breaking news
Nizamabad
-
మానవత్వాన్ని ప్రశ్నార్థకం చేసిన కానిస్టేబుల్ హత్యోదంతం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ఆపద వస్తే పోలీసు కావాలి.. వెంటనే రావాలి.. అలాంటి పోలీసుకు ప్రాణాపాయ స్థితి వస్తే మాత్రం చోద్యం చూడాలి.. నిజామాబాద్ నగరం నడిబొడ్డున శుక్రవారం రాత్రి 8.30 గంటల సమయంలో జరిగిన కానిస్టేబుల్ ప్రమోద్ హత్యోదంతం సమాజంలో కొడిగడుతున్న మానవత్వాన్ని, పౌర బాధ్యతలను మరోసారి ఎత్తిచూపింది. విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్ గుండెల్లో దుండగుడు కత్తితో పొడిస్తే చుట్టూ వందలమంది గుడ్లప్పగించి చోద్యం చూశారే తప్ప ఏ ఒక్కరూ స్పందించలేదు. ప్రమోద్ను ఆస్పత్రికి తరలించేందుకు సాయం చేయాలని పోలీస్ సబ్ఇన్స్పెక్టర్ విఠల్ అరగంటపాటు బతిమాలినా ఒక్కరూ అడుగు ముందుకేయలేదు. పైగా ఏదో వేడుక జరుగుతున్నట్లు తమ మొబైళ్లలో వీడియోలు, ఫొటోలు, సెల్ఫీలు దిగుతూ గడిపారు. ఆటోవాలాలు సైతం సహాయం చేసేందుకు ముందుకు రాలేదు. సుమారు 30 నిమిషాలపాటు ఎస్ఐ విఠల్ ఎంత మొత్తుకున్నా ఎవ్వరూ స్పందించలేదు. అటువైపు నుంచి వెళ్తున్న ఓ అంబులెన్స్ను ఆపినప్పటికీ ఆపకుండా వెళ్లడం గమనార్హం. చివరికి ఆదుకున్నది పోలీసే..వినాయక నగర్ మీదుగా తన వాహనంలో వెళ్తున్న మోపాల్ మండల సబ్ఇన్స్పెక్టర్ సుస్మిత జనం గుమిగూడి ఉండడాన్ని చూసి ఆగారు. కత్తిపోటుకు గురైంది కానిస్టేబుల్ ప్రమోద్ అనే విషయం తెలియకపోయినా తన వాహనంలో ఎక్కించుకుని ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ, అప్పటికే పరిస్థితి విషమించి ప్రమోద్ మార్గమధ్యలోనే మరణించాడు. ఈ ఘటనలో ప్రజల తీరుపై పోలీసులు తీవ్ర ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. సమాజానికి భద్రత కల్పిస్తున్న తమకే ఆపదలో సహాయం చేయటానికి ఒక్కరూ ముందుకు రాలేదని ఓ అధికారి ‘సాక్షి’తో మాట్లాడుతూ కన్నీరుమున్నీరయ్యాడు.ఓటు బ్యాంకు రాజకీయాలకు లొంగొద్దుపోలీసు కానిస్టేబుల్ ప్రమోద్ దారుణ హత్యకు గురికావడం తీవ్ర విచారకరం. ఈ చర్యను ఖండిస్తున్నాం. విధి నిర్వహ ణలో ప్రమోద్ చేసిన త్యాగం అత్యున్నతమైనది. సీఎం రేవంత్ రెడ్డి చేతిలో ఉన్న శాంతిభద్రతల విభాగంలో పోలీసు సిబ్బందికే భద్రత లేకుండా పోయింది. రౌడీషీటర్లు స్వేచ్ఛగా తిరిగే స్థాయికి శాంతిభద్రతలు దిగజారడం శోచనీయం. రౌడీషీటర్ షేక్ రియాజ్ను తక్షణమే పట్టుకోవాలి. అమరుడైన కానిస్టేబుల్ కుటుంబానికి త్వరగా న్యాయం చేయాలి. ఓటు బ్యాంకు రాజకీయాలకు లొంగకుండా, కరడుగట్టిన నేరస్తులకు అత్యంత కఠిన శిక్ష విధించేలా ప్రభుత్వం ముందుకెళ్లాలి.– ధర్మపురి అర్వింద్, ఎంపీ కానిస్టేబుల్ హత్యపై డీజీపీ సీరియస్ఘటనా స్థలంలో పరిస్థితులను పర్యవేక్షించాలని ఐజీకి ఆదేశంసాక్షి, హైదరాబాద్: నిజామాబాద్ సీసీఎస్లో కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్న ప్రమోద్పై ఒక చైన్ స్నాచర్ దాడి చేసి హత్య చేసిన సంఘటనను డీజీపీ బి.శివధర్రెడ్డి సీరియస్గా తీసుకు న్నారు. సిన్సియర్గా విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్ ప్రమోద్ మరణం పట్ల విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. వాహనాల దొంగతనాలు, చైన్ స్నాచింగ్ నేరాలను చేస్తున్న నిందితుడు షేక్ రియాద్ను సమాచారం లభించిన వెంటనే పట్టుకుని పోలీస్ స్టేషన్కు తీసుకొస్తున్న కానిస్టేబుల్ను కత్తితో పొడిచి హత్య చేసి పరారైన నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయా లని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ను ఆదే శించారు. మల్టీ జోన్–1 ఐజీ చంద్రశేఖర్రెడ్డిని సంఘటన స్థలానికి వెళ్లి పరిస్థితులను పర్యవేక్షి ంచాలని సూచించారు. మరణించిన కానిస్టే బుల్ కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించాలని, వారికి అవసరమైన సహాయం చేయాలన్నారు. లభించిన ఆధారాలను బట్టి గాలింపు చేపట్టాలని, నిందితుడిని వెంటనే పట్టుకోవాలని ఆదేశాలు జారీచేశారు. -
సా..గుతున్న లిఫ్ట్ నిర్మాణ పనులు!
బాల్కొండ: బాల్కొండ మండలం చిట్టాపూర్, శ్రీరాంపూర్, ఆర్మూర్ మండలం సుర్బీర్యాల్, కోమన్పల్లి గ్రామాలకు చెందిన సుమారు 3500 ఎకరాల ఆయకట్టుకు నీరందించేందుకు చేపట్టిన ఎత్తిపోతల పనులు రెండేళ్లుగా కొనసాగుతున్నాయి. ఎస్సారెస్పీ బ్యాక్వాటర్ ఆధారంగా కోమన్పల్లి శివారులో పంపుహౌస్ నిర్మించి, సుర్బీర్యాల్, ఫత్తేపూర్, చిట్టాపూర్ వరకు పైపులైన్ ద్వారా నీటి సరఫరా చేపట్టాలని 2023 అక్టోబర్లో రూ. 149.52 కోట్ల నిధులను అప్పటి ప్రభుత్వం మంజూరు చేసింది. శంకుస్థాపన అనంతరం లిఫ్ట్ నిర్మాణ పనుల్లో భాగంగా కొద్దిమేర పైపులైన్ తవ్వకాలు, పైపులు వేయడం చేపట్టారు. ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ వద్ద పంపుహౌస్, జాతీయ రహదారి పక్కన డీసీ (డిస్ట్రిబ్యూటర్ చాంబర్) పనులు నెమ్మదిగా సాగుతున్నాయి. పైపులైన్ను పంట భూముల నుంచి వేస్తున్నారు. అయితే, వేసవిలో మాత్రమే పైపులైన్ కోసం తవ్వకాలు చేపట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం యాసంగి పంటలను వేసేందుకు రైతులు నేలను సిద్ధం చేస్తున్నారు. దీంతో పైపులైన్ వేసే అవకాశం లేదు. ప్రస్తుతం కొనసాగుతున్న సిమెంట్ పనులు వేగంగా చేపడితే పంటలు చేతికొచ్చిన తర్వాత వెంటనే పైపులైన్ పనులు చేపట్టే అవకాశం ఉంటుంది. కానీ ఆ పనులు సైతం నత్తకు నడక నేర్పేలా సాగుతున్నాయి. ఇప్పటికై నా అధికారులు, పాలకులు స్పందించి లిఫ్ట్ పనులను వేగవంతం చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. చిట్టాపూర్ ఎత్తిపోతల పథకం పైపులైన్ వేసేందుకు పంటలు అడ్డుగా ఉన్నాయి. పంటలు లేనిచోట పైపులైన్ పనులు చేపట్టాం. ఇప్పటి వరకు 1500 మీటర్ల వరకు పైపులైన్ వేశాం. ప్రస్తుతం డీసీ పనులు సాగుతున్నాయి. పనుల వేగవంతానికి చర్యలు తీసుకుంటాం. – సురేశ్, డిప్యూటీ ఈఈ, మైనర్ ఇరిగేషన్, బాల్కొండ ఎస్సారెస్పీ బ్యాక్వాటర్ ఆధారంగా నిర్మాణం రూ.149.52 కోట్ల నిధులు మంజూరు రెండేళ్లు గడిచినా కొనసాగుతున్న పనులు -
ధ్రువపత్రాల భద్రతకు ‘డిజిలాకర్’
మీ కోసం.. సదాశివనగర్(ఎల్లారెడ్డి): ప్రయాణాలు ఇతర సందర్భాల్లో చాలా మంది ఉత్తీర్ణత, ఇతర విలువైన ధ్రువపత్రాలను మరిచిపోతున్నారు. ఒక్కోసారి పోగొట్టుకున్న పత్రాలను తిరిగి పొందడం కష్టంతో కూడుకున్న పని. ఇలాంటి పరిస్థితిని అధిగమిస్తూ ఎలాంటి ధ్రువపత్రాలనైనా భద్రంగా దాచుకునేలా కేంద్ర ప్రభుత్వం కొత్త విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. అదే డిజిలాకర్. ● కాగిత రహిత పాలనను ప్రోత్సహించడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం 2016లో ప్రారంభించిన ఈ డిజిలాకర్ను విద్యార్థులు, నిరుద్యోగులే కాకుండా ప్రతి ఒక్కరూ విలువైన పత్రాలను దా చుకునేందుకు బ్యాంక్ లాకర్గా పనిచేస్తోంది. ● డిజిటల్ విధానంలో దాచుకున్న పత్రాలను ఎక్కడైనా, ఏ సమయంలోనైనా అవసరమైనప్పుడు ఉపయోగించుకోవచ్చు. ● ఇవి వాస్తవ ధ్రువీకరణ పత్రాల మాదిరే చట్టపరంగానూ చెల్లుబాటు అవుతాయి. ● లాకర్ సహాయంతో పంపించే ఈ పత్రాలను వాటి క్యూఆర్ కోడ్ లేదా డిజిటల్ సంతకాలతో నిర్ధారణ జరుగుతుంది. ● డిజిలాకర్ ఖాతాకు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. ● ఆధార్ కార్డు, దానితో అనుసంధానమైన ఫోన్ నంబర్తో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ● అనంతరం ఓటీపీతో లాగిన్ అయితే మన ఆధార్పై లాకర్ తెరుచుకుంటుంది. ● డ్రైవింగ్ లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్ ధ్రువపత్రాలు, విద్యార్హత ధ్రువపత్రాలు, ఆధార్, ఓటరు ఐడీ, పాన్కార్డు, పాస్పోర్టు, జనన ధ్రు వపత్రాలు, విద్యార్హత ఇలా అన్ని రకాల పత్రా లను స్కాన్ చేసుకొని భద్రపరుచుకోవచ్చు. ● ఒక్కొక్కరూ ఒక జీబీ వరకు డాటా ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. -
గురుకులాలపై ‘ప్రత్యేక’ గురి
ఖలీల్వాడి:సాంఘిక సంక్షేమ గురుకులాలపై ప్రభు త్వం ప్రత్యేక దృష్టి సారించింది. విద్యార్థుల, సిబ్బందితోపాటు వసతిగృహాల సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతున్నారు. అందులో భాగంగా రాష్ట్రంలోని ఉమ్మడి పది జిల్లాలకు 10 మంది ప్రత్యేకాధికారులను గురుకులాల సొసైటీ కార్యదర్శి కృష్ణ ఆదిత్య నియమించారు. ఉమ్మడి నిజామాబాద్కు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ప్రమోద్ను కేటాయించారు. దీంతో 10 రోజుల క్రితం జిల్లాకు వచ్చిన ఆయన ఉమ్మడి జిల్లా పరిధిలోని సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలల ప్రిన్సిపాళ్లతో సమావేశమయ్యారు. కాలేజీల వారీగా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల రక్షణ చర్యలతోపాటు మెనూ ప్రకారం భోజనం అందించడం, అద్దె బిల్లుల చెల్లింపు వంటి సమస్యల పరిష్కారానికి సూచనలు చేశారు. జిల్లాలో 11 సంక్షేమ గురుకులాలు.. జిల్లాలో 11 సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల/ కళాశాలలు ఉన్నాయి. అందులో 3 బాలుర, 6 బాలికల, రెండు డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. సోషల్ వెల్ఫేర్ పాఠశాల, కళాశాలల్లో 5,761 మంది, డిగ్రీ కాలేజీల్లో 864 మంది విద్యార్థులు చదువుతున్నారు. జిల్లాలోని సాంఘిక సంక్షేమ గురుకులాల్లో 267 మంది రెగ్యులర్ సిబ్బంది, 84 మంది పార్ట్ టైం, 59 మంది అవుట్ సోర్సింగ్ సిబ్బంది పనిచేస్తున్నారు. ఉత్తీర్ణత శాతం పెంపునకు.. సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. దీంతో ప్రత్యేక తరగతుల నిర్వహణపై దృష్టిసారించారు. ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన కొత్త మెనూ ప్రకారం విద్యార్థులకు పౌష్టికాహారంతో కూడిన నాణ్యమైన భోజనం అందించే దిశగా చర్యలు చేపట్టారు. మరోవైపు సిబ్బంది బకాయి వేతనాలను ఇటీవల మంజూరు చేయగా, అద్దె భవనాలకు సంబంధించిన బిల్లులు చెల్లించేందుకు వివరాలు సేకరించారు. ఉమ్మడి జిల్లా స్పెషల్ ఆఫీసర్గా సోషల్ వెల్ఫేర్ డీడీ ప్రమోద్ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి ఇప్పటికే ప్రిన్సిపాళ్లతో సమావేశం చదువుతోపాటు మెనూ అమలుకు కసరత్తు పదిరోజుల క్రితం ప్రిన్సిపాళ్లతో ఉమ్మడి జిల్లా ప్రత్యేకాధికారి రివ్యూ చేశారు. గురుకులాలకు సంబంధించిన పలు అంశాలపై నివేదిక తీసుకున్నారు. సమస్యలపై ఆరా తీశారు. సిబ్బందికి వేతనాలు మంజూరు చేశారు. పెండింగ్లో ఉన్న బిల్లులు త్వరలో విడుదల చేస్తామన్నారు. – పూర్ణచంద్రరావు, సోషల్ వెల్ఫేర్ జోనల్ అధికారి -
చిన్న నిర్లక్ష్యం.. భారీ మూల్యం
● ధాన్యం నూర్పిళ్లు, ఆరబోతలతో రోడ్డు ప్రమాదాలు ● గత అక్టోబర్లో జరిగిన ప్రమాదాల్లో 27 మంది మృతి ● అందులో ధాన్యం ఆరబోతలతో జరిగినవే ఎక్కువ ● పోలీసులు అవగాహన కల్పిస్తున్నా కనిపించని మార్పు కామారెడ్డి క్రైం: ఒక్కోసారి చిన్నపాటి నిర్లక్ష్యానికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. రోడ్లపై ధాన్యం ఆరబోతలు, నూర్పిళ్ల విషయం కూడా అలాంటిదే. ఆరుగాలం శ్రమించి దేశానికి అన్నం పెట్టే రైతన్నలకు సంబంధించిన విషయం కావడంతో అందరూ సర్దుకుపోతుంటారు. కాకపోతే రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని పోలీసుశాఖ గుర్తు చేస్తోంది. రోడ్లపై ధాన్యం ఆరబోయడంతో రోడ్డు ప్రమాదాలకు ఆస్కారం ఉంటుందని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరిస్తూ విలువైన ప్రాణా లను కాపాడుకోవాలని సూచిస్తున్నారు. గతేడాది జరిగిన ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని ఇప్పటికే పోలీసులు గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. అయినా మార్పు కనిపించడం లేదు. తాజాగా తాడ్వాయి మండలం చందాపూర్లో ఓ వ్యక్తి బైక్పై వెళ్తూ రోడ్డుపై ఆరబోసిన మక్కల కారణంగా అదుపుతప్పి కిందపడి మృత్యువాత పడ్డాడు. పోలీసుల ప్రత్యేక దృష్టి.. కామారెడ్డి జిల్లాలో ప్రతి సంవత్సరం అక్టోబర్ నాటికి వరి, మొక్కజొన్న, సోయాబీన్, పప్పు దినుసుల కోతలు పూర్తవుతాయి. చాలామంది వాటిని రహదారుల వెంట ఆరబోయడం, నూర్పిళ్లు చేస్తుంటారు. ఈ క్రమంలో అనేక రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. కొంతకాలం క్రితం టేక్రియాల్ వద్ద ఓ రైతు వడ్లను రోడ్డు వెంట ఆరబోసి రాత్రిపూట రోడ్డు దాటే క్రమంలో వాహనం ఢీకొని మృతి చెందాడు. వాహనాలు అదుపుతప్పి పడిపోవడంతో సంభవించిన మరణాలు అనేకం. గత అక్టోబర్ నెలలో జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో మొత్తం 27 మంది మృతి మృతి చెందగా, అందులో ధాన్యం ఆరబోతల కారణంగా దాదాపు 10 ప్రమాదాలు జరిగినట్లు భావిస్తున్నారు. దీంతో పోలీసులు ఈ వ్యవహారంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. అందరి బాధ్యత.. రోడ్లపై ధాన్యం నూర్పిళ్లు, ఆరబోసే విషయంలో వాహనదారులే కాకుండా రైతులు సైతం ప్రమాదాల బారినపడిన ఘటనలు ఉన్నాయి. చిన్నపాటి నిర్లక్ష్యం కారణంగా జరిగే ప్రమాదాల్లో కుటుంబ పెద్ద దిక్కయిన వ్యక్తి ప్రాణాలు కోల్పోతే ఆ కుటుంబంలో తీరని విషాదం నెలకొంటుంది. అందుకే ధాన్యాన్ని రోడ్లపై కాకుండా గ్రామాల్లోని ఖాళీ స్థలాల్లో మాత్రమే ఆరబోయాలని రైతులకు పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రాణం తీసిన మక్కలు కుప్పను తప్పించబోయి బైక్ అదుపుతప్పి ఒకరు మృతి తాడ్వాయి(ఎల్లారెడ్డి): తాడ్వాయి గ్రామ శివారులో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందినట్లు ఎస్సై నరేశ్ తెలిపారు. మండలంలోని చందాపూర్ గ్రామానికి చెందిన పైడి చిన్నగంగారెడ్డి(52) బైక్పై తాడ్వాయిలోని చిన్న కూతురు వద్దకు వెళుతున్నాడు. మార్గమధ్యంలో రోడ్డపై ఉన్న మక్కల కుప్పను తప్పించబోయి అదుపుతప్పి బైక్పై నుంచి కిందపడడంతో గంగారెడ్డి తల, ముక్కుకు తీవ్రగాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. గంగారెడ్డి పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గంగారెడ్డి మరణించాడు. మృతుడికి భార్య మల్లవ్వ, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. మల్లవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. రోడ్లపై ధాన్యం నూర్పిళ్లు, ఆర బోయడంతో ఏటా పలు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్డు ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత. జీపీలు, రైతు సమితులు కేటాయించిన స్థలాల్లోనే పంట దిగుబడులను ఆరబోయాలి. విలువైన ప్రాణాలు రక్షించుకోవాలి. – రాజేశ్చంద్ర, ఎస్పీ, కామారెడ్డి -
నిర్లక్ష్యానికి తావిస్తే చర్యలు తప్పవు
● ఆయిల్ పామ్ సాగు లక్ష్యాన్ని సాధించాలి ● కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి నిజామాబాద్అర్బన్: జిల్లాలో నిర్దేశిత లక్ష్యం మేర కు ఆయిల్ పామ్ సాగు జరిగేలా అంకిత భావంతో కృషి చేయాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది 3,500 ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్ పామ్ సాగు చేయాలని లక్ష్యం కాగా, ఆ దిశగా రైతులను ప్రోత్సహించాలన్నారు. కలెక్టరేట్లో శనివారం వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికారులు, ఆయిల్ పామ్ నర్సరీ నిర్వాహకులైన ప్రీ యునిక్ కంపెనీ ప్రతినిధులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఆయిల్ పామ్ సాగు పురోగతిపై క్లస్టర్ల వారీగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. లక్ష్య సాధనలో వెనుకబడి ఉన్న క్లస్టర్ల అధి కారుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయి ల్ పామ్ సాగును ప్రోత్సహించడంలో విఫలమవుతున్న అధికారులపై తగు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఒప్పందానికి అనుగుణంగా కృషి చేయని పక్షంలో ప్రయివే టు కంపెనీపై కూడా చర్యలు తీసుకునే అంశాలను పరిశీలించాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో రైతు లు ఆయిల్ పామ్ సాగు చేపట్టేలా విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని పదేపదే సూచిస్తున్నప్పటికీ ఎందుకు పురోగతి సాధించలేకపోతున్నారని ప్రశ్నించారు. సాగుకు ప్రస్తుత సమయం ఎంతో అనుకూలమని, రైతులను ప్రోత్సహించేందుకు ప్ర భుత్వం అందిస్తున్న రాయితీలు, మద్దతు ధర, సుధీర్ఘకాలంపాటు ఏటేటా సమకూరే రాబడి తదితర అంశాలను వివరించాలని సూచించారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జె.గోవిందు, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి శ్రీనివాస్, ప్రీ యూనిక్ కంపెనీ ప్రతినిధులు, ఆయా క్లస్టర్ల ఉద్యా నవన శాఖ అధికారులు పాల్గొన్నారు. -
స్కూటీని ఢీకొన్న లారీ
● రిటైర్డ్ వీఆర్వో దుర్మరణం కామారెడ్డి క్రైం: అదుపుతప్పిన లారీ స్కూటీని ఢీకొన్న ఘటనలో ఒకరు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన జిల్లా కేంద్రంలోని పోలీస్స్టేషన్ ఎదురుగా శనివారం ఉదయం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని ఎన్జీవోస్ కాలనీకి చెందిన రిటైర్డ్ వీఆర్వో జనార్దన్ రావు వ్యక్తిగత పనుల మీద స్కూటీపై వెళ్తున్నాడు. అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన లారీ అదుపుతప్పి స్కూటీని ఢీకొంది. ఈ ప్రమాదంలో జనార్దన్రావుకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు, స్థానికులు ఆయనను జనరల్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కొద్దిసేపటికే మృతి చెందాడు. ఇసాయిపేటకు చెందిన ఆయన కొంతకాలంగా కుటుంబంతో కలిసి కామారెడ్డిలోని ఎన్జీవోస్ కాలనీలో స్థిరపడ్డారు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని భవానీపేట గ్రామానికి చెందిన బ్యాగరి రాజయ్య(52) చేపలవేటకు వెళ్లి విద్యుత్ షాక్తో మృతి చెందినట్లు ఎస్సై దీపక్కుమార్ తెలిపారు. గ్రామశివారులోని పెద్దవాగు మడుగులో శనివారం విద్యుత్ తీగల సహాయంతో చేపలను పట్టేందుకు స్టార్టర్ బాక్సులోని ఫ్యూజ్కు వైరు పెట్టి నీటిలో దిగుతున్న క్రమంలో షాక్ తగిలి రాజయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. గ్రామస్తులు మృతదేహాన్ని గుర్తించి మృతుడి సోదరి లక్ష్మికి సమాచారం ఇచ్చారు. లక్ష్మి ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. రోడ్డు ప్రమాదంలో యువకుడు.. సదాశివనగర్(ఎల్లారెడ్డి): మండలంలోని పద్మాజివాడి గ్రామ శివారులోని స్ప్రింగ్ ఫీల్డ్స్ స్కూల్ సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి. గాంధారి మండల కేంద్రానికి చెందిన కామెల్లి అరవింద్ స్వామి(29) సదాశివనగర్ మండల కేంద్రంలోని అత్తగారి ఇంటికి వచ్చి భార్యాపిల్లలను చూసి తిరిగి ద్విచక్ర వాహనంపై గాంధారికి వెళ్తున్నాడు. ముందు వెళ్తున్న కారును ఓవర్టేక్ చేసి వెళ్తూ ఎదురుగా వస్తున్న హైచర్ వ్యాన్ను ఢీకొట్టాడు. దీంతో తీవ్రంగా గాయపడిన స్వామిని కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించేలోగా మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతుడి తండ్రి నర్సింహులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై పుష్పరాజ్ తెలిపారు. చికిత్స పొందుతూ మాజీ ఎంపీటీసీ.. ఇందల్వాయి: మండలంలోని తిర్మన్పల్లి మాజీ ఎంపీటీసీ జంగిడి లక్ష్మి(61) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మధ్యాహ్నం మృతి చెందినట్లు ఎస్సై సందీప్ తెలిపారు. 15 రోజుల క్రితం లక్ష్మి పురుగుల మందు సేవించింది. విషయం తెలిసిన ఆమె చెల్లెలు వెంటనే అక్కను చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ లక్ష్మి శనివారం మృతి చెందారు. కాంగ్రెస్ సీనియర్ నాయకురాలైన జంగిడి లక్ష్మి మృతి పార్టీకి తీరని లోటని మండల నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. -
బోధన్ ఎకై ్సజ్ సర్కిల్ పరిధిలో 422 దరఖాస్తులు
బోధన్టౌన్(బోధన్): బోధన్ ఎక్సైజ్ సర్కిల్ కార్యాలయ పరిధిలోని 18 మద్యం దుకాణాలకు శనివారం రాత్రి 10 గంటల వరకు 422 దరఖాస్తులు వచ్చినట్లు సీఐ భాస్కర్రావ్ తెలిపారు. ఈ నెల 23న లక్కీడ్రా నిర్వహిస్తామని, డిసెంబర్ 1 నుంచి కొత్త మద్యం దుకాణాలు ప్రారంభమవుతాయని సీఐ వెల్లడించారు. రాజంపేట: మండలంలోని పెద్దాయిపల్లి గ్రామ శివారులోని గుట్ట నుంచి మొరం అక్రమ రవాణా చేస్తున్న పలువురిపై కేసు నమోదు చేసి తొమ్మిది ట్రాక్టర్లను సీజ్ చేసినట్లు ఎస్సై రాజు శనివారం తెలిపారు. అనుమతి లేకుండా ఇసుక, మొరం రవాణా చేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిజామాబాద్ రూరల్: భారత సంచార్ నిగం లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) వినియోగదారులకు దీపావళి పండగ బొనాంజాను ప్రకటించిందని జిల్లా జీఎం వెంకటేశ్వర్లు తెలిపారు. ఒక్క రూపాయితోనే 30 రోజులపాటు అపరిమిత ఉచిత వాయిస్ కాల్స్, రోజుకు 2జీబీ డేటా 100 ఎస్ఎంఎస్లు లభిస్తాయ ని పేర్కొన్నారు. వచ్చే నెల 15వ తేదీ వరకు ఉచితంగా సిమ్కార్డు అందజేయనున్నట్లు తెలిపారు. ఈ నెల 18, 19, 20 తేదీల్లో బీఎస్ఎన్ఎల్ సెల్ఫ్ కేర్ యాప్, వెబ్సైట్ ద్వారా రూ.100 అంతకంటే ఎక్కువ రీచార్జ్ చేసుకునే పది మందిని లక్కీ డిప్ ద్వారా ఎంచుకొని ఒక్కొక్కరికి 10 గ్రాముల సిల్వర్ కాయిన్ను బహుమతిగా ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని బీఎస్ఎన్ఎల్ వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని జీఎం కోరారు. సుభాష్నగర్: కానిస్టేబుల్ ప్రమోద్పై కత్తితో దాడి చేసి ప్రాణాలు తీసిన నిందితుడు రియాజ్పై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ పటేల్ కులాచారి శనివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఈ ఘటన చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమోద్ మృతి పట్ల వారి కుటుంబసభ్యులకు సంతాపం ప్రకటించారు. కానిస్టేబుల్ హత్యపై మానాల దిగ్భ్రాంతి నిజామాబాద్ సిటీ: చోరీ కేసులో పోలీస్ స్టేషన్కు తీసుకువస్తున్న కానిస్టేబుల్ ప్రమోద్ను నిందితుడు రియాజ్ కత్తితో పొడిచి హత్య చేసిన ఘటన తనను తీవ్రంగా దిగ్భ్రాంతికి గురిచేసిందని డీసీసీ అధ్యక్షుడు, రాష్ట్ర సహకా ర సంఘం లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్రెడ్డి శ నివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఘటనకు కారకులను ఎ ట్టి పరిస్థితుల్లో ఉపేక్షించవద్దని, నిందితుడిని కఠినంగా శిక్షించాలని సీపీ సాయిచైతన్యను కోరారు. మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
ఎస్హెచ్జీలకు మరిన్ని కొనుగోలు కేంద్రాలు
● సాఫీగా కొనుగోళ్లు చేపట్టడంతోనే.. ● యాసంగి కన్నా ఈ సారి 37 కేంద్రాలు అధికం మోర్తాడ్(బాల్కొండ):మహిళా సంఘాలకు వరి ధా న్యం కొనుగోలు బాధ్యతను విస్తృతం చేశారు. గత యాసంగి సీజన్న్కన్నా ఈసారి 37 కొనుగోలు కేంద్రాలను పెంచారు. జిల్లాలోని మహిళా సంఘాలు గతంలో 224 కేంద్రాల ద్వారా వరి ధాన్యాన్ని సేకరించాయి.అయితే జిల్లా వ్యాప్తంగా ఈసారి మొత్తం 676 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా, అందులో మహిళా సమాఖ్యలకు 261 కేంద్రాలను అ ప్పగిస్తూ అధికార యంత్రాంగం నిర్ణయించింది. గ్రామ సమాఖ్యలను ఆర్థికంగా బలోపేతం చేస్తూ వారిని వ్యాపార రంగం వైపు ప్రోత్సహించేందుకు ధాన్యం కొనుగోళ్లను అప్పగిస్తున్నారు. మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీ, సీ్త్రనిధి రుణాలు ఇవ్వడ, వసూలు చేయడంతో ఆశించిన ప్రయోజనం చేకూ రడం లేదని ప్రభుత్వం భావిస్తోంది. వ్యాపారం వైపు మహిళల దృష్టిని మరలిస్తే వారు ఆర్థికంగా నిలదొక్కుకుంటారని గుర్తించిన ప్రభుత్వం వరి కొనుగోలు కేంద్రాలకు ప్రాధాన్యం కల్పించింది. మహిళా సమాఖ్యల ఆధ్వర్యంలోని కొనుగోలు కేంద్రాల ద్వారా మహిళలు విజయవంతంగా వరి ధాన్యాన్ని సేకరించాలి. లక్ష్యానికి అనుగుణంగా వడ్లు కొనుగోలు చేసి లాభాలు గడించాలి. మహిళా సంఘాలు బలపడితేనే సభ్యులకు ప్రయోజనం. – సాయాగౌడ్, పీడీ, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ -
రెండేళ్లకు చిక్కాడు..
తాండూరు: హత్య చేసి పరారీలో ఉన్న నిందితుడిని రెండేళ్ల తర్వాత పోలీసులు పట్టుకున్నారు. వివరాలను డీఎస్పీ బాలకృష్ణారెడ్డి, సీఐ నగేశ్ శనివారం విలేకరులకు వెల్లడించారు. వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం మన్సన్పల్లికి చెందిన ముడావత్ రవి(39) వ్యవసాయ పనులు చేస్తూ జీవించేవాడు. గ్రామ శివారులోని ఓ ఫామ్హౌస్లో పనిచేసే కామారెడ్డి జిల్లా మద్నూర్కు చెందిన బాలయ్య అలియాస్ బాలాజీతో ఇతనికి స్నేహం కుదిరింది. ఈ క్రమంలో పలుమార్లు మద్యం తాగేందుకు రవి వద్ద బాలాజీ రూ.2,050 అప్పుగా తీసుకున్నాడు. నెలలు గడుస్తున్నా తిరిగి డబ్బులు ఇవ్వకపోవడంతో పలుమార్లు అడగగా, రవి తన పరువు తీస్తున్నాడని కక్షపెంచుకున్న బాలాజీ 2023 ఆగస్టు 12న మద్యం తాగుదామంటూ తాను పనిచేసే ఫామ్హౌస్ వద్దకు పిలిచాడు. అనంతరం పథకం ప్రకారం కత్తితో పొడిచి పారిపోయాడు. ఆస్పత్రి పాలైన బాధితుడు చికిత్స పొందుతూ ఆరు రోజుల తర్వాత మరణించాడు. దీంతో నిందితుడైన బాలాజీపై హత్య, అట్రాసిటీ కేసులు నమోదయ్యాయి. నాటి నుంచి హంతకుడి కోసం పోలీసులు వెతుకుతున్నా ఆచూకీ లభించలేదు. ఇటీవల మృతి చెందిన తన తల్లి అంత్యక్రియలకు సైతం రాలేదు. కొన్నాళ్లుగా అతని కుటుంబసభ్యుల కదలికలపై నిఘా పెట్టిన పోలీసులు, కాల్డాటా ఆధారంగా నిందితుడు సిద్దిపేటలోని తన సోదరుడు సంజీవ్ ఇంట్లో ఉన్నట్లు గుర్తించి, అక్కడికి వెళ్లి అరెస్టు చేశారు. హత్య అనంతరం చాలారోజులు మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లా వీసాపూర్లో తలదాచుకున్నాడని విచారణలో వెల్లడైనట్లు డీఎస్పీ తెలిపారు. నిందితుడిని కోర్టులో హాజరుపర్చి రిమాండ్కు తరలించారు. కేసులో కీలకంగా పనిచేసిన పోలీసులు అంజాద్, శివకుమార్, మున్నయ్యను అభినందిస్తూ డీఎస్పీ రివార్డులు అందజేశారు. హంతకుడు మద్నూర్వాసి సిద్దిపేటలో అదుపులోకి తీసుకున్న పోలీసులు రిమాండ్కు తరలింపు -
అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు
● కానిస్టేబుల్ ప్రమోద్కు కన్నీటి వీడ్కోలు ● నివాళులు అర్పించిన ఐజీ, సీపీ నిజామాబాద్అర్బన్ : సీసీఎస్ కానిస్టేబుల్ ప్ర మోద్ అంత్య క్రియలు నగరంలో శనివారం అ ధికారిక లాంఛనాలతో పూర్తయ్యాయి. స్థానిక రైల్వే కమాన్ ప్రాంతంలోని బ్యాంకు కాలనీలో ని ఆయన నివాసం నుంచి శవ యాత్ర ప్రారంభమైంది. ఈ అంత్యక్రియలకు మల్టీజోన్– 1 నార్త్ తెలంగాణ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి, సీపీ సా యి చైతన్య, పోలీస్ అధికారులు హాజరయ్యా రు. ప్రమోద్ కుటుంబానికి అండగా ఉంటామ ని సీపీ పేర్కొన్నారు. ప్రమోద్ పార్థీవ దేహానికి నివాళులు అర్పించారు. శవ యాత్రలో పాడె మోశారు. ఈ సందర్భంగా ఐజీ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ నిందితుడు రియాజున్ త్వరలోనే పట్టుకుంటామన్నారు. శాంతి భద్రతల వి షయంలో ఉపేక్షించబోమన్నారు. కానిస్టేబుల్ కుటుంబానికి అండగా ఉంటాం.. కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి అండగా ఉంటామని సీపీ సాయి చైతన్య పేర్కొన్నారు. ఉదయం ప్రభుత్వ మెడికల్ కశాశాలలో మీడి యాతో మాట్లాడారు. నిందితుడు రియాజ్ను పట్టుకునేందుకు కానిస్టేబుల్ ప్రమోద్తో పాటు సీసీఐ ఎస్సై కూ డా ఉన్నారన్నారు. దురదృష్టవశాత్తు పోలీసు ఫ్యామిలీలో ఒక్కరు చనిపోవడం చాలా బా ధాకరమన్నారు. కానిస్టేబుల్ కుటుంబానికి ప్ర తి ఒక్కరు అండగా ఉండాలన్నారు. కొందరు ఘటనపై రాజకీయలు చేయడం తగదన్నారు.కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో నిందితుడు రియాజ్ ను పట్టుకునేందుకు ఎనిమి ది పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. శుక్రవారం బాబన్సాహెబ్ పహాడ్ వద్ద కెనల్ కట్ట ప్రాంతంలో మొదట రియాజ్ను పట్టుకునేందుకు కానిస్టేబుల్ ప్రయత్నం చేశాడు. కెనాల్ కాల్వ గుండా పారిపోతున్న రియాజ్ను వెంబడించి పట్టుకున్నాడు. అనంతరం తన బైక్పై సీసీఎస్ ఎస్సై విఠల్ ఆధ్వర్యంలో అరెస్టు చేసి బైౖక్పై తీసుకువస్తున్నారు. ఈ సందర్భంలోనే రియాజ్ కానిస్టేబుల్ను పొడిచి హత్య చేశారు. ఇతను ఎక్కడికి పారిపోయాడు.. ఎలా పారిపోయాడు కోణంలో పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. నిందితుడు రియాజ్ సెల్ఫోన్ వదిలేసి మరో బైక్ ను దొంగిలించి పారిపోయినట్లు పోలీసులు భావిస్తున్నారు. అర్ధరాత్రి 12 గంటల వరకు నగరంలోనే ఉన్నట్లు పోలీసులకు సమాచారం. కొన్ని బృందాలు పట్టణంలో గాలింపు చర్యలు చేపడుతున్నాయి. మరికొన్ని బృందాలు రియాజ్ తరచుగా వెళ్లే ప్రాంతాలను జల్లెడ పడుతున్నాయి. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని సీపీ సాయి చైతన్య అన్నారు. -
నాలుగో స్తంభానికి పొంచివున్న ప్రమాదం
పత్రిక స్వేచ్ఛను కాపాడాలిఏపీలోని కూటమి ప్ర భు త్వం అక్రమ కేసులతో జర్నలిస్టులను భయభ్రాంతులకు గురిచేయడం సరి కాదు. ఇది సాక్షి పత్రికపై దాడి మాత్రమే కాదు రాజ్యాంగంపై దాడిగా పరిగణిస్తున్నాం.పత్రికా స్వేచ్ఛను కాపాడాలి. – మానాల మోహన్రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు, రాష్ట్ర సహకార సంఘం లిమిటెడ్ చైర్మన్ ‘సాక్షి’ దినపత్రిక, ఎడిటర్ ధనంజయ రెడ్డిపై ఏపీలోని కూటమి ప్రభుత్వం అక్రమంగా కేసులు పెట్టి వేధించడాన్ని ప్రజాస్వామిక వాదులు, ప్రజాప్రతినిధులు, పలు రాజకీయ పార్టీల నేతలు ఖండించారు. పత్రికపై దాడిని ప్రజాస్వామ్యంపై దాడిగా అభివర్ణించారు. వాస్తవాలు వెలుగులోకి తెస్తూ.. ప్రజలను అప్రమత్తం చేస్తున్న ‘సాక్షి’ వంటి ప్రజామోదం పొందిన పత్రికను ఇబ్బందుల పాలు చేస్తే ప్రజలే గుణపాఠం చెబుతారని అన్నారు. ఏపీలోని కూటమి ప్రభుత్వాల వంటి వాటితో నాలుగో స్తంభానికి ప్రమాదం పొంచివుందన్నారు. – నిజామాబాద్ సిటీ ‘సాక్షి’ పై దాడి ప్రజాస్వామ్యంపై దాడిగానే పరిగణిస్తున్నాం ఏపీలోని కూటమి ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలి రాజకీయ నేతలు, ప్రజా సంఘాలు, జర్నలిస్టు సంఘాల ప్రతినిధుల మనోభిప్రాయాలు -
ధాన్యం తూకంలో తరుగు తీస్తే చర్యలు
● జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డిరుద్రూర్ : ధాన్యం సేకరణలో అవకతవకలు జరిగితే బాధ్యులపై కఠిన చర్యలు ఉంటాయని జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి హెచ్చరించారు. రుద్రూర్, పోతంగల్, కోటగిరి మండలంలోని కొత్తపల్లి ధా న్యం కొనుగోలు కేంద్రాలను శనివారం ఆయన పరిశీలించారు. సేకరించిన ధాన్యం వివరాలు తెలు సుకున్నారు. కొనుగోలు కేంద్రాల్లో ఏర్పాట్లను పరిశీలించారు. కొన్నిసార్లు తూకం వేయకుండానే ధా న్యం నింపి పంపిస్తున్నారని రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. కొనుగోలు కేంద్రాల్లో ప్రతి ధాన్యం బస్తాను తప్పని సరిగా కాంటా చేసిన తరువాతనే మిల్లులకు తరలించాలని నిర్వాహకులకు కలెక్టర్ సూచించారు. తరుగు, కోతలను అమలు చేస్తే చర్య లు తీసుకుంటామన్నారు. కొనుగోలు కేంద్రాలకు సరిపడా గన్నీ బ్యాగులు కేటాయించాలని, వర్షాల కు ధాన్యం తడిసిపోకుండా టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలన్నారు. రైస్ మిల్లుల నుంచి ట్రక్ షీట్లు తెప్పించుకుని వేగంగా ట్యాబ్ ఎంట్రీలు చేయాలని, దీంతో సకాలంలో రైతులకు బిల్లుల చెల్లింపులు జరుగుతాయన్నారు. క్రాప్ బుకింగ్ జాబితాలో పేర్లు లేని రైతులు పంట సాగు చేస్తే క్షేత్ర స్థాయిలో పరిశీలించి సంబంధిత రైతులకు ధ్రువీకరణ పత్రాలు అందించాలని ఏఈవోలను ఆదేశించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ కిరణ్కుమార్, జిల్లా సహకార అధికారి శ్రీనివాస్, తహసీల్దార్లు గంగాధర్, తారాబాయి, వ్యవసాయ అధికారులు సాయి కృష్ణ, రాజు, నిశిత ఉన్నారు. -
నిజామాబాద్
● నిరసనల్లో పాల్గొన్న వివిధ రాజకీయ పార్టీల నాయకులు ● ఆర్టీసీ బస్టాండ్ వద్ద బైఠాయింపు ● నగరంలో బైక్ ర్యాలీగురుకులాలపై ‘ప్రత్యేక’ గురి సాంఘిక సంక్షేమ గురుకులాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతున్నారు. ఆదివారం శ్రీ 19 శ్రీ అక్టోబర్ శ్రీ 2025– 10లో uనిర్మానుష్యంగా బస్టాండ్బీసీ బంద్నిజామాబాద్అర్బన్ : రాష్ట్ర బీసీ జేఏసీ పిలుపు మేర కు శనివారం జిల్లా వ్యాప్తంగా బంద్ విజయవంతమైంది. ఆర్మూర్, బోధన్, బాల్కొండ తదితర ప్రాంతాల్లో స్వచ్ఛందంగా వ్వాపారస్తులు, ప్రయివేటు పాఠశాలలు బంద్ పాటించారు. ఉదయం 3 గంటలకే బీసీ సంఘాల నాయకులు నిజామాబాద్ ఒకటవ, రెండవ డిపోల ముందు బైఠాయించారు . బస్సులను అడ్డుకున్నారు. కాంగ్రెస్, బీజేపీ వామపక్షాల నాయకులు ఆర్టీసీ డిపో ముందు బైఠాయించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని డి మాండ్ చేశారు. బీసీ సంఘల నాయకులు నగరంలో బైక్ర్యాలీ నిర్వహించారు. నగరంలో బస్స్టాండ్ నుంచి పాత కలెక్టరేట్, పూలాంగ్ చౌరస్తా బోర్గం(పి) వరకు, అక్కడి నుంచి ధర్న చౌక్ వరకు వచ్చా రు. అనంతరం నిర్వహించిన దీక్ష శిబిరంలో వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు. జిల్లా బీసీ సంక్షే మ సంఘం నాయకులు సుధాకర్, బుస్సా ఆంజనేయులు పాల్గొన్నారు సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో నగరంలో ర్యాలీ నిర్వహించారు. న్యూ డెమోక్రసీ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ద్వారక నగర్ నుంచి బస్టాండ్ రైల్వే స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఆకుల పాపయ్య మాట్లాడుతూ బీసీలు అత్యధిక జనాభా ఉండి కూడా రిజర్వేషన్ ఫలాలను అందుకోలేకపోతున్నారన్నారు. తెలంగాణ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బంద్లో జిల్లా అధ్యక్షుడు మల్లాని శివ మాదిగ పాల్గొని మాట్లాడారు. ఎమ్మార్పీఎస్ నాయకులు బంధ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. బోరం్గ(పి)లో మాది గ కుల సంఘాలు, బీసీ సంఘాలు, కాంగ్రెస్ పార్టీ నాయకులతో బంద్ కార్యక్రమం నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ధర్నా చౌక్ వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ పాల్గొన్నారు. దిష్టిబొమ్మ దహనం సీపీఐ ఎమ్మెల్సీ మాస్లైన్ ప్రజాపంథా నాయకులు కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. వనమాల కృష్ణ పాల్గొన్నారు. నుడా చైర్మన్ కేశ వేణు, నరాల రత్నాకర్, కాంగ్రెస్ పా ర్టీ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, బీఎల్పీ రాష్ట్ర పార్టీ అధ్యక్షు డు దండి వెంకట్, మహిళా రాష్ట్ర నాయకురాలు సబ్బని లత, మాల మహానాడు నాయకులు గైని గంగారం, దేవిదాస్, సుధాకర్, తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షులు అవంతి రావు, ప్రజా హక్కుల సంఘం నాయకులు భాస్కర్, పీడీఎస్యూ నాయకు లు గణేష్, ఆంజనేయులు, గంగకిషన్ పాల్గొన్నారు.బంద్లో భాగంగా బీసీల కులాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో పాత కలెక్టరేట్ వద్ద నిరసన చేశారు, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, ఎస్ఎస్ఆర్ విద్యాసంస్ధల అదినేత మా రయ్యగౌడు, బీఆర్ఎస్ నాయకుడు దాదాన్నగా రి విఠల్రావు పాల్గొన్నారు. పోతన్కర్ లక్ష్మినారాయణ ఆధ్వర్యంలో ఈ నిరసన చేశారు. -
ప్రజా సంక్షేమాన్ని వదిలేసి కక్ష సాధింపు చర్యలు
ఏపీలోని చంద్రబాబు సర్కార్ పత్రికా స్వేచ్ఛపై దాడికి పాల్పడుతోంది. ఉద్దేశపూర్వకంగానే సాక్షి మీడియాపై కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. ఇది పత్రికా స్వేచ్ఛపై జరుగుతున్న దాడి. ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసిన కూటమి ప్రభుత్వం నిజాలు రాస్తున్న సాక్షి ఎడిటర్ ధనంజయ రెడ్డిపై అక్రమ కేసులు, విచారణ పేరుతో వేధించడం, పత్రిక కార్యాలయంలో పోలీసులు హంగామా సృష్టించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. – జి ప్రమోద్ గౌడ్, స్టేట్ కౌన్సిల్ మెంబర్, తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ -
తెలంగాణ పోలీస్ శాఖ సీరియస్.. వెలిసిన ‘వాంటెడ్ రియాజ్’ పోస్టర్లు
సాక్షి, హైదరాబాద్/నిజామాబాద్ : నిజామాబాద్ కానిస్టేబుల్ హత్యోదంతాన్ని తెలంగాణ ప్రభుత్వం, పోలీస్ శాఖ తీవ్రంగా పరిగణించింది. ఈ ఘటనలో నిందితుడు రియాజ్ను పట్టుకుని తీరాలని జిల్లా పోలీసు యంత్రాంగానికి ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో 8 బృందాలు రంగంలోకి దిగాయి. చిన్నచిన్న దొంగతనాలు, చైన్స్నాచింగ్లకు పాల్పడే రియాజ్ గురించి శుక్రవారం నిజామాబాద్ సీసీఎస్కు సమాచారం అందింది. దీంతో సీసీఎస్ ఎస్ఐ భీమ్రావు, కానిస్టేబుల్ ప్రమోద్(48) కలిసి అతన్ని పట్టుకునేందుకు బైక్పై బయల్దేరారు. ఖిల్లా ప్రాంతంలో రాత్రి 8గం. ప్రాంతంలో రియాజ్ను పట్టుకుని.. ఠాణాకు తీసుకెళ్లేందుకు తమ బైక్పై ఎక్కించుకున్నారు. అయితే అప్పటికే తన దగ్గర దాచుకున్న కత్తి తీసి.. కానిస్టేబుల్ ప్రమోద్ను పొడిచి పరారయ్యాడు. దీంతో తీవ్రంగా గాయపడిన ప్రమోద్ను దవాఖానకు తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ ఘటనపై రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అంకిత భావంతో పనిచేస్తున్న కానిస్టేబుల్ ప్రమోద్ మరణం పట్ల విచారం వ్యక్తం చేశారు. ఘటనను తీవ్రంగా పరిగణించారు. నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయాలని అత్యవసర ఆదేశాలు జారీ చేశారు. ఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితుల్ని పర్యవేక్షించాలని, మృతుని కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించాలని, ఆ కుటుంబానికి అవసరమైన సాయం అందించాలని మల్టీజోన్-1 ఐజీపీ చంద్రశేఖర్ రెడ్డి ఆదేశించారు. దీంతో రియాజ్ పేరిట మోస్ట్ వాంటెడ్ పోస్టర్లు వెలిశాయి. అతని ఆచూకీ చెబితే రూ.50 వేలు ఇస్తామని పోలీస్ శాఖ ప్రకటించింది. అదే సమయంలో ఎనిమిది బృందాలు అతని ఆచూకీ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. -
నిజాలు రాస్తే వేధింపులా..!
‘సాక్షి’పై అక్రమ కేసులను ఎత్తి వేయాలి● నినదించిన జర్నలిస్టు, వామపక్ష, విద్యార్థి, సంఘాల ప్రతినిధులు ● జిల్లా కేంద్రంలో నిరసన ర్యాలీ, ధర్నా నిజామాబాద్లోని ధర్నాచౌక్లో నిరసనలో పాల్గొన్న ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాల ప్రతినిధులు, రాజకీయ పార్టీల నేతలు, జర్నలిస్టులు(803) ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నిరంకుశ పాలన కొనసాగుతోంది. గతంలోనే చంద్రబాబు ప్రపంచ బ్యాంకు జీతగాడు అని మేమే వ్యతిరేకించాం. ప్రజా పాలనను పక్కనపెట్టి కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నాడు. కొన్నేళ్లుగా ఇదే విధానం కొనసాగుతోంది. పత్రికలపై కక్షపూరిత చర్యలు సిగ్గుచేటు, అక్రమ కేసులు బనాయించడం, ఎదుటి వారిని బెదిరించడం అలవాటుగా మార్చుకున్నాడు. తక్షణమే సాక్షి మీడియాపై పెట్టిన కేసులను వెనక్కు తీసుకోవాలి. ఇతర మీడియాలు కూడా సాక్షికి మద్దతుగా నిలవాలి. మీడియాపై ఎవరు కేసులు నమోదు చేసినా, కక్షపూరిత చర్యలకు పాల్పడినా అందరూ ఒక్కటై కలిసికట్టుగా ఎదుర్కోవాలి. మీడియాకు మేము అండగా ఉంటాం. –వి. ప్రభాకర్, సీపీఐ (ఎంఎల్)మాస్లైన్ ప్రజాపంథ రాష్ట్ర నాయకుడుసాక్షి మీడియా నిజాలు రాస్తే చంద్రబాబు ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించింది. ఇది ప్రజాస్వామ్యానికే మాయని మచ్చ. మీడియాను తన గుప్పిట్లో పెట్టుకుని అరాచకాలు సష్టించాలని చంద్రబాబు చూస్తున్నాడు. దీనికి ప్రజలు తగిన బుద్ధి చెబుతారు. –ముస్కు సుధాకర్, టీయూసీఐ జిల్లా ప్రధాన కార్యదర్శినిజామాబాద్అర్బన్ : ‘సాక్షి’ దిన పత్రికపై, ఎడిటర్ ఆర్. ధనంజయ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు నమోదు చేసి ఇబ్బందులకు గురి చేయడాన్ని నిరసిస్తూ జిల్లా కేంద్రంలో శుక్రవారం జర్నలిస్టు సంఘాలు, వామపక్ష సంఘాలు, విద్యార్థి సంఘాలు ఆందోళన నిర్వహించాయి. సంఘాల ప్రతినిధులు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రజాస్వామ్యంలో మీడియా పాత్ర ఎంతో కీలకమని, మీడియా లేకుంటే ప్రజల హక్కులు హరించుకుపోతాయన్నారు. అలాంటి మీడియాపై అక్రమ కేసులు బనాయించి ఇబ్బందులకు గురి చేయడాన్ని తీవ్రంగా ఎండగట్టారు. మొదట ఎన్టీఆర్ చౌరస్తా నుంచి కోర్టు చౌరస్తా వరకు, తిరిగి ఎన్టీఆర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. సుమారు రెండు గంటల పాటు ధర్నా చేశారు. కూటమి ప్రభుత్వం ప్రజాస్వా మ్యానికి సంకెళ్లు వేస్తోంది. కక్షపూరితమైన విధానాలు కొన సాగిస్తోంది. తన తప్పులను వెలికి తీసేందుకు ప్రయత్నించే వారిని అక్రమంగా నిర్బంధిస్తున్నారు. పత్రిక విలేకరులపై కేసులు నమోదు చేసి ఇబ్బందులకు గురి చేయడమంటే దారుణం. ప్రజాస్వామ్యంలో మీడియాకు స్వేచ్ఛ లేకుంటే ప్రజలు ఎలా బతికేది. –ఖైసర్, కాంగ్రెస్ జిల్లా నాయకుడు చంద్రబాబు పోలీసులను అడ్డుపెట్టుకొని ప్రజాస్వామ్యాన్ని తుద ముట్టించాలని ప్రయ త్నం చేస్తున్నాడు. తన తప్పుల ను వెలికి తీసే వారి పై అక్రమ కేసులు బనాయించడం, అధికా రాన్ని అడ్డుపెట్టుకొని నిరంకుశత్వంతో ప్రజలను, పత్రిక విలేకరులను ఇబ్బందులకు గురి చేయడం సరైంది కాదు. దీనిపై తక్షణమే ప్రభుత్వం వెనక్కు తగ్గాలి. –సుజాత, ఐద్వా జిల్లా కార్యదర్శి అక్రమ కేసులు బనాయించి పోలీసులతో నిర్బంధించడం, జర్నలిస్టుల ఇండ్లలో తనిఖీలు చేస్తూ భయభ్రాంతులకు గురి చేయడం ఏమాత్రం సరైనది కాదు. అనుకూలమైన వార్తలు రాయాలంటూ బెదిరించడం, మీడియాను తొక్కి పెట్టాలని ప్రయత్నాలు చేయడాన్ని వ్యతిరేకిస్తున్నాం. –వనమాల కృష్ణ, సీపీఐ (ఎంఎల్)మాస్లైన్ ప్రజాపంఽథ రాష్ట్ర నాయకులు -
కాంటాలు ఇంకెప్పుడో..
నందిపేట్(ఆర్మూర్) : జిల్లాలో వరికోతలు ప్రారంభమై నెలరోజులవుతోంది. అధికారులు వివిధ ప్రాంతాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినా.. ఇప్పటి వరకు కొనుగోలు మాత్రం చేయడం లేదు. కోత కోసిన ధాన్యాన్ని చాలా గ్రామాల్లో రైతులు కొనుగోలు కేంద్రాల వద్దకు తరలించి ఆరబెడుతున్నారు. ఇలా ఆయా గ్రామాల్లో ధాన్యం రాశులు కుప్పలు తెప్పలుగా పేరుకు పోతున్నాయి. మరోవైపు ప్రభుత్వం రూ.500 బోనస్ ప్రకటించడంతో వరి కొనుగోళ్లు ఎప్పుడెప్పుడా అని రైతులు ఎదురు చూస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 4,36,695 ఎకరాలలో వరి సాగు చేశారు. జిల్లాలో 677 కొనుగోలు కేంద్రాల ద్వారా 8.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు ధాన్యం కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ పాటికే సగం వరకు కేంద్రాలను పీఏసీఎస్, ఐకేపీ, మోప్మా, ఐసీడీఎంఎస్, ఎఫ్డీవో ల ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. నామ మాత్రంగా ప్రారంభమైన కొనుగోలు కేంద్రాలు నెల నుంచి సాగుతున్న వరికోతలు ధాన్యం తరలించి కేంద్రాల వద్ద రైతుల పడిగాపులు మరోవైపు వెంటాడుతున్న వరుణుడి భయం -
మెజార్టీ అభిప్రాయానికి ప్రాధాన్యత
● డీసీసీ అధ్యక్షుని ఎన్నిపై పార్టీ జిల్లా పరిశీలకుడు రిజ్వాన్ అర్షద్ ● డిచ్పల్లిలో రూరల్ బ్లాక్ కాంగ్రెస్ స్థాయి సమావేశండిచ్పల్లి(నిజామాబాద్రూరల్) : మెజార్టీ కార్యకర్తల అభిప్రాయం, కాంగ్రెస్ పార్టీకి విధేయులై అందరినీ కలుపుకొని పోయే వారికే జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష ప దవి దక్కుతుందని పార్టీ జిల్లా పరిశీలకుడు, కర్ణాట క ఎమ్మెల్యే రిజ్వాన్ అర్షద్ స్పష్టం చేశారు. డీసీసీ అధ్యక్ష ఎన్నికలపై ‘సంఘటన్ సృజన్ అభియాన్’ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం డిచ్పల్లి మండల కేంద్రంలోని కేఎన్ఆర్ గార్డెన్స్లో నిర్వహించిన నిజామాబాద్ రూరల్ బ్లాక్ కాంగ్రెస్ స్థాయి సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడా రు. కాంగ్రెస్ పార్టీని ప్రక్షాళన చేయాలని అధినేతలు రాహుల్గాంధీ, మల్లిఖార్జున్ ఖర్గే ఆలోచనల మేర కు డీసీసీ అధ్యక్షుడి నియామకం కోసం గ్రామీణ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు ప్రతి కార్యకర్త, నాయకుల అభిప్రాయాన్ని సేకరిస్తున్నామని తెలి పారు. పార్టీకోసం ఎళ్లవేళలా కష్టపడే వారు, పార్టీని వీడకుండా 10 సంవత్సరాలకు పైగా క్రియాశీలకంగా పని చేసిన వారికి ప్రాధాన్యత ఉంటుందన్నారు. వచ్చే ఎన్నికల్లో అధిక ఎంపీలను గెలిపించుకుని రాహల్గాంధీని ప్రధానిగా చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. -
సీఎంకు సుదర్శన్రెడ్డి కృతజ్ఞతలు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: జిల్లాకు వ్యవ సాయ కళాశాల మంజూరు చేయడంపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్రెడ్డి శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి కృతజ్ఞ్ఞతలు తెలిపారు. సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి ఉన్నారు. రెవెన్యూ సిబ్బంది బదిలీ నిజామాబాద్ అర్బన్: రెవెన్యూశాఖలోని తొమ్మిది మంది సిబ్బందిని బదిలీ చేస్తూ జిల్లా కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.ఈనెల 15న ప్రచురితమైన ‘రేషన్కార్డుల్లో భారీ అక్రమాలు’ కథనంపై అధికారులు స్పందించారు. వివిధ మండలాల్లో అనర్హులకు రేషన్కార్డులు మంజూరు చేశారని రెవెన్యూ సిబ్బందిని వివిధ ప్రాంతాలకు బదిలీ చేశారు. పసుపు రైతుల సంక్షేమానికి కృషి ● జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి సుభాష్నగర్: పసుపు రైతుల సంక్షేమం కో సం జాతీయ పసుపు బోర్డు ఎల్లప్పుడూ పని చేస్తుందని బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి అ న్నారు. వరంగల్, ఏపీలోని అరకు జిల్లా పా డేరు, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బస్తర్, ఒరిస్సా రాష్ట్రాలకు చెందిన పలువురు రైతులు శుక్రవారం నగరంలోని జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని సందర్శించారు. పల్లె గంగారెడ్డి వారితో ప్రత్యేకంగా సమావేశమయ్యా రు. పసుపు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, ఉత్పత్తి వ్యయం, మార్కెట్లో ధరల అస్థిరత, పంట సంరక్షణలో ఎదురయ్యే సవాళ్లు వంటి అంశాలపై పరిష్కార మార్గాలను చర్చించారు. పాఠశాలకు రూ.50 వేల విరాళం మోపాల్ : మోర్తాడ్ మండలంలోని సిర్పూర్ జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలకు దూస లక్ష్మణ్ విద్యా ఆశయం స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున రూ.50 వేల ఆర్థిక సాయాన్ని శుక్రవారం ప్రధానోపాధ్యాయులు వి సత్యనారాయణకు అందజేశారు. ఈసందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ పాఠశాలలో రెండు సంవత్సరాలుగా జరుగుతున్న వివిధ విద్య అభివృద్ధి పనులు గమనించి ఆర్థికసాయాన్ని అందజేశారని తెలిపారు. అనంతరం సంస్థ ప్రతినిధులు దూస దాసు, ఆరు గొండ దయానంద్ మాట్లాడుతూ విద్యా ర్థులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గెలుచుకున్న బహుమతులను గుర్తించి, వారి ప్రతిభా పాటవాలను మరింత ప్రోత్సహించేలా ఈ విద్యానిధిని అందించినట్లు పేర్కొన్నారు. తెలుగు ఉపాధ్యాయులు డాక్టర్ కాసర్ల నరేష్రావు చొరవతో పాఠశాల అవసరాలను గుర్తించి ఈ నిధిని అందించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్యామల, మోహన్, అక్బర్ బాషా, డాక్టర్ శ్రీనివాస్ హజారే, లలిత, విద్యార్థులు పాల్గొన్నారు. -
ఆర్టీసీ లక్కీడ్రా విజేతలకు చెక్కుల ప్రదానం
నిజామాబాద్ సిటీ: దసరా సీజన్ నేపథ్యంలో ఆర్టీసీ వారు ‘లక్కీడ్రా’ కార్యక్రమాన్ని నిర్వహించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా నిజామాబాద్ నుంచి సికింద్రాబాద్లోని జూబ్లీ బస్టాండ్ వరకు ఆర్టీసీ లగ్జరీ, సూపర్ లగ్జరీ, రాజధాని బస్సులపై ప్రయాణించిన వారికి డ్రాలో పాల్గొనే అవకాశం కల్పించింది. దీంతో సదరు ప్రయాణికులు తమ టికెట్ల వెనుకాల తమ ఫోన్ నంబర్లను రాసి, బస్టాండ్లోని లక్కీడ్రా పెట్టెలో వేశారు. జిల్లాకేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్లోగల ఆర్ఎం కార్యాలయంలో ఇటీవల డ్రా తీశారు. విజేతలకు శుక్రవారం ఏసీపీ రాజా వెంకట్రెడ్డి చెక్కులు అందించారు. మొదటి బహమతి కింద యస్.చంద్రయ్యకు రూ.25 వేలు, రెండో బహుమతి కింద షేక్ బాబర్కు రూ.15 వేలు, మూడో బహుమతి కింద రాంప్రసాద్కు రూ.10వేలు అందించారు. కార్యక్రమంలో ఆర్ఎం జోత్స్న, డిప్యూటీ రీజినల్ మేనేజర్ మధుసూదన్, పరమాత్మ, ఆనంద్ బాబు, డీఎం–1 ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. -
గాలికుంటు వ్యాధికి టీకాతో చెక్
● జిల్లాలో ప్రారంభమైన పశువులకు వ్యాక్సినేషన్ ● ఈనెల 15 నుంచి నవంబర్ 14 వరకు కొనసాగనున్న కార్యక్రమం బోధన్రూరల్/ఆర్మూర్: పాడిరంగంలో అభివృద్ధి సాధించాలంటే పాడి పశువుల సంపూర్ణ ఆరోగ్యం అత్యంత కీలకమైనది. అలాంటిది పాడి పశువులకు గాలికుంటు వ్యాధి సోకితే తీవ్రమైన నష్టాలను చవిచూడాల్సివస్తుంది. వ్యాధి సోకిన పశువులు నీరసించిపోవడంతోపాటు, పాలదిగుబడి తగ్గిపోతుంది. దీంతో ఈ వ్యాధిని నివారించడానికి గేదె, ఆవు జాతి పశువులకు ప్రతియేటా ఉచితంగా వ్యాధి నివారణ టీకాలను వేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. ప్రస్తుతం ఈనెల 15న ఈ టీకాల కార్యక్రమం ప్రారంభం కాగా, నవంబర్ 14 వరకు కొనసాగనుంది. జిల్లాలో మొత్తం 82 టీంలను ఏర్పాటు చేసి ప్రాంతాల వారీగా పాడి పశువులకు గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు వేస్తున్నారు. జిల్లాలోని పశువులు ఇలా.. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో 2019లో చేపట్టి పశు గణాంకాల ప్రకారం జిల్లాలో గేదె జాతి పశువులు 2లక్షల 6వేల 898 ఉండగా, గో జాతి (ఆవులు, ఎడ్లు) పశువులు 1లక్ష 1వెయ్యి 252గా ఉన్నాయి. ఇప్పటికే పోషణ కరువై పశువులు, జీవాల సంఖ్య సుమారు 20 శాతం వరకు తగ్గిందని అధికారులు పేర్కొంటున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం పశు సంవర్థక శాఖ ఆధ్వర్యంలో గాలికుంటు వ్యాధి రహిత జిల్లాగా మార్చడానికి ప్రస్తుతం పశువులకు టీకాలు వేస్తూ విశేష కృషి చేస్తోంది. గాలికుంటు వ్యాధిని నివారించగలిగితే ప్రత్యక్షంగా పశువుకి వ్యాధి వల్ల కలిగే బాధ నుండి ఉపశమనంతో పాటు ఆ పశువు పైన ఆధారపడిన రైతుకి ఆర్థిక స్వావలంబన చేకూరనుంది. -
ఒమన్లో చిక్కుకున్న సిద్దపల్లి వాసి
మోర్తాడ్(బాల్కొండ): గల్ఫ్ దేశం ఒమన్లో చిక్కుకున్న తన తండ్రిని స్వగ్రామానికి రప్పించాలని కూతురు కోరింది. ఈమేరకు హైదరాబాద్లో శుక్రవారం నిర్వహించిన ప్ర వాసీ ప్రజావాణిలో వినతిపత్రం అందజేశారు. వివరా లు ఇలా.. భీమ్గల్ మండలం సిద్ధపల్లికి చెందిన భోజ సురేష్ను ధర్పల్లికి చెందిన ఏజెంట్ ఒకరు ఆ గష్టులో ఒమన్కు పంపించాడు. అక్కడ ఒక కార్యాలయంలో క్లీనింగ్ విభాగంలో పని కల్పిస్తానని నమ్మించి, సురేష్ వద్ద రూ.90వేలు తీసుకున్నాడు. తీరా ఒమాన్ వెళ్లిన తర్వాత యాంకూల్ పట్టణానికి సమీపంలోని ఒక గ్రామంలోని వ్యవసాయ క్షేత్రానికి తరలించారు. అక్కడ ఉన్న గొర్రెల మందకు కాపరిగా పని చేయాలని సూచించారు. తనకు చెప్పి న పని కాకుండా, ఎడారిలో గొర్రెలకు కాపలాగా ఉండటంతో అతడు నిత్యం చాలా ఇబ్బంది పడుతున్నాడు. తాను ఇక్కడ ఉండలేనని సురేష్ తన కుటుంబ సభ్యులతో గోడు వెళ్లబోసుకున్నాడు. ఇటీవల సురేష్ తల్లి చనిపోగా, అతని భార్య అనారోగ్యంతో బాధపడుతుంది. దీంతో తన తండ్రిని ఎలాగైనా ఇంటికి రప్పించాలని కోరుతూ బాధితుడి కూతురు తేజశ్రీ ప్రవాసీ ప్రజావాణిలో అధికారి జగదీష్ పటేల్కు, ఎమిగ్రంట్స్ వెల్ఫేర్ ఫోరం ప్రధాన కార్యదర్శి సురేంద్రనాథ్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా ఎన్నారై అడ్వయిజరీ కమిటీ వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి ‘సాక్షి’తో మాట్లాడారు. ఏజెంట్ చేతిలో మోసపోయిన సురేష్కు న్యాయం జరిగేలా చూస్తామన్నారు. క్లీనింగ్ విభాగంలో ఉపాధి అంటూ గొర్రెల కాపరిగా పనికి పురమాయించిన ఏజెంట్ ఎడారిలో తీవ్ర ఇబ్బందులు పడుతున్న వైనం తన తండ్రిని ఇంటికి రప్పించాలని ప్రవాసి ప్రజావాణిలో కూతురి వేడుకోలు -
పత్రిక స్వేచ్ఛను హరిస్తే ఊరుకోం
సాక్షి ఎడిటర్పై అక్రమంగా నమోదు చేసిన కేసులను ఏపీ ప్రభుత్వం వెనక్కు తీసుకోవాలి. ‘సాక్షి’కి కూట మి ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి. అక్రమాలను వెలికితీస్తున్న ‘సాక్షి’ని అభినందించకుండా, తప్పుడు వార్తల పేరిట యాజమాన్యంపై కేసులు నమోదు చేసి భయభ్రాంతులకు గురి చేయడం ప్రజాస్వామ్యంలోనే అవమానకరమైన ఘటన. –గణేష్, పీడీఎస్యూ జిల్లా కార్యదర్శి నిజామాబాద్అర్బన్: పత్రిక స్వే చ్ఛను హరిస్తే ఊరుకో మని జిల్లాలోని జర్నలిస్టులు, వివిధ సంఘాల ప్రతినిధులు హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాక్షి మీడియాపై కూ టమి ప్రభుత్వం అక్రమ కేసులు నమోదు చేసి ఇబ్బందులకు గురిచేయడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈమేరకు శుక్రవారం జిల్లా కేంద్రంలో వారు నిరసన వ్యక్తం చేశారు. సాక్షి బ్యూరో ఇన్చార్జి భద్రరెడ్డి, ఎడిషన్ ఇన్చార్జి ప్రభాకర్, అడ్వడైజర్ మేనేజర్ సంపత్, ఆర్సీ ఇన్చార్జి, జర్నలిస్టులు పాకాల నర్సింలు, మండే మోహన్, ఏబీవీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ హర్షవర్ధన్రెడ్డి తదితరులు ఉన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికి వదిలేసి ప్రజాస్వామ్య విధానాలను పట్టించుకోకుండా కక్షపూరితమైన పరిపాలన కొనసాగిస్తుంది. ప్రజాస్వామ్యాన్ని మంటగలిపి ప్రజల హక్కుల్ని కాలరాస్తున్నారు. ప్రజా సమస్యల కోసం ఎప్పుడు ముందుండే ‘సాక్షి’ మీడియాను గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. ఏపీలో జరుగుతున్న అక్రమాలను వెలుగు తీస్తే కేసులు పెట్టి నిర్బంధించడం సరైనది కాదు. –జన్నారపు రాజేశ్వర్, పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి -
670 కొనుగోలు కేంద్రాల ఏర్పాటు
● కేంద్రాల్లో రైతులకు సౌకర్యాలు కల్పించాలి ● కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి వర్ని: రైతులు పండించిన వరి ధాన్యాన్ని సేకరించేందుకు జిల్లావ్యాప్తంగా 670 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి వెల్లడించారు. మోస్రా, చందూర్, వర్ని మండల కేంద్రాల్లో శుక్రవారం ఆయన ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఇప్పటి వరకు జిల్లాలో 300 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామని, ఆయా ప్రాంతాల అవసరాలను బట్టి రైతులకు లబ్ధి చేకూర్చేందుకు మరిన్ని కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తామన్నారు. రైతులు తెచ్చిన ధాన్యం నాణ్యత ప్రమాణాలకు లోబడి ఉన్నట్లయితే వెంటనే తూకం జరిపి నిర్ధేషిత రైస్ మిల్లులకు పంపిస్తామన్నారు. ధాన్యం సేకరణకు సంబంధించిన పూర్తి వివరాలను రిజిస్టర్లో నమోదు చేయాలని, రైతులకు సంబంధిత రసీదు అందజేయాలని, క్రాప్ బుకింగ్ డేటాలో నమోదు చేయాలని సిబ్బందికి సూచించారు. రాక్ సీట్లు వచ్చిన వెంటనే ట్యాబ్ ఎంట్రీలు పూర్తి చేయాలని దీని ద్వారా రైతులకు సకాలంలో బిల్లుల చెల్లింపు జరుగుతుందన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. ధాన్యాన్ని ఆరబెట్టి, శుభ్రపరిచి కొనుగోలు కేంద్రాలకు తీసుకువస్తే పూర్తిస్థాయి మద్దతు ధర పొందవచ్చునన్నారు. అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, సివిల్ సప్లయ్ డీఎం శ్రీకాంత్ రెడ్డి, సహకార శాఖ అధికారి అంబర్ సింగ్, వర్ని ఏఎంసీ చైర్మన్ సురేష్ బాబా పాల్గొన్నారు. -
నేడు సెపక్తక్రా అండర్–14 జట్ల ఎంపికలు
నిజామాబాద్నాగారం: కామారెడ్డి జిల్లా గాంధారి మండలం పోతంగల్ ప్రభుత్వ పాఠశాలలో శనివారం ఎస్జీఎఫ్ ఉమ్మడి జిల్లా సెపక్తక్రా అండర్–14 బాలబాలికల విభాగంలో జిల్లా జట్ల ఎంపికపోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా కార్యదర్శి నాగమణి ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనడానికి జిల్లా జట్టుకు ఎంపికలు చేస్తారన్నారు. నిజామాబాద్నాగారం: కామారెడ్డి జిల్లా దోమకొండలో నేడు ఎస్జీఎఫ్ అండర్–14, 17 బాలబాలికల విభాగంలో ఆర్చరీకి ఎంపికలు నిర్వహించనున్నట్లు క్రీడల కార్యదర్శి నాగమణి తెలిపారు. వివరాలకు 94900 15388ను సంప్రదించాలన్నారు. నిజామాబాద్అర్బన్: ఆర్మూర్ ఎస్సై వినయ్ కుమార్ను వీఆర్కు అటాచ్ చేస్తూ సీపీ సాయిచైతన్య ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిసింది. ఇటీవల ఆర్మూర్లోని పాత బస్టాండ్లో ఓ కిరాణ దుకాణ యజమానిని ఎస్సై వేధించినట్లు ఓ వీడియో వైరల్ అయింది. ఈ విషయం సీపీ దృష్టికి రావడంతో ఎస్సైను వీఆర్కు అటాచ్ చేసినట్లు సమచారం. బీసీ బంద్కు కాంగ్రెస్ మద్దతు నిజామాబాద్ సిటీ: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ బీసీ సంఘాలు ఇచ్చిన రాష్ట్ర బంద్కు జిల్లా కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు తెలుపుతుందని డీసీసీ అధ్యక్షుడు, రాష్ట్ర సహకార సంఘాల సొసైటీ చైర్మన్ మానాల మోహన్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఎక్కడికక్కడ బీసీ బంద్లో పాల్గొనాలని సూచించారు. కాంగ్రెస్ బీసీ పక్షాన నిలబడుతోందన్నారు. బంద్ సందర్భంగా బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం రద్దుచేసినట్లు తెలిపారు. సీఎంకు కృతజ్ఞతలు.. జిల్లాకు వ్యవసాయ కళాశాల మంజూరు చేసినందుకు సీఎం రేవంత్రెడ్డికి మానాల మోహన్రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా అభివృద్ధికి పెద్దపీఠ వేస్తున్న సీఎంకు, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డిలకు ధన్యవాదాలు తెలిపారు. -
నిజామాబాద్
‘సాక్షి’ గొంతు నొక్కేందుకు కుట్రలువాతావరణం ఆకాశం మేఘావృతమవుతుంది. చల్లనిగాలులు వీస్తాయి. మబ్బులతో కూడిన ఎండ ఉంటుంది.ఇళ్ల నిర్మాణాలను.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం శ్రీ 17 శ్రీ అక్టోబర్ శ్రీ 2025– IIలో uసాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : ప్రజా సమస్యలను ఎత్తిచూపుతూ నిరంతరం అక్షరయజ్ఞం చేస్తున్న ‘సాక్షి’ దినపత్రికపై అక్రమ కేసులు బనాయించి గొంతు నొక్కేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కు ట్రలు చేస్తోంది. ఈ అన్యాయాలను, కుట్రలను అ న్ని వర్గాలు ముక్తకంఠంతో ఖండిస్తున్నాయి. సా మాజిక రుగ్మతలపై, ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిత్యం పాటుపడుతున్న ‘సాక్షి’ పత్రిక ఎడిటర్ ధనంజయరెడ్డి మీద వరుసగా కేసులు పెడు తుండడంతోపాటు విచారణల పేరిట వేధింపుల కు గురిచేయడం పట్ల చంద్రబాబు ప్రభుత్వంపై సర్వత్రా వ్యతిరేకత వస్తోంది. ఈ నేపథ్యంలో ప లువురు ప్రజాసంఘాల నాయకులు ‘సాక్షి’పై చే స్తున్న కక్షసాధింపు చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు. తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఏపీ ప్రభుత్వ అప్రజాస్వామిక చర్యలను ఎండగట్టారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం 10.30 గంటలకు నిజామాబాద్ నగరపాలక సంస్థ కూడలిలో నిరసన కార్యక్రమం జరుగనుంది. జర్నలిస్టు, రా జకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, సామాజిక, విద్యార్థి, యువజన సంఘాలు పాల్గొననున్నాయి.సాక్షి పత్రికపై ఏపీ ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించడం సరికాదు. వాస్తవాలు ప్రజలకు చేరవేసే సాక్షి వంటి ప్రజా పత్రికా విలేఖరులపై అక్రమ కేసులు బనాయించడమంటే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే అవుతోంది. ఏపీ ప్రభుత్వ చర్యలను సీపీఐ తీవ్రంగా ఖండిస్తోంది. ప్రజాస్వామ్యంలో దాడులు, భయభ్రాంతులకు గురిచేయడం హేయమైన చర్యలు. – ఓమయ్య, సీపీఐ జిల్లా కార్యదర్శి పత్రికలు ప్రజాసమస్యలు వెలికితీసి పరి ష్కారానికి కృషి చేస్తాయి. ప్రజా సమస్యలను సాక్షి పత్రిక బయటపెడుతుంటే ఏపీలోని కూటమి ప్రభుత్వం నియంతలా వ్యవహరిస్తోంది. ఏపీ ప్రభుత్వం విద్య, వైద్యాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పగించకుండా పత్రికలు ప్రజాపక్షం వహిస్తే అ క్రమ కేసులు బనాయించి భయపెట్టే ప్రయత్నం చేస్తోంది. ఈ కుట్రలను ప్రజాస్వామికవాదులు ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. సాక్షిపై పెట్టిన కేసులు వెంటనే ఎత్తివేయాలి. – ముస్కె సుధాకర్, టీయూసీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రజా సమస్యలపై ప్రజలను చైతన్య పరుస్తున్న పత్రికలపై ప్రభుత్వాలు కక్ష కట్టడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు. పత్రికా స్వేచ్ఛను హరించడం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కొత్తకాదు. సాక్షి పత్రికపై, ఎడిటర్, రిపోర్టర్లపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలి. కేసులు ఉపసంహరించునేవరకు ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటారు. – వి.ప్రభాకర్, సీపీఐ(ఎంఎల్) మాస్లైన్ ప్రజాపంథ రాష్ట్ర నాయకుడు పత్రికలపై కేసులు పెట్టి భయభ్రాంతుల కు గురి చేయడం సరికాదు. సాక్షి పత్రికపై పదే పదే నకిలీ కేసులు పెట్టి వే ధించడాన్ని ప్రజాస్వామ్యవాదులు, మేధావులు తీవ్రంగా ఖండిస్తున్నారు. పత్రికల్లో తప్పుడు కథనాలు వస్తే సంజాయిషీ అడగవచ్చు, అవసరమైతే న్యాయస్థానాలను ఆశ్ర యించవచ్చు తప్ప తప్పుడు కేసులు పెట్టి వేధించడం సరికా దు. నిరంకుశత్వంతో అణగదొక్కుతామంటే ప్రజలు చూ స్తూ ఊరుకోరు. ప్రజల నుంచి తీవ్ర నిరసనను పాలకులు ఎదుర్కోక తప్పదు. – రమేశ్బాబు, సీపీఎం జిల్లా కార్యదర్శి -
లిక్కర్కు మహా కిక్కు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : 2025–27 సంవత్సరాలకు గాను మద్యం దుకాణాల టెండర్ల దరఖాస్తులకు రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన గడువు శనివారంతో ముగియనుంది. లాటరీ పద్ధతిలో కేటాయించే దుకాణాల టెండర్లకు ఎకై ్సజ్ శాఖ గత నెల 26 నుంచి ఈ నెల 18 వరకు దరఖాస్తులు స్వీకరిస్తోంది. నిజామాబాద్ జిల్లాలో మొత్తం 102 మద్యం దుకాణాలు ఉండగా, కామారెడ్డి జిల్లాలో మొత్తం 49 దుకాణాలు ఉన్నాయి. వీటికి 2023–25 సంవత్సరాలకు సంబంధించి 5,963 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో నిజామాబాద్ జిల్లాలోని దుకాణాల కోసం 3,759 దరఖాస్తులు, కామారెడ్డి దుకాణాలకు సంబంధించి 2,204 దరఖాస్తులు వచ్చాయి. అయితే ఈ దరఖాస్తుల్లో 95 శాతం చివరి రెండు రోజుల్లోనే వచ్చాయి. అందువల్ల గతంలో మాదిరిగానే ఈసారి కూడా చివరి రెండు రోజుల్లో భారీగా దరఖాస్తులు వచ్చే అవకాశాలున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా ఇప్పటివరకు ఉమ్మడి జిల్లాలో 1,106 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో నిజామాబాద్ జిల్లా దుకాణాల కోసం 687 దరఖాస్తులు, కామారెడ్డి దుకాణాల కో సం 419 దరఖాస్తులు వచ్చాయి. అయితే 1,106 ద రఖాస్తుల్లో 422 దరఖాస్తులు గు రువారం ఒక్కరోజు వచ్చినవే కావడం గమనార్హం. దీన్నిబట్టి చివరి రెండు రోజుల్లో భారీగా దరఖాస్తులు రానున్నట్లు అంచనా. గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా చివరి రెండు రోజుల్లో దరఖాస్తులు వెల్లువెత్తనున్నాయి. ఇందుకు తగినట్లుగా అన్ని ఏర్పాట్లు చేశాం. ఈనెల 18న అర్ధరాత్రి వరకు దరఖాస్తులు స్వీకరిస్తాం. సరిహద్దు రాష్ట్రమైన మహారాష్ట్ర నుంచి సైతం టెండర్లు వేసేందుకు ఆసక్తి చూపుతున్నవారి సంఖ్య పెరుగుతోంది. బోధన్, బిచ్కుంద దుకాణాలకు సంబంధించి మహారాష్ట్ర వారి నుంచి దరఖాస్తులు మరింతగా వస్తాయని భావిస్తున్నాం. – సోమిరెడ్డి, ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ బోధన్, జుక్కల్ నియోజకవర్గాల్లోని వైన్స్లపై మహారాష్ట్ర వ్యాపారుల ఆసక్తి తెలంగాణతో పోలిస్తే పొరుగు రాష్ట్రంలో మద్యం ధర ఎక్కువ ఉండటమే కారణం నేడు, రేపు మద్యం దుకాణాల కోసం టెండర్ల జాతర ! -
కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలి
సుభాష్నగర్ : రాష్ట్రంలో వరి కోతలు మొదలు పెట్టి 15 రోజులు కావస్తున్నా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ప్రారంభించలేదని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు బస్వా లక్ష్మీనర్సయ్య అన్నారు. యుద్ధప్రాతిపదికన కేంద్రాలను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. గురువారం నగరంలోని బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వర్షానికి ధాన్యం తడిసిపోతోందన్నా రు. రైతులు గత్యంతరం లేక క్వింటాలుకు రూ. 1600 నుంచి రూ.1700 వరకు దళారులకు అమ్ము కుని తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. తరుగు పేరు తో అధికారులు, రైస్మిల్లర్లు కుమ్మకై ్క రైతులను మోసం చేస్తున్నా రని, సీఎంఆర్ ఇవ్వని రైస్మిల్లులను బ్లాక్ లిస్టులో పెట్టాల్సి ఉన్నా అధికారులు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. యాసంగి పంటకు బోనస్ డబ్బులు చెల్లించాలన్నారు. సమావేశంలో కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు శ్రీనివాస్రెడ్డి, సీనియర్ నాయకులు న్యాలం రాజు, లక్ష్మీనారాయణ, హరీశ్ రెడ్డి, పంచరెడ్డి శ్రీధర్, శ్రీనివాస్, ఇప్పకాయల కిషోర్, గంగాధర్, తదితరులు పాల్గొన్నారు. -
డిప్యుటేషన్లు, బదిలీలకు దరఖాస్తులు
ఖలీల్వాడి : జిల్లాలోని లోకల్ కేడర్ తాత్కాలిక డిప్యుటేషన్లు, బదిలీల కోసం అర్హత కలి గిన ఉద్యోగులు ఆన్లైన్లో దరఖాస్తులు చే సుకోవాలని డీఈవో అశోక్ కుమార్ ఒక ప్రక టనలో తెలిపారు. జీవో నెంబర్ 190, జనర ల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్టుమెంట్ జీవో నెంబ ర్ 190 ప్రకారం సబ్–కమిటీ సిఫార్సులలో ఉన్న సబ్జెక్టు ఖాళీలకు లోబడి దరఖాస్తులకు ప్రభుత్వం అనుమతించిందని తెలిపారు. పాఠశాల విద్య (ఎస్పీఎఫ్ఐఐ) జీవో నెంబ ర్ 25ను ఈనెల 12న ఉత్తర్వులు జారీ చేసిన ట్లు చెప్పారు. నిబంధనల ప్రకారం జిల్లాలో ని బోధన, బోధనేతర ఉద్యోగులు అక్టోబర్ 17 నుంచి 24 వరకు ఇంటర్ లోక ల్ కేడర్ తాత్కాలిక డిప్యుటేషన్ల కోసం schooledu. telangana.go.in పోర్టల్లో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. నూతన ఓటర్లకు గుర్తింపు కార్డులు ● రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి నిజామాబాద్అర్బన్ : నూతన ఓటర్లకు గు ర్తింపు కార్డులను తపాలా శాఖ ద్వారా సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి సూ చించారు. గురువారం హైదరాబాద్ నుంచి ఇతర అధికారులతో కలిసి సీఈవో సుదర్శన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్న్స్ ద్వారా రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, సహాయ ఎన్నికల అధికారులు, తహసీల్దార్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఈవో మాట్లాడుతూ.. ఓటరు జాబితాలో 100 సంవత్సరాల వయసు కలిగిన ఓటర్లను గుర్తించి వారి వయసును తగిన ఆధారాలతో సమర్పించాలన్నారు. బూత్ స్థాయి అధికారులకు గుర్తింపు కార్డులు పంపిణీ చేయాలని, ఫారం 6, 7, 8 దరఖాస్తులను వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. వీడియో కాన్ఫరెనన్స్లో కలెక్టర్ టి వినయ్ కష్ణారెడ్డి, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, ట్రెయినీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావీ, ఏవో ప్రశాంత్, ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు. నిజామాబాద్ అర్బన్ : నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా మాక్లూర్ మండల కేంద్రంలోని ప్రభు త్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు రూ.కోటి విరాళం ఇచ్చారు. గురువారం ఆ యన తన సోదరుడు బిగాల మహేశ్తో కలి సి కలెక్టరేట్కు వచ్చి కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డికి చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో డీఈవో అశోక్ పాల్గొన్నారు. -
డీలర్ల పరేషన్
● కమీషన్ కోసం ఎదురుచూపులు ● ఐదు నెలలుగా పెండింగ్ ● జిల్లాలో రూ.3 కోట్లకుపైనే బకాయిలు సుభాష్నగర్ : ప్రజాపంపిణీ పథకం కింద పేదలకు రేషన్ బియ్యం పంపిణీ చేస్తున్న డీలర్లు కమీషన్ డబ్బుల కోసం ఎదురుచూస్తున్నారు. ఐదు నెలలుగా కమీషన్ డబ్బులు రాకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలోని డీలర్లకు ఐదు నెలలకు సంబంధించి రూ.3 కోట్లకుపైనే బకాయిలు పేరుకుపోయాయి. జిల్లాలో 759 రేషన్దుకాణాలు ఉన్నాయి. వీటి ద్వారా 4,47,788 వరకు కార్డుదారులకు బియ్యం పంపిణీ అవుతోంది. ప్రతినెలా సుమారు 7,650 మెట్రిక్ టన్నుల బియ్యం డీలర్లు పంపిణీ చేస్తున్నారు. ఇందుకు సంబంధించి రేషన్షాపుల డీలర్లకు ప్రభుత్వం క్వింటాలుకు రూ.140 చొప్పున కమీషన్ చెల్లిస్తోంది. ప్రభుత్వం కొత్త రేషన్కార్డుల పంపిణీ, సభ్యుల చేరికతో గత మూడు నెలల నుంచి అన్ని దుకాణాల్లో బియ్యం కోటా పెరిగింది. మార్చి వరకు సజావుగా కమీషన్ డబ్బులు జమ చేసిన ప్రభుత్వం.. ఇటీవల ఏప్రిల్ కమీషన్ జమ చేసింది. మే నుంచి సెప్టెంబర్ వరకు బకాయిలు పేరుకుపోయాయి. మరోవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త నిబంధనల ప్రకారం వేర్వేరుగా కమీషన్ జమ చేస్తుండటంతో డీలర్లు అయోమయ పరిస్థితిలో ఉన్నారు. రేషన్డీలర్లకు అక్టోబర్ 1లోపు పెండింగ్లో ఉన్న కమీషన్ డబ్బులు జమ చేయాలి. కమీషన్ కోసం ఇప్పటికే సంబంధిత మంత్రితో పాటు కమిషనర్ను కలిసి విన్నవించాం. అయినా స్పందించడంలేదు. దీపావళి తర్వాత రాష్ట్ర కమిటీతో చర్చించి బియ్యం పంపిణీని నిలిపివేసే ఆలోచనలో ఉన్నాం. అదేవిధంగా ప్రతినెలా ఒకటో తేదీనే కమీషన్ డబ్బులు బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలి. కమీషన్ను పెంచే విధంగా చర్యలు చేపట్టాలి. – అతిమల నగేష్, జిల్లా అధ్యక్షుడు, రేషన్ డీలర్ల సంక్షేమ సంఘంఆర్థిక ఇబ్బందుల్లో డీలర్లు ఐదు నెలలుగా కమీషన్ డబ్బులు జమ చేయకపోవడంతో డీలర్లు ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదు ర్కొంటున్నారు. దుకాణాల అద్దె, బియ్యం సరఫరా కు అవసరమైన సిబ్బంది జీతం, ఎంఎల్ఎస్ పా యింట్ నుంచి లారీల్లో వచ్చిన బియ్యాన్ని దుకా ణాల్లో దిగుమతి చేసిన హమాలీల చార్జీల చెల్లింపు, తదితర ఆర్థికపరమైన అంశాల్లో డీలర్లు సతమతమవుతున్నారు. మరోవైపు ప్రభుత్వం మే నెల కమీషన్ పెండింగ్లో ఉంచడంతోపాటు, జూన్, జూలై, ఆగస్ట్ నెలల బియ్యం వర్షాల నేపథ్యంలో ఒకేసారి జూన్ నెలలోనే సరఫరా చేసేసింది. ఆ మూడు నెలలతోపాటు సెప్టెంబర్ కమీషన్ కూడా బకాయి ఉంది. ఐదు నెలల కమీషన్ డబ్బులు జమ కాకపోవడంతో అప్పుల పాలు కావాల్సి వస్తోందని రేషన్డీలర్లు వాపోతున్నారు. -
అభిప్రాయ సేకరణ.. ఆసక్తికరం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడి ఎన్నికకు సంబంధించి పార్టీ నాయకత్వం చేపట్టిన వడపోత కార్యక్రమం జిల్లాలో రోజురోజుకూ ఆసక్తిని మరింతగా పెంచుతోంది. పైగా పీసీసీ అధ్యక్షుడి సొంత జిల్లా కావడంతో ఉత్కంఠ కలిగిస్తోంది. ఈ సీటును బీసీకి అప్పగిస్తారా.. ఓసీకి కేటాయిస్తారా అనే విషయంలో కచ్చితమైన నిర్ణయానికి రాకపోయినప్పటికీ ఏఐసీసీ పరిశీలకుడు, కర్ణాటక ఎమ్మెల్యే రిజ్వాన్ అర్షద్ ప్రతి అంశాన్ని కూలంకశంగా పరిశీలిస్తున్నారు. ఈ పీఠం కోసం పోటీలో ఉన్నవారితో ఇప్పటికే ఈ నెల 14న ఒకసారి ముఖాముఖి నిర్వహించారు. తాజాగా గురువారం మరోసారి ముగ్గురితో ముఖాముఖి నిర్వహించారు. బాడ్సి శేఖర్గౌడ్, మార చంద్రమోహన్రెడ్డి, బాస వేణుగోపాల్యాదవ్లతో పరిశీలకుడు రిజ్వాన్ అర్షద్ ముఖాముఖి మాట్లాడారు. శుక్రవారం కాటిపల్లి నగేష్రెడ్డితో ముఖాముఖి నిర్వహించనున్నారు. పరిశీలకుడు ఆయా నియోజకవర్గాల వారీగా అందులో బ్లాకులవారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. సీనియర్ నాయకులతో మాట్లాడి మొదటి, రెండో ప్రాధాన్యత అభిప్రాయ సేకరణ చేస్తున్నారు. డీసీసీ ఎన్నికపై నియోజకవర్గాలవారీగా సమావేశాలు ఇప్పటికే బోధన్, ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ అర్బన్లలో పూర్తి నేడు నిజామాబాద్ రూరల్లో, రేపు బాన్సువాడలో.. నియోజకవర్గాల్లో మారుతున్న సీనియర్ల ప్రాధాన్యతలు -
జిల్లాకు వ్యవసాయ కళాశాల
డొంకేశ్వర్(ఆర్మూర్) : వ్యవసాయాధారిత జిల్లాగా పిలువబడే నిజామాబాద్లో వ్యవసాయ కళాశాల ఏర్పాటు కానుంది. ఈ మేరకు గురువారం జరిగిన రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇది ఏర్పాటైతే విద్యార్థులకు, రైతులకు బహుళ ప్రయోజనాలు కలుగనున్నాయి. వ్యవసాయ రంగానికి మరింత ఊతం ఇచ్చినట్లు అవుతుంది. ఐతే, అగ్రి కోర్సులు చేసే నిజామాబాద్ జిల్లాతో పాటు కామారెడ్డి, నిర్మల్, ఆదిలాబాద్, జగిత్యాల్ విద్యార్థులకు వ్యవసాయ కళాశాల వరమనే చెప్పవచ్చు. తెలంగాణ యూనివర్సిటీలో ఇటీవల ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఇప్పుడు వ్యవసాయ కళాశాలను తేవడం నిజామాబాద్కు మరింత వన్నె తెస్తుంది. వ్యవసాయ కళాశాలను కూడా యూనివర్సిటీ పక్కనే ఏర్పాటు చేయనున్నారు. జిల్లాలో ఎస్సారెస్పీ, నిజాంసాగర్ ప్రాజెక్టులు పంటలకు పుష్కలంగా సాగునీటిని అందిస్తున్నాయి. దీంతో జిల్లాలో ఆరు లక్షల ఎకరాలకు పైగా పంటలు సాగవుతున్నాయి. వరి అత్యధికంగా 4.5 లక్షల ఎకరాల్లో రైతులు సాగు చేస్తున్నారు. పసుపు, మొక్కజొన్న, సోయా, జొన్నలు, సజ్జలు కూడా ఎక్కువగా సాగవుతున్నాయి. జిల్లాలో పండించిన పంటలు ఇతర ప్రాంతాలు, దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. రాష్ట్రంలో అత్యధిక పంటలు, రైతులు ఉన్న జిల్లాల్లో ఒకటిగా నిజామాబాద్ ఉంది. అందుకే ఇక్కడ వ్యవసాయ కళాశాల ఏర్పాటుకు డిమాండ్ ఏర్పడింది. ప్రజాప్రతినిధుల చొరవతో కేబినెట్ ద్వారా ఇప్పుడు ఆమోద ముద్ర పడింది. చెరుకు పరిశ్రమలు అలాగే రుద్రూర్ కృషి విజ్ఞా కేంద్రం, కమ్మర్పల్లి పసుపు పరిశోధన కేంద్రాలకు తోడుగా వ్యవసాయ కళాశాల రావడంతో రైతుల్లో హర్షం వ్యక్తం అవుతోంది. ఎంచక్కా విద్య... స్థానికంగా పరిశోధన... ఇందూరు కేంద్రంగా వ్యవసాయ కళాశాల ఏర్పాటైతే చుట్టు పక్కనున్న జిల్లాల విద్యార్థులు నిజామాబాద్లోనే వ్యవసాయ కోర్సులు పూర్తి చేయడానికి అవకాశం ఉంది. వ్యవసాయ కోర్సులు చేయాలంటే హైదరాబాద్లోని రాజేంద్రనగర్, జగిత్యాల ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. అంతదూరం వెళ్లి చదువు, పరిశోధనలు చేయాలంటే విద్యార్థులకు ఇబ్బందిగా మారింది. ఇప్పుడు నిజామాబాద్ వ్యవసాయ కళాశాలలోనే పట్టభద్రులుగా, పరిశోధకులుగా, ప్రొఫెసర్లుగా తయారు కావొచ్చు. వ్యవసాయానికి అనువుగా ఉన్న నిజామాబాద్ జిల్లాలో పంటలపై ప్రయోగాలు సులువుగా చేయాడానికి వీలుంటుంది. కొత్త వంగడాలు ఇక్కడి వాతావరణానికి అనుకూలంగా తయారు చేయవచ్చు. రైతులు, ఆదర్శ రైతులు కూడా కళాశాలను సందర్శించి శాస్త్రవేత్తలను కలిసి వ్యవసాయంలో కొత్త పద్ధతులను తెలుసుకోవచ్చు. వ్యవసాయ, ఇతర అనుబంధ శాఖలకు కూడా అగ్రి కాలేజీ బలాన్ని చేకూరుస్తుందని చెప్పవచ్చు. భవిష్యత్తులో రాష్ట్రానికి, దేశానికి ఇక్కడి నుంచే వ్యవసాయానికి ఊపిరిలూదే అవకాశం లేకపోలేదు.Ýë„ìS {糆-°«¨, °gê-Ð]l*»ê§Šæ : ï³ïÜïÜ A«§ýlÅ-„ýS$yýl$ »ŸÐ]l$à Ð]l$õßæÔŒæ MýS$Ð]l*ÆŠæ VúyŠæ Ý÷…™èl hÌêÏOò³ ™èl¯]lO§ðl¯]l Ð]l¬{§ýl ÐólçÜ$¢-¯é²Æý‡$. VýS™ólyé¨ ï³ïÜïÜ `‹œ V> »ê«§ýlÅ-™èlË$ ¡çÜ$-MýS$¯]l² çÜÐ]l$-Ķæ$…ÌZ C_a¯]l àÒ$-ÌS¯]l$ Ð]lÆý‡$-çÜV> ¯ðlÆý‡-ÐólÆý‡$-çÜ$¢¯é²Æý‡$. Cç³µ-sìæMóS ™ðlÌS…-V>׿ ĶæÊ°-Ð]l-ÇÞsîæÌZ C…h-±-Ç…VŠæ MýSâê-Ô>ÌS Ð]l$…þÆý‡$ ^ólƇ$$…-^éÆý‡$. ™égêV> C糚yýl$ Ð]lÅÐ]l-ÝëĶæ$ MýSâê-Ô>ÌS Ð]l$…þÆý‡$ ^ólƇ$$…-^éÆý‡$. VýS$Æý‡$ÐéÆý‡… fÇ-W¯]l MóS¼-¯ðlsŒæ çÜÐ]l*-Ðól-Ôèæ…ÌZ Æ>çÙ‰…ÌZ Ð]lÊyýl$ ^ørÏ Ð]lÅÐ]l-ÝëĶæ$ MýSâê-Ô>-ÌSË$ Ð]l$…þÆý‡$ ^ólçÜ*¢ °Æý‡~Ķæ$… ¡çÜ$-MýS$¯é²Æý‡$. Ð]l¬QÅ-Ð]l$…{† °Äñæ*-f-MýSÐ]lÆý‡Y… Möyýl…VýSÌŒæ, E™èl¢ÐŒl$ MýS$Ð]l*ÆŠæ Æð‡yìlz °Äñæ*-f-MýS-Ð]lÆý‡Y… çßæ$kÆŠæ ¯]lVýSÆøÏ, Ð]l$õßæÔŒæ VúyŠæ MýS–íÙ™ø °gê-Ð]l*»ê§Šæ hÌêÏÌZ HÆ>µ-r$MýS$ °Æý‡~Ƈ$$…-^éÆý‡$. yìl^Œl ç³ÍÏ Ð]l$…yýl-ÌS…ÌZ° ™ðlÌS…-V>׿ ĶæÊ°-Ð]l-ÇÞsîæ ç³MýSP¯]l Æý‡*.124 MørÏ °«§ýl$-ÌS™ø Ð]lÅÐ]l-ÝëĶæ$ MýSâê-Ô>ÌS HÆ>µ-r$MýS$ °Æý‡~-Ƈ$$…-^éÆý‡$. CMýS Ñ$W-ͯ]l Ð]l$Æø àÒ$ ™èlÓÆý‡ÌZ ¯ðlÆý‡-Ðól-Æý‡$-Ý뢯]l° Ð]l$õßæÔŒæ VúyŠæ "Ýë„ìS'MìS ™ðlÍ-´ëÆý‡$. «§ýlÆý‡Ã-ç³#-Ç&-Mö…yýl-VýS-r$t&-ÐólÐ]l¬ÌS-Ðé-yýl&-Í…-»ê{¨ VýS$rt&-»ê-çÜÆý‡ sñæ…ç³#ÌŒæ Æøyýl$z Æý‡çßæ§éÇ °Æ>Ã׿… MøçÜ… Æý‡*.450 Mør$Ï Ð]l$…þÆý‡$ ^ólƇ$$…^ól…§ýl$MýS$ Cç³µ-sìæMóS {ç³™ólÅ-MýS…V> {糆-´ë§ýl-¯]lË$ ^ólíÜ-¯]lr$Ï õ³ÆöP-¯é²Æý‡$. ఆమోదం తెలిపిన రాష్ట్ర కేబినెట్ ఏర్పాటైతే వ్యవసాయ రంగానికి మరింత ఊతం విద్య, పరిశోధనలతో పాటు కొత్త వంగడాల సృష్టికి అవకాశం -
వాహనాల చోరీ నిందితుల అరెస్టు
● వివరాలు వెల్లడించిన సీపీ సాయి చైతన్య నిజామాబాద్అర్బన్: జిల్లాలో పలు చోట్ల వాహనా ల దొంగతనాలకు పాల్పడుతున్న నిందితులను అ రెస్టు చేసినట్లు సీపీ సాయిచైతన్య తెలిపారు. సీసీ ఎస్ పోలీస్స్టేషన్లో సీపీ గురువారం వివరాలు వెల్లడించారు. కొందరు వ్యక్తులు ఒక ముఠాగా ఏర్ప డి బోధన్, నిజామాబాద్, ఆర్మూర్, ముథోల్లో ఆటోలు, బైక్లను చోరీ చేసి కోరుట్ల, జగిత్యాల ప్రాంతాల్లో విక్రయిస్తున్నారని తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఆటోనగర్కు చెందిన షేక్ ఫజల్, మహ్మద్ నవాజ్ను అదుపులోకి తీసుకొని విచారించగా షేక్అలీ, వహిద్, అలీమ్లతో కలిసి 9 ఆటోలు, మూడు బైక్లు చోరీ చేసినట్లు ఒప్పుకున్నారని తెలిపారు. అపహరించిన వాహనాలను కోరుట్లలో విక్రయించినట్లు పేర్కొన్నారు. దొంగ వాహనాలను కొనుగోలు చేసిన మహ్మద్ ఇమ్రాన్, మహ్మద్ ఇలియాస్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. పరారీలో ఉన్న మరో ముగ్గురిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. కేసును త్వరిగతిన ఛేదించిన సీసీఎస్ ఏసీపీ నగేంద్రచారి, సీఐ సాయినాథ్, ఇతర పోలీసు సిబ్బందిని సీపీ అభినందించారు. -
మొక్కజొన్న తూకంలో మోసం
● రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డ వ్యాపారులు భిక్కనూరు: మండలంలోని గుర్జకుంట గ్రామంలో తూకంలో మోసం చేస్తూ వ్యాపారులు పట్టుబడ్డ ఘటన గురువారం చోటుచేసుకుంది. గాంధారి ప్రాంతానికి చెందిన గిరిజన వ్యాపారులు భిక్కనూరు మండలం గుర్జకుంటలో ఒక ఏజెంట్ను పెట్టుకొని మొక్కజొన్నలను కోనుగోలు చేస్తున్నారు. మొక్కజొన్న బస్తాను 62 కిలోల చొప్పున తూకం వేస్తున్నట్లు రైతులను నమ్మించి 72 కిలోల మొక్కజొన్నలను బస్తాలో నింపి వాహనాల్లో వేశారు. రైతులకు అనుమానం రావడంతో తూకం వేసే ఎలక్ట్రానిక్ కాంటా 10కిలోలు మైనస్లో చూపించడంతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏజెంట్ను, గాంధారి వ్యాపారులను నిలదీశారు. ఒక దశలో తూకంలో మోసానికి పాల్పడిన వారిని చెట్లకు కట్టివేయాలని పలువురు రైతుల యత్నించగా మిగతా రైతులు వారిని సముదాయించారు. చివరికి వ్యాపారులకు జరిమానా విధించి వదిలిపెట్టారు. -
ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలి
● కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ● అధికారుల అలసత్వంపై ఆగ్రహంనిజామాబాద్అర్బన్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలలో స్పష్టమైన పురోగతి కనిపించేలా క్షేత్రస్థాయిలో చిత్తశుద్ధితో కృషి చేయాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. లక్ష్య సాధనకు కృషి చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిని ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఇందిరమ్మ ఇళ్ల పురోగతి, డబుల్ బెడ్రూంల పంపిణీ ప్రక్రియపై కలెక్టర్ గురువారం ఎంపీడీవోలు, ఎంపీవోలు, హౌసింగ్ ఏఈలు, గ్రామ పంచాయతీ కార్యదర్శులతో సుదీర్ఘ సమీక్ష జరిపారు. మండలాల వారీగా ఇందిరమ్మ ఇళ్ల పురోగతిని తెలుసుకున్నారు. ఇళ్ల నిర్మాణాలలో వెనుకంజలో అధికారులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రమం తప్పకుండా సమీక్ష నిర్వహిస్తూ, నిర్దేశిత లక్ష్యాల సాధన కోసం స్పష్టమైన దిశానిర్దేశం చేస్తున్నప్పటికీ, ఎందుకు పురోగతి సాధించడం లేదని మండిపడ్డారు. మంజూరీలు పొందిన వారందరూ తక్షణమే ఇళ్ల నిర్మాణాలు చేపట్టేలా లబ్ధిదారులను ప్రోత్సహిస్తూ, క్షేత్రస్థాయిలో పక్కాగా పర్యవేక్షణ చేయాలని సూచించారు. ఉచిత ఇసుక అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపు ప్రక్రియను కూడా వేగవంతం చేయాలని సూచించారు. సమీక్షలో ట్రెయినీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావీ, హౌసింగ్ పీడీ పవన్ కుమార్, జెడ్పీ డిప్యూటీ సీఈవో సాయన్న తదితరులు పాల్గొన్నారు. సర్వేలో భాగస్వాములు కావాలి రానున్న రోజులలో రాష్ట్రాన్ని అభివృద్ధి, సంక్షేమ రంగాలలో అగ్రగామిగా నిలిపేందుకు రాష్ట్ర ప్రభు త్వం తెలంగాణ రైజింగ్ విజన్–2047 అంశాలతో డాక్యుమెంటును రూపొందిస్తోందని, ఈ సర్వేలో ఉద్యోగులు, అన్నివర్గాల వారు భాగస్వాములు కావాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి కోరారు. సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షలకు అనుగుణంగా రూపొందిస్తున్న ఈ విజన్ 2047 డాక్యుమెంట్ తయారీలో ప్రతి ఒక్క పౌరుడు పాల్గొనేలా సిటిజన్ సర్వే చేపట్టారన్నారు. ఈ నెల 25వ తేదీ వరకు కొనసాగే సర్వేలో ఉద్యోగులు పాల్గొనడంతోపాటు విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని సూచించారు. జిల్లా పౌరులు http//www.telangana.gov.in/ telanganarising/ అనే లింక్ ద్వారా సర్వేలో పాల్గొనాలని కలెక్టర్ కోరారు. -
బీసీ బంద్కు అఖిలపక్షం మద్దతు
నిజామాబాద్నాగారం: రాష్ట్రవ్యాప్త బీసీ బంద్కు అఖిలపక్ష పార్టీల మద్దతు ఉందని బీసీ జేఏసీ ప్రతినిధులు తెలిపారు. నగరంలోని గీతాభవన్లో గురువారం ఏర్పాటు చేసిన రౌండ్టేబుల్ సమావేశంలో వారు మాట్లాడారు. రాష్ట్ర బీసీ జేఏసీ పిలుపు మేరకు ఈ నెల 18న తలపెట్టిన బీసీ బంద్కు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, టీడీపీ, సీపీఐ, సీపీఎం, సీపీఐ(ఎంఎల్) మాస్లైన్ ప్రజాపంథా, ఎంఐఎం పార్టీలు, కుల సంఘాలు, ప్రజాసంఘాలు, డాక్టర్లు, లాయర్లు, జర్నలిస్టులు మద్దతు తెలిపినట్లు పేర్కొన్నారు. అన్ని సంఘాలు ప్రత్యక్షంగా బంద్లో పాల్గొంటామని బీసీ జేఏసీకి హామీ ఇచ్చాయని తెలిపారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలయ్యే వరకు శాంతియుత ఉద్యమం చేస్తామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీసీ జేఏసీ చైర్మన్ పోతనకర్ లక్ష్మీనారాయణ, వైస్ చైర్మన్ బొబ్బిలి నర్సయ్య, బీఆర్ఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి, జెడ్పీ మాజీ చైర్మన్ దాదన్న గారి విఠల్రావు, బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి స్వామి యాదవ్, కాంగ్రెస్ ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షులు రాజ నరేందర్ గౌడ్, సీపీఐ నగర కార్యదర్శి ఓమయ్య, సీపీఐ జిల్లా కార్యదర్శి సుధాకర్, ఆయా పార్టీలు, కుల సంఘాల, డాక్టర్స్, పీఎంపీ, స్టూడెంట్స్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. గోడప్రతుల ఆవిష్కరణ రాష్ట్ర బీసీ జేఏసీ బంద్కు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పేర్కొన్నారు. గురువారం బంద్కు సంబంధించిన గోడపత్రులను ఆయన ఆవిష్కరించా రు. బీసీలంటే తనకు ఎనలేని గౌరవమని, వారి కో సం తాను ముందు వరుసలో ఉండి న్యాయం చేసే లా చూస్తానని అన్నారు. కార్యక్రమంలో నరాల సుఽ దాకర్తోపాటు బుస్స ఆంజనేయులు, ఆకుల ప్రసా ద్, దర్శనం దేవేందర్, కొయ్యాడ శంకర్, బసవసాయి చంద్రకాంత్, చైతన్య పాల్గొన్నారు. -
వరద గేట్ల మూసివేత
బాల్కొండ: ఎగువ ప్రాంతాల నుంచి వరద తగ్గుముఖం పట్టడంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ వరద గేట్లను అధికారులు మూసివేశారు. రెండ్రోజుల నుంచి ప్రాజెక్ట్లోకి ఇన్ఫ్లో తగ్గుతూ, పెరుగుతూ ఉండటంతో గోదావరిలోకి నీటి విడుదలను పెంచుతూ.. తగ్గించారు. గురువారం ఉదయం వరద మరింత తగ్గడంతో గేట్లను మూసివేశారు. ప్రస్తుతం ప్రాజెక్ట్లోకి 9,654 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. ప్రాజెక్ట్ నుంచి కాకతీయ కాలువ వ్వారా 5 వేలు, ఎస్కేప్ గేట్ల ద్వారా 3 వేలు, సరస్వతి కాలువ ద్వారా 650, లక్ష్మి కాలువ ద్వారా 200, ఆవిరి రూపంలో 573, మిషన్ భగీరథ ద్వారా 231 క్యూసెక్కుల నీరు పోతోంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091(80.5 టీఎంసీలు) అడుగులు కాగా గురువారం సాయంత్రానికి నిండుకుండలా ఉందని అధికారులు తెలిపారు. ● ఎస్సారెస్పీలోకి తగ్గిన ఇన్ఫ్లో ● గోదావరిలోకి నిలిచిన నీటి విడుదల మూసి ఉన్న ఎస్సారెస్పీ వరద గేట్లు -
సిర్పూర్ కాగజ్నగర్లో రుద్రూర్వాసి మృతి
రుద్రూర్: మండల కేంద్రానికి చెందిన కర్రోళ్ల శ్రీనివాస్ (53) అనే వ్యక్తి గురువారం కుమురం భీం జిల్లా సిర్పూర్ కాగజ్నగర్ రైల్వేస్టేషన్ సమీపంలో ప్రమాదవశాత్తు రైలు కింద పడి దుర్మరణం చెందినట్టు స్థానికులు తెలిపారు. కూలి పని నిమిత్తం పది రోజుల క్రితం వెళ్లిన శ్రీనివాస్ మృతి చెందాడన్న సమాచారం తెలుసుకున్న బంధువులు సిర్పూర్ కాగజ్నగర్కు బయల్దేరి వెళ్లారు. మృతుడికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. గాంధారి శివారులో మృతదేహం గాంధారి(ఎల్లారెడ్డి): మండల కేంద్ర శివారులోని గాంధారి–చద్మల్ రహదారి పక్కన గుంతలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం గురువారం లభించినట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. రైతుల సమాచారం మేరకు ఘటనా స్థలాన్ని పోలీసులు సందర్శించి మృతదేహాన్ని పరిశీలించారు. దుండగులు గుర్తు తెలియని వ్యక్తిని హత్య చేసి పెట్రోలు పోసి దహనం చేసినట్లు తెలుస్తోంది. మృతదేహం పాక్షికంగా దహనం అయింది. సదాశివనగర్ సీఐ సంతోష్ కుమా ర్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. డాగ్స్క్వాడ్ను రప్పించి విచారణ చేశారు. మృతదేహాన్ని బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతుడి వయస్సు సుమారు 30–35 ఏళ్ల మధ్య ఉంటుందని, నీలిరంగు జీన్ ప్యాంటు, తెల్లని బనియన్, నల్లచారలు కల్గిన తెల్లచొక్కా ధరించి ఉన్నాడు. సంబంధీకులు ఎవరైనా 8712686165, 8712686163 నెంబర్లకు ఫోన్ చేసి సంప్రదించాలని తెలిపారు. తిరుమలయ్య ఆలయంలో చోరీ ఇందల్వాయి: నల్లవెల్లి గ్రామంలోని తిరుమలయ్య స్వామి ఆలయంలో బుధవారం రాత్రి దుండగులు చోరీకి పాల్పడ్డారు. 6 గ్రాముల బంగారు, 4 తులాల వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లినట్లు ఎస్సై సందీప్ కుమార్ తెలిపారు. వీడీసీ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. తాళం వేసిన ఇంట్లో .. నిజామాబాద్ రూరల్: మండలంలోని గుండారం గ్రామంలో తాళం వేసిన ఇంట్లో దుండగులు చోరీకి పాల్పడిన ఘటన గురువారం వెలుగుచూసింది. రూరల్ ఎస్హెచ్వో మహ్మద్ ఆరీఫ్, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గుండారం గ్రామానికి చెందిన స్వర్గం లక్ష్మి అదే గ్రామంలోని బంధువుల ఇంట్లో బుధవారం రాత్రి నిద్రించింది. ఇదే అదనుగా భావించిన దుండగులు లక్ష్మి ఇంటి తాళం పగులగొట్టి 2 గ్రాముల బంగారం, 10 తులాల వెండి అపహరించారు. అయితే, చోరీకి పాల్పడిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్హెచ్వో తెలిపారు. నిజామాబాద్ అర్బన్: నగరంలోని దుబ్బ ప్రాంతంలో అనుమతి లేకుండా టపాకాయలు విక్రయిస్తున్న దుకాణంపై మూడో టౌన్ పోలీసులు, అగ్నిమాపక శాఖ అధికారులు కలిసి గురువారం దాడులు చేశారు. రూ. మూడు లక్షల విలువచేసే 29 రకాల టపాకాయలను సీజ్ చేసినట్లు మూడో టౌన్ ఎస్సై హరిబాబు తెలిపారు. నిబంధనలు పాటించకుండా రాఘవ ఉపాధ్యా య అనే వ్యక్తి టపాకాయలు విక్రయిస్తున్నట్లు వారు తెలిపారు. కేసు నమోదు చేశామని పేర్కొన్నారు. -
సీపీఆర్పై ప్రతి ఒక్కరికీ అవగాహన అవసరం
కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి నిజామాబాద్అర్బన్: ఆకస్మిక గుండెపోటుకు గురైన వ్యక్తులకు సకాలంలో సీపీఆర్ చేసి ప్రాణాలను రక్షించవచ్చని, దీనిపై ప్రతి ఒక్కరికీ అవగాహన అవసరమని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి పేర్కొ న్నారు. ఐడీవోసీ సమావేశ మందిరంలో వైద్యశాఖ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన సీపీఆర్పై అవగాహన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. ఆకస్మికంగా కొందరికి గుండెపోటు వచ్చి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని, అలాంటి వారికి సీపీఆర్తో ప్రథమ చికిత్స చేస్తే ప్రాణాపా య స్థితి నుంచి బయటపడతారన్నారు. జిల్లాలో సీ పీఆర్పై ఈ నెల 13 నుంచి 17వ తేదీ వరకు అ వగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపా రు. అనంతరం సీపీఆర్ ఎలా చేయాలన్న దానిపై మాస్టర్ ట్రైనర్స్ డాక్టర్ వెంకటేశ్, వేణుగోపాల్ అ వగాహన కల్పించారు. కార్యక్రమంలో ట్రెయినీ కలె క్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావీ, డీఎంహెచ్వో రాజ శ్రీ, హౌసింగ్ పీడీ పవన్ కుమార్, డిప్యూటీ సీఈవో సాయన్న తదితరులు పాల్గొన్నారు. -
పసుపు పరిశోధన కేంద్రం సందర్శన
కమ్మర్పల్లి: మండల కేంద్రంలోని పసుపు పరిశోధన కేంద్రాన్ని వరంగల్ స్పైస్ బోర్డు ఆధ్వర్యంలో నేక్కొండ, కేసముద్రం, చింతపల్లి, ఒడిశా ప్రాంత రైతులు గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ మహేందర్ పసుపు రకాలు, యంత్రాలు, పరిశోధనలపై పవర్ పాయింట్ ప్రజేంటేషన్ ద్వారా వివరించారు. మనోహరాబాద్లో పసుపు పరిశ్రమ.. జక్రాన్పల్లి : మండలంలోని మనోహరాబాద్లో ఉ న్న పసుపు రైతుల ఉత్పత్తిదారుల సంఘం పరిశ్రమ ను వరంగల్ జిల్లా రైతులు గురువారం సందర్శించారు. జాతీయ పసుపు బోర్డు ,స్పైసెస్ బోర్డు వరంగల్ సంయుక్తంగా నిర్వహించిన పసుపు రైతుల విజ్ఞానయాత్రలో భాగంగా వరంగల్ జిల్లా నేకొండా ఎఫ్పీసీఎల్, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన 40 మంది రైతులు జేఏం కేపీఏం ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ను సందర్శించారు. కార్యక్రమంలో జేఎంకేపీఎం సూపర్వైజర్ రుత్విక్, స్పైసెస్ బోర్డు అసిస్టెంట్ డైరెక్టర్ జ్యోతిష్, సిబ్బంది వెంకటేశ్, మాధవ్, సంస్థ చైర్మన్ తిరుపతిరెడ్డి, డైరెక్టర్ సంతోష్ రెడ్డి పాల్గొన్నారు . నిజామాబాద్నాగారం: తెలంగాణ రాష్ట్ర జిమ్నాస్టిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 18న జాతీయస్థాయి టోర్నీకి రాష్ట్ర బృందం ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కిరణ్రెడ్డి, స్వామి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్లోని ది గార్డియన్ స్కూల్లో తెలంగాణ రాష్ట్ర ఆర్టిస్ట్ జిమ్నాస్టిక్స్ క్రీడాకారుల ఎంపిక జరుగుతుందన్నారు. ఎంపికై న క్రీడాకారులు నవంబర్ 6 నుంచి 9 వరకు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో నిర్వహించే జాతీయస్థాయి టోర్నీలో పాల్గొంటారని తెలిపారు. ఆసక్తి గల క్రీడాకారులు 9849193002 నెంబర్లో సంప్రదించాలని తెలిపారు. -
ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
మాక్లూర్: చదువులో వెనుకబడి ఉన్నానన్న మనస్తాపంతో మండలంలోని చిక్లీ గ్రామానికి చెందిన దీమర వెంకట్(16) గురువారం సాయంత్రం గ్రామ శివారులో చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మాక్లూర్ ఎస్సై రాజశేఖర్ కథనం ప్రకారం.. చిక్లీ గ్రామానికి చెందిన దీమర సాయిరెడ్డి, మంజుల కుమారుడు వెంకట్ డిచ్పల్లి మండలం ధర్మారం(బి)లోని ఓ కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్నాడు. చదువులో నెలవారీగా నిర్వహించే కామన్ పరీక్షలలో తోటి స్నేహితుల కంటే తక్కువ మార్కులు వస్తున్నాయన్న బాధతో ఉండేవాడని తెలిపారు. దీపావళి పండుగ కోసం నాలుగు రోజుల ముందే చిక్లీకి వచ్చాడు. గురువారం వెంకట్ గ్రామ శివారులో ఓ చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తండ్రి సాయిరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజశేఖర్ తెలిపారు. నిజామాబాద్ రూరల్: రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గంగాస్థాన్–1 లక్ష్మీనరసింహ అపార్టమెంట్లో గురువారం రాత్రి ఏసీపీ నాగేంద్రచారి ఆధ్వర్యంలో సీసీఎస్ సీఐ సురేశ్, సాయినాథ్, ఎస్సైగోవింద్ కలిసి పేకాట స్థావరంపై దాడి చేశారు. పేకాడుతున్న 9 మందిని పట్టుకొని, 9 సెల్ ఫోన్లు, రూ.49,250 స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చర్యల కోసం రూరల్ ఎస్హెచ్వో మహ్మద్ ఆరీఫ్కు అప్పగించారు. రుద్రూర్లో ముగ్గురు.. రుద్రూర్: మండలంలోని అక్బర్నగర్ శివారులో పేకాట స్థావరంపై బుధవారం రాత్రి ఎస్సై సాయ న్న ఆధ్వర్యంలో పోలీసులు దాడి చేశారు. పేకాడు తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకుని, వారి నుంచి రూ.1100 స్వాధీనం చేసుకున్నారు. కేసు నమో దు చేసినట్టు ఎస్సై సాయన్న తెలిపారు. రెంజల్(బోధన్): మండలంలోని కందకుర్తి శివారులో ఏర్పాటు చేసిన చెక్పోస్టును గురువారం తహసీల్దార్ శ్రావణ్కుమార్ తనిఖీ చేశారు. మహారాష్ట్ర నుంచి ధాన్యం అక్రమంగా జిల్లాలోకి ప్రవేశించకుండా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రెండు రోజుల కిందట చెక్పోస్టును ప్రారంభించినట్లు ఆయన పేర్కొన్నారు. రెవెన్యూ, పోలీస్, వ్యవసాయ శాఖల ఆధ్వర్యంలో 24 గంటల నిఘా ఉంటుందన్నారు. జిల్లాలో కొనుగోళ్లు పూర్తయ్యే వరకు చెక్పోస్టు కొనసాగుతుందని తెలిపారు. -
తమ్ముడి ఇంట్లో అన్న చోరీ
● వ్యాపారంలో నష్టాలొచ్చాయని.. ● కేసును ఛేదించిన పోలీసులు నిజామాబాద్ అర్బన్: వ్యాపారంలో నష్టాలు, అప్పులు పెరగడంతో తమ్ముడి ఇంట్లో అన్న చోరీకి పాల్పడ్డాడు. నగరంలోని రెండో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పది రోజుల క్రితం జరిగిన దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. నగర సీఐ శ్రీనివాస్రాజ్ గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ నెల 6న మహ్మదీయకాలనీకి చెందిన మహ్మద్ సాబీక్ పాషా ఇంటికి తాళం వేసి బంధువుల ఇంటికి వెళ్లాడు. మరుసటి రోజు తిరిగిరాగా తాళాలు పగులగొట్టి ఉన్నాయి. నగదుతోపాటు బంగారం చోరికి గురైందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన రెండో టౌన్ పోలీసులు విచారణ చేపట్టారు. స్థానికంగా ఉన్న సీసీ ఫుటేజీలను పరిశీలించగా ఇంటి పక్కనే ఉన్న అతని అన్న మహ్మద్ షఫీ పాషాను అనుమానించి విచారించగా తానే దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నాడు. వ్యాపారంలో నష్టాలు రావడం, అప్పులు పెరగడంతో తమ్ముడి ఇంట్లోకి చొరబడి రెండు తులాల బంగారం, రూ.7 లక్షల నగదు ఎత్తుకెళ్లినట్లు తెలిపారు. షఫీ పాషాను అరెస్టు చేసి బంగారం, డబ్బులు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ పేర్కొన్నారు. కేసు విచారణలో టౌన్ ఎస్సై సయ్యద్ ముజాయిద్తోపాటు సిబ్బందిని అభినందించారు. -
గురుకులాల్లో మిగిలిన సీట్ల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
డిచ్పల్లి(నిజామాబాద్రూరల్): జిల్లాలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 2025–26 విద్యాసంవత్సరానికి 5 నుంచి 9వ తరగతులలో మిగిలిన సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు గురుకుల విద్యాలయా ల సంస్థ జిల్లా సమన్వయ అధికారి మాధవీలత గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 23 ఫిబ్రవరి 2025న నిర్వహించిన ప్రవేశపరీక్షకు విద్యార్థులు హాజరై ఉండాలని పేర్కొన్నారు. 2024–25 విద్యా సంవత్సరంలో ఏదైనా ప్రభు త్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 4, 5, 6, 7, 8వ తరగతులు పూర్తిచేసి ఉండాలన్నారు. లాటరీ పద్ధతిలో సీట్లు కేటాయిస్తారన్నారు. ఈ నెల 17, 18వ తేదీల్లో హాల్టికెట్, కుల, ఆదాయ ధృవీకరణ పత్రాల ఒరిజనల్, జిరాక్స్ ప్రతులతో డిచ్పల్లి మండలం ధర్మారం(బి) గ్రామంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలి కల పాఠశాల/కళాశాలలో ఉదయం 9.30 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు దరఖాస్తులు సమర్పించాలని తెలిపారు. నిజామాబాద్ అర్బన్: ఈ నెల 21న నిర్వహించే పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా పోలీసులకు సంబంధించిన అంశాలపై షార్ట్ ఫిల్మ్ తీసేందుకు ఆసక్తి ఉన్న ఫొటో, వీడియోగ్రాఫర్లు దర ఖాస్తు చేసుకోవాలని సీపీ సాయి చైతన్య ఒక ప్రకటనలో తెలిపారు. 2024 అక్టోబర్ నుంచి 2025 అక్టోబర్ వరకు అత్యవసర సమయాల్లో పోలీసుల సేవలు, ప్రకృతి వైపరీత్యాల్లో పోలీసుల విధులు, సైబర్ నేరాలు, ర్యాగింగ్ మత్తు పదార్థాల నిషేధంలో పోలీసుల కృషి తదితర అంశాలపై ఫోటోలు, వీడియోలు ఉండాలన్నారు. వివరాలకు 94400 1827 నెంబర్లో సంప్రదించాలని పేర్కొన్నారు. ● ఒక్కటైన ప్రేమజంట నిజాంసాగర్(జుక్కల్): మహ్మద్నగర్ మండలం తెల్గాపూర్ గ్రామానికి చెందిన దనుల రవీందర్, నేపాల్కు చెందిన మాయ ఒక్కటయ్యారు. గురువారం తెల్గాపూర్ గ్రామంలో వేద పండితుడు, గ్రామస్థుల సమక్షంలో ఇద్దరి పెళ్లి సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. వివరాలు ఇలా ఉన్నాయి. తెల్గాపూర్ గ్రామానికి చెందిన దనుల వెంకవ్వ, ఎల్లయ్య దంపతులు రెండో కుమారుడు రవీందర్ ఏడు సంవత్సరాల నుంచి దుబాయ్లో ఉంటూ ఉపాధి పొందుతున్నాడు. రవీందర్ పని చేస్తున్న కంపెనీలోనే నేపాల్కు చెందిన మాయ పనిచేస్తోంది. మూడు సంవత్సరాల నుంచి ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. పది రోజుల కిందట రవీందర్తోపాటు మాయ దుబాయ్ నుంచి తెల్గాపూర్ గ్రామానికి వచ్చారు. రవీందర్ తన తల్లిదండ్రులను ఒప్పించి మాయను వివాహం చేసుకున్నారు. -
జాతీయ స్థాయిలో రాణించాలి
● ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి నాగమణి ● అండర్–17 జిల్లా స్థాయి తైక్వాండో క్రీడాకారుల ఎంపిక నిజామాబాద్నాగారం: క్రీడాకారులు రాష్ట్ర, జాతీయస్థాయిలో రాణించి జిల్లాకు బంగారు పతకాలు తేవాలని ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి నాగమణి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ఎన్నారై కాలనీలో తైక్వాండో మార్షల్ ఆర్ట్స్ అకాడమీ క్రీడా ప్రాంగణంలో గురువారం అండర్–17 బాలబాలికల విభాగంలో ఎంపికల పోటీలు నిర్వహించారు. ప్రతిభచూపిన వారిని రాష్ట్రస్థాయికి ఎంపిక చేశారు. వచ్చే నెలలో నల్గొండ జిల్లాలో అండర్–17 తైక్వాండో పోటీలు ఉంటాయన్నారు. కార్యక్రమంలో పీడీ ఈశ్వర్, కోచ్ ఫారుకి అబ్దుల్లా, కోచ్లు వినోద్ నాయక్, గయాస్, మనోజ్, వినోద్, సీనియర్ క్రీడాకారులు పాల్గొన్నారు. అనంతరం తైక్వాండో అండర్–17 క్రీడాకారులు నియామక అబ్జర్వర్లను ఘనంగా సన్మానించారు. ఎంపికై న బాలికలు : సారా ఫాతీమా, ఇన్సర్ నూరేన్, జైనాబ్, సాన్వి, సయ్యద్ సిమ్రా ఫాతిమా, అన్సరా మిదాత్, జామ్ల దర్శిని, నివేదిత, వర్షిణి, ఊర్మిళ, నేహ వాసవి, నూరేన్ బాలుర విభాగంలో.. అబ్దుల్ అజాన్షేక్, షేక్ అబ్దుల్లా ఓమర్, రయాన్ అబ్దుల్లా ఫారూఖ్, షేక్ ముస్తాపా రజన్, హరీశ్, ఇబ్రహీం ఎండీ అబ్దుల్, అమాన్ సింగ్, కాంచిపూరం సిద్ధార్థ, షేక్ రిజ్వాన్, రహీం, వేదాన్స్, హుస్సేన్, అమాన్ -
నెట్బాల్ ప్రాబబుల్స్ క్రీడాకారుల ఎంపిక
నిజామాబాద్నాగారం: ఉమ్మడి జిల్లా (నిజామాబాద్, కామారెడ్డి) నెట్బాల్ అండర్–19 విభాగంలో బాలబాలికల ప్రాబబుల్స్ జిల్లా జట్టుకు ఎంపిక నిర్వహించారు. సారంగాపూర్ ప్రభుత్వ పాఠశాల ఆవరణలో బుధవారం పోటీలు నిర్వహించి ప్రతిభకనబర్చిన వారిని ఎంపిక చేశారు. శిక్షణ అనంతరం తుది జట్లను ఎంపిక చేయనున్నారు. బాలికల విభాగం: డి అనుప్రియ, ఎన్ సింధు, డి ప్రతిభ, కె సరు, బి అక్షయ, యూ శృతి, ఏ రక్షిత, ఎం ప్రణీత, సీహెచ్ పురంధరేశ్వరి, యూ సంకీర్తన, కె కీర్తన, పి రక్షిత, బి సింధు, డి బాణవి, పి అలేఖ్య. బాలుర విభాగం: జాన్ ప్రభాస్, ఐ అజయ్కుమార్, కె అరవింద్, పి దేవేందర్, డి అభ్యుదయ, డి సాయికుమార్, టి మహేశ్, హెచ్ నివర్తి, డి రాహుల్, ఎం నవనీత్, ఎండీ ముబాసిర్, ఎస్ అభిలాష్, వి నిఖిల్, శివకాంత్. -
పీసీసీ చీఫ్ది అవగాహనరాహిత్యం
సుభాష్నగర్: రైల్వే ఓవర్ బ్రిడ్జి(ఆర్వోబీ)లకు కేంద్రం నిధులు ఆగడం వల్లే పనులు ఆలస్యమవుతున్నాయని పీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్ అనడం అవగాహనారాహిత్యానికి నిదర్శనమని ఎంపీ అర్వింద్ ధర్మపురి విమర్శించారు. జిల్లాలోని మాధవనగర్, అర్సపల్లి, అడవి మామిడిపల్లి ఆర్వోబీలకు దీపావళి తర్వాత మూడు, నాలుగు రోజుల్లో నిధులు విడుదల చేయాలని, లేకపోతే నిరాహార దీక్షకు దిగుతానని అన్నారు. నగరంలోని బీజేపీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మహేష్కుమార్గౌడ్కు అవగాహన లేక కేంద్రంపై నెట్టేస్తున్నారని, ఇది సరైన పద్ధతి కాదన్నారు. సబ్జెక్ట్ తెలుసుకుని మీడియా ముందు మాట్లాడాలని హితవుపలికారు. మాధవనగర్ ఆర్వోబీలో సగం నిధులు తప్ప మిగతా అన్ని ఆర్వోబీలు కేంద్ర ప్రభుత్వ నిధులతోనే నిర్మిస్తున్నామన్నారు. ఆయా ఆర్వోబీలకు సంబంధించి 75శాతానికి పైగా నిధులు రాష్ట్ర ఖజానాలో కేంద్రం జమ చేసిందని అర్వింద్ తెలిపారు. పథకాలు, అభివృద్ధి పనులు, వరద నష్టం, ఇతర బిల్లులకు నిధులు విడుదల చేయాలని కోరితే డబ్బులు లేవని సీఎం చెప్పడం సిగ్గుచేటన్నారు. జిల్లాకేంద్రంలో పసుపు బోర్డు కార్యాలయానికి రెండెకరాల స్థలం కేటాయించాలని ఎంపీ డిమాండ్చేశారు. బీసీ రిజర్వేషన్ల అంశంలో బీజేపీపై బురదజల్లే కుట్రలు చేస్తున్నారని, ఢిల్లీలో బీసీ ధర్నా చేసినప్పుడు రాహుల్గాంధీ ఎందుకు రాలేదన్నారు. రాజ్యాంగ సవరణ చేసి పార్లమెంట్లో బీసీ బిల్లు ఆమోదం తెలపాలని, అందుకు కాంగ్రెస్ చేసిన ప్రయత్నమేమిటని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ అవినీతి పార్టీలని ఆరోపించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఓట్ల చోరీ జరిగిందని కేటీఆర్ ఆరోపిస్తున్నారని, వాళ్ల హయాంలోనే ఆ ఓట్లు నమోదయ్యాయేమోనని అర్వింద్ విమర్శించారు. జూబ్లీహిల్స్లోనే అధికంగా క్లబ్లు ఉంటాయని, బీఆర్ఎస్ పాలనలో క్లబ్లకు డ్రగ్స్ సరఫరా ఎవరి కనుసన్నల్లో జరిగిందని ప్రశ్నించారు. ఆ బీఆర్ఎస్ కీలక నాయకుడెవరు.. కేసులు నమోదైతే నిర్వీర్యం చేసిందెవరో అందరికీ తెలుసన్నారు. కల్వకుంట్ల కుటుంబంతో దేశభద్రతకే ముప్పు అని విమర్శించారు. సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి గోపిడి స్రవంతిరెడ్డి, నాయకులు న్యాలం రాజు, నాగోళ్ల లక్ష్మీనారాయణ, ప్రదీప్రెడ్డి, మాజీ కార్పొరేటర్లు, మండలాల అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆర్వోబీ నిధులు విడుదల చేయకపోతే నిరాహార దీక్ష బీసీ రిజర్వేషన్లపై బీజేపీపై బురదజల్లే కుట్ర మీడియాతో ఎంపీ అర్వింద్ ధర్మపురి -
విద్యార్థులకు ఇబ్బందులు కలిగించొద్దు
● కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ● జిల్లాలోని బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ యాజమాన్యాలతో సమావేశం నిజామాబాద్ అర్బన్: బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకం కింద ప్రయివేటు పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు యాజమాన్యాలు ఎలాంటి ఇబ్బందులు కలిగించొద్దని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. నగరంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బుధవారం బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కరెస్పాండెంట్లు, ప్రిన్సిపాల్స్తో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూన.. ఏమైనా సమస్యలు ఉంటే జిల్లా యంత్రాంగం, ప్రభుత్వం దృష్టికి తెచ్చి పరిష్కరించుకోవాలని యాజమాన్యాలకు సూచించారు. బెస్ట్ అవైలబుల్ స్కీం విద్యార్థులు పట్ల వివక్షను ప్రదర్శించకూడదని స్పష్టం చేశారు. బకాయిల చెల్లింపుల విషయమై ప్రభుత్వం సానుకూలంగా ఉందని, విద్యార్థులకు మెరుగైన విద్య, నాణ్యమైన వసతుల కల్పనకు చొరవ చూపాలన్నారు. అదనపు కలెక్టర్ అంకిత్, ట్రెయినీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావి, అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
ధాన్యం సేకరణకు విస్తృత ఏర్పాట్లు
నిజామాబాద్ అర్బన్ : కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణ సజావుగా సాగేలా విస్తృత ఏర్పాట్లు చేశామని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. ఎక్కడ కూడా రైతులకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు ప్రణాళికతో అవసరమైన చర్యలు చేపట్టామన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఇతర ఉన్నతాధికారులతో కలిసి మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ధాన్యం సేకరణపై సమీక్షించారు. జిల్లాలో ధాన్యం సేకరణ ఏర్పాట్ల వివరాలను కలెక్టర్ మంత్రులకు వివరించారు. బాన్సువాడ, బోధన్ నియోజకవర్గాల పరిధిలోని పలు మండలాల్లో ధాన్యం దిగుబడులు వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే 274 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామన్నారు. గత సీజన్ లో 606 కేంద్రాలు ఏర్పాటు చేయగా, ఈసారి 676 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. అలాగే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను కూడా అందుబాటులో ఉంచుతామన్నారు. జిల్లాకు 1582 అదనపు టార్పాలిన్లు కేటాయించాలని కలెక్టర్ కోరారు. వీసీ అనంతరం ధాన్యం సేకరణపై కలెక్టర్ సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. అదనపు కలెక్టర్ కిరణ్కుమార్, డీఆర్డీవో సాయాగౌడ్, డీఎస్వో అరవింద్రెడ్డి, సివిల్ సప్లయీస్ డీఎం శ్రీకాంత్రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి గోవిందు, డీసీవో శ్రీనివాస్, డీటీవో ఉమామహేశ్వర్ రావు, మార్కెటింగ్ ఏడీ గంగవ్వ, తూనికలు కొలతల శాఖ అధికారి సుజాత్ అలీ తదితరులు పాల్గొన్నారు.నిజామాబాద్ అర్బన్: ప్రజలకు మరింత మెరుగైన సదుపాయాలు అందుబాటులోకి తెచ్చేందుకు వీలుగా నగరంలో చేపడుతున్న అభివృద్ధి పనులను నిర్ణీత గడువు లోగా పూర్తి చేయాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. నగరంలో కొనసాగుతున్న వివిధ పనులను కలెక్టర్ బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మాధవనగర్ వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ) పనులతోపాటు ఖలీల్వాడిలో నిర్మాణంలో ఉన్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డు, అహ్మదీబజార్ వద్ద ఖిల్లా రోడ్డును ఆనుకుని అధునాతన సదుపాయాలతో నిర్మించిన సమీకృత మార్కెట్ సముదాయ భవనాన్ని, 80 క్వార్టర్స్, కలెక్టరేట్ పక్కన నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. పెండింగ్లో ఉన్న పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయా శాఖల అధికారులతో కలెక్టరేట్లో పనులపై సమీక్షించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ అంకిత్, ట్రెయినీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావి, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్కుమార్, హౌసింగ్ డీఈ నివర్తి, నిజామాబాద్ సౌత్ తహసీల్దార్ బాలరాజు తదితరులున్నారు. పొరుగు రాష్ట్రాల ధాన్యం రాకుండా సరిహద్దుల్లో గట్టి నిఘా జిల్లాకు అదనంగా టార్పాలిన్లు కేటాయించండి వీడియోకాన్ఫరెన్స్లో మంత్రులతో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి -
ధాన్యం సేకరణ ప్రారంభించాలి
బోధన్: ధాన్యం సేకరణను వెంటనే ప్రారంభించాలని రైతులు డిమాండ్చేశారు. కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినప్పటికీ ధాన్యం సేకరించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎడపల్లిలోని బోధన్ – నిజామాబాద్ రహదారిపై రైతులు బుధవారం బైఠాయించారు. రాస్తారోకో కారణంగా పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న ఎస్సై ముత్యాల రమ సిబ్బందితో కలిసి ఘటనాస్థలానికి చేరుకుని రైతులతో మాట్లాడారు. ఎస్సై సముదాయించడంతో వారు ఆందోళనలను విరమించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. సొసైటీలు, ఐకేపీ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినప్పటికీ ధాన్యం సేకరించడం లేదని, తాము పక్షం రోజులుగా ఎదురు చూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షం కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. ఉన్నతాధికారులు స్పందించి వెంటనే ధాన్యం కొనుగోళ్లను ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. -
ఒకే కుటుంబంలోని ముగ్గురి ఆత్మహత్యాయత్నం
● మృతిచెందిన తండ్రి, చికిత్స పొందుతున్న తల్లి, కొడుకు ● పెళ్లి విషయమై గొడవలే కారణం నిజామాబాద్ అర్బన్: జిల్లా కేంద్రంలోని శివాజీనగర్లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు. ఇందులో తండ్రి మృతి చెందగా, తల్లి, కొడుకు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రెండో టౌన్ ఎస్సై గంగాధర్ తెలిపిన వివరాలు ఇలా.. శివాజీనగర్ కు చెందిన దాసరి కిషన్(68)కు భార్య నాగమణి, ఇద్దరు కొడుకులు వంశీ, బాలకృష్ణ ఉన్నారు. పెద్దకొడుకు వంశీ గల్ఫ్కు వెళ్లి తిరిగి వచ్చి, మద్యానికి బానిసయ్యాడు. చిన్న కొడుకు బాలకృష్ణతో కలిసి కిషన్ కర్రీ పాయింట్ నిర్వహిస్తున్నాడు. బాలకృష్ణకు వివాహం జరుగగా, వంశీకి పెళ్లి కాలేదు. ఈవిషయమై మంగళవారం అతడు తల్లిదండ్రులతో గొడవపడ్డాడు. దీంతో వంశీ గడ్డిమందు తాగి చనిపోతానంటూ మందు తాగాడు. వెంటనే వంశీ నుంచి తల్లి గడ్డిమందు డబ్బా తీసుకొని ఆమె తాగింది. ఆమె నుంచి కిషన్ డబ్బా తీసుకొని తాగాడు. దీంతో ముగ్గురు అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయారు. స్థానికులు గమనించి వారిని వెంటనే చికిత్స కోసం ప్రయివేట్ ఆస్పత్రికి తరలించారు. బుధవారం తెల్లవారుజామున కిషన్ చికిత్స పొందుతు మృతిచెందగా, మిగిలిన ఇద్దరిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించారు. ఈ ఘటనపై మృతుడి చిన్నకుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఘటన స్థలానికి వెళ్లి వారు విచారణ చేపట్టారు. కిషన్ మృతిచెందిన విషయాన్ని ఆస్పత్రి యాజమాన్యం పోలీసులకు ఇవ్వకపోవడం, మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించడంపై పోలీసులు ఆస్పత్రికి నోటీసులు జారీ చేశారు. -
టీకా కోసం వెళ్తూ అనంతలోకాలకు..
భిక్కనూరు : టీకా వేయించేందుకు మూడు నెలల పసికందుతోపాటు వెళ్లిన ముగ్గురిని టిప్పర్ రూపంలో వచ్చిన మృత్యువు కబళించింది. భిక్కనూరు మండలం జంగంపల్లి బస్టాండ్ వద్ద జాతీయ రహదారిపై బుధవారం చోటు చేసుకున్న ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. పోలీసులు, స్థానికులు తెలిపిన ప్రకారం.. తాడ్వాయి మండలం కరడ్పల్లి గ్రామానికి చెందిన మెరుగు కిషన్ (54) అనే వ్యక్తి 20 ఏళ్లుగా ఆదిలాబాద్ జిల్లా రణదీవ్నగర్ చర్చిలో పాఽస్టర్గా పనిచేస్తున్నాడు. వృద్ధులైన తల్లిదండ్రుల బాగోగులను ఒక నెల కిషన్, మరో నెల తన సోదరుడు చూసుకుంటున్నారు. ఈ క్రమంలో తన వంతు వచ్చినప్పుడు కిషన్ కామారెడ్డికి వచ్చి శాబ్దీపూర్ శివారులో ఉన్న అద్దె ఇంట్లో తల్లిదండ్రులతో కలిసి ఉండేవాడు. కిషన్ కుమార్తె జాస్లీన్ (30)కు ఖమ్మం జిల్లా ముష్టికుంటకు చెందిన పాస్టర్ ఆగమని ప్రకాశ్తో వివాహం చేశాడు. జాస్లీన్కు జోయల్ ప్రకాశ్(4), మూడు నెలల జాడ్సన్ అనే పసికందు ఉంది. జాస్లీన్ ఇటీవల తన కుమారులతో కామారెడ్డికి వచ్చి తండ్రి, నానమ్మ–తాతయ్యలతో కలిసి ఉంటోంది. జాడ్సన్ నెల టీకాకు సమయం అయ్యింది. కాగా, భిక్కనూరు ప్రభుత్వాసుపత్రిలో ఆశవర్కరుగా పనిచేసే బంధువును కలిసి జాడ్సన్కు ఇప్పించవచ్చని భావించిన జాస్లీన్ ఈ విషయాన్ని తండ్రి కిషన్కు వివరించింది. దీంతో కిషన్ తన ఎలక్ట్రిక్ స్కూటీపై జాస్లీన్, మనుమలు జోయల్ ప్రకాశ్, జాడ్సన్లను తీసుకొని భిక్కనూరుకు బయల్దేరాడు. జంగంపల్లి వద్ద జాతీయ రహదారిపై వెళ్తుండగా ఎదురుగా రాంగ్ రూటులో టిప్పర్ వేగంగా వచ్చి ఎలక్ట్రిక్ స్కూటీని ఢీకొట్టింది. దీంతో నలుగురు గాలిలో ఎగిరి కిందపడ్డారు. కిషన్, జాస్లీన్లు అక్కడికక్కడే మృతి చెందగా, కొన ఊపిరితో ఉన్న చిన్నారులు జోయల్ ప్రకాశ్, జాడ్సన్లను కామారెడ్డి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మరణించారు. ఘటనా స్థలాన్ని ఎల్లారెడ్డి డీఎస్పీ, కామారెడ్డి ఇన్చార్జి శ్రీనివాస్ రావు, రూరల్ సీఐ రామన్ పరిశీలించారు. డ్రైవర్ అజాగ్రత్తగా టిప్పర్ను రాంగ్రూట్లో నడపడంతోనే ఈ ప్రమాదం సంభవించిందని తెలిపారు. కేసు నమోదు చేసుకొని నలుగురు మృతికి కారణమైన డ్రైవర్ రాజిరెడ్డిని అరెస్టు చేశామని ఎస్సై ఆంజనేయులు వివరించారు. టిప్పర్ రూపంలో ఎదురుగా వచ్చిన మృత్యువు తాత, ఇద్దరు మనుమలు, కుమార్తె మృతి జంగంపల్లిలో నెత్తురోడిన జాతీయ రహదారి -
అభిప్రాయాల సేకరణ తర్వాతే డీసీసీ నియామకం
నందిపేట్(ఆర్మూర్): క్షేత్రస్థాయిలో కచ్చితమైన అభిప్రాయాలు సేకరించిన తర్వాతనే డీసీసీల నియామకాలు చేపడతామని కర్ణాటక ఎమ్మెల్యే, ఏఐసీసీ పరిశీలకులు రిజ్వాన్ అర్షద్ అన్నారు. నందిపేట మండలంలోని వెల్మల్ గ్రామంలో బుధవారం ఆర్మూర్ నియోజకవర్గంలోని నందిపేట, మాక్లూర్, డొంకేశ్వర్ మండలాల ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్బంగా రిజ్వాన్ అర్షద్ను నాయకులు ఘనంగా సన్మానించారు. అనంతరం రిజ్వాన్ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చేసేందుకు ప్రక్రియలో భాగంగానే డీసీసీ పదవి నియామకంలో పార్టీ నాయకులు, కార్యకర్తల అభిప్రాయ సేకరణ చేపట్టామన్నారు. అభిప్రాయల నివేదికను పార్టీ అధిష్టానానికి పంపిస్తామని తెలిపారు. అనంతరం జిల్లా పార్టీ అధ్యక్షుడు మానాల మోహన్రెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మాట్లాడుతూ.. పార్టీ సంస్థాగత నిర్మాణానికి మరింత బలోపేతం చేసేందుకు డీసీసీల పదవుల నియామకానికి ఏఐసీసీ సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టిందన్నారు. ఆర్మూర్ నియోజకవర్గ ఇన్చార్జి వినయ్రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ మార చంద్రమోహన్, మంద మహిపాల్, భూమేశ్వర్రెడ్డి, రవి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. -
మక్క కొనుగోళ్లకు పచ్చ జెండా
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : మొక్కజొన్న కొ నుగోళ్లకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో గురువారం నుంచి స హకార సంఘాల్లో కేంద్రాలను ఏర్పాటు చేసి, కొనుగోళ్లను ప్రారంభించాలని మార్క్ఫెడ్ అధికారులకు ఇప్పటికే మౌఖిక ఆదేశాలు అందా యి. తక్షణమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చే సుకోవాలని సహకార సంఘాలకు సూచనలు వచ్చాయి. దీంతో బుధవారం కలెక్టరేట్లో అద నపు కలెక్టర్ కిరణ్కుమార్ ఆధ్వర్యంలో మా ర్క్ఫెడ్ అధికారులు సొసైటీల నిర్వాహకులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. మొక్కజొన్న పంట దిగుబడులను రైతుల నుంచి పక్కాగా సేకరించాలని అదనపు కలెక్టర్ సూచించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా 14 మండలాల్లో మొత్తం 26 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. కేంద్రాలను సమర్ధవంతంగా నిర్వహించి రైతులకు క్వింటాల్కు మద్దతు ధర రూ.2,400 దక్కేలా చ ర్యలు తీసుకోవాలన్నారు. కాగా జిల్లాలో ఈ సీ జన్లో 52,093 ఎకరాల్లో మొక్కజొన్నను రైతు లు సాగుచేశారు. పంట కోతలు మొదలై మూ డు వారాలు దాటింది. అయితే మక్క కొనుగోలు కేంద్రాల ఏర్పాటును ప్రభుత్వం ఆలస్యం చేయడంతో 40 శా తం పంటను రైతులు ఇప్పటికే ప్రైవేటు వ్యాపా రులకు అమ్ముకోవాల్సి వచ్చింది. ప్రతికూల వా తావరణం నేపథ్యంలో పలువురు రైతులు తక్కు వ ధరకే అమ్ముకున్నారు. ఈ క్రమంలో తాజాగా మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనుండడంతో పంట చేతిలో ఉన్న రైతులు తమకు మద్దతు ధర దక్కనుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గు రువారం నిజామాబాద్ రూరల్, ఆర్మూర్ నియోజకవర్గాల్లో ప్రజాప్రతినిధులు కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 6 లక్షల ఎకరాల్లో రైతులు మొ క్కజొన్న సాగు చేశారు. జిల్లాలోనే ముందుగా పంట చేతికి వచ్చింది. కొనుగోలు కేంద్రాలు లే కపోవడంతో రైతులు దళారులకు రూ.1900కే అమ్ముకున్నారు. దీంతో మార్క్ఫెడ్ ద్వారా మ క్క కొనుగోళ్లు చేయాలని కోరుతూ గత నెల 23 వ తేదీన మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు లేఖ రాశా. మార్క్ఫెడ్ ద్వారా కొనుగోళ్లకు ఎమ్మెల్యే లు సుదర్శన్రెడ్డి, డాక్టర్ భూపతిరెడ్డి చొరవ తీ సుకున్నారు. రైతులు కొనుగోలు కేంద్రాలను స ద్వినియోగం చేసుకోవాలి. – ఎస్. అన్వేష్రెడ్డి, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్జిల్లాలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రా లు ఏర్పాటు చేసుకోవాలని రాష్ట్ర శాఖ నుంచి మౌఖిక ఆదేశాలు అందాయి. దీంతో వెంటనే సమాచారాన్ని సహకార సంఘాలకు చేరవేశాం. గురువారం మొదట గా జక్రాన్పల్లి మండలం మునిపల్లిలో కొ నుగోలు కేంద్రం ప్రారంభించనున్నాం. జి ల్లాలో 26 చోట్ల వీటిని ఏర్పాటు చేయను న్నాం. రైతులు కేంద్రాలను సద్వినియోగం చేసుకుని మద్దతు ధరను పొందాలి. – మహేశ్కుమార్, మార్క్ఫెడ్ జిల్లా మేనేజర్ మార్క్ఫెడ్కు ప్రభుత్వం నుంచి మౌఖిక ఆదేశాలు జిల్లాలోని 26 సహకార సంఘాల్లో కొనుగోలు కేంద్రాల ఏర్పాటు నేటి నుంచి ప్రారంభం కానున్న కొనుగోళ్లు -
మరోసారి రెండుగా చీలిన తొర్తి
● గతంలో నమోదైన కేసులలో రాజీ కుదరకపోవడంతో విడిపోయిన గ్రామస్తులు ● ఉద్రిక్తతలు చోటు చేసుకోకుండా పికెటింగ్ ఏర్పాటు చేసిన పోలీసులు మోర్తాడ్(బాల్కొండ): ఏర్గట్ల మండలం తొర్తి గ్రామస్తులు మంగళవారం మరోసారి రెండు వర్గాలుగా విడిపోయారు. గతంలో నమోదైన కేసులలో రాజీ కుదురకపోవడంతో ఒక వర్గానికి చెందిన దాదాపు వంద కుటుంబాలు ఒకవైపు, మెజార్టీ కులాలకు చెందిన 320 కుటుంబాలు మరోవైపు ఉండిపోయారు. దీంతో ఉద్రిక్తతలు చోటుచేసుకుంటాయనే సందేహంతో పోలీసులు మంగళవారం నుంచి పికెటింగ్ నిర్వహిస్తున్నారు. 2021లో వరి కోతల విషయంలో రెండుగా చీలిపోయిన తొర్తిలో కొంత కాలం వర్గపోరు కొనసాగింది. పోలీసులు, రెవెన్యూ అధికారులు సంప్రదింపులు జరిపి గ్రామస్తులను ఐక్యం చేశారు. ఈక్రమంలో వంద కుటుంబాలు ఉన్న వర్గం వారిపై గతంలోనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఆ కేసు కోర్టులో విచారణకు రాగా సాక్షులుగా ఉన్నవారు కోర్టుకు హాజరయ్యారు. గ్రామంలో అందరం కలిసిపోయినా కేసుల విషయంలో రాజీ కుదురకపోవడంతో వంద కుటుంబాల వారు మళ్లీ కట్టడి చేసుకున్నారు. గతంలో మాదిరిగానే విడిపోయి ఉండాలని తీర్మానించుకున్నారు. రెండో వర్గం వారు దీనిని విభేదించడంతో గ్రామంలో రెండు వర్గాలు ఏర్పడ్డాయి. గ్రామస్థులు కలిసిపోయిన సమయంలోనే కేసుల విషయంలో రాజీ కుదిరి ఉంటే ఇప్పుడు వివాదం ఏర్పడేది కాదనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. క్రైం కార్నర్తొర్తిలో ఏర్పడిన వివాదం వల్ల శాంతి భద్రతలకు భంగం వాటిల్లకుండా ఉండటానికి పోలీసు పికెటింగ్ నిర్వహిస్తున్నాం. ఇరు వర్గాలు పోలీసులకు సహకరించాలి. ఎవరైన చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. –పడాల రాజేశ్వర్, ఎస్సై, ఏర్గట్ల -
ట్యాంకర్ను ఢీకొన్న బస్సు
● ముగ్గురు ప్రయాణికులకు స్వల్ప గాయాలు డిచ్పల్లి: మండలలోని హైవేపై ఓ ప్రయివేట్ బస్సు అదుపుతప్పి ఇంధన ట్యాంకర్ను ఢీకొని, సమీపంలోని ఏడో బెటాలియన్ పెట్రోల్ బంక్లోకి దూసుకెళ్లింది. ఈఘటనలో ముగ్గురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. డిచ్పల్లి ఎస్సై ఎండీ షరీఫ్ తెలిపిన వివరాలు ఇలా.. హరికృష్ణ ట్రావెల్స్కు చెందిన బస్సు బుధవారం హైదరాబాద్ నుంచి జగిత్యాలకు బయలుదేరింది. డిచ్పల్లిలోని పోలీస్ పెట్రోల్ బంక్ వద్దకు రాగానే బస్సు ముందు వెళుతున్న ట్యాంకర్ను ఢీకొని బంకులోకి దూసుకెళ్లింది. దీంతో పెట్రోల్ బంక్లో ఉన్న వాహనదారులు, సిబ్బంది ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అయితే బస్సు సమీపంలోకి వచ్చి నిలిచిపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బస్సులో ఉన్న ముగ్గురు ప్రయాణికులకు స్వల్పగాయాలయ్యాయి. అజాగ్రత్తగా బస్సు నడిపి ప్రమాదానికి కారణమైన డ్రైవర్ ప్రభాకర్ తేజపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఆర్మూర్టౌన్: పట్టణంలో ఆర్టీసీ బస్సు బైక్ను ఢీకొనడంతో ఇద్దరికి గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా.. ఆర్టీసీ బస్సు నిజామాబాద్ నుంచి హన్మకొండకు బయలుదేరింది. ఈక్రమంలో పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తాలో బైక్ను బస్సు వెనుకనుంచి వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్పై ఉన్న ఇద్దరికి గాయాలయ్యాయి. ఆర్టీసీ డ్రైవర్ ఆజాగ్రత్తగా వాహనాన్ని నడపడంతో ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు.. సంఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించి, ఇరువురిని పోలీస్ స్టేషన్కు తరలించారు విద్యుత్ షాక్తో జీపీ కార్మికుడికి .. బీబీపేట: మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్మికుడు విద్యుత్ షాక్తో గాయపడ్డాడు. వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన జీపీ కార్మికుడు కొంగరి చంద్రం బుధవారం పెద్దమ్మ ఆలయం సమీపంలో విద్యుత్ బల్బులు అమర్చడానికి స్తంభం ఎక్కాడు. అప్పటికే విద్యుత్ సరఫరా ఉండడంతో అతని చేతులకు విద్యుత్ షాక్ తగిలి కింద పడిపోయాడు. దీంతో కుడి కాలు విరిగింది. స్థానికులు వెంటనే అతడిని కామారెడ్డి ఆస్పత్రికి తరలించారు. -
భవిష్యత్ను ఉన్నతంగా తీర్చుదిద్దుకోవాలి
బోధన్: సంఘసంస్కర్తలు మహాత్మ జ్యోతిరావుపూలే, సావిత్రిబాయి దంపతులను ఆదర్శంగా తీసుకొని విద్యార్థులు భవిష్యత్ను ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఉదయ్భాస్కర్రావు సూచించారు. పట్టణంలోని ఆచన్పల్లి ప్రాంతంలోగల మహాత్మా జ్యోతిబాపూలే బాలికల గురుకుల పాఠశాల, బెల్లాల్ ప్రాంతంలోని ఎస్సీ బాలుర గురుకుల కళాశాలను బుధవారం ఆయన తనిఖీ చేశారు. ఆయన విద్యార్థినులతో మాట్లాడారు. నేటి పోటీ ప్రపంచంలో చదువు ప్రాముఖ్యతను వివరించి, లక్ష్యంతో చదివితే ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చని తెలిపారు. చదువుకు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా ఉపాధ్యాయులతో అడిగి నివృత్తి చేసుకోవాలని సూచించారు. అనంతరం బెల్లాల్ ప్రాంతంలోని ఎస్సీ బాలుర గురుకుల కళాశాలను సందర్శించారు. ఇరుకుగా ఉన్న తరగతి గదిలోనే నిద్రిస్తున్నామని విద్యార్థులు జడ్జి దృష్టికి తీసుకెళ్లారు. ఇక్కడిపరిస్థితుల సమగ్ర నివేదికను ఉన్నత న్యాయస్థానానికి నివేదిస్తామని ఆయన వెల్లడించారు. జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ సిబ్బంది శ్రావణ్, మృణాళిని, పారాలీగల్ వలంటీర్స్ పద్మాసింగ్, రమణారెడ్డి, న్యాయవాది ఆశా నారాయణ తదతరులు ఉన్నారు. -
స్తంభాన్ని ఢీకొన్న బైక్: ఒకరి మృతి
ఎల్లారెడ్డి: మండలంలో బైక్ అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడంతో ఒకరు అక్కడికక్కడే మృతిచెందారు. ఎస్సై మహేశ్ వివరాలు ఇలా.. వెల్లుట్ల గ్రామానికి చెందిన పండుగ లక్ష్మణ్(36) బుధవారం మోటార్ సైకిల్పై బాన్సువాడ నుంచి గ్రామానికి బయలుదేరాడు. ఆజామాబాద్ గ్రామ శివారులోని మూల మలుపు వద్ద బైక్ అదుపుదప్పి కరెంట్ స్తంభాన్ని ఢీకొన్నాడు. ఈ ఘటనలో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. రైలు ప్రమాదంలో ఒకరు.. నిజామాబాద్ సిటీ: నిజామాబాద్ రైల్వేస్టేషన్–జాన్కంపేట స్టేషన్ల మధ్య రైలు ఢీకొని ఓ వ్యక్తి మృతిచెందినట్లు రైల్వే ఎస్సై సాయిరెడ్డి తెలిపారు. వివరాలు ఇలా.. జిల్లా కేంద్రంలోని దుబ్బకు చెందిన ట్రాన్స్జెండర్ మీరా అలియాస్ నారాయన్ కామాజీ అనే వ్యక్తి బుధవారం మధ్యాహ్నం నిజామాబాద్ రైల్వేస్టేషన్–జాన్కంపేట స్టేషన్ల మధ్య పట్టాలపై వస్తున్న రైలుకు ఎదురువెళ్లారు. ఈక్రమంలో రైలు ఢీకొని తీవ్రగాయాలై మృతిచెందారు.ఈ ఘటన కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఎల్లారెడ్డి: చెరువులో చేపలు పట్టడానికి వెళ్లి ప్రమాదవశాత్తూ నీటిలో ము నిగి మృతిచెందిన వ్యక్తి మృతదేహం బుధవారం లభ్యమయ్యింది. వివరాలు ఇలా.. బాలాజీనగర్ తండాకు చెందిన రుడావత్ గణేశ్ (48) మంగళవారం చేపలు పట్టడానికి ఎల్లారెడ్డి పెద్దచెరువులో దిగగా ప్రమాదవశాత్తూ జారిపడి మృతి చెందాడు. పోలీసులు మృతదేహం కోసం గాలించగా బుధవారం మధ్యాహ్నం లభ్యమయ్యింది. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని శవాన్ని పోస్టుమార్టానికి తరలించినట్లు ఎస్సై తెలిపారు. -
ఎర్రజొన్నకు బదులు మొక్కజొన్న
ఆర్మూర్: ఎర్రజొన్న రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగువైపు మొగ్గుచూపుతున్నారు. జిల్లాలో ప్రతీ ఏటా ఎర్రజొన్న రైతులను విత్తన వ్యాపారులు సిండికేట్గా మారి మోసం చేస్తుండటంతో అన్నదాతలు పంట మార్పిడి విధానాన్ని అవలంభించి వారి మోసాల బారిన పడకుండా జాగ్రత్త పడుతున్నారు. అందులో భాగంగా ఈ యాసంగిలో ఎర్రజొన్నకు బదులుగా మొక్కజొన్నను పండించడానికి ఆసక్తి చూపుతున్నారు. దీంతో జిల్లా వ్యాప్తంగా ప్రస్తుత సీజన్లో ఎర్రజొన్న విస్తీర్ణం తగ్గి మొక్కజొన్న విస్తీర్ణం గణనీయంగా పెరగనుంది. గతంలో.. మార్కెట్లో మొక్కజొన్నకు డిమాండ్ ఉన్నా.. పెట్టుబడి వ్యయం, శ్రమ ఎక్కువ కావడంతోపాటు తెగుళ్లు సహా ఇతర కారణాలతో గతంలో మొక్కజొన్న విస్తీర్ణం గణనీయంగా తగ్గి, ఎర్రజొన్న విస్తీర్ణం పెరిగింది. కానీ ప్రతియేటా ఎర్రజొన్న విత్తన వ్యాపారులు బైబ్యాక్ ఒప్పందాలు చేసుకొని పంట చేతికి వచ్చిన సమయంలో కొనుగోలు చేయకుండా ముఖం చాటేయడంతో రైతులు వచ్చిన నామమాత్రపు ధరకే ఎర్రజొన్న పంటను అమ్ముకొని ఆర్థికంగా నష్టపోతున్నారు. దీంతో అన్నదాతలు ప్రస్తుతం ఎర్రజొన్నకు బదులుగా మొక్కజొన్న పండించడానికే ఆసక్తి చూపుతున్నారు. అక్టోబర్ నెలలో విత్తుకొనే ఎర్రజొన్నల విస్తీర్ణం ప్రతీ ఏటా గణనీయంగా తగ్గుతూ వస్తోంది. 2023–24 యాసంగిలో 34,086 ఎకరాల్లో, 2024–25లో 25,447 ఎకరాల్లో ఎర్రజొన్నలు పండించారు. ప్రత్యామ్నాయంగా మొక్కజొన్నను పండించడానికి రైతులు ఆసక్తి చూపుతున్నారు. వ్యవసాయ శాఖ ముందస్తు ప్రణాళిక ప్రకారం ఈ యాసంగిలో మొక్కజొన్న పంట విస్తీర్ణం 30 వేల ఎకరాలకు చేరువలో ఉండబోతోంది. మొక్కజొన్న పచ్చి బుట్ట పంట 90 రోజుల్లో చేతికొస్తుంది. ఇలా వచ్చిన పచ్చి బుట్టల దిగుబడికి బహిరంగ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఎర్రజొన్న విత్తన వ్యాపారులు బై బ్యాక్ ఒప్పందాన్ని ఉల్లంఘించి ప్రతీయేటా రైతులను మోసం చేస్తూనే ఉన్నారు. సిండికేట్గా మారిన వారిని ని యంత్రిండంలో ప్రభుత్వం వి ఫలం అవుతోంది. కాబట్టి ఎర్రజొన్నకు బదులు గా రైతులు మొక్కజొన్నను పండించడానికి ఆసక్తి చూ పుతున్నారు.–బార్ల మనీష్, రైతు, ఆలూర్ మండలం రైతులు మొక్కజొన్న పంట పండించే సమయంలో మెరుగైన యాజమాన్య పద్ధతులు పాటిస్తూ పంట దిగుబడిని పెంచుకోవాలి. ఆర్మూర్, అంకాపూర్లో పచ్చిబుట్ట కొనుగోలుకు వ్యాపారులు ఆసక్తి చూపుతారు. కాబట్టి ఈ మార్కెట్ను ఉపయోగించుకోవాలి. – హరికృష్ణ, వ్యవసాయశాఖ అధికారి, ఆర్మూర్ యాసంగిలో పెరుగుతున్న మక్క సాగు విస్తీర్ణం ఎర్రజొన్న వ్యాపారుల మోసాలతో విసిగిపోతున్న రైతులు ప్రత్యామ్నాయ పంటలవైపు మొగ్గు -
విద్యార్థి అదృశ్యం
రెంజల్(బోధన్): మండలంలోని సాటాపూర్ గ్రామానికి చెందిన అక్మత్బేగ్ అనే ఇంటర్ విద్యార్థి అదృశ్యమైనట్లు ఎస్సై చంద్రమోహన్ తెలిపారు. సదరు విద్యార్థి బుధవారం బోధన్లోని కళాశాలకు వెళుతున్నట్లు చెప్పి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. సాయంత్రం వరకు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు, బంధువులు అతడి కోసం గాలించినా ఆచూకీ లభించలేదు. దీంతో విద్యార్థి తండ్రి కరామత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. బీబీపేటలో ఒకరు.. బీబీపేట: మండల కేంద్రానికి చెందిన బట్టుపల్లి నాగరాజుగౌడ్ (33) అనే వ్యక్తి అదృశ్యమైనట్లు ఎస్సై ప్రభాకర్ బుధవారం తెలిపారు. నాగరాజు గౌడ్ మంగళవారం తెల్లవారుజామున ఇంట్లో నుంచి ఎవరికి చెప్పకుండా బయటకు వెళ్లాడు. తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబీకులు ఎంత వెతికినా అతడి ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో అతడి తండ్రి సిద్దరామగౌడ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు కేసు నమోదు చేశారు. ఎవరికై న అతడి ఆచూకీ తెలిస్తే పోలీసు స్టేషన్లో తెలపాలని ఎస్సై పేర్కొన్నారు. -
క్షేత్రస్థాయి నుంచి జల్లెడ
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియ షురువైంది. ఈ పీఠాన్ని బీసీకి అప్పగిస్తారా.. ఓసీకి కేటాయిస్తారా అనే విషయమై కచ్చితమైన నిర్ణయానికి రాకపోయినప్పటికీ ఏఐసీసీ నుంచి వచ్చిన పరిశీలకుడు, కర్ణాటక ఎమ్మెల్యే రిజ్వాన్ అర్షద్ ప్రతి అంశాన్ని జల్లెడ పడుతున్నారు. ఇందులో భాగంగా క్షేత్రస్థాయి నుంచి కచ్చితమైన అభిప్రాయాలను సేకరించేందుకు స్వయంగా ఆయా నియోజకవర్గాల్లోని బ్లాక్ల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. సమావేశాలను సాధారణంగానే నిర్వహిస్తుండగా, ఆయా నియోజకవర్గంలోని కీలక నేతల, సీనియర్ నాయకుల, బ్లాక్, మండలాల అధ్యక్షుల అభిప్రాయాలను సేకరిస్తున్నారు. ఇందుకు గాను వ్యక్తిగతంగా ఒక్కొక్కరితో మాట్లాడుతూ మొదటి ప్రాధాన్యత, రెండో ప్రాధాన్యత వివరాలు తీసుకుంటున్నారు. ఇందులో సామాజిక సమీకరణలను సైతం బేరీజు వేస్తున్నారు. అభిప్రాయ సేకరణకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చేందుకు పార్టీ నాయకత్వం నిర్ణయించింది. దీంతో పీఠం ఆశిస్తున్న నాయకులు పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలను తమకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతున్నారు. క్షేత్రస్థాయి నుంచి పరిశీలకుడు వడపోత కార్యక్రమం నిర్వహిస్తుండడంతో ఆయా నియోజకవర్గాన్ని బట్టి ప్రాధాన్యతాక్రమాలు మారుతున్నాయి. దీంతో డీసీసీ కోసం దరఖాస్తు చేసుకున్న నాయకులు తమ సొంత నియోజకవర్గం నుంచి భారీగా మద్దతు కూడగట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. పరిశీలకుడికి తమ పేర్లు చెప్పాలంటూ శ్రేణులను కోరుతున్నారు. మరోవైపు ఐదేళ్ల ముందు నుంచి పార్టీలో పనిచేస్తున్నవారికే డీసీసీ పీఠం అప్పగించేందుకు పార్టీ నిర్ణయించడంతో స్క్రూటినీలో కొందరి దరఖాస్తులు ఎగిరిపోనున్నట్లు సీనియర్ నాయకులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా పీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ సొంత జిల్లా కావడంతో ఈ డీసీసీ పీఠం విషయంలో ఎంపిక ఏవిధంగా ఉంటుందనే విషయమై పార్టీ శ్రేణులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ● క్షేత్రస్థాయిలో అభిప్రాయ సేకరణలో భాగంగా ఏఐసీసీ పరిశీలకుడు మంగళవారం బోధన్ నియోజకవర్గంలో సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలోని బ్లాకుల వారీగా సమావేశం నిర్వహించారు. అనంతరం అన్ని మండలాలకు చెందిన సీనియర్ నాయకులు, ఆయా మండలాల అధ్యక్షులతో వ్యక్తిగతంగా మాట్లాడి వివరాలు సేకరించారు. ఒక బీసీ నాయకుడికి, మరొక ఓసీ నాయకుడికి అక్కడి నాయకులు మొదటి, ద్వితీయ ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది. అలేగే పరిశీలకుడు బుధవారం ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాలకు సంబంధించిన సమావేశాలు, అభిప్రాయ సేకరణ చేయనున్నారు. ఆర్మూర్లోని రెండు బ్లాకులకు సంబంధించి నందిపేట మండలం వెల్మల్లో, ఆర్మూర్లో వరుసగా సమావేశాలు నిర్వహించనున్నారు. అనంతరం మధ్యాహ్నం బాల్కొండ నియోజకవర్గంలో బ్లాకుల వారీగా సమావేశాలు నిర్వహించనున్నారు. కీలకమైన ఈ సమావేశాల అనంతరం వ్యక్తిగత అభిప్రాయ సేకరణలో ఆయా నాయకులు, సీనియర్ కార్యకర్తలు ఎలాంటి అభిప్రాయాలు చెబుతారనే విషయమై అందరిలో ఉత్కంఠ నెలకొంది. డీసీసీ అధ్యక్షుడి ఎంపికలో ఒకటో ప్రాధాన్యత.. రెండో ప్రాధాన్యత పకడ్బందీగా అభిప్రాయ సేకరణ చేస్తున్న ఏఐసీసీ పరిశీలకుడు సెగ్మెంట్లవారీగా మారుతున్న సమీకరణలపై విశ్లేషణ గత ఐదేళ్ల కాలాన్ని కటాఫ్గా పెట్టిన నాయకత్వం -
విద్యార్థుల సంక్షేమంపై దృష్టి పెట్టండి
నిజామాబాద్అర్బన్ : బెస్ట్ అవైలబుల్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి ని కేంద్రీకరించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక ప్రణాళిక, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క అన్నారు. మంగళవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర సాంఘిక, గిరిజన, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాల కలెక్టర్లు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. నిజామాబా ద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుంచి కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, సంక్షేమ శాఖల అ ధికారులు ఈ వీసీలో పాల్గొన్నారు. ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో బెస్ట్ అవైలబుల్ స్కూ ల్స్ స్కీం కింద ఎంపిక చేసిన పాఠశాలలో చదివే షె డ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు చెందిన విద్యా ర్థుల సంక్షేమంపై ఆయా జిల్లాల కలెక్టర్లు నిరంత రం పర్యవేక్షించాలన్నారు. విద్యార్థులకు అందిస్తు న్న బోధన, ఆరోగ్యం, మెనూ ప్రకారం భోజనం, ఇతర మౌలిక వసతుల అమలుపై పాఠశాలలను సందర్శించి పరిశీలించాలన్నారు. ఎంపికైన ప్రతి వి ద్యార్థి పాఠశాలలో ఉండాలని, సమస్యల పరిష్కారంపై ఆయా పాఠశాలల యాజమాన్యాలతో చర్చించి తగు చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థు లకు ఎలాంటి ఆటంకం లేకుండా విద్యాబోధన కొ నసాగేలా చూడాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో జి ల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఉపసంచాలకు లు రజిత, జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారిణి కృష్ణవేణి, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి నాగురా వు, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అ ధికారి నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. ‘బెస్ట్ అవైలబుల్ స్కూల్స్’ను సమీక్షించండి వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్, అధికారులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క -
చెక్డ్యాం బ్యాక్ వాటర్తోనే ముప్పు!
మోర్తాడ్(బాల్కొండ) : శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోని మిగులు జలాలను సద్వినియోగం చేసుకోవడానికి నిర్దేశించిన వరద కాలువకు గండి ఏర్పడిన ఘటనపై ఇంజినీరింగ్ అధికారుల బృందం విచారణ పూర్తి చేసింది. పెద్దవాగు ప్రవాహానికి అడ్డు లేకుండా వరద కాలువ నీటిని మళ్లించడానికి గాండ్లపేట్ వద్ద నిర్మించిన అక్విడెక్ట్ను నిర్మించారు. దీని సమీపంలోనే చెక్డ్యాం నిర్మించడం అందులో నీరు నిలచి ఉండటం వల్లనే వరద కాలువకు ముప్పు ఏర్పడటానికి ప్రధాన కారణం అని అధికారులు నిర్దారించారు. చెక్డ్యాం ఇటీవలే కొట్టుకపోయినా ఎంతో కాలం నీరు నిలచి ఉండటం వల్లనే వరద కాలువ కింది భాగంలోని మట్టి కరిగిపోయి ఇప్పుడు ముప్పు వాటిల్లిందని ఇంజినీరింగ్ అధికారులు గుర్తించారు. వరద కాలువకు ఇటీవల గండి ఏర్పడి నీరు అంతా పెద్దవాగులో ప్రవహించిన విషయం విదితమే. దీనిపై ఎస్సారెస్పీ ఛీఫ్ ఇంజినీర్ సుధాకర్ రెడ్డి, సెంట్రల్ డిజైనింగ్ ఛీఫ్ ఇంజినీర్ సత్యనారాయణరెడ్డి, ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ ఛీఫ్ ఇంజినీర్ శ్రీనివాస్ గండిపడిన చోటును పరిశీలించారు. ఎంతో కాలం మనుగాల్సిన వరద కాలువకు గండి ఏర్పడిన అంశం, అందుకు గల కారణాలపై ప్రభుత్వానికి నివేదికను అందించినట్లు తెలిసింది. వరద కాలువ అక్విడెక్ట్కు 300ల మీటర్ల దూరంలోనే చెక్డ్యాంను నిర్మించడం ఎక్కువ మొత్తంలో నీరు నిలచి ఉండటం వల్లనే గండి ఏర్పడటానికి ప్రధాన కారణం అని అధికారులు గుర్తించారు. కనీసం కిలోమీటర్ దూరంలో చెక్డ్యాంను నిర్మించి ఉంటే బ్యాక్ వాటర్ దూరంలోనే ఆగిపోయేదని అధికారులు భావిస్తున్నారు. అక్విడెక్ట్కు సమీపంలో చెక్డ్యాం నిర్మించడానికి శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఉన్నతాధికారుల అనుమతి తీసుకోలేదని తెలిసింది. నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలోనే చెక్డ్యాం నిర్మించినా వరద కాలువను పర్యవేక్షిస్తున్నవారితో సంప్రదింపులు జరుపకపోవడం గమనించాల్సిన విషయం. వరద కాలువ కింది భాగంలోని మట్టి దశలవారిగా కొట్టుకపోయి ఒక్కసారి నీటి ప్రవాహం పెరగడంతో గండి పరిమాణం పెరిగిందని అధికారులు చెబుతున్నారు. ఇది ఇలా ఉండగా వరద కాలువకు గండి ఏర్పడటంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు లోని మిగులు జలాలను గోదావరి నదిలోనే వదలాల్సి వస్తుంది. గండిని పూడ్చి ముందు ముందు ఎలాంటి ముప్పు ఏర్పడకుండా ఉండటానికి పకడ్బందీగా మరమ్మత్తులు చేయాల్సి ఉంది. ఇంజినీరింగ్ అధికారులు అంచనాలను రూపొందిస్తున్నారు. సిమెంట్ గోడ కింద మట్టి పూర్తిగా కొట్టుకపోవడం శాశ్వత ప్రాతిపదికన మరమ్మత్తులపై అధ్యాయనం చేయడానికి సాంకేతిక నైపుణ్యంగల అధికారి ఒకరు ఒకటి రెండు రోజుల్లో గండి ఏర్పడిన ప్రాంతాన్ని పరిశీలించనున్నారని తెలుస్తుంది.వరద కాలువకు గండి ఏర్పడిన చోట మరమ్మత్తులు పూర్తి చేయడానికి ప్రతిపాదనలు సిద్దం చేస్తున్నాం. గండి ఏర్పడటానికి ప్రధాన కార ణం గుర్తించారు. మరమ్మత్తులు చేసి ముందు ముందు ఎలాంటి ముప్పు ఏర్పడకుండా ఉండటానికి పక్కా ప్రణాళికను సిద్దం చేస్తున్నాం. – చక్రపాణి, ఈఈ, ఎస్సారెస్పీ ఇటీవల గాండ్లపేట్ వద్ద వరద కాలువకు గండి ఇంజినీరింగ్ అధికారుల బృందం విచారణ పూర్తి మరమ్మతుల కోసం అంచనాలు తయారు చేస్తున్న అధికారులు -
భారీ అక్రమాలు
రేషన్ కార్డుల్లోనిజామాబాద్అర్బన్ : ప్రజాపాలన కింద నూతన రేషన్ కార్డులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేస్తోంది. జిల్లాలో ఇప్పటికే 3,83,384 రేషన్ కార్డులు ఉన్నాయి. కొత్తగా మంజూరైన రేషన్ కార్డుల్లో లక్షా 18 వేల మంది పేర్లు చేరాయి. ఇదిలా ఉండగా అనర్హులకు సైతం రేషన్ కార్డులు దక్కినట్లు పలు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇందులో కొందరు అధికారు లు, రెవెన్యూ సిబ్బంది భారీగా వసూళ్లు చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పౌరసరఫరాల శాఖ కమిషనర్కు ఫిర్యాదులు వెళ్లగా ఆయన అక్రమార్కుల జాబితాను జిల్లాకు పంపి విచారణ కోసం ఆదేశించినట్లు సమాచారం. నిబంధనల ప్రకారం.. అధికారులు దరఖాస్తులను పరిశీలించి అర్హులైన వారిని గుర్తించి రేషన్ కార్డు మంజూరు చేయాలి. అదేవిధంగా రేషన్ కార్డులో కుటుంబ సభ్యుల పేర్లు చేర్చాలి. ఈ ప్రక్రియ మూడు నెలల పాటు కొనసాగింది. ఇదే అదునుగా భావించిన కొందరు రెవెన్యూ అధికారులు, సిబ్బంది భారీగా వసూళ్లకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఏ మాత్రం అర్హత లేని వారికి రేషన్ కార్డులు మంజూరు చేశారని సమాచారం. నూతనంగా రేషన్ కార్డు పొందడం కోసం ఒక్కొ క్కరి వద్ద నుంచి రూ.10 వేల నుంచి రూ. 15 వేల వరకు వసూలు చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఇందులో ‘మీ సేవ’ కేంద్రాల నిర్వాహకులు ప్రధాన భూమిక పోషించారు. మీ సేవ కేంద్రాలకు వచ్చే అనర్హులైన దరఖాస్తుదారుల నుంచి రేషన్ కార్డులు మంజూరు చేయిస్తామని చెప్పి వసూళ్లకు పాల్పడ్డారు. దరఖాస్తుదారులను తహసీల్ కార్యాలయా లకు తీసుకెళ్లి భరోసా ఇప్పించారు. ఈ క్రమంలో జరిపిన వసూళ్లలో రెవెన్యూ సిబ్బందికి వాటాలు పంచినట్లు తెలుస్తోంది. జిల్లా కేంద్రంలోని నిజామాబాద్ సౌత్ మండ లం తహసీల్ కార్యాలయంలో అత్యధిక అక్రమాలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఇందులో పని చేసే ఉద్యోగి ఏకంగా 34 మంది నుంచి భారీ మొ త్తంలో డబ్బులు తీసుకున్నట్లు అధికారులు విచారణలో తేలింది. అదేవిధంగా జిల్లా కేంద్రంలో మూ డు మీ సేవా కేంద్రాలను, ధర్పల్లి, సిరికొండ, రెంజల్, ఎడపల్లి, నవీపేట మండల కేంద్రాల్లోని మీసే వ కేంద్రాలు అక్రమాలకు అడ్డాగా గుర్తించారు. వీటి పై విచారణ పూర్తయ్యింది. బాల్కొండ, భీమ్గల్, కమ్మర్పల్లి మండల కేంద్రాల్లోని రెవెన్యూ సిబ్బంది భారీ మొత్తంలో వసూలు చేశారని తెలిసింది. ని జామాబాద్ అర్బన్లో బోగస్ రేషన్ కార్డుల జారీ ఎక్కువగా జరిగినట్లు అధికారులు గుర్తించారు. జిల్లా కేంద్రంలో పని చేసే ఓ ప్రభుత్వ ఉద్యోగి ఏ కంగా రూ. 20 వేలు ఇచ్చి సౌత్ మండలంలో మూ డు రేషన్ కార్డులు పొందినట్లు తెలుస్తోంది. గాంధీచౌక్లోని వ్యాపార నిర్వాకుడు, వినాయక నగర్లో ని పెట్రోల్ బంక్ యజమాని, బోధన్ రోడ్డులోని ఓ ప్రైవేట్ పాఠశాల యజమాని రేషన్ కార్డులు పొందినట్లు అధికారుల అధికారులు గుర్తించారు.పది మండలాల్లో.. జిల్లాలోని పది మండలాల్లో 22 మంది రెవెన్యూ సిబ్బంది, అధికారులు రేషన్ కార్డుల జారీలో అక్రమాలకు పాల్పడినట్లు విచారణ అధికారులు తేల్చారు. దరఖాస్తుదారుడు రేషన్ కార్డు కోసం ఆన్లైన్లో మీ సేవ కేంద్రంలో దరఖాస్తు చేసుకోగానే మండల కార్యాలయంలోని సిబ్బంది క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టాలి. రేషన్ కార్డుకు అర్హతలు గుర్తించి కార్డు మంజూరు కోసం పౌరసరఫరాల శాఖకు సిఫార్సు చేయాలి. ఈ క్రమంలోనే రెవెన్యూ సిబ్బంది క్షేత్రస్థాయిలో విచారణ పేరిట దరఖాస్తుదారుడు అనర్హురుడు అయితే డబ్బులు వసూలు చేసి అర్హుడిగా సిఫార్సు చేశారు. ఇలా వందలాది మంది అనర్హులకు రేషన్ కార్డులు జారీ చేశారు. మండల కార్యాలయంలో పనిచేసే కొందరు రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, మరికొందరు తహసీల్దారులు కూడా ఈ అక్రమాల్లో భాగస్వాములైనట్లు తెలుస్తోంది. పౌరసరఫరాల శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు నెల రోజుల క్రితమే అదనపు కలెక్టర్ ఆధ్వర్యంలో విచారణ పూర్తయ్యింది. అక్రమార్కులకు గుర్తించారు. అయితే అక్రమార్కులపై చర్యలు తీసుకోవడంలో మీనవేషాలు లెక్కిస్తున్నారు. దీని వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నట్లు సమాచారం.జిల్లాలో రేషన్ కార్డుల జారీలో జరిగిన అక్రమాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ ఆదేశించినా తగిన ఫలితం కనిపించడం లేదు. రేషన్ కార్డుల జారీలో కొన్ని మండలాల్లో అనర్హులను ఎంపిక చేశారు. అక్రమాలకు పాల్పడిన అధికారులు, సిబ్బంది పేర్లు, ఎవరు ఎంతెంత వసూలు చేశారనే వివరాలతో కమిషనర్ జిల్లా అధికారులకు జాబితాను పంపినట్లు తెలుస్తోంది. విచారణ జరిపిన అధికారులు చర్యలు తీసుకోవడంలో వెనుకంజ వేస్తున్నారు.చర్యలు శూన్యం! భారీ వసూళ్లు.. అనర్హులకు రేషన్ కార్డుల జారీ అక్రమార్కుల్లో రెవెన్యూ అధికారులు, సిబ్బంది ‘మీసేవ’ కేంద్రాల నిర్వాహకుల ప్రధాన భూమిక రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ ఆగ్రహం విచారణ పూర్తి చేసిన జిల్లా అధికారులు -
మార్కెట్యార్డు అభివృద్ధికి సమష్టి కృషి
● రూ.3 కోట్లతో కవర్షెడ్, టాయిలెట్ల నిర్మాణం ● నిజామాబాద్ ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి సుభాష్నగర్ : నిజామాబాద్ మార్కెట్ యార్డు అభివృద్ధికి మంత్రి, జిల్లా ఎమ్మెల్యేల సహకారంతో అధి కారులు, పాలకవర్గం సమష్టిగా కృషి చేస్తోందని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగా రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం నగరంలోని వ్యవ సాయ మార్కెట్ కార్యాలయంలో పాలకవర్గ సాధా రణ సమావేశం జరిగింది. చైర్మన్ గంగారెడ్డి మాట్లా డుతూ మార్కెట్యార్డులో కవర్ షెడ్, కూరగాయల మార్కెట్లో రెండు టాయిలెట్స్ బ్లాకుల నిర్మాణానికి రూ.3 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. రూ.97 లక్షలతో గాంధీగంజ్లో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయన్నారు. కూరగాయల మార్కెట్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. మార్కెట్లో కవర్ షెడ్, సీసీ కెమెరాల పునరుద్ధరణ, నూతనంగా సీసీ కెమెరాలు ఏర్పాటు, అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు పంపించాలని పాలకవర్గం తీర్మానించింది. వైస్ చైర్మన్ రాంచంద ర్ మాట్లాడుతూ చైర్మన్, పాలకవర్గ సభ్యుల మధ్య ఎలాంటి విభేదాలు లేవన్నారు. సమావేశంలో సెల క్షన్ గ్రేడ్ సెక్రటరీ అపర్ణ, గ్రేడ్–1 సెక్రటరీ విజయ్కి షోర్, డైరెక్టర్లు మారుతీ మల్లేష్, గంగారెడ్డి, రాజలింగం,బాగారెడ్డి, నరేందర్ తదితరులు పాల్గొన్నారు. -
నిందితుడిని అరెస్టు చేయాలి
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయిపై దాడికి యత్నించిన నిందితుడిని వెంటనే అరెస్టు చేయాలని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు కనుక ప్రమోద్, ఎమ్మార్పీఎస్ అనుబంధ సంఘాల నాయకులు ప్రజావాణిలో వినతిపత్రం సమర్పించారు. ప్రమోద్ మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై దాడి అంటే ప్రజాస్వామ్యం మీద దాడిగా చూడాలన్నారు. గవాయి దళితుడు కాబట్టి ఈ దాడి జరిగిందన్నారు. జిల్లా అధ్యక్షుడు సరికెల పోశెట్టి సీనియర్ నాయకులు మైలారం బాలు. జాతీయ ఉపాధ్యక్షుడుగంగారం, సురేష్ నాంపల్లి, మారుతి, యమున, స్వప్న, భూమయ్య, ప్రవీణ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
నిధులు విడుదల చేయాలి
పెండింగ్లో ఉన్న బెస్ట్ అవైలబుల్ స్కూల్స్కు సంబంధించి 250 కోట్ల రూపాయలను విడుదల చేయాలని బోధన్ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ఈమేరకు వారు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. నాయకులు నవాతే ప్రతాప్ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా బెస్ట్ అవైలబుల్ స్కూల్స్కు సుమారు 250 కోట్లకు పైగా బకాయిలు ఉన్నాయని, వాటిని వెంటనే రిలీజ్ చేయాలన్నారు. లేదంటే రాష్ట్రంలో ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామన్నారు. నాయకులు దేవర్ల నాగరాజు, రాజన్న, గౌతమ్ కుమార్, సంజయ్, మోసిన్, బాలరాజ్, ప్రశాంత్, శ్రీకాంత్ మోహన్, కిరణ్, సతీష్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
పోలీస్ ప్రజావాణికి 20 ఫిర్యాదులు
నిజామాబాద్అర్బన్: నగరంలోని పోలీస్ కమిషనరేట్లో సోమవారం నిర్వహించిన పోలీస్ ప్రజావాణి కార్యక్రమంలో 20 ఫిర్యాదులు వచ్చాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి సీపీ సాయి చైతన్య అర్జీలను స్వీకరించారు. ఈసందర్భంగా సీపీ మాట్లాడుతూ.. ఫిర్యాదుదారుల అర్జీలను చట్టప్రకారం పరిష్కారం చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. సమస్య, స్థితిని పరిష్కారానికి సూచనలు చేశారు. ప్రజలు నిర్భయంగా మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా ఎలాంటి పైరావీలు లేకుండా స్వచ్ఛందంగా పోలీసు సేవలను వినియోగించుకుంటూ, సమస్యలను చట్టప్రకారం పరిష్కరించుకోవాలన్నారు. పోలీసులు ప్రజలకు మరింత దగ్గర అయ్యేలా శాంతిభద్రతలు పరిరక్షిస్తూ ముందుకు సాగడమే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ పనిచేస్తుందన్నారు. -
దేవుడి ముందు పెట్టిన దీపం అంటుకొని ఇల్లు దగ్ధం
బాల్కొండ: దేవుడి ఫొటోల ముందు ఉన్న దీపంతో ఇంటికి నిప్పు అంటుకొని కాలిపోయిన ఘటన మెండోరా మండల కేంద్రంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా.. మెండోరాలోని రాజారపు భార్గవి సోమవారం ఇంట్లో దేవుడి ఫొటోల ముందర దీపం ముట్టించింది. అనంతరం ఇళ్లకు తాళం వేసి బయటకు వెళ్లింది. కొంత సమయం తర్వాత ఇంట్లో నుంచి పొగలు రావడాన్ని చుట్టుపక్కల వారు గమనించి, ఇంటి తాళాలు పగలగొట్టారు. కానీ అప్పటికే ఇంట్లో సామగ్రి, నగదు కాలి బూడిదయ్యాయి. విషయం తెలసుకున్న రెవెన్యూ ఇన్స్పెక్టర్ వేణుగోపాల్ చారి ఘటన స్థలాన్ని పరిశీలించారు. సుమారు రూ. లక్ష నష్టం వాటిల్లినట్లు తెలిపారు. బాధితులకు తక్షణ సహాయం కింద రేషన్ బియ్యాన్ని అందించారు. ప్రభుత్వం నుంచి సహాయం అందేలా ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తానన్నారు. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు కోరారు. -
లింబాద్రి గుట్ట జాతరలో పాల్గొనాలని ఎమ్మెల్యేకు ఆహ్వానం
కమ్మర్పల్లి(భీమ్గల్): భీమ్గల్లోని లింబాద్రి గుట్ట(నింబాచలం) లక్ష్మీ నరసింహస్వామి జాతరలో పాల్గొనాలని బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్రెడ్డిని సోమవారం ఆలయ అర్చకులు పార్థసారథి ఆహ్వానించారు. ఈమేరకు ఎమ్మెల్యేను హైదరాబాద్లోని ఆయన నివాసంలో కలిసి, ఆహ్వాన పత్రికను అందజేసి, ఆశీర్వదించారు. వచ్చే నెల 5న జరిగే జాతరకు హాజరుకావాలని కోరారు. దోమకొండ: బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాల్సిందేనని బీసీ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం మండల కేంద్రంలోని గాంధీచౌక్ వద్ద బీసీ సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడారు. జనాభాలో ఎక్కువ శాతం ఉన్న బీసీలకు రాజకీయంగా అన్యాయం జరుగుతుందన్నారు. ప్రతి పార్టీ బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. నాయకులు ఐరేని నర్సయ్య, తీగల తిర్మల్గౌడ్, అబ్రబోయిన స్వామి, రాజేందర్, మర్రి శేఖర్, తదితరులు పాల్గొన్నారు. -
ముగిసిన అటవీశాఖ స్పోర్ట్స్ మీట్
నిర్మల్టౌన్: జిల్లాకేంద్రంలోని డిగ్రీ కళాశాల మైదానంలో అటవీశాఖ ఆధ్వర్యంలో రెండు రోజులుగా నిర్వహించిన స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ ఆదివారం రాత్రి అట్టహాసంగా ముగిసింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా జిల్లా జడ్జి శ్రీవాణి, అటవీశాఖ బాసర సర్కిల్ చీఫ్ కన్జర్వేటర్ శర్వానన్ హాజరై విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. పోటీల్లో నిర్మల్, నిజామాబాద్, ఆదిలాబాద్, జగిత్యాల జిల్లాలకు చెందిన సుమారు 350 మంది అటవీశాఖ క్రీడాకారులు పాల్గొనగా 35 రకాల క్రీడలు నిర్వహించారు. టగ్ ఆఫ్ వార్ పురుషుల విభాగంలో నిర్మల్ జట్టు, మహిళల విభాగంలో ఆదిలాబాద్ జట్టు విజేతగా నిలిచాయి. వాలీబాల్లో ప్రథమ విజేతగా ఆదిలాబాద్, రన్నరప్గా నిర్మల్ జట్టు, క్రికెట్లో నిజామాబాద్ జట్టు, కబడ్డీ పురుషుల విభాగంలో నిజామాబాద్, మహిళల విభాగంలో నిర్మల్ జట్టు, త్రోబాల్ మహిళల విభాగంలో ఆదిలాబాద్ జట్టు, మార్చ్పాస్ట్లో నిర్మల్ జట్టు విజేతగా నిలిచాయి. ఓవరాల్ ఛాంపియన్స్ ట్రోఫీని నిర్మల్ జట్టు కై వసం చేసుకుంది. నిజామాబాద్ డీఎఫ్వో వికాస్ మీనా, నిర్మల్ డీఎఫ్వో నాగిని భాను, అధికారులు సుధాకర్రావు, శివకుమార్, నాలుగు జిల్లాల అటవీశాఖ అధికారులు, సిబ్బంది తదితరు లు పాల్గొన్నారు. -
ఎస్సారెస్పీలోకి మళ్లీ పోటెత్తిన వరద
● నాలుగు గేట్ల ద్వారా 12,500 క్యూసెక్కుల నీటి విడుదల ● నిండుకుండలా శ్రీరాంసాగర్ వరద గేట్ల ద్వారా విడుదలవుతున్న నీరు బాల్కొండ : శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లోకి వరద ఆదివారం మధ్యాహ్నం నుంచి మళ్లీ పోటెత్తింది. ప్రాజెక్ట్లోకి గరిష్టంగా 60 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో రావడంతో 16 వరద గేట్లను ఎత్తి గోదావరిలోకి 50 వేల క్యూసెక్కుల నీటిని వదిలారు. సోమవారం ఉదయం నుంచి సాయంత్రానికి క్రమంగా ఇన్ఫ్లో 34 వేల 709 క్యూసెక్కులకు పడిపోయింది. దీంతో దిగువకు నీటి విడుదలను తగ్గించారు. 8 వరద గేట్ల ద్వారా 25 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. రాత్రి సమయానికి ఇన్ఫ్లో మరింత తగ్గి 23 వేల క్యూసెక్కులకు పడిపోవడంతో నాలుగు గేట్ల ద్వారా 12,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కాకతీయ కాలువ ద్వారా 5 వేల క్యూసెక్కులు, ఎస్కేప్గేట్ల ద్వారా 3 వేలు, సరస్వతి కాలువ ద్వారా 650, లక్ష్మి కాలువ ద్వారా 200, మిషన్ భగీరథ ద్వారా 231 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండగా, ఆవిరి రూపంలో 709 క్యూసెక్కుల నీరు పోతోంది. ప్రాజెక్ట్పూర్తి స్థాయి నీటి మట్టం 1091(80.5 టీఎంసీలు) అడుగులు కాగా అంతే స్థాయి నీటి మట్టంతో ప్రాజెక్ట్నిండుకుండలా ఉందని అధికారులు తెలిపారు. -
నాణ్యతపై నిఘా ఏదీ?
నిజామాబాద్ఫిర్యాదులను సత్వరమే.. ప్రజావాణికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్లు అధికారులకు సూచించారు. మంగళవారం శ్రీ 14 శ్రీ అక్టోబర్ శ్రీ 2025– 10లో uసాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : ఆహార పదార్థాలతోపాటు బంగారం, వెండి ఆభరణాలు, ఎలక్ట్రిక్, ఎలక్ట్రానిక్ గృహోపకరణాలు, కార్లు, బైక్స్ తదితర ఆటోమొబైల్స్, మోటార్లు, ట్రాన్స్ఫార్మర్లు, సిమెంట్, స్టీల్ తదితర ఇతర అన్నిరకాల వస్తువులకు సంబంధించి ‘బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్’(బీఐఎస్) నిర్దేశించిన మేరకు నాణ్యతాప్రమాణాలు పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా అందరికీ ప్రియమైన, ప్రస్తుతం రోజురోజుకూ భారీగా ధర పెరుగుతున్న బంగారం విషయానికి వస్తే హెచ్యూఐడీ (హాల్మార్కింగ్ యూనిక్ ఐడెంటిఫికేషన్) నంబరు విషయంలో మాయాజాలం జరుగుతోంది. అయితే రాష్ట్రంలో, దేశంలోనూ ఈ ప్రమాణాలు పాటించడం సంగతి అటుంచితే.. ఇందుకు సంబంధించి నిఘా పెట్టే వ్యవస్థ సక్రమంగా పనిచేయలేని పరిస్థితి. ప్రతి రాష్ట్రంలో ఒక్కచోట మాత్రమే ఉండే బీఐఎస్ కార్యాలయాలకు తగినంతమంది సిబ్బంది లేకపోవడంతో ఇన్స్పెక్షన్లు చేయలేని పరిస్థితి నెలకొంది. దీంతో తగిన చర్యలు తీసుకునే అవకాశాలు లేవు. దీంతో నాణ్యతా ప్రమాణాల విధానాలు ఆశించినవిధంగా అమలు కావడం లేదు. అక్టోబర్ 14 అంతర్జాతీయ ప్రమాణాల దినోత్సవం నేపథ్యంలో కథనం.. అన్నిరకాల వస్తువులకు సంబంధించి నాణ్యత పరంగా బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అనే కేంద్ర ప్రభుత్వ సంస్థ ప్రమాణాలు (స్టాండర్డ్స్)ను నిర్ణయిస్తుంది. ఈ మేరకు ఆయా వస్తువుల అమ్మకాలు చేపట్టాలి. అప్పుడే వినియోగదారులకు ఆర్థికపరంగా, ఆరోగ్యరీత్యా రక్షణ ఉంటుంది. అన్నింటిలో ఖరీదైన, పెట్టుబడి వస్తువుగా ఉన్న బంగారు ఆభరణాలకు ప్రమాణాలతోపాటు ఆరు అంకెల హాల్మార్కింగ్ యూనిక్ ఐడెంటిఫికేషన్ (హెచ్యుఐడీ)ని తప్పనిసరిగా ముద్రించాలి. ఈ నంబర్ రసీదుపైనా ఉండాలి. అయితే ఈ ప్రమాణాల విధానం సరైనదే అయినప్పటికీ అమలులో లోపాల కారణంగా వినియోగదారులు నిరంతరం మోసపోతూనే ఉన్నారు. ప్రమాణాల అమలుపై బీఐఎస్ విభాగానికి సంబంధించి రాష్ట్రంలో ఒక్క కార్యాలయం మాత్రమే ఉండడంతోపాటు తగినంత మంది సిబ్బంది లేకపోవడంతో తనిఖీలు చేసే పరిస్థితి లేదు. దీంతో ప్రమాణాలు సరిగానే అమలు చేస్తున్నారా? లేదా? అని పర్యవేక్షించే పరిస్థితి లేదు. మరోవైపు వినియోగదారులకు ప్రమాణాల విషయమై అవగాహన లేకపోవడంతో ముఖ్యంగా బంగారు ఆభరణాలపై లోపాలతో కూడిన నకిలీ ముద్రలు, ఇతర వస్తువులపై అసలు ముద్రలే (బీఐఎస్, ఐఎస్ఐ) లేకపోవడంతో దారుణంగా మోసపోతున్నారు. తెలంగాణలో బంగారు ఆభరణాలపై హెచ్యూఐడీ ప్రమాణాల ముద్రలు వేసే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అనుమతించిన 22 హాల్మార్కింగ్ కేంద్రాల్లో 16 కేంద్రాల లైసెన్సులు తాత్కాలికంగా రద్దు చేశారు. ఇక దేశవ్యాప్తంగా 546 హాల్మార్కింగ్ కేంద్రాల లైసెన్సులు రద్దు చేయడం గమనార్హం. ఈ లైసెన్సులు కలిగి ఉన్న కేంద్రాలు ముద్రలు వేసే విషయంలో అనేక అవకతవకలకు పాల్పడడంతో వాటిని రద్దు చేశారు. అన్ని ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ఒక్కోటి మాత్రమే ఉన్న బంగారం హాల్మార్క్ కేంద్రాల లైసెన్సులు రద్దు చేయడంతో వినియోగదారులకు ముద్రలు లేకుండానే అమ్మకాలు చేస్తున్నారు. కచ్చితమైన ప్రమాణాల నిబంధనలు ఉన్నప్పటికీ వినియోగదారులు మోసపోతున్న పరిస్థితి.మనం వాడే, మనకు అవసరమైన వస్తువుకు ప్రాముఖ్యత దాని నాణ్యతాప్రమాణంపై ఆధారపడి ఉంటుంది. మరి వస్తువు నాణ్యతాప్రమాణాల కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ విధానాలు సూచించినప్పటికీ అమలు మాత్రం అంతంతగానే ఉండటం గమనార్హం. అతి విలువైన బంగారం కొనుగోళ్ల సందర్భంగా వినియోగదారులు మోసపోతూనే ఉన్నారు. ప్రమాణాల విధానాలు సరే.. అమలు అంతంతేనా..? గృహోపకరణాలు, ఆటోమొబైల్స్, సిమెంట్, స్టీల్ తదితరాల ప్రమాణాలపై లేని పట్టింపు అందరికీ ప్రియమైన బంగారంలో అనేక లోపాలు హెచ్యూఐడీలో మాయాజాలం అక్టోబర్ 14 అంతర్జాతీయ ప్రమాణాల దినోత్సవం -
హెచ్యూఐడీ నంబరు అనే మాటే లేదు
బంగారు, వెండి ఆభరణాల వ్యాపారంలో లీగ ల్ మెట్రాలజీ శాఖ కేవ లం ఎలక్ట్రానిక్ కాంటా లు, తూకంల తనిఖీకే పరిమితమవుతోంది. వినియోగదారులు బంగారు, వెండి ఆభరణాల నాణ్యత విషయంలో మోసపోతున్నారు. అధికారులు నాణ్యత పరీక్షలు నిర్వహించడం లేదు. దీంతో వ్యాపారులు బిల్లులపై హెచ్యూఐడీ నంబరు వేయకుండానే విక్రయాలు చేస్తున్నా రు. వినియోగదారుల మండలి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 14 నుంచి 28వ తేదీ వర కు అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాలపై కార్యక్రమాలు చేస్తున్నాం. వినియోగదారులను చైత న్యవంతులను చేస్తూ, నాణ్యతా లోపాలతో మోసపోయిన వినియోగదారులు.. వినియోగదారులు కమిషన్లలో ఫిర్యాదు చేసేవిధంగా కార్యక్రమాలను రూపొందించాం. దే శంలో ఇటీవల కాలంలో ఏకంగా 546 హాల్మా ర్క్ కేంద్రాల లైసెన్సులు రద్దు కావడాన్ని వినియోగదారుల హక్కుల పరిరక్షణ దృష్ట్యా అతిపెద్ద సమస్యగా పరిగణించాలి. ప్రపంచంలో అన్నివర్గాల ప్రజలకు పొదుపు మాంద్యంగా ఉన్న బంగారంపై ప్రమాణాల విధానం కఠినంగా అమలు చేయాల్సి ఆవశ్యకత ఉంది. – సాంబరాజు చక్రపాణి, వినియోగదారుల మండలి జాతీయ ప్రధాన కార్యదర్శి -
శిక్షణ కేంద్రంలో సౌకర్యాలను మెరుగుపర్చాలి
బోధన్ : పోలీసు ట్రెయినింగ్ సెంటర్లో సౌ కర్యాలు, వసతిని మరింత మెరుగుపర్చాల ని సంబంధిత అధికారులను సీపీ సాయిచైత న్య ఆదేశించారు. ఎడపల్లి మండలం జానకంపేట గ్రామశివారులోని జిల్లా పోలీస్ శిక్ష ణ కేంద్రాన్ని సీపీ సోమవారం సందర్శించా రు. కేంద్రం పరిసరాల్లో కలియదిరిగారు. గ దులు, వంటశాల, నీటిసరఫరా, మరుగుదొడ్లు, అవుట్ డోర్ పరేడ్ గ్రౌండ్, ఫైరింగ్ రేంజ్ పరిశీలించారు. సీపీ వెంట బోధన్ ఏసీపీ శ్రీనివాస్, రూరల్ సీఐ విజయ్బాబు, ఎడపల్లి ఎస్సై ముత్యాల రమ, శిక్షణా కేంద్రం ఉద్యోగులు, సిబ్బంది ఉన్నారు. వైన్ షాపులకు 232 దరఖాస్తులు నిజామాబాద్ అర్బన్: జిల్లాలోని 102 మ ద్యం దుకాణాలకు ఇప్పటి వరకు మొత్తం 232 దరఖాస్తులు అందినట్లు జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి ఒక ప్రకటన లో తెలిపారు. సోమవారం 83 దరఖాస్తులు అందాయని, దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోందని పేర్కొన్నారు. గెస్ట్ లెక్చరర్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం ఖలీల్వాడి : డైట్ కళాశాలలో తాత్కాలిక ప్రాతిపదికన అతిథి అధ్యాపక పోస్టుల (గెస్ట్ లెక్చరర్)భర్తీ కోసం అర్హుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ టి శ్రీనివాస్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేసుకునే సమయానికి అభ్యర్థుల వయస్సు 65 సంవత్సరాల లోపు ఉండాలని, రిటైర్డ్ లెక్చరర్లు, టీచర్లు, ప్రధానోపాధ్యాయులు, నిరుద్యోగ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఇంగ్లిష్, తెలుగు మీడియంలో ఫిలాసఫీ, సోషి యాలజీ సబ్జెక్టుల్లో ఒక పోస్టు, మ్యాథమెటిక్స్ సబ్జెక్టులో ఒక పోస్టు, ఉర్దూ మీడియంలో రెండు పోస్టులు మ్యాథమేటిక్స్, ఫిలా సఫీ/సోషియాలజీ/సైకాలజీ సబ్జెక్ట్స్లో ఖా ళీలు ఉన్నాయని వివరించారు. అభ్యర్థు లు సంబంధిత సబ్జెక్టులో పోస్టు గ్రాడ్యుయేషన్తోపాటు ఎంఎడ్ అర్హత కలిగి ఉండాలని సూచించారు. ఎంఎడ్ అభ్యర్థులు అందుబాటులో లేనిపక్షంలో సంబంధిత సబ్జెక్టుకు బీఎడ్ అభ్యర్థులను పరిగణనలోకి తీసుకుంటామని తెలిపారు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు కళాశాలలో ఈనెల 15 నుంచి 18వ తేదీ వరకు దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. మెరిట్ ప్రాతిపదికన 1:5 నిష్పత్తిలో డెమో, ఇంటర్వ్యూ నిర్వహిస్తామని ప్రిన్సిపాల్ తెలిపారు. రేపు జాబ్ మేళా నిజామాబాద్ నాగారం: నిరుద్యోగులకు ప్రైవేట్రంగంలో ఉద్యోగాలు కల్పించేందుకు బుధవారం జాబ్మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి బీపీ మధుసూదన్రావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. వరుణ్ మోటార్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న జాబ్మేళా ద్వారా సేల్స్ ఎగ్జిక్యూటివ్స్, ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్స్, టెక్నీషియన్, సెక్యూరిటీ గార్డు, సలహాదారు, క్యాషియర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. పదో తరగతి, ఏదైనా డిగ్రీ, బీటెక్ పూర్తి చేసిన వారు అర్హులని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు నిజామాబాద్నగరంలోని శివాజీనగర్లోని జిల్లా ఉపాధి కార్యాలయంలో బుధవారం ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం వరకు ఇంటర్వ్యూకు హాజరుకావాలని తెలిపారు. ఇతర వివరాలకు 99594 56793, 99487 48428, 63057 43423 నంబర్లను సంప్రదించాలని సూచించారు. పోలీస్ సిబ్బందికి ఉలెన్ జాకెట్లు పంపిణీ నిజామాబాద్అర్బన్: ఏఆర్, సివిల్ పోలీస్ సిబ్బందికి సీపీ సాయిచైతన్య సోమవారం త న కార్యాలయంలో ఉలెన్ జాకెట్లు, హవర్ సాక్సులు అందజేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. చలికాలాన్ని దృష్టిలో ఉంచుకుని ముందుజాగ్రత్తగా అందజేశామని, సిబ్బంది ఉలెన్ జాకెట్లు, హవర్ సాక్సు లు తమ వెంట ఉంచుకుని ఉపయోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో రిజర్వ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, స్పెషల్ బ్రాంచ్ సబ్ ఇన్స్పెక్టర్ సంతోష్రెడ్డి, ఆర్ఎస్సైలు నిశిత్, సుమంత్ తదితరులు పాల్గొన్నారు. -
మక్క కొనుగోళ్లకు ఏర్పాట్లు!
● 26 సెంటర్లను ఖరారు చేసిన అధికారులు ● ఇక ప్రభుత్వ ఆదేశాలే తరువాయి డొంకేశ్వర్ మండలం తొండాకూర్ శివారులో మక్కలను ఆరబెడుతున్న రైతులుడొంకేశ్వర్(ఆర్మూర్): జిల్లాలో మక్క కొనుగోళ్లకు యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ఎన్ని సెంటర్లు, ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలనే దానిపై కసరత్తు చేసిన అధికారులు.. జిల్లా వ్యాప్తంగా 14 మండలాల్లో 26 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని నిర్ణయానికి వచ్చారు. మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో కొనుగోళ్లు చేపట్టనుండగా సహకార సంఘాల ద్వారా మక్కలను సేకరించనున్నారు. ఈ మేరకు ఎంపిక చేసిన సొసైటీల్లో ఈ–పాస్ యంత్రాలను అందుబాటులో పెట్టుకోవాలని మార్క్ఫెడ్ అధికారులు సహకార శాఖకు లేఖ రాశారు. అయితే మక్క కొనుగోళ్లపై మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ఇటీవల ప్రకటన చేయడంతో రెండు, మూడు రోజుల్లో జీవో ద్వారా ఆదేశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ఆదేశాలు రాగానే కేంద్రాలను తెరిచేందుకు సిద్ధంగా ఉండాలని సొసైటీ సీఈవోలకు సూచించారు. కేంద్రాల్లోనే మద్ధతు ధర జిల్లాలో ఖరీఫ్ సీజన్కుగాను 52,093 ఎకరాల్లో మొక్కజొన్నను రైతులు సాగు చేశారు. సుమారు 1.45లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం పంట కోతలు మొదలై 20 రోజులవుతున్నా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయలేదు. దీంతో వేచి చూసే పరిస్థితి లేక క్వింటాల్కు రూ.2,100 రేటు వచ్చినా రైతులు అమ్మేస్తున్నారు. ప్రభుత్వం మొక్కజొన్నకు రూ.2,420 మద్దతు ధర ప్రకటించినప్పటికీ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతో మద్ధతు ధరను పొందలేకపోతున్నారు. మొక్కజొన్న కోతలు దాదాపు పూర్తి కాగా, మార్కెట్లో 40 శాతం మక్కలు ప్రైవేట్ వ్యాపారులకు విక్రయించారు. సెంటర్ల ఏర్పాటుపై ప్రభుత్వం ఇంకా ఆలస్యం చేస్తే వ్యాపారులు మరింత తక్కువ ధరకు కోనే అవకాశం ఉందని రైతులు అంటున్నారు. మక్కలను కొనుగోలు చేసేందుకు జిల్లాలో సెంటర్లను ఎంపిక చేశాం. సొసైటీల ద్వారా రైతుల నుంచి మక్కలను కొంటాం. ప్రభుత్వం నుంచి రెండు, మూడు రోజుల్లో ఆదేశాలు వచ్చే అవకాశాలున్నాయి. రాగానే కేంద్రాలను తెరుస్తాం. – దాసోజు మహేశ్, మార్క్ఫెడ్ డీఎం -
అక్రమాలకు తావిస్తే క్రిమినల్ కేసులు
● ధాన్యం సేకరణలో రైతులకు ఇబ్బందులు ఎదురైతే అధికారులదే బాధ్యత ● వీడియోకాన్ఫరెన్స్లో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డినిజామాబాద్ అర్బన్: ధాన్యం సేకరణలో అక్రమాలకు తావిస్తే క్రిమినల్ కేసులు పెడతామని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి హెచ్చరించారు. ఏ దశలోనూ రైతులకు ఇబ్బందులు ఎదురుకాకుండా, ధాన్యం సేకరణ ప్రక్రియ సాఫీగా సాగేలా సమగ్ర ప్రణాళికతో ముందుకెళ్లాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ సూచించారు. ధాన్యం కొనుగోళ్లపై సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సబ్ కలెక్టర్లు, ఆర్డీవో, తహసీల్దార్లు, సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధాన్యం సేకరణ సందర్భంగా ఎక్కడైనా రైతులు ఆందోళనలకు దిగితే సంబంధిత అధికారులనే బాధ్యులుగా పరిగణిస్తామని స్పష్టం చేశారు. తహసీల్దార్లు క్రియాశీలక పాత్ర పోషిస్తూ, బాధ్యతాయుతంగా పని చేయాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించడంతోపాటు ఎఫ్ఏక్యూ ప్రమాణాలకు లోబడి బాగా ఆరబెట్టి, శుభ్రపర్చిన ధాన్యాన్ని తీసుకువచ్చేలా క్షేత్ర స్థాయిలో రైతులను చైతన్యపర్చాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. పచ్చి ధాన్యం కోయకుండా రైతులు, హార్వెస్టర్ల యజమానులకు అవగాహన కల్పించాలన్నారు. అకాల వర్షాలకు ధాన్యం తడవకుండా కొనుగోలు కేంద్రాల్లో టార్పాలిన్లు, గన్నీ బ్యాగులు అందుబాటులో ఉంచాలన్నారు. అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, సబ్ కలెక్టర్లు వికాస్ మహతో, అభిజ్ఞాన్ మాల్వియా, ట్రెయినీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావి, ఆర్డీవో రాజేంద్రకుమార్, డీఆర్డీవో సాయాగౌడ్, డీఎస్వో అరవింద్రెడ్డి, సివిల్ సప్లయీస్ డీఎం శ్రీకాంత్రెడ్డి, డీసీవో శ్రీనివాస్, జిల్లా వ్యవసాయ అధికారి గోవిందు, రవాణా శాఖ అధికారి ఉమామహేశ్వర్రావు, మార్కెటింగ్ శాఖ ఏడీ గంగవ్వ, తహసీల్దార్లు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. -
పార్టీ కోసం పనిచేసేవారికే పదవులు
నిజామాబాద్ సిటీ: డీసీసీ, సీసీసీ అధ్యక్ష పదవులను త్వరలో భర్తీచేస్తామని, అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని పార్టీ కోసం పనిచేసే వారికే పదవులు కట్టబెడతామని ఏఐసీసీ పరిశీలకుడు, కర్ణాటక రాష్ట్ర ఎమ్మెల్యే రిజ్వాన్ అర్షద్ అన్నారు. జిల్లా కేంద్రంలోని హరిత హోటల్లో డీసీసీ అధ్యక్షుడు, రాష్ట్ర సహకార సంఘం లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్రెడ్డి అధ్యక్షతన సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీలో ఖాళీగా ఉన్న పదవులన్నింటిని ఏఐసీసీ ఆదేశాల మేరకు త్వరలోనే భర్తీ చేస్తామన్నారు. అన్ని జిల్లాల్లో డీసీసీ, సీసీసీ పోస్టులను ముందుగా భర్తీ చేస్తామని తెలిపారు. ఎమ్మెల్యేలు, ఇతర సీనియర్ నాయకుల అభిప్రాయలను సేకరిస్తామని, ఇప్పటికే బ్లాక్ లెవల్ కాంగ్రెస్ నాయకుల అభిప్రాయాలు తెలుసుకున్నామన్నారు. వారం రోజులపాటు జిల్లాలో ఉండి అన్ని నియోజకవర్గాల్లో పర్యటించనున్నట్లు రిజ్వాన్ తెలిపారు. ఈనెల 14న బోధన్లో, 15న ఆర్మూర్లో, 16న బాల్కొండ, 17న నిజామాబాద్ రూరల్లో, బాన్సువాడ నియోజకవర్గాల్లో పర్యటించనున్నట్లు వివరించారు. సమావేశంలో బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపతిరెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, డీసీసీ అధ్యక్షుడు, రాష్ట్ర సహకార సంఘం లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్రెడ్డి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్బిన్ హందాన్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి, నుడా చైర్మన్, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కేశ వేణు, పీసీసీ డెలిగేట్ బాడ్సి శేఖర్గౌడ్, ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ కె నగేశ్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, ఎస్టీసెల్ జిల్లా అధ్యక్షుడు కేతావత్ యాదగిరి, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటాం నియోజకవర్గాల వారీగా పర్యటిస్తా ముందుగా డీసీసీ, సీసీసీ పోస్టుల భర్తీ ఏఐసీసీ పరిశీలకుడు, ఎమ్మెల్యే రిజ్వాన్ అర్షద్ -
ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచండి
● డీఎంహెచ్వో రాజశ్రీ ● నగరంలో వైద్యాధికారులు, నర్సింగ్ ఆఫీసర్లతో సమీక్ష నిజామాబాద్నాగారం: వైద్య సిబ్బంది బాధ్యతగా విధులు నిర్వహిస్తూ ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచాలని జిల్లా వైద్యాధికారి రాజశ్రీ అన్నారు. నగరంలోని కలెక్టరేట్లోగల డీఎంహెచ్వో కార్యాలయంలో సోమవారం ఆమె వైద్యాధికారులు, నర్సింగ్ అధికారులకు, పీహెచ్సీ వైద్యులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా రాజశ్రీ మాట్లాడుతూ.. ప్రతి ఆరోగ్య ఉపకేంద్రం పరిధిలో ఏఎన్ఎం, ఆశలు, అర్హులైన గర్భిణుల జాబితాను ఉంచుకోవాలన్నారు. రక్తహీనత గల గర్భిణులను ముందే గుర్తించి వారికి పోషకాహారం ఐరన్ మాత్రలు, ఐరన్ సూక్రోజ్ తీసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. అత్యంత ప్రమాదకర లక్షణాలు గల గర్భిణులకు మాత్రమే శస్త్ర చికిత్సలు చేయాలని, మిగతా గర్భిణులకు సాధారణ ప్రసవాలు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. తక్కువగా ప్ర సవాలు చేసిన పీహెచ్సీ వైద్యాధికారులతో మాట్లా డి, ప్రసవాలు పెంచేలా కృషి చేయాలని ఆదేశించా రు. ప్రసవానికి ముందే బర్త్ ప్లాన్ ప్రకారం గర్భిణులను ప్రభుత్వ ఆస్పత్రులకు తీసుకెళ్లాలని అన్నారు. తద్వారా మాతాశిశు మరణాలను తగ్గించవచ్చన్నారు. ప్రోగ్రాం ఆఫీసర్ శ్వేత, అశ్విని, డిప్యూటీ డీఎంహెచ్వో రమేష్, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి అశోక్, ఏవో రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. సీపీఆర్పై అవగాహన అవసరంనిజామాబాద్ నాగారం: ప్రతిఒక్కరికి సీపీఆర్ (కార్డియో పల్మనరీ రీసెర్సిటేషన్)పై అవగాహన ఉండాలని డీఎంహెచ్వో రాజశ్రీ అన్నారు. సీపీఆర్ వారోత్సవాల్లో భాగంగా నగరంలో సోమవారం ఆమె సీపీఆర్పై వివరించారు. ప్రతి ఒక్కరూ పోషకాహారం తీసుకుంటూ ఉప్పును తగ్గించాలని, జంక్ ఫుడ్కు దూరంగా ఉండాలని, జీవనశైలి మార్పుల ద్వారానే జీవన శైలి వ్యాధులను అరికట్టవచ్చనన్నారు. వారంపాటు జిల్లావ్యాప్తంగా మూడు డివిజన్లలో సీపీఆర్పై అవగాహన కల్పించామన్నారు. కార్యక్రమంలో వైద్యశాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వైద్యశాఖ కార్యాలయాల తనిఖీ నిజామాబాద్నాగారం: జిల్లాకేంద్రంలోని డీఐవో, మలేరియా, పీవోడీటీటీ కార్యాలయాలను, డిప్యూటీ డీఎంహెచ్వో ఆఫీస్ను సోమవారం డీఎంహెచ్వో రాజశ్రీ తనిఖీ చేశారు. ఆయా కార్యాలయాల్లోని రికార్డులను పరిశీలించారు. సిబ్బంది సమయపాలన పాటిస్తూ విధులను సక్రమంగా నిర్వర్తించాలన్నారు. -
ముగిసిన ఎస్జీఎఫ్ జిల్లాస్థాయి టోర్నమెంట్
నిజామాబాద్ నాగారం: నగరంలోని డీఎస్ఏ క్రీడామైదానం కొనసాగిన స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా స్థాయి టోర్నమెంట్ సోమవారం ముగిసింది. ఈసందర్భంగా జిల్లాస్థాయి అండర్ 17 వాలీబాల్, అండర్ 14 కబడ్డీ బాలబాలికల పోటీలలో 16 జోన్ల బాలబాలికల జట్లు పాల్గొనగా ప్రతిభ చూపిన వారిని తదుపరి పోటీలకు ఎంపిక చేసినట్లు జిల్లా ఎస్జీఎఫ్ కార్యదర్శి నాగమణి తెలిపారు. అండర్ 17 వాలీబాల్ బాలుర విభాగంలో నందిపేట జోన్ ప్రథమ స్థానం, డిచ్పల్లి జోన్ ద్వితీయ స్థానం సాధించింది. బాలికల విభాగంలో ఆర్మూర్ రూరల్ జోన్ ప్రథమ స్థానం, డిచ్పల్లి జోన్ ద్వితీయ స్థానం సాధించింది. అండర్ 14 కబడ్డీ బాలుర విభాగంలో భీమ్గల్ రూరల్ జోన్ ప్రథమ స్థానం, ఆర్మూర్ రూరల్ జోన్ ద్వితీయ స్థానం సాధించింది, బాలికల విభాగంలో నిజామాబాద్ అర్బన్ జోన్ ప్రథమ స్థానం, నందిపేట్ జోన్ ద్వితీయ స్థానం సాధించింది. విజేతలకు బహుమతులు అందజేశారు. డీవైఎస్వో పవన్ కుమార్, విద్యాసాగర్రెడ్డి, గోపిరెడ్డి, రాజేందర్, అమరవీర్ రెడ్డి, కస్తూరి శ్రీనివాస్, రాజరాజేశ్వర్, ప్రసాద్, అలివేలు మంగ తదితరులు పాల్గొన్నారు. -
బీసీ జేఏసీ జిల్లా కమిటీ నియామకం
నిజామాబాద్ నాగారం: నగరంలోని గీతాభవన్లో సోమవారం బీసీ కమిటీల అన్ని సంఘాలు, జేఏసీ రాష్ట్ర కమిటీ సూచన మేరకు జిల్లా కమిటీని నియమించినట్లు నాయకులు రేవంత్ తెలిపారు. జిల్లా చైర్మన్గా పోతనకార్ లక్ష్మి నారాయణ, కో–చైర్మన్గా బొబ్బిలి నర్స య్య నియమితులయ్యారు. ప్రతి కుల సంఘం నుంచి ఒక ప్రతినిధిని కో–కన్వీనర్గా నియమించినట్లు పేర్కొన్నారు. బీసీ నాయకులు నాగరాజ్, సభ్యులు పాల్గొన్నారు.నిజామాబాద్నాగారం: నగరంలోని కలెక్టరేట్లో సోమవారం జాతీయ పోషణ మాసోత్సవాలకు సంబంధించిన వాల్పోస్టర్లను అడిషనల్ కలెక్టర్లు అంకిత్, కిరణ్కుమార్ ఆవిష్కరించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈనెల 16 వరకు జరిగే పోషన్ మాసోత్సవాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని, విజయవంతం చేయాలన్నారు. ట్రెయినీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావి, జిల్లా సంక్షేమాధికారిణి రసూల్బీ తదితరులు పాల్గొన్నారు. డొంకేశ్వర్(ఆర్మూర్): జిల్లాలో మక్క కొనుగో లు కేంద్రాలు ఏర్పాటు చేయాలని అఖిల భార త రైతు కూలీ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈమేరకు వారు సోమవారం జిల్లా కేంద్రంలోని మార్క్ఫెడ్ డీఎం దాసోజు మహేశ్కు వినతిపత్రం అందజేశారు. జిల్లాలో మక్క కోత లు మొదలై 20 రోజులైనా ప్రభుత్వం నుంచి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు నష్టపోతున్నారని తెలిపారు. వీలైనంత త్వరగా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి, రైతులకు మద్దతు ధర దక్కేలా చూడాల ని కోరారు. నాయకులు సాయిరెడ్డి, ఆకుల పా పన్న, సాయిలు, దేవన్న, గంగాధర్, మోహన్ తదితరులు ఉన్నారు. తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో ఎంఈడీ 2వ సెమిస్టర్ పరీక్షలు సోమవారం ప్రశాంతంగా జరిగినట్టు అకాడమిక్ ఆడిట్సెల్ డైరెక్టర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల పరీక్ష కేంద్రంలో జరిగిన పరీక్షకు మొత్తం 29 మంది అభ్యర్థులకు గాను అందరూ హాజరయ్యారైనట్లు ఆయన తెలిపారు. పోతన్కర్ లక్ష్మీనారాయణ బొబ్బిలినర్సయ్య -
క్రైం కార్నర్
రోడ్డు ప్రమాదంలో చిన్నారి మృతి నిజాంసాగర్(జుక్కల్): మండలంలోని అచ్చంపేట గ్రామంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మూడేళ్ల చిన్నారి మృతిచెందింది. వివరాలు ఇలా.. అచ్చంపేట గ్రా మానికి చెందిన మ్యాదరి శివగంగ, సత్యనారాయణ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. చిన్న కుమార్తె మధురశ్రీ(3) ఆదివారం రాత్రి వేళ ఇంటి ఆవరణలో బహిర్భుమికి వెళ్లింది. కొద్దిసేపటికి ఇంట్లోకి పరుగెత్తుకు వస్తుండగా అదే సమయంలో ఇంటిపక్కనే ఉన్న శ్రీనివాస్ తన వాహనాన్ని తీస్తుండగా ప్రమాదవశాత్తు మధురశ్రీ కాళ్ల పైనుంచి వెళ్లగా తీవ్రంగా గాయపడింది. వెంటనే గమనించి కుటుంబీకులు ఆమెను ఎల్లారెడ్డిలోని ప్రయివేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స తర్వాత ఇంటికి తీసుకురాగా రాత్రివేళ మళ్లీ ఆమె అస్వస్థతకు గురవడంతో ఆస్పత్రికి తరలించగా మృతిచెందింది. ఈమేరకు స్థానిక ఎస్సై శివకుమార్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఇజ్రాయిల్లో వెంకటాపూర్ వాసి.. వేల్పూర్: వేల్పూర్ మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన నీరటి బొర్రన్న(52) ఇజ్రాయిల్ దేశంలో గుండెపోటుతో మృతిచెందినట్లు సోమవారం తెలిసింది. బొర్ర న్న సుమారు 16 ఏళ్లుగా ఉపాధి కోసం ఇజ్రాయిల్ దేశానికి వెళ్లివస్తున్నాడు. అక్కడ ఈనెల 11న ఉదయం స్నానం కోసం బాత్రూంకు వెళ్లగా, గుండెపోటుకు గురై మరణించినట్లు తెలిపారు. ఆయన మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురావడానికి ఇజ్రాయెల్లో ఉన్న వెంకటాపూర్ గ్రామస్తులు, బంధువులు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు, కొడుకు ఉన్నట్లు తెలిపారు. విద్యుత్ షాక్తో గేదె .. రాజంపేట: మండలంలోని తలమడ్ల గ్రామంలో విద్యుత్ షాక్తో గేదె మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. వివరాలు ఇలా.. తలమడ్ల గ్రామానికి చెందిన సావుసాని క్రిష్ణారెడ్డి ఆదివారం రాత్రి తన పొలం వద్ద గేదెను కట్టి ఉంచి ఇంటికి వచ్చాడు. సోమవారం ఉదయం వెళ్లి చూ డగా పంట పొలానికి సమీపంలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ వ ద్ద చనిపోయి ఉంది. ట్రాన్స్ఫార్మర్కు కంచె లేకపోవడం వల్ల గేదే కరెంట్ షాక్కు గురై మృతిచెందిటనట్లు పేర్కొన్నాడు. ప్రభుత్వం తనను ఆర్థికంగా ఆదుకోవాలని బాధితుడు కోరాడు. -
ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి
● అదనపు కలెక్టర్ అంకిత్ ● ప్రజావాణిలో 88 వినతుల స్వీకరణ నిజామాబాద్అర్బన్: ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ అంకిత్ అధికారులకు సూచించారు. నగరంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమ వారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. జి ల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదు దారులు తమ సమస్యలను అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్తో పాటు డీఆర్డీవో సాయాగౌడ్, ట్రైనీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావీ, బోధన్ ఏసీపీ శ్రీనివాస్లకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. మొత్తంగా 88 ఫిర్యాదులు అందాయి. అర్జీలను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ పరిష్కరించాలని అదనపు కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
అనవసరపు కాల్స్ వేధిస్తున్నాయా..?
మీకోసం..సదాశివనగర్(ఎల్లారెడ్డి): మీరు అత్యవసర పనుల్లో, ఇతరులతో సమావేశాల్లో ఉన్నప్పుడు ప్రమోషనల్, మార్కెటింగ్ కాల్స్ వస్తుంటాయి. ఈ అనవసరపు ఫోన్కాల్స్ రోజు ఇబ్బంది పెడుతున్నాయా... అయితే ఫోన్లో పలు మార్పులతో కట్టడి చేయొచ్చు. యాక్టివేట్ డీఎన్డీ ప్రమోషనల్, మార్కెటింగ్ ఫోన్ కాల్స్ రాకుండా ఉండాలంటే మొదట ఫోన్లో డీఎన్డీ ఆప్షన్ను ఎనేబుల్ చేయాలి. ● STARTO అని టైప్ చేసి.. 1909కి ఎస్ఎంఎస్ చేస్తే ప్రమోషనల్ కాల్స్ ఆగిపోతాయి. వెబ్సైట్ https:/// www. dndcheck. co. in లోకి వెళ్లి ‘నేషనల్ డునాట్ కాల్ రిజిస్ట్రీ’లో ప్రమోషనల్ కాల్స్కు అడ్డుకట్ట వేయొచ్చు. టెలికాం ప్రొవైడర్లందరికీ.. అధికారిక యాప్ ఉంటుంది.(ఉదాహరణకు మై జియో, ఎయిర్టెల్ థ్యాంక్స్, వీఐ యాప్). అందులో డీఎన్డీ సెట్టింగ్లోకి వెళ్లి ప్రిఫరెన్స్ ఎంపిక చేసుకొని ప్రమోషనల్ కాల్స్ బ్లాక్ చేయొచ్చు. ● బ్యాంక్ వెబ్సైట్ లేదా యాప్లో లాగిన్ అయ్యి.. కమ్యూనికేషన్ ప్రిఫరెన్సెస్ లేదా ప్రొఫైల్ సెట్టింగ్స్లోకి వెళ్లి మార్కెటింగ్, ప్రమోషనల్ ఈ మెయిల్స్, ఎస్ఎంఎస్, కాల్స్ ఆప్షన్ డిజేబుల్ చేయడం ద్వారా అనవసరపు ఫోన్కాల్స్ను తగ్గించుకోవచ్చు. మాన్యువల్ నంబర్ బ్లాకింగ్.. డీఎన్డీ సెట్టింగ్ను యాక్టివేట్ చేసినా అనవసరమైన ఫోన్లు వస్తే ఫోన్లోని కాల్ బ్లాకింగ్ ఫీచర్ను ఉపయోగించి అడ్డుకట్ట వేయొచ్చు. ట్రూ కాలర్, కాల్ బ్లాకర్ లాంటి యాప్లు కూడా ఉన్నాయి. అవి స్పామ్, బ్యాంక్, మార్కెటింగ్ ఫోన్కాల్స్ను గుర్తిస్తాయి. ఒకసారి కాల్ వచ్చినప్పుడు ‘మార్క్ కాల్స్ యాజ్ స్పామ్’ ఆప్షన్ ఎంచుకుంటే ..ఆ తర్వాతి నుంచి ఆయా నంబర్ల నుంచి కాల్స్ రావు. నేరుగా బ్యాంకుకే.. ఒకే బ్యాంక్కు చెందిన మార్కెటింగ్ సిబ్బంది నుంచి తరచూ కాల్స్ వస్తుంటే.. ఆ బ్యాంక్ కస్టమర్ కేర్ సర్వీసుకు కాల్ చేసి.. లేదంటే నేరుగా బ్రాంచ్కి వెళ్లి ‘అప్డేట్ యువర్ ప్రిఫరెన్సెస్’ను మార్చాలని కోరాలి. గతంలో మీరు ‘మార్కెటింగ్ కమ్యూనికేషన్’కు అంగీకారం తెలిపినట్లయితే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు కచ్చితంగా చెప్పాలి. డీఎన్డీ ఆప్షన్ యాక్టివేట్ చేసినా.. కాల్స్ వస్తుంటే.. నేరుగా 1909కి ఫోన్ చేసి.. ఫిర్యాదు చేయొచ్చు. https:/// www. nccptrai. gov. in ఆన్లైన్లో కూడా ఫిర్యాదు చేయొచ్చు. -
దారిపైనే ధాన్యం రాశులు
● వాహనదారుల తిప్పలు ● కల్లాలు లేక ధాన్యం ఆరబోతకు రైతుల ఇబ్బందులు మాక్లూర్: పంట ఉత్పత్తులను ఆరబెట్టుకోడానికి కల్లాలు లేక ప్రతి ఏడాది రైతులు జాతీయ, గ్రామీణ రోడ్లనే ఆశ్రయిస్తున్నారు. ప్రధాన రహదారులపై ధాన్యం రాశులు పోయడంతో ప్రమాదాలు సైతం జరుగుతున్నాయి. జిల్లాలో వరికోతలు ప్రారంభం కావడంతో మాక్లూర్ మండలంలోని రైతులు ప్రధాన రహదారులపై వరి ధాన్యాన్ని రోడ్లపై ఆరబెడుతున్నారు. రహదారులతో పాటు సర్వీస్ రోడ్లపైనా ధాన్యాన్ని ఆరబెడుతుండడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. రాత్రులు రోడ్లపై ఆరబెట్టిన ధాన్యాన్ని గమనించని వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. పలువురు ఆస్పత్రులకు చేరిన ఘటనలు ఉన్నాయి. రోడ్లపై ధాన్యాన్ని ఆరబెట్టవద్దని పోలీసులు రైతులకు సూచిస్తున్నా స్పందన కరువవుతోంది. ఇటీవల మాక్లూర్ ఎస్సై రాజశేఖర్ చిన్నాపూర్ గండి ప్రాంతంలోని 63వ నంబర్ జాతీయ రహదారిపై రైతులు ఆరబోసిన ధాన్యం రాశుల గుండా సుమారు రెండు కిలోమీటర్ల పొడవునా రేడియం స్టిక్లర్లను ఏర్పాటు చేశారు. మాణిక్బండార్ నుంచి బోర్గాం(కె) ద్వారా నందిపేట వెళ్లే రహదారికి పొడవున రోడ్డంతా ధాన్యం ఆరబెడుతున్నారు. గడిచిన రెండేళ్లలో నవీపేట మండలం లింగాపూర్కు చెందిన గంగాధర్ అనే వ్యక్తి బోర్గాం వద్ద రోడ్డుపై ఆరబెట్టిన వడ్లకుప్పను ఢీకొని కిందపడడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. అలాగే ముల్లంగి(బి) గ్రామ శివారులో ఆరబెట్టిన వడ్లపై కారు అదుపుతప్పి బోల్తా కొట్టగా కారు యజమాని తీవ్రగాయాలపాలయ్యాడు. గతేడాది చిన్నాపూర్ గండిలో ఒకరు ఆరబెట్టిన వడ్ల కుప్పను ఢీకొని మృతిచెందాడు. ఇలా ప్రతి సీజన్లో రోడ్లపై ఆరబెడుతున్న వడ్ల కుప్పలను ఢీకొని వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు, వాహనదారులు కోరుతున్నారు. చిన్నాపూర్ రహదారిపై ధాన్యం ఆరబెట్టిన చోట రేడియం ఏర్పాటు చేస్తున్న మాక్లూర్ పోలీసులు బోర్గాం–శాంతినగర్ రోడ్డుపై ఆరబోసిన ధాన్యంమండలంలోని రైతులు తమ పంట ధాన్యాన్ని రోడ్లపై ఆరబెట్టవద్దు. రాత్రుళ్లు రోడ్లపై ఆరబెట్టిన ధాన్యాన్ని గమనించక ప లువురు వాహనదారులు ప్ర మాదాలకు గురవుతున్నారు. ఇకనైనా రైతులు మైదానాల్లో ధాన్యాన్ని ఆరబెట్టుకోవాలి. – రాజశేఖర్, ఎస్సై, మాక్లూర్ధాన్యాన్ని ఆరబోసేందుకు కల్లాలు లేక గత్యంతరం లేక కోసిన పంటను రోడ్లపై ఆరబెట్టుకోవాల్సి వస్తోంది. ధాన్యాన్ని ఆరబెట్టేందుకు మైదాన ప్రాంతాలు లేవు. వాహనదారులు సైతం రైతుల ఇబ్బందులను గుర్తించాలి. – గొల్ల లక్ష్మణ్, రైతు, వల్లభాపూర్ -
వలస కార్మికుల ఆకలి కేకలు
మోర్తాడ్(బాల్కొండ): దేశంకాని దేశంలో సరైన తిండి లేక ఆకలితో అలమటిస్తున్న వలస కార్మికుల దయనీయమైన పరిస్థితి అందరి కంట కన్నీరు పెట్టిస్తోంది. జోర్డాన్లో వ్యవసాయ పనుల కోసం ఏడాది కింద వలస వెళ్లిన తెలంగాణ జిల్లాల కార్మికులు అక్కడ నరకయాతన అనుభవిస్తున్నారు. ఇక్కడ ఉండలేమని తాము ఇంటికి వెళతామంటే అక్కడి యజమానులు నిరాకరిస్తున్నారు. ప్రశ్నించిన వారిని పోలీసులతో బెదిరింపులకు గురి చేస్తున్నారని వలస కార్మికులు వాపోతున్నారు. నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల్, నిర్మల్ జిల్లాలకు చెందిన 12 మంది వలస కార్మికులు జోర్డాన్లో ఉన్నారు. వ్యవసాయ పనులు చేయడానికి తమను తరలించగా జీతం ఒప్పందం ప్రకారం చెల్లిస్తున్నా సరైన భోజనం లేకపోవడంతో ఆకలి బాధ తట్టుకోలేక పోతున్నామని వలస కార్మికులు చెబుతున్నారు. మూడు పూటలా భోజనం పెడుతున్నా అది కేవలం 10 ఏళ్ల వయస్సులోపు ఉన్న వారికి సరిపోయేంతనే ఉంటుందని కార్మికులు ‘సాక్షి’కి ఫోన్లో చెప్పారు. తాము చేస్తున్న పనికి సరైన ఆహారం లేకపోవడంతో తమలో ఒకరైన నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండల కేంద్రానికి చెందిన కత్తి నరేశ్ అనారోగ్యం పాలైతే ఇటీవలే ఇంటికి పంపించామని వెల్లడించారు. తాము జోర్డాన్ వచ్చిన నుంచి వారంలో ఆరు రోజుల పాటు ఆలుగడ్డ కూరతోనే భోజనం పెడుతున్నారని తెలిపారు. ఒకరోజు మాత్రం చికెన్ పెడుతున్నా అది కూడా ఉడికి ఉడకుండా ఉంటుండటంతో తినలేకపోతున్నామన్నారు. ఇప్పటికే తమ కష్టాలపై సామాజిక మాధ్యమాల ద్వారా వలస కార్మికులు తమ గోడును వెల్లబోసుకున్నారు. ఇంటికి పంపించాలని కోరితే యజమానులు అంగీకరించడం లేదని ఎంబసీలో ఫిర్యాదు చేస్తే అధికారులు వచ్చి వివరాలను నమోదు చేసుకున్నారని వలస కార్మికులు తెలిపారు. తమను ఇంటికి రప్పించే విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని వలస కార్మికులు వేడుకుంటున్నారు. విదేశాంగ శాఖకు లేఖ రాసిన రాష్ట్ర ప్రభుత్వం జోర్డాన్లో ఉన్న తెలంగాణ వలస కార్మికులను సురక్షితంగా ఇళ్లకు చేర్చేలా రాష్ట్ర ప్రభుత్వం శనివారం అమ్మాన్లోని భారతదేశ రాయబార కార్యాలయానికి, విదేశాంగ శాఖ మంత్రికి, ఉన్నతాధికారులకు లేఖ పంపించారు. 12 మంది వలస కార్మికుల పేర్లు వారి పాస్పోర్టు నంబర్లు, మొబైల్ నంబర్లతో సహా ఇతర వివరాలను అందించారు. విదేశాంగ శాఖ స త్వరమే స్పందించి జోర్డాన్లో ఉన్న వలస కార్మికు లను రప్పించాలని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. జోర్డాన్లో ఉపాధి కోసం వెళ్లి సరైన తిండి లేక అనారోగ్యం పాలు ఇంటికి వెళ్తామంటే పోలీసులతో బెదిరిస్తున్న యజమానులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాలని వలస కార్మికుల వినతి -
ప్రమాదకరంగా బ్రిడ్జి రోడ్డు
రామారెడ్డి: రామారెడ్డి నుంచి కామారెడ్డికి వెళ్లే మార్గంలోని గంగమ్మ వాగు బ్రిడ్జి వద్ద ఏర్పడిన పెద్ద గుంతతో ఎప్పుడు ఎలాంటి ప్రమాదం జరుగుతుందోనని ప్రయాణికులు, వాహనదారులు భయపడుతున్నారు. ఈ ప్రాంతంలో నిత్యం ఆర్టీసీ బస్సులు, ఆటోలు, బైక్లు ప్రయాణం సాగిస్తున్నా ఆర్అండ్బీ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. చీకట్లో కొత్తగా వచ్చే వారు ప్రమాదానికి గురికావడం తప్పదు. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి బ్రిడ్జి నిర్మాణం త్వరగా చేపట్టి రోడ్డును బాగు చేయాలని ప్రయాణికులు, వాహనదారులు కోరుతున్నారు. -
వీరవనితల ధైర్యసాహసాలు వివరించాలి
● రాష్ట్రీయ సేవికా సమితి విజయదశమి ఉత్సవంపట్టణంలో ర్యాలీ నిర్వహిస్తున్న విద్యార్థులుకామారెడ్డి అర్బన్: §ólÔèæ ç³#¯]l-Ç-²-Æ>Ã-׿…ÌZ Ð]l$íßæ-âê-ÔèæMìS¢ A°Æý‡Ó-^èl-±-Ķæ$-OÐðl$…-§ýl-°, G…§ýlÆø ÒÆý‡ Ð]l°-™èlË$ §ólÔèæ… MøçÜ… ™éÅVýS… ^ólÔ>Æý‡° Æ>[ï-ÙtĶæ$ õÜÑM> çÜÑ$† ™ðlÌS…-V>׿ {´ë…™èl M>Æý‡Å-Ð]l-íßæMýS }´ë§ýl Æ>«§ýl õ³ÆöP-¯é²Æý‡$. B¨-ÐéÆý‡… ç³rt-׿…ÌZ° } çÜÆý‡çÜÓ† ѧéÅ Ð]l$…¨-ÆŠ‡ÌZ Æ>[ï-Ù-tĶæ$ õÜÑM> çÜÑ$† Ñf-Ķæ$§ýl-ÔèæÑ$ E™èlÞ-Ð]l…, 282 Ð]l$…¨ õÜÑ-MýSË$ òœ*‹Ù-™ø-´ër$ ç³§ýl çÜ…^èl-ÌS¯]l… °Æý‡Óíßæ…-^éÆý‡$. D çÜ…§ýl-Æý‡Â…V> Ð]lMýS¢V> àfOÆð‡-ై }´ë§ýl Æ>«§ýl Ð]l*sêÏyéÆý‡$. A†¤V> Ñ{Ô>…™èl OÐðl§ýl$Å-Æ>Ë$ EÐ]l*f-¯é-Æý‡ª¯ŒS ´ëÌŸY-¯é²Æý‡$. {糆 MýS$r$…-º…ÌZ ™èlÐ]l$ í³ÌSÏ-ÌSMýS$ §ólÔèæ ÒÆý‡-Ð]l-°-™èlË$, çÜ…çœ$ çÜ…çÜP-Æý‡¢ÌS ´ùÆ>r çÜ*¹Ç¢, O«§ðlÆý‡ÅÝëçßæÝë-ÌS¯]l$ ÑÐ]lÇ…^éÌS° }´ë§ýl Æ>«§ýl A¯é²Æý‡$. íßæ…§ýl* Ýë{Ð]l*-fÅ… Ýë¦í³…-^èlyé-°MìS ÕÐéi ™èlÍÏ hhĶæ*-»êƇ$$ ^ólíܯ]l MýS–íÙ° ^ðl´ëµ-ÌS-¯é²Æý‡$. Æý‡n*±Þ ÌS„îSÃ-»êƇ$$, Æ>×ìæ Æý‡${§ýl-Ð]l$-§ól-Ñ, Æ>×ìæ Açßæ-ÌSÅ-»êƇ$$ çßZÌS-P-ÆŠ‡Ìê…sìæ ÐéÆý‡$ §ólÔèæ…, çÜ…çÜP–† çÜ…{ç³-§é-Ķæ*ÌS MøçÜ… ^ólíܯ]l MýS–íÙ, õÜÐ]l-ÌS¯]l$ ÑÐ]l-Ç…-^éÆý‡$. M>Æý‡Å-{MýSÐ]l$…ÌZ Ñ¿êVŠæ M>Æý‡Å-Ð]l-íßæMýS VýS$fÆ>† çÜÆø-f, hÌêÏ M>Æý‡Å-Ð]líßæMýS ÒÆý‡-Ð]l$-ÍÏ çÜÆý‡-çÜÓ-†, {糆-°«§ýl$Ë$ Ķæ$fq-}, Æ>×ìæ, »Ÿ…-™èlç³ÍÏ MýSÌSµ¯]l, A°™èl ™èl¨-™èl-Æý‡$Ë$ ´ëÌŸY-¯é²Æý‡$. -
విద్యార్థులకు దీన్దయాల్ స్పర్శ్యోజన పోటీలు
సిరికొండ: మండలంలోని సత్యశోధక్ పాఠశాలలో ఆదివారం తపాలా శాఖ ఆధ్వర్యంలో దీన్దయాల్ స్పర్శ్ యోజన రాష్ట్రస్థాయి జనరల్ నాలెడ్జ్ పోటీ పరీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా నిజామాబాద్ సబ్ డివిజన్ తపాలా శాఖ సహయ పర్యవేక్షకులు సుష్మితాబెనర్జీ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. పోస్టల్ పిలాటలి అకౌంట్ ఉన్న ఆరు నుంచి తొమ్మిదవ తరగతి విద్యార్థులకు ప్రతి ఏడాది పోటీ పరీక్షను నిర్వహించనున్నట్లు తెలిపారు. విద్యార్థులలో తపాలాశాఖపైన అవగాహన, స్టాంపుల సేకరణ అలవాటును పెంపొందించి విజేతలైన విద్యార్థులకు ఉపకార వేతనాలు అందించి ప్రోత్సహిస్తుందన్నారు. విద్యార్థులకు తపాలా శాఖ తరపున పరీక్ష ప్యాడ్లు, పెన్నులు అందజేశారు. ప్రిన్సిపాల్ నర్సయ్య, సబ్ పోస్ట్ మాస్టర్లు మహేందర్, రాజ్కుమార్, వెంకటదాస్, గోపాల్, స్నేహిత్, ప్రవీణ్, లింగం, గంగారెడ్డి, రాజు, శంకర్, రవి, శ్రీధర్ పాల్గొన్నారు. -
జోరందుకున్న పంట కోతలు
ఆర్మూర్ ప్రభుత్వ పాఠశాల పదో తరగతి 2005–06 బ్యాచ్ విద్యార్థులు తిమ్మాపూర్ ఉన్నత పాఠశాల పదో తరగతి 1999–2000 బ్యాచ్ విద్యార్థులు ● కల్లాల్లో శ్రమిస్తున్న రైతులు డొంకేశ్వర్(ఆర్మూర్): వర్షాల తగ్గుముఖం పట్టి నేల గట్టిపడడంతో జిల్లా వ్యాప్తంగా పంట కోతలు ఊపందుకున్నాయి. సోయా, మొక్కజొన్న కోతలు జోరుగా సాగుతున్నాయి. దీంతో హార్వెస్టర్లకు గిరాకీ పెరిగింది. మొక్కజొన్న కోతకు గంటకు రూ.4వేలు, సోయాకు రూ.2,600 వరకు రైతుల వద్ద కిరాయి తీసుకుంటున్నారు. పంట దిగుబడులను నేరుగా ట్రాక్టర్లలో తీసుకొచ్చి కల్లాలు, రోడ్లపై ఎండబోస్తున్నారు. పంటను త్వరగా అమ్ముకునేందుకు రైతులు కల్లాల వద్దే తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే ప్రభుత్వం ఇంకా మక్క, సోయా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతో కొన్ని చోట్ల వ్యాపారులకు విక్రయిస్తున్నారు. ప్రభుత్వం త్వరగా కేంద్రాలను తెరవాలని రైతులు కోరుతున్నారు. -
రైల్వే పోలీసుల అదుపులో అనుమానాస్పద వ్యక్తులు
నిజామాబాద్ సిటీ: జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ ఫ్లాట్ఫారాల్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరిని రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు ఆర్పీఎస్ ఎస్సై తెలిపారు. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో రైల్వే పోలీసులు తనిఖీ చేస్తుండగా ఫ్లాట్ఫారమ్–1 వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న గంగాప్రసాద్ విశ్వంభర గైక్వాడ్, అమోల్ విశ్వంభర గైక్వాడ్ అనే ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించగా వారు పాత నేరస్తులుగా గుర్తించారు. వీరు మహారాష్ట్రలోని నాందేడ్ ప్రాంతానికి చెందిన వారుగా గుర్తించారు. కూలీ పనులు చేసేవీరు దొంగతనాలకు పాల్పడుతున్నట్లు విచారణలో తేలింది. అంతేకాకుండా గతంలో పలు నేరాలు చేసినట్లు వారు ఒప్పుకున్నారు. వీరి నుంచి విలువైన ఫోన్లు, రూ.18,700 నగదును స్వాధీనం చేసుకొని కోర్టులో హాజరుపర్చనున్నట్లు రైల్వే ఎస్సై తెలిపారు. -
అ‘పూర్వ’ సమ్మేళనం
మోపాల్/ ఖలీల్వాడి/ మోర్తాడ్/ బాల్కొండ/ ఆర్మూర్టౌన్/ సదాశివనగర్: నగరశివారులోని బోర్గాం(పి) జెడ్పీ ఉన్నత పాఠశాలలో 1998–99వ సంవత్సవంలో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు. చాలా ఏళ్ల తర్వాత విద్యార్థులంతా ఒకే వేదికపై కలవడంతో ఆత్మీయంగా పలకరించుకున్నారు. నాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు శ్రీనివాస్, రాజు, నరేందర్, శ్రీహరి, లత, ఉమా మహేశ్వరి, దొంతుల రవి, కవిత, కల్పన, సుకన్య తదితరులు పాల్గొన్నారు. నగరంలోని పద్మనగర్లో ఉన్న శ్రీ విశ్వశాంతి హైస్కూల్లో 2007–2008లో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు హరిదాస్, అరుణ, అనిల్, రాజేశ్, రాజేందర్, సుజాత, థామస్, ప్రసన్న, పాండు, గణేశ్, మురళి పాల్గొన్నారు. మోర్తాడ్ మండలం తిమ్మాపూర్ ఉన్నత పాఠశాలలో 1999–2000లో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థులు, ముప్కాల్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 2003–04లో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను సన్మానించారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో 2005–06 బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. తమ చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. కార్యక్రమంలో పూర్వవిద్యార్థులు జయలక్ష్మి, లావణ్య, స్వాతి, శిల్ప, శ్రావణి, లక్ష్మి, ప్రియాంక, సునీత, భాను తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలోని పద్మాజివాడి ఉన్నత పాఠశాలలో 2008–09 పదో తరగతి పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. కార్యక్రమంలో హెచ్ఎం రమణ, ఉపాధ్యాయులు వీవీ రమణ, అబ్బయ్య, వాణి, లింగం, మీనా, సబిత, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. -
మాలల రిజర్వేషన్ల సాధనే ధ్యేయం
● మంత్రి పదవిపై ఆశ లేదు ● ఐక్యంగా ఉండి హక్కులు సాధించుకోవాలి ● రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి నిజామాబాద్ నాగారం: తనకు మంత్రి పదవిపై ఆశ లేదని, మాల జాతి ఐక్యత, రిజర్వేషన్లు సాధించడమే ప్రధాన ధ్యేయమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ దృష్టికి తీసుకువెళ్లి మాలలకు 12 శాతం నుంచి 18 శాతం వరకు రిజర్వేషన్ కేటాయించేలా కృషి చేస్తానని తెలిపారు. నగరంలోని ఓ ప్రయివేటు ఫంక్షన్ హాల్లో దివంగత వెంకటస్వామి (కాక) జయంతి వేడుకలు, మాలల ఐక్య సదస్సు ఆదివారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి వివేక్ మాట్లాడారు. మాలలంతా ఏకతాటిపై నిలబడి హక్కుల సాధన కోసం నిరంతరం పోరాడాలని పిలుపునిచ్చారు. నిజామాబాద్ మాలల ఐక్యతను చూస్తే సంతోషంగా ఉందన్నారు. కొందరు ఉన్నతవర్గాల ఉద్యోగులు ప్రధానంగా ప్రభుత్వ శాఖల్లో పనిచేసే మాల ఉద్యోగులను తొలగించడం, బదిలీ చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. మాలలు ఐక్యతతోనే కుట్రలను తిప్పికొట్టాలని సూచించారు. మాలలకు వర్గీకరణ విషయంలో అన్యాయం జరిగిందని, దానిపై నిరంతరం పోరాడుతున్నామని వర్ధన్నపేట్ ఎమ్మెల్యే నాగరాజు అన్నారు. తమ పోరాటానికి అన్ని కులసంఘాలు సహకరించాలని కోరారు. రాజకీయాల్లో సైతం కులవివక్ష కొనసాగుతుందని తెలిపారు. అనంతరం గ్రూప్–1, గ్రూప్–2లో విజయం సాధించిన అభ్యర్థులను సన్మానించారు. కార్యక్రమంలో రైతు కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్బిన్ హందాన్, మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య, రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశం, ఉన్నత విద్యామండలి మాజీ చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు ఆలుక కిషన్, మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు చొక్కం దేవదాస్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎడ్ల నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
పకడ్బందీగా సీ్త్రనిధి రుణాలు
● పక్కదారి పట్టకుండా సాంకేతిక విధానం ● లబ్ధిదారుల ఫేస్ క్యాప్చరింగ్, బయోమెట్రిక్ తప్పనిసరిడొంకేశ్వర్(ఆర్మూర్) : సీ్త్రనిధి రుణాల పంపిణీ ప్రక్రియలో ప్రభుత్వం మార్పులు తీసుకొచ్చింది. రుణాలు పక్కదారి పట్టకుండా లబ్ధిదారుల అనుమతి, సమ్మతి తప్పనిసరి చేసింది. అంతే కాకుండా ఎస్హెచ్జీ సభ్యురాలి ఫేస్ క్యాప్చరింగ్, బయోమెట్రిక్ తీసుకున్న తర్వాతే రుణం మంజూరు చేస్తున్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త సాంకేతిక విధానం సత్ఫలితాలనిస్తోంది. తద్వారా సీ్త్రనిధి రుణాలు పక్కదారి పట్టే అవకాశం లేకుండాపోయింది. జిల్లాలో 806 గ్రామ సంఘాలు, వీటి పరిధిలో 24,179 మహిళా సంఘాలు ఉండగా 2.53 లక్షలకు పైగా సభ్యులు ఉన్నారు. అయితే సంఘాల్లో ఉన్న పేద మహిళల ఆర్థికాభివృద్ధి కోసం వివిధ వ్యాపారాలు, వ్యక్తిగతంగా సీ్త్రనిధి పథకం ద్వారా ప్రభుత్వం రుణాలు అందిస్తోంది. రూ.50వేల నుంచి మొదలుకొని రూ.5 లక్షల దాకా రుణాలు పొందే అవకాశం కల్పించింది. కిరాణం, బట్టల దుకాణం, జనరల్ స్టోర్, టైలరింగ్, బ్యూటీ పార్లర్, పేపర్ ప్లేట్స్, జూట్ బ్యాగ్స్ తయారీ, ఇంటర్నెట్ సెంటర్, నాటు కోళ్లు, పెరటి కోళ్ల పెంపకం, ఎలక్ట్రికల్ బైక్స్, ఈ–ఆటోలు తదితర వ్యాపారాలు చేసేందుకు రుణాలు అందజేస్తున్నారు. సీ్త్రనిధి రుణం కావాలంటే లబ్ధిదారుల లైవ్ ఫొటో, వేలిముద్రలు, ఆధార్, ఫోన్ నంబర్ వంటి వివరాలను ట్యాబ్లో ఎంట్రీ చేస్తున్నారు. కాగా సంఘంలోని ఇద్దరు లీడర్ల ఫొటోలను సైతం తీసుకుంటున్నారు. ఇప్పటివరకు రూ.111కోట్ల రుణాలు పంపిణీ గతేడాది జిల్లాలో రూ.211 కోట్లు రుణాలు పంపిణీ చేయగా, ఈ ఏడాది రూ.246 కోట్ల పంపిణీ లక్ష్యంగా నిర్దేశించారు. ఇది రాష్ట్రంలోనే అత్యధిక లక్ష్యం. అయితే ఇప్పటి వరకు 653 గ్రామ సంఘాల పరిధిలో 12,927 మంది మహిళలకు రూ.111 కోట్ల రుణాలను అందజేశారు. మిగిలిన లక్ష్యాన్ని 2026 మార్చి నెలాఖరు నాటికి పూర్తి చేయాల్సి ఉంది. ప్రభుత్వం తెచ్చిన సాంకేతిక విధానంతో పారదర్శకంగా రుణాలు పంపిణీ చేస్తున్నాం. జిల్లాకు నిర్దేశించిన రుణ పంపిణీ లక్ష్యాన్ని గడువులోగా పూర్తి చేసేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నాం. రోజుకు రూ.1.50 కోట్ల రుణాలను ఎస్హెచ్జీలకు ఇవ్వాలని టార్గెట్ పెట్టుకుని క్షేత్రస్థాయి సిబ్బందితో కలిసి పని చేస్తున్నాం. – రాందాస్, సీ్త్రనిధి ఆర్ఎం, నిజామాబాద్ -
పటాకుల విక్రయానికి అనుమతి తీసుకోవాలి
నిజామాబాద్ అర్బన్: దీపావళి పండుగ సందర్భంగా పటాకుల దుకాణదారులు తప్పనిసరిగా డివిజన్ స్థాయి పోలీసు అధికారుల అనుమతి తీసుకోవాలని సీపీ సాయిచైతన్య ఆదివారం ఒక ప్రకటనలో సూచించారు. పటాకులు విక్రయించేందుకు తాత్కాలికంగా దుకాణాలు ఏర్పాటు చేసే వారు సంబంధిత డివిజన్ పోలీసు అధికారి కార్యాలయంలో దరఖాస్తు చేసుకొని అనుమతి పొందాలన్నారు. పటాకుల దుకాణాలను ఖాళీ ప్రదేశాల్లో నెలకొల్పాలని, అనుమతి లేని దుకాణాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఒక క్లస్టర్లో 50 షాపులకు మించొద్దని, అగ్నిమాపక శాఖ నిబంధనలు పాటించాలని సూచించారు. 15 నుంచి పశువులకు గాలికుంటు టీకాలు ● జిల్లాకు చేరిన 2 లక్షల డోసులు డొంకేశ్వర్(ఆర్మూర్): రాష్ట్ర ప్రభుత్వ ఆదేశా ల మేరకు జిల్లాలో ఈ నెల 15వ తేదీ నుంచి తెల్ల, నల్ల జాతి పశువులకు ఉచితంగా గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయనున్న ట్లు జిల్లా పశువైద్యాధికారి రోహిత్రెడ్డి తెలిపారు. జిల్లాకు 2 లక్షల డోసులను ప్రభు త్వం సరఫరా చేయగా వచ్చే నెల 14 వరకు కార్యక్రమం కొనసాగుతుందన్నారు. జిల్లా లో 2లక్షలకు పైగా పశువులు ఉన్నాయని, ప్రతి ఆరు నెలలకోసారి ఈ టీకాలను తప్పనిసరిగా వేయించాల్సి ఉంటుందన్నారు. పా డి రైతులందరూ ఈ నెల 15నుంచి సమీప పశువైద్య కేంద్రంలో లేదా పశువైద్యులను గ్రామాల్లోకి రప్పించుకుని పశువులకు గాలి కుంటు టీకాలను వేయించాలని కోరారు. థాయ్ బాక్సింగ్లో పతకాలు నిజామాబాద్ నాగారం: రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్–17 థాయ్ బాక్సింగ్ పోటీల్లో జిల్లాకు పతకాలు వచ్చాయి. ఆ దివారం హన్మకొండ జిల్లాలో జరిగిన పోటీల్లో జిల్లాకు చెందిన క్రీడాకారులు నిహారిక, శ్రీవల్లి బంగారు పతకం, కుల్సం, శ్వేత రజత పతకం, శృతి కాంస్య పతకం సాధించారు. ఈ సందర్భంగా వారిని ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి నాగమణి అభినందించారు. ‘సాగర్’లోకి 13,662 క్యూసెక్కుల ఇన్ఫ్లో నిజాంసాగర్(జుక్కల్): ఎగువ ప్రాంతాల నుంచి నిజాంసాగర్ ప్రాజెక్టులోకి ఆదివారం సాయంత్రం 13,662 క్యూసెక్కుల వరద నీరు వస్తోందని అధికారులు తెలిపారు. ప్రాజెక్టు రెండు గేట్ల ద్వారా 13,562 క్యూసెక్కుల నీటిని మంజీరా నదిలోకి వదులుతున్నారు. నిజాంసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1405 (17.8 టీఎంసీలు) అడుగులకు గాను ప్రస్తుతం 1405 (17.8 టీఎంసీలు) అడుగుల నీరు నిల్వ ఉందని అధికారులు పేర్కొన్నారు. కామారెడ్డి టౌన్: ఆ ల్ ఇండియా ఫోర మ్ ఫర్ రైట్ టు ఎడ్యుకేషన్ రాష్ట్ర ఎగ్జిక్యూటీవ్ కమిటీ సభ్యుడిగా తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచ ర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సకినాల అనిల్ కుమార్ నియమితులయ్యారు. పంజాబ్లోని జలంధర్లో ఇటీవల జరిగిన 8వ జాతీయ కౌన్సిల్ సమావేశంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు. అందులో ఆయనకు చోటు దక్కింది. ఈ మేరకు టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు చింతల లింగం, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, ఉపాధ్యక్షులు శ్రీనివాస్ తదితరులు అనిల్ను అభినందించారు. -
కుండీల్లో మిగిలింది సగమే..
● సగం చేప పిల్లలు మృత్యువాత ● 80 రోజులు దాటినా పంపిణీకి నోచుకోని వైనం బాల్కొండ : ఎస్సారెస్పీ దిగువన ఉన్న జాతీయ చేప పిల్లల ఉత్పత్తి కేంద్రంలో ఉత్పత్తి చేసిన చేప పిల్లలు 80 రోజులు దాటినా పంపిణీకి నోచుకోలేదు. ఫలితంగా చేప పిల్లలు మృత్యువాత పడుతున్నాయి. సాధారణంగా ఉత్పత్తి చేసిన 40 నుంచి 45 రోజుల్లోనే చేపపిల్లలను పంపిణీ చేయాలి. కానీ, ప్రభుత్వం ఉచితంగా చెరువుల్లో చేప పిల్లలను వదిలేందుకు పిలిచిన టెండర్లు ఇప్పటికీ ఖరారు కాలేదు. దీంతో పంపిణీ ప్రారంభించలేదు. ఆ ప్రభావం చేపపిల్లల పెంపకంపై పడింది. 54 లక్షల చేప పిల్లలను ఉత్పత్తి చేస్తే ప్రస్తుతం 25 లక్షల చేప పిల్లలు మాత్రమే ఉన్నాయని మత్స్యశాఖ అధికారులు చెబుతున్నారు. మరికొన్ని రోజులు గడిస్తే మరిన్ని చేపపిల్లలు మృత్యువాత పడే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సైజ్ ఎక్కువగా పెరగడంతో అన్ని చేప పిల్లలకు నర్సరీలో కావాల్సిన ఆక్సిజన్ అందక చనిపోతాయని పేర్కొంటున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి చేప పిల్లల పంపిణీ ప్రారంభించాలని మత్స్యకారులు కోరుతున్నారు. చేప పిల్లల పంపిణీ కోసం ఉన్నతాధికారులకు లేఖ రాశాం. చేపపిల్లలు కుండీల్లోనే చనిపోతున్నాయి. ఈ విషయాన్ని సైతం ఉన్నతాధికారులకు వివరించాం. టెండర్లు పూర్తయ్యాక పంపిణీ చేసే అవకాశం ఉంది. – దామోదర్, మత్స్య అభివృద్ధి అధికారి, పోచంపాడ్ -
బీసీకా.. ఓసీకా..?
● డీసీసీ పీఠం కోసం తీవ్ర పోటీ ● భారీగా అందిన దరఖాస్తులు ● మానాల తరువాత ఎవరో.. ● కాంగ్రెస్ పదవులపై సర్వత్రా ఆసక్తిజిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవి ఎవరిని వరిస్తుందనే అంశంపై సర్వత్రా చర్చసాగుతోంది. బీసీ రిజర్వేషన్ల అంశంపై అందరి దృష్టి ఉన్న ప్రస్తుత తరుణంలో.. పార్టీ పదవుల్లో సైతం బీసీలకు 42శాతం రిజర్వేషన్ కల్పిస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో డీసీసీ పీఠంపై కూర్చునేది బీసీనా..? ఓసీనా..? తేలాల్సి ఉంది. డీసీసీ కోసం 18 మంది దరఖాస్తులు అందజేయగా.. సీసీసీ(సిటీ కాంగ్రెస్ కమిటీ) పదవి కోసం తొమ్మిది మంది దరఖాస్తు చేసుకున్నారు. సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం తీవ్ర పోటీ నెలకొంది. ప్రస్తుత అధ్యక్షుడు మానాల మోహన్రెడ్డి తరువాత ఆ పీఠం ఎవరికి దక్కతుందనే అంశంపై చర్చ సాగుతోంది. జి ల్లా అధ్యక్ష పదవిని దక్కించుకునేందుకు ఆశావహు లు ఎవరికి వారు తమ సర్వశక్తులు ఒడ్డుతున్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉండడంతోపాటు పీసీసీ అ ధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ సొంత జిల్లా కావడంతో డీసీసీ పీఠంపై మరింత ఆసక్తి నెలకొంది. పార్టీ నాయకత్వం ఎంపిక ఎలా ఉంటుందో.. పీసీసీ అ ధ్యక్షుడి ఆలోచన ఏవిధంగా ఉంటుందనే దానిపై పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. ఓ వైపు బీసీ రిజర్వేషన్ల వ్యవహారం నేపథ్యంలో స్థానిక సంస్థల ఎ న్నికలు మరింత దూరం వెళ్లాయి. మరోవైపు పార్టీ పదవుల్లో సైతం బీసీలకు 42 శాతం అవకాశాలు క ల్పించనున్నట్లు పార్టీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో జిల్లా అధ్యక్ష పీఠం బీసీ నాయకుడికి కేటాయిస్తా రా.. ఓసీ నాయకుడికి అప్పగిస్తారా..? అని కార్యకర్తలు, నాయకులు ఎదురు చూస్తున్నారు. మరోవైపు నిజామాబాద్ నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవి కోసం సైతం ఆశావహులు దరఖాస్తు చేసుకున్నా రు. ఏఐసీసీ నుంచి వచ్చిన పరిశీలకులు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పర్యటించి వివిధ వర్గాల, పార్టీ శ్రేణుల అభిప్రాయాలు సేకరించి, దరఖాస్తు లు చేసుకున్న నాయకులతో ముఖాముఖి మాట్లాడి పార్టీ నాయకత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. ఈ నివేదిక మేరకు డీసీసీ, సీసీసీ అధ్యక్షులను ఎంపిక చేసేందుకు పార్టీ రంగం సిద్ధం చేసింది. నగర అధ్యక్ష పీఠం కోసం తొమ్మిది మంది.. నగర కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న కేశ వేణు ‘నుడా’ చైర్మన్ పదవిని దక్కించుకున్నారు. అయితే కేశ వే ణు డీసీసీ, సీసీసీ పీఠాల్లో దేనికీ దరఖాస్తు చేయలే దు. వేణు తరువాత నగర కాంగ్రెస్ పీఠం ఎవరికనే విషయమై చర్చ నడుస్తోంది. ఈ పదవి కోసం సై తం పోటీ గట్టిగానే ఉంది. కీలకమైన నగర అధ్యక్ష పదవి కోసం సయ్యద్ ఖైసర్ మైనారిటీ కోటా నుంచి రేసులో ముందున్నారు. మరోవైపు డీసీసీకి దర ఖాస్తు చేసుకున్న నరాల రత్నాకర్, మహ్మద్ జావెద్ అక్రమ్ సైతం సీసీసీ రేసులోకి వచ్చారు. మరోవైపు పంచరెడ్డి చరణ్, బొబ్బిలి రామకృష్ణ, కాప్కార్ గన్రాజ్, శరత్కుమార్, మహ్మద్ కరీముద్దీన్, అంతిరెడ్డి విజయ్పాల్రెడ్డి దరఖాస్తు చేసుకున్నారు. డీసీసీ పీఠం కోసం అంచనాలకు మించి దరఖాస్తులు వచ్చాయి. ఏకంగా 18 మంది తమ దర ఖాస్తులను అందించారు. రేసులో యూత్ కాంగ్రెస్ స్థాయి నుంచి అంచెలంచెలుగా పనిచేస్తూ వచ్చిన మార చంద్రమోహన్రెడ్డి(ఆర్మూర్), ని జామాబాద్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, పీసీ సీ మాజీ ప్రధాన కార్యదర్శి కాటిపల్లి నగేశ్రెడ్డి (రూరల్), డీసీఎంఎస్ మాజీ చైర్మన్ మునిపల్లి సాయిరెడ్డి(రూరల్), పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్కు సన్నిహితుడైన పీసీసీ డెలిగేట్ బాడ్సి శేఖ ర్ గౌడ్ (రూరల్), పీసీసీ అధికార ప్రతినిధిగా చే సిన సీఎం రేవంత్ సన్నిహితుడు బాస వేణుగోపాల్యాదవ్(బాల్కొండ) రేసులో ముందున్నా రు. అదేవిధంగా మహ్మద్ జావెద్ అక్రమ్(అర్బ న్), నరాల రత్నాకర్(అర్బన్), గంగాశంకర్(బోధన్), కునిపురి రాజారెడ్డి(బాన్సువాడ), కోల వెంకటేశ్(ఆర్మూర్), అయ్యప్ప శ్రీనివాస్(ఆర్మూ ర్), జి.నటరాజ్(అర్బన్), కె.సాయికుమార్(అర్బన్), ముషు పటేల్(అర్బన్), మహ్మద్ ఖరీముద్దీన్(అర్బన్), ఇమ్మడి గోపి(రూరల్), జగడం సుమన్(అర్బన్), ఎంఏ అలీమ్(అర్బన్) దరఖా స్తు చేసుకున్నారు. అయితే రాష్ట్ర కార్పొరేషన్ చై ర్మన్ పదవి రేసులో ముందంజలో ఉన్న బాడ్సి శేఖర్గౌడ్కు ఆ పదవి దక్కుతుందా.. డీసీసీ పీ ఠం వస్తుందా అనే ఆసక్తి నెలకొంది. -
నెల్లూరు అతిథులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా నుంచి వచ్చిన బాతులు రెంజల్ మండలం సాటాపూర్ ప్రాంతంలోని వ్యవసాయ భూముల్లో సందడి చేస్తున్నాయి. నెల్లూరు నుంచి వచ్చిన ఈ అతిథులు.. వరి కోతల తరువాత వ్యవసాయభూమిలో రాలిన ధాన్యం గింజలు, కలుపు మొక్కలు కీటకాలను ఆరగించి వచ్చే పంటకు చీడపీడల బెడద లేకుండా చేస్తున్నాయి. బాతుల రెట్ట సహజ ఎరువుగా పని చేయడంతో ఏడాదిలో రెండుసార్లు వలస వచ్చే బాతుల గుంపులను ఇక్కడి రైతులు ఆహ్వానిస్తున్నారు. ఈ ఏడాది కూడా వచ్చిన సుమారు 15 కుటుంబాలు సాటాపూర్ ప్రాంతంలో రోడ్ల వెంబడి గుడారాలు వేసుకున్నారు. పొద్దంతా బాతుల గుంపులను వ్యవసాయభూముల్లో మేతకు వదులుతున్నారు. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, నిజామాబాద్ -
డీసీసీ పదవికి మాజీ ఎంపీపీ దరఖాస్తు
బోధన్: బోధన్ మాజీ ఎంపీపీ, టీపీసీసీ డెలిగేట్ బి.గంగాశంకర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్య క్ష పదవికి శనివారం జిల్లా కేంద్రంలోని కార్యా లయంలో దరఖాస్తు అందజేశారు. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి ముఖ్య అనుచరుడిగా ఉన్నారు.ఆయన వెంట పార్టీ మండల అధ్యక్షు డు నాగేశ్వర్రావు, నాయకులు దాము, గణప తి రెడ్డి, సంజీవ్ రెడ్డి తదితరులు ఉన్నారు. ● బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ కులాచారి సుభాష్నగర్: కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇచ్చిన హామీ ప్రకారం 42శాతం రిజర్వేషన్లు, కామారెడ్డి బీసీ డిక్లరేషన్ హామీని అమలు చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ కులాచారి శనివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. తప్పుడు నిర్ణయాలతో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోందని, ఈ నిర్లక్ష్య ధోరణితో బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42శాతం రిజర్వేషన్ల విషయంలో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సుప్రీంకోర్టును ఆశ్రయించి న్యాయపరమైన లొసుగులను సరి చేసుకోవాలని డిమాండ్ చేశారు. బీజేపీ బీసీలకు 42శాతం రిజర్వేషన్లకు పూర్తిగా మద్దతు తెలుపుతూ కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ఇకనైనా ప్రభుత్వం వెంటనే బీసీ రిజర్వేషన్లతోపాటు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. నిజామాబాద్అర్బన్: నగరంలోని వర్ని చౌరస్తాలో తిరుగుతున్న మతిస్థిమితం లేని బాలుడిని గుర్తించినట్లు ఐదో టౌన్ ఎస్సై శనివారం తెలిపారు. వర్ని చౌరస్తాలో బాలుడు తిరుగుతున్నట్లు స్థానికులు సమాచారం అందించడంతో బాబును పీఎస్కు తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. బాబు వివరాలు తెలిసిన వారు పోలీస్స్టేషన్లో సంప్రదించాలని కోరారు. -
ముగిసిన రాష్ట్రస్థాయి తైక్వాండో టోర్నీ
నిజామాబాద్నాగారం: నగరంలోని వినాయక్నగర్లో ఉన్న మున్నూరుకాపు సంఘంలో కొనసాగుతున్న రాష్ట్రస్థాయి అండర్–14 ఎస్జీఎఫ్ తైక్వాండో టోర్నీ శనివారం ముగిసింది. జిల్లా ఎస్జీఎఫ్ కార్యదర్శి నాగమణి ఆధ్వర్యంలో బాలబాలికలకు వివిధ కేటగిరీల్లో తైక్వాండో పోటీలు నిర్వహించారు. ప్రతిభ చూపిన క్రీడాకారులకు బంగారు, రజత, కాంస్య పతకాలు అందించారు. పోటీల్లో మనస్విని(నిజామాబాద్), జునేరియాకుల్సమ్(నల్గొండ), సమన్విత(రంగారెడ్డి), కతిజాఫాతిమా(నిజామాబాద్), మగేశ్ మెహరిన్(రంగారెడ్డి), హారిక(రంగారెడ్డి), సమీక్ష(రంగారెడ్డి), టి. వైష్ణవి(హైదరాబాద్),చొక్కం ఓంకార్(నిజామాబాద్), జె.శశిధర్ (నిజామాబాద్) బంగారు పతకాలు సాధించారు. వీరు ఈ నెల 28 నుంచి నాగాలాండ్లో నిర్వహించే జాతీయస్థాయి పోటీలకు ఎంపికై నట్లు నాగమణి పేర్కొన్నారు. ఈ పోటీలు ఆర్గనైజింగ్ సెక్రెటరీ ఈశ్వర్, పరిశీలకుడు రాజశేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. తైక్వాండో అసోసియేషన్ జిల్లా అధ్యక్షు డు అజ్మత్, ప్రధాన కార్యదర్శి మాస్టర్ వినోద్నాయ క్, పీడీలు గోపిరెడ్డి, శ్రీధర్, సురేశ్ పాల్గొన్నారు.నేను 8వ తరగతి చదువుతున్నాను. గతేడాది ఎస్జీఎఫ్ టో ర్నీలో పాల్గొని రాష్ట్రస్థాయిలో ర న్నర్గా నిలిచి రజత పతకం సాధించాను.ఈసారి ఎలాగైనా బంగారు పతకం సాధించాలనే కసితో కోచింగ్ తీసుకున్నాను. మొదటిసారి బంగారు పతకం సాధించి జాతీయస్థాయికి ఎంపికవ్వ డం చాలా సంతోషంగా ఉంది. – హారిక, రంగారెడి్డ -
చెట్టుపై నుంచి పడి ఒకరి మృతి
ఆర్మూర్టౌన్: ఆర్మూర్ పట్టణంలోని రాంనగర్ కాలనీలో శుక్రవారం మధ్యాహ్నం చెట్టుపై నుంచి పడి ఒకరు మృతి చెందినట్లు ఎస్హెచ్వో సత్యనారాయణ శనివారం తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని సంతోష్నగర్ కాలనీకి చెందిన ప్రేమ్ ఇద్దరు వ్యక్తులతో కలిసి రాంనగర్ కాలనీలోని రామకృష్ణ ఇంటికి చెట్టు కొమ్మలు కొట్టడానికి వచ్చారు. కాగా ప్రేమ్తో వచ్చిన ఇద్దరు అడ్డా కూలీల్లో ఒకతను చెట్టు కొమ్మలు కొడుతూ ప్రమాదవశాత్తు కిందపడి పోయాడు. తలకు తీవ్ర గాయాలు కాగా ఇంటి యజమాని క్షతగాత్రుడిని ఆర్మూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా మెరుగైన చికిత్స కోసం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుడు శుక్రవారం రాత్రి చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్హెచ్వో తెలిపారు. గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం బాల్కొండ: మెండోరా మండల శివారులోని కాకతీయ కాలువలో గుర్తు తెలియని మహిళ మృతదేహం శనివారం లభ్యమైనట్లు ఎస్సై సుహాసిని తెలిపారు. మృతురాలి వయస్సు 55–60 ఏళ్ల వరకు ఉంటుందని, లేత ఆకుపచ్చ చీర, ఎరుపు రంగు జాకెట్టు ధరించి ఉందన్నారు. ఎడమ చేతికి పచ్చబొట్టు ఉందన్నారు. మృతురాలి వివరాలు తెలిసిన వారు 8712659859, 8712659864 నంబర్ల సమాచారం అందించాలని ఎస్సై కోరారు. కుటుంబ తగాదాలతో యువకుడి ఆత్మహత్య మోపాల్: కుటుంబ తగాదాలతో ఓ వ్యక్తి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై సుస్మిత శనివారం తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. మోపాల్ మండలంలోని సిర్పూర్ గ్రామానికి చెందిన గోదా సందీప్(29) ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ కుటుంబంతో జీవిస్తున్నాడు. రెండు రోజుల క్రితం భార్యతో చిన్నపాటి గొడవ జరిగింది. మనస్తాపంతో క్షణికావేశానికి గురైన సందీప్ శుక్రవారం అర్ధరాత్రి ఇంట్లో డిష్ వైర్తో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య మానస ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పేకాట స్థావరంపై దాడి డొంకేశ్వర్: మండలంలోని మారంపల్లిలో పేకాట స్థావరంపై పోలీసులు శనివారం రాత్రి దాడి చేశారు. ఊరి బయట రేకుల షెడ్డులో పేకాట ఆడుతున్న ఐదుగురిని పట్టుకోగా వారి నుంచి రూ.5,700 నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై రామ్ తెలిపారు. పట్టుబడిన వారిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మండలంలో ఎక్కడైనా పేకాట ఆడితే వారిపై కేసులు నమోదు చేస్తామని ఎస్సై హెచ్చరించారు. -
ప్రతిభచాటిన సైకాలజిస్టులు
● ముగ్గురికి ప్రపంచ రికార్డు పత్రాలు నిజామాబాద్నాగారం/సిరికొండ : ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్లో మనోజాగృతి సంస్థ ఆధ్వర్యంలో యూనిసెంట్ స్కూల్, లార్జెస్ట్ మాస్ సైకాలజికల్ ఫస్ట్ ఎయిడ్ సెషన్ ప్రపంచ రికార్డు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లాకు చెందిన విశ్వతేజాస్ ట్రైనింగ్ అండ్ కౌన్సెలింగ్ సర్వీసెస్ స్థాపకులు శ్రీహరి, సభ్యురాలు తేజస్వి, సిరికొండ మండలం తాళ్లరామడుగు గ్రామానికి చెందిన ఇజాప శ్రేయ, ఇజాప రమేశ్ పాల్గొని ప్రపంచ రికార్డు పత్రాన్ని యూనియన్ అధికారి షరీఫా హానీఫ్, మనోజాగృతి స్థాపకురాలు డా.గీతా చల్ల చేతుల మీదుగా అందుకున్నారు. -
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు
నవీపేట: మండల కేంద్రంలోని బాసర రహదారిపై ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని ట్రాఫిక్ ఏసీపీ సయ్యద్ మస్తాన్ అలీ హెచ్చరించారు. సీపీ సాయి చైతన్య ఆదేశాల మేరకు మండల కేంద్రంలోని బాసర క్షేత్రానికి వెళ్లే రహదారికి ఇరువైపులా ఉన్న ఆక్రమణలను శనివారం పరిశీలించారు. కొన్ని ఆక్రమణలను తొలగించి, మరికొందరికి హెచ్చరికలు జారీ చేశారు. అనంతరం స్థానిక పీఎస్లో విలేకరులతో మాట్లాడారు. ఇరుకుగా ఉన్న బాసర రహదారికి ఇరువైపులా కొందరు వ్యాపారులు స్థలాన్ని ఆక్రమించి ఇష్టానుసారంగా వ్యాపారాలు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. అక్రమ నిర్మాణాలు, ఇష్టానుసారంగా పార్కింగ్తో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. బాసరలోని సరస్వతిదేవి దర్శనానికి వెళ్లే భక్తులకు నవీపేటలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. అలాగే వారాంతపు కూరగాయలు, మేకల సంత ఇదే ప్రాంతంలో జరగడంతో మరింత ట్రాఫిక్ సమస్య ఎదురవుతోందని అన్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ సమస్య నియంత్రణకు పోలీసులకు సహకరించాలని కోరారు. నార్త్ రూరల్ సీఐ శ్రీనివాస్, ఎస్సై తిరుపతి పాల్గొన్నారు. -
ఎస్సారెస్పీ వరద గేట్ల మూసివేత
● గోదావరిలోకి నిలిచిన నీటి విడుదల! ● ఇప్పటి వరకు ఇన్ఫ్లో 862 టీఎంసీలు.. అవుట్ ఫ్లో 700 టీఎంసీలు బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లోకి ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు తగ్గుముఖం పట్టడంతో గోదావరిలోకి నీటి విడుదలను అధికారులు శనివారం నిలిపివేశారు. ప్రస్తుతం 10 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. ఇప్పటి వరకు ప్రాజెక్ట్ నుంచి వరద గేట్ల ద్వారా గోదావరిలోకి 700టీఎంసీల నీటిని వదిలారు. అందులో వరద గేట్ల ద్వారా 680 టీఎంసీలు, ఎస్కేప్ గేట్ల ద్వారా 20 టీఎంసీలు విడుదల చేశారు. ఆగస్టు 27 నుంచి మధ్యలో మూడు రోజులు మినహాయించి నిరంతరం వరద గేట్ల ద్వారా గోదావరిలోకి నీటి విడుదల కొనసాగింది. ప్రస్తుత సంవత్సరం ఎగువ ప్రాంతాల నుంచి 862 టీఎంసీల నీరు వచ్చి చేరింది. కాగా, ఈ నెల 28 వరకు ప్రాజెక్టుకు ఇన్ఫ్లో కొనసాగే అవకాశం ఉంది. కాలువలకు కొనసాగుతున్న నీటి విడుదల.. ప్రాజెక్ట్ నుంచి ఆయకట్టు కోసం కాలువల ద్వారా నీటి విడుదల కొనసాగుతోంది. కాకతీయ కాలువ ద్వారా 3 వేలు, ఎస్కేప్ గేట్ల ద్వారా 5 వేలు, సరస్వతి కాలువ ద్వారా 650, లక్ష్మి కాలువ ద్వారా 200, మిషన్ భగీరథ ద్వారా 231, ఆవిరి రూపంలో 709 క్యూసెక్కుల నీరు పోతోంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091(80.5 టీఎంసీలు) అడుగులు కాగా శనివారం సాయంత్రానికి ప్రాజెక్ట్లో 1090.90 (80.05 టీఎంసీలు) అడుగుల నీరు నిల్వ ఉందని అధికారులు పేర్కొన్నారు. వరద గేట్ల ద్వారా 680 టీఎంసీలు వరద కాలువ ద్వారా 50.54 టీఎంసీలు కాకతీయ కాలువ ద్వారా 26 టీఎంసీలు సరస్వతి కాలువ ద్వారా 3.12 టీఎంసీలు లక్ష్మి కాలువ ద్వారా 0.54 టీఎంసీలు ఎస్కేప్ గేట్ల ద్వారా 20 టీఎంసీలు ఆవిరి రూపంలో 5.54 టీఎంసీలు అలీసాగర్ లిప్టు ద్వారా 0.58 టీఎంసీలు గుత్ప లిప్టు ద్వారా 0.29 టీఎంసీలు మిషన్ భగీరథకు 2.57 టీఎంసీలు -
స.హ. చట్టానికి విలువేది?
● సమాచారం ఇవ్వడంలో అధికారుల కప్పదాటు వైఖరి ● నేడు సమాచార హక్కు చట్టం దినం సిరికొండ: ప్రభుత్వం నుంచి జవాబుదారీతనం, పారదర్శకత కోరుకునే ప్రజలకు గొప్పవరం సమాచార హక్కు చట్టం. అమలులో లోపాల వల్ల క్రమక్రమంగా నీరుగారి పోతోంది. సమాచారం ఇవ్వడంలో అధికారులు కప్పదాటు వైఖరి ప్రదర్శిస్తున్నారు. 12అక్టోబర్2005న సమాచార హక్కు చట్టం అమలులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో జిల్లాలో ఈ నెల 5 నుంచి ఆర్టీఐ వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. సమాచార హక్కు చట్టం సెక్షన్ 6 ప్రకారం పౌర సమాజం ద్వారా వచ్చిన సహ దరఖాస్తులను ప్రజా సమాచారం అధికారులు (పీఐవో) పట్టించుకోవడం లేదు. సెక్షన్ 7(1) ప్రకారం 30 రోజులలో ఇవ్వాల్సిన సమాచారాన్ని నెలలు గడిచినా ఇవ్వడం లేదు. సహచట్టం దరఖాస్తుదారులు సమాచారం కోరితే కొందరు అధికారులు సహయ నిరాకరణ చేస్తుండగా, మరికొందరు అరకొర సమాచారం ఇస్తున్నారు. అంతేకాకుండా జిల్లాలో చాలా ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజలకు స్వచ్ఛందంగా వెల్లడించాల్సిన 4(1)బి సెక్షన్కు చెందిన 17 అంశాల సమాచారం ప్రదర్శించడం లేదు. ఈ నెల 8న నిర్వహించిన సహచట్టం జిల్లా సమీక్ష సమావేశంలో జిల్లా శాఖ అధికారులకు, ప్రజా సమాచార అధికారులకు కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. వచ్చిన ప్రతి దరఖాస్తును పరిశీలించి 30 రోజుల్లో సమాచారం ఇవ్వాలన్నారు. డివిజన్, మండల కేంద్రాల్లోని ప్రజా సమాచార అధికారులు దరఖాస్తులు పెండింగ్లో ఉంచవద్దని కోరారు. 306 అప్పీళ్లు, 127 ఫిర్యాదులు పెండింగ్ సమాచార కమిషన్లో ప్రస్తుతం జిల్లా నుంచి 306 అప్పీళ్లు, 127 ఫిర్యాదులు పెండింగ్లో ఉన్నాయి. జిల్లాల వారీగా సమాచార కమిషన్ అప్పీళ్లు ఫిర్యాదులపై సమీక్ష జరుపుతోంది. అక్టోబర్ చివరి వారంలో సమాచార కమిషనర్లు జిల్లాకు రానున్నారు. -
ఏకగ్రీవ పంచాయతీలకు మొండిచేయి
● పదవీ కాలం పూర్తయినా దక్కని నజరానా ● నిధుల విడుదలను పట్టించుకోని గత ప్రభుత్వం మోపాల్: గ్రామాభివృద్ధిని కాంక్షించి పంచాయతీలను ఏకగ్రీవం చేసిన గ్రామాలకు మొండిచేయే దక్కింది. ఎన్నికలు లేకుండా ఆదర్శంగా నిలిచిన జీపీలు పాలకుల వ్యవహారంతో అన్యాయానికి గురయ్యాయి. ఐదేళ్ల పదవీకాలం పూర్తయినా ఆదర్శ గ్రామపంచాయతీలకు నజరానా నేటికి అందలేదు. రూ.10 లక్షలను ప్రభుత్వం, మరో రూ.15లక్షలు ఎమ్మెల్యే, ఎంపీల నిధుల నుంచి కేటాయిస్తామని ప్రకటించారు. ఆ నిధులు విడుదలైతే గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందామనుకున్న వీరి ఆశలు అడియాశలయ్యాయి. 2019 ఎన్నికల్లో జిల్లా వ్యాప్తంగా 530 (ప్రస్తుతం 542 జీపీలు) గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఎన్నికల్లో 130 జీపీల్లో సర్పంచ్, వార్డుసభ్యులందరినీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికలు జరగకుండా సర్పంచ్ సహా పాలకవర్గం ఏకగ్రీవంగా ఎన్నుకుంటే తమ గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం రూ.10లక్షలు, ఎంపీ, ఎమ్మెల్యే నిధుల నుంచి రూ.15లక్షలు కేటాయిస్తామని ప్రకటించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. కానీ పదవీకాలం పూర్తయి ఏడాదిన్నర దాటినా.. మళ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్నా.. ప్రోత్సాహకం కింద ఇస్తామన్న డబ్బులు రాకపోవడంతో గ్రామస్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీ ఎన్నికలంటే ఆషామాషీ కాదు పంచాయతీ ఎన్నికల వేళ ఆశావహుల మధ్య తీవ్ర పోటీ ఉంటుంది. అప్పటి వరకు మిత్రులుగా ఉన్న వారు రాజకీయ శత్రువులుగా, పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థితిలో ఉన్న వారు దోస్త్ మేరా దోస్త్ అనేలా సమీకరణాలు మారిపోతుంటాయి. ఎమ్మెల్యే, ఎంపీ గెలవడం కన్నా.. సర్పంచ్ కావడం ఎంతో కష్టమని సీనియర్ మంత్రి, ప్రస్తుత బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఓ సందర్భంలో ప్రస్తావించారు. ఇంతటి సందడి ఉండే ఎన్నికలను ఏకగ్రీవం పేరుతో ఆదర్శంగా నిలిచిన గ్రామాలకు తగిన ప్రోత్సాహం అందించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి ఈ మొత్తాన్ని రూ.50వేల నుంచి రూ.5లక్షలకు పెంచారు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏకగ్రీవ పంచాయతీలకు రూ.10 లక్షల నజరానా ప్రకటించింది. ఎమ్మెల్యే, ఎంపీ నిధుల నుంచి మరో రూ.15లక్షలు అదనంగా కేటాయిస్తామని తెలిపింది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నజరానాను పెంచుతుందో లేదో వేచి చూడాలి. మోపాల్ మండలంలోని తాడెం జీపీ కార్యాలయం ప్రభుత్వాలపై సన్నగిల్లుతున్న విశ్వాసం..! ఏకగ్రీవంగా ఎన్నికై న గ్రామపంచాయతీలకు ప్రభుత్వాలు ప్రోత్సాహకం ప్రకటిస్తున్నా.. నిధుల విడుదల్లో చిత్తశుద్ధి చూపడం లేదు. ప్రభుత్వం గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఏకగ్రీవ పంచాయతీలకు ప్రోత్సాహకమనేది చాలా ప్రభావితం చేస్తోంది. నిధులు విడుదల చేయకపోవడంతో ప్రభుత్వాలపై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లుతోందని చెప్పక తప్పదు. కాగా ఇదేవిషయమై జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ వివరణ కోరగా, ఏకగ్రీవ పంచాయతీలకు ప్రోత్సాహకం కోసం పంచాయతీరాజ్శాఖ ఉన్నతాధికారులు, ప్రభుత్వానికి నివేదించినట్లు ఆయన తెలిపారు. -
గోదావరిలో ఒకరి గల్లంతు
● బావమరిది మృతదేహం కోసం గాలిస్తుండగా బావ గల్లంతు బాల్కొండ: మెండోరా మండలం చాకిర్యాల్ శివారులోని గోదావరి నదిలో ఆర్మూర్ మండలం చేపూర్కు చెందిన కనికరపు గంగన్న(45) శనివారం గల్లంతయ్యాడు. మెండోరా ఎస్సై సుహాసిని తెలిపిన వివరాల ప్రకారం.. చేపూర్కు చెందిన గంగన్న తన బావమరిది జొరిగె గంగాధర్ కొన్ని రోజుల క్రితం అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకుంటానని ఇంటి నుంచి బయటకు వచ్చాడు. ఈ క్రమంలో ఆయన స్కూటీ చాకిర్యాల్ గోదావరి సమీపంలో కనిపించింది. దీంతో ఇక్కడే పడి ఆత్మహత్య చేసుకుని ఉంటారని భావించిన గంగన్న శనివారం కొంత మంది బంధువులతో కలిసి వచ్చి గోదావరిలోకి గాలింపు చర్యలు చేపట్టారు. గోదావరి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో గంగన్న నీటిలో మునిగి కొట్టుకు పోయాడు. కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఒకరి అదృశ్యం బోధన్రూరల్: మండలంలోని భూలక్ష్మి క్యాంప్ గ్రామానికి చెందిన లోకిరెడ్డి సాంబరెడ్డి అనే వ్యక్తి అదృశ్యమైనట్లు బోధన్ రూరల్ ఎస్సై మచ్చేందర్ రెడ్డి శనివారం తెలిపారు. గ్రామంలో హోటల్ వ్యాపారం చేసుకుంటు జీవిస్తున్న సాంబరెడ్డి శుక్రవారం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబీకులు పలుచోట్ల గాలించినా ఆచూకీ లభించలేదు. చేసిన అప్పులు బాగా పెరిగిపోవడంతో మనోవేదనకు గురై ఇంటి నుంచి వెళ్లిపోయి ఉంటాడని కుటుంబీకులు తెలిపారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై పేర్కొన్నారు. రెంజల్లో వివాహిత..రెంజల్: మండల కేంద్రానికి చెందిన ఓ వివాహిత అదృశ్యమైనట్లు ఎస్సై చంద్రమోహన్ శనివారం తెలిపారు. గత నెల 16న ఇంటి నుంచి వెళ్లిన ఆమె తిరిగి రాలేదు. కుటుంబీకులు పలుచోట్ల వెతికినా ఆచూకీ లభించలేదు. వివాహిత భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. -
బదిలీ బంధాలు
ఆర్మూర్ ప్రాంతంలో పసుపు కొమ్ములు ఏరుతున్న బదిలీకి వచ్చిన బంధువులు (ఫైల్)టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్న కొద్దీ.. మనుషుల మధ్య ఆత్మీయ పలకరింపులు కరువవుతున్నాయి. ఉరుకులు, పరుగుల జీవితంలో ఆప్యాయంగా మాట్లాడాల్సిన బంధువులు, కష్టసుఖాలను పంచుకునే తోబుట్టువుల మధ్య సైతం దూరం పెరుగుతోంది. ఇలాంటివి తమకేమీ పట్టవంటూ ఒకరికొకరు తోడుంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు ఆర్మూర్ ప్రాంత రైతులు. నిద్రలేచిన నుంచే ఆత్మీయ పలకరింపులు మొదలవుతాయి. వ్యవసాయంలో అనాదిగా వస్తున్న సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. పరస్పర సహకారంతో కూలీల సమస్యను అధిగమించడంతోపాటు మానవ సంబంధాలను బలోపేతం చేసుకుంటున్నారు. బదిలీలతో సమష్టిగా వ్యవసాయం చేస్తూ స్ఫూర్తిగా నిలుస్తున్న గ్రామీణ రైతాంగంపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.ఆర్మూర్ : రోజురోజుకూ పెరిగిపోతున్న పెట్టుబడి వ్యయాన్ని తగ్గించుకోవడం కోసం ఆర్మూర్ ప్రాంత రైతాంగం బదిలీ బంధాలను ఏర్పరుచుకొని ఆదర్శంగా నిలుస్తోంది. తమ మధ్య గల బంధాలు, బంధుత్వాలు, స్నేహాలతో ఒకరికి ఒకరు తోడుగా నిలుస్తూ వ్యవసాయంలో రాణిస్తున్నారు. కూలీల ధరలు పె రిగిపోవడంతో వరి నాట్లు, కోతలు, మొక్కజొన్న, సోయా, పసుపు లాంటి పంటలు విత్తుకొనే సమ యంలో ఒకరికి ఒకరు బదిలీ కూలీగా వెళ్లి పనిని పంచుకుంటున్నారు. ఫలి తంగా పెట్టుబడి వ్యయాన్ని తగ్గించు కుంటున్నారు. ఒకవైపు కూలీల భారం లేకుండా వ్యవసా యం సాఫీగా సాగిపోతుండగా, మరోవైపు గ్రామాల్లో బంధాలు, బంధుత్వాలు, స్నేహాలు సై తం బలపడుతున్నాయి. గ్రామాల్లో మహిళలకు రో జు కూలీ రూ.500 ఉండగా పురుషులకు రూ. 1000 వరకు ఉంటుంది. గిట్టుబాటు ధరలు లభించని ప్రతికూల పరిస్థితుల్లో అంతంత పెట్టుబడి పెట్టే స్థోమత లేని వారు.. గ్రామంలో ఇతరులకు కూలీ గా వెళ్లడం ఇష్టపడని వారు తమ బంధువుల తో ట ల్లోకి బదిలీపై వెళ్లి వ్యయాన్ని తగ్గించుకుంటున్నా రు. మరోవైపు బదిలీకి వెళ్లిన రోజు మధ్యాహ్న సమయంలో బంధువులంతా కలిసి ముచ్చట్లు పెడుతూ సద్ది(భోజనం) తినడం.. ఒకరి వంటలు ఒకరు పంచుకోవడం వ్యవసాయ క్షేత్రాల్లో వనభోజనాలను తలపిస్తుంది. సమష్టి వ్యవసాయంతో ఈ ప్రాంత రైతుల తీరు ఆదర్శంగా నిలుస్తోంది.సమష్టిగా వ్యవసాయ పనులు కూలీల అవసరం లేకుండా పరస్పర సహకారం బలపడుతున్న మానవ సంబంధాలు ఆదర్శం.. ఆర్మూర్ ప్రాంత రైతాంగం వరి నాట్లు, కోతలు, పసుపు, మొక్కజొన్న పంటల్లో చేదోడు వాదోడుగా పనులుపెద్ద ఆసాములకు కూలీకి వెళ్లడంతోపాటు ఖాళీ రోజుల్లో మా పొలంలో బంధువులను బదిలీకి పిలుస్తాను. లేదా నేను వారికి బదిలీ వెళతాను. బదిలీల కారణంగా పెట్టుబడి తగ్గి పంట అమ్మిన సమయంలో నాలుగు డబ్బులు నా కూలీగా మిగులుతాయి. అది చాలా ఆనందాన్నిస్తుంది. పని చేసే సమయంలో ఒకరి కష్టసుఖాలను మరొకరం పంచుకుంటాం. – భోజమ్మ, రైతు, మాక్లూర్ మండలం ఎకరం, రెండెకరాల వ్యవసాయం ఉన్న సన్న, చిన్నకారు రైతులకు బదిలీ కూలీలు ఎంతగానో ఉపయోగపడతాయి. పెద్ద ఆసాములు ఈ మధ్యకాలంలో బిహార్, మహారాష్ట్ర నుంచి వచ్చిన కూలీలకు గుత్తగా పనులు ఇచ్చేస్తున్నారు. మాలాంటి చిన్న రైతులు మాత్రం బదిలీలకు వెళ్తున్నాం. – మీరప్పాల మల్లు, రైతు, వల్లభాపూర్, మాక్లూర్ మండలం చిన్న రైతులు పంటను పండించడం కోసం ట్రాక్టర్, హార్వెస్టర్లకే పెద్ద మొత్తం చెల్లిస్తున్నారు. ఇలాంటి సమయంలో కూలీల వ్యయం తగ్గించుకోవడానికి బదిలీలు ఉపయోగపడతాయి. గ్రామాల్లో బదిలీలు కొనసాగినన్ని రోజులు కూలీల కొరత ఉండదు. – టీ సాయిలు, రైతు, మాక్లూర్ మండలం -
కేంద్ర నిధుల జాప్యంతోనే..
నిజామాబాద్ సిటీ : రాష్ట్రంలో ఆర్వోబీలు, పలు అభివృద్ధి పనులు కేంద్రం నుంచి నిధులు రాకపోవడం వల్లనే మందకొడిగా సాగుతున్నాయని పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. జిల్లాలో కాంగ్రెస్ హయాంలోనే అభివృద్ధి జరుగుతోందని, వ్యవసాయ కళాశాల, ఫామాయిల్ ఇండస్ట్రీ ఏర్పాటుకు సీఎం రేవంత్రెడ్డి సముఖంగా ఉన్నారన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్బీ అతిథిగృహంలో మహేశ్ కుమార్ గౌడ్ విలేకరులతో మాట్లాడారు. హైదరాబాద్ నుంచి ముంబయి, వయా నిజామాబాద్ డబుల్ రైల్వేలైన్ విషయం ముఖ్యమంత్రితో చర్చించినట్లు మహేశ్ కుమార్ తెలిపారు. ఎన్నికలకు ముందు కామారెడ్డిలో బీసీ గర్జన సభ ఉంటుందన్నారు. అర్హులైనవారిని డీసీసీ అధ్యక్షులుగా ఎంపికచేస్తామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు అడ్డుకునే కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉందని, బీసీ రిజర్వేషన్లు అమలుచేసి తీరతామని అన్నారు. హైకోర్టు ఇచ్చిన స్టేపై సుప్రీంకోర్టుకు వెళతామన్నారు. రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతనే ఎన్నికలకు వెళతామన్నారు. రాహుల్గాంధీ ఆలోచనల మేరకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శాసీ్త్రయ పద్ధతిలో కులగణన చేశారన్నారు. బీసీ రిజర్వేషన్లపై ఫైల్, మరో రెండు బిల్లులు సైతం గవర్నర్ వద్ద పెండింగ్లో ఉన్నాయన్నారు. బీజేపీ ఎంపీలు ధర్మపురి అర్వింద్, బండి సంజయ్, కిషన్రెడ్డి వంటి వారు కేంద్రంలో రాష్ట్రానికి రావలసిన నిధులపై ప్రధానితో ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. బనక చర్ల విషయంలో మాజీమంత్రి హరీశ్రావు మైల కడుక్కునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే బనకచర్ల జీవోలు తెచ్చారన్నారు. రాష్ట్ర ప్రయోజనాలకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, నీటిచుక్కను కూడా వదిలే ప్రసక్తి లేదన్నారు. సమావేశంలో రాష్ట్ర సహకార సంఘాల సొసైటీ చైర్మన్ మానాల మోహన్రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, పీసీసీ డెలిగేట్ బాడ్సి శేఖర్గౌడ్, మాజీ ఏఎంసీ చైర్మన్ నగేష్రెడ్డి పాల్గొన్నారు. ఆర్వోబీ, అభివృద్ధి పనులకు ఆటంకం జిల్లాలో వ్యవసాయ కళాశాల ఏర్పాటుకు సీఎం సుముఖత 42 శాతం బీసీ రిజర్వేషన్లతోనే స్థానిక ఎన్నికలు అడ్డుకునేందుకు బీజేపీ, బీఆర్ఎస్ కుట్ర పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ -
మద్యం షాపులకు 34 దరఖాస్తులు
నిజామాబాద్అర్బన్ : మద్యం షాపులకు శ నివారం 34 దరఖాస్తులు స్వీకరించినట్లు జి ల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి తె లిపారు. ఇప్పటి వరకు నిజామాబాద్ స్టేషన్ పరిధిలోని మొత్తం 36 వైన్ షాపులకు 53, బోధన్ స్టేషన్ పరిధిలోని 18 వైన్ షాపులకు 23, ఆర్మూర్ స్టేషన్ పరిధిలోని 25 వైన్ షా పులకు 36, భీమ్గల్ పరిధిలో 12 వైన్ షాపులకు 22, మోర్తాడ్ పరిధిలో 11 వైన్ షాపుల కు 15 దరఖాస్తులు వచ్చాయని పేర్కొన్నా రు. జిల్లాలో మొత్తం 102వైన్షాపులకు 149 దరఖాస్తులు స్వీకరించినట్లు తెలిపారు. యథావిధిగా ప్రజావాణి ● కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి నిజామాబాద్అర్బన్: ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్)లో కొనసాగుతున్న ప్రజావాణి కార్యక్రమాన్ని ఈ నెల 13వ తేదీ నుంచి యథావిధిగా నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉండడంతో ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేసినట్లు గుర్తుచేశారు. ప్రస్తుతం స్థానిక ఎన్నికల నిర్వహణ ప్రక్రియ నిలిచిపోయినందున ప్రజావాణి కార్యక్రమం తిరిగి యథావిధిగా కొనసాగుతుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ పదవులకు దరఖాస్తులు షురూ నిజామాబాద్ సిటీ : జిల్లా కాంగ్రెస్ పార్టీలో గడువు ముగిసిన పలు పదవులను త్వరలోనే భర్తీ చేయనున్నారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవితోపాటు నగర అధ్యక్ష పదవికి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ భవన్ కార్యాలయంలో శనివారం పలువురు ఆశావహులు తమ దరఖాస్తులను సమర్పించారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి ఏఎంసీ మాజీ చైర్మన్ నాగేశ్ రెడ్డి, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ మార చంద్రమోహన్, గంగాశంకర్, కునిపురి రాజారెడ్డి, పోల వెంకటేశ్ దరఖాస్తు చేసుకున్నారు. నగర కాంగ్రెస్ అధ్యక్ష పదవికి మహ్మద్ ఖైసర్, బొబ్బిలి రామకృష్ణ, యూత్ కాంగ్రెస్ నాయకుడు గన్రాజ్, శరత్కుమార్ దరఖాస్తు అందజేశారు. ఉచిత శిక్షణకు దరఖాస్తుల స్వీకరణ డిచ్పల్లి : ఎస్బీఐ గ్రామీణ స్వయం ఉపాధి శి క్షణ సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువకులకు ఎలక్ట్రీషియన్, ఫొటోగ్రఫీ, సీసీటీవీ కో ర్సుల్లో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు డైరెక్టర్ రవికుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపా రు. ఈ నెల 13 నుంచి ఎలక్ట్రీషియన్(31 రో జులు), ఫొటోగ్రఫీ (30రోజులు), 15 నుంచి సీసీటీవీ(13రోజులు) కోర్సుల్లో శిక్షణ తరగతులు ప్రారంభమవుతాయన్నారు. శిక్షణతో పాటు ఉచిత భోజన వసతి, సదుపాయం, హాస్టల్ వసతి ఉంటుందని తెలిపారు. ఉమ్మ డి నిజామాబాద్ జిల్లాకు చెందిన 19 నుంచి 45 ఏళ్ల వారు ఈ అవకాశాన్ని సద్వినియో గం చేసుకోవాలని సూచించారు. అభ్యర్థులు ఆధార్కార్డు, రేషన్కార్డు జిరాక్స్, పదో తరగ తి ధ్రువీకరణ పత్రం, ఐదు పాస్పోర్టు సైజ్ ఫొటోలతో వచ్చి రిజిస్టర్ చేసుకోవాలని తెలిపారు. పూర్తి సమాచారం కోసం డిచ్పల్లి మండలం ఘన్పూర్ రోడ్డులో ఉన్న సంస్థ కా ర్యాలయంలో, 08461–295428 నంబర్లో సంప్రదించాలని డైరెక్టర్ సూచించారు. చిరుత సంచారం లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని కంచుమల్, సీతాయిపల్లి రోడ్డుపై చిరుత సంచరించినట్లు గ్రామస్తులు తెలిపారు. గత రెండు రోజులుగా రాత్రి వేళ కంచుమల్ నుంచి సీతాయిపల్లి వెళ్తున్న ప్రయాణికులకు రోడ్డుపై చిరుతపులి పరుగులు తీస్తూ కనిపించినట్లు పేర్కొన్నారు. దీంతో చుట్టు పక్కల గ్రామాల ప్రజలు రాత్రి వేళ, మధ్యాహ్నం రోడ్డుపై ప్రయాణించాలంటే జంకుతున్నారు. అటవీ శాఖ అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
ఆర్టీసీ డ్రైవర్లకు మొబైల్ నిషేధం
● కామారెడ్డి డిపోలో అమలవుతున్న విధానం ● విధులకు ముందే ఫోన్ల డిపాజిట్ ● ప్రమాదాల నివారణకు కృషి ఖలీల్వాడి: తెలంగాణ ఆర్టీసీ ఆదాయాన్ని పెంచుకునేందుకు వివిధ మార్గాలను అన్వేషిస్తూనే.. మరోవైపు ప్రయాణికుల మన్ననలను పొందేందుకు అన్నిరకాల అవకాశాలను ఉపయోగించుకుంటోంది. ఆర్టీసీ ప్రమాదాల నివారణకు ఇటీవల డ్రైవర్లకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించింది. ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకొని తాజాగా బస్సు డ్రైవర్లకు సెల్ఫోన్ వాడకం నిషేధించింది. ఈ విధానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 11 రీజియన్ల నుంచి ఒక్కో డిపోను పైలట్ ప్రాజెక్టు కింద తీసుకుంది. ఉమ్మడి నిజామాబాద్ నుంచి కామారెడ్డి డిపోలో ఈ విధానం అమలు చేస్తోంది. ఈ మేరకు డిపోలోని డ్రైవర్లు సెల్ఫోన్ లేకుండా బస్సుల్లో విధులు నిర్వహిస్తున్నారు. డ్రైవింగ్ సీటులోకి వెళ్లే ముందు డ్రైవర్లు అంతా తమ సెల్ఫోన్లను డిపో సెక్యూరిటీకి అందజేస్తున్నారు. గతంలో పలువురు డ్రైవర్లు విధుల్లో సెల్ఫోన్ వినియోగిస్తున్నట్లు ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు రావడంతో ఆర్టీసీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆర్టీసీ అధికారులు తీసుకున్న ఈ నిర్ణయం సఫలీకృతమైతే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల్లో అమలు చేయనున్నట్లు సమాచారం. సురక్షితమైన ప్రయాణాన్ని అందించాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇంత కాలం జరిగిన ప్రమాదాలకు కారణాలను విశ్లేషిస్తూనే మరోసారి జరగకుండా చర్యలు చేపడుతున్నాం. ఈ విధానంలో ఏమైనా మార్పులు, సమస్యలుంటే తొలుత గుర్తిస్తాం. దశల వారీగా అన్ని డిపోల్లో అమలు చేస్తాం. – జ్యోత్స్న, ఆర్ఎం -
సమాచార హక్కు వ్యవస్థను బలోపేతం చేయాలి
తెయూ(డిచ్పల్లి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమా చార హక్కు వ్యవస్థను బలోపేతం చేయాలనే సంకల్పంతో స.హ. చట్టం–2005ను ప్రవేశపెట్టాయని తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యాదగిరి అన్నారు. తెయూ సమాచార హక్కు సహాయాధికారి డాక్టర్ నీలిమా అధ్యక్షతన ‘సమాచార హక్కు చట్టం–2005’ పై శుక్రవారం నిర్వహించిన అవగాహన సదస్సుకు రిజిస్ట్రార్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రజల సహకారం, భాగస్వామ్యంతోనే వ్యవస్థలు ప్రగతి పూర్వకంగా ముందుకు పోతాయన్నారు. పౌర సమాజానికి ఉపయోగపడే సమాచారాన్ని పారదర్శకంగా అందించాలన్నారు. దేశ సమగ్రతకు భంగం కలిగించే సమాచారాన్ని గోప్యంగా ఉంచాలన్నారు. వర్సిటీ న్యాయ కళాశాల ప్రిన్సిపల్ కే ప్రసన్న రాణి మాట్లాడుతూ సమాచారం అడగడం పౌరుల ప్రధానహక్కుగా ప్ర భుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ప్రవీణ్ మామిడాల, కంట్రోలర్ ప్రొఫెసర్ సంపత్ కుమార్, యూజీసీ సెల్ డైరెక్టర్ ప్రొఫెసర్ సీహెచ్ ఆంజనేయులు, సమాచార కేంద్రం జూనియర్ అసిస్టెంట్ హరీశ్, టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. -
అంకాపూర్ను సందర్శించిన పొలాస విద్యార్థులు
పెర్కిట్(ఆర్మూర్): ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామాన్ని జగిత్యాల జిల్లా పొలాస వ్యవసాయ కళాశాల విద్యార్థులు శుక్రవారం సందర్శించారు. క్షేత్ర సందర్శనలో భాగంగా అంకాపూర్లో రైతులు సాగు చేస్తున్న పంటలను ప్రత్యక్షంగా పరిశీలించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన విత్తన అభివృద్ధి కేంద్రాలను సందర్శించారు. దీంతోపాటు రైతులు సాగు చేస్తున్న అంతర పంటలు, నీటి యాజమాన్య పద్ధతులపై అంకాపూర్ సొసైటీ సభ్యుడు కేకే భాజన్నను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో పొలాస వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తలు రమేశ్, జయంత్, శ్రావణ్, శ్రీకాంత్, రంజిత్, కే నర్సారెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు. -
లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు
● డీఎంహెచ్వో రాజశ్రీ బోధన్టౌన్(బోధన్): ఆస్పత్రుల్లో లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే సహించేది లేదని, ఆర్ఎంపీ, పీఎంపీలు రిఫర్ చేసిన రోగులకు స్కానింగ్ తీయొద్దని జిల్లా వైద్యాధికారి రాజశ్రీ హెచ్చరించారు. శుక్రవారం పట్టణంలోని శక్కర్నగర్ కాలనీలో ఉన్న బస్తీ దవాఖానాలో బోధన్ డివిజన్ స్థాయిలోని ప్రైవేట్ ఆస్పత్రుల వైద్యులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్వో మాట్లాడుతూ ప్రైవేటు ఆస్పత్రుల్లో పని చేస్తున్న వైద్యుల వివరాలు జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో అందించాలన్నారు. డాక్టర్ మారినా, ఒకే డాక్టర్ ఒకటి లేదా రెండు ఆస్పత్రుల్లో పనిచేస్తే ఆ వివరాలు సూచిక బోర్డులో ఏర్పాటు చేయాలని తెలిపారు. ఆస్పత్రుల్లో బయో మెడికల్ వేస్టేజ్ నిర్వహణ, పొల్యూషన్, పార్కింగ్, లీజ్, రెంట్ అగ్రిమెంట్ సర్టిఫికెట్లు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. ప్రతి ఆస్పత్రిలో ధరల సూచిక బోర్డును ఏర్పాటు చేయాలని, చికిత్స కోసం వచ్చే రోగులకు ఆస్పత్రిలో ప్రాథమిక వసతులు తప్పనిసరి కల్పించాలన్నారు. సమావేశంలో సూపర్వైజర్ నిర్మల తదితరులు పాల్గొన్నారు. -
మరమ్మతు పనుల పరిశీలన
నిజామాబాద్అర్బన్: అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో నిర్వహిస్తున్న మరమ్మతు పనులను డీఐఈవో రవికుమార్ శుక్రవారం పరిశీలించారు. ప్రిన్సిపల్ బుద్ధిరాజు ఆధ్వర్యంలో కళాశాలలో చేపడుతున్న సివిల్ పనుల నిర్వహణపై సంతృప్తిని వ్యక్తంచేశారు. తరగతి గదులలో చిన్నచిన్న మరమ్మతులు, విద్యుత్ మరమ్మతు పనులు వెంటనే పూర్తిచేయాలని సూచించారు. అనంతరం సీఎస్ఐ జూనియర్ కళాశాల, ఆల్ఫోర్స్ జూనియర్ కళాశాలలను డీఐఈవో ఆకస్మిక తనిఖీ చేశారు. ప్రిన్సిపాళ్లు, బోధనేతర సిబ్బందితో సమావేశమై విద్యార్థుల అపార్, యుడైస్ పనులను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. -
బీవోఎస్ చైర్మన్గా ప్రొఫెసర్ రవీందర్రెడ్డి
తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీలో పలు విభాగాలకు చైర్మన్, డీన్, సమన్వయకర్తలను నియమిస్తూ వీసీ ప్రొఫెసర్ యాదగిరిరావు ఆదేశాలు జారీ చేశారు. అర్థశాస్త్ర విభాగం బోర్డ్ ఆఫ్ చైర్మన్ (బీవోఎస్)గా ప్రొఫెసర్ రవీందర్రెడ్డి నియామకం అయ్యారు. అర్ధశాస్త్ర విభాగంలో 17 సంవత్సరాల బోధన, పరిశోధన అనుభవం ఉండటంతోపాటు ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్, పలు అకడమిక్, అడ్మినిస్ట్రేటివ్ పదవులను సమర్థవంతంగా నిర్వహించారు. అర్థశాస్త్ర విభాగాధిపతిగా ఎన్.స్వప్న నియామకమయ్యారు. అర్థశాస్త్ర విభాగంలో స్వప్నకు 12 సంవత్సరాల బోధన, పరిశోధన అనుభవం ఉంది. ప్రస్తుతం ఎన్ఎస్ఎస్ యూనిట్–1 ప్రోగ్రాం ఆఫీసర్గా కొనసాగుతున్నారు. వర్సిటీ ఎన్ఎస్ఎస్ విభాగం సమన్వయకర్త (కోఆర్డినేటర్)గా ప్రొఫెసర్ కే అపర్ణ నియమితులయ్యారు. అపర్ణ వర్సిటీలో పలు అకడమిక్, అడ్మినిస్ట్రేటివ్ పదవులను సమర్థవంతంగా నిర్వహించారు. రవీందర్రెడ్డి, స్వప్న, అపర్ణలకు వీసీ యాదగిరి రావు, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యాదగిరి నియామక ఉత్తర్వులను అందజేశారు. తమపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన వీసీ, రిజిస్ట్రార్లకు వారు కృతజ్ఞతలు తెలిపారు. -
బీరు సీసాతో ఆర్టీసీ బస్సుపై దాడి
ఆర్మూర్టౌన్: ఆర్మూర్ మండలం ఆలూర్ గ్రామంలో ఓ యువకుడు మద్యం మత్తులో ఆర్టీసీ బస్సుపై బీరు సీసాతో దాడి చేశాడు. వివరాలు ఇలా ఉన్నాయి. గురువారం రాత్రి ఆర్మూర్ డిపోకు చెందిన బస్సు ఆలూర్ మీదుగా నందిపేట్ వెళ్తుండగా ఆలూర్ గ్రామంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద జాన్(ప్రవీణ్) అనే యువకుడు బైక్ను ఇష్టానుసారంగా నడుపుతుండడంతో డ్రైవర్ శ్రీరాములు హారన్ కొట్టాడు. దీంతో ఆగ్రహం వ్యక్తంచేస్తూ జాన్ బీరు సీసాతో బస్సుపై దాడి చేశాడు. అనంతరం బస్సులోకి ప్రవేశించి మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో ప్రయాణికులు భయాందోళన చెందారు. బీరు సీసాతో బస్సు డ్రైవర్ను చంపాలని ప్రయత్నించగా స్థానికులు అడ్డుకున్నారు. అదే సమయంలో వార్త సేకరణకు వెళ్లిన ఓ రిపోర్టర్ను సైతం జాన్ బెదిరించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోగానే జాన్ అక్కడి నుంచి పారిపోయాడు. దీంతో ప్రయాణికులు రోడ్డుపై బైఠాయించి జాన్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బస్సు డ్రైవర్, రిపోర్టర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
దేవునిపల్లిలో భారీ చోరీ
● రూ.2.5 లక్షల నగదు, 3.5 తులాల బంగారం, 50 తులాల వెండి అపహరణ కామారెడ్డి క్రైం: తాళం వేసి బయటకు వెళ్లిన వ్యక్తి తిరిగి వచ్చేలోపే దుండగులు ఇళ్లు గుల్ల చేశారు. ఈ ఘటన జిల్లా కేంద్రంలోని దేవునిపల్లిలో శుక్రవారం వేకువజామున చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. దేవునిపల్లిలోని భూమొళ్ల శ్రీశైలం బీడీ కంపెనీ వర్కర్గా పని చేస్తున్నాడు. గాంధీనగర్ కాలనీలో బంధువుల పెళ్లి ఉండటంతో గురువారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో కుటుంబంతో కలిసి వెళ్లారు. శ్రీశైలం తిరిగి శుక్రవారం వేకువజామున 5 గంటలకే వచ్చాడు. అప్పటికే తాళం పగులగొట్టి ఉంది. ఇంట్లో సామాన్లు, బీరువా చిందరవందరగా పడి ఉన్నాయి. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. దేవునిపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ జరిపారు. క్లూస్టీంను రప్పించి ఆధారాలు సేకరించారు. ఇంట్లో దాచిన రూ.2.5 లక్షల నగదు, 3.5 తులాల బంగారం, 50 తులాల వెండి అపహరణకు గురైనట్లు బాధితుడు శ్రీశైలం వాపోయాడు. కాగా, పక్కనే ఉన్న మరో ఇంట్లో సైతం దొంగలు చొరబడి చోరీకి యత్నించారు. ఆ ఇంట్లో విలువైన వస్తువులు లేకపోవడంతో వెళ్లిపోయారు. నవీపేట: మండలంలోని యంచ గ్రామంలో తాళం వేసిన ఇంట్లో గురువారం రాత్రి దుండగులు చోరీకి పాల్పడినట్లు ఎస్సై తిరుపతి శుక్రవారం తెలిపారు. గ్రామానికి చెందిన బేగరి జ్యోతి జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో నైట్ డ్యూటీ చేసి శుక్రవారం ఉదయం ఇంటికి వచ్చింది. ఇంటి తాళాలు పగులగొట్టి ఉండడంతో లోపలికి వెళ్లి చూడటంతో బీరువా తెరిచి ఉంది. అందులోని ఒకటిన్నర తులాల బంగారు ఆభరణాలు, రూ. 48 వేల నగదును దుండగులు అపహరించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
అంతర్జాతీయ స్థాయిలో రాణించడం గర్వకారణం
● అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ● అట్టహాసంగా ప్రారంభమైన ఎస్జీఎఫ్ అండర్–14 తైక్వాండో టోర్నీ నిజామాబాద్ నాగారం: జిల్లా కేంద్రంలో సరైన మైదానాలు లేకపోయినప్పటికీ ప్రతిభచాటుతూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించడం క్రీడాకారుల గొప్పతనమని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. ఎస్జీఎఫ్ అండర్–14 తైక్వాండో టోర్నీని ఎమ్మెల్యే ధన్పాల్ శుక్రవారం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ గ్రామీణస్థాయి క్రీడాకారులను ప్రోత్సహిస్తుంటే, రాష్ట్రంలో మాత్రం గత ప్రభుత్వం క్రీడాకారులకు తగిన ప్రోత్సాహం అందించకపోవడం దురదృష్టకరమన్నారు. జిల్లా కేంద్రంలో ప్రత్యేకంగా ఓ క్రీడా మైదానం ఏర్పాటు చేయాలని కలెక్టర్కు వినతిపత్రాలు అందించినప్పటికీ ప్రభుత్వం కేటాయించకపోవడం దారుణమన్నారు. జిల్లాలో క్రీడా మైదానం ఏర్పాటు కోసం వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎస్జీఎఫ్ కార్యదర్శి నాగమణి, డీవైఎస్వో పవన్ కుమార్, ఒలింపిక్ సంఘం జిల్లా కార్యదర్శి బొబ్బిలి నర్సయ్య, పేట సంఘం అధ్యక్షులు విద్యాసాగర్ రెడ్డి, గోపిరెడ్డి, మల్లేశ్ గౌడ్, డీసీసీబీ సెక్రెటరీ సీతయ్య, తైక్వాండో అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు అజ్మత్, కార్యదర్శి వినోద్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
క్రైం కార్నర్
ప్రమాదవశాత్తు చెరువులో పడి ఒకరు మృతి బాల్కొండ: ముప్కాల్ మండలం రెంజర్ల గ్రామానికి చెందిన వడ్ల రాములు(48) గ్రామ ఊర చెరువులో ప్రమాదవశాత్తు పడి మృతి చెందాడు. ఎస్సై రజనీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. రాములు గ్రామంలో వడ్రంగి పని చేసుకుంటూ జీవనం సాగిస్తుంటాడు. అప్పుడప్పుడు మానసిక పరిస్థితి బాగోలేక పోవడంతో ఆందోళనగా తిరిగేవాడు. ఈ క్రమంలో చెరువు వద్దకు వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందాడు. శనివారం నీటిలో తేలియాడుతున్న మృతదేహాన్ని గమనించిన గ్రామస్తులు ఫిర్యాదు చేయడంతో ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆర్మూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించామని ఎస్సై తెలిపారు. ఖలీల్వాడి: చోరీ కేసులో ఒకరిని అరెస్టు చేసినట్లు రైల్వే ఎస్సై సాయిరెడ్డి తెలిపారు. మంచిర్యాలకు చెందిన పాత నేరస్తుడు షేక్ యూనుస్ మేడ్చల్ రైల్వేస్టేషన్లో ఉన్నట్లు వచ్చిన సమాచారంతో శుక్రవారం అక్కడికి వెళ్లి అరెస్టు చేశామన్నారు. కృష్ణ, పండరీపూర్ రైలులో నిందితుడు చోరీకి పాల్పడ్డాడన్నారు. నిందితుడి నుంచి రెండు ఫోన్లు, రూ.20 వేల నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. అతనిపై రెండు కేసులు ఉన్నట్లు నిర్ధారించి రిమాండ్కు తరలించినట్లు ఎస్సై తెలిపారు. రైల్వే ఐడీ పార్టీ పోలీసులు హనుమాన్ గౌడ్, సురేందర్ గురుదాస్ ఉన్నారు. ● ఆస్పత్రిలో చేర్చిన ఎయిర్పోర్టు సిబ్బంది నిజామాబాద్అర్బన్: దుబాయి ఎయిర్పోర్ట్లో నిజామాబాద్ నగరానికి చెందిన సయ్యద్ బాబా (38) అపస్మారకస్థితిలోకి వెళ్లాడు. వివరాలు ఇలా ఉన్నాయి. ఈ నెల 3న సయ్యద్ బాబా ముంబై నుంచి సౌదీ అరేబియాలోని అభా నగరానికి వెళుతూ దుబాయ్ ఎయిర్పోర్టులో మరో విమానం ఎక్కాల్సి ఉండగా, అపస్మారకస్థితిలోకి వెళ్లాడు. స్పందించిన ఎయిర్పోర్ట్ సిబ్బంది సయ్యద్ బాబాను రషీద్ హాస్పిటల్లో చేర్పించి మానవత్వం చాటారు. అస్వస్థతకు మత్తు కారణమై ఉండొచ్చని అనుమానిస్తున్నారు. కాగా, అతడిని ఇండియాకు తిరిగి రప్పించాలని భార్య సమీనా బేగం హైదరాబాద్ ప్రజాభవన్లో శుక్రవారం నిర్వహించిన సీ ఎం ప్రజావాణిలో వినతిపత్రం సమర్పించారు. ఎమిగ్రెంట్స్ వెల్ఫేర్ ఫో రం ప్రధాన కార్యదర్శి బీఎల్ సురేంద్రనాథ్ వారికి మార్గదర్శనం చేశారు. దుబాయిలో ఉన్న జిల్లావాసులు నయీం, కొట్టాల సత్యం, నారాగౌడ్ రోగి బాగోగులు చూసుకుంటున్నారని కుటుంబసభ్యులు తెలిపారు. -
సీఎం పర్యటనలో కట్టుదిట్టమైన బందోబస్తు
పర్యవేక్షించిన ఐజీపీ చంద్రశేఖర్ రెడ్డి, సీపీ సాయిచైతన్యఖలీల్వాడి: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పర్యటన సందర్భంగా పోలీసులు శుక్రవారం నగరంలో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. అందులో భాగంగా సీపీ సాయిచైతన్య ఉదయం నగరంలోని శ్రావ్య గార్డెన్లో పోలీస్ సిబ్బందితో సమా వేశమై పలు సూచనలు చేశారు. డ్యూటీ స్థలం విడి చి ఎక్కడికి వెళ్లొద్దని, సిబ్బంది అలర్ట్గా ఉండాలని ఆదేశించారు. సీఎం పర్యటన బందోబస్తులో ఏసీపీలు, సీఐలు, ఎస్సైలు, ఏఎస్సైలు, హెడ్కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, మహిళా సిబ్బంది, హోంగార్డులతో కలిపి మొత్తం 600 మంది పాల్గొన్నారు. నగరంలోని మాధవనగర్ బైపాస్, కంఠేశ్వర్ బైపాస్, అర్సపల్లి, ఆర్ఆర్ ఎక్స్ రోడ్డు, పులాంగ్, రుక్మిణి చాంబర్, బోర్గాం(పి) బ్రిడ్జి తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సీఎం కాన్వాయ్ వెళ్లే సమయంలో అన్ని వైపులా వాహనాలను నిలిపివేశారు. సీఎం పర్యటన నేపథ్యంలో నగరంలో ఏర్పాటు చేసిన బందోబస్తును ఐజీపీ ఎస్.చంద్రశేఖర్రెడ్డి పర్యవేక్షించారు. సీపీ సాయిచైతన్యను వివరాలు అడిగి తెలుసుకున్నారు. సమీకృత కలెక్టరేట్లో సీఎం రేవంత్రెడ్డికి సీపీ సాయిచైతన్య పుష్పగుచ్ఛం అందజేశారు. బందోబస్తులో అదనపు డీసీపీ (అడ్మిన్) బస్వారెడ్డి, ఏసీపీలు రాజా వెంకటరెడ్డి, వెంకట్ రెడ్డి, శ్రీనివాస్, నాగేంద్ర చారి, రాజశేఖర్, మస్తాన్ అలీ తదితరులు పాల్గొన్నారు. -
హత్య కేసులో ఏడుగురి రిమాండ్
మద్నూర్(జుక్కల్): యువకుడి హ త్య కేసులో ఏడుగురు నిందితులను అరెస్టు చేసి శుక్రవారం రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. మండల కేంద్రంలోని పోలీస్స్టేషన్లో శుక్రవారం సాయంత్రం బాన్సువాడ డీఎస్పీ విఠల్రెడ్డి, బి చ్కుంద సీఐ రవికుమార్, ఎస్సై విజయ్కొండ వివరాలు వెల్లడించారు. సోమూర్ గ్రా మానికి చెందిన రాజ్కుమార్, భీంరావ్, తేజరావ్, సూర్యకాంత్, పండిత్రావ్, రాచప్ప, హన్మంత్, రామ్నాథ్ వరుసకు అన్నదమ్ములు. గత నెల 28న భీంరావ్కు రాజ్కుమార్ డబ్బులు బాకీ ఉండగా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. డబ్బులు తక్కువ చెల్లిస్తున్నావని భీంరావ్ రాజ్కుమార్ను ప్రశ్నించాడు. దీంతో రాజ్కుమార్ భీంరావ్ను దుర్భాషలాడాడు. భీంరావ్తోపాటు తేజరావు, సూర్యకాంత్, పండిత్రావ్, రాచప్ప, రామ్నాథ్, హన్మంత్లు కలిసి రాజ్కుమార్పై దాడి చేయడంతో తీవ్రగాయాలయ్యాయి. రాజ్కుమార్ను స్థానికులు నిజామాబాద్లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఈ నెల 6న మృతి చెందాడు. మృతుడి తండ్రి బస్వంత్ ఫిర్యాదు మేరకు ఏడుగురిపై హత్య కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. -
నిజామాబాద్
పిల్లలను ఫోన్కు దూరంగా.. సెల్ ఫోన్ ప్రభావం పిల్లలపై అధికంగా ఉంద ని సీనియర్ సివిల్ జడ్జి ఉదయ భాస్కర్ రావు అన్నారు. ఫోన్కు దూరంగా ఉంచాలన్నారు.శనివారం శ్రీ 11 శ్రీ అక్టోబర్ శ్రీ 2025– 8లో uపరిశోధన స్థానంలో సాగవుతున్న ఆర్మూర్ పసుపు రకం పంటబాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లోకి ఎగువ ప్రాంతాల నుంచి 75 వేల 394 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు 21 వరద గేట్ల ద్వారా 65,604 క్యూసెక్కుల నీటిని అధికారులు గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్ నుంచి కాకతీయ కాలువ ద్వారా 4 వేలు, ఎస్కేప్ గేట్ల ద్వారా 4 వేలు, సరస్వతి కాలువ ద్వారా 650, మిషన్ భగీరథ ద్వారా 231, ఆవిరి రూపంలో 709 క్యూసెక్కుల నీరు పోతోంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091(80.5 టీఎంసీలు) అడుగులు కాగా శుక్రవారం సాయంత్రానికి ప్రాజెక్ట్లో 1090.90(80.05 టీఎంసీలు) అడుగులు నీరు నిల్వ ఉందని అధికారులు పేర్కొన్నారు. మోర్తాడ్(బాల్కొండ): వరద కాలువకు గండిపడిన చోట మరమ్మతులు పూర్తి చేయడానికి యుద్ధ ప్రాతిపదికన అంచనాలను తయారు చేయాలని ఆపరేషన్స్, మెయింటెనెన్స్ ఇంజినీర్ ఇన్ చీఫ్ శ్రీనివాస్ ఆదేశించారు. శుక్రవారం ఆయన మోర్తాడ్ మండలం గాండ్లపేట్ శివారులోని వరద కాలువ అక్విడెక్ట్ను పరిశీలించారు. గండిపడిన చోట పనులు వేగంగా పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. మూడు రోజుల్లో అంచనాలను రూపొందించి పంపించాలని సూచించారు. ఆయన వెంట సెంట్రల్ డిజైన్ చీఫ్ ఇంజినీర్ సత్యనారాయణరెడ్డి, ఎస్సారెస్పీ సీఈ సుధాకర్రెడ్డి, ఎస్ఈ జగదీశ్వర్, ఈఈ చక్రపాణి, డీఈ గణేశ్, ఏఈఈలు పాల్గొన్నారు. నిజామాబాద్ సిటీ: నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవితోపాటు నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవులను త్వరలో భర్తీచేయనున్నట్లు డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్రెడ్డి తెలిపారు. ఈ మేరకు పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఈ ఎన్నికలను పరిశీలించేందుకు ఏఐసీసీ, కర్ణాటక రాష్ట్ర ఎమ్మెల్యే రిజ్వాన్ అర్షద్ను నియమించింది. ఆయన పర్యవేక్షణలోనే ఎన్నికల ప్రకియ కొనసాగనుంది. పదవుల కోసం పోటీచేసే ఆశావహులు ఈ నెల 12 లోపు జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ భవన్లో దరఖాస్తులు అందజేయాలని మోహన్రెడ్డి సూచించారు.కమ్మర్పల్లి: ఆర్మూర్ ప్రాంతంలో సాగయ్యే పసుపు పంటకు ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తీసుకురావడం కోసం కమ్మర్పల్లి మండల కేంద్రంలోని పసుపు పరిశోధన కేంద్రం సంకల్పించింది. తరతరాలుగా ఈ ప్రాంత రైతులు పండిస్తున్న సంప్రదాయ వైరెటీ ఎర్ర గుంటూర్ రకం పసుపు పంటకు భౌగోళిక గుర్తింపు (జీఐ ట్యాగ్) తీసుకురావడం కోసం, శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం, వనపర్తి జిల్లా మోజర్ల ఉద్యాన కళాశాల శాత్రవేత్త సైదయ్య ఆధ్వర్యంలో పసుపు పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు డాక్టర్ బి మహేందర్, శ్రీనివాస్, నా బార్డ్, ఉద్యాన, మార్కెటింగ్ శాఖల అధికారులు రైతు సహకార సంఘాలతో కలిసి ప్రత్యేక బృందం ఏర్పాటు చేశారు. ఈ బృందం సభ్యులు ఆర్మూర్, నిర్మల్, మెట్పల్లి, జగిత్యాల, మహబూబబాద్ ప్రాంతాల్లో పర్యటించి పసుపు పంటల సాగు విస్తీర్ణాన్ని పరిశీలించి జీఐ ట్యాగ్కు అవసరమైన ఆధారాలు సేకరించారు. ఈ పసుపు రకానికి ప్రత్యేకమైన సువాసన, రంగు, ఔషధ గుణాలు ఉన్నట్లు గుర్తించారు. భౌగోళిక గుర్తింపు (జీఐ ట్యాగ్) కోసం గత నెలలో చైన్నెలోని మేధో సంపత్తి హక్కుల కార్యాలయం (జీఐ ట్యాగ్ రిజిస్ట్రేషన్)లో దరఖాస్తు చేయగా రిజిస్ట్రీ ఆమోదం తెలిపింది. బ్రాండ్ నేమ్తో మంచి ధర ఆర్మూర్ ప్రాంతంలో సాగయ్యే ఎర్ర గుంటూర్ రకం పసుపు పంటకు శాస్త్రవేత్తల బృందం ఆర్మూర్ పసుపుగా నామకరణం చేసి జీఐ ట్యాగింగ్ (భౌగోళిక గుర్తింపు)కు దరఖాస్తు చేశారు. బ్రాండ్కు చట్టపరమైన రక్షణ కల్పించడమే భౌగోళిక గుర్తింపు. దీన్ని దృష్టిలో ఉంచుకొని చేసేదే ‘ది జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ ఆఫ్ గూడ్స్(రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్) యాక్ట్ 1999’ ఈ భౌగోళిక గుర్తింపు వల్ల ఈ ప్రాంతంలోని ఉత్పత్తికి అంతర్జాతీయంగా ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. దీనివల్ల పంటకు డిమాండ్ ఏర్పడి అధిక ధర లభిస్తుంది. ఆర్మూర్ పసుపునకు జీఐ ట్యాగ్ ఇచ్చే ప్రక్రియను ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఈ రకం పసుపు అధిక దిగుబడి రావడంతో పాటు, నాణ్యత, శక్తివంతమైన రంగు, అధిక కుర్కుమిన్ శాతం కోసం ప్రసిద్ధి చెందింది. భౌగోళిక గుర్తింపుతో అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ ఏర్పడుతుంది. రైతులకు మంచి ధర, మెరుగైన మార్కెటింగ్, ఎగుమతి అవకాశాలను మెరుగుపడతాయి. వినియోగదారులకు నాణ్యతపై నమ్మకం పెరుగుతుంది. రైతుల ఉత్పత్తిదారుల హక్కులను కాపాడుతుంది. స్థానిక సంస్కృతి పరిరక్షణకు సహాయపడుతుంది. బ్రాండ్ నేమ్తోనే పసుపు ఉత్పత్తి చేయడం, విక్రయించడానికి అనుమతి ఉంటుంది. దీనివల్ల మంచి ధరతో పాటు, వ్యాపార అవకాశాలను సృష్టిస్తుంది. రైతుల ఆదాయం పెరుగుతుంది. తమిళనాడులో ప్రత్యేక లక్షణాలతో ఈరోడ్ మంజల్ పసుపు మహారాష్ట్రలో ఆసియాలోనే పసుపునకు అతిపెద్ద వ్యాపార కేంద్రంగా ప్రసిద్ధి చెందిన సంగాలి రకం పసుపు, అదేవిధంగా అధిక కుర్కుమిన్ శాతం, సువాసనకు ప్రసిద్ధి చెందిన వైగావ్ రకం పసుపు. ఒడిశాలో ఘాటైన వాసన, ఔషధ గుణాలు కలిగిన కంధమాల్ హల్దీ రకం పసుపు మేఘాలయలో అత్యధిక కుర్కుమిన్ శాతం కలిగిన లకడోంగ్ రకం పసుపు.ఆర్మూర్ పసుపునకు జీఐ ట్యాగింగ్తో ప్రపంచ మార్కెట్లో డిమాండ్ ఏర్పడుతుంది. పరిశోధన బృందం సభ్యులందరం కలిసి క్షేత్ర స్థాయిలో పసుపు పంటను పరిశీలించి ఆధారాలు సేకరించాం. సెప్టెంబర్లో జీఐ ట్యాగింగ్కు దరఖాస్తు చేశాం. రిజిస్ట్రీ ఆమోదం తెలిపింది. మూడు నెలల్లో ఆర్మూర్ పసుపునకు జీఐ ట్యాగింగ్ లభిస్తుంది. ఆర్మూర్ ప్రాంత రైతులకే హక్కులు ఉంటాయి. – డాక్టర్ బి. మహేందర్, ప్రధాన శాస్త్రవేత్త, పసుపు పరిశోధన స్థానం, కమ్మర్పల్లి భౌగోళిక గుర్తింపునకు కమ్మర్పల్లి పసుపు పరిశోధన స్థానం కృషి సెప్టెంబర్లో దరఖాస్తు, రిజిస్ట్రీ ఆమోదం జీఐ ట్యాగ్తో పంటకు మంచి ధర, మార్కెటింగ్, ఎగుమతి అవకాశాలు మెరుగు వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి ‘అర్బన్’ అభివృద్ధికి సహకరించాలి సీఎం రేవంత్రెడ్డికి బీజేపీ ఎమ్మెల్యేల వినతి ముఖ్యమంత్రి పర్యటనలో బీజేపీ నిరసన సెగలు -
విద్యార్థులను సమయానికి చేర్చండి
● ఆర్టీసీ అధికారులకు సీనియర్ సివిల్ జడ్జి ఆదేశాలురెంజల్(బోధన్): విద్యార్థులను సమయానికి బడికి చేర్చాలని జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఉదయ్ భాస్కర్ రావు ఆర్టీసీ అధికారులకు సూచించారు. శుక్రవారం నిజామాబాద్ డిపో రీజనల్ మేనేజర్ జ్యోత్స, డిప్యూటీ ఆర్ఎం మధుసుదన్లను జిల్లా కోర్టులోని తన కార్యాలయం న్యాయ సేవాసదన్కు పిలిపించుకుని మాట్లాడారు. బస్సులు సమయానికి రాకపోవడంతో రెంజల్ మండలం కందకుర్తిలో విద్యార్థినులు బస్సు ముందు నిలబడి నిరసన వ్యక్తం చేశారు. ‘బస్సును అడ్డుకున్న పాఠశాల విద్యార్థులు’ అనే శీర్షికతో గురువారం ‘సాక్షి’లో వచ్చిన కథనానికి స్పందించిన ఆయన ఆర్టీసీ అధికారులతో చర్చించారు. విద్యార్థులకు ఎలాంటి అవరోధాలు రానీయవద్దని, విద్యను అభ్యసించే వారికి ఇబ్బందులు కలుగకుండా పాఠశాలకు సమయానికి చేరుకునేలా బస్సులను నడపాలని వారికి సూచించారు. పాఠశాల సమయాలను తెలుసుకుని బస్సులు నడిచేలా చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థులు సమయానికి బడులకు వెళ్లకుంటే చదువుపై ప్రభావం పడుతుందని జడ్జి పేర్కొన్నారు. బస్సులను పాఠశాలల సమయానికి అనుగుణంగా నడుపుతామని ఆర్టీసీ అధికారులు అంగీకరించారు. -
ఆర్వోబీల పనులు పూర్తిచేయాలి
సుభాష్నగర్: జిల్లాలోని అర్సపల్లి, అడవి మామిడిపల్లి, మాధవనగర్ అండర్ రైల్వే బ్రిడ్జి(ఆర్వోబీ)ల నిర్మాణానికి నిధులు కేటాయించి పనులు పూర్తి చేయాలని నిజామాబాద్ అర్బన్, ఆర్మూర్ ఎమ్మెల్యేలు ధన్పాల్ సూర్యనారాయణ, పైడి రాకేశ్రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ పటేల్ డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి జిల్లా పర్యటన నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు శుక్రవారం నిరసన తెలియజేశారు. మొదట ఆర్వోబీల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని బీజేపీ కార్యాలయం వద్ద పార్టీ అధ్యక్షుడు దినేశ్ పటేల్ ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలు ధరించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సీఎం పర్యటనను ఎక్కడ అడ్డుకుంటారోనని పోలీసులు బీజేపీ నాయకులను అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. బీజేపీ శ్రేణులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పోలీసులు భారీగా మోహరించారు. అనంతరం సీఎం రేవంత్రెడ్డికి వినతిపత్రం అందజేసేందుకు కలెక్టరేట్కు వెళ్లిన ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులకు కేవలం వినతి పత్రం ఇవ్వాలని పోలీసులు చెప్పడంతో వారు అక్కడే అందోళనకు దిగారు. ఎమ్మెల్యేలు సహా నాయకులు కలెక్టరేట్లో కింద కూర్చొని నిరసన తెలియజేశారు. అనంతరం పోలీసుల అనుమతితో ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు సీఎంను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్లు, డబుల్ బెడ్రూం కింద నియోజకవర్గానికి 3500 మంజూరైతే.. స్థలం కొరత వల్ల కేవలం 1757 మాత్రమే కేటాయించారని అన్నారు. మిగతా 1743 ఇండ్లు చంద్రశేఖర్నగర్ కాలనీలో ప్రభుత్వమే భూమిని కేటాయించి ఇళ్ల నిర్మాణం చేపట్టాలని కోరారు. నాగారంలో డబుల్ బెడ్రూం ఇండ్ల మరమ్మతులకు కేటాయించిన రూ.1.25 కోట్లకు అదనంగా సరిపడా నిధులు మంజూరు చేయాలన్నారు. జీజీహెచ్ అభివృద్ధికి నిధులు కేటాయించాలని, ఇంటిగ్రేడెట్ పాఠశాల నిర్మాణానికి అనువుగా జీవోలో మార్పులు చేయాలని కోరారు. సీడీపీ నిధులు విడుదల చేయాలని, ఎస్డీఎఫ్ నిధులు రూ.10 కోట్లు కేటాయించాలన్నారు. మున్సిపాలిటీలో రోడ్లు, పార్కులకు, జంక్షన్ల అభివృద్ధి కోసం రూ.100 కోట్ల ప్రణాళిక సిద్ధం చేశామని, వాటికి అవసరమయ్యే నిధులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అత్యాధునిక మౌలిక సదుపాయాలతో బస్టాండ్ను అభివృద్ధి చేయాలన్నారు. అర్బన్ నియోజకవర్గ అభివృద్ధి కోసం చేసిన ప్రతిపాదనలను ప్రభుత్వం పరిశీలించి తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు.జిల్లాలో భారీ వర్షాల కారణంగా మొక్కజొన్న రైతులు తీవ్రంగా నష్టపోయారని, వెంటనే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధరకు కొనుగోలు చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ పటేల్ డిమాండ్ చేశారు. పీఎం నిధులతో ఆమోదం పొందిన పనులు ఆలస్యమవుతున్నాయని, అభివృద్ధిలో స్తబ్ధత నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్వోబీలను తక్షణమే పూర్తి చేయాలని, పనులు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించి ఆదుకోవాలన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధానకార్యదర్శులు నాగోళ్ల లక్ష్మీనారాయణ, న్యాలం రాజు, శంకర్రెడ్డి, పద్మారెడ్డి, తారక్ వేణు, నాగరాజు, పిల్లి శ్రీకాంత్, దొంతుల రవి, ఆమంద్ విజయ్, పంచరెడ్డి శ్రీధర్, సాయివర్ధన్, ఆకుల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. -
నకిలీ అధ్యాపకులు!
నిజామాబాద్అర్బన్: ఉద్యోగం క్రమబద్ధీకరణ (రెగ్యులరైజ్) కోసం కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్లు నకిలీ సర్టిఫికెట్లను సమర్పించారు. ఈ వ్యవహారం పై ప్రస్తుతం జరుగుతున్న విచారణ తుది దశకు వచ్చింది. గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో కాంట్రాక్టు పద్ధతిన పనిచేస్తున్న అధ్యాపకులను క్రమబద్ధీకరించారు.అయితే కొందరు కాంట్రాక్టు అధ్యాపకులు నకిలీ ధ్రువపత్రాలను సమర్పించి క్రమబద్ధీకరణ పొందారు. దీనిపై ఫిర్యాదు వెళ్లగా కొన్నేళ్లుగా రాష్ట్రస్థాయిలోనే విచారణ చేపట్టారు. ఇటీవల జిల్లాల వారీగా విచారణ చేపట్టడంతో జిల్లాలో 30 మంది జూనియర్ అధ్యాపకులు నకిలీ ధ్రువపత్రాలు సమర్పించినట్లు విచారణలో తేలింది. యూనివర్సిటీలు లేకున్నా.. జిల్లాలో 16 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. వీటి పరిధిలో 130 మంది కాంట్రాక్టు అధ్యాపకులను క్రమబద్ధీకరించాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు ధ్రువపత్రాల పరిశీలన చేపట్టి కాంట్రాక్టు అధ్యాపకులను క్రమబద్ధీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఎన్నికల కోడ్ సమీపిస్తుందన్న సమయంలోనే ఈ కార్యక్రమం నిర్వహించారు. కాంట్రాక్టు అధ్యాపకులు కొందరు అర్హులు కాకున్నా నకిలీ ధ్రువపత్రాలను తీసుకువచ్చి ఉద్యోగాన్ని క్రమబద్ధీకరించుకున్నారు. గత నెల 10న జిల్లా ఇంటర్ విద్యాధికారి క్రమబద్ధీకరించబడిన 130 మంది కాంట్రాక్టు అధ్యాపకుల ఒరిజినల్ ధ్రువపత్రాలు తీసుకొని వరంగల్ ఆర్జేడి కార్యాలయంలో పరిశీలన చేశారు. ఇందులో 30 మంది అధ్యాపకులు నకిలీ ధ్రువపత్రాలు సమర్పించినట్లు గుర్తించారు. ఇందులో పాండిచ్చేరి అలగప్ప, మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన దూరవిద్య కేంద్రాలకు సంబంధించిన ధ్రువపత్రాలు సమర్పించారు. ఈ ధ్రువ పత్రాలకు సంబంధించి ఎలాంటి యూనివర్సిటీ కొనసాగడం లేదు. నకిలీ ధ్రువపత్రాలు సమర్పించిన అధ్యాపకుల సంబంధించిన రహస్య విచారణ ప్రస్తుతం ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా 700 మంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు. జిల్లాల వారీగా నకిలీ అధ్యాపకులను గుర్తించి తుది నివేదికను రూపొందించనున్నారు. అనంతరం వీరిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అధికారులు భావిస్తున్నారు. అందరూ పంచుకున్నారు.. కాంట్రాక్టు అధ్యాపకులు క్రమబద్ధీకరణ కోసం భారీగా డబ్బులు చెల్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో ఇద్దరు ప్రజాప్రతినిధులను కలిసి డబ్బులు సమర్పించినట్లు సమాచారం. ఒక్కో అధ్యాపకుడు రూ. ఐదు లక్షల చొప్పున సమర్పించినట్లు తెలిసింది. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ అధ్యాపకుల సంఘానికి చెందిన ఇద్దరు నాయకులు కళాశాలల వారీగా కాంట్రాక్టు అధ్యాపకులందరి వద్ద డబ్బులు వసూలు చేసినట్లు చెబుతున్నారు. రాష్ట్ర సంఘం నాయకులు, జిల్లా సంఘం నాయకులు, జిల్లాకు చెందిన అధికారులు వసూలు చేసిన డబ్బులు పంచుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.గత నెల వరంగల్ ఆర్జేడీ కార్యాలయంలో క్రమబద్ధీకరించబడిన కాంట్రాక్టు అధ్యాపకుల ధ్రువపత్రాల పరిశీలన జరిగింది. ఇందులో కొన్ని లోపాలు ఉన్నట్లు తెలిసింది. ఉన్నతాధికారులు పరిశీలన చేపడుతున్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన పత్రాలను గుర్తించారు. దీనికి సంబంధించి ఉన్నతాధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియడం లేదు. – రవికుమార్, ఇంటర్ విద్యాధికారి క్రమబద్ధీకరణ కోసం తప్పుడు ధ్రువపత్రాల సమర్పణ జిల్లాలో 30 మంది గుర్తింపు ఒక్కొక్కరి వద్ద రూ. ఐదు లక్షలు వసూలు తుది దశకు వచ్చిన అధికారుల విచారణ చర్యలకు అవకాశం -
నిజామాబాద్
ఈసీ మార్గదర్శకాలను పాటించాలి రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు, నియమాలను అధికారులు, అభ్యర్థులు కచ్చి తంగా పాటించాలని కలెక్టర్ సూచించారు. శుక్రవారం శ్రీ 10 శ్రీ అక్టోబర్ శ్రీ 2025– IIలో uస్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల నేపథ్యంలో.. పరిషత్ మొదటి విడత ఎన్నికలకు నామినేషన్ల దాఖలు మొదటి రోజే ఎన్నికలను నిలిపేస్తూ హైకోర్టు ఆదేశాలిచ్చింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన బీసీ రిజర్వేషన్ల స్థానాలు అనుకూలంగా వచ్చిన పోటీదారులు తీవ్ర నిరాశలో పడిపోయారు. కోర్టు జోక్యంతో ఎక్కడ రిజర్వేషన్లు మారిపోతాయోనని ఆందోళన చెందుతున్నారు. మరోవైపు రిజర్వేషన్లు అనుకూలంగా రాని వారు కాలం కలిసి వస్తుందేమోనని ఆశాభావంతో ఎదురుచూస్తున్నారు. సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : బీసీ రిజర్వేషన్ల నేపథ్యంలో అనేక మలుపులు తిరుగుతూ వచ్చిన స్థాని క సంస్థల ఎన్నికల అంశం మరిన్ని చర్చలకు తెరతీసింది. శాసనసభ తీర్మానం, గవర్నర్ వద్ద ఫైల్ పెండింగ్, ప్రభుత్వం జీవో విడుదల చేయడం, ఎన్నిక ల కమిషన్ షెడ్యూల్ ప్రకటించడం, మొదటి విడత నోటిఫికేషన్ ఇవ్వడం, హైకోర్టుకు వెళ్లడం.. ఇన్ని ప రిణామాల మధ్య వివిధ వర్గాల్లో అనేక రకాల చర్చ లు జరిగాయి. ఎవరి విశ్లేషణ వారిదే అన్నట్లుగా కథ నడిచింది. చివరకు హైకోర్టు ఆదేశాలతో ఎన్నికలకు బ్రేకు పడింది. పరిషత్ మొదటి విడత ఎన్నికలకు నామినేషన్ల దాఖలు మొదటి రోజే ఎన్నికలను నిలి పేస్తూ ఉన్నత న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. నా లుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు పేర్కొంది. మరో రెండు వారాల్లో పిటిషనర్ కౌంటర్ ఇవ్వాలంది. దీంతో ఎన్నికల ప్రక్రియ మరింత ఆలస్యం అవుతోంది. వచ్చే జనవరిలో మాత్రమే ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గా లు అంచనాలు వేస్తున్నాయి. స్థానిక ఎన్నికల అంశం మొత్తం బీసీ రిజర్వేషన్ల చుట్టూ తిరుగుతుండగా, తాజాగా కోర్టు ఆదేశాలతో కొందరిలో నిరాశ, మరికొందరిలో ఆశలు పెరుగుతున్నాయి. ఆయా ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీల స్థానాలకు రిజర్వేషన్లు అనుకూలంగా వచ్చిన వారు బరిలో దిగేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. వారిలో తాజాగా కోర్టు తీర్పుతో నిరాశ నెలకొంది. మరోవైపు రిజర్వేషన్ల కారణంగా తమకు పోటీ చేసే అవకాశం రాలేదని నిరాశ చెందుతున్నవారిలో మళ్లీ ఆశలు చిగురించాయి. మళ్లీ రిజర్వేషన్లు మారాతాయా అంటూ చర్చోపచర్చలు జరుగుతున్నాయి. జిల్లాలో మొదటి విడతలో గురువారం 18 మండలాల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కమిషన్ నామినేషన్ల స్వీకరణ మొదలు పెట్టింది. డిచ్పల్లి జెడ్పీటీసీకి ఒక నామినేషన్ దాఖలైంది. అదే మండలంలో రెండు ఎంపీటీసీ నామినేషన్లు దాఖలయ్యాయి. కోటగిరి మండలంలో నాలుగు ఎంపీటీసీ స్థానాలకు నాలుగు నామినేషన్లు దాఖలయ్యాయి. మాక్లూర్ మండలంలో ఒక ఎంపీటీసీ నామినేషన్ దాఖలైంది. మోపాల్ మండలంలో ఒక ఎంపీటీసీ స్థానానికి నామినేషన్ దాఖలైంది. బోధన్ రెవెన్యూ డివిజన్లో ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. అంతా ఇదే చర్చ.. మహారాష్ట్రలో గతంలో స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయ్యాక, ఫలితాలు ప్రకటించిన తరువాత సైతం సదరు ఎన్నికలను సుప్రీంకోర్టు రద్దు చేయడంతో ఆయా పార్టీల నాయకుల్లో తీవ్రమైన చర్చ జరిగింది. ప్రస్తుతం తాజాగా వచ్చిన కోర్టు ఆదేశాలకు ముందు వరకు కూడా రిజర్వేషన్లు ఉంటాయా.. మారతాయా, నామినేషన్లు వేసినప్పటికీ ఎన్నికలు సజావుగా జరుగుతాయా.. లేదా, డబ్బులు ఖర్చు చేసుకుని ఎన్నికల్లో విజయం సాధిస్తే ఈ ఎన్నికలను కోర్టు అంగీకరిస్తుందా.. రద్దు చేస్తుందా అనే విషయంలో తర్జనభర్జన పడ్డారు. ఈ నేపథ్యంలోనే హైకోర్టు ఎన్నికలను నిలిపేయడంతో ఆశావహులు నిర్వేదం చెందుతున్నారు. వెనుతిరిగిన అభ్యర్థులు.. మాక్లూర్–2 ఎంపీటీసీ స్థానానికి ఒకరు నామినేషన్ దాఖలు చేశారు. సాయినేని వెంకేశ్వరరావు అనే అభ్యర్థి ముహూర్తం చూసుకుని భారీగా అనుచరులతో తరలివచ్చి నామినేషన్ వేశారు. అయితే అప్పటికే కోర్టు స్టే ఇచ్చిందని తెలియడంతో నిరాశ చెందాడు. అదేవిధంగా కొత్తపల్లి ఎంపీటీసీ స్థాఽనానికి కాంగ్రెస్ నుంచి చంద్రయ్య, మాక్లూర్ ఎంపీటీసీ–2 స్థానంలో బీజేపీ అభ్యర్థి సురేష్నాయక్ నామినేషన్ దాఖలు చేసేందుకు వచ్చి కోర్టు స్టేతో దాఖలు చేయకుండానే తిరిగి వెళ్లిపోయారు. స్థానిక ఎన్నికలు నిలిపేస్తూ హైకోర్టు ఆదేశాలతో భిన్న స్వరాలు నామినేషన్లకు రంగం సిద్ధం చేసుకున్నవారికి చుక్కెదురు తమకు అనుకూలంగా రిజర్వేషన్లు రానివారిలో ఆశలు జనవరి వరకు ఎన్నికలకు బ్రేకు పడినట్లేనా.. పలువురి అంచనాలు -
అధిక ఆదాయం.. అత్యధిక పోటీ
ఖలీల్వాడి: రాష్ట్రప్రభుత్వం 2025–2027 వరకు మ ద్యం షాపుల నిర్వహణకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. రూ. 3లక్షల చలాన్తో సెప్టెంబర్ 26 నుంచి ఎక్సైజ్ అధికారులు దరఖాస్తులు స్వీకరిస్తున్నా రు. జిల్లా వ్యాప్తంగా 102 మద్యం షాపులు ఉన్నా యి. అయితే, గతంలో పలు వైన్ షాపులకు వచ్చిన దరఖాస్తుల ఆధారంగా ప్రస్తుతం కూడా వాటికే అధిక డిమాండ్ ఉంటుందని ఎకై ్సజ్ వర్గాలు భావిస్తున్నాయి. రెండేళ్ల కాలపరిమితిలో రూ.కోట్లలో వ్యాపారం జరగడంతో వ్యాపారులు అధిక ఆదా యం వచ్చే మద్యం షాపులపైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. వాటిని దక్కించుకునేందుకు గ్రూ పులుగా ఏర్పడి దరఖాస్తులు చేసేందుకు సిద్ధమవుతున్నారు. నగరానికి చెందిన ఓ యువకుడు వివిధ గ్రూపులతో కలిసి సుమారు 50 వరకు దరఖాస్తులు చేస్తున్నట్లు తెలిసింది. జిల్లాలో 12 వైన్ షాపులకు 2023, 2024 సంవత్స రంలో ఎక్కువగా దరఖాస్తులు వచ్చినట్లు ఎకై ్సజ్ సూపరిండెంట్ మల్లారెడ్డి తెలిపారు. మానిక్భండార్లోని మద్యం షాపుకు 112 దరఖాస్తులు రాగా, సె ప్టెంబర్ వరకు లిక్కర్ విక్రయం ద్వారా రూ.26 కో ట్ల ఆదాయం వచ్చింది. దీంతో ఈసారి మరో వైన్స్ కు అవకాశం కల్పించారు. కాగా, ఇదే ప్రాంతంలో బార్ రావడంతో గతంమాదిరిగా ఈ వైన్స్కు దర ఖాస్తులు వస్తాయా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మద్యం దుకాణాల దరఖాస్తులకు ఈ నెల 18 న సా యంత్రం 5 గంటల వరకు అవకాశం ఉంది. గతంలో గడువు ముగింపు దశలో అత్యధిక దరఖాస్తులు వచ్చాయి. ఈసారీ అదే మాదిరిగా దర ఖాస్తుదారు లు అత్యధిక సంఖ్యలో వస్తాయని భావించిన ఎక్సై జ్ అధికారులు వ్యాపారులకు ఇబ్బందులు కలుగకుండా ఆర్మూర్ ప్రాంత దరఖాస్తులను నిజామాబాద్ ఎక్సైజ్శాఖ కార్యాలయంలో స్వీకరించేందుకు ఏర్పాట్లు చేశారు. గురువారం సాయంత్రం వరకు 102 దుకాణాలకు 88 దరఖాస్తులు వచ్చినట్లు ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి వెల్లడించారు. జిల్లాలో పలు మద్యం దుకాణాలకు క్రేజీ గతంలో ఒక్కో వైన్స్కు 53 నుంచి 112 వరకు దరఖాస్తులు సెప్టెంబర్ వరకు లిక్కర్ ద్వారా రూ.18.85 కోట్ల నుంచి రూ.35 కోట్ల ఆదాయం -
కాకతీయ కాలువ కట్ట భద్రమేనా !
● ప్రమాదకరంగా కాలువ కట్ట ● ఏళ్లతరబడి ప్రతిపాదనలు.. లభించని మోక్షంబాల్కొండ : శ్రీ రాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి నీటి సరఫరా చేసే కాకతీయ కాలువ కట్ట భద్రతపై ఆయకట్టు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నా రు. గాండ్లపేట్ వద్ద వరద కాలువ అక్విడెక్ట్కు గండి పడిన నేపథ్యంలో.. కాకతీయ కాలువ పరిస్థితి కూడ అధ్వానంగా ఉందంటున్నారు. కాకతీయ కాలువ జీరో పాయింట్ వద్ద గత కొంతకాలంగా కట్ట కుంగుతోంది. దీంతో కాలువ కట్టను సిమెంట్ బస్తాల్లో ఇసుక నింపి అడ్డుగా వేశారు. మరమ్మతుల కోసం రూ. 10 లక్షలు మంజూరై రెండేళ్లు గడుస్తున్నా పనులు చేపట్టడం లేదు. అదేవిధంగా పోచంపాడ్ శశివారులో వాటర్ ట్యాంక్ వద్ద కాకతీయ కాలువ కట్ట మరింత ప్రమాదకరంగా ఉంది. వాటర్ ట్యాంక్ నుంచి మిగులు నీటిని కాలువలోకి మళ్లించుటకు పైపు వేశారు. దీనివల్ల కాలువ కట్ట మరింత కోతకు గురైంది. కాలువ కట్టకు ఇది వరకే గండి ఏర్పడింది. మరింత పెద్దగా గండి పడితే కాలువ నీరు పోచంపాడ్ కాలనీలోకి వెళ్లే ప్రమాదం ఉంది. అదేవిధంగా కాకతీయ కాలువ పొడవునా సిమెంట్ లైనింగ్ ధ్వంసం కావడంతో కాలువ కట్ట ప్రమాదకరంగా మారింది. కాలువకు గండి పడక ముందే మరమ్మతులు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.కాకతీయ కాలువ మరమ్మతుల కోసం ప్రభుత్వానికి పలు మార్లు ప్రతిపాదనలు పంపించాం. ఇప్పటి వరకు నిధులు మంజూరు కాలే దు. దీంతో పనులు చేపట్టలేక పోయాం. నిధు లు మంజూరు కాగానే పనులను చేపడుతాం. – రఘుపతి, డిప్యూటీఈఈ, కాకతీయ కాలువ -
వరద కాలువకు గండి
మోర్తాడ్(బాల్కొండ) : మోర్తాడ్ మండలం గాండ్లపేట శివారులోని వరద కాలువ అక్విడెక్ట్కు గండి పడటంతో వరద కాలువ నీరు పెద్దవాగులో కలిసిపోయింది. బుధవారం అర్ధరాత్రి తర్వాత ఊహించని రీతిలో వరుద కాలువకు కింది భాగంలో గండి ఏర్పడింది. పెద్ద వాగు వద్ద నిర్మించిన అక్విడెక్టు ముగిసిన తర్వాత సిమెంటు గోడను నిర్మించారు. వరద కాలువ ప్రవాహం తట్టుకునే విధంగా నిర్మాణాన్ని 2020లో పూర్తి చేశారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి మిగులు జలాలు మిడ్ మానేరుకు వరద కాలువ ద్వారా విడుదల చేస్తున్నారు. గోదావరి నదిలోకి నీరు వదిలేందుకు బదులుగా వరద కాలువ ద్వారా విడుదల చేస్తుండడంతో ప్రవాహం విపరీతంగా పెరిగింది. వరదనీటి ఉధృతికి అక్విడెక్ట్ కింది భాగంలో గుంత ఏర్పడి నీరంతా పెద్ద వాగులోకి చేరింది. మొదట ఒడ్డువైపు నీటి ప్రభావం పెరిగిపోయింది. ఈ సమాచారం అందుకున్న చీఫ్ ఇంజనీర్ సుధాకర్రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చక్రపాణి తదితరులు వరద కాలువకు నీటి మళ్లింపును ఆపివేశారు.నీటి ప్రవాహం ఉండడంతో జగిత్యాల వైపు వెళ్లిన నీరు కూడా గాండ్లపేట వైపు మళ్లింది.వరద కాలువ అక్విడెక్ట్ నీరు పెద్దవాగులో ప్రవహిస్తున్న తీరుపై అధికారులతో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఫోన్లో మాట్లాడారు. వరద కాలువకు గండి ఏర్పడడానికి ప్రధాన కారణం గుర్తించి సత్వరమే చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ప్రాజెక్టు వరద కాలువ విభాగం ఇంజనీర్లతో పాటు మోర్తాడ్ తహసీల్దార్తో మాట్లాడి కాల్వకు గండిపడటం వల్ల పంటలకు ఏమైనా నష్టం జరిగితే గుర్తించి ప్రభుత్వానికి నివేదిక అందించాలని కోరారు. -
దోమకొండలో ఇద్దరు అదృశ్యం
దోమకొండ: మండల కేంద్రానికి చెందిన ఇద్దరు అదృశ్యమైనట్లు ఎస్సై స్రవంతి తెలిపారు. దో మకొండకు చెందిన మా సుల నర్సింలు గురువారం మధ్యాహ్నం గేదెలను మేపడానికి వెళ్తు న్న అని ఇంట్లో చెప్పి బయటకు వెళ్లాడు. రాత్రి తిరిగి ఇంటికి రాలేడు. ఆచూకీ లభించకపోవడంతో నర్సింలు భార్య లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే మండల కేంద్రానికి చెందిన చిట్యాల నవీన్ అనే వ్యక్తి గురువారం ఉదయం కుటుంబంలో గొడవల కారణంగా ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోయాడు. రాత్రయినా తిరిగి ఇంటికి రాలేడు. కుటుంబ సభ్యులు ఎంత వెతికినప్పటికీ ఆచూకీ లభించలేదు. ఈమేరకు అతడి భార్య రాధిక పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. -
బీసీలను మోసగిస్తున్న కాంగ్రెస్, బీజేపీ
వేల్పూర్: కాంగ్రెస్, బీజేపీ లు కలిసి బీసీలను మోసగిస్తున్నాయని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్ర శాంత్రెడ్డి ఆరోపించారు. బీసీ రిజర్వేషన్లపై హైకో ర్టు ఇచ్చిన తీర్పుపై గురువారం ఆయన స్పందిస్తూ ప్రకటన విడుదల చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకా రం 50 శాతం కంటే ఎక్కువ రిజర్వేషన్ ఇవ్వాలంటే 10వ షెడ్యూల్లో చేర్చి రాజ్యాంగ సవరణ తప్పని సరి చేయాలన్న వాస్తవం తెలిసి కూడా కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో బీసీలను కాంగ్రెస్ మోసగించిందన్నారు. రాజ్యాంగ సవరణ కోసం 22 నెలలుగా ఢిల్లీ లో పోరాటం చేయకుండా కాంగ్రెస్ గల్లీలో మాత్రం డ్రామాలు ఆడిందన్నారు. బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో కాంగ్రెస్ ధర్నా చేసినప్పుడు సోనియాగాంధీ, రాహుల్గాంధీ, పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జునఖర్గే ఇలా ఏ ఒక్కరూ రాలేదన్నారు.ప్రధానమంత్రి మోదీ కూడా కాంగ్రెస్తో కలిసి బీసీ రిజర్వేషన్లు పెరగకుండా చూస్తున్నారని ఆరోపించారు. ఢిల్లీలో కాంగ్రెస్ నిజాయితీగా పోరాటం చేస్తే తాము కూడా వారితో కలిసి పనిచేస్తామన్నారు. సీఎం రేవంత్రెడ్డి బీసీలకు రిజర్వేషన్ల పెంపుపై చిత్తశుద్ధితో పనిచేయాలని డిమాండ్ చేశారు. -
టేకు చెట్ల చోరీలో ఇద్దరి అరెస్టు
మాక్లూర్: వ్యవసాయ క్షేత్రం నుంచి టేకు చెట్లను కోసి అపహరించుకుపోయిన దొంగలను మాక్లూర్ పోలీసులు గురువారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఎస్సై రాజశేఖర్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఆగస్టు 19న మండలంలోని మెట్పల్లి–వల్లభాపూర్ గ్రామాల మధ్యలో ఉన్న గోపాల్ శ్రీధర్ వ్యవసాయ క్షేత్రం నుంచి దొంగలు 20 టేకు చెట్లను మిషన్తో కోసి దుంగలను ఎత్తుకెళ్లారు. యజమాని శ్రీధర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, నార్త్ జోన్ సీఐ శ్రీనివాస్, ఎస్సై రాజశేఖర్ దర్యాప్తు చేపట్టారు. చెట్లను అపహరించిన జావేద్, మహమ్మద్ అబ్బాస్లను అరెస్టు చేసి వారి నుంచి రూ. 95 వేల విలువజేసే టేకు కలపను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. -
ఈసీ మార్గదర్శకాలను పాటించాలి
● కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ● మోస్రా, చందూర్, రుద్రూర్ మండలాల్లో నామినేషన్ల ప్రక్రియ పరిశీలన వర్ని(చందూరు)/ రుద్రూర్: రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు, నియమాలను అధికారులు, అభ్యర్థులు కచ్చితంగా పాటించాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. గురువారం మోస్రా, చందూర్, రుద్రూర్ మండల కేంద్రాల్లో ఎంపీటీసీల నామినేషన్ ప్రక్రియను ఆయన పరిశీలించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి పక్కాగా అమల య్యేలా అధికారులు శ్రద్ధ వహించాలన్నారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎలాంటి సందేహా లున్నా జిల్లా స్థాయి అధికారులను సంప్రదించాలని సూచించారు.నామినేషన్ల స్వీకరణ కేంద్రా ల్లో సరిపడా సిబ్బంది ఉన్నారా లేదా అని అడిగి తె లుసుకున్నారు. నోటీసు బోర్డుపై ప్రదర్శించిన నోటిఫికేషన్ పత్రాలను పరిశీలించారు. పొరపాట్లకు తావులేకుండా నామినేషన్ల ప్రక్రియను నిర్వహించాలని సూచించారు. నామినేషన్లకు సంబంధించిన అఫిడవిట్లను ఏరోజుకు ఆరోజు నోటీసు బోర్డుపై ప్రదర్శిస్తూ, జిల్లా కేంద్రానికి రిపోర్టు పంపాలని సూచించారు. కలెక్టర్ వెంట బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, రుద్రూర్ ఎంపీడీవో భీమ్రావ్, తహసీల్దార్ తారాబాయి తదితరులు ఉన్నారు. మెనూ ప్రకారం భోజనం అందించాలి వర్ని (చందూర్): విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనాన్ని అందించాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఉపాధ్యాయులకు సూచించారు. గురువారం చందూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో మధ్యాహ్న భోజనాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల కోసం వండిన భోజనాన్ని పరిశీలించి నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, తేడా వస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పాఠశాలలో అసంపూర్తిగా ఉన్న డైనింగ్ హాల్ నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలని పంచాయతీరాజ్ అధికారులకు ఫోన్ ద్వారా ఆదేశించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు ఎఫ్ఆర్ఎస్ ద్వారా హాజరు తీసుకున్నారా లేదా అన్నది పరిశీలించారు. -
సిజేరియన్లు తగ్గించాలి
● నిబంధనలను పాటించని స్కానింగ్ సెంటర్లను మూసేస్తాం ● వైద్యారోగ్యశాఖాధికారి డాక్టర్ రాజశ్రీ నిజామాబాద్నాగారం : ప్రైవేట్ ఆస్పత్రులో సిజేరియన్లు తగ్గించాలని, ప్రతి ఆస్పత్రికి బయో మెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్, పొల్యూషన్ సర్టిఫికెట్ తప్పనిసరి అని జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి డాక్టర్ రాజశ్రీ తెలిపారు. గురువారం సిజేరియన్ శస్త్ర చికిత్సలపై ఆడిట్ టీం సభ్యులు, సంబంధిత అధికారులతో తన చాంబర్లో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ప్రైవేట్ ఆస్పత్రులన్నీ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ క్రింద రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నారు. అన్ని ఆస్పత్రుల్లో గర్భిణులకు కనీస మౌలిక సదుపాయాలు కల్పిల్పించాలని, ముఖ్యంగా కూర్చోడానికి కుర్చీలు, తాగునీటి, టాయిలెట్ వసతులు, అదేవిధంగా వాహనాల కోసం పార్కింగ్ స్థలాన్ని, ఫైర్ ప్రమాద నివారణ వసతి కలిగి ఉండాలన్నారు. రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, టారిఫ్ చార్జీల చార్ట్ను వెయిటింగ్ హాలులో ప్రదర్శించాలన్నారు. అనవసర సిజేరియన్ శస్త్ర చికిత్సలను నివారించాలని, ఆర్ఎంపీలు, పీఎంపీలకు పర్సంటేజీల ఆశ చూపుతూ అనవసర సిజేరియన్ శస్త్ర చికిత్సలను చేయరాదన్నారు. ప్రతి ఆస్పత్రిని మూడు నెలలకు ఒకసారి వెరిఫై చేయాలన్నారు. ప్రతినెల 300 ఆస్పత్రులను ఎంక్వయిరీ చేయాలని అన్నారు. అనవసర అబార్షన్లు కూడా చేయరాదన్నారు. జిల్లాలో 176 స్కానింగ్ సెంటర్లు ఉన్నాయని, ప్రతి స్కానింగ్ సెంటర్లో అర్హులైన రేడియాలజిస్ట్ ద్వారానే స్కానింగ్ నిర్వహించాలన్నారు. వైద్యులు కాని వారి ద్వారా వచ్చిన రిఫరల్ స్లిప్పులతో స్కానింగ్ చేయరాదన్నారు. అందుకు విరుద్ధంగా స్కానింగ్ చేస్తే ఆ స్కానింగ్ సెంటర్లను మూసి వేస్తామని హెచ్చరించారు. సమీక్షలో ఆర్మూర్ డిప్యూటీ డీఎంఅండ్హెచ్వో డాక్టర్ రమేష్, ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ శ్వేత, డాక్టర్ సుప్రియ, డాక్టర్ అశ్విని వివిధ పీహెచ్సీల వైద్యాధికారులు, పర్యవేక్షక సిబ్బంది, ఆఫీసు సిబ్బంది పాల్గొన్నారు. -
పలుచోట్ల నామినేషన్ల దాఖలు
● ఏర్పాట్లు చేసిన అధికారులు ● కోర్టు తీర్పుతో వెనుదిగిరిన అభ్యర్థులుబోధన్ /డిచ్పల్లి /మోపాల్ /రుద్రూర్ /మాక్లూర్: స్థానిక సంస్థల ఎన్నికల తొలి విడత నోటిఫికేషన్ గురువారం ఉదయం విడుదలైంది. దీంతో అప్పటి కే ఆయా మండలాల అధికారులు నామినేషన్ల స్వీకరణకు కేంద్రాలను ఏర్పాటు చేశారు. డిచ్పల్లి, మోపాల్, కోటగిరి, మాక్లూర్ మండలాల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు పలువురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. డిచ్పల్లిలో జెడ్పీటీసీ స్థానానికి మాజీ ఎంపీపీ కంచెట్టి గంగాధర్, మిట్టాపల్లి ఎంపీటీసీ స్థానానికి అంబటి శైలజ (కాంగ్రెస్), నడిపల్లి– 2 ఎంపీటీసీ స్థానానికి మాజీ సర్పంచ్ పాశం లావణ్య (కాంగ్రెస్) నామినేషన్ దాఖలు చేశారు. మోపాల్ మండలంలోని న్యాల్కల్ ఎంపీటీసీ స్థానానికి అసది విద్యాసాగర్ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలుచేశారు. అంతకుముందు నామినేషన్ దాఖలు కేంద్రాలను అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) అంకిత్ పరిశీలించారు. కోటగిరి –1 ఎంపీటీసీ స్థానానికి మూడు, కోటగిరి–2 స్థానానికి ఒక్క నామినేషన్ దాఖలైంది. కాగా, సాయంత్రం స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ ఈసీ ప్రకటించడం విశేషం. మాక్లూర్–2 ఎంపీటీసీ స్థానానికి గురువారం సాయంత్రం నాలుగున్నర గంటలకు సాయినేని వెంకటేశ్వరరావు నామినేషన్ దాఖలు చేశారు. మంచి ముహూర్త సమయాన్ని ఎన్నుకొని అనుచరులతో తరలివచ్చి నామినేషన్ వేశారు. అప్పటికే కోర్టు నాలుగు వారాలు స్టే ఇచ్చిందని తెలియడంతో కంగుతిని వెళ్లిపోయారు. కొత్తపల్లి ఎంపీటీసీ అభ్యర్థిగా చంద్రయ్య, మాక్లూర్ ఎంపీటీసీ–2 స్థానానికి బీజేపీ అభ్యర్థి సురేశ్నాయక్ సైతం నామినేషన్ వేసేందుకు వచ్చి వెనుదిరిగారు. -
స.హ. చట్టం పకడ్బందీగా అమలు చేయాలి
నిజామాబాద్అర్బన్: సమాచార హక్కు చట్టాన్ని ప కడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. స.హ. చట్టం ప్రవేశపెట్టి 20 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని గురువారం హైదరాబాద్లోని రవీంద్రభారతిలో నిర్వహించిన కార్యక్రమాన్ని నిజామాబా ద్ కలెక్టరేట్లో ఆయా శాఖల అధికారులు ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. సమాచార హక్కు చట్టం అమలుపై రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేయించిన ప్రతిజ్ఞలో అన్ని శాఖల పీఐవో, ఏపీఐవోలు పాల్గొని ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా సమాచార చట్టాన్ని పక్కాగా అమ లు చేస్తూ, నిజామాబాద్ జిల్లాకు కూడా అవార్డులు సాధించి ప్రత్యేక గుర్తింపు తేవాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్ సందీప్, ఏవో ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. -
దుబ్బాక పాఠశాలలో సెల్ఫోన్ చిచ్చు
● విద్యార్థికి టీసీ ఇచ్చిన హెచ్ఎం ● నిరసన తెలిపిన బంజారా నాయకులునిజామాబాద్అర్బన్: పాఠశాలకు సెల్ఫోన్ తీసుకొచ్చాడని విద్యార్థికి టీసీ ఇచ్చిన ఘటన ధర్పల్లి మండలం దుబ్బాక ఉన్నత పాఠశాలలో చోటు చేసుకుంది. దసరా సెలవులకు ఒకరోజు ముందు ఈ ఘటన జరగగా గురువారం స్థానిక బంజారా సేవా సంఘం నాయకుల ఆందోళనతో వెలుగులోకి వచ్చింది. వివరాలు ఇలా.. పాఠశాలలో బతుకమ్మ కార్యక్రమాలు నిర్వహించిన రోజు 8వ తరగతి విద్యార్థి సెల్ఫోన్ తీసుకొచ్చాడు. గమనించిన ప్రధానోపాధ్యాయురాలు శశికళ విద్యార్థి నుంచి ఫోన్ తీసుకుంది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పాఠశాలకు వచ్చి ఫోన్ ఇవ్వాలని అడగగా, విద్యార్థి పాఠశాలకు ఫోన్ తీసుకురావడం సరైన విధానం కాదని, ఫోన్ ఇవ్వనంటూ చెప్పింది. ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకోగా, హెచ్ఎం సెల్ఫోన్ను ధర్పల్లి పోలీస్ స్టేషన్లో అప్పగించారు. అనంతరం ఆ విద్యార్థికి టీసీ ఇచ్చారు. విషయం తెలుసుకున్న బంజారా సేవా సంఘం నాయకులు గురువారం పాఠశాల ఎదుట ధర్నా నిర్వహించారు. విద్యార్థి తల్లిదండ్రులను హెచ్ఎం దుర్భషలాడిందని, విద్యార్థికి టీసీ ఇవ్వడం సమంజసం కాదని, వెంటనే ఆమైపె చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. ఈ విషయమై హెచ్ఎం శశికళను వివరణ కోరగా.. విద్యార్థి మరోసారి ఇలాంటి తప్పిదం చేయకుండా బుద్ధి చెప్పేందుకు తల్లిదండ్రులు, గ్రామపెద్దల సమక్షంలో సెల్ఫోన్ ఇస్తానని తెలిపానని, అయినా వారు వినకుండా ఫోన్ ఇవ్వకుంటే తన పేరిట ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించారని తెలిపారు. దీంతో తాను భయపడి ధర్పల్లి పోలీస్ స్టేషన్ను ఆశ్రయించినట్లు పేర్కొన్నారు. విద్యార్థి ప్రవర్తనను దృష్టిలో పెట్టుకొని టీసీ మంజూరు చేసినట్లు తెలిపారు. పాఠశాలకు సెల్ఫోన్ తీసుకురాకుండా విద్యార్థికి కౌన్సెలింగ్ ఇప్పిస్తాం. టీసీ వాపస్ తీసుకోవాలని ప్రధానోపాధ్యాయురాలికి ఆదేశాలిచ్చాం. పాఠశాలలో ఎలాంటి ఇబ్బందులు లేవు. – అశోక్, డీఈవో -
రేషన్ డీలర్పై కేసు నమోదు
గాంధారి(ఎల్లారెడ్డి): మండలంలోని గండివేట్ గ్రామంలో రేషన్ బియ్యం పంపిణీలో అవకతవకలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. దీంతో సంబంధిత రేషన్డీలర్పై గురువారం 6ఏ కేసు నమోదు చేసినట్లు ఆర్ఐ ప్రదీప్ తెలిపారు. కొన్ని రోజులుగా రేషన్ డీలర్ గంగ వేధిత వినియోగదారులకు బియ్యం పంపిణీ చేయలేదని తెలిపారు. గురువారం పౌరసరఫరాల డీటీ సురేశ్ దుకాణాన్ని తనిఖీ చేసి రికార్డులు పరిశీలించగా 150 క్వింటాళ్ల సన్నబియ్యం, 66 క్వింటాళ్ల దొడ్డురకం బియ్యం తేడా వచ్చిందన్నారు. దీంతో డీలర్పై కేసు నమోదు చేసి మరో డీలర్కు ఇన్చార్జి బాధ్యతలు ఇచ్చినట్లు తెలిపారు. లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని కన్నాపూర్ శివారులో అటవీ భూమిని కబ్జా చేసుకోవడానికి ప్రయత్నించిన ఏడుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై దీపక్కుమార్ తెలిపారు. అటవీ ప్రాంతంలో ఈ నెల 5న చెట్లను నరికివేసి, విధులకు ఆటంకం కలిగించిన ఎల్లేశం, భూమయ్య, వెంకటి, కవిత, సంతోష్, ధరత, సుజాతలపై అటవీ శాఖ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. మోపాల్: మండలంలోని బాడ్సి గ్రామానికి చెందిన బోధకుంట పోశెట్టిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై జడ్ సుస్మిత గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పోశెట్టి ఐదు నెలల క్రితం బోధన్లోని రాకాసీపేట్కు చెందిన ప్యాట విజయ్కుమార్ను మలేసియాకు పంపించాడు. కంపెనీ వీసా ఉందని అబద్ధాలు చెప్పి డబ్బులు తీసుకున్నాడు. తీరా అక్కడికి వెళ్లిన తర్వాత కంపెనీ వీసా కాదని, విజిట్ వీసా ఇచ్చి పంపినట్లుగా విజయ్కుమార్ గ్రహించాడు. ఏజెంట్ పోశెట్టి విజిట్ వీసా ఇచ్చి మోసం చేశాడని విజయ్కుమార్ భార్య ఫిర్యాదు చేసింది. దీంతో పోశెట్టిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సుస్మిత తెలిపారు. -
26 నుంచి తీర్థయాత్రలకు ప్రత్యేక రైళ్లు
● జనవరి వరకు దేశీయ ఎయిర్ ప్యాకేజీ ● ఐఆర్సీటీసీ టూరిజం అసిస్టెంట్ మేనేజర్ పీవీ వెంకటేశ్ వెల్లడి నిజామాబాద్నాగారం: తీర్థయాత్రలకు వెళ్లే వారి కోసం రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చిందని ఐఆర్సీటీసీ టూరిజం అసిస్టెంట్ మేనేజర్ పీవీ వెంకటేశ్ తెలిపారు. నగరంలోని ప్రెస్క్లబ్లో గురువారం ఆయన మాట్లాడారు. ఈ నెల 26 నుంచి నవంబర్ 4వ తేదీ వరకు ప్రత్యేక రైళ్లు, అక్టోబర్ నుంచి జనవరి వరకు దేశీయ ఎయిర్ ప్యా కేజీలను హైదరాబాద్ నుంచి ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. భవ్య గుజరాత్ తీర్థయాత్రలో భాగంగా ద్వారకాదీష్ మందిరం, నాగేశ్వర జ్యోతిర్లింగ మందిరం, బేట్ ద్వారక, సోమనాథ్ జ్యోతిర్లింగ మందిరం, సబర్మతి ఆశ్రమం, సూర్యదేవాలయం, రాణికి వావ్, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ప్రాంతాలను సందర్శ న ఉంటుందని పేర్కొన్నారు. ఒక్కొక్కరికి సాధా రణ టికెట్ ధర రూ.18,400(స్లీపర్), రూ. 30,200 (3 ఏసీ), రూ. 39,900 (2ఏసీ) అని తెలిపారు. రైలు, బస్సు, హోటల్, భోజన సదుపాయం కల్పిస్తామని వివరించారు. దేశీయ ఎయిర్ ప్యాకేజీలో భాగంగా అండమాన్, కశ్మీర్, కర్ణాటక, రాజస్థాన్, ఒడిశా, తమిళనాడులోని పలు ప్రాంతాల్లో ఆరు లే దా ఏడు రోజుల యాత్ర ఉంటుందని పేర్కొన్నారు. ప్రాంతాల మేరకు రూ.34,950 నుంచి రూ.56,625 వరకు చార్జీలు ఉంటాయన్నారు. అంతర్జాతీయ ఎయిర్ ప్యాకేజీలో భాగంగా థాయ్లాండ్, శ్రీలంక, దుబాయ్ దేశాల సందర్శన ఉంటుందని, అందులో భాగంగా ఒక్కొక్కరికి రూ.64,500 నుంచి రూ.1,12,250 వరకు చార్జీలు ఉంటాయని తెలిపారు. వివరాలకు 9701360701, 9281030711 నెంబర్లను సంప్రదించాలన్నారు. సమావేశంలో టూరిజం మానిటర్లు నరేశ్బాబు ఓర్సు, కొక్కుల ప్రశాంత్ పాల్గొన్నారు. -
పనులను వేగవంతం చేయాలి
సిరికొండ: విద్యుత్ సరఫరాకు సంబంధించి మరమ్మతు పనులను వేగవంతం చేయాలని ఎస్ఈ రవీందర్ సిబ్బందిని ఆదేశించారు. మండలంలోని పెద్ద వాల్గోట్, చిన్న వాల్గోట్, కొండూర్ గ్రామాల్లో ఆగస్టు నెలలో కురిసిన భారీ వర్షాలకు విద్యుత్ శాఖకు జరిగిన నష్టాన్ని ఎస్ఈ గురువారం పరిశీలించారు. డిచ్పల్లి డీఈ కామేశ్వర్రావు, ఏడీఈ శ్రీనివాస్, ఏఈ చంద్రశేఖర్ ఉన్నారు. తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని పీజీ ఇంటిగ్రేటెడ్ కోర్సులు (అప్లయిడ్ ఎకనామిక్స్, ఇంటిగ్రేటెడ్ ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ) 7, 9వ సెమిస్టర్ థియరీ, ప్రాక్టికల్ పరీక్షల ఫీజును ఈ నెల 23 వరకు చెల్లించాలని కంట్రోలర్, ప్రొఫెసర్ సంపత్కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రూ.100 అపరాధ రుసుముతో ఈ నెల 25 వరకు ఫీజు చెల్లించవచ్చని పేర్కొన్నారు. ఏపీ ఈ అన్ని సబ్జెక్టులకు కలిపి రూ.500లు, ఐపీసీ హెచ్ అన్ని సబ్జెక్టులకు కలిపి రూ.600 లు పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నారు. వివరాలకు యూనివర్సిటీ వెబ్సైట్ను సందర్శించాలని విద్యార్థులకు సూచించారు. ● బీజేపీ జిల్లా అధ్యక్షుడు కులాచారి దినేశ్ సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: రాజ్యాంగ నిబంధనలు, కోర్టు అడ్డంకులు వస్తాయని తెలిసినప్పటి కీ కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్రెడ్డి.. బీసీ రిజర్వేషన్ల విషయమై కుట్రపూరితంగా వ్య వహరించారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కులా చారి దినేశ్ ఆరోపించారు. ఈ మేరకు గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అ న్ని అంశాలు తెలిసినప్పటికీ, బీసీ సంఘాలు మొత్తుకున్నప్పటికీ జీవో నంబర్9 జారీ చేసి ఇష్టం వచ్చినట్లు నాటకమాడారన్నారు. తమిళనాడులో జయలలిత హయాంలో న్యాయపరమైన చిక్కులు రాకుండా చేసుకున్నారన్నారు. ఇక్కడ మాత్రం అలాంటి ప్రయత్నం చేయకుండానే బీసీలను, తెలంగాణ ప్రజలను మోసం చేసేందుకు కుట్ర చేశారన్నారు. కాంగ్రెస్ను బీ సీలు, తెలంగాణ ప్రజలు ఇకపై నమ్మరన్నారు. మద్నూర్(జుక్కల్): విద్యుత్ తీగలు తగలడంతో మండలంలోని దన్నూర్ శివారులో సాగువుతున్న చెరుకు తోట దగ్ధమైనట్లు బాధితుడు దేవ్కత్తే మారుతి తెలిపారు. గురువారం ప్రమాదవశాత్తు చెరుకుతోటకు విద్యుత్ తీగలు తగలడంతో మంటలు వ్యాపించాయని పేర్కొన్నా రు. మద్నూర్ ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగి మంటలను ఆర్పివేశారు. ప్రమాదంలో రూ. 1.50 లక్షల పంట నష్టం జరిగిందని, సకాలంలో వచ్చి రూ.2.50 లక్షల విలువజేసే పంటను కాపాడినట్లు అగ్నిమాపక అధికారి మాధవ్ తెలిపారు. సిబ్బంది హరీశ్, సంతోష్, సహదేవ్ ఉన్నారు. నిజామాబాద్నాగారం: ఎస్జీఎఫ్ అండర్–14 బాలబాలికల విభాగంలో కబడ్డీ, వాలీబాల్ జిల్లాస్థాయి పోటీలు ఈ నెల 13న నిర్వహించనున్నట్లు క్రీడల కార్యదర్శి నాగమణి గురువారం ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటలకు పాత కలెక్టరేట్ మైదానంలో పోటీలు ఉంటాయన్నారు. ప్రతిభ చూపిన వారిని ఈ నెల 16న సంగారెడ్డిలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు పంపుతామని తెలిపారు. వివరాలకు 9347216426 నెంబర్లో సంప్రదించాలని పేర్కొన్నారు. -
యువత పొగాకుకు దూరంగా ఉండాలి
● డీఎంహెచ్వో రాజశ్రీ నిజామాబాద్నాగారం: విద్యార్థులు, యువత ప్రతి ఒక్కరూ పొగాకు దూరంగా ఉంటూ, మంచి మా ర్గంలో ఉన్నత శిఖరాల వైపు నడవాలని డీఎంహెచ్వో రాజశ్రీ తెలిపారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో టొబాకో ఫ్రీ యూత్ క్యాంపెయిన్ కార్యక్రమాన్ని గురువారం అర్సపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం డీఎంహెచ్వో మాట్లాడుతూ 60 రోజులపాటు జిల్లాలో టొబాకో ఫ్రీ యూత్ క్యాంపెయిన్ నిర్వహిస్తామన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న పాఠశాలలు, కళాశాలలన్నీ టొబాకో ఫ్రీగా గుర్తించడం, కనీసం 30 టొబాకో ఫ్రీ గ్రామాలుగా గుర్తించడం జరుగుతుందన్నారు. పొగాకు ఉత్పత్తులను అక్రమంగా విక్రయించే వారిపై చర్యలు తీసుకుంటామని తెలి పారు. జిల్లా సైకియాట్రిస్ట్ డాక్టర్ రవితేజ మా ట్లాడుతూ విద్యార్థులు పాన్, గుట్కా, సిగరెట్, డ్ర గ్స్ లాంటి వాటికి దూరంగా ఉండాలన్నారు. పొ గాకు ఉత్పత్తులు, డ్రగ్స్ తీసుకుంటే శారీరక, మానసిక అనారోగ్యాలు, రుగ్మతలు సంభవిస్తాయన్నా రు. కార్యక్రమంలో హెచ్ఎం, ఎంఈవో ఆర్వీఎన్ గౌడ్, ఎన్సీడీ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ సామ్రాట్ యాదవ్, మెడికల్ ఆఫీసర్ శ్రావణ లక్ష్మి, ఆర్బీ ఎస్కే వైద్యులు విజయభాస్కర్, జిల్లా సైన్స్ అధికా రి కస్తూరి గంగాకిషన్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు పెరిగేలా చూడాలి
డిచ్పల్లి: ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవం చేయించుకునేలా గర్భిణులను ప్రోత్సహించాలని జిల్లా మలేరియా అధికారి తుకారాం రాథోడ్ సూచించారు. సాధారణ ప్రసవంతో కలిగే లాభాలు, శస్త్రచికిత్సతో కలిగే నష్టాలను గర్భిణులకు వివరించాలన్నారు. డిచ్పల్లి సామాజిక ఆరోగ్య కేంద్రంలో గురువారం ఆశా కార్యకర్తల సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. కీటక జనీత వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. నీరు నిల్వ ఉండే ప్రాంతాలను గుర్తించి తొలగించాలన్నారు. జ్వరానికి సంబంధించి రక్త పరీక్షలు చేయాలని, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆశా కార్యకర్తలు కచ్చితంగా గర్భిణులతో ఫోలిక్ యాసిడ్(ఐరన్) మాత్రలు తినిపించాలని ఆదేశించారు. సమావేశంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి షారోన్ షైని క్రిస్టినా, వైద్యులు రాజశ్రీ, మండల ఆరోగ్య విస్తరణ అధికారి వై.శంకర్, ఆరోగ్య పర్యవేక్షకులు అక్బర్ అలీ, దేవపాలం తదితరులు పాల్గొన్నారు. -
స.హ.చట్టం అమలులో ఆదర్శంగా నిలవాలి
● దరఖాస్తులను నిర్ణీత వ్యవధిలో పరిష్కరించాలి : కలెక్టర్ నిజామాబాద్ అర్బన్: పారదర్శకత, జవాబుదారీతనం కోసం ఉద్దేశించిన సమాచార హక్కు చట్టాన్ని అన్ని ప్రభుత్వ శాఖలలో సమర్థవంతంగా అమలు చేస్తూ జిల్లాను ఆదర్శంగా నిలుపాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. ఆర్టీఐ వారోత్సవాలను పురస్కరించుకుని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ.. సబ్ కలెక్టర్లు, ఆర్డీవోల నేతృత్వంలో గురువారం నిజామాబాద్, బోధన్, ఆర్మూర్లలో డివిజనల్ స్థాయిలో, శుక్ర వారం తహసీల్దార్ల ఆధ్వర్యంలో అన్ని మండల కేంద్రాలలో మండల స్థాయిలో సమాచార హక్కు చట్టంపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. ఆయా శాఖల పీఐవోలు, ఏపీఐవోలు తప్పనిసరిగా హాజరయ్యేలా చూడాలన్నారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో పౌర సమాచార అధికారి (పీఐవో), సహాయ పౌర సమాచార అధికారి (ఏపీఐవో), అప్పిలేట్ అధికారి వివరాల తో కూడిన సమాచార హక్కు చట్టం బోర్డును విధి గా ప్రదర్శించాలని ఆదేశించారు. ఆర్టీఐ అమలుకు సంబంధించి తప్పనిసరిగా రిజిస్టర్ ను నిర్వహిస్తూ, ఎప్పటికప్పుడు వివరాలను పొందుపరచాలని సూ చించారు. 4(1బి) రిజిస్టర్లోని సమాచారంతో కూడిన బుక్ లెట్ను అన్ని కార్యాలయాలలో అందుబాటులో ఉంచాలని, పీరియాడికల్ రిపోర్ట్స్ను క్రమం తప్పకుండా సేకరించాలని, కనీసం మూడు మాసాలకు ఒకసారి ఆర్టీఐ అమలుపై సమీక్ష జరపాలన్నారు. దరఖాస్తుదారు రెండవ అప్పిలేట్ అథారిటీకి వెళ్లే ఆస్కారం లేకుండా కోరిన సమాచారాన్ని నిర్ణీత ఫార్మాట్లో అందించాలన్నారు. ఆర్టీఐ దరఖాస్తుల పరిష్కారంలో అనవసర కాలయాపన చేస్తే జరిమానాలకు గురి కా వాల్సి వస్తుందని, ఇది పదోన్నతులు, ఇంక్రిమెంట్లు వంటి వాటిపై కూడా ప్రభావం చూపే ప్రమాదం ఉంటుందన్నారు. రిసోర్స్ పర్సన్లు కిషన్, కృష్ణాజీ సమాచార హక్కు చట్టంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, ట్రెయినీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్, జెడ్పీ సీఈవో సాయాగౌడ్, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్ సందీప్ తదితరులు పాల్గొన్నారు. -
ఆనకట్టపై మక్కల ఆరబోత
బాల్కొండ: ఆరుగాలం శ్రమించి పండించిన మక్క పంటల ఆరబోత రైతులకు ఇబ్బందికరమవుతోంది. నూర్పిళ్ల అనంతరం వర్షాలు వెంటాడుతుండటంతో మక్కలను ఆరబెట్టేందుకు కల్లాలు, రోడ్లు సరిపోవడం లేదు. దీంతో రైతులు ఎస్సారెస్పీ ఆనకట్టను ఆశ్రయిస్తున్నారు. ముప్కాల్, నల్లూర్, కొత్తపల్లి, బస్సాపూర్, సోన్పేట్ తదితర గ్రామాలకు చెందిన రైతులు మక్కలను ఆరబెట్టేందుకు సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆనకట్ట వరకు తరలిస్తున్నారు. అయితే, మక్కల ఆరబోతతో పర్యాటకులకు కొంత మేర ఇబ్బంది కలిగినా అన్నదాతల అవస్థలను దృష్టిలో ఉంచుకొని సర్దుకుపోతున్నారు. -
క్రైం కార్నర్
అడవిపంది దాడిలో మహిళకు గాయాలు ఎల్లారెడ్డిరూరల్: ఎల్లారెడ్డి మండలంలోని రుద్రారం గ్రామానికి చెందిన సత్యంగారి ఏసవ్వపై అడవిపంది దాడి చేసినట్లు స్థానికులు బుధవారం తెలిపారు. ఏసవ్వ పొలానికి వెళ్తున్న సమయంలో అడవిపంది దాడి చేసింది. దీంతో ఆమె కాలు విరిగింది. గాయపడిన ఏసవ్వను ఎల్లారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించగా వైద్యులు కామారెడ్డికి రిఫర్ చేశారు. ఇసుక వాహనం సీజ్ మద్నూర్(జుక్కల్): డోంగ్లీ మండలంలోని కుర్లా సమీపంలో ప్రభుత్వ ఇసుక క్వారీ నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న బోలెరో వాహనాన్ని బుధవారం ఉదయం పట్టుకున్నట్లు డోంగ్లీ ఆర్ఐ సాయిబాబా తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో ఇసుక అక్రమ తరలింపుపై తనిఖీలు నిర్వహిస్తుండగా ప్రభుత్వ క్వారీ వద్ద ఉన్న ఇసుక కుప్పల నుంచి అనుమతులు లేకుండా ఇసుకను డంప్ చేసుకొని వెళ్తుండగా డోంగ్లీలో పట్టుకున్నామన్నారు. వాహనాన్ని డోంగ్లీ తహసీల్ కార్యాలయానికి తరలించామని తెలిపారు. -
కొనసాగుతున్న నీటి విడుదల
బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లోకి ఎగువ నుంచి 60 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. దీంతో 16 వరద గేట్ల ద్వారా 50 వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. బుధవారం ఉదయం ఎగువ నుంచి వరద తగ్గుముఖం పట్టడంతో నీటి విడుదలను 25 వేల క్యూసెక్కులకు తగ్గించారు. మధ్యాహ్నం మళ్లీ ఇన్ఫ్లో పెరగడంతో అవుట్ ఫ్లోను పెంచారు. ప్రాజెక్ట్ నుంచి కాకతీయకాలువ ద్వారా 4 వేల క్యూసెక్కులు, ఎస్కేప్ గేట్ల ద్వారా 4 వేలు, సరస్వ తి కాలువ ద్వారా 650, మిషన్ భగీరథ ద్వారా 231 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండగా, ఆవిరి రూపంలో 709 క్యూసెక్కుల నీరు పోతోంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 1091(80.5 టీఎంసీలు) అడుగులు కాగా బుధవారం సాయంత్రానికి 1090.90(80.05 టీఎంసీలు) అడుగుల నీరు నిల్వ ఉందని ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు. నవీపేట: గర్భిణులు పౌష్టికాహారాన్ని తీసుకోవాలని ఐసీడీఎస్ పీడీ రసూల్బీ సూచించారు. మండల కేంద్రంలోని రైతువేదికలో బుధవారం ఏర్పాటు చేసిన పోషణ్ మాసోత్సవంలో ఆమె మాట్లాడారు. పౌష్టికాహారాన్ని తీసుకుంటే పుట్టబోయే పిల్లలు ఆరోగ్యవంతంగా ఉంటారని పేర్కొన్నారు. అంగన్వాడీ కార్యకర్తలు పౌష్టికాహారంపై అవగాహన కల్పించాలని సూచించారు. ఈ సందర్భంగా నిర్వహించిన వంటల పోటీలలో విజేతలుగా నిలిచిన మహిళలకు బహుమతులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో సీడీపీవో జ్యోతి, సూపర్వైజర్లు భాగ్యలక్ష్మి, రాధలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ప్రజలు ఆర్టీసీ సేవలను వినియోగించుకోవాలి ● సీపీ సాయిచైతన్య ● లక్కీ డ్రా విజేతల ప్రకటన ఖలీల్వాడి: నిజామాబాద్ ఆర్టీసీ రీజియన్ ఆధ్వర్యంలో దసరా పండుగ సందర్భంగా ప్రయాణికుల కోసం నిర్వహించిన ప్రత్యేక లక్కీ డ్రా విజేతలను సీపీ సాయిచైతన్య ప్రకటించారు. జిల్లా కేంద్రంలోని ఆర్ఎం కార్యాలయంలో బుధవారం నిర్వహించిన లక్కీ డ్రా కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మొదటి బహుమతి చంద్రయ్య (రూ.25 వేలు), ద్వితీయ బహుమ తి షేక్ బాబర్ (రూ.15వేలు), తృతీయ బహుమతి రాంప్రసాద్ (రూ.10 వేలు) అందజేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడు తూ ప్రజలు ఎల్లప్పుడూ ప్రభుత్వ రవాణా సంస్థ సేవలను వినియోగించుకోవాలన్నా రు. ఆర్టీసీ ఆర్ఎం జ్యోత్స్న మాట్లాడుతూ ప్రతి ప్రయాణికుడి సహకారమే సంస్థ విజయానికి మూలాధారమన్నారు. కార్యక్రమంలో టీజీఎస్ఆర్టీసీ డిప్యూటీ రీజినల్ మేనేజర్ యస్. మధుసూదన్, పీవోటీ పద్మజ, ఏవో పరమాత్మ, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆనంద్ బాబు, డిపో మేనేజర్లు, అధికార సిబ్బంది, ప్రయాణికులు పాల్గొన్నారు. టీచర్ డిప్యుటేషన్ రద్దు చేయాలి ● బడికి తాళం వేసిన గ్రామస్తులు ఇందల్వాయి: ఉపాధ్యాయురాలిని డిప్యుటేషన్పై ఇతర పాఠశాలకు పంపించడాన్ని నిరసిస్తూ డొంకల్ గ్రామస్తులు బుధవారం ప్రాథమికోన్నత పాఠశాలకు తాళం వేశారు. అనంతరం విద్యార్థులను ఇంటికి పంపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాఠశాలలో 37 మంది విద్యార్థులకు నలుగురు ఉపాధ్యాయులు ఉన్నారని, ఉపాధ్యాయురాలు అర్చన పిల్లలతో చనువుగా ఉంటూ చక్కగా పాఠాలు చెప్తున్నారనే తమ పిల్లలని పాఠశాలలో చేర్పించామన్నారు. ఇప్పుడు ఆ టీచర్నే డిప్యుటేషన్పై పంపించడం సరికాదన్నారు. టీచర్ డిప్యుటేషన్ రద్దు చేస్తేనే పాఠశాల తాళం తీసి విద్యార్థులను పంపుతామని వారు తెలిపారు. -
ఏరియా ఆస్పత్రిని సందర్శించిన ఏఎస్సీఐ
ఆర్మూర్టౌన్: పట్టణంలోని ఏరియా ఆస్పత్రిని అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఏఎస్సీఐ) వైద్య బృందం బుధవారం సందర్శించింది. వైద్యులు హరికృష్ణ, రేష్మతోపాటు బృందం సభ్యులు ఆస్పత్రిలో అందిస్తున్న వైద్యసేవలు, పరికరాలు, స్టాఫ్ హాజరు, శుభ్రత, రోగుల క్షేమం తదితర వాటి వివరాలను సేకరించారు. ఆస్పత్రికి కావాల్సిన పరికరాలు, ఇతర సౌకర్యాలపై సూపరిటెండెంట్ ప్రమీదరెడ్డిను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రి మెరుగుదల కోసం సిఫార్సులతో కూడిన నివేదికను రాష్ట్ర ఆరోగ్య శాఖకు అందజేస్తామని బృందం సభ్యులు తెలిపారు. వారి వెంట వైద్యులు అమృత్రాంరెడ్డి, మోహన్రెడ్డి, అజయ్ తదితరులు ఉన్నారు. -
స్థానిక ఎన్నికలకు సిద్ధం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మొదటి విడత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించేందుకు నోటిఫికేషన్ జారీకి అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. బుధవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు, ఎన్నికల అధికారులతో మొదటి విడత జెడ్పీటీసీ, ఎంపీ టీసీ ఎన్నికల నోటిఫికేషన్, నామినేషన్ల ప్రక్రియపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పోలీస్ కమిషనర్ సాయి చైతన్యతో కలిసి కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మొదటి విడతలో 9న నిజామాబాద్, బోధన్ రెవెన్యూ డివిజన్ల పరిధిలోని 18 జెడ్పీటీసీలు, 177 ఎంపీటీసీ స్థానాలకు సంబంధించిన ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఆర్వోలు, ఏఆర్వోలకు శిక్షణ ఇచ్చామన్నారు. నామినేషన్ల స్వీకరణకు అన్ని చర్యలు తీసుకున్నామని, ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ బృందాలను నియమించామని పేర్కొన్నారు. తొలి విడతలో బోధన్, చందూర్, కోటగిరి, మోస్రా, పోతంగల్, రెంజల్, రుద్రూర్, సాలూర, వర్ని, ఎడపల్లి, ధర్పల్లి, డిచ్పల్లి, ఇందల్వాయి, మాక్లూర్, మోపాల్, నవీపేట్, నిజామాబాద్, సిరికొండ జెడ్పీటీసీ స్థానాలతోపాటు, పై మండలాల పరిధిలోని 177 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ జారీచేస్తామని కలెక్టర్ తెలిపారు. ఆర్వోలు, ఎంపీడీవోలతో టెలీ కాన్ఫరెన్స్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి రిటర్నింగ్ అధికారులు, ఎంపీడీవోలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ తొలి విడ త ఎన్నికల నోటిఫికేషన్ జారీ, నామినేషన్ల స్వీకరణ ప్రక్రియలను ప్రశాంత వాతావరణంలో పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. రా ష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను అనుసరిస్తూ ఎన్నికల ప్రక్రియ నిర్వహించాలని, ఎ లాంటి పొరపాట్లకు తావులేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మార్గనిర్దేశం చేశారు. నామినేష న్ల స్వీకరణ కేంద్రాల్లో హెల్ప్డెస్క్లను ఏర్పాటు చేసుకోవాలన్నారు. అన్ని మండలాల్లో ఎస్ఎస్టీ, ఎఫ్ఎస్టీ బృందాలను ఏర్పాటు చేసు కుని ఎన్నికల ప్రవర్తనా నియమావళి పక్కాగా అమలయ్యేలా పర్యవేక్షించాలని సూచించారు. పోస్టర్లు, బ్యానర్లు, గోడలపై రాతలను తొలగింప జేయాలని అన్నారు. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియలో నిబంధనలను పాటించాలని, రిటర్నింగ్ అధికారులు నామినేషన్ ఫారాలు, రిజిస్టర్లు సక్రమంగా నిర్వహించాలని తెలిపారు. సీసీ కెమెరాలు, గోడ గడియారాలు, ఓటర్ల జా బితా నిర్వహణ సక్రమంగా ఉండాలని, నామినేషన్ల సమయంలో వీడియోగ్రఫీ కచ్చితంగా ఉండాలన్నారు. నామినేషన్ సమయంలో అభ్యర్థులు సమర్పించాల్సిన అఫిడవిట్లు, ధ్రువపత్రాలు, ఇతర ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. టెలీ కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్ సందీప్, జెడ్పీ సీఈవో సాయాగౌడ్, డీపీవో శ్రీనివాస్ పాల్గొన్నారు. మొదటి విడత నోటిఫికేషన్కు ఏర్పాట్లు పూర్తి కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని వీడియో కాన్ఫరెన్స్ -
చేపల వేట.. ప్రాణాలతో ఆట
బాల్కొండ: మత్స్యకారుల అనాలోచిత చర్యలతో ప్రాణాలు పోతున్న తీరు కలవరానికి గురిచేస్తోంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ వరద గేట్ల ఎదుట గోదావరిలో జాలర్లు ప్రాణాలు పోతున్నా వేట మానడం లేదు. గత శనివారం నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలం కాల్వ గ్రామానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు గేట్ల ఎదుట చేపల వేటకు వెళ్లి గోదావరిలో గల్లంతయ్యారు. అందులో ఒకరు ప్రాణాలతో బయటపడగా మరొకరు నీటమునిగి కొట్టుకుపోయారు. ఈ ఘటన జరిగి వారం గడవకముందే మళ్లీ వరద గేట్ల ఎదుట గోదావరిలో బుధవారం జాలర్లు వేట సాగించారు. ఉదయం 9 వరద గేట్ల ద్వారా 25 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతుండగా ప్రవాహంలోనే చేపల వేట కొనసాగించారు. వరద గేట్ల ఎదుట చేపలు వేటాడకుండా ఎవరూ చర్యలు చేపట్టడం లేదు. ఉన్నతాధికారులు స్పందించి వరద గేట్ల ఎదుట ప్రవాహం సమయంలో చేపలవేటకు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.