breaking news
Nizamabad
-
ఖరీఫ్ ముంగిట్లో యాసంగికి ‘భరోసా’!
కామారెడ్డి క్రైం: ఓ వైపు యాసంగి పంటలు కోతకు వస్తున్నాయి. మరో నెల గడిస్తే ఖరీఫ్ సీజన్కు రైతులు సమాయత్తం అవుతారు. ఈ పరిస్థితుల్లో ఎట్టకేలకు యాసంగి రైతు భరోసా విడుదలపై స్పష్టత వచ్చింది. మొదటి విడతలో ఎకరంలోపు భూమి ఉన్న రైతులకు ఈనెల 22 న పెట్టుబడి సాయం అందించనున్నారు. సకాలంలో అందకపోయినా పంటల సాగులో చేసిన అప్పులు, ఇతర అవసరాలకు ఆసరాగా ఉండనుండడంతో రైతులు కాస్త ఊరట చెందుతున్నారు.జిల్లాలో 3,32,611 మంది రైతులు..జిల్లాలో గత యాసంగి లెక్కల ప్రకారం మొత్తం 3,32,611 మంది రైతులున్నారు. ఇందులో ఎకరంలోపు భూమి కలిగిన రైతులు 1,30,671 మంది, 1 నుంచి 2 ఎకరాల మధ్య ఉన్నవారు 81,796 మంది, 2నుంచి 3 ఎకరాలు కలిగిన రైతులు 48,945 మంది, 3 నుంచి 4 ఎకరాలున్నవారు 26,734 మంది, 4 నుంచి 5 ఎకరాలు కలిగిన రైతులు 15,800 మంది ఉన్నారు. 5 నుంచి 10 ఎకరాల మధ్య భూమి ఉన్నవారు 11,265 మంది, 10 ఎకరాలకుపైగా భూమి కలిగిన వారు 1,493 మంది ఉన్నారు. అందరికీ రైతు భరోసా నిధులు జమ చేయాలంటే రూ.316.53 కోట్లు అవసరం.ఈనెల 25 వరకు కొత్త దరఖాస్తులకు అవకాశంజిల్లాలో గతేడాదికంటే ఈసారి రైతుల సంఖ్య 12 వేలు పెరిగింది. వారికి కూడా పథకాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం అవకాశం కలి్పంచింది. ఈ ఏడాది ఫిబ్రవరి 28 వరకల్లా రిజి్రస్టేషన్లు, ఆన్లైన్ రికార్డుల ప్రక్రియ పూర్తయిన భూములకు దరఖాస్తు చేసకునే అవకాశం ఇచ్చారు. బ్యాంక్ అకౌంట్ వివరాల్లో మార్పులు, గతంలో సాంకేతిక కారణాల (డీబీటీ ఫెయిల్యూర్)తో రైతు భరోసా అందని వారు కూడా మళ్లీ దరఖాస్తులు చేసుకోవాలని సూచించింది. అర్హులైన రైతులు ఈనెల 25 వరకు సంబంధిత వ్యవసాయ విస్తీర్ణ అధికారులను సంప్రదించి తమ దరఖాస్తులను సమర్పించాలని అధికారులు సూచిస్తున్నారు.స్పష్టత కరువు..యాసంగికి సంబంధించిన రైతు భరోసా కోసం రైతులు మూడు నెలలుగా ఎదురుచూస్తున్నారు. కొందరైతే పెట్టుబడి సాయంపై ఆశలు వదులుకున్నారు. ఆలస్యం జరిగినా యాసంగి పెట్టుబడి సాయం నిధులు రైతుల ఖాతాల్లో జమ చేస్తామని ప్రభుత్వం మూడు రోజుల క్రితం ప్రకటించింది. ఈనెల 22 న మొదటి విడతలో ఎకరంలోపు భూమి ఉన్న రైతులకు నిధులను విడుదల చేస్తామని, 20 రోజుల తర్వాత రెండో విడత, ఏప్రిల్ చివరలో మూడో విడత నిధులు విడుదల చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. అయితే రెండు, మూడు విడతలలో ఎన్ని ఎకరాలలోపు రైతులకు ఎప్పుడు రైతు భరోసా ఇస్తారన్న దానిపై ప్రభుత్వం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఒకవేళ పరిషత్ ఎన్నికల కోడ్ వస్తే నిధులు జమ చేయడం కొనసాగిస్తారా, ఆపేస్తారా అన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. దీంతో అందరికీ పెట్టుబడి సాయం అందుతుందో లేదోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు యాసంగి సాయమే ఇంత ఆలస్యంగా ఇస్తుండడంతో వానాకాలంలో రైతుభరోసా ఇస్తారో లేదోనన్న చర్చ రైతుల్లో నడుస్తోంది. -
మేకల సంత వేలం రూ. కోటీ 2 లక్షలు
● రికార్డు స్థాయిలో ఆదాయం ● వాయిదా పడిన కూరగాయలు, సులభ్ కాంప్లెక్స్ల వేలం నవీపేట: నవీపేట జీపీ పరిధిలో కొనసాగే మేకల సంతకు బుధవారం నిర్వహించిన వేలానికి రికార్డు స్థాయిలో రూ. కోటీ 2 లక్షల ఆదాయం వచ్చింది. సంత వేలంలో పాల్గొనేందుకు 159 మంది ఔత్సాహికులు రూ. లక్ష చొప్పున డిపాజిట్ చెల్లించి వేలంలో పాల్గొన్నారు. సర్పంచ్ కేఎల్వీ రేఖ రాజేందర్గౌడ్, ఉప సర్పంచ్ నవీన్రాజ్, జీపీ పాలకవర్గం ఆధ్వర్యంలో వేలాన్ని నిర్వహించారు. గతేడాది ఈ సంతకు రూ. 61 లక్షల ఆదాయం వచ్చింది. ఈ ఏడాది గణనీయంగా రూ. 41 లక్షల అదనపు ఆదాయం వచ్చింది. పాత గుత్తేదారు సిరాజుద్దీన్ రూ. కోటీ 2 లక్షలకు వేలాన్ని దక్కించుకున్నారు. అలాగే వారాంతపు కూరగాయలు, సులభ్ కాంప్లెక్సులకు నిర్వహించాల్సిన వేలం వాయిదా పడింది. పాడైన ఇనుప సామగ్రి, ఫర్నీచర్కు వేలం నిర్వహించగా రూ. 1,40,000 ఆదాయం వచ్చింది. వాయిదా పడిన వారాంతపు కూరగాయల సంత, సులభ్ కాంప్లెక్స్లకు మళ్లీ వేలం నిర్వహిస్తామని జీపీ కార్యదర్శి రవీందర్నాయక్ తెలిపారు. దరఖాస్తుల ఆహ్వానం ● కలెక్టర్ ఇలా త్రిపాఠి ఇందల్వాయి: ఇందల్వాయి ఏకలవ్య గురుకులంలో ఖాళీగా ఉన్న పోస్టులను తాత్కాలిక పద్ధతిన అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేయనున్నట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి పేర్కొన్నారు. పీజీటీ కెమిస్ట్రీ (01), సైకాలజీ కౌన్సిలర్ (01), ఎంబీఏ రిటైలర్ (01), గార్డెనర్ (01), మెస్ హెల్పర్ (01), స్లీపింగ్ అండ్ శానిటేషన్ (02) పోస్టులకు ఈ నెల 20 నుంచి 25 తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు. బీబీపూర్ తండాలోని ఈఎంఆర్ఎస్ గురుకులంలో దరఖాస్తులు అందజేయాలన్నారు. పూర్తి వివరాలకు 9492357892, 9696623631 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. -
నిజామాబాద్
జిల్లాలో పామాయిల్ ఫ్యాక్టరీఎస్సెస్సీ ప్రశ్నాపత్రం లీక్● అంగీకారం తెలిపిన సీఎం రేవంత్రెడ్డి ● నిర్మాణం కోసం స్థల పరిశీలన ● వ్యవసాయంతోపాటు పారిశ్రామిక అభివృద్ధితో మేలు: సుదర్శన్రెడ్డి గురువారం శ్రీ 19 శ్రీ మార్చి శ్రీ 2026సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: వ్యవసాయ రంగంలో ముందంజలో ఉన్న జిల్లాలో అనుబంధ పరిశ్రమల ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి. ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం పెరిగేలా రైతులను అధికారు లు, ప్రజాప్రతినిదులు ప్రోత్సహిస్తుండగా, పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి సీఎం రేవంత్రెడ్డి ఇప్పటికే అంగీకరించారు. ఫ్యాక్టరీ నిర్మాణానికి అ వసరమైన స్థలాన్ని సేకరించేందుకు కసరత్తు ప్రారంభమైంది. ఇందులో భాగంగా మాక్లూర్ మండలంలో ని గుత్ప శివారులో ప్రభుత్వ స్థలాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియా తో కలిసి సుదర్శన్రెడ్డి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయాధారిత పరిశ్రమల ఏర్పాటుతో రైతుల కు మరింత మేలు కలుగుతుందన్నారు. జిల్లా రైతులు ప్రస్తుతం 7వేల ఎకరాల్లో పామాయిల్ పంటను సాగు చేస్తున్నారని, మరో రెండేళ్లలో ఉత్పత్తి ప్రారంభమవుతుందన్నారు. మరింతమంది రైతులు ఆయిల్పామ్ సాగువైపు మళ్లుతున్నారన్నారు. జిల్లాలో పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి సీఎం రేవంత్రెడ్డి అంగీకరించారని తెలిపారు. స్థలాన్ని ఖరారు చేయాల్సి ఉందన్నారు. ఫ్యాక్టరీ ఏర్పాటైతే జిల్లాలో మరింతమంది రైతులు పామాయిల్ సాగుకు మొగ్గుచూపుతారన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రజల అవసరాలకు అనుగుణంగా 75 లక్షల ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్పామ్ సాగు చేయాల్సి ఉండగా, ప్రస్తుతం కేవలం పది శాతం విస్తీర్ణం లోపే పంట సాగు చేస్తున్నారన్నారు. దీంతో ఇతర దేశాల నుంచి వంట నూనెలు భారీగా దిగుమతి చేసుకోవాల్సి వస్తోందన్నారు. స్థానికంగా ఆయిల్పామ్ను అధిక విస్తీర్ణంలో సాగు చేస్తే రైతులు అధిక లాభాలు ఆర్జించడంతోపాటు ప్రజల అవసరాలు సైతం తక్కువ ఖర్చుతోనే తీరుతాయన్నారు. పామాయిల్ సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున రాయితీలతో కూడిన ప్రోత్సాహకాలను అందిస్తున్నట్లు తెలిపారు. ఇన్పుట్ సబ్సిడీ రైతు ఖాతాలో జమ అవుతోందన్నారు. ఆయిల్పామ్ మొక్కలకు అయ్యే వ్యయంలో అధిక మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తోందని, పంట దిగుబడి విక్రయం, ధర విషయంలో రైతులకు ఆందోళన అవసరం లేదని స్పష్టం చేశారు. మొక్కలు అందించిన కంపెనీలే, బోర్డు ద్వారా ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకు పంట దిగుబడిని కొనుగోలు చేస్తాయన్నారు. ఎకరానికి సుమారు పది టన్నుల వరకు పామాయిల్ గెలల దిగుబడి వస్తుందని సుదర్శన్రెడ్డి తెలిపారు. అంతర పంటలను సైతం సాగు చేసుకుని రైతులు లాభాలు రెట్టింపు చేసుకోవచ్చన్నారు. ఎకరానికి కనీసం రూ.2 లక్షల ఆదాయం ఆర్జించొచ్చన్నారు. స్థలాన్ని పరిశీలించిన అనంతరం సమగ్ర వివరాలతో నివేదిక సమర్పించాలని అధికారులను సుదర్శన్రెడ్డి ఆదేశించారు. స్థల నిర్దారణ అయిన వెంటనే పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణం కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామన్నారు. సుదర్శన్రెడ్డి వెంట రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్రకుమార్, జిల్లా ఉద్యాన శాఖ అధికారి శ్రీనివాస్, డీసీసీ అధ్యక్షుడు కాటిపల్లి నగేష్రెడ్డి, జిల్లా రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షుడు రమణ్రెడ్డి తదితరులు ఉన్నారు.ఖలీల్వాడి/పెర్కిట్: పదో తరగతి ప్రశ్నాపత్రం లీక్ ఘటన కలకలంరేపింది. ఆలూర్, బోధన్, మెండోరాలోని సెంటర్ల నుంచి సెకండ్ లాంగ్వేజ్ తెలుగు, హిందీ ప్రశ్నాపత్రాలను లీక్ చేశారు. బుధవారం పరీక్ష ప్రారంభమైన కొద్దిసేపటికి ప్రశ్నాపత్రాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఆలూర్లో బయటి వ్యక్తులు జవాబులను రాసి పరీక్ష కేంద్రంలోకి పంపినట్లు తెలిసింది. ప్రశ్నాపత్రాలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన వెంటనే డీఈవో అశోక్కుమార్ ఆయా సెంటర్లకు వెళ్లి విచారణ చేపట్టారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశాల మేరకు ఆలూర్ సెంటర్ సిబ్బంది రాజేందర్, విజయ్కుమార్, సాగర్, ఉమేందర్, మెండోరా సిబ్బంది మమత, రవీందర్, భూపతి, బోధన్ సిబ్బంది వేణు, శివానందరావులను సస్పెండ్ చేసినట్లు డీఈవో తెలిపారు. సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన సెకండ్ లాంగ్వేజ్ పేపర్ ఆలూర్, బోధన్, మెండోరాలో ఘటన తొమ్మిది మంది సస్పెన్షన్ -
వడగళ్ల వాన.. 1,520 ఎకరాల్లో పంట నష్టం
● సాలూర, రుద్రూర్, వర్ని, పొతంగల్ మండలాల్లో దెబ్బతిన్న పంటలు డొంకేశ్వర్/రుద్రూర్/వర్ని: జిల్లాలో మంగళవారం సాయంత్రం కురిసిన వడగళ్ల వానకు బోధన్ డివిజన్ పరిధిలో 1,520 ఎకరాల్లో పంటకు నష్టం వాటిల్లింది. వడగళ్ల ధాటికి వరి గింజలు నేలరాలాయి. మొక్కజొన్న పంట అడ్డంగా పడిపోయింది. సాలూర, పొతంగల్ మండలం కొల్లూర్, హెగ్డొలి, దొమలెడ్గి, టాక్లీ గ్రామాల్లో మొక్కజొన్న, రుద్రూర్ మండలం చిక్కడపల్లి, రాణంపల్లి, అంబం(ఆర్), కొందాపూర్, రుద్రూర్, అక్బర్నగర్లతోపాటు వివిధ గ్రామాల శివార్లలో వరికి నష్టం వాటిల్లింది. వర్ని మండలం తగిలేపల్లి, పాత వర్నిలో వడగల్లు కురిశాయి. వ్యవసాయ శాఖ బుధవారం పంట నష్టం లెక్కలను సేకరించగా.. మొత్తం 891మంది రైతులను బాధితులుగా గుర్తించారు. అంచనా నివేదికను వ్యవసాయాధికారులు కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి పంపించారు. అత్యధికంగా వరి 1,110 ఎకరాలు, మొక్క జొన్న 110 ఎకరాల్లో దెబ్బతిన్నట్లు డీఏవో వీరాస్వామి వెల్లడించారు. రుద్రూర్ 980 సాలూర 360వర్ని 130 పొతంగల్ 50మండలాల వారీగా పంటనష్టం (ఎకరాల్లో..) -
రాళ్ల వాన, ఈదురు గాలులు
డొంకేశ్వర్(ఆర్మూర్)/ కొందుర్గు/వికారాబాద్: రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో కురిసిన వడగళ్ల వానకు పలు జిల్లాల్లో పంటనష్టం వాటిల్లింది. నిజామాబాద్ జిల్లాలో మంగళవారం సాయంత్రం కురిసిన వడగళ్ల వానకు 1,520 ఎకరాల్లో పంటనష్టం జరిగింది. ఇందులో వరి 1,110 ఎకరాలు, మొక్కజొన్న 110 ఎకరాలు ఉన్నట్లు వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక పంపింది. అయితే జరిగిన పంట నష్టమంతా బోధన్ డివిజన్లోనే ఉంది. సాలూరాలో 360, రుద్రూర్లో 980, వర్నిలో 130, పొతంగల్లో 50 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. నాలుగు మండలాలు కలిపి 891 మంది రైతులు పంటనష్టం బాధితులుగా ఉన్నారు. వికారాబాద్జిల్లా వ్యాప్తంగా మంగళవారం రాత్రి, బుధవారం కురిసిన అకాల వర్షానికి వందలాది ఎకరాల్లో పంటలు భారీగా దెబ్బతిన్నాయి. వడగళ్లు, పిడుగుపాట్లతో పదికి పైగా పాడి ఆవులు మృత్యువాత పడ్డాయి. పూడూరు మండలం నిజాంపేట్ మేడిపల్లి వద్ద మంద పెట్టిన 217 మేకలు మృత్యువాత పడ్డాయి. చెట్లు నేలకొరిగి, ప్రధాన రోడ్లకు అడ్డంగా పడిపోయాయి. పోలేపల్లిలో ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. దోమ మండలం కొండాయపల్లిలో రైతు చిన్న పిరంగికి చెందిన రెండు ఆవులు, శివారెడ్డిపల్లిలో రాంరెడ్డికి చెందిన ఓ ఆవు, కుల్కచర్ల మండలం చిన్నరామయ్య తండాకు చెందిన రైతు రాజుకు చెందిన ఓ ఆవు, యాలాల మండలం అక్కంపల్లిలో ఓ కాడెద్దు మృతి చెందాయి. మరోవైపు రంగారెడ్డి జిల్లా కొందుర్గు, జిల్లేడ్ చౌదరిగూడ మండలాల్లోని వివిధ గ్రామాల్లో బుధవారం తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. ఈ వానతో పంటలు దెబ్బతిని నేలకొరిగాయి. వరి, మొక్కజొన్న, కూరగాయల తోటలు ధ్వంసమయ్యాయి. విద్యుత్ స్తంభాలు, చెట్లు విరిగిపడ్డాయి. ఏఓ రాజేందర్రెడ్డి దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. నివేదికను ఉన్నతాధికారులకు పంపిస్తామని తెలిపారు. -
రాతిగోడపై రావిచెట్టు
దరఖాస్తుల ఆహ్వానం డిచ్పల్లి: మండలంలోని ఘన్పూర్ గ్రామ పంచాయతీ భవనంలో ఉన్న సెట్విన్ (యూత్ సర్వీస్ డిపార్ట్మెంట్) ఆధ్వర్యంలో కంప్యూటర్, టైలరింగ్లో శిక్షణ కోసం అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సెంటర్ కోఆర్డినేటర్ అబ్రార్ ఖాన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు ఆధార్, ఎస్సెస్సీ జిరాక్స్తోపాటు, ఫొటోలతో దరఖాస్తులను సెట్విన్ కార్యాలయంలో అందజేయాలని కోరారు. ఎంఎస్ ఆఫీస్, డీటీపీ కోర్సులకు మూడు నెలలకు రూ.12,00 లు, టాలీ కోర్సుకు మూడు నెలలకు రూ.1,600లు ఫీజు చెల్లించాల్సి ఉంటుందని కో–ఆర్డినేటర్ తెలిపారు. అలాగే టైలరింగ్ మూడు నెలలకు రూ.1600 లు ఫీజు చెల్లించాలన్నారు. కోర్సు పూర్తయిన తర్వాత పరీక్ష నిర్వహించి ప్రభుత్వ సర్టిఫికెట్ ఇస్తారని తెలిపారు. మరిన్ని వివరాలకు 89858 64424, 97000 07149ను సంప్రదించాలని ఆయన పేర్కొన్నారు. -
విద్యార్థులకు బెటాలియన్ పోలీసుల చేయూత
కాసర్లకు ధర్మనిధి పురస్కారం నిజామాబాద్ రూరల్: జిల్లాకు చెందిన కవి కాసర్ల నరేష్ రావు తెలంగాణ సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి ధర్మనిధి పురస్కారాన్ని అందుకున్నారు. హైదరాబాద్లో మంగళవారం జరిగిన కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రా రావు చేతుల మీదు ఆయన ఈ పురస్కారాన్ని అందుకున్నారు. పరిషత్ అధ్యక్షుడు శివారెడ్డి, ప్రధాన కార్యదర్శి చెన్నయ్య, కవులు తిరుమల శ్రీనివాసాచార్య, గోపగాని రవీందర్, తుమ్మల దేవారావు, మంత్రి రామారావు, డాక్టర్ కమలాకర శర్మ, సీతాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
25న తైబజార్ వేలం
ఆర్మూర్టౌన్ : ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని వారంతపు సంత, రోజువారి తైబజార్కు ఈనెల 25న వేలంపాటను మున్సిపల్ చైర్పర్సన్ గోనె లహరి, మున్సిపల్ కమిషనర్ ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు నిర్వహించనున్నట్లు మున్సిపల్ ఆర్వో ఉమాదేవి ఒక ప్రకటనలో తెలిపారు. వారపు సంత (అంగడి), రోజువారి తైబజార్ కాంట్రాక్టు 01–04–2026 నుంచి 31–03–2027 వరకు ఇచ్చేందుకు నిర్ణయించడమైందన్నారు. వేలంలో పాల్గొనేవారు ఈనెల 17 నుంచి 24 వరకు మున్సిపల్ కమిషనర్ పేరు మీద రూ.5లక్షల డీడీ తీసి అందజేయాలన్నారు. వేలంపాటకు సంబంధించిన నిబంధనలు నోటీసు బోర్డుపై ఉన్నాయన్నారు. ఖలీల్వాడి : జిల్లాలో నేటి నుంచి ఇంటర్ మూల్యాంకనం ప్రారంభం అవుతుందని, సంబంధిత సబ్జెక్టుల అధ్యాపకులు వెంటనే రిపోర్టు చేయాలని జిల్లా ఇంటర్ విద్యా అధికారి తిరుమలపూడి రవికుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్, అన్ని రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్స్ వారి కళాశాల లాగిన్లలో అధ్యాపకుల అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇంటర్ బోర్డు నిక్షిప్తం చేసిందన్నారు. మూల్యాంకన విధులు ఉన్న ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎకనామిక్స్, హిస్టరీ సబ్జెక్టు అధ్యాపకులను రిలీవ్ చేయాలని, ఎవరైనా రిలీవ్ చేయని ప్రిన్సిపాల్స్, ప్రైవేటు యాజమాన్యంపై ఇంటర్ బోర్డు నిబంధనల మేరకు కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఖలీల్వాడి: ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనంలో విధులు నిర్వహిస్తున్న అధ్యాపకులకు రానున్న ఉగాది, రంజాన్ పండుగలకు మూల్యాంకనంలో ‘నో వర్క్ నో పే‘ అమలు చేయాలని ప్రభుత్వ అధ్యాపకుల సంఘం జిల్లా అధ్యక్షుడు నర్సయ్య, ఇతర ప్రతినిధులు కోరారు. ఈమేరకు వారు జిల్లా ఇంటర్ విద్య అధికారి రవి కుమార్కు, హైదరాబాద్ నుంచి వచ్చిన ఇంటర్ విద్య పర్యవేక్షకులకు మంగళవారం వినతిపత్రం సమర్పించారు. వినతి పత్రాన్ని వెంటనే ఇంటర్ బోర్డు కమిషనర్కు, పరీక్షల నిర్వహణ విభాగానికి పంపిస్తామని జిల్లా ఇంటర్ విద్యా అధికారి, పర్యవేక్షకులు తెలియజేశారు. నిజామాద్ రూరల్: ఏప్రిల్ 2న హనుమాన్ జ న్మోత్సవం సందర్భంగా నిర్వహించనున్న శో భాయాత్రకు అనుమతి ఇవ్వాలంటూ విశ్వహిందూపరిషత్ ప్రతినిధులు కోరారు. ఈమేర కు వీహెచ్పీ జిల్లా అధ్యక్షుడు దినేష్ ఠాకూర్ మంగళవారం నగరంలోని సీపీ సాయిచైతన్య ను ఆయన చాంబర్లో కలిసి, వినతిపత్రం అందజేశారు. ఇందూరు నగరంతోపాటు, అర్మూ ర్, బోధన్లలో హనుమాన్ శోభాయాత్ర ని ర్వహించనున్నట్లు తెలిపారు. అలాగే అడిషనల్ డీజీపీ బస్వారెడ్డిని కలిసి మెమోరాండం ఇ చ్చారు. వీహెచ్పీ ప్రతినిధులు తమ్మలా కృష్ణ, గాజుల దయానంద్, ధాత్రిక రమేష్, దాసరి సాయి ప్రసాద్, అనిల్ కధం, రామ్ ప్రసాద్ చటర్జీ, నాంపల్లి శేఖర్, బాసొల్లా నీకేష్, గజానన్ పాల్గొన్నారు. నవోదయ ఫలితాల్లో జిల్లా టాపర్ లేక్షణ డొంకేశ్వర్(ఆర్మూర్): నవోదయ ప్రవేశ పరీక్ష ఫలితాలు మంగళవారం వెలువడగా.. డొంకేశ్వర్ మండలం జీజీ నడ్కుడకు చెందిన రాజారాం లేక్షణ 95శాతం మార్కులతో జిల్లా టాపర్గా నిలిచింది. నూత్పల్లిలోని సాయి ప్రసన్న పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న లేక్షణ ఇటీవల నవోదయ ఆరో తరగతి ప్రవేశ పరీక్ష రాసింది. ఫలితాల్లో అత్యుత్తమ మార్కులు రావడంతో తల్లిదండ్రులతోపాటు గ్రామస్తులు లేక్షణను అభినందిస్తున్నారు. -
ఎండకు ఎదురెళ్లొద్దు!
● వేసవికాలంలో ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం ● ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలంటున్న వైద్యనిపుణులునిజామాబాద్ రూరల్: వేసవికాలంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. ఇంతటి ఎండల్లో తి రిగితే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంద ని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. హీట్ స్ట్రోక్తో పాటు విరేచనాలు (డయేరియా), పచ్చ కామెర్లు (జాండిస్) వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కు వగా ఉంటుందని తెలిపారు. వేసవి కాలంలో చిన్న జాగ్రత్తలతోనే పెద్ద ఆరోగ్య సమస్యలను నివారించ వచ్చని సూచిస్తున్నారు. ఈనేపథ్యంలో ఎండాకా లంలో ప్రతిఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని పేర్కొంటూ.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సూ చనలు తెలియజేశారు. ● రోజుకు కనీసం 3–4 లీటర్ల నీరు తాగాలి. ● శుభ్రమైన, మరిగించిన లేదా ఫిల్టర్ చేసిన నీటిని మాత్రమే ఉపయోగించాలి. ● చిన్నపిల్లలు గర్భిణులు, బాలింతలు ఎండలో బయటకు వెళ్లరాదు. ● బయటకు వెళ్తే తలకు టోపి (క్యాప్/టవల్) ఉపయోగించాలి. ● ఉదయం 8 గంటల నుంచి 11 గంటలలోపు ఇంట్లోకి చేరుకుకోవాలి. ● మధ్యాహ్నం 12 నుంచి 4 గంటల వరకు బయట తిరగకుండా ఉండాలి. ● సాయంత్రం 4గంటల తరువాతనే బయటకు వెళ్లడం శ్రేయస్కరం. ● తేలికపాటి, పలుచని, తెల్లని దుస్తులు ధరించాలి. ● కొబ్బరి నీరు, మజ్జిగ, నిమ్మరసం వంటి ద్రవాలు ఎక్కువ తీసుకోవాలి. ● బయట ఆహారం, అపరిశుభ్రమై న ఆహారం తీసుకోవడం పూర్తిగా నివారించాలి. ● చేతులు తరచూ కడుక్కోవాలి, పరిశుభ్రత పాటించాలి. ● పిల్లలు, వృద్ధులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ● వాంతులు, విరేచనాలు, జ్వరం లేదా కళ్లు/చర్మం పసుపు రంగులో మారడం వంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి. ● ఉదయం అత్యవసర సమయంలో బయటకు వెళ్తే గొడుగు తప్పని సరిగావాడాలి.ఎండాకాలంలో జాగ్రత్తలు పాటిస్తే సంపూర్ణ అరోగ్యం అభిస్తుంది. ముఖ్యంగా ఎండాకాలంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. వడదెబ్బ తగిలితే వెంటనే దగ్గర్లో ఉన్న వైద్యుడిని సంప్రదించాలి. ఓఆర్ఎస్ ద్రావణంతోపాటు మజ్జిగ, నిమ్మరసాలు, శీతల పానియాలు తాగాలి. ఎండలో ఎక్కవగా తిరుగకుడదు. –ఆనంద్ మాలు, జనరల్ ఫిజీషియన్, మెడికవర్ హాస్పిటల్స్, నిజామాబాద్ -
జాబ్మేళాకు అపూర్వ స్పందన
కొనసాగుతున్న ఎంఈడీ పరీక్షలు తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ ఎంఈడీ 3వ సెమిస్టర్ రెగ్యులర్ థీయరీ పరీక్షలు మంగళవారం ప్రశాంతంగా జరిగినట్లు అకడమిక్ ఆడిట్సెల్ డైరెక్టర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. మధ్యాహ్నం జరిగిన పరీక్షకు 29 మంది విద్యార్థులకు గానూ 28 మంది హాజరు కాగా ఒకరు గైర్హాజరైనట్లు ఆయన తెలిపారు. ఘనంగా మహిళా దినోత్సవం తెయూ(డిచ్పల్లి): తెలంగాణ వర్సిటీలో మంగళవా రం తెయూ ఉమెన్ సెల్ ఆధ్వర్యంలో మంగళవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి వీసీ యాదగిరిరావు ము ఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. మహిళా చైత న్యం గ్రామాల నుంచే మొదలవ్వాలన్నారు. రిజిస్ట్రా ర్ యాదగిరి మాట్లాడుతూ.. సీ్త్ర, పురుషులు పరస్ప ర సహకారంతో ముందుకెళ్లినప్పుడే మంచి అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ఉమెన్ సెల్ డైరెక్టర్ భ్ర మరాంభిక, ప్రిన్సిపాల్స్ రాంబాబు, సీహెచ్ ఆరతి, ప్రసన్నరాణి తదితరులు పాల్గొన్నారు. లైబ్రరీకి పుస్తకాల అందజేత తెయూ(డిచ్పల్లి): తెయూకు మంగళవారం డాక్టర్ విభూది వెంకటేశ్వర్లు రచించిన బేడ (బుడగ) జంగం ఇంగ్లీష్ వర్షన్ పుస్తకాలను అందజేశారు. నల్గొండ జిల్లా దిండి మండలానికి చెందిన డాక్టర్ వెంకటేశ్వర్లు ప్రస్తుతం పీఎంఆర్ లా కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన బహూకరించిన పుస్తకాలను తెయూ తెలుగు అధ్యయనశాఖ ప్రొఫెసర్ పి.కనకయ్య, లక్ష్మణ చక్రవర్తి యూనివర్సిటీ లైబ్రేరియన్కు అందజేశారు. 25న ‘సైబర్ హైజీన్ ప్రాక్టీసెస్’పై సదస్సు తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీలో ఈ నెల 25న ‘సైబర్ హైజీన్ ప్రాక్టీసెస్’ అవగాహన స దస్సు నిర్వహించనున్నట్లు తెయూ వీసీ యాదగిరిరావు అన్నారు. సదస్సును విద్యార్థులు సద్వినియో గం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈసందర్భంగా మంగళవారం వీసీ తన చాంబర్లో రిజిస్ట్రార్ యాదగిరితో కలిసి సదస్సు బ్రోచర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ.. సదస్సును కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ వర్సిటీ సమన్వయంతో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ‘వార్తాలాప్’ కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న ఈ అవగాహన స దస్సు ఉదయం 10 గంటలకు వర్సిటీ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ కళాశాల సెమినార్ లో ప్రారంభమవుతుందన్నారు. వర్సిటీ హాస్టల్స్ తనిఖీ తెయూ(డిచ్పల్లి): తెయూ మెయిన్ క్యాంపస్లోని హాస్టళ్లను మంగళవారం వీసీ యాదగిరిరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల తో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. హా స్టళ్లలో పరిశుభ్రతను మరింత మెరుగుపరచాలని, విద్యార్థులకు నాణ్యమైన ఆహారం నిరంతరం అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రిజిస్ట్రార్ యాదగిరి, కంట్రోలర్ సంపత్కుమార్, ప్రిన్సిపాల్ రాంబాబు, హాస్టల్స్ చీఫ్ వార్డెన్ రవీందర్రెడ్డిలతో కలిసి వీసీ భోజనం చేశారు. వార్డెన్లు గంగాకిషన్, కిరణ్, కేర్టేకర్లు క్రాంతి, డిగంబర్ ఉన్నారు. -
ఉద్రిక్తంగా మారిన బల్దియా ముట్టడి
● సొమ్మసిల్లిన మున్సిపల్ మహిళా కార్మికులు ● సమస్యలు పరిష్కరించాలని ధర్నా నిజామాబాద్ రూరల్: సమస్యలను పరిష్కరించాలని, కామన్ ఇంట్రెస్ట్ గ్రూపులు(సీఐజీ)లను య థావిధిగా కొనసాగించాలని, ఏజెన్సీలను రద్దుచేసి, కొత్త గ్రూపులు ఏర్పాటు చేయాలని నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్మికులు డిమాండ్ చేశా రు. సమస్యల పరిష్కారం కోసం టీయూసీఐ, ఏఐటీయూసీ, సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు మంగళవారం చేపట్టిన ధర్నా ఉద్రిక్తంగా మారింది. కార్మికులు, డ్రైవర్లు పాత మున్సిపల్ కార్యాలయం నుంచి కోర్టు చౌరస్తా నుంచి కార్పొరేషన్ కార్యా ల యం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీగా వచ్చిన కార్మికులను పోలీసులు మున్సిపల్ కార్యాలయంలోకి రానివ్వకపోవడంతో ఒక్కసారిగా చొచ్చు కు వెళ్లారు. అనంతరం కమిషనర్ చాంబర్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా టీ యూసీ ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.సుధాకర్, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు ఏ రమేశ్బాబు, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి ఓమయ్య, డ్రైవర్స్ యూనియన్ అధ్యక్షుడు లక్ష్మణ్ మాట్లాడారు. ఉగా ది, రంజాన్ పండుగల నేపథ్యంలో బుధవారం సా యంత్రంలోగా కార్మికులకు జీతాలు ఇవ్వాలన్నారు. అ వుట్సోర్సింగ్ కార్మికులందరికీ యూనిఫామ్, స బ్బులు, నూనెలు, రక్షణ పరికరాలు ఇవ్వా లని, చనిపోయిన కార్మికుల స్థానంలో వారి కుటుంబ స భ్యులకి ఉద్యోగ అవకాశం ఇవ్వడంలో కొర్రీలు పెట్టడం మానుకోవాలన్నారు. కేటగిరీల వారీగా ఇ తర మున్సిపల్ కార్పొరేషన్లలో ఇస్తున్నట్లు వేతనా లు చెల్లించాలని, పీఎఫ్, ఈఎస్ఐలలో తప్పులను సరిదిద్దాలని డిమాండ్ చేశారు. సమస్యలను 14 రోజుల్లో పరిష్కరించకపోతే సమ్మెకు వెళ్తామన్నారు. మున్సిపల్ కమిషనర్ అందుబాటులో లేకపోవడంతో డిప్యూటీ కమిషనర్ రవీందర్సాగర్కు వినతిపత్రం అందజేశారు. ధర్నా కొనసాగుతున్న క్ర మంలో తోపులాట చోటుచేసుకోవడంతో మాధవి, పార్వతి అనే మహిళా కార్మికులు సొమ్మసిల్లి పడిపోయారు. తోటి కార్మికులు వారిని వెంటనే అంబులెన్స్లో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మున్సిపల్ కార్మిక సంఘాల నాయకులు భూపతి, రాజేశ్వర్, కిరణ్, గోవర్ధన్, రవి, శివకుమార్, భానుచందర్, మహేశ్, యాదమ్మ, లక్ష్మి, శైలజ, మున్సిపల్ కార్మికులు, డ్రైవర్లు టీయూసీఐ జిల్లా నాయకులు కిరణ్, లింగం, ఏఐటీయూసీ జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
కేవీకి ఇంటర్, అదనపు సెక్షన్లు మంజూరు
● ఫలించిన ఎంపీ అర్వింద్ కృషి ఖలీల్వాడి: నిజామాబాద్, బోధన్ కేంద్రీయ విద్యాలయాల్లో 2026 – 27 విద్యా సంవత్సరానికి అదనపు సెక్షన్లు మంజూరయ్యాయి. బోధన్ కేవీలో 2వ తరగతి నుంచి 5వ తరగతి వరకు, నిజామాబాద్ కేవీలో 3 నుంచి 5వ తరగతి వరకు అదనపు సెక్షన్లు ఎంపీ అర్వింద్ కృషితో మంజూరయ్యాయి. అలాగే ఈ విద్యా సంవత్సరం నిజామాబాద్ కేంద్రీయ విద్యాలయానికి ఇంటర్ ప్రథమ సంవత్సరం(సైన్స్)కి సైతం అనుమతి లభించింది. రెండు కేంద్రీయ విద్యాలయాల్లోనూ అదనపు సిబ్బందిని నియమించనున్నారు. ఈ సందర్భంగా ఎంపీ అర్వింద్ మాట్లాడుతూ.. అదనపు సెక్షన్ల మంజూరు చేయాలని కేంద్ర మంత్రితోపాటు ఉన్నతాధికారులకి గతంలో తాను విన్నవించానని, ఈ సంవత్స రం నుంచి అదనపు సెక్షన్లు మంజూరవడం ఆనందంగా ఉందన్నారు. జిల్లా విద్యార్థుల కు మెరుగైన విద్యా అవకాశాలు కల్పించడానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. అలా గే కేవీల్లో సౌకర్యాల విస్తరణ కోసం తన ప్ర యత్నాలు కొనసాగుతాయని పేర్కొన్నారు. అటవీ సిబ్బందికి ముగిసిన అవగాహన తరగతులు ● హాజరైన తొమ్మిది జిల్లాల సిబ్బందిడొంకేశ్వర్(ఆర్మూర్): మూడు జిల్లాల సరిహద్దులో పెద్దపులి సంచరిస్తున్న నేపథ్యంలో తొమ్మిది జిల్లాల ఫారెస్ట్ సిబ్బందికి నిజామాబాద్ అటవీ కార్యాలయంలో రెండు రోజులపాటు నిర్వహించిన అవగాహన తరగతులు మంగళవారం ముగిశాయి. పుణే నుంచి వచ్చిన మగ్గురు రెసూ్క్య్ టీం వన్యప్రాణుల సంరక్షణకు తీసుకోవాల్సిన చర్య లు, జాగ్రత్తలను వివరించారు. నిజామాబాద్తోపాటు జగిత్యాల, నిర్మల్, అదిలాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల, మెదక్, సిద్దిపేట్, కరీంనగర్ జిల్లాల నుంచి వచ్చిన బీట్, సెక్షన్ ఆఫీసర్లతోపాటు ఎఫ్ఆర్వోలు, ఎఫ్డీవోలు, డీఎఫ్వోలు పాల్గొన్నారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా నీలకంఠరావు ● 26న మిగతా పదవులకు ఎన్నికలునిజామాబాద్ లీగల్: నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా డి నీలకంఠరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే జాయింట్ సెక్రెటరీగా ఏ మానస, లైబ్రరీ సెక్రెటరీగా బి పుణ్యరాజ్, ట్రెజరర్గా జి మధుసూదన్గౌడ్, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రెటరీగా బి గణేశ్, మహిళా రిప్రజెంటేటివ్గా ఝాన్సీరాణితోపాటు, తొమ్మిది మంది ఈసీ మెంబర్లు ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ఎన్నికల అధికారులు అమిడాల సుదర్శన్, మెట్టు నరేశ్కుమార్ ప్రకటించారు. ఉపాధ్యక్ష పదవితోపాటు ప్రధాన కార్యదర్శి పదవులకు ఈనెల 26వ తేదీన ఎన్నికలు నిర్వహించనున్నారు. -
కొత్త పట్టాదారులకూ భరోసా
డొంకేశ్వర్(ఆర్మూర్): రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతలకు మరో తీపి కబురు చెప్పింది. ఈ ఏడాది ఫిబ్రవరి 28వ తేదీ నాటికి కొత్త పట్టా పాస్పుస్తకాలు పొందిన రైతులు కూడా ‘రైతు భరోసా’ పథకం కింద పంట పెట్టుబడి సాయం పొందేందుకు అవకాశం కల్పించింది. ఈ మేరకు మార్గదర్శకాలను విడుదల చేసిన ప్రభుత్వం తగిన పత్రాలతో స్థానిక రైతు వేదికల్లో ఏఈవోలకు ఈ నెల 25వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని గడువు విధించింది. ఈ నిర్ణయంతో జిల్లాలో మరికొంత మంది రైతులు లబ్ధి పొందనున్నారు. కటాఫ్ తేదీ ప్రకారం జిల్లాలో కొత్త పట్టాదారు పుస్తకాలు పొందిన వారు 4,616 మంది ఉన్నట్లుగా వ్యవసాయ శాఖ వెల్లడించింది. అయితే యాసంగి సీజన్కు సంబంధించిన రైతు భరోసా నిధులు మార్చి 22వ తేదీ నుంచి రైతుల ఖాతాల్లో జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. పాత రైతులతోపాటు కొత్త రైతులకు కూడా పెట్టుబడి సాయం అందనుంది. ఎకరానికి రూ.6వేల చొప్పున ప్రభుత్వం ఇవ్వనుంది. కొత్త పట్టాలు పొందిన రైతులు దరఖాస్తు చేసుకునేలా వ్యవసాయాధికారులు వాట్సాప్ గ్రూపుల్లో, స్టేటస్ల ద్వారా సమాచారాన్ని చేరవేస్తున్నారు. రైతు భరోసా నిధులను ప్రభుత్వం చివరిసారిగా వానాకాలం–2025లో ఇవ్వగా జిల్లాలో 2.72లక్షల మంది రైతులకు రూ.316.63కోట్లు ఖర్చు చేసింది. అర్హతలు.. అవసరమైన పత్రాలు ఈ ఏడాది ఫిబ్రవరి 28వ తేదీ వరకు కొత్త పట్టా పాసుబుక్ పొందిన వారు అర్హులు పట్టా పాస్బుక్ ఉండి ఇప్పటి వరకు రైతు భరోసా పొందని రైతులు రైతు భరోసా అప్లికేషన్ ఫారం పట్టాదార్ పాస్పుస్తకం జిరాక్స్ రైతు ఆధార్కార్డు బ్యాంకు ఖాతా జిరాక్స్ రైతు మొబైల్ నంబర్ సద్వినియోగం చేసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని కటాఫ్ తేదీ వరకు కొత్త పట్టాపా స్ పుస్తకాలు పొందిన రైతులు సద్వినియోగం చేసుకోవాలి. యాసంగికి సంబంధించిన రైతు భరోసా డబ్బులు రావాలంటే కొత్త రైతులు తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాల్సిందే. రైతుల్లో వేదికల్లో ఏఈవోలను, ఏవోలను సంప్రదిస్తే వారు మరిన్ని వివరాలు తెలుపుతారు. – గోసుల వీరాస్వామి, జిల్లా వ్యవసాయాధికారి ఫిబ్రవరి 28 నాటికి పాస్పుస్తకాలు పొందిన వారికి అవకాశం దరఖాస్తుకు ఈ నెల 25వ తేదీ వరకు గడువు లబ్ధి పొందనున్న 4,616 మంది రైతులు! -
నిజామాబాద్
రంజాన్ సందడి వాతావరణం ఉదయం ఆకాశం పాక్షికంగా మేఘావృతమవుతుంది. మధ్యాహ్నం ఉక్కపోతగా ఉంటుంది. అక్కడక్కడ ఉరుములు, మెరుపుల తో కూడిన వర్షం కురిసే అవకాశాలున్నాయి.ఎండకు ఎదురెళ్లొద్దు! ఎండ తీవ్రత పెరుగుతోంది. ఎండలో తిరిగితే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.బుధవారం శ్రీ 18 శ్రీ మార్చి శ్రీ 2026– 8లో uజిల్లా కేంద్రంలోని ప్రధాన కూడళ్లయిన గాంధీచౌక్, నెహ్రూపార్క్ ప్రాంతాల్లో రంజాన్ మార్కెట్ జోరుగాసాగుతోంది. ప్రత్యేకంగా వెలిసిన దుకాణాలు విద్యుత్ వెలుగుల్లో జిగేల్మంటున్నాయి. రాత్రిపగలు తేడాలేకుండా కొనుగోలుదారుల సందడి ఉంటోంది. గాజులు, ఫ్యాన్సీ ఐటమ్స్ కొనుగోలు కోసం మహిళలు తరలివస్తున్నారు. వివిధ రకాల అత్తర్లు ఆకర్షిస్తున్నాయి. రెండుమూడు రోజులపాటు సందడి కొనసాగనుంది. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, నిజామాబాద్ -
పచ్చి పసుపు తీసుకొచ్చి నష్టపోవద్దు
● ఈ నెల 23 నుంచి అమలులోకి గ్రేడింగ్ విధానం ● నిజామాబాద్ ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి నిజామాబాద్ రూరల్: రైతులు పచ్చి పసుపు మార్కెట్ యార్డుకు తీసుకువచ్చి నష్టపోవద్దని నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి సూచించారు. మార్కెట్ యార్డు లో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడా రు. అకాల వర్షాల కారణంగా పసుపు ధర మరింత తగ్గుతుందనే భయంతో రైతులు పెద్ద ఎత్తున పచ్చి పసుపు తీసుకువస్తుండడంతో మోడల్ ధరలో రూ.500 నుంచి రూ.800 వరకు తగ్గుదల గమనించామన్నారు. ధరల తగ్గుదల, పచ్చి పసుపు విక్రయాలను నివారించేందుకు మార్కెట్ యార్డులో ఈ నెల 23వ తేదీ నుంచి గ్రేడింగ్ విధానాన్ని అమలు చేస్తామన్నారు. పూర్తిగా ఎండబెట్టిన పసుపును మా ర్కెట్ యార్డుకు తీసుకురావాలని రైతులను కోరా రు. అలాగే అమావాస్య, ఉగాది, రంజాన్ కారణంగా 18వ తేదీ నుంచి 22వ తేదీ వరకు మార్కెట్ యార్డులో లావాదేవీలు కొనసాగవని, 23వ తేదీ నుంచి యథావిధిగా క్రయవిక్రయాలు సాగుతాయ ని నగేశ్రెడ్డి తెలిపారు. -
21న కలెక్టరేట్ ముట్టడిని జయప్రదం చేయాలి
నిజామాబాద్ రూరల్: జిల్లాకేంద్రంలో ఈనెల 21న బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న కలెక్టరేట్ ముట్టడికి ప్రజలు పెద్దఎత్తున పాల్గొని, జయప్రదం చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేష్పటేల్ కులాచారి పిలుపునిచ్చారు. నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై తీవ్రంగా మండిపడ్డారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీలను నిలబెట్టడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. రాష్ట్రంలో అవినీతి, అక్రమాలు పెరిగిపోయాయన్నారు. అయినా ప్రభుత్వ సలహాదారులు, పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యేలు కార్పొరేషన్ చైర్మన్లకు ప్రజల మీద పట్టింపు లేదన్నారు. అన్ని సమస్యలపై సమగ్ర నివేదిక సిద్ధం చేసి కలెక్టర్కు అందజేస్తామని తెలిపారు. సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి గోపిడి స్రవంతిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు పోతనకర్ లక్ష్మినారాయణ, నాగోల్ల లక్ష్మినారాయణ, జిల్లా ఉపాధ్యక్షులు ప్రమోద్కుమార్, బంటు రాము, నిమ్మల శ్రీనివాస్, బాన్సువాడ ఇన్చార్జి కోనేరు శశాంక్, రూరల్ కన్వీనర్ పద్మరెడ్డి, జిల్లా కార్యదర్శిలు దాంపల్లి జ్యోతి, పోల్కం వేణు, పాలేపు రాజు, బద్దం కిషన్, పుట్ట వీరేందర్, జగన్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, విజయ్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు -
పశువులకు వ్యాక్సిన్ తప్పక వేయించాలి
జక్రాన్పల్లి: పాడి పశువులు రోగాల బారిన పడకుండా గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు తప్పనిసరి గా వేయించాలని జిల్లా పశుసంవర్ధక శాఖ అఽధికారి బస్వారెడ్డి పశుపోషకులకు సూచించారు. మండలంలోని సికింద్రాపూర్లో గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమాన్ని మంగళవారం పర్యవేక్షించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాడి పశువులు, ఆవులు, గేదెలు, ఎద్దులు ఆరోగ్యంగా ఉండాలంటే టీకాలు వేయించాలన్నారు. ఆరు నెలలకోసారి ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను పశువులకు వే యించాలన్నారు. సర్పంచ్ అప్పాల అరుణ్కుమార్, మండల పశువైద్యాధికారిణి అశ్రితరెడ్డి, జంతు వ్యాధి నిర్ధారణ ప్రయోగశాల ఏడీ డాక్టర్ కిరణ్ దేశ్పాండే, గోపాల మిత్ర పోశెట్టి, జీపీ సిబ్బంది సురేశ్, అశోక్, పవన్, వీడీసీ సభ్యులు పాల్గొన్నారు. -
నామినేటెడ్ ఆశలు
● ఈ నెలలో పదవుల పంపిణీ పూర్తి చేసే అవకాశాలు ● తాజాగా డాక్టర్ కవితారెడ్డికి దక్కిన రాష్ట్ర కార్పొరేషన్ పదవి ● అలర్ట్ అయిన ఆశావహులు.. హైదరాబాద్లో మకాం ● నాయకులను, శ్రేణులను మూడు కేటగిరీలుగా విభజించినట్లు వార్తలు ● ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డికి ఆర్టీసీ చైర్మన్ దక్కే చాన్స్! సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: నామినేటెడ్ పదవులను పూర్తిస్థాయిలో పంపిణీ చేసేందుకు ఈ నెలలో కాంగ్రెస్ నాయకత్వం రంగం సిద్ధం చేస్తుండడంతో జిల్లాకు చెందిన ఆశావహులు మరింత అలర్ట్ అయ్యారు. పదవులు ఆశిస్తున్న నాయకులు హైదరాబాద్లో మకాం వేసి తమ స్థాయిలో ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. కీలక పదవుల్లో ఉన్నవారిని కలిసి తమకు పదవులు కేటాయించేలా చూడాలని అడుగుతున్నారు. పూర్తిగా హైదరాబాద్లోనే ఆయా ఆశావహులు చక్కర్లు కొడుతున్నారు. కాగా రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షినటరాజన్ శ్రేణులను మూడు కేటగిరీలుగా విభజించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో నాయకులు, కార్యకర్తల్లో దీనిపై చర్చ జరుగుతోంది. మొదటి నుంచి పార్టీలో ఉన్నవారు, గత శాసనసభ ఎన్నికలకు ముందు వచ్చినవారు, పార్టీ అధికారంలోకి వచ్చినవారు అనే మూడు కేటగిరీలు చేసినట్లు తెలుస్తోంది. దీంతో మూడు కేటగిరీల వారు ఆయా లెక్కల ఆధారంగా ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు. ఇప్పటికే పదవుల కోసం రెండేళ్లకు పైగా ఎదురు చూస్తున్న నాయకుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొన్నట్లు మీనాక్షిపార్టీ అధినాయకత్వానికి నివేదిక సైతం ఇవ్వడం గమనార్హం. ఇక జిల్లా నుంచి పీసీసీ అధ్యక్షుడుగా మహేశ్గౌడ్ ఉండడంతో ఆశావహుల నుంచి ఆయనపై ఒత్తిడి ఎక్కువగా ఉంది. పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న డాక్టర్ కవితారెడ్డికి జిల్లా నుంచి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్పర్సన్గా నామినేటెడ్ పదవి కేటాయించడంతో ఆమె బాధ్యతలు స్వీకరించారు. ఇదే క్రమంలో మిగిలిన ఆశావహులకు సైతం పదవుల పంపిణీ చేయనున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా కొందరు ఎమ్మెల్యేలకు సైతం కీలక కార్పొరేషన్ పదవులు ఇ వ్వనున్నట్లు తెలుస్తోంది. నిజామాబాద్ రూరల్ ఎ మ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డికి కీలకమైన ఆర్టీసీ చైర్మన్ పదవి ఇవ్వనున్నట్లు జిల్లా పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. కాగా జిల్లాల వారీగా నామినేటెడ్ పదవులు ఎవరికి ఇవ్వాలనే విషయమై ఇప్పటికే జాబితా రూపొందించినట్లు సమాచారం. ఇందులో యువ నాయకులు సైతం ఉన్నట్లు తెలుస్తోంది. రేసులో..మాజీ డీసీసీబీ చైర్మన్ కుంట రమేష్ రెడ్డి మరోసారి ఆ పదవిని ఆశిస్తున్నారు. సహకార పదవులు సైతం నామినేటెడ్ పద్దతిలో ఇవ్వనున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో దీనిపై భారీ చర్చ నడుస్తోంది. డీసీసీ పీఠం ఆశించి విఫలమైన సీనియర్ నాయకుడు మార చంద్రమోహన్రెడ్డి రాష్ట్రస్థాయి నామినేటెడ్ పదవి రేసులో ఉన్నారు. అదేవిధంగా మరో సీనియర్ నాయకుడు బాడ్సి శేఖర్గౌడ్ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ పదవి రేసులో ఉన్నారు. శేఖర్గౌడ్కు గీత కార్మిక కార్పొరేషన్ పదవి దక్కనున్నట్లు తెలుస్తోంది. మాజీ డీసీఎంఎస్ చైర్మన్ మునిపల్లి సాయిరెడ్డి, పురణ్రెడ్డి సైతం నామినేటెడ్ రేసులో ఉన్నారు. మాజీ మేయర్ ధర్మపురి సంజయ్, బాస వేణుగోపాల్యాదవ్, వెల్మ భాస్కర్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, కాటిపల్లి నరేందర్రెడ్డి, నరాల రత్నాకర్ పదవుల రేసులో ఉన్నారు. గత ఎన్నికల్లో జుక్కల్ ఎమ్మెల్యే టిక్కెట్టు ఆశించి భంగపడిన రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్ సైతం రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ పదవి ఆశిస్తున్నారు. నామినేటెడ్ పదవుల నియామకానికి అధిష్టానం కసరత్తు చేస్తోందనే వార్తల నేపథ్యంలో ఆశావహులు ఎవరి స్థాయిలో వారు ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయితే నాయకులు, కార్యకర్తలను అధిష్టానం మూడు కేటగిరీలుగా విభజించిట్లు సమాచారం. ముందు నుంచి పార్టీలో ఉన్నవారు, అసెంబ్లీ ఎలక్షన్స్కు ముందు వచ్చిన వారు, పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత చేరిన వారి పేర్లతో జాబితాలు చేసినట్లు తెలిసింది. -
సత్వర న్యాయానికి లోక్అదాలత్
నిజామాబాద్ లీగల్: కోర్టుల్లో పెండింగ్లో ఉన్న కే సులకు సంబంధించి కక్షిదారులకు సత్వర న్యా యం అందించేందుకు ఈనెల 28వ తేదీన లోక్అ దాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా జడ్జి జీవీఎన్ భారతలక్ష్మి తెలిపారు. లోక్ అదాలత్ విజయవంతానికి పోలీసులు కృషి చేయాలని కోరారు. జిల్లా కోర్టులో మంగళవారం స్టేషన్ హౌజ్ ఆఫీసర్లతో సమావేశం నిర్వహించగా.. అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జిలు హరీష, టి శ్రీనివాస్, డీసీపీ బస్వారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి భారతలక్ష్మి మాట్లాడుతూ.. లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసు కునేలా కృషి చేయాలన్నారు. -
ఎర్రజొన్న నిలువకే మొగ్గు
మోర్తాడ్: ఇరాన్తో సాగుతున్న యుద్ధాన్ని సాకుగా చూపుతున్న వ్యాపారులు ఎర్రజొన్నల ధరను అమాంతం తగ్గించారు. తమ లాభాలకు వ్యాపారులు గండికొడుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ సీజన్లో జిల్లాలో 22,378 ఎకరాల్లో ఎర్రజొన్నలను సాగు చేశారు. మూడు సీజన్లతో పోల్చితే సాగు విస్తీర్ణం ఎంతో తగ్గింది. సాగు విస్తీర్ణం తగ్గిపోయిన కారణంగా ఉన్న పంటకు డిమాండ్ ఏర్పడాల్సి ఉంది. కానీ వ్యాపారుల మాయాజాలంలో భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. ప్రతి ఏటా ఏదో ఒక కారణం చెబుతూ ఎర్రజొన్నలకు ధర తగ్గిస్తున్నారని రైతులు పేర్కొంటున్నారు. ఈసారి ఏకంగా ఇరాన్ యుద్ధాన్ని సాకుగా చూపడం గమనార్హం. ఎర్రజొన్నలను అత్యధికంగా ఉత్తరాది రాష్ట్రాల్లోనే వినియోగిస్తారు. కొంత మొత్తం మాత్రం పొరుగు దేశాలకు ఎగుమతి అవుతుంది. వ్యాపారులు కావాలని ధర తగ్గించి తమను నష్టానికి గురి చేస్తున్నారని రైతులు పేర్కొంటున్నారు. మోర్తాడ్ మండలం దొన్కల్కు చెందిన రైతు రవి పండించిన ఎర్రజొన్నలను క్వింటాలుకు రూ.3,900ల ధరకు విక్రయించాలని నిర్ణయించాడు. వ్యాపారులు మాత్రం రూ.600లు తగ్గించి ఒక్కో క్వింటాలుకు రూ.3,300 మాత్రమే చెల్లిస్తామని స్పష్టం చేశారు. దీంతో సదరు రైతు అనుకున్న ధరకు ఎర్రజొన్నలను విక్రయిస్తే రూ.6,35,700ల ఆదాయం లభించేది. వ్యాపారులు సూచించిన ధరకు అమ్మితే రూ.5,37,900ల ఆదాయం మాత్రమే వచ్చేది. అంటే ఆ రైతుకు రూ.97,800ల నష్టం వాటిల్లుతుంది. ఇప్పట్లో ఎర్రజొన్నలను విక్రయించడానికి బదులు కోల్డ్ స్టోరేజీలో నిలువ చేసుకుని ధర పెరిగిన సమయంలోనే అమ్ముకోవాలని రైతు రవి నిర్ణయించాడు. ఇది ఒక్క రవి భావనే కాదు. ఎర్రజొన్నలను సాగు చేసిన ఎంతో మంది రైతులు ఇలాంటి ఆలోచనలోనే ఉన్నారు. అందుబాటులో ఉంటే కోల్డ్ స్టోరేజీలు లేకుంటే గోదాంలు, తమ ఇళ్లలోనే ఎర్రజొన్నలను నిలువ చేసుకుంటున్నారు. యుద్ధం కారణం చూపి ధర తగ్గించిన వ్యాపారులు వారం రోజుల వ్యవధిలోనే క్వింటాకు రూ.600 పడిపోయిన ధర ధర పెరిగాకే విక్రయిస్తామంటున్న రైతులు -
విద్యుత్ అంతరాయాల నివారణకు ప్రత్యేక వాహనాలు
● విద్యుత్ శాఖ ఎస్ఈ పీవీ రాజేశ్వరరావు నిజామాబాద్ రూరల్: ప్రకృతి విపత్తులైన భారీ వర్షాలు, ఈదురు గాలులు, సాంకేతిక కారణాల వల్ల విద్యుత్ సరఫరాలో ఏర్పడే అంతరాయాలను తగ్గించి వినియోగదారులకు త్వరితగతిన సేవలు అందించేందుకు నిజామాబాద్ సర్కిల్ పరిధిలో ప్రత్యేక చర్యలు చేపట్టామని ఎస్ఈ పీవీ రాజేశ్వరరావు అన్నారు. ఈ మేరకు సర్కిల్ పరిధిలో 3 ఈఆర్టీ(ఎమర్జెన్సీ రీస్టోరేషన్ టీమ్) వాహనాలను వినియోగిస్తున్నామని వెల్లడించారు. సబ్డివిజన్ స్థాయిలో 14 వాహనాలను సిద్ధంగా ఉంచి అత్యవసర పరిస్థితుల్లో వినియోగిస్తున్నామని పేర్కొన్నారు. ఈ వాహనాల్లో విద్యుత్ లైన్ల మరమ్మతులకు అవసరమైన కండక్టర్లు, ఇన్సులేటర్లు, కేబుల్స్, టూల్స్ తదితర మెటీరియల్ ముందుగానే అందుబాటులో ఏర్పాటు చేసుకొని, వాహనాలకు జీపీఆర్ఎస్ ఏర్పాటు చేయడంతో సమస్య ఏర్పడిన ప్రాంతానికి బృందాన్ని వెంటనే పంపించి వేగంగా సమస్యను పరిష్కరిస్తున్నామని ఎస్ఈ వివరించారు. ఎమర్జెన్సీ రీస్టోరేషన్ టీమ్ వాహనాల ద్వారా హఠాత్తుగా సంభవించే సమస్యలను పరిష్కరించడంలో ఎంతగానో దోహదపడతాయని అన్నారు. విద్యుత్ అంతరాయాలను తగ్గించి వినియోగదారులకు మెరుగైన నాణ్యమైన సేవలు అందించడంలో సంస్థ మరింత సమర్థవంతంగా పనిచేస్తుందని ఎస్ఈ అన్నారు. -
శ్రీరామ నవమికి ఏర్పాట్లు పూర్తి చేయాలి
● మున్సిపల్ కమిషనర్ దిలీప్కుమార్, నుడా చైర్మన్ కేశవేణు ● రఘునాథ ఆలయం సందర్శన నిజామాబాద్ రూరల్: శ్రీరామ నవమి వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని మున్సిపల్ కమిషనర్ దిలీప్కుమార్, నుడా చైర్మన్ కేశవేణు అన్నారు. జిల్లా కేంద్రంలోని రఘునాథ ఆలయ అభివృద్ధి ప నుల కోసం టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ ఇటీవల రూ.50 లక్షల నిధులు మంజూరైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మున్సిపల్ కమిషనర్, నూడా చైర్మన్ ఆదివారం ఆలయ పరి సర ప్రాంతాలను సందర్శించి రోడ్లు అంచనా వే యించినారు. శ్రీరామనవమి సందర్భంగా భక్తుల కు అన్ని విధాల సౌకర్యాలు కల్పిస్తామని,తగిన వస తులు మున్సిపల్ ద్వారా కల్పిస్తామని వారు అన్నా రు. ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షుడు ముక్క దేవేందర్ గుప్తా, కోశాధికారి పెండ్యాల శ్రీనివాస్, కమిటీ ట్రస్ట్ మెంబర్, కార్యవర్గ సభ్యులు భక్తవత్సలం నా యుడు, డీ రాజేంద్రప్రసాద్, బంటు బలరాం తదితరులు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ సభ్యులు అశోక్ కుమార్, సంపత్, బింగి ప్రకాశ్, చల్ల గంగాధర్, తాటి వీరేశం, నరేందర్ గౌడ్ తదితరులు ఉన్నారు. -
క్రైం కార్నర్
చికిత్స పొందుతూ ఒకరి మృతి రెంజల్(బోధన్):రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి మృతిచెందినట్లు స్థానికులు తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. రెంజల్ మండలం తాడ్బిలోలి గ్రా మానికి చెందిన రాజేందర్(45) మూడు రోజుల క్రితం సాటాపూర్ నుంచి జాతీయ రహదారి మీదుగా స్వగ్రామానికి బైక్పై వెళ్తుండగా బోర్గాం శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. తీవ్రగాయాలతో ఘటన స్థలంలో పడి ఉన్న క్షతగాతుడిని స్థానికులు నిజామాబాద్లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. గొర్రెల మందపై కుక్కల దాడి ధర్పల్లి: మండల కేంద్రానికి చెందిన కుర్మ నడిపి సాయిలుకు చెందిన గొర్రెల మందపై వీధి కుక్కలు దాడి చేశాయి. ఈ దాడిలో ఆరు గొర్రెలు మృతి చెందాయి. మరో ఆరు గొర్రెలు తీవ్రంగా గాయపడ్డాయి. నడిపి సాయిలు తన గొర్రెలను పగలు మేత కోసం అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి రాత్రి ఇంటి పరిసరాల్లో రక్షణ చర్యలు చేపట్టి ఉంచుతారు. ఆదివారం తెల్లవారుజామున గొర్రెల మంద పై వీధి కుక్కలు దాడి చేశాయి. మండల పశు వైద్యాధికారులు ఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. గాయపడిన గొర్రెలకు ప్రథమ చికిత్స అందజేశారు. సుమారు రూ.80 వేల వరకు నష్టం వాటిళ్లిందని బాధితుడు వాపోయాడు. ప్రభుత్వం తనను ఆదుకోవాలని బాధితుడు కోరాడు. -
కృష్ణ జింకను కాపాడిన గ్రామస్తులు
వర్ని: మండలంలోని శంకోర గ్రామ శివారులోని నిజాంసాగర్ ప్రధాన కాలువలో ప్రమాదవశాత్తు పడిన కృష్ణ జింకను గ్రామస్తులు ఆదివారం కాపాడారు. అడవిలో కుక్కలు వెంటపడగా వాటి నుంచి కాపాడుకునే ప్రయత్నంలో సాగర్ కాలువలో పడిన కృష్ణ జింకను శంకోరా గ్రామానికి చెందిన యువకులు కాపాడారు. నీళ్లలో కొట్టుకపోతున్న జింకను పైకి తీసుకొచ్చి మళ్లీ అడవిలో వదిలివేశారు. కామారెడ్డి టౌన్: కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత సామాన్యులతో పాటు చిన్న చిన్న హోటళ్ల నిర్వాహకులను సైతం ఇబ్బంది పెడుతోంది. గ్యాస్ సిలిండర్ లభించకపోవడంతో జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ ఆర్కేలాడ్డ్ రోడ్లో ఒక చిన్న ఫుడ్ హోటల్ నిర్వాహకురాలు వినూత్నంగా ఆలోచించారు. వంట గ్యాస్కు ప్రత్యామ్నాయంగా ఆధునిక కట్టెల పొయ్యిని వినియోగిస్తూ తన వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. అతి తక్కువ కట్టెలు లేదా బొగ్గుతో, ఎక్కువ వేడినిచ్చే ఈ పొయ్యిని వాడటం వల్ల ఖర్చు గణనీయంగా తగ్గుతోందని ఆమె పేర్కొన్నారు. ముఖ్యంగా రొట్టెలు, వంటకాలు చేయడానికి గ్యాస్ స్టౌ కంటే ఇలాంటి పొయ్యిలే ఎంతో అనుకూలంగా ఉన్నాయని చెబుతున్నారు. ఒకవైపు కమర్షియల్ గ్యాస్ దొరక్కపోవడంతో ఇలాంటి తక్కువ ఖర్చుతో కూడిన మార్గాలను అన్వేషించడం ఇప్పుడు జిల్లా కేంద్రంలో చర్చనీయాంశమైంది. -
బోధన్లో గ్యాస్ ఇబ్బందులు
బోధన్టౌన్: గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు గ్యాస్ ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. ఆదివారం బోధన్ పట్టణంలోని వీక్లీ మార్కెట్ వద్ద సీపీఎం, సీపీఐఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు స్థానిక ప్రజలతో కలిసి ధర్నా నిర్వహించారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు వంట గ్యాస్ కోసం ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదని చెబుతుంటే గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు మాత్రం ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టణ కేంద్రంలోని ఓ గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు గ్యాస్ సిలిండర్ల కోసం కార్యాలయానికి వెళ్తే నిర్లక్ష్యంగా సమాధానాలు చెబుతున్నారని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్ బుక్ చేసుకొని ఎనిమిది రోజులు గడుస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరారు. నాయకులు రాజు, రాములు, పోశెట్టి, సాయిలు, గౌస్, హైమద్, అమీర్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
గుప్పుమంటున్న గుడుంబా
● గ్రామాల్లో పెరుగుతున్న స్థావరాలు ● అధికారుల పర్యవేక్షణ కరువు ● ప్రజల పాలిట శాపంగా మారుతున్న పరిస్థితి సిరికొండ: పల్లెల్లో గుడుంబా గుప్పుమంటోంది. మారుమూల గ్రామాలు, గిరిజన తండాల్లో గుట్టుచప్పుడు కాకుండా సారా తయారు చేస్తున్నారు. అబ్కారీ అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో పల్లెల్లో నాటు సారా ఏరులై పారుతోంది. సిరికొండ మండలంలో గిరిజన తండాలు అధికంగా ఉండటంతో తండాలు, మారుమూల గ్రామాల్లో గుడుంబా తయారీ జోరుగా కొనసాగుతోంది. పల్లెల్లో నాటు సారా అమ్మకాలను కొందరు తమ ప్రవృత్తిగా కొనసాగిస్తున్నారు. పూరి గుడిసెల్లో బట్టీలను పెట్టి దొంగచాటుగా నాటు సారాను కాస్తుంటారు. సారాను ప్లాస్టిక్ ప్యాకెట్లలో నింపి గ్రామాలకు తరలిస్తు పొలిమేరల్లో విక్రయాలు సాగిస్తున్నారు. హానికర పదార్థాలతో.. పల్లెల్లో నాటు సారాను విక్రయదారులు ప్రాణాంతక పదార్థాలతో తయారు చేస్తున్నారు. యూరి యా, పటిక, నల్లబెల్లం, తంబాకు లాంటి హానికర పదార్థాలను గుడుంబా తయారీలో వినియోగిస్తున్నారు. ఇలా ప్రాణాంతక పదార్థాలతో తయారు చేసిన సారాను తాగి పేద ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. మద్యం అధిక ధరలతో.. మద్యం ధరలు అధికంగా ఉండడంతో పేదలు గుడుంబా వైపు మొగ్గుచూపుతున్నారు. ఒక్కోసారా ప్యాకెట్టు తక్కువ ధరకే లభిస్తుండటంతో ధరలు అధికంగా ఉన్న మద్యాన్ని కొనలేక కూలీ పనులు చేసుకునే వారు సారాకు బానిసలవుతున్నారు. తక్కువ ధరకు దొరుకుతుందని హానికర పదార్థాలతో తయారు చేస్తున్న విషయం గమనించక నాటు సారాను తాగుతు పేద ప్రజలు తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. నాటు సారా తయారు చేయకుండా, విక్రయించకుండా తగిన చర్యలు తీసుకుంటున్నాం. సారా తయారీ, వాడకం వల్ల కలిగే అనర్థాలపై గ్రామాల్లో అవగాహన కల్పిస్తున్నాం. సారా తయారీదారులపై కేసులు నమోదు చేసి తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేస్తున్నాం. – వేణుమాధవరావు, భీంగల్ ఎకై ్సజ్ సీఐ చర్యలు శూన్యం నాటు సారా విక్రయాలపై అబ్కారీ అధికారుల చర్యలు శూన్యంగా మారాయి. నామ మాత్రంగా దాడులు చేయడమే తప్ప నాటు సారా తయారీని ని వారించడానికి పకడ్బందీ చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నాటు సారా అమ్మకాలు పూర్తిగా కనుమరుగు కాగా, గత రెండేళ్లుగా పల్లెల్లో మళ్లీ గుడుంబా గుప్పుమంటోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. నాటు సారా తయారు చేస్తున్న, విక్రయిస్తున్న వారిని ఎకై ్సజ్ శాఖ అధికారులు పట్టుకొని తహసీల్ ఎదుట బైండోవర్ చేస్తున్నారు. ఇటీవల చీమన్పల్లి, తాటిపల్లి గ్రామాలకు చెందిన ముగ్గురిని తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేశారు. -
ఆటో చోరీ కేసులో నిందితుడి అరెస్టు
నిజామాబాద్అర్బన్: జల్సాలకు అలవాటుపడి ఆటో చోరీ చేసిన నిందితుడిని అరెస్టు చేసినట్లు నార్త్రూరల్ సీఐ శ్రీనివాస్ తెలిపారు. ఈనెల 13న న్యాల్కల్ రోడ్డులో నివాసం ఉండే పండ్ల వ్యాపారి నర్సింలు తన ఆటో చోరీకి గురైనట్లు 5వ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. నగరంలోని నెహ్రూనగర్కు చెందిన షేక్నయీమ్ జల్సాలకు అలవాటుపడి మద్యం కోసం డబ్బులు లేకపోవడంతో చిల్లర దొంగతనాలకు అలవాటు పడ్డాడు. అందులో భాగంగానే నర్సింలు ఆటోను దొంగిలించినట్లు సీఐ తెలిపారు. ఆటోను మహారాష్ట్రలో విక్రయించేందుకు తీసుకెళ్తుండగా అర్సపల్లిలో పట్టుకున్నట్లు పేర్కొన్నారు. నిందితుడిని అరెస్టు చేసినట్లు తెలిపారు. కేసును ఐదో టౌన్ ఎస్సై గంగా ధర్, సిబ్బంది త్వరగా ఛేదించినట్లు సీఐ తెలిపారు. ఎల్లారెడ్డిరూరల్: ఎల్లారెడ్డి పట్టణంలోని సూర్య విహార్ కాలనీలో నాలుగు ఆవులు చోరీకి గురైనట్లు బాధితులు ఆదివారం తెలిపారు. పట్టణంలోని సూర్యవిహార్లో పశువుల పాకలో కట్టి ఉంచిన నాలుగు ఆవులను దుండగులు చోరీకి పాల్పడినట్లు పేర్కొన్నారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితులు తెలిపారు. -
ఇందూరు తిరుమల బ్రహ్మోత్సవాలు సంపూర్ణం
నిజామాబాద్ రూరల్: మోపాల్ మండలంలోని నర్సింగ్పల్లిలో ఉన్న ఇందూరు తిరుమలలో కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు ఆదివారం ముగిశాయి. బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజు అయిన ఆదివారం ఆలంయలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మహా పూర్ణాహుతి నిర్వహించి అనంతరం స్వామి వారి రథోత్సవం వైభవంగా చేపట్టారు. ఆలయ మాడవీధుల్లో భక్తులు రథాన్ని లాగగా, వేలాది మంది కదిలివచ్చారు. గోవింద నామస్మరణతో మాడవీధులు పులకించిపోయాయి. దిల్రాజు సోదరుడు శిరీష్రెడ్డి నరసింహారెడ్డి, విజయసింహారెడ్డి స్వామి వారి రథాన్ని లాగుతు ముందుకు నడిచారు. నర్సింగ్పల్లి గ్రామ మహిళలు హారతులు పట్టుకొని స్వామి వారికి స్వాగతం పలుకుతూ దారి వెంట నృత్యాలు చేసుకుంటూ నడిచారు. రథోత్సవం అనంతరం స్వామి వారికి చక్రస్నానం కార్యక్రమాన్ని చేపట్టారు. ఆలయ పుష్కరిణిలో స్వామి వారికి చక్ర స్నాన కార్యక్రమాన్ని దేవనాథ జియర్ స్వామి వారు, యాజ్ఞాచార్యులు, వేద పండితులు, అర్చకులు నిర్వహించారు. పుష్కర బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు ఉదయం యాగశాలలో మహా పూర్ణాహుతి నిర్వహించారు. మహా పూర్ణాహుతి అనంతరం త్రిదండి దేవనాథ జియర్ స్వామి భక్తులను ఉద్దేశించి ప్రవచనాలు చేశారు. భగవంతునిపై ప్రేమతో సేవలు చేస్తున్న ఇందూరు తిరుమల ఇలలో వైకుంఠంగా మారడం ఖాయమని వారు అన్నారు. మనుషులు సదా భగవంతునికి కృతజ్ఞతాపూర్వకంగా ఉండాలని అన్నారు. భగవంతుడు లోక కార్యం మనుషుల ద్వారా చేస్తారని, భగవంతుడి కృష వల్లనే మనిషి గొప్పగా ఎదుగుతాడని అన్నారు. భగవంతుడు మనల్ని ఎంచుకునేందుకు అర్హత సాధించాలని, మనిషి లోపల భూత దయ, ప్రకృతిపై ప్రేమ, దేశ భక్తి ఉండాలన్నారు. కలియుగంలో హరి నామమే మోక్ష మార్గం కావున ప్రతి క్షణం హరి నామం జపిస్తూ ఉండాలని అన్నారు. తాను మోక్ష మార్గాన్ని అనుసరిస్తు సాటి మనిషికి కూడా మోక్ష మార్గాన్ని చూపెట్టాలన్నారు. కార్యక్రమంలో ఆలయ ప్రధాన ధర్మకర్త నర్సింహా రెడ్డి దంపతులు, సుదర్శన్ రెడ్డి దంపతులు, ఎంపీటీసీ రాములు, ఫొటో గంగాధర్, ప్రవీణ్, పృథ్వి నారాయణ, నర్సారెడ్డి, నరాల సుధాకర్, రమేశ్ భాస్కర్, నరేందర్, రాజేశ్వర్, సాయిలు, గంగారెడ్డి, ప్రమోద్, భూంరెడ్డి, యాజ్ఞాచార్యులు, అనంత ఆచార్యులు, రోహిత్ కుమారాచార్యా విజయ్ స్వామి, అనిల్ స్వామి తదితరులు పాల్గొన్నారు. -
జోరందుకుంటున్న కూలర్ల విక్రయాలు
మద్నూర్(జుక్కల్): కాలాలు కూడా కొంతమందికి కడుపు నింపుతాయి. ఏడాదంతా చిన్నాచితకా పను లు చేసుకుంటున్న వారికి వేసవిలో చేతినిండా పను లు దొరుకుతాయి. వేసవి వచ్చిందంటే చాలు విద్యు త్ ఉపకరణాలు వాడని వారుండరు. పేద మధ్య త రగతుల ప్రజలు కుడా ఫ్యాన్లు, కూలర్లు కొనుగోలు చేస్తున్నారు. ఈ సీజన్లో విద్యుత్ ఉపకరణాల మరమ్మతులు పెరగడంతో రిపేర్లకు ఉపాధి దొరుకు తోంది.అలాగే అసెంబుల్డ్ కూలర్లు తయారు చేస్తుండటంతో మధ్య తరగతి ప్రజలు కూడా వేసవిలో చ ల్లబడటం కోసం కూలర్లు తీసుకుంటున్నారు. ఫ్యా న్లు, కూలర్లే కాదు.. ఏసీలు, ఫ్రిజ్ల బిగింపు లాంటి పనులతో వారికి చేతినిండా పనులు దొరుకుతున్నా యి. ఎండలు ముదురుతున్నాయి. ఉక్కపోత ఎక్కువైంది. వేడి నుంచి ఉపశమనం కోసం స్థాయిని బట్టి ఫ్యాన్లు, మధ్య తరగతి వారు కూలర్లు, ఉన్నతవర్గాల వారు ఏసీలు వినియోగిస్తున్నారు. మెకానిక్లు కూడా బిజీ అయిపోయారు. గ్రామాల నుంచి కూడా ఫ్యాన్లు, కూలర్లు మరమ్మతుల కోసం మండల కేంద్రానికి వస్తున్నారు. -
వేటాడుతున్న పెద్దపులి
డొంకేశ్వర్(ఆర్మూర్): నిజామాబాద్–సిరిసిల్ల– జగిత్యాల జిల్లాల అటవీ ప్రాంతాల్లో గత కొన్ని రోజులుగా చక్కర్లు కొడుతున్న పెద్దపులి తన వేట కొనసాగిస్తోంది. ఇటీవల జిల్లాలోని కమ్మర్పల్లి రేంజ్ పరిధిలో ఉన్న భీమ్గల్ మండలం దే వక్కపేట్ అడవుల్లో రెండు ఆవులను చంపిన పె ద్దపులి, తాజాగా జగిత్యాల జిల్లాలోకి ప్రవేశించి అక్కడ వేట మొదలు పెట్టింది. కొడి మ్యాల రేంజ్ దమ్మాయిపేట్ అటవీ ప్రాంతంలో ఓ రైతు కట్టేసి ఉంచిన ఆవుపై దాడి చేసి హత మార్చిన ఘటన ఆదివారం వెలుగుచూసింది. ఆవు మాంసాన్ని కొంత మేర ఆరగించి వెళ్లింది. సమాచా రం అందుకున్న అటవీ అధికారులు ఘ టనా స్థలాన్ని పరిశీలించారు. రోజుకు 20 కిలో మీట ర్లు సంచరిస్తున్న పులి మూడు జిల్లాలను హడలెత్తిస్తోంది. ఇదే పులి గత కొన్ని రోజుల క్రితం రా జన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లంతకుంట, తిప్పాపురం అడవుల్లో నాలుగు ఆవులను చంపేసింది. ఇప్పటి వరకు ఏడు ఆవులను హతమార్చింది. రోజుకో చోట వేటాడి మూడు జిల్లాల అటవీ అధికారులకు నిద్ర లే కుండా చేస్తోంది. అదృష్టవశాత్తు మనుషులపై ఎలాంటి దాడులు చేయ డం లేదు. పెద్దపులి వే ట నేపథ్యంలో రైతులను, పశువుల కాపర్లను, అడవులకు సమీప గ్రామాల ప్రజలను అటవీ అధికారులు అప్రమత్తం చేస్తూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఒకవేళ పులి మ నుషులపై దాడి చేసే పరిస్థితి ఉంటే ఉన్నతాధికారుల ఆదేశాలు తీసుకుని దానిని పట్టుకోవడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. జగిత్యాల వైపు వెళ్లి మరో ఆవును చంపిన టైగర్ మూడు జిల్లాల అటవీ సరిహద్దుల్లో హడల్ రోజుకు 20 కిలోమీటర్ల మేర సంచారం -
నిజామాబాద్
అకాల జల్లు.. రైతు గుండెగుబిల్లువాతావరణం ఉదయం ఈదురు గాలులు వీస్తాయి. ఆకాశం పాక్షికంగా మేఘావృతమవుతుంది. పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. రాత్రి ఉక్కపోతగా ఉంటుంది.బ్రహ్మోత్సవాలు సంపూర్ణం.. మోపాల్ మండలం నర్సింగ్పల్లిలోని ఇందూరు తిరుమల ఆలయ బ్రహ్మోత్సవాలు ఆదివారం ముగిశాయి. సోమవారం శ్రీ 16 శ్రీ మార్చి శ్రీ 2026– 8లో uజిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉన్నట్ట్టుండి ఆదివారం వాతావరణం మారిపోయింది. సాయంత్రం వేళం ఆకాశం మేఘావృతమై ఎండ వేడి నుంచి ఉపశమనం లభించినప్పటికీ అక్కడక్కడా వర్షపు జల్లులు కురిశాయి. నిర్మల్, భైంసా ప్రాంతాలతోపాటు సరిహద్దులోని మహారాష్ట్రలో ఉన్న ధర్మాబాద్ ప్రాంతంలో ఈదురు గాలులతో వడగళ్ల వర్షం కురవగా.. ఆ ప్రభావం జిల్లాపై కొంత వరకు కనిపించింది. బోధన్, రెంజల్, నవీపేట్, నిజామాబాద్రూరల్, మాక్లూర్, నందిపేట్, డొంకేశ్వర్ మండలాల్లో ఉరుములు మెరుపులతో చినుకులు కురిశాయి. – డొంకేశ్వర్(ఆర్మూర్)అన్నదాతల్లో ఆందోళన అక్కడక్కడా కురిసిన తేలికపాటి వర్షపు జల్లులు రైతుల్లో తీవ్ర ఆందోళనను కలిగించాయి. ప్రస్తుతం జిల్లాలోని కొన్ని చోట్ల పసుపు కల్లాల్లోనే ఉంది. ఆరబోసిన పసుపు కొమ్ములు వర్షానికి తడకుండా కుప్పలు చేసి టార్పాలిన్లు కప్పారు. ఈదురు గాలుకు అవి లేచిపోకుండా బండరాళ్లు, చెట్ల మొద్దులను అడ్డుగా పెట్టారు. అలాగే మొక్కజొన్న పంట కోత దశలో ఉంది. ఇప్పటికే ఫిబ్రవరి నెలాఖరులో ఈదురు గాలుల వర్షానికి పలు ప్రాంతాల్లో సుమారు 200 ఎకరాల్లో మక్క నేలకొరిగి రైతులకు నష్టం జరిగింది. మళ్లీ ఇప్పుడు అకాల వర్షం కారణంగా మక్కకు మరింత నష్టం జరిగే అవకాశం ఉందని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. జొన్న పంటకు సైతం వర్షం ముప్పు పొంచి ఉంది. గింజలు మొలకెత్తే ప్రమాదం ఉందని కలవరపడుతున్నారు. మరో నాలుగైదు రోజులపాటు జిల్లాకు వర్ష సూచన ఉన్న నేపథ్యంలో కల్లాల్లో ఉన్న ధాన్యంపై టర్పాలిన్లు కప్పి ఉంచాలని రైతులకు వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. జిల్లాలోని పలుచోట్ల కురిసిన వర్షపు చినుకులు మారిన వాతావరణం.. ఉరుములు, మెరుపులు -
భగీరథ ఆపరేటర్లకు అందని వేతనాలు
మోర్తాడ్(బాల్కొండ): మంచినీటిని సరఫరా చేయడంలో కీలకపాత్ర పోషిస్తున్న మిషన్ భగీరథ ఆపరేటర్లకు కాంట్రాక్టు కంపెనీ ఏడు నెలలుగా వేతనాలు చెల్లించడం లేదు. మూడు సంవత్సరాలుగా సరిగా వేతనాలు చెల్లించడం లేదని సదరు కంపెనీ తీరుపై ఆపరేటర్లు ఆగ్ర హం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి తమకు సకాలంలో బిల్లులు మంజూరు కావ డం లేదనే సాకు చూపుతున్న కాంట్రాక్టు కంపెనీలు ఆపరేటర్లకు వేతనాలు చెల్లించడం లేదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇదీ పరిస్థితి.. మిషన భగీరథ పంప్హౌస్లు, సంప్హౌస్లు ప్రభుత్వ పరిధిలోనే ఉన్నాయి. కేవలం నీటి సరఫరా, అజమాయిషీ చేసే బాధ్యతను గత ప్రభుత్వం కంపెనీలకు కాంట్రాక్టు ఇచ్చింది. కాంట్రాక్టు పొందిన కంపెనీలు ఆపరేటర్లు, సూపర్వైజర్లను నియమించుకుని వారి ద్వారా ఇంటింటికి రోజూ నీరు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఉమ్మడి జిల్లాలో 600 మంది వరకు పని చేస్తున్నారు. ఆపరేటర్లకు సీనియారిటీని బట్టి రూ.8వేల నుంచి రూ.10వేల వరకు, సూపర్వైజర్లకు రూ.12వేల చొప్పున వేతనం చెల్లిస్తున్నారు. పీఎఫ్ను కూడా జమ చేయాల్సి ఉంది. పీఎఫ్ను జమ చేస్తున్నా వేతనాల విషయంలో మాత్రం మొదటి నుంచి నిర్లక్ష్యమే జరుగుతోంది. నిబంధనల ప్రకారం ప్రభుత్వం నుంచి వచ్చే బిల్లులతో సంబంధం లేకుండానే కంపెనీలు తమతో ఒప్పందం చేసుకున్న ఆపరేటర్లకు ప్రతినెలా వేతనాలను వారి ఖాతాల్లో జమ చేయాలి. కానీ ఏడు నెలలుగా వేతనాలు ఇవ్వకపోవడంతో రెండు రోజుల కింద ఆపరేటర్లు ఆందోళన బాట పట్టారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి మిషన్ భగీరథ సిబ్బందికి న్యాయం జరిగేలా చూడాలని పలువురు కోరుతున్నారు. ఏడు నెలలుగా పెండింగ్.. బిల్లులు రావడం లేదనే సాకుతో జీతాలివ్వని కాంట్రాక్టు కంపెనీ చెల్లింపుల్లో మొదటి నుంచి నిర్లక్ష్యమే.. -
అన్ని రంగాల్లో నియోజకవర్గ అభివృద్ధికి కృషి
● బాన్సువాడ సెగ్మెంట్కు 150 ఫంక్షన్హాల్స్ మంజూరు ● ఎమ్మెల్యే, ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాస్రెడ్డి రుద్రూర్/వర్ని: నియోజకవర్గంలో కనీస వసతుల కల్పన, విద్య, వైద్య సేవలతోపాటు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించేందుకు కృషి చేస్తున్నామని ప్రభుత్వ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. పేదలు తక్కువ వ్యయంతో శుభకార్యాలు నిర్వహించుకునేలా బాన్సువాడ నియోజకవర్గంలో 150 ఫంక్షన్ హాళ్లు మంజూరు చేశామన్నారు. రుద్రూర్ మండలం అక్బర్నగర్లో రూ.20 లక్షల వ్యయంతో నిర్మించనున్న జనరల్ ఫంక్షన్హాల్ నిర్మాణ పనులకు ఆదివారం ఆయన భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ.. బాన్సువాడ నియోజకవర్గంలో ఇప్పటివరకు 14,500 ఇళ్లను మంజూరు చేసినట్లు తెలిపారు. దేశంలోనే ఒకే నియోజకవర్గానికి ఇంతపెద్ద సంఖ్యలో ఇళ్లు మంజూరు కావడం అరుదని అన్నారు. అనంతరం వర్ని మండలం శ్రీనగర్లో అంగన్వాడి భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. తహసీల్దార్ తారాబాయి, సర్పంచులు సీతారామరాజు (రాంబాబు), పూర్ణిమ కిరణ్, మార్కెట్ కమిటీ చైర్మన్ సురేశ్బాబా, నాయకులు బుజ్జన్న, నరోజి గంగారాం, తోట అరుణ్ కుమార్, పట్టెపు రాములు, అనిల్ పటేల్, మారుతిగౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
మళ్లీ ఖాళీ!
జీపీ ఖాతా డొంకేశ్వర్ మండలం అన్నారం గ్రామ పంచాయతీ డొంకేశ్వర్ మండలంలోని జీపీలకు ఇటీవల 15వ ఆర్థిక సంఘం నిధులు మంజూరయ్యాయి. దత్తాపూర్, కోమట్పల్లి, మారంపల్లి, గాదేపల్లి, గంగాసముందర్, జీజీ నడ్కుడ గ్రామ పంచాయతీలు ట్రాక్టర్ ఈఎంఐలను పెండింగ్లో ఉంచడంతో బ్యాంకర్లు ఆ జీపీల ఖాతాలను ఫ్రీజ్ చేశారు. ట్రాక్టర్ కిస్తీలను ఒకేసారి చెల్లిస్తేనే ఖాతాలను మళ్లీ ప్రారంభిస్తామని తేల్చి చెప్పారు. సర్పంచులకు వేరే మార్గం లేకపోవడంతో సరే అన్నారు. వచ్చిన నిధుల్లో సగం ట్రాక్టర్ల ఈఎంఐలకు పోగా మిగిలిన వాటితో పాత బకాయిలు, జీపీ సిబ్బంది జీతాలు చెల్లించారు. దీంతో పంచాయతీ ఖాతాలు మళ్లీ ఖాళీ అయ్యాయని, కొత్త పనులు ఎలా చేపట్టాలని సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డొంకేశ్వర్(ఆర్మూర్): జిల్లాలో దాదాపు అన్ని గ్రామ పంచాయతీల బ్యాంకు ఖాతాలు ఖాళీగా ఉన్నాయి. రెండేళ్ల తర్వాత వచ్చిన 15వ ఆర్థిక సంఘం నిధులు రెండు రోజులు కూడా పంచాయతీ ఖాతాల్లో నిలువలేదు. మూడు విడతల్లో వచ్చిన నిధులు చేతికి అందకముందే పాత బకాయిల రూపంలో ఖర్చయిపోవడంతో పంచాయతీ ఖాతాలు మళ్లీ ఖాళీ అయ్యాయి. గ్రామాల్లో చెత్త సేకరణకు కొనుగోలు చేసిన ట్రాక్టర్ల నెలవారీ వాయిదాలు పెండింగ్లో ఉండడంతో బ్యాంకర్లు జమ చేసుకున్నారు. అలాగే గత ప్రభుత్వ హయాంలో సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులు చేసిన వివిధ పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లులను ఇందులో నుంచే చెల్లించారు. కాగా, జీపీ కార్మికులకు పెండింగ్లో ఉన్న వేతనాలు సైతం ఇవే నిధుల నుంచి ఖర్చు చేశారు. ప్రస్తుతం వీధి దీపాల నిర్వహణ, తాగునీటి సరఫరా, మోటార్ల కరెంట్ బిల్లు, రిపేర్లు, కొత్త పనుల కోసం నిధులు లేకపోవడంతో సర్పంచులు తలలు పట్టుకుంటున్నారు. వచ్చిన నిధులు వచ్చినట్లుగా పాత బకాయిలకే పోవడంతో చిన్న గ్రామ పంచాయతీల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. మళ్లీ నిధులు వచ్చే వరకు పంచాయతీలను ఎలా నడుపాలో సర్పంచులకు పాలుపోవడం లేదు. కార్యదర్శులకు కూడా పాత బిల్లులు అందక ఇబ్బందులు పడుతున్నారు. అయితే, ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వమే జీపీలకు మూడు సార్లు నిధులివ్వగా రాష్ట్ర ప్రభుత్వం ఒక్కసారి కూడా ఇవ్వలేదు. అప్పులకే సరిపోయిన 15వ ఆర్థిక సంఘం నిధులు ట్రాక్టర్ కిస్తీలు, పాత బకాయిలకు సర్దుబాటు నిధులు లేవని కొత్త సర్పంచుల ఆవేదన -
గంగుల నర్సయ్య వర్ధంతి
నిజామాబాద్ రూరల్: జిల్లా కేంద్రంలోని మాధవన్నగర్లో సీపీఐఎంఎల్ రాష్ట్ర నాయకుడు గంగుల నర్సయ్య రెండవ వర్ధంతిని ఏఐకేఎంకేఎస్ నాయకులు శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో తెలంగాణ రైతు కూలీ సంఘం రాష్ట్ర కోశాధికారి బామండ్ల రవీందర్, బిందు, మానస, పల్లె మల్లేశ్, కత్తుల మారుతి, సత్యనారాయణ, గారబోయిన శంకర్, కొండ అనూషవ్వ, రజియా, పల్ల దుర్గయ్య, యాది మల్లన్న, భిక్షపతి, లక్ష్మణ్, అనిత, రుక్కవ్వ, మంజుల, సిద్ధవ్వ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ రూరల్: నగరంలోని నాందేవాడలో ఉన్న రివల్యూషనరీ సోషలిస్టు పార్టీ కార్యాలయంలో ప్రపంచ ప్రఖ్యాత తత్వవేత్త, కార్మిక వర్గ విమోచన కోసం పోరాడిన మహనీయుడు కార్ల్ మార్క్స్ వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆర్ఎస్పీ జిల్లా కన్వీనర్ కటారి రాములు మాట్లాడుతూ.. కార్ల్ మార్క్స్ సమాజంలో ఉన్న దోపిడీ వ్యవస్థలను శాసీ్త్రయంగా విశ్లేషించి కార్మికులు, రైతులు సమాన హక్కులతో జీవించే సమాజం కోసం మార్గదర్శక ఆలోచనలు అందించిన మహనీయుడని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు పిట్ల నరేశ్, గోపాల్ సింగ్, ఠాగూర్, సునీల్, కార్యకర్తలు పాల్గొన్నారు. సిరికొండ: మండలంలోని న్యావనంది గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ చంద్రకాంత్ సత్తెమ్మ కుటుంబ సభ్యులను బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి బాజిరెడ్డి జగన్ శనివారం పరామర్శించారు. మాజీ ఎంపీటీసీ ఇటీవల మృతి చెందారు. ఆమె మృతిపై జగన్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన వెంట పార్టీ మండల అధ్యక్షుడు నారవోయిన శ్రీనివాస్, పోత్నూర్ సర్పంచ్ మహిపాల్, సొసైటీ మాజీ చైర్మన్ గంగారెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ తోట రాజన్న, భూషణ్రెడ్డి, గడ్డల సురేందర్, అన్సర్, రమేశ్రెడ్డి, దాసు, తిర్మల్, గంగారెడ్డి, బొబ్బిలి రాజు, మోహన్రెడ్డి, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. జక్రాన్పల్లి: మండలంలోని గన్యతండాలో బీఆర్ఎస్ కార్యకర్త అడవిరాజ్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో బాధిత కుటుంబాన్ని ధర్పల్లి మాజీ జడ్పీటీసీ సభ్యుడు, బీఆర్ఎస్ పార్టీ జిల్లా యువజన నాయకుడు బాజిరెడ్డి జగన్ శనివారం పరామర్శించారు. బాధిత కుటుంబానికి పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందన్నారు. ఆయన వెంట సికింద్రాపూర్ సర్పంచ్ అప్పాల అరుణ్ కుమార్, బీఆర్ఎస్ నాయకులు దీకొండ శ్రీనివాస్, తలారి సతీశ్, కుంచాల రాజు, చింత మహేశ్, ప్రశాంత్, రమణారెడ్డి తదితరులు ఉన్నారు. -
మహిళా సమానత్వాన్ని గుర్తించిన ఐక్యరాజ్యసమితి
ఖలీల్వాడి: ప్రపంచ నీటి దినోత్సవాన్ని ఈ ఏడాది మహిళల సమానత్వ హక్కులకు సూచికగా ఐక్యరాజ్యసమితి గుర్తించిందని గిరిజన సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ సైదా జైనబ్ అన్నారు. శనివారం నగరంలోని నాగారంలో ఉన్న కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు. ప్రపంచ నీటి దినోత్సవ వారోత్సవ గోడ ప్రతులను ఆవిష్కరించారు. విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి ఈనెల 22న నిర్వహించే ప్రపంచ నీటి దినోత్సవ ప్రాముఖ్యతను వివరించారు. ఐక్యరాజ్యసమితి ఈ దినోత్సవాన్ని ఈ ఏడాది మహిళల సమానత్వ హక్కులకు అంకితం చేసిందని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో మహిళా కళాశాల తరఫున వృక్షశాస్త్రం విభాగాధిపతి మౌనిక ఆధ్వర్యంలో ఈనెల 22 వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రపంచం నీటి కొరతను ఎదుర్కొంటుందని, దీనిని అధిగమించే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ సుధా సింధు, అధ్యాపకులు మౌనిక, దీపిక, హీన, ప్రత్యూష, నవత, జాగృతి, సుమాంజలి పాల్గొన్నారు. -
నూతన జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయొద్దు
● రాష్ట్ర ప్రభుత్వం హామీలను అమలు చేయాలి● ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు రజినీకాంత్తెయూ(డిచ్పల్లి): తెలంగాణ రాష్ట్రంలో నూతన జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయొద్దని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు శనిగరపు రజినీకాంత్ డిమాండ్ చేశారు. శనివారం తెలంగాణ యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాలలో ఎస్ఎఫ్ఐ 7వ మహాసభ నిర్వహించారు. ముందుగా ఇటీవల మరణించిన విద్యార్థి నాయకులకు నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. యూనివర్సిటీలకు పెద్దపీట వేస్తానని రాష్ట్ర ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చినా ఇప్పటికీ ఒక్కటి కూడా అమలు కాలేదని విమర్శించారు. తెయూకు తక్కువ నిధులు కేటాయించడం దారుణమన్నారు. వర్సిటీలో అనేక సమస్యలు నెలకొన్నాయన్నారు. తెయూ ఎస్ఎఫ్ఐ నూతన కమిటీ ఎన్నిక తెలంగాణ యూనివర్సిటీ ఎస్ఎఫ్ఐ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వర్సిటీ నూతన అధ్యక్షుడిగా వినీత్, కార్యదర్శిగా చక్రి, ఆఫీస్ బేరర్స్గా ఆదిత్య, నిరంజన్, బాలమణి, కారుణ్య, వంశీ, కమిటీ సభ్యులుగా నాగేంద్ర, మోక్షిత్, సరిత ను ఎన్నుకున్నట్లు రాష్ట్ర అధ్యక్షుడు శనిగరపు రజినీకాంత్ తెలిపారు. కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా కార్యదర్శి రాచకొండ విఘ్నేశ్, జిల్లా అధ్యక్షురాలు దీపిక, వర్సిటీ ఎస్ఎఫ్ఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
కూలీలపై ప్రభుత్వాల చిన్నచూపు
సిరికొండ: వ్యవసాయ కూలీలు, కార్మికులు అంటేనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చిన్నచూపు అని అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిట్ల రామకృష్ణ అన్నారు. మండలంలోని గడ్కోల్ గ్రామంలో సంఘం రాష్ట్ర మహాసభల వాల్ పోస్టర్లను ఆయన శనివారం ఆవిష్కరించారు. మహాసభలను కామారెడ్డిలో ఈ నెల 24, 25న నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. మహాసభలకు అన్ని వర్గాల ప్రజలు తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. వ్యవసాయ కార్మికుల ఉద్యమ బలోపేతం కోసం రాష్ట్ర మహాసభలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వికసిత్ భారత్ అన్ని చెబుతున్న ప్రధాని కూలీల కోసం ఒక్క పథకం అమలు చేయడం లేదని విమర్శించారు. కూలీల కోసం ఉన్న ఉపాధి హామీ పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసే కుట్రలకు తెర లేపిందని వాపోయారు. మహాసభలకు ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, సీపీఐఎంఎల్ మాస్లైన్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు, నిజామాబాద్ రూరల్, కామారెడ్డి సంయుక్త జిల్లా కార్యదర్శి ప్రభాకర్ తదితరులు రాన్నునట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు దామోదర్, లింబాద్రి, గంగాధర్, కిరణ్, రాములు, రాజు, రఫీక్, మహబూబ్ తదితరులు పాల్గొన్నారు. -
ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలి
నిజామాబాద్ రూరల్: పీఆర్సీ అమలు, ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తపస్ ఇందూరు శాఖ సభ్యులు జిల్లా కేంద్రంలో రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డికి శనివారం వినతిపత్రం అందజేశారు. ఎమ్మెల్యేతో పలు అంశాల గురించి వివరించారు. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో వీటి పై ప్రస్తావించాలని కోరారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తపస్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నల్ల కిషన్రెడ్డి, మధుసూదన చారి, రాష్ట్ర సహాయ అధ్యక్షుడు రామకృష్ణ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి బద్రినాథ్, కార్యవర్గ సభ్యులు తదితరులు ఉన్నారు. -
అన్నివర్గాల సంక్షేమమే ధ్యేయం
● ప్రభుత్వ సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి ● జాన్కంపేటలో ముస్లింలకు రంజాన్ తోఫాల పంపిణీ బోధన్: అన్నివర్గాల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యే యమని ప్రభుత్వ సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి అన్నారు. శనివారం ఎడపల్లి మండలంలోని జాన్కంపేటలో ఉన్న ఓ ఫంక్షన్ హాల్లో రాష్ట్ర ప్రభుత్వం అందించిన రంజాన్ తో ఫాలను ముస్లింలకు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అథితిగా హాజరైన ఎమ్మెల్యే తో ఫాలను పంపిణీ చేసి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభు త్వం ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీ హామీల్లో భాగంగా అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు, రేషన్కార్డులు మంజూరు చేస్తోందన్నారు. రేషన్ దుకాణా ల ద్వారా పేదలకు సన్నబియ్యం పంపిణీ చేస్తోందని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రత్యేక కృషి చేస్తోందని అన్నారు. పవిత్ర రంజాన్ పండుగను ఆనందంతో జరుపుకోవాలని ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమి చైర్మన్ తాహెర్బిన్ హందాన్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, గ్రామ సర్పంచ్ అనురాధ రాధకిషన్ గౌడ్, ఉపసర్పంచ్ నీలం కృష్ణ, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పులి శ్రీనివాస్, నాయకులు అశ్వక్, జహిరొద్దీన్, ఏసీపీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ స్థలాల కబ్జాలపై దృష్టి సారించాలి నవీపేట: ప్రభుత్వ స్థలాల కబ్జాలపై అధికారులు దృష్టి సారించాలని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్రెడ్డి అన్నారు. నవీపేట మండల కేంద్రంలోని ఆర్ఆర్ గార్డెన్లో ముస్లింలకు రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. కబ్జాదారులపై రెవెన్యూ, జీపీ, పోలీసులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ స్థలాలు కబ్జాలకు గురైతే రాబోయే రోజుల్లో ప్రభుత్వ భవనాల నిర్మాణాలు కష్టమవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా బోరుబావులు తవ్వుతున్నారని, అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్, రాష్ట్ర సహకార యూనియన్ చైర్మన్ మానాల మోహన్రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, నాయకులు శ్రీనివాస్గౌడ్, రాజేందర్గౌడ్, గోవర్ధన్రెడ్డి, సాయిరెడ్డి, సంజీవ్రెడ్డి, భగవాన్ తదితరులు పాల్గొన్నారు. -
పశువులకు గాలికుంటు నివారణ టీకాలు
జక్రాన్పల్లి: మండలంలోని కేశ్పల్లి గ్రామంలో మండల పశువైద్య శాఖ ఆధ్వర్యంలో గేదెలకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేశారు. గ్రామంలోని 250 గేదెలకు గాలికుంటు వ్యాఽధి నివారణ టీకాలు వేశారు. కార్యక్రమంలో సర్పంచ్ పూదరి మమత, మండల పశువైద్యాధికారిణి అశ్రితరెడ్డి, గోపాల మిత్ర పోశెట్టి తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ రూరల్: నగరంలోని కసాబ్గల్లిలో నివాసం ఉండే చాకలి స్రవంతికి శ్రీలక్ష్మీ చేయూత సేవా సమితి సభ్యులు శనివారం రూ.11 వేలు ఆర్థికసాయాన్ని శనివారం అందజేశారు. పేద కుటుంబం కావడంతో స్రవంతి వివాహానికి ఈ నగదు అందించినట్లు సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో అధ్యక్షుడు బంగారి శ్రీనివాస్, లక్ష్మణ్, శ్రీనివాస్, యాదగిరి, రవీందర్, పవన్కుమార్, సతీశ్, సురేశ్, గంగాధర్ పాల్గొన్నారు. -
నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలి
నిజామాబాద్ రూరల్: కార్మికుల వ్యతిరేక లేబర్ కోడ్లను కేంద్రం వెంటనే రద్దు చేయాలని ఐఎఫ్టీయూ నాయకులు డిమాండ్ చేశారు. ఈ నెల 16న కలెక్టరేట్, 23న హైదరాబాద్ లేబర్ కమిషనరేట్ఎదుట నిర్వహించే ధర్నాల పోస్టర్లను శ్రద్ధానంద్గంజ్లో నాయకులు శనివారం ఆవిష్కరించారు. ఏప్రిల్ ఒకటి నుంచి కార్మికుల వ్యతిరేక లేబర్ కోడ్లను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోందని దానిని వెంటనే రద్దు చేయాలని కోరారు. నాయకులు మేసినేని రాజు, మతిన్, శ్రీనివాస్, ఇమ్రాన్, జగన్, రసూల్, ధర్మయ్య తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ రూరల్: నగరంలోని ఖిల్లా రఘునాథ ఆలయానికి రూ. 50లక్షల నిధులు మంజూరు కావడంపై ఆలయ కమిటీ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. శనివారం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిధుల మంజూరుకు కృషి చేసిన పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్గౌడ్కు ఆలయ కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఆలయం చైర్మన్ చెరువుపల్లి గురు ప్రసాద్, గౌరవ చైర్మన్ ముక్క దేవేందర్ గుప్తా, ప్రధాన కార్యదర్శి మదగాని మారయ్య గౌడ్, కోశాధికారి పెండ్యాల శ్రీనివాస్, ఉపచైర్మన్, మాజీ కార్పొరేటర్ డీ రాజేంద్రప్రసాద్, తాటి వీరేశం తదితరులు ఉన్నారు. సిరికొండ: మండలంలోని కొండూర్ గ్రామంలో హనుమాన్ మాలధారణ కమిటీ ఆధ్వర్యంలో హనుమాన్ రామాంజనేయ స్వామి మెట్ల పూజను శనివారం వైభవంగా నిర్వహించారు. అరటి ఆకులు, మామిడి తోరణాలతో అందంగా అలంకరించిన మండపంలో దేవేరుల చిత్ర పటాలకు ప్రత్యేక పూజలు చేశారు. ఉత్సవ మూర్తులకు వివిధ రకాల అభిషేకాలు నిర్వహించారు. గ్రామంలోని యువకులు, పెద్దలు, చిన్నారులు పూజలో పాల్గొన్నారు. పూజలో పాల్గొన్న సర్పంచ్ నర్మల లతభాస్కర్రెడ్డిని హనుమాన్ మాలధారులు శాలువాతో సన్మానించారు. -
తొలి రోజు పది పరీక్షలు ప్రశాంతం
● విద్యార్థులను తనిఖీ చేసిన అధికారులు ● పరీక్ష కేంద్రాల వద్ద పోలీసుల బందోబస్తునిజామాబాద్ రూరల్/ జక్రాన్పల్లి/ డిచ్పల్లి/ సిరికిండ: నిజామాబాద్ అర్బన్, రూరల్ నియోజకవర్గాల్లో శనివారం పదో తరగతి వార్షిక పరీక్షలు తొలి రోజు ప్రశాంతంగా జరిగాయి. పరీక్ష కేంద్రాలు విద్యార్థులతో సందడిగా మారాయి. పరీక్ష కేంద్రాల వద్ద ఉపాధ్యాయులు, అధికారులు విద్యార్థులను తనిఖీ చేసి లోనికి పంపించారు. పలు మండలాల్లోని పరీక్ష కేంద్రాలను స్థానిక అధికారులు తనిఖీ చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. రూరల్ మండల పరిధిలోని గుండారం, మూబారక్నగర్, వాసవి హైస్కూల్, ఎస్కే డీజీ, ఆర్బీవీఆర్ఆర్, విజయ్ పబ్లిక్ స్కూల్, బ్లూమింగ్ బడ్స్ హైస్కూల్లో పదో తరగతి పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఎంఈవో సేవ్లా తెలిపారు. రూరల్ పరిధిలో 1772 మందికి 1769 మంది హాజరు కాగా ముగ్గురు విద్యార్థులు గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. మోపాల్ మండలంలోని బోర్గాం(పి), న్యాల్కల్, కంజర్, మోపాల్, ముదక్పల్లి గ్రామాల్లో పదో తరగతి పరీక్ష కేంద్రాల్లో పదో తరగతి పరీక్షలు నిర్వహించినట్లు ఎంఈవో సాయిలు తెలిపారు. 1550 మందికి గాను ముగ్గురు విద్యార్థులు గైర్హాజరయ్యారని ఎంఈవో పేర్కొన్నారు. జక్రాన్పల్లి మండలంలోని అర్గుల్, జక్రాన్పల్లి, పడకల్, తొర్లికొండ జెడ్పీ ఉన్నత పాఠశాలల్లో పదో తరగతి పరీక్షలు జరిగాయి. డిచ్పల్లి మండలంలో ఏర్పాటు చేసిన 8 పరీక్షా కేంద్రాల్లో పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. మండలంలో మొత్తం 1427 మందికి 1426 మంది హాజరు కాగా జెడ్పీహెచ్ఎస్ మెంట్రాజ్పల్లి పరీక్షా కేంద్రంలో ఒక విద్యార్థి గైర్హాజరైనట్లు ఎంఈవో నరేశ్ తెలిపారు. సిరికొండ మండలంలోని నాలుగు పరీక్షా కేంద్రాల్లో 696 మందికి సిరికొండ ప్రభుత్వ ఆదర్శ పాఠశాల కేంద్రంలో ఒక విద్యార్థిని గైర్హాజరైనట్లు ఎంఈవో పుసాల రాములు తెలిపారు. సిరికొండలో పరీక్ష కేంద్రంలోకి వెళ్తున్న విద్యార్థులు పడకల్లో పరీక్ష కేంద్రంలో విద్యార్థులను తనిఖీ చేస్తున్న ఉపాధ్యాయులు -
కొనసాగుతున్న ‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక’
ధర్పల్లి: గ్రామపంచాయతీల్లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ధర్ప ల్లి మండల కేంద్రంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శనివారం వీధి కుక్కల కు కుటుంబ నియంత్రణ (ఏబీసీ) వ్యాక్సినేషన్లను వెటర్నరీ సిబ్బంది వేశారు. ఈ ప్రక్రియను ఎంపీడీవో లక్ష్మారెడ్డి పర్యవేక్షించారు. అనంతరం ధర్పల్లిలోని నర్సరీని పరిశీలించారు. వేసవికాలం నేపథ్యంలో మొక్కల సంరక్షణకు ప్రత్యేక దృష్టి సారించాలని సిబ్బందికి సూచించారు. ఎండ తీవ్రత పెరుగుతున్నందున మొక్కలకు క్రమం తప్పకుండా నీటిని అందించాలన్నారు. జీపీ కార్యదర్శి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. ధర్పల్లి: మండలంలోని దుబ్బాక గ్రామంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సర్పంచ్ సరోజినీ దేవి, ఉప సర్పంచ్ శేఖర్ రెడ్డి ఉపాధి హామీ పనులను పరిశీలించారు. ఉపాధి హామీ కూలీలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కూలీలకు పని ప్రదేశాల్లో తాగునీరు, నీడ కోసం టెంట్లు, ప్రథమ చికిత్స కిట్లు వంటి కనీస సౌకర్యాలు కల్పించాలని ఉపాధి హామీ సిబ్బందికి సూచించారు. అనంతరం గ్రామంలోని నర్సరీని పరిశీలించి మొక్కలు ఎండిపోకుండా నీటిని అందించాలన్నారు. జీపీ కార్యదర్శి సాయికుమార్, వార్డు సభ్యులు ఉన్నారు. జక్రాన్పల్లి: మండలంలోని పడకల్ గ్రామంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వాటర్ ట్యాంకులను శుభ్రం చేశారు. గ్రామంలో ఉన్న నర్సరీని పరిశీలించారు. నర్సరీలో మొక్కలకు ఎండ తగలకుండా నెట్ను ఏర్పాటు చేశారు. అనుకున్న లక్ష్యం మేరకు మొక్కలను పెంచడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని ఫీల్డ్ అసిస్టెంట్కు సూచించారు. సర్పంచ్ లోక స్వప్న, ఉపసర్పంచ్ పురుషో త్తంరెడ్డి, జీపీ కార్యదర్శి రాకేశ్ తదితరులు పాల్గొన్నారు. డిచ్పల్లి: ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజు ల కార్యక్రమంలో భాగంగా డిచ్పల్లి మండల కేంద్రంలోని కేజీబీవీలో ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్యం కేంద్రం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. బాలికలకు రక్తపరీక్షలు, ఒత్తిడి నిర్వహణ, టోల్ ఫ్రీ నంబర్ 14416, సీపీఆర్పై శిక్షణ, హెచ్పీ వీ వ్యాక్సినేషన్, డైట్ న్యూట్రిషన్, థైరాయిడ్ పై అ వగాహన తదితర కార్యక్రమాలను నిర్వహించారు. పీడియాట్రీషియన్ సందీప్ మాట్లాడుతూ.. బాలికలు గుడ్ టచ్, బ్యాడ్ టచ్పై అవగాహన కలిగి ఉండాలన్నారు. పరీక్షలంటే భయాన్ని వీడి ఒత్తిడి లే కుండా సరైన సమాధానాలు రాసి మంచి మార్కు లు సాధించాలన్నారు. కార్యక్రమంలో కేజీబీవీ స్పె షల్ ఆఫీసర్ జీ సవిత, ఆర్బీఎస్కే వైద్యులు శివప్రసాద్, తహిమినా ఫాతిమా, వెంకటేశ్వర్లు, ఫార్మాసి స్టు మౌనిక, ఏఎన్ఎం సుమలత, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.దుబ్బాకలో మాట్లాడుతున్న సర్పంచ్, ఉపసర్పంచ్ ధర్పల్లిలో కుక్కలకు వ్యాక్సిన్ వేస్తున్న సిబ్బంది -
గర్భిణితో నర్సు దురుసు ప్రవర్తన
లింగంపేట(ఎల్లారెడ్డి): వైద్యం కోసం వచ్చిన గ ర్భిణితో ఓ నర్సు దురుసుగా ప్రవర్తించిన ఘట న లింగంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చోటు చేసుకుంది. వివరాలు ఇ లా.. లింగంపేట మండ లం నల్లమడుగు గ్రామానికి చెందిన పూజిత తొ మ్మిది నెలల గర్భిణీ. లింగంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి శనివారం వచ్చి, డ్యూటీలో ఉన్న నర్సు ప్రతిభరాణి వద్దకు వెళ్లి మూడో డోసు ఇంజక్షన్తోపాటు వైద్య పరీక్షలు చేయమని అడిగింది. దాంతో ఆమె ‘ఇంజక్షన్ లేదు ఏమిలేదు పో’ డాక్టరమ్మ లేదు అంటూ దురుసుగా మాట్లాడింది. వైద్యం చేయము ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకోపో అంటూ తేల్చి చెప్పడంతో గర్భిణీ గర్భిణీ పీహెచ్సీ ఆరుబయట నిరసన తెలుపుతూ కూర్చుంది. ఈ విషయమై పీహెచ్సీ వైద్యురాలు హిమబిందును వివరణ కోర గా.. పూజిత మూడో డోసు ఇంజక్షన్ కోసం ఆస్ప త్రికి వచ్చిన విషయం వాస్తవమే అన్నారు. డాక్టర్ సమక్షంలోనే ఇంజక్షన్ ఇస్తారు. దీంతో నర్సు ఇంజక్షన్ ఇవ్వడానికి నిరాకరించింది.డాక్టర్ వచ్చిన తర్వాత పీహెచ్సీకి పూజిత వచ్చి వైద్యం పొందినట్లు తెలిపారు. నర్సు దురుసుగా మాట్లాడడం సరికాదని, సమస్యను పరిష్కరిస్తామని అన్నారు. -
శనగ కొనుగోళ్లకు కసరత్తు
● జిల్లాలో 12 వేల ఎకరాలకు పైగా విస్తీర్ణంలో సాగైన శనగ ● ఏడు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్న మార్క్ఫెడ్ బోధన్రూరల్: జిల్లాలో శనగ కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు అధికార యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. వ్యవసాయ శాఖ అందించిన పంట సాగు వివరాలతో శనగను కొనుగోలు చేసేందుకు మార్కెఫెడ్ అధికారులు నాఫెడ్కు నివేదికలు అందించారు. ఎకరానికి 10 క్వింటాళ్లు కొనుగోలు చేసేందుకు అనుమతించాలని కోరగా నాఫెడ్ అనుమతులతో రైతుల నుంచి శనగను కొనుగోలు చేసేందుకు మార్క్ఫెడ్ అధికారులు కార్యాచరణ రూపొందిస్తున్నారు. జిల్లాలో మొత్తం ఏడు శనగ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. బోధన్ మండలంలోని కల్దుర్కి, మావంది కాలన్, రెంజల్ మండలం నీలా, సాలూర మండలంలో సాలూర, హున్సా, పొతంగల్ మండల కేంద్రం, వర్ని మండలం జాకోరాలో సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు. ఎకరానికి 7 నుంచి 9 క్వింటాళ్లు ఈ యాసంగి సీజన్లో జిలాల్లో సుమారు 12వేల ఎ కరాల్లో రైతులు శనగ పంటను సాగు చేశారు. అత్యధిక బోధన్ డివిజన్లోని రెంజల్, సాలూర, బోధన్, పొతంగల్ మండలాల్లో శనగ పండించారు. గతంతో పోలిస్తే ఈ సీజన్లో శనగ పంట దిగుబడులు బాగున్నాయని, ఎకరానికి 7 నుంచి 9 క్వింటాళ్ల దిగుబడి వచ్చిందని రైతులు చెబుతున్నారు. ఆలస్యంతో పలువురికి నష్టం పక్షం రోజుల క్రితమే జిల్లాలో శనగ కోతలు పూర్తవ్వగా కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో జాప్యం జ రగడంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. పొ లాలు, అత్యవసర పరిస్థితులు ఉన్న రైతులు దళారు లకు తక్కువ ధరకే పంటను అమ్ముకొని నష్టపోయారు.ప్రభుత్వ మద్దతు ధర రూ.5,875 ఉండగా, బహిరంగ మార్కెట్లో ప్రైవేటు వ్యాపారులు రూ. 5,100, రూ.5,200కే రైతుల నుంచి కొనుగోలు చే శారు. దీంతో రైతులు క్వింటాలుకు రూ.600 నుంచి రూ.800 వరకు నష్టపోయారు. 15 ఎకరాల్లో శనగ పంటను సాగు చేశాం. కోతలు పూర్తి చే సి శనగలను నిలువ చేసి పెట్టా ను. 20 రోజులైనా కొనుగోలు ప్రారంభం కాకపోవడంతో ఇ బ్బందులు పడుతున్నాం. అఽ దికారులు స్పందించి శనగ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి. – కుర్లె మొగులయ్య, కల్దుర్కిజిల్లాలో కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం. మొత్తం ఏడు కేంద్రాల ఏర్పాటుకు కార్యాచరణ సాగుతోంది. మరో మూడు రోజుల్లో ప్రారంభించి రైతుల నుంచి శనగలను కొనుగోలు చేస్తాం. రైతులు దళారులకు శనగలను విక్రయించకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి. – మహేశ్ కుమార్, మార్కెఫెడ్ జిల్లా మేనేజర్ -
ఎండవేడి.. భరించలేక
జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. మార్చి ప్రారంభంలోనే భానుడు తన ప్రతాపం చూపుతున్నాడు. దీంతో ప్రజలు అల్లాడుతున్నారు. జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రత శనివారం 39 డిగ్రీల వరకు నమోదైంది. ప్రజలు ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్నారు. మధ్యాహ్నం వేళ బయటకు వెళ్లాలంటే జంకుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో గొడుగులు పట్టుకొని, మాస్క్లు, స్కార్ప్లు పెట్టుకొని వెళ్తున్నారు. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, నిజామాబాద్ ఎండ వేడిమి నుంచి రక్షణ పొందడానికి స్కార్ఫ్, చీరకొంగు, చేతి రుమాలును తలకు చుట్టుకొని వెళుతున్న వాహనదారులు -
అంతర్రాష్ట్ర దొంగల ముఠా సభ్యుల అరెస్ట్
● వివరాలు వెల్లడించిన ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్ రావు కామారెడ్డి క్రైం: జిల్లాలో వరుస చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాకు చెందిన ఇద్దరు సభ్యులను రూరల్ పోలీసులు శనివారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. దేవునిపల్లి పీఎస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్ రావు వివరాలు వెల్లడించారు. కామారెడ్డి మండలం వడ్లూర్ గ్రామానికి చెందిన వద్దే పద్మ గత నెల 22న ఇంటికి తాళం వేసి హైదరాబాద్కు వెళ్లగా దుండగులు చోరీకి పాల్పడ్డారు. సమీపంలోని మరో ఇంట్లోకి సైతం చొరబడి బంగారు, వెండి ఆభరణాలు అపహరించారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. శనివారం మధ్యాహ్నం టేక్రియాల్ వద్ద వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించారు. నిందితుల్లో ఒకరు సిద్దిపేట జిల్లా దుబ్బాకకు చెందిన నూనె నర్సింలు కాగా మరొకరు మైనర్గా గుర్తించారు. వీరిద్దరూ మరో ఇద్దరితో కలిసి ముఠాగా ఏర్పడి చోరీలు చేస్తున్నారని విచారణలో తేలింది. నిందితుల నుంచి 40 తులాల వెండి, 15 కిలోల రాగి వైర్, ద్విచక్రవాహనం, రూ.4,500 నగదు, 2 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ తెలిపారు. నిందితుడు నర్సింలుపై గతంలో శామీర్పేట, సిద్దిపేట, రాయిపోల్, తోగుట, కుకునూర్, పీఎస్లలో పలు దొంగతనం కేసులు ఉన్నట్లు వెల్లడించారు. ముఠా సభ్యులను పట్టుకోవడంలో ప్రతిభ కనబర్చిన సీఐలు, ఎస్సైలు, సిబ్బందిని అభినందించారు. -
ట్రాక్టర్ అదుపు తప్పి ఒకరు..
నవీపేట: మండలంలోని అనంతగిరి సమీపంలో శనివారం రా త్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మహంతం గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ బాజా వెంకటేశ్ (53) మృతి చెందినట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. అనంతగిరి శివారు నుంచి రెడ్డి ఫారానికి ఇసుకను ట్రాక్టర్లో తీసుకువస్తుండగా వెనుక నుంచి వస్తున్న ప్యాసింజర్ ఆటో ఓవర్ టేక్ చేసిందన్నారు. దీంతో ట్రాక్టర్ అదుపుతప్పి పంట పొలాల్లో పడగా ఇంజిన్ వెంకటేశ్పై పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడని పేర్కొన్నారు. ఆటో డ్రైవర్ శ్రీనివాస్తోపాటు మరో ఇద్దరు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయని పేర్కొన్నారు. మృతుడికి భార్య, ముగ్గురు కుమారులు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. -
నితిన్ నబీన్తో కొండెల సాయిరెడ్డి
● ఆర్ఎస్ఎస్ క్షేత్రాల అఖిల భారతీయ సమ్మేళనంలో.. సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ఆర్ఎస్ఎస్ అనుబంధ క్షేత్రాల అఖిల భారతీయ సమన్వయ సదస్సు హర్యానాలో జరుగుతోంది. ఈ నెల 13 నుంచి 15వ తేదీ వరకు సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇందులో సంఘ్ అన్ని శాఖలకు చెందిన అఖిల భారత అధ్యక్ష, కార్యదర్శులు మాత్రమే పాల్గొంటున్నారు. ఇందులో ఇందూరు నగరానికి చెందిన అఖిల భారత కిసాన్ సంఘ్ జాతీయ అధ్యక్షులు కొండెల సాయిరెడ్డి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ కలిసి ఒకే వరుసలో పాల్గొన్నారు. సాధారణ కార్యకర్త స్థాయి నుంచి అఖిల భారత అధ్యక్ష స్థాయికి ఎదిగిన అత్యంత సాధారణ కార్యకర్తలు ఇద్దరు కలిసిన అరుదైన దృశ్యం జిల్లా సంఘ్ శ్రేణుల్లో సంతోషం నింపింది. ధర్పల్లి: మండలంలోని హోన్నాజీపేట్ గ్రామంలో నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును నిజామాబాద్ ఏసీపీ ప్రకాశ్ శనివారం విచారణ చేపట్టారు. గ్రామానికి వెళ్లి బాధితులు, గ్రామస్తులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ.. కేసు దర్యాప్తు నిష్పక్షపాతంగా కొనసాగుతుందన్నారు. చట్టానికి విరుద్ధంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అంతకుముందు ధర్పల్లి మండల కేంద్రంలో ఈ నెల 11న జరిగిన జారూపల కాంతామణి హత్య కేసుకు సంబంధించి ఘటనా స్థలాన్ని సందర్శించి వివరాలు సేకరించారు. ఏసీపీ వెంట సీఐ భిక్షపతి, ఎస్సై శ్రీనివాస్, సిబ్బంది ఉన్నారు. బాన్సువాడ రూరల్: మండల కేంద్రంలోని ప్రెస్కాలనీలో నివాసముండే పట్లోళ్ల సుగుణ ఇంట్లో గతేడాది ఆగస్టు 5న చోరీకి పాల్పడిన నిందితుడిని శనివారం పోలీసులు పట్టుకున్నారు. సుగుణ తన ఇంటికి తాళం వేసి హైదరాబాద్ వెళ్లి వచ్చేసరికి ఇంటి తాళాలు పగులగొట్టబడి ఉన్నాయి. ఇంట్లో దాచిన రూ.రెండున్నల లక్షలు అపహరణకు గురికావడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా, ఆరు నెలల తర్వాత నిందితుడు దండుగల ఎల్లప్ప తాడ్కోల్ శివాజీ చౌరస్తా వద్ద అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు విచారించారు. ప్రెస్కాలనీలో చోరీకి పాల్పడినట్లు నిందితుడు ఒప్పుకున్నాడని, అతని వద్ద నుంచి రూ.45వేల విలువ చేసే ట్యాబ్ స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించామని సీఐ తుల శ్రీధర్ తెలిపారు. -
అశ్వ వాహనంపై ఊరేగిన శ్రీవారు
● ఇందూరు తిరుమలలో నిత్య హవన పూర్ణాహుతి ● భక్తి శ్రద్ధలతో విష్ణు సహస్రనామ పారాయణం నిజామాబాద్ రూరల్: మోపాల్ మండలం నర్సింగ్పల్లి గ్రామ శివాల్లోని ఇందూరు తిరుమల బ్రహ్మో త్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఏడో రోజు ఉదయం నిత్య హవన పూర్ణాహుతి నిర్వహించారు. శనివారం సందర్భంగా సామూహిక భగవద్గీత పఠనం చేశారు. షాక్తా పరిషత్ బృందం గురువు పవన్ శర్మ, మహిళా శిష్య బృందం భక్తశ్రద్ధలతో విష్ణు సహస్రనామ పారాయణం, లలిత సహస్రనామ పారాయణం, సౌందర్య లహరి సామూహిక గానం చేశారు. దీంతో భక్తులు భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. సాయంత్రం స్వామివారు అశ్వవాహనంపై మాడ వీధుల్లో ఊరేగారు. అశ్వ వాహనంపై వచ్చిన శ్రీవారు సిరి సంపదలను తీసుకొని వస్తాడని దేవనాథ జీయర్ స్వామి తెలిపారు. అనంతరం దోపోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. గ్రామానికి చెందిన ఆడబిడ్డలు మంగళ హారతులతో స్వామి వారిని ఆహ్వానించారు. కార్యక్రమాల్లో ఆలయ ప్రధాన ధర్మకర్త నర్సింహారెడ్డి, సినీ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, విజయసింహా రెడ్డి, డీసీపీ బస్వారెడ్డి, సాయిరెడ్డి, ఎంపీటీసీ రాము లు, నర్సారెడ్డి, పృథ్వీ, ప్రవీణ్, నరాల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. -
మృత్యువులోనూ వీడని స్నేహం
● ఆర్మూర్ మండలం పిప్రిలో ఆటో, స్కూటీ ఢీ ● ఇద్దరు యువకులు మృతి ● ఒంటరైన తల్లులు ఆర్మూర్టౌన్: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు స్నేహితులు దుర్మరణం చెందిన ఘటన ఆర్మూర్ మండలం పిప్రి గ్రామ శివారులో శనివారం చోటు చేసుకుంది. పిప్రి గ్రామానికి చెందిన సంచు శ్రీనివాస్(40), ఆర్మూర్కు చెందిన దయ్య విజయ్(33) ఇద్దరూ స్నేహితులు. శ్రీనివాస్ ఆర్మూర్లోని ఓ బా ర్లో వెయిటర్గా పని చేస్తున్నాడు. విజయ్ సైతం గతంలో నాలుగు నెలలపాటు అదే బార్లో పనిచేశాడు. అయితే, ఈ నెల 4న విజయ్ ఇజ్రాయెల్ దేశానికి వెళ్లాల్సి ఉండగా, యుద్ధ పరిస్థితుల నేప థ్యంలో విమానాలు రద్దు కావడంతో వెళ్లలేదు. అ యితే, శనివారం ఉదయం శ్రీనివాస్, విజయ్ కలిసి స్కూటీపై ఆర్మూర్ వైపు వస్తూ ఆర్మూర్ నుంచి నందిపేటకు వెళ్తున్న ఆటోను ఢీకొని ఎగిరిపడ్డారు. దీంతో ఘటనా స్థలంలోనే ఇద్దరు మృతిచెందారు. కుటుంబాల్లో విషాదం.. రోడ్డు ప్రమాదంతో యువకుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. శ్రీనివాస్, విజయ్లకు ఇంకా పెళ్లి కాలేదు. కొన్నేళ్ల క్రితం వీరి తండ్రులు మరణించగా, తల్లుల వద్ద ఉంటూ పనులు చేసుకొని జీవ నం సాగిస్తున్నారు. కుటుంబాలకు పెద్ద దికై ్కన కొ డుకులు మరణించడంతో తల్లులు గుండెలవిసెలా రోదించారు. యువకుల మరణంతో తల్లులిద్దరూ ఒంటరివారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. అనంతరం మృతదేహాలను ఆర్మూర్ ప్రభుత్వ ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్హెచ్వో సత్యనారాయణగౌడ్ తెలిపారు. దుయ్య విజయ్(ఫైల్) సంచు శ్రీనివాస్(ఫైల్) -
క్రైం కార్నర్
మంజీర నదిలో మునిగి ఒకరి మృతి నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): మండలంలోని చీనూర్ గ్రామానికి చెందిన రంగి యేసయ్య(44) శనివారం మంజీర నదిలో మునిగి మృత్యువాత పడ్డాడు. నదిలో నుంచి మోటార్ను తీసే ప్రయత్నంలో ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందినట్లు ఎస్సై భార్గవ్గౌడ్ తెలిపారు.మృతదేహాన్ని పోస్టుమార్టం నిమి త్తం ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. గుంతలో పడి ఒకరు.. బోధన్: ప్రమాదవశాత్తు బో రుబావి వద్ద గుంతలో పడి ఒకరు మృతి చెందారు. రెంజ ల్ మండలం దూపల్లి గ్రామానికి చెందిన బోగుల గంగాధర్(25) ఎడపల్లి మండలంలోని దూపల్లి గేట్ సమీపంలో పంట పొలాల మధ్య ఉన్న బోరుబావి వద్ద గల గుంతలో ప్రమా దవశాత్తు పడి మృతి చెందాడు. గంగాధర్ రోజు మాదిరిగా శుక్రవారం కూలి పని కోసం ఎడపల్లి మండలం జానకంపేట గ్రామానికి వెళ్లాడు. తిరిగి ఇంటికి చేరుకోలేదు. కుటుంబసభ్యులు ఆచూకీ కోసం ఆరా తీశారు. శనివారం ఉదయం స్థానికుల సమాచారం మేర కు ఘటన స్థలానికి వచ్చి మృతుడిని గుర్తించారు. బోరుబావి వద్ద నీళ్లు తాగేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు గుంతలో పడిపో యి మృతి చెంది ఉంటాడని, మృతుడి తమ్ముడు రమేశ్ ఫిర్యా దు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై రమ తెలిపారు. చికిత్స పొందుతూ వివాహిత ..రుద్రూర్: పోతంగల్ మండలం హంగర్గా ఫారానికి చెందిన కుంటన రమ (30) అనే వివాహిత చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కోటగిరి ఎస్సై సునీల్ తెలిపారు. రమ భర్త మద్యానికి బానిసై పని చేయకపోవడంతో కుటుంబపోషణ విషయమై తీవ్రంగా ఇబ్బందిపడేది. ఈ నెల 12న సాయంత్రం రమ గుర్తుతెలియని పురుగుల మందు సేవించింది. గుర్తించిన కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా, చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం మృతి చెందింది. మృతురాలి తల్లి సోన్ కాంబ్లె లక్ష్మీబాయి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు. -
ఇందిరమ్మ రాజ్యంలో అందరికీ సంక్షేమ ఫలాలు
● రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి ● కల్యాణలక్ష్మి, ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్ పత్రాల పంపిణీ డిచ్పల్లి(నిజామాబాద్రూరల్): ఇందిరమ్మ రాజ్యంలో, సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రంలో ప్రతి పేదవాడికి సంక్షేమ ఫలాలు అందుతున్నాయని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి పేర్కొన్నారు. డిచ్పల్లి మండల కేంద్రంలోని కేఎన్ఆర్ గార్డెన్స్లో నియోజకవర్గంలోని వివిధ మండలాలకు సంబంధించిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు, ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్ పత్రాలను శనివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 246 మంది లబ్ధిదారులకు రూ. 2,46,28,536 విలువ చేసే కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు, 153 మందికి రూ.7,65,00,000 విలువ చేసే ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్ పత్రాలను పంపిణీ చేయడం ఆనందంగా ఉందన్నారు. దేశంలో మరెక్కడా లేని విధంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు. మహిళలకు తొలి ప్రాధాన్యతను ఇస్తూ అన్ని పథకాలూ వారి పేరిటే ఇస్తున్నామని గుర్తు చేశారు. అంతకుముందు డిచ్పల్లి మాజీ ఎంపీపీ కంచెట్టి గంగాధర్, ధర్పల్లి మాజీ ఎంపీపీ ఇమ్మడి గోపి మరణం పట్ల సంతాపం ప్రకటించారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలపాటు మౌనం పాటించి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, డిచ్పల్లి మండల అధ్యక్షుడు అమృతాపూర్ గంగాధర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పొలసాని శ్రీనివాస్, సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షుడు మునిపెల్లి సాయిరెడ్డి, తారాచంద్ నాయక్, మాజీ ఎంపీపీ భూమారెడ్డి, ప్రజాప్రతినిధులు, నాయకులు నవీన్గౌడ్, ఎర్రన్న, డాక్టర్ షాదుల్లా, రాంచందర్గౌడ్, ధర్మాగౌడ్, వాసుబాబు, ఉమ్మాజి నరేశ్, గంగారెడ్డి, హన్మాండ్లు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు. -
పాఠాలు.. గుణపాఠాలు
విద్యార్థులకు విద్యాబోధన.. అధికారులకు చురకలు ఆదివారం శ్రీ 15 శ్రీ మార్చి శ్రీ 2026– 8లో uసంపూర్ణ అక్షరాస్యత నా కల.. అని చెప్పే కలెక్టర్ ఇలా త్రిపాఠి విద్యాశాఖపై ప్రత్యేక దృష్టి సారించారు. వ్యక్తిగత, సామాజిక అభివృద్ధికి కీలకమైన విద్యావ్యవస్థను మరింత పటిష్టం చేసే దిశగా కృషి చేస్తున్నారు. బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి కేజీబీవీలు, గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలలను తనిఖీ చేస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరించే వారికి ఝలక్ ఇస్తున్నారు. వేర్వేరు కారణాలతో ఇప్పటికే ఆరుగురిపై సస్పెన్షన్ వేటు పడగా, ఇద్దరికి షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. ఖలీల్వాడి: జిల్లాలోని కేజీబీవీలు, గురుకులాలతోపాటు ప్రభుత్వ పాఠశాలలను కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆకస్మికంగా తనిఖీ చేస్తున్నారు. విద్యాలయాల నిర్వహణలో లోపాలను గుర్తించడంతోపాటు నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నారు. ఏ పాఠశాలకు వెళ్లిన ముందు గా నిర్వహణ, రికార్డులను పరిశీలిస్తున్నారు. నేరుగా తరగతి గదుల్లోకి వెళ్లి పాఠాలు బోధిస్తూ విద్యార్థుల్లోని అభ్యసన సామర్థ్యాలను గుర్తిస్తున్నారు. విద్యార్థులతో మమేకమవుతూ వారి సమస్యలను తెలుసుకుంటున్నారు. కలెక్టర్ విద్యా వ్యవస్థపై ప్రత్యేకంగా దృష్టి సారించడంతోపాటు సంబంధిత అధికారులు, సిబ్బంది హడలెత్తుతున్నారు. దీంతో చేసేది లేక డుమ్మా టీచర్లు, సిబ్బంది స్కూల్ బాట పడుతున్నారు. గతేడాది డిసెంబర్ 31న జిల్లా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి తనిఖీలతో హడలెత్తిస్తూ ఇప్పటి వరకు ఆరుగురిపై సస్పెన్షన్ వేటు వేశారు. మరో ఇద్దరికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ● జనవరి 28న ఎన్నికల విధులకు గైర్హాజరైన ఆర్మూర్ బాలికల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రఽధానోపాధ్యాయురాలు వనజారెడ్డిపై సస్పెన్ష న్ వేటు వేశారు. ● జిల్లా కేంద్రంలోని నాందేవ్వాడలో ఉన్న ఎస్సీ స్టడీ సర్కిల్, సాంఘిక సంక్షేమ హాస్టల్ వార్డెన్ ఫిబ్రవరి 8న ఆటోలో సుమారు రెండు క్వింటాళ్ల బియ్యాన్ని తరలిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. దీనిపై విచారణ చేపట్టిన సాంఘిక సంక్షేమశాఖ అధికారులు కలెక్టర్కు నివేదిక అందించగా ఆయనను సస్పెండ్ చేశారు. ● మార్చి 4న ఇందల్వాయిలోని ఏకలవ్వ గురుకుల పాఠశాల విద్యార్థి రామ్చరణ్(15) ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపై విచారణ నివేదిక అందుకున్న కలెక్టర్.. ప్రిన్సిపాల్తోపాటు ముగ్గురిని సస్పెండ్ చేశారు. ● మార్చి 9న బాల్కొండ మోడల్ స్కూల్ను కలెక్టర్ త్రిపాఠి తనిఖీ చేశారు. కేర్టేకర్ విద్యార్థులతోపాటు టీచర్లు, సిబ్బందిపై దురుసుగా ప్రవ ర్తిస్తున్నారని తేలడంతో ఆమెను విధుల నుంచి తొలిగించారు. ● మార్చి 11న నవీపేట్ మండలంలోని మోకన్పల్లి కేజీబీవీని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది అటెండెన్స్ రిజిస్టర్ను తనిఖీ చేసి లోపాలను గుర్తించారు. స్పెషల్ ఆఫీసర్ కవిత, బోధన విధుల్లో కొనసాగుతున్న రాజశ్రీకి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. విద్యతోపాటు ఆరోగ్యంపై..విద్యాలయాలను తనిఖీ చేస్తున్న కలెక్టర్ ఇలా త్రిపాఠి విద్యార్థులకు చదువుతోపాటు ఆరోగ్య సంరక్షణ ప్రాముఖ్యతపై అవగాహన కల్పిస్తున్నారు. ఎటువంటి అనారోగ్య సమస్య ఎదురైనా ఇబ్బంది పడకుండా క్లాస్ టీచర్కు లేదా స్కూల్లోని మెడికల్ సిబ్బందికి తెలుపాలని సూచిస్తూ అవగాహన కల్పిస్తున్నారు. వ్యక్తిగత శుభ్రత ప్రాధాన్యతను వివరిస్తున్నారు. పాఠాలు చెబుతున్న కలెక్టర్ ఇలా త్రిపాఠి(ఫైల్)పరీక్ష కేంద్రాల తనిఖీలుపరీక్షలు కొనసాగుతున్న వేళ సెంటర్లను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేస్తున్నారు. పరీక్ష సెంటర్లలో కనీస సౌకర్యాలు లేకపోవడాన్ని గుర్తించి ఇప్పటికే సంబంధిత అధికారుల తీరును ఎండగట్టారు. ఎగ్జామినేషన్ సెంటర్లలో సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. శనివారం నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కాగా.. కలెక్టర్ ఎప్పుడు ఏ సెంటర్ను తనిఖీ చేస్తారోనని తెలియడం లేదని సంబంధిత అధికారులు చర్చించుకుంటున్నారు.పీఎంశ్రీ నిధుల దుర్వినియోగంపై దృష్టి సారిస్తే..జిల్లాలో 44 ప్రభుత్వ పాఠశాలలు పీఎంశ్రీ కింద ఎంపికయ్యాయి. ప్రతి పాఠశాలకు రూ.10 నుంచి రూ.13 లక్షల వరకు నిధులు మంజూరయ్యాయి. అయితే నిధుల దుర్వినియోగంపై విద్యాశాఖకు ఇప్పటికే ఫిర్యాదులు అందాయి. ఏంఈవోలతో విచారణ చేపట్టి నివేదికను జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి పంపించారు. నిధుల దుర్వినియోగానికి సంబంధించిన ఫైలు జిల్లా విద్యాశాఖలో పెండింగ్లో ఉంది. కలెక్టర్ దృష్టి సారించి నిధులు దుర్వినియోగం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని విద్యావేత్తలు కోరుతున్నారు. ఇప్పుటి వరకు ఆరుగురి సస్పెన్షన్, ఇద్దరికి షోకాజ్ నోటీసులు కేజీబీవీలు, గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలల తనిఖీలు విద్యావ్యవస్థను గాడిలో పెడుతున్న కలెక్టరమ్మ క్షేత్రస్థాయిలో చిన్నారులతో మమేకమవుతున్న ఇలా త్రిపాఠి -
గ్యాస్ బుకింగ్కు సాంకేతిక సమస్యలు
● ఆన్లైన్లో బుక్ చేసుకుంటేనే సిలిండర్ ఇస్తామంటున్న ఏజెన్సీలు ● మూడు రోజుల నుంచి పరిష్కారం కాని సమస్య మోర్తాడ్(బాల్కొండ): ఇరాన్ – ఇజ్రాయిల్ యుద్ధం కారణంగా గ్యాస్ కొరత వస్తుందనే ప్రచారానికి స్థానికంగా క్షేత్రస్థాయి పరిస్థితులు తోడవడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. వంట గ్యాస్ సరఫరాపై కేంద్ర పెట్రోలియం శాఖ, పౌర సరఫరాల శాఖ నిబంధనలను కఠినతరం చేయడంతో వినియోగదారులు ముందస్తుగా జాగ్రత్త పడుతున్నారు. సర్వర్ బిజీ కారణంగా ఆన్లైన్లో, వాట్సాప్ ద్వారా గ్యాస్ బుక్ కావడం లేదు. దీంతో వినియోగదారులు గ్యాస్ ఏజెన్సీల ఎదుట బారులు తీరుతున్నారు. అయితే ఆన్లైన్లో బుక్ చేసుకుంటేనే గ్యాస్ వస్తుందని ఏజెన్సీల నిర్వాహకులు స్పష్టం చేస్తుండడంతో వినియోగదారులు ఆగ్రహానికి గురవుతున్నారు. రెండు, మూడు రోజుల నుంచి ప్రతి కంపెనీ గ్యాస్ బుకింగ్ టోల్ఫ్రీ నంబర్లు పని చేయడం లేదు. మూడు రోజుల నుంచి సాంకేతిక సమస్య ఉత్పన్నం కావడం అది పరిష్కారానికి నోచుకోవడం లేదు. అనేక మంది ఒకే సమయంలో గ్యాస్ బుకింగ్ కోసం టోల్ఫ్రీ నంబర్ను వినియోగిస్తుండటంతో సర్వర్ బిజీగా ఉంటోందని అధికార యంత్రాంగం చెబుతోంది. వంట గ్యాస్ కొరత లేదని వినియోగదారులు ఆందోళన చెందొద్దని చెబుతున్నా గ్యాస్ బుకింగ్ కష్టాలు మాత్రం తప్పడం లేదు. -
పెద్దపులి కదలికలపై అటవీ అధికారులకు అవగాహన
కమ్మర్పల్లి: కమ్మర్పల్లి అటవీ రేంజ్లో పె ద్దపులి సంచారం నేపథ్యంలో అటవీ శాఖ అ ధికారులకు పూణేలోని టైగర్ రెస్క్యూ టీం, హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్ వెటర్నరీ డాక్టర్ అవగాహన కల్పించారు. కమ్మర్పల్లి మండల కేంద్రంలోని అటవీ క్షేత్ర పరిధి కార్యాలయంలో రిజర్వ్ ఫారెస్ట్ లోపల, బయట పెద్దపులి కదలికలు కనిపించినప్పుడు తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలను సూచించారు. పెద్దపులి కదలికలను ఎలా గుర్తించాలి, దాని స్థానాలను గుర్తించడం ద్వారా ట్రాప్ కెమెరాను ఎలా అమర్చాలి, ఎలా ప్రశాంత పర్చాలనే అంశాలపై క్షుణ్ణంగా అవగాహన కల్పించారు. పులి ప్రవర్తనను వివరించారు. ఎఫ్ఆర్వో రవీందర్, డీఎఫ్ఆర్వో శ్రీనివాస్, కమ్మర్పల్లి, సిరికొండ, ఇందల్వాయి రేంజ్ల సిబ్బందితోపాటు బేస్ క్యాంప్ వాచర్లు పాల్గొన్నారు. ఆన్లైన్ గేమింగ్కు యువకుడు బలి ● డబ్బులు పోవడంతో ఆత్మహత్య డిచ్పల్లి: ఆన్లైన్ గేమింగ్ భూతానికి మరొక యువకుడు బలయ్యాడు. డిచ్పల్లి ఎస్సై మహమ్మద్ అరిఫ్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని నడిపల్లి తండాకు చెందిన బదావత్ అరుణ్(20) శనివారం తెల్లవారుజామున తమ రేకుల ఇంట్లో ఇనుపరాడ్కు టవల్తో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయం కుటుంబీకులు గమనించే సరికే అరుణ్ మృతి చెంది ఉన్నాడు. ఇటీవల ఆన్లైన్ గేమింగ్కు అలవాటు పడిన అరుణ్ డబ్బులు పోగొట్టుకుని అప్పులపాలైనట్లు సమాచారం. అప్పుల బాధతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. మృతుడి తండ్రి పండరి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. 16న జీజీ కాలేజీలో మెగా జాబ్మేళా ఖలీల్వాడి: జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ కళాశాలలో తెలంగాణ స్కిల్ అండ్ నాలెడ్జ్ సెంటర్, కెరీర్ గైడెన్స్ విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 16న మెగా జాబ్మేళా ని ర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ రామ్మోహన్రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉ దయం 9:30 నుంచి మధ్యాహ్నం వరకు కొనసాగుతుందన్నారు. మ్యాజిక్ బస్సు ఇండియా ఫౌండేషన్ సౌజన్యంతో జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. టెక్ మహీంద్ర, ముత్తూట్, జస్ట్ డయల్, టాటా ఏఐజీ, బ్యాంకింగ్, ఐటీ సర్వీస్తోపాటు వివిధ కంపెనీలు ఇందులో పాల్గొంటాయని పేర్కొన్నారు. డిగ్రీ పూర్తి చేసిన వారు, ప్రస్తుతం చి వరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు అర్హులని తెలిపారు. అర్హులు బయోడేటా, సర్టిఫికెట్లు, పీపీ సైజ్ ఫొటోలతో ఇంటర్వ్యూకి హాజరుకావాలన్నారు. సందేహాలుంటే 9059344379, 9494559027 నంబర్లను సంప్రదించాలని సూచించారు. -
పడిపోయిన పసుపు ధర
మోర్తాడ్(బాల్కొండ): ఇరాన్ – ఇజ్రాయిల్ యు ద్ధం ప్రభావం పసుపు రైతులపై పడుతోంది. ఎగుమతులు నిలిచిపోవడంతో మార్కెట్లో డిమాండ్ లేదని వ్యాపారులు అంటున్నారు. వారం, పది రోజుల కింద ఊరించిన పసుపు ధర ఒక్కసారిగా క్వింటాల్కు రూ.2వేలు తగ్గడంతో రైతులు నిరాశకు గురవుతున్నారు. పసుపు క్రయవిక్రయాలు ప్రారంభమైన నాటి నుంచి మార్కెట్లో పరిస్థితి ఆశాజనకంగా ఉండడంతో ఈసారి లాభాల పంట పండుతుందని రైతులు ఆశించారు. అయితే యుద్ధం పరిస్థితులు వారి ఆశలపై నీళ్లు చల్లాయి. నిజామాబాద్ మార్కెట్లో క్వింటాల్కు రూ.14వేల నుంచి రూ.15,500 వరకు పలికిన ధర ఇప్పుడు రూ.9,500 నుంచి రూ.13,500కు తగ్గిపోయింది. సాంగ్లీ మార్కెట్లో రూ.16వేల నుంచి రూ.17వేలు ధర పలకగా.. ఇప్పుడు రూ.13వేలకు పడిపోయింది. జాతీయ మార్కెట్ కావడంతో సాంగ్లీ వచ్చి బడా వ్యాపారులు పసుపు కొనుగోలు చేస్తారు. అయితే యుద్ధం కారణంగా పొరుగు దేశాలకు ఎగుమతులు నిలచిపోయాయని, ఒక దశలో పసుపుతో విదేశాలకు పయనమైన ఓడలు వెనక్కి వచ్చాయని వ్యాపారులు చెబుతున్నారు. యుద్ధం ఎక్కువ కాలం ఉండేది కాదని, మన పసుపునకు విదేశాల్లో డిమాండ్ ఉన్నప్పటికీ వ్యాపారులే కావాలని ధర తగ్గించారని రైతులు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు తక్కువ ధరకు కొనుగోలు చేసి ఎక్కువ ధరకు విక్రయించుకుని లాభాలు గడించాలని ఆశతో ఇలా చేస్తున్నారని అంటున్నారు. సీజన్ ముగింపు దశలో ధర పెరగాలి సీజన్ ముగింపు దశలో పసుపు ధర పెరగాలి. గతంలో సాంగ్లీలో లభించిన విధంగానే నిజామాబాద్లో ధర లభిస్తుందని తీసుకువచ్చాం. యుద్ధం కారణంగా ధర పడిపోయిందని వ్యాపారులు చెబుతున్నారు. లాభాలు తగ్గిపోవడమే కాదు మా శ్రమ వృథా అవుతుంది. – పెద్దకాపు శ్రీనివాస్, రైతు, దోంచందఎంతో ఆశతో సాంగ్లీకి తరలించాం సాంగ్లీ మార్కెట్లో నాణ్యమైన పసుపునకు డిమాండ్ ఉంటుందనే ఆశతో తీసుకెళ్లాం. క్వింటాల్కు రూ.3వేల నుంచి రూ.4వేల వరకు ధర తగ్గిపోవడంతో మాకు రవాణా చార్జీలు కూడా భారమవుతున్నా యి. యుద్ధం కారణంగా పసుపు ధరలు పడిపోయాయని వ్యాపారులు చెప్పడం కుట్రగానే భావిస్తున్నాం. – రవి, రైతు, దొన్కల్ ఇరాన్ – ఇజ్రాయిల్ యుద్ధం ఎఫెక్ట్ ! ఎగుమతులు నిలిచిపోవడంతోనే డిమాండ్ లేదంటున్న వ్యాపారులు క్వింటాల్కు రూ.2వేల వరకు తగ్గిన ధర సాంగ్లీ మార్కెట్లోనూ ప్రతికూల పరిస్థితులు -
పుష్కరాల్లో కందకుర్తికి ప్రత్యేక గుర్తింపు
● ప్రభుత్వ సలహాదారు సుదర్శన్రెడ్డి ● కలెక్టర్తో కలిసి ఘాట్ల సందర్శన రెంజల్(బోధన్): గోదావరి పుష్కరాల్లో (2027) కందకుర్తి త్రివేణి సంగమ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు ఉంటుందని ప్రభుత్వ సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి అన్నారు. ఇలా త్రిపాఠితో కలిసి శనివారం కందకుర్తి పుష్కరక్షేత్రాన్ని సుదర్శన్రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. త్రివేణి సంగమ క్షేత్రానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉంటుందని, వారి అవసరాలకు తగినట్లు ఏర్పాట్లు చేయాలని సూచించారు. 2015 గోదావరి పుష్కరాల సందర్భంగా ఒక్క రోజే కందకుర్తికి సుమారు 6 లక్షల మంది వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. శ్రాద్ధా మండపం, తాత్కాలిక మరుగుదొడ్లు, పార్కింగ్, వీఐపీ ఘాట్ల నిర్మాణం, రొడ్ల మరమ్మతులు తదితర పనులను గుర్తించి అంచనాలు రూపొందించాలని అధికారులకు సూచించారు. ఇటీవల గోదావరి పుష్కరాలపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో రెండు, మూడు నదులు కలిసే ప్రాంతాల కు ఉన్న ప్రాధాన్యతను సీఎం రేవంత్రెడ్డి ప్రత్యేకంగా వివరించారని గుర్తుచేశారు. అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఆయన వెంట ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతరెడ్డి రాజిరెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మోబీన్ఖాన్, మాజీ జెడ్పీటీసీ నాగభూషణంరెడ్డి సర్పంచ్లు గయాసుద్దీన్, ధనుంజయ్, మల్లేశ్, భానుచందర్, అశోక్నాయక్, జుబేర్లతోపాటు నాయకులు పాల్గొన్నారు. తోఫాల పంపిణీ రంజాన్ను పురస్కరించుకుని మండలంలోని ముస్లిం మైనారిటీలకు మంజూరైన తోఫాలను స్థానిక తహసీల్ కార్యాలయంలో సుదర్శన్రెడ్డి పంపిణీ చేశారు. మండలంలో 300 మందికి ప్రభుత్వం కానుకలను మంజూరు చేసిందన్నారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ వికాస్మహతో, తహసీల్దార్ శ్రావణ్కుమార్, మండల కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు సాయారెడ్డి పాల్గొన్నారు. -
పరీక్ష రోజే తండ్రి మరణం.. శోకాన్ని దిగమింగుతూ
సాక్షి, మెదక్: జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కుమారుడి పరీక్ష రోజే దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదంలో తండ్రి మృతి చెందాడు. దీంతో పుట్డెడు దుఃఖాన్ని దిగమింగుతూ. అంతటి శోకంలోనూ ఆ పిల్లాడు పదవ తరగతి పరీక్షకు హాజరయ్యాడు.. ఈ ఘటన పలువురిని కంటతడికి గురిచేసింది. శివంపేట మండలం ఉసిరిలకాపల్లి గ్రామ శివారులో ఈ రోజు ( శనివారం) అర్ధరాత్రి శివాoపేట మండలం పంబండ గ్రామానికి చెందిన కుమ్మరి నాగరాజు (45) అనే వ్యక్తికి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. కాగా నేడు అతని అంత్యక్రియలు జరగాల్సి ఉంది. అయితే అంతటి దుఃఖంలోనూ అతని కుమారుడు కుమ్మరి ధనుష్ తన బాధను దిగమింగుకుంటూ తూప్రాన్ లోని బాలుర ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రానికి హాజరయ్యారు. తన తండ్రి ఎంతో కష్టపడి తమని చదివిస్తున్నాడని అందుకు అతను ఇప్పుడు భౌతికంగా తమవద్ద లేకపోయినటప్పటికీ నాన్న కష్టం వృధా కాకూడదని పరీక్షలకు హాజరవుతున్నానని విలపించాడు. ఈ ఘటన అక్కడి స్థానికులను ఎంతగానో కలిచివేసింది. -
పది పరీక్షలకు సర్వం సిద్ధం
ఖలీల్వాడి:జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్షల ని ర్వహణకు విద్యాశాఖ సర్వం సిద్ధం చేసింది. ఈ నె ల 14 నుంచి వచ్చే నెల 16 వరకు పరీక్షలు కొన సాగనున్నాయి.జిల్లా వ్యాప్తంగా మొత్తం 144 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షలకు 12,244 మంది బాలురు, 12,155 మంది బాలికలు, మొత్తం 24,399 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఐదు నిమిషాల ఆలస్యం అయినా ఒకే.. పదో తరగతి పరీక్షలు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 గంటలకు జరుగుతాయి. పరీక్షకు ఐదు నిమిషాలు ఆలస్యం అయినా విద్యార్థులకు అనుమతి ఉంటుందని డీఈవో పార్శి అశోక్కుమార్ తెలిపారు. అరగంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ప్రభుత్వం ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. ఈ వస్తువులకు అనుమతి లేదు విద్యార్థులు పరీక్ష కేంద్రాల్లోకి సెల్ఫోన్లు, క్యాలిక్యులెటర్లు వంటి ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకెళ్లడానికి అనుమతి లేదు. పరీక్ష కేంద్రానికి 100 మీటర్ల దూరం వరకు ఉన్న జిరాక్స్ సెంటర్లు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మూసి ఉండాలి. కేంద్రాల వద్ద బీఎన్ఎన్ 163 అమలులో ఉంటుంది. అత్యవసర సమాచారం కోసం జిల్లా విద్యాశాఖ హెల్ప్లైన్ నెంబర్ 90302 82993ను ఏర్పాటు చేసింది. కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి.. జిల్లాలోని పరీక్ష కేంద్రాలను మూడు కేటగిరీలుగా విభజించారు. ఏ కేటగిరీలో 49, బీ కేటగిరీలో 49, సీ కేటగిరీలో 46 కేంద్రాలను గుర్తించి తగిన చర్యలు తీసుకుంటున్నారు. పరీక్షల నిర్వహణకు 144 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 144 మంది డిపార్ట్మెంటల్ అధికారులు, 1,214 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. వీరితోపాటు ఏడుగురు అడిషనల్ డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు, ఐదుగురు రూట్ ఆఫీసర్లు, 22 మంది కస్టోడియన్లు, 22 మంది జాయింట్ కస్టోడియన్లు విధులు నిర్వర్తించనున్నారు. ఆరు ఫ్లయింగ్ స్క్వాడ్లు, సెంటర్కు ఒక సిట్టింగ్ స్క్వాడ్ నియమించారు. నేటి నుంచి ప్రారంభం పకడ్బందీ ఏర్పాట్లు చేసిన విద్యాశాఖ పరీక్ష రాయనున్న 24,399 మంది విద్యార్థులు 144 పరీక్ష కేంద్రాల ఏర్పాటు హాల్ టికెట్తో బస్సుల్లో ఉచిత ప్రయాణం పాఠశాలల వారీగా పరీక్ష రాసే విద్యార్థుల వివరాలు -
గ్యాస్ ఏజెన్సీ, రెస్టారెంట్ను తనిఖీ చేసిన కలెక్టర్
నిజామాబాద్ అర్బన్: గ్యాస్ కొరత నెలకొందనే వదంతుల నేపథ్యంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితుల పరిశీలన కోసం స్వయంగా తనిఖీలు చేపట్టారు. నగరంలోని భారత్ గ్యాస్ ఏజెన్సీ శిల్పా ఎంటర్ ప్రైజెస్, జాఫ్రాన్ హౌస్ మల్టీ కుషన్ ఫ్యామిలీ రెస్టారెంట్ను శుక్రవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్యాస్ ఏజెన్సీలో ఆన్లైన్ బుకింగ్ వివరాలు పరిశీలించారు. గ్యాస్ సిలిండర్ల స్టాక్ రిజిస్టర్ తనిఖీ చేశారు. గ్యాస్ కొరత వదంతులతో బుకింగ్లు పెరిగాయని నిర్వాహకులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. కలెక్టర్ మాట్లాడుతూ గ్యాస్ సిలిండర్ల పంపిణీలో అక్రమాలకు తావు లేకుండా చూడాలన్నారు. గ్యాస్ సిలిండర్ల పంపిణీలో ఇబ్బందులుంటే టోల్ ఫ్రీ నెంబర్ 1967కు కాల్ చేయాలని సూచించారు. అనంతరం రెస్టారెంట్ను తనిఖీ చేశారు. వండేందుకు వినియోగిస్తున్న గ్యాస్ సిలిండర్లను పరిశీలించారు. వినియోగదారులకు పరిశుభ్రమైన ఆహార పదార్థాలను అందించాలని హితవు పలికారు. కలెక్టర్ వెంట ఇన్చార్జి అదనపు కలెక్టర్ దిలీప్ కుమార్, డీఎస్వో శ్రీకాంత్ రెడ్డి, ఏఎస్వో అరవింద్ రెడ్డి తదితరులు ఉన్నారు. -
ఉల్లాసంగా.. ఉత్సాహంగా..
ఇంటర్ సెకండియర్ పరీక్షలు శుక్రవారం ప్రశాంతంగా ముగిశాయి. పరీక్షలు ముగియడంతో విద్యార్థుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. పరీక్షా కేంద్రాలు, హాస్టళ్లు, కళాశాలల వద్ద విద్యార్థులు కేరింతలు కొడుతూ సందడి చేశారు. తోటి విద్యార్థులతో ఉల్లాసంగా గడిపి సెల్ఫీలు తీసుకున్నారు. తమ పిల్లలను ఇంటికి తీసుకెళ్లేందుకు వచ్చిన తల్లిదండ్రులతో హాస్టళ్ల వద్ద సందడి వాతావరణం నెలకొంది. విద్యార్థులు, కుటుంబ సభ్యులతో బస్టాండ్ కిటకిటలాడింది. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్ – నిజామాబాద్ సెల్ఫీ తీసుకుంటున్న విద్యార్థులు ● వీసీలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిజామాబాద్ అర్బన్: రాష్ట్రంలో వంట గ్యాస్ కొరత ఉందన్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని, ప్రజలు అపోహలకు గురికాకూడదని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం హైదరాబాద్ సచివాలయం నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో మంత్రి మాట్లాడారు. అమెరికా – ఇరాన్ యుద్ధ పరిస్థితు లను కారణంగా చూపుతూ సోషల్ మీడియాలో జరుగుతున్న గ్యాస్ కొరత ప్రచారం పూర్తిగా అవాస్తవం అన్నారు. అవసరానికి మించి సిలిండర్లు బుక్ చేయకుండా, అపోహలను నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వీసీలో మంత్రి తుమ్మల, సీఎస్ రామకృష్ణారావు, పౌర సరఫరాల కమిషనర్ స్టీవెన్ రవీంద్ర, కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్ కిర ణ్ కుమార్, అడిషనల్ డీసీపీ బస్వారెడ్డి, డీఎస్వో శ్రీకాంత్రెడ్డి, అరవింద్రెడ్డి పాల్గొన్నారు.రాష్ట్రంలో వంట గ్యాస్ కొరత లేదు -
క్రైం కార్నర్
ధర్పల్లి: మండల కేంద్రంలో మూడు రోజుల క్రితం అనుమానాస్పద స్థితిలో లభ్యమైన మహిళ మృతదేహం కేసును పోలీసులు ఛేదించారు. ధర్పల్లి పోలీస్ స్టేషన్లో సీఐ భిక్షపతి ఎస్సై శ్రీనివాస్తో కలిసి కేసు వివరాలను శుక్రవారం వెల్లడించారు. మండలంలోని చత్రు తండాకు చెందిన జారుపాల కాంతి(50) అనే మహిళకు ధర్పల్లికి చెందిన గుండ్ల నర్సయ్యకు పరిచయం ఉంది. గత బుధవారం డబ్బుల విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో ఆమెను హత్య చేయాలని నిర్ణయించుకున్న నర్సయ్య నైలాన్ తాడుతో ఆమె మెడకు గట్టిగా చుట్టి హత్య చేశాడు. ఆమె మృతి చెందిన తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు నిందితుడు తన షెడ్డులో మృతదేహాన్ని ఉంచాడు. రాత్రి ఎర్రని బట్టతో చుట్టి టీవీఎస్ ఎక్సెల్ వాహనంపై ఊరు బయటకు తీసుకెళ్తుండగా మార్గమధ్యలో వాహనం అదుపుతప్పింది. మృతదేహం కింద పడిపోవడంతో ఎవరైనా చూస్తారేమోనన్న భయంతో వాహనాన్ని, మృతదేహాన్ని అక్కడే వదిలి పారిపోయాడు. విచారణలో నిందితుడు నేరం చేసినట్లు ఒప్పుకున్నాడని సీఐ తెలిపారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ పేర్కొన్నారు. -
జాతీయ స్థాయి పోటీలకు కృతిక ఎంపిక
జక్రాన్పల్లి: మండలంలోని కలిగోట్ గ్రామానికి చెందిన పూర్వ విద్యార్థిని కృతిక జాతీయ స్థాయి యూత్ వాలీబాల్ పోటీలకు ఎంపికై న ట్లు పీఈటీ యాదగిరి తెలిపారు. ఈ నెల 14 నుంచి 20 వరకు ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్లో నిర్వహించే జాతీయ స్థాయి యూత్ వాలీబాల్ పోటీల్లో పాల్గొననున్నట్లు పీఈటీ పేర్కొన్నారు. కృతిక ఎంపికపై వాలీబాల్ సర్పంచ్ నాయిక రాజు, ఉపసర్పంచ్ సత్తెమ్మ, అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లేశ్గౌడ్, హెచ్ఎం పురుషోత్తమాచారి, ఉపాధ్యాయులు, వీడీసీ సభ్యులు అభినందించారు. -
సివిల్ సప్లయ్ అధికారుల దాడి
బోధన్/ఆర్మూర్ టౌన్: గృహ అవసరాల (డొమెస్టిక్) గ్యాస్ సిలిండర్లను వ్యాపారాల కోసం వినియోగిస్తున్నారన్న సమాచారంతో ఆర్మూర్, బోధన్ పట్టణాల్లో సివిల్ సప్లయ్ అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు. బోధన్ పట్టణంలోని దీపక్ స్వీట్ హోంలో 15, చాందినీ దాబాలో మూడు డొమెస్టిక్ సిలిండర్లను స్వాధీనం చేసుకొని, నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు. దాడుల్లో డీటీ హనుమాన్, పవన్కుమార్, మహేశ్ పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలో సివిల్ సప్లయ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు వినోద్, శ్రీనివాస్ తనిఖీలు చేపట్టారు. మొత్తం 31 దుకాణాల్లో తనిఖీలు చేసి, 68 డొమెస్టిక్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. దుకాణాల యజమానులపై కేసులు నమోదు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. దాడుల్లో ఆర్ఐ ప్రమోద్, జీపీవో నితిన్ ఉన్నారు. -
ఎర్ర జొన్నల ధరలు తగ్గించడం సరైంది కాదు
● సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్రెడ్డి నిజామాబాద్ అర్బన్: ఎర్రజొన్నల ధరను తగ్గించ డం సబబు కాదని సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి అన్నారు. శుక్రవారం అదనపు కలెక్టర్ కార్యాలయంలో వ్యాపారులు, రైతులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులు తొందరపడి ఎర్రజొన్నలను విక్రయించవద్దని అన్నారు. రైతులు వ్యాపారులతో బైబ్యాక్ ఒప్పందం చేసుకొని విత్తనాలను నాటాలన్నారు. ఈ నెల 15 లోపు ఎర్రజొన్నలను వ్యాపారులు కొనుగోలు చేయాలని రైతులకు నష్టం జరిగే అవకాశం ఇవ్వవద్దని పేర్కొన్నారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను కూడా ప్రారంభించాలని పేర్కొన్నారు. మార్కెట్లో అవకతవకలు జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. నిర్మల్ సమీపంలో చట్ట విరుద్ధంగా పసుపును కొనుగోలు చేస్తున్న వ్యాపారులు తూకంలో కూడా మోసం చేస్తున్నారని పేర్కొన్నారు. అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
నైపుణ్యం, పోటీతత్వం విజయానికి సోపానాలు
తెయూ(డిచ్పల్లి): నైపుణ్యం, పోటీతత్వం విజయానికి సోపానాలు అని తెయూ వీసీ టీ యాదగిరిరావు అన్నారు. తెలంగాణ యూనివర్సిటీ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సెల్, రిలయన్స్ ఫౌండేషన్, మ్యాజిక్ బస్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన విద్యార్థుల నైపుణ్యాభివృద్ధి శిక్షణా కార్యక్రమం శుక్రవారం ముగిసింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వీసీ మాట్లాడుతూ.. ఆధునిక సమాజంలో ఉద్యోగాల కోసం పోటీ తీవ్రమైందని, విద్యార్థులు కేవలం అకడమిక్ పరంగా మాత్రమే కాకుండా కమ్యూనికేషన్ నైపుణ్యాలు, సమస్య పరిష్కార సామర్థ్యం, నాయకత్వ లక్షణాలు పెంపొందించుకున్నప్పుడే విజయం సాధిస్తారని అన్నారు. ఇలాంటి శిక్షణా కార్యక్రమాలు విద్యార్థుల ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంలో, ఉద్యోగ అవకాశాలను విస్తరించడంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. రిలయన్స్ ఫౌండేషన్, మ్యాజిక్ బస్ ఫౌండేషన్కు చెందిన రిసోర్స్ పర్సన్స్ పవన్ రెడ్డి, అంజలి మాట్లాడుతూ.. విద్యార్థులకు కెరీర్ ప్రణాళిక, కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంటర్వ్యూ నైపుణ్యాలు, సమయపాలన, వ్యక్తిత్వ వికాసంపై శిక్షణ నిచ్చినట్లు తెలిపారు. అనంతరం శిక్షణ పూర్తి చేసుకున్న 70 మంది విద్యార్థులకు వీసీ ధ్రువపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రాంబాబు, ప్లేస్మెంట్ సెల్ డైరెక్టర్ పాత నాగరాజు, జీ శ్రీనివాస్, సీహెచ్ శ్రీనివాస్, కిరణ్ రాథోడ్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
వైభవం.. శ్రీవారి కల్యాణం
నిజామాబాద్ రూరల్: మోపాల్ మండలంలోని నర్సింగ్పల్లిలో ఉన్న ఇందూరు తిరుమలలో కొనసాగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరవ రోజు స్వామి వారి కల్యాణం వైభవంగా నిర్వహించారు. శుక్రవారం నిర్వహించిన కల్యాణ వేడుకల్లో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పాల్గొని స్వామి వారి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆలయ నేపథ్యం తెలుసుకొని తాను సంభమాశ్యర్యాలకు గురయ్యాయని మంత్రి అన్నారు. ఎలాంటి లాభపేక్ష లేకుండా ఈ ఆలయాన్ని శ్రీమాన్ నర్సింహారెడ్డి కట్టించడం చాలా గొప్ప విషయమని మంత్రి సురేఖ అన్నారు. స్వామివారి కల్యాణంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. తిరుపతికి వెళ్లలేని వారు ఇందూరు తిరుమలలో ఆ భక్తిని, శక్తిని దక్కించు కోగలుగుతున్నారని అన్నారు. సాయంత్రం నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో రూరల్ ఎమ్మెల్యే భూపతరెడ్డి పాల్గొన్నారు. సినీ నిర్మాత దిల్రాజ్తో ఎమ్మెల్యే కొంతసేపు ముచ్చటించారు. కార్యక్రమంలో దేవనాథ జీయర్ స్వామి, ప్రముఖ సినీ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ రెడ్డి, ఆలయ ప్రధాన ధర్మకర్త నరసింహారెడ్డి, సినీ హీరో ఆశిష్, విజయసింహారెడ్డి, రాములు, ప్రవీణ్, పృథ్వి, నరాల సుధాకర్, నర్సారెడ్డి, రాజేశ్వర్, రమేశ్, భాస్కర్, నరేందర్, మురళి, యాజ్ఞాచార్యులు అనంత ఆచార్య, సంపత్ కుమార్ ఆచార్య, రోహిత్ కుమారాచార్యులు, ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, ిపీసీసీ డెలిగేట్ శేఖర్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ మోపాల్ అధ్యక్షుడు సాయి రెడ్డి, రూరల్ అధ్యక్షుడు కౌలాస్ మోహన్, నాయకులు ఉమ్మాజి నరేశ్, సడక్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు. మంత్రికి ఘనస్వాగతం జిల్లాకు విచ్చేసిన దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖకు కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ ఘన స్వాగతం పలికారు. అనంతరం నర్సింగ్పల్లిలో నిర్వహించిన వేంకటేశ్వర స్వామి వారి కల్యాణోత్సవంలో పాల్గొన్నారు. నగర మేయర్ కూరగాయల ఉమారాణి, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, పీసీసీ ప్రధాన కార్యదర్శి రామ్ భూపాల్, నగర మాజీ మేయర్ ఆకుల సుజాత, ఏఐసీసీ కో–ఆర్డినేటర్ కప్కర్ గన్రాజ్, రాష్ట్ర యూత్ కాంగ్రెస్ మాజీ ప్రధాన కార్యదర్శి జగడం సుమన్ పాల్గొన్నారు. -
కట్టెలకు ఫుల్ డిమాండ్
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: వాణిజ్య గ్యాస్ సిలిండర్ల కొ రత నేపథ్యంలో జిల్లాలో వంట చెరకుకు డి మాండ్ పెరిగింది. జిల్లా వ్యాప్తంగా భోజన హోటళ్లు, టిఫిన్ సెంటర్లు సు మారు రెండు వేలకు పైగా ఉన్నట్లు అంచనా. ఇందులో అత్యధికంగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్లను వి నియోగిస్తున్నారు. ఇక ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనాని కి చాలామంది గ్యాస్కు బదులు వంటచెరుకు వాడేవారు ఉన్నారు. కాగా, ప్రస్తుతం కమర్షియల్ గ్యా స్ సిలిండర్ల కొరత నెలకొన్న నేపథ్యంలో ప్రధానంగా హో టల్ వ్యాపారులు వంటచెరుకు (కట్టెలు) ఉపయోగించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. దీంతో చాలా ఏళ్ల తర్వాత వంటచెరకుకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. రాను రాను పరిస్థితులు ఏవిధంగా ఉంటాయోననే ఆలోచనతో చాలామంది వ్యాపారులు వంటచెరకును కొనిపెట్టుకునేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే పలువురు వంటచెరకుతో హోటల్స్ నిర్వహించేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. నాలుగు రోజుల్లో ఇంటికే సిలిండర్.. గృహ వినియోగానికి సంబంధించి గతంలో గ్యాస్ సిలిండర్ కోసం బుకింగ్ చేస్తే రెండు రోజుల సమయంలో ఇంటికి డెలివరీ ఇచ్చేవారు. ప్రస్తుతం బుక్ చేసిన నాలుగు రోజులకు డెలివరీ చేస్తున్నారు. దీంతో గ్యాస్ కొరత నెలకొంటుందనే ఆలోచనతో గృహ వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. అయితే, గృహ వినియోగానికి సంబంధించిన గ్యాస్ సిలిండర్ల విషయంలో ఎలాంటి ఆందోళన చెందొద్దని కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుండగా, జిల్లా అధికారులు సైతం చెబుతున్నారు. అయినప్పటికీ వ్యాపారులు, డీలర్లు కృత్రిమ కొరత సృష్టిస్తారని పలువురు ఆరోపణలు చేస్తున్నారు. రెట్టింపు ధరకు వంటచెరుకు..వంటచెరుకు ధర గతంలో కిలో రూ.5 వరకు మాత్రమే ఉండగా, ప్రస్తుతం రెట్టింపు అయి కిలో రూ.10 లకు పెరిగింది. కట్టెల కొనుగోళ్లు ఒక్కసారిగా పెరగడంతో డిమాండ్ ఏర్పడింది. దీంతో ధర అమాంతం పెరిగింది. చిన్నచిన్న టిఫిన్ సెంటర్ల నుంచి మోస్తరు హోటల్స్ వరకు కట్టెలు కొనుగోలు చేసేందుకు ముందుకొస్తుండటంతో డిమాండ్ అంతకంతకూ పెరుగుతోంది. ఇటీవలి వరకు బంగారం ధరలు భారీగా పెరగగా, ఇప్పుడు కట్టెల ధరలు పెరుగుతుండడంతో కాలమహిమ ఎప్పుడెలా ఉంటుందో తెలియదని పలువురు అంటున్నారు. గ్యాస్ విషయంలో బ్లాక్ దందాకు రంగం సిద్ధమవుతుండగా, కట్టెల విషయంలో నూ ఇదే పరిస్థితి వచ్చే అవకాశాలు నెలకొన్నా ఆశ్చర్యపోనవసరం లేదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్లో ఓ అంగడిలో కట్టెలుపశ్చిమాసియాలో యుద్ధ జ్వాలల ప్రభావం స్థానికంగానూ పడుతోంది. వంట గ్యాస్ కొరత ఆందోళనలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. వాణిజ్య సిలిండర్లు సరిగ్గా దొరక్క పోవడంతో కట్టెలకు డిమాండ్ ఏర్పడింది. హోటళ్లు, టిఫిన్ సెంటర్ల నిర్వాహకులు సిలిండర్లకు బదులు ప్రత్యామ్నాయంగా కట్టెల పొయ్యిని ఉపయోగిస్తున్నారు. ప్రత్యామ్నాయం లేదు... హోటళ్లు, టిఫిన్ సెంటర్లకు సిలిండర్ల సరఫరా నిలిచిపోతే చాలా ఇబ్బంది. ఇప్పటికే ఉన్న స్టాక్తో నెట్టుకొని వస్తున్నాం. సిలిండర్లకు మరో ప్రత్యామ్నాయం లేదు. కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించి కమర్షియల్ సిలిండర్లను సరఫరా చేయాలి. – చిటికేసి రఘు, టిఫిన్ సెంటర్ నిర్వాహకుడు, కమ్మర్పల్లి టీస్టాల్ మూసుకుంటే ఇబ్బందే.. సిలిండర్లు లేక టీస్టాల్ మూసుకుంటే ఇల్లు గడవడటం కష్టమైతుంది. ఇంటింటికి గ్యాస్ సరఫరాపై దృష్టి పెట్టినట్లే ప్రభుత్వం మాలాంటి చిన్న వ్యాపారులపై దయ చూపాలి. సిలిండర్లు సరఫరా అయ్యేలా చూసి మా దందా దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాలి. – కాలేరు గణేశ్, టీ స్టాల్ నిర్వాహకుడు, కమ్మర్పల్లి కట్టెల పొయ్యిలపై కష్టమైతుంది.. కొన్నేళ్లుగా సిలిండర్లపై వంట చేస్తున్నాం. గ్యాస్ సిలిండర్లు సరఫరా కాకపోతే కట్టెల పొయ్యిలపై వంట చేయడం కష్టమవుతుంది. కట్టెలు కొనాలన్నా మార్కెట్లో ధర బాగానే ఉంది. ఎలా ఉంటుందో ఏమో అర్థం కావడం లేదు. – పర్స నిరంజన, మధ్యాహ్న భోజనం ఏజెన్సీ, మోర్తాడ్ వాణిజ్య సిలిండర్ల కొరతతో ప్రాధాన్యమిస్తున్న హోటల్ వ్యాపారులు పెరిగిన వంట చెరుకు ధర గృహ వినియోగంలో కొరత లేకున్నప్పటికీ వినియోగదారుల్లో గందరగోళం డీలర్లు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారనే ఆరోపణలు -
నిద్రలోనే మృత్యు ఒడికి
జాతీయ రహదారిపై గన్నారం వద్ద ప్రమాదానికి గురైన ప్రయివేటు ట్రావెల్స్ బస్సుడిచ్పల్లి/నిజామాబాద్ అర్బన్/ఇందల్వాయి: ఇందల్వాయి మండలం గన్నారం గ్రామ శివారులో 44వ నెంబరు జాతీయ రహదారిపై జరిగిన ప్రైవేట్ బస్సు ప్రమాదంలో ముగ్గురు ప్రయాణికులు నిద్రలోనే మృతు ఒడికి చేరుకున్నారు. మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారు 2.30 గంటల సమయంలో బస్సు ప్రమాదానికి గురైంది. గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులు ఉలిక్కి పడి లేచి తీవ్ర భయాందోళనకు గురయ్యారు. బస్సు బోల్తా పడగా కళ్లముందే ముగ్గురు మృతి చెందడం, మిగిలిన వారిలో పలువురికి కాళ్లు, చేతులు విరగడం, తలలు పగలడం, సామగ్రి చెల్లాచెదురుగా పడిపోవడంతో ఏం జరిగిందో తెలియక ఆర్తనాదాలు చేశారు. గాయపడ్డ వారి రోదనలతో ఘటనా స్థలం దద్దరిల్లింది. బస్సు బోల్తా పడిన ఘటనలో నలుగురు మృతి చెందగా 17మంది తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్ నుంచి మహారాష్ట్రలోని అకోలాకు ఇద్దరు డ్రైవర్లు, ఒక క్లీనర్, 18 మంది ప్రయాణికులు మొత్తం 21 మందితో ఖురానా ట్రావెల్స్ బస్సు (నెంబరు ఎంపీ 13 పీ 3899) బయలుదేరింది. గన్నారం శివారు బ్రహ్మంగారి ఆలయం వద్దకు చేరుకోగానే డ్రైవర్ సంజయ్ అతివేగంగా అజాగ్రత్తగా నడపడంతో అదుపుతప్పి రోడ్డు పక్క ఉన్న హెచ్చరిక బోర్డు ను ఢీకొని రోడ్డు కిందకు దిగిపోయి బోల్తా పడింది. దీంతో బస్సులో ఉన్న మైగం మంజుషా(32), మైగం రుషి(7), రాహుల్ (40) అక్కడికక్కడే మృతి చెందగా, నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అబ్బాస్ (35) మృతి చెందాడు. 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటన జరిగిన వెంటనే వీరందరిని పోలీసులు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి తో పాటు ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మహారాష్ట్ర అకోలా, వాషిమ్, నాందేడ్ ప్రాంతాలకు చెందిన వీరంతా ఇక్కడ ప్రమాదానికి గురై ఆస్పత్రిలో కన్నీరుమున్నీరయ్యారు. గా యపడిన వారిలో ఐదురుగురు ప్రైవేట్ ఆస్పత్రిలో, మిగిలిన వారు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మహారాష్ట్రలోని వాషిమ్ జిల్లాకు చెందిన లక్ష్మన్ గాయపడగా, అతని భార్య మంజు ష, కొడుకు రిషి మృతి చెందారు. గాయపడిన వా రిలో యాదాద్రిభువనగిరి జిల్లాకు చెందిన ఒకరు, బెంగుళూరుకు చెందిన ఒకరు ఉండగా, ఎక్కువ మంది మహారాష్ట్రకు చెందిన వారు ఉన్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహిళ చికిత్స పొందుతూ మృతి చెందిన అబ్బాస్(బెంగళూరు)ప్రమాదంలో గాయపడి ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు కార్తీక్, అతిఽథి(అకోలా) జాతీయ రహదారిపై గన్నారం వద్ద ప్రైవేటు బస్సు బోల్తా నలుగురు మృతి, 17 మందికి తీవ్ర గాయాలు మృతుల్లో తల్లీకొడుకులు కళ్లముందు శవాలు, రక్తమోడుతున్న శరీరాలతో భయకంపితులైన ప్రయాణికులు -
ఆందోళన వద్దు
● జిల్లాకు సరిపడా ఎల్పీజీ సిలిండర్లు ● కలెక్టర్ ఇలా త్రిపాఠి వెల్లడి నిజామాబాద్ అర్బన్: వంట గ్యాస్ సిలిండర్ల విషయంలో ప్రజలెవరూ ఆందోళనకు గురికావొద్దని కలెక్టర్ ఇలా త్రిపాఠి పేర్కొన్నారు. జిల్లా అవసరాలకు సరిపడా నిల్వలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామని, జిల్లాలో గ్యాస్ కొరత ఎంతమాత్రం లేదని స్పష్టం చేశారు. వంట గ్యాస్ డిమాండ్, సరఫరా తీరుతెన్నులపై శుక్రవారం కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లా పర్యవేక్షక కమిటీ సమావేశంలో సమీక్షించారు. జిల్లాలో 5,81,769 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. 33 గ్యాస్ ఏజెన్సీల ద్వారా సరఫరా జరుగుతోంది. శుక్రవారం నాటికి 10,850 సిలిండర్లు జిల్లాలో గృహావసరాల కోసం పంపిణీ నిమిత్తం అందుబాటులో ఉన్నాయని, వీటికి అదనంగా మరో 5,875 సిలిండర్లు జిల్లాకు రానున్నాయని పౌర సరఫరాల శాఖ అధికారి శ్రీకాంత్ రెడ్డి కలెక్టర్ దృష్టికి తెచ్చారు. బుక్ చేసిన మూడు నుంచి నాలుగు రోజుల వ్యవధిలో గృహావసరాల సిలిండర్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ జిల్లాలో ఎవరైనా కృత్రిమ కొరత సృష్టించి, బ్లాక్ మార్కెట్లో సిలిండర్లను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తనిఖీలను ముమ్మరం చేయించామని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, వసతిగృహాలు, రెసిడెన్షియల్ స్కూల్స్, గురుకులాలు, ఆస్పత్రులు, అంగన్వాడీ కేంద్రాలు, అనాథాశ్రమాలకు ఇండెంట్లు అందిన వెంటనే సిలిండర్లు సరఫరా చేయాలని ఏజెన్సీల నిర్వాహకులకు సూచించారు. సమావేశంలో అ దనపు డీసీపీ బస్వారెడ్డి, ఇన్చార్జి అదనపు కలెక్టర్ దిలీప్ కుమార్, ఏఎస్వో అరవింద్ రెడ్డి, డీటీవో ఉమామహేశ్వర్ రావు, డీపీవో శ్రీనివాస్ రావు, డీడబ్ల్యూవో పద్మ, గ్యాస్ కంపెనీల సేల్స్ ఆఫీసర్లు, ఎల్పీజీ డీలర్లు పాల్గొన్నారు. -
గ్యాస్ కోసం బారులు
ఇరాన్ – ఇజ్రాయిల్ యుద్ధం ప్రభావం వంట గ్యాస్పై పడింది. ఆన్లైన్లో గ్యాస్ బుక్ కాకపోవడం, బుకింగ్కు నిబంధనలను విధుస్తుండడం గందరగోళ పరిస్థితులకు కారణమవుతున్నాయి. సర్వర్ బిజీ కారణంగా గ్యాస్ బుక్ కాకపోవడంతో గురువా రం జిల్లా కేంద్రంలోని గ్యాస్ ఏజెన్సీల ఎదుట వినియోగదారులు బారులు తీరారు. కమర్షియల్ సిలిండర్ల లభించకపోవడంతో హోటళ్లు, రెస్టారెంట్ల నిర్వాహకులు కట్టెలు, బొగ్గుల పొయ్యిపై వంటలు చేస్తున్నారు. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, నిజామాబాద్వార్ ఎఫెక్ట్ -
లోక్ అదాలత్ను విజయవంతం చేయాలి
● జిల్లా జడ్జి జీవీఎన్ భారతలక్ష్మి నిజామాబాద్ లీగల్: ఈ నెల 28న నిర్వహించను న్న లోక్ అదాలత్ను సమష్టిగా విజయవంతం చేయాలని జిల్లా జడ్జి జీవీఎన్ భారతలక్ష్మి పేర్కొ న్నారు. కోర్టులోని బార్ హాల్లో గురువారం న్యా యవాదులతో నిర్వహించిన సమావేశంలో జడ్జి మాట్లాడారు. కక్షిదారుల్లో సరైన అవగాహన లేక కోర్టుల్లో అనేక సంవత్సరాలుగా కేసులు పెండింగ్ లో ఉంటున్నాయని, వాటి సత్వర పరిష్కారం కోసం కక్షిదారులకు అవగాహన కల్పిస్తూ లోక్ అదాలత్లు నిర్వహిస్తున్నామని తెలిపారు. బార్, బెంచ్ మధ్య సయోధ్యతో కేసులను సత్వరం పరిష్కరించవచ్చని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వివిధ కోర్టు ల్లో న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్యలను జిల్లా జడ్జికి వివరించగా, న్యాయమూర్తులతో మా ట్లాడి సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు. బార్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మామిళ్ల సాయిరెడ్డి, బట్టు మాణిక్రాజు, న్యాయమూర్తులు హరీషా, శ్రీనివాసరావు, ధరావత్ దుర్గాప్రసాద్, వరూధిని, గోపీకృష్ణ, కుష్బూ ఉపాధ్యాయ, సీనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు. -
జవాబుదారీగా ఉంటూ సేవలందించాలి
డిచ్పల్లి(నిజామాబాద్రూరల్) : అభివృద్ధికి పాటుపడతారనే నమ్మకంతో గెలిపించిన ప్రజలకు జవాబుదారీగా నిలుస్తూ, వారికి మెరుగైన సేవలందించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు సూచించారు. నూతనంగా ఎన్నికై న నిజామాబాద్ నగర పాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు, బోధన్, ఆర్మూర్, భీమ్గల్ మున్సిపల్ చైర్ పర్సన్లు, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లకు ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. నిజామాబాద్ నగర శివారులోని బోర్గాం(పి)లో ఉన్న భూమారెడ్డి కన్వెన్షన్ హాల్లో కార్పొరేషన్, మున్సిపాలిటీల పాలకవర్గాలకు, అలాగే డిచ్పల్లి మండలం బర్ధిపూర్ శివారులోని అమృతాగార్డెన్స్లో జిల్లాలోని సర్పంచ్లకు అవగాహన కల్పించారు. ప్రగతి ప్రణాళికలో భాగంగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల అధికారాలు, విధులు, బాధ్యతల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరిస్తూ, ప్రింటెడ్ మెటీరియల్ను అందజేశారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ.. ప్రజాసమస్యల పరిష్కారమే లక్ష్యంగా పని చేయాలని, స మస్యలను గుర్తిస్తూ, వాటి పరిష్కారం కోసం స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకో వా లని అన్నారు. అధికారుల నుంచి సరైన సహకారం అందని పక్షంలో తన దృష్టికి తేవాలని, జిల్లా యంత్రాంగం తప్పక సహకరిస్తుందని కలెక్టర్ భరోసా ఇచ్చారు. అధికారాలు, హక్కుల గురించి స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నప్పుడే బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించగలుగుతార న్నారు. స్థానికంగా అందుబాటులో ఉన్న వనరుల ద్వారా స్థానిక సంస్థలకు ఆదాయ మార్గాలను పెంపొందించుకోవాలని సూచించారు. తాగునీరు, పారిశుద్ధ్యం, రహదారులు, విద్య, వైద్యం వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. అన్ని రంగాల్లో మహిళలకు ప్రాతినిధ్యం కల్పించాలనే సదుద్ధేశంతో స్థానిక సంస్థల్లో మహిళలకు ప్రభుత్వం 50 శాతం రిజర్వేషన్ కల్పించిందన్నారు. ఈ అవకాశాన్ని మహిళా కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, సర్పంచ్లు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుని, గ్రామాలు, వార్డుల్లో సమర్థవంతంగా సేవలు అందించాలని హితవు పలికారు. కుటుంబ సభ్యుల జోక్యానికి అవకాశం ఇవ్వకుండా, సొంత నిర్ణయాలతో గౌరవాన్ని పెంపొందించుకోవాలని, ఇది భవిష్యత్లో మరెన్నో ఉన్నత పదవులకు ఆస్కారం కల్పిస్తుందన్నారు. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా మాట్లాడుతూ.. ప్రజలకు సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ముందుకు సాగాలని అన్నారు. ప్రభుత్వం చేపట్టిన ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’లో అందరిని భాగస్వాములు చేస్తూ, కార్యక్రమం విజయవంతం అయ్యేలా చొరవ చూపాలన్నారు. రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి మాట్లాడుతూ.. ప్రజల అవసరాలను గుర్తిస్తూ, ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాల్సిన గురుతర బాధ్యత సర్పంచులపై ఉంటుందన్నారు. దేశాభివృద్ధికి గ్రామాలే పట్టుగొమ్మలన్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థ ప్రస్తుతం పటిష్టంగా కొనసాగడానికి ప్రధాన కారణం గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన సమూల మార్పులేనని పేర్కొన్నారు. పార్టీలకు అతీతంగా అన్ని గ్రామాల అభివృద్ధికి తాను కృషి చేస్తానని అన్నారు. నిజామాబాద్ నగర మేయర్ కే.ఉమారాణి, డిప్యూటీ మేయర్ సల్మా తహసీన్, కార్పొరేటర్లు, ఆర్మూర్, బోధన్, భీమ్గల్ మున్సిపాలిటీల చైర్పర్సన్లు, కౌన్సిర్లు, ఆయా గ్రామాల సర్పంచులు, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, ఇన్చార్జి అదనపు కలెక్టర్ దిలీప్కుమార్, నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, డీపీవో శ్రీనివాస్ రావు, డీఆర్డీవో సాయాగౌడ్, డీఈవో అశోక్, ఏవో రాజబాబు, అధికారులు పాల్గొన్నారు. మాట్లాడుతున్న ఎమ్మెల్యేలు ధన్పాల్, భూపతిరెడ్డి అవగాహన సదస్సుల్లో పాల్గొన్న మున్సిపల్ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, సర్పంచులు.. స్థానిక వనరుల ద్వారా ఆదాయాన్ని పెంచుకోండి ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలి దృఢ సంకల్పంతో ముందుకు సాగాలి ‘ప్రగతి ప్రణాళిక’ అవగాహన సదస్సుల్లో కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎమ్మెల్యేలు ధన్పాల్, భూపతిరెడ్డి -
వేం నరేందర్రెడ్డిని కలిసిన సుదర్శన్ రెడ్డి
నిజామాబాద్ రూరల్: కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్రెడ్డిని హైదరాబాద్లోని ఆయన నివాసంలో ప్రభుత్వ సల హాదారు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కాటిపల్లి నగేష్రెడ్డి గురువారం మర్యదపూర్వకంగా కలిశారు. నరేందర్రెడ్డిని వారు సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఉన్నారు. అగ్ని ప్రమాదంలో సీజ్డ్ వాహనాలు దగ్ధం ఆర్మూర్ టౌన్: ఆర్మూర్ పోలీస్ స్టేషన్ ఆవరణలో గురువారం సాయంత్రం ప్రమాదవశాత్తు సంభవించిన అగ్ని ప్రమాదంలో పలు కేసుల్లో సీజ్డ్ చేసిన వాహనాలు దగ్ధమయ్యా యి. ఎస్హెచ్వో సత్యనారాయణ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. పోలీస్ స్టేషన్ వెను క భాగంలో ప్రమాదవశాత్తు మంటలు అంటుకుని వాహనాలు పార్కింగ్ చేసిన చోటికి వ్యాపించాయి. మంటల్లో 15 బైక్లు, 10 ఆటోలు, నాలుగు కార్లు పూర్తిగా దగ్ధమ య్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది సురేశ్, విజేందర్ రె డ్డి, శ్రవణ్, మారుతి ఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. 630 మంది విద్యార్థులు గైర్హాజరు ఖలీల్వాడి : జిల్లాలో గురువారం ఇంటర్ మొదటి సంవత్సరం రసాయనశాస్త్రం, వా ణిజ్య శాస్త్రం, ఒకేషనల్ బ్రిడ్జి కోర్సు పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు జిల్లా ఇంటర్ విద్యాధికారి రవికుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షలకు మొత్తం 19,525 మంది విద్యార్థులకు గాను 18,895 మంది హాజ రయ్యారని పేర్కొన్నారు. 630 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు తెలిపారు. మొత్తం 58 పరీక్షా కేంద్రాలకుగాను 56 పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసి సమీక్షించామని పేర్కొ న్నారు. పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులు 15, హైపవర్ కమిటీ 7, సిట్టింగ్, ఫ్లయింగ్ స్క్వాడ్లు మొత్తం 26 పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసినట్లు తెలిపారు. జిల్లా స్థాయి మౌఖిక పరీక్ష పూర్తి ఖలీల్వాడి: నగరంలోని జవహర్ నవోదయ పాఠశాలలో గురువారం జిల్లాస్థాయి ప్రేరణ ఉత్సవం మౌఖిక పరీక్ష నిర్వహించారు. పరీక్షలకు జిల్లాలోని వివిధ యాజమాన్య పాఠశాలల నుంచి 30 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, కమ్యూనికేషన్ స్కిల్స్, నాయకత్వ లక్షణాలు, పర్సనాలిటీ డెవలప్మెంట్ తదితర అంశాల్లో న్యాయ నిర్ణేతలు పరీక్షలు నిర్వహించారు. మూల్యాంకన వివరాలను ప్రేరణ ఆన్లైన్ పోర్టల్ పొందుపర్చినట్లు డీఈవో అశోక్ తెలిపారు. పాల్గొన్న విద్యార్థుల నుంచి ఒక బాలిక, ఒక బాలుడిని ఎంపిక చేసి జాతీయస్థాయిలో జరిగే శిబిరానికి పంపుతామన్నారు. జేఎన్వీ నిజాంసాగర్ ప్రిన్సిపల్ రాంబాబు, కోఆర్డినేటర్ ప్రవీణ్, జిల్లా సైన్స్ అధికారి గంగాకిషన్, స్థానిక జేఎన్వీ పాఠశాల ప్రిన్సిపల్ జోజిబాబు పాల్గొన్నారు. కామారెడ్డి టౌన్ : కామారెడ్డిలో ఫ్ల యింగ్ అకాడమీ ఏర్పాటు చేయా లని ఎమ్మెల్యే కా టిపల్లి వెంకటరమణారెడ్డి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడును కోరారు. గురువారం ఢిల్లీలో ఆయన కేంద్ర మంత్రిని కలిసి వినతి పత్రాన్ని అందించారు. -
సమావేశాలకు శాశ్వత వేదిక
మండలాల వారీగా మంజూరైన భవనాలుడొంకేశ్వర్(ఆర్మూర్) : కేంద్ర ప్రభుత్వం ఉపాధిహా మీ పథకం (వీబీజీరామ్జీ) కింద గ్రామాల్లో మహి ళా సంఘాల (గ్రామ సమాఖ్య) కోసం శాశ్వత భవనాలను నిర్మిస్తోంది. జిల్లాకు 291 భవనాలు మంజూరు కాగా ఒక్కో దానికి రూ.10లక్షలు ఖర్చు చే స్తోంది. భవన నిర్మాణ బాధ్యతలను పంచాయ తీరాజ్ ఇంజనీరింగ్ శాఖకు అప్పగించగా గ్రామ పంచాయతీలే కాంట్రాక్టర్లను వెతుకుతున్నాయి. కొ న్ని గ్రామాల్లో పనులు ప్రారంభమై గ్రౌండింగ్ దశ లో ఉన్నాయి. ఉపాధిహామీ నిధులు ఆలస్యంగా వస్తున్నాయనే కారణంతో చాలా చోట్ల వీవో భవనాలను నిర్మించేందుకు గుత్తేదార్లు ముందుకు రావడం లేదు. కొన్ని చోట్ల స్థల సమస్య కూడా ఉంది. మంజూరైన గ్రామాల్లో ప్రస్తుతం జరుగుతున్న ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో పనులు ప్రారంభించుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇటీవల వీవో భవనాల కోసం అవసరమున్న గ్రామ పంచాయతీలు తీర్మానాలు చేసి ఎంపీడీవో కార్యాలయల ద్వారా గ్రామీణాభివృద్ధి శాఖకు పంపాయి. 80 స్కూళ్లలో 103 టాయిలెట్లు.. మోర్తాడ్(బాల్కొండ) : ఉపాధిహామీ పథకం (వీబీజీరామ్జీ) నిధులతో మహిళా సంఘాలకు సొంత భవనాలతోపాటు జిల్లాలోని 80 పాఠశాలల్లో 103 టాయిలెట్లను నిర్మించాలని నిర్ణయించారు. ఇందు కోసం రూ.2.06 కోట్లు కేటాయించారు. ఆర్థిక సంవత్సరం ముగింపు దశకు చేరుకుంటుండటంతో పనులను వేగంగా పూర్తి చేయాలని ఒత్తిడి వస్తోంది. ఆలూర్ 09 ఆర్మూర్ 02 బాల్కొండ 09 భీమ్గల్ 22 బోధన్ 24 చందూర్ 03 ధర్పల్లి 12 డిచ్పల్లి 31 డొంకేశ్వర్ 12 ఇందల్వాయి 07 జక్రాన్పల్లి 16 కమ్మర్పల్లి 14 కోటగిరి 10 మాక్లూర్ 18 మోర్తాడ్ 02 మోస్రా 02 మోపాల్ 13 ముప్కాల్ 02 నవీపేట్ 17 నిజామాబాద్ 05 పొతంగల్ 15 సాలూరా 12 సిరికొండ 12 వర్ని 05 ఎడపల్లి 11 ఏర్గట్ల 06 -
పెద్దపులి వేట
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ – సిరిసిల్ల – జగిత్యాల జిల్లాల అటవీ ప్రాంతాల్లో చక్కర్లు కొడుతున్న పెద్దపులి గురువారం రెండు ఆవులను వేటాడి చంపింది. కమ్మర్పల్లి రేంజ్ పరిధిలోని భీమ్గల్ మండలం దేవక్కపేట్ అటవీ ప్రాంతంలో బూక్యా చంద్ర, సోమరి మంగ్యాలకు చెందిన ఆవులను హతమార్చింది. నిజామాబాద్, సిరిసిల్ల జిల్లాల మధ్య ఉన్న అటవీ ప్రాంతాల్లోనే పులి చక్కర్లు కొడుతోంది. కొన్ని నెలల కిందట మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా మీదుగా వచ్చిన మగ పులి.. జగిత్యాల, సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల మీదుగా భువనగిరి జిల్లా వరకు వెళ్లి మళ్లీ అదే దారిన తిరిగి వచ్చింది. అయితే గత పది రోజులుగా నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల మధ్య తిరుగుతోంది. మహారాష్ట్ర నుంచి వచ్చేటప్పుడు గోదావరి నది దాటి వచ్చినప్పటికీ మళ్లీ ఆ నది దాటి వెళ్లకుండా ఇక్కడిక్కడే తిరుగుతుండడం గమనార్హం. తోడు కోసం వెతుకుతోందా? లేక వన్యప్రాణులు పుష్కలంగా ఉండడంతోపాటు నీళ్లు సైతం చాలాచోట్ల పుష్కలంగా లభిస్తుండడంతో ఇక్కడే ఉంటోందా అనే చర్చ జరుగుతోంది. అటవీ అధికారుల విచిత్ర వైఖరి పెద్ద పులి సంచారం నేపథ్యంలో అన్ని విషయాలను నిశితంగా గమనిస్తున్న అటవీ శాఖ అధికారులు ఆయా ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయాల్సి ఉన్నప్పటికీ కొంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పులికి సంబంధించిన సమాచారం విషయంలో అత్యంత గోప్యత పాటిస్తున్నారు. పైగా పులికి సంబంధించిన సంరక్షణ విషయంలో కచ్చితమైన చర్యలు తీసుకోకుండా, పులి సంచారానికి సంబంధించిన సమాచారం బయటకు ఎలా వెళ్తోందనే విషయంపై శోధన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై అటవీ శాఖ వర్గాల్లోనే తీవ్రమైన చర్చ జరుగుతోంది.దేవక్కపేట్ అటవీప్రాంతంలో ఆవు కళేబరంకమ్మర్పల్లి ఫారెస్ట్ రేంజ్లో రెండు ఆవులను చంపిన వ్యాఘ్రం గోదావరి దాటొచ్చి ఇక్కడే తిరుగుతోంది.. పులి సంచారంపై అటవీశాఖ గోప్యత! ప్రజలను అప్రమత్తం చేయడం మరిచారనే విమర్శలు జిల్లాలో చక్కర్లు కొడుతున్న పెద్దపులి కమ్మర్పల్లి రేంజ్లోని దేవక్కపేట అటవీ ప్రాంతంలో రెండు ఆవులను చంపింది. పెద్దపులి సమాచారం విషయంలో గోప్యత పాటిస్తున్న అటవీ అధికారు లు ప్రజలను అప్రమత్తం చేయడంపై శ్రద్ధ చూపడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
విమాన టికెట్ ధరలకు రెక్కలు
● ఇజ్రాయిల్ నుంచి ఇండియాకు రూ.1.50 లక్షలు ● సాధారణ రోజుల్లో రూ.30 వేలలోపు టికెట్ ధర ● జోర్డాన్ మీదుగా పంపించేందుకు భారీ మొత్తంలో చార్జీల వసూలు ● తమపై తీవ్ర భారం పడుతోందని వలస కార్మికుల ఆవేదన మోర్తాడ్(బాల్కొండ): యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ఇజ్రాయిల్ నుంచి స్వదేశానికి వచ్చేయాలని అనుకుంటున్న వలస కార్మికులకు విమాన టికెట్ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. సాధారణ రోజుల్లో రూ.30 వేలలోపు ఉన్న టికెట్ ధర ఏకంగా రూ.1.50 లక్షలకు చేరిందని వలస కార్మికులు వాపోతున్నారు. ఇజ్రాయిల్ నుంచి విమానాలను నిలపివేయడంతో రోడ్డు, జలమార్గంలో జోర్డాన్కు ట్రావెల్స్ సంస్థలు వలస కార్మికులను తరలిస్తున్నాయి. అక్కడి నుంచి ముంబైకి రూ.1.50లక్షలతో విమాన టికెట్ను కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఓ వైపు యుద్ధం రోజురోజుకు తీవ్రమవుతుండగా, మరోవైపు తాము ఇంటికి రాలేక పోతున్నామని వలస కార్మికులు అంటున్నారు. దుబాయి నుంచి.. దుబాయి నుంచి హైదరాబాద్కు విమాన టికె ట్ సాధారణ రోజుల్లో రూ.9వేల నుంచి రూ. 10వేలు ఉండగా.. ఇప్పుడు ఏకంగా రూ.30 వేల నుంచి రూ.40వేలకు పెరిగింది. కువైట్, బహ్రెయిన్ల నుంచి వచ్చే అవకాశం లేకపోవడంతో కొందరు దుబాయ్కి రోడ్డు మార్గంలో వెళ్లి ఇంటికి వచ్చే ఆలోచన చేస్తున్నారు. అయితే అక్కడి నుంచి కూడా అత్యధికంగా విమాన చార్జీలు వసూలు చేస్తుండటంతో వలస కార్మికులు బెంబెలెత్తిపోతున్నారు. విదేశాంగ శాఖ స్పందించి తమను సురక్షితంగా రప్పించేందుకు ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేయాలని వలస కార్మికులు కోరుతున్నారు. -
కాల్వలోకి దూసుకెళ్లిన కారు
● ఒకరి మృతి, మరొకరికి తీవ్రగాయాలు మాక్లూర్: కారు అదుపుతప్పి కాల్వలోకి దూసుకెళ్లిన ప్రమాదంలో ఓ యువకుడు మరణించగా, మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. ఆలూర్ మండలం గుత్ప గ్రామ శివారులో బుధవారం అర్ధరాత్రి ప్ర మాదం చోటు చేసుకుంది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుత్ప గ్రామానికి చెందిన బైరి పెద్ద నారాయణ (31), క్యాసెల్ ప్రవీణ్ బుధవారం అర్ధరాత్రి కారులో గుత్ప నుంచి ఆలూ ర్ వైపు వెళ్తున్నారు. గ్రామానికి కొద్ది దూరంలో ఉన్న కాల్వ వద్ద కారు అదుపుతప్పి పడిపోయింది. దీంతో డ్రైవింగ్ సీటులో ఉన్న నారాయణ అక్కడికక్కడే మృతి చెందగా, ప్రవీణ్ తీవ్రంగా గాయపడ్డా డు. విషయం తెలిసిన గ్రామస్తులు ఘటనా స్థలాని కి చేరుకొని ప్రవీణ్ను చికిత్స నిమిత్తం అంబులెన్స్లో జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇవ్వటంతో మాక్లూర్ ఎస్సై రాజశేఖర్ ఘట నా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు. కారు అతివేగమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. మృతుడు నారాయణకు వివాహం జరిగి విడాకులు అయ్యాయి. గాయపడ్డ ప్రవీణ్ ప్రస్తుతం కోలుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. -
ప్రజారోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి
కలెక్టర్ ఇలా త్రిపాఠి పెర్కిట్(ఆర్మూర్): అధికారులు క్రమం తప్పకుండా ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తూ ప్రజారోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి పేర్కొన్నారు. ఆర్మూర్ మండలం గోవింద్పేట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పీహెచ్సీలో రోగులకు కల్పిస్తున్న సుదపాయాలు, అందుబాటులో ఉన్న ఔషధాల రికార్డులను పరిశీలించారు. అలాగే సిబ్బంది హాజరును తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు ముందస్తుగా సమాచారం అందజేస్తూ ప్రత్యేక శిబిరాలు నిర్వహించాలన్నారు. దీంతోపాటు కేజీబీవీ, జ్యోతిబా ఫూలే పాఠశాల, సంక్షేమ వసతి గృహాల్లో క్రమం తప్పకుండా వైద్య శిబిరాలు నిర్వహించాలని సూచించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన, ప్రగతి ప్రణాళికలో కార్యక్రమాలను పకడ్బందీగా అమలు చేయాలన్నారు. కలెక్టర్ వెంట డీఎంహెచ్వో రాజశ్రీ, పీహెచ్సీ వైద్యాధికారిణి మానస, వైద్య సిబ్బంది ఉన్నారు. -
టేబుల్ టెన్నిస్లో అదరహో
● ప్రతిభ చాటుతున్న కాకతీయ విద్యార్థులు ● జిల్లా, రాష్ట్రస్థాయి బహుమతులు కై వసం నిజామాబాద్ అర్బన్: పిల్లల్ని ప్రోత్సహిస్తే ఎందులోనైనా రాణిస్తారు. చదువులు, ఆటపాటల్లో ఒకేసారి సత్తాచాటుతారు. చదువులో ప్రతిభ చాటుతూనే టేబుల్ టెన్నిస్లో తిరుగులేదంటున్నారు జిల్లాకు చెందిన కాకతీయ పాఠశాల విద్యార్థులు. కోచ్ వినయ్ సాగర్ సలహాలు, సూచనలు పాటిస్తూ ఉత్తమ ప్రదర్శన ఇస్తున్నారు. కాకతీయ ఒలంపియాడ్ పాఠశాలకు చెందిన 10వ తరగతి విద్యార్థి షేక్ నౌషన్ మూడేళ్లలో జిల్లా స్థాయిలో పోటీపడి ప్రథమ స్థానాన్ని కై వసం చేసుకున్నాడు. 2023 ఎస్జీఎఫ్ అండర్–14లో జిల్లా స్థాయి ప్రథమ స్థానం సాధించి రాష్ట్రస్థాయికి ఎంపిక అయ్యాడు. 2024 అండర్–17లో భాగంగా రాష్ట్రస్థాయిలో ఆడి మూడో స్థానంలో నిలిచాడు. 2024 జిల్లా స్థాయి సీఎం కప్ పోటీల్లో ప్రథమ స్థానం సాధించి, రాష్ట్రస్థాయికి ఎంపికయ్యాడు. 2025 ఎస్జీఎఫ్ అండర్–17లో జిల్లా స్థాయి ప్రథమ, సీఎం కప్ పోటీలలో రాష్ట్రస్థాయి బహుమతులు సాధించాడు. పదో తరగతికి చెందిన మరో విద్యార్థి భవానీ ప్రసాద్ 2024 ఎస్జీఎఫ్ అండర్–17 టేబుల్ టెన్నిస్ పోటీలలో జిల్లాస్థాయిలో రెండో స్థానం సాధించి రాష్ట్రస్థాయికి ఎంపికయ్యాడు. రాష్ట్రస్థాయిలో మూడో స్థానంలో నిలిచాడు. 2025 ఎస్జీఎఫ్ అండర్–17 విభాగంలో రాష్ట్రస్థాయిలో రెండో స్థానంలో నిలిచాడు. 2024, 2025 సీఎం కప్ జిల్లా స్థాయి పోటీల్లో రెండో స్థానం సాధించాడు. విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను గుర్తించి దానికి అనుకూలంగా ప్రోత్సహించడం ఎంతో ముఖ్యం. భవానీప్రసాద్ టేబుల్ టెన్నిస్లో ఉత్తమ ప్రదర్శన కనబరుస్తున్నాడు. క్రీడాకారులను మరింత ప్రతిభావంతులుగా తీర్చిదిద్దుతా. – వినయ్సాగర్, కోచ్ మా కోచ్ వల్లే నేను ఉత్తమ ప్రదర్శన ఇవ్వగలుగుతున్నాను. జాతీయ స్థాయిలో మెరుగైన ప్రతిభ కనబర్చి జిల్లాకు పేరు ప్రతిష్టలు తీసుకువస్తాను. – భవానీ ప్రసాద్, క్రీడాకారుడు -
ప్రమాదవశాత్తు చెరువులోపడి ఒకరి మృతి
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): ప్రమాదవశాత్తు చెరువులో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన మండల కేంద్ర శివారులో గురువారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. లింగంపేట మండలంలోని లొంకలపల్లి గ్రా మానికి చెందిన తొనిగండ్ల సంజీవులు(58)కు 35ఏళ్ల క్రితం వివాహం జ రిగింది. జీవనోపాధి నిమిత్తం సంజీవులు తన భార్యతో కలిసి ముంబై వెళ్లాడు. అక్కడ గ్యాస్ సిలిండర్ లీకై జరిగిన ప్రమాదంలో భార్య మరణించింది. అప్పటి నుంచి సంజీవులు మతిస్థిమితం కోల్పోయి లొంకలపల్లి లోని తమ్ముడు సాయిలు వద్దే ఉంటున్నాడు. సంజీవులు అప్పుడప్పుడు సైకిల్పై శెట్పల్లి సంగారెడ్డి, గోపాల్పేట గ్రామాల్లో తిరుగుతూ భిక్షాటన చేస్తుంటాడు. గురువారం నాగిరెడ్డిపేట గ్రామశివారులోని పటేల్చెరువు గట్టుపై సంజీవులుకు చెందిన సైకిల్ ఉండగా చెరువులో మృతదేహాం తేలియాడుతుందని తెలుసుకొని సాయిలు అక్కడికి వెళ్లి చూడగా సంజీవులు మృతదేహంగా గుర్తించారు. సంజీవులు కాలకృత్యాలు తీర్చుకునే క్రమంలో ప్రమాదవశాత్తు పటేల్ చెరువులోపడి మృతిచెందినట్లు ఎస్సై భార్గవ్గౌడ్ తెలిపారు. మృతుడి తమ్ముడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఆయన చెప్పారు. నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): జీవితంపై విరక్తితో ఓ వ్యక్తి పోచారం ప్రాజెక్టులో దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గురువారం వెలుగుచూసింది. వివరాలు ఇలా ఉన్నాయి. నాగిరెడ్డిపేట మండలంలోని ఏర్రారం గ్రామానికి చెందిన దూదేకుల జహంగీర్(25)కు షన్నుతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. జీవనోపాధి నిమిత్తం ఐదేళ్లుగా మెదక్లో నివసిస్తున్నారు. కాగా, ఈ నెల 11న ఉదయం పాలు తీసుకువస్తానని చెప్పి జహంగీర్ ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. దీంతో భార్య షన్ను కుటుంబ సభ్యుల సహకారంతో జహంగీర్ కోసం పలుచోట్ల గాలించినప్పటికీ ఆచూకీ లభించలేదు. గురువారం పోచారం ప్రాజెక్టులో మృతదేహాం తేలియాడుతుండ డాన్ని గుర్తించి జాలర్లు బయటికి తీశారు. మృతుడు జహంగీర్గా గుర్తించి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు నాగిరెడ్డిపేట ఎస్సై భార్గవ్గౌడ్ తెలిపారు. -
దోషులను వదలబోం
ఇందల్వాయి: మాజీ ఎంపీపీ ఇమ్మడి గోపి హత్యకు కారకులైన వారిని వదలబోమని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి పేర్కొన్నారు. బుధవారం రాత్రి దారుణహత్యకు గురైన ఇమ్మడి గోపి మృతదేహం పోస్టుమార్టం అనంతరం గురువారం సాయంత్రం స్వగ్రామం లింగాపూర్కు చేరుకుంది. ఎమ్మెల్యే భూపతి రెడ్డి లింగాపూర్కు చేరుకొని గోపి మృతదేహానికి నివాళులర్పించి, అతని కుటుంబసభ్యులను పరామర్శించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ సీనియర్ నాయకుడిని కోల్పోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తంచేశారు. పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ చేపట్టి దోషులకు శిక్షపడేలా చూడాలని అన్నారు. రాజకీయ కక్షల కారణంగా హింసను ప్రేరేపించడం సహించబోమని అన్నారు. మృతుడి భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని, పలువురు అనుమానితులను విచారిస్తున్నట్లు ఎస్సై సందీప్ తెలిపారు. కాగా, విదేశాల్లో ఉన్న కొడుకు, కూతురు వచ్చిన తర్వాత అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ● ఎమ్మెల్యే భూపతిరెడ్డి ● ఇమ్మడి గోపి కుటుంబానికి పరామర్శ -
ప్రభుత్వ స్థలం కబ్జాపై అధికారుల విచారణ
● సీఎం ప్రజావాణిలో గ్రామస్తుడి ఫిర్యాదు రెంజల్(బోధన్): మండలంలోని నీలా గ్రామంలో ప్రభుత్వ స్థలం కబ్జాపై అధికారులు విచారణ చేపట్టారు. సర్వే నంబర్ 745లోని ప్రభుత్వ భూమిని కబ్జా చేసి స్థానిక ప్రజాప్రతినిధి ఒకరు విక్రయించుకునే ప్రయత్నం చేస్తున్నట్లు గ్రామానికి చెందిన గౌరాజి విఠల్ 2024 ఏప్రిల్ నెల 29న కలెక్టరేట్లోని ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. అధికారులు స్పందించకపోవడంతో హైదరాబాద్లోని సీఎం ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. దీంతో బోధన్ సబ్ కలెక్టర్ ఆదేశాల మేరకు తహసీల్దార్ శ్రావణ్కుమార్తోపాటు ఎమ్మారై ఫహీంలు గ్రామానికి చేరుకొని సర్వే చేపట్టారు. రెవెన్యూ రికార్డులో శ్మశాన వాటికిగా ఉన్న స్థలాన్ని గ్రామానికి చెందిన ఓ నాయకుడు తన పలుకుబడితో పంచాయతీ కార్యదర్శిపై ఒత్తిడి తీసుకువచ్చి తన పేరున లేని ఇంటికి నంబర్ మార్పిడి చేసుకున్నట్లు ఫిర్యాదులో వివరించారు. తమ పూర్వీకుల ఆస్తులు ప్రభుత్వ స్థలం పక్కనే ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వ స్థలంలోని కొంత భాగాన్ని ఆ ప్రజాప్రతినిధి పక్కనే గల ఇంటి వ్యక్తికి అనధికారికంగా విక్రయించినట్లు ఫిర్యాదులో ఆరోపించారు. కబ్జా నుంచి ప్రభుత్వ భూమిని కాపాడాలని అధికారులకు విన్నవించారు. కాగా, ఈ విషయమై ఎమ్మారైను వివరణ కోరగా అధికారుల ఆదేశాల మేరకు విచారణ చేపట్టామని, నివేదికను జిల్లా అధికారులకు అందజేస్తామన్నారు. -
ఇంటి బాట..
ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు గురువారం ముగిశాయి. పరీక్షలు ముగియడంతో కేంద్రాల వద్ద విద్యార్థులు సంతోషం వ్యక్తంచేస్తూ కనిపించారు. కేరింతలు కొడుతూ స్నేహితులకు వీడ్కోలు పలికారు. వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థులు తమ లగేజీలను పట్టుకొని ఇంటిబాట పట్టారు. విద్యార్థులు, తల్లిదండ్రులతో బస్టాండ్, రైల్వే స్టేషన్ ప్రాంగణాలు కిటకిటలాడాయి. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, నిజామాబాద్ లగేజీతో ఇంటికి వెళ్తున్న విద్యార్థిప్రయాణికులతో కిక్కిరిసిన బస్టాండ్బస్సులో సీటు కోసం.. -
తాడ్కోల్లో ఒకరి అదృశ్యం
బాన్సువాడ రూరల్: మండలంలోని తాడ్కోల్ గ్రామానికి చెందిన గూడెంల సాయిలు అనే వ్యక్తి అదృశ్యమైనట్లు సీఐ తుల శ్రీధర్ తెలిపారు. ఈ నెల 11న చేపలు పట్టేందుకు వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి తిరిగి రాలేదని పేర్కొన్నారు. సాయిలు కుటుంబసభ్యులు గురువారం ఫిర్యాదు చేశారని తెలిపారు. ఇంట్లో నుంచి వెళ్లే సమయంలో తెల్లని ధోవతి, తెలుపురంగు చొక్కా ధరించి ఉన్నాడని, చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభించలేదని పేర్కొన్నారు. నవీపేట: మండలంలోని అబ్బాపూర్ (ఎం) గ్రామా నికి చెందిన ప్రేమజంట గురువారం పోలీసులను ఆశ్రయించింది. ఒకే కులానికి చెందిన డొక్కలి వినీత్కుమార్, బట్టు శైలజ రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇరువురి పెళ్లికి పెద్దలు అడ్డు చెప్పడంతో నిజామాబాద్ నగరంలోని మాధవనగర్ రామాలయంలో పెళ్లి చేసుకున్నారు. రక్షణ కల్పించాలని ఎస్సై శ్రీకాంత్ను ఆశ్రయించగా ఇరువురి తల్లిదండ్రులు స్టేషన్కు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. సిరికొండ: చోరీ కేసులో నిందితుడికి ఏడాది జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారని ఎస్సై రామకృష్ణ గురువారం తెలిపారు. మెట్టుమర్రి తండాలో 2019లో చోరీ జరగగా, నిందితుడు కేతావత్ రవిపై కేసు నమోదైనట్లు ఎస్సై పేర్కొన్నారు. కేసును విచారించిన ఆర్మూర్ కోర్టు న్యాయమూర్తి భవ్యశ్రీ నిందితుడు రవికి ఒక సంవత్సరం సాధారణ జైలు శిక్ష, రూ. 5 వేల జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించారని ఎస్సై తెలిపారు. నిజామాబాద్ లీగల్: ఇద్దరు వ్యక్తులపై హత్యకు యత్నించిన నిందితుడికి ఐదేళ్ల జైలు శిక్ష, రూ.100 జరిమానా విధిస్తూ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి సాయిసుధ తీర్పునిచ్చారు. డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ లక్ష్మినర్సయ్య తెలిపిన వివరాల ప్రకారం..రూరల్ పోలీసు స్టేషన్ పరిధిలోని గుండారం గ్రామంలో 30 ఆగస్టు, 2020న షేక్ షాదుల్లా, సుల్తాన్ ఖాన్లపై ఆనంద్ శర్మ అనే నిందితుడు కర్రతో దాడి చేశాడు. దాడిలో షాదుల్లా, సుల్తాన్ తీవ్రంగా గాయపడ్డారు. బాధితుల స్నేహితుడు షేక్ లాయక్ ఇచ్చిన ఫిర్యాదుతో నిజామాబాద్ రూరల్ పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. కేసు పూర్వాపరాలు పరిశీలించిన అసిస్టెంట్ సెషన్స్ జడ్జి సాయిసుధ నిందితుడికి జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు. షార్ట్ సర్క్యూట్తో ఇల్లు దగ్ధం సదాశివనగర్(ఎల్లారెడ్డి):మండలంలోని తిర్మన్పల్లి గ్రామంలో గురువారం మధ్యాహ్నం ఓ పెంకుటిల్లు షార్ట్ సర్క్యూట్తో దగ్ధమైంది. గ్రామంలోని సున్న పు రాజు నివాసపు ఇల్లు షార్ట్ సర్క్యూట్తో దగ్ధమైనట్లు గ్రామస్తులు తెలిపారు. విషయం తెలుసుకు న్న ఎస్సై పుష్పరాజ్ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. -
కంటి చూపును కబళించే ‘గ్లకోమా’
● ముందుగా గుర్తిస్తే అంధత్వ నివారణ ● చూపు తగ్గితే.. తిరిగి రాదు! ● డాక్టర్ టి.శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ వైద్యులు నిజామాబాద్ అర్బన్: సర్వేంద్రియాణాం నయనం ప్రధానం అని పెద్దలు చెబుతుంటారు. కానీ, కంటికి గ్లకోమా నుంచి అనేక విధాల ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇంట్రా ఆక్యులర్ ప్రెషర్ (ఐవోపీ) ఎక్కువ కావడం, కంటి నరాలు దెబ్బతినడంతో ఏర్పడే రుగ్మతే గ్లకోమా అని డాక్టర్ టి.శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ వైద్యులు టి.శ్రీనివాస్ చెప్తున్నారు. కంటి నుంచి మెదడుకు దృష్టి సంకేతాలను తీసుకెళ్లే బాధ్యత కంటి నరాలదే. గ్లకోమాను తొలిదశలోనే గుర్తించకపోతే చూపు కోల్పేయే ప్రమాదం ఉందని, తొలిదశలో గుర్తిస్తే దీనికి మంచి మందులు, శస్త్రచికిత్సలు అందుబాటులో ఉన్నాయి. దీంతో శాశ్వత అంధత్వం బారిన పడకుండా కాపాడుకోవచ్చని డాక్టర్ టి.శ్రీనివాస్ పేర్కొంటున్నారు. గ్లకోమా వారోత్సవాల సందర్భంగా గ్లకోమా అంశంపై ప్రజలకు అవగాహన అవసరమన్నారు. గ్లకోమా ఎందుకొస్తుంది..? గ్లకోమాకు మూలం కంట్లో ఒత్తిడి పెరగటం. మనం కంటితో చూసేవన్నీ దృశ్యనాడి ద్వారా మెదడుకు చేరతాయి. అప్పుడే ఆయా దశ్యాలు మనకు కనిపిస్తాయి. అయితే కంట్లో ఒత్తిడి పెరిగితే ఈ దృశ్యనాడి దెబ్బతినడం ప్రారంభమవుతుంది. దీంతో చూపు పరిధి తగ్గటం మొదలవుతుంది. నెమ్మదిగా.. చివరికి పూర్తి అంధత్వానికి దారితీస్తుంది. నిర్ధారించడం ఎలా? బోనోమెట్రీ పరీక్ష ద్వారా కంట్లో ఒత్తిడిని గుర్తిస్తారు. అలాగే కంట్లో చుక్కల మందు వేసి కనుపాప పెద్దగా ఆయ్యాక లోపల దృశ్యనాడి ఎలా ఉందో చూస్తారు. దృశ్యనాడిలో ఏదైనా తేడా ఉంటే చూపు పరిధిని తెలిపే పెరిమెట్రీ పరీక్ష చేస్తారు. గ్లకోమా నిర్ధారణకు ఇది ముఖ్యమైన పరీక్ష. నీటికాసుల్లో చుట్టుపక్కల నుంచి చూపు పరిధి తగ్గుతూ వస్తుంది. అందుకే తల తిప్పకుండా చూస్తున్నప్పుడు చుట్టుపక్కల ఉన్నవి కనిపించే పరిధి తగ్గుతోందా? అనేది ఇందులో బయటపడుతుంది. జబ్బు నిర్ధారణకే కాదు. తీవ్రత తెలుసుకోవటానికి, మందుల పనితీరును గుర్తించటానికీ ఇది ఉపయోగపడుతుంది. చికిత్స ఇలా.. కంట్లో ఒత్తిడిని తగ్గిస్తే దృశ్యనాడి దెబ్బతినకుండా చూసుకోవచ్చు. గ్లకోమాలో ఉన్న చూపును కాపాడుకోవటం తప్పించి చేయగలిగిందేమీ లేదు. అందుకే ఎంత త్వరగా చికిత్స తీసుకుంటే అంత మంచిది. కంట్లో ఒత్తిడి తగ్గటానికి చుక్కల మందులు ఉపయోగపడతాయి. -
మెగా జాబ్మేళాలో 277 మంది ఎంపిక
● బోధన్ ఉషోదయ డిగ్రీ కళాశాలలో నిర్వహణ బోధన్టౌన్(బోధన్): పట్టణంలోని ఉషోదయ డిగ్రీ కళాశాలలో గురువారం మెగా జాబ్మేళా నిర్వహించారు. జాబ్ మేళాలో 11 కంపెనీలు పాల్గొనగా 450 మంది విద్యార్థులు హాజరయ్యారు. మొత్తం 277 మందిని 11 కంపెనీలు ఎంపిక చేసుకున్నాయి. అనంతరం వివిధ కంపెనీల హెచ్ఆర్లు, కళాశాల సెక్రెటరీ, టాస్క్ జిల్లా అధికారి రఘుతేజ ఆధ్వర్యంలో నియామకపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా కళాశాల సెక్రెటరీ మాట్లాడుతూ తెలంగాణ నైపుణ్యాల సంస్థ (టాస్క్) ఆధ్వర్యంలో జాబ్మేళా నిర్వహించామని, ప్రముఖ కంపెనీలైన టాటా స్ట్రేవ్, హిట్రో, ఫార్మా శ్రీరామ్, పర్చూర్ ద ఎంపైర్ గ్రూప్, టీసీఎస్, మెడ్ప్లస్, విజయ ఫర్టిలైజర్స్, ఏజే సొల్యూషన్స్ పాల్గొన్నాయని తెలిపారు. ఉషోదయ డిగ్రీ కళాశాలలో విద్యతోపాటు ఉద్యోగ నియామకాలకు సంబంధించిన నైపుణ్యాలపై తర్ఫీదునిస్తున్నట్లు వెల్లడించారు. ప్రతి విద్యార్థి విద్యతోపాటు సాంకేతికపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాళ్లు గంగాధర్, హరి, అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. -
పోలీస్ స్టేషన్లో అగ్ని ప్రమాదం
సాక్షి, నిజామాబాద్: ఆర్మూర్ పోలీస్ స్టేషన్లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సాధారణంగా రహదారులపై నిబంధనలు ఉల్లంఘించి పట్టుబడ్డవారి వాహనాలను ఆ పోలీస్ స్టేషన్ వద్ద ఉంచుతారు. అలా పోలీసులు సీజ్ చేసి అక్కడ ఉంచిన బైక్లు, ఆటోలు, కార్లు అగ్ని ప్రమాదంలో దగ్ధమయ్యాయి. పోలీస్ స్టేషన్ పరిసరాల్లో చెత్తను తగలబెట్టడంతో వాహనాలకు నిప్పు అంటుకుంది.ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలు ఆర్పుతున్నారు. వేసవికాలం కావడంతో అగ్ని ప్రమాదాలు జరిగితే అవకాశాలు అధికంగా ఉంటాయి. జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచనలు చేస్తుంటారు. అటువంటిది పోలీస్ స్టేషన్లోనే అగ్ని ప్రమాదం జరగడం గమనార్హం. -
టీకా.. పశువులకు శ్రీరామరక్ష!
డొంకేశ్వర్(ఆర్మూర్): పశువుల ఆరోగ్యంతోనే ప్రజారోగ్యం ముగిపడి ఉంది. వాటి ఉత్పత్తులను ఆహారంగా తీసుకొని ప్రజలు ఆరోగ్యవంతులుగా జీవిస్తున్నారు. అయితే, పశువులకు వ్యాపించే ప్రాణాంతకమైన వ్యాధులు కొన్ని ఉన్నాయి. అందులో ఒకటి గాలికుంటు వ్యాధి. గాలి ద్వారా వేగంగా వ్యాపించే దీనిని నివారించేందుకు భారత ప్రభుత్వం పశువులకు గాలికుంటు నివారణ టీకాలను ఏడాదిలో రెండుసార్లు ఉచితంగా వేయిస్తోంది. మన జిల్లాలో ఈ టీకాల కార్యక్రమాన్ని ఈ నెల 10 నుంచి ఏప్రిల్ 9 వరకు పశుసవంర్ధక శాఖ నిర్వహిస్తోంది. జిల్లాలో ఆవులు, గేదెలు, ఎద్దులు కలిపి 1.79 లక్షలు ఉన్నాయి. పశువైద్య అధికారులు, సిబ్బంది పాడి రైతుల ఇళ్ల వద్దకే వెళ్లి పశువులకు టీకాలు వేస్తున్నారు. పాడి రైతులు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని, టీకాలు వేయించకపోతే పశువులకే కాకుండా రైతులకు, ప్రజలకు చాలా నష్టాలు జరిగే అవకాశముందంటూ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. ఇదే సమయంలో గొర్రెలు, మేకలు, పందులు పెంచే వారు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఎందుకు వస్తుంది..? ● ఈ వ్యాధి పికోర్నా విరిడే కుటుంబానికి చెందిన ఆఫ్తో వైరస్ ద్వారా వస్తుంది. గాలి ద్వారా ఒక పశువు నుంచి మరొక పశువుకు సులభంగా వ్యాపిస్తుంది. ● కలుషిత నీరు, ఆహారం (మేత, దాణా) ద్వారా వ్యాపిస్తుంది. వ్యాధి సోకిన పశువుల లాలాజలం, మలమూత్రాలతో కూడా వస్తుంది. వ్యాధి సోకిన పశువులను ఆరోగ్యంగా ఉన్న పశువులతో కలిపి ఉంచడంతో సంక్రమిస్తుంది. ● వ్యాధి సోకిన తల్లిపాలు తాగడంతో దూడలకు సోకుతుంది. పశు సంరక్షకుల బట్టలు, చెప్పులు, చేతుల ద్వారా వైరస్ ఒకచోటి నుంచి మరో చోటికి వ్యాపిస్తుంది. ఆర్మూర్ మండలం సుర్బిర్యాల్లో దూడలకు టీకాలు వేస్తున్న పశువైద్య అధికారులువ్యాధితో పశువులకు కలిగే నష్టాలు పాడి పశువులలో పాల ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోతుంది. ఎద్దులు, దుక్కి పశువుల కాళ్లు కుంటు పడడంతో అవి పొలం పనులకు పనికిరావు. లేత వయసు గల దూడలలో ఈ వ్యాధి ప్రాణాంతకంగా మారుతుంది. చూడి (గర్భంతో ఉన్న) పశువులలో గర్భస్రావం జరిగే ప్రమాదం ఉంది. పశువుల నోటిలో పుండ్లు ఏర్పడటంతో అవి సరిగ్గా తినలేవు. దీంతో విపరీతమైన నీరసం, బరువు తగ్గుతాయి. కోలుకున్న తర్వాత కూడా కొన్ని పశువులలో శ్వాస తీసుకోవడం ఇబ్బంది, వెంట్రుకలు గరుకుగా మారడం వంటి దీర్ఘకాలిక సమస్యలు ఉంటాయి.టీకాలు ఇప్పిస్తే ఉపశమనం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమాన్ని పాడి పోషకులు సద్వినియోగం చేసుకోవాలి. టీకాలు ఇప్పిస్తే పశువులకు వ్యాధి వలన కలిగే ఇబ్బందుల నుంచి ఉపశమనం కలుగడంతోపాటు పాడి రైతులకు ఆర్థిక స్వావలంబన చేకూరుతుంది. – బస్వారెడ్డి, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి జిల్లాలో మొదలైన గాలికుంటు నివారణ వ్యాక్సినేషన్ ప్రక్రియ పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలని అవగాహన కల్పిస్తున్న పశుసంవర్ధక శాఖ పశువుల ఆరోగ్యంతో ముడిపడి ఉన్న ప్రజారోగ్యం -
జనగణన పక్కాగా నిర్వహించాలి
● కలెక్టర్ ఇలా త్రిపాఠి ● ప్రత్యేక శిక్షణలో అధికారులకు ఆదేశంనిజామాబాద్ అర్బన్: జనగణన విధులను పక్కాగా నిర్వహించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి పేర్కొన్నారు. సర్వే వివరాలతోనే ప్రజలకు భవిష్యత్తులో కల్పించాల్సిన మౌలిక సదుపాయాలు, సంక్షేమ పథకాల అమలుపై ప్రభుత్వం అవగాహనకు వస్తుందన్నారు. జనగణన– 2027 ప్రక్రియలో భాగస్వాములయ్యే తహసీల్దార్లు, సంబంధిత శాఖల అధికారులకు బుధవారం కలెక్టరేట్లో శిక్షణ తరగతులు ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ 2011లో చివరిసారి జనాభా గణన జరిగిందని గుర్తుచేశారు. వాస్తవానికి 2021లో ఈ ప్రక్రియను చేపట్టాల్సి ఉండగా, కరోనా తీవ్రతతో నిర్వహించలేదన్నారు. ప్రస్తుతం సాంకేతికతను వినియోగిస్తూ, డిజిటల్ విధానంలో జనాభా లెక్కల సేకరణ జరిపేందుకు ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. తొలి దశలో నివాస గృహాలు, అన్నిరకాల కట్టడాలు, కుటుంబ వివరాలను సేకరించనున్నట్లు తెలిపారు. రెండో విడతలో వ్యక్తిగత వివరాలు సేకరించాల్సి ఉంటుందన్నారు. దేశంలోనే తొలిసారి పూర్తిగా డిజిటల్ విధానం ద్వారా జనగణన జరపాల్సి ఉంటుందన్నారు. గతేడాది నల్గొండ జిల్లా తిప్పర్తి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలాల్లో ప్రయోగాత్మకంగా కుటుంబ, ఇళ్ల వివరాల సేకరణ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించారని కలెక్టర్ అన్నారు. జన గణనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై వాస్తవ వివరాలు వెల్లడించాలన్నారు. ఏ ఒక్కరి వివరాలు బయటికి వెల్ల డి కావని, నేరుగా సర్వర్లో నిక్షిప్తమయ్యేలా సాంకేతికతను వినియోగిస్తున్నారని తెలిపారు. ఈసారి సెల్ఫ్ డిక్లరేషన్ ఎంతో ముఖ్యమని, అధికారులు, ఎన్యుమరేటర్లు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. చార్జ్ ఆఫీసర్లు ప్రతిరోజూ జన గణన ప్రక్రియను సమీక్షించాలని, తాము సైతం పర్యవేక్షిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో బోధన్, ఆర్మూర్ సబ్ కలెక్టర్లు వికాస్ మహతో, అభిగ్యాన్ మాల్వియ, నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
రాజీవ్ గాంధీ ఆడిటోరియాన్ని ఆధునీకరించాలి
● కలెక్టర్ ఇలా త్రిపాఠి నిజామాబాద్ అర్బన్: నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియాన్ని ఆధునీకరించేందుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం ఆమె రాజీవ్ గాంధీ ఆడిటోరియం, న్యూ అంబేడ్కర్ భవన్లను సందర్శించారు. ఆడిటోరియం హాల్, పరిసరాలను నిశితంగా పరిశీలించారు. సాంస్కృతిక కార్యక్రమాలు, సదస్సులు, సమావేశాలు నిర్వహించేందుకు అనువుగా ఉన్న ఆడిటోరియంలో మరమ్మతు లు చేయించాలని సూచించారు. ఆధునీకరణ పనులకు అయ్యే అంచనా వ్యయం, అందుబాటులో ఉన్న నిధులు తదితర సమగ్ర వివరాలతో ప్రతిపాదనలు పంపాలని నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ను ఆదేశించారు. న్యూ అంబేడ్కర్ భవన్లో సైతం మరమ్మతులు చేయించాలన్నారు. కాగా, ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ఈ నెల 12న ఒక రోజు శిక్షణ నిర్వహించనున్న నేపథ్యంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి అమృతా గార్డెన్ను సందర్శించారు. కలెక్టర్ వెంట నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, డీపీవో శ్రీనివాస్ రావు తదితరులున్నారు. నేటి నుంచి ఇందల్వాయి రైల్వేగేటు మూసివేత ఇందల్వాయి: ఇందల్వాయి–ధర్పల్లి రోడ్డు మార్గంలో ఉన్న రైల్వేగేటుని అత్యవసర మరమ్మతుల నేపథ్యంలో గురువారం నుంచి ఈ నెల 16వ తేదీ సాయంత్రం వరకు మూసి వేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గ్రహించి ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు. భీమ్గల్, సిరికొండ, ధర్పల్లి మండలాలతోపాటు గేటు అవతలి ప్రాంతాలకు వెళ్లేవారు తిర్మన్పల్లి, రాంపూర్, కమలాపూర్ గ్రామాల గుండా డిచ్పల్లికి చేరుకోవాలని తెలిపారు. కామారెడ్డి వైపు వెళ్లేవారు గౌరారం, నల్లవెల్లి, గన్నారం మీదుగా జాతీయ రహదారి పైకి చేరుకోవాలని సూచించారు. -
జై వీరాంజనేయ
భిక్షను స్వీకరిస్తున్న హనుమాన్ దీక్షాపరులుసాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ‘ఇందూరు శోభాయాత్ర’. ఈ పేరు వింటేనే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. అంతటి పేరెన్నికగన్నది ఈ యాత్ర. ‘అఖిల భారత హనుమాన్ దీక్ష సేవాసమితి’ ద్వారా 1985లో ఏముల నాగభూషణం గురుస్వామి, దేశాయ్ గంగాధర్ గురుస్వామి ఆధ్వర్యంలో 11 మంది భక్తులు హనుమాన్ దీక్షలు ప్రారంభించారు. ఇక ఈ అఖిల భారత హనుమాన్ దీక్ష సేవాసమితి ఆధ్వర్యంలో 1986లో ఇందూరులో ‘హనుమాన్ శోభాయాత్ర’ ప్రారంభించారు. కాగా, ప్రస్తుతం ఈ అఖిల భారత హనుమాన్ దీక్ష సేవాసమితికి జిల్లాలోని అన్ని మండలాల్లో కన్వీనర్లు ఉన్నారు. ప్రతి గ్రామంలో ప్రతి ఏటా చైత్రమాసం నుంచి వైశాఖ మాసంలో హనుమంతుడి పుట్టినరోజు వరకు నలభై రోజులకు పైగా ఈ దీక్షలు చేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా అన్ని మండలాల్లోని అత్యధిక గ్రామాల్లో హనుమాన్ దీక్షలు చేస్తున్నవారి సంఖ్య 40 వేలకి పైగా చేరుకుంది. ఇక అర్ధ మండల దీక్షలు (21 రోజులు) అయితే 80 వేల మంది వరకు చేస్తుండడం గమనార్హం. ఇదిలా ఉండగా 1996 నుంచి మార్చి–ఏప్రిల్ నెలల్లో (ఆంజనేయుడి పుట్టిన రోజుకు 10 రోజుల ముందు) మహిళలు సైతం ఏకాదశి దీక్షలు భారీ సంఖ్యలో చేస్తున్నారు. గ్రామాల్లో అందరూ ఒక్కటే అనేదాన్ని చాటేందుకు భజరంగ్దళ్ సైతం ఈ దీక్షల్లో విరివిగా పాల్గొంటున్నారు. మరోవైపు పదేళ్లుగా ఇందూరు నగరంలో ప్రతి మార్చి–ఏప్రిల్ నెలల్లో 45 రోజులపాటు హనుమాన్ దీక్షాధారణ చేసిన భక్తులకు అన్నదానం నిర్వహిస్తున్నారు. ● విజయవాడకు చెందిన హనుమాన్ దీక్ష పీఠాధిపతి దుర్గాప్రసాద్ స్వామీజీ ఆధ్వర్యంలో అఖిల భారత హనుమాన్ దీక్ష సేవాసమితి ఏర్పాటు అయింది. వారి శిష్యరికంలోనే ఇందూరుకు చెందిన ఏముల నాగభూషణం, దేశాయ్ గంగాధర్ దీక్షలు మొదలుపెట్టారు. వీరిద్దరూ ప్రతి ఏడాది 45 రో జుల నుంచి 90 రోజుల వరకు మాలధారణ దీక్షలు చేస్తూ వస్తున్నారు. పలుసార్లు 108 రోజులపాటు దీక్షలు చేశారు. ఈ దీక్షలతోపాటు ఏటా దేవీనవరాత్రులు, వినాయకచవితి సమయాల్లోనూ 11 రో జుల పాటు దీక్షలు చేస్తూ వస్తున్నారు. పైగా నాగభూషణం గురుస్వామి నిజామాబాద్ డీసీసీబీలో మేనేజర్గానూ ఉద్యోగ బాధ్యతలు నిర్విఘ్నంగా ని ర్వహిస్తున్నారు. కాగా, 30 ఏళ్ల కిందటి వరకు జి ల్లాలో హనుమాన్ దీక్షలు చేసేవారిని గ్రామాల పొ లిమేరల్లోనే ఉంచేవారని, ఇప్పుడు కులమతాలకు అతీతంగా ఆదరిస్తున్నట్లు భక్తులు చెబుతున్నారు. కొనసాగుతున్న దీక్షల స్వీకరణ.. ఈ ఏడాది ఫిబ్రవరి 17 నుంచి 21 వరకు మండల దీక్ష స్వీకరించారు. ఈ నెల 9 నుంచి 13 వరకు అర్ధ మండల దీక్ష స్వీకరణ కొనసాగుతోంది. 19 నుంచి 23 వరకు ఏకాదశి దిన దీక్షలను స్వీకరించనున్నారు.మొదట్లో ముదిరాజ్ హనుమాన్ మందిర్ నుంచి.. 1986లో నగరంలో హనుమాన్ శోభాయాత్రను ముదిరాజ్ హనుమాన్ మందిర్ నుంచి గాజుల్పేట్ పెద్ద రామమందిర్ వరకు నిర్వహించాం. ప్రస్తుతం కంఠేశ్వర్ ఆలయం నుంచి ఆర్ఆర్ చౌరస్తా వరకు నిర్వహిస్తున్నారు. దీక్ష చేసేవారు రోజూ ఒక్కసారే భోజనం తీసుకుంటారు. సింధూరం ధరించి ఆంజనేయుడి గుడిలో ప్రదక్షిణలు, సాష్టాంగ ప్రణామాలు, అభిషేకం, అర్చన, జపం, ధ్యానం, పారాయణం చేసి హారతి తీసుకుంటారు. ప్రతి వ్యక్తిలో హనుమాన్ను దర్శించుకోవాలి. – ఏముల నాగభూషణం గురుస్వామి, ఉమ్మడి జిల్లా కన్వీనర్, అఖిల భారత హనుమాన్ దీక్ష సేవాసమితి ఇంటింటా హనుమధ్వజం లక్ష్యం.. పదకొండు మందితో ప్రారంభమైన ఈ హనుమాన్ దీక్షలు ప్రస్తుతం జిల్లాలోని వందల గ్రామాల్లో చేస్తున్నారు. దీక్షా సమయాల్లో ప్రతిరోజూ సంకీర్తన కా ర్యక్రమాలు ఉంటాయి. ఇంటింటా హ నుమాన్ చాలీసా పారాయణం, ప్రతి ఇంటిపై హనుమంతుడి జెండా ఉంచేలా ముందుకెళుతున్నాం. – దేశాయ్ గంగాధర్ గురుస్వామి, నగర కన్వీనర్, అఖిలభారత హనుమాన్ దీక్ష సేవాసమితి ఇందూరు జిల్లాలో 41 ఏళ్లుగా కొనసాగుతున్న భక్తుల మాలధారణ ‘అఖిల భారత హనుమాన్ దీక్ష సేవాసమితి’ ఆధ్వర్యంలో.. ఇందూరులో 11 మందితో మొదలై.. 40 వేల మంది వరకు దీక్షలు మహిళలు సైతం 11 రోజులపాటు హనుమాన్ ఏకాదశి దీక్ష 1986లో హనుమాన్ శోభాయాత్రకు అంకురార్పణ -
భూభారతితో రైతులకు ప్రయోజనం
తెయూ(డిచ్పల్లి): భూభారతి రైతులకు ప్రయో జనం చేకూరుస్తుందని అడ్వకేట్ సునీల్కుమార్ పేర్కొన్నారు. భూమి రికార్డుల డిజిటలైజేషన్, భూ వివాదాల పరిష్కారం, భూమి రిజిస్ట్రేషన్ విధానంలో పారదర్శకత పెంపు వంటి అంశాల్లో భూ భా రతి చట్టం ప్రధాన పాత్ర పోషిస్తుందని తెలిపారు. తెలంగాణ యూనివర్సిటీ న్యాయ కళాశాల ఆధ్వర్యంలో ‘లాండ్ గవర్నెస్ ఇన్ తెలంగాణ స్టేట్: భూభారతి యాక్ట్ –2025’ అనే అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి సునీల్ కుమార్ ముఖ్యవక్తగా హాజరై, మాట్లాడారు. రైతులు భూమి పత్రాలను సరిచూసుకోవడం, చట్టపరమైన అవగాహన కలిగి ఉండడం ద్వారా మోసాలను నివారించవచ్చన్నారు. చీఫ్ ప్యాట్రన్గా తెయూ వీసీ యాదగిరిరావు, ప్యాట్రన్గా రిజిస్ట్రార్ యాదగిరి, కో–ప్యాట్రన్గా డీన్ శ్రీనివాస్ వ్యవహరించారు. లా కాలేజ్ ప్రిన్సిపాల్ ప్రసన్నరాణి, అధ్యాపకులు స్రవంతి, జెట్లింగ్ ఎల్లోసా, నాగజ్యోతి, లా విద్యార్థులు పాల్గొన్నారు. -
బడిలో హనుమాన్ దీక్షాస్వాముల నిరసన
బోధన్: ఎడపల్లి మండలంలోని మంగల్పహాడ్ జెడ్పీహెచ్ఎస్లో హనుమాన్ దీక్షాస్వాములు భజనలు చేస్తూ నిరసన చేపట్టారు. వివరాలు ఇలా.. పాఠశాలలోని పదో తరగతికి చెందిన ఓ విద్యార్థి ఇటీవల హనుమాన్ దీక్షా ధరించి బడికి వచ్చాడు. దీంతో ఓ మహిళా ఉపాధ్యాయురాలు రెండు రోజుల నుంచి సదరు విద్యార్థిని కించపర్చేలా ప్రవర్తించారు. ఈ విషయాన్ని విద్యార్థి తన తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లాడు. స్థానిక హనుమాన్ దీక్షాస్వాములకు విషయం తెలియడంతో బుధవారం వారు పాఠశాలకు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి భజనలు చేస్తూ ఆందోళనకు దిగారు. అనంతరం మండల కేంద్రంలోని ప్రధాన రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. సమాచారం అందుకున్న ఎంఈవో శివలింగ్ గాలప్ప పాఠశాలకు వచ్చి విచారణ చేశారు. ఆందోళన చేపట్టిన హనుమాన్ దీక్షా స్వాముల వద్దకు వచ్చి చర్చించారు. టీచర్ నుంచి వివరణ తీసుకుని పూర్తిస్థాయి విచారణ చేపడుతామని ఎంఈవో వెల్లడించారు. స్వాములను సముదాయించి ఆందోళన విరమింప చేశారు. -
ఉద్యాన పంటలపై అవగాహన
రుద్రూర్: పోతంగల్ మండలం కొడిచర్ల గ్రామంలో తెలంగాణ ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో బుధవారం ఉద్యాన పంటలపై రైతులకు అవగాహన, శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీమతి భారతి మాట్లాడుతూ.. మిషన్ ఆన్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ పథకం ద్వారా ప్రభుత్వం ఉద్యాన రైతులకు అందిస్తున్న సబ్సిడీలు, పథకాల గూర్చి వివరించారు. రుద్రూర్ వ్యవసాయ పరిశోధన కేంద్రం కీటక శాస్త్రవేత్త సాయిచరణ్ మాట్లాడుతూ.. రైతులకు మిరప సాగులో వచ్చే నల్ల తామర పురుగుల నియంత్రణకు పాటించాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యలను వివరించారు. అలాగే వివిధ కూరగాయ పంటల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఉద్యానశాఖ అధికారి వహీద్ మా ట్లాడుతూ.. రైతు పొలంలో నిర్వహించిన ఈ కార్య క్రమంలో రైతులు ఆరోగ్యకరమైన పంటలు పండించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రభుత్వ పథ కాల ప్రయోజనాలు పొందే విధానాలను వివరించారు. అనంతరం అధికారులు, శాస్త్రవేత్తలు మిరప సాగు చేస్తున్న రైతుల పొలాలను సందర్శించారు. పొలాల్లో నల్ల తామర పురుగులు కనిపించడంతో వాటి నియంత్రణ కోసం ఎకరాకు 30 నుంచి 35 నీలిరంగు జిగురు అట్టలు ఏర్పాటు చేయాలని సూ చించారు. అలాగే బ్రోఫ్లానిలైడ్ 34 మి.లీ లేదా డై ఫెంతియురాన్ 300 గ్రాములు లేదా ఫిప్రోనిల్ 80 డబ్ల్యూజీ 20 గ్రాములు ఎకరాకు మారుస్తూ పిచి కారీ చేయాలని సూచించారు. హెచ్ఈవో అస్రర్, ఆదర్శ రైతు శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
చోరీ కేసుల్లో ఇద్దరి అరెస్టు
భిక్కనూరు: కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల కేంద్రంలో చోరీకి యత్నం, రామేశ్వర్పల్లి గ్రామంలో చోరీ ఘటనలో ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్టు ఏఎస్పీ చైతన్యరెడ్డి తెలిపారు. మండల కేంద్రంలోని పోలీస్స్టేషన్లో బుధవారం ఆమె వివరాలను వెల్లడించారు. ఈనెల 6న రామేశ్వర్పల్లికి చెందిన రాజు ఇంటి తాళం పగులగొట్టి, రెండు జతల పట్టల గొలుసులు, రూ. పదివేల నగదును దుండగులు చోరీ అయ్యాయి. ఈనెల 8న భిక్కనూరులోని వేంకటేశ్వరాలయం తాళంను దుండగులు పగులగొట్టి హూండీలో చోరీకి యత్నించగా స్థానికులు గుర్తించడంతో పారిపోయారు. ఈ ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. బుధవారం బీటీఎస్ వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల గ్రామానికి చెందిన లంబాడి శ్రావణి, నర్సపూర్కు చెందిన స్క్రాపు వ్యాపారి పర్థం ఏలియా అలియాస్ ప్రవీణ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శ్రావణి, ఆమె భర్త మోచి శ్రీనివాస్ కలిసి పాత సామానులు, ప్లాస్టిక్ కాగితాలను ఏరుకుంటూ తాళం వేసిన ఇళ్లను గుర్తిస్తారు. తర్వాత రెక్కీ నిర్వహించి చోరీలకు పాల్పడుతారు. చోరీ సొత్తును ప్రవీణ్కు విక్రయిస్తారు. నిందితులు ఫిబ్రవరిలో సంగారెడ్డి జిల్లా పుల్కల్ పోలీస్స్టేషన్ పరిధిలో ముదిమానిక్ గ్రామంలో ఒక ఇంటి తాళం పగులగొట్టి నాలుగు తులాల బంగారు ఆభరణాలు, వెండి పట్టగొలుసులు నగదును చోరీ చేశారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేసి, రిమాండ్కు తరలించామని, శ్రీనివాస్ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. సీఐ సంపత్కుమార్, ఎస్సై అంజనేయులు సమావేశంలో పాల్గొన్నారు. -
పెండింగ్ వేతనాలను విడుదల చేయాలి
నిజామాబాద్ అర్బన్: ఆశా వర్కర్లకు పెండింగ్లో ఉన్న రెండు నెలల వేతనాలను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ జాగృతి నాయకులు డిమాండ్ చేశారు. ఈమేరకు వారు బుధవారం ఆశా వర్కర్లతో కలిసి కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా జాగృతి జిల్లా నాయకురాలు విజయలక్ష్మి మాట్లాడుతూ.. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలన్నారు. పెండింగ్ వేతనాలను విడుదల చేయాలన్నారు. జిల్లా అధ్యక్షురాలు సహారా భాను, జిల్లా ప్రధాన కార్యదర్శి అనూష, మంజుల, శిరీష, శ్రీదేవి, లత తదితరులు పాల్గొన్నారు. ఇందల్వాయి: మండలంలోని గౌరారం గ్రామ పరిధి లోని లింగాపూర్ గ్రామంలో నిబంధనలకు విరుద్ధంగా, ప్రజా ప్రయోజనాలకు ఆటంకం కలిగించేవిధంగా వేసిన బోరుబావిని అధికారులు బుధవారం సీజ్ చేసినట్లు సర్పంచ్ హేమలత తెలిపారు. గ్రామానికి చెందిన ఓ రైతు గ్రామ పంచాయతీ బోరు బావికి దగ్గరగా వాల్టా చట్టానికి విరుద్ధంగా బోరు వేయడంతో పంచాయతీ బోరు నుంచి నీరు రావడం తగ్గంది. ఈ విషయంపై రెవెన్యు అధికారులకు ఫిర్యాదు చేయగా జీపీవో, పంచాయతి కార్యదర్శి విచారణ చేపట్టి సదరు బోరు బావిని సీజ్ చేసినట్లు తెలిపారు. బాన్సువాడ రూరల్: మండలంలోని బోర్లం గ్రామంలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పా ల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఎస్హెచ్వో తుల శ్రీధర్ తెలిపిన వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన మన్నె గంగాధర్(33) అనే యువకుడు వృత్తిరీత్య ఫో టోగ్రాఫర్గా జీవనం సాగించేవాడు. కొంతకాలంగా పని లేకపోవడంతో మద్యానికి బానిసయ్యాడు. దీంతో అప్పులు పెరిగిపోవడం, గొడవలు తదితర కారణాలతో జీవితంపై విరక్తిచెందాడు. ఈక్రమంలో బుధవారం ఉదయం తన ఇంట్లో దూలానికి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
వైభవంగా కొనసాగుతున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలు
నిజామాబాద్ రూరల్: మోపాల్ మండలం నర్సింగ్పల్లి శివారులోని ఇందూరు తిరుమల గోవింద వనమాల క్షేత్రం ఇందూర్ తిరుమల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నాలుగవ రోజు బుధవారం ఉదయం ఆలయంలో ‘సర్వ రక్షా కర సుదర్శన నారసింహ హవనం‘ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా దేవనాథ జీయర్ స్వామి భక్తులను ఉద్దేశించి ప్రవచనం చేశారు. సర్వ లోకాలను ఏలే మహావిష్ణువు దర్శనం కావాలంటే సుదర్శన భగవానుడి అనుగ్రహం కావాలి, ఆ సుదర్శన భగవానుడి అనుగ్రహం కోసం సర్వా రక్షాకర సుదర్శన నారసింహ హోమం ఉత్తమ మార్గమని అన్నారు. సాయంత్రం స్వామివారు హంస వాహనంపై దర్శనం ఇచ్చారు. ఆలయ ధర్మకర్తలు ప్రముఖ సినీ నిర్మాత సోదరులు దిల్ రాజు, శిరీష్ రెడ్డి దంపతులు, ప్రధాన ధర్మకర్త నరసింహారెడ్డి దంపతులు, విజయసింహారెడ్డి దంపతులు, దర్శకులు బొమ్మరిల్లు భాస్కర్, శైలేష్ కొలను, ఛాయాగ్రహకులు విజయ చక్రవర్తి, సినీ నిర్మాతలు కృష్ణ, సత్యనారాయణ రెడ్డి మహేందర్, మాజీ ఎంపీటీసీ రాములు రాజేశ్వర్, నరాల సుధాకర్, సాయిలు పాల్గొన్నారు. -
అభివృద్ధి పనులు త్వరగా పూర్తిచేయించాలి
● కలెక్టర్ ఇలా త్రిపాఠికి అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ వినతి నిజామాబాద్ అర్బన్: నిజామాబాద్ అర్బన్ ని యోజకవర్గంలో అభివృద్ధి పనులను త్వరితగతి న పూర్తిచేయించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ కోరారు. ఈమేరకు బుధవా రం ఆయన కలెక్టర్ ఇలా త్రిపాఠిని కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం పలు అంశాలపై చర్చించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్లు, డబుల్ బెడ్రూమ్లపై సంబంధిత అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించి త్వరతగతిన పూర్తి చేసి, అర్హులైన నిరుపేదలకు అందించే విధంగా ప్రణాళికలు చేపట్టాలన్నారు. అదేవిధంగా ప్రభుత్వం నుంచి రావాల్సిన యూజీడీ నిధుల విషయంలో ఎలాంటి జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్కి సూచించారు. బోధన్ బస్టాండ్ సమీపంలో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ మరమ్మతులను పూర్తిచేసి అర్హులైన వారికి కేటాయించాలన్నారు. -
ఉత్తమ వ్యక్తులుగా తీర్చిదిద్దేవి విశ్వవిద్యాలయాలే
● ఏఎస్పీ చైతన్య రెడ్డి ● సౌత్క్యాంపస్లో విద్యార్థులకు కౌన్సెలింగ్ భిక్కనూరు: సమాజంలో ఉత్తమ వ్యక్తులుగా విశ్వవిద్యాలయాలు తీర్చిదిద్దుతాయని కామారెడ్డి ఏఎస్పీ చైతన్య రెడ్డి అన్నారు. బుధవారం తెలంగాణ యూ నివర్సిటీ సౌత్క్యాంపస్లో విద్యార్థులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యార్థులు స్నేహపూర్వకంగా కలిసిమెలిసి ఉండాలన్నారు. నేటి విద్యార్థి రేపు సమాజంలో గుర్తింపు పొందే వ్యక్తిగా ఎదిగినప్పడు తమ స్నేహితుడు ఉన్నత స్థానానికి ఎదిగాడని గర్వంగా చెప్పుకునే విధంగా తయారు కావాలన్నారు. సీనియర్లు జూనియర్లకు మార్గదర్శకులుగా ఉండి వారిని సో దరులుగా భావించుకోవాలన్నారు. జూనియర్లు తమకు తెలియని విషయాలను సీనియర్ విద్యార్థులను అడిగి తెలుసుకోవాలన్నారు. సీఐ సంపత్కుమార్ మాట్లాడుతూ.. ఎన్నో ఆశలు, ఆశయాలతో తల్లిదండ్రులు తమ జీవితాలను త్యాగం చేస్తూ విద్యార్థులను చదివిస్తున్నారని దీన్ని గుర్తుంచుకుని విద్య అభ్యసించాలన్నారు. పనికిరాని విషయాల్లో తలదూర్చి ఇబ్బందుల్లో పడవద్దని హెచ్చరించారు. ఎస్సై అంజనేయులు.. ర్యాంగింగ్ వల్ల జరిగే పరిణామాలు, శిక్షలు, చట్టాల గురించి పవర్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ప్రిన్సిపాల్ సుధాకర్గౌడ్, అధ్యాపకులు లలిత, యాలాద్రి, సరిత, సబిత, నారాయణ పాల్గొన్నారు. -
జాబ్ మేళా విజయవంతం
ఖలీల్వాడి: జిల్లా కేంద్రంలోని ఎస్ఎస్ఆర్ డి గ్రీ కాలేజీలో గురువారం నిర్వహించిన మెగా జాబ్ మేళా విజయవంతమైనట్లు, సుమారు 152 మంది యువతీయువకులు ఉద్యోగాలు పొందినట్లు ఎస్ఎస్ఆర్ విద్యాసంస్థల చైర్మన్, తెయూ మాజీ పాలకవర్గ సభ్యుడు మారయ్య గౌడ్ తెలిపారు.మ్యాజిక్ బస్ సహకారంతో జరిగిన ప్రాంగణ నియామకాలలో టెక్ మహేంద్ర, జియో, ఐడీబీఐ బ్యాంక్, మెడిప్లస్తోపా టు 24 ప్రముఖ కంపెనీలు ప్రాంగణ నియమకాలు చేపట్టారన్నారు. వివిధ కంపెనీలలో సుమారు 700 మంది ఉమ్మడి నిజామాబాద్ జిల్లా విద్యార్థులు తమ వివరాలు నమోదు చే సుకొని,పాల్గొన్నారన్నారు.ఎంపికై న వారికి ని యామక పత్రాలను మారయ్యగౌడ్ అందజేశా రు. టీపీవోలు స్వప్న, మహేశ్, అధ్యాపక బృందం, మాజిక్ బస్ సిబ్బంది బాలకృష్ణ, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ వేణుగోపాల్, ఎన్ఎస్ఎస్ వలంటీర్లు, విద్యార్థులు ఉన్నారు. ఖలీల్వాడి: జిల్లా కేంద్రంలోని మహిళా డిగ్రీ కళాశాలలో బుధవారం భౌతికశాస్త్ర విభాగం అధ్వర్యంలో ‘క్వాంటం ఇంటెలిజెన్స్ ది నెక్ట్స్ లిప్ ఇన్ ఏఐ ఆప్టిమైజేషన్‘ అనే అంశంపై ఒక రోజు వర్క్ షాప్ నిర్వహించినట్లు ప్రిన్సిపాల్ భారతిరెడ్డి తెలిపారు. ఈ వర్క్ షాప్కు ముఖ్య అతిథిగా రామకృష్ణ హాజరై, మాట్లాడారు. విద్యార్థులకు క్వాంటం ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధస్సు (ఏఐ)తో ఆధునిక ప్రాధాన్యాన్ని పరిచయం చేయడం జరిగిందన్నారు. కళాశాల అధ్యక్షుడు రాజేందర్రెడ్డి, కళాశాల యాజమాన్యం, భౌతికశాస్త్ర అధ్యాపకులు మాధవి, సంతోషి రాణి, విద్యార్థినులు పాల్గొన్నారు. బోధన్టౌన్(బోధన్): కేంద్ర ప్రభుత్వం అమ లు చేస్తున్న పీఎం ముద్ర యోజన, స్టార్టప్ ఇండియా, పీఎం స్వనిధి పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎస్ఆర్ఎమ్ యూనివర్సిటీ రిసోర్స్ పర్సన్ శ్రీవాణి, ప్రొఫెసర్ లు టార్కర్ అన్నారు. పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధవారం వాణిజ్యశాస్త్రం ఆధ్వర్యంలో ‘సమ్మెళిత వృద్ధికి వ్యవస్థాపకత, ప్ర భుత్వ ఆర్థిక పథకాల పాత్ర’ అనే అంశాలపై సెమినార్ నిర్వహించారు. కార్యక్రమానికి వా రు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ పథకాలతోపాటు యువతకు అందిస్తున్న ఉపాధి కల్పన అవకాశాలను నేటి యువత వినియోగించుకోవాలని సూచించా రు. ఇండోర్ పీజీ కళాశాల ప్రిన్సిపాల్ మదన్మోహన్, వెల్నెస్ ఆస్పత్రి ఎండీ సుమన్ గౌడ్, టీ యూ ప్రొఫెసర్లు ఆంజనేయులు, రాంబాబు, కళాశాల ప్రిన్సిపాల్ సురేష్, వైస్ ప్రిన్సిపాల్ ప్రసాద్రావ్, రిటైర్డ్ ప్రిన్సిపాల్ మారుతి రావ్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
● కలెక్టర్ ఇలా త్రిపాఠి ● మోకన్పల్లి కేజీబీవీ తనిఖీ ● సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ నవీపేట: విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవ ని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. మండలంలోని మోకన్పల్లి గ్రామంలోని కేజీబీవీని బుధవారం ఆ మె ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యాలయంలోని తరగతి గదులను క్షుణ్ణంగా పరిశీలించి, సిబ్బది హా జరు రిజిస్టర్లను పరిశీలించారు. పరిసరాలను శుభ్రంగా ఉంచాలని ప్రత్యేక అధికారి కవితను మందలించారు. బాలికలు ఉండే వసతిగృహంలోకి బ యటి వ్యక్తులను ఎందుకు రానిచ్చారని మండిపడ్డా రు. విద్యార్థినుల భద్రత, సంక్షేమంపై నిర్లక్ష్యం వ హించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మెనూ ప్రకా రం భోజనం వడ్డించే విధంగా జాగ్రత్త వహించాలన్నారు. విద్యార్థులతో మాట్లాడి బోధనాతీరును పరీక్షించారు. ఏమైనా సమస్యలుంటే నిర్భయంగా చె ప్పాలని విద్యార్థినులకు సూచించారు. విధుల నిర్వ హణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన కేజీబీవీ ప్రత్యేక అధికారి కవితతోపాటు గెస్ట్ ఫ్యాకల్టీ రాజశ్రీలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఇరువురి వేతనాలను నిలిపివేయాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. అనంతరం పాఠశాల ఆవరణలో కొనసాగుతున్న వైద్య శిబిరాన్ని పరిశీలించారు. అధికా రులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
మాజీ ఎంపీపీ ఇమ్మడి గోపి హత్య!
ఇందల్వాయి: ధర్పల్లి మండల మాజీ ఎంపీపీ, ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గౌరారం గ్రామ సర్పంచ్ హేమలత భర్త ఇమ్మడి గోపి(55) గౌరారం గ్రామ సబ్ స్టేషన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. అయితే ఇది హత్యగా తెలుస్తోంది. గౌరారం గ్రామం నుంచి అతని సొంత గ్రామం లింగాపూర్ వెలుతుండగా గత సర్పంచ్ ఎన్నికల్లో గోపి భార్యపై పోటీ చేసి ఓడిపోయిన గోపి అల్లుడు సతీశ్ తన కారుతో గోపి ప్రయాణిస్తున్న కారును వేగంగా ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగింది. ప్రమాద స్థలంలో కత్తి దొరకడం, ప్రమాద స్థలానికి మృతదేహం దూరంగా పడి ఉండటం, వరుసకు అల్లుడు కారు ప్రమాదానికి కారణం అవ్వడం చూసి గ్రామస్తులు గోపిది హత్యే అని ఆరోపిస్తున్నారు. గత కొంత కాలంగా లింగాపూర్ గ్రామంలో రెండు వర్గాల మధ్య ఇసుక, భూముల విషయంలో తరుచూ తగాదాలు జరగడం, కేసులు నమోదవడం సాధారణంగా మారింది. ఈ క్రమంలో బుధవారం ఉదయం ఒక వర్గానికి చెందిన బోరు బావిని గోపి సీజ్ చేయించడం ఇక్కడ గమనార్హం. ఇది పథకం ప్రకారం చేసిన హత్యే అని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. మృతుడు గోపికి ఇద్దరు భార్యలు ఉండగా ఇద్దరు కొడుకులు, కూతురు ఉన్నారు. గౌరారం గ్రామానికి మొదటి భార్య వరుసగా రెండు పర్యాయాలు, రెండవ భార్య ఈ సంవత్సరం సర్పంచ్లుగా ఎన్నికయ్యారు. మృతుడు గతంలో పీపుల్స్ వార్ గ్రూపులో క్రియాశీలకంగా పని చేసి తర్వాత జన జీవన స్రవంతిలో కలిసి పలు వ్యాపారాలు చేసి రాజకీయాల్లోకి వచ్చాడు. గతంలో మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి అనుచరుడిగా, ప్రస్తుతం కాంగ్రెస్లో కీలక నేతగా ఉన్నాడు. -
క్రైం కార్నర్
నదిలో స్నానానికి వెళ్లి యువకుడి మృతి బోధన్రూరల్: మంజీర నదిలో స్నానానికి వెళ్లిన ఓ యువకుడు నీటిలో గల్లంతై, మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. బోధన్ మండలం కల్దుర్కి గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు బుధవారం మధ్యాహ్నాం ఇదే మండలంలోని ఖండ్గాం గ్రామ శివారులోగల మంజీర నదికి వెళ్లారు. ముగ్గురు యువకులు స్నాన్నాలు చేస్తుండగా, నీలం అమితేశ్(18) అనే యువకుడు ప్రమాదవశాత్తు కాలుజారిలో నీటిలో పడిపోయాడు. ఈత రాకపోవడంలో నీటిలో గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. గజ ఈతగాళ్లలో నదిలో గాలించి అమితేశ్ మృతదేహాన్ని బయటకు తీసుకువచ్చారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కరెంట్ షాక్తో రైతు .. వర్ని: మండలంలోని జాకోర గ్రామంలో ఓ రైతు కరెంట్ షాక్తో మృతిచెందాడు. వర్ని ఎస్సై వంశీకృష్ణ తెలిపిన వివరాలు ఇలా.. జాకోర గ్రామానికి చెందిన గట్టు మీది గంగాధర్ (36) బుధవారం ఉదయం తన వ్యవసాయ పొలం వద్దకు వెళ్లాడు. పొలంలోని మోటారు వైరును సరి చేస్తుండగా ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. మృతుడు వ్యవసాయంతోపాటు గ్రామంలో ఆర్ఎంపీ వైద్యుడిగా పని చేస్తున్నాడు. -
377 మంది విద్యార్థుల గైర్హాజరు
ఖలీల్వాడి: ఇంటర్మీడియెట్ పరీక్షలు జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. మంగళవారం సెకండియర్ భౌతికశాస్త్రం, అర్థశాస్త్రం, ఒకేషనల్ పరీక్షలు నిర్వహించారు. మొత్తం 16,678 మంది విద్యార్థులకు గాను 16,301 మంది (97.7శాతం) హాజరుకాగా, 377 మంది గైర్హాజరయ్యారని జిల్లా ఇంటర్ విద్యా అధికారి రవికుమార్ వివరించారు. మొత్తం 58 సెంటర్లకు గాను 55 సెంటర్లను తనిఖీ చేశామని తెలిపారు. 15 వరకు పరీక్ష ఫీజు చెల్లించాలి ఖలీల్వాడి: జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల (2025 – 2026) బీఏ, బీకాం, బీబీఏ, బీసీఏ, బీఎస్సీ డిగ్రీ విద్యార్థులకు ఏప్రిల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ రామోహ్మన్రెడ్డి, కంట్రోల్ ఆఫ్ ఎగ్జామ్స్ భరత్రాజ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రెండో, నాల్గో సెమిస్టర్లు (రెగ్యులర్)తోపాటు ఆరో సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్ లాగ్ థియరీ పరీక్షలకు సంబంధించి ఫీజును ఈనెల 15వ తేదీ వరకు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అలాగే వన్ టైం చాన్స్ కింద 2014–15 నుంచి 2019–20 వరకు పూర్వపు డిగ్రీ విద్యార్థులకు అవకాశం ఇస్తున్నట్లు తెలిపారు. జాతీయస్థాయి ఆర్చరీ పోటీలకు ఎంపిక మోపాల్: ఏకలవ్య స్పోర్ట్స్ హబ్ ఆర్చరీ అకాడమీ క్రీడాకారు డు నేనావత్ రుత్విక్ ఉత్తమ ప్రతిభ కనబ ర్చి జాతీయస్థాయి పోటీలకు ఎంపికై న ట్లు కోచ్ ఎం రవీందర్ మంగళవారం తెలిపారు. హైదరాబాద్లోని పటాన్చెరులోగల ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఇటీవల నిర్వహించిన రాష్ట్రస్థాయి ఆర్చరీ అండర్–13 వ్యక్తిగత విభాగంలో రుత్విక్ 315 పాయింట్లు సాధించి ఎంపికయ్యాడన్నారు. ఈనెల 26 నుంచి విజయవాడలో నిర్వహించే సబ్ జూనియర్ జాతీయస్థాయి పోటీల్లో రుత్విక్ పాల్గొంటాడని తెలిపారు. రుత్విక్ను ఆర్చరీ అసో సియేషన్ అధ్యక్షుడు ఈగ సంజీవ్రెడ్డి, ప్రధా న కార్యదర్శి కె గంగరాజు, కోచ్ ఎం రవీందర్ తదితరులు అభినందించారు. సమర్థవంతంగా ‘ప్రగతి ప్రణాళిక’ నిజామాబాద్ అర్బన్: ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని పోలీస్ కమిషనర్ సాయిచైతన్య అన్నారు. జిల్లా కేంద్రంలోని కమిషనరేట్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. 99 రోజుల్లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టాల్సిన పనులపై సమీక్షించారు. సీసీ టీవీ సర్వైలైన్స్, గ్రౌండ్ పెట్రోలింగ్, రోడ్డు భద్రతపై దృష్టి సారించాలన్నారు. సైబర్ నేరాలబారిన పడకుండా, డ్రగ్స్ కారణంగా తలెత్తే దుష్పరిణామాలు, భరోసా సెంటర్పై అవగాహన కల్పించాలన్నారు. పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలని సూచించారు. అదనపు డీసీపీ బస్వారెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీధర్రెడ్డి, సీసీఆర్బీ ఇన్స్పెక్టర్ అంజయ్య, ఐటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నస్రుల్లాబాద్: బొమ్మన్దేవ్పల్లి హైస్కూల్లో పనిచేస్తున్న ఎన్.శ్రీనివాస్ అనే టీచర్ను సస్పండ్ చేస్తూ డీఈవో రాజు ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల పాఠశాలలో తోటి ఉపాధ్యాయుడిపై ఎన్.శ్రీనివాస్ కుర్చీతో దాడి చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయనపై శాఖా పరమైన చర్యలు తీసుకున్నారు. -
తాగునీటికి ఇబ్బందులు తలెత్తొద్దు
● వంద శాతం పన్నులు వసూలు చేయాలి ● డీపీవో శ్రీనివాస్రావురెంజల్(బోధన్): వేసవిలో తాగు నీటికి ఇబ్బందు లు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్రావు సూచించారు. రెంజల్ గ్రామ పంచాయతీని మంగళవారం ఆయన ఆకస్మికంగా సందర్శించారు. స్థానిక అధికారులు, పాలకవర్గం సభ్యులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. తాగు నీటి పైప్లైన్ల పనులు, లికేజీలను నిత్యం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. సమస్యను గుర్తించి వెంటనే పరిష్కరించే ఏర్పాట్లు చేయాలన్నారు. ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’లో భాగంగా గ్రామాలను సందర్శిస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం గ్రామంలో కార్యదర్శులతో కలిసి ఇంటి పన్ను వసూలు చేశా రు. ఎంపీడీవో కమాలకర్, ఎంపీవో రఫీయొద్దీన్ సర్పంచ్ తిరుపతి లలిత, కార్యదర్శి రాజేందర్రావు డీపీవోను సన్మానించారు. బోధన్ డీఎల్పీవో నాగరాజుతో పాటు పలు గ్రామాల కార్యదర్శులు, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. -
ప్రగతి ప్రణాళికపై అవగాహన కల్పించాలి
● సమన్వయంతోనే ఉత్తమ ఫలితాలు ● వీసీలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు నిజామాబాద్ అర్బన్: అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు , 99 రోజుల ప్రగతి ప్రణాళిక కార్యాచరణపై సర్పంచులు, మున్సిపల్ వార్డు సభ్యులు, చైర్మన్లు, మేయర్లకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అన్నారు. ఈనెల 12వ తేదీన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు నిర్వహించే శిక్షణ కార్యక్రమంలో సీఎస్ మంగళవారం వీడియోకాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో అందరినీ భాగస్వాములను చేసి విజయవంతం చేయాలని అన్నారు. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు సమన్వయంతో పని చేస్తేనే ఉత్తమ ఫలితాలు వచ్చి ప్రభుత్వ కార్యక్రమాలు సమర్థవంతంగా అమలవుతాయని సీఎం రేవంత్రెడ్డి పదే పదే ఉటంకిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ప్రజలకు ఏవిధంగానైతే ప్రామాణికమైన ఫలితాలు అందుతాయో, ఆ కోణంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించాలని స్పష్టం చేశారు. విద్య, వైద్యం తదితర అంశాలపై స్పష్టమైన అవగాహన కలిగేలా ఉండాలన్నారు. శిక్షణ కార్యక్రమ ప్రారంభోత్సవానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలను సైతం ఆహ్వానించాలని సూచించారు. జిల్లాలోని వివిధ అభివద్ధి, సంక్షేమ కార్యక్రమాలను తెలిపేలా ఫొటో ప్రదర్శనను వేదిక వద్ద ఏర్పాటు చేయాలన్నారు. కొత్తగా ఎన్నికై న స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ప్రత్యేకంగా గుర్తింపు కార్డులు ఇవ్వాలన్నారు. ఇన్చార్జి అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దిలీప్ కుమార్ మాట్లాడుతూ.. నూతనంగా ఎన్నికై న స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు శిక్షణ ఇచ్చేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశామని తెలిపారు. నిజామాబాద్ కార్పొరేషన్, ఆర్మూర్, బోధన్, భీమ్గల్ మున్సిపాలిటీల ప్రజాప్రతినిధులకు జిల్లా కేంద్రంలోని న్యూ అంబేడ్కర్ భవన్లో, గ్రామ పంచాయతీల సర్పంచ్లకు మరో వేదికపై మాస్టర్ ట్రైనర్లతో నిర్దేశిత అంశాలపై శిక్షణ ఇప్పిస్తామని అన్నారు. అందరి భాగస్వామ్యంతో జిల్లాలో ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేస్తామని అన్నారు. వీసీ లో డీపీవో శ్రీనివాస్రావు, సీపీ వో రతన్, మున్సిపల్ కమిషనర్లు జాదవ్కృష్ణ, ఉమామహేశ్వర్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి
● ఎర్రజొన్న ధర తగ్గకుండా చూడాలి ● కలెక్టర్కు ఫోన్ చేసిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: వ్యాపారుల సిండికేట్ను అరికట్టి ఎర్రజొన్న ధర తగ్గకుండా చూడాలని బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి కలెక్టర్ ఇలా త్రిపాఠిని కోరారు. ఈ మేరకు ఆయన కలెక్టర్కు మంగళవారం ఫోన్ చేశారు. క్వింటాల్ ఎర్రజొన్న ధరను రూ.3,850 నుంచి రూ.3,450కి తగ్గించడంతో రైతులకు తీవ్ర నష్టం జరిగే పరిస్థితి నెలకొందని కలెక్టర్కు ఆయన వివ రించారు. తక్షణమే ప్రభుత్వం జోక్యం చేసుకోవా లని డిమాండ్ చేశారు. ఎర్రజొన్న రైతులకు మేలు చేసేందుకు జిల్లా, మండల స్థాయి అధికారులతో ప్రత్యేక యంత్రాంగం ఏర్పాటు చేయాలని కోరారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఎర్రజొన్న సాగు, దిగుబడి గణనీయంగా తగ్గిందని, ఈ పరిస్థితుల్లో సహజంగానే మద్దతు ధర పెరగాల్సి ఉన్నప్పటికీ అందుకు విరుద్ధంగా వ్యాపారులంతా కలిసి ధరలను తగ్గించే ప్రయత్నం చేస్తుండడంతో రైతులకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ధర తగ్గడానికి పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితుల ను వ్యాపారులు కారణంగా చూపుతున్నారన్నారు. ఎర్రజొన్న ప్రధానంగా పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్గ్గనిస్తాన్ దేశాలతోపాటు ఉత్తర భారతంలోని రాష్ట్రాలకు ఎ గుమతి అవుతోందన్నారు. ఈ దేశాల్లో యుద్ధ పరిస్థితు లు లేవన్నారు. గత నాలుగేళ్లుగా అమల్లో ఉన్న నిబంధనలను కఠినంగా అమలు చే యాలని ప్రశాంత్రెడ్డి సూచించారు. లైసెన్స్ ఉన్న వ్యాపారులు మాత్రమే విత్తనాలు సరఫరా చేయాలన్నారు. విత్తనాలు ఇచ్చే సమయంలో రైతులతో తప్పనిసరిగా బైబ్యాక్ అగ్రిమెంట్ చేసుకోవాలని కోరారు. ముఖ్యంగా బాల్కొండ, ఆర్మూర్ నియోజకవర్గాలతో పాటు నిజామాబాద్ రూరల్, జక్రాన్పల్లి మండలా ల్లో ఎర్రజొన్న సాగు ఎక్కువగా ఉన్నందున అక్కడ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు. జిల్లా వ్యవసాయ అధికారి, అదనపు కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రత్యేక పర్యవేక్షణ యంత్రాంగం ఏర్పాటు చేసి రైతులకు గిట్టుబాటు ధర అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను ప్రశాంత్రెడ్డి కోరారు. సా నుకూలంగా స్పందించిన కలెక్టర్ రైతులకు న్యా యం చేస్తామని హామీ ఇచ్చినట్లు ఆయన విలేకరు లకు తెలిపారు. ఎర్రజొన్న రైతులు సంఘటితం కావాలని.. గిట్టుబాటు ధర దక్కకపోతే పోరాటానికి సిద్ధం కావాలని, బీఆర్ఎస్ తరపున పోరాడి రైతులకు అండగా ఉంటామని ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. -
నిజామాబాద్
వాతావరణం ఉదయం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఎండ తీక్షణంగా కాస్తుంది. పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. రాత్రి నిర్మలంగా ఉంటుంది. ప్రతిఫలం, స్వార్థం లేకుండా.. స్వార్థం లేకుండా.. ప్రతిఫలం ఆశించకుండా సేవ చేయాలని త్రిదండి చిన్నజీయర్ స్వామి ప్రవచించారు.బుధవారం శ్రీ 11 శ్రీ మార్చి శ్రీ 2026– IIలో uపశ్చిమాసియాలో ఉద్రిక్తతలతో పెరిగిన నిత్యావసరాల ధరలు పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం ప్రభావం వంటింటి మీద కనబడుతోంది. వారం పది రోజులుగా ధరలు పెరుగుతున్నాయి. ఇప్పటికే గ్యాస్ ధర సిలిండర్పై రూ. 60 పెరగ్గా.. నిత్యావసర వస్తువుల ధరలూ అదే దారిలో పయనిస్తున్నాయి. దీంతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. – నిజామాబాద్ రూరల్ అమెరికా, ఇరాన్ల మధ్య యుద్ధం కారణంగా నిత్యావసరాల ధరలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా వంట నూనెలు సలసలా కాగుతున్నాయి. రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ లీటర్ ప్యాకెట్ మొన్నటి వరకు రూ. 143 వరకు ఉండగా.. ఇప్పుడు రూ. 175కు చేరింది. అలాగే పామాయిల్ లీటర్ ధర రూ. 120 నుంచి రూ. 135 కు పెరిగింది. పల్లి నూనె ధర లీటర్కు రూ. 160 ఉండగా, ఇప్పుడు రూ. 175 కి విక్రయిస్తున్నారు. పప్పుల ధరలూ కిలోకు రూ. 20 నుంచి రూ. 25 దాకా పెరిగాయి. కందిపప్పు కిలో రూ. 125 ఉండగా ఇప్పుడు రూ. 145 కు అమ్ముతున్నారు. మినపపప్పు ధర కిలోకు రూ. 120 నుంచి రూ. 140కి చేరింది. ఇతర వస్తువులు ధరలు కూడా పెరిగాయి. ఇప్పటికే సిలిండర్ ధర రూ.60 పెరిగిన విషయం తెలిసిందే. పెరగనున్న ఖర్చులు.. మూడు నెలల తర్వాత శుభ ముహూర్తాలు రావడంతో భా రీ సంఖ్యలో పెళ్లిళ్లు, ఫంక్షన్లు జరుగుతున్నాయి. అయితే ధ రల మోత కారణంగా పెళ్లి ఖర్చులు కూడా భారీగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా నిత్యావసరాల ధరలు అడ్డగోలుగా పెరిగిన నేపథ్యంలో భోజనాల ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. ఇప్పటికే శుభకార్యాలకు అవసరమైన అన్ని రకాల సామగ్రి ధరలను పెంచేసి అమ్ముతున్నారు. మరోవైపు ధరల పెరుగుదలతో ఇంటి బడ్జెట్ కూడా పెరగనుంది. అసలే వేసవి కాలం కావడంతో కరంటు బిల్లుల మోత కూడా తోడవనుంది. ఇళ్లల్లో కూలర్లు, ఫ్యాన్లు, ఏసీలు రాత్రింబవళ్లు నడిపించాల్సి వస్తుంది. దీంతో విద్యుత్ చార్జీ భారం ఎక్కువ అవుతుంది. వెరసి నెలవారీ ఖర్చు రెట్టింపై సామాన్యుడికి ఇబ్బందికరంగా మారనుంది.వంటింటికి యుద్ధం సెగ! సిలిండర్ ధర రూ.60 పెంపు నూనెలు, పప్పుల ధరలకు రెక్కలు సామాన్యుడిపై తీవ్ర ప్రభావం -
రికార్డ్ స్థాయిలో యూరియా విక్రయాలు
● యాసంగిలో 82 వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసిన రైతులు ● జిల్లాలో ఈ స్థాయిలో అమ్మకాలు ఇదే తొలిసారి డొంకేశ్వర్(ఆర్మూర్): జిల్లాలో యాసంగి సీజన్ యూరియా అమ్మకాలు రికార్డు స్థాయికి చేరాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా 82 వేల మెట్రిక్ టన్నుల యూరియాను రైతులు కొనుగోలు చేశారు. గత కొన్నేళ్ల లెక్కలను తిరగేసి చూస్తే ఈ స్థాయిలో విక్రయాలు జరగడం ఇదే తొలిసారి. అయితే, ఒక్క 2020 ఖరీఫ్ సీజన్లో మాత్రం 86,489 మెట్రిక్ టన్నుల యూరియా వినియోగం జరిగింది. చరిత్రలో ఏ సంవత్సరంలో కూడా యాసంగిలో 80 వేల మెట్రిక్ టన్నులు దాటలేదు. ఈ ఏడాదిలోనే 82 వేల మెట్రిక్ టన్నులు అమ్ముడయి రికార్డు నమోదైంది. జిల్లాలో ఇంకా కొన్ని చోట్ల యూరియా డిమాండ్ ఉండడంతో వ్యవసాయ శాఖ మరో 1,200 మెట్రిక్ టన్నులు తెప్పిస్తోంది. యాప్ ద్వారా అమ్మకాల జోరు యాప్ విధానం వచ్చిన తర్వాత జిల్లాలో యూరియా అమ్మకాలు భారీగా పెరిగాయి. గడిచిన నెల రోజుల్లో 1,02,958 మంది రైతులు 12,877 మెట్రిక్ టన్నుల (2,86,173 బస్తాలు) కొనుగోలు చేశారు. యాప్ ద్వారా రోజుకు సగటున 430 మెట్రిక్ టన్నులు (9,555 బస్తాలు) అమ్ముడయ్యాయి. పంటల సాగు పెరగడంతోపాటు రైతులు వచ్చే ఖరీఫ్ సీజన్కు కూడా ఇప్పుడే బస్తాలను తీసుకొని నిల్వ చేసుకుంటున్నట్లుగా అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వరికి ఎకరానికి 3 నుంచి 4 బస్తాల యూరియా వాడాల్సి ఉండగా 5 నుంచి 6 బస్తాలు, కొన్ని మండలాల్లో 8 బస్తాలు కూడా వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. పదేళ్లలో విక్రయాలు ఇలా..యాసంగిలో సాగవుతున్న ప్రధాన పంటలు (ఎకరాల్లో..) -
పెద్దపులి చక్కర్లు
నిజామాబాద్ – జగిత్యాల – సిరిసిల్ల అటవీ ప్రాంతాల్లో తిరుగుతున్న పులి ● ఈసారి సిరికొండ రేంజ్ ద్వారా వచ్చి మళ్లీ కమ్మర్పల్లి రేంజ్లోకి ● మూడు చోట్ల ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసిన అటవీ అధికారులుసాక్షి ప్రతినిధి, నిజామాబాద్: మహారాష్ట్ర నుంచి కొ న్ని నెలల క్రితం వచ్చిన పెద్ద పులి తెలంగాణలోని వివిధ జిల్లాల అటవీ ప్రాంతాల్లో ఆడ పులి కోసం తిరుగుతూ వచ్చి చివరకు నిజామాబాద్ – జగిత్యా ల – సిరిసిల్ల జిల్లాల్లోని అటవీ ప్రాంతాల్లో చక్కర్లు కొడుతోంది. తోడు కోసం వెతుకుతున్న పెద్ద పులికి ట్రయాంగిల్లో ఉన్న ఈ మూడు జిల్లాల పరిధి లోని అటవీ ప్రాంతాల్లో ఆహారం సమృద్ధిగా లభించే విధంగా పులి ఎక్కువగా ఇష్టపడే సాంబార్, దు ప్పులు, నీల్గాయి, కొండగొర్రె, జింకలు, కుందేళ్లు, అడవి పందులు ఎక్కువగా ఉన్నాయి. జిల్లాలోని ఇందల్వాయి, సిరికొండ, కమ్మర్పల్లి రేంజ్లలో వ న్యప్రాణుల కోసం ఏర్పాటు చేసిన సాసర్పిట్లలో నీ టిని నింపేందుకు సోలార్ మోటార్లు ఏర్పాటు చేశారు. అదేవిధంగా పలుచోట్ల అటవీ జంతువుల దాహార్తిని తీర్చేందుకు పలుచోట్ల చెక్డ్యాములు సైతం ఏర్పాటు చేశారు. తోడు కోసం వచ్చిన పులి నిజామాబాద్, జగిత్యా ల, సిరిసిల్ల జిల్లాల అటవీ ప్రాంతాల మధ్య తిరుగుతున్నట్లు అటవీ అధికారులు అంచనా వేస్తున్నారు. రెండు చోట్ల పాదముద్రలు..ఈ నెల 3వ తేదీన జగిత్యాల జిల్లా అటవీ ప్రాంతం నుంచి జిల్లాలోని కమ్మర్పల్లి రేంజ్ అడవిలోకి వచ్చిన పులి గట్టుపొడిచినవాగు డ్యాం బ్యాక్వాటర్ సమీపంలో రెండు రోజుల పాటు తిష్ట వేసింది. 6వ తేదీన తిరిగి సిరిసిల్ల జిల్లా చందుర్తి అడవిలోకి వెళ్లిపోయింది. తిరిగి ఈ నెల 9వ తేదీన జిల్లాలోని సిరిసిల్ల రేంజ్ అటవీ ప్రాంతంలోకి వచ్చింది. సిరికొండ రేంజ్లోని జంగ్యాల అటవీ ప్రాంతంలో సోమవారం పులి పాదముద్రలను అటవీ అధికారులు గుర్తించారు. మంగళవారం కమ్మర్పల్లి రేంజ్లోని తాటిపల్లి భీంగనర్ అడవిలో పులి పాదముద్రలను కనుగొన్నారు. దీంతో సిరికొండ, కమ్మర్పల్లి రేంజ్లలో అటవీ అధికారులు మూడు చోట్ల ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. తోడు దొరికే వరకు మగపులి తిరుగుతూనే ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అటవీ ప్రాంతాలకు సమీపంలోని గ్రామాల ప్రజలు, పొలాల్లో పనిచేసేవారు అప్రమత్తంగా ఉండాలి. పొలాల్లో, గ్రామాల సమీపంలో పులి పాదముద్రలు కనిపిస్తే తక్షణమే సమాచారం ఇవ్వాలి. అటవీ అధికారులు, సిబ్బందితో పెట్రోలింగ్ మరింత ముమ్మరం చేశాం. ట్రాప్ కెమెరాలతో వివరాలు సేకరించే ఏర్పాట్లు చేశాం. చుట్టుపక్కల జిల్లాల అటవీ అధికారులు, సిబ్బందితో పూర్తి సమన్వయం చేసుకుని, ఎప్పటికప్పుడు సమాచారం ఇచ్చిపుచ్చుకుంటూ ముందుకెళ్తున్నాం. – వికాస్ మీనా, జిల్లా అటవీ అధికారి -
తగ్గిన ఎర్రజొన్న ధర
క్వింటాల్ ధర రూ.3,950 నుంచి రూ.3,400కు తగ్గించిన సిండికేట్ ● ఒకేసారి ధర రూ.550 తగ్గడంతో రైతుల్లో ఆందోళనమోర్తాడ్(బాల్కొండ): ఎర్రజొన్న ధర విషయంలో వ్యాపారులు తమ పంతం నెగ్గించుకుంటున్నారు. నిన్న మొన్నటి వరకు క్వింటాల్ ధర రూ.3,800 నుంచి రూ.3,950 ఉండగా, ఒకేసారి రూ.550 వరకు తగ్గించారు. క్వింటాల్కు రూ.3,400 చెల్లిస్తామని చెబుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. సాగు విస్తీర్ణం తగ్గడంతో డిమాండ్ పెరుగుతుందని రైతులు ఆశించినప్పటికీ.. అందుకు భిన్నంగా వ్యాపారులు ధర తగ్గించి రైతులకు చుక్కలు చూపిస్తున్నారు. పంట సాగుకు ముందు బైబ్యాక్ ఒప్పందం చేసుకోవాలని జిల్లా అధికార యంత్రాంగం సూచించింది. బైబ్యాక్ ఒప్పందానికి వ్యాపారులు వెనుకంజ వేయగా రైతులు కూడా ఎలాంటి ఒత్తిడి చేయలేదు. అయితే ఉత్తరాది రాష్ట్రాలతోపాటు పొరుగు దేశాల్లో ఎర్రజొన్నకు మంచి మార్కెట్ ఉన్నా కావాలని వ్యాపారులు ధర తగ్గిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. మన జిల్లాలోనే అత్యధికంగా..వాణిజ్య పంటల సాగు మన జిల్లాలోనే ఎక్కువగా ఉంది. ఎర్రజొన్నలు ఎక్కువగా జిల్లాలోనే సాగవుతుండగా, నిర్మల్, జగిత్యాల్ జిల్లాల్లో కొంత మేర సాగవుతోంది. జిల్లాలో 2023–24 ఆర్థిక సంవత్సరంలో 34,086 ఎకరాల విస్తీర్ణంలో, 2024–25 సంవత్సరంలో 25,445 ఎకరాల్లో, 2025–26లో 22,378 ఎకరాల్లో రైతులు ఎర్రజొన్న సాగు చేశారు. సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోవడంతో ధర పెరుగుతుందని భావించిన రైతుల ఆశలపై వ్యాపారులు నీళ్లు చల్లారు. -
రూ.4వేలకు తగ్గకుండా చర్యలు తీసుకోవాలి
సుభాష్నగర్: ఎర్రజొన్న క్వింటాల్ ధర రూ.4వేల కు తగ్గకుండా చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రదేశ్ కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ అన్వేష్రెడ్డి సుంకెట కోరారు. ఈ మేరకు మంగళవారం కలెక్టర్ ఇలా త్రి పాఠికి ఆయన లేఖ ద్వారా విన్నవించారు. రాష్ట్రంలో ఒక్క నిజామాబాద్ జిల్లాలోనే ఎర్రజొన్న సాగవుతోందని, కానీ పంట చేతికొచ్చిన ప్రతిసారి వ్యా పారులు ధర విషయంలో రైతులకు అన్యాయం చేస్తున్నారని పేర్కొన్నారు. పంట వచ్చిన మొదట్లో ఉన్న ధర క్రమంగా తగ్గిస్తున్నారని, ఈసారి పంట వచ్చిన మొదట్లో క్వింటాల్కు రూ.3900 ఇచ్చి.. ఇప్పుడు రూ.3400కు తగ్గించారని లేఖలో పేర్కొన్నారు. గతేడాది కన్నా ఈసారి సాగు విస్తీర్ణం కూడా తగ్గిందన్నారు. అయినప్పటికీ వ్యాపారులు ధర పెంచడంలేదన్నారు. వ్యాపారులు సిండికేట్గా మా రి ధరను తగ్గిస్తున్నారని, మా ర్కెట్ లేదని రక రకాల కారణాలు చెబుతుండడంతో రై తులు నష్ట పోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రత్యే క చొరవ తీసు కుని వ్యాపారులతో మాట్లాడాలని, క్వింటాల్కు ధర కనీసం రూ.4వేలకు తగ్గకుండా చర్య లు తీసుకోవాలని కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. -
భీమ్గల్ పట్టణాభివృద్ధికి అందరూ సహకరించాలి
కమ్మర్పల్లి(భీమ్గల్): భీమ్గల్ పట్టణాభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని మున్సిపల్ చైర్పర్సన్ బొదిరే నాగమణి విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఆమె అధ్యక్షతన మున్సిపల్ సాధారణ సభ్య సమావేశం నిర్వహించారు. ఎజెండా అంశాలను కమిషనర్ గోపు గంగాధర్ ప్రస్తావించారు. అంశాలపై కౌన్సిలర్లు చర్చించి ఆమోదం తెలిపారు. వైస్ చైర్పర్సన్ సంటి లత, కౌన్సిలర్లు కుశలత, సతీశ్, గున్నా ల బాలలక్ష్మి, బొదిరే లావణ్య, అంజుమ్ అలీ, సందీప్, నీలం రవి, సంగ్యానాయక్, మల్లెల అనుపమ, మేనేజర్ నరేందర్ తదితరులు పాల్గొన్నారు. -
ఫిజియోథెరపీని సద్వినియోగం చేసుకోవాలి
ఆర్మూర్: తెలంగాణ సర్వశిక్షాభియాన్ సహిత విద్యా విభాగం ఆధ్వర్యంలో అందించే ఉచిత ఫిజియోథెరపీని వైకల్యంతో బాధపడే పిల్లల తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని ఆర్మూర్ ఎంఈవో రాజగంగారాం సూచించారు. ఆర్మూర్ పట్టణంలోని భవిత కేంద్రంలో ఉచిత ఫిజియోథెరపీ శిబిరాన్ని మంగళవారం ప్రారంభించారు. భవిత కేంద్రంలో ప్రతీ వారానికి రెండు రోజులు ఉచితంగా ఫిజియోథెరపీ సేవలను అందిస్తున్నామన్నారు. ఫిజియోథెరపీస్ట్ అరుణ చిన్నారులకు ఫిజియోథెరపీ అందించారు. శిబిరంలో ఇన్క్లూసివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్పర్సన్ కిషన్, సురేశ్, ఎంఐఎస్ కోఆర్డినేటర్ అలేఖ్య, ఆపరేటర్ రఘు, మెసెంజర్ రవి, సీజీవీ కవిత తదితరులు పాల్గొన్నారు. రెండో రోజు కొనసాగిన శిక్షణ రుద్రూర్: ఫుడ్సైన్స్ టెక్నాలజీ కళాశాలలో మహిళా రైతులకు మంగళవారం రెండవ రోజు శిక్షణ కార్యక్ర మం కొనసాగింది. శిక్షణలో భాగంగా గుడ్లు, మాంసం, కోడి మాంసంతో పలు విలువ ఆధారిత ఆహా ర ఉత్పత్తులను తయారు చేశారు. పరిశుభ్రత ప్రమాణాలు పాటిస్తూ ఉత్పత్తులను తయారు చేయడం, నిల్వ విధానాలు, ప్యాకెజింగ్, మార్కెటింగ్ అవకాశాల గూర్చి అవగాహన పెంచుకున్నా రు. కళాశాల అసోసియేట్ డీన్ కే వెంకట్ రెడ్డి, కో ర్సు డైరెక్టర్లు పీ శ్రీలత, బీ అమల పాల్గొన్నారు. -
నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యం
● ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేశ్రెడ్డి నందిపేట్: ఆర్మూర్ నియోజకవర్గ అభివృద్ధే తన లక్ష్యమని ఎమ్మెల్యే రాకేశ్రెడ్డి అనానరు. నందిపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో లబ్ధిదారులకు మంజూరైన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను మంగళవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజలకు అన్ని సంక్షేమ పథకాలు అందే లా అధికారులు చూడాలని అన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ సంతోష్రెడ్డి, ఆర్ఐ దివ్య, నందిపేట, డొంకేశ్వర్ మండలాల బీజేపీ అధ్యక్షులు పటేల్రాజు, చిన్నారెడ్డి, సర్పంచులు సాయి, మహేశ్, సంజీవ్, నాయకలు చిన్నా రెడ్డి, నాగసురేశ్, సాయినాథ్, అరుట్ల రమేశ్, కస్తూరి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్తోనే గ్రామాల అభివృద్ధి నందిపేట్: గ్రామాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్ర భుత్వం కట్టుబడి ఉందని పార్టీ ఆర్మూర్ ని యోజకవర్గ ఇన్చార్జి వినయ్రెడ్డి అన్నారు. నందిపేట మండల కేంద్రంలోని మున్నూరుకాపు కల్యాణ మండలంలో మంగళవారం ఉమ్మడి నందిపేట మండలంలోని మున్నూరుకాపు స ర్పంచులకు, ఉపసర్పంచులకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం వినయ్రెడ్డి సర్పంచు, ఉప సర్పంచులను సన్మానించారు. అయిలాపూర్ సొసైటీ చైర్మన్ మీసాల సుదర్శన్, పార్టీ మండల అధ్యక్షుడు మంద మహిపా ల్, సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. చెత్త సేకరణ ఆటోలు ప్రారంభం వర్ని: మండలంలోని సత్యనారాయణపురం జీపీలో నూతనంగా కొనుగోలు చేసిన రెండు చెత్త సేకరణ ఆటోలను సర్పంచ్ కనకదుర్గ రవి మంగళవారం ప్రారంభించారు.రూ. కార్యక్రమంలో ఉప సర్పంచ్ రాంబాబు, నాయకులు సురేశ్, సరి చాంద్, రాజు పాల్గొన్నారు. ప్రొఫెసర్గా పదోన్నతి పొందిన ప్రిన్సిపాల్ ఆర్మూర్టౌన్: ఆర్మూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ వేణుగోపాల స్వామి ప్రొఫెసర్గా పదోన్నతి పొందారు. ఉన్నత విద్యా శాఖ మండలి అధికారులు ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రొఫెసర్గా పదోన్నతి పొందిన ప్రిన్సిపాల్ వేణుగోపాల స్వామిని బా ల్కొండ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ వేణు ప్రసా ద్, ఆర్మూర్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ సునీత, అధ్యాపకులు అంబర్సింగ్, రహమాన్, శ్యామ్ కుమార్, లింగన్న ఘనంగా స న్మానించారు. కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పరామర్శ కమ్మర్పల్లి: ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధ నేపథ్యంలో ఇజ్రాయెల్లో బాంబు పడి గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కమ్మర్పల్లి వాసి కోయల్కర్ తిరుపతి కుటుంబాన్ని స్థానిక పోలీసులు మంగళవారం పరామర్శించారు. ఎస్సై అనిల్రెడ్డి, పోలీస్ సిబ్బంది తిరుపతి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. అక్కడి యుద్ధ పరిస్థితులను వివరించి ధైర్యం చెప్పారు. మానసికి స్తైర్యాన్ని నింపారు. విద్యార్థినులకు హెచ్పీవీ వ్యాక్సినేషన్ ఆర్మూర్టౌన్: ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో మంగళవారం గర్భాశయముఖ ద్వారా వచ్చే క్యాన్సర్ నివారణ వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఆస్పత్రిలో 14 నుంచి 15 ఏళ్ల వయసు గల బాలికలకు ఉచితంగా హెచ్పీవీ వ్యాక్సినేషన్ చేపట్టారు. ఈ సందర్భంగా డిప్యూటీ డీఎంహెచ్వో రవీందర్ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన ఉచిత వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆర్మూర్ పట్టణంలోని సీహెచ్సీలో వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. వైద్యాధికారిణి శ్రేయ, కృష్ణమూర్తి, ప్రదీప్, సాయి, చంద్రశేఖర్, శ్యామల, చరణ్, బాలాజీ, సుచరిత, సిబ్బంది పాల్గొన్నారు. -
మహిళా లోకానికి దిక్సూచి సావిత్రిబాయి ఫూలే
నందిపేట్/ పెర్కిట్/ ఆర్మూర్/ బోధన్/ నవీపేట: విద్య ద్వారానే స్త్రీ విముక్తి సాధ్యమని నమ్మి మహిళల్లో చైతన్యం తీసుకొచ్చి చదువుకునేలా ప్రోత్సహించిన సావిత్రిబాయి ఫూలే మహిళా లోకానికి దిక్సూచి అని పలువురు వక్తలు అన్నారు. ఆర్మూర్, బాల్కొండ, బోధన్ నియోజకవర్గాల్లో ప్రభుత్వ, ప్రైవేట్, స్వచ్ఛంద సంస్థల కార్యాలయాల్లో సావిత్రిబాయి ఫూలే వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలువురు పూలమాల వేసి నివాళులు అర్పించారు. నందిపేట మండల కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాలలో, ఆర్మూర్ మండలం గోవింద్పేట్ రాక్ చర్చిలో, బోధన్ పట్టణంలోని న్యాయ సహాయ కేంద్రంలో సావిత్రిబాయి ఫూలే వర్ధంతి నిర్వహించారు. నవీపేటకు చెందిన సామాజిక కార్యకర్త వడ్డెరవి ఆధ్వర్యంలో యువకులు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో రక్తదానం చేశారు. -
పార్టీని బలోపేతం చేయాలి
నందిపేట్: కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ గ్రామాల్లో బీజేపీని బలోపేతం చేయాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్రెడ్డి అన్నారు. మంగళవారం నందిపేట మండల కేంద్రంలో నందిపేట, డొంకేశ్వర్ ఉమ్మడి మండలాల బీజేపీ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. భవిష్యత్తులో బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. దేశానికి మోదీ ఒక గొప్ప నాయకుడ ని అతని శక్తిని చూసి ఓర్వలేక కొందరు బీజేపీని విమర్శిస్తున్నారని ఆరోపించారు. రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించి సత్తా చాటాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు బద్దం లింగారెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు పటేల్ రాజు, కార్యదర్శి కస్తూరి గంగాధర్, జిల్లా నాయకులు నాగ సురేశ్, సంజీవ్, గంగాధర్ గౌడ్, అరుట్ల రమేశ్, నర్సా గౌడ్, కృష్ణ, వెల్మల్ నరేందర్, నందిపేట్, డొంకేశ్వర్ మండలాల నాయకులు పాల్గొన్నారు. -
ఘనంగా మహిళా దినోత్సవం
రుద్రూర్: రుద్రూర్ మండల కేంద్రంలో పీఆర్టీయూ ఆధ్వర్యంలో మంగళవారం అంతర్జాతీయ మహిళ ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి తహసీల్దార్ తారాబాయి హాజరై మాట్లా డారు. సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ ఇందూర్ సునీత చంద్రశేఖర్, ఎంఈవో కట్ట శ్రీనివాస్, మండల వైద్యాధికారిణి అయేషా సిద్ధిఖా, పీఆర్టీయూ మండల అధ్యక్ష, కార్యదర్శులు విఠల్రెడ్డి, దస్తగిరి తదితరులు పాల్గొన్నారు. పోతంగల్ మండలం జల్లాపల్లి ఫారంలో సర్పంచ్ రాజు ఆధ్వర్యంలో మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మహిళా ఉపాధ్యాయులు, సిబ్బందిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో డ్వాక్రా, అంగన్వాడీ, హెల్త్, ఆశావర్కర్లు, జీపీ కార్మికులు పాల్గొన్నారు. జల్లాపల్లి ఫారంలో.. రుద్రూర్లో ఉపాధ్యాయులను సన్మానించిన అధికారులు, ప్రజాప్రతినిధులు -
మెరుగైన ఫలితాలు సాధించాలి
పెర్కిట్/ వేల్పూర్/ బోధన్: పదో తరగతి పరీక్షల్లో విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించాలని ఆలూర్ సర్పంచ్ ముక్కెర విజయ్ ఆకాంక్షించారు. ఆలూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మంగళవారం పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశం నిర్వహించారు. సమావేశానికి సర్పంచ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఆ దిశగా పయనించాలని అన్నారు. ఎంఈవో నరేందర్ మా ట్లాడుతూ.. విద్యార్థులు సమయాన్ని సద్వినియో గం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో వీడీసీ అ ధ్యక్షుడు మగ్గిడి సూర్య, ఉపాధ్యాయులు, విద్యార్థు లు పాల్గొన్నారు. వేల్పూర్ మండలం రామన్నపేట్ ఉన్నత పాఠశాలలో ఎస్సెస్సీ విద్యార్థులకు వీడ్కో లు కార్యక్రమం నిర్వహించారు. హెచ్ఎం శివాజీకుమార్ మాట్లాడుతూ.. విద్యార్థులు క్రమశిక్షణతో చ దువుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలన్నారు. విద్యార్థులు నృత్యాలు చేసి అలరించారు. గ్రామానికి చెందిన పడకంటి మహిపాల్రెడ్డి పదో తరగతి విద్యార్థులకు పరీక్ష అట్టలను అందించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు వేణుగోపాల్, మనోహర్, శ్రీకాంత్, గణేశ్, నగేశ్, శ్యాం, చరణ్, సరిత పాల్గొన్నారు. బోధన్ పట్టణ కేంద్రంలోని రాకాసిపేట ప్ర భుత్వ ఉన్నత పాఠశాల(జేసీ)లో పదో తరగతి వి ద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. పా ఠశాల ఇన్చార్జి హెచ్ఎం కృష్ణ మాట్లాడుతూ.. పదో తరగతి వార్షిక పరీక్షలను ఎలాంటి ఒత్తిళ్లకు గురికాకుండా ప్రశాంతంగా రాయాలని సూచించారు. ఉపాధ్యాయులు సుధాకర్ రెడ్డి, ఖైరాన్, జ్యోతి, సంజీవ్ కుమార్, రామ్మోహన్, వెంకట్, విద్యాసాగర్, రాకేవ్, కిశోర్, నాగేశ్వర్రావు, స్నేహ, కల్యాణి, రాజ్యలక్షి తదితరులు పాల్గొన్నారు. -
పశువులకు గాలికుంటు టీకాలు వేయించాలి
మాక్లూర్/ మోర్తాడ్/ వేల్పూర్/ రుద్రూర్/ బోధన్/ రెంజల్/ కమ్మర్పల్లి: పశువుల పెంపకందారులు తమ జీవాలు రోగాల బారిన పడకుండా ఉండాలంటే గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలని పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు అన్నారు. మాక్లూర్ మండలంలోని ఆయా గ్రామాల్లో పశువైద్యాధికారులు మంగళవారం ప్రా రంభించారు. మాణిక్బండార్ గ్రామంలో 2వ డివిజన్ కార్పొరేటర్ మారంపల్లి మోహన్ ఆధ్వర్యంలో పశువైద్యాధికారి బాబురావు, మాక్లూర్ మండలంలోని కొత్తపల్లిలో సర్పంచ్ వేములపల్లి రత్నకుమారి, మాక్లూర్లో సర్పంచ్ సాయినేని వెంకటేశ్వర్రావుల ఆధ్వర్యంలో మండల పశువైద్యాదికారి ఉమా సహేర్, కిరణ్దేశ్పాండే, ఆలూర్ మండలం కల్లెడి గ్రామంలో సర్పంచ్ గంగ్గోల్ల సుస్మిత ఆధ్వర్యంలో పశువైద్యాధికారి సందీప్లు పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేశారు. మోర్తాడ్లో నిర్వహించిన కార్యక్రమంలో సర్పంచ్ భోగ ఆనంద్, ఉప సర్పంచ్ సామ శ్రీనివాస్, కార్యదర్శి సైఫొద్దీన్, పశువైద్యాధికారి గౌతమ్రాజ్, సిబ్బంది ప్రభాకర్, ప్రభాస్ తదితరులు పాల్గొన్నారు. వేల్పూర్ మండలం పోచంపల్లిలో పశువులకు ఉచిత గాలికుంటు నివారణ టీకాల కార్యక్రమాన్ని సర్పంచ్ సాతాల రాజు ప్రారంభించారు. మండల వెటర్నరీ వైద్యుడు సంతోష్రెడ్డి పశువులకు టీకాలు వేశారు. పశువైద్య సిబ్బంది సురేశ్, గంగాధర్, దయానంద్, జావిద్, రైతులు పాల్గొన్నారు. రుద్రూర్ మండలంలోని రాయకూర్ క్యాంపులో గాలికుంటు వ్యాధి నివారణ టీకా కార్యక్రమాన్ని సర్పంచ్ పరుచూరి పద్మ ప్రారంభించారు. 99 పశువులకు టీకాలు వేసినట్లు మండల పశువైద్యాధికారి సంతోష్ రెడ్డి తెలిపారు. ఎడపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమాన్ని సర్పంచ్ కందగట్ల రాంచందర్ ప్రారంభించారు. పశువైద్యాధికారి ప్రమోద్, సిబ్బంది పశువులకు టీకాలు వేశారు. ఉపసర్పంచ్ మచ్కూరి గంగాధర్, రైతులు సుమన్, సాయికృష్ణ, సాయికుమార్, వైద్య సిబ్బంది సుశాంత్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు. రెంజల్ మండలంలోని నీలా గ్రామంలో గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమాన్ని సర్పంచ్ క్యాతం యోగేశ్, మండల పశు వైద్యాధికారి విఠల్ ప్రారంభించారు. కమ్మర్పల్లి మండల కేంద్రంలో పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమాన్ని మండల పశు వైద్యాధికారి రాజశేఖర్రావు ప్రారంభించి టీకాలు వేశారు. ఉప సర్పంచ్ అశోక్, సిబ్బంది ప్రవీణ్రెడ్డి, స్పరన్ తదితరులు పాల్గొన్నారు. -
‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’తో గ్రామాల అభివృద్ధి
ఆర్మూర్టౌన్/ వేల్పూర్/ రుద్రూర్/ పెర్కిట్/ రెంజల్: ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’తో గ్రామాలు అన్ని విధాల అభివృద్ధి చెందుతాయని పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఆర్మూర్ పట్టణంలో విద్యార్థులు మంగళవారం 2కే రన్ నిర్వహించారు. ఆర్మూర్ మున్సిపల్ అభివృద్ధే లక్ష్యంగా కృషి చేస్తామని మున్సిపల్ చైర్పర్సన్ గోనె లహరి, కమిషనర్ ఉమా మహేశ్వర్ రావు అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ శ్రీనివాస్, శానిటరి ఇన్స్పెక్టర్ నరేందర్, సిబ్బంది పాల్గొన్నారు. వేల్పూర్ మండలం హనుమాన్నగర్లో ప్రజాపాలన ప్రణాళిక పనుల్లో భాగంగా సర్పంచ్ అల్లెపు నడ్పిమల్లయ్య మురికి కాలువకు పైపులైన్ బిగింపజేశారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ మణికంఠ, జీపీ కార్యదర్శి భరత్స్వరూప్ పాల్గొన్నారు. కోటగిరి మండల కేంద్రంతో పాటు అడ్కాస్పల్లి, బస్వాపూర్ గ్రామాల్లో చేపడుతున్న ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమాల అమలును ఎంపీడీవో శ్రీనివాస్రెడ్డి పరిశీలించారు. లబ్ధిదారులు నిర్మించుకుంటున్న ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. రుద్రూర్ మండలం సిద్ధాపూర్లో ఎంపీడీవో బాల గంగాధర్ పర్యటించి గ్రామంలో కొనసాగుతున్న పనులను పరిశీలించారు. ఆలూర్ మండలం దేగాం పీహెచ్సీలో ప్రత్యేక ఆరోగ్య వైద్య శిబిరం నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీడీవో గంగాధర్, సర్పంచ్ ఇట్టెడి లింగారెడ్డి, వైద్యులు అయేషా, రక్షిత, గీతా, సల్మాన్, సృజిల్ బాబు, వైశాలి, ఏపీఎం భూమేశ్వర్ గౌడ్, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు. రెంజల్ మండలం నీలా గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో డీఎల్పీవో నాగరాజు పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలో విద్యార్థులతో 2కే రన్ నిర్వహిస్తున్న అధికారులుహనుమాన్నగర్లో పైపులైన్ బిగింపజేస్తున్న సర్పంచ్ నడ్పి మల్లయ్య -
క్రైం కార్నర్
చింతకాయల కోసం వెళ్లి..● చెట్టుపై నుంచి పడి ఒకరి మృతి డిచ్పల్లి: చింతకాయల కోసం చెట్టుపైకెక్కిన వ్యక్తి ప్రమాదవశాత్తు కిందపడి మృతి చెందిన ఘటన డిచ్పల్లి మండలం మిట్టాపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో గ్రామానికి చెందిన మైలారం చిన్న పోశన్న (55) చింతకాయలు తెంపడానికి చెట్టుపైకి ఎక్కాడు. కాలుజారి చెట్టుపై నుంచి కిందపడటంతో తలకు తీవ్ర గాయమైంది. వెంటనే కుటుంబీకులు చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పోశన్న మృతి చెందాడు. భార్య చిన్నమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. రుద్రూర్ : మండలంలోని అక్బర్నగర్ గ్రామానికి చెందిన కల్దుర్కి పోశెట్టి (57) మృతదేహం లభ్యమైంది. ఎస్సై సాయన్న తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం సాయంత్రం పొలానికి వెళ్లిన పోశెట్టి రాత్రి వరకు ఇంటికి తిరిగి రాలేదు. కుటుంబసభ్యులు పొలం పరిసర ప్రాంతాల్లో వెతికినప్పటికీ ఆచూకీ లభించలేదు. అయితే, సోమవారం ఉదయం పొలం సమీపంలో ఉన్న చెరువులో మృతదేహం కనిపించింది. గ్రామస్తుల సహాయంతో మృతదేహాన్ని నీటిలో నుంచి బయటకు తీశారు. కాలకృత్యాలకు వెళ్లిన సమయంలో ప్రమాదవశాత్తు కాలు జారి చెరువులో పడటంతో మృతి చెంది ఉంటాడని కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. డ్రంకెన్ డ్రైవ్లో 86 మందికి శిక్ష కామారెడ్డి క్రైం: మద్యం సేవించి వాహనాలు నడిపినందుకు జిల్లా వ్యాప్తంగా ఉన్న వివిధ కోర్టులు సోమవారం ఒకే రోజు 86 మందికి శిక్ష విధించాయి. వాహనాల తనిఖీల్లో పట్టుబడిన వారిని ఆయా కోర్టులలో హాజరుపర్చగా 8 మందికి ఒక రోజు, ఒకరికి 2 రోజుల జైలు శిక్షతో పాటు మొత్తం 86 మందికి రూ.1,22,500 జరిమానా విధించినట్లు ఎస్పీ రాజేశ్చంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. మద్యం సేవించి వాహనం నడపడం నేరమన్నారు. జిల్లాలోని అన్ని పీఎస్ల పరిధిలో క్రమం తప్పకుండా వాహనాల తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలని సూచించారు. -
క్యాంపస్ సమాచారం
తెయూలో రెండు రోజుల జాతీయ సదస్సు ● 25, 26వ తేదీల్లో నిర్వహణ తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ రసాయన శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ‘ఇన్నోవేషన్స్ ఇన్ మెడిసినల్ కెమిస్ట్రీ (ఐఎంసీ)–2026’ అనే అంశంపై ఈ నెల 25, 26వ తేదీల్లో నిర్వహించనున్నారు. సదస్సుకు సంబంధించిన బ్రోచర్ను తెయూ వీసీ యాదగిరిరావు, రిజిస్ట్రార్ యాదగిరి సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ సదస్సులో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన అధ్యాపకులు, శాస్త్రవేత్తలు, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొని మెడిసినల్ కెమిస్ట్రీ రంగంలో జరుగుతున్న తాజా పరిశోధనలు, ఆవిష్కరణలపై చర్చిస్తారని తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సదస్సు కన్వీనర్ డాక్టర్ సాయిలు మాట్లాడుతూ పరిశోధకులు తమ అబ్స్ట్రాక్ట్లను ఈ నెల 15లోపు సమర్పించాలని తెలిపారు. కార్యక్రమంలో కోకన్వీనర్ నాగరాజు, ఆర్గనైజింగ్ సెక్రటరీ నాగరాజు, బాలకిషన్, అధ్యాపకులు గంగాకిషన్, నాగేంద్రబాబు, సునీత, సురేశ్ తదితరులు పాల్గొన్నారు. స్క్రిప్ట్ టు స్క్రీన్ ఎలక్ట్రానిక్ మీడియాపై.. తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ మాస్ కమ్యూనికేషన్స్ విభాగం ఆధ్వర్యంలో ‘స్క్రిప్ట్ టు స్క్రీన్ : ఎలక్ట్రానిక్ మీడియా’ అనే అంశంపై బుధవారం నుంచి మూడు రోజులపాటు వర్క్షాప్ నిర్వహించనున్నట్లు మాస్ కమ్యూనికేషన్ విభాగాధిపతి ప్రొఫెసర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం 100 రోజుల కార్యాచరణలో భాగంగా చేపట్టిన వర్క్షాప్ బ్రోచర్ను వర్సిటీ వీసీ ప్రొఫెసర్ టి.యాదగిరిరావు, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం.యాదగిరి ఆవిష్కరించారు. వర్క్షాప్ను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని వీసీ సూచించారు. కార్యక్రమంలో ప్రొఫెసర్లు ఆంజనేయులు, సంపత్ కుమార్, బీవోఎస్ చైర్మన్ శాంతాబాయి, పీఆర్వో రమణాచారి, అధ్యాపకులు మోహన్, శ్రీనివాస్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. నూతన కళాశాలకు తరలిన సైన్స్ విభాగాలు ● పూజలు నిర్వహించిన వీసీ తెయూ(డిచ్పల్లి): గత నెల సీఎం రేవంత్ రెడ్డి వర్చువల్గా ప్రారంభించిన తెలంగాణ యూనివర్సిటీ నూతన సైన్స్ కళాశాలలోకి సోమవారం సైన్స్ విభాగాలను తరలించారు. నూతన భవనంలో వీసీ యాదగిరిరావు, రిజిస్ట్రార్ యాదగిరి పూజ లు నిర్వహించారు. ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ, బోట నీ, బయో టెక్నాలజీ, మాథ్స్, స్టాటిస్టిక్స్, ఆర్గానిక్ కెమిస్ట్రీ విభాగాలు నూతన భవనంలోకి తరలివెళ్లాయి. అనంతరం సైన్స్ కళాశాలలోని అన్ని విభాగాలను సందర్శించి విభాగాధిపతులకు సూచనలు ఇచ్చారు. కార్యక్రమంలో ఆడిట్ సెల్ డైరెక్టర్ ఘంటా చంద్రశేఖర్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ సంపత్కుమార్, వర్సిటీ కళాశాల ప్రిన్సిపల్ రాంబాబు, సైన్స్ విభాగాల అధిపతులు ఎం.సత్యనారాయణ, అలీమ్ ఖాన్, ప్రసన్నశీల, సంపత్కుమార్, బి.సాయిలు తదితరులు పాల్గొన్నారు. నైపుణ్యాలు పెంపొందించుకోవాలి ● వీసీ ప్రొఫెసర్ యాదగిరిరావు తెయూ(డిచ్పల్లి): ప్రస్తుత పోటీ ప్రపంచంలో కేవలం డిగ్రీ సాధిస్తే సరిపోదని, ఉద్యోగ అవకాశాలను పొందేందుకు అవసరమైన నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడం ప్రధానమని తెలంగాణ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ టీ.యాదగిరిరావు సూచించారు. వర్సిటీ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సెల్ ఆధ్వర్యంలో రిలయన్స్ ఫౌండేషన్ సహకారంతో నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమంలో సోమవారం వీసీ హాజరై ప్రసంగించారు. విద్యార్థులు తమలోని సంకోచాలను అధిగమించి ఇంట్రావర్ట్ స్వభావం నుంచి ఎక్స్ట్రావర్ట్గా మారేందుకు ప్రయత్నించాలన్నారు. వ్యక్తిత్వ వికాసం, కమ్యూనికేషన్ నైపుణ్యా లు, నాయకత్వ లక్షణాలు, టీమ్ వర్క్ వంటి అంశాలను అభివృద్ధి చేసుకోవడం ద్వారా మెరుగైన ఉద్యోగ అవకాశాలను పొందవచ్చన్నారు. ఉపాధి అవకాశాలకు అవసరమైన సాఫ్ట్ స్కిల్స్, సాంకేతిక పరిజ్ఞానం, ప్రాక్టికల్ నైపుణ్యాలను నేర్చుకోవడం చాలా అవసరమని వివరించారు. కార్యక్రమంలో ప్లేస్మెంట్ సెల్ డైరెక్టర్ డాక్టర్ పాత నాగరాజు, ప్రొఫెసర్ సీహెచ్ ఆంజనేయులు, శ్రీనివాస్, కిరణ్ రాథోడ్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. జాతీయస్థాయి వర్క్షాప్ను సద్వినియోగం చేసుకోవాలి తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ జియో ఇన్ఫర్మెటిక్స్ విభాగం ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నిర్వహించనున్న జాతీయస్థాయి వర్క్షాప్ను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని వీసీ యాదగిరిరావు సూచించారు. సోమవారం వర్క్షాప్ బ్రోచర్స్ను రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం.యాదగిరితో కలిసి వీసీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 24, 25, 26వ తేదీల్లో ‘గ్రామీణ జీఐఎస్, మొబైల్ జీపీఎస్ ద్వారా సామాజిక నిర్ణయాధికారం – ప్రయోగాత్మక అనుభవంతో కూడిన భవిష్యత్ ధృక్పథం’ అనే అంశంపై ఈ వర్క్షాప్ నిర్వహించనున్నట్లు తెలిపారు. మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులకు, పరిశోధక విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానం అత్యవసరమన్నారు. వర్క్షాప్ కన్వీనర్ డాక్టర్ ప్రతిజ్ఞ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలో వనరుల నిర్వహణ ప్రణాళికపై నిర్ణయాలు తీసుకోవడంలో మొబైల్ జీపీఎస్, గ్రామీణ జీఐఎస్ ద్వారా సమాచారం సేకరించి అవసరమైన మ్యాప్లను తయారు చేయడానికి వర్క్షాప్ ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో సౌత్ క్యాంపస్ ప్రిన్సిపల్ ఆర్ సుధాకర్ గౌడ్, జియో ఇన్ఫర్మెటిక్స్ హెచ్వోడీ సబిత, వర్క్షాప్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ ఎస్.నారాయణ గుప్తా తదితరులు పాల్గొన్నారు. -
ప్రజావాణికి 103 ఫిర్యాదులు
నిజామాబాద్ అర్బన్: ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులకు సూచించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 103 ఫిర్యాదులు అందాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను కలెక్టర్తోపాటు అదనపు కలెక్టర్లు కిరణ్కుమార్, దిలీప్ కుమార్, ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియా, డీఆర్డీవో సాయాగౌడ్, ఆర్డీవో రాజేంద్రకుమార్, డీపీవో శ్రీనివాస్, ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారిణి కృష్ణవేణిలకు వివరించారు. కాగా, అర్జీలను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. -
చైన్ స్నాచింగ్ నిందితుడి రిమాండ్
కామారెడ్డి క్రైం: జిల్లా కేంద్రంలోని స్టేషన్ రోడ్డులో ఆదివారం సాయంత్రం నడుచుకుంటూ వెళ్తున్న భారతి అనే మహిళ మెడలో నుంచి బంగారు గొలుసు లాక్కొని పరారవుతున్న చైన్ స్నాచర్ను సమీపంలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లు పట్టుకున్న విషయం తెలిసిందే. నిందితుడిని రామారెడ్డి మండలం మద్దికుంట గ్రామానికి చెంది న గుండెబోయిన స్వామిగా గుర్తించారు. రూ.4.80 లక్షల విలువైన బంగారు గొలుసును రికవరీ చేసి సోమవారం నిందితుడిని రిమాండ్కు తరలించినట్లు పట్టణ ఎస్హెచ్వో నరహరి తెలిపారు. రెంజల్(బోధన్): మండలంలోని బోర్గాం శివారులో అక్రమంగా నిల్వ చేసి చేసిన ఇసుక డంపులను సీజ్ చేసినట్లు తహశీల్దార్ శ్రావణ్కుమార్ తెలిపారు. రె వెన్యూ సిబ్బంది గుర్తించి సమాచారం అందించడంతో గ్రామానికి చేరుకొని ఇసుక అక్రమ నిల్వల ను తహసీల్ కార్యాలయానికి తరలించి డంప్ చేయించినట్లు వివరించారు. సుమారు 20 ట్రాక్టర్ల ఇసుకను ప్రభుత్వ నిర్మాణ పనులకు అందిస్తామన్నారు. -
నికాల్పూర్లో పుష్కరఘాట్ ఏర్పాటు చేయాలి
డొంకేశ్వర్(ఆర్మూర్): మండలంలోని నికాల్పూర్ గ్రామంలో పుష్కరఘాట్ ఏర్పాటు చేయాలని గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు సోమవారం ప్రజావాణిలో అదనపు కలెక్టర్ కిరణ్కుమార్కు వినతిపత్రం అందజేశారు. ‘సాక్షి’ దినపత్రిలో వచ్చిన ‘పుణ్య స్నానాల గంగ’ కథనాన్ని వినతిపత్రానికి జోడించి ఇచ్చారు. గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలో గోదావరి నది ఉందని, ఇక్కడి వరకు రోడ్డు సౌకర్యం ఉందన్నారు. పుణ్యస్నానాలకు నికాల్పూర్లో గంగకు ప్రసిద్ధి ఉందని, ఇతర ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి మొక్కులు తీర్చుకుంటారని తెలిపారు. 2027లో ప్రభుత్వం నిర్వహించే పుష్కరాలకు నికాల్పూర్ చాలా అనుకూలంగా ఉంటుందన్నారు. ఘాట్ నిర్మించి పుష్కరాలు జరపాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ అనితాసుమన్, ఉప సర్పంచ్ నీరజసుధాకర్, వీడీసీ సభ్యులు నవీన్, ముత్యం ఉన్నారు. -
క్రీడాకారునికి కలెక్టర్ అభినందన
నిజామాబాద్ అర్బన్: బాల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు అనిల్ కుమార్ను కలెక్టర్ ఇలా త్రిపాఠి సోమవారం అభినందించారు. ఫిబ్రవ రి 28వ తేదీ నుంచి మార్చి 4వ తేదీ వరకు మ లేసియా దేశంలో జరిగిన ఇండియా–మలేషి యా అంతర్జాతీయ బాల్ బ్యాడ్మింటన్ సిరీస్ లో పాల్గొన్న అనిల్కుమార్ బంగారు పతకం సాధించారు. ఈ సందర్భంగా కలెక్టర్ను మ ర్యాదపూర్వకంగా కలవగా అభినందించారు. భవిష్యత్తులో దేశానికి మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జిల్లా యువజన, క్రీడాభివృద్ధి అధికారి పవన్ కుమా ర్, బాల్ బ్యాడ్మింటన్ సంఘం బాధ్యులు శ్రావణ్ రెడ్డి, విద్యాసాగర్ రెడ్డి, శ్యామ్, రాజేశ్, రమణ, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. రుద్రూర్: మండలంలోని ఆహార శాస్త్ర సాంకేతిక విజ్ఞాన కళాశాలలో మహిళా రైతులకు మాంసం, మాంస ఉత్పత్తులపై ఏర్పాటు చేసిన మూడు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐసీఏఆర్–ఎన్ఎంఆర్ఐ డైరెక్టర్ డా. ఎస్బీ బర్బుద్దే, ప్రిన్సిపల్ సైంటిస్ట్ డా. బస్వా రెడ్డి మాట్లాడుతూ మహిళా రైతులు శిక్షణ ద్వారా లభించే పరిజ్ఞానాన్ని పూర్తిగా వినియోగించుకొని, ఆదాయాన్ని పెంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కళాశాల అసోసియేట్ డీన్ వెంకట్ రెడ్డి, కోఆర్డినేటర్లు శ్రీలత, అమల, కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పాఠశాలలో క్షుద్రపూజల కలకలం ● డొంకేశ్వర్ మండలం దత్తాపూర్లో ఘటన డొంకేశ్వర్(ఆర్మూర్): ప్రభుత్వ పాఠశాల లో క్షుద్రపూజలు కలకలం రేపాయి. డొంకేశ్వర్ మండలం దత్తాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామంలో ప్రభుత్వ పాఠశాల, అంగన్వాడీలు ఒకే భవనంలో కొనసాగుతున్నాయి. సోమవారం పాఠశాలను తెరువగా వరండాలో పసుపు, కుంకుమతో వేసిన ఆకారం, వేపాకులు అందులో కత్తి వంటి వస్తువు కనిపించింది. దీంతో అంగన్వాడీ టీచర్లు, పాఠశాల ఉపాధ్యాయులు భయాందోళనకు గురయ్యారు. విద్యార్థులు పాఠశాలకు వచ్చేందుకు భయపడగా, తల్లిదండ్రులు వారి పిల్లలను అంగన్వాడీ కేంద్రాలకు పంపలేదు. సమాచారం అందుకున్న సర్పంచ్ మూడ్ ప్రకాశ్ గ్రామ పంచాయతీ సిబ్బందితో వరండాను నీటితో శుభ్రం చేయించారు. ప్రజలు ఇలాంటి మూఢనమ్మకాలను నమ్మొద్దని అవగాహన కల్పించారు. ఎవరైనా ఇలాంటి పనులు చేస్తే పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నారు. నిఘా కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. -
గర్భిణుల వివరాలను నమోదు చేయాలి
సుభాష్నగర్: గర్భిణుల పేర్లను 12 వారాల్లోగా పకడ్బందీగా నమోదు చేయాలని డీఎంహెచ్వో బి రాజశ్రీ సూచించారు. గర్భిణుల నమోదు తక్కువగా ఉన్న పీహెచ్సీల సిబ్బందితో సోమవారం నగరంలోని వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్వో మాట్లాడుతూ.. ఆరోగ్య ఉప కేంద్రాల పరిధిలో ప్రతిరోజూ ఇళ్లను సందర్శించి రిజిస్టర్లో వివరాలు నమోదు చేయాలని, పూర్తి వివరాలు సేకరించడం ద్వారా రిపోర్టులు చేయడం సులువవుతుందన్నారు. సమావేశంలో ఎంసీహెచ్ ప్రోగాం అధికారి డాక్టర్ శ్వేత, డాక్టర్ వెంకన్న, నారాయణ, శ్రీనివాస్, ఘన్పూర్ వెంకటేశ్వర్లు, రాము, ఎడపల్లి, సాలూరా, పెగడాపల్లి, డొంకేశ్వర్, జక్రాన్పల్లి, వేల్పూర్ పీహెచ్సీల ఏఎన్ఎంలు, సూపర్వైజర్లు, సిబ్బంది పాల్గొన్నారు. -
పెండింగ్ బిల్లులు చెల్లించండి
● ప్రభుత్వానికి మాజీ సర్పంచుల వినతి ● పేరుకుపోయిన బకాయిలు రూ.15 కోట్ల పైమాటే మోర్తాడ్: జీపీల ద్వారా రావాల్సిన పెండింగ్ బిల్లులను ఇప్పించాలని మాజీ సర్పంచులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. తాము పదవీలో ఉన్న సమయంలో చేసిన పనులకు బకాయిలు అలాగే ఉన్నాయని ఎంబీ రికార్డులు చేసినా బిల్లులు చెల్లించకపోవడంతో తాము ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని వారు పేర్కొంటున్నారు. ఇటీవల 15వ ఆర్థిక సంఘం ద్వారా గ్రామ పంచాయతీలకు రూ.27.23 కోట్ల నిధులు విడుదలయ్యాయి. మాజీ సర్పంచులకు చెల్లించాల్సిన బకాయిలు రూ.15 కోట్ల వరకూ ఉన్నాయి. నిధులు తక్కువ మొత్తంలో విడుదల కాగా దశల వారిగానైనా బిల్లులు చెల్లించాలని మాజీ సర్పంచులు కోరుతున్నారు. బిల్లు బకాయిలు చెల్లించాలని గతంలో మాజీలు అనేక మార్లు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించినా బిల్లులు చెల్లించే విషయంలో నాన్చివేత ధోరణి అవలంభించిందనే ఆరోపణలు ఉన్నాయి. పారిశుద్ధ్యం, చిన్న చిన్న మరమ్మతులు, స్టేషనరీ కొనుగోలు, సీసీ రోడ్లు, కల్వర్టుల నిర్మాణం ఇలా ఎన్నో రకాల పనులు చేయగా ఎంబీ రికార్డులు చేయించి ఉంచారు. నిబంధనల ప్రకారం ఎంబీ రికార్డులు చేసి ఉంటే బిల్లులు చెల్లించాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం నుంచి రాతపూర్వకంగా ఆదేశాలు వస్తేనే పెండింగ్ బిల్లుల క్లియరెన్స్కు మోక్షం లభిస్తుందని మాజీ సర్పంచులు వెల్లడిస్తున్నారు. గతంలో ఎన్నో రకాల అభివృద్ధి పనులు చేశాం.గ్రామాల అ భివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేశాం. ప్రభుత్వం ఆలోచన చేసి మా బిల్లు బకాయిలు ఇప్పించాలి. గతంలో మంత్రి సీతక్క బిల్లు బకాయిలు చెల్లించేలా చూస్తామని హమీ ఇచ్చారు. తొందరగా పెండింగ్ బిల్లులు చెల్లించాలి. – కడారి శ్రీనివాస్, మాజీ సర్పంచ్, సుంకెట్ -
రూ.75 లక్షల ఇన్సూరెన్స్ చెక్కు పంపిణీ
నిజామాబాద్ అర్బన్: తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్లో రూ. 75 లక్షల ఇన్సూరెన్స్ చెక్కు పంపిణీ చేశారు. ఇటీవల మరణించిన రెవెన్యూ ఉద్యోగి సీనియర్ అసిస్టెంట్ రాజేశ్వర్ కుటుంబానికి చెక్కును అందజేశారు. ఉద్యోగుల సంక్షేమ కార్యక్రమాలలో భాగంగా జిల్లా రెవెన్యూ ఉద్యోగులకు బీమా చేయించినట్లు సంఘం అధ్యక్షుడు రామన్ రెడ్డి తెలిపారు. రెవెన్యూ ఉద్యోగుల సేవా సంస్థ (హెల్పింగ్ ఆర్ట్స్) ఆధ్వర్యంలో డెంటల్ విద్యార్థి ఓంకార్కు రూ. 25 వేల ఆర్థిక సహాయం చేశారు. అనంతరం జిల్లా రెవెన్యూ అసోసియేషన్ డైరీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రామన్ రెడ్డి మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలుగా రెవెన్యూ ఉద్యోగులకు బీమా చేయించడం ద్వారా అత్యవసర సమయాల్లో ఆదుకునే ప్రయత్నం చేస్తున్నామన్నారు. కార్యక్రమానికి హాజరైన పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వానికి రెవెన్యూ శాఖ గుండెకాయలాంటిదని అన్నారు. ప్రభుత్వ విజయాలకు రెవెన్యూ శాఖ కీలకమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, అసోసియేషన్ రాష్ట్ర నాయకులు రాజకుమార్, రామకృష్ణారెడ్డి, నగర మేయర్ ఉమారాణి , నుడా చైర్మన్ కేశ వేణు, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, ఆర్డీవో రాజేంద్ర కుమార్, ప్రశాంత్, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు. -
త్వరలోనే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు
సుభాష్నగర్: జర్నలిస్టుల చిరకాల వాంఛ ఇళ్ల స్థలా ల విషయమై కలెక్టర్, అధికారులతో సమావేశమై త్వరలోనే ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో పాత్రికేయుల పాత్ర అత్యంత కీలకమన్నారు. జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉంటామని, వారికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని అన్నారు. సోమవారం జిల్లాకేంద్రంలోని బస్వాగార్డెన్లో ప్రెస్క్లబ్ నూతన కార్యవ ర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం నిర్వహించారు. కార్యక్రమానికి మహేశ్ కుమార్ గౌడ్తోపాటు ప్ర భుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి, అర్బన్ ఎమ్మె ల్యే ధన్పాల్ సూర్యనారాయణ, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, నగర మేయర్ కూరగాయల ఉమారాణి, మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, వెల్నెస్ ఆస్పత్రి ఎండీ అసద్ ఖాన్, డైరెక్టర్ వెంకట్రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా క్లబ్ కార్యవర్గంతో మహేశ్ కుమార్ గౌడ్ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం వెల్నెస్ ఆస్పత్రిలో జర్నలిస్టులకు ఉచితంగా వైద్యం అందించేలా రూపొందించిన ఐడీ కార్డులను ముఖ్యఅతిథులు ఆవిష్కరించారు. జర్నలిస్టులకు అండగా ఉంటామని ఆస్పత్రి మేనేజింగ్ డైరెక్టర్ అసద్ఖాన్, మెడికల్ డైరెక్టర్ డాక్టర్ వెంకట్రెడ్డి తెలిపారు. సమావేశంలో క్లబ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పంచరెడ్డి శ్రీకాంత్, డాక్టర్ వాగ్మారే సుభాష్, కోశాధికారి రాజ్కుమార్, ఆర్గనైజింగ్ సెక్రెటరీ రాజు, ఉపాధ్యక్షులు, ఈసీ మెంబర్లు, సీనియర్ జర్నలిస్టులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉంటాం.. ప్రజాస్వామ్య వ్యవస్థలో పాత్రికేయుల పాత్ర కీలకం టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ -
‘కల్యాణలక్ష్మి’ ఆర్థికసాయాన్ని పెంచాలి
నిజామాబాద్ అర్బన్: పేద ఆడబిడ్డ కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలిచే కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల ఆర్థికసాయాన్ని పెంచాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో సోమవారం పలువురు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరై, సుమారు 326 మంది లబ్ధిదారులకు రూ.3కోట్ల 24 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. ఈసందర్భంగా ధన్పాల్ మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితుల్లో వివాహ ఖర్చులు పెరిగిన నేపథ్యంలో ఈ పథకాల ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం పెంచాలన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కల్యాణలక్ష్మి పథకం కింద ఒక తులం బంగారం అందిస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చాలన్నారు. అనంతరం పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. పేదల అభ్యున్నతి కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, మేయర్ ఉమారాణి కార్పొరేటర్లు అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
విధులు, బాధ్యతలపై అవగాహన ఉండాలి
● ఎంపీడీవో భీంరావు ● ఉప సర్పంచులు, వార్డుమెంబర్లకు శిక్షణ ప్రారంభండిచ్పల్లి: ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో నూతనంగా ఎన్నికై న ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు తమ విధులు, బాధ్యతలపై అవగాహన కలిగి ఉండాలని ఎంపీడీవో భీంరావు అన్నారు. డిచ్పల్లిలోని మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం తొలి విడత శిక్షణలో భాగంగా మండలంలోని బర్ధిపూర్, దూస్గాం, మెంట్రాజ్పల్లి, బీబీపూర్ తండా, దేవనగర్ క్యాంప్, గొల్లపల్లి, కమలాపూర్, కొరట్పల్లి, ఆరేపల్లి, నర్సింగ్పూర్ (కొత్తపేట్), డిచ్పల్లి, బీబీపూర్ గ్రామాలకు చెందిన 102 మంది ప్రజాప్రతినిధులకు శిక్షణ తరగతులను ఎంపీడీవో ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ శిక్షణ తరగతులు ఐదు రోజులు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. వారికి 2018 పంచాయతీరాజ్ చట్టంపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఆయా పంచాయతీ ఆధ్వర్యంలో నిర్వహించే గ్రామ సభలు, సమావేశాల్లో తప్పకుండా ప్రతినిధులందరూ హాజరు కావాలని, వరుసగా మూడు సమావేశాలకు హాజరుకాకుండా ఉన్న వార్డు మెంబర్లను పదవి నుంచి తొలగించే అవకాశం ఉంటుందన్నారు. శిక్షణ అనంతరం చివరి రోజు పరీక్ష నిర్వహించి మార్కులు కేటాయిస్తామని, ధ్రువపత్రం అందజేస్తామని అన్నారు. ఎంపీవో శ్రీనివాస్గౌడ్, టీవోటీలు సాయికుమార్, విష్ణువర్థన్, సుమన్, సింగోత్తం పాల్గొన్నారు. -
వంటగ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలి
నిజామాబాద్ రూరల్ : కేంద్రంలోని బీజేపీ ప్రభు త్వం పెంచిన వంట గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. పేద, మధ్య తరగతి ప్రజలపై ఆర్థికభారం మోపుతూ వంట గ్యాస్ ధరలను 60 రూపాయలు, వ్యాపార స ముదాయాలకు ఇచ్చే సిలిండర్ ధరలను రూ.115 కు కేంద్రం పెంచిందన్నారు. దీనికి నిరసనగా సో మవారం నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో కేంద్ర ప్ర భుత్వ దిష్టిబొమ్మను పార్టీ శ్రేణులు దహనం చేశా రు. ఈసందర్భంగా జిల్లా కార్యదర్శి రమేష్ బాబు మాట్లాడుతూ.. అమెరికా, ఇజ్రాయిల్ దేశాలు ఇరాన్పైన జరుపుతున్న యుద్ధాన్ని సాకుగా చూపి, కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ ధరలను పెద్ద ఎత్తున పెంచుతోందన్నారు. సాకులు చూపి ఆయిల్ ఉత్పత్తిదారులైన కార్పొరేట్ కంపెనీలకు లాభాలు పెంచే విధంగా ధరలను పెంచడం సరైంది కాదని విమ ర్శించారు. వెంటనే ధరలను తగ్గించాలన్నారు. నా యకులు పెద్ది వెంకట్ రాములు, నూర్జహాన్, సు జాత, విగ్నేష్, అనసూయమ్మ, అనిత, అంజయ్య, మాధవి, గణేష్, బుచ్చన్న, అశోక్, రాజు పాల్గొన్నారు. -
వక్ఫ్ భూముల రక్షణ, ఉర్దూ భాషా వికాసానికి పెద్దపీట
నిజామాబాద్ రూరల్: వక్ఫ్ భూముల రక్షణ, ఉర్దూ భాషా వికాసానికి ప్రభు త్వం పెద్దపీట వేస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌ డ్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. నగరంలోని ఖిల్లా రోడ్లో సో మవారం సాయంత్రం ప్రభుత్వం తరఫున అధికారిక ఇఫ్తార్ విందు నిర్వహించారు. కార్యక్రమానికి మహేష్ కుమార్ గౌడ్, షబ్బీర్ అలీ హాజరై, ముస్లింలకు ‘రంజాన్ తోఫా’ను పంపిణీ చేశారు. మహేష్ కుమార్గౌడ్, షబ్బీర్ అలీ మా ట్లాడుతూ.. ప్రభుత్వం మైనారిటీల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్బిన్ హందాన్, డీసీసీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి, నగర అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ, మేయర్ ఉమారాణి తదితరులు పాల్గొన్నారు. -
ఎండీఎం కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
నిజామాబాద్ అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మ ధ్యాహ్న భోజన(ఎండీఎం)కార్మికుల సమస్యలు ప రిష్కరించాలని ఏఐటీయూసీ నాయకులు డిమాండ్ చేశారు. ఈమేరకు సోమవారం నిజామాబాద్ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి ఓమయ్య మాట్లాడుతూ.. ప్రభుత్వం మ ధ్యాహ్న భోజన పథకాన్ని పక్కదారి పట్టిస్తుందని సెంట్రలైజ్డ్ కిచెన్ విధానంతో మధ్యాహ్న భోజన ప థకాన్ని దొడ్డిదారిన ప్రయివేట్ సంస్థకు అప్పజెప్పే కుట్రలు చేస్తున్నారన్నారు. సెంట్రలైజ్డ్ కిచెన్ విధానాన్ని ఉపసంహరించుకోకపోతే అసెంబ్లీని ముట్టడి చేస్తామని హెచ్చరించారు. నాయకులు చక్రపాణి, సాయమ్మ, గంగమణి, లత, బుచ్చవ్వ, లావణ్య, వీ రేశం, నాగలక్ష్మి, లలిత, అనసూయ పాల్గొన్నారు. -
వేం నరేందర్రెడ్డిని కలిసిన సంజయ్
సుభాష్నగర్: కాంగ్రె స్ పార్టీ రాజ్యసభ అ భ్యర్థి వేం నరేందర్రె డ్డిని సోమవారం హై దరాబాద్లోని తన ని వాసంలో మాజీ మే యర్ ధర్మపురి సంజయ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా రాజ్యసభ ఎన్నికల్లో ఏకగ్రీవం కానున్న సందర్భంగా వేం నరేందర్రెడ్డిని శాలువాతో సన్మానించి, శుభాకాంక్షలు తెలియజేశారు. నిజామాబాద్ రూరల్ : నగరంలోని కంఠేశ్వర్ ప్రాంతంలో ఉన్న ఇందూరు పీఠం శ్రీ భగవద్రామ్–సేవాలాల్ మహారాజ్ ఆలయంలో సో మవారం టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్పీ మహే ష్ కుమార్ గౌడ్ ప్రత్యేక పూజలు నిర్వహించా రు. మేయర్ ఉమారాణి, రమేష్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, డీసీసీ అధ్యక్షుడు నగేష్రెడ్డి, నుడా చైర్మన్ కేశవేణు, నగర కాంగ్రెస్ అ ధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ పాల్గొన్నారు. ధర్పల్లి: మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో బాలికలకు హెచ్పీవీ టీకాలను వేస్తున్నట్లు మెడికల్ ఆఫీసర్ సుశాంత్ రెడ్డి తెలిపా రు. ఇందులో భాగంగా సోమవారం ఐదుగురు బాలికలకు టీకాలను ఇచ్చామన్నారు. గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ నిరోధానికి ప్రభు త్వం హెచ్పీవీ వ్యాక్సిన్ టీకాలను 14 నుంచి 15 ఏళ్లలోపు బాలికలను ఉచితంగా అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. మోపాల్: మండలంలోని ముదక్పల్లిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సర్పంచ్ మంగలి నరేష్, ఎంపీడీవో రాములు నాయక్తో కలిసి నిజా మాబాద్ ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి భూ మిపూజ చేశారు. ఈసందర్భంగా ముప్ప గంగారెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్తోనే అన్నివర్గా ల ప్రజలకు న్యాయం దక్కుతుందన్నారు. రా బోయే పదేళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని, బీఆర్ఎస్కు నూకలు చెల్లినట్లేనని, బీజేపీ కి రాష్ట్ర అభివృద్ధిపై చిత్తశుద్ధి, విజన్ లేదని ఆ రోపించారు. ఉపసర్పంచ్ రంజిత్, పంచాయతీ కార్యదర్శి, కార్యకర్తలు పాల్గొన్నారు. ధర్పల్లి: పర్యావరణాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎంపీడీవో లక్ష్మారెడ్డి అన్నారు. ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా ధర్పల్లిలో సోమవారం ఎంపీడీవో లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో ఈ వేస్ట్ కలెక్షన్ స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. దీనిలో భాగంగా గ్రామంలో ఎలక్ట్రానిక్ వ్యర్థాలను గ్రామపంచాయతీ సిబ్బంది సేకరించారు. ఈసందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ.. నిరుపయోగంగా ఉన్న ఎలక్ట్రానిక్ వస్తువులను గ్రామ పంచాయతీ సిబ్బందికి ఇచ్చి సహకరించాలని ప్రజలను కోరారు. సర్పంచ్ శ్రీనివాస్, ఉప సర్పంచ్ శ్రీకాంత్, సెక్రెటరీ శ్రీనివాస్ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యం
డిచ్పల్లి: కాంగ్రెస్తోనే అభివృద్ధి సాధ్యమని రూర ల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి అన్నారు. మండలంలోని కొరట్పల్లి సర్పంచ్ పోతే ప్రభాకర్తోపాటు పలువురు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్లో చేరారు. వారికి సోమవారం నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే రేకులపల్లి భూపతిరెడ్డి కాంగ్రెస్ కండువాలు కప్పి, పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మె ల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్తోనే అభివృద్ధి సాధ్య మన్నారు. అనంతరం సర్పంచ్ ప్రభాకర్, ఎమ్మెల్యే భూపతిరెడ్డిని సన్మానించారు. ఏఎంసీ చైర్మన్ ము ప్పగంగారెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు అమృతాపూర్ గంగాధర్, నాయకులు తారాచంద్నాయ క్, సర్పంచులు కోట్ల భాస్కర్, హేమలత లక్ష్మణ్, నాయకులు ధర్మాగౌడ్, మహేష్ పాల్గొన్నారు. వినతుల స్వీకరణ డిచ్పల్లి: ‘ప్రజాపాలన’ కార్యక్రమంలో భాగంగా రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ప్రజల వద్ద నుంచి వినతులను స్వీకరించారు. నియోజకవర్గంలోని డిచ్పల్లి, ఇందల్వాయి, సిరికొండ, జక్రాన్పల్లి, మోపాల్, నిజామాబాద్ రూరల్, ధర్పల్లి మండలాలకు సంబంధించిన ప్రజలు ఎమ్మెల్యేను కలిసి పలు సమస్యలను విన్నవించారు. ఎమ్మెల్యే సమస్యల పరిష్కారం కోసం సంబంధిత అధికారులకు ఫోన్ చేసి పలు సూచనలు చేశారు. -
‘మహిళల అభివృద్ధితోనే దేశాభివృది’్ధ
● జిల్లాలో ఘనంగా మహిళా దినోత్సవం ● పలు సంఘాలు, సంస్థల ఆధ్వర్యంలో మహిళా అధికారులు, సిబ్బందికి సన్మానంసాక్షి నెట్వర్క్: మహిళలు అభివృద్ధి చెందితే ఆ ఇంటితోపాటు ఆ గ్రామం, ఆ దేశం అభివృద్ధి చెందుతుందని వక్తలు కొనియాడారు. జిల్లాకేంద్రంలో సో మవారం వివిధ సంఘాలు, అసోషియేషన్లు, స్వ చ్ఛంద సంస్థలు, క్లబ్ల ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. నగరంలోని జిల్లాకోర్టు సముదాయంలో నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కా ర్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి జీవీఎన్ భారత లక్ష్మీ హాజరై, మాట్లాడారు. దేశ ప్రగతి నిర్మాణంలో మహిళలు ముందు వరుస లో ఉన్నారన్నారు. మొదటి అదనపు జిల్లా జ డ్జి హ రీష, నాల్గవ అదనపు జిల్లాజడ్జి దుర్గా ప్రసాద్, సీనియర్ సివిల్ జడ్జి సాయి సుధ, జూనియర్ సివిల్ జడ్జిలు ఖుష్భూ ఉపాధ్యాయ, కీర్తి రాజ్, బార్ అధ్యక్షుడు మామిళ్ల సాయరెడ్డి, ప్రధాన కార్యదర్శి మాణి క్ రాజు తదితరులు పాల్గొన్నారు. అలాగే నగరంలోని ఉషోదయ డిగ్రీ కళాశాలలో న్యాయవాద పరిషత్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించా రు. పరిషత్ అధ్యక్షుడు జగన్ మోహన్ గౌడ్ మాట్లాడుతూ.. దేశ చరిత్రలో మహిళలకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. కంఠేశ్వర్ ఉమెన్స్ కాలేజీలో డైరెక్టర్ వనిత సన్మానించారు. మేయర్ ఉమారాణి తదితరులు పాల్గొన్నారు. పెన్షనర్స్ భవన్లో తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మేయర్ ఉమారాణిని సన్మానించారు. సెయింట్ జేవియర్స్ హైస్కూల్లో రోటరీ క్లబ్ ఆఫ్ జేమ్స్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయురాళ్లను, ఆయమ్మలను సన్మానించారు. మున్నూరుకాపు కల్యాణ మండపంలో జీఆర్ మెమోరియల్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఉపాధ్యాయురాళ్లను మాజీ జెడ్పీ చైర్మన్ విఠల్రావు, సొసైటీ సభ్యులు సన్మానించారు. -
676 మంది విద్యార్థుల గైర్హాజరు
ఖలీల్వాడి: జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయి. సోమవారం మొదటి సంవత్సరం భౌతిక, అర్థశాస్త్రంతోపాటు ఒకేషనల్ పరీక్ష జరిగినట్లు జిల్లా ఇంటర్ విద్యాధికారి రవికుమార్ తెలిపారు. మొత్తం 20,413 మంది విద్యార్థులకు గాను19,737 (96.7శాతం) మంది హాజరుకాగా, 676 మంది గైర్హాజరయ్యారని వివరించారు. 55 పరీక్షాకేంద్రాలను తనిఖీ చేసినట్లు డీఐఈవో తెలిపారు. ఈవీఎం గోడౌన్ పరిశీలన నిజామాబాద్ అర్బన్: జిల్లా కేంద్రంలోని వినాయకనగర్లో ఉన్న ఈవీఎం గోదామును కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్ కిరణ్కుమార్ సోమవారం పరిశీలించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో నిబంధనలకు అనుగుణంగా ఈవీఎం గోదాము సీల్ను తెరిపించారు. ఈవీఎంలు, బ్యాలెట్ యూనిట్లు, ఎన్నికల సామగ్రిని భద్రపర్చిన గదులను క్షుణ్ణంగా పరిశీలించారు. గోదాము వద్ద భద్రతా ఏర్పాట్లను తనిఖీ చేశారు. సీసీ కెమెరాలు నిరంతరం పని చేసేలా చూడాలన్నారు. ఈవీఎంలు, బ్యాలెట్ యూనిట్లు, ఇతర సామగ్రికి నష్టం వాటిల్లకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట అగ్నిమాపక శాఖ అధికారి శంకర్, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు బాలరాజు, సిబ్బంది సాత్విక్, విజేందర్ తదితరులు ఉన్నారు. నేడు జాబ్ మేళా నిజామాబాద్ అర్బన్: జిల్లాలోని నిరుద్యోగులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు మంగళవారం జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి బీపీ మధుసూదన్రావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల వారు నిజామాబాద్ నగరంలోని శివాజీనగర్లో ఉన్న ఉపాధి కల్పన కార్యాలయంలో ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం వరకు హాజరు కావాలని సూచించారు. ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, బీటెక్ అభ్యసించిన వారు అర్హులని, ఇతర వివరాలకు 89197 43152, 70135 80089 నంబర్లను సంప్రదించాలని సూచించారు. -
లోక కల్యాణం కోసమే బ్రహ్మోత్సవం
● దేవనాథ జీయర్ స్వామి ● వైభవంగా కొనసాగుతున్న ఇందూరు తిరుమల బ్రహ్మోత్సవాలు మోపాల్(నిజామాబాద్రూరల్): బ్రహ్మోత్సవం అంటే సాక్షాత్తూ బ్రహ్మనే లోక కల్యాణం కోసం జరిపించే ఉత్సవమని, ఉత్సవం అంటే లోకమంతా సంతోషించడమని దేవనాథ జీయర్స్వామి అన్నారు. మండలంలోని నర్సింగ్పల్లిలో ఇందూరు తిరుమల గోవింద వనమాల క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. సోమవారం యాగ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సంతానార్తులకు గరుడ ప్రసాదం దేవనాథ జీయర్ స్వామి పంపిణీ చేశారు. సాయంత్రం స్వామి వారిని శేష వాహనంపై ఊరేగించారు. ప్రభుత్వ సలహాదారు సుదర్శన్రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు నగేశ్రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్బిన్ హందాన్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, పీసీసీ డెలిగేట్ శేఖర్గౌడ్ తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు. బ్రహ్మత్సవాల్లో అహోబల జీయర్ స్వామితోపాటు ఆలయ ధర్మకర్తలు దిల్ రాజు, శిరీశ్రెడ్డి, నరసింహారెడ్డి, విజయసింహారెడ్డితోపాటు యజ్ఞాచార్యులు శ్రీనివాసాచార్య, లక్ష్మణాచార్య, శ్రీకరాచార్య, ఆలయ ప్రధాన అర్చకులు రోహి త్ కుమారాచార్య, గ్రామస్తులు, ఆలయ సేవ కులు అశోక్, నరాల సుధాకర్, గంగాధర్, ప్రసాద్, రాజేశ్వర్, రమేశ్, సాయిలు, భాస్కర్, మురళి, ప్రమోద్, గంగారెడ్డి, భక్తులు, పాల్గొన్నారు. నేడు చిన్నజీయర్ రాక త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి మంగళవారం ఉదయం 10 గంటలకు ఇందూరు తిరుమల గోవింద వనమాల క్షేత్రానికి చేరుకుంటారని ఆలయ ధర్మకర్తలు తెలిపారు. భక్తులు పెద్దఎత్తున పాల్గొని స్వామి వారి మంగళా శాసనములకు పాత్రులు కావాలని వారు కోరారు. -
కార్పొరేట్కు దీటుగా తెలంగాణ పబ్లిక్ స్కూల్
● మండలానికి ఒకటి ఏర్పాటు ● ఆంగ్లమాధ్యమంలో బోధన ● పేద విద్యార్థులకు అందనున్న నాణ్యమైన విద్య ఖలీల్వాడి: పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అన్ని మౌలిక వసతులు, హంగులతో కార్పొరే ట్కు దీటుగా మండలానికి ఒక తెలంగాణ పబ్లిక్ స్కూల్ను ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చే సింది. ప్రస్తుతం జిల్లాలోని 33 మండలాల్లో వీటిని ఏర్పాటు చేయనున్నారు. ప్రాథమిక పాఠశాల, ఉ న్నత పాఠశాలలు ఒక్కచోట ఉన్నవాటిని ఎంపిక చే స్తున్నారు. పిల్లల సంఖ్య పెరిగే అవకాశం ఉన్న బ డులను గుర్తించారు. మండలానికి ఇతర గ్రామాలకు సమీపంలో ఉన్న పాఠశాలను ఎంచుకున్నారు. ఒక్కో పాఠశాల నిర్మాణానికి రూ.కోటి వరకు ఖ ర్చవుతుందని, త్వరలో నిర్మాణ పనులు చేపట్టే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. మొదట రెండు సంవత్సరాలపాటు సాధారణంగానే విద్యా ర్థులకు ప్రవేశాలు కల్పించనున్నారు. ఆ తర్వాత పరీక్షల ఆధారంగా అడ్మిషన్లు ఇవ్వనున్నారు. 1వ తరగతి నుంచి ప్రవేశాలు.. ప్రస్తుతం జిల్లాలో పది మోడల్ స్కూళ్లు ఉన్నప్పటికీ వీటిలో 6వ తరగతి నుంచి ప్రవేశాలు ఉన్నాయి. కానీ పబ్లిక్ పాఠశాలల్లో 1వ తరగతి నుంచే విద్యార్థులకు ప్రవేశాలు కల్పించనున్నారు. ప్రస్తుతం 10వ తరగతి వరకు, అవసరమైతే ఇంటర్ కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు అధికారులు చె బుతున్నారు. విద్యార్థులకు పూర్తిస్థాయి ఇంగ్లిష్ మీ డియంలో బోధన జరగనుంది. నిర్మాణం చేపట్టే క్రమంలో ఆ పాఠశాలలోని విద్యార్థులను సమీపంలోని పాఠశాలలకు సర్దుబాటు చేయనున్నారు. ప్రస్తుతం ఎంపికై న బడిలోని విద్యార్థులు ఈ పబ్లిక్ బడిలో చదివేలా అవకాశం కల్పిస్తారు. తెలుగు మీడియంలో చదువుకోవాలనుకునే వారికి పక్క పాఠశాలలో చేర్పించనున్నట్లు తెలుస్తోంది. పబ్లిక్ పాఠశాలల్లో కంప్యూటర్, లైబ్రెరీ, సైన్స్ ల్యాబ్, ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేయనున్నారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి చేరే విద్యార్థులకు రవాణ సౌకర్యం సైతం కల్పించనున్నారు. ఏదేమైనా ఈ పాఠశాలల ఏర్పాటుతో సర్కారు బడుల్లో విద్యార్థుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. జిల్లాలో ప్రతిపాదించిన బడులుమండలం ఏర్పాటు చేయనున్న పాఠశాల నవీపేట్ జెడ్పీహెచ్ఎస్, బినోల నందిపేట్ జెడ్పీహెచ్ఎస్, అయిలాపూర్ ఆర్మూర్ జెడ్పీహెచ్ఎస్, పిప్రి బాల్కొండ పీఎంశ్రీ, జెడ్పీహెచ్ఎస్, బాల్కొండ ముప్కాల్ జెడ్పీహెచ్ఎస్, ముప్కాల్ మెండోరా జెడ్పీహెచ్ఎస్, మెండోరా ఏర్గట్ల జెడ్పీహెచ్ఎస్, తాళ్లరాంపూర్ కమ్మర్పల్లి పీఎంశ్రీ జెడ్పీహెచ్ఎస్, చౌట్పల్లి మెర్తాడ్ ప్రభుత్వ హెచ్ఎస్, మోర్తాడ్ వేల్పూర్ పీఎంశ్రీ జెడ్పీహెచ్ఎస్, వేల్పూర్ జక్రాన్పల్లి జెడ్పీహెచ్ఎస్, తొర్లికొండ మాక్లూర్ జెడ్పీహెచ్ఎస్, మాక్లూర్ ని.నార్త్ జెడ్పీహెచ్ఎస్, దుబ్బ ఎడపల్లి జెడ్పీఎస్ఎస్, ఎడపల్లి రెంజల్ జెడ్పీహెచ్ఎస్, నీలా బోధన్ ప్రభుత్వ ఎంఎం హైస్కూల్ కోటగిరి పీఎంశ్రీ జెడ్పీహెచ్ఎస్, కోటగిరి రుద్రూర్ జెడ్పీహెచ్ఎస్, రుద్రూర్ వర్ని జెడ్పీహెచ్ఎస్, వడ్డేపల్లి ని.రూరల్ జెడ్పీహెచ్ఎస్, గుండారం ని.సౌత్్ ప్రభుత్వ హెచ్ఎస్, కసాబ్గల్లీ మోపాల్ జెడ్పీహెచ్ఎస్, మోపాల్ డిచ్పల్లి జెడ్పీహెచ్ఎస్, రాంపూర్ ఇందల్వాయి జెడ్పీహెచ్ఎస్, గన్నారం ధర్పల్లి పీఎంశ్రీ జెడ్పీహెచ్ఎస్, ధర్పల్లి భీంగల్ పీఎంశ్రీ జెడ్పీహెచ్ఎస్, పల్లికొండ సిరికొండ జెడ్పీహెచ్ఎస్, సిరికొండ చందూర్ పీఎంశ్రీ జెడ్పీహెచ్ఎస్, చందూర్ మోస్రా జెడ్పీహెచ్ఎస్, మోస్రా ఆలూర్ జెడ్పీహెచ్ఎస్, ఆలూర్ డొంకేశ్వర్ జెడ్పీహెచ్ఎస్, డొంకేశ్వర్ సాలూరా పీఎంశ్రీ జెడ్పీహెచ్ఎస్, సాలూరా పొతంగల్ పీఎంశ్రీ జెడ్పీహెచ్ఎస్, పొతంగల్ మండలానికి ఒక పాఠశాలను గుర్తించి ప్రతిపాదనలను రాష్ట్ర విద్యాశాఖ అధికారులకు జాబితాను అందించాం. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే నిర్మాణ పనులను ప్రారంభిస్తాం. ప్రస్తుతం కొనసాగుతున్న బడులను సమీపంలోని పాఠశాలలకు సర్దుబాటు చేయనున్నాం. ఈ పాఠశాలల్లో పూర్తిస్థాయి ఇంగ్ల్లిష్ బోధన జరగనుంది. జూన్ నుంచి నిర్మాణ పనులు చేపట్టే అవకాశం ఉంది. –అశోక్ కుమార్, డీఈవో, నిజామాబాద్ -
భానుడి భగభగ
ఎండ నుంచి రక్షణ కోసం టోపీ, మాస్క్ ధరించి ప్రయాణిస్తున్న వాహనదారుడుఎండ తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. మార్చిలోనే భానుడు భగభగలాడుతుండడంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఉదయం 11 గంటల నుంచే ఎండ తీవ్రత మొదలవుతోంది. సోమవారం 38.8 డిగ్రీలు, ఈనెల 8వ తేదీన 38.2, 7న 37.6, 6న 36.8, 5న 36.9, 4న 35.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆదివారం నమోదైన 38.2 ఉష్ణోగ్రత రాష్ట్రంలోనే అత్యధికం. మార్చిలోనే ఎండ తీవ్రత విపరీతంగా ఉందని, వచ్చే రెండు నెలల్లో మరింత ఎక్కువగా ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. – నిజామాబాద్ అర్బన్ -
ఇక్కడ టెన్షన్
ఇజ్రాయిల్లో గాయాలపాలైన కోయల్కర్ తిరుపతిఇజ్రాయిల్–ఇరాన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం ఆగే పరిస్థితి కనిపించకపోవడంతో ఆ రెండు దేశాలతో పాటు గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న జిల్లాకు చెందిన వలసకార్మికుల కుటుంబాల వారు ఆందోళన చెందుతున్నారు. – సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ గల్ఫ్ యుద్ధం రోజురోజుకూ ఉధృతం అవుతుండడంతో ఎప్పుడు ఏంజరుగుతుందోననే టెన్షన్లో కా ర్మికుల కుటుంబాల వారు ఉన్నారు. ఆయా దేశాల్లో పనిచేస్తున్న కార్మికులు తమ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో, సన్నిహితులతో నిరంతరం టచ్లో ఉంటున్నారు. ఎప్పటికప్పుడు క్షేమసమాచారాలు, అక్కడి పరిస్థితుల గురించి మాట్లాడుతున్నారు. ● కమ్మర్పల్లి మండల కేంద్రానికి చెందిన కోయ ల్కర్ తిరుపతి ఇజ్రాయిల్లోని టెల్అవీవ్లో కేర్టేకర్గా పనిచేస్తున్నాడు. తిరుపతి ఎప్పటికప్పుడు తన క్షేమ సమాచారాన్ని కుటుంబ సభ్యులు, స్నేహితులకు చెబుతూ వస్తున్నాడు. అయితే సోమవారం కమ్మర్పల్లిలోని స్నేహితులతో మాట్లాడిన అరగంట తరువాత తాను పనిచేస్తున్న ప్రాంతానికి సమీపంలో బాంబు పడింది. దీంతో ఆ ధాటికి కారు అద్దాలు పగిలి తిరుపతి దవడ, గొంతు భాగంలో గుచ్చుకున్నాయి. ఆస్పత్రికి తరలించి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ఇక్కడకు తీసుకొచ్చే పరిస్థితి లేకపోవడంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది. ● ఆలూరు మండల కేంద్రానికి చెందిన మల్లయ్య మస్కట్లో రోడ్డు ప్రమాదంలో ఈ నెల 6న మరణించాడు. అయితే సాధారణ సమయాల్లో అక్కడ ఎవరైనా మరణిస్తే మృతదేహాన్ని ఇక్కడకు తీసుకురావాలంటే రెండువారాల వరకు సమయం పడుతుంది. ప్రస్తుతం యుద్ధం జరుగుతున్నందున విమానాలు నడవడం లేదు. దీంతో మల్లయ్య మృతదేహాన్ని తీసుకొచ్చేందుకు ఎంతకాలం ఎదురుచూడాలోనని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. ● మెండోరా మండలం సావెల్ గ్రామానికి చెందిన లక్ష్మినర్సు రెండ్రోజుల క్రితం మృతి చెందింది. దుబాయ్లో ఉంటున్న ఈమె భర్త లింబాద్రికి సమాచారం ఇచ్చారు. అయితే తాజా యుద్ధం నేపథ్యంలో లింబాద్రి ఇక్కడకు రాలేని పరిస్థితి నెలకొంది. యుద్ధం ఇంకా ఎంతకాలం జరుగుతుందో అర్ధం కాని పరిస్థితి. దీంతో భార్య అంత్యక్రియలకు దూరం కావాల్సి వచ్చింది. ● గల్ఫ్ దేశాలతో పాటు ఇజ్రాయిల్ చుట్టుపక్కల దేశాలకు వాయురవాణా నిలిచిపోవడంతో రాకపోకలు నడవడం లేదు. దీంతో అక్కడ పనిచేస్తున్నవారు మరణించినా, ఇక్కడ కుటుంబాల్లో ఎవరైనా మరణించినా, ఇతర అత్యవసర పరిస్థితులు నెలకొంటే రాకపోకలకు అవకాశాలు లేకపోవడంతో ఆయా కుటుంబాల్లో తీవ్ర మనోవేదన నెలకొంది. ఇజ్రాయిల్లో బాంబు దాడిలో గాయపడ్డ కమ్మర్పల్లి వాసి సావెల్లో భార్య మరణించగా అంత్యక్రియలకు ఇక్కడకు రాలేని భర్త దుబాయ్లో రోడ్డు ప్రమాదంలో వలసకార్మికుని మృతి.. మృతదేహాన్ని తీసుకురాలేని పరిస్థితి -
నిర్లక్ష్యాన్ని సహించేది లేదు
మోర్తాడ్: విధులను నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని, విద్యార్థుల ప్రయోజనాల విషయంలో రాజీపడబోమని కలెక్టర్ ఇలా త్రిపాఠి స్పష్టం చేశారు. విద్యార్థులు, సిబ్బంది ఫిర్యాదుల మేరకు విచారణ అనంతరం బాల్కొండలోని మోడల్ స్కూల్ కేర్ టేకర్ను విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. బాల్కొండలోని మైనారిటీ రెసిడెన్షియల్ బాలికల విద్యాలయంతోపాటు మోడల్ స్కూల్ను కలెక్టర్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టోర్ రూ మ్, కిచెన్లను పరిశీలించారు. విద్యార్థులకు ప్రతి రోజూ మెనూ ప్రకారం రుచికరమైన పౌష్టికాహారం అందిస్తున్నారా అని ఆరా తీశారు. కేర్ టేకర్ వీణ విధులను నిర్లక్ష్యం చేస్తూ తమతో అనుచితంగా వ్యవహరిస్తున్నారని మోడల్ స్కూల్ విద్యార్థినులు, సిబ్బంది కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. కేర్ టేకర్ రెగ్యులర్గా విధులకు హాజరు కావడం లేదని, తమ బాగోగులను పట్టించుకోవడం లేదని, మెనూ ప్రకారం భోజనం అందించడం లేదని, హాస్టల్లో నీటి కొరత తీవ్రస్థాయిలో ఉన్నా ప్రత్యామ్నాయ చ ర్యలు చేపట్టడం లేదని విద్యార్థినులు ఫిర్యాదు చేశా రు. కేర్ టేకర్ తమను కూడా దూషిస్తున్నారని సి బ్బంది కన్నీటి పర్యంతమయ్యారు. దీనిని తీవ్రంగా పరిగణించిన కలెక్టర్.. తక్షణ విచారణకు ఆదేశించా రు. కలెక్టర్ ఆదేశాల మేరకు జీఈసీవో భాగ్యలక్ష్మి, ఇన్చార్జి ప్రిన్సిపాల్ శ్రీనివాస్ విచారణ చేపట్టి నివేదిక సమర్పించారు. వారి నివేదిక ఆధారంగా కేర్ టేకర్పై కలెక్టర్ చర్యలు తీసుకున్నారు. మోడల్ స్కూల్లో నీటి సమస్యను పరిష్కరించేలా తక్షణ చర్యలు తీసుకోవాలని మిషన్ భగీరథ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అంతకుముందు కలెక్టర్ మైనారిటీ రెసిడెన్షియల్ బాలికల విద్యాలయాన్ని సందర్శించారు. పదో తరగతి గదిని సందర్శించి విద్యార్థినులకు గణితంలో పలు ప్రశ్నలు వేసి, సరైన సమాధానాలు చెప్పిన బాలికలను అభినందించి చాక్లెట్ బాక్సులు అందజేశారు. తాను మరోమారు ఆకస్మిక తనిఖీకి వస్తానని, పాఠశాల నిర్వహణను మరింతగా మెరుగుపరచాలని కలెక్టర్ సూచించారు. విద్యార్థుల ప్రయోజనాల విషయంలో రాజీ ఉండదు కలెక్టర్ ఇలా త్రిపాఠి మైనారిటీ రెసిడెన్షియల్, మోడల్ స్కూళ్ల తనిఖీ మోడల్ పాఠశాల కేర్ టేకర్పై విద్యార్థినులు, సిబ్బంది ఫిర్యాదు విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన కలెక్టర్ -
సేంద్రియ ఎరువు మరింత కాస్ట్లీ
● లారీ పశువుల పేడ ధర రూ.3 వేల నుంచి రూ.4 వేలు పెరుగుదలమోర్తాడ్(బాల్కొండ): పసుపు సాగు చేసే వ్యవసాయ క్షేత్రాల్లో ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకల పేడను రైతులు విరివిగా వినియోగిస్తున్నారు. ప్రస్తుతం పసుపు తవ్వకాలు చివరి దశకు చేరుకోవడంతో రైతులు ముందస్తుగా పశువుల పేడను పొలాల వద్ద నిలువ చేసుకుంటున్నారు. అయితే, నెల రోజుల వ్యవధిలోనే ఒక్కో లారీ లోడ్కు రూ.3వేల నుంచి రూ.4 వేల ధర పెరిగింది. పశువుల పేడ లారీ లోడ్కు రూ.23 వేల నుంచి రూ.25 వేలు ఉంటే ప్రస్తుతం రూ.26 వేల నుంచి రూ.29 వేలకు చేరింది. గొర్రెలు, మేకల పేడ ధర నెల రోజుల క్రితం రూ.34 వేల నుంచి రూ.35 వేల ధర పలికితే ఇప్పుడు రూ.37 వేల నుంచి రూ.39 వేలకు ధర పెరిగింది. గడచిన సీజన్లో పసుపు పంటకు క్వింటాలుకు రూ.10 వేలకు మించి ధర లభించడంతోనే సేంద్రియ ఎరువుల ధర విపరీతంగా పెంచారని రైతులు అంటున్నారు. పశువుల పేడను యజమానులు నేరుగా విక్రయిస్తే ధర ఇలా ఉండదని, దళారుల జోక్యంతోనే ధర భారీగా పెరిగిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కాగా, రైతులు వర్మి కంపోస్టును వినియోగించడం మొదలుపెడితే పశువుల పేడ ధర తగ్గే అవకాశం ఉందనే వాదన వినిపిస్తోంది. వర్మి కంపోస్టును గ్రామ పంచాయతీల ద్వారా ఉత్పత్తి చేయాలని నిర్ణయించినా ఆశించినంత స్థాయిలో ఉత్పత్తి సాగడం లేదు. ప్రైవేటు కంపెనీలు విక్రయించే ఎరువు ధర కొంత ఎక్కువగానే ఉంది. -
17న మెగా జాబ్ ఫెయిర్
● విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి ● వీసీ ప్రొఫెసర్ యాదగిరి రావుతెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ డెవలప్మెంట్ సొసైటీ సహకారంతో ఈ నెల 17న వర్సిటీ మెయిన్ క్యాంపస్లో మెగా జాబ్ ఫెయిర్ నిర్వహించనున్నట్లు వీసీ ప్రొఫెసర్ యాదగిరి రావు తెలిపారు. సోమవారం తన చాంబర్లో మెగా జాబ్ ఫెయిర్కు సంబంధించిన బ్రోచర్స్ను రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం.యాదగిరి, నిపుణ హ్యూమన్ డెవలప్మెంట్ సొసైటీ ప్రతినిధులతో కలిసి వీసీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత కాలంలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం ఎంతో ముఖ్యమని అన్నారు. మెగా జాబ్ ఫెయిర్ ద్వారా వర్సిటీ పరిధిలోని నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల విద్యార్థులకు వివిధ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ ప్రతిభను ప్రదర్శించి మంచి సంస్థల్లో ఉద్యోగాలను పొందాలని సూచించారు. జాబ్ ఫెయిర్లో సుమారు 50కి పైగా ప్రముఖ కంపెనీలు పాల్గొని 5 వేలకు పైగా ఉద్యోగ అవకాశాలను అందించే అవకాశం ఉందన్నారు. ఐటీ, ఐటీఈఎస్, కోర్, ఫార్మా, నర్సింగ్, హాస్పిటాలిటీ, బ్యాంకింగ్, రిటైల్, ఎఫ్ఎంసీజీతోపాటు మేనేజ్మెంట్ వంటి వివిధ రంగాలకు చెందిన సంస్థలు పాల్గొంటాయని వీసీ తెలిపారు. రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యాదగిరి మాట్లాడుతూ.. 10వ తరగతి నుంచి పీజీ వరకు చదివిన అభ్యర్థులు ఈ జాబ్ ఫెయిర్లో పాల్గొనే అవకాశముందని తెలిపారు. 2016 నుంచి 2026 వరకు చదువు పూర్తిచేసిన అభ్యర్థులు జాబ్ ఫెయిర్లో పాల్గొనవచ్చని చెప్పారు. బ్రోచర్ ఆవిష్కరణలో తెయూ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సెల్ డైరెక్టర్ పాత నాగరాజు, నిపుణ హ్యూమన్ డెవలప్మెంట్ సొసైటీ ప్రతినిధులు హర్ష, అనూషా రెడ్డి, వర్సిటీ పీఆర్వో రమణాచారి, ప్రొఫెసర్ సీహెచ్ ఆంజనేయులు, నాగరాజు, వాసం చంద్రశేఖర్, బాలకిషన్ తదితరులు పాల్గొన్నారు.


