Nizamabad
-
రైలులో గంజాయి రవాణా
● ఇద్దరి అరెస్ట్.. 10 కిలోల గంజాయి స్వాధీనం కామారెడ్డి క్రైం: రైలులో గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరిని కామారెడ్డి రైల్వే, ఎకై ్సజ్ పోలీసులు మంగళవారం గుర్తించి పట్టుకున్నారు. సీఐ సంపత్ కృష్ణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. సంబల్పూర్ నుంచి పుణే వెళ్తున్న నాగవలి ఎక్స్ప్రెస్లో గంజాయి తరలిస్తున్నారనే సమాచారం మేరకు కామారెడ్డి స్టేషన్లో రైలు ఆగగానే పోలీసులు తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పదంగా కనిపించిన ఇద్దరిని అదుపులోకి తీసుకుని వారివద్ద నుంచి 10 కిలోల గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను మహారాష్ట్రలోని జాల్నా జిల్లాకు చెందిన సునీల్, ప్రవీణ్గా గుర్తించారు. వారు ఒడిశా రాష్ట్రంలోని రాయ్ఘడ్ ప్రాంతం నుంచి గంజాయిని కొనుగోలు చేసి రైలులో మహారాష్ట్ర లోని రాయ్పూర్కు రవాణా చేస్తున్నట్లు విచారణలో తేలింది. కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్కు తరలిస్తున్నామని సీఐ తెలిపారు. దాడుల్లో ఎకై ్సజ్ ఎస్సై విక్రమ్, హెడ్ కానిస్టేబుళ్లు జాన్, బల్వంత్రావు, ఫరీద్ తదితరులు పాల్గొన్నారు. -
గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి
గాంధారి/బాన్సువాడ: గాంధారి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్ రఘు(45) గుండెపోటుతో మంగళవారం మృతి చెందినట్లు ఎస్సై మహేందర్ తెలిపారు. బాన్సువాడ పట్టణానికి చెందిన రఘు గత కొంత కాలంగా గాంధారి పోలీస్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. బాన్సువాడలోని ఇంటికి వచ్చిన రఘు మంగళవారం ఉదయం విధి నిర్వహణ కోసం గాంధారికి వెళ్లేందుకు సిద్ధమవుతుండగా అస్వస్తతకు గురయ్యాడు. గమనించిన కుంటుంబ సభ్యులు వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందాడు. మృతుడికి భార్య, 12ఏళ్ల లోపు వయస్సున్న ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. -
నేడు మంత్రి ఉత్తమ్ పర్యటన
నిజామాబాద్ అర్బన్: రాష్ట్ర పౌరసరఫరాల శాఖ, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి బుధవారం జిల్లాకు రానున్నారు. ముందుగా వర్ని మండలంలోని సిద్దాపూర్ రిజర్వాయర్ను పరిశీలిస్తారు. అనంతరం జాకోరా గ్రామంలో లిఫ్ట్ ఇరిగేషన్ను ప్రారంభించి పబ్లిక్ మీటింగ్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 12.15 నిమిషాలకు హెలికాప్టర్ ద్వారా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ బ్యారేజీకి బయల్దేరి వెళ్తారు. ఖలీల్వాడి: 2026–27 విద్యా సంవత్సరానికి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకం కింద ఒకటో తరగతి (నాన్–రెసిడెన్షియల్)లో 102 సీట్లు, 5వ తరగతి (రెసిడెన్షియల్)లో 101 సీట్లు మంజూరైనట్లు సోషల్ వెల్ఫేర్ డీడీ రజిత మంగళవారం తెలిపారు. ప్రవేశాల కోసం అర్హులైన షెడ్యూల్డ్ కులాల విద్యార్థినీవిద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని పేర్కొన్నారు. జిల్లా స్థాయి ఎంపిక కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 11న ఉదయం 10.30 గంటలకు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని రూమ్ నం.3లో లక్కీ డ్రా తీస్తామని తెలిపారు. మోపాల్: మండలకేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో యంగ్ ఇండియా ఇన్స్టిట్యూషన్ ఎక్స్లెన్స్ కోర్సులోభాగంగా సీఈసీ – సీఎల్ఏటీ(లా)లో శిక్షణ ఇచ్చేందుకు అనుభవజ్ఞులైన నిపుణుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ సుప్రజ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 93 కేజీబీవీల్లో ఈ విద్యాసంవత్సరం నుంచే కోర్సు ప్రారంభమవుతుందని, ప్రతిరోజూ రెండు గంటలపాటు విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలన్నారు. కరెంట్ ఎఫైర్స్, లీగల్ రీజనింగ్, లాజికల్ రీజనింగ్, క్వాంటిటేటీవ్ టెక్నిక్స్కు సంబంధించిన నిపుణులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆసక్తిగల వారు 76748 24361 నంబర్ను సంప్రదించాలని పేర్కొన్నారు. సిరికొండ: జాతీయ స్థాయి బేస్బాల్ పోటీలకు సిరికొండ సత్యశోధక్ పాఠశాల జట్టు ఎంపికై ందని ప్రిన్సిపాల్ ఆర్ నర్సయ్య తెలిపారు. ఏప్రిల్లో ఆర్మూర్లో నిర్వహించిన నిజామాబాద్ రీజినల్ ఉభయ రాష్ట్రాల మేజర్ లీగ్ బేస్బాల్ కప్ ఇండియా అండర్–11 చాంపియన్షిప్ పోటీల్లో ప్రతిభ కనబర్చి గ్రూప్ బి విజేతగా నిలిచి చాంపియన్షిప్ను కై వసం చేసుకొని జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించినట్లు ఆయన తెలిపారు. ఈ నెల 11 నుంచి 14వ తేదీ వరకు బెంగళూరులో నిర్వహించే జాతీయ స్థాయి మేజర్ లీగ్ బేస్బాల్ కప్ ఇండియా–2026 పోటీల్లో జట్టు పాల్గొంటుందని తెలిపారు. హర్షిత్, సతీష్, శివచరణ్, శ్రీరామ్, రిత్విక్, సాయిసృజన్, అభిరామ్, విశ్వక్సేనా, విద్వాన్, రిషివరుణ్తేజ్, రిశ్విత్, రిత్విక్లు సభ్యులుగా, పీఈటీలు దండు అనిల్, బాదావత్ సంతోష్లు కోచ్, మేనేజర్లుగా వ్యవహరిస్తారన్నారు. జాతీయ స్థాయికి ఎంపికై న క్రీడాకారులను పాఠశాలలో మంగళవారం అభినందించారు. కామారెడ్డి టౌన్ : తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ రీజినల్ చైర్మన్గా శెనిశెట్టి గౌరీ శంకర్ నియామకమయ్యారు. మంగళవారం సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మినారాయణ నియామకపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా గౌరీ శంకర్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో పదవి అప్పగించిన రాష్ట్ర కమిటీకి కృతజ్ఞతలు తెలిపారు. సంఘం అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో ప్రతినిధులు కై లాస్ శ్రీనివాస్రావు తదితరులున్నారు. -
హిట్లర్కు పట్టిన గతే రేవంత్రెడ్డికి పడుతుంది
నిజామాబాద్రూరల్/డిచ్పల్లి : నియంత హిట్లర్కు పట్టిన గతే సీఎం రేవంత్రెడ్డికి పడుతుందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. డిచ్పల్లి మండల కేంద్రంలోని జీ కన్వెన్షన్లో మంగళవారం నిర్వహించిన నిజామాబాద్ రూరల్నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు, సర్ (స్పెషల్ ఇంటెన్సిస్ రివిజన్) సన్నాహక సమావేశానికి ప్రశాంత్రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్నవారే నిజమైన కార్యకర్తలని అన్నారు. సభ్యత్వ నమోదును ప్రతిష్టాత్మకంగా చేపడితే పార్టీ బలపడుతుందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాల వల్ల అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీలు తోడుదొంగలని, ఆ రెండు పార్టీలు కలిసి రైతులను మోసం చేస్తున్నాయని ఆరోపించారు. యూరియా కొరత వల్ల రైతుల కడుపు మండుతోందని, తక్షణమే యాప్ విధానాన్ని రద్దు చేసి పాతపద్దతిని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. యాప్ పోవాలి.. బాపు రావాలి.. అని రైతులు కోరుకుంటున్నారన్నారు. కేసీఆర్ అధికారంలో ఉన్న పదేళ్లలో ఎవ్వరూ కూడా తెలంగాణపై మాట్లాడలేదని, ప్రస్తుతం ఆంధ్రాగద్దల కన్ను తెలంగాణపై పడుతోందని, బీఆర్ఎస్ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ చంద్రబాబు అండ చూసుకుని తెలంగాణకు వచ్చి ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఇక్కడి ప్రజలు చూస్తు ఊరుకోబోరని హెచ్చరించారు. అనంతరం ఉమ్మడి జిల్లా ఇన్చార్జి వీ గంగాధర్గౌడ్ మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, జీవన్రెడ్డి, బిగాల గణేశ్గుప్తా, హన్మంత్సింధే, జాజాల సురేందర్ తదితరులు ప్రసంగించారు. ప్రసంగించారు. రైతాంగ సంక్షేమమే ద్యేయంగా ఈ ప్రతినిధుల సభలో ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి సమక్షంలో రెండు ముఖ్యమైన తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు. యాప్ విధానాన్ని రద్దు చేసి అన్ని సొసైటీల ద్వారా రైతులకు నేరుగా యూరియా అందేలా చర్యలు చేపట్టాలని, వ్యవసాయానికి నాణ్యమైన 24 గంటల ఉచిత విద్యుత్ను తక్షణమే పునరుద్దించాలని తీర్మానించారు. పార్టీ సీనియర్ నాయకుడు, సభ్యత్వ నమోదు ఇన్చార్జి గిర్దావర్ గంగారెడ్డి, మాజీ జెడ్పీటీసీలు బాజిరెడ్డి జగన్, దాసరి ఇందిర, పాట్కూరి తనూజ, గడ్డం సుమనరెడ్డి, మాజీ ఎంపీపీలు, మండల పార్టీ అధ్యక్షులు, సర్పంచులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, కార్యకర్తలు తదితరులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కాంగ్రెస్, బీజేపీలు రైతులను మోసం చేస్తున్నాయి యూరియా కొరతతో అన్నదాతల కడుపు మండుతోంది బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్రెడ్డి -
యూరియా నిల్వలపై పక్కా పర్యవేక్షణ
● రైతులు ఆందోళన చెందొద్దు ● ఎరువుల కొరత లేదు ● కలెక్టర్ ఇలా త్రిపాఠిబోధన్: జిల్లాలోని సహకార సంఘాలు, విక్రయ కేంద్రాల్లో యూరియా నిల్వలు అందుబాటులో ఉండే విధంగా ప్రణాళికాబద్ధంగా పర్యవేక్షిస్తున్నామని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. వానాకాలం సీజన్ పంటల సాగుకు అవసరమైన ఎరువులు జిల్లాలో పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతం జిలాల్లో 27 వేల మెట్రిక్ టన్నుల యూరియా ఎరువులు అందుబాటులో ఉందని, ఎక్కడా కొరత తలెత్తకుండా రైతుల అవసరాలకు అనుగుణంగా అన్ని ప్రాంతాలకు నిల్వలను చేరవేస్తున్నామన్నారు. ఎడపల్లి మండల కేంద్రంలోని జానకంపేట సహకార సంఘం ఎరువుల గోదాముతోపాటు ఎడపల్లిలోని విక్రయ కేంద్రం గోదామును కలెక్టర్ మంగళవారం తనిఖీ చేశారు. యూరియాతోపాటు ఇతర ఎరువుల నిల్వలను పరిశీలించారు. యూరియా యాప్ బుకింగ్ యాప్ పనితీరును తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ముందస్తుగా పంటలు సాగు చేసే బోధన్, బాన్సువాడ నియోజక వర్గాల పరిధిలోని రైతులకు ఎరువుల పంపిణీ ప్రక్రియను ప్రారంభించామని, నిజామాబాద్, ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాల రైతులకు పక్కాగా పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. యూరియా బుకింగ్ యాప్తో ఎలాంటి నష్టం లేదని, ఎరువుల పక్కాదారి పట్టకుండా పారదర్శకంగా, ప్రణాళికాబద్ధంగా పంపిణీ దోహదం చేస్తుందన్నారు. నానో యూరియాను కొంత పరిమాణంలో ప్రయోగాత్మకంగా వినియోగించి ఫలితాలను పరిశీలించాలని రైతులకు సూచించారు. నానో యూరియా కొనుగోలు చేయాలని బలవంతం చేయొద్దని, రైతులు కోరిన ఎరువుల మాత్రమే అందించాలన్నారు. కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వీరాస్వామి, జిల్లా సహకార శాఖ అధికారి శ్రీనివాస్, తహసీల్దార్ దత్తాద్రి, జానకంపేట సొసైటీ చైర్మన్ మిద్దె నరేందర్, స్థానిక అధికారులు ఉన్నారు. -
ఫోన్ మాట్లాడొద్దన్న తండ్రి.. కూతురి ఆత్మహత్య
మద్నూర్(జుక్కల్) : ఫోన్లో ఎక్కువ సేపు మాట్లాడొద్దన్నందుకు మండలంలోని పెద్ద తడ్గూర్కు చెందిన భాగ్యవార్ సంధ్య(15) అనే బాలిక ఆత్మహత్యకు పాల్పడిందని ఎస్సై మోహన్రెడ్డి తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి.. పెద్ద తడ్గూర్కు చెందిన భాగ్యవార్ మాదప్ప కూతురు సంధ్య ఇటీవల పదో తరగతి పూర్తి చేసింది. ఇంటర్మీడియెట్ కోసం బోధన్లోని ఓ ప్రైవేటు కళాశాలలో అడ్మిషన్ తీసుకున్నారు. తనతోపాటు ఎస్సెస్సీ పూర్తి చేసిన స్నేహితులు ఏ కాలేజీలో అడ్మిషన్ తీసుకున్నారని తరుచూ వారితో ఫోన్ మాట్లాడుతుండడంతో తండ్రి మాదప్ప ఆమెను సోమవారం సాయంత్రం మందలించాడు. మంగళవారం ఉదయం మాదప్పతోపాటు ఆయన భార్య పొలానికి వెళ్లగా ఇంట్లో ఎవరు లేని సమయంలో సంధ్య దూలానికి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
ఆత్మస్థైర్యం స్వీయ రక్షణ
● చిట్టి చేతులతో కరాటే పంచ్లు ● ఉత్సాహంగా నేర్చుకుంటున్న చిన్నారులుబాన్సువాడ : ఆత్మ స్థైర్యాన్ని పెంచుకోవడంతోపా టు స్వీయరక్షణ కోసం చిన్నారులు వేసవి సెలవుల్లో కరాటే శిక్షణ పొందుతున్నారు. శారీరక దృఢత్వం.. క్రమ శిక్షణ అలవడేలా సెలవులు సద్వినియోగమ వుతున్నాయి. బాన్సువాడ పట్టణంలోని బేతాళస్వా మి ఆలయం ప్రాంగణంలో చిన్నారులు కరాటేలో శిక్షణ క్లాస్లు కొనసాగుతున్నాయి. మండలంలోని సంగోజిపేట్ గ్రామానికి చెందిన మాగి నవీన్ అనే యువకుడు హైందవ వీరుల యుద్ధ కలల గురుకులం (అకాడమీ ది రైట్ వే కరాటే క్యాంపస్) అనే శిక్షణ తరగతులను ప్రారంభించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను శిక్షణ తరగతులకు పంపిస్తున్నారు. వేసవి సెలవులు వృథా చేయకుండా, సెల్ఫోన్లకు పరిమితం కాకుండా కరాటే శిక్షణ ఇప్పిస్తున్నారు. గత నెల 1వ తేదీన శిక్షణ తరగతులను ప్రారంభం కాగా, బుధవారం నాటితో ముగియనున్నాయి. మొదట్లో 8 మంది పిల్లలతో శిక్షణ క్లాస్లు ప్రారంభం కాగా, ఆ సంఖ్య 60కి చేరిందని నవీన్ తెలిపా రు. ప్రతి రోజూ ఉదయం 8 నుంచి 10 గంటల వర కు, సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు చిన్నారులకు కరాటే శిక్షణ కొనసాగింది. చిన్నారులు తమ చిట్టి చేతులతో ఇస్తున్న కరాటే పంచ్లను చూస్తూ స్థానికులు అభినందిస్తున్నారు. కరాటే నేర్చుకోవడం ద్వారా ఆత్మవిశ్వాసం పెరుగు తుంది. ఏదైనా సాధించొచ్చనే నమ్మకం కలు గు తుంది. అమ్మనాన్నలు కరాటే శిక్షణ అంటే ఆనందంతో పంపుతున్నారు. వేసవి సెలవులు వృథా కా కుండా శిక్షణ ఉపయోగపడుతోంది. నవీన్ మాస్టారుకు ప్రత్యేక ధన్యవాదాలు. – వైష్ణవి, బాన్సువాడ కరాటేతో ఆరోగ్యం సొంతమవుతుంది. ఆత్మస్థైర్యం, నాయకత్వ లక్షణాలు అవలవడుతాయి. వేసవి సెలవుల్లో పిల్లల కోసం ఉచిత శిక్షణ తరగతులు ఏర్పాటు చేశాం. ఉచితంగా కరాటే శిక్షణ ఇవ్వడం ఆనందాన్ని ఇస్తోంది. పిల్లలు కూడా ఉత్సాహంగా వస్తున్నారు. – నవీన్, శిక్షకుడు -
రీజియన్ అభివృద్ధికి కృషి చేశాం
నిజామాబాద్ రూరల్ : ఆర్టీసీ నిజామాబాద్ రీజియన్ అభివృద్ధికి విశేష కృషి చేశామని ఆర్ఎం టి జ్యోత్స్న అన్నారు. బదిలీపై నల్గొండ జిల్లాకు వెళ్తున్న ఆర్ఎంను, డిప్యూటీ ఆర్ఎంగా మెదక్ రీజియన్కు పదోన్నతిపై వెళ్తున్న మధుసూదన్ను అధికారులు, సిబ్బంది జిల్లా కేంద్రంలోని రీజియన్ కార్యాలయంలో మంగళవారం సన్మానించారు. ఈ సందర్భంగా ఆర్ఎం మాట్లాడుతూ.. రీజియన్ అభివృద్ధికి విశేష కృషి చేశామని, ప్రయాణికులకు మెరుగైన సేవలందించడంలో సిబ్బంది కీలకపాత్ర పోషించారని కొనియాడారు. భవిష్యత్లో సైతం సంస్థ అభివృద్ధికి అందరూ కృషి చేయాలని కోరారు. రీజియన్ పరిధిలోని ఆరు డిపోల మేనేజర్లు, సూపర్వైజర్లు, మెకానికల్ ఫోర్మెన్లు, రీజియన్ పీవో పద్మజ, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. -
సీఎం తన ప్రకటనను వెనక్కి తీసుకోవాలి
ఖలీల్వాడి: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను 27 వేల నుంచి 4 వేలకు కుదిస్తామని చేసిన ప్రకటనను సీఎం వెనక్కి తీసుకోవాలని డీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎం సోమయ్య డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు ఎం బాలయ్య అధ్యక్షతన మంగళవారం నిర్వహించిన జిల్లా కౌన్సిల్ సమావేశానికి ఎన్నికల అధికారిగా సోమయ్య హాజరై మాట్లాడారు. అధికారంలోకి వస్తే ఒక్క పాఠశాలను కూడా మూసివేయనని, బడ్జెట్లో విద్యారంగాని 15 శాతం నిధులు కేటాయిస్తామని చెప్పారని గుర్తు చేశారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, ప్రైవేట్ విద్యారంగాన్ని, ఫీజులను నియంత్రిస్తామని, ఉపాధ్యాయ ఉద్యోగుల పెండింగ్ సమస్యలను పరిష్కరిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో స్పష్టంగా పేర్కొని ఇప్పుడు తిరోగమన విధానాన్ని ప్రకటించడం సరికాదన్నారు. అనంతరం జిల్లా ప్రధాన కార్యదర్శి కె ఓమాజీ కార్యదర్శి నివేదికను ప్రవేశపెట్టగా సుదీర్ఘ చర్చ అనంతరం ఆమోదించారు. జిల్లా కమిటీ సభ్యులు. విజయ్కుమార్, పి దాసు ఆర్ పెంటన్న, అరుణ్కుమార్, ఆయా మండలాల అధ్యక్ష ప్రధానకార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. -
నిజామాబాద్
సీఎం తన ప్రకటనను.. ప్రభుత్వ పాఠశాలలను 4 వేలకు కుదిస్తామన్న సీఎం ప్రకటనను వెనక్కి తీసుకోవాలని డీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు సోమయ్య అన్నారు. బుధవారం శ్రీ 10 శ్రీ జూన్ శ్రీ 2026– 8లో uరోడ్లు, భవనాల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ మోహన్ నాయక్ ఇంటితో పాటు ఆయన బంధువు లు, సన్నిహితుల ఇళ్లపై ఏసీబీ దాడులు జిల్లాలో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఏసీబీ అధికారులు బృందాలుగా ఏర్పడి ఏకకాలంలో తనిఖీలు నిర్వహించారు. మోహన్ నాయక్కు సొంత జిల్లాలోనే స్థిరాస్తులు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ఆయనకు సుమారు 30 ఎకరాల వ్యవసాయ భూమి, ఫామ్హౌస్ తో పాటు పలు అక్రమాస్తులు ఉన్నట్లు గుర్తించారు.జిల్లాకు చెందిన ఆర్అండ్బీ ఈఎన్సీ మోహన్ నాయక్ ఇళ్లల్లో సోదాలు -
ఎరువుల స్టాక్ పాయింట్లను తనిఖీ చేయాలి
● అధికారులకు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశాలునిజామాబాద్ అర్బన్: ఎరువుల గిడ్డంగులు, విక్రయ కేంద్రాలను వ్యవసాయ, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా క్రమం తప్పకుండా తనిఖీలు చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్తో కలిసి అన్ని మండలాల తహసీల్దార్లు, వ్యవసాయ శాఖ అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వ హించారు. ఎక్కడ కూడా రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా యూరియా, ఇతర ఎరువుల పంపిణీ జరిగేలా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేయాలన్నారు. క్రాప్ బుకింగ్ కలిగిన రైతులకే పంట సాగు విస్తీర్ణానికి అనుగుణంగా బుకింగ్ యాప్ ద్వారా ఎరువులు పంపిణీ చేయాలని సూచించారు. ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్లో ప్రభుత్వం నుంచి నష్టపరిహారం పొందిన భూముల్లోని పంటలకు క్రాప్ బుకింగ్ చేయకూడదని కలెక్టర్ స్పష్టం చేశారు. గ్రామాల్లో అంగన్వాడి భవనాలు, గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణాలకు అనువైన స్థలాలను త్వరితంగా కేటాయించాలని తహసీల్దార్లకు సూచించారు. ప్రత్యేక ఓటరు సవరణ ప్రక్రియ (ఎస్ఐఆర్) అమలుకు సంబంధించి బీఎల్వోలు, బీఎల్ఏలకు ఆయా విడతలలో అందించనున్న శిక్షణ కార్యక్రమాలలో సహాయ ఈఆర్వోలు, బీఎల్వో సూపర్వైజర్లు తప్పనిసరిగా పాల్గొనాలన్నారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వీరస్వామి తదితరులు పాల్గొన్నారు. -
నగరంలో భారీ చోరీ
● 30 తులాల బంగారం ఎత్తుకెళ్లారు ● రిటైర్డ్ జాయింట్ కలెక్టర్ నివాసంలో దొంగతనంనిజామాబాద్ అర్బన్: నిజామాబాద్ నగరంలోని సుభాష్నగర్లో సోమవారం రాత్రి భారీ దొంగతనం జరిగింది. రామాలయం పక్కన రిటైర్డ్ జా యింట్ కలెక్టర్ రవికుమార్ నివాసంలో ముగ్గురు దొంగలు చొరబడ్డారు. ఇంటిలోని 30 తులాల బంగారం, అరతులం వెండి, ఇంటిలో ఉన్న లాకర్ను ఎత్తుకెళ్లారు. ఇందులో బంగారు ఆభరణాలు ఉన్నా యి. రవికుమార్ ప్రస్తుతం హైదరాబాద్లోని కూకట్పల్లిలో నివాసం ఉంటున్నారు. మంగళవారం ఇంటికి వాచ్మెన్ వెంకట్ రాగా తాళాలు పగులగొట్టి ఉన్నాయి. దీంతో రవికుమార్కు సమాచారం అందించారు. అనంతరం మూడో టౌన్ పోలీసులకు తెలుపగా ఏసీపీ ప్రకాశ్యాదవ్, ఎస్సై హరిబాబులు వచ్చి దొంగతనం తీరును పరిశీలించారు. ముగ్గురు దొంగలు చోరీకి పాల్పడినట్లు సమీపంలోని సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు. ఇంట్లోని సీసీపుటేజీ డీపీఆర్ను దొండలు ఎత్తుకెళ్లారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై హరిబాబు తెలిపారు. -
బ్యాక్ వాటర్లో అరుదైన పక్షి గుడ్లు
డొంకేశ్వర్(ఆర్మూర్): మండలంలోని చిన్నయానం వద్ద ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ పచ్చిక బయళ్లలో అరుదైన పక్షి గుడ్లు స్థానికులకు కనిపించాయి. ఐతే, ఈ గుడ్లు టిట్టిభం (లాప్వింగ్) అనే పక్షికి చెందినవి. సాధారణంగా పక్షులు చెట్లపైన గూళ్లు కట్టుకుంటాయి. కానీ, టిట్టిభం పక్షులు మాత్రం నేలపైనే చిన్న గుంతలా చేసి గుడ్లు పెడతాయి. వీటి గుడ్లు మట్టి రంగులో, నల్లటి మచ్చలతో ఉండటం వల్ల శత్రువుల కంటికి సులువుగా కనిపించవు. ఇప్పుడు బ్యాక్ వాటర్లో పచ్చగడ్డిని సంతానోత్పత్తికి ఆవాసాలుగా చేసుకున్నాయి. -
పరిహారం.. పరిహాసమా !
మోర్తాడ్ (బాల్కొండ): జాతీయ రహదారి 63ను రెండు లేన్ల నుంచి నాలుగు లేన్లకు విస్తరించాలని కేంద్ర ప్రభుత్వం ఆమోదించగా నష్టపోయే భూములకు పరిహారం ధర నిర్ణయంచడంలో పారదర్శకత లోపించిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. వరద కాలువ, రైల్వే లైన్ల కోసం భూములను త్యాగం చేసిన రైతులే ఇప్పుడు జాతీయ రహదారి విస్తరణలో నష్టపోతుండటం గమనార్హం. ఎంతో విలువైన భూములను కోల్పోతున్నామని పరిహారం ఎక్కువ చెల్లించి ఆదుకోవాల్సింది పోయి భిన్నమైన తేడాలు చూపిస్తున్నారని రైతులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. కమ్మర్పల్లిలో ఒకలాగా... జగిత్యాల్ జిల్లా సరిహద్దులో ఉన్న గండిహనుమాన్ మందిరం నుంచి కమ్మర్పల్లి శివారులోని పాటి హనుమాన్ మందిరం వరకు ఉన్న జాతీయ రహదారిని విస్తరించడానికి రోడ్డుకు ఇరువైపులా ఉన్న భూమిని సేకరిస్తున్నారు. ఇక్కడ ఒక్కో ఎకరానికి రూ.కోటికి తగ్గకుండా పరిహారం రైతుల ఖాతాల్లో జమ చేశారు. దొన్కల్ వద్ద 40 ఎకరాల భూమి ఇరువైపులా నష్టపోతోంది. మోర్తాడ్లో 30.154 హెక్టార్ల భూమిని సేకరించనున్నారు. జాతీయ రహదారికి రెండువైపులా భూమి ఒకే వరుస క్రమంలోనే నష్టపోతోంది. అలాంటప్పుడు పరిహారం అన్ని భూములకు ఒకేలాగా ఉండాలని రైతులు అంటున్నారు. ఒక ఎకరానికి రూ. కోటికి పైగా ధరను పరిహారంగా నిర్ణయించి. మరో ఎకరానికి రూ.10 లక్షలే పరిహారం చెల్లించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. పరిహారం చెల్లింపులో స్వల్ప తేడా ఉంటే ఎలాంటి ఇబ్బంది ఉండదని, 90 శాతం మించి తేడా ఉండటం సరికాదని రైతులు వెల్లడిస్తున్నారు. పరిహారం ధర నిర్ణయించే విషయంలో అధికారులు అన్ని సర్వే నంబర్లకు ఒకే విధానం పాటించకుండా భిన్నమైన తేడాలు చూపడాన్ని నిరసిస్తున్నారు. నాలుగు లేన్ల రహదారిగా విస్తరించనున్న 63 వ నంబర్ జాతీయ రహదారి రహదారి విస్తరణలో రైతులు కోల్పోనున్న వ్యవసాయ భూములు ఒక్కో సర్వే నంబర్కు ఒక్కో ధర దొన్కల్ వద్ద భూమిని సేకరించడానికి పరిహారాన్ని రైతుల ఖాతాల్లో జమ చేశారు. 502 1ఎఫ్ బీ సర్వే నంబర్ గల భూమికి ఎకరానికి రూ.1,14,31,384 ధరను పరిహారంగా నిర్ణయించారు. ఇదే భూమి పక్కన ఉన్న 500 3 సర్వే నంబర్ గల దానికి రూ.60,54,604 ధరను అవార్డుగా ప్రకటించారు. ఇదే వరుసలో ఉన్న 377 2 ఏ సర్వే నంబర్కు మాత్రం రూ.10,91,240 పరిహారంగా చెల్లించారు. జాతీయ రహదారికి మరో వైపున ఉన్న 508 1సీ 1/2 సర్వే నంబర్ భూమికి రూ.60,54,600 పరిహారం నిర్ణయించారు. ఇదే వరుసలో ఉన్న 534 1ఏ 2 సర్వే నంబర్ గల భూమికి రూ.10,91,240 ధర ప్రకారం పరిహారం చెల్లించారు. మోర్తాడ్లోని భూములకు రూ.12 లక్షల నుంచి రూ.15 లక్షలు పరిహారంగా చెల్లించాలని నిర్ణయించారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన రైతులు హైకోర్టును ఆశ్రయించి స్టే తీసుకు వచ్చారు. రైతులను తీవ్రంగా నష్టపరుస్తున్నారు భూసేకరణ వల్ల మాకు వ్యవసాయం చేసుకునే పరిస్థితి లేదు. ఎంతో విలువైన భూములను ఇప్పటికే కోల్పోయాం. మళ్లీ భూములను జాతీయ రహదారికి ఇచ్చి మేము కూలీలుగా మారాల్సి వస్తుంది. కనీసం పరిహారం విషయంలోనూ న్యాయం జరగడం లేదు. – దడివె గంగాధర్, బాధిత రైతు, మోర్తాడ్ భూమికి బదులు భూమి ఇవ్వాలి వదర కాలువ, రైల్వే లైన్ కు మేమే భూములను కో ల్పోయాం. ఇప్పుడు జాతీ య రహదారికి అంటే మ రింత నష్టపోతాం. భూమి కి బదులు భూమి ఇవ్వాలి. లేదంటే పరిహారం రెండింతలు పెంచాలి. ప్రభుత్వం తీరుపై న్యాయ పోరాటం చేస్తాం. – దడివె ప్రభుదాస్, బాధిత రైతు, మోర్తాడ్ 63వ నంబర్ జాతీయ రహదారి విస్తరణలో వ్యవసాయ భూములు కోల్పోతున్న రైతులు పరిహారం ధర నిర్ణయంలో తేడాలు ఓ చోట ఒక ఎకరానికి రూ.1.14 కోట్ల ధర, పక్కనే ఉన్న మరో ఎకరానికి రూ.10.91 లక్షలే నిర్దిష్టమైన విధానం లేకపోవడంతో అధికారుల తీరుపై తీవ్ర అసంతృప్తి ఆందోళనలో బాధిత రైతులు -
యూరియా యాప్ను రద్దు చేయాలి
పెర్కిట్(ఆర్మూర్): ప్రభుత్వం నూతనంగా తీసుకు వచ్చిన యూరియా యాప్ ద్వారా తీవ్రంగా నష్టపోతున్నామని ఆర్మూర్ మండలం అంకాపూర్లో రైతు లు మంగళవారం 63వ నెంబరు జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. వారు మాట్లాడు తూ యూరియా యాప్ విధానం వల్ల సకాలంలో యూరియా అందడం లేదని, తక్షణమే యాప్ను తొలగించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం సాగవుతున్న మొక్కజొన్న, ఖరీఫ్ పనులు చేపట్టిన రైతుల కు యాప్ విధానం వల్ల యూరియా లభించక సొసై టీ వద్ద పడిగాపులు పడాల్సిన పరిస్థితి నెలకొంద న్నారు. స్మార్ట్ఫోన్లు లేని వారు, వాడే విధానం తెలి యని వారు యాప్లో యూరియా బుక్ చేసుకోలేక పోతున్నారన్నారు. రైతులు వ్యవసాయ పనులు చే సుకోకుండా యూరియా కోసం సొసైటీల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ప్రభుత్వం యాప్ను తొలగించి సొసైటీ యూనిట్ గా రైతుల కు యూరియాను అందజేయాలని డిమాండ్ చేశా రు. రైతుల రాస్తారోకోతో రహదారికి ఇరువైపుల వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ అంతరాయం కలిగింది. పోలీసులు అక్కడికి చేరుకుని రైతులకు సర్ది చెప్పి రాస్తారోకోను విరమింప చేశారు. రాస్తారోకోలో స్థానిక సర్పంచ్ అంక్సాపూర్ దేవేందర్ రెడ్డి, వినోద్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, నవీన్ రెడ్డి పాల్గొన్నారు. -
‘సాగర్’లో నీరున్నా.. ఆయకట్టు గట్టెక్కేనా?
● ప్రాజెక్టులో 7 టీఎంసీలపైనే నిల్వ ● పంటల సాగుపై ఎల్ నినో నీలినీడలు ● నీటి విడుదలపై స్పష్టత కరువు ● ఆందోళనలో రైతులు నిజాంసాగర్: నిజాంసాగర్ ప్రాజెక్టు కింద ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఏటా ఖరీఫ్లో సుమారు 1.5 లక్షల ఎకరాలలో పంటలు సాగవుతాయి. ప్రా జెక్టును నమ్ముకుని పలువురు రైతులు బోర్లు, బా వుల కింద వానాకాలం పంటల సాగుకు సమాయత్తమయ్యారు. దుక్కులు దున్ని పెట్టుకున్నారు. బా న్సువాడ, నస్రుల్లాబాద్, వర్ని, రుద్రూర్, ఎడపల్లి, కోటగిరి, బోధన్ ప్రాంతాల్లో ఇప్పటికే నారుమళ్లనూ సిద్ధం చేశారు. ఈ నెలాఖరు నుంచి ఆయకట్టు కింద వరి నాట్లు వేయనున్నారు. ఆందోళన కలిగిస్తున్న ‘వాతావరణ’ం.. వానాకాలం పంటల సాగుకు సమాయత్తం అవుతున్న రైతులను ఎల్ నినో ఆందోళనకు గురిచేస్తోంది. ఈసారి జిల్లాలో సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నందున బోరుబావులు, ఎత్తిపోతలు, చెరువులు, కుంటలు, ప్రధాన జలాశయాల కింద ముందస్తు పంటలు సాగు చేయవద్దని వాతావరణ శాఖ సూచిస్తోంది. బోరుబావులపై ఆధారపడి పంటలు సాగు చేసినా.. ఒకవేళ వర్షాలు కురియకపోతే పరిస్థితి ఏమిటన్నది రైతులను వేధిస్తోంది. నిజాంసాగర్ ప్రాజెక్టులో ప్రస్తుతం 771 టీఎంసీల నీరుంది. అయితే ఇందులో ఆవిరి, లీకేజీల రూపంలో 1.5 టీఎంసీలు తగ్గిపోతాయి. మరో అర టీఎంసీ మేర డెడ్స్టోరేజీ ఉంటుంది. ఖరీఫ్ పంటలు గట్టెక్కడానికి 9 టీఎంసీల వరకు నీరు అవసరం. దీంతో ప్రాజెక్టులో ఉన్న నీటిని విడుదల చేసినా వర్షాలు కురియకపోతే పంటలు గట్టెక్కడం కష్టమేనన్న అభిప్రాయం రైతుల్లో వ్యక్తమవుతోంది. కాగా వర్షాభావ పరిస్థితులు ఏర్పడితే ప్రాజెక్టునుంచి నీటిని విడుదల చేస్తారో లేదోనని సందేహిస్తున్నారు. నీటి విడుదలకు సంబంధించి స్టేట్ లెవల్ కమిటీ ఫర్ వాటర్ ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్ (స్కివమ్) కమిటీ ఏ నిర్ణయం తీసుకుంటుందోనని రైతులు ఎదురుచూస్తున్నారు. నిజాంసాగర్ ప్రాజెక్టు నీటిమట్టం మంజీర నదిలోకి వృథాగా వెళ్తున్న నీరు మూడు టీఎంసీలు మాయం..ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వరప్రదాయిని అయిన నిజాంసాగర్ ప్రాజెక్టులో నీటినిల్వలు ఆశాజనకంగా ఉన్నా.. ఆయకట్టుకు నీటి విడుదలపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎల్ నినో ప్రభావం నేపథ్యంలో నీటిని విడుదల చేస్తారో లేదోనని రైతులు ఆందోళన చెందుతున్నారు.ప్రభుత్వ ఆదేశాల మేరకే.. నిజాంసాగర్ ఆయకట్టు కింద వానాకాలం పంటల కోసం నీటి విడుదలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలు రాలేదు. స్కివమ్ క మిటీ ఆదేశాల మేరకు నీటి కేటాయింపులు ఉంటాయి. ప్రస్తుతం ఎల్ నినో ప్రభావం ఉన్నట్లు వా తావరణ శాఖ తెలిపింది. ప్రభుత్వ ఆదేశాల మేరకే నీటిని విడుదల చేస్తాం. – కిమ్యానాయక్, నీటిపారుదలశాఖ ఈఈ, నిజాంసాగర్నిజాంసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1,405 అడుగులు (17.8 టీఎంసీలు). అయితే యాసంగి పంటల సాగు సమయంలో నిజాంసాగర్ ప్రాజెక్టులో 1,405 అడుగులు 17.8 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఆయకట్టు కింద సుమారు 1.5 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేశారు. ఆయకట్టు పంటల అవసరాల కోసం ప్రాజెక్టు 6 విడతల్లో 12.289 టీఎంసీల నీటిని విడుదల చేశారు. కాగా జనవరిలో సింగూరు ప్రాజెక్టు నుంచి 8 టీఎంసీల నీటిని నిజాంసాగర్ ప్రాజెక్టుకు విడుదల చేశారు. ఇందులో 4.592 టీఎంసీలు మాత్రమే ప్రాజెక్టును చేరాయి. నిజాంసాగర్లో అంతకుముందు ఉన్న నీరు, సింగూరు జలాలు కలిపి 10 టీఎంసీలపైనే నీరుండాలి. కానీ ప్రస్తుతం 7.1 టీఎంసీలు మాత్రమేఉన్నాయి. ప్రాజెక్టు క్యాచ్మెంట్ ఏరియాలో అక్రమంగా మోటార్లను ఏర్పాటు చేసి జల చౌర్యానికి పాల్పడుతుండడంతోపాటు లీకేజీలు, ఆవిరి రూపంలో సుమారు 3 టీఎంసీలు ఖాళీ అయ్యాయి. -
ఇంకా యాసంగి సాగులోనే..
● ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్లో వరి సాగు చేస్తున్న రైతులుడొంకేశ్వర్(ఆర్మూర్): జిల్లాలో యాసంగి వరి కోతలు ఎప్పుడో పూర్తయి, రైతులు తమ ధాన్యాన్ని అమ్ముకుని లాభాలు చేతికి అందుకున్నారు. అంతేకాకుండా ఖరీఫ్ సీజన్కు సమాయత్తమవుతూ ఇప్పటికే నారుమడులు పోసుకుని దుక్కులు దున్నుకుంటూ బిజీగా గడుపుతున్నారు. అయితే డొంకేశ్వర్ మండలం ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ పరివాహక గ్రామాల రైతులు ఇంకా యాసంగి సాగులోనే ఉన్నారు. వర్షాకాలంలో వరదలొచ్చి ప్రాజెక్టులో నీటి మట్టం పూర్తి స్థాయిలో ఉన్నప్పుడు మండలంలోని పలు గ్రామాల రైతుల భూములు సుదీర్ఘకాలం పాటు నీటి ముంపులోనే ఉండిపోతాయి. వేసవిలో ప్రాజెక్టు నీటి మట్టం తగ్గుతున్న కొద్దీ ఒకొక్కక్కటిగా బయటపడతాయి. నీరు పూర్తిగా వెనక్కి తగ్గిన తర్వాతే రైతులు భూములను సాగు సిద్ధం చేసుకుంటారు. ఈ ఏడాది కూడా యాసంగి వరినాట్లను రెండు నెలలు ఆలస్యంగా వేశారు. ఫలితంగా పంటలు ఇప్పుడిప్పుడే ఎదిగి పొట్ట దశకు వస్తున్నాయి. వీటిని కాపాడుకునేందుకు రైతులు బోర్ల ద్వారా నీటిని అందిస్తున్నారు. -
కాంట్రాక్టర్ల తిరుగుబాటు!
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: రాష్ట్ర ప్రభుత్వంపై ఇప్పటికే అధికార కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే గుర్రు గా ఉన్నారు. ప్రభుత్వంలో ఉన్నవారితో పాటు కీలక నాయకులు తమను పట్టించుకోవడం లేదని, చివరకు అధికార యంత్రాంగం సైతం చిన్నచూపు చూస్తోందని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో గ్రామాల పాలనలో కీలకంగా వ్యవహరిస్తూ నే అప్పులు చేసి మరీ పనులు చేస్తున్న సర్పంచ్లు, పంచాయతీల పాలకవర్గాలు సైతం ప్రభుత్వం తమను చిన్నచూపు చూస్తోందంటూ ఆవేదన చెందుతున్నారు. అధికార పార్టీలో ఉన్నప్పటికీ బహి రంగంగానే తమ అసహనాన్ని వెలిబుచ్చుతున్నా రు. బిల్లులు రాక అప్పుల పాలవుతున్నామని స ర్పంచ్లు గగ్గోలు పెడుతున్నారు. ఈ క్రమంలోనే చిన్నతరహా, మధ్యతరహా, పెద్దతరహా అభివృద్ధి పనులు చేస్తున్న కాంట్రాక్టర్లూ తమ కు బిల్లులు ఇవ్వకపోతుండడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 18న రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని కాంట్రాక్టర్లు చలో హైదరాబాద్ కార్యక్రమం చేపట్టారు. 1941లో ఏర్పాటై జాతీయ స్థాయి సంస్థగా ఉన్న ‘బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండి యా’ ఆధ్వర్యంలో ‘మా హక్కు–మా బిల్లులు–రాష్ట్ర అభివృద్ధి’ అనే నినాదంతో చలో హైదరాబాద్ కార్యక్రమానికి అన్ని ఉమ్మడి జిల్లాల్లో సన్నాహ క సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం నిజామాబాద్లో కాంట్రాక్టర్లు రాష్ట్ర అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏ ర్పాటు చేసిన సమావేశంలో సన్నాహక సమావేశంపై మాట్లాడారు. ఇందులో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రవీందర్రెడ్డి, కార్యదర్శి భా స్కర్రెడ్డి, ప్రమోద్రెడ్డి, సురేందర్రావు, బాగారెడ్డి, విష్ణువర్ధన్రెడ్డి, సంజీవరెడ్డి, శ్రీధర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చలో హైదరాబాద్ పోస్టర్ విడుదల చేశారు. జిల్లాలో రూ.300 కోట్ల బిల్లులు పెండింగ్ అప్పులకు వడ్డీలు చెల్లించలేక పోతున్నాం.. ఆత్మహత్యలే శరణ్యమవుతున్నాయ్.. 18న ‘చలో హైదరాబాద్’కు ఇందూరులో సన్నాహక సమావేశం -
పంట సాగుచేసే ప్రతి రైతుకు ఎరువులు
● అందుబాటులో 27,203 మెట్రిక్ టన్నుల యూరియా ● కలెక్టర్ ఇలా త్రిపాఠి వెల్లడి నిజామాబాద్అర్బన్: జిల్లాలో ఖరీఫ్ సీజన్ కు సరిపడా యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని, ఆందోళనకు గురి కా వాల్సిన అవసరం లేదని కలెక్టర్ ఇలా త్రిపా ఠి పేర్కొన్నారు. రాష్ట్రంలో జిల్లాలోనే అత్యధిక స్థాయిలో 27,203 మెట్రిక్ టన్నుల యూ రియా నిల్వలు ఉన్నాయని కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని ప్రాంతాలలో పంట సాగు చేసే ప్రతి రైతుకు ఎరువులు అందేలా చూస్తామన్నారు. ఎలాంటి అక్ర మాలకు తావు లేకుండా, ఎరువులు పక్కదా రి పట్టకుండా పారదర్శకమైన పంపిణీ కో సం యూరియా బుకింగ్ యాప్ దోహదపడుతోందన్నారు. ఈ యాప్ పనితీరును గ మనించిన ఇతర రాష్ట్రాలు కూడా ఒక్క యూరియానే కాకుండా మిగతా అన్ని ఎరువులను కూడా బుకింగ్ యాప్ ద్వారానే రైతులకు అందిస్తున్నాయని కలెక్టర్ తెలిపారు. రైతులు ఒకేసారి ఎరువులను కొనుగోలు చే సి పెట్టుకోకుండా, అవసరాలకు అనుగుణంగా ద శల వారీగా తీసుకోవాలని, మోతాదు కు మించి వాడవద్దని హితవు పలికారు. ఎరువుల దుకాణాలు, వివిధ సంస్థల ద్వారా కొనుగోలు చేసే రైతులను యూరియా, ఎరువులతో ముడిపెడుతూ ఇతర ఉత్పత్తులను కొనుగోలు చేయాలని బలవంతం చేస్తే లైసెన్సులు రద్దు చేస్తామని కలెక్టర్ హెచ్చరించారు. జీజీహెచ్ సూపరింటెండెంట్ బదిలీ ● 12 మంది ప్రొఫెసర్లకూ స్థానచలనం సుభాష్నగర్: నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కళాశాల పరిధిలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి (జీజీహెచ్) ఇన్చార్జి సూపరిండెంటెండ్, ఫోరెన్సిక్ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ బీవీ నాగమోహన్రావు బదిలీ అయ్యారు. ఆయనతోపాటు కళాశాలలోని మరో 12 మంది ప్రొఫెసర్లను బదిలీ చేస్తూ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. నాగమోహన్రావును సికింద్రాబాద్లోని గాంధీ మెడికల్ కళాశాలకు బదిలీచేశారు. వివిధ విభాగాల్లోని ప్రొఫె సర్లు డాక్టర్ పి మధు, డాక్టర్ ఎన్ బాల్రాజ్, డాక్టర్ డి ప్రతిమారాజ్, డాక్టర్ జె తిరుపతిరావు, డాక్టర్ కే శివప్రసాద్, డాక్టర్ సయేదా అమ్తుల్ మౌఖిత్, డాక్టర్ వి వెంకటేశ్వర్రావు, డాక్టర్ కేజే కిషోర్ కుమార్, డాక్టర్ బి శ్రీనివాస్, డాక్టర్ పి శ్రీనివాస్, డాక్టర్ కె విజయకుమార్, డాక్టర్ ఎన్ రవికిరణ్ బదిలీ అ య్యారు. వీరంతా ఇప్పటికే రిలీవ్ అయ్యా రు. అదేసమయంలో నిజామాబాద్ ప్రభు త్వ మెడికల్ కళాశాలకు బదిలీ అయిన వారిలో ఐదుగురు ఇప్పటికే రిపోర్ట్ చేశారు. రిపోర్ట్ చేసిన వారిలో డాక్టర్ ఏ విశాల్, డాక్టర్ పి వెంకటేశ్వర్లు, డాక్టర్ టి దినేష్కుమార్, డాక్టర్ తానాజీ జాడె, డాక్టర్ మహ్మద్ యూసుఫ్ ఖాన్ ఉన్నారు. కాగా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్గా అదనపు సూపరింటెండెంట్ డాక్టర్ రాములుకు తాత్కాలికంగా బాధ్యతలను అప్పగించినట్లు తెలిసింది. బదిలీల ప్రక్రియ పూర్తయి వెంటనే సీనియారిటీ జాబితా ప్రకారం పూర్తిస్థాయి సూపరింటెండెంట్ను డీఎంఈ నుంచి నియమించనున్నట్లు సమాచారం. -
పెద్దాస్పత్రిలో సిజేరియన్లకు సెలవు
● అత్యవసర పరిస్థితుల్లో గర్భిణులకు ఇబ్బందులు ● ప్రసూతి వైద్యురాలు లేని బోధన్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిబోధన్టౌన్(బోధన్): పెద్దాస్పత్రిగా పేరు పొందిన బోధన్లోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో వారం రోజులుగా ప్రసూతి వైద్యురాలు లేక అత్యవసర పరిస్థితుల్లో గర్భిణులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రసవం కోసం ఆస్పత్రికి వచ్చే గర్భిణులకు వైద్య సిబ్బంది నార్మల్ డెలివరీలు మాత్రమే చేస్తున్నారు. శస్త్ర చికిత్స చేయాల్సి వస్తే ఏమి చేయలేక నిజామాబాద్ జిల్లా జనరల్ ఆస్పత్రికి పంపిస్తున్నారు. కొందరు బోధన్లోనే ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తే, మరి కొందరు ఆర్థిక ఇబ్బందులతో నిజామాబాద్ జీజీహెచ్కు తరలి వెళుతున్నారు. బోధన్లోని జిల్లా ఆస్పత్రి పరిధిలో బోధన్, సాలూర, మోస్రా, చందూర్, రుద్రూర్, వర్ని మండలాలతో పాటు పట్టణ ప్రజలు, పక్క రాష్ట్రమైన మహారాష్ట్ర ప్రజలు వైద్య చికిత్స కోసం వస్తుంటారు. ప్రతి రోజు 500 నుంచి 700 వరకు ఓపీ సేవలు నడువగా, 50 నుంచి 100 మంది వరకు ఇన్ పేషెంట్లు చేరుతున్నారు. తగ్గిన కాన్పులు.. బోధన్ ప్రభుత్వ ఆస్పత్రిలో మే నెలలో కాన్పులు తగ్గాయి. ఏప్రిల్లో సాధారణ కాన్పులు 42, శస్త్ర చికిత్సలు 21 అయ్యాయి. మేలో సాధారణ కాన్పులు 33, శస్త్ర చికిత్సలు 16 అయ్యాయి. ఇప్పటికై నా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి ఆస్పత్రిలో ప్రసూతి వైద్యురాలిని నియమించి వైద్య సేవలు మెరుగు పడేలా చూడాలని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. త్వరిత గతిన నియమించే ఏర్పాటు చేస్తాం ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో ప్రసూతి వైద్యురాలిని త్వరిత గతిన నియమించే ఏర్పాటు చేస్తాము. ఇప్పటి వరకు ఉన్నత అధికారులకు సమాచారం అందించాం. ఆస్పత్రిలో కాన్పులు జరిగేలా చర్యలు చేపడుతున్నాం. – డాక్టర్ రాహుల్, బోధన్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి -
28న పల్స్ పోలియో చుక్కల పంపిణీ
● అదనపు కలెక్టర్ భుజంగరావు ● జిల్లా సమన్వయ కమిటీ సమావేశం..సుభాష్నగర్: ఐదేళ్లలోపు పిల్లలకు పల్స్ పోలియో చుక్కల మందును ఈనెల 28న పంపిణీ చేయనున్నట్లు అదనపు కలెక్టర్ భుజంగరావు తెలిపారు. 29, 30 తేదీల్లో వైద్యసిబ్బంది, వలంటీర్లు ఇంటింటికీ తిరిగి పోలియో చుక్కల మందును వేస్తారన్నా రు. సోమవారం జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ అధ్యక్షతన డయేరియా, పోలియో, నులిపురుగుల నిర్మూలనే లక్ష్యంగా జిల్లా సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, ప్రధాన చౌరస్తాలో ట్రాన్సిట్ బూత్ల ను ఏర్పాటు చేసి పల్స్ పోలియో వందశాతం విజ యవంతమయ్యేలా చూడాలన్నారు. చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేయాలన్నారు. డయేరియా మరణాలు నివారించాలి.. ఈనెల 16 నుంచి జూలై 31 వరకూ డయేరియా నిర్మూలన కార్యక్రమాన్ని జిల్లావ్యాప్తంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు. ఐదేళ్లలోపు పిల్లలు డయేరియా లక్షణాలతో మరణించకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పిల్లలకు రెండు ఓఆర్ఎస్ ప్యాకెట్లు, 14 జింక్ మాత్రలు పంపిణీ చేయాలన్నారు. పట్టణ మురికి వాడలు, గిరిజన ప్రాంతా లు, మారుమూల అటవీ ప్రాంతాల్లో నివసించే వా రిలో డయేరియా మరణాలు జరగకుండా మొదటి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. జాతీయ నులిపురుగుల నిర్మూలనలోభాగంగా ఏడాది వయసు నుంచి 19 ఏళ్లలోపు పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రను ఇవ్వనున్నట్లు అదనపు కలెక్టర్ తెలిపారు. డీఎంహెచ్వో రాజశ్రీ, డీఈవో అశోక్, ఆస్పత్రుల సమన్వయకర్త డాక్టర్ శ్రీనివాస్ ప్రసాద్, రవికుమార్, ఎన్పీడీసీఎల్ ఎస్ఈ పీవీ రాజేశ్వర్రావు పాల్గొన్నారు. -
నేరస్తుల సమాచారాన్ని నమోదు చేయాలి
నిజామాబాద్అర్బన్: నేరాలు, నేరస్తుల సమాచా రాన్ని సీసీ టీఎన్ఎస్ 2.0 (క్రైం అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టమ్స్)ద్వారా వేగవంతంగా నమోదు చేయాలని డీజీపీ సీవీ ఆనంద్ ఆదేశించా రు. సోమవారం వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ఆయన మాట్లాడారు. దర్యాప్తు ప్రక్రియను డిజిటలైజ్ చేయడం ప్రజలకు అందించే సేవలను మరింత పారదర్శకంగా సమర్థవంతంగా మార్చడంపై దిశా నిర్దేశం చేశారు. ఈ – సాక్ష్య వ్యవస్థ ద్వారా నేర సంఘటనలకు సంబంధించి డిజిటల్ ఆధారాలను సేకరించడం భద్రత పరచడం, కోర్టు విచారణలో సమర్పించే విధానాన్ని మరింత పటిష్టంగా అమలు చేయాలని సూచించారు. పోలీస్ వ్యవస్థను ఆధునీకరించడం, సేవల్లో నాణ్యతను పెంపొందించడం, ప్రజలకు మెరుగైన సేవలు అందించడం లక్ష్యంగా కార్యక్రమాలను అమలు చేస్తున్నామన్నారు, ఇన్చార్జి సీపీ రాజేశ్చంద్ర, అదనపు డీసీపీ శుభం ప్రకాశ్, నిజామాబాద్, ఆర్మూర్ ట్రాఫిక్ ఏసీపీలు తదితరులు పాల్గొన్నారు. -
స్కేటింగ్ నేర్చుకున్నా..
హాయ్ ఫ్రెండ్స్... నా పేరు డీజీ అన్విక్ష్ భీమ్. నా స్వగ్రామం వేల్పూర్. వేసవి సెలవుల్లో నిజామాబాద్లో ఉండే అమ్మమ్మ దగ్గరికి వచ్చాను. ఇక్కడ జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్కేటింగ్ శిక్షణలో పాల్గొంటున్నాను. మొదటిసారి స్కేటింగ్ షూస్ ధరించినప్పుడు కొంచెం భయంగా అనిపించింది. కానీ ప్రతిరోజూ సాధన చేయడంతో, ఇప్పుడు ఎంతో ఉత్సాహంగా స్కేటింగ్ చేస్తున్నాను. వేసవి సెలవులను ఆనందంగా, ఉపయోగకరంగా గడుపుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. -
నాన్ కమాండ్ ఏరియాకు సాగునీరు
వర్ని: నిజాంసాగర్ కాలువ ఎగువన ఉన్న నాన్ కమాండ్ ఏరియా వ్యవసాయ భూములకు ఈ ఖరీఫ్లో సాగునీరు అందించనున్నట్లు ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి వెల్లడించారు. రూ.106 కోట్లతో నిర్మాణం చేపట్టిన జాకోర, చందూర్ లిఫ్ట్ల పనులు పూర్తయిన నేపథ్యంలో ఈనెల 10న రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ప్రారంభించనున్నట్లు తెలిపారు. సోమవారం జాకోరాలో లిఫ్ట్ ఇరిగేషన్ను, సభాస్థలిని, హెలీప్యాడ్న్ ఆయన పరిశీలించారు. జాకోరా లిఫ్ట్ ద్వారా కాలు వ ఎగువ భాగాన ఉన్న 25 వేల ఎకరాలకు, చందూర్ పరిధిలో 10 వేల ఎకరాలకు సాగునీరందించనున్నట్లు వెల్లడించారు. నిజాంసాగర్ ప్రాజెక్టు కింద లక్షా 80 వేల ఎకరాల పంట సాగవుతుందని నాన్ కమాండ్ ఏరియా రైతులకు కూడా సాగునీరు అందించాలనే ఉద్దేశంతో జాకోరా, చందూర్, చింతకుంట లిఫ్ట్ల నిర్మాణం చేపట్టినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా బాన్సువాడ నియోజకవర్గంలో సాగునీరు, విద్య, వైద్య రంగాలకు అధిక నిధులు తీసుకువచ్చి ఆదర్శంగా నిలిచినట్లు వెల్లడించారు. రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు, వర్ని మార్కెట్ కమిటీ చైర్మన్ సురేశ్బాబా, పీసీసీ డెలిగేట్ రాజిరె డ్డి, తహసీల్దార్ ప్రశాంత్కుమార్, ఎంపీడీవో వెంకటేశ్వర్, జాకోరా సొసైటీ చైర్మన్ దశరథ్, సర్పంచ్ సాయిలు నాయకులు, కరణం సాయిరెడ్డి, బారీ, గిరి, వీర్రాజు పాల్గొన్నారు. -
గుండెపోటుతో హెడ్ కానిస్టేబుల్ మృతి
మోపాల్: మోపాల్ పోలీస్స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్న ఏ గంగాధర్ (52) గుండెపోటుతో మృతిచెందినట్లు ఎస్సై జాడె సుస్మిత సోమవారం తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి.. కమ్మర్పల్లి మండలం బషీరాబాద్కు చెందిన ఏ గంగాధర్ 1998లో పోలీస్శాఖలో కానిస్టేబుల్గా విధుల్లో చేరాడు. ప్రస్తుతం మోపాల్ పోలీస్స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్నాడు. సోమవారం విధుల్లో భాగంగా మండలంలోని గుడితండాలో నిర్వ హించిన గ్రామసభకు హాజరయ్యాడు. విధులు పూర్తి చేసుకుని మధ్యా హ్నం సమయంలో నగరంలోని రోటరీనగర్లోగల తన ఇంటికి వెళ్లాడు. ఇంట్లో ఉన్న సమయంలో అకస్మాత్తుగా ఛాతిలో నొప్పి రావడంతో భార్య, కుమారుడు ఖలీల్వాడిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తు న్న క్రమంలోనే తీవ్రమైన గుండెపోటు వచ్చింది. వైద్యబృందం అత్యవసర చికిత్సతోపాటు సీపీఆర్ చేసినప్పటికీ ఆయ న స్పందించలేదు. తీవ్రమైన గుండెపోటుతో మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. గంగాధర్ కుమారుడు రెండేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతిచెందినట్లు తెలిసింది. ఇప్పుడిప్పుడే కోలుకుంటు న్న ఆ కుటుంబానికి కుటుంబ పెద్ద కోల్పోవడంతో వారి రోదనలు మిన్నంటాయి. కాగా గంగాధర్ ఆకస్మిక మరణం పోలీస్శాఖకు తీరని లోటు అని, అంకితభావంతో విధులు నిర్వహించిన పోలీసు అని సీఐ సురేష్కుమార్, ఎస్సై సుస్మిత పేర్కొన్నారు. ఆయన మృతికి వారు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గంగాధర్ అంత్యక్రియలు బషీరాబాద్లో మంగళవారం నిర్వహించనున్నట్లు పోలీస్ వర్గాల ద్వారా తెలిసింది. -
తెలంగాణ–20 క్రికెట్ లీగ్కు జిల్లా కుర్రోడు
● నల్గొండ నైట్స్కు పాట్కూరి నితీశ్రెడ్డి ● రూ.5.5 లక్షలకు కొనుగోలు చేసిన ఫ్రాంచైజీ ● రాష్ట్రవ్యాప్తంగా 8 జట్లతో లీగ్ నిర్వహణ సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: తెలంగాణ–20 పేరిట ఈ నెల 20వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీల్లో రాష్ట్రవ్యాప్తంగా 8 జట్లు పోటీ పడనున్నాయి. జిల్లాలోని జక్రాన్పల్లి మండలం మనోహరాబాద్ గ్రామానికి చెందిన మాజీ జెడ్పీటీసీ పాట్కూరి తనూజరెడ్డి, శ్రీనివాసరెడ్డి దంపతుల కుమారుడు నితీశ్రెడ్డిని నల్గొండ నైట్స్ జట్టు రూ.5.5 లక్షలకు కొనుగోలు చేసింది. నల్లగొండ నైట్స్ జట్టు తరఫున నితీశ్రెడ్డి క్రికెట్ ఆడనున్నాడు. నితీశ్రెడ్డి గతంలో రంజీ ట్రోఫీలో హైదరాబాద్కు ప్రాతినిధ్యం వహించాడు. 2018–19, 2019–20 సంవత్సరాల్లో అండర్–19 జట్లకు హైదరాబాద్ తరఫున ప్రాతినిధ్యం వహించాడు. 2021–22లో కల్నల్ సీకే నాయుడు టోర్నమెంట్లో హైదరాబాద్ అండర్–25 జట్టుకు, 2021–22లో సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నమెంట్లో హైదరాబాద్కు ప్రాతినిధ్యం వహించాడు. అలాగే 2022–23లో హైదరాబాద్ అండర్–25 వన్డే జట్టుకు, 2023–24లో హైదరాబాద్ అండర్–23 వన్డే జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించాడు. 2024–25లో సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నమెంట్లో హైదరాబాద్కు ప్రాతినిధ్యం వహించాడు. 2024–25 విజయ్ హజారే ట్రోఫీలో హైదరాబాద్కు ప్రాతినిధ్యం వహించి పంజాబ్ జట్టుపై 100 పరుగులు సాధించాడు. -
ప్రజల భాగస్వామ్యంతోనే సత్వర ప్రగతి
● కలెక్టర్ ఇలా త్రిపాఠి ● ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా శ్రమదానం సుభాష్నగర్: ప్రజల భాగస్వామ్యంతోనే సత్వర ప్రగతి సాధ్యమవుతుందని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజు ల కార్యాచరణలో భాగంగా కలెక్టర్ ప్రత్యేక చొర వతో సోమవారం నగరంలోని 41వ డివిజన్ వసంత్ నగర్లో శ్రమదానం నిర్వహించారు. కలెక్టర్తోపాటు నగర మేయర్ కూరగాయల ఉమారాణి, డిప్యూటీ మేయర్ సల్మా తహసీన్, కమిషనర్ దిలీప్ కుమార్ తదితరులు స్థానికులతో కలిసి పాల్గొన్నారు. మున్సిపల్ పరిధిలోని ఖాళీ స్థలాన్ని శ్రమదానంతో శుభ్రంచేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పరిసరాల పరిశుభ్రత ప్రతిఒక్కరి బాధ్యత అని గుర్తుచేశారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో శ్రమదానం అంశం లేనప్పటికీ, పరిసరాల పరిశుభ్రతలో ప్రజలను భాగస్వాములు చే యాలనే లక్ష్యంతో నగరంలో ప్రత్యేకంగా శ్రమదా నం కారక్రమాన్ని చేపట్టామని తెలిపారు. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వ్యక్తిగత, పరిసరాల శుభ్రతపై ప్రత్యే క దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. ఖాళీస్థలాలు కబ్జాకు గురి కాకుండా కాపాడుకోవాలని, తద్వారా ఆ స్థలాలను స్థానిక ప్రజల అవసరాలకు అనుగుణంగా పార్కులు, వాకింగ్ ట్రాక్ తదితర వాటి కోసం వినియోగించుకునేలా తీర్చిదిద్దవచ్చని అన్నారు. ప్రస్తుతం శ్రమదానం చేసిన సుమారు 10వేల చదరపు గజాల మున్సిపల్ స్థలాన్ని పరిరక్షించేందుకు సరిహద్దులను గుర్తిస్తూ బయో ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని, ఆహ్లాదాన్ని అందించేలా పూల మొక్కలు నాటాలని అధికారులను ఆదేశించారు. కార్పొరేటర్ పూజిత, స్థానిక ప్రజలు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
క్రైం కార్నర్
బైక్ అదుపు తప్పి ఒకరి మృతి నవీపేట : మండలంలోని అంజుమన్ ఫా రం శివారులో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నవీపేట్కు చెందిన మహ్మ ద్ గౌస్(30) అనే వ్యక్తి మృతి చెందినట్లు ఎస్సై శ్రీకాంత్ సోమవారం తెలిపారు. నిజామాబాద్ మండలం పాల్ద గ్రామంలోని అత్తగారింటికి బైక్పై వెళ్తుండగా బైక్ అదుపు తప్పి కిందపడడంతో గౌస్ తలకు తీవ్ర గాయాలయ్యాయన్నారు. జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి ఆదివారం రాత్రి మృతి చెందాడని తెలిపారు. బైక్ను టిప్పర్ ఢీకొట్టిన ఘటనలో మరొకరు.. ఇందల్వాయి: బైక్ను టిప్పర్ ఢీకొట్టిన ఘటనలో వృద్ధుడు మృతి చెందాడు. ఎస్సై సుమలత తెలిపిన వివరాలు.. తిర్మన్పల్లి గ్రామానికి చెందిన ఎరుకల పోశయ్య (82) ఇందల్వాయి నుంచి సోమవారం సాయంత్రం తన స్వగ్రామానికి బైక్పై వెళ్తుండగా ఇందల్వాయి నుంచి ధర్పల్లి వైపు వెళ్తున్న టిప్పర్ ఢీట్టింది. తీవ్ర గాయాలపాలైన పోచయ్యను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందాడు. మృతుడి కుమారుడు రాజేశ్వర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసినట్లు ఎస్సై తెలిపారు. చికిత్స పొందుతూ.. నాగిరెడ్డిపేట: రోడ్డు ప్రమాదంలో గాయాలపాలైన మండలంలోని మాల్తుమ్మెద గ్రామానికి చెందిన దూదేకుల అజీమ్ (73) చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి సోమవారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. నడుచుకుంటూ వెళ్తు న్న అజీమ్ను వెనక నుంచి ఆటో ఆదివారం ఢీకొట్టిందన్నారు. గాయాలపాలైన అజీమ్ మెదక్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతు సోమవారం మృతి చెందాడని తెలిపారు. ఆటో డ్రైవర్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
పిల్లలను సర్కారు బడికే పంపాలి
● డొంకేశ్వర్ మండలం అన్నారం పంచాయతీ తీర్మానండొంకేశ్వర్(ఆర్మూర్): మన ఊరి బడిని మన మే కాపాడుకుందాం.. ప్రయివేటు విద్యాసంస్థల ఫీజుల దోపిడీకి అడ్డుకట్ట వేసి ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేద్దామంటూ డొంకేశ్వర్ మండలం అన్నారం గ్రామ పంచాయతీతోపాటు గ్రామ ప్రజలు ఏకగ్రీవంగా తీర్మా నం చేశారు. గ్రామానికి అదనంగా ప్రీ ప్రైమ రీ పాఠశాల కూడా మంజూరైందని, మంచి విద్యతోపాటు రుచికరమైన మధ్యాహ్న భోజనం లభిస్తుందని సర్పంచ్ అట్టోలి సంజీవ్, వార్డు సభ్యులు ప్రజలకు గ్రామసభ ద్వారా అవగాహన కల్పించారు. ప్రత్యేక కమిటీ ఏ ర్పాటు చేసి విద్యా ప్రమాణాలు, వసతులను నిరంతరం పర్యవేక్షించాలని మరో తీర్మానం చేశారు. పంచాయతీతోపాటు గ్రామస్తులు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారడంతోపాటు పలు గ్రామాలకు ఆదర్శంగా నిలిచింది. ప్రజావాణికి 146 ఫిర్యాదులునిజామాబాద్ అర్భన్ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 146 ఫిర్యాదులు అందాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ తో పాటు, అదనపు కలెక్టర్లు కిరణ్ కుమార్, భుజంగరావు, డీఆర్వో గీత, జిల్లా పరిషత్ సీఈవో సాయాగౌడ్, నిజా మాబాద్ ఏసీపీ ప్రకాశ్ లకు విన్నవిస్తూ అర్జీ లు సమర్పించారు. ఫిర్యాదులను పెండింగ్ లో పెట్టకుండా సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
సంపూర్ణ ఆరోగ్యం
మానసిక ఉల్లాసం ● చౌట్పల్లిలో విద్యార్థుల యోగా సాధన ● ప్రత్యక్ష తరగతులతోపాటు ఆన్లైన్ శిక్షణ ● 13 ఏళ్ల వయస్సులో యోగా నేర్పుతున్న అనిరుధ్గౌడ్ యోగా శిక్షణ ఇస్తున్న అనిరుధ్గౌడ్మోర్తాడ్(బాల్కొండ): ప్రత్యక్ష తరగతులతోపాటు ఆన్లైన్లో క్లాసులు విని యోగాపై పట్టు సాధించిన 13 ఏళ్ల విద్యార్థి తన తోటి విద్యార్థులకు వేసవి సెలవుల్లో యోగా శిక్షణ ఇస్తున్నాడు. సెలవుల్లో ఏదో ఒక ప్రత్యేక అంశాన్ని నేర్చుకోవాలనే ఆలోచనలో ఉన్న తనతోటి వారికి యోగా శిక్షణ ఇచ్చి మానసిక ఉల్లాసం, సంపూర్ణ ఆరోగ్యం కోసం బాట చూపాడు. అతడే కమ్మర్పల్లి మండలం చౌట్పల్లికి చెందిన సిలివేరి అనిరుధ్గౌడ్. స్థానిక ఉన్నత పాఠశాలలో ఎనిమిదో తరగతి పూర్తి చేసుకున్న అనిరుధ్ తనతోపాటు చదువుకుంటున్న వారికి యోగా శిక్షణ ఇచ్చి మెలకువలను నేర్పిస్తుండడం విశేషం. విద్యార్థులు కూడా తమ వేసవి సెలవులను వృథాగా పోనివ్వకుండా యోగా నేర్చుకోవడంపై దృష్టి సారించి అందరి ప్రశంసలను అందుకుంటున్నారు. రోజూ ఉదయం, సాయంత్రం గంటపాటు ఉన్నత పాఠశాల ఆవరణలో యోగా శిక్షణ తరగతులను అనిరుధ్గౌడ్ నిర్వహిస్తున్నాడు. కరోనా సమయంలో ఆన్లైన్లో యోగా క్లాస్లకు అటెండ్ అయ్యాను. యోగాతో మానసిక ఉల్లాసంతోపాటు సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని తెలుసుకున్న నేను నా తోటి విద్యార్థులకు అదే చెప్పాను. సెలవులు ప్రారంభం కాగానే యోగా శిక్షణ ఇవ్వాలని కోరడంతో రోజూ శిక్షణ ఇస్తున్నా. అందరూ ఉత్సాహంగా శిక్షణలో పాల్గొంటున్నారు. – అనిరుధ్గౌడ్, యోగా శిక్షకుడు యోగా శిక్షణ ద్వారా ఎంతో నేర్చుకున్నాం. యోగా క్లాసులు అనగానే మొదట ఏదో అనుకున్నాం. రెండు మూడు రోజులకే అన్నీ అర్థమయ్యాయి. మా సహచర విద్యార్థి అనిరుధ్ ఇచ్చిన శిక్షణ ఎంతో బాగుంది. యోగాతో ఆరోగ్యం బాగుటుందని తెలుసుకున్నాం. – రూపేశ్, చౌట్పల్లి యోగా సాధన ద్వారా చదువుపై పట్టు సంపాదించడానికి మార్గం దొరికింది. యోగా శిక్షణ అందరికీ అవసరమే. ఆరోగ్యం, మానసికి ప్రశాంతత ఉంటే మనిషి ఏదైనా సాధించవచ్చు. అది యోగాతోనే సాధ్యమని తెలుసుకున్నాం. ప్రతి సెలవుల్లో యోగా శిక్షణ కార్యక్రమాలు కొనసాగాలి. – శ్రీమై, చౌట్పల్లి అనిరుధ్ ఇచ్చే యోగా శిక్షణ బాగుంది. మాతోటి విద్యార్థి ఎన్నో ఏళ్లుగా యోగాభ్యాసం చేస్తుండటం మాకూ శిక్షణ ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉంది. ఉత్సాహంగా రోజూ యోగా క్లాసులకు హాజరవుతున్నాం. మానసికంగా ప్రశాంతత లభిస్తోంది. – అక్షర, చౌట్పల్లి -
నేను గీసిన చిత్రం
శ్రీరాం ఘనతేజ, 5వ తరగతి, భీమ్గల్ శ్రీరాం కార్తికేయ, 5వ తరగతి, భీమ్గల్ పందిరి శాల్వి, 6వ తరగతి, జీవదాన్ హైస్కూల్, కామారెడ్డి. వేసవి సెలవుల్లో మీ కలానికి పదునుపెట్టి బొమ్మలు గీస్తున్నారా? చిట్టి కథలు రాస్తున్నారా? ఏదైనా పర్యాటక ప్రదేశం సందర్శించారా? ఆటపాటల్లో విజయం సాధించి పతకాలు అందుకున్నారా? ఈ విషయాలను మీ స్నేహితులు, పాఠకులతో పంచుకోవాలనుకుంటే వాట్సాప్ నంబర్ ద్వారా మాకు పంపండి. మేము ప్రచురిస్తాం. మీ ఫొటో కూడా జతచేయండి. ఊరు.. పేరు.. జిల్లా రాయడం మరువొద్దు సుమా.. -
ఈదురుగాలుల బీభత్సం
రుద్రూర్: పోతంగల్, కోటగిరి, రుద్రూర్ మండలాల్లో ఆదివారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. బలమైన గాలుల కారణంగా పోతంగల్ మండలం తిర్మలాపూర్ గ్రామానికి చెందిన గొంటి సాయిలు ఇంటిపై ఉన్న రేకులు ఎగిరిపోయాయి. అలాగే ఓ ఇంటిపై చెట్టు పడటంతో వెంటనే స్థానికులు స్పందించి తొలగించారు. రుద్రూర్ మండలం లింగంపల్లి శివారులో విద్యుత్ స్తంభం, పోతంగల్ రహదారిపై చెట్టు నేలకొరిగాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. సిరికొండ: మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లో గాలివాన బీభత్సం సృష్టించింది. చెట్లు విరిగిపోయి విద్యుత్ తీగలపై పడడంతో స్తంభాలు ధ్వంసం అయ్యాయి. దీంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పలు గ్రామాల్లో చెట్లు విరిగిపోయి రోడ్లపై అడ్డంగా పడిపోవడంతో రాకపోకలకు ఇబ్బందులు నెలకొన్నాయి. -
మున్నూరుకాపు కార్పొరేషన్ సేవలను విస్తరిస్తాం
● చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి పటేల్ ● విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల ప్రదానంనిజామాబాద్ రూరల్: రాష్ట్ర మున్నూరుకాపు కార్పొరేషన్ సేవలను విస్తరిస్తామని చైర్మన్ బొమ్మ శ్రీరా మ్ చక్రవర్తి పటేల్ అన్నారు. నగరంలోని ప్రగతిన గర్ మూన్నూరుకాపు సంఘంలో ఆదివారం ప్రభు త్వ ఉద్యోగుల, విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఉత్తమ విద్యార్థులకు ‘ప్రతిభా పు రస్కారాలు’ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి, మాట్లాడా రు. ప్రతి జిల్లాలోని సంఘ కార్యాలయాల్లో, కల్యా ణ మండపాల్లో కార్పొరేషన్కు సంబంధించిన స మాచారాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. జిల్లా సంఘం అధ్యక్షుడు ధర్మపురి సంజయ్ మాట్లాడుతూ.. కాపు సోదరుల కుటుంబాల అభ్యున్నతికి జిల్లా క మిటీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అన్నారు. అనంతరం ఎస్సెస్సీ, ఇంటర్, డిగ్రీ, పీజీ విద్యల్లో ప్రతిభ కనబరిచిన వారికి ప్రశంసపత్రంతో గోల్డ్ మెడల్ శాలువాతో సత్కరించారు. సభాధ్యక్షులుగా తోట రాజశేఖర్, ప్రతినిధులు అబ్బపూర్ రవీందర్, బుస్స ఆంజనేయులు. నగర డీసీసీ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ రాంభూపాల్, బొబ్బిలి నర్స య్య, గోపి, సురేష్ పాల్గొన్నారు. -
వికసించని యువ వికాసం..
మోర్తాడ్(బాల్కొండ) : మోర్తాడ్ మండల కేంద్రానికి చెందిన రాణి స్వయం ఉపాధి కోసం రాజీవ్ యువ వికాసం పథకం కింద రూ.2 లక్షల రుణం కోసం దరఖాస్తు చేసుకుంది. రాయితీ రుణం మంజూరైతే కిరాణ దుకాణం, లేడిస్ ఎంపోరియం ఏర్పాటు చేసుకోవచ్చని ఆశించింది. ఇప్పటి వరకూ యువ వికాసం రుణం మంజూరు కాలేదు. స్వయం ఉపాధి పొందడానికి తనకు రాయితీ రుణం ఒక్కటే మార్గం అని ఆమె భావించింది. ఇది ఒక్క రాణి ఆలోచనే కాదు. జిల్లా వ్యాప్తంగా ఎంతో మంది యువత రాయితీ రుణాల కోసం నిరీక్షిస్తున్నారు. గత ఏడాది రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా యువతకు రాయితీ రుణాలను పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. 2025 జూన్ 2కు ముందుగానే దరఖాస్తులను స్వీకరించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బీసీబంధు, దళితబంధు పథకాలను ఒక్క ఏడాది మాత్రమే అమలు చేశారు. ఎంతో మంది అర్హులు ఉన్నా కొందరికి మాత్రమే లబ్ధి జరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా ప్రతి ఏటా రాయితీ రుణాలను పంపిణీ చేసేవారు. రాయితీ కోసం నిధులను కేటాయించడంలో నిర్లక్ష్యం వహించడంతో రాయితీ రుణాల పంపిణీ నిలిచిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత రాజీవ్ యువ వికాసం పేరిట కొత్త పథకాన్ని ప్రారంభించారు. జిల్లాలో 58 వేల దరఖాస్తులు... రాజీవ్ యువ వికాసం పథకం కింద లబ్ధిపొందడానికి జిల్లా వ్యాప్తంగా 58 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో దరఖాస్తుదారుల సామాజిక వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఆయా కార్పొరేషన్ల ద్వారా రాయితీ రుణాలను అందించాలని నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా ఓసీలను మినహాయించి ఆయా సామాజిక వర్గాల వారికి రాయితీ రుణాలను పంపిణీ చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. రూ.50 వేలలోపు వారికి వంద శాతం రాయితీ... రాజీవ్ యువ వికాసం కింద రూ.50 వేల లోపు రుణం కావాలని దరఖాస్తు చేసుకున్న వారికి వంద శాతం రాయితీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. రూ.లక్ష వరకు రుణం పొందేవారికి 90 శాతం రాయితీ, రూ.2లక్షల వరకు రుణం తీసుకునేవారికి 80 శాతం రాయితీ, రూ.2లక్షల నుంచి రూ.4లక్షల వరకు రుణం పొందేవారికి 70 శాతం రాయితీని అందించాలని ప్రభుత్వం తీర్మానించింది. ఎక్కువ మంది రూ.4లక్షల వరకు రుణం కోసం దరఖాస్తు చేసుకున్నారు. బడ్జెట్లో నిధుల కేటాయింపు... 2026–27 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాజీవ్ యువ వికాసం కోసం రూ.6వేల కోట్లు కేటాయిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. ఇప్పటికి పథకం అమలుపై స్పష్టత కరువు కావడంతో రాయితీ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నవారు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.రాజీవ్ యువ వికాసం పేరిట రుణాలు ఇస్తామని దరఖాస్తులను స్వీకరించి ఇప్పటి వరకూ నయాపైసా రుణం ఇవ్వలేదు. రాయితీ కోసం నిధులు కేటాయిస్తే నిరుద్యోగులలో కొందరికై నా ప్రయోజనం కలిగేది. – ఉమేష్, ధర్మ సమాజ్ పార్టీ మండల అధ్యక్షుడు యువత స్వయం ఉపాధి పథకాల విషయంలో నాన్చి వేత ధోరణి సరికాదు. ప్రభుత్వం వెంటనే స్పందించి రాయితీ రుణాలను అందించాలి. ఎంతో మంది ప్రభుత్వ సాయం కోసం నిరీక్షిస్తున్నారు. – పుప్పాల నరేష్, సర్పంచ్, తిమ్మాపూర్ గతేడాది రాయితీ రుణాలను పంపిణీ చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం బడ్జెట్లో రూ.6 వేల కోట్లు కేటాయించినట్లు వెల్లడి ఇప్పటికీ పథకం అమలుపై స్పష్టత కరువు -
పిల్లలు మీరూ పంపండి..
నేను గీసిన చిత్రం83328 87332ఎం లక్ష్యతేజ్ రెడ్డి 3వ తరగతి బోధన్ టి అతిశయ 7వ తరగతి నిర్మల్ రెమ్మ అభిత 5వ తరగతి మెంట్రాజ్పల్లి వి. శ్రేయాన్ నిజామాబాద్ ప్రజ్ఞ యోదిత 2వ తరగతి దేశాయిపేట్ గ్రామం సాత్విక్ 4వ తరగతి జానకంపేట మం: ఎడపల్లి జిల్లా: నిజామాబాద్ అక్షయ్ కుమార్ 7వ తరగతి ముత్యంపేట్ వేసవి సెలవుల్లో మీ కలానికి పదునుపెట్టి బొమ్మలు గీస్తున్నారా? చిట్టి కథలు రాస్తున్నారా? ఏదైనా పర్యాటక ప్రదేశం సందర్శించా రా? ఆటపాటల్లో విజయం సాధించి పతకాలు అందుకున్నారా? ఈ విషయాలను మీ స్నేహితులు, పాఠకులతో పంచుకోవాలనుకుంటే వాట్సాప్ నంబర్ ద్వారా మాకు పంపండి. మేము ప్రచురిస్తాం. మీ ఫొటో కూడా జతచేయండి. ఊరు.. పేరు.. జిల్లా రాయడం మరువొద్దు సుమా.. -
సర్ ప్రక్రియలో ఏ ఒక్కరి ఓటు పోవద్దు
● ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపతి రెడ్డి డిచ్పల్లి(నిజామాబాద్రూరల్):‘సర్’ప్రక్రియ లో ఏ ఒక్కరి ఓటు పోకుండా కాంగ్రెస్ పార్టీ బీఎల్ఏలు క్రియాశీలకంగా వ్యవహరించాల ని ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి పేర్కొన్నా రు. ఆదివారం నిజామాబాద్ రూరల్ నియోజవర్గ పరిధిలోని 293 మంది పార్టీ బూత్ లె వెల్ ఏజెంట్లకు ఓటర్ల జాబితా ప్రత్యేక సమ గ్ర సవరణ (సర్)పై డిచ్పల్లి మండలం బర్ధిపూర్ శివారులోని అమృతాగార్డెన్స్లో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. డీసీసీ అధ్యక్షుడు కాటిపల్లి నగేష్రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో సర్ ప్రక్రియలో ఎక్కడైనా ఇబ్బందులు వస్తే తమ దృష్టికి తీసుకు రావాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర గీత పారిశ్రామిక సహకార కార్పొరేషన్ చైర్మన్ శేఖర్గౌడ్, ఏఎంసీ చైర్మన్ ముప్పగంగారెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షులు అమృతాపూర్ గంగాధ ర్, ప్రధాన కార్యదర్శులు భాస్కర్రెడ్డి, పొల సాని శ్రీనివాస్, ఎర్రన్న, ఆయా మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాల్రాజు, మోపా ల్ సాయరెడ్డి, నవీన్ గౌడ్, చిన్నారెడ్డి, రూరల్ నియోజకవర్గ సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు గొట్టిపాటి వాసు, బర్ధిపూర్ సర్పంచ్ కోట్ల భాస్కర్, శ్రీనివాస్, జలందర్, సొసైటీ చైర్మన్ రాంచందర్గౌడ్, చెలిమెల నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. పీఆర్సీని వెంటనే ప్రకటించాలి ● పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఎం చెన్నయ్య ఖలీల్వాడి : పీఆర్సీని వెంటనే అమలు చేయాలని తెలంగాణ పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షులు ఎం చెన్నయ్య డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలో పీఆర్టీయూ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజ రై మాట్లాడారు. పీఆర్సీతో పాటు ఫిట్మెంట్ ప్రకటించాలన్నారు. పెండింగ్ డీఏలలో వెంటనే మూడు డీఏలు ప్రకటించాలన్నారు. మోడల్ స్కూల్, కేజీబీవీ, రెసిడెన్షియల్ ఉపాధ్యాయులకు కూడా హెల్త్ కార్డ్స్ వర్తింప చేయాలన్నారు. సీపీఎస్ విధానం రద్దుపరిచి ఓపీఎస్ అమలు పరచాలన్నారు. సమావేశంలో పీఆర్టీయూ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి రత్నాకర్ రావు, నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి బుచ్చన్న, కామారెడ్డి జిల్లా అధ్యక్షులు అంబీర్ మనోహర్ రావు, ప్రధాన కార్యదర్శి జన పాల లక్ష్మీరాజం, నాగేశ్వర్ రావు, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. -
మెదడుకు మేత.. చెస్ ఆట
బోధన్: చెస్ (చదరంగం) ఒక ఆటే కాదు.. మెదడుకు మేత వంటిది. మేధో వికాసానికి, విమర్శనాత్మక ఆలోచనకు ఒక చక్కని శిక్షణ. చదువుతోపాటు చదరంగం (చెస్) ఆడటం వల్ల విద్యార్థులలో జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, సమస్యను పరిష్కరించే నైపుణ్యాలు అద్భుతంగా మెరుగవుతాయని చెస్ సీనియర్ కోచ్లు అంటున్నారు. చిన్న వయస్సులో చెస్ నేర్చుకోవడం వల్ల భవిష్యత్తులో వ్యూహకర్తలుగా ఉన్నత స్థాయిలో రాణించేందుకు ఉపయోగకరమని పేర్కొంటున్నారు. ఈక్రమంలో బోధన్ పట్టణంలో ఇటీవల సాయిసామల చెస్ అకాడమీ ద్వారా చిన్నారులకు నెలపాటు చదరంగం ఆటలో శిక్షణ అందించారు. 30 రోజులు.. 44 మంది.. బోధన్ పట్టణానికి చెందిన యువకుడు సాయిబాబా సామల తాను నేర్చుకున్న చెస్ అటను నేటి, భావితరం బాలబాలికలకు అందించాలనే సంకల్పం, సేవాధృక్పథంతో కొత్తగా సాయి సామల చెస్ అకాడమీ ఏర్పాటు చేశారు. తొలిసారి అకాడమీ అధ్వర్యంలో పట్టణంలోని దయానంద్ గోశాల ఆర్యసమాజ్ ప్రాంగణంలో 6 ఏళ్ల వయస్సు పైబడిన బాలబాలికలకు ప్రత్యేకంగా చెస్ సమ్మర్ క్యాంప్ను 30 రోజుల పాటు నిర్వహించారు. అకాడమీ నిర్వాహకులు నామ మాత్రపు ఫీజుతో మే 3 నుంచి జూన్ 2 వరకు శిబిరం కొనసాగించారు. డివిజన్ పరిధిలోని పట్టణ పరిసర మండలాలు, గ్రామాలకు చెందిన 44 మంది సమ్మర్క్యాంప్లో పాల్గొని చెస్లో తర్ఫీదు పొందారు. శిబిరం చివరి రోజు నిర్వహించిన ఫైనల్ టోర్నమెంట్లో పలువురు చిన్నారులు విశేష ప్రతిభ చాటారు. ముగింపు వేడుకల్లో పలువురు ప్రముఖులు విచ్చేసి, ప్రతిభ చూపిన క్రీడాకారులకు సర్టిఫికెట్లు, బహుమతులు ప్రదానం చేశారు. పట్టణంలో చిన్నారులకు ఇలాంటి శిక్షణ శిబిరం నిర్వహించడంపై పట్టణ ప్రజలు అకాడమీ నిర్వాహకులను అభినందించారు. బోధన్లో సాయిసామల చెస్ అకాడమీ నిర్వహించిన సమ్మర్ క్యాంప్లో శిక్షణ పొందుతున్న విద్యార్థులు చెస్ ఆటపై ఆసక్తితో మా గ్రామం నుంచి బోధన్లో ఏర్పాటు చేసిన సమ్మర్క్యాంప్కు వచ్చి శిక్షణ పొందాను. నిర్వాహకులు చాలా సులభమైన పద్ధతుల్లో శిక్షణ ఇచ్చారు. దీంతో ఆటపై మంచి పట్టు రావడంతో ఎంతో పురోగతి సాధించాను. –ఎంజీ హితేంద్ర, చెస్ క్రీడాకారుడు, గోవూర్, మోస్రా మండలంనేటి బాలబాలికలు ఎక్కువ సమయం డిజిటల్ వినోదాలకే కేటాయిస్తున్నారు. ఈ నేపథ్యంలో బాలలను వా టి నుంచి దృష్టిమళ్లీంచి వా రిలోని సృజనాత్మతకు పదు ను పెట్టాలనే ఆలోచనతో సమ్మర్ క్యాంప్ నిర్వహించాను. విశేష స్పందన లభించింది. –సాయిబాబా సామల, సాయి సామల చెస్ అకాడమీ కో–ఆర్డినేటర్, కోచ్, బోధన్ చెస్ ఆట నేర్చుకోవడం వల్ల చదువులో రాణించేందుకు ఎంతో ఉపయోగపడుతుందని గుర్తించాను. 30 రోజుల పాటు సమ్మర్ క్యాంప్లో పాల్గొని శిక్షణ పొందాను. ఏ విషయంలోనైనా ముందుగా ఆలోచించడంతోపాటు, సరైన నిర్ణయం తీసుకోవడం నేర్చుకున్నాను. –ఎంఎస్ ధోనీ, చెస్ క్రీడాకారుడు, బోధన్ విద్యార్థులలో జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుదలకు తోడ్పాటు బోధన్లో ఇటీవల క్యాంప్ నిర్వహించిన సాయిసామల చెస్ అకాడమీ -
ఇక బోగస్ పింఛన్లకు చెక్
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : పురపాలక, నగరపాలక సంస్థల పరిధిలో పింఛన్ల పంపిణీ విషయంలో ఇక నుంచి ప్రభుత్వం లైవ్ అథెంటిఫికేషన్ ప్రక్రియ నిర్వహించనుంది. ఇందులో భాగంగా పింఛనుదారులు బతికే ఉన్నట్లు సంబంధిత సిబ్బంది క్షేత్రస్థాయిలోకి వెళ్లి యాప్లో నమోదు చేయాల్సి ఉంటుంది. పట్టణ ప్రాంతాల్లో నేరుగా బ్యాంకు ఖాతాలో పింఛన్ల డబ్బులు జమ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఈ లైవ్ అథెంటిఫికేషన్ ప్రక్రియ ప్రారంభించింది. పింఛన్ల లబ్ధిదారులు మరణించినప్పటికీ నగరపాలక సంస్థలు, పురపాలక సంస్థల్లో అధికారులు ఆయా పేర్లను తొలగించకపోవడంతో పాటు మరోవైపు పలుచోట్ల బోగస్ పింఛన్లకు సైతం డబ్బులు జమ అవుతుండడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. జిల్లాలోని నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్తో పాటు బోధన్, ఆర్మూర్, భీమ్గల్ మున్సిపాలిటీల్లో కలిపి 46,473 మంది పింఛన్ల లబ్ధిదారులు ఉన్నారు. ● ఇకపై ఏమాత్రం తేడా లేకుండా బతికి ఉన్నవారికి మాత్రమే పింఛన్లు అందించాలనే లక్ష్యంతో ‘కోర్ బ్యాకింగ్ సొల్యూషన్’ (సీబీఎస్) అనే మొబైల్ యాప్ను అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్తో పాటు ఆర్మూర్, బోధన్, భీమ్గల్ మున్సిపాలిటీల్లో వార్డు ఆఫీసర్లు, బిల్ కలెక్టర్లు, ఇతర సిబ్బంది క్షేత్ర స్థాయికి వెళ్లి లబ్ధిదారులు బతికే ఉన్నట్లుగా వారి ఫొటోలను యాప్లో నమోదు చేస్తున్నారు. ● లైవ్ అథెంటిఫికేషన్ ప్రక్రియను మే 15న మొదలు పెట్టారు. దీన్ని ఈ నెల 15 వరకు పూర్తి చేయాలని ప్రభుత్వం గడువు పెట్టింది. జిల్లాలో ఇప్పటివరకు 60 శాతం మేర పింఛన్ లబ్ధిదారులకు సంబంధించి లైవ్ అథెంటిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేశారు. గడువు సమీపిస్తుండడంతో మిగిలిన వారికి సంబంధించి కూడా త్వరగా పూర్తి చేయాలని ఉన్నతాధికారులు ఒత్తిడి పెడుతున్నారు. కాగా ప్రతి మున్సిపాలిటీలోని పింఛన్ లబ్ధిదారులందరికి సంబంధించి ప్రతి మూడు నెలలకు ఒకసారి లైవ్ అథెంటిఫికేషన్ చేయాలని, అలా చేస్తేనే పింఛన్ల డబ్బులు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రతి మూడు నెలలకోసారి అథెంటిఫికేషన్ ప్రక్రియ అన్ని మున్సిపాలిటీల్లో క్షేత్రస్థాయిలో యాప్లో నమోదు మరణించినవారి ఖాతాల్లో పింఛన్లు జమ కాకుండా చర్యలు -
మహా ఇసుక దోపిడీకి పాతికేళ్లు
బోధన్ : తెలంగాణ, మహారాష్ట్ర మధ్య మంజీర నదిలో ఇసుక తవ్వకాల సరిహద్దు వివాదం 25 ఏళ్లకు పైగా కొనసాగుతోంది. ఇప్పటికీ పరిష్కారానికి నోచుకోవండం లేదు. మహారాష్ట్ర కాంట్రాక్టర్లు హద్దులు దాటి మన భూభాగంలోకి చొరబడి ఇష్టారీతిన ఇసుక తవ్వకాలు జరుపుతున్నారు. ఫలితంగా ప్రతిఏటా రూ. కోట్ల విలువైన ఇసుక దోపిడీకి గురవుతోంది. తాజాగా సాలూర మండలం హున్సా, మందర్నా గ్రామ శివారులోని మంజీర నదిలో మన భూభాగంలో చొరబడి మహారాష్ట్ర నాందేడ్ జిల్లా బిలోలి తాలూకా పరిధిలోని బోలేగాం క్వారీ కాంట్రాక్టర్లు భారీ స్థాయిలో ఇసుక తవ్వకాలు జరుపుతున్నారు. హున్సా, మందర్నా గ్రామస్తులు గుర్తించి ఫిర్యాదు చేయగా సాలూర మండల రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి సర్వే నిర్వహించారు. మన హద్దులో సుమారు 10 ఎకరాల విస్తీర్ణంలో భారీ యంత్రాలతో ఇసుక తవ్వకాలు చేపట్టినట్టు గుర్తించారు. ఈ నెల 3న మన రెవెన్యూ, పోలీసు అధికారులు బోలేగాం క్వారీలోకి వెళ్లి ఇసుక తవ్వకాలు జరుపుతున్న జేసీబీలను అడ్డుకున్నారు. దీంతో మహారాష్ట్ర గ్రామాల ప్రజలు వాదనకు దిగడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. చివరికి మంజీర నదిలో తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులను గుర్తించేందుకు జాయింట్ సర్వే నిర్వహించాలని ఇరు రాష్ట్రాల అధికారులు అంగీకరించారు. అయితే నిర్ణీత తేదిన జాయింట్ సర్వేకు సాలూర మండల రెవెన్యూ అధికారులు, పోలీసులు వెళ్లినప్పటికీ మహారాష్ట్ర అధికారులు హాజరు కాలేదు. దీంతో సరిహద్దుల వివాదం మరోసారి వాయిదా పడింది. సరిహద్దు గ్రామాలు.. బోధన్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని పోతంగల్, సాలూర, బోధన్ మండలాల్లోని పోతంగల్, సుంకిని, కారేగాం, మందర్నా, హున్సా, ఖాజాపూర్, సాలూర, తగ్గేల్లి, కల్దుర్కి, సిద్దాపూర్, ఖండ్గాం గ్రామాలు మంజీర నది సరిహద్దులో ఉన్నాయి. నదికి అవతలి వైపు నాందేడ్ జిల్లాలోని బిలోలి, దెగ్లూర్, ధర్మాబాద్ తాలూకా పరిధిలోని నాగిని, గంజ్గాం, ఎస్గీ, బోలేగాం, సగ్రోలీ, శాకాపూర్ మహారాష్ట్ర సరిహద్దు గ్రామాలున్నాయి. గంజ్గాం, బోలేగాం, ఎస్గీ, కార్ల, సగ్రోలి ప్రాంతాల్లో ఇసుక క్వారీలకు మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతిస్తోంది. గతంలో 2011 నుంచి 2016 వరకు వరుసగా ప్రతి ఏటా హున్సా–మందర్నా, సుంకిని గ్రామస్తులకు మహారాష్ట్ర సరిహద్దు గ్రామస్తులతో సరిహద్దు వివాదం నెలకొంది. జాయింట్ సర్వే, ఇసుక తవ్వకాల విషయంలో పలుసార్లు ఘర్షణలు చోటు చేసుకున్నాయి, ● మంజీరలో ఇసుక తవ్వకాల వల్ల మన భూభాగంలోని తీర ప్రాంత గ్రామాలకు భూర్భజలాల ముప్పు తన్నుకొస్తుంది. నది తీర ప్రాంతంలో సాగు నీటి ప్రాజెక్టులు, చెరువులు లేవు. కరెంట్ బోరుబావులే పంట సాగుకు ప్రధాన జలవనరుగా ఉన్నాయి. పలు ఎత్తిపోతల పథకాలు, తాగునీటి పథకాలు మంజీర జలాలపై ఆధారపడి పని చేస్తున్నాయి. ● ప్రస్తుతం మహారాష్ట్రకు చెందిన గంజ్గాం, ఎస్గీ, బోలేగాం, సగ్రోలి క్వారీల్లో తవ్వకాలు సాగుతున్నాయి. మంజీర నదిలోని మన హద్దుల్లోకి వచ్చి ఇసుక తవ్వకాలు జరుపుతున్నారు. దీంతో భూగర్భ జలాల సమస్య ఏర్పడుతుందని నది తీరంలోని మన గ్రామాల రైతులు ఆందోళనకు గురవుతున్నారు. మన భూభాగంలోని మంజీర నదిలో మహారాష్ట్ర కాంట్రాక్టర్ల ఇసుక తవ్వకాల విషయాన్ని ఉన్నతాధికారులకు దృష్టికి తీసుకెళ్తాం. తద్వార ఇసుక తవ్వకాల నివారణకు పటిష్ట చర్యలు తీసుకుంటాం. – అజ్మత్ నవాజ్ , సాలూర తహసీల్దార్మంజీర నదిలో మ్యాప్ను పరిశీలిస్తున్న సాలూర తహసీల్దార్ అజ్మత్ నవాజ్, సర్వేయర్లు (ఫైల్) మంజీరలో ఎడతెగని సరిహద్దు వివాదం మన భూభాగంలో తవ్వకాలు జరుపుతున్న మహారాష్ట్ర కాంట్రాక్టర్లు జాయింట్ సర్వేకూ డుమ్మా కొడుతున్న పొరుగు రాష్ట్ర అధికారులు -
ప్రజావాణి.. పరిష్కారమేదీ!
● ఫిర్యాదులు పెండింగ్ పడుతున్నాయ్.. ● రెవెన్యూ శాఖవే ఎక్కువ.. ● త్వరితంగా పరిష్కరించాలని బాధితుల వేడుకోలునిజామాబాద్అర్బన్ : అధికారులు తమ సమస్యలను పరిష్కరిస్తారని గంపెడాశతో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి బాధితులు ప్రతి సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి వస్తున్నారు. సంబంధిత అధికారులకు తమ విన్నపాలను సమర్పిస్తున్నారు. అయితే జిల్లా అధికారులను నేరుగా కలిసి సమస్యను విన్నవించినా పరిష్కారం కావడం లేదని పలువురు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక తమకు దిక్కెవరంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఆరు నెలలుగా ప్రజావాణిలో సమర్పించిన అనేక ఫిర్యాదులు పెండింగ్లోనే ఉన్నాయి. ఇందులో రెవెన్యూ శాఖకు చెందిన ఫిర్యాదులే ఎక్కువగా ఉన్నాయి. నిజామాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధిలో 54, డిచ్పలి్ల్ తహసీల్లో 35, పొతంగల్ తహసీల్లో 34, ఆర్మూరు రెవెన్యూ డివిజన్లో 27, కోటగిరి తహసీల్లో 24. ఆర్మూర్ తహసీల్లో 20 ఫిర్యాదులు పెండింగ్లో ఉన్నాయి. ప్రజా వాణిలో జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్లు, జిల్లా అధికారులు పాల్గొంటున్నారు. అక్కడే ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి ఫిర్యాదు దారుల సమస్యలపై ఉన్నతాధికారులు సంబంధిత మండల అధికారులతో నేరుగా మాట్లాడి పరిష్కరించేందుకు అవకాశం ఉంది. ఈ పద్ధతిని ఏర్పాటు చేస్తే బాధితులకు తక్షణమే న్యాయం జరుగుతుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా కొందరు బాధితులు వ్యక్తిగత విషయాలను, కుటుంబ తగాదాలను ప్రజావాణిలో విన్నవిస్తున్నారు. వీటివల్ల అధికారులకు సమయం వృథా అవుతోంది. వీటిపై ఫిర్యాదు దారులకు అవగాహన కల్పిస్తే మళ్లీ రాకుండా ఉంటారు. -
ఆత్మీయ పలకరింపులు.. మధుర స్మృతులు
● జిల్లాలో పలుచోట్ల సమ్మేళనాలు నిర్వహించిన పూర్వవిద్యార్థులు ● ఏళ్ల తర్వాత కలుసుకోవడంతో భావోద్వేగానికి గురైన చిన్ననాటి మిత్రులుసాక్షి నెట్వర్క్: ఆత్మీయ పలకరింపులు.. ఆపాత మధుర స్మృతులను గుర్తుకు తెచ్చుకుని పూర్వ విద్యార్థులు భావోద్వేగానికి లోనయ్యారు. జిల్లాలోని వివిధ గ్రామాల ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల పదోతరగతి పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు. ఈసందర్భంగా చిన్నానాటి మిత్రులందరూ ఏళ్ల తర్వాత మళ్లీ ఒకే వేదికపై కలుసుకోవడంపై ఆనందం వ్యక్తం చేశారు. ఒకరినొకరు పలకరించుకుంటూ అనాటి జ్ఞాపకాలను గుర్తుకుతెచ్చుకున్నారు. నాడు చదువు నేర్పిన ఉపాధ్యాయులను సమ్మేళనానికి ఆహ్వానించి, సన్మానించారు. సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటపాటలతో ఉల్లాసంగా గడిపారు. అనంతరం విద్యార్థులు, గురువులు అందరూ కలిసి సహపంక్తి భోజనాలు చేశారు. -
అలరించిన ఆర్కెస్ట్రా బృంద ప్రదర్శన
డిచ్పల్లి: మండలంలోని రాష్ట్ర ప్రత్యేక పోలీస్ ఏడవ బెటాలియన్లో నూతనంగా ఏర్పాటైన ఆర్కెస్ట్రా బృందం ఆదివారం నిర్వహించిన ప్రదర్శన ఎంతో అలరించింది బెటాలియన్ ఆవరణలో ఏర్పాటు చేసిన తమ సంగీత ప్రదర్శనతో శ్రోతలను మంత్రముగ్ధులను చేసింది. వారు పాత, కొత్త సినీ మధుర గీతాలను ఆలపిస్తూ, దానికి తగ్గట్టుగా వాయిద్యాలను వాయిస్తూ అందరినీ ఆశ్చ ర్యంలో ముంచెత్తారు. ఈ సందర్భంగా బెటాలియ న్ కమాండెంట్ సత్యనారాయణ మాట్లాడుతూ.. బృందాన్ని ఇంత చక్కగా తీర్చిదిద్దినందుకు గానూ ఇన్చార్జి 8వ బెటాలియన్ కమాండెంట్ రామకృష్ణకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. పోలీసుల విధుల్లో ఉండే ఒత్తిడిని దూరం చేయడానికి, సిబ్బంది మానసిక ఉల్లాసానికి ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని కమాండెంట్ పేర్కొన్నారు. అసిస్టెంట్ కమాండెంట్లు శ్రీనివాస్, సత్యనారాయణ పాల్గొన్నారు. -
వర్షాకాలానికి సూచిక.. మృగశిర కార్తె వేడుక
● నేడు ఘనంగా జరుపుకోనున్న ప్రజలు ● జిల్లావ్యాప్తంగా చేపలు, మామిడి పండ్లకు పెరిగిన డిమాండ్ నిజామాబాద్ రూరల్: తొలకరి చినుకులు పడే మృగశిర కార్తె సోమవారం ఆరంభం అవుతుంది. సంప్రదాయం ప్రకారం మృగశిర కార్తె ప్రారంభమైన వెంటనే కొన్ని ప్రాంతాల్లో తొలకరి వర్షాలు పడటం మొదలవుతుందని పెద్దలు చెబుతుంటారు. భారీ వర్షాలు సాధారణంగా మృగశిర రెండో వారంలో లేదా ఆరుద్ర కార్తె ప్రారంభానికి దగ్గరగా నమోదవుతుంటాయి. సూర్యుడు ఒక్కొక్క నక్షత్రం సమీపంలో 14 రోజుల పాటు ఉంటాడు. ప్రస్తుతం మృగశిర నక్షత్రానికి చేరువలో సూర్యుడు ఉండటం వల్ల దీనికి మృగశిర కార్తె అనే పేరు వచ్చింది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో మృగశిర, మృగం, మిరుగు, మిర్గం పేర్లతో పిలుస్తారు ఈ రోజున ప్రజలు బెల్లంలో ఇంగువను కలుపుకుని సేవిస్తారు. మరికొందరు చేపలు ఆహారంగా తీసుకుంటారు. మామిడి పండ్లను కూడా తింటారు. మృగశిర కార్తె రోజు నుంచి వాతావరణంలో వచ్చే మార్పులకు అనుగుణంగా శరీర ఉష్ణోగ్రతలను సమతుల్యం చేయడానికి ఇంగువ బెల్లం, చేప మందు దోహదపడతాయని ఆయుర్వేద వైద్యులు పేర్కొంటున్నారు. ఈనేపథ్యంలో నగరంలో చేపల మార్కెట్, మామిడిపండ్ల దుకాణాలు కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. -
కరెంటు బకాయిలు
రూ.177.37 కోట్లుకమ్మర్పల్లి : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సమాయానికి గ్రాంట్లు రాక అల్లాడుతున్న గ్రామ పంచాయితీలకు విద్యుత్ బకాయిలు అదనపు ఆర్థిక భారంగా మారాయి. గ్రామ పంచాయతీల్లో వీధి దీపాలు, తాగునీటి సరఫరా (వాటర్ వర్క్స్) విద్యుత్ బిల్లులు ప్రతినెలా తడిసి మోపెడవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ బకాయిలపై ప్రత్యేక గ్రాంటు విడుదల చేయాలని లేదా విద్యుత్ బకాయిలు మాఫీ చేయాలని సర్పంచులు కోరుతున్నారు. జిల్లాలో ఇదీ పరిస్థితి..! జిల్లాలో 27 మండలాల పరిధిలోని 538 గ్రామ పంచాయతీల్లో 8422 కేటగిరి 6 ఏ, 6 బీ విద్యుత్ మీటర్ల ద్వారా రూ. 177.37 కోట్ల విద్యుత్ బకాయిలు ఉన్నాయి. 2019 మార్చి నెలకు ముందు అప్పటి ప్రభుత్వం గ్రామ పంచాయతీల బకాయిలను పూర్తిగా మాఫీ చేసింది. 2019 ఏప్రిల్ నుంచి 2026 మార్చి 31 వరకు గ్రామ పంచాయతీల్లో విద్యుత్ దీపాలు, వాటర్ వర్క్స్కు సంబంధించి విద్యుత్ బకాయిలు పెరిగిపోయాయి. నూతన సర్పంచ్ల ఎన్నిక తర్వాత గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న 15వ ఆర్థిక సంఘం నిధులతో ఎంతో కొంత అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన రాష్ట్ర ఆర్థిక సంఘం నిధుల గురించి ఎదురుచూపులు తప్పడం లేదు. చిన్న గ్రామ పంచాయతీల్లో సరైన ఆదాయం లేక అష్టకష్టాలు పడుతున్న సందర్భంలో విద్యుత్ బకాయిలు గుదిబండగా మారాయి. గత ప్రభుత్వం విద్యుత్ బకాయిలు మాఫీ చేసినట్లుగానే ఈ ప్రభుత్యం కూడా మాఫీ చేయాలని సర్పంచులు కోరుతున్నారు.మండలం జీపీలు విద్యుత్ బకాయిలు మీటర్లు రూ.కోట్లలో ఆర్మూర్ 18 353 5.84 బాల్కొండ 10 185 3.66 భీమ్గల్ 27 388 5.13 బోధన్ 39 470 11.75 చందూర్ 07 115 2.65 ధర్పల్లి 22 294 5.57 డిచ్పల్లి 35 457 10.34 ఇందల్వాయి 23 318 5.95 జక్రాన్పల్లి 21 345 7.49 కమ్మర్పల్లి 14 306 6.21 కోటగిరి 29 403 11.81 మాక్లూర్ 31 446 6.16 మెండోరా 11 135 2.21 మోర్తాడ్ 11 289 7.72 మోస్రా 03 85 2.55 మోపాల్ 21 256 5.94 ముప్కాల్ 07 124 1.78 నందిపేట్ 34 691 19.14 నవీపేట్ 33 500 11.38 నిజామాబాద్ రూరల్ 20 208 4.52 రెంజల్ 17 289 6.83 రుద్రూర్ 10 221 3.83 సిరికొండ 31 412 6.06 వర్ని 23 316 6.38 వేల్పూర్ 17 325 6.04 ఎడపల్లి 16 324 8.20 ఏర్గట్ల 08 167 2.08 మొత్తం 538 8422 177.37 27 మండలాల్లో బిల్లులు చెల్లించని జీపీలు పేరుకుపోతున్న విద్యుత్ బిల్లులు ప్రభుత్వమే చెల్లించాలని సర్పంచుల వేడుకోలుగత పాలకవర్గం హయాంలో కరెంట్ బిల్లులు చెల్లించాలంటే గ్రామ పంచాయతీకి భారంగా ఉంది. ప్రభుత్వం ప్రత్యేక నిధులైనా మంజూరు చేయాలి, లేదా ప్రభుత్వమైనా చెల్లించాలి. లేనిపక్షంలో పూర్తిగా మాఫీ చేసి ఆదాయం లేని గ్రామ పంచాయతీలను ఆదుకోవాలి. – ఎం.డీ మెహబూబ్, సర్పంచ్, చౌట్పల్లి, కమ్మర్పల్లి మండలం -
ఎఫ్పీవోలకు ఎన్సీఈఎల్ పూర్తి సహకారం
సాక్షి ప్రతినిధి, నిజామాబా ద్: రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకున్న రైతు ఉత్పత్తిదారుల సంఘాల(ఎఫ్పీవో)కు ప్రోత్సాహం అందించేందుకు నేషనల్ కోఆపరేటివ్ ఎక్స్పో ర్ట్స్ లిమిటెడ్ (ఎన్సీఈఎల్) పూర్తిస్థాయిలో స హకరిస్తుందని సంస్థ బిజినెస్ మేనేజర్, ప్లాంటేషన్ ప్రొడక్ట్స్ అధికారి రిచాశర్మ తెలిపారు. ఢిల్లీ లోని ఎన్సీఈఎల్ కార్యాలయంలో సంస్థ బిజినె స్ మేనేజర్, ప్లాంటేషన్ ప్రొడ క్ట్స్ అధికారి రిచా శర్మ, సీనియర్ ఆఫీసర్ సంతోష్కుమార్ను శనివారం జిల్లాకు చెందిన రైతు ఉత్పత్తిదారుల సంఘాల ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశా రు. ఇందూరు పసుపును ఆమెకు అందించారు. అనంతరం రిచాశర్మ మాట్లాడుతూ..గ్రామీణ ప్రాంతాల్లో సేంద్రియ సాగుతో పండించే వ్యవసాయ ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లో చాలా డిమాండ్ ఉందని తెలిపారు. రైతులను మెల్లమెల్లగా సేంద్రియ సాగువైపు మళ్లించే దిశ గా రైతు ఉత్పత్తిదారుల సంఘాలు ముందుండాలన్నారు. ఎఫ్పీవోల ప్రతినిదులు పాట్కూరి తి రుపతిరెడ్డి, కర్నె లక్ష్మీనర్సయ్య పటేల్, మైలారం రాజారెడ్డి, గడ్డం రాజేందర్రెడ్డి ఉన్నారు. -
మాటు కాలువ మరమ్మతు పనులు ప్రారంభం
నవీపేట: మండలంలోని నాళేశ్వర్ శివారులోని మాటు కాలువ మరమ్మతు పనులను సర్పంచ్ ఆర్మూర్ లావణ్య శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఆర్మూర్ లావణ్య, ఉ ప సర్పంచ్ ఆర్మూర్ శ్రీనివాస్లు మాట్లాడారు. ఎగువ ప్రాంతం నుంచే వరదనీటిని గ్రామంలోని ఊర చెరువుకు మళ్లించే మాటు కాలువకు గత కొన్నేళ్లుగా మరమ్మతులు లేక పూడుకుపోయిందన్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ సలహా దారు సుదర్శన్రెడ్డిని కలువగా రూ. 37 లక్షలు మంజూరు చేశారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సుదర్శన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో బినోల సొసైటీ చైర్మన్ మగ్గారి హన్మాండ్లు, మాజీ సర్పంచ్ నర్సింగ్రావ్, వీడీ సీ ప్రతినిధులు గంగాధర్, పోతన్న, సంపత్, పోశెట్టి, కారోబార్ భుజంగ్రావ్ పాల్గొన్నారు. వేల్పూర్ : వేల్పూర్ మండలం అక్లూర్ గ్రామంలో అపరిష్కృతంగా ఉన్న పనులను పూర్తి చే యడానికి నిధులు మంజూరు చేయాలని హైద రాబాదులో ిపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ను సర్పంచ్ జిన్న జనార్దన్ శనివారం కలిసి విన్నవించారు. మల్కా చెరువును విస్తరించడానికి, బైపాస్ డ్రెయినేజీ నిర్మించడానికి నిధులు ఇవ్వాలని కోరారు. గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని విన్నవించారు. నిధుల మంజూరుకు బస్సు సౌకర్యం కల్పించడానికి వెంటనే చర్యలు తీసుకుంటానని మహేశ్కుమార్ గౌడ్ హామీ ఇచ్చినట్లు సర్పంచ్ పేర్కొన్నారు. పెర్కిట్: ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు ఉచిత హాస్టల్ వసతి కలదని కళాశాల ప్రిన్సిపాల్ సుభాష్ అన్నారు. ఆర్మూర్ మండలం ఇస్సాపల్లి గ్రామంలో శనివారం ప్రభుత్వ బాలుర జూ నియర్ కళాశాలలో అధ్యాపకులు అడ్మిషన్ల కో సం ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. ప్రభుత్వ బాలుర కాలేజీలో చేరితే ఎన్ఎస్ఎస్ సర్టిఫికెట్లు, ఉచిత పాఠ్యపుస్తకాలు, స్కాలర్షిప్ సౌకర్యం కలదన్నారు. కా ర్యక్రమంలో చంద్ర శేఖర్, గంగాధర్, చంద్రమోహన్, శ్రీనివాస్, పాల్గొన్నారు. డొంకేశ్వర్(ఆర్మూర్): గ్రామంలో చదువుకునే పిల్లలను ప్రయివేటుకు పంపొద్దని, ప్రభుత్వ పాఠశాలకే పంపాలని మారంపల్లి సర్పంచ్ ఆరే గంగాధర్ ఊరి ప్రజలకు సూచించారు. శనివారం ప్రభుత్వ టీచర్లతో కలిసి గ్రామస్తులతో సమావేశం నిర్వహించారు. గ్రామంలోని ఉన్న ప్రభుత్వ పాఠశాలను కాపాడుకోవాలని, విద్యా బోధనకు మంచి ఉపాధ్యాయులు ఉన్నారని సూచించారు. ఉప సర్పంచ్ రాజేశ్వర్, వార్డు సభ్యులున్నారు. ఆర్మూర్: దివ్యాంగ క్రీడాకారులకు గ్రూప్స్, ఇతర ప్రభుత్వ ఉద్యోగాల్లో జీవో నెంబర్ 74 ప్రకారం రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని పారా అఽథ్లెటిక్స్ సలహాదారు, అంతర్జాతీయ దివ్యాంగుల బాల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు తలారి జాన్కంపేట్ సంజీవయ్య డిమాండ్ చేశారు. ఆర్మూర్లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబర్చిన దివ్యాంగ క్రీడాకారులకు విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించి ప్రోత్సహించాలన్నారు. రాష్ట్రంలో 2025 నూతన క్రీడా విధానం అమలులోకి వచ్చి పది నెలలు కావొస్తున్నా పారా క్రీడాకారుల సంక్షేమం, ఉద్యోగ అవకాశాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టమైన చర్యలు తీసుకోవడం లేదన్నారు. -
గ్రామసభల ద్వారానే సమస్యల పరిష్కారం
రెంజల్/పెర్కిట్/డొంకేశ్వర్/నందిపేట్ : గ్రామసభల ద్వారానే సమస్యలకు పరిష్కారం లభిస్తుందని మండల ప్రత్యేకాధికారిణి కృష్ణవేణి పేర్కొన్నారు. శనివారం రెంజల్ మండలం రెంజల్, తాడ్బిలోలి, మౌలాలితండా గ్రామాల్లో ఆయా గ్రామాల సర్పంచ్లు తిరుపతి లలిత, తెలంగాణ శంకర్, అశోక్ నాయక్ల ఆధ్వర్యంలో గ్రామ సభలను నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడారు. గ్రామసభలో పలు తీర్మానాలను ఆమోదించారు. తహసీల్దార్ శ్రావణ్కుమార్, ఎంపీడీవో కమలాకర్లతో పాటు ఉప సర్పంచ్లు, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఆలూర్ మండలం దేగాం గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో తహసీల్దార్ రమేశ్ మాట్లాడారు. ఎస్ఐఆర్ అమలులో బూత్ లెవెల్ ఏజెంట్ల (బీఎల్ఏ) పాత్ర కీలకమన్నారు. సర్పంచ్ ఇట్టెడి లింగారెడ్డి, కార్యదర్శి శ్రీనివాస్, ఆర్డబ్ల్యూఈఎస్ డీఈ కౌశిక్, ఇరిగేషన్ ఏఈ శ్రావణ్, ఎస్ఐ అర్ఫాత్ తదితరులు పాల్గొన్నారు. డొంకేశ్వర్ మండలం గాదేపల్లిలో సర్పంచ్ చిన్నరెడ్డి అధ్యక్షత నిర్వహించిన గ్రామసభలో కొత్త జీపీ భవనం, వీవో బిల్డింగ్ నిర్మాణం, వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా తీసుకోవాల్సిన చర్యలపై తీర్మానాలు చేశారు. చర్చించారు. ఉప సర్పంచ్ సందీప్, కార్యదర్శి సాయిలు, వార్డు సభ్యులున్నారు. నందిపేట్ మండలం మాయాపూర్ గ్రా మసభ సర్పంచ్ బ్యాగరి జీవన్ అధ్యక్షతన నిర్వహించారు.తహసీల్దార్ స్పెషల్ ఆఫీసర్ సంతోష్రెడ్డి పాల్గొని గ్రామస్తులకు పలు సూచనలు చేశారు. -
పునర్విభజన కష్టాలు..
తొమ్మిది ఏళ్లైనా తొలగని రామన్నపేట్ గ్రామ ముఖచిత్రంమోర్తాడ్: మండలాలు, గ్రామాల పునర్విభజనపై ఉన్న శ్రద్ధ వాటితో ఏర్పడిన ఇబ్బందులను తొలగించే అంశంపై పాలకులకు లేకపోవడంపై సర్వత్రా నిరసన వ్యక్తం అవుతుంది. మోర్తాడ్ మండలంలో కొనసాగిన రామన్నపేట్ను 2016లో వేల్పూర్ మండలంలో విలీనం చేశారు. భౌగోళికంగా రామన్నపేట్ వేల్పూర్ మండల కేంద్రానికి సమీపంలో ఉంది. ఈ పునర్విభజనతో తమ సమస్యలు తొలగిపోతాయని గ్రామస్తులు ఆశించారు. కానీ ఫలితం భిన్నంగా ఉండటంతో గ్రామస్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కేవలం పంచాయతీరాజ్, రెవెన్యూ శాఖల పరంగానే పునర్విభజన చేసిన పాలకులు పోలీసు, వైద్య ఆరోగ్య శాఖ ఇతర శాఖల విషయంలో దృష్టి సారించలేదు. రామన్నపేట్ గ్రామం ఇప్పటికి మోర్తాడ్ పోలీసు స్టేషన్ పరిధిలో కొనసాగుతుంది. వైద్య ఆరోగ్య శాఖ సబ్ సెంటర్ చౌట్పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఉంది. మొదట మోర్తాడ్ పీహెచ్సీ పరిధిలో ఉండగా ఇక్కడ కమ్యూనిటీ ఆస్పత్రి ఏర్పాటైంది. దీంతో ఈ పీహెచ్సీకి సంబంధించి ఈ గ్రామంలోని సబ్సెంటర్ ఆలనా పాలన చౌట్పల్లి పీహెచ్సీ పరిధిలోకి మార్చారు. వాస్తవానికి పోలీసు శాఖ, వైద్య ఆరోగ్య శాఖలకు సంబంధించి రామన్నపేట్ వేల్పూర్ మండలంలోనే కొనసాగాల్సి ఉంది. అప్పట్లో పునర్విభజన చేసిన నాయకులు, అధికార యంత్రాంగం అన్ని శాఖల విషయంలో సరైన దృష్టి నిలపలేదనే విమర్శలు ఉన్నాయి. ఈ కారణంగానే రామన్నపేట్ కొన్ని శాఖల విషయంలో వేల్పూర్ మండలంలో మరి కొన్ని శాఖల అంశాల్లో మోర్తాడ్, కమ్మర్పల్లి మండలంలో కొనసాగుతుందని వెల్లడైతుంది. ప్రజలు తమకు ఉన్న సమస్యల విషయంలో ఏదైనా తేల్చుకోవాలంటే శాఖల పరంగా ఏ మండలం పరిధిలో తమ పని ఉంటే ఆ మండలానికి పరుగులెత్తాల్సి వస్తోంది. మోర్తాడ్ మండలంలోని రామన్నపేట్ వేల్పూర్ మండలంలో విలీనం రెవెన్యూ, పంచాయతీరాజ్ పరంగా వేల్పూర్ మండలం పోలీసు, వైద్య ఆరోగ్య శాఖ ఇతర సేవలు మాత్రం మోర్తాడ్లో.. గ్రామస్తులకు తప్పని ఇబ్బందులు -
మహిళా సంఘ భవనాలకు భూమిపూజ
కమ్మర్పల్లి(భీమ్గల్)/ మాక్లూర్/నందిపేట్: మ హిళా సంఘ భవనాలకు భూమిపూజ శనివారం ప్ర జాప్రతినిధులు, అధికారులు భూమిపూజ చేశారు. భీమ్గల్ మండలం పురాణీపేట, కుప్కల్ గ్రామా ల్లో ఎంపీడీవో గంగుల సంతోష్కుమార్, మాక్లూర్ మండలం చిక్కిలి, గుంజిలి గ్రామాలలో ఎంపీడీవో బ్రహ్మానందం, నందిపేట్ మండలం మల్లారం గ్రా మంలో సర్పంచ్ తబస్సుం మహిళసంఘ భవనాలకు భూమి పూజ చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ఈజీఎస్ నిధులు రూ.10లక్షలో భవనాలను నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమాల్లో ఏఈలు రమేశ్, సాయి సూర్య, రాజ్కుమార్, ఆయా గ్రామాల సర్పంచ్లు, వార్డు సభ్యులు, నందిపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మంద మహిపాల్, ఏపీఎం ప్రమీల, సీసీలు శ్రీనివాస్, రఘు, నరేశ్, తదితరులు పాల్గొన్నారు. -
స్థిరంగా నీటి మట్టాలు
● ప్రస్తుతం 11.86 మీటర్ల లోతులో.. ● ఈ నెలలో భూగర్భ జలాలు తగ్గే అవకాశం డొంకేశ్వర్(ఆర్మూర్) : జిల్లాలో భూగర్భ జలాలు నిలకడగా ఉన్నాయి. యాసంగి పంటలు త్వరగా కోతకు రావడంతో వ్యవసాయ బోర్ల వినియోగం తగ్గి ఏప్రిల్, మే నెలల్లో నీటి మట్టాలు పెద్దగా పడిపోలేదు. ప్రస్తుతం 11.86 మీటర్ల లోతులో ఉన్నట్లు భూగర్భజల శాఖ వెల్లడించింది. అయితే, ఎల్నినో కారణంగా వర్షాభావ పరిస్థితులు ఉండే అవకాశం ఉన్నందున నిల్వ ఉన్న నీటిని పొదుపుగా వాడుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఖరీఫ్ లో బోర్ల వినియోగంతో నీటి మట్టాలు వేగంగా కిందికి వెళ్లే అవకాశం ఉందని చెబుతున్నారు. జిల్లాలో 82 నీటి పరిశీలక బోరుబావులు ఉండగా 31 వాటి లో 10 మీటర్ల లోపు భూరగ్భ జలాలున్నాయి. 42 పరిశీలక బోరు బావుల్లో 10–20లోపు, అలాగే తొమ్మిది పరిశీలక బోరు బావుల్లో 20 మీటర్లపైన లోతులో ఉన్నట్లు గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ గుర్తించింది. -
ఎకరానికి రెండు బస్తాలే..
డొంకేశ్వర్(ఆర్మూర్) : ఖరీఫ్ సాగు సీజన్ మొదలు కావడంతో రైతులకు యూరియా పంపిణీపై వ్యవసాయ శాఖ దృష్టి పెట్టింది. మొన్నటి వరకు మూసి ఉన్న ‘యూరియా బుకింగ్ యాప్’ను కూడా ప్రభుత్వం తెరిచింది. దీంతో పలు మండలాల్లో రైతులు యాప్ ద్వారా బస్తాలను బుకింగ్ చేసుకుంటున్నారు. అయితే, ఎకరానికి రెండు బస్తాలు మాత్రమే ప్రభుత్వం పరిమితి పెట్టింది. అదనపు బస్తాలకు బుక్ చేస్తే యాప్ తీసుకోవడం లేదు. దీంతో రైతులే కాకుండా సొసైటీ చైర్మన్లు, ఇతర ప్రజాప్రతినిధులు వ్యవసాయాధికారులకు ఫోన్లు చేస్తున్నారు. బస్తాల పరిమితి పెంచాలని కోరుతున్నారు. గడిచిన వారం రోజుల్లో జిల్లాలో యాప్ ద్వారా 4,634 మెట్రిక్ టన్నుల యూరియాను రైతులు కొనుగోలు చేశారు. జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్లో 5.30 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఇందులో అత్యధికంగా 4.38 లక్షల ఎకరాల వరకు వరి సాగయ్యే అవకాశం ఉంది. రైతులు ఎకరం వరికి మూడు బస్తాలకు పైగా యూరియా వేస్తున్నారు. ఎకరానికి రెండు బస్తాలే ఇవ్వడంతో మూడో డోసు సమయంలో నానో యూరియా వాడాలని వ్యవసాయాధికారులు రైతులకు సూచించారు. తద్వారా ఎలాంటి ఇబ్బంది ఉండదని జిల్లా వ్యవసాయాధికారి వీరాస్వామి అన్నారు. సాగు ఊపందుకున్న తర్వాత ఎకరానికి మూడు బస్తాలకు పెంచే అవకాశం ఉందని తెలిపారు. సరిపడా యూరియా నిల్వలు... పశ్చిమాసియా యుద్ధ పరిస్థితుల కారణంగా యూరియా దిగుమతి ప్రభావం ఉండొచ్చని ప్రభుత్వం అంచనా వేసింది. దిగుమతిలో కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ జిల్లాకు మాత్రం అవసరమైన యూరియాను వ్యవసాయ శాఖ ఎప్పటికప్పుడు తెప్పిస్తోంది. ఖరీఫ్లో 80,857 మెట్రిక్ టన్నులు అవసరం అవుతుందని ప్రభుత్వానికి ఇండెంట్ పెట్టిన అధికారులు ఇప్పటి వరకు జిల్లాకు 32,462 మెట్రిక్ టన్నులు తెప్పించారు. పది రోజుల్లో రెండు సార్లు జిల్లాకు రైలు వ్యాగన్లలో యూరియాను తెప్పిస్తున్నారు. వచ్చిన దానిని సొసైటీలకు, దుకాణాలకు రవాణా చేస్తున్నారు.పెర్కిట్(ఆర్మూర్): యూరియా కోసం గంటల తరబడి వేచి చూసి చివరకు దొరక్క పోవడంతో శనివారం పెర్కిట్ సొసైటీకి రైతులు తాళం వేసి ఎదుట ఆందోళనకు దిగారు. ఆర్మూర్ ము న్సిపల్ పరిధిలోని పెర్కిట్ సొసైటీ పరిధిలో పె ర్కిట్తో పాటు కొటార్మూర్, చేపూర్ గ్రామాలు ఉన్నాయి. కాగా ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో రైతులు యూరియా కోసం ఉదయం పె ర్కిట్ సొసైటీకి వచ్చారు. సొసైటీలో 450 బస్తా ల యూరియా ఉందని సొసైటీ సిబ్బంది తెలిపారు. దీంతో రైతులు ప్రత్యేకంగా ఏర్పాటు చే సిన యాప్లో యూరియా కోసం బుక్ చేసుకు నే ప్రయత్నం చేయగా సాంకేతిక సమస్య తలెత్తింది. కొద్దిసేపటికి యాప్లో సాంకేతిక సమ స్య తొలగిపోయిన నిమిషాల్లోనే కొందరు రైతు లు యూరియాను బుక్ చేసుకుని తీసుకెళ్లారు. అప్పటి వరకు వేచిచూసిన మిగిలిన రైతులకు యూరియ లభించకపోవడంతో ఆగ్రహంతో సొసైటీకి తాళం వేసి ఆందోళనకు దిగారు. యాప్ను తొలగించి మామూలుగా పద్దతిలో యూరియాను సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు సొసైటీ వద్దకు చేరుకుని రైతులను శాంతింపజేసి అందరికి యూరియా వచ్చేలా చేస్తామని హామి ఇవ్వడంతో రైతులు శాంతించారు. తెరుచుకున్న యూరియా బుకింగ్ యాప్ ప్రణాళిక బద్ధంగా పంపిణీకి వ్యవసాయ శాఖ చర్యలు ఖరీఫ్కు అవసరమైన బస్తాలు ఎప్పటికప్పుడు జిల్లాకు దిగుమతి -
పెంచిన ఎరువుల ధరలను తగ్గించాలి
ఆర్మూర్: కేంద్రం పెంచిన ఎరువుల ధరలను వెంట నే తగ్గించాలని, ఎంఎస్పీ చట్టం అమలు చేయా లని ఏఐయూకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వీ.ప్రభాకర్ డి మాండ్ చేశారు. ఆర్మూర్లో అఖిల భార ఐక్య రైతు సంఘం (ఏఐయూకేఎస్) జాతీయ మహాసభ పి లుపు మేరకు ఆర్మూర్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఏఐయూకేఎస్ కార్యాలయం నుంచి ఆర్మూర్ సబ్ క లెక్టర్ కార్యాలయం వరకు మోటార్ సైకిల్ ర్యాలీ ని ర్వహించి కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించా రు. జిల్లా కార్యదర్శి కిషన్ అధ్యక్షతన నిర్వహించిన ధర్నానుద్దేశించి రాష్ట్ర అధ్యక్షుడు ప్రభాకర్ మాట్లాడారు. ఎరువుల ధర ఒక్కో బస్తా పై రూ.300 నుంచి రూ.500 వరకు పెంచి రైతుల వెన్ను విరు స్తోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హా మీలన్నింటినీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు. అ నంతరం తమ డిమాండ్లను తెలుపుతూ ఆర్మూర్ స బ్కలెక్టర్ అభిజ్ఞాన్ మాల్వియాకు వినతిపత్రాన్ని స మర్పించారు. జిల్లా నాయకులు గంగారాం, యూ. రాజన్న, జే.శేఖర్, ఏ.సాయులు, పోశన్న, టీ.గంగాధర్, ఈ.రమేష్, భద్రి తదితరులు పాల్గొన్నారు. రైతాంగ సమస్యలు పరిష్కరించాలని ధర్నా బోధన్: రైతాంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శనివారం ఎడపల్లి తహసీల్దార్ ఆఫీస్ ఎదుట అఖిల భారత ఐక్య రైతు సంఘం ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తహసీల్దార్ దత్తాద్రికి అందించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. ఆ సంఘం రాష్ట్ర కమిటి సభ్యుడు గుమ్ముల గంగాధర్, నాయకులు శ్రీపతి మల్లేశ్,రవి, సుదర్శన్, హన్మాండ్లు, గంగాధర్,వైద్యనాథ్ తదితరులు పాల్గొన్నారు. -
తడి–పొడి చెత్త వేరు చేయాలి
కమ్మర్పల్లి(భీమ్గల్): పరిసరాల పరిశుభ్రత కార్యక్రమంలో భాగంగా ప్రజలు తడి చెత్త, పొడి చెత్తలను వేర్వేరు డబ్బాలో వేయాలని భీమ్గల్ మున్సిపల్ చైర్ పర్సన్ బొదిరే నాగమణి అన్నారు. శనివారం ప్రజా పాలన, ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా 3,4,5,6 వార్డుల్లో వార్డు సభలు చైర్ పర్సన్ నాగమణి అధ్యక్షతన నిర్వహించారు. కమిషనర్ గజానంద్ ఎజెండా అంశాలను ప్రజలకు వివరించారు. వర్షాకాల సన్నద్ధత, ప్రజలు డెంగీ, మలేరియా బారిన పడకుండా జాగ్రత్తలను వివరించారు. వర్షాకాలంలో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని సూచించారు. వైస్ చైర్ పర్సన్ సంటి లత, కౌన్సిలర్లు తోట సతీష్. గున్నాల బాలలక్ష్మి. బోదిరే లావణ్య తదితరులు పాల్గొన్నారు. సమస్యల పరిష్కారానికి వార్డు సభలు బోధన్టౌన్(బోధన్): మున్సిపల్లో సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం వార్డుసభలను నిర్వహిస్తోందని బల్దియా వైస్ చైర్మన్ మీర్ ఇలియాస్ అలీ అన్నారు. శనివారం పట్టణంలోని వెంకటేశ్వర కల్యాణ మండపంలో 10 నుంచి 20 వరకు వార్డుల వార్డుసభలను నిర్వహించారు. ఈసందర్భంగా వైస్ చైర్మన్ మాట్లాడారు. తడిపొడి చెత్తను వేరు చేసి చెత్త సేకరించే ఆటోలకు ఇవ్వాలని, డ్రెయినేజీల్లో ప్లాస్టిక్ కవర్లతో పాటు ఇతర చెత్త వేయరాదని సూచించారు. బోధన్ పట్టణంలో జరుగుతున్న సర్ సర్వేకు ప్రజలు, ప్రజా/ప్రతినిధులు సహకరించాలని, ఆర్ఐ నాగేశ్వర్రావ్ అన్నారు. కార్యక్రమంలో కమిషనర్ జాదవ్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలి
రుద్రూర్: ప్రజా సమస్యల పరిష్కారంలో గ్రామ పంచాయతీల పాత్ర కీలకమని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. పొతంగల్ మండలంలోని తిర్మలపూర్, పీఎస్ఆర్ నగర్ గ్రామాల్లో శనివారం గ్రామ పంచాయతీ నూతన భవనాల నిర్మాణానికి ఆయన భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామ ప్రజలకు ప్రభు త్వ సేవలు అందుబాటులో ఉండేలా పంచాయతీ భవనాలను నిర్మిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమాల్లో అగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాల్రాజు. తిర్మాలపూర్, పీఎస్ఆర్ నగర్ సర్పంచ్లు సైదవ్వ, రాంబాయి, ఏఎంసీ చైర్మన్ హన్మంతు, మాజీ జెడ్పీటీసీ పుప్పాల శంకర్, మండల, గ్రామస్థాయి ప్రజాప్ర తినిధులు, అధికారులు పాల్గొన్నారు. -
రెక్కలు
నిజామాబాద్భూముల ధరలకువాలీబాల్ @ కలిగోట్ జక్రాన్పల్లి మండలం కలిగోట్ గ్రామానికి చెందిన వందలాది మంది క్రీడాకారులు వాలీబాల్లో రాణిస్తున్నారు. ఆదివారం శ్రీ 7 శ్రీ జూన్ శ్రీ 2026– 8లో uరాష్ట్ర ప్రభుత్వం భూముల, స్థిరాస్తుల మార్కెట్ విలువను పెంచడంతో నగరం, పట్టణ ప్రాంతాల్లోని కమర్షియల్ ఏరియాలతో పాటు, గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ భూముల ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ఇదిలా ఉండగా రెండ్రోజుల కిత్రం నిజామాబాద్ అర్బన్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో 15 రిజిస్ట్రేషన్లు మాత్రమే కావడం గమనార్హం. భూముల ధరలు పెరిగిన నేపథ్యంలో లావాదేవీలు తగ్గుతాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : రాష్ట్రంలో భూముల, స్థిరాస్తుల మార్కెట్ విలువను ప్రభుత్వం పెంచడంతో జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. జిల్లా కేంద్రమైన నిజామాబాద్ నగరంతో పాటు బోధన్, ఆర్మూర్ పట్టణాల్లో, ఆయా మండల కేంద్రాల్లో, ఇతర ముఖ్యమైన ప్రాంతాల్లో భూముల ధరలు పెరిగాయి.గ్రామాలు, పట్టణాలు, నగరాలు అనే తేడా లేకుండా ఈ పెంపు ఉండడంతో అన్నివర్గాల్లో ఇదే చర్చ నడుస్తోంది. నిజామాబాద్ నగరంలోని కమర్షియల్ జోన్లలో, బోధన్, ఆర్మూర్ పట్టణాల్లో ప్రధాన రహదారుల వెంట ధరలు అమాంతం పెరిగాయి. ● భీమ్గల్లో వ్యవసాయ భూమి ఎకరానికి రూ.3.75 లక్షలు ఉండగా ప్రస్తుతం ఏకంగా రూ.6.50 లక్షలకు పెరిగింది. ఇళ్ల స్థలాలకు దగ్గరగా ఉన్న వ్యవసాయ భూముల ధరలు 150 శాతం పెంచారు. జిల్లాలోని నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బోధన్, ఆర్మూర్, భీమ్గల్లలో రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ఉన్నాయి. జిల్లాలో సాధారణంగా ప్రతిరోజూ సుమారు 500 వరకు రిజిస్ట్రేషన్లు జరిగేవి. నిజామాబాద్ అర్బన్ రిజిస్ట్రేషన్ కార్యాలయం పరిధిలో ప్రతిరోజూ 60 నుంచి 70 వరకు రిజిస్ట్రేషన్లు ఉండేవి. కాగా శుక్రవారం ఇక్కడ కేవలం 30 స్లాట్ బుకింగ్లు కాగా 15 రిజిస్ట్రేషన్లు మాత్రమే కావడం గమనార్హం. భూముల ధరలు పెరిగిన నేపథ్యంలో లావాదేవీలు తగ్గుతాయని జనం చెబుతున్నారు. ● నిజామాబాద్ అర్బన్ రిజిస్ట్రేషన్ పరిధిలోకి వచ్చే నగరంలోని కీలకమైన కమర్షియల్ ప్రాంతంగా ఉన్న ఖలీల్వాడితో పాటు ద్వారకానగర్, ఎల్లమ్మగుట్ట, నిజామాబాద్ బస్స్టేషన్, కంఠేశ్వర్, మార్కెట్యార్డు, గాంధీచౌక్ ప్రాంతాల్లో ప్రస్తుతం గజం రూ.37,400 ఉన్న ధర ఇప్పుడు ఏకంగా రూ.56,100 మేర పెరిగింది. ● ఇందూరు నగరానికి ఆనుకుని ఉన్న కాలూరు ఏరియాలో రూ.700 ఉన్న గజం భూమి ధర ఇప్పుడు రూ.1,500 వరకు పెరిగింది. ఖానాపూర్ ప్రాంతంలో గజం రూ.1,100 నుంచి రూ.1,900 వరకు పెరిగింది. ● నగరానికి సమీపంలోని మోపాల్ మండలంలోనూ ధరలు పెరిగాయి. గజం ధర రూ.600 నుంచి రూ.1,500కు పెరగడం గమనార్హం. ● జిల్లాలోని మహారాష్ట్ర సరిహద్దులోని రెంజల్, సాలూర మండలాల్లోని పలు గ్రామాల్లో కనీస ధర రూ.600 వరకు పెరిగింది. ● బోధన్ బస్స్టేషన్ ప్రాంతాల్లో గజం భూమి ధర రూ.15,800 ఉండగా ప్రస్తుతం రూ.27,800కు పెరిగింది. బోధన్ మండలంలోని గ్రామాల పరిధిలో గజం ధర రూ.900 వరకు పెరిగింది. కమర్షియల్ ఏరియాల్లో అమాంతం పెరిగిన రేట్లు నగరంలోని ఖలీల్వాడిలో గజానికి రూ.18,700 పెంపు భూముల లావాదేవీలపై ప్రభావం.. తగ్గిన రిజిస్ట్రేషన్లు, వ్యవసాయ భూముల రేట్లు రెట్టింపు -
మొరం అనుమతులపై అక్బర్నగర్ గ్రామ సభలో వాగ్వాదం
రుద్రూర్: మండలంలోని అక్బర్నగర్ గ్రామ పంచాయతీలో శనివారం ఏర్పాటు చేసిన గ్రామ సభలో మొరం అనుమతుల ఆంశంపై తీవ్ర వాగ్వాదం జరిగింది. సమీపంలోనే గుట్ట ఉన్నందున వేబిల్లు లేకుండా గ్రామస్తులకు మొరం తరలింపుకు అనుమతి ఇవ్వాలని యువకులు డిమాండ్ చేశారు. నిబంధనల ప్రకారం వేబిల్లు తప్పనిసరి అని తహసీల్దార్ తారాబాయి స్పష్టం చేయడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. గ్రామస్తులకు వే బిల్ లేకుండా మొరం ఇవ్వాలని గ్రామ సభలో తీర్మానం చేశారు. వానకాలంలో గుట్ట ప్రాంతం నుంచి వరద నీరు వస్తోందని, ఈ సమస్యను పరిష్కారించాలని గ్రామస్తులు సభ దృష్టికి తెచ్చారు. సభలో ఒకరు అనుచిత వ్యాఖ్యలు చేయడంతో తహసీల్దార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం సర్పంచ్ సీతారామరాజు ఈఘటనపై స్పందిస్తూ క్షమాపణలు కోరారు. ఎంపీవో అరవింద్, ఏఈవో వెంకటేశ్, ఉపసర్పంచ్ హబీబ్ఖాన్, వార్డు సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. -
గ్యాస్ సిలిండర్ల పట్టివేత
● హోటళ్లు, టిఫిన్ సెంటర్ల పై సివిల్ సప్లయ్ అధికారుల దాడులు బోధన్: గృహవసరాలకు సంబంధించిన గ్యాస్ సిలిండర్లను వ్యాపారాల కోసం వాడుకుంటున్నారనే సమాచారం మేరకు శనివారం ఎడపల్లి మండల కేంద్రంతో పాటు జానకంపేట, ఎంఎస్సీఫారం, సాటాపూర్ గేట్ ప్రాంతాల్లో పలు హోటళ్లు, టిఫిన్ సెంటర్ల పై సివిల్ సప్లయ్ అధికారులు దాడులు నిర్వహించారు. ఆయా హోటళ్లల్లో తనిఖీలో చేపట్టగా 15 గృహవసరాల గ్యాస్ సిలిండర్లను గుర్తించి పట్టుకున్నట్టు అధికారులు తెలిపారు. హోటల్ యాజమానుల పై కేసు నమోదు చేశామని పేర్కొన్నారు. పట్టుబడిన గ్యాస్ సిలిండర్లను స్థానిక గ్యాస్ ఏజెన్సీ గోదాంకు తరలించినట్టు సివిల్ సప్లయ్ అధికారులు ఆకుల మహేశ్, పవన్లు తెలిపారు. -
జాతీయ లోక్ అదాలత్ విజయవంతం చేయాలి
ఆర్మూర్టౌన్: ఈనెల 20న జరిగే జాతీయ లోక్అదాలత్ను విజయంతం చేయాలని సీనియర్ సివిల్ జడ్జి శ్రీదేవి అన్నారు. ఆర్మూర్ కోర్టులో శనివారం విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. పెండింగ్ కేసులు పరిష్కారానికి లోక్ అదాలత్ మంచి వేదిక అన్నారు. ప్రజలు ఈవేదిక ద్వారా న్యాయం పొందాలని సూచించారు. న్యాయవాదులు పరస్పర అవగాహనతో రాజీ పరిష్కారాలకు కృషి చేయాలని అన్నారు. రెంజల్(బోధన్): మండలంలోని తాడ్బిలోలి గ్రా మానికి చెందిన లింగాల సాయిలు అనే బాధితునికి మంజూరైన రూ.18,000 సీఎంఆర్ఎఫ్ చెక్కును శ నివారం స్థానిక కాంగ్రెస్ నాయకులు అందించారు. ప్రభుత్వ ప్రధాన సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే సు దర్శన్రెడ్డి సహకారంతో తక్కువ సమయంలో బా ధితునికి నిధులు మంజూరయ్యాయని పేర్కొన్నా రు. రెంజల్ సింగిల్ విండో మాజీ చైర్మెన్ సాయరెడ్డి, రామాలయం చైర్మన్ కార్ఖాన శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీలు నర్సయ్య, శ్రీనివాస్, ఉప సర్పంచ్ ఖుద్దూస్, నాయకులు సద్దాం, సురేష్పటేల్, షఫీ తదితరులు పాల్గొన్నారు. ప్రమాద బాధిత కుటుంబాలకు పరామర్శ కమ్మర్పల్లి(భీమ్గల్): భీమ్గల్లోని లింబాద్రిగుట్ట వడ్డెర కాలనీ వద్ద గల బ్రాహ్మణ కుంటలో పడి మరణించిన ముగ్గురు పిల్లల కుటుంబాలను కాంగ్రెస్ బాల్కొండ నియోజకవర్గ ఇన్చార్జి ముత్యాల సునీల్కుమార్ శనివారం పరామర్శించారు. కంది హరీష్, వర్షిణి తల్లిదండ్రులు మహేష్, లక్ష్మి దంపతులను, ధ్యారంగుల అరవింద్ తల్లిదండ్రులు సురేష్, పద్మలను సునీల్కుమార్ పరామర్శించి సానుభూతి వ్యక్తం చేశారు. ప్రభుత్వం తరపున ఆదుకుంటామని హామీనిచ్చారు. కాంగ్రెస్ మండలాధ్యక్షుడు మల్లెల లక్ష్మణ్, నాయకులు పర్స అనంతరావు, సంగ్యా నాయక్ తదితరులు ఉన్నారు. బాధిత కుటుంబాలకు మానాల మోహన్రెడ్డి... కమ్మర్పల్లి: కమ్మర్పల్లి మండలం హసకొత్తూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మేడం రమేష్ తండ్రి లక్ష్మణ్, మాజీ సర్పంచ్ ఏనుగు రాజేశ్వర్ తండ్రి రాజన్న ఇటీవల మరణించడంతో రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్రెడ్డి శనివారం పరామర్శించారు. ఆయన వెంట నాయకులు సర్పంచ్ రేవతి గంగాధర్, ఉప సర్పంచ్ ఏనుగు మనోహర్, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు బోనగిరి భాస్కర్, సుంకెట రవి, తిప్పిరెడ్డి శ్రీను, పడిగెల ప్రవీణ్, బద్దం మోహన్రెడ్డి, రఫీ, లక్ష్మీకాంతం, చిటికేశి గంగాధర్ తదితరులు ఉన్నారు. -
మెరుగైన వైద్యసేవలందించాలి
● వైద్యులు, సిబ్బందికి సూచనలు చేసిన జిల్లా వైద్యాధికారి రాజశ్రీ ● ఆర్మూర్ సీహెచ్సీతో పాటు అంగన్వాడీ కేంద్రాల్లో టీకాల సెంటర్ల తనిఖీఆర్మూర్ : ఆర్మూర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్సీ) పరిధిలోని ప్రజలకు మెరుగైన వైద్యసేవలందించాలని జిల్లా వైద్యాధికారి రాజశ్రీ సూచించారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిని శనివారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేసారు. ఆస్పత్రిలోని అన్ని వార్డులు, ల్యాబ్లు, మందుల పంపిణీ కేంద్రాలు, హెచ్ఐవీ, ఐసీటీసీ కేంద్రాన్ని, ట్రూ నాట్ టీబీ పరీక్షా కేంద్రాన్ని సందర్శించి సిబ్బందికి సూచనలు చేసారు. అదేవిధంగా ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బందికి విధులు కేటాయించిన రికార్డులను, హాజరు పట్టికలను పరిశీలించారు. వైద్యులు, సిబ్బంది సమయ పాలన పాటిస్తూ విధులకు హాజరు కావాలని ఆదేశించారు. అనంతరం పట్టణంలోని మగ్దుంనగర్ కాలనీలోని అంగన్వాడీ కేంద్రంలో చిన్న పిల్లలకు టీకాలు ఇచ్చే కేంద్రాన్ని సందర్శించారు. పిల్లలకు ఇస్తున్న టీకాలు, వ్యాక్సిన్ను పరిశీలించారు. పుట్టిన ప్రతి శిశువు నుంచి 16 సంవత్సరాల వరకు పిల్లలకు వారి వయసు వారిగా ఇవ్వాల్సిన డోసులను సక్రమంగా అందజేయాలని ఆదేశించారు. ఒక రోజు ముందు డ్యూ లిస్ట్ని తయారు చేసుకోవాలని సూచించారు. ఆర్ఎంవో డాక్టర్ అమృత్రామ్రెడ్డి, వైద్యులు, సతీష్, ప్రవీణ్, సబ్ యూనిట్ ఆఫీసర్ సాయి, ల్యాబ్ టెక్నీషియన్స్, ఆరోగ్య అధికారి శేఖర్, ఆరోగ్య కార్యకర్తలు శ్యామల, సౌందర్య తదితరులున్నారు. -
ఆరుగురు జల సమాధి
కమ్మర్పల్లి(భీమ్గల్)/బాన్సువాడ:నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో రెండు ఘటనల్లో నీట మునిగి ఆరుగురు మృత్యువాత పడ్డారు. వివరాల్లోకి వెళితే... నిజామాబాద్ జిల్లా భీమ్గల్ పట్టణ పరిధిలోని లింబాద్రిగుట్ట వడ్డెర కాలనీలో నివాసం ఉండే కంది మహేశ్ కొడుకు హరీశ్ (10), కూతురు వర్షిణి (5), ధ్యారంగుల సురేశ్ కొడుకు అరవింద్ (4) శుక్రవారం ఉదయం 10 గంటల సమయంలో ఆడుకోవడానికి ఇంటి నుంచి బయటకు వెళ్లారు. ఆడుకుంటూ కాలనీ పక్కనే ఉన్న బ్రాహ్మణకుంట వద్దకు వెళ్లారు. స్నానం చేసేందుకు బట్టలు విప్పి ఒడ్డున పెట్టి కుంటలోకి దిగారు. ఇటీవల కుంటలో మొరం తవ్వకాలు జరపడంతో గుంతలు ఏర్పడ్డాయి.గుంతలు తవ్విన ప్రాంతంలో లోతు ఎక్కువగా ఉండటంతో ముగ్గురు చిన్నారులు మునిగి పోయారు. మధ్యాహ్న సమయంలో పిల్లలు ఇంటికి రాకపోవడంతో మహేశ్, సురేశ్ కుటుంబ సభ్యులు వారి కోసం వెతికారు. కాలనీలో, పక్కనే ఉన్న వ్యవసాయ తోటల్లో ఇతర ప్రాంతాల్లో గాలించారు. అయినా వారి ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఎస్ఐ సీహెచ్ తిరుపతి, పోలీస్ సిబ్బంది పిల్లల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాలనీ సమీపంలోని బ్రాహ్మణ కుంట వద్ద ఒడ్డున పిల్లల దుస్తులు కనిపించాయి. దీంతో అగి్నమాపక సిబ్బందిని, గజ ఈతగాళ్లను ఘటన స్థలానికి రప్పించి గల్లంతైన పిల్లల కోసం గాలించారు. రెండు గంటల పాటు శ్రమించిన గజ ఈతగాళ్లు చివరికి చిన్నారుల మృతదేహాలను వెలికితీశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తిరుపతి తెలిపారు. ఎల్లమ్మ పండగ చేస్తుండగా.... కామారెడ్డి జిల్లా పిట్లం మండలం కిష్టాపూర్ గ్రామానికి చెందిన పండరి అనే వ్యక్తి బోలక్పల్లి శివారులోని మంజీర బ్రిడ్జి కింద ఎల్లమ్మ గుడి వద్ద పండగ చేశాడు. అన్నాదమ్ములు, అక్కచెల్లెళ్ల కుటుంబాలను పిలిచాడు. అందరూ కలిసి సంతోషంగా పండగ చేసుకున్నారు. ఇంటికి వెళ్లే సమయంలో పండరి కుమార్తె పావని(15)తోపాటు, లింగంపేట్ మండలం పర్మల్ల గ్రామానికి చెందిన పండరి చెల్లి అనిత (40), ఆమె కుమార్తె శివాణి (13), పిట్లం మండలం గోద్మేగాం గ్రామానికి చెందిన పండరి మరో చెల్లి సుజాత కుమారుడు భానుప్రసాద్తోపాటు అక్షయ, అశ్వీతలు మంజీర నదిలో స్నానాలు చేసేందుకు వెళ్లారు.అయితే అక్షయ, అశ్వీతలు ఒడ్డున ఉన్నారు. అనిత, శివాణి, పావని, భానుప్రసాద్లు నదిలో స్నానానికి దిగారు. లోతుగా ఉండడంతో ఒక్కసారిగా అందరూ నీటిలో మునిగిపోయారు. దీంతో ఒడ్డున ఉన్న అక్షయ, అశ్వీతలు కేకలు వేయడంతో పండరి తమ్ముడు రవీందర్ హుటాహుటిన వచ్చి నీటిలో మునిగిన అక్క అనిత, మేనకోడలు శివాణి, అన్న కుమార్తె పావని, అక్క కుమారుడు భానుప్రసాద్లను బయటకు తీశాడు. నీట మునిగిన వారందరినీ బాన్సువాడ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అనిత, శివాణి, పావని మృతి చెందినట్టు వైద్యులు చెప్పారు. భానుప్రసాద్ పరిస్థితి విషమంగా ఉండడంతో ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
‘పండుగ’ వేళ విషాదం
బాన్సువాడ/బాన్సువాడ రూరల్/పిట్లం: పిట్లం మండలం కిష్టాపూర్ గ్రామానికి చెందిన పండరి అదే మండలంలోని బొల్లక్పల్లి శివారులోగల మంజీర బ్రిడ్జి వద్దనున్న ఎల్లమ్మ ఆలయంలో శుక్రవారం పండుగ చేశాడు. అన్నదమ్ములు సాయిలు, రవీందర్తో పాటు చెల్లెళ్లు అనిత, సుజాతల కుటుంబ సభ్యులను ఆహ్వానించాడు. అందరూ కలిసి మొక్కలు చెల్లించికుని, సంతోషంగా భోజనాలు చేశారు. సాయంత్రం వేళలో పండరితోపాటు ఆయన కూతురు పావని(15), చెల్లెలు లింగంపేట్ మండలం పర్మల్ల గ్రామానికి చెందిన కొడబోయిన అనిత(40), ఆమె కూతురు శివాని (13), మరో చెల్లి పిట్లం మండలం గోద్మేగాం గ్రామానికి చెందిన సుజాత కుమారుడు భానుప్రసాద్తో పాటు మరికొందరు మంజీర నది వద్దకు వెళ్లారు. అక్కడ నదిలో లోతు ఎక్కువగా ఉండడంతో అనిత, శివాని, పావని, భానుప్రసాద్ అదుపుతప్పి పడిపోయారు. ఒడ్డున ఉన్నవారు కేకలు వేయడంతో పండరి తమ్ముడు రవీందర్ పరుగెత్తుకుంటూ వచ్చి నీటిలో మునిగిన అనితతో పాటు శివాని, పావని, భానుప్రసాద్లను ఒడ్డుకు చేర్చాడు. అప్పటికే అనిత, శివాని, పావని మరణించారు. భానుప్రసాద్తోపాటు ముగ్గురి మృతదేహాలను కుటుంబ సభ్యులు మోసుకుంటూ రోడ్డు వరకు వచ్చి అంబులెన్స్లో బాన్సువాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. భానుప్రసాద్ పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో బాన్సువాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఓదార్చిన ఆర్డీవో.. నీట మునిగి ముగ్గురు మరణించిన విషయం తెలుసుకున్న బాన్సువాడ ఆర్డీవో రవీందర్రెడ్డి.. బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి చేరుకుని సంఘటనపై ఆరాతీశారు. మృతుల బంధువులను ఓదార్చారు. భానుప్రసాద్కు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. ప్రమాదానికి సంబంధించిన నివేదికను ప్రభుత్వానికి పంపి బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు. మిన్నంటిన రోదనలు.. మంజీర నదిలో ముగ్గురి మరణవార్త తెలుసుకున్న బంధుమిత్రులు బాన్సువాడ ఆస్పత్రికి తరలివచ్చారు. మృతదేహాలను చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. బాన్సువాడ రూరల్ సీఐ తిరుపయ్య కేసు నమోదు చేసుకున్నారు.లింగంపేట : మంజీర నదిలో మునిగి మరణించిన పర్మళ్ల గ్రామానికి చెందిన కొడబోయిన అనితకు భర్త నర్సింలు, కూతురు శివాని, కుమారుడు భానుప్రసాద్ ఉన్నారు. కూలి పనులు, వ్యవసాయ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవారు. శివాని కామారెడ్డిలోని మైనారిటీ గురుకుల పాఠశాలలో ఏడో తరగతి, కొడుకు భానుప్రసాద్ పర్మళ్ల ప్రాథమిక పాఠశాలలో నాలుగో తరగతి పూర్తి చేశారు. ఇటీవల పర్మళ్ల గ్రామంలో ఊర పండుగ చేసుకున్నారు. పండుగ అనంతరం నిద్ర కోసం గురువారం రాత్రి పుట్టింటికి (పిట్లం మండలంలోని కిష్టాపూర్)కు వచ్చారు. శుక్రవారం అందరు కలిసి సంతోషంగా ఎల్లమ్మ పండుగ చేసుకుంటుండగా విషాదం చోటు చేసుకుంది. నీట మునిగి తల్లీకూతుళ్లు అనిత(40), శివాని(13) మృతి చెందడంతో పర్మళ్ల గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతురాలు అనిత గ్రామంలో అందరితో కలుపుగోలుగా ఉండేదని గ్రామస్తులు గుర్తు చేసుకుంటున్నారు. -
లక్ష్యం.. 10 శాతం పెంపు
‘సర్కారు బడుల్లో 10 శాతం అడ్మిషన్లు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఈ ఏడాది జిల్లాలో 10 వేల మంది విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించేందుకు లక్ష్యం పెట్టుకున్నాం. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా లక్షా 10 వేల మంది విద్యార్థులు ప్రభుత్వ బడుల్లో చదువుతున్నారు. ఈ నెల 12 నుంచి తరగతులు పున:ప్రారంభమవుతాయి. పుస్తకాలు, నోట్బుక్స్ విద్యార్థులకు అందిస్తాం. ప్రతి బడిలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తూనే నాణ్యమైన బోధన చేసేలా చర్యలు తీసుకుంటాం.’ అని చెప్తున్న డీఈవో పార్శి అశోక్తో ‘సాక్షి’ ఇంటర్వ్యూ... – ఖలీల్వాడి ● మధ్యాహ్న భోజనం ఎలా ఉంటుంది.. ● జిల్లాలో మధ్యాహ్న భోజన పథకాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నాం. నిర్వాహకుల జీతాలతోపాటు వంట సామగ్రికి సంబంధించిన ఖర్చులను నెలవారీగా ఖాతాలో జమ చేస్తున్నాం. నాణ్యమైన భోజనంతోపాటు విద్యార్థులకు టిఫిన్స్, రాగి జావా, పాలు అందిస్తున్నాం.● 10 వేల మంది విద్యార్థులను ప్రభుత్వ బడుల్లో చేర్పించేందుకు కృషి ● స్కూళ్ల ప్రారంభం నాటికే పుస్తకాలు అందిస్తాం ● మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నాం ● ‘సాక్షి’తో డీఈవో పార్శి అశోక్ సాక్షి : జిల్లాకు పుస్తకాలు, నోట్బుక్స్, యూనిఫాంలు వచ్చాయా? విద్యాశాఖ అధికారి : జిల్లాకు 6,92,650 పుస్తకాలు అవసరం ఉండగా ఇప్పటి వరకు 6 లక్షల 5వేల 950 పుస్తకాలు వచ్చాయి. మిగతా పుస్తకాలు స్కూళ్లు ప్రారంభం వరకు వస్తాయి. పుస్తకాలను మండలాలకు పంపించాం. నోట్బుక్స్ మండల విద్యాశాఖ అధికారులకు నేరుగా అందజేశారు. యూనిఫాంలను కూడా అందిస్తాం. ● ఎన్ని ప్రీ ప్రైమరీ స్కూళ్లు మంజూరయ్యాయి? సిబ్బంది నియామకం? ● గత విద్యాసంవత్సరం నుంచి జిల్లాలో ప్రీ ప్రైమరీ స్కూళ్లు ప్రారంభించాం. జిల్లాలో 68 ఏర్పాటు చేయగా, ఐదు పీఎంశ్రీ స్కూళ్లలో కొనసాగాయి. ఈ విద్యాసంవత్సరం 112 ప్రీ ప్రైమరీ స్కూళ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ నెల 10 వరకు సిబ్బందిని నియమిస్తాం. స్థానికులకే అవకాశం కల్పిస్తాం. ● విద్యార్థుల సంఖ్య తగ్గకుండా తీసుకుంటున్న చర్యలు.. ● బడిబాటలో భాగంగా విద్యార్థుల సంఖ్య పెంచే లా ప్రత్యేక దృష్టి పెట్టాం. ఈ విద్యా సంవత్సరం ప్రతి ప్రభుత్వ పాఠశాలలో 10 శాతం విద్యార్థులను పెంచాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని హెడ్మాస్టర్లకు వివరించాం. ఈ ఏడాది కొత్తగా జిల్లాలో 10 వేల మంది విద్యార్థులను బడుల్లో చేర్పిస్తాం. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్య మంతోపాటు పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్, యూనిఫాం ఉచితంగా పంపిణీ చేస్తున్నాం. తల్లిదండ్రులు గమనించి పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలి. శిథిల బడులపై దృష్టి.. జిల్లాలో ఎన్ని శిథిల బడులు ఉన్నాయో గుర్తించి ప్రణాళిక సిద్ధం చేశాం. కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నవాటిని తొలగించాలని హెచ్ఎంలకు ఆదేశాలిచ్చాం. వాటి స్థానంలో కొత్త భవనాల నిర్మాణాలకు చర్యలు చేపడతాం. గ్రామ పంచాయతీ తీర్మానం చేసి స్కూల్ నుంచి ఎంఈవో ద్వారా డీఈవో ఆఫీస్కు వస్తే నిధుల కోసం నివేదిస్తాం. టీచర్ల కొరతను ఎలా అధిగమిస్తారు.. టీచర్ల కొరత అంతగా లేదు. విద్యార్థుల చదువులకు ఇబ్బందులు ఉండవు. జిల్లాలో సుమారు 400 వరకు పోస్టులు ఖాళీలు ఉన్నాయి. అవసరం ఉన్న పాఠశాలలకు టీచర్లను సర్దుబాటు చేస్తాం. విధులకు రాని టీచర్లపై తీసుకునే చర్యలు .. స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎంలు, ఎంఈవోలు పాఠశాలలను తనిఖీ చేయాలి. ఫేషియల్ అటెండెన్స్ ద్వారా సమయపాలన పాటించని వారిని గుర్తించి శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. -
ప్రమాదవశాత్తు చెరువులో ఒకరి మృతి
ఆర్మూర్టౌన్: పట్టణ శివారులోని చెరువు లో చేపలు పట్టేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు వెంకట సుబ్బయ్య(32) అనే వ్యక్తి మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి. నెల్లూ రు జిల్లా ఆల్లూర్ మండలం ఇస్కపల్లి గ్రా మానికి చెందిన సుబ్బయ్య బతుకుదెరువు కోసం రెండు సంవత్సరాల క్రితం ఆర్మూర్కు వచ్చాడు.ఈ నెల 4న చేపలు పట్టేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందాడు. పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.మృతుడి భార్య ఫిర్యాదు మే రకు కేసు నమోదు చేసినట్లు ఎస్హెచ్వో సత్యనారాయణగౌడ్ తెలిపారు. భిక్కనూరు : మెకానిక్ నిర్లక్ష్యంతో ట్రాక్టర్ యజమాని ఒకరు మృతి చెందినట్లు ఎస్సై ఆంజనేయులు శుక్రవారం తెలిపారు. మండలంలోని కాచాపూర్ గ్రామానికి చెందిన ట్రాక్టర్ యజమాని మంగిలిపల్లి రమేశ్(52) ట్రాక్టర్ మరమ్మతులు చేసేందుకు కామారెడ్డికి చెందిన మెకానిక్ రియాన్ను పిలిపించాడు. దీంతో రియాన్ వచ్చి ట్రాక్టర్ను రిపేర్ చేస్తుండగా యజమాని రమేశ్ ట్రాక్టర్ ఎదుట నిల్చున్నాడు. ఆ సమయంలో రియాన్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా సెల్ఫ్ ద్వారా స్టార్టు చేయగానే ట్రాక్టర్ ముందుకు వెళ్లి రమేశ్ను ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన రమేశ్ను కామారెడ్డిలోని ప్రయివేటు ఆస్పత్రికి తరలించగా అక్కడి వైద్యుల సలహామేరకు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రమేశ్ మృతి చెందాడు. రమేశ్ మృతికి కారణమైన మెకానిక్ రియాన్పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వివరించారు. నిజాంసాగర్(జుక్కల్): మహమ్మద్ నగర్ మండలం తెల్గాపూర్ గ్రామ శివారులోని ఎస్ఎస్ 5 ట్రాన్స్ఫార్మర్ వద్ద గురువారం కరెంట్ షాక్తో పాడి గేదె మృతి చెందింది. గ్రామానికి చెందిన తోట రవీందర్ పాడి గేదె మేత కోసం గ్రామ శివారులోకి వెళ్లింది. పొలం గట్టు వద్ద ఉన్న ట్రాన్స్ఫార్మర్కు తగలడంతో గేదె అక్కడిక్కడే మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. బాధిత రైతుకు రూ. 55 వేల వరకు ఆస్తి నష్టం వాటిల్లిందని గ్రామస్తులు పేర్కొన్నారు. ట్యూటర్పై కేసు నమోదు నిజామాబాద్ అర్బన్ : ప్రభుత్వ జనరల్ ఆ స్పత్రిలో నర్సింగ్ విద్యార్థినిని వేధించిన ఘ టనలో ట్యూటర్పై కేసు నమోదైంది. నర్సింగ్ విద్యార్థినిని జనరల్ ఆస్పత్రికి చెందిన ట్యూటర్ గౌతమ్ కొన్నినెలలుగా వేధిస్తున్నా డు. వేధింపులు భరించలేక ఆమె గురువా రం మాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించింది. విచారణ చేపట్టిన వైద్యాధికారులు ట్యూటర్ను తొలగించారు. మరోవైపు ఒక టో టౌన్ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. -
పర్యావరణాన్ని కాపాడాలి
● ఇన్చార్జి జిల్లా జడ్జి నారాయణ నిజామాబాద్ లీగల్ : ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడాలని ఎస్సీ,ఎస్టీ కోర్టు జడ్జి ఎస్. నారాయణ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జిల్లా న్యాయసేవా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని కోర్టు ఆవరణలో మొక్కలను నాటారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ ఈ సంవత్సరం ఎల్ నినో కారణంగా విపరీతమైన వేడి వాతావరణం ఉంటుందని, ప్రతి ఇంట్లో ఏసీలు పెట్టడంతో వేడిమి ఎక్కువ అయ్యిందని, అందుకే ప్రతి ఒక్కరూ తమ ఇంటి ఎదుట మొక్కలను నాటాలని సూచించారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నీలకంఠరావు, మేజిస్ట్రేట్స్ శ్రీనివాస్ రావు, చైతన్య, హరికుమార్, ప్రధాన కార్యదర్శి సుభాష్ రెడ్డి, ఉపాధ్యక్షుడు అవుల నారాయణ, పరిపాలనాధికారి గోవిందరావు, న్యాయవాదులు రాజ్కుమార్ సుబేదార్, రాజు, ఆశ నారాయణ, రవిప్రసాద్, న్యాయ సేవా సంస్థ పర్యవేక్షకులు శైలజ, శ్రావణ్, గణేశ్ తదితరులు పాల్గొన్నారు. -
ఒకే రోజు ఐదువేల మొక్కలు
డొంకేశ్వర్(ఆర్మూర్): ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా శుక్రవారం అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి ఐదు వేల మొక్కలు నాటారు. గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా ప్రతి మండలంలో రెండు ప్రాంతాలను గుర్తించి మొక్కలను నాటించారు. గ్రామ పంచాయతీల పరిధిలో ఉపాధిహామీ సిబ్బంది సర్పంచులను ఆహ్వానించారు. మొక్కలు నాటేచోట ముగ్గులు వేశారు. ఇటు అటవీ అధికారులు కూడా ఆయా రేంజ్లలో మొక్కలు నాటాను. ఎన్జీవోలు, కమ్యునిటీ సంఘాలు సైతం మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని పిలుపునిచ్చారు. -
పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి
తెయూ(డిచ్పల్లి): భవిష్యత్ తరాల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని తెలంగాణ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపల్ జి.రాంబాబు సూచించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం తెయూలో తెలంగాణ విశ్వవిద్యాలయంలో జోయ్అలుక్కాస్ జ్యువెలర్స్ నిజామాబాద్, వర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ సంయుక్త ఆధ్వర్యంలో ‘మొక్కల పంపిణీ’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ రాంబాబు మాట్లాడుతూ పర్యావరణానికి హానికారకంగా మారిన ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించుకోవాలన్నారు. కార్యక్రమంలో జోయ్అలుక్కాస్ జ్యువెలర్స్ మార్కెటింగ్ అధికారి మదన్, ఎన్ఎస్ఎస్ యూనిట్ ప్రోగ్రాం ఆఫీసర్ హలీంఖాన్, అధ్యాపకు లు, బోధనేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
చైన్స్నాచర్ అరెస్టు
మోర్తాడ్(బాల్కొండ): మెండోరా పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన చైన్ స్నాచింగ్ కేసులో నిందితుడు గుర్జంత్ సింగ్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఆర్మూర్ రూరల్ సీఐ జాన్రెడ్డి శుక్రవారం తెలిపారు. బాల్కొండలోని రూరల్ సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వారం క్రితం సోన్పేట్కు చెందిన ఉప్పరి గణేశ్ తన భార్య గంగు, కూతురు మనీషతో కలిసి ముప్కాల్ నుంచి బుస్సాపూర్ శివారుకు చేరుకోగా ముసుగు ధరించిన నిందితుడు గంగు మె డలో నుంచి రెండు తులాల పుస్తెల తాడు తెంచుకొ ని పారిపోయాడు. పంజాబ్ రాష్ట్రానికి చెందిన గు ర్జంత్ సింగ్గా గుర్తించి అరెస్టు చేసినట్లు తెలిపారు. మెండోరా పోలీసులను సీఐ అభినందించారు. నిజామాబాద్ రూరల్ : రూరల్ పోలీస్స్టేషన్ పరిధిలోని గుండారం శివారులో సర్దార్ తేజాసింగ్(36) అనే వ్యక్తి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై షరీఫ్ శుక్రవారం తెలిపారు. నిజామాబాద్ నగరంలోని గాజులపేటకు చెందిన తేజాసింగ్ మద్యానికి బానిసై తీవ్ర మనస్తాపంతో ఉరేసుకున్నాడని పేర్కొన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కామారెడ్డి క్రైం : మద్యం సేవించి వాహనాలు నడిపినందుకు జిల్లా వ్యాప్తంగా ఉన్న వివిధ కోర్టులు శుక్రవారం ఒకే రోజు 28 మందికి శిక్షలు విధించా యి. వాహనాల తనిఖీల్లో పట్టుబడిన వారిని కోర్టులలో హాజరుపర్చగా ఐదుగురికి ఒకరోజు జైలుశిక్షతోపాటు మొత్తం 28 మందికి రూ.36,500 జరిమానా విధించినట్లు ఎస్పీ రాజేశ్చంద్ర ఒక ప్రకటనలో తెలిపారు.మద్యం సేవించి వాహనాలు నడిపి తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలని సూచించారు. -
జీజీహెచ్లో తొలి పీటీసీఏ ప్రక్రియ సక్సెస్
సుభాష్నగర్ : జీజీహెచ్ నిజామాబాద్లో తొలిసారి పీటీసీఏ (స్టెంట్) ప్రక్రియ విజయవంతమైంది. కార్డియాలజీ, ప్లాస్టిక్ సర్జరీ విభాగాల్లో తొలిసారిగా నిర్వహించిన క్లిష్టమైన వైద్య, శస్త్రచికిత్సా ప్రక్రియలు విజయవంతమై ఆస్పత్రి చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించాయి. ఈ సందర్భంగా జీజీహెచ్ సూపరింటెండెంట్ నాగమోహన్రావ్ తెలిపిన వివరాల ప్రకారం... బురాజీ (65) అనే వ్యక్తి ఇటీవల తీవ్రమైన ఛాతినొప్పితో జీజీహెచ్లో చేరారు. పరీక్షించిన వైద్యులు అక్యూట్ మయోకార్డియల్ ఇన్ఫ్రక్షన్(గుండెపోటు) వచ్చినట్లు నిర్ధారించారు. వెంటనే కార్డియాలజీ బృందం థ్రాంబోలైసిస్ చేసి రోగికి చికిత్స అందించారు. గురువారం రోగికి యాంజియోగ్రామ్లో రైట్ కరోనరీ ఆర్టరీలో తీవ్రమైన బ్లాకేజీ ఉన్నట్లు గుర్తించి కార్డియాలజీ విభాగ వైద్యులు సందీప్, గోపీకృష్ణ, రవికిరణ్ బృందం పీటీసీఏ స్టెంట్ వేశారు. ప్రస్తుతం రోగి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ఈ సందర్భంగా ఆస్పత్రి సూపరింటెండెంట్ నాగమోహన్, డిప్యూటీ సూపరింటెండెంట్ రాములు కార్డియాలజీ బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు. ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి అందిస్తున్న సహకారంతోనే అత్యాధునిక వైద్య సేవలు జీజీహెచ్లో అందుబాటులోకి వచ్చాయని పేర్కొన్నారు. జనరల్ సర్జరీ విభాగాధిపతి విజయ్ కుమార్ నాయకత్వాన్ని, ప్లాస్టిక్ సర్జన్ శివానీ సేవలను వారు ప్రశంసించారు. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత ● జిల్లా అటవీశాఖ అధికారి సిద్ధార్థ్ విక్రమ్సింగ్ నిజామాబాద్ రూరల్: పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని జిల్లా అటవీశాఖ అధికారి సిద్ధార్థ్ విక్రమ్సింగ్ పేర్కొన్నారు. మండలంలోని మల్లారం (ఎం), గాంధీనగర్ గ్రామ శివారులో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని అధికారులతో కలిసి శుక్రవారం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భావితరాల భవిష్యత్తు బాగుండాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పరిరక్షించాలని అన్నారు. కార్యక్రమంలో కాలుష్య నియంత్రణ మండలి నోడల్ అధికారి, స్వచ్ఛంద సంస్థలు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. -
సర్కు సహకరించాలి
● బూత్ లెవెల్ ఏజెంట్ల జాబితాను వెంటనే అందించాలి ● రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : పారదర్శకమైన ఓట రు జాబితా రూపకల్పన కోసం ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రత్యేక ఓటరు జా బితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియకు రాజకీయ పా ర్టీలు సహకరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరా రు. కలెక్టరేట్లో శుక్రవారం జిల్లా స్థాయి రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐఆర్ ప్రక్రియ అమలు విధానం, జిల్లా యంత్రాంగం చేపడుతున్న చర్యల ను కలెక్టర్ వివరించారు. మరణించిన వారి పేర్ల తొలగింపు, శాశ్వతంగా వలస వెళ్లిన వారిని గుర్తించడం, అర్హులైన కొత్త ఓటర్ల పేరును జాబితాలో చేర్చడం కోసమే ఎస్ఐఆర్ జరుగుతోందన్నారు. నిజామాబాద్ అర్బన్ మినహా మిగతా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో 90 శాతం ప్రీ–మ్యాపింగ్ పూర్తయ్యిందని, అర్బన్ సెగ్మెంట్లో 68 శాతం జరిగిందని వివరించారు. జూన్ 25 నుంచి క్షేత్రస్థాయిలో జరుగనున్న ఎస్ఐఆర్ ప్రక్రియకు రాజకీయ పార్టీలు సహకరించాలన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించాలని, ప్రతి ఓటరు తప్పనిసరిగా మ్యాపింగ్ చేసుకునేలా చొరవ చూపా లని కోరారు. ఎస్ఐఆర్ అమలులో బీఎల్వోలతోపాటు బూత్ లెవెల్ ఏజెంట్ల పాత్ర కూడా అత్యంత క్రియాశీలకమని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ నెల 15 నుంచి 24వ తేదీలోపు బీఎల్ఏలు, బీఎల్వోలకు ఎ స్ఐఆర్ అమలు తీరుపై శిక్షణా తరగతులను నిర్వహిస్తామని తెలిపారు. ఈ నెల 25 నుంచి జూలై 24 వరకు బీఎల్వోలు ఇంటింటికీ వెళ్లి సమగ్ర విచారణ చేపడతారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఓటరు పేరుతో ముద్రితమై ఉండి, క్యూఆర్ కోడ్ కలిగిన ఎన్యుమరేషన్ ఫారాలను అందజేస్తారని, ప్రతి ఓట రు తప్పనిసరిగా ఆ ఫారంలోని వివరాలను పూరించి తిరిగి బీఎల్వోలకు అందించేలా చొరవ చూ పాలని కోరారు. బీఎల్వోల నుంచి ఓటీపీలు తీసుకొని బీఎల్ఏలు ఎస్ఐఆర్ ప్రక్రియ చేపట్టకూడదని, అది నేరంగా పరిగణించబడుతుందన్నారు. ఎస్ఐఆర్ షెడ్యూల్ ప్రకారం జూలై 24న పోలింగ్ కేంద్రాలను ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా పునర్వ్యవస్థీకరించడం జరుగుతుందని, 31న ఓటర్ల ముసాయిదా జాబితా ప్రచురిస్తామని వివరించారు. జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు స్వీకరిస్తారని తెలిపారు. అభ్యంతరాలు, క్లెయిములను సెప్టెంబర్ 28 వరకు పరిష్కరించి, అక్టోబర్ 1న తుది ఓటరు జాబితాను అధికారికంగా ప్రచురిస్తామని కలెక్టర్ వెల్లడించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వి.భుజంగరావు, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు బాలరాజు, వివిధ రాజకీయపార్టీల నాయకులు పాల్గొన్నారు. -
చదివింది మరిచిపోకుండా...
మోర్తాడ్(బాల్కొండ): విద్యార్థులు తాము చదువుకున్న పాఠాలు, లెక్కలు ఇతర అంశాలను మరిచిపోకుండా ఉండేందుకు వేసవి సెలవుల్లోనూ నిత్యం రెండు, మూడు గంటలపాటు సమయం కేటాయిస్తున్నారు. గురువు బోయిడి నర్సయ్య నిత్యం వాట్సాప్ గ్రూప్లో ఇచ్చే సూచనలు, సలహాలను పాటిస్తూ పాఠ్యంశాలపై పట్టు సంపాదించుకుంటున్నారు. బాల్కొండ మండలం బస్సాపూర్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు కొన్నేళ్లుగా వేసవి సెలవులను వృథా చేయకుండా చదువుకోసం వినియోగిస్తున్నారు. కరోనా కన్నా ముందు నుంచే బస్సాపూర్ విద్యార్థులు యేటా సెలవుల్లో రెండు, మూడు గంటలపాటు ఆన్లైన్ తరగతులను కొనసాగిస్తుండడం విశేషం. ప్రతి సెలవుల్లోనూ నేను చదువుకున్న పాఠాలు మరిచిపోకుండా ఉండేందుకు మా గురువు నర్సయ్య ఆన్లైన్ క్లాసులను నిర్వహిస్తున్నారు. మేము ఉత్సాహంగా ఆన్లైన్ తరగతులకు హాజరవుతున్నాం. – లతీక్ష, 4వ తరగతి మా సారు పాఠశాలలో చెప్పిన లెక్కలను ఇప్పుడు సెలవుల సమయంలో ప్రాక్టీస్ చేస్తున్నాం. వాట్సాప్లో ఆయన లెక్కలు పంపిస్తే వాటిని ఇంటి వద్ద ప్రాక్టీస్ చేసి తిరిగి వాట్సాప్లో పంపిస్తున్నాం. తప్పులుంటే సరిచేసుకోమంటూ సూచనలు ఇస్తున్నారు. – పి.దేవాన్ష్, 4వ తరగతి పాఠ్యాంశాలు గుర్తుండేలా బొమ్మలను గీస్తూ మా మాస్టర్ పాఠాలు చెప్పారు. ఇప్పుడు హోంవర్క్లో ఆయన చెప్పిన పాఠాలకు అనుగుణంగా బొమ్మలను గీస్తున్నాం. సెలవులను వృథా కాకుండా సద్వినియోగం చేసుకుంటున్నాం. – శివరక్షిత్, 5వ తరగతి మా గురువు రోజు మా తల్లిదండ్రుల వాట్సాప్కు పాఠ్యంశాలకు సంబంధించిన సూచనలు, సలహాలు పంపుతారు. ఆయన సూచించిన విధంగా మేము హోమ్వర్క్ చేసి వాట్సాప్లో పంపిస్తున్నాం. పాఠాలు ఏవీ మరచిపోకుండా గుర్తుంచుకుంటున్నాం. – బి. కారుణ్య, 5వ తరగతి వేసవి సెలవుల్లోనూ ఆన్లైన్లో సలహాలు, సూచనలు ఇంటి వద్దనే ప్రాక్టీస్ చేస్తున్న విద్యార్థులు వాట్సాప్ సమూహం ద్వారా పర్యవేక్షిస్తున్న టీచర్ -
డ్రై డే పక్కాగా నిర్వహించాలి
మాక్లూర్ : ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని అన్ని గ్రామాల్లో ఫ్రై డే, డ్రై డే కార్యక్రమాలను పక్కాగా నిర్వహించాలని డీఎంహెచ్వో రాజశ్రీ వైద్య సిబ్బందిని ఆదేశించారు. శుక్రవారం ఆలూర్ మండలం కల్లెడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి గ్రామంలో పరిశుభ్రత పాటించేలా గ్రామ ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. దోమల నివారణకు తగిన చర్యలు తీసుకునేలా సర్పంచ్లకు తెలియజేయాలన్నారు. ఆరోగ్య సిబ్బంది బాధ్యతయుతంగా పనిచేయాలని సూచించారు. నిజామాబాద్అర్బన్ : పెండింగ్ కేసులను త్వరిగతిన పూర్తిచేయాలని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పేర్కొన్నారు. కమిషనర్ కార్యాలయంలో గ్రేవ్ క్రైమ్ కేసుల దర్యాప్తుపై శుక్రవారం సీఐలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ పోలీస్ స్టేషన్లలో నమోదైన హత్య, హత్యాయత్నం, దోపి డీ, మహిళలు, చిన్నారులపై నేరాలు, ఫోక్సో కేసులు, మోసం, అపహరణ తదితర గ్రేవ్ క్రైమ్ కేసులను సమీక్షించారు. పెండింగ్లో ఉన్న కేసులను త్వరిగతిన పూర్తి చేయాలన్నా రు. కేసు దర్యాప్తులో ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా సాంకేతిక ఆధారాలు, సీసీటీవీ ఫుటేజీ, కా ల్ డేటా విశ్లేషణ చేపట్టాలన్నారు. ప్రతి కేసులో సాక్ష్యాధారాలను పటిష్టంగా సేకరించడం ద్వారా కోర్టులో నిందితులకు శిక్ష పడేలా చూ డాలన్నారు. సమావేశంలో నిజామాబాద్, ఆ ర్మూర్, బోధన్ ట్రాఫిక్ ఏసీపీలు ప్రకాశ్, వెంకటేశ్వర రెడ్డి, శ్రీనివాస్, మస్తాన్ అలీ, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీధర్రెడ్డి, మల్లేశ్, సీసీఆర్ ఇన్స్పెక్టర్ అంజయ్య, సీఐలు, ఎస్హెచ్వోలు తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ అర్బన్ : ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి నుంచి గత నెల 19న కామారెడ్డి జిల్లా తిర్మన్పల్లి గ్రామానికి చెందిన అరవింద్(5) తప్పిపోయాడు. తల్లిదండ్రులు 1వ టౌన్లో ఫిర్యాదు చేయగా, పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. శుక్రవారం బాలుడిని గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు. -
పిల్లలు మీరూ పంపండి..
నేను గీసిన చిత్రం83328 87332ఎం. రిషివర్ధన్, 8వ తరగతి, లయోలా హైస్కూల్, భిక్కనూర్, జిల్లా : కామారెడ్డి. ఖుషి రెడ్డి, 1వ తరగతి, నిజామాబాద్. ఇషాన్, 5వ తరగతి, ప్రభుత్వ పాఠశాల, ఐలాపూర్, కామారెడ్డి. జి.రసజ్ఞ, 6వ తరగతి, శ్రీ సిద్ధార్థ స్కూల్, హైదరాబాద్. ఎం. హర్షవర్ధన్, 6వ తరగతి, భిక్కనూర్, జిల్లా : కామారెడ్డి. హర్ధిక్, 3వ తరగతి, మంజీరా హైస్కూల్, రామాయంపేట్, మెదక్ టి.అతిష్య, 7వ తరగతి, నిర్మల్ టి. అక్షద ప్రియ, 5వ తరగతి, నిజామాబాద్ వేసవి సెలవుల్లో మీ కలానికి పదునుపెట్టి బొమ్మలు గీస్తున్నారా? చిట్టి కథలు రాస్తున్నారా? ఏదైనా పర్యాటక ప్రదేశం సందర్శించా రా? ఆటపాటల్లో విజయం సాధించి పతకాలు అందుకున్నారా? ఈ విషయాలను మీ స్నేహితులు, పాఠకులతో పంచుకోవాలనుకుంటే వాట్సాప్ నంబర్ ద్వారా మాకు పంపండి. మేము ప్రచురిస్తాం. మీ ఫొటో కూడా జతచేయండి. ఊరు.. పేరు.. జిల్లా రాయడం మరువొద్దు సుమా.. -
తీవ్ర విషాదం.. కుంటలో దిగి ముగ్గురు చిన్నారుల మృతి
నిజామాబాద్: జిల్లాలోని భీంగల్ మండలం లింబాద్రిగుట్ట వడ్డెర కాలనీలో తీవ్ర విషాద చాయలు అలుముకున్నాయి. బ్రాహ్మణ కుంటలో పడి ముగ్గురు పిల్లలు దుర్మరణం చెందారు. మృతిచెందిన చిన్నారులను సురేష్(4), వర్షిని(5), హరీష్(10)గా గుర్తించారు. తల్లిదండ్రులకు చెప్పకుండా బయటకొచ్చిన చిన్నారులు ఆడుకుంటూ వెళ్లి బ్రాహ్మణ కుంటలో దిగారు. స్నానం చేద్దామని దిగిన చిన్నారులు అక్కడ లోతు గ్రహించకపోవడంతో అందులోనే మునిగిపోయి మృత్యువాత పడ్డారు. పిల్లలను తల్లిదండ్రులు వెతుక్కునే క్రమంలో బ్రాహ్మణ కుంట వైపు వెళ్లారని ఎవరో చెప్పడంతో అక్కడ గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులు, ఫైర్ సిబ్బంది, గజ ఈతగాళ్లతో గాలించగా చిన్నారుల మృతదేహాలను వెలికితీశారు. దాంతో గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి. విగత జీవులుగా పడి ఉన్న చిన్నారులను చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
భూసేకరణే ప్రధాన సమస్య..
మోర్తాడ్(బాల్కొండ): ఆర్మూర్ నుంచి మంచిర్యాల వరకు 63వ నంబర్ జాతీయ రహదారి విస్తరణకు భూ సేకరణనే ప్రధాన సమస్యగా నిలిచింది. వ్యవసాయ భూములకు తీవ్ర ముప్పు వాటిల్లనుండటంతో కొందరు రైతులు కోర్టును ఆశ్రయించడంతో హైకోర్టు స్టే విధించింది. ఇప్పుడు రెండు లేన్ల రోడ్డుగా ఉన్న జాతీయ రహదారిని నాలుగు లేన్ల రోడ్డుగా విస్తరించడానికి కేంద్ర ప్రభుత్వం గతంలోనే ప్రతిపాదించింది. ఈ నేపథ్యంలో జాతీయ రహదారి విస్తరణకు అవసరమైన భూ సేకరణను త్వరిత గతిన చేపట్టడానికి ఎన్హెచ్ఏఐ రెవెన్యూ శాఖకు ఆదేశాలను జారీ చేసింది. మొదట్లో ఉన్న జాతీయ రహదారిని విస్తరించాలని నిర్ణయించగా కొన్ని గ్రామాల్లో ఇండ్లు, భవనాలకు ముప్పువాటిల్లే ప్రమాదం ఉందని భావించారు. దీంతో ఇండ్లు, భవనాలకు నష్టం వాటిల్లకుండా ఉండటానికి బైపాస్ రోడ్లను నిర్మించాలని కొత్తగా ప్రతిపాదించారు. గతంలో జాతీయ రహదారి విస్తరించాలని నిర్ణయించిన సమయంలో జిల్లాలో 26 కిలోమీటర్ల రోడ్డుకు 72.2671 హెక్టార్ల భూమిని సేకరించాల్సి ఉంటుందని గుర్తించారు. ఇప్పుడు చేసిన కొత్త ప్రతిపాదనలతో బైపాస్ రోడ్లను నిర్మించాలని నిర్ణయించగా 83.895 హెక్టార్ల భూమిని సేకరించాల్సిన అవసరం ఏర్పడింది. -
బాధ్యతగా వ్యవహరించాలి
మోపాల్(నిజామాబాద్రూరల్) : భావితరాలకు నష్టం వాటిల్లకుండా ప్రతిఒక్కరూ బాధ్యతతో వ్యవహరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి హితవు పలికారు. సమాజం కోసం మనం ఏం చేస్తున్నామన్నది గుర్తెరిగి బాధ్యతతో మెలగాలని సూచించారు. ప్రజాపాలన –ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా జిల్లాలో గురువారం గ్రామ, వా ర్డుసభలకు శ్రీకారం చుట్టారు. మోపాల్ మండలం న్యాల్కల్ గ్రామ పంచాయతీ ఆవరణలో సర్పంచ్ చంద్రకళ గంగాప్రసాద్ అధ్యక్షతన జరిగిన గ్రామసభకు కలెక్టర్ ఇలా త్రిపాఠి, సీపీ సాయిచైతన్య ము ఖ్య అతిథులుగా హాజరయ్యారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడు తూ ఎల్నినో ప్రభావంతో ఈసారి వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ సూచనలు చేసిందని, తదనుగుణంగా అనుకూలమైన పంటలు ఎంచుకోవాలని హితవు పలికారు. పంట మార్పిడి విధానాలు అవలంబించాలని, వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తల సలహాలు, సూచనలను పాటిస్తూ నాణ్యమైన ఎరువులు, విత్తనాలను వినియోగించాలని సూచించారు. నాసిరకం, నకిలీ ఎరువులు, విత్తనాలను విక్రయిస్తే కఠినచర్యలు తీసుకుంటామని, అలాంటి డీలర్ల లైసెన్సులు రద్దు చేస్తామని కలెక్టర్ హెచ్చరించారు. తనిఖీల కోసం పోలీస్, రెవెన్యూ, వ్యవసాయ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో టాస్క్ఫోర్స్ బృందాలు ఏర్పాటు చేశామని అన్నారు. పర్యావరణానికి హాని చేకూర్చేలా వరి కొయ్యలకు నిప్పు పెట్టవద్దని సూచించారు. ఇలా చేయడం చట్టరీత్యా నేరమని, బాధ్యులకు రూ.5 వేలు నుంచి రూ.25వేల వరకు జరిమానా విధించే అవకాశాలు ఉంటాయని తెలిపారు. పర్యావరణ సమతుల్యత, పచ్చదనాన్ని పెంపొందించేందుకు విరివిగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఎస్ఐఆర్ ప్రక్రియకు సహకరిస్తూ ఇంటికి వచ్చే బీఎల్వోలకు తగిన వివరాలు అందించాలని కలెక్టర్ సూచించారు. చెరువుల, శిఖం భూములు కబ్జాలకు పాల్పడే వారిపై కఠినచర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. శాంతి భద్రతల పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత శాంతి భద్రతల పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అని పొలీస్ కమిషనర్ సాయి చైతన్య గుర్తుచేశారు. నేరాల నియంత్రణకు ఉపకరించే సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, మత్తు పదార్థాలు, దురలవాట్లకు యువత దూరంగా ఉండాలని హితవు పలికారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు కృషి చేయాలన్నారు. సమావేశంలో డీపీవో శ్రీనివాస్రావు, మండల ప్రత్యేకాధికారి తిరుమల ప్రసాద్, నిజామాబాద్ ఏసీపీ ప్రకాశ్, డీఎల్పీవో శ్రీనివాస్, ఎంపీడీవో రాములు నాయక్, తహసీల్దార్ రేఖ, ఉపసర్పంచ్ సతీశ్ రావు, ఎంఈవో అమ్దాపూర్ సాయిలు, ఏవో జాదవ్ హీరా, వివిధ శాఖల అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. వరి కొయ్యలకు నిప్పు పెడితే రూ.25 వేల వరకు జరిమానా పంట మార్పిడి విధానాలు అవలంబించాలి కలెక్టర్ ఇలా త్రిపాఠి ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’ల్లో భాగంగా గ్రామసభలు ప్రారంభం -
ఢిల్లీ సదస్సులో ‘ఇందూరు పసుపు’
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : ఢిల్లీలోని కాన్స్టిట్యూ షన్ క్లబ్ ఆఫ్ ఇండియాలో గురువారం జరిగిన జాతీయ స్థాయి రైతు ఉత్పత్తిదారుల సంఘాల ఫె డరేషన్ సదస్సులో జిల్లాకు చెందిన ఎఫ్పీవోల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సదస్సులో ఏపీకి చెందిన ఒంగోలు పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాస్రెడ్డిని కలిసిన జిల్లా ప్రతినిధులు జిల్లాలో ని జేఎంకేపీఎం పసుపు రైతు ఉత్పత్తిదారుల సంఘం నుంచి తీసుకెళ్లిన ఆర్గానిక్ పసుపు పొడిని ఆయనకు అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాగుంట మాట్లాడుతూ తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా పసుపునకు మంచి ప్రసిద్ధి చెందిందన్నారు. గ్రామీణ రైతు ఉత్పత్తిదారుల సంఘాలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయాన్ని ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రైతులకు సహకరిస్తానని తెలిపారు. కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా నుంచి ఎఫ్పీవో అధ్యక్షుడు పాట్కూరి తిరుపతిరెడ్డి. మోర్తాడ్ నుంచి కస్పా లక్ష్మీనరసయ్య, మనోహరాబాద్ మైలారం రాజారెడ్డి, జగిత్యాల జిల్లా నుంచి ఇటికాల ఎఫ్పీవో అధ్యక్షుడు గడ్డం రాజేందర్రెడ్డి పాల్గొన్నారు. -
ఐదేళ్లలోపు పిల్లల మరణాలు తగ్గించాలి
● డీఎంహెచ్వో రాజశ్రీసుభాష్నగర్ : గర్భిణులు, చిన్న పిల్లల్లో ప్రమాదక ర లక్షణాలను ముందే గుర్తించి మరణాలను తగ్గించాలని డీఎంహెచ్వో రాజశ్రీ సూచించారు. నగరంలోని కలెక్టరేట్లోగల డీఎంహెచ్వో కార్యాలయంలో ఐదేళ్లలోపు పిల్లల మరణాలపై ఆమె గురువా రం సమీక్షించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్వో మాట్లాడుతూ వైద్యాధికారులు, వైద్య సిబ్బంది మె డికల్ నాలెడ్జ్ను పెంచుకుంటూ వైద్యసేవలను అందించాలన్నారు. సీపీఆర్ పట్ల అందరూ అవగాహన కలిగి ఉండాలని, ప్రతి గర్భిణి, బాలింతను ఫాలో అప్ విజిట్స్లో తల్లిపాల ప్రాముఖ్యతపై వివరించాలని తెలిపారు. డిప్యూటీ డీఎంహెచ్ వోలు రవీందర్, సమత, పిల్లల వైద్య నిపుణులు, సీ్త్ర వైద్య నిపుణులు శ్రీకాంత్, నవీన్, ఉమా, వనిత, డీఐవో అశోక్, 12 పీహెచ్సీల వైద్యాధికారులు, ఏఎన్ఎంలు, ఆశాకార్యకర్తలు పాల్గొన్నారు. -
వర్షం.. హర్షం
జిల్లాలోని పలు ప్రాంతాల్లో గురువారం సాయంత్రం చిరుజల్లులు కురిశాయి. ఇన్నాళ్లూ ఎండవేడిమి, ఉక్కపోత, వడగాల్పులతో ఉక్కిరిబిక్కిరి అయిన జనం.. వర్షం కురవడంతో ఉపశమనం పొందారు. ఇందల్వాయి మండల వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. దీంతో పొలం మడుల్లో వర్షపునీరు నిలిచింది. ఖరీఫ్ సీజన్ ప్రారంభించేందుకు ఎదురుచూస్తున్న రైతుల్లో చిరుజల్లులు సంతోషాన్నిచ్చాయి. దీంతో వరి నారు పోసుకునేందుకు సిద్ధమవుతున్నారు. – ఇందల్వాయిఇందల్వాయి మండల శివారులో పొలాల్లోకి చేరిన వర్షపు నీరు -
జాతీయ రహదారులకు మహర్దశ
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ఉత్తర తెలంగాణలో రవాణాకు అత్యంత కీలకమైన 63వ నంబర్ జాతీ య రహదారి ఆర్మూర్–జగిత్యాల–మంచిర్యాల వరకు, 563వ నంబర్ జాతీయ రహదారి జగిత్యా ల–కరీంనగర్ రోడ్లకు మహర్దశ పట్టనుంది. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆధ్వర్యంలో కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 190.76 కిలోమీటర్ల మేర ఈ రోడ్ల ను విస్తరించేందుకు గాను రూ.7,597.16 కోట్ల ని ధులు కేటాయించేందుకు నిర్ణయించారు. ఈ రో డ్లను నాలుగు లేన్లుగా అభివృద్ధి చేయనున్నారు. ఉత్తర తెలంగాణలోనే అత్యధిక జనసాంద్రత ఉన్న రోడ్డు కావడంతో పలుచోట్ల బైపాస్లను నిర్మించనున్నారు. అంక్సాపూర్, కోరుట్ల, జగిత్యాల, ధర్మపురి, లక్సెట్టిపేట, మంచిర్యాల, పోతారం, గంగాధర ప్రాంతాల్లో ఈ బైపాస్లు నిర్మాణం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. దీంతో రద్దీ నివారించడంతో పాటు ట్రాఫిక్ సమస్యలు అధిగమించనున్నారు. వీటి నిర్మాణంతో ఆర్మూర్ నుంచి మంచిర్యాలకు గంటన్నర ప్రయాణ సమయం, జగిత్యాల నుంచి కరీంనగర్కు 54 నిముషాల ప్రయాణ స మయం ఆదా కానుంది. ఈ రోడ్డు నిర్మాణంలో భా గంగా టోల్ గేట్ల ఏర్పాటు లేకుండా, ఎక్కడా ఆగకుండా 100 కిలోమీటర్ల వేగంతో వెళ్లేలా డిజైన్ చేశా రు. ఆధునిక ఎలక్ట్రానిక్ వ్యవస్థ ద్వారా టోల్ చార్జి నేరుగా తీసుకునేలా ఏర్పాట్లు చేయనున్నారు. ఈ రోడ్డు కోసం నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ గతంలో పలుసార్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసి విన్నవించారు. ఈ క్రమంలో తాజాగా ఈ రోడ్లను మంజూరు చేయడంపై అర్వింద్ ప్రధాని మోదీకి, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి, కేంద్ర కేబినెట్కు ధన్యవాదాలు తెలిపారు. ప్రమాదాల బెడద తప్పనుంది పెర్కిట్ నుంచి జగిత్యాల, కరీంనగర్ జిల్లాలకు వెళ్లే మార్గాన్ని నాలుగు లేన్లు గా విస్తరిచండం హర్షించదగ్గ విషయం. రహదారి విస్తరణతో రోడ్డు ప్రమాదాల బెడద తప్పనుంది. ఇక నుంచి ఆయా జిల్లాలకు వెళ్లే వారు నిబ్బరంగా ప్రయాణించవచ్చు. – జక్కుల మోహన్, ఆరోగ్య కార్యకర్త, పెర్కిట్ప్రయాణం సాఫీగా.. ముఖ్యంగా జగిత్యాల, కరీంనగర్ జిల్లాలో ఉన్న పుణ్యక్షేత్రాల దర్శానికి వెళ్లే ఇతర జిల్లాల వా రికి రహదారి విస్తరణతో ఉపశమనం లభించనుంది. ప్రస్తుతం ఉన్న ఇరుకై న మార్గం వెంట అ నేక భారీ వాహనాలు ప్రయాణిస్తుండడంతో రోడ్డు ప్ర మాదాలు జరిగేవి. రహదారి విస్తరణతో ప్రమాదాల సంఖ్య తగ్గే అవకాశం ఉంది. – వి లక్ష్మీనారాయణ, ప్రభుత్వ ఉపాధ్యాయుడు, పెర్కిట్ 63, 563 నంబర్ల జాతీయ రహదారులను నాలుగు లేన్లుగా మార్చేందుకు కేంద్రం పచ్చజెండా 190.76 కిలోమీటర్లకు రూ.7,597.16 కోట్లు కేటాయింపు ఆర్మూర్ నుంచి మంచిర్యాలకు తగ్గనున్న గంటన్నర ప్రయాణ సమయం కేంద్ర ప్రభుత్వానికి ఎంపీ అర్వింద్ ధన్యవాదాలు -
నిజామాబాద్
శ్రీరాం సాగర్లోబహిరంగ చర్చకు సిద్ధం అవినీతిపై బహిరంగ చర్చకు తాను సిద్ధమని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ మాజీ ఎమ్మెల్యే బిగాలకు సవాల్ విసిరారు.శుక్రవారం శ్రీ 5 శ్రీ జూన్ శ్రీ 2026– 8లో uసాక్షి ప్రతినిధి, నిజామాబాద్: 18 లక్షల ఎకరాల ఆయకట్టు కలిగిన ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్ జలాశయంలో నీటి నిల్వ ప్రస్తుతం కేవలం 16.26 టీఎంసీలు మాత్రమే ఉంది. ఇందులో డెడ్ స్టోరేజీ 5 టీఎంసీలు, 5 టీఎంసీలు తాగునీటి అవసరాలు పోను మిగిలేది 6.26 టీఎంసీలు మాత్రమే కావడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం (1,091అడుగులు) 80.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం 16.26 టీఎంసీలకు పడిపోయింది. గత సీజన్లో జలాశయంలోకి ఎగువ నుంచి భారీగా వరద వచ్చినప్పటికీ పూడిక కారణంగా నీటి నిల్వ చేయలేక దిగువకు వదిలారు. నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోవడంతో కొంత మాత్రమే నీరు ఉంది. దీంతో మెండోరా, బాల్కొండ, ముప్కాల్ మండలాల్లో బోర్లు ఎండిపోవడం, భూగర్భ జలాలు పడిపోతున్నట్లు రైతులు చెబుతున్నారు. పూడికను తొలగించి నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచాలని కోరుతున్నారు. లేనిపక్షంలో భవిష్యత్తులో తాగు, సాగునీటి సమస్యలు మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉందంటున్నారు. ఎగువన ఉన్న మహారాష్ట్రలో భారీగా వర్షాలు కురిసి వరద వస్తేనే జలాశయంలోకి నీరు వస్తుంది. లేకుంటే గడ్డు పరిస్థితే. ఈసారి ఎల్నినో ప్రభావం ఉంటుందంటున్న హెచ్చరికల నేపథ్యంలో ఆయకట్టు రైతులతో పాటు సాధారణ ప్రజల్లోనూ ఆందోళన నెలకొంది. ధర్పల్లి మండలంలో 1 టీఎంసీ నీటి నిల్వ సామర్థ్యం కలిగిన రామడుగు జలాశయంలో ఇప్పటికే 0.3 టీఎంసీల పూడిక చేరినట్లు అధికారులు తెలిపారు. కాగా ప్రస్తుతం జలాశయంలో 185 మిలియన్ క్యూసెక్కుల (మిలియన్ క్యూబిక్ ఫీట్లు) నీరు మాత్రమే ఉంది. ఇది డెడ్ స్టోరేజీ అని అధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్టు కింద ధర్పల్లి, డిచ్పల్లి, జక్రాన్పల్లి, భీమ్గల్, వేల్పూర్ మండలాల్లోని సాగుభూములకు కుడి, ఎడమ కాలువల ద్వారా 6,100 ఎకరాలకు సాగునీరు అందుతుంది. దీన్ని 1964లో నిర్మించారు. ప్రస్తుతం ప్రాజెక్టుకు నిధులు కేటాయించకపోవడంతో కుడి, ఎడమ కాలువలో ముళ్ల పొదలు పెరిగి చివరి ఆయకట్టుకు నీరు అందే పరిస్థితి లేకుండా పోయింది. పలుచోట్ల కాలువలకు సీసీ లైన్లు దెబ్బతినడంతో నీటిని వదిలినప్పుడు లీకేజీ అవుతున్నాయి. ఎడపల్లి మండలంలోని అలీసాగర్ జలాశ యంలో మాత్రం నీటి నిల్వ సామర్థ్యం 1299.6 అ డుగులు కాగా ప్రస్తుతం నీటి నిల్వ 1295.6 అడు గుల మేర ఉంది. అలీసాగర్ నుంచి ప్రతిరోజూ ని జామాబాద్ నగర ప్రజలకు తాగునీటి కోసం ఫిల్టర్ బెడ్ ద్వారా 30 క్యూసెక్కులు సరఫరా జరుగుతోంది. జలాశయంలోని నీరు మరో 28 రోజుల వరకు నిజామాబాద్ నగరానికి తాగునీటి సరఫరాకు సరిపోతాయి. దీని కింద ఎడపల్లి మండలంలో 18వేల ఎకరాలకు సాగునీరు సరఫరా అవుతుంది. ఎస్సారెస్పీలో తగ్గుతున్న నీటి నిల్వలుడెడ్ స్టోరేజీకి 5 టీఎంసీలు.. తాగునీటికి 5 టీఎంసీలు.. ఇక మిగిలింది 6.36 టీఎంసీలే ఎగువ మహారాష్ట్రలో వర్షాలు కురిసి వరద వస్తేనే ఈసారి ఊరట రామడుగు జలాశయంలోనూ డెడ్ స్టోరేజీకి పడిపోయిన నీటి నిల్వ -
వలలు తొలగించిన అటవీ అధికారులు
డొంకేశ్వర్(ఆర్మూర్) : శ్రీరాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ప్రాంతంలో అటవీ శాఖ అధికారులు గురువారం ముమ్మర తనిఖీలు చేపట్టారు. నీరు తగ్గిన ప్రాంతాల్లో మత్స్యకారులు వదిలి వెళ్లిన పాత వేట వలలను ఆర్మూర్ ఎఫ్డీవో చంద్రశేఖర్ ఆధ్వర్యంలో డిప్యూటీ ఎఫ్ఆర్వో సుధాకర్, బీట్ ఆఫీసర్ లింబాద్రిలు గుర్తించి వాటిని తొలగించారు. వన్యప్రాణులు, జింకలు, పక్షులు ఈ వలలలో చిక్కుకుని ప్రమాదాల బారిన పడే అవకాశం ఉందని, అందుకే తొలగింపు చర్యలు చేపట్టినట్లు వారు తెలిపారు. మత్స్యకారులు పాత వలలను వదిలి వెళ్లకూడని అధికారులు వారికి సూచించారు. నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం సుభాష్నగర్ : నగరంలోని 33/11కేవీ వినాయక్నగర్ 11 కేవీ ఫీడర్–1 ఏబీ స్విచ్ఛుల మరమ్మతుల కారణంగా శుక్రవారం ఉద యం 9 నుంచి 11 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని టౌన్–3 ఏడీఈ వినోద్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. వినాయక్నగర్లోని నసీ మ్కాలనీ, తెలంగాణ తల్లి ఏరియా, యాద గిరి బాగ్, మహాన్, అమృతగంగా అపార్ట్మెంట్లు, గాయత్రినగర్ రోడ్–1, మార్కండేయ ఆలయం, షాదుల్లా దర్గా, దోబీగల్లి, నకాష్ గల్లి, ఆర్యసమాజ్ ఏరియా, బాలికల హైస్కూల్, సిర్నాపల్లి గడి తదితర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఉండదని పేర్కొ న్నారు. విద్యుత్ వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు. బడిబాట షార్ట్ ఫిలిం విడుదల ఖలీల్వాడి: జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్లో గురువారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ నేతృత్వంలో, సమగ్ర శిక్షా సౌజన్యంతో రూపొందించిన ‘బడిబాట’ షార్ట్ ఫిల్మ్ను జిల్లా అదనపు కలె క్టర్ (స్థానిక సంస్థలు) భుజంగరావు విడుదల చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. నాణ్యమైన విద్య ప్రభుత్వ బడిలో నే అందుతున్నదనీ, తల్లిదండ్రులు తమ పి ల్లలను చేర్పించాలని పిలుపునిచ్చారు. డీఈవో అశోక్ మాట్లాడుతూ.. తల్లిదండ్రులని చైతన్యవంతుల్ని చేస్తూ, పిల్లలందరినీ ప్రభు త్వ బడిలో చేర్పించేలా ప్రోత్సహించడానికి ఈ షార్ట్ ఫిల్మ్ను రూపొందించినట్లు తెలిపారు. అనంతరం షార్ట్ ఫిల్మ్ రచన, దర్శకత్వం వహించిన డా.కోకిల నాగరాజు, నటించిన డాక్టర్ కాసర్ల నరేశ్ రావు, చింతల శ్రీనివాస్ గుప్తా, రాజశేఖర్ను అభినందించారు. డీసీఈబీ సెక్రెటరీ సీతయ్య, విద్యా శాఖ సెక్టోరియల్ అధికారులు శ్రీధర్రెడ్డి, శ్రీనివాసరావు, బాలకృష్ణారావు, భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
నేను గీసిన చిత్రం
హన్విక యూకేజీ హైదరాబాద్ ఏ దీక్షిత 2వ తరగతి జీవదాన్ హైస్కూల్ లింగంపేట జిల్లా : కామారెడ్డి టి హయగ్రీవ్ 3వ తరగతి నిర్మల్ అతిషయ 7వ తరగతి నిర్మల్ బి రిష్వంత్ 6వ తరగతి మంజీర హై స్కూల్ రామాయంపేట జిల్లా: మెదక్ -
సీఎంపై అసత్య ఆరోపణలు చేస్తే సహించం
డిచ్పల్లి(నిజామాబాద్రూరల్): సీఎం రేవంత్రెడ్డిపై బీఆర్ఎస్ నాయకులు అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాటిపల్లి నగేశ్రెడ్డి హెచ్చరించారు. మండలంలోని ముల్లంగి(ఐ)లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గురువారం ఆయన మాట్లాడారు. రైతు డిస్కం వల్ల రైతులకు ఉచిత కరెంట్ తొలగించే కుట్ర చేస్తున్నారని, దీనివెనక వేల కోట్ల స్కాం ఉందని ప్రశాంత్రెడ్డి ఆరోపించడం సిగ్గు చేటన్నారు. పదేళ్లలో ఎలాంటి అభివృద్ధి చేయకుండా రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి కాలం వెళ్లదీసిన బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు కాంగ్రెస్ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే విమర్శలు చేస్తున్నారన్నారు. తమ ఉనికి కాపాడుకోవడానికి బీఆర్ఎస్ నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు అసత్య ఆరోపణలకు పాల్పడుతున్నారని, కుంభకోణాలు చేసిన ఘనత వారికే దక్కుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ ధరలు, ఎరువుల ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. లేదంటే కాంగ్రెస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. సర్పంచ్ శ్రీనివాస్, మాజీ ఎంపీపీ చిన్నోల్ల నర్సయ్య, సొసైటీ చైర్మన్ గ్యానాజి గంగారెడ్డి, నాయకులు అశోక్, మదుసూదన్, నితిన్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. -
హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం
● డిచ్పల్లి శివారులో కారును వెనుకనుంచి ఢీకొన్న బైక్ ● ఇద్దరు యువకులు కిందపడగా, లారీ వెళ్లడంతో మృతి భిక్కనూరు: మండలంలోని జంగంపల్లి శివారులోని హైవే పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందినట్లు భిక్క నూరు ఎస్సై అంజనేయులు తెలిపారు. వివరాలు ఇలా.. దోమకొండ మండలం సంగమేశ్వర్ గ్రామానికి చెందిన కొమ్ము మహేష్ (30) బిచ్కుంద ప్రభుత్వ డిగ్రీ కళశాలలో అటెండర్గా పనిచేస్తున్నాడు. గురువారం అతడు సొంత ప నుల నిమిత్తం సంగమేశ్వర్ నుంచి కామారెడ్డికి బైక్ పై బయలుదేరాడు. జంగంపల్లి గ్రామశివారులో గు ర్తు తెలియని వాహనం ఢీకొని అతడి పైనుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భా ర్య అనురాధ ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై అంజనేయులు వివరించారు. జంగంపల్లి గ్రామశివారులో గురువా రం మధ్యాహ్నం ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో హైవే పక్కన ఉన్న ఓ చెట్టు రోడ్డుపై పడింది. ఆ సమయంలోనే మహేష్ చెట్టును తప్పించి, నెమ్మదిగా వెళ్లడంతోనే గుర్తుతెలియని వాహనం ఢీకొన్నట్లు స్థానికులు భావిస్తున్నారు. డిచ్పల్లి(నిజామాబాద్రూరల్): మండల కేంద్రం శివారు నాగ్పూర్ గేట్ సమీపంలో 44వ నెంబరు జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. డిచ్పల్లి సీఐ వినోద్, ఎస్సై ఎండీ ఆరీఫ్ తెలిపిన వివరాలు ఇలా.. జక్రాన్పల్లి మండలం వైఎస్సార్ కాలనీకి చెందిన చిన్న స్వామి అలియాస్ నవీన్ (20) డిగ్రీ చదువుతుండగా, బలరాం అలియాస్ నాని (24) స్టోన్ కట్టర్గా పనిచేస్తున్నాడు. గురువారం మధ్యాహ్నం ఇద్దరూ కలిసి బైక్పై ధర్పల్లి నుంచి జక్రాన్పల్లికి బయలుదేరారు. డిచ్పల్లి నాగ్పూర్ గేట్ సమీపంలో హైవేపై మూలమలుపు వద్ద వారి ముందువెళ్తున్న కారును తప్పించబోయి, కారు వెనక భాగాన్ని ఢీకొన్నారు. దీంతో ఇద్దరు బైక్తోపాటు కిందపడిపోయారు. అదే సమయంలో వీరి వెనకే వస్తున్న లారీ వీరిద్దరిపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న సీఐ వినోద్, ఎస్సై ఎండీ ఆరిఫ్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుల కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న సీపీ సాయిచైతన్య సైతం సాయంత్రం ఘటనా స్థలాన్ని సందర్శించారు. అనంతరం జాతీయ రహదారి అధికారులు, రవాణా శాఖ, పోలీసు అధికారులతో మాట్లాడారు. భవిష్యత్లో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఏసీపీ ప్రకాష్, డిచ్పల్లి సీఐ వినోద్, ఎస్సై ఆరిఫ్, అధికారులు ఉన్నారు. బలరాం (ఫైల్) చిన్న స్వామి (ఫైల్) -
తాళం వేసిన మూడిళ్లల్లో చోరీ
● 4 తులాల బంగారం, రూ.55 వేలు ఎత్తుకెళ్లిన దుండగులు డిచ్పల్లి: మండలంలోని సుద్దపల్లి గ్రామంలో బుధవారం అర్ధరాత్రి తాళం వేసిన మూడిళ్లల్లో గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. సుద్దపల్లి గ్రామానికి చెందిన మలావత్ నరేష్ ఇంటికి తాళం వేసి కుటుంబసభ్యులతో కలిసి వేరే ఊరికి వెళ్లాడు. అలాగే గ్రామానికి చెందిన చింతం రాజశేఖర్, సుమన్ (అన్నదమ్ములు) తమ ఇళ్లకు తాళాలు వేసి డాబాలపై నిద్రించారు. బుధవారం అర్ధరాత్రి ఇద్దరు దుండగులు చేతిలో రాడ్లు పట్టుకుని వచ్చి మొదట నరేష్ ఇంటి వద్ద ఉన్న సీసీ టీవీ ధ్వంసం చేసి, తాళం పగులగొట్టి ఇంట్లో దాచుకున్న రూ.3తులాల బంగారం, రూ.45వేలు ఎత్తుకెళ్లారు. అనంతరం రాజశేఖర్, సుమన్ ఇళ్లలోని తులం బంగారం, రూ.10వేలు ఎత్తుకెళ్లారు. రాజశేఖర్ భార్య ఫోన్ను దొంగిలించారు. ఓ దుండగుడు తన కత్తిని అక్కడే మర్చిపోయాడు. వారి అలజడికి నిద్రలేచి కిందకు వచ్చిన బాధితులు చోరీ జరిగిన విషయాన్ని గమనించి గురువారం పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ వినోద్, ఎస్సై ఆరిఫ్ ఘటన స్థలానికి చేరుకొని, వివరాలు సేకరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు తెలిపారు. -
క్రమశిక్షణ, సరైన మార్గదర్శకత్వం విజయానికి మూలం
ఖలీల్వాడి: క్రమశిక్షణ, సరైన మార్గదర్శకత్వం వి జయానికి మూలమని మాజీ ఐపీఎస్ అధికారి, జే డీ లక్ష్మీనారాయణ తెలిపారు. దేశంలో జరిగే ఐఐటీ–జేఈఈ, నీట్ శిక్షణలో ఇస్తున్న రెసోనెన్స్ వి ద్యాసంస్థ సెంటర్ను నిజామాబాద్లోని ఓ ఇంట ర్నేషనల్ హోటల్ వేదికగా గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచే బలమైన విద్యా పునాదిని నిర్మించుకోవాల్సిన అవస రం ఎంతైనా ఉందన్నారు. నిజామాబాద్లో ఫౌండేషన్ కోచింగ్ను అందుబాటులోకి తీసుకువస్తు న్న రెసోనెన్స్ విద్యాసంస్థలను అభినందించారు. 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. రెసోనెన్స్ ఎండీ పూర్ణచంద్రరావు నర్రా మాట్లాడుతూ అనుభవజ్ఞులైన అ ధ్యాపకులు, క్రమబద్ధమైన బోధనా, నిరంతర వి ద్యా పర్యవేక్షణతో ఫలితాల ఆధారిత విద్యను అందించడానికి కట్టుబడి ఉందన్నారు. ఈ సెంటర్ విద్యార్థులకు ప్రాథమికాంశాలను బలోపేతం చేసుకోవడానికి, ఐఐటీ–జేఈఈ, నీట్, ఒలింపియాడ్స్ వంటి పోటీ పరీక్షలకు ఆత్మవిశ్వాసంతో సిద్ధమవడానికి సహాయపడుతుందని తెలిపారు. -
అవినీతిపై బహిరంగ చర్చకు సిద్ధం
● మాజీ ఎమ్మెల్యే బిగాలకు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సవాల్ సుభాష్నగర్: తాను ఒక్కరూపాయైన అవినీతికి పాల్పడినట్లు నిరూపిస్తే బహిరంగ చర్చకు సిద్ధమని మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తాకు నిజామాబా ద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ స వాల్ విసిరారు. నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తాలోగల గణపతి ఆలయానికి తాను వస్తానని బిగాల వస్తా రా? అని ప్రశ్నించారు. నగరంలోని బీజేపీ కార్యాల యంలో గురువారం ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ధన్పాల్ మాట్లాడారు. అవినీతి, అభివృద్ధిపై కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనే దమ్ములేక బిగాల తనపై ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. తా ను ఎమ్మెల్యే బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఒక్క గుంట భూమి కూడా కొనుగోలు చేయలేదని, బిగా ల మాత్రం నగరంలో ఒక్క గుంట కూడా విడిచిపెట్టలేదని విమర్శించారు. రూ.4 కోట్ల మినీ ట్యాంక్బండ్ కాంట్రాక్ట్ అంచనా వ్యయాన్ని అమాంతంగా రూ.40 కోట్లకు పెంచి అవినీతికి బిగాల పాల్పడ్డా డని ఆరోపించారు. కార్పొరేషన్లో 330 మంది పని చేయకున్నా.. చేసినట్లుగా రికార్డుల్లో చూయించి నెలకు రూ.50లక్షల వరకు దోచుకున్నాడని విమర్శించారు. స్రవంతిరెడ్డి, ప్రమోద్, జ్యోతి, రాజు, కి షన్, ప్రభాకర్, గిరిబాబు, విజయ్ పాల్గొన్నారు. -
తాటి చెట్లు దగ్ధం
ధర్పల్లి: మండలంలోని ద మ్మన్నపేట్ గ్రామ శివారులో గల చెరువు కట్టపై ఇరువైపులా ఏర్పాటుచేసిన తాటి వ నంలో ప్రమాదవశాత్తు జరిగిన అగ్ని ప్రమాదంలో 200 తాటి చెట్లు దగ్ధమయ్యాయి. జీవనోపాధి చూపించే చెట్లు దగ్ధమవడంతో గీత కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభు త్వం తమను ఆదుకోవాలని కోరారు. కామారెడ్డి అర్బన్: తెలంగాణ రెడ్డి సంఘాల ఐక్య వేదిక రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షుడిగా నల్లవెల్లి కరుణాక ర్ రెడ్డి నియమితులయ్యారు. వ్యవస్థాపక అధ్యక్షు డు ఏనుగు సంతోష్రెడ్డి ఆధ్వర్యంలో గురువారం రాష్ట్ర నూతన కమిటీని ఎన్నుకోగా కామారెడ్డి జిల్లా కు చెందిన కరుణకర్రెడ్డి మూడోసారి ఎన్నికయ్యా రు. రాష్ట్ర అధ్యక్షుడు నాగర్తి చంద్రారెడ్డి గురువారం నియామక పత్రం అందజేశారు. ప్రధాన కార్యదర్శి తిరుపతిరెడ్డి, ప్రతినిధులు గోపాల్రెడ్డి, రాజ్కుమా ర్రెడ్డి, సుమన్రెడ్డి, లింగారెడ్డి పాల్గొన్నారు. -
నదిలో పడి పశువుల కాపరి మృతి
నవీపేట: మండలంలోని యంచ గోదావరి నదిలో పడి ప్రమాదవశాత్తు పశువుల కాపరి మృతి చెందినట్లు ఎస్సై శ్రీకాంత్ గురువారం తెలిపారు. వివరాలు ఇలా.. నిర్మల్ జిల్లా బాసరకు చెందిన మ్యాతరి నారాయణ(44)కు వివాహం కాలేదు. ఈనెల 2న ఎప్పటిలాగే పశువులను మేపుతూ గోదావరి నదిలో నీటిని తాగించేందుకు తీసుకువెళ్లాడు. నదిలోకి దిగిన నారాయణ ప్రమాదవశాత్తు అందులో పడి ఊపిరాడక మృతి చెందాడు. సాయంత్రం ఎప్పటిలాగే పశువులు ఇంటికి వెళ్లగా, నారాయణ ఇంటికి రాకపోవడంతో కుటుంబీకులు ఎంత వెతికినా అతడి ఆచూకీ లభించలేదు. గురువారం ఉదయం నదిలో ఆయన మృతదేహం లభ్యం కావడంతో మృతుడి సోదరి పోశవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మోపాల్: మండలంలోని న్యాల్కల్ చెరువులో పడి ఓ వృద్ధుడు మృతిచెందినట్లు ఎస్సై జాడె సుస్మిత తెలిపారు. వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన కర్రెళ్ల చిన్న శంకర్ (60)కు గత కొంతకాలంగా మానసిక పరిస్థితి సరిగా లేదు. ఈనెల 3న తన గొర్రెలను చూసి వస్తానని ఇంటి నుంచి వెళ్లి, మళ్లీ తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎంత వెతికినా అతడి ఆచూకీ లభించలేదు. గురువారం మధ్యాహ్నం చెరువు కట్టపై అతడి దుస్తువులు, చెప్పులు కనిపించడంతో చెరువులో గాలించగా మృతదేహం లభ్యమైంది. సమచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లాకేంద్రాస్పత్రికి తరలించారు. మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. కామారెడ్డి క్రైం: చేపలు పట్టడానికి వెళ్లిన ఓ యువకుడు ప్రమాదవశాత్తు మృతి చెందిన ఘటన కామారెడ్డి పెద్ద చెరువులో గురువారం వెలుగుచూసింది. వివరాలు ఇలా.. మున్సిపల్ పరిధిలోని సరంపల్లి గ్రామానికి చెందిన బొడ్డారి స్వామి (25) అనే యువకుడు బుధవారం చేపలు పట్టడానికి కామారెడ్డి పెద్ద చెరువుకు వెళ్లాడు. మళ్లీ ఇంటికి తిరిగి రాలేదు. దీంతో గురువారం ఉదయం కుటుంబ సభ్యులు, గ్రామస్తులు చెరువు వద్దకు వెళ్లి చూడగా నీటిలో అతడి మృతదేహం కనిపించింది. దేవునిపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీయించారు. చేపల కోసం నీటిలోకి దిగగా, ఫిట్స్ రావడంతో నీటమునిగి మృతిచెందినట్లు లుస్తోంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జనరల్ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
జీజీహెచ్లో ప్లాస్టిక్ సర్జరీలు విజయవంతం
సుభాష్నగర్: నగరంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో జరిగిన తొలి, క్లిష్ట ప్లాస్టిక్ సర్జరీలు రెండు విజయవంతమయ్యాయని సూపరింటెండెంట్ డాక్టర్ బీవీ నాగమోహన్ తెలిపారు. కామారెడ్డి జిల్లా గాంధారి మండలానికి చెందిన లచ్చవ్వ ముఖంపై ఎడ మ కన్ను కింద భాగంలో బాసల్ సెల్ కార్కినోమ వ్యాధితో బాధపడుతోంది. వ్యాధి నిర్ధారణ కావడంతో శస్త్రచికిత్స విభాగాధిపతి డాక్టర్ విజయ్కుమార్ పర్యవేక్షణలో ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ శివానీ ఆధ్వర్యంలో రొటేషన్ ఫ్లాప్ రీకన్స్ట్రక్షన్ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. అదేవిధంగా నగరానికి చెందిన మమత కాలిభాగంలో దీర్ఘకాలంగా మానని గాయం కారణంగా తీవ్రంగా బాధపడుతోంది. ఆమెకు ఫ్లాప్ కవర్, స్ల్పిట్ థిక్నెస్ స్కిన్ గ్రాఫ్టింగ్ శస్త్రచికిత్సలను విజయవంతంగా పూర్తిచేశారు. చికిత్స ద్వారా రోగులు సాధారణ జీవన విధానానికి తిరిగి చేరుకునే అవకాశం కలిగిందని సూపరింటెండెంట్ నాగమోహన్ తెలిపారు. ఆధునిక ప్లాస్టిక్ సర్జరీ సేవల ద్వారా ప్రజలకు నాణ్యమై న వైద్యం జీజీహెచ్లో అందుతుందని పేర్కొన్నా రు. ప్రజలకు అత్యాధునిక సేవలు అందించేందుకు ఆస్పత్రి వైద్యబృందం కట్టుబడి ఉందన్నారు. వైద్యుల బృందాన్ని అభినందించారు. -
విద్యుత్ డిస్కమ్ల విభజన వెనుక రూ. వేల కోట్ల స్కామ్
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: నరేంద్రమోదీ, చంద్రబాబునాయుడులకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఏజెంట్గా పనిచేస్తున్నరని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి విమర్శించారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు, ఎస్ఐఆర్ మీద అవగాహనపై విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యుత్ డిస్కమ్లను మూడు ముక్కలు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం తెస్తున్న కొత్త విధానం వెనుక వేలకోట్ల స్కామ్ దాగిఉందన్నారు. ఫ్యాక్టరీలు, కమర్షియల్, గృహ అవసరాలకు సంబంధించి ఆదాయం వచ్చే డిస్కమ్లను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించి రూ.వేల కోట్లు దండుకునేందుకు పథకం వేశారన్నారు. ఆదాయం లేని, బిల్లులు రాని రైతు వ్యవసాయ, మిషన్ భగీరథ, లిఫ్ట్ ఇరిగేషన్ కనెక్షన్లను కలిపి ’రైతు డిస్కమ్’గా మారుస్తున్నారన్నారు. గతంలో ఏటా రూ.10 వేల కోట్లు ఉచిత వ్యవసాయ విద్యుత్ కోసం వాడేవాళ్లమన్నారు. ఇప్పుడు రూ.35 వేల కోట్ల బాకీని రైతు డిస్కమ్లపై నెడుతున్నారని ఆరోపించారు. రైతులకు ఉచిత విద్యుత్ అందకుండా కుట్ర చేస్తున్నారన్నారు. నగరంలోని రైల్వేస్టేషన్ సమీపంలో బస్స్టేషన్ కోసం కేటాయించిన స్థలాన్ని కాంగ్రెస్ పార్టీ కోసం దండుకున్నారన్నారు. పవన్ కళ్యాణ్ తెలంగాణ గడ్డపైకొచ్చి పునర్నిర్మాణం గురించి మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రతి వార్డు లో విజయవంతం చేయాలని ప్రశాంత్ రెడ్డి కోరా రు. ‘సర్’ కింద అర్హులైన వారి ఓట్లు తొలగిపోకుండా బీఆర్ఎస్ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలన్నా రు. మాజీ ఎమ్మెల్యేలు బిగాల గణేశ్ గుప్తా, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్లు మాట్లాడుతూ పార్టీ సభ్యత్వ నమోదును బాధ్యతగా తీసుకోవాలన్నారు. మాజీ ఎమ్మె ల్సీ వీజీ గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు హనుమంత్ సింధే, జాజాల సురేందర్, కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్సింగ్, నీతు కిరణ్, నుడా మాజీ చైర్మన్ ప్ర భాకర్ రెడ్డి, సిర్పరాజు, సత్య ప్రకాష్ పాల్గొన్నారు. మోదీ, చంద్రబాబులకు ఏజెంట్గా సీఎం రేవంత్రెడ్డి రైతులకు ఉచిత విద్యుత్ తొలగించేందుకు కుట్ర బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు సభలో ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి -
మంజీర నదిలో ఉద్రిక్తత
బోధన్: మంజీర నదిలోని మన భూభాగంలో మ హారాష్ట్ర కాంట్రాక్టర్ల ఇసుక తవ్వకాలను రెవెన్యూ, పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. బుధవారం సాలూర మండల తహసీల్దార్ అజ్మీత్ నవాజ్, రెవెన్యూ సిబ్బంది, బోధన్ ఏసీపీ శ్రీనివాస్ నేత్రుత్వంలో డివిజన్ పరిధిలోని బోధన్ రూరల్, ఎడపల్లి, రెంజల్, రుద్రూర్ మండలాల సీఐలు, ఎ స్సైలు, సిబ్బంది కలిసి సాలూర మండలం హు న్సా, మందర్నా గ్రామ శివారులోని మంజీర నదిలోకి వెళ్లారు. అక్కడ మన భూభాగంలో ఇసుక త వ్వకాలు జరుపుతున్న మహారాష్ట్రలోని బిలోలి తాలూకా బోలేగాం ఇసుక క్వారీ జేసీబీలను అడ్డుకున్నారు. ఈ క్రమంలో బోలేగాం క్వారీ నిర్వాహకుల అనుచరులు, ఆ గ్రామస్తులు పదుల సంఖ్యలో వచ్చి మన పోలీసు అధికారులతో వాగ్వాదానికి దిగారు. మా ప్రాంతంలోనే ఇసుక తవ్వకాలు సాగు తున్నాయని వాదించారు. వాగ్వివాదాల అనంతరం మంజీర నదిలో సరిహద్దులను గుర్తించేందుకు జాయింట్ సర్వే నిర్వహించాలని ఇరు రాష్ట్రా ల రెవెన్యూ, పోలీసు అధికారులు ఒక అంగీకారానికి వచ్చారు. అప్పటి వరకు ఇసుక తవ్వకాలు, రవాణను నిలిపి వేయాలని మన అధికారుల సూచనను మహారాష్ట్ర అధికారులు ఒప్పుకున్నారు. ఈ నెల 5న బోలేగాం క్వారీ వద్ద రెండు రాష్ట్రాల రెవె న్యూ, ల్యాండ్ సర్వే శాఖల అధికారులతో జాయింట్ సర్వే చేపట్టనున్నామని తహసీల్దార్ అజ్మీత్ న వాజ్ తెలిపారు. మంజీరలోని మన హద్దుల్లోకి వచ్చి మహారాష్ట్ర ఇసుక కాంట్రాక్టర్లు తవ్వకాలు చేపట్టారని సమాచారం మేరకు మంగళవారం సాలూర మండల రెవెన్యూ, ల్యాండ్సర్వే, మైనింగ్ అధికారులు సర్వే నిర్వహించి నిర్ధారించారు. మన భూభాగంలో ‘మహా’ ఇసుక తవ్వకాలు అడ్డుకున్న సాలూర రెవెన్యూ సిబ్బంది, బోధన్ డివిజన్ పోలీసులు వాగ్వాదాల అనంతరం సరిహద్దుల జాయింట్ సర్వేకు అంగీకారం ఈనెల 5న సర్వే నిర్వహించనున్న ఇరురాష్ట్రాల అధికారులు -
పర్యావరణ పరిరక్షణపై అవగాహన ర్యాలీ
కమ్మర్పల్లి : ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కా ర్యక్రమంలో భాగంగా కమ్మర్పల్లిలో బుధవారం అటవీ శాఖ ఆధ్వర్యంలో హరిత తెలంగాణ, స్వచ్ఛమైన పర్యావరణం, ఆరోగ్యకరమై న భవిష్యత్ అనే నినాదంతో బైక్ ర్యాలీ చేప ట్టారు. అటవీ శాఖ కార్యాలయం నుంచి జాతీ య రహదారి మీదుగా పోలీస్స్టేషన్ నుంచి బస్టాండ్ వరకు ర్యాలీ కొనసాగింది. కార్యక్రమంలో డీఆర్వోలు శ్రీనివాస్, సిద్ధార్థ, ఎఫ్ఎస్వోలు బాపూరావు, రాజేందర్, బేస్ క్యాంప్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కేజీబీవీలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానంరెంజల్(బోధన్): రెంజల్లోని కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయంలో ఇంటర్ ప్రథమ సంవత్సరం బైపీసీలో 40 సీట్లు ఖాళీగా ఉన్నా యని ప్రిన్సిపల్ శ్యామల తెలిపారు. అర్హులైన బాలికలు ఈ నెల 12వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎస్సెస్సీ ఫలితాల జాబితా, ఆధార్ కార్డు, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలతోపాటు రెండు పాస్పోర్టు ఫొటోలతో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. బైపీసీ ఇంగ్లిష్ మీడియంలో మాత్రమే అవకాశం ఉందని తెలిపారు. ప్రభుత్వ కళాశాలలోనే నాణ్యమైన విద్య ఆర్మూర్టౌన్ : ప్రభుత్వ కళాశాలలోనే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని కళాశాల ప్రిన్సిపల్ సుభాష్ అన్నారు. ఆర్మూర్, పెర్కిట్, మామిడిపల్లిలో ప్రభుత్వ జూనియర్ బాలుర కళాశాల అధ్యాపకులు పదో తరగతి పాసైన విద్యార్థుల ఇంటింటికి తిరిగి ప్రభుత్వ కళాశాలలో చేరాలని ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో అధ్యాపకులు చంద్రశేఖర్, నరే శ్, లక్ష్మణ్, శ్రీనివాస్, రామకృష్ణ, కృష్ణ మోహన్ తదితరులు పాల్గొన్నారు. బరువు కొలిచే పరికరం వితరణ కమ్మర్పల్లి : కమ్మర్పల్లి మండలం చౌట్పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి లయన్స్ క్లబ్ ఆఫ్ కమ్మర్పల్లి ఆధ్వర్యంలో బుధవారం బరువు కొలిచే పరికరాన్ని(వెయింగ్ మిషన్)ను వితరణ చేశారు. సర్పంచ్ మెహబూబ్, ఉప సర్పంచ్ సట్ట విశాల్, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు లుక్క గంగాధర్, సభ్యులు తెడ్డు రమేశ్, నోముల నరేందర్ రెడ్డి, బద్రి, గుండోజీ రవీందర్, చిలివేరి పవన్కుమార్, సురంగి చంద్రశేఖర్, హెచ్ఈవో సత్యనారాయణ, ఫార్మసిస్ట్ సంజీవ్ తదితరులు పాల్గొన్నారు. ఎంఈవోకు సన్మానం రుద్రూర్: మండల విద్యాశాఖ అధికారిగా బాధ్యతలు స్వీకరించిన రామ్సింగ్ను బుధవారం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. విద్యారంగ అభివృద్ధికి కృషి చేసి మండలంలో పాఠశాలల పురోగతికి తోడ్పడాలని ఆకాంక్షించారు. క్లబ్ అధ్యక్షుడు కేవీ మోహన్, సభ్యులు శ్యామ్ సుందర్ పహాడే, పత్తి రాము, గుండూరి ప్రశాంత్ గౌడ్, పుట్టి సాగర్, గెంటిల గంగాధర్, గాండ్ల మధు, అడ్ప సుమన్ తదితరులు పాల్గొన్నారు. విద్యా శిరోమణికి దరఖాస్తుల ఆహ్వానం నిజామాబాద్ రూరల్ : విద్యా శిరోమణి అవార్డ్స్–2026కు జిల్లాలోని కుమ్మర శాలివాహన కులానికి చెందిన ప్రతిభావంతులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు శాలివాహన ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్(సేవా) జిల్లా అధ్యక్షుడు మర్రిపల్లి భూపతి బుధవారం తెలిపారు. పదో తరగతిలో 500కు పైగా, ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో 900కుపైగా మార్కులు సాధించినవారు తమ వివరాలను ఈనెల 4 వరకు 99123 37702 ఫోన్కు వాట్సాప్ చేయాలని సూచించారు. పురస్కారాలు, ప్రశంసపత్రాలు అందిస్తామని తెలిపారు. -
వాగ్ధానాలను అమలు చేయాలి
కమ్మర్పల్లి/ బోధన్/ ఆర్మూర్ : ఎన్నికల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు ఇచ్చిన వాగ్ధానలను అమలు చేయాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం నేతలు డిమాండ్ చేశారు. కమ్మర్పల్లి, బోధన్, ఆలూర్ ఆర్డీవో, తహసీల్ కార్యాలయాల ఎదుట బుధవారం అఖిల భారత ఐక్య రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతులకు రాతపూర్వకంగా ఇచ్చిన స్వామినాథన్ కమిషన్ సి ఫారసులను అమలు చేయడంతోపాటు పంటలకు మద్దతు ధరల చట్టం బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని విజ్ఞప్తి చేశారు. ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు, వ్యవసాయ పనిముట్లు సబ్సిడీ పై సరఫరా చేయాలన్నారు. పంట రుణాలను మా ఫీ చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన వాగ్ధానం మేరకు మూతపడిన నిజాంషుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలని పేర్కొన్నారు. అనంతరం అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. కమ్మర్పల్లిలో నిర్వహించిన కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు సారా సురేశ్, నాయకులు బాలయ్య, కిషన్, లింబ నాయక్, లింబన్న, రమేశ్, మలావత్ లింబన్న, స్వప్న, శిరీష, నర్సు, లక్ష్మి, గౌరీ తదితరులు పాల్గొన్నారు. బోధన్లో రాష్ట్ర కమిటీ సభ్యుడు గుమ్ముల గంగాధర్, డివిజన్ ప్రతినిధులు పుట్టనడ్పి నాగన్న, పార్వతి రాజేశ్వర్, కాశ రవి, శ్రీపతి మల్లేశ్, సిద్ధ పోశెట్టి, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. ఆలూర్లో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి దేవరాం, జిల్లా ఉపాధ్యక్షుడు యూ.రాజన్న, ఆర్మూర్ ఏరియా అధ్యక్షుడు జే.శేఖర్, జిల్లా కార్యదర్శి కిషన్, నాయకులు పస్క నాగేశ్వర్, ఉంగరాల జగదీశ్వర్, ఉంగరాల రాములు, గంగారం తదితరులు పాల్గొన్నారు. -
ఢిల్లీ సదస్సుకు ఎఫ్పీవోల చైర్మన్లు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాలో ఈ నెల 4న జరుగనున్న రైతు ఉత్పత్తిదారుల సంఘాల ఫెడరేషన్ సదస్సుకు ఎఫ్పీవోల చైర్మన్లు బుధవారం బయల్దేరి వెళ్లారు. జిల్లా లోని జక్రాన్పల్లి మండలం మనోహరాబాద్ గ్రామానికి చెందిన జేఎంకేపీఎం చైర్మన్ పాట్కూరి తిరుపతిరెడ్డి, డైరెక్టర్ ఎం.రాజు, మోర్తాడ్ మండలం నుంచి ఎఫ్పీవో డైరెక్టర్ లక్ష్మీనర్సయ్య, జగిత్యాల జిల్లా ఇటిక్యాల ఎ ల్జీఎంఆర్ రైతు ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు గడ్డం రాజేందర్రెడ్డి హాజరు కా నున్నారు. రైతు ఉత్పత్తిదారుల సంఘాల ని ర్మాణం, బలోపేతం, ఇందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారం తదితర అంశాలే సమావేశం ముఖ్య ఉద్దేశమని ఎఫ్పీవోల ప్రతినిధులు తెలిపారు.నిజామాబాద్ను ‘స్మార్ట్ సిటీ’గా ప్రకటించాలి ● అఖిల భారత మేయర్ కౌన్సిల్లో మేయర్ ఉమారాణి సుభాష్నగర్: ఉత్తరఖండ్ రాష్ట్రంలోని రు షికేశ్లో బుధవారం నిర్వహించిన అఖిల భారత మేయర్స్ కౌ న్సిల్ 117వ కార్యవర్గ సమావేశానికి నిజామాబాద్ నగర మేయర్ కూరగాయల ఉమారాణి హాజరయ్యారు. దే శవ్యాప్తంగా నగరాల అభివృద్ధి, పట్టణ పా లనలో నూతన విధానాలు, స్వచ్ఛత, మౌలి క వసతుల విస్తరణ, సుస్థిర పట్టణాభివృద్ధి అంశాలపై జరిగిన సమావేశంలో మేయర్ నిజా మాబాద్ నగర అభివృద్ధికి సంబంధించిన ప లు కీలక అంశాలను ప్రస్తావించారు. కౌన్సి ల్ వేదికగా కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి నిజామాబాద్ నగరాన్ని స్మార్ట్ సిటీగా ప్ర కటించాలని విజ్ఞప్తి చేశారు. స్మార్ట్ సిటీ హో దా లభిస్తే నగరంలో మరిన్ని ఆధునిక మౌలి క వసతులు, సాంకేతిక సేవలు, సమగ్ర పట్టణాభివృద్ధికి దోహదపడుతుందన్నారు. మూడురోజులు విద్యుత్ సరఫరాలో అంతరాయం సుభాష్నగర్ : నగరంలోని 33/11 కేవీ ఆర్యగనర్ సబ్స్టేషన్ పరిధిలో ఉన్న టాటా మో టార్స్ షోరూం వెనకభాగంలో కొన్ని ఏరియాల్లో ఈ నెల 4, 5, 6 తేదీల్లో ఉద యం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు వి ద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడు తుందని టౌన్–3 ఏడీఈ వినోద్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆ ఏరియాలోని 132 కేవీ టవర్లపై లైన్ మార్చే ప్రక్రియ చేపడుతున్నందున విద్యుత్ సరఫరా నిలిపేస్తున్నామని పేర్కొన్నారు. విద్యుత్ వినియోగదారులు సహకరించాలని కోరారు. 7న మున్నూరు కాపు విద్యార్థులకు పురస్కారాలు సుభాష్నగర్ : తెలంగాణ మున్నూరుకాపు ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం (ఇందూరు) ఆధ్వర్యంలో ఈ నెల 7న నగరంలోని ప్రగతినగర్ ము న్నూరుకాపు కల్యాణ మండపంలో పదోతరగతి, ఇంటర్, ఈపీసెట్, జేఈఈ అడ్వాన్స్ లో ప్రతిభ చాటిన విద్యార్థులకు ప్రతిభా పుర స్కారాలు అందజేస్తున్నట్లు అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు తోట రాజశేఖర్ పటేల్, అబ్బాపూర్ రవీందర్ పటేల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే పలువురు విద్యా ర్థులు తమ పేర్లు నమోదు చేసుకున్నా రని పేర్కొన్నారు. ఈ ఏడాది క్రీడల్లో జాతీయ స్థాయిలో ప్రతిభ చాటిన వారికి కూడా పుర స్కారాలు ఇవ్వాలని నిర్ణయించామని, వారు కూడా జిల్లా కమిటీకి పేర్లు అందజేయాలని కోరారు. -
పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్నాం
● ప్రభుత్వ సలహాదారు సుదర్శన్రెడ్డి ● నియోజకవర్గంలో విస్తృత పర్యటన ● ఇందిరమ్మ గృహ ప్రవేశాలురెంజల్/ నవీపేట / బోధన్ టౌన్ : ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సొంతింటి కలను తీరుస్తుందని ప్రభుత్వ ప్రధాన సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ హయాంలో అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నామన్నారు. బోధన్ నియోజకవర్గంలోని రెంజల్, నవీపేట, బోధన్ పట్టణాల్లో బుధవారం ఆయన విస్తృతంగా పర్యటించారు. ఇందిరమ్మ గృహ ప్రవేశాలను లబ్ధిదారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం బోధన్ నియోజకవర్గానికి ఒక్క ఇళ్లు నిర్మించి ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే అర్హులను గుర్తించి ఒక్క రెంజల్ మండలానికి వెయ్యి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసినట్లు గుర్తు చేశారు. విడతల వారీగా అవసరమైన అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామన్నారు. చివరి బిల్లు మంజూరులో కొంత జాప్యం జరుగుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని, అధికారులతో చర్చించి సకాలంలో అందించే ఏర్పాటు చేస్తానన్నారు. రెంజల్లో రైతులు, వ్యవసాయ అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వానాకాలంలో సీజన్కు సంబంధించి రైతులకు ఇబ్బందులు రానీయకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సాగు నీరు, ఎరువులు, విత్తనాలు అందించేందుకు ప్రణాళిక రూపొందించాలన్నారు. రెంజల్లో నిర్వహించిన కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు మొబిన్ఖాన్, సర్పంచ్లు ధనుంజయ్, ఎత్తరి మాధవి, లచ్చవార్ సుహసిని, తిరుపతి లలిత, మాధవ్, నాయకులు సాయిబాబాగౌడ్, రాములు, ఆసాని అనిల్ తదితరులు పాల్గొన్నారు. నవీపేటలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్, సర్పంచ్ కేఎల్వీ రేఖ, ఉప సర్పంచ్ నవీన్రాజ్, కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్గౌడ్, రాజేంద్రకుమార్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. బోధన్ పట్టణంలోని ఆచన్పల్లి, అనీసానగర్, రాకాసీపేట్లో ఇందిరమ్మ గృహ ప్రవేశాలను సుదర్శన్రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తూము పద్మాశరత్ రెడ్డి, కౌన్సిలర్ లక్ష్మి రామ్మూర్తి, పట్టణ అధ్యక్షుడు దాము, మున్సిపల్ ఫ్లోనర్ లీడర్ శరత్ రెడ్డి, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు. -
జింకలు విలవిల
గోదారి తీరాన గాయపడిన జింకకు సపర్యలు చేస్తున్న రైతు డొంకేశ్వర్(ఆర్మూర్): ఒకప్పుడు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్లో జింకలు గుంపులు గుంపులుగా తిరిగేవి. కుక్కల దాడి కారణంగా ఇప్పుడు పట్టుమని పది జింకలు కూడా కనిపించడం లేదు. ఇవి కూడా కనుమరుగైతే అప్పుడు ఏకో టూరిజం ఏర్పాటు చేసినా ఎలాంటి అర్థం ఉండదు. వచ్చిన పర్యాటకులు జింకలకు బదులు కుక్కలను చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని స్థానికులు అంటున్నారు. ఇప్పటికే కుక్కల సంఖ్య పెరగడంతో అవి తమపై ఎక్కడ దాడి చేస్తాయోనని పర్యాటకులు భయపడుతున్నారు. వాటిని ఇక్కడి నుంచి తరలించాలని పర్యాటకులు, స్థానిక రైతులు అధికారులను కోరుతున్నారు. అయితే, బ్యాక్ వాటర్కు వేలాది ఎకరాల విస్తీర్ణం ఉండడం, అది ఇరిగేషన్ ల్యాండ్ కావడంతో అటవీ అధికారులు పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టలేకపోతున్నారు. హద్దులు ఏర్పాటు చేసే పరిస్థితి కూడా లేకపోవడంతో ఏమి చేయలేని పరిస్థితి నెలకొంది. రక్షణ చర్యలకు ఏ మార్గం లేదా? డొంకేశ్వర్ మండలం చిన్నయానం, గంగాసముందర్, జీజీ నడ్కుడ, గాదేపల్లి వంటి గ్రామాల శివార్లలో జింకలు ఎక్కువగా ఉండేవి. ప్రతి ఏడాది వేసవిలో బ్యాక్వాటర్ తగ్గి పచ్చిక బయటళ్లు ఏర్పడడంతో ఆ పచ్చికను మేసేందుకు వస్తున్న జింకలను వీధి కుక్కలు వేటాడుతున్నాయి. జింకల మాంసానికి రుచి మరిగిన కుక్కలు నలుదిక్కులా మాటు వేసి వెంబడిస్తున్నాయి. దీంతో జింకలు భయంతో వేరేచోటికి కూడా వెళ్లిపోతున్నాయి. కుక్కల దాడిలో గాయపడిన జింకలను శివారు గ్రామాల ప్రజలు, మత్స్యకారులు కాపాడి అటవీ అధికారుల పర్యవేక్షణలో పశువైద్య అధికారులతో చికిత్స చేయిస్తున్నారు. చనిపోయిన వాటికి అక్కడే అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. తాజాగా గతనెల 6న ఒక జింక పిల్లను కుక్కల బారి నుంచి కాపాడి అటవీ అధికారులకు అప్పగించారు. అదే నెల 28న కుక్కల దాడిలో గాయపడిన చుక్కల జింక నడ్కుడ గ్రామంలోకి వచ్చింది. స్థానికులు దానిని పట్టుకొని వైద్యం అందించారు. అయితే, జింకల రక్షణకు అధికారులకు ఏ మార్గం కనిపించడం లేదు. వేలాది ఎకరాలున్న బ్యాక్ వాటర్లో ట్రెంచ్ ఏర్పాటు చేయడం అతి కష్టం. సుప్రిం కోర్టు ఇచ్చిన తీర్పు మేరకు కుక్కలకు కారుణ్య మరణం కల్పించాలనే డిమాండ్ తెరపైకి వస్తోంది. నిరంతరం పర్యవేక్షిస్తున్నారు..వేలాది ఎకరాల్లో బ్యాక్ వాటర్ ఏరి యా విస్తరించి ఉంది. దీంతో కుక్కల సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కరించడానికి వీలు లేకుండా ఉంది. ఇరిగేషన్ ల్యాండ్ కావడంతో అటవీ శాఖ అజమాయిషీ చేయలేకపోతోంది. జింకలు, వన్యప్రాణుల రక్షణకు బ్యాక్ వాటర్లో ఒక డీఆర్వోతో పాటు బీట్ ఆఫీసర్ ఉన్నారు. వారు నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారు. గ్రామస్తుల సహకారంతో జింకలను ఎప్పటికప్పుడు రక్షిస్తున్నారు. – సిద్ధార్థ్ విక్రమ్సింగ్, జిల్లా అటవీ అధికారిఎకో టూరిజం మాటేమో గానీ.. ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్లో జింకలకు మనుగడ లేకుండా పోతోంది. స్వేచ్ఛగా విహరించే ఈ వన్యప్రాణులను ఊర కుక్కలు వేటాడి పీక్కుతింటున్నాయి. ప్రతిఏటా ఎన్నో జింకలు కుక్కల నోట చిక్కి ప్రాణాలు విడుస్తున్నాయి. ఫలితంగా బ్యాక్ వాటర్లో జింకల సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది. ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్లో వన్యప్రాణులకు రక్షణ కరువు పచ్చిక బయళ్లలో మాటు వేసి వేటాడుతున్న ఊర కుక్కలు దాదాపుగా కనుమరుగవుతున్న జింకల సంఖ్య వేల ఎకరాల విస్తీర్ణం ఉండడంతో రక్షణ చర్యలు చేపట్టలేని పరిస్థితి -
ఎల్నినో ముప్పుంది..
● వర్షాభావ పరిస్థితులపై రైతులు అప్రమత్తంగా ఉండాలి ● పంటల ఎంపిక, సాగు పద్ధతులపై వ్యవసాయ శాఖ సూచనడొంకేశ్వర్(ఆర్మూర్): వాతావరణ శాఖ అంచనా ప్రకారం జిల్లాపై ఎన్నినో ప్రభావం ఉందని, సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశమున్నట్లు వ్యవసాయ శాఖ రైతులను అప్రమత్తం చేసింది. వర్షాలు ఆలస్యమైనా ఆందోళన చెందకుండా పరిస్థితులకు అనుగుణంగా పంటలను ఎంపిక చేసుకోవాలని, సాగు పద్ధతులను మార్చుకోవాలని సూచించింది. తద్వారా పంట నష్టాలను తగ్గించుకోవచ్చని జిల్లా వ్యవసాయాధికారి వీరాస్వామి ఒక ప్రకటన విడుదల చేశారు. ● జూన్లో సాధారణ వర్షపాతం నమోదై తర్వాత వర్షాలు నిలిచిపోయే అవకాశం ఉన్నందున పంటల ప్రణాళిక ముందే రూపొందించుకోవాలి. పొలాల్లో సేద్యపు కుంటలు ఏర్పాటు చేసుకోవాలి. ● ముఖ్యంగా వరి సాగుకు బదులు నీటి ఎద్దటిని తట్టుకునే కంది, కొర్రలు, సజ్జలు లాంటి దిగుబడినిచ్చే పంటలను సాగు చేయాలి. ● జూలై 15 వరకు వర్షాలు లేకపోతే పొడి నెలల్లో తొందరపడి విత్తనాలు వేయొద్దు. తేలిక నేలల్లో 50–60 మి.మీ అలాగే బరువు నేలల్లో 60–70 మి.మీ వర్షపాతం నమోదైన తర్వాత ఏడు రోజుల్లోపే విత్తనాలు విత్తనాలి. ● పత్తి, మొక్కజొన్న, కంది పంటల్లో సాధారణ సాగు కొనసాగించొచ్చు. మొక్కల సంఖ్య తగ్గకుండా ఉండేందుకు 10 శాతం ఎక్కువ విత్తనాలు వేయాలి. మొలకలు రాని చోట వెంటనే తిరిగి విత్తాలి. ● నేలలో తేమ వచ్చే వరకు ఎరువుల వాడకం వాయిదా వేయాలి. అంతరకృషి ద్వారా నేల తేమను కాపాడుకోవాలి. 2 శాతం యూరియా, 1శాతం పొటాషియం నైట్రెడ్ ద్రవాన్ని 15 రోజుల వ్యవధిలో రెండు నుంచి మూడు సార్లు పిచికారీ చేయాలి. ● జూలై 30 వరకు అలాగే ఆగస్టు 15 వరకు వర్షాలు కురవకపోతే అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వినియోగించడానికి ఒక సాలు వదిలి ఒక సాలుకు తడులు ఇవ్వాలి. వరి, మొక్కజొన్న, పత్తి పంటలకు బదులు కంది, సజ్జ, మొదలగు పంటలు వేసుకోవాలి. -
జిల్లాలో ఎస్సైల బదిలీలు
పేరు ప్రస్తుత స్థానం బదిలీ అయిన స్థానం సందీప్ ఇందల్వాయి ధర్పల్లి సామ శ్రీనివాస్ ధర్పల్లి వీఆర్ సుమలత వీఆర్ ఇందల్వాయి(ఎస్హెచ్వో) అనిల్రెడ్డి కమ్మర్పల్లి మాక్లూర్ రాజశేఖర్ మాక్లూర్ బోధన్ రూరల్ మచ్చేందర్ బోధన్ రూరల్ సీఎస్బీ శ్రీనివాస్ వెయింటింగ్ కోటగిరి సునీల్ కోటగిరి 5వ టౌన్ వినయ్ వీఆర్ నందిపేట(ఎస్హెచ్వో) శ్యామ్రాజ్ నందిపేట వీఆర్ సతీశ్ జగిత్యాల ఎస్బీ కమ్మర్పల్లి(ఎస్హెచ్వో) మనోజ్కుమార్ వీఆర్ రుద్రూర్ సాయన్న రుద్రూర్ వీఆర్ గంగాధర్ 5వ టౌన్ రెంజల్ యాదగిరి వీఆర్ 6వ టౌన్ వెంకట్రావు 6వ టౌన్ సీటీసీ సందీప్ వీఆర్ 2వ టౌన్ సయ్యద్ముజాయిద్ 2వ టౌన్ ఎస్బీ చంద్రమోహన్ సీసీఎస్ సీసీఆర్బీ గోవింద్ వీఆర్ సీఎస్బీనిజామాబాద్ అర్బన్ : నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలోని పలువురు ఎస్సైలు బదిలీ అయ్యారు. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. -
గ్రామ, వార్డు సభల నిర్వహణపై దిశానిర్దేశం
నిజామాబాద్ అర్బన్: ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈ నెల 4, 6, 8, 10వ తేదీలలో పంచాయతీల్లో గ్రామ సభలు, మున్సిపాలిటీల్లో వార్డు సభల నిర్వహణకు సంబంధించి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. మండల ప్రత్యేక అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, తహసీల్దార్లు, ఎంపీవోలు, వి విధ శాఖల అధికారులకు జిల్లా ఉన్నతాధికారులు గ్రామ, వార్డు సభల నిర్వహణ, విధి, విధానాలపై అవగాహన కల్పించడం గురించి అదనపు కలెక్టర్లు కిరణ్ కుమార్, భుజంగరావు దిశానిర్దేశం చేశారు. గ్రామ, వార్డు సభల నిర్వహణకు ఒకరోజు ముందే టాంటాం ద్వారా, ఇతర ప్రచార మాధ్యమాల ద్వా రా ప్రజలకు ముందస్తుగానే సమాచారం అందించాలన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం చేపడుతున్న ప్రత్యేక ఓటరు సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియపై సభలలో అవగాహన కల్పించాలన్నారు. ఖరీఫ్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎరువులు, విత్తనాలు అందించేందుకు ప్రణాళిక రూపొందించాలని సూచించారు. వర్షాలు తక్కువగా కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు చేసిన నేపథ్యంలో రైతులకు పంటల మార్పిడి, వర్షపు నీటి నిలువ, ఎరువులు, క్రిమిసంహారక మందుల వాడకంపై అవగాహన కల్పించాలన్నారు. ప్లాస్టిక్ వినియోగం నియంత్రణ, వాల్టా, వన్యప్రాణి సంరక్షణ చట్టాల గురించి తెలియజేయాలన్నారు. రక్షిత మంచినీటి సరఫరా, వీధి దీపాలు, సానిటేషన్ నిర్వహణపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రజలకు వివరించాలన్నారు. సమావేశంలో అదనపు డీసీపీ శుభం నగ్రాలే, డీఆర్వో గీత, డీఎఫ్వో సిద్దార్థ్ విక్రమ్ సింగ్, డీఆర్డీవో సాయన్న, జె డ్పీ సీఈవో సాయగౌడ్, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, నిజామాబాద్, బోధన్ ఆర్డీవోలు రాజేంద్రకుమార్, విజయలక్ష్మి పాల్గొన్నారు. ఎస్ఐఆర్పై అవగాహన కల్పించాలి ఖరీఫ్లో రైతులకు ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచాలి అధికారులకు అదనపు కలెక్టర్ల సూచనలు -
సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించాలి
● డీఎంహెచ్వో రాజశ్రీ పెర్కిట్(ఆర్మూర్): రానున్న వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి రాజశ్రీ వైద్య సిబ్బందికి సూచించారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో నిర్వహిస్తున్న టీకాల కా ర్యక్రమాన్ని బుధవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్వో మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు అయ్యేలా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ నెల 28న చేపట్టనున్న పల్స్ పోలియో కార్యక్రమానికి ఐదేళ్ల లోపు పిల్లల జాబితాను తయారు చేసి పెట్టుకోవాలని సూచించారు. అనంతరం మందుల నిల్వల రిజిస్టరు, ఓపీ రి జిస్టరు, వ్యాధి నిరోధక టీకాల అర్హుల జాబితాను పరిశీలించారు. ఆర్మూర్ మండలం చేపూర్ ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాన్ని జిల్లా ఇమ్యునైజేషన్ అ ధికారి అశోక్ పరిశీలించారు. కార్యక్రమంలో డాక్టర్ ప్రీతి పావని, ఆరోగ్య కార్యకర్తలు జక్కుల మోహన్, సువర్ణ, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. -
నిజాంషుగర్స్ కార్మికులను ఆదుకోవాలి
బోధన్: మూతపడిన ఎన్డీఎస్ఎల్ ( నిజాం దక్కన్ షుగర్స్ లిమిటెడ్) కార్మికుల బకాయి వేతనాలు చె ల్లించి ఆదుకోవాలని కార్మిక సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు. పట్టణంలోని ఫ్యాక్టరీ ప్రధాన గేటు ఎదుట బుధవారం కార్మిక సంఘాల ఆధ్వ ర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఉపేందర్, రవిశంకర్ గౌడ్ మాట్లాడుతూ లేఆఫ్ ప్రకటించి ఇప్పటి వరకు 11 ఏళ్లు పూర్తి కావొస్తున్నా కార్మికుల బకాయి వేతనాలు చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మానవతాదృక్పథంతో కార్మికులను ఆదుకోవాలని కోరారు. కార్మిక నాయకులు బాలకృష్ణ, రాజారాం, దేవదాసు, బాలచందర్, భాస్కర్, భిక్షపతి, భూమయ్య, శ్రీధర్ పాల్గొన్నారు. ఎస్ఐఆర్పై సదస్సు ఆర్మూర్టౌన్: పట్టణంలోని రైతువేదిక భవనంలో వివిధ పార్టీ నాయకులు, రెవెన్యూ అధికారులకు బుధవారం ఎస్ఐఆర్పై శిక్షణ సదస్సు నిర్వహించా రు. ఈ సందర్భంగా రెవెన్యూ ఇన్ స్పెక్టర్ ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ ప్రతీ ఓటర్ మ్యాపింగ్ చేయించుకోవాలని, 2002 ఓటర్ లిస్టులోని ప్రస్తుత ఓటరు వారసులతోపాటు తల్లిదండ్రుల వివరాలు నమోదు చేయించుకోవాలని సూచించారు. రెవె న్యూ అధికారులు, నాయకులు పాల్గొన్నారు. -
జెండాను అవమానపరిచిన వారిపై చర్యలు తీసుకోవాలి
రుద్రూర్ : తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వర్ని వ్యవసాయ మార్కెట్ కమిటీలో జాతీయ పతాకం రూపంలో కేక్ తయారు చేయించి కట్ చేసిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు బుధవారం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో బీజేపీ మండల ఉపాధ్యక్షుడు బోజగొండ అనిల్, మండల నాయకులు వడ్ల సాయినాథ్, రేపల్లి సాయిప్రసాద్, కుమ్మరి గణేశ్, తీగుళ్ల రాజా వరప్రసాద్, బైండ్ల బాలరాజ్, ధర్మరం వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. సిరికొండ : మండలంలోని హుస్సేన్నగర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు కేసిరెడ్డి శ్రీనివాస్రెడ్డి మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల అమలులో వైఫల్యం చెందడం, ప్రజా వ్యతిరేక పాలన నచ్చక బీఆర్ఎస్లో చేరినట్లు తెలిపారు. పార్టీలో చేరిన శ్రీనివాస్రెడ్డిని మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, మాజీ ఎమ్మెల్సీ వీసీ గౌడ్,పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి బాజిరెడ్డి జగన్ అభినందించారు. -
అర్హులకే సంక్షేమ ఫలాలు
బోధన్: కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన పేదలకు సంక్షేమ పథకాల ఫలాలు అందిస్తుందని ప్రభు త్వ సలహదారు, ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి అన్నారు. ఎడపల్లి మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం లబ్ధిదారులకు ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, నుడా చైర్మన్ కేశవేణు, తహసీల్దార్ దత్తాద్రి, ఎంపీడీవో శంకర్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పులి శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బిల్ల రాంమోహన్, ఏంఎసీ డైరెక్టర్ బొబ్బిలి శ్రీనివాస్, సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు. -
ఎరువులను సకాలంలో అందజేయాలి
● జిల్లా సహకార అధికారి శ్రీనివాస్ రావురుద్రూర్ : సహకార సంఘ పరిధిలోని రైతులకు అ వసరమగు ఎరువులను సకాలంలో అందజేయాల ని జిల్లా సహకార అధికారి శ్రీనివాస్ రావు సూచించారు. మండల కేంద్రంలోని సింగిల్ విండో కార్యా లయాన్ని బుధవారం సాయంత్రం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రుణమా ఫీ ఖాతాలు, ఎరువుల నిల్వలు, యూరియా విక్రయాలకు సంబంధించిన రికార్డులను పరిశీలించా రు. అనంతరం పాలకవర్గ సభ్యులతో మాట్లాడా రు. ఇప్పటి వరకు సంఘ పరిపాలన బాధ్యతలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. బాధ్యతలు వద్దంటే లిఖిత పూర్వకంగా తెలియజేయాలని సూ చించారు. డైరెక్టర్లు మాట్లాడుతూ గతంలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. గతంలో విండో కార్యదర్శిపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో షోకాజ్ నోటీసు జారీ చేయకపోవడంపై డీసీవో అసంతృప్తి వ్యక్తం చేశారు. అవకతవకలు నిర్ధారణ అయితే కార్యదర్శిని సస్పెండ్ చేసే అధికారం పాలకవర్గానికి ఉంటుందని పేర్కొంటూ, ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. -
నిధులు మంజూరు చేయించాలి
పెర్కిట్(ఆర్మూర్): ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామాభివృద్ధికి నిధులు మంజూరు చేయించాలని సర్పంచ్ అంక్సాపూర్ దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పాలకవర్గసభ్యులు ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. అంకాపూర్లోని ఎమ్మెల్యే నివాసంలో బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. గ్రామాభివృద్ధిపై ఎమ్మెల్యేతో చర్చించారు. రూ.200 కోట్లతో చేపడుతున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్ను మంజూరు చేయించిన ఎమ్మెల్యేను ఈ సందర్భంగా పాలకవర్గసభ్యులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ తుకారాం, వార్డు సభ్యులు పాల్గొన్నారు. నేటి నుంచి వార్డు సభలు ఆర్మూర్టౌన్ : ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని 36 వార్డులలో గురువారం నుంచి వార్డు సభలను నిర్వహిస్తున్నట్లు కమిషనర్ శ్రీహరి రాజు తెలిపారు. 1, 2, 3, 14, 15, 16, 17, 18, 29, 35, 36 వార్డులకు సంబంధించి పట్టణంలోని బాలాజీ ఫంక్షన్ హాల్లో ఉదయం 9 గంటల నుంచి నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. 6వ తేదీన 8, 9, 10, 24, 25, 26, 27, 28 వార్డుల సభను సైదాబాద్లోని షాదీ ఖానలో, ఈ నెల 8వ తేదీన 11, 12, 13, 30, 31, 32, 33, 34 వార్డుల సభను జెండాగల్లీలోని వేంకటేశ్వర కల్యాణ మండపంలో, 4, 5, 6, 7, 19, 20, 21, 22, 23 వార్డు సభను పెర్కిట్లోని ఎమ్మార్ గార్డెన్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సభలకు మున్సిపల్, వ్యవసాయ, విపత్తు నిర్వహణ, పో లీస్, ఎకై ్సజ్, నీటి పారుదల శాఖల అధికారులు హాజరవుతారని పేర్కొన్నారు. బోధన్లో 4 రోజులపాటు.. బోధన్టౌన్(బోధన్): బోధన్ పట్టణంలోని టీటీడీ కల్యాణ మండపంలో నాలు గు రోజులపాటు ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమం నిర్వహించునున్నట్లు మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ తెలిపారు. 4న బల్దియా పరిధిలోని 1 నుంచి 10 వారికి, 6న 11 నుంచి 20వ వార్డు వరకు, 8న 21 నుంచి 29వ వార్డు వరకు, 10న 30 నుంచి 38వ వార్డు ప్రజలు సభలలో పాల్గొనాలని కోరారు. ప్రభుత్వ బడిలోనే పిల్లలను చేర్పించాలి బోధన్: తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని ఎడపల్లి సర్పంచ్ కందగట్ల రాంచందర్, జడ్పీహెచ్ఎస్ హెచ్ఎం వేములపల్లి రవికుమార్ తెలిపారు. బడిబాటలో భాగంగా బుధవారం ఎడపల్లి మండల కేంద్రంలో ఉపాధి హామీ పని ప్రదేశానికి వెళ్లి కూలీలతో మాట్లాడారు. ఈ ఏడాది పదో తరగతి ఫలితాల్లో విద్యార్థులు అత్యధిక మార్కులతో ఉత్తీర్ణత సాధించారని హెచ్ఎం తెలిపారు. ఉపసర్పంచ్ గంగాధర్, ఉపాధ్యాయులు లక్ష్మీనారాయణ, సంజీవ్కుమార్, ప్రశాంత్రెడ్డి, శ్రీనివాస్, ఈజీఎస్ సిబ్బంది పాల్గొన్నారు. -
మంజీర నదిలో ‘మహా’ కాంట్రాక్టర్ల ఇసుక దోపిడీ
● సర్వే నిర్వహించిన రెవెన్యూ, మైనింగ్, ల్యాండ్ సర్వే అధికారులుబోధన్: మన సరిహద్దుల్లోని మంజీర నదిలోకి చొ చ్చుకొచ్చి మహారాష్ట్ర కాంట్రార్లు ఇసుక తవ్వకాలు జరపడంతో అధికారులు తాజాగా సర్వే నిర్వహించారు. సాలూర మండల తహసీల్దార్ అజ్మీత్ నవా జ్, ల్యాండ్ సర్వే శాఖ డివిజన్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ దత్తాత్రిలతో పాటు రెవెన్యూ, మైనింగ్, ల్యాండ్ సర్వే శాఖల అఽధికారులు సర్వేలో పాల్గొ న్నారు. మ హారాష్ట్రలోని గంజ్గాం, బోలేగాం గ్రామాల శివారు లో ఆ ప్రాంత ఇసుక కాంట్రాక్టర్లు మంజీర నదిలో రెండు నెలలుగా ఇసుక తవ్వకాలు చేస్తున్నారు. ఈ రెండు ఇసుక క్వారీలు సాలూర మండలంలోని హున్సా– మందర్నా, తగ్గేల్లి గ్రామాల అవతలి వైపు ఉన్నాయి. రెండు చోట్ల మహారాష్ట్ర కాంట్రాక్టర్లు మన హద్దుల్లోని మంజీర నదిలోకి చొచ్చుకు వచ్చి భారీ యంత్రాలతో ఇసుక తవ్వకాలు చేపట్టి తరలిస్తున్నారని ఆ గ్రామాల ప్రజలు అధికారులకు సమా చారం అందించారు. మే మొదటి వారంలో తగ్గేల్లి శివారులో మన అధికారులు హద్దులు గుర్తించి ఎర్ర జెండాలు పాతి వచ్చారు. తాజాగా హున్సా– మందర్నా శివారులో ఇసుక తవ్వకాలు చేపట్టడంతో అధికారులు మంగళవారం సర్వే నిర్వహించారు. హద్దులు దాటి తవ్వకాలు చేసినట్లు గుర్తించారు. పటిష్ట చర్యలు తీసుకుంటాం.. సాలూర మండలంలోని హున్సా– మందర్నా గ్రామ శివారులోని మంజీర నదిలో సర్వే నిర్వహించాం. మన హద్దుల్లోకి వచ్చి మహారాష్ట్ర కాంట్రాక్టర్లు ఇసుక తవ్వకాలు చేపట్టినట్టు సర్వేలో ప్రాథమికంగా అంచనా వేశాం. జాయింట్ సర్వేకు మహారాష్ట్ర అధికారులకు పలుమార్లు విన్నవించినా సహకరిండంలేదు. ల్యాండ్ సర్వేయర్ల రిపోర్టు వచ్చిన తర్వా త మన హద్దులో ఇసుక తవ్వకాల కట్టడికి పటిష్ట చర్యలు తీసుకుంటాం. – అజ్మీత్ నవాజ్, తహసీల్దార్, సాలూర మండలం -
గ్రామ, వార్డు సభలను విజయవంతం చేయండి
● అధికారులతో కలెక్టర్ ఇలా త్రిపాఠి ● జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్ నిజామాబాద్అర్బన్: ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఈ నెల 4, 6, 8, 10 తేదీలలో జిల్లా వ్యా ప్తంగా నిర్వహించే గ్రామ, వార్డు సభలను విజయవంతం చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. మంగళవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకష్ణారావు గ్రామ, వార్డు సభల నిర్వహణపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష జరిపారు. పోలీ స్ కమిషనర్ సాయి చైతన్య తో కలిసి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుంచి కలెక్టర్ ఇలా త్రిపాఠి, సంబంధిత శాఖల జిల్లా అధికారులు వీసీలో పాల్గొన్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఓటరు జాబితా సమగ్ర సవరణ ప్రక్రియకు సహకరించేలా ప్రజలకు అవగాహన కల్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సూచించారు. ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రస్తుతం నిర్వహిస్తున్న పర్యావరణ వారోత్సవాలను షెడ్యూల్ ప్రకారం విజయవంతం చేయాలన్నారు. వీసీ అనంతరం కలెక్టర్ ఇలా త్రిపాఠి సంబంధిత శాఖల అధికారులతో సమావేశమై కీలక సూచనలు చేశారు. గ్రామ, వార్డు సభలలో ప్రజా ప్రతినిధులు, మహిళా సంఘాల సభ్యులతో పాటు అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనేలా కృషి చేయాలన్నారు. మండల ప్రత్యేక అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఎంఏవోలను నోడల్ అధికారులుగా నియమించి గ్రామ సభలను నిర్వహించాలన్నారు. నిజామాబాద్ నగర పాలక సంస్థ, బోధన్, ఆర్మూర్, భీమ్గల్ మున్సిపల్ పట్టణాలలో వార్డుల వారీగా సభలను ఏర్పా టు చేసి ప్రభుత్వం నిర్దేశించిన అంశాలపై చర్చించాలన్నారు. వీసీలో అదనపు కలెక్టర్లు కిరణ్ కుమార్, భుజంగరావు, అధికారులు పాల్గొన్నారు. -
తెలంగాణ అస్తిత్వంపై మూకుమ్మడి కుట్రలు
● ఎదుర్కొనేందుకు మరో ఉద్యమం తప్పదు ● మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: తెలంగాణ అస్తిత్వా న్ని, ఉనికిని కనుమరుగు చేసేందుకు కొన్ని శక్తులు ఐక్యంగా కుట్రలు పన్నుతున్నాయని, వీటిని ఎదు ర్కొనేందుకు మరోసారి పోరాటానికి సన్నద్ధం కా వాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని బాల్కొండలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన జెండా ఎగురవేశారు. ఆయన మాట్లాడుతూ తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బక్కని నరసింహులు ఆంధ్రాకు వెళ్లి మహానాడు సభలో ‘డిక్షనరీలోనే తెలంగాణ అనే పదమే లేదు‘ అని మాట్లాడడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు. కేంద్ర మంత్రులైన బీజేపీ నాయకులు కిషన్రెడ్డి, బండి సంజయ్లు కూడా ఎందుకు నిలదీయడంలేదన్నారు. ఏపీ ఉప ముఖ్య మంత్రి పవన్ కళ్యాణ్ ‘మా కోనసీమలో కొబ్బరికాయలు ఎండిపోతుంటే తెలంగాణోళ్ల దిష్టి తగిలింది‘ అని వెటకారం చేయడమేమిటన్నారు. కేసీఆర్ అధికారంలో లేకపోవడంతో వీళ్లందరూ మొరుగుతున్నారన్నారు. కేసీఆర్ మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించి ఎ లాంటి హింస కు తావులేకుండా ప్రజాస్వామ్య ప్ర క్రియ ద్వారానే తెలంగాణను సాధించిపెట్టారన్నా రు. తెలుగుదేశంలో ఉన్నప్పుడు సోనియాగాంధీని ‘వేయి మంది బిడ్డలను బలిగొన్న బలిదేవత’ అన్న ఇదే రేవంత్ రెడ్డి, ఇవాళ సోనియా గాంధీ తెలంగా ణ ఇచ్చిందని మాయమాటలు చె బుతున్నార న్నారు. ఇందులో ఏది నిజమో రేవంత్ రెడ్డి స మా ధానం చెప్పాలన్నారు.నరేంద్ర మోదీ, రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు ఒక్కటై తెలంగాణ ఉనికే లేకుండా చేయాలని చూస్తున్నారన్నారు. తెలంగాణ ఉనికి ప్రశ్నార్థకమవుతున్న వేళ మరో ఉద్యమానికి సిద్ధం కావాలన్నారు. -
ఉద్యమంలో ఉత్సాహంగా డాక్టర్ సాబ్
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం సకల జనులు చేసిన ఉద్యమంలో ఉత్సాహంగా పాల్గొన్న డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి ప్రస్తుతం నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రూరల్ మండలంలోని జలాల్పూర్కు చెందిన భూపతిరెడ్డి ఆర్థోపెడిక్ సర్జన్గా మంచి పేరు తెచ్చుకున్నారు. భూపతిరెడ్డి వైద్య వృత్తిని కొనసాగిస్తూనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ఉమ్మడి జిల్లాలో కీలకంగా పనిచేశారు. ప్రజా దవాఖానా పేరిట 20 ఏళ్లు ప్రాక్టీస్ చేసిన భూపతిరెడ్డి చాలామందికి ఉచితంగా వైద్యసేవలు అందించి ప్రజలు అభిమానం సంపాదించారు. ఈ క్రమంలో తన ఆస్పత్రి తరఫున పలు పోలియో క్యాంపులు నిర్వహించారు. మరోవైపు 2004 నుంచి 2009 వరకు ‘క్లియర్ సొసైటీ’ (చైల్డ్ లేబర్ ఎలిమినేషన్ అండ్ రీహాబిటేషన్) అనే సంస్థను ఉమ్మడి జిల్లాలో నిర్వహించి దీని ద్వారా 1,500 మందికి పైగా చిన్నారులను పని మాన్పించి బడికి పంపేలా చేశారు. ఈ క్లియర్ సొసైటీలో పలువురు విద్యావంతులను భాగస్వాములను చేశారు. 1988లో గాంధీ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. 1993లో ఉస్మానియా మెడికల్ కళాశాలలో ఎంఎస్(ఆర్థో) పూర్తి చేశారు. తరువాత సంవత్సరం పాటు కోయంబత్తూర్ మెడికల్ కళాశాలలో శిక్షణ తీసుకున్నారు. నిజామాబాద్లో ప్రాక్టీసులో భాగంగా పలువురికి ఉచిత సేవలు అందించారు. 2001లో బీఆర్ఎస్ పార్టీలో వ్యవస్థాపక సభ్యుడిగా చేరి ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2009 నుంచి నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఇన్చార్జిగా వ్యవహరించారు. విద్యావంతులు, న్యాయవాదులు, డాక్టర్లు, మేధావులతో కలిసి జేఏసీలో అత్యంత క్రియాశీలకంగా పనిచేశారు. తెలంగాణ ఆవిర్భావం తరువాత 2016లో బీఆర్ఎస్ నుంచి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అయ్యారు. తరువాత క్రమంలో బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి ఎమ్మెల్సీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్లో చేరి 2018లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చెందారు. 2023 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రత్యేక రాష్ట్ర సాధన పోరాటంలో కీలకంగా వ్యవహరించిన భూపతిరెడ్డి ప్రజా దవాఖానా పేరిట ఉచిత సేవలు మొదట ఎమ్మెల్సీగా.. ప్రస్తుతం ఎమ్మెల్యేగా చట్ట సభల్లోకి.. -
ప్రజాపాలనలో ప్రగతి పయనం
నిజామాబాద్ప్రయివేటుకు దీటుగా.. రాష్ట్ర ప్రభుత్వం ప్రయివేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నట్లు ఎమ్మెల్యే భూపతిరెడ్డి పేర్కొన్నారు. బుధవారం శ్రీ 3 శ్రీ జూన్ శ్రీ 2026నృత్య ప్రదర్శనను తిలకిస్తున్న ప్రభుత్వ సలహాదారు పి సుదర్శన్రెడ్డి ఎమ్మెల్యేలు భూపతిరెడ్డి, రాకేశ్రెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి, సీపీ సాయిచైతన్య – 8లో uప్రతిపాదనలను సమర్పించాలి నిజామాబాద్ అర్బన్ : గోదావరి పుష్కరాలను పురస్కరించుకొ ని చేపట్టాల్సిన పనులకు ప్రతిపాదనలను వెంటనే సమర్పించా లని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. గోదావరి పుష్కరాలు–2027 ఏర్పాట్లపై అధికారులతో కలెక్టర్ మంగళవారం సమీక్షించారు. దేవాదాయ, నీటి పారుదల శాఖల ఆధ్వర్యంలో సవరించిన ప్రతిపాదనలను బుధవారంలోగా పంపించాలని, పంచాయతీరాజ్, ఆర్అండ్బీ తదితర శాఖల ద్వారా కూడా రెండు రోజుల్లో సమగ్ర ప్రతిపాదన లు సమర్పించాలని అధికారులకు సూచించారు. ప్రధానంగా త్రివేణి సంగమ ప్రాంతమైన కందకుర్తి ప్రాంతానికి పుణ్యస్నానాలు ఆచరించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశాలు ఉన్నందున అన్ని వసతులు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. కందకుర్తి పుష్కర ఘాట్ను క్షేత్రస్థాయిలో సందర్శించాలని బోధన్ ఆర్డీవో విజయలక్ష్మిని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ భుజంగరావు, డీఆర్వో గీత, దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ విజయరామారావు తదితరులు పాల్గొన్నారు. నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం సుభాష్నగర్: నగరంలోని 11కేవీ పులాంగ్ ఫీడర్ లైన్ ఏబీ స్విచ్ మరమ్మతుల కారణంగా బుధవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని టౌన్–3 ఏడీఈ వినోద్ ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యాస స్కూల్, రానా టవర్, ఆకాష్ అపార్ట్మెంట్స్, శివాలయం, రైతుబజార్, ఫాతిమా మ జీద్, మదీనా మజీద్, వేణు మాల్, వంశీ హోటల్, హైదరాబాద్ రోడ్, కాకతీయ స్కూ ల్, తదితర ప్రాంతాల్లో నేడు ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపేస్తున్నామన్నారు. సుభాష్నగర్: నగరంలోని 33/11 కేవీ సబ్స్టేషన్ దుబ్బలో 11కేవీ గిరిరాజ్ కళాశాల ఫీడర్లో పనుల కారణంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని టౌన్–2 ఏడీఈ ప్రసాద్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. గౌతంనగర్, దుబ్బ, రాజీవ్నగర్, గిరిరాజ్ కళాశాల ఏరియా, బైపాస్ రోడ్డులో నేడు ఉదయం 10 నుంచి ఒంటిగంట వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నామన్నారు. వడదెబ్బతో మహిళ మృతి సదాశివనగర్(ఎల్లారెడ్డి): కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలోని అడ్లూర్ ఎల్లారెడ్డిలో ఓ మహిళ వడదెబ్బతో మృతి చెందింది. గ్రామానికి చెందిన ఆకుల లక్ష్మి (56) రోజు మాదిరి గా మంగళవారం కూలీ పనికి వెళ్లింది. పని చేసేచోట వడదెబ్బ తగలడంతో స్పృహ కోల్పోయింది. కుటుంబీకులు కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే లక్ష్మి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.వినాయక్నగర్లోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి సుదర్శన్రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి, సీపీ సాయిచైతన్య ప్రసంగిస్తున్న ప్రభుత్వ సలహాదారు సుదర్శన్రెడ్డిసాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ప్రజాపాలనలో అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందించే లక్ష్యంతో రేవంత్రెడ్డి ప్రభుత్వం ముందుకెళుతోందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పొద్దుటూరి సుదర్శన్రెడ్డి అన్నారు. 13వ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం సుదర్శన్రెడ్డి నిజామాబాద్ పరేడ్ మైదానంలో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ .. రాష్ట్రంలోని అన్ని సామాజిక వర్గాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా గ్రామీణ, పట్టణ, నగర ప్రాంతాలకు సమ ప్రాధాన్యమిస్తూ సమగ్రాభివృద్ధితో ముందుకు సాగుతున్నామన్నారు. ఇందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం 99 రోజుల ‘ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమం చేపట్టిందన్నారు. సంక్షేమ, అభివద్ధి కార్యక్రమాల అమలులో నిజామాబాద్ జిల్లా ముందంజలో నిలుస్తోందన్నారు. 2026 వానాకాలం సీజన్కు 5.58 లక్షల ఎకరాల్లో సాగుకు ప్రణాళికలు సిద్దం చేశామన్నారు. పచ్చిరొట్ట ఎరువులైన జీలుగ విత్తనాలు 6,610 క్వింటాళ్లు, జనుము 126 క్వింటాళ్లు 50 శాతం రాయితీపై సొసైటీల ద్వారా రైతులకు అందుబాటులో ఉంచమన్నారు. యూరియా 80,857 మెట్రిక్ టన్నులు, డీఏపీ 14,591, పొటాష్ 13,201, కాంప్లెక్స్ 45,122 మెట్రిక్ టన్నులు అవసరమని అంచనా వేశామన్నారు. రైతులకు కొరత లేకుండా సరఫరా చేసేందుకు పూర్తి ఏర్పాట్లు చేశామన్నారు. మరణించిన 487 మంది రైతుల కుటుంబాలకు రైతు బీమా నామిని బ్యాంకు ఖాతాల్లో రూ. 24.35 కోట్లు నేరుగా జమ చేశామన్నారు. రైతు భరోసా కింద యాసంగి సీజనుకు గాను జిల్లాలో 2 లక్షల 76 వేల మంది రైతులకు ఇప్పటి వరకు రూ.219.16 కోట్లు జమ చేశామన్నారు. జిల్లాలో మొదటి విడతలో 16,843 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయగా, ఇందులో 8,590 పురోగతిలో, మరో 8,253 ఇళ్లు నిర్మాణం పూర్తి అయ్యాయన్నారు. ఇందుకు రూ.372.14 కోట్లు ఖర్చు చేశామన్నారు. తాజాగా 2,764 ఇళ్లకు సామూహిక గృహప్రవేశాలు చేశామన్నారు. మహాలక్ష్మి పథకం కింద జిల్లాలో 9.15 కోట్ల మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పించామన్నారు. గృహ జ్యోతి పథకం కింద జిల్లాలో 2,97,635 కుటుంబాలకు ప్రతి నెలజీరో బిల్లులు జారీ చేసి రూ.260 కోట్లు సబ్సిడీ అందిస్తున్నామన్నారు. నాయీబ్రాహ్మణ, రజక వృత్తుల లోని 3,023 మంది లబ్ధిదారులకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామన్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా జిల్లాలోని 28 మండల సమాఖ్యలకు రాష్ట్ర ప్రభుత్వం 28 బస్సులు మంజూరు చేసిందన్నారు. ఒక్కో బ స్సుకు రూ.36 లక్షల చొప్పున మొత్తం రూ.10.8 కోట్లు తెలంగాణ ఆర్టీసీకి బదిలీ చేసిందన్నారు. ఇందులో 18 బస్సులను ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా ప్రారంభించామన్నారు. సీ్త్రనిధి పథకం కింద ఈ ఆర్థిక సంవత్సరంలో 761 సంఘాలకు రూ.16.75 కోట్లు బ్యాంకు రుణాలు మంజూరు చేశామన్నారు. రూ.3.56 లక్షల విలువైన 6 ఎలక్ట్రిక్ ఆటోలను మహిళా సంఘాలకు ఇచ్చామన్నారు. ఏప్రిల్ 2024 నుంచి జనవరి 2025 వరకు 20,109 సంఘాలకు రూ.44.95 కోట్ల వడ్డీ రాయితీ విడుదల చేశామన్నారు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ద్వారా ఈ ఆర్థిక సంవత్సరం బ్యాంక్ లింకేజి ద్వారా 96 స్వయం సహాయక సంఘాలకు రూ.11.8 కోట్ల రుణాలు ఇచ్చామన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాలల పథకం ద్వారా అదనపు గదులు, మరుగుదొడ్లు, తాగునీటి సదుపాయాల కోసం జిల్లాకు రూ.42.24 కోట్లు మంజూరు చేశామన్నారు. యంగ్ ఇండియా ఇంట్రిగ్రేటేడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ పథకంలో భాగంగా ఈ సంవత్సరం జిల్లాలో నాలుగు చోట్ల (మల్కాపూర్, పొతంగల్, బెల్లాల్, అంకాపూర్) నిర్మాణ పనులను రూ.800 కోట్లతో ప్రారంభించామన్నారు. భూ భారతి ద్వారా జిల్లాలో 70,790 దరఖాస్తులు రాగా, వీటిలో 69,212 పరిష్కరించామన్నారు. మిగిలిన 1,578 దరఖాస్తులు విచారణ దశలో ఉన్నాయన్నారు.సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలులో జిల్లా ముందంజలో నిలుస్తోందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి అన్నారు. అన్ని సామాజిక వర్గాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. గ్రామీణ, పట్టణ, నగర ప్రాంతాలకు సమ ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవంలో ఆయన మాట్లాడారు. ‘ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక’ ద్వారా చేపడుతున్న ప్రజాహిత కార్యక్రమాలను ఆయన వివరించారు. జిల్లాలో 4,01,959 పాత ఆహార భద్రత కార్డులు ఉండగా, ఈ ప్రభుత్వంలో కొత్తగా 71,370 కార్డులు మంజూరు చేశామన్నారు. మహా లక్ష్మి పథకం ద్వారా రూ.500లకే సబ్సిడీ గ్యాస్ సిలిండర్లను ఇస్తున్నాం. జిల్లాలో 2,47,603 మంది లబ్ధిదారులకు, 14,87,826 సిలిండర్లకు సబ్సిడీ విడుదల చేసి రూ.46.86 కోట్లు చెల్లించామన్నారు. యాసంగిలో 7,03,550 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 98,157 మంది రైతుల నుంచి కొనుగోలు చేశామన్నారు. రూ.1,605 కోట్లు వారి ఖాతాల్లో జమ చేశామన్నారు. ధాన్యం సేకరణలో జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచిందన్నారు. అన్నివర్గాలకు అభివృద్ధి, సంక్షేమ ఫలాలు గ్రామీణ, పట్టణ, నగర ప్రాంతాలకు సమ ప్రాధాన్యత మరింత సమగ్రాభివృద్ధి కోసం ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’ ద్వారా ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో ప్రభుత్వ సలహాదారు పొద్దుటూరి సుదర్శన్రెడ్డి -
ప్రయివేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు
● రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్కు భూమిపూజనిజామాబాద్ రూరల్ : విద్యపై వెచ్చించేది ఖర్చుకాదని, భవిష్యత్తు తరాలకు పెట్టుబడిగా నిజామాబా ద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి పేర్కొన్నా రు. రాష్ట్ర ప్రభుత్వం ప్రయివేటుకు దీటుగా ప్రభు త్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నట్లు వివరించారు. మండలంలోని మల్కాపూర్(ఎ) గ్రామ శివారులో రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రె సిడెన్షియల్ స్కూల్కు మంగళవారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యాభివృద్ధితో పాటు అన్నివర్గాల అభ్యున్నతికి ప్ర భుత్వం కృషి చేస్తుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ మాట మీద నిలబడే పార్టీ అని అన్నారు. ప్రతి ఒక్కరికీ నాణ్యమైన విద్యను అందించే దిశగా ఇంటిగ్రేటె డ్ రెసిడెన్షియల్ పాఠశాలను ప్రతి నియోజకవర్గంలో నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను ఎమ్మె ల్యే భూపతి రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో రాష్ట్ర గీతా పారిశ్రామిక సహకార కార్పొరేషన్ చైర్మన్ శేఖర్ గౌడ్, ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, ఐడీసీఎంఎస్ మాజీ చైర్మన్ సాయరెడ్డి, సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షులు మునిపల్లి సాయిరెడ్డి, రూరల్ నియోజకవర్గ అధ్యక్షుడు వాసు, స్థానిక సర్పంచ్ నీరజ కార్తీక్ తదితరులు పాల్గొన్నారు. -
సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
వర్ని: నిరుపేద బడుగు బలహీనవర్గాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పో చారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మండలంలోని మ ల్లారం గ్రామంలో మంగళవారం ఇందిరమ్మ పథకంలో నిర్మించిన ఇంటిని ఎమ్మెల్యే ప్రారంభించా రు. సంక్షేమ పథకాలు అర్హులైన వారికి అందించే వి ధంగా స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు చర్య తీసుకోవాలన్నారు. బోధన్ ఆర్డీవో విజయలక్ష్మి, డి ఆర్డిఎ పిడి సాయన్న, వర్ని మార్కెట్ కమిటీ అధ్యక్షులు సురేష్ బాబా, మల్లారం సర్పంచ్ మాడ అంజవ్వ లక్ష్మణ్ పాల్గొన్నారు. -
అట్టహాసంగా అవతరణ వేడుకలు
నిజామాబాద్ అర్బన్ : తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు మంగళవారం జిల్లాలో ఘనంగా నిర్వహించారు. నగరంలోని పోలీస్ పరేడ్గ్రౌండ్లో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం తెలంగాణ అమరవీరుల కుటుంబాలను ఘనంగా సన్మానించారు. గృహ నిర్మాణం, రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ, పౌర సరఫరాలు, వైద్యారోగ్య శాఖల శకటాలు ప్రదర్శనలో పాల్గొన్నాయి. వ్యవసాయ, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, మహిళా శిశు సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో స్టాల్స్ ఏర్పాటు చేశారు. సిద్ధార్థ కళాక్షేత్రం, బాల భవన్ చిన్నారులు బతుకమ్మ గేయం, పచ్చదనం ప్రాముఖ్యతపై నృత్యప్రదర్శన ఇచ్చారు. అంతకుముందు వినాయకనగర్లోని అమరవీరుల స్మారక స్తూపం వద్ద ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి, సీపీ సాయిచైతన్య, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, అదనపు కలెక్టర్లు కిరణ్ కుమార్, భుజంగరావు, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్కుమార్ తదితరులు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. వేడుకల్లో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి, డీఎఫ్వో సిద్ధార్థ్, అదనపు డీసీపీ శుభం నగ్రాలే, డీఆర్వో గీత తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం
సాక్షి నెట్వర్క్: ఆర్మూర్, బాల్కొండ, బోధన్ నియోజకవర్గాల్లో మంగళవారం తెలంగాణ రాష్ట్ర అవతర ణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆయా నియోజకవర్గాల్లోని అన్ని మండలా లు, గ్రామాల్లోని ప్రభుత్వ కార్యలయాల్లో అధికారు లు, ప్రజాప్రతినిధులు జాతీయ జెండాను ఎగురవే సి, వందనం చేశారు. అలాగే జాతీయ గేయాలపన నిర్వహించారు. ఈసందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరు ల త్యాగాలను స్మరించుకున్నారు. వారి ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామంలో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి జాతీ య జెండాను ఆవిష్కరించారు. ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్ గోనె లహరి,, తహసీల్దార్, ఏసీపీ, పోలీస్స్టేషన్, సబ్రిజిస్టర్, ఆర్టీఏ, ఎకై ్సజ్ కార్యాలయల్లో, ఆర్మూర్ కోర్డుతో పాటు ఇతర ప్రభుత్వ కార్యాలయల్లో సంబంధింత అధికారులు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం స్వీట్లు పంపిణి చేశారు. బోధన్ కోర్టులో అదనపు జిల్లా న్యాయమూర్తి వరుదిని జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం చేసి గీతాన్ని ఆలపించారు. అనంతరం ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో విజయ కుమారి, బల్దియా కార్యాలయంలో మున్సిపల్ చైర్పర్సన్ తూము పద్మాశరత్ రెడ్డి జాతీయ జెండాను ఎగుర వేసి గీతాన్ని ఆలపించారు. జీపీ కార్మికులకు కిట్స్ పంపిణీ తెలంగాణ అవిర్భావ దినోత్సవం వేడుకల సందర్భంగా పలు గ్రామాల్లోని జీపీ కార్మికులకు రక్షణ కిట్లు (గ్లౌస్, హెల్మెట్లు, బూట్లు) అందజేశారు. అలాగే పలు జీపీల్లో కార్మికులను సన్మానించి, వారి సేవలను కొనియాడారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల జీపీ సిబ్బంది, అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
నాణ్యమైన విత్తనాలను మాత్రమే విక్రయించాలి
పెర్కిట్(ఆర్మూర్)/బోధన్/నవీపేట: విత్తన డీలర్లు రైతులకు నాణ్యమైన విత్తనాలను మాత్రమే విక్రయించాలని ఆలూర్ తహసీల్దార్ రమేష్ సూచించారు. ఆలూర్ మండల కేంద్రంలోని విత్తన విక్రయ దుకాణాలను ఆయన ఏవో రాంబాబుతో కలిసి మంగళవారం తనిఖీ చేశారు. తహసీల్దార్ మాట్లాడుతూ.. నకిలీ విత్తనాలను విక్రయించిన వారిపై క ఠిన చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించారు. ఏవో రాంబాబు మాట్లాడుతూ.. రైతులు లైసెన్సు కలిగిన వారి నుంచి మాత్రమే విత్తనాలను కొనుగోలు చేయాలని సూచించారు. అలాగే రషీదులు తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. సాలూర మండల కేంద్రంలోని పలు విత్తన విక్రయ కేంద్రాలను తహసీల్దార్ అజ్మీత్ నవాజ్, ఏవో శ్వేత తనిఖీ చేశారు. నవీపేట మండల కేంద్రంలోని ఎరువుల దుకాణాలను తహసీల్దార్ వెంకటరమణ, ఏవో నవీన్కుమార్ తనిఖీ చేశారు. నాణ్యమైన కంపెనీల నుంచి కొనుగోలు చేసిన విత్తనాలను రైతులకు విక్రయించాలని ఫర్టిలైజర్ దుకాణాల యజమానులకు సూచించారు. కార్యక్రమంలో ఆయా శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
సైక్లింగ్తో గ్రీన్ ఫ్యూచర్..
ప్రతిరోజూ సైక్లింగ్ చేయడంతో ఆరోగ్యానికి మంచి దే కాకుండా పర్యావర ణా నికి మేలు చేసినట్లే. రోజు వారీ పనుల్లో సైకిల్ ను ఉపయోగిస్తే తక్కువ ధర తో రవాణా ఏర్పాటు చేసుకున్నట్లే కాకుండా పర్యావరణానికి హితం చేసినవారమవుతాం. – మంచాల జ్ఞానేందర్, సామాజిక సేవకుడు అన్నిరకాలుగా ఉపయోగకరంసైక్లింగ్ చేయడంతో అన్ని రకాలుగా ఉపయోగం ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఫ్యూయల్ వాడ కం తగ్గించినట్లే. శరీరాని కి అవసరమైన చెమట ప డుతుంది. శరీరంలో ని అన్ని రకాల కండరా లు ఉత్తేజితమవుతాయి. – డా.తిరుపతిరావు, ఎండీ, జనరల్ ఫిజీషియన్ -
పేదల సొంతింటి కల సాకారం
నవీపేట: కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదల సొంతింటి కలను సాకారం చేసిందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి అన్నారు. మండలంలోని జన్నేపల్లి, సిరన్పల్లి గ్రామాలలో మంగళవారం సాయంత్రం ఇందిరమ్మ ఇళ్లను ఆయన పరిశీలించారు. నూతన గృహప్రవేశాలు చేసిన దంపతులకు నూతన వస్త్రాలను అందించారు. ఏళ్లుగా పెండింగ్లో ఉన్న జన్నేపల్లి, సిరంపల్లి, లింగాపూర్, గాంధీనగర్ గ్రామాల అనుసంధాన రహదారి విస్తరణకు రూ. 15కోట్లు మంజూరు అయ్యాయన్నారు. రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్, జన్నేపల్లి, సిరన్ పల్లి గ్రామాల సర్పంచులు గంగాధర్, తొగరి సౌమ్య, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు -
అటు ఆరోగ్యం.. ఇటు పర్యావరణం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: వ్యక్తిగత ఆరోగ్యం.. పర్యావరణ హితం కోసం సైక్లింగ్ చేయాలని ఆరోగ్య నిపుణులు, వైద్యులే కాకుండా ప్రభుత్వాలు సైతం చెబుతున్నాయి. పలు యూరప్ దేశాల్లో సైకిల్పై విధులకు వెళ్లేవారు గణనీయంగా పెరిగారు. హైదరాబాద్లోనూ మాదాపూర్, గచ్చిబౌలి లాంటి ప్రాంతాల్లో సైకిల్ ట్రాక్ ప్రత్యేకంగా నిర్మించారు. ఈ క్రమంలో నిజామాబాద్లోనూ కొందరు ఆరోగ్యాభిలాషులు ప్రతిరోజూ సైక్లింగ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా నగరానికి చెందిన 20 మంది నాలుగు బృందాలుగా ఏర్పడి తమ సైకిళ్లతో ప్రతిరోజూ 30 కిలోమీటర్ల మేర సైక్లింగ్ చేస్తున్నారు. నిజామాబాద్–మంచిప్ప, నిజామాబాద్–మామిడిపల్లి తదితర రూట్లలో ఈ సైక్లింగ్ చేస్తున్నారు. డాక్టర్ వెంకటరమణ, మంచాల జ్ఞానేందర్, డాక్టర్ ప్రతాప్, తిరుమల నాయుడు, వీరేష్, శ్రీహరి, ప్రసాద్, వినోద్, అశోక్, సురేందర్ సైక్లింగ్ బృందం ప్రతిరోజూ మంచిప్ప వరకు వెళ్లడం, రావడం కలిపి 30 కిలోమీటర్లు సైక్లింగ్ చేస్తున్నారు. ఈ బృందం మరో 10 మందితో కలిసి గతంలో సైకిళ్లపై 440 కిలోమీటర్ల దూరంలోని భద్రాచలం వరకు వెళ్లి సీతారాముల దర్శనం చేసుకుని వచ్చారు. ప్రతిరోజూ 30 కిలోమీటర్ల మేర సైక్లింగ్ చేస్తున్న ఇందూరువాసులు గతంలో భద్రాచలం వరకు 440 కిలోమీటర్లు సైకిల్ యాత్ర చేసిన 15 మంది నేడు అంతర్జాతీయ సైక్లింగ్ దినోత్సవం -
పర్యావరణ బాధ్యత ప్రజలందరిదీ
● డీఎఫ్వో సిద్ధార్థ్ విక్రమ్సింగ్డొంకేశ్వర్(ఆర్మూర్): పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కేవలం ప్రభుత్వ శాఖలదే కాదని, ప్రజలందరిదని జిల్లా అటవీ శాఖ అధికారి సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ అన్నారు. ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా సోమవారం సారంగపూర్ అర్బన్ ఫారెస్ట్ పార్క్లో స్థానిక యువకులు, ఎన్జీవోలకు, ప్రజలకు అడవుల సంరక్షణపై అవగాహన కల్పించారు. అడవులు, నదులు, వన్యప్రాణులు, చెట్లు కేవలం సహజ వనరులు మాత్రమే కాదని, అవి మన పూర్వీకుల నుంచి వారసత్వంగా పొందిన అమూల్యమైన ఆస్తులని పేర్కొన్నారు. వీటిని మరందరం కాపాడుకొని భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత ఉందన్నారు. వాతావరణ మార్పుల తీవ్రతకు చాలా కారాణాలున్నాయని అందులో అడవులు క్షీణించడం, ప్లాస్టిక్ వినియోగం అంశాలు ప్రధానమన్నారు. జిల్లాలో అటవీకరణ, పర్యాటక అభివృద్ధిపై అవగాహన పెంచుకొని ప్రతి ఒక్కరూ చెట్లను నాటాలని పిలుపునిచ్చారు. ఎఫ్ఆర్వో సంజయ్గౌడ్, అటవీ సిబ్బంది పాల్గొన్నారు. -
అవతరణ వేడుకలకు సిద్ధం
నిజామాబాద్ అర్బన్ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవానికి జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ను ముస్తాబు చేశారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్లు కిరణ్ కుమార్, భుజంగరావు, డీఆర్వో గీత ఇప్పటికే అధికారులతో సమీక్ష నిర్వహించి వేడుకల నిర్వహణ ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు. వేడుకల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఉదయం 8 గంటలకు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. అంతకుముందు వినాయకనగర్లోని అమరవీరుల స్థూపం వద్ద శ్రద్ధాంజలి ఘటించనున్నారు. ఏర్పాట్ల పరిశీలన తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించు కొని పోలీస్ పరేడ్ మైదానం, అమరవీరుల స్థూపం వద్ద జరుగుతున్న ఏర్పాట్లను సీపీ సాయిచైతన్య సో మవారం పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట భద్రతా చర్య లు చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు. ఆయన వెంట స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ రెడ్డి, టౌన్ 4 ఎస్హెచ్వో సతీశ్, నిజామాబాద్ నార్త్ తహసీల్దా ర్ వి.అనిల్ గిరిధర్, సాయిలు ఉన్నారు. -
జేఈఈ అడ్వాన్స్డ్లో ర్యాంకుల పంట
● కాకతీయ విద్యార్థుల ప్రభంజనంఖలీల్వాడి: జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలలో నిజామాబాద్ కాకతీయ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారని చైర్మన్ విజయలక్ష్మి సోమవారం తెలిపారు. హెచ్. భరత్ 1275, జె. తన్విత 1573, బి. సంధ్య 1627, ఆర్. బన్ని 1834, ఎ. ఆత్రిజీ 2361 ర్యాంకులు సాధించారన్నారు. ఈ సందర్భంగా కాకతీయ విద్యాసంస్థల డైరెక్టర్ సీహెచ్. రామోజీరావు మాట్లాడుతూ ఈ సంవత్సరం ప్రకటించిన జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలలో ఆలిండియా ర్యాంకులు సాధించి కాకతీయ విద్యార్థులు సత్తా చాటారని అన్నారు. జాతీయ స్థాయి ర్యాంకులు సాధించిన విద్యార్థులను డైరెక్టర్ సీహెచ్. తేజశ్విని అభినందించారు. కార్యక్రమంలో డైరెక్టర్ సీహెచ్ రాజా, ప్రిన్సిపాల్స్ సందీప్ కులకర్ణి, వి. రణధీశ్ శర్మ, అకడమిక్ కో–ఆర్డినేటర్ నాగరాజు, వైస్ ప్రిన్సిపాల్ శ్యాంబాబు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఆత్మరక్షణ.. కర్రసాము శిక్షణ
బాన్సువాడ : వేసవి సెలవుల్లో సరదాగా గడిపేందుకు పిల్లలు ఆసక్తి చూపుతారు. కానీ, బాన్సువాడకు చెందిన ఈ చిన్నారులు మాత్రం కర్రసాములో మెలకువలు నేర్చుకుంటూ ఔరా అనిపిస్తున్నారు. ఫలితంగా శారీరక దృఢత్వం, క్రమశిక్షణ, మానసిక ఉల్లాసం, ఆత్మస్థైర్యాన్ని పొందుతున్నారు. పిల్లలు సెలవులను వృథా చేయకుండా ఆత్మరక్షణకు తోడ్పడేలా వేద్ ఆర్యన్ అనే యువకుడు ఉచిత శిక్షణ శిబిరం ఏర్పాటు చేశారు. ఆర్య సమాజ్ ప్రాంగణంలో కరాటే, కర్రసాము, యోగాపై శిక్షణనిస్తున్నారు. తొలుత 12 మంది మాత్రమే రాగా ప్రస్తుతం 40 మంది చిన్నారులు శిక్షణ పొందుతున్నారు. పిల్లల ఆసక్తికి తల్లిదండ్రులు ప్రోత్సాహం తోడయ్యింది. ఆర్యసమాజ్ ప్రాంగణంలో కరాటే మాస్టర్ వేద్ ఆర్యన్ (బ్లాక్ బెల్ట్) ఆధ్వర్యంలో కర్రసాము, కరాటే, యోగాపై ఉదయం 6 నుంచి 8 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు శిక్షణనిస్తున్నారు. కరాటే, యోగా శిక్షణతో చిన్నారుల ఉత్సాహం మానసిక ఉత్తేజం, శారీరక దృఢత్వం బాన్సువాడ ఆర్యసమాజ్ ప్రాంగణంలో ఉచిత శిక్షణ -
చోరీ కేసులో ముగ్గురి అరెస్టు
నిజామాబాద్ అర్బన్ : ఆర్మూర్ పట్టణంలోని మహాలక్ష్మినగర్ కాలనీలో మే 24న జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీపీ సాయిచైతన్య వివరాలు వెల్లడించారు. మహాలక్ష్మినగర్ కాలనీకి చెందిన శరత్ కుటుంబసభ్యులతో కలిసి వేములవాడకు వెళ్లారు. దుండగులు పథకం ప్రకారం ఇంట్లోకి చొరబడి రూ.19 లక్షల నగదు, 10 గ్రాముల చైన్, వెండిపెట్లు, 580 గ్రాముల బంగారం ముద్దలను అపహరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఏసీపీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సోమవారం బ్రాహ్మణపల్లి రోడ్డు వద్ద ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో పట్టుకొని విచారించగా చోరీకి పాల్పడింది తామేనని ఒప్పుకున్నారు. నిందితులు విజయ్ అగర్వాల్, సల్మాన్ఖాన్, మంజల్ సాయికుమార్ను అరెస్టు చేయగా, శ్రీహరి పరారీలో ఉన్నాడు. వారి నుంచి రూ.31 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు సీపీ తెలిపారు. కాగా, విజయ్ అగర్వాల్ సొంత బాబాయి ఇంట్లోనే చోరీ చేసేందుకు మరో ముగ్గురితో కలిసి పథకం వేసినట్లు పేర్కొన్నారు. సమావేశంలో ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ● రూ.31 లక్షలు స్వాధీనం ● బాబాయ్ ఇంట్లోనే దొంగతనం చేసిన ఘనుడు -
ఎస్ఆర్ విద్యార్థుల ప్రతిభ
నిజామాబాద్ ఎస్ఆర్ విద్యాసంస్థల విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలలో జాతీయస్థాయి అత్యుత్తమ ర్యాంకులతో విజయభేరి మోగించారు. వై. శ్రీ వర్ధన్ 203, ఎన్.సురేశ్ 1060, డి. శ్రీకాంత్ 3216, జె. యశ్వంత్ 3,424, ఎం. నివాస్ రెడ్డి 5,191, ఎస్. కృపాకర్ 5454, జె.అఖిలేష్ 5617, ఎస్. విశ్వంత్ 5931, ఏ.చరణ్ తేజ 9397 ర్యాంక్ సాధించగా 10 వేల లోపు 9 మంది విద్యార్థులు ర్యాంకు లు సాధించారు. డీజీసీ గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు ప్రత్యేక తరగతులు, వారాంతపు పరీక్షలు, ప్రత్యేక శ్రద్ధ వహించడంతో అత్యుత్త మ ఫలితాలు సాధించారన్నారని అన్నారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులకు ఎస్ఆర్ చైర్మన్ వరదారెడ్డి, డైరెక్టర్లు మధుకర్ రెడ్డి, సంతోష్ రెడ్డి, సీఈవో సురేందర్ రెడ్డి అభినందించారు. కార్యక్రమంలో నిజామాబాద్ జోనల్ ఇంచార్జి శ్రీకాంత్, అకడమిక్ డీన్ రాంరెడ్డి, ప్రిన్సిపాళ్లు హన్మంత్ రావు, శ్రీధర్ రెడ్డి, దేవేందర్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, మురళీధర్ రెడ్డి, నర్సింహారెడ్డి సిబ్బంది పాల్గొన్నారు. -
డిప్యుటేషన్ల రద్దు కొందరికే..
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: జిల్లా, మండల ప్రజాపరిషత్ ఉద్యోగుల బదిలీల ప్రక్రియ పూర్తయినప్పటికీ కొన్ని గంటలు కూడా గడవకముందే కొందరు ఉద్యోగులు డిప్యుటేషన్ల కోసం ప్రయత్నాలు చేస్తుండడంతో గత నెల 27న ‘సాక్షి’లో ‘బదిలీల కౌన్సెలింగ్తో మాకేంటి?’ శీర్షికతో కథనం ప్రచురితం అయింది. దీంతో ఉద్యోగుల డిప్యుటేషన్ల ప్రక్రియ కు బ్రేక్ పడింది. ఈ క్రమంలో ఇప్పటికే డిప్యుటేషన్ల మీద ఉన్నవాళ్లు ఆయా స్థానాల్లోనే కొనసాగేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. ‘సాక్షి’ కథనం నేపథ్యంలో కొందరు ఉద్యోగుల డిప్యుటేషన్లను రద్దు చేస్తూ జెడ్పీ సీఈవో ఉత్తర్వులు జారీ చేశారు. అయితే సగం మంది డిప్యుటేషన్లు మాత్రమే రద్దు అయ్యాయని, మిగిలిన సగం మంది డిప్యుటేషన్లు సైతం రద్దు చేయాల్సి ఉందని ఉద్యోగులు చెబుతున్నారు. ఇంకా రద్దు కాని డిప్యుటేషన్లపై పలువురు ఉద్యోగులు గుర్రుగా ఉన్నారు. బోధన్ నియోజకవర్గంలోని ఒక మండలానికి చెందిన ఉద్యోగి జెడ్పీ లో, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని ఒక మండలానికి చెందిన ఉద్యోగి బాన్సువాడ నియోజకవర్గంలోని ఒక మండలంలో, బాన్సువాడ నియోజకవర్గంలోని ఒక మండలానికి చెందిన ఉద్యోగి ఆర్మూర్ నియోజకవర్గంలోని ఒక మండలంలో, ఆర్మూర్ నియోజకవర్గంలో ఒక మండల ఉద్యోగి మరో మండలంలో, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని ఒక మండలం ఉద్యోగి బోధన్ నియోజకవర్గంలోని మరొక మండలంలో, బాన్సువాడ నియోజకవర్గంలోని ఒక మండలానికి చెందిన ఉ ద్యోగి బోధన్ నియోజకవర్గంలోని ఒక మండలంలో ఇంకా డిప్యుటేషన్లపై కొనసాగుతున్నారు. ఇదిలా ఉండగా బదిలీలు అయినప్పటికీ యథాస్థానాల్లో కొనసాగేందుకు గాను కొందరు జిల్లా, మండల ప్రజాపరిషత్ ఉద్యోగులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. జిల్లా ప్రజాపరిషత్లో ఏళ్లతరబడి కొనసాగుతున్న ఒక సెక్షన్ అధికారి ఈ స్థానం నుంచి కదిలేందుకు ఇష్టపడడం లేదని పలువురు ఉద్యోగులు చెబుతున్నారు. సదరు ఉద్యోగి కనుసన్నుల్లోనే మిగిలిన ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్లు నడుస్తున్నాయని, ఆ సెక్షన్ అధికారిని అడగకుండా మిగిలిన సెక్షన్ల ఉద్యోగులు పనులు చేయలేని పరిస్థితి నెలకొంది. ఆ అధికారి సెలవులో ఉన్న సమయంలో ఎవరైనా ఉద్యోగి పని నిమిత్తం జెడ్పీ కార్యాలయానికి వస్తే తర్వాత రమ్మని చెప్పే పరిస్థితి. ఈ క్రమంలో బదిలీ అయినప్పటికీ సదరు కొందరు అధికారులను మచ్చిక చేసుకుని జిల్లా ప్ర జాపరిషత్ ఎన్నికల పేరిట మళ్లీ యథాస్థానంలోనే డిప్యుటేషన్ మీద కొనసాగేందుకు అధికారి ప్రయత్నాలు చేస్తున్నట్లు ఉద్యోగ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఈ సెక్షన్ అధికారి ఆర్మూర్ నియోజకవ ర్గంలోని ఒక మండలానికి బదిలీ కాగా అక్కడ పనిచేస్తున్న ఉద్యోగి జెడ్పీకి బదిలీ అయ్యాడు. ఈ ఇద్ద రూ తిరిగి యథాస్థానాల్లోనే ఉండేలా ప్లాన్లు చేసుకుంటున్నట్లు ఉద్యోగ వర్గాలు చెప్పుకుంటున్నాయి. మరో జూనియర్ అసిస్టెంట్కు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని ఒక మండలానికి బదిలీ అయింది. ఈ ఉద్యోగి మళ్లీ జెడ్పీలోకి వచ్చేందుకు అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాడని పలువురు చెబుతున్నారు. ఇక్కడి నుంచి ఫారిన్ విభాగానికి వెళతానని తోటి ఉద్యోగుల ముందు చెబుతున్నట్లు తెలుస్తోంది. అయితే వీళ్లకంటే గత జెడ్పీ ఎన్నికల్లో పనిచేసిన అనుభవం ఉన్న సీనియర్లకు అవకాశం ఇస్తే బాగుంటుందని ఉద్యోగ వర్గాలు పేర్కొంటున్నాయి. జెడ్పీ ప్రత్యేక అధికారిగా ఉన్న జిల్లా కలెక్టర్ స్పందించి అక్రమ వ్యవహారాలకు చెక్ పెట్టాలని కోరుతున్నారు. గతంలో ఇచ్చిన డిప్యుటేషన్లను సైతం రద్దు చేసి అందరికీ సమన్యాయం చేయాలని కోరుతున్నారు. మరోవైపు నిజామాబాద్ రూరల్ మండలం డిప్యుటేషన్ కోసం ఇద్దరు ముగ్గురు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. బోధన్ నియోజకవర్గంలోని ఒక మండలానికి సూపరింటెండెంట్ లేకపోవడంతో పనిభారం కింది ఉద్యోగులపై పడుతుందని చెబుతున్నారు. జెడ్పీ ఎన్నికల నేపథ్యంలో ఎంపీడీవోకు కిందిస్థాయి సిబ్బంది తక్కువగా ఉంటే పనిభారం పడుతుందని పలువురు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యూనియన్ల పేరిట డిప్యుటేషన్ల కథలు నడిపిస్తుండడం పట్ల ఉద్యోగుల్లో అసహనం వ్యక్తం అవుతోంది. ఈ విషయాలపై జెడ్పీ సీఈవో సాయాగౌడ్ను ‘సాక్షి’ వివరణ కోరగా కొత్తగా ఎవరికీ డిప్యుటేషన్లు ఇచ్చేది లేదని తెలిపారు. సగం మందికి మాత్రమే మినహాయింపు ఇవ్వడంపై జెడ్పీ ఉద్యోగుల్లో చర్చ అందరికీ ఒకే న్యాయం ఉండాలంటున్న ఉద్యోగులు ‘సాక్షి’ కథనంతో జిల్లా ప్రజాపరిషత్లో కదలిక ఎవరికీ డిప్యుటేషన్లు ఇవ్వం : జెడ్పీ సీఈవో సాయాగౌడ్ -
పశువుల దొంగల ముఠా అరెస్ట్
రుద్రూర్ : కోటగిరి మండల కేంద్రంలో బుధవారం పశువుల దొంగల ముఠా సభ్యులను అరెస్ట్ చేసిన ట్టు బోధన్ ఏసీపీ శ్రీనివాస్ తెలిపారు. నిందితుల నుంచి రెండు బొలెరో వాహనాలు, ఒక బైక్, ఐదు సెల్ఫోన్లు, రూ.20 వేల నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు. కోటగిరి పోలీస్స్టేషన్లో సోమవా రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. మండల కేంద్రంలోని ఎన్టీఆర్ చౌరస్తా వద్ద పోలీసులు వాహనాల తనిఖీ చేస్తుండ గా ముఠాకు చెందిన ఐదుగురు పట్టుబడ్డారు. నిందితులను మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా బిలోలికి చెందిన ఫరీద్ నవాబ్ సాబ్ ఖురేషీ, అస్లాం ఖురేషీ, ఇలియాస్ నవాబ్ ఖురేషీ, ఆర్మూర్కు చెందిన షేక్ రఫీక్, ఇందల్వాయి మండలం తిర్మన్పల్లికి చెందిన మహ్మద్ రెహమత్గా గుర్తించారు. వీరిపై కోటగిరి, వర్ని, బోధన్, నిజామాబాద్ టౌన్ ప్రాంతాలతోపా టు జగిత్యాల జిల్లా వెల్గటూర్ పోలీస్ స్టేషన్ల పరిధి లో మొత్తం 11 కేసులు ఉన్నట్లు విచారణలో తేలింది. దొంగిలించిన గేదెలు, పశువులను బోధన్న్కు చెందిన ఖురేషి అబ్దుల్లాకు విక్రయించినట్లు ఏసీపీ వివరించారు. ప్రధాన నిందితులైన సోహెల్ పటేల్ (నాందేడ్), సయ్యద్ సైఫ్ (బిలోలి), జియా ఖురేషీ (బిలోలి), అబుసద్, అబ్దుల్ అజీజ్ (బోధన్) పరారీలో ఉన్నట్లు తెలిపారు. సమావేశంలో ఎస్సై సునీల్, పోలీస్ సిబ్బంది ఉన్నారు. -
చోరీ కేసులో ముగ్గురి అరెస్టు
నిజామాబాద్ అర్బన్ : ఆర్మూర్ పట్టణంలోని మహాలక్ష్మినగర్ కాలనీలో మే 24న జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీపీ సాయిచైతన్య వివరాలు వెల్లడించారు. మహాలక్ష్మినగర్ కాలనీకి చెందిన శరత్ కుటుంబసభ్యులతో కలిసి వేములవాడకు వెళ్లారు. దుండగులు పథకం ప్రకారం ఇంట్లోకి చొరబడి రూ.19 లక్షల నగదు, 10 గ్రాముల చైన్, వెండిపెట్లు, 580 గ్రాముల బంగారం ముద్దలను అపహరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఏసీపీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సోమవారం బ్రాహ్మణపల్లి రోడ్డు వద్ద ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో పట్టుకొని విచారించగా చోరీకి పాల్పడింది తామేనని ఒప్పుకున్నారు. నిందితులు విజయ్ అగర్వాల్, సల్మాన్ఖాన్, మంజల్ సాయికుమార్ను అరెస్టు చేయగా, శ్రీహరి పరారీలో ఉన్నాడు. వారి నుంచి రూ.31 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు సీపీ తెలిపారు. కాగా, విజయ్ అగర్వాల్ సొంత బాబాయి ఇంట్లోనే చోరీ చేసేందుకు మరో ముగ్గురితో కలిసి పథకం వేసినట్లు పేర్కొన్నారు. సమావేశంలో ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ● రూ.31 లక్షలు స్వాధీనం ● బాబాయ్ ఇంట్లోనే దొంగతనం చేసిన ఘనుడు -
ఇందూరు స్ఫూర్తి
తెలంగాణ ఉద్యమానికినేడు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవంసాక్షి ప్రతినిధి, నిజామాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన పోరాటంలో ఇందూరు జిల్లా ఉద్యమానికి తీసుకొచ్చిన ఊపు చరిత్రను లిఖించింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 2001 జూన్ 5న వేల్పూర్ మండలంలోని మోతె గ్రామాన్ని సందర్శించి, ఈ గ్రామస్తుల పోరాట స్ఫూర్తి తనకు, బీఆర్ఎస్కు ఎంతో బలాన్ని ఇచ్చిందని ఇక్కడి మట్టిని ముడుపు కట్టి తీసుకెళ్లారు. తెలంగాణ ఆవిర్భావం తరువాత 2014 మార్చిలో గ్రామానికి వచ్చిన కేసీఆర్ ముడుపు విప్పారు. ● 2016 అక్టోబర్ 9న దసరా రోజున పరిపాలన వికేంద్రీకరణ చేశారు. నిజామాబాద్ నుంచి ప్రత్యేకంగా కామారెడ్డి జిల్లా ఏర్పాటైంది. జిల్లాలో 14 కొత్త మండలాలు ఏర్పాటు కాగా, మొత్తం మండలాల సంఖ్య 33కు చేరుకుంది. తండాలను గ్రామపంచాయతీలుగా చేశారు. జిల్లాలో పంచాయతీల సంఖ్య 545కు చేరుకుంది. అన్ని పంచాయతీల పరిధిలో పల్లె ప్రకృతి వనాలు, శ్మశాన వాటికలు, క్రీడా ప్రాంగణాలు నిర్మాణమయ్యాయి. వ్యవసాయంలో అగ్రభాగంలో ఉన్న ఇందూరు జిల్లాకు ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు మాత్రం ఇప్పటివరకు రాలేదు. లక్కంపల్లిలో ప్రత్యేక ఆర్థిక మండలి ఉన్నప్పటికీ యూనిట్ల స్థాపనలో అడుగులు ముందుకు పడలేదు. వేల్పూర్ క్రాస్రోడ్డు వద్ద స్పైసెస్ పార్క్ కోసం 70 ఎకరాలు భూసేకరణ చేసినప్పటికీ అతీగతీ లేదు. అయితే ధాన్యం సేకరణలో జిల్లా వరుసగా రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలుస్తూ వస్తోంది. ● జిల్లాలో 2014లో పంటల సాగు విస్తీర్ణం 4,14,197 ఎకరాలు ఉండగా, 2026 నాటికి 5,30,000 ఎకరాలకు చేరింది. వరి గణనీయంగా 2లక్షల ఎకరాల మేర పెరిగింది. మరోవైపు ఒకప్పుడు 50 వేల ఎకరాల్లో సాగయ్యే పసుపు పంట ప్రస్తుత ఏడాదికి 20 వేల ఎకరాలకు తగ్గింది. కేంద్ర ప్రభుత్వం జిల్లాలోనే పసుపు బోర్డు ఏర్పాటు చేయడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకం.. ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకానికి అప్పటి సీఎం కేసీఆర్ 2017 ఆగస్టు 10న శంకుస్థాపన చేశారు. రూ.1,069 కోట్లతో నిర్మాణ పనులు ప్రారంభించారు. 2023లో పునరుజ్జీవన పథకాన్ని ప్రారంభించి 2.5 టీఎంసీల నీటిని కాలేశ్వరం నుంచి ఎస్సారెస్పీకి తరలించారు. ఈ పథకంతో ఎస్సారెస్పీకి ఆశించిన స్థాయిలో ప్రయోజనం చేకూరలేదు. విద్యుత్ బిల్లులు అధికమయ్యాయని విమర్శలు వచ్చాయి. వరద కాలువ ద్వారా నీటి సరఫరా రివర్స్ పంపింగ్తో కాలువకు ఇరువైపులా భూముల్లో భూగర్భ జలాలు మాత్రం పెరిగాయి. ● కాళేశ్వరం 21వ ప్యాకేజీ కింద ఆయకట్టు స్థిరీకరణ కోసం మోపాల్ మండలం మంచిప్ప వద్ద 3.5 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో జలాశయం నిర్మాణం కోసం పనులు ప్రారంభించారు. కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 1.5 టీఎంసీల సామర్థ్యంతో మాత్రమే జలాశయాన్ని పరిమితం చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ పనులు నిలిచిపోయాయి. ● జిల్లాలోని 19 మైనారిటీ గురుకులాలు, 11 ఎస్సీ, 13 బీసీ, 5 తెలంగాణ పబ్లిక్ స్కూల్స్, 175 ప్రీ ప్రైమరీ స్కూల్స్ ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంలో ఐటీ టవర్ నిర్మాణం పూర్తి చేశారు. ● బోధన్లోని నిజాం షుగ ర్స్ ఫ్యాక్టరీని 2024 సెప్టెంబర్ 17లోగా తెరిపిస్తామని రేవంత్రెడ్డి ప్రకటించినప్పటికీ అది హామీగానే మిగిలిపోయింది. ● తెలంగాణ ఏర్పాటుకు ముందు ప్రారంభమైన నిజామాబాద్ బైపాస్ రోడ్డు నిర్మాణం అసంపూర్తిగానే ఉంది. నగరంలో సుమారు రూ.వెయ్యి కోట్లతో పనులు చేశారు. రూ.240 కోట్ల విలువైన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు 2005 నుంచి నడుస్తూనే ఉన్నాయి. జక్రాన్పల్లి మండలంలో విమానాశ్రయ ఏర్పాటు కలగానే మిగిలిపోయింది. ● ప్రస్తుత ప్రభుత్వం తెలంగాణ వర్సిటీకి ఇంజినీరింగ్ కళాశాల, జిల్లాలో వ్యవసాయ కళాశాల మంజూరు చేసింది. ● 30 ఏళ్ల డిమాండ్ అయిన ఆర్మూర్ రెవెన్యూ డివిజన్ ఏర్పాటు అయింది. నందిపేట్ మండలం నుంచి నిర్మల్ జిల్లాను కలుపుతూ పంచగుడి వద్ద గోదావరిపై బ్రిడ్జి నిర్మించారు. ● బోధన్లో అంబేడ్కర్ చౌరస్తా నుంచి మూడు వైపులా ప్రధాన రోడ్డు మార్గంలో సెంట్రల్ లైటింగ్ పూర్తి చేశారు. బోధన్లో 2021లో రూ.2.35 కోట్లతో ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు అధునాతన నూతన భవనం, 2017లో రూ.3కోట్లతో ప్రభుత్వ జూనియర్ కళాశాల అధునాతన భవనం నిర్మాణం చేశారు. ● ఎడపల్లి మండలం జానకంపేట నుంచి నవీపేట మండలంలోని యంచ వరకు 14.5 కిలోమీటర్ల పొడవున ఉన్న బాసర పుణ్యక్షేత్ర వెళ్లే రోడ్డును రూ.52 కోట్లతో నాలుగు వరుసలుగా విస్తరణ చేశారు. నిజాంసాగర్ ప్రాజెక్ట్ నాన్ కమాండ్ ఏరియా పరిధిలోని మెట్ట భూములకు సాగునీరు అందించేందుకు మోస్రా మండలంలోని చింతకుంట, వర్ని మండలంలోని జాకోరా ఎత్తిపోతల పథకాలు మంజూరు అయ్యాయి. వీటి పనులు పూర్తి కాలేదు. ఇవి పూర్తి అయితే 4,500 ఎకరాలకు సాగునీటి సౌకర్యం కలుగుతుంది. వర్ని మండలంలో రూ.102 కోట్లతో ప్రారంభమైన సిద్దాపూర్ రిజర్వాయర్ పనులు బిల్లులు రాకపోవడంతో ముందుకు సాగడం లేదు. ఈ రిజర్వాయర్ పనులు పూర్తయితే 10 వేల ఎకరాలకు సాగు నీటి సౌకర్యం కలుగుతుంది. బోధన్ మండలంలోని బెల్లాల్ శివారులో రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణాలు సాగుతున్నాయి. బోధన్ ఏరియా ప్రభుత్వ ఆస్పత్రి 2018లో జిల్లా ఆస్పత్రిగా అప్గ్రేడ్ అయింది. స్థలం సమస్య వల్ల కొత్త భవన నిర్మాణం ప్రతిపాదనలకే పరిమితమైంది. తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తిగా నిలిచిన ఇందూరు జిల్లా తనకే ప్రత్యేకమైన పేజీలను లిఖించుకుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును డిమాండ్ చేస్తూ మోతె గ్రామస్తులు తీర్మానం చేసి ఉద్యమంలో ముందు వరుసలో నిలిచారు. దీంతో ఉద్యమ నేత కేసీఆర్ ఇక్కడి మట్టిని ముడుపు కట్టి తీసుకెళ్లారు. చివరికి ప్రజాపోరాటం ఫలించి 2014 జూన్ 2న తెలంగాణ ప్రత్యేక రాష్టం ఏర్పాటు కాగా మంగళవారం నాటికి పన్నెండేళ్లు పూర్తవుతున్నాయి. ఈ ప్రస్థానంలో జిల్లాలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. కొత్తగా కామారెడ్డి జిల్లా ఏర్పాటైంది. 2023లో పునరుజ్జీవన పథకాన్ని ప్రారంభించి 2.5 టీఎంసీల నీటిని కాళేశ్వరం నుంచి ఎస్సారెస్పీకి తరలించారు. జిల్లాలో మండలాల సంఖ్య 33కు, గ్రామ పంచాయతీల సంఖ్య 545కు చేరుకుంది. సీఎం హోదాలో మోతెకు కేసీఆర్కథనం–1 మోతె మట్టితో ముడుపు కట్టిన కేసీఆర్ పన్నెండేళ్ల ప్రస్థానంలో అనేక మార్పులు జిల్లాలో 33కు చేరిన మండలాలు, 545కు చేరిన గ్రామ పంచాయతీలు జిల్లాకు వ్యవసాయ, తెయూకు ఇంజినీరింగ్ కళాశాల మంజూరు జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వం సీఎం హామీకే పరిమితమైన నిజాం షుగర్స్ పున:ప్రారంభం కలగానే జక్రాన్పల్లి విమానాశ్రయం మోర్తాడ్(బాల్కొండ): తెలంగాణ ఉద్యమ సమయంలో మోతె మోగించిన దరువు ప్రతి ఊరును కదిలించింది. మోతె బాటలో నడిచిన పల్లెల సంఖ్య క్రమక్రమంగా పెరిగిపోయింది. మోతె చూపిన ఉద్యమ స్ఫూర్తికి ముగ్ధుడైన ఉద్యమ నేత కేసీఆర్ ఇక్కడి మట్టిని మట్టిని ముడుపు కట్టి తీసుకెళ్లి, రాష్ట్ర సాధన అనంతరం ముడుపు విప్పారు. అనంతరం సీఎం హోదాలో మోతెకు వచ్చిన కేసీఆర్ గ్రామానికి కొత్త గ్రామ పంచాయతీ భవనం, నూతన పాఠశాల భవనం, సీసీ రోడ్లు, రైతులకు సిమెంట్ కల్లాలు, వంద శాతం డ్రిప్ ఇరిగేషన్, ఇలా ఎన్నో రకాలైన పథకాలను అందించారు. -
గంగమ్మ ఒడి నుంచి బయటకు..
డొంకేశ్వర్(ఆర్మూర్): శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (ఎస్సారెస్పీ) బ్యాక్వాటర్ పరిధిలో ఆధ్యాత్మిక అద్భుతం వెలుగుచూసింది. గత కొన్ని రోజులుగా ప్రాజెక్ట్ వెనుక జలాల్లో నీటి మట్టం క్రమంగా తగ్గుముఖం పట్టడంతో డొంకేశ్వర్ పాత గ్రామంతో పాటు ఒక పురాతన శివలింగం, రెండు నందులు బయటపడ్డాయి. గంగమ్మ ఒడిలో జలదీక్ష ముగించుకుని ఆ పరమ శివుడు సాక్షాత్కరించినట్లుగా దర్శనమిస్తున్నాడు. అయితే, జలాల నుంచి బయటపడిన శివలింగానికి గ్రామ ప్రజలు సోమవా రం ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యాలు సమర్పించారు. ప్రస్తుత డొంకేశ్వర్ గ్రామానికి ఐదారు కిలో మీటర్ల దూరంలో ఉంది ఈ శివలింగం. -
అలుపెరుగని ఉద్యమ దీక్షలు
బోధన్: తెలంగాణ ఉద్యమంలో భాగంగా బోధ న్లో 1,519 రోజుల పాటు రిలే నిరహార దీక్షలు కొనసాగాయి. ఈ ఉద్యమ దీక్షలతో రాష్ట్ర స్థాయి లో బోధన్కు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. 2009 డిసెంబర్ 9న అప్పట్లో అధికారంలో ఉన్న యు పీఏ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ప్రకటించి యూటర్న్ తీసుకున్న క్రమంలో ఉద్యమం మరింత వేడెక్కింది. బోధన్ ప్రాంత ఉపాధ్యాయ, ఉద్యోగ, విద్యార్థి, మహిళా, కార్మిక , విశ్రాంత ఉద్యోగులు, రాజకీయ పార్టీలు కలిసి తెలంగాణ రాజకీయ జేఏసీని ఏర్పాటు చేశారు. 2009 డిసెంబర్ 28న పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తాలో ఐదుగురు ఉద్యమ కారులతో రిలే నిరహార దీక్షా శిబిరాన్ని ప్రారంభించారు. 2014 ఫిబ్రవరి 23 వరకు అలుపెరుగకుండా రిలే నిరహార దీక్షలు కొనసాగించారు. ఉద్యమ సారథి కేసీఆర్తో పాటు టీజేఏసీ రాష్ట్ర చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం, ప్రజాగాయకుడు గద్దర్ తదితరులు దీక్షలను సందర్శించారు. బోధన్లోని అంబేడ్కర్ చౌరస్తాలో పట్టణ కుల సంఘాల జేఏసీ అధ్వర్యంలో తెలంగాణ అ మరవీరుల స్తూపం నిర్మించారు. విశ్రాంత ఉపాధ్యాయుడు అక్కపల్లి కొండయ్య కుటుంబీకులు స్తూప నిర్మాణానికి రూ.4 లక్షలు ఆర్థిక సహాయం అందించారు. 2013 ఏప్రిల్ 29న ప్రజాగాయకుడు గద్దర్ స్తూపాన్ని ఆవిష్కరించారు. -
పేదల సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యం
సాక్షి నెట్వర్క్: పేదల సొంతింటి కలను నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని, ఇందిరమ్మ రాజ్యంలో అర్హులందరికీ ఇళ్లు మంజూరు చేసి వారి కళ్లల్లో ప్రజా ప్రభుత్వం ఆనందం నింపిందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి అన్నారు. రూరల్, అర్బన్ నియోజకవర్గాల్లోని పలు మండలాలు, గ్రామాల్లో లబ్ధిదారులు నిర్మించుకున్న ఇందిరమ్మ ఇళ్లను స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు ప్రారంభించారు. నిజామాబాద్ రూరల్ మండలం కులాస్పూర్లో సామూహిక ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశ కార్యక్రమాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. లబ్ధిదారులతో గృహ ప్రవేశం చేయించి, నూతన వస్త్రాలు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ఒక్కరోజే వెయ్యి ఇళ్ల గృహప్రవేశం చేయడం ఆనందంగా ఉందన్నారు. నియోజకవర్గంలో 2655 ఇండ్లు మంజూరు కాగా, 98 శాతం గ్రౌండింగ్ పూర్తి చేసుకొని జిల్లాలోనే మొదటి స్థానంలో ఉందని తెలిపారు. రెండో విడతలో అర్హులకు మరిన్ని ఇండ్లు మంజూరు చేస్తామని పేర్కొన్నారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ.. జిల్లాలో మొత్తం 3,304 ఇళ్ల గృహ ప్రవేశాలు చేశామని వివరించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉర్ధూ అకాడమీ చైర్మన్ తాహెర్ బీన్ హందాన్, రాష్ట్ర కల్లుగీత కార్మిక సహకార ఆర్థిక కార్పొరేషన్ చైర్మన్ బాడ్సి శేఖర్ గౌడ్, నిజామాబాద్ ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, సర్పంచ్ గుడి జనార్ధన్రెడ్డి, డీఆర్వో గీత, ఆర్డీవో రాజేంద్రకుమార్, మండల ప్రత్యేకాధికారి తిరుమల ప్రసాద్, తహసీల్దార్ రేఖ, ఎంపీడీవో రాములు నాయక్, హౌజింగ్ అధికారులు రాజ్యలక్ష్మీ, నివర్తి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు జలంధర్రెడ్డి, ఎల్లోల్ల సాయిరెడ్డి, మునిపల్లి సాయిరెడ్డి, ఉమ్మాజి నరేష్, హన్మండ్లు, హమీద్, దిలావర్ హుస్సేన్, తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి పలు గ్రామాల్లో ‘ఇందిరమ్మ’ గృహప్రవేశాలు -
పట్టాలెక్కని అధ్యయనం
మోర్తాడ్(బాల్కొండ): వలస కార్మికుల సంక్షేమం కోసం ప్రవాసీ విధానాన్ని రూపొందించాలనే సంకల్పంతో ఏర్పాటు చేసిన ఎన్నారై అడ్వయిజరీ బోర్డు అధ్యయనం పట్టాలెక్కకపోవడంతో వలసదారుల ప్రయోజనాలపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. 2025 ఏప్రిల్ 10వ తేదీన ఎన్నారై అడ్వయిజరీ బోర్డును ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. అధ్యయనం చేసి నివేదికను అందించడానికి రెండేళ్ల కాలపరిమితిని నిర్ణయించింది. ఇప్పటికే 14 నెలల కాలం గడచిపోయినా బోర్డు అధ్యయనం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. సలహా కమిటీ తీరు సరిగా లేకపోవడానికి ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం కరువైందనే ఆరోపణలతో బోర్డు సభ్యత్వానికి గుగ్గిల్ల రవిగౌడ్ శనివారం రాజీనామా చేశారు. సభ్యుని రాజీనామాతో ప్రవాసీ విధానం రూపకల్పన అటకెక్కిందని వలస కార్మికుల్లో చర్చ జరుగుతోంది. ఉద్ధండులతోనే కమిటీ ఏర్పాటు ఎన్నారై అడ్వయిజరీ బోర్డులో గల్ఫ్ అంశాలు, వలస కార్మికుల సమస్యలపై ఎంతో అవగాహన ఉన్నవారే సభ్యులుగా ఉన్నారు. పదవీ విరమణ చేసిన ఐఎఫ్ఎస్ అధికారి, వివిధ దేశాల్లో రాయబారిగా, మన దేశంలో పాస్పోర్టు అధికారిగా సేవలందించిన డాక్టర్ వినోద్కుమార్ నేతృత్వంలో కమిటీ కొనసాగుతోంది. అంతర్జాతీయ వలసల విశ్లేషకులు మంద భీంరెడ్డి, వలస కార్మిక సంఘాల నాయకులైన స్వదేశ్ పరికిపండ్ల, నంగి దేవేందర్రెడ్డి, సిస్టర్ లిజీ జోసెఫ్, సింగిరెడ్డి నరేశ్రెడ్డి, చెన్నమనేని శ్రీనివాస్రావు, కొట్టాల సత్యం నారాగౌడ్, గుగ్గిల్ల రవిగౌడ్(రాజీనామా చేసిన వ్యక్తి)తో పాటు ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాస్, మేడిపల్లి సత్యం, డాక్టర్ భూపతిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ ఈరవత్రి అనిల్, మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డి(బీఆర్ఎస్లో చేరక ముందు) సభ్యులుగా ఎంపిక చేశారు. ఈ కమిటీ మన రాష్ట్రంలో వలసలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలతోపాటు పొరుగు రాష్ట్రాల్లో పర్యటించి అధ్యయనం చేయాల్సి ఉంది. కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగానే ప్రభుత్వం ప్రవాసీ విధానాన్ని రూపొందచడానికి అవకాశం ఉంది. ఇప్పటి వరకు కమిటీ కేవలం నిర్మల్ జిల్లాతోపాటు ఆంధ్రప్రదేశ్లో మాత్రమే పర్యటించింది. అధ్యయనం కోసం ఎన్నో పర్యటనలు చేయాల్సి ఉన్నా ప్రభుత్వం నుంచి సహకారం లేదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. కమిటీ సభ్యులు ప్రభుత్వ పెద్దలను ప్రశ్నించే స్థితిలో లేకపోవడంతో అధ్యయనం పట్టాలు ఎక్కడం లేదనే వాదన వినిపిస్తోంది. రవిగౌడ్ రాజీనామాతో అధ్యయనం ఎంత వరకు వచ్చిందనే విషయం బహిర్గతమైందని స్పష్టమవుతోంది. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి వలస కార్మికుల సంక్షేమానికి కృషి చేయాలని పలువురు సూచిస్తున్నారు. కాగితాలకే పరిమితమైన ఎన్నారై అడ్వయిజరీ బోర్డు ప్రభుత్వ ప్రోత్సాహం లేదని సభ్యుని రాజీనామా వలస కార్మికుల ప్రయోజనాలపై నీలినీడలు -
నేను గీసిన చిత్రం
సాయిప్రభ, 7వ తరగతి, జెడ్పీహెచ్ఎస్, పిట్లం, కామారెడ్డి ఎన్. సంస్థిత, 4వ తరగతి, రుద్రూర్. సింగారం నిత్యశ్రీ, 7వ తరగతి, తొర్లికొండ, నిజామాబాద్ ప్రవస్తి, 5వ తరగతి, కాకతీయ స్కూల్, నిజామాబాద్ -
ఊపిరి పోశారు..
కామారెడ్డి టౌన్ : నెలలు నిండకుండా పుట్టి, శ్వాస ఆడక ప్రాణాపాయ స్థితిలో ఉన్న నవజాత శిశువుకు 108 అంబులెన్స్ సిబ్బంది పునర్జన్మనిచ్చారు. కృత్రిమ శ్వాస అందిస్తూ ఆస్పత్రికి తరలించారు. వివరాలు ఇలా ఉన్నాయి.. పాల్వంచ మండలం భవానీపేట గ్రామానికి చెందిన మానస అనే గర్భిణికి జిల్లా కేంద్రంలో ని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో సాధారణ ప్రసవమైంది. అయితే, నెలలు నిండకుండానే మగ శిశు వు జన్మించాడు. పుట్టి న సమయంలో బా బు ఏడవకపోవడం, శ్వాస తీసుకోవడానికి తీవ్రంగా ఇబ్బంది పడుతూ నిర్జీవ స్థితికి చేరుకోవడంతో పిల్లల వైద్యులు బా బును సాధారణ స్థితి కి తెచ్చేందుకు శతవిధాలా ప్రయత్నించా రు. ఫలితం లేకపోవడంతో, మెరుగైన చికి త్స కోసం నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి రెఫర్ చేశారు. 108 అంబులెన్స్ సిబ్బంది వెంటనే శిశువును నిజామాబాద్ తరలించేందుకు బయలుదేరారు. మార్గమధ్యంలో బాబు పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారడంతో ఈఎంటీ కృష్ణస్వామి సమయస్ఫూర్తితో అంబులెన్స్లోనే నిరంతరాయంగా ఆక్సిజన్తోపాటు అంబుబ్యాగ్ ద్వారా కృత్రిమ శ్వాస అందిస్తూ, ఐవీ ఫ్ల్యూడ్స్ ఇస్తూ బాబును సురక్షితంగా ఇంక్యుబేటర్లో ఉంచారు. పైలట్ సుదర్శన్ గౌడ్ సమయస్ఫూర్తితో వాహనాన్ని నడిపి సురక్షితంగా నిజామాబాద్ ఆస్పత్రికి చేర్చారు. బాబుకు ప్రస్తుతం ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. సమయానికి స్పందించి తన కుమారుడి ప్రాణాలు కాపాడిన 108 ఈఎంటీ కృష్ణస్వామి, పైలట్ సుదర్శన్ గౌడ్ను శిశువు తండ్రి సంతోష్ కృతజ్ఞతలు తెలిపారు. ఆస్పత్రి వైద్యుడు, సిబ్బంది సైతం అభినందించారు. ● 108 సిబ్బంది సమయస్ఫూర్తి.. శిశువుకు పునర్జన్మ ● నెలలు నిండకుండా పుట్టిన బాబు ● కృత్రిమ శ్వాసనందిస్తూ ఆస్పత్రికి తరలింపు -
ధాన్యం కొనుగోళ్లపై బీజేపీ, బీఆర్ఎస్ ‘రాజకీయం’
● చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం ● రైతులు ఆందోళన చెందవద్దు ● రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్రెడ్డి కమ్మర్పల్లి : యాసంగి ధాన్యం కొనుగోళ్లపై బీజేపీ, బీఆర్ఎస్ రాజకీయం చేస్తున్నాయని రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. రైతులను తప్పుదోవ పట్టించాలనే దురుద్దేశంతో కల్లాల వద్దకు వెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. ఆదివారం ఆయన కమ్మర్పల్లి మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడా రు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకా రం చేసిన తర్వాత నాలుగు సీజన్లలో రైతులకు ఇబ్బంది లేకుండా చేశాం, ప్రస్తుత ఐదో సీజన్లో కూడా రైతులకు ఇబ్బంది లేకుండా చూస్తామని తెలిపారు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రంపై పోరాడాల్సిన బీజేపీ నాయకులు రాష్ట్ర ప్రభుత్వంపై మాట్లాడుతున్న తీరు వారి అనాలోచిత విధానానికి నిదర్శనమని విమర్శించారు. ధాన్యానికి మద్దతు ధర నిర్ణయించే కేంద్ర ప్రభుత్వం కొనుగోలు బాధ్యత ఎందుకు తీసుకోదని ప్రశ్నించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఒప్పందం ప్రకారమే కోత అని లేఖల ద్వారా ఉసిగొల్పి రైతుల ఉసురు పోసుకున్నది ఎవరో మాజీ మంత్రి ప్రశాంత్రెడ్డికి తెలియదా అని మోహన్రెడ్డి నిలదీశారు. ప్రస్తుతం 95 శాతం ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యాయని, ఇవేవీ ఎరగనట్టు చిన్నచిన్న సమస్యలతో మిగిలిన కొనుగోలు కేంద్రానికి వెళ్లి రైతులు ఇబ్బంది పడుతున్నారని అనడం ఆయన అజ్ఞానానికి నిదర్శనమని పేర్కొన్నారు. కాంగ్రెస్ మండలాధ్యక్షుడు బోనగిరి భాస్కర్, నాయకులు సుంకెట రవి, తిప్పిరెడ్డి శ్రీనివాస్, సల్లూరి గణేష్గౌడ్ భూపతిరెడ్డి, రాజు, జనార్ధన్, శ్రీనివాస్, అరవింద్ తదితరులు పాల్గొన్నారు. -
ప్చ్.. గుర్తింపేది..?
● సతమతమవుతున్న నాయకులు ● ఏళ్లుగా పార్టీకి సేవ చేస్తున్నామని ఆవేదన సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: పార్టీ అభివృద్ధి కోసం క్షేత్రస్థాయిలో పనిచేసే కార్యకర్తలకే నాయకులు, ప్రజాప్రతినిధులుగా అవకాశాలు ఇస్తామని ప్రతి పార్టీ చెబుతున్న క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ప్రస్తుత రాజకీయాల్లో తమకు అంతగా ప్రాధాన్యత కాదు కదా, కనీసం గుర్తింపు కూ డా లేకుండా పోతోందని పలువురు గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయి నాయకులు కుమి లిపోతున్నారు. ఏళ్లుగా పనిచేస్తున్నప్పటికీ గుర్తింపు దక్కడంలేదని ఆవేదన చెందుతున్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ పని చేస్తున్నప్పటికీ చివరకు జెడ్పీటీసీ, ఎంపీటీసీ టిక్కెట్కు కూడా నోచుకోవడం లేదంటున్నారు. ఇక సర్పంచ్లైతే పా ర్టీలు తమను కరివేపాకులా వాడుకుని వదిలేస్తున్నా యని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో జవాబుదారీగా ఉంటూ ప్రజాసమస్యల పరిష్కారం కోసం తాము కృషి చేస్తుంటే తమకు అందుతున్న సహకారం అంతంతమాత్రమేనని వాపోతున్నారు. కీలక నాయకులు పట్టించుకోకపోవడంతో అధికారులు సైతం తమతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పలువురు సర్పంచ్లు ఆవేదన చెందుతున్నారు. పారాచూట్ నాయకులకు పెద్దపీట ఎలాంటి రాజకీయ నేపథ్యం లేనివారికి పారాచూట్ మాదిరిగా రాగానే ఏకంగా ఎమ్మెల్యే టిక్కెట్లు ఇ స్తూ.. ఏళ్లతరబడి పనిచేస్తున్న తమకు కనీసం గుర్తింపు ఇవ్వకపోవడమేమిటని ఆయా పార్టీల్లోని సీనియర్లు గుర్రుగా ఉన్నారు. కేవలం డబ్బులే ప్రామాణికంగా చూసుకున్నప్పటికీ, అప్పటికప్పుడు వచ్చి టిక్కెట్లు తెచ్చుకున్నవాళ్లతో పోలిస్తే, ఏళ్లతరబడి క్షేత్రస్థాయిలో కార్యక్రమాల కోసం తాము ఖర్చు పెట్టడంతోపాటు పార్టీకి, జనానికి అందించిన సేవలు వెలకట్టలేనివని చెబుతున్నారు. ప్రభుత్వ అధికారులుగా రిటైర్ అయినవారికి, వ్యాపారాలు చేసుకుని వచ్చినవారికి అప్పటికప్పుడు టిక్కెట్లు ఇవ్వడమేమిటని పలు పార్టీల సీనియర్ నాయకు లు, కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా వచ్చినవారిలో జిల్లాలో ఒకరిద్దరు గెలిచినప్పటికీ తరువాత పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు అందుబాటులో లేకుండాపోతున్నారని అంటున్నారు. పసుపు నేలగా పేరొందిన ఈ ప్రాంతంలో గెలిచిన ఓ ఎమ్మె ల్యే అయితే ఒక జాతీయ పార్టీ నుంచి గెలిచి ఆ పార్టీ కార్యకర్తలను ఏమాత్రం పట్టించుకోకపోగా, మరో జాతీయ పార్టీతో అంటకాగుతున్నారనే విమర్శలు ఉన్నాయి. ఈ విషయమై రెండు జాతీయ పార్టీల కార్యకర్తలు గుర్రుగా ఉన్నారు. సదరు ఎమ్మెల్యే తన సొంత గ్రామంలోనూ సర్పంచ్ను గెలిపించుకోలేక చతికిలపడడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది. అధికార పార్టీలో ఉండీ.. ఇక అధికార కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల పరిస్థితి మరోరకంగా ఉంది. అధికారంలో లేని సమయంలో అనేక ఇబ్బందులు పడడంతోపాటు డబ్బులు ఖర్చు పెట్టుకున్నామని, తీరా అధికారంలోకి వచ్చాక మాత్రం తగిన గుర్తింపు దక్కకపోగా, తమను పట్టించుకోవడం లేదని ఆవేదన చెందుతున్నారు. నామిటేటెడ్ పదవుల్లోనూ సీనియర్లమైన తమకు ప్రాధాన్యత ఇవ్వడంలేదని, మరోవైపు తమ తమ ప్రాంతల్లో ప్రజా సమస్యల పరిష్కారానికి సంబంధించిన చిన్న చిన్న పనులు సైతం చేయించలేని దుస్థితిలో ఉన్నామని పలువురు సీనియర్ నాయకులు తమ సన్నిహితుల వద్ద కుమిలిపోతున్నారు. మరోవైపు ఎన్నికలకు ముందు ఇతర పార్టీల నుంచి వచ్చి ఎమ్మెల్యే టిక్కెట్లు తెచ్చుకుని, ఓడిపోవడంతోపాటు తమకు పార్టీ పదవులు కూడా దక్కకుండా చేస్తున్నారని పలువురు కాంగ్రెస్ సీనియర్లు ఆగ్రహంతో ఉన్నారు. -
సృజనాత్మకతను వెలికితీయడానికే..
ఇందూరు జిల్లా బాలసాహిత్య వేదిక ఏర్పడిన నాటి నుంచి జిల్లా వ్యాప్తంగా వివిధ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల కోసం, వారిలోని సృజనకళను ప్రోత్సహించడానికి కవితా కార్యశాలలు, కథాకార్యశాలలను నిర్వహించాం. విద్యార్థులు రాసిన రచనలను వివిధ పత్రికలు, పోటీలకు పంపించి వారికి జాతీయ, అంతర్జాతీయ స్థాయి బహుమతులు వచ్చేందుకు కృషి చేశాం. తెలంగాణ సారస్వత పరిషత్, తెలంగాణ సాహిత్య అకాడమీ వంటి ప్రతిష్టాత్మక సంస్థల ద్వారా విద్యార్థులు బహుమతులు పొందారు. – డాక్టర్ కాసర్ల నరేశ్ రావు, ఇందూరు జిల్లా బాలసాహిత్య వేదిక, అధ్యక్షుడు -
లారీ, బైక్ ఢీ
● ప్రమాదంలో తండ్రి మృతి, కుమారుడికి తీవ్రగాయాలు పిట్లం(జుక్కల్): మండలంలోని పోతిరెడ్డిపల్లి తండా సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రి మృతి చెందగా కొడుకుకి తీవ్రగాయాలయ్యాయి. ఎస్సై ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం.. పోతిరెడ్డిపల్లితండా సమీపంలోని పిట్లం–బాన్సువాడ రహదారిపై ఆదివారం ఎదురెదురుగా వస్తున్న లారీ, బైక్ ఢీకొన్నాయి. ప్రమాదంలో బైక్ నడుపుతున్న దుర్గేశ్కు తీవ్రగాయాలు కాగా, వెనకాల కూర్చున్న తండ్రి దుర్గయ్య(62) అక్కడికక్కడే మృతి చెందాడు. దుర్గేశ్ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిజామాబాద్అర్బన్ : ఆస్తి తగాదాల నేపథ్యంలో ఒకరిపై కత్తితో దాడి చేసిన ఘటన నగరంలోని నాల్గో టౌన్ పరిధిలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్హెచ్వో సతీశ్ తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని హస్మీ కాలనీకి చెందిన సోహైల్ ఖాన్కు, అతని బంధువు అయిన జావిద్ఖాన్ మధ్య కొన్నేళ్లుగా ఆస్తి తగాదాలు జరుగుతున్నాయి. బక్రీద్ సందర్భంగా సోహైల్ఖాన్ తన మేనమామ ఇంటికి వెళ్లగా అక్కడికి వచ్చిన జావిద్ కుమారులు ఫర్హాన్, జియాన్, అక్బర్ దాడి చేశారు. సోహైల్ఖాన్ తండ్రి సలీంఖాన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్హెచ్వో పేర్కొన్నారు. -
రుజువుందా సర్
నిజామాబాద్ధాన్యం కొనుగోళ్లపై.. ధాన్యం కొనుగోళ్లపై బీజేపీ, బీఆర్ఎస్ రాజకీయం చేస్తున్నాయని టీఎస్సీయూబీ చైర్మన్ మానాల మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. సోమవారం శ్రీ 1 శ్రీ జూన్ శ్రీ 2026– 8లో uఎస్ఐఆర్కు యంత్రాంగం సమాయత్తం ఓటరు మ్యాపింగ్లో బీఎల్వోలు బిజీబిజీ జిల్లా వ్యాప్తంగా 84.04 శాతం మ్యాపింగ్ పూర్తి నిబంధనల ప్రకారం డెత్, డూప్లికేట్, షిఫ్టెడ్ ఎంట్రీల తొలగింపు కొత్త ఓటర్ల నమోదుకు అవకాశం జులై 31న ముసాయిదా ఓటరు జాబితా విడుదల -
మన పసుపే మిన్న..
మోర్తాడ్(బాల్కొండ): పసుపు సాగులో అగ్రగామిగా నిలుస్తున్న మన ప్రాంతానికి సాంగ్లీ మార్కెట్లో ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తోంది. అక్కడి మార్కెట్కు మన జిల్లాతోపాటు కర్ణాటక, మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల నుంచి పసుపు వెళ్తుండగా, మన దగ్గర నుంచి వెళ్లిన కొమ్ములకు అక్కడి వ్యాపారులు ఎక్కువ ధర నిర్ణయించడం విశేషం. మన జిల్లా నుంచి వెళ్లిన పసుపు కొమ్ములకు రూ.15 వేల నుంచి రూ.16 వేల వరకు చెల్లిస్తున్నారు. నాణ్యత ఆధారంగా ధర చెల్లించే సాంగ్లీ వ్యాపారులు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి వెళ్లిన పసుపునకు రూ.13 వేలకు మించి ధర చెల్లించడం లేదు. మన జిల్లాలోని అంక్సాపూర్, గుమ్మిర్యాల్, దోంచంద, దొన్కల్, పడగల్, వన్నెల్(బీ), అంకాపూర్ తదితర గ్రామాల నుంచి ఎక్కువగా సాంగ్లీకి పసుపును రైతులు తరలిస్తారు. నిజామాబాద్ మార్కెట్తో పోలిస్తే ఎక్కువ ధర లభించడం, నాణ్యతను బట్టి ధర నిర్ణయిస్తుండడంతో సీజన్లో రోజుకు రెండు, మూడు లారీల పసుపు సాంగ్లీ మార్కెట్కు ఎగుమతి అవుతోంది. మన రైతుల శ్రమకు తగిన ఫలితం కాకపోయినా ఇతర రాష్ట్రాల రైతుల కన్నా ఎక్కువ ప్రాధాన్యం మన వాళ్లకు దక్కడ ప్రత్యేక గుర్తింపుగా చెప్పుకోవచ్చు. సాంగ్లీలో కర్ణాటక, మహారాష్ట్ర కొమ్ములకన్నా ఎక్కువ ధర నాణ్యతకు పెద్దపీట వేస్తున్న అక్కడి వ్యాపారులు ఇతర రాష్ట్రాల పసుపునకు రూ.2 వేలు తక్కువ ధర -
భూ తగాదాలతోనే రాజిరెడ్డి హత్య
● ఘాతుకానికి పాల్పడిన తండ్రీకొడుకుల రిమాండ్ ● వివరాలు వెల్లడించిన డీఎస్పీ మధుసూదన్కామారెడ్డి క్రైం : కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని లింగాపూర్ గ్రామానికి చెందిన బండారి రాజిరెడ్డి హత్య భూ తగాదాల నేపథ్యంలోనే జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు.హత్యకు పాల్పడిన అదే గ్రామానికి చెందిన మంచాల ఎల్లయ్య, అతని కొడు కు ప్రణీత్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. కామారెడ్డి సబ్ డివిజనల్ పోలీస్ కార్యాలయంలో ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ మధుసూదన్ హత్య కేసు వివరాలను వెల్లడించారు. ఎల్లయ్యకు చెందిన 21 గుంటల భూమిని గతంలో రాజిరెడ్డి రూ.1.20 కోట్లకు ఒప్పందం చేసుకొని కొనుగోలు చేశాడు. అందుకు రూ.28 లక్షలు రాజిరెడ్డి చెల్లించాడు. ఆ డబ్బులలో నుంచి రూ.20 లక్షలు అడ్వాన్సుగా ఇచ్చి తాడ్వాయి మండలం ఎర్రాపహాడ్లోని రాజిరెడ్డి సమీప బంధువులకు చెందిన 2 ఎకరాల భూమిని ఎల్లయ్య రూ.40 లక్షలకు కొనుగోలు చేశాడు. రాజిరెడ్డి మిగితా డబ్బులు ఇవ్వడంలో ఆలస్యం చేయడంతో ఎల్లయ్య కూడా తాను కొనుగోలు చేసిన భూమికి డబ్బులు చెల్లించలేదు. కొనడం, అమ్మడం రెండూ పూర్తిస్థాయిలో జరుగక గొడవలు మొదలయ్యాయి. దీంతో కక్ష పెంచుకున్న ఎల్లయ్య, అతని కుమారుడు ప్రణీత్... రాజిరెడ్డి హత్యకు పథకం వేశారు. ఈ నెల 29న సాయంత్రం రాజిరెడ్డిని మాట్లాడేందుకు రమ్మని తమ ఇంటి వెనుక పశువుల కొట్టం వద్దకు పిలిచారు. రాజిరెడ్డి రాగానే ఎల్లయ్య వెనుక నుంచి మెడపై రాడ్డుతో బలంగా కొట్టాడు. ఇద్దరూ కలిసి కిందపడిన రాజిరెడ్డి గొంతు నులుమి హత్య చేశారు.ఎవరికీ అనుమానం రాకుండా ఉండాలని భావించి మృతదేహాన్ని గోనె సంచిలో వేసి గ్రామా నికి సమీపంలోని ఓ పాడుబడిన నీళ్లు లేని బావిలోకి తీసుకువెళ్లి గుంత తీసి పాతిపెట్టారు.రాజిరెడ్డి బైక్ను గ్రామానికి దూ రంగా ఓ ఫంక్షన్ హాల్ సమీపంలో వదిలేశారు. రాజిరెడ్డి కనిపించకపోవడం, ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో అనుమానం వచ్చిన అతని కుమారుడు రంజిత్ శనివారం దేవునిపల్లి పోలీసులకు ఫిర్యాదు చే శారు. ఎల్లయ్య, ప్రణీత్పై అనుమానం ఉందని ఫి ర్యాదులో పేర్కొనడంతో పోలీసులు వారిని విచా రించగా నేరం అంగీకరించారని డీఎస్పీ తెలిపారు. శనివారం అర్ధరాత్రి మృతదేహాన్ని బావిలో నుంచి బయటకు తీయించి పోస్టుమార్టం అనంతరం అంత్యక్రియల నిమిత్తం కుటుంబానికి అప్పగించామన్నారు. 24 గంటల్లోనే కేసు ఛేదించిన రూరల్ సీఐ శ్రీధర్ గౌడ్, దేవునిపల్లి ఎస్సై రంజిత్, సిబ్బందిని అభినందించారు. పట్టణ సీఐ నరహరి, అధికారులు పాల్గొన్నారు. -
అగ్నివీర్కు ఎంపిక
రెంజల్(బోధన్): రెంజల్, కోటగిరి మండలాలకు చెందిన నలుగురు యువకులు అగ్నివీర్కు ఎంపికయ్యారు. రెంజల్ మండలంలోని కళ్యాపూర్ గ్రామానికి చెందిన ఒడ్డెక్క అక్షయ్కుమార్, ఒడ్డెక్క భరత్, రెంజల్కు చెందిన గైని శివానంద్ అగ్నివీర్కు అర్హత సాధించారు. దీంతో ఆయా గ్రామాల సర్పంచులు భానుచందర్, తిరుపతి లలిత, కాంగ్రెస్ నాయకులు యువకులను అభినందించారు. కోటగిరి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన శ్రీహరి అగ్నివీర్కు ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల (బాలుర) ప్రిన్సిపాల్ డాక్టర్ మహమ్మద్ ముబీన్ శ్రీహరిని అభినందించారు. ఆర్మూర్టౌన్: ఆర్మూర్ పోలీస్స్టేషన్ పరిధిలో పోగొట్టుకున్న ఫోన్లను సీఈఐఆర్ పోర్టల్ ద్వారా సేకరించి ఆదివారం బాధితులకు అందజేసినట్లు ఎస్హెచ్వో సత్యనారాయణగౌడ్ తెలిపారు. మొత్తం 6 ఫోన్లను బాధితులకు అందజేశామని పేర్కొన్నారు. సిరికొండ: మండలంలోని జినిగ్యాల తండా అటవీ ప్రాంతం నుంచి అక్రమంగా వంట చెరుకును తరలిస్తున్న ఎడ్లబండిని స్వాధీనం చేసుకున్నట్లు సిరికొండ ఎఫ్ఆర్వో నర్సింగరావు ఆదివారం తెలిపారు. పెట్రోలింగ్లో భాగంగా వంట చెరుకుతో కూడిన ఎడ్ల బండిని గమనించిన స్థానిక బీట్ అధికారి సతీశ్.. ఆ బండి వద్ద ఎవరూ లేకపోవడంతో దాన్ని స్వాధీనం చేసుకొని సిరికొండలోని రేంజ్ కార్యాలయానికి తరలించారు. విచారణ జరిపి కేసు నమోదు చేస్తామని ఎఫ్ఆర్వో తెలిపారు. -
జాతీయ, రాష్ట్ర స్థాయి బహుమతులు అందుకున్నా..
నేను తొమ్మిదో తరగతి నుంచి కవితలు, కథలు రాయడం ప్రారంభించా. ఇప్పటి వరకు దాదాపు 30 కవితలు, 10 కథ లు రాశాను. ఈ మధ్యనే రెండు నాటికలను కూడా రాశా ను. నేను రాసిన కవితలకు, కథలకు జాతీయ, రాష్ట్రస్థాయి బహుమతులు వచ్చాయి. ఇటీవల తెలుగు సాహిత్య అకాడమీ ప్రకటించిన నాటిక రచనల పోటీల్లో నేను రాసిన ‘పల్లెతనం‘ అనే నాటికకు ప్రత్యేక బహుమతి వచ్చింది. రచనలు చేసేందుకు గురువు కాసర్ల, ఇందూరు జిల్లా బాలసాహిత్య వేదిక ఎంతో తోడ్పాటునందించింది. భవిష్యత్తులో నేను ఇలాగే రచనలు కొనసాగిస్తాను. –ఎం.మాధురి,పదో తరగతి -
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
నవీపేట : మండలంలోని నాగేపూర్ గ్రామ శివారులోని బాసర రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరు గాయపడినట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. రెంజల్ మండల కేంద్రానికి చెందిన పోసాని(44) నాలుగు నెలలుగా కోస్లీలోని సోదరి జ్యోతి దగ్గర ఉంటుంది. నవీపేటలో పని ఉండడంతో మరిది పోశెట్టితో కలిసి ఆదివారం మధాహ్నం బైక్పై వెళ్తుండగా నాగేపూర్ సమీపంలో అదుపుతప్పిన బైక్ డివైడర్ను ఢీకొట్టింది. ప్రమాదంలో కిందపడిన పోసాని తలకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందింది. పోశెట్టికి స్వల్ప గాయాలయ్యాయి. మృతురాలికి భర్త, పిల్లలు లేరు. తల్లిదండ్రులు చనిపోయారు. సోదరి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. గాయపడిన యువకుడు ..రుద్రూర్ : ట్రాక్టర్ బోల్తాపడిన ఘటనలో తీవ్రంగా గాయపడిన యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై సాయన్న ఆదివారం తెలిపారు. వర్ని మండలం కోటయ్య క్యాంపునకు చెందిన వడ్డేపల్లి భూమేశ్(25) శనివారం సాయంత్రం ట్రాక్టర్లో సిమెంట్ బస్తాలను తీసుకెళ్తుండగా మండల కేంద్రంలోని జవహర్నగర్ కాలనీ సమీపంలో ట్రాక్టర్ టైరు పంక్చర్ కావడంతో వాహనం అదుపుతప్పి పల్టీ కొట్టింది. ప్రమాదంలో భూమేశ్ తీవ్రంగా గాయపడగా 108 అంబులెన్స్లో నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు. అనుమానాస్పదస్థితిలో ఎలక్ట్రీషియన్ ..భిక్కనూరు : మండల కేంద్రంలో ప్రయివేటు ఎలక్ట్రీషియన్ ఒకరు అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు ఎస్సై ఆంజనేయులు ఆదివారం తెలిపారు. మండల కేంద్రానికి చెందిన బల్యాల సిద్దరాములు (46) ప్రయివేటు ఎలక్ట్రీషియన్గా పనిచేస్తూ జీవిస్తున్నాడు. నాలుగు రోజుల నుంచి సిద్దరాములు కనిపించడం లేదు. ఆదివారం ఆయన ఇంటి నుంచి దుర్వాసన రావడంతో చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం అందించారు. ఇంట్లోకి వెళ్లి చూడగా సిద్దరాములు మృతి చెంది ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
అపూర్వ సమ్మేళనం
పెర్కిట్(ఆర్మూర్): ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 2004–05 విద్యా సంవత్సరంలో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. సుదీర్ఘకాలం తర్వాత కలుసుకోవడంతో పరస్పర యోగ క్షేమాలు తెలుసుకున్నారు. అనంతరం విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ఆహ్వానించి ఘనంగా సత్కరించారు. వాణి విద్యాలయంలో.. కామారెడ్డి అర్బన్: కామారెడ్డి వాణి విద్యాలయం ఉన్నత పాఠశాల 2000–01 పదో తరగతి బ్యాచ్ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఉల్లాసంగా నిర్వహించారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన పూర్వ విద్యార్థుల సందడి చేశారు. 25 ఏళ్ల నాటి జ్ఞాపకాలను నెమరేసుకున్నారు. -
బాల సాహిత్య నిలయం
నిజామాబాద్ రూరల్ : బాలల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసేది బాల సాహిత్యం. కథలు, కవితలు, గేయాలు రాయిస్తూ సృజనాత్మకతకు అక్షరరూపం కల్పించి సాహితీ లోకానికి పరిచయం చేస్తోంది ఇందూరు బాలసాహిత్య వేదిక. రెండు సంవత్సరాల క్రితం ఉగాది రోజున ప్రారంభమైన ఈ వేదిక జిల్లాలోని అనేకమంది విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహిస్తూ వస్తోంది. కవితారచన, కథారచనలు ఇతర సజనాత్మక ప్రక్రియల్లో విద్యార్థులకు అండగా నిలుస్తున్నది. పాఠశాలల్లో కార్యశాల ఏర్పాటు చేసి కవిత రచన, కథా రచనల్లో మెలకువలను పిల్లలకు నేర్పిస్తున్నది. పుస్తకావిష్కరణలను ప్రోత్సహిస్తున్నది. విద్యార్థులు రాసిన రచనలను వివిధ సాహితీ సంస్థల పోటీలకు పంపించి, బహుమతులు సాధించేలా మార్గదర్శనం చేస్తున్నది. ఈ సంస్థ ద్వారా ఇప్పటి వరకు సుమారు 20 పుస్తకాలు విడుదలయ్యాయి. గుండారం, తడపాకల్, ఏర్గట్ల, సిరిపూర్, నీలా, కులాస్పూర్, కాలూర్, బాచనపల్లి, వడ్డేపల్లి మొదలైన పాఠశాల విద్యార్థుల రచనలను ప్రోత్సహించి వారి ద్వారా పుస్తకాలు తీసుకువచ్చేందుకు బాల సాహిత్య వేదిక అండగా నిలుస్తున్నది. ఇందూరు జిల్లా బాలసాహిత్య వేదికకు అధ్యక్షుడిగా డాక్టర్ కాసర్ల నరేశ్ రావు, ప్రధాన కార్యదర్శిగా డి.ప్రవీణ్ కుమార్ శర్మ, కార్యవర్గ సభ్యులుగా డాక్టర్ శారద, డాక్టర్ గంట్యాల, చింతల శ్రీనివాస్ గుప్త, శ్రీమన్నారాయణ చారి, స్వర్ణ సమత తదితరులు వ్యవహరిస్తున్నారు. కవితలంటే ఎంతో ఇష్టం.... రెండు సంవత్సరాల నుంచి కవితలు, కథలు రాస్తున్నాను. ఇందూరు జిల్లా బాలసాహిత్య వేదిక కవితా, కథా కార్యశాలలో పాల్గొన్నాను. ఇప్పటి వరకు 30 కవితలు, 6 కథలు రాశాను. జాతీయ సైన్స్ఫిక్షన్ కథా పోటీలో నేను రాసిన ‘బ్రేవ్ గర్ల్ ‘అనే కథకు బహుమతి లభించింది. నాకు చాలా సంతోషం వేసింది. మా అందరికీ తెలుగు భాషా భిమానాన్ని కలిగించి, ముందుకు తీసుకెళ్తున్న ఇందూరు జిల్లా బాలసాహిత్య వేదికకు ఎప్పటికీ రుణపడి ఉంటాం. – కే. కృతిక, 8వ తరగతి, జాతీయస్థాయి సైన్స్ఫిక్షన్ కథా పోటీల విజేత విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికితీస్తున్న బాలసాహిత్య వేదిక కవితలు, కథలు, గేయాల రచనల్లో రాణిస్తున్న పిల్లలు ఇప్పటి వరకు 20 పుస్తకాల రచన -
గ్యాస్ లీకేజీతో మంటలు
● తల్లి, కుమారుడికి తీవ్రగాయాలు ఆర్మూర్టౌన్: గ్యాస్ లీకేజీతో మంటలు అంటుకొని ఇద్దరికి గాయాలైన ఘటన ఆర్మూర్ పట్టణంలో ఆదివారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని కాశీ హనుమాన్ సమీపంలో కొండూర్ రాజేశ్ చికెన్ షాప్తోపాటు కిరాణాషాప్ నడిపిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం ఉదయం చికెన్ను స్టౌవ్పై కాల్చుతుండగా సిలిండర్ పైప్ నుంచి గ్యాస్ లీకేజీ అయ్యింది. దీంతో మంటలు చెలరేగి దుకాణం మొత్తం వ్యాపించాయి. కిరాణ దుకాణంలో ఉన్న తల్లి కొండూరు రుకుంబాయికి, రాజేశ్కు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే ఆర్మూర్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం జిల్లా ఆస్పత్రికి తరలించారు. స్థానికులు అగ్నిమాపక శాఖకు సమాచారం అందించడంతో ఫైరింజన్ సిబ్బంది వచ్చి మంటలు ఆర్పారు. ప్రమాదంలో సుమారు రూ. లక్ష వరకు ఆస్తినష్టం జరిగిందని అగ్నిమాపకశాఖ అధికారులు తెలిపారు. ఘటనా స్థలానికి ఎస్హెచ్వో సత్యనారాయణగౌడ్ చేరుకొని వివరాలు తెలుసుకున్నారు. -
మంజీరలో విషాదం
● నీటమునిగి ఇద్దరు గొర్రెల కాపరుల మృతి ● మృతులు బావ బావమరుదులురుద్రూర్: గొర్రెలను కడిగేందుకు మంజీర నది వద్దకు వెళ్లిన ఇద్దరు నీటమునిగి దుర్మరణం పాలైన ఘటన నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండల కేంద్ర సమీపంలోని మంజీర నదిలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పోతంగల్ గ్రామానికి చెందిన కుర్మ గంగొండ (43) తన గొర్రెలను మేపేందుకు కు మారుడు సంతోష్తోపాటు బావ అయిన రెంజల్ మండలం బోర్గాం గ్రామానికి చెందిన చిక్కాల గంగారాం (50)ను వెంటబెట్టుకొని మంజీర నది ప్రాంతానికి వెళ్లాడు. గొర్రెలను కడుగుతున్న సమయంలో చిక్కాల గంగారాం ప్రమాదవశాత్తూ నదిలో ప డిపోయాడు. అతడిని కాపాడేందుకు గంగొండ వెంటనే నీటిలోకి దూకి గల్లంతయ్యాడు. దీనిని గమనించిన సంతోష్ గ్రామస్తులకు సమాచారం అందించాడు. స్థానికులు, ఈతగాళ్లు గాలింపు చర్యలు చేపట్టి ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు. గంగొండకు ఇద్దరు కుమారులు, గంగారామ్కు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. మృతుడు గంగొండ భార్య రుక్మిణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై సునీల్ తెలిపారు. బావబామ్మర్దుల మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గంగొండ మృతదేహంగంగారాం మృతదేహం -
నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు
డొంకేశ్వర్(ఆర్మూర్): లాభాపేక్షతో రైతుల కు నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని విత్తన వ్యాపారులను టా స్క్ఫోర్స్ అధికారులు హెచ్చరించారు. ప్ర భుత్వ ఆదేశా మేరకు జిల్లా కేంద్రంలోని ప లు విత్తన దుకాణాలను అధికారుల బృందం శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేసింది. స్టాక్ రిజిస్టర్లు, బిల్బుక్కులు, విత్తన ప్యాకెట్ల లా ట్ నంబర్లు, సర్టిఫికేషన్, గడువు తేదీల ను పరిశీలించారు. నకిలీ విత్తనాలు విక్రయిస్తే దుకాణ లైసెన్స్ రద్దు చేయడంతోపాటు వ్యాపారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఏడీఏ ప్రవీణ్కుమార్, ఎంఏవో మహేందర్రెడ్డి, సీడ్ మేనేజర్ వినయ్, ఏఎస్సై గంగారాం, ఏఈవో చక్రపాణి ఉన్నారు. నిజాంషుగర్స్ ఉద్యమకారులపై కేసు కొట్టివేత బోధన్: నిజాం షుగర్ ఫ్యాక్టరీని పునరుద్ధరించాలని, ప్రైవేట్ యాజమాన్యం నుంచి స్వాధీనం చేసుకుని ప్రభుత్వమే నడపాలని డిమాండ్తో 2018లో ఉద్యమం చేపట్టిన సమయంలో నాయకులపై పోలీసులు నమో దు చేసిన కేసును విచారణ అనంతరం శుక్రవారం స్థానిక కోర్టు కొట్టివేసింది. బీర్కూర్ బుజ్జి, బీ మల్లేశ్, పుట్ట వరదయ్య, వి రాఘవులు, గుమ్ముల గంగాధర్, జంబిశెట్టి శంకర్గౌడ్, యేశాల గంగాధర్, సుల్తాన్ సాయి లు, సింగం రాములుయాదవ్, గోపి, షేక్బా బు,షేక్ ఫారూఖ్పై పోలీసులు కేసు నమో దు చేసింది. కేసు కోర్టులో ఉన్న కాలంలో వివిధ కారణాలతో రాఘవులు, షేక్బాబు, షేక్ఫారూఖ్ మృతి చెందారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. కేసు కొట్టివేత కార్మికులు, రైతులు, బోధన్ ప్రాంత ప్రజల విజయమని పేర్కొన్నారు. నానో యూరియా అంటగడుతున్నారు బోధన్: యూరియా బస్తాలతోపాటు నానో యూరియా, సాగరిక (గుళికలు) తప్పనిసరి గా తీసుకోవాలని సొసైటీ అధికారులు ని బంధన పెడుతున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సాలూరలోని సహకార సొసై టీ గోదాము వద్ద శుక్రవారం సాలూర క్యాంప్, సాలూర గ్రామ రైతులు నిరసన తెలిపా రు. అవసరం లేని మందులు అంటగడుతుండడంతో తమపై ఆర్థిక భారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. యూరియా యాప్ బుకింగ్ ప్రకియపై సరైన అవగాహన లేని సన్న, చిన్నకారు రైతులు ఇబ్బందులు పడుతున్నారని, ఇతర గ్రామాల రైతులు బుక్ చేసుకుంటుండడంతో స్థానిక రైతులకు అన్యాయం జరుగుతోందన్నారు. ఇదిలా ఉండగా, నానో యూరియా ఇవ్వాలని అధికారుల నుంచి మార్గదర్శకాలు ఉన్నాయని సొసైటీ నిర్వాహకులు అంటున్నారు.


