breaking news
Nizamabad
-
అర్జీలను పెండింగ్లో పెట్టొద్దు
● కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ● ప్రజావాణికి 115 ఫిర్యాదులుసాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అధికారులకు సూచించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 115 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను కలెక్టర్తోపాటు అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, ట్రెయినీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావీ, డీఆర్డీవో సాయాగౌడ్, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, మెప్మా పీడీ రాజేందర్, బోధన్ ఏసీపీ శ్రీనివాస్లకు వివరించారు. కాగా, ఫిర్యాదులను పెండింగ్లో పెట్టకుండా సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. -
ప్రజాపాలన దినోత్సవానికి విస్తృత ఏర్పాట్లు
● ముఖ్య అతిథిగా హాజరుకానున్న సీఎం సలహాదారులు వేం నరేందర్ రెడ్డి ● కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి వెల్లడిసాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ఈ నెల 17న నిర్వహించనున్న ప్రజాపాలన దినోత్సవానికి విసృత్త ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో సోమవారం సంబంధిత అధికారులతో సమావేశమయ్యారు. వేడుకకు ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారని తెలిపారు. ముఖ్య అతిథితోపాటు ప్రజా ప్రతినిధులు, పుర ప్రముఖులు హాజరుకానున్న నేపథ్యంలో ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సూచించారు. వేదిక, సీటింగ్ తదితర వాటిపై సంబంధిత శాఖల అధికారులకు దిశానిర్దేశం చేశారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, ట్రైనీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావీ, నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్ర కుమార్, కలెక్టరేట్ ఏవో ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. 17న స్వస్థనారీ స్వశక్తి పరివార్ ప్రారంభం మహిళల ఆరోగ్యం పెంపొందించేందుకు భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్వస్థనారీ స్వశక్తి పరివార్ కార్యక్రమాన్ని ఈ నెల 17న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభిస్తున్నట్లు కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమం 17 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు కొనసాగుతుందన్నారు. మహిళల ఆరోగ్యమే ప్రధాన ధ్యేయంగా జిల్లా వ్యాప్తంగా అన్ని ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల్లో సాధారణ ఆరోగ్య శిబిరాలు, ప్రత్యేక నిపుణుల వైద్య శిబిరాలను జిల్లా వ్యాప్తంగా ప్రతిరోజు 10 చోట్ల నిర్వహిస్తారని తెలిపారు. శిబిరాల్లో గైనకాలజీ, చర్మవ్యాధి, దంత, కంటి, మానసిక, పిల్లల వైద్య నిపుణులు పాల్గొని పరీక్షలు నిర్వహిస్తారని పేర్కొన్నారు. వ్యాధి నిర్ధారణ, రక్తదాన శిబిరాలు ఉంటాయని తెలిపారు. డీఆర్డీవో, ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంలు, అంగన్వాడీ టీచర్లు క్షేత్రస్థాయిలో మహిళలకు అవగాహన కల్పించి ప్రత్యేక పరీక్షలు చేయించుకునేలా చూడాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ అంకిత్, డీఆర్డీవో సాయాగౌడ్, డీఎంహెచ్వో రాజశ్రీ, డీసీహెచ్ఎస్ శ్రీనివాస్ ప్రసాద్, జీజీహెచ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్రావు తదితరులు పాల్గొన్నారు. -
అంగన్వాడీల ఆందోళన ఉద్రిక్తం
● పీసీసీ చీఫ్ ఇంటి ముట్టడికి యత్నం ● సీఐటీయూ నాయకుల ముందస్తు గృహనిర్బంధాలు ● ధర్నాచౌక్ వద్ద అంగన్వాడీల నిరసననిజామాబాద్నాగారం: సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీ టీచర్లు, ఆయాలతోపాటు సీఐటీయూ నాయకులు సోమవారం నిర్వహించిన ఆందోళనలు ఉద్రిక్తతకు దారితీశాయి. చలో హైదరాబాద్కు వెళ్లనున్న అంగన్వాడీ టీచర్లు, నాయకులను ఉదయం పోలీసులు గృహనిర్భంధం చేశారు. పలువురిని పోలీసు స్టేషన్లకు తరలించి, అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. కాగా, జిల్లా కేంద్రంలోని వినాయక్నగర్లో పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఇంటి ముట్టడికి అంగన్వాడీ కార్యకర్తలు యత్నించారు. సీఐటీయూ నాయకులు, అంగన్వాడీలు పెద్దసంఖ్యలో తరలిరావడంతో పోలీసులు అప్రమత్తమై అడ్డుకున్నారు. కార్యకర్తలు, నాయకులను అరెస్టుచేసి స్టేషన్కు తరలించారు. అనంతరం మిగతా అంగన్వాడీ కార్యకర్తలు ధర్నాచౌక్ వద్ద నిరసన తెలిపారు. ధర్నాలో సీపీఎం జిల్లా కార్యదర్శి రమేశ్బాబు మాట్లాడుతూ అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని, శాంతియుతంగా చేపట్టే కార్యక్రమాలను పోలీసులు అడ్డుకోవడం, అక్రమ నిర్భందాలు చేయడం సరికాదని అన్నారు. సమస్యల పరిష్కారంపైన చూపాల్సిన శ్రద్ధ నాయకుల అరెస్టులపై పెట్టారని ఎద్దేవా చేశారు. ఇప్పటికై నా ప్రభుత్వం ప్రీ ప్రైమరీ కేంద్రాలను అంగన్వాడీ కేంద్రాలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ టీచర్లకు రూ. 18వేల వేతనం ఇవ్వాలన్నారు. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించకుంటే మరో ఉద్యమం చేపడతామన్నారు. కార్యక్రమంలో అంగన్వాడీ నాయకులు స్వర్ణ, చంద్రకళ, మంగాదేవి, వాణి, విజయ, లక్ష్మి, వసంత, సూర్యకళ, రాజ్యలక్ష్మి, లావణ్య తదితరులు పాల్గొన్నారు. -
ప్లాస్టిక్ నిరోధానికి స్టీల్ బ్యాంకులు
● రెంజల్, తాడ్బిలోలి గ్రామాల్లో శ్రీకారం ● స్టీల్ ప్లేట్లను వినియోగిస్తున్న గ్రామస్తులురెంజల్(బోధన్): పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ భూతాన్ని తరిమేందుకు గ్రామాల్లో స్టీల్ బ్యాంకులు ఏర్పాటవుతున్నాయి. శుభకార్యాలు, అన్నదానాల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ప్లేట్లలో భోజనాలు చేస్తుండడంతో అనారోగ్య సమస్యలు దరి చేరుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడాకాన్ని తగ్గించాలనే ఆలోచనతో రెంజల్ మండల కేంద్రంలో శివాజీ సేవా సమితి, తాడ్బిలోలి గ్రామంలో శ్రీరామాలయం కమిటీలు స్టీల్ బ్యాంకులను ఏర్పాటు చేశాయి. ఈ రెండు గ్రామాల్లో జరిగే శుభకార్యాలు, పెళ్లిళ్లలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను తగ్గించే దిశగా కమిటీలు ముందుకెళ్తున్నాయి. ప్లాస్టిక్ ప్లేట్లకు బదులు స్టీల్ ప్లేట్లను వాడేలా కృషి చేస్తున్నాయి. భయపెడుతున్న ప్లాస్టిక్ భూతం జిల్లాలో ప్లాస్టిక్ భూతం భయపెడుతోంది. నిషేధిత సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను యథేచ్ఛగా వినియోగిస్తున్నారు. 120 మైక్రాన్లలోపు కవర్లు, గ్లాసుల నిషేధం అమలుకు నోచడంలేదు. 2022 జూలై నుంచి ప్లాస్టిక్ను నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. కానీ, వ్యాపారులు, ప్రజలు నిబంధనలు పాటించడం లేదు. మరోవైపు ప్లాస్టిక్ నిషేధాన్ని అమలు చేయాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదు. సూపర్ మార్కెట్లు, టిఫిన్ సెంటర్లు, కూరగాయల మార్కెట్లు, హోటల్స్, పానీపూరి, చిరు వ్యాపారులు, వైన్స్ల వద్ద పర్మిట్ రూంలు, స్వీట్ షాపులు, పండ్ల దుకాణాల తదితర వాటిల్లో తక్కువ మైక్రాన్ల కవర్లను వినియోగిస్తున్నారు. వాటిని వినియోగించే ప్రజలు రోగాలబారిన పడే ప్రమాదం ఉంది. ప్లాస్టిక్ కవర్లు విక్రయించే వారికి భారీ మొత్తంలో జరిమానాలు విధించే అవకాశం ఉన్నా, అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి.ప్లాస్టిక్ ప్లేట్లు, గ్లాసుల వాడకాన్ని నియంత్రించేందుకు శివాజీ సేవా సమితి ఆధ్వర్యంలో 300 స్టీల్ ప్లేట్లు, గ్లాసులు తీసుకొచ్చాం. శుభకార్యాలకు ఉచితంగా అందిస్తున్నాం. స్టీల్ బ్యాంకు ప్లేట్లు, గ్లాసులు తీసుకున్న వారు చార్జీలు కాకుండా మరిన్ని స్టీల్ ప్లేట్లు అందించాలని సూచిస్తున్నాం. ఎవరినీ బలవంతం చేయడం లేదు. – లక్ష్మణ్గౌడ్, రెంజల్ శివాజీ సేవా సమితి ప్రతినిధిప్లాస్టిక్ వాడకంతో కలిగే అనర్థాలను గుర్తించి ఇటీవల ఆలయ కమిటీ ద్వారా 800 స్టీల్ ప్లేట్లు, గ్లాసులు తెప్పించాం. కేవలం ఆలయాల్లో నిర్వహించే అన్నదానాలకు ఉచితంగా అందిస్తున్నాం. – కార్ఖానా శ్రీనివాస్, శ్రీరామాలయం కమిటీ చైర్మన్, తాడ్బిలోలి -
విశ్వేశ్వరయ్యను ఆదర్శంగా తీసుకోవాలి
● సీపీ సాయి చైతన్యసాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ఇంజినీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్యను ఇంజినీర్లు ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని సీపీ సాయిచైతన్య పేర్కొన్నారు. నగరంలోని పాలిటెక్నిక్ కళాశాలలో పూర్వ విద్యార్థుల సంఘం, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆధ్వర్యంలో సోమవారం ఇంజినీర్స్ డే నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీపీ సాయిచైతన్య హాజరై మోక్షగుండం విశ్వేశ్వరయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంజినీరింగ్ విభాగంలో ఉమ్మడి ఏపీతోపాటు దేశానికి విశ్వేశ్వరయ్య చేసిన సేవలను గుర్తించి ప్రభుత్వం భారతరత్న ఇచ్చిందని గుర్తు చేశారు. యువత ట్రాఫిక్ రూల్స్ పాటించాలని సూచించారు. డ్రగ్స్కు దూరంగా ఉండాలని తెలిపారు. అనంతరం కళాశాల టాపర్లకు గోల్డ్మెడల్, బిగాల కృష్ణమూర్తి ట్రస్ట్ నుంచి రూ.10వేల చెక్కు, సర్టిఫికెట్ను అందజేశారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ భారతి, పూర్వ విద్యార్థుల సంఘం ప్రధాన కార్యదర్శి తోట రాజశేఖర్, సహా అధ్యక్షుడు కేఎల్వీ రమణ, సంయుక్త కార్యదర్శి సత్యనారాయణ, వినోద్, మోహన్ కుమార్, బాలచందర్, బాబా శ్రీనివాస్, వై గణేశ్, కళాశాల అధ్యాపకులు నాగరాజ్, నరేశ్ తదితరులు పాల్గొన్నారు. -
విద్యుదాఘాతంతో కౌలు రైతు మృతి
గాంధారి(ఎల్లారెడ్డి): మండల పరిధిలోని ముదెల్లిలో సోమవారం విద్యుదాఘాతంతో గ్రామానికి చెందిన కౌలు రైతు కర్రోల్ల సాయిలు(52) మృతి చెందినట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. సాయిలు అదే గ్రామానికి చెందిన ఒకరి పొలం కౌలుకు తీసుకొని వరి పంట సాగు చేస్తున్నాడు. సోమవారం మధ్యాహ్నం సాయిలు, భార్య లలిత కలుపు తీసేందుకు పొలానికి వెళ్లారు. పొలానికి నీళ్లు పారించేందుకు సాయిలు బోరు మోటారు స్టార్టరు ఆన్ చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య లలిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి భార్య, కూతురు ఉన్నారు. ఖలీల్వాడి: నిజామాబాద్ రైల్వేస్టేషన్లో రైలుకు ఎదురెళ్లి ఆత్మహత్యకు యత్నించిన యువకుడిని రైల్వే పోలీసులు కాపాడినట్లు ఎస్సై సాయిరెడ్డి తెలిపారు. సాలూరా మండలంలోని హాజీపూర్కు చెందిన పవన్ (28) ఇంజినీరింగ్ పూర్తి చేసి నిజామాబాద్లో ఉంటున్నాడు. ఆన్లైన్ బెట్టింగ్, మద్యానికి బానిస కావడంతో అప్పులయ్యాయి. అప్పుల బాధలు ఎక్కువ కావడంతో రైలు కిందపడి ఆత్మహత్యకు యత్నించినట్లు చెప్పారు. గాయపడిన పవన్ను రైల్వే పోలీసులు ఆస్పత్రికి తరలించారు. నవీపేట: మండలంలోని యంచ సమీపంలో గోదావరిపై నిర్మిస్తున్న బ్రిడ్జికి వాడే ఐరన్ రాడ్లను ఎత్తుకెళ్లిన నిందితుడిని సోమవారం పట్టుకున్నట్లు ఎస్సై తిరుపతి తెలిపారు. అనూష ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న బ్రిడ్జికి వినియోగించే ఇనుప రాడ్లను యంచ సమీపంలో నిల్వ చేశారు. యంచ గ్రామానికి చెందిన పీరాజి వ్యాకంటి కొన్ని రోజులుగా ట్రాక్టర్లో ఇనుమును దొంగిలించాడని పేర్కొన్నారు. దాదాపు రెండు టన్నుల ఇనుప రాడ్లను దొంగిలించినట్లు తెలిపారు. ప్రాజెక్టు మేనేజర్ పార్థసారథి ఫిర్యాదు మేరకు ఈ నెల 10న కేసు నమోదు చేసి దర్యాప్తు చేశామన్నారు. చోరీకి పాల్పడిన పీరాజి వ్యాకంటిని సోమవారం అరెస్టు చేసి, రెండు టన్నుల ఇనుప రాడ్లను రికవరీ చేశామని ఎస్సై తెలిపారు. చోరీకి ఉపయోగించిన ట్రాక్టర్ను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. -
‘తైక్వాండో’ పోటీల్లో ప్రతిభ చాటిన క్రీడాకారుడు
మోపాల్: ఏషియన్ ఓపెన్ ఇంటర్నేషనల్ తైక్వాండో చాంపియన్షిప్ పోటీల్లో బిగ్ ఫైటర్స్ తైక్వాండో హబ్ క్రీడాకారుడు కుమ్మరి మోక్షిత్ సత్తా చాటినట్లు మాస్టర్ నరహరి నాయక్ తెలిపారు. హైదరాబాద్లో సోమవారం చాంపియన్షిప్ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నరహరి నాయక్ మాట్లాడుతూ మోక్షిత్ అద్భుతమైన ప్రతిభ కనబర్చాడన్నారు. గ్రామీణ ప్రాంతం నుంచి అంతర్జాతీయ స్థాయికి వెళ్లడం ఆనందంగా ఉందన్నారు. మోక్షిత్ విజయం సాధించడంపై తల్లిదండ్రులు సంతోషం వ్యక్తంచేశారు.వేల్పూర్: వేల్పూర్ మండలం రామన్నపేట్ గ్రా మాభివృద్ధి కమిటీని రద్దు చేసినట్లు వీడీసీ అధ్యక్షుడు గుమ్ముల కిషన్, ఉపాధ్యక్షుడు రాజేశ్వర్, క్యాషియర్ లింబాద్రి, సభ్యులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. వీడీసీని రద్దు చేసినట్లు ఇన్చార్జి తహసీల్దార్ శ్రీకాంత్, ఎస్సై సంజీవ్కు వినతిపత్రం అందజేశారు. ఇక నుంచి గ్రామంలో వీడీసీ ఉండదని వారు పేర్కొన్నారు. తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో కొనసాగుతున్న ఎంఈడీ పరీక్షలు సోమవారం ముగియగా, ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం సెమిస్టర్ పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల పరీక్ష కేంద్రంలో ఎంఈడీ 4వ సెమిస్టర్ రెగ్యులర్, 1, 2, 3, 4వ సెమిస్టర్ బ్యాక్లాగ్ పరీక్షలలో మొత్తం 30 మందికి 28 మంది హాజరుకాగా ఇద్దరు గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. తెయూ క్యాంపస్ కళాశాలలో జరిగిన ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం 4వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల్లో మొత్తం 28 మందికి 26 మంది హాజరు కాగా ఇద్దరు గైర్హాజరైనట్లు ప్రొఫెసర్ చంద్రశేఖర్ తెలిపారు. నిజామాబాద్నాగారం: సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యుమన్ రైట్స్ కౌన్సిల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా నీరడి లక్ష్మణ్ నియమితులయ్యారు. సోమవారం కౌన్సిల్ నేషనల్ చైర్మన్ కె విజయ్కుమార్ నియామకపత్రాన్ని అందజేశారు. జిల్లాలో హ్యుమన్ రైట్స్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. డ్రంకెన్డ్రైవ్ కేసులో రెండు రోజుల జైలు భిక్కనూరు: మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడిన వ్యక్తికి న్యాయమూర్తి చంద్రశేఖర్ రెండు రోజుల జైలు శిక్షతోపాటు రూ.1000 జరిమానా విధించినట్లు భిక్కనూరు ఎస్సై ఆంజనేయులు సోమవారం తెలిపారు. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రానికి చెందిన స్వామి మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడ్డాడు. దీంతో స్వామిని అరెస్టు చేసి న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చగా రెండ్రోజుల జైలు శిక్ష విధించినట్లు తెలిపారు. -
‘బోను ఏర్పాటు చేస్తాం’
మద్నూర్: చిరుత పులి జాడ కోసం గాలిస్తున్నామని, దానిని పట్టుకునేందుకు బోన్లు ఏర్పాటు చేస్తా మని అటవీశాఖ రేంజ్ అధికారి సంతోష తెలిపారు. మండల కేంద్రంలోని తహసీల్ కార్యలయానికి సో మవారం మద్నూర్ గ్రామస్తులు, రైతులు తరలి వచ్చి చిరుత పులిని పట్టుకోవాలని తహసీల్దార్ ము జీబ్కు వినతి పత్రం ఇచ్చారు. అనంతరం తహసీల్ కార్యలయానికి వచ్చిన అటవీశాఖ అధికారులు రై తులతో సమావేశమయ్యారు. పులిని పట్టుకోవడాని కి డ్రోన్ కెమెరాలను, బోన్లను ఏర్పాటు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని జిల్లా అ టవీశాఖ అధికారుల దృష్టికి తీసుకువెళ్తామని ఆమె తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ రేంజ్ అధికారి సుజాత, బీట్ అధికారి రాంచందర్, రైతులు బాల్కిషన్, రాములు, హన్మండ్లు, పరశురాం, అజయ్ తదితరులు పాల్గొన్నారు. నాగిరెడ్డిపేట: మాల్తుమ్మెద విత్తన క్షేత్రంలో ఈనెల 19న మధ్యాహ్నం పంట ఉత్పత్తులను వేలం వేయనున్నట్లు క్షేత్రం ఏడీఏ ఇంద్రసేన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. విత్తన క్షేత్రంలో విత్తనం కోసం ఉపయోగపడని కేఎన్ఎం–1638 సన్నరకానికి చెందిన 492 క్వింటాళ్ల ధాన్యం నిల్వ ఉందని పేర్కొన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విత్తన క్షేత్ర కార్యాలయంలో వీటిని వేలం వేయనున్నట్లు తెలిపారు. వేలంపాటలో పాల్గొనేవారు రూ.2 వేల డిపాజిట్ చెల్లించాలని సూచించారు. వేలం తర్వాత నిర్ధారించిన సొమ్ములో సగం డబ్బులను రెండురోజులో చెల్లించాలని, మిగతా మొత్తాన్ని వారంలో చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఆసక్తిగలవారు వేలం పాటలో పాల్గొనాలని సూచించారు. -
దౌర్జన్యం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి
తోటలకు వెళ్లేందుకు దారి కోసం తమ భూమి ఇవ్వాలని కొందరు వ్యక్తులు ఇబ్బంది పెడుతున్నారని బాల్కొండ మండలం వన్నెల(బి) గ్రామానికి చెందిన కొందరు గ్రామస్తులు కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. తమ భూమిలో నుంచి ఇతర కులస్తులు దారి తీసుకునేందుకు దౌర్జన్యం చేస్తున్నారని పేర్కొన్నారు. విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వేతనాలు చెల్లించండి రెండు నెలల వేతనాలను చెల్లించాలని తెలంగాణ ప్రగతిశీల గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ నాయకులు, పారిశుద్ధ్య కార్మికులు కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సంఘం ఉమ్మడి జిల్లా సంయుక్త కార్యదర్శి రమేశ్ మాట్లాడుతూ రెండు నెలల నుంచి వేతనాలు చెల్లించడం లేదని పేర్కొన్నారు. -
మహిళా సంఘాల్లో నగదు రహిత లావాదేవీలు
నందిపేట్ (ఆర్మూర్): మహి ళా సంఘాల్లో నగదు రహిత లావాదేవీలు నిర్వహించేందు కు జిల్లాలో పైలట్ మండలంగా నందిపేట్ను ఎంపిక చేశా రు. సోమవారం మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయంలో గ్రామ సంఘం ప్రతినిధులు, అసిస్టెంట్లకు ఒక్కరోజు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర సెర్ప్ అధికారి వెంకట్ మాట్లాడుతూ.. వీవో అధ్యక్షులు, సిబ్బంది డిజిటల్ లా వాదేవీలపై చిన్న సంఘ సభ్యులందరికీ అవగాహన కల్పించాలన్నారు. గూగుల్ పే, ఫోన్ పే నుంచి రోజుకు రూ. లక్ష వరకు, చిన్న మొబైల్ నుంచి రోజుకు రూ. 5000 వరకు లావాదేవీలు చేసుకోవచ్చని వివరించారు. రేపటి నుంచి అన్ని గ్రామాలలో అన్ని సంఘాలకు సీసీలు, సీఆర్పీలు, వీవోఏలు శిక్షణ ఇస్తారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏడీఆర్డీవో మధుసూదన్, డీపీఎం సంధ్యారాణి, జిల్లా సమాఖ్య పాలకవర్గ సభ్యులు, ఏపీఎం ఖాందేశ్ గంగాధర్, బ్యాంకు అధికారులు, సీసీలు, సీఆర్పీలు, వీవోఏలు, వీవో ప్రతినిధులు పాల్గొన్నారు. -
దిశ సమావేశం 23కు వాయిదా
డొంకేశ్వర్(ఆర్మూర్): ఈ నెల 16న ఎంపీ ధర్మపురి అర్వింద్ అధ్యక్షతన జరగాల్సిన జిల్లా అభివృద్ధి సమన్వయ, మానిటరింగ్ కమిటీ (దిశ) సమావేశం అనివార్య కారణాలతో 23వ తేదీకి వాయిదా పడినట్లు డీఆర్డీవో సాయాగౌడ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. దిశ కమిటీ సభ్యులు, సంబంధిత శాఖల అధికారులు ఈ విషయాన్ని గమనించాలని ఆయన కోరారు. ఖలీల్వాడి: జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 23 ఫిర్యాదులు వచ్చాయి. కమిషనర్ ఆఫ్ పోలీ స్ సాయిచైతన్య ఫిర్యాదుదారుల సమస్యల ను విని వాటిని చట్టప్రకారం పరిష్కరించాల ని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజలు నిర్భయంగా, మూడో వ్యక్తి ప్రమే యం లేకుండా స్వచ్ఛందంగా పోలీసు సేవ లను వినియోగించుకోవాలని తెలిపారు.వరల్డ్ బాక్సింగ్లో పతకాల పంట ● జిల్లాకు చెందిన కోచ్ ఎత్తేసామొద్దీన్ నేతృత్వంలో..నిజామాబాద్నాగారం: ప్రపచం బాక్సింగ్ చాంపియన్షిప్లో జిల్లాకు చెందిన కోచ్ ఎత్తేసామొద్దీన్ నేతృత్వంలో మన దేశానికి చెందిన బాక్సింగ్ క్రీడాకారిణిలు జాస్మిన్, మీనాక్షి ఉదాలు బంగారు పతకాలు సాధించారు. నుపుర్ షియోరాన్ (రజతం), పూజారాణి (కాంస్య) పతకాలు సాధించారు. ఇంగ్లాడ్లో ఈ నెల 4 నుంచి 14వ తేదీ వరకు నిర్వహించిన వరల్డ్ బాక్సింగ్ టోర్నమెంట్లో మొత్తం నాలుగు పతకాలుసాధించా రు. భారత బాక్సింగ్ జట్టుకు కోచ్గా జిల్లా కు ఎత్తేసామొద్దీన్ వ్యవహరించడంతో జిల్లా కు చెందిన క్రీడాకారులు, క్రీడాభిమానులు ఆనందనం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాకు చెందిన బాక్సింగ్ క్రీడాకారులు, జాతీయస్థాయి అథ్లెట్, గోల్డ్ మెడలిస్టు సయ్యద్ ఖైసర్ ఎత్తేసామొద్దీన్కు ప్రత్యేక అభినందనలు తెలిపారు. -
ప్రాజెక్టులకు మళ్లీ పోటెత్తిన వరద
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లోకి రెండు లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో ● నిజాంసాగర్లోకి 38వేల క్యూసెక్కులుబాల్కొండ: ఎగువ ప్రాంతాల నుంచి సోమవారం రాత్రి 7గంటలకు శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లోకి వరద నీరు పోటెత్తింది. ఆదివారం నుంచి నిలకడగా లక్ష క్యూసెక్కులు వచ్చిన వరద సోమవారం సాయంత్రానికి లక్షా 33 వేల క్యూసెక్కులకు చేరుకుంది. రాత్రి ఇన్ఫ్లో లక్షా 51 వేల క్యూసెక్కులకు పెరగడంతో మొదట 26 వరద గేట్ల ద్వారా లక్షా 33 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. మళ్లీ వరద పెరడగంతో రాత్రి 7 గంటలకు 36 వరద గేట్ల ద్వారా లక్షా 82 వేల క్యూసెక్కులకు నీటి విడుదలను పెంచారు. ప్రాజెక్ట్ నుంచి వరద కాలువ ద్వారా 8 వేలు, కాకతీయ కాలువకు 4 వేలు, ఎస్కెప్ గేట్ల ద్వారా 5 వేలు, సరస్వతి కాలువకు 800, లక్ష్మికాలువకు 200, అలీసాగర్ లిప్టు ద్వారా 180, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. 684 క్యూసెక్కుల నీరు ఆవిరి రూపంలో పోతుంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091(80.5 టీఎంసీలు) అడుగులు కాగా సోమవారం రాత్రి నిండుకుండలా ఉంది. నిజాంసాగర్ నుంచి నాలుగు గేట్ల ద్వారా.. నిజాంసాగర్: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు సోమవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో నిజాంసాగర్ ప్రాజెక్టులోకి 38,829 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. దీంతో ప్రాజెక్టు 4 వరద గేట్ల ద్వారా 27,128 క్యూసెక్కుల నీటిని మంజీర నదిలోకి వదులుతున్నామన్నారు. ప్రధాన కాలువకు వెయ్యి క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామన్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1,405 అడుగులు(17.8 టీఎంసీలు) కాగా 1,404.72 అడుగుల(17.397 టీఎంసీలు) నీరు నిల్వ ఉందన్నారు. ఎస్సారెస్పీ నుంచి విడుదలవుతున్న నీరు నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి మంజీరలోకి.. -
లేబర్ రేట్లు పెంచాలని పనుల నిలిపివేత
సుభాష్నగర్: లేబర్ రేట్లు పెంచాలని డిమాండ్ చేస్తూ సర్కిల్ పరిధిలో కొనసాగుతున్న అన్ని పనులను మంగళవారం నుంచి నిలిపేస్తున్నామని ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కె వెంకట్రెడ్డి తెలిపారు. ఈ మేరకు సోమవారం ఎన్పీడీసీఎల్ ఎస్ఈ రవీందర్కు వినతిపత్రం అందజేశారు. అంతకుముందు పవర్హౌస్ ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వెంకట్రెడ్డి మాట్లాడుతూ.. 2021లో ఉన్న లేబర్ రేట్లకు, ప్రస్తుతమున్న రేట్లకు వ్యత్యాసం ఉందని, దీంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని అన్నారు. ఈవిషయాన్ని పలుమార్లు సీఎండీ దృష్టికి తీసుకెళ్లినా న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్య పరిష్కారమయ్యే వరకు మంగళవారం నుంచి పనులు ఆపేయాలని అసోసియేషన్ నిర్ణయం తీసుకుందని తెలిపారు. పరిస్థితిని యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి సమ్మెకు సహకరించి న్యాయం చేయాలని వారు కోరారు. కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు రవి యాదవ్, సంతోష్, భాస్కర్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
పకడ్బందీగా ఎస్ఐఆర్
● పొరపాట్లు, తప్పిదాలకు తావుండొద్దు ● వీసీలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సి సుదర్శన్రెడ్డి సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)–2026 ప్రక్రియను అన్ని నియోజకవర్గాల పరిధిలో పకడ్బందీగా చేపట్టేందుకు సన్నద్ధం కావాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సి.సుదర్శన్రెడ్డి సూచించారు. కలెక్టర్, ఈఆర్వోలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సోమవారం ఆయన ఎస్ఐఆర్ ప్రక్రియపై మాట్లాడారు. కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) నుంచి ఆదేశాల వచ్చిన వెంటనే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను చేపట్టాలని, అందుకు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. బీహార్ రాష్ట్ర సాధారణ ఎన్నికల దృష్ట్యా ఇప్పటికే ఆ రాష్ట్రంలో ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తయ్యిందని గుర్తు చేశారు. మన వద్ద సైతం ఎలాంటి పొరపాట్లు, తప్పిదాలకు తావులేకుండా ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. 2002 ఓటరు జాబితాతో 2025 జాబితాను సరిపోల్చుకోవాలని పేర్కొన్నారు. ఎస్ఐఆర్ నిర్వహణపై సూపర్వైజర్లు, బీఎల్వోలకు శిక్షణ అందించాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ టి వినయ్కృష్ణారెడ్డి, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్కుమార్, ట్రెయినీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావి, బోధన్, ఆర్మూర్, బాన్సువాడ సబ్ కలెక్టర్లు వికాస్ మహతో, అభిగ్యాన్ మాల్వియా, కిరణ్మయి, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్కుమార్, నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్రకుమార్, ఎన్నికల విభాగం సిబ్బంది సాత్విక్, జితేందర్ తదితరులు పాల్గొన్నారు. పక్కాగా పోషణ మాసం.. పిల్లల్లో పోషలోపాన్ని అధిగమించేందుకు పోషకాహారాన్ని అందించడంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా, నిజాయితీగా పని చేయాలని కలెక్టర్ టి వినయ్కృష్ణారెడ్డి సంబంధిత అధికారులకు సూచించారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 17 నుంచి నిర్వహించనున్న పోషణ మాసం కార్యక్రమాన్ని పురస్కరించుకుని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం సాయంత్రం సంబంధిత అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. పోషణమాసం కార్యక్రమాల అమలు తీరును సమీక్షించి, అధికారులకు సూచనలు చేశారు. అంగన్వాడి కేంద్రాల ద్వారా చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు మరింత మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ఈ నెల 17 నుంచి అక్టోబర్ 16వ తేదీ వరకు పోషణ మాసాన్ని పక్కాగా నిర్వహించాలన్నారు. రక్తహీనత, పౌష్టికాహార లోపంపై పిల్లల తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని అన్నారు. చిన్న పిల్లలు, మహిళల్లో పోషకాహార లోపాన్ని గుర్తించి పరిష్కరించడమే పోషణ మాసం ముఖ్య ఉద్దేశమని అన్నారు. డీఆర్డీవో సాయాగౌడ్, డీడబ్ల్యూవో రసూల్ బీ, డీఎంహెచ్వో డాక్టర్ రాజశ్రీ, డీఈవో అశోక్, ఐసీడీఎస్ సీడీపీవోలు, సూపర్జర్లు పాల్గొన్నారు. -
స్కానింగ్ సెంటర్లపై నిఘా ఉచాలి
నిజామాబాద్నాగారం: స్కానింగ్ కేంద్రాల పనితీరుపై నిరంతర నిఘా ఉంచాలని అధికారులను, సలహా సంఘ సభ్యులను జిల్లా వైద్యారోగ్యశాఖాధికారిణి రాజశ్రీ ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో గర్భస్థ పూర్వ, గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షల నిషేధ చట్టం జిల్లా స్థాయి సలహా సంఘ సమావేశాన్ని సోమ వారం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్వో మాట్లాడుతూ.. ప్రతి స్కానింగ్ కేంద్రాన్ని తప్పుకుండా మూడు నెలలకోసారి తనీఖీ చేయాలన్నారు. రిజిస్టర్లు, రికార్డులను పరిశీలించి రూ పొందించాలన్నారు. స్కానింగ్ సెంటర్లలో తాగునీరు, మూత్రశాలలు ఉండాలని, ధరల పట్టిక, ఐ ఈసీ, సమాచార సూచికలు, వేచి ఉండే గది అందుబాటులో ఉండాలన్నారు. అర్హత లేని వారు స్కానింగ్కు రిఫర్ చేయొద్దని, రేడియాలాజిస్ట్, గైనకాలజిస్ట్ లేకుండా స్కానింగ్ సెంటర్లను నిర్వ హించే వారిపై చట్ట ప్రకారం చర్యలుంటాయని స్పష్టం చేశారు. కొత్తగా రెండు స్కానింగ్ సెంటర్లకు అనుమతులివ్వడంతోపాటు నాలుగు సెంటర్లకు రెన్యువల్ చేసినట్లు తెలిపారు. ఆర్మూర్ డివిజన్లో ఓ స్కానింగ్ కేంద్రాన్ని మూసివేయాలని సభ్యులు తీర్మానం చేశారు. సమావేశంలో పీవో పీసీఎన్డీటీ డాక్టర్ సుప్రియ, పీవో ఎంసీహెచ్ డాక్టర్ శ్వేత, సభ్యులు పాల్గొన్నారు. మూడు నెలలకోసారి తనిఖీలు చేయాలి అర్హత లేకుండా స్కానింగ్కు రిఫర్ చేయొద్దు డీఎంహెచ్వో రాజశ్రీ -
బాధిత రైతులకు ఊరట
● పొలాల్లో ఇసుక మేటలు తొలగిస్తున్న ఉపాధి కూలీలుడొంకేశ్వర్(ఆర్మూర్): జిల్లాలో ఇటీవల కురిసిన భా రీ వర్షాల కారణంగా పంటపొలాల్లో వేసిన మట్టి, ఇసుక మేటల తొలగింపు సోమవారం నుంచి మొదలైంది. ఎస్టిమేషన్లు వేసిన అధికారులు ఉపాధి కూ లీల ద్వారా తొలగిస్తున్నారు. ఖర్చు లేకుండా ప్రభుత్వమే చర్యలు చేపట్టడంతో బాధిత రైతులకు కొంత ఊరట లభిస్తోంది. జిల్లాలో మొత్తం 270 ఎకరా ల పంట పొలాల్లో ఇసుక మేటలు వేశాయి. వర్ని, వేల్పూర్, ఇందల్వాయి, ధర్పల్లి, భీ మ్గల్, సిరికొండ మండలాలు కలిపి 389 మంది రైతులు బాధితులుగా ఉన్నారు. వరికి ఎక్కువగా నష్టం వాటిల్లగా, జరిగిన నష్టం నుంచి కోలుకునే చర్యల్లో భాగంగా ప్రభుత్వం పొలాల్లో వేసిన ఇసుక, మట్టిని ఉపాధి కూలీల సహాయంతో తొలగింపజేస్తోంది. ఇటు ఉపాధి కూ లీలకు కూడా పని లభిస్తోంది. వా రం, పది రోజుల్లోగా పొలాల్లోని ఇసుక, మట్టి మేటలను తొలగించాలని సిబ్బందికి ఆదేశాలిచ్చామని జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి సాయాగౌడ్ తెలిపారు. -
హిందువులను స్వయంసేవకులుగా చేయడమే లక్ష్యం
సుభాష్నగర్: ప్రతీ హిందువును స్వయంసేవక్గా తయారు చేయడమే శతాబ్ది ఉత్సవాల లక్ష్యమని ఆర్ఎస్ఎస్ జిల్లా సంఘ్ చాలక్ డాక్టర్ కాపర్తి గురుచరణం అన్నారు. ఇందుకోసం రానున్న విజయదశమి నుంచి ఏడాది పాటు వివిధ కార్యక్రమాలను రూ పొందించినట్లు తెలిపారు. నగరంలోని న్యూ హౌసింగ్బోర్డ్ కాలనీ కమ్యూనిటీ హాల్లో ఆదివారం ఆర్ఎస్ఎస్ కంఠేశ్వర్, నాందేవ్వాడ ఉప నగరాల ఆధ్వర్యంలో గణవేశ్ధారి స్వయంసేవకుల సంఘీక్ కార్యక్రమాన్ని నిర్వహించారు. గురుచరణం ముఖ్య వక్త గా విచ్చేసి, మాట్లాడారు. సామాజిక సమరసత, ప్రకృతి పరిరక్షణ, కుటుంబ వ్యవస్థ సంరక్షణ ఆధారంగా బాధ్యతాయుతమైన సమాజాన్ని నిర్మించడం కోసమే సంఘం పని చేస్తుందన్నారు. అంతకు ముందు హౌసింగ్ బోర్డ్ కాలనీలో పథ సంచలన్ నిర్వహించారు. నగర కార్యవాహ అర్గుల సత్యం, ఉపనగర కార్యవాహలు మధుకర్, ప్రవీణ్ తదితరులు పా ల్గొన్నారు. -
తల్లిని చంపిన కొడుకు అరెస్టు
బాన్సువాడ: తల్లిని సాకలేక మంజీర నదిలో తోసేసిన కొడుకును అరెస్ట్ చేసినట్లు బాన్సువాడ డీఎస్పీ విఠల్రెడ్డి తెలిపారు. బాన్సువాడ డీఎస్పీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. బోర్లం గ్రామానికి చెందిన సాయవ్వ(75)కు కొడుకు బాలయ్య ఉన్నాడు. వృద్ధురాలైన సాయవ్వ గత కొన్ని రోజులుగా అనారోగ్యానికి గురయింది. ఆమెకు సేవలు చేయడానికి ఇంట్లో ఎవరూ లేరు. దీంతో కొడుకు బాలయ్య ఆమెను సాకలేక ఈనెల 8న ఓ మైనర్తో కలిసి సాయవ్వను బైక్పై ఎక్కించుకొని బోలక్పల్లి బ్రిడ్జి వద్దకు తీసుకెళ్లి బ్రిడ్జి పైనుంచి నదిలోకి తోసివేశాడు. ఈ 11న సాయవ్వ మృతదేహం నదిలో తేలడంతో ఈనెల 12న బోర్లం గ్రామ పెద్దలు బాలయ్య వద్ద ఉన్న మైనర్ను పట్టుకొని ప్రశ్నించారు. అతడు సాయవ్వను కొడుకే నదిలో పడేశాడని తెలిపాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కొడుకు కోసం గాలింపు చేపట్టారు. ఈనెల 14న నిందితుడు ఎర్రోళ్ల బాలయ్యతోపాటు మైనర్ కలిసి బోర్లం నుంచి వస్తుండగా కొయ్యగుట్ట చౌరస్తా వద్ద అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ వెల్లడించారు. వారి వద్ద ఉన్న బైక్ను, రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. బాలయ్యను రిమాండ్కు తరలించామని, మైనర్ను జువైనల్ అబ్జర్వేషన్ హోంకు తరలించామని అన్నారు. -
కరెంట్షాక్తో నెమలి మృతి
తాడ్వాయి(ఎల్లారెడ్డి): మండలంలోని కృష్ణాజివాడి గ్రామ శివారు లో కరంట్ వైర్లకు నెమలి తగిలి షాక్తో మృతిచెందినట్లు గ్రా మస్తులు తెలిపారు. గ్రామంలో శనివారం రాత్రి అకస్మాత్తుగా కరంటు సరఫరా నిలిచిపోవడంతో ట్రాన్స్కో అధికారులు, సిబ్బంది వచ్చి స్తంభాలను, వైర్లను పరిశీలించారు. సమస్యను గుర్తించకపోవడంతో వేరే లైన్కు కనెక్షన్ ఇచ్చారు. తిరిగి ఆదివారం అధికారులు గ్రామశివారులో గల విద్యుత్ స్తంభాలు, వైర్లను పరిశీలించారు. శివారులోని వైర్లపై నెమలి పడి చనిపోయినట్లు కనిపించిందన్నారు. దీంతో వైర్లపై మృతి చెంది ఉన్న నెమిలిని కిందికి తీసి యథావిధిగా కరంటు కనెక్షన్ ఇచ్చారు. -
మురికి కాలువలో వ్యక్తి మృతదేహం లభ్యం
బోధన్టౌన్(బోధన్): పట్టణంలోని శివసాయి కాలనీలోగల మురికి కాలువలో ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు పట్టణ సీఐ వెంకట నారాయణ తెలిపారు. సదరు మృతదేహాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే వారు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడి ప్యాంట్ జేబులో దొరికిన ఆధార్ కార్డులో నిర్మల్ లక్ష్మణ్ పేరు ఉందన్నారు. వయస్సు 42, చిరునామా బ్రాహ్మణపల్లి, ఎడపల్లి మండలం అని ఉందన్నారు. మృతుడు బ్లాక్ కలర్ షర్ట్, బ్లూ కలర్ జీన్స్ ధరించినాడన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించామని సీఐ తెలిపారు. ఎల్లారెడ్డిరూరల్: మండలంలోని అడవిలింగాల్ గేట్ వద్ద ఎల్లారెడ్డి–కామారెడ్డి ప్రధాన రహదారిపై ఉన్న బ్రిడ్జిపై ఆదివారం లారీ అదుపుతప్పి బ్రిడ్జిని ఢీకొని బురదలో కూరుకుపోయింది. లారీ ఎల్లారెడ్డి నుంచి కామారెడ్డికి వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్అండ్బీ డీఈ నారాయణ, ఏఈ ఐశ్వర్యలు స్పందించి బ్రిడ్జిపై దిగబడిపోయిన లారీని క్రేన్ల సహాయంతో తొలగించారు. నారింజపండ్ల లారీ బోల్తా ఇందల్వాయి: మండలంలోని చంద్రాయన్పల్లి శివారులో నారింజ పండ్ల లోడ్ తో వెళ్తున్న లారీ ప్రమాదవశాత్తు బోల్తాపడింది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా.. నారింజ పండ్ల లోడ్ తో ఉన్న లారీ ఆదివారం హైదరాబాద్ నుంచి నాగ్పూర్వైపు జాతీయ రహదారిపై వెళ్తోంది. మండలంలోని చంద్రాయన్పల్లి శివారులో ప్రమాదవశాత్తు లారీ అదుపుతప్పి బోల్తాపడి సర్వీస్రోడ్డుపై పడింది. ఈ ఘటనలో డ్రైవర్, క్లీనర్కు స్వల్ప గాయాలు అయ్యాయి. లారీలోని పండ్లన్నీ రోడ్డుపై పడిపోయాయి. మట్కా ఆడుతున్న ముగ్గురు అరెస్టు ఆర్మూర్టౌన్: పట్టణంలో మట్కా ఆడుతున్న ముగ్గురిని అరెస్టు చేసినట్లు ఎస్హెచ్వో సత్యనారాయణ ఆదివారం తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు మట్కా స్థావరంపై దాడిచేసి గుజరాతి గోవర్ధన్, వొడుల మోహన్, మహ్మద్ రహీముద్దీన్ను అరెస్టు చేశామన్నారు. వారి నుంచి రూ. 15వేల నగదు, రెండు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పరారయిన మట్కా నిర్వాహకుడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మోపాల్: మండలంలోని ఒడ్డెర కాలనీకి చెందిన దండుగుల ఎల్లయ్యపై అకారణంగా దాడిచేసిన పలువురిపై కేసులు నమోదు చేసినట్లు ఎస్సై సుష్మిత ఆదివారం తెలిపారు. వివరాలు ఇలా.. ఎల్లయ్య టిప్పర్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఇదేక్రమంలో ఆదివారం సాయంత్రం గేదెలు అడ్డుగా ఉన్నాయని టిప్పర్ను రోడ్డు పక్కన నిలిపాడు. వెనకాల బైక్లపై వస్తున్న నిజామాబాద్కు చెందిన యువకులు టిప్పర్ను ఎందుకు నిలిపావంటూ ఎల్లయ్యపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, దాడికి పాల్పడ్డారు. ఆరు ద్విచక్ర వాహనాలపై పది మంది యువకులు వచ్చి దాడిచేశారని ఎల్లయ్య ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని నల్లమడుగు అటవీ ప్రాంతంలో చిరుత దా డిచేసి రెండు లేగ దూడలను హతమార్చినట్లు బాధితుడు దూప్సింగ్ తెలిపారు. నాలుగు రోజుల క్రితం ఆవుల మందను మేతకు అడవికి తీసుకెళ్లగా సాయంత్రం రెండు లేగదూడలు కనిపించలేదని తెలిపారు. లేగదూడల కోసం మూడు రోజులుగా అటవీ ప్రాంతంలో గాలించగా ఆదివారం కుళ్లిపోయిన లేగదూడల కళేబరాలు కనిపించినట్లు బాధితుడు తెలిపాడు. చిరుత దాడిలోనే లేగదూడలు మృతి చెందాయని, అటవీశాఖ అధికారులు నష్టపరిహారం అందజేయాలని కోరారు. -
పద్మశాలి వసతిగృహం అధ్యక్షుడిగా యాదగిరి
నిజామాబాద్ నాగారం: నగరంలోని కోటగల్లి పద్మశాలి వసతిగృహం అధ్యక్షుడిగా దీకొండ యాదగిరి గెలుపొందారు. ఆయన ప్యానెల్లోని 11 మంది అభ్యర్థులు విజయం సాధించారు. ఎన్నికల్లో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు చెందిన ఓటర్లు పాల్గొన్నారు. నగరంలోని పద్మశాలి ఉన్నత పాఠశాలలో ఆదివారం ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరిగిన పోలింగ్లో 85 శాతం ఓటింగ్ నమోదైంది. మొత్తం 894 ఓట్లకు 757 ఓట్లు పోలయ్యాయి. 11 పదవులకు 34 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. దీకొండ యాదగిరి, ఎస్ఆర్ సత్యపాల్, కొండి రమేశ్ ప్యానెళ్లు బరిలో నిలిచాయి. సాయంత్రం ఐదు గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కాగా రాత్రి వరకు కొనసాగింది. యాదగిరికి 441 ఓట్లు రాగా, సమీప అభ్యర్థి సత్యపాల్కు 236 ఓట్లు వచ్చాయి. ఎన్నికల అధికారిగా న్యాయవాది రేగొండ గంగాప్రసాద్, అసిస్టెంట్ ఎన్నికల అధికారులుగా పగిడిమారి యాదగిరి, కర్లం రాములు వ్యవహరించారు. ఎన్నికలకు పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. నూతన కార్యవర్గం ఇదే.. అధ్యక్షుడిగా దీకొండ యాదగిరి, ప్రధాన కార్యదర్శి గంట్యాల వెంకటనర్సయ్య, కోశాధికారిగా కన్న రాజు, ఉపాధ్యక్షులుగా గుజ్జేటి వెంకటనర్సయ్య, ఎనగందుల మురళి, నూకల విజయసారథి, సహాయ కార్యదర్శి బొమ్మెర తులసీప్రసాద్, లక్కపత్రి దేవిదాస్, గాలిపల్లి వెంకటేశ్వర్, ఆర్గనైజింగ్ సెక్రెటరీ కై రంకొండ మురళి, కల్చరల్ సెక్రెటరీగా తన్నీరు శ్రీనివాస్ ఎన్నికయ్యారు. -
షార్ట్సర్క్యూట్తో రెండు ఇళ్లు దగ్ధం
ధర్పల్లి: మండల కేంద్రంలోని గోసంగి కాలనీలో షార్ట్ సర్క్యూట్తో రెండు ఇళ్లు దగ్ధమైన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు, బాధితులు తెలిపిన వివరాలు ఇలా.. గోసంగి కాలనీలో సల్ల భాగ్య, తురపాటి సాయమ్మ కుటుంబ సభ్యులతో కలిసి పాత సా మాన్ల కొనుగోలు వ్యాపారం చేసుకుంటూ నివాసం ఉంటున్నారు. ఈక్రమంలో వారు ఎప్పటిలాగానే ఆదివారం ఉదయం బయటకు వెళ్లారు. మధ్యాహ్నం సల్ల భాగ్య ఇంట్లో విద్యుత్ తీగలు కాలిపోయి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అనంతరం పక్కన ఉన్న తూరపాటి సాయమ్మ ఇంట్లోకి మంటలు వ్యాపించాయి. స్థానికులు గమనించి మంటలను ఆర్పి వేశారు. కానీ అప్పటికే రెండు ఇళ్లలోని సామాన్లు పూర్తిగా కాలి బూ డిదయ్యాయి. సల్ల భాగ్య ఇంట్లో తులం బంగారం, వెండి ఆభరణాలు, రూ.3లక్షల నగదు కాలిపోగా, తూరపాటి సాయమ్మ ఇంట్లో కొంత నగదుతోపాటు వంట సామగ్రి, దుస్తులు, ఎలక్ట్రానిక్ వస్తువులు కాలి పోయాయి. సుమారు రెండు ఇళ్లల్లో కలిపి సుమారు రూ. 5లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లిందని బాధి తులు వాపోయారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని వారు వేడుకున్నారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఆర్మూర్ బాలరాజ్ బాధిత కుటుంబాలను పరామర్శించి వంట సామగ్రి, దుస్తులను అందజేశారు. -
అంగన్వాడీల ఆందోళన బాట
నిజామాబాద్నాగారం: సమస్యల పరిష్కారానికి అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు ఉద్యమబాట పట్టాయి. గర్భిణులు, బాలింతలు, చిన్నారుల బాగోగులను అంగన్వాడీ టీచర్లు, ఆయాలు చూసుకుంటున్నారు. నిత్యం వారికి పాలు, గుడ్లు, పౌష్టికాహారంతోపాటు ప్రీ ప్రైమరీ విద్యను అందిస్తున్నారు. ఇవే కాకుండా శ్రీమంతాలు, అక్షరాభ్యాసం తదితర ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే, కనీస వేతనం, ఉద్యోగ భద్రత లేదని, పనిభారం పెరుగుతోందని అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా రూ.18వేల వేతనం, పీఎఫ్ సౌకర్యం కల్పించాలని, ఎఫ్ఆర్ఎస్ రద్దు చేసి, ప్రీ ప్రైమరీ, పీఎం శ్రీ విద్యను అంగన్వాడీ కేంద్రాల్లో నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇవే కాకుండా ఖాళీలను భర్తీ చేయాలని, మూడు నెలల పీఆర్సీ, సమ్మె కాలపు వేతనాలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ తదితర డిమాండ్ల సాధనకు తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్(సీఐటీయూ) రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చింది. అందులో భాగంగా సోమవారం మంత్రుల ఇళ్లను ముట్టడించి ధర్నా చేపట్టనున్నారు. అయినా స్పందించక పోతే 25న చలో సెక్రటేరియట్, అక్టోబర్ 8న జిల్లా కేంద్రాల్లో 5కి.మీల పాదయాత్ర, 17వ తేదీ నుంచి ఆన్లైన్ సమ్మె చేపట్టాలని నిర్ణయించారు.జిల్లాలో సీడీపీవో ప్రాజెక్టులు 5 మొత్తం అంగన్వాడీలు 1501 బాలింతలు 61,200 గర్భిణులు 9821 చిన్నారులు 81,262 టీచర్లు 1427 ఆయాలు 901 నేడు మంత్రుల ఇళ్ల ఎదుట ధర్నాలు 25న చలో సెక్రటేరియట్ అక్టోబర్ 8న జిల్లా కేంద్రాల్లో పాదయాత్ర 17 నుంచి ఆన్లైన్ సమ్మెకు పిలుపుఏళ్ల తరబడిగా సమస్యలు పరిష్కరించాలని ప్రజాప్రతినిధులు, అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాం. పనిభారం పెరిగిపోతుంది. జీతాలు తక్కువగానే ఉన్నాయి. ఎవరూ పట్టించుకోవడం లేదు. అందుకే ఉద్యమిస్తున్నాం. – పి స్వర్ణ, యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శిమేము న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వాల ఎదుట ఉంచాం. గత ప్రభుత్వాలు నమ్మించి మోసం చేశాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సమస్యలు పరిష్కరించాల్సిందే. రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు జిల్లాలో ఆందోళన చేస్తాం. – కై రి దేవగంగు, జిల్లా అధ్యక్షురాలు -
రైలు ఢీకొని వ్యక్తి మృతి
ఇందల్వాయి/ఖలీల్వాడి: ఇందల్వాయి–సిర్నాపల్లి రైల్వే లైనును ఓ వ్యక్తి దాటుతుండగా రైలు ఢీకొని మృతి చెందాడు. రైల్వే ఎస్సై సాయిరెడ్డి తెలిపిన వివరాలు ఇలా.. ఇందల్వాయి మండలం గన్నా రం గ్రామానికి చెందిన బద్దం రవీందర్ రెడ్డి (46) ఆదివారం ఉదయం తన పొలం వద్దకు బయలుదేరాడు. ఈక్రమంలో ఇందల్వాయి–సిర్నాపల్లి రైల్వే స్టేషన్ల మధ్య రైలు పట్టాలను అతడు దాటుతుండ గా గుర్తు తెలియని రైలు ఢీకొని మృతి చెందాడు. స మాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని, వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పోచారం ప్రాజెక్టు నీటిలో పడి యువకుడు.. నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): మండలంలోని పోచారం ప్రాజెక్టు నీటిలో మునిగి ఓ యువకుడు మృతిచెందాడు. వివరాలు ఇలా.. మెదక్ పట్టణానికి చెందిన షేక్ మహబూబ్(20)అనే యువకుడు ఆదివారం తన స్నేహితుల తో కలిసి మండలంలోని పోచారం ప్రాజెక్టుకు వ చ్చాడు. ప్రాజెక్టు అలుగు పైనుంచి వెళ్తుండగా, కా లు జారి నీటి ప్రవాహంలో పడిపోయాడు. నీటము నిగి ఊపిరాడక మృతిచెందినట్లు తెలిసింది. మృతుడి అన్న షేక్ వాజీద్ హుస్సేన్ ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసినట్లు నాగిరెడ్డిపేట పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం మెదక్ ఆస్పత్రికి తరలించినట్లు వివరించారు. -
అద్భుతం అలీసాగర్
● తొమ్మిది దశాబ్దాల క్రితం నిర్మాణం ● నిజాం కాలంలో రూపకల్పన చేసిన సీఈ నవాబ్ అలీ ● జిల్లా కేంద్రానికి తాగునీటి సరఫరానేడు ఇంజినీరింగ్స్ డేబోధన్: నిజాం ఏడో రాజు మీర్ ఉస్మాన్ అలీఖాన్ హయాంలో భారీ ప్రాజెక్టులకు రూపకల్పన చేసిన నాటి చీఫ్ ఇంజినీర్ అలీ నవాజ్ జంగ్ ఎడపల్లి మండలం ఠాణాకలాన్ గ్రామ శివారులో ఎత్తైన గుట్టల మధ్య అలీసాగర్ రిజర్వాయర్ నిర్మాణానికి డిజైన్ చేశారు. 93 ఏళ్ల క్రితం (1932లో) దీనిని నిర్మించగా ఆయన పేరు మీదుగానే అలీసాగర్ రిజర్వాయర్గా నామకరణం చేశారు. నవాబ్ అలీ ఇంజినీరింగ్ నైపుణ్యాలు, దార్శనికతతో రూపుదిద్దుకున్న రిజర్వాయర్తో బహుళ ప్రయోజనాలు చేకూరుతున్నాయి. రిజర్వాయర్ నుంచి నిజాంసాగర్ ప్రాజెక్టు డి–46 కాలువ ద్వారా ఎడపల్లి, బోధన్, రెంజల్ మండలల పరిధిలో 1500 ఎకరాలకు సాగు నీరందుతోంది. నిజామాబాద్ నగర ప్రజల తాగు అవసరాలకు ఈ రిజర్వాయర్ నుంచి రోజూ నీరు సరఫరా అవుతోంది. రిజర్వాయర్ పక్కనే ఉన్న అలీసాగర్ ఉద్యానవనం జిల్లాలో ప్రముఖ్య పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతోంది. రిజర్వాయర్లో పర్యాటకులకు బోటింగ్ సౌకర్యం కూడా ఉంది. -
చికిత్స పొందుతూ వివాహిత..
లింగంపేట(ఎల్లారెడ్డి): ఆత్మహత్యకు యత్నించిన ఓ వివాహిత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. ఎస్సై దీపక్ కుమార్ తెలిపిన వివరాలు ఇలా.. మండలంలోని అయ్యపల్లితండాకు చెందిన దేవసోత్ సుజిత(20) అత్తింటివారి వేధింపులు భరించలేక ఆగస్టు 10 గడ్డిమందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం ఎల్లారెడ్డిపేటలోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు.. ఖలీల్వాడి: నిజామాబా ద్ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో గుర్తుతెలియ ని వ్యక్తి చికిత్స పొందుతూ మృతిచెందినట్లు ఐదో టౌన్ ఎస్సై గంగాధర్ తెలిపారు. నగరంలోని న్యాల్కల్ రోడ్లోగల కల్లు బట్టి సమీపంలో శనివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తి స్పృహ లేని స్థితిలో గుర్తించారు. వెంటనే సదరు వ్యక్తిని చికిత్స నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మధ్యా హ్నం మృతిచెందాడు. మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. మృతుడు లేత ఆరెంజ్ రంగు, కలర్ ఫుల్ షర్ట్, ముదురు నీలి రంగు ప్యాంటు ధరించినట్లు తెలిపారు. మృతుడి వయస్సు సుమారు 65 ఏళ్ల వరకు ఉంటాయని, న్యాల్కల్ రోడ్లో భిక్షాటన చేసేవాడని అన్నారు. అతని దగ్గర ఎలాంటి ఆధారాలు లభించలేదన్నారు. ఎవరికై నా సమాచారం తెలిస్తే ఐదో టౌన్ పోలీస్ స్టేషన్ను సంప్రదించాలన్నారు. నవీపేట: నిజామాబాద్ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో గుర్తుతెలియ ని వ్యక్తి చికిత్స పొందుతూ మృతిచెందాడు. నవీపేట ఎస్సై తిరుపతి తెలిపిన వివరాలు ఇ లా.. నవీపేట శివారులో ని అయ్యప్ప ఆలయ సమీపంలో ఈనెల 12న గుర్తుతెలియని ఓ వ్యక్తి అస్వస్థతకు గురైయ్యాడు. వెంటనే స్థానికులు గమనించి అతడిని చికిత్స నిమిత్తం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు. మృతుడి వయస్సు సుమారు 36ఏళ్లు ఉంటాయని ఎస్సై అన్నారు. -
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
మోపాల్/ఖలీల్వాడీ: నగరశివారులోని బోర్గాం(పి) జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల 1991–92 బ్యా చ్ విద్యార్థులు, గురువులు ఆదివారం కిసాన్ ము న్నూరు కాపు కల్యాణ మండపంలో ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. 33 ఏళ్ల తర్వాత విద్యార్థులందరూ ఒకే వేదికపై కలుసుకోవడంతో ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ అనాటి జ్ఞాపకాలను గుర్తుకుతెచ్చుకున్నారు. నాడు చదువు నే ర్పిన ఉపాధ్యాయులను సమ్మేళనానికి ఆహ్వానించి, సన్మానించారు. పూర్వ విద్యార్థి, సినీ రచయిత బండోజి సతీష్ తన వ్యాఖ్యానంతో ఆకట్టుకుంటూ గు రుశిస్యుల ఆత్మీయ సమ్మేళనాన్ని ఆహ్లాదపరిచాడు. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటపాటలతో ఉల్లాసంగా గడిపారు. యోగా గురువుకు సన్మానం రుద్రూర్: మండల కేంద్రానికి చెందిన యోగా గురువు డాక్టర్ విశ్వనాథ్ మహాజన్ను కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ఆదివారం సన్మానించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశేష సేవలందించిన వారిని సికింద్రాబాద్లో ఘనంగా సత్కరించారు. ఇటీవల యోగా ఆంధ్రాలో భాగంగా రాయలసీమ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన సెమినార్కు విశ్వనాథ్ మహాజన్ హాజరై యోగా ప్రాధాన్యతను వివరించారు. కార్యక్రమంలో భారత స్వాభిమాన్ ట్రస్ట్ పతంజలి రాష్ట్ర అధ్యక్షుడు శ్రీధర్రావ్ పాల్గొన్నారు. -
బకాయిల విడుదలకు ‘పోరుబాట’
ఇంజినీరింగ్ కళాశాలలకు 22 కోట్లు బీఈడీ కళాశాలలకు 15.60 కోట్లు నిజామాబాద్అర్బన్: స్కాలర్షిప్, రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని ప్రైవేటు ఉన్నత విద్యాసంస్థల యాజమాన్యాలు పోరుబాట పట్టా యి. నాలుగేళ్లుగా బకాయిలు విడుదల కాకపోవడంతో ఉన్నత కళాశాలలకు సోమవారం నుంచి బంద్ ప్రకటిస్తూ హయ్యర్ ఇన్స్టిట్యూషన్ అసోసియేషన్ నిర్ణయించింది. జిల్లాలో మొత్తం ఉన్నత విద్యా కళాశాలలు 109 ఉండగా, అందులో ప్రైవేటు కళాశాల లు 79 ఉన్నాయి. వీటితోపాటు మూడు ఇంజినీరింగ్ కళాశాలలు కొనసాగుతున్నాయి. సుమారు 50వేల మంది వరకు విద్యార్థులు చదువుతున్నారు. గుదిబండగా బకాయిలు జిల్లాలోని ప్రైవేట్ కళాశాలలకు స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ ఇబ్బందికరంగా మారింది. గత నాలుగు సంవత్సరాలుగా బకాయిల చెల్లింపులలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందంటూ యాజమాన్యాలు ఆరోపిస్తున్నాయి. మరోవైపు దశల వారీగా బకాయిలను విడుదల చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. జిల్లాకు చెందిన కళాశాలలకు సుమారు రూ.86 కోట్ల వరకు ప్రభుత్వం బకాయిలు చెల్లించాల్సి ఉంది. విద్యార్థులపై ప్రభావం.. ఉన్నత కళాశాలల బంద్తో విద్యార్థులపై తీవ్ర ప్రభావం పడనుంది. ప్రస్తుతం డిగ్రీ కళాశాలల అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి కాగా, పీజీలో చేరేందుకు కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు. డిగ్రీ పూర్తయిన విద్యార్థులు సర్టిఫికెట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. రీయింబర్స్మెంట్ మీద ఆధారపడిన విద్యార్థులు ఫీజు చెల్లించలేక ఉన్నత చదువులకు దూరమయ్యే అవకాశం ఉంది. డిగ్రీ 50 పీజీ 11 బీఈడీ 13 బీపీఈఎడ్ 01 ఎంబీఏ 03 ఎంసీఏ 01 ఇంజినీరింగ్ 03 నిరవధికంగా కొనసాగుతుంది.. ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ల కోసం ఇదివరకు చా లా సార్లు ప్రభుత్వానికి విన్నవించాం. అయినా ఫలితం లేదు. అందుకే కళాశాలల బంద్ పాటిస్తున్నాం. నిధులు విడుదల చేసే వరకు కళాశాలల బంద్ నిరవధికంగా కొనసాగుతుంది. – సుధాకర్, ఉమ్మడి జిల్లా ప్రైవేట్ డిగ్రీ కళాశాలల అసోసియేషన్ ప్రధాన కార్యదర్శివెంటనే విడుదల చేయాలి పేద, మధ్యతరగతి విద్యార్థుల భవిష్యత్తును ప్రభుత్వం దృష్టిలో ఉంచుకోవాలి. కళాశాలలకు బకాయిపడిన ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ నిధులను వెంటనే విడుదల చేయాలి. – రాజేశ్వర్, పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రైవేట్ ఉన్నత కళాశాలలు జిల్లాలో బకాయిల వివరాలు పెండింగ్లో నాలుగేళ్ల ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ జిల్లాలో సుమారు రూ.86 కోట్ల బకాయిలు నేటి నుంచి ఉన్నత విద్యా కళాశాలలు బంద్ -
గ్రావిటీతో నీటి సరఫరా..
నిజామాబాద్ సిటీ: పంపింగ్ వ్యవస్థతో పనిలే కుండా మంచిప్ప చెరువు నుంచి గ్రావిటీ ద్వారా 1892లోనే నీటిని సరఫరా చేశారు నాటి ఇంజినీర్లు. నిజాం కాలం నాటి ఇంజినీర్ల అద్భుత ప్ర తిభకు నిదర్శనం మంచిప్ప లార్జ్ ట్యాంక్. మంచిప్ప చెరువునీటితో ఇందూరువాసుల దాహార్తిని తీర్చేందుకు నాటి నిజాం నవాబు కృషి చేశారు. 1892 ప్రాంతంలో మంచిప్ప చెరువు నుంచి నీటిని ఎలాంటి పంపింగ్ వ్యవస్థ లేకుండా కేవలం గ్రావిటీద్వారా నీటిని కంజర–కులాస్పూర్ వరకు తీసుకువచ్చారు. కులాస్పూర్ వద్ద ఫిల్డర్ బెడ్లో నీటిని శుద్ధి చేసి పైపుల ద్వారా నిజామాబాద్ నగరంలోని పెద్ద బజార్లో నిర్మించిన వాటర్ట్యాంక్లోకి వస్తాయి. ఇక్కడి నుంచి నగరంలోని పలు ప్రాంతాలకు ఈ నీటిని సరఫ రా చేస్తున్నారు. 440 మీటర్ల ఎత్తులో ఉన్న మంచిప్ప చెరువులోని నీటిని దిగువన 380 మీటర్ల వరకు కులాస్పుర్ ఫిల్టర్బిడ్ వరకు నీరు గ్రావిటీ ద్వారా సరఫరా అవుతున్నాయి. ఎలాంటి టె క్నాలజీ ఉపయోగించకుండా కేవలం భూమార్గంలోనే కాల్వల ద్వారా (గ్రావిటీ) చెరువు నీటిని తరలించారు. ఈ వ్యవస్థ ఇప్పటికీ కొనసాగుతోంది. పైపుల మరమ్మతులు వంటి చిన్నచిన్న సమస్యలు మినహా మిగతా పెద్దగా ఎలాంటి సమస్యలు లేవు. సుమారు వందేళ్లుగా ఇందూరువాసులు తమ గొంతులు తడుపుకుంటున్నారు. -
చెదరని చరిత్ర
● ఇంజినీరింగ్ నైపుణ్యానికి ప్రతీక ఎస్సారెస్పీ నిజాంసాగర్ ప్రాజెక్టు డొంకేశ్వర్(ఆర్మూర్)/ఇందల్వాయి : ఇంజినీర్లే లేని కాలంలో నిర్మించిన భవనాలు, ఆలయాలు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. కేవలం రాళ్లు, డంగు సునాన్ని మాత్రమే ఉపయోగించడం ప్రత్యేకత. 200 ఏళ్ల నాటి రామలింగేశ్వరాలయం కుస్తాపురం రామ లింగేశ్వర ఆలయాన్ని రెండు వందల ఏళ్ల క్రితం నిర్మించినట్లుగా చరిత్రకారులు చెబుతున్నారు. గుడిని పూర్తిగా రాతితో నిర్మించారు. 1965 సమయంలో ఎస్సారెస్పీ ప్రాజెక్టు కట్టడంతో కుస్తాపురం గ్రామాన్ని ఖాళీ చేసి వెళ్లిపోయారు. ఆలయం కొన్నేళ్లుగా బ్యాక్ వాటర్ ముంపులోనే ఉంటోంది. రెండు సార్లు తేలినా గుడి చెక్కు చెదరకుండా ఉంది. సిర్నాపల్లిలో గడి..సిర్నాపల్లి సంస్థానాధీశురాలు జానకీబాయి అధికారిక భవనాన్ని(గడి) 1870వ దశకంలో అ ద్భుతంగా నిర్మించారు. ఇటుక, మట్టి గోడలు, డంగు సున్నంతో చేపట్టిన నిర్మాణం 150 ఏళ్లు గడుస్తున్నా చెక్కు చెదరలేదు. గడి ఎండాకాలంలో చల్లగా, శీతాకాలం వెచ్చగా ఉంటుంది. మూడంచెల తూముఇందల్వాయి: అద్భుతమైన ఇంజినీరింగ్కు సిర్నాపల్లి జానకీబాయి చెరువుతూము అద్దం పడుతోంది. మూడు అంచెలుగా నిర్మించిన తూము ద్వారా కింది ప్రాంతంలో ఉన్న చెరువులకు నీటిని వదులుతారు. చెరువులో నీటి మ ట్టాన్ని బట్టి ఒక్కో తూమును తెరుస్తారు. కేవ లం బండ రాళ్లతో నిర్మించిన తూము ఇప్పటికీ చెక్కు చెదరలేదు. చెరువులో చివరి నీటి బొట్టు వరకు ఉపయోగించే విధంగా తూమును నిర్మించారు. నాటి ఇంజినీర్ల నైపుణ్యం, అంకితభావానికి ల్యాండ్ మార్క్గా నిలుస్తున్నాయి ఉమ్మడి జిల్లాలోని కట్టడాలు. రాళ్లు, డంగు సున్నంతో నిర్మించిన ప్రాజెక్టులు భారీ వరదలను తట్టుకుని చరిత్రలో నిలిచి ఉన్నాయి. నిజాం పాలనలో నాటి చీఫ్ ఇంజినీర్ నవాబ్ అలీ జంగ్ ఉమ్మడి జిల్లాలో రూపకల్పన చేసిన నిజాంసాగర్, పోచారం ప్రాజెక్టులతోపాటు అలీసాగర్ రిజర్వాయర్లు ఆయకట్టుకు జీవం పోస్తున్నాయి. చెరువులో ఏ స్థాయిలో నీరున్నా ఆయకట్టుకు నీరందించేలా శీలం జానకీబాయి సిర్నాపల్లి చెరువులో నిర్మింపజేసిన మూడంచెల తూము ‘ఔరా’ అనిపిస్తోంది. ఇలా ఉమ్మడి జిల్లాలో అనేక కట్టడాలు చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ఇంజినీర్స్డే సందర్భంగా ‘సాక్షి’ కథనం.. ఇరవైఏళ్ల ఇంజినీర్ల శ్రమ బాల్కొండ: ఉత్తర తెలంగాణ కల్పతరువు శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నాటి ఇంజినీర్ల నైపుణ్యానికి ప్రతీకగా నిలుస్తోంది. 1963 జూలైలో పనులు ప్రారంభం కాగా 1983లో పూర్తయ్యింది. ఇరవై సంవత్సరాలపాటు ఇంజినీర్ల చేసిన కృషి 62 ఏళ్లు గడుస్తున్నా చెక్కు చెదరకుండా నిలబడింది. మిగులు జ లాలను గోదావరిలోకి విడుదల చేసేందుకు నిర్మించిన 42 వరద గేట్లు ఎస్సారెస్పీకే ప్రత్యేక ఆకర్షణ. 18 లక్షల ఎకరాలకు సాగునీరు, 36 మెగావాట్ల విద్యుదుత్పత్తి, చేపల పెంపకం లక్ష్యాలుగా.. 112 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో 1091 అడుగుల నీటిమట్టంతో 175చదరపు మైళ్ల విస్తీర్ణంలో నిర్మించారు. వరద తాకిడిని తట్టుకునే సువిశాలమైన బండరాయి ప్రాంతాన్ని ప్రాజెక్టు నిర్మాణం కోసం ఎంచుకున్నారు. 16 లక్షల క్యూసెక్కుల వ రద నీటిని తట్టుకునేలా ఆనాటి ఇంజినీర్లు డిజైన్ చేసి 50 అడుగుల వెడల్పు, 33 అడుగుల ఎత్తుతో మొత్తం 42 వరద గేట్లను ని ర్మించారు. పూడిక పోయేలా ఆరు రివర్స్ స్లూయిస్ గేట్లు నిర్మించారు. డంగు సున్నం, బండ రాళ్లు.. ఎస్సారెస్పీ నిర్మాణంలో అధికంగా డంగు సున్నం, బండరాళ్లను వినియోగించినట్లు ఇంజినీర్లు తెలుపుతున్నారు. కుడి, ఎడమల 14 కిలోమీటర్ల మేర ఆ నకట్ట నిర్మించారు. ఆనకట్టకు రివిట్ మెంట్ నిర్మా ణం కోసం పెద్దపెద్ద రాళ్లను వినియోగించారు. ఉమ్మడి జిల్లాలో భారీ ప్రాజెక్టులు రాళ్లు, డంగు సున్నంతో నిర్మాణం భారీ వరదలను తట్టుకుని నిలబడుతున్న కట్టడాలు గడీలు, ఆలయాలు ఎన్నో అద్భుత కట్టడాలు నేడు ఇంజినీర్స్ డే రాతి కట్టడాలు.. -
మంజీరపై రాతి వంతెన
బోధన్: తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దులో సాలూ ర శివారులో మంజీర నదిపై 90 ఏళ్ల క్రితం నిజాం పాలనలో నిర్మించిన లో లెవల్ రాతి వంతెన చెక్కు చెదరలేదు. నిజాంపాలనలో (1935–36) నిర్మించి న ఈ వంతెన నాటి ఇంజినీర్ల నైపుణ్యానికి సాక్ష్యంగా నిలుస్తోంది. వంతెనను పూర్తిగా రాయి, సున్నం డంగుతో పటిష్టంగా నిర్మించారు. రెండు రాష్ట్రాల మధ్య రవాణా సౌకర్యం కోసం నిర్మించిన వంతెన మంజీరాకు భారీ వరదలు వచ్చినా తట్టుకుని నిలబడింది. 1985–86లో రాతి వంతెనకు దిగువన మ హారాష్ట్ర–ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కలిసి నిర్మించిన హైలెవల్ వంతెన ఐదేళ్ల క్రితం పూర్తిగా దెబ్బతిన్నది. కానీ రాతి లోలెవల్ వంతెన ఇప్పటికీ చెక్కుచెదరకుండా చరిత్రకు సాక్షిగా నిలుస్తోంది. ● రాష్ట్ర సరిహద్దులో నిర్మాణం ● నాటి ఇంజినీర్ల నైపుణ్యానికి సజీవ సాక్ష్యం -
తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదు
వేల్పూర్: ఎంపీ అర్వింద్ తప్పుడు ఆరోపణలు చే స్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే మాటలు మానుకోవాలని రాష్ట్ర సహకార యూనియన్ చైర్మన్ మా నాల మోహన్రెడ్డి హితవు పలికారు. వేల్పూర్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయం వద్ద డీసీసీ బీ చైర్మన్ కుంట రమేశ్రెడ్డితో కలిసి ఆదివారం ఆ యన విలేకరులతో మాట్లాడారు. పోలీసులు ఒక వ ర్గానికే మద్దతుగా ఉంటున్నారని, దానికి కాంగ్రె స్ నాయకులు వత్తాసు పలుకుతున్నారని ఎంపీ అ ర్వింద్ చేసిన ఆరోపణలు కేవలం ఎన్నికలను దృష్టి లో పెట్టుకొని చేసినవేనని మండిపడ్డారు. యూరి యా సరఫరా వైఫల్యానికి కారణంగా కాంగ్రెస్ అని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి చేసిన ఆరోపణలను ఖండిస్తున్నామన్నారు. కేంద్రం పంపిన యూరియా ను కాంగ్రెస్ ఎక్కడైనా బ్లాక్ మార్కెట్ చేస్తోందా అని ప్రశ్నించారు. రాష్ట్రానికి రావాల్సిన యూరియా ను కేంద్రం సక్రమంగా ఇవ్వకపోవడం వల్లనే కొర త ఏర్పడుతోందన్న విషయం రైతులు గుర్తించాలని కోరారు. యూరియ కోసం సీఎం, రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ఢిల్లీకి వెళ్లిన ప్రతిసారి యూరియా కొరతపై కేంద్రానికి విన్నవిస్తున్నారని పేర్కొన్నారు. కేంద్రం కావాలనే మన రాష్ట్రానికి కోత విధించిందన్నారు. వేల్పూర్ ఏఎంసీ వైస్ చైర్మన్ గడ్డం నర్సారెడ్డి పాల్గొన్నారు. అర్వింద్ రెచ్చగొట్టే ప్రకటనలు మానుకోవాలి యూరియా కొరత పాపం బీజేపీదే రాష్ట్ర సహకార యూనియన్ చైర్మన్ మానాల మోహన్రెడ్డి -
వరదపోటును తట్టుకున్న పోచారం
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : కామారెడ్డి, మెదక్ జిల్లాల సరిహద్దుల్లో నాగిరెడ్డిపేట మండలం పోచారం శివారులో నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ 1917లో పోచారం ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 1922లో నిర్మాణం పూర్తయ్యింది. అప్పట్లో రూ. 27.11 లక్షల వ్యయంతో ప్రాజెక్టు నిర్మించారు. ఇంజినీర్ నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ ఆధ్వర్యంలో ప్రాజెక్టు నిర్మాణం జరిగింది. 21 అడుగుల ఎత్తు, 1.7 కిలోమీటర్ల పొడవు తో ఆనకట్టను నిర్మించారు. ప్రాజెక్టు నిర్మాణంలో రాళ్లు, డంగు సున్నం మాత్రమే వినియోగించారు. మొదట 3.4 టీఎంసిల నీటినిల్వ సామర్థ్యంతో ప్రాజెక్టును నిర్మించాలని తలచినప్పటికీ ప్రతికూల పరిస్థితుల కారణంగా 2.423 టీఎంసీలకు పరిమితం చేశారు. 70 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహాన్ని తట్టుకునే శక్తి ఉన్న పోచారం ప్రాజెక్టులోకి గత నెల 27, 28 తేదీల్లో ఎవరూ ఊహించని రీతిలో 1.82 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. అయినా ప్రాజెక్టు స్ట్రక్చర్ బలంగా ఉండడంతో దెబ్బతినలేదు. -
మోతాదుకు మించి యూరియా వాడొద్దు
మోపాల్: వరికి యూరియాను మోతాదుకు మించి వాడొద్దని జిల్లా వ్యవసాయాధికారి మేకల గోవిందు రైతులకు సూచించారు. ఆదివారం మండలంలోని బోర్గాం(పి), మోపాల్ సొసైటీ గోదాములను పరిశీలించి యూరియా, ఇతర ఎరువుల నిల్వలు, రిజిస్టర్, స్టాక్బోర్డులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నానో యూరియాను వినియోగిస్తే మొక్కకు 90 శాతం వరకు చేరుతుందని తెలిపారు. తద్వారా మొక్క ఎదుగుదలకు దోహదపడుతుందన్నారు. జిల్లాలో యూరియా కొరత రాకుండా పకడ్బందీగా చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. యూరియా బ్లాక్మార్కెట్కు తరలకుండా, కృత్రిమ కొరత సృష్టించకుండా ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తున్నామన్నారు. ఆయన వెంట సొసైటీ సిబ్బంది ఉన్నారు. ఎత్తేసామొద్దీన్ నేతృత్వంలో బంగారు పతకంనిజామాబాద్నాగారం: ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్లో భారత బాక్సింగ్ క్రీడాకారిణి జాస్మిన్ బంగారు పతకం సాధించింది. శనివారం రాత్రి ఇంగ్లాండ్లో జరిగిన టోర్నీలో పోలాండ్ క్రీడాకారిణిని 4–1 తేడాతో ఓడించింది. కాగా, జాస్మిన్కు బాక్సింగ్ కోచ్గా జిల్లా చెందిన మహ్మద్ ఎత్తేసామొద్దీన్ వ్యవహరించారు. దీంతో బాక్సింగ్ క్రీడాకారుడు, జాతీయస్థాయి అథ్లెటిక్స్ గోల్డ్మెడలిస్టు సయ్యద్ ఖైసర్ కోచ్ ఎత్తేసామొద్దీన్ను అభినందించారు. కేసుల పరిష్కారంలో జిల్లాకు 4వ స్థానం ● లోక్ అదాలత్లో 7,444 కేసులు రాజీ ● సీపీ సాయిచైతన్య ఖలీల్వాడి: జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన, రాజీపడటానికి అవకాశం ఉన్న 7,444 కేసులను జాతీయ మెగా లోక్ అదాలత్లో రాజీ కుదుర్చినట్లు సీపీ సాయిచైతన్య ఆదివారం తెలిపారు. బీఎన్ఎస్(ఐపీసీ) కేసులు 501, ఈ–పెట్టీ కేసులు 1958, డీడీ, ఎంవీఐ యాక్ట్లో 4,985 కేసులను పరిష్కరించినట్లు వెల్లడించారు. 138 సైబర్ క్రైమ్ కేసులలో రూ.42,45,273 తిరిగి సైబర్ బాధితులకు ఇప్పించేందుకు ఆర్డర్ కాపీలను సంబంధిత బ్యాంక్ నోడల్ అధికారులకు పంపించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ సైబర్ క్రైమ్, వివిధ కేసులలో రాజీమార్గం చేసినందుకు జిల్లాకు 4వ స్థానం లభించిందన్నారు. ప్రజలు సైబర్ మోసాలకు గురైతే ట్రోల్ఫ్రీ నెంబర్ 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు. లోక్ అదాలత్ను విజయవంతం చేసినసైబర్ క్రైమ్ డీఎస్పీ వై వెంకటేశ్వర్ రావు, సీఐ ముఖీద్ పాషా, రిజర్వ్ సీఐ సతీశ్, కోర్ట్ డ్యూటీ, సైబర్ సెల్ సిబ్బందిని అభినందించారు. -
ఎస్సారెస్పీకి మళ్లీ పెరిగిన వరద
బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లోకి ఎగు వ ప్రాంతాల నుంచి వరద నీరు మళ్లీ పెరిగింది. శుక్రవారం అర్ధరాత్రి వరకు లక్ష క్యూసెక్కులకు చేరింది. దీంతో ప్రాజెక్ట్లోని 23 వరద గేట్ల ద్వారా 90 వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదిలారు. శనివారం ఉదయం ప్రాజెక్ట్లోకి 90 వేల క్యూసెక్కులకు వరద నీరు తగ్గిపోవడంతో వరద గేట్ల ద్వారా గోదావరిలోకి 75 వేల క్యూసెక్కులకు నీటి తగ్గించారు. మధ్యాహ్ననికి లక్షా 32 వేల క్యూసెక్కులకు పెరగడంతో గోదావరిలోకి లక్షా 15 వేల క్యూసెక్కులకు నీటి విడుదలను పెంచారు. రాత్రి వరకు అంతేస్థాయిలో ఇన్ఫ్లో, ఔట్ఫ్లో కొనసాగింది. ప్రాజెక్ట్ నుంచి ఎస్కెప్ గేట్ల ద్వారా 8 వేల క్యూసెక్కులు, వరద కాలువ ద్వారా 8 వేల క్యూసెక్కులు, మిషన్ భగీరథ ద్వారా 231 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 684 క్యూసెక్కుల నీరు పోతుంది. కాగా శనివారం సాయంత్రానికి అంతేస్థాయి నీటి మట్టంతో నిండుకుండలా ఉంది. సందర్శించిన హైకోర్టు జడ్జీలు శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ను శనివారం హైకోర్టు జడ్జీలు సామ్ కోషి, సృజన సందర్శించారు. నిర్మల్ జిల్లా పర్యటనను ముగించుకుని వారు తిరుగు ప్రయాణంలో ఎస్సారెస్పీని సందర్శించారు. కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి జడ్జీలకు పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం ఎస్సారెస్పీ అతిథి గృహంలో జడ్జిలు, కలెక్టర్తో సమావేశమయ్యారు. ప్రాజెక్ట్ గురించి, జిల్లాలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిపై చర్చించారు.వరల్డ్ బాక్సింగ్ కమిటీలో నిఖత్ జరీన్కు చోటునిజామాబాద్నాగారం: వరల్డ్ బాక్సింగ్ అథ్లెటిక్ కమిటీలో జిల్లాకు చెందిన బాక్సర్ నిఖత్ జరీన్కు చోటు లభించింది. కమిటీలో టర్కీ, ఆస్ట్రేలియా, వేల్స్, యూఎస్ఏ, ఫ్రాన్స్ దేశాలకు చెందిన క్రీడాకారులతోపాటు భారత్ తరఫున నిఖత్కు సభ్యురాలిగా అవకాశం ఇచ్చారు. రికార్డుల నిర్వహణపై డీఎంహెచ్వో ఆగ్రహం బాల్కొండ: రికార్డుల నిర్వహణపై నిర్లక్ష్యం వహిస్తున్న బాల్కొండ ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు, సిబ్బందిపై డీఎంహెచ్వో రాజశ్రీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె శనివారం ప్రభుత్వ ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్యుల, సిబ్బంది హాజరుపట్టికను పరిశీలించారు. అనంతరం మందుల స్టాక్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆమె మాట్లాడుతూ ఆస్పత్రిలో వైద్య సేవలను మె రుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్న ట్లు తెలిపారు. ప్రస్తుతం వైద్యవిధాన పరిష త్ నుంచి వైద్యుల కొరత ఉందని, దీంతో జి ల్లా వైద్య శాఖ నుంచి మరో ఇద్దరు వై ద్యు లను నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. వారంలో మూడు రోజులు ఇక్కడ సేవలందిస్తారని తెలిపారు. ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నానో యూరియా వాడకం పెరిగేలా చూడాలి ● జిల్లా వ్యవసాయాధికారి గోవింద్ డిచ్పల్లి: రైతులు పంటల సాగుకు నానో యూరియా వాడకాన్ని అలవాటు చేసుకోలని జిల్లా వ్యవసాయాధికారి గోవింద్ సూచించారు. శనివారం డిచ్పల్లి మండలం బర్ధిపూర్లోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాన్ని ఆయన సందర్శించారు. యూరియా నిల్వలపై సమీక్షించారు. భవిష్యత్లో నానో యూరియా వాడకం పెంచా లని, ఈ విషయంలో రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. ప్రస్తు తం సొసైటీ పరిధిలో యూరియా కొరత లేదని చైర్మన్ రామకృష్ణ తెలిపారు. ఆయన వెంట సొసైటీ సీఈవో నారాయణరెడ్డి, సిబ్బంది ఉన్నారు. -
త్వరలోనే ఇందూరుకు వందే భారత్
● జిల్లాకు ఇండస్ట్రియల్ కారిడార్ ● ఎంపీ అర్వింద్ ధర్మపురి ● ఎన్సీసీఐ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారంనిజామాబాద్ రూరల్: త్వరలోనే ఇందూరు నుంచి ముంబై, మధ్యప్రదేశ్లకు వందేభారత్ రైలు సౌ కర్యం కల్పించనున్నట్లు పార్లమెంట్ సభ్యుడు అర్వింద్ ధర్మపురి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ఓ హోటల్లో శనివారం నిర్వహించిన నిజామాబాద్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండసీ్ట్ర (ఎన్సీసీఐ) నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి ఆయన ము ఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఎంపీ మాట్లాడుతూ జిల్లాలో ఉన్న వ్యాపార, వాణిజ్య సంబంధాల నేపథ్యంలో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటుకు ప్రయ త్నాలు కొనసాగుతున్నాయన్నారు. వందేభారత్ రై లుకు సంబంధించిన ఫైలు రైల్వే శాఖ మంత్రి వద్ద పెండింగ్లో ఉందన్నారు. జిల్లా కేంద్రంలో రైల్వే బైపాస్ నిర్మాణం కొనసాగుతుందని తెలిపారు. జిల్లాలో వ్యాపార, వాణిజ్య రంగాలను ప్రోత్సహించేందుకు కేంద్రంతో మాట్లాడి నిధులు తెచ్చేందుకు తనవంతు కృషిచేస్తానని హామీ ఇచ్చారు. రైల్వే బ్రిడ్జిలు, కొత్త రైల్వేలైన్ నిర్మాణాల ఆలస్యానికి గత ప్రభుత్వ పాలకుల అవినీతి, అక్రమాలే కారణమని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి అన్ని విధాలుగా సహకరిస్తానని తెలిపారు. అనంతరం ఎన్సీసీఐ అధ్యక్ష, కార్యదర్శులు రాజు, శ్రీనివాసరావు, ఇతర కార్యవర్గసభ్యులతో ప్రమాణస్వీకారం చేయించారు. కార్యక్రమంలో నుడా చైర్మన్ కేశ వేణు, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, చాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు పాల్గొన్నారు. -
ఆన్లైన్ షాపర్స్ లక్ష్యంగా..
● తాజాగా నిజామాబాద్లో ఇలాంటి పార్శిల్స్ డెలివరీ ● డబ్బులు చెల్లించి పార్శిల్ విప్పితే, అందులో చిల్లర వస్తువులు.. ● వాట్సాప్ గ్రూపుల్లోకి సైతం చొరబడుతున్న వైనం ● బాధితుల సిమ్ను, వాట్సాప్ను ఆధీనంలోకి తీసుకుంటున్న మాయగాళ్లు సైబర్ కేటుగాళ్లు రోజు రోజుకూ కొత్త కొత్త విధానాలతో మోసాలు చేస్తున్నారు. టెక్నాలజీని ఉపయోగించుకుని పలువురి ఖాతాలకు చిల్లులు పెడుతున్నారు. ఇలా కూడా సైబర్ నేరాలు చేస్తారా అనేవిధంగా సైబరాసురులు ఊహించని రీతిలో మోసాలకు దిగుతున్నారు. ప్రస్తుత గ్లోబల్ ప్రపంచంలో స్మార్ట్ ఫోన్ ఉపయోగించి సింపుల్గా సైబర్ నేరాలు చేస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో ప్రతిఒక్కరూ అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన పరిస్థితి నెలకొంది. – సాక్షి ప్రతినిధి, నిజామాబాద్అడ్రస్లు చోరీ చేసి పార్శిల్స్ పంపిస్తున్న సైబర్ కేటుగాళ్లు ● ఇటీవల నిజామాబాద్కు చెందిన పలువురు ఉపయోగిస్తున్న వాట్సాప్ గ్రూపును సైతం తమ ఆధీనంలోకి తీసుకున్న సైబర్ నేరగాళ్లు చాలా తెలివిగా మోసం చేశారు. ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన సైబర్ కేటుగాళ్లు ఏకంగా పర్సనల్ ఫోన్ కాంటాక్ట్ నంబర్ల ద్వారా బాధితుల బంధు వులు, స్నేహితులతో నే రుగా చాటింగ్లోకి వెళుతున్నారు. ఇలా హ్యాక్ చేసిన ఫోన్ను తమ ఆధీనంలోకి తీసుకుంటున్నారు. నిజామాబాద్లోని సుభాష్నగర్కు చెందిన ఓ వ్యాపారస్తుడికి ఇటీవల క్యాష్ ఆన్ డెలివరీ (సీవోడీ) పార్శిల్ వచ్చింది. ఈ వ్యాపారి ఆన్లైన్ షాపింగ్లో తన ఇంటిలో అవసరమైన గృహోపకరణం కోసం ఆర్డర్ చేశాడు. దానికి సంబంధించిన డెలివరీ రాకపోగా, ఓ కొరియర్ సంస్థ ద్వారా ఈ నెల 11న తన ఇంటి చిరునామాకు పార్శిల్ వచ్చింది. నగదు చెల్లించి పార్శిల్ తీసుకుని దాన్ని తెరవగా అందులో వాడేసిన చిన్న ఖాళీ నెయిల్ పాలిష్ సీసా, నీళ్లతో నింపిన చిన్న స్ప్రేబాటిల్ ఉంది. అయితే ఈ పార్శిల్పై హైదరాబాద్లోని నారాయణగూడ ఏరియాకు చెందిన వ్యక్తి చిరునామా ఉంది. ఈ చిరునామా పైభాగంలో నిజామాబాద్ సుభాష్నగర్కు చెందిన సదరు వ్యాపారి అడ్రస్ స్లిప్ అతికించి మరీ పార్శిల్ డెలివరీ చేయడం గమనార్హం. అయితే తాను ఆర్డర్ చేసిన వస్తువు వచ్చిందని నగదు చెల్లించి తీసుకున్న వ్యాపారి మోసపోయినట్లు తెలుసుకుని అవాక్కయ్యాడు. కొరియర్ సంస్థ వాళ్లను వాకబు చేస్తే హర్యానా నుంచి వచ్చినట్లు చెప్పడం గమనార్హం. అయితే ఈ మోసం చుట్టుపక్కల నుంచే చేసినట్లు అర్థమవుతోంది. ● ఇటీవల నగరానికి చెందిన మాజీ ప్రజాప్రతినిధి వాట్సప్కు సైబర్ కేటుగాళ్లు ఓ లింక్ను పంపారు. ఈ వాట్సప్ ఉన్నది ఆపిల్ ఐఫోన్ కావడం గమనార్హం. ఈ ప్రజాప్రతినిధి ఫోన్తో పాటు అన్ని యాప్లు ఫేస్ ఐడీతో ఓపెన్ అవుతాయి. అయితే వాట్సప్ కూడా అలా ఓపెన్ చేసి కొత్తగా వచ్చిన ఓ లింక్ను క్లిక్ చేశారు. తక్షణమే సదరు వాట్సాప్తో పాటు ఫోన్లోని సిమ్ పూర్తిగా సైబర్ నేరగాడి ఆధీనంలోకి వెళ్లిపోయింది. బాధిత ప్రజాప్రతినిధి ఎవరికీ ఫోన్ చేయలేని, ఎవరి వద్ద నుంచీ ఫోన్కాల్స్ రిసీవ్ చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. కొద్దిసేపటిలోనే కేటుగాళ్లు వాట్సప్ ద్వారా సదరు మాజీ ప్రజాప్రతినిధి కాంటాక్ట్ నంబర్లలోని 90 మందితో ఛాటింగ్లోకి వెళ్లారు. అప్పటికే వాట్సాప్ మొత్తం కేటుగాడి ఆధీనంలో ఉండడంతో బంధువులెవరు, స్నేహితులెవరు అనే విషయాన్ని తెలుసుకుని అందుకు అనుగుణంగా చాటింగ్ చేయడం విశేషం. ఇలా ప్రతిఒక్కరికి చాటింగ్లో అత్యవసరంగా రూ.42 వేలు కావాలంటూ మెసేజ్ చేశాడు. ఇలా మెసేజ్ అందుకున్నవారిలో ముగ్గురు వ్యక్తులు సదరు ప్రజాప్రతినిధి ఫోన్పేకు డబ్బులు పంపారు. ఈ డబ్బులు నేరుగా సైబర్ కేటుగాళ్ల ఖాతాల్లో చేరిపోయాయి. గంటలోపే అప్రమత్తమైన సదరు మాజీ ప్రజాప్రతినిధి తన సిమ్ను డీయాక్టివేట్ చేయించడంతో సైబర్ కేటుగాళ్ల మోసానికి బ్రేక్ వేయించగలిగారు. డెలివరీ పార్శిల్ వచ్చిందని..కొందరు ఆన్లైన్ షాపింగ్ చేసినప్పుడు సైతం సైబర్ కేటుగాళ్లు ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నారు. షాపింగ్ చేయనివారికి సైతం పార్శిల్ వచ్చిందని, బయట డెలివరీ బాయ్ వెయిట్ చేస్తున్నాడని, ఓటీపీ చెప్పాలని కేటుగాళ్లు అడుగుతున్నారు. ఇలా చెప్పినవారి కాల్స్ను సైతం ఫార్వర్డింగ్ చేసుకుంటున్నారు. -
కేసుల పరిష్కారానికి లోక్ అదాలత్ రాజమార్గం
నిజామాబాద్ లీగల్ : కేసుల సత్వర పరిష్కారంలో లోక్ అదాలత్లు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని, ప్రజలు వీటిని వినియోగించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జీవీఎన్ భారతలక్ష్మి పేర్కొన్నారు. జాతీయ మూడో లోక్ అదాలత్ను జిల్లా కేంద్రంలోని న్యాయ సేవా సంస్థ ప్రాంగణంలో శనివారం జడ్జి ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ రాజీమార్గమే –రాజమార్గం అన్న నినాదంతో ప్రారంభమైన లోక్ అదాలత్లు అనేక పెండింగ్ కేసులకు ముగింపు పలికాయన్నారు. కోర్టుల చుట్టూ ఏళ్లపాటు తిరిగే బదులు కక్షిదారులు తమ కేసుల్ని లోక్అదాలత్ ద్వారా పరిష్కరించుకుని మానసిక ప్రశాంతతను పొందవచ్చని వివరించారు. నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మామిళ్ల సాయిరెడ్డి మాట్లాడుతూ ప్రజల్లో అవగాహన పెరగడంతో జిల్లా న్యాయసేవా సంస్థ లోక్ అదాలత్ సేవలను విరివిగా వినియోగించుకుంటున్నారని, ఇది పెండింగ్ కేసుల పరిష్కారంలో ముందడుగని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా న్యాయసేవా సంస్థ కార్యదర్శి విజయభాస్కర్ రావు, నాల్గో అడిషనల్ సెషన్స్ కోర్టు జడ్జి హరీష, తెలంగాణ బార్ అసోసియేషన్ సభ్యుడు రాజేందర్ రెడ్డి, నిజామాబాద్ ఏసీపీ రాజావెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి జీవీఎన్ భారతలక్ష్మి మూడో లోక్అదాలత్లో 26,390 పెండింగ్ కేసులు పరిష్కారం రూ. 9.26 కోట్ల పరిహారం చెల్లింపు -
సిమీ, పీఎఫ్ఐలకు నిజామాబాద్ అడ్డా
● కాంగ్రెస్ హయాంలో లా అండ్ ఆర్డర్ బాగాలేదు ● ఎంపీ అర్వింద్ ధర్మపురి ఖలీల్వాడి: సిమీ, పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాలకు నిజామాబా ద్ అడ్డాగా మారిందని ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. జిల్లా కేంద్రంలోని డీఐజీ కార్యాలయంలో శనివారం సీపీ పోతరాజు సాయిచైతన్యతో ఎంపీ సమావేశమయ్యారు. అనంతరం ఏర్పాటు చేసిన మీ డియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ హయాంలో లా అండ్ ఆర్డర్ బాగాలేదన్నారు. వినాయక నిమజ్జనానికి సంబంధించిన ఫొటోను సోషల్ మీడియాలో పోస్టు చేసిన యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశా రని తెలిపారు. యువకుడిపై కేసు నమోదు చే సిన సందర్భంగా ఓ వర్గానికి చెందిన సుమారు 400 మంది బైక్ ర్యాలీ నిర్వహించి, హారన్ కొట్టుడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తే మాత్రం కేసు నమోదు చేయలేదన్నారు. తాను పోలీసులతో మాట్లాడిన తర్వాత బాధ్యు లపై కేసులు నమోదు చేశారన్నారు. హిందువుల పండుగలకు ఆంక్షలు ఎక్కువయ్యాయని, తప్పు చేసిన వారి విషయంలో మత ప్రస్తావన ఎందుకు తీసుకువస్తున్నారని ప్రశ్నించారు. ఇటీవల దొరికిన ఉగ్రవాదులను పోలీసులు విచారిస్తే స్వచ్ఛంద సంస్థల ముసుగులో లవ్జీహాదీలకు సపోర్టు చేయడం ఆందోళన కలిగిస్తోందన్నారు. మర్వాడీ గో బ్యాక్ కాదని, ఇక్క డే ఉన్న బంగ్లాదేశ్, మయన్మార్, టర్కీ దేశాల వారిని వెళ్లగొట్టాలని సూచించారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు, ఉగ్ర కార్యకలాపాలపై కఠినంగా వ్యవహరించాలని సీపీ సాయి చైతన్యను కోరినట్లు ఎంపీ అర్వింద్ తెలిపారు. -
చుట్టం చూపుగా వచ్చి చోరీలు
● రాజస్థాన్కు చెందిన నిందితుడి అరెస్ట్ ● వివరాలు వెల్లడించిన ఎస్పీ రాజేశ్ చంద్ర కామారెడ్డి క్రైం: చుట్టం చూపుగా వచ్చి చోరీలకు పాల్పడుతున్న రాజస్థాన్కు చెందిన ఓ నిందితుడిని కామారెడ్డి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గతనెల 25 న జిల్లా కేంద్రంలోని అశోక్నగర్ కాలనీకి చెందిన మాసిరెడ్డి శివారెడ్డి కుటుంబం ఇంటికి తాళం వేసి దైవదర్శనం కోసం వేములవాడకు వెళ్లింది. మరుసటి రోజు వచ్చి చూసేసరికి చోరీ జరిగినట్లు గుర్తించారు. ఇంట్లోని 19 తులాల బంగారు ఆభరణాలు అపహరణ కు గురయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసు కుని సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా దర్యాప్తు చేశా రు. శనివారం హౌసింగ్బోర్డు కాలనీలో ఓ కారులో అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని పోలీసులు పట్టుకుని వాకబు చేశారు. తెలంగాణ నంబర్ ప్లేట్ కారులో తిరుగుతూ హిందీలో మాత్రమే మా ట్లాడడంతో అనుమానం వచ్చి అదుపులోకి తీసుకు ని విచారించగా నేరం అంగీకరించాడని ఎస్పీ తెలిపారు. నిందితుడిని రాజస్థాన్ రాష్ట్రంలోని కరోలీ జి ల్లా అజీజ్పూర్ గ్రామానికి చెందిన హన్సరాజ్ మీ నాగా గుర్తించారు. అతడు కొద్ది రోజుల క్రితం మెద క్ రైల్వే క్వార్టర్స్లో నివాసం ఉండే తన బంధువు ఇంటికి చుట్టం చూపుగా వచ్చాడని పేర్కొన్నారు. స్నేహితుడైన అభిషేక్తో కలిసి కామారెడ్డిలో తాళం వేసిన ఇంట్లో చోరీ చేశాడన్నారు. నిందితుడి వద్ద నుంచి 2 తులాల బంగారు ఆభరణాలు, కారు, సె ల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. -
సొసైటీ డైరెక్టర్లపై వేటు!
● రుణాలు చెల్లించని వారిని పాలకవర్గాల నుంచి తొలగిస్తున్న సహకార శాఖ ● ఇప్పటి వరకు 20 మంది వరకు ఉద్వాసన ● పలుమార్లు నోటీసులిచ్చినా లెక్క చేయకపోవడంతో చర్యలకు దిగిన అధికారులు డొంకేశ్వర్(ఆర్మూర్): ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో రుణాలు తీసుకొని తిరిగి చెల్లించని డైరెక్టర్లపై జిల్లా సహకార శాఖ చర్యలకు దిగింది. జిల్లా వ్యాప్తంగా పలు సొసైటీల్లోని దాదాపు 20 మంది డైరెక్టర్లపై అధికారులు వేటు వేశారు. వారి పదవితోపాటు పాలకవర్గం నుంచి పేరును అధికారులు తొలగించారు. అధికారులు తీసుకున్న ఈ నిర్ణయం ప్రస్తుతం జిల్లాలో హాట్టాపిక్గా మారింది. జిల్లాలో మొత్తం 89 పీఏసీఎస్లు ఉన్నాయి. ఇటీవల 60 సొసైటీలకు మాత్రమే పదవీకాలాన్ని ప్రభుత్వం మళ్లీ పొడిగించింది. మిగిలిన 29 సొసైటీలకు పొడిగింపు ఇవ్వలేదు. మొదటిసారి పెంచిన సమయంలో బకాయిలున్న డైరెక్టర్ల జోలికి వెళ్లలేదు. ఇటీవల రెండోసారి పెంచిన సమయంలో మాత్రం రుణాలు తీసుకొని డీఫాల్టర్ల కింద ఉన్న డైరెక్టర్ల పేర్లను ప్రభుత్వం అధికారుల ద్వారా సేకరించింది. అవినీతి జరిగిన సొసైటీల వివరాలు, పాలకవర్గంలో ఉండి రుణాలు కట్టని వారి పేర్లను కూడా ప్రభుత్వానికి పంపారు. ఇదేదో సాధారణంగా తీసుకుంటున్న డేటానేమోనని అంతా అనుకున్నారు. కానీ, ఈ విధంగా జరుగుతుందని ఎవరూ ఊహించలేదు. ధర్పల్లి మండలం హోన్నాజీపేట్, ఇందల్వాయి మండలంలోని ఇందల్వాయితోపాటు నల్లవెల్లి, నందిపేట్లో చింరాజ్పల్లి, ఇతర మండలాల్లోని సొసైటీల్లో డీఫాల్టర్లుగా ఉన్న డైరెక్టర్లకు ఉద్వాసన పలికారు. అయితే, పెద్ద మొత్తంలో రుణాలు పొంది వాటిని తిరిగి కట్టని మరికొన్ని సొసైటీలకు సంబంధించిన డైరెక్టర్లపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. రైతులకో తీరు..డైరెక్టర్లకో తీరా! రైతుల అభ్యున్నతి కోసం పనిచేయాల్సిన సొసైటీల్లో డైరెక్టర్లు సొంత లాభాపేక్షను చూసుకుంటున్నారనే విమర్శలు రైతుల నుంచి వస్తున్నాయి. రైతులు రుణాలు తీసుకొని కట్టపోతే అధికారులు వారి ఇంటికి నోటీసులు పంపడమే కాకుండా ఆస్తులను జప్తు చేస్తున్నారు. కానీ, పాలకవర్గ పదవీలో ఉంటూ రూ.లక్షల్లో రుణాలు తీసుకొని ఏళ్ల తరబడి సక్రమంగా చెల్లించని డైరెక్టర్లను ఏమీ అనకపోవడంతో గత కొంతకాలంగా రైతులు ప్రశ్నిస్తున్నారు. రైతులకో తీరు... డైరెక్టర్లకో తీరా అంటూ విమర్శలు మొదలయ్యాయి. ఈ క్రమంలో డీఫాల్ట్ డైరెక్టర్లకు పలుమార్లు నోటీసులు పంపించారు. సమయం ఇచ్చినా వారు లెక్క చేయకపోవడంతో అధికారులు చర్యలకు ఉపక్రమించి పదవి నుంచి తొలగించడం ప్రారంభించారు. కాగా, తొలగింపబడిన వారి నుంచి బకాయిలను వసూలు చేసేందుకు లీగల్ పద్ధతిలో వెళ్లనున్నట్లు తెలిసింది. అయితే, పదవిని కోల్పోయిన డైరెక్టర్లు పాలకవర్గంలో తిరిగి చేరేందుకు పైరవీలు మొదలుపెట్టారు. రాజకీయ నేతలతో అధికారులకు ఫోన్లు చేయిస్తున్నట్లు సమాచారం. డీఫాల్ట్ డైరెక్టర్ల తొలగింపు విషయమై జిల్లా సహకార శాఖ అధికారి శ్రీనివాస్రావును సంప్రదించగా చర్యలు వాస్తవమేనని తెలిపారు. పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామన్నారు. -
ఖాతాలు తీసినా వెతలు తీరలే..
మోర్తాడ్(బాల్కొండ): పంచాయతీ కార్మికుల వేతనాలను స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్(ఎస్ఎఫ్సీ) నిధు ల నుంచి చెల్లించేందుకు అంగీకరించి ప్రభుత్వం అందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినా ప్రయోజనం లేకపోయింది. ప్రతి పంచాయతీకి టీఎస్బీపాస్ ఖాతాలను తెరిపించినా నిధులు జమ చేయడంలో అలసత్వం చోటు చేసుకుంటుంది. ఫలితంగా సకాలంలో వేతనాలు అందక పంచాయతీ కార్మికులు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అస్తవ్యస్తంగా పాలన.. ఎస్ఎఫ్సీ ద్వారా జిల్లాలోని పంచాయతీలకు ప్రతి నెలా రూ.10.30 కోట్ల నిధులను విడుదల చేయాల్సి ఉంది. మరోవైపు పంచాయతీలకు పాలకవర్గాలు లేకపోవడంతో కేంద్రం 15వ ఆర్థిక సంఘం నిధులను విడుదల చేయడం లేదు. దీనికి తోడు ఎస్ఎఫ్సీ నిధుల విడుదలలో తీవ్ర జాప్యం ఏర్పడటంతో పంచాయతీల పాలన అస్తవ్యస్తంగా మారింది. జిల్లాలో మొత్తం 545 పంచాయతీలు ఉండగా, అందులో కార్మికులు 2,198 మంది, కారోబార్లు 522 మంది విధులు నిర్వహిస్తున్నారు. అందరికీ ఒకే రకంగా ప్రతి నెలా రూ.9,500 చొప్పున వేతనం చెల్లించాల్సి ఉంది. ప్రభుత్వం ఎస్ఎఫ్సీ నిధుల నుంచి ప్రతి నెలా టీఎస్బీపాస్ ఖాతాలకు రూ.2 కోట్ల 58 లక్షల 40 వేలను జమ చేస్తే పంచాయతీ కార్మికుల వేతనాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. గతంలో మూడు, నాలుగు నెలలకు ఒకసారి వేతనాలకు గ్రాంటును విడుదల చేయగా ప్రస్తుతం గ్రాంటు విడుదల కాకపోవడంతో రెండు నెలల నుంచి వేతనాలు చెల్లించడం లేదు. దీంతో కార్మికులు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. సర్దుబాటు చేయిస్తున్నాం ఎస్ఎఫ్సీ నిధులు విడుదలలో జాప్యం ఏర్పడితే వేతనాల చెల్లింపు ఆలస్యం అవుతుంది. పంచాయతీల్లో నిధులు ఉంటే సర్దుబాటు చేయించి కార్మికులకు వేతనాలు ఇస్తున్నాం. కొన్ని పంచాయతీల్లోనే ఆదాయం బాగుంది. చాలా చోట్ల ఆదాయం తక్కువగా ఉంది. – శివకృష్ణ, డీఎల్పీవో, ఆర్మూర్ జీపీ కార్మికుల వేతనాల కోసం పంచాయతీకో టీఎస్బీపాస్ ఖాతా ఎస్ఎఫ్సీ నుంచి నిధులు రాకపోవడంతో రెండు నెలలుగా ఆగిన వేతనాలు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న కార్మికులు -
సామాజిక సేవలు అభినందనీయం
నిజామాబాద్ రూరల్: సమాజంలో విద్య, వైద్య రంగాలకు జోస్ ఆలుక్కాస్ సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి అన్నా రు. నగరంలోని జోస్ ఆ లుక్కాస్ జువెలరీ షో రూంలో శనివారం మూ డవ వార్షికోత్సవం ఘ నంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఎంపీ ముఖ్య అతిథిగా విచ్చేసి, మాట్లాడారు. గత మూడు సంవత్సరాలుగా జిల్లాలోని ఆస్పత్రులు, బడులకు అవసరమైన సామగ్రిని జోస్ ఆలుక్కాస్ సంస్థ అందజేస్తుండటంపై అభినందించారు. ప్రస్తుతం నాలు గు ప్రభుత్వ పాఠశాలకు సుమారు రూ.6.96 లక్షల విలువగల కంప్యూటర్లు, డిజిటల్ టీవీ, తాగునీటి శుద్ధియంత్రం వాటికి నిధులు అందజేశారన్నారు. మూడో వార్షికోత్సవం సందర్భంగా ఈనెల 13 నుంచి 19 వరకు ప్రత్యేక ఆఫర్లు అందజేస్తున్నామని సంస్థ ప్రతినిధులు తెలిపారు. అనంతరం వివిధ పాఠశాలకు ఎంపీ చేతుల మీదుగా సీఎస్ఆర్ ఫండ్ చెక్కులను అందజేశారు. బ్రాంచ్ మేనేజర్ ధనుష్, అసిస్టెంట్ మేనేజర్ సజయ్, అకౌంట్స్ మేనేజర్ జితిన్, పీఆర్వో పిప్పెర నరేందర్, తదితర ప్రతినిధులు పాల్గొన్నారు. -
విద్యుత్ షాక్తో మూడు గేదెలు..
లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని భవానిపేట గ్రామ శివారులో విద్యుత్ షాక్తో మూడు గేదెలు మృతి చెందినట్లు లైన్మెన్ పాండు తెలిపారు. గ్రామానికి చెందిన మాదిగ బాలయ్య పొలం వద్ద బోరు మోటారు సర్వీస్ వైరు తెగిపోయి ఫినిషింగ్ వైర్పై పడింది. ఈక్రమంలో శనివారం అదే గ్రామానికి చెందిన ఆకుల సురేందర్, గుండ్ర సత్యనారాయణ, గుండ్ర పరందాములుకు చెందిన గేదెలు గ్రామ శివారులోకి మేతకు వెళ్లాయి. దీంతో గేదెలు మేత మేసుకుంటూ వెళ్లగా ఫినిషింగ్ వైరు తగిలి అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. గేదెల విలువ సుమారు రూ. 3లక్షలు ఉంటుందన్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు. చికిత్సపొందుతూ వృద్ధురాలు.. నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): ప్రమాదవశాత్తు గాయపడిన ఓ వృద్ధురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. ఎస్సై భార్గవ్గౌడ్ తెలిపిన వివరాలు ఇలా.. మండలంలోని నాగిరెడ్డిపేట గ్రామానికి చెందిన నట్ట అనసూయ(79) అనే వృద్ధురాలు గత నెల 28న కాలకృత్యాలు తీర్చుకునేందుకు ఇంటి బయటకు వెళ్లి కాలుజారి నేలపై పడిపోయింది. దీంతో ఆమెకు తీవ్ర గాయాలు కావడంతో కుటుంబసభ్యులు గమనించి చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.అనంతరం మెరుగైన వైద్యం కోసం ఈ నెల 3న మె దక్లోని ఓ ప్రయివేట్ ఆస్పత్రికి, అక్కడి నుంచి ఈ నెల 8న హైదరాబాద్ లోని నిమ్స్కు తరలించి చికిత్స చేయించారు. కాగా ఈ నెల 12న ఆమె ఆ స్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. మృతురాలి మనువడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ప్రియుడు మోసం చేశాడని ఆత్మహత్యాయత్నం వర్ని: చందూర్ మండలంలోని ఘన్పూర్ గ్రామంలో ఓ యువతి తన ప్రియుడు మోసం చేశాడని ఆత్మహత్యకు యత్నించింది. వర్ని మండలం కూనిపూర్ క్యాంపునకు చెందిన వీరేంద్ర అనే వ్యక్తి ప్రేమ, పెళ్లి పేరుతో మోసం చేశాడని ఘన్పూర్ గ్రామానికి చెందిన సదరు యువతి మనస్తాపం చెందింది. దీంతో శుక్రవారం ఆమె ప్రియుడి ఇంటి ముందు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నం చేసింది. వెంటనే స్థానికులు బాధితురాలిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి అక్క పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మహేష్ తెలిపారు. విధులకు ఆటంకం కలిగించిన పలువురిపై కేసు నవీపేట: పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన పలువురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తిరుపతి శనివారం తెలిపారు. మూడు రోజుల కిందట మండల కేంద్రానికి చెందిన ఒక వర్గానికి చెందిన యువకుడు ప్రార్థనా మందిరంపై జెండాను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియలో షేర్ చేశాడు. ఇది వైరల్గా మారడంతో ఆగ్రహానికి గురైన మరో వర్గానికి చెందిన యువకులు పోలీస్ స్టేషన్కు వచ్చి ఆందోళన చేశారు. ఈక్రమంలో వారు పోలీస్ స్టేషన్లోకి చొరబడి సిబ్బందితో దురుగా ప్రవర్తిస్తూ, వారి విధులకు ఆటంకం కలిగించారు. దీంతో ఆ వర్గానికి చెందిన ఆరుగురితో పాటు మరికొందరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు. -
ర్యాగట్లపల్లిలో గుప్తనిధుల కోసం తవ్వకాలు!
● నిందితులను పట్టుకున్న గ్రామస్తులు ● ఎనిమిది మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు భిక్కనూరు: మండలంలోని ర్యాగట్లపల్లి గ్రామంలోగల బసవేశ్వరాలయం ప్రాంతంలో గుప్తనిధుల కోసం తవ్వకాలు జరుపుతున్న వ్యక్తులను గ్రామస్తులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. ర్యాగట్లపల్లి గ్రామంలో శిథిలావస్థకు చేరుకున్న అతిపురాతనమైన బసవేశ్వరాలయం ప్రాంతంలో శనివారం వేకువజామున ప్రొక్లెయిన్ సహాయంతో కొందరూ గుప్తనిధుల కోసం తవ్వకాలను ప్రారంభించారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు అక్కడికి వెళ్లి పనులను అడ్డుకున్నారు. గ్రామస్తులు ప్రశ్నించగా దురుసుగా సమాధానాలు చెప్పడంతో వారిని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని నిందితులైన ర్యాగట్లపల్లి గ్రామానికి చెందిన చిన్న భూమయ్య, మహేందర్, మంత్రి దుర్గయ్య, రామాయంపేట, భిక్కనూర్కు చెందిన సభావత్ భరత్, నాగభూషణం, యాదగిరి, వెంకట చంధ్రశేఖర్, నెల్లూరి కాంతారావులను అదుపులోకి తీసుకున్నారు. గ్రామస్తులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎనిమిది మందిపై కేసు నమోదు చేసినట్టు ఎస్సై అంజనేయులు వివరించారు. -
చోరీ కేసులో ఇద్దరు మహిళా నిందితుల అరెస్టు
రుద్రూర్: పోతంగల్ మండల కేంద్రంలోని రాములు ఇంట్లో గత నెల 24న జరిగిన చోరీ కేసులో ఇద్దరు మహిళలను అరెస్ట్ చేసినట్లు కోటగిరి ఎస్సై సునీల్ తెలిపారు. కోటగిరి బస్టాండ్ వద్ద శనివారం అనుమానాస్పదంగా ఉన్న బోధన్కు చెందిన సంగీత, రుద్రూర్ మండలం అంబం(ఆర్)కు చెందిన సునీతను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో వారు రాములు ఇంట్లో చోరీ చేసినట్లు అంగీకరించారు. అనంతరం వారి వద్ద నుంచి 6.9 గ్రాముల బంగారం, 44.51 తులాల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులను రిమాండ్కు పంపించినట్టు తెలిపారు. సదాశివనగర్(ఎల్లారెడ్డి): మండలకేంద్రంలో ఓ వ్యాపారి ఫోన్ను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేసి, సుమారు రూ.8లక్షల వరకు కాజేశారు. బాధితుడు తెలిపిన వివరాలు ఇలా.. మండల కేంద్రానికి చెందిన కొడిప్యాక శ్రీనివాస్ గత కొంతకాలంగా జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాలకు, వసతి గృహాలకు నిత్యవసర సరుకులను పంపిణీ చేసే టెండర్ను దక్కించుకుని, సరుకులను సరఫరా చేస్తుంటాడు. ఈక్రమంలో గత నెల 30న తన ఖాతాలో సరుకులకు సంబంధించి డబ్బులు జమ అయినట్లు మెసేజ్ వచ్చింది. ఈ నెల 6న తన ఫోన్ తరచూ వేడి కావడంతో ఇట్టి విషయాన్ని పోలీసులకు తెలిపాడు. పోలీసులు ఫోన్ హ్యాక్ అయిందని, వెంటనే సిమ్ను వేరే ఫోన్లో వేసుకోమని చెప్పడంతో అతడు అలానే చేశారు. మరుసటి రోజు తన ఖాతా నుంచి డబ్బులను తీసుకుందామని కామారెడ్డిలోని హెచ్డీఎఫ్సీ బ్యాంక్కు వెళ్లగా గతంలోనే రూ.4లక్షల 50వేలు, రూ.4లక్షల 27వేలు ఎలాంటి మెసేజ్ లేకుండా డ్రా అయినట్లు చూపించింది. దీంతో ఇదేమిటని బ్యాంక్ అధికారులను ప్రశ్నించగా ఇది సైబర్ నేరగాళ్ల పని అని గుర్తించి వెంటనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయమని చెప్పారు. సదరు వ్యాపారి ఈ నెల 9న సదాశివనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వ్యాపారి తెలిపారు. -
ఆటోలు చోరీ చేసే ముఠా అరెస్ట్
కామారెడ్డి క్రైం: ఆటోల చోరీలకు పాల్పడుతున్న ఓ ముఠాను నాగిరెడ్డిపేట పోలీసులు అరెస్ట్ చేసి రి మాండ్కు తరలించారు. జిల్లాకేంద్రంలోని జిల్లా పో లీసు కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన వి లేకరుల సమావేశంలో ఎస్పీ రాజేష్ చంద్ర వివరా లు వెల్లడించారు. నాగిరెడ్డిపేట మండలం గోపాల్పేటకు చెందిన తాడేపల్లి క్రిష్ణ ఆటో ఈ నెల 11న చోరీకి గురైంది. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించా రు. శనివారం ఉదయం మాల్తుమ్మెద వద్ద పోలీసు లు వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా ఆటోలో పారిపోబోయిన ఇద్దరిని పట్టుకుని విచారించారు. దీంతో ఆటోల చోరీ వ్యవహారం బయటపడింది. నిందితులను నిజామాబాద్ జిల్లా మంచిప్పకు చెందిన కుమ్మరి రాజు, కొల్ల దుర్గరాజులుగా గుర్తించా రు. వారిలో కుమ్మరి రాజుపై గతంలో కరీంనగర్, జ గిత్యాల, మెదక్, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల పరిధిలో మొత్తం 20 దొంగతనం కేసులు ఉన్నాయ ని ఎస్పీ తెలిపారు. వాటిలో ఎక్కువగా ఆటోల చోరీ కేసులే ఉన్నాయన్నారు. దుర్గరాజుపై గతంలో ఒక ఆటో చోరీ కేసు ఉన్నట్లు వెల్లడించారు. నిందితుల వద్ద నుంచి నాగిరెడ్డిపేటలో దొంగిలించిన ఆటోతోపాటు మెదక్ జిల్లాలో దొంగిలించిన 2 ఆటోలు, భి క్కనూర్లో ఎత్తుకెళ్లిన మరో ఆటోను స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులను రిమాండ్కు తరలిస్తున్నామని ఎస్పీ తెలిపారు. నిందితులను పట్టుకున్న కానిస్టేబుల్ గంగారాం, హోంగార్డు బాలాజీలను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. కామారెడ్డి ఏఎస్పీ చైతన్య రెడ్డి, ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్ రావు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
జీజీహెచ్లో నవజాత శిశువు మృత్యువాత
● ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టిన బంధువులు కామారెడ్డి టౌన్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో అప్పుడే పుట్టిన శిశువు మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే మృతి చెందిందని శిశువు కుటుంబీకులు, బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళన నిర్వహించారు. వివరాలు ఇలా.. తాడ్వాయి మండలం బ్రహ్మాజీవాడి గ్రామానికి చెందిన అఖిల పురిటి నొప్పులు రావడంతో శుక్రవారం సాయంత్రం కామారెడ్డి జీజీహెచ్కు వచ్చింది. వైద్యులు అర్ధరాత్రి ఆమెకు ప్రసవం చేశారు. ఆడపిల్ల పుట్టడంతో మహాలక్ష్మి పుట్టిందని కుటుంబ సభ్యులంతా సంబరంలో ఉన్నా ఆ ఆనందం 5 నిమిషాలు కూడా లేకుండా పోయింది. పుట్టిన శిశువులో చలనం లేకపోవడంతో మృత శిశువు జన్మించిందని వైద్యులు చెప్పారు. దీంతో బంధువులు వైద్యులతో వాగ్వాదానికి దిగారు. కాలయాపన చేయకుండా ఆపరేషన్ చేసి ఉంటే శిశువు బ్రతికేదని కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాసేపు ఆస్పత్రిలో ఆందోళన చేశారు. పట్టణ పోలీసులు ఆస్పత్రికి వచ్చి వారిని సముదాయించారు. ఈ విషయమై ఆస్పత్రి సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లును వివరణ కోరగా వైద్యుల నిర్లక్ష్యం ఏమాత్రం లేదన్నారు. ఉమ్మనీరు మింగడంతోనే శిశువు మృతి చెందిందని తెలిపారు. -
క్రైం కార్నర్
● మద్నూర్లో చోటుచేసుకున్న విషాద ఘటన ● కన్నీరుమున్నీరవుతున్న తల్లిదండ్రులు తొట్టెలో పడి బాలుడు మృతి మద్నూర్(జుక్కల్): నీటి తొట్టెలో పడి బాలుడు ప్రాణాలు వదిలాడు. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలో శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. ఇందిర నగర్ కాలనీకి చెందిన మేత్రివార్ రాజు, అనిత దంపతులు మద్నూర్లోని పాత బస్టాండ్లో టీ పాయింట్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. రాజు టీ పాయింట్లో ఉండగా, అనిత ఇంట్లో వంట చేస్తోంది. వీరికి ఇద్దరు కొడుకులు ఉండగా చిన్న కొడుకు అక్షయ్ (2) ఇంటి ముందు ఆడుకుంటూ నీటి తొట్టె వద్దకు వెళ్లాడు. అక్షయ్ చేతిలో ఉన్న ఆట వస్తువు నీటి తొట్టెలో పడటంతో దాన్ని తీసుకోవడానికి వంగడంతో బ్యాలెన్స్ తప్పి తల నీటి తొట్టెలోకి పడిపోయి కాళ్లు బయటకు తేలాయి. కొద్ది సేపటికి తల్లి అనిత బయటకు వచ్చి చూడగా అక్షయ్ నీటి తొట్టెలో కనిపించాడు. బాలుడిని నీటి తొట్టెలోంచి బయటకు తీసి స్థానికులతో కలిసి స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా, అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న కొడుకు మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై విజయ్కొండ తెలిపారు. -
అనాథలైన సోదరులను ఆదుకోరూ!
మాక్లూర్: తండ్రి గల్ఫ్ దేశానికి వెళ్లి గల్లంతుకాగా, ఆ బాధతో తల్లి మంచంపట్టి అనారోగ్యంతో మృతిచెందింది. దీంతో వారి ఇద్దరు కుమారులు అనాథలుగా మిగిలారు. పట్టించుకునేవారు లేక సోదరు లు విలపిస్తుండగా, ఉదార స్వభావులు వారిని ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. మండలంలోని మాదాపూర్కు చెందిన పర్సో ల్లా రాజు బతుకుదెరువు నిమిత్తం రెండేళ్ల క్రితం దుబాయ్ వెళ్లి అక్కడ గల్లంతయ్యాడు. ఇప్పటికీ అతడి ఆచూకీ లభించలేదు. ఆ బాధతో భార్య సత్తె మ్మ మచ్చం పట్టి అనారోగ్యంతో వారం రోజుల క్రి తం మృతి చెందింది. దీంతో వారి కుమారులు ఎవ రు లేని అనాథలుగా మి గిలారు. అంతేకాకుండా మృతి చెందిన తల్లికి అంత్యక్రియలు ఎలా చేయా లో తెలియక బిక్కుబిక్కుమంటూ విలపిస్తూ ఉంటే గ్రామస్తులు స్పందించి విరాళాలు సేకరించి అంత్యక్రియలు పూర్తి చే శారు. తల్లి మృతితో ఒంటరైన పిల్లలకు చిన్న ఇ ల్లు తప్పా వారి వద్ద ఏమి లేవు. అన్నదమ్ముల్లో పెద్దవాడైన రోహిత్ స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతుండగా, తమ్ముడు దీక్షిత్ 6వ తరగతి చదువుతున్నాడు. దీంతో వీరి దీనస్థితిని చూసి చలించి, ఇప్పటికే ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్రెడ్డి రూ.10,000, ఆస్కార్ యూత్ సభ్యులు రూ.12000 నగదు, నిత్యవసర సరుకులను అందించారు. మరికొందరు ఉదార స్వభావులు ముందుకు వచ్చి అనాథలైన వారిని ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. తండ్రి దుబాయ్లో గల్లంతు ఆ బాధతో అనారోగ్యానికి గురై ఇటీవల మృతిచెందిన తల్లి పట్టించుకునేవారు లేక విలపిస్తున్న అన్నదమ్ముళ్లు ఉదార స్వభావులు ఆదుకోవాలని గ్రామస్తుల వినతి -
రాష్ట్రస్థాయి పోటీల్లో చాంపియన్గా గాంధారి ఈఎంఆర్ఎస్
కొత్తగూడ: మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం పొగుళ్లపల్లి ఈఎంఆర్ఎస్లో జరిగిన రాష్ట్రస్థాయి క్రీడల్లో కామారెడ్డి జిల్లా గాంధారి ఈఎంఆర్ఎస్ ఓవరాల్ చాంపియన్గా నిలిచింది. శనివారం క్రీడల ముగింపు వేడుకలు నిర్వహించగా రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క హాజరై, మాట్లాడారు. క్రీడల్లో గెలుపోటములు సహజమని, ఓడిన వారు నిరాశపడకుండా గెలుపుకోసం మరోసారి ప్రయత్నించాలనిన్నారు. అనంతరం ఓవరాల్ చాంపియన్షిప్ సాధించిన గాంధారి ఈఎంఆర్ఎస్కు, అలాగే వివిధ విభాగాల్లో గెలుపొందిన జట్లకు బహుమతులు అందజేశారు. మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాఽథ్కేకన్, ఆర్డీవో కృష్ణవేణి, స్పోర్ట్స్ ఆఫీసర్ వీర్యనాయక్, ఆర్సీవో రత్నకుమారి, రాష్ట్ర ఉపాధిహామీ సంస్థ డైరెక్టర్ చల్ల నారాయణరెడ్డి, ప్రిన్సిపాల్ అజయ్సింగ్, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
చౌడమ్మ కొండూర్ ఎత్తిపోతల పథకంలో చోరీ
● ట్రాన్స్ఫార్మర్ కాయిల్స్, ఆయిల్ ఎత్తుకెళ్లిన దుండగులు ● ఏడాదిలో మూడోసారి ఘటన నందిపేట్(ఆర్మూర్): జిల్లాలో ఎత్తిపోతల పథకాలే లక్ష్యంగా వరుస చోరీలు జరుగుతున్నాయి. దుండగులు విద్యుత్తు ట్రాన్స్ఫార్మర్లోని విలువైన సామగ్రిని ఎత్తుకెళ్తున్నారు. పోలీసులు నమోదు చేస్తున్నా ఇప్పటి వరకు దుండగులను పట్టుకున్న దాఖలాలు లేవు. తాజాగా చౌడమ్మ కొండూర్ ఎత్తిపోతల పథకం పరిధిలోని ఉమ్మెడ శివారులో ఉన్న రెండవ పంపుహౌజ్ వద్ద ఉన్న ట్రాన్స్ఫార్మర్ను గుర్తుతెలియని దుండగులు శుక్రవారం అర్ధరాత్రి చోరీకి పాల్పడ్డారు. ఇనుప రాడ్లతో లిఫ్ట్ గదిలోకి ప్రవేశించి అక్కడ విధులు నిర్వహిస్తున్న సాకలి ముత్తెన్న, సాకలి శ్రీను అనే ఇద్దరు ఆపరేటర్లను బెదిరించి కాపలా కాశారు. అనంతరం దుండగులు 250 కేవీ ట్రాన్స్ఫార్మర్ను పగుల గొట్టి రాగి కాయిల్స్, ఆయిల్ను దొంగిలించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు శనివారం ఘటన స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. కొలిక్కి రాని దర్యాప్తు.. ఈ సంవత్సరంలో చౌడమ్మ కొండూర్ ఎత్తిపోతల పంపుహౌజ్ల వద్ద మూడు సార్లు, తల్వేద ఎత్తిపోతల పఽథకంలో మూడు సార్లు చోరీలు జరిగాయి. దుండగులు ఎత్తిపోతల పథకాల వద్ద ఉన్న ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసి రూ. లక్షల విలువైన రాగి కాయిల్స్, ఇంధనం, ఇతర పరికరాలను అపహరించుకుపోతున్నారు. వరుస ఘటనలు ఒకే తరహాలో జరుగుతున్నప్పటికీ చోరీలకు పాల్పడుతున్నది ఎవరనేది ప్రశ్నార్థకంగా మారింది. అయినా ఒక్క కేసు కూడ దర్యాప్తు కొలిక్కి రాలేదు. ఎత్తిపోతల పథకాల ట్రాన్స్ఫార్మర్లు పనిచేయక పోవడంతో వేల ఎకరాల్లో ఖరీఫ్ సాగుకు నీరందని పరిస్థితి నెలకొంది. ఇప్పటికై నా అధికారులు స్పందించి ఎత్తిపోతల పథకాల వద్ద చోరీల నివారణకు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. -
కట్టని గోడలు.. ఈ బండరాళ్లు
బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి ప్రతియేటా గోదావరిలోకి వదిలే మిగులు జలాల తాకిడిని బండరాళ్లు తట్టుకొని నిలబడుతున్నాయి. 42 వరద గేట్ల ద్వారా నీటిని వదిలినా బండరాళ్లు చెక్కుచెదరకుండ కట్టని గోడలా నిలబడుతున్నాయి. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నిర్మాణం ముందుగా కుస్తాపూర్ వద్దనే నిర్మించాలని నిర్ణయించారు. కాని విశాలమైన బండరాయి లేకపోవడంతో అక్కడి నుంచి, విశాలమైన బండరాళ్లు గల పోచంపాడ్కు మార్చి నిర్మించారు. ప్రస్తుతం వరద గేట్ల ద్వారా నీటి విడుదల నిలిపి వేయడంతో ఈ బండరాళ్లు ప్రత్యేక అకర్షణగా నిలుస్తున్నాయి. దీంతో పర్యాటకులు ప్రాజెక్ట్ డ్యాం వైపు కంటే దిగువన గోదావరి వైపునకే వస్తున్నారు. -
వ్యర్థాలను డిస్పోస్ చేయని ఆస్పత్రులపై చర్యలు తీసుకోవాలి
జక్రాన్పల్లి: నిబంధనలకు అనుగుణంగా వ్యర్థాలను డిస్పోస్ చేయని ఆస్పత్రులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. జక్రాన్పల్లి మండలం పడకల్ గ్రామ శివారులోని శ్రీ మెడికేర్ సర్వీసెస్ ఏజెన్సీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెడికల్ వేస్టేజీని నిర్వీర్యం చేసే ప్లాంట్ను కలెక్టర్ శుక్రవారం సందర్శించారు. జిల్లాలో 900 వరకు ప్రభుత్వ, ప్రయివేట్ ఆస్పత్రులు కొనసాగుతుండగా, సగానికి పైగా ఆస్పత్రుల నుంచి వ్యర్థాలను సేకరించడం లేదని కలెక్టర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంట్రాక్ట్ ఏజెన్సీకి వ్యర్థాలు అందించని ఆస్పత్రులకు నోటీసులు జారీ చేయాలని, అయినప్పటికీ మార్పు రాకపోతే ఆస్పత్రుల అనుమతులను రద్దు చేయాలని డీఎంహెచ్వో రాజశ్రీని ఆదేశించారు. ఏజెన్సీ పనితీరును పర్యవేక్షించాలని కాలుష్య నియంత్రణ మండలి ఏఈ మానసను ఆదేశించారు. సెంట్రల్ డ్రగ్స్ స్టోర్ తనిఖీ.. నిజామాబాద్నాగారం: జిల్లా కేంద్రంలోని గంగాస్తాన్ ఫేజ్–1లోగల సెంట్రల్ డ్రగ్స్ స్టోర్ (సీ.డీ.ఎస్)ను కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి శుక్రవారం తనిఖీ చేశారు. అనంతరం సిబ్బందితో మాట్లాడుతూ.. ఇండెంట్ వచ్చిన వెంటనే తాత్సారం చేయకుండా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ఔషధాలు పంపించాలన్నారు. ప్రస్తుత వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలె ప్రమాదం ఉన్నందున అన్ని రకాల ఔషధాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఫార్మసిస్ట్ గంగాధర్ను ఆదేశించారు. -
చేపలు చేజారుతున్నాయి..
● వరద గేట్ల నుంచి నీటి ప్రవాహంతోకొట్టుకుపోతున్న వైనం ● ఎస్సారెస్పీలో ప్రతియేటా ఇదే పరిస్థితి ● ఆవేదన వ్యక్తం చేస్తున్న మత్స్యకారులు బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి వరద గేట్ల ద్వారా నీటిని గోదావరిలోకి విడుదల చేసినప్పుడు వరదతోపాటు చేపలు కూడా కొట్టుకు పోతున్నాయని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్ట్ వరద గేట్ల దిగువన కేవలం గురువారం ఒక్క రోజు వేటాడితే ఎక్కువ సంఖ్యలో చేపలు చిక్కడమే ఇందుకు నిదర్శనమని వారు పేర్కొంటున్నారు. అలాంటిది వరద ప్రవహించినప్పుడు ఎన్ని చేపలు కొట్టుకుపోయింటాయోనని నిరాశ వ్యక్తం చేస్తున్నారు. అలాగే ప్రాజెక్ట్ నుంచి మిగులు జలాలను వదిలే వరద కాలువ ద్వారా కూడ అధికంగా చేపలు వెళ్లిపోతున్నాయి. దీంతో వరద కాలువ హెడ్ రెగ్యులేటర్ వద్ద ఉన్న 6 గేట్లకు జాలిగేట్లను అమర్చాలని ఏళ్లుగా మత్స్యకారులు పాలకులు, అధికారుల చుట్టు తిరుగుతున్నారు. కానీ ఇప్పటికీ అమలుకు నోచుకోలేదు. ప్రతి సంవత్సరం ప్రాజెక్ట్లో 62 లక్షల చేపపిల్లలను ఉచితంగా వదులుతారు. కానీ చివరిలో వేటాడుటకు చేపలు ఉండవు. కారణం వరదల వలన దిగువకు కొట్టుకు పోవడమే. దీంతో వరద గేట్లకు చేపలు కొట్టుకుపోకుండ జాలి గేట్లు బిగించాలని కొన్నాళ్లుగా మత్స్యకారులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ‘సాక్షి’ అధికారులను వివరణ కోరగా.. వరద గేట్లకు జాలిలు ఏర్పాటు చేయడం సాధ్యం కాదని వివరించారు. వరద కాలువ గేట్లకు ఏర్పాటు చేసే అవకాశం ఉందన్నారు. వరద గేట్లకు, వరద కాలువ గేట్లకు జాలి గేట్లను నిర్మించాలి. జాలి గేట్లు లేకపోవడంతో కిందకి చేపలు కొట్టుకుపోతున్నాయి. చిన్న, పెద్ద చేపలు తేడా లేకుండ పోతున్నాయి. ప్రభుత్వం ఆలోచించి, మత్స్యకారుల సమస్యను పరిష్కరించాలి. – శ్రీనివాస్, మత్స్యకారుడు, బాల్కొండ -
గుండెపోటుతో న్యాయవాది మృతి
నిజామాబాద్ లీగల్: నగరానికి చెందిన న్యాయ వాది పెద్దగాని కిరణ్ కుమార్ గౌడ్ (57) గుండెపోటుతో మృతి చెందాడు. కిరణ్ శుక్రవారం సాయంత్రం ఆఫీసర్స్ క్లబ్కు చేరుకున్న కొద్దిసేపటికి చాతిలో నొప్పిగా ఉందని చెప్పడంతో స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స ప్రారంభిస్తుండగానే గుండెపోటుతో ప్రాణాలు వదిలాడు. 1997లో న్యాయవాద వృత్తిలో ప్రవేశించిన కిరణ్ కుమార్ గౌడ్, సీనియర్ న్యాయవాది నారాయణరెడ్డి వద్ద జూనియర్గా పనిచేశాడు, న్యాయవాదిగా సివిల్, క్రిమినల్ కేసులు వాదించాడు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నాడు. గవర్నమెంట్ ప్లీడర్గా, న్యాయవాదుల సొసైటీ వ్యవస్థాపక సభ్యుడిగా, ఆఫీసర్స్ క్లబ్ కార్యదర్శిగా పనిచేశాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కిరణ్ మృతిపట్ల నిజామాబాద్ బార్ అసోసియేషన్ సోమవారం సంతాప సభ నిర్వహించనున్నట్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మామిళ్ల సాయిరెడ్డి తెలిపారు. చికిత్స పొందుతూ మహిళ ..రుద్రూరు: ఆత్మహత్యకు యత్నించిన ఓ వృద్ధురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందినట్లు రుద్రూర్ ఎస్సై సాయన్న వెల్లడించారు. వివరాలు ఇలా.. మండలంలోని బొప్పాపూర్ గ్రామానికి చెందిన గాండ్ల సావిత్రి (62) ఈనెల 11న కడుపునొప్పి బాధ భరించలేక యాసిడ్ తాగి ఆత్మహత్యకు య త్నించింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను చికిత్స నిమిత్తం నిజామాబాద్ ఆస్పత్రికి తరలించారు. శుక్రవారం చికిత్స పొందుతూ ఆమె మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. మృతురాలి కొడుకు అశోక్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
నాయబ్ తహసీల్దార్లకు పదోన్నతి
నిజామాబాద్అర్బన్: పలువురు నాయబ్ తహసీల్దార్లకు తహసీల్దార్లుగా పదోన్నతి లభించింది. పదోన్నతికి సంబంధించిన ఉత్తర్వులను రాష్ట్ర రెవెన్యూ శాఖ శుక్రవారం జారీ చేసింది. కామారెడ్డి జిల్లాలో పనిచేస్తున్న నేనావత్ రాక, నిర్మల్ జిల్లాలో పనిచేస్తున్న శ్రీనివాసరెడ్డి తహసీల్దార్లుగా పదోన్నతి పొంది జిల్లాకు రానున్నారు. కాగా ఇదే జిల్లాలో పనిచేస్తున్న నరేష్ నాయబ్ తహసీల్దార్ నుంచి తహసీల్దార్గా పదోన్నతి పొందారు. వీరికి త్వరలోనే మండలాలు కేటాయించనున్నారు. ఖలీల్వాడి: పోలీసుల ఆత్మస్థైర్యంను దెబ్బతీయవద్దని, పోలీసులకు అందరు సమానులేనని నిజామాబాద్ పోలీస్ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు ష కీల్ పాషా అన్నారు. జిల్లాకేంద్రంలోని కమాండ్ కంట్రోల్ రూమ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడి యా సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలీసులపై బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు సరైనవి కాదన్నారు. ఆర్మూర్లోని యాసీన్ హోటల్ నిబంధనలకు విరుద్ధంగా రాత్రివే ళ కొనసాగడంతో కేసులు నమోదు చేశామన్నారు. పోలీసుల పేర్లు పింక్బుక్లో రాస్తామని సదరు నా యకుడు చెప్పడం సరైనది కాదన్నారు. పోలీసులు నిబంధనలకు అనుకూలంగా పనిచేస్తారని, ఎవరిపై కక్షపూరితంగా వ్యవహరించరని తెలిపారు. మరోసారి పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలీస్ సంఘం ప్రతినిధులు చందూలాల్, సాయిలు, గోవర్ధన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వివాహితతో అసభ్య ప్రవర్తన.. నిందితుడికి మూడేళ్ల జైలు నిజామాబాద్ లీగల్: వివాహితతో అసభ్యకరంగా ప్రవర్తించిన ఓ వ్యక్తి నిజామాబాద్ నాల్గవ అడిషనల్ మహిళ న్యాయస్థానం మూడేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ. 10వేల జరిమానా విధించింది. వివరాలు ఇలా.. రెంజల్ మండల కేంద్రానికి చెందిన గైని కిరణ్ 2023 ఏప్రిల్ 14న తన పక్కింట్లో నివసించే వివాహిత ఒంటరిగా ఉండగా ఆమె ఇంట్లోకి ప్రవేశించి, అసభ్యకరంగా ప్రవర్తించాడు. వెంటనే ఆమె కేకలు వేయడంతో భర్త అక్కడికి చేరుకుని కిరణ్ను పట్టుకునేందుక ప్రయత్నించగా, ఫరారయ్యాడు. దీనిపై దత్తు తన భార్యతో కలిసి రెంజల్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడిని జిల్లా కోర్టులో హాజరుపర్చారు. జడ్జి సాక్ష్యాలను విచారించిన అనంతరం నిందితుడు గైని కిరణ్కు మూడు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ.10వేల జరిమానా విధించారు. అలాగే జిల్లా న్యాయసేవ సంస్థ బాధితురాలికి రూ.50వేల పరిహారం చెల్లించాలని జడ్జి తన తీర్పులో సూచించారు. -
ఎంఎంపీటీఎఫ్ను పక్కాగా అమలుచేస్తాం
● కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ● జిల్లాస్థాయి కమిటీ సభ్యులతో సమీక్షనిజామాబాద్అర్బన్: యూఎన్వో ద్వారా ప్రయోగాత్మకంగా నిజామాబాద్ జిల్లాలో అమలు చేస్తున్న మైగ్రేషన్ మల్టీ పార్ట్నర్ ట్రస్ట్ ఫండ్ (ఎంఎంపీటీఎఫ్) కార్యక్రమాన్ని పక్కాగా అమలు పరుస్తూ, జిల్లా యంత్రాంగం తరపున పూర్తిస్థాయిలో సహాయ సహకారాలు అందిస్తామని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అన్నారు. నగరంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో శుక్రవారం ఆయన జిల్లాస్థాయి కమిటీ సభ్యులతో సమీక్ష సమావేశం జరిపారు. జిల్లాలో వలసదారులు, దుర్బల కుటుంబాల స్థితిగతులలో మార్పును తేవాలనే సంకల్పంతో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా, పూర్తి పారదర్శకంగా అమలయ్యేలా చూస్తామని అన్నారు. కార్యక్రమం ఉద్దేశ్యం, పైలెట్ ప్రాజెక్టుగా జిల్లాలోని సిరికొండ, ధర్పల్లి మండలాలను ఎంపిక చేయడానికి గల కారణాలు, సహా పలు అంశాలపై చర్చించారు. జెడ్పీ సీఈవో సాయాగౌడ్, డీఏవో గోవిందు, డీపీఆర్వో పద్మశ్రీ, ఉద్యానవన శాఖ అధికారి శ్రీనివాస్, డీడబ్ల్యూవో రసూల్బీ, డీపీవో శ్రీనివాస్, రోహిత్ రెడ్డి, మధు సూదన్, యాదయ్య తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదాలపై సమగ్ర దర్యాప్తు చాలా కీలకం
ఖలీల్వాడి: రోడ్డు ప్రమాదాలపై సమగ్ర దర్యాప్తు చాలా కీలకమని సీపీ సాయిచైతన్య అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ కమిషనర్ కార్యాలయంలో శుక్రవారం క్రాష్ ఇన్వెస్టిగేషన్ శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి సీపీ ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. రోడ్డు ప్రమాదాల నివారణకు అవగాహన అవసరమని సీపీ అన్నారు. ప్రతి ప్రమాదం వెనక ఉన్న అసలైన కారణాలను వెలికితీసి, భవిష్యత్లో అలాంటి ఘటనలు జరగకుండా చూసేందుకు సహాయపడుతుందన్నారు. ఈ శిక్షణ కార్యక్రమాన్ని ప్రతి పోలీస్ సిబ్బంది సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని సూచించారు. డీసీపీ (అడ్మిన్) బస్వారెడ్డి, ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ, వర్షా నిహంత్, సేవ్ లైఫ్ ఫౌండేషన్ ప్రతినిధులు సాహెల్ మోటో, నూర్ ఖాట్టర్ పాల్, చిరాగ్ కాటేగర్, సీటీసీ సర్కిల్ సీఐ శివరాం తదితరులు పాల్గొన్నారు. -
ఉపాధి ఉద్యోగులకు వేతన వెతలు
మోర్తాడ్(బాల్కొండ): ఉపాధి హామీ పథకం కింద పని చేస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వం నెలల తరబడి వేతనాలు చెల్లించకపోవడంతో వారు ఆర్థికంగా అవస్థలు పడుతున్నారు. ఉపాధి హామీ పథకం క్షేత్రస్థాయి ఉద్యోగులకు మూడు నెలల వేతనం చెల్లించాల్సి ఉండగా ఏపీవోలు, కంప్యూటర్ ఆపరేటర్లు, ఇంజినీరింగ్ కన్సల్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లకు రెండు నెలల వేతనాలు చెల్లించాల్సి ఉంది. దీంతో పలువురు సిబ్బంది జీతాలు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బాల్కొండ ఉపాధిహామీ కార్యాలయంలో టెక్నికల్ అసిస్టెంట్గా పని చేస్తున్న ధనుంజయ్(45) గురువారం పని చేసే చోటనే గుండెపోటుతో మరణించాడు. అతని మరణానికి సకాలంలో జీతాలు రాకపోవడంతోపాటు, ఆర్థిక ఇబ్బందులే కారణం అని సిబ్బంది చెబుతున్నారు. రెగ్యులర్ ఉద్యోగుల మాదిరిగానే ఉపాధి హామీ పథకం ఉద్యోగులు క్రమశిక్షణతో విధులను నిర్వహిస్తున్నా వేతనాల చెల్లింపుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. కేంద్రం నిధులు ఇస్తున్నా.. ఉపాధిహామీ పథకం కింద నిధులను కేంద్రం విడుదల చేస్తుంది. ఈ నిధులతో చేసిన పనులకు చెల్లింపులతో పాటు సిబ్బందికి వేతనాలు చెల్లించాల్సి ఉంది. ఉపాధి హామీ ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వ అజమాయిషీలో పని చేస్తున్నా వేతనాల భారం మాత్రం కేంద్రంపైనే ఉంది. కేంద్రం చెల్లించే నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టిస్తుండటంతో వేతనాల చెల్లింపులకు కటకట ఏర్పడిందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఉపాధి హామీ పథకం నిధులను వినియోగించి చేపట్టే పనులను ఈ పథకం ఉద్యోగులే పరిశీలిస్తున్నారు. స్థానిక సంస్థలకు పాలకవర్గాలు లేకపోవడంతో అభివృద్ధి పనులకు కేంద్రం నిధులు మంజూరు చేయడం లేదు. గ్రామాలలో ఏవైనా పనులు చేయాలన్నా, మౌళిక సదుపాయాలను కల్పించాలంటే ఉపాధి హామీ పథకం నిధులనే వినియోగిస్తున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి ఉపాధిహామీ ఉద్యోగులకు సకాలంలో వేతనాలు చెల్లించి వారికి ఆర్థిక ఇబ్బందులు లేకుండా చూడాలని పలువురు కోరుతున్నారు. జిల్లాలో ఉపాధిహామీ ఉద్యోగులు ఏపీవోలు 20 కంప్యూటర్ ఆపరేటర్లు 36 ఇంజినీర్ కన్సల్టెంట్లు 11 టెక్నికల్ అసిస్టెంట్లు 67 ఫీల్డు అసిస్టెంట్లు 317 ఉపాధిహామీ పథకం కింద పని చేసే ఉద్యోగులు ఎంతో శ్రమకోర్చి విధులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం వేతనాల చెల్లింపుల విషయంలో జాప్యం చేయడం తగదు. కేంద్రం ఇచ్చే నిధుల నుంచే వేతనాలు చెల్లించాల్సి ఉన్నా ఎందుకు జాప్యం చేస్తున్నారో అర్థం కావడం లేదు. – నర్సయ్య, ఏపీవోల సంఘం అధ్యక్షుడు ప్రభుత్వం ఉపాధి హామీ ఉద్యోగుల వేతనాల విషయంలో స్పందించాలి. ఏ కార్యక్రమం చేపట్టాలన్నా ఉపాధి నిధులను వినియోగిస్తున్నారు. ప్రభుత్వం వేతనాలు చెల్లించే విషయంలో జాప్యం చేయడం సరికాదు. ఎంతో మంది ఉద్యోగులకు వేతనాలు సకాలంలో చేతికి అందక ఇబ్బంది పడుతున్నారు. – సురేష్బాబు, ఉపాధి ఉద్యోగుల జేఏసీ ప్రతినిధి ఫీల్డు అసిస్టెంట్లకు 3 నెలలుగా, ఇతర ఉద్యోగులకు 2 నెలలుగా అందని జీతాలు సకాలంలో చెల్లించాలని సిబ్బంది వేడుకోలు -
బాధిత కుటుంబాలను ఆదుకోవాలి
బోధన్ టౌన్ (బోధన్): ట్రాక్టర్ బోల్తాపడటంతో జీపీ కార్మికులు బాలాజీ, యాదు మృతిచెందడంతో బాధిత కుటుంబాలను ఆదుకోవాలని బంధువులు, కార్మిక సంఘాల జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ఈమేరకు వారు శుక్రవారం బోధన్లోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. మృతుల కుటుంబాలకు విద్యుత్ కాంట్రాక్టర్ నష్టపరిహారము చెల్లించాలని, ప్రభు త్వం మృతిచెందిన కార్మికులకు ఒక్కొక్కరికి రూ.50 లక్షల నష్టపరిహారం చెల్లించాలన్నారు. రెండు ఎకరాల పొలం, ఇందిరమ్మ ఇల్లు, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, పిల్లల చదువుల బాధ్యత తీసుకోవాలన్నారు. సమాచారం అందుకున్న బోధన్ తహసీల్దార్ విఠల్, డీఎల్పీవో, రూరల్ సీఐ విజయ్బాబు వారిని సముదాయించారు. అనంతరం సబ్కలెక్టర్ వికాస్మహతో వద్దకు వెళ్లి చర్చలు జరిపారు. మృతుల కుటుంబాలకు బోధన్లో ప్లాట్లు ఇస్తామని, కు టుంబ సభ్యులకు ఉద్యోగం కల్పిస్తామని, అన్ని విధాలుగా ఆదుకుంటామని కల్పిస్తామని సబ్ కలెక్టర్ హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. వివిధ కార్మిక సంఘాల నాయకులు నరేందర్, సుధాకర్, మల్లేష్, నూర్జహాన్, శంకర్ గౌడ్, జంగం గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. -
క్రైం కార్నర్
దుబాయ్లో మోపాల్ వాసి మృతి మోపాల్: మండలకేంద్రానికి చెందిన తలారి సవీన్ (35) దుబాయ్లో మృతిచెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా.. సవీన్ ఆగస్ట్ 16న ఉపాధి నిమిత్తం దుబాయ్ వెళ్లాడు. 21న కంపెనీలో పని ముగించుకుని గదిలోకి వచ్చిన సవీన్.. ఫోన్, పర్సు, గుర్తింపు కార్డులు పెట్టి వెళ్లిపోయాడు. ఈనెల 26న రోడ్డు పక్కన చెట్టు కింద విగతజీవిగా పడి ఉన్నాడు. పోలీసులు మృతదేహాన్ని స్వా ధీనం చేసుకుని వివరాల కోసం ప్రయత్నించారు. తెలియకపోవడంతో మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. కాగా గల్ఫ్ సంఘాలు, గ్రామస్తులు సవీన్ తప్పిపోయాడని వీడియో రూపొందించి వైరల్ చేశారు. ఆ వీడియోను పరిశీలించిన పోలీసులు.. వివరాలు సేకరించి కంపెనీకి సమాచారమిచ్చారు. సవీన్ మృతి వార్త తెలుసుకున్న కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి. మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చేందుకు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి గల్ఫ్ సంఘం ప్రతినిధులతో మాట్లాడారు. త్వరగా మృతదేహాన్ని రప్పించే ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే సూచించారు. మృతుడి తండ్రి తలారి చిన్న లక్ష్మణ్ సైతం దుబాయ్లో ఉన్నాడు. మృతుడికి భార్య కృష్ణవేణి, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుటుంబ పెద్దను కోల్పోయామని, ప్రభుత్వం ఆదుకోవాలని భార్య కృష్ణవేణి కోరుతున్నారు. ట్రాన్స్ఫార్మర్ను ఢీకొట్టిన కారు బోధన్రూరల్: సాలూర మండలకేంద్రంలోని శివారులో శుక్రవారం ఓ కారు అతివేగం కారణంగా అదుపుతప్పి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు, ట్రాన్స్ఫార్మర్ ధ్వంసమయ్యాయి. కారులోని ఆరుగురికి గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో బోధన్ రూరల్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని, వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మచ్చేందర్రెడ్డి తెలిపారు. -
నూతన కార్యవర్గం ఎన్నిక
సుభాష్నగర్: నగరశివారులోని శ్రావ్యగార్డెన్లో శుక్రవారం తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ 1104 యూనియన్ ఎన్పీడీసీఎల్ డిస్కం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఎన్పీడీసీఎల్ డిస్కం కార్యవర్గ ఎన్నికలు (16 జిల్లాలు) నిర్వహించారు. ఎన్పీడీసీఎల్ డిస్కం అధ్యక్షుడిగా బి రఘునందన్, కార్యనిర్వాహక అధ్యక్షుడిగా సత్తిరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా ఎస్ వెంకట రమణరావు, అదనపు కార్యదర్శిగా ఎండీ ఆరీఫ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని రాష్ట్ర నాయకులు సన్మానించి, వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, ప్రధానకార్యదర్శి సాయిబాబు, అదనపు కార్యదర్శి వరప్రసాద్, కోశాధికారి శ్రీనివాస్రెడ్డి, డిస్కం కార్యదర్శి శేషగిరి రావు, అదనపు కార్యదర్శి రంగారావు, జిల్లా ముఖ్య సలహాదారులు లక్ష్మణ్రెడ్డి, జిల్లా అధ్యక్షుడు రాజేందర్, వర్కింగ్ ప్రెసిడెంట్ డీసీ రాజు, 16 జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. -
మంత్రులు జిల్లా అభివృద్ధిపై దృష్టిపెట్టాలి
● కాంగ్రెస్ కామారెడ్డి బీసీ సభను బహిష్కరించాలి ● బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి సుభాష్నగర్: జిల్లా ఇన్చార్జి మంత్రులు పర్యటనలు మా నుకుని జిల్లా అభివృద్ధి, వరద బాధిత కుటుంబాలను ఆదుకోవడంపై దృష్టిసారించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి డిమాండ్ చేశారు. నగరంలోని బీజేపీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. వరద బాధితుల పట్ల ప్రభుత్వం, మంత్రులు కనీసం కనికరం చూపకపోవడం సిగ్గుచేటన్నారు. కామారెడ్డిలో వరద బాధితులకు రూ.11,500 పంపిణీ చేశారని, కానీ రూరల్ నియోజకవర్గంలో బాధితులను పట్టించుకోలేదన్నారు. కామారెడ్డిలో కాంగ్రెస్ నిర్వహించేది బీసీల సభ కాదని, మైనార్టీ రిజర్వేషన్ల కోసం నిర్వహించే బహిరంగ సభ అని విమర్శించారు. సభకు బీసీలు, బలహీనవర్గాలు, బీసీ సంఘాలు దూరంగా ఉండాలని, ఆ సభను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. నాయకులు న్యాలం రాజు, నాగోళ్ల లక్ష్మీనారాయణ, ప్రమోద్, మాస్టర్ శంకర్, జ్యోతి, నాగరాజు, ఓంసింగ్, శ్రీనివాస్రెడ్డి, తారక్ వేణు, అంబదాస్, ఆకుల శ్రీనివాస్, హరీష్రెడ్డి పాల్గొన్నారు. -
డీఫాల్ట్ మిల్లర్లపై ఆర్ఆర్ యాక్ట్
● ఆస్తులు వేలం వేసి సీఎంఆర్ నిధులు రికవరీ చేయండి ● కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి నిజామాబాద్అర్బన్: సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) అందించడంలో విఫలమైన డీఫాల్ట్ రైస్మిల్లర్ల పై నిబంధనల మేరకు రెవెన్యూ రికవరీ యాక్టును అమలు చేయాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తహసీల్దార్లను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ నుంచి తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించా రు. ఈ సందర్భంగా డిఫాల్ట్ మిల్లర్లపై ఇప్పటి వర కు చేపట్టిన చర్యలు, వారి నుంచి రావాల్సిన మొ త్తం, ఇప్పటి వరకు ఎంత రికవరీ చేశారనే వివరాల ను తహసీల్దార్లను అడిగి తెలుసుకున్నారు. డీఫాల్ట్ రైస్ మిల్లులతోపాటు మిల్లర్లకు చెందిన ఆస్తులను బ్లాక్ చేయించాలని, అవసరమైతే ఆస్తులను వేలం వేసి సీఎంఆర్ నిధులను రాబట్టే దిశగా చర్యలు తీ సుకోవాలని స్పష్టం చేశారు. సీఎంఆర్ నిధులు పూ ర్తిస్థాయిలో రికవరీ కావాల్సిందేనని, నిబంధనల ప్రకారం ముందుకెళ్లాలని సూచించారు. సీఎంఆర్ రికవరీపై ప్రతి వారం సమీక్ష జరుపుతానని, ఎప్పటికప్పుడు ప్రగతి కనిపించాలని అన్నారు. ‘భూభారతి’ దరఖాస్తులు పరిష్కరించాలి భూభారతి పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. జాతీయ కుటుంబ ప్రయోజన పథకానికి అర్హులైన వారు దరఖాస్తు చేసుకునేలా చూడాలన్నారు. వీసీలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, డీఎస్వో అరవింద్ రెడ్డి, సివిల్ సప్లయ్ డీఎం శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. -
17 నుంచి ‘స్వస్థ్ నారీ– స్వశక్త్ పరివార్ అభియాన్’
నిజామాబాద్ నాగారం: మహిళల ఆరోగ్యం పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ‘స్వస్థ్ నారీ – స్వశక్త్ పరివార్ అభియాన్’ కార్యక్రమాన్ని ఈ నెల 17న ప్రధాని మోదీ ప్రారంభిస్తారని డీఎంహెచ్వో రాజశ్రీ తెలిపారు. ఈ కార్యక్రమం అ క్టోబర్ 2 వరకు కొనసాగుతుందన్నారు. కార్యక్రమ నిర్వహణపై రాష్ట్రస్థాయి అధికా రులు శుక్రవారం నిర్వహించిన జూమ్ మీటింగ్లో ఆమె పాల్గొన్నా రు. ‘స్వస్థ్ నారీ – స్వశక్త్ పరివార్ అభియాన్’లో భాగంగా జిల్లా వ్యాప్తంగా అన్ని ఆయుష్మాన్ ఆరో గ్య మందిరాల్లో ప్రత్యేక వైద్య నిపుణులతో ప్రతి రోజు 10 వైద్య శిబిరాలను నిర్వహిస్తామన్నారు. మహిళలు, గర్భిణులకు గుండె సంబంధ, మధుమేహం, క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలతోపాటు కంటి, దంత తదితర పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్స్ డాక్టర్ తుకారాం రాథోడ్, డాక్టర్ రాజు, డీపీవో విశాల, డీడీఎం నారాయణ, డీహెచ్ఈ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
యూరియా గోదాముల తనిఖీ
మాక్లూర్: మండల కేంద్రంలోని పీఏసీఎస్, గ్రోమోర్ గోదాములను జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్ శుక్రవారం ఆకస్మికంగా త నిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ కొందరు రైతులు లేటుగా నాట్లు వేశారని అలాంటి వారికి సరిపడా యూరియాను అందుబాటులో ఉంచాలన్నారు. రై తులు కూడా అవసరం మేరకే యూరియా చల్లుకోవాలని సూచించారు. వరి పొట్ట దశ లో అధిక యూరియా వాడటంతో చీడపీడ లు ఆశించే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నారు. సొసైటీ, గ్రోమోర్ గోదాంలలో యూరియా నిల్వలు ఉండటంపై డీఏవో సంతృప్తి వ్యక్తంచేశారు. ఆయన వెంట మండల వ్యవసాయ అధికారిణి పద్మ ఉన్నారు. అర్బన్పార్క్ను సందర్శించిన డీఎఫ్వో మాక్లూర్: మండలంలోని చిన్నాపూర్ శివారులో ఉన్న అర్బన్ పార్క్ను శుక్రవారం డివిజనల్ ఫారెస్టు అధికారి భవానీశంకర్ సందర్శించారు. ఈ సందర్భంగా పార్కుకు సంబంధించిన రికార్డులను పరిశీలించి, రోజువారీగా పార్కుకు వస్తున్న సందర్శకుల సంఖ్య వివరాలు తెలుసుకున్నారు. పార్కులో ఎంతమంది డ్యూటీలు చేస్తున్నారని అడిగా రు. ఆయన వెంట ఎఫ్ఆర్వో అశోక్, బీట్ అధికారి సుశీల్ ఉన్నారు. నిజాంసాగర్ 4 గేట్ల ఎత్తివేత నిజాంసాగర్: సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో కురుస్తున్న వర్షాలతో శుక్రవారం నిజాంసాగర్ ప్రాజెక్టులోకి 15,296 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజె క్టు నాలుగు వరద గేట్లను ఎత్తి 21,988 క్యూ సెక్కుల నీటిని మంజీర నదిలోకి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1,405 అడుగులు (17.8 టీఎంసీలు) కాగా శుక్రవారం సాయంత్రానికి 1,404.82 అడుగుల(17.542 టీఎంసీలు) నీరు నిల్వ ఉంది. ఏడు మండలాల్లో అధిక వర్షం నిజామాబాద్అర్బన్: జిల్లా వ్యాప్తంగా రెండ్రోజులుగా వర్షం కురుస్తోంది. ఏడు మండలాల్లో అధిక వర్షపాతం నమోదైంది. శుక్రవారం 44.1 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. అత్యధికంగా మోస్రాలో 74.6, చందూరు 71.3, మోర్తాడ్ 65.1, నవీపేట 60.4, ఎడపల్లి 58.5, మోపాల్ 57.7, వర్ని 56.5, నిజామాబాద్ సౌత్ 53.8, ఆలూర్ 52.4. రెంజల్ 51.8, కమ్మర్పల్లి 51.4, మాక్లూర్ 51.2, జక్రాన్పల్లి 50.9, భీమ్గల్ 48.0, ఏర్గట్ల 46.0, సిరికొండ 45.1, రుద్రూర్ 41.2, నిజామాబాద్ నార్త్లో 40.4 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. 24 మండలాల్లో సాధారణ, రెండు మండలాల్లో తక్కువ వర్షపాతం నమోదైంది. జిల్లాలో శనివారం భారీ వర్షా లు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దేవీరోడ్లో వన్ వే ఖలీల్వాడి: నగరంలోని దేవీరోడ్లో వన్ వే ఏర్పాటు చేసినట్లు ట్రాఫిక్ సీఐ ప్రసాద్ తెలి పారు. వ్యాపార సముదాయాలు, బ్యాంకు లు, ఆలయాలు ఉండే ఈ ప్రాంతంలో వా హనాలు రోడ్డుపై పార్కింగ్ చేయడంతో ట్రా ఫిక్ జామ్ అవుతూ ప్రజలు తీవ్ర ఇబ్బందు లు ఎదుర్కొంటున్నారన్నారు. ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులతో సీపీ సాయిచైతన్య ఆదేశాల మేరకు ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ ఆధ్వర్యంలో బారికేడ్లు, ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి వన్ వే ప్రారంభించామన్నారు. వాహనదారులు రైల్వే ఫ్లైఓవర్ వైపు నుంచి గంజ్ గేట్–1 మీదుగా, ద్విచక్ర వాహనదారులు దేవిరోడ్ నుంచి సాయిరెడ్డి పెట్రోల్ బంక్ వ ద్ద బయటకు వెళ్లాలని తెలిపారు. హెవీ వెహికల్స్, ఆటోలు, ఫోర్ వీలర్స్కి ప్రవేశం లేదన్నారు. ప్రజలు సహకరించాలని కోరారు. -
ఆర్టికల్ 19(1)(ఏ)ను అతిక్రమించడమే..
ఏపీ ప్రభుత్వం సాక్షి ఎడిటర్ ధనంజయ రెడ్డిపై కేసులు పెట్టడం భావప్రకటన స్వేచ్ఛను హరించడమే. భారత రాజ్యాంగం ప్రకారం దేశంలో పుట్టిన ప్రతి వ్యక్తికి తన భావాల్ని వెల్లడించే హ క్కు ఉంటుంది. వాటిని ప్రచురించే హక్కు మీడియాకు ఉంటుంది. భావ ప్రకటనను పా ర్లమెంటరీ భాషలో వెల్లడించాలి. ప్రభుత్వ పనుల్లో లో టుపాట్లను పత్రికలు ఎత్తిచూపుతాయి. అంతమాత్రాన వారిపై చర్యలకు పూనుకోవడం ఆర్టికల్ 19(1)(ఏ)ను అతిక్రమించడమే అవుతోంది. – ఆల్గోట్ రవీందర్, సీనియర్ అడ్వొకేట్, పౌరహక్కుల నాయకుడు -
బీసీ రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాం
● కేంద్రం నిర్లక్ష్యంతోనే యూరియా కొరత ● రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ఆర్మూర్/నిజామాబాద్ రూరల్ : రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లకు కట్టుబడి ఉందని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ, డెయిరీ, ఫిషరీష్, క్రీడలు, యువజన శాఖల మంత్రి వాకిటి శ్రీహరి స్పష్టం చేశారు. జిల్లా లో శుక్రవారం పర్యటించిన ఆయన నగరంలోని రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం, ఆర్మూర్లో నిర్వహించిన విలేకరుల సమావేశాల్లో మాట్లాడా రు. రాష్ట్రంలో బీసీలకు రాజకీయాలు, విద్య, ఉ ద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించడమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యమన్నారు. ఈనెల 15న భారీ వర్షం ఉందంటూ వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో కామారెడ్డి సభ రెండు, మూడు రోజులు వాయిదా పడుతుందని, ఆ తర్వాత సభ నిర్వహిస్తామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అన్నివర్గాలను కలుపుకుపోతూ రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తున్నట్లు తెలిపారు. ప్రజల్లో కాంగ్రెస్ అంటే మక్కువ పెరిగిందన్నారు. రాష్ట్రంలో యూరియా కొరతకు కేంద్ర ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. యూరియా కోసం గతంలో కేంద్ర ప్రభుత్వానికి ఎన్ని లేఖలు రా సినా ఫలితం లేకుండా పోయిందని, దీంతో యూరియా సంక్షోభం ఏర్పడిందని పేర్కొన్నారు. అనంతరం మంత్రి శ్రీహరిని కాంగ్రెస్ నాయకులు ఘనంగా సన్మానించారు. ప్రభుత్వం మత్స్యశాఖకు రూ.123 కోట్లు కేటాయించిందన్నారు. వారం రోజుల్లో టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి రాష్ట్రంలోని 46 వేల చెరువుల్లో 82 కోట్ల చేపపిల్లలు, 24 కోట్ల రొయ్యలను పెంచుతామన్నారు. సమావేశాల్లో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, తెలంగాణ పాడిపరిశ్రమ అభివృద్ధి సంస్థ చైర్మన్ గుత్తా అమిత్రెడ్డి, వ్యవసాయ కమిటీ సభ్యులు గడుగు గంగాధర్, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్బిన్ హందాన్, డీసీసీ అధ్యక్షుడు, రాష్ట్ర సహకార చైర్మన్ మానాల మోహన్రెడ్డి, తెలంగాణ రాష్ట్ర రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రాంరెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జి వినయ్రెడ్డి, ఏఎంసీ చైర్మన్లు ముప్ప గంగారెడ్డి, సాయిబాబాగౌడ్, పీసీసీ డెలిగేట్ బాడ్సి శేఖర్గౌడ్, నగేశ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నిజామాబాద్
● రాజీమార్గమే రాజమార్గం● కేసుల పరిష్కారం దిశగా కృషి ● నేడు మూడో జాతీయ లోక్ అదాలత్ ● జిల్లా న్యాయసేవా సంస్థ చైర్ పర్సన్, ప్రధాన న్యాయమూర్తి జీవీఎన్ భరతలక్ష్మి చేపలు చేజారుతున్నాయి ఎస్సారెస్పీ నుంచి నీటిని విడుదల చేసినప్పుడు చేపలు కొట్టుకుపోతున్నాయని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.శనివారం శ్రీ 13 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025– 8లో uఅభాగ్యులకు అండగా..జిల్లా జడ్జి జీవీఎన్ భరతలక్ష్మి న్యాయసేవా సంస్థ‘సత్వరం, సమన్యాయం అందించే జిల్లా న్యాయసేవా సంస్థ ప్రజల పాలిట కామధేనువు, కల్పవృక్షం. అభాగ్యులకు అండగా నిలుస్తోంది. రాజీమార్గమే రాజమార్గం నినాదంతో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించి కేసులు పరిష్కరిస్తోంది.’అని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జీవీఎన్ భరతలక్ష్మి పేర్కొన్నారు. శనివారం మూడో జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా న్యాయసేవా సంస్థ లక్ష్యాలు, ప్రజలకు ఉపయోగాలపై ‘సాక్షి’తో మాట్లాడారు. – నిజామాబాద్ లీగల్ జాతీయ లోక్ అదాలత్ను ఎందుకు నిర్వహిస్తున్నారు.. లక్ష్యం ఏమిటీ దేశంలో కింది కోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు లక్షలాది కేసులు పెండింగ్లో ఉన్నాయి. సోషల్ మీడియా ప్రభావంతో ప్రజల్లో చట్టాలపై అవగాహన పెరిగి కేసుల సంఖ్య సైతం పెరిగింది. దీంతో కోర్టులపై పనిభారం ఎక్కువైంది. కేసుల్ని పరిష్కరించేందుకు చాలా సమయం పడుతుండటంతో జాతీయ న్యాయసేవా సంస్థ రాజీమార్గమే– రాజమార్గం అనే నినాదంతో ఇరుపక్షాలను లోక్అదాలత్ ద్వారా ఒక్కచోట చేర్చి వారి సమస్యకు పరిష్కారం చూపేందుకు ప్రయత్నిస్తోంది. సాక్షి : న్యాయ సేవా సంస్థ లక్ష్యాలు ఏమిటి జడ్జి : జాతీయ న్యాయసేవా సంస్థ దేశ వ్యాప్తంగా ప్రతి జిల్లా కేంద్రంలో జిల్లా న్యాయసేవా సంస్థను ఏర్పాటు చేసింది. ఈ సంస్థ ప్రజలు ఎదుర్కొంటు న్న అనేక సమస్యలపై న్యాయ సహాయం అందించడంతోపాటు పరిష్కార మార్గాలను చూపుతోంది. ఏ సమస్యలపై న్యాయసేవా సంస్థను సంప్రదించవచ్చు ప్రజలు నిత్యజీవితంలో ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై జిల్లా న్యాయసేవా సంస్థను సంప్రదించొచ్చు. భార్యాభర్తలు, కుటుంబ సభ్యుల మధ్య త గాదాలు, కుల సంఘాల, వీడీసీల ఆధిపత్య ధోర ణి, ప్రజా సమస్యలపై స్థానిక సంస్థలైన గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల నిర్లక్ష్యం, ఫుట్పాత్ల ఆక్రమణ, గరిష్ట చిల్లర ధరకన్నా అధికంగా వస్తువులు అమ్మడం, హోటళ్లలో వాటర్ బాటిల్ కొనుగోలు చేయాలనే నిబంధన విధించడం లాంటి న్యాయ పరిష్కారం ఉన్న అనేక సమస్యలపై ప్రజలకు న్యాయ సహాయం అందిస్తుంది. ప్రజా సమస్యలపై ప్రభుత్వ శాఖలు నిర్లక్ష్యంగా వ్యవహరించినప్పుడు న్యాయసేవా సంస్థను సంప్రదిస్తే పరిష్కారానికి ఆదేశాలు జారీ చేస్తాం. న్యాయం పొందడంపై ప్రజల్లో ఎలా అవగాహన కల్పిస్తోంది? గ్రామాలు, పట్టణాల్లో న్యాయ చైతన్య సదస్సులు నిర్వహిస్తోంది. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై కోర్టులను ఆశ్రయించకుండానే న్యాయ సహాయం పొందేందుకు ప్రీ–లిటిగేషన్, మీడియేషన్ వ్యవస్థ ద్వారా వారి మధ్య మధ్యవర్తిత్వం వహించి సమస్యను పరిష్కరించేందుకు ప్రాధాన్యం ఇస్తోంది. జిల్లా న్యాయసేవా సంస్థ హెల్ప్లైన్ నంబర్ 15100 సైతం ఏర్పాటు చేసింది. లోక్అదాలత్ ఎక్కడెక్కడ నిర్వహిస్తున్నారు నిజామాబాద్ జిల్లాలో గతంలో నిర్వహించిన రెండో లోక్ అదాలత్లో 29 వేలకు పైగా కేసుల్ని పరిష్కరించి రాష్ట్రస్థాయిలో మూడో స్థానంలో నిలిచింది. శనివారం జరగబోయే మూడో జాతీయ లోక్అదాలత్ను మరింత సమర్థవంతంగా నిర్వహించి ఎక్కువ కేసుల్ని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నాం. అందుకోసం నిజామాబాద్ జిల్లా కోర్టులో 11, బోధన్లో 4, ఆర్మూర్లో 3 బెంచ్లను ఏర్పాటు చేశాం. మూడు సంవత్సరాలకు మించని శిక్షపడే క్రిమినల్ కేసులతోపాటు సివిల్, మోటారు వాహనాల కేసులు, ఇతరత్రా కేసులను లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించనున్నాం. ఈ సందర్భంగా నల్సా(నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ) నినాదమైన మీడియేషన్ ఫర్ నేషన్ (దేశం కోసం రాజీమార్గం) అనే నినాదాన్ని విస్తృతంగా ప్రచారం కల్పిస్తున్నాం. వీడీసీల పెత్తనాన్ని ఎలా అదుపు చేస్తోంది ప్రజలపై ఆధిపత్య ధోరణి అవలంబించే గ్రామాభివృద్ధి కమిటీలపై పోరాడేందుకు జిల్లా న్యాయ సేవా సంస్థ సహాయపడుతోంది. జిల్లాలోని పలు వీడీసీలపై అనేకమంది బాధితులు హైకోర్టును సైతం ఆశ్రయించారు. జిల్లా న్యాయసేవా సంస్థ బాధితులను తమ కార్యాలయానికి పిలిపించుకొని ఫిర్యాదులు స్వీకరించి, పోలీసు, రెవెన్యూ తదితర శాఖల సమన్వయంతో వీడీసీలపై చర్యలకు ఆదేశించింది. వీడీసీల ఆర్థిక వనరులైన షాపింగ్ కాంప్లెక్స్ వంటి వాటిని సీజ్ చేయడం, అమాయకులైన ప్రజలను వేధించకుండా చర్యలు చేపట్టాం. -
అక్రమ కేసులు.. అప్రజాస్వామికం
● నిజాలు నిర్భయంగా రాయడం తప్పా? ● ‘సాక్షి’ ఎడిటర్, పాత్రికేయులపై కేసులు ఎత్తివేయాలి ● ఏపీ ప్రభుత్వ కుట్రలపై మేధావుల మండిపాటు నిజామాబాద్అర్బన్: ‘ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభం జర్నలిజం. ప్రజల సంక్షేమం కోసం పాత్రికేయులు పాటుపడతారు. అలాంటి వారిపై ప్రభుత్వాలు అక్రమ కేసులు బనాయించడం స్వేచ్ఛను హరించడమే’ అవుతుందని మేధావులు పేర్కొంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘సాక్షి’ దినపత్రిక ఎడిటర్ ధనంజయ రెడ్డిపై అక్రమంగా కేసులు బనాయించి ఇబ్బందులకు గురిచేయడం సరైంది కాదని అభిప్రాయపడ్డారు. తమకు అనుకూలంగా ఉండాలని జర్నలిస్టులను ఇబ్బందులకు గురిచేయడం ప్రభుత్వ దుర్మార్గపు చర్యగా అభివర్ణించారు. -
పాస్ పుస్తకాలు ఎప్పుడొస్తాయ్?
● నెలల తరబడి నిరీక్షిస్తున్న రైతులు ● పట్టా పాస్బుక్లు లేకపోవడంతో రుణాలివ్వని బ్యాంకులు ● ఇబ్బందులు పడుతున్న అన్నదాతలుమోర్తాడ్(బాల్కొండ) : పట్టాదారు పాస్ పు స్తకాలు అందక రైతులు అవస్థలు పడుతున్నారు. జిల్లాలో కొత్తగా భూములను కొ నుగోలు చేసిన అనేక మంది పాస్ పుస్త కాల కోసం మూడు, నాలుగు నెలల నుంచి ఎదురుచూస్తున్నారు. వ్యవసా య భూమి రిజిస్ట్రేషన్ సందర్భంగా కొత్త పట్టాదా రు పాస్ పుస్తకం కోసం రూ.300 వసూలు చేస్తున్నా రు. గతంలో పాస్ పుస్తకం ఉన్న వారు భూమిని కొనుగోలు చేస్తే అందులోనే వివరాలను నమోదు చేసి ఇస్తున్నారు. ఒక్కో మండలంలో 5 నుంచి 10 రిజిస్ట్రేషన్లు.. ధరణి పోర్టల్ అమల్లోకి వచ్చిన తర్వాత వ్యవసా య భూములను తహసీల్ కార్యాలయంలోనే రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ చేసిన వెంటనే మ్యు టేషన్ ప్రక్రియను పూర్తి చేసి, రిజిస్ట్రేషన్ పత్రాలు, ప్రొసీడింగ్ కాపీ, డూప్లికేట్ పీపీలను అందిస్తున్నా రు. అనంతరం రిజిస్ట్రేషన్ వివరాలు సీసీఎల్ కార్యాలయం ద్వారా బెంగళూరులోని ఏజెన్సీకి వెళ్తాయి. అక్కడ భూమి కొనుగోలు చేసిన వ్యక్తి పేరిట కొత్త పాస్ పుస్తకం ముద్రించి పోస్టులో ఇంటికి పంపిస్తారు. జిల్లాలోని చిన్న మండలాల్లో రోజుకు ఐదు, పెద్ద మండలాల్లో 10 చొప్పున రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ఇలా గత నాలుగైదు నెలల నుంచి రిజిస్ట్రేషన్లు చేయించుకున్న సుమారు వెయ్యి మందికి ఇప్పటి వరకు పట్టా పాస్ పుస్తకాలు అందలేదు. బ్యాంకర్ల విముఖత కొత్తగా భూములు కొనుగోలు చేసిన వారు పంట రుణాలు తీసుకునేందుకు ఇబ్బందులు పడుతున్నా రు. తహసీల్ కార్యాలయంలో ఇచ్చే రిజిస్ట్రేషన్ ప త్రాలు, ప్రొసీడింగ్ కాపీలను చూపినా పంట రుణా లు ఇచ్చేందుకు బ్యాంకర్లు విముఖత చూపుతున్నా రు. వాస్తవానికి భూ భారతి వెబ్పోర్టల్లో రైతు వి వరాలను పరిశీలించి పంట రుణం ఇవ్వాలని ప్ర భుత్వం నిబంధన విధించింది. కానీ, బ్యాంకర్లు మాత్రం ఉన్నతాధికారుల సూచనల ప్రకారం పట్టా పాస్ పుస్తకం పరిశీలన తర్వాతే రుణాలు ఇస్తామని స్పష్టం చేస్తున్నారు. వ్యవసాయ భూమి రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి వెంటనే ప్రొసీడింగ్ కాపీ, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఇస్తున్నాం. రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ ప్రక్రియ పూర్తి చేసి ఆన్లైన్లో వివరాలను నమోదు చేస్తున్నాం. పాస్ పుస్తకం లేకపోయినా ఆన్లైన్లో వివరాలను పరిశీలించి బ్యాంకర్లు పంట రుణాలు ఇవ్వాలి. పాస్ పుస్తకాలు పోస్టులో రావడానికి కొంత సమయం పడుతుంది. – కృష్ణ, తహసీల్దార్, మోర్తాడ్ఏర్గట్ల మండలం తొర్తి గ్రామానికి చెందిన రైతు నవీన్ ఎకరం వ్యవసాయ భూమిని కొనుగోలు చేసి తహసీల్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. తహసీల్దార్ ప్రొసీడింగ్ కాపీ, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ అందజేశారు. కొత్త పట్టాపాస్ పుస్తకం పోస్టులో వస్తుందని చెప్పగా, నెల రోజులు గడచినా ఇంకా రాలేదు. రైతు తహసీల్ కార్యాలయంలో అడిగితే అది తమ పరిధిలో లేదని సమాధానం ఇచ్చారు. -
గొంతు నొక్కాలని చూస్తే ప్రజలే గుణపాఠం చెబుతారు
ఏపీలో ప్రజాస్వామ్యానికి పాతర వేస్తున్నా రని ఇప్పటి చర్యల వల్ల అర్థం అవుతోంది. జర్నలిస్టు లు వారి బాధ్యతల ను వారు సక్రమంగా నిర్వహిస్తే క్రిమినల్ కేసులు న మోదు చేయడం సరికాదు. ప్రజల గొంతుకగా ఉ న్న జర్నలిస్టులపై కేసులు నమోదు చేస్తే ప్రజలే గు ణపాఠం చెబుతారు. ఉమ్మడి ఏపీలో చంద్రబాబు కు రెండుసార్లు ప్రజలు గుణపాఠం చెప్పిన విష యం మరిచిపోయినట్లు ఉన్నారు. ప్రజల సంక్షేమ కార్యక్రమాలపై కాకుండా పగతో ఊగిపోవడం సరికాదు. – తక్కూరి సతీష్, జిల్లా టెలికం బోర్డు మాజీ సభ్యుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మోర్తాడ్ -
రోగుల బారులు..
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని జీజీహెచ్లో ఓపీ వద్ద బారులు తీరిన రోగులుఇటీవల కురిసిన వర్షాల వల్ల సీజనల్ వ్యాధుల ప్రభావంతో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో గురువారం 2,156 మంది అవుట్ పేషెంట్లు నమోదయ్యారు. జ్వరాలు, దగ్గు, వాంతులు, విరేచనాలతో ఆస్పత్రికి వస్తున్నారు. ఒకే రోజు రెండువేలకుపైగా ఓపీ నమోదు కావడం ఈనెలలో తొలిసారి అని ఆస్పత్రి అధికారులు పేర్కొన్నారు. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, నిజామాబాద్ -
మృత్యు అంచున చేపపిల్లలు
బాల్కొండ: జిల్లాలో చేప పిల్లల పంపిణీ ప్రక్రియ సందిగ్ధంలో పడింది. టెండర్ల నిర్వహణలో జాప్యం కారణంగా మత్స్యకారులకు చేపపిల్లల సరఫరా ఆలస్యమవుతోంది. దీంతో ఎస్సారెస్పీ దిగువన ఉన్న జాతీయ చేప పిల్లల ఉత్పత్తి కేంద్రంలో చేపపిల్లల సైజు పెరిగి కుండీల్లో ఇమడలేక చనిపోయే ప్రమాదం నెలకొంది. 180 చెరువులు, 65 సంఘాలు.. ఎస్సారెస్పీ చేపపిల్లల ఉత్పత్తి కేంద్రం పరిధిలో నందిపేట్, బాల్కొండ, ముప్కాల్, మెండోరా, ఏర్గట్ల, మోర్తాడ్, కమ్మర్పల్లి మండలాల్లోని 180 చెరువులు, 65 మత్స్య సహకార సంఘాలు ఉన్నాయి. అయితే ప్రస్తుత సంవత్సరం 54 లక్షల చేపపిల్లల ఉత్పత్తి లక్ష్యంగా అధికారులు నిర్ణయించారు. కాగా 30 లక్షల చేప పిల్లలను ఉత్పత్తి చేసి నర్సరీల్లో వేశారు. సాధారణంగా 35–40 ఎంఎం సైజు పెరగగానే చేప పిల్లలను చెరువుల్లో వదలాలి. ఇప్పటి వరకు చేపపిల్లలు మత్స్యసహకార సంఘాలకు చేరలేదు. దీంతో నర్సరీల్లోని చేప పిల్లల సైజు 80–100 ఎంఎంకు చేరుకుంటోంది. తద్వారా నర్సరీ కుండీల్లో చేపపిల్లలకు స్థలం సరిపడక చనిపోయే ప్రమాదం నెలకొంది. మరోవైపు చేపపిల్లలకు దాణా కూడా సరిపోయే పరిస్థితి లేదు. దీంతో చేపపిల్లలు చేతికందకుండా పోతాయని మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టెండర్లతో లింకు వద్దురాష్ట్ర వ్యాప్తంగా చెరువులు, ప్రాజెక్ట్లకు ప్రభుత్వం నీలి విప్లవంలో భాగంగా ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేస్తుంది. ఇందుకోసం టెండర్లను నిర్వహిస్తారు. టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ చేపపిల్లలను సరఫరా చేస్తారు. అయితే ఇప్పటి వరకు టెండర్లు పూర్తికాలేదు. ఆ టెండర్లకు, ఉత్పత్తి కేంద్రంలోని చేపపిల్లలకు లింకు పెట్టడంతో పంపిణీకి నోచు కోవడం లేదు. టెండర్లు కూడా ఇప్పట్లో పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు. టెండర్లకు సంబంధం లేకుండా త్వరగా చేపపిల్లలను పంపిణీ చేయాలని మత్స్యకారులు డిమాండ్ చేస్తున్నారు.కేంద్రంలోని చేప పిల్లలకు సరిపడా దాణా అందించలేకపోతున్నాం. సైజ్ ఎక్కువగా పెరిగినట్లు ఉన్నతాధికారులకు నివేదించాం. ఆదేశాలు రాగానే చేపపిల్లల పంపిణీ చేపడతాం. – దామోదర్, మత్స్య అభివృద్ధి అధికారి, పోచంపాడ్ ఉత్పత్తి కేంద్రంలోనే చేప పిల్లలు సైజు పెరిగి కుండీల్లో ఇమడని వైనం సరిపడా ఆహారం అందించలేకపోతున్న అధికారులు చేప పిల్లలు పంపిణీ చేయాలని మత్స్యకారుల డిమాండ్ టెండర్ల జాప్యంతో ఇబ్బందులు -
అప్రజాస్వామిక పద్ధతులు విడనాడాలి
పత్రికలు, మీడియాపై దాడులు చేయడమంటే పత్రికా స్వే చ్ఛను హరించడమే అవుతుంది. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒ క్కరి హక్కులను కాపా డాల్సిన బాధ్యత ప్రభుత్వా లపైనే ఉంటుంది. కుట్రతో అక్రమ కేసులు బనాయించడం, భయభ్రాంతులకు గురిచేయడం ప్రజాస్వా మ్య విరుద్ధం. చట్టసభలు, పత్రికలు, బ్యూరోక్రాట్లు ప్రధాన అంగాలు. వీటిలో ఏ ఒక్కటి దెబ్బతిన్నా ప్రజాస్వామ్య వ్యవస్థ దెబ్బతింటది. ప్రభుత్వాలు అప్రజాస్వామిక పద్ధతులు విడనాడాలి. పత్రికలపై దాడులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. – ఎ.రమేష్బాబు, సీపీఎం జిల్లా కార్యదర్శి -
బ్యాక్టీరియా బారిన వరి
డొంకేశ్వర్(ఆర్మూర్): చిరు పొట్ట దశకు వచ్చిన వరి పంటపై ఎండాకు తెగులు బ్యాక్టీరియా దాడి చేస్తోంది. మోతాదుకు మించి యూరియా వాడకం, తీవ్రమైన ఎండలు, అధిక వానలతో ఎండాకు తెగులు సోకే అవకాశం ఉందని వ్యవసాయాధికారులు చెప్తున్నారు. దీనిని నివారించే మందులు లేకపోగా.. ఒక మొక్కనుంచి మరో మొక్కకు వ్యాపించకుండా యాంటీ బయాటిక్స్ రసాయనిక మందులు పిచికారీ చేయడమే మార్గమని సూచిస్తున్నారు. 4,34,695 ఎకరాల్లో సాగు.. ఖరీఫ్ సీజన్లో జిల్లా వ్యాప్తంగా 4,34,695 ఎకరాల్లో రైతులు వరిని సాగు చేస్తున్నారు. ప్రస్తుతం పొలాలన్నీ చిరు పొట్ట దశకు చేరుకున్నాయి. విత్త నాలు బయటికి వచ్చే సమయంలో ఎండాకు తెగు లు సోకడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మొక్క పైభాగంలో తెచ్చటి మచ్చలు ఏర్పడి ఆకు లు పూర్తిగా ఎండిపోతున్నాయి. ఇది ఒకటి, రెండు మొక్కలతో మొదలై పొలమంతా వ్యాపిస్తోంది. త ద్వారా దిగుబడిపై ప్రభావం పడుతుంది. అయితే, ఇటీవల కురిసిన భారీ వర్షాలు, ఆ వెంటనే తీవ్రమైన ఎండలతో వాతావరణం నిలకడగా లేదు. దీనికి తోడు రైతులు పరిమితికి మించి యూరియా చల్లారు. వాస్తవానికి ఎకరానికి మూడు డోసులు కలిపి రెండు నుంచి మూడు బస్తాలు సరిపోతుంది. కానీ, రైతులు పొలం త్వరగా ఎదగాలనే ఉద్దేశంతో ఎకరానికి నాలుగైదు, అంతకుమించి బస్తాల యూరియా వేశారు. దీంతో తెగుళ్లు, చీడపీడలు సోకుతున్నాయని వ్యవసాయాధికారులు పేర్కొంటున్నారు. పంటకు సోకిన బ్యాక్టీరియా పూర్తిగా వ్యాపించకుండా రైతులు యాంటీ బయాటిక్స్ మందులను స్ప్రే చేస్తున్నారు. ఎండాకు తెగులు వ్యాప్తిని అరికట్టే యాంటీ బయా టిక్స్ రసాయనాలు అందుబాటులో ఉన్నాయి. అగ్రి మైసన్ లేదా ప్లాంటమైసిన్తో కాపర్ ఆక్సిక్లోరైడ్ పిచికారీ చేయాలి. సొంత నిర్ణయాలు తీసుకోవద్దు. స్థానిక వ్యవసాయాధికారులను రైతులు సంప్రదించాలి. పూత దశలో ఉన్నప్పుడు కాపర్ సంబంధిత శీలింధ్ర నాశినులు వాడొద్దు. – మధుసూదన్, ఏవో, డొంకేశ్వర్ చిరు పొట్ట దశలో సోకిన ఎండాకు తెగులు అధిక యూరియా, వాతావరణ మార్పులే కారణమంటున్న వ్యవసాయ అధికారులు విస్తరించకుండా యాంటీబయాట్సిక్ వినియోగిస్తున్న రైతులు -
బిల్లులు సకాలంలో చెల్లించాలి
● అధికారులకు కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆదేశం ● సిరన్పల్లిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పరిశీలన నవీపేట: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ బిల్లులను సకాలంలో చెల్లించాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. నవీపేట మండలంలోని సిరన్పల్లి గ్రామంలో గురువారం ఆయన పర్యటించి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. లబ్ధిదారులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. గ్రామంలో 93 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా 69 గ్రౌండింగ్ అయ్యాయని, 12 ఇళ్లు స్లాబ్ దశకు చేరుకున్నాయన్నారు. ఇంకా 24 మంది లబ్ధిదారులతో మాట్లాడి వెంటనే నిర్మాణాలను ప్రారంభించాలని సూచించారు. ప్రభుత్వ కార్యాలయాల తనిఖీ నవీపేటలోని ఎంపీడీవో, తహసీల్ కార్యాలయాల ను కలెక్టర్ తనిఖీ చేశారు. గ్రామాలలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల వేగాన్ని పెంచేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. పెండింగ్లో ఉన్న భూభారతి అర్జీలను పరిశీలించాలన్నారు. అదనపు కలెక్టర్ కిరణ్కుమార్, హౌసింగ్ పీడీ పవన్కుమార్, ఎంపీడీవో నాగనాథ్, తహసీల్దార్ వెంకట రమణ ఉన్నారు. -
కొండ చిలువ పట్టివేత
నందిపేట్(ఆర్మూర్): మండలంలోని అయిలాపూర్ గ్రామంలో గురువారం 9 అడుగుల కొండ చిలువను పట్టుకున్నారు. అయిలాపూర్ గ్రామంలోని ప్రధాన రహదారి వెంబడి గల డ్రెయినేజీలో అలికిడి రావడంతో గ్రామస్తులు చూడగా భారీ పాముగా గుర్తించారు. వెంటనే నందిపేటకు చెందిన పాములు పట్టే సర్వర్కు సమచారం అందించారు. వెంటనే సర్వర్ అయిలాపూర్కు చేరుకుని గ్రామస్తుల సహకారంతో డ్రెయినేజీలోని కొండ చిలువను పట్టుకుని రోడ్డుపై పడవేశాడు. కొంతసేపు కొండచిలువ అటుఇటుగా తిరగడంతో గ్రామస్తులు భయంతో కేకలు వేశారు. చివరికి దానిని అదుపులోకి తీసుకుని సంచిలో వేశాడు. పట్టుకున్న కొండ చిలువను అటవీ ప్రాంతంలో వదిలేయనున్నట్లు సర్వర్ వివరించాడు. -
గోదావరిలోకి నిలిచిన నీటి విడుదల
బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లోకి ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు తగ్గుముఖం పట్టడంతో ప్రాజెక్ట్ నుంచి వరద గేట్ల ద్వారా నీటి విడుదలను ప్రాజెక్ట్ అధికారులు గురువారం ఉదయం నిలిపివేశారు. బుధవారం రాత్రికి ప్రాజెక్ట్లోకి వరద నీరు పోటెత్తడంతో గోదావరిలో 75 వేల క్యూసెక్కుల నీటిని వదిలారు. తర్వాత క్రమంగా నీటి విడుదలను తగ్గించారు. గురువారం ఉదయం పూర్తిగా నీటి విడుదలను నిలిపి వేశారు. ప్రస్తుత సంవత్సరం ఇప్పటి వరకు ప్రాజెక్ట్లోకి 385 టీఎంసీల నీరు వచ్చి చేరింది. అందులో 245 టీఎంసీల నీటిని గోదావరిలోకి వదిలారు. ప్రాజెక్ట్ నుంచి వరద కాలువ ద్వారా 19 వేల క్యూసెక్కులు , సరస్వతి కాలువ ద్వారా 800 క్యూసెక్కులు, కాకతీయ కాలువ ద్వారా 5500 క్యూసెక్కులు, ఎస్కెప్ గేట్ల ద్వారా 2500 క్యూసెక్కులు, లక్ష్మి కాలువ ద్వారా 200 క్యూసెక్కులు, గుత్ప లిప్టు ద్వారా 270 క్యూసెక్కులు, అలీసాగర్ లిప్టు ద్వారా 360 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 684క్యూసెక్కులు, మిషన్ భగీరథ ద్వారా తాగునీటి అవసరాల కోసం 231 క్యూసెక్కుల నీరు పోతుంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091(80.5 టీఎంసీలు) అడుగులు కాగా గురువారం సాయంత్రానికి అంతేస్థాయి నీటిమట్టంతో ప్రాజెక్ట్ నిండుకుండలా ఉందని ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు. -
యువకుడి అదృశ్యం
ఖలీల్వాడి: నగరంలోని వినాయక్ నగర్కు చెందిన కాంపెల్లి రాము అదృశ్యం అయినట్లు నాలుగో టౌన్ ఎస్సై శ్రీకాంత్ గురువారం తెలిపారు. వినాయక్ నగర్లోని అంగిటి హోటల్ వద్ద రాము అదృశ్యమయ్యాడని, అతడి మానసిక స్థితి బాగాలేదని సోదరుడు తిరుపతి పేర్కొన్నాడు. తిరుపతి ఫిర్యాదు మేరకు కేసు, నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. ఎవరికై నా రాము ఆచూకీ తెలిస్తే 8712659840, 8712659836కు సమాచారం అందించాలని ఎస్సై తెలిపారు. అక్రమ మద్యం స్వాధీనం మోర్తాడ్: భీమ్గల్ మండలం బాబాపూర్లో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ఇద్దరిని అరెస్టు చేసినట్లు ఎకై ్సజ్ ఎస్సై గోవర్ధన్ గురువారం తెలిపారు. బాబాపూర్కు చెందిన జంగిటి నరేష్, సుమలత వద్ద 7.92 లీటర్ల అక్రమ మద్యంను స్వాధీనం చేసుకున్నామని, వారిపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. అక్రమ మద్యం స్వాధీనం ఘటనలో సిబ్బంది దత్తాద్రి, శ్రీనివాస్రెడ్డి, జగదీష్, రాణిలు పాల్గొన్నారని ఆయన వెల్లడించారు. బోధన్ ఎస్బీఐలో రూ. 5లక్షల నగదు చోరీ బోధన్టౌన్(బోధన్): పట్టణంలోని ఎస్బీఐ బ్యాంకులో రూ. 5లక్షలు చోరీ జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పట్టణ సీఐ వెంకటనారాయణ తెలిపిన వివరాలు ఇలా.. పట్టణంలోని ఎస్బీఐ బ్యాంకులో ఈ నెల 8న బ్యాంకు కార్యకలాపాలు నిర్వహిస్తున్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు కౌంటర్ నుంచి రూ. 5లక్షలను చోరీ చేశారు. ఈ విషయాన్ని బ్యాంకు అధికారులు 10వ తేదీన గుర్తించగా, పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారని సీఐ గురువారం తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. బ్యాంకు కార్యాకలాపాలు జరిగే సమయంలో బ్యాంకు అధికారులు ఎవరు ఏమి చేస్తున్నారో గమనించాలని, బ్యాంకు సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సీఐ తెలిపారు. -
క్రైం కార్నర్
ట్రాక్టర్ బోల్తాపడి ఇద్దరు జీపీ కార్మికుల మృతి ● విద్యుత్ స్తంభాలు తరలిస్తుండగా ఘటన బోధన్రూరల్: బోధన్ మండలం బిక్నెల్లీ గ్రామ పంచాయతీ ట్రాక్టర్లో విద్యుత్ స్తంభాలను తరలిస్తుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తా పడి ఇద్దరు జీపీ కార్మికులు అక్కడిక్కడే మృతి చెందారు. స్థానికులు, అధికారులు తెలిపిన వివరాలు ఇలా.. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా బిక్నెల్లీ గ్రామ శివారులోని పొలాల్లో విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నాయి. దీంతో కొత్త స్తంభాలను తీసుకురావడానికి జీపీ డ్రైవర్ రాజు (అవుట్ ఓర్సింగ్), జీపీ కార్మికులు బాగారే బాలాజీ (42) (మల్లీపర్పస్ వర్కర్), బాగారే యాదు (40) (ఔట్సోర్సింగ్ వర్కర్) గురువారం రాంపూర్ సబ్సేష్టన్కు వెళ్లారు. అక్కడి నుంచి ట్రాక్టర్పై విద్యుత్ స్తంభాలను తీసుకొని గ్రామానికి బయలుదేరారు. కల్దుర్కి శివారులో ఓవర్ లోడ్ కారణంతో ట్రాక్టర్ బోల్తాపడింది. ఈ ఘటనలో ట్రాక్టర్ను నడిపిస్తున్న రాజు గాయాలతో బయటపడగా, ట్రాలీలో ఉన్న బాగారే బాలాజీ, బాగారే యాదుపై స్తంభాలు పడటంతో అక్కడిక్కడే మృతి చెందారు. బోధన్ రూరల్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను బోధన్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. జీపీ కార్యదర్శి సుధాకర్ ఆదేశాల మేరకే జీపీ సిబ్బంది ట్రాక్టర్లో స్తంభాలను తరలించారని ప్రచారం జరుగగా, ఘటనపై వివరాల కోసం జీపీ కార్యదర్శిని ఫోన్లో సంప్రదించగా ఆయన స్పందించలేదు. గుండెపోటుతో టీఏ మృతి బాల్కొండ: మండల కేంద్రంలో ఉపాధి హామీ పథకం టెక్నికల్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్న ధనుంజయ్(45) గుండెపోటుతో మృతిచెందారు. విధుల్లో భాగంగా గురువారం ధనుంజయ్ బైక్పై బస్సాపూర్ గ్రామానికి బయలుదేరాడు. గ్రామంలో పర్యటిస్తుండగా అస్వస్థతకు గురై గుండెపోటు వచ్చింది. వెంటనే స్థానికులు అతడిని చికిత్సకు తరలించేలోపు మృతి చెందాడు. సమయానికి జీతాలు రాక ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఒత్తిడికి గురికావడంతోనే ధనుంజయ్కి గుండెపోటు వచ్చిందని తోటి ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రియుడు మోసం చేశాడని ఆత్మహత్య ఎల్లారెడ్డి: ప్రియుడు మోసం చేయడంతో మనస్తాపం చెందిన ప్రియురాలు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని సబ్దల్పూర్ గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై మహేష్ తెలిపిన వివరాలు ఇలా.. సబ్దల్పూర్ గ్రామానికి చెందిన బత్తుల సావిత్రి (20) బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కొద్దిసేపటికి తండ్రి రాంచందర్ ఇంటికి రాగా, ఉరివేసుకున్న కూతురును చూసి బోరున విలపించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని, వివరాలు సేకరించారు. సావిత్రికి లింగంపేట మండలం శెట్పల్లి సంగారెడ్డికి చెందిన ఓ యువకుడితో ప్రేమ వ్యవహారం కొనసాగుతున్నదని, అతడు నిరాకరించడంతోనే ఆత్మహత్యకు పాల్పడిందని మృతురాలి తండ్రి రాంచందర్ ఫిర్యాదు చేశాడు. ఈమేరకు కేసు నమోదు చేసుకొని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎల్లారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు ఎస్సై తెలిపారు. మద్యానికి బానిసై యువకుడు.. నిజామాబాద్ రూరల్: రూరల్ పోలీస్స్టేషన్ పరిధిలోని గూపన్పల్లిలో ఓ వ్యక్తి మద్యానికి బానిసై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రూరల్ ఎస్హెచ్వో ఆరీఫ్ తెలిపిన వివరాలు ఇలా.. గూపన్పల్లికి చెందిన చింతకుంట రాజు(30) ఆటోడ్రైవర్గా జీవనం కొనసాగిస్తున్నాడు. కొన్నిరోజులుగా రాజు ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యల కారణంగా తాగుడుకు బానిసయ్యాడు. ఈక్రమంలో గురువారం తీవ్ర మనస్తాపానికి గురై, ఇంటిలో ఎవరు లేని సమయంలో రాజు ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి తల్లి గంగామణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్హెచ్వో వివరించారు. -
బీసీ రిజర్వేషన్కు కట్టుబడి ఉన్నాం
● ఈనెల 15న కామారెడ్డిలో జరిగే బహిరంగసభను విజయవంతం చేయాలి ● డీసీసీ అధ్యక్షుడు, సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్రెడ్డి నిజామాబాద్ సిటీ: కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్కు కట్టుబడి ఉందని, కామారెడ్డి డిక్లరేషన్ ప్రకా రం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని డీసీసీ అధ్యక్షుడు, సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ భవన్లో గురువారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా మానాల మాట్లాడుతూ.. జనాభా ప్రకారం రిజ ర్వేషన్లు అమలు చేయాలన్న ఏఐసీసీ అగ్రనేత రా హుల్గాంధీ ఆలోచనకు అనుగుణంగా రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లు అమలుచేస్తున్నామన్నారు. బీసీ రి జర్వేషన్లపై అసెంబ్లీలో జరిగిన చర్చకు బీజేపీ ఎమ్మెల్యేలు మద్ధతు పలికితే, బీజేపీ ఎంపీలు మాత్రం రిజర్వేషన్లను అడ్డుకుంటున్నారని, ద్వంద్వ నీతిని అవలంభిస్తున్నారని మండిపడ్డారు. యూరియా కొ రతకు కేంద్రప్రభుత్వానిదే బాధ్యత అన్నారు. యూ రియా కొరత జిల్లాలో పెద్దగా లేదన్నారు. బీసీల రిజర్వేషన్ల నుంచి ముస్లింలను తీసివేయాలని బీజే పీ ఎంపీలు వితండవాదం చేస్తున్నారన్నారు. బీసీ రిజర్వేషన్లు ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, పీ సీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రివర్గానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈనెల 15న కామారెడ్డిలో ముఖ్యమంత్రి హాజరయ్యే బీసీ గర్జనను విజయవంతం చేయాలని కోరారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి, ఓబీసీ అధ్యక్షుడు రాజనరేందర్ గౌడ్, జిల్లా ఎస్టీసెల్ అధ్యక్షుడు కెతావత్ యాదగిరి, సీనియర్ నాయకులు మహ్మద్ ఖుద్దూ స్, ప్రమోద్ కుమార్, వేణురాజ్, బోదిరే స్వామి, కేశ మహేష్, తిప్పిరెడ్డి శ్రీనివాస్, ఈసా, అబ్దుల్ ఎ జాజ్, సుభాష్ జాదవ్, సంగెం సాయిలున్నారు. -
విద్యారంగంలో తెయూ గణనీయమైన ప్రగతి
● వీసీ యాదగిరిరావు ● ఘనంగా వర్సిటీ ఆవిర్భావ దినోత్సవం తెయూ(డిచ్పల్లి):విద్యారంగంలో తెలంగాణ యూ నివర్సిటీ గణనీయమైన ప్రగతి సాధించిందని తె యూ వీసీ యాదగిరిరావు అన్నారు. క్యాంపస్ ఆవరణలో గురువారం తెలంగాణ యూనివర్సిటీ ఆవి ర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వీసీ యాదగిరిరావు, రిజిస్ట్రార్ యాదగిరితో కలిసి కేక్ కట్ చేసి సంబురాలు జరుపుకున్నారు. అనంతరం వీసీ మాట్లాడుతూ.. తెలంగాణ యూనివర్సిటీ 11 సెప్టెంబర్ 2006న 6 కోర్సులు, 12 మంది రెగ్యులర్ అధ్యాపకులతో ప్రారంభం కా గా, గడిచిన 19 ఏళ్లలో రాష్ట్రంలో మూడో అతిపెద్ద యూనివర్సిటీగా పరిణామం చెందడం గర్వకారణంగా ఉందన్నారు.ప్రస్తుతం 60 మందికి పైగా రెగ్యులర్ అధ్యాపకులు, 50 మందికి పైగా కాంట్రా క్టు అధ్యాపకులు, 13 మంది నాన్ టీచింగ్ సిబ్బంది, 275 మంది అవుట్ సోర్సింగ్ సిబ్బంది, మూడు క్యాంపస్లలో 31 కోర్సులకు విస్తరించిందన్నారు. అందరి సహకారంతో రాబోయే రోజుల్లో మరిన్ని కోర్సులను తెలంగాణ యూనివర్సిటీలో ప్రారంభించేందుకు కృషి చేస్తామన్నారు. కంట్రోలర్ సంపత్ కుమార్, యూజీసీ కోఆర్డినేటర్ ఆంజనేయు లు,ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపాల్ సీహెచ్ ఆరతి, అధ్యాపకులు అపర్ణ,రవీందర్రెడ్డి,ఎల్లోసా,అతీక్ సుల్తాన్ ఘోరి,సత్యనారాయణరెడ్డి,వాణి,భ్రమరాంబిక,స్రవంతి,నీలిమ,అసిస్టెంట్ రిజిస్ట్రార్ సా యాగౌడ్, ఏఈ వినోద్, తదితరులు పాల్గొన్నారు. -
కుక్కర్ పేలి ఎండీఎం కార్మికురాలికి గాయాలు
మాక్లూర్: పాఠశాలలో మధ్యాహ్న భో జనం (ఎండీఎం) వండుతున్న కార్మికురాలికి తీవ్ర గాయాలు అయ్యాయి. వివరాలు ఇలా.. మండలంలోని అమ్రాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బుధవారం మధ్యాహ్నం రాంపూర్ లలిత అనే కార్మికురాలు వంట చేస్తుండగా ప్రమాదవశాత్తు కుక్కర్ పేలింది. దీంతో కుక్కర్లోని పప్పు ముఖంపై చిల్లి తీవ్రంగా గాయపడింది. ఉపాధ్యాయులు వెంటనే గమనించిన ఆమెను చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం ఆమె కుటుంబ సభ్యులు ప్రయివేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతంలలిత ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు కుటుంబసభ్యులు తెలిపారు. విషయం తెలిసిన ఏఐటీయూసీ, మధ్యాహ్న భోజన కార్మిక సంఘం నాయకులు గురువారం ఆస్పత్రిలో లలితను పరామర్శించారు. లలిత వైద్యఖర్చులన్ని జిల్లా విద్యాశాఖ భరించాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఓమయ్య, మధ్యాహ్న భోజన కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చక్రపాణి డిమాండ్ చేశారు. లేనిచో జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. గోడ కూలి వృద్ధ దంపతులకు .. మద్నూర్(జుక్కల్): మండలంలోని హండేకేలూర్లో ఇంట్లోని గోడ కూలడంతో వృద్ధ దంపతులకు గాయాలయ్యాయి. వివరాలు ఇలా.. హండేకేలూర్లోని ఇంట్లో తుమ్మల్వార్ హన్మండ్లు, రుక్మిణీబాయి అనే వృద్ధ దంపతులు నివాసం ఉంటున్నారు. గురువారం ప్రమాదవశాత్తు ఇంట్లోని గోడ కూలి వారిపై పడటంతో గాయపడ్డారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ ముజీబ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దరాస్ సాయిలు ఘటన స్థలానికి చేరుకొని, బాధితులను చికిత్స నిమిత్తం మద్నూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కొన్ని రోజుల క్రితం భారీ వర్షాలు కురవడంతో హన్మండ్లు ఇంటి గోడ నాని తడిసిపోవడంతో కూలిపోయిందని స్థానికులు తెలిపారు. వర్షాలకు దెబ్బతిన్న ఇళ్లలో ఉండరాదని, ప్రమాదాన్ని కొనితెచ్చుకోవద్దని దరాస్ సాయిలు సూచించారు. గ్రామంలో శిథిలావస్థకు చేరిన ఇళ్లను పరిశీలించారు. బైక్ను ఆటో ఢీకొనడంతో దంపతులకు.. ఖలీల్వాడి: నగరంలోని కుమార్గల్లీ వద్ద ఆటో, బైక్ను ఢీకొడంతో ఇద్దరికి గాయాలైన్నట్లు ఒకటో టౌన్ ఎస్హెచ్వో రఘుపతి తెలిపారు. వివరాలు ఇలా.. నగరంలోని కుమార్గల్లీ వద్ద బైక్పై సాయిలు, అతడి భార్య వెళుతుండగా వెనుక నుంచి ఆటో వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో సాయిలు, అతడి భార్యకు తీవ్రగాయాలు అయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్హెచ్వో తెలిపారు. -
చిత్రం.. సందేశాత్మకం
ఆర్మూర్లోని రోడ్డు పక్కన గోడలపై వేసిన చిత్రాలుఆర్మూర్టౌన్ : మొన్నటి వరకు కళావిహీనంగా కనిపించిన గోడలు.. ప్రస్తుతం సందేశాత్మక చిత్రా లతో ఆకట్టుకుంటున్నాయి. ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రితోపాటు వివిధ కార్యాలయాలు, కూరగాయల మార్కెట్ ప్రహరీలు కొత్తందాలను సంతరించుకుంటున్నాయి. సర్కారీ గోడలపై అద్భుతమైన పెయింటింగ్స్ వేస్తూ పట్టణ పురపాలక సంస్థ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చు ట్టింది. రూ. 4 లక్షలతో శుభ్రత, పారిశుద్ధ్యం, ప ర్యావరణ పరిరక్షణ, మాదక ద్రవ్యాలను మాన్పించడం, తెలంగాణ సంస్కృతి, రైతుల గౌరవం వంటి అంశాలు ప్రతిబింబించేలా చిత్రాలను గీయిస్తున్నారు. ఇలాంటి చిత్రాలతో గోడ సమీపంలో చెత్త వేయాలనే ఆలోచన రాదని, అవగాహన సైతం పెరుగుతుందని పుర ప్రజలు చెబుతున్నారు. ఆర్మూర్ పట్టణాన్ని అందంగా మార్చడమే లక్ష్యం. ప్రజల్లో వివిధ అంశాలపై అవగాహన పెంపొందించేందుకు చిత్రాలు వేస్తున్నాం. దీంతో పరిసరాలు శుభ్రంగా ఉంటాయి. చెత్త వేయాలన్న ఆలోచన రాదు. – రాజు, మున్సిపల్ కమిషనర్, ఆర్మూర్ -
గెస్ట్ ఫ్యాకల్టీ నియామకం కోసం ఇంటర్వ్యూలు
తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాలలో మ్యాథమెటిక్స్, ఫిజి క్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్, ఈసీఈ, ఈఈఈ, మెకా నికల్, సివిల్ ఇంజినీరింగ్ సబ్జెక్టులు బోధించటానికి గెస్ట్ ఫ్యాకల్టీ నియామకం కోసం గురువారం అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. సుమారు వందమంది అభ్యర్థులు రాగా, వర్సిటీ పరిపాలన భవనంలోని కాన్ఫరెన్స్ హాల్లో ఉదయం నుంచి ఇంటర్వ్యూలు చేశారు. తెయూ వీసీ యాదగిరిరావు, రిజిస్ట్రార్ యాదగిరి, ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఆరతి విషయనిపుణులను సమన్వయం చేశారు. వివిధ విభాగాల కోఆర్డినేటర్స్ నందిని, అతిక్ సుల్తాన్ ఘోరి, భ్రమరాంభిక, నీలిమ సాంకేతిక సహాయం అందించారు. ప్రశాంతంగా ఎంఈడీ పరీక్షలు తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో కొనసాగుతున్న ఎంఈడీ సెమిస్టర్ పరీక్షలు గురువారం ప్రశాంతంగా జరిగినట్లు అకడమిక్ ఆడిట్సెల్ డైరెక్టర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. ఎంఈడీ 4వ సెమిస్టర్ రెగ్యులర్, 1, 2, 3, 4వ సెమిస్టర్ బ్యాక్లాగ్ పరీక్షల్లో ఒక విద్యార్థికి గానూ ఒకరు హాజరైనట్లు ఆయన తెలిపారు. జాతీయస్థాయి బాస్కెట్బాల్ ఎంపికలకు జిల్లా జట్టు ఖరారు నిజామాబాద్నాగారం: నగరంలోని డీఎస్ఏ మైదానంలో గురువారం జిల్లా బాస్కెట్బాల్ సంఘం ఆధ్వర్యంలో సబ్ జూనియర్ బాలబాలికల జాతీయస్థాయి బాస్కెట్ బాల్ ఎంపికలకు జిల్లా క్రీడాకారులను ఎంపిక చేశారు. బాలుర విభాగంలో 13 మంది, బాలిక విభాగంలో ఏడుగురు ఎంపికయ్యారు. వీరిని ఈనెల 12న హైదరాబాద్లో నిర్వహించే జాతీయ స్థాయి ఎంపిక పోటీలకు పంపనున్నట్లు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బీరెల్లి విజయ్ రావు, బొబ్బిలి నరేష్ రావు, కార్యనిర్వాహక కార్యదర్శి నిఖిల్ తెలిపారు. సంఘ సభ్యులు శ్రీనివాస్, బెనర్జీ , విశాల్, ప్రణీత్, అరుణ్, నవీన్ పాల్గొన్నారు. -
దరఖాస్తులు పెండింగ్లో ఉంచొద్దు
● కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ● మున్సిపల్ అధికారులతో సమీక్ష నిజామాబాద్ సిటీ: మున్సిపల్ కార్పొరేషన్ పాలనపై కలెక్టర్, మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేక అధికారి వినయ్ కృష్ణారెడ్డి దృష్టి సారించారు. బల్దియా పాలన అస్తవ్యస్తంగా మారడంతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. రెండ్రోజుల క్రితం రెవెన్యూ అధికారులతో సమావేశమైన కలెక్టర్ తాజాగా గురువారం టౌన్ ప్లానింగ్ విభాగ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎల్ఆర్ఎస్, బిల్డింగ్ పర్మిషన్, ఆక్రమణల తొలగింపు, పెండింగ్ ఫైళ్లపై ఆరా తీశారు. పెండింగ్ ఫైళ్లను క్లియర్ చేయాలని ఏసీపీలు శ్రీనివాస్, శ్రీధర్రెడ్డిని ఆదేశించారు. ఎల్ఆర్ఎస్ ఫీజు తీసుకున్న వారికి వెంటనే ప్రొసీడింగ్స్ ఇవ్వాలని సూచించారు. సమావేశంలో కమిషనర్ దిలీప్ కుమార్, ఏసీపీలు శ్రీనివాస్, శ్రీధర్రెడ్డిలతోపాటు టీపీవో ప్రదీప్కుమార్, టీపీఎస్లు, టీపీబీవోలు పాల్గొన్నారు. నేడు జిల్లాకు మంత్రి వాకిటి శ్రీహరి ● ఐదు నియోజకవర్గాల్లో విస్తృత స్థాయి సమావేశాలు నిజామాబాద్ సిటీ: రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి శుక్రవారం జిల్లాలో పర్యటించనున్నట్లు డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్రెడ్డి తెలిపారు. నియోజకవర్గస్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొననున్నట్లు పేర్కొన్నారు. ఉదయం 11 గంటలకు నిజామాబాద్ రూరల్, మధ్యాహ్నం 12.30 గంటలకు ఆర్మూర్, 2.30కు బాల్కొండ, 3.45కు బోధన్, సాయంత్రం 5.30 గంటలకు నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ స్థాయి సమావేశాలకు హాజరవుతారు. మంత్రితోపాటు బోధన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యేలు డాక్టర్ భూపతిరెడ్డి, సుదర్శన్రెడ్డి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, నియోజకవర్గ ఇన్చార్జిలు వినయ్రెడ్డి, ముత్యాల సునీల్ రెడ్డి పాల్గొంటారని మానాల పేర్కొన్నారు. ‘సాగర్’ నుంచి 6వేల క్యూసెక్కుల నీటి విడుదల నిజాంసాగర్(జుక్కల్): ఎగువ నుంచి వరద వస్తుండడంతో నిజాంసాగర్ ప్రాజెక్టు ఒక గేటు ఎత్తి మంజీరలోకి నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు గురువారం సాయంత్రం తెలిపారు. ప్రాజెక్టులోకి 6,022 క్యూసెక్కుల ఇన్ఫ్లోగా వస్తుండగా, అదే స్థాయిలో అవుట్ ఫ్లో ఉందన్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1405 అడుగులు (17.8 టీఎంసీలు)కాగా ప్రస్తుతం 1404.99 అడుగుల (17.788 టీఎంసీలు) నీరు నిల్వ ఉంది. -
వాక్ స్వాతంత్య్రంపై దాడి
నూతన ఆర్థిక విధానా లు వచ్చిన తర్వాత కార్మికవర్గ సమస్య లు, రైతాంగ సమస్యలు పెరిగిపోతున్నాయి. వీటికోసం జరుగుతున్న ఉద్యమాలను బయటపెడుతున్న పత్రికలను తమ గుప్పిట్లో పెట్టుకోవడానికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అక్రమకేసులు పెడుతోంది. ఇది ఖచ్చితంగా వాక్ స్వాతంత్య్రంపై దాడిగానే పరిగణిస్తాం. పత్రికా స్వేచ్ఛపై దాడులు చేయడమంటే నాలుగో స్తంభానికి ప్రమాదం పొంచివున్నట్లే. దీనికి ప్రధాన బాధ్యత ప్రభుత్వాలదే. నిర్బంధం, అణచివేతలు ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు. ఇటువంటి అప్రజాస్వామిక చర్యలను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. అక్రమ కేసులను బేషరతుగా రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. – వుప్పల ప్రభాకర్, సీపీఐఎంఎల్ (ప్రజాపంథా) జిల్లాకమిటీ కార్యదర్శి -
అద్దె బస్సులతో ఆదాయం
డొంకేశ్వర్(ఆర్మూర్): సెర్ప్ అందిస్తోన్న రుణంతో మండల సమాఖ్యలు త్వరలోనే అద్దె బస్సులు కొనుగోలు చేసి ఆర్టీసీకి ఇవ్వనున్నాయని జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి సాయాగౌడ్ తెలిపారు. జిల్లా పరిషత్ మీటింగ్ హాల్లో గురువారం జిల్లా సమాఖ్య సమావేశం నిర్వహించారు. డీఆర్డీవో మాట్లాడుతూ ప్రభుత్వం ఒక్కో మండల సమాఖ్యకు రూ.30 లక్షల రుణమిచ్చి బస్సులు కొనుగోలు చేయిస్తుందని, ఈ బస్సులను ఆర్టీసీకి అద్దెకు ఇస్తే నెలకు రూ.70 వేల వరకు ఆదాయం వస్తుందన్నారు. మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీ, సీ్త్రనిధి రుణాలను లక్ష్యానికి అనుగుణంగా పంపిణీ చేయాలన్నారు. మేకలు, గొర్రెలు, పెరటి కోళ్ల పెంపకానికి సీ్త్రనిధి ద్వారా రుణాలు అందజేయాలన్నారు. సమావేశంలో ఏపీడీ మధుసూదన్, డీపీఎంలు నీలిమా, కిరణ్, సంధ్యారాణి, మోహన్, రాజేశ్వర్, జెడ్ఎస్ అధ్యక్షురాలు హేమలత, కార్యదర్శి మమత పాల్గొన్నారు. ● డీఆర్డీవో సాయాగౌడ్ -
భావప్రకటనపై పాశవిక దాడి
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : భావ ప్రకటన స్వేచ్ఛను హరించేలా ఆంధ్రప్రదేశ్లోని చంద్రబా బు ప్రభుత్వం ‘సాక్షి’ ఎడిటర్ ఆర్ ధనంజయ్రెడ్డి, ఇతర పాత్రికేయులపై అక్రమంగా కేసులు బనా యించడంపై అన్ని వర్గాలు ముక్తకంఠంతో ఖండిస్తున్నాయి. 2024 జూన్ లో టీడీపీ ఆధ్వర్యంలోని కూట మి ప్రభుత్వం వచ్చాక పత్రికా స్వేచ్ఛను, ప్రశ్నించే గొంతులను భౌతిక దాడుల ద్వారా, పోలీసులను ఉపయోగించి తప్పుడు కేసులు పెట్టి తీవ్రంగా అణిచివేస్తున్నారు. ప్రజాసమస్యలు, వివి ధ సామాజిక అంశాలపై ప్రతిపక్ష పార్టీల నాయ కులు నిర్వహించిన ప్రెస్మీట్లకు సంబంధించిన వా ర్తలు రాసిన సందర్భంలో ‘సాక్షి’ దినపత్రికతో పా టు ఎడిటర్, ఇతర జర్నలిస్టులపై కేసులు నమోదు చేస్తూ, భావ ప్రకటనా స్వేచ్ఛను తమ గుప్పిట్లోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల పక్షాన పనిచేసే జర్నలిస్టుల గొంతులను నొక్కేస్తున్న అప్రజాస్వామిక చర్యలపై పలువురి స్పందనలు.. పత్రికా స్వేచ్ఛను హరించడం దుర్మార్గం సాక్షి ఎడిటర్, పాత్రికేయులపై అక్రమ కేసుల నేపథ్యంలో పలువురి సంఘీభావం చంద్రబాబు ప్రభుత్వ తీరుపై ఖండన -
సాక్షి జర్నలిస్టులపై దాడులు హేయమైన చర్య
ఆంధ్రప్రదేశ్లో సాక్షి పత్రిక, ఛానల్ కార్యాలయాలతో పాటు జర్నలిస్టులపై రాజకీయ క క్షతో దాడులకు పా ల్పడటం హేయమైన చర్య. పత్రికా వ్యవస్థపై దాడులను జర్నలిస్టు సంఘాలు సహించవు. నిజాలు రాస్తే జీర్ణించుకోలేని పాలకులు ఇలాంటి దాడుల తో రాబోయే తరాలకు ఏం సందేశం ఇస్తున్నారో అ ర్థం కాని పరిస్థితుల్లో సమాజం ఉంది. తప్పులు రాస్తే కోర్టులను ఆశ్రయించే అవకాశం ఉన్నప్పటికీ.. ప్రశ్నించే గొంతుకను అణచివేసేందుకు దాడు లు జరిపినంత మాత్రాన జర్నలిస్టులు భయప డతారని అనుకోవడం భ్రమనే అవుతుంది. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధులుగా వ్యవహరిస్తు న్న జర్నలిస్టులపై దాడులను ప్రతిఒక్కరు ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. – దురిశెట్టి నర్సింహా చారి, సీనియర్ జర్నలిస్టు, నిజామాబాద్ -
అడ్డూఅదుపూ లేని స్కానింగ్ దందా
నిజామాబాద్నాగారం: జిల్లాలో స్కానింగ్ సెంటర్లు ఇష్టారాజ్యాంగా వ్యవహరిస్తూ ప్రజలను దోచుకుంటున్నాయి. ధరల నియంత్రణ లేకపోవడంతో ఒ క్కో సెంటర్లో ఒక్కో రకంగా దోపిడీ కొనసాగుతోంది. రోగుల అత్యవసరాన్ని ఆసరాగా చేసుకుంటూ డబ్బులు వసూలు చేస్తున్నాయి. రిఫరల్ డాక్టర్లకు కమీషన్లు ముట్టజెబుతూ అందినంత దోచేస్తున్నారు. అర్హతలేని వారితో సెంటర్లను నిర్వహిస్తూ లక్షల్లో సంపాదిస్తున్నారు. కన్నెత్తి చూడని అధికారులు.. గర్భిణులతోపాటు కడుపునకు సంబంధించి ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తినా స్కానింగ్ చేయించాల్సిందే. చెస్ట్, గ్యాస్ట్రో, లివర్ తదితర సమస్యలు తెలుసుకునేందుకూ సంబంధిత వైద్యులు స్కానింగ్కు రిఫర్ చేస్తున్నారు. అందులో వచ్చే రిపోర్టు ఆధారంగానే వైద్యులు చికిత్స చేస్తారు. గాయాలు, తలనొప్పి, చెస్ట్, నరాల సమస్య ఎదుర్కొనే రోగులకు ఆర్థో వైద్యులు ఎక్కువగా ఎక్స్ రే, సీటీ స్కాన్, ఎమ్ఆర్ఐలను రాస్తుంటారు. ● ఎక్స్ రే కోసం రూ.500 నుంచి రూ.1200, స్కానింగ్కు రూ.800 నుంచి రూ.2000 వరకు రోగుల నుంచి నిర్వాహకులు వసూలు చేస్తున్నారు. ఇక సీటీస్కాన్, ఎమ్ఆర్ఐల విషయానికొస్తే ఫీజులు వేలల్లో ఉంటున్నాయి. జిల్లా వ్యాప్తంగా 137 స్కానింగ్ సెంటర్లు, 29 ఎక్స్రే, 16 సీటీ స్కాన్, 4 ఎమ్ఆర్ఐలు ఉన్నాయి. పలు సెంటర్లలో ధరల నియంత్రణ పాటించడం లేదు. పేరుకు మాత్రమే ధరల బోర్డు ప్రదర్శిస్తూ ఇష్టారీతిన వసూలు చేస్తున్నారని రోగుల బంధువులు ఆరోపిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న స్కానింగ్ సెంటర్లలో తనిఖీలు చేయాల్సిన వైద్యారోగ్యశాఖ అటువైపు కన్నెత్తి చూడటం లేదనే విమర్శలు వస్తున్నాయి. అంతా రిఫరల్ జిల్లాలో సీనియర్ వైద్యులు సొంతగా ఆస్పత్రులు నడుపుతూ అవసరం ఉంటేనే ఎక్స్రే, స్కానింగ్, సీటీస్కాన్, ఎమ్ఆర్ఐ చేయించుకోవాలని రోగులకు సలహా ఇస్తున్నారు. కానీ, మేనేజ్మెంట్ ఆస్పత్రుల్లోని వైద్యులు మాత్రం ప్రతి చిన్న సమస్యకు ఎక్స్రే, సీటీస్కాన్, స్కానింగ్, ఎమ్ఆర్ఐలు రాస్తున్నారు. ఇలా రిఫరల్ దందా చేస్తూ కొంతమంది వైద్యులు కమీషన్లు తీసుకుంటున్నారని బహిరంగంగా చర్చించుకుంటున్నారు. రూ.1000 ఫీజుకు రూ.200 చొప్పున కమీషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. బోర్డుపై ఓ రేటు.. వసూలు చేసేది మరో రేటు ఎక్స్రే, సీటీస్కాన్, ఎమ్మారైలకీ రిఫరల్ టెక్నీషియన్లుగా జూనియర్ల చెలామణి అంతంత మాత్రంగానే తనిఖీలు తనిఖీలు చేస్తున్నాం.. జిల్లాలోని అన్ని స్కానింగ్ సెంటర్లలో ఇప్పటికే తనిఖీలు చేశాం. పలుమార్లు హెచ్చరించాం. స్కానింగ్ విషయంలో తప్పుడు రిపోర్టులు ఇచ్చినట్లు మా దృష్టికి వస్తే కచ్చితంగా చర్యలు తీసుకుంటాం. సెంటర్లలో మళ్లీ తనిఖీలు చేయిస్తాము. ప్రత్యేక బృందం సైతం తనిఖీలు చేస్తూనే ఉంది. – రాజశ్రీ, జిల్లా వైద్యాధికారి జూనియర్లతోనే నిర్వహణ.. ఎక్స్రే, స్కానింగ్, సీటీస్కాన్, ఎమ్ఆర్ఐ ఏదీ తీ యాలన్నా అనుభవం ఉన్న టెక్నీషియన్ ఉండాలి. డీఎమ్ఐటీ (డిప్లొమా ఇన్ మెడికల్ ఇమేజింగ్ టెక్నాలజీ) కోర్సు చేసి, శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే మల్టీ, సూపర్ స్పెషాలిటీ, పెద్ద పెద్ద ప్రైవేట్ ఆస్పత్రుల్లో టెక్నీషియన్లకు రూ. 35 వేల నుంచి రూ. 50 వేల వరకు వేతనాలు ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో జూనియర్లకు రూ.20 వేల లోపు జీతాలు ఇచ్చి నిబంధనలకు విరుద్ధంగా నడిపిస్తున్నారు. జూనియర్లు ఇచ్చే స్కానింగ్ రిపోర్టులో తేడా వస్తే ఎవరు బాధ్యత వహిస్తారనేది ప్రశ్నార్థకంగా మిగులుతోంది. -
ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి
● కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి నిజామాబాద్అర్బన్: జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగంగా జరిగేలా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి బుధవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో మాట్లాడారు. వివిధ కారణాలతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు ముందుకురాని వారి స్థానంలో అర్హులైన కొత్త లబ్ధిదారులకు ఇళ్లను మంజూరు చేశామని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ఇందిరమ్మ కమిటీల ద్వారా కొత్త లబ్ధిదారులకు తెలియజేస్తూ, అందరూ మార్కింగ్ చేసుకొని నిర్మాణాలు ప్రారంభించేలా ప్రోత్సహించాలన్నారు. లబ్ధిదారులకు సెర్ప్, మెప్మా ద్వారా రుణాలు మంజూరయ్యేలా చొరవ చూపాలన్నారు. డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపు ప్రక్రియను సైతం వేగవంతం చేయాలని, ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా లబ్ధిదారులను గుర్తించి జాబితాలు సమర్పించాలని కలెక్టర్ సూచించారు. పంట పొలాల్లో ఉన్న ఇసుక మేటలను ఉపాధి హామీ కూలీలతో తొలగింపజేయాలన్నారు. పనుల జాతరలో భాగంగా మెటీరియల్ కాంపోనెంట్ కింద మంజూరైన మేజిక్ సోక్పిట్లు, పశువుల కొట్టాలు, వర్మీ కంపోస్ట్ తదితర నిర్మాణ పనులను వెంటనే చేపట్టి, సకాలంలో పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల భవనాలపై సౌర విద్యుత్ పలకాలను ఏర్పాటు చేసేందుకు వీలుగా మరోసారి క్షేత్రస్థాయిలో పరిశీలించి, సమగ్ర వివరాలతో నివేదికలు అందించాలన్నారు. వీసీలో అదనపు కలెక్టర్ అంకిత్, ట్రెయినీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావీ, డీఆర్డీవో సాయాగౌడ్, హౌసింగ్ పీడీ పవన్ కుమార్, ఈఈ నివర్తి, డీపీవో శ్రీనివాస్, డీఏవో గోవిందు తదితరులు పాల్గొన్నారు. -
ఉపాధ్యాయుల సర్దుబాటు
నిజామాబాద్అర్బన్: జిల్లా విద్యాశాఖలో నేటి నుంచి మరోసారి సర్దుబాటు ప్రక్రియ నిర్వహించనున్నారు. గతంలో చేపట్టిన ఉపాధ్యాయుల సర్దుబాటు, ఇటీవల చేపట్టిన పదోన్నతులతో కేటాయింపుల్లో గందరగోళం ఏర్పడింది. దీంతో సర్దుబాటు ప్రక్రియ మళ్లీ మొదటికి వచ్చింది. 182 మందికి పదోన్నతులు.. వారం రోజుల క్రితం విభాగాల వారీగా మొత్తం 182 మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు లభించాయి. వీరిని సీనియారిటీ ప్రకారం పాఠశాలలకు కేటాయించారు. ఐతే, అంతకుముందే జిల్లాలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా 252 మంది టీచర్లను సర్దుబాటు చేశారు. రెండు ప్రక్రియలతో కేటాయింపుల్లో గందరగోళం ఏర్పడింది. పదోన్నతి పొందిన వారు, సర్దుబాటులోని ఉపాధ్యాయులు ఒకే పాఠశాలలకు కేటాయించబడ్డారు. దీంతో సర్దుబాటులో భాగంగా వెళ్లిన టీచర్లను విద్యాశాఖ మళ్లీ వెనక్కి పిలిపించి ఇతర ప్రాంతాలకు సర్దుబాటు చేసే ప్రక్రియ మొదలుపెట్టింది. పదోన్నతి పొందిన వారు వారికి కేటాయించిన పాఠశాలల్లోనే ఉండేలా ఆదేశాలు జారీ చేశారు. కాగా, 46 మంది టీచర్లు పదోన్నతులను తిరస్కరించారు. దీంతో వీరిని పక్కనపెట్టి 136 టీచర్లకు సర్దుబాటు ప్రక్రియ చేపట్టనున్నారు. ఐతే, పదోన్నతులు తిరస్కరించిన టీచర్ల స్థానంలో అంతకుముందే సర్దుబాటులో వెళ్లిన టీచర్లు విధులు నిర్వర్తించనున్నారు. కాగా, మరోసారి సర్దుబాటు ప్రక్రియ నిర్వహించేందుకు నిజామాబాద్, బోధన్, ఆర్మూర్ ఎంఈవోలతో కమిటీని ఏర్పాటు చేశారు. వీరు నేటి నుంచి సర్దుబాటు ప్రక్రియ చేపట్టనున్నారు. అవసరమైన పాఠశాలలకు.. పదోన్నతి పొందిన టీచర్లకు పాఠశాలలు కేటాయించాం. అప్పటికే సర్దుబాటు ద్వారా అక్కడ ఉన్న టీచర్లను వెనక్కి పిలిపించి మళ్లీ అవసరమైన పాఠశాలలకు కేటాయిస్తాం. పదోన్నతి వదులుకున్న టీచర్లను వారి సర్వీస్ బుక్కుల్లో నాట్ విల్లింగ్ నమోదు చేస్తాం. – అశోక్, డీఈవో పదోన్నతులతో కేటాయింపుల గందరగోళం ప్రమోషన్లు తిరస్కరించిన 46 మంది టీచర్లు 136 మందికి మరోసారి కేటాయింపులు నేటి నుంచి ముగ్గురు ఎంఈవోలతో పరిశీలన -
జలసిరులు
డొంకేశ్వర్(ఆర్మూర్): జిల్లాలో భూగర్భ జలాలు పెరిగాయి. ఆగస్టు నెలలో కురిసిన భారీ వర్షాలు భూగర్భ జలాల పెరుగుదలకు ఎంతో దోహదప డ్డాయి. లోటు పరిస్థితి నుంచి మేలైన స్థాయికి తీ సుకొచ్చాయి. జూలై వరకు 11.76 మీటర్ల లో తులో ఉన్న జలాలు ఆగస్టు ముగిసే నాటికి సరా సరి 8.48 మీటర్లకు వచ్చాయి. అంటే ఒక్క నెలలోనే ఏకంగా 3 మీటర్ల వరకు పెరిగాయి. ఇది గ తేడాది ఆగస్టు (8.66 మీటర్లు)తో పోలిస్తే మెరుగైన పరిస్థితి. వర్షాకాలంలో ఇప్పటి వరకు 78 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవగా, ఇందులో సగం మేర ఆగస్టులోనే వర్షం కురిసింది. వరదలు పోటెత్తి భూగర్భంలో ఊట భా రీగా చేరింది. మే నెల నుంచి ఆగస్టు నాటికి వచ్చే సరికి మొత్తంగా 4 మీటర్లు పెరిగాయి. వచ్చే ఏడాది వరకు బోరుబావులు, సాగునీటికి ఎలాంటి ఢోకా ఉండదని గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ అధికారి శ్రీనివాస్ బాబు పేర్కొన్నారు. 53 ఫిజోమీటర్లలో పుష్కలంగా జలం... ఆగస్టు మాసానికి సంబంధించిన భూగర్భ జలాల లెక్కలను ఇటీవల గ్రౌండ్వాటర్ డిపార్ట్మెంట్ తీసింది. జిల్లా వ్యాప్తంగా 82 ఫిజోమీటర్ల ద్వారా నీటి లెక్కలను సేకరించింది. ఇందులో 53 ఫిజోమీటర్లలో 10 మీటర్ల లోపు నీటి మట్టాలున్నాయి. 25 ఫిజోమీటర్లలో 10–20 మీటర్ల లోపు, నాలుగు ఫిజో మీటర్లలో 20 మీటర్ల లోతులో జలాలున్నాయి. జిల్లా వ్యాప్తంగా 65–85 శాతం వరకు భూగర్భ జలాలు పుష్కలంగా విస్తరించి ఉన్నాయి. ఇది వరకు కురిసిన వర్షాలతోపాటు మున్ముందు కూడా పడే అవకాశం ఉండడంతో మరికొంత మేర భూరగ్భ జలాలు పెరిగే అవకాశం ఉంది. నెలల వారీగా భూగర్భ జలాలు (మీటర్లలో) భూగర్భ జలాలు ౖపైపెకి.. జిల్లాలో సరాసరి నీటిమట్టం 8.48 మీటర్లు భారీ వర్షాలతో తీరిన నీటి లోటు -
ఐలమ్మ స్ఫూర్తి అందరికీ ఆదర్శం
● కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి నిజామాబాద్అర్బన్: తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి అందరికీ ఆదర్శమని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఐలమ్మ వర్ధంతిని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. వినాయక్నగర్లోని ఐలమ్మ విగ్రహానికి కలెక్టర్, అదనపు కలెక్టర్ అంకిత్, ఇతర అధికారులు, వివిధ కుల సంఘాల ప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పెత్తందారి వ్యవస్థకు వ్యతిరేకంగా చాకలి ఐలమ్మ స్ఫూర్తిదాయకమైన పోరాటం చేశారని గుర్తుచేశారు. కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి నర్సయ్య, వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. మరోసారి ఇంటర్ అడ్మిషన్ లాగిన్ ● మార్పులకు రెండ్రోజులు అవకాశం నిజామాబాద్అర్బన్: ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్, ఇతర అన్ని సాంఘిక సంక్షేమ గు రుకుల కళాశాలలో ఇంటర్ అడ్మిషన్ల లాగిన్ ఓపె న్ చేస్తున్నట్లు డీఐఈవో రవికుమార్ తెలిపారు. ఈ నెల 11, 12 తేదీలలో అడ్మిషన్ లాగిన్ మార్పులు, ఇతర పనులు పూర్తి చేసుకోవాలని సూచించారు. ప్రైవేటు కళాశాలలో నామినల్ రోల్ కరెక్షన్ కోసం ప్రతి విద్యార్థికి రూ.200 చొప్పున చెల్లించాల్సి ఉంటుందని, ప్రభుత్వ కళాశాల విద్యార్థులకు ఎలాంటి రుసుము ఉండదని తెలిపారు. మరోసారి అడ్మిషన్ లాగిన్ ఉండదని, ప్రక్రియ పూర్తి చేసుకోవాలన్నారు. -
సేవ చేసేందుకు ఇష్టం లేక హత్య
బోధన్రూరల్: వృద్ధురాలికి సేవ చేసేందుకు ఇష్టం లేని కుటుంబీకులు హత్య చేసిన ఘటన సాలూర మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఘటనకు సంబంధించి బోధన్రూరల్ ఎస్సై మచ్చేందర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. సాలూర మండల కేంద్రానికి చెందిన కట్టం నాగవ్వ(65) అనారోగ్యంతో బాధపడుతోంది. ఆమెకు భర్త, కుమారులు లేకపోవడంతో మరిది చిన్న గంగారాం వద్ద ఉంటోంది. ఆమెకు సేవలు చేసేందుకు ఇష్టం లేని గంగారాం, భార్య, కుమారుడు గొంతు నులిమి హత్య చేశారు. వృద్ధురాలి వద్ద ఉన్న డబ్బు, బంగారం కోసమే నిందితులు హత్య చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. నిజామాబాద్ రూరల్: ప్రేమ విఫలమై ఓ యువకుడు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు రూరల్ ఎస్హెచ్వో మహ్మద్ ఆరిఫ్ బుధవారం తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. రూరల్ పీఎస్ పరిధిలోని చంద్రశేఖర్ కాలనీకి చెందిన సూరజ్రావు(22), అదే కాలనీకి చెందిన ఓ అమ్మాయి గత ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇటీవల ఆ అమ్మాయి వేరే యువకుడితో ప్రేమలో ఉందని తెలిసి తట్టుకోలేక మంగళవారం రాత్రి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్హెచ్వో తెలిపారు. నిజామాబాద్ రూరల్: మండలంలోని మాధవనగర్ రైల్వే గేటును బుధవారం టాటా ఏఎస్ వాహనం ఢీకొనడంతో మధ్యలో విరిగిపోయింది. ఉదయం 11:30 ప్రాంతంలో రైలు వస్తుందని గేట్మన్ గేటు వేస్తుండగా గేటు దాటి త్వరగా వెళ్లాలని నిజామాబాద్ నుంచి కామారెడ్డి వైపు వెళ్తున్న టాటా ఏస్ వాహనం గేటును ఢీకొన్నదని గేట్మన్ తెలిపారు. గేట్ మధ్యలో విరిగిపోవడంతో సిబ్బంది పునరుద్ధరణ పనులు చేపడుతున్నారు. ప్రస్తుతం తాత్కాలిక గేటు వేసి రైలు వచ్చిన ప్రతిసారి ప్రయాణికులను సిబ్బంది ఆపుతున్నారు. మరమ్మతులు ఇంకా పూర్తికాకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. -
గోడకూలి ఒకరి మృతి
భిక్కనూరు: మండల కేంద్రంలో గోడకూలి ఒకరు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. మండల కేంద్రానికి చెందిన జాగీర్సింగ్(37) రేకుల షెడ్డుల నిర్మాణంతో పాటు షటర్లను తయారు చేస్తూ కుటుంబంతో కలిసి జీవిస్తున్నాడు. గత నెలలో కురిసిన భారీ వర్షానికి జాగీర్సింగ్ ఇల్లు కూలిపోవడంతో పక్కనే ఉన్న బంధువుల ఇంట్లో ఉంటున్నారు. బుధవారం వేకువజామున కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్తుండగా వర్షానికి కూలిన ఇంటి గోడ జాగీర్సింగ్పై పడింది. విషయాన్ని గమనించిన స్థానికులు, కుటుంబీకులు వెంటనే కామారెడ్డి ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అతను మృతి చెందినట్లు తెలిపారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు. మృతుడికి భార్య, నలుగురు కుమార్తెలు, అంధుడైన ఓ కుమారుడు ఉన్నారు. రుద్రూర్: మండల కేంద్రంలోని పెద్ద చెరువులో ప్రమాదవశాత్తు గాండ్ల సావిత్రి అలియాస్ సాయమ్మ (52) అనే మహిళ పడి మృతి చెందినట్లు ఎస్సై సాయన్న బుధవారం తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన సాయమ్మ మంగళవారం చెరువులో బట్టలు ఉతకడానికి వెళ్లి జారి పడిపోయిందని తెలిపారు. బుధవారం చెరువులో మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించినట్లు ఎస్సై తెలిపారు. ఖలీల్వాడి: నగరంలోని జడ్పీ చౌరస్తా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందినట్లు మూడో టౌన్ ఎస్సై హరిబాబు బుధవారం తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. నగరంలోని ఖిల్లా రోడ్డుకు చెందిన మహేశ్(32) పని నిమిత్తం అశోక్ లీలాండ్ వెహికల్పై వస్తున్నాడు. డ్రైవర్ గాటే ఖండూ వాహనాన్ని అతివేగంగా నిర్లక్ష్యంగా నడపడంతో వాహనం వెనకాల కూర్చొని ఉన్న మహేశ్ వాహనం పైనుంచి కిందపడ్డాడు. ఈ ఘటనలో అతని తలకు తీవ్రగాయం కావడంతో స్థానికులు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. నవీపేట: మండలంలోని యంచ శివారులో జరుగుతున్న జాతీయ రహదారి(బీబీ 161)విస్తరణ పనుల కోసం డంప్ చేసిన స్టీల్ నుంచి పీరాజీ అనే వ్యక్తి 2 టన్నులు దొంగిలించినట్లు ఎస్సై తిరుపతి తెలిపారు. పనులు నిర్వహిస్తున్న అనూష ప్రాజెక్ట్స్ లిమిటెడ్ మేనేజర్ పార్థసారధి ఫిర్యాదు మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు. -
ఓ నాన్న నువ్వెక్కడున్నవే..
సదాశివనగర్: నాన్న నేను మన ఊరికి వస్తున్న.. ఆ క్షేమంగా రా బిడ్డ నీకోసం మేమంతా ఎదురుచూస్తున్నాం అంటూ ఫోన్లో ప్రేమగా మాట్లాడిన ఆ తండ్రి ఇక లేడని తెలిసిన ఆ కుమారుడి హృదయం ఎంతో తల్లడిల్లిపోయింది. కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగా లేని ఓ కుమారుడు దుబాయికి వెళ్లి మొదటిసారిగా ఇంటికి వస్తుండడంతో ఆ కుటుంబం ఎంతో సంతోషంతో నిండిపోయింది. మరుసటి రోజు కుమారుడు ఇంటికి చేరుతాడనే కొన్ని గంటల వ్యవధిలోనే మృత్యువు గుర్తు తెలియని వాహన రూపంలో తండ్రిని కబళించింది. ఈ ఘటన సదాశివనగర్ మండలం కుప్రియల్ జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని పద్మాజీవాడి గ్రామానికి చెందిన మ్యాదరి బాలయ్య(53) ఆరేపల్లి శివారులోని ఓ ఆయిల్ కంపెనీలో పనిచేస్తున్నాడు. మంగళవారం రాత్రి పని ముగించుకొని బైక్పై స్వగ్రామానికి వస్తుండగా దారి వెంట రోడ్డుపై నడుచుకుంటు వెళ్తున్న బోధన్ ప్రాంతానికి చెందిన సయ్యద్ బాసిద్ను ఢీకొన్నాడు. దీంతో వాహనం అదుపు తప్పి బాలయ్య రోడ్డు పై పడడంతో కామారెడ్డి నుంచి నిజామాబాద్ వైపునకు వస్తున్న గుర్తు తెలియని వాహనం అతనిపై నుంచి వెళ్లింది. ఈ ఘటనలో బాలయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్ ఢీకొన్న ఘటనలో బాసిద్కు గాయాలు కావడంతో స్థానికులు ఆస్పత్రికి తరలించారు. కాగా బాసిద్ మతిస్థిమితం కోల్పోయి కొంత కాలంగా రోడ్డుపై తిరుగుతున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా బుధవారం ఉదయం దుబాయి నుంచి స్వగ్రామానికి చేరిన కుమారుడు శివకుమార్ తండ్రి బాలయ్య మృతదేహాన్ని చూసి బోరున విలపించాడు. డాడీ ఫ్లయిట్ ఎక్కుతున్న అంటే జాగ్రత్తగా రా బిడ్డ అన్నవు.. నువ్వెక్కడున్నవే నాన్న అంటూ ఆ కుమారుడు రోదన తీరు స్థానికులను కంటతడి పెట్టించింది. మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పుష్పరాజ్ పేర్కొన్నారు.● రోడ్డు ప్రమాదంలో తండ్రి మృతి ● కుమారుడు దుబాయి నుంచి వస్తున్న రోజే ఘటన ● పద్మాజీవాడిలో విషాదం -
‘వరద’ సద్వినియోగం
● వరద కాలువ ద్వారా నీటి విడుదల ● నిండుతున్న చెరువులు ● హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు బాల్కొండ: ఎస్సారెస్పీ నుంచి మిగులు జలాలను సద్వినియోగం చేసుకునేందుకు నిర్మించిన వరద కాలువ ప్రస్తుత సంవత్సరం సద్వినియోగమవుతోంది. ఈ వరద కాలువ నిర్మాణం ప్రాజెక్ట్ మిగులు జలాలు గోదావరిలోకి వదలకుండా కాలువ ద్వారా వదిలి నల్గొండ జిల్లాలో 2.2 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించేందుకు చేపట్టారు. కానీ మారిన అనేక పరిణామాల్లో వరద కాలువ ఎస్సారెస్పీ పునరుజ్జీవనానికి రివర్స్ పంపింగ్ కోసం నీటి సరఫరా చేసే కాలువ అయింది. ప్రస్తుతం ప్రాజెక్ట్లోకి ఎగువ ప్రాంతాల నుంచి వరద వచ్చి చేరుతుండటంతో 28 రోజుల నుంచి కాలువ ద్వారా నీటి విడుదలను చేపడుతున్నారు. వరద కాలువ ద్వారా విడుదలవుతున్న నీరు సద్వినియోగం అవుతోంది. బాల్కొండ నియోజక వర్గంలోని 16 చెరువులను నింపేందుకు 9 తూంలను ఏర్పాటు చేశారు. 9 చెరువుల తూం ల ద్వారా చెరువులకు నీటి సరఫరా జరుగుతోంది. నియోజక వర్గంలో 1529 ఎకరాలకు సాగునీరు అందుతోంది. వరద కాలువ ద్వారా నీటి విడుదల కొనసాగుతుండడంతో వరద కాలువ పరివాహక ప్రాంతంలోని భూగర్భ జలాలు సమృద్ధిగా పెరుగుతాయని రైతులు పేర్కొంటున్నారు. మధ్యమానేరు నింపేందుకు.. ప్రాజెక్ట్ నుంచి వరద కాలువ ద్వారా నీటి విడుదలను చేపట్టి మధ్యమానేరు డ్యాం(ఎంఎండీ) నింపుతున్నారు. గత నెల రోజుల వ్యవధిలో 45 టీఎంసీల నీటిని వరద కాలువ ద్వారా వదిలారు. వరద కాలువ 122 కిలోమీటర్ల పొడవున ఉంది. కాలువ మొత్తం 35 తూంలు, 16 చెక్ డ్యాంలు ఉన్నాయి. ప్రస్తుతం అన్నింటికి నీటి సరఫరా జరిగేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మిగులు జలాలు వరద కాలువ ద్వారా విడుదలవుతున్నాయి. ఎస్సారెస్పీ నీటి వివరాలను తెలుసుకోవడానికి నీటి విడుదల ప్రారంభ సమయంలో ఎంఎండీ ఎస్ఈ సుమతి ప్రాజెక్ట్కు వచ్చారంటే నీటి ఆవశ్యకత ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. వరద కాలువ ద్వారా విడుదలవుతున్న ప్రతి నీటి చుక్కను సద్వినియోగం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. కొన్ని చోట్ల నీటి అవసరం లేక పోవడంతో ప్రస్తుత తూంలను ఓపెన్ చేయలేదు. రైతులు అధికారులకు సహకరించాలి. – గణేశ్, డిప్యూటీ ఈఈ, వరద కాలువ -
భార్యపై హత్యాయత్నం కేసులో భర్తకు ఐదేళ్ల జైలు
నిజామాబాద్ లీగల్: భార్యను మానసికంగా వేధించి కత్తితో గాయపర్చిన భర్తకు ఐదేళ్ల కఠిన కారాగార శిక్షను విధిస్తూ నిజామాబాద్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి సాయిసుధ బుధవారం తీర్పు వెల్లడించారు. వివరాలిలా ఉన్నాయి. నగరంలోని అంబేడ్కర్ కాలనీకి చెందిన తురేకార్ రాజమణికి, కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం సిర్పూర్కు చెందిన సోన్ కాంబ్లె యాదవ్తో 2018 లో వివాహమైంది. కాంబ్లె మద్యం తాగుతూ భార్య సంపాదనపై ఆధారపడేవాడు. ఆమె నిజామాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తుండేది. 27మే2021న ఆస్పత్రికి వెళ్లి తన వెంట రావాలని గొడవ చేశాడు. దీంతో ఆమె రాను అనడంతో తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆమైపె దాడి చేశాడు. పోలీసులు కాంబ్లైపె కేసు నమోదు చేశారు. బుధవారం నిందితుడు నేరం చేసినట్లు రుజువు కావడంతో జడ్జి ఐదేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ. వెయ్యి జరిమానాను విధించారు. జరిమానా చెల్లించకుంటే అదనంగా నెల రోజుల జైలు శిక్ష అనుభవించాలని జడ్జి తీర్పులో పేర్కొన్నారు. -
ఇంజినీరింగ్ విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పిస్తాం
తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం కల్పిస్తామని వైస్ చాన్స్లర్ టి.యాదగిరిరావు తెలిపారు. బుధవారం తెయూ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ సీహెచ్ ఆరతి అధ్యక్షతన నిర్వహించిన నూతన విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో పరిచయ కార్యక్రమంలో వీసీ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. వర్సిటీలో ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటు 18 ఏళ్ల సుధీర్ఘ కల అని, ఈ ప్రాంతంలో బడుగు బలహీన వర్గాలకు ఇంజినీరింగ్ విద్యను అందించేందుకు తెయూలో ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటుకు సీఎం అనుమతించారన్నారు. విద్యార్థులకు అధునాతన సాంకేతిక బోధనా పద్ధతులతో నాణ్యమైన విద్యను అందిస్తామన్నారు. కౌన్సిలింగ్ సమయంలో హాస్టల్ వసతి లేదని ప్రకటించామని, అయితే విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపకుల వినతి మేరకు ఇంజినీరింగ్ విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పించాలని నిర్ణయించినట్లు తెలిపారు. అలాగే తల్లిదండ్రులు సైతం తమ పిల్లలను నిరంతరం పర్యవేక్షించాలన్నారు. ప్రవేశపరీక్షలో వచ్చిన ర్యాంకు ముఖ్యం కాదని, ఇంజినీరింగ్లో చేరిన తర్వాత ఏం నేర్చుకున్నాం.. ఎలా జీవితంలో స్థిరపడ్డారనేదే ముఖ్యమని అన్నారు. ఫస్ట్ బ్యాచ్ విద్యార్థులైన మీరు తర్వాత వచ్చే బ్యాచ్ల విద్యార్థులకు ఆదర్శంగా నిలువాలని పిలుపునిచ్చారు. తెయూలో ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటుకు కృషి చేసిన టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్, రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, సహకరించిన రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డికి వీసీ ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో అధ్యాపకులు నందిని, అతిక్ సుల్తాన్ ఘోరి, భ్రమరాంబిక, నీలిమ, విద్యార్థులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
చాకలి ఐలమ్మ చరిత్ర మరువలేనిది
ఖలీల్వాడి: తెలంగాణ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ చరిత్ర మరువలేనిదని డీసీపీ బస్వారెడ్డి అన్నారు. నగరంలోని నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో చాకలి ఐలమ్మ వర్ధంతి నిర్వహించారు. ఆమె చిత్రపటానికి డీసీపీ పూలమాల వేసి నివాళులు అర్పించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ ప్రదర్శించిన ధైర్యసాహసాలు, ప్రజాస్వామిక పోరాటాలకు స్ఫూర్తిగా నిలిచాయన్నారు. కార్యక్రమంలో కార్యాలయ సూపరింటెండెంట్ శంకర్, బషీర్, వనజ రాణి, స్పెషల్ బ్రాంచ్ సీఐ శ్రీశైలం, రిజర్వ్ సీఐలు శ్రీనివాస్, తిరుపతి, సిబ్బంది పాల్గొన్నారు. -
చదువులో వెనుకబడ్డ వారిపై శ్రద్ధ వహించాలి
నిజామాబాద్అర్బన్: చదువులో వెనుకబడ్డ విద్యార్థులపై అధ్యాపకులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా ఇంటర్మీడియట్ అధికారి రవికుమార్ అన్నారు. నగరంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలను బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం అధ్యాపకులు, బోధనేతర సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ప్రతి అధ్యాపకుడు విద్యార్థుల హాజరుపై ప్రత్యేక శ్రద్ధ వహించి, ఫేస్ రికగ్నేషన్ సిస్టం ద్వారా హాజరు తీసుకోవాలని ఆదేశించారు. స్లిప్టెస్ట్లు నిర్వహించి మార్కులను రిజిస్టర్లలో ఎంట్రీ చేయాలని సూచించారు. కళాశాలలో నెలకొన్న అదనపు అధ్యాపకుల కొరతను ఇంటర్ బోర్డు అధికారుల దృష్టికి తీసుకెళ్తానని అన్నారు. సమావేశంలో బుద్ధిరాజ్, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు. -
కేఎఫ్సీలో ఫుడ్సేఫ్టీ అధికారుల తనిఖీలు
నిజామాబాద్ సిటీ/ నిజామాబాద్లీగల్: జిల్లా కేంద్రంలోని పలు హోటళ్లపై జిల్లా ఫుడ్సేప్టీ అధికారులు దాడులు చేశారు. బుధవారం సాయంత్రం నగరంలోని వేణుమాల్లో నిర్వహిస్తున్న కేఎఫ్సీపై ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్ సునీత బృందం తనిఖీలు చేపట్టారు. చికెన్, ఫాస్ట్ఫుడ్ తయారీలో ఉపయోగించే పదార్థాల శాంపిల్స్ సేకరించి ల్యాబ్కు పంపారు. మున్సిపల్ శానిటేషన్ అధికారులు సైతం తనిఖీలు చేశారు. కిచెన్ అపరిశుభ్రంగా ఉండటంతో రూ.10 వేల జరిమానా విధించారు. గత రెండు రోజుల క్రితం కేఎఫ్సీ చికెన్ ముక్కలు కుళ్లిపోయి ఉండ టం, పాచి వాసన వస్తుండటంతో కస్టమర్లు యజమానిని నిలదీశారు. నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో వీడియో తీసి వైరల్ చేశారు. దీంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు కేఎఫ్సీపై తనిఖీలు నిర్వహించారు. అనారోగ్యకర ఆహార పదార్థాలు సరఫరాచేస్తే చట్టరీత్యా చర్యలు తప్పవని శానిటరీ ఇన్స్పెక్టర్ సాజిద్ అలీ హెచ్చరించారు. తనిఖీల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు జి. నవీత, జి. విక్రమ్, శానిటరీ ఇన్స్పెక్టర్ ఆకుల సునీల్, సిబ్బంది ఉన్నారు. -
వైద్య సిబ్బందికి హెపటైటిస్ టీకాలు
నిజామాబాద్నాగారం: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో హెపటైటిస్ బి టీకాల కార్యక్రమాన్ని డీఎంహెచ్వో రాజశ్రీ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో మొదటి విడతలో హెపటైటిస్ బి వ్యాక్సిన్ను ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందికి ఇచ్చినట్లు పేర్కొన్నారు. వైద్య సిబ్బంది వారి విధుల్లో భాగంగా హెపటైటిస్ బి వ్యాధికి గురికాకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యగా ఈ టీకాలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో జీజీహెచ్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు, డీసీహెచ్ శ్రీనివాస ప్రసాద్, ప్రోగ్రామ్ ఆఫీసర్ తుకారం రాథోడ్, డీఐవో అశోక్, డిప్యూటీ డీఎంహెచ్వో అంజన, డీటీసీ దేవి నాగేశ్వరి, డాక్టర్ రాజు, డాక్టర్ సుప్రియ, వివిధ విభాగాల అధిపతులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. కామారెడ్డి రూరల్: కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని పాతరాజంపేటలో మంగళవారం మృతి చెందిన సల్మా బేగం అంత్యక్రియలు బుధవారం గ్రామస్తులు, దత్తత తీసుకున్న కుమార్తె కరిష్మా చేతుల మీదుగా నిర్వహించారు. సల్మాబేగం మృతి చెందగా హైదరాబాద్ నుంచి ఓ వ్యక్తి వచ్చి తానే సల్మాబేగం కుమారుడని తానే అంత్యక్రియలు చేస్తానని తెలుపగా అందుకు గ్రామస్తులు అంగీకరించలేదు. అయితే దత్తత తీసుకున్న కరిష్మా బేగంతో గ్రామస్తులు అంత్యక్రియలు నిర్వహించారు. ఇదిలా ఉండగా తానే కొడుకునని చెప్పుకొనే వ్యక్తి అంత్యక్రియల అనంతరం హైదరాబాద్ నుంచి వచ్చిన తన బంధువులతో కలిసి తిరిగి వెళ్లిపోయినట్లు గ్రామస్తులు తెలిపారు. -
సమస్య పరిష్కారం కోసం.. సాష్టాంగ నమస్కారం
● న్యాయం చేయాలని సబ్ కలెక్టర్ ఆఫీస్ ఎదుట వినూత్న నిరసనఆర్మూర్టౌన్: తమ భూమిని కబ్జా చేసిన కొందరు 12 ఏళ్లుగా ఇబ్బందులు పెడుతున్నారని నీరడి సాయన్న అనే వ్యక్తి కుటుంబ సభ్యులతో కలిసి సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట వినూత్న నిరసన తెలిపాడు. ఆర్మూర్ మండలంలోని ఇస్సాపల్లికి చెందిన నీరడి సాయన్న మంగళవారం సబ్ కలెక్టర్ కార్యాలయా నికి చేరుకొని కుటుంబ సభ్యులతో కలిసి సాష్టాంగ నమస్కారం చేస్తూ తన సమస్యను వివరించాడు. అనంతరం న్యాయం చేయాలని కోరుతూ సబ్కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియాకు వినతిపత్రం అందజేశారు. వివరాలు తెలుసుకున్న సబ్కలెక్టర్ న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద సాష్టాంగ నమస్కారం చేస్తున్న నీరడి సాయన్నసబ్కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియాకు తమ సమస్యను వివరిస్తూ.. -
ఉప రాష్ట్రపతి ఎన్నిక.. ఓటేసిన ఎంపీ అర్వింద్
వర్చువల్గా జీజీహెచ్లో క్యాన్సర్ సెంటర్ ప్రారంభం నిజామాబాద్నాగారం: జిల్లా కేంద్ర ప్రభుత్వ జ నరల్ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన డే కేర్ క్యాన్సర్ సెంటర్ను ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహా మంగళవారం వర్చువల్గా ప్రారంభించారు. సెంటర్లో క్యాన్సర్ రోగులకు ఉదయం నుంచి సాయంత్రం వరకు చికిత్స అందుతుందని, ఇప్పటివరకు హైదరాబాద్లోని ఎమ్జే క్యాన్సర్ ఆస్పత్రిలో మొదటి డోస్ చికిత్స పొందిన రోగులు రెండో డోస్ నుంచి డే కేర్ సెంటర్లోనే చికిత్స పొందవచ్చిన మంత్రి అన్నారు. అలాగే అవసరమైన సెంటర్లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. జీజీహెచ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్, ఆర్థో హెచ్వోడీ రాములు, డాక్టర్లు కిశోర్, చైతన్య, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
అంతా ఒక్కటయ్యారు..!
డొంకేశ్వర్(ఆర్మూర్): ఈ ఏడాది చేప పిల్లల పంపిణీ కోసం ప్రభుత్వానికి కాంట్రాక్టర్లు సహకరించడం లేదు. పాత బకాయిలు ఇవ్వకపోవడంతో కాంట్రార్లందరూ ఒక్కటై టెండర్లకు దూరంగా ఉన్నారు. మొదటగా ఆగస్టు 18నుంచి సెప్టెంబర్ 1వ తేదీ వరకు రాష్ట్ర శాఖ ఈ–ప్రొక్యూర్మెంట్ ద్వారా టెండర్లను ఆహ్వానించగా, ఒక గుత్తేదారు కూడా బిడ్ దాఖలు చేయలేదు. దీంతో టెండర్ల గడువు తేదీని ఈ నెల 8వ తేదీ వరకు పొడగించింది. రెండోసారి పొడిగించిన గడువు సైతం ముగియగా కాంట్రాక్టర్లు బిడ్లు వేయలేదు. ప్రభుత్వం మళ్లీ ఈనెల 12వ తేదీ వరకు గడువును పెంచింది. మూడోసారైనా టెండర్లు దాఖలవుతాయో లేదో చూడాలి. గత రెండేళ్లలో చేప పిల్లలు సరఫరా చేసిన కాంట్రాక్టర్లకు బకాయి బిల్లులు రావాల్సి ఉంది. వాటిని చెల్లించకుండా ప్రభుత్వం ఈ ఏడాది టెండర్లు చేపట్టడంపై కాంట్రాక్టర్లు అసంతృప్తితో ఉన్నారని తెలిసింది. ఈ పరిస్థితి నిజామాబాద్ జిల్లాతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. జిల్లాకు సంబంధించిన కాంట్రాక్టర్లకు పాత బకాయిలు రూ.4కోట్లకు పైగా రావాల్సి ఉంది.లక్ష్యం.. 4.54 కోట్ల చేప పిల్లలు..ఈ ఏడాది జిల్లాలోని 976 చెరువుల్లో 4.54కోట్ల చేప పిల్లలు వదలాలని మత్స్య శాఖ లక్ష్యంగా పెట్టుకుని రాష్ట్ర శాఖకు ప్రతిపాదనలు పంపింది. ఇందులో 35 నుంచి 40ఎంఎం అలాగే 80 నుంచి 100 ఎంఎం చేప పిల్లలున్నాయి. వాస్తవానికి జూలైలో టెండర్లు పూర్తి చేసి ఆగస్టులో చేప పిల్లలను చెరువుల్లో వదలాలి. కానీ.. టెండరు ప్రక్రియను ప్రభుత్వం ఆలస్యం చేసింది. దీనికి తోడు కాంట్రాక్టర్లు టెండర్లు వేయకపోవడంతో మరింత ఆలస్యమవుతోంది. గడువు పొడిగించిన ప్రభుత్వం కొత్త గుత్తేదార్లను సముదాయించి టెండర్లు వేయించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. పెంచిన గడవు తేదీ వరకు కూడా ఎవరూ టెండరు వేయకపోతే చేప పిల్లల పంపిణీ మరింత ఆలస్యమయ్యే అవకాశముంది. సెప్టెంబర్ నెలలోనే చెరువుల్లో చేప పిల్లలు వేయకపోతే అదును దాటి పోతుందని మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతేడాది 4.45 కోట్ల చేప పిల్లలను 967 చెరువుల్లో వదలాలని లక్ష్యం ఉండగా, ప్రభుత్వం 1.92కోట్ల చేప పిల్లలను 799 చెరువుల్లో మాత్రమే పోసేందుకు అనుమతి ఇచ్చింది. మరి ఈ ఏడాది పూర్తి లక్ష్యానికి అనుమతి ఇస్తుందో లేదో వేచి చూడాలి.టెండర్లే ఆలస్యంఈ ఏడాది చేప పిల్లలను చెరువుల్లో వదిలేందుకు ప్రణాళికలు సిద్ధం చేసి పెట్టుకున్నాం. టెండర్ల ప్రక్రియ పూర్తయితే ప్రభుత్వం మార్గదర్శకాలు ఇస్తుంది. వాటి ప్రకారం కాంట్రాకర్ల ద్వారా చేప పిల్లలను పంపిణీ చేస్తాం.– ఆంజనేయస్వామి, జిల్లా మత్స్యశాఖ అధికారిఅదును దాటితే ఇబ్బందులుగతేడాది కూడా చేప పిల్లలను ఆలస్యంగా చెరువుల్లో పోశారు. ఇప్పుడు కూడా అంతకు మించి ఆలస్యం చే స్తున్నారు. ప్రభుత్వం త్వర గా టెండర్లను పూర్తి చేసి చేప పిల్లలను పంపిణీ చేయాలి. ఇప్పటికే ఆలస్యం కాగా అదును దాటిపోతోంది. చెరువుల్లో లేటుగా పోస్తే చేప పిల్లల్లో సరైన ఎదుగుదల ఉండదు. – మోహన్, మత్స్యకారుడు, డొంకేశ్వర్ -
దక్కని ఆత్మీయ భరోసా
మోర్తాడ్(బాల్కొండ): మోర్తాడ్ మండలం గాండ్లపేట్కు చెందిన ఎల్లయ్య అనే ఉపాధి హామీ కూలీకి ఇందరమ్మ భరోసా సాయం మంజూరైనట్లు అధికారులు పత్రాన్ని అందజేశారు. నాటి నుంచి ప్రభుత్వం ఇచ్చే సాయం కోసం ఎల్లయ్యతోపాటు జిల్లా వ్యాప్తంగా అనేక మంది కూలీలు నిరీక్షిస్తున్నారు. భూమి లేని కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద రెండు విడతల్లో రూ.6వేల చొప్పున సాయం అందించాలని నిర్ణయించిన ప్రభుత్వం.. పథకాన్ని ఈ ఏడాది జనవరి 26న (గణతంత్ర దినోత్సవం సందర్భంగా) ప్రారంభించింది. ఒక్కో మండలం నుంచి ఒక గ్రామాన్ని ఎంపిక చేసి అక్కడి ఉపాధి కూలీలకు సాయం అందించారు. ఆ తరువాత ఆత్మీయ భరోసా ఊసేలేకుండాపోయింది. అప్పట్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో సాయం సొమ్ము జమ చేయడానికి బ్రేక్ పడింది. అయితే ఎన్నికల తంతు ముగిసి కోడ్ ఎత్తివేసినా సాయం సొమ్మును విడుదల చేసే విషయంలో ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు స్పందన లేదు. జిల్లా వ్యాప్తంగా 38,787 మంది ఉపాధి కూలీలకు ఇందరమ్మ భరోసా సాయం అందించేందుకు అధికారులు ఎంపిక పూర్తి చేశారు. 31 మండలాల్లోని 31 గ్రామాల్లో కేవలం 1,675 మందికి మాత్రమే సాయం సొమ్మును ఖాతాల్లో జమ చేశారు. మిగిలిన గ్రామాల్లోని 37,112 మంది కూలీలకు సాయం అందించాల్సి ఉన్నా ఇప్పటి వరకు నిధులను ప్రభుత్వం విడుదల చేయలేదు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అమలులోకి తీసుకువచ్చి ఎనిమిది నెలలు గడుస్తున్నా లబ్ధిదారులకు పూర్తి స్థాయిలో సాయం అందించే విషయాన్ని ప్రభుత్వం మరిచిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్తో బ్రేక్ ఆ తరువాత ఊసెత్తని ప్రభుత్వం గణతంత్ర దినోత్సవాన ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ప్రారంభం మండలానికి ఒక గ్రామంలో ఎంపిక చేసిన వారికి అందిన సాయం మిగతా లబ్ధిదారుల ఎదురు చూపులు -
దిద్దుబాటు
నిజామాబాద్ సిటీ: నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లోని రెవె న్యూ విభాగంపై ఓ వైపు తీవ్రస్థాయి లో అవినీతి ఆరోపణలు వ్యక్తం అవుతు న్నాయి. మరోవైపు ఇటీవలే రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కా రు. కార్పొరేషన్లో పరిస్థితులపై కలెక్టర్, కార్పొరేషన్ ప్రత్యేకాధికారి వినయ్కృష్ణారెడ్డితోపాటు వరంగల్లోని రీజినల్ డైరెక్టర్ కార్యాలయం ఆరా తీశారు. దీంతో మున్సిపల్ కమిషనర్ దిలీప్కుమార్ నేరుగా రంగంలోకి దిగి దిద్దుబాటు చర్యలు చేపట్టారు.మ్యుటేషన్కు అక్షరాలా లక్ష..?ఆస్తి ఒకరి పేరు మీద నుంచి మరొకరి పేరు మీదకు మార్చేందుకు(మ్యుటేషన్)కు రెవెన్యూ సిబ్బంది రూ.లక్ష డిమాండ్ చేస్తున్నారని పలువురు వాపోతున్నారు. కిందిస్థాయి నుంచి పైస్థాయి వరకు ఇదే పరిస్థితి ఉందని, పేర్లలో కరెక్షన్ చేయాలంటే రూ.30 వేలు డిమాండ్ చేస్తున్నారని అంటున్నారు. డబ్బులిచ్చినవారి పనులు మాత్రమే అవుతున్నాయని, డబ్బులివ్వని వారిని నెలల తరబడి తిప్పుకుంటున్నారని, గట్టిగా ప్రశ్నిస్తే మీ ఫైల్ కనపడటం లేదని నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ప్రముఖ న్యాయవాది కుటుంబానికి చేదు అనుభవంగతేడాది డిసెంబర్లో మృతి చెందిన ప్రముఖ న్యాయవాది, మానవ హక్కుల నాయకుడు గొర్రెపాటి మాధవరావు కుటుంబానికి చేదు అనుభవం ఎదురైంది. ఎల్లమ్మగుట్టలోని ఇంటిని మాధవరావు పేరు పైనుంచి తన పైరుపైకి మార్చాలని ఆయన భార్య మీనా సహానీ 25న మార్చి 2025న దరఖాస్తు చేశారు. ఇప్పటివరకు వారికి మ్యుటేషన్ సర్టిఫికేట్ ఇవ్వకపోగా.. డబ్బులిస్తేనే మీ పని అవుతుందని నేరుగా చెప్పారు. దీంతో మీనా సహానీ మున్సిపల్కమిషనర్కు, జిల్లా కలెక్టర్కు ఫిర్యాదుచేసినా ఇప్పటివరకు పని కాలేదు.ఆన్లైన్ పేమెంట్..పని చేయాలంటే డబ్బులు డిమాండ్ చేస్తున్న పలువురు అధికారులు లంచం మొత్తాన్ని నేరుగా తమ అకౌంట్లోకి ఆన్లైన్ చేయించుకుంటున్నట్లు సమాచారం. ఇటీవల ఏసీబీకి చిక్కిన ఆర్ఐ శ్రీనివాస్ సైతం ఆర్మీ జవాన్ను ఫోన్ పే చేయమని కోరారు. ఏసీబీ దాడి తరువాత ఓ బాధితుడు నేరుగా ఏసీబీ అధికారిని కలిసి తాను ఆన్లైన్ ద్వారా రూ.17వేలు చెల్లించినట్లు ఫిర్యాదు చేశాడని తెలిసింది. మీ పని కావాలంటే తన కిందిస్థాయి అధికారిని కలిసి రా వాలని రెవెన్యూ విభాగం ఉన్నతాధికారి ఒకరు సూ చిన్నారనే ఆరోపణలున్నాయి. 20 ఏళ్లకుపైగా బల్ది యా రెవెన్యూ విభాగాన్ని శాసించిన ఆర్ఐ దాసరి నరేందర్ శిష్యులు ఇప్పటికీ చక్రం తిప్పుతున్నారని, అన్ని స్థాయిల్లో వారున్నారని పలువురు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. బల్దియాలోని రెవెన్యూ, టౌన్ప్లానింగ్, శానిటేషన్ విభాగాల్లో ఫిర్యాదులు స్వీకరించేందుకు గ్రివెన్స్ సెల్ ఏర్పాటు చేస్తే వంద ల సంఖ్యలో ఫిర్యాదులు అందుతాయంటున్నారు.ఫైళ్లపై రిపోర్టు..మ్యుటేషన్, అసెస్మెంట్, రీ అసెస్మెంట్, అలాట్మెంట్, నేమ్ చేంజెస్, ట్రేడ్ లైసెన్స్ల జారీ తదితర అనుమతులకు సంబంధించి ఫైళ్లన్నీ కమిషనర్ తెప్పించారు. రెవెన్యూ సెక్షన్ నుంచి ఈ సంవత్సరం జనవరి నుంచి ఇప్పటివరకు అనుమతులు మంజూరు చేసిన ఫైళ్ల వివరాలు తెలుసుకున్నారు. మ్యుటేషన్కు సంబంధించిన ఫైళ్లను రీ వెరిఫికేషన్ చేయాలని అడిషనల్ కమిషనర్ రవీంద్రసాగర్కు సూచించారు. వాటితోపాటు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉంచిన ఫైళ్లను కూడా తెప్పించి వాటిపై రిపోర్టు సిద్ధం చేయాలని రెవెన్యూ ఆఫీసర్ ఖయ్యూంను ఆదేశించారు.కలెక్టర్ ప్రత్యేక సమీక్షనిజామాబాద్ సిటీ: మున్సిపల్ కార్పొరేషన్లోని రెవెన్యూ విభాగం అధికారులు, సిబ్బందితో జిల్లా కలెక్టర్, మున్సిపల్ ప్రత్యేక అధికారి టి.వినయ్కృష్ణారెడ్డి సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. మంగళ వారం సాయంత్రం రెండుగంటల పాటు సమావేశమయ్యారు. ఇటీవలే రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ఏసీబీకి పట్టుబడిన విషయం తెలిసిందే. ఈ అంశంపై వరంగల్లోని రీజనల్ డైరెక్టర్ (రెవె న్యూ) రిపో ర్టు అడిగినట్లు తెలిసింది. దీంతో ము న్సిపల్ కమిషనర్, రెవెన్యూ టీంతో కలెక్టర్ ప్రత్యే క సమావేశం నిర్వహించారు. మ్యుటేషన్, అసెస్ మెంట్, రీ అసెస్మెంట్, అలాట్మెంట్, పేరుమార్పులు, ట్రేడ్ లై సెన్సులపై నివేదిక తీసుకున్నారు. రెవెన్యూ విభా గం ఇన్చార్జి డిప్యూటీ కమిషనర్ రవి బాబు, రెవెన్యూ అధికారులతో మాట్లాడారు. మ్యుటేషన్ల జారీ, పెండింగ్ పనులకు సంబంధించిన ఫైళ్లను తీసి చెక్ చేశారు. సర్కిళ్ల వారీగా పెండింగ్ రెవెన్యూ ఫైళ్లపై ఆరా తీశారు. సుదీర్ఘ కాలం నుంచి పలు మ్యుటేషన్ ఫైళ్లు పెండింగ్ లో ఉండడాన్ని గమనించిన కలెక్టర్, వాటి విషయమై సంబంధిత జోన్ల రెవెన్యూ ఇన్స్పెక్టర్లను ప్రశ్నించారు. సత్వరమే పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించాలని, తద్వారా నగర పాలక సంస్థకు ఆదాయం కూడా సమకూరుతుందని కలెక్టర్ సూచించారు. పన్ను వసూళ్లపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని సూచించారు. భవన నిర్మాణాలకు అనుమతులు, క్రమబద్ధీకరణ, ఎల్ఆర్ఎస్, ఇంజినీరింగ్ పనుల పురోగతిపై ఆరా తీశారు.ప్రక్షాళన చేపట్టాంబల్దియాలో ఇటీవల జరిగిన పరిణామాలు బాధాకరం. రెవెన్యూలో జరుగుతున్న అవకతవకలపై దృష్టి సారించాం. ఇప్పటివరకు అనుమతి ఇచ్చిన ఫైళ్లను తెప్పించాం. అని ఫైల్లను రీ వెరిఫికేషన్ చేయిస్తున్నా. పెండింగ్లో ఉన్న ఫైళ్లపై వివరణ తీసుకుంటున్నా. తప్పుచేస్తే ఎంత పెద్ద అధికారి అయినా చర్యలు తప్పవు.– దిలీప్కుమార్, బల్దియా కమిషనర్ -
ఉత్తమ గురువులకు సన్మానం
● ఘనంగా గురుపూజోత్సవం ● విద్యలో జిల్లాను అగ్రభాగాన నిలపాలని రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి పిలుపు నిజామాబాద్అర్బన్: గురుపూజోత్సవాన్ని విద్యాశాఖ ఆధ్వర్యంలో మంగళవారం ఘ నంగా నిర్వహించారు. సమీకృత జిల్లా కార్యా లయాల సముదాయం కాన్ఫరెన్స్ హాల్లో కా ర్యక్రమాన్ని నిర్వహించగా.. ముఖ్య అతిథు లుగా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి పాల్గొన్నారు. జిల్లా స్థాయిలో ఉత్తమ టీచర్లుగా ఎంపికైన 40 మందిని ఘనంగా సన్మానించి జ్ఞాపికలను అందజేశారు. అంతకుముందు మాజీ రాష్ట్ర పతి సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూ లమాలలు వేసి నివాళులర్పించారు. భూపతి రెడ్డి మాట్లాడుతూ.. ఉపాధ్యాయ వృత్తికి మించిన వృత్తి సమాజంలో మరేదీ లేదని, విద్యార్థులకు నాణ్యమైన విద్యనందిస్తూ జిల్లాను వి ద్యా రంగంలో అగ్రభాగాన నిలుపుదామని పిలుపునిచ్చారు. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమైందని, గురు వు స్థానానికి ఉన్న గౌ రవాన్ని మరింత ఇనుమడింపజేయాలని హితవు పలికారు. అదన పు కలెక్టర్ అంకిత్, ఉపాధ్యాయ సంఘాల నాయకులు మోహన్రెడ్డి, కిషన్, వెనిగళ్ల సురేశ్, గద్దల రమేశ్, వెంకటేశ్వర్గౌడ్, జలంధర్, హెచ్ఎంలు, టీచర్లు పాల్గొన్నారు. -
ఎల్వోసీ విధానంలో చెల్లింపులకు చర్యలు చేపట్టాలి
● మార్కెట్ కమిటీ చైర్మన్ల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు ముప్ప గంగారెడ్డి ● మంత్రి తుమ్మల నాగేశ్వర్రావుకు వినతిసుభాష్నగర్: మార్కెట్ కమిటీ చైర్మన్, ఉద్యోగుల వేతనాలు, అలవెన్సులు, మార్కెట్యార్డు నిర్వహణ, ఇతరత్ర చెల్లింపులు ఈ–పోర్టల్లోని ఐఎఫ్ఎంఎస్ ద్వారా కాకుండా, ఎల్వోసీ విధానంలో చెల్లింపులు చేసేలా చర్యలు చేపట్టాలని మార్కెట్ కమిటీ చైర్మన్ల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు ముప్ప గంగారెడ్డి కోరారు. ఈమేరకు ఫోరం ఆధ్వర్యంలో మంగళవారం ఆయన హైదరాబాద్లో రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావును కలిసి, పలు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన విధానంతో మార్కెట్యార్డుల్లో చేపట్టే అభివృద్ధి పనుల చెల్లింపుల్లో జాప్యం జరుగుతుందని, కావున ట్రెజరీ ద్వారా నేరుగా చెల్లింపులు జరిపే విధంగా చూడాలని కోరారు. పాలకమండలి పదవీకాలాన్ని మూడేళ్లకు పొడగించాలని విజ్ఞప్తిచేశారు. మార్కెట్యార్డుల్లో అవసరమైన పోస్టులను భర్తీ చేసుకునే అధికారం చైర్మన్లకు కల్పించాలని, చైర్మన్లకు ప్రొటోకాల్ వర్తింపజేయాలని, అలాగే పలు సమస్యలను విన్నవించారు. మంత్రి తుమ్మల సానుకూలంగా స్పందించారని అధ్యక్షుడు ముప్ప గంగారెడ్డి తెలిపారు. ప్రధానకార్యదర్శి నర్సింహాయాదవ్, గౌరవాధ్యక్షుడు చిలుక మధుసూదన్రెడ్డి, కార్యవర్గ సభ్యులు, మార్కెట్ కమిటీ చైర్మన్లు పాల్గొన్నారు. -
ఎస్సారెస్పీకి తగ్గిన వరద
బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లోకి ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు తగ్గుముఖం పట్టింది. ప్రాజెక్ట్లోకి ఎగువ ప్రాంతాల నుంచి 42వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. క్రితం రోజు సోమవారం సాయంత్రం పెరిగిన వరద మంగళవారం ఉదయం నుంచి క్రమంగా తగ్గింది. దీంతో ప్రాజెక్ట్ నుంచి గోదావరిలోకి నీటి విడుదలను ప్రాజెక్ట్ అధికారులు తగ్గించారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ నుంచి గోదావరిలోకి 8 వరద గేట్ల ద్వారా 12500 క్యూసెక్కుల నీరు పోతుంది. వరద కాలువ ద్వారా 19 వేల క్యూసెక్కులు, కాకతీయ కాలువ ద్వారా 5500 క్యూసెక్కులు, ఎస్కెప్ గేట్ల ద్వారా 2500 క్యూసెక్కులు, సరస్వతి కాలువ ద్వారా 800 క్యూసెక్కులు, లక్ష్మికాలువ ద్వారా 200 క్యూసెక్కులు, గుత్ప లిప్ట్ ద్వారా 270 క్యూసెక్కులు, మిషన్ భగీరథ ద్వారా 231 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 684 క్యూసెక్కుల నీరు పోతుంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091(80.5 టీఎంసీలు) అడుగులు కాగా మంగళవారం సాయంత్రానికి ప్రాజెక్ట్లో అంతే స్థాయి నీటి మట్టంతో ప్రాజెక్ట్ నిండుకుండలా ఉంది. -
విపత్కర పరిస్థితుల్లోనూ విధులు!
● ఉత్సవాలైనా, సహాయక చర్యలైనా ముందుంటున్న పోలీసులు ● రాత్రి, పగలు తేడాలేకుండా శాంతిభద్రతల రక్షణ కోసం కృషిఖలీల్వాడి: సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణే కాకుండా విపత్కర పరిస్థితుల్లోనూ పోలీసులు నిరాటంకంగా విధులు నిర్వహిస్తున్నారు. ప్రజలకు సేవ చేయడానికి, చట్టాన్ని అమలు చేయడానికి, నేరాలను నివారించడానికి, శాంతిభద్రతలను కాపాడటా నికి పోలీసులు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. కానీ అత్యవసర పరిస్థితులు, పండుగలు, ప్రమాదలు, వ రదలు వచినప్పుడు పగలు, రాత్రి తేడా లే కుండా విధులు నిర్వహిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఒక వైపు వరదలు, మరో వైపు ఉత్సవాలు.. పండుగల వేళ అందరూ కుటుంబాలతో వేడుకలను వైభవంగా జరుపుకుంటారు. కానీ పోలీసులు మాత్రం పండుగలు, పర్వదినాల వేళ కుటుంబాలకు దూరంగా విధులు నిర్వహిస్తున్నారు. ఎలాంటి పరిస్థితి ఎదురైనా ఉన్నతాధికారుల ఆదేశాలను అనుసరించి, సమాజ శ్రేయస్సు కోసం డ్యూటీలు చేస్తున్నారు. ఇటీవల గణేష్ ఉత్సవాలకు ముందు జిల్లాలో భారీవర్షాలు కురవడంతో వరదలు సంభవించాయి. దీంతో అటు ఉత్సవాలు, ఇటు వరదలు ఒకేసారి వచ్చినా పోలీసులు తమ విధులను సమయస్ఫూర్తితో నిర్వహించారు.వరదల కారణంగా కొన్ని గ్రామాల్లోకి నీరు వచ్చి చేరడం, రోడ్లు ధ్వంసం కావడంతో జిల్లా అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టించాయి. వాగులు వంతెనల పైనుంచి ప్రవహించడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఈక్రమంలో రోడ్లపై నీరు వచ్చి చేరడంతో పోలీసులు వాహనాదారులకు హెచ్చరికలు జారీ చేస్తూనే, తగిన సహాయక చర్యలు చేపట్టారు. అలాగే గణేష్ నవరాత్రి ఉత్సవాల దృష్ట్యా ఎలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు యంత్రాంగం పటిష్ట చర్యలు చేపట్టింది. అన్ని వర్గాల ప్రజలకు, గణేష్ మండళ్లకు, శాంతికమిటీలకు సమావేశాలు నిర్వహించి ప్రశాంతంగా ఉత్సవాలు ముగించారు. సీపీ సాయిచైతన్య పకడ్బందీగా వ్యవహరించి, నవరాత్రుల్లో వినాయక మండపాలు సందర్శించి, అక్కడ ఉన్న యువతకు మార్గనిర్ధేశం చేశారు. గణేష్ ఉత్సవాలపై ఎప్పటికప్పుడు సమీక్షలు, సూచనలు చేశారు. దీంతో ఉత్సవాలతోపాటు నిమజ్జనోత్సవ శోభాయాత్రలనూ విజయవంతంగా పూర్తి చేశారు. గతంలో వినాయక నిమజ్జనం సందర్బంగా పలు హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడంతో పోలీసులు సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి పోలీస్ ఫోర్స్తో గట్టి బందోబస్తు, నిఘాను ఏర్పాటు చేసి, ప్రత్యేక ప్రణాళికలను రూపొందించారు. ఉదయం, రాత్రివేళల్లో ప్రతీ గణేశ్ మండపం వద్దకు పోలీసులు గస్తీ తిరిగారు. నిజామాబాద్ పోలీస్కమిషనరేట్ పరిధిలోని ఆర్మూర్, బోధన్, నిజామాబాద్లో వినాయక ఉత్సవాలు ప్రారంభమైనప్పటినుంచి ముగింపు వరకు సీపీ పోతరాజు సాయిచైతన్య పర్యటించారు. ఒకవైపు వరదలు, మరో వైపు వినాయక ఉత్సవాల్లో వారంరోజుల నుంచి పోలీసులు కంటిమీద కునుకు లేకుండా, రోడ్లపైనే నిల్చుని సమర్థవంతంగా డ్యూటీలు చేశారు. నిజామాబాద్ కమిషనరేట్లో నిమజ్జన వేడుకల్లో పోలీసులు రెండురోజులు ఆన్డ్యూటీలోనే ఉండటంతో ప్రజలు పోలీస్లకు హాట్సాప్ అంటూ కృతజ్ఞతలు తెలుపుతున్నారు.జిల్లాలోని అధికారులు, సిబ్బంది సహకారంతో సమిష్టిగా పని చేయడంతో గణేష్ ఉత్సవాలు విజయవంతంగా పూర్తిచేశాం. ఆలాగే భారీ వర్షాలకు ప్రజల వద్దకు వెళ్లి సహకారం అందించాం. ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా చూశాం. నగరంలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, నిమజ్జనం సమయంలో ప్రత్యేకంగా పర్యవేక్షించాం. వరదలు, ఉత్సవాలకు ప్రతీ పోలీసు తమ విధులను సమర్థవంతంగా నిర్వర్తించారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావివ్వకుండా పనిచేశారు. – పోతరాజు సాయిచైతన్య, సీపీ, నిజామాబాద్ -
పోలీసులు నిక్కచ్చిగా విధులు నిర్వహించాలి
బోధన్రూరల్: పోలీస్ ఇమేజ్ పెంచేవిధంగా ప్రతీ సిబ్బంది నిక్కచ్చిగా విధులు నిర్వహించాలని నిజామాబాద్ సీపీ సాయి చైతన్య అన్నారు. బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్ను మంగళవార సీపీ సందర్శించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ.. అండర్ ఇన్వెస్టిగేషన్లో ఉన్న కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి కేసులో నాణ్యమైన ఇన్వెస్టిగేషన్ చేయాలని సిబ్బందికి సూచనలు చేశారు. ప్రజలకు గేమింగ్ యాప్స్, సైబర్ మోసాలపై అవగాహన కల్పించాలన్నారు. గ్రామాలలో విలేజ్ పోలీస్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తూ ప్రజలతో మమేకమై గ్రామాలలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించే దిశగా ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. అట్టి గ్రామాలలో ఉన్నటువంటి సమాచారం తమ పైస్థాయి అధికారులకు ఎల్లప్పుడూ చేరవేయాలన్నారు. అధికారులు, సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. ట్రాఫిక్ రూల్స్ను పాటిస్తూ ఇతరులకు ఆదర్శంగా ఉండాలని సూచించారు. బోధన్ ఏసీపీ శ్రీనివాస్, రూరల్ సీఐ విజయ్ బాబు, ఎస్హెచ్వో వెంకట నారాయణ, ట్రాఫిక్ సీఐ చందర్ రాథోడ్, ఏస్సైలు మచ్చేందర్, రమ, చంద్రమోహన్, సిబ్బంది పాల్గొన్నారు. -
బైక్ను ఢీకొన్న కారు: ఒకరికి గాయాలు
ఖలీల్వాడి: నగరంలోని గాజులపేట్లోగల ఏఆర్ జిరాక్స్ వద్ద బైక్ను కారు ఢీకొనడంతో ఒకరికి గాయాలయ్యాయి. ఒకటో టౌన్ ఎస్హెచ్వో రఘుపతి తెలిపిన వివరాలు ఇలా.. నగరంలోని గాజులపేట్కు చెందిన ప్రేమ్కుమార్(45) మంగళవారం బైక్పై కంఠేశ్వర్కు బయలుదేరాడు. గాజులపేట్లోని ఏఆర్ జిరాక్స్ వద్ద ఓ కారు యూటర్న్ తీసుకుంటుండగా, బైక్పై వెళుతున్న ప్రేమ్కుమార్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో అతడికి తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాధితుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. జక్రాన్పల్లి మండలంలో ఇద్దరికి.. జక్రాన్పల్లి: మండల పరిధిలో బైక్ను కారు ఢీకొనడంతో బైక్పై ప్రయాణిస్తున్న ఇద్దరికి గాయాలయ్యాయి. వివరాలు ఇలా.. ఆర్గుల్ గ్రామానికి చెందిన జైడి నర్సయ్య, అతని కోడలుతో కలిసి బైక్పై మంగళవారం ఆర్మూర్కు బయలుదేరారు. మార్గమధ్యలో ఆర్మూర్ వైపు వెళ్తున్న కారు వేగంగా వచ్చి బైక్ను వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్ పై ప్రయాణిస్తున్న ఇద్దరికి గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు జక్రాన్పల్లి ఎస్హెచ్వో తెలిపారు. ● కాపాడిన పోలీసులు ఆర్మూర్టౌన్: ఆత్మహత్యకు యత్నించిన ఓ మహిళలను పోలీసులు కాపాడారు. వివరాలు ఇలా.. పెర్కిట్ గ్రామానికి చెందిన సిరిగాల లక్ష్మీ ఆర్థిక, కుటుంబ సమస్యల కారణంగా జీవితంపై విరక్తి చెందింది. దీంతో సోమవారం రాత్రి స్థానిక చెరువులో దూకి ఆత్మహత్యకు ప్రయత్నించింది. కానీ స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకున్న పోలీసులు మహిళను చెరువులో దూకకుండా అడ్డుకొని కాపాడి, కుటుంబ సభ్యులకు అప్పగించారు. నిండు ప్రాణాలు కాపాడిన ఆర్మూర్ ఎస్బీ కానిస్టెబుల్ విజయ్కుమార్, ఏఎస్సై రాందాస్ను స్థానికులు అభినందించారు. డిచ్పల్లి: మండలంలోని బీబీపూర్ తండా సమీపంలోగల 44వ నంబరు జాతీయ రహదారిపై కంకర లోడ్తో వెళుతున్న టిప్పర్ అదుపుతప్పి సైడ్వాల్ను ఢీకొట్టింది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా.. కంకర లోడ్తో టిప్పర్ మంగళవారం ఇందల్వాయి నుంచి నిజామాబాద్ బయలుదేరింది. బీబీపూర్ తండా సమీపంలో టిప్పర్ అతివేగంతో అదుపుతప్పి సైడ్వాల్ను ఢీకొట్టి నిలిచిపోయింది. ఈ ఘటనలో డ్రైవర్కు గాయాలు కాగా, టిప్పర్ ముందుభాగం దెబ్బతింది. స్థానికులు బాధితుడిని వెంటనే చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రికి తరలించారు. నందిపేట్ (ఆర్మూర్): మండలంలోని ఆంధ్రనగర్ గ్రామంలో డివైడర్ ఢీకొని కారు బోల్తా పడగా, అందులోని ముగ్గురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. నిజామాబాద్ నుంచి నందిపేట్ వైపు వస్తున్న కారు మంగళవారం ఆంధ్రనగర్ గ్రామంలో డివైడర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు పల్టీలు కొడుతూ కొద్ది దూరం వెళ్లి బోల్తా పడింది. వెంటనే స్థానికులు కారు వద్దకు వెళ్లి అందులోని ముగ్గురు ప్రయాణికులను బయటకు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కారులో ప్రయాణిస్తున్న వ్యక్తులు డొంకేశ్వర్ గ్రామానికి చెందిన వారీగా సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
ఇందల్వాయి: మండల పరిధి లోని 44వ నంబరు జాతీయ ర హదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందాడు. ఎస్సై సందీప్ తెలిపిన వివరాలు ఇలా.. అదిలా బాద్ జిల్లాలోని ఇచ్చోడకు చెందిన నరసింహారెడ్డి(21), విశాల్ అనే ఇద్దరు యువకులు హైదరా బాద్లో బీటెక్ చదువుతున్నారు. వారు మంగళవారం వేకువజామున కారులో హైదరాబాద్ నుంచి ఇచ్చోడకు బయలుదేరారు. ఇందల్వాయి మండలంలోని దేవితండా హైవే వద్ద వారు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కన నిలిపి ఉంచిన లారీని వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నరసింహరెడ్డి అక్కడికక్కడే మృతి చెందగా, కారు నడుపుతున్న విశాల్కు స్వల్ప గా యాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసు లు ఘటన స్థలానికి చేరుకొని, వివరాలు సేకరించా రు. మృతదేహాన్ని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి తండ్రి కృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు నిర్లక్ష్యంగా కారు నడిపిన విశాల్పై, లారీ పార్క్ చేసిన హర్యానాకు చెందిన లారీ డ్రైవర్ ఆలాంపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై సందీప్ తెలిపారు. చెరువులో పడి వృద్ధుడు.. సిరికొండ: మండలంలోని కొండాపూర్ గ్రామ చెరువులో ఓ వృద్ధుడు పడి మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. వివరాలు ఇలా.. గోప్య తండాకు చెందిన బుక్యా శంకర్(59) అనే వృద్ధుడు సోమవారం చేపలు పట్టడానికి చెరువుకు వెళ్లాడు. రాత్రి అయిన అతడు ఇంటికి రాకపోవడంతో కుటుంబీకులు చెరువు వద్దకు వెళ్లి చూడగా శంకర్ కనిపించలేదు. చెరువు కట్టపై అతడి బట్టలు ఉండటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. గజ ఈతగాళ్ల సహాయంతో చెరువులో వెతకగా చెరువులో శంకర్ మృతదేహం లభ్యమైంది. మృతుడి కొడుకు సుమన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రామకృష్ణ తెలిపారు. -
రాష్ట్రస్థాయి క్రీడల్లో విద్యార్థుల ప్రతిభ
ఇందల్వాయి: మండలంలోని ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాల విద్యార్థినులు రాష్ట్ర స్థాయి క్రీడల్లో విజేతలుగా నిలిచినట్లు ప్రిన్సిపాల్ రమేశ్ కుమార్ మంగళవారం తెలిపారు. ఈ నెల 6 నుంచి 8వ తేదీ వరకు రాజన్న సిరిసిల్ల జిల్లా టీజీ ఈఎంఆర్ఎస్ మరిమడ్లలో నిర్వహించిన 5వ రాష్ట్రస్థాయి క్రీడల్లో పాఠశాల విద్యార్థినులు పాల్గొన్నట్లు ఆయన పేర్కొన్నారు. అండర్–19 వాలీబాల్ విభాగంలో విద్యార్థినులు జి. కృష్ణవేణి, బి. పూజ, ఆర్. అఖిల, పి.సంగీత, ఆర్. వైష్ణవి, ఎ. వాణి ప్రథమ స్థానంలో నిలిచి విన్నర్ ట్రోఫీని అందుకున్నారని అన్నారు. ఈ బృందం జాతీయ పోటీలకు ఎంపికై ందన్నారు. అలాగే ఖోఖో లో రన్నరప్గా విద్యార్థినులు ఎల్. సౌందర్య, సావిత్రి, సింధు, బిందు, అమూల్య, అక్షయ, సోనియా, సరస్వతి, అపూర్వ నిలిచారు. వీరిని హెచ్ఎం అభినందించి హర్షం వ్యక్తం చేశారు. బాక్సింగ్ అండర్ 19లో తేజశ్విని, హారిక, అండర్ 14లో షణ్ముఖ ప్రియ, జూడో అండర్ 19లో హారిక, తేజశ్విని, అండర్ 14లో ప్రసన్న, అర్చన, రెజ్లింగ్ అండర్ 19లో హారిక, శిరీష అండర్ 14లో మాధవి, వెయిట్ లిఫ్టింగ్ అండర్ 19లోసోని, హారిక, శిరీష, తేజశ్విని, తైక్వాండో అండర్ 14లో నిత్య, సౌందర్య, అండర్ 19లో రజిత, షార్ట్ పుట్ అండర్ 19లో కృష్ణవేణి, డిస్కస్ థ్రో అండర్ 14లో బిందు, లాంగ్ జంప్ అండర్ 14లో శృతితోపాటు పలువురు రన్నింగ్ యోగా పోటోల్లో ప్రతిభ చాటారన్నారు. ఈ క్రీడల్లో విద్యార్థులు 9 బంగారు పతకాలు, 6 వెండి పతకాలు, 10 రజత పతకాలు సాధించినట్లు పేర్కొన్నారు. అనంతరం విజయాలను సాధించడంలో ముఖ్య పాత్ర పోషించిన పీఈటీ దివ్య, రోహిత్లను ప్రిన్సిపాల్ అభినందించారు. నిజామాబాద్నాగారం: నిర్మల్లో ఈనెల 5, 6, 7 తేదీల్లో నిర్వహించిన రాష్ట్రస్థాయి యోగాసన పోటీల్లో నిజామాబాద్ జిల్లా క్రీడాకారులు పతకాల పంట తెచ్చారు. జిల్లాకు చెందిన క్రీడాకారులు వివిధ విభాగాల్లో ప్రతిభ చాటి రెండు బంగారు, 7 రజత, 8 కాంస్య పతకాలు మొత్తం 17 పతకాలు సాధించి సత్తా చాటారు. రాష్ట్రస్థాయి విజేతలను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందనమ్ కృపాకర్, కార్యనిర్వాక కార్యదర్శి రామ్రెడ్డి, జిల్లా గౌరవ అధ్యక్షుడు యోగ రామచందర్, అధ్యక్షుడు ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి బాలశేఖర్, కార్యనిర్వాహక కార్యదర్శి సంగీత, భూమాగౌడ్, రఘువీర్, జ్యోతి, ఉమారాణి తదితరులు క్రీడాకారులను అభినందించారు. తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో ఏర్పాటు చేసిన ఐదు పరీక్షా కేంద్రాల్లో బీఈడీ, ఎంఈడీ సెమిస్టర్ పరీక్షలు మంగళవారం ప్రశాంతంగా ముగిసినట్లు అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఘంటా చంద్రశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. బీఈడీ 2, 4వ సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్లాగ్ పరీక్షల్లో మొత్తం 1145 మంది విద్యార్థులకు గానూ 1088 మంది హాజరైనట్లు తెలిపారు. ఎంఈడీ నాలుగవ సెమిస్టర్ రెగ్యులర్, 1, 2, 3, 4వ సెమిస్టర్ బ్యాక్లాగ్ పరీక్షల్లో మొత్తం ముగ్గురు విద్యార్థులకు ముగ్గురు హాజరైనట్లు ఆయన తెలిపారు. నిజామాబాద్ సిటీ: నగర మున్సిపల్ కార్పొరేషన్లో వార్డు ఆఫీసర్లుగా విధులు నిర్వహిస్తున్న 18 మంది సిబ్బంది జీపీవోలుగా ఎంపికయ్యారు. వీరంతా కలెక్టర్ను కలిసి ఇటీవల నియామక పత్రాలు పొందారు. దీంతో మంగళవారం 18 మంది వార్డు ఆఫీసర్లను మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ రిలీవ్ చేశారు. వీరంతా గ్రామ పాలన అధికారులుగా విధులు నిర్వహించనున్నారు. -
క్షయవ్యాధి నిర్మూలనే ధ్యేయం
● జిల్లా వైద్యాధికారిణి రాజశ్రీ ● బెటాలియన్లో ఆరోగ్య శిబిరండిచ్పల్లి: దేశంలో క్షయవ్యాధిని పూర్తిగా నిర్మూలించడానికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని నిజామాబాద్ జిల్లా వైద్యాధికారిణి (డీఎంహె చ్వో) రాజశ్రీ అన్నారు. డిచ్పల్లి మండలం టీజీఎస్పీ ఏడో బెటాలియన్లో మంగళవారం టీబీముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా క్షయవ్యాధి నిర్ధారణ వైద్య శిబిరాన్ని డీఎంహెచ్వో ప్రారంభించి మాట్లాడారు. సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. వారానికి మించి ఎవరైనా దగ్గు, జ్వరంతో బాధపడుతున్నట్లయితే వెంటనే సమీపంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి వెళ్లి తెమడ పరీక్ష చేయించుకోవాలని సూచించారు. వైద్య శిబిరంలో పలువురికి క్షయవ్యాధి పరీక్షలు నిర్వహించారు. అలాగే బెటాలియన్లోని సిబ్బంది ఇంటింటికి వెళ్లి కుటుంబసభ్యులకు జ్వర పరీక్షలు నిర్వహించారు. కమాండెంట్ సత్యనారాయణ, అసిస్టెంట్ కమాండెంట్ శరత్, జిల్లా క్షయ వ్యాధి నివారణ అధికారిణి అవంతి, బెటాలియన్ యూనిట్ మెడికల్ ఆఫీసర్ అనుపమ, ఇందల్వాయి పీహెచ్సీ వైద్యాధికారి షారోన్ షైని క్రిస్టినా, జిల్లా టీబీ కోఆర్డినేటర్ రవి, ఆయుష్మాన్ ఆరోగ్యం మందిర్ డాక్టర్ అరుణ్, స్వప్న, సుచరిత, హెచ్ఈవో శంకర్, సూపర్వైజర్లు దేవపాలం, రాజేందర్, పద్మ, ఏఎన్ఎంలు అరుంధతి, సంధ్య, సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రమాదకరంగా విద్యుత్ వైర్లు
నందిపేట్(ఆర్మూర్): నందిపేట మండలం కౌల్పూర్ గ్రామంలో గృహాల మీదుగా ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు ప్రమాదకరంగా మారాయి. ఇళ్ల సమీపంలో నుంచి వెళ్తున్న వైర్లు చేతికి అందే దగ్గరలో ఉన్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. వైర్లు కిందకు ఉండటంతో విద్యుత్ ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆవేదన చెందుతున్నారు. సమస్యను విద్యుత్ అధికారులకు తెలిపినా పరిష్కారం కావడం లేదని, ఇప్పటికై నా స్పందించి సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు. నవీపేట: నవీపేట శివారులోని పంట పొలంలో రైతు గోపాల్ ఆధునిక డ్రోన్ల సహాయంతో మంగళవారం క్రిమిసంహారక మందులను పి చికారి చేశారు. 20 ఎకరాల వరి పొలంలో తక్కువ ఖర్చుతో క్రిమిసంహారక మందులను పిచికారి చేశారు. ఎకరానికి రూ. 300 నుంచి రూ.350 వరకు ఖర్చు అయిందని రైతు తెలిపారు. కేవలం రెండున్నర గంటలలో 20 ఎకరాల వరి పొలంలో క్రిమిసంహారక మందుల ను డ్రోన్ ద్వారా స్ప్రే చేసినట్లు పేర్కొన్నారు. డ్రోన్ల వాడకంతో సమయం ఆదా అవడంతోపాటు ఖర్చులు తగ్గాయని అన్నారు. నిజామాబాద్నాగారం: ఇటీవల మహబూబ్నగర్లో జరిగిన 11వ రాష్ట్ర సబ్ జూనియర్ బ్యాడ్మింటన్ చాపియన్ షిప్ పోటీల్లో నిజామాబాద్ జిల్లాకు చెందిన అనుముల శ్రీవైభవి సింగిల్స్ విభాగంలో రన్నర్గా నిలిచింది. ఈసందర్బంగా జిల్లా బాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు కర్నాటి వాసు, సెక్రెటరీ కిరణ్ కుమార్, కోశాధికారి సాయరెడ్డిలు మంగళవారం ఆమె కు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. శ్రీ వైభవి జూన్లో గోవాలో జరిగిన అండర్ 13 నే షనల్ ర్యాంకింగ్ టోర్నమెంట్, ఆగస్టులో ముంబాయి లో జరిగిన అండర్ 13 నేషనల్ ర్యాంకింగ్ టోర్నమెంట్లో కూడా ప్రతిభ కనబర్చి రెండు బంగారు పతకాలు సాధించి జిల్లాకి, రాష్ట్రానికి వన్నె తెచ్చిందన్నారు. ● గ్రామంలో మృతిచెందిన సల్మాబేగం ● ఏళ్ల క్రితం ఇంట్లోంచి వెళ్లిన మృతురాలి కుమారుడు ● అంత్యక్రియలు చేయడానికి తిరిగిరాగా, ఒప్పుకోని స్థానికులు ● దత్తత కుమార్తె కరిష్మా బేగం చేయాలని నిర్ణయించిన గ్రామస్తులు కామారెడ్డి రూరల్: తల్లిని కంటికి రెప్పలా కాపాడుకొని ఆసరాగా ఉండాల్సిన కుమారుడు 20 ఏళ్ల క్రితం ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. కుమారుడు వెళ్లిపోయాడని ఆ తల్లి కుంగిపోలేదు. కామారెడ్డిలో దొరికిన ఒక అమ్మాయిని పెంచుకుని పెళ్లి చేసి పంపించింది. మంగళవారం ఆ తల్లి మృతి చెందగా చెందగా ‘తానే కొడుకునని అంత్యక్రియలు నేనే చేస్తాను. మా ఊరికి తీసుకెళ్తాను’ అని వచ్చిన కొడుకును నువ్వెవరో తెలియదు అని వెల్లగొట్టారు. ఈ ఘటన కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని పాత రాజంపేటలో చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన సల్మాబేగంను 20 సంవత్సరాల క్రితం కుమారుడు వదిలి వెళ్లిపోయాడు. ఒక్కగానొక్క కొడుకు తనను వదిలి వెళ్లిపోవడంతో కొద్దిరోజులు బాధపడింది. తన రాత ఇంతే అనుకుని జీవిస్తుండగా కొద్దిరోజులకు కామారెడ్డి పట్టణంలో దొరికిన కరిష్మా బేగం అనే చిన్నారిని పెంచుకుంది. పెద్దయ్యాక సల్మాబేగం.. కరిష్మాకు పెళ్లి చేసి బాధ్యత తీర్చుకుంది. పెళ్లయినా పెంచిన తల్లి మంచి చెడులన్నీ కరిష్మానే చూసుకుంది. గ్రామంలో కూడా మంచి పేరు తెచ్చుకుంది. అయితే మంగళవారం సల్మాబేగం మృతి చెందింది. 20 ఏళ్లుగా అటువైపు రాని కొడుకు తల్లి చనిపోయిన విషయం తెలుసుకొని, అంత్యక్రియలు చేస్తానని తల్లి శవాన్ని తీసుకొని వెళ్లేందుకు గ్రామానికి వచ్చాడు. దాంతో కొడుకుతో గ్రామస్తులు వాగ్వాదానికి దిగారు. 20 ఏళ్ల తర్వాత తల్లి ఇప్పుడు గుర్తుకొచ్చిందా అంటూ నిలదీశారు. అయితే ఇన్నేళ్ల పాటు సల్మాబేగం మంచి చెడులు చూసిన కరిష్మాయే అంత్యక్రియలు చేయాలని నిర్ణయించారు. ఇన్నాళ్లుగా లేని ప్రేమ తల్లి చనిపోయాక రావడంతో ఆస్తి కోసమే వచ్చి ఉంటాడని గ్రామస్తులు అనుమానిస్తున్నారు. ఈ విషయం పోలీసుల దాకా వెళ్లడంతో అంత్యక్రియలు నిలిచిపోయాయి. -
బోధనలో ప్రత్యేకం మా‘స్టారు’
● విద్యతోపాటు నైతిక విలువలకు పెద్దపీటనిజామాబాద్అర్బన్: బోధనలో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. పిల్లలకు విద్యతోపాటు నైతిక విలువలూ ముఖ్యమని భావిస్తాడు. 29 ఏళ్లుగా ఈయన బోధనలో నైతిక విలువలకు పెద్దపీట వేస్తూ విద్యార్థులను తీర్చిదిద్దుతున్నాడు. ఆ విధానంతోనే భీమ్గల్ మండలం చేంగల్ గ్రామానికి చెందిన నంబి శ్రీనివాస్ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. 1997లో ఆగస్టు 28న టీచర్ ఉద్యోగంలో చేరాడు. ప్రస్తుతం వేల్పూర్ మండలం మోతె మండల పరిషత్ పాఠశాలలో ఎస్టీటీగా విధులు నిర్వర్తిస్తున్నాడు. విద్యార్థులకు పాఠ్యపుస్తకాలతోపాటు వివిధ సామాజిక సేవా కార్యక్రమాలు, సాంస్కృతిక విధానాలు, క్రమశిక్షణ అలవర్చారు. సమాజంలో మారుతున్న విధానాలపై విద్యార్థులకు బోధిస్తారు. వారంలో ఒకరోజు క్వీజ్ పోటీలను నిర్వహిస్తూ సొంత డబ్బులతో వారికి బహుమతులు ప్రదానం చేసేవారు. విద్యార్థులతో మొక్కలు నాటించి, వాటి సంరక్షణకు కృషి చేస్తున్నారు. ‘పిల్లలకు విద్యతోపాటు నైతిక విలువలు ఎంతో ముఖ్యం, క్రమశిక్షణ తోడైతే బంగారు భవిష్యత్తు లభిస్తుంది’ అని చెబుతున్నారు నంబి శ్రీనివాస్. జిల్లాస్థాయి అవార్డు రావడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. -
హుండీ ఆదాయం లెక్కింపు
నిజామాబాద్ రూరల్: నగరంలోని జెండా బాలాజీ దేవస్థానం హుండీ ఆదాయాన్ని సోమవారం లెక్కించారు. ఆగస్టు 24 నుంచి సెప్టెంబర్ 7 వరకు నోట్ల ద్వారా రూ.5,79,130, నాణెములు రూ. 93,081, మొత్తం రూ. 6,72,211 ఆదాయం వచ్చినట్లు దేవాదాయ శాఖ పరిశీలకురాలు కమల వెల్లడించారు. ఆరు గ్రాముల మిశ్రమ బంగారం, 305 గ్రాముల మిశ్రమ వెండి వచ్చిందని తెలిపారు. కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వాహణాధికారి ఎ.వేణు, ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ లవంగ ప్రమోద్ కుమార్, ధర్మకర్తలు పోలకొండ నర్సింగ్ రావు, సిరిపురం కిరణ్ కుమార్, పవర్ విజయ, కొర్వ రాజ్కుమార్, అర్చకులు నాగరాజాచార్యులు, జూనియర్ అసిస్టెంట్లు ప్రశాంత్ కుమార్, ఆంజనేయులు, రఘునాథ్, సహస్రనామ పారాయణ భక్తులు పాల్గొన్నారు. -
పంటలను గట్టెక్కించారు
● యూరియా కొరత తీర్చిన సొసైటీ ● హర్షం వ్యక్తం చేస్తున్న రైతులుమాక్లూర్: ఖరీఫ్ సీజన్లో యూరియా కొరత రాకుండా తీసుకున్న జాగ్రత్తలు పంటలను గట్టెక్కించాయి. జిల్లాలో పలు మండలాల్లో యూరియా కొరత ఏర్పడినప్పటికీ మాక్లూర్లో మాత్రం రైతులు ఆ సమస్య ఎదుర్కోకుండా సొసైటీ చైర్మన్ బూరోల్ల అశోక్ సఫలీకృతులయ్యారు. మాక్లూర్ మండలంలో మొత్తం 19,500 ఎకరాల్లో రైతులు వరి సాగు చేస్తుండగా, సుమారు 2,500 మెట్రిక్ టన్నుల యూరియా అవసరమవుతుంది. దీంతో నిత్యం ఉన్నతాధికారులతో మాట్లాడుతూ సొసైటీ పరిధిలోని రైతాంగానికి కావాల్సిన యూరియాను తెప్పించారు. గ్రామాలకు వెళ్లి యూరియా అవసరం ఉన్నంత వరకే కొనుగోలు చేసుకోవాలని ఆ తర్వాత మళ్లీ అవసరానికి యూరియా అందించే బాధ్యత తనదని రైతులకు హామీ ఇచ్చారు. ఆ దిశగా విడుతల వారీగా పంటకు కావాల్సిన యూరియాను అందించారు. ప్రస్తుతం కొన్ని చోట్ల వరి పొట్టదశలో ఉండగా, మరికొన్ని చోట్ల కంకి పూర్తిగా బయటికి వచ్చింది. కాగా, గతంలో సొసైటీకి వచ్చిన యూరియా పక్కదారి పట్టేదని, సమయానికి ఎరువులు వేయక దిగుబడి తగ్గి నష్టపోయామని పలువురు రైతులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం సరిపడా యూరియా అందించి పంటలను గట్టెక్కించడంపై రైతులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. -
కాంగ్రెస్ రాష్ట్ర ఇన్చార్జి మీనాక్షి నటరాజన్తో భేటీ
మోపాల్(నిజామాబాద్రూరల్): కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్తో పీసీసీ డెలిగేట్, నిర్మల్ జిల్లా పార్టీ పరిశీలకులు బాడ్సి శేఖర్గౌడ్ సోమవారం హైదరాబాద్లోని గాంధీభవన్లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నిర్మల్ జిల్లాలో పార్టీ పరిస్థితి, జిల్లా, మండల కమిటీల ఎన్నిక, తదితర అంశాలను మీనాక్షి నటరాజన్కు వివరించారు. కామారెడ్డిలో ఈ నెల 15న నిర్వహించే బహిరంగసభకు జిల్లా నుంచి పెద్ద ఎత్తున బీసీలు, కాంగ్రెస్ కార్యకర్తలను తరలించాలని, సభ విజయవంతం కోసం ప్రతిఒక్కరూ కృషి చేయాలని ఆమె సూచించినట్లు శేఖర్ గౌడ్ తెలిపారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పార్టీ గెలుపు కోసం బాధ్యతలు అప్పగిస్తే పని చేయాలన్నారని పేర్కొన్నారు. కాగా, అంతకుముందు గాంధీభవన్లో జరిగిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ, ఆఫీస్ బేరర్ల సమావేశానికి శేఖర్గౌడ్ హాజరయ్యారు. -
జార్ఖండ్లో అబ్బాపూర్తండా వాసి మృతి
● మృతుడు పోస్టల్ ఉద్యోగి నవీపేట: మండలంలోని అబ్బాపూర్ తండాకు చెందిన సభావాత్ శ్రీహరి(20) సోమవారం జార్ఖండ్లో జరిగిన నీటి ప్రమాదంలో మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి. అబ్బాపూర్ తండాకు చెందిన సభావత్ కై లాస్ కుమారుడు జార్ఖండ్ రాష్ట్రంలోని చక్రధర్ఫూల్ పరిధి ఒటాదిరి బ్రాంచ్లో పోస్టల్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్నారు. సోమవారం ఆయన స్నేహితులతో కలిసి సమీపంలోని వాటర్ఫాల్కు వెళ్లాడు. స్నానం చేస్తుండగా ఒక్కసారిగా నీటి ప్రవాహం పెరిగి నీటమునిగాడు. ఊపిరాడకపోవడంతో మృతి చెందాడు. జార్ఖండ్ పోలీసులు మృతుడి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. శ్రీహరి మృతితో అబ్బాపూర్తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఖలీల్వాడి: నగరంలోని కంఠేశ్వర్ ప్రాంతంలో సోమ వారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందినట్లు మూడో టౌన్ ఎస్సై హరిబాబు తెలిపారు. వి వరాలు ఇలా ఉన్నాయి. ఆగ్రాకు చెందిన సంతోష్(32) సోమవారం బైక్పై ఆర్మూర్ వైపు నుంచి నిజామాబాద్కు వస్తున్నాడు. కంఠేశ్వర్లోని అయ్య ప్ప స్వామి ఆలయ సమీపంలో ముందున్న ఓ స్కూల్ బస్సును బైక్ ఢీకొట్టింది. ఆ వెంటనే వెనుక నుంచి వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో బైక్పై ఉన్న సంతోష్ తలకు తీవ్రగాయాలయ్యాయి. హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే సంతోష్ మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కామారెడ్డి క్రైం: అంగన్వాడీ కేంద్రం నుంచి ఇంటికి వస్తూ దారి మరిచి తప్పిపోయిన చిన్నారిని పట్టణ పోలీసులు గుర్తించి కుటుంబసభ్యులకు అప్పగించారు. ఈ ఘటన జిల్లా కేంద్రంలోని ఆర్బీనగర్ కాలనీలో సోమవారం చోటు చేసుకుంది. కాలనీకి చెందిన తూర్పాటి లక్ష్మి–చింటులకు 4 ఏళ్ల కుమార్తె సాయిపల్లవి ఉంది. ఆమె ప్రతిరోజు ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల సమీపంలోని అంగన్వాడీ కేంద్రానికి ఉదయం 10 గంటలకు వెళ్లి మధ్యాహ్నం 2.45 గంటలకు తిరిగి వచ్చేది. సోమవారం ఇంటికి వస్తుండగా దారి తప్పి ఎక్కడికో వెళ్లిపోయింది. బాలిక కనిపించకపోవడంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు, అంగన్వాడీ కేంద్రం సిబ్బంది గాలించడంతోపాటు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సిరిసిల్లా రోడ్డులోని యూనియన్ బ్యాంకు వద్ద ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ శ్రీకాంత్ బాలికను చేరదీసి పట్టణ పోలీస్స్టేషన్కు తీసుకువచ్చాడు. పట్టణ ఎస్హెచ్వో నరహరి కుటుంబసభ్యులకు సమాచారం అందించి చిన్నారిని అప్పగించారు. -
ఫోన్ హ్యాక్.. ఖాతా షేక్..
మోర్తాడ్ (బాల్కొండ) : మనోడే కదా వాట్సాప్లో ఏపీకే ఫైల్ పంపింది.. ఓపెన్ చేద్దామని క్లిక్ చేశారో ఇక అంతే సంగతులు. క్షణాల్లోనే సైబర్నేరగాళ్లు మీ ఫోన్ను హ్యాక్ చేసేస్తారు. ఎంచక్కా మొబైల్లోని పాస్వర్డులు, ఓపీటీలను తెలుసుకొని మీ ఖాతాల్లోని డబ్బులను దోచేస్తుంటారు. ఇలా ఒకరి తర్వాత మరొకరి మొబైల్లోని కాంటాక్ట్ నంబర్లన్నింటికీ ఏపీకే ఫైల్ పంపుతూ సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు. మోసం జరుగుతోంది ఇలాగే.. ● సైబర్ మోసగాళ్లు వాట్సాప్కు ‘పీఎం కిసాన్ సమ్మాన్ నిధి’, ఎస్బీఐ, ఇతర బ్యాంకులు, ఆఫర్ల పేరిట ఓ ఏపీకే ఫైల్ను పంపిస్తారు. ● ఆ ఫైల్ను క్లిక్ చేయగానే మన మొబైల్ హ్యాక్ అవుతుంది. అనంతరం మన ప్రమేయం లేకుండానే సైబర్ నేరగాళ్లు ఫోన్ను వాడేస్తుంటారు. గుట్టుగా మన సమాచారాన్ని దొంగిలిస్తారు. ఆ తర్వాత బ్యాంకు పిన్, పాస్వర్డుల సహాయంతో మన ఖాతాను ఖాళీ చేస్తారు. ● హ్యాక్ చేసిన మొబైల్లోని కాంటాక్ట్ నంబర్లన్నింటికీ వాట్సాప్ ద్వారా ఏపీకే ఫైల్స్ను పంపిస్తూ ఇలాగే మోసం చేస్తుంటారు. భద్రమైన యాప్స్ను మాత్రమే ఇన్స్టాల్ చేసుకోవాలి. పాస్వర్డులు, పిన్ నంబర్లు, క్రెడిట్ కార్డులు ఇతరత్రా కీలక సమాచారాన్ని మొబైల్లో సేవ్ చేసుకోవద్దు. ఫోన్లకు ఇతరులు ఊహించలేని, కఠినతరమైన పాస్వర్డులు పెట్టుకోవాలి. ప్రధానంగా ఏపీకే ఫైల్స్, లింక్లను అసలే క్లిక్ చేయొద్దు.సైబర్ నేరాలపై అవగాహన పెంచుకొని, సైబర్ మోసగాళ్లకు చిక్కకుండా అప్రమత్తంగా ఉండాలి. ఏపీకే ఫైల్స్ ఓపెన్ చేయొద్దు. ఓటీపీ నంబర్లు ఎవరికీ చెప్పొద్దు. – పొన్నం సత్యనారాయణ, సీఐ, భీమ్గల్ రెచ్చిపోతున్న సైబర్ మోసగాళ్లు ఏపీకే ఫైల్స్ పంపి ఫోన్లను హ్యాక్ చేస్తున్న కేటుగాళ్లు పాస్వర్డులు, ఓటీపీలతో ఖాతాల్లోని డబ్బులను దోచుకుంటున్న వైనం -
అప్పులబాధతో ఒకరి ఆత్మహత్య
ఖలీల్వాడి: నగరంలోని నాందేవ్వాడకు చెందిన మానేయకుర్ రమేశ్(44) అప్పులబాధతో ఆదివారం గడ్డి మందు తాగినట్లు మూడో టౌన్ ఎస్సై హరిబాబు తెలిపారు. గమనించిన కుటుంబసభ్యులు జీజీహెచ్కు తరలించగా చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం మృతి చెందాడన్నారు. మృతుడి భార్య పద్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.కామారెడ్డి క్రైం: తండ్రిని చంపిన కేసులో ఓ కుమారుడికి కామారెడ్డి కోర్టు జీవిత ఖైదు విధించింది. వివరాలిలా ఉన్నాయి. నాగిరెడ్డిపేట మండలం జలాల్పూర్ మండలానికి చెందిన జాన్కంపల్లి విఠల్ 2021 మార్చి 16న హత్యకు గురయ్యాడు. మృతుడికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉండగా చిన్న కుమారుడు సంగమేశ్వర్తో తరుచూ గొడవలు జరిగేవి. సంగమేశ్వర్ తన తండ్రిని హత్య చేసి ఉరివేసుకున్నట్లుగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. కానీ అనుమానించిన కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణలో హత్యగా తేలింది. దీంతో సంగమేశ్వర్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. అప్పటి నుంచి కేసు కోర్టు పరిశీలనలో ఉంది. నేరం రుజువు కావడంతో జిల్లా జడ్జి సీహెచ్వీఆర్ఆర్ వరప్రసాద్ నిందితునికి జీవిత ఖైదు, రూ.10 వేల జరిమానా విధిస్తూ సోమవారం తీర్పు వెల్లడించారు. పోలీసుల తరఫున వాదనలు వినిపించిన పీపీ రాజగోపాల్గౌడ్, కేసును సరైన పద్ధతిలో విచారణ జరిపిన సీఐలు రాజశేఖర్, రాజారెడ్డి, ఎస్సై రాజయ్య, భార్గవ్ గౌడ్, కోర్టు లైజనింగ్ అధికారి రామేశ్వర్రెడ్డి, సిబ్బంది సాయిలును ఎస్పీ రాజేశ్చంద్ర అభినందించారు. -
జాతీయ లోక్అదాలత్ను ఉపయోగించుకోవాలి
ఖలీల్వాడి: జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని సీపీ సాయి చైతన్య సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. చిన్నచిన్న కేసులు, ట్రాఫిక్ చలానాలు, మైనర్ క్రిమినల్ కేసులు, సివిల్ డిస్ప్యూట్లు వంటి వివాదాలకు లోక్ అదాలత్ ద్వారా సులభంగా పరిష్కారం పొందవచ్చని పేర్కొన్నారు. ఈ నెల 13న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ పాల్గొని న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న కేసులను తక్కువ సమయంలో ముగించుకోవచ్చని తెలిపారు. తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో బీఈడీ, ఎంఈడీ సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్లాగ్ పరీక్షలు సోమవారం ప్రశాంతంగా జరిగినట్లు ఆడిట్ సెల్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. బీఈడీ 2, 4వ సెమిస్టర్ పరీక్షల్లో మొత్తం 27 మంది విద్యార్థులకు 18 మంది హాజరుకాగా, 9 మంది గైర్హాజరయ్యారు. ఎంఈడీ 4వ సెమిస్టర్ రెగ్యులర్, 1, 2, 3, 4వ సెమిస్టర్ బ్యాక్లాగ్ పరీక్షల్లో మొత్తం 31 మందికి గానూ 30 మంది హాజరుకాగా ఒకరు గైర్హాజరైనట్లు తెలిపారు. వర్సిటీ కళాశాలలో సోమవారం జరిగిన ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం 4వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల్లో మొత్తం 39 మంది విద్యార్థులకు 34 మంది హాజరుకాగా నలుగురు గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. -
విద్యతోపాటు క్రీడలు కూడా ముఖ్యమే
● ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డికమ్మర్పల్లి: విద్యార్థులకు విద్యతోపాటు క్రీడలు కూడా ముఖ్యమేనని, ఆటలతో శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతత లభిస్తుందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి పేర్కొన్నారు. కమ్మర్పల్లి మండలం అమీర్నగర్ గ్రామంలో సోమవారం నిర్వహించిన మండల అంతర పాఠశాలల క్రీడాపోటీలను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లలను విద్యతోపాటు క్రీడల్లో కూడా ప్రోత్సహించాలన్నారు. ఇక్కడి విద్యార్థులు జాతీయస్థాయి క్రీడల్లో రాణించడానికి వ్యాయామ ఉపాధ్యాయుల కృషి ఎంతో ఉందని అభినందించారు. మార్చ్ఫాస్ట్లో మొదటిస్థానంలో చౌట్పల్లి జెడ్పీహెచ్ఎస్, ద్వితీయ స్థానంలో బషీరాబాద్, కోనసముందర్, తృతీయ స్థానంలో హసకొత్తూర్ పాఠశాలలు నిలిచాయి. ప్రైవేట్ పాఠశాలల విభాగంలో మొదటిస్థానంలో విజ్ఞాన జ్యోతి, ద్వితీయ స్థానంలో క్రిష్ణవేణి, తృతీయ స్థానంలో శ్రీవిద్యాసాయి పాఠశాలలు నిలిచాయి. వీరికి ఎమ్మెల్యే బహుమతులు ప్రదానం చేశారు. గదుల నిర్మాణానికి కృషి.. అమీర్నగర్ మండల పరిషత్ ఉన్నత పాఠశాలలో గదుల కొరత తీవ్రంగా ఉందని, గదుల నిర్మాణం కోసం ప్రభుత్వానికి విన్నవించి నిధులు మంజూరయ్యేలా కృషి చేస్తానని హామీనిచ్చారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ నర్సయ్య, వైస్ చైర్మన్ సుంకెట బుచ్చన్న, సొసైటీ చైర్మన్ సామ బాపురెడ్డి, రేగుంట దేవేందర్, వైస్ చైర్మన్ ఆకుల రాజన్న, ఎంఈవో ఆంధ్రయ్య, డీఎస్డీవో పవన్, నాయకులు స్వామి తదితరులు పాల్గొన్నారు. -
ప్రపంచ దేశాలకు మన ఆర్థిక వ్యవస్థ ఆదర్శం
సుభాష్నగర్: ప్రపంచ దేశాలకు భారత ఆర్థిక వ్యవస్థ ఆదర్శంగా నిలుస్తోందని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పేర్కొన్నారు. దేశ ప్రజలకు దీపావళి కానుకగా జీఎస్టీలో సంస్కరణలు తీసుకొచ్చినందుకు బీజేపీ ఆధ్వర్యంలో ప్రధాని మోదీ, ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్ చిత్రపటాలకు నగరంలోని గాంధీచౌక్లో సోమవారం పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ పటేల్ కులాచారితోకలిసి అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడారు. జీఎస్టీపై గగ్గోలు పెట్టిన ప్రతిపక్షాలకు ఇది చెంపపెట్టన్నారు. పేద, మధ్యతరగతి కుటుంబాలు ఉపయోగించే షాంపు నుంచి లగ్జరీ కార్ల వరకు భారీ ఊరట కల్పించారని హర్షం వ్యక్తంచేశారు. తద్వారా దేశంలో దీపావళి పండుగ సంబరాలు ఇప్పుడే మొదలయ్యాయన్నారు. ప్రధానంగా ఆరోగ్య, జీవిత బీమాలతోపాటు 33 రకాల అత్యవసర మందులపై జీరో జీఎస్టీ ఒక విప్లవాత్మక నిర్ణయమని పేర్కొన్నారు. మేక్ ఇన్ ఇండియాలో భాగస్వాములవుతూ మన దేశ ఉత్పత్తులు పెంచి, గ్రామీణస్థాయి నుంచి మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దాలన్న మోదీ సంకల్పానికి తోడ్పాటునందించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు న్యాలం రాజు, నాగోళ్ల లక్ష్మీనారాయణ, జిల్లా ఉపాధ్యక్షుడు బంటు రాము, నాయకులు జ్యోతి, వనిత, ఇప్పకాయల కిశోర్, తారక్ వేణు, హరీశ్రెడ్డి, పంచరెడ్డి శ్రీధర్, మాస్టర్ శంకర్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ప్రధాని మోదీ, ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్ చిత్రపటానికి పాలాభిషేకం -
పిప్రిలో గౌడ కులస్తుల బహిష్కరణ
ఆర్మూర్టౌన్: ఆర్మూర్ మండలం పిప్రి గ్రామంలో గౌడ కులస్తులపై గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు బహిష్కరణ వేటు వేశారు. కల్లు ధర పెంపు విషయంలో గ్రామానికి చెందిన తమను వీడీసీ బహిష్కరించినట్లు సోమవారం 54 గౌడ కుటుంబాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. ప్రస్తుతం ఉన్న ధర సరిపోవడం లేదని, ధర పెంచుకుంటామని వీడీసీ దృష్టికి తీసుకెళ్లగా, తెల్లకాగితంపై సంతకాలు పెట్టి ఇవ్వాలని లేదంటే తాము చెప్పినట్లు వినాలని హకుం జారీ చేసినట్లు తెలిపారు. తెల్లకాగితంపై సంతకాలు చేయకపోవడంతో తమను బహిష్కరించినట్లు పేర్కొన్నారు. తమకు సంబంఽధించిన హోటళ్లు, దుకాణాలు, ఆటోల్లోకి ఎవరినీ రానివ్వకుండా ఆంక్షలు పెట్టినట్లు గౌడ కులస్తులు తెలిపారు. -
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
బాల్కొండ: జీవాలకు సోకే సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని జిల్లా పశువైద్యాధికారి రోహిత్రెడ్డి పేర్కొన్నారు. బాల్కొండ మండలం బోదేపల్లి గ్రామంలో గొర్రెలకు, మేకలకు సోమ వారం పశుసంవర్థక శాఖ ఆధ్వర్యంలో ఉచితంగా టీకాలు వేశారు. జీవాలకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను తప్పకుండా వేయించాలన్నా రు. గ్రామంలో 850 గొర్రెలు, 140 మేకలకు టీకా లు వేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో పశువైద్యాధికారి గౌతంరాజు, ఎల్ఎస్ఏ ప్రవీణ్, గోపాలమిత్రలు మల్లేశ్, షకీల్, ప్రణీత్, రైతులు పాల్గొన్నారు.కామర్స్ విభాగం డీన్గా ప్రొఫెసర్ యాదగిరితెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ సీనియర్ ప్రొఫెసర్ ఎం యాదగిరి కామర్స్ విభాగం డీన్గా నియామకమయ్యారు. ఈ మేరకు వీసీ ప్రొఫెసర్ టి.యాదగిరిరావు నియామక ఉత్తర్వులు అందజేశారు. కామర్స్ విభాగంలో మూడు దశాబ్దాల బోధన, పరిశోధన అనుభవం కలిగిన ప్రొఫెసర్ యాదగిరి తెయూలో అనేక అడ్మినిస్ట్రేటివ్, అకడమిక్ పదవులు సమర్థంగా నిర్వహించారు. ప్రస్తుతం ప్రొఫెసర్ యాదగిరి తెయూ రిజిస్ట్రార్గా కొనసాగుతున్నారు.సోషల్ సైన్స్ డీన్గా ప్రొఫెసర్ రవీందర్రెడ్డితెలంగాణ యూనివర్సిటీ అర్ధశాస్త్ర విభా గం ప్రొఫెసర్ కే.రవీందర్రెడ్డి సోషల్ సైన్స్ డీన్గా నియమితులయ్యారు. వీసీ ప్రొఫెసర్ టీ.యాదగిరిరావు ఆదేశాల మేరకు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యాదగిరి సోమవారం రవీందర్రెడ్డికి నియామక ఉత్తర్వులు అందజేశారు. రవీందర్రెడ్డి ప్రస్తుతం తెయూ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్గా కొనసాగుతున్నారు.‘గిరిరాజ్’ వైస్ ప్రిన్సిపాల్ రంగరత్నానికి డాక్టరేట్ నిజామాబాద్అర్బన్: గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ రంగరత్నానికి డాక్టరేట్ లభించింది. రసాయనశాస్త్రంలో ‘పాలిమర్ మాట్రిక్స్తో ఔషధాలను జతచేసి, వాటి జీవప్రక్రియలపై అధ్యయనం’ అనే అంశంపై ప్రొఫెసర్ ఎస్బీ పట్వారీ పర్యవేక్షణలో పరిశోధన చేశారు. నాందేడ్లోని ఎస్ఆర్టీఎం యూనివర్సిటీ నుంచి పీహెచ్డీ పట్టా అందుకున్నారు. డాక్టరేట్ అందుకున్న రంగరత్నాన్ని అధ్యాపక బృందం సోమవారం సన్మానించింది. కార్యక్రమంలో పరీక్షల నియంత్రణాధికారి భరత్రాజ్, కార్యాలయ ఉద్యోగులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
నేడు ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు
● జిల్లా స్థాయిలో 40 మంది టీచర్ల ఎంపికనిజామాబాద్అర్బన్: జిల్లా స్థాయిలో 40 మంది ఉత్తమ టీచర్లుగా ఎంపికయ్యారు. ఈమేరకు జిల్లా విద్యాశాఖ సోమవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. కలెక్టరేట్లో మంగళవారం ఉత్తమ టీచర్లను ఉన్నతాధికారులు సన్మానించనున్నారు. ఉత్తమ ఉపాధ్యాయులు వీరే.. హెచ్ఎం కేటగిరి : టి హరిచరణ్ (కుకునూర్, వేల్పూర్), టి సురేశ్కుమార్ (డొంకేశ్వర్), డి రవీందర్ (మామిడిపల్లి, ఆర్మూర్), సీహెచ్ రాంప్రసాద్ (కోనాపూర్, కమ్మర్పల్లి). స్కూల్ అసిస్టెంట్: జి.రాజశేఖర్ (జెడ్పీహెచ్ఎస్, ఏర్గట్ల), ఎస్ మల్లేశ్ (రెంజర్ల), శ్రీనివాస్, ఎం.ప్రశాంత్కుమార్ (బాల్కొండ), ఏ శ్రీనివాస్ (మెండోరా), పి గణేశ్ (ఆలూర్), సయ్యద్ అబ్దుల్ నహీం (నీలా), పి గంగాధర్ (కుకునూర్), ఎం సుజాత (ముచ్కూర్), ఏ లక్ష్మీనారాయణ(ఎడపల్లి), టి సాయిలు (డొంకేశ్వర్), స్వప్న (డిచ్పల్లి), శ్రీనివాసరాజు (టీజీఎంఎస్, బాల్కొండ), ఎస్.స్రవంతి (కేజీబీవీ, ఆర్మూర్). ఎస్జీటీ: బి.శివకుమార్ (శివతండా, నవీపేట్), పెద్ది రమణ (కుర్నాపల్లి). ఎస్కే అబ్దుల్ (వెల్మల్), ప్రవీణ్ కుమార్రెడ్డి (గుంజిలి), శ్రీనివాస్ (మోతె), ఎన్ విజయలక్ష్మి (నాగేపూర్), రాజు (ఇస్సాపల్లి), వి.సునీత (ఆర్మూర్), టి.వెంకటేశ్వర్లు (బర్ధిపూర్, బోధన్), శృతిమ (శ్రీరాంపూర్), బాల్కొండ, అల్తాఫుద్దీనన్(ఫతేపూర్), డి.నరేంద్ర శేఖర్ (బాగేపల్లి). ప్రత్యేక అవార్డులు సీహెచ్ శంకర్ (బోర్గాం, మోపాల్), టి.సాయన్న (ఖిల్లా జీహెచ్ఎస్), హఫీజుద్దీన్న(బెజ్జోరా), ఆదిల్ అహ్మద్ (నిజాంకాలనీ, నిజామాబాద్), శ్రీనివాస్ (చౌట్పల్లి), జి.కిషన్న్ (నారాయణపేట్, జక్రాన్పల్లి), శ్రీనివాస్ (వేంపల్లి, ముప్కాల్), డి.సునీత (నాళేశ్వర్), కే సుజాత (పులాంగ్, నిజామాబాద్), రమేశ్ (మానవతా సదన్, కేర్టేకర్, డిచ్పల్లి). -
ప్రజావాణికి 114 ఫిర్యాదులు
నిజామాబాద్అర్బన్: ప్రజావాణికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో 114 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్తోపాటు అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, ట్రెయినీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావీ, డీఆర్డీవో సాయాగౌడ్, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్కుమార్, డీపీవో శ్రీనివాస్, ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్రెడ్డికి అర్జీలు అందజేశారు. ఫిర్యాదులను పెండింగ్లో పెట్ట కుండా ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఖలీల్వాడి: జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావా ణి కార్యక్రమానికి 11 ఫిర్యాదులు వచ్చాయి. బాధితుల సమస్యలను విన్న సీపీ సాయిచైతన్య వాటిని చట్టప్రకారం పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ప్రజలు పోలీసుల సేవలను స్వచ్ఛందంగా వినియోగించుకోవాలని పేర్కొన్నారు. శాంతిభద్రతలను పరిరక్షిస్తూ ముందుకు సాగడమే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ పని చేస్తోందని సీపీ పేర్కొన్నారు. నిజామాబాద్ నాగారం: జిల్లా కబడ్డీ అసో సియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 13న శని వారం ఉదయం 10 గంటలకు నగరంలోని క్రీడా మైదానంలో అండర్–16 బాలుర జట్ల ఎంపికలు జరుగుతాయని అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు లింగయ్య, గంగాధర్ రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికలో పాల్గొనేవారు 16 సంవత్సరాల్లోపు వయస్సు, 55 కేజీల బరువు ఉండాలన్నారు. ఆధార్ కార్డుతోపాటు జనన ధ్రువీకరణ పత్రం తప్పనిసరిగా తీసుకురావాలన్నారు. ఎంపికై న క్రీడాకారులు జిల్లాలో జరగబోయే రాష్ట్రస్థాయి అంతర్ జిల్లాల కబడ్డీ చాంపియన్షిప్ పోటీల్లో పాల్గొంటారన్నారు. నిజామాబాద్అర్బన్: ఈ నెల 12వ తేదీ వరకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూ నివర్సిటీలో డిగ్రీ, పీజీ కోర్సులకు ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకోవాలని రీజినల్ కో ఆర్డినేటర్ రంజిత సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. డిగ్రీలో బీఎస్సీ, ఎంపీసీ, బీజెడ్సీ, పీజీలో ఎంకాం, ఎమ్మెస్సీ, ఎంబీఏ కో ర్సులు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ఆసక్తిగల వారు దూర విద్యను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
అంగన్వాడీ కేంద్రాల ఆధునికీకరణ
● రూ. రెండు కోట్లతో పనులు ● పాత భవనాల్లో మరుగుదొడ్ల నిర్మాణం.. తాగునీటి సదుపాయం ● 10 నూతన భవనాల నిర్మాణం నిజామాబాద్నాగారం: జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల్లో ఇప్పటి వరకు మరుగుదొడ్ల సదుపాయం లేకపోగా, తాగునీటి సరఫరా అంతంతే. అరకొర సదుపాయాల మధ్య అంగన్వాడీ కేంద్రాలు కొనసాగుతుండడంతో ప్రభు త్వం కేంద్రాల బలోపేతంపై దృష్టి సారించింది. రూ.2 కోట్ల నిధులతో జిల్లాలోని సెంటర్లను ఆధునికీకరించడంతోపాటు 10 నూతన భవనాలను నిర్మించాలని నిర్ణయించింది. జిల్లాలో నిజామాబాద్ రూరల్, నిజామాబాద్ అర్బన్, బోధన్, ఆర్మూర్, భీమ్గల్ మొత్తం ఐదు సీడీపీవో(చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్) కార్యాలయాలు ఉండగా, వీటి పరిధిలో 1501 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. 400 సెంటర్లకు సొంత భవనాలు ఉండగా, మిగతా చోట్ల అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. అయితే 400 అంగన్వాడీ కేంద్రాల్లో మరుగుదొడ్ల నిర్మాణం, 216 కేంద్రాల్లో తాగునీటి సదుపాయం కల్పించడంతోపాటు 10 నూతన భవన నిర్మాణ పనులను ప్రా రంభించారు. ఇప్పటికే 156 మరుగుదొడ్ల నిర్మాణ పూర్తయ్యాయని, 244 చోట్ల పనులు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. రెండు నెలల్లో పనులు పూర్తవుతాయని పేర్కొంటున్నారు. సెంటర్ల ఆధునీకరణలో భాగంగా భవనాలకు రంగులు వేయించడంతోపాటు గోడలపై పిల్లలకు అర్థమయ్యేలా చిత్రాలు గీయించారు. 216 సెంటర్లలో తాగునీటి సదుపాయం కల్పించేందుకు పనులు చేపట్టగా 35 సెంటర్లలో పనులు పూర్తయ్యాయి. మొత్తం 10 చోట్ల నూతన భవనాల నిర్మాణ పనులు ప్రారంభించగా, ఇప్పటికే ఐదు చోట్ల పనులు పూర్తయ్యాయి. రూపురేఖలు మారుతున్నాయి జిల్లాలో అంగన్వాడీ కేంద్రాల రూపురేఖలు మారుతున్నాయి. మరమ్మతులతో పాటు ఆధునీకరణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. సొంత భవనాలు ఉన్న చోట్ల మరుగుదొడ్ల నిర్మాణ పనులు, తాగునీటి సదుపాయం కల్పిస్తున్నాం. అలాగే కొత్త భవనాలు సైతం నిర్మిస్తున్నాం. – రసూల్బీ, జిల్లా సంక్షేమాధికారిణి -
వరదలే వరదలు
● దశాబ్దాలుగా కళకళలాడుతున్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ● 47 ఏళ్లుగా ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో ● చరిత్రలో అత్యధికంగా 1983లో.. అతి తక్కువ 1987, 2015లో.. ● రెండుసార్లు డెడ్ స్టోరేజీకన్నా తక్కువ నీటిమట్టంబాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు దశాబ్దాలుగా నీటితో కళకళలాడుతోంది. 47 ఏళ్ల చరిత్రలో కేవ లం రెండేళ్లు మాత్రమే స్వల్ప ఇన్ఫ్లో వచ్చింది. ప్రా జెక్టుకు 1983 నుంచి వరదలు ప్రారంభమయ్యా యి. 1978 నుంచి కాలువల ద్వారా నీటి విడుదల ప్రారంభించినప్పటికీ ఆ సమయంలో ప్రాజెక్ట్ ని ర్మాణం పూర్తి కాలేదు. గడిచిన 47 ఏళ్లలో 10 సంవత్సరాలు మాత్రమే స్వల్పంగా వరద నీరు వచ్చి చే రింది. 1987, 2015లో మాత్రమే ప్రాజెక్ట్ నీటి మ ట్టం డెడ్ స్టోరేజీ (5 టీఎంసీలు) కన్నా తక్కువ నీటి మట్టానికి పడిపోయింది. దశాబ్ద కాలంగా ప్రతి ఏడాది ప్రాజెక్ట్ నిండుకుండలా మారుతుండగా మిగులు జలాలను దిగువకు విడుదల చేస్తున్నారు. బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లోకి ఎగువ నుంచి వరద మళ్లీ పోటెత్తింది. ఆదివారం సా యంత్రం 28 వేల క్యూసెక్కులుగా ఉన్న ఇన్ఫ్లో క్రమంగా 50 వేల క్యూసెక్కులకు పెరిగింది. ఆదివారం రాత్రి 7గంటలకు 8 గేట్లను ఎత్తి 12,500 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. అర్ధరాత్రి తరువాత 54 వేల క్యూసెక్కుల కు పెరగడంతో అవుట్ఫ్లోను 25వేల క్యూసెక్కు లకు పెంచారు. సోమవారం రోజంతా నిలకడగా కొనసాగిన ఇన్ఫ్లో సాయంత్రానికి 66,685 క్యూ సెక్కులకు పెరిగింది. దీంతో 12 వరద గేట్ల ద్వా రా 37,500 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. ఎగువ నుంచి వరద మరింత పెరిగే అవకాశం ఉందని ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు. కాలువల ద్వారా.. వరద కాలువ ద్వారా 19 వేల క్యూసెక్కులు, కా కతీయ కాలువ ద్వారా 5500, ఎస్కేప్ గేట్ల ద్వారా 2500, సరస్వతి కాలువ ద్వారా 800, లక్ష్మికాలువ ద్వారా 200, గుత్ప లిఫ్ట్కు 270 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మిషన్ భగీరథ అవసరాలకు 231 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తుండగా, ఆవిరి రూపంలో 684 క్యూసెక్కుల నీరు పోతోంది. ప్రాజెక్ట్పూర్తి స్థాయి నీటి మట్టం 1091(80.5 టీఎంసీలు) అడుగులు కాగా సోమవారం సాయంత్రానికి అంతే స్థాయి నీటి మట్టంతో ప్రాజెక్ట్ నిండుకుండలా ఉంది. మళ్లీ పోటెత్తిన వరద.. 12 వరద గేట్ల ద్వారా 37,500 క్యూసెక్కుల నీటి విడుదల ఎగువ నుంచి 66,685 క్యూసెక్కుల ఇన్ఫ్లో బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లోకి ఎగువ నుంచి వరద మళ్లీ పోటెత్తింది. ఆదివారం సా యంత్రం 28 వేల క్యూసెక్కులుగా ఉన్న ఇన్ఫ్లో క్రమంగా 50 వేల క్యూసెక్కులకు పెరిగింది. ఆదివారం రాత్రి 7గంటలకు 8 గేట్లను ఎత్తి 12,500 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. అర్ధరాత్రి తరువాత 54 వేల క్యూసెక్కుల కు పెరగడంతో అవుట్ఫ్లోను 25వేల క్యూసెక్కు లకు పెంచారు. సోమవారం రోజంతా నిలకడగా కొనసాగిన ఇన్ఫ్లో సాయంత్రానికి 66,685 క్యూ సెక్కులకు పెరిగింది. దీంతో 12 వరద గేట్ల ద్వా రా 37,500 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. ఎగువ నుంచి వరద మరింత పెరిగే అవకాశం ఉందని ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు. కాలువల ద్వారా.. వరద కాలువ ద్వారా 19 వేల క్యూసెక్కులు, కా కతీయ కాలువ ద్వారా 5500, ఎస్కేప్ గేట్ల ద్వారా 2500, సరస్వతి కాలువ ద్వారా 800, లక్ష్మికాలువ ద్వారా 200, గుత్ప లిఫ్ట్కు 270 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మిషన్ భగీరథ అవసరాలకు 231 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తుండగా, ఆవిరి రూపంలో 684 క్యూసెక్కుల నీరు పోతోంది. ప్రాజెక్ట్పూర్తి స్థాయి నీటి మట్టం 1091(80.5 టీఎంసీలు) అడుగులు కాగా సోమవారం సాయంత్రానికి అంతే స్థాయి నీటి మట్టంతో ప్రాజెక్ట్ నిండుకుండలా ఉంది. -
రేపు ‘స్థానిక’ తుది ఓటరు జాబితా
● కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి నిజామాబాద్అర్బన్: జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల తుది ఓటరు జాబితాను ఈ నెల 10వ తేదీన వెలువరించనున్నట్లు కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా ఇప్పటికే ముసాయిదా ఓటరు జాబి తా విడుదల చేయడం జరిగిందని తెలిపారు. ము సాయిదా జాబితా, పోలింగ్ కేంద్రాలకు సంబంధించి ఏవైనా అభ్యంతరాలు ఉంటే తెలుపాలని సూ చించారు. అభ్యంతరాలను పరిశీలించి, అవసరమై న మార్పులు, చేర్పులు చేసిన తరువాత 10వ తేదీ న తుది జాబితా వెలువరిస్తామని అన్నారు. మండల స్థాయిలో నిర్వహించిన రాజకీయ పార్టీల ప్రతి నిధుల సమావేశంలో సైతం అభ్యంతరాలు ఉంటే తెలుపాలన్నారు. తుది ఓటరు జాబితా రూపకల్పనకు రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు. సమావేశంలో అదనపు కలెక్టర్ అంకిత్, జెడ్పీ సీఈవో సాయాగౌడ్, డిప్యూటీ సీఈవో సాయన్న, రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. -
యూరియా.. లేదయ!
● వేధిస్తున్న కొరత ● ఇబ్బందిపడుతున్న రైతులు ● బస్తా కోసం గంటల తరబడి బారులు ● అయినా దక్కక నిరాశ సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : వానాకాలంలో సాగు చే సిన పంటలకు అవసరమైన మేర యూరియా సర ఫరా కాకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవలి కాలంలో ఎక్కడ చూసినా రైతులు ఎరువుల కోసం సహకార సంఘాల వద్ద బారులు తీరి కనిపిస్తున్నారు. కొన్ని చోట్ల రాత్రి వేళలోనే సొసైటీకి చేరుకుని అక్కడే ఉండి పొద్దున్నే వరుసలో నిల్చుంటున్నారు. మరికొన్ని చోట్ల చెప్పులు, రాళ్లు, చెట్లకొమ్మలు, పాసుపుస్తకాల జిరాక్సులను వరుస లో పెడుతున్నారు. జిల్లాలోని మాచారెడ్డి, రామారె డ్డి, బీబీపేట, భిక్కనూరు, దోమకొండ, కామారెడ్డి తదితర మండలాల్లో సమస్య తీవ్రంగా ఉంది. ఆయా మండలాల్లో యూరియా కోసం రైతులు పది రోజులుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నా రు. ఇటీవల భారీ వర్షాలు కురవడంతో చెరువు లు, ప్రాజెక్టు లు నిండాయి. వర్షాలతో కొంత న ష్టం జరిగినా, ఉన్న పంటలకు ఎరువులు వేయాలని రైతులు సహ కార సంఘాల చుట్టూ తిరుగుతున్నారు. స్టాక్కు మించి రైతులు వస్తుండడంతో ఒక్కో బస్తా చొప్పు నే పంపిణీ చేస్తున్నారు. ఆ ఒక్క బస్తా కూడా చాలామందికి దక్కడం లేదు. ఆందోళనకు దిగుతున్న రైతులు.. ఎరువులు దొరక్క ఇబ్బందులు పడుతున్న రైతు లు ఆందోళనకు దిగుతున్నారు. రామారెడ్డి మండలం ఉప్పల్వాయి గ్రామంలో రైతులు సోమ వారం యూరియా కోసం ధర్నా చేశారు. అధికారుల తీరు పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మాచారె డ్డి మండల కేంద్రంలోనూ రైతులు రోడ్డెక్కారు. పోలీసు పహారాలో పంపిణీ... మాచారెడ్డి మండల కేంద్రంలోని సహకార సంఘానికి సోమవారం భారీ సంఖ్యలో రైతులు తరలిరావడంతో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కూపన్లు ఇవ్వడానికి అధికారులు పోలీ సుల సాయం తీసుకున్నారు. అక్కడ రైతులు, పోలీసులకు మధ్య పలుమార్లు వాగ్వాదం జ రిగింది. అలాగే వ్యవసాయశాఖ, సహకార శాఖ అధికారులతోనూ రైతులు గొడవకు దిగారు. ప్రైవేటు వ్యాపారుల బ్లాక్ దందా.... కొందరు వ్యాపారులు ముందుగానే యూరియాను బ్లాక్ చేసి ఉంచారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఎ క్కువ డబ్బులు తీసుకుని విక్రయిస్తున్నట్లు తెలు స్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో కొందరు దళారులు పెద్ద మొత్తంలో ఎరువులు స్టాక్ చేసి ఉంచారన్న ప్రచారం జరుగుతోంది. మాచారెడ్డిలో.. మాచారెడ్డి : మండలకేంద్రానికి సోమవారం యూరియా వస్తుందని అధికారులు చెప్పడంతో వేకువజామునే అన్ని గ్రామాల నుంచి సింగిల్విండోకు వచ్చి బారులు తీరారు. యూరియా రాకపోవడంతో విసిగి వేసారిన రైతులు ఇటుకలను క్యూలో ఉంచి ఆందోళనకు దిగారు. మండల కేంద్రంలోని రోడ్డుపై రాస్తారోకో చేశారు. జిల్లాలో 48 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవ సరం ఉండగా.. ఇప్పటికే 46 వేల మెట్రిక్ టన్నులు వచ్చింది. దానిని రైతులకు అందించాం. మంగళవా రం మరో 800 మెట్రిక్ టన్ను ల యూరియా రానుంది. ఆయా సొసైటీలకు సరఫరా చేసి రైతులకు పంపిణీ చేస్తాం. బ్లాక్ మార్కెట్ విషయం మా దృష్టికి రాలేదు. ఎవరైనా బ్లాక్మార్కెట్లో అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటాం. – మోహన్రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి -
గ్రామ పాలనాధికారులకు పోస్టింగ్లు
నిజామాబాద్అర్బన్: గ్రామ పాలనాధికారులు(జీపీవో)గా నియమితులైన వారికి సోమ వారం పోస్టింగ్లు ఇచ్చారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ప్రధాన సమావేశ మందిరంలో కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి సమక్షంలో కౌన్సెలింగ్ ప్రక్రియ ద్వా రా ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరిస్తూ జీపీవోలకు పోస్టింగ్లను ఖరారు చేశారు. ఉదయం నుంచి రాత్రి వరకు ఈ ప్రక్రియ కొనసాగింది. అదనపు కలెక్టర్లు అంకిత్, కిర ణ్ కుమార్, కలెక్టరేట్ ఏవో ప్రశాంత్, ఇతర అధికారులు కౌన్సెలింగ్ ప్రక్రియ నిర్వహించారు. -
కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా బస్వా
● జిల్లా నేతలకు కీలక పదవులు ● బీజేపీ పూర్తిస్థాయి కార్యవర్గం ప్రకటన సుభాష్నగర్: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కి సాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా బస్వా లక్ష్మీనర్స య్య నియ మితులయ్యారు. బీజేపీ పూ ర్తిస్థాయి కార్యవర్గంతోపాటు ఏడు మోర్చాల రాష్ట్ర అధ్యక్షుల ను పార్టీ అధ్యక్షుడు ఎన్ రాంచందర్రావు సోమవా రం ప్రకటించారు. బస్వా లక్ష్మీనర్సయ్య పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన కాలంలోనే ఎంపీగా అర్వింద్ ధర్మపురి (2019లో) విజయం సాధించారు. మెదక్ పార్లమెంట్ ఇన్చార్జీగా 2024 ఎన్నికల్లో వ్యవహరించారు. ఆ ఎన్నికల్లో ఎంపీగా రఘునంద న్రావు గెలుపొందా రు. ప్రస్తుతం వివిధ విభాగాలకు సంగారెడ్డి, నిర్మ ల్, పెద్దపల్లి జిల్లాల ఇన్చార్జీగా కొనసాగుతున్న ఆయన.. స్టేట్ యాక్టివ్ మెంబర్స్ కో కన్వీనర్గా కూడా ఉన్నారు. తనను కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించినందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్రావు, రాష్ట్ర సంఘటన మంత్రి చంద్రశేఖర్కు బస్వాలక్ష్మీనర్సయ్య ప్రత్యేక ధన్యవాదా లు తెలిపారు. రాష్ట్రంలో రైతాంగ సమస్యల పరిష్కా రం కోసం ప్రభుత్వంపై ఉద్యమిస్తామని ఆయన పేర్కొన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా గోపిడి స్రవంతిరెడ్డి బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఫ్లోర్లీడర్ గోపిడి స్రవంతిరెడ్డి నియమితులయ్యారు. స్రవంతిరెడ్డి 2020 సంవత్సరంలో పార్టీలో చేరి కార్పొరేటర్గా గెలుపొందారు. ఆ తర్వాత మున్సిపల్ కార్పొరేషన్లో ఫ్లోర్లీడర్గా వ్యవహరించారు. 2021లో బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమితులయ్యారు. తనను పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నియమించినందుకు అధ్యక్షుడు ఎన్ రాంచందర్రావు, ఎంపీ అర్వింద్ ధర్మపురికి స్రవంతిరెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. -
విద్యార్థులే లక్ష్యంగా గంజాయి విక్రయాలు
● నాందేడ్ నుంచి ప్రతి వారం అక్రమంగా రవాణా ● ఇటీవల భీమ్గల్లో విక్రేతను అరెస్టు చేసిన పోలీసులు మోర్తాడ్(బాల్కొండ): విద్యార్థులు, యువతే లక్ష్యంగా గంజాయి వ్యాపారులు తమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. దీంతో చదువుకోవాల్సిన విద్యార్థు లు గంజాయి మత్తుకు బానిసై జీవితాన్ని నాశ నం చేసుకుంటున్నారు. తమపై తల్లిదండ్రులు పెంచుకున్న ఆశలను విద్యార్థి దశలోనే తుంచివేస్తున్నారు. రుచి చూపించి.. ఇటీవల భీమ్గల్ డిగ్రీ కళాశాల వెనుక భాగంలో గం జాయి విక్రయిస్తున్న కారెపల్లికి చెందిన బూక్యా ర ఘును మూడు రోజుల కింద ఎకై ్సజ్ పోలీసులు అ రెస్టు చేశారు. రఘును విచారించగా విస్తుపోయే ని జాలు వెలుగులోకి రావడం గమనార్హం. భీమ్గల్లో ని ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల్లో చదువుకుంటు న్న కొందరు విద్యార్థులకు గంజాయి రుచి చూపించిన దుండగులు తమ దందాను యథేచ్చగా కొనసాగిస్తున్నారని తేలింది. దాదాపు 40 మంది విద్యార్థు లు కొన్ని నెలలుగా గంజాయికి బానిసలైనట్లు అధికారులు గుర్తించారు. నిందితుడు ప్రతి వారం గంజా యిని నాందేడ్ నుంచి తీసుకువచ్చి విద్యార్థులకు వి క్రయిస్తాడని తెలిసింది. ఒక్కో ప్యాకెట్ను రూ.100 కు తీసుకవచ్చి రూ.500లకు విక్రయిస్తుండటంతో అధిక ఆదాయం రావడంతో ప్రతి వారం తీసుకువచ్చేవాడు. అలా నాందేడ్కు వెళ్లినప్పుడు కనీసం 10 నుంచి 20 ప్యాకెట్లు తీసుకవచ్చి తన దందా కొనసాగించేవాడు. ఇదిలా ఉండగా గంజాయికి బానిసై న విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులను ఎకై ్సజ్ స్టేషన్కు రప్పించి కౌన్సెలింగ్ నిర్వహించారు. వారి లో మార్పు రాకపోతే డీ అడిక్షన్ సెంటర్కు తప్పనిసరిగా పంపించాలని అధికారులు యోచిస్తున్నారు. గంజాయిని పూర్తిగా నిర్మూలించాలంటే ప్రజల సహకారం ఎంతో అవసరం. గంజాయి విక్రేతలపైనా, బానిసలపైనా ప్రజలు దృష్టిపెట్టి మాకు, పోలీసులకు సమాచారం అందించాలి. గంజాయి విక్రయించేవారు, వారికి మద్దతు ఇచ్చేవారు ఎంతటివారైనా వదలిపెట్టేది లేదు. – పి. వేణుమాధవ్ రావు, ఎకై ్సజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్, భీమ్గల్ పెద్దలకు వేరే ముఠా.. పెద్దలకు గంజాయిని వేరే ముఠా సరఫరా చేస్తుండగా, వీరికి కొందరు నాయకుల అండదండలు ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి. గంజాయి విక్రేతలు ఎక్కడ అరెస్టు అయినా భీమ్గల్ మండలానికి చెందిన ఒక నాయకుడు అధికారులపై ఒత్తిడి తీసుకవచ్చి వారిని విడిపించడం, కేసులు నమోదు కాకుండా చూసుకోవడం చేసేవాడని సమాచారం. భీమ్గల్ ప్రాంతంలో రాజకీయ నాయకుల ప్రోద్బలంతోనే గంజాయి దందా సాగడంతో మత్తుకు అడ్డు అదుపు లేకుండా సాగిందనే వాదన వినిపిస్తోంది. ఇప్పటికై నా అధికారులు పారదర్శకంగా విచారణ చేపట్టి గంజాయి వెనుక దాగి ఉన్న నాయకుల బండారం బయటపెడితేనే ఈ దందాకు చెక్ పెట్టవచ్చనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. -
క్రైం కార్నర్
మాచారెడ్డి: మండలంలోని సోమారంపేటకు చెందిన ఓ యువకుడు దుబాయిలో అనుమానాస్పదంగా మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. గ్రామానికి చెందిన గూగులోతు రవి (32) మూడేళ్ల క్రితం బతుకుదెరువు కోసం దుబాయి వెళ్లాడు. తన గదిలో ఆదివారం అతడు అనుమానాస్పదంగా మృతి చెందినట్లు గ్రామస్తులు ద్వారా తెలిసింది. ప్రభుత్వం స్పందించి రవి మృతదేహాన్ని త్వరగా స్వగ్రామానికి తెప్పించాలని గ్రామస్తులు కోరారు. తాడ్వాయి(ఎల్లారెడ్డి): మండలంలోని కన్కల్ గ్రామ శివారులో పేకాట స్థావరంపై దాడిచేసి పేకాడుతున్న ముగ్గురిని అరెస్టు చేయగా, ఇద్దరు పరారయ్యారని ఎస్సై మురళి తెలిపారు. విశ్వసనీయ సమాచారం రావడంతో పేకాట స్థావరంపై దాడిచేసినట్లు పేర్కొన్నారు. ఐదుగురు పేకాడుతుండగా పోలీసులు దాడి చేయగా ఇద్దరు పరారయ్యారు. మిగిలిన ముగ్గురిని పోలీసులు పట్టుకొని, వారి వద్ద ఉన్న రూ.2850 నగదు, మూడు బైక్లు, మూడు ఫోన్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై వివరించారు. బాన్సువాడ: పట్టణంలోని కోనా బాన్సువాడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహించే పురుషోత్తం అనే ఉపాధ్యాయుడిపై కేసు నమోదు చేసినట్లు సీఐ అశోక్ తెలిపారు. పాఠశాలలో ఇన్చార్జి హెచ్ఎంగా విధులు నిర్వహిస్తున్న తారాచంద్కు పురుషోత్తంకు మధ్య శనివారం గొడవ జరిగింది. తారాచంద్ తలపై పురుషోత్తం వాటర్ బాటిల్తో కొట్టగా ఆయనకు తీవ్ర గాయమైంది. దీంతో తారాచంద్ బాన్సువాడ పోలీస్టేషన్లో పురుషోత్తంపై ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. అలాగే తారాచంద్ తనను ఇష్టం వచ్చినట్లు దూషించడని పురుషోత్తం కూడా ఆయనపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఆర్మూర్టౌన్: పట్టణంలో ఆదివారం నిర్వహించిన వినాయకుడి నిమజ్జన శోభాయాత్రలో ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి విద్యుత్ షాక్తో గాయపడ్డాడు. రాంనగర్ మండప నిర్వహకులు వినాయకుడిని నిమజ్జనానికి ప్రత్యేక వాహనంలో తీసుకువెళ్లారు. హుస్సాబాద్కాలనీకి రాగానే రోడ్డు మధ్యలో ఉన్న విద్యుత్ వైర్లు వినాయకుడికి తగిలాయి. దీంతో వినాయకుడి పక్కనే పడుకొని ఉన్న నితిన్ అనే వ్యక్తికి కరెంట్ షాక్ తగలంతో గాయపడ్డాడు. వెంటనే స్థానికులు గమనించి అతడిని చికిత్స నిమిత్తం ఓ ప్రయివేట్ ఆస్పత్రికి తరలించారు. -
మరో ఐదేళ్లు అధికారంలో మేమే..
● టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ వర్ని: ప్రస్తుత పదవీకాలంతోపాటు రాబోయే మరో ఐదేళ్లపాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. మోస్రా మండల కేంద్రంలోని సీతారామ ఆలయంలో ఆదివారం ఆయన ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు అన్నింటినీ నెరవేరుస్తున్నామని, రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజలు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మద్దతు తెలుపుతున్నారని వివరించారు. పదేళ్ల బీఆర్ఎస్ దోపిడీ రాజ్యానికి ప్రజలు చరమగీతం పాడారని, రాష్ట్రంలో రేవంత్రెడ్డి ప్రజాపాలన కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. అన్నివర్గాల వారికి సమన్యాయం చేస్తూ ప్రభుత్వం ముందుకు వెళ్తోందని, ఇదే స్ఫూర్తితో మరో ఐదేళ్లపాటు పాలన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. -
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
జక్రాన్పల్లి: మండలంలోని అర్గుల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2007–08 బ్యాచ్ పదో తరగతి విద్యార్థులు ఆదివారం ‘పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం’ నిర్వహించారు. మిత్రులంతా ఏళ్ల త ర్వాత కలుసుకోవడంతో ఆలింగనం చేసుకొని ఆత్మీయంగా పలకరించుకున్నారు. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుని ఆనందంగా గడిపారు. ఆనాటి ఉపాధ్యాయులను సత్కరించారు. అనంతరం సాంస్కృతిక కార్యకమ్రాలు, వింధులతో ఉత్సాహంగా గడిపారు. భిక్కనూరు: మండలంలోని పెద్దమల్లారెడ్డి ప్రభుత్వ ఉన్నత పాఠశాల 1996–97 విద్యార్థులు ఆదివారం స్థానిక వీరభద్ర ఫంక్షన్హాల్లో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈసందర్భంగా విద్యార్థులంతా 28 ఏళ్ల తర్వాత కలుసుకోవడంతో భావోద్వేగానికి గురయ్యారు.ఒకరినొకరు ఆ ప్యాయంగా పలుకరించుకుంటూ యోగక్షేమాలు తెలుసుకున్నారు.అనంతరం తమకు చదువు చెప్పి న ఆనాటి ఉపాధ్యాయులను సత్కరించి వారి ఆశీ ర్వాదం పొందారు. వచ్చే ఏడాది కుటుంబీకులతో క లిసి సమ్మేళనం నిర్వహించాలని తీర్మానించుకున్నా రు. పాఠశాల అభివృద్ధికి సైతం కృషిచేస్తామన్నారు. -
భీమ్గల్లో పోలీస్ వాహనం ధ్వంసం
మోర్తాడ్(భీమ్గల్): భీమ్గల్లో వినాయక నిమజ్జనం సందర్బంగా పోలీసులు బందోబస్తు నిర్వహించగా తమ వినోదానికి అడ్డు చెప్పారనే కక్షతో ముగ్గురు యువకులు పోలీసుల వాహనంపై రాళ్లు రువ్వి అద్దాలను పగులగొట్టారు. శనివారం రాత్రి చోటు చేసుకున్న ఘటనను దృష్టిలో ఉంచుకున్న ముగ్గురు యువకులు ఆదివారం ఉదయం భీమ్గల్ పోలీసుల వాహనంపై రాళ్లు రువ్వారు. ఈ విషయమై ఎస్సై సందీప్ మాట్లాడుతూ.. తమ వాహనంపై రాళ్లతో దాడి చేసి తమ విధులకు ఆటంకం కలిగించిన ముగ్గురు యువకులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. -
లిఫ్ట్లను వెంటనే ప్రారంభించాలి
వేల్పూర్: మండలంలోని కుకునూర్, నవాబు ఎత్తిపోతల పథకాల ద్వారా నీటి సరఫరాను వెంటనే ప్రారంభించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి నీటి పారుదల శాఖ అధికారులను ఆదేశించారు. వేల్పూర్లోని ఆయన నివాసంలో ఎమ్మెల్యేను కుకునూర్ గ్రామస్తులు, నవాబు లిఫ్ట్ కమిటీ సభ్యులు ఆదివారం కలిసి ఎత్తిపోతల పథకాల ద్వారా నీటి సరఫరాను ప్రారంభించాలని విన్నవించారు. దీంతో ఆయన నీటి పారుదల శాఖ సీఈ మధుసూదన్, ఈఈ భానుప్రకాశ్తో ఫోన్లో మాట్లాడారు. సీజన్ ప్రారంభించకముందే మోటార్లు, ట్రాన్స్ఫార్మర్లు సిద్ధంగా ఉన్నది, లేనిది చూసుకోవాల్సిన బాధ్యత అధికారులదేనని అన్నారు. వెంటనే ట్రాన్స్ఫార్మర్ను తెప్పించి నవాబు లిఫ్ట్ను ప్రారంభించాలన్నారు. కుకునూర్ లిఫ్ట్ మోటార్లు ఇసుకలో కూరుకుపోయినట్లు గ్రామస్తులు ఎమ్మెల్యే దృష్టికి తేగా, సమస్యను పరిష్కరించాలని అధికారులకు సూచించారు. శ్రీరాంసాగర్లో 45 టీఎంసీల నీరున్నప్పుడే లిఫ్ట్ల ద్వారా చెరువులు నింపి ఉంటే ఇప్పుడు సమస్య వచ్చేది కాదన్నారు. వందల టిఎంసీల నీరు సముద్రం పాలవుతోందన్నారు. ఎస్సారెస్పీలో పూర్తిస్థాయిలో నీరున్నందున వెంటనే గుత్ప, చౌట్పల్లి హన్మంత్రెడ్డి లిఫ్ట్లు ప్రారంభించి చెరువులు నింపాలని అన్నారు. నిర్వహణ లేక వేంగంటి లిఫ్ట్కు సంబంధించిన కాపర్ కాయిల్స్, ఇతర సామగ్రిని దుండగులు ఎత్తుకుపోయారని, వాటికి మరమ్మతులు చేసి పల్లికొండ లిఫ్ట్ను కూడా ప్రారంభించాలని అధికారులకు సూచించారు. -
ఆర్మూర్ గణేశ్ శోభాయాత్రలో ఉద్రిక్తత
● లాఠీచార్జ్ చేసిన పోలీసులు ● రోడ్డుపై బైఠాయించి, నిరసన తెలిపిన యువకులు ఆర్మూర్టౌన్: ఆర్మూర్ పట్టణంలో ఆదివారం తెల్లవారుజామున గణేష్ శోభాయాత్రలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో గణేశ్ మండలి యువకులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో సుమారు రెండు గంటలపాటు శోభాయాత్ర నిలిచిపోయింది. వివరాలు ఇలా.. పట్టణంలోని కంఠేశ్వర యూత్ గణేష్ మండలి వద్ద ఓ పోలీసు అధికారి దురుసుగా వ్యవహరిస్తూ అసభ్య పదజాలంతో దూషించడంతో మండలి సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులకు, నిర్వాహకులకు మధ్య వాగ్వాదం నెలకొంది. దీంతో పోలీసులు యూత్ సభ్యులపై లాఠీచార్జ్ చేశారు. దీంతో మండపాల నిర్వాహకులు రెండు గంటల పాటు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు తమకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మరోవైపు గణేష్ శోభాయత్ర సైతం నిలిచిపోవడంతో పాటు వివిధ మండపాల నిర్వాహకులు కంఠేశ్వర్ యూత్ సభ్యులకు మద్దతు తెలిపారు. అనంతరం యూత్ సభ్యులను పలువురు సముదాయించి శోభాయాత్రను కొనసాగే విధంగా చేశారు. -
ఎస్సారెస్పీ నీటి విడుదల
● 28,500 క్యూసెక్కుల నీరు ఇన్ఫ్లో ● 8 వరద గేట్ల ద్వారా 12500 క్యూసెక్కులు అవుట్ ఫ్లోపర్యాటకుల సందడి శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ను సందర్శించేందుకు ఆ దివారం పర్యాటకులు అధిక సంఖ్యలో తరలివ చ్చారు. డ్యామ్పై ఫొటోలు, సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు. జిల్లాతోపాటు నిర్మల్, జగిత్యాల, కరీంనగర్, హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి పర్యాటకులు తరలివచ్చారు. బాల్కొండ: ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు పెరుగుతుండటంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లోని ఎనిమిది వరద గేట్ల ద్వారా 12,500 క్యూసెక్కుల నీటి విడుదలను అధికారులు ఆదివారం సాయంత్రం ప్రారంభించారు. ఎగువ ప్రాంతాల నుంచి 28,500 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోందని, రాత్రికి మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కాగా, ఎస్సారెస్పీ వరద కాలువకు 18 వేల క్యూసెక్కుల నుంచి 19 వేల క్యూసెక్కులకు నీటి విడుదలను పెంచారు. కాకతీయ కాలువకు 5500, ఎస్కెప్ గేట్ల ద్వారా 2500, సరస్వతి కాలువకు 500, గుత్ప లిఫ్ట్ ద్వారా 270, మిషన్ భగీరథ ద్వారా 231 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. 684 క్యూసెక్కుల నీరు ఆవిరి రూపంలో పోతోంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091(80.5 టీఎంసీలు) అడుగులు కాగా ఆదివారం సాయంత్రానికి నిండుకుండలా ఉంది. గేట్ల ద్వారా కొనసాగుతున్న నీటి విడుదల