో డిపాజిట్ పెడితే రూ. లక్షకు 10 శాతం వరకు అందిస్తామని నమ్మబలికారు. కొంతమంది మిత్రులు, ఏజెంట్లను ఏర్పాటు చేసుకొని 125 మంది నుంచి రూ.8.5 కోట్ల డిపాజిట్లు సేకరించారు. ఆ తర్వాత మొయిజ్ఖాన్, సయ్యద్ మహ్మద్ హాసన్లు డిపాజిటర్లకు డబ్బులు చెల్లించడంలో జాప్యం చేస్తూ వచ్చారు. డిపాజిటర్లు ఒత్తిడి చేయడంతో మకాం మార్చారు. దీంతో ఇందల్వాయి మండలంలోని లో లం గ్రామానికి చెందిన హకీం ఫిర్యాదు చేయడంతో సీపీ పోతరాజు సాయిచైతన్య కేసును సీసీఎస్కు బదిలీ చేశారు. కేసు దర్యాప్తు అనంతరం మొయిజ్ఖాన్, సయ్యద్ మహ్మద్ హాసన్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు ఏసీపీ వెల్లడించారు. మొయిజ్ఖాన్, సయ్యద్ మహ్మద్ హాసన్లు నిజామాబాద్ నుంచి మకాం మార్చి మహారాష్ట్రకు వెళ్లారు. అక్కడి నుంచి ఆన్లైన్లో క్రిప్టో, యూఎస్ డాలర్, ట్రేడింగ్ పేరిట యాప్ ద్వారా వసూళ్లకు తెర లేపారు. ఉత్తరప్రదేశ్, ఢిల్లీ ప్రాంతాల్లో ఏజెంట్లను ఏర్పాటు చేసుకొని మీటింగ్లు ఏర్పాటు చేశారు. కాగా, వీరి వలలోపడి ఎంతమంది ప్రజలు మోసపోయారో తెలియాల్సి ఉందని ఏసీపీ నాగేంద్రచారి తెలిపారు. మరోవైపు హైదరాబాద్లో ఓ భూమిని నిందితులిద్దరూ కలిసి కొనుగోలు చేసి రూ. 25 లక్షలు అడ్వాన్స్గా ఇచ్చినట్లు తెలిపారు. ఈ సమావేశంలో సీసీఎస్ సీఐలు రవీందర్, సురేశ్, కానిస్టేబుళ్లు ఉన్నారు. -
మోతాదుకు మించి యూరియా వాడొద్దు
జిల్లా వ్యవసాయాధికారి గోవింద్ వేల్పూర్: మోతాదుకు మించి యూరియా వాడటంతో పంటలకు తెగుళ్ల వస్తాయని, వాతావరణం సైతం కలుషితమవుతుందని జిల్లా వ్యవసాయాధికారి గోవింద్ పేర్కొన్నారు. బుధవారం ఆయన వేల్పూర్, అంక్సాపూర్ గ్రామాలలోని ఎరువుల గిడ్డంగులను తనిఖీ చేశారు. స్టాకును పరిశీలించి మాట్లాడారు. 2025–26 ఏడాదిలో ఇప్పటి వరకు జిల్లాలో 2985.03 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా జరిగిందన్నారు. అవసరానికి మించి కొనే యూరియాతో కృత్రిమ కొరత ఏర్పడుతుందని, అంతేగాక రైతులపై పెట్టుబడి భారం పెరుగుతుందన్నారు. సంప్రదాయ యూరియాకు బదులుగా నానో యూరియా వాడాలని, ఇది ఆకులపై ద్రవరూపంలో పిచికారీ చేయడంతో మొక్కలలో పోషణ ఎక్కువగా జరిగి, దిగుబడి 8 శాతం వరకు పెరుగుతుందని చెప్పారు. ఆయన వెంట వ్యవసాయాధికారి శృతి, సొసైటీ కార్యదర్శి కృష్ణ, సతీశ్, సుభాష్ ఉన్నారు. -
ఈ గ్రామాల్లో దసరాకు జెండా ఎగురవేస్తారు
రామారెడ్డి: దసరా పండుగ అనగానే సెలవులకు స్వగ్రామాలకు వచ్చిన కుటుంబసభ్యులు, అతిథులతో గ్రామాలలో చుక్కా.. ముక్కతో ఎంజాయ్ చేస్తుంటారు. కానీ, ఈ గ్రామాలలో మాత్రం జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తిని చాటుకుంటున్నారు. ●రామారెడ్డి మండలం ఇసన్నపల్లి గ్రామంలోని హనుమన్ మందిరం ఎదుట దసరా నాడు జెండాను ఎగరవేసి జాతీయగీతాన్ని ఆలపిస్తారు. ఇదే గ్రామంలోని ఇసన్నపల్లి కషీర్ దగ్గర మరో జెండాను ఎగరవేస్తారు. ●రెడ్డిపేట గ్రామంలోనూ భారీ కట్టెతో తయారు చేసిన జెండాను ఎగురవేసి జాతీయగీతాన్ని ఆలపిస్తారు. ●ఈ ఆచారం ఏళ్ల నుంచి ఆనవాయితీగా వస్తుందని గ్రామస్తులు చెప్తున్నారు. ●రెడ్డిపేట గ్రామంలో స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జాతీయ జెండాను కొన్నేళ్లపాటు ఎగురవేశారు. ●నక్సల్స్ ప్రభావిత గ్రామం కావడంతో జాతీయ జెండాకు బదులుగా తెల్లటి రంగు కలిగిన జెండాను ఎగురవేసినట్లుగా పూర్వీకులు చెప్తున్నారు. ●నిజాం పాలనలో ఉన్నప్పుడు వారు సూచించిన రంగు జెండానే ఎగురవేసేవారట. ●ప్రస్తుతం జిల్లాలోని పలు గ్రామాలలో దసరా రోజున సాయంత్రం జెండాను ఎగరవేస్తున్నారు. అనంతరం చావిడి వద్ద పూజలు చేసి జంబిని ఒకరికొకరు ఇచ్చుకుంటూ పండుగ శుభాకాంక్షలు చెబుతుంటారు. మీకు తెలుసా.. -
పశువుల షెడ్లు శుభ్రంగా ఉంచాలి
● జిల్లా పశువైద్యాధికారి రోహిత్ రెడ్డి నిజామాబాద్ రూరల్: వర్షాకాలం దృష్ట్యా పాడి రైతులు పశువుల పెంపకంలో జాగ్రత్తలు పాటించాలని జిల్లా పశువైద్యాధికారి రోహిత్ రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని జలాల్పూర్ గ్రామంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో బుధవారం ఉచిత పశువైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ రోహిత్ రెడ్డి మాట్లాడుతూ.. పశువులు పెంచుకునే స్థలాన్ని ఎప్పటికప్పడు శుభ్రపరుచుకోవాలన్నారు. పశువులకు పౌష్టికాహారాన్ని అందిస్తే అవి ఆరోగ్యకరంగా ఉంటాయన్నారు. గ్రామంలో మొత్తం 57 పశువులకు చికిత్స చేసి, పాడి రైతులకు ఉచితంగా మందులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మండల పశువైద్యాధికారి బాబూరావు, నరేందర్, వీఎల్వో రమేశ్, భాస్కర్, శ్రీనివాస్, నరేశ్, అస్రఫ్, గంగారాం, మాజీ సర్పంచ్ నాగయ్య తదితరులు పాల్గొన్నారు. -
జీఎస్టీతో దేశప్రజలపై లక్షల కోట్ల భారం వేసిన మోదీ
● ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి వేల్పూర్: కొత్తగా జీఎస్టీ అమలులోకి తెచ్చి దేశ ప్రజలపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ లక్షల కోట్ల భారం వేశారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి బుధవారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జీఎస్టీ పేరుతో దేశ ప్రజల నుంచి అక్రమంగా దోచిన రూ. 22 లక్షల కోట్ల నుంచి కేవలం రూ. 2 లక్షల కోట్లు తగ్గించి, ప్రజలకు ఏదో చేశామని బీజేపీ నాయకులు జబ్బలు చరుచుకుకుంటూ ఫోజులు కొడుతున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణాలోని ప్రతి వ్యక్తికి నెలకు రూ. 5 వేలు మిగిల్చామని ఎంపీ అర్వింద్ అంటున్నారని, గత తొమ్మిదేళ్లలో తెలంగాణాలోని ప్రతి వ్యక్తి నుంచి రూ. 5,40,000 కేంద్రం దోచుకున్నట్లు ఒప్పుకున్నట్లే కదా అని పేర్కొన్నారు. ఎంపీలు ఏం మొహం పెట్టుకొని మాట్లాడుతున్నారని, జీఎస్టీ పెట్టుమని అడిగింది ఎవరని ప్రశ్నించారు. 2017 నుంచి కొత్తగా జీఎస్టీ తెచ్చి నిత్యావసర సరుకులు, అన్ని రకాల వాహనాలు, ఇతర వస్తువులపై ధరలు పెంచింది మీరు కాదా? అని అన్నారు. జీఎస్టీ పేరుతో మోసం చేస్తున్నదెవరో ప్రజలు గమనిస్తున్నారని, సమయం వచ్చినప్పుడు ఓట్ల కోతలు పెట్టడం ఖాయమన్నారు.