breaking news
Nizamabad
-
నేనొచ్చి క్లీన్ చేయాలా?
నవీపేట: పాఠశాల ఆవరణను శుభ్రంగా ఉంచాలని తెలియదా? నేనొచ్చి క్లీన్ చేయాలా? అంటూ నవీపేట పంచాయతీ కార్యదర్శిపై కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నవీపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాలను శుక్రవారం కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. మొదట ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు. మందుల కొరత లే కుండా చూడాలని ఆదేశించారు. అనంతరం దర్యాపూర్ ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేసి అక్కడ వంటశాలను పరిశీలించారు. మధ్యాహ్న భోజన నిర్వాహకులతో మాట్లాడి మెనూ వివరాలను తెలుసుకున్నారు. ఆ వరణలో చుట్టుపక్కల వాసులు చెత్తను పారేయడంతో జీపీ కార్యదర్శి రవీందర్నాయక్ను మందలించారు. అంగన్వా డీ కేంద్రాలను పరిశీలించి చిన్నారుల వివరాలను తెలుసుకున్నారు. నవీపేట ప్రాథమిక పాఠశాలలోని మరుగుదొడ్లు, బాత్రూమ్లను పరిశీలించారు. సొసైటీ, పశు వైద్యశాల, తహసీల్ కార్యాలయాన్ని తనిఖీ చేసి భూభారతిపై అధికారులతో సమీక్షించారు. రెవెన్యూ సమస్యలను పెండింగ్లో ఉంచొద్దన్నారు. ● పంచాయతీ కార్యదర్శిపై కలెక్టర్ సీరియస్ ● నవీపేటలో ప్రభుత్వ కార్యాలయాలను తనిఖీ చేసిన వినయ్ కృష్ణారెడ్డి -
బందీ నుంచి విముక్తి
ఖలీల్వాడి: బాలల రక్షణ, మానవ అక్రమ రవాణా నిరోధానికి చేపట్టిన ‘ఆపరేషన్ ముస్కాన్’ సత్ఫలితాలనిస్తోంది. ఆకలి, ఆర్థిక సమస్యలతో బాల కార్మికులు పెరుగుతున్నారు. దీంతో అధికారులు వారిని పనిలోంచి బయటికి తీసుకొచ్చి, తల్లిదండ్రుల చెంతకు చేరుస్తున్నారు. జిల్లాలో పోలీసులు, బాలల సంరక్షణ, కార్మిక శాఖ అధికారులు బృందాలుగా ఏర్పడి నిర్వహించిన తనిఖీలతో 154 మంది బాలలకు విముక్తి లభించింది. తనిఖీలు ఇలా.. జిల్లాలో నిర్వహించిన ‘ఆపరేషన్ ముస్కాన్–11’ మూడు బృందాలు పనిచేశాయి. కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్, బోధన్, ఆర్మూర్ ఎస్సైలు ఇంచార్జీలుగా, నలుగురు కానిస్టేబుళ్లు, నలుగురు ఐసీడీఎస్, కార్మిక శాఖ అధికారులతో కలిసి కార్యక్రమాన్ని పూర్తిచేశారు. జూలై 1 నుంచి 31 వరకు ఈ బృందాలు జిల్లాలోని హోటళ్లు, లాడ్జీలు, ఇటుక బట్టీలు, రైల్వే స్టేషన్ తదితర ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలోని మూడు డివిజన్లలో మొత్తం 154 మంది గుర్తించగా 148 మంది బాలుర, 6 మంది బాలికలను విముక్తి చేశారు. నిజామాబాద్ పరిధిలో 15, ఆర్మూర్లో 12, బోధన్లో 9 కేసులు నమోదు చేశారు. తప్పిపో యిన పిల్లల వివరాలను ‘దర్పణ్ యాప్’లో నమో దు చేసి, వారి అడ్రస్లను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. నిజామాబాద్ సబ్ డివిజన్ పరిధిలో 56 మంది, బోధన్లో 56 మంది, ఆర్మూర్లో 42 మందిని గుర్తించారు. తప్పిపోయిన చిన్నారులను సైతం అక్కున చేర్చుకున్నారు. కౌన్సెలింగ్ నిర్వహించి కొందరిని తల్లిదండ్రులకు అప్పగించగా, మరికొందరిని రిహాబిలిటేషన్ సెంటర్కు తరలించారు. కొన్ని రోజులకే యథాస్థితికి..జనవరిలో ఆపరేషన్ స్మైల్, జూలైలో ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమం నిర్వహించిన కొన్ని రోజులకే యథాస్థితికి చేరుకుంటుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆరు నెలలకోసారి నిర్వహించే ఈ కార్యక్రమాల్లో గుర్తించిన పిల్లలను తల్లిదండ్రులు తమ కుటుంబ అవసరాలకు మళ్లీ పనుల్లో చేరుస్తున్నారు. నిరంతరం కార్యక్రమాన్ని కొనసాగిస్తే పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయవచ్చని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ముగిసిన ‘ఆపరేషన్ ముస్కాన్–11’ జిల్లాలో 154 మంది బాలల గుర్తింపు 36 కేసులు నమోదు -
ఏడేళ్లుగా మూసిఉన్న సబ్ జైళ్లు
మీకు తెలుసా? ఆర్మూర్: 2018 జనవరిలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఐదు సబ్ జైళ్లను తాత్కాలికంగా మూసి వేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేయగా అందులో జిల్లాలోని ఆర్మూర్, బోధన్ సబ్ జైళ్లు ఉన్నాయి. ● నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్, బోధన్ సబ్ జైళ్లతో పాటు వరంగల్ జిల్లాలోని నర్సంపేట, పరకాల, ఖమ్మం జిల్లాలోని మదిర సబ్ జైళ్లను నిర్వహణ భారం కారణంగా మూసి వేస్తూ అప్పటి జైళ్ల శాఖ జీవో జారీ చేసింది. ● ఆర్మూర్ పట్టణంలో అసిస్టెంట్ సీనియర్ సివిల్ కోర్టు (ఫాస్ట్రాక్ కోర్టు), జ్యుడీషియల్ ఫస్ట్క్లాస్ కోర్టు, అడిషనల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ కోర్టులు ఉన్నాయి. ● ఆర్మూర్ డివిజన్ పరిధిలోని ఆర్మూర్, ఆలూర్, నందిపేట, డొంకేశ్వర్, జక్రాన్పల్లి, బాల్కొండ, మెండోర, ముప్కాల్, వేల్పూ ర్, మోర్తాడ్, ఏర్గట్ల, కమ్మర్పల్లి, భీమ్గల్, సిరికొండ మండలాల పోలీస్ స్టేషన్ల పరిధిలోని కేసులను ఇక్కడ విచారిస్తారు. ● కాగా విచారణలో భాగంగా నిందితులుగా ఉన్న రిమాండ్ ఖైదీలను ఆర్మూర్ సబ్ జైలులో బంధించేవారు. శిక్షలు ఖరారు అయిన అనంతరం వారిని జిల్లా జైలుకు తరలించేవారు. ● కానీ ఆర్మూర్తో పోటు బోధన్ సబ్ జైలును ఎత్తివేయడంతో రిమాండ్ ఖైదీలను సైతం జిల్లా కేంద్రానికి తరలించాల్సిన పరిస్థితి తలెత్తింది. దీంతో ఖైదీలను కోర్టుకు తరలించే బాధ్యత నిర్వహించే పోలీసులపై మరింత పనిభారం పడింది. రైళ్లల్లో ఉండే కోచ్లు ఖలీల్వాడి: రైళ్లలో ప్రయాణించేటప్పుడు స్లీపర్, ఏసీ, జనరల్ బోగీల గురించి అందరికీ తెలిసే ఉంటుంది. కానీ ఏసీలో కూడా చాలా రకాలు ఉంటాయి. అందులో 1ఏ, 2ఏ, 3ఏ తరగతులతోపాటు ఇటీవల కొన్ని రైళ్లలో 3ఈ, ఈఏ వంటివి వందేభారత్ రైళ్లలో ఈసీ, సీసీ వంటి తరగతులు కూడా అప్పుడప్పుడు కనిపిస్తుంటాయి. ఒక్కో తరగతి(బెర్త్) టిక్కెట్ ఛార్జీ ఒక్కో రకంగా ఉంటుంది. ● యూఆర్: అన్ రిజర్వ్ పిలిచే కోచ్లను సెకండ్ క్లాస్ అంటారు. రిజర్వేషన్ లేకుండానే అప్పటికప్పుడు టిక్కెట్ తీసుకొని రైళ్లలో ప్రయాణించడానికి అవకాశం ఉంటుంది. ● స్లీపర్ క్లాస్: తక్కువ ఖర్చుతో దూర ప్రయాణం చేసే వారు స్లీపర్ క్లాస్ టిక్కెట్ను ఎంచుకుంటారు. ఇవి నాన్– ఏసీ కోచ్. ఈ క్యాబిన్లో 8 బెర్తులు ఉంటాయి. ● సెకండ్ సిట్టింగ్: స్లీపర్ క్లాస్ తర్వాత రిజర్వేషన్ చేసుకునే అవకాశం సెకండ్ సిట్టింగ్ కోచ్లో ఉంటుంది. కొన్ని రైళ్లలో మాత్రమే ఇవి అందుబాటులో ఉంటాయి. ● 1ఏ: ఫస్ట్ క్లాస్ ఏసీ స్లీపర్ను 1ఏ గా పిలుస్తారు. ఇందులో సైడ్ బెర్తులు లేకుండా రెండు లేదా నాలుగు బెర్తులు ఉంటాయి. రెండు బెర్తు ఉంటే కూప్ అని, 4 బెర్తులు ఉంటే క్యాబిన్గా పిలుస్తారు. ● 2ఏ: దీనిని సెకండ్ ఏసీ, టూ టైర్ ఏసీ అని పిలుస్తారు. ఇందులో ఉండే క్యాబిన్ ఆరు సీట్లు ఉంటాయి. మిడిల్ బెర్తులు ఉండవు. ● 3ఏ: మధ్యతరగతి ప్రజల కోసం ఉండే ఏసీ కోచ్ ఇది. స్లీపర్ క్లాస్ లాగే ఉండగా ఏసీ అదనంగా ఉంటుంది. ● 3ఈ: థర్డ్ ఎకానమీగా పిలిచే ఈ కోచ్లు ఎక్కువగా గరీబ్రథ్, ఫలక్నామా రైళ్లలో కనిపిస్తుంటాయి. థర్డ్ ఏసీ కంటే తక్కువ ఛార్జీలు ఉంటాయి. ● ఈఏ: ఎగ్జిక్యూటివ్ అనుభూతిగా పిలిచే కోచ్లు శతాబ్ది రైళ్లలో అందుబాటులో ఉంటాయి. ఏసీతో కూడిన కూర్చీలు ఉంటాయి. ఇందులో సినిమాలు, సంగీతాన్ని వినడానికి ఎల్ఈడీ టీవీలు ఉంటాయి ● ఈసీ: ఎగ్జిక్యూటివ్ క్లాస్గా పిలిచే తరగతిలో ఏసీతో కూడిన సీట్లు ఉంటాయి. బెర్తులు ఉండవు. ఇవి వందే భారత్ రైళ్లలో అందుబాటులో ఉన్నాయి. ● సీసీ: ఏసీ చైర్కార్గా పిలిచే పగటి పూట ప్రయాణించే రైళ్లలో ఈ తరగతి అవకాశం ఉంటుంది. వందేభారత్ రైళ్లలో ఇది అందుబాటులో ఉంది. ● విస్టాడోమ్: పర్యాటక ప్రాంతాల్లో నడిచే రైళ్లలో అద్దాలతో నిర్మితమై ఉంటాయి.సమాచారం.. -
చికిత్స పొందుతూ ఒకరి మృతి
పెద్దకొడప్గల్(జుక్కల్): రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. మండల కేంద్రంలోని జాతీయ రహదారి 161పై గల బ్రిడ్జి సైడ్వాల్ను ఇటుక లారీ గురువారం ఢీకొట్టడంతో ఘటన స్థలంలోనే ఒకరు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో గాయపడిన నాందేడ్కు చెందిన గణేష్ (20) నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా శుక్రవారం తెల్లవారుజామున పరిస్థితి విషమించి మృతిచెందినట్లు ఎస్సై అరుణ్ కుమార్ తెలిపారు. ఘటన స్థలంలో పిట్లం మండలంలోని రూమ్తండాకు చెందిన నర్సింగ్ మృతి చెందగా, అతడి భార్య హలవత్ సరిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై తెలిపారు. జక్రాన్పల్లి మండలంలో.. జక్రాన్పల్లి: పురుగుల మందు తాగిన ఓ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. వివరాలు ఇలా.. మండలంలోని అర్గుల్ గ్రామానికి చెందిన ద్యాగ రవి అనే రైతుకు ఇటీవల అదే గ్రామానికి చెందిన పొట్టి గంగారెడ్డి, తుమ్మల గంగారెడ్డి, సయ్యద్ ముహమ్మద్, శ్రీకాంత్ కలిసి మద్యం తాగించి, అతడి భూమిని వేరేవారి పేరుపై రిజిస్ట్రేషన్ చేయించారు. కొన్నిరోజుల తర్వాత విషయం తెలుసుకొని అతడు పంచాయితీ పెట్టించగా, వారు మరో భూమిని అతడికి రిజిస్ట్రేషన్ చేయించారు. కానీ మృతుడు తాను చేసిన తప్పును తలుచుకుంటూ మానసికంగా కృంగిపోయాడు. ఈక్రమంలో గత నెల 16న అతడు పురుగుల మందు తాగడంతో అనారోగ్యానికి గురయ్యాడు. కుటుంబ సభ్యులు అతడిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించగా శుక్రవారం పరిస్థితి విషమించి మృతిచెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మాలిక్ రెహ్మాన్ తెలిపారు. -
అధ్వానంగా అండర్ బ్రిడ్జిలు
జక్రాన్పల్లి(నిజామాబాద్రూరల్): ఉమ్మడి జిల్లా పరిధిలో జాతీయ రహదారి 44కు అనుబంధంగా నిర్మించిన అండర్ బ్రిడ్జిల నిర్వహణను గాలికి వది లేశారు. సుమారు 85 కిలోమీటర్ల మేర ఉన్న హైవే పై పెద్ద అండర్ బ్రిడ్జీలు 10, చిన్న బ్రిడ్జీలు 46వరకు ఉన్నా యి. నిర్మాణ డిజైన్లో లోపానికి తోడు నిర్వ హణ అ స్తవ్యస్తంగా మారడంతో గ్రామీణ ప్రజలు తీవ్ర ఇ బ్బందులు ఎదుర్కొంటున్నారు. లైట్లు వెలగకపోయి నా, వర్షపునీరు నిలుస్తున్నా పర్యవేక్షించాల్సిన జాతీ య రహదారుల సంస్థ అధికారులు పట్టించుకోవడం లేదు. ఉమ్మడి జిల్లా పరిధిలోని పోచంపాడ్ నుంచి అడ్లూర్ ఎల్లారెడ్డి వరకు అండర్ బ్రిడ్జీలతో 76 గ్రామా లు అనుసంధానమై ఉన్నాయి. 15ఏళ్ల పాటు రోడ్డు మరమ్మతులతో పాటు అండర్ బ్రిడ్జిలు, సర్వీసు రోడ్ల నిర్వహణ బాధ్యత సదరు కాంట్రాక్ట్ సంస్థదే. అయితే అండర్ బ్రిడ్జిల లోపల కూడా లైట్లు సరిగా వెలగకపోవడంతో వాహనదారులు భయపడుతున్నారు. నిర్మాణంలో లోపాలు జాతీయ రహదారి నిర్మాణ సమయంలోనే అనేక లోపాలు బయటపడ్డాయి. డిచ్పల్లి మండలం సాంపల్లి, బాల్కొండ మండలం శ్రీరాంపూర్, ఇందల్వాయి మండల కేంద్రంలో, సదాశివనగర్లో ఒకటి, జక్రాన్పల్లి, చాంద్మియాబాగ్ ప్రాంతాల్లో అండర్ బ్రిడ్జిలు ఉన్నాయి. కొన్ని చోట్ల అండర్ బ్రిడ్జిలు లేక ఒక పక్క నుంచి మరో పక్కకు తిరిగి రావాల్సిన పరిస్థితి నెలకొంది. వానాకాలంలో బీబీపూర్ తండా వద్ద నిర్మించిన సర్వీసు రోడ్డు పక్కన ఉన్న చెరువు నీరు చేరి ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. బ్రిడ్జిల నిర్మాణంలో లోపాల కారణంగా పెద్ద వాహనాలు వెళ్లేందుకు వీలు లేకుండా ఉంది. అండర్ బ్రిడ్జిల నిర్మాణంలో లోపాల కారణంగా వర్షం కురిసినప్పుడు జాతీయ రహదారిపై నుంచి నీరు బ్రిడ్జి కిందకు చేరుతోంది. అవస్థలు పడుతున్నాం చాంద్మియాబాగ్ వద్ద జాతీయ రహదారిపై నిర్మించిన అండర్ బ్రిడ్జి కింద వర్షపు నీరు నిలవడంతో ప్రయాణానికి ఆటంకం కలుగుతోంది. బ్రిడ్జి కింద బురద నీటిలో ప్రయాణించాలంటే వాహనదారులుఅనేక అవస్థలు పడాల్సి వస్తోంది. బ్రిడ్జి కింద నీరు నిల్వ ఉండకుండా చేసి వాహనదారుల ఇబ్బందులు తొలగించాలి. – కోటేశ్వర్, పడకల్గుత్తేదారుల నిర్లక్ష్యం వల్లే ఇబ్బందులు జాతీయ రహదారిపై నిర్మించిన అండర్ బ్రిడ్జిలు అస్తవ్యస్తంగా ఉన్నాయి. అంతేకాక సర్వీసు రోడ్ల నిర్వహణ సరిగా లేదు. గుత్తేదారుల నిర్లక్ష్యం వల్లే వాహనదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇకనైన సంబంధిత రోడ్లు నిర్వహణ అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలి. వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలి. – అంకం నరేశ్, టీచర్, పడకల్ నిర్వహణ గాలికి.. వెలగని లైట్లు.. నిలుస్తున్న వర్షపు నీరు ఉమ్మడి జిల్లాలో ఎన్హెచ్ 44 అనుబంధంగా 10 అండర్ బ్రిడ్జిలు 46 వరకు చిన్న బ్రిడ్జిలు జక్రాన్పల్లిలో నాలుగు.. జక్రాన్పల్లి మండల కేంద్రంతోపాటు చాంద్మియాబాగ్, సికింద్రాపూర్, అర్గుల్ గ్రామా ల్లో నాలుగు అండర్ బ్రిడ్జిలు ఉన్నాయి. ఆయా గ్రామాల ప్రజలు బ్రిడ్జి కింద నుంచి నడిచి వె ళ్లలేని పరిస్థితి ఉంది. చాంద్మియాబాగ్ బ్రిడ్జి కింద నుంచి పడకల్, కలిగోట్, చింతలూర్ గ్రామాల ప్రజలు ప్రయాణిస్తూ ఉంటారు. జక్రాన్పల్లి బ్రిడ్జి నుంచి మనోహరాబాద్, కొలిప్యాక్, సికింద్రాపూర్ బ్రిడ్జి నుంచి కేశ్పల్లి గ్రామస్తులు వెళ్తుంటారు. బ్రిడ్జి కింద నుంచి వెళ్లాలంటేనే వాహనదారులు జంకుతున్నారు. -
డివిడెండ్తో పీఏసీఎస్లకు పునర్వైభవం
సుభాష్నగర్: ఎన్డీసీసీబీ ద్వారా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు విడుదల చేసిన డివిడెండ్తో పునర్వైభవం రానుందని ఉమ్మడి జిల్లా సహకార సంఘాల యూనియన్ అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు దయాసాగర్, నర్సయ్య అన్నారు. ఇటీవల జరిగిన ఎన్డీసీసీబీ 103వ వార్షిక మహాజనలో చైర్మన్ రమేష్రెడ్డి డివిడెంట్ ప్రకటించి, ఖాతాల్లో జమ చేశారు. ఈసందర్భంగా వారు శుక్రవారం నగరంలోని కార్యాలయంలో చైర్మన్ రమేష్రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి, సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. పదేళ్లలో ఎన్నడూలేని విధంగా సహకార సంఘాలకు చైర్మన్ డివిడెంట్ ప్రకటించారని, ఇదే వారి పనితీరుకు నిదర్శమన్నారు. వారి నాయకత్వంలో మరిన్ని మైలురాళ్లు చేరుకుంటామని ఆశాభావం వ్యక్తంచేశారు. వైస్ చైర్మన్ నల్ల చంద్రశేఖర్రెడ్డి, డైరెక్టర్లు గోర్కంటి లింగన్న, రమేష్ పాటిల్, సీఈఓ నాగభూషణం వందే, యూనియన్ నాయకులు వంశీ, మోహిత్ పాష, తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యమాలను గుర్తుచేస్తున్న ‘రైతాంగ పోరాట గళం’
ఆర్మూర్: ఆర్మూర్ ప్రాంతంలో జరిగిన రైతు ఉద్యమా లను కళాకారుడు సుమన్ రచించి, పాడిన ‘రైతాంగ పోరాట గళం’ అనే పాట గుర్తుచేస్తోందని రాష్ట్ర సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్రెడ్డి, రైతు జేఏసీ నాయకుడు ప్రభాకర్ కొనియాడారు. పట్టణంలోని కుమార్ నారాయణ భవన్లో శుక్రవారం ‘రైతాంగ పోరాట గళం’ పాట సీడీ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించా రు. వారు ముఖ్య అతిథులుగా హాజరై, సీడీని ఆవి ష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్లు గా ఆర్మూర్ ప్రాంత రైతులు పోరాటాలు చేస్తూ పోలీ సు లాఠీ దెబ్బలు తినడమే కాకుండా అక్రమ కేసులతో జైలు జీవితాన్ని సైతం గడిపారన్నారు. ఎర్రజొన్నలకు గిట్టుబాటు ధర, పసుపు బోర్డు సాధించుకోవడంలో ఈ ప్రాంత రైతాంగం చేసిన ఉద్యమాలు చరిత్రలో ని లిచిపోతాయన్నారు. ఎర్రజొన్న, పసుపు బోర్డు ఉద్య మాల్లో రైతు నాయకులపై పెట్టిన కేసులను ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. పాట చిత్రీకరణలో ప్ర ధాన పాత్ర పోషించిన రైతు నాయకుడు మంథని నవీన్రెడ్డి, డైరెక్టర్ చిట్టిబాబు, డీవోపీ సంజీవ్, నటులు సూరిబాబు, అనిల్ కుమార్, నిఖిల్, నరేందర్, మంథ ని గ్రామ ప్రజలను వారు అభినందించారు. నాయకు లు మంథని గంగారాం, దేవరాం, కిషన్, ఆకుల గంగారాం, రాజన్న, తిరుపతిరెడ్డి, నారాయణరెడ్డి, శ్రీని వాస్రెడ్డి, భరత్, దుర్గాప్రసాద్, రాజారెడ్డి ఉన్నారు. రాష్ట్ర సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్రెడ్డి, రైతు జేఏసీ నాయకుడు ప్రభాకర్ ఆర్మూర్లో పాటల సీడీ ఆవిష్కరణ -
సంక్షేమం, అభివృద్ధి పనులపై దిశానిర్దేశం
నిజామాబాద్అర్బన్ : నిర్దేశిత లక్ష్యాల సాధన కోసం అధికారులు అంకిత భావంతో కృషి చేయాలని కలెక్టర్ టీ వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. కలెక్టరేట్లోని ప్రధాన సమావేశ మందిరంలో శుక్రవారం అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్లతో కలిసి అన్ని శాఖల జిల్లా అధికారులతో కలెక్టర్ సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల ప్రగతిపై మండలాల వారీగా చర్చిస్తూ, అధికారులకు దిశానిర్దేశం చేశారు. వివిధ శాఖల ద్వారా అమలవుతున్న కార్యక్రమాలు సజావుగా జరిగేలా సంబంధిత శాఖల జిల్లా అధికారులతోపాటు మండల స్పెషల్ ఆఫీసర్లు పర్యవేక్షణ జరపాలని కలెక్టర్ ఆదేశించారు. పాఠశాలలు, రెసిడెన్షియల్ స్కూల్స్, హాస్టళ్లు, అంగన్వాడీ, ఆసుపత్రులు వంటి వాటికి సంబంధించిన అసంపూర్తి భవనాలను గుర్తించి, యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టి పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ బడులలో తాగునీరు, మరుగుదొడ్లు వంటి మౌలిక సదుపాయాలను గుర్తిస్తూ, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా ప్రతిపాదనలు సమర్పించేలా చూడాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను క్షేత్రస్తాయిలో పరిశీలిస్తూ, నిరంతర పర్యవేక్షణ జరపాలని కలెక్టర్ ఆదేశించారు. ఇంటి నిర్మాణానికి ఆసక్తి చూపని లబ్ధిదారుల నుంచి రాతపూర్వకంగా లేఖలు తీసుకోవాలని, వారి స్థానంలో అర్హులైన ఇతరులకు కేటాయించాలని కలెక్టర్ సూచించారు. నియోజకవర్గాలలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా అర్హులైన వారికి కేటాయించాలని తెలిపారు. ఎక్కడైనా ఎరువులను దారి మళ్లించినట్లు తెలిస్తే రైతులు, ప్రజలు టోల్ ఫ్రీ నెంబర్కు ఫిర్యాదు చేసేలా సూచించాలని అన్నారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు సోకకుండా ముందు జాగ్రత్తలు చేపట్టాలని, పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా జరిగేలా చూడాలన్నారు. రేషన్కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అయినందున, కొత్త కార్డులు, సభ్యుల పేర్ల నమోదు కోసం వచ్చే దరఖాస్తులను వెనువెంటనే పరిశీలించాలన్నారు. వన మహోత్సవంలో భాగంగా ఆయా శాఖలకు కేటాయించిన మొక్కలు నాటే లక్ష్యాన్ని పూర్తిస్థాయిలో సాధించాలని అన్నారు. సమీక్షా సమావేశంలో ట్రెయినీ కలెక్టర్ కరోలినా చింగ్తియాన్ మావీ, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, అధికారులు పాల్గొన్నారు. మండలాల వారీగా అధికారులతో సమీక్ష నిర్వహించిన కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి -
నిజామాబాద్
గిరిజనుల సంస్కృతికి ప్రతీక తీజ్ గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలకు తీజ్ ప్రతీకగా నిలుస్తోంది. శ్రావణ మాసంలో తొమ్మిది రోజులు ఉత్సవాలు జరుగుతాయి. సామర్థ్యం ఎక్కువ.. ఎస్సారెస్పీ దిగువన ఉన్న జాతీయ చేప పిల్లల ఉత్పత్తి కేంద్రంపై ప్రభుత్వం, అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. శుక్రవారం శ్రీ 1 శ్రీ ఆగస్టు శ్రీ 2025– 8లో uన్యూస్రీల్ -
పదోన్నతుల్లో వర్గీకరణను అమలు చేయండి
నిజామాబాద్అర్బన్: విద్యా శాఖలోని టీచర్ల పదోన్నతుల్లో ఎస్సీ వర్గీకరణను అమలు చేయాలని మాదిగ ఉద్యోగుల సంఘం నాయకులు డీఈవో అశోక్కు గురువారం వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణకు చట్టబద్ధత తీసుకురావడంతో అమల్లోకి వచ్చిందన్నారు. పదోన్నతుల్లో కూడా వర్గీకరణ అమలు చేయాలని కోరారు. ఎస్సీలలో గ్రూపుల వారిగా విభజనను అమలు చేస్తే అందరికి న్యాయం జరుగుతుందన్నారు. స్పందించిన డీఈవో వర్గీకరణ అమలు చేస్తామని పేర్కొన్నారు. మాదిగ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సురేశ్, తెడ్డు గంగారాం, మారుతి, గద్దల రమేశ్ తదితరులు ఉన్నారు. -
రైతులు ఫ్యూజులు మార్చొద్దు
డిచ్పల్లి: విద్యుత్ సమస్య ఏర్పడినప్పుడు రైతులు సొంతంగా ఫ్యూజులు మార్చి ప్రమాదాలకు గురై ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని డిచ్పల్లి సబ్స్టేషన్ ఏడీఈ శ్రీనివాస్ సూచించారు. గురువారం డిచ్పల్లి సబ్స్టేషన్ పరిధిలోని డిచ్పల్లి ఖిల్లా గ్రామంలో విద్యుత్ అధికారులు పొలం బాట నిర్వహించారు. ఈ సందర్భంగా ఏడీఈ మాట్లాడుతూ.. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడితే వెంటనే సబ్ స్టేషన్ సిబ్బందికి సమాచారం అందించాలన్నారు. విద్యుత్ ప్రమాదాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డిచ్పల్లి ఏఈ గంగారాం, లైన్ఇన్స్పెక్టర్లు అబ్బయ్య, పోశెట్టి, లైన్మన్లు, జేఎల్ఎంలు, సిబ్బంది పాల్గొన్నారు. -
సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం
నిజామాబాద్ సిటీ/ నిజామాబాద్అర్బన్: ప్రభు త్వం జిల్లాకు ఇంజినీరింగ్ కళాశాలను మంజూరు చేయడంపై జిల్లా ఎన్ఎస్యూఐ నాయకులు సంబురాలు చేపట్టారు. గురువారం నగరంలోని ధర్నాచౌక్ వద్ద పటాకులు కాల్చి, మిఠాయిలు పంచారు. సీఎం రేవంత్రెడ్డి, పీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. ఎన్ఎస్యూఐ రాష్ట్ర కార్యదర్శి వేణురాజ్ మాట్లాడుతూ.. ఇంజినీరింగ్ కళాశాల కోసం ఎన్నో పోరాటాలు చేశామన్నారు. కాంగ్రెస్ హయాంలో జిల్లాకు ఇంజినీరింగ్ కాలేజీ రావడం సంతోషకరమని అన్నారు. కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకులు నవీన్, రమేశ్, గంగప్రసాద్, నరేందర్ సింగ్, సాయికిరణ్, కౌశిక్, మణి, రాజు పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయి పోటీలకు విద్యార్థుల ఎంపిక
నిజామాబాద్నాగారం/ జక్రాన్పల్లి: నగరంలోని మైనారిటీ గురుకుల విద్యార్థులు రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికై నట్లు ప్రిన్సిపాల్ సయ్యద్హైదర్ గురువారం తెలిపారు. రాజారాం స్టేడియంలో నిర్వహించిన జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో అర్జున్, ధన్రాజ్ ప్రతిభ కనబర్చి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. అండర్–20 విభాగంలో షాట్పుట్లో అర్జున్, అండర్–18 విభాగంలో 200మీటర్ల పరుగుపందెంలో ధన్రాజ్ బంగారు పతకాలు సాధించారు. అనంతరం క్రీడాకారులను, పీడీ కోటేశ్వర్ను ప్రిన్సిపాల్, అధ్యాపకులు అభినందించారు. జక్రాన్పల్లి మండలంలోని మునిపల్లిలో ఉన్న మహాత్మా జ్యోతిబా పూలే కళాశాల విద్యార్థినులు రాష్ట్ర స్థాయి అథ్లెటిక్ పోటీలకు ఎంపికై నట్లు కళాశాల ప్రిన్సిపాల్ అనూష తెలిపారు. రాష్ట్ర స్థాయి అండర్–20 ఉమెన్ కేటగిరి అథ్లెటిక్ పోటీలకు గాయత్రి, నవనీత, మౌనిక, నవిత ఎంపికై నట్లు పేర్కొన్నారు. విద్యార్థులను ప్రిన్సిపాల్ అనూష, ఉపాధ్యాయులు అభినందించారు. సిరికొండ: మండల కేంద్రానికి చెందిన యువకులు గంగరాజు, గౌతమ్ అథ్లెటిక్స్లో బంగారు పతకాలు సాధించారని తెలంగాణ జాగృతి రూరల్ కన్వీనర్ మల్లెల సాయిచరణ్ తెలిపారు. జిల్లా కేంద్రంలో నిర్వహించిన 100 మీటర్ల పరుగు పందెంలో చిట్యాల గంగరాజు, మూడు కిలోమీటర్ల విభాగంలో గౌతమ్లు మొదటి స్థానాల్లో నిలిచి బంగారు పతకాలు సాధించారని అన్నారు. అనంతరం యువకులను గ్రామస్తులు అభినందించారు. జాతీయ స్థాయి హాకీ పోటీలకు ఎంపిక సిరికొండ: మండలంలోని తూంపల్లికి చెందిన ముగ్గురు క్రీడాకారిణులు జాతీయ స్థాయి హాకీ పోటీలకు ఎంపికయ్యారని జెడ్పీహెచ్ఎస్ పీడీ నాగేశ్ గురువారం తెలిపారు. హైదబాద్లో ఇటీవల నిర్వహించిన ఎంపిక పోటీల శిక్షణ శిబిరంలో ప్రతిభ కనబర్చిన ఆర్ రాజశ్రీ, అక్షయ, బి శ్రీజలు ఎంపికై నట్లు ఆయన పేర్కొ న్నారు. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడలో ఈ నెల 1 నుంచి 12 వరకు నిర్వహించే జాతీయ స్థా యి పోటీల్లో వీరు పాల్గొననున్నారు. జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావడంపై వీడీసీ సభ్యులతో పాటు ఎంఈవో రాములు,ఇన్చార్జి హెచ్ఎం మనోహర్, ఉపాధ్యాయు లు, జిల్లా హకీ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు గంగారెడ్డి, రమణ హర్షం వ్యక్తం చేశారు. -
రాష్ట్రస్థాయిలో జిల్లాకు పతకాలు తేవాలి
నిజామాబాద్నాగారం: రాష్ట్రస్థాయి జూడో పోటీల్లో రాణించి జిల్లా పతకాలు తీసుకరావాలని జిల్లా యువజన క్రీడల అధికారి పవన్కుమార్ అన్నారు. నిజామాబాద్ జిల్లా జూడో అసోసియేషన్ కార్యదర్శి అభినవ్ ఆధ్వర్యంలో గురువారం నగరంలోని ప్రభుత్వ స్విమ్మింగ్పూల్ ఆవరణలో సబ్జూనియర్, క్యాడెట్ బాలబాలికలకు జూడో ఎంపికలు నిర్వహించారు. ప్రతిభ చూపిన వారిని రాష్ట్రస్థాయికి ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ఎంపికై న క్రీడాకారులను డీవైఎస్వో ప్రత్యేకంగా అభినందించారు. పీఈటీలు అనిత, శ్యామల, వికాస్, శ్రీకాంత్, నవీన్, మానస, క్రీడాకారులు పాల్గొన్నారు. -
ప్రశాంతంగా ముగిసిన స్పాట్ కౌన్సెలింగ్
డిచ్పల్లి: మండలంలోని ధర్మారం(బి), సుద్దప ల్లి గ్రామాల్లో ఉన్న తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల కళాశాలల్లో ఇంటర్ ప్రథమ సంవత్సరం ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లో ఖాళీ సీట్ల భర్తీకి గురువారం కౌన్సెలింగ్ నిర్వహించారు. ధర్మారం(బి) గురుకుల కళాశాలలో ఎంపీసీలో 12, బైపీసీలో 11 సీట్లు, సుద్దపల్లి కళాశాలలో ఎంపీసీలో 18, బైపీసీలో 16 సీట్లు భర్తీ చేసినట్లు ప్రిన్సిపాళ్లు మాధవీలత, నళిని తెలిపారు. కౌన్సెలింగ్లో వైస్ ప్రిన్సిపాళ్లు స్వప్న, ఎం. ప్రేమలత, సిబ్బంది నూర్నిస బేగం, సుమలత, జ్యోతి, దమయంతి, శ్యాంసుందర్ తదితరులు పాల్గొన్నారు.పాఠశాలకు కంప్యూటర్ వితరణజక్రాన్పల్లి: మండలంలోని తొర్లికొండ జెడ్పీ ఉన్నత పాఠశాలకు ప్రముఖ వ్యాపారవేత్త చిట్టాపూర్ ఏనుగు దయానంద్రెడ్డి మూడు కంప్యూటర్లు, జైడి రాజ్కుమార్ సీనియర్ పీడీ ప్రింటర్ను వితరణగా అందజేశారు. కార్యక్రమంలో ఎంఈవో శ్రీనివాస్, పీడీ గంగామోహన్, ఉపాధ్యాయులు సునీత, మాలతి, కృష్ణ, పల్లె గంగాధర్, కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ గౌతిమి పాల్గొన్నారు.మహాధర్నాను విజయవంతం చేయాలినిజామాబాద్ రూరల్: హైదరాబాద్లోని ఇందిరా పార్కు వద్ద శనివారం నిర్వహించే బీజేపీ ఓబీసీ మోర్చా మహాధర్నాను విజయవంతం చేయాలని ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి మదాసు స్వామి యాదవ్ కోరారు. గురువారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో పార్టీ ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ధర్నాను బీసీ కుల, ఉద్యోగ, విద్యార్థి సంఘాల నాయకులు విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు మాస్టర్ శంకర్, నారాయణ యాదవ్, గిరి బాబు, సురేశ్, రాజకుమార్, పాండు తదితరులు పాల్గొన్నారు.ఇంజినీరింగ్ కళాశాలతో చిరకాల వాంఛ నెరవేరిందినిజామాబాద్ సిటీ: జిల్లాలో ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల మంజూరుకావడంతో జిల్లావాసుల చిరకాల వాంఛ నెరవేరిందని పీసీసీ ప్రధాన కార్యదర్శి రాంభూపాల్ గురువారం పేర్కొన్నారు. ఇంజినీరింగ్ కళాశాల కోసం పీసీసీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్ విశేషంగా కృషి చేశారని అన్నా రు. ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటుతో పేద విద్యార్థులు ఇంజినీర్లు కావాలనే కల నెరవేరనుందని ఆశాభావం వ్యక్తంచేశారు. సీఎం రేవంత్రెడ్డికి, ప్రభుత్వ సలహాదారు మహ్మద్ షబ్బీర్ అలీ, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు.ఏపీఎంకు సన్మానంజక్రాన్పల్లి: మండల ఏపీఎంగా పని చేసి డిచ్పల్లికి బదిలీపై వెళ్లిన రవీందర్రెడ్డిని మండల మహిళా సమాఖ్య సభ్యులు గురువారం ఘనంగా సన్మానించారు. ఎంపీడీవో సతీశ్కుమార్, ఏపీవో రవి,సీసీలు, వీవోఏలు పాల్గొన్నారు. -
ప్రజల అవసరాలకు అనుగుణంగా కమ్యునిటీ హాల్ నిర్మాణం
● అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ నిజామాబాద్ రూరల్: ప్రజల అవసరాలకు అనుగుణంగా కమ్యునిటీ హాల్ నిర్మాణం చేపడుతున్నట్లు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. గురువారం నగరంలోని 39వ డివిజన్, ఓల్డ్ ఎన్జీవోఎస్ కాలనీ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నిర్మిస్తున్న కమ్యూనిటీ భవన నిర్మాణానికి ఆయన భూమి పూజ చేశారు. నిర్మాణానికి తన వంతు సహాయ సహకారం ఉంటుందని అన్నారు. ప్రజల ఉపయోగం కోసం నిర్మిస్తున్న ఈ భవన పనులను త్వరగా ప్రారంభించి ఉపయోగంలోకి తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మీనారాయణ, జిల్లా ఉపాధ్యక్షుడు నాగోళ్ల లక్ష్మీనారాయణ, మాజీ కార్పొరేటర్ కృష్ణ, కొండ ఆశన్న, ఇల్లెందుల ప్రభాకర్, పార్శి రాజు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. -
ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవర్తించాలి
ఖలీల్వాడి: పోలీస్స్టేషన్కు వచ్చి ఫిర్యాదుదారులతో మర్యాద ఉండాలని ఏసీపీ రాజావెంకట్రెడ్డి సిబ్బందికి సూచించారు. నగరంలోని ఐదోటౌన్ పోలీస్స్టేషన్ను వార్షిక తనిఖీల్లో భాగంగా గురువారం ఆయన తనిఖీ చేశారు. అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్క నాటారు. ఈసందర్బంగా ఏసీపీ మాట్లాడుతూ.. పోలీస్ అధికారులు, సిబ్బంది తరచుగా నగరంలోని వార్డులను సందర్శించి, ప్రజల సమస్యలు తెలుసుకోవాలని సూచించారు. పోలీస్ స్టేషన్లో వివిధ కేసులలో ఉన్న వాహనాల అడ్రస్ తెలుసుకుని, సంబంధిత యజమానులకు త్వరగా అప్పగించాలని ఎస్సై గంగాధర్కు సూచించారు. సిబ్బంది సమస్యలు అడిగి తెలుసుకుని, ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. విలేజ్ పోలీస్ ఆఫీసర్ కేటాయించిన వార్డులకు తరచుగా సందర్శిస్తూ ఇన్ఫర్మేషన్ వ్యవస్థను మెరుగుపరుచుకోవాలన్నారు. పాత నేరస్తులపై నిఘా ఉంచాలని తెలిపారు. దోస్త్ ‘ప్రత్యేక’ ధ్రువపత్రాల పరిశీలన తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో దోస్త్–డిగ్రీ ప్రవేశాలకు సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రత్యేక కేటగిరి విద్యార్థుల ధ్రువపత్రాల పరిశీలన గురువారం నిర్వహించినట్లు దోస్త్ కోఆర్డినేటర్ డాక్టర్ వాసం చంద్రశేఖర్ తెలిపారు. అడ్మిషన్స్ కార్యాలయంలో ప్రత్యేక కేటగిరి పీహెచ్సీ (దివ్యాంగులు), సీఏపీ, ఎన్సీసీ, స్పోర్ట్స్, ఎక్స్ట్రా కరిక్యులర్ ఆక్టివిటీస్ విద్యార్థులకు ఉదయం నుంచి సాయంత్రం వరకు ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించామన్నారు. ఎన్సీసీలో నలుగురు, స్పోర్ట్స్లో ఇద్దరు, పీహెచ్సీలో ఒకరు మొత్తం ఏడుగురు విద్యార్థులు పరిశీలనకు హాజరైనట్లు ఆయన తెలిపారు. ఎన్సీసీ ఆఫీసర్ డాక్టర్ రామస్వామి, తెయూ ఫిజికల్ డైరెక్టర్ నేత, సిబ్బంది రవీందర్నాయక్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. కార్మికుల వేతనాలు పెంచాలి నిజామాబాద్అర్బన్: కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికుల వేతనాలను పెంచాలని డిమాండ్ చేస్తూ గురువారం కలెక్టరేట్ ఎదుట ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. కార్మికులకు నెలకు రూ.26 వేల వేతనం అందించాలని కోరారు. అనంతరం అడిషనల్ కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో టీయూసీఐ జాతీయ ఉపాధ్యక్షుడు వనమాల కృష్ణ, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎం.నరేందర్, ఎం.సుధాకర్, ఎం.వెంకన్న, డి.రాజేశ్వర్, బి.మల్లేశ్, సాయారెడ్డి, మురళి, లింగం, కిరణ్, రవి, రాజేశ్వర్, హేమలత, సుమలత, శారద, శివకుమార్, లక్ష్మి, రజిని, నవనాథ్, శ్రీనివాస్, లాలయ్య, గంగాధర్, మహేశ్, శ్రీధర్, రాజన్న తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యోగులకు పదవీ విరమణ తప్పనిసరి
ఖలీల్వాడి: ఉద్యోగులకు పదవీ విరమణ తప్పదని సీపీ సాయిచైతన్య అన్నారు. జిల్లా కేంద్రంలోని సీపీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో పదవీ విరమణ పొందిన ఏఎస్సై మురళిధర్ రాజు(వేల్పూర్), ఏఆర్ ఎస్సై నర్సింలు(పోలీస్ హెడ్ క్వార్టర్స్), ఏఆర్ ఎస్సై సత్యనారాయణ గౌడ్(హెడ్ క్వార్టర్స్)ను సీపీ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. ఉద్యోగ నిర్వహణలో ఎలాంటి పని ఒత్తిడి లేకుండా విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ పొందడం గొప్ప విషయమని అన్నారు. పదవీ విరమణ పొందిన సిబ్బందికి పోలీస్శాఖ ఎల్లప్పుడు సహాయంగా ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీసీపీ(అడ్మిన్) బస్వారెడ్డి, రిజర్వు సీఐ శ్రీనివాస్, తిరుపతి, సతీశ్, సిబ్బంది తదితరులు ఉన్నారు. -
గుత్ప, అలీసాగర్ ఆయకట్టుకు నీటిని అందించాలి
నిజామాబాద్ సిటీ: గుత్ప, అలీసాగర్ ఆయకట్టు కింద రైతులు నాట్లు వేసుకున్న పొలాలకు నీటిని అందించాలని ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షుడు వేల్పూర్ భూమయ్య డిమాండ్ చేశారు. గురువారం నగరంలోని కోటగల్లి ఎన్ఆర్ భవన్లో సమావేశం నిర్వహించారు. గోదావరి నది నుంచి ఎస్సారెస్పీకి వరదలు వస్తున్నందున వెంటనే అధికారులు గుత్ప, అలీసాగర్ ఆయకట్టుకు నీటిని అందించాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్నాయన్నారు. వ్యవసాయరంగంలో తెచ్చిన మూడు నల్ల చట్టాలను రైతాంగ ఉద్యమాల ఫలితంగా మోడీ ప్రభుత్వం మళ్లీ నూతన వ్యవసాయ మార్కెట్ విధానాల పేరుతో దొడ్డిదారున తీసుకు వస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు, రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో నాయకులు దేశెట్టి సాయిరెడ్డి, సాయిలు, గోపాల్, బన్సీ, బుచ్చన్న, రాపాని గంగాధర్, గోపాల్, దేవస్వామి పాల్గొన్నారు. -
సంక్షిప్తం
పడకల్లో శతాధిక వృద్ధుడు మృతి జక్రాన్పల్లి: మండలంలోని పడకల్ గ్రామానికి చెందిన శతాధిక వృద్ధుడు (100)కోమటి రమణయ్య గురువారం మృతి చెందాడు. మృతుడికి ఒక కుమారుడు లింగయ్య ఉన్నాడు. రమణయ్య మృతి చెందే వరకు ప్రతి రోజు అర కి లోమీటరు దూరంలో ఉన్న తన వ్యవసాయ క్షేత్రానికి నడుచుకుంటూ వెళ్లి వచ్చేవాడని గ్రామస్తులు తెలిపారు. రమణ య్య మృతితో గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి. పెండింగ్ బకాయిలు విడుదల చేయాలి నిజామాబాద్అర్బన్: పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ను విడుదల చేయాలని యూఎస్ఎఫ్ఐ నాయకులు కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపి అడిషనల్ కలెక్టర్కు గురువారం వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు సిద్ధల నాగరాజు, పోషమైన మహేశ్, వేణు, విశాల్,కాశిఫ్,సాయి, చరణ్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి సిరికొండ: విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని ఎస్సై రామకృష్ణ సూచించారు. మండల కేంద్రంలోని పీఎంశ్రీ తెలంగాణ ఆదర్శ పాఠశాల/కళాశాలలో మత్తు పదార్థాల నియంత్రణపై పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఎస్సై మాట్లాడుతూ.. యువత గంజాయి, మత్తు పదార్థాలకు బానిసై తమ జీవిత లక్ష్యాలను చేరుకోలేకపోతున్నారని అన్నారు. ఆన్లైన్ బెట్టింగ్ల జోలికి వెళ్లవద్దన్నారు. ప్రిన్సిపాల్ గడ్డం రాజేశ్రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. హైమద్పురలో ఆపరేషన్ ఛబుత్రా ఖలీల్వాడి: నగరంలోని హైమద్పుర కాలనీలో బుధవారం రాత్రి పోలీసులు ఆపరేషన్ ఛబుత్రా నిర్వహించారు. ఈసందర్భంగా కాలనీలోని రోడ్లపై తిరుగుతున్న 50 మంది యువకులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. రాత్రివేళల్లో తిరగవద్దని, రోడ్లపై బైక్లపై తిరిగితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. 25 వాహనాలకు పత్రాలు లేనందున వాటిని పరిశీలించిన తర్వాత చలాన్లు వేసి వాహనాదారులకు అప్పగించారు. ఎస్సై సయ్యద్ ముజాహిద్తోపాటు సిబ్బంది పాల్గొన్నారు. జేసీబీ పట్టివేత నిజామాబాద్ రూరల్: మండలంలోని గుండారం గుట్టల నుంచి అక్రమంగా మొరం తరలిస్తున్న జేసీబీ, టిప్పర్ను పట్టుకుని సీజ్ చేసినట్లు రూరల్ ఎస్హెచ్వో మహ్మద్ ఆరిఫ్ గురువారం తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. అనుమతులు లేకుండా గుండారం గుట్ట నుంచి అక్రమంగా మొరంను తరలుతున్నట్లు సమాచారం అందడంతో దాడి చేసినట్లు పేర్కొన్నారు. గ్రామాల్లో ఎవరైనా మొరం, ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్హెచ్వో హెచ్చరించారు. పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
ఎమ్మెల్యే ధన్పాల్ కృషితోనే ఇంజినీరింగ్ కళాశాల మంజూరు
నిజామాబాద్ రూరల్: తెలంగాణ యూనివర్సిటీకి ఇంజినీరింగ్ కళాశాలను మంజూరు చేయడంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ కీలక పాత్ర వహించారని బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పల్నాటి కార్తిక్, నాయకులు అన్నారు. నగరంలోని దేవి టాకిస్ చౌరస్తాలో ఎమ్మెల్యే ధన్పాల్ చిత్రపటానికి బీజేవైఎం నాయకులు క్షీరాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో బీజేవైఎం నాయకులు సాయికుమార్, సురేశ్, అక్షయ్, అందోల్ రాజు, అనిల్, రాజశేఖర్, సంజయ్ పురోహిత్, ప్రశాంత్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ఆక్రమణల తొలగింపు
నిజామాబాద్ సిటీ: నగరంలోని ఎల్లమ్మగుట్ట చౌరస్తా నుంచి పులాంగ్ వరకు రోడ్డును ఆనుకొని నిర్మించిన సైన్బోర్డులు, ఇతర తాత్కాలిక నిర్మాణాలను మున్సిపల్ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు తొలగించారు. నగరవాసులు ఎదుర్కొంటున్న ట్రాఫిక్ ఇబ్బందులపై ‘సాక్షి’ దినపత్రికలో గురువారం ప్రచురితమైన ‘శాశ్వత పరిష్కారం చూపేదెప్పుడు..?’ అనే కథనానికి బల్దియా టౌన్ప్లానింగ్ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు స్పందించారు. హైదరాబాద్ రోడ్డులో రోడ్డుకు అడ్డంగా ఉన్న నిర్మాణాలు, వేణుమాల్ వద్ద అడ్డుగా ఉన్న బోర్డులను తొలగించారు. ఎల్లమ్మగుట్ట చౌరస్తా నుంచి పులాంగ్ వరకు రోడ్డును ఆనుకుని నిర్మించిన సైన్బోర్డులు, ఇతర తాత్కాలిక నిర్మాణాలను తొలగించినట్లు టౌన్ప్లానింగ్ అధికారి టి.శ్రీనివాస్ తెలిపారు. స్థానిక ట్రాఫిక్ పోలీసుల సమన్వయంతో ప్రతిరోజు ఆక్రమణల తొలగింపు నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. సాక్షి కథనానికి స్పందించిన ట్రాఫిక్, బల్దియా అధికారులు హైదరాబాద్ రోడ్డులో తొలగిన ట్రాఫిక్ ఇబ్బందులు -
ఇంజినీరింగ్ కళాశాల
తెయూకుఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రజల దశాబ్దాల కల నెరవేరింది. ప్రజలు, విద్యార్థులు, విద్యావంతుల నిరంతర పోరాటాలు, ప్రజా ప్రతినిధులు, నేతల కృషి ఫలించింది. తెలంగాణ యూనివర్సిటీకి ఇంజినీరింగ్ కళాశాల మంజూరు చేస్తూ గురువారం ప్రభుత్వం జీవో జారీ చేసింది.జీవో జారీ చేసిన ప్రభుత్వం ● నాలుగు కోర్సులకు అనుమతి ● మూడో విడత కౌన్సెలింగ్ ద్వారా ఇంజినీరింగ్ సీట్ల భర్తీ ● సీఎం రేవంత్రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు ● వీసీ ప్రొఫెసర్ యాదగిరిరావు -
క్రైం కార్నర్
ట్రాలీ ఆటో నుంచి పడి బాలుడు మృతి మాక్లూర్: ట్రాలీ ఆటోలో ప్రయాణం చేస్తుండగా ప్రమాదవశాత్తు కిందపడి ఓ బాలుడు మృతిచెందాడు. మాక్లూర్ ఎస్సై రాజశేఖర్ తెలిపిన వివరాలు ఇలా.. నిజామాబాద్ నగరంలోని నెహ్రూనగర్ కాలనీకి చెందిన షేక్ ఇబ్రహిం తన సొంత ట్రాలీ ఆటోలో గురువారం భార్య ఫౌజియా సుల్తానా, నలుగురు బిడ్డలతో కలిసి ఆర్మూర్లోని బంధువుల ఇంటికి బయలుదేరారు. అడవి మామిడిపల్లి శివారులోని 63వ నంబర్ జాతీయ రహదారిపై అతడి కుమారుడు షేక్ అహ్మద్ (7) ప్రమాదవశాత్తు ఆటోలో నుంచి కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు. పోలీసుల పేరు చెప్పి వసూళ్లకు పాల్పడిన వ్యక్తి అరెస్టు బోధన్: పట్టణంలో పోలీసుల పేరు చెప్పి వసూళ్లకు పాల్పడిన ఓ వ్యక్తిని పోలీసులు పట్టుకొని రిమాండ్కు తరలించారు. వివరాలు ఇలా.. పట్టణంలోని రెంజల్ బేస్ ప్రాంతానికి చెందిన మీనాజ్ అనే వ్యక్తి మట్కా నిర్వహిస్తుండేవాడు. అయితే ఈ విషయం పోలీసులకు తెలపకుండా ఉండటానికి మహ్మద్ అబ్దుల్ సోఫియాన్ అనే వ్యక్తి డబ్బులు డిమాండ్ చేశాడు. బాధితుడి నుంచి అతడు ప్రతినెలా రూ.5వేల నుంచి రూ.10వేల వరకు డబ్బులు వసూలు చేయగా, ఇప్పటి వరకు రూ. 2లక్షల వరకు వసూళ్లకు పాల్పడ్డాడు. గత రెండు నెలలుగా బాధితుడు డబ్బులు ఇవ్వకపోవడంతో నిందితుడు బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా ఈమేరకు కేసు నమోదు చేసినట్లు బోధన్ టౌన్ సీఐ వెంకట నారాయణ తెలిపారు. నిందితుడు సోఫియాన్ను అదుపులోకి తీసుకుని రిమాండ్కు పంపినట్టు పేర్కొన్నారు. -
ఆర్మూర్లో బోర్డు తిప్పేసిన తిరుమల ట్రేడర్స్
ఆర్మూర్టౌన్: పట్టణంలోని ఓ ట్రేడర్స్ దుకాణం బోర్డు తిప్పేసింది. రాయితీపై వస్తువులు అందిస్తామంటూ దుకాణం ఏర్పాటు చేయగా, కస్టమర్ల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసిన నిర్వాహకులు పరారయ్యారు. పోలీసులు, బాధితులు తెలిపిన వి వరాలు ఇలా.. పట్టణంలోని నిజాంసాగర్ కెనాల్ ప క్కన గల ఎల్వీఆర్ కాంప్లెక్స్లో కొన్ని నెలల క్రితం తమిళనాడుకు చెందిన ఐదుగురు వ్యక్తులు తిరుమల ట్రేడర్స్ పేరుతో దుకాణం ఏర్పాటు చేశారు. ప్రతి వస్తువుపై 40శాతం రాయితీతో పంపిణీ చేస్తా మని వారు ప్రచారం చేశారు. ఫోన్లు, సోఫా సెట్, ఫ్రిడ్జ్, కంప్యూటర్, వాషింగ్ మిషన్, డైనింగ్ టేబు ల్, ఆల్ ఫర్నిచర్స్ ఎలక్ట్రానిక్ తదితర వస్తువుల కోసం ముందస్తుగా అడ్వాన్స్ ఇస్తే వారం రోజుల్లో వస్తువులు ఇస్తామని నమ్మబలికారు. దీంతో వందల మంది ఆర్డర్ ఇచ్చారు. మొదట్లో పలువురికి వ స్తువులను 40శాతం రాయితీతో ఇవ్వడంతో నమ్మా రు. దీంతో ఇటీవల మరింత మంది వస్తువుల కో సం రూ.లక్షల్లో డబ్బులు చెల్లించారు. కాగా వస్తువు ల కోసం బాధితులు దుకాణం వద్దకు రాగా మంగళవారం నుంచి షాపు తెరవకపోవడంతోపాటు వారి ఫోన్లు స్వీచ్ఆఫ్ రావడంతో ఆందోళనకు గురయ్యా రు. సిరిగిరి శ్రీనివాస్ అనే బాధితుడు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి నట్లు ఎస్హెచ్వో సత్యనారాయణ గౌడ్ తెలిపారు. రాయితీపై వస్తువులు ఇస్తామంటూ డబ్బులు వసూలు చేసిన నిర్వాహకులు మూడు రోజులుగా దుకాణం మూసిఉండటంతో బాధితుల ఆందోళన -
పదోన్నతులకు కసరత్తు
నిజామాబాద్అర్బన్ : జిల్లాలో ఉపాధ్యాయుల పదోన్నతుల ప్రక్రియ మొదలైంది. ఇటీవల ప్రభుత్వం టీచర్లకు పదోన్నతులు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అందులో భాగంగా జిల్లాలోని అర్హులైన ఉపాధ్యాయులకు పదోన్నతి కల్పించేందుకు జిల్లా విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. గురువారం ముందస్తుగా ధ్రువపత్రాల పరిశీలన ప్రారంభించింది. 140 మందికి అవకాశం జిల్లా విద్యాశాఖలో ప్రస్తుతం 140 ఖాళీలు ఉండ గా, వాటిని పదోన్నతుల ద్వారా భర్తీ చేయనున్నా రు. స్కూల్ అసిస్టెంట్, ఎస్జీటీ, పండిట్లకు సంబంధించి ఖాళీలను పరిగణనలోకి తీసుకొని ప్రక్రియ చేపట్టనున్నట్లు విద్యాశాఖ అధికారులు పేర్కొన్నా రు. గతంలోని రోస్టర్ ప్రక్రియను పరిగణనలోకి తీ సుకొని ఉపాధ్యాయులను ధ్రువపత్రాల పరిశీలన కు ఆహ్వానించారు. ఒక్కో పోస్టుకు ముగ్గురు చొప్పు న ధ్రువపత్రాల పరిశీలన చేపడుతున్నారు. ఎస్జీటీ నుంచి స్కూల్ అసిస్టెంట్గా పదోన్నతి పొందే వారికి కేవలం డీఎడ్ అర్హతను పరిగణనలోకి తీసుకొన్నారు. స్కూల్ అసిస్టెంట్ నుంచి గెజిటెడ్ హెచ్ఎంగా పదోన్నతులను ఇవ్వనున్నారు. కాగా, మొదటిసారిగా విద్యాశాఖ పదోన్నతుల ప్రక్రియలో ఎస్సీ వర్గీకరణ అమలు చేయనున్నారు. వారి సంగతేంటి..? పదోన్నతుల ప్రక్రియకు సంబంధించి 1998 డీఎస్సీకి సంబంధించిన కొందరు ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంలు కొన్నేళ్లుగా పదోన్నతులు స్వీకరించడం లేదు. పదోన్నతులు తిరస్కరించిన వారు సర్వీస్ బుక్లో ఆ విషయాన్ని నమోదు చేసుకోవాల్సి ఉండగా, అ లాంటిదేమీ జరగకపోవడంతో ప్రతిసారి వీరి పేర్లు నమోదవుతున్నాయి. ప్రస్తుతం కూడా లిస్టులో సు మారు 15 పేర్లు ఉన్నాయి. వీరికి మళ్లీ పదోన్నతులు కల్పిస్తారా లేదంటే తొలగిస్తారా అనేది విద్యాశాఖ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. సర్టిఫికెట్ల పరిశీలకు హాజరుకావాలి పదోన్నతులకు సంబంధించి సర్టిఫికెట్ల పరిశీలనకు శుక్రవారం విద్యాశాఖ కార్యాలయంలో టీచర్లు హా జరుకావాలని డీఈవో అశోక్ తెలిపారు. గ్రేడ్–2 తెలుగు, హిందీ, ఉర్దూ, పీఈటీ ఉపాధ్యాయులు హాజరుకావాల్సి ఉంటుందన్నారు. ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఒక జిరాక్స్ సెట్, చెక్ లిస్టులతో రావాలని తెలిపారు. డీఎస్సీ 2017 వరకు ఎస్జీటీ నుంచి స్పెషల్ ఎడ్యుకేషన్కు అర్హులైన ఉపాధ్యాయులు సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరుకావాలన్నారు.షెడ్యూల్ విడుదలజిల్లా విద్యాశాఖలో పదోన్నతులకు సంబంధించి షెడ్యూల్ విడుదల చేశారు. స్కూల్ అ సిస్టెంట్ విభాగంలో ఈ నెల 2న ఖాళీల ప్రద ర్శన చేపడతారు. 3న అభ్యంతరాల స్వీకరణ, 4, 5 తేదీల్లో సీనియారిటీ జాబితా పరిశీలన అనంతరం తుది జాబితాను విడుదల చేస్తా రు. 6న వెబ్ ఆప్షన్, ఎడిటింగ్ అవకాశం ఉంటుంది. 7న పదోన్నతులకు సంబంధించి ఆర్డర్లను జారీ చేస్తారు. 8, 9 తేదీల్లో ఎస్జీటీల ప దోన్నతులకు సంబంధించి ఖాళీల ప్రదర్శన చేపడుతారు. 10న వెబ్ ఆప్షన్లు, ఎడిటింగ్ అ వకాశం ఉంటుంది. 11న పదోన్నతులకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేస్తారు. జిల్లాలో 140 మంది ఉపాధ్యాయులకు అవకాశం మొదలైన ధ్రువపత్రాల పరిశీలన పారదర్శకంగా చేపట్టాలి పదోన్నతుల ప్రక్రియను పారదర్శకంగా చేపట్టాలి. లోటుపాట్లు లేకుండా విద్యాశాఖ పకడ్బందీగా వ్యవహరించాలి. ఉపాధ్యాయులకు ఎలాంటి సందేహాలు లేకుండా వివరాలను అందించాలి. అందరికీ న్యాయం జరిగేలా చూడాలి. లేదంటే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తాం. – ఓ రమేశ్, టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు.ఎస్సీ టీచర్లకు న్యాయం ఉపాధ్యాయ పదోన్నతులలో వర్గీకరణను అమలు చేయాలి. మొదటిసారిగా విద్యాశాఖ పదోన్నతుల ప్రక్రియలో వర్గీకరణను అమలు చేసే అవకాశం లభించింది. దీంతో ఎస్సీ టీచర్లకు న్యాయం జరుగుతుంది. – ఎస్. సురేశ్, మాదిగ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు -
గిరిజనుల సంస్కృతికి ప్రతీక తీజ్
నిజామాబాద్ రూరల్: గిరిజనుల సంస్కృతి, సాంప్రదాయాలకు తీజ్ పండుగ ప్రతీకగా నిలుస్తోంది. ప్రతి ఏడాది శ్రావణమాసంలో తొమ్మిది రోజుల పాటు ఉత్సవాలను గిరిజనులు జరుపుకుంటారు. తండాలు పాడి పంటలతో కళకళలాడాలని, ప్రజలను రోగాల బారి నుంచి రక్షించాలని జగదాంబ, సేవాలాల్, రామ్రావు మహరాజ్తో పాటు వనదేవతలను వేడుకుంటారు. తీజ్ పండుగలో భాగంగా వివిధ తండాల్లో ఉన్న జగదాంబ, సేవాలాల్ మహరాజ్ ఆలయాల్లో గోధుమ బుట్టలకు తొమ్మిది రోజులపాటు యువతులు తమకు మంచి భర్త రావాలని పూజలు చేస్తారు. ఉత్సవాల కోసం విరాళాలు తీజ్ పండుగ నిర్వహణకు కావలసిన గోధుమలు, చిన్న వెదురు బుట్టల కొనుగోలు కోసం తండా పెద్దలు ప్రతి ఇంటి నుంచి విరాళాలు సేకరిస్తారు. యువతులు పుట్టమన్ను తెచ్చి, అందులో గోధుమలు కలిపి వెదురు బుట్టలో వేసి, ఒక మంచైపె ఉంచుతారు. నాటి నుంచి యువతులు తొమ్మిది రోజులు ఉపవాస దీక్ష చేపడతారు. రోజూ ఉదయం, సాయంత్రం బుట్టలో నీరు పోస్తారు. సాయంత్రంవేళ యువతులు బుట్టలు ఉన్న మంచి వద్ద గుంపులుగా చేరి ఉత్సవ గీతాలు అలపిస్తారు. బంజారా సంప్రదాయ నృత్యం చేస్తారు. తొమ్మిది రోజుల్లో బోరడి ఝష్కెరో, ఢమోళి, గణ్ గోర్ వంటి కార్యక్రమాలు ఉంటాయి. తొమ్మిదో రోజు అసలైన తీజ్ ఉత్సవం జరుగుతుంది. వివిధ ప్రాంతాల్లో ఉండే తమ బంధువులను ఆహ్వానిస్తారు. తండా ప్రజలు తీజ్ బుట్టల నిమజ్జనానికి శోభాయాత్రగా వెళతారు. ఓ ప్రదేశంలో బుట్టలు కిందకి దించి వలయాకారంలో కూర్చుంటారు. ఈ సమయంలో బంధువులు, సోదరులు ఆ బుట్టల్లో తోచినంత డబ్బు కట్నంగా వేస్తారు. యువతులు తీజ్ నారు తెంపి పెద్దలు పెట్టుకున్న తలపాగాల్లో అమరుస్తారు. యువతుల పాదాలు సోదరులు నీటితో కడిగి ఆశీర్వాదం తీసుకుంటారు. యువతులు బుట్టలను తలపై పెట్టుకుని పాటలు పాడుతూ సమీపంలో చెరువు వద్దకు వెళుతారు. మొదట సేవాలాల్ మహారాజ్, దండియాడికి చెందిన తీజ్ బుట్టను నిమజ్జనం చేసిన అనంతరం ఒక్కొక్కరు తమ తమ బుట్టలను గీతాలాపనల మధ్య నిమజ్జనం చేస్తారు. ప్రతియేటా ఆషాడ, శ్రావణమాసాల్లో ఉత్సవాల నిర్వహణ గోధుమ బుట్టలకు తొమ్మిదిరోజులపాటు నిష్టతో పూజలు చేయనున్న యువతులు రాష్ట్ర పండుగగా గుర్తించాలి.. తీజ్ పండుగను కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించాలి. నిధులను విడుదల చేయాలి. పండుగలో పంటలు బాగా పండాలని తీజ్ పండుగ నిర్వహిస్తాం. ఎంతో నిష్టతో బంజారాలు నిర్వహించుకోవడం సంప్రదాయంగా వస్తుంది. –ప్రేమ్లాల్, బంజారా కవి, నిజామాబాద్ -
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక
డొంకేశ్వర్: రాష్ట్ర స్థాయి జావెలిన్ త్రో షాట్పుట్ పో టీలకు డొంకేశ్వర్ మండలం నూత్పల్లి గ్రామానికి చెందిన విద్యార్థి శివరాజ్ ఎంపికయ్యాడు. ఇటీవల జిల్లా కేంద్రంలోని నాగారంలో జిల్లాస్థాయి అథ్లెటిక్ పోటీలు జరిగాయి. ఇందులో శివరాజ్ కుమార్ ప్ర తిభ చూపి గోల్డ్ మెడల్ సాధించి రాష్ట్రస్థాయికి ఎంపికయ్యాడు. ఆగస్టు 3 నుంచి హనుమకొండలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో శివరాజ్ కుమా ర్ జిల్లా నుంచి పాల్గొననున్నా రు. ప్రస్తుతం అతడు ఉప్పల్వా యి గురుకులంలో ఇంటర్ ఫస్టి యర్ చదువుతున్నాడు. -
కుక్కల దాడిలో నెమలి మృతి
సిరికొండ: మండల కేంద్రానికి సమీపంలో గురువారం సాయంత్రం కుక్కల దాడిలో జాతీయ పక్షి నెమలి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. గ్రామ సమీపంలో మేత మేస్తున్న నెమలిపై కుక్కలు మూకుమ్మడిగా దాడి చేసి తీవ్రంగా గాయపర్చాయి. స్థానికులు గమనించి కుక్కలను తరిమివేశారు. నెమలి వద్దకు వారు వెళ్లి చూడగా అప్పటికే మృతి చెందడంతో అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. నెమలి కళేబరానికి పంచనామా నిర్వహించి ఖననం చేసినట్లు ఇన్చార్జి ఎఫ్ఆర్వో రవీందర్, డీఆర్వో గంగారాం తెలిపారు. ఆలయాల్లో చోరీ బోధన్: ఎడపల్లి మండలం ఠాణాకలాన్ గ్రామంలోని పలు ఆలయాల్లో గురువారం తెల్లవారు జామున గుర్తుతెలియని వ్యక్తులు దొంగతనానికి పాల్పడ్డారని గ్రామస్తులు తెలిపారు. గ్రామంలోని పెద్దమ్మ ఆలయంలో అమ్మవారి పుస్తె మట్టెలు, బంగారు నగలు చోరీ చేసి, మహాలక్ష్మి మందిరం, తుల్జాభవాని ఆలయం, శివాలయాల్లో హుండీలను దుండగులు పగులగొట్టి, నగదును ఎత్తుకెళ్లినట్లు పేర్కొన్నారు. స్థానికుల సమాచారం మేరకు ఎడపల్లి ఎస్సై ముత్యాల రమా సిబ్బందితో కలిసి గురువారం ఆలయాలను పరిశీలించారు. గ్రామస్తులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
బ్రిడ్జి సైడ్వాల్ను ఢీకొట్టిన లారీ
పెద్దకొడప్గల్(జుక్కల్): కామారెడ్డి జిల్లా పెద్దకొడప్గల్ మండల కేంద్రంలోని జాతీయ రహదారి 161 పై ఘోరరోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్టీరింగ్ వైఫల్యం కారణంగా లారీ హైవే బ్రిడ్జిపై సైడ్వాల్ ను ఢీకొట్టడంతో క్యాబిన్లో కూర్చున్న ఐదుగురు కూలీలు పైనుంచి సర్వీస్ రోడ్డుపై పడిపోయారు. ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరి ప రిస్థితి విషమంగా ఉంది. గాయాలపాలైన ముగ్గురి ని చికిత్స నిమిత్తం బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. గురువారం పిట్లం మండలం నుంచి ఇటుక లోడ్ చేసుకొని మద్నూర్కు వెళ్లిన లారీ (ఏపీ 26 ఎక్స్ 1377) తిరిగి వస్తుండగా.. పెద్దకొడప్గ ల్లో నేషనల్ హైవే 161 బ్రిడ్జిపై స్టీరింగ్ ఫెయిలై సైడ్వాల్ను ఢీకొట్టింది. క్యాబిన్లో డ్రైవర్తోపాటు ఐదుగురు కూలీలు కూర్చున్నారు. లారీ సైడ్వాల్ ను ఢీ కొట్టగానే డ్రైవర్ మినహా ఐదురు కూలీలు క్యాబిన్లో నుంచి కింద ఉన్న సర్వీస్రోడ్డుపై పడిపోయారు. పిట్లం మండలం రూం తండాకు చెందిన హలావత్ నర్సింగ్(30) అక్కడికక్కడే మృతి చెందాడు. మహారాష్ట్రకు చెందిన గణేశ్ పరిస్థితి విషమంగా ఉండడంతో నిజామాబాద్ ఆస్పత్రికి తరలించినట్లు తెలిసింది. మహారాష్ట్రకు చెందిన బింబాటో, రూం తండాకు చెందిన శోభన్, హలావత్ రమేశ్కు గాయాలుకాగా.. చికిత్స నిమిత్తం బాన్సువాడ ఏరి యా ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. ఎన్హెచ్ 161 పై ఘోర ప్రమాదం పైనుంచి సర్వీస్ రోడ్డుపై పడిన ఐదుగురు కూలీలు ఒకరి మృతి.. మరొకరి పరిస్థితి విషమం ప్రమాదానికి స్టీరింగ్ వైఫల్యమే కారణం -
ఇందూరులో కలెక్టర్ సుడిగాలి పర్యటన
నిజామాబాద్ సిటీ: నగరంలో కలెక్టర్ టీ వినయ్కృష్ణారెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. గురువారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు మున్సిపల్ కమిషనర్ దిలీప్కుమార్, ఇంజినీరింగ్ అధికారులతో కలిసి అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పనుల వివరాలు, జాప్యానికి కారణాలను అడిగి తెలుసుకున్నారు. సమీకృత మార్కెట్లో.. ఖలీల్వాడిలో సమీకృత మార్కెట్ నిర్మాణ పనులు నిలిచిపోవడంపై కమిషనర్ను వివరణ అడిగి తెలుసుకున్నారు. గడువులోపు పనులన్నీ పూర్తయ్యేలా ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లాలని సూచించారు. అహ్మదీబజార్లో నిర్మాణం పూర్తయినా వాడుకలోకి తీసుకురాకపోవడంపై ఆరా తీశారు. పాత గంజ్ను సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. ట్రాఫిక్ ఆంక్షలు, ఫుట్పాత్ల ఆక్రమణలతో ఇబ్బందులు వస్తున్నాయని మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆక్రమణలను తొలగించాలని కమిషనర్ను ఆదేశించారు. అనంతరం నాగారంలో నిర్మించిన రాజీవ్గృహకల్ప ఇళ్లను పరిశీలించారు. లబ్ధిదారులకు వాటిని కేటాయించేలా అవసరమైన మరమ్మతులు చేయించాలని ఆర్అండ్బీ అధికారులను ఆదేశించారు. డంపింగ్ యార్డు సందర్శన.. నాగారం శివారులోని డంపింగ్ యార్డును కలెక్టర్ సందర్శించారు. బల్దియా చేపడుతున్న చెత్త సేకరణ, చెత్తనిల్వను పరిశీలించారు. చుట్టుపక్కల వారికి దుర్వాసన రాకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. బయో మైనింగ్ ప్రక్రియను చూశారు. పెద్ద మొత్తంలో కంపోస్ట్ తయారీ కోసం అవసరమైన ప్రతిపాదనలు రూపొందించాలని సూచించారు. జిల్లాలోని ఆస్పత్రులకు సంబంధించిన వ్యర్థాలను రోజువారీగా సేకరిస్తూ నిర్దేశిత ప్రాంతంలో డిస్పోజ్ చేసేలా పర్యవేక్షణ జరపాలని అధికారులను ఆదేశించారు. బస్తీ దవాఖాన, పాఠశాల తనిఖీ ఖానాపూర్లోని బస్తీ దవాఖానను కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తనిఖీ చేశారు. దవాఖానకు వచ్చిన రోగులతో మాట్లాడారు. పీహెచ్సీ తరహాలో అన్నిరకాల సేవలందిస్తూ, మందులు సిద్ధం చేసుకోవాలని మెడికల్ ఆఫీసర్కు సూచించారు. అనంతరం కాలూర్ ప్రభుత్వ ప్రైమరీ స్కూల్ను సందర్శించి మధ్యాహ భోజనాన్ని తనిఖీ చేశారు. కలెక్టర్ వెంట డీఎంహెచ్వో డాక్టర్ రాజశ్రీ, ఇన్చార్జి ఎంహెచ్వో రవిబాబు, మున్సిపల్ ఈఈ మురళీమోహన్ రెడ్డి, డంపింగ్యార్డు ఇన్చార్జి ప్రభుదాస్, రషీద్, డీఈ ముస్తాక్ అహ్మద్, ఏఈ ఇనాయత్ కరీం, శానిటరీ సూపర్వైజర్ సాజిద్ అలీ తదితరులు ఉన్నారు. మున్సిపల్ కమిషనర్తో కలిసి అభివృద్ధి పనుల పరిశీలన అలసత్వం వహిస్తున్న అధికారులు, గుత్తేదారులపై మండిపాటు నాణ్యతతో పనులు వేగవంతం చేయాలని ఆదేశం -
సౌత్ క్యాంపస్లో సంబురాలు
తెయూ(డిచ్పల్లి) : తెయూలో ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటుకు ‘సాక్షి’ తనవంతు కృషి చేసింది. పీసీసీ అధ్యక్షుడి హోదాలో ప్రస్తుత సీఎం రేవంత్రెడ్డి నిజామాబాద్ జిల్లాను సందర్శించిన సమయంలో తెయూకు ఇంజినీరింగ్ కళాశాల మంజూరు చేస్తామని ఇచ్చిన హామీని గుర్తుచేస్తూ ప్రత్యేక కథనాలను ప్రచురించింది. 12 ఏప్రిల్ 2025న ‘సాక్షి’ టౌన్ ఆఫీస్లో వివిధ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ‘తెలంగాణ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ కళాశాలను ఏర్పాటు చేయాలి’ అనే అంశంపై చర్చాగోష్టి నిర్వహించింది. ప్రభుత్వం కళాశాల మంజూరు చేస్తే చాలు తాము నడిపేందుకు సిద్ధంగా ఉన్నా మని జూన్ 24న వర్సిటీని సందర్శించిన ఉన్న త విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి దృష్టికి వీసీ యాదగిరిరావు, రిజిస్ట్రార్ యాదగిరి తీసుకెళ్లారు. జూలై 8న ‘మంజూరు చేస్తే చాలు’ అనే కథనాన్ని ‘సాక్షి’ ప్రచురించింది. 577 విశాలమైన క్యాంపస్తోపాటు సైన్స్ కాలేజ్ భవనం, మౌలిక వసతులు, ఫ్యాకల్టీ అందుబాటులో ఉన్నాయంటూ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. ఇలా తెయూలో ఇంజినీరింగ్ కళాశాల మంజూరు విషయంలో కృషి చేసిన ‘సాక్షి’ దినపత్రికకు పలువురు విద్యార్థి సంఘాల నాయకులు, విద్యావేత్తలు గురువారం ఫోన్లు చేసి కృతజ్ఞతలు తెలిపారు.భిక్కనూరు: తెలంగాణ వర్సిటీకి ఇంజినీరింగ్ కళాశాల మంజూరు కావడాన్ని హర్షిస్తూ డాక్టరేట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులు, అధ్యాపకులు గురువారం సౌత్ క్యాంపస్లో సంబురాలు జరుపుకున్నారు. ఎన్నో ఏళ్ల కల నేరవేరిందని డాక్టరేట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సంతోష్గౌడ్ అన్నారు. ప్రభుత్వం ఇంజినీరింగ్ కళాశాలను మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. విద్యార్థులు బాణాసంచా కాల్చి ఒకరికొకరు స్వీట్లు తినిపించుకున్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సుధాకర్గౌడ్, వైస్ ప్రిన్సిపాల్ రాజేశ్వరి, డాక్టరేట్ అసోసియేషన్ ప్రతినిధులు రాహుల్ నేత, సరిత, సత్యం, రమేశ్, అధ్యాపకులు అంజయ్య, మోహన్బాబు, యాలాద్రి తదితరులు పాల్గొన్నారు. -
ముఖ్యమంత్రికి ధన్యవాదాలు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: తెలంగాణ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ కళాశాల మంజూరు చేసినందుకు సీఎం రేవంత్రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, రాష్ట్ర కోఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్రెడ్డి తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వరుసగా నెరవేర్చుతున్నామన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఏవిధమైన కొత్త ప్రాజెక్టులు జిల్లాకు రాలేదన్నారు. తెలంగాణ వర్సిటీ సైతం దివంగత మహానేత రాజశేఖర్రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఇచ్చిందేనన్నారు. ఇంజినీరింగ్ కళాశాలతో జిల్లా విద్యార్థులకు ఎనలేని మేలు కలుగుతుందన్నారు. ఎండిన సోయాబీన్ పంటల పరిశీలన కమ్మర్పల్లి: మండలంలోని ఉప్లూర్లో గడ్డి మందు పిచికారీ చేయడంతో ఎండిన సోయాబీన్ పంటలను గురువారం జగిత్యాల జిల్లా పొలాస ప్రాంతీయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తల బృందం పరిశీలించింది. స్వాతి, స్పందన భట్, దినేష్, సంధ్యకిషోర్ల బృందం రైతుల నుంచి వివరాలు సేకరించింది. నివేదికను జిల్లా వ్యవసాయాధికారి మేకల గోవింద్కు అందజేస్తామని శాస్త్రవేత్తలు తెలిపారు. వారి వెంట ఏవో రమ్యశ్రీ ఉన్నారు. 3న సీనియర్ జిల్లాస్థాయి చెస్ ఎంపికలు నిజామాబాద్నాగారం: నిజామాబాద్ జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 3న నగరంలోని అభ్యాస స్కూల్లో సీనియర్ మెన్, ఉమెన్ విభాగంలో చెస్ ఎంపిక పోటీలు ఉంటాయని సంఘం జిల్లా కార్యదర్శి రమేష్ ఒక ప్రకటనలో తెలిపారు. క్రీడాకారులు తప్పనిసరిగా చెస్బోర్డు, ఆధార్కార్డు తీసుకొని రావాలన్నారు. వివరాలకు 94400 07004ను సంప్రదించాలన్నారు. పథకాలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకే పాదయాత్ర ఆర్మూర్: రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు మరింత చేయడంలో భాగంగా ఏఐసీసీ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్గౌడ్ పాదయాత్రకు శ్రీకారం చుట్టారని తెలంగాణ కోఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి అన్నారు. ఆర్మూర్లోని పీవీఆర్ భవన్లో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆగస్టు 2న ఆలూర్, గగ్గుపల్లి మీదుగా పాత బస్టాండ్ వరకు 10 కిలోమీటర్ల పాదయాత్ర ఉంటుందన్నారు. 3న ఉదయం పాత బస్టాండ్లో శ్రమదానం నిర్వహిస్తారన్నారు. అనంతరం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన ముఖ్య నాయకులతో సమావేశమవుతారన్నారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని పాదయాత్రను విజయవంతం చేయాలని కోరారు. ఆర్మూర్ ఏఎంసీ చైర్మన్ సాయిబాబా గౌడ్, నాయకులు పండిత్ పవన్, అయ్యప్ప శ్రీనివాస్, షేక్ మున్ను, బైండ్ల ప్రశాంత్, భూమేష్ తదితరులు పాల్గొన్నారు. -
అందుబాటులో రైతులకు సరిపడ ఎరువుల నిల్వలు
● కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి ● మోపాల్లో గోదాం తనిఖీ నిజామాబాద్ రూరల్: ప్రస్తుత వానాకాలం సీజన్లో జిల్లా రైతుల అవసరాలకు సరిపడా యూరియా, ఎరువుల నిల్వలు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. మోపాల్ సహకార సంఘం ఎరువుల గోడౌన్ను కలెక్టర్ గురువారం తనిఖీ చేశారు. గిడ్డంగిలో రికార్డులలో పేర్కొన్న విధంగా ఎరువుల నిల్వలు అందుబాటులో ఉన్నాయా అని పరిశీలించారు. ఎరువుల విక్రయాలను ఈ–పాస్ ద్వారా నిర్వహిస్తున్నారా లేదా అని తనిఖీ చేశారు. స్టాక్ కొంత మిగిలి ఉన్నప్పుడే ఇండెంట్ సమర్పించి, ఎరువులను తెప్పించుకోవాలని నిర్వాహకులకు సూచించారు. కాగా, ఎరువుల నిల్వలతో కూడిన వివరాలను స్టాక్ బోర్డుపై తప్పనిసరిగా ప్రదర్శించాలని ఆదేశించారు. యూరియా, ఇతర ఎరువుల విషయంలో రైతులు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని కలెక్టర్ భరోసా కల్పించారు. లంచం అడిగితే 1064 టోల్ ఫ్రీ నంబర్కు సమాచారం ఇవ్వండి ఖలీల్వాడి: నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరైన లంచం అడిగితే ఏసీబీ టోల్ఫ్రీ నంబర్ 1064కు సమాచారం ఇవ్వాలని ఏసీబీ డీఎస్పీ శేఖర్గౌడ్ గురువారం తెలిపారు. ఈమేరకు ప్రజలకు అవగాహన కల్పించడానికి కూడళ్లతోపాటు ఆర్టీసీ బస్సులు, ఆటోలకు ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064కి సంబందించిన స్టిక్కర్లను అతికించామన్నారు. ఎవరైనా ప్రభుత్వ కార్యాలయాలలో ఏదైన పని నిమిత్తం వెళితే, అధికారులు, సిబ్బంది పని పూర్తి చేయించడం కోసం లంచం డబ్బులు డిమాండ్ చేసినచో అవినీతి నిరోధక శాఖ అధికారులకు సమాచారం అందించాలన్నారు. లేదు నేరుగా టోల్ ఫ్రీ నంబర్కు గాని లేదా నిజామాబాద్ రేంజ్కి చెందిన అవినీతి నిరోధక శాఖ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్కు నేరుగా ఫిర్యాదు చేయవచ్చునన్నారు. -
జిల్లా నేతల కృషి
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: తెలంగాణ వర్సిటీలో ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటు వెనుక పలువురి కృషి ఉంది. పీసీసీ అధ్యక్షు డు, ఎమ్మెల్సీ బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యేలు డాక్టర్ భూపతిరెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ సైతం కళాశాల కోసం పాటుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా మహేశ్ కుమార్ గౌడ్ బాధ్యతలు స్వీకరించిన రోజున నిజామాబాద్ జిల్లాకు కచ్చితంగా ఇంజినీరింగ్ కళాశాలను సాధిస్తానని హామీ ఇచ్చారు. అందులో భాగంగానే ఆయన శక్తివంచన లేకుండా కృషి చేశారు. దీంతో సీఎం రేవంత్రెడ్డి చొరవ తీసుకొని జిల్లాకు ఇంజినీరింగ్ కళాశాల మంజూరు చేశారు. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి సైతం జిల్లా విద్యార్థులకు సాంకేతిక విద్యను మరింత చేరువ చేసేందుకు గట్టి ప్రయత్నాలు చేసి సాధించారు. ఈ కళాశాలతో నిజామాబాద్ జిల్లాతోపాటు ఆదిలాబాద్, నిర్మల్, కామారెడ్డి జిల్లాల విద్యార్థులకు మరింత మేలు కలుగనుంది. టీయూలో ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటు చేస్తే ఉత్తర తెలంగాణలోని వివిధ జిల్లాలకు చెందిన పేద, మధ్యతరగతి విద్యార్థులకు సాంకేతిక విద్య అభ్యసించేందుకు చాలా ఉపయుక్తంగా ఉంటుందని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా శాసనసభలో పలుమార్లు ప్రస్తావించారు. సీఎంకు ధన్యవాదాలు ● ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి తెలంగాణ వర్సిటీలో ఇంజినీరింగ్ కళాశాల మంజూరు చేయ డంపై నిజామాబా ద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి సీఎం రేవంత్రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న విద్యార్థులు, విద్యాభిమానుల ఆకాంక్షలు నెరవేరడం సంతోషంగా ఉందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కళాశాల ఏర్పాటు చేయించడం హర్షణీయమన్నారు. -
సామర్థ్యం ఎక్కువ.. ఉత్పత్తి తక్కువ
బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ దిగువన ఉన్న జాతీయ కేంద్రంలో చేపపిల్లల ఉత్పత్తిపై ప్రభుత్వం, అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. 5 కోట్ల చేపపిల్లలను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉన్న కేంద్రంలో ప్రస్తుత సంవత్సరం కేవలం 54 లక్షల చేప పిల్లలను ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నారు. 54 లక్షల చేపపిల్లల ఉత్పత్తికి 2.4 కోట్ల స్పాన్ అవసరం ఉండగా, ఇప్పటి వరకు 1.75 కోట్ల స్పాన్ను ఉత్పత్తి చేశారు. మరో 65 లక్షల స్పాన్ ఉత్పత్తి చేస్తే లక్ష్యం పూర్తవుతుందని అధికారులు చెప్తున్నారు. సామర్థ్యం కన్నా తక్కువ చేపపిల్లల ఉత్పత్తిపై అధికారులు నోరు మెదపడం లేదు. తల్లి చేపల సేకరణ నుంచి.. జాతీయ చేపపిల్లల ఉత్పత్తి కేంద్రంలో తల్లి చేపలను ఉంచి వాటి నుంచి గుడ్డును సేకరించి హెచరీలో బాయిల్డ్ చేసి స్పాన్ను ఉత్పత్తి చేస్తారు. ఉత్పత్తి చేసిన స్పాన్ను నర్సరీల్లో వేసి చేప పిల్లలను అంగుళం సైజ్ వరకు పెంచుతారు. 5కోట్ల చేపపిల్లలు ఉత్పత్తి కావాలంటే కనీసం 15కోట్ల స్పాన్ను ఉత్పత్తి చేయాలి. అందుకు కనీసం రెండున్నర టన్నుల తల్లి చేపలు అవసరం ఉంటుంది. కానీ, ఈ సంవత్సరం 700 కేజీల తల్లి చేపలను మాత్రమే సేకరించారు. దీంతో మరోసారి స్పాన్ ఉత్పత్తి చేపడితే తల్లి చేపలు ఖాళీ అవుతాయి. అందుకే 2.4 కోట్ల స్పాన్ ఉత్పత్తి చేసి చేతులు దులుపుకోవడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారని మత్స్య సహకార సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. నిరుపయోగంగా హెచరీలు.. చేపపిల్లల కేంద్రంలో జార్ హెచరీలు కొంతకాలంగా పని చేయడం లేదు. దీంతో తాత్కాలికంగా నిర్మించిన ఎకో హెచరీల్లోనే స్పాన్ను ఉత్పత్తి చేస్తున్నారు. చైనీస్ హెచరీలను నిర్మించినా వాటిని వినియోగించడం లేదు. ఫలితంగా స్పాన్ ఉత్పత్తి కూడా తక్కువే అవుతుంది. సరైన పద్ధతిలో చేపపిల్లల ఉత్పత్తి చేపడితే జిల్లాలోని చెరువులు, ప్రాజెక్ట్లకు ఈ కేంద్రం నుంచే చేపపిల్లలను సరఫరా చేపట్టవచ్చు. కానీ, టెండర్ల ద్వారా వచ్చిన చేపపిల్లలను చెరువుల్లో వదులుతారు. కమీషన్లపై ఉన్న శ్రద్ధ చేపపిల్లల ఉత్పత్తిపై లేదని మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. చేపపిల్లల ఉత్పత్తికి మరో 20 రోజుల సమయం ఉంది. తల్లి చేపలుంటే మరింత స్పాన్ను ఉత్పత్తి చేసే అవకాశం ఉండేది. ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించి పూర్తిస్థాయిలో చేపపిల్లల ఉత్పత్తి జరిగేలా చర్యలు తీసుకోవాలని మత్స్యకారులు వేడుకుంటున్నారు. చేపపిల్లల ఉత్పత్తిలో నిర్లక్ష్యం! ఎస్సారెస్పీలో ఈ ఏడాది 54 లక్షల చేప పిల్లల లక్ష్యం పని చేయని జార్ హెచరీలు పట్టించుకోని ప్రభుత్వం, అధికారులు లక్ష్యానికి అనుగుణంగా ఉత్పత్తి ప్రస్తుత సంవత్సరం 54లక్షల చేపపిల్లల ఉత్పత్తి లక్ష్యంగా విధించారు. అందుకు అనుగుణంగానే చేపపిల్లల ఉత్పత్తి చేపడుతున్నాం. 700 కేజీల తల్లి చేపలను మాత్రమే సేకరించాం. మత్స్యకారులకు డబ్బులు చెల్లించకపోవడంతో తల్లి చేపలను ఇ వ్వడం లేదు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. – దామోదర్, ఎఫ్డీవో, పోచంపాడ్ -
బడుగు, బలహీనవర్గాలకు కాంగ్రెస్ రక్షణ
నిజామాబాద్ సిటీ: బడుగు, బలహీనవర్గాలు, గిరి జనులు, ఆదివాసీల హక్కుల కోసం కాంగ్రెస్ పా టుపడుతుందని, వారికి రక్షణగా పార్టీ ఉంటుందని రాష్ట్ర మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్ అన్నారు. కాంగ్రెస్ హయాంలోనే పేదల సంక్షేమం జరిగిందని, పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత కార్యకర్తలదేనన్నారు. జిల్లాకేంద్రంలోని హోటల్ హరితలో మూడు రోజులుగా కొనసాగుతున్న ఆదివాసీ గిరిజన కాంగ్రెస్ ఉమ్మడి జిల్లా శిక్షణా శిబిరం గురువారం ముగిసింది. కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దేశావ్యాప్తంగా 25వేల మంది ఆదివాసీలు, గిరిజనులను మంచి నాయకులుగా తీర్చిదిద్దాలన్న ల క్ష్యంతోనే ఈ శిక్షణా శిబిరాలు నిర్వహిస్తున్నామన్నా రు. అనంతరం శిక్షణలో పాల్గొన్న కార్యకర్తలకు సర్టి ఫికేట్లు అందించారు. ట్రైకార్ చైర్మన్ తేజావత్ బె ల్లయ్య నాయక్, జిల్లా ఆదివాసీ గిరిజన చైర్మన్ కెతా వత్ యాదగిరి, రాణాప్రతాప్ రాథోడ్, ఐడీసీఎంఎస్ చైర్మన్ తారాచంద్, నాయకులు రాహుల్బాల, చంద్రు నాయక్, కెతావత్ ప్రకాష్ నాయక్, చాంగుబాయి, సురేష్ నాయక్, సుభాష్ జాదవ్ ఉన్నారు. రాష్ట్ర మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్ ముగిసిన ఆదివాసీ గిరిజన కాంగ్రెస్ ఉమ్మడి జిల్లా శిక్షణా శిబిరం -
బడుల్లో ఆటస్థలాల విస్తీర్ణం ఎంత?
మోర్తాడ్(బాల్కొండ): ప్రభుత్వ ఉన్నత పాఠశాలల పరిధిలో ఉన్న క్రీడా మైదానాల విస్తీర్ణం ఎంతమేర ఉందో లెక్కించే పనిలో ఫిజికల్ డైరెక్టర్లు, పీఈటీలు నిమగ్నమయ్యారు. ఆట స్థలాల విస్తీర్ణంను లెక్కించి వాటి స్థితిగతులపై వివరాలు అందించాలని క్రీ డా సమాఖ్య ఇటీవల ఆదేశాలు ఇవ్వడంతో జిల్లావ్యాప్తంగా సిబ్బంది ఆ పనిలోపడ్డారు. చాలా చోట్ల పాఠశాలలకు ఉన్న మైదానాలలో అదనపు గదుల నిర్మాణం, అనువైన చోట షాపింగ్ కాంప్లెక్స్ల ని ర్మాణం జరిగింది. ఫలితంగా విద్యార్థులకు ఆటల కోసం అనువైన స్థలం లేకుండాపోయింది. ఈక్రమంలో బడుల్లో క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలనే ఉ ద్దేశ్యంతో క్రీడా మైదానాల విస్తీర్ణం లెక్కలు తీయాల ని పాఠశాలల క్రీడా సమాఖ్య నిర్ధేశించినట్లు తెలుస్తోంది. జిల్లాలో 255 ఉన్నత పాఠశాలలు ఉండగా 146 మంది వ్యాయామ ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు. క్రీడా మైదానాల విస్తీర్ణం ఎంత, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ ఇతరత్రా క్రీడల నిర్వహణకు అనువైన ఏర్పాట్లు ఉన్నాయా లేవా అనే వివరాలను గూగుల్ షీట్లలో వారు నమోదు చేస్తున్నా రు. క్రీడా సమాఖ్యకు వివరాలను అందించిన తరువాత ప్రభుత్వం ఏదైనా సానుకూల నిర్ణయం తీసుకుంటుందని క్రీడాభిమానులు భావిస్తున్నారు. సిబ్బందిని ఆదేశించాం.. పీడీలు,పీఈటీలు ఉన్న పాఠశాలల పరిధిలో క్రీడా మైదానాల వివరాలను నమోదు చేయాలని ఆదేశించాం. మాకు వివరాలను సేకరించాలని రాష్ట్ర క్రీడల సమాఖ్య నుంచి సూచనలు అందాయి. దీంతో క్షేత్ర స్థాయిలో వివరాలను నమోదు చేయాలని సిబందికి వెల్లడించాం. – నాగమణి, ప్రధాన కార్యదర్శి జిల్లా పాఠశాలల క్రీడల సమాఖ్య జిల్లావ్యాప్తంగా లెక్కలు తీస్తున్న పాఠశాలల క్రీడా సమాఖ్య వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని సిబ్బందికి ఆదేశం -
తెయూలో మిన్నంటిన సంబురాలు
తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీకి ఇంజినీరింగ్ కళాశాల మంజూరు చేస్తూ గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో దశాబ్దాల కల నెరవేరిందని విద్యార్థి సంఘాల నాయకులు, అధ్యాపకులు, విద్యార్థులు సంబురాలు జరుపుకున్నారు. తెయూ ఎన్ఎస్యూఐ ఆధ్వర్యంలో టీపీసీపీ చీఫ్, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్కుమార్ గౌడ్, సీఎం రేవంత్రెడ్డి, ఎమ్మెల్యే భూపతిరెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకం నిర్వహించారు. నాయకులు పుప్పాల రవి, సాగర్ నాయక్, ప్రిన్సిపాల్ ప్రవీణ్, ప్రొఫెసర్లు కనకయ్య, బాలకిషన్, పున్నయ్య, మహేందర్ పాల్గొన్నారు. పీడీఎస్యూ కొన్నేళ్లుగా చేపట్టిన ఆందోళన కార్యక్రమాలతోనే ప్రభుత్వం ఇంజినీరింగ్ కళాశాల మంజూరు చేసిందని జిల్లా కార్యదర్శి రాజేశ్వర్, సహాయ కార్యదర్శి ప్రిన్స్ ఒక ప్రకటనలో తెలిపారు. ఏబీవీపీ ఆధ్వర్యంలో.. తెలంగాణ యూనివర్సిటీ ఏబీవీపీ ఆధ్వర్యంలో ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకుని హర్షం వ్యక్తం చేశారు. ఏబీవీపీ పోరాటాలతోనే ప్రభుత్వం దిగివచ్చిందన్నారు. నాయకులు శివ, సమీర్, సాయి, అక్షయ్, అజయ్, అశోక్, లెనిన్, అఖిల్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో.. నిజామాబాద్ సిటీ: నిజామాబాద్ జిల్లాకు ఇంజినీరింగ్ కళాశాల మంజూరుచేయడంపై జిల్లా యూత్ కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తంచేశారు. జిల్లాకేంద్రంలోని కాంగ్రెస్ భవన్లో గురువారం జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు విపుల్గౌడ్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్రెడ్డి, పీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేశారు. విపుల్గౌడ్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్రెడ్డి, పీసీసీ చీఫ్ బొమ్మ మహేష్కుమార్ గౌడ్, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్లకు కృతజ్ఞతలు తెలిపారు. నాయకులు ఆకుల మహేందర్, పంచరెడ్డి చరణ్, లవంగ ప్రమోద్, నరేందర్ సింగ్ తదితరులున్నారు. -
సాంకేతిక పరిజ్ఞానాన్ని మెరుగుపర్చుకోవాలి
● సీపీ సాయిచైతన్య ఖలీల్వాడి: నేటి డిజిటల్ యుగంలో సైబర్ నేరాలు వేగంగా పెరుగుతున్నాయని, వాటిని నిరోధించేందుకు ప్రతి పోలీసు అధికారి సాంకేతిక పరిజ్ఞానాన్ని మెరుగుపర్చుకోవాలని సీపీ పోతరాజు సాయిచైతన్య పేర్కొన్నారు. కమాండ్ కంట్రోల్ హాల్లో బుధవారం సైబర్ వారియర్స్కి సైబర్ నేరాల నియంత్రణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ఫిషింగ్, వేరియంట్ ఫ్రాడ్స్, సోషల్ మీడియా మోసాలుపై అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రతి కేసును సీరియస్గా తీసుకొని బాధితులకు తక్షణమే న్యాయం చేయాలని తెలిపారు. సైబర్ నేరాలపై ప్రజలకు తరచూ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. కమిషనరేట్ పరిధిలో 1 జనవరి 2024 నుంచి జూలై 29, 2025 వరకు మొత్తం 759 సైబర్ క్రైమ్ కేసులు నమోదు కాగా రూ.3,27,12,397.84 కోర్టు ద్వారా బాధితులకు అందించామన్నారు. అనంతరం సైబర్ వారియర్స్కు టీ షర్ట్స్ అందజేశారు. కార్యక్రమంలో సైబర్ క్రైమ్ డీఎస్పీ వై వెంకటేశ్వరరావు, సీఐ మహమ్మద్ ముఖీద్ పాషా, ఎస్సై ఎం ప్రవళిక , సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రభుత్వ కళాశాలలో బయోమెట్రిక్ అటెండెన్స్
● డీఐఈవో రవికుమార్ నిజామాబాద్అర్బన్: జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలలో విద్యార్థులకు బయోమెట్రిక్ అటెండెన్స్ విధానాన్ని అమలు చేయనున్నట్లు జిల్లా ఇంటర్ విద్యాధికారి రవికుమార్ పేర్కొన్నారు. డీఐఈవో కార్యాలయంలో బుధవారం ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా డీఐఈవో మాట్లాడుతూ బయోమెట్రిక్ అటెండెన్స్ విధానం అమలుకు విద్యార్థుల బయోడేటా, ఆధార్ను ఇంటర్ బోర్డు లాగిన్లో నిక్షిప్తం చేయాలని ఆదేశించారు. అపార్ నెంబర్ గుర్తింపుతోపాటు యుడైస్ పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. విద్యార్థులు, అధ్యాపకులు సమయపాలన పాటించడంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ఇంటర్ బోర్డు సూచించిన సెంట్రలైజ్డ్ టైం టేబుల్ ప్రకారం తరగతులు నిర్వహించాలని తెలిపారు. అడ్మిషన్ల సంఖ్య పెంచాలని, పేరెంట్స్ మీటింగ్లు నిర్వహించాలని పేర్కొన్నారు. కళాశాలల్లో మరమ్మతు పనులను పూర్తి చేయాలన్నారు. -
నీటిపారుదల శాఖలో వేధింపులు!
మోర్తాడ్(బాల్కొండ): నీటి పారుదల శాఖలో కిందిస్థాయి ఉద్యోగులపై ఉన్నతాధికారి ఒకరు వేధింపులకు పాల్పడుతున్నాడంటూ ఏఈఈల అసోసియేషన్ చీఫ్ ఇంజినీర్కు ఫిర్యాదు చేయడం సర్వత్రా చ ర్చనీయాంశమైంది. ఒకరిద్దరు అధికారులు తమ త ప్పులను కప్పిపుచ్చుకునేందుకు కిందిస్థాయి ఉద్యోగులను వేధిస్తూ పబ్బం గడుపుతున్నారనే ఆరోపణ లు కొంతకాలంగా వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో నే కమ్మర్పల్లి ఏఈఈగా పని చేస్తున్న నితిన్ మానసిక ఒత్తిడికి గురై ఐదు రోజుల కింద మరణించాడు. ఉ ద్యోగంలో చేరినప్పటి నుంచి నితిన్పై ఒత్తిడి పెంచిన అధికారి అనేకమార్లు మానసికంగా బాధపెట్టా రని ఏఈఈల అసోసియేషన్ ఆరోపించింది. పెళ్లి చేసుకొని నెల రోజులు గడువక ముందే నితిన్ విధి నిర్వహణలో మరణించడం అతని కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. పెళ్లికి అవసరమైన సెలవు లు ఇవ్వకుండా గైర్హాజరైనట్లు ఉన్నతాధికారి ఒకరు రికార్డులలో చూపారనే విమర్శలున్నాయి. పండుగ లకు సెలవులు ఇవ్వకుండా జీతాన్ని నిలపివేస్తామ ని బెదిరించడంతోనే నితిన్ వేదనకు గురై మరణించాడని అసోసియేషన్ వివరించింది. నితిన్ మరణంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది. ఏఈఈ మృతికి అధికారి వేధింపులే కారణమని అసోసియేషన్ ఫిర్యాదు చర్యలు తీసుకోవాలని డిమాండ్ ఉన్నతాధికారులకు నివేదించాం నితిన్ మరణంపై వచ్చిన ఆరోపణల విషయం ఉ న్నతాధికారులకు నివేదించాం. చీఫ్ ఇంజినీర్ గురువారం నిజామాబాద్కు రానున్నారు. ఆయన విచారణ జరిపిన తర్వాత చర్యలు తీసుకునే అవకాశం ఉంది. – యశస్వి, ఎస్ఈ, ఆర్మూర్ డివిజన్ -
మైనారిటీ డిక్లరేషన్ అమలేదీ?
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: మైనారిటీల అభ్యున్నతి కోసం రూ.4 వేల కోట్లు కేటాయించి, ప్రత్యేకంగా ఉప ప్రణాళిక అమలు చేస్తామని కామారెడ్డి డిక్లరేషన్లో ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ దాన్ని మరచిందని మైనారిటీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసి ఏడాదిన్నర దాటినప్పటికీ దీని ఊసేలేదని, గత ఎన్నికల్లో పేరుకే మైనారిటీ డిక్లరేషన్ ప్రకటించారని అంటున్నారు. ఇదిలా ఉండగా కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మసీదుల్లో సేవలందిస్తున్న ఇమామ్లు, మౌజవ్ులకు ఇచ్చే గౌరవ వేతనం చెల్లించే విషయంలోనూ ప్రస్తుతం రేవంత్రెడ్డి ప్రభుత్వం విధించిన నిబంధనలతో ఇబ్బందులు పడుతున్నామని అంటున్నారు. మసీదుల్లో పనిచేసే ఇమామ్లు, మౌజవ్ులకు గత ప్రభుత్వం నెలకు రూ.5 వేల చొప్పున గౌరవ వేతనం చెల్లిస్తూ వచ్చింది. ఇలా పనిచేసే వారిలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారు సైతం ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 16,200 మంది ఇమామ్లు, మౌజమ్లు ఉన్నారు. ఈ ఏడాది ఈ గౌరవ వేతనాలకు సంబంధించి దరఖాస్తులు చేసుకోవాలని ప్రభుత్వం హైదరాబాద్లోని ఓ స్థానిక ఉర్దూ పత్రికలో ప్రకటన ఇచ్చింది. మసీదు ధ్రువీకరణ పత్రంతోపాటు గతంలో లేనివిధంగా పాన్ కార్డు, ఆదాయ ధ్రువీకరణ పత్రం సైతం జత చేయాలని నిబంధనలు పెట్టింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు ఇన్కం సర్టిఫికెట్లు తెచ్చుకోలేకపోతున్నారు. అలాగే గడువు సైతం జూలై 31 వరకే ఇవ్వడంతో అత్యధిక మంది ఇమామ్లు, మౌజమ్లు దరఖాస్తులు చేసుకోలేని పరిస్థితి నెలకొంది. దీంతో గడువు పొడిగించాలనే డిమాండ్లు వస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో ఇమామ్లకు, మౌజమ్లకు ఇచ్చే గౌరవ వేతనాన్ని రూ.12 వేలకు పెంచుతామని ప్రకటించింది. అయితే ఇచ్చిన హామీ మేరకు పెంచకపోగా ఇలా కఠిన నిబంధనలు పెట్టడమేమిటని పలువురు అంటున్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్న సమయంలో ఇలాంటి నిబంధనలు లేవని, పైగా ప్రస్తుతం నెలనెలా చెల్లింపులు చేయకుండా మూడునెలలకోసారి చెల్లిస్తున్నారని చెబుతున్నారు. డిక్లరేషన్ వదిలేసి ఇమామ్లు, మౌజవ్ుల గౌరవ వేతనాల విషయంలో కొర్రీలు దరఖాస్తులకు పరిమిత గడువుతో సమస్యలు ప్రతిపాదనలు పంపాం.. నిబంధనల్లో మార్పులు చేయాలని కోరుతూ ప్రభుత్వానికి ఇప్పటికే ప్రతిపాదనలు పంపించాం. దరఖాస్తుల గడువు పెంచే విషయమై ఇప్పటికే ప్రభుత్వానికి నివేదించాం. – అసదుల్లా, సీఈవో, రాష్ట్ర వక్ఫ్ బోర్డు కోత పెట్టేందుకే కఠిన నిబంధనలు.. ఇమామ్లు, మౌజమ్లకు ఇస్తున్న గౌరవ వేతనాల్లో కోత పెట్టేందుకే రాష్ట్ర ప్రభుత్వం కొర్రీలు పెడుతోంది. ఎన్నికల హామీ మేరకు గౌరవ వేతనాలు పెంచకపోగా కావాలనే కఠిన నిబంధనలు రూపొందించారు. ప్రభుత్వం గడువును మరో నెలరోజులు పొడిగించాలి. మూడు నెలలకొకసారి ఇస్తున్న గౌరవ వేతనాలను గత ప్రభుత్వం ఇచ్చినట్లుగా నెలనెలా ఇవ్వాలి. ఆదాయ ధ్రువీకరణ పత్రం ఇవ్వాలనే నిబంధన సరికాదు. – యాకూబ్పాషా, రాష్ట్ర అధ్యక్షుడు, మైనారిటీ సంక్షేమ సంఘం -
అభివృద్ధి పనులకు అధిక నిధులు
వర్ని (మోస్రా): ప్రజా సంక్షేమం, అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం అధిక నిధులు కేటాయిస్తుందని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎ మ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. మో స్రా మండల కేంద్రంలో నిర్మిస్తున్న మండల సముదాయ భవనాలను బుధవారం ఆయన పరిశీలించారు. వచ్చే నెల 4న మోస్రా, చందూర్ మండల కేంద్రాల్లో మండల సముదాయ భవనాలు, జనరల్ ఫంక్షన్ హాల్, గ్రామ పంచాయతీ భవనాలను రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ప్రారంభించనున్నట్లు తెలిపారు. మిగిలిన పనులను పూర్తిచేయాలని అధికారులకు సూచించారు. -
భర్త హత్యకు సుపారీ ఇచ్చిన భార్య
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసేందుకు కుట్ర పన్నిన కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఎల్లారెడ్డి డీఎస్పీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ శ్రీనివాస్రావు కేసు వివరాలను వెల్లడించారు. నాగిరెడ్డిపేట మండలంలోని చిన్న ఆత్మకూర్ గ్రామానికి చెందిన పల్లె సంపూర్ణకు అదే గ్రామానికి చెందిన జాన్సన్తో వివాహేతర సంబంధం ఉంది. తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్త పల్లె రవిని అడ్డు తొలగించుకోవాలని కుట్ర పన్నింది. రవిని హత్య చేసిన వారికి రూ.లక్ష నగదు సుపారీగా ఇవ్వాలని జాన్సన్కు చెప్పింది. దీంతో జాన్సన్ తన స్నేహితులైన చాకలి రాజు, నవీన్, మరో 17ఏళ్ల బాలుడిని సంప్రదించాడు. అందులో భాగంగా పల్లె రవికి డబ్బులు అప్పుగా ఇస్తామని నమ్మించి ఈ నెల 24న చిన్న ఆత్మకూర్ గ్రామానికి చెందిన జాన్సన్, చాకలి రాజు, తాండూర్కు చెందిన నవీన్న్తోపాటు మరో మైనర్ ఎల్లారెడ్డి మండలం పెద్దారెడ్డి గ్రామ సమీపంలో ఉన్న డంపింగ్యార్డుకు తీసుకెళ్లి మద్యం సేవించారు. అదే సమయంలో జాన్సన్తోపాటు చాకలి రాజు సుత్తితో రవి తలపై దాడి చేశారు. దీంతో రవి వారి నుంచి తప్పించుకొని సమీపంలోని ఫామ్హౌస్లోకి పరుగెత్తాడు. అయినా జాన్సన్, చాకలి రాజు వెంబడించి రవిపై మరోసారి దాడి చేసినా రవి మళ్లీ తప్పించుకొని ప్రాణాలను కాపాడుకున్నాడు. కాగా, పల్లె సంపూర్ణ తన భర్తపై జాన్సన్, చాకలి రాజుతోపాటు మరికొందరు గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారని నాగిరెడ్డిపేట పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన ఎస్సై భార్గవ్గౌడ్ దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయి. సంపూర్ణనే భర్తను హత్య చేయించేందుకు కుట్ర పన్నిందని తెలుసుకున్న పోలీసులు దాడి కేసును హత్యాయత్నంగా మార్చి విచారణ చేపట్టారు. నిందితులు పల్లె సంపూర్ణతోపాటు జాన్సన్, చాకలి రాజు, నవీన్, ఓ మైనర్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. నిందితుల నుంచి రెండు ద్విచక్ర వాహనాలతోపాటు మూడు మొబైల్ ఫోన్లు, సుత్తిని స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వివరించారు. కేసును ఛేదించిన ఎస్సైతోపాటు హెడ్ కానిస్టేబుల్ మనోహర్ రావు, కానిస్టేబుళ్లు గంగారాం, సందీప్, అన్వరీని ఎస్పీ రాజేశ్చంద్ర ప్రత్యేకంగా అభినందించినట్లు తెలిపారు. సమావేశంలో సదాశివనగర్ సీఐ సంతోష్కుమార్ పాల్గొన్నారు. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ప్లాన్ ప్రియుడితో కలిసి కుట్ర పన్నిన భార్య తీవ్రగాయాలతో తప్పించుకున్న భర్త -
నిజాయితీ చాటుకున్న కండక్టర్
కామారెడ్డి క్రైం: బస్సులో మరిచిపోయిన బ్యాగును తిరిగి ప్రయాణికురాలికి అప్పగించి కామారెడ్డి డిపోకు చెందిన కండక్టర్ సువర్ణ తన నిజాయితీని చాటుకున్నారు. ఈ ఘటన బుధవారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. డిపోకు చెందిన బస్సు సికింద్రాబాద్ జూబ్లీ బస్టాండ్కు వెళ్లింది. అందులో ఎక్కిన ఓ మహిళా ప్రయాణికురాలు తన బ్యాగును బస్సులో మర్చిపోయి జేబీఎస్లో దిగిపోయింది. బ్యాగును గమనించిన కండక్టర్ సువర్ణ తన వద్ద భద్రపరిచారు. కొద్దిసేపటి తర్వాత ప్రయాణికురాలు తన బ్యాగు కనిపించడం లేదంటూ తిరిగి బస్టాండ్కు వచ్చింది. అక్కడే ఉన్న కండక్టర్ ప్రయాణికురాలికి బ్యాగును అప్పగించింది. కాగా, బ్యాగులో నాలుగు తులాల బంగారు ఆభరణాలు, సెల్ఫోన్తోపాటు కొంత నగదు ఉంది. పోయిందనుకున్న బ్యాగు తిరిగి దొరకడంతో ప్రయాణికురాలు కండక్టర్ సువర్ణకు కృతజ్ఞతలు తెలిపారు. అక్కడే ఉన్న కొందరు ప్రయాణికులు నిజాయితీ చాటుకున్న కండక్టర్ను అభినందించారు. -
మహిళల భాగస్వామ్యంతోనే గ్రామీణాభివృద్ధి
కమ్మర్పల్లి: గ్రామ పంచాయతీ కార్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించే ప్రతి కార్యక్రమంలో మహిళలు భాగస్వామ్యం అయినప్పుడే గ్రామాల అభివృద్ధి సాధ్యమవుతుందని కేంద్ర ప్రభుత్వ పథకాల పర్యవేక్షక బృందం సభ్యులు సుధాకర్ రెడ్డి, లోహిత్ పేర్కొన్నారు. కమ్మర్పల్లి మండలంలోని అమీర్నగర్, డీసీ తండా గ్రామాల్లో వారు బుధవారం పర్యటించారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో చేపట్టిన పథకాల అమలు తీరు పరిశీలించారు. ఉపాధి హామీ పథకం కింద నిర్మిస్తున్న సీసీ రోడ్లు, డ్రైనేజీలు, భవన నిర్మాణాలతోపాటు ప్లాంటేషన్ను తనిఖీ చేశారు. అనంతరం గ్రామ పంచాయతీలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. స్వయం సహాయక బృందాలలో సభ్యులుగా ఉన్న మహిళలు ప్రభుత్వ పథకాల అమలులో భాగస్వామ్యం కావాలని సూచించారు. జాతీయ గ్రామీణ జీవనోపాధుల కల్పన మిషన్ ద్వారా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ రాయితీ ఇవ్వడంతోపాటు రుణ పరిమితిని సైతం పెంచినట్లు ఐకేపీ అధికారులు తెలిపారు. వినతుల వెల్లువ.. ఉపాధి పని దినాలను పెంచాలని, మహిళా సంఘాలకు వడ్డీ తగ్గించాలని, ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని, పెండింగ్ బిల్లులను ఇప్పించాలని కేంద్ర బృందం సభ్యులకు స్థానికులు విన్నవించారు. అందుకు స్పందించిన సభ్యులు కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నారు. డీసీ తండాలో జీపీ భవనానికి సంబంధించి బిల్లు రాలేదని మాజీ సర్పంచ్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కేంద్ర ప్రభుత్వ బృందం సభ్యులు సుధాకర్ రెడ్డి, లోహిత్ -
ఆయిల్ పామ్ నర్సరీని సందర్శించిన కలెక్టర్
పెర్కిట్(ఆర్మూర్): ఆర్మూర్ మండలం చేపూర్లో ఏర్పాటు చేసిన ఆయిల్ పామ్ నర్సరీని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయిల్పామ్ సాగుతో కలిగే ప్రయోజనాలపై రైతులకు అవగాహన కల్పించాలని ఉద్యానవన శాఖ అధికారులకు సూచించారు. ఆయిల్ పామ్ సాగుకు ముందుకు వచ్చే రైతులకు ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా తోడ్పాటును అందజేస్తామన్నారు. నర్సరీలో లక్షన్నర ఎకరాలకు సరిపడా మొక్కలను అందుబాటులో ఉంచడంపై కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఉద్యానవన శాఖ సంయుక్త సంచాలకులు శ్రీనివాస్ రావు, ఏడీఏ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. జ్యుడీషియల్ అసోసియేషన్ సంయుక్త కార్యదర్శిగా శ్రీదేవి ఆర్మూర్టౌన్: రాష్ట్ర హైకోర్టు జ్యుడీషియల్ అసోసియేషన్ ఎన్నికలలో సంయుక్త కార్యదర్శిగా ఆర్మూర్ సీనియర్ సివిల్ జడ్జి శ్రీదేవి గెలుపొందారు. ఈ సందర్భంగా జూనియర్ సివిల్ జడ్జి సరళరాణి, ఆర్మూర్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం జడ్జి శ్రీదేవిను శాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జక్కుల శ్రీధర్, జెస్సు అనిల్, ఉపాధ్యక్షుడు గటడి ఆనంద్, కోశాధికారి గజ్జల చైతన్య, కార్యదర్శి శ్రావణ్, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. మధ్యాహ్న భోజన బిల్లులు విడుదల నిజామాబాద్అర్బన్: జిల్లాలోని మధ్యాహ్న భోజనానికి సంబంధించి 2025– 26 సంవత్సర రెగ్యులర్ బిల్లులు కోసం నిధులు విడుదల చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ ఒక ప్రకటనలో తెలిపారు. ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు కుకింగ్ నిధులు రూ.2 కోట్ల 15 లక్షల 328, సీసీహెచ్ల గౌరవ వేతనం రూ.48 లక్షలు ఆయా మండలాల వారీగా రిలీజ్ చేశామన్నారు. విద్యార్థులతో పాఠశాల పనులు నిజామాబాద్అర్బన్: ప్రభుత్వ పాఠశాలలో స్కావెంజర్లు చేయాల్సిన పనులను విద్యార్థులతో చేయిస్తున్నారు. జిల్లాలోని ఎడపల్లి మండలం మంగల్పాడ్ పాఠశాలలో ఇద్దరు స్కావెంజర్లు ఉన్నా అక్కడి ఉపాధ్యాయులు విద్యార్థులతో పనులు చేయిస్తున్నారు. పాఠశాల ఆవరణ ఊడ్చడం, బెంచీలు, కుర్చీలను మోయించడం తదితర పనులు చేయిస్తున్నారు. బుధవారం పాఠశాలలో విద్యార్థులు వివిధ పనులు చేస్తూ కనిపించారు. స్కావెంజర్లు ఇలా వచ్చి అలా వెళ్తున్నారని, హెచ్ఎం కూడా పట్టించుకోవడం లేదని తల్లిదండ్రులు తెలిపారు. చదువుకోవాల్సిన పిల్లలతో పనులు చేయించడం సరికాదని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. -
వారంలో రెండ్రోజులు ఫిజియోథెరపీ సేవలు
ఆర్మూర్: తెలంగాణ సమగ్ర శిక్ష సహిత విద్యా విభాగం ఆధ్వర్యంలో జిల్లాలో శారీరక వైకల్యంతో బాధపడుతున్న చిన్నారులకు భవిత కేంద్రాల్లో వారానికి రెండుసార్లు ఉచిత ఫిజియోథెరపీ వైద్య శిబిరాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణ యం తీసుకుంది. ఇప్పటి వరకు వారానికి ఒకసారి మాత్రమే నిర్వహించే శిబిరాలను రెండుసార్లకు పెంచడంపై పిల్లల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, డీఈవో అశోక్, సహిత విద్యా విభాగం జిల్లా కోఆర్డినేటర్ పడకంటి శ్రీనివాస్రావు ఆధ్వర్యంలో ఫిజియోథెరపీ శిబిరాల నిర్వహణకు ప్రణాళిక సిద్ధం చేశారు. అందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా 29 మండలాల్లో శారీరక వైకల్యంతోపాటు సెరిబ్రల్ పాల్సీతో బాధపడుతూ నడవలేని స్థితిలో ఉన్న 426 మంది విద్యార్థులను గుర్తించారు. వీరికి ఇన్క్లూసివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ టీచర్ల సహకారంతో ఎంపిక చేసిన ఫిజియోథెరపిస్టులు సేవలందిస్తున్నారు. ఆర్మూర్ మండల కేంద్రంలోని భవిత కేంద్రంలో మంగళ, గురువారాల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. ఫిజియోథెరపిస్టుల కొరత.. జిల్లాలోని భవిత కేంద్రాలకు 15 మంది ఫిజియోథెరపిస్టులు అవసరం కాగా, ప్రస్తుతం ఎనిమిది మంది మాత్రమే సేవలందిస్తున్నారు. ఫిజియోథెరపిస్టుల కొరత ఉండటంతో కొత్త వారిని విధుల్లో చేర్చుకునేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక్కో శిబిరానికి వెయ్యి రూపాయల చొప్పున ఫిజియోథెరపిస్టులకు ఫీజు రూపంలో చెల్లిస్తున్నారు. వీరు ఫిజియోథెరపీ పరికరాలను ఉపయోగించి నడకను నేర్పిస్తున్నారు. పిల్లలతోపాటు వారి తల్లిదండ్రులకు ఇంటి వద్దే చేయాల్సిన వ్యాయామాన్ని సూచిస్తారు. కాగా, తీవ్రమైన వైకల్యంతో బాధపడే పిల్లలను ప్రతిసారి శిబిరానికి తీసుకురావడం ఇబ్బందికరంగా ఉండడంతో ఇంటి వద్దనే ఫిజియోథెరపీ చికిత్సను ఉచితంగా అందించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. దివ్యాంగులకు వరం.. సహిత విద్యా విభాగం దివ్యాంగ విద్యార్థులకు నడక నేర్పుతున్న భవిత కేంద్రాలు -
త్వరలో అంతర్రాష్ట్ర చెక్పోస్టు ఎత్తివేత
● ఆమోదం తెలిపిన రాష్ట్ర మంత్రివర్గం ● సాలూరాలో ఇక తనిఖీలు చేసేది ఎకై ్సజ్శాఖ మాత్రమే..బోధన్: జిల్లా సరిహద్దులోని ఏకై క రవాణా చెక్పోస్టు(సాలూర) ఇక మూతపడనుంది. జాతీయ ర హదారులపై రవాణాకు ఇబ్బందులు తలెత్తకుండా చెక్పోస్టులను తొలగించాలని కేంద్ర ప్రభుత్వం సూచించిన నేపథ్యంలో అంతర్రాష్ట్ర చెక్పోస్టులను రద్దు చేయాలని రాష్ట్ర మంత్రివర్గం సోమవారం నాటి సమావేశంలో తీర్మానించిన విషయం తెలిసిందే. చెక్పోస్టు ఎత్తివేతకు సంబంధించి ప్రభుత్వం నుంచి త్వరలో ఆదేశాలు వచ్చే అవకాశాలున్నాయ ని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. సాలూర చెక్ పోస్టులో ఒక ఎంవీఐ, ఆరుగురు ఏఎంవీఐలు, ఐదుగురు కానిస్టేబుళ్లు, కంప్యూటర్ ఆపరేటర్ పని చేస్తున్నారు. కేంద్ర రవాణ మంత్రిత్వ శాఖ అమలులోకి తెచ్చిన వాహన్ పోర్టల్ ద్వారా ఇప్పటికే రవాణ శాఖకు సంబంధించిన సేవలను అందిస్తున్నారు. ఇక నుంచి వాహన్ పోర్టల్, సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ కొనసాగనుంది. దశాబ్దాల క్రితం ఏర్పాటు తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దులోని సాలూర ప్రాంతంలో నాలుగున్నర దశాబ్దాల క్రితం అంతర్రాష్ట్ర చెక్ పోస్టును ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రారంభంలో గ్రామ బస్టాండ్ కూడలిలో వీడీసీకి చెందిన రేకుల షెడ్డులో ఏర్పాటు చేసి కొన్నేళ్లపాటు అక్కడే కొనసాగించారు. ఆ తర్వాత మంజీర నది ఒడ్డుకు మార్చారు. మహారాష్ట్రకు వెళ్లే ప్రధాన రోడ్డుకు ఆనుకుని ప్రభుత్వం సుమారు 10 ఎకరాల భూమి కొనుగోలు చేసి అధునాతన భవనాన్ని నిర్మించింది. భవనంలో అంతర్రాష్ట్ర ఉమ్మడి తనిఖీ ప్రాంగణం పేరుతో రవాణ, వాణిజ్యపన్నుల శాఖ, సివిల్ సప్లయీస్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. జీఎస్టీ విధానం అమలులోకి వచ్చిన తరువాత వాణిజ్య పన్నుల శాఖను ఎత్తివేశారు. ఆ తరువాత వ్యవసాయ మార్కెట్ కమిటీ, సివిల్ సప్లయీస్ చెక్ పోస్టులు తొలగించారు. ప్రస్తుతం రవాణా శాఖ, ఎకై ్సజ్ శాఖ చెక్పోస్టులు మాత్రమే ఉండగా, ఇక నుంచి ఎకై ్సజ్ చెక్ పోస్టు ఒక్కటే మిగలనుంది. సాలూర శివారులో చెక్ పోస్టు ఇక్కడి నుంచి రూ.కోట్ల ఆదాయం ఆర్టీవో చెక్పోస్టు ద్వారా నాలుగేళ్ల క్రితం వరకు ఏటా రూ.3 కోట్ల నుంచి రూ.4 కోట్ల వరకు రాష్ట్ర ప్రభుత్వాన్నికి ఆదాయం సమకూరేది. వాహన పర్మిట్లు, ఓవర్ లోడ్ అపరాధ రుసుము, ఇతర పన్నుల రూపంలో చెక్పోస్టు ద్వారా ఖజానాకు ఆదాయం జమయ్యేది. ప్రస్తుతం ఆదాయం సగానికి తగ్గిపోయింది. ఏసీబీ దాడులతో అనేకసార్లు ఈ చెక్పోస్టు వార్తల్లో నిలిచింది. -
కలెక్టర్ వచ్చి టీసీ ఇప్పించే..
● ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు టీసీలు ఇచ్చేందుకు నిరాకరణ ● ప్రైవేట్ కళాశాలకు వెళ్లి ఆరా తీసిన కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డికమ్మర్పల్లి: మండల కేంద్రంలోని శ్రీభాషిత జూనియర్ కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ పూర్తి చేసిన 15 మంది విద్యార్థులు ఫీజుల భారాన్ని భరించలేక ప్ర భుత్వ కళాశాలకు వెళ్లాలనుకున్నారు. టీసీల కోసం దరఖాస్తు చేసుకోగా.. ప్రైవేట్ కళాశాల యాజమా న్యం నిరాకరించింది. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రవేశానికి బుధవారంతో గడువు ముగుస్తుందని ఆందోళనకు గురయ్యారు. కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి మండల కేంద్రంలో ఆకస్మిక తనిఖీలు చేస్తూ వెళ్తుండడాన్ని గమనించిన ఆ విద్యార్థులు వాహనాన్ని ఆపి తమ గోడును వెళ్లబోసుకున్నారు. విషయాన్ని తీవ్రంగా పరిగణించిన కలెక్టర్ వెంటనే ప్రైవేట్ కళాశాలకు వెళ్లారు. టీసీలు ఇవ్వకుండా వి ద్యార్థులను పక్షం రోజులుగా ఎందుకు ఇబ్బందులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నచ్చిన కాలేజీలో చదివే స్వేచ్ఛ విద్యార్థులకు ఉందని, సె కండియర్ కూడా మీ కాలేజీలోనే చదవాలని బలవంతం చేయడం సమంజసం కాదన్నారు. విద్యార్థులకు ఇప్పటికిప్పుడు టీసీలు ఇవ్వాలని, లేనిపక్షంలో చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తహసీల్దార్ ప్రసాద్, ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపల్ మధుకుమార్ను అక్కడికి పిలిపించుకుని వి ద్యార్థులకు వెంటనే టీసీలు ఇప్పించి, ప్రభుత్వ కాలేజీలో ప్రవేశాల ప్రక్రియ పూర్తయ్యేలా చూడాల ని ఆదేశించి వెళ్లారు. తహసీల్దార్ అక్కడే ఉండి విద్యార్థులకు టీసీలు ఇప్పించి ప్రభుత్వ కళాశాలలో అడ్మిషన్లు ఇప్పించడంతో విద్యార్థులు ఊపిరిపీల్చుకున్నారు. -
రాత్రికి రాత్రే అడ్రస్ మారింది!
మాక్లూర్: మండలంలోని మాదాపూర్ శివారులో కొనసాగిన మాక్లూర్ పోలీస్స్టేషన్ దాస్నగర్ వద్ద నిర్మించిన నూతన భవనంలోకి రాత్రికి రాత్రే మారింది. దాస్నగర్ వద్ద నూతన భవనం నిర్మించినప్పటికీ పోలీస్ స్టేషన్ అక్కడికి ఎప్పుడు తరలిస్తారనేదానిపై స్పష్టత లేదు. మంగళవారం రాత్రి వరకు మాదాపూర్లో కొనసాగిన స్టేషన్ కార్యకలాపాలు బుధవారం ఉదయం దాస్నగర్లో ప్రారంభమయ్యాయి. మాదాపూర్కు వచ్చిన పలువురు ఇక్కడి నుంచి స్టేషన్ తరలిపోయిందని తెలుసుకుని అవాక్కయ్యారు. స్టేషన్ తరలిస్తున్నట్లు లేదా తరలినట్లు కనీసం ఎక్కడా బోర్డు ఏర్పాటు చేయలేదని విస్మయం వ్యక్తం చేశారు. మాదాపూర్ నుంచి దాస్నగర్కు తరలిన మాక్లూర్ పీఎస్ -
వాడి చూడండి.. తర్వాతే నమ్మండి!
డొంకేశ్వర్(ఆర్మూర్): బస్తాల్లో వచ్చే యూరియా వి నియోగాన్ని క్రమంగా తగ్గించాలని, దానికి ప్రత్యామ్నాయంగా వచ్చిన ద్రవ రూపంలోని నానో యూరియాను వాడాలని వ్యవసాయశాఖ రైతులకు అవగాహన కల్పిస్తోంది. మండల, గ్రామ స్థాయిలో వ్యవసాయాధికారులు రైతులను కలిసి నానో యూ రియా వల్ల కలిగే లాభాలను వివరిస్తూ అపోహాలను పోగొడుతున్నారు. వాడి చూసిన తరువాత నమ్మాలని సూచిస్తున్నారు. లాభాలతోపాటు ఖర్చు తక్కువ కావడంతో జిల్లాలో కొంతమంది రైతులు నానో యూరియాను వినియోగిస్తున్నారు. నమ్మకం ఏర్పడిన తర్వాత బస్తాల యూరియా జోలికి వెళ్లడం లేదు. దీంతో జిల్లాలో నానో యూరియా విక్రయాలు పెరిగినట్లు వ్యవసాయ శాఖ చెబుతోంది. ఇటీవల దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం యూరియా వినియోగాన్ని తగ్గించాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. అలాగే రైతులకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. ● ఇది గుళికల రూపంలో ఉంటుంది. ఒక బస్తా 45 కిలోలు ఉంటుంది. ఖరీదు రూ.267. ● వరికై తే ఎకరానికి 3 నుంచి 4 బస్తాలు, మొక్కజొన్నకు 4 నుంచి 6 బస్తాలు అవసరమవుతాయి. ● బస్తాల రవాణాకు ఇబ్బందులు. తెచ్చిన వాటిని నిల్వ చేసుకోవడం, మళ్లీ పొలానికి తీసుకెళ్లడం కష్టం. ఖర్చుతో కూడుకున్న పని. ● గుళికల యూరియా ప్రభావం రెండు, మూడు రోజులే ఉంటుంది. పొలానికి వాడిన మొత్తం యూరియాలో 30 శాతమే మొక్కకు అందుతుంది. ● చల్లిన తర్వాత నీటిలో కరిగిపోయి నేల, గాలిలో కలిసిపోయి వాతావరణ, భూ కాలుష్యం జరుగుతుంది. పంట దిగుబడి తగ్గే అవకాశం. ● పొలాల్లో చల్లేందుకు కూలీలు అవసరం, ఖర్చుతో కూడుకున్న పని.బస్తాల యూరియా నానో యూరియాపై రైతులకు విస్తృత అవగాహన పంటలకు కలిగే ప్రయోజనాలను వివరిస్తున్న వ్యవసాయ శాఖ -
నిజామాబాద్
సాంకేతిక పరిజ్ఞానం.. సైబర్ నేరాలను నిరోధించేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని మెరుగుపర్చుకోవాలని సీపీ పోతరాజు సాయిచైతన్య అన్నారు. గురువారం శ్రీ 31 శ్రీ జూలై శ్రీ 2025– 8లో uప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలు అంతంత మాత్రంగానే అందుతున్నాయి. 24 గంటల పాటు తెరిచి ఉండాల్సిన పీహెచ్సీలలో వైద్యులు ఉండటం లేదు. సీహెచ్సీలలో వైద్యులు ఉన్నా రాత్రుల్లో విధులకు డుమ్మా కొడుతున్నారు. కొన్ని పీహెచ్సీలను ఉదయం సాయంత్రం వరకు తెరిచి ఉంచినా సేవలు మాత్రం అందడం లేదు. దీంతో ప్రస్తుతం సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్న తరుణంలో రోగులు ప్రయివేట్ ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. న్యూస్రీల్ -
దవాఖానాలో కాదన్నారు..108 సిబ్బంది చేశారు
బోధన్: బోధన్ మండలం బెల్లాల్కు చెందిన గర్భిణి బర్మె లక్ష్మీబాయికి పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు పట్టణంలోని జిల్లా ఆస్పత్రికి బుధవారం తీసుకువచ్చారు. ఆమెను పరీక్షించిన వైద్య సిబ్బంది పరిస్థితి క్రిటికల్గా ఉందని నిజామాబాద్లోని జీజీహెచ్కు తీసుకెళ్లాలని సూచించారు. లక్ష్మీబాయిని 108 అంబులెన్స్లో తరలిస్తుండగా మార్గమధ్యలో నొప్పులు ఎక్కువయ్యాయి. దీంతో సిబ్బంది అంబులెన్స్ను సారంగాపూర్ వద్ద నిలిపివేశారు. ఈఆర్సీపీ వైద్యుడు మనీశ్ సలహా మేరకు కాన్పు చేయగా లక్ష్మీబాయి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. క్షేమంగా ఉన్న తల్లీబిడ్డలను నిజామాబాద్ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. లక్ష్మీబాయికి సాధారణ కాన్పు చేసిన 108 అంబులెన్స్ ఈఎంటీ లక్ష్మణ్, ఫైలట్ జావీద్ను వైద్యులు, లక్ష్మిబాయి కుటుంబ సభ్యులు అభినందించారు. బోధన్లోని జిల్లా ఆస్పత్రిలో సాధ్యం కాదని చెప్పగా.. 108 అంబులెన్స్లో సాధారణ కాన్పు కావడం గమనార్హం. బోధన్ జిల్లా ఆస్పత్రి నుంచి జీజీహెచ్కు తరలిస్తుండగా.. 108 అంబులెన్స్లో గర్భిణి ప్రసవం సాధారణ కాన్పు చేసిన సిబ్బంది -
రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలి
ఖలీల్వాడి: డ్రైవర్లు రోడ్డు భద్రతా నిబంధనలు పాటిస్తే ఎలాంటి ప్రమాదాలు సంభవించవని నిజామాబాద్ ఆర్టీసీ ఆర్ఎం జ్యోత్స్న అన్నారు. నిజామాబాద్ రీజినల్ మేనేజర్ కార్యాలయంలో మంగళవారం ఎలక్ట్రికల్ బస్సు డ్రైవర్ల ట్రైనింగ్ ప్రోగ్రామ్ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆర్ఎం మాట్లాడుతూ.. వాహనం నడపడానికి ముందు ప్రాథమిక తనిఖీలు చేయాలన్నారు. సాంకేతిక సమస్యలు గుర్తించిన వెంటనే గ్యారేజీకి నివేదించాలన్నారు. ప్రయాణికులతో శాంతంగా, మర్యాదగా మాట్లాడాలని, పెద్దవారికి, మహిళలకు, చిన్నపిల్లలకు సహాయంగా ఉండాలన్నారు. డ్రైవర్లు సమయపాలన పాటించాలని, ఉద్యోగం పట్ల నిజాయితీగా ఉండాలన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వాహనం వినియోగించకూడదన్నారు. ఆర్టీసీ గౌరవం కాపాడే బాధ్యత డ్రైవర్లు, సిబ్బంది పై ఉందన్నారు. -
తాడ్వాయిలో వృద్ధురాలి ఆత్మహత్య
తాడ్వాయి(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలో ఓ వృద్ధురాలు ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై మురళి తెలిపారు. వివరాలు ఇలా.. మండల కేంద్రానికి చెందిన ఎరుకట్ల సాయవ్వ(77) అనే వృద్ధురాలు గత యేడాది నుంచి అర్షమొలలు, వెన్ను నొప్పితో బాధపడుతుండేది. ఎన్ని ఆస్పత్రులలో చూపించినప్పటికీ నొప్పి నయం కాలేదు. దీంతో జీవితంపై విరక్తి చెందిన సాయవ్వ సోమవారం సాయంత్రం కాలనీలోని బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. రాత్రివేళ కుటుంబ సభ్యులు సాయవ్వ కోసం గాలించగా బావిలో మృతదేహం కనబడింది. మరుసటి రోజు పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతురాలి కుమారుడు ఎల్లయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. సిరికొండ మండలంలో ఒకరు.. సిరికొండ: మండలంలోని మెట్టుమర్రి తండాలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. వివరాలు ఇలా.. తండాకు చెందిన కేతావత్ తిరుపతి(42) అనే వ్యక్తికి నీల, గోదావరి అనే ఇద్దరు భార్యలు ఉన్నారు. కొన్ని రోజుల క్రితం రెండో భార్యతో గొడవ జరగడంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. ఇటీవల ఆమె తన భర్తపై ధర్పల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈక్రమంలో అతడు మద్యానికి బానిసై, మంగళవారం ఇంట్లోనే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబసభ్యులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. మృతుడి మొదటి భార్యకు ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రామకృష్ణ తెలిపారు. -
ఆదివాసీలను నాయకులుగా తీర్చిదిద్దుతాం
నిజామాబాద్ సిటీ: దేశవ్యాప్తంగా 25 వేల మంది ఆదివాసీలను నాయకులుగా తీర్చిదిద్దుతామని, అందులో భాగంగానే శిక్షణా శిబిరాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క అన్నారు. జిల్లా కేంద్రంలోని హోటల్ హరితలో మంగళవారం నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆదివాసీ గిరిజన చైర్మన్ కెతావత్యాదగిరి అధ్యక్షతన ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఆదివాసీ గిరిజన శిక్షణా తరగతులు నిర్వహించారు. కార్యక్రమానికి మంత్రి సీతక్క హాజరై, ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఏఐసీసీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ సూచనలతో సీఎం రేవంత్రెడ్డి, పీసీసీ చీఫ్ బొమ్మమహేష్కుమార్ గౌడ్ల ఆదేశాలతో తెలంగాణలో ఎస్టీలకు శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. కేంద్రం చర్యలతో ఆదివాసీల జీవితాలు చిన్నాభిన్నం అవుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. దేశంలో రాజ్యాంగ ఉల్లంఘనలు జరుగుతున్నాయని, రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. రాజ్యాంగ పరిరక్షణకు కాంగ్రెస్ బాధ్యత తీసుకుంటుందన్నారు. ప్రభుత్వ సలహాదారు మహ్మద్ అలీ షబ్బీర్ మాట్లాడుతూ.. జల్–జమీన్–జంగిల్ (నీరు, అట వీ, భూ వనరులు)పై గిరిజన హక్కుల కోసం కాంగ్రెస్ కట్టుబడి ఉందన్నారు. గిరిజనుల అటవీ భూ ములు, ఇతర వనరులు హక్కుల పరిరక్షణ కోసం కాంగ్రెస్ ఎల్లపుడూ పోరాడుతూనే ఉందన్నారు. మాజీ ఎంపీ మదుయాష్కీగౌడ్ మాట్లాడుతూ.. ఈ శిక్షణ శిబిరంలో శిక్షణ పొందిన వారు ఆదివాసి, గిరిజనులను సరైన మార్గంలో నడిపించి రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలన్నారు. కాంగ్రెస్పార్టీ ఎస్టీ సెల్ అధ్యక్షుడు బెల్లయ్య నా యక్ మాట్లాడుతూ.. పీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ సూచనలతో ఇప్పటివరకు 6 జిల్లాల్లో శిక్షణా తరగతులు పూర్తిచేయగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా 7వది అని తెలిపారు. జాతీయ కన్వీనర్ రాహుల్బాల్, ట్రైకార్ రాష్ట్ర చైర్మన్ తేజావత్ బెల్లయ్య నాయక్, ఎస్టీసెల్ జిల్లా చైర్మన్ కెతావత్ యాదగిరి రాథోడ్, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్బిన్హందాన్, టీఎస్సీడ్స్ చైర్మన్ అవినాష్రెడ్డి, ఏఎంసీ చైర్మన్ గంగారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజారెడ్డి, పీసీసీ డెలిగేట్ బాడ్సి శేఖర్గౌడ్, కామారెడ్డి జిల్లా చైర్మన్ రాణా ప్రతాప్ రాథోడ్, నాయకులు కోటియా నాయక్, మల్లేశ్వరి, చంద్రకళ, గణేష్ నాయక్, వినోద్ నాయక్, నరేష్ నాయక్, సునీల్ జాదవ్, మల్లికార్జున్, కెతావత్ ప్రకాష్ నాయక్, హరినాయక్ పాల్గొన్నారు. గిరిజనుల హక్కులను కేంద్రం హరిస్తోంది జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క నగరంలో ఆదివాసీ గిరిజన కాంగ్రెస్ ఉమ్మడి జిల్లా శిక్షణా తరగతులు -
నూతన ఆవిష్కరణలతో సమాజానికి మేలు
నిజామాబాద్అర్బన్: ఎప్పటికప్పుడు కొత్తగా వచ్చే ఆవిష్కరణలు సమాజానికి మేలు చేస్తాయని గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ రాంమోహన్రెడ్డి అన్నారు. కళాశాలలో మంగళవారం తెలంగాణ ఆవిష్కరణల విభాగం ఆధ్వర్యంలో ‘నూతన ఆవిష్కర్తల పరిచయ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్బంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. చదువుతో సంబంధం లేకుండ కూడా కొత్తకొత్త ఆలోచనలతో ఎన్నో ఆవిష్కరణలు వస్తున్నాయన్నారు. వారిని ప్రోత్సహించాలన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఔత్సాహిక విద్యార్థులు వివిధ రకాల ఆవిష్కరణల గురించి ప్రస్తావించారు. రమేష్, అనూష, ముత్తెన్న, చంద్రశేఖర్, పూర్ణ చందర్ రావు, రామస్వామి, రమేశ్ గౌడ్ పాల్గొన్నారు. నూతన కార్యవర్గం ఎన్నిక తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ ఏబీవీవీ నూతన కార్యవర్గాన్ని మంగళవారం తెయూలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా పృథ్వీరాజ్, ప్రధాన కార్యదర్శిగా సమీర్ ఎన్నికయ్యారు. కమిటీ ఉపాధ్యక్షులుగా అక్షయ్, అశోక్, అజయ్, మనోజ్, జ్యోతి, జాయింట్ సెక్రెటరీలుగా నవీన్, లెనిన్, అఖిల్, రాకేష్, నరేందర్, కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, రాష్ట్ర ఆల్ యూనివర్సిటీస్ కన్వీనర్ జీవన్ మాట్లాడుతూ.. 60 లక్షల సభ్యత్వంతో ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంఘంగా ఏబీవీపీ ఉందన్నారు. అనంతరం ఈ నెల 8న ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రక్తదానం చేసిన విద్యార్థులకు ధ్రువపత్రాలను అందజేశారు. సభ్యులు శివ, విభాగ్ సంఘటన మంత్రి హర్ష, రాష్ట్ర కార్య సమితి సభ్యులు అమృత్చారి, స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ మోహన్, నాయకులు సాయికుమార్, నవీన్, నాగరాజు, ప్రమోద్ పాల్గొన్నారు. అథ్లెటిక్స్ పోటీలో కంజర విద్యార్థి ప్రతిభ నిజామాబాద్ రూరల్: జిల్లా కేంద్రంలోని నాగారం రాజారాం స్టేడియంలో ఇటీవల అండర్–12 జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో మోపాల్ మండలానికి చెందిన కంజర పాఠశాల విద్యార్థి కుందన్ సిద్ధాంత్ జావెలిన్త్రోలో రెండో స్థానంలో నిలిచినట్లు పాఠశాల హెచ్ఎం తెలిపారు. ఈసందర్భంగా విద్యార్థిని ఉపాధ్యాయులు మంగళవారం అభినందించారు. -
కుక్కల దాడిలో బాలుడికి గాయాలు
ఎల్లారెడ్డిరూరల్: పట్టణంలోని న్యూ ఆబాది కాలనీకి చెందిన అర్హాన్ అనే బాలుడిపై కుక్కలు దాడి చేసి గాయపర్చిన ట్లు స్థానికులు మంగళవారం తెలిపారు. బాలు డు మంగళవారం రాత్రి ట్యూషన్ నుంచి వస్తుండగా కుక్కలు వెంటపడి గాయపర్చాయి. ఎల్లారెడ్డి పట్టణంలో 8 మందిని కుక్కలు దాడి చేసి గాయపర్చిన ఘటన మరవక ముందే బాలుడిపై దాడి చేయడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. వెంటనే అధికారులు స్పందించి పట్టణంలో కుక్కల నివారణకు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.తాళం వేసిన ఏడిళ్లలో చోరీ సిరికొండ: మండలంలోని గడ్కోల్ గ్రామంలో సోమవారం అర్ధరాత్రి తాళం వేసి ఉన్న ఏడు ఇళ్లల్లో చోరీ జరిగినట్లు స్థానికులు తెలిపారు. గ్రామంలోని పలువురి ఇళ్లకు ఉన్న తాళాలు పగలగొట్టి ఉండటంతో మంగళవారం ఉదయం స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. గుర్తుతెలియని దుండగులు గ్రామంలోని మల్కి నరేష్ ఇంటి వద్ద సీసీ కెమెరా ఉండగా దానిపై వస్త్రం పడేసి, తాళం పగులగొట్టి ఇంట్లోకి చొరబడ్డారు. ఇంట్లోని తులం మూడు గ్రామాల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లినట్లు తెలిసింది. యాదుల్ అనే వ్యక్తి ఇంట్లో రూ.పది వేల నగదు, పదిహేను తులాల వెండి వస్తువులు, మేర గంగాదాసు ఇంట్లో రూ.4వేల నగదు ఎత్తుకెళ్లారు. మరో నాలుగిళ్ల తాళాలను ధ్వంసం చేయగా, చోరీ ఏమి జరగలేదని గ్రామస్తులు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు ధర్పల్లి సీఐ భిక్షపతి, ఎస్సై రామకృష్ణలు చోరీ జరిగిన ఇళ్లను పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. కొండ చిలువను చంపిన గ్రామస్తులు లింగంపేట(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలోని మత్తడికింది పల్లె శివారులో మంగళవారం సాయంత్రం స్థానికులు కొండ చిలువను చంపారు. కొండచిలువ గుర్తు తెలియని జంతువును మింగివేడయంతోనే చంపినట్లు గ్రామస్తులు తెలిపారు. కొండ చిలువ సమీపంలోని గుట్టల పైనుంచి వచ్చిందా, పెద్దవాగు శివారులో నుంచి వచ్చిందో తెలియక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొండ చిలువ సుమారు 8 అడుగులపైన పొడవు ఉంటుందని వారు తెలిపారు. -
వ్యవసాయ కళాశాల ఏర్పాటుకు ‘రుద్రూర్’ అనువైనది
రుద్రూర్: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు మంజూరైన వ్యవసాయ కళాశాల ఏర్పాటుకు రుద్రూర్ వ్యవసాయ పరిశోధన కేంద్ర అనువైన ప్రాంతమని రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. మండలంలోని రుద్రూర్ వ్యవసాయ పరిశోధన కేంద్రం భవనాలు, క్వార్టర్లు, ఆడిటోరియం, వసతి భవనాలను ఆయన మంగళవారం పరిశీలించారు. అనంతరం పోచారం మాట్లాడుతూ.. వ్యవసాయ కళాశాల ఏర్పాటుకు అనువైన ప్రాంతం కోసం ప్రత్యేక బృందం స్థల పరిశీలన చేస్తున్నదన్నారు. రుద్రూర్ పరిశోధన కేంద్రం పరిధిలో మూడు వందల ఎకరాల స్థలం, మౌలిక వసతులు, భవనాలు, ప్రయోగ శాలలు, ఆడిటోరియం, వసతి గృహలు ఉన్నాయన్నారు. ఇక్కడే వ్యవసాయ పాలిటెక్నిక్, ఫుడ్ సైన్స్ టెక్నాలజీ కళాశాలలు కొనసాగుతున్నాయని, శాస్త్రవేత్తలు నిరంతరం నూతన వరి, చెరుకు వంగడాల రూప కల్పనలో నిమగ్నమవుతున్నారన్నారు. ఈ ఆంశాలు వందశాతం వ్యవసాయ కళాశాల ఏర్పాటుకు దోహదపడుతాయన్నారు. ఈ ఆంశాలను సీఎం, మంత్రులకు వివరిస్తానన్నారు. పరిశోధన కేంద్రం ఇన్చార్జి హెడ్ పరమేశ్వరి, ఫుడ్సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ వెంకట్ రెడ్డి, తహసీల్దార్ తారాబాయి, ఎంపీడీవో భీమ్రావ్, మాజీ ఎంపీటీసీ నరోజి గంగారాం, విండో చైర్మన్ సంజీవరెడ్డి, మాజీ చైర్మన్ పత్తి రాము, నాయకులు తోట అరుణ్కుమార్, రామగౌడ్, పార్వతి ప్రవీణ్ తదితరులు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి రుద్రూర్ వ్యవసాయ పరిశోధన కేంద్రం పరిశీలన -
విద్యుత్ షాక్తో ఒకరి మృతి
భిక్కనూరు: మండలంలోని తిప్పాపూర్ గ్రామంలో ఒకరు విద్యుత్ షాక్తో మృతి చెందినట్లు భిక్కనూరు ఏఎస్సై నర్సయ్య తెలిపారు. వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన మహమ్మద్ గౌసొద్దీన్ (55) మంగళవారం స్నానం చేసేందుకు తన ఇంట్లో వాటర్ హీటర్ ఆన్ చేయడానికి యత్నిస్తుండగా విద్యుత్ సరఫరా జరిగి కరెంట్ షాక్తో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య ముంతాజ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం కామారెడ్డి ఆస్పత్రికి తరలించినట్లు ఏఎస్సై తెలిపారు. నగరంలో గుర్తుతెలియని వ్యక్తి... ఖలీల్వాడి: నగరంలోని వీక్లీ మార్కెట్ కల్లు దుకాణం సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందినట్లు ఒకటో టౌన్ ఎస్హెచ్వో రఘుపతి మంగళవారం తెలిపారు. కల్లు దుకాణం సమీపంలో ఈనె 26న ఓ వ్యక్తి అపస్మారక స్థితిలో పడి ఉన్నట్లు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే వారు ఘటన స్థలానికి చేరుకొని నిజామాబాద్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించగా, అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. మృతుడి వయస్సు సుమారు 45 ఏళ్ల నుంచి 50 ఏళ్ల మధ్య ఉంటుందన్నారు. అతడు గోధుమ రంగు షర్టు, ఆరెంజ్ కలర్ స్వెటర్, నీలి రంగు ప్యాంట్, తలకు ముస్లింలు ధరించే టోపీ ధరించి ఉన్నట్లు చెప్పారు. మృతుడు కూలీ పని చేసుకునేలా ఉన్నాడని, అతడి వద్ద ఎలాంటి ఆధారాలు దొరకలేదన్నారు. ఎవరికై నా సమాచారం తెలిసినచో వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో గాని, 8712659714కు సమాచారం అందించాలన్నారు. -
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు
మాక్లూర్: అధికారులు విధులు నిర్వహించటంలో నిర్లక్ష్యం చూపితే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి హెచ్చరించారు. మండల కేంద్రంలోని పీహెచ్సీ, సొసైటీలతో పలు ప్రభుత్వ కార్యాలయాలను మంగళవారం కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆరోగ్యా కేంద్రానికి వచ్చే ప్రజల పట్ల ప్రేమానురాగాలతో ఉండి తగిన వైద్యం అందించాలని మాక్లూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులకు సూచించారు. సొసైటీలో ఎరువుల స్టాక్ వివరాలతో కూడిన పట్టికను గుమ్మం ఎదుట ఉంచటంపై కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఇందిరమ్మ లబ్ధిదారులకు పొదుపు సంఘాల్లో దగ్గరుండి రుణాలు ఇప్పించాలని పంచాయతీ కార్యదర్శి రాకేష్ను ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించి సిబ్బందితో మాట్లాడి, పలు విషయాలు అడిగి తెలుసుకున్నారు. మండల కేంద్రంలో ఉన్న శాఖ గ్రంథాలయం తాళం వేసి ఉండటంతో శాఖ గ్రంథపాలకుడుపై కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం 8 గంటలకే తీయాల్సిన గ్రంథాలయం 11 అవుతున్న ఎందుకు తీయలేదని సంస్థ కార్యదర్శి బుగ్గారెడ్డిని ఫోన్ ద్వారా ఆరాతీశారు. అనంతరం ఎంఈవో కార్యాలయంలో ఇతర సిబ్బంది లేకపోవటాన్ని గమనించి కలెక్టర్ మండిపడ్డారు. ఇక ముందు ఇలా ఉంటే సహించేది ఉండదని హెచ్చరించారు. కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి మాక్లూర్లో ఆకస్మిక పర్యటన -
బర్త్డే వేడుకల్లో కత్తులతో వీరంగం
● సోషల్ మీడియాలో వైరల్ ● నాలుగేళ్ల క్రితం వీడియోగా పోలీసుల నిర్ధారణ! ● వైరల్ చేసిన వారిపై పోలీసుల ఆరా..ఖలీల్వాడి: జిల్లా కేంద్రంలోని ఆటోనగర్లో రౌడీ షీటర్లు బర్త్డే వేడుకల్లో తల్వార్తో కేక్ కట్ చేయడమే కాకుండా ఊరేగింపుతో హల్చల్ చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనిపై పోలీసులు అప్రమత్తమై, ఆరా తీస్తున్నారు. ఈ వీడియో సోమవారం నాటిదని కొందరు చెబుతుండగా, నాలుగేళ్ల క్రితం వీడియో అని పోలీసులు నిర్ధారించినట్లు తెలుస్తోంది. వీడియోలో ఏముందంటే.. నగరంలోని ఆటోనగర్లో రౌడీ షీటర్ ఆరిఫ్ గ్యాంగ్ సభ్యుడు అప్పు తన బర్త్ డే సందర్భంగా బైక్పై తల్వార్ పట్టుకొని ర్యాలీగా వచ్చారు. అనంతరం కేక్ను తల్వార్తో కట్ చేసి తినిపించారు. ఈ వీడి యోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన వారిపై పోలీసులు నిఘా పెట్టినట్లు తెలిసింది. తల్వార్తో హల్చల్ చేసిన వ్యక్తిపై ఆరా తీస్తున్నట్లు సమాచారం. అప్పు కోసం పోలీసుల బృందం గాలింపు చ ర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. నగరంలో గతంలో జంగిల్ ఇబ్బు ఆలియాస్ ఇబ్రహీం ఛావూస్, ఆరిఫ్ డాన్ వేర్వేరుగా గ్యాంగ్లను నడిపించారు. ఆరిఫ్ డాన్, జంగిల్ ఇబ్బులు మృతిచెందినా వారి అనుచరులు ఈ గ్యాంగ్లను కొనసాగిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. -
ఓల్టేజీ సమస్య తలెత్తకుండా..
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: స్వయం సహాయక సంఘాల(ఎస్హెచ్జీ) మహిళలను కూరగాయల సాగు దిశగా ప్రోత్సహించేందుకు ఉపాధి హామీ పథకం ద్వారా తోడ్పాటునందించే అంశాన్ని పరిశీలిస్తామని జిల్లా ఇన్చార్జి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశుసంక్షేమ, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి మంత్రి సీతక్క అన్నారు. నిజామాబాద్ జిల్లాలో ప్రయోగాత్మకంగా(పైలట్ ప్రాజెక్టు) అమలు చేసి, ఆ తరువాత రాష్ట్రమంతటా అమలు చేస్తామని పేర్కొన్నారు. అధికారులు సమన్వయంతో, సమష్టి కృషితో ముందుకెళ్తూ అభివృద్ధిలో జిల్లాను అగ్రస్థానంలో నిలుపాలని అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, సీజనల్ వ్యాధుల నియంత్రణ, వన మహోత్సవం, భారీ వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, రేషన్ కార్డులు, సన్న బియ్యం పంపిణీ, ఎరువులు, మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక పరిపుష్టికి చేపడుతున్న కార్యక్రమాలు, గృహజ్యోతి, మిషన్ భగీరథ, పంచాయతీరాజ్ శాఖల పనితీరుతోపాటు తాగునీటి సరఫరా, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంపై మంత్రి సమీక్షించారు. కలెక్టరేట్లో మంగళవారం నిర్వహించిన సమీక్షాసమావేశంలో ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, పోచారం శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు సుదర్శన్రెడ్డి, భూపతిరెడ్డి, రాకేశ్రెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని, అప్పుడే సమస్యలు తెలిసి వాటి పరిష్కారానికి అవకాశం ఉంటుందన్నారు. నీటిపారుదల, పంచాయతీరాజ్ శాఖలకు సంబంధించిన పెండింగ్ పనులను పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటామని, ప్రభుత్వ బడుల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తామని, ప్రభుత్వ ఆస్పత్రుల ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలందేలా చొరవ చూపుతామని పేర్కొన్నారు. అంగన్వాడీ భవనాలు, మహిళా శక్తి భవనాల నిర్మాణాలను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. మహిళల సాధికారతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, వడ్డీ లేని రుణాలు, ప్రమాద బీమా, లోన్ బీమా తదితర ప్రయోజనాల గురించి విస్తృత ప్రచారం నిర్వహించి, మహిళలందరూ స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా చేరేలా ప్రోత్సహించాలని సూచించారు. ఉమ్మడి జిల్లా అన్ని రంగాలలో సమగ్ర అభివృద్ధి సాధించేలా అందరి సహకారంతో ముందుకు వెళ్తామన్నారు. జిల్లాలో ఎరువుల కొరత తలెత్తకుండా జిల్లా యంత్రాంగం ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తుండడం అభినందనీయమని మంత్రి ప్రశంసించారు. వర్షాకాలంలో ప్రమాదాలకు ఆస్కారం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వచ్చే రెండు నెలలపాటు అప్రమత్తంగా వ్యవహరించాలని, పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పాముకాటు మందుతోపాటు అన్ని రకాల ఔషధాలను అందుబాటులో ఉంచాలని అన్నారు. సీఎంఆర్ డిఫాల్టర్లపై.. కస్టమ్ మిల్లింగ్ రైస్ ఇవ్వకుండా అవకతవకలకు పాల్పడిన రైస్ మిల్లర్లపై రెవెన్యూ రికవరీ యాక్టు అమలు చేయాలని సీతక్క ఆదేశించారు. డిఫాల్టర్లపై ఇప్పటివరకు తీసుకున్న చర్యలకు సంబంధించి సమగ్ర వివరాలతో నివేదిక అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు పలు అంశాలను ప్రస్తావించగా, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సీతక్క సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, ట్రెయినీ కలెక్టర్ కరోలినా చింగ్తియాన్ మావీ, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్బిన్ హందాన్, సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, రాష్ట్ర రైతు, వ్యవ సాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు సూదం లక్ష్మి, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. మంత్రి సీతక్కకు కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్యతోపాటు అధికారులు పూల మొక్కలు అందజేసి స్వాగతం పలికారు. టీఎన్జీవో, టీజీవో, ఇతర సంఘాల ప్రతినిధులు మంత్రికి వినతిపత్రాలు అందజేశారు. ప్రభుత్వానికి ఎమ్మెల్యే ధన్పాల్ డెడ్లైన్ గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లు లబ్ధిదారులకు అప్పగించకపోవడంతో అవి శిథిలావస్థకు చేరి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. గతేడాది ని ర్వహించిన సమీక్షాసమావేశంలో హౌసింగ్ మంత్రి మాట్లాడుతూ.. దసరా నాటికి ఇళ్లు పంపిణీ చేస్తా మని చెప్పారని, ఇప్పటికీ అతీగతీ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మూడు నెలల్లో పేదలకు ఇళ్లు అప్పగించకపోతే వారి తరఫున ఉద్యమిస్తానని, అప్పటి కీ ప్రభుత్వం స్పందించని పక్షంలో నిరాహార దీక్ష చే స్తానని స్పష్టం చేశారు. అర్బన్ హెల్త్ సెంటర్లలో వై ద్యులు లేరని, జీజీహెచ్లో మౌలిక వసతులు లేవని సమస్యలను లేవనెత్తారు. మదర్–చైల్డ్ విభాగం ప్రారంభానికి నోచుకోవడం లేదన్నారు. నియోజకవర్గానికి రూ.100 కోట్ల ప్రత్యేక నిధులు, ఇంటిగ్రేటెడ్ పాఠశాల మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. మాట్లాడుతున్న ఇన్చార్జి మంత్రి సీతక్క, పక్కన ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్, పోచారం, ఎమ్మెల్యేలు సుదర్శన్రెడ్డి, ధన్పాల్, భూపతిరెడ్డి, రాకేశ్రెడ్డి, కలెక్టర్ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి మాట్లాడుతూ.. ఓల్టేజీ సమస్య తలెత్తకుండా చూడాలని విద్యుత్ అధికారులకు, ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో పారిశుద్ధ్య కార్మికులకు ప్రాధాన్యత ఇవ్వాలని సంబంధిత అధికారులకు సూచించారు. ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదారులకు ఎప్పుడో 20 ఏళ్ల కిందట గృహజ్యోతి పథకం వచ్చిందంటూ అధికారులు కొర్రీలు పెట్టడం సరికాదన్నారు. సీడ్ కార్పొరేషన్ చైర్మన్ సుంకెట అన్వే ష్రెడ్డి మాట్లాడుతూ.. అంకాపూర్లో ఉన్నట్లుగా పెర్కిట్–మోర్తాడ్ మధ్యలో, బాల్కొండ–పోచంపాడ్ మధ్యలో జాతీయ రహదారిపై ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు నిర్మించాలన్నారు. రామడుగు చివరి ఆయకట్టు అయిన వేల్పూర్ మండలంలోని పచ్చల నడ్కుడ, వాడి, కొత్తపల్లి, అట్లూర్, భీంగల్ మండలంలోని చేంగల్, బడాభీంగల్ గ్రామాలకు సాగునీరు అందడంలేదని.. నవాబ్ ఎత్తిపోతల పథకం నుంచి పచ్చలనడ్కుడ చెరువుకు నీటిని తరలిస్తే ఆరు గ్రామాలకు సాగునీటి సమస్య తప్పుతుందన్నారు. ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్బిన్ హందాన్ మాట్లాడుతూ.. గ్రామపంచాయతీల పరిధిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రిని కోరారు. -
సమష్టి కృషితో జిల్లా అభివృద్ధి
● కూరగాయల సాగు దిశగా ఎస్హెచ్జీలను ప్రోత్సహిస్తాం ● పైలట్ ప్రాజెక్టుగా జిల్లా.. ఆ తరువాత రాష్ట్రమంతా అమలు చేస్తాం ● ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, సీజనల్ వ్యాధుల నియంత్రణ, వనమహోత్సవంపై జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క సమీక్ష ● భారీ వర్షాల నేపథ్యంలో జాగ్రత్తలపై అధికారులకు దిశానిర్దేశం అన్ని చర్యలు తీసుకుంటున్నాం ఆయా విభాగాల వారీగా వివరాలను కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి మంత్రి సీతక్క దృష్టికి తెచ్చారు. భారీ వర్షాల నేపథ్యంలో ముందస్తు అప్రమత్తతతో అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. కలెక్టరేట్తోపాటు ఆయా శాఖల కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశామని, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను అందుబాటులో ఉంచామని తెలిపారు. సీజనల్ వ్యాధుల నియంత్రణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో ప్రగతి సాధించామని, రేషన్ కార్డుల పంపిణీ, సన్న బియ్యం పంపిణీ సజావుగా సాగుతోందని తెలిపారు. ఉమ్మడి జిల్లా సమగ్ర అభివృద్ధి సాధించేలా అందరినీ కలుపుకుని ముందుకు వెళ్తామని జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క అన్నారు. క్షేత్రస్థాయికి వెళ్తేనే సమస్యలు తెలుస్తాయని, అప్పుడే పరిష్కారానికి వీలుంటుందని అధికారులకు సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, సీజనల్ వ్యాధుల నియంత్రణ, వనమహోత్సవం, రేషన్కార్డులు, సన్నబియ్యం పంపిణీ తదితర అంశాలపై సమీక్షించిన మంత్రి.. భారీ వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. -
వాగులను దాటే ప్రయత్నం చేయొద్దు
సిరికొండ: వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్న సమయంలో దాటే ప్రయత్నం చేయొద్దని పోలీస్ కమీషనర్ సాయిచైతన్య సూచించారు. వర్షాల నేపథ్యంలో తూంపల్లి వద్ద కప్పలవాగును, కొండూర్ వద్ద గల లో లెవల్ వంతెనను, సిరికొండ సమీపంలోని దొండ్ల వాగును సీపీ మంగళవారం పరిశీలించారు. ఆయా చోట్ల స్థానికులతో మాట్లాడి తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. గ్రామ భద్రత దృష్ట్యా సీసీ కెమెరాల ప్రాముఖ్యతను తెలిపి, ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సీపీ వెంట ధర్పల్లి సీఐ భిక్షపతి, ఎస్సై రామకృష్ణ ఉన్నారు. రేపు స్పాట్ కౌన్సెలింగ్ డిచ్పల్లి(నిజామాబాద్రూరల్): బాసర జోన్ పరిధిలోని నిజామాబాద్, కామారెడ్డి, నిర్మ ల్, ఆదిలాబాద్, జగిత్యాల జిల్లాల్లోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల, బాలుర కళాశాలల్లో 2025–26 విద్యాసంవత్సరానికి ఇంటర్ మొదటి సంవత్సరం గ్రూపుల్లో సీట్ల భర్తీకి గురువారం స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు జోనల్ అధికారి పూర్ణచందర్రావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత, ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈ అ వకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. జోన్ పరిధిలోని అన్ని సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర, బాలికల కళాశాలల్లో 31న ఉదయం 9 గంటలకు కౌన్సెలింగ్ ప్రారంభమవుతుందని, తాము చేరాలనుకుంటున్న కళాశాలలో అన్ని ఒరిజనల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలని ఆయన సూచించారు. అడ్మిషన్లు రిజర్వేషన్, పదో తరగతి మార్కుల ప్రాతిపాదికన కౌన్సెలింగ్ నిర్వహిస్తారని తెలిపారు. జాతీయస్థాయి హాకీకి ఎంపిక సిరికొండ: జాతీయ స్థాయి హాకీ పోటీలకు తూంపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు క్రీడాకారులు తోయేటి లో కేశ్, పుల్లింటి విశాల్ ఎంపికై నట్లు జెడ్పీహెచ్ఎస్ పీడీ నాగేశ్ మంగళవారం తెలిపారు. గత నెలలో ఆదిలాబా ద్లో నిర్వహించిన రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ హాకీ పోటీల్లో ప్రతిభ కనబర్చి జా తీయ స్థాయికి ఎంపికయ్యారన్నారు. జాతీ య స్థాయి పోటీలకు ఎంపికై న క్రీడాకారులు తమ పాఠశాల పూర్వ విద్యార్థులు కావడంతో ఏంఈవో రాములు, ఇన్చార్జి హెచ్ఎం మనోహర్, వీడీసీ సభ్యులు, జిల్లా హకీ అ సోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు గంగారెడ్డి, రమణ హర్షం వ్యక్తం చేశారు. ఎంపికై న క్రీడాకారులు చైన్నెలో వచ్చే నెల 8వరకు నిర్వహించే పోటీల్లో పాల్గొంటారని పీడీ తెలిపారు. హుండీ ఆదాయం లెక్కింపు నిజామాబాద్ రూరల్: నగరంలోని జెండాబాలాజీ ఆలయ హుండీ ఆదాయాన్ని మంగళవారం లెక్కించారు. రెండు నెలల కాలానికి రూ.96,371 ఆదాయం సమకూరినట్లు ఆలయ చైర్మన్ లవంగ ప్రమోద్ తెలిపారు. చైర్మన్, ధర్మకర్తలు, కార్యనిర్వహణ అధికారి వేణు నేతృత్వంలో భక్తులు ఆదాయాన్ని లెక్కించగా, ఆలయ పరిశీలకులు కమల, దేవాదాయ సిబ్బంది పాల్గొన్నారు. నవోదయలో 9,11 తరగతుల్లో ప్రవేశాలు నిజామాబాద్అర్బన్: నవోదయ విద్యాలయంలో 2026– 27 విద్యా సంవత్సరానికి 9, 11వ తరగతుల్లో ప్రవేశానికి ఖాళీగా ఉన్న సీట్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. సెప్టెంబర్ 23వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని, 2026 ఫిబ్రవరి 7వ తేదీ ప్రవేశ పరీక్ష నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లా జవహర్ నవోదయ విద్యాలయంలో ఖాళీలకు సంబంధించి సీట్లను భర్తీ చేస్తామని, ప్రతిభ ఆధారంగా అభ్యర్థులు ఎంపిక ఉంటుందని తెలిపారు. ఆన్లైన్లో దర ఖాస్తు చేసుకోవాలని సూచించారు. -
ఎస్సారెస్పీకి పోటెత్తిన వరద..
బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లోకి మహారాష్ట్ర ప్రాంతం నుంచి వరద పోటెత్తింది. సోమవారం రాత్రి వరకు 65 వేల క్యూసెక్కులు వచ్చిన వరద నీరు రాత్రికి 75 వేల 500 క్యూసెక్కులకు పెరిగింది. నిలకడగా అర్ధరాత్రి వరకు కొనసాగి మళ్లీ వరద నీరు పెరిగి 89 వేల క్యూసెక్కులకు చే రింది. మంగళవారం ఉదయం 9 గంటలకు వర ద నీరు పెరిగి లక్ష 5 వేల క్యూసెక్కులకు పెరిగింది. ఈ సంవత్సరం లక్ష క్యూసెక్కుల వరద నీరు దాటడం ఇదే తొలిసారి. మధ్యాహ్ననం 12 గంటలకు మళ్లీ తగ్గుముఖం పట్టి 86 వేల 620 క్యూసెక్కులకు పడిపోయింది. తరువాత మరింత తగ్గి 67, 401 క్యూసెక్కులకు పడిపోయింది. సాయంత్రం 6 గంటలకు 64 వేల 345 క్యూసెక్కులకు తగ్గిపోయింది. రాత్రి వరకు అంతే స్థాయిలో వరద ప్రాజెక్ట్లోకి కొనసాగింది. ప్రాజెక్ట్లోకి లక్ష క్యూసెక్కులకు పైగా వరద నీరు రావడంతో ప్రాజెక్ట్ నీటి మట్టం వేగంగా పెరుగుతోంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 1091(80.5 టీఎంసీలు) అడుగులు కాగా మంగళవారం రాత్రికి ప్రాజెక్ట్లో 1076.80 (36.9 టీఎంసీలు) అడుగుల నీరు నిల్వ ఉంది. లక్షా 5 వేల క్యూసెక్కుల వరద నీరు వేగంగా పెరుగుతున్న నీటి మట్టం నీటి నిల్వ 36.9 టీఎంసీలు!గతేడాది నీటి మట్టాన్ని దాటి.. ఎస్సారెస్పీలోకి ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు వచ్చి చేరుతుండటంతో ప్రాజెక్ట్ నీటి మట్టం గతేడాది ఇదే రోజున ఉన్న నీటి మట్టాన్ని దాటింది. గతేడాది ఇదే రోజున ప్రాజెక్ట్లో 1075.20 (33.37 టీఎంసీలు) నిల్వ ఉంది. ఆ నీటి నిల్వను మధ్యాహ్ననికే దాటి నీటి మట్టం పె రుగుతోంది. ప్రాజెక్ట్నీటి మట్టం వేగంగా పెరగడంపై ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
చురుగ్గా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం
నిజామాబాద్అర్బన్: అభివృద్ధి లక్ష్యంగా ప్రజాప్రతినిధులను కలుపుకొని సమన్వయంతో పనిచేస్తా మని జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క అన్నారు. కలెక్టరేట్లో సమీక్షా సమావేశంలో అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో పెండింగ్లో ఉన్న సమస్యలను రాష్ట్ర ఉన్నతాధికారులతో కలిసి పరిష్కరిస్తామన్నారు. విద్య, వైద్యం, ఇరిగేషన్లో సమస్యల పరిష్కారానికి సమన్వయంగా ముందుకు వెళ్తామన్నారు. జిల్లాలోని ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చురుగ్గా సాగుతోందన్నారు. మహిళల ఆర్థికాభివృద్ధి కోసం బ్యాంకు లింకేజీ ద్వారా రూ.20 కోట్లు అందించడం జరుగుతుందన్నారు. మహిళా సంఘాల ద్వారా కూరగాయల సాగును ప్రోత్సహిస్తామని పేర్కొన్నారు. వానాకాలంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా ప్రమాదం జరిగితే తక్షణమే స్పందించాలన్నారు. జిల్లాలో యూరియా కొరత లేకుండా చూశారని అధికారులను మంత్రి అభినందించారు. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డితో కలిసి జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులకు పరిష్కారం చూపుతామన్నారు. ఉమ్మడి జిల్లాలో సమస్యల పరిష్కారంపైనే ప్రధానంగా దృష్టి సారిస్తామన్నారు. బీఆర్ఎస్ నాయకులు బీసీ రిజర్వేషన్లపై నిరసన తెలుపడం సరికాదన్నారు. సమావేశంలో మాజీమంత్రి, బోధన్ ఎమ్మె ల్యే సుదర్శన్రెడ్డి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి. అర్బన్ ఎమ్మె ల్యే ధనపాల్ సూర్యనారాయణ, ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేశ్రెడ్డి, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.డొంకేశ్వర్(ఆర్మూర్): ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ ప్రాంతంలో గాదేపల్లి వద్ద ఎకో టూరిజం ఏర్పాటు పై అనుమానాలు కలుగుతున్నాయి. స్థల సేకరణ విషయంలో అటవీ అధికారులకు అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఓవైపు పనులు చేపట్టేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయగా... గాదేపల్లిలో వాచ్ టవర్ల ఏర్పాటు కోసం ఇంత వరకు అనువైన స్థలమే దొరకడంలేదు. అయితే ఇది వరకు సర్వే చేసిన ఒక స్థలం శ్మశాన వాటిక పక్కనే ఉందనే కారణంతో అధికారులు దానిని తిరస్కరించారు. దీంతో స్థల సేకరణ సమస్య మళ్లీ మొదటికి వచ్చింది. మరో చోట స్థలం లేకపోవడంతో అధికారులు గ్రామస్తుల సహకారాన్ని కోరుతున్నారు. దీనికోసం త్వరలోనే అధికారులు మరోసారి బ్యాక్వాటర్ ప్రాంతానికి రానున్నట్లు తెలిసింది. ఒక వేళ గ్రామస్తులు ముందుకు రాని పక్షంలో గాదేపల్లి వద్ద ఎకో టూ రిజం ఏర్పాటుపై ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పకనే చెప్తున్నారు. సమన్వయం లేక.. సహకారం లభించక... జిల్లాలో ఎకో టూరిజం ఏర్పాటుకు బీజం పోసిందే డొంకేశ్వర్ మండలంలోని గాదేపల్లి వద్ద ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ ప్రాంతం. కృష్ణ జింకలు, విదేశీ పక్షులు, పచ్చిక బయళ్లతో ఇక్కడ కనువిందుగా ఉంటుంది. అందుకే గాదేపల్లి వద్ద అత్యధికంగా 18 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం కేటాయించింది. నందిపేట్ మండలం ఉమ్మెడ వద్ద 1.20 ఎకరాలు, బాల్కొండ మండలం జలాల్పూర్ వద్ద మూడెకరాలకు స్థల సేకరణ ఎప్పుడో పూర్తయింది. ఇప్పుడు సమస్య వచ్చిందల్లా గాదేపల్లి వద్దనే. అటవీ అధికారులకు ఎస్సారెస్పీ ఇరిగేషన్ అధికారుల సహకారం లభించడం లేదనే వాదన వినిపిస్తోంది. ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్టీఎల్) పరిధిలోని భూములను సైతం ప్రభుత్వం కేటాయించిన 18 ఎకరాల స్థలంలో చూపెట్టారు. తద్వారా వాచ్ టవ ర్లు, రిసార్టులు, పార్కింగ్ ఏరియా, ఇతర వసతులు కల్పించడానికి స్థలం లేకుండా పోయింది. కాగా శ్మశాన వాటిక పక్కనే ఎకరం స్థలాన్ని గుర్తించిన అఽ దికారులు ఇది ఇబ్బందికరంగా ఉంటుందని వెనక్కి తగ్గారు. మరే దగ్గర స్థలం లేకపోవడంతో అటవీ అధికారులు ముందడుగు వేయలేకపోతున్నారు. ముంపునకు గురై ప్రభుత్వం నుంచి పరిహారం పొందిన వారికి నచ్చజెప్పి భూములను తీసుకోవాలనే ఆలోచన ఉన్నప్పటికీ సమస్యగా మారుతుందేమోనని ఎస్సారెస్పీ ఇరిగేషన్, అటవీ శాఖల అధికారులు వెనకడుగు వేస్తున్నారు. ఇటు గ్రామస్తులు కూడా సెంటు భూమిచ్చినా కూడా తమ భూములు ఎక్కడ పోతాయోననే భయంతో ముందుకు రావడం లేదని తెలుస్తోంది. ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారులు చొరవ తీసుకుంటే తప్పా గాదేపల్లి వద్ద స్థల సేకరణకు పరిష్కారం దొరికే పరిస్థితైతే కనిపించడం లేదు. త్వరలోనే గ్రామస్తులతో సమావేశమై వాచ్ టవర్ల కోసం అనువైన మరొక స్థలాన్ని సేకరించడానికి పయత్నాలు చేస్తామని అటవీ శాఖకు చెందిన అధికారులు ‘సాక్షి’కి వెల్లడించారు. ప్రజాప్రతినిధులందరినీ కలుపుకుని ముందుకు.. పెండింగ్ సమస్యలను పరిష్కరిస్తాం మీడియాతో మంత్రి సీతక్క స్థల సేకరణకు ఎదురవుతున్న అడ్డంకులు అనువుగా లేని ఇదివరకు ఎంపిక చేసిన స్థలం గ్రామస్తులు సహకరిస్తేనే మరొకచోట స్థలం దొరికే అవకాశం లేదంటే ఎకో టూరిజంపై ఆశలు వదులుకోవాల్సిందేనా..? -
నేడు ఇన్చార్జి మంత్రి సీతక్క రాక
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : జిల్లా ఇన్ చార్జి మంత్రి సీతక్క (ధనసరి అనసూ య) నిజామాబాద్ నగరంలో మంగళవారం పర్యటించనున్నా రు. మధ్యాహ్నం నగరానికి చేరుకోనున్న ఆమె.. 3గంటలకు కలెక్టరేట్ సముదాయంలో నిర్వహించనున్న సమీక్షాసమావేశంలో పాల్గొంటారని డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్రెడ్డి తెలిపారు. ఆ తరువాత హోట ల్ హరితలో నిర్వహించనున్న కాంగ్రెస్ ఆదివాసీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కార్యకర్తల సమావేశంలో పాల్గొని దిశానిర్దేశం చేస్తారని పార్టీ ఎస్టీ విభాగం అధ్యక్షుడు కేతావత్ యా దగిరి తెలిపారు. సాయంత్రం 6గంటలకు హైదరాబాద్కు తిరిగి బయల్దేరుతారు. ప్రజావాణికి 112 ఫిర్యాదులు నిజామాబాద్ అర్బన్: ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను స త్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ కి రణ్కుమార్ అధికారులకు సూచించారు. స మీకృత జిల్లా కార్యాలయాల సముదాయ స మావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 112 ఫిర్యాదులు అందా యి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వ చ్చిన వారు తమ సమస్యలను అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్తోపాటు ట్రెయినీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావీ, డీఆర్డీవో సా యాగౌడ్, డీపీవో శ్రీనివాస్, మెప్మా పీడీ రా జేందర్, ఏసీపీ వెంకటేశ్వర్ రావుకు వివరి స్తూ ఫిర్యాదులను అందజేశారు. ఫిర్యాదుల ను పెండింగ్లో ఎప్పటికప్పుడు పరిశీలించి సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ అధికారులకు సూచించారు. ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. జిల్లాలో ఎరువుల కొరత లేదు వర్ని : జిల్లాలో రైతులకు సరిపడా ఎరువులు అందుబాటులో ఉన్నాయని జిల్లా సహకార అధికారి శ్రీనివాస్ అన్నారు. మోస్రా మండ ల కేంద్రంలో నూతనంగా నిర్మించిన సహకా ర సంఘ భవనంతోపాటు గిడ్డంగిని సోమ వారం ఆయన ప్రారంభించారు. రైతులు స హకార సంఘాల ద్వారా తీసుకున్న స్వల్పకాలిక, దీర్ఘకాలిక రుణాలను చెల్లించి తిరిగి రుణాలు పొందాలని సూచించారు. ఎరువు లు కొనుగోలు చేసిన రైతులు బిల్లులు తప్పకుండా తీసుకోవాలన్నారు. విండో చైర్మన్ జ గన్మోహన్రెడ్డి తదితరులు ఉన్నారు. ‘ఓపెన్’ ఫీజు చెల్లించాలి నిజామాబాద్ అర్బన్: ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లించాలని డీఈవో అశోక్ ఒక ప్రకటనలో తెలిపారు. సాధారణ రుసుంతో ఈ నెల 28 నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు చెల్లించవచ్చునన్నా రు. రూ.25 అపరాధ రుసుముతో ఆగస్టు 10 వరకు, రూ 50 అపరాధ రుసుముతో 15వరకు, తాత్కాల్ రుసుముతో 18వ తేదీ వరకు టీఎస్ ఆన్లైన్, మీసేవ సెంటర్లలో చెల్లించాలని పేర్కొన్నారు. -
ఎస్సారెస్పీలోకి 68,516 క్యూసెక్కుల ఇన్ఫ్లో
బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లోకి ఎగువ ప్రాంతమైన మహారాష్ట్ర నుంచి వరద నీరు వస్తోంది. ప్రాజెక్ట్లోకి 68,516 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. ఆదివారం ఉదయం నుంచి క్రమక్రమంగా వరద పెరుగుతూ రాత్రి 7 గంటల వరకు 53 వేల క్యూసెక్కులకు చేరింది. నిలకడగా అంతే స్థాయిలో సోమవారం ఉదయం 3 గంటల వరకు వరద కొనసాగింది. అనంతరం వరద నీరు 68,516 క్యూసెక్కులకు పెరిగింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు నిలకడగా అంతేస్థాయిలో వరద వచ్చింది. సాయంత్రం 4 తర్వాత 65,740 క్యూసెక్కులకు తగ్గింది. దీంతో ప్రాజెక్ట్ నీటిమట్టం వేగంగా పెరిగింది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091(80.5 టీఎంసీలు) అడుగులు కాగా సోమవారం సాయంత్రానికి 1074.60 (30 టీఎంసీలు) అడుగులకు పెరిగినట్లు పేర్కొన్నారు. ఆయకట్టు రైతులు ఆందోళన చెందొద్దు శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ ఆయకట్టు రైతులు ఆందోళన చెందొద్దని ప్రాజెక్ట్ ఈఈ చక్రపాణి అన్నారు. సోమవారం ప్రాజెక్ట్ నీటిమట్టాన్ని పరిశీలించారు. ఇన్ఫ్లో, అవుట్ ఫ్లో వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్ట్లోకి ఎగువ ప్రాంతాల నుంచి మరో రెండు రోజుల పాటు వరద కొనసాగే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం వస్తున్న వరదతో ప్రాజెక్ట్లో నీటి నిల్వ 35 టీఎంసీలకు చేరుకుంటుందన్నారు. ఖరీఫ్లో పంటలకు కాలువల ద్వారా నీటి విడుదల చేపట్టాలంటే 50 టీఎంసీలకు ప్రాజెక్ట్ నీటి నిల్వ చేరాలన్నారు. ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు మరింత వచ్చే అవకాశం ఉందని తెలిపారు. నిజాంసాగర్లోకి 1,172 క్యూసెక్కులు..నిజాంసాగర్: నిజాంసాగర్ ప్రాజెక్టులోకి సోమవారం సాయంత్రం 1,172 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోందని అధికారులు తెలిపారు. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఇన్ఫ్లో తగ్గిందని పేర్కొన్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1,405 అడుగులు(17.8 టీఎంసీలు) కాగా సోమవారం సాయంత్రానికి 1,391.22 అడుగుల (4.58 టీఎంసీలు) నీరు నిల్వ ఉందని తెలిపారు. -
కాంగ్రెస్పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత
నిజామాబాద్ అర్బన్: ఎన్నికల హామీలను నెరవేర్చకపోవడంతో కాంగ్రెస్పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మొదలైందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రజలు బీఆర్ఎస్వైపు మొగ్గు చూపుతున్నారని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధిస్తామన్నారు. ఇందూరు గడ్డ నుంచే కాంగ్రెస్ పూర్తిస్థాయిలో మట్టికరుస్తుందన్నారు. కాంగ్రెస్ హయాంలో సెటిల్మెంట్లు, దోపిడీలు పె రిగిపోయాయి ఆరోపించారు. ఇందిరమ్మ రాజ్యం వద్దు.. కేసీఆర్ రాజ్యం ముద్దు.. నినాదంతో ముందుకు వెళ్తామని, గ్రామగ్రామాన పార్టీలను శ్రేణులను సమాయత్తం చేస్తామన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే మళ్లీ కేసీఆర్ రావాల్సిందేనని అ న్నారు. పేదలకు ఇందిరమ్మ ఇళ్లు అందని ద్రాక్ష లా మారాయని, ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న హామీని కాంగ్రెస్ ప్రభుత్వం తుంగ లో తొక్కిందని విమర్శించారు. జాబ్ క్యాలెండర్కు అతీగతీ లేదని, నిరుద్యోగ భృతిని మరిచిపోయార న్నారు. తనను రాజకీయంగా ఎదుర్కోలేక కాంగ్రెస్, బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తున్నాయ న్నారు. నాయకులు సుజిత్సింగ్ ఠాకూర్, సత్యప్రకాశ్, ప్రభాకర్, భూమేశ్, నరేందర్, సంతోష్, రజినీశ్, వెల్మల్ సురేశ్, సుంకర రవి, రంజిత్ పాల్గొన్నారు. స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్దే విజయం పేదలకు అందని ద్రాక్షలా ఇందిరమ్మ ఇళ్లు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్రెడ్డి -
రవాణాశాఖలో ఫీజుల మోత!
రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ కార్యాలయంఖలీల్వాడి : రవాణాశాఖ ఫీజుల మోత మోగించింది. ఆదివారం నుంచి పెరిగిన ఫీజులు అమలులోకి వచ్చాయి. దీంతో వాహనాదారులు, లైసెన్స్దారులకు రవాణాశాఖ సేవలు మరింత భారం అవుతున్నాయి. ఎలాంటి బహిరంగ ప్రకటన లేకుండానే రవాణాశాఖ పలు సేవల ధరలను పెంచుతూ ఆ శాఖ వెబ్సైట్లో నూతన ఫీజులను అప్డేట్ చేసేసింది. పలు సేవల ఫీజులు కొంత పెరగగా, మరికొన్నింటి ఫీజులు వాహనాదారులకు భారం కానున్నాయి. వాహనాల రిజిస్ట్రేషన్ ఫీజు సైతం మారింది. గతంలో రవాణాశాఖ అధి కారులు ఫీజుల పెంపునకు సంబంధించి ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపించగా, ప్రభుత్వం అనుమతించినట్లు సమాచారం. రూ.50 నుంచి రూ.వెయ్యి వరకు పెంపు ఆదివారం నుంచి ట్రాన్స్పోర్ట్ వెబ్సైట్లో అప్డేట్ -
దృష్టిలో పడేందుకు..
నిజామాబాద్ఎవరి ప్లాన్లు వారివి..ఆలయాల అభివృద్ధికి.. ఆలయాల అభివృద్ధికి చైర్మన్తో సహా కమిటీ సభ్యులు కృషి చేయాలని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ సూచించారు. మంగళవారం శ్రీ 29 శ్రీ జూలై శ్రీ 2025– 8లో u● ఆగస్టు 2, 3 తేదీల్లో ఆర్మూర్ నియోజకవర్గంలో మీనాక్షి నటరాజన్ పర్యటన ●● ఆమెతోపాటు పాదయాత్ర, శ్రమదానంలో పాల్గొనేందుకు కాంగ్రెస్ నాయకుల ప్రణాళికలు ఆర్మూర్ నియోజకవర్గంకాంగ్రెస్ శ్రేణులకు దిశానిర్దేశం చేయడమే లక్ష్యంగా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ ఆర్మూర్ నియోజక వర్గంలో పాదయాత్ర చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆమె దృష్టిలో పడేందుకు నామినేటెడ్ పదవులు ఆశిస్తున్న వారితోపాటు స్థానిక ఎన్నికల బరిలో నిలువాలనుకుంటున్న నాయకులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. మీనాక్షి నటరాజన్ పాదయాత్ర తమ రాజకీయ భవిష్యత్కు బాటలు వేయాలని కోరుకుంటున్నారు.సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ ఆగస్టు 2, 3 తేదీల్లో జిల్లాలో పర్యటించనున్నారు. 2న సాయంత్రం ఆర్మూర్ నియోజకవర్గంలో ఆమె పాదయాత్ర చేయనున్నారు. ఇదే నియోజకవర్గంలో రాత్రి బస చేయనున్నారు. 3న ఉదయం శ్రమదానం కార్యక్రమంలో మీనాక్షి పాల్గొననున్నారు. అదేవిధంగా అసంఘటిత కార్మికులతో సమావేశం కానున్నారు. అనంతరం అదేరోజు మధ్యాహ్నం ఉమ్మడి జిల్లాలోని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, మండల అధ్యక్షులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, వివిధ అనుబంధ విభాగాల అధ్యక్షులతో సమావేశం నిర్వహించి మీనాక్షి నటరాజన్ దిశానిర్దేశం చేయనున్నారు. ప్రధానంగా జై భీమ్, జై బాపు, జై సంవిధాన్ నినాదాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఇప్పటికే మీనాక్షి కృషి చేస్తున్నారు. ఇదిలా ఉండగా మీనాక్షి పర్యటనకు సంబంధించి మంగళవారం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మానాల మోహన్రెడ్డి ఆధ్వర్యంలో రూట్మ్యాప్ షెడ్యూల్ ఖరారు చేయనున్నారు. ఇందులో భాగంగా సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. నాలుగేళ్ల క్రితం జిల్లాలో పాదయాత్ర.. రాజీవ్గాంధీ పంచాయతీ సంఘటన్ చైర్మన్గా నాలుగేళ్ల కిందట మీనాక్షి నటరాజన్ రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పాదయాత్ర నిర్వహించారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని ఇందల్వాయి మండలం సిర్నాపల్లి నుంచి ఆమె పాదయాత్ర నిర్వహించారు. జక్రాన్పల్లి మండలంలో, ఆర్మూర్ మండలంలో, బాల్కొండ మండలాల్లోనూ ఆమె ఆ సమయంలో పాదయాత్ర చేశారు. అప్పటి పాదయాత్రలో పాల్గొన్న నాయకులతో మీనాక్షి ఇప్పటికీ నిరంతరం మాట్లాడుతూ వివరాలు తెలుసుకుంటున్నారు. ఇదిలా ఉండగా పూర్తిగా గ్రామీణప్రాంతాలపైనే ఆమె ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. గతంలో మీనాక్షి పాదయాత్ర చేశాక జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించామని, ఈసారి సైతం స్థానిక సంస్థల ఎన్నికల్లో భారీ గెలుపును నమోదు చేస్తామని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. ప్రస్తుతం మీనాక్షి నటరాజన్ చేయనున్న పాదయాత్ర, శ్రమదానం కార్యక్రమాల్లో పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్కుమార్ గౌడ్ కూడా పాల్గొననున్నారు.న్యూస్రీల్రాహుల్గాంధీ కోర్ టీమ్లో కీలకమైన నాయకురాలిగా ఉన్న మీనాక్షికి ఢిల్లీలో అధినాయకత్వం వద్ద గట్టి పట్టుంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలోని పలువురు నామినేటెడ్ పదవుల ఆశావహులు, స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్న నాయకులు, కార్యకర్తలు, పార్టీ మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి పదవులు ఆశిస్తున్నవారు ఆమె దృష్టిలో పడేందుకు, ఆమెను ప్రసన్నం చేసుకునేందుకు ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు. సర్పంచ్, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మున్సిపాలిటీల్లో కౌన్సిలర్లు, నగరంలో కార్పొరేటర్లుగా బరిలోకి దిగేందుకు ఉవ్విళ్లూరుతున్నవారు. జెడ్పీ చైర్మన్, మున్సిపల్ చైర్మన్లు, నగర మేయర్ పదవులు ఆశిస్తున్నవారు, రాష్ట్ర స్థాయిలో కార్పొరేషన్ చైర్మన్ పదవు లు కోరుతున్నవారు మీనాక్షి దృష్టిలో పడేందుకు గట్టి ప్ర యత్నాలు చే సుకుంటున్నారు. ఎట్టిపరిస్థితుల్లో పదవులు దక్కించుకునేందుకు ఎవరి పా ట్లు వారు పడుతున్నారు. ఇక మండల కాంగ్రెస్ అధ్యక్ష పదవులు, జిల్లా కాంగ్రెస్ పదవి రేసులో ఉన్నవారు సైతం ఈ పర్యటనను సద్వినియో గం చేసుకునేందుకు ఎవరి ప్లాన్లు వారు వేసు కుంటున్నారు. -
అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి రేషన్కార్డు
నిజామాబాద్ అర్బన్: ప్రజల ఆకాంక్షలను ప్రభుత్వం గౌరవిస్తుందని, అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని, ఇంకా అర్హులు మిగిలి ఉంటే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. జిల్లా కేంద్రంలోని రాజీవ్గాంధీ ఆడిటోరియంలో షబ్బీర్ అలీ, అదనపు కలెక్టర్ అంకిత్ నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం పరిధిలోని లబ్ధిదారులకు నూతన రేషన్కార్డులను సోమవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా షబ్బీర్ మాట్లాడుతూ.. ఒక్క నిజామాబాద్ జిల్లాలోనే 11,852 కొత్త రేషన్ కార్డులు మంజూరు చేశామని, మరో 84,232 మంది పేర్లను కొత్తగా లబ్ధిదారుల జాబితాలో చేర్చడం జరిగిందన్నారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలోని నార్త్, సౌత్ మండలాల పరిధిలో 3,174 కుటుంబాలకు కొత్త కార్డులు ఇవ్వడంతోపాటు 16,687 మంది సభ్యుల పేర్లను కొత్తగా నమోదు చేసినట్లు వివరించారు. గత ప్రభుత్వం పదేళ్ల పాలనలో ఒక్క రేషన్ కార్డు కూడా అందించలేదని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో అవలంబించిన అసంబద్ధ పాలనా విధానాల కారణంగా రూ.7.80 లక్షల కోట్ల అప్పుల భారం ఉన్నప్పటికీ, ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రాధాన్యత క్రమంలో సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలోనే ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. సన్న బియ్యం పంపిణీ బీజేపీ పాలిత రాష్ట్రాలతోపాటు దేశంలో మరెక్కడా లేదని, కేవలం తెలంగాణలోనే అమలవుతోందని అన్నారు. పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు ప్రతి నియోజకవర్గంలో 3500 ఇళ్లు మంజూరు చేశామని, ఒక్కో లబ్ధిదారుకు రూ.5 లక్షలు అందిస్తున్నామని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు కోసం ఎవరికీ ఒక్క రూపాయి ఇవ్వొద్దని, ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే నేరుగా తనకు ఫిర్యాదు చేయాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని షబ్బీర్ అలీ హెచ్చరించారు. అదనపు కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ.. రేషన్కార్డుల పంపిణీ పారదర్శకంగా కొనసాగుతోందని తెలిపారు. అర్హులకు మాత్రమే కార్డులు మంజూరయ్యేలా పకడ్బందీగా పరిశీలన చేపడుతున్నామన్నారు. ఇంకా దరఖాస్తుల వెరిఫికేషన్ కొనసాగుతోందని, అర్హత కలిగిన కుటుంబాలకు కార్డులు మంజూరు చేస్తామని అన్నారు. కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, రాష్ట్ర సహకార సంఘాల యూనియన్ చైర్మన్ మానాల మోహన్రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, నుడా చైర్మన్ కేశ వేణు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్రకుమార్, డీఎస్వో అరవింద్ రెడ్డి, సౌత్, నార్త్ తహసీల్దార్లు బాలరాజు, విజయ్కాంత్, ఆయా శాఖల అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలను గౌరవిస్తుంది కార్డులు రాని వారు ఆందోళన చెందొద్దు అర్హులు దరఖాస్తు చేసుకోవాలి.. కొత్త కార్డుల మంజూరు నిరంతర ప్రక్రియ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ జిల్లా కేంద్రంలో లబ్ధిదారులకు కార్డుల పంపిణీ -
నేరాల నియంత్రణకు కమ్యూనిటీ కాంటాక్ట్
రుద్రూర్: నేరాల నియంత్రణ కోసమే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నట్టు బోధన్ ఏసీపీ శ్రీనివాస్ అన్నారు. పోతంగల్ మండలం జల్లాపల్లి ఫారంలో సోమవారం సాయంత్రం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి వాహనాలు తనిఖీ చేశారు. ఎలాంటి ధ్రువపత్రాలు లేని వాహనాలు సీజ్ చేశారు. అనంతరం ఏసీపీ మాట్లాడుతూ సీజ్ చేసిన వాహనాలకు సంబంధించి సరైన ధ్రువపత్రాలు తీసుకువస్తే వాహనాలను విడుదల చేస్తామన్నారు. ప్రజలందరు పోలీసులకు సహకరించాలన్నారు. గ్రామంలోకి కొత్త వ్యక్తులు వచ్చినా, అనుమానాస్పదంగా కన్పించినా పోలీస్స్టేషన్కు సమాచారం అందించాలన్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్నారు. సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బోధన్ సీఐలు విజయ్ బాబు, వెంకటనారాయణ, రుద్రూర్ సీఐ కృష్ణ, కోటగిరి, రుద్రూర్, వర్ని ఎస్సైలు సునీల్, సాయన్న, మహేష్ తదితరులు పాల్గొన్నారు. సైబర్ నేరాలపై అవగాహన బాల్కొండ: ముప్కాల్ మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో సోమవారం స్థానిక పోలీస్ల ఆధ్వర్యంలో విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. విద్యార్థులు సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో ఎస్వో వినోద, హెడ్కానిస్టెబుల్ మల్లేశ్, పోలీస్ సిబ్బంది, ఉపాధ్యాయులు తదితరులున్నారు. -
సంక్షిప్తం
ఆలయ చైర్మన్లకు సన్మానం నిజామాబాద్ రూరల్: నగరంలోని జెండా బాలాజీ మందిర్ చైర్మన్గా ఎన్నికై న లవంగ ప్రమోద్, హమాల్వాడి సంతోషిమాత, సాయిబాబా మందిరం చైర్మన్గా ఎన్నికై న బోధకం గంగా కిషన్లను సోమవారం రావూజీ సంఘం కన్వీనర్ నరేష్కుమార్, సభ్యులు సన్మానించారు. కార్యక్రమంలో సంఘ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. హాస్టళ్లలో అడ్మిషన్లపై సమీక్ష బోధన్: ఈవిద్యాసంవత్సరానికిగాను ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థుల అడ్మిషన్లకు సంబంధించిన అంశంపై సో మవారం తన చాంబర్లో సబ్ కలెక్టర్ వికాస్ మహతో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. బోధన్, ఎడపల్లి, నవీపేట, రెంజల్ మండలాల ఎంపీడీవోలు, ఎంఈవోలు, హాస్టళ్ల వార్డెన్లు హాజరయ్యారు.ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అడ్మిషన్ల ప్రక్రియను పాదర్శకంగా పూర్తి చే యాలని సబ్ కలెక్టర్ సూచించారు. వసతి గృహాల విద్యార్థుల భద్రతపైశ్రద్ధ్ద వహించాలని తెలిపారు.తమ వసతిగృహాల్లో నెలకొన్న సమస్యలను వార్డెన్లు సబ్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.సీఎంఆర్ఎఫ్ చెక్కుల అందజేత వేల్పూర్: మండలంలోని రామన్నపేట్ గ్రామంలో సోమవారం బేల్దారి నవీన్కు రూ. 17500, గూండ్లకిషన్కు రూ. 17వేలు, చాకలి జలంకు రూ. 44 వేల సీఎంఆర్ఎఫ్ చెక్కులను స్థానిక కాంగ్రెస్ నాయకులు అందజేశారు. శోభన్రెడ్డి, మోహన్, ఎల్క శ్రీనివాస్, భూమేశ్వర్రెడ్డి, లింబాద్రి, తెడ్డు భూమేశ్వర్ పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పరిశీలన ఆర్మూర్టౌన్: ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని 11, 12,13, 30, 31, 32, 33వ వార్డుల్లో వివిధ దశల్లో ఉన్న ఇందిరమ్మ నిర్మాణాలను కమిటీ సభ్యులతో పీసీసీ ప్రచార కమిటీ సభ్యుడు కోలా వెంకటేశ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం రూ. 5లక్షలతో సొంత ఇళ్లు నిర్మించుకోటానికి ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లను మంజురు చేస్తుందన్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో 618 మందికి ఇళ్లు మంజూరు కాగా, అందులో సుమారు 50% కి పైగా లబ్ధిదారులు ఇళ్లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయన్నాని పేర్కొన్నారు. నాయకులు తాటి హన్మాండ్లు, లోక రాజేశ్వర్, పులి గంగాధర్, మీసాల రవి, బట్టు శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఈత మొక్కలు నాటిన గీత కార్మికులు వేల్పూర్: మండలంలోని పోచంపల్లి గ్రామంలో ఈత వనం కోసం గీతకార్మికులు సోమవారం ఈజీఎస్ తరపున అందజేసిన ఈత మొక్కలను వారి సొసైటీ స్థలంలో నాటారు. అర ఎకరం స్థలంలో సుమారు 870 ఈత మొక్కలు నాటారు. వీటిని పెంపుదల చేసుకొని ఉపాధి పొందుతామని పేర్కొన్నారు. కార్యక్రమంలో గౌడ సంఘం ప్రతినిధులు పోశగౌడ్, వెంకాగౌడ్, శ్రీనివాస్, ముత్తెన్న,రాజేశ్వర్ పాల్గొన్నారు. -
సంచార జాతులను కాపాడాలి
నిజామాబాద్ నాగారం: సంచార జాతులను కాపాడాలని తెలంగాణ రచయితల వేదిక జిల్లా అధ్యక్షుడు ప్రేమ్ లాల్ అన్నారు. నగరంలోని వినాయక్నగర్లోగల సంస్థ కార్యాలయంలో సోమవారం ఆయన మాట్లాడారు. సంచార జాతులకు అన్ని రకాల సంక్షేమ ఫలాలను ప్రభుత్వం అందజేయాలన్నారు. వారిలో చైతన్యం తీసుకువచ్చి మంచి విద్య, వైద్యం అందించాలని కోరారు. తెరవే కామారెడ్డి అధ్యక్షులు గఫూర్ శిక్షక్, శివలింగం, వేముల శేఖర్ లున్నారు. శివాజీ బీడీ సెంటర్ మార్చొద్దు నిజామాబాద్ సిటీ: చందూరులోని శివాజీ బీడీ సెంటర్ను కుర్నాపల్లికి మార్చాలన్న నిర్ణయాన్ని యాజమాన్యం ఉపసంహరించుకోవాలని సీఐటీయూ నూర్జహాన్ కోరారు. ఈమేరకు సోమవారం జిల్లా కేంద్రంలోని ఆర్ఆర్ చౌరస్తాలోని శివాజీ బీడీ కార్యాలయంలో వారు వినతిపత్రం అందజేశారు. చందూరుకు చెందిన మహిళ బీడీ ప్యాకర్స్ 14 సంవత్సరాలుగా పనులు చేస్తున్నారని తెలిపారు. వారి సర్వీసును దృష్టిలో పెట్టుకుని కుర్నాపల్లికి మార్చకుండా చందూరులోనే ఉంచాలని విజ్ఞప్తిచేశారు. బీడీ ప్యాకర్లు రేఖ, విజయ, ఉష, భారతి, అనిత, జ్యోతి, అభిజ్ఞ పాల్గొన్నారు. రేపు సీపీఎం జిల్లా విస్తృత స్థాయి సమావేశం నిజామాబాద్ సిటీ: నగరంలో ఈనెల 30న సీపీఎం జిల్లా విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహిస్తున్నామని జిల్లా కార్యదర్శి రమేష్బాబు అన్నారు. సమావేశానికి కార్మికులు, పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. జిల్లాకేంద్రంలోని నాందేవ్వాడలోగల పార్టీ కార్యాలయంలో సోమవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సమావేశానికి పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ పాల్గొంటారని, పార్టీ అఖిల భారత మహాసభల్లో తీసుకున్న కర్తవ్యాల్లో భాగంగా జిల్లాలోని నాయకత్వానికి, కార్యకర్తలకు అవగాహన క ల్పించనున్నట్లు తెలిపారు. విద్యార్థులకు టై, బెల్టుల వితరణ జక్రాన్పల్లి: మండలంలోని తొర్లికొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు సోమవారం ఎంఈవో శ్రీనివాస్ టై, బెల్టులను అందజేశారు. పాఠశాల విద్యార్థిని నిత్యశ్రీ జన్మదినం సందర్భంగా వారి తల్లిదండ్రులు సాంబార్ ఉమారాణి–నవీన్లు రూ.5వేల విలువగల టై, బెల్టులను వితరణ చేశారు. ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. మత్తు పదార్థాలపై దృష్టిపెట్టాలి సిరికొండ: మండలంలో మత్తు పదార్థాల సరఫరాపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎస్సై రామకృష్ణను కాంగ్రెస్ నాయకులు కోరారు. పోలీస్ స్టేషన్లో ఎస్సైని సోమవారం వారు కలిసి వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం ఎస్సైని శాలువాతో సన్మానించారు. చిన్నవాల్గోట్ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు రొండ్ల గోవర్ధన్రెడ్డి, మాజీ సర్పంచ్ ప్యాట్ల లింబాద్రి, మైనార్టీ సెల్ మండలాధ్యక్షుడు ఆసిఫ్, జీవన్, దీప్చంద్రెడ్డి పాల్గొన్నారు. -
ఇందూరును గ్రీన్సిటీగా తీర్చిదిద్దుతా
నిజామాబాద్ సిటీ: ఇందూరు నగరాన్ని గ్రీన్సిటీగా తీర్చిదిద్దుతామని, ఇందుకోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ అన్నారు. జిల్లాకేంద్రంలోని గంగాస్తాన్ ఫేజ్–1 మారుతినగర్ పార్కులో సోమవారం ఆయ న వనమహోత్సవంలో భాగంగా మొక్కలు నాటా రు. అనంతరం షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. పర్యావరణాన్ని పరిరక్షించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభు త్వం వన మహోత్సవం ద్వారా పెద్ద ఎత్తున మొక్క లు నాటే కార్యక్రమం నిర్వహిస్తోందన్నారు. జిల్లా లో ఈ ఏడాది 51 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నందున, లక్ష్య సాధనకు సమష్టిగా కృషిచేయాలన్నారు. పాఠశాల విద్యార్థులతో మొక్క లు నాటించారు. రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తా హెర్ బిన్ హందాన్, రాష్ట్ర సహకార సంఘాల యూనియన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, నుడా చైర్మన్ కేశ వేణు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి, పీసీసీ జనరల్ సెక్రెటరీ రాంభూపాల్, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, జిల్లా అదనపు కలెక్టర్ అంకిత్, మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్, ఇన్చార్జి డీఎఫ్వో నిఖిత, ఆర్డీవో రాజేంద్ర కుమార్, డీఎఫ్వో సుధాకర్ పాల్గొన్నారు. ఉద్యమకారులకు ఇంటి స్థలాలు ఇవ్వండి నిజామాబాద్ సిటీ/నిజామాబాద్ అర్బన్: తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలాన్ని ఇస్తామని కాంగ్రెస్ నాయకులు చేసిన వాగ్ధానాన్ని నెరవేర్చాలని తెలంగాణ ఉద్యమకారులు కోరారు. ఈమేరకు వారు సోమవారం జిల్లా కేంద్రానికి వచ్చిన ప్రభుత్వ సలహాదారు మహ్మద్ షబ్బీర్ అలీని కలిసి వినతిపత్రం సమర్పించారు. షబ్బీర్ అలీ స్పందిస్తూ.. రాష్ట్ర ఏర్పాటులో ఉద్యమకారులు కీలక పాత్ర పోషించారన్నారు. ఉద్యమంలో జైలు పాలైనవారికి ప్రభుత్వం ఇంటి స్థలాన్ని కేటాయించే విధంగా చూస్తానని హామీ ఇచ్చారు. క్రీడారంగానికి నిధులు కేటాయించాలి నిజామాబాద్ సిటీ: రాష్ట్ర ప్రభుత్వం క్రీడారంగానికి నిధులు కేటాయించాలని కాంగ్రెస్ నాయకుడు సయ్యద్ఖైసర్ కోరారు. ఈమేరకు సోమవారం ఆయన జిల్లాకేంద్రానికి వచ్చిన ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీకి వినతిపత్రం అందజేశారు. జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ గ్రౌండ్లో వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలని, మైనార్టీ పాఠశాల విద్యార్థులు క్రీడల్లో రాణించేందుకు తగిన నిధులు కేటాయించాలని కోరారు. మాలలకు రిజర్వేషన్లు పెంచాలి నిజామాబాద్నాగారం: ఎస్సీ వర్గీకరణతో మాలలకు తీవ్ర అన్యాయం జరిగిందని, 2024 జనాభాల లెక్కల ప్రకారం మాలలకు రిజర్వేషన్లు పెంచాలని మాలమహానాడు జిల్లా అధ్యక్షుడు చొక్కం దేవిదాస్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎడ్ల నాగరాజు కోరారు. ఈమేరకు వారు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీకి విన్నవించారు. జిల్లా హెడ్ క్వార్టర్లో మాల కల్యాణ మండపానికి స్థలాన్ని కేటాయించాలని కోరారు. నాయకులు ఆనంపల్లి ఎల్లయ్య, నాంది వినయ్ కుమార్, రాజన్న, సంగం శ్రీనివాస్, అసది గంగాధర్, చంద్ర కాంత్, భూమయ్య, బొడ్డు లక్ష్మణ్, భూషణ్, సాయిలు, బాల స్వామి, రామ చందర్, సక్కి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసమే వన మహోత్సవం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ -
నడిరోడ్డుపై గుంత.. వాహనదారులకు చింత
డిచ్పల్లి: డిచ్పల్లి–నిజామాబాద్ ప్రధాన రహదారి గుంతల మయంగా మారింది. ఇటీవల నాలుగైదు రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు రోడ్డుపై నీరు నిలిచి గుంతలు కనిపించడం లేదు. దీంతో వాహనదారులు గుంతల్లో పడి ప్రమాదాలకు గురవుతున్నారు. అధికారులు స్పందించి రోడ్డుపై ఏర్పడిన గుంతలకు మరమ్మతులు చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు. నగరంలోని ఆర్యనగర్లో..నిజామాబాద్ రూరల్: నగరంలోని ఆర్యనగర్లో రోడ్లు గుంతలమయంగా మారాయి. దీంతో కాలనీ వాసులు, వాహనదారులు నిత్యం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు వర్షపు నీరు గుంతల్లో చేరడంతో వాహనదారులు గుంతలను గమనించకుండ ప్రమాదాలకు గురవుతున్నారు. అధికారులు ఇప్పటికై న స్పందించిన రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని కాలనీవాసులు కోరుతున్నారు. -
నాగ పంచమికి ముస్తాబైన ఆలయాలు
నిజామాబాద్ రూరల్: నాగ పంచమి సందర్భంగా నగరంలోని నాగేంద్రుడి ఆలయాలు విద్యుత్ దీపాలంకరణలతో అందంగా ముస్తాబయ్యాయి. నేడు శ్రావణ శుద్ధ నాగపంచమి కావడంతో భక్తులు ఆయా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఈ సందర్భఃగా ఆలయ కమిటీల ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. భక్తుల కోసం ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. ఎంతో ప్రత్యేకత.. నాగపంచమి పండుగ రోజున మహిళలు, చిన్నారులు కొత్త వస్త్రాలు ధరించి పుట్ట వద్ద పూజలు చేసి పాముల కోసం అవుపాలు పోయడం ఆనవాయితీగా వస్తోంది. నాగదేవతలకు పూజలు చేయ డం ద్వారా సంతాన ప్రాప్తి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయన్నది భక్తుల విశ్వాసం. నాగుల పంచమిని పురస్కరించుకుని జొన్న పేలాలకు భలే గిరాకీ ఏర్పడింది. ప్రత్యేకంగా తయారు చేసిన జొన్న పేలాలను నాగదేవతకు నైవేద్యంగా పెడతారు. తెల్ల జొన్నలను పేలాల తయారీకి ఉపయోగిస్తారు. ఈ పేలాలు కేవలం నాగుల పంచమి పండుగ సంద ర్భంగా విక్రయస్తారు. తర్వాత రోజుల్లో ఇవి మచ్చు కై నా కనబడవు. వంశపారంవర్యంగా ఇళ్లలోనే నాగదేవతను పూజించడం కొందరికి సంప్రదాయంగా ఉంది. నాగ దేవతలను మట్టితో తయారు చేసి నాగ రూ పంలో ప్రతిష్ఠిస్తారు. ప్రత్యేక పూజలు, వ్రతాలు నిర్వహించి, నాగ దేవతకు సారే సమర్పించుకుంటారు. అనంతరం సమీపంలోని పుట్ట వద్దకు వెళ్లి, పాలు పోసి పూజలు నిర్వహిస్తారు. అనంతరం ఆ పాలతో సోదరి, సోదరుడి కళ్లను కడుగుతారు. ఇలా కళ్లు కడగడం సోదర–సోదరీమణుల బంధానికి ప్రతీకగా ఈ పండుగ నిలుస్తుంది. నాగుల పంచమి రోజున చేసే ఉపవానం సంవత్సరం పొడవునా వచ్చే నాగుల చవితి కంటే అధిక ఫలితం ఇస్తుంది అని భక్తులు విశ్వసిస్తారు. ఏదేమైనా నాగు ల పంచమి సందర్భంగా నాగదేవత పూజలతో ఆలయాలు, పుట్టలు సందడిగా మారనున్నాయి. నేడు నగరంలోని నాగేంద్రుడి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించనున్న భక్తులు ఆలయ కమిటీల ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి -
పర్యావరణాన్ని కాపాడాలి
నిజామాబాద్ రూరల్: ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి, పర్యావరణంను కాపాడాలని లయన్స్ క్లబ్ పోర్ట్ సిటీ అధ్యక్షుడు అట్లూరి రవీంద్రనాథ్ ఠాగూర్ అన్నారు. మాధవ నగర్ రామాలయం వద్ద సోమవారం లయన్స్ క్లబ్ ఫోర్ట్ సిటీ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. రవీంద్రనాథ్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి కాలుష్య రహిత దేశం నిర్మాణం కోసం సంకల్పం చేపట్టాలన్నారు. శివరామకృష్ణ, రాఘవేంద్రరావు, మైలారం నారాయణరెడ్డి, నరసింహచారి, పొందూరి చిలుకమ్మ, లక్ష్మీ నర్సయ్య, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు . -
గర్భిణులు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి
నిజామాబాద్ నాగారం: గర్భిణులు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా వైద్య ఆరో గ్యశాఖ అధికారిణి రాజశ్రీ అన్నారు. నగరరంలోని దుబ్బ జిల్లా పరిషత్ స్కూల్లో సోమవారం రోటరీ క్లబ్ ఆఫ్ జేమ్స్ నిజామాబాద్ వారి ఆధ్వర్యంలో ఆమె గర్భిణులకు న్యూట్రిషన్ కిట్స్, బ్లౌజ్ పీస్, ప్రొటీన్ పౌడర్, పళ్ళు పంపిణీ చేశారు. ఈసందర్భంగా డీఎంహెచ్వో మాట్లాడుతూ.. గర్భిణులు ప్రతి నెల తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వైద్య పరీక్షలు, మందులపై అవగాహన కల్పించారు. అధ్యక్షు డు పాకాల నరసింహారావు, కార్యదర్శి గంజి రమే ష్, ట్రెజరర్ పాల్తి రక్షిత్ కుమార్, స్వాతి ఠాకూర్, రంజిత్ సింగ్ ఠాకూర్, బంగారి వీరబ్రహ్మం, రాచకొండ గౌరీ శంకర్, నాలం గిరీష్ కుమార్, గైనకాలజిస్ట్ అరుణ తదితరులు పాల్గొన్నారు . -
ధర్పల్లిలో పందుల స్వైర విహారం
ధర్పల్లి: మండల కేంద్రంలో పందుల స్వైర విహారం చేస్తున్నాయి. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పందులను ఊరికి దూరంగా పెంచుకోవాలని నిబంధన ఉన్నప్పటికీ పెంపకం దారులు వాటిని గ్రామంలోనే పెంచుతున్నారు. మండల కేంద్రంలోని హోట ల్స్, ఫాస్ట్ ఫుడ్, చికెన్ సెంటర్లు ఎక్కువగా ఉండడంతో వారు వ్యర్థాలను సమీపంలోని ఊర చెరువు కట్టపై పడేస్తున్నారు. పందులు వ్యర్థాల కోసం గ్రామంలో సంచరిస్తున్నాయి. వర్షాకా లం కావడంతో ఎలాంటి వ్యాధులు వస్తాయో నని ధర్పల్లి వాసులు ఆందోళన చెందుతున్నా రు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. -
కరెంట్ మీటరుపై పేరు మార్చాలా?
మీకు తెలుసా? కమ్మర్పల్లి: విద్యుత్ మీటరుపై పేరు మార్పు కోసం వినియోగదారుల సౌకర్యార్థం విద్యుత్ సంస్థ వెబ్సైట్ను అందుబాటులో ఉంచింది. ● టీజీఎన్పీడీసీఎల్ వెబ్సైట్ను తెరిచి ‘కన్జ్యూమర్ సర్వీసెస్’పై క్లిక్ చేస్తే పలు సేవలు కన్పిస్తాయి. అందులో సర్వీస్ రిక్వెస్ట్ విండోపై క్లిక్ చేయాలి. ● కరెంట్ బిల్లుపై ఉండే యూనిక్ సర్వీస్ నెంబరు, మొబైల్ నెంబరు నమోదు చేస్తే ఓటీపీ వస్తుంది. ఓటీపీ నమోదు చేయగానే అక్కడ అందించే సర్వీసులు కన్పిస్తాయి. ● వాటిలో టైటిల్ ట్రాన్స్ఫర్, చిరునామా మార్పు, అదనపు లోడు, లైన్ల మార్పు, కేటగిరి మార్పు వంటివి ఉంటాయి. ● టైటిల్ ట్రాన్స్ఫర్పై క్లిక్ చేసి అవసరమైన మూడు డాక్యుమెంట్లను అప్లోడ్ చేయాలి. ● రిజిస్టర్డ్ సేల్ డీడ్/గిఫ్ట్ డీడ్, వ్యక్తిగత గుర్తింపు పత్రం(ఏదైనా ఐడీ), రూ.100 నాన్ జ్యుడీషియల్ స్టాంప్ పేపరుతో కూడిన ఇండెమ్నిటీ బాండ్ను ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. ● బాండ్కు సంబంధించిన ఫార్మాట్ కూడా అక్కడే ఉంటుంది. దానిని డౌన్లోడ్ చేసుకుని వివరాలు సమర్పించాలి. ● గుర్తింపు పత్రం జేపీజీ/పీఈజీ ఫార్మాట్లో ఉండాలి. వీటి సైజు 100కేబీ లోపు, ఇండెమ్నిటీ బాండ్ పీడీఎఫ్ రూపంలో 500 కేబీ లోపు, రిజిస్టర్డ్ డాక్యుమెంట్ పీడీఎఫ్ 5ఎంబీ లోపు సైజు ఉండే విధంగా జాగ్రత్త తీసుకోవాలి. ● అన్ని డాక్యుమెంట్లపై సంతకం తప్పనిసరి. ఆ తర్వాతే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సర్వీస్ చార్జ్ రూ.25 చెల్లించాల్సి ఉంటుంది. ● తర్వాత విద్యుత్ శాఖ వారు వివరాలన్నీ పరిశీలించి, అన్ని సరిగా ఉంటే మీ బిల్లుపై పేరును మార్పు చేస్తారు. -
భావితరానికి స్ఫూర్తినిచ్చే.. బతుకు చిత్రం
పదేళ్ల కిందటి వరకు ఏ గ్రామానికి వెళ్లినా ఎడ్లబండ్లు కనిపించేవి. పొలాల్లో దుక్కులు చేయాలంటే నాగళ్లు, అరకలు వాడేవారు. అందుకు ఎడ్లు అవసరం. పండిన పంట ఇంటికి చేర్చాలంటే ఎడ్లబండ్లు వాడేవారు. వ్యవసాయంలో నేడు యాంత్రీకరణ పెరిగిపోయింది. ఎక్కడా ఎడ్లబండ్లు కనిపించడం లేదు. చదును చేయడం, దుక్కులు దున్నడానికి ట్రాక్టర్లు వచ్చేశాయి. నేటి తరానికి పాత వ్యవసాయ పద్ధతులు తెలిసేలా మోస్రా మండలం చింతకుంట గ్రామస్తులు చందాలు వేసుకొని గ్రామముఖ ద్వారం వద్ద ఎడ్లబండిపై రైతు దంపతులు ధాన్యం తరలించే విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, నిజామాబాద్ -
ఆలయాల అభివృద్ధికి కృషి చేయాలి
ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ నిజామాబాద్ రూరల్: ఆలయాల అభివృద్ధికి చైర్మన్తో సహా కమిటీ సభ్యులు కృషి చేయాలని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పేర్కొన్నారు. నగరంలోని జెండా బాలాజీ, శంభుని గుడి, సంతోషిమాత సాయిబాబా ఆలయ కమిటీల ప్రమాణ స్వీకారోత్సవం సోమవారం ఆయా ఆలయాల్లో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా షబ్బీర్ అలీ హాజరై మాట్లాడారు. మూడు ఆలయాలు చాలా మహిమలుగలవని తెలిపారు. ఆలయాల అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానన్నారు. జెండా బాలాజీ ఆలయ కమిటీ చైర్మన్గా లవంగ ప్రమోద్ కుమార్, డైరెక్టర్లుగా పాలకొండ నర్సింగరావు, సిరిపురం కిరణ్ కుమార్, వేముల దేవిదాస్, మంత లక్ష్మణ్, పవర్ విజయ, కోరవ రాజ్కుమార్, శంభుని గుడి ఆలయ కమిటీ చైర్మన్ బింగి మధు, డైరెక్టర్లుగా గాజుల కిశోర్, గాండ్ల సంతోష్ కుమార్, కమల్ కిశోర్ దయ్మా, మామిడి శేఖర్, ఉప్పల రమేశ్, గోపు రేఖ, సంతోషిమాత సాయిబాబా ఆలయ కమిటీ చైర్మన్గా బొత్కం గంగాకిషన్, డైరెక్టర్లుగా శ్రీరాం రమేశ్, గాదె ప్రవీణ్ కుమార్, బాణాల శివ లింగం, కోల్తే శాంతాబాయిలతో ప్రమాణస్వీకారం చేయించారు. కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతి రాజిరెడ్డి, నుడా చైర్మన్ కేశ వేణు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
ఆహార పదార్థాలు కలుషితం కాకుండా చూడాలి
డిచ్పల్లి(నిజామాబాద్రూరల్): ఆహార పదార్ధాలను కలుషితం కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, శుభ్రమైన వాతావరణంలో భోజనం తయారు చేయాలని కలెక్టర్ టీ వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. డిచ్పల్లి మండలం ధర్మారం(బి) గ్రామంలోని మహాత్మా జ్యోతీబాపూలే బీసీ బాలుర గురుకుల పాఠశాలను కలెక్టర్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టోర్ రూమ్, కిచెన్, డైనింగ్ హాల్, డార్మెటరీలను పరిశీలించారు. ఆహార పదార్థాలను భద్రపరిచే విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిర్వాహకులకు సూచించారు. విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలని, ఆయా సబ్జెక్టులలో వెనుకబడి ఉన్న విద్యార్థులను గుర్తించి ప్రత్యేక బోధన అందిస్తూ, మరింత మెరుగైన ఫలితాలు వచ్చేలా కృషి చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఉపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులు, సిబ్బంది సమయపాలన పాటిస్తూ, అంకిత భావంతో విధులు నిర్వర్తించాలని లేదంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పర్యవేక్షణ అధికారి ఎల్లవేళలా అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. మరుగుదొడ్లను శుభ్రంగా ఉంచాలని, విద్యార్థులకు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు జరిపించాలని సూచించారు. గురుకులంలో ఇంకా ఏమైనా సదుపాయాలు అవసరం ఉన్నాయా అని ప్రిన్సిపల్ శ్రీకర్ను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఎంజేపీ బాలుర గురుకుల పాఠశాల తనిఖీ -
సరిహద్దు తేల్చాలి
రుద్రూర్: పోతంగల్ మండలంలోని మంజీరా నది నుంచి ఇసుక తరలించే కొడిచర్ల, పోతంగల్కు చెందిన ట్రాక్టర్ యజమానులు సోమవారం తహసీల్ కార్యాలయానికి తరలి తరలివచ్చారు. మంజీర నుంచి ఇసుక తరలించే శివారు సరిహద్దు తేల్చాలని కొడిచర్ల గ్రామస్తులు డిమాండ్ చేశారు. పోతంగల్ వే బిల్లు తీసుకుని కొడిచర్ల శివారు నుంచి ఇసుక తీసుకెళుతున్నారని ఫిర్యాదు చేశారు. తమ శివారు నుంచి ఇసుక తరలింపును నిలిపివేయాలని తహసీల్దార్ గంగాధర్కు వినతిపత్రం అందజేశారు. స్పందించిన తహసీల్దార్ ఇసుక ట్రాక్టర్లను నిలిపివేశారు. స్థానికంగా ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకుంటున్న లబ్ధిదారుల వివరాలు సేకరించి అవసరమగు వారికి సరఫరా చేయాలని జీపీ కార్యదర్శికి సూచించారు. ఎన్డీఎస్ఎల్ను పునరుద్ధరించాలి నిజామాబాద్ అర్బన్: ఎన్డీఎస్ఎల్ను వెంటనే పునరుద్ధరించాలని ఎంసీపీఎం నాయకులు సోమవారం ప్రజావాణిలో వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యదర్శి మైత్రి రాజశేఖర్ మాట్లాడుతూ చక్కెర కార్మాగారం మళ్లీ ప్రారంభిస్తే ప్రత్యక్షంగా, పరోక్షంగా అనేకమందికి ఉపాధి కలుగుతుందన్నారు. సీమాంధ్ర పాలకుల నిర్లక్ష్యంతోనే ఈ ఫ్యాక్టరీ నష్టాలు ఊబిలోకి వెళ్లిందన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఫ్యాక్టరీని పునరుద్ధరించాలన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు సామెల్ నరసయ్య, అంజయ్య, సాయిలు తదితరులు పాల్గొన్నారు. ముంపు గ్రామాల ప్రజలను ఆదుకోండి బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లో ముంపునకు గురైన గ్రామాల ప్రజలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ సోషల్ మీడియాలో దేశ తొలి ప్రధాని నెహ్రూ ఫొటో, ప్రాజెక్ట్ నిర్మాణ కాలంలో ప్రభుత్వాలు ఇచ్చిన పరిహారం, హామీలతో కూడిన ఓ పోస్టు వైరల్ అవుతోంది. అందులోని సారాంశం ఇదే.. ‘శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్కు 1963లో దేశ తొలి ప్రధాని నెహ్రూ శంకుస్థాపన చేశారు. ప్రాజెక్ట్ నిర్మాణంలో నిజామాబాద్ జిల్లాకు చెందిన 36 గ్రామాలు, ఆదిలాబాద్ జిల్లా (ప్రస్తుతం నిర్మల్ జిల్లా)కు చెందిన 56 గ్రామాలు ముంపునకు గురయ్యాయి. ఆకాలంలో ఎకరానికి రూ.600, ఇంటికి రూ.5 వేలలోపు పరిహారం అందించారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పటి వరకూ ఇవ్వలేదు. ఇప్పటికై నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వారికి జరిగిన నష్టాన్ని భర్తీ చేయాలి’ అని పేర్కొన్నారు. తాళాలు వేసిన మూడు ఇళ్లలో చోరీ మద్నూర్(జుక్కల్): మండల కేంద్రంలోని టీచర్స్ కాలనీలో మూడు ఇళ్లలో ఆదివారం అర్ధరాత్రి దుండగులు చోరీకి పాల్పడ్డారు. మద్నూర్కు చెందిన లైబ్రెరియన్ కపిల్ కుటుంబసభ్యులు కామారెడ్డికి వెళ్లడంతో ఇంటికి తాళం వేశారు. దుండగులు తాళాలను పగులగొట్టి ఇంట్లో దాచిపెట్టిన రూ. 40 వేల నగదు అపహరించుకు వెళ్లారు. సోమవారం సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితుడు కపిల్ తెలిపారు. కాలనీలోని మరో రెండు ఇళ్ల తాళాలను దుండగులు పగులగొట్టారని స్థానికులు తెలిపారు. కాగా, నలుగురు వ్యక్తులు చోరీకి పాల్పడినట్లు సీసీ కెమెరాలో రికార్డు అయ్యిందని పేర్కొన్నారు. -
అక్కను కాపాడబోయి చెల్లి
దోమకొండ: బట్టలు ఉతుకుతూ నీటిలో జారిపడిన అక్కతోపాటు కాపాడేందుకు ప్రయత్నం చేసిన చెల్లెలు నీటి కుంటలో పడి మృతిచెందిన ఘటన కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో జరిగింది. వివరాలిలా ఉన్నాయి. గ్రామ శివారులోని ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద గోసంగికి చెందిన పలువురు కుటుంబాలు గుడిసెలు వేసుకొని నివసిస్తున్నారు. రోజు మాదిరిగానే ఆదివారం సాయంత్రం గంగారపు మల్లేశం కూతుళ్లు పెద్దరాగుల శివాని(23), చిన్నరాగుల మల్లవ్వ (19) బట్టలు ఉతకడానికి నరసింగరాయకుంటకు వెళ్లారు. బట్టలు ఉతికే క్రమంలో అక్క శివాని నీటిలో జారిపడగా, అక్కను కాపాడే ప్రయత్నంలో చెల్లెలు మల్లవ్వ కూడా నీటిలోకి దిగింది. కాగా, ఇరువురు నీటి మునిగారు. స్థానికంగా వ్యవసాయ పనులు చేసి ఇంటికి వెళ్తున్న ఓ వ్యక్తి గమనించి కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. తండ్రి మల్లేశంతోపాటు శివాని భర్త దుర్గయ్య, మల్లవ్వ భర్త రమేశ్ కుంట వద్దకు చేరుకొని ఇరువురి కోసం వెతికారు. ఆదివారం రాత్రి మల్లవ్వ మృతదేహం, సోమవారం శివాని మృతదేహం లభించిందని పోలీసులు తెలిపారు. గుంతే ప్రాణం తీసిందా... అక్కాచెల్లెళ్లు బట్టలు ఉతుకుతున్న ప్రదేశంలో నీటి గుంత ఉంది. నాలుగైదు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కుంటలోకి నీరు చేరింది. గుంతను గమనించని వారు బట్టలు ఉతికే క్రమంలో నీటిలోకి దిగడంతో ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఘటనా ప్రదేశం వద్ద పోలీసులు కట్టెలతో నీటి లోతును పరిశీలించారు. మొదట శివాని నీటిలో పడడంతో, ఆమెను పట్టుకుందామనే ప్రయత్నంలో మల్లవ్వ కూడా నీటిలో మునిగి చనిపోయినట్లు ఎస్సై స్రవంతి తెలిపారు. తండ్రి గంగారపు మల్లేశం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఆమె వివరించారు. బట్టలు ఉతకడానికి వెళ్లి నీటికుంటలో పడి ఇద్దరూ మృతి దోమకొండలో ఘటన -
గుంజిళ్ల మాస్టారుకు ‘ఆయుష్ ఉదయ్ సమ్మాన్’ అవార్డు
డిచ్పల్లి(నిజామాబాద్రూరల్): డిచ్పల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల మాజీ ప్రిన్సిపల్, గుంజిళ్ల మాస్టారుగా పేరొందిన అందె జీవన్రావు ‘ఆయుష్ ఉదయ్ సమ్మాన్’ అవార్డు అందుకున్నారు. ఆదివారం దక్షిణ గోవాలోని ఐటీసీ ఫార్చూన్ రిసార్ట్లో నిర్వహించిన ఇంటర్నేషనల్ ఆయుష్ కాంక్లేవ్ సదస్సులో అందె జీవన్ రావుకు గోవా కార్టోరిమ్ నియోజకవర్గ ఎమ్మెల్యే, గోవా పరిశ్రమల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ అలెక్సో రెజినాల్డో లారెంకో అవార్డు అందజేశారు. ఈ సదస్సులో అందె జీవన్ రావు ‘సూపర్ బ్రెయిన్ యోగా– ఎన్ అప్రొప్రియేట్ యోగిక్ ఎక్సర్ సైజ్ ఫర్ సుపీరియర్ ఇంటెలెక్ట్ అండ్ వెల్ బీయింగ్’ అనే అంశంపై తన పరిశోధనా పత్రాన్ని సమర్పించి ప్రసంగించారు. -
ఉపాధి హామీ పనులు భేష్
జక్రాన్పల్లి: జక్రాన్పల్లి మండలంలో చేపట్టిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు భేషుగ్గా ఉన్నాయని గ్రామీణాభివృద్ధి శాఖ జాతీయ పర్యవేక్షకులు సుధాకర్ రెడ్డి, లోహిత్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం జక్రాన్పల్లి, చాంద్ మియాబాగ్, మనోహరాబాద్ గ్రామాల్లో కేంద్ర, రాష్ట్ర పథకాల అమలు తీరుపై గ్రామసభలు నిర్వహించారు. బ్యాంకు లింకేజీ, స్త్రీ నిధి రుణాలు ద్వారా మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ఎలా ఉపయోగపడ్డాయని అడిగి తెలుసుకున్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో చేపట్టిన పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జక్రాన్పల్లితోపాటు వేల్పూర్, కమ్మర్పల్లి మండలాల్లో పర్యటించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీవో సతీశ్ కుమార్, ఎంపీవో యూసుఫ్ఖాన్, జీపీ కార్యదర్శులు గంగాధర్, అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. గ్రామీణ అభివృద్ధి శాఖ జాతీయ పర్యవేక్షకులు సుధాకర్ రెడ్డి -
ప్రజలు లేకుండానే ఈజీఎస్ ప్రజావేదిక
బాల్కొండ: మెండోరా మండల కేంద్రంలో సోమవారం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నాల్గో విడత సామాజిక తనిఖీ ప్రజావేదికను ప్రజలు లేకుండానే నిర్వహించారు. సమాచారం ఇవ్వకుండానే ప్రజావేదిక నిర్వహించడంపై ఉపాధి కూలీలకు, ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం ఈజీఎస్ సిబ్బందితోనే కార్యక్రమాన్ని ముగించారు. అంతకుముందు అడిట్ వివరాలను డీఆర్పీలు చదివి వినిపించారు. మస్టర్లలో కూలీల పేర్లు నమోదు చేయకపోవడాన్ని గుర్తించారు. కూలీలకు వేతనాలు చెల్లించడం, పేర్లు నమోదు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని డీఆర్డీవో సాయాగౌడ్ హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా విజిలెన్స్ అధికారి నారాయణ, ఎంపీడీవో కొండ లక్ష్మణ్, ఇన్చార్జి ఏపీవో అశోక్, అంబుడ్స్మెన్ శ్రీనివాస్రావు తదితరులు పాల్గొన్నారు. -
కొందరికే పీఎం కిసాన్
ఇందల్వాయి: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పీఎం కిసాన్ పథకం జిల్లాలో కొందరు రైతులకే ప్రయోజనం కలుగుతోంది. 2019 జనవరి 31వ తేదీ వరకు పట్టాపాస్ పుస్తకాలు కలిగిన సన్న, చిన్నకారు రైతులనే ఈ పథకానికి అర్హులుగా గుర్తించి సాగుకు పెట్టుబడిగా ఏడాదికి మూడు విడతల్లో కలిపి రూ.6వేలు రైతుల ఖాతాల్లో వేస్తోంది. ఆ తర్వాత పట్టా పాస్ పుస్తకాలు పొందిన వారు ఈ పథకంలో నమోదుకు అవకాశం ఇవ్వడం లేదు. దీంతో చాలా మంది రైతులు పీఎం కిసాన్ పథకానికి దూరమవుతున్నారు. తహసీల్ కార్యాలయాల్లో సేల్ డీడ్, గిఫ్ట్ డీడ్, సక్సెషన్, వారసత్వపు బదిలీల రూపంలో నిత్యం పదుల సంఖ్యలో భూ లావాదేవీలు జరుగుతుంటాయి. ఇలా నూతన పట్టాలు పొందిన రైతులు పీఎమ్ కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో చేరేందుకు నిబంధనలు అడ్డుపడుతున్నాయి. పీఎం కిసాన్ డబ్బులు వచ్చిన రైతు ఎవరైనా చనిపోతే వారి ద్వారా వారసత్వపు పాసు పుస్తకాలు పొందిన రైతులను మాత్రమే నూతనంగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధిలో చేర్చే అవకాశం ఉంది. 35 శాతం మందికే.. జిల్లాలో 2,65,000 మంది రైతులు ఉండగా అందులో కేవలం 88,000 మంది రైతులకు(35 శాతం) పీఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు అందుతున్నట్లు అధికార గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2019 ఫిబ్రవరి 1వ తేదీ నుంచి పట్టాలు పొందిన రైతులెవ్వరికీ ఈ పథకం వర్తించడం లేదు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం పథకాల అమలులో సౌలభ్యం కోసం అర్హులైన రైతులందరికీ విశిష్ట గుర్తింపు కార్డులు ఇవ్వనున్నట్లు కేంద్రం ప్రకటించింది. అందుకోసం ప్రవేశపెట్టిన ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ సాంకేతిక సమస్యలు, రైతుల్లో అవగాహన లేమితో నత్తనడకన సాగుతోంది. జిల్లాలో మొత్తం 2,91,749 పట్టా పాస్బుక్లు ఉంటే ఇప్పటి వరకు 1,40,285 మందే రిజిస్ట్రేషన్ చేయించుకోవడం(48.08 శాతం) అందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. ఐదేళ్లుగా నమోదుకు అవకాశం కరువు లక్ష్యం చేరని ఫార్మర్ ఐడీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ -
బోటింగ్కు వెళ్లి సరస్సులో పడిపోయి..
● అమెరికాలో ఎత్తొండ క్యాంపు వాసి మృతి రుద్రూర్: కోటగిరి మండలం ఎత్తొండ క్యాంపునకు చెందిన వడ్లమూడి హరికృష్ణ (49) అమెరికాలో ప్రమాదవశాత్తు సరస్సులో మునిగి మృతి చెందిన ఘటన మూడు రోజుల క్రితం (శనివారం) చోటు చేసుకుంది. సరదాగా బోటింగ్కు వెళ్లిన హరికృష్ణ సరస్సులో మునిగి మృతి చెందాడన్న సమాచారంతో ఎత్తొండ క్యాంపులో విషాదఛాయలు అలుముకున్నాయి. హరికృష్ణకు భార్య శిల్ప, కూతుళ్లు యుక్త, సరయు ఉన్నారు. 25ఏళ్ల క్రితం ఉద్యోగ రీత్యా అమెరికాలో స్థిరపడ్డారు. కుటుంబసభ్యులతో కలిసి ఏడాది, రెండేళ్లకోసారి ఎత్తొండ క్యాంపునకు వచ్చి స్నేహితులు, బంధువులతో గడిపి వెళ్లేవారు. ఆరు నెలల క్రితం హరికృష్ణ తల్లిదండ్రులు సరస్వతి, రాధాకృష్ణ అమెరికా వెళ్లినట్టు స్థానికులు తెలిపారు. కాగా, హరికృష్ణ అంత్యక్రియలు అమెరికాలోనే నిర్వహిస్తున్నట్టు వారు తెలిపారు. ఒకరికి రెండు రోజుల జైలు వర్ని: మద్యం తాగి వాహనం నడిపిన వ్యక్తికి రెండు రోజుల జైలు శిక్ష విధిస్తూ సోమవారం బోధన్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ సాయి శివ తీర్పునిచ్చారు. ఈ నెల 20న బాన్సువాడ మండలం బోర్లం గ్రామానికి చెందిన ఓల్లెపు పాపయ్య మద్యం తాగి వాహనం నడుపుతుండగా వర్ని మండల కేంద్రంలో పట్టుకొని కోర్టులో హాజరుపర్చినట్లు ఎస్సై మహేశ్ తెలిపారు. -
రైలు కింద పడి ఒకరి మృతి
బోధన్: నిజామాబాద్–జానకంపేట రైల్వేస్టేషన్ల మార్గమధ్యలో సోమవారం గుర్తు తెలియని రైలు కిందపడి 60 నుంచి 65 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తి మృతి చెందినట్లు నిజామాబాద్ రైల్వేస్టేషన్ మేనేజర్ చందన్ కుమార్ తెలిపారు. మృతుడు ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని రైల్వే అధికారులు అనుమానిస్తున్నారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు దొరకలేదని రైల్వే ఎస్సై సాయరెడ్డి పేర్కొన్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్కు తరలించినట్లు తెలిపారు. మృతుడిని ఎవరైనా గుర్తిస్తే 87126 58591 నంబర్కు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఇసుక టిప్పర్ల పట్టివేత వర్ని (మోస్రా): అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్న రెండు ఇసుక టిప్పర్లను పట్టుకున్నట్లు వర్ని ఎస్సై మహేశ్ తెలిపారు. సోమవారం తెల్లవారుజామున రెండు టిప్పర్లలో ఇసుక తరలిస్తుండగా మోస్రా శివారులో పట్టుకొని కేసు నమోదు చేశామన్నారు. ఈ టిప్పర్లు సాలూర శివారులోని మంజీర పరీవాహక ప్రాంతం నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
క్రైం కార్నర్
బస్సు ఢీకొని ఒకరి మృతి కామారెడ్డి క్రైం: టీవీఎస్ ఎక్సెల్ వాహనంపై వెళ్తున్న ఓ వ్యక్తి పైకి ఆర్టీసీ బస్సు రూపంలో మృత్యువు దూసుకువచ్చిన ఘటన జిల్లా కేంద్రంలోని స్టేషన్ రోడ్డులో సోమవారం ఉదయం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. తాడ్వాయి మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన పైడాకుల నారాయణ (55) కామారెడ్డి– సిరిసిల్లా రోడ్లోని ధర్మశాల పక్కన ఉండే ఫర్నీచర్ దుకాణంలో పనిచేస్తున్నాడు. రోజూ మాదిరిగానే టీవీఎస్ ఎక్సెల్ వాహనంపై విధులకు వస్తుండగా వెనుక నుంచి వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొంది. తలకు తీవ్ర గాయాలు కావడంతో నారాయణ అక్కడికక్కడే మృతి చెందాడు. పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ జరిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా జనరల్ ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య, కుమార్తె ఉన్నారు. -
విద్యుత్ స్తంభాలను ఢీకొన్న లారీ
రుద్రూర్: పోతంగల్ చెక్పోస్ట్ వద్ద ఆదివారం ఓ కంకర లారీ విద్యుత్ స్తంభాలను ఢీకొని బోల్తా పడింది. బీర్కూర్ నుంచి కోటగిరి మండలం ఎత్తోండకు కంకర లోడ్తో లారీ బయలుదేరింది. పోతంగల్ శి వారులో మూల మలుపు వద్ద లారీ ప్రమాదవశాత్తు విద్యుత్ స్తంభాన్ని ఢీకొని బోల్తా పడింది. ఈ ఘటనలో రెండు స్తంభాలు విరిగిపోగ, మరో రెండు దె బ్బతిన్నాయి. ప్రమాద సమయంలో విద్యుత్ సరఫ రా ఉండగా, వెంటనే అధికారులు సరఫరా నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఘటనపై విద్యుత్శాఖ ఏఈ ఫక్రుద్దిన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుమారు రూ.80 వేల నష్టం జరిగినట్లు తెలిపారు. లారీ డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డట్టు స్థానికులు తెలిపారు. -
ఆత్మీయ పలకరింపులు.. మధుర స్మృతులు
సాక్షి నెట్వర్క్: ఆత్మీయ పలకరింపులు.. ఆపాత మధుర స్మృతులను గుర్తుకు తెచ్చుకుని పూర్వ విద్యార్థులు భావోద్వేగానికి లోనయ్యారు. అరే ఎన్నాళ్లయింది కలుసుకుని.. పూర్తిగా మారిపోయావంటూ ఆనాటి స్నేహితులు ఏళ్ల తర్వాత కలుసుకోవడంతో హర్షం వ్యక్తంచేశారు. జిల్లాలోని వివిధ గ్రామాల ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల పదోతరగతి పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు. ఈసందర్భంగా చిన్నానాటి మిత్రులందరూ ఏళ్ల తర్వాత మళ్లీ ఒకే వేదికపై కలుసుకోవడంపై ఆనందం వ్యక్తం చేశారు. ఒకరినొకరు పలకరించుకుంటూ అనాటి జ్ఞాపకాలను గుర్తుకుతెచ్చుకున్నారు. నాడు చదువు నేర్పిన ఉపాధ్యాయులను సమ్మేళనానికి ఆహ్వానించి, సన్మానించారు. సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటపాటలతో ఉల్లాసంగా గడిపారు. అనంతరం విద్యార్థులు, గురువులు అందరూ కలిసి సహపంక్తి భోజనాలు చేశారు. జిల్లాలో పలుచోట్ల సమ్మేళనాలు నిర్వహించిన పూర్వవిద్యార్థులు ఏళ్ల తర్వాత కలుసుకోవడంతో భావోద్వేగానికి గురైన చిన్ననాటి మిత్రులు -
ఆర్యవైశ్యులు రాజకీయంగా ఎదగాలి
నిజామాబాద్ నాగారం: ఆర్య వైశ్యులు రాజకీయంగా ఎదగాలని, ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. నగరంలోని శ్రీరామగార్డెన్లో ఆదివారం ఆర్యవైశ్య పట్టణ సంఘం, అనుబంధ సంఘాల విజయోత్సవ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై, జ్యోతిప్రజ్వలన చేసి మాట్లాడారు. ఆర్యవైశ్యులు అంటేనే సమాజంలో సేవకు మారు పేరుగా నిలిచారన్నారు. అన్నదాన కార్యక్రమాల నుంచి విద్య, వైద్యం, ఆధ్యాత్మికంగా అన్ని రంగాలలో సేవలందించడంలో ముందుంటారన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన ఈ ఆర్యవైశ్య పట్టణ సంఘం ఎన్నికల గురించి కొంత మంది ఎక్కువ ఆలోచిస్తున్నారన్నారు. ఆలా అలోచించి చివరికి నవ్వులపాలు కావద్దని విజ్ఞప్తి చేశారు. నూతనంగా గెలిచిన వారందరిని అభినందిస్తూ, ఈ గెలుపుతో తమ బాధ్యత మరింత పెరిగిందనే విషయం గుర్తుపెట్టుకోవాలని వారికి సూచించారు. మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, మాజీ మున్సిపల్ చైర్మన్ ముక్క దేవేందర్ గుప్తా, ఆర్యవైశ్య పట్టణ సంఘం అధ్యక్షుడు ధన్పాల్ శ్రీనివాస్ గుప్తా, ప్రధానకార్యదర్శి ఇల్లెందుల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. -
అవస్థల ప్రయాణం ఇంకెన్నాళ్లు?
నిజామాబాద్ రూరల్: మాధవనగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి వద్ద రహదారి అధ్వానంగా మారడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డంతా గుంతలమయం కావడంతోపాటు ఇటీవల కురిసిన వర్షాలకు వర్షపు నీరంత గుంతల్లో చేరింది. దీంతో వాహనదారులు గుంతలను గమనించక ప్రమాదాలకు గురవుతున్నారు. అయినా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇదీ పరిస్థితి.. మాధవగర్ ఆర్వోబీ పనులు ప్రారంభమై దాదాపు రెండున్నర సంవత్సరాలు గడుస్తున్నా ఇంకా కొనసాగుతునే ఉన్నాయి. ఆర్వోబీ నిర్మాణంలో భాగంగా రోడ్డుపై అక్కడక్కడ తవ్వకాలు జరిపి, పలు నిర్మాణాలు చేపట్టారు. తవ్వకాలను మొరంతో పూ డ్చివేసినా, పూర్తిస్థాయి మరమ్మతులు చేపట్టలేదు. అలాగే నిత్యం వాహనాల రాకపోకలు, వర్షాల కారణంగా రోడ్డంతా పూర్తిగా అధ్వానంగా మా రింది. పెద్ద పెద్ద గుంతలతోపాటు, పలు చోట్ల రో డ్డు కోతకు గురవడంతో వాహనాల రాకపోకలకు తీ వ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. అంతేకాకుండా రైల్వేగే టు పడితే ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతోంది. త లమయమైన రోడ్డు గురించి ఇది వరకే ఎన్నో సా ర్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినాప్రయోజనం లేదనిప్రయాణికులు,స్థానికప్రజలువాపోతున్నారు. సూచికలు, లైటింగ్ కరువు... ఆర్వోబీ పనులు జరిగే చోట ఎలాంటి ప్రమాద, ప్రయాణ సూచికల బోర్డులు లేకపోవడంతో ప్రయాణికులు అయోమయంలో పడుతున్నారు. హైదరాబాద్ వైపు నుంచి వచ్చే ప్రయాణికులు ఆర్వోబీ పనుల వద్ద సూచిక బోర్డులు లేక ఎటునుంచి వెళ్లాలో తెలియక స్థానికులను అడిగి వెళ్లే దుస్థితి ఏర్పడింది. అలాగై లైటింగ్ సౌకర్యం లేకపోవడంతో రాత్రివేళలో వాహనదారులు రోడ్డు సరిగా కనబడక ప్రమాదాలకు గురవుతున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి, ఆర్వోబీ పనుల వద్ద రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. రెండున్నరేళ్లుగా సాగుతున్న మాధవ్నగర్ ఆర్వోబీ పనులు గుంతల రోడ్లతో ఇబ్బందులు పడుతున్న వాహనదారులు మరమ్మతులు చేపట్టని అధికారులు -
వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు?
మీకు తెలుసా? డొంకేశ్వర్(ఆర్మూర్): ఎప్పుడైన వర్షం కురిస్తే, ఎంత కురిసిందో వాతావరణ శాఖ మాత్రమే చెబుతుంది. ● వర్షపాతాన్ని తెలుసుకునేందుకు రెయిన్ గేజ్లను (వర్షమాపకాలు) ఉపయోగిస్తారు. వా టిని వాతావరణ ప్రధాన కేంద్రమైన పూణే లో ప్రత్యేక ల్యాబ్లో తయారు చేస్తారు. ● రెయిన్ గేజ్లలో రెండు రకాలున్నాయి. ఒకటి సెల్ఫ్ రికార్డింగ్ రెయిన్ గేజ్. దీనిని నేలపై బోరు పైపులా ఏర్పాటు చేస్తారు. పైపులో గ్రాఫ్ రోలర్ బిగించి ఉంచుతారు. వర్షం పడిన సమయంలో నీరు సన్నని రంద్రంలోకి చేరడం వలన ఎప్పటికప్పుడు గ్రాఫ్లో నమోదు చేస్తుంది. ● రెయిన్ గేజ్లో రెండో రకం ఆర్డినరీ రెయిన్ గేజ్. ఇది ప్రతి మూడు గంటలకోసారి వర్షపాతాన్ని నమోదు చేస్తుంది. ఉదయం 8:30 గంటలకు, 11:30 గంటలకు మధ్యాహ్నాం 2:30 గంటలకు, సాయంత్రం 5:30 గంటలకు వర్షపాతాన్ని తీస్తారు. ● ఇదే పద్దతిలో రాత్రి నుంచి వేకువజాము వరకు కూడా మూడు గంటలకోసారి కొలుస్తారు. ● ఈ ఆర్డినరీ రెయిన్ గేజ్లు ప్రతి మండలానికి ఒకటి తహసీల్ ఆఫీసు ఆవరణలో ఉంటుంది. అలాగే సబ్ స్టేషన్లలో కూడా ఉంటాయి. ● వీటి రక్షణ కోసం చుట్టూ ఫెన్సింగ్ ఉంటుంది. చూడటానికి బోరు పైపు మాదిరిగా ఉంటుంది. సన్నని రంద్రం ద్వారా వర్షపునీరు వెళ్లి లోపల ఉన్న ఒక కంటెయినర్ (డబ్బా)లో చేరుతుంది. ● అలా డబ్బాలోకి చేరిన నీటిని ప్లాస్క్ మగ్లో కి పోసి కొలుస్తారు. వర్షపాతాన్ని మిల్లీ మీ టర్లు, సెంటీ మీటర్లలో కొలుస్తారు. 10 మి ల్లీ మీటర్లకు ఒక సెంటీ మీటరు అంటారు. ● ఈ వర్షపాతం వివరాలను సేకరించి ప్రభుత్వాలకు పంపేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుంటారు. వాతావరణ శాఖ నుంచి సైంటిఫిక్ అసిస్టెంట్లు, ముఖ్య ప్రణాళిక శాఖ నుంచి అసిస్టెంట్ స్టాటికల్ ఆఫీసర్ (ఏఎస్వో)లు ఉంటారు. -
ప్రమాదపు అంచున పర్యాటకులు
బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లోకి ఎగువ ప్రాంతాల నుంచి వరద చేరుతుండటంతో ప్రా జెక్ట్ సందర్శనకు పర్యాటకులు తరలివస్తున్నా రు. కానీ పర్యాటకులు ప్రాజెక్టు లోపలికి వెళ్లడంతోపాటు, నీటి అంచున ఫొటో షూట్లు, సెల్ఫీలు దిగుతున్నారు. దీంతో పర్యాటకులు ప్రమాదవశాత్తు నీటమునిగే ప్రమాదం ఉంద ని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ప్రాజెక్టు అధికారులు స్పందించి ప్రమాదాలు జరుగకముందే తగిన చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. ప్రారంభమైన జెండా బాలాజీ జాతర ఆర్మూర్టౌన్: పట్టణంలోని జెండాగల్లీలో గల వేంకటేశ్వర ఆలయ ఆవరణలో ఆదివారం స ర్వసమాజ్ ఆధ్వర్యంలో జెండా బాలాజీ జాత ర ఘనంగా ప్రారంభమైంది. ఈ సంద ర్బంగా జెండాతో ఆలయం చూట్టు ఐదు ప్రదిక్షణలు చే సి, ప్రత్యేక పూజలు నిర్వహించి జెండాను ప్రతి ష్ఠించారు. భక్తులు 9రోజుల పాటు ఆలయంలోని జెండాకు పూజలు చేయనున్నారు. అంతకుముందు జెండాతో పట్టణంలో ఊరేగింపు ని ర్వహించారు. ఆగస్టు 5న జెండాను అంకాపూర్ గ్రామాస్తులకు అప్పగించనున్నారు. ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ నియెజకవర్గ ఇన్చార్జి వినయ్రె డ్డి జంబిహనుమాన్ ఆలయ ఆవరణలో జెండా కు ప్రత్యేక పూజలు చేశారు. అధ్యక్షుడు కొట్టాల సుమన్, ప్రధాన కార్యదర్శి కర్తన్ దినేష్, సర్వసమాజ్ సభ్యులు పాల్గొన్నారు. రేపు ఆవు పాల పంపిణీ నిజామాబాద్ రూరల్: నాగుల పంచమిని పురస్కరించుకొని ఈ నెల 29న గోకుల్ గో సేవా సమితి ఆధ్వర్యంలో ఇందూరు నగరంతోపా టు పలు గ్రామాల్లో 70 ఆవుపాల పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు అధ్యక్షుడు టీ రా మ్మోహన్ తెలిపారు. నగరంలోని పెద్ద రాంమందిరంలో ఆదివారం ఏర్పాటు చేసిన సమా వేశంలో ఆయన మాట్లాడారు. మంగళవారం ఉదయం 6.30 నుంచి ఆవు పాలను ఉచితంగా పంపిణీ చేస్తామన్నారు. సమావేశంలో సమితి సభ్యులు శంకర్, శ్రీధర్, దయాకర్, సతీశ్, బా లకిషన్ తదితరులు పాల్గొన్నారు. అలాగే ఇందూరు గోసేవా సమితి ఆధ్వర్యంలో ఆవు పా లు పంపిణీ చేస్తున్నట్లు అధ్యక్షుడు వీరమల్లు రమేశ్ తెలిపారు. ఆదివారం సమితి కార్యాలయంలో పోస్టర్లను ఆవిష్కరించారు. లక్ష్మీకాంతం, కోట యాదగిరి తదితరులు పాల్గొన్నారు. ‘నిజాంసాగర్’లోకి ఇన్ఫ్లో నిజాంసాగర్: ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షా ల వల్ల ఆదివారం నిజాంసాగర్ ప్రాజెక్టులోకి 1,828 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1,405 అడుగులు (17.8 టీఎంసీలు) కాగా ఆదివారం సాయంత్రానికి 1,391 అడుగుల (4.47 టీఎంసీలు) నీరు నిల్వ ఉందని పేర్కొన్నారు. -
ఐక్యతతోనే బంజారాల అభివృద్ధి సాధ్యం
డిచ్పల్లి(నిజామాబాద్రూరల్): బంజారా (లంబా డి)లు అందరూ ఐక్యతతో ఉంటేనే అభివృద్ధి సాధ్య మని ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ సబావత్ రాములు నా యక్ అన్నారు. మండలంలోని బర్ధిపూర్ శివారులోగల ఓ ఫంక్షన్ హాల్లో ఆదివారం బంజారా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. కార్యక్రమానికి రాములు నాయక్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బంజారాల సంస్కృతి, సాంప్రదాయాల పరిరక్షణకు జీవితం అంకింతం చేసిన రామారావు మహారాజ్కు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించాలని డిమాండ్ చేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బంజారాలు అత్యధిక స్థానాలను గెలిచి రాజకీయంగా రాణించడంతో పాటు తండాల అభి వృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆదివాసీ నాయకులు, మాజీ ఎంపీ సోయం బాపురావు ఎస్టీ జాబితా నుంచి బంజారాలను తొలగించాలని సు ప్రీంకోర్టులో కేసు వేశారని బంజారాలందరూ ఐ క్యతతో ఆయన కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఏఐబీఎస్ఎస్ జాతీయ అధ్యక్షుడు, మాజీ ఎంపీ ఉమేష్ జీ.జాదవ్ మాట్లాడుతూ.. బంజారాలకు రాష్ట్ర ప్రభుత్వం మంత్రి పదవి ఇవ్వాలని డి మాండ్ చేశారు. నాయకులు శ్రీహరి నాయక్, కిషన్సింగ్ రాథోడ్, పాండునాయక్, రామారావు, మో హన్ నాయక్, పీర్సింగ్, రవికుమార్, రాంచందర్నాయక్, పుసల నరహరి బదావత్, సబావత్ శివలాల్ నాయక్, మోతీలాల్, జాదవ్ ఓమాజీ, దశర థ్, శివలాల్, చాంగీబాయి తదితరులు ఉన్నారు. -
తాళం వేసిన రెండిళ్లలో చోరీ
బాల్కొండ: మండల కేంద్రంలోని తాళం వేసిన రెండిళ్లలో గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. స్థానికులు, ఎస్సై శైలెంధర్ తెలిపిన వివరాలు ఇలా.. మండల కేంద్రానికి చెందిన పుట్టి సుమంతి ఇంటికి తాళం వేసి ఉండగా శనివారం అర్ధరాత్రి దుండగులు తాళం పగులగొట్టి, ఇంట్లోని 6.7 తులాల బంగారం, ఆరు తులాల వెండి, నగదు ఎత్తుకెళ్లారు. అలాగే అదే గ్రామంలోని తాళం వేసి ఉన్న సంతోష్ గౌడ్ ఇంట్లోకి దుండగులు చొరబడి నగదును చోరీ చేశారు. ఉదయం స్థానికులు చోరీ జరిగినట్లు గుర్తించి, పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై శైలెంధర్ సిబ్బందితో వెళ్లి ఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. వ్యవసాయ మోటార్ల కేబుల్ వైరు.. ధర్పల్లి: మండల కేంద్రం శివారులోని పంట పొలాల వద్ద సుమారు 20 వ్యవసాయ మోటార్ల కేబుల్ వైర్లు చోరీకి గురయ్యాయి. ఆదివారం ఉదయం పొలాలకు నీరు పెట్టేందుకు వెళ్లిన రైతులు సబ్మెర్సిబుల్ మోటారు నుంచి మెయిన్ బోర్డ్ వరకు ఉండే కేబుల్ వైర్లు కట్ చేసి ఉండడాన్ని గమనించి, పోలీసులకు సమాచారం అందించారు. వారు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కళ్యాణి తెలిపారు. పంటలకు నీరు పెట్టాలంటే మళ్లీ ప్రతి మోటార్కు కేబుల్ వైరు కొనాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు రాత్రి సమయంలో గట్టి నిఘా పెట్టి దొంగలను పట్టుకుని కేబుల్ వైర్ చోరీలను అరికట్టాలని రైతులు కోరుతున్నారు. -
మత్తు పదార్థాలకు దూరంగా ఉండండి
కామారెడ్డి క్రైం: మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని పట్టణ ఎస్హెచ్వో నరహరి అన్నారు. ఆదివారం పట్టణ పోలీస్ స్టేషన్లో ‘మత్తు పదార్ధాలకు దూరంగా ఉండండి’ అనే సందేశంతో రూపొందించిన వాల్ పోస్టర్లను లీగల్ సర్వీసెస్ అధారిటీ కార్యదర్శి విజయ్ కుమార్తో కలిసి ఆవిష్కరించారు. పట్టణ పోలీసుల ఆధ్వర్యంలో పట్ణణంలోని ప్రధాన కూడళ్లు, బస్టాండ్, రైల్వే స్టేషన్, తదితర ప్రాంతాల్లో అతికించారు. మత్తు పదార్థాలపై యు వత, ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని తెలిపారు. మంకీ గన్లకు భలే గిరాకీ..! ఎల్లారెడ్డి: కోతుల బెడద తీవ్రంగా ఉండటంతో స్థానికులు బెంబేలెత్తి పోతున్నారు. కోతుల నివారణకు మంకీ గన్లు బాగా ఉపయోగపడుతుండటంతో వాటిని కొనుగోలు చేసేందుకు స్థానికులు ఆసక్తి కనబరుస్తున్నారు. పట్టణంలో మంకీ గన్లు విక్రయించేందుకు రావడంతో స్థానికులు వాటిని కోనుగోలు చేశారు. సుమా రు రూ.150కి విక్రయదారులు అమ్ముతున్నా రు. మంకీగన్లలో సున్నపురాయిని వేసి దానిలో రెండు చుక్కల నీటిని పోసి అటు ఇటు తిప్పి లైటర్ను ఆన్చేస్తే భారీ శబ్దం రావడంతో కోతు లు పారిపోతున్నాయని స్థానికులు తెలిపారు. -
క్రైం కార్నర్
దుబాయ్ నుంచి స్వగ్రామానికి చేరిన మృతదేహం ● తలకొరివి పెట్టిన తల్లి డిచ్పల్లి/ఇందల్వాయి: ఇందల్వాయి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి దుబాయ్లో కొన్ని రోజుల క్రితం మృతిచెందగా ఆదివారం మృతదేహం స్వగ్రామానికి చేరింది. గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా.. ఇందల్వాయి గ్రామానికి చెందిన నీరడి భోజన్న (44) ఉపాధి నిమిత్తం కొన్ని రోజుల క్రితం దుబాయి వెళ్లాడు. 20 రోజుల క్రితం అనారోగ్యానికి గురై, గుండెపోటు రావడంతో అక్కడి ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. దుబాయ్లోనే ఉంటున్న అతడి తమ్ముడు మృతదేహాన్ని గ్రామానికి పంపించేందుకు కంపెనీ చుట్టూ తిరిగిన పట్టించుకోలేదు. విషయం తెలుసుకున్న యూఏఈ తెలుగు హెల్పింగ్ హాండ్స్ ఆర్గనైజేషన్ కంపెనీ వారితో మాట్లాడగా, మృతదేహాన్ని స్వగ్రామానికి పంపించేందుకు సహకరించింది. ఆర్గనైజేషన్కు చెందిన అజ్మన్ ఇన్చార్జి భూమేష్ సహకారంతో అన్ని రకాల అనుమతులు తీసుకున్నారు. మృతుడు తమ్ముడికి టికెట్టు సమకూర్చి మృతదేహాన్ని ఇండియాకు పంపించారు. ఆదివారం స్వగ్రామానికి చేరుకున్న మృతదేహానికి తల్లి లింగవ్వ తలకొరివి పెట్టింది. మృతుడు భోజన్నకు భార్య సుమ (ప్రస్తుతం నిండు గర్భిణీ), ఒక కూతురు ఉంది. బాధిత కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ఐదు లక్షల ఎక్స్గ్రేషియా ఇచ్చి ఆదుకోవాలని గ్రామస్తులు, తెలుగు హెల్పింగ్ హ్యాండ్ ఆర్గనైజేషన్ సభ్యులు కోరుతున్నారు. పోచారంలో పోచమ్మ గుడి, పుట్ట ధ్వంసం బోధన్: ఎడపల్లి మండలం పోచారం గ్రామ శివారులో చెట్ల కింద ఉన్న నాగదేవత పుట్ట, పోచమ్మ గుడిని గుర్తు తెలియని వ్యక్తులు జేసీబీతో ఽతవ్వేశారని గ్రామస్తులు తెలిపారు. గ్రామస్తులు ఆదివారం ఉదయం గుడి వైపు వెళ్లగా ఆలయ ధ్వంసంను గుర్తించి, పోలీసులకు సమాచారం అందించారు. ప్రతి ఏటా నాగుల పంచమినాడు గ్రామంలోని మహిళలు ఇక్కడి పుట్టకు పూజలు చేసి పాలుపోస్తారని మంగళవారం నాగుల పంచమి ఉండగా పుట్ట ధ్వంసం కావడంతో గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. బోధన్ రూరల్ సీఐ విజయ్బాబు, ఎడపల్లి ఎస్సై రమా సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకుని గ్రామస్తులతో మాట్లాడి వివరాలు సేకరించారు. ఆలయ పున:నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, బాధ్యుల పై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరారు. -
ఉపాధి ఎరవేసి.. ఇరికించారు
మోర్తాడ్(బాల్కొండ): యూరప్లో ఉపాధి కల్పిస్తామంటూ ఏజెంట్లు చెప్పిన మాటలను నమ్మి వెళ్లిన వేల్పూర్ మండలం పడిగెల గ్రామానికి చెందిన గంగాప్రసాద్ దుబాయ్లో చిక్కుకుపోయాడు. మూడేళ్లుగా స్వదేశానికి రాలేక ఇబ్బందులు పడుతున్నాడు. ప్రభుత్వం స్పందించి తమ కుమారుడిని ఎలాగైనా ఇంటికి రప్పించాలని కోరుతూ బాధితుడి తండ్రి భోజన్న, అన్న ప్రసాద్ హైదరాబాద్లోని ప్రవాసీ ప్రజావాణిని ఆశ్రయించారు. ఎన్నారై అడ్వయిజరీ కమిటీ చైర్మన్ వినోద్కుమార్, వైస్ చైర్మన్ మంద భీంరెడ్డిల సహకారంతో ప్రవాసీ ప్రజావాణి ఇన్చార్జి, ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డికి ఇటీవల వినతిపత్రం అందజేశారు. దీంతో గంగాప్రసాద్ను మోసగించిన ఏజెంట్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చిన్నారెడ్డి పోలీసులకు సూచిస్తూ లేఖ రాశారు. దుబాయ్లోని భారత రాయబార కార్యాలయంతో మాట్లాడి బాధితుడిని రప్పిస్తామని హామీ ఇచ్చారు. యూరప్ పేరిట గాలం.. పడిగెల గ్రామానికి చెందిన గంగాప్రసాద్ హోటల్ మేనేజ్మెంట్ కోర్సులో డిగ్రీ పూర్తి చేశాడు. మూడేళ్ల కిందట యూరప్లోని హోటల్ రంగంలో ఉపాధి కల్పిస్తామని నమ్మించిన ఇద్దరు ఏజెంట్లు గంగాప్రసాద్ నుంచి రూ.8.77 లక్షలు వసూలు చేశారు. మొదట దుబాయ్లో ఆరు నెలలపాటు ఉంటే అక్కడి నుంచి యూరప్ తరలిస్తామని చెప్పారు. ఏజెంట్ల మాటలు నమ్మిన గంగాప్రసాద్ దుబాయ్కి వెళ్లాడు. అక్కడ ఓ డమ్మీ కంపెనీలో ప్రసాద్కు ఐటీ మేనేజర్గా ఉద్యోగం ఇచ్చినట్లు నకిలీ ఐడీ కార్డును అందజేశారు. అదే ఐడీ కార్డుతో బ్యాంకు ఖాతా తెరిపించి చెక్బుక్ తీసుకున్నారు. ఆ చెక్కులపై గంగాప్రసాద్తో సంతకాలు చేయించుకొని అతని పేరిట షార్జాలో ఓ ఇల్లును అద్దెకు తీసుకున్నారు. ఆరు నెలల తర్వాత యూరప్ పంపే విషయమై అడిగితే దాటవేస్తూ వచ్చారు. దీంతో అక్కడే ఉంటూ బయట వంట మనిషిగా పనిచేస్తూ వచ్చాడు. స్వదేశానికి వచ్చేందుకు ఏప్రిల్ 13న దుబాయ్ ఎయిర్పోర్టుకు చేరుకోగా గంగాప్రసాద్ను పోలీసులు అరెస్టు చేశారు. షార్జాలో ఇంటి ఒప్పందం చేసుకొని ఇచ్చిన చెక్కులు చెల్లలేవని, దీంతో కేసు నమోదైనట్లు స్పష్టం చేశారు. ఇంటి అద్దె ఒప్పందంలో భాగంగా 27వేల ధరమ్స్ చెల్లించాలని వెల్లడించారు. మొదట బెయిల్ ఇవ్వడానికి 4వేల ధరమ్స్ను ప్రసాద్ కుటుంబసభ్యులు షార్జాకు పంపించారు. ఇంకా 23వేల ధరమ్స్(రూ.5.4లక్షలు)చెల్లించాల్సి ఉంది. కాగా, గంగాప్రసాద్ పేరిట భవనాన్ని అద్దెకు తీసుకున్న ఏజెంట్లు.. థర్డ్ పార్టీకి అద్దెకు ఇచ్చి తమ జేబులు నింపుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏజెంట్ల మోసానికి బలైన పడిగెల వాసి బాధితుడి పేరిట దుబాయ్లో ఇల్లు అద్దె తిరిగి వచ్చేందుకు ఇబ్బందులు ఏజెంట్లపై కేసు నమోదుకు ప్రవాసీ ప్రజావాణి ఇన్చార్జి సూచన -
పులి.. జాడేదీ?
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు వచ్చిన అరుదైన అతిథి.. ఎటువెళ్లిందన్న విషయమై స్పష్టత రావడం లేదు. పక్షం రోజులుగా అటవీ అధికారులు వెతుకుతున్నా పెద్దపులి జాడ కనిపించడం లేదు. నిఘా కోసం ఏర్పాటు చేసిన కెమెరాలలోనూ ఎలాంటి ఆధారాలూ రికార్డు కాలేదు. దీంతో అటవీ ప్రాంతాలకు సమీపంలో ఉన్న గ్రామాల ప్రజలు, పశువుల కాపరులు భయంభయంగా గడుపుతున్నారు. నిజామాబాద్ జిల్లా సిరికొండ రేంజ్ పరిధిలో పెద్దపులి సంచరించినట్లు ఈనెల 11వ తేదీన అటవీ అధికారులు పాదముద్రల ద్వారా నిర్ధారించారు. ఆ తరువాత కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం రెడ్డిపేట స్కూల్తండా అటవీ ప్రాంతంలో పక్షం రోజుల క్రితం ఓ ఆవుపై పులి దాడి చేసిన సంఘటన కలకలం రేపింది. దాడి చేసిన ప్రాంతంలో అడుగులను పరిశీలించిన అటవీ శాఖ అధికారులు.. అవి పులివేనన్న తేల్చారు. 26 కెమెరాల ఏర్పాటు.. ఆవుపై దాడి చేసిన ప్రాంతానికి కొద్ది దూరంలో నలువైపులా కెమెరా ట్రాప్లను ఏర్పాటు చేశారు. ఆ కెమెరాలు రాత్రింబవళ్లు పనిచేస్తాయి. ఆ ప్రాంతంలో పులి సంచరిస్తే కచ్చితంగా కెమెరాకు చిక్కుతుంది. దాదాపు 26 కెమెరాలు ఏర్పాటు చేసినట్టు అటవీ అధికారులు చెబుతున్నారు. కెమెరాలను రెగ్యు లర్గా పరిశీలిస్తున్నారు. కానీ ఏ ఒక్కదానిలోనూ పులి సంచారం రికార్డు కాలేదు. పులి తిరుగుతున్న నేపథ్యంలో పశువులు, మేకల కాపరులు అడవి లోపలికి వెళ్లడం లేదు. బయట మేపుతున్నారు. పక్షం రోజులుగా వెతుకుతున్నా ఫలితం శూన్యం కెమెరా కంటికీ చిక్కని వైనం -
చిరుతల అలజడి
డొంకేశ్వర్(ఆర్మూర్): జిల్లాలో చిరుతల అలజడి పెరిగింది. ఆహారం, నీటి కోసం సంచరిస్తూ అడవులు, గుట్టలను వదిలి జన సంచార ప్రాంతాల్లోకి వస్తున్నాయి. అలా వస్తున్న చిరుతలు పశువులు, మేకల మందలపై దాడులు చేసి చంపుతున్నాయి. దీంతో పశువుల కాపరులకు భయం పట్టుకుంది. ఇటీవల పలు రేంజ్ల పరిధిలో చిరుతలు ఎక్కువగా కనిపిస్తుండడంతో ఆ ప్రాంతాల ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఈ జూలై నెలలోనే జరిగిన వరుస ఘటనలు అటవీ అధికారులకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. ట్రాప్ కెమెరాలు అందుబాటులో లేకపోవడంతో చిరుతలతోపాటు ఇతర వన్యప్రాణుల కదలికలను కనిపెట్టలేకపోతున్నారు. చిరుతలు ఎక్కు వగా ఉన్న ఇందల్వాయి అటవీ రేంజ్లో 44వ నెంబర్ జాతీయ రహదారికి ఇరువైపులా ఫెన్సింగ్ లేకపోవడంతో చిరుతలు హైవేపై సంచరిస్తున్నాయి. ఈ నెలలోనే ఆరు ఘటనలు... ● 11వ తేదీన సిరికొండ మండలం తాటిపల్లి అడవుల్లో పెద్ద పులి సంచరించినట్లు ఫారెస్ట్ అధికారులు పాదముద్రలను గుర్తించారు. ఇక్కడి నుంచి వెళ్లిన పులి కామారెడ్డి జిల్లా మాచారెడ్డి రేంజ్ అడవుల్లో ఆవుపై దాడిచేసింది చంపింది. పెద్దపులి జాడ ఇంతవరకు లభించలేదు. ● 13వ తేదీన నిజామాబాద్ నార్త్ రేంజ్ పరిధిలోని నాగారం డంపింగ్యార్డు గుట్ట ప్రాంతంలో చిరుత కనిపించింది. స్థానికులు వీడియో తీసి అటవీ అధికారులకు సమాచారం అందించారు. తరుచూ ఇదే ప్రాంతంలో చిరుతలు సంచరిస్తుడంతో స్థానికులు భయబ్రాంతులకు గురవుతున్నారు. ● 17వ తేదీన ఎడపల్లి మండలం జానకంపేట్ శివారులో మేకల మందపై చిరుత దాడి చేసి ఒక మేకను పట్టుకెళ్లింది. ఈ ఘటన మేకల కొట్టంలోని సీసీ కెమెరాలో రికార్డయ్యింది. ఈ విషయాన్ని మేకల యజమాని సందీప్ అటవీ అధికారులకు తెలుపడంతో వారు చిరుత సంచరించిన ప్రాంతాన్ని పరిశీలించారు. అదే రోజున సిరికొండ మండలం పాకాల శివారులో జిట్టపులి లేగదూడపై దాడిచేసి చంపేసింది. డీఎఫ్వో నిఖిత మృతి చెందిన లేగదూడను పరిశీలించారు. ● జూలై 24, 26 తేదీల్లో నవీపేట్ మండలం నందిగామ, సిరన్పల్లి గ్రామాల్లో చిరుతలు సంచరించాయి. సిరన్పల్లిలో మేకల మందపై చిరుత దాడిచేసింది. నందిగామలో చిరుత పాదముద్రలు కనిపించగా, మరుసటి రోజే గుట్టపై చిరుత కనిపించింది. దీనిని స్థానికులు వీడియో, ఫొటోలు తీశారు. ● ఫిబ్రవరి 21న నవీపేట్ మండలం అబ్బాపూర్లో ఓ రైతుకు చెందిన పశువుల కొట్టంలోకి చొరబడిన చిరుత రెండు లేగదూడలపై దాడిచేసి చంపేసింది. సమాచారం అందుకున్న అటవీ అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అడవుల్లోకి వెళ్లొద్దు చిరుతల సంచారం పెరిగింది. ఒక చోటు నుంచి మరో చోటుకి వెళ్తున్నాయి. ఈ క్రమంలో అటవీ ప్రాంతాలకు దగ్గరగా ఉన్న గ్రామాల్లోకి వచ్చి మేక లు, పశువుల కొట్టాల్లోకి చొరబడి దాడి చేస్తున్నా యి. అడవుల్లోకి వెళ్లకుండా కొద్ది దూరం వరకే కాపరులు పశువులను తీసుకెళ్లాలి. చిరుత పులులు కనిపించిన వెంటనే అటవీ అధికారులకు సమాచారం ఇవ్వాలి. – సంజయ్గౌడ్, ఎఫ్ఆర్వో, నిజామాబాద్ నార్త్జిల్లాలో పెరిగిన సంచారం ఆహారం, నీటి కోసం అన్వేషిస్తూ అడవి నుంచి బయటికి.. లేగదూడలు, మేకల మందలపై వరుస దాడులు భయబ్రాంతులకు గురవుతున్న ప్రజలు, పశువుల కాపర్లు -
ధైర్యం ధర్మాస్పత్రి!
హలో.. ఆస్పత్రికి రండిప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు జీవితంపై కొత్త ఆశలు ● పాలియేటివ్ కేర్ సెంటర్, క్యాన్సర్ వార్డుల్లో చికిత్స ● పేద, మధ్య తరగతికి భారీ ఊరట ● త్వరలో అధికారికంగా క్యాన్సర్ వార్డు ప్రారంభం ● ప్రాథమికంగా అందుతున్న చికిత్స నిజామాబాద్నాగారం: జిల్లాలో సుమారు 1200 మందికిపైగా క్యాన్సర్ బారినపడినట్లు అధికారిక లెక్కలు పేర్కొంటున్నాయి. వారంతా జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఆస్పత్రులు లేదా హైదరాబాద్లోని ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకుంటున్నారు. కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ చేయించుకోవడం, ఖరీదైన మందులు కొనుగోలు చేయడం చాలా కుటుంబాలపై ఆర్థికంగా తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే క్యాన్సర్ రోగులకు వైద్యం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి చికిత్స అందించేందుకు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ఆవరణలో ఏడాది క్రితం ప్రారంభించిన పాలియేటివ్ కేర్ సెంటర్లోనే ప్రత్యేకంగా క్యాన్సర్ వార్డును ఏర్పాటు చేశారు. ప్రారంభమైతే అన్ని రకాల వైద్యం.. జీజీహెచ్ ఆవరణలో క్యాన్సర్ వార్డు అధికారికంగా ప్రారంభమైతే రోగులకు అవసరమైన అన్నిరకాల వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇప్ప టికే క్యాన్సర్ బారిన పడిన రోగులకు చికిత్స అందిస్తున్నారు. అధికారికంగా ప్రారంభమైన తరువాత రోగులకు కీమో థెరీపీ, రేడియేషన్ థెరపీ చేయడంతోపాటు అన్ని రకాల మందులు అందించనున్నారు. ఇది అన్నివర్గాల వారికి పెద్ద ఊరటనిచ్చే అంశం. జీజీహెచ్ ఆవరణలో ఏర్పాటైన క్యాన్సర్ వార్డు అధికారికంగా ప్రారంభం కాలేదు. అయినప్పటికీ క్యాన్సర్ రోగుల ఆరోగ్య వివరాలను ఎప్పటికప్పుడు సేకరిస్తున్న వైద్య సిబ్బంది ప్రస్తుతం అందుబాటులో ఉన్న చికిత్స అందిస్తున్నారు. రోగులకు, వారి కుటుంబ సభ్యులకు వైద్య సిబ్బంది ఫోన్లు చేసి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటున్నారు. కీమో, రేడియేషన్ థెరపీ కారణంగా చేయించుకున్న తరువాత వచ్చే తీవ్ర నొప్పులు, వీక్నెస్, ఇతర సైడ్ ఎఫెక్ట్లకు క్యాన్సర్ వార్డులో చికిత్స అందిస్తున్నారు. అవసరమైన వారికి ఫిజియోథెరపీ, డ్రెస్సింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం 10 బెడ్లు ఉన్నాయి. హైదరాబాద్లోని ఎంఎన్జే, బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రుల్లో చికిత్స తీసుకున్న వారికి ఆ తరువాత సైడ్ ఎఫెక్ట్స్, నొప్పులు, ఇతర సమస్యలు వస్తే జీజీహెచ్కు వెళ్లాలని అక్కడి వైద్యులు రిఫర్ చేస్తున్నారు. వైద్యులు.. సిబ్బంది ప్రస్తుతం క్యాన్సర్ వార్డులో వైద్య నిపుణులు చైతన్యతోపాటు ఫిజియోథెరపిస్ట్, నలుగురు స్టాఫ్ నర్సులు, ఇద్దరు చొప్పున అటెండర్లు, ఆయాలు, వాచ్మెన్లు విధులు నిర్వర్తిస్తున్నారు. ఇప్పటి నుంచే 24 గంటలపాటు వార్డు అందుబాటులో ఉంటోంది. -
ఆర్థిక భారమైనా.. సన్నబియ్యం పంపిణీ
బోధన్ : ఉన్నతస్థాయి వారితో సమానంగా పేదలు సైతం సన్నబియ్యంతో భోజనం చేయాలనే సంకల్పంతో సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక భారాన్ని భరిస్తూ సన్నబియ్యం పంపిణీ చేస్తోందని మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్రెడ్డి అన్నారు. బోధన్ పట్టణంలోని లయన్స్ కంటి ఆస్పత్రి ఆడిటోరియం హాల్, సాలూరాలోని టీటీడీ కల్యాణ మండపంలో రేషన్కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా బోధన్ మండలానికి చెందిన 665 మందికి, సాలూరాకు చెందిన 108 మందికి నూతన రేషన్కార్డులను అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే పంపిణీ చేశా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి రేషన్కార్డు ఇస్తామన్నారు. పేదల అభ్యున్నతి, వారి సొంతింటి కలను సాకారం చేసేందుకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తోందన్నారు. జిల్లాలోని ప్రభుత్వ బడుల్లో మౌలిక సౌకర్యాల కల్పనకు రూ.22 కోట్లు వెచ్చిస్తున్నామన్నారు. అలాగే బోధన్ ప్రాంతంలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ నెలకొల్పేందుకు కృషి చేస్తున్నామని, ఇందుకు స్థలాన్ని పరిశీలించామని తెలిపారు. వరికి ప్రత్యామ్నాయంగా అధిక లాభదాయకమైన ఆయి ల్ పామ్ పంట సాగు వైపు దృష్టిసారించాలని రైతులకు సూచించారు. జిల్లాకు నాలుగైదు రోజుల్లో సీఎం రేవంత్రెడ్డి రానున్నారని, రూ.1000 కోట్ల వి లువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుడతారని తె లిపారు. కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి మాట్లాడు తూ.. అర్హులకు రేషన్కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని అన్నారు. జిల్లాలో 11,852 కొత్త రేషన్కార్డులు, 84,232 మంది కొత్త సభ్యుల పేర్లను జాబితాలో చే ర్చినట్లు వివరించారు. సబ్ కలెక్టర్ వికాస్ మహతో, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్బిన్ హందాన్, డీఎస్వో అర్వింద్రెడ్డి, సివిల్ సప్లయీస్ డీఎం శ్రీకాంత్రెడ్డి, ఏఎంసీ చైర్మన్ చీల శంకర్, సాలూర తహసీల్దార్ శశిభూషణ్, ఎంపీడీవో శ్రీనివాస్, టీపీసీసీ డె లిగేట్ గంగాశంకర్, కాంగ్రెస్ పార్టీ మండల అఽ ద్యక్షుడు మందర్నా రవి, నాగేశ్వర్రావు, పాషామోహినొద్దీన్, సాలూర సొసైటీ చైర్మన్ అల్లె జనార్దన్, నాయకులు అల్లె రమేశ్ తదితరులు పాల్గొన్నారు.అర్హులందరికీ రేషన్కార్డులిస్తాం పకడ్బందీగా వెరిఫికేషన్ నాలుగైదు రోజుల్లో జిల్లాకు సీఎం రాక మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి బోధన్, సాలూర మండలాల్లో కార్డుల పంపిణీకార్డుల మంజూరు నిరంతర ప్రక్రియ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి డిచ్పల్లి(నిజామాబాద్రూరల్): రేషన్కార్డుల మంజూరు నిరంతర ప్రక్రియ అని నిజామాబా ద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి తెలిపారు. డిచ్పల్లి మండల కేంద్రంలోని కేఎన్ఆర్ గార్డెన్లో శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లబ్ధిదారులకు ఎమ్మెల్యే రేషన్కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. రూరల్ నియోజకవర్గంలో 16,116, డిచ్పల్లి మండలంలో 3,270 రేషన్కార్డులు మంజూరు చేసినట్లు వెల్లడించారు. గత బీఆర్ఎస్ ప్రభు త్వం పదేళ్ల కాలంలో ఒక్క రేషన్కార్డు కూడా మంజూరు చేయ లేదని విమర్శించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పేదలకు సన్న బియ్యం ఇవ్వ డం లేదని విమర్శించారు. అదనపు కలెక్టర్ కిర ణ్కుమార్, ఆర్డీవో రాజేంద్రకుమార్, తహసీల్దా ర్ సతీశ్ రెడ్డి, మండల ప్రత్యేకాధికారి యోహాన్, టీపీసీసీ జనరల్ సెక్రెటరీ కే నగేశ్రెడ్డి, పీసీసీ డెలిగేట్ శేఖర్గౌడ్, ఐడీసీఎంఎస్ మాజీ చైర్మన్ తారాచంద్, డీసీసీబీ వైస్ చైర్మన్ చంద్రశేఖర్రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పొలసాని శ్రీనివాస్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు అమృతాపూర్ గంగాధర్, డీసీసీ డెలిగేట్స్ వాసుబా బు, ధర్మాగౌడ్, శ్యాంసన్, సొసైటీ చైర్మ న్లు రాంచందర్గౌడ్, గంగారెడ్డి, మాజీ ఎంపీపీలు కంచెట్టి గంగాధర్, నర్సయ్య పాల్గొన్నారు. -
సబ్ కంట్రోల్ పునరుద్ధరణ
ఖలీల్వాడి : నిజామాబాద్ నగరంలోని ప్రధాన జంక్షన్లలో పోలీస్ సబ్ కంట్రోల్ రూమ్లను పునరుద్ధరించనున్నట్లు పోలీస్ కమిషనర్ పి సాయిచైతన్య తెలిపారు. గతంలో నగరంలోని ఆర్టీసీ బస్టాండ్, బోధన్ బస్టాండ్, అర్సపల్లి చౌరస్తా, చార్ భాయ్ పె ట్రోల్ బంక్, వీక్లి మార్కెట్, కంఠేశ్వర్ చౌరస్తా తదితర ప్రాంతాల్లో కొనసాగిన సబ్ కంట్రోల్ రూమ్ లను సీపీ శుక్రవారం రాత్రి పరిశీలించారు. సబ్ కంట్రోల్ రూమ్లను వాడకంలోకి తీసుకువచ్చేలా అధి కారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. ట్రాఫిక్ ని యంత్రణ కోసం ఆయా జంక్షన్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీలతో సీసీ కెమెరాల ను ఏర్పాటు చేయాలన్నారు. అవసరమైన ప్రాంతా ల్లో కొత్తగా ట్రాఫిక్ సిగ్నల్స్, జీబ్రా, స్టాఫ్ లైన్ల ఏ ర్పాటు, ఫ్రీ లెఫ్ట్ కార్యాచరణ రూపొందించాలని, హనుమాన్ జంక్షన్ వద్ద ట్రాఫిక్ సిగ్నల్ను పునరుద్ధరించాలని ఆదేశించారు. సీపీ వెంట ట్రాఫిక్ ఏసీపీ సయ్యద్ మస్తాన్ అలీ, సీఐ పి ప్రసాద్, ఒకటో టౌన్ ఎస్హెచ్వో రఘుపతి, రిజర్వ్ సీఐ (వెల్ఫేర్) తిరుపతి తదితరులు ఉన్నారు.● ప్రధాన జంక్షన్లలో ఏఐ టెక్నాలజీ సీసీ కెమెరాలు ● నిజామాబాద్ నగరంలో పర్యటించిన సీపీ సాయిచైతన్య -
కొత్త పెన్షన్ చట్టాన్ని రద్దు చేయాలి
నిజామాబాద్ నాగారం: కేంద్ర ప్రభుత్వం పెన్షనర్లకు వ్యతిరేకంగా రూపొందించిన కొత్త పెన్షన్ చట్టాన్ని రద్దు చేయాలని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా కమిటీ నాయకులు డిమాండ్ చేశారు. జాతీయ పెన్షనర్ల కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం వారు ఎన్టీఆర్ చౌరస్తా వద్ద నిరసన వ్యక్తం చేశారు. జిల్లా అధ్యక్షుడు రామ్మోహన్రావు మాట్లాడుతూ.. మధ్యతరగతి ఉద్యోగుల పొట్ట కొట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఇలాంటి చట్టాలు తీసుకొస్తుందని, దీనికి వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. నాయకులు మదన్మోహన్, శిరప హనుమాండ్లు, రాధా కిషన్, జార్జి, పురుషోత్తం, ప్రతాపరెడ్డి, హుస్సేన్, పుష్పవల్లి, లలిత, మేరీ, ప్రసాద్, వెంకట్రావు, సిర్ప లింగయ్య పాల్గొన్నారు. -
పురాతన ఇళ్లపై నజర్
నిజామాబాద్ సిటీ : అసలే వానాకాలం.. ఆపై పురాతన భవనాలు ఆందోళన కలిగిస్తున్నాయి. కురుస్తున్న వర్షాలతో మట్టితో నిర్మించిన పాత ఇళ్లు తడుస్తూ కొద్దికొద్దిగా కూలుతున్నాయి. ఎ లాంటి ప్రమాదాలు చోటు చేసుకోకముందే బల్ది యా అధికారులు అప్రమత్తమయ్యారు. పురాత న (శిథిల) భవనాలపై దృష్టి సారించారు. కా ర్పొరేషన్ పరిధిలో కూలడానికి సిద్ధంగా 120 ఇళ్లను గుర్తించారు. వందల సంఖ్యలో పురాతన ఇళ్లు.. కార్పొరేషన్లోని పాత ఇందూరులో పురాతన ఇళ్లు ఎక్కువగా ఉన్నాయి. దుబ్బ, బురుడుగల్లీ, కోటగల్లీ, శివాజీనగర్, వినాయక్నగర్, జెండాగల్లీ, గాజుల్పేట్, కంఠేశ్వర్, శివాజీనగర్, బ్రహ్మపురి కాలనీ, పూసలగల్లీ, బొబ్బిలి వీధి, కసాబ్గల్లీ, ఫులాంగ్, పెద్దబజార్, అర్సపల్లిల్లో వందల సంఖ్యలో ఉన్నాయి. వీటిలో కొన్ని ఇప్పటికే శిథిలావస్థకు చేరి పాక్షికంగా ధ్వంసమయ్యాయి. అయితే కొన్నింటిలో మాత్రం ఇప్పటికీ జనం నివసిస్తున్నారు. ప్రమాదం అని తెలిసినా సెంటిమెంట్తో వాటిని ఖాళీ చేయడం లేదు. గోడలకు తాత్కాలిక మరమ్మతులు చేయిస్తూ వాటిలోనే నివసిస్తున్నారు. పెంకుటిళ్లు కూలిపోతున్నా పాలిథిన్, టార్పాలిన్లు కప్పుకొని అందులోనే నివసిస్తున్నారు. ఖాళీ చేయాలి నగరంలోని పురాతన ఇళ్లను గుర్తించాం. వరుసగా కురుస్తున్న వర్షాలకు పాత ఇళ్లు కూలిపోయే ప్రమాదం ఉంది. ఇప్పటి వరకు 120 ఇళ్లను గుర్తించాం. ఖాళీ చేయాలని నోటీసులు ఇచ్చాం. ప్రమాదం జరగక ముందే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలి. – టీ శ్రీనివాస్, ఏసీపీపాత ఇళ్లకు నోటీసులు..నగరంలో ఉన్న పురాతన భవనాలను గు ర్తించి నోటీసులు ఇవ్వాలని మున్సిపల్ కమిషనర్ దిలీప్కుమార్ ఆదేశించారు. దీంతో బల్దియా అధికారులు పాత భవనాలను గు ర్తించేపనిలో నిమగ్నమయ్యారు. టౌన్ ప్లా నింగ్ విభాగానికి చెందిన ఇద్దరు ఏసీపీలు, ఇద్దరు టీపీఎస్లతోపాటు ఆరుగురు టీపీబీవోలు నగరంలో పర్యటిస్తూ పాత భవనాల ను గుర్తిస్తున్నారు. వెంటనే కూల్చివేయాల్సి న వాటి యజమానులకు నోటీసులు అందజేస్తున్నారు. సురక్షిత ప్రాంతాలకు వెళ్లేలా అవగాహన కల్పిస్తున్నారు. వర్షాల నేపథ్యంలో బల్దియా అప్రమత్తం నిజామాబాద్నగరంలో 120 శిథిల ఇళ్ల గుర్తింపు కూల్చివేయాలని యజమానులకు నోటీసులు ఖాళీ చేయాలంటున్న అధికారులు -
అభివృద్ధికి అడుగులు..
నిజామాబాద్ఏపీఎంల బదిలీలు పూర్తి జిల్లాలోని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్)లో పనిచేస్తున్న ఏపీఎంల బదిలీలు పూర్తయ్యాయి.శనివారం శ్రీ 26 శ్రీ జూలై శ్రీ 2025– 8లో uవచ్చే వారంలో జిల్లాకు రానున్న సీఎం రేవంత్ ! ● రూ.వెయ్యి కోట్లకుపైగా అభివృద్ధి పనుల శంకుస్థాపనకు రంగం సిద్ధం ● మోడల్ స్కూళ్లు.. అమృత్ స్కీమ్లకు.. ● ప్రాణహిత – చేవెళ్ల పథకానికి నిధులు ప్రకటించే అవకాశం.. ● టీయూలో ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటుపై చిగురిస్తున్న ఆశలు ● పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణ స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డిసాక్షి ప్రతినిధి, నిజామాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వచ్చే వారం జిల్లాలో పర్యటించనున్నట్లు సమాచారం. సుమారు రూ.వెయ్యి కోట్లకుపైగా విలువైన వివిధ అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తల్లో ఉత్సాహం నెలకొంది. పామాయిల్ సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తుండడంతో జిల్లాలో ఆయిల్పామ్ సాగు భారీగా పెరుగుతోంది. మరో ఏడాది తరువాత నుంచి జిల్లాతోపాటు చుట్టుపక్కల జిల్లాల్లో పామాయిల్ దిగుబడి చేతికి రానుంది. దీంతో క్రషింగ్ కోసం రెంజల్ మండలంలో ఫ్యాక్టరీ ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇందుకు సంబంధించి బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్రెడ్డి శుక్రవారం స్థలాన్ని పరిశీలించారు. సుమారు 120 ఎకరాల విస్తీర్ణంలో ఫ్యాక్టరీ నిర్మాణానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ప్రీ యూనిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ సుమారు రూ.100 కోట్ల వ్యయంతో ఫ్యాక్టరీ నిర్మాణానికి రంగం సిద్ధం చేస్తున్నారు. నిజాం షుగర్స్ మూతపడిన తరువాత దెబ్బతిన్న ఎకానమీని పునరుద్ధరించే లక్ష్యంతో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణం కోసం పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లారు. చెరుకు సాగుకు రైతులు ముందుకు రావడం లేదు. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా ఆయిల్పామ్ సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం రైతులకు చేయూతనిస్తోంది. దీంతో జిల్లాలో పామాయిల్ సాగు రోజురోజుకూ పెరుగుతోంది. జిల్లాలో ఇప్పటికే 6వేల ఎకరాల్లో ఆయిల్పామ్ సాగవుతోంది. వచ్చే ఏడాదికి 15వేల ఎకరాలకు పెరుగనుంది. నాలుగో ఏడాది నుంచి 30 ఏళ్ల వరకు పామాయిల్ దిగుబడి వస్తుంది. అదేవిధంగా నాలుగేళ్లవరకు అంతరపంటలు సాగు చేసుకోవచ్చు. దీంతో రైతులు ఆయిల్పామ్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇదిలా ఉండగా ఫ్యాక్టరీ నిర్మాణం చేయనున్న స్థలానికి ఇప్పటికే రోడ్డు వేయగా, సుదర్శన్రెడ్డి స్థలాన్ని పరిశీలించారు. సీఎం రేవంత్ ఫ్యాక్టరీ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా రూ.600 కోట్లతో బోధన్, నిజామాబాద్ రూరల్, ఆర్మూర్ మండలాల్లోని మోడల్ స్కూళ్ల భవనాల నిర్మాణానికి, బోధన్, ఆర్మూర్ పట్టణాల అమృత్ స్కీం పనులకు సైతం ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు.న్యూస్రీల్21వ ప్యాకేజీకి నిధులు.. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని ప్రా ణహిత–చేవెళ్ల 21వ ప్యాకేజీకి సంబంధించిన పనులకు ముఖ్యమంత్రి నిధులు ప్రకటించనున్నట్లు సమాచారం. మంచిప్ప ఏరియాలో ముంపు సమస్య లేకుండా 0.8 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతోనే గతంలో ప్రతిపాదించిన 2 లక్షల ఎకరాల ఆయకట్టు తగ్గకుండా నిర్మా ణం చేయనున్నట్లు ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి తెలిపారు. మెంట్రాజ్పల్లి వరకు గ్రావిటీతో, గడ్కోల్కు లిఫ్ట్ ద్వారా నీటిని తరలించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు సాగవుతుందని ఎమ్మెల్యే తెలిపారు. కొత్తగా 1.20 లక్షల ఎకరాల ఆయకట్టు, నిజాంసాగర్ టెయిల్ఎండ్ పరిధిలో 80వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుకు సీఎం అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇంజినీరింగ్ కళాశాల.. తెలంగాణ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటుకు సైతం ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది. కేబినెట్ ఆమోదిస్తే ఈ ఏడాదే నాలుగు కోర్సులతో తరగతులను ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే భూపతిరెడ్డి తెలిపారు. ఇదిలా ఉండగా నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలను సైతం టీయూ పరిధిలోకి తీసుకువచ్చేలా సీఎంను కోరామన్నారు. -
అందుబాటులో సరిపడా ఎరువులు
● రైతులు ఆందోళన చెందొద్దు ● కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ● ఎడపల్లి సొసైటీ ఎరువుల గోదాం తనిఖీబోధన్ : వానాకాలం సీజన్ పంటల సాగుకు సరిప డా ఎరువులు అందుబాటులో ఉన్నాయని, రైతులెవరూ ఆందోళన చెందొద్దని కలెక్టర్ వినయ్ కృష్ణారె డ్డి పేర్కొన్నారు. ఎడపల్లి మండల కేంద్రంలో పీఏసీఎస్ ఎరువుల గోదాంను శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. ఎరువుల నిల్వలను పరిశీలించారు. ఎరు వుల కోసం వచ్చిన రైతులతో కలెక్టర్ మాట్లాడారు. సరిపడా ఎరువులు అందుతున్నాయా లేదా అని ఆ రా తీశారు. జిల్లాలో ప్రస్తుతం 11వేల మెట్రిక్ ట న్నుల యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని, ప్రతి రెండ్రోజులకు ఒకసారి ఎరువుల స్టాక్ వస్తోందన్నారు. రైతులకు ఎరువులు అందేలా ప్ర ణాళికాబద్దంగా వ్యవహరిస్తున్నామని పేర్కొన్నా రు. వరికి ప్రత్యామ్నాయంగా అధిక లాభాలు అందించే ఆయిల్ పామ్ సాగు వైపు దృష్టి సారించాలని రైతులకు సూచించారు. కలెక్టర్ వెంట సొసైటీ చైర్మ న్ పోల మల్కారెడ్డి, ఉద్యోగులున్నారు. మరమ్మతులు చేయించాలి పట్టణ కేంద్రంలోని బోధన్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిని కలెక్టర్ సందర్శించారు. ఆస్పత్రి భవనం లీకేజీలు, ఫ్లోరింగ్ వంటి సమస్యలకు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేయించాలని అధికారులను ఆదేశించారు. రోగులకు ఎలాంటి అసౌకర్యం కలుగుకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.కలెక్టర్ను కలిసిన డేటా ఆపరేటర్లు సాలూర మండల కేంద్రంలో కొత్తరేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి వచ్చిన కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డిని కులగణన సర్వే డేటా ఎంట్రీ ఆపరేటర్లు కలిశారు. ప్రభుత్వం నుంచి పారితోషి కం ఇప్పించాలని కోరారు. -
గుండెపోటుతో ఇరిగేషన్ ఏఈఈ మృతి
కమ్మర్పల్లి : విధి నిర్వహణలో ఇరిగేషన్ ఏఈఈ నితిన్(30) శుక్రవారం సాయంత్రం గుండెపోటుతో మృతి చెందారు. ఉన్నతాధి కారుల ఆదేశాల మేరకు కమ్మర్పల్లి మండలం కోనాపూర్ లోని రాళ్లవాగులో చెక్డ్యామ్ల నిర్మాణానికి తో టి సిబ్బందితో కలిసి లెవల్స్ తీస్తుండగా నితిన్ కుప్పకులాడు. సమాచారం అందుకున్న ఎస్సై అనిల్రెడ్డి ఘటనాస్థలాన్ని పరిశీలించారు. మృతదేహా న్ని ఆర్మూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. హైదరాబాద్కు చెందిన నితిన్ 2024 అక్టోబర్లో ఏఈఈగా ఉద్యోగం సాధించాడు. నెల రోజుల క్రితమే వివాహమైంది. -
స్థానికంలో మనదే గెలుపు
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి/లింగంపేట : ‘‘కాంగ్రెస్ అన్ని వర్గాలను మోసం చేసింది. పాలిచ్చే బర్రెను వదిలేసి తన్నే దున్నపోతును తెచ్చుకున్నమని ప్రజలు బాధపడుతుండ్రు. ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ప్రజల్లోకి తీసుకువెళితే ‘స్థానిక’ ఎన్నికల్లో మనదే విజయం’’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. లింగంపేట అంబేడ్కర్ చౌక్లో నిర్వహించిన ఆత్మగౌరవ గర్జన సభలో ఆ యన మాట్లాడారు. అంబేడ్కర్ జయంతి రోజున స్థానిక దళిత నాయకుడు సాయిలును ప్రభుత్వ ఆదేశాలతో పోలీసులు అవమానించారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎల్లారెడ్డి అభివృద్ధి ప్రదాతగా చెప్పుకుంటున్న స్థానిక ఎమ్మెల్యే అమెరికా నుంచి ఏమైనా నిధలు తీసుకువచ్చిండా అని ప్రజలను ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గా లు మోసపోయాయని, అందరూ కసితో ఉన్నారని ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. దొడ్డు వడ్లకు బోనస్ ఇవ్వకుండా తప్పించుకున్న సర్కారు.. ఇప్పుడు సన్న వడ్లకూ ఇవ్వడం లేదని విమర్శించారు. తమ ప్రభుత్వ హయాంలో కరోనాలాంటి సమ యంలో కూడా సంక్షేమ పథకాలు ఏ ఒక్కటీ ఆగలేదని పేర్కొన్నారు. పాలించడం చేతగాక ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. 22 లక్షల మంది కౌలు రైతులకు రైతుబంధు ఇస్తానని చెప్పి వాళ్లను కూడా మోసం చేశారన్నారు. కేసీఆర్ 1,022 గురుకులాలు ఏర్పాటు చేసి, 6.50 లక్షల మంది విద్యార్థులకు సన్నబువ్వ పెట్టి, నాణ్యమైన చదువు చెప్పిస్తే.. రేవంత్రెడ్డి ప్రభుత్వం మాత్రం విద్యార్థుల ప్రాణా లు బలితీసుకుంటోందని ఆరోపించారు. మాజీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు సురేందర్, గంప గోవర్ధన్, హన్మంత్ సింధే, బాజిరెడ్డి, జనార్దన్గౌడ్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ముజీబొద్దీన్, జెడ్పీ మాజీ చైర్మన్ దఫేదర్ రాజు తదితరులున్నారు. అన్ని వర్గాలను మోసం చేస్తున్న కాంగ్రెస్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లింగంపేటలో ఆత్మగౌరవ గర్జన సక్సెస్ -
వేలల్లో దరఖాస్తులు.. పదుల్లో యూనిట్లు
మోర్తాడ్(బాల్కొండ): దివ్యాంగులకు స్వయం ఉపాధిని కల్పించడానికి, వ్యాపార వృద్ధికి ఆర్థిక చేయూతను అందించడానికి ప్రతియేటా రాష్ట్ర ప్రభుత్వం రాయితీపై రుణాలను అందిస్తోంది. ఈక్రమంలో ప్రస్తుత సంవత్సరం (2025–26)కు గాను దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ప్రతిసారి జిల్లావ్యాప్తంగా వేలాది మంది దివ్యాంగులు రుణం కోసం దరఖాస్తు చేసుకోగా, పదుల సంఖ్యలోనే లబ్ధిదారులను ఎంపిక చేసి రాయితీరుణం అందిస్తోంది. దీంతో రుణం దక్కని దరఖాస్తుదారులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. యూనిట్ల సంఖ్య పెంచితేనే.. 2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను దివ్యాంగులకు ఇచ్చే రుణ లక్ష్యంను ప్రభుత్వం నిర్దేశించింది. ఇందులో 33 యూనిట్లకు రూ.50వేల చొప్పున వంద శాతం రాయితీతో సాయం అందించనున్నారు. మిగిలిన మూడు యూనిట్లకు బ్యాంకు లింకేజీ ద్వారా రుణం అందించి సబ్సిడీని వర్తింపచేయనున్నారు. మొత్తం 36 యూనిట్లకు రాయితీ కోసం ప్రభుత్వం రూ.20.50 లక్షలను కేటాయిస్తూ నిర్ణయించింది. వంద శాతం రాయితీ కోసం రూ.16.50 లక్షలు, బ్యాంకు లింకేజీ రుణాలకు రాయితీ కోసం రూ.4లక్షలను కేటాయించారు. జిల్లాలో స్వయం ఉపాధి పొందుతున్న దివ్యాంగుల సంఖ్య వేలల్లో ఉంటే రాయితీ రుణాలను మాత్రం 36 మందికే మంజూరు చేయనున్నారు. ప్రతి ఏటా పదుల సంఖ్యలోనే యూనిట్లకు రాయితీ అందిస్తుండటంతో దివ్యాంగులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. కనీసం ప్రతి ఏటా వంద మందికి రుణ సదుపాయం కల్పిస్తూ పోతే దివ్యాంగులైన నిరుద్యోగులకు ఎంతో ఆసరాగా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ప్రభుత్వం స్పందించి దివ్యాంగులకు ఇచ్చే రాయితీ యూనిట్ల సంఖ్యను పెంచాలని పలువురు కోరుతున్నారు. ఈ చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తి మోర్తాడ్ మండలం శెట్పల్లికి చెందిన తంగళ్లపల్లి చిరంజీవి. ఇతడు పుట్టుకతోనే అంగవైకల్యంతో బాధపడుతున్నాడు. కూల్డ్రింక్స్, జిరాక్సు సెంటర్తో పాటు మొబైల్ ఫోన్లను రిపేర్ చేస్తూ స్వయం ఉపాధి పొందుతున్నాడు. దివ్యాంగులకు ఇచ్చే రాయితీ రుణం తనకు అందితే తన వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవాలని భావించాడు. 2021 నుంచి ప్రతి ఏటా దివ్యాంగులకు ఇచ్చే వంద శాతం రాయితీ రుణం కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటున్నా, అతనికి ఇప్పటి వరకూ ఎలాంటి సాయం అందలేదు. ఇది ఒక్క చిరంజీవికే కాకుండా ఎంతో మంది దివ్యాంగులకు ఎదురవుతున్న చేదు అనుభవం. దివ్యాంగులకు స్వయం ఉపాధి కోసం రాయితీ రుణాలను అందిస్తోన్న ప్రభుత్వం జిల్లాలో ప్రతియేటా వేలాది మంది దరఖాస్తు చేసుకుంటున్న వైనం పంపిణీకి మాత్రం అరకొర యూనిట్లే మంజూరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న దివ్యాంగులుచిన్నచూపు తగదు.. ప్రభుత్వం దివ్యాంగులపట్ల చిన్న చూపు చూడటం తగదు. ది వ్యాంగులకు ప్రతి ఏటా పదుల సంఖ్యలోనే రాయితీ రుణాలను అందిస్తున్నారు. వేల సంఖ్యలో దివ్యాంగులు ఉంటే పదుల సంఖ్యలో యూనిట్లను మంజూరి చేయడం ఎంత వరకు సమంజసం. వెంటనే యూనిట్ల సంఖ్యను పెంచేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. – సుజాత సూర్యవంశి, వికలాంగుల హక్కుల సమితి జాతీయ అధ్యక్షురాలు -
జిల్లా కేంద్ర గ్రంథాలయానికి నూతన భవనం
నిజామాబాద్ అర్బన్: నగరంలోని జిల్లా కేంద్ర గ్రంథాలయానికి రూ.3కోట్లతో నూతన భవన నిర్మాణం చేపట్టాలని పాలకవర్గం తీర్మానించింది. జిల్లా కేంద్ర గ్రంథాలయంలో శుక్రవారం సంస్థ అధ్యక్షుడు అంతి రెడ్డి రాజిరెడ్డి అధ్యక్షతన పాలకవర్గ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఏర్పడిన నూతన మండలాల్లో శాఖ గ్రంథాలయాలు ఏర్పాటు చేయుటకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. ఆర్మూరు శాఖ గ్రంథాలయంలో పాఠకులు అధికంగా వస్తున్నందున పనివేళలను మరో ఆరు గంటలు పొడిగించామన్నారు. అన్ని గ్రంథాలయాల్లో పాఠకుల సౌకర్యం కోసం మౌలిక వసతులను ఏర్పాటు చేసేందుకు తీర్మానం చేసినట్లు తెలిపారు. జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి బుగ్గారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బాధితులకు అండగా భరోసా కేంద్రం
● సీపీ సాయిచైతన్య ఖలీల్వాడి: బాధిత మహిళలు, పిల్లలకు సహాయం అందించడంతోపాటు మెరుగైన సేవలు అందిస్తూ భరోసా కేంద్రం అండగా నిలుస్తోందని సీపీ సాయిచైతన్య పేర్కొన్నా రు. జిల్లా కేంద్రంలోని సీపీ కార్యాలయం వద్ద ఉన్న భరోసా కేంద్రంలో నమోదైన పోక్సో, రేప్ కేసులలోని ఏడుగురు బాధిత పిల్లలు, మహిళలకు భరోసా కేంద్రం తరఫున చెక్కులను శుక్రవారం ఆయన అందజేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ భరోసా కేంద్రం ద్వారా మహిళలకు మనోధైర్యం, న్యాయం అందించడం పోలీస్ శాఖ ముఖ్య లక్ష్యాలలో ఒకటన్నారు. కార్యక్రమంలో డీసీపీ(అడ్మిన్) బస్వారెడ్డి, భరోసా సెంటర్ కో–ఆర్డినేటర్ జీ రోజా, లీగల్ అడ్వయిజర్ డయాణ గీతిక, మహిళా పీఎస్ ఎస్సై పుష్పావతి, మౌనిక, సవిత తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ విద్య.. వైద్యం అంతా మిథ్యేనా..?
ఇందల్వాయి: ప్రజలకు అందించే వైద్యం, విద్యపై ప్రభుత్వాలకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉందో పై ఫొటోలు చూస్తే అర్థమవుతోంది. ఇందల్వాయి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మొత్తం పిచ్చి మొక్కలతో నిండిపోయి, విష పు రుగులు, దోమలకు ఆవాసంగా మారే అవకాశం ఉన్నా సంబంధిత అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. గత కొన్నేళ్లుగా వర్షాకాలంలో ఇక్కడ ఇదే పరిస్థితి నెలకొంటోంది. తిర్మన్పల్లి గ్రామంలో రోడ్డు పక్కనే ఉన్న ప్రాథమిక పాఠశాలలోని తరగతి గదుల్లో నీరు చేరుతున్నా పట్టించుకున్న నాథుడే లేడు. ఏళ్ల తరబడి నీళ్లు చేరుతున్న ప్రతీసారి విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారు. వర్షపు నీటితో పాటు పాఠశాలలోకి దుర్గందం చేరి విద్యార్థుల ఆరోగ్యం, మధ్యాహ్న భోజనం కలుషితమయ్యే అవకాశం ఉన్నా సమస్యను ఎవరూ పరిష్కరించడంలేదు. సమస్యలపై ఉన్నత స్థాయి అధికారులకు, ప్రజా ప్రతినిధులకు స్థానిక ప్రజలు పలుమార్లు వినతిప్రతాలు అందించినా పరిష్కారం కావడం లేదు. ప్రభుత్వం స్పందించి తగు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
సిద్దిపేట మహాసభకు కార్మికులు తరలిరావాలి
నిజామాబాద్ నాగారం: సిద్దిపేటలో ఈ నెల 28న నిర్వహించే మహాసభకు కార్మికులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు కల్లెడి గంగాధర్ కోరారు. శుక్రవారం నగరంలోని ప్రెస్క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్మికులకు ప్రమాద బీమా రూ. పది లక్షల సౌకర్యం కల్పించాలని, 55 ఏళ్లు నిండి కార్మికుడికి రూ. ఐదు వేల పింఛన్ను కార్మిక వెల్ఫేర్ బోర్డు నుంచి అందించాలని కోరారు. సభను కార్మికులు విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పెంచాల వేణు, కార్యదర్శి శాంతయ్య, సహాయ కార్యదర్శి ఎస్కే హనీఫ్, పట్టణ అధ్యక్షుడు పిండే బాబురావు, ఉపాధ్యక్షులు ముదారపు రాములు, కూనగంగాధర్, రమేశ్, రాజు, సురేశ్ తదితరులు పాల్గొన్నారు. -
మంచిప్పలో ఒకరి ఆత్మహత్య
మోపాల్: మండలంలోని మంచిప్పలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై సుస్మిత శుక్రవారం తెలిపారు. వివరాలు ఇలా.. మంచిప్పకు చెందిన ఆలకుంట పోశెట్టి (45) కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారు. దీంతో జీవితంపై విరక్తి చెంది అతడు గురువారం సాయంత్ర ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. దాడి కేసులో నిందితుడి రిమాండ్ నిజామాబాద్ రూరల్: ఒక వ్యక్తిపై దాడి చేసిన కేసులో షేక్ రెహన్ అనే వ్యక్తిని పట్టుకొని రిమాండ్కు తరలించినట్లు రూరల్ పోలీసులు శుక్రవారం తెలిపారు. వివరాలు ఇలా.. నెహ్రునగర్కు చెందిన షేక్ అఫ్సర్అలీ ఈనెల 17న మండలంలోని రాంనగర్ గ్రామంలోని అతడి అక్క ఇంట్లో భోజనం చేస్తున్నాడు. ఈ సమయంలో రాంనగర్కు చెందిన షేక్రెహన్ వ్యక్తిగత కక్షతో అతడి తలపై గాయపరిచాడు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి నిందితుడిని పట్టుకొని రిమాండ్కు తరలించినట్లు ఎస్హెచ్వో వివరించారు. బైక్ చోరీ కేసులో.. రూరల్ పోలీస్స్టేషన్ పరిధిలోని చంద్రశేఖర్ కాలనీకి చెందిన ఎస్కె మజీద్ను బైక్ చోరీ కేసులో పట్టుకొని రిమాండ్కు తరలించినట్లు రూరల్ ఎస్హెచ్వో మహ్మద్ ఆరీఫ్ తెలిపారు. బైపాస్ రోడ్డుపై నిలిచి ఉన్న సుజుకి ఆక్సిస్ మోటార్ సైకిల్ను మజీద్ చోరీ చేయగా, ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. పోలీసులు నిందితుడిని గుర్తించి, రిమాండ్కు తరలించినట్లు ఆయన తెలిపారు. -
ఏపీఎంల బదిలీలు పూర్తి
డొంకేశ్వర్(ఆర్మూర్) : గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్)లో పనిచేస్తున్న ఏపీఎంల బదిలీలు పూర్తయ్యాయి. శుక్రవారం కలెక్టరేట్లో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అధ్యక్షతన బదిలీలకు కౌన్సెలింగ్ నిర్వహించారు. సెర్ప్ నుంచి వచ్చిన సీనియారిటీ లిస్టు ప్రకారం ఏపీఎంలకు కౌన్సెలింగ్ చేపట్టి కోరుకున్న మండలాలకు బదిలీలు చేశారు. బదిలీలు పారదర్శకంగా జరగడంతో ఏపీఎంలు సంతృప్తి వ్యక్తం చేశారు. మొత్తం 31 మందిని బదిలీ చేయ గా, శనివారం పోస్టింగ్ ఆర్డర్లు ఇవ్వనున్నారు. నెలాఖరుకు రిలీవ్ అయ్యి ఆగస్టు 1న కొత్త మండలాల్లో రిపోర్టు చేయాల్సి ఉంటుంది. కాగా, కొత్త మండలాలైన డొంకేశ్వర్, ఆలూరు, పొతంగల్, సాలూరలకు ఏపీఎంలను నియమించలేదు. బదిలీల్లో భాగంగా కొత్త మండలాలకు ఏపీఎంలను కేటాయించాలని డీఆర్డీవో, సెర్ప్ సీఈవోకు ఇటీవల లేఖ రాసినా ఫలితం లేకుండా పోయింది. కౌన్సెలింగ్లో డీఆర్డీవో సాయాగౌడ్, ఏపీడీ మధుసూదన్ ఉన్నారు. కలెక్టరేట్లో 31 మందికి కౌన్సెలింగ్ నిర్వహించిన కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి నేడు పోస్టింగ్ ఆర్డర్లుఅధికారి కేటాయించిన పేరు మండలం యెలవర్తి సరళ ని. రూరల్ వి.సరోజిని మోపాల్ అనిల్కుమార్ డీఎంఎంయూ సీహెచ్ ప్రమీల భీమ్గల్ బి. గంగారాం బాల్కొండ ప్రసాద్రావు డీఎంఎంయూ బోలిశెట్టి ఉమాకిరణ్ మాక్లూర్ బస్వాంత్ రావు రుద్రూర్ చిన్నొళ్ల సాయిలు బోధన్ భూమేశ్వర్ గౌడ్ ఆర్మూర్ ఎంఏ ముఖీమ్ ఎస్వీఈపీ బోధన్ రవీందర్ రెడ్డి డిచ్పల్లి పుప్పాల గంగాధర్ జక్రాన్పల్లి కె. గంగాధర్ నందిపేట్ మహేశ్ కుమార్ నవీపేట్ డి.శ్యామ్ మోర్తాడ్ బి.మాణిక్యం వేల్పూర్ ఈ.సునీత ఇందల్వాయి కె. రవికుమార్ డీఎంఎంయూ ఎస్.గంగాధర్ మోస్రా గడ్డం హిమబాల ముప్కాల్ బొర్ర గంగాధర్ చందూర్ కుంట గంగాధర్ ఏర్గట్ల మెట్టు సువర్ణ సిరికొండ ఎస్. మోహన్ రెంజల్ చిలుక రాజేందర్ ఎడపల్లి ఈర్నాల చిన్నయ్య ధర్పల్లి జి.కిరణ్ కుమార్ కమ్మర్పల్లి ఈ. మనోహర్ వర్ని గంగారాజు మెండోరా జి. భాస్కర్ కోటగిరి -
వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలి
● నిజామాబాద్ ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి మోపాల్: గ్రామాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పంచాయతీ అధికారులు, వైద్యసిబ్బంది ప్రజలకు అవగాహన కల్పిస్తూ తగిన చర్యలు చేపట్టాలని నిజామాబాద్ ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని కాల్పోల్లో స్థానిక పాఠశాలలో కొనసాగుతున్న వైద్యశిబిరాన్ని కాంగ్రెస్ ఆదివాసీ, గిరిజన జిల్లా చైర్మన్ కెతావత్ యాదగిరితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా డెంగీ, ఇతర వ్యాధులు ప్రబలడానికి గల కారణాలపై ఆరా తీశారు. జ్వర పీడితులను పరామర్శించి వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. జ్వరాలతో బాధపడుతున్న వారి ఆరోగ్య పరిస్థితిని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ప్రత్యూషను అడిగి తెలుసుకున్నారు. వ్యాధి తీవ్రత తగ్గుముఖం పట్టేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని ఎంపీడీవో రాములు నాయక్, మెడికల్ ఆఫీసర్ ప్రత్యూషను ఆదేశించారు. వారి వెంట జెడ్పీటీసీ మాజీ సభ్యుడు మోహన్ నాయక్, మోపాల్ మండల అధ్యక్షుడు ఎల్లోల్ల సాయిరెడ్డి, గ్రామ అధ్యక్షుడు సురేశ్, గ్రామస్తులు ఉన్నారు. -
ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయండి
నిజామాబాద్ నాగారం: జిల్లా కేంద్రంలోని బృందావనం గార్డెన్లో ఈ నెల 27న నిర్వహించే బంజారా సేవా సంఘం ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని ఆలిండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీహరినాయక్, జిల్లా అధ్యక్షుడు మోహన్నాయక్ కోరారు. శుక్రవారం నగరంలోని ఆర్అండ్బీ అతిథి గృహంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బంజారాల ఐక్యత చాటడానికి ఈ ఆత్మీయ సమ్మేళ నాన్ని నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. సమ్మేళనానికి ముఖ్య అతిథిగా ఆలిండియా బంజారా సేవా సంఘం జాతీయ అధ్యక్షుడు ఉమేశ్, రాష్ట్ర అధ్యక్షుడు రాములు నాయక్ హాజరవుతారని అన్నారు. అనంతరం ఆత్మీయ సమ్మేళన పోస్టర్లను ఆవిష్కరించారు. సమ్మేళనాన్ని సంఘ సభ్యులు విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా కోశాధికారి రవి నాయక్, ఉపాధ్యక్షులు రామారావు, చిన్న నాయక్, నాయకులు పాల్గొన్నారు. -
ఖాతాదారులతో మర్యాదగా ప్రవర్తించాలి
డిచ్పల్లి: సహకార బ్యాంకుకు వచ్చే ఖాతాదారులతో సిబ్బంది మర్యాదగా మెలగాలని, పారదర్శకంగా సేవలందించి వారి మన్ననలు పొందాలని నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ (డీసీసీబీ) చైర్మన్ కుంట రమేష్రెడ్డి సూచించారు. డిచ్పల్లి మండల కేంద్రంలోని సహకార బ్యాంకును శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బందితో ఆయన మాట్లాడుతూ.. ఖాతాదారులకు బ్యాంకు లాకర్స్, రుణాలు, డిపాజిట్ సదుపాయాల గురించి అవగాహన కల్పించాలన్నారు. భవిష్యత్లో నకిలీ బంగారం అని తేలినా, రుణ మంజూరు ప్రక్రియలో లోపాలు గుర్తించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం రమేష్రెడ్డి, డైరెక్టర్ ఆనంద్లను బ్రాంచ్ మేనేజర్ శ్రావణ, ఫీల్డ్ ఆఫీసర్ మోహన్రెడ్డి, అసిస్టెంట్ మేనేజర్ సునీత సత్కరించారు. క్యాషియర్ ప్రసన్నకుమారి, స్టాప్అసిస్టెంట్ మునీర్ఖాన్, విశ్వనాథ్, అటెండర్ రమేష్ పాల్గొన్నారు. -
పొంచి ఉన్న సీజనల్ వ్యాధులు
ధర్పల్లి: వర్షాకాలంలో వచ్చే జలుబు, సాధారణ జ్వరాలు, మలేరియా, డెంగీ వ్యాధులు ప్రబలకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ రోజువారి దినచర్యల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పరిసరాల, వ్యక్తిగత శుభ్రత పాటించడంతో పాటు స్వీయ జాగ్రత్తలు తీసుకుంటే కాలానుగుణ వ్యాధుల బారి నుంచి తప్పించుకోవచ్చని వైద్యులు, అధికారులు సూచిస్తున్నారు. ప్రతి శుక్రవారం గ్రామాల్లో డ్రైడే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. దోమల వ్యాప్తితో.. గ్రామాల్లో డ్రెయినేజీ సౌకర్యాలు లేకపోవడంతో రోడ్లపైనే మురికినీరు నిలుస్తుంది. దీని వల్ల దోమలు వ్యాప్తి చెంది ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది. తలనొప్పి, గొంతునొప్పి, మలేరియా, టైఫాయిడ్, చికున్ గున్యా, విషజ్వరాలు, డెంగీ, పైలేరియా వంటివి ప్రబలే అవకాశాలున్నాయి. ● విష జ్వరాలు.. ఒళ్లు నొప్పులు, జలుబు, తుమ్ములతో జ్వరం వస్తుంది. వారం రోజుల పాటు జ్వరం తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది. తలనొప్పి, చలి, నీరసం విష జ్వరాల ప్రధాన లక్షణం. ● దోమలను అరికట్టే విధానం.. ఇళ్లలోని మంచినీటి తొట్లలో నీరు నిల్వ ఉంచకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈగలు, దోమలు ముసరకుండా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. నీరు నిల్వ ఉండే ప్రదేశాల్లో వేస్ట్ ఆయిల్ స్ప్రే చేయాలి. దోమ తెరలను తప్పని సరిగా ఉపయోగించాలి. గ్రామాల్లో మురికి నీరు నిల్వ ఉండకుండా, లార్వా పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. తాగేనీటిని కాచి చల్లార్చిన తర్వాతే తాగాలి. అప్రమత్తతే నివారణ మార్గం ప్రజలకు అవగాహన కల్పిస్తున్న అధికారులు చెత్త తొలగిస్తున్నాం జీపీల్లో ప్రతిరో జు శానిటేషన్ పనులు చేస్తున్నాం. పంచాయ తీ ట్రాక్టర్ ద్వారా గ్రామాల్లో ఉన్న చెత్తను ప్రతిరోజు డంపింగ్ యార్డ్కు తరలించేలా చర్యలు తీసుకుంటున్నాం. – లక్ష్మారెడ్డి, ఎంపీడీవో, ధర్పల్లి -
సెక్యూరిటీ గార్డ్పై దాడి
మాక్లూర్: మండలంలోని మాణిక్భండా ర్ మార్కెట్ కమిటీ చెక్పోస్టులో విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ గార్డ్ బట్టు నరేష్పై గురువారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు బైక్పై వచ్చి దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు. బాధితుడు వారి నుంచి తప్పించుకొని పారిపోయి ప్రాణాలు కాపాడుకున్నట్లు శుక్రవారం తెలిపారు. ఈవిషయమై మాక్లూర్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. దాడి దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డవడంతో పోలీసులు వాటిని పరిశీలించారు. నిందితుల బైక్ నంబర్ సహాయంతో వారి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. ఇద్దరు నిందితులను పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నట్టు తెలిసింది.ఇద్దరిపై కేసు నమోదు రుద్రూర్: అదనపు కట్నం కోసం వేధించిన ఇద్దరిపై కేసు నమోదు చేసినట్టు కోటగిరి ఎస్సై సునీల్ తెలిపారు. వివరాలు ఇలా.. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం బరంగెడ్గి గ్రామానికి చెందిన రాజేష్తో కోటగిరి మండల కేంద్రానికి చెందిన రజితకు 19ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి కుమారుడు, కూతురు ఉన్నారు. ఇటీవల రజితను అదనపు కట్నం తెమ్మని భర్త రాజేష్, అత్త గంగమణి వేధించి, ఇంట్లో నుంచి పంపించివేశారు. దీంతో బాధితురాలు శుక్రవారం కోటగిరి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు. మాణిక్భండార్లో గంజాయి కలకలం మాక్లూర్: మండలంలోని మాణిక్భండార్ శివారులోగల పోచమ్మ ఆలయం సమీపంలో గంజాయి తాగుతున్న 9మంది యువకులను శుక్రవారం పట్టుకుని కేసు నమోదు చేసినట్టు మాక్లూర్ పోలీసులు తెలిపారు. పట్టుబడిన వారంతా 20 ఏళ్లలోపు వయస్సు ఉన్న యువకులేనని తెలిపారు. గంజాయి ఎక్కడి నుంచి వచ్చింది. ఎవరి వద్ద కోనుగోలు చేశారు. ఎంతకాలంగా ఇలా గంజాయి తాగుతున్నారు అనేది విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. తాళం వేసిన ఇంట్లో చోరీ మాక్లూర్: మండలంలోని గుత్ప గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున తాళం వేసిన ఓ ఇంట్లో చోరీ జరిగింది. వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన ప్రసాద్ అనే వ్యక్తి గురువారం తన ఇంటికి తాళం వేసి, మరో ఇంట్లో నిద్రించాడు. మరుసటి రోజు ఇంటికి వచ్చి చూడగా ఇంటి తాళం పగలగొట్టి ఉండటంతో చోరీ జరిగినట్లు గుర్తించి, పోలీసులకు సమాచారం అందించారు. మాక్లూర్ పోలీసులకు ఘటన స్థలానికి చేరుకొని క్లూస్టీంతో వేలిముద్రలు సేకరించుకొని వెళ్లారు. దుండగులు ఇంట్లోకి చొరబడి రెండు తులాల బంగారం చోరీ చేసినట్లు బాధితుడు తెలిపారు. ఈ విషయమై ఎస్సై రాజశేఖర్ను సంప్రదించే ప్రయత్నం చేయగా ఆయన అందుబాటులోకి రాలేదు. ఏర్గట్ల ఎస్సైపై సీపీకి ఫిర్యాదు ఖలీల్వాడి: ఏర్గట్ల ఎస్సై, కానిస్టేబుళ్లపై శుక్రవారం బాధితుడు ఏర్గట్లకు చెందిన రాజ్ కుమార్ సీపీ సాయిచైతన్యకు ఫిర్యాదు చేశారు. బాధితుడు తెలిపిన వివరాలు ఇలా.. ఈ నెల 22న అర్ధరాత్రి ఏర్గట్ల మండల కేంద్రంలోని ఓ మంగళి దుకాణంలో షట్టర్ క్లోజ్ చేసి రాజ్కుమార్తోపాటు మరో ముగ్గురు మద్యం సేవిస్తున్నారు. అయితే ఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్లు వచ్చి నలుగురిని పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లారు. ముగ్గురిని వివరాలను అడిగి పంపారని, తనను వివరాలు అడిగితే నెలన్నర క్రితం గల్ఫ్ నుంచి వచ్చినట్లు తెలిపారు. అయితే ఎస్సై, కానిస్టేబుళ్లు పోలీస్ స్టేషన్ నుంచి వెళ్లడానికి డబ్బులు డిమాండ్ చేశారన్నారు. దీనికి ససేమిరా అనడంతో చితకబాధినట్లు చెప్పారు. దీనిపై సీపీకి ఫిర్యాదు చేసినట్లు అతడు పేర్కొన్నాడు. -
ప్రమాదకరంగా మ్యాన్హోల్స్
నిజామాబాద్ నాగారం: నగరంలోని మారుతినగర్లో అండర్గ్రౌండ్ డ్రెయినేజీ మ్యాన్హోల్స్ ప్రమా దకరంగా ఉన్నాయి. రోడ్డు కంటే ఎత్తులో ఉండడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వాహనదారులు ఆదమరిస్తే అంతే సంగతులు. పలువురు వాహనదారులు అదుపుతప్పి కిందపడి గాయాలైన ఘటనలు ఉన్నాయి. నెల రోజుల క్రితం ఈ ప్రాంతంలో అండర్గ్రౌండ్ డ్రెయినేజీ మ్యాన్హోల్స్ మరమ్మ తుల కోసం తవ్వారు. మరమ్మతులను తూతూ మంత్రంగా చేపట్టి అలాగే వదిలేశారు. మారుతినగర్లో స్కూల్ బస్సులు, పలు వాహనాలు అధిక సంఖ్యలో ప్రయాణిస్తుంటాయి. ఈ ప్రాంతం చాలా రద్దీగా ఉంటుంది. రాత్రిళ్లు ఈ ప్రాంతం గుండా కొత్త వారు వస్తే మ్యాన్హోల్స్ గమనించక వాటి గుండా ప్రయాణిస్తుండడంతో ప్రమాదాలకు గురవుతున్నారు. వీటి చుట్టూ రోడ్డు సరిగా లేకపోవడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మారుతినగర్లో రోడ్డు కంటే ఎత్తులో అండర్గ్రౌండ్ డ్రెయినేజీ మ్యాన్హోల్స్ ఆదమరిస్తే అంతే సంగతులు ఇబ్బందిపడుతున్న కాలనీవాసులు, వాహనదారులు పట్టించుకోని అధికారులు -
కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాతి
● నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి డిచ్పల్లి: రైతు సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే రేకులపల్లి భూపతిరెడ్డి అన్నారు. శుక్రవారం డిచ్పల్లి మండలం రాంపూర్ సొసైటీ ఆధ్వర్యంలో మిట్టాపల్లిలో రూ.15 లక్షల వ్యయంతో నిర్మించిన 250 మెట్రిక్ టన్నుల గోదాంను డీసీసీబీ చైర్మన్ కుంట రమేశ్రెడ్డి, సొసైటీ చైర్మన్ తారాచంద్ నాయక్తో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇచ్చిన హామీ ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 9 రోజుల్లో రూ.9వేల కోట్ల రైతు రుణమాఫీ చేసిందన్నారు. సన్న వడ్లకు రూ.500 బోనస్, సాగుకు ఉచిత కరెంట్ అందజేస్తున్నట్లు తెలిపారు. అలాగే సొసైటీల ద్వారా రైతులకు అవసరమయ్యే విత్తనాలు, ఎరువులను అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నగేశ్రెడ్డి, పీసీసీ డెలిగేట్ శేఖర్గౌడ్, డీసీసీబీ వైస్ చైర్మన్ చంద్రశేఖర్రెడ్డి, పార్టీ మండల అధ్యక్షులు అమృతాపూర్ గంగాధర్, నవీన్గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పొలసాని శ్రీనివాస్, మాజీ ఎంపీపీలు కంచెటి గంగాధర్, నర్స య్య, డిచ్పల్లి సొసైటీ చైర్మన్ రాంచందర్ గౌడ్, నా యకులు గణేశ్, బాల గంగాధర్, సొసైటీ సీఈవో నాగరాజు, సిబ్బంది నాగేశ్వరరావు, డైరెక్టర్లు, వీడీసీ సభ్యులు, గ్రామస్తులు, రైతులు పాల్గొన్నారు. -
శ్రావణ మాసం ఎంతో విశిష్టమైంది
నిజామాబాద్ రూరల్: శ్రావణ మాసం ఎంతో విశిష్టమైందని దేవాదాయ–ధర్మాదాయ శాఖ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సహాయ కమిషనర్ విజయరామారావు అన్నారు. శ్రావణమాసం మొదటి శుక్రవారం పురస్కరించుకొని నగరంలోని జెండాబాలాజీ, గోల్హనుమాన్ ఆలయాలను పరిశీలించారు. అనతరం ఆలయాల్లో పూజలు చేశారు. శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని జెండా బాలాజీ, గోల్హనుమాన్, సారంగపూర్ హనుమాన్ ఆలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టున్నట్లు పేర్కొన్నారు. వారాహి దేవాలయంలో.. నగర శివారులో ఉన్న శ్రీ వారాహి దేవాలయంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా ఆలయ చైర్మన్ మంచాల జ్ఞానేందర్, భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి రోజు ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ చైర్మన్ పేర్కొన్నారు. -
ఓబీసీ సెమినార్లో పాల్గొన్న విపుల్ గౌడ్
నిజామాబాద్ సిటీ: ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ శుక్రవారం నిర్వహించిన ఓబీసీ సమావేశంలో జిల్లా యూత్కాంగ్రెస్ అధ్యక్షుడు విపుల్ గౌడ్ పాల్గొన్నారు. సమావేశంలో ఏఐసీసీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ నాయకులకు దిశానిర్ధేశం చేశారు. అణగారినవర్గాల సామాజిక, విద్యా, ఆర్థిక అభ్యున్నతి అవశ్యకతపై చర్చించారు. కార్యక్రమంలో పీసీసీ చీఫ్ బొమ్మ మహేష్కుమార్ గౌడ్, మైన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్, పలువురు నాయకులను విపుల్గౌడ్ కలిశారు. ఉప తహసీల్దార్ బదిలీ సిరికొండ: మండల ఉప తహసీల్దార్ ప్రవీణ్, కంప్యూటర్ ఆపరేటర్ అజ్మత్ బదిలీ అయ్యా రు. ఉప తహసీల్దార్ పౌరసరఫరాల శాఖ కా ర్యాలయానికి, కంప్యూటర్ ఆపరేటర్ మెండో రా మండలానికి బదిలీ అయ్యారు. వారి స్థానా ల్లో మండలానికి ఎవరినీ కేటాయించలేదు. -
నూతన గేట్ వాల్వ్ బిగింపు
సిరికొండ: మండలంలోని గడ్కోల్ గ్రామంలోని ఎస్సీ కాలనీలో నెలకొన్న నీటి కష్టాలను అధికారులు తొలగించారు. నీటి కష్టాలపై ‘సాక్షి’ దినపత్రికలో ఈ నెల 24న ‘గడ్కోల్లో నీటి తిప్పలు’ అనే కథనం ప్రచురితమైంది. కథనానికి స్పందించిన గ్రామ పంచాయతీ కార్యదర్శి మఖ్దుం చెడిపోయిన గేట్ వాల్వ్ స్థానంలో నూతన గేట్ వాల్వ్ను ఏర్పాటు చేయించారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య మోపాల్: ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని, విద్యార్థులు శ్రద్ధగా చదువుకుని ఉన్నత స్థానాలను అధిరోహించాలని సవిత్ర చిట్ఫండ్ మేనేజింగ్ డైరెక్టర్ సుదర్శన్ అన్నారు. మోపాల్ మండలంలోని సిర్పూర్ ప్రాథమిక పాఠశాలలో తెలంగాణ టీచర్స్ యూనియన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు సుదర్శన్ రూ.15వేల విలువైన గుర్తింపుకార్డులు, వాటర్ బాటిళ్లు, పరీక్ష ప్యాడ్లను శుక్రవారం అందజేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు నరేశ్రావు, వసంత, అనురాధ, గంగాప్రసాద్, సుకన్య, విద్యార్థులు పాల్గొన్నారు. ఆర్టికల్ 19ని ఎత్తివేయాలి నిజామాబాద్ నాగారం: కులవృత్తే జీవనాధారంగా జీవిస్తున్న నాయీబ్రాహ్మణులకు ఆర్టికల్ 19తో అన్యాయం జరుగుతోందని దానిని వెంటనే ఎత్తివేయాలని నగర నాయీబ్రాహ్మణ దుకాణదారుల యూనియన్ అధ్యక్షులు దేశాయి గంగాధర్ డిమాండ్ చేశారు. శుక్రవారం గాజులపేటలోని కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఆర్టికల్ 19లో ఉన్న 18వ సవరణను సవరించి కులవృత్తులను ఆదుకోవాలన్నారు. నాయీబ్రాహ్మనేతరులు సెలూన్ షాపు పెట్టుకోవచ్చన్న నిబంధన ఉన్న ఆర్టికల్ 19ని రద్దు చేయాలన్నారు. హైకోర్టు తీర్పు ఇవ్వడం విచారకరమన్నారు. సమావేశంలో నాయకులు అంజయ్య, రామకృష్ణ, బాలస్వామి, సురేందర్, హన్మాండ్లు, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. రైతులకు అందుబాటులో యూరియా సిరికొండ: రైతులకు యూరియాను అందుబాటులో ఉంచుతున్నామని మండల వ్యవసాయశాఖ అధికారి నర్సయ్య తెలిపారు. మండల కేంద్రంలోని సొసైటీలో యూరియాను రై తులకు శుక్రవారం పంపిణీ చేశారు. ఈ సీజన్ లో ఇప్పటి వరకు 2277 మెట్రిక్ టన్నుల యూ రియాను మండలంలో పంపిణీ చేసినట్లు తెలి పారు. మండలానికి ప్రతి రోజు 60 నుంచి 80 టన్నుల వరకు యూరియాను సరఫరా చేస్తున్నామని అన్నారు. నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం సుభాష్నగర్: నగరంలోని వినాయక్నగర్ సబ్స్టేషన్లో నాల్గో శనివారం నిర్వహణలో భాగంగా ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని టౌన్–1 ఏడీఈ ఆర్ చంద్రశేఖర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కోటగల్లి, గాయత్రినగర్, ఫులాంగ్, నిఖిల్సాయి హోటల్, యెండల టవర్స్, తుల్జాభవానీ ఆలయం తదితర ఏరియాల్లో విద్యుత్ ఉండదని పేర్కొన్నారు. మొరం టిప్పర్ పట్టివేత మోపాల్: మండలకేంద్రంలో అనుమతులు లేకుండా తరలిస్తున్న మొరం టిప్పర్ను పట్టు కున్నట్లు ఎస్సై జాడే సుస్మిత శుక్రవారం తెలిపారు. అక్రమంగా మొరం తరలిస్తే కఠినచర్యలు ఉంటాయని హెచ్చరించారు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. చోరీ కేసులో నిందితుడి పట్టివేత నిజామాబాద్ రూరల్: రూరల్ పోలీస్స్టేషన్ పరిధిలోని కేశ్పూర్గ్రామంలో ఈనెల 23న రా త్రి జరిగిన చోరీ కేసులో నిందితుడిని పట్టుకొని రిమాండ్కు తరలించినట్లు రూరల్ ఎస్హెచ్వో మహ్మద్ ఆరీఫ్ శుక్రవారం తెలిపారు. కేశాపూర్ గ్రామశివారులో ఉన్న మహాలక్ష్మీ ఆలయంలో అమ్మవారి పుస్తెలతాడు, వినాయకుని పంచలో హ విగ్రహం, హుండీ డబ్బులు అపహరణకు గురైన విషయం తెలిసిందే. ఈ ఘటనపై విచార ణ చేపట్టిన పోలీసులు నిందితుడిని పట్టుకొని, చోరీకి గురైన వస్తువులను రికవరీ చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు వివరించారు. -
చిరుత సంచార ప్రాంతాల పరిశీలన
నవీపేట: మండలంలోని నందిగామ, సిరన్పల్లి గ్రామాలలో చిరుత సంచరిస్తున్నట్లు సమాచారం రావడంతో ఫారెస్ట్ అధికారులు శుక్రవారం ఆయా ప్రాంతాలను పరిశీలించారు. 15రోజుల కిందట నందిగామ శివారులో చిరుత కనిపించగా, కొందరూ ఫొటో తీశారు. కానీ అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వలేదు. అలాగే రెండు రోజుల కిందట సిరన్పల్లి శివారులో మేకల మందపై చిరుత దాడి చేసి ఒక మేకను తీవ్రంగా గాయపర్చింది. ఈ రెండు ఘటనలను కొందరు యువకులు శుక్రవారం సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఫారెస్ట్ నిజామాబాద్ బీట్ ఆఫీసర్ సుధీర్, సెక్షన్ ఆఫీసర్ జహ్రూలు స్పందించి, రెండు ప్రాంతాలను సందర్శించారు. పాదముద్రలను సేకరించారు. చిరుత సంచారం నిజమేనని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. -
గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
సిరికొండ: మండలంలోని మై లారం గ్రామ శి వారులో ఆ యల కుంట చె రువు కట్ట పక్క న చెట్ల పొదలలో గుర్తుతెలి యని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు ఎస్సై రామకృష్ణ శుక్రవారం తెలిపారు. మృతుడి వయస్సు సుమారు 35ఏళ్ల నుంచి 40ఏళ్ల మధ్య ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహన్ని ధర్పల్లి సీఐ భిక్షపతి, ఎస్సై పరిశీలించారు. మైలారం పంచాయతీ కార్యదర్శి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. గ్రామంలోని సీసీ ఫుటేజీని పోలీసులు పరిశీలించగా ఈ నెల 23న గ్రామంలో నుంచి ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు మృతదేహంతో బైక్పై వెళుతున్నట్లు రికార్డయినట్లు తెలిసింది. డ్రంకెన్డ్రైవ్ కేసులో ఇద్దరికి జైలు రెంజల్(బోధన్): మండలంలోని సాటాపూర్ చౌరస్తాలో గురువారం సా యంత్రం పోలీసులు వాహనాల తనిఖీతోపాటు, డ్రంకెన్డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. ఇద్దరు వ్యక్తులు మద్యం తాగి వాహనాలు నడుపుతూ పోలీసులకు పట్టుబడ్డారు. వారిపై కేసు నమోదు చేసి, శుక్రవారం కోర్టులో హాజరుపర్చారు. జడ్జి ఇద్దరికి 4రోజుల జైలుశిక్ష విధించినట్లు ఎస్సై చంద్రమోహన్ తెలిపారు. -
చెత్తకుప్పలు.. పశువుల మేత స్థావరాలు
నేటి చిత్రంవర్నిచౌరస్తా వద్ద చెత్తకుప్పలో పేపర్లు తింటున్న పశువులు నిజామాబాద్ సిటీ: నగరంలోని పలు కూడళ్ల వద్ద ఉన్న చెత్త కుప్పలు మూగజీవాలకు ఆహార స్థావరాలుగా మారాయి. బల్దియా అధికారులు చెత్త తొలగించడంలో శ్రద్ధ వహించడం లేదు. దీంతో చెత్తకుప్పల వద్ద నిల్వ ఉన్న పాలిథిన్ పేపర్లు, చిత్తు పేపర్లను పశువులు తింటున్నాయి. పశువులు రోడ్లుమీద తిరుగుతున్నా వాటి యజమానులు, బల్దియా అధికారులు పట్టించుకోవడం లేదు. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలి. – గట్ల సింజిత్ కుమార్, ఆనంద్నగర్ కాలనీ మీ ప్రాంతంలో నెలకొన్న సమస్యను, ఫొటోను మాకు వాట్సాప్లో పంపించండి. ప్రచురించి అధికారుల దృష్టికి తీసుకెళ్తాము. పంపిన వారి పేరు, ఫొటో ప్రచురిస్తాము. నిజామాబాద్ అర్బన్ – 95531 30597 నిజామాబాద్ రూరల్ – 97053 46541 మాకు ఫొటో పంపండి -
విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి
నిజామాబాద్ అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. నిరసన కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం వారు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఇల్లు ముట్టడికి యత్నించారు. సమాచారం అందుకున్న పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఈక్రమంలో పోలీసులకు విద్యార్థి సంఘం నాయకులకు మధ్య తోపులాట జరిగింది. అనంతరం పోలీసులు పీడీఎస్యూ విద్యార్థి సంఘం నాయకులను అరెస్టు చేసి నాలుగో పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈసందర్భంగా పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగాన్ని విస్మరించిందన్నారు. ఇప్పటికై నా స్పందించి సమస్యలను పరిష్కరించాలన్నారు. నాయకులు కార్తీక్, గౌతంకుమార్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
ఆర్అండ్బీ రోడ్లకు రూ.438 కోట్లు
నిజామాబాద్నాగారం: ఉమ్మడి జిల్లా (నిజామాబాద్, కామారెడ్డి) పరిధిలో 362.83 కిలోమీటర్ల మేర 24 రోడ్ల పనులకు ప్రభుత్వం రూ.438.54 కో ట్లు కేటాయించింది. ఇందుకు సంబంధించిన పనులను ఆర్ అండ్ బీ పరిధిలో చేపట్టేందుకు ఆమోదం తెలుపుతూ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. హైబ్రిడ్ యాన్యునిటీ మోడ్(హ్యామ్) విధానంలో పనులు చేపట్టనున్నారు. నూతన విధానమిదే.. గతంలో రోడ్లను ఈపీసీ (ఇంజినీరింగ్ – ప్రొక్యూర్మెంట్–కనస్ట్రక్షన్) లేదా బీవోటీ (బిల్డ్ – ఆపరేట్ – ట్రాన్స్ఫర్) విధానాల్లో చేపట్టేవారు. ఈపీసీ విధానంలో పనులు చేపడితే ప్రభుత్వం ఒకేసారి భారం పడగా, బీవోటీ విధానంలో కాంట్రాక్ట్ సంస్థనే మొ త్తం నిధులను భరించాల్సి వచ్చేది. బీవోటీ విధానంలో రోడ్లను నిర్మించిన కాంట్రాక్ట్ సంస్థ టోల్గేట్లను ఏర్పాటు చేసుకుని రోడ్ల నిర్మాణానికి వెచ్చించిన మొత్తాన్ని రాబట్టుకునేది. అయితే ప్రభుత్వం, ప్రజలకు భారం తప్పేలా హ్యామ్ (హైబ్రిడ్ యా న్యునిటీ మోడ్) విధానంలో రోడ్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. రోడ్డు కాంట్రాక్ట్ దక్కించుకున్న సంస్థకు ప్రభుత్వం ముందుగా 40శాతం ని ధులు అందిస్తుంది. మిగతా 60శాతం నిధులను సదరు కాంట్రాక్ట్ సంస్థనే భరిస్తూ పనులు పూర్తి చేయాల్సి ఉంటుంది. కాంట్రాక్ట్ సంస్థలు రోడ్ల ని ర్మాణానికి వెచ్చించిన 60శాతం నిధులను ప్రభు త్వం 15 ఏళ్లపాటు ఏటా కొంత చొప్పున వడ్డీతోపాటు చెల్లిస్తుంది. అయితే రోడ్ల నిర్వహణ బాధ్యత 15ఏళ్లపాటు కాంట్రాక్టర్దే. నూతనంగా తీసుకొచ్చిన హ్యామ్ విధానంలో గ్రామీణ రోడ్ల నిర్మాణం, విస్తరణ చేపట్టాలనే నిర్ణయంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అత్యవసరం ఉన్న రోడ్లే.. ఉమ్మడి జిల్లా(కామారెడ్డి, నిజామాబాద్)లో అవసరం ఉన్న చోట్ల నూతన రోడ్ల నిర్మాణం, విస్తరణ చేపట్టనున్నారు. ఇప్పటికే 24 రోడ్లకు సంబంధించిన పనులను మొదటి ఫేజ్లో చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. నిజామాబాద్ జిల్లాలో మొత్తం 1438 కి.మీ, కామారెడ్డి జిల్లాలో 830 కిలో మీటర్ల మేర రోడ్లు ఉన్నాయి. గ్రామీణ రోడ్లు, గ్రా మాల నుంచి మండల కేంద్రాలకు వెళ్లే, ఓ మండ లం నుంచి మరో మండలానికి, మండలాల నుంచి జిల్లా కేంద్రానికి వెళ్లే రోడ్ల పనులను ప్రాధాన్యతను బట్టి, ప్రజలకు అత్యంత అవసరం ఉన్న ప్రాంతాల్లో పనులను పకడ్బందీగా చేపట్టనున్నారు. ‘హ్యామ్’ విధానంలో ఉమ్మడి జిల్లాలో పనులు 362.83 కిలోమీటర్ల మేర అత్యవసర పనులకు నిధుల కేటాయింపు -
ఎంపీ అర్వింద్ కృషి ఫలితమే ‘కొత్త రైల్వేలైన్’
సుభాష్నగర్: ఆర్మూర్ మీదుగా ఆదిలాబాద్–పటాన్చెరు మధ్య కొత్త రైల్వేలైన్ ప్రాజెక్టు ఎంపీ అర్వింద్ ధర్మపురి కృషికి ఫలితమేనని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి ఒక ప్రకటనలో తెలిపారు. రెండేళ్లుగా ఎంపీ అర్వింద్ ఈ రైల్వేలైన్ ప్రాజెక్టు మంజూరు కోసం రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్ను పలుమార్లు కలిసి విజ్ఞప్తి చేశారన్నారు. 250 కిలోమీటర్ల పొడవైన ఈ నూతన రైలు మార్గం నిర్మల్, నిజామాబాద్, బోధన్, సంగారెడ్డి వంటి కీలక ప్రాంతాలను కలుపుతుందన్నారు. పటాన్చెరు, సంగారెడ్డి ప్రాంతాల్లో అధిక సంఖ్యలో పరిశ్రమలు ఉన్నందున పారిశ్రామిక, వ్యవసాయ, వాణిజ్య రంగాల అభివృద్ధికి ఈ లైన్ ఎంతగానో దోహదపడుతుందన్నారు. రైల్వేలైన్ను మంజూరు చేసిన రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్, చొరవ తీసుకున్న ఎంపీ అర్వింద్ ధర్మపురికి జిల్లా ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేశారు. ఇక ఏపీఎంల బదిలీలు ●డొంకేశ్వర్(ఆర్మూర్): పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్)లో డీపీఎంల వరకు జరిగి నిలిచిన బదిలీలు తిరిగి మొదలయ్యాయి. నెల రోజులుగా ఎదురుచూస్తున్న ఏపీఎంలకు బదిలీల షెడ్యూల్ విడుదలైంది. జిల్లాకు ఏపీఎంలను కేటాయించిన సెర్ప్ ఉన్నతాధికారులు వారి సీనియారిటీ లిస్టును సైతం పంపించారు. బుధ, గురువారాల్లో ఆప్షన్లు రాసి జిల్లా కార్యాలయంలో అందజేశారు. మొత్తం 31 మంది ఏపీఎంల బదిలీలకు శుక్రవారం కలెక్టరేట్లో కలెక్టర్ ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. కౌన్సెలింగ్లో కోరుకున్న మండలాలను కేటాయించి 26న పోస్టింగ్ ఆర్డర్లు ఇవ్వనున్నారు. 31న పాత మండలాల నుంచి రిలీవ్ అయ్యి ఆగస్టు 1న కొత్తగా పోస్టింగ్ ఇచ్చిన మండలాల్లో రిపోర్టు చేయాలని సెర్ప్ నుంచి ఆదేశాలున్నాయి. ఐతే, ఏపీఎంలలో కొందరు కోరుకున్న ప్రాంతాలకు వెళ్లాలనే పట్టుదలతో పైరవీలు సైతం చేసినట్లు వినిపిస్తున్నాయి. సీసీలు, ఇతర సిబ్బందికి కూడా వెంటనే.. ఏపీఎంల బదిలీలు, కొత్త మండలాల్లో పోస్టింగ్ల ప్రక్రియ నెలాఖరుతో ముగియనుంది. అనంతరం సీసీలు, ఇతర సిబ్బందికి కూడా వెంటనే బదిలీలు చేపట్టాలని సెర్ప్ ఉన్నతాధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు నాలుగైదు రోజుల్లో షెడ్యూల్ విడుదల చేసే అవకాశమున్నట్లు ఉద్యోగవర్గాలు పేర్కొంటున్నాయి. సీసీలు, ఇతర సిబ్బంది ఇది వరకే ఆప్షన్లు పెట్టుకోగా కౌన్సెలింగ్ చేయడమే ఆలస్యమంటున్నారు. సమగ్ర శిక్షలో బదిలీలకు గ్రీన్సిగ్నల్.. ఆర్మూర్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్తంగా నిర్వహిస్తున్న సమగ్ర శిక్షలో ఎట్టకేలకు బదిలీల పర్వం ప్రారంభమైంది. భార్య, భర్తలు ఉద్యోగులుగా ఉన్న పక్షంలో వారిలో ఒకరిని బదిలీ చేయడానికి, మ్యూచ్వల్ అండర్ స్టాండింగ్తో బదిలీలకు అనుమతినిస్తూ సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిర్ణయంతో భార్యభర్తలు ఇతర జిల్లాల్లో విధులు నిర్వహిస్తూ ఇబ్బందులు పడుతున్న వారికి సమస్య పరిష్కారం కానుంది. బదిలీ లు కోరే ఉద్యోగులు దరఖాస్తు చేసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.● షెడ్యూల్ విడుదల ● నేడు కలెక్టరేట్లో కౌన్సెలింగ్ -
ప్రభుత్వ స్కూళ్లల్లో లైబ్రరీ పీరియడ్
నిజామాబాద్అర్బన్: విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. అందులో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో గ్రంథాలయాలను ఏర్పాటు చేస్తోంది. జిల్లాలోని 252 హైస్కూళ్లు, 131 ప్రాథమికోన్నత పాఠశాలలకు వివిధ రకాల పుస్తకాలను సరఫరా చేసింది. దీంతో ప్రతిరోజు గ్రంథాలయ పీరియడ్ నిర్వహిస్తూ విద్యార్థులను బాల సాహిత్యానికి చేరువ చేయనున్నారు. అలాగే పిల్లల్లో పఠనాసక్తిని పెంపొందిచనున్నారు. నిర్వహణపై శిక్షణ ఒక్కో పాఠశాలకు సమగ్ర శిక్ష అభియాన్ 150 పుస్తకాలు, రూమ్ టు రీడ్ సంస్థ 250 వరకు కథల పుస్తకాలను సరఫరా చేసింది. విద్యార్థులకు ఆసక్తి కలిగించేలా రంగురంగుల బొమ్మలతో కూడినవి, నైతిక విలువలు పెంపొందించేవి, నీతి కథలు, నా యకుల జీవిత చరిత్రలు గల పుస్తకాలు ఉన్నాయి. కాగా, గ్రంథాలయాల నిర్వహణపై రిసోర్స్ పర్సన్లకు శిక్షణ ఇస్తున్నారు. వారు ఈ నెల 28, 29 తేదీలలో జరగనున్న కాంప్లెక్స్ సమావేశాల్లో ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వనున్నారు. రీడింగ్ కార్నర్లు.. గ్రంథాలయాల ఏర్పాటుతో పిల్లల్లో అభ్యసన స్థా యి మెరుగుపడుతున్నట్లు ఇటీవల ప్రకటించిన న్యాస్ ఫలితాలతో వెల్లడైంది. దీనిని దృష్టిలో పెట్టు కొని పఠన సామర్థ్యాన్ని పెంచేందుకు ప్రతిరోజు లైబ్రరీ పీరియడ్ అమలయ్యేలా అధికారులు పర్యవేక్షించనున్నారు. అలాగే విద్యార్థులు ఉత్సాహంగా, స్వేచ్ఛగా చదివేలా పాఠశాలలో 45 నిమిషాలు కే టాయించనున్నారు. అందుకు ప్రతి తరగతి గదిలో రీడింగ్ కార్నర్లను ఏర్పాటు చేస్తున్నారు. వారంలో రెండుసార్లు పిల్లలకు కథల పుస్తకాలను ఇంటికి ఇచ్చి చదివే అలవాటును ప్రోత్సహించనున్నారు. ప్రతి రోజు 45 నిమిషాలు కేటాయింపు జిల్లాలోని 383 పాఠశాలల్లో అందుబాటులో గ్రంథాలయాలు పఠనాసక్తి పెంపొందించడమే లక్ష్యం రిసోర్స్ పర్సన్లకు కొనసాగుతున్న శిక్షణపఠనశక్తి పెరుగుతుంది ప్రభుత్వ బడులకు సరఫరా చేసిన కథల పుస్తకాలు బాగున్నాయి. ఆకర్షణీయంగా ఉండడంతో పిల్లలు చదివేందుకు ఆసక్తి చూపుతారు. దీంతో పిల్లల్లో పఠన శక్తి పెరుగుతుంది. – అశోక్, డీఈవో చదవడం అలవాటుగా మారుతుంది ప్రపంచీకరణ నేపథ్యంలో పిల్లలు సెల్ఫోన్లకు ఆకర్షితులవుతున్నా రు. ఈ దురాలవాటును మాన్పించడానికి పిల్లలు పుస్తకాలను చదివేలా లైబ్రరీ నిర్వహణ ఎంతగానో ఉపయోగపడుతుంది. – ప్రసన్న కుమార్, రిసోర్స్ పర్సన్ -
అరుదైన జానపద నృత్య రూపకం ‘చిందు’
మీకు తెలుసా? ఆర్మూర్: అరుదైన జానపద నృత్యరీతిగా గుర్తింపు తెచ్చుకున్న చిందులు మన తెలంగాణలోనే కనబడతారు. కొన్నేళ్ల కిందట ఈ కళను నమ్ముకొని నిజామాబాద్, కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, వరంగల్, నల్గొండ జిల్లాల్లో సుమారు ఐదువేల కుటుంబాలు జీవనం సాగించేవి. ఒక్క ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోనే ఆర్మూర్, భీమ్గల్, బాల్కొండ, బోధన్, బాన్స్వాడ ప్రాంతాలలో రెండు వేల మంది కళాకారులు ఉండేవారని అంచనా. ● హరిజనులలో ఒక తెగ అయిన మాదిగ వారిని అడుక్కోవడానికి చిందులు వేసేవారే ఈ చిందు కళాకారులు లేదా చిందు మాదిగలు. ● వీరు ప్రదర్శించే యక్షగానం పేరే చిందు భాగోతం లేదా చిందు భాగవతం. ● చిందు కళాకారుల రామాయణ, మహాభారత, భాగవతాలలో ప్రధాన ఘట్టాలను రంగస్థలంపై ప్రదర్శించేవారు. ● ప్రస్తుతం రంగస్థల ప్రదర్శనలు కనుమరుగుకావడంతో, వారు చిందు ప్రదర్శనలను తగ్గించారు. పాత ఫోన్లు కొనేటప్పుడు జాగ్రత్త.. ఖలీల్వాడి: తక్కువ ఽరేటుకు మంచి సెల్ఫోన్లు వస్తున్నాయని చాలా మంది పాతవి కొనుగోలు చేస్తుంటారు. కానీ ఈ ఫోన్లు తీసుకునేటప్పుడు జాగ్రత్తలు తీసుకోకుంటే ఇబ్బందుల్లో పడక తప్పదు. ప్రతి సెల్ఫోన్కు ఐఎంఈఐ నెంబర్ ఉంటుంది. గతంలో ఏదైనా నేరాలకు పాల్పడిన వారు ఫోన్ను విక్రయిస్తే, కొనుగోలు చేసినవారు ఇబ్బందులు పడతారు. అలాగే కొందరు సెల్ఫోన్లను చోరీ చేసి తక్కువ ధరకు అమ్ముతుంటారు. వీటిని కొన్న తర్వాత పోలీసు సమస్యలు రావచ్చు. ఎప్పుడైనా పాత ఫోన్ కొనేటప్పుడు వారి పూర్తి వివరాలు, చిరునామా తీసుకోవాలి. అలాగే లిఖిత పూర్వకంగా పత్రం రాసుకొని తీసుకుంటే కొంత మేర ఇబ్బందులు తప్పే అవకాశాలు ఉంటాయి. సమాచారం.. -
లక్ష్య సాధనకు కృషిచేయాలి
నిజామాబాద్అర్బన్: ప్రభుత్వ కార్యక్రమాలను పకడ్బందీగా అమలు చే స్తూ, లక్ష్యాల సాధనకు ప్ర ణాళికాబద్దంగా కృషి చే యాలని కలెక్టర్ టీ వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో గురువారం ప్రత్యేక అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, సంబంధిత శాఖల అధికారులతో ఆయన సమీక్షించారు. వన మహోత్సవంలో భాగంగా జిల్లాలో 51 లక్షల పైబడి మొ క్కలు నాటేందుకు సమష్టిగా కృషి చేయాలన్నారు. భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయనే వా తావరణ శాఖ చేసిన సూచనల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఇంటి నిర్మాణాలు చేపట్టేలా అవగాహన కల్పించాలన్నారు. లబ్ధిదారులకు ఐకేపీ, మెప్మా ద్వారా రుణాలు మంజూరయ్యేలా చూడాలన్నా రు. అర్హులైన వారికి డబుల్ బెడ్రూం ఇళ్లను కేటాయించే ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లాలో ఆయిల్ పామ్ పంటను అధిక విస్తీర్ణంలో సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాలని సూ చించారు. క్షయ వ్యాధి నిర్మూలనకు చిత్తశుద్ధితో కృషి చేయాలన్నారు. క్షయ వ్యాధిగ్రస్తులకు ఆరు నెలల పాటు పోషణ్ కిట్లు అందించేలా చొరవ చూపాలని సూచించారు. సీజనల్ వ్యాధుల ని యంత్రణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆ దేశించారు. అసంపూర్తిగా ఉన్న పాఠశాల, అంగన్వాడీ, పీహెచ్సీల భవనాలను త్వరితగతిన పూర్తి చేసి అప్పగించేలా చర్యలు తీసుకోవాలని ఇంజినీరింగ్ విభాగం అధికారులను ఆదేశించారు. అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, ట్రెయినీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావీ, నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్రకుమార్, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్కుమార్ పాల్గొన్నారు. కలెక్టర్ టీ వినయ్ కృష్ణారెడ్డి -
కులాస్పూర్లో దొంగల బీభత్సం
మోపాల్(నిజామాబాద్రూరల్): మండలంలోని కులాస్పూర్ గ్రామంలో దోపిడీ దొంగలు బుధవారం అర్ధరాత్రి బీభత్సం సృష్టించారు. ఏకంగా తాళం వేసి ఉన్న 11 ఇళ్లల్లో దొంగతనానికి పాల్పడ్డారు. గ్రామంలో చోరీ జరిగిన ఇళ్లను సీపీ సాయి చైతన్య, ఏసీపీ రాజా వెంకట్రెడ్డి గురువారం పరిశీలించి, బాధితులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎస్ఐ జడ్ సుస్మిత, గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా.. గ్రామంలోని తాళం వేసిన సుమారు 11 ఇళ్లను గురువారం ఉదయం స్థానికులు చూడగా, తాళాలు పగలగొట్టి ఉండటంతో ఒక్కొక్కరుగా పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిసరాలను పరిశీలించారు. వేలిముద్రలు సేకరించారు. సీసీ ఫుటేజీలను పరిశీలించారు. ఐదారుగురి ఇళ్లల్లోనే నగదు, బంగారం, వెండి చోరీకి గురైనట్లు తెలిసింది. మిగతా వారి ఇళ్లల్లో చోరీకి యత్నించినా.. విలువైన వస్తువులు లేకపోవడంతో వెనుదిరిగారు. ఆయా ఇళ్ల నుంచి మొత్తం 7.3 తులాల బంగారం, 54 తులాల వెండి, రూ.3.85లక్షల నగదు దొంగతనానికి గురైనట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదుచేశారు. పిల్లులు పట్టేవారి పనేనా? కులాస్పూర్లో గురువారం పిల్లులు పడతామని పలువురు గుర్తుతెలియని వ్యక్తులు గ్రామంలో సంచరించారు. ఈక్రమంలో వారే ఎవరికీ అనుమానం రాకుండా ఉదయం నుంచి సాయంత్రం వరకు తాళం వేసిన ఇళ్లను గమనించి రెక్కి నిర్వహించి, అర్ధరాత్రి చోరీకి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. సుమారు అర్ధరాత్రి 2 గంటల నుంచి 3 గంటల్లోపే నిందితులు ఒకేసారి 11 ఇళ్లల్లో చోరీకి పాల్పడ్డారు. సుమారు 10మందికిపైగా బృందాలుగా విడిపోయి గంటల వ్యవధిలోనే దొంగతనానికి పాల్పడటంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. మంకీ క్యాపులు ధరించి, మారణాయుధాలను కూడా వెంట తెచ్చుకున్నట్లు తెలిసింది. ఓ ఇంట్లో దొంగతనానికి పాల్పడిన దొంగ పదునైన కత్తిని మర్చిపోగా, పోలీసులు దానిని స్వాధీనం చేసుకున్నారు. ఘటన స్థలాన్ని సీపీ సాయి చైతన్య, ఏసీపీ రాజావెంకట్రెడ్డి, సీఐ సురేష్కుమార్ పరిశీలించారు. బాధితుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిందితులను పట్టుకునేందుకు 3 ప్రత్యేక బృందాలను నియమించారు. గడిచిన ఏడాది కాలంలో గ్రామంలో రెండుసార్లు దొంగతనాలు జరగడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గతంలో ఐదారు ఇళ్లల్లో ఒకేరోజు చోరీ జరిగినా.. ఇప్పటివరకూ ఆ కేసులో పురోగతిలేదు. తాళం వేసిన 11ఇళ్లలో చోరీ 7.3 తులాల బంగారం, 54 తులాల వెండి, రూ.3.85లక్షల నగదు అపహరణ -
మహిళలకు వడ్డీ వాపస్
డొంకేశ్వర్(ఆర్మూర్): స్వయం సహాయక సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం ‘వడ్డీ’ కానుక అందజే సింది. ఐకేపీలో బ్యాంకు లింకేజీ రుణాలు పొంది వడ్డీతో కలిపి సక్రమంగా వాయిదాలు చెల్లించిన వారికి వడ్డీ డబ్బులను వాపస్ చేసింది. జి ల్లాలోని 20,547 ఎస్హెచ్జీలకు రూ.21.69 కోట్లు విడుదల చేసింది. ఇవి 2024–25 ఆర్థిక సంవత్సరంలోని ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు నెలలకు సంబంధించిన వడ్డీ డబ్బులని సంబంధిత అధికారులు వెల్లడించారు. నిధుల ను మండలాల వారీగా సంఘాల ఖాతాల్లో జ మ చేశారు. సంఘం ఖాతాల నుంచి సభ్యురాలి వారీగా వడ్డీ డబ్బులను పంచుకోనున్నారు. అ త్యధికంగా నందిపేట్ మండలానికి రూ.1.32 కోట్లు, నవీపేట్ మండలానికి రూ.1.24కోట్ల వడ్డీ వాపస్ వచ్చింది. చాలా రోజుల తర్వాత వడ్డీ వాపస్ రావడంతో జిల్లాలోని మహిళా సంఘాల సభ్యులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. మండలాల వారీగా వాపస్ వచ్చిన వడ్డీ డబ్బులు మండలం సంఘాలు రూ.కోట్లలో ఆర్మూర్ 948 1.16 మాక్లూర్ 1,088 1.05 నందిపేట్ 1,220 1.32 బాల్కొండ 606 0.69 భీమ్గల్ 976 1.15 కమ్మర్పల్లి 845 1.06 మెండోరా 497 0.52 మోర్తాడ్ 666 0.62 ముప్కాల్ 411 0.52 ఎడపల్లి 854 0.85 ధర్పల్లి 809 0.82 డిచ్పల్లి 1,187 0.59 ఇందల్వాయి 682 0.59 జక్రాన్పల్లి 828 0.98 మోపాల్ 760 0.78 నిజామాబాద్రూరల్ 571 0.62 సిరికొండ 944 0.96వేల్పూర్ 960 1.16 ఏర్గట్ల 335 0.37 చందూర్ 188 0.15 కోటగిరి 893 0.93 మోస్రా 267 0.25 రుద్రూర్ 416 0.41 వర్ని 554 0.49 బోధన్ 1,189 1.22 నవీపేట్ 1,145 1.24 రెంజల్ 708 0.61 జిల్లాకు రూ.21.69 కోట్లు విడుదల ఎస్హెచ్జీల ఖాతాల్లో నిధులు జమ -
రేషన్కార్డులకు ‘స్థానిక’ భయం!
సుభాష్నగర్: అర్హులందరికీ రేషన్కార్డులు అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రకటనతో పేదల్లో సంతోషం ఎంతోకాలం నిలిచేలా లేదు. కార్డుల కో సం దరఖాస్తు చేసుకున్న పేదలకు స్థానిక సంస్థల ఎన్నికల భయం పట్టుకుంది. ఎన్నికల కోడ్ రూపంలో అడ్డుతగిలేలా ఉందనే చర్చ దరఖాస్తుదారుల్లో జోరుగా సాగుతోంది. జిల్లాలో 4,05,310 రేషన్ కా ర్డులు ఉన్నాయి. అందులో అంత్యోదయ కార్డులు 20,910, అన్నపూర్ణ కార్డులు 1,016 పోను మిగతా 3,83,384 ఆహార భద్రత కార్డులు ఉన్నాయి. గత జనవరి నుంచి ఇప్పటి వరకు 3,501 కొత్తకార్డులు మంజూరయ్యాయి. 1.19 లక్షల మంది పేర్లు కొత్తగా కార్డుల్లో చేరాయి. కాగా, రేషన్కార్డుల కో సం 39వేల వరకు దరఖాస్తులు రాగా, 20వేలకుపైగా దరఖాస్తులు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. ఇటీవల మీ సేవ కేంద్రాల్లో కార్డుల కోసం డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు రావడంతో పది రోజులపాటు వెబ్సైట్ను బంద్ ఉంచారు. దరఖాస్తులను క్షేత్రస్థాయిలో తహసీల్దార్ కుణ్ణంగా పరిశీలించిన తర్వాతే డీఎస్వో లాగిన్కు ఫార్వార్డ్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. దీంతో దరఖాస్తులపై రీసర్వే చేసి, నిబంధనల ప్రకారం ఉంటేనే డీఎస్వో లాగిన్కు ఫార్వార్డ్ చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఉంటే రిజెక్ట్ చేస్తున్నారు. ఎన్నికల కోడ్పై సర్వత్రా చర్చ దరఖాస్తుదారుల్లో మొదలైన ఆందోళన తహసీల్, డీఎస్వో కార్యాలయాలకు పరుగులు కోడ్పై స్పష్టత లేదంటున్న అధికారులుకోడ్ వర్తిస్తుందా? రేషన్కార్డుల దరఖాస్తు, మంజూరు నిరంతర ప్రక్రియ అంటూ ప్రభుత్వ పెద్దలు ఒకవైపు ప్రకటనలు చేస్తున్నా.. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల కోడ్తో దరఖాస్తుల మంజూరు నిలిచిపోనుందా అనే చర్చ జోరందుకుంది. రేషన్కార్డుల మంజూరుకు స్థానిక సంస్థల కోడ్ వర్తిస్తుందా? లేదా? అనే దానిపై అటు అధికార వర్గాల్లో, ఇటు ప్రభుత్వ పెద్దల నుంచి స్పష్టత కరువైంది. దీంతో గాబరా పడుతున్న దరఖాస్తుదారులు తహసీల్, డీఎస్వో కార్యాలయాలకు తరలివస్తున్నారు.స్పష్టత లేదు.. రేషన్కార్డుల కోసం వచ్చిన దరఖాస్తులను వారం రోజుల్లోగా మంజూరు చేస్తున్నాం. స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ కార్డుల మంజూరుకు వర్తిస్తుందా? లేదా అనేది స్పష్టత లేదు. ప్రభుత్వ పరిధిలోని అంశం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే ముందుకు సాగుతాం. – అరవింద్రెడ్డి, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి -
పేదలకు ఇళ్లు ఇవ్వకుంటే నిరాహార దీక్ష చేస్తా
సుభాష్నగర్: నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్ల మంజూరుతోపాటు డబుల్ బెడ్రూం ఇళ్లకు మరమ్మతులు చేసి దీపావళి నాటికి పంపిణీ చేయాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ డెడ్లైన్ ప్రకటించారు. లేకుంటే పేదలతో కలిసి ధర్నా, నిరాహార దీక్షకు సిద్ధమన్నారు. నగరంలోని బీజేపీ కార్యాలయంలో గురువారం ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతేడాది దసరా నాటికే ఇళ్లను ఇస్తామని మంత్రి పొంగులేటి ప్రకటించారని, కానీ ఏడాది కావస్తున్నా ఇళ్లకు మోక్షం లభించలేదన్నారు. జాగా ఉన్న వారికే ఇందిరమ్మ ఇళ్లు అని ప్రభుత్వం ప్రకటించిందని, అర్బన్ ఏరియాలో కార్మికులు, ఆటోడ్రైవర్లకు గజం జాగా కొనే స్థోమత ఉందా అని ప్రశ్నించారు. రెండో విడతలో జాగా లేని అర్హులకు ప్రభుత్వం ఇళ్లు కట్టించి ఇవ్వాలని డిమాండ్చేశారు. 80శాతం పూర్తయిన డబుల్ బెడ్రూం ఇళ్లపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలన్నారు. పీఎం ఆవాస్ యోజన కింద కేంద్రం వాటా ఇస్తోందని, ఇళ్లపై ప్రధానమంత్రి పేరు, ఫొటో పెట్టాలని డిమాండ్చేశారు. నాయకులు, మాజీ కార్పొరేటర్లు గోపిడి స్రవంతిరెడ్డి, న్యాలం రాజు, నాగోళ్ల లక్ష్మీనారాయణ, నారాయణ యాదవ్, మాస్టర్ శంకర్, నాగరాజు, తారక్ వేణు, పల్నాటి కార్తీక్, పంచరెడ్డి శ్రీధర్, కిషోర్, మండల అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నియోజకవర్గంలో 3500 ఇందిరమ్మ ఇళ్లు, డబుల్బెడ్ రూం ఇళ్లు దీపావళి నాటికి అందించాలి నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ -
ఫంక్షన్హాల్ గేటు కూల్చివేత
డిచ్పల్లి: మండల కేంద్రం శివారులోని జీ కన్వెన్షన్ ఫంక్షన్హాల్ మెయిన్ గేటును గురువారం మధ్యాహ్నం కొందరు గుర్తుతెలియని వ్యక్తులు కూల్చివేశారు. సమచారం అందుకున్న డిచ్పల్లి ఎస్సై ఎండీ షరీఫ్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. జీ కన్వెన్షన్ యజమానులు కొందరి వద్ద అప్పులు చేసి నష్టాలపాలు కావడంతో ఐపీ పెట్టారు. ఏడాదిన్నర కాలం గడిచినా బాధితులకు డబ్బులు ముట్టకపోవడంతో వారు ఇబ్బందులు పడుతున్నారు. ఈక్రమంలో గురువారం గుర్తుతెలియని వ్యక్తులు జేసీబీ తీసుకెళ్లి కన్వెన్షన్ గేటును కూల్చివేయడంతోపాటు లోనికి వెళ్లకుండా గేటు ముందు గుంత తవ్వి వెళ్లిపోయారు. ఈఘటనపై కన్వెన్షన్ యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నారు.