breaking news
Nizamabad
-
కొత్త కార్డుదారులకూ రేషన్
● సెప్టెంబర్ 1 నుంచి దుకాణాల్లో సన్నబియ్యం పంపిణీ ● జిల్లాలో 44,278 కుటుంబాలకు కార్డులు మంజూరుసుభాష్నగర్ : జిల్లాలో పాత కార్డుదారులతోపాటు కొత్తగా మంజూరైన కార్డుదారులకూ సెప్టెంబర్ 1 నుంచి రేషన్దుకాణాల ద్వారా సన్నబియ్యం పంపిణీకి పౌరసరఫరాల శాఖ ఏర్పాట్లు చేస్తోంది. వర్షాకాలంలో వరదలు, వర్షాల నేపథ్యంలో పేదలు రేషన్ తీసుకోవడం ఇబ్బందిగా ఉంటుందని భావించిన కేంద్రం జూన్లో ఒకేసారి మూడు నెలల బియ్యం కోటాను పంపిణీ చేసింది. సెప్టెంబర్ నుంచి తిరిగి నెలవారీ సన్నబియ్యం పంపిణీ కొనసాగనుంది. ఈ మేరకు సెప్టెంబర్ నెల కోటా సన్నబియ్యం మండల్ లెవల్ స్టాక్ (ఎంఎల్ఎస్) పాయింట్ల నుంచి రేషన్ దుకాణాలకు చేరుతున్నాయి. జిల్లాలో 4,47,788 ఆహార భద్రతా కార్డులుండగా అందులో 15,21,062 మంది సభ్యులుగా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గత నెల నుంచి కొత్తగా ఆహార భద్రత కార్డులను పంపిణీ చేస్తోంది. అందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా కొత్తగా 44,278 కార్డులు మంజూరు కాగా, కార్డుల్లో 1,26,559 మంది సభ్యులుగా చేరారు. ఈ నేపథ్యంలో 759 రేషన్దుకాణాల ద్వారా 7,639 మెట్రిక్ టన్నుల సన్నబియ్యాన్ని సెప్టెంబర్ 1 నుంచి కార్డుదారులకు పంపిణీ చేయనున్నారు. సెప్టెంబర్ 1 నుంచి పాత కార్డుదారులతోపాటు కొ త్త కార్డుదారులకు కూడా సన్నబియ్యం పంపిణీ చే యాలని ప్రభుత్వం ఆదేశించింది. ఎంఎల్ఎస్ పా యింట్ల నుంచి రేషన్దుకాణాలకు బియ్యం సరఫరా చేస్తున్నాం. జిల్లాలోని కార్డుల సంఖ్యకు అనుగుణంగా చేతి సంచీలు చేరాయి. కానీ కార్డుదారులకు పంపిణీ చేయాలనే ఆదేశాలు మాత్రం అందలేదు. – శ్రీకాంత్రెడ్డి, జిల్లా మేనేజర్, పౌరసరఫరాల సంస్థఉచితంగా చేతి సంచి! రేషన్కార్డుదారులకు సన్నబియ్యంతోపాటు ప్ర త్యేకంగా రూపొందించిన పర్యావరణహితమైన చేతి సంచిని ప్రభుత్వం ఉచితంగా అందజేయనుంది. ఈ బ్యాగుపై సీఎం రేవంత్రెడ్డి, డిప్యూ టీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పౌరసరఫరా లశాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి ఫొటోలతో పాటు మధ్యలో ఇందిరమ్మ అభయహస్తం పేరు తో ఆరు గ్యారెంటీలకు సంబంధించిన వివరాలు, ‘అందరికీ సన్నబియ్యం ప్రజా ప్రభుత్వంతోనే సాధ్యం’ అనే నినాదం ముద్రించారు. -
ఉద్యోగ, ఉపాధ్యాయుల పోరుబాట
నిజామాబాద్అర్బన్: సీపీఎస్(కాంట్రిబ్యూటరీ పెన్ష న్ స్కీం), యూపీఎస్ (యూనిఫైడ్ పెన్షన్ స్కీం)లు గుదిబండగా మారాయని ఉద్యోగ, ఉపాధ్యాయు లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఎస్ను రద్దు చేసి ఓపీఎస్(ఓల్డ్ పెన్షన్ స్కీం)ను అమలు చేస్తామని మేనిఫెస్టోలో చేర్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై మండిపడుతున్నారు. సమస్య తీవ్రతను తెలియజేస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు పోరుబాట పడుతున్నాయి. పీఆర్టీయూ, ఉద్యోగ సంఘాల సహకారంతో సెప్టెంబర్ 1న పెన్షన్ విద్రోహదినం సందర్భంగా హైదరాబాద్లో మహాధర్నాకు పిలుపునిచ్చింది. మరోవైపు నూతన పీఆర్సీ, ఐదు డీఏల పెండింగ్ ఇతర ఉపాధ్యాయ సమస్యలపై ఉద్యోగ సంఘాల పోరాట కమిటీ ఈ నెల 23న హైదరాబాద్లో మహాధర్నా చేపట్టనుంది. సీపీఎస్ రద్దుపైనే ప్రధాన ఆందోళన 2024 సెప్టెంబర్ 1 నుంచి కొత్తగా నియామకమైన ఉద్యోగ, ఉపాధ్యాయులకు సీపీఎస్ విధానం అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ జాబితాలో జిల్లాలో 8,432 మంది ఉద్యోగ, ఉపాధ్యాయులు ఉన్నారు. సీపీఎస్ విధానంలో భాగంగా వచ్చే జీతంలో పది శాతం, ప్రభుత్వం మరో 10 శాతం కలిపి షేర్ మార్కెట్లో పెట్టనున్నది. వాటి ద్వారా వచ్చిన లాభాల ఆధారంగా పెన్షన్ ఆధారపడి ఉంటుంది. ఒకవేళ నష్టాలు జరిగితే ఉద్యోగులు నష్టపోయే అవకాశం ఉంది. పాత పెన్షన్ విధానంలో ఉద్యోగి చనిపోతే భార్యకు పెన్షన్ అందించేవారు. కానీ సీపీఎస్ విధానంలో భార్యకు ఇచ్చే పెన్షన్ రద్దు చేస్తున్నారు. ఉద్యోగి జమ చేసిన నగదులో 60 శాతం మాత్రమే ప్రభుత్వం ఇస్తుంది. మిగతా 40 శాతం పెన్షన్ రూపంలో ఇస్తారు. ఇలా చాలా రూపాల్లో నష్టపోతామనే ఆందోళన చెందుతున్నారు. సీపీఎస్తోపాటు కేంద్ర ప్రభుత్వం ఇటీవల అమల్లోకి తెచ్చిన ఏకీకృత పెన్షన్ పథకం(యూపీఎస్) మరో అసంపూర్ణ పథకమని, దీంతో ఉద్యోగులకు ఏమాత్రం రక్షణ, ప్రయోజనం లేదని అభిప్రాయపడుతున్నారు. ఏకతాటిపైకి ఉపాధ్యాయ సంఘాలు ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించుకునేందుకు అన్ని సంఘాలు ఏకతాటిపైకి వచ్చాయి. సమష్టిగా పోరాడేందుకు సిద్ధమయ్యాయి. పదోన్నతులు, పీఆర్సీ, డీఎస్సీ–2003 వారికి పాత పెన్షన్ పునరుద్ధరణ, పండిత్ పోస్టులు, ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం పోస్టుల కేటాయింపు తదితర డిమాండ్లతో 16 సంఘాలు కలిసి ఐక్య పోరాట కమిటీగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నారు. పీఆర్సీ అమలుతోపాటు 63 డిమాండ్లతో అక్టోబర్ 12న ఉద్యోగ, ఉపాధ్యాయుల జేఏసీ చలో హైదరాబాద్ కార్యక్రమం చేపట్టనుంది. లక్ష మంది ఉద్యోగ, ఉపాధ్యాయులతో నిరసన చేపట్టి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. యూపీఎస్ను తిరస్కరిస్తున్న ఉపాధ్యాయులు రేపు యూఎస్పీఎస్ మహాధర్నా సెప్టెంబర్ 1న హైదరాబాద్లో పీఆర్టీయూ ఆందోళన మద్దతిస్తున్న టీజీజేఏసీ, టీఎన్జీవోలు ఉద్యోగ, ఉపాధ్యాయుల పాలిట సీపీఎస్ శాపంగా మారింది. షేర్ మార్కెట్లో మా జీతాలు పెట్టి వచ్చిన లాభాల ఆధారంగా పెన్షన్ ఇవ్వడం సరైంది కాదు. ఆర్థిక ప్రయోజనం లేని సీపీఎస్ను తిరస్కరిస్తున్నాం. – వెంకట రాజారెడ్డి, సీపీఎస్ ఉపాధ్యాయుడు ఉద్యోగ, ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలి. సీపీఎస్ను రద్దు చేసి, పీ ఆర్సీని వెంటనే ప్రకటించా లి. ఉద్యోగ, ఉపాధ్యాయుల కు మేలు జరిగేలా చూడాలి. – నాగరాజు, టీఎస్వోఎస్ అసోసియేట్ అధ్యక్షుడు సీపీఎస్, యూపీఎస్లను రద్దు చేసి పాత పెన్షన్ వి ధానాన్ని అమలు చేయాలి. సీపీఎస్ రద్దు చేయాలని సెప్టెంబర్ 1న హైదరాబాద్ ధర్నాచౌక్లో చేపట్టనున్న మహాధర్నాను విజయవంతం చేయాలి. – మోహన్రెడ్డి, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు -
మధ్యవర్తిత్వంతో కేసుల పరిష్కారానికి ప్రాధాన్యం
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి జీవీఎన్ భరతలక్ష్మి నిజామాబాద్ లీగల్ : జిల్లాలోని వివిధ కోర్టుల్లో పెండింగ్లో ఉన్న 250 కేసులను మీడియేషన్ ద్వారా పరిష్కరించేందుకు గుర్తించినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జీవీఎన్ భరతలక్ష్మి పేర్కొన్నారు. మీడియేషన్ ఫర్ నేషన్లో భాగంగా నల్సా (నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ) పిలుపు మేరకు జిల్లా కోర్టులో గురువారం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ కేసుల త్వరితగత పరిష్కారానికి మీడియేషన్ ఉపయోగపడుతుందని, ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు మీడియేషన్పై ఆధారపడుతున్నాయని తెలిపారు. పేరుకుపోతున్న కేసుల పరిష్కారానికి నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ మీడియేషన్ ప్రక్రియకు ప్రాధాన్యమిస్తోందన్నారు. సమావేశంలో న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఉదయ భాస్కర్రావు, బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు మామిళ్ల సాయిరెడ్డి, మాణిక్రాజ్, వివిధ కోర్టుల జడ్జీలు, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. -
అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు
● బ్యాంక్ లోన్ ఇప్పిస్తామంటూ బంగారం, నగదు చోరీ ● ఐదు జిల్లాల్లో వెలుగుచూసిన ఘటనలు ● వివరాలు వెల్లడించిన ఎస్పీ రాజేష్ చంద్ర కామారెడ్డి క్రైం: సుమారు ఐదు జిల్లాల్లో బ్యాంక్ లోన్ ఇప్పిస్తామంటూ బాధితులను ఎమర్చి బంగారం, నగదు చోరీకి పాల్పడుతున్న అంతర్ర్రాష్ట్ర దొంగల ముఠాను కామారెడ్డి జిల్లా భిక్కనూరు పోలీసులు అరెస్టు చేశారు. జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ రాజేష్ చంద్ర వివరాలు వెల్లడించారు. భిక్కనూర్కు చెందిన ఊరె లక్ష్మి దంపతులు స్థానికంగా బొంబు మర్చంట్ దుకాణం నడుపుతున్నారు. ఫిబ్రవరి 26న లక్ష్మి దుకాణంలో ఉండగా ఓ గుర్తుతెలియని వ్యక్తి వచ్చి మాటలు కలిపాడు. బ్యాంకు నుంచి వచ్చానని, మీ దుకాణంపై రుణం ఇప్పిస్తామని నమ్మించి లక్ష్మిని బ్యాంకుకు తీసుకువెళ్లాడు. పేదవారిగా కనిపిస్తేనే బ్యాంకు అధికారులు రుణం ఇస్తారని, మెడలోని బంగారు గొలుసు తీసేయాలని చెప్పారు. లక్ష్మి మెడలోని 3 తులాల బంగారం గొలుసును తీయగా, మేనేజర్ వద్దకు వెళ్లి వచ్చేదాకా తన వద్ద భద్రంగా ఉంచుతానని నమ్మబలికాడు. ఆమె దృష్టిని మళ్లించి అక్కడ నుంచి ఉడాయించారు. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా, భిక్కనూర్ పోలీసులు విచారణ ప్రారంభించారు. మహారాష్ట్రలోని నాగ్పూర్కు చెందిన ఆఫ్తాబ్ అహ్మద్ షేక్, ఫహీమా బేగం అనే భార్యా భర్తలు కబీరుద్దీన్, దీపక్ కిసాన్ సలుంకే అనే మరో ఇద్దరితో కలిసి ఇలాంటి నేరాలకు పాల్పడుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు. భిక్కనూర్ టోల్ గేట్ వద్ద ఒకరిని, కామారెడ్డిలో ముగ్గురిని అరెస్ట్ చేశారు. నిందితులు భిక్కనూర్తోపాటు ఆదిలాబాద్, నిర్మల్, హైదరాబాద్, సిద్దిపేట జిల్లాల్లో ఈ తరహాలో మొత్తం 8 నేరాలు చేసినట్లు అంగీకరించారు. వారి వద్ద నుంచి బంగారు గొలుసు, రెండు కార్లు, ఓ ద్విచక్రవాహనం, నాలుగు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టించిన బైక్ నెంబర్ ప్లేట్.. అఫ్తాబ్ అహ్మద్ షేక్పై గతంలో 60 పైగా దృష్టి మళ్లింపు, చోరీ కేసులు ఉన్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. పలు కేసుల్లో జైలుకు వెళ్లివచ్చినా చోరీలు చేస్తూనే ఉన్నాడు. అతడిని పట్టుకునేందుకు ఐదు జిల్లాల పోలీసులు చాలాకాలంగా గాలిస్తున్నా తప్పించుకు తిరుగుతున్నాడు. కొద్దిరోజుల క్రితం ఈ నేరస్తుడి గురించి దొంగ చిక్కడం లేదంటూ పలు టీవీ చానెళ్లలో వార్తా కథనాలు సైతం వచ్చాయన్నారు. ఇదిలా ఉండగా కేసులో ప్రధాన నిందితుడైన అఫ్తాబ్ అహ్మద్ షేక్ తప్పుడు నెంబర్ ప్లేట్తో ఉన్న బైక్ను వాడి పోలీసులకు చిక్కాడు. అతడు వాడిన బైక్ ముందర ఒక నెంబర్, వెనుక భాగంలో మరో నెంబర్ ఉండటాన్ని గమనించిన భిక్కనూర్ పోలీసులు వెంటనే అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు. జిల్లాలో ఇప్పటివరకు ఫేక్ నెంబర్ ప్లేట్లతో తిరుగుతున్న వాహనాలను పట్టుకుని 6 కేసులను చేధించినట్లు ఎస్పీ తెలిపారు. అందుకే వాహనాల తనిఖీలపై ఎక్కువగా దృష్టి పెట్టామన్నారు. కేసు ఛేదనకు కృషి చేసిన భిక్కనూర్ సీఐ సంపత్ కుమార్, సీసీఎస్ సీఐ శ్రీనివాస్, ఎస్సైలు ఆంజనేయులు, ఉస్మాన్, కానిస్టేబుళ్లు రవి, రాజేందర్, మైసయ్య, రమేష్ యాదవ్, మేకల నరేష్, జి నరేష్ లను ఎస్పీ అభినందించారు. అదనపు ఎస్పీ నరసింహరెడ్డి, కామారెడ్డి ఏఎస్పీ చైతన్య రెడ్డి, అధికారులు పాల్గొన్నారు. -
ప్రచారం సరే.. భద్రత ఏదీ?
ఆర్మూర్ టౌన్: వస్త్రాలపై ఆఫర్ అంటూ ఓ దు కాణ నిర్వాహకులు సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. కానీ కొనుగోలుదారులకు తగిన భద్రత చర్యలు చేపట్టకపోవడంతో గందరగోళం నెలకొంది. పట్టణంలోని ఓ వస్త్ర దుకాణ యజమానులు సోషల్ మీడియాలో రూ.పదికే షర్టు, రూ.పదికే ప్యాంట్ అంటూ ప్రచారం చేశారు. దీంతో వివిధ గ్రామాల ప్రజలు గురువారం ఉదయం నుంచే దుకాణం ఎదుట బారులు తీరారు. ఈక్రమంలో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడటంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని దుకాణం ఎదుట ఉన్న ప్రజలను చెదరగొట్టారు. అనంతరం దుకాణానికి తాళం వేసి, దుకాణ యజమానులకు అదుపులో తీసుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్హెచ్వో స త్యనారాయణగౌడ్ తెలిపారు. వేలాది మంది ఒ క్కసారిగా దుకాణంలోకి వెళ్తే తోపులాటలో ప్రా ణాలకు ముప్పు పొంచిఉంటుందని పలువురి అ భిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇష్టారాజ్యంగా ఆ ఫర్లు ప్రకటిస్తే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. -
పిన్కోడ్లో ఆరు అంకెల రహస్యం
మీకు తెలుసా? సదాశివనగర్(ఎల్లారెడ్డి): తపాలా కార్యకలాపాల్లో పిన్కోడ్ నంబరులు కీలక పాత్ర పోషిస్తాయి. తపాలా శాఖ పరిధిలో ఉత్తర ప్రత్యుత్తరాలు చేసేందుకు ఆరు అంకెల పిన్కోడ్ను ఉపయోగిస్తారు. ● చాలా ఏళ్లుగా ఉత్తరాలు, వస్తువులు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి పంపడంతోపాటు ఇటీవల కాలంలో ఆన్లైన్ మార్కెటింగ్ కార్యకలాపాలు పిన్ కోడ్ ఆధారంగా కొనసాగిస్తున్నారు. ● మన దేశంలో 1972 ఆగస్టు 15 నుంచి పిన్కోడ్ నంబరు వినియోగంలోకి వచ్చింది. ● పిన్కోడ్ నంబర్ల ఆధారంగా వినియోగదారులకు తపాలా సేవలు అందుబాటులోకి వచ్చాయి. ● ఆరు అంకెలా పిన్కోడ్లో మొదటి అంకె జో న్ను, రెండో అంకెను సర్కిల్ను, మూడో అంకె జిల్లా చివరి మూడు అంకెలు తపాలా కార్యాల యం ఉన్న ప్రాంతంను సూచిస్తాయి. –ప్రధాన తపాలా కార్యాలయంతోపాటు ఉప తపాలా కార్యాలయాలకు కూడా పిన్కోడ్ నంబర్లను కేటాయించారు. -
యాపిల్స్ డీసీఎం బోల్తా
బాల్కొండ: మెండోరా మండలం బుస్పాపూర్ వద్ద జాతీయ రహదారి 44పై గురువారం ఉదయం హైదరాబాద్ వెళ్తున్న యాపిల్స్ లోడ్ డీసీఎం వ్యాన్ బోల్తా పడింది. అతి వేగంగా రావడంతో అదుపు తప్పి బోల్తాపడగా డ్రైవర్, క్లీనర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ ఘటనతో హైవేపై 45 నిమిషాల పాటు ట్రాఫిక్ నిలిచి పోయింది. హైవే సిబ్బంది స్పందించి క్రేన్ సాయంతో వ్యాన్ను తొలగించారు. వేరే వాహనంలో యాపిల్స్ను తరలించారు. వారం క్రితం నిర్మల్ వైపు వెళ్తున్న బొప్పాయి లోడ్ డీసీఎం వ్యాన్ ఇక్కడనే బోల్తా పడింది. -
దివ్యాంగులకు ఉచితంగా పరికరాలు!
● అర్హుల గుర్తింపు కోసం 23 నుంచి రెవెన్యూ డివిజన్ల వారీగా శిబిరాలు ● వైద్య పరీక్షలు నిర్వహించనున్న ఆలిమ్కో ప్రతినిధులు ఆర్మూర్: జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రత్యేక అవసరాలు గల పిల్లల (దివ్యాంగులకు)కు అవసరమైన పరికరాలను ఉచితంగా అందిచనున్నారు. ఇందుకోసం అర్హులను గుర్తించడానికి శిబిరాలను తెలంగాణ సమగ్ర శిక్ష సహిత విద్యా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దివ్యాంగుల సౌకర్యార్థం రెవెన్యూ డివిజన్ల వారీగా ఆర్మూర్, బోధన్, నిజామాబాద్లో మూడు శిబిరాల నిర్వహణకు ఉన్నతాధికారులు అనుమతులనిచ్చారు. శారీరక వైకల్యం, మానసిక వైకల్యం, వినికిడిలోపం, అంధత్వంతో బాధపడుతున్న పిల్లలకు అవసరమైన వీల్ చైర్స్, చంక కర్రలు, ట్రై సైకిళ్లు, రొలేటర్స్, బ్రెయిలీ కిట్, బ్రెయిలీ ప్లేట్స్, ఎమ్మార్ కిట్లతో పాటు కృత్రిమ అవయవాలు అందించడమే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. ఆర్టిఫిషియల్ లింబ్స్ మానిఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (అలిమ్కో) సహకారంతో ఈ శిబిరాలను నిర్వహించడానికి జిల్లా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా సుమారుగా ఉన్న 4,125 మంది ప్రత్యేక అవసరాలు గల పిల్లలలో సుమారు 500 మందికి పరికరాలు అవసరం ఉన్నట్లు ఇన్క్లూసివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్ (ఐఈఆర్పీ)లు గుర్తించారు. వీరిని శిబిరాలకు తరలించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నారు. శిబిరానికి వచ్చే ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ట్రావలింగ్ అలవెన్స్ (టీఏ), భోజన సదుపాయం కల్పించనున్నారు. ఏమేమి తీసుకొనిరావాలి.. సున్నా నుంచి 18 సంవత్సరాల ఏళ్లలోపు గల ప్రత్యేక అవసరాలు గల పిల్లలు మాత్రమే ఈ శిబిరాలకు హాజరు కావాల్సి ఉంటుంది. ఇన్కం సర్టిఫికెట్, సదరం సర్టిఫికెట్, యూడీఐడీ కార్డు, తెల్లరేషన్ కార్డు, ఆధార్ కార్డు జిరాక్స్లతోపాటు మూడు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో శిబిరానికి హాజరు కావాల్సి ఉంటుంది. సదరం సర్టిఫికెట్లేని సందర్భంలో సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రి వైద్యునిచే ధృవీకరించిన పత్రంపై ఎంఈవో లేదా ప్రధానోపాధ్యాయుడి అటెస్టేషన్ చేపించుకొని తీసుకొని రావాల్సి ఉంటుంది. అలిమ్కో ప్రతినిధులు అర్హులకు వైద్య పరీక్షలు నిర్వహించి, సిఫార్సు చేస్తారు. 60 శాతం కేంద్ర ప్రభుత్వం నిధులు, 40 శాతం సహిత విద్యా విభాగం నిధులు వెచ్చించి పరికరాలను సమకూర్చుకొని ఎంపిక చేసిన లబ్ధిదారులకు త్వరలో అందజేస్తారు. రాయితీపై అందజేసే బస్ పాస్ను సైతం ఈ శిబిరంలో అందజేయడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. శిబిరం వేదికలు: 23న: సీఎస్ఐ హెచ్పీడీ బదిరుల పాఠశాల, సీఎస్ఐ కాంపౌండ్, ఆర్మూర్ 25న: ప్రభుత్వ జేసీ హైస్కూల్, బోధన్ 26న: న్యూ ఎస్ఎస్ ఫంక్షన్ హాల్, న్యూహౌజింగ్ బోర్డు కాలనీ(కేసీఆర్ కాలనీ), నిజామాబాద్ దివ్యాంగులకు అలిమ్కో ప్రతినిధులు అవసరమైన పరికరాల గుర్తింపు పరీక్షలు నిర్వహించి, అర్హులను గుర్తిస్తారు. వారికి పరికరాలను అతి త్వరలో ఉచితంగా అందజేస్తాము. పరికరాల అందజేత సమచారాన్ని అర్హులకు తెలియజేస్తాం. – పడకంటి శ్రీనివాస్రావు, సహిత విద్యావిభాగం జిల్లా ఇన్చార్జి కోఆర్డినేటర్ప్రత్యేక అవసరాలు గల పిల్లలు ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి. వివిధ వైకల్యాలతో బాధపడుతున్న పిల్లలకు పరికరాలు ఎంతగానో ఉపయోగపడతాయి. ఉచితంగా అందజేస్తున్నాము కాబట్టి శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి. – అశోక్, డీఈవో, నిజామాబాద్ -
ఏసీబీకీ పట్టుబడ్డ ఆర్మూర్ ఎంవీఐ
ఆర్మూర్ : ఆర్మూర్ పట్టణంలోని ఏవీఐ కార్యాలయంలో మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్న గుర్రం వివేకానందరెడ్డి రూ. 25 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. పట్టణంలోని పెర్కిట్ శివారులో గల తన కార్యాలయంలో గురువారం జిల్లా కేంద్రానికి చెందిన ఫిర్యాదు దారుడి నుంచి తన ప్రైవేటు డ్రైవర్ తిరుపతి మధ్య వర్తిగా లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. వాహనాల రిజిస్ట్రేషన్, లైసెన్సుల పునరుద్ధణ, లెర్నింగ్ లైసెన్స్ల జారీ తదితర ఫైళ్ల క్లియరెన్స్కు ఏజెంట్ వద్ద ఎంవీఐ లంచం డిమాండ్ చేసాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేసాడు. ఏసీబీ అధికారుల సూచన మేరకు పక్కా ప్రణాళిక ప్రకారం సదరు ఏజంట్ ఎంవీఐ ప్రైవేటు డ్రైవర్కు రూ. 25 వేల లంచం ఇవ్వగా వాటిని డ్రైవర్ ఎంవీఐకి అందజేసాడు. వెంటనే ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ చంద్ర శేఖర్గౌడ్ వివరించారు. విచారణ పూర్తయిన అనంతరం నిందితుడిని హైదరాబాద్ నాంపల్లి కోర్టుకు తీసుకువెళ్తామని డీఎస్పీ వివరించారు. ఈ దాడుల్లో ఏసీబీ సీఐలు నగేష్, శ్రీనివాస్ ఉన్నారు. ఆర్టీవో ఏజెంట్ వద్ద ప్రైవేటు డ్రైవర్ ద్వారా రూ.25 వేలు లంచం తీసుకుంటూ దొరికిన వైనం కార్యాలయంలో రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న ఏసీబీ అధికారులు -
దరఖాస్తులకు వేళాయే..!
ఖలీల్వాడి: మద్యం దుకాణాల టెండర్లు అంటేనే అదో రకమైన సందడి. దరఖాస్తుల ద్వారా ప్రభుత్వానికి దండి ఆదాయం. 2023 డిసెంబర్ 1న ప్రారంభమైన వైన్షాపుల గడువు ముగియనుండడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ వారంలో దరఖా స్తులను పిలిచేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు ఎ కై ్సజ్ వర్గాల ద్వారా తెలిసింది. ఇప్పటికే ఎకై ్సజ్ కమిషనరేట్ జిల్లాలోని వైన్స్షాపులకు సంబంధించిన వివరాలను సేకరించింది. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో టెండర్లు ఆలస్యమవుతాయని భావించినప్పటీకి దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇస్తున్నట్లు తెలిసింది. టెండర్లకు సంబంధించిన జీవోను సిద్ధం చేసినప్పటికీ ఇప్పటి వరకు అధికారికంగా అందలేదని ఎకై ్సజ్ వర్గాల ద్వారా తెలిసింది. దీనిపై వారం రోజుల్లో పూర్తి స్పష్టత వస్తుందని, వచ్చిన తర్వాత దరఖాస్తులు స్వీకరణకు తేదీలు ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి తెలిపారు. 2023 ఆగస్టు 4వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించి అదే నెల 22వ తేదీన లాటరీ పద్ధతిలో దుకాణాలను కేటాయించారు. లైసెన్సులు నవంబర్లో జారీ చేయగా, కొత్త దుకాణాలు డిసెంబర్ 1 నుంచి ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది సైతం డిసెంబర్ 1 నుంచి కొత్త దుకాణాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. 2023లో దరఖాస్తు ఫారానికి రూ. 2 లక్షల ఫీజు వసూలు చేయగా, గతంలో 4 వేల దరఖాస్తులకు గాను ఎకై ్సజ్శాఖకు రూ.80కోట్ల ఆదాయం వచ్చింది. ఈసారి దరఖాస్తు ఫీజు రూ.3 లక్షలకు పెరిగింది. అయితే ఒక దరఖాస్తుదారు ఒక దుకాణానికి ఎన్ని దరఖాస్తులైనా వేసే అవకాశం ఉంది. ఈసారి 5 వేలకు పైగా దరఖాస్తులు అందుతాయని ఎకై ్సజ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. బీర్లు, వీస్కీ ధరలు పెంపు రాష్ట్ర ప్రభుత్వం బీర్లపై రూ.30 చొప్పున, వీస్కీ క్వార్టర్కు రూ.10, హాఫ్ బాటిల్పై రూ.20, ఫుల్ బాటిల్పై రూ.40 పెంచింది. ధరలు పెరగక ముందు మద్యం విక్రయాల ద్వారా జిల్లా ఎకై ్సజ్కు రూ.90 కోట్ల వరకు నెలకు ఆదాయం సమాకూరేది. ధరల పెంపుతో జూలై నెలలో రూ.111 కోట్ల ఆదాయం వచ్చింది. ధరల పెంపుతో ఎకై ్సజ్కు రూ. 20 కోట్ల ఆదాయం అదనంగా సమకూరుతున్నట్లు ఎకై ్సజ్ వర్గాల ద్వారా తెలిసింది. రిజర్వేషన్లు, శ్లాబ్లు.. జిల్లాలో 102 వైన్ షాపులు ఉండగా రిజర్వేషన్లు కేటాయించారు. గౌడ కులస్తులకు 15 శాతం, ఎస్సీలకు 10, ఎస్టీలకు 5 శాతం రిజర్వేషన్ ఉంటుంది. ఈ షాపులను ఆరు శ్లాబ్లలో విభజించనున్నారు. 5 వేల జనాభా వరకు రూ.50 లక్షల లైసెన్స్ ఫీజు, 5 వేల నుంచి 50 వేల జనాభా ఉంటే రూ.55 లక్షలు, లక్ష జనాభా ఉంటే 60 లక్షలు, లక్ష నుంచి 5 లక్షల వరకు ఉంటే రూ.65 లక్షలు, 5 లక్షల నుంచి 20 లక్షల జనాభా ఉంటే రూ.85 లక్షలుగా నిర్ణయించారు. లాటరీ పద్ధతి ద్వారా 24 నెలల లైసెన్స్కు నాలుగో వంతు ఎకై ్సజ్శాఖకు బ్యాంక్ గ్యారెంటీని చూపించాల్సి ఉంటుంది. మద్యం దుకాణాల్లో ప్రతిరోజూ ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు తెరిచి ఉంటాయి. వైన్ షాపులకు నవంబర్తో ముగియనున్న గడువు జిల్లాలో 102 మద్యం దుకాణాలు ఈ సారి రూ.3 లక్షలకు పెరగనున్న దరఖాస్తు ఫీజు ఒక దుకాణానికి ఒకరు ఎన్ని దరఖాస్తులైనా వేసే అవకాశం వారం రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం 5 వేల దరఖాస్తులు అందొచ్చని ఎకై ్సజ్ వర్గాల అంచనా -
ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు చేయాలి
ఆర్మూర్: గర్భిణులకు అవగాహన కల్పిస్తూ స్థానికంగానే ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు చేయాలని కలెక్టర్ టీ.వినయ్ కృష్ణారెడ్డి మెడికల్ ఆఫీసర్లకు సూచించారు. ఆలూరు మండలంలో కలెక్టర్ బుధ వారం ఆకస్మిక తనిఖీలు చేశారు. జెడ్పీ హై స్కూల్, పీహెచ్సీ, సొసైటీ గోదాం, తహసీల్ కార్యాలయాలను సందర్శించారు. ముందుగా కల్లడిలోని పీ హెచ్సీని తనిఖీ చేసిన కలెక్టర్ ప్రజలకు అందుతున్న వైద్య సేవలను, అందుబాటులో ఉన్న ఔషధ నిల్వలను పరిశీలించారు. గర్భిణుల వివరాలు న మోదు చేయడంతోపాటు వారికి క్రమం తప్పకుండా నిర్వహించేలా పర్యవేక్షించాలన్నారు. అనంత రం జెడ్పీ ఉన్నత పాఠశాలకు వెళ్లి సిబ్బందితోపాటు విద్యార్థుల హాజరును ఫేస్ రికగ్నిషన్ విధానం ద్వారా చేపడుతున్నారా లేదా అని పరిశీలించారు. మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేశారు. సహకార సొసైటీ గోదాములో ఎరువుల నిల్వలను పరిశీలించారు. రైతుల అవసరాలకు సరిపడా ఎరువులు అందుబాటులో ఉండేలా చూడాలని, స్టాక్ మిగిలి ఉన్నప్పుడే, మళ్లీ స్టాక్ తెప్పించుకోవా లని గోదాం బాధ్యులకు సూచించారు. గ్రామంలో నర్సరీల నిర్వహణ, మొక్కల పెంపకం, పారిశుద్ధ్య పనులు, దోమల నివారణ చర్యల వివరాలను పంచాయతీ కార్యదర్శితో మాట్లాడి తెలుసుకున్నారు. అనంతరం ఆలూరు తహసీల్ కార్యాలయాన్ని సందర్శించి భూభారతి రెవెన్యూ సదస్సుల్లో అందిన దరఖాస్తులపై గ్రామాల వారీగా సమీక్షించారు. అనంతరం పీహెచ్సీ నూతన భవన నిర్మాణ పనులను పరిశీలించిన కలెక్టర్ పనులను త్వరితగతిన పూర్తి చేయించాలని ఇంజినీరింగ్ విభాగం అధికారులకు సూచించారు. కలెక్టర్ వెంట ఎంపీడీవో ఎం.గంగాధర్, స్థానిక అధికారులు ఉన్నారు. గర్భిణులకు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆలూర్ మండలంలో ఆకస్మిక తనిఖీలు భూభారతి దరఖాస్తులపై రెవెన్యూ అధికారులతో సమీక్ష -
స్థానికంలో క్లీన్ స్వీప్ చేయాలి
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసే విధంగా పని చేయాలని ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణులకు పీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్ సూ చించారు. హైదరాబాద్లోని గాంధీభవన్లో బుధవారం ఆర్మూర్ నియోజకవర్గ ఇన్చార్జి పొద్దుటూరి వినయ్రెడ్డితోపాటు నాయకులతో పీసీసీ చీఫ్ సమీక్షాసమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్యకర్తలు, నాయకులు కలిసికట్టుగా పనిచేసి సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలను పూర్తిగా గెలిచేలా పకడ్బందీ ప్రణాళికతో ముందుకు వెళ్లాలన్నారు. ఆర్మూర్ను తన సొంత నియోజకవర్గంలాగా చూసుకుంటానన్నారు. ఏ సమస్య ఉన్నా కలిసి పరిష్కరించుకుందామన్నారు. ప్రజాసమస్యలను ఇన్చార్జి మంత్రి దృష్టికి తీసుకెళ్తే తానే వెంట ఉండి పనులను చేస్తానన్నారు. రేవంత్రెడ్డి నేతృత్వంలోనేఇ ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేనివిధంగా అనేక సంక్షేమ, అభివద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందని, వాటిని ప్రజ ల్లోకి బలంగా తీసుకెళ్లాలన్నారు. నియోజకవర్గానికి మంజూరైన ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్కు త్వరంలోనే సీఎం రేవంత్రెడ్డి శంకుస్థాపన చేస్తారన్నారు. ఏ సమస్య ఉన్నా ఇన్చార్జి మంత్రికి చెప్పండి పనులు పూర్తయ్యేలా చూస్తా ఆర్మూర్ నియోజకవర్గ సమీక్షలో టీపీసీసీ చీఫ్ మహేశ్గౌడ్ -
గట్టెక్కించిన బఫర్ స్టాక్
డొంకేశ్వర్(ఆర్మూర్): ప్రస్తుతం రాష్ట్రమంతా యూరియా లొల్లి నడుస్తోంది. వరంగల్, ఖమ్మం, మెదక్, మహబూబ్నగర్, రంగారెడ్డి వంటి జిల్లాల్లో కొరత తీవ్రంగా ఉండడంతో అక్కడి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. అయితే వ్యవసాయ ఆధారిత జిల్లాగా గుర్తింపు ఉన్న మన జిల్లాలో మాత్రం అలాంటి పరిస్థితులు ఇప్పటి వరకు తలెత్తకపోవడానికి కారణం అధికారుల ముందు చూపేనని చెప్పొచ్చు. వానాకాలం సీజన్కు ముందుగానే జిల్లాలో అందుబాటులో ఉంచిన 9వేల మెట్రిక్ టన్నుల బఫర్ స్టాక్ (యూరియా) గండం నుంచి గట్టెక్కించింది. వ్యవసాయ శాఖతోపాటు కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి క్షేత్రస్థాయిలో పర్యవేక్షించడం, రోజువారీగా పరిస్థితిని సమీక్షించి అవసరమైన ప్రాంతాలకు యూరియా తెప్పించి రైతులకు అందేలా చూశారు. ప్రజాప్రతినిధులు కూడా వారివంతు కృషి చేశారు. గ్రామగ్రామానా సొసైటీ గోదాములు ఉండడంతో రవాణాకు రైతులు ఇబ్బందులు పడలేదు. ప్రస్తుతం జిల్లాలో వరినాట్లు దాదాపు పూర్తయ్యాయి. ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్రూరల్ నియోజకవర్గాల్లో అక్కడక్కడ మాత్రమే కొంతమేర నాట్లు పడే అవకాశం ఉండడంతో ఆ ప్రాంతాల సొసైటీల్లో యూరియా స్టాక్ను ఉంచారు. ఇటు రైతులు బస్తాల్లోని యూరియా తగ్గించి ద్రవ రూపంలో ఉండే నానో యూరియా వాడే విధంగా వ్యవసాయాధికారులు చేసిన ప్రయత్నాలు కొంతమేర ఫలించాయని చెప్పొచ్చు. జిల్లాకు అవసరమైన యూరియా 75 వేల మెట్రిక్ టన్నులు ఇప్పటి వరకు వచ్చింది 67,529 మె.ట. రైతులు కొనుగోలు చేసింది 62,254 మె.ట. అందుబాటులో ఉన్న స్టాక్ 5,275 మె.ట.వచ్చింది వచ్చినట్లుగా.. జిల్లాలో ఈ సీజన్లో 5,24,506 ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతున్నాయి. ఇందులో ప్రధానంగా వరి 4,36,700 ఎకరాల్లో, మొక్క జొన్న 52,093 ఎకరాల్లో, సోయా 33,603 ఎకరాల్లో రైతులు సాగు చేస్తున్నారు. అయితే జిల్లాకు తెప్పించిన యూరియా వచ్చింది వచ్చినట్లుగా అమ్ముడైంది. కొరత వస్తుందేమోనని రైతులు పంటకు అవసరమయ్యే మూడు దఫాల యూరియాను ఒకేసారి తీసుకెళ్లి ఇళ్లలో, గోదాముల్లో నిల్వ చేసుకున్నారు. దీంతో రైతులకు మళ్లీ యూరియా అవసరం లేకుండా పోయింది. శాసీ్త్రయంగా వేయాల్సిన ఎరువులు ఎకరానికి ఒకటి, రెండు బస్తాలు ఎ క్కువగా వేయడంతో రికార్డు స్థాయిలో అమ్మకాలు జరిగాయి. ఈ అమ్మకాలపై జిల్లా యంత్రాంగం కూడా నిఘా పెట్టింది. ప్రభుత్వం రాయితీపై అందించే యూరియాను వ్యవసాయేత పనులకు వాడుతున్నారా? అనే అనుమానంతో అధికారులు పలు పరిశ్రమల్లో తనిఖీలు చేశారు. జిల్లాలో యూరియా కొరత తలెత్తకపోవడానికి కారణం అదే.. ఎప్పటికప్పుడు తెప్పించిన వ్యవసాయ శాఖ అధికారుల ముందుచూపుతో తప్పిన గండం ఇంకా 290 పాయింట్లలో అందుబాటులో ఉన్న స్టాక్ పరిస్థితులను అధిగమించాం జిల్లాలో యూరియా కొరత వంటి పరిస్థితులు రాకపోవడం అదృష్టం. రాష్ట్ర ఉన్నతాధికారులతోపాటు కలెక్టర్ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించి జిల్లాకు యూరియాను తెప్పించారు. రైతులకు అవసరం మేరకు అందించాం. బఫర్ స్టాక్ చాలా వరకు మేలు చేసింది. జిల్లాలో ఇంకా 5వేల మెట్రిక్ టన్నులకు పైగా యూరియా నిల్వలున్నాయి. సరిపోకపోతే ఇంకా తెప్పిస్తాం. – మేకల గోవింద్, డీఏవో -
పెండింగ్లోనే..
నిజామాబాద్ సీఎంఆర్ రికవరీని సీరియస్గా తీసుకోని అధికారులుపండుగలు ప్రశాంతంగా.. వినాయక చవితి, మిలాద్–ఉన్–నబీ వేడుకలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అన్నారు.గురువారం శ్రీ 21 శ్రీ ఆగస్టు శ్రీ 2025– 8లో u ఇన్చార్జి మంత్రుల ఆదేశాలు బేఖాతర్ గతంలో మంత్రి జూపల్లి, ప్రస్తుత మంత్రి సీతక్క ఆదేశించినప్పటికీ ఫలితం శూన్యం ఓ మిల్లర్ పోరాటంతో.. కోర్టు ఆదేశాల మేరకు కేసు పెట్టి వదిలేశారు సీఎంఆర్ ధాన్యం రికవరీలో ఉన్నతాధికారుల అధికార దుర్వినియోగం నిజామాబాద్ జిల్లాలో రూ.250 కోట్లు.. కామారెడ్డి జిల్లాలో రూ.45 కోట్ల విలువైన సీఎంఆర్ పెండింగ్ కేసులు నమోదు చేశారు.. విచారణ వదిలేశారు..సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : ధాన్యం పండించడంలో, ధాన్యం సేకరణలోనూ జిల్లా నంబర్ వన్గా నిలిచింది. అదేవిధంగా సీఎంఆర్ రికవరీని పెండింగ్ పెట్టడంలోనూ మొదటి స్థానంలోనే నిలబెట్టడంపై జిల్లా యంత్రాంగంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుత ప్రభుత్వంలో ఇప్పటి వరకు జిల్లా కు ఇద్దరు ఇన్చార్జి మంత్రులు మారారు. మంత్రి జూపల్లి కృష్ణారావు తర్వాత జిల్లా ఇన్చార్జి మంత్రి గా వ్యవహరిస్తున్న సీతక్క సీఎంఆర్ రికవరీ విష యంలో చర్యలకు దిగాలని ఉమ్మడి జిల్లా అధికారులను ఆదేశించినప్పటికీ ఒక్క అడుగు కూడా ముందుకు పడడం లేదు. ఉమ్మడి జిల్లాలో మొత్తం రూ.295 కోట్ల మేర మిల్లర్ల నుంచి సీఎంఆర్ రికవరీ చేయాల్సి ఉంది. ఈ విషయమై మంత్రులు సమీక్ష సమావేశాల్లో చెప్పినప్పటికీ యంత్రాంగం ఏమా త్రం సీరియస్గా తీసుకోకపోతుండడం విశేషం. 2014–15 నుంచి 2022–23 సంవత్సరాలకు సంబంధించి నిజామాబాద్ జిల్లాలో 44 మిల్లుల నుంచి రూ.250 కోట్లు, కామారెడ్డి జిల్లాలో 49 మిల్లుల నుంచి రూ.45 కోట్ల విలువజేసే సీఎంఆర్ రికవరీ చేయాల్సి ఉంది. ఇందులో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ నుంచి రావాల్సిందే రూ.60 కోట్ల మేర ఉండడం గమనార్హం. ఇందుకు సంబంధించి గతంలో సమీక్షలో మంత్రి జూపల్లి ఉన్నతాధికారులపై ఆ గ్రహం వ్యక్తం చేశారు. పదేళ్లవుతున్నప్పటికీ రికవరీ చేయకుండా నోటీసులిచ్చి వదిలేయడమేమిటంటూ అసహనం వ్యక్తం చేశారు. షెడ్యూల్, యాక్షన్ ప్లాన్ రూపొందించుకుని కేసుల మీద కేసులు పెట్టి తక్షణమే రికవరీ చేయాలని ఆదేశించారు. అదేవిధంగా యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని అడ్వొకేట్ జనరల్తో కలిసి హైదరాబాద్లో సమీక్షకు రావాలని ఆదేశించినప్పటికీ అది కార్యరూపం దాల్చలేదు. 2021–22 యాసంగి, 2022–23 వానాకాలం సీజన్లకు గాను షకీల్కు చెందిన రహీల్, రాస్, అమీ ర్, దాన్విక్ అనే మిల్లుల పేరిట 50 వేల మెట్రిక్ ట న్నుల ధాన్యం ప్రభుత్వం ఇచ్చింది. అయితే ఈ మిల్లుల్లో ఒక్క గింజ ధాన్యం కూడా మిల్లింగ్ చేయ లేదు. నేరుగా ధాన్యాన్ని అక్రమ మార్గంలో ముంబయి, కాకినాడ పోర్టుల ద్వారా ఎగుమతి చేసి సొమ్ము చేసుకున్నాడు. కేవలం 5వేల మెట్రిక్ టన్ను ల ధాన్యానికి ఇచ్చేంత పరిమాణంలో రీసైకిల్ బి య్యాన్ని పౌరసరఫరాల శాఖకు ఇచ్చాడు. 10 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రం ఏఆర్ ఇండ స్ట్రీ స్ (ఎడపల్లి), ఆర్కాం ఇండస్ట్రీస్ (వర్ని), అబ్దుల్ ఐ ఇండస్ట్రీస్ (ఎడపల్లి), ఎఫ్టీఎఫ్ ఇండస్ట్రీస్ (బోధ న్)కు ఇచ్చినట్లు చూపించాడు. ఈ నాలుగు మిల్లుల యజమానులతో అధికారాన్ని అడ్డం పెట్టుకుని బలవంతంగా ధాన్యం తీసుకున్నట్లు లేఖలు ఇప్పించా డు. షకీల్ ఒత్తిడితోనే లేఖలు ఇచ్చినట్లు సదరు మి ల్లర్లు తెలిపారు. రూ.60 కోట్ల విలువ చేసే ధాన్యానికి బియ్యం ఇవ్వకపోవడంతో ప్రభుత్వం షకీల్కు చెందిన మిల్లులకు రూ.10 కోట్ల జరిమానా వేసింది. ఇప్పటివరకు కస్టమ్ మిల్లింగ్ రైస్ ఇవ్వకపోవడంతోపాటు, జరిమానా సైతం కట్టలేదు. నోటీసు లు ఇచ్చామని చెబుతూ అధికారులు కాలం గడిపా రు. మరోవైపు బాధితుడు కిషోర్ సంతకాన్ని ఫోర్జరీ చేసే కథ నడిపిన అధికారులే, సీఎంఆర్ సైతం కిషో రే ఇవ్వాలంటూ ఒత్తిడి చేయడం గమనార్హం. ఇన్చార్జి మంత్రులుగా జూపల్లి, సీతక్క ఆదేశించినప్పటికీ ఒక్క అడుగు ముందుకు పడలే దు. ఈ విషయమై అదనపు కలెక్టర్ కిరణ్కుమార్ను వివరణ కోరేందుకు ‘సాక్షి’ ఫోన్ చేయగా స్పందించలేదు. సీఎంఆర్ రికవరీలో ఉన్నతాధికారులే అధికార దుర్వినియోగానికి పాల్పడిన వ్యవహారంలో గత మార్చి 30న బాధితుడి పోరాటంతో ఉన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు ప్రస్తుతం సంగారెడ్డి అదనపు కలెక్టర్గా పనిచేస్తున్న, గతంలో నిజామాబాద్ అదనపు కలెక్టర్గా పనిచేసిన చంద్రశేఖర్, మాజీ డీఎస్వో చంద్రప్రకాష్, డిప్యూటీ తహసీల్దార్ నిఖిల్రాజ్లపై వర్ని పోలీసుస్టేషన్ లో కేసు నమోదు చేశారు. 2022–23 సీజన్లో వర్ని మండలంలోని కిషోర్ అనే వ్యక్తికి చెందిన శ్రీనివాస రైస్మిల్లుకు కేటాయించిన ధాన్యం పంపించకుండానే పంపించినట్లు చూపించిన ఉన్నతాధికారులే, సదరు రైస్మిల్లు యజమాని సంతకాన్ని సైతం ఫోర్జరీ చేయించడం విశేషం. ధాన్యం మాత్రం మాజీ ఎమ్మెల్యే షకీల్ మిల్లుకు పంపించి, కస్టమ్ మిల్లింగ్ రైస్ను కిషోర్కు చెందిన శ్రీనివాస రైస్ మిల్లు నుంచి ఇవ్వాలని ఈ ఉన్నతాధికారులే ఒత్తిడి తేవడం గమనార్హం. దీంతో దిక్కుతోచని బాధితుడు కిషోర్ నెలల తరబడి న్యాయపోరాటం చేయాల్సి వచ్చింది. కేసు నమోదు చేసినప్పటికీ ఇప్పటివరకు ఒక్కసారి కూడా సద రు అధికారులను పోలీసులు ప్రశ్నించకపోవడం విశేషం. కాలయాపన చేస్తే చాలు అన్నట్లుగా యంత్రాంగం వ్యవహరిస్తోందని అధికార కాంగ్రె స్ నాయకులు, ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్య క్తం చేస్తున్నారు. అధికారులకు వాటాలు ముట్టినట్లు కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. అధి కారాన్ని అడ్డుపెట్టుకుని బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ఇష్టం వచ్చినట్లు దందా చేశాడు. మళ్లీ అధికారంలోకి వస్తామనే అతినమ్మకంతో ధాన్యం ఇవ్వకుండానే కిషోర్ మిల్లు నుంచి సీఎంఆర్ ఇవ్వాల్సిందేనని ఒత్తిడి చేయించడం గమనార్హం. -
3,817 ఎకరాల్లో పంటనష్టం
● వ్యవసాయశాఖ ప్రాథమిక అంచనా డొంకేశ్వర్(ఆర్మూర్): ఎడతెరిపి లేకుండా కు రిసిన వర్షాలకు జిల్లాలో 3,817 ఎకరాల్లో పంటకు నష్టం వాటిల్లింది. ఈ నష్టం మొ త్తం బోధన్ డివిజన్లోనే జరిగింది. గోదావరికి ఆనుకుని ఉన్న మండలాలు, గ్రామాల్లో భారీగా పంటలు వరద నీట మునిగాయి. అత్యధికంగా 3,355 ఎకరాల్లో సోయా, 450ఎకరాల్లో వరి, ఐదెకరాల్లో పత్తి, మరో ఐదెకరాల్లో పెసర, రెండెకరాల్లో పసుపు పంటలకు నష్టం వాటిల్లింది. రెంజల్ మండలంలోని కల్దుర్కి, తాడ్బిలోలి, బోర్గాం, బోధన్ మండలం హంగర్గ, కొప్పర్గ, బిక్నెల్లి, ఖండ్గావ్, సిద్ధాపూర్, అలాగే సాలూర మండలం హున్సా, ఖాజాపూర్, మందర్న, తగ్గెల్లి గ్రా మాల్లో పంటలు నీట మునిగినట్లు వ్యవసా య శాఖ గుర్తించింది. మొత్తం 1,092 మంది బాధిత రైతుల పేర్లు నమోదు చేసుకున్నారు. ఇది ప్రాథమిక అంచనా మాత్రమేనని, వరద నీటి నుంచి పంట తేలిన తర్వాత తుది నివేదికను ప్రభుత్వానికి పంపుతామని డీఏవో గోవింద్ ‘సాక్షి’కి తెలిపారు. కార్పొరేషన్ కమిషనర్గా యాదగిరిరావు ● అడిషనల్ కమిషనర్గా రవీంద్రసాగర్ ● నేడు బాధ్యలు స్వీకరించనున్న అధికారులు ● దిలీప్కుమార్కు ఐఏఎస్ ఖరారు నిజామాబాద్ సిటీ: నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఎస్ దిలీప్కుమార్కు ఐఏఎస్ ఖరారు కావడంతో ఆ యనకు శిక్షణకు వెళ్లనున్నారు. నూతన కమిషనర్గా ఎన్ యాదగిరిరావు నియమితులయ్యారు. తెలంగాణలోని పలు కార్పొరేషన్ల కమిషనర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం బుధవా రం జీవో ఎంఎస్ నంబర్ 87 జారీ చేసింది. సెలక్షన్ గ్రేడ్ మున్సిపల్ కమిషనర్గా వెయిటింగ్లో ఉన్న ఎన్.యాదగిరిరావు నిజామాబాద్కు రానున్నారు. అడిషనల్ కమిషనర్గా పి రవీంద్రసాగర్ నియమితులయ్యారు. గురువారం ఉదయం ఇరువురు ఉన్నతాధికారులు బాధ్యతలు స్వీకరించనున్నారు. డీజేలు నిషేధం : సీపీ ఖలీల్వాడి: గణేశ్ మండలి నిర్వాహకులు ని బంధనలు తప్పనిసరిగా పాటించాలని సీపీ సాయిచైతన్య ఒక ప్రకటనలో తెలిపారు. ఉత్సవాల్లో డీజేలకు ఎలాంటి అనుమతులు లేవని, వాటిని పూర్తిగా నిషేధించినట్లు పే ర్కొన్నారు. మండపాల వద్ద విద్యుత్ తీగల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రాత్రి 10 గంటలకు లౌడ్ స్పీకర్లు ఆఫ్ చేయాలని పేర్కొన్నారు. మండపాల వద్ద ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే డయల్ 100కు సమాచారం అందించాలని తెలిపారు. ప్రతిష్టాపన, నిమజ్జనం శాంతియుతంగా నిర్వహించాలని పేర్కొన్నారు. -
‘ప్రో కబడ్డీ చాంపియన్’ శిబిరం ప్రారంభం
బాల్కొండ: యువ తెలంగాణ ప్రో కబడ్డీ చాంపియ న్– 2025 క్యాంపు బుధవారం ముప్కాల్ భుదేవ్ ఇండోర్ స్టేడియంలో ప్రారంభమైంది. ఈ సందర్భంగా జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అంద్యాల లింగయ్య, కె.గంగాధర్ మాట్లాడుతూ ప్రో కబడ్డీ లీగ్లో ఎనిమిది జట్లు పా ల్గొంటున్నాయని, అందులో ‘శాతవాహన సైనిక్’ జట్టును జిల్లాకు కేటాయించినట్లు తెలిపారు. జట్టు క్రీడాకారులకు భుదేవ్ ఇండోర్ స్టేడియంలో ఈ నెల 25వ తేదీ వరకు చీఫ్ కోచ్ ప్రశాంత్ శిక్షణ ఇస్తారన్నారు. కార్యక్రమంలో జిల్లా క్రీడల నిర్వహణ అధికారి పవన్ కుమార్, జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఉపాధ్యక్షులు గంగారెడ్డి, ముస్కు భూమేశ్వర్, బద్దం నర్సారెడ్డి, ముస్కు మోహన్, ఎన్.అంజయ్య, పీడీ రాజ్కుమార్, పీఈటీ అన్వేష్, టీ సాయన్న, గోపీనాథ్, రఫీ, ముఖీద్, పోశెట్టి, గైని రమేశ్, గొర్రె రాములు తదితరులు పాల్గొన్నారు. మినీ స్టేడియాన్ని ఆధునీకరిస్తాం ఆర్మూర్టౌన్: క్రీడాకారులకు అనుగుణంగా మినీ స్డేడియాన్ని అన్ని విధాల ఆధునీకరిస్తామని జిల్లా యువజన క్రీడాభివృద్ధి అధికారి పవన్కుమార్ పే ర్కొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని మినీ, ఇండోర్ స్టేడియాలను ఆయన బుధవారం పరిశీలించారు. త్వరలోనే క్రీడా మైదానాలను అందంగా తీర్చిదిద్దుతామన్నారు. వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, ప్లే ఫీల్డ్లని ఏర్పాటు చేస్తామన్నారు. ఆయన వెంట సీనియర్ పీడీ గోపిరెడ్డి, మల్లేశ్ గౌడ్ తదితరులు ఉన్నారు. -
ఎస్సారెస్పీలోకి తగ్గిన వరద
బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లోకి ఎగువ ప్రాంతాల నుంచి వరద తగ్గుముఖం పట్టింది. దీంతో గో దావరిలోకి నీటి విడుదలను ప్రాజెక్ట్ అధికారులు త గ్గించారు. బుధవారం ఉదయం నుంచి ప్రాజెక్టులో కి వరద క్రమంగా తగ్గుముఖం పడుతూ సాయంత్రానికి లక్షా 50వేల క్యూసెక్కులకు చేరుకుంది. దీంతో గోదావరిలోకి నీటి విడుదలను తగ్గిస్తూ.. సాయంత్రానికి 16 గేట్ల ద్వారా 52వేల క్యూసెక్కుల నీటి విడుదల చేశారు. ఇన్ఫ్లో ఎక్కువగా ఉన్నా అవుట్ ఫ్లో మాత్రం తగ్గించి, ప్రాజెక్ట్ నీటిమట్టాన్ని క్రమంగా పెంచుతున్నారు. ఎస్సారెస్పీ నుంచి గో దావరిలోకి నీటి విడుదల కొనసాగుతుండటంతో సందర్శనకు పర్యాటకులు తరలివచ్చ్రాు. డ్యామ్పైకి అనుమతులు ఇవ్వడంతో పర్యాటకులు హర్షం వ్యక్తం చేస్తూ ఉల్లాసంగా గడిపారు. కాలువల ద్వారా కొనసాగుతున్న నీటి విడుదల ప్రాజెక్ట్ నుంచి వరద కాలువ ద్వారా 20 వేలు, ఎ స్కెప్ గేట్ల ద్వారా 3 వేలు, కాకతీయ కాలువ ద్వారా 5వేలు, లక్ష్మి కాలువ ద్వారా 150, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ఆవిరి రూ పంలో 692 క్యూసెక్కులు పోతుంది. పూర్తిస్థాయి నీటిమట్టం 1091 (80.5 టీఎంసీలు) అడుగులు కాగా బుధవారం సాయంత్రానికి 1088.10 (70.10 టీఎంసీలు) అడుగుల నీరు నిల్వ ఉంది. -
కొనసాగుతున్న పీజీ, బీఈడీ పరీక్షలు
తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో కొనసాగుతున్న పీజీ, బీఈడీ పరీక్షలు బుధవారం ప్రశాంతంగా జరిగినట్లు ఆడిట్ సె ల్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. మొత్తం ఏడు పరీక్ష కేంద్రాల్లో ఉదయం జరిగిన పీజీ 2, 4వ సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్లాగ్ పరీక్షల్లో 2,366 మంది విద్యార్థులకు 2,240 మంది హాజరుకాగా 126 మంది గైర్హాజరైనట్లు వెల్లడించారు. మధ్యాహ్నం జరిగిన బీఈడీ 2, 4వ సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్లాగ్ పరీక్షల్లో మొత్తం 1,444 మంది విద్యార్థులకు 1,379 మంది హాజరుకాగా 65 మంది గైర్హాజరైనట్లు చంద్రశేఖర్ తెలిపారు.దోమలు కుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలినిజామాబాద్నాగారం: దోమలు పుట్టకుండా, కుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా మలేరియా అధికారి డాక్టర్ తుకారాం రాథోడ్ పేర్కొన్నారు. ప్రపంచ దోమల నివారణ దినోత్సవం సందర్భంగా బుధవారం నగరంలోని దుబ్బా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా తుకారాం రాథోడ్ మాట్లాడుతూ దోమల ద్వారా వ్యాపించే డెంగీ, మలేరియా, ఫైలేరియా, చికున్ గున్యా, మెదడువాపు లాంటి వ్యాధులను నివారించాలన్నారు. కార్యక్రమంలో వైద్యాధికారులు హజ్మతున్నీసా బేగం, శిఖర, డిప్యూటీ డెమో నాగలక్ష్మి, హెచ్ఈవోలు నటరాజ్ గోవర్ధన్, లింబారెడ్డి, శంకర్ తదితరులు పాల్గొన్నారు.బాలుడి అప్పగింతమోపాల్: మండలంలోని కులాస్పూర్ గ్రామానికి చెందిన బొద్దుల వరుణ్ను ఆయన తాత వడ్డేపల్లి గంగాధర్కు ఎస్సై జాడె సుస్మిత బుధవారం అప్పగించారు. వరుణ్ అదృశ్యమయ్యా డని గంగాధర్ మంగళవారం పోలీసులకు ఫి ర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఆ మేరకు పోలీసులు బాలుడి ఆచూకీ కోసం గాలించారు. నిజామాబాద్ బస్టాండ్, రైల్వేస్టేషన్ పరిసరాల్లో తిరుగుతున్నట్లు గుర్తించిన రైల్వే పోలీసులు వరుణ్ను అదుపులోకి తీసుకుని విచారించి మోపాల్ పోలీసులకు అప్పగించారు. అనంత రం మోపాల్ పోలీసులు వరుణ్ను ఆయన కు టుంబసభ్యులకు బుధవారం అప్పజెప్పారు.లెక్చరర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులునిజామాబాద్ అర్బన్: మైనార్టీ గురుకుల పాఠశాల, కళాశాలలో ఖాళీగా ఉన్న లెక్చరర్ పోస్టుల భర్తీకి అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాల ని మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి కృష్ణవేణి ఒక ప్రకటనలో తెలిపారు. బాల్కొండ, ఆలూరు, ధర్మపురి హిల్స్, కోటగిరి గురుకుల పాఠశాల లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఎంఏ, బీఈడీ అర్హత ఉండాలని తెలిపారు. ఈ నెల 23వ తేదీలోపు నాగారంలోని మైనార్టీ రెసిడెన్షియల్ గురుకుల కళాశాలలో దరఖాస్తులు సమర్పించాలని వివరించారు. పూర్తి వివరాలకు 9849419469 నెంబర్ను సంప్రదించాలని తెలిపారు. -
ఆగస్టులోనే పూసే ‘అగ్ని శిఖ’ పుష్పం
మీకు తెలుసా? వేసవిలో పూసే ‘మే’ పుష్పం మాదిరిగా ఆగస్టు మాసంలోనే పూసే మరో రకం పుష్పం ఉంది. దాని పేరే అగ్ని శిఖ (కలంగటి పువ్వు). దీనికి ‘గ్లోరీ లిల్లి’ అనే మరో శాసీ్త్రయ నామం కూడా ఉంది. ఇది ‘కొల్చి కేసియే’ అనే కుటుంబానికి చెందిన మొక్క. మొత్తం 11 రకాల జాతుల్లో ‘అగ్ని శిఖ’ ఒకటి. ● ఇది భారతదేశంతోపాటు దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా దేశాల్లో అలాగే సముద్రపు, అటవీ ప్రాంతాలు, చెట్ల పొదల్లో ఎక్కువగా కనిపిస్తాయి. ఇవి వర్షాకాలంలో రుతుపవనాలకు అనుకూలంగా ఉండి పుష్పాలు పూస్తాయి. ● ఇది తమిళనాడు రాష్ట్ర పుష్పం కూడా. మొక్క మూడు మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. దీని పూలు ఆకుపచ్చ, పసుపు, నారింజ, ఎరుపు, ముదురు గులాబీ రంగుల్లో ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ● వినాయక చవితి పండుగకు ముందు ఇవి భారీగా వికసిస్తాయి. అందుకే వీటిని ‘ఎంకయ్య పువ్వు’ అని కూడా అంటారు. చవితి రోజు గణపతిని ఈ పుష్పాలతో ప్రత్యేకంగా పూజిస్తారు. ఎడ్లపొలాల అమావాస్య నాడు కూడా వీటిని రైతులు పూజకు ఉపయోగిస్తారు. ఇలా చేయడం పెద్దల కాలం నుంచి ఆనవాయితీగా వస్తోంది. ● పవిత్రంగా భావించే ఈ మొక్కను విషపూరితమైనదిగా పరిగణిస్తారు. మనుషులు, పశువులు తినకూడదంటారు. కానీ, దీనిని ఆర్థరైటిస్, అల్సర్, కు ష్టు, పైల్స్, కడుపునొప్పి, చర్మ సంబంధిత, ఇత ర చాలా రకాల వ్యాధులకు ఉపయోగిస్తారట. – డొంకేశ్వర్(ఆర్మూర్) -
బీజేపీలో కార్యకర్తలకు సముచిత స్థానం
● జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి సుభాష్నగర్: బీజేపీ కోసం కష్టపడుతున్న ప్రతి కార్యకర్తకు సముచిత స్థానం ఉంటుందని జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి పేర్కొన్నారు. నగరంలోని బీజేపీ కార్యాలయంలో మహాజన సంపర్క్ అభియాన్ జిల్లా సమావేశం పార్టీ అధ్యక్షుడు దినేశ్ పటేల్ కులాచారి అధ్యక్షతన బుధవారం నిర్వహించారు. సమావేశానికి పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ, సీనియర్ నా యకులు పెద్దోళ్ల గంగారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా పల్లె గంగారెడ్డి మాట్లాడుతూ జిల్లాలో బూత్ కమిటీలను త్వరితగతిన ఏర్పాటు చేయాలన్నారు. ఎంపీ అర్వింద్ కార్యకర్తల సంక్షేమానికి ప్ర త్యేక నిధి ఏర్పాటు చేసి వారికి అండగా నిలుస్తున్నారని తెలిపారు. బలమైన బూత్ ఉంటే సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాలు గెలవడం సులభమన్నారు. దొంగ ఓట్ల విషయమై కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోందని, ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ను ఉద్దేశించి విమర్శించారు. స్థానిక ఎన్నికల్లో కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలని, జెడ్పీపై కా షాయ జెండా ఎగురవేస్తామని బీజేపీ జిల్లా అధ్యక్షు డు దినేశ్ పటేల్ కులాచారి ఆశాభావం వ్యక్తంచేశా రు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రతి ఇంటికి చేరేలా కార్యకర్తలు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గసభ్యులు మేడపాటి ప్రకాశ్రెడ్డి, డాక్టర్ మల్లికార్జున్రెడ్డి, మాజీ ఫ్లోర్ లీడర్ గోపిడి స్రవంతిరెడ్డి, న్యాలం రాజు, నాగోళ్ల లక్ష్మీనారాయణ, పద్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
క్రైం కార్నర్
రోడ్డు ప్రమాదంలో పాల్వంచ వాసి మృతి మాచారెడ్డి: రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం పెద్దమ్మ స్టేజి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో బుధవారం పాల్వంచ మర్రి గ్రామానికి చెందిన కడమంచి వెంకటి(57)మృతి చెందాడు. గ్రామస్తులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. వెంకటి తన బైక్పై పని మీద సిరిసిల్ల జిల్లా సముద్ర లింగాపూర్కు వెళ్లి తిరిగి వస్తుండగా పెద్దమ్మ స్టేజి మూలమలుపు వద్ద ఎదురుగా వస్తున్న కారుడ్రైవర్ అతివేగంతో ఢీ కొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అక్కడి వైద్యులు వెంకటి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించినట్లు తెలిపారు. అదృశ్యమైన మహిళ శవం లభ్యం లింగంపేట(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలోని మత్తడికిందిపల్లెకు చెందిన ఇరగదిండ్ల చిన్నక్క(42) మృత దేహం లభ్యమైనట్లు ఎస్సై దీపక్ కుమార్ తెలిపారు. ఈ నెల 5న చిన్నక్క అదృశ్యమైనట్లు కుటుంబసభ్యు లు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చే శామన్నారు. బుధవారం రాంపల్లి అటవీ ప్రాంతంలో మహిళ మృతదేహం ఉన్నట్లు సమాచారం వ చ్చిందన్నారు. ఘటనా స్థలానికి వెళ్లి చూడగా మహిళ మృతదేహం కుళ్లిపోయినట్లు తెలిపారు. మృతురాలిని హత్య చేసినట్లుగా అనుమానం వ్యక్తం చేస్తూ విచారణ చేపట్టినట్లు ఎస్సై పేర్కొన్నారు. -
జక్రాన్పల్లి వీడీసీ భవనంపై గ్రామస్తుల ఫిర్యాదు
● విచారణకు ఆదేశించిన న్యాయసేవా సంస్థ నిజామాబాద్ లీగల్: జక్రాన్పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ స్థలంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించి, అద్దె వసూలు చేసుకుంటున్న వీడీసీపై న్యాయసేవా సంస్థకు గ్రామస్తులు బుధవారం ఫిర్యాదు చేశారు. దీంతో సంస్థ కార్యదర్శి ఉదయభాస్కర్ రావు గ్రామ పంచాయతీ కార్యదర్శి గంగాధర్ను విచారణకు ఆదేశించారు. వివరాలు ఇలా ఉన్నాయి. జక్రాన్పల్లి మండల కేంద్రంలో 1982–87 పంచాయతీ పాలకవర్గం బీఎస్ఎన్ఎల్ భవన నిర్మాణానికి స్థలం కేటాయించింది. 2020–21లో వీడీసీ ఆ స్థలాన్ని కబ్జా చేసి అనుమతి లేకుండా 8 మడిగెలతో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించింది. మడిగెలను వైన్స్, పర్మిట్రూంలకు అద్దెకు ఇచ్చి డబ్బులను వీడీసీ వసూలు చేస్తోంది. ఐతే, మడిగెలు నిర్మించిన స్థలం ప్రభుత్వానిదా లేక ప్రైవేటు వ్యక్తులదా? తేల్చాలని, నిర్మాణాలకు జీపీ అనుమతులపై న్యాయసేవా సంస్థ కార్యదర్శి ఉదయభాస్కర్ రావు విచారణకు ఆదేశించారు. పర్మిట్ రూంలతో మహిళలు ఇబ్బంది పడుతున్నారని, దీనిపై చర్యలు తీసుకోవాలని ఆర్మూర్ ఎకై ్సజ్ ఇన్స్పెక్టర్ రంజిత్ రావుకు సూచించారు. -
ఏటీఎంలో కాలిబూడిదైన రూ.5లక్షలు
● మిగతా నగదును తీసేసిన బ్యాంక్ సిబ్బంది ● దుండగుల కోసం మూడు బృందాలతో పోలీసుల గాలింపు ఖలీల్వాడి: జిల్లా కేంద్రంలో దుండగులు ఏటీఎం చోరీకి యత్నించిన కేసులో రూ.5లక్షలకు పైగా నగదు కాలిబూడిదైంది. నగరంలోని చంద్రశేఖర్ కాలనీలోని ఏటీఎంలో మంగళవారం తెల్లవారుజామున చోరీకి యత్నించిన విషయం తెలిసిందే. కేసు ఛేదనలో భాగంగా పోలీసులు విచారణ చేపట్టారు. మారుతీవ్యాన్లో వచ్చిన దుండగుల్లో ముగ్గురు ముసుగులు ధరించి ఏటీఎంలోకి చొరబడగా, మరొకరు ఏటీఎం పక్కన మరొకరు సెక్యూరిటీగా ఉన్నట్లు పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏటీఎంలోని సీసీ కెమెరాలకు నల్లని రంగును స్పే చేసి, గ్యాస్కట్టర్తో ఏటీఎంను ధ్వంసం చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించినట్లు తెలిసింది. కాగా, బ్యాంక్ సిబ్బంది బుధవారం ఏటీఎంను పరిశీలించి అందులో ఉన్న నగదును తీసుకెళ్లారు. ఏటీఎం నుంచి ఖాతాదారులు డ్రా చేసిన వివరాలను బ్యాంక్ సిబ్బంది సేకరించినట్లు తెలిసింది. దొంగలు ఏటీఎంలోని నగదును తీసే క్రమంలో కొన్ని నోట్లకు మంటలు అంటుకొని కాలిబూడిదైనట్లు బ్యాంక్ అధికారులు గుర్తించారు. కాలిపోయిన నగదు రూ.5లక్షలకు పైగా ఉంటుందని అంచనా వేసినట్లు సమాచారం. చోరీకి ముందు ఏటీఎంలో రూ.25 లక్షలకు పైగా నగదును జమ చేసినట్లు తెలిసింది. మూడేళ్ల క్రితం ఇదే మాదిరిగా మెండోరాలోని దక్కన్ గ్రామీణ బ్యాంక్లో దొంగలు గ్యాస్కట్టర్తో లాకర్స్ తీస్తున్నటప్పుడు పెద్ద మొత్తంలో నగదు కాలిపోయింది. గాలింపు ముమ్మరం ఏటీఎం దొంగలను పట్టుకునేందుకు ప్రత్యేకంగా మూడు బృందాలతో గాలింపు చేపట్టినట్లు తెలిసింది. అందులో భాగంగా క్లూస్టీం ఆధారాలను సేకరించింది. కాగా, ఈ కేసును సీసీఎస్ పోలీసులకు అప్పగించారు. ఏటీఎంలో జరిగిన చోరీ ఆధారంగా పాత నేరస్తుల లేదా కొత్త నేరస్తులా లేకుంటే మహారాష్ట్ర దొంగల ముఠా పనే అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇదిలా ఉండగా ముంబై మెయిన్ బ్రాంచీ నుంచి సమాచారం అందుకున్న పోలీసులు పెట్రోలింగ్ వాహనం సైరన్ మోగించుకుంటూ రావడంతోనే దొంగలు అప్రమత్తమై పరారైనట్లు నగరంలో చర్చ జరుగుతోంది. -
ఇదోరకం మోసం.. ‘కారు’చౌక బేరం..
కామారెడ్డి క్రైం: మోసగాళ్లు తెలివిమీరుతున్నారు. కార్లను అద్దెకు తీసుకుని, ఫేక్ నంబర్లు, ఆర్సీ త యారు చేసి ఆన్లైన్ ద్వారా విక్రయిస్తున్నారు. అదే కారును తస్కరించి, తిరిగి యజమానులకు అప్పగిస్తున్నారు. ఈ ముఠాను మాచారెడ్డి పోలీసులు పట్టుకున్నారు. బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ రాజేశ్ చంద్ర ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. జిల్లా కేంద్రానికి చెందిన ఉప్పల్వాయి ప్రశాంత్ గౌడ్ ఫేస్బుక్ అప్లికేషన్లో చూసి సెకండ్ హ్యాండ్ కారును కొనుగోలు చేశాడు. ఆ మరుసటి రోజు ఓ వ్యక్తి వచ్చి అది తన కారని చెప్పి తీసుకుపోయాడు. కారు విక్రయించిన వ్యక్తు లకు ఫోన్ చేయగా.. అందుబాటులోకి రాలేదు. దీంతో ఆయన గతనెల 7వ తేదీన మాచారెడ్డి పీఎస్లో ఈ విషయమై ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపగా కొత్త రకం మో సం వెలుగు చూసింది. ముఠాగా ఏర్పడి.. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గోపీనగర్కు చెందిన మహమ్మద్ ఇయాజ్, వికారాబాద్లోని ఆలంపల్లికి చెందిన మహమ్మద్ జాహీద్ అలీ, సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురానికి చెందిన పృధ్వి జగదీష్, రాచర్ల శివకృష్ణ, వేములవాడకు చెందిన వివేక్, శేరిలింగంపల్లి మండలానికి చెందిన కర్ణకోట సాకేత్, అలీ కలిసి ముఠాగా ఏర్పడ్డారు. వీరు ముందుగా ట్రావెల్స్ సంస్థల నుంచి వ్యక్తిగతంగా ఇచ్చే సెల్ఫ్ డ్రైవింగ్ కార్లను అద్దెకు తీసుకుంటారు. వాటి నంబర్ ప్లేట్లు మార్చేసి నకిలీ ఆర్సీ, ఇతర పత్రా లు సృష్టిస్తారు. ఆపై ఫేస్బుక్, ఇతర సామాజిక మాధ్యమాల్లో కారు అమ్మకానికి ఉందని పెట్టి, తక్కువ ధరకే వాటిని అమ్మనున్నట్లు పేర్కొంటా రు. కారును అమ్మేటప్పుడు దాంట్లో జీపీఎస్ ట్రాక ర్ను అమరుస్తారు. దీంతో కారు ఎక్కడుందో వారికి తెలిసిపోతుంది. కారున్న చోటుకు వెళ్లి రాత్రికి రాత్రి వారు విక్రయించిన కారునే చోరీ చేసి తీసుకువచ్చి అసలు యజమానికి అప్పగిస్తున్నారు. అలా వీలు కాని సందర్భాల్లో ఇతరులను పంపి కారు మాది అంటూ బెదిరింపులకు పాల్పడి ఎత్తుకొస్తున్నారు. నిందితులపై పలు కేసులు.. నిందితులు గతంలోనూ పలు చోట్ల నేరాలకు పా ల్పడినట్లు విచారణలో తేలింది. మాచారెడ్డిలో కేసు నమోదైన నాటి నుంచి పరారీలో ఉన్న వారిలో ఆరుగురిని అరెస్ట్ చేసి బుధవారం రిమాండ్కు తరలించామన్నారు. మరో నిందితుడు అలీ ఇంకా పరారీ లో ఉన్నాడన్నారు. నిందితుల నుంచి మూడు కా ర్లు, 15 సెల్ఫోన్లు, జీపీఎస్ పరికరాలు, ల్యాప్టాప్, 10 మైక్రో సిమ్కార్డులు, చిప్ కార్డులు, ఫో ర్జరీ చేసిన ఆర్సీలు స్వాధీనం చేసుకున్నామన్నారు. కేసు ఛేదనలో విశేషంగా కృషి చేసిన రూరల్ సీఐ రా మన్, ఎస్సై అనిల్, ఐటీ సెల్ హెడ్ కానిస్టేబుల్ శ్రీ నివాస్, సిబ్బంది సుభాష్రెడ్డి, సిద్దిరాములు, శ్రీ కాంత్లను అభినందించారు. సమావేశంలో కామా రెడ్డి ఏఎస్పీ చైతన్య రెడ్డి, అధికారులు పాల్గొన్నారు. అద్దెకు తెచ్చి.. ఫేక్ నంబర్ తయారుచేసి.. తక్కువ ధరకు విక్రయం ఆపై అదే కారును చోరీ చేసి.. యజమానికి అప్పగిస్తున్న వైనం ఆరుగురు నిందితుల అరెస్ట్, పరారీలో మరొకరు -
‘సాహిత్యం సమాజ ప్రగతిని నిర్దేశిస్తుంది’
నిజామాబాద్ రూరల్: ఉత్తమమైన సాహిత్యం ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించి పౌరులందరినీ బా ధ్యతతో నిలిచేలా చేస్తుందని డీఈవో అశోక్ అన్నా రు. బోర్గాం(పి) సమీపంలోని శ్రీ లక్ష్మీగణపతి ఆల యంలో బుధవారం జిల్లా స్థాయి కవి సమ్మేళనం, చింతల శ్రీనివాస గుప్త సంపాదకత్వంలో వెలువడి న ‘వేసవి సెలవులు’ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఆలయ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ డాక్టర్ అరుణ్ కుమార్ శర్మ అధ్యక్షతన జరిగిన కా ర్యక్రమానికి ముఖ్యఅతిథిగా డీఈవో అశోక్ హాజరై పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లా సాహిత్యరంగంలో మున్ముందుకు సాగుతుందన్నారు. నిజామాబాద్ కవులు అన్ని ఉద్యమాలలో ప్రముఖంగా నిలి చి ప్రజలను చైతన్యవంతుల్ని చేస్తున్నారన్నారు. ‘వేసవి సెలవులు’ పుస్తకంలో 21 మంది ప్రముఖ కవులందరూ కలిసి బాల్యాన్ని చిత్రీకరిస్తూ చక్కటి కవితలు రాశారన్నారు. అనంతరం పుస్తక సంపాదకులు చింతల శ్రీనివాస గుప్తను అభినందించారు. ప్రముఖ కవి, వ్యాఖ్యాత వీపీ చందన్ రావు, కవులు డాక్టర్ కాసర్ల నరేశ్ రావు, కంకణాల రాజేశ్వర్, స్వర్ణ సమత, వసంతా లక్ష్మణ్, కే రజిత, డాక్టర్ ఏ జ్యోతి, రామ్ నరేశ్, విట్టం ధనుంజయ, ఎలగందుల లింబాద్రి, శంకర్, బట్టు శ్రీధర్ రాజు, రివర్స్ గేర్ నవీన్, వివిధ పాఠశాలల విద్యార్థులు పాల్గొని తమ కవితలను వినిపించారు. -
పండుగలు ప్రశాంతంగా జరుపుకోవాలి
● కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, సీపీ సాయిచైతన్య హితవు ● వినాయక చవితి, మిలాద్–ఉన్–నబీ నేపథ్యంలో శాంతి కమిటీ సమావేశం నిజామాబాద్ అర్బన్: వినాయక చవితి, మిలాద్–ఉన్–నబీ వేడుకలను ప్రశాంత వాతావరణంలో ఘనంగా జరుపుకోవాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. ఉత్సవాలను పురస్కరించుకొని కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్, సీపీ సాయి చైతన్య సంబంధిత అధికారులకు కీలక సూచనలు చేశారు. కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఉత్సవాల నిర్వహణకు జిల్లా యంత్రాంగం తరఫున పూర్తిస్థాయిలో సహాయ స హకారాలు అందిస్తామన్నారు. రోడ్ల మరమ్మతులు, శోభాయాత్రకు అడ్డుగా ఉండే చెట్ల కొమ్మలను తొలగించడం వంటి పనులను యుద్ధ ప్రాతిపదికన చేపడతామన్నారు. ప్రతి సంవత్సరం సహద్భావ వాతావరణంలో వేడుకలు జరుగుతాయని, ఈసారి కూ డా అదే స్ఫూర్తిని ప్రదర్శిస్తూ ఉత్సవాలు జరుపుకొ ని జిల్లా ప్రతిష్టను పెంపొందించాలని కోరారు. ఎక్కడా అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. భారీ శబ్దాలతో చిన్నారులు, వృద్ధులు ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉన్నందున మంటపాల వద్ద డీజే సౌండ్లను నిషేధించినట్లు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. వినాయక నిమజ్జనం సందర్భంగా చెరువులు, గోదావరి పరీవాహ క ప్రాంతాల వద్ద సరిపడా సంఖ్యలో క్రేన్లను అందుబాటులో ఉంచాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, సబ్ కలెక్టర్లు వికాస్ మహతో, అభిజ్ఞాన్ , ట్రెయినీ కలెక్టర్ కరోలినా చింగ్తియాన్ మావీ, అదనపు డీసీపీ బస్వారెడ్డి, నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ రవిబాబు, నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్రకుమార్, నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. డ్రగ్స్పై పటిష్ట నిఘా.. మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాల రవాణా, విక్రయం, వినియోగంపై పటిష్ట నిఘా ఉంచామని కలెక్టర్ టీ వినయ్ కృష్ణారెడ్డి, సీపీ సాయిచైతన్య స్పష్టం చేశారు. కలెక్టరేట్లో బుధవారం మత్తు పదార్థాల నిరోధక కమిటీ జిల్లాస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా యువత, విద్యార్థులను మత్తుకు బానిసలుగా మారుస్తున్న మాదకద్రవ్యాల రవాణా, విక్రయాలపై ఉక్కుపా దం మోపాలని సూచించారు. మాదకద్రవ్యాల విక్రేతలు, రవాణా చేసే వారిపై పీడీ యాక్టును ప్రయోగించేందుకు కూడా వెనుకాడబోమని హె చ్చరించారు. డ్రగ్స్ వాడకంతో కలిగే దుష్పరిణామాలపై ప్రజలను చైతన్యపర్చాలని సూచించా రు. ‘డ్రగ్ అఫెండర్స్ ప్రొఫైలింగ్ ఎనాలిసిస్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ (డోపమ్)’ పోర్టల్ ద్వారా మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాలను రవాణా చేసే వారిని, వాటిని విక్రయిస్తున్న, వినియోగిస్తున్న వారిని పక్కాగా గుర్తిస్తూ నిఘా కొనసాగిస్తున్నామని సీపీ సాయిచైతన్య స్పష్టం చేశారు. ఈ పోర్టల్ సహాయంతో ఇప్పటికే పలువురిని అరెస్టు చేశామని, ఇకపై మరింత కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. -
కొనసాగుతున్న నీటి విడుదల
నిజాంసాగర్: ఎగువ ప్రాంతాల నుంచి ఇన్ఫ్లో వస్తుండడంతో నిజాంసాగర్ ప్రాజెక్టు వరద గేట్ల ద్వారా నీటి విడుదల కొనసాగుతోంది. మంగళవారం సాయంత్రానికి నిజాంసాగర్లోకి 80 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. దీంతో 16 గేట్ల ద్వారా 88 వేల క్యూసెక్కుల నీటిని మంజీర నదిలోకి వదులుతున్నామన్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1,405 అడుగులు (17.8 టీఎంసీలు) కాగా.. ప్రస్తుతం 1,403. 67 అడుగుల (15.902 టీఎంసీలు) నీరు నిల్వ ఉందని పేర్కొన్నారు. నిజాంసాగర్ ప్రాజెక్టు ద్వారా విడుదలవుతున్న జలాలు -
చివరి దశలో ఇందిరమ్మ ఇళ్ల పనులు
బోధన్: జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాలకు తొ లి విడతలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయని కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి అన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజాప్రతినిధులతో కలిసి పూర్తయిన ఇందిరమ్మ ఇళ్లను త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. ఎడపల్లి మండలంలోని జైతాపూర్లో 15 ఇళ్లు పూర్తయ్యా యని, వాటిని వారం రోజుల్లో ప్రారంభించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. ఎడపల్లి మండలం జైతాపూర్, ఠాణాకలాన్ గ్రామాలను అడిషనల్ కలె క్టర్ అంకిత్, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, వివిధ శాఖల అధికారులతో కలిస కలెక్టర్ మంగళవారం సందర్శించారు. జైతాపూర్లో 74 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వివిధ దశల్లో ఉన్నాయని, పూర్తయిన 15 ఇళ్లకు సంబంధించి చిన్నచిన్న పనులను వెంటనే పూర్తి చేయించాలని అధికారుల కు సూచించారు. బిల్లుల చెల్లింపులపై ఆరా తీయ గా, చివరి విడతకు సంబంధించి రూ.లక్ష బిల్లు రావాల్సి ఉందని లబ్ధిదారులు తెలిపారు. వెంటనే లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని అ ధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఇళ్లకు విద్యుత్ క నెక్షన్, మిషన్ భగీరథ నీటి సరఫరా సౌకర్యాలు క ల్పించాలని విద్యుత్, ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. లబ్ధిదారులు ఎవరైనా ఇళ్ల నిర్మాణానికి ముందుకురాకపోతే వారి స్థానంలో అర్హులను గుర్తించాలని సూచించారు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణంలో ఆడంబారాలకు పోయి అప్పు ఊబిలో కూ రుకుపోవద్దన్నారు. అనంతరం రూర్భన్ పథకం కింద కొత్తగా నిర్మించిన పల్లె దవాఖానను సందర్శించారు. నూతన భవనంలో విద్యుత్ సౌక ర్యం లేదని గుర్తించి, వెంటనే విద్యుత్ సదుపాయం కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎరువుల కొరత లేదు జిల్లాలో యూరియా, ఇతర ఎరువుల కొరత లేదని, రైతుల అవసరాల మేరకు ఎరువులు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ అన్నారు. ఠాణాకలాన్ లోని సొసైటీ గోదామును సందర్శించి స్టాక్ను ప రిశీలించారు. ఖరీఫ్ సీజన్ తరహాలోనే వచ్చే యా సంగి సీజన్లో సైతం కొరత తలెత్తకుండా రైతుల అవసరాలకు సరిపడా ఎరువుల పంపిణీ జరిగేలా ప్రణాళికబద్ధంగా వ్యవహరించాలన్నారు. పట్టాపా స్ పుస్తకాలు లేని రైతులు పంటలు సాగు చేస్తే వారికి కూడా ఎరువులు ఇవ్వాలని ఆదేశించారు. ఆయనవెంట జిల్లా గృహ నిర్మాణ శాఖ పీడీ పవన్కుమార్, మండల అధికారులు ఉన్నారు. వివిధ దశల్లో తొలి విడత మంజూరైన ఇళ్లు పూర్తయిన వాటిని త్వరలో ప్రారంభిస్తాం నిర్మాణానికి ముందుకు రాని లబ్ధిదారుల స్థానంలో కొత్తవారి ఎంపిక కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి -
డబుల్ ఇళ్లపై కదలిక
నిజామాబాద్వీడీసీ నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ సీజ్ జీరో విద్యుత్ ప్రమాదాలే.. జీరో విద్యుత్ ప్రమాదాలే లక్ష్యంగా సిబ్బంది పని చేయాలని టీజీఎన్పీడీసీఎల్ డైరెక్టర్ (ఆపరేషన్) మధుసూదన్ సూచించారు.బుధవారం శ్రీ 20 శ్రీ ఆగస్టు శ్రీ 2025– 8లో uనిజామాబాద్ అర్బన్: డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన డబుల్ ఇళ్ల కోసం అర్హులను ఎంపిక చేసేందుకు క్షేత్రస్థాయిలో గెజిటెడ్ అధికారుల బృందాలతో విచారణ చేపడుతున్నారు. అధికారుల బృందాలు ఎంపిక చేసిన వారికి ఎల్–2(ఇల్లు, జాగాలేనివారు) కేటగిరి కింద ఇళ్లు పంపిణీ చేయనున్నారు. గత ప్రభుత్వ హ యాంలో డబుల్బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ ప్రక్రియను ప్రారంభించినప్పటికీ ఎలక్షన్ కోడ్ కారణంగా నిలిచిపోయింది. కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి ఆదేశాల మేరకు ఇటీవలే జిల్లా కేంద్రంలోని నాగారంలో ఇళ్ల నిర్మాణాలను హౌసింగ్ అధికారులు పరిశీలించారు. వారికే ముందు.. డబుల్ ఇళ్ల పంపిణీ కోసం గత ప్రభుత్వం స్వీకరించిన దరఖాస్తులను పలు ఆరోపణల నేపథ్యంలో పక్కన పెట్టేశారు. ప్రస్తుత ప్రభుత్వం ప్రజాపాలన లో దరఖాస్తులను స్వీకరించింది. అయితే ఇల్లు, సొంత జాగా లేని వారిని అర్హులుగా ఎంపిక చేసే అ వకాశం ఉంది. జిల్లా వ్యాప్తంగా 9486 డబుల్ ఇళ్లు మంజూరు కాగా, 5695 పంపిణీ చేశారు. 1662 ఇళ్ల నిర్మాణ పనులు పూర్తయి పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. 2129 ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి. నిజామాబాద్ అర్బన్లో 396 ఇళ్ల పనులు పూర్తయి రెండేళ్లవుతోంది. బాన్సువాడ ముందంజ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీలో బాన్సువాడ నియోజకవర్గం(నిజామాబాద్ జిల్లా పరిధిలోని మండలాలు) ముందంజలో ఉంది. నియోజకవర్గానికి 4807 ఇళ్లు మంజూరు కాగా 4018 ఇళ్లు పంపిణీ చేశారు. ప్రస్తుతం రెండు ఇళ్ల నిర్మాణాలు పూర్తయి పంపిణీకి సిద్ధంగా ఉండగా, మరో 787 ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి. నిజామాబాద్ అర్బన్లో ఇంత వరకు ఒక్క ఇల్లు కూడా పంపిణీ చేయలేదు. ఆర్మూర్ నియోజక వర్గంలో 92 , నిజామాబాద్ రూరల్ నియోజక వర్గంలో 98 , బాల్కొండ నియోజక వర్గంలో 925, బోధన్ నియోజకవర్గంలో 562 ఇళ్లు ఇప్పటి వరకు పంపిణీ చేశారు. ప్రస్తుతం 1662 ఇళ్లు లబ్ధిదారులకు పంపిణీ చేసే అవకాశం ఉంది. జిల్లా కేంద్రంలోని నాగారం ప్రాంతంలో నిర్మాణాలు పూర్తి అయిన డబుల్బెడ్రూమ్లుమరమ్మతులకు రూ.3కోట్లుజిల్లాలోని వర్నితోపాటు పలు ప్రాంతాల్లో పూర్తయిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు పంపిణీ చేయనప్పటికీ అర్హులు బలవంతంగా వాటిలో ఉంటున్నారు. నిర్మాణాలు పూర్తయిన ఇళ్లు సంవత్సరాల తరబడి అలాగే ఉండడంతో కిటికీలు, తలుపులు, కులాయిలు, పైపులను దుండగులు ఎత్తుకెళ్లారు. పలు చోట్ల ధ్వంసమయ్యాయి. అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారాయి. వాటి మరమ్మతులకు రూ.3 కోట్లు మంజూరు చేశారు. మరమ్మతు పనులను త్వరితగతిన పూర్తిచేసి ఇళ్లను బాగుచేయాలని అధికారులు ఆదేశించారు. కమిటీ రద్దుకు సుర్భిర్యాల్ గ్రామస్తుల నిర్ణయం పంపిణీ చేసేందుకు అధికారుల నిర్ణయం అర్హుల ఎంపికపై కొనసాగుతున్న క్షేత్రస్థాయి విచారణ ప్రజాపాలన దరఖాస్తులే ప్రామాణికం?విచారణ కొనసాగుతోంది డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీలో భాగంగా ప్రస్తుతం క్షేత్రస్థాయిలో అర్హుల ఎంపికకు సంబంధించి విచారణ కొనసాగుతోంది. గెజిటెడ్ అధికారుల బృందాలను నియమించడం జరిగింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో విచారణ చేస్తున్నారు. అనంతరం అర్హులను ఎంపిక చేసి ఇళ్లను కేటాయిస్తాం. – నివర్తి, హౌసింగ్ ఏఈ -
మళ్లీ పోటెత్తిన వరద
బాల్కొండ: ఎగువ ప్రాంతాల నుంచి శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లోకి మంగళవారం ఉదయం నుంచి మళ్లీ వరద పోటెత్తింది. దీంతో నీటి విడుదలను ప్రాజెక్ట్ అధికారులు పెంచారు. సోమవారం రాత్రి ఇన్ఫ్లో లక్షా 17వేలకు తగ్గగా, మంగళవారం ఉదయం లక్షా 45 వేల క్యూసెక్కులకు పెరిగింది. దీంతో 39 వరద గేట్లను ఎత్తి లక్షా 73 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఎగువ నుంచి వరద పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 6గంటల వరకు ఇన్ఫ్లో 2.27లక్షల క్యూసెక్కులు నిలకడగా ఉన్నప్పటికీ.. అవుట్ ఫ్లోను 2.75 లక్షల క్యూ సెక్కుల నుంచి 3.75లక్షలకు పెంచారు. రాత్రి వేళ ఇన్ఫ్లో లక్షా 75 వేల క్యూసెక్కులకు తగ్గింది. 40 గేట్ల ద్వారా 3లక్షల 12వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. వరద కాలువకు పెరిగిన నీటి విడుదల వరద కాలువకు 20 వేల క్యూసెక్కులు, కాకతీయకు 4700, ఎస్కేప్ గేట్ల ద్వారా 3300 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మిషన్ భగీరథ అవసరాలకు 231 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తుండగా, ఆవిరి రూపంలో 636 క్యూసెక్కులు పోతోంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 1091(80.5 టీఎంసీలు) అడుగులు కాగా మంగళవారం సాయంత్రం 1088.10(70.14 టీఎంసీలు) అడుగుల నీరు నిల్వ ఉందని ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు. ఎస్సారెస్పీ గేట్ల ద్వారా విడుదలవుతున్న నీరు ఇన్ఫ్లో – అవుట్ ఫ్లో (క్యూసెక్కులు లక్షల్లో..) 40 వరద గేట్ల ఎత్తివేత -
జిల్లా కేంద్రంలో దొంగల హల్చల్
ఖలీల్వాడి: మారుతి వ్యాన్లో వచ్చిన దుండగులు ముసుగులు ధరించి.. గ్యాస్ కట్టర్ను ఉపయోగించి ఏటీఎం యంత్రాన్ని ధ్వంసం చేశారు. సీసీ కెమెరాలకు చిక్కకుండా ముసుగులు ధరించారు. అదే సమయంలో పోలీస్ పెట్రోలింగ్ వాహనం రావడంతో వ్యాన్లో పరారయ్యారు. ఈ ఘటన జిల్లా కేంద్రంలోని చంద్రశేఖర్కాలనీ చౌరస్తాలో మంగళవా రం తెల్లవారుజామున చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. మహారాష్ట్రలో రిజిస్ట్రేషన్ అయిన మారుతి వ్యాన్లో వచ్చిన దండగులు ముసుగులు ధరించి ఏటీఎంలోకి ప్రవేశించారు. తమ వెంట తీ సుకొచ్చిన గ్యాస్ కట్టర్తో ఏటీఎంను ధ్వంసం చేశా రు. నగదు తీసేందుకు యత్నిస్తున్న సమయంలోనే పోలీసు పెట్రోలింగ్ వాహనం రావడంతో వ్యాన్లో పరారయ్యారు. బాసరవైపు పారిపోతుండగా అప్రమత్తమైన పెట్రోలింగ్ సిబ్బంది దుండగుల వాహనాన్ని వెంబడిస్తూనే అన్ని పోలీస్స్టేషన్లకు సమా చారం అందించారు. తప్పించుకునే మార్గం లేకపోవడంతో నవీపేట మండలం పాల్ద వద్ద మారుతి వ్యాన్ను వదిలేసి పారిపోయారు. చుట్టు పక్కల ప్రాంతాల్లో కొత్త వ్యక్తులు కనిపిస్తే తమకు సమాచారం అందించాలని పోలీసులు ఆయా గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. ముంబై మెయిన్ బ్రాంచ్కు మెస్సేజ్ ఏటీఎంలో దుండగులు చోరీకి యత్నిస్తున్న సమ యంలో ముంబైలోని మెయిన్ బ్రాంచ్కు మెస్సేజ్ వెళ్లడంతో అక్కడి సిబ్బంది నిజామాబాద్ పోలీస్ కంట్రోల్ రూమ్కు సమాచారం అందించారు. వెంటనే మూడో టౌన్ పోలీస్ స్టేషన్ పెట్రోలింగ్ వాహనం ఏటీఎం వద్దకు చేరుకోవడంతో దుండగు లు పరారయ్యారు. ఏటీఎం నుంచి నగదు పోలేదని ఎస్సై హరిబాబు తెలిపారు. ఘటనా స్థలం పరిశీలన ఘటనాస్థలాన్ని సీపీ పోతరాజు సాయిచైతన్య పరిశీలించారు. మూడవటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చంద్రశేఖర్ కాలనీలో ఎస్బీఐ బ్యాంక్ ఏటీఎంను సీపీ పోతరాజు సాయిచైతన్య పరిశీలించారు. ఎస్సై హరిబాబు, సీఐ శ్రీనివాస్ రాజుకు పలు సూచనలు చేశారు. కేసు విచారణ చేయాలని క్లూస్ టీం, సీసీఎస్ టీం అధికారులను ఆదేశించారు. ఏటీఎం చోరీకి యత్నం ముసుగులు ధరించి మారుతి వ్యాన్లో వచ్చిన దుండగులు వెంట గ్యాస్ కట్టర్.. పెట్రోలింగ్ వ్యాన్ రావడంతో పరార్ పాల్దా వద్ద మారుతి వ్యాన్ను వదిలేసిన చోరులు -
నీట మునిగిన పంటలు
బోధన్/బోధన్ రూరల్/రెంజల్/వర్ని: భారీ వర్షాలకు తోడు నిజాంసాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో మంజీర నదిలోకి వరద పోటెత్తింది. సాలూర మండలంలోని మందర్నా, హున్సా, ఖాజాపూర్, సాలూర, బోధన్ రూరల్ మండలం హంగర్గ గ్రామాల శివారులో సోయా, వరి, పెసర, మినుము పంటలు వందలాది ఎకరాల్లో నీట మునిగాయి. పూతదశలో ఉన్న సోయాకు అపారనష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హంగర్గ గ్రామంలోని హనుమాన్ ఆలయం వరకు వరద నీరు వచ్చింది. గ్రామ శివారులోని 13 వందల ఎకరాల్లో సోయా నీట మునిగింది. వరద తగ్గిన తరువాత పంట నష్టంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మందర్నా గ్రామంలో తహసీల్దార్ శశిభూషణ్ సోమవారం రాత్రి బస చేసి వరద పరిస్థితిని పరిశీలించారు. ఎంపీడీవో శ్రీనివాస్ మంగళవారం గ్రామస్తులతో కలిసి వరద ఉధృతిని పరిశీలించారు. అడిషనల్ కలెక్టర్ కిరణ్కుమార్ సాలూర, హంగర్గ గ్రామాలను సందర్శించి వరదను పరిశీలించారు. అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉండాలని అధికారులకు సూచించారు. ఆయన వెంట బోధన్ రూరల్ తహసీల్దార్ విఠల్, ఏవో సంతోష్, అధికారులు ఉన్నారు. సాయంత్రం వేళ సీపీ సాయిచైతన్య హంగర్గా, ఖండ్గావ్ గ్రామాలను సందర్శించిన వరద ఉధృతిని పరిశీలించారు. రెంజల్ మండలం కందకుర్తి శివారులోని రాష్ట్ర సరిహద్దులో ఉన్న వంతెన పైనుంచి మంగళవారం ఉదయం గోదావరి ప్రవహించింది. రెండు రాష్ట్రాల అధికారులు, పోలీసులు వంతెనకు ఇరువైపులా పికెటింగ్ ఏర్పాటు చేసి రాకపోకలను నిలిపివేశారు. సాయంత్రం వేళ వరద కాస్త తగ్గుముఖం పట్టింది. రెవె న్యూ, పోలీస్, వ్యవసాయ శాఖ అధికారులు నదీ పరివాహక గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. గ్రామాల్లో దండోరా వేయించారు. వందలాది ఎకరాల్లో సోయాకు నష్టం -
బోధన్లో కలకలం రేపిన రేసింగ్ పావురం
బోధన్రూరల్ : నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలో కోడింగ్ స్టిక్కర్తో ఉన్న పావురం కలకలం రేపింది. మండలంలోని భవానీపేట్ గ్రామంలో ఓ బాలుడు ఆడుకుంటుండగా పావురం దొరికింది. ఆ పావురం కాలికి, రెక్కలకు కోడింగ్ నెంబర్లతో ఉన్న స్టిక్కర్లు ఉన్నాయి. దీంతో ఆ పావురం గూఢచారి పావురం అంటూ ప్రచారం జరిగింది. గ్రామస్తులు కొందరు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో బోధన్ రూరల్ ఎస్సై మచ్చేందర్ రెడ్డి అక్కడికి చేరుకుని పావురాన్ని స్వాధీనం చేసుకుని పోలీసు స్టేషన్ తీసుకొచ్చారు. ఈ పావురం రేసింగ్ గేమ్కు సంబంధించినదని ఎస్సై తెలిపారు. పావురాన్ని పరిశీలించి వదిలేసినట్లు చెప్పారు. ఎటువంటి కేసు నమోదు చెయ్యలేదన్నారు. ఈ పావురం ఘటన మంగళవారం సోషల్ మీడియా వైరల్గా మారింది. నిజామాబాద్ నాగారం: నిజామాబాద్ ప్రాంతీయ (కామారెడ్డి, నిజామాబాద్) సైనిక సంక్షేమ జిల్లా అధికారిగా మత్స్యశాఖ ఏడీ ఆంజనేయులు మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఇంతకుముందు ఇన్చార్జిగా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రమేష్ బాధ్యతల స్వీకరించి విషయం తెలిసిందే. గత నెల 31న ఆయన పదవీ విరమణ చేయడంతో ఈ పోస్టు ఖాళీగా ఉంది. కలెక్టర్ ఆదేశాల మేరకు ఆంజనేయులు బాధ్యతలు స్వీకరించారు. -
జీరో విద్యుత్ ప్రమాదాలే లక్ష్యంగా పనిచేయాలి
సుభాష్నగర్: జీరో విద్యుత్ ప్రమాదాలే లక్ష్యంగా సిబ్బంది పని చేయాలని టీజీఎన్పీడీసీఎల్ డైరెక్టర్ (ఆపరేషన్) మధుసూదన్ సూచించారు. నగరంలోని పవర్హౌజ్ కంపౌండ్లోగల సమావేశ మందిరంలో మంగళవారం ఎస్ఈ, డీఈలు, ఏడీఈలు, ఏఈలు, ఇతర అధికారులతో సమావేశం ఏర్పాటుచేశారు. ఈసందర్భంగా మధుసూదన్ మాట్లాడుతూ.. విద్యుత్ వినియోగదారులకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ను సరఫరా చేయాలని సూచించారు. కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్లు డిపార్ట్మెంట్ వాహనంలో తరలించి త్వరితగతిన సమయంలో అమర్చాలని ఆదేశించారు. వినాయక చవితి, దుర్గామాత పండుగల నేపథ్యంలో విగ్రహాల తరలింపు, ఊరేగింపులో ఎలాంటి విద్యుత్ ప్రమాదాలు జరగకుండా అవసరమైన అన్నిరకాల చర్యలు చేపట్టాలన్నారు. చీఫ్ ఇంజనీర్ (వరంగల్) అశోక్, ఎస్ఈ రాపల్లి రవీందర్, డీఈలు రమేష్, శ్రీనివాస్, రాజేశ్వర్రావు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కేబుల్ వైర్లను వెంటనే తొలగించాలి సుభాష్నగర్: విద్యుత్ స్తంభాలకు ఉన్న కేబుల్ వైర్లను వెంటనే తొలగించాలని ఎన్పీడీసీఎల్ ఎస్ఈ రాపల్లి రవీందర్ ఆదేశించారు. సీఎండీ కర్నాటి వరుణ్రెడ్డి ఆదేశాల మేరకు మంగళవారం నగరంలోని రాజరాజేంద్ర చౌరస్తా, తదితర ప్రాంతాల్లో కేబుల్ వైర్లను తొలగించారు. ఈసందర్భంగా ఎస్ఈ మాట్లాడుతూ.. గతేడాది నుంచి విద్యుత్ స్తంభాలపై ఉన్న కేబుల్ వైర్లను తొలగించాలని ఆపరేటర్లకు విన్నవించినా పట్టించుకోవడం లేదని తెలిపారు. దీని ద్వారా విద్యుత్ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని, కేబుల్ వైర్లను రీఅలైన్మెంట్ చేసుకోవాలని ఆదేశించారు. లేకుంటే తామే తొలగిస్తామని హెచ్చరించారు. ముఖ్యంగా వినాయక, దుర్గామాతా విగ్రహాల తరలింపు, ఊరేగింపు సమయంలో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని తెలిపారు. అంతకుముందు సీఎండీ కర్నాటి వరుణ్రెడ్డి 16 సర్కిళ్ల ఎస్ఈలు, డీఈలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. హైదరాబాద్లో ఇటీవల జరిగిన విద్యుత్ ప్రమాద ఘటనను ఉదహరించారు. వినాయక, దుర్గామాత మండపాల నిర్వాహకులతో మాట్లాడి విద్యుత్ పట్ల జాగ్రత్త వహించేలా అవగాహన కల్పించాలని తెలిపారు. -
వరద గేట్ల వైపు అనుమతి నిరాకరణ
● పర్యాటకుల ఆగ్రహం బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి వరద గేట్ల ద్వారా గోదావరిలోకి నీటి విడుదల చేపట్టడంతో ప్రాజెక్ట్ సందర్శనకు పర్యాటకులు పోటెత్తుతున్నారు. కానీ పర్యాటకులను వరద గేట్ల వైపు డ్యాంపైకి వెళ్లడానికి అధికారులు అనుమతివ్వడం లేదు. ప్రాజెక్ట్ ఆనకట్టపైకి మాత్రం అనుమతిస్తున్నారు. కొందరికి మాత్రం డ్యాంపైకి కూడ అనుమతిస్తున్నారు. అయినవారికి మాత్రం అధికారులు నిబంధనలు పెట్టడం లేదు. దీంతో ఒక్కసారిగా పర్యాటకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ డ్యాంగేటు వద్దకు దూసుకువచ్చారు. డ్యాంపైకి వెళ్లి తీరుతామంటూ నినాదాలు చేశారు. అధికారుల, పోలీసుల బంధువులకు ఎలా అనుమతిస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్, ప్రాజెక్ట్ సిబ్బందితో తీవ్ర వాగ్వాదం చేశారు. కొందరు గేటు దూకి లోపలికి వెళ్లారు. ప్రాజెక్ట్పైకి మీడియాకు కూడ అనుమతివ్వడం లేదు. ఉన్నతాఽధికారులు స్పందించి అందరికి సమాన న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. -
సైబర్క్రైమ్లో డబ్బుల రిఫండ్
రుద్రూర్: కోటగిరి మండల కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి సైబర్ మోసానికి గురై, డబ్బులు పోగొట్టుకోగా పోలీసులు రికవరీ చేశారు. కోటగిరి ఎస్సై సునీల్ తెలిపిన వివరాలు ఇలా.. కోటగిరి గ్రామానికి చెందిన ఎజాస్ అహ్మద్ ఖురేషి అనే వ్యక్తి వాట్సప్కు 13 ఏప్రిల్ 2025 నాడు అనుమానాస్పద లింక్ మెసేజ్ రాగా ఓపెన్ చేశాడు. దీంతో సైబర్ నేరగాళ్లు అతని బ్యాంక్ అకౌంట్ నుంచి కొన్ని డబ్బులు దోచేశారు. వెంటనే బాధితుడు కోటగిరి పోలీస్స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేయగా, వారు సైబర్ క్రైమ్ పోర్టల్లో వివరాలు నమోదు చేసి బాధితుడికి రూ.5వేలు రిఫండ్ చేయించారు. నిజామాబాద్ లీగల్/కామారెడ్డి క్రైం: ఆభరణాల కోసం ఓ వృద్ధురాలిని హత్య చేసిన కేసులో నిందితుడికి జీవిత ఖైదు విధిస్తూ నిజామాబాద్ కోర్టు మంగళవారం తీర్పు వెల్లడించింది. వివరాలు ఇలాలా.. కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని శివాజీనగర్కు చెందిన గుడిలింగం పండరి అనే యువకుడు మద్యానికి బానిసయ్యాడు. సులువుగా డబ్బు సంపాదన కోసం దొంగతనాలకు అలవాడు పడ్డాడు. ఈక్రమంలో గ్రామంలోని గోనె కాశవ్వ (58) అనే వృద్ధురాలి ఆభరణాలను దొంగిలించాలనుకున్నాడు. 29 సెప్టెంబర్, 2024న కాశవ్వ ఇంట్లో ఎవరు లేని సమయంలో ఆమె తలపై రోకలి దుడ్డుతో కొట్టి హత్యచేసి, ఆమె మెడలో ఉన్న గుండ్లు, చెవులకు ఉన్న నగలను దొంగిలించాడు. మృతురాలి కుమారుడు బాబయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరిపారు. నిందితుడు లింగంను అప్పట్లోనే అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు. కేసు పూర్వాపరాలను పరిశీలించిన నిజామాబాద్ రెండవ అదనపు జిల్లా సెషన్స్ (ఎస్సీ, ఎస్టీ) కోర్టు న్యాయమూర్తి శ్రీనివాస్ నిందితుడికి హత్యా నేరానికి గాను జీవిత ఖైదు, దొంగతనం నేరానికి ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష, ఎస్సీ మహిళను చంపినందుకు మరో ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.4వేలు జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. బైక్ చోరీ కేసులో ఇద్దరికి 9నెలల జైలు ఎల్లారెడ్డి: బైక్ చోరీ కేసులో ఇద్దరికి 9నెలల జైలు శిక్ష విధిస్తూ ఎల్లారెడ్డి మున్సిఫ్ కోర్టు మంగళవారం తీర్పు వెల్లడించారు. వివరాలు ఇలా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పల్నాడు జిల్లాకు చెందిన బత్తుల హరిక్రిష్ణ ఎల్లారెడ్డి పట్టణంలో ఉంటూ మేసీ్త్ర పనులు చేస్తున్నాడు. 2024 డిసెంబర్ 11న అతడి బైక్ ఇంటి ముందు నుంచి చోరీకి గురైంది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులుగా ఎర్ర అశోక్, దొడ్ల గోపాల్గా గుర్తించారు. కోర్టు లో విచారణ జరుగగా ఎల్లారెడి కోర్టు జడ్జి సుష్మ నిందితులకు 9 నెలలు జైలు శిక్ష, రూ. వెయ్యి చొప్పున జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. సిరికొండ: మండలంలోని కొండూర్ గ్రామంలో సుంకెట విజయకు చెందిన ఇల్లు ప్రమాదవశాత్తు దగ్ధమైనట్లు తహసీల్దార్ రవీందర్రావు మంగళవారం తెలిపారు. అగ్ని ప్రమాదంలో ఇంట్లో ఉన్న నిత్యావసర వస్తువులు, బట్టలు, టీవీ, ఫ్రిజ్, సెల్ఫోన్లు, బియ్యం, నగదు, బంగారు ఆభరణాలు పూర్తిగా కాలిపోయినట్లు తెలిపారు. ప్రమాదంలో సుమారు రూ.4లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లిందని ఆయన తెలిపారు. నిజామాబాద్ లీగల్: సారంగాపూర్లోని సెంట్రల్ జైలులో మంగళవారం టీబీ ముక్త్ భారత్లో భాగంగా ఖైదీలకు టీబీ వ్యాధిపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అవగాహన కల్పించారు. డీఎంహెచ్వో రాజశ్రీ, జిల్లా టీబీ కంట్రోల్ ఆఫీసర్ దేవి నాగేశ్వరి, మెడికల్ ఆఫీసర్ అవంతి ఖైదీలకు పలు జాగ్రత్తలను వివరించారు. డీఎంహెచ్వో మాట్లాడుతూ.. జైలులోని 560 మంది ఖైదీలకు వైద్య పరీక్షలు నిర్వహించామని తెలిపారు. జిల్లా జైలు సూపరింటెండెంట్ చింతల దశరథం, జైలర్ రాజశేఖర్, జైల్ మెడికల్ ఆఫీసర్ దినేష్, జిల్లా టీబీ కో–ఆర్డినేటర్లు రవిగౌడ్, లక్ష్మణ్, స్వాతి, మహేష్, రాంచందర్, స్రవంతి, సాయికిరణ్, శివ, ఖలీద్, శంకర్ రాథోడ్ పాల్గొన్నారు. -
గంజాయి తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్
ఖలీల్వాడి: నగరంలోని సారంగపూర్లోని పెట్రోల్ బంక్ వద్ద గంజాయిని ఆటోలో తరలిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఎకై ్సజ్ ఎస్హెచ్వో స్వప్న తెలిపారు. వివరాలు ఇలా.. నగరంలోని సారంగపూర్కు చెందిన సయ్యద్ వాసీం చిన్న ప్యాకెట్లను ఏర్పాటు చేసుకొని గంజాయి అమ్మకాలు సాగిస్తున్నట్లు తెలిపారు. పక్కా సమాచారం మేరకు సారంగపూర్ పెట్రోల్ బంక్ వద్ద ఆటోను ఆపి తనిఖీలు నిర్వహించగా వాసీం వద్ద 100 గ్రాముల ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. అతడి సెల్ఫోన్ను, ఆటోను సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. సిబ్బంది రామ్కుమార్, హమీద్, విష్ణు, అవినాష్, భోజన్న ఉన్నారు. -
లక్ష్యం మేరకు ఆయిల్పామ్ సాగు చేపట్టాలి
● కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ● వ్యవసాయశాఖ అధికారులతో సమీక్షనిజామాబాద్ అర్బన్: జిల్లాలో నిర్ధేశిత లక్ష్యం మేరకు ఆయిల్పామ్ సాగు జరిగేలా చిత్తశుద్ధితో కృషి చేయాలని కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి సూచించారు. జిల్లావ్యాప్తంగా ఈ ఏడాది 3500 ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్ పామ్ సాగు చేయాలని లక్ష్యం కాగా, ఈ దిశగా రైతులను ప్రోత్సహించాలన్నారు. నగరంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో మంగళవారం ఆయన వ్యవసాయ శాఖ వివిధ విభాగాల అధికారులు, సిబ్బందితో ఆయిల్పామ్ సాగుపై సమావేశం నిర్వహించారు. ఆయిల్పామ్ సాగు పురోగతిపై క్లస్టర్ల వారీగా సమీక్ష జరిపారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఇప్పటికే జిల్లాలో 5630 ఎకరాలలో ఆయిల్పామ్ సాగు జరిగిందని, ఈ సంవంత్సరం 1500 ఎకరాలలో ఆయిల్పామ్ గెలలు కోతకు వచ్చాయని తెలిపారు. ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం పలు రకాల సబ్సిడీలను అందిస్తోందన్నారు. ఆయిల్పామ్ మొక్కలకు 90 శాతం రాయితీని ప్రభుత్వం భరిస్తుందని, రైతు కేవలం ఒక ఎకరానికి 1000 రూపాయల చొప్పున జిల్లా ఉద్యాన పట్టుపరిశ్రమ అధికారి, నిజామాబాద్ పేరిట డీడీ చెల్లిస్తే 50 మొక్కలు ప్రీ యూనిక్ కంపెనీ వారిచే అందిస్తామని తెలిపారు. అంతర పంటల సాగు చేపట్టే రైతులకు ఎకరానికి రూ. 4200 చొప్పున రైతు ఖాతాలో సంవత్సరానికి ఒకసారి జమ చేస్తారని వివరించారు. చిన్న, సన్నకారు, ఐదెకరాల లోపు విస్తీర్ణం ఉన్న వారికి 90 శాతం రాయితీ, ఎస్సీ, ఎస్టీ రైతులైతే 100 శాతం రాయితీ, 5 ఎకరాల పైబడి విస్తీర్ణంలో సాగు చేసే వారు 80 శాతం రాయితీ కింద డ్రిప్ సౌకర్యం పొందవచ్చని తెలిపారు. ఈ విషయాలను రైతులకు వివరించి ఆయిల్ పామ్ సాగు చేపట్టేలా ప్రోత్సహించాలని కలెక్టర్ సిబ్బందికి సూచించారు. డీఏవో గోవిందు, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి శ్రీనివాస్, ప్రీ యూనిక్ కంపెనీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. -
ఎరువుల కొరత లేదు
పెర్కిట్(ఆర్మూర్): వానకాల సీజన్కు ఎరువుల కొరత లేదని జిల్లా సహకార శాఖ అధికారి శ్రీనివాస్ రావు స్పష్టం చేశారు. ఆలూర్ మండల కేంద్రంలోని సొసైటీ గోదామును డీసీవో మంగళవారం తనిఖీ చేశారు. గోదాములో ఎరువుల నిల్వలకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వానకాల సీజన్లో రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని తగినంత యూరియా అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు. అలాగే రైతులు తమ అవసరాలకు అనుగుణంగా యూరియాను తీసుకోవాలని సూచించారు. సొసైటీ వైస్ చైర్మన్ చేపూర్ రాజేశ్వర్, సెక్రెటరీ మల్లేష్, సిబ్బంది ముత్యం, సురేష్, సీతగంగారాం, రైతులు పాల్గొన్నారు. -
ఉద్యాన పంటలకు రాయితీలు
ఆర్మూర్: జిల్లాలో కూరగాయలు, పండ్లు, పూల తోటలు పండించే రైతులకు ఉద్యానశాఖ (హార్టికల్చర్) అధికారులు రాయితీలు అందజేసి ప్రోత్సహిస్తున్నారు. ప్రధానంగా వ్యవసాయాధారిత ప్రాంతమైన జిల్లాలో రైతులను ఉద్యాన పంటలవైపు ప్రోత్సహిస్తూ అదనపు ఆదాయాన్ని సమకూర్చుకోవడంలో ఉద్యాన శాఖ తోడ్పాటును అందిస్తోంది. జిల్లా రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు సూచిస్తున్నారు. యాౖౖభై శాతం సబ్సిడీపై... జిల్లాలో వర్షాకాలంలో సుమారు 800 ఎకరాల్లో, ఎండాకాలంలో సుమారు రెండు వేల ఎకరాల్లో కూరగాయల పంటలను రైతులు పండిస్తున్నారు. ఇలాంటి రైతులకు సాగును బట్టి రాయితీలను అధికారులు అందిస్తున్నారు. తీగ జాతి (బీర, కాకర, దొండ, పొట్లకాయ, సోరకాయ) లాంటి కూరగాయల పెంపకం కోసం పందిరి సాగు చేసుకోవాలనుకొనే రైతులకు 50 శాతం రాయితీని అందిస్తున్నారు. ఒక రైతు కనీసం అర ఎకరం సాగు చేసుకోవాల్సి ఉంటుంది. అర ఎకరానికి ఉద్యాన శాఖ వారు గరిష్టంగా రూ.50 వేలకు మించకుండా రాయితీని అందజేస్తున్నారు. అదేవిధంగా టమాట, వంగ, మిరప నారును జీడీమెట్లలోని సెంటర్ఆఫ్ ఎక్ట్సెన్స్ వారి ఆధ్వర్యంలో ఉచితంగా అందజేస్తున్నారు. ఒక ఎకరానికి ఎనిమిది వేల మొక్కలను తీసుకోవడానికి అవకాశం ఉంది. ఒక్కో రైతు రెండున్నర ఎకరాల్లో ఈ కూరగాయలను పండించడానికి నారును తీసుకోవచ్చును. అదేవిధంగా ఉద్యాన పంటలో వేసుకొనే మల్చింగ్ (కప్పు) కోసం 50 శాతం రాయితీ అంటే ఎకరానికి రూ.6400 రాయితీని రైతులకు అందిస్తున్నారు. ఒక్కో రైతు ఐదు ఎకరాల్లో పంటపైన కప్పు కోసం రాయితీ తీసుకోవచ్చును. ఇక మామిడి, జామ, సీతాఫలం, పపాయ, డ్రాగన్ ఫ్రూట్ లాంటి పండ్ల తోటలు, బంతి, చామంతి, గల్లార్డియా లాంటి ఇతర పూల తోటల సాగును ప్రోత్సహించడానికి ఉద్యానశాఖ వారు 40 శాతం రాయితీని అందజేస్తున్నారు. ఒక్కో రైతు గరిష్టంగా ఐదు ఎకరాల్లో పంట పండించడానికి రాయితీని పొందవచ్చును. ఈ రాయితీలను సద్వినియోగం చేసుకొని రైతులు ఉద్యాన పంటల సాగును లాభదాయకంగా మార్చుకోవాలి.సాంప్రదాయ పంటలతో పాటు అదనపు ఆదాయాన్ని పొందాలనుకొనే రైతులు కూరగాయలు, పండ్లు, పూల తోటలను సైతం పెంచడానికి ఉద్యానశాఖ తోడ్పాటును అందిస్తోంది. ఆసక్తి గల రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అదనపు సమాచారం కోసం 8977713980 నంబర్ను సంప్రదించాలి. – కే సంధ్యరాణి, హార్టికల్చర్ ఆఫీసర్, ఆర్మూర్ కూరగాయలు, పండ్లు, పూలతోటల సాగులో పందిరి నిర్మాణానికి సబ్సిడీలు జిల్లా రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తున్న హార్టికల్చర్ శాఖ అధికారులు -
ఉప్పొంగిన నదులు
శ్రీరాంసాగర్, నిజాంసాగర్ గేట్ల ఎత్తివేతఎస్సారెస్పీ నుంచి విడుదలవుతున్న నీరుజలాశయాలకు వరద పోటెత్తింది. శ్రీరాంసాగర్, నిజాంసాగర్ ప్రాజెక్టులకు అనూహ్యంగా ఇన్ఫ్లో పెరగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆదివారం అర్ధరాత్రి నిజాంసాగర్ ప్రాజెక్టుకు 62వేల క్యూసెక్కులుగా ఉన్న ఇన్ఫ్లో 90 వేల క్యూసెక్కులకు చేరింది. 1.30 గంటల ప్రాంతంలో గేట్లను ఎత్తివేశారు. మరోవైపు ఎస్సారెస్పీలోకి ఇన్ఫ్లో లక్షా 52వేలకు పెరగడంతో ప్రాజెక్టు నిండుకుండలా మారింది. సోమవారం 39 వరద గేట్లను ఎత్తారు. రాత్రి వేళ ఒక గేటును మూసివేశారు. 38 గేట్ల ద్వారా లక్షా 32వేల క్యూసెక్కుల నీరు గోదావరిలోకి వెళ్తోంది. బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లోకి వరద ఉధృతి కొనసాగుతుండడంతో ప్రాజెక్ట్ ఎస్ఈ శ్రీనివాస్ గుప్తా, ఈఈ చక్రపాణి వరద గేట్ల ద్వారా నీటి విడుదలను సోమవారం ప్రారంభించారు. ఆదివారం ఉదయం నుంచి లక్షా 52 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో రాగా, రాత్రికి 10 గంటల సమయానికి లక్షా 43 వేలకు పడిపోయింది. అర్ధరాత్రి తరువాత లక్షా 52 వేలకు పెరగడంతో ప్రాజెక్ట్ నిండుకుండల మారింది. నీటి నిల్వ 73 టీఎంసీలు దాటగానే గేట్లను ఎత్తారు. ముందుగా 9 వరద గేట్లను క్రమంగా ఎత్తి 25 వేల క్యూసెక్కులు వదిలారు. ఆ తరువాత 16, మధ్యాహ్నం ఒంటి గంటకు మొత్తం 24 గేట్లను ఎత్తి నీటి విడుదలను 75 వేల క్యూసెక్కులకు పెంచారు. 2 గంటల సమయానికి 34 వరద గేట్లను ఎత్తి లక్షా 25 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. సాయంత్రం 4 గంటలకు మొత్తం 39 వరద గేట్లు ఎత్తి 2 లక్షల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదిలారు. రాత్రి 8గంటల సమయంలో ఒక గేటును మూసివేశారు. 38 గేట్ల ద్వారా లక్షా 32వేల క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తోంది. ఎస్ఈ శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ.. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వర ద నీటి ఆధారంగా గోదావరిలోకి నీటి విడుదలను చేపడుతామన్నారు. పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూ చించారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్ఈ జగదీశ్, ఏఈఈ రవి, సిబ్బంది పాల్గొన్నారు. నీటి విడుదల వరద కాలువకు నీటి విడుదల పెరిగింది. ఆదివా రం 10 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసిన అధికారులు.. సోమవారం ఉదయం 15 వేలకు ఆ తరువాత 18 వేల క్యూసెక్కులకు పెంచారు. కాకతీయ కాలువ ద్వారా 5 వేల క్యూసెక్కుల నీరు విడుదలవుతుండగా మిషన్ భగీరథ అవసరాలకు 231 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నారు. ఆవిరి రూపంలో 636 క్యూసెక్కుల నీరు పోతోంది. 36 మెగావాట్ల విద్యుదుత్పత్తి.. కాకతీయ కాలువకు 5 వేల క్యూసెక్కులు, ఎస్కేప్ గేట్ల ద్వారా 3 వేల క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతుండటంతో నాలుగు టర్బయిన్ల ద్వారా 36 మెగావాట్ల విద్యుదుత్పత్తి జరుగుతుందని జెన్కో డీఈఈ శ్రీనివాస్ తెలిపారు. జలవిద్యుదుత్పత్తి కేంద్రంలో ఒక్కో టర్బయిన్ ద్వారా 9 మెగావాట్ల విద్యుదుత్పత్తి అవుతుంది. తగ్గిన వరద.. ప్రాజెక్ట్లోకి ఎగువ నుంచి ఇన్ఫ్లో తగ్గుముఖం పట్టింది. లక్షా 52 వేలు కొనసాగిన వరద సోమవారం రాత్రి సమయానికి లక్షా 17 వేల 148 క్యూసెక్కులకు పడిపోయింది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 1091(80.5 టీఎంసీలు) అడుగులు కాగా సోమవారం రాత్రి 1088.90(72.99 టీఎంసీలు) అడుగుల నీరు నిల్వ ఉందని అధికారులు తెలిపారు. పక్షం రోజుల ముందే.. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది పక్షం రోజుల ముందే ఎస్సారెస్పీ గేట్ల ద్వారా నీటి విడుదల ప్రారంభమైంది. గతేడాది సెప్టెంబర్ 2వ తేదీన గేట్లను ఎత్తారు. 2018 నుంచి ప్రతి ఏడాది ప్రాజెక్ట్కు భారీ ఇన్ఫ్లో వస్తుండడంతో గేట్లను ఎత్తుతున్నారు. 2018, 2022, 2023 సంవత్సరంతోపాటు ఈ ఏడాది ఆగస్టులోనే గోదావరిలోకి నీటిని విడుదల చేశారు. నిజాంసాగర్ 13 గేట్లు ఎత్తివేత నిజాంసాగర్(జుక్కల్): వరద పోటెత్తడంతో ఆదివారం అర్ధరాత్రి నిజాంసాగర్ 13 గేట్లను ఎత్తారు. సింగూరు ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయడంతోపాటు హల్దీవాగు, ఘనపురం ఆనకట్ట, పోచారం ప్రాజెక్టు పొంగిపొర్లుతుండటంతో నిజాంసాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. వరద తాకిడితో నిజాం సాగర్ ప్రాజెక్టు ప్రమాదకర స్థాయికి చేరుకోగా అధికారులు అప్రమ త్తమయ్యారు. అర్థరాత్రి ఒంటి గంట న్నర కు నిజాంసాగర్ ప్రాజెక్టు గేట్లను ఎత్తివేశారు. 13 గేట్ల ద్వారా 85 వేల క్యూసెక్కుల నీటిని మంజీరా నదిలోకి వదులుతున్నారు. ప్రాజెక్టు పూ ర్తిస్థాయి నీటిమట్టం 1405 అడుగులు (17.8 టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 1403. 50 అడుగుల (15.667 టీఎంసీలు) నీరు నిల్వ ఉంది. 36 ఏళ్ల తర్వాత.. నేడు నిజాంసాగర్ 20 గేట్లకు ట్రయల్రన్32.2 మి.మీ. వర్షపాతంసుభాష్నగర్: జిల్లావ్యాప్తంగా శనివారం 32.2 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా రుద్రూర్ మండలంలో 162.4 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. గత ఐదారు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు, ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. వర్షాకాలం సీజన్ ప్రారంభమై మూడు నెలలు పూర్తి కావొస్తున్నా.. కేవలం డొంకేశ్వర్, ఇందల్వాయి, కోటగిరిల్లో మాత్రమే అత్యధిక వర్షం కురిసింది. 20 మండలాల్లో సాధారణ, 10 మండలాల్లో లోటు వర్షపాతం నమోదైంది. మరో మూడు రోజులపాటు జిల్లాకు వర్షసూచన ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ప్రాజెక్టులకు పోటెత్తిన వరద ఆదివారం అర్ధరాత్రి నిజాంసాగర్.. సోమవారం ఉదయం ఎస్సారెస్పీ నుంచి నీటి విడుదల నిజాంసాగర్: ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వస్తుండడంతో ముప్పై ఆరేళ్ల తర్వాత నిజాంసాగర్ ప్రాజెక్టు చివరన ఉన్న 20 గేట్లను తెరవనున్నారు. మంగళవారం ఈ గేట్లను ఎత్తి ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. ప్రాజెక్టుకు మూడు చోట్ల కలిపి 48 గేట్లున్నాయి. నిజాంసాగర్కు ఒకవైపు 12, మధ్యలో16, ఇంకోవైపు 20 గేట్లున్నాయి. సాధారణంగా మధ్యలో ఉన్న 16 గేట్లను, అవసరానుగుణంగా ఒకవైపు ఉన్న 12 గేట్లను ఎత్తుతుంటారు. 20 గేట్లను భారీ ఇన్ఫ్లో వచ్చినప్పుడు మాత్రమే ఎత్తుతారు. 1988 సంవత్సరంలో నిజాంసాగర్ ప్రాజెక్టుకు 3 లక్షల క్యూసెక్కులు, 1989 సంవత్సరంలో 4 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. ఆ సమయంలో ఈ 20 గేట్లను ఎత్తి నీటిని మంజీర నదిలోకి విడుదల చేశారు. ప్రస్తుతం భారీ వరద వస్తుండడంతో డ్యాం సేఫ్టీ దృష్ట్యా ఈ 20 గేట్లను ఎత్తాలని నిర్ణయించారు. ఒక్కో గేటును 5 ఫీట్ల మేర లేపి, నీటిని దిగువకు వదులుతూ ట్రయల్ రన్ నిర్వహిస్తామని నీటిపారుదల శాఖ సీఈ శ్రీనివాస్ తెలిపారు. నిపుణుల బృందం గేట్ల పనితీరును పరిశీలిస్తుందన్నారు. నీటి విడుదల నేపథ్యంలో నది పరీవాహక ప్రాంతంలో బోర్లు, పైపులైన్లు, కరెంట్ వైర్లు కలిగి ఉన్న రైతులు వాటిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. చెరువులు, వాగులకు జలకళ -
మానవత్వం చాటారు
వృద్ధురాలికి తినిపిస్తున్న మున్సిపల్ మాజీ చైర్పర్సన్ ఇందుప్రియవృద్ధురాలు శకుంతలతో మాట్లాడుతున్న సీఐ నరహరికామారెడ్డి టౌన్: జిల్లా కేంద్రంలోని రైల్వేస్టేషన్ షెడ్డులో కొన్ని రోజులుగా వర్షంలో తడుస్తూ, చలికి వణుకుతూ ఉంటున్న వృద్ధురాలి దీన స్థితిపై ‘సాక్షి’ దినపత్రిక మెయిన్పేజీలో సోమవారం ‘అనాథగా అమ్మ’ శీర్షికన కథనం ప్రచురితమైంది. దీంతో కథనాన్ని చదివి ఏఎస్పీ చైతన్యారెడ్డి చలించిపోయారు. ఆ వృద్ధురాలికి అన్ని విధాలుగా సహాయం చేసి, పూర్తి వివరాలు సేకరించాలని పట్టణ సీఐ నరహరిని ఆదేశించారు. దీంతో సీఐ నరహరి సోమవారం ఉదయం వృద్ధురాలు శంకుతల ఉన్న చోటికి వెళ్లి వివరాలను సేకరించి ఏఎస్పీకి తెలిపారు. మున్సిపల్ మాజీ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ సైతం సాక్షి కథనానికి స్పందించి మానవత్వం చాటారు. వృద్ధురాలి వద్దకు వెళ్లి స్వయంగా భోజనం తినిపించారు. దుస్తులు ధరింపజేసి, దుప్పటి అందజేశారు. పోలీసులతో కలిసి ఆటోలో వృద్ధురాలిని జీజీహెచ్కు తీసుకెళ్లారు. వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని తెలిపారు. వృద్ధురాలి దీనస్థితిపై కథనం రాసిన ‘సాక్షి’కి ఏఎస్పీ, పట్టణ సీఐ, మున్సిపల్ మాజీ చైర్పర్సన్తోపాటు పలువురు అభినందనలు తెలిపారు. ‘సాక్షి’ కథనానికి స్పందించిన ఏఎస్పీ చైతన్యరెడ్డి ‘అనాథగా అమ్మ’ వివరాలు సేకరించాలని సీఐకి ఆదేశం ఆస్పత్రికి తరలించి వైద్యమందేలా చేసిన మున్సిపల్ మాజీ చైర్పర్సన్ -
బేస్బాల్ పోటీల్లో ఇందూరు మహిళలు ఫస్ట్
● తృతీయ స్థానంలో నిలిచిన బాలుర జట్టు నిజామాబాద్నాగారం: రాష్ట్రస్థాయి బేస్బాల్ పోటీల్లో నిజామాబాద్ మహిళల జట్టు ప్రథమ స్థానంలో నిలిచింది. ఆదిలాబాద్ జిల్లాలో ఈ నెల 16, 17 తేదీల్లో 5వ తెలంగాణ సీనియర్ బేస్బాల్ మహిళల, పురుషుల పోటీలు నిర్వహించారు. మహిళల విభాగంలో నిజామాబాద్, హైదరాబాద్ జట్లు ఫైనల్స్లో తలపడాల్సి ఉండగా వర్షం కారణంగా రెండు జట్లను విజేతలుగా ప్రకటించారు. పురుషుల విభాగంలో జిల్లా జట్టు తృతీయ స్థానంలో నిలిచింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర బేస్బాల్ జనరల్ సెక్రెటరీ శ్వేతా, ట్రెజరర్ డాక్టర్ కె.కృష్ణ, ఆదిలాబాద్ బేస్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు కాలా శ్రీనివాస్ బహుమతులు ప్రదానం చేశారు. టోర్నీలో బెస్ట్ క్యాచర్ అవార్డును సుద్దపల్లిలోని టీఎస్డబ్ల్యూఆర్ఐఎస్కు చెందిన లిఖిత అందుకున్నారు. విజేతలను జిల్లా బేస్బాల్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి ఎల్ మధుసూదన్ రెడ్డి, సొప్పరి వినోద్, వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు హన్మంత్ రెడ్డి, మల్లేశ్ గౌడ్ తదితరులు అభినందించారు. -
సాకు చూపి.. మాట మార్చి
● సీడ్ రకం పండించిన రైతులకు తగ్గిన ఆదాయం ● సర్కారు బోనస్ ఇవ్వలేదంటూ అదనపు డబ్బులు చెల్లించని వ్యాపారులుమోర్తాడ్(బాల్కొండ): ప్రభుత్వం యాసంగిలో కొనుగోలు చేసిన సన్నరకాలకు బోనస్ ఇవ్వలేదనే సాకును చూపుతున్న సీడ్ కంపెనీలు కూడా అదనంగా చెల్లిస్తామన్న సొమ్ము విషయంలో మాట తప్పుతున్నాయి. ప్రభుత్వం బోనస్ ఇస్తేనే తాము కూడా అదనపు సొమ్మును చెల్లిస్తామని లేకుంటే ఇవ్వబోమని కంపెనీలు స్పష్టం చేస్తుండటంతో సీడ్ రకం వరి సాగు చేసిన రైతులకు లాభం తగ్గింది. సీడ్ కంపెనీల కోసం ప్రత్యేక శ్రద్ధ సాధారణ రకాలను సాగు చేసే రైతులు సీడ్ కంపెనీల కోసం వరి సాగు చేస్తే మాత్రం ఎక్కువ శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. విత్తనం కొనుగోలుకు ఎక్కువ ధర చెల్లించడమే కాకుండా సీడ్ ధాన్యం ఎండబెట్టడంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటారు. కొనుగోలు కేంద్రాల్లో విక్రయించే ధాన్యంలో తేమ శాతం 12 ఉంటేనే సరిపోతుంది. సీడ్ కంపెనీలకు మాత్రం 18శాతం తేమ తక్కువ ఉండేలా చూసుకోవాల్సి ఉంటుంది. బెరుకులు లేకుండా ధాన్యంను జల్లెడ పట్టి సంచుల్లో నింపుతారు. సీడ్ రకానికి, సాధారణ రకం వరి ధాన్యం సాగు చేసేందుకు తేడా ఉన్నా కంపెనీలు మాత్రం ప్రభుత్వం బోనస్ ఇవ్వకపోవడాన్ని సాకుగా చూపుతూ అదనపు సొమ్ము చెల్లించకుండా మొండికేయడంపై రైతులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.మోర్తాడ్కు చెందిన రైతు ఏనుగు రాజేశ్వర్కు సంబంధించిన 145 క్వింటాళ్ల ధాన్యానికి రూ.500ల చొప్పున, రూ.72,500లను సీడ్ కంపెనీ యాజమాన్యం జమ చేయాల్సి ఉంది. -
గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒకరి మృతి
నస్రుల్లాబాద్ : గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒకరు మృతి చెందినట్లు ఎస్సై రాఘవేంద్ర తెలిపారు. మండలంలోని నాచుపల్లి గ్రామానికి చెందిన జల్ల నర్సింలు(52) కామిశెట్టిపల్లిలో దినసరి కూలీగా పనిచేస్తున్నాడు. ఆదివారం రాత్రి పని ముగించుకొని జాతీయ రహదారి 765డీ పై సైకిల్ నడుపుతూ వెళుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టింది. స్థానికులు గమనించి కుటుంబసభ్యులకు తెలుపగా నర్సింలును బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యుడు అప్పటికే నర్సింలు మరణించినట్లు నిర్ధారించారు. భార్య సునీత ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. కుంటలో పడి ఒకరు.. నవీపేట: మండలంలోని ఫకీరాబాద్ గ్రామానికి చెందిన బోడాసు ఎల్ల య్య (50) ప్రమాదవశాత్తు నీటికుంటలో పడి మృతి చెందినట్లు ఎస్సై తి రుపతి సోమవారం తెలిపారు. చెరువులోని పూలను అమ్ముకొని జీవనం సాగించే ఎల్లయ్య ఈ నెల 10న ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. సో మవారం ఉదయం ఫకీరాబాద్ సమీపంలోని కుంటలో ఎల్లయ్య మృతదేహం కనిపించింది. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. వర్ని: మండలంలోని హుమ్నాపూర్ గ్రామంలో తాళం వేసిన ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడినట్లు ఎస్సై మహేశ్ తెలిపారు. డీకొండ శ్యామల ఇంట్లో ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి పరుపు కింద దాచిన రూ.10 వేలు ఎత్తుకెళ్లినట్లు పేర్కొన్నారు. నిజామాబాద్ లీగల్: కులం పేరుతో దూషించి, ఇంటిని కూల్చిన కేసులో ఆరుగురికి నిజామాబాద్ ఎస్సీ, ఎస్టీ కోర్టు జడ్జి టీ శ్రీనివాస్ ఐదేళ్ల జైలు శిక్షతోపాటు జరిమానా విధిస్తూ సోమవారం తీర్పు వెలువరించారు. వివరాలు ఇలా ఉన్నాయి. మోర్తాడ్ మండలం రామన్నపేట్ గ్రామానికి చెందిన పత్రి పోశన్న తన చిన్నమ్మ, చిన్న నాన్నలకు పిల్లలు లేకపోవడంతో వృద్ధాప్యంలో సేవలు చేశాడు. దీంతో వారు తమ తదనంతరం ఇంటిని పోశన్నకు ఇచ్చారు. ఐతే, ఆ ఇంటిపై తనకు హక్కు ఉందని విజయ అనే మహిళ పోశన్న కుటుంబసభ్యులతో గొడవపెట్టుకుంది. రావుట్ల గ్రామానికి చెందిన బాజిరెడ్డి రమాకాంత్, పిప్రి గ్రామానికి చెందిన అరిగెల జనా ర్దన్, కొంపల్లి మల్లేశ్, భీమ్గల్ గ్రామానికి చెందిన గంగాధర్, రాధ, రామన్నపేట్కి చెందిన విజయలు 2015 జూన్ 19న పొక్లెయిన్తో పోశన్న ఇంటిన కూల్చి వేసి, కులం పేరుతో దూషించారు. దీంతో పోశన్న కుటుంబసభ్యులు మోర్తాడ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆరుగురిపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను కోర్టుకు పంపారు. కేసులో సాక్ష్యాధారాలను పరిశీలించిన కోర్టు రమాకాంత్, జనార్దన్, మల్లేశ్లకు రూ.ఐదు వేల జరిమానా, ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. ఎస్సీలైన గంగాధర్, విజయ, రాధలకు ఐదేళ్ల జైలుశిక్షతోపాటు రూ.3వేల జరిమానా విధించారు. కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్గా బంటు వసంత్ వాదించారు. ఖలీల్వాడి: నిజామాబాద్ టాస్క్ఫోర్స్ను సీసీఎస్లో కలిపినట్లు పోలీస్వర్గాల ద్వారా తెలిసింది. జిల్లాలో పేకాట, రేషన్ బియ్యం, ఇసుక అక్రమ రవాణా, మొరం దందాలు, మట్కా స్థావరాలపై టాస్క్ఫోర్స్ దాడులు చేసేది. ఐతే, ఈ విభాగాన్ని సీసీఎస్ చూడనున్నట్లు తెలిసింది. సీఐ, ఎస్సై, ఎనిమిది మంది కానిస్టేబుళ్లు పనిచేసే టాస్క్ఫోర్స్కు సరైన సమాచారం రావడం లేద నే ఉద్దేశంతో తాత్కాలికంగా తీసివేసినట్లు సమాచారం. గతంలో సీపీగా కల్మేశ్వర్ ఉన్న సమయంలో సిబ్బందిపై ఆరోపణలు రావడంతో వారిపై బది లీ వేటు వేశారు. కొన్ని నెలలపాటు టాస్క్ఫోర్స్ ఎలాంటి కార్యక్రమాలూ చేపట్టలేదు. సీపీగా పోతరాజు సాయిచైతన్య వచ్చిన తర్వాత టాస్క్ఫోర్స్కు సిబ్బందిని కేటాయించారు. దీంతో టాస్క్ఫోర్స్ మళ్లీ ప్రారంభమైంది. కాగా, టాస్క్ఫోర్స్ చేసే పనులను ప్రస్తుతం సీసీఎస్ ద్వారా చేయనున్నట్లు తెలుస్తోంది. -
ఎస్సారెస్పీ ఎస్ఈగా బాధ్యతల స్వీకరణ
బాల్కొండ: శ్రీరాంసాగర్ జలాశయం సూపరింటెండెంట్ ఇంజినీర్గా జగదీశ్ సోమవారం కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. మొన్నటి వరకు శ్రీనివాస్ గుప్తా ఇన్చార్జి ఎస్ఈగా కొనసాగారు. కాగా, ఇద్దరు ఎస్ఈలను టీఎన్జీవోస్ నాయకులు, అధికారులు, సిబ్బంది ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ప్రా జెక్ట్ ఈఈ చక్రపాణి, డిప్యూటీ ఈఈలు, ఏఈ ఈలు తదితరులు పాల్గొన్నారు. బాల్కొండ: వరద పెరిగే అవకాశం ఉందని, అప్రమత్తంగా ఉండాలని ఈఈ చక్రపాణి సి బ్బందికి సూచించారు. ప్రాజెక్టుపై సోమవారం సిబ్బందితో వారు మాట్లాడి పలు సూచనలు చేశారు. ఎప్పటికప్పుడు నీటమట్టంపై దృష్టి సారించాలని, గేట్ల ఆపరేటింగ్ సరిగా చేపట్టాలన్నారు. వారి వెంట ప్రాజెక్ట్ ఏఈఈలు తదితరులు ఉన్నారు. బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి మి గులు జలాలను గోదావరిలోకి విడుదల చేసేందుకు నిర్మించిన 42 వరద గేట్లలో 40 వరద గేట్కు మోటార్ బిగించడాన్ని సంబంధిత అధికారులు మరిచిపోయారు. సోమవారం వరద గేట్లను ఎత్తినప్పటికీ మోటార్ లేకపోవడంతో 40వ గేటును ఎత్తలేదు. గత మూడు రోజులుగా వరదలు వచ్చి ప్రాజెక్ట్ నిండుకుండల మారుతోందని తెలిసినా అధికారులు మో టార్ గురించి పట్టించుకోలేదు. చాలా రోజులపాటు మరమ్మతులకు నోచుకోక వరద గేట్లు మొరాయించారు. ప్రస్తుతం మరమ్మతులు చేసినప్పటికీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా పని చేయడం లేదు. -
గంటగంటకు పెరిగిన వరద
బోధన్/రెంజల్: మంజీ ర, గోదావరి నదులు ఉ ప్పొంగుతున్నాయి. సో మవారం సాయంత్రం 4 గంటలకు సాలూర శివారులోని పాత వంతెన పైనుంచి మంజీర ప్రవ హించింది. వరద ఉధృతి సోమవారం రాత్రి వేళ మరింత పెరిగే అవకాశం ఉంది. పాత వంతెన మీదుగా రాకపోకలు సాగించకుండా నది అవతలి వైపు మహారాష్ట్ర అధికారులు మట్టివేసి రోడ్డును మూసివేశారు. సాలూర తహసీల్దార్ శశిభూషణ్ మంజీరను సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. మహారాష్ట్రతోపాటు నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి వరద పోటెత్తడంతో కందకుర్తి వద్ద గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తోంది. అంతర్రాష్ట్ర వంతెనను ఆనుకుని ప్రవహిస్తోంది. గంటగంటకూ వరద పెరుగుతోందని అధికారులు పేర్కొన్నారు. -
ఏ వాహనానికి ఏ నెంబర్ ప్లేట్
మీకు తెలుసా? ప్రతి వాహనానికి నెంబర్ ప్లేట్ ఉంటుంది. నెంబర్ ప్లేట్ లేకుండా వాహనాన్ని తిప్పుతూ పోలీసులకు పట్టుబడితే జరిమానా వేస్తారు. వాహనాలకు వివిధ రంగుల్లో నెంబర్ ప్లేట్లు కనిపిస్తాయి. అసలు ఏ రంగు నెంబర్ ప్లేట్ ఏ వాహనాలకు కేటాయిస్తారో తెలుసుకుందాం. తెలుపు రంగు: ఈ నంబర్ ప్లేట్ వ్యక్తిగత వాహనాలకు ఇస్తారు. ఈ ప్లేటు కలిగిన వాహనాలను కమర్షియల్గా ఉపయోగించరాదు. పసుపు రంగు : ట్యాక్సీలు, ఆటోలు వంటి ప్రయాణికులను తరలించే వాహనాలకు ఈ నంబర్ ప్లేట్ను వాడతారు. ఆకుపచ్చ : ఎలక్ట్రిక్ వాహనాలకు ఈ రంగు ఉన్న నంబరు ప్లేట్లను ఏర్పాటు చేస్తారు. ఎరుపు : ఈ రంగు నంబర్ ప్లేట్లు రాష్ట్రపతి, గవర్నర్ వాహనాలకు మాత్రమే కనిపిస్తాయి. మధ్యలో జాతీయచిహ్నం ఉంటుంది. నలుపు : విలాసవంతమైన హోటళ్లలకు చెందిన వారి వాహనాలకు ఉపయోగిస్తారు. నీలం రంగు : విదేశీ దౌత్యవేత్తలు ఉపయోగించే వాహనాలకు ఈ రంగు నంబర్ ప్లేట్లు ఉంటాయి. బాణం గుర్తు : ఈ నెంబర్ ప్లేట్లు సైనిక అవసరాలకు ఉపయోగిస్తారు. ఇవి రక్షణ శాఖకు రిజిస్టేషన్ అయి ఉంటాయి. ఈ నంబర్ ప్లేట్లలో ఫస్ట్ లేదా రెండో అక్షరం తర్వాత బాణం గుర్తు ఉంటుంది. బాణం గుర్తు అనంతరం వచ్చే సంఖ్య వాహనం కొనుగోలు చేసిన సంవత్సరాన్ని గుర్తు చేస్తుంది. తర్వాత బేస్ కోడ్, సీరియల్ నంబరు, చివరిది వెహికల్ క్లాస్ను వివరిస్తుంది. భారతదేశం సిరీస్ : నెంబర్ ప్లేట్పై బీహెచ్ అని ఉంటే ఆ వాహనం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినదిగా గుర్తించవచ్చు. నాలుగు అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో తమ సీఎంసీలో ఉన్న కార్పొరేట్ ఉద్యోగులు ఈ నెంబర్ ప్లేట్కు దరఖాస్తు చేసుకోవాలి. నంబర్ ప్లేట్ లేకుంటే : వాహనానికి నెంబర్ ప్లేట్ లేకుండా ప్రయాణిస్తే వారిపై సెక్షన్ 171 కింద ఆర్టీఏ, ట్రాఫిక్, పోలీసులు చర్యలు తీసుకుంటారు. మొదటిసారి పట్టుబడితే రూ.200, రెండోసారికి రూ.500 జరిమానా విధిస్తారు. మూడోసారి చిక్కితే వాహనాన్ని స్వాధీనం చేసుకునే అవకాశం ఉంటుంది. – ఖలీల్వాడి -
యూరియా పక్కదారి పట్టించే వారిపై ఉక్కుపాదం
సుభాష్నగర్: యూరియాను పక్కదారి పట్టించే వారిపై ఉక్కుపాదం మోపాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి రామకృష్ణారావు అన్నారు. సచివాలయం నుంచి వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్, సంచాలకులు గోపి తదితరులతో కలిసి వారు సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. యూరియా నిల్వలు, పంపిణీ తీరుతెన్నులను సమీక్షించి కలెక్టర్కు దిశానిర్దేశం చేశారు. వ్యవసాయ, ఇతర శాఖల అధికారులతో టాస్క్ఫోర్స్ బృందాలు నియమించి యూరియా దుర్వినియోగం కాకుండా నిఘా ఉంచాలని మంత్రి తుమ్మల సూచించారు. గతేడాదితో పోలిస్తే ఈ సీజన్లో ఇదే సమయానికి లక్ష మెట్రిక్ టన్నుల యూరియా ఎక్కువగా పంపిణీ చేశామని తెలిపారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి కనీసం 3 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు రావాల్సి ఉందని, దీన్ని దృష్టిలో పెట్టుకుని అందుబాటులో ఉన్న ఎరువులను, ప్రత్యేకించి యూరియా నిల్వలు సజావుగా పంపిణీ చేసేలా ప్రణాళికా బద్ధంగా చర్యలు చేపట్టాలని అన్నారు. సహకార సంఘాలు, ప్రైవేట్ డీలర్ల వారీగా ఉన్న యూరియా నిల్వలను నిరంతరం పరిశీలించి, అవసరమున్న ప్రాంతాలకు సర్దుబాటు చేయాలని సూచించారు. యూరియాను వ్యవసాయేతర అవసరాలకు వినియోగించకుండా తనిఖీలు చేయాలని మంత్రి ఆదేశించారు. పొరుగు రాష్ట్రాలకు తరలకుండా చెక్పోస్ట్లను ఏర్పాటు చేయాలన్నారు. అక్రమ రవాణాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, పోలీసు శాఖ క్రియాశీలక పాత్ర పోషించాలని సూచించారు. సరిహద్దులు దాటొద్దు జిల్లాలో ఎరువుల కొరత తలెత్తకుండా రైతుల అవసరాలకు సరిపడా నిల్వలను అందుబాటులో ఉంచామని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి స్పష్టంచేశారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం సీపీ సాయి చైతన్యతో కలిసి అధికారులతో సమీక్షించారు. ఒక్క బస్తా కూడా జిల్లా సరిహద్దులు దాటకుండా గట్టి నిఘా సారించాలన్నారు. ట్రెయినీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావి, డీఏవో జె గోవిందు, డీసీవో శ్రీనివాస్, ఇండస్ట్రీస్ జిల్లా జనరల్ మేనేజర్ సురేశ్ కుమార్, డీఎంవో గంగుబాయి, ఆర్టీవో ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయేతర అవసరాలకు వినియోగిస్తే కఠినచర్యలు వీసీలో వ్యవసాయశాఖమంత్రి మంత్రి తుమ్మల, సీఎస్ -
ప్రజావాణికి 52 ఫిర్యాదులు
సుభాష్నగర్: ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 52 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు తమ సమస్యలను కలెక్టర్తోపాటు అదనపు కలెక్టర్ అంకిత్, ట్రెయినీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావీ, జెడ్పీ సీఈవో సాయాగౌడ్, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్కుమార్, డీపీవో శ్రీనివాస్, మెప్మా పీడీ రాజేందర్, ఏసీపీ వెంకటేశ్వర్ రావులకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో ఫిర్యాదుదారులు లేక ప్రజావాణి వెలవెలబోయింది. ఆర్సీవో కార్యాలయాలు ఏర్పాటు చేయాలి గురుకులాలకు సంబంధించిన ఆర్సీవో కార్యాలయాలను జిల్లాకేంద్రంలో ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ప్రజావాణిలో వినతిపత్రం అందజేశా రు. అనంతరం రాజేశ్వర్ మాట్లాడుతూ మూడు జి ల్లాలకు సంబంధించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గు రుకులాల ఆర్సీవో కార్యాలయాలు రూరల్ ప్రాంతంలో ఉన్నాయన్నారు. అందరికీ అందుబాటు లో ఉండేలా చూడాలని కోరారు. కలెక్టర్ సానుకూలంగా స్పందించారని తెలిపారు. నాయకులు మనోజ్, సాయికిరణ్, రాకేశ్ పాల్గొన్నారు. -
అతి తక్కువ ఫీజుతో వైద్యం అందిస్తాం
నిజామాబాద్నాగారం: అనుభవజ్ఞులు, వైద్య నిపుణుల బృందంతో ఇంటిగ్రేటెడ్ మెడికల్ సైన్సెస్ – రీసెర్చ్(ఐఎంఎస్ఆర్) ప్రైవేట్ లిమిటెడ్ను స్థాపించిన తాము.. క్రిస్టియన్ మెడికల్ కళాశాల, ఆస్పత్రిని ప్రారంభించేందుకు సీఎస్ఐతో ఒప్పందం చేసుకున్నామని చైర్మన్ షణ్ముఖ మహాలింగం తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఐఎంఎస్ఆర్ ఆధ్వర్యంలో డిచ్పల్లిలోని సీఎంసీని పున:ప్రారంభించేందుకు వివిధ దశల్లో రూ.200 కోట్లు పెట్టుబ డి పెట్టేందుకు 2024లో ముందుకు వచ్చామన్నారు. 500 పడకల సీఎంసీ ఆస్పత్రిని మే 25వ తేదీన రాష్ట్ర అధికారుల ఆమోదంతో ప్రజల కోసం తిరిగి ప్రారంభించామని తెలిపారు. డాక్టర్ అజ్జ శ్రీ నివాస్ అనే వ్యక్తి తనను ఇండియన్ మెడికల్ అసో సియేషన్ నిజామాబాద్ అధ్యక్షుడిగా పరిచయం చేసుకుని వచ్చాడని, తనకు 200 మంది వైద్యుల నెట్ వర్క్ ఉందని చెప్పి 30 మందిని నియమించాడన్నారు. డాక్టర్లు అజ్జ శ్రీనివాస్, మంత్రి సుమంత్, ఎల్.పాండు, సుమన్కుమార్, సుర్దానీ ఇష్టరాజ్యాంగా వ్యవహారించారని ఆవేదన వ్యక్తం చేశారు. వైద్య పరికరాల కోసం ఐఎంఎస్ఆర్ రూ.92 లక్షలు (చె క్కు)ఇవ్వగా.. కొంత పాత పరికరాలను కొనుగోలు చేశారని తెలిపారు. ఇంకా రూ.72లక్షల విలువైన సామగ్రి అందివ్వలేదని తెలిపారు. ఆ తరువాత అజ్జ శ్రీనివాస్ను జూన్ 10వ తేదీన తొలగించామని, హైపవర్ కమిటీ చివరకు అజ్జ శ్రీనివాస్ సర్టిఫికెట్లపై కూడా అనుమానాలు వ్యక్తం చేసిందన్నారు. త్వరలోనే ప్రభుత్వ అనుమతులతో సీఎంసీని ప్రారంభించి ప్రజలకు అతి తక్కువ ఫీజులతో మె రుగైన వైద్య సేవలు అందిస్తామని అన్నారు. సీఎంసీని ప్రారంభించేందుకు సీఎస్ఐతో ఒప్పందం వివిధ దశల్లో రూ.200 కోట్ల పెట్టుబడి అజ్జ శ్రీనివాస్ను డైరెక్టర్ పదవి నుంచి తొలగించాం సీఎంసీ చైర్మన్ షణ్ముఖ మహాలింగం -
అలీసాగర్ రిజర్వాయర్ గేట్ల ఎత్తివేత
బోధన్: ఎడపల్లి మండలంలోని ఠాణాకలాన్ గ్రామ శివారులో ఉన్న అలీసాగర్ రిజర్వాయర్ కు భారీ వరద రావడంతో రెండు గేట్లను ఎత్తా రు. రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటి నిల్వ సామ ర్థ్యం 1299.6 ఫీట్లుకాగా సోమవారం ఉదయం వరకు 1298.6 ఫీట్ల మేర నీరు చేరింది. దీంతో రెండు వరద గేట్లు ఎత్తి 1000 క్యూసెక్ల నీటిని దిగువ ఉన్న నిజాంసాగర్ ప్రాజెక్టు డి–50 కాలువలోకి వదిలారు. నీటిపారుదల శాఖ అధికారులు ఎప్పటికప్పుడు రిజర్వాయర్ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఉదయం నుంచి వరద గేట్ల ద్వారా నీటి విడుదల కొనసాగుతోంది. -
పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన వీసీ, రిజిస్ట్రార్
తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీలో పీజీ, ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సుల 2, 4వ సెమిస్టర్ పరీక్షలు సోమవారం రెండోరోజు కొనసాగాయి. క్యాంపస్లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల పరీక్ష కేంద్రాన్ని వర్సిటీ వీసీ ప్రొఫెసర్ టీ యాదగిరిరావు, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం యాదగిరి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షల ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. వారి వెంట కళాశాల ప్రిన్సిపల్ మామిడాల ప్రవీణ్, కంట్రోలర్ ప్రొఫెసర్ కే సంపత్కుమార్, ఆడిట్ సెల్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఘంటా చంద్రశేఖర్, అడ్మిషన్స్ డైరెక్టర్ వాసం చంద్రశేఖర్ ఉన్నారు. ఉదయం జరిగిన పీజీ పరీక్షలకు 2,357మంది విద్యార్థులకు గాను 2,228 మంది హాజరుకాగా 129 మంది గైర్హాజరైనట్లు ఆడిట్సెల్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. మధ్యాహ్నం జరిగిన బీఈడీ, బీపీఎడ్ పరీక్షలకు 1,487 మంది విద్యార్థులకు గాను 1,418మంది హాజరుకాగా 69 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. -
సర్వాయి పోరాట స్ఫూర్తితో ముందుకెళ్లాలి
సుభాష్నగర్: సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కొనసాగించిన పోరాట స్ఫూర్తితో ముందుకెళ్లాలని వక్త లు పిలుపునిచ్చారు. జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సర్వాయి పాపన్నగౌడ్ జయంతిని సో మ వారం ఘనంగా నిర్వహించారు. వినాయక్నగర్లోని ఆయన విగ్రహానికి కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి తదితరులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం న గరంలోని న్యూ అంబేడ్కర్ భవన్లో నిర్వహించిన వేడుకల్లో వక్తలు మాట్లాడారు. రాచరిక వ్యవస్థ కొనసాగుతున్న ఆ రోజుల్లో కులవృత్తిని నమ్ముకుని జీవిస్తున్న ఓ సా ధారణ వ్యక్తి వృత్తిపై పన్ను విధించడాన్ని వ్యతిరేకిస్తూ పోరాటం చేయడం ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయమని కొనియాడారు. అదనపు కలెక్టర్ అంకిత్, బీసీ సంక్షేమ శాఖ అధి కారి నర్సయ్య, బీసీ సంఘాల నాయకులు నరాల సుధాకర్, రాజ నరేందర్ గౌడ్, ఆదె ప్రవీణ్, మారయ్య గౌడ్, జయసింహాగౌడ్, వెంకటేశ్వర్గౌడ్, గౌడ సంఘాల ప్రతినిధులు, గీత వృత్తిదారులు పాల్గొన్నారు. ప్రజలను అప్రమత్తం చేయండి రెంజల్(బోధన్): గోదావరి, మంజీర పరీవాహక గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలని సీపీ సాయి చైతన్య సూచించారు. మండలంలోని కందకుర్తి పుష్కరక్షేత్రంతోపాటు అంతర్రాష్ట్ర వంతెన పైనుంచి సోమ వారం గోదావరి ప్రవాహాన్ని పరిశీలించారు. రానున్న రెండు, మూడు రోజులు అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతవరణ శాఖ అధికారులు ప్రకటించారని గుర్తుచేశారు. నదుల వైపు వెళ్లకుండా గ్రామాల్లో దండోరా వేయించాలని సూచించారు. అత్యవసర సమయాల్లో డయల్ 100 లేదా పోలీస్ కంట్రోల్ రూమ్ 87126 59700 నంబర్లకు కాల్ చేసే లా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. రెవెన్యూ, పోలీసు, వ్యవసాయ శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఆయన వెంట ఏసీపీ శ్రీనివాస్, రూరల్ సీఐ విజయ్బా బు, రెంజల్ ఎస్సై చంద్రమోహన్, ఇన్చార్జి వ్యవసాయాధికారి సిద్ధి రామేశ్వర్ ఉన్నారు. ఈ నెల 20నుంచి డిచ్పల్లి రైల్వే గేటు మూసివేత డిచ్పల్లి(నిజామాబాద్రూరల్): మరమ్మతులు చేపట్టనున్న నేపథ్యంలో మండల కేంద్రం నుంచి ఘన్పూర్, ఖిల్లా డిచ్పల్లి, దూస్గాం, ముల్లంగి(ఐ), గ్రామాలకు వెళ్లే దారిలో ఉన్న రైల్వే గేటు (నెంబర్ 196టీ)ను నాలుగు రోజులపాటు మూసివేయనున్నట్లు రైల్వే శాఖ అధికారులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 20న అర్ధరాత్రి 12 గంటల నుంచి 24వ తేదీ రాత్రి 11 గంటల వరకు గేటు మూసి వేసి ఉంటుందని పేర్కొన్నారు. వాహనదారులు డిచ్పల్లి స్టేషన్, నాగ్పూర్ గేట్, 44వ నంబర్ జాతీయ రహదారిపై 7వ బెటాలియన్ లక్ష్మీవేంకటేశ్వర ఆలయం మీదుగా ఘన్పూర్ గ్రామానికి చేరుకోవాలని సూచించారు. అలాగే ఘన్పూర్ నుంచి బొమ్మల గుండు హనుమాన్ మందిరం, 44వ నంబర్ జాతీయ రహదారి, పోలీస్ స్టేషన్ మీదుగా డిచ్పల్లి స్టేషన్కు చేరుకోవాలని పేర్కొన్నారు. ఆర్మూర్: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణనిచ్చేందుకు రెండు అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ (ఏటీసీ)లను మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభు త్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్మూర్ మండల కేంద్రంతోపాటు బాన్సువాడ పరిధిలోని వర్నిలో రూ.45 కోట్ల వ్య యంతో కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు పరిపాలన అనుమతులతో కూడిన ఉత్తర్వులు విడుదలయ్యాయి. కార్మిక ఉపాధి శిక్షణ, కర్మాగారాల విభాగంతోపా టు టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ (టీటీఎల్) సహకారంతో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ అసెంబ్లీ నియోజకవర్గాలలో 46 ఏటీసీల ఏర్పాటుకు ఉత్తర్వులు అయ్యాయి. అందులో భా గంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు రెండు కేంద్రాలు మంజూరు కావడంపై యువత హర్షం వ్యక్తం చేస్తున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్గౌడ్ ప్రత్యేక చొరవతో ఈ ఏటీసీల ఏర్పాటుకు నిధులు మంజూరు చేయడంపై ఆయా నియోజకవర్గాల కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
రెండు పంటలకూ భరోసా
బాల్కొండ: శ్రీరాంసాగర్ జలాశయం ఆయకట్టు రైతుల్లో భరోసా నింపింది. మొన్నటి వరకు ఖరీఫ్ పంటలకు మాత్రమే నీరందుతుందని అనుకున్న రైతులకు మూడు రోజుల వ్యవధిలో వచ్చిన వరద యాసంగి సీజన్పై నమ్మకం పెంచింది. జూన్, జూలై నెలల్లో అంతంతగా వరద రావడంతో ప్రాజెక్ట్ నుంచి ఆయకట్టుకు నీటి విడుదలపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ పరిస్థితుల్లో ఖరీఫ్ పంటల కోసం నాలుగు తడులు అందించేందుకు ప్రాజెక్ట్ అధికారులు నీటి విడుదల ప్రారంభించారు. అప్పటి నుంచి ప్రాజెక్ట్లోకి స్వల్పంగా వరద వచ్చి చేరుతోంది. గత మూడు రోజుల నుంచి వరద ఉధృతి పెరడగంతో ప్రాజెక్ట్ నిండుకుండలా మారింది. దీంతో ప్రాజెక్టు నుంచి మిగులు జలాలను గోదావరిలోకి వదులుతున్నారు. కాగా, ఎగువ ప్రాంతాల నుంచి అక్టోబర్ 28 వరకు వరద వచ్చే అవకాశం ఉంది. దీంతో యాసంగి సీజన్ ప్రారంభమయ్యే వరకు ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టంతో నిండుకుండలా ఉండే అవకాశం ఉంది. రెండో పంటకు సైతం భరోసా కలగడంపై ఆయకట్టు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 75.73 టీఎంసీల వరద ప్రస్తుత సంవత్సరం జూన్ 1 నుంచి ఇప్పటి వరకు ప్రాజెక్ట్లోకి 75.73 టీఎంసీల వరద నీరు చేరింది. జూన్లో 4.48 టీఎంసీలు, జూలైలో 24.49 టీఎంసీలు, ఆగస్టులో (ఇప్ప టి వరకు) 46.76 టీఎంసీల వరద వచ్చింది. ఇప్పటి వరకు ఆవిరి రూపంతోపాటు కాలువ ల ద్వారా, తాగునీటి అవసరాలకు 10.44 టీఎంసీల నీటి విడుదల చేపట్టారు. నిండుకుండలా ఎస్సారెస్పీ ఆయకట్టు రైతుల హర్షం -
సోలార్ ప్లేట్ల ఏర్పాటుకు నివేదికలు సమర్పించాలి
● కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డిసుభాష్నగర్: ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థల భవనాలపై సోలార్ విద్యుత్ ప్లేట్ల ఏర్పాటుకు మంగళవారం సాయంత్రంలోపు ఆయా శాఖల వారీగా నివేదికలు రూపొందించి సమర్పించాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సౌర విద్యుత్ పలకలు ఏర్పాటు విషయమై అధికారులకు సూచనలు చేశారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలు, వసతిగృహాలు, గురుకులాల భవనాలతోపాటు నీటి పారుదల, మిషన్ భగీరథ శాఖలకు చెందిన ఖాళీ స్థలాల్లో సౌర విద్యుత్ పలకలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంకల్పించిందన్నారు. అందులో భాగంగా ఆయా శాఖల అధికారులు సౌర విద్యుత్ పలకల ఏర్పాటుకు వీలున్న ప్రభుత్వ కార్యాలయాల భవనాల పూర్తి వివరాలను నిర్దేశిత నమూనాలో పొందుపరుస్తూ, మంగళవారం సాయంత్రంలోపు సమర్పించాలని సూచించారు. సౌర విద్యుత్ పలకల ఏర్పాటుకు కావలసిన వైశాల్యం, విద్యుత్ కనెక్షన్ తదితర వివరాలను అందించాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ అంకిత్, ట్రెయినీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావీ, డీఆర్డీవో సాయాగౌడ్, డీపీవో శ్రీనివాస్, మెప్మా పీడీ రాజేందర్, ఏసీపీ వెంకటేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు. చేపపిల్లల పెంపకంపై ప్రత్యేక దృష్టిసుభాష్నగర్: మత్స్య కార్మిక కుటుంబాల ఉపాధిని మెరుగుపర్చి, వారిని ఆర్థికంగా మరింత బలోపేతం చేసేందుకు నాణ్యమైన చేపపిల్లల పెంపకంపై దృష్టి కేంద్రీకరించాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్లో మత్స్యశాఖ పనితీరుపై ఆయన సమీక్షించారు. మత్స్య అభివృద్ధి పథకం కింద 2024–25 సంవత్సరానికి వంద శాతం సబ్సిడీపై 799 చెరువులు, రిజర్వాయర్లలో కోటీ 92 లక్షల చేపపిల్లలను విడుదల చేశామన్నారు. ఈ ఏడాది 967 చెరువుల్లో 4.5 కోట్ల చేపపిల్లలను వదలాలని నిర్దేశించిన నేపథ్యంలో నాణ్యమైన చేపపిల్లల పెంపకానికి చొరవ చూపాలన్నారు. కట్ల, రాహు, బంగారు తీగ రకాల చేప పిల్లలను పెంచుతున్నట్లు తెలిపారు. జిల్లాలోని 398 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల పరిధిలోని 24,071 కుటుంబాలు ఆర్థికంగా బలోపేతమయ్యేలా తోడ్పాటును అందించాలని సూచించారు. మత్స్య కార్మిక సంఘాల సభ్యులు అందరూ ఎన్ఎఫ్డీపీ పథకం కింద ఆన్లైన్లో సభ్యత్వ నమోదు చేసుకునేలా చూడాలని అన్నారు. డిచ్పల్లి, అర్సపల్లి ప్రాంతాల్లో నూతనంగా మంజూరైన చేపల మార్కెట్ సముదాయాల నిర్మాణాలు త్వరితగతిన చేపట్టి, పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో జిల్లా మత్స్యశాఖ సహాయ సంచాలకులు ఆంజనేయ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
చట్టాలపై అవగాహన అవసరం
● మూట్ కోర్టులో న్యాయవాది రామాగౌడ్తెయూ(డిచ్పల్లి): మారుతున్న కాలంలో న్యాయ విద్యార్థులు సైబర్ నేరాలు, చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలని ప్రముఖ న్యాయవాది రామాగౌడ్ సూచించారు. తెలంగాణ యూనివర్సిటీ న్యాయ కళాశాలలో సోమవారం నిర్వహించిన మూట్ కోర్ట్కు ముఖ్యఅతిథిగా హాజరైన రామాగౌడ్ న్యాయమూర్తిగా వ్యవహరించారు. ఈ సందర్భంగా సైబర్ నేరంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. క్రిమినల్ కేసులలో నిందితుల హక్కులు, చట్టంలో వారికి సంబంధించిన నిబంధనలను వివరించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం తరఫున కొందరు, నిందితుల తరఫున కొందరు న్యాయ విద్యార్థులు వాద ప్రతివాదనలు వినిపించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్, హెచ్వోడీ కే ప్రసన్న రాణి, బీవోఎస్ చైర్మన్ బీ స్రవంతి, అధ్యాపకులు ఎం.నాగజ్యోతి, న్యాయ విద్యార్థులు పాల్గొన్నారు. -
చేపలవేటకు వెళ్లి ఒకరి మృతి
నస్రుల్లాబాద్: చేపల వేటకు వెళ్లిన వ్యక్తి నీట మునిగి మృతి చెందిన ఘటన దుర్కి గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. ఎస్సై రాఘవేంద్ర తెలిపిన వివరాల ప్రకారం.. బాన్సువాడ మండలం దేశాయిపేట గ్రామానికి చెందిన గుడిసె రాజు(28) సోమవారం ఉదయం నస్రూల్లాబాద్ మండలం దుర్కి గ్రామంలోని మాంధారి చెరువు అలుగులో చేపలు పట్టేందుకు వెళ్లాడు. భారీ వర్షాల ధాటికి అలుగు 765డీ మీదుగా పారుతోంది. జాతీయ రహదారి పనుల్లో భాగంగా అలుగు కోసం మొరం కింద నుంచి పైపులు వేశారు. వరద ఉధృతికి మొరం కొట్టుకుపోయింది. రహదారి ఎగువ భాగాన దిగిన రాజు నీట మునిగిపోయాడు. ఎంతకీ బయటకు రాకపోవడంతో తోడుగా వచ్చిన వ్యక్తి కుటుంబీకులకు సమాచారం అందించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు, గ్రామస్తులు గజ ఈతగాళ్లతో గాలించగా పైపులైన్లో మృతదేహం లభించింది. కాగా, రహదారి పనులు నెమ్మదిగా జరగడంతోనే రాజు మరణించాడని ఆరోపిస్తూ కుటుంబీకులు, గ్రామస్తులు ధర్నా నిర్వహించారు. పోలీసులు అక్కడికి చేరుకొని ఆందోళనకారులకు నచ్చజెప్పారు. భార్య అంజలి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాఘవేంద్ర తెలిపారు. మృతుడికి ఓ కూతురు ఉంది. అదుపు తప్పిన స్కూటీ... నస్రుల్లాబాద్ మండలంలోని బొమ్మన్దేవ్పల్లి క్రాస్రోడ్ వద్ద స్కూటీ అదుపు తప్పి ఓ యువతి సైడ్ డ్రెయిన్లో పడిపోయింది. ఆదివారం రాత్రి కురిసిన వర్షానికి సబ్స్టేషన్ ఎదుట ఉన్న తాత్కాలిక మట్టిదారి పూర్తిగా కొట్టుకుపోయింది. సోమవారం ఉదయం డ్రెయిన్ దాటుతుండగా యువతి స్కూటీతో సహా అందులో పడిపోయింది. రోడ్డు పనులు చేస్తున్న కూలీలు గమనించి ఆమె పైన ఉన్న వాహనాన్ని తీసి కాపాడారు. నిజామాబాద్నాగారం: జాతీయస్థాయి తైక్వాండో పోటీలకు జిల్లాకు చెందిన క్యూరియస్ తైక్వాండో అకాడమీ క్రీడాకారులు మయాంక్ తేజ్, శీతల్ ఎంపికై నట్లు కోచ్ వినోద్ నాయక్ తెలిపారు. హైదరాబాద్లో ఈ నెల 17న నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చారన్నారు. ఈ నెల 28 నుంచి సెప్టెంబర్ 2 వరకు ఒడిశా రాష్ట్రంలోని కటక్లో జరగనున్న జాతీయస్థాయి పోటీలో మయాంక్ తేజ్, శీతల్ పాల్గొననున్నారు. ఎంపికై న క్రీడాకారులను జిల్లా తైక్వాండో అసోసియేషన్ చైర్మన్ డా. రమేశ్ పవార్, ప్రెసిడెంట్ అజ్మత్ ఖాన్, ప్రధాన కార్యదర్శి వినోద్ నాయక్, అసోసియేషన్ సభ్యులు అభినందించారు. నిజామాబాద్నాగారం: నిజామాబాద్ షటిల్ బాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ఫిట్ నెస్ క్లబ్లో ని ర్వహించిన జిల్లాస్థాయి పోటీ ల్లో ప్రతిభ కనబర్చిన వారిని రాష్ట్రస్థాయికి ఎంపిక చేశారు. త్వరలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలలో క్రీడాకారులు పాల్గొంటారని అధ్యక్షుడు కర్నాటి వాసు, సెక్రెటరీ కేవీ కిరణ్ కుమార్ తెలిపారు. పోలీసు బందోబస్తుబాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ గేట్లు ఎత్తిన నేపథ్యంలో పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మెండోరా ఎస్సై సుహాసిని ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆనకట్ట దిగువనే వాహనాలను నిలిపి వేశారు. గోదావరి వైపు వెళ్లకుండా బారికేడ్లను పెట్టారు. గోదావరి వైపు పర్యాటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. బందోబస్తును ఆర్మూర్ రూరల్ సీఐ శ్రీధర్రెడ్డి పర్యవేక్షించారు. -
ఇది మట్టి రోడ్డు కాదు.. సీసీ రోడ్డే!
కామారెడ్డి: ఈ చిత్రంలో కనిపిస్తున్న సీసీ రోడ్డు ఎక్కడో మారుమూల గ్రామంలో ఉంది అనుకుంటే పొరపాటే. బాన్సువాడ పట్టణం నడిఒడ్డున ఉన్న సీసీ రోడ్డు ఇది. పట్టణంలోని సంగమేశ్వర చౌరస్తా సమీపంలో ఉన్న మజీద్ నుంచి పాత బాన్సువాడ వినాయకనగర్, మండలంలోని కొల్లూర్, నాగారం వెళ్లే వారికి ఈ రోడ్డు మీదుగా వెళ్తే సుమారు మూడు కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. దీంతో ప్రతిరోజు వందలాది వాహనాలు, వందలాది పాదచారులు ఈ రోడ్డుపైనుంచి వెళ్తుంటారు. 2007–08లో ఇక్కడ సీసీ రోడ్డు వేశారు. ఈ మధ్య దారంతా గుంతలమయంగా మారింది. ప్రస్తుతం ఈ రోడ్డుపై నడవాలంటే పాదచారులూ నరకం చూస్తున్నారు. వాహనదారుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. గత్యంతరం లేక పాదచారులు, విద్యార్థులు రోడ్డు పక్కనే ఉన్న డ్రైయినేజీపై నుంచి నడుచుకుంటూ వెళ్తున్నారు. భారీ వర్షాలు కురిస్తే ఈ డ్రెయినేజీ కూడా నిండుగా ప్రవహిస్తుంది. అదుపుతప్పి కాలుజారి డ్రెయినేజీలో పడితే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం లేకపోలేదు. ప్రమాదాలు జరగకముందే అధికారులు స్పందించి రోడ్డును బాగు చేయాలని స్థానికులు కోరుతున్నారు. -
మూడు ట్రాన్స్ఫార్మర్లు ధ్వంసం
ఇందల్వాయి: మండలంలోని పలు గ్రామాల్లో దుండగులు శనివారం రాత్రి మూడు ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసి కాపర్ కాయిల్స్ను ఎత్తుకెళ్లారు. నల్లవెల్లి శివారులో గ్రామానికి చెందిన వెంకట్ రెడ్డి, గన్నారం గ్రామానికి చెందిన సామల రాజేశ్, మెగ్యానాయక్ తండాకు చెందిన లంబాని రెడ్య అనే రైతులకు చెందిన మూడు ట్రాన్స్ఫార్మర్లను దుండగులు ధ్వంసం చేశారు. ఆదివారం ఉదయం పొలాల వద్దకు వెళ్లిన రైతులు విషయం గమనించి లైన్మన్ నవీన్కి సమాచారం అందించారు. లైన్మన్ పంచనామా నిర్వహించి జరిగిన నష్టంపై పై అధికారులకు నివేదిక అందించారు. రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని ఆయన తెలిపారు. మద్నూర్(జుక్కల్): మండలంలోని పెద్దతడ్గూర్లో ఆదివారం పిచ్చికుక్కలు దాడి చేసిన ఘటనలో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గ్రామంలో నడుచుకుంటు వెళ్తున్న సంజయ్, విఠబాయి, అనిల్, దాదారావు, నారాయణ, గంగాధర్లపై పిచ్చి కుక్క దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. దీంతో స్థానికులు గాయాలపారైన వారిని మద్నూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గ్రామంలో కుక్కలు విపరీతంగా పెరిగిపోయాయని కనిపించిన వారందరిని గాయపరుస్తున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. నవీపేట: చేపలు పట్టేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటి మునిగి ఒకరు మృతి చెందిన ఘటన నవీపేట మండలం లక్ష్మాపూర్లో చోటు చేసుకుంది. ఎస్సై తిరుపతి తెలిపిన వివరాల ప్రకారం.. లక్ష్మాపూర్కు చెందిన గుడిమెట్ల శంకర్(45) రెండు రోజుల క్రితం గ్రామ సమీపంలోని చింతల చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబీకులు పలుచోట్ల వెతికినా ఆచూకీ లభించలేదు. ఆదివారం ఉదయం శంకర్ మృతదేహం లభ్యమైందన్నారు. మృతుడి కుమారుడు కార్తిక్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
చెరువు నిండదు.. పంట పండదు!
● సోన్పేట్ చెరువు దుస్థితి ● ఎగువనే ఎస్సారెస్పీ ఉన్నా అందని నీరు ● నీరు లేక సాగు చేయని వైనంబాల్కొండ: తలపునే సముద్రం ఉన్నా తాగడానికి చుక్క నీరు పనికి రాదన్న చందంగా ఉంది మెండోరా మండలం సోన్పేట్ గ్రామస్తుల దుస్థితి. గ్రామ చెరువు వర్షపు నీటి ఆధారంగా నిండుతుంది. ప్రస్తుతం చెరువు సగం మాత్రమే నిండింది. దీంతో పొలాలకు నీటి సరఫరా చేసేందుకు నిర్మించిన తూంకు నీరు అందడం లేదు. దీంతో చెరువు నీటి ఆధారంగా సాగు చేసే సుమారు 300 ఎకరాలు బీడుగానే ఉంది. వర్షాలు కురుస్తాయని పంటలు సాగు చేస్తామని ఆశతో రైతులు నారు పోశారు. కానీ నారు ముదిరి పోయింది. ప్రస్తుతం నీరు వచ్చినా నారు పనికి రాదని రైతులు పేర్కొంటున్నారు. ఎగువనే ఎస్సారెస్పీ.. ఎస్సారెస్పీ గ్రామ చెరువుకు 300 మీటర్ల దూరంలోనే ఉంది. కానీ ప్రాజెక్ట్ నుంచి సోన్పేట్ చెరువుకు చుక్క నీరు రాదు. ప్రాజెక్ట్ నిర్మాణం కోసం సగం ఆ గ్రామ భూములేనే అప్పగించారు. కానీ ఆ గ్రామానికే ప్రాజెక్టు నుంచి చుక్క నీరు లేదు. ప్రాజెక్ట్ నుంచి నీటి సరఫరా చేసే లక్ష్మికాలువ ఆధారంగా సుమారు 65 చెరువులను నింపుతారు. కానీ ఇక్కడ అలాంటి అవకాశం కూడా లేదు. బుస్సాపూర్ వరకు లక్ష్మి కాలువ నీరు సరఫరా అవుతుంది. అక్కడి నుంచి ఫీడర్ చానల్ నిర్మించి చెరువులకు నీటి సరఫరా చేపట్టవచ్చు. కానీ పాలకులు ఆ వైపుగా దృష్టి సారించడం లేదు. దీంతో సోన్పేట్ గ్రామస్తులు నీటి కొరతను ఎదుర్కొంటున్నారు. అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.చెరువు కింది ఆయకట్టుకు ఏటా నీటి కోసం తిప్పలు పడుతున్నాం. ప్రాజెక్ట్ నిర్మాణం కోసం సర్వం భూములను కోల్పోయినా మాకు మాత్రం చుక్క నీరు ప్రాజెక్ట్ నుంచి రావడం రాదు. వర్షం నీటిపైనే ఆధారం. చెరువులో నీరు లేక ఇప్పటి వరకు నాట్లు వేయలేదు. అధికారులు స్పందించాలి. – ప్రకాశ్, మాజీ సర్పంచ్, సోన్పేట్ -
సేఫ్టీ లేకుండానే పనులు..
బాల్కొండ: ముప్కాల్ మండల కేంద్రంలో జాతీయ రహదారి 44 విస్తరణ పనుల్లో ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టకుండానే పనులు చేపడుతున్నారు. దీంతో పని చేసే కూలీలు ప్రమాదాల బారిన పడుతున్నారు. వారం రోజుల క్రితం పనుల్లో భాగంగా ఎలాంటి సేఫ్టీ లేకుండా పైపులైన్ పనులు చేస్తుండగా మట్టి పెల్లాలు కూలి ఇద్దరు కూలీలు మట్టిలో కూరుకుపోయారు. అందులో ఒకరు మత్యువాత పడ్డారు. అయినా అధికారుల్లో మాత్రం చలనం లేకుండా పోతోంది. ఆదివారం కూడా పనులు సేప్టీ లేకుండానే చేపడుతున్నారు. రోడ్డు పక్కనే కందకంలో పనులు చేపడుతుంటే రోడ్డుపై నుంచి భారీ వాహనాలు వెళ్తుంటే భూమి కదులుతోంది. ఫలితంగా మట్టి కందకంలో కూలుతుంది. దీంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి రక్షణ చర్యలు చేపట్టి పనులు చేపట్టాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. -
అంబులెన్సులో ప్రసవం
పెర్కిట్: ఆలూర్ మండలం మచ్చర్ల గ్రామానికి చెందిన రవిత ఆదివారం 108 అంబులెన్సులో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. మచ్చర్లకు చెందిన రవిత ఆదివారం కాన్పు నొప్పులు అధికం కావడంతో కుటుంబ సభ్యులు 108 అంబులెన్సుకు సమాచారం ఇచ్చారు. అంబులెన్సు సిబ్బంది గ్రామానికి చేరుకుని ఆమెను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో శిశువుకు జన్మనిచ్చింది. అంబులెన్సు సిబ్బంది ప్రథమ చికిత్సలు అందించి దేగాం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా తల్లి, బిడ్డలు క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు అంబులెన్సు సిబ్బంది రమేశ్, శాంత, ఆశా వర్కర్ పుష్పకు కృతజ్ఞతలు తెలిపారు. కిటికీ ఊచలు తీసి దొంగతనం ఖలీల్వాడి: నగరంలోని మహాలక్ష్మి కాలనీ నాగటవర్స్లో ఉంటున్న బేవసాని విఠల్ ఇంట్లో దుండగులు కిటికీల ఊచలు తీసి దొంగతనం చేసినట్లు నాలుగో టౌన్ ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. విఠల్ తన కుటుంబ సభ్యులతో కలిసి శనివారం రాత్రి నిర్వహించిన కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొని రాత్రి రెండు గంటల ప్రాంతంలో గదిలో నిద్రపోయారు. దుండగులు పక్క రూమ్లో ఉన్న కిటీకల ఊచలు తొలగించి లోపలికి ప్రవేశించారు. ముందుగా కుటుంబ సభ్యులు పడుకున్న రూమ్కు గొళ్లెం పెట్టి చోరీకి పాల్పడ్డారు. బీరువాను పగులగొట్టి అందులో ఉన్న రూ.12 తులాల బంగారం, 30 తులాల వెండి దొంగతనం చేశారు. ఆదివారం ఉదయం 7 గంటల ప్రాంతంలో పాలు పోసే అతను రావడంతో విషయం గమనించి డోరు తీశారు. విఠల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. పైపు లైన్కు లీకేజీలు.. వృథాగా నీరు.. బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి పో చంపాడ్కాలనీకి నీటిని సరఫరా చేసే పైపు లైన్ కు లీకేజీలు ఏర్పడటంతో నీరు వృథాగా పో తుంది. లీకేజీల గురించి పట్టించుకోకుండా నీ టిని అలానే సరఫరా చేస్తున్నారు. దీంతో నీరు మొత్తం రోడ్లపై ప్రవహిస్తుంది. ప్రాజెక్ట్ నిర్మా ణ కాలంలో ప్రాజెక్ట్ నుంచి సిమెంట్ పైపులు వేశారు. ప్రస్తుతం ఆ పైపులకు లీకేజీలు ఏర్పడ్డాయి. వర్షకాలం కావడంతో తాగునీరు కలుషితమవుతుందని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లీకేజీలకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు. -
భరోసా లేని గీతన్నల బతుకు
డిచ్పల్లి: పొట్టకూటి కోసం ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని తాటి చెట్లు ఎక్కి కల్లు గీస్తూ జీవించే గీత కార్మికుల జీవితాలు ప్రమాదకరం. వారి గీత మార్చేందుకు ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. అంతేకాకుండా లిక్కర్, శీతల పానీయాలు, విదేశాల నుంచి ఇబ్బడి ముబ్బడిగా రావడంతో గీత కార్మికులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వాటి ధాటికి తట్టుకోలేక కల్లు అమ్మకాలు పడిపోయాయి. ఫలితంగా వృత్తిలో సరైన ఉపాధి దొరకక బతుకుతెరువు కోసం ఇతర పనులు వెతుక్కుంటూ పట్టణాలకు, గల్ఫ్ దేశాలకు వలస బాటపడుతున్నారు. మరో పక్క వృత్తిలో ప్రమాదాలు జరిగి పెద్ద సంఖ్యలో వికలాంగులు అవుతుండగా మరికొందరు చనిపోతున్నారు. ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు తూ..తూ మంత్రపు చర్యలు చేపడుతున్నాయి. నేడు గీత కార్మికుల ఆరాధ్య దైవం సర్దార్ పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం. ప్రభుత్వ పథకాలు ఎన్ని ఉన్నా.. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో దాదాపు 18 వేల మంది గీత కార్మికులు ఉన్నారు. ప్రభుత్వ పథకాలు ఎన్ని ఉన్నా వారి దరికి చేరడం లేదు. దీంతో వారు వేదనాభరిత జీవితాలను అనుభవిస్తున్నారు. 50 ఏళ్లు పైబడిన గీత కార్మికులకు ఆసరా పింఛన్ ఇస్తున్నారు. గీత కార్మికులకు ఏదైనా ప్రమాదం జరిగితే ప్రమాద బీమా ఇస్తున్నారు. కానీ రియల్ ఎస్టేట్ వ్యాపార ఫలితంగా ఎక్కడికక్కడ ఈత, తాటి చెట్లు నరికేస్తున్నా.. ప్రభుత్వం ఎలాంటి చర్యలను తీసుకోవడం లేదు. ఫలితంగా గీత కార్మికులకు ఉపాధి లేకుండా పోతోంది. జీవో నంబర్ 560 ప్రకారం ప్రతి గ్రామంలో ప్రభుత్వ భూమి ఉంటే 5 ఎకరాలు ఈత వనాలకు ఇవ్వాలని మార్గదర్శకత్వాలు ఉన్నా ఎక్కడా అమలు కావడం లేదు. కల్లులో అనేక పోషకాలు ఉన్నాయని జాతీయ పోషకాహార సంస్థ తెలిపింది. క్యాన్సర్ లాంటి రోగాలు రాకుండా నివారించవచ్చని, కిడ్నీలో రాళ్లను తొలగిస్తుందని అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ప్రముఖ వైద్యులు చెబుతున్నారు. దీనిని ప్రభుత్వమే ప్రచారం చేయడం వల్ల కల్లుకు మార్కెట్ పెరుగుతుంది. తద్వారా గీత కార్మికులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. అయితే ప్రభుత్వం నుంచి ఆశించినంత సహకారం ఉండడం లేదు. అలాగే ఎతైన తాటి చెట్టుని ఎక్కాలంటే మోకు, ముస్తాదు పైనే ఆధారపడాల్సి వస్తుంది. దీంతో ఎక్కువ మంది గీత పనులకు దూరమవుతున్నారు. కల్లుగీత కార్పొరేషన్ నుంచి వృత్తిదారులకు సరైన రుణాలు కూడా లభించడం లేదు. వృత్తిలో అడుగడుగునా జీవన్మరణమే.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలంటున్న గీత కార్మికులు నేడు గీత కార్మికుల ఆరాధ్య దైవం సర్దార్ పాపన్నగౌడ్ జయంతి -
నూత్పల్లిలో స్వయంభూ శివలింగం
ఇందిరమ్మ ఇళ్లకు బిల్లుల చెల్లింపులు ఇలా..సమాచారంఖలీల్వాడి: ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం రూ. ఐదు లక్షల నిధులు అందిస్తుంది. దీనిని నాలుగు విడతల వారీగా బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తుంది. లబ్ధిదారులు ఇళ్లు నిర్మించే స్థలంలో ముగ్గు పోయగానే సంబంధిత అధికారులు కొలతలు వేసి ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఇందిరమ్మ ఇంటి యాప్లో ఫొటో తీసి జియో ట్యాగింగ్ చేస్తారు. ఆ తర్వాత విడతల వారీగా నిధులు మంజూరవుతాయి. అవేంటో తెలుసుకుందాం.. మొదటి విడత ఇంటి బేస్మెంట్ నిర్మాణం పూర్తికాగానే మున్సిపల్ వార్డు ఆఫీసర్, గ్రామ పంచాయతీ స్థాయిలో సెక్రెటరీ ఇంటి వద్దకు వచ్చి పరిశీలన చేసి ఫొటో తీసుకుంటారు. దానిని సంబంధిత యాప్లో అప్లోడ్ చేస్తే మండల ఏఈకి వెళ్తుంది. దీనిని ఏఈ నుంచి డీఈకి లాగిన్ అవుతుంది. డీఈ నుంచి పీడీకి చేరుతుంది. పీడీ కలెక్టర్ లాగిన్కు పంపిస్తారు. కలెక్టర్ పంపిన వివరాలు అన్ని పరిశీలించిన రూ. లక్ష నగదును లబ్ధిదారుని ఖాతాల్లో జమ చేస్తారు. రెండో విడత రెండో విడతలో మరో రూ. లక్ష మంజూరువుతుంది. ఈ నిధులు మంజూరు కావాలంటే స్లాబు వేసేంత ఎత్తు గోడలు నిర్మించాల్సి ఉంటుంది. మూడో విడత మూడో విడతలో మరో రూ. రెండు లక్షలు నిధులు మంజూరు అవుతాయి. దీని కోసం ఇంటి పైకప్పు సిమెంట్ స్లాబ్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఫీల్డ్ అధికారులు ఇంటిని పరిశీలించి ఫొటోలను సంబంధిత యాప్లో అప్లోడ్ చేస్తారు. నాలుగో విడత ఇక నాలుగో విడతలో రూ. లక్ష మంజూరవుతుంది. ఈ నిధులు మంజూరు కావాలంటే ఇంటికి ప్లా స్టరింగ్, మరుగుదొడ్ల నిర్మాణం, ఇంటికి రంగులు వేసి ఉండాలి. అధికారులు అన్ని పనులు పూ ర్తయ్యాయా లేదా అని పరిశీలించి ఫొటోలు తీసి యాప్లో అప్లోడ్ చేస్తారు. ఆ తర్వాత రూ. లక్ష నిధులు లబ్ధిదారుల ఖాతాల్లో జమ అవుతాయి.మీకు తెలుసా? డొంకేశ్వర్(ఆర్మూర్): మండలంలోని నూత్పల్లిలో స్వ యంభూ లింగ క్షేత్రం ప్రత్యేక చరిత్రను సంతరించుకుంది. ఈ ఆలయంలోని శివలింగం పశువుల పేడ కింద వెలిసినట్లు,గుడిలోని నంది ఎగి రి వచ్చినట్లుగా గ్రామస్తులు పేర్కొంటున్నారు. ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ ప్రాంతానికి ఆనుకున్న ఉన్న ఈ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని 150 ఏళ్ల క్రితమే రాతితో నిర్మించారు. వందల ఏళ్ల క్రితం చంద్రయ్య మహారాజ్ అమ్మమ్మ ఒకనాడు పిడకల కోసం పశువులు ఉండే ఊరి కొండ ప్రాంతానికి వెళ్లింది. ఆమె పేడను తీసే క్రమంలో శివలింగం బయటపడింది. విషయం తెలుసుకున్న చంద్రయ్య మహారాజ్ ఆ ప్రదేశాన్ని శుద్ధి చేసి గుడిని నిర్మించారు. రాజరాజేశ్వర స్వామిపై చంద్రయ్య భజన, కీర్తనలు రచించి గ్రామగ్రామాన సంచరించి భక్తి ప్రచారం చేసి, శివుడిలో ఐక్యమైనట్లు స్థలం పురాణం ఉంది. ఆయన సమాధి కూడా గుడికి కొద్ది దూరంలో ఉంది. చంద్రయ్య మహారాజ్ ఓ దొరగారింట్లో భక్తి, కీర్తనలు చేశారు. విని తరించిన దొర కానుకగా ఏమివ్వాలని చంద్రయ్యను అడిగారట. దొర ఇంట్లో ఉన్న నంది విగ్రహం కావాలని కోరారట. చంద్రయ్య నందిపై మంత్రపుష్పాలు వేయగానే దానికి చలనం వచ్చి ఐదు మూరలు రంకెలు కొట్టి నూత్పల్లి శివాలయానికి ఎగిరి వచ్చినట్లు స్థల పురాణం. ప్రస్తుతమున్న నూత్పల్లి గ్రామానికి పురా తన ఆలయం ఐదు కిలో మీటర్ల దూరంలో ఉండగా, దీనిని ప్రతీకగా గ్రామంలోనే మరొక కొత్త గుడిని నిర్మించి అక్కడే ప్రతి ఏటా అక్టోబర్లో జాతర నిర్వహిస్తారు. -
వాల్పోస్టర్ల ఆవిష్కరణ
తెయూ (డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీలో అనలాగ్ ఐఏఎస్ అకాడమీ ప్రత్యేక కోచింగ్ సెంటర్ త్వరలో ప్రారంభమవుతుందని యూనివర్సిటీ బీఆర్ఎస్వీ అధ్యక్షుడు శ్రీను రాథోడ్ పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వాల్పోస్టర్లను ఆదివారం యూనివర్సిటీలో ఆవిష్కరించారు. ఉద్యోగాలకు ప్రిపేరయ్యే వారి కోసం అనలాగ్ ఐఏఎస్ అకాడమీ హైదరాబాద్ ప్రత్యేక కోచింగ్ నిర్వహిస్తుందన్నారు. నిరుద్యోగులు ఈఅవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. యూనివర్సిటీ విద్యార్థులు రాము, సచిన్, శివరాం, రాకేష్ తదితరులు పాల్గొన్నారు. -
ఉన్నత విద్యామండలి మాజీ చైర్మన్కు మాతృవియోగం
సిరికొండ: రాష్ట్ర ఉన్నత విద్యామండలి మాజీ చైర్మన్ రిక్క లింబాద్రికి మాతృవియోగం కలిగింది. ఆయన తల్లి రిక్క లక్ష్మమ్మ శనివారం రాత్రి హైదరాబాద్లో మృతి చెందారు. స్వగ్రామం సిరికొండ మండలం రావుట్లలో ఆమె అంత్యక్రియల ను ఆదివారం నిర్వహించారు. అంత్యక్రియల్లో బీ ఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మె ల్యే జీవన్రెడ్డి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్బిన్ హందాన్, సీపీఐఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర నాయకుడు ప్రభాకర్, బీఆర్ఎస్ రాష్ట్ర నా యకుడు మధుశేఖర్ తదితరులు పాడె మోసి లింబాద్రిని పరామర్శించారు. నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అంత్యక్రియల అనంతరం లింబాద్రిని పరామర్శించారు. పంట రక్షణకు పాత చీరలు బాల్కొండ: అడవి పందుల భారీ నుంచి మక్క పంటను కాపాడుకోవడానికి రైతులు నానా పాట్లు పడుతున్నారు. పాత చీరలను పంట చేనుకు రక్షణ కడుతున్నారు. మార్కెట్లో పాత చీరలను రూ.50 ఒక్కటి కొనుగోలు చేసి చీరలను చుట్టూ కంచె వేసినట్లు కడుతున్నారు. పంట రక్షణ కోసం రైతులకు అదనంగా ఖర్చు అవుతుంది. ప్రస్తుత సంవత్సరం మక్క పంటకు అడవి పందుల బెడద తీవ్రంగా ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గడ్కోల్లో..సిరికొండ: అడవి పందుల బారి నుంచి పంటను కాపాడుకోవడానికి అన్నదాతలు వివిధ ప్రయోగాలు చేస్తుంటారు. రాత్రి వేళల్లో మొక్కజొన్న చేనుపై దాడి చేయడానికి వచ్చే అడవి పందులకు బెదురుగా కనబడటానికి చేను చుట్టూ పాత చీరలను రక్షణగా కడుతున్నారు. సిరికొండ మండలంలోని గడ్కోల్, న్యావనంది, నర్సింగ్పల్లి, చీమన్పల్లి, తాళ్లరామడుగు గ్రామాల్లో మొక్కజొన్న పంటను సాగు చేస్తున్నారు. అడవి పందుల నుండి కాపాడుకోవటానికి మొక్కజొన్న చేను చుట్టు పాత చీరలను బెదుర్లుగా వాడుతున్నారు. -
అ‘పూర్వ’ సమ్మేళనం
మోర్తాడ్/ నిజామాబాద్ అర్బన్: మోర్తాడ్ ఉన్నత పాఠశాలలో 1980–81కు చెందిన పదో తరగతి పూర్వ విద్యార్థులు ఆదివారం అపూర్వ సమ్మేళనం నిర్వహించారు. 45 ఏళ్ల తర్వాత నాటి మిత్రులందరూ ఒకే చోట చేరడంతో సంతోషం వ్యక్తం చేశారు. నగరంలోని శ్రీముక్క అయోధ్యరామ్ విద్యానికేతన్కు చెందిన 1995–96 పదో తరగతి పూర్వ విద్యార్థులు అపూర్వ సమ్మేళనం నిర్వహించారు. నాటి గురువులను ఘనంగా సన్మానించారు. పాఠశాల వ్యవస్థాపకుడు ముక్త దేవేందర్ గుప్తా, ఉపాధ్యాయులు సందీప్ కులకర్ణి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
గ్రంథాలయాల సేవలను మెరుగుపర్చేందుకు కృషి
● జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డిబోధన్: జిల్లాలో గ్రంథాలయ శాఖలను పటిష్టం చేసి పాఠకులకు మరింత మెరుగైన సేవలను అందించేందుకు కృషి చేస్తున్నామని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి అన్నారు. ఈ క్రమంలోనే గ్రంథాలయ శాఖలో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తున్నట్లు పేర్కొన్నారు. కొత్తగా ఏర్పాటైన సాలూర మండల కేంద్రంలో నూతనంగా గ్రంథాలయ శాఖ ఏర్పాటు కోసం కొత్త భవన నిర్మాణానికి గ్రామస్తులు ఎంపిక చేసిన స్థలాన్ని ఆదివారం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్, స్థానిక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ అల్లె జనార్దన్, గ్రామపెద్దలతో కలిసి పరిశీలించారు. కొత్త భవనం నిర్మాణం అయ్యే వరకు సహకార సంఘం కోసం ఇటీవల కొత్తగా నిర్మించిన రెండు గదుల భవనాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆదేశాల మేరకు స్థల పరిశీలన చేసినట్లు పేర్కొన్నారు. సాలూరలో గ్రంథాలయ కొత్త భవన నిర్మాణానికి రూ. 35 లక్షలతో ప్రతిపాదనలు పంపించామని, త్వరలోనే సహకార సంఘం భవనంలో గ్రంథాలయాన్ని ప్రారంభిస్తామన్నారు. అనంతరం ఆయనను గ్రామపెద్దలు సన్మానించారు. విశ్రాంత హెచ్ఎం ఇల్తెపు శంకర్, ఎత్తిపోతల పథకం కమిటీ చైర్మన్ శివకాంత్ పటేల్, సొసైటీ సీఈవో బస్వంత్రావు పటేల్, గ్రామ పెద్దలు కేజీ గంగారాం, లక్ష్మణ్ గౌడ్, కన్నె రమేశ్, సొక్కం రవి తదితరులు పాల్గొన్నారు. -
‘తక్షణ స్పందన.. ప్రాణాలకు రక్షణ’
ఖలీల్వాడి: ‘ఒక్క గంట ముందు వచ్చి ఉంటే ప్రాణాలు కాపాడేవాళ్లం’ అనే మాటలు డాక్టర్ల వెంట తరచూ వింటూ ఉంటాం. రోడ్డు ప్రమాదాలు, విద్యుదాఘాతాలు, పాముకాట్లు తదితర ఘటనలు జరిగిన తర్వాత తక్షణమే స్పందించకపోవడంతో చాలా మంది ప్రాణాలు కోల్పోవడం, జీవితాంతం క్షతగాత్రులుగా మిగిలిపోతున్నారు. ఎలాంటి ప్ర మాదం జరిగినా సమీపంలో ఉండే వారు తక్షణమే స్పందించి తగిన చర్యలు చేపడితే ప్రాణాలు నిలిపే అవకాశం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. గోల్డెన్ అవర్ జిల్లాలో గత మూడేళ్లలో సుమారు 944లకు పైగా రోడ్డు ప్రమాదాలు సంభవించగా ఇందులో 1012 మందికి పైగా మృత్యువాత పడ్డారు. మరో 2183 మందికి పైగా క్షతగాత్రులుగా మిగిలారు. రోడ్డు ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన వారిని గంటలోపే ఆస్పత్రికి తరలిస్తే ప్రాణాలు కాపాడే అవకా శం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. రక్తస్రా వం, ఎముకలు విరగడం లాంటివి జరిగినప్పుడు అంబులెన్స్ కోసం వేచిచూడకుండా ఇతర మార్గాల ద్వారా ఆస్పత్రికి తరలించాలని సూచిస్తున్నారు. సీపీఆర్.. రోడ్డు ప్రమాదాలు, గుండెపోటు బాఽధితులకు పక్క న ఉండేవారు సీపీఆర్(కార్డియో పల్మనరీ రిససిటేషన్) చేసి ప్రాణాపాయం నుంచి తప్పించవచ్చు. సీపీఆర్పై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వైద్యులు సూచిస్తున్నారు. ప్రథమ చికిత్సే ప్రధానం.. చాలా ప్రమాదాల సమయంలో ప్రథమ చికిత్సలు ప్రాణాలను కాపాడుతాయి. ఇటీవల వీధి కుక్కలు దాడి చేసి పిల్లలు, పెద్దలను గాయపర్చిన ఘటనలు జిల్లాలో చోటు చేసుకున్నాయి. కుక్క కరిచిన చోట సబ్బుతో బాగా శుభ్రం చేసి కట్టుకట్టాలి. అనంతరం ఆస్పత్రికి తరలించి తగిన చికిత్స పొందాల్సి ఉంటుంది. వర్షాకాలంలో రైతులు పాముకాటుకు గుర య్యే అవకాశం ఉంటుంది. పాము కరిచిన వెంటనే కాటు వేసిన ప్రాంతంలో దారంతో గట్టిగా కట్టాలి. దీంతో పాము విషం శరీరంలోకి వ్యాప్తి చెందే అవకాశం తగ్గుతుంది. అనంతరం ఆస్పత్రికి వెళ్లి చికిత్స పొందితే ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చు. రోడ్డు ప్రమాదాల్లో తొలి గంటే కీలకం సీపీఆర్, ప్రథమ చికిత్సతో ప్రాణాలు నిలిపే అవకాశంఆస్పత్రికి తరలించాలి ఎలాంటి ప్రమాదం జరిగినా సమీపంలో ఉన్నవారు తక్షణమే స్పందించి ఆస్పత్రికి తరలించాలి. క్షతగాత్రుడిని త్వరగా తీసుకువస్తే ప్రాణాలను రక్షించే అవకాశం ఉంటుంది. – డాక్టర్ శంభు, ఎంఎస్ ఆర్థోపెడిక్, నిజామాబాద్ -
బీసీలు ఐక్యతతో ముందుకు సాగాలి
నిజామాబాద్రూరల్/డిచ్పల్లి: ఐక్యతతో ముందుకు సాగాలని, 2029లో బీసీలదే రాజ్యాధికారమని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. తెలంగాణ బీసీ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో ఆదివారం డిచ్పల్లి మండలం బర్దీపూర్ శివారులోని హోటల్లో విలేకరులతో మాట్లాడారు. బీసీ ఉద్యమానికి నిజామాబాద్ జిల్లా నాంది పలుకుతుందన్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎమ్మెల్యే టికెట్లను అధికంగా అగ్రవర్ణాల వారికి కేటాయించిన ఘనత కాంగ్రెస్కే దక్కుతుందని విమర్శించారు. ఉమ్మడి జిల్లాలో 25 లక్షలకు పైగా బీసీ జనాభా ఉంటే ఒక్క బీసీ ఎమ్మెల్యే లేరని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కామారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యేగా బీసీకి చెందిన గంప గోవర్ధన్ ఉండగా, ఆ ఒక్క సీటును కేసీఆర్ లాక్కున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్రెడ్డి 42 శాతం బీసీల రిజర్వేషన్ పేరిట డ్రామా ఆడుతూ, ధర్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. బీసీలు కలిసికట్టుగా ఉండాలి బీసీ ఓట్లతో గెలిచి సీఎంగా రేవంత్రెడ్డి రాష్ట్రాన్ని పాలిస్తున్నారని, 15శాతం ఉన్న ఓసీలకు చిత్తశుద్ధి ఉంటే సీఎంతో సహా అందరూ రాజీనామా చేసి బీసీలకు రాజ్యాధికారం ఇవ్వాలని మల్లన్న డిమాండ్ చేశారు. వచ్చే స్థానిక ఎన్నికల్లో అత్యధిక ఎంపీటీసీలు, సర్పంచులు, జెడ్పీటీసీ స్థానాలను సాధించుకునేలా బీసీలు కలిసికట్టుగా కృషి చేయాలన్నారు. సమావేశంలో తెలంగాణ బీసీ పొలిటికల్ జేఏసీ కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ సుదగాని హరిశంకర్ గౌడ్, సమన్వయకర్తలు వట్టె జానయ్య యాదవ్, భీమగాని సిద్ధులుగౌడ్, సంగెం సూర్యారావు, బుస్సాపూర్ శంకర్, బీసీ జేఏసీ నాయకులు బాస రమేశ్ యాదవ్, రమేశ్ పటేల్, డి.నరేందర్, సతీశ్ గౌడ్, తాళ్లపల్లి చంద్రశేఖర్, ప్రవీణ్ ముదిరాజ్, జ్యోతి, రేఖ, ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. రిజర్వేషన్ల పేరిట సీఎం రేవంత్రెడ్డి డ్రామా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న -
వరద ఉధృతి
బాల్కొండ: మహారాష్ట్ర ప్రాంతంలోని ప్రాజెక్ట్ల నుంచి మిగులు జలాలు వదలడంతో గోదావరికి వరద పోటెత్తింది. దీంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లోకి శనివారం మధ్యాహ్నం నుంచి లక్షా 5 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో రాగా.. అర్ధరాత్రి సమయానికి లక్షా 30 వేలకు చేరింది. ఆదివారం ఉదయం 6 గంట ల సమయంలో లక్షా 52 వేల క్యూసెక్కులకు పెరి గింది. అప్పటి నుంచి రాత్రి వరకు ఇన్ఫ్లో నిలకడగా ఉంది. 10 గంటల సమయంలో లక్షా 43వేలకు తగ్గింది. ప్రాజెక్ట్ నీటి మట్టం వేగంగా పెరుగుతోంది. మహారాష్ట్రలో ని గైక్వాడ్ ప్రాజెక్ట్ 92 శా తం నిండిందని, అక్కడి నుంచి మిగులు జలాలు విడుదల చేస్తే వరద మరింత పెరిగే అవకాశం ఉందని ఎస్సారెస్పీ అధికారులు పేర్కొంటున్నారు. ఇన్ ఫ్లో కొనసాగితే.. ఎస్సారెస్పీలోకి ప్రస్తుతం లక్షా 43వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా.. సో మవారం మధ్యాహ్నం వ రకు ఇలాగే ఉంటే గేట్లు ఎత్తి గోదావరిలోకి నీటిని విడుదల చేసే అవకాశం ఉంటుందని ప్రాజెక్టు అధికారులు అంటున్నారు. గంట కు 0.5 టీఎంసీల వరద నీరు వచ్చి చేరుతుండగా.. ప్రస్తుతం 67 టీఎంసీల నీరు నిల్వ ఉంది. సోమవారం ఉదయం 6 గంటల వరకు ఇన్ఫ్లో నిలకడగా లేదా పెరిగినా మరో 6 టీఎంసీలు నీరు చేరి నీటి మట్టం 72 టీఎంసీలకు చేరుతుంది. గత రెండేళ్లుగా 70 టీఎంసీలు దాటగానే వరద గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. బ్యాక్ వాటర్ ప్రాంతంలో నీరు ఎక్కువగా నిలిచి గ్రామాల్లోకి చేరుతోందనే కారణంతో 10 టీఎంసీల నీరు తక్కువగా ఉండగానే గేట్లను ఎత్తుతున్నారు. ఈ ఏడాది కూడా అలాగే నీటిని వదిలేందుకు ప్రాజెక్ట్ అధికారులు సిద్ధమవుతున్నారు. వరద కాలువ ద్వారా నీటి విడుదల.. వరద కాలువ ద్వారా అధికారులు ఆదివారం నీటి విడుదల చేపట్టారు. ముందుగా 3 వేల క్యూసెక్కు ల నీటిని విడుదల చేసి క్రమంగా 10 వేల క్యూసెక్కులకు పెంచారు. కాకతీయ కాలువకు 4 వేల క్యూసెక్కులు, అలీసాగర్ లిఫ్ట్కు 180 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండగా, మిషన్ భగీరథ అవసరాలకు 231 క్యూసెక్కులు వినియోగిస్తున్నారు. ఆవిరి రూపంలో 594 క్యూసెక్కుల నీరు పోతోంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 1091(80.5 టీఎంసీలు) అడుగులు కాగా ఆదివారం రాత్రి వరకు 1087.40(67.63 టీఎంసీలు) అడుగుల నీరు నిల్వ ఉందని అధికారులు తెలిపారు. నది వైపు వెళ్లొద్దు ఎగువ నుంచి వరద ఉధృతంగా వస్తున్న నేపథ్యంలో గేట్లు ఎత్తే అవకాశం ఉందని, పశువుల కాపర్లు, రైతులు గోదావరి వైపువెళ్లొద్దని ప్రాజెక్ట్ ఎస్ఈ శ్రీనివాస్గుప్తా హెచ్చరించారు. గోదావరి పరీవాహక ప్రాంత రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎస్సారెస్పీ ప్రస్తుత నీటి నిల్వ ఎస్సారెస్పీ ఆనకట్టపై పర్యాటకులుఅలీసాగర్ అప్రమత్తం బోధన్: ఎడపల్లి మండలం ఠాణాకలాన్ గ్రామ శివారులోని అలీసాగర్ రిజర్వాయర్ వరద గేట్లను ఏ క్షణానైన ఎత్తే అవకాశం ఉంది. నిజాంసాగర్ ప్రాజెక్టు డి–50 ప్రధాన కాలువలోకి నీటిని వదిలేందుకు నీటిపారుదల శాఖ అధికారులు సిద్ధమయ్యారు. అలీసాగర్ రిజర్వాయర్లోకి ఎగువ నుంచి భారీగా వరద వస్తుండడంతో ఎప్పటికప్పుడు పరిస్థితి అంచనా వేస్తున్నారు. రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 1299.6 ఫీట్లు కాగా, ఇప్పటి వరకు 1297 ఫీట్ల వరకు నీరు చేరిందని, మరో ఫీటు మేర నీటి నిల్వ పెరిగితే గేట్లు ఎత్తాల్సి వస్తుందని అధికారులు పేర్కొన్నారు. ఎడపల్లి, రెంజల్, నవీపేట మండలాల్లో డి–50 కాలువ విస్తరించి ఉన్నందున పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నిజాంసాగర్కు భారీ వరద 90 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకున్న జలాశయంజిల్లా వ్యాప్తంగా 27.9 మి.మీ. వర్షంనిజామాబాద్ అర్బన్: జిల్లా వ్యాప్తంగా ఆదివారం రోజున 27.9 మిల్లీమీటర్ల వర్ష పాతం నమోదైంది. శనివారం సాయంత్రం ఐదు గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటలవరకు వర్షం కురిసింది. డొంకేశ్వర్లో 59.3, ఆలూర్ 38.3, నందిపేట 60.1, నవీపేట 48.1 , బోధన్ 33.0, ధర్పల్లి 29.9, పొతంగల్ 29.5, రెంజల్ 39.5 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. ఎగువ నుంచి ఎస్సారెస్పీలోకి లక్షా 43 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో వేగంగా పెరుగుతున్న ప్రాజెక్ట్ నీటి మట్టం ఇన్ఫ్లో కొనసాగితే గేట్లు ఎత్తే అవకాశం! ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటున్న ప్రాజెక్ట్ అధికారులు ఉమ్మడి జిల్లాలోని నిజాంసాగర్, శ్రీరాంసాగర్ ప్రాజెక్టులు నిండు కుండల్లా మారాయి. ఎగువ ప్రాంతాల నుంచి భారీ వరద వస్తుండడంతో నిజాంసాగర్ గేట్లను సోమవారం ఉదయం ఎత్తివేయనున్నట్లు సంబంధిత అధికారులు ప్రకటించగా, శ్రీరాంసాగర్ ప్రాజెక్టు గేట్లు ఏ సమయంలోనైనా ఎత్తే అవకాశం ఉంది. మంజీర, గోదావరి పరీవాహక ప్రాంతాల రైతులు, పశువులకాపర్లు అప్రమత్తంగా ఉండాలని, నదులవైపు వెళ్లొద్దని అధికారులు సూచిస్తున్నారు. అలీసాగర్ రిజర్వాయర్ గేట్లను ఏక్షణానైనా ఎత్తే అవకాశం ఉంది.ఉప్పొంగుతున్న గోదావరి రెంజల్(బోధన్): జిల్లాతోపాటు ఎగువ మహారాష్ట్రలో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో గోదావర ఉధృతంగా ప్రవహిస్తోంది. రెంజల్ మండలం కందకుర్తి వద్ద గోదావరితోపాటు మంజీరా, హరిద్ర నదుల నుంచి వరద ఉప్పొంగుతోంది. దీంతో కందకుర్తి పుష్కరక్షేత్రం వద్ద నదిలోని పురాతన శివాలయం పూర్తిగా నీటమునిగింది. అంతర్రాష్ట్ర వంతెనను ఆనుకొని వరద ప్రవహిస్తోంది. రెంజల్ ఎస్సై చంద్రమోహన్తోపాటు ఇన్చార్జి తహసీల్దార్ ఆసియా ఫాతిమా వరద ప్రవాహం నేపథ్యంలో గోదావరి పరీవాహక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రచారం చేయించారు. పర్యాటకుల సందడి బాల్కొండ: ఎస్సారెస్పీకి భారీ వరద వస్తుండడంతో ప్రాజెక్టు అందాలను తిలకించేందుకు ప ర్యాటకులు తరలివస్తున్నారు. ఆదివారం సెలవుకావడంతో వేల సంఖ్యలో పర్యాటకులు వచ్చి ఉల్లాసంగా గడిపారు. ఆనకట్ట పైకి కార్లు, ద్విచక్ర వా హనాలు వందల సంఖ్యలో రావడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తింది. కనీస సౌకర్యాలు లేవని, అడ్డూఅదుపు లేకుండా వాహనాలు తిరుగుతున్నాయని పలువురు పర్యాటకులు విస్మ యం వ్యక్తం చేశారు. నిజాంసాగర్: ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వరప్రదాయిని అయిన నిజాంసాగర్ ప్రాజెక్టు నిండుకుండలా మారుతోంది. ఎగువన ఉన్న పోచా రం ప్రాజెక్టుతో పాటు హల్దీవాగు, ఘనపురం ఆనకట్ట, మంజీర నది, సింగూరు ప్రాజెక్టుల ద్వారా ఆదివారం అర్ధరాత్రి 90వేల క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్టులోకి ఇన్ఫ్లోగా వస్తోంది. దీంతో ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరువవుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1,405 అడుగులు (17.8టీఎంసీలు కాగా.. ఆదివారం రాత్రి వరకు 1,402.37 అడుగుల (14.162 టీఎంసీ లు) నీరు నిల్వ ఉంది. ఎగువ ప్రాంతాల నుంచి వరద నీటి ప్రవాహం కొనసాగుతోంది. ఆది వారం అర్ధరాత్రి తరువాత గేట్లు ఎత్తే అవకాశం ఉందని నీటి పారుదలశాఖ ఈఈ సోలోమాన్ తెలిపారు. జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు సోమవారం ప్రాజెక్టును సందర్శించనున్నారు. -
తెలంగాణ ప్రోకబడ్డీ చీఫ్ కోచ్గా ప్రశాంత్
నిజామాబాద్ నాగారం: తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ సహకారంతో ఈ నెల 27 నుంచి హైదరాబాద్ లో యువ ప్రోకబడ్డీ లీగ్ చాంపియన్షిప్ నిర్వహించనున్నారు. ఈ పోటీల్లో ఎనిమిది జట్లు పాల్గొననుండగా, శాతవాహన సైనికులు జట్టుకు చీఫ్ కోచ్గా జిల్లాకు చెందిన మీసాల ప్రశాంత్ నియామకం అయ్యారు. ప్రశాంత్ ప్రస్తుతం జిల్లా స్పోర్ట్స్ అథారిటీలో కబడ్డీ కోచ్గా విఽ దులు నిర్వర్తిస్తున్నారు. ప్రోకబడ్డీ జట్టుకు కోచ్గా ఎంపికై న ప్రశాంత్ను జిల్లా కబడ్డీ సంఘం అధ్యక్షుడు అంద్యాల లింగయ్య, కార్యదర్శి గంగాధర్ రెడ్డి, కోశాధికారి సురేందర్, వైస్ ప్రెసిడెంట్ శ్రవణ్ రెడ్డి, బొబ్బిలి నర్సయ్య, రాజకుమార్, గంగారెడ్డి, రాజేందర్, శ్రీనివాస్, శ్రీనివాస్ రెడ్డి, హైదర్ అలీ, హరిచరణ్, అనురాధ, జ్యోతి, సీనియర్ క్రీడాకారులు అభినందించారు. ఎస్సారెస్పీ ఎస్ఈగా జగదీశ్ బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజినీర్గా జగదీశ్ రానున్నారు. కంతనపల్లి ప్రాజెక్ట్ ఈఈగా పని చేస్తున్న ఆయనకు పదోన్నతి లభించింది. ఎస్సారెస్పీ ఇన్చార్జి ఎస్ఈగా ఏడాదిపాటు శ్రీనివాస్గుప్తా పని చేశారు. నూతన ఎస్ఈ సోమవారంబాధ్యతలు స్వీకరిస్తారని కార్యాలయ వర్గాలు తెలిపాయి. 19న డైట్లో స్పాట్ అడ్మిషన్లు నిజామాబాద్ అర్బన్: ప్రభుత్వ, ప్రైవేటు డైట్ కళాశాలల్లో మిగిలిన సీట్లకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ డైట్ కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రవేశపరీక్ష రాసి అర్హత పొందిన అభ్యర్థులకు వివిధ దశల్లో అడ్మిషన్ల ప్రక్రియ పూర్తయ్యిందని పేర్కొన్నారు. ఈ నెల 19న ఉదయం 10 గంటల నుంచి డైట్ కళాశాలలో నిర్వహించే స్పాట్ అడ్మిషన్లకు అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలన్నారు. ప్రైవేట్ డైట్ కళాశాలలో సీటు పొందాలనుకునేవారు 20వ తేదీన హాజరుకావాలని సూచించారు. నిజామాబాద్ సిటీ: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలను నిర్లక్ష్యం చేశాయని, వాటిని అమలు చేయాలని సీపీఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు బుర్రిప్రసాద్ డిమాండ్ చేశారు. నగరంలోని నాందేవ్వాడలో ఉన్న పార్టీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన పార్టీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఇళ్లు లేని పేదలకు ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తానని ఇచ్చిన హామీని అమలు చేయాలన్నారు. గుడిసెలు వేసుకొని జీవిస్తున్న వారికి పట్టాలు ఇచ్చి ఇళ్లు నిర్మించి ఇవ్వాలన్నారు. గృహలక్ష్మి పథకం ప్రతి మహిళకు అందించాలన్నారు. రూ. 500 గ్యాస్ సిలిండర్ కూడా చాలా మందికి రావడం లేదన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలు కోసం పోరాటాలు చేస్తామన్నారు. సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి రమేశ్ బాబు, నగర కార్యదర్శి బెజుగం సుజాత, రాములు, నర్సయ్య,అనసూయ, నరేశ్, దీపిక, అనిత పాల్గొన్నారు. -
క్రీడాపోటీల్లో ప్రతిభ కనబర్చాలి
నిజామాబాద్ నాగారం: రాష్ట్రస్థాయి క్రీడా పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని డీవైఎస్వో పవన్కుమార్ పేర్కొన్నారు. జిల్లా క్రీడా మైదానంలో ఆదివారం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బాల్ బ్యాడ్మింటన్ మహిళా, పురుషుల జట్టు ప్రాబబుల్స్ను ఎంపిక చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డీవైఎస్వో పవన్కుమార్ క్రీడాకారులను పరిచయం చేసుకొని మాట్లాడారు. క్రీడాకారులు నైపుణ్యాలను ప్రదర్శించి రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించాలన్నారు. తాను కూడా మొదట బాల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడినేనని గుర్తు చేశారు. అనంతరం జిల్లా బాల్ బ్యాడ్మింటన్ సంఘం ప్రధాన కార్యదర్శి శ్యామ్ మాట్లాడుతూ బాల్ బ్యాడ్మింటన్ క్రీడకు పూర్వ వైభవం తీసుకొచ్చేలా జిల్లా సంఘం కృషి చేస్తోందన్నారు. రాష్ట్రస్థాయి క్రీడాపోటీల్లో పతకాలు సాధిస్తుందన్నారు. జిల్లా క్రీడా మైదానంలో బాల్ బ్యాడ్మింటన్ కోర్టుకు స్థలాన్ని కేటాయించాలని ఈ సందర్భంగా కోరారు. ఎంపికై న క్రీడాకారులకు శిక్షణ శిబిరాన్ని నిర్వహించి తుది జట్టును ఎంపిక చేస్తామన్నారు. వారు ఈ నెల 22 నుంచి 24వ తేదీ వరకు కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో జరిగే 71వ రాష్ట్రస్థాయి బాల్బ్యాడ్మింటన్ పోటీల్లో జిల్లా జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తారన్నారు. కార్యక్రమంలో బాల్బ్యాడ్మింటన్ కామారెడ్డి జిల్లా కార్యదర్శి కృష్ణమూర్తి, కోశాధికారి రాజేశ్వర్, ఆర్గనైజింగ్ సెక్రెటరీ నాగేష్, కార్యవర్గ సభ్యులు భాగ్యశ్రీ, గీత, సింధూజ, సీనియర్ క్రీడాకారులు ఆనంద్, కార్తిక్, సాయికుమార్, పూజ పాల్గొన్నారు. డీవైఎస్వో పవన్కుమార్ ఉమ్మడి జిల్లా బాల్బ్యాడ్మింటన్ జట్టు ప్రాబబుల్స్ ఎంపిక -
క్రైం కార్నర్
నీటి గుంతలో పడి ఒకరి మృతి ఇందల్వాయి: మండలంలోని గన్నారం గ్రామ శివారులోగల రోడ్డు పక్కన ఉన్న నీటి గుంతలో పడి ఒకరు మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. వివరాలు ఇలా.. మండలంలోని సిర్నాపల్లి గ్రామానికి చెందిన పురేందర్ గౌడ్(52) గతంలో ఉపాధి కోసం వైన్ షాపుల్లో, కల్లు బట్టీల్లో పని చేసేవాడు. ప్రస్తుతం ఉపాధి లేకపోవడతో పని కోసం వెతుకుతున్నాడు. ఈక్రమంలో శుక్రవారం రాత్రి అతడు ఇందల్వాయి నుంచి సిర్నాపల్లి వైపు నడుచుకుంటూ బయలుదేరాడు. గన్నారం గ్రామ శివారులోగల రోడ్డు పక్కన ఉన్న నీటి గుంతలో అతడు ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు కూతుర్లు ఉన్నారని, భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై సందీప్ తెలిపారు. చికిత్స పొందుతూ ఒకరు.. మోర్తాడ్(బాల్కొండ): రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. మోర్తాడ్కు చెందిన కనకం అనిల్(31) ఈనెల 4న బంధువులను కలవడానికి బైక్పై శెట్పల్లి గ్రామానికి వెళ్లాడు. తిరిగి ఇంటికి బయలుదేరగా, పాలెం సమీపంలో రోడ్డుపై ఉన్న గుంతలో పడి, తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే అతడిని చికిత్స నిమిత్తం ఆర్మూర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం మరణించాడు. మృతదేహానికి శనివారం ఆర్మూర్ ఆస్పత్రిలో పోసుమార్టం నిర్వహించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాము తెలిపారు. మృతుడికి తల్లి, భార్య, ఒక కొడుకు, కూతురు ఉన్నారు. బీబీపేట మండలంలో ఒకరు.. బీబీపేట: ఇటీవల ఆత్మహత్యకు యత్నించిన ఓ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఎస్సై ప్రభాకర్ తెలిపిన వివరాలు ఇలా.. బీబీపేట గ్రామానికి చెందిన పోసు నారాయణ (65) గత మూడేళ్లుగా అల్సర్తో బాధపడుతుండేవాడు. ఎన్ని ఆస్పత్రుల్లో చూపించినప్పటికీ వ్యాధి నయం కాలేదు. దీంతో అతడు జీవితంపై విరక్తి చెంది గురువారం రాత్రి గడ్డిమందు తాగాడు. కుటుంబసభ్యులు గమనించి వెంటనే అతడిని చికిత్స నిమిత్తం ఎల్లారెడ్డిపేట ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం రాత్రి చనిపోయాడు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. కామారెడ్డి క్రైం: కామారెడ్డి పెద్ద చెరువులో ఓ గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు దేవునిపల్లి పోలీసులు శనివారం తెలిపారు. మృతదేహం పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో ఉండటంతో మూడు రోజుల క్రితం చెరువులో పడి చనిపోయి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతుడి వయస్సు 25 నుంచి 35 ఏళ్ల మధ్య ఉంటుందని ఎస్సై రంజిత్ తెలిపారు. -
పచ్చిబుట్ట..టన్నుకు 10 వేలు
● ఎకరానికి 6 నుంచి 7 టన్నుల దిగుబడి ● మక్క రైతులకు తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం బాల్కొండ: మక్క రైతుల పంట పండింది. తక్కువ పెట్టుబడితో లాభాలు గడిస్తున్నారు. ప్రస్తుత సంవత్సరం మక్కకు ధర ఎక్కువగా ఉంటుందని ఆలోచించిన ఆర్మూర్ డివిజన్ రైతులు.. సోయా సాగును తగ్గించి మక్కను ఎక్కువగా సాగు చేశారు. ముందుగా కోతకు వచ్చిన మక్క పచ్చిబుట్టకే అధిక ధర దక్కడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పచ్చి బుట్ట ధర వారం రోజుల క్రితం కిలో రూ.8 పలుకగా, ప్రస్తుతం రూ.10కి పెరిగింది. దీంతో ఎకరానికి రూ.60 వేల నుంచి రూ.70 వేల వరకు ఆదాయం వస్తోందని రైతులు చెబుతున్నారు. మక్క సాగు చేస్తున్నప్పటి నుంచి పచ్చి బుట్టకు ఇంత ధర ఎప్పుడూ పలుకలేదంటున్నారు. దిగుబడి బాగు.. సాధారణంగా మక్క సాగు చేసే రైతులకు ఎకరా నికి రూ.25వేల నుంచి రూ.30వేల వరకు ఖర్చవు తోంది. కానీ, పచ్చిబుట్ట రాగానే మక్క రిక్కుతుండడంతో ఎకరానికి కేవలం రూ.5వేలు మాత్రమే ఖ ర్చవుతోంది. ఎకరానికి 6 నుంచి 7టన్నులకు తగ్గ కుండా దిగుబడి వస్తుండడంతో రూ.70 వేల వరకు ఆదాయం వస్తుందని రైతులు అంటున్నారు. అడవి పందుల నుంచి పంటను కాపాడుకోవడంతోపాటు మంచి ధర పలుకుతుండటంతో రైతులు పచ్చిబుట్ట విక్రయానికే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. కంకుల చొప్పున విక్రయం.. రైతుల వద్ద నుంచి కిలోల చొప్పున కొనుగోలు చేస్తున్న వ్యాపారులు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్రలో కంకుల చొప్పున విక్రయిస్తామని తెలుపుతున్నారు. అక్కడ రూ.100కు నాలుగు కంకులు విక్రయిస్తామంటున్నారు. ఇటు రైతులకు, అటు వ్యాపారులకు మక్క పచ్చిబుట్ట ద్వారా మంచి ఆదాయం లభిస్తోంది. నూర్పిడి చేసి ఆరబెట్టిన మక్కలు అమ్మినా ఇంతా ఆదా యం రాదు. ఈ సంవత్సరం పచ్చిబుట్టకు మంచి ధర లభిస్తోంది. నేను ఎకరం పచ్చిబుట్టను విక్రయించాను. ఆనందంగా ఉంది. – శ్రీనివాస్, రైతు -
‘మహాలక్ష్మి సాయం’ కోసం ఎదురుచూపులు!
● మహిళలకు ప్రతినెల రూ.2500 అందిస్తామని కాంగ్రెస్ హామీ ● ప్రభుత్వం ఏర్పాటైనా ఇప్పటికీ అందని సాయం మోర్తాడ్(బాల్కొండ): సాధారణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంలోనే కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తరువాత కూడా అర్హులైన గృహిణులకు మహాలక్ష్మి పథకం కింద ఆర్థిక చేయూతను అందిస్తామని కాంగ్రెస్ నేతలు హామీ ఇచ్చారు. ఆరు గ్యారెంటీలలో భాగంగానే ఈ పథకం అమలు చేస్తామన్నారు. కానీ నెలల గడుస్తున్నా అర్హులైన మహిళలకు ఆర్థిక సాయం అందడం లేదు. దీంతో వారు పథకం అమలు కోసం ఎదురుచూపులు చూడాల్సివస్తోంది. జారీకాని మార్గదర్శకాలు.. ఆరు గ్యారెంటీల హామీల అమలు కోసం 2024–25 బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం రూ. 53,196 కోట్లను కేటాయించింది. 2025–26 ఆర్థిక సంవత్సరానికి కూడా బడ్జెట్లో నిధులను కేటాయించినా మార్గదర్శకాలను జారీ చేయకపోవడంతో మహిళలకు నిరాశనే ఎదురవుతుంది. ఇప్పటికే జిల్లాలో 74,154 మంది వితంతువులు, 10,185 మంది ఒంటరి మహిళలు, 95,453 మంది బీడీ కార్మికులకు ఆసరా ఫించన్లు అందుతున్నాయి. ఆసరా పథకం కింద లబ్ధి పొందుతున్న వారికి మహాలక్ష్మి సాయం అందించే అవకాశం లేదు. ఈ సాయం కోసం అందించడానికి లబ్ధిదారులను ఎంపిక చేస్తే జిల్లాలో సుమారు 50వేల మంది లబ్ధి పొందే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ప్రజాపాలనలో భాగంగా ఆసరా పింఛన్లను అందుకోని మహిళలు మహాలక్ష్మి సాయం కోసం వేలాది మంది దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేస్తేనే ప్రతి నెలా సాయం అందుకునేవారి విషయంలో స్పష్టత రానుంది. దీంతెఓ ప్రభుత్వం ఎప్పుడు సాయం విషయంపై ప్రకటన చేస్తుందోనని మహిళలు నిరీక్షిస్తున్నారు. మహాలక్ష్మి పథకం కింద లబ్ధిదారులను ఎంపిక చేసే విషయంలో ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉంది. ప్రజాపాలనలో అనేక మంది దరఖాస్తులు అందించగా వాటిని ఆన్లైన్లో నమోదు చేసి ఉంచాం. లబ్ధిదారులుగా ఎవరు అర్హులు, వారిని ఎలా గుర్తించాలి అనే విషయంలో ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలు రాలేవు. తొందరలోనే మార్గదర్శకాలు జారీ కావచ్చు. – తిరుమల, ఎంపీడీవో, మోర్తాడ్ -
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
● కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి, సీపీ సాయిచైతన్య ● బోధన్ నియోజకవర్గంలో పర్యటన బోధన్టౌన్(బోధన్): ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి సూచించారు. అధికారులు ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పట్టణంలోని 24, 35 వార్డుల్లో శనివారం కలెక్టర్ పర్యటించారు. అనిల్ టాకీస్ చౌరస్తాలో శర్భతీ కెనాల్పై గల రోడ్డు మరమ్మతులను పరిశీలించారు. త్వరితగతిన పనులు పూర్తిచేయాలని, ప్రజల రాకాపోకలకు ఇబ్బంది కలుగకుండా చూడాలని సిబ్బందికి వెల్లడించారు. సబ్ కలెక్టర్ వికాస్ మహతో, బల్దియా సిబ్బంది ఉన్నారు. బోధన్లోని అనిల్ టాకీస్ చౌరస్తాలోగల శర్భతీ కెనాల్ మరమ్మతులను శనివారం రాత్రి సీపీ సాయిచైతన్య పరిశీలించారు. పనులు పూర్తిచేసే వరకు పోలీసులు, ట్రాఫి క్ పోలీసులు బందోబస్తు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. ట్రాఫిక్ మళ్లింపుపై ఏసీపీ శ్రీనివాస్ను అడిగి తెలుసుకున్నారు. సీఐ వెంకట నారా యణ,ట్రాపిక్ సిఐ చందర్ రాథోడ్ లు ఉన్నారు. వాగులను దాటొద్దు.. వర్ని: భారీ వర్షాలకు లోలెవల్ వంతెనల మీదుగా వరద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నందున ఎవరూ వాగుదాటేందుకు ప్రయత్నాలు చేయవద్దని, లోత ట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీపీ సాయి చైతన్య ప్రజలకు సూచించారు. వర్ని పోలీస్ స్టేషన్ పరిధిలోని జలాల్పూర్ శివారులోని సైదిపూర్ రిజర్వాయర్ ( చెరువు) అలుగు, కోకల్దాస్ తండా శివారులోని లోలెవల్ వంతెనను సీపీ పరిశీలించారు. గ్రామాల్లో వర్షాల వల్ల కలిగే నష్టాల స మాచారాన్ని ఎప్పుటికప్పుడు అందించాలని గ్రామ స్థాయి అధికారులను ఆదేశించారు. అత్యవసర స మయంలో సంబంధిత పోలీస్ స్టేషన్ లేదా 100 డయల్ చేయాలని, లేదా పోలీస్ కంట్రోల్ రూం 8712659700 నంబర్కు సంప్రదించాలన్నారు. బో ధన్ ఏసీపీ శ్రీనివాస్, రుద్రూర్ సీఐ కృష్ణ, ఎస్సై మ హేష్, సాయన్న, ఎంపీడీవో వెంకటేశ్ ఉన్నారు. -
చికిత్స పొందుతూ ఒకరి మృతి
● వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ ఆస్పత్రి ఎదుట మృతుడి కుటుంబీకుల ఆందోళన నిజామాబాద్నాగారం: రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. వైద్యుల నిర్లక్ష్యంతోనే మృతిచెందాడని మృతుడి కుటుంబీకులు ఆస్పత్రి ఎదుట ఆందోళన నిర్వహించారు. వివరాలు ఇలా.. ఆర్మూర్ ప్రాంతానికి చెందిన సాయికుమార్(26) మెడికల్ రిప్రజంటేటివ్గా పనిచేస్తుండేవాడు. అతడు శనివారం హైదరాబాద్ నుంచి ఆర్మూర్కు కారులో బయలుదేరగా, కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం జంగంపల్లి హైవే వద్ద రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఈ ఘటనలో అతడు తీవ్రంగా గాయపడగా చికిత్స నిమిత్తం నిజామాబాద్లోని ప్రుడెన్స్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రాత్రి ఆస్పత్రిలో మృతిచెందాడు. విషయం తెలిసిన కుటుంబసభ్యులు వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే మృతిచెందినట్లు ఆరోపించారు. ఆస్పత్రి ఎదుట కుటుంబ సభ్యులు, బంధువులు, మెడికల్ రిప్రజంటేటివ్ సంఘం సభ్యులు ధర్నా చేపట్టారు. వీరికి మద్ధతుగా సీఐటీయూ నాయకులు నూర్జహాన్, మానవ హక్కుల సంఘం అధ్యక్షులు రషీదాభేగం, టీడీపీ అధికార ప్రతినిధి పురుషోత్తం, మెడికల్ రిప్రజంటేటివ్ సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ ఆస్పత్రికి చేరుకున్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. -
ఈనెల 19న ఏచూరి సంస్మరణ సభ
కామారెడ్డి టౌన్: జిల్లా కేంద్రంలో ఈనెల 19న పట్టణ మున్నూరుకాపు సంఘం కల్యాణ మండపంలో సీపీఎం పార్టీ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి సంస్మరణ సభ నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి చంద్రశేకర్ తెలిపారు. శనివారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఈ సభకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ హాజరవుతున్నట్లు తెలిపారు. జిల్లాలోని పార్టీ కార్యకర్తలు, శాఖ కార్యదర్శులు, సభ్యులు, శ్రేణులు, రైతులు, కార్మికులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు వెంకట్ గౌడ్, మొతీరాం నాయక్, కొత్త నర్సింలు, అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి టౌన్: కామారెడ్డి పట్టణంలో నవంబర్ 16న మిస్టర్ కామారెడ్డి బాడీ బిల్డర్ పోటీలను నిర్వహిస్తున్నట్లు జిమ్ ప్రతినిధులు నవీన్, యాసిన్లు తెలిపారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఆర్అండ్బీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కామారెడ్డి జిమ్ యజమానుల ఆధ్వర్యంలో మొట్టమొదటి సారిగా కామారెడ్డిలో జిల్లా స్థాయి బాడీ బిల్డర్ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పోటీలలో ఏడు కేటగిరీలు ఉంటాయని వివరించారు. పోటీలో ప్రథమ, ద్వితియ, తృతియ బహుమతులు ఉంటాయన్నారు. ఆసక్తి ఉన్నవాళ్లు 9848278436 నంబర్ను సంప్రదించాలని తెలిపారు. జిల్లాలోని బాడీ బిల్డర్స్ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో శివ, లిఖిత్గౌడ్, మహిపాల్, రథిఫ్రెడ్డి, తేజ, ఎజాజ్, దేవా తదితరులున్నారు. సదాశివనగర్(ఎల్లారెడ్డి): మండలంలోని అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామంలో గల ఆంజనేయ స్వామి ఆలయం ఎదుట గ్రామ పంచాయతీ సమీపంలో దాత అయిన సైంటిస్ట్ పైడి ఎల్లారెడ్డి శనివారం తన సొంత నిధులతో షెడ్డును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పలు గ్రామాల్లో ఇప్పటి వరకు తన వంతుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
గంగరాజు మళ్లీ సెల్టవర్ ఎక్కాడు
● తన ఇంటిముందు విద్యుత్స్తంభాన్ని ఏర్పాటుచేయాలని డిమాండ్ ● గత నెల 19న టవరెక్కినా పరిష్కారం కాని సమస్య నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): మండలంలోని ధర్మారెడ్డి గ్రామానికి చెందిన జోడు గంగరాజు అనే యువకుడు శనివారం మరోమారు సెల్టవర్ ఎక్కాడు. తన ఇంటిముందు విద్యుత్స్తంభం ఏర్పాటు చేసి వీధి దీపం అమర్చాలని డిమాండ్ చేస్తూ అతడు సెల్టవర ఎక్కాడు. కాగా గత నెల 19న ఇదే డిమాండ్తో ఆయన సెల్టవర్ ఎక్కడంతో స్థానిక ఎస్సై భార్గవ్గౌడ్, ట్రాన్స్కో ఏఈ నాగరాజు ఘటన స్థలానికి చేరుకొని అతడికి నచ్చజెప్పి కిందకు దించారు. కానీ సమస్య పరిష్కారం కాకపోవడంతో శనివారం అతడు మరోమారు సెల్టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేశాడు. విషయం తెలుసుకున్న ఎస్సై భార్గవ్గౌడ్ అక్కడికి చేరుకొని గంగరాజుకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. కానీ అతడు వినిపించుకోకుండా ట్రాన్స్కో ఏఈ వచ్చి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. దీంతో ట్రాన్స్కో ఏఈ నాగరాజు గ్రామానికి చేరుకొని గంగరాజు కుటుంబసభ్యులతో మాట్లాడారు. స్తంభం ఏర్పాటుకు చర్యలు చేపట్టగా, స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారన్నారు. సమస్య పరిష్కారం కోసం పక్కింటివారితో మాట్లాడుకోవాలని చెప్పారు. దీంతో గంగరాజు సెల్టవర్ దిగి కిందకువచ్చాడు. కాగా రెండు గంటలకుపైగా గంగరాజు సెల్టవర్పైనే ఉండటంతో గ్రామస్తులు ఆందోళనకు గురయ్యారు. -
బొప్పాయిల వ్యాన్ బోల్తా
బాల్కొండ: మెండోరా మండలం బుస్సాపూర్ శివారులోని జాతీయ రహదారి 44పై బొప్పాయి పండ్ల వ్యాన్ బోల్తా పడింది. హైదరాబాద్ నుంచి రాజస్థాన్ వెళ్తున్న బొప్పాయి పండ్ల డీసీఎం వ్యాన్ శుక్రవారం మధ్యాహ్నం వర్షం కారణంగా హైవేపై అదుపు తప్పి పడిపోయింది. ఈ ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్ స్వల్ప గాయాలతో బయట పడ్డారు. బొప్పాయి పండ్లు కింద పడిపోవడంతో జనాలు పండ్ల కోసం ఎగబడ్డారు. కొందరు బస్తాల్లో ఎత్తుకెళ్లారు. విద్యుత్ షాక్తో గేదె మృతి మద్నూర్(జుక్కల్): మండలంలోని సుల్తాన్పేట్లో శనివారం విద్యుత్ షాక్తో గేదె మృతి చెందినట్లు పంచాయతీ కార్యదర్శి సంజయ్ తెలిపారు. విద్యుత్ తీగల కింద గేదె మేత మేస్తుండగా విద్యుత్ తీగలు తెగి గేదైపె పడ్డాయి. దీంతో గేదె కరెంట్షాక్తో అక్కడికక్కడే మృతి చెందింది. కళేబరానికి పంచనామ నిర్వహించి మేనూర్ విద్యుత్ సబ్ స్టేషన్ ఏఈకి సమాచారం అందించినట్లు ఆయన వెల్లడించారు. దాబాపై పోలీసుల దాడి ఎల్లారెడ్డి: మండలంలోని లక్ష్మాపూర్ శ్రీమాతా దాబాపై శుక్రవారం రాత్రి దాడులు నిర్వహించినట్లు ఎస్సై మహేష్ తెలిపారు. దాబాలో మద్యం తాగేందుకు అనుమతిస్తున్నారన్న సమాచారం మేరకు దాడులు నిర్వహించారు. దాబా యజమానిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. అనుమతులు లేని దాబాలలో మద్యం సేవించవద్దని ఎస్సై మద్యం ప్రియులకు సూచించారు. -
పేకాడుతున్న 10మంది అరెస్టు
ఎల్లారెడ్డి: మండలంలోని వెల్లుట్లపేట శివారులో పేకాట ఆడుతున్నారన్న సమాచారం రావడంతో శుక్రవారం రాత్రి పోలీసులు దాడులు నిర్వహించారు. పేకాడుతున్న పది మందిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై మహేష్ శనివారం తెలిపారు. వారి వద్ద నుంచి రూ.43,150ల నగదు, 10 సెల్ఫోన్లు, 11 బైకులు సీజ్ చేసినట్లు ఎస్సై తెలిపారు. మరో నలుగురు పరారైనట్లు ఆయన తెలిపారు. గుంతలో దిగపడిన లారీ నస్రుల్లాబాద్: మండల కేంద్రంలో ఓ లారీ అదుపు తప్పి రోడ్డు పక్కన గుంతలో దిగబడిపోయింది. మండల కేంద్రంలో రోడ్డు విస్తరణ పనులు కొనసాగుతుండగా రహదారి పక్కన గుంతలు తవ్వా రు. ఈక్రమంలో శుక్రవారం మండల కేంద్రంలోని సమీకృత భవనం ఎదురుగా వర్ని వైపునకు వెళుతున్న లారీ అదుపుతప్పి రోడ్డు పక్కన గుంతలో దిగిపోయింది. ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. ఇప్పటికై నా అధికారులు స్పందించి రోడ్డు పనుల నేపథ్యంలో హెచ్చరిక బోర్డులు, బార్డర్ లైన్లను ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. వీధి కుక్కల దాడిలో బాలుడికి గాయాలు నిజామాబాద రూరల్: మండలంలోని మాధవనగర్ పరిధిలో వీధి కుక్కల దాడిచేయడంతో ఓ బాలుడికి గాయాలయ్యాయి. వివరాలు ఇలా.. మాధవనగర్ మూడో డివిజన్కు చెందిన సుశాంత్ అనే ఐదేళ్ల బాలుడు శనివారం ఇంటి బయట ఆడుకుంటున్నాడు. వీధికుక్కలు ఒక్కసారిగా బాలుడిపై దాడి చేశాయి. దీంతో బాలుడి తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గమనించి కుక్కలను తరిమివేసి, బాలుడిని చికిత్స నిమిత్తం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి కుక్కల బెడదను నివారించాలని స్థానికులు కోరుతున్నారు. -
అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచాలి
● డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ నరేంద్రకుమార్ ● డిచ్పల్లి సీహెచ్సీ తనిఖీ డిచ్పల్లి(నిజామాబాద్రూరల్): సీజనల్ వ్యాధుల నివారణ కోసం అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ నరేంద్ర కుమార్ సిబ్బందిని ఆదేశించారు. డిచ్పల్లి మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రం (సీహెచ్సీ)ని శనివారం ఆయన తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్తో కలిసి సందర్శించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులను పలకరించి వారికి అందుతున్న వైద్యసేవలు తెలుసుకున్నారు. మెరుగైన వైద్య సేవలను అందించి ప్రజలకు ప్రభుత్వ ఆస్పత్రులపై విశ్వాసం పెంపొందేలా కృషి చేయాలని వైద్యులకు వారు సూచించారు. డీఎంహెచ్వో రాజశ్రీ, డీసీహెచ్ఎస్ శ్రీనివాస్ ప్రసాద్, డిప్యూటీ డీఎంహెచ్వో అంజన, జిల్లా మలేరియా అధికారి తుకారం రాథోడ్, ఎన్హెచ్ఎం రాజు, జిల్లా సర్వేలైన్ అధికారి నాగరాజు, సీహెచ్సీ వైద్యాధికారులు శివశంకర్, సందీప్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇందల్వాయిలో.. ఇందల్వాయి: ఇందల్వాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని వైద్య విదాన పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ ఎడ్యుకేషన్ నరేంద్ర కుమార్ తనిఖీ చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. వైద్య సిబ్బంది సమయానుసారం ప్రజలకు అందుబాటులో ఉండాలని, మందులు ఎల్లప్పుడు అందుబాటులో ఉంచాలని సూచించారు. ఆరోగ్య కేంద్రం పరిసరాలను శుభ్రపర్చాలని సూచించారు. వైద్య సిబ్బంది వెంకటేష్, క్రిస్టినా, శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టుకు భరోసా
ఎస్సారెస్పీలో ప్రస్తుతం నిల్వ ఉన్న నీరు బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో నీటిమట్టం క్రమంగా పెరుగుతుండడంతో ఆయకట్టుకు భరోసా ఏర్పడింది. స్థానిక ఎగువ ప్రాంతాలతోపాటు మహారాష్ట్రలోని ప్రాజెక్టుల నుంచి వరద వస్తోంది. ఎస్సారెస్పీ నీటిమట్టం ప్రస్తుతం 50 టీఎంసీలు దాటింది. దీంతో ఆయకట్టులోని ఖరీఫ్ పంటలకు పూర్తిస్థాయిలో నీరు అందించవచ్చని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. కాగా, సీజన్ ప్రారంభంలో వర్షాభావ పరిస్థితులతో జలాశయంలోకి ఆశించినంతగా వరద రాలేదు. దీంతో ప్రాజెక్ట్ నుంచి ఖరీఫ్ పంటలకు కాలువల ద్వారా నీటిని విడుదల చేసేందుకు పాలకులు, అధికారులు మల్లగుల్లాలు పడ్డారు. ప్రాజెక్ట్లో నీటి నిల్వ 40.5 టీఎంసీలకు చేరగానే వరదలు వచ్చే అవకాశం ఉందని భావించి ప్రభుత్వం నీటి విడుదలకు పచ్చజెండా ఊపింది. ఈ నెల 7న అధికారులు నీటి విడుదల చేపట్టారు. నాలుగు రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో ప్రాజెక్ట్లోకి భారీగా వరద వస్తోంది. ప్రాజెక్ట్లో నీటిమట్టం వేగంగా పెరుగుతుండడంతో ఖరీఫ్తోపాటు రబీ సాగుపై ఆయకట్టు రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. లక్షల ఎకరాలకు నీరు.. ఎస్సారెస్పీ నుంచి కాకతీయ కాలువ ద్వారా ఎల్ఎండీ ఎగువ వరకు 4.60 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించేందుకు అధికారులు నిర్ణయించారు. లక్ష్మీ కాలువ ద్వారా 25 వేలు, సరస్వతి కాలువ ద్వారా 35 వేలు, అలీసాగర్ ఎత్తిపోతల పథకం ద్వారా 57,763, గుత్ప ఎత్తిపోతల ద్వారా 38,967, చౌట్పల్లి హన్మంత్రెడ్డి ఎత్తిపోతల ద్వారా 11,600, వేంపల్లి ఎత్తిపోతల ద్వారా 22 వేల ఎకరాలకు సాగునీరు అందించనున్నారు. ఎస్సారెస్పీలో 50 టీఎంసీలు దాటిన నీటి నిల్వ -
ఏడు కొండలను కాపాడుకోవాలి
మాక్లూర్: వేదకాలం నాటి శ్రీవారి ఏడు కొండలను కాపాడుకోవాల్సిన బాధ్యత హిందువులపై ఉందని మధుర భారతి బిరుదాంకితులు, ఉభయ వేదాంత డాక్టర్ వోలేటి రవికుమారాచార్య స్వామి అన్నారు. మండలంలోని గుత్ప చౌరస్తా వద్దగల అపురూప వేంకటేశ్వర ఆలయంలో శనివారం ఆయన వేంకటేశ్వరస్వామి విశేష ప్రవచనాలు వినిపించారు. సనాతన ధర్మ పరిరక్షణకు ఆలయా లు కేంద్రస్థానాలని తెలిపారు. ఇతిహాస పు రాణాలలో చెప్పబడిన ధర్మాలను తెలుసు కుని ఆరోగ్యకరమైన సామాజిక కుటుంబ జీ వనం సాగించాలన్నారు. ధర్మమార్గంలో న డుస్తూ న్యాయంగా సమాజ అభివృద్ధికి పా టుపడాలన్నారు. అనంతరం శ్రీకృష్ట జన్మాష్టమి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ ప్రధాన అర్చకులు శ్రీమాన్ సేనాపతి వెంక ట కుమారస్వామి, ఆలయ చైర్పర్సన్ అమృతలత, సురేందర్రెడ్డి భక్తులు పాల్గొన్నారు. యోగాతో ఆరోగ్యం ● అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ నిజామాబాద్నాగారం: ప్రతి వ్యక్తి రోజు 40 నిమిషాల పాటు యోగా చేయడంతో మంచి ఆరోగ్యం పొందవచ్చని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. ఇటీవల రాష్ట్రస్థాయి యోగా పోటీల్లో విజేతలుగా నిలిచిన వారిని నగరంలోని దయానంద యోగా కేంద్రంలో ఎమ్మె ల్యే ప్రత్యేకంగా అభినందించి సన్మానించా రు. ప్రస్తుతం యోగా అనేది ప్రతి ఒకరిలో భాగమైందని అన్నారు. అనంతరం యోగా పోటీల్లో విజేతలుగా నిలిచిన బి.పద్మ, కృష్ణవేణి, ఆర్.ప్రియాంక, డి.ప్రియాంక, నిత్య, రిత్విక, అబ్బయ్యను సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు యోగ రా మచందర్, అధ్యక్షుడు యోగారత్న ప్రభాక ర్, ప్రధాన కార్యదర్శి టి.బాల శేఖర్, కార్యనిర్వాహక కార్యదర్శి జి.సంగీత, కోశాధికారి ఎం. భూమాగౌడ్, సంయుక్త కార్యదర్శి ఎం. రఘువీర్, శ్రీనివాస్, కార్పొరేటర్ శ్రీధర్, ప్రభాకర్, యోగా శిక్షకులు, సాధకులు పాల్గొన్నారు. ‘మహాలక్ష్మి’తో ఆర్టీసీకి ఆదాయం బాన్సువాడ : మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీకి భారీగా ఆదాయం సమకూరుతోందని ప్ర భుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. శనివారం బా న్సువాడ బస్డిపోకు వచ్చిన రెండు కొత్త ఎక్స్ప్రెస్ బస్సులను ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాల్రాజ్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకటి నిజామాబాద్ నుంచి జహీరాబాద్కు(వయా బోధన్, బాన్సువాడ, నిజాంసాగర్), మరొకటి బాన్సువాడ నుంచి నారాయణ్ఖేడ్ (వయా పిట్లం, నిజాంపేట్) నడుస్తాయని తెలిపారు. కార్యక్రమంలో ఆర్టీసీ డీఎం సరితాదేవి, బీర్కూర్ ఏఎంసీ చైర్మన్ శ్యామల తదితరులు పాల్గొన్నారు. -
ఆశలు నింపిన వాన
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు ఆశలు నింపాయి. మొన్నటి వరకు అంతంత మాత్రమే పడడంతో సాగు, తాగునీటిపై కొంత భయం ఉండేది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో ఆ ఆందోళన అక్కర్లేదనే నమ్మకం ఏర్పడింది. శుక్రవారం అర్ధరాత్రి నుంచి ఆగకుండా కురిసిన వర్షంతో జిల్లా వ్యాప్తంగా మెరుగైన వర్షపాతం నమోదైంది. ప్రాజెక్టుల్లోకి భారీగా వరద వచ్చి చేరుతోంది. చెరువులు, కుంటలు నిండుతున్నాయి. పలుచోట్ల అలుగులు, వాగులు పారుతున్నాయి. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తడంతో నీటి నిల్వ 55 టీఎంసీలు దాటింది. సగం చెరువులు నిండేస్థాయికి చేరుకోవడంతో సాగు, తాగునీటికి ఢోకా లేదని చెప్పవచ్చు. ఇటు భూగర్భజలాల పెరుగుదలకు వర్షాలు దోహదపడుతున్నాయి. వర్షాధార పంటలకూ మే లు జరుగుతోంది. ఐతే, వాతావరణ శాఖ చెప్పిన దాని కంటే ఆలస్యంగా జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. అంచనాలు అదుపు తప్పడంతో వర్షం ఎప్పుడెలా వస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. శనివారం ఉదయం 8గంటల వరకు వర్షపాతం జిల్లా వ్యాప్తంగా 2సెంటీమీటర్లు నమోదు కాగా, రోజంతా కురిసిన వానకు మరింత వర్షపాతం రికార్డు కానుంది. ఇందల్వాయి మండలం సిర్నాపల్లి వాగు ఉధృతంగా ప్రవహించడంతో గ్రామానికి రాకపోకలు నిలిచాయి. రుద్రూర్ మండలం బొప్పాపూర్ వద్ద రోడ్డుపై గుండ్ల వాగు ప్రవహిస్తోంది. జిల్లాకు వర్షసూచన ఇంకా ఉన్నందున ప్రజలు వరద ప్రవహించే ప్రాంతాలతోపాటు జలపాతాల వద్దకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీచేశారు. కలెక్టర్ పరిశీలన ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేప థ్యంలో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి శనివారం లోత ట్టు ప్రాంతాల్లో పర్యటించారు. నిజామాబాద్ నగరంతోపాటు బోధన్ పట్టణం, వర్ని మండలం జలాల్పూర్లో అధికారులతో కలిసి తిరిగారు. డివిజన్ చెరువులు 25 శాతం 25–50 శాతం 50–75 శాతం 75–100 శాతం అలుగు నిండినవి నిండినవి నిండినవి నిండినవి పారుతున్నవి బోధన్ 182 02 21 121 20 18నిజామాబాద్ 324 163 117 29 11 04ఆర్మూర్ 196 47 63 53 27 08బాల్కొండ 292 79 128 79 06 -బాన్సువాడ 90 - 16 25 18 31మొత్తం 1,084 291 345 307 82 61ఇప్పటి వరకు 48 సెంటీమీటర్లుఈ ఏడాది వర్షాకాల సీజన్లో ఇప్పటి వరకు జిల్లాలో 57 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 48 సెంటీమీటర్లు నమోదైంది. కురుస్తున్న వర్షాలతో మరింత పెరిగే అవకాశముంది. డొంకేశ్వర్, ఇందల్వాయి మండలాలు అధిక వర్షపాతం జాబితాలో ఉండగా, 15 మండలాలు సాధారణ, 16 మండలాలు లోటులో ఉన్నాయి. ఈ కాస్త లోటును పూడ్చేందుకు ఇంకా 40 రోజుల వర్షాకాలం సీజన్ మాత్రమే ఉంది. సెప్టెంబర్ ముగిసే నాటికి జిల్లా వ్యాప్తంగా మొత్తంగా 90 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదు కావాలి. జిల్లాలో చెరువుల పరిస్థితి.. -
నిజామాబాద్
‘సాగర్’కు 35,500 క్యూసెక్కుల ఇన్ఫ్లోఆదివారం శ్రీ 17 శ్రీ ఆగస్టు శ్రీ 2025నిజాంసాగర్: మెదక్, సంగారెడ్డి జిల్లాలతో పాటు జిల్లాలో కురుస్తున్న వర్షాలతో నిజాంసాగర్ ప్రాజెక్టులోకి వరద నీటి ప్రవాహం పెరిగింది. పోచారం ప్రాజెక్టు పొంగి పొర్లుతుండడంతో శనివారం 10 వేల క్యూసెక్కుల నీరు నిజాంసాగర్లోకి వస్తోందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ఘనపురం ఆనకట్ట, హల్దీవాగు, సింగూరు ప్రాజెక్టు ద్వారా 25,500 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోందన్నారు. నిజాంసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటమట్టం 1,405 అడుగులు (17.8 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 1,398.08 అడుగుల (9.407 టీఎంసీలు) నీరు నిల్వ ఉందని పేర్కొన్నారు. సింగూర్ ప్రాజెక్టు 5 గేట్లు ఎత్తివేత నిజాంసాగర్: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో సంగారెడ్డి జిల్లాలోని సింగూర్ ప్రాజెక్టులోని శనివారం 31 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. ఎగువ నుంచి వరద నీరు ఉధృతంగా వస్తుండడంతో సింగూరు ప్రాజెక్టు 5 గేట్ల ఎత్తివేసి 45 వేల క్యూసెక్కుల నీటిని మంజీర నదిలోకి వదులుతున్నారు. ఈ నీరు నిజాంసాగర్ ప్రాజెక్టును చేరనుంది. వేల్పూర్ మండలంలోని జాన్కంపేట్ పెద్దవాగు చెక్డ్యాం వద్ద వర్షపు నీరు సాగు, తాగునీటికి ఢోకా లేదిక నిండుతున్న ప్రాజెక్టులు, చెరువులు పారుతున్న అలుగులు, వాగులు అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం లోతట్టు ప్రాంతాల్లో పర్యటించిన కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి -
విపత్కర పరిస్థితుల్లోనూ వైద్య సేవలందించాలి
నిజామాబాద్నాగారం: భారీ వర్షాల దృష్ట్యా ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్య సేవలందించాలని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) డాక్టర్ నరేంద్ర కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిని శనివారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎమర్జెన్సీ వార్డులో రోగులకు అందిస్తున్న వైద్య సేవలను పరిశీలించా రు. ఫార్మసీ, టీహబ్, ఫీవర్ వార్డు, బ్లడ్ బ్యాంక్ త దితర విభాగాలను సందర్శించి వివరా లు తెలుసుకున్నారు. అనంతరం సూపరింటెండెంట్ చాంబర్ లో వైద్యులు, అధికారులతో కలిసి మీడియాతో మా ట్లాడారు. రోగులకు అందుతున్న వైద్య సేవలను తెలుసుకునేందుకు సీహెచ్సీ, పీహెచ్సీలతోపాటు జిల్లా ఆస్పత్రిని తనిఖీ చేశామన్నారు. సమన్వయంతో ముందుకు సాగాలి డెంగీ కేసులు, ఇతర విషజ్వరాలు ఎక్కడైనా ప్రబలితే అవసరమైన ఇతర శాఖల సహాయం తీసుకొని రోగులకు సేవలు అందించేందుకు సిద్ధంగా ఉండాలని డీఎంఈ నరేంద్రకుమార్ అన్నారు. ఆయన వెంట తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్కుమార్, డీఎంహెచ్వో రాజశ్రీ, మెడికల్ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపల్ నాగమోహన్, ఇన్చార్జి సూపరింటెండెంట్ రాములు, డాక్టర్ సరస్వతీ, ఎన్హెచ్ఎం రాజు, సర్వేలైన్ అధికారి నాగరాజు, ఇతర వైద్య సిబ్బంది ఉన్నారు. కాగా, తనిఖీల సమయంలో ఔషధాల స్టోర్ రూమ్కు తాళం ఉండడంతో అధికారులు అసహనం వ్యక్తం చేశారు. ఒక్కసారి 100 మంది వచ్చినా.. భారీ వర్షాల నేపథ్యంలో ఒక్కసారిగా 50 నుంచి 100 మంది రోగులు వచ్చినా వైద్యం అందించేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. అన్ని మూడు నెలలకు సరిపడా మందులతోపాటు బెడ్స్, వైద్య సిబ్బంది, టెక్నీషియన్స్, ల్యాబుల్లో కెమికల్స్ ఉంచుకోవాలని సూచించారు. సీ జనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. రోగులకు నాణ్యమైన ఆహారం అందించాలని పేర్కొన్నారు. వర్షాలతో రవాణా సమస్య ఏర్పడే అవకాశం ఉందని, రెండు వారాలకు సరిపడా నిత్యావసర సరుకులు స్టాక్ పెట్టుకోవాలన్నారు. భారీ వర్షాల దృష్ట్యా వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండాలి డీఎంఈ డాక్టర్ నరేంద్రకుమార్ -
ఘనంగా తీజ్ వేడుకలు
డిచ్పల్లి: మండలంలోని నడిపల్లితండాలో శుక్రవారం తీజ్ పండుగను తండావాసులు ఘనంగా జరుపుకున్నారు. తొమ్మిది రోజులపాటు భ క్తిశ్రద్ధలతో పూజించిన గోధుమ మొలకల బు ట్టలను యువతులు నెత్తిన ధరించి, ఊరేగింపు నిర్వహించారు. ఈసందర్భంగా మహిళలు, యువతులు బంజారా సంప్రదాయ ఆటపాట లతో అలరించారు.అనంతరం గోధుమ బుట్టలను స్థానిక చెరువులో నిమజ్జనం చేశారు. నిజామాబాద్ రూరల్: మండలంలోని కేశాపూర్ గ్రామ ఊర చెరువును తహసీల్దార్ అనురుద్, ఎంపీడీవో రాంనారాయణ, ఉన్నత అధికారులు శుక్రవారం పరిశీలించారు. భారీ వర్షాల నేపథ్యంలో చెరువులను, కుంటలను లోతట్టు ప్రాంతలను పరిశీలించినట్లు వారు తెలిపారు. జిల్లాకు వచ్చే రెండు రోజులు సైతం భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. కాంగ్రెస్ నాయకులు మహెంధర్ రెడ్డి, గ్రామస్తులు ఉన్నారు. నిజామాబాద్ రూరల్: నగరంలో శుక్రవారం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల కరపత్రాలను ఇ స్కాన్ కంఠేశ్వర్ ప్రతినిధులు ఆవిష్కరించారు. ఈసందర్భంగా కేంద్రం నిర్వాకులు రామానందరాయ గౌరదాస్ మాట్లాడుతూ..నగరంలోని ఆర్మూర్ రోడ్డులోగల శ్రీలక్ష్మీ కల్యాణ మండపంలో ఇస్కాన్ కంఠేశ్వర్ ఆధ్వర్యంలో శనివా రం శ్రీకృష్ణ జన్మాష్టమి కార్యక్రమాలను వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రజలందరూ పెద్ద సంఖ్యలో హాజరై వేడుకలను విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు. మాదాసు స్వామి యాదవ్, నీతాయి చంద్ ప్ర భు, బలరాంప్రభు, రామానందగోపేస్ ప్రభు, ప్రాణప్రియ ప్రభు, సర్వానంతప్రభు ఉన్నారు. డిచ్పల్లి: నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే భూపతిరెడ్డిని శుక్రవారం నియోజకవర్గం పరిధిలోని ప్రభుత్వ ప్రాథమిక సహకార సంఘాల (సొసైటీ) చైర్మన్లు మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రభుత్వం సొసైటీ చైర్మన్లు, పాలకమండలి పదవీకాలం 6 నెలలు పొడిగించినందుకు వారు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలియజేసి, సత్కరించారు. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, డీసీసీబీ వైస్ చైర్మన్ నల్లా చంద్రశేఖర్రెడ్డి, డైరక్టర ఆనంద్, సొసైటీ చైర్మన్లు చింత శ్రీనివాస్రెడ్డి, చింతలపల్లి గోవర్ధన్రెడ్డి, నాగేశ్వరరావు, నిమ్మ మోహన్రెడ్డి, శ్రీదర్, జన్నారెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ సిటీ: నగర మున్సిపాలిటీలో ఉ త్తమ ప్రతిభ కనపరిచిన, అంకితభావం, సేవాదృక్పథంతో విధులు నిర్వహించిన పలువురు అధికారులు, సిబ్బందికి శుక్రవారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో కలెక్టర్ ప్రశంసాపత్రా లు అందజేశారు. అనంతరం వారిని కమిషనర్ దిలీప్కుమార్ అభినందించారు. మున్సిపల్ డీ ఈ సుదర్శన్రెడ్డి, ముస్తాక్ అహ్మద్, టీపీఆర్వో చిదుర రమేష్తోపాటు పారిశుధ్య సిబ్బంది న ర్సయ్య, ఆంజనేయులు, పుష్ప, ఒడ్డెమ్మ, సైదు లు, విజయలక్ష్మి ఉన్నారు. సౌండ్ బాక్స్ వితరణ ధర్పల్లి: మండలంలోని దుబ్బాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు శుక్రవారం గ్రామానికి చెందిన పిప్పెర ప్రతాప్ గౌడ్, ప్రసాద్ గౌడ్, ప్రశాంత్ గౌడ్ సౌండ్ బాక్స్ సిస్టం అందజేశారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ కవిత, వీడీసీ చైర్మన్ నరేష్ గౌడ్, హెచ్ఎం శశికళ ఉన్నారు. -
ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవం
నగరంలోని డీసీసీబీ కార్యాలయంలో జెండా ఎగురవేస్తున్న కుంట రమేష్రెడ్డి సాక్షి నెట్వర్క్: నిజామాబాద్ జిల్లాకేంద్రంతోపాటు అర్బన్, రూరల్ నియోజకవర్గాల్లో శుక్రవారం స్వా తంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆయా నియోజకవర్గాల్లోని అన్ని మండలాలు, గ్రామాల్లో వీధివీధినా మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. అన్ని ప్రభుత్వ శాఖల కా ర్యాలయాలు, విద్యాసంస్థలు, వివిధ పార్టీల కార్యాలయాలు, స్వచ్ఛంద సంస్థలు, పలు సంఘాల ఆధ్వర్యంలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి, జెండా వందనం చేశారు. అనంతరం జాతీయ గీతం ఆలపించారు. విద్యాసంస్థల్లో కొందరు విద్యార్థులు స్వాతంత్య్ర సమరయోధుల వేషధారణలో ఆకట్టుకున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. పాఠశాలల యాజమాన్యాలు ఇటీవల విద్యార్థులకు క్రీడాపోటీలు నిర్వహించగా, విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. -
ఆలయ అభివృద్ధికి కృషి చేస్తా
నిజామాబాద్ రూరల్: నగరంలోని దుబ్బ గుమాస్తాకాలనీలోగల దుర్గాదేవి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయ ణ అన్నారు. ఆలయ ఆవరణలో శుక్రవారం రాత్రి నూతన ఆలయ కమిటీ ప్రమాణస్వీకారోత్సవం ని ర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్కులచారి, నుడా చైర్మన్ కేశవేణు హాజరై, నూతన కా ర్యవర్గంతో ప్రమాణస్వీకారం చేయించారు. ఎమ్మె ల్యే మాట్లాడుతూ.. ఆలయ అభివృద్ధికి ఎమ్మెల్యే నిధుల నుంచి రూ.5లక్షలు, తనవంతుగా లక్ష రూపాయలు అందజేస్తానని ఎమ్మెల్యే తెలిపారు. నూతన కార్యవర్గం.. దుర్గాదేవి ఆలయ కమిటీ అధ్యక్షుడిగా అమంద్ వి జయ్కృష్ణ, ప్రధాన కార్యదర్శిగా బోడికె బాబురా వు, కోశాధికారులు ధాత్రిక వేణుగోపాల్, లవంగ సదాశివ్, ఉపాధ్యక్షులుగా మాడురి కిషన్, గంగోనె సంతోష్, గంగోనె అనిల్, కార్యదర్శులుగా అమంద్ వెంకటేశ్, అమంద్ రాకేష్, కార్యవర్గ సభ్యులుగా అ జ్జన్ దుబ్బయ్య, నిచ్చంగ దానాజీ, గంగోనె ఊష న్న, గంగోనె సంతోష్, గంగోనె శ్రీనివాస్, దాత్రిక ప్రవీణ్, మహిపాల్, పొలాస రామకృష్ణ, పాండ్రవీసం హరీష్కుమార్, గౌరవ అధ్యక్షులుగా ఆకుల సందీప్, జోగిని మల్లేష్యాదవ్, గౌరవ సలహాదారులుగా భీమన్న, రాజేందర్ ఎన్నికయ్యారు. -
సంక్షిప్తం
బడిలో వంటగది ప్రారంభం ధర్పల్లి: మండలంలోని దుబ్బాక మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో నిర్మించిన వంటగది షెడ్ను ప్రారంభించారు. ఏఐపీఎస్ చైర్మన్ సౌజన్య, వీడీసీ చైర్మన్ నరేష్ గౌడ్, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు పోతన్న, మాజీ ఉపసర్పంచ్ ప్రతాప్ గౌడ్, హెచ్ఎం చంద్రకాంత్, జీపీ సెక్రెటరీ సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు. మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు సిరికొండ: మండలంలోని పెద్దవాల్గోట్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం గ్రామానికి చెందిన పోతుగంటి నవీన్ అనే యువకుడు మినరల్ వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేయించాడు. దాతను ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్తులు అభినందించారు. దాడి ఘటనలో నలుగురిపై కేసు నమోదు మోపాల్: మండలకేంద్రంలో ఇంటి స్థలం విషయంలో జరిగిన దాడి ఘటనలో నలుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సుస్మిత శుక్రవారం తెలిపారు. వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన బండమీది మధు తన పాత ఇల్లు కూల్చి అదే స్థలంలో కొత్త ఇల్లు నిర్మించుకుంటున్నాడు. ఈనెల 8న సాయంత్రం మధు వద్దకు గ్రామానికి చెందిన ఎల్లోల్ల రాజశేఖర్రెడ్డి, అతడి అన్న నరేష్రెడ్డి, తండ్రి ఎల్లోల్ల నారాయణరెడ్డి, తల్లి లక్ష్మీ వచ్చారు. ఈ స్థలం తమదంటూ మధు, వాళ్ల నాన్న బుచ్చన్నపై దాడి చేశారు. చంపేస్తామని బెదిరింపులకు దిగారు. అనంతరం మధు పోలీసులకు ఫిర్యాదు చేయగా, విచారణ చేపట్టి నలుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. కుల బహిష్కరణ, బెదిరింపుపై విచారణ మోపాల్: మండలంలోని సింగంపల్లిలో పల్లికొండ పోశెట్టిని కుల బహిష్కరణతోపాటు చంపేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని ఫిర్యాదు రావడంతో ఎస్ఐ సుస్మిత శుక్రవారం విచారణ చేపట్టారు. పల్లికొండ రమేష్ తమ అన్నదమ్ముళ్లపై కక్ష గట్టి కుల బహిష్కరణ చేశారని, అన్నదమ్ముళ్లను తనను చంపేందుకు రెచ్చగొడుతున్నాడని పోశెట్టి ఇటీవల పోలీసులకు ఫిర్యాదుచేశారు. ఆయన ఫిర్యాదు మేరకు గ్రామానికి వెళ్లిన ఎస్సై దర్యాప్తు చేశారు. ఉన్నతాధికారుల సూచనల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని ఎస్సై సుస్మిత పేర్కొన్నారు. పీసీసీ చీఫ్ను కలిసిన కై సర్ నిజామాబాద్ సిటీ: హైదరాబాద్లో శుక్రవారం జరిగిన స్వాతంత్య్ర దినోత్సవంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ను జిల్లా కాంగ్రెస్ నాయకుడు సయ్యద్ కై సర్ మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలోని పలు అంశాలపై చర్చించారు. జిల్లాలో క్రీడల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని ఆయనను కోరారు. క్యాన్సర్తో కానిస్టేబుల్ మృతి ఖలీల్వాడి: నగరంలోని ఒకటో టౌన్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ బొంగేవారు అనిల్ క్యాన్సర్ వ్యాధితో మృతి చెందారు. గత కొన్ని రోజులుగా అతడు క్యాన్సర్తో బాధపడుతుండగా, పరిస్థితి విషమించి శుక్రవారం మృతిచెందాడు. అనిల్కు భార్య, ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. -
రైతులకు మరింత సేవ చేసుకునే అవకాశం
● ఎన్డీసీసీబీ చైర్మన్ కుంట రమేశ్ రెడ్డి ● సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేల చిత్రపటాలకు పాలాభిషేకంసుభాష్నగర్: రాష్ట్రంలోని సహకార సంఘాలు, డీసీసీబీల పాలకవర్గాల పదవీకాలం గడువు మరోసారి ఆరు నెలలు పొడిగించి రైతులకు మరింత సేవ చే సుకునే భాగ్యాన్ని సీఎం రేవంత్రెడ్డి, మంత్రి తుమ్మ ల నాగేశ్వర్రావు, మంత్రివర్గం కల్పించిందని ఎన్డీసీసీబీ చైర్మన్ కుంట రమేశ్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ఎన్డీసీసీబీ ప్రధాన కార్యాలయ ఆవరణలో శుక్రవారం పాలకవర్గాల గడువు ఆరు నెలలు పొడిగించడంపై హర్షం వ్యక్తం చేస్తూ సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా రమేశ్ రెడ్డి మాట్లాడుతూ ఎన్డీసీసీబీని రాష్ట్రంలోనే ఉత్తమమైన బ్యాంకుగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ప్రధానంగా ఎన్పీఏ తగ్గింపుపై ప్రత్యేక దృష్టి సారించామని, అందరి స హకారంతో బ్యాంకుకు పూర్వవైభవం తీసుకొస్తా మని ధీమా వ్యక్తంచేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి సహకార సంఘాల చైర్మన్లు, బ్యాంకు డైరెక్టర్ల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. వైస్ చైర్మన్ నల్ల చంద్రశేఖర్రెడ్డి, డైరెక్టర్లు, సొసైటీ చైర్మన్లు పాల్గొన్నారు. -
ఉత్తమ సేవలకు ప్రశంసలు
స్వాతంత్య్ర వేడుకలను పురస్కరించుకొని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉత్తమ సేవలందించిన ఉద్యోగులు, సిబ్బందికి బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ ప్రశంసాపత్రాలను అందజేశారు. జిల్లా కేంద్రంలోని పరేడ్ మైదానంలో శుక్రవారం నిర్వహించిన వేడుకల్లో ఉన్నతాధికారులు ఉద్యోగుల సేవలను అభినందించారు. కార్యక్రమంలో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, సీపీ సాయిచైతన్య, అదనపు కలెక్టర్ అంకిత్ తదితరులు పాల్గొన్నారు. – నెట్వర్క్వసంత్రావు, నాయబ్ తహసీల్దార్, నందిపేటవందన, ఆయూష్ డీపీఎంరవళి, ఎంపీహెచ్వో, డిచ్పల్లిఅశోక్ కుమార్, అసిస్టెంట్ డిప్యూటీ జైలర్సూర్యప్రకాశ్, సర్వేయర్, డిచ్పల్లినవాబ్, ఎమ్మారై, నిజామాబాద్ సౌత్గంగాధర్, తహసీల్దార్, కోటగిరిసంతోష్రెడ్డి, తహసీల్దార్, మెండోరావినయ్ సాగర్, నాయబ్ తహసీల్దార్, నిజామాబాద్ రూరల్సాయిలు, నాయబ్ తహసీల్దార్, మోస్రాశ్రీనివాస్, ఏఎంవీఐ, నిజామాబాద్రావుట్ల జనార్దన్, ఎన్జీవోవెంకటనారాయణ, సీఐ, బోధన్ టౌన్నర్సింగ్రావు, ఫైర్స్టేషన్ ఆఫీసర్, నందిపేటనాగరాజు, సెక్రటరీ, పీఏసీఎస్ రాంపూర్రాములు, ఎండోమెంట్ ఈవోమహ్మద్ అబ్దుల్ మజీద్, సీనియర్ అసిస్టెంట్, డీపీఆర్వోపుష్ప, ఎడ్యుకేషన్ ఆఫీసర్, నిజామాబాద్సయ్యద్ మస్తాన్ అలీ, ఏసీపీ, ట్రాఫిక్ నిజామాబాద్రమేశ్, టీపీవో, మున్సిపల్, నిజామాబాద్ నిక్షిత, కానిస్టేబుల్, ఆర్మూర్సంతోష్రెడ్డి, సీఎస్బీ ఎస్సై, నిజామాబాద్హరితరాణి, కానిస్టేబుల్, షీటీమ్ నిజామాబాద్సుమతి, హెడ్కానిస్టేబుల్ షీటీమ్, ఆర్మూర్రాశి, కానిస్టేబుల్, రెంజల్శ్రీజ, కానిస్టేబుల్, మెండోరాఎండీ సలీం, ట్రాఫిక్ హెడ్కానిస్టేబుల్గంగాధర్, ఏఆర్ ఏఎస్సై, ట్రాఫిక్శ్రీనివాస్, ఏఆర్ ఎస్సైప్రేమ్కుమార్, సీపీ పీఆర్వో, హెడ్కానిస్టేబుల్ -
‘ఓట్ల చోరీ’ గడపగడపకూ తీసుకెళ్లాలి
● బీజేపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంది ● రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపతిరెడ్డిమోపాల్(నిజామాబాద్రూరల్): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఓట్ల చోరీకి పాల్పడుతుందని, సుప్రీంకోర్టు తీర్పు ఇందుకు నిదర్శనమని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపతిరెడ్డి పేర్కొన్నారు. ఓట్ చోర్.. గద్దె చోడ్ నినాదాన్ని కాంగ్రెస్ కార్యకర్తలు గడపగడపకూ తీసుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. శుక్రవారం మండలంలోని న్యాల్కల్ గ్రామంలో ఎమ్మెల్యే భూపతిరెడ్డి మాసాని చెరువు గేట్లు ఎత్తి నిజాంసాగర్ ఆయకట్టుకు సాగునీరు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని, ఓట్ల చోరీకి పాల్పడుతూ ప్రజల హక్కులను కాలరాస్తుందని విమర్శించారు. బిహార్లో 65లక్షల ఓట్లు తొలగించిందని, దీనిపై రాహుల్గాంధీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, కాంగ్రెస్కు అనుకూలంగా తీర్పు వచ్చిందన్నారు. నీటిని పొదుపుగా వాడుకోవాలి.. మాసాని చెరువు నుంచి నిజాంసాగర్ కెనాల్ ద్వారా 15వేల ఎకరాలకు సాగునీటిని అందిస్తున్నామని, రైతులు నీటిని పొదుపుగా వాడుకోవాలని ఎమ్మెల్యే భూపతిరెడ్డి సూచించారు. వర్షాలు ముందుగా కురవడంతో రైతులు త్వరగా నాట్లు వేశారని, వర్షాభావ పరిస్థితుల కారణంగా పంటలకు సాగునీరు అవసరమని పేర్కొన్నారు. సొసైటీ పాలకవర్గాల గడువు పొడిగింపు శుభపరిణామమని, రైతులకు మరింత సేవ చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో నిజామాబాద్ ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, మండల అధ్యక్షుడు ఎల్లోల్ల సాయిరెడ్డి, ఫిషర్మెన్ జిల్లా చైర్మన్ బోర్గాం శ్రీనివాస్, ఇరిగేషన్ డీఈ బాలరాజు, సొసైటీ చైర్మన్ మోహన్రెడ్డి, నాయకులు గంగాప్రసాద్, ప్రతాప్సింగ్, కిరణ్రావు, బొడ్డు రఘు, కెతడి నారాయణ, సడక్ శేఖర్, సతీశ్ రావు, సతీశ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
జిల్లా కోర్టులో జెండా ఆవిష్కరించిన జడ్జి
నిజామాబాద్ లీగల్: స్వాతంత్య్ర వేడుకలను జిల్లా కోర్టులో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి జీవీఎన్ భరతలక్ష్మి జాతీయ జెండాను ఆవిష్కరించి, ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యాలయంలో కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఉదయభాస్కర్ రావు జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జడ్జీలు, కోర్టు సిబ్బంది, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ అర్బన్: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తన క్యాంప్ ఆఫీస్తోపాటు జిల్లా పరిషత్ కార్యాలయంలో ప్రత్యేకాధికారి హోదాలో జాతీయ పతాకాలను ఆవిష్కరించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో అదనపు కలెక్టర్ కిరణ్కుమార్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. కార్యక్రమాల్లో ట్రెయినీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావీ, టీజీవో జిల్లా అధ్యక్షుడు కిషన్, కార్యదర్శి అమృత్కుమార్, కలెక్టరేట్ ఏవో ప్రశాంత్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. మోర్తాడ్(బాల్కొండ): యూరప్ పంపిస్తామని నమ్మించి వేల్పూర్ మండలం పడిగెలకు చెందిన గంగాప్రసాద్ను యూఏఈలోనే ఉండిపోయేలా మోసగించిన ఇద్దరు గల్ఫ్ ఏజెంట్లపై పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ప్రవాసీ ప్రజావాణిలో బాధిత కుటుంబసభ్యులు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి స్పందించి బాధితునికి న్యాయం చేయాలని సీపీ సాయి చైతన్యకు లేఖ రాశారు. సీపీ ఆదేశాల మేరకు ఆలూర్ మండలం మచ్చర్లకు చెందిన ఆర్ నారాయణ, హైదరాబాద్లోని అమీర్పేట్కు చెందిన మహమ్మద్ అబ్దుల్ జబ్బర్లపై వేల్పూర్ పోలీసు స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. దీంతో దుబాయ్లో చిక్కుకుపోయిన గంగాప్రసాద్ను స్వదేశానికి తీసుకొచ్చేందుకు విదేశాంగ శాఖ చొరవ తీసుకుంటుందని అడ్వయిజరీ కమిటీ వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. -
అన్న వెంటే తమ్ముడు
● సోదరుని మరణాన్ని తట్టుకోలేక గుండెపోటుతో మృతి వేల్పూర్: అన్న మరణాన్ని తట్టుకోలేక తమ్ముడు గుండెపోటుకు గురై మరణించిన ఘటన శుక్రవారం వేల్పూర్ మండలం అంక్సాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన దివంగత రిటైర్డ్ టీచర్ అయ్యవార్ల మురళీధర్రావుకు భార్గవ్శ్యాం, ప్రేమ్కుమార్, విజయ్కుమార్ అనే ముగ్గురు కుమారులు ఉన్నారు. పెద్దకొడుకు భార్గవ్శ్యాం ప్రైవేటు కంపెనీలో పనిచేసుకుంటూ చాలా ఏళ్లుగా మహారాష్ట్రలోని నాగ్పూర్లో నివాసముంటున్నాడు. ప్రేమ్కుమార్ కలకత్తాలో ఉంటుండగా, విజయ్కుమార్ అంక్సాపూర్లో ఇంటి వద్దనే ఉండేవాడు. భార్గవ్ శ్యాం(57) కొద్దికాలంగా పక్షవాతంతో బాధపడుతూ గురువారం రాత్రి మరణించాడు. ఆయన మరణవార్తను శుక్రవారం ఉదయం అంక్సాపూర్లో ఉన్న తమ్ముడు విజయ్కుమార్కు తెలిపారు. దీంతో విజయ్కుమార్ తీవ్ర మనస్తాపం చెంది గుండెపోటుకు గురయ్యాడు. గ్రామస్తులు వెంటనే స్థానిక ఆర్ఎంపీ వద్ద ప్రాథమిక చికిత్స చేయించారు. మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్కు తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. భార్గవ్శ్యాం అంత్యక్రియలు శుక్రవారం పూర్తికాగా, విజయ్కుమార్ అంత్యక్రియలు కలకత్తాలో ఉండే అన్న ప్రేమ్కుమార్ శనివారం ఇంటికి వచ్చిన తర్వాత నిర్వహించనున్నట్లు గ్రామస్తులు తెలిపారు. అన్నదమ్ములు ఒకరివెంట ఒకరు మరణించడంతో గ్రామంలో విషాదం నెలకొంది.రాజంపేట: వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడికి తీవ్రగాయాలైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి. మండల కేంద్రానికి చెందిన గుర్రాల రమేశ్ కొడుకు ధనుంజయ్(4) స్థానిక ప్రైవేటు పాఠశాలలో ఎల్కేజీ చదువుతున్నాడు. గురువారం మధ్యాహ్నం 3గంటలకు మూత్ర విసర్జన కోసం పాఠశాల ఆవరణలోకి వెళ్లగా వీధికుక్కలు ఒక్కసారిగా దాడికి పాల్పడ్డాయి. దీంతో ధనుంజయ్కి తీవ్రగాయాలయ్యాయి. కుక్కలను తరిమే ప్రయత్నంలో ఓ ఉపాధ్యాయురాలిపై దాడికి యత్నించినట్లు తెలిసింది. విద్యార్థి ప్రస్తుతం కామారెడ్డి ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు స్థానికులు తెలిపారు. పెద్దకొడప్గల్(జుక్కల్): మండల కేంద్ర సమీపంలోని 161 జాతీయ రహదారిపై శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన మాడు సాయవ్వ శుక్రవారం ఉదయం వ్యవసాయ పనుల నిమిత్తం 161 జాతీయ రహదారి దాటుతుండగా పిట్లం నుంచి బిచ్కుంద వైపు వెళుతున్న కారు ఢీకొట్టింది. సాయవ్వకు గాయాలు కాగా స్థానికులు 108 అంబులెన్స్లో స్థానిక ప్రభుత్వ ఆస్పతిరికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం సాయవ్వను మెరుగైన వైద్యం కోసం బాన్సువాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
ఒకే వార్డులో కుటుంబమంతా..
మోర్తాడ్(బాల్కొండ): గ్రామ పంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వం ఇంకా పచ్చజెండా ఊపకపోయినా క్షేత్రస్థాయిలో మాత్రం ఏర్పాట్లు ముమ్మరంగా సా గుతున్నాయి. ఓటర్ల జాబితాను సవరిస్తూ ఆన్లైన్ లో నమోదు చేయడంలో పంచాయతీ కార్యదర్శు లు, కంప్యూటర్ ఆపరేటర్లు బిజిబిజీగా ఉన్నారు. కొత్తగా ఓటరు నమోదు చేసుకోవడంతో అనేక చో ట్ల ఓటర్ల సంఖ్య పెరిగింది.ఈ నేపథ్యంలో ఒక కు టుంబంలోని ఓటర్లందరూ ఒకే వార్డులో ఉండేలా సవరణ చేపట్టారు. గతంలో భార్య ఒక వార్డులో ఓటు హక్కు కలిగి ఉంటే, భర్త ఇతర కుటుంబసభ్యులు మరో వార్డులో ఓటు వేసేవారు. ఇలాంటి పరిస్థితి గందరగోళానికి దారి తీస్తుందనే ఉద్దేశంతో కుటుంబసభ్యులంతా ఒకే వార్డులో ఉండేలా చర్య లు తీసుకుంటున్నారు. మార్పులు, చేర్పులు.. తొలగింపులు జిల్లాలో పాత గ్రామ పంచాయతీలు 530 ఉండగా కొత్తగా విభజించిన పంచాయతీల సంఖ్య 15 ఉంది. మొత్తం వార్డులు 5022 ఉన్నట్లు అధికారులు గతంలో వెల్లడించారు. డిసెంబర్ 2024 నాటికి పంచాయతీలలో ఓటర్ల సంఖ్య 8,30,580గా నమోదైంది. ఈ సంవత్సరం ఆరంభంలో ఓటర్ల నమోదు చేపట్టగా సంఖ్య పెరిగింది. మరణించిన వారి పేర్లు జాబితా నుంచి తొలగించడం, కొత్తవారి చేరికతో ఓటర్ల జాబితా సవరణ అనివార్యమైంది. కాగా, ఓటర్ల జాబితాలను సవరిస్తూ ఆన్లైన్లో నమోదు చేయడంతో పనిభారం పెరిగిందని పంచాయతీ ఉద్యోగులు చెబుతున్నారు. ఆన్లైన్ నమోదు కొనసాగుతోంది ఓటర్ల జాబితాల సవరణ, ఆన్లైన్లో నమోదు ప్ర క్రియ కొనసాగుతోంది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఉన్నతాధికారులు సూచించిన విధంగా ప్ర తి పంచాయతీ ఓటర్ల జాబితాను ఆన్లైన్లో నమో దు చేస్తున్నాం.ఎలాంటి తప్పులు దొర్లకుండా జా గ్రత్తలు తీసుకుంటున్నాం. – శ్రీధర్, ఎంపీవో, మోర్తాడ్ గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితా సవరణ ఆన్లైన్లో నమోదు చేస్తున్న ఉద్యోగులు ఎన్నికలకు ఖరారు కాని షెడ్యూల్ క్షేత్రస్థాయిలో జరుగుతున్న ఏర్పాట్లు -
ముఖ గుర్తింపుతో 60శాతం
● నూతన విధానంతో జిల్లాలో 1,20,246 మందికి పింఛన్ల పంపిణీ ● వివిధ కారణాలతో మిగతా వారికి పాత పద్ధతిలోనే అందజేతడొంకేశ్వర్(ఆర్మూర్): చేయూత పింఛన్ల పంపిణీలో మరింత పారదర్శకత కోసం టీజీ ఆన్లైన్ అభివృద్ధి చేసిన ముఖ గుర్తింపు సాఫ్ట్వేర్(పేషియల్ రికగ్నిషన్)తో మొదటి సారిగా జిల్లాలో పింఛన్ల పంపిణీ పూర్తయింది. నూతన విధానం ద్వారా గ్రామాల్లో 60 శాతం మందికి పింఛన్లు అందజేయగా, మిగతా వారికి వివిధ కారణాలతో పాత పద్ధతిలోనే (వేలిముద్రలు తీసుకుని) పంపిణీ చేశారు. ముఖ గుర్తింపు సాఫ్ట్వేర్ కారణంగా పింఛన్ల పంపిణీ వేగవంతంగా పూర్తయినట్లు పోస్టల్ అధికారులు చెబుతున్నారు. చేతి వేలిముద్రల ద్వారా 10 మంది లబ్ధిదారులకు పింఛన్లు అందజేసేందుకు సుమారు అరగంట సమయం పట్టేది. ప్రస్తుతం ముఖ గుర్తింపు ద్వా రా కేవలం 15 నిమిషాల్లోనే పంపిణీ పూర్తవుతోంది. దీంతో లబ్ధిదారులు పోస్టాఫీసులు, గ్రామ పంచాయతీల వద్ద ఎక్కువ సేపు నిరీక్షించే పరిస్థితి పోయింది. అదే విధంగా గ్రామాల్లో బోగస్ పింఛన్లకు కూడా చెక్ పడినట్లయింది. బ తికున్నవారే పింఛన్లు పంపిణీ చేసే చోటికి వచ్చి డబ్బులు తీసుకుంటున్నారు. ఇటీవల జిల్లాలో జూన్ నెలకు సంబంధించిన పింఛన్ డబ్బులు పోస్టల్ అధికారులు గ్రామీణ లబ్ధిదారులకు ముఖ గుర్తింపు సాఫ్ట్వేర్తో పంపిణీ చేశారు. గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు కూడా ఈ ప్రక్రియను పరిశీలించారు. నిజామాబాద్ కార్పొరేషన్తోపాటు ఆర్మూర్, బోధన్, భీమ్గల్ మున్సిపాలిటీల పరిధిలోని లబ్ధిదారులకు ఎప్పటిలాగే నేరుగా బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేశారు. పంచాయతీ కార్యదర్శులకు తప్పిన భారం ఇది వరకు లబ్ధిదారులందరికీ చేతి వేలిముద్రల ద్వారా పింఛన్లు పంపిణీ చేస్తూ వచ్చారు. వేలిముద్రలు రానివారికి సంబంధిత గ్రామ పంచాయతీ కార్యదర్శి వేలిముద్రతో డబ్బులు అందజేశారు. పోయిన నెల వరకు పంచాయతీ కార్యదర్శులే బయోమెట్రిక్ పెట్టి జిల్లాలో సుమారు 12వేల మందికి పింఛన్లు ఇచ్చారు. ఇప్పుడు ముఖ గుర్తింపు సాఫ్ట్వేర్ రావడంతో వేలి ముద్రలు రాని లబ్ధిదారులకు ఇబ్బందులు తప్పాయి. పంచాయతీ కార్యదర్శులతో పని లేకుండానే పింఛన్ డబ్బులు తీసుకున్నారు. దీంతో పంచాయతీ కార్యదర్శుల సహాయంతో పింఛన్లు పొందే వారి సంఖ్య గణనీయంగా తగ్గింది. తమకు కూడా పనిభారం తగ్గిందని పంచాయతీ కార్యదర్శులు ఊపిరి పీల్చుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పింఛన్ లబ్ధిదారులు 2,01,243 ముఖ గుర్తింపుతో పింఛన్ పొందినవారు 1,20,246 వేలి ముద్రలతో పొందిన వారు 80,154 పంచాయతీ కార్యదర్శుల ద్వారా పొందిన వారు 843 -
ఘనంగా స్వాతంత్య్ర వేడుక
● త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ నిజామాబాద్ అర్బన్: జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో 79వ స్వాతంత్య్ర వేడుకలు శుక్రవారం పండుగ వాతావరణంలో జరిగా యి. వేడుకల కోసం జిల్లా యంత్రాంగం విస్తృత ఏ ర్పాట్లు చేయగా, రాష్ట్ర వెనుకబడిన తరగతుల కమి షన్ చైర్మన్ ఎస్.నిరంజన్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించిన ఆయన.. పుర ప్రముఖులను, అధికారులు, అనధికారులను కలిసి స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. వివిధ శాఖల ద్వారా అమలవుతున్న కార్యక్రమా లు, సాధించిన ప్రగతిని తెలిపేలా ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించారు. ఆయా శాఖల ఫొటో ఎగ్జిబిషన్, శకటాలను ఆసక్తిగా తిలకించారు. ఉత్త మ సేవలు అందించిన ఉద్యోగులకు ప్రశంసాపత్రా లు అందజేశారు. స్వాతంత్య్ర సమర యోధులను, వారి కుటుంబీకులను సన్మానించారు. వేడుకల్లో భా గంగా చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను ఆకట్టుకున్నాయి. ఎమ్మెల్యేలు ధన్పాల్ సూర్యనారాయణ, ఆర్.భూపతిరెడ్డి, పైడి రాకేశ్రెడ్డి, కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి, సీపీ సాయిచైతన్య, రాష్ట్ర సహకార సంఘాల యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్కుమార్, ట్రెయినీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావీ, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్రకుమార్, ఆయా శాఖల అధికారులు, సిబ్బంది, స్వాతంత్య్ర సమరయోధులు, ప్రజలు, విద్యార్థులు పాల్గొన్నారు. -
సంక్షేమానికి పెద్దపీట
నిజామాబాద్వాతావరణం ఆకాశం మేఘావృతమవుతుంది. చల్లని గాలులు వీస్తాయి. మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. రైతులకు మరింత సేవ.. మరోసారి పదవీకాలం పొడిగింపుతో రైతులకు మరింత సేవచేసే భాగ్యం కలిగిందని డీసీసీబీ చైర్మన్ రమేశ్రెడ్డి అన్నారు.శనివారం శ్రీ 16 శ్రీ ఆగస్టు శ్రీ 2025– 8లో uజాతీయ జెండాకు వందనం చేస్తున్న ముఖ్య అతిథి, బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, ఎమ్మెల్యేలు ధన్పాల్, రాకేశ్రెడ్డి, కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి, సీపీ సాయిచైతన్య తదితరులుఎస్సారెస్పీలోకి 60 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో ● వేగంగా పెరుగుతున్న ప్రాజెక్ట్ నీటి మట్టం ● గంటగంటకూ ఎక్కువవుతున్న వరద బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లోకి ఎగువ ప్రాంతాల నుంచి ఇన్ఫ్లో క్రమంగా పెరుగుతోంది. గురువారం 13,910 క్యూసెక్కుల ఇన్ఫ్లో రాగా.. శుక్రవారం ఉదయం నుంచి గంట గంటకూ పెరుగుతూ ెరాత్రి 9 గంటల వరకు 60 వేల క్యూసెక్కులకు చేరింది. ప్రాజెక్ట్ నుంచి కాకతీయ కాలువ ద్వారా 5 వేల క్యూసెక్కులు, సరస్వతి కాలువకు 800, అలీసాగర్ లిఫ్ట్కు 180 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. మిషన్ భగీరథ అవసరాలకు 231 క్యూసెక్కులు వినియోగిస్తుండగా, ఆవిరి రూపంలో 502 క్యూసెక్కుల నీరు పోతోంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 1091(80.5 టీఎంసీలు) అడుగులు కాగా, శుక్రవారం రాత్రి వరకు 1081.10(48 టీఎంసీలు) అడుగుల నీరు నిల్వ ఉందని ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు. గోదావరికి పెరిగిన వరద రెంజల్(బోధన్), నాలుగు రోజులుగా జిల్లాతోపాటు ఎగువన ఉన్న మహారాష్ట్రలో విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో గోదావరిలో వరద ప్రభావం పెరిగింది. కందకుర్తి వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. పుష్కర క్షేత్రంలోని పురాతన శివాలయం చుట్టూ వరద నీరు చేరింది. నిజాంసాగర్లోకి భారీ వరద 25,500 క్యూసెక్కుల ఇన్ఫ్లో నిజాంసాగర్: ఎగువన ఉన్న మెదక్, సంగారెడ్డి జిల్లాలలో కురుస్తున్న వర్షాలకు శుక్రవారం సాయంత్రం నిజాంసాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. సింగూరు ప్రాజెక్టుతో పాటు ఘనపురం ఆనకట్ట, హల్ది వాగుల ద్వారా 25,500 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ఎగువ నుంచి వరద నీరు భారీగా వచ్చి చేరుతుండడంతో ప్రాజెక్టు నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. నిప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1,405 అడుగుల(17.8 టీఎంసీలు)కుగాను శుక్రవారం సాయంత్రానికి 1,394.92 అడుగుల (6.781 టీఎంసీలు) నీరు నిల్వ ఉంది. సింగూర్ మూడు గేట్ల ఎత్తివేత ఎగువన సంగారెడ్డి జిల్లాలో ఉన్న సింగూర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. దీంతో ప్రాజెక్టు మూడు గేట్లను ఎత్తి 27 వేల క్యూసెక్కుల నీటిని మంజీర నదిలోకి వదులుతున్నారు. ఈ నీరు నిజాంసాగర్ ప్రాజెక్టును చేరనుంది.నిజామాబాద్ అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమానికి పెద్ద పీట వేస్తోందని, అర్హులందరికీ ఫలాలు అందుతున్నాయని బీసీ కమిన్ చైర్మన్ నిరంజన్ అన్నారు. 79వ స్వాతంత్య్ర వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన జెండా ఆవిష్కరించిన అనంతరం ప్రసంగించారు. జిల్లా రైతాంగానికి రూ.755 కోట్ల 29 లక్షల రుణ మాఫీ చేయడంతోపాటు ఇందిరమ్మ రైతు భరోసా కింద ఎకరాకు రూ.12 చొప్పున పంట పెట్టుబడి సాయం అందజేయడం జరిగిందని వెల్లడించారు. తొమ్మిది రోజుల్లో రూ.9వేల కోట్ల రైతు భరోసా అందించడం జరిగిందన్నారు. 2047 నాటికి భారతదేశ ముఖచిత్రాన్ని మార్చే గేమ్ ఛేంజర్ పాత్రలో తెలంగాణ ఉండనుందని, ఆ సంకల్పానికి దార్శనిక పత్రమే ‘తెలంగాణ రైజింగ్ 2047’ అని పేర్కొన్నారు. ఇది కేవలం ప్రణాళిక కాదని, ప్రపంచ వేదికపై తెలంగాణను సగర్వంగా నిలబెట్టే సంకల్పమని అన్నారు. జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ పథకాలపై స్వాతంత్య్ర దినోత్సవ వేదిక పైనుంచి నిరంజన్ ప్రసంగం సాగిందిలా.. రైతు రుణమాఫీ పథకం జిల్లాలో 97,696 మంది రైతులకు రూ.755 కోట్ల 29 లక్షల పంట రుణం మాఫీ అయ్యింది. రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అందింది. భూ భారతి రెవెన్యూ సదస్సుల ద్వారా గ్రామ స్థాయిలోనే సమస్యలను పరిష్కరించే అవకాశం ఉంది. జిల్లాలో మొత్తం 40,462 దరఖాస్తులు అందాయి. పౌర సరఫరాల శాఖ జూన్ నుంచి ఆగస్టు వరకు మొ త్తం 26,217 మెట్రిక్ టన్నుల ఉచిత సన్న బియ్యం పంపిణీ చేశాం. జనవరి నుంచి ఇప్పటి వరకు 11,852 నూతన రేషన్కా ర్డులు మంజూరు చేశాం. మహాలక్ష్మి 2,19,330 మంది గ్యాస్ వినియోగదారులకు 10,19,994 సిలిండర్ల సబ్సిడీ విడుదల చేసి రూ.30 కోట్ల 73 లక్షలు చెల్లించడం జరిగింది. పథకం ప్రారంభమైన నాటి నుంచి ఈనెల 10వ తేదీ వరకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకున్న మహిళలకు రూ.249 కోట్ల 13 లక్షలు ఆదా అయ్యాయి. గృహజ్యోతి గృహజ్యోతిలో భాగంగా మార్చి 2024 నుంచి జూలై 2025 వరకు ప్రతి నెలా 2,67,707 మంది వినియోగదారులకు జీరో బిల్లులు వచ్చాయి. వైద్యారోగ్యం టీబీ ముక్త్ భారత్కు కృషి చేస్తున్నాం. ప్రస్తుతం జిల్లాలో కేవలం 1,211 మంది వ్యాధిగ్రస్తులు మాత్రమే చికిత్స పొందుతున్నారు. విద్య జిల్లాలో 1,156 పాఠశాలల్లో 90,359 విద్యార్ధులకు మధ్యాహ్న భోజనం అందుతోంది. రెండు కేజీబీవీలు మంజూరయ్యాయి. ధర్పల్లి, ఇందల్వాయి, మెండోర, రుద్రూర్, మోపాల్ కేజీబీవీల్లో ఇంటర్మీడియట్ విద్యను ప్రవేశపెట్టాం. అటవీశాఖ జిల్లా మొత్తం అటవీ విస్తీర్ణం 2,14,056.38 ఎకరాలు. నేటి వరకు 27 లక్షల మొక్కలు నాటడం పూర్తయ్యింది. జిల్లాలో మొత్తం 542 నర్సరీలు ఏర్పాటయ్యాయి. శాంతి భద్రతల పరిరక్షణ డయల్ 100 ద్వారా ఫిర్యాదులు స్వీకరించి 5 నిమిషాల్లో పోలీసులు సమస్యలను పరిష్కరిస్తున్నారు. శాంతి భద్రతలను సామరస్యాన్ని కాపాడినందుకు, జిల్లాలో ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకున్నందుకు జి ల్లా పోలీస్ యంత్రాంగానికి అభినందనలు. స్వాతంత్య్ర వేడుకల్లో స్నేహ సొసైటీ రూరల్ ఫర్ రూరల్ రీ కన్స్ట్రక్షన్కు చెందిన మానసిక దివ్యాంగులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. యునైటెడ్ వి స్టాండ్.. మేరా భారత్ మహాన్ తదితర నినాదాలతో ప్లకార్డులను ప్రదర్శిస్తూ 75 మంది మానసిక దివ్యాంగులు నృత్యాలు చేశారు. ఈ సందర్భంగా చిన్నారులను ముఖ్య అతిథి అయిన బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి, సీపీ సాయిచైతన్య, ఉన్నతాధికారులు ప్రత్యేకంగా అభినందించారు. – నిజామాబాద్ నాగారం వ్యవసాయ రంగంవానాకాలం సీజన్కు సంబంధించి జిల్లాలో ఇప్పటి వరకు వరి 4.19 లక్షల ఎకరాల విస్తీర్ణంలో, మొక్కజొన్న 52 వేల ఎకరాలు, సోయాచిక్కుడు 33 వేల ఎకరాలు, పసుపు 23 వేల ఎకరాల విస్తీర్ణంలో మొత్తం సుమారు 5 లక్షల 33 వేల ఎకరాల్లో రైతులు పంటు సాగు చేస్తున్నారు. పంటల సాగులో అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు 1,746 మెట్రిక్ టన్నుల యూరియా బఫర్ లో ఉంది. ఇందిరమ్మ ఇళ్లు 19,397 ఇందిరమ్మ ఇళ్ల ని ర్మాణం లక్ష్యం. లబ్ధిదారులకు 17,301 ఇళ్లు మంజూరయ్యాయి. 9,486 ఇళ్ల మార్కింగ్ పూర్తి కాగా, 4,820 ఇళ్లు బేస్మెంట్, 742 రూఫ్, 237 స్లాబ్ లెవెల్ పనులు పూర్తయ్యాయి. రూ.60.36 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. ఐక్యతే మనబలం జిల్లాలో రూ.755 కోట్ల 29 లక్షల రుణ మాఫీ భూ భారతితో గ్రామ స్థాయిలోనే సమస్యలకు పరిష్కారం 17,301 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు 11,852 నూతన రేషన్కార్డులు సజావుగా సంక్షేమ పథకాల అమలు స్వాతంత్య్ర వేడుకల్లో ముఖ్య అతిథిగా ప్రసంగించిన నిరంజన్ -
మహిళను కట్టేసి చితకబాదిన దాయాదులు
మోపాల్ (నిజామాబాద్ రూరల్): నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలంలోని సింగంపల్లి గ్రామంలో అమానుష ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళను దాయాదులు గుంజకు కట్టేసి చితకబాదిన సంఘటన రెండురోజుల తర్వాత వెలుగు లోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరా లు.. గ్రామానికి చెందిన పల్లికొండ సవిత మతిస్థిమితం లేని భర్త, నలుగురు పిల్లలతో జీవనం సాగిస్తోంది. జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటోంది. సవిత ఇంటి ఎదుట నున్న స్థలంలో ఆమె తోటికోడలు పల్లికొండ లక్ష్మికి చెందిన గేదెలు, గొర్రెలు ఉంటాయి. గొర్రెలు, గేదెలు తరచుగా సవిత ఇంట్లోకి వచ్చి మలమూత్రాలు విసర్జించడమే కాకుండా, బియ్యం తినడం వంటివి చేస్తున్నాయి. ఈ విషయమై సవిత పలుమార్లు లక్ష్మి కుటుంబ సభ్యులకు చెప్పినా పట్టించుకోలేదు. మంగళవారం రాత్రి కూడా గేదె సవిత ఇంట్లోకి వెళ్లి బియ్యాన్ని తొక్కి చిందరవందర చేయడంతో లక్ష్మిపై సవిత ఆగ్రహం వ్యక్తం చేసింది. లక్ష్మి కోపంతో సవితను తిడుతూనే మంత్రాలు చేస్తున్నావని ఆరోపించింది. దీంతో ప్రమాణం చేద్దామని సవిత గేదెను తీసుకుని హనుమాన్ గుడి వద్దకు వెళ్లింది. అక్కడికి వచ్చిన లక్ష్మి సవితను హనుమాన్ ఆలయం వద్దనున్న పెద్ద గుంజకు(కట్టె) కట్టేసింది. లక్ష్మి కొడుకు గంగాధర్, కోడలు మమత, భర్త పల్లికొండ గంగాధర్ అక్కడికి చేరుకుని సవితపై దాడి చేశారు. తనను వదిలిపెట్టాలని సవిత వేడుకున్నా కనికరించలేదు. గంట తరువాత స్థానిక మహిళలు జోక్యం చేసుకుని సవిత కట్లు విప్పారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎస్సై జాడె సుస్మిత గురువారం గ్రామానికి వెళ్లి విచారణ చేపట్టారు. పల్లికొండ గంగాధర్, లక్ష్మి, వారి కుమారుడు గంగాధర్, కోడలు మమతను అరెస్ట్ చేసినట్లు ఎస్సై తెలిపారు. -
బీసీ కమిషన్ చైర్మన్కు స్వాగతం పలికిన కలెక్టర్
నిజామాబాద్ అర్బన్: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొననున్న రాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్ చైర్మన్ ఎస్.నిరంజన్ గురువారం రాత్రి జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆర్అండ్బీ అతిథి గృహం వద్ద ఆయనను కలెక్ట ర్ వినయ్ కృష్ణారెడ్డి, ఇతర అధికారులు మ ర్యాద పూర్వకంగా కలిసి పూల మొక్క అందించి స్వాగతం పలికారు. వారి వెంట ఆ ర్మూర్ సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్, నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్రకుమార్ తదితరులు ఉన్నారు. బెటాలియన్ ఏఆర్ ఎస్సైకి విశిష్ట సేవా పతకం డిచ్పల్లి: డిచ్పల్లి మండల కేంద్రంలోని తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీస్ ఏడో బెటాలియన్కు చెందిన ఏఆర్ ఎస్సై రామ్ దులారి సింగ్కు గురువారం కేంద్ర ప్రభుత్వం విశిష్ట సేవా పతకం ప్రకటించింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విశేష సేవలందించిన వారికి ప్రభుత్వం ఈ పతకం అందజేస్తుందని బెటాలియన్ అధికారులు తెలిపారు. గంగాసాగర్కు అంబేడ్కర్ ఎక్సలెన్సీ అవార్డు నందిపేట్(ఆర్మూర్): నందిపేట మండల కేంద్రానికి చెందిన కానూరి గంగాసాగర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఎక్సలెన్సీ అవార్డు–2025ను అందుకున్నాడు. హైదరాబాద్లోని తెలంగాణ సారస్వత పరిషత్లో సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యుమన్ రైట్స్ కమిషన్ ఆధ్వర్యంలో స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం జరిగిన కార్యక్రమంలో విద్యారంగ విభాగంలో గంగాసాగర్ అవార్డును అందజేశారు. 28 సంవత్సరాలుగా గ్రామీణ ప్రాంత విద్యార్థులను చదువుతోపాటు అన్ని రంగాలలో రాణించేలా తీర్చిదిద్దిన నేపథ్యంలో ఈ అవార్డు వరించింది. అసిస్టెంట్ కమిషనర్ శ్యామ్ సుందర్సింగ్, అడ్వకేట్ సునీల్కుమార్, సోషల్ జస్టిస్ ఫర్ హ్యుమన్ రైట్ కౌన్సిల్ నేషనల్ చైర్మన్ కొప్పుల విజయ్కుమార్, ఆర్టీఐ డైరెక్టర్ సాప పండరీ చేతుల మీదుగా అవార్డు అందుకున్నాడు. పీజీ సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం తెయూ(డిచ్పల్లి) : తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో పీజీ 2, 4వ సెమిస్టర్ రెగ్యులర్, బీఈడీ 2, 4వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలు గురువారం ప్రారంభమైనట్లు ఆడిట్ సెల్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. ఉదయం ఐదు పరీక్ష కేంద్రాలలో జరిగిన పీజీ పరీక్షల్లో 1861 మంది విద్యార్థులకు 1784 మంది హాజరుకాగా 77 మంది గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. బీఈడీ పరీక్షల్లో 1544 మంది విద్యార్థులకు 1494 మంది హాజరుకాగా 50 మంది గైర్హాజరైనట్లు ఆయన తెలిపారు. -
నిజామాబాద్
పంద్రాగస్టు వేడుకకు ముస్తాబైన పరేడ్ గ్రౌండ్శుక్రవారం శ్రీ 15 శ్రీ ఆగస్టు శ్రీ 2025నిజామాబాద్అర్బన్: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానం ముస్తాబైంది. రాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్ చైర్మన్ ఎస్.నిరంజన్ శుక్రవారం ఉదయం 9.30 గంటలకు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. అనంతరం జిల్లా ప్రగతిపై ప్రసంగించనున్నారు. ప్రజాప్రతినిధులు, పుర ప్రముఖులు హాజరుకానున్న నేపథ్యలో ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. వేడుకల్లో భాగంగా ఎగ్జిబిషన్ స్టాల్స్, శకటాల ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు సర్వం సిద్ధం చేసింది. -
సౌర వెలుగుల నడ్కుడ
ఆదర్శంగా నిలుస్తున్న జీజీ నడ్కుడగ్రామంలో ఏర్పాటు చేసిన సోలార్ యూనిట్డొంకేశ్వర్(ఆర్మూర్): పల్లెలు దేశానికి పట్టుకొమ్మలు అని బాపూజీ అన్న మాటలను నిజం చేస్తోంది మండలంలోని గంగగడ్డ (జీజీ) నడ్కుడ గ్రామం. బానిస సంకెళ్ల నుంచి విముక్తి పొంది స్వాతంత్య్ర ఫలాలు ఇంటింటికీ అందుతున్న గ్రామంగా గుర్తింపు పొందుతోంది. గ్రామంలో ఇప్పటికే ఇంటింటికీ ఇంటర్నెట్ సేవలు అందుతుండగా, సొలార్ వినియోగంలో ఆదర్శంగా నిలుస్తోంది. ఎస్సారెస్పీ బ్యాక్వాటర్ను ఆనుకొని ఉన్న ఈ మారుమూల పల్లె మూడేళ్ల క్రితమే సౌర విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంది. గ్రామ పంచాయతీలకు భారీ విద్యుత్ చార్జీల భారాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో జిల్లాలో జీజీ నడ్కుడ గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి సోలార్ సిస్టంను ఏర్పాటు చేశారు. అప్పట్లో కలెక్టర్గా పనిచేసిన నారాయణ రెడ్డి ‘గ్రీన్ విలేజ్’ పేరిట దీనికి శ్రీకారం చుట్టారు. మొత్తం ఆరుచోట్ల సోలార్ యూనిట్లను ఏర్పాటు చేయగా, రూ.13లక్షల వరకు ఖర్చయింది. నిర్వహణ మొత్తం గ్రామ పంచాయతీ చూస్తుండగా, జీపీకి సంబంధించిన బోరు మోటార్లు, వీధి దీపాలకు ‘సౌర’ విద్యుత్ను వాడుతున్నారు. సోలార్ సిస్టం ఏర్పాటుకు ముందు జీపీకి ప్రతినెలా రూ.లక్షకు పైగా విద్యుత్ బిల్లు వచ్చేది. ఇప్పుడు సగం మాత్రమే వస్తోంది. సోలార్ సిస్టంతో విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించుకున్న జీజీనడ్కుడ బాటలోనే జిల్లాలోని మరిన్ని జీపీలు నడవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సౌర యూనిట్ల ఏర్పాటుకు ముందు విద్యుత్ బిల్లులు భారీగా వచ్చేవి. మూడేళ్ల నుంచి సోలార్ కారణంగా బిల్లుల భారం తగ్గింది. సోలార్ ద్వారా గ్రామంలోని విద్యుద్దీపాలు, బోరు మోటార్లను వినియోగిస్తున్నాం. – సుప్రియ, పంచాయతీ కార్యదర్శి, జీజీ నడ్కుడ -
అవినీతే సమస్య..
నిజామాబాద్ అర్బన్ : 79 ఏళ్ల స్వాతంత్య్ర భారతంలో అతి పెద్ద సమస్యగా అవినీతి ఉందని, స్వేచ్ఛ, సమానత్వం అంతంతేనని పలువురు అభిప్రాయపడ్డారు. స్వాతంత్య్ర దినోత్సవం నేపథ్యంలో ‘సాక్షి’ సర్వే నిర్వహించింది. స్వతంత్ర భారతంలో అవినీతి, పేదరికం పెద్ద సమస్యగా మారాయని, అధికారులు నీతి, నిజాయితీతో పని చేయాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. మూడు ప్రధాన ప్రశ్నలకు 30 మంది సమాధానాలిచ్చారిలా.. ● మీరు ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య ఏది.. (ఏ) అవినీతి (బీ) పేదరికం (సీ) నాణ్యమైన విద్య (డీ) వైద్యం (ఇ) కుల వివక్ష ● (ఏ)4 (బీ)3 (సీ) 1 (డీ) 1 (ఇ) 1 ● స్వేచ్ఛ – సమాఽనత్వ్యం నిజంగానే అందరికి చేరుతోందా.. (ఏ) అవును (బీ) లేదు (సీ) కొద్దిగా ● (ఎ)4 (బీ)4 (సీ) 2 ● స్వాతంత్య్ర ఫలాలు అందరికీ దక్కాలంటే.. మరింత నీతి, నిజాయితీగా పనిచేయాల్సిన రంగం.. (ఏ) చట్ట సభలు (బీ) న్యాయ స్థానాలు (సీ) అధికార యంత్రాంగం (డీ) మీడియా ● (ఏ)2 (బీ) 2 (సీ) 5 (డీ) 1 స్వేచ్ఛ, సమానత్వం అంతంతే.. అధికార యంత్రాంగం నీతి, నిజాయితీతో పని చేయాలి ‘సాక్షి’ సర్వేలో ప్రజల అభిప్రాయాలు -
ప్రపంచానికి తలమానికం..
వైద్యరంగంలో ప్రపంచానికి భారతదేశం తలమానికంగా నిలుస్తుంది. ఏఐ కారణంగా వైద్యరంగంలో చాలా మార్పులు రాబోతున్నాయి. అధునాతన పరికరాలు అందుబాటులోకి వస్తాయి. ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకంతో వచ్చిన రోగులు మళ్లీ ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లకుండా భవిష్యత్లు అన్ని వైద్య సేవలందనున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైద్యరంగానికి నిధులు కేటాయిస్తూ అభివృద్ధి చేస్తున్నాయి. 2047 నాటికి దేశంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రజలకు పల్లె, పట్టణం తేడా లేకుండా మెరుగైన వైద్య సేవలు అందుతాయన్న నమ్మకం నాకు ఉంది. – శ్రీనివాస్, జీజీహెచ్ సూపరింటెండెంట్ -
ఓటరు జాబితాలో గోల్మాల్
క్యాండిల్ ర్యాలీలో పాల్గొన్న యూత్ కాంగ్రెస్ నాయకులునిజామాబాద్ సిటీ: కేంద్రంలోని బీజేపీ ప్రభు త్వం ఓటరు జాబితాను గోల్మాల్ చేసిందని యూత్ కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. దొంగ ఓట్లతో బీజేపీ అధికారంలోకి వచ్చిందని నిరసన తెలుపుతూ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో గురువారం రాత్రి నెహ్రూపార్క్ నుంచి క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు విపుల్గౌడ్ మాట్లాడుతూ.. ఏఐసీసీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ, పీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్కుమార్ గౌడ్ ఆదేశాలతో క్యాండిల్ర్యాలీ నిర్వహించామన్నారు. ఓటరు జాబితాలో అక్రమాలను రాహుల్గాంధీ బహిరంగపరిచిన విషయాన్ని గుర్తుచేశారు. కార్యక్రమంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి రాంభూపాల్, జీవీ రామకృష్ణ, నరేందర్గౌడ్, మఠం రేవతి, ప్రమోద్, పోల ఉష, పుప్పాల శోభ తదితులు పాల్గొన్నారు. -
ప్రపంచ దేశాలకు దిక్సూచిలా నిలుస్తుంది
విద్య, వైద్యం, టెక్నాలజీ, పరిపాలన, వ్యవసాయం తదితర అన్ని రంగాల్లో ప్రపంచంలోని ఇతర దేశాలకు దిక్సూచిలా మన దేశం నిలుస్తుంది. మనదేశంలోని ప్రతి ఒక్కరిలో టాలెంట్ ఉంది. కొవిడ్ వ్యాక్సిన్ను ప్రపంచానికి అందించిన ఘనత మనదే. రీసెర్చ్లతో మన దేశం ఎన్నో ఆవిష్కరణలకు వేదిక అవుతోంది. భవిష్యత్ తరాల కోసం అన్ని రంగాల్లో చాలా మార్పులు రావాలి. నూతన టెక్నాలజీకి అనుగుణంగా ప్రభుత్వాలు కొత్తకొత్త కోర్సులను ప్రవేశపెట్టాలి. 2047 కల్లా మన దేశం అగ్రామిగా ఉంటుంది. – ఎన్ కృష్ణమోహన్, ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్, అడిషనల్ డీఎంఈ -
ప్రాణ, ఆస్తి నష్టం సంభవించకుండా చూడాలి
● వీసీలో మంత్రులు పొంగులేటి, తుమ్మల, సీఎస్ ● క్షేత్రస్థాయిలో సిబ్బంది సిద్ధంగా ఉన్నారు : కలెక్టర్ నిజామాబాద్అర్బన్: రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో కలిసి గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్, పోలీస్ కమిషనర్లతో సమీక్షించారు. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నందున ఎక్కడ కూడా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించకుండా ముందస్తుగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో తక్షణ సహాయక చర్యలు చేపట్టేందుకు వీలుగా అన్ని జిల్లాలకు ప్రత్యేకంగా రూ. కోటి చొప్పున నిధులు కేటాయించినట్లు వెల్లడించారు. సహాయక చర్యలు పర్యవేక్షించేందుకు ఉమ్మడి పది జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ జిల్లాలో సాధారణ స్థాయిలోనే వర్షాలు కురుస్తున్నాయని, గురువారం ఉదయం సగటున 23 మి.మీ వర్షపాతం నమోదైందని మంత్రులు, సీఎస్ దృష్టికి తెచ్చారు. జిల్లాలో పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని, అయినప్పటికీ రానున్న 48గంటలపాటు భారీ వర్ష సూచన దృష్ట్యా అన్ని శాఖల అధికారులను అప్రమత్తం చేశామని తెలిపారు. ఎలాంటి పరిస్థితి తలెత్తినా సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు క్షేత్రస్థాయి సిబ్బంది సన్నద్ధమై ఉన్నారని వివరించారు. ఇప్పటికే అధికారులు, సిబ్బంది సెలవులను రద్దు చేశామన్నారు. జిల్లాలోని ఎస్సారెస్పీకి తక్కువగానే ఇన్ఫ్లో వస్తోందని, పరీవాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశామని, ఎప్పటికప్పుడు వరద పరిస్థితిని సమీక్షిస్తున్నామని తెలిపారు. 100 మంది ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది, శిక్షణ పొందిన మరో 20 మందితో కూడిన పోలీస్, ఫైర్ బృందం ఉందని, ఒక బృందాన్ని మెదక్ జిల్లాలో సహాయక చర్యలకు పంపించినట్లు పేర్కొన్నారు. వీసీలో సీపీ సాయి చైతన్య, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్కుమార్, డీఆర్డీవో సాయాగౌడ్, డీపీవో శ్రీనివాస్ రావు, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
క్రైం కార్నర్
రోడ్డు ప్రమాదంలో సొసైటీ చైర్మన్ మృతి మోర్తాడ్(బాల్కొండ): మండలంలోని దొన్కల్ శివారులోగల జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో శెట్పల్లి సహకార సంఘం చైర్మన్ సింగిడి రాజేశ్వర్రెడ్డి(70) మృతిచెందారు. వివరాలు ఇలా.. దొన్కల్ గ్రామానికి చెందిన రాజేశ్వర్రెడ్డి గురువారం బైక్పై పొలానికి వెళ్లాడు. కొద్దిసేటికే ఇంటికి తిరిగి బయలుదేరాడు. దొన్కల్ శివారులోని హైవేపై అతడి బైక్ను మెట్పల్లి నుంచి ఆర్మూర్ వైపు వెళుతున్న పశువుల వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి కూతురు రాధ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాము తెలిపారు. రాజేశ్వర్రెడ్డి కుటుంబ సభ్యులు ఆమెరికాలో ఉండటంతో అంత్యక్రియలు జరగడానికి ఒకటి రెండు రోజులు పట్టే అవకాశం ఉందని గ్రామస్తులు తెలిపారు. -
దరఖాస్తుల ఆహ్వానం
సిరికొండ: మండలంలోని కస్తుర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పాఠశాల ప్రత్యేకాధికారి పర్వీన్బేగం ఒక ప్రకటనలో తెలిపారు. సోషల్, హిందీ పోస్టులకు టెట్ ఉత్తీర్ణులై బీఏ బీఈడీ, సోషల్ మెథడాలజీ, ఎంపీటీ, హిందీ మెథడాలజీ కలిగి ఉండాలని తెలిపారు. ఎంపికై న వారికి గెస్ట్ ఫ్యాకల్టీగా నెలకు రూ.18 వేల వేతనం ఉంటుందని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు అన్ని ధృవపత్రాలతో ఈనెల 20లోపు పాఠశాలలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. నిజామాబాద్ రూరల్: విద్యార్థి దశ నుంచే సాహిత్యంపై మక్కు వ పెంచుకోవాలని భావకవి, కవిత్వ శిక్షకుడు, వైదిక పురో హితుడు తిరుమల శ్రీనివాస్ ఆర్య తెలిపారు. మండల కేంద్రంలోని సరస్వతి శిశు మందిర్ ఉన్నత పాఠశాల యజమాన్యం పిలుపు మేరకు గురువా రం ఆయన పాఠశాలను సందర్శించారు. అనంత రం విద్యార్థులకు సాహిత్యంపై మక్కువ పెంచే అ నేక విషయాలు తెలియజేశారు. పాఠశాల యజమాన్యం, నిర్వహకులు ఆచార్యుల బృందం ఆయనను సన్మానించారు. -
ఘనంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీ
మోపాల్: మండలకేంద్రంలో గురువారం బీజేపీ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా చిన్నారులు జాతీయ జెండాను ఎగురవేశారు. జెండాలను చేతబూని దేశభక్తి, జాతీయ భావం, దేశ ప్రాధాన్యతను పిల్లలకు బీజేపీ నాయకులు నవీన్రెడ్డి తెలియజేశారు. చిన్నారులు అక్షర, ఆకృతి, ఖుషి, చిన్ను, కన్నయ్య, అభినయ్, సంజీవ్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ధర్పల్లి మండల కేంద్రంలో.. ధర్పల్లి: మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో గురువారం తిరంగా యాత్ర చేపట్టారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు మువ్వన్నెల పతాకాలతో భారత్ మాతాకీ జై అంటూ నినాదాలతో ర్యాలీ చేపట్టారు. పార్టీ మండల అధ్యక్షుడు మహిపాల్ యాదవ్, గంగాదాస్, కర్క గంగారెడ్డి, శ్రీకాంత్, వెంకటేష్ పాల్గొన్నారు. -
పెళ్లి వ్యాన్ బోల్తా: 15 మందికి గాయాలు
డిచ్పల్లి: మండలంలోని మిట్టపల్లి గ్రామ శివారులో గురువారం సాయంత్రం పెళ్లి వ్యాన్ బోల్తా పడింది. ఈ ఘటనలో 15 మందికి గాయాలు కాగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. నిజామాబాద్ మండలం అర్సపల్లి గ్రామానికి చెందిన యువతితో ఇందల్వాయి మండలం మల్లాపూర్ గ్రామానికి చెందిన సట్ల అనిల్కు గురువారం పెళ్లి జరిగింది. మల్లాపూర్కు వచ్చిన వధువు తరపు బంధువులు సుమారు 50 మంది సాయంత్రం వ్యాన్లో అర్సపల్లికి బయలుదేరారు. మిట్టాపల్లి గ్రామశివారులోని మహాలక్ష్మీ ఆలయం మలుపు వద్ద వారి వ్యాన్ ప్రమాదవశాత్తు పక్కనున్న పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ఘటనలో 15 మంది గాయపడగా, వారిలో బాగిర్తి చంద్రయ్య, రాజయ్యలకు తీవ్ర గాయాలు కాగా పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం తెలియగానే మల్లాపూర్ మిట్టపల్లి గ్రామానికి చెందిన పలువురు ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి కారణమైన వ్యాన్ డ్రైవర్పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎండీ షరీఫ్ తెలిపారు. -
నిష్పక్షపాతంగా విచారణ జరపాలి
పెర్కిట్(ఆర్మూర్): కేజీబీవీ పాఠశాల విద్యార్థిని కా వేరి మృతిపై పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరపాలని ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాల్వి యా సూచించారు. పెర్కిట్ కేజీబీవీలో ఇంటర్ వి ద్యార్థిని కావేరి మృతిపై సబ్ కలెక్టర్ గురువారం పా ఠశాలకు వెళ్లి విచారణ జరిపారు. పాఠశాల ప్రత్యేక అధికారిణి గంగమణిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. తోటి విద్యార్థినులతో విడివిడిగా మాట్లాడి వివరాలు సేకరించారు. విద్యార్థిని అర్ధరాత్రి వాష్రూంకు వెళ్లగా కోతులు వెంబడించడంతో భయప డి, పరిగెత్తుతూ ప్రమాదవశాత్తూ భవనం పైనుంచి పడిందని పాఠశాల అధికారిణి సబ్కలెక్టర్కు తెలిపారు. సబ్ కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థుల నుంచి భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నందున పా రదర్శకంగా విచారణ జరిపి, బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామన్నారు. కోతుల బెడద నివారణకు పాఠశాల చుట్టూ గ్రిల్స్ ఏర్పాటు చే యించాలని అధికారులను ఆదేశించారు. మున్సిప ల్ కమిషనర్ తహసీల్దార్ పాల్గొన్నారు. -
జాతి ఆత్మగౌరవానికి ప్రతీక.. జాతీయ పతాకం
● నేడు స్వాతంత్య్ర దినోత్సవం ● వీధివీధిన రెపరెపలాడనున్న త్రివర్ణ పతాకం నిబంధనలు.. ● జెండా దీర్ఘ చతురస్రాకారంలో ఉండి, పొడవు, వెడల్పులు 3:2 నిష్పత్తిలో ఉండాలి. ● సమ నిష్పత్తిలో కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులు కలిగిఉండాలి. మధ్యలో నీలి రంగులో 24 మొనలు కలిగిన అశోక ధర్మ చక్రం రెండు వైపులా కనిపించేలా ఉండాలి. ● పతాకాన్ని గౌరవప్రదమైన ప్రదేశాల్లో ఎగుర వేయాలి. ● జెండాలోని కాషాయ రంగు పైకి వచ్చేలా కట్టాలి. ● జాతీయ పతాకం కంటే ఎత్తుగా మరే పతాకం ఎగుర వేయకూడదు. ● కుడి వైపున ఇతర జెండాలను పెట్ట కూడదు. జెండాను అలంకరణగా వాడరాదు. ● పతాకాన్ని నేలకు తగిలేలా ఉంచరాదు. ● ఎగర వేసేటప్పుడు జెండా వైపే చూస్తూ, నిలబడి వందనం చేయాలి. అనంతరం జాతీయ గీతాలాపన చేయాలి. ● సూర్యోదయం కంటే ముందు జెండాను ఎగురవేయకూడదు. ● సూర్యాస్తమయం సమయంలోనే కిందికి దించాలి. ● ప్రభుత్వ భవనాలపై త్రివర్ణ పతాకం ఎల్లప్పుడు ఎగురవచ్చు. ● దేశ ప్రముఖులు చనిపోతే సంతాప సూచకంగా పతాకాన్ని అవతనం చేయాలి. ● చినిగిన, నలిగిన పతాకాన్ని ఎగురవేయరాదు. ఆర్మూర్: ఎటు చూసినా రాజకీయ పార్టీల జెండాలే దర్శనం ఇవ్వడంతో 145 కోట్ల మంది భారతీయుల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తున్న మువ్వన్నెల జెండాకు గుర్తింపు కరువవుతోంది. ఇలాంటి తరుణంలో మన జాతీయ జెండా ప్రాముఖ్యతను, నియమాలను ప్రతిఒక్కరూ తప్పనిసరిగా తెలుసుకోవాలి. నేడు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ప్రాముఖ్యత, నియమాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. జాతీయ జెండా రూపకల్పన ఇలా.. 1921లో విజయవాడలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశాలు నిర్వహిస్తున్న సమయంలో బందరుకు చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు పింగళి వెంకయ్య ఒక జాతీయ పతాకాన్ని రూపొందించి గాంధీజీకి చూపించారు. రెండు గడులు పచ్చగా ఒక గడి ఎరుపుగా ఉండేది. గాంధీజీ ఆ పతాకానికి కొన్ని మార్పులు సూచించారు. దాని ప్రకారం తెలుపు, పచ్చ, ఎరుపు రంగుల మధ్య చరఖా వచ్చి చేరింది. నేటి మన జాతీయ పతాకానికి మాతృక ఇది. 1931లో కరాచిలో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో కాంగ్రెస్ నాయకత్వం జాతీయ పతాకం రూపొందించడం కోసం ఒక సబ్ కమిటీని నియమించింది. ప్రజాభిప్రాయ సేకరణ అనంతరం ఎరుపు, తెలుపు, ఆకుప్చ రంగులున్న పతాకాన్ని రూపొందించారు. తెలుపు రంగులో నీలి రంగు చరఖాను ఏర్పరిచారు. ఈ పతాకాన్ని కాంగ్రెస్ కమిటీ ఆమోదించింది. ఆ తర్వాత జాతీయ జెండాలో రాట్నానికి బదులుగా అశోక ధర్మ చక్రాన్ని చేర్చమని అంబేడ్కర్ ప్రతిపాదించగా, సర్దార్ వల్లబ్భాయ్ పటేల్ సమర్థించారు. దీంతో జాతీయ పతాకం మధ్యలో నీలి రంగులో 24 మొనలు కలిగిన అశోక ధర్మ చక్రాన్ని ముద్రించారు. ఈ జాతీయ పతాకాన్ని భారత రాజ్యాంగ సభ 1947 జూలై 22న ఆమోదించింది. జిల్లాకు భారీ వర్ష సూచన -
సంక్షిప్తం
బడిలో కృష్ణాష్టమి వేడుకలు మోపాల్: మండలంలోని మంచిప్ప గ్రామంలోగల జ్ఞానోదయ హైస్కూల్లో గురువారం శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. చిన్నారులు కృష్ణుడు, గోపికమ్మల వేషధారణలో అలరించారు. ఉట్టి కొట్టి సంబురాలు చేసుకున్నారు. ప్రిన్సిపాల్ దేవ శంకర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. దుర్గామాతను దర్శించుకున్న జిల్లా నాయకులు నిజామాబాద్ సిటీ: జిల్లాకు చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు గురువారం విజయవాడలోని కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి, రాష్ట్ర సహకార సంఘం లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్రెడ్డి, నుడా చైర్మన్ కేశ వేణు, రైతు కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, నరాల రత్నాకర్, ఆర్మూర్ ఏబీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. క్రికెట్ టోర్నీకి ఎంపిక నిజామాబాద్నాగారం: చైన్నెలో ఈ నెల 18 నుంచి జరిగే బుచ్చిబాబు ఇన్విటేషన్ క్రికెట్ టోర్నమెంట్కు జిల్లాకు చెందిన క్రికెట్ క్రీడాకారుడు అనికేత్రెడ్డి ఎంపికయ్యారు. ది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ జస్టీస్ నవీన్రావు, జాయింట్ సెక్రటరీ బస్వరాజు కలిసి 15మందితో కూడిన జట్టును ఎంపిక చేసి ప్రకటించారు. అనికేత్రెడ్డిని జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు చంద్రసేన్రెడ్డి, జిల్లా కార్యదర్శి వెంకట్రెడ్డి, కోశాధికారి శ్రీనివాస్, కోచ్ సురేష్ అభినందించారు. ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలి నిజామాబాద్ సిటీ: జిల్లాకేంద్రంలోని కోజాకాలనీలోగల ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సయ్యద్ ఖైసర్ కోరారు. ఈమేరకు గురువారం ఆయన హైదరాబాద్లోని సీడీఎంఏ కార్యాలయంలో లిఖితపూర్వకంగా ఫిర్యాదుచేశారు. ప్రభుత్వ స్థలాన్ని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టిన అప్పటి నగర మేయర్, డిప్యూటీ మేయర్, మున్సిపల్ కమిషనర్, స్థానిక కార్పొరేటర్లపై చర్యలు తీసుకోవాలని కోరారు. -
లోతట్టు ప్రాంతాల్లో మాక్డ్రిల్
● భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు జాగ్రత్తలు సూచించిన అగ్నిమాపక శాఖ ఖలీల్వాడి: భారీ వర్షాల సూచన నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని ఖానాపూర్ రోడ్డులోని లోతట్టు ప్రాంతాలు, కెనాల్ ప్రాంతంలో అగ్నిమాపకశాఖ అధికారులు మాక్డ్రిల్ నిర్వహించారు. భారీ వర్షాలకు నీ రు ఇళ్లలోకి వచ్చి చేరితే, రక్షణ చర్యలపై కాలనీవాసులకు అవగాహన కల్పించారు. ఇళ్లలోకి నీరు వస్తే వెంటనే ఎత్తైన ప్రదేశాలకు వెళ్లాలని ప్రజలకు అగ్నిమాపకశాఖ అధికారి శంకర్ సూచించారు. సంబంధిత అధికారులకు సమాచారం అందించాలన్నారు. పారిశుద్ధ్య పనుల పరిశీలన నిజామాబాద్ సిటీ: మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను గురువారం డిప్యూటీ కమిషనర్ రవిబాబు పరిశీలించారు. మహాలక్ష్మినగర్, బ్యాంక్కాలనీ, నాందేవ్వాడ, ముజాహిద్నగర్ కాలనీల్లో శానిటరీ సూపర్వైజర్తో కలిసి ఆయన పర్యటించారు. చెత్తను ఎప్పటికప్పుడు తొలగించాలని, ట్రాక్టర్లలో చెత్తను డంపింగ్యార్డుకు తరలించాలని సిబ్బందిని ఆదేశించారు. ప్రజలు మున్సిపల్ సిబ్బందికి సహకరించాలని సూచించారు. సూపర్వైజర్, ఇన్స్పెక్టర్లు శ్రీకాంత్, సునీల్ తదితరులున్నారు. -
మహిళలను కోటీశ్వరులను చేస్తాం
● రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి ● అర్గుల్లో రూ. కోటి నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన జక్రాన్పల్లి: ఇందిరమ్మ రాజ్యంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి అన్నారు. గురువారం జక్రాన్పల్లి మండలంలోని అర్గుల్లో రూ. కోటి నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. రజక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇప్పటివరకు రాష్ట్రంలో రెండు కోట్ల మంది మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించారన్నారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి రూ.6800 కోట్లు చెల్లించిందన్నారు. రైతులకు ఉచిత కరెంటు, రైతు రుణమాఫీ, పేదల గృహాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, సన్న బియ్యం, డ్వాక్రా సంఘాలకు ఒక్కో గ్రూప్ కు రూ. 15 లక్షలు వడ్డీ లేని రుణాలు, వంటి పథకాలను అమలు చేస్తుందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో పేదలకు రేషన్ కార్డులు, ఒక్క ఇల్లు మంజూరు చేయలేదన్నారు. బీసీలకు 42 శాతం ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేసిందన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ఎంపీలు, బీసీ రిజర్వేషన్లకు అనుకూలమా, వ్యతిరేకమా, స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. చాకలి ఐలమ్మ స్ఫూర్తితో ప్రభుత్వం మహిళలకు అత్యధిక ప్రాధాన్యత కల్పిస్తుందన్నారు. అనంతరం చాకలి ఐలమ్మ ముని మనుమరాలు శ్వేతను ఎమ్మెల్యే ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, ఐడీసీఎంఎస్ మాజీ చైర్మన్ మునిపల్లి సాయి రెడ్డి, సర్పంచుల ఫోరం జిల్లా మాజీ అధ్యక్షుడు గోర్త రాజేందర్, నాయకులు చిన్నారెడ్డి, చిన్న సాయి రెడ్డి, ఆర్మూర్ గంగారెడ్డి, శేఖర్, కాటిపల్లి నర్సారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, సత్యం రెడ్డి, వసంతరావు, మద్దుల రమేశ్, గోర్త పద్మ , రజక సంఘ సభ్యులు సాగర్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. -
సైబర్ క్రైంపై అవగాహన
ఖలీల్వాడి: నిజామాబాద్ రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు రైల్వే, ఆర్పీఎఫ్ పోలీసులు సైబర్ మోసాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రైల్వే ఎస్సై సాయిరెడ్డి మాట్లాడుతూ స్మార్ట్ ఫోన్కు వచ్చే లింకులను ఓపెన్ చేయవద్దని సూచించారు. సైబర్మోసాలకు గురైతే వెంటనే 1930 ట్రోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేయాలని తెలిపారు. కల్వర్టుల పరిశీలన డిచ్పల్లి: మండలంలోని కొరట్పల్లి గ్రామాన్ని ఎంపీడీవో రాజ్వీర్, పంచాయతీ రాజ్ డిప్యూటీ ఈఈ ఇషాక్ అలీలు గురువారం సందర్శించారు. కొరట్పల్లి నుంచి జక్రాన్పల్లి మండలం కలిగోట్–చింతలూరు గ్రామాలకు వెళ్లే రోడ్డుపై ఉన్న కల్వర్టులను వారు పరిశీలించారు. ప్రజలు రాకపోకలు సాగించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కొరట్పల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి నగేశ్కు తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రేషన్కార్డుల పంపిణీ నిజామాబాద్ రూరల్: సారంగాపూర్లోని 13వ డివిజన్లో కొత్తగా మంజూరైన రేషన్కార్డులను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కుంచపు నాగేశ్ పంపిణీ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. నూతన రేషన్కార్డుల మంజూరుకు కృషి చేసినందుకు రూరల్ ఎమ్మెల్యే డా.భూపతిరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు సుదర్శన్, రామ్సింగ్, రవి, శ్రీరాములు, ఇలియాజ్, అనిల్ తదితరులు పాల్గొన్నారు. పాకాలలో ఘనంగా తీజ్ సిరికొండ: మండలంలోని పాకాల గ్రామంతోపాటు గంగారాంనాయక్ తండాలో తీజ్ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. గోధుమ మొలకల బుట్టలతో బంజారా మహిళలు పాటలు పాడుతూ సంప్రదాయ రీతిలో నృత్యాలు చేశారు. ఊరేగింపుగా వెళ్లి గోధుమ మొలకలను చెరువులో నిమజ్జనం చేశారు. తండా పెద్దలు ఆనంద్నాయక్, భూపతినాయక్, గంగానాయక్, రమేశ్నాయక్, తిరుపతినాయక్, రవినాయక్, బీమ్లానాయక్, లాల్సింగ్నాయక్, గ్రామ అధ్యక్షుడు సంతోష్నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
200 ట్రిప్పులు.. రూ.3000
● హైవేపై నేటి నుంచి వార్షిక టోల్ పాస్ అమలు ● రాజ్మార్గ్ యాత్ర యాప్ ద్వారా పాస్లు పొందే అవకాశం ఇందల్వాయి( నిజామాబాద్ రూరల్): జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు ప్రయాణం మరింత సులభంగా, చవకగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం నేటి నుంచి వార్షిక టోల్పాస్ విధానాన్ని అమలు చేయనుంది. ఒకసారి రూ.3వేలు చెల్లిస్తే సంవత్సరంలో టోల్గేట్ గుండా 200 ట్రిప్పులు వెళ్లవచ్చు. ఒకసారి టోల్గేట్ దాటితే ఒక ట్రిప్పుగా పరిగణిస్తారు. ఈ వార్షిక పాస్ కోసం వాహనదారులు ఇప్పుడు ఉన్న ఫాస్టాగ్కే రాజ్మార్గ్ యాత్ర యాప్ లేదా ఎన్హెచ్ఏఐ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకొని రూ.3వేలు చెల్లిస్తే, రెండు గంటల్లో యాక్టివేట్ అవుతుంది. కాల పరిమితి లేదా 200 ట్రిప్పులు పూర్తవగానే వాహనదారుడి ఫాస్టాగ్ పాత విధానం (పే ఫర్ యూజ్)లోకి మారిపోతుంది. తెలుపు రంగు నంబర్ ప్లేట్ ఉంటేనే.. ఈ వార్షిక టోల్పాస్ తెలుపు రంగు నంబరు ప్లేటు కలిగిన వాహనాలకు మాత్రమే ఈ విధానం వర్తిస్తుంది. పసుపు రంగు నంబరు ప్లేటు కలిగిన వాహనాలకు వర్తించదు. ఒక వాహనంపై పొందిన వార్షిక పాస్ మరో వాహనానికి వర్తించదు. వార్షికపాస్ తీసుకోవటం తప్పనిసరి కాదు. రాష్ట్ర రహదారులు, ఔటర్ రింగ్ రోడ్లు, మున్సిపల్ టోల్స్ వద్ద ఈ వార్షిక టోల్పాస్ చెల్లుబాటు కాదు. ఇందల్వాయి టోల్ప్లాజావ్యాపార పనుల నిమిత్తం ఇదివరకు నిజామాబాద్ నుంచి హైదరాబాద్కు నెలలో ఐదారు సార్లు వెళ్లేవాన్ని. ఈ క్రమంలో టోల్చార్జీలే రెండు మూడు వేల రూపాయలు కట్టేవాన్ని. వార్షిక టోల్పాస్ ద్వారా వందల్లోనే కట్టాల్సి రావడం సంతోషకరం. ప్రయివేటు వాహనదారులకు ఈ పాస్ ఎంతో ఉపయోగకరం. –కుంట గంగారెడ్డి, నల్లవెల్లి -
వేగవంతంగా ‘డబుల్ ఇళ్ల’ కేటాయింపు ప్రక్రియ
నిజామాబాద్అర్బన్: జిల్లాలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అర్హులకు కేటాయించే ప్రక్రియ వేగవంతం చేసినట్లు కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు సంబంధిత శాఖల అధికారులు గురువారం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సముదాయాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం వారు స్థానికంగా నెలకొని ఉన్న స్థితిగతులను కలెక్టరేట్లో ఆయనకు వివరించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ మార్గదర్శకాలు, నిబంధనలకు అనుగుణంగా అర్హులను గుర్తించి ఆమోదం నిమిత్తం జిల్లా ఇన్చార్జి మంత్రికి లబ్ధిదారుల జాబితా పంపుతామని అన్నారు. ప్రధానంగా ఇల్లు, నివాస స్థలం లేని నిరుపేద కుటుంబాలు, సఫాయి కర్మచారీలు, వితంతువులు, ఒంటరి మహిళలకు ఇళ్ల కేటాయింపులో తొలి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా గృహ నిర్మాణ సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ పవన్ కుమార్, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్రకుమార్, ఆర్అండ్బీ డీఈ రంజిత్, హౌసింగ్ అధికారి నివర్తి తదితరులు ఉన్నారు. -
ప్రభుత్వ ఆస్పత్రుల పనితీరు మెరుగుపర్చాలి
● కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ● వైద్యశాఖ అధికారులతో సమీక్ష నిజామాబాద్అర్బన్: జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల పనితీరు మరింతగా మెరుగుపడాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. వైద్యవిధాన పరిషత్ పరిధిలో కొనసాగుతున్న జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల పనితీరుపై కలెక్టర్ గురువారం సాయంత్రం కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని ఆయా ఆస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది ఖాళీలు, వాటి భర్తీకి చేపట్టిన చర్యల గురించి జిల్లా ఆస్పత్రుల సమన్వయకర్త డీసీహెచ్ఎస్ శ్రీనివాస్ ప్రసాద్ను కలెక్టర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఖాళీల భర్తీ కోసం ఉన్నతాధికారులకు పంపిన ప్రతిపాదనలను పరిశీలించారు. విభాగాల పనితీరును సమీక్షించారు. కాగా, వర్ని, ధర్పల్లి తదితర ప్రాంతాల్లో నూతనంగా నిర్మిస్తున్న ఆస్పత్రుల భవన నిర్మాణాల పనులు వేగంగా , నాణ్యతతో జరిగేలా పర్యవేక్షణ చేయాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ అంకిత్, డీఎంహెచ్వో రాజశ్రీ, తదితరులు పాల్గొన్నారు. -
సింగూరు ప్రాజెక్టు గేటు ఎత్తివేత
నిజాంసాగర్: ఎగువన వర్షాలు దంచి కొట్టడంతో ప్రాజెక్టులు జలకళను సంతరించుకుంటున్నాయి. బుధవారం సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టు 11 వ నంబర్ గేటును ఎత్తి, 7,694 క్యూసెక్కుల నీటిని మంజీర నదిలోకి వదులుతున్నారు. ఈ నీరు నిజాంసాగర్ ప్రాజెక్టులోకి వచ్చి చేరనుంది. ‘సాగర్’లోకి 16 వందల క్యూసెక్కులు.. నిజాంసాగర్ ప్రాజెక్టులోకి 1,600 క్యూసె క్కుల ఇన్ఫ్లో వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1,405 అడుగులు (17.8 టీఎంసీలు) కాగా.. బుధవారం సాయంత్రానికి 1,300.93 అడుగుల (5.67 టీఎంసీలు) నీరు నిల్వ ఉంది. 12,769 క్యూసెక్కుల ఇన్ఫ్లో బాల్కొండ:శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లోకి ఎగువ ప్రాంతాల నుంచి 12,769 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. అవుట్ ఫ్లో తక్కువగా, ఇన్ఫ్లో ఎక్కువగా ఉండటంతో ప్రాజెక్ట్ నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. బోధన్ మున్సిపల్ కమిషనర్గా జాదవ్ కృష్ణ బోధన్టౌన్(బోధన్): బోధన్ మున్సిపల్ కమిషనర్గా జాదవ్ కృష్ణ బుధవారం రా త్రి బాధ్యతలు తీసుకున్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీ కమిషనర్గా పనిచేసిన కృష్ణ పలు ఆరోపణల నేపథ్యంలో సస్పెన్షన్కు గురయ్యారు. ఆ తరువాత ఆరోపణలు అవాస్తవమని తేలడంతో సీడీఎంఏ ఆయనను బోధన్ మున్సిపల్ కమిషనర్గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పంద్రాగస్టు వేడుకకు ముఖ్య అతిథిగా బీసీ కమిషన్ చైర్మన్ నిజామాబాద్అర్బన్: జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించనున్న 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ హాజరవుతారని కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి తెలిపారు. ముఖ్య అతిథిగా జాతీయ పతాకాన్ని ఎగురవేస్తారని, వేడుకలను ఘనంగా నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. 17న షటిల్ బ్యాడ్మింటన్ జిల్లాస్థాయి ఎంపికలు నిజామాబాద్నాగారం: ఈ నెల 17న జిల్లాస్థాయి బాలబాలికల షటిల్ బాడ్మింటన్ ఎంపికలు నిర్వహించనున్నట్లు బ్యాడ్మింటన్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కర్నాటి వాసు, కేవీ కిరణ్కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అండర్–11, 13,15 విభాగంలో బాలబాలికలకు పోటీలు ఉంటాయన్నారు. మోపాల్ మండల కేంద్రంలోని ఫిట్నెస్ క్లబ్లో ఎంపికలు నిర్వహిస్తామని, వివరాలకు ఆర్గనైజింగ్ కార్యదర్శి శ్రీనివాస్గౌడ్ 9848351255 నెంబర్లో సంప్రదించాలని సూచించారు. శాలువాలు, బొకేలు వద్దు ● ఎంపీ అర్వింద్ ధర్మపురి సుభాష్నగర్: తనను కలిసేందుకు వచ్చే పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు, ప్రజలు బొకేలు, శాలువాలు తీసుకురావొద్దని ఎంపీ అర్వింద్ ధర్మపురి బుధవారం ఒక ప్రకటనలో సూచించారు. వాటికి బదులు నోట్బుక్స్, పెన్నులు వంటివి తీసుకురావాలని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పేద విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని ఆయన పేర్కొన్నారు. -
సవాల్గా సమస్యల పరిష్కారం
నిజామాబాద్ అర్బన్: భూ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన భూ భారతి అధికారులకు తలనొప్పిగా మా రింది. జిల్లాలో 453 రెవెన్యూ సదస్సులు నిర్వహించిన అధికారులు 40,468 దరఖాస్తులను స్వీకరించారు. భూ సమస్యలను ఆగస్టు 14వ తేదీ లోగా పరిష్కరిస్తామని ప్రకటించగా, నేటితో గడువు ము గియనుంది. కాగా మొత్తం దరఖాస్తుల్లో సగం ద రఖాస్తులు కూడా పరిష్కారానికి నోచుకోలేదు. ఇందుకు ప్రధాన కారణం కోర్టు కేసులకు సంబంధించిన వ్యవహారాలే. ఉండడం గత కొన్నేళ్ల నుంచి ప రిష్కారం కానీ సమస్యలు ఉండడమే ప్రధాన కారణం. సాదా బైనామా దరఖాస్తులు 9,185 ఉండగా, ప్రభుత్వ భూముల నుంచి పట్టా భూములుగా మార్చేందుకు 9,233, ఇతర సమస్యలకు సంబంధించి 4,189 దరఖాస్తులు అందాయి. స్వీకరించిన మొత్తం స్వీకరించిన దరఖాస్తుల్లో 22,607 దరఖాస్తులను పరిష్కరించేందుకు అవకాశం ఉందని గుర్తించినప్పటికీ 1320 దరఖాస్తులను మాత్రమే పరిష్కరించారు. మరో 2449 దరఖాస్తులు పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇదివరకే 28,072 మందికి దరఖాస్తులకు అనుగుణంగాసమస్యల పరిష్కారానికి సంబంధించి నోటీసులు అందించారు. వీటి పరిశీలన ప్రస్తుతం కొనసాగుతోంది. ఆ దరఖాస్తులే ఎక్కువ.. భూభారతి దరఖాస్తుల్లో ఎక్కువగా సాదాబైనామా, ప్రభుత్వ భూమి నుంచి పట్టా భూమిగా మార్పిడి, పేరు మార్పిడికి సంబంధించిన దరఖాస్తులే ఎక్కువగా ఉన్నాయి. వీటిని పరిశీలించి పరిష్కరించే అవకాశం ఉంది. అయితే క్షేత్రస్థాయికి అధికారులు వెళ్లినప్పుడు దరఖాస్తుదారు అందుబాటులో ఉండకపోవడం, సర్వే నంబర్లు ఇతరత్రా ఇబ్బందులు ఉండటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కోర్టు కేసులూ జాప్యానికి కారణమవుతున్నాయి. క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారానికి రెవెన్యూ బందాలను కూడా అధికారులు ఏర్పాటు చేయగా, దరఖాస్తుల పరిశీలనకు ఎక్కువ సమయం తీసుకోవడంతో మరింత సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు ప్రభుత్వం విధించిన గడువు మళ్లీ పొడిగించే అవకాశం ఉందని రెవెన్యూ అధికారులు పేర్కొంటున్నారు. మొత్తం దరఖాస్తుల్లో ఇప్పటి వరకు ఇప్పటివరకు 1,320 దరఖాస్తులను మాత్రమే క్లియర్ చేశారు. భూభారతి దరఖాస్తులు 40468 పరిష్కారమైనవి 1320 నేటితో ముగుస్తున్న గడువు మరింత సమయం పట్టే అవకాశం -
అగమ్య గోచరంగా జిల్లా పరిస్థితి
నిజామాబాద్ అర్బన్: జిల్లా పరిస్థితి అగమ్య గోచరంగ మారిందని, జిల్లాను పట్టించుకున్న వారే కరువయ్యారని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్రెడ్డి విమర్శించారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాకు మంత్రి లేరని, తమ గోడును ఎవరికి చెప్పుకోవాలో తెలియక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ ఉన్నా ఆయన ఏనాడూ జిల్లా ను పట్టించుకోలేదన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జీలు అవినీతి, అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. వారి అవినీ తిని ప్రజలు గమనిస్తున్నారని, స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండా రెపరెపలాడడం ఖాయమని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సీఎం రేవంత్రెడ్డి రాష్ట్రాన్ని అప్పులకుప్ప చేస్తున్నారని విమర్శించారు. ఆరు గ్యారెంటీల అమలును విస్మ రించారని, ఏ ఒక్క వర్గం సంతోషంగా లేదన్నారు. మహిళలకు మహాలక్ష్మి పథకం కింద రూ.2500 ఇస్తామన్న హామీ అమలు కావడం లేదన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు కూడా ఇవ్వడం లేదన్నారు. తెలంగాణ ఆడపడుచులకు బతుకమ్మ చీరలు ఇవ్వడం లేదన్నారు, క్రిస్మస్, రంజాన్ కానుకలు మర్చిపోయారని విమర్శించారు. సమావేశంలో పార్టీ నాయకులు ప్రభాకర్, సుజిత్ సింగ్ ఠాకూర్, రాజేశ్వర్రెడ్డి, మస్తా ప్రభాకర్, పూజా నరేంద్ర, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ అవినీతిని ప్రజలు గమనిస్తున్నారు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఏ జీవన్రెడ్డి -
అత్యవసరమైతేనే బయటికి రండి
నిజామాబాద్ అర్బన్: రానున్న రెండు రోజులపాటు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు చేసిన నేపథ్యంలో అ న్ని శాఖల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించా రు. ప్రజలను అప్రమత్తం చేయాలని, ఎక్కడ కూడా ఏ చిన్న అవాంఛనీయ ఘటన చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుంచి కలెక్టర్ బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తహసీల్దార్లు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లతో నిర్వహించి, జాగ్రత్తలు సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై దిశానిర్దేశం చేశారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి మొదలుకుని జిల్లా పంచాయతీ అధికారి వర కు, ఆశాలు, ఏఎన్ఎంల నుంచి జిల్లా వైద్యారోగ్య అధికారి వరకు అన్ని శాఖల అధికారులు, సిబ్బంది అందరూ స్థానికంగా ఉండాలని కలెక్టర్ స్పష్టం చేశారు. అత్యవసర పరిస్థితి కారణంగా సెలవులను కూడా రద్దు చేసినట్లు తెలిపారు. అత్యవసరమైతేనే ఇళ్ల నుంచి బయటికి రావాలని ప్రజలకు సూచించారు. అత్యవసర పరిస్థితులు తలెత్తిన సమయాలలో చేపట్టే సహాయక చర్యలపై ప్రజలకు భరోసా కల్పించేలా నిజామాబాద్ నగరంతోపాటు బోధన్, ఆర్మూర్, భీమ్గల్ పట్టణాల్లో ఆయా వార్డుల్లో మాక్ డ్రిల్స్ నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. గతంలో వరద ప్రభావానికి గురైన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలన్నారు. ఇదివరకు ఏర్గట్ల మండలం తడ్పాకల్ గోదావరి పరీవాహక ప్రాంతంలో పలువురు వరద ప్రవాహంలో చిక్కుకున్న ఘటనను కలెక్టర్ గుర్తు చేశారు. అటువంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అన్ని మండలాల్లో కంట్రోల్ రూమ్ల ను ఏర్పాటు చేయాలన్నారు. విద్యు త్, రెవెన్యూ, పోలీసు, ఆర్అండ్ బీ, పంచాయితీరాజ్, ఇరిగేషన్, వైద్యారోగ్యం, వ్యవసాయ తదితర శాఖల అధికారులు పరస్పరం సమన్వయంతో పనిచేస్తూ, జిల్లాలో భారీ వర్షాల కారణంగా ఎలాంటి ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని అన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్కుమార్, ట్రెయినీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావీ, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్కుమార్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉండాలి మండలాల్లో కంట్రోల్ రూమ్లు భారీ వర్ష సూచన నేపథ్యంలో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సమీక్ష జాగ్రత్తలు, సహాయక చర్యలపై యంత్రాంగానికి దిశానిర్దేశం -
వాగుల వైపు వెళ్లొద్దు..
ఖలీల్వాడి: రాబోయే రెండు, మూడు రోజు ల్లో వర్ష సూచన దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీపీ పోతరాజు సాయిచైతన్య సూచించారు. ప్రజల భద్రత దృష్ట్యా పోలీస్ అధికారు లు, సిబ్బంది ప్రతిరోజూ అందుబాటులో ఉండాలని అన్నారు. వా గుల వైపు, జలాశయాలు, చెరువులు, కుంటలు చూసేందుకు వెళ్లొద్దని ప్రజలకు సూచించారు. పురాతన కట్టడాలు, ఇళ్లు, గోడలు ఉంటే వర్షతాకిడికి పడిపోయే అవకాశా లున్నాయని, ప్రజలు పునరావాస కేంద్రాల కు వెళ్లాలని సూచించారు. ఎక్కడైనా వరద ఉధృతి తలెత్తితే వెంటనే స్పందించి సహాయ క చర్యలు చేపట్టి ప్రాణనష్టం లేకుండా చూ డాలని అధికారులు, సిబ్బందికి ఆదేశాలు జారీచేశారు. అన్నిశాఖల అధి కారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. ప్రజలు అత్యవసర సమయంలో డయల్ 100 లేదా పోలీస్ కంట్రోల్ రూమ్ నెంబర్ 87126 59700ను లేదా స్థానిక పోలీస్ స్టేషన్ నంబర్ను సంప్రదించాలని సీపీ సూచించారు. -
విద్యుత్ కంట్రోల్ రూం ఏర్పాటు
సుభాష్నగర్: మూడు రోజులపాటు అతి భారీ వర్ష సూచన నేపథ్యంలో విద్యుత్ సరఫరాపై వినియోగదారులు, రైతులు అత్యంత జాగ్రత్త వహించాలని ఎన్పీడీసీఎల్ ఎస్ఈ రాపెల్లి రవీందర్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు లోడ్ మానిటరింగ్ చేస్తున్నామని, మెన్, మెటీరియల్ అందుబాటులో ఉంచామని తెలిపారు. మొబైల్ ట్రాన్స్ఫార్మర్ వాహనాలను సిద్ధం చేశామని, ఉద్యోగులకు షిఫ్ట్ విధానంలో 24 గంటల విధులు కేటాయించామని పేర్కొన్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడితే పునరుద్ధరించేందుకు ప్రత్యేక బృందాలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. విద్యుత్ ప్రమాదాల నివారణ, అంతరాయాల సమస్య పరిష్కారం కోసం కంట్రోల్ రూం ఏర్పాటు చేశామని, 87124 85205 నెంబర్ను సంప్రదించాలని సూచించారు. తెగిపడిన, వేలాడుతున్న, వదులుగా, తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్ తీగలను తాకొద్దని, ప్రమాదకరంగా ఉన్నట్లు గమనించిన వెంటనే సంబంధిత విద్యుత్ సిబ్బందికి, టీజీఎన్పీడీసీఎల్ టోల్ ఫ్రీ నెంబర్ 1912కు సమాచారం అందించాలని కోరారు. ప్రధానంగా రైతులు మో టార్లు, పైపులు, ఫుట్ వాల్వులను ఏమరపాటుతో తాకొద్దని, వ్యవసాయ పంపుసెట్లు, స్టార్టర్లను విధిగా ఎర్త్ చేయాలని తెలిపారు. ట్రాన్స్ఫార్మర్ల వద్ద అనధికారికంగా మరమ్మతులు చేయొద్దని, పనులేమైనా ఉంటే విద్యుత్ సిబ్బందికి సమాచారమివ్వాలని ఎస్ఈ కోరారు. కరెంట్ సరఫరాపై జాగ్రత్త వహించాలి మొబైల్ ట్రాన్స్ఫార్మర్ వాహనాలు సిద్ధం ఎన్పీడీసీఎల్ ఎస్ఈ రవీందర్ -
రాష్ట్ర ప్రభుత్వమే నిధులు ఇవ్వడం లేదు
● నిధులు ఇవ్వని రాష్ట్ర ప్రభుత్వం ● ఆగిపోతున్న రైల్వే బ్రిడ్జిల పనులు ● మీడియాతో ఎంపీ అర్వింద్ నిజామాబాద్ అర్బన్: జిల్లాలో జరుగుతున్న రైల్వే అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వమే నిధులు కేటాయించడం లేదని, ఆలస్యం చేస్తోందని ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. బుధవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లాలో జరుగుతున్న రైల్వే పనులకు సంబంధించి కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో అడవి మామిడిపల్లి, అర్సపల్లి, మాధవ్ నగర్ వద్ద రైల్వే బ్రిడ్జిల నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు. అడవి మామిడిపల్లిలో సుమారుగా పనులు పూర్తి కావచ్చాయని, దీనికి సంబంధించిన నిధులను నాటి మంత్రి ప్రశాంత్ రెడ్డి రూ. 17 కోట్లను ఇతర పనులకు మళ్లించారని పేర్కొన్నారు. దీనివల్లనే పనులలో ఆలస్యం అన్నారు. మాధవ నగర్ బ్రిడ్జి పనులు కొనసాగుతున్నాయని, దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రూ. 11 కోట్లు కేటాయించవలసి ఉందన్నారు. అర్సపల్లి వద్ద నిర్మించే రైల్వే బ్రిడ్జికి సంబంధించి మొత్తం రూ. 137 కోట్లు కాగా, ఇందులో కేంద్ర ప్రభుత్వం తన వాటా కింద రూ. 127 కోట్లు కేటాయించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కింద రూ. 10 కోట్లు ఇప్పటికీ కేటాయించలేదన్నారు. రైల్వే బ్రిడ్జిల నిర్మాణానికి సంబంధించి వారం రోజుల్లో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిని కలిసి నిధులు విడుదల చేయాలని కోరనున్నట్లు తెలిపారు. జిల్లాలో మిగతా అభివృద్ధి పనులకు సంబంధించి రాష్ట్ర మంత్రులను కలిసి నిధులు వచ్చేలా చూస్తానన్నారు. గతంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి పెండింగ్ బకాయిలను విడుదల చేయించినట్లు తెలిపారు. -
క్రైం కార్నర్
మట్టిలో కూరుకుపోయి కూలీ మృతి బాల్కొండ: ముప్కాల్ మండల కేంద్రంలోని జాతీయ రహదారి 44 విస్తరణ పనుల్లో బిహార్కు చెందిన సురాజ్ నిశాద్(40) అనే కూలీ మట్టిలో కూరుకుపోయి మృతి చెందాడు. ఎస్సై రజనీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. బిహార్ రాష్ట్రానికి చెందిన కొంతమంది కూలీలు ఓ కాంట్రాక్టర్ వద్ద పని చేస్తున్నారు. మంగళవారం ముప్కాల్ మండల కేంద్రంలో జరుగుతున్న రోడ్డు విస్తరణలో పని చేసేందుకు సునీల్, సురాజ్, ధీరేంద్రయాదవ్, రాజు వచ్చారు. పనిలో భాగంగా పైపులను పక్కకు జరిపేందుకు సురాజ్, ధీరేంద్రయాదవ్లు గుంతలోకి దిగారు. ప్రమాదవశాత్తు పైపులైన్ పక్కన ఉన్న మట్టి పెల్లాలు కూలి సురాజ్ పూర్తిగా కూరుకుపోగా, ధీరేంద్రయాదవ్ ఛాతి వరకు మట్టి పడింది. ఇద్దరినీ హైవే అంబులెన్స్లో ఆర్మూర్లోని ప్రభుత్వాసుపత్రికి తరలించగా, అప్పటికే సురాజ్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. కాగా, ధీరేంద్రయాదవ్ చికిత్స పొందుతున్నాడు. -
జిల్లాలో డ్రైపోర్టు ఏర్పాటు చేయాలి
ఎంపీకి సాధన కమిటీ సభ్యుల వినతి సుభాష్నగర్: కేంద్ర ప్రభుత్వ నిధులతో జిల్లాలో డ్రైపోర్టు ఏర్పాటు చేయాలని డ్రైపోర్టు సాధన కమిటీ సభ్యులు కోరారు. ఈ మేరకు బుధవారం ఎంపీ అర్వింద్ ధర్మపురిని నగరంలోని తన క్యాంపు కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా డ్రైపోర్టు సాధన కమిటీ సభ్యులు మాట్లాడుతూ నిజామాబాద్ను పారిశ్రామికీకరణ చేసేలా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. యువత, నిరుద్యోగులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు, వారిని ఆర్థికంగా శక్తివంతం చేసేలా కృషి చేయాలన్నారు. జిల్లాలో ఏదైనా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థను ఏర్పాటు చేసేలా చొరవ చూపాలని విజ్ఞప్తిచేశారు. కాగా, డ్రైపోర్టు ఏర్పాటు విషయంలో వీలైనంత త్వరగా ఫిజిబిలిటీ రీసెర్చ్ చేయిస్తానని ఎంపీ హామీనిచ్చినట్లు తెలిపారు. ఎంపీని కలిసిన వారిలో డ్రైపోర్టు సాధన కమిటీ సభ్యులు ఎన్ దినేశ్ రెడ్డి, హితేన్, లక్ష్మణ్, బీజేపీ నాయకులు గోపిడి స్రవంతిరెడ్డి, తదితరులు ఉన్నారు. -
వీడీసీ నిర్మించిన మడిగెలను సీజ్ చేయాలి
నిజామాబాద్ లీగల్: ఆర్మూర్ మండలం సుర్భిర్యాల్ గ్రామంలో పంచాయతీ స్థలం ఆక్రమించడంతోపాటు అనుమతి లేకుండా నిర్మించిన 11 మడిగెలను సీజ్ చేయాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఆదేశించారు. సుర్భిర్యాల్ గ్రామంలో ఇటీవల మాదిగ కులానికి చెందిన వ్యక్తులపై వీడీసీ సాంఘిక బహిష్కరణ విధించింది. దీంతో బాధితులు న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఉదయ్ భాస్కర్ రావును ఆశ్రయించారు. వీడీసీ సభ్యులు గ్రామంలోని ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమంచి అక్రమంగా 11 షెటర్లను నిర్మించారని, వాటిలో రెండింటిని ఓ అగ్రవర్ణ కుల సంఘానికి అప్పగించారని, అదేవిధంగా తమకు కేటాయించాలని అడుగగా వ్యతిరేకిస్తున్నారని వివరించారు. దీనిపై స్పందించిన సంస్థ కార్యదర్శి ఉదయ్ భాస్కర్ రావు సుర్భిర్యాల్ పంచాయతీ కార్యదర్శి సంధ్యారాణి, ఆర్ఐ ప్రమోద్లను తన కార్యాలయానికి పిలిపించుకొని సాంఘిక బహిష్కరణకు దారితీసిన పరిస్థితులను తెలుసుకున్నారు. గ్రామంలో కొందరు వ్యక్తులు చట్టానికి అతీతులుగా వ్యవహరిస్తుంటే పైఅధికారులకు నివేదికలు ఇవ్వాల్సింది పోయి వారికి సహకరించడం తగదని అన్నారు. ● జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఆదేశం ● సుర్భిర్యాల్ వీడీసీ ఆగడాలపై ఆగ్రహం -
సివిల్ ప్రొసీజర్ కోడ్లో మెలకువలు నేర్చుకోవాలి
జిల్లా జడ్జి జీవీఎన్ భరతలక్ష్మి నిజామాబాద్ లీగల్: యువ న్యాయవాదులు సివిల్ ప్రొసీజర్ కోడ్పై పట్టు సాధించినప్పుడే సివిల్ లా యర్గా వృత్తిలో స్థిరపడతారని జిల్లా జడ్జి జీవీఎన్ భరతలక్ష్మి పేర్కొన్నారు. యువ న్యాయవాదుల్లో వృత్తి నైపుణ్యాలను పెంపొందించేందుకు జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన శిబిరం రెండోరోజు బుధవారం కొనసాగింది. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ సివిల్ ప్రొసీజర్ కోడ్లోని మెలకువలు నేర్చుకోవాలని సూచించారు. సీనియర్ సివిల్ న్యాయవాది సంగమేశ్వర్ రావు సివిల్ ప్రొసీజర్ కోడ్లోని వివిధ సెక్షన్లపై అవగాహన కల్పించారు. సీనియర్ సివిల్ అడ్వకేట్ జే వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సమయస్పూర్తితో ఆలోచిస్తే అనేక సమస్యలకు న్యాయశాస్త్రంలో పరిష్కారం దొరుకుతుందని అన్నారు. కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు కృపాకర్ రెడ్డి, వాల్గోట్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
కాకతీయ కాలువకు తగ్గిన నీటి విడుదల
బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి కాకతీయ కాలువ ద్వారా నీటి విడుదలను అధికారులు తగ్గించారు. కాకతీయ కాలువకు 2500, లక్ష్మి కాలువ ద్వారా 150, సరస్వతి కాలువ ద్వారా 800 క్యూసెక్కుల నీటి విడుదల జరుగుతోంది. అలీసాగర్, గుత్ప లిఫ్ట్ ద్వారా నీటి విడుదలను నిలిపివేశారు. మిషన్ భగీరథకు 231 క్యూసెక్కులు, ఆవిరిరూపంలో 482 క్యూసెక్కుల నీరు పోతుంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091(80.5 టీఎంసీలు) అడుగులు కాగా బుధవారం సాయంత్రానికి 1080.10(45.16టీఎంసీలు) అడుగుల నీరు నిల్వ ఉందని అధికారులు పేర్కొన్నారు. డ్రగ్స్ రహిత సమాజానికి కృషి చేయాలి ఖలీల్వాడి: నషా ముక్త్ భారత్ అభియాన్ ఐదో వార్షికోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ రీజియన్ సమావేశ మందిరంలో మాదకద్రవ్యాల వ్యతిరేక సామూహిక ప్రతిజ్ఞ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ ఆర్ఎం జ్యోత్స్న మాట్లాడుతూ మాదకద్రవ్యాల నివారణ, డ్రగ్స్ రహిత జీవన శైలి పాటించడం, అక్రమ రవాణా నిరోధించాలన్నారు. బస్సులో గంజాయి వంటి మత్తు పదార్థాలు రవాణా జరుగుతున్నట్లు తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రాత్రంతా విధుల్లోనే.. డొంకేశ్వర్(ఆర్మూర్): జిల్లాకు భారీ వర్ష సూ చన నేపథ్యంలో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆదేశాల మేరకు డొంకేశ్వర్ మండల అధికారులు బుధవారం రాత్రంతా విధుల్లోనే ఉన్నారు. త హసీల్దార్ నరేశ్ కుమార్తో కలిసి ఎంపీడీవో లక్ష్మి ప్రసాద్, మండల వ్యవసాయ అధికారి మ ధుసూదన్, రెవెన్యూ సిబ్బంది తహసీల్ కార్యాలయంలోనే ఉండి పరిస్థితులను సమీక్షించా రు. ఆయా గ్రామాల ప్రజలతో ఫోన్లో మా ట్లాడి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇసుక ట్రాక్టర్ల పట్టివేత పెద్దకొడప్గల్(జుక్కల్): మండలంలోని హస్గుల్ క్వారీ నుంచి మంగళవారం రాత్రి సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం తడ్కల్ గ్రామానికి అక్రమంగా ఇసుక తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లను సముందర్ తండా శివారులో పోలీసులు పట్టుకున్నారు. అనంతరం ట్రాక్టర్ యజమానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అరుణ్ కుమార్ తెలిపారు.అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్సై అరుణ్ కుమార్ హెచ్చరించారు. -
అధికారులు, సిబ్బంది కార్యస్థానాల్లో ఉండాలి
నిజామాబాద్ రూరల్: భారీ వర్ష సూచనల నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది కార్యస్థానాల్లో ప్రజలకు అందుబాటులో ఉండాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. కార్యస్థానాల్లో ఉండని వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిజామాబాద్ రూరల్ మండలం తిర్మన్పల్లి, పాల్దా గ్రామాలలో కలెక్టర్ బుధవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తిర్మన్పల్లి రైతువేదికను సందర్శించిన కలెక్టర్.. ఏఈవో అందుబాటులో లేకపోవడంపై అసహనం వ్యక్తంచేశారు. రైతు వేదికకు తాళం వేసి ఉండడం, పలువురు రైతులు బయట నిరీక్షిస్తుండడాన్ని గమనించిన కలెక్టర్, జిల్లా వ్యవసాయ అధికారి గోవిందుకు ఫోన్ చేసి అక్కడికి పిలిపించారు. అదే సమయంలో ఏఈవో కూడా చేరుకోగా, రైతువేదిక వద్ద అందుబాటులో లేకుండా ఎక్కడికి వెళ్లావంటూ కలెక్టర్ నిలదీశారు. కార్యస్థానాలలో ఉండాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ నిర్లక్ష్యం వహించడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని వైద్యాధికారులకు సూచించారు. పాల్ద గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను సందర్శించి మధ్యాహ్న భోజనం నాణ్యతను తనిఖీ చేశారు. పాఠశాల ఆవరణలో ఇంకుడు గుంత నిరుపయోగంగా ఉండడాన్ని గమనించిన కలెక్టర్, దాని నిర్వహణను చక్కబెట్టాలని ఏపీవోను ఆదేశించారు. పాఠశాలకు 30 మంది విద్యార్థులు హాజరుకాగా, ముఖ గుర్తింపు విధానం ద్వారా 25 మంది హాజరు మాత్రమే ఆన్లైన్లో నమోదు చేయడాన్ని గమనించిన కలెక్టర్, మిగతా విద్యార్థులు ఎఫ్ఆర్ఎస్ హాజరు విషయమై హెచ్ఎం సుమన్ రెడ్డిని ప్రశ్నించారు. సాంకేతిక కారణాలతో నమోదు కాలేదని హెచ్ఎం తెలుపగా, కలెక్టర్ తన సమక్షంలో విద్యార్థులు హాజరును ఎఫ్ఆర్ఎస్ విధానంలో నమోదు చేయించారు. ఎఫ్ఆర్ఎస్ నమోదులో సాంకేతిక సమస్యలు తలెత్తితే ఎవరిని సంప్రదించాలనే విషయమై జిల్లాలోని అన్ని పాఠశాలల హెచ్ఎంలకు టెక్నికల్ పర్సన్ ఫోన్ నెంబర్, తదితర వివరాలతో కూడిన సమాచారాన్ని చేరవేయాలని ఫోన్ ద్వారా డీఈవోను ఆదేశించారు. అనంతరం అంగన్వాడీ కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు. సహకార సంఘం ఎరువుల గిడ్డంగిని తనిఖీ చేశారు. రైతులకు పూర్తిస్థాయిలో యూరియా, ఇతర ఎరువులను అందజేసినట్లు సొసైటీ సీఈవో రాకేశ్, కలెక్టర్ దృష్టికి తెచ్చారు. మరింత అందుబాటులో ఉంచేందుకు వీలుగా 10 టన్నుల వరకు ఎరువుల కోసం ఇండెంట్ పంపినట్లు తెలిపారు. పాల్ద గ్రామంలోని ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, నర్సరీల నిర్వహణ, మొక్కల పెంపకం తదితర అంశాలపై పంచాయతీ కార్యదర్శిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి నిజామాబాద్ రూరల్లో ఆకస్మిక తనిఖీలు తిర్మన్పల్లి ఏఈవోపై ఆగ్రహం -
దరఖాస్తు లేకుండానే కుల ధ్రువీకరణ పత్రం
డిచ్పల్లి(నిజామాబాద్రూరల్): కుల ధ్రువీకరణ పత్రాల జారీలో రాష్ట్ర ప్రభుత్వం పలు మార్పులు చేసింది. మీసేవ నుంచి పత్రాన్ని పొందిన వ్యక్తి మరోసారి దరఖాస్తు చేసే వెసులుబాటు గతంలో ఉండేది. కులం మారదు కనుక ఇప్పుడు అలాంటి విధానానికి స్వస్తి పలకడంతోపాటు ప్రభుత్వం నూతన విధానాన్ని అమలులోకి తెచ్చింది. కుల ధ్రువీకరణపత్రం గతంలో ‘కమ్యూనిటీ డేట్ ఆఫ్ బర్త్’ గా వచ్చేది. దీంతోపాటు ఆధార్ కార్డు ప్రకారం పుట్టిన తేదీ వివరాలు వచ్చేవి. ప్రస్తుతం కుల ధ్రువీకరణ పత్రంలో జనన వివరాలు అవసరం లేదని ప్రభుత్వం గుర్తించింది. పత్రంలో ఈ వివరాలను తొలగించి కేవలం ‘కమ్యూనిటీ’ పేరుతోనే నూతన పత్రాన్ని జారీ చేస్తోంది. కొత్త విధానంతో ధ్రువపత్రాలు పొందడానికి క్షణాల్లో పని పూర్తయితే బాగానే ఉంటుంది. కానీ, గతంలో పొందిన కుల ధ్రువపత్రాల్లో ఏవైనా తప్పులు ఉంటే వాటిని మార్చుకునే వెసులుబాటు లేదు. ఎస్సీ వర్గానికి వర్తించదు.. కుల ధ్రువీకరణ పత్రం జారీలో అన్ని సామాజిక వర్గాలకు పాత ధ్రువపత్రం చూపిస్తే అప్పటికప్పుడు కుల ధ్రువీకరణ పత్రం జారీ కానుండగా ఎస్సీ సామాజిక వర్గానికి మాత్రం వర్తించదని అధికారులు చెబుతున్నారు. వారు కొత్తగా దరఖాస్తు చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. ప్రచారం కరువు.. నూతన విధానంపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాల్సిన అధికార యంత్రాంగం ప్రేక్షకపాత్ర పోషిస్తోంది. నూతన మార్పులను పత్రికా ప్రకటనల ద్వారా ప్రజలకు తెలపాల్సి ఉండగా తదనుగుణ చర్యలు లేకపోవడం గమనార్హం. కొత్త విధానంలో కులధ్రువీకరణ పత్రం ఎలా తీసుకోవాలో తెలియక చాలామంది పాత విధానాన్నే అనుసరిస్తూ సమయంతోపాటు డబ్బు వృథా చేసుకుంటున్నారు. ఈ విషయమై రెవెన్యూ అధికారులను సంప్రదించగా ప్రభుత్వం నుంచి ఇంకా గైడ్లైన్స్ రాలేదని రాగానే ప్రజలకు అవగాహన కల్పిస్తామని తెలిపారు. నూతన విధానాన్ని అమలులోకి తెచ్చిన ప్రభుత్వం హర్షం వ్యక్తం చేస్తున్న విద్యార్థులు అవగాహన కల్పించని అధికారులు పాత సర్టిఫికెట్ చూపిస్తే సరి.. ఇక మీదట ప్రతిసారి కుల ధ్రువీకరణ పత్రం పొందడానికి దరఖాస్తు చేయాల్సిన పని లేదు. పాత ధ్రువీకరణ పత్రంలోని నంబర్ లేదా ఆధార్ ద్వారా అప్పటికప్పుడు మీసేవలో సర్టిఫికెట్ తీసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. దీంతో విద్యార్థులు, ఇతరత్రా వారికి సేవలు సులభతరం కానున్నాయి. గతంలో మీసేవ ద్వారా దరఖాస్తు చేసుకొని, మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్, నాయబ్ తహసీల్దార్, తహసీల్దార్ ఆమోదం పొందిన తర్వాత కుల ధ్రువీకరణ పత్రం తీసుకోవాల్సి వచ్చేది. ఈ ప్రక్రియకు కనీసం పక్షం రోజులు సమయం పట్టేది. కొత్త విధానంలో భాగంగా పాత సర్టిఫికెట్ చూయించి వెంటనే కొత్త సర్టిఫికెట్ పొందే అవకాశం కల్పించడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. -
ఇంజినీరింగ్ కళాశాలలో 61 మంది చేరిక
తెయూ(డిచ్పల్లి): నూతనంగా ఏర్పాటైన తెలంగాణ యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాలలో 3వ విడత కౌన్సెలింగ్లో 81 మందిని కేటాయించగా, బుధవారం సాయంత్రం వరకు 61 మంది విద్యా ర్థులు అడ్మిషన్స్ తీసుకున్నారు. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (సీఎస్ఈ)లో 48 మంది, సీఎస్ ఐటీలో ముగ్గురు, సీఎస్ (ఏఐ)లో ఏడుగురు, డాటా సైన్స్లో ముగ్గురు విద్యార్థులు ప్రవేశాలు పొందినట్లు ప్రిన్సిపాల్ సీహెచ్ ఆరతి తెలిపారు. హాస్టల్ వసతి లేక వెనుకంజ ఇంజినీరింగ్ విద్యార్థులకు తెయూ క్యాంపస్లో హాస్టల్ వసతి కల్పించడం లేదు. దీంతో కౌన్సెలింగ్లో కేటాయించబడిన మరికొంత మంది విద్యార్థులు క్యాంపస్కు వచ్చి ఇంజినీరింగ్ కళాశాలలో ఉన్న వసతి, సౌకర్యాలను తెలుసుకున్నారు. హాస్టల్ వసతి లేకపోవడంతో కొందరు బాలికలు ఇక్కడ అడ్మిషన్ తీసుకునేందుకు వెనుకంజ వేశారు. నాలుగు కోర్సులకు 264 సీట్లు అందుబాటులో ఉన్నప్పటికీ కళాశాల మంజూరులో ఆలస్యం కావడం, హాస్టల్ వసతి లేకపోవడంతో విద్యార్థులు తక్కువ సంఖ్యలో చేరడానికి కారణమవుతున్నట్లు తెలుస్తోంది. సీట్ల భర్తీకి ఇక స్పాట్ కౌన్సెలింగ్పైనే ఆశలు పెట్టుకోవాల్సి ఉంటుంది. -
తాళం వేసిన ఇంట్లో చోరీ
తాడ్వాయి (ఎల్లారెడ్డి): తాడ్వాయి మండలంలోని కరడ్పల్లి గ్రామంలో బుధవారం పట్టపగలు తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగినట్లు గ్రామస్తులు తెలిపారు. గ్రామానికి చెందిన పరువాజిగారి శివాజీ రావు కుటుంబసభ్యులు ఇంటికి తాళం వేసి పెళ్లి నిమిత్తం ఇతర గ్రామానికి వెళ్లారు. ఇదే అదునుగా భావించిన దుండగులు ఇంటి తాళాలు పగులగొట్టి లోనికి చొరబడ్డారు. అనంతరం బీరువా తాళాలు పగులగొట్టి అందులో ఉన్న రెండుతులాల బంగారం, రూ.40వేల నగదు, వెండి ఆభరణాలు అపహరించుకుపోయారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మురళి తెలిపారు. అదుపుతప్పిన కంటైనర్ సదాశివనగర్(ఎల్లారెడ్డి): మండలంలోని అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామశివారు 44వ జాతీయ రహదారిపై కంటైనర్ అదుపుతప్పింది. బుధవారం తెల్లవారుజామున నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వైపునకు వెళ్తున్న కంటైనర్ అదుపుతప్పి రోడ్డు కిందికి దూసుకెళ్లి బోల్తా కొట్టింది. ఘటనలో డ్రైవర్, క్లీనర్లు సురక్షితంగా బయటపడ్డారు. సదాశివనగర్ పోలీసులు కేసు దర్యాప్తు జరుపుతున్నారు. -
చికిత్స పొందుతూ కేజీబీవీ విద్యార్థిని మృతి
నిజామాబాద్నాగారం/ఆర్మూర్: తీవ్రగాయాలతో ప్రగతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కేజీబీవీ విద్యార్థిని కావేరి(16) బుధవారం ఉదయం మృతి చెందింది. వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలోని దుబ్బకు చెందిన కావేరి ఆర్మూర్ పట్టణంపెర్కిట్లో ఉన్న కేజీబీవీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఈ నెల 5న అర్ధరాత్రి కేజీబీవీ భవనం నుంచి కావేరి కిందకు దూకింది. తలకు తీవ్రగాయాలు కావడంతో కేకలు వేసింది. స్పందించిన కేజీబీవీ సిబ్బంది వెంటనే స్థానికంగా ఉన్న ఎంజే ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం జిల్లా కేంద్రంలోని ప్రగతి ఆస్పత్రికి తరలించారు. వారం రోజులుగా చికిత్స పొందిన కావేరి బుధవారం ఉదయం 8.40 నిమిషాల సమయంలో మరణించింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్కు తరలించారు. కోతులకు భయపడే.. కావేరి ఈ నెల 5న తెల్లవారుజామున హాస్టల్లోని వాష్రూంకు వెళ్లి వస్తుండగా కోతులు వెంటపడడంతో భయపడి హాస్టల్ పోర్టువాల్ ఎక్కి కిందకు దూకినట్లు కేజీబీవీ అధికారులు తెలిపారు. తలకు గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. కాగా, కావేరి తండ్రి గణేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆర్మూర్ పోలీసులు తెలిపారు. చికిత్స పొందుతూ యువకుడు.. రామారెడ్డి: ఆర్థిక ఇబ్బందులతో గడ్డి మందు తాగిన ఓ యువకుడు చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్లు రామారెడ్డి ఎస్సై లావణ్య తెలిపారు. రామారెడ్డికి చెందిన పోగుల నాగరాజు (37) కొంతకాలంగా మద్యం, పేకాటకు బానిసయ్యాడు. దురలవాట్లతో అప్పులు కావడంతో మానసిక ఒత్తిడికి గురై ఈ నెల 1న ఇంటి నుంచి వెళ్లిపోయాడు. 9న గుర్తుతెలియని గడ్డి మందు తాగిన నాగరాజును కుటుంబసభ్యులు గుర్తించారు. వెంటనే కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం అక్కడి నుంచి ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందాడు. మృతుడి భార్య సంధ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి కొడుకు, కూతురు ఉన్నారు. -
ఎఫ్ఆర్ఎస్ సంపూర్ణంగా అమలు చేయాలి
నందిపేట్(ఆర్మూర్): పాఠశాలల్లో బోధన, బోధనేతర సిబ్బందితోపాటు విద్యార్థుల హాజరుకు ఫేషి యల్ రికగ్నిషన్ సిస్టమ్(ఎఫ్ఆర్ఎస్)ను సంపూర్ణంగా అమలు చేయాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. నందిపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలను మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో మధ్యాహ్న భోజనం నాణ్యతను పరిశీలించి, మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని హెచ్ఎం మంజులకు సూ చించారు. అంతకుముందు పీహెచ్సీని తనిఖీ చేసి న కలెక్టర్, ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలను, అందుబాటులో ఉన్న ఔషధ నిల్వలను పరిశీలించారు. గర్భిణులు స్థానికంగానే సుఖ ప్రసవాలు చేయించుకునేలా అవగాహన కల్పించాలని మెడిక ల్ ఆఫీసర్ డాక్టర్ ప్రవీణ్కు సూచించారు. హైరిస్క్ కేసులను సీహెచ్సీ, ఏరియా, జిల్లా ఆస్పత్రులకు రిఫర్ చేయాలన్నారు. స్కానింగ్ సెంటర్లపై నిఘా ఉంచాలని, ఎక్కడైనా లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వ్యాక్సినేషన్, టీబీ ముక్త్భారత్ అభియాన్ అమలు, గ్రామాల్లో ఆరోగ్య శిబిరాల నిర్వహణ తదితర కార్యక్రమాల అమలుపై ఆరా తీశారు. అనంతరం ఎరువుల గోదామును తనిఖీ చేశారు. రైతుల అవసరాలకు సరిపడా ఎరువులు అందుబాటులో ఉంచాలని మండల వ్యవసాయాధికారి రాంబాబు, గో డౌన్ నిర్వాహకుడు కార్తిక్ను ఆదేశించారు. పశువైద్యశాలను సందర్శించి పశువులకు వ్యాధి నిరోధక టీకాలు, కృత్రిమ గర్భధారణ తదితర సేవలపై పశువైద్యాధికారి నితీశ్ వర్మను అడిగి తెలుసుకున్నారు. ఫైర్ స్టేషన్ను సందర్శించి విపత్తులు, అతివృష్టి సంభవించినప్పుడు సత్వరమే స్పందించి సహాయక చర్యలు చేపట్టాలని స్టేషన్ ఆఫీసర్ నర్సింగ్రావును ఆదేశించారు. నర్సరీ మొక్కలపై సంతృప్తి మండల కార్యాలయం ఆవరణలోని నర్సరీలో మొక్కలు ఆరోగ్యంగా ఉండడాన్ని చూసి కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సంతృప్తి వ్యక్తం చేశారు. మండలంలోని కొనసాగుతున్న అభివృద్ధి పనులను ఎంపీడీవో శ్రీనివాసరావును అడిగి తెలుసుకున్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ప్రగతి గురించి ఆరా తీశారు. ఈ నెల 13న మార్కింగ్ మేళాలో లబ్ధిదారులందరూ మార్కింగ్ పూర్తి చేసుకునేలా చూడాలన్నారు. అనంతరం తహసీల్ కార్యాలయాన్ని సందర్శించి భూభారతిపై సమీక్షించారు. ఆర్జీల పరిష్కారంలో జాప్యం జరుగకుండా చూడాలని తహసీల్దార్ సతీశ్, రెవెన్యూ అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలి నందిపేటలో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆకస్మిక తనిఖీలు -
ట్రాఫిక్ నియంత్రణ చర్యలు బలోపేతం చేయాలి
కమ్మర్పల్లి/ఆర్మూర్టౌన్/మాక్లూర్/ఖలీల్వాడి: ప్రజల ప్రాణాల రక్షణ కోసం ట్రాఫిక్ నియంత్రణ చర్యలను మరింత బలోపేతం చేయాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, సీపీ సాయి చైతన్య సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా సరిహద్దు కమ్మర్పల్లి నుంచి బోధన్ వరకు 77 కిలోమీటర్ల మేర ఉన్న ఎన్హెచ్–63ని మంగళవారం పోలీసు, ఆర్అండ్బీ, ఎన్ఐసీ, పంచాయతీరాజ్, రవాణ, 108 సర్వీస్ తదితర శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. కమ్మర్పల్లి మండల కేంద్ర శివారులోని పెట్రోల్ బంక్ వద్ద యాక్సిడెంట్ స్పాట్ను క్షుణ్ణంగా పరిశీలించారు. వర్షాల కారణంగా రోడ్లపై గుంతలు ఏర్పడి తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, వాటి మరమ్మతులు త్వరగా చేపట్టాలన్నారు. ఎన్హెచ్–63 పరిధిలో ఉన్న దుకాణాలు, ప్రకటనల బోర్డులు, విగ్రహాలను వెనక్కి జరిపించాలని సూ చించారు. గ్రామాల్లో పాదచారులు రోడ్డు దాటేందుకు జీబ్రా క్రాసింగ్ లైన్లు ఏర్పాటు చేయాలన్నారు. కొన్ని చోట్ల జంక్షన్లు మూసి వేయడానికి బా రికేడ్లు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. మూలమలుపుల వద్ద రోడ్డు విశాలంగా కనపడేలా చర్యలు తీసుకోవాలన్నారు. జాతీయ రహదారిని కలిపే అన్ని రకాల రోడ్లకు స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేయా లని ఆదేశించారు. ప్రజలకు అవగాహన కల్పించాలి హైవేకు సమీపంలోని గ్రామాల ప్రజలకు అవగా హన కల్పించడంతోపాటు వారి సూచనలు తీసుకోవాలని తెలిపారు. ప్రజలు రోడ్డు భద్రత నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తగా ప్రయాణించాలని విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ అధికారులు డ్రైవర్లకు తగిన సలహాలు, సూ చనలు ఇవ్వాలన్నారు. వృద్ధాప్యం, రిటైర్మెంట్కు దగ్గరగా ఉన్నవారికి లాంగ్ రూట్ డ్యూటీ లు వేయకుండా ఉండటమే మంచిదని సూచించారు. ఆర్మూ ర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారిపై పోలీసులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రోడ్డు ప్రమాదం ఘటన నమూనా దృశ్యాన్ని కలెక్టర్, సీపీ తిలకించి అభినందించారు. వారి వెంట ఎన్హెచ్ పెర్కిట్ ఈఈ మల్లారెడ్డి, మంచిర్యాల పీడీ అజయ్, డీటీవో ఉమా మహేశ్వర్రావు, ఆర్అండ్బీ ఏఈ సతీశ్, పంచాయతీ రాజ్ శాఖ సిబ్బంది రామకృష్ణ, ఏసీపీలు మస్తాన్ అలీ, వెంకటేశ్వర్రెడ్డి, శ్రీనివాస్, ఐఆర్ఏడీ మేనేజర్ శ్రీవర్ష, 108 సర్వీసెస్ ప్రతినిధి రామలింగేశ్వరరెడ్డి, ఆర్మూర్ ము న్సిపల్ కమిషనర్ రాజు, సీఐలు, ఎస్సైలు, వివిధ విభాగాల అధికారులు ఉన్నారు. కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, సీపీ సాయిచైతన్య జిల్లా పరిధిలోని ఎన్హెచ్–63పై ఉన్న 26 బ్లాక్ స్పాట్ల పరిశీలన రోడ్ల మరమ్మతులు, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశం -
దొంగ ఓట్లతో అధికారంలోకి..
నిజామాబాద్ సిటీ: ఎన్నికల కమిషన్ను అడ్డుపెట్టుకొని దొంగ ఓట్లతో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిందని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, రాష్ట్ర సహకార సంఘాల కార్పొరేషన్ చైర్మన్ మానాల మోహన్రెడ్డి విమర్శించారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని కాంగ్రెస్ భవన్ నుంచి ధర్నాచౌక్ వర కు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రోడ్డుపై బైఠాయించారు. ధర్నాచౌక్ వద్ద ఓ టరు జాబితాను దహనం చేశారు. అనంతరం మా నాల మోహన్రెడ్డి మాట్లాడుతూ ఓట్ల దొంగతనాన్ని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ బహిరంగం చేయగానే ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ను మూసివేసిందన్నారు. నుడా చైర్మన్, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కేశ వేణు మాట్లాడుతూ దొంగ ఓట్ల వ్యవహారం బయటపెట్టిన రాహుల్గాంధీని బీజేపీ నేతలు విమర్శించడం సిగ్గుచేటన్నారు. కార్యక్రమంలో నాయకులు రాంభూపాల్, బాడ్సీ శేఖర్గౌడ్, జీ వీ రామకృష్ణ, విపుల్ గౌడ్, వేణురాజ్, రత్నాకర్, న రేందర్ గౌడ్, లింగం, కెతావత్ యాదగిరి, సయ్యద్ ఖైసర్, ప్ర మోద్, మధుసూదన్, బొబ్బిలి రామకృష్ణ, వినయ్, సంగెం సాయిలు, మహిళా కాంగ్రెస్ నాయకులు మఠం రేవతి, పోల ఉష, పుప్పాల విజయ, స్వప్న, మీనా, సువర్ణ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల కమిషన్ బీజేపీకి తొత్తుగా మారింది ఓట్ల గోల్మాల్ను రాహుల్గాంధీ బయటపెట్టారు డీసీసీ అధ్యక్షుడు, రాష్ట్ర సహకార సంఘాల కార్పొరేషన్ చైర్మన్ మానాల మోహన్రెడ్డి -
ఆపరేషన్ సిందూర్తో ఉగ్రవాదులకు గుణపాఠం
సుభాష్నగర్: భారతదేశం వైపు కన్నెత్తి చూసే ఉగ్రవాదులకు ఆపరేషన్ సిందూర్తో గుణపాఠం చెప్పా మని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూ ర్యనారాయణ పేర్కొన్నారు. 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మంగళవారం బీజేపీ ఆధ్వర్యంలో నగరంలోని గాంధీచౌక్ నుంచి తిలక్ గార్డెన్ వరకు తిరంగా ర్యాలీ నిర్వహించారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు, యువత, విద్యార్థులు పెద్ద ఎత్తున చేసిన భారత్ మాతాకీ జై అనే నినాదాలతో ఇందూరు నగరం హోరెత్తింది. తిలక్ గార్డెన్ చౌరస్తాలో సామూహిక జాతీయ గీతలాపన కార్యక్రమంతో ర్యాలీ ముగిసింది. ఈ సందర్భంగా ధన్పా ల్ సూర్యనారాయణ మాట్లాడుతూ అమరుల త్యా గాలను స్మరించుకుంటూ దేశ ఐక్యత, జాతీయత, దేశభక్తిని ప్రపంచదేశాలకు చాటిచెప్పేలా ప్రధాని మోదీ పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నామన్నారు. ఆపరేషన్ సిందూర్ వంటి చారిత్రాత్మక రక్షణ చర్యలతో భారత సైన్యం శౌర్యం, నాయక త్వం ఎంత దృఢంగా ఉందో ప్రపంచానికి చాటి చె ప్పారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ పటేల్ కు లాచారి పేర్కొన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు న్యాలం రాజు, లక్ష్మీనారాయణ, ఉపాధ్యక్షుడు నాగోళ్ల లక్ష్మీనారాయణ, మున్సిపల్ మాజీ ఫ్లోర్లీడర్ గోపిడి స్రవంతి రెడ్డి, హర్ ఘర్ తిరంగా కో కన్వీనర్ రాంచందర్, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు సతీశ్ రెడ్డి, మహిళా మోర్చా అధ్యక్షురాలు పంచరెడ్డి ప్రవళిక తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ జాతీయత, దేశభక్తి, ఐక్యత చాటిచెప్పేలా భారీ తిరంగా ర్యాలీ -
831 ఇళ్లకు ఒకేసారి ముగ్గు
నిజామాబాద్అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మ కంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ప నుల వేగవంతానికి అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఏకకాలంలో ఇందిరమ్మ ఇళ్ల పనుల ప్రారంభానికి శ్రీకారం చుట్టాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. బుధ, గురువారాల్లో మంచి రోజులు ఉండడంతో ఇందిరమ్మ ఇళ్ల మార్కింగ్ మహామేళా చేపట్టనున్నారు. మొదటి స్థానం కోసం.. జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలని కలెక్టర్ సంకల్పించా రు. అందులో భాగంగా అధికారులతో సమీక్షిస్తూ, క్షేత్రస్థాయిలో పరిశీలన చేపడుతున్నారు. సంబంధిత శాఖల అధికారులకు సూచనలు, సలహాలు ఇ స్తున్నారు. ఆర్థిక పరిస్థితులు సరిగా లేనివారికి మె ప్మా, డీఆర్డీవో సహకారంతో రుణాలు మంజూరు చేయిస్తున్నారు. జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు సకాలంలో పూర్తి చేసి రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. బుధవా రం జిల్లా వ్యాప్తంగా 831 ఇళ్లకు మార్కింగ్ చేయనుండగా, అధికంగా నిజామాబాద్ అర్బన్లో 133, ఆర్మూర్లో 47, మాక్లూర్లో 44, రెంజల్లో 41 ఇళ్లకు భూమిపూజ చేయనున్నారు. ఇదిలా ఉండగా జిల్లాకు 17,301 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా, అందులో 9,526 ఇళ్లు పురోగతిలో ఉన్నాయి. వీటిలో బేస్మెంట్ లెవల్లో 5,043, రూఫ్ లెవల్లో 796, స్లాబ్ పూర్తయిన 256 ఇళ్లు ఉన్నాయి. ఆ ఇళ్లపై కొనసాగుతున్న విచారణ ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా గతంలో ఇళ్లు పొందిన, వాహనాలు కలిగిన 355 మంది లబ్ధిదారులను అధికారులు పక్కన పెట్టారు. కాగా, జాబితాలో కొందరు గతంలో ఇల్లు నిర్మించుకొని మధ్యలోనే నిలిపివేసిన వారు ఉన్నారు. వీరు కూడా ప్రస్తుతం లబ్ధిదారులేనని, వారికీ ఇళ్లు అందేలా చూడాలని మళ్లీ ఆదేశాలు అందాయి. దీంతో మండల పరిషత్ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన జరుపుతూ లబ్ధిదారులను గుర్తిస్తున్నారు. మరో మూడు రోజుల్లో విచారణ పూర్తిచేసి అర్హులైన వారి జాబితాను ప్రకటించనున్నారు. దీంతో లబ్ధిదా రుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. నేడు ఇందిరమ్మ ఇళ్ల ‘మార్కింగ్ మహామేళా’ జిల్లా వ్యాప్తంగా పనుల ప్రారంభం -
విద్యా బోధనకు సమయమేది..?
ప్రభుత్వ పాఠశాలల్లోని గురువులపై బోధనేతర పనుల భారం రోజురోజుకూ పెరుగుతోంది. ఒకప్పుడు పాఠాలు చెబుతూ బిజీగా ఉండే ఉపాధ్యాయులు నేడు యాప్, ఆన్లైన్ పనులతో కుస్తీ పడుతున్నారు. ఫలితంగా విద్యార్థులు నాణ్యమైన విద్యకు దూరమవుతున్నారు. నిజామాబాద్అర్బన్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధనకు ఆన్లైన్ పనులు ప్రతిబంధకంగా మారాయి. బోధనేతర పనులన్నీ ఉపాధ్యాయులు చేయాల్సి ఉండడంతో పాఠాల బోధన క్లిష్టతరంగా మారింది. మరోవైపు రాష్ట్ర విద్యాశాఖతోపాటు జిల్లా, మండల స్థాయి అధికారులు అడిగే నివేదికలు పంపేందుకు సమయం కేటాయిస్తున్నారు. దీంతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఇటీవల మధ్యాహ్న భోజనానికి సంబంధించి విద్యార్థుల వివరాలు స్కూల్ ఎడ్యుకేషన్ యాప్లో నమోదు చేయలేదని 13 మంది హెచ్ఎంలకు జిల్లా విద్యాశాఖ మెమోలు జారీ చేసింది. దీంతో ఉపాధ్యాయులు మరింత ఆందోళన చెందుతున్నారు. సగం సమయం వీటికే.. ప్రతిరోజు పాఠశాలలో ప్రార్థన నుంచే ఉపాధ్యా యులకు ఆన్లైన్ పని మొదలవుతుంది. డీఎస్ఈ–ఎఫ్ఆర్ఎస్ (డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్) ద్వారా విద్యార్థుల హాజరును నమోదు చేస్తారు. దీనికి అరగంట నుంచి గంట వరకు కేటాయించాల్సి వస్తోంది. ఎంపిక చేసిన పాఠశాలల్లో అల్పాహారం, మిగతా పాఠశాల ల్లో రాగిజావ పెట్టేందుకు మరొక గంట సమయం పడుతుంది. మొదటి రెండు పీరియడ్లు గడిచిన త ర్వాత మధ్యాహ్న భోజనానికి గంట సమయం కేటాయించాల్సి వస్తోంది. ప్రాథమిక పాఠశాలల్లో గతే డాది ప్రవేశపెట్టిన తొలిమెట్టు, ఈ ఏడాది నుంచి ఉన్నత పాఠశాలలో ప్రవేశపెట్టిన ఉన్నతి కార్యక్ర మాల నిర్వహణ, వాటి పరీక్షలకు పాఠ్యప్రణాళిక తయారీ, బోధన ఉపకరణాల ను సమకూర్చాల్సి ఉంటుంది. ఇవే కాకుండా ఎఫ్ఎల్ఎన్ (ఫౌండేషన్ లిటరసీ న్యూమరసీ), ఎల్ఐపీ (లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రాం), విద్యార్థుల వివరాలను యూడైస్ ప్లస్లో నమోదు చేయడం, కంప్యూటర్ల నిర్వహణ తదితర కార్యక్రమాలు ఉంటాయి. ఒత్తిడిలో ఉపాధ్యాయులు బోధనేతర పనులతో ప్రభుత్వ ఉపాధ్యాయు లు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా మధ్యాహ్న భోజన పర్యవేక్షణ బాధ్యతలంటే జంకుతున్నారు. గతేడాది నవీపేట, రెంజల్, బోర్గాం(పి) పాఠశాలలకు చెందిన పలువురు ప్రధానోపాధ్యాయులపై సస్పెన్షన్ వేటు పడింది. ఒకవైపు మెనూ ప్రకారం మఽ ద్యాహ్న భోజనం వడ్డించాలని ఉన్నతాధికారులు ఆదేశిస్తున్నారు. మరోవైపు సకాలంలో బిల్లులు రాకపోవడంతో ఏజెన్సీల నిర్వాహకు లు మెనూ పాటించలేని పరిస్థితి ఏర్పడుతోంది. మంచినీటి వసతి, సరైన వంట పాత్రలు లేక చాలా పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థులు అస్వస్థతకు గురైన సందర్భాలున్నాయి. వీటన్నింటికీ ప్రధానోపాధ్యాయులే కారణంగా చూపుతూ ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవడంపై విమర్శలు వస్తున్నాయి. బోధనేతర పనుల నుంచి తప్పించాలి మధ్యాహ్న భోజనం, అల్పాహార పథకాల నుంచి హెచ్ఎంలను తప్పించాలి. వాటిని ప్రత్యేక ఏజెన్సీలకు అప్పగించాలి. ఉన్నతి కార్యక్రమాన్ని సరళీకృతం చేసి బోధనకు ఎక్కువ సమయం కేటాయించేలా హెచ్ఎంలకు అవకాశం ఇవ్వాలి. ప్రాథమిక పాఠశాలలో తరగతికి ఒక ఉపాధ్యాయుడిని కేటాయించాలి. – రవీందర్ గౌడ్, పీఆర్టీయూ నాయకుడు ఇబ్బంది లేకుండా పనిచేయాలి టీచర్లు తమకు కేటాయించిన పనులను ఇ బ్బంది లేకుండా చేయాలి. పాఠశాలలో మిగ తా టీచర్ల సహాయం తీసుకోవాలి. సరైన ప్ర ణాళిక ఉంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఆన్లైన్ పనులు కూడా ఎక్కువ సేపు ఉండవు. – అశోక్, డీఈవో బోధనేతర పనులతో ఉపాధ్యాయులకు ఇబ్బందులు యాప్, ఆన్లైన్ పనులే అధికం అల్పాహార, మధ్యాహ్న భోజన అమలు బాధ్యతా గురువులకే.. అటకెక్కుతున్న పాఠ్యాంశాల బోధన -
తాళ్ల రాంపూర్ వీడీసీ రద్దు
మోర్తాడ్(బాల్కొండ): కల్లు విక్రయాలపై నిషేధం విధించి, గీతా కార్మిక సంఘం సభ్యులకు ఆలయ ప్రవేశం లేదని హుకుం జారీ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటూ వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన ఏర్గట్ల మండలం తాళ్లరాంపూర్ గ్రామాభివృద్ధి కమిటీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి తమ గ్రామంలో గ్రామాభివృద్ధి కమిటీ అంటూ ఏది ఉండదని కమిటీని రద్దు చేస్తున్నట్లు మంగళవారం సభ్యులుగా వ్యవహరించిన వారు ప్రకటించారు. సహకార సంఘం ఫంక్షన్ హాల్లో గ్రామస్తుల సమక్షంలో గ్రామాభివృద్ధి కమిటీ రద్దు అంశాన్ని వెల్లడించారు. దీంతో గడచిన పది నెలల నుంచి తాళ్లరాంపూర్లో నెలకొన్న వివాదానికి తెరపడినట్లు అయ్యింది. జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో ఇటీవల గ్రామంలో చైతన్య సదస్సు నిర్వహించారు. జిల్లా న్యాయమూర్తి, ఇతర న్యాయాధికారులు చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ నేపథ్యంలో వీడీసీ స భ్యులు, గ్రామస్తులు సమావేశం ఏర్పాటు చేసు కుని ఏర్గట్ల ఎస్సై పడాల రాజేశ్వర్ సమక్షంలో వీడీసీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆలయ ప్రవేశంపై ఆంక్షలు ఎప్పుడూ లేవని ఇదంతా ఒక కల్పితమని వీడీసీ సభ్యులు ప్రధానంగా వివరించారు. వీడీసీ రద్దు ప్రకటనతో గ్రామస్తులు ఐక్యంగా ఉంటారా లేదా అనే విషయం ముందు ముందు తేలనుందని చెప్పవచ్చు. -
6.5 కిలోల గంజాయి స్వాధీనం
ఖలీల్వాడి: నగరానికి గంజాయి తీసుకు వస్తున్న ఒకరిని పోలీసులు పట్టుకొని, అ తడి వద్ద నుంచి 6.5కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వివరాలు ఇ లా.. నగరంలోని అమన్ నగర్, ఖిల్లా రోడ్డులో మంగళవారం ఎన్ఫోర్స్మెంట్ సీఐ వెంకట్ తనిఖీలు చేపట్టారు. నగరానికి చెందిన షేక్ మిరాజ్ బైక్పై ఎండు గంజాయి తీసుకువస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. అతడిని విచారించగా మహారాష్ట్రలోని బోకర్కు చెందిన ఫారుఖ్ ఖురేషి నుంచి గంజాయిని కొనుగోలు చేసినట్లు చెప్పారు. అతడి వద్ద ఉన్న 6.5 కిలోల గంజాయిని, బైక్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఫారుఖ్ ఖురేషీ పరారీలో ఉన్నారని, మిరాజ్ను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఎకై ్సజ్ ఎస్సై నరసింహచారి, సిబ్బంది నారాయణరెడ్డి, అవినాష్, విష్ణు, భోజన్న, శ్యామ్ తదితరులు ఉన్నారు. -
మృత్యువులోనూ కలిసే..
కామారెడ్డి క్రైం: కవలలుగా కలిసి జన్మించారు. మృత్యువులోనూ కలిసే లోకాన్ని వీడిపోయారు. పిల్లలే సర్వస్వంగా బతుకుతున్న ఆ తల్లిదండ్రులకు జరిగిన ఘటన కడుపుకోతను మిగిల్చింది. ఈ విషాదకర ఘటన కామారెడ్డి జిల్లా తిమ్మక్పల్లి గ్రామంలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన గుర్రాల పెద్ద నర్సింలు, మంజుల దంపతులకు రామ్, లక్ష్మణ్ (13) అనే కవలలు ఉన్నారు. స్థానికంగా ఉన్న జడ్పీ ఉన్నత పాఠశాలలో 8 వ తరగతి చదువుకుంటున్నారు. రోజూ మాదిరిగానే సోమవారం సాయంత్రం పాఠశాల నుంచి ఇంటికి వచ్చిన వారిద్దరూ బ్యాగులు ఇంట్లో పెట్టి ఆడుకునేందుకు బయటకు వెళ్లారు. రాత్రి 10 గంటలైనా ఇంటికి తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు వెతకడం మొదలుపెట్టారు. సమీపం లోని కుంట కట్ట పైన పిల్లల బట్టలు కనిపించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. దేవునిపల్లి పోలీసులు, గ్రామస్తులు అక్కడకు పెద్ద ఎత్తున చేరుకుని కుంటలో గాలింపు చర్యలు చేపట్టారు. అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో ఒకరి మృత దేహం, మంగళవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో మరొక బాలుడి మృతదేహలు లభ్యమయ్యాయి. సరదాగా గడిపేందుకు నీళ్ల లోకి దిగి లోతు ఎక్కువగా ఉండటంతో ఈత రాక నీటమునిగి ఉండవచ్చని భావిస్తున్నారు. మృతి చెందిన కవల పిల్లల తండ్రి నర్సింలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని దేవునిపల్లి ఎస్సై రంజిత్ తెలిపారు. కుటుంబంలో తీరని విషాదం..గ్రామానికి చెందిన పెద్ద నర్సింలు నిత్యం కామారెడ్డికి వచ్చి రోజువారీ మేసీ్త్ర పనులు చేస్తూ, మంజుల బీడీలు చుడుతూ జీవనం సాగిస్తున్నా రు. 13 ఏళ్ల క్రితం నర్సింలు దంపతులకు కవలలు పుట్టారు. ఇద్దరు కుమారులు ఒకేసారి జన్మించడంతో తరువాత సంతానం వద్దనుకున్నారు. రామ్, లక్ష్మణ్ అనే పేర్లు పెట్టుకుని అల్లారు ముద్దుగా చూసుకుంటున్నారు. పిల్లలే సర్వస్వంగా ఉన్నదాంట్లో సంతోషంగా బతుకుతున్నారు. ఉన్న ఇద్దరు పిల్లలు ప్రమాదవశాత్తు చనిపోవడం ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. తల్లిదండ్రులు, బంధువులు కన్నీటిపర్యంతమయ్యారు. కుంటలో పడి కవలల దుర్మరణం కామారెడ్డి మండలం తిమ్మక్ పల్లిలో ఘటన