breaking news
Nizamabad
-
భోజన ఏజెన్సీలకు బకాయిల భారం
మోర్తాడ్(బాల్కొండ): ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థుల కడుపు నింపుతున్న మధ్యా హ్న భోజన ఏజెన్సీలు ఆర్థిక ఇబ్బందులను ఎదు ర్కొంటున్నాయి. ప్రభుత్వం సకాలంలో బిల్లులు మంజూరు చేయకపోవడంతో నిర్వాహకులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. బకాయిలు పేరుకపోవడంతో ఇంకెంత వరకు అప్పులు చేయాలని ప్రశ్నిస్తు న్నారు. గురుకుల పాఠశాలల్లోని విద్యార్థులకు డైట్ చార్జీలను పెంచిన ప్రభుత్వం వారికి క్రమం తప్పకుండా నిధులను కేటాయిస్తుంది. ప్రభుత్వ పాఠశాలల్లోని ఏజెన్సీలకు మాత్రం నెలల తరబడి బిల్లులను చెల్లించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. 20 24–25 విద్యా సంవత్సరానికి అక్టోబర్ నుంచి ఫిబ్ర వరి 2025 వరకూ తొమ్మిది, పది తరగతులు చదువుతున్న విద్యార్థులకు సంబంధించిన బిల్లులతోపా టు అన్ని తరగతుల విద్యార్థులకు కోడిగుడ్లు వడ్డించిన బిల్లులు, గౌరవ వేతనం బకాయిలు రూ.1.43 కోట్ల వరకూ ఉన్నాయి. గడిచిన మార్చి, ఏప్రిల్ నెలలకు సంబంధించి రూ.3 కోట్లు, 2025–26 విద్యా సంవత్సరంలోని బిల్లు బకాయి మరో రూ.1.50 కోట్లు చెల్లించాల్సి ఉంది. జిల్లాలోని 1124 ఏజెన్సీలకు ప్రతి నెలా క్రమం తప్పకుండా బిల్లు చెల్లించాలంటే రూ.1.50 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంది. ఏజెన్సీల నిర్వాహకులు పేద, మధ్య తరగతికి చెందినవారే కావడంతో వి ద్యార్థులకు భోజనం పెట్టాలంటే అప్పులు చేయా ల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెలల తరబడి బిల్లులు రాకపోవడం, దుకాణాదారుల వ ద్ద తీసుకున్న సామగ్రి డబ్బులు చెల్లించకపోవడంతో కొత్తగా ఉద్దెర ఇవ్వమని ఘాటుగా సమాధానం చెబుతున్నారని బాధపడుతున్నారు. ప్రభుత్వం స్పందించి బకాయిలు చెల్లించాలని కోరుతున్నారు. బిల్లుల చెల్లింపులలో సర్కారు నిర్లక్ష్యం జిల్లాలో దాదాపు రూ.5.93 కోట్లు పెండింగ్ బకాయిలు చెల్లించాలి మధ్యాహ్న భోజన ఏజెన్సీలకు బిల్లు బకాయిలు వెంటనే చెల్లించాలి. ఏజెన్సీలు ఎన్నో కష్టాలు పడుతున్నాయి. బిల్లులు చెల్లించకపోతే ఏజెన్సీల నిర్వాహకులతో కలిసి ఆందోళన తీవ్రతరం చేస్తాం. – చక్రపాణి, సీఐటీయూ నాయకుడు -
విధుల్లో నిర్లక్ష్యం వహించొద్దు
నిజామాబాద్నాగారం: రోగులకు నాణ్యమైన సేవలు అందించాలని, సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం వహించొద్దని జిల్లా వైద్యాధికారిణి రాజశ్రీ పేర్కొన్నారు. నగరంలోని మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ఉన్న వెల్నెస్ కేంద్రాన్ని మంగళవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఉద్యోగుల హాజరు రిజిస్టర్, ఓపీ విభాగం, ల్యాబ్, ఫార్మసీ తదితర విభాగాలను పరిశీలించారు. అనంతరం డీఎంహెచ్వో మాట్లాడుతూ మందులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని, అవసరమైన రోగుల వద్ద నుంచి రక్త నమూనాలను తీసి టీహబ్కు పంపాలని సూచించారు. ఆమె వెంట వెల్నెస్ సెంటర్ వైద్యాధికారిణి డాక్టర్ కృష్ణవేణి, సిబ్బంది ఉన్నారు. ● డీఎంహెచ్వో రాజశ్రీ ● వెల్నెస్ సెంటర్ తనిఖీ -
ఇందిరమ్మ ఇళ్లకు ప్రభుత్వ చేయూత
బోధన్టౌన్(బోధన్): ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు రూ.5 లక్షలతోపాటు ఇసుకను ఉచితంగా అంది స్తూ లబ్ధిదారులకు ప్రభుత్వం చేయూతనిస్తుందని కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఆర్థిక స్థోమత లేని నిరుపేదలకు డ్వాక్రా రుణాలు ఇప్పించి, ఇళ్లు నిర్మించుకునేలా చూడాలని అధికారులకు సూచించారు. మంగళవారం బోధన్ మున్సిపల్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ వికాస్ మహతో కలిసి బల్దియా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, వన మహోత్సవం, సీజనల్ వ్యాధుల నియంత్రణకు చేపడుతున్న చర్యలు తదితర అంశాలపై సాధించిన ప్రగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో అధికారులు అలసత్వం వహిస్తే సహించేది లేదని, చిత్తశుద్ధితో పనిచేసి లక్ష్యాన్ని సాధించాలన్నారు. ప్రభుత్వం చేపడుతున్న వన మహోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఫ్రైడే డ్రైడే నిర్వహించాలన్నారు. ప్లాట్ల క్రమబద్ధీకరణ కోసం రుసుము చెల్లించిన వారికి త్వరితగతిన ప్రొసీడింగ్స్ అందించాలని సూచించారు. అనంతరం పాండుఫారంలో ఇందిర మ్మ ఇళ్ల లబ్ధిదారులతో మాట్లాడారు. జిల్లా మలే రియా నియంత్రణ విభాగం అధికారి తుకారాం రాథోడ్, మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ, బల్ది యా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. నిర్మాణానికి డ్వాక్రా రుణాలు సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి -
రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఇష్టారాజ్యం
సుభాష్నగర్: నగరంలోని నిజామాబాద్ అర్బన్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో అధికారుల ఇష్టారాజ్యంగా మారింది. పర్యవేక్షణ లేకపోవడంతో ఉద్యోగులు, సిబ్బంది సమయపాలన పాటించడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సోమ వారం రోజంతా సర్వర్ డౌన్ కావడంతో డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్లు నిలిచిపోగా, మంగళవారం 12 గంటలు దాటినా అధికారులు విధులకు హాజరుకాలేదు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ కార్యాలయంలో 9 నెలలుగా రెగ్యులర్ సబ్ రిజిస్ట్రార్లు లేకపోవడంతో సీనియర్ అసిస్టెంట్లతో నెట్టుకొస్తున్నారు. ప్రస్తుతం ఒక్కరే ఇన్చార్జి సబ్ రిజిస్ట్రార్ ఉండగా, ఆయన కూడా మంగళవారం గైర్హాజరయ్యారు. సమాచార లోపంతో 12 దాటినా సబ్ రిజిస్ట్రార్గా విధులకు హాజరుకాలేదు. ఈ విషయాన్ని డాక్యుమెంట్ రైటర్లు, ప్రజలు ఉన్నతాధికారులకు తెలపడంతో వారి సూచనల మేరకు ఇద్దరు సీనియర్ అసిస్టెంట్లు ఇన్చార్జీలుగా కొనసాగారు. కాగా, మంగళవారం 44 డాక్యుమెంట్లకు రిజిస్ట్రేషన్లు చేసినట్లు తెలిసింది. మధ్యాహ్నం 12 గంటలు దాటినా విధులకు హాజరుకాని సబ్ రిజిస్ట్రార్లు ఇబ్బందులు పడ్డ ప్రజలు -
రూ.60 కోట్లతో 10 సబ్స్టేషన్ల నిర్మాణం
రెంజల్(బోధన్): విద్యుత్ వినియోగదారులతోపాటు రైతులకు నాణ్యమైన కరెంట్ సరఫరా చేసేందుకు జిల్లాలో రూ. 60 కోట్లతో కొత్తగా 10 సబ్స్టేషన్లను నిర్మిస్తున్నట్లు ట్రాన్స్కో ఎస్ఈ రవీందర్ పేర్కొన్నారు. ఇప్పటికే మూడు చోట్ల పనులు ప్రారంభించగా మరో 7 పనులు టెండర్ దశలో ఉన్నాయని తెలిపారు. రెంజల్ సబ్స్టేషన్లో మంగళవారం అదనంగా మూడు బ్రేకర్లను ప్రారంభించారు. నిరంతరాయ విద్యుత్ సరఫరాకు ముందస్తు ప్రణాళికతో కార్యాచరణ జరుగుతుందని వివరించారు. ఓవర్లోడ్ ట్రాన్స్ఫార్మర్లను గుర్తించి వాటి స్థానంలో పవర్ ట్రాన్స్ఫార్మర్లను బిగించినట్లు తెలిపారు. విద్యుత్ సమస్య వచ్చినప్పుడు లోడ్ పడకుండా విద్యుత్ సరఫరా చేసేందుకు బ్రేకర్లను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో 108 బ్రేకర్లను ఏర్పాటు చేశామన్నారు. వినియోగదారులు టోల్ఫ్రీ నెంబర్ 1912ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. జిల్లాలో రూ. 40 కోట్ల వరకు బకాయిపడిన ప్రైవేటు, ప్రభుత్వ సంస్థలు వెంటనే చెల్లించి సహకరించాలని కోరారు. ఆయన వెంట డీఈఈ వెంకట రమణ, ఏడీఈ తోట రాజశేఖర్, డీఈఈ ముక్తార్, ఏఈ మగ్ధుంతోపాటు ట్రాన్స్కో సిబ్బంది ఉన్నారు. జిల్లాలో రూ.40 కోట్ల విద్యుత్ బకాయిలు ట్రాన్స్కో ఎస్ఈ రవీందర్ -
ఎప్పటికీ మరిచిపోలేము
అమర్నాథ్ యాత్రలో భాగంగా కశ్మీర్లో వైష్ణోదేవి ఆలయాన్ని కూడా దర్శించుకున్నాం. పహల్గామ్ దాడి తరువాత ప్రజలు భయపడకుండా అమర్నాథ్ యాత్రకు తరలివస్తున్నారు. భారత ప్రభుత్వం, భారత సైన్యం మీద ఉన్న అపార విశ్వాసానికి ఇది నిదర్శనం. యాత్ర కోసం భారత ప్రభుత్వం చేసిన ఏర్పాట్లు, కల్పించిన భద్రత అత్యద్భుతంగా ఉన్నాయి. అమర్నాథ్ యాత్ర పొడవునా సైన్యం అడుగడుగునా పహారా కాస్తోంది. దీంతో ఏమాత్రం భయం లేకుండా ప్రశాంతంగా యాత్ర చేయొచ్చు. భయం అనేదే లేకుండా యాత్ర చేమొచ్చు. కశ్మీర్ అందాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ప్రకృతి అంటే ఏమిటో ప్రత్యక్షంగా చూస్తున్నాం. ప్రకృతి కూడా ప్రస్తుతం పూర్తి అనుకూలంగా ఉంది. జూలై, ఆగస్టులో సందర్శిస్తే అద్భుతంగా ఉంటుంది. అమర్నాఽథ్ యాత్రలో ఉదయం, మధ్యాహ్నం, రాత్రి భోజనాలు ఉచితంగా అందిస్తున్నారు. దక్షిణ భారత, తెలుగు లంగర్లు చాలా ఉన్నాయి. – కరుటూరి పాపారావు, వెంకట సుబ్బలక్ష్మి, జైతాపూర్ -
పకడ్బందీగా స్నాతకోత్సవ ఏర్పాట్లు
తెయూ వీసీ యాదగిరిరావు తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీలో ఈ నెల 16న జరిగే రెండో స్నాతకోత్సవానికి పకడ్బందీ ఏర్పాటు చేయాలని వీసీ ప్రొఫెసర్ టీ యాదగిరిరావు స్పష్టం చేశారు. 12 సంవత్సరాల తర్వాత రెండో స్నాతకోత్సవాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. మంగళవారం నిర్వహించిన స్నాతకోత్సవ కమిటీ కన్వీనర్ల సమావేశంలో ఆయ న మాట్లాడారు. వర్షాకాలం నేపథ్యంలో ఏర్పాట్లు బాగుండాలన్నారు. స్నాతకోత్సవానికి హాజరయ్యే విద్యార్థులు, పరిశోధకులు, అతిథులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా వసతులు కల్పించాలన్నారు. 2014 నుంచి 2023 వరకు పోస్ట్ గ్రాడ్యుయేషన్లో వివిధ విభాగాల నుంచి మొదటి ర్యాంకు పొందిన 180 మంది విద్యార్థులకు గోల్డ్ మెడల్స్తోపాటు 30 జూన్ 2025 వరకు వివిధ విభాగాలలో పరిశోధనలు పూర్తి చేసుకున్న సుమారు 158 మంది పరిశోధకులకు డాక్టరేట్ పట్టాలను రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అందజేస్తారని వీసీ తెలిపారు. సమావేశంలో రిజిస్ట్రార్ ఎంయాదగిరి, కంట్రోలర్ సంపత్ కుమార్, కమిటీ కన్వీనర్లు ఘంటా చంద్రశేఖర్, కనకయ్య, అపర్ణ, ఆరతి, రాంబాబు, ఆంజనేయులు, రవీందర్ రెడ్డి, ప్రిన్సిపల్ మామిడాల ప్రవీణ్, నాగరాజు, పీఆర్వో పున్నయ్య పాల్గొన్నారు. -
ప్రభుత్వ ఉద్యోగులు బాధ్యతగా పని చేయాలి
నిజామాబాద్ రూరల్: ప్రభుత్వ ఉద్యోగులు బాధ్యతగా పని చేయాలని, పనిలో పారదర్శకత ఎంతో అవసరమని జెడ్పీ సీఈవో సాయాగౌడ్ అన్నారు. జిల్లా పరిషత్ కార్యాలయ ఆవరణలోని డీపీఆర్ భవనంలో కారుణ్య నియామకం పొందిన జూనియర్ అసిస్టెంట్లకు సర్వీసు నిబంధనలకు పది రోజుల శిక్షణ కార్యక్రమాన్ని మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జడ్పీ సీఈవో సాయా గౌడ్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ చట్టం, లోకల్ బాడీపై అవగాహన ఉండాలని అన్నారు. పది రోజులపాటు అకౌంట్స్, జిల్లా పరిషత్ ఎన్నికలు, పే బిల్స్, కార్యాలయ నిర్వహణ, ఆర్టీఐ తదితర వాటిపై అధికారులు శిక్షణ ఇవ్వనున్నారు. కార్యక్రమంలో పంచాయతీ రాజ్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు గడ్డం భాస్కర్, జనరర్ సెక్రెటరీ ప్రదీప్, అసోసియేట్ ప్రెసిడెంట్ శంకర్, వైస్ ప్రెసిడెంట్ సునీతాదేవి, ఆర్గనైజింగ్ సెక్రెటరీ సిద్ధు పటేల్ తదితరులు పాల్గొన్నారు. -
పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడిగా నారాయణ
నిజామాబాద్నాగారం: తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా మైసల నారాయణను మంగళవారం ఎన్నుకున్నారు. నగరంలోని ఖలీల్వాడిలో జిల్లా పద్మశాలి సంఘ కార్యవర్గ సమావేశం గౌరవ అధ్యక్షుడు, అఖిల భారత పద్మశాలి సంఘం సెంట్రల్ బోర్డు సభ్యుడు దాసరి నర్సింలు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడిగా రిటైర్డ్ తహసీల్దార్ మైసల నారాయణను ఏకగ్రీవంగా ఎన్నుకొని ఘనంగా సన్మానించారు. అనంతరం నారాయణకు జిల్లా అనుబంధ సంఘాల ప్రతినిధులు, నగరంలోని వివిధ తర్పలకు చెందిన అధ్యక్ష, కార్యదర్శులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా సంఘం ప్రతినిధులు బీమర్తి రవి, గాలిపల్లి నారాయణ, పాము రమేశ్, గెంటెల వెంకటేశ్(బొట్టు), కోడూరు స్వామి, సిరిగాదే మనోహర్, ఆడెపు రాజన్న, రచ్చ మురళి, సామల శ్రీనివాస్, దిండిగల్ల శంకర్, భాస్కర్, జీజీ ప్రసాద్, పద్మసుభాష్, పెంబర్తి సంతోష్కుమార్, శేరుపల్లి బాగులరావు తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్ సేవలు చిరస్మరణీయం ● ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ నిజామాబాద్ సిటీ: మాజీ సీఎం, దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డికి జిల్లాతో ఎంతో అనుబంధం ఉందని రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్బిన్ హందాన్ అన్నారు. జిల్లాకేంద్రంలోని కాంగ్రెస్ భవన్లో వైఎస్ జయంతిని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం తాహెర్బిన్ హందాన్ మాట్లాడుతూ వైఎస్కు జిల్లాతో అవినాభావ సంబంధం ఉందని, ఆయన జన్మదినం నిజాంసాగర్లో జరుపుకున్నామని గుర్తుచేశారు. గుత్ప, అలీసాగర్ ఎత్తిపోతల పథకం ద్వారా లక్షల ఎకరాలకు నీరు అందించిన ఘనత వైఎస్ రాజశేఖర్ రెడ్డికే దక్కుతుందన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ, ఉచిత విద్యుత్ తదితర పథకాలు విజయవంతంగా అమలుచేసిన ధైర్యవంతుడైన నాయకుడన్నారు. పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్గౌడ్ ఆయన శిష్యుడేనన్నారు. వైఎస్ ఆశయాలను సీఎం రేవంత్ రెడ్డి ముందుకు తీసుకు వెళ్తున్నారన్నారు. కార్యక్రమంలో నుడా చైర్మన్ కేశ వేణు, పీసీసీ ప్రధాన కార్యదర్శి రాంభూపాల్, నాయకులు కెతావత్ యాదగిరి, వేణు, కోనేరు సాయికుమార్, ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు. -
జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం
● తప్పిన ప్రాణాపాయం ఇందల్వాయి: ఇందల్వాయి మండలంలోని చంద్రాయన్పల్లి గ్రామం వద్ద జాతీయ రహదారిపై మంగళవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే మార్గంలో ముందు ప్రయాణిస్తున్న రెండు కార్లను వెనుక నుంచి వస్తున్న లారీ అదుపుతప్పి వేగంగా ఢీ కొట్టింది. దీంతో ముందు వెళ్తున్న రెండుకార్లు వరుసగా ఢీకొనడంతో ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. కాగా, ప్రమాదానికి గురైన కారు తగలడంతో బైక్ పై ప్రయాణిస్తున్న కామారెడ్డి జిల్లా ఉత్తునూరు గ్రామానికి చెందిన దంపతులకు గాయాలయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ట్రాఫిక్ క్లియర్ చేశారు. గాయపడిన వారిని టోల్ప్లాజా అంబులెన్స్లో నిజామాబాద్ ఆస్పత్రికి తరలించారు. లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై సందీప్ తెలిపారు. కాగా, కోతుల గుంపు ఎదురు రావడంతో కార్లను ఆపగా వెనుకాల నుంచి లారీ ఢీకొన్నట్లు పేర్కొన్నారు. -
‘బీఏఎస్’ బిల్లులు చెల్లించాలి
● సీఎంకు బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ పటేల్ డిమాండ్ సుభాష్నగర్: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న బెస్ట్ అవైలబుల్ స్కూల్(బీఏఎస్) స్కీం పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ పటేల్ కులాచారి డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్రెడ్డికి మంగళవారం మెయిల్ ద్వారా లేఖ పంపించారు. కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ మల్క కొమురయ్యకు విన్నవించారు. ఈ సందర్భంగా దినేశ్ పటేల్ కులాచారి మాట్లాడుతూ మూడేళ్లుగా ఈ స్కీం బిల్లులు దాదాపు రూ.200 కోట్ల మేర చెల్లించకపోవడంతో యా జమాన్యాలు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదు ర్కొంటున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. కొ న్ని స్కూళ్లు స్కీం ద్వారా చదువుతున్న విద్యార్థులను రావొద్దని చెప్పడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. తక్షణ మే పెండింగ్ బిల్లులు విడుదల చేసి విద్యార్థుల భవిష్యత్ను కాపాడాలని ఆయన కోరారు. మెరుగైన వైద్య సేవలు అందించాలి రుద్రూర్/కోటగిరి: ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన సేవలు అందించాలని జిల్లా మలేరియా వైద్యాధికారి తుకారాం రాథోడ్ పేర్కొన్నారు. రుద్రూర్, కోటగిరి, పోతంగల్ మండల కేంద్రాల్లో మంగళవారం ఆయన పర్యటించారు. రుద్రూర్ ఆస్పత్రిలోని రికార్డులు పరిశీలించారు. మిర్జాపూర్ ఆరోగ్య ఉపకేంద్రాన్ని సందర్శించారు. కోటగిరిలో ఇటీవల డెంగీ వచ్చిన వారి ఇంటిని పరిశీలించి, ఆరోగ్య పరి స్థితిని తెలుసుకున్నారు. పోతంగల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సమీక్షించారు. ఆయన వెంట మండల వైద్యాధికారిణి ఆయేషా సిద్ధిఖి, గోవర్ధన్, హెల్త్ సూపర్వైజర్లు రవి, సునీత, వైద్య సిబ్బంది ఉన్నారు. ఊర పండుగకు అంకురార్పణ ● గాజుల్పేట్లో బండారు పోసిన పెద్దలు ● 13న ఊర పండుగ నిజామాబాద్ రూరల్: నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఊర పండుగకు అంకురార్పణ జరిగింది. మంగళవారం సర్వసమాజ్ కమిటీ, శ్రీ విజయ్ మున్నూరుకాపు సంఘం ఆధ్వర్యంలో నగరంలోని గాజుల్పేట్ వీధిలో బండారు పోశారు. ఈ సందర్భంగా సర్వసమాజ్ కమిటీ కో కన్వీనర్ ఆదె ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ఇందూరు నగరం ఏర్పాటు నుంచి ఊర పండుగ నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో సర్వసమాజ్ కమిటీ జాయింట్ సెక్రటరీలు మల్కాయ్ సుదర్శన్, పసుల రాజు, కార్యవర్గ సభ్యులు కొత్మీర్ సతీశ్, శ్రీ విజయ్ కిసాన్ మున్నూరుకాపు సంఘం అధ్యక్షుడు సుంకటి ప్రవీణ్, ప్రధాన కార్యదర్శి పాల్వంచ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. మృత్యువుతో పోరాడి ఓడిన బాలిక ● చికిత్స పొందుతూ చిన్నారి మృతి మాక్లూర్: వాటర్ హీటర్ బకెట్లో పడి తీవ్రగాయా లతో ఆస్పత్రుల్లో మూడు నెలలుగా చికిత్స పొందిన బానావత్ మనస్వి (4) మంగళవారం రాత్రి మృతి చెందింది. ఎస్సై రాజశేఖర్ కథనం ప్రకారం.. మండలంలోని ఎలియానాయ్ తండాకు చెందిన బానావత్ విజయ్కుమార్, కిర్తీల కుమార్తె మనస్వి ఏప్రిల్ 3న ఆడుకుంటూ పక్కింటికి వెళ్లి అక్కడ వాటర్ హిటర్ పెట్టి ఉన్న బకెట్లో పడింది. తీవ్రగాయాలు కావడంతో చిన్నారిని నిజామాబాద్లోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని సురక్ష ఆస్పత్రికి తరలించి చికిత్స అందించగా, డాక్టర్ సూచన మేరకు ఇటీవలే డిశ్చార్జీ అయ్యింది. మంగళవారం చిన్నారి ఆకస్మికంగా మరణించిందని ఎస్సై తెలిపారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు. -
పోలీసులు ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి
ఖలీల్వాడి: పోలీసులకు విధులు ఎంత ముఖ్యమో ఆరోగ్యం కూడా అంతే ప్రధానమని, ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని సీపీ పోతరాజు సా యిచైతన్య పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో మెగా వైద్య శిబిరాన్ని ఆయన మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ పోలీస్ సిబ్బందితోపాటు వారి కు టుంబసభ్యుల ఆరోగ్యంపై అన్నిరకాల జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రస్తుత పరిస్థితులలో వ్యాధుల బారిన పడకుండా ఆరోగ్య సూచనలు పాటించాలన్నారు. వైద్య శిబిరంలో ఆర్బీఎస్, కంటి పరీక్ష, ఈసీజీ, 2డీ ఈకో, క్యాన్సర్ స్క్రీనింగ్, బీపీ, షుగర్ తదితర పరీక్షలు చేస్తారన్నారు. ప్రతి సంవత్సరం ఒక్కసారైనా డాక్టర్లను సంప్రదించాలన్నారు. నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్స్టేషన్లలోని సిబ్బంది, హోంగార్డులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. డీసీపీలు బస్వారెడ్డి, రామ్చందర్ రావు, ఏసీపీ రాజావెంకట్ రెడ్డి, పీ శ్రీనివాసులు, వెంకటేశ్వర్ రెడ్డి, రిజర్వ్ సీఐలు శ్రీనివాస్, శేఖర్ బాబు, తిరుపతి, సతీశ్, పోలీస్ యూనిట్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సరళ, డాక్టర్లు సుధాకర్ రావు, చంద్రమోహన్, వంశీ, ఆఫ్రిన్, నిఖిత, షాహబాజ్ హైమద్ పాల్గొన్నారు. సీపీ సాయి చైతన్య మెగా వైద్య శిబిరం ప్రారంభం -
దత్తత తీసుకోబడిన గ్రామమే దత్తాపూర్
డొంకేశ్వర్ మండలంలోని దత్తాపూర్ గ్రామాన్ని దేశ్ముఖ్ అనే దొర దత్తత తీసుకొని పరిపాలించినట్లు చరిత్ర చెబుతోంది. అందుకే ఈ గ్రామానికి దత్తాపూర్ అనే పేరు వచ్చినట్లు ఊరి పెద్దలు చెప్తున్నారు. సుమారు 200 ఏళ్ల క్రితం లంబాడీ తండా మాత్రమే ఉండేదని, కాలక్రమేనా గ్రామంగా అవతరించినట్లు గ్రామస్తులు పేర్కొంటున్నారు. ● తొండాకూర్ గ్రామ పంచాయతీ పరిధిలోనే ఉన్న దత్తాపూర్ 1981లో గ్రామ పంచాయతీగా ఏర్పడింది. ప్రస్తుతం 900 ఎకరాల వరకు సాగు భూములు, 395 నివాస గృహాలున్నాయి. ● మొదట్లో తండా ఉండటంతో ఊరిలో లంబాడీ(గిరిజన) కుటుంబాలు 100కు పైగా ఉన్నాయి. అందుకే ఈ ఊరికి మొదటి సర్పంచ్గా మూడ్ రామ్జీ 1981లో ఎన్నికయ్యారు. 1959లో గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ఏర్పాటైంది. ● గ్రామానికి రెండు చెరువులున్నాయి. ఒకటి పెద్ద చెరువు, మరొకటి గ్రామకుంట. పెద్ద చెరువు విస్తీర్ణం 106ఎకరాలు ఉంటుంది. ఉమ్మడి నందిపేట్ మండలంలో కుద్వాన్పూర్ చెరువు తర్వాత దత్తాపూర్ పెద్ద చెరువుదే అతి పెద్ద విస్తీర్ణం. ● దత్తాపూర్లో దత్తాత్రేయుడికి ఊరంతా భక్తులే. వందేళ్ల క్రితమే శివదత్త గుడిని కట్టారు. అప్పటి నుంచే పూజలు, భజనలు చేస్తున్నారు. ఏటా దత్త జయంతి రోజున (పౌర్ణమి) పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహిస్తారు. ఇక్కడ ఉన్న ఔదుంబర వృక్షం చుట్టూ ప్రదక్షిణలు చేసి నిష్టతో దత్తుడిని పూజిస్తే సంతానం కలుగుతుందని భక్తుల్లో నమ్మకం ఏర్పడింది. – డొంకేశ్వర్(ఆర్మూర్) మీకు తెలుసా? -
సబ్కలెక్టర్ కార్యాలయ జప్తునకు ఆదేశం
వర్ని: వ్యవసాయ భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించకపోవడంతో బోధన్ సబ్ కలెక్టర్ కార్యాలయ ఆస్తులను జప్తు చేయాలని బోధన్ సీనియర్ సివిల్ జడ్జి కాంచనరెడ్డి సోమవారం తీ ర్పు వెలువరించారు. వివరాలు ఇలా ఉన్నాయి.. ఉమ్మడి వర్ని మండలంలోని లక్ష్మీసాగర్ ప్రాజెక్టులో 155 ఎకరాల భూములు కోల్పోయిన 105 మంది రైతులకు రూ.62 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాల్సి ఉంది. 1986లో లక్ష్మీసాగర్ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడంతో కారేగాం, మేడిపల్లి, లక్ష్మాపూర్ గ్రామాల పరిధిలోని 105 మంది రైతులకు చెందిన 155 ఎకరాల వ్యవసాయ ముంపునకు గురైంది. సదరు రైతులు కోర్టును ఆశ్రయించగా రూ.56 లక్షల రూపాయల పరిహారం చెల్లించాలని 2022లో హైకోర్టు తీర్పునిచ్చింది. అయితే ఆ తీర్పు ఇప్పటి వరకు అమలు కాలేదు. రైతులు తిరిగి స్థానిక సివిల్ కోర్టుకు వెళ్లగా రూ.56 లక్షలకు వడ్డీ కలుపుకుని మొత్తం రూ.62 లక్షల పరిహారాన్ని రైతులకు చెల్లించాలని.. లేనిపక్షంలో సబ్ కలెక్టర్ కార్యాలయ ఆస్తులను జప్టు చేయాలని న్యాయమూర్తి తీర్పు వెలువరించారు.ఫైల్ పెండింగ్లో ఉంది భూ నిర్వాసితులకు పరిహారం చెల్లించాల్సి ఉంది. దీనికి సంబంధించిన ఫైల్ను నాలుగు నెలల క్రితం జిల్లా కలెక్టర్కు పంపించాం. ఇరిగేషన్ కార్యదర్శి, ప్రిన్సిపల్ సెక్రెటరీ వద్ద ఫైల్ పెండింగ్లో ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి పరిహారం విడుదల కాగానే రైతులకు చెల్లిస్తాం. – వికాస్ మహతో, సబ్ కలెక్టర్, బోధన్ -
బలగాలు గైడ్ చేస్తున్నాయి
అమర్నాథ్ యాత్రలో భారత సైనికులు చక్కగా గైడ్ చేస్తున్నారు. మర్యాద పూర్వకంగా, స్నేహ పూర్వకంగా వ్యవహరిస్తున్నారు. ఇబ్బందులేమైనా ఉంటే అడుగుతున్నారు. కశ్మీర్లో చాలా చోట్ల రోడ్లు, వంతెనల నిర్మాణాలు తుది దశకు వచ్చాయి. టన్నెల్స్ సైతం ప్రారంభమయ్యాయి. తెలుగు వారు చాలామంది ఉన్నారు. మేము పదిమంది బృందంగా నిజామాబాద్ నుంచి వెళ్లాం. శ్రీనగర్లో దాల్ సరస్సు చాలా బాగుంది. వంతెనలు, రోడ్లు పూర్తి అయితే మరింత తక్కువ సమయంలో యాత్ర పూర్తి చేయొచ్చు. వడ్డి జనార్దన్ రెడ్డి, వరలక్ష్మి, నవీపేట -
జై అమర్నాథ్..
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : భూతల స్వర్గంగా పేరుపొందిన కళ్మీర్లోని పహల్గామ్లో మన పర్యాటకులపై దాయాది దేశం ఉగ్రమూకలు దాడికి పాల్పడితే భారత ప్రభుత్వం, సైన్యం స్పందించిన తీరుపై యావత్ దేశం గర్వంతో ఉప్పొంగింది. భారత ప్రజలు కేంద్ర ప్రభుత్వానికి పూర్తి మద్దతుగా నిలిచారు. పహల్గామ్ మారణహోమం తమను ఏమాత్రం భయపెట్టలేదని ప్రపంచానికి చాటిచెబుతున్నారు. ఆర్టికల్ 370 రద్దు తరువాత పర్యాటక రంగ అభివృద్ధితో ఆర్థికంగా స్వావలంబన సాధిస్తున్న కశ్మీర్లో ఆధ్యాత్మిక, సాధారణ పర్యాటకానికి దన్నుగా నిలబడుతున్నారు. ఇందూరు జిల్లా వాసులు సైతం కశ్మీర్ పర్యటకు వెళ్తున్నారు. ఇందులో భాగంగా నిజామాబాద్ జిల్లా నుంచి అమర్నాథ్ యాత్ర, కశ్మీర్ యాత్ర కోసం ఇప్పటి వరకు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి నుంచి 124 మంది మెడికల్ సర్టిఫికెట్లు తీసుకున్నారు. ఇంకా మరికొందరు ఈ సర్టిఫికెట్లు తీసుకునే పనిలో ఉన్నారు. జిల్లా నుంచి పలువురు బృందాలుగా వెళుతున్నారు. మరోవైపు సిద్ధిపేటకు చెందిన అమర్నాథ్ సేవాసమితి ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఉదయం, మధ్యాహ్నం, రాత్రి సమయాల్లో యాత్ర మార్గంలో అన్నదానం చేస్తున్నారు. ఈ అమర్నాథ్ సేవాసమితిలో నిజామాబాద్ జిల్లా వాసులు సభ్యులుగా ఉన్నారు. సైన్యం మీద అపారమైన నమ్మకంతో కశ్మీర్ యాత్రకు జిల్లా వాసులు మంచులింగాన్ని దర్శించుకున్న జిల్లా యాత్రికులు పహల్గామ్ ఘటనతో బెదిరేది లేదంటున్న శివయ్య భక్తులు -
ప్రభుత్వం వద్ద మాస్టర్ప్లాన్ డ్రాఫ్ట్
● ఆక్రమణలను బల్దియా అధికారులే ప్రోత్సహిస్తున్నారు. ఎన్నిసార్లు ఫిర్యాదుచేసినా స్పందించడం లేదు. మాస్టర్ ప్లాన్ ఖచ్చితంగా అమలు చేయాలి. ఖలీల్వాడి, బోధన్ రోడ్డు, హైదరాబాద్ రోడ్లలో ఆక్రమణలను తొలగించాలి. పాతనగరంలో పార్కులు లేవు. హైదరాబాద్ రోడ్డులో ఇటీవల విచ్చలవిడిగా బహుళ అంతస్థుల భవనాలకు అనుమతులు ఇస్తున్నారు. ఇందులో టౌన్ప్లానింగ్ అధికారుల సహకారం కూడా ఉంది. సయ్యద్ ఖైసర్ (పులాంగ్), కోర్వ దేవేందర్ (ఎల్లమ్మగుట్ట), శివాజీ భూషణ్ (శ్రీనగర్ కాలనీ), గంగాధర్ (వర్ని చౌరస్తా) ● మాస్టర్ ప్లాన్ డ్రాఫ్ట్ పూర్తిచేసి ప్రభుత్వానికి పంపించాం. ముఖ్యమంత్రి కార్యాలయం అనుమతి ఇవ్వాలి. అక్రమ నిర్మాణాలను ప్రోత్సహించబోము. ట్రాఫిక్ ఫ్రీగా సిటీగా మార్చాలన్నదే మా లక్ష్యం. నగరవాసులు సహకరించాలి. నిబంధనలను పాటించని నిర్మాణాలకు అనుమతులు ఇవ్వం.● అక్రమ నిర్మాణాలను ప్రోత్సహించేది లేదు ● ట్రాఫిక్ ఫ్రీ సిటీగా మార్చాలన్నదే లక్ష్యం ● నగరవాసులు సహకరించాలి ● కుక్కల బెడదను నివారిస్తాం ● ‘సాక్షి’ ఫోన్ ఇన్లో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ దిలీప్కుమార్● వినాయక్నగర్లోని అమ్మ వెంచర్ పరిసరాలు అధ్వానంగా మారాయి. దారివెంట పిచ్చి మొక్కలు పెరిగాయి. చెత్త సేకరించడం లేదు. రోడ్ల మరమ్మతులు చేపట్టడం లేదు. వీధిలైట్లు లేకపోవడంతో రాత్రి వేళల్లో అసాంఘిక కార్యకలాపాలు సాగుతున్నాయి. మధుసూదన్ (అమ్మ వెంచర్), వేణుకుమార్(ఎల్లమ్మగుట్ట) ● మున్సిపల్ కమిషనర్: వీధిలైట్ల మెయింటెనెన్స్ను రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఏజెన్సీకి అప్పగించింది. త్వరలోనే లైట్లు ఏర్పాటు చేస్తాం. చెత్త సేకరణ రోజూ జరిగేలా సంబంధిత శానిటరీ ఇన్స్పెక్టర్ను ఆదేశిస్తాం.● నగరంలోని నాల్గో డివిజన్ పరిధిలో ఉన్న పాంగ్రా, మాధవనగర్, మూడో డివిజన్లోని గూపన్పల్లి, గంగాస్థాన్–2, వీరభద్రకాలనీల్లో పారిశుద్ధ్య సిబ్బంది డ్రెయినేజీలు తీయడం లేదు. ఖానాపూర్ భాగ్యనగర్ కాలనీలో ఇళ్ల మధ్య మురికినీరు నిలిచి దుర్గంధం వ్యాపిస్తుస్తోంది. పారిశుద్ధ్య కార్మికులు సరిగా చెత్త తీసుకెళ్లడంలేదు. డీఎస్ మార్కెట్ ఎదురుగా ఉన్న గల్లీలు అధ్వానంగా మారాయి. సాలుగారి మోహన్ (ఖానాపూర్), రాములు (పాంగ్రా), రతన్ (47 డివిజన్), నాగభూషణం (ఆర్టీసీ కాలనీ) ● ఆయా కాలనీల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తాం. వెంటనే శానిటరీ ఇన్పెక్టర్లు సునీల్, షాదుల్లాతోపాటు శానిటరీ సూపర్ వైజర్ సాజిద్ అలీతో మాట్లాడుతా. వెంటనే సమస్యలను పరిష్కరించాలని ఆదేశిస్తా. ● యాదగిరిబాగ్లో ప్రభుత్వ స్థలం కబ్జాచేస్తున్నారని పలుమార్లు అధికారులకు ఫిర్యాదుచేసినా పట్టించుకోలేదు. కబ్జాదారులను ప్రోత్సహించొద్దు.. ప్రభుత్వ స్థలాలను కాపాడాలి. తాగునీటి సమస్యను పరిష్కరించాలి. భూమేశ్వర్ గుడ్ల (యాదగిరిబాగ్), శ్రీనివాస్గౌడ్ (వినాయక్నగర్) ● మున్సిపల్ రోడ్డు కబ్జాపై ఫిర్యాదు అందింది. టౌన్ప్లానింగ్ అధికారులను పంపించి పనులు నిలిపివేయించాం. తిరిగి పనులు చేస్తే ఈసారి కేసు నమోదు చేస్తాం. అసిస్టెంట్ సిటీ ప్లానర్ శ్రీనివాస్కు ఆదేశాలు జారీచేస్తాం. ● కాలూర్ ప్రభుత్వ పాఠశాల స్థలాన్ని ఓ నాయకుడు కబ్జా చేసి అక్రమ నిర్మాణం చేపడుతున్నాడు. దీనిపై ఫిర్యాదు చేసినా ఖాతరు చేయడం లేదు. కఠిన చర్యలు తీసుకోవాలి. గంగాధర్ (కాలూర్), శ్రీనివాసులు (కాలూర్) ● వెంటనే పనులు నిలిపివేయిస్తాం. టౌన్ప్లానింగ్ అధికారులను పంపిస్తాం. మళ్లీ పనులు చేపడితే సమాచారం ఇవ్వండి. ఈ సారి నేనే వచ్చి చూస్తా. ● ఇంటింటికి చెత్త బండి రోజూ రావడం లేదు. డ్రెయినేజీలు శుభ్రం చేయడం లేదు. తీసిన చెత్తను తరలించడం లేదు. కుక్కల బెడద చాలా ఎక్కువగా ఉంది. అధికారులు చర్యలు తీసుకోవాలి. మహేశ్ (మమ్మదేవీ కాలనీ), అబ్దుల్నయీం ఖాన్ (ఖిల్లా చౌరస్తా), రాజులదేవి శంకర్ (గాజుల్పేట్), రజిని (ఆనంద్నగర్కాలనీ), గులాబ్ సింగ్ (ఫారెస్ట్ ఆఫీస్ వెనక ప్రాంతం), మోహన్ (పవర్హౌస్) ● ఇంటింటి చెత్త సేకరణ రోజూ జరగాల్సిందే. డ్రెయినేజీల్లో నుంచి తీసిన చెత్తను కూడా తొలగిస్తారు. ఈ మేరకు శానిటరీ ఇన్స్పెక్టర్లను ఆదేశిస్తా. కుక్కలను పట్టే కార్యక్రమం కూడా పూర్తిస్థాయిలో చేపడతాం.నిజామాబాద్ సిటీ : నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అక్రమ నిర్మాణాలను ప్రోత్సహించేది లేదని, నిబంధనలను పాటించని నిర్మాణాలపై చర్యలు తీసుకుంటామని కమిషనర్ దిలీప్కుమార్ స్పష్టం చేశా రు. నగరంలో తాగునీరు, డ్రెయి నేజీ వ్యవస్థ, పారిశుద్ధ్య నిర్వహ ణ, భవన నిర్మాణ అనుమతులు తదితర సమస్యలపై ‘సాక్షి’ ఆధ్వర్యంలో మంగళవారం ‘ఫోన్ ఇన్’ కార్యక్రమాన్ని నిర్వహించగా.. కమిషనర్ పాల్గొన్నారు. ఉదయం 10.30 నుంచి 11.30గంటల వరకు సుమారు 52 మంది నగరవాసులు ఫోన్ చేసి వివిధ సమస్యలను కమిషనర్కు వివరించారు. అవసరమైన చోట్ల వీధి దీపాలు ఏర్పాటు చేయిస్తామని, ప్రతిరోజూ చెత్త సేకరణ ఉంటుందని, కుక్కల బెడదను నివారిస్తామని కమిషనర్ అన్నారు. ‘ఫోన్ ఇన్’ కొనసాగిందిలా..● వినాయక్నగర్ బీఎస్ఎన్ఎల్ టవర్ వద్ద రోడ్డు పనులు నెలలుగా సాగుతున్నాయి. కుక్కల బెడద చాలా ఎక్కువగా ఉంది. బోసుబాబు (వినాయక్నగర్), సాయిబాబు (కెనాల్ కట్ట) ● సంబంధిత ఏఈని పంపి పనులు వేగవంతం చేయాలని ఆదేశిస్తాం. కాలనీవాసులకు ఇబ్బంది కలగకుండా చూస్తాం. కుక్కలు పట్టేవారిని ఈ రాత్రి పంపిస్తాం. కోటగల్లిలోని సరస్వతి శిశుమందిర్ వెనుకభాగంలో పిచ్చిమొక్కలు ఏపుగా పెరిగాయి. ఖాళీ స్థలంలో మురికి నీరు నిలుస్తోంది. పాములు, తేళ్లు, విషపురుగులు పాఠశాలలోని తరగతి గదుల్లోకి వెళితే ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఎన్నిసార్లు శానిటరీ జవాన్లకు, ఎస్సై సునీల్కు చెప్పినా మా పరిధి కాదంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారు. డాక్టర్ శ్రీనివాస్ (కోటగల్లి), గోపినాథ్ (గోల్హనుమాన్), మాయావర్ సావిత్రి (కోటగల్లి) పాఠశాల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాల్సిందే. వెంటనే స్పెషల్ టీమ్తో శుభ్రం చేయిస్తా. సంబంధిత ఎస్సై, శానిటరీ సూపర్వైజర్ను పంపిస్తాం. -
డిచ్పల్లి సబ్స్టేషన్లో బ్రేకర్ల బిగింపు
డిచ్పల్లి: మండల కేంద్రం శివారులో గల 33/11 కేవీ విద్యుత్ సబ్స్టేషన్లో కొత్తగా రెండు బ్రేకర్లను బిగిస్తున్నారు. ఈ బ్రేకర్ల బిగింపు సందర్భంగా సోమవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు డిచ్పల్లి రైల్వేస్టేషన్, బీబీపూర్ తండ, ఘన్పూర్ గ్రామాలకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. అయితే సుద్దపల్లి నుంచి లైను తీసుకుని డిచ్పల్లి రైల్వే స్టేషన్ కు కొద్ది సేపు విద్యుత్ సరఫరా పునరుద్ధరించినట్లు ట్రాన్స్కో ఏఈ గంగారాం తెలిపారు. బ్రేకర్ల బిగింపు పనులు జరుగుతుండగా వర్షం రావడంతో పనులకు అంతరాయం ఏర్పడింది. సోమవారం సాయంత్రానికి ఒక బ్రేకర్ ఏర్పాటు పూర్తి కాగా, మంగళవారం రెండో బ్రేకర్ పనులు కొనసాగుతాయని ఏఈ తెలిపారు. మంగళవారం సైతం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని, వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు. -
ప్రభుత్వ దిష్టి బొమ్మ దహనం
నిజామాబాద్ సిటీ : కార్మిక శాఖ విడుదల చేసిన జీవో నంబర్ 282ను రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ కార్మిక సంఘాల జేఏసీ నాయకులు ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనంచేశారు. సోమవారం ఉదయం ధర్నాచౌక్ వద్ద నాయకులు నిరసన తెలిపారు. అనంతరం సీఐటీయూ జిల్లా కార్యదర్శి నూర్జహాన్, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి వై.ఓమయ్య, టీయూసీఐ జిల్లా కార్యదర్శి ముస్కె సుధాకర్, ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షులు జి.భూమయ్య మాట్లాడారు. జీవో నంబర్ 282లో వాణిజ్య సంస్థల్లో పనిచేసే ఉద్యోగులతో, కార్మికులతో రోజుకు 10 గంటలు పనిచేయించుకోవచ్చని, వారానికి 48 గంటలు మించకూడదని ఉందన్నారు. కార్మిక సంఘాల జేఏసీ నాయకులు సాయన్న, రాములు, రవి, ఇమ్రాన్ అలీ, ప్రసాద్, కిరణ్, సురేష్, నవీన్, లక్ష్మీ, సాయిలు, నరసయ్య, గంగాధర్, గంగారం తదితరులు పాల్గొన్నారు. -
యువతపైనే దేశ భవిష్యత్
కమ్మర్పల్లి/బోధన్టౌన్ : దేశ భవిష్యత్ యువతపైనే ఉందని కమ్మర్పల్లి ఎస్ఐ అనిల్రెడ్డి అన్నారు. సోమవారం కమ్మర్పల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ‘మత్తు పదార్థాల నియంత్రణ’ అంశంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. యువత మత్తుకు బానిసకావొద్దని సూచించారు. అనంతరం విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు. అధ్యాపకులు మధు, రాజ్కుమార్, వెంకటేష్, గంగారాం, మహేందర్, స్వాతి తదితరులు పాల్గొన్నారు. మత్తు పదార్థాలకు యువత బానిస కావొద్దని బోధన్ పట్టణ ఎస్సై వెంకట నారాయణ అన్నారు. పట్టణంలోని విద్యావికాస్ జూనియర్ కాలేజీలో మత్తు పదార్థాల నియంత్రణ అంశంపై నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. సైబర్ నేరాలపై అవగాహన పెర్కిట్(ఆర్మూర్): ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ తెలుగు మీడియం ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు సోమవారం షీ టీం ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా షీ టీం సభ్యులు విఘ్నేష్, సుమతి మాట్లాడుతూ ఆన్లైన్ మోసాలను ఉదాహరణలతో విద్యార్థులకు వివరించారు. -
జక్రాన్పల్లి గ్రామ కాంగ్రెస్ శాఖ అధ్యక్షుడిగా లక్ష్మణ్
జక్రాన్పల్లి: జక్రాన్పల్లి గ్రామ కాంగ్రెస్ శాఖ అధ్యక్షుడిగా లక్ష్మణ్, ఉపాధ్యక్షుడిగా సొస్పరి సుధీర్లను సోమవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడి ఆదేశానుసారం జక్రాన్పల్లిలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కలిసి అధ్యక్ష, ఉపాధ్యక్షులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ పార్టీ బలోపేతం కోసం తనవంతు కృషి చేస్తానని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పని చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు చిన్నారెడ్డి, ప్రధాన కార్యదర్శి వసంత్రావు, అర్గుల్ సొసైటీ చైర్మన్ గంగారెడ్డి, మాజీ సర్పంచ్ నర్సారెడ్డి, నాయకులు సొప్పరి వినోద్, నట్ట తిరుపతి, బొంబాయి రాజు, అనిల్, శ్రీనివాస్, సాయిలు,బుయ్య గంగాధర్, గన్న శ్రీనివాస్, అనిల్, గన్న గంగారాం, పోశెట్టి, శంకర్, అక్బర్, తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగా ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం
మోపాల్/సిరికొండ : మోపాల్ మండలకేంద్రంతోపాటు సిర్పూర్, ముదక్పల్లి గ్రామాల్లో, సిరికొండ మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ 31వ ఆవిర్భావ దినోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఎమ్మార్పీఎస్ నాయకులు జెండా ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకను నిర్వహించి కేక్కట్ చేసి పంచిపెట్టారు.ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్చార్జి ఇరుగు పైడి మాదిగ,మోపాల్ ఇన్చార్జి రొడ్డ ప్రవీణ్, ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పిప్పెర సంజీవ్, సిరికొండ మండల అధ్యక్షుడు మొట్టల దీపక్ సంపత్ ఉన్నారు. -
ఎస్సీ వర్గీకరణలో మందకృష్ణ కృషి
నిజామాబాద్అర్బన్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణ అమలు చట్టబద్ధతకు ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఎనలేకి కృషి చేశారని, ఆయనకు మాదిగ జాతి రుణపడి ఉంటుందని మాదిగ ఉద్యోగులు అన్నారు. మందకృష్ణ పుట్టిరోజు సందర్భంగా సోమవారం హైదరాబాద్లో డ్రీమ్ల్యాండ్లో ఆయనను జిల్లా మాదిగ ఉద్యోగులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. మాదిగ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సిలుమల సురేష్, ఉద్యోగులు నాంపల్లి, సందీప్ సోంనాథ్ తదితరులు పాల్గొన్నారు. రేపు తెయూలో క్యాంపస్ సెలెక్షన్స్ తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ లో ఈనెల 9న తెయూ కెమిస్ట్రీ విభాగం, ప్ర ముఖ ఫార్మాస్యూటికల్ కంపెనీ హెటిరో సంయుక్తంగా క్యాంపస్ సెలెక్షన్స్ నిర్వహించనున్నట్లు కెమిస్ట్రీ విభాగాధిపతి సాయిలు ఒక ప్రకటనలో తెలిపారు. తెయూ పరిధిలో ఎమ్మెస్సీ కెమిస్ట్రీ పూర్తి చేసిన వారితో పాటు ఈ విద్యాసంవత్సరం ఫైనలియర్ విద్యార్థులు క్యాంపస్ సెలెక్షన్స్లో పాల్గొనవచ్చని తెలిపారు. అభ్యర్థులకు రాతపరీక్ష, మౌఖిక పరీక్షలు నిర్వహించి ప్రతిభ చూపిన వారికి నియామక ఉత్తర్వులు అందజేస్తారని ఆయన తెలిపారు. ఈ సదవకాశాన్ని విద్యార్ధులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. విద్యార్థులకు నగదు అందజేత ధర్పల్లి: మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇటీవల పదో తరగతి పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు పాఠశాల పూర్వ విద్యార్థి మూత రాజకుమార్ నగదును అందజేశారు. ప్రథమ స్థానంలో నిలిచిన నరేష్కు రూ.5 వేలు, ద్వితీయ స్థానంలో నిలిచిన కల్యాణ్ కు రూ.3 వేల నగదును అందజేశారు. ఈ సందర్భంగా ఆయనను పాఠశాల ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు. కోచ్ ఎస్సాముద్దీన్కు అభినందనలు నిజామాబాద్ నాగారం: జిల్లాకు చెందిన బాక్సింగ్ కోచ్ ఎస్సాముద్దీన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ బాక్సింగ్ మహిళ టోర్నమెంట్ కజకిస్తాన్ దేశంలో జూన్ 30 నుంచి ఈనెల వరకు జరిగింది. ఈటోర్నమెంట్లో మనదేశ క్రీడాకారులు మూడు బంగారు, రెండు వెండి, ఒక కాంస్య పతకాలు గెలుచుకున్నారు. ఈసందర్భంగా కోచ్గా వ్యవహారించిన ఎస్సాముద్దీన్ ఆధ్వర్యంలో దేశానికి పతకాలు రావడంపై మాజీ అథ్లెట్ సయ్యద్ కై సర్, క్రీడా సంఘాల ప్రతినిధులు అభినందనలు తెలుపుతున్నారు. సార్వత్రిక సమ్మెకు మద్దతు నిజామాబాద్ సిటీ : ఈనెల 9న నిర్వహిస్తున్న సార్వత్రిక దేశవ్యాప్త సమ్మెకు తెలంగాణ ప్రగతిశీల బీడీవర్కర్స్ యూనియన్, యుఎస్ఎఫ్ఐ మద్దతు తెలుపుతుందని ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షులు బి. సూర్యశివాజీ, యూఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు గణేష్ తెలిపారు.సోమవారం జిల్లా కేంద్రంలోని ఐఎఫ్టీయూ కార్యాలయంలో సూర్యశివాజీ, పార్టీ కార్యాలయంలో గణేశ్ మాట్లాడారు. వ్యవసాయరంగంలో స్వామినాథన్ సిఫార్సులను అమలు పరచాలని, ఉపాధిహామీ కూలీలకు రూ. 600 వేతనం ప్రకటించి, ఏడాదికి 200 పని దినాలను కల్పించాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు శివకుమార్, వి.పద్మ, సుప్రియ, పోశెట్టి, ఎల్.లక్ష్మి, అబ్దుల్, కవిత, భాను, ధనలక్ష్మి, గణేష్, వేణు, మహేష్, సందీప్, కిరణ్, విశాల్, శివాజీ పాల్గొన్నారు. గుంజిళ్లు తీయడం శిక్ష కాదు మోర్తాడ్: గుంజిళ్లు తీయడం శిక్ష కాదని అదొక సూపర్ బ్రెయిన్ యోగా అని రిటైర్డు అధ్యాపకులు అందె జీవన్రావు అన్నారు. సూపర్ బ్రెయిన్ యోగా అనే అంశంపై సోమవారం భీమ్గల్ ఉన్నత పాఠశాలలో ఆయన విద్యార్థులకు గుంజిళ్లు తీయడంపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. గుంజిళ్లు తీయడం వల్ల విద్యార్థులలో ఒత్తిడి తగ్గి జ్ఞాపక శక్తి పెరుగుతుందని చెప్పారు. ప్రతి విద్యార్థి రోజుకు తమకు వీలైనన్ని గుంజిళ్లు తీయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో స్వామి, ఉపాధ్యాయులు గట్టు ఈశ్వర్, రాజు, వాసుదేవ్ తదితరులు పాల్గొన్నారు. -
భూమి కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి
మోపాల్: మండలంలోని మంచిప్ప శివారులో ఎస్సీ కార్పొరేషన్ తమకు ఇచ్చిన 0.39 గుంటల భూమిని కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని చాట్ల సాయన్న కోరారు. ఈమేరకు సోమవారం కలెక్టరేట్లోని ప్రజావాణిలో కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. బాధితుడు చాట్ల సాయన్న తెలిపిన వివరాల ప్రకారం 0.39 ఎకరాల భూమిలో తన తండ్రి మాద్గి ఎల్లయ్య బతికి ఉన్నన్ని రోజులు వ్యవసాయం చేశాడని తెలిపారు. కొద్ది రోజులుగా తమ భూమికి పక్కన భూమి కలిగిన ఈదుల్ల గంగారాం, ఆయన అల్లుడు ఈదుల్ల ప్రవీణ్ కబ్జా చేసుకున్నారని ఆరోపించారు. తమను బెదిరిస్తున్న ఈదుల్ల గంగారాం, ఈదుల్ల ప్రవీణ్పై చర్యలు తీసుకోవాలని, తమ భూమిని ఇప్పించి న్యాయం చేయాలని కోరారు. సానుకూలంగా స్పందించిన కలెక్టర్.. మోపాల్ తహసీల్దార్ను పరిశీలించాలని ఆదేశించినట్లు సాయన్న తెలిపారు. కార్యక్రమంలో పల్లాటి సాయిలు, కొంగల మౌనిక, పర్వవ్వ, డప్పు సుజాత, డప్పు బుచ్చమ్మ, చాట్ల బాలయ్య, తదితరులు పాల్గొన్నారు. -
పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యం
మోపాల్(నిజామాబాద్రూరల్): గ్రామాల్లోని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకున్నప్పుడే ప్రజలంతా ఆరోగ్యంగా ఉంటారని వైద్యులు బృందం సూచించింది. మండలంలోని నర్సింగ్పల్లిలో వైరల్ ఫీవర్లు పెరుగుతున్న నేపథ్యంలో వైద్య, ఆరోగ్యశాఖ అప్రమత్తమై నాలుగు బృందాలను పంపించింది. బృందాలు గ్రామం మొత్తం కలియ తిరిగి ప్రజలకు అప్రమత్తం చేస్తూ, అవగాహన కల్పించారు. ముఖ్యంగా వర్షపు నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో ఆయిల్ బాల్స్ వేస్తూ, స్ప్రే చేశారు. డ్రై డే నిర్వహించారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు వైద్యులు సూచించారు. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. గ్రామపంచాయతీ సిబ్బందిసైతం ప్రతిరోజూ చెత్త సేకరించాలని, ఎప్పటికప్పుడు ఫాగింగ్ చేయాలన్నారు. లార్వా నిరోధక చర్యలు చేపట్టారు. అదేవిధంగా గ్రామంలో ఆరోగ్య శిబిరం నిర్వహించారు. జ్వరంతో బాధపడుతున్న వారికి మందులను అందజేశారు. మెరుగైన చికిత్సలు అవసరమున్న వారికి జీజీహెచ్కు సిఫారసు చేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో రాములు నాయక్, వైద్యులు డాక్టర్ రాజు, డాక్టర్ నాగరాజు, డాక్టర్ వెంకటేష్, డాక్టర్ అజ్మల్, డాక్టర్ ప్రత్యూష, హెచ్ఈఓ గోవర్ధన్, పంచాయతీ కార్యదర్శి,జీపీ, వైద్యసిబ్బంది పాల్గొన్నారు. నర్సింగ్పల్లిలో వైద్యుల బృందం పర్యటన -
ఓటర్ నమోదుపై బీఎల్వోలకు అవగాహన
ఇందల్వాయి : స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఓటర్ నమోదు కార్యక్రమంపై బూత్ లెవెల్ ఆఫీసర్లకు సోమవారం ఆర్డీవో రాజేంద్ర కుమార్ ఆధ్వర్యంలో అవగాహన సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ 18 ఏళ్లు నిండిన యువత ఓటు హక్కు పొందేలా అవగాహన కల్పించాలన్నారు. ఇందుకు బీఎల్వోలు కృషి చేయాలని సూచించారు. ఓటు హక్కు పొందేందుకు అవసరమైన ధృవపత్రాల వివరాలను వారికి తెలియజేయాలన్నారు. ఓటరు జాబితాలో ఎలాంటి తప్పులు లేకుండా ఉండేలా జాగ్రత్త పడాలని అధికారులకు సూచించారు. మార్పులు చేర్పులు సక్రమంగా నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ వెంకట్రావు, డిప్యూటీ తహసీల్దార్ శైలజ, ఆర్ఐ మోహన్ తదితరులు పాల్గొన్నారు. -
అదుపుతప్పితే....అంతే
నేటి చిత్రంగూపన్పల్లికి వెళ్లే దారిలో బ్రిడ్జిపై లేని సైడ్వాల్ నగరంలోని గూపన్పల్లికి వెళ్లే దారిలో బ్రిడ్జిపై ఎలాంటి సైడ్వాల్ నిర్మించకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. సైడ్వాల్ లేకపోవడం, బ్రిడ్జిపక్కన పిచ్చిమొక్కలు పెరిగిపోయాయి. అధికారులు స్పందించి బ్రిడ్జికి ఇరువైపులా సైడ్వాల్ నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు. –సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, నిజామాబాద్ మీ ప్రాంతంలో నెలకొన్న సమస్యను, ఫొటోను మాకు వాట్సాప్లో పంపించండి. ప్రచురించి అధికారుల దృష్టికి తీసుకెళ్తాము. పంపిన వారి పేరు, ఫొటో ప్రచురిస్తాము. నిజామాబాద్ అర్బన్ – 95531 30597 నిజామాబాద్ రూరల్ – 97053 46541 మాకు ఫొటో పంపండి -
గుమస్తా సంఘం అధ్యక్షుడిగా లాండేరి బాల్ అంజయ్య
సుభాష్నగర్: నగరంలోని శ్రద్ధానంద్ గంజ్ గుమస్తా సంఘం అధ్యక్షుడిగా లాండేరి బాల్ అంజయ్య (బాలు) విజయం సాధించారు. సోమవారం నగరంలోని శ్రద్ధానంద్ గంజ్లో గుమస్తా సంఘం ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి. అధ్యక్ష స్థానానికి ఎన్నికలు జరగగా, ప్రత్యర్థి కొక్కు నర్సయ్యపై లాండేరి బాల్ అంజయ్య 134 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. బాల్ అంజయ్య గతంలో సంఘానికి కార్యదర్శిగా ఉన్నారు. అలాగే కార్యదర్శిగా గట్ల శ్రీనివాస్, కోశాధికారిగా వెంకటేష్, ఉపాధ్యక్షులుగా రాజ్ గణేష్, సంయుక్త కార్యదర్శిగా శివప్రసాద్ ఎన్నికయ్యారు. అనంతరం గంజ్లో విజయోత్సవం సంబురాలు నిర్వహించారు. స్వీట్లు తినిపించి, టపాకాయలు కాల్చారు. నూతన అధ్యక్షుడు బాల్ అంజయ్యతోపాటు ఎన్నికై న కమిటీ సభ్యులకు నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, అధికారులు, వ్యాపారస్తులు శుభాకాంక్షలు తెలియజేశారు. కాగా ఈ కమిటీ రెండేళ్లపాటు కొనసాగనుంది. -
డ్రెయినేజీలో పేరుకున్న వ్యర్థాలు
● ఆర్టీసీ కాలనీలో దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు ● మున్సిపల్ అధికారులు స్పందించాలని వినతి నిజామాబాద్అర్బన్ : నగరంలోని ఆర్టీసీ కాలనీలో హనుమాన్ ఆలయ రోడ్డులో గల మండి హోటల్ ఆహార వ్యర్థాలను స్థానిక డ్రెయినేజీలో పేరుకుపోయాయి. దీంతో కాలనీవాసులు దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నారు. ఆర్టీసీ కాలనీలో ప్రధాన రోడ్డుకు ఆనుకొని మండీ హోటల్ కొనసాగుతుంది. ఆర్టీసీ కాలనీ వెనుక వైపు ఉన్న నివాస గృహాల మధ్య గల డ్రెయినేజీలోకి హోటల్ నుంచే వచ్చే వ్యర్థాలను మురుగు నీరు పైపులైన్ను కలిపారు. ఈడ్రెయినేజీ నుంచి మురుగునీరు బయటకు వెళ్లే పరిస్థితి లేదు. దీంతో వ్యర్థాలు డ్రెయినేజీల్లో పేరుకుపోయాయి. దీంతో దుర్వాసన రావడంతో కాలనీవాసులు ఇబ్బందులు పడుతున్నారు. ఈవిషయమై మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు.అలాగే డ్రెయినేజీలను మున్సిపల్ సిబ్బంది శుభ్ర పర్చడం లేదని కాలనీవాసులు వాపోతున్నారు. కాలనీలోని పలు డ్రెయినేజీల వద్ద పిచ్చిమొక్కలు ఏపుగా పెరిగి మురుగు నీరు అక్కడే నిలుస్తోంది. వర్షం పడిన సమయంలో ఇంటిముందు, రోడ్డు ముందు హోటల్ వ్యర్ధాలు నీటితో పాటు బయటకు వస్తున్నాయి. దీంతో కాలనీవాసులు ఇబ్బందులు పడుతున్నారు. హోటల్ నుంచే వచ్చే వ్యర్థాలను ప్రధాన డ్రెయినేజీలో కలపాలని కాలనీవాసులు కోరుతున్నారు. మున్సిపల్ అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కాలనీవాసులు కోరుతున్నారు. -
పోలీస్ ప్రజావాణికి 27 ఫిర్యాదులు
ఖలీల్వాడి: నిజామాబాద్ సీపీ కార్యాలయంలో సోమవారం సీపీ పోతరాజు సాయిచైతన్య పోలీస్ ప్రజావాణి నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ఫిర్యాదిదారులు రాగా, 27 అర్జీలను స్వీకరించారు. అనంతరం సీపీ ఫిర్యాదులను పరిశీలించి, పరిష్కారం కోసం సంబంధిత స్టేషన్ ఎస్సైలు, సీఐలకు ఫోన్ ద్వారా మాట్లాడి సమస్య స్థితిని, పరిష్కారానికి సూచనలు చేశారు. ప్రజలు పైరవీలు లేకుండా స్వచ్ఛందంగా పోలీసు సేవల్ని వినియోగించుకుంటూ, వారి సమస్యలను పరిష్కరించుకొనేందుకు ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు సీపీ తెలిపారు. -
ఫిర్యాదుల పరిష్కారానికి ప్రాధాన్యమివ్వాలి
నిజామాబాద్అర్బన్: ప్రజావాణి కార్యక్రమంలో వచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి ప్రాధాన్యతనివ్వాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. నగరంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్తో పాటు, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, ట్రెయినీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావీ, డీఆర్డీవో సాయాగౌడ్, నగర మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్, మెప్మా పీడీ రాజేందర్, నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకట్ రెడ్డిలకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. మొత్తం 126 ఫిర్యాదులు అందాయి. కాగా, అర్జీలను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ, సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఫిర్యాదులపై చేపట్టిన చర్యలను వివరిస్తూ అర్జీదారులకు సమాచారం తెలియజేయాలన్నారు. వేతనాలు మంజూరు చేయండి.. కేజీబీవీలలో నూతనంగా నియమించబడ్డ నాన్ టీచింగ్ సిబ్బందికి వేతనాలు ఇప్పించాలని ప్రగతిశీల కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. ఈమేరకు వారు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. గత ఐదు నెలల నుంచి వేతనాలు రావడం లేదన్నారు. ప్రభుత్వం స్పందించి తక్షణమే వేతనాలు మంజూరు చేయించాలని కోరారు. ఆన్లైన్లో భూవివరాలు నమోదు చేయాలి ఆర్మూర్లోని వడ్డెర కాలానికి చెందిన పలువురు రైతులు తమ భూములను ఆన్లైన్లో నమోదు చేయాలని కోరారు. ఈమేరకు వారు కలెక్టర్ను కలిసి సమస్యను విన్నవించారు. సర్వే నంబర్ 189/20కి సంబంధించిన భూములు ఆన్లైన్లో కనిపించడం లేదని, సమస్యను అధికారులకు విన్నవించిన పట్టించుకోవడం లేదన్నారు. వెంటనే తమ భూములను ఆన్లైన్లో నమోదు చేయాలని కోరారు. ప్రవేశ మార్గాలను మూయొద్దు నగరంలోని వ్యవసాయ మార్కెట్లో ఇరువైపులా ఉన్న ప్రవేశ మార్గాలను రాత్రివేళ మూసివేయవద్దని వ్యాపారులు కోరారు. వారు ప్రజావాణిలో సమస్యను కలెక్టర్కు విన్నవించారు. రాత్రివేళ మార్కెట్ కమిటీకి ఇరువైపులా ఉన్న ప్రవేశం మార్గాలు మూసివేయడం వల్ల ఆ తర్వాత బయటకు వెళ్లేందుకు వీలుపడడం లేదన్నారు. అకస్మాత్తుగా ఏవైన ఘటన జరిగినా ఇబ్బందిగా ఉంటుందన్నారు. కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి ప్రజావాణికి 126 ఫిర్యాదులు మూడు నెలలుగా వేతనాలు లేవు.. జిల్లాలోని గ్రామ పంచాయతీలలో పనిచేస్తున్న తమకు మూడు నెలలుగా జీతాలు రావడం లేదని జీపీ కార్మికులు, కారోబార్లు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే వేతనాలు ఇప్పించాలని కోరుతూ వారు యూనియన్ నాయకులతో కలిసి ప్రజావాణిలో కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. అలాగే ఎంపీడబ్ల్యూ విధానం తీసివేయాలన్నారు. ఈ విధానం వల్ల అనేక ఇబ్బందులు కలుగుతున్నాయని కార్మికులు పేర్కొన్నారు. అంతకుముందు కలెక్టరేట్ ప్రవేశం మార్గం వద్ద కార్మికులు నిరసన చేశారు. -
మహిళా ప్రాంగణాలకు పూర్వ వైభవం
పెర్కిట్(ఆర్మూర్): బీఆర్ఎస్ పాలనలో మరుగున పడిన మహిళా ప్రాంగణాలకు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో మళ్లీ పూర్వ వైభవం సంతరించుకుంటున్నాయని తెలంగాణ మహిళా సహకార అభివృద్ధి సంస్థ చైర్పర్సన్ బండ్రు శోభారాణి అన్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్లోగల దుర్గాబాయి మహిళ శిశు వికాస కేంద్రంలో సోమవారం ఎంపీహెచ్డబ్ల్యూ కోర్సు పూర్తి చేసుకున్న వారికి క్యాపింగ్ సెర్మనీ నిర్వహించారు. కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. ఎంపీహెచ్డబ్ల్యూ కోర్సు పూర్తి చేసుకున్నవారు నిస్వార్థంగా సేవలందించాలన్నారు. అనంతరం కోర్సు పూర్తి చేసుకున్నవారికి సర్టిఫికెట్లు అందజేసి క్యాపింగ్ చేశారు. డబ్ల్యూసీడీసీ మేనేజింగ్ డైరెక్టర్ చంద్రకాంత్రెడ్డి, అదనపు కలెక్టర్ అంకిత్, ఐసీడీఎస్ సీడీపీవో జ్యోతి, ఏఎంసీ చైర్మన్ సాయిబాబా గౌడ్, మున్సిపల్ కమీషనర్ రాజు, శిక్షణ తీసుకున్న అభ్యర్థినులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి
నవీపేట: రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టిసారించినట్లు పోలీసులు తెలిపారు. ఈమేరకు సోమవారం వారు మండలంలోని ధర్మారం(ఏ), శివాజీ చౌక్ ప్రాంతాలలో తరచూ రో డ్డు ప్రమాదాలు జరుగుతున్న ప్రదేశాలను పరిశీలించారు. 2022 నుంచి 2024 వరకు ఈ రెండు ప్రాంతాలలో పలు ప్రమాదాలు జరుగగా, పదుల సంఖ్యలో గాయపడ్డారు. దీంతో నిజామాబాద్ నార్త్ రూరల్ సీఐ శ్రీనివాస్, ఆర్అండ్బీ ఈఈ రామ్మోహన్, ఆడార్ మేనేజర్ వర్ష నిహంత్, ఇరిగేషన్ ఏఈ శ్రీధర్లు రోడ్డుకు ఇరువైపుల ఖాళీ ప్రదేశాలను కొలిచారు. రోడ్డు విస్తీర్ణంపై స్థానిక వ్యాపారులను అడిగి తెలుసుకున్నారు. మండల కేంద్రంలో నిబంధనలు అతిక్రమించి ముందుకు వచ్చిన వ్యాపారులు స్వచ్ఛందంగా హద్దులను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో నాగనాత్, నవీపేట జీపీ కార్యదర్శి రవీందర్ నాయక్, స్థానిక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
ఫర్టిలైజర్ దుకాణం తనిఖీ
కమ్మర్పల్లి: కలుపు మందు పిచికారితో సోయాబీన్ పంట ఎండిపోవడంతో మందు విక్రయించిన ఫర్టిలైజర్ దుకాణాన్ని డీఏవో వీరస్వామి సోమవారం తనిఖీ చేశారు. గడ్డి మందు కొట్టడంతో సోయాబీన్ పంటలు ఎండిపోయాయని రైతులు వ్యవసాయాధికారులకు ఇటీవల ఫిర్యాదు చేశారు. దీంతో మండలంలోని ఉప్లూర్, కమ్మర్పల్లి, చౌట్పల్లి గ్రామల్లో కలుపు మందు పిచికారి చేయడంతో ఎండిపోయిన పంటలను వారు పరిశీలించారు. అనంతరం రైతులు కొనుగోలు చేసిన ఫెర్టిలైజర్ షాపును తనిఖీ చేశారు. పంటకు నష్టం చేకూర్చిన కలుపు మందు(హెర్బిసైడ్స్)ను ఎవరికి విక్రయించుకుండా సీజ్ చేశారు. శాంపిల్ సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్కు పంపించారు. రిపోర్టు రాగానే చట్టపరమైన ఆదేశాలు తీసుకుంటామని డీఏవో తెలిపారు. ఏవో రమ్యశ్రీ, ఏఈవోలు తదితరులు ఉన్నారు. ‘అర్చకుల సమస్యల పరిష్కారానికి కృషి’ సదాశివనగర్: అర్చకుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ విజయ రామారావు సూచించారు. సోమవారం మండల కేంద్రంలోని ఆర్యవైశ్య ఫంక్షన్ హాల్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ధూపదీప నైవేద్య అర్చక సంఘం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. మూడు నెలలుగా వేతనాలు ఇవ్వకపోవడంతో ఇబ్బందులు పడు తున్నామని అర్చకులు కమిషనర్తో పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని ఆయన హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల అర్చ క సంఘ అధ్యక్షులు అంజనప్ప, రాచప్ప, గ్రేట ర్ హైదరాబాద్ అధ్యక్షుడు గోపి కృష్ణమాచార్యులు, ఆయా ఆలయాల కమిటీల చైర్మన్లు బీరయ్య, రవి, రాజయ్య, స్థానిక అర్చకులు సంతోష్కుమార్ శర్మ, జంగం గంగాధర్, ప్రసాద్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. పోగొట్టుకున్న సెల్ఫోన్ల అందజేత ఖలీల్వాడి: నిజామాబాద్ రైల్వే పోలీస్స్టేషన్ పరిధిలోని సెల్ఫోన్లను పోగొట్టుకున్న బాధితులకు తిరిగి ఫోన్లను అందించినట్లు ఎస్సై సాయిరెడ్డి సోమవారం తెలిపారు. 11 మందికి సెల్ఫోన్లు అందించామని, సెల్ఫోన్ పోతే సీఈఐఆర్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయాలని కోరారు. ఈసందర్భంగా ఫోన్లను రికవరీ చేసిన కానిస్టేబుళ్లు సుప్రియ, సలావుద్దీన్లను ఎస్సై అభినందించారు. -
కేటీఆర్ వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి
వేల్పూర్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 18 నెలలుగా ఏమి చేసిందో కేటీఆర్ గ్రామాలు తిరిగి వాస్తవాలు తెలుసుకొని, మాట్లాడాలని రాష్ట్ర సహకార యూనియన్ చైర్మన్, డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్రెడ్డి అన్నారు. వేల్పూర్ మండల కేంద్రంలో సోమవారం ఆయన ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలను పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పరిపాలనలో రాష్ట్రంలో ఎక్కడా కూడా ఇల్లులేని పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు ఇవ్వకుండా మోసం చేసిందన్నారు. గ్రామాలలో జరుగుతున్న అభివృద్ధిని చూడకుండా సీఎం రేవంత్రెడ్డిపై కేటీఆర్ అవాకులు, చెవాకులు చేస్తే సహించేది లేదన్నారు. మండలాలు, గ్రామాలలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకుంటున్న వారికి సహకరించాలని సూచించారు. గోదావరి అనే లబ్ధిదారురాలు నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటిని చూసి సంతోషం వ్యక్తం చేశారు.వేల్పూర్ ఏఎంసీ వైస్ చైర్మన్ గడ్డం నర్సారెడ్డి, డైరెక్టర్ గౌరాయి నరేందర్, నాయకులు దామోదర్గౌడ్, మల్లేష్, రమణ, రాజేందర్, రాజేశ్వర్, లావణ్య, లహరి పాల్గొన్నారు. -
క్రైం కార్నర్
ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న కారు ● భర్త మృతి, భార్యకు గాయాలు బోధన్టౌన్(బోధన్): ఎడపల్లి మండలం దూపల్లి గేట్ సమీపంలోని బోధన్–నిజామాబాద్ ప్రధాన రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఎస్సై ముత్యాల రమ తెలిపిన వివరాలు ఇలా.. రెంజల్ మండలం బాగెపల్లి గ్రామానికి చెందిన దంపతులు వాద్యాల రాములు(54), ఇంద్ర కలిసి సోమవారం ద్విచక్ర వాహనం (టీవీఎస్ చాంప్)పై నిజామాబాద్ నుంచి స్వగ్రామానికి బయలుదేరారు. దూపల్లి గేట్ వద్ద వారు రోడ్డు దాటుతుండగా బోధన్ నుంచి నిజామాబాద్కు వెళ్తున్న కారు వారిని వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో భర్త వాద్యాల రాములు అక్కడికక్కడే మృతి చెందగా భార్య ఇంద్రకు గాయాలు అయ్యాయి. వెంటనే స్థానికులు గమనించి ఇంద్రను నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని, వివరాలు సేకరించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. దుబాయ్లో పెద్దవాల్గోట్ వాసి .. సిరికొండ: మండలంలోని వాల్గోట్ గ్రామానికి చెందిన వడియాల రవీందర్ (38) ఈ నెల 4న గల్ఫ్ దేశమైన దుబాయిలో గుండెపోటుతో మృతి చెందాడు. మృతుడికి భార్య లావణ్య, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. బతుకు దెరువు కోసం కొద్ది సంవత్సరాలుగా రవీందర్ దుబాయ్కి వెళ్తున్నాడు. సెలవుపై ఏడాది క్రితం ఇంటికి వచ్చి, వెళ్లాడు. రోజూలాగే డ్యూటీకి వెళ్లివచ్చి రూమ్కు విశ్రాంతి తీసుకుంటున్న రవీందర్ ఒక్కసారిగా గుండెపోటుకు గురయ్యాడు. వెంటనే తోటి స్నేహితులు హాస్పిటల్కు తరలించే లోపే మృతి చెందాడు. ప్రభుత్వం స్పందించి మృతదేహాన్ని త్వరగా స్వదేశానికి రప్పించాలని కుటుంబీకులు, గ్రామస్తులు కోరుతున్నారు. -
రీయింబర్స్మెంట్ అందించాలి..
పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్, ఫీజు రీయింబర్స్మెంట్ను విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ, టీజీవీపీ నాయకులు వేర్వేరుగా డిమాండ్ చేశారు. ఈమేరకు వారు సమస్యను ప్రజావాణిలో కలెక్టర్కు విన్నవించారు. టీజీవీపీ నగర అధ్యక్షుడు అఖిల్ మాట్లాడుతూ.. రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్స్ లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కళాశాలలో యాజమాన్యాలు ఇబ్బందులకు గురి చేస్తున్నాయన్నారు. అలాగే ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. బెస్ట్ అవైలబుల్ స్కీంకు సంబంధించిన బకాయిలను విడుదల చేయాలన్నారు ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు విగ్నేష్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. -
60 గ్రాముల గంజాయి పట్టివేత!
ఖలీల్వాడి: నగరంలోని ఎల్లమ్మగుట్ట బ్రిడ్జి వద్ద గంజాయి అమ్ముతున్న బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. వీరి నుంచి ఎండు గంజాయి ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. చిన్న, చిన్న ప్యాకెట్లలో సుమారు 60 గ్రాముల వరకు గంజాయి ఉంటుందని సమాచారం. ఈ విషయమై నాలుగో టౌన్ ఎస్సై శ్రీకాంత్ను వివరణ కోరగా గంజాయి పట్టుకున్నామని, బాలుడు మైనరా? మేజరా? ఆనేది నిర్ధారించాల్సి ఉందన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే నగరంలోని ఓ ప్రయివేట్ కాలేజీకి చెందిన విద్యార్థులు గంజాయి పడుతుండగా పోలీసులు పట్టుకున్నారు. వారికి కౌన్సెలింగ్ ఇచ్చిన తర్వాత కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఏడు ఇసుక ట్రాక్టర్లు.. రుద్రూర్: పోతంగల్ మండలం కొడిచర్ల శివారులోని మంజీరా నది నుంచి అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్న ఏడు ట్రాక్లర్లను, ఒక ట్రాలీని సోమవారం తెల్లవారుజామున పట్టుకున్నట్టు ఎస్సై సునీల్ తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు సిబ్బందితో వెళ్లి ట్రాక్టర్లను పట్టుకుని కోటగిరి పోలీస్స్టేషన్ తరలించామని ఆయన పేర్కొన్నారు. ట్రాక్టర్ డ్రైవర్లు, యజమానులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు. -
అందరు ఉన్నా.. అనాథలా మృతి
జక్రాన్పల్లి: రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ ఓ యువకుడు వారం రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నా కుటుంబసభ్యులకు సమాచారం లేకపోవడంతో అనాథలా మృతిచెందాడు. మృతుడి కుటుంబీకులు, గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా.. మండలంలోని అర్గుల్ గ్రామానికి చెందిన కొరబోయిన అశోక్(32) మేసీ్త్ర పని చేస్తుండేవాడు. అతడు కొన్నేళ్ల క్రితమే లింగంపేట్ మండలం నుంచి అర్గుల్ గ్రామానికి కుటుంబంతో వలస వచ్చి, జీవనం కొనసాగిస్తున్నాడు. గత నెల 28న రాత్రి అతడు జక్రాన్పల్లిలో స్నేహితుడిని కలిసి వస్తానని బైక్పై ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. ఎంతకీ తిరిగిరాకపోవడంతో మరుసటి రోజు తండ్రి ప్రభురాజ్యం జక్రాన్పల్లి పోలీస్స్టేషన్లో మిస్సింగ్ అయినట్లు ఫిర్యాదు చేశాడు. జిల్లాకేంద్ర ఆస్పత్రిలో సోమవారం గుర్తుతెలియని వ్యక్తి చికిత్స పొందుతూ మృతిచెందగా ఆస్పత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతుడు అశోక్గా గుర్తించి, ప్రభురాజ్యంకు సమాచారం ఇచ్చారు. వెంటనే అతడు ఆస్పత్రికి చేరుకొని మృతిచెందినది తన కుమారుడే అని బోరున విలపించారు. బైక్ను ఠాణాకు తరలించారు.. విచారణ మరిచారు.. ఆస్పత్రిలో వారం రోజులుగా ఎవరూ లేని అనాథలా చికిత్స పొందుతున్న అశోక్ మృతి చెందడం పలు అనుమానాలకు తావిస్తోంది. 28న రాత్రి జక్రాన్పల్లి సర్వీసు రోడ్డులో ఒక యువకుడు బైక్ అదుపుతప్పి కిందపడిపోగా చికిత్స నిమిత్తం జిల్లాకేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు అంబులెన్స్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. మరుసటి రోజు పోలీసులు బైక్ను ఠాణాకు తరలించారు. అయితే ఆ ఘటనలో గాయపడ్డవారు ఎవరు? అని పోలీసులు వివరాలు సేకరించడంలో నిర్లక్ష్యం వహించినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టినట్లయితే అతడు ప్రాణాలతో ఉండేవాడని అర్గుల్కు చెందిన ఓ మాజీ ప్రతినిధి పేర్కొన్నారు. అశోక్ను ఆస్పత్రిలో చేర్చినప్పటికీ అతనికి సంబందించిన వ్యక్తులు లేకపోవడం వల్ల వైద్యులు సైతం వైద్యం అందించడంలో నిర్లక్ష్యం వహించినట్లు అనుమానం వ్యక్తం చేశారు. స్వల్ప గాయాలైన వ్యక్తి మరణించడంపై అనుమానంగా ఉందని గ్రామస్తులు పేర్కొన్నారు. ఈ విషయమై ‘సాక్షి’ జక్రాన్పల్లి ఎస్సైను వివరణ కోరేందుకు యత్నించగా ఫోన్ లిప్ట్ చేయలేదు. గతనెల 28న రోడ్డు ప్రమాదంలో గాయపడిన అశోక్ ఆస్పత్రిలో చేర్పించి పోలీసులకు సమాచారమిచ్చిన అంబులెన్స్ సిబ్బంది తమ కుమారుడు కనిపించడం లేదని ఫిర్యాదు చేసిన తండ్రి దర్యాప్తు చేయడంలో పోలీసుల నిర్లక్ష్యం చికిత్స పొందుతూ మృతి -
రుద్రూర్కు ఆ పేరు ఎలా వచ్చిందంటే..
రుద్రూర్: కాకతీయుల కాలంలో రాణీ రుద్రమదేవి వంశీయులు ఈ ప్రాంతాన్ని పరిపాలించినందున గ్రామానికి రుద్రూర్గా పేరు వచ్చింది. ● రాణీ రుద్రమదేవికి సంబంధించిన సైనిక స్థావరం రుద్రూర్లో ఉండేదని గ్రామపెద్దలు చెబుతున్నారు. ● గ్రామానికి మూడు వైపుల బురుజులు (గడి)లు, ఒక వైపు చెరువు ఉంది. కాల క్రమేణ రెండు అంతరించిపోగా రాతితో నిర్మించిన ప్రధాన ద్వారం చెక్కు చెదరకుండా ఉంది. ● గ్రామం మధ్యలో రాతితో కట్టిన పెద్ద పురాతన కోట (బురుజు) ఉంది. ఇందులో కాకతీయుల సైనిక స్థావరం ఉండేది. ఇక్కడి నుంచి సొరంగ మార్గం (బావి) రుద్రూర్ వ్యవసాయ పరిశోధన కేంద్రం వరకు ఉన్నట్టు గ్రామ పెద్దలు పేర్కొన్నారు. ● కాకతీయుల కాలంలో రాతితో నిర్మించిన రాజరాజేశ్వర ఆలయం ఎంతో ప్రత్యేకతను కలిగి ఉంది. మీకు తెలుసా? -
అడ్డేముంది.. ఆక్రమించేద్దాం!
సోమవారం శ్రీ 7 శ్రీ జూలై శ్రీ 2025– 8లో u13న ఊర పండుగ నిజామాబాద్రూరల్: నగరంలో ఈ నెల 13న ఆదివారం ఊర పండుగ నిర్వహించనున్నట్లు సర్వ సమాజ్ కమిటీ అధ్యక్షుడు యెండల లక్ష్మీనారాయణ తెలిపారు. ఆదివా రం సిర్నాపల్లిగడిలో పండుగ సన్నాహక స మావేశం నిర్వహించారు. నగరంలోని ఖిల్లా చౌరస్తా నుంచి పెద్దబజార్, ఆర్య సమాజ్, గోల్ హనుమాన్ ఆలయం మీదుగా వినా యక్నగర్ వరకు గ్రామదేవతల ఊరేగింపు ఉంటుందన్నారు. మరో గ్రామ దేవత దుబ్బ వైపు వెళ్తుందని పేర్కొన్నారు. గురువారం బండారు వేయనున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో సర్వ సమాజ్ కమిటీ ప్రతినిధులు బంటు రాము, ఆదె ప్రవీణ్, కుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. మాలల సంక్షేమానికి కృషి చేయాలి నిజామాబాద్ నాగారం : జిల్లాలోని మాలల సంక్షేమానికి కృషి చేయాలని, ఏ కష్టం వచ్చి నా అండగా ఉండాలని మాల ఉద్యోగుల సంక్షేమ సంఘం సభ్యులకు మాజీ ఉన్నత విద్య మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి సూచించారు. నగరంలోని కంఠేశ్వర్ బైపాస్ చౌరస్తాలో ఉన్న సంఘం కార్యాలయంలో ఆ దివారం నిర్వహించిన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. నూతన జిల్లా కమిటీ తో ప్రమాణం చేయించారు. కార్యక్రమంలో మాల ఉద్యోగుల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షుడు అలుక కిషన్, జిల్లా అధ్యక్షుడు స్వామిదాస్, ప్రధాన కార్యదర్శి చొక్కం దేవదాస్, తదితరులు పాల్గొన్నారు పేలుడు పదార్థాల కేసులో కాంగ్రెస్ నేత అరెస్ట్ కామారెడ్డి క్రైం: అక్రమంగా పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలను నిల్వ ఉంచిన కేసులో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్రెడ్డిని పోలీసులు శనివారం అర్ధరాత్రి అరెస్ట్ చేశా రు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కేపీఆర్ కాలనీలో ఇంటి నిర్మాణం కోసం బండరాళ్లు పగుల గొట్టడానికి యజమాని శ్రీధర్ పట్టణానికి చెందిన ముగ్గురు వ్యక్తులతో ఒప్పందం చేసుకున్నాడు. వారంతా కలిసి ఈనెల 4న జిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్లు, ఇతర సామగ్రితో బండరాళ్లు పేల్చడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. చుట్టుపక్కల వారు ఫిర్యాదు చే యడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. లింగాపూర్ వద్దనున్న శ్రీవారి వెంచర్లో నిల్వ చేసిన 1,564 జిలెటిన్ స్టిక్స్, 41 డిటోనేటర్లు ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకు న్నారు. పేలుడు పదార్థాలు నిల్వ చేసిన గది మున్సిపల్ మాజీ చైర్పర్సన్ భర్త, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్రెడ్డి, అతడి సోదరుడు గడ్డం సురేందర్రెడ్డిలది. శనివారం అర్ధరాత్రి చంద్రశేఖర్రెడ్డిని అరెస్టు చేసి నిజామాబాద్ జైలుకు తరలించారు. సురేందర్రెడ్డి పరారీలో ఉన్నారు. సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: జిల్లా కేంద్రమైన నిజామాబాద్ నగరం మధ్యలో నుంచి ప్రవహించే పులాంగ్వాగు కబ్జా అవుతుండడంతో వరదనీటి ప్రవాహానికి అడ్డంకులు ఏర్పడుతున్నాయి. రెండు గంటలపాటు భారీ వర్షం కురిస్తే ఇందూరు నగరంలోని ప్రధాన రోడ్లన్నీ నీటితో నిండుతున్నాయి. నగరం నుంచి మురుగునీటితోపాటు వర్షపు నీరు వెళ్లిపోవడంలో పులాంగ్ వాగుది ప్రధాన పాత్ర. అయితే వాగును కొందరు అక్రమార్కులు అడుగడుగునా కబ్జా చేయడంతో నగరంలోని పలు ప్రాంతాల్లో పిల్లకాలువలా తయారైంది. ఇంత జరిగినా ఇరిగేషన్, మున్సిపల్, రెవెన్యూ, అటవీ అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. న్యాల్కల్ చెరువు అలుగుతో మొదలయ్యే ఈ పులాంగ్ వాగు నవీపేట మండలం నాళేశ్వర్ వద్ద గోదావరిలో కలుస్తుంది. గాయత్రినగర్, పద్మనగర్, ప్రగతినగర్, ఎల్లమ్మగుట్ట, కంఠేశ్వర్, గూపన్పల్లి వరకు వాగు కుంచించుకుపోయింది. ప్రగతినగర్, ఎల్లమ్మగుట్ట ప్రాంతాల్లో వాగును ఆక్రమించి భారీ భవనాలను నిర్మించారు. ఇక కొందరు ప్రబుద్ధులు కంఠేశ్వర్, గూపన్పల్లి ఏరియాల్లో పులాంగ్లో వేలకొద్దీ ట్రక్కుల మట్టి నింపి వెంచర్లు వేసి ప్లాట్లు అమ్మేశారు. పులాంగ్ వాగుకు ఇరువైపులా జాతీయ పక్షులైన నెమళ్లు ఉన్నాయి. అయితే ఆక్రమణలు, భారీ నిర్మాణాల కారణంగా అందమైన నెమళ్లకు నిలువనీడ లేకుండా పోతోంది. త్వరలోనే ఇక్కడి నుంచి నెమళ్లు మాయమయ్యే పరిస్థితి ఉంది. ఇక పాంగ్రా వాగు సైతం ఆక్రమణలకు గురైంది. ఎల్లమ్మగుట్ట ప్రాంతంలో వాగును ఆక్రమించిన ఓ ప్రముఖ బిల్డర్.. వాగు స్థలంలో మట్టిపోసి చదును చేసి తాను నిర్మించి అమ్మేసిన అపార్ట్మెంట్లకు సంబంధించిన క్లబ్ హౌస్ను నిర్మించడం గమనార్హం. ఆనవాళ్లు కోల్పోయిన నిజాంసాగర్ కాలువ మాలపల్లి, అహ్మద్పురా కాలనీ, నటరాజ్ థియేటర్ వెనుక నుంచి మిర్చి కాంపౌండ్ వైపు డి–54 కాలువను పూర్తిగా ఆక్రమించి ఇళ్లు, భారీ భవనాలు నిర్మించారు. దీంతో కాలువ ఆనవాళ్లు లేకుండా పోయింది. ఇతర ప్రాంతాల్లో సైతం కాలువలో పూడిక తీయలేని దుస్థితి నెలకొంది. ● నగరంలో ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలపై నిజామాబాద్ నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్కుమార్ను వివరణ కోరగా.. వాగులు, చెరువుల కబ్జాలు, ఆక్రమణలపై ఇరిగేషన్ అధికారులకు చెబుతామన్నారు. ఇరిగేషన్ డిప్యూటీ సీఈ ప్రవీణ్ను వివరణ కోరగా త్వరలో వీటిపై సర్వే చేయిస్తామన్నారు. వరద.. ట్రాఫిక్నగరంలో ఓ వైపు వాగులు, కాలువలు కబ్జా అవుతుండగా.. మరో వైపు అనుమతులకు సంబంధం లేకుండా భారీ నిర్మాణాలు చేపడుతుండడంతో వర్షాకాలంలో పరిస్థితి అధ్వానంగా మారుతోంది. రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద ఐదడుగుల మేర నీళ్లు నిలుస్తున్నాయి. వరద నీటి కారణంగా ట్రాఫిక్ సమస్య తీవ్రమవుతోంది. 30 మీటర్ల దూరం వెళ్లేందుకు 30 నిమిషాల సమయం పట్టిన పరిస్థితి అనేకసార్లు ఉత్పన్నమైంది. నగరంలోని చాలా ప్రాంతాల్లో పార్కింగ్ స్థలాలు, సెట్బ్యాక్, ఫైర్ అనుమతులు లేకుండానే భవనాలు, కమర్షియల్ కాంప్లెక్స్లు కట్టారు. వీటి విషయంలో అధికార యంత్రాంగం తమకేం సంబంధంలేదన్నట్లు వ్యవహరిస్తోంది. పార్కింగ్ విషయంలో పోలీసు శాఖ వాహనదారులకు జరిమానాలు వేస్తుండగా, భవనాల ఫైర్, సెల్లార్, సెట్బ్యాక్ విషయమై ఆయా శాఖల మధ్య ఏనాడూ సమన్వయ సమావేశం జరిగిన దాఖలాలు లేవు. పరిస్థితి ఇలాగే ఉంటే భవిష్యత్లో ప్రధాన నగరం స్లమ్ సిటీగా మరే పరిస్థితి ఉందని ఇందూరువాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎస్సారెస్పీలోకి ఇన్ఫ్లో బాల్కొండ: స్థానిక ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి 6,090 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. కాకతీయ కాలువ ద్వారా 100, మిషన్ భగీరథ ద్వారా 231, ఆవిరి రూపంలో 323 క్యూసెక్కుల నీరు పోతుంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091 (80.5 టీఎంసీలు)అడుగులు కాగా ఆదివారం సాయంత్రానికి 1067 (18.8 టీఎంసీలు) అడుగుల నీరు ఉంది.న్యూస్రీల్32 ఎకరాల రామర్తి.. 6 ఎకరాలైంది!బోధన్ రోడ్లోని రామర్తి చెరువు విస్తీర్ణం 32 ఎకరాలు కాగా ప్రస్తుతం కేవలం 6 ఎకరాల లోపు మాత్రమే మిగిలింది. దీనిపై 2024 మార్చి నెలలో ‘సాక్షి’లో కథనాలు వెలువడగా.. అధికారులు మూడురోజులపాటు కూ ల్చివేతల ప్రక్రియ చేపట్టారు. ఆ తర్వాత మళ్లీ ఆక్రమణదారులు నిర్మాణాలు చేపట్టారు. రామర్తి చెరువు అభివృద్ధి కోసం గతంలో దివంగత సీఎం, మహానేత రాజశేఖర్రెడ్డి వేసి న పైలాన్ను సైతం కబ్జాదారులు మాయం చేశారు. జిల్లాలోనూ ‘హైడ్రా’ మాదిరి ‘నిడ్రా’ విభాగాన్ని ఏర్పాటు చేసి ఆక్రమణలను తొలగించాలనే డిమాండ్లు వస్తున్నాయి. కార్పొరేషన్ కహానీ – 6బ్రహ్మ చెరువులో 12 ఎకరాలు మాయం స్లాటర్ హౌస్ వెనుక ప్రాంతంలో గుట్టల మధ్య ఉన్న సహజసిద్ధమైన బ్రహ్మచెరువును సైతం క బ్జా చేశారు. కొందరు ప్రబుద్ధులు ఏకంగా చెరువు కు సంబంధించి 12 ఎకరాల భూమిని మింగేశా రు. పూర్తిగా చదును చేసి ప్లాట్లు చేశారు. పక్క నే ఉన్న అటవీ భూమిలో సైతం ఓ కీలక ప్రజాప్రతినిధి అక్రమంగా వెంచర్ వేశాడు. అటవీ సరిహ ద్దు దిమ్మె వద్దనే వెంచర్ సరిహద్దు రాయి పాతా రు. ఇక్కడికి వెళ్లేందుకు రోడ్డు లేకపోవడంతో స్లా టర్ హౌస్ వెనుక ఉన్న గోడను కూల్చి రో డ్డు వే శారు. బ్రహ్మ చెరువుకు సమీపంలోని బాబన్సాహెబ్ పహాడ్ వద్ద డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణా ల సమీపంలో 2230, 2231, 2232, 2233, 22 22, 2237 సర్వే నంబర్లలో అనధికారికంగా, అక్రమంగా లేఅవుట్లు వేసి ప్లాట్లు విక్రయిస్తున్నారు. వీటిలోనూ కొందరు ప్రజాప్రతినిధులది కీలక పాత్ర కావడం గమనార్హం. మరోవైపు నగరంలో కీలకమైన బొడ్డెమ్మ చెరువు వద్ద 28 ఎకరాల శి ఖం భూమిని ఆక్రమించి నిర్మాణా లు చేపట్టారు. ఇలా ప్రభుత్వ, అసైన్డ్, దేవాదాయ భూములు విచ్చలవిడిగా ఆక్రమణలకు గురవుతున్నాయి. పులాంగ్ వాగు, నిజాంసాగర్ కాలువల కబ్జా రామర్తి, బ్రహ్మ చెరువుల ఆనవాళ్లు మాయం భారీ వర్షం కురిస్తే నగరంలో అంతా ఆగమాగం వరద నీరు ప్రవహించే అవకాశం లేకుండా అక్రమ నిర్మాణాలు నాలాలనూ వదలని వైనం మున్సిపల్ అధికారుల అనుమతులపై అనుమానాలు పులాంగ్వాగును కాపాడాలి పులాంగ్ వాగును శు భ్రం చేయాలి. వాగు లోతును పెంచడంతో పాటు చెత్తవేయకుండా రెండు వైపులా కంచె ఏ ర్పాటుచేయాలి. ఇరిగేషన్ అధికారులు వాగు విస్తీర్ణాన్ని కొలిచి బౌండరీలను గుర్తించి ఆక్రమణలను తొలగించాలి. వరదల నుంచి నగరాన్ని కాపాడాలి. – ఆకుల పాపయ్య, రైతు నాయకుడునిడ్రా తీసుకురావాలి విశాలమైన పులాంగ్ వాగు క్ర మంగా పిల్ల కాల్వలను తలపిస్తోంది. వాగు వాస్తవ విస్తీర్ణం కొ లిచి, హద్దులు నిర్దేశించాలి. ఈ అంశంపై మున్సిపల్ కౌన్సిల్లో కూడా చర్చించాం. రామర్తి చెరువు కబ్జాలు తొలగించేందుకు రూ.20 లక్షలు కేటాయించాం. పేదలకు ఇబ్బంది కలకుండా నిజామాబాద్లో నిడ్రా తీసుకురావాలి. – న్యాలం రాజు, బీజేపీ నాయకుడు, ఎల్లమ్మగుట్టఆక్రమణలను తొలగించాలి పులాంగ్ వాగు, నిజాంసాగర్ కెనాల్ను రియల్ ఎస్టేట్ వ్యాపారులు విచ్చలవిడిగా ఆక్రమిస్తున్నారు. వీరికి మున్సిపల్, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు సహకరిస్తు న్నారు. ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. వరదలు వస్తే నగరవాసులకు ప్ర మాదమే. ఆక్రమణలు తొలగించాల్సిందే. – వీ ప్రభాకర్, న్యూడెమోక్రసీ నాయకుడు -
ఊపందుకున్న ఎవుసం
● జిల్లాలో 50 శాతం పూర్తయిన వరినాట్లు ● జోరుగా మొక్కజొన్న సాగు ● వలస కూలీలకు దండిగా ఉపాధి ఆరుతడిని ఆదుకున్న వర్షం బాల్కొండ: ఆరుతడి పంటల సాగుకు వర్షం సహకరిస్తోంది. వారం రోజుల నుంచి అడపాదడపా కురుస్తూ పంటలకు జీవం పో స్తుంది. కురుస్తున్న వర్షాలతో రైతులు సాగు చేసిన మొక్కజొన్న, సోయా పంటలు పచ్చ దనాన్ని సంతరించుకుంటున్నాయి. ప్రస్తు తం మొక్కజొన్నకు అన్నదాతలు యూరి యా మందును వేస్తున్నారు. ఆరుతడి పంటలను ఆదుకునేలా వరుణుడు కరుణించడంపై అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. డొంకేశ్వర్(ఆర్మూర్): జిల్లాలో ఎవుసం ఊపందుకుంది. కురుస్తున్న వర్షాలతో సాగు పనులు జోరుగా సాగుతున్నాయి. రైతన్నలు సాగు పను ల్లో నిమగ్నమయ్యారు. ఒక పక్క కేజ్వీల్స్ ట్రాక్టర్లతో పొలాలను దమ్ము చేయిస్తూ.. మరో పక్క వరినారును తరలించి చకచకా నాట్లు వేయిస్తున్నారు. ఐతే, ప్రభుత్వం బోనస్ ఇస్తుందనే ఆశ తో రైతులంతా సన్నాలే ఎక్కువగా సాగు చేస్తున్నారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో పంటలన్నీ కలి పి 5.31 లక్షల ఎకరాలకు పైగా సాగవుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఇందులో ప్రధానంగా వరి 4.37లక్షల ఎకరాలు అంచనా ఉండగా, ఇప్పటి వరకు 50శాతం వరకు సాగైంది. మొక్కజొన్నకు మంచి ధర వస్తుండడంతో రైతులు వరి తర్వాత మొక్కజొన్నను ఎక్కువగా విత్తారు. సోయా గతేడాదితో పోలిస్తే ఐదారు వేల ఎకరాలు తగ్గింది. వలస కూలీలతో వరినాట్లు వరినాట్లు వేసేందుకు జిల్లాకు ఎప్పటిలాగే మ హారాష్ట్ర, యూపీ, ఏపీ, బిహార్, పశ్చిమ బెంగా ల్ రాష్ట్రాల నుంచి వలస కూలీలు వచ్చారు. వా రికి మధ్యవర్తులుగా ఉన్న మునీములు గ్రా మాల్లో వసతి, భోజన సౌకర్యాలు కల్పిస్తున్నా రు. తక్కువ సమయంలో నాట్లు పూర్తి చేయడంలో వీరికి పెట్టింది పేరు. ఆగస్టు చివరి వరకు జిల్లాలోనే ఉండి నాట్లు పూర్తిచేసుకుని వెళ్తారు. ఐతే, ఎనిమిది మంది 10 మంది ఉండే కూలీల బృందానికి ఎకరం నాటు వేస్తే రూ.4,500 నుంచి రూ.4,800 వరకు రైతులు చెల్లిస్తున్నారు. సగం కోటా యూరియా ఖతం సాగు పనులు పుంజుకోవడంతో యూరియా అమ్మకాలు జోరుగా జరుగుతున్నాయి. ఖరీఫ్ సీజన్కు మొత్తం 75వేల మెట్రిక్ టన్నులు అవసరమని వ్యవసాయ శాఖ ఇండెంట్ పంపింది. ఇందులో ఇప్పటి వరకు 42,787 మెట్రిక్ టన్నులు జిల్లాకు రాగా, 30వేల మెట్రిక్ టన్నులు అమ్ముడుపోయింది. 12,700 మెట్రిక్ టన్నుల వరకు నిల్వలు ఉన్నట్లు జిల్లా వ్యవసాయాధికారి వీరాస్వామి తెలిపారు. నల్గొండ నుంచి మహిళా కూలీలు.. ఐదేళ్లుగా డొంకేశ్వర్కు వసల కూలీలను తెప్పిస్తున్నా. ఈసారి కూడా నల్గొండ నుంచి ప్రత్యేకంగా మహిళలను, పశ్చిమ బెంగాల్ నుంచి మగ కూలీలను రప్పించాను. వారికి గ్రామంలోనే రెండు నెలలపాటు నివాస, భోజన సదుపాయం కల్పిస్తాం. నాట్లు పూర్తికాగానే తిరిగి వారి స్వస్థలాలకు వెళ్తారు. – బార్ల వంశి, డొంకేశ్వర్18 ఎకరాల్లో మూడు పంటలు.. నాకున్న 18 ఎకరాల వ్యవసాయ భూమిలో మూ డు రకాల పంటలు వేశా. వరి, పసుపు, సోయా పంటలను ఆరున్నర ఎకరాల చొప్పున వేయగా, అవసరం మేరకు యూరియా కొనుగోలు చేశాను. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అందించిన పెట్టుబడి సాయం డబ్బులు సాగుకు ఉపయోగపడ్డాయి. – గోక గంగారెడ్డి, డొంకేశ్వర్ జిల్లాలో ఇప్పటి వరకు సాగైన ప్రధాన పంటలు (ఎకరాల్లో..) -
రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు
డిచ్పల్లి/ఇందల్వాయి/జక్రాన్పల్లి: నిజామాబాద్ డివిజన్ పరిధిలోని 44వ నెంబరు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసు కుంటున్నట్లు ఏసీపీ రాజా వెంకట్రెడ్డి తెలిపారు. డిచ్పల్లి మండలం సుద్దపల్లి శివారులోని క్రిస్టియన్ మెడికల్ కాలేజీ(సీఎంసీ), ఇందల్వాయి, జక్రాన్ప ల్లి పరిధిలోని జాతీయ రహదారిపై బ్లాక్ స్పాట్లను ఆదివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ డివిజన్ పరిధిలోని 35 కిలోమీటర్ల రహదారిపై గత మూడేళ్లలో 30 ప్రాంతాల్లో అధికంగా ప్రమాదాలు జరుగుతున్నట్లు గుర్తించామన్నా రు. హైవే అథారిటీ, ఇందల్వాయి అతాంగ్ టోల్ప్లా జా ఆధ్వర్యంలో ఇందల్వాయి, డిచ్పల్లి, జక్రాన్పల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇప్పటికే కొన్ని చోట్ల రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఆయా ప్రదేశాల్లో సర్వీసు రోడ్లు, వంతెనల నిర్మాణం చేపట్టారని చెప్పారు. సీఎంసీ వద్ద వంతెన నిర్మాణం కోసం నిధులు మంజూరయ్యాయని, నిర్మాణ పనులు పూర్తికావడానికి కొద్ది నెలల సమ యం పడుతుందన్నారు. ఆయన వెంట డిచ్పల్లి సీఐ వినోద్, ఇందల్వాయి ఎస్పై సందీప్, డిచ్పల్లి, ఇందల్వాయి, జక్రాన్పల్లి పోలీసు సిబ్బంది, హైవే అథారిటీ, టోల్ప్లాజా సిబ్బంది ఉన్నారు. హైవేపై బ్లాక్ స్పాట్లను పరిశీలించిన ఏసీపీ రాజావెంకట్రెడ్డి -
నత్తనడకన అమృత్ 2.0
● యూజీడీ, తాగునీటి కోసం రూ. 379 కోట్లు మంజూరు ● 18 వాటర్ ట్యాంక్ల్లో నాలుగింటి పనులే ప్రారంభం ● నెమ్మదిగా సాగుతున్న అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ పనులు ● పనుల పూర్తికి మరో ఏడాది పట్టే అవకాశం సా...గుతున్న యూజీడీ పనులు అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ వ్యవస్థ ఇందూరువాసుల చిరకాల వాంఛ. ఈ కల కలగానే మిగిలిపోతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్ర భుత్వ హయాంలో మాజీ మంత్రి డీ శ్రీనివాస్ అంకురార్పణ చేసిన యూజీడీ పనులు 20 ఏళ్లు గడిచినా ముందుకు సాగడం లేదు. బీఆర్ఎస్ హయాంలో కొంతమేర పెద్ద డ్రెయినేజీ మా ర్గాలు తవ్వి, పైపులైన్లు వేసి వదిలేశారు. ప్రస్తు తం మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో అమృత్ 2.0 పథకం ద్వారా యూజీడీ పనులు కొనసాగిస్తున్నారు. కాలనీల్లోంచి పైపులైన్లు, వాటికి కనెక్షన్లు ఇవ్వడం వంటి పనులు సాగుతున్నాయి. నగరంలో 145 కిలోమీటర్ల మేర పైప్లైన్ పనులు జరగనున్నాయి. పనులు 2026 ఆగస్టు వరకు కొనసాగనున్నట్లు అధికారులు చెప్తున్నారు. నిజామాబాద్ సిటీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అమృత్ 2.0 (అటల్ మిషన్ ఫర్ రిజువెనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్) పథకం జిల్లాలో నత్తనడకన సాగుతోంది. పట్టణాల్లో ప్రజలు తాగునీరు, డ్రెయినేజీ వ్యవస్థను మెరుగుపర్చేందుకు కేంద్రం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకానికి నిజామాబాద్ నగరాన్ని ఎంపిక చేసి రూ.379 కోట్ల నిధులను కేంద్రం మంజూరు చేసింది. వీటిలో యూజీడీ(అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ)కి రూ. 162 కోట్లు, తాగునీటి వ్యవస్థకు రూ. 217 కోట్లు కేటాయించింది. అమృత్ 2.0 పనులు అప్పటి జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు చేతుల మీదుగా జనవరి నెలలో పైలాన్ను ఆవిష్కరించారు. కాంట్రాక్ట్ దక్కించుకున్న మెగా కంపెనీ పనులు ప్రారంభించారు. పబ్లిక్ హెల్త్ విభాగం పర్యవేక్షణలో పనులు కొనసాగుతున్నాయి. అమృత్ 2.0 పనులు పూర్తిచేసిన తర్వాత మున్సిపల్ కార్పొరేషన్కు అప్పగించనున్నట్లు అధికారులు తెలిపారు. పిల్లర్ల దశలోనే.. నగరంలో తాగునీటి సరఫరా కోసం 5 లక్షల లీటర్ల కెపాసిటీతో 18 పెద్ద వాటర్ ట్యాంక్లు నిర్మించేందుకు అధికారులు ప్రణాళికలు వేశారు. కాలూరు, ఖానాపూర్, సారంగాపూర్, గూపన్పల్లి, ముబారక్నగర్, పాంగ్రా వంటి విలీన గ్రామాలతోపాటు నగరంలోని నాందేవ్వాడ, అర్సపల్లి, మాలపల్లి వంటి ప్రాంతాలను గుర్తించారు. ఇందులో 4 వాటర్ ట్యాంక్లు నిర్మించేందుకు స్థలాలను ఎంపిక చేశారు. నాలుగు నెలల క్రితం కాలూరు, ఖానాపూర్, నాందేవ్వాడలలో పనులు ప్రారంభించి, పునాదులు వేసి వదిలేశారు. గూపన్పల్లిలో ఎంపిక చేసిన స్థలాన్ని మార్చారు. మళ్లీ కొత్త ప్రదేశాన్ని ఎంపిక చేయలేదు. నాందేవ్వాడలోని పాత వాటర్ ట్యాంక్ను కూల్చి ఆ స్థలంలో కొత్త వాటర్ ట్యాంక్ నిర్మిస్తున్నారు. ఇది కూడా పిల్లర్ల దశలోనే ఉంది. మిగతా వాటి పనులు ఇంకా ప్రారంభించలేదు. కార్పొరేషన్ కహానీ – 5 -
ఊరి దేవుళ్లు!
నిజామాబాద్కష్టాలు తొలగించే సత్తాచాటిన డొంకేశ్వర్.. బాసర ట్రిపుల్ ఐటీ ఎంపికల్లో డొంకేశ్వర్ మండల విద్యార్థులు సత్తా చాటారు. 42 మంది ట్రిపుల్ ఐటీకి ఎంపికయ్యారు.ఆదివారం శ్రీ 6 శ్రీ జూలై శ్రీ 2025– 8లో uడొంకేశ్వర్(ఆర్మూర్): ఆరుద్రతో ఆషాఢమాసం మొదలైంది. ఈ మాసంలో గ్రామ దేవతలను భక్తి శ్రద్ధలతో పూజిస్తే గ్రామానికి, ప్రజలకు ఎలాంటి కష్టాలు రాకుండా సుఖశాంతులు లభిస్తాయని పల్లె ప్రజల నమ్మకం. తరతరాలుగా ఈ ఆచారాన్ని పాటిస్తున్నారు. వర్షాల కోసం గంగనీళ్లకు వెళ్లడం.. తెచ్చిన ఆ నీటితో ఊరి దేవుళ్లను శుద్ధి చేయడం అనాదిగా వస్తోంది. పస్కరాజులతో మొదలుపెట్టి తొలి ఏకాదశి వనభోజనాలు పూర్తయ్యే వరకు వారానికో క్రతువును నిర్వహించే బాధ్యతలను ప్రతి ఊరిలో ఆ ఊరి పెద్ద మనుషులే చూడడం ఆనవాయితీ. ప్రజలు జూలై నెలాఖరు వరకు గ్రామ దేవతలకు బోనాలు, నైవేద్యాలు సమర్పిస్తూ ఘనంగా పూజలు చేస్తారు. కొబ్బరికాయలు కొట్టి కోళ్లు, మేకలు కోసి మొక్కులు తీర్చుకుంటారు. రైతు లు ఊరి దేవతలను మొక్కిన తర్వాతనే పంటలేస్తారు. వల గొడుగుతో డప్పుచప్పుల్ల మధ్య గంగనీళ్లకు వెళ్తున్న గ్రామస్తులున్యూస్రీల్ ఆషాఢ మాసంలో గ్రామ దేవతలకు బోనాలు, నైవేద్యాల నివేదన నియమనిష్టలతో గంగనీళ్లతో విగ్రహాల శుద్ధి నాలుగు వారాల పాటు కొనసాగనున్న కార్యక్రమాలు పల్లెల్లో మొదలైన పండుగ వాతావరణం -
అట్రాసిటీ కేసులను సత్వరమే పరిష్కరించాలి
నిజామాబాద్అర్బన్: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని రాష్ట్ర ఎస్సీ, ఎ స్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య పేర్కొన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో శనివారం ఆయన కలెక్టర్ టీ వినయ్ కృష్ణారెడ్డి, సీపీ సాయి చైతన్యలతో కలిసి అట్రాసిటీ కేసులలో పురోగతి, ఎస్సీ, ఎస్టీలు ఎదుర్కొంటున్న సమస్యలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్, వివిధ శాఖల ద్వారా వెచ్చిస్తున్న నిధుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయా సమస్యలపై బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం చైర్మన్ మాట్లా డుతూ ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు పక్కదారి పెట్టకుండా చూడాలన్నారు. నిధులు దుర్వినియోగం అయితే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలి పారు. దీర్ఘకాలికంగా పేరుకుపోయిన ఎస్సీ, ఎస్టీ భూముల సమస్యలను పరిష్కరించాలని సూచించారు. గ్రామాల్లో ప్రతి నెల చివరి శనివారం పౌర హక్కుల దినాన్ని నిర్వహించాలని, కార్యక్రమంలో తహసీల్దార్, పోలీస్ అధికారి తప్పనిసరిగా హాజరయ్యేలా ప్రత్యేక శ్రద్ధ చూపాలని అన్నారు. మూడు నెలలకోసారి డీవీఎంసీ సమావేశాలు నిర్వహించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీలకు సరైన న్యాయం జరిగేలా అంకిత భావంతో పనిచేయాలన్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా ఇందిరమ్మ ఇళ్లు, స్వయం ఉపాధి కార్యక్రమాలలో కూడా వాటాలకు అనుగుణంగా ఎస్సీ, ఎస్టీలకు లబ్ధి చేకూరేలా చూ డాలన్నారు. పదోన్నతుల్లో సరైన న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని చైర్మన్ సూచించారు. ఎస్సీ, ఎస్టీలను వేధింపులకు గురిచేసే వారిపై కమిషన్ కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు. అంతకుముందు కలెక్టరేట్కు చేరుకున్న కమిషన్ చైర్మన్ వెంకటయ్యను కలెక్టర్ టీ వినయ్ కృష్ణారెడ్డి, సీపీ సాయి చైతన్య పూల మొక్కలు అందించి స్వాగతం పలికా రు. కమిషన్ చైర్మన్, జిల్లా అధికారులు బీఆర్ అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సమీక్షలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులు నీలాదేవి, జిల్లా శంకర్, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, ట్రెయినీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావీ, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అభివృద్ధి అధికారిణి రజిత, వివిధ శాఖల అధికారులు, కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య సబ్ప్లాన్ నిధులు వాటా మేరకు వెచ్చించాలి -
ప్రభుత్వ కళాశాలలకు రూ.3.23 కోట్లు
జూనియర్ కళాశాల మంజూరైన నిధులు (రూ) నిజామాబాద్(బాలికలు) 30,00,000 నిజామాబాద్(బాలుర) 56,00,000 డిచ్పల్లి 14,00,000 మాక్లూర్ 10,00,000 మోర్తాడ్ 26,35,000 వర్ని 20,50,000 బోధన్ మధుమలాంచ 10,70,000 ఆర్మూర్ (బాలికలు) 16,00,000 ఆర్మూర్ (బాలుర) 24,00,000 భీమ్గల్ 18,00,000 ఐలాపూర్ 9,00,000 బాల్కొండ 33,05,000 ధర్పల్లి 25,00,000 కోటగిరి 30,50,000● మరమ్మతులు, కనీస వసతుల కల్పనకు మంజూరు ● ఉత్తర్వులు జారీ చేసిన ఇంటర్ బోర్డు కమిషనర్ కృష్ణ ఆదిత్యనిజామాబాద్అర్బన్: ప్రభుత్వ కళాశాలల మరమ్మతులు, కనీస వసతుల కల్పనకు రూ. 3.23 కోట్లు మంజూరైనట్లు జిల్లా ఇంటర్ విద్యాధికారి రవికుమార్ వెల్లడించారు. జిల్లాలోని 14 ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు ఈ నిధులను రాష్ట్ర ఇంటర్ బోర్డు కమిషనర్ కృష్ణ ఆదిత్య మంజూరు చేశారన్నారు. ఇంటర్ విద్య బలోపేతం కోసం కళాశాలలో విద్యార్థులకు తాగునీటి వసతి, మరుగుదొడ్ల నిర్వహణ, కళాశాలలకు సున్నం వేయడం, కరెంటు రిపేర్లు, ఫర్నిచర్ తదితర వాటికి ఈ నిధులను వెచ్చించనున్నారు. -
ధాన్యం సేకరణలో మనమే ఫస్ట్
మోపాల్(నిజామాబాద్రూరల్): జిల్లాలో ధాన్యం సేకరణ ప్రక్రియ ముగిసింది. ఒకవైపు నాట్లు వేస్తుండగా, మరోవైపు కొనుగోలు కేంద్రాలు కొనసాగాయి. ఈ సీజన్లో లక్ష్యానికి మించి 8.40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు. ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్రంలోనే నిజామాబాద్ జిల్లా మొదటిస్థానంలో నిలిచింది. రూ.1949 కోట్ల విలువైన ధాన్యం జిల్లావ్యాప్తంగా 606 కొనుగోలు కేంద్రాల ద్వారా 1,15,996 మంది రైతుల నుంచి 8,40,144 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు. రూ.1949.09 కోట్ల విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేశారు. అందులో 7,38,662 మెట్రిక్ టన్నులు సన్నరకం కాగా, 1,01, 481 మెట్రిక్ టన్నులు దొడ్డు రకాలు ఉన్నాయి. రూ.1948 కోట్ల ధాన్యం డబ్బులను 1,15,945 రై తుల ఖాతాల్లో జమచేశారు. గత వానాకాలం సీజన్లో 4,19,597 మెట్రిక్ టన్నులు కాగా, గతేడాది యాసంగి సీజన్లో 4,28,214 మెట్రిక్ టన్నులు సేకరించారు. రాష్ట్రంలోనే జిల్లాలో అత్యధికంగా ధా న్యం కొనుగోలు చేసి మొదటిస్థానంలో నిలిచినట్లు అధికారులు పేర్కొంటున్నారు. తర్వాతి స్థానాల్లో న ల్గొండ, సూర్యాపేట్, కామారెడ్డి జిల్లాలు ఉన్నాయి. బోనస్ ప్రభావంతోనే.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సన్నరకాలను ప్రోత్సహించేందుకు క్వింటాలుకు రూ.500 బోనస్ ప్రకటించింది. వానాకాలంలో సన్నవడ్లు పండించి న రైతులకు బోనస్ డబ్బులు జమచేశారు. యాసంగిలోనూ బోనస్ ఇస్తామని ప్రకటించడంతో సన్నరకాల సాగు పెరగడమే కాకుండా, బయట వ్యాపారులకు విక్రయించలేదు. అధికారుల ఉరుకులు.. పరుగులు జిల్లాలో ధాన్యం సేకరణ ప్రక్రియ పూర్తయ్యే వరకూ అధికార యంత్రాంగం ఉరుకులు.. పరుగులు పెట్టింది. మొదట్లో ధాన్యం సేకరణ సాఫీగా సాగినా.. మిల్లర్లకు సామర్థ్యానికి మంచి కేటాయింపులు, నిండుకున్న గోదాములు, మరోవైపు వర్షం, తరుగు, ధాన్యం రవాణా సమస్యలతో అధికారులు ఉక్కిరిబిక్కిరయ్యారు. ప్రధానంగా తడిసిన ధాన్యం సేకరణతో తలలు పట్టుకున్నారు. రెండు నెలలకుపైగా కొనుగోళ్లు చేపట్టడం అధికారులకు తలకుమించిన భారంగా మారింది. మరోవైపు తరు గు పేరుతో మిల్లర్లు విపరీతంగా దోచుకున్నారనే ఆరోపణలున్నాయి. జిల్లాలో 8.40 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలు బోనస్ ప్రకటనతో దండిగా వడ్లు 2 నెలలకుపైగా సాగిన కొనుగోళ్లు సాఫీగా ముగిసిన కొనుగోళ్లు జిల్లాలో రికార్డుస్థాయిలో ధా న్యం కొనుగోలు చేశాం. సేక రణ ప్రక్రియ సాఫీగానే ము గించాం. 8,40,144 మెట్రిక్ టన్నులు సేకరించడమంటే ఆషామాఫీ కాదు. క్షేత్రస్థాయిలో నెలకొన్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించుకుంటూ పూర్తిచేశాం. – శ్రీకాంత్రెడ్డి, మేనేజర్, పౌరసరఫరాల సంస్థ -
లోక కల్యాణార్థమే జగన్నాథ రథయాత్ర
నిజామాబాద్ రూరల్: ఇందూరు నగరంలో లోకకల్యాణం కోసం జగన్నాథ రథయాత్ర కొనసాగిస్తున్న ట్లు ఇస్కాన్ అంతర్జాతీయ బోధకుడు శ్రీమాన్ ప్రణ వానంద దాస్ ప్రభూజీ అన్నారు. జిల్లా కేంద్రంలో శుక్రవారం ఇస్కాన్ కంఠేశ్వర్ ఆధ్వర్యంలో జగన్నాథ రథయాత్ర అంగరంగ వైభవంగా నిర్వహించారు. ర థంపై బలదేవ్, సుభద్రమయి, జగన్నాథుడి విగ్రహాల ను ఏర్పాటు చేసి, ఊరేగింపు నిర్వహించారు. ఈసందర్భంగా శ్రీమాన్ ప్రణవానంద దాస్ ప్రభుజీ మాట్లాడుతూ.. ఇస్కాన్ చేపడుతున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలు అంతర్జాతీయంగా విజయవంతగా కొనసాగుతున్నాయన్నారు. కార్యక్రమానికి సీపీ సాయి చైతన్య హాజరై స్వామివార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రథయాత్ర ప్రశాంతమైన వాతవరణంలో జరుపుకోవాలని సీపీ పేర్కొన్నారు. రథయాత్రలో భక్తులు శ్రీకృష్ణుని నామస్మరణ చేయగా, నగ రం ఆధ్యాత్మిక శోభ సంతరించరించుకుంది. మహిళలు రోడ్లపై వేసిన వివిధ రకాల రంగవల్లులు ఆకట్టుకున్నాయి. ఇస్కాన్ కంఠేశ్వర్ కేంద్రం అధ్యక్షుడు రామనంద ప్రభురాయ్ దాస్, ఆర్ఎస్ఎస్ విభాగ్ ప్రచారక్ వెంకట శివకుమార్, అసిస్టెంట్ కమిషనర్ రాజా వెంకటరెడ్డి, మాదాసు స్వామి, అర్బన్ మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఇందూరులో ఇస్కాన్ ఆలయం నిర్మిస్తాం ● ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఇందూరులో ఇస్కాన్ ఆలయం నిర్మిస్తామని, హిందువులు సహకరించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. రథయాత్ర అనంతరం వినాయక్నగర్లోని విజయలక్ష్మీగార్డెన్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. హిందూ ధర్మాన్ని పరిరక్షించడానికి జిల్లా వాసులందరూ సంఘటితం కావాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం 56 రకాల చప్పన్భోగ్ నైవేద్యాలను స్వామివార్లకు సమర్పించారు. ఇస్కాన్ బోధకుడు శ్రీమాన్ ప్రణవానంద దాస్ ప్రభూజీ నగరంలో వైభవంగా రథోత్సవం -
మీనాక్షి నటరాజన్ను కలిసిన పీసీసీ చీఫ్
నిజామాబాద్ సిటీ: కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ను శుక్రవారం పీసీసీ చీఫ్ మహేష్ కుమార్గౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్లో జరుగుతున్న కాంగ్రెస్ సమ్మేళనం ఏర్పాట్లను ఆయన వారికి వివరించారు. పీసీసీ చీఫ్తోపాటు పీసీసీ డెలిగేట్ బాడ్సి శేఖర్ గౌడ్, గడ్కోల్ భాస్కర్ రెడ్డి ఉన్నారు. అలాగే జిల్లాలో నిర్వహిస్తున్న కార్యక్రమాలను వారు మీనాక్షి నటరాజన్కు వివరించారు.50వేల యూనిట్ల రక్తాన్ని సేకరిస్తాంనిజామాబాద్నాగారం: దేశవ్యాప్తంగా రక్తదాన శిబిరాలను నిర్వహించి 50 వేల యూనిట్ల రక్తాన్ని సేకరించి తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం అందజేస్తామని ఐవీఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు అన్నారు. నగరంలోని ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంకులో శుక్రవారం ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ (ఐవీఎఫ్) 12వ వార్షికోత్సవం సందర్భంగా రక్తదానం నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు ముస్తాల సాయికృష్ణ ఆధ్వర్యంలో పలువురు రక్తదానం చేయగా వారికి ప్రశంసా పత్రాలను అందజేశారు. రెడ్క్రాస్ చైర్మన్ బుస్స ఆంజనేయులు, ప్రతినిధులు తోట రాజశేఖర్, రామకృష్ణ, ప్రణీష్, నర్సయ్య ఉన్నారు. -
అత్తను హత్యచేసిన అల్లుడి అరెస్టు
పిట్లం(జుక్కల్): మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో అత్తను హత్య చేసిన అల్లుడిని అరెస్టు చేసి, రిమాండుకు తరలించినట్లు బాన్సువాడ సీఐ రాజేష్ తెలిపారు. బాన్సువాడ రూరల్ సీఐ కార్యాలయంలో శుక్రవారం ఆయన వివరాలు వెల్లడించారు. బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన జిన్నా లక్ష్మీ (50) మూడేళ్ల క్రితం అల్లుడైన జిన్న బాగరాజుకు రూ.లక్ష అప్పుగా ఇచ్చింది. డబ్బులు ఇవ్వమని అల్లుడిని ఎన్నిసార్లు అడిగిన ఇవ్వలేడు. ఇటీవల బాగరాజు తను పండించిన జొన్నలను విక్రయించగా వచ్చిన డబ్బులను అత్త అకౌంట్లో వేయించాడు. ఆ డబ్బుల కోసం అతడు అత్తను అడిగాడు. తనకు ఇవ్వాల్సిన బాకీ కింద ఆ డబ్బులు జమచేసుకుంటానని అత్త అతడికి తెలిపింది. దీంతో పగ పెంచుకున్న బాగరాజు తన అత్తను చంపాలని పథకం పన్ని గురువారం మధ్యాహ్నం ఆమైపె కత్తితో దాడి చేసి హత్య చేశాడు. ఈ ఘటనపై మృతురాలి కుమారుడు రాజు పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటన జరిగిన రోజే నిందితుడు తన బైక్పై హత్యకు ఉపయోగించిన కమ్మ కత్తితో పోలీస్ స్టేషన్కు వచ్చి లొంగిపోయాడు. నిందితుడిని జ్యుడీషియల్ రిమాండ్కు పంపించినట్లు పోలీసులు తెలిపారు. -
మల్కాపూర్లో ఉద్రిక్తత
● అక్రమ ఇంటి నిర్మాణాన్ని తొలగించిన అధికారులు ● ఆత్మహత్యకు యత్నించిన కుటుంబీకులుఎల్లారెడ్డి: మండలంలోని మల్కాపూర్ గ్రామంలో ఇంటి నిర్మాణం కూల్చివేతతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన పెద్దెడ్ల నర్సింలు (బీజేపీ మండల అధ్యక్షుడు) ప్రభుత్వ స్థలంలో రెండు గజాల, ఆరు అంగులాల స్థలం ఆక్రమించి ఇంటి నిర్మాణం చేపట్టినట్లు ఇటీవల ఉన్నతాధికారులకు ఫిర్యాదు వచ్చింది. దీంతో సదరు ఇంటి యజమానికి నిర్మాణం నిలిపివేయాలని పలుమార్లు నోటీసులు ఇచ్చారు. అయినా ఇంటి నిర్మాణం చేపట్టడంతో డీఎల్పీవో సురేందర్ శుక్రవారం పోలీసు బందోబస్తు మధ్య అక్రమ నిర్మాణాన్ని కూల్చివేయించారు. అంతకుముందు కూల్చివేతకు వచ్చిన అధికారులను ఇంటి కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. కుటుంబసభ్యులు అశోక్, రాకేష్, కృష్ణలు ఒంటిపై పెట్రోలు పోసుకోవడంతో పోలీసులు స్పందించి వారిపై నీరు పోసి, ఎల్లారెడ్డి పోలీస్స్టేషన్కు తరలించారు. గ్రామంలోకి ఎవరు రాకుండా డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐ రవీందర్నాయక్, ఎస్సై మహేష్లు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. బాధితుడు నర్సింలు మాట్లాడుతూ.. రాజకీయ కక్షతోనే ఇంటి నిర్మాణం కూల్చివేయించారని ఆరోపించారు. తాను ఎలాంటి అక్రమ నిర్మాణం చేయలేదని తన సొంత స్థలంలోనే నిర్మించుకున్నట్లు తెలిపారు. -
ఇళ్లపై పడకూడదంటే..
ఖలీల్వాడి: మండుటెండల వేడిమి చల్లారక ముందే నైరుతి రుతుపవనాలు వచ్చేశాయి. వర్షాకాలంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. ఈ పిడుగులతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పిడుగుల కారణంగా ప్రతి యేటా వందలాది మంది చనిపోతున్నారు. ఇటీవల ఆదిలాబాద్ జిల్లాలో పిడుగులు పడటంతో ఆరుగురు మృత్యువాతపడ్డారు. ఈనేపథ్యంలో వర్షాకాలంలో పిడుగుల పట్ల తగిన జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదం నివారించే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. పిడుగులు ఏర్పడేది ఇలా.. పిడుగు అనేది ఆకాశంలో ఏర్పడే విద్యుత్ ఉత్సర్గం. సాధారణంగా మేఘాల మధ్య సంభవిస్తుంది. అధిక ఉష్ణోగ్రతల కారణంగా నీరు ఆవిరై మేఘాలు ఏర్పడినప్పుడు, వాటిలో ధనావేశిత, రుణావేశిత కణాలు ఏర్పాడుతాయి. ఈ కణాలు ఒకదానితో ఒకటి ఆకర్షించబడుతాయి. ఇలా ఆకర్షణ జరిగినప్పుడు విద్యుత్ ప్రవాహం ఏర్పడి, మెరుపు, ఉరుములతో కూడిన పిడుగు భూమిని తాకుతుంది. పిడుగు పడిన వద్ద వేల డిగ్రీల వేడి ఉండటంతో ప్రమాదాలు సంభవిస్తాయి. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ● ఉరుములతో కూడిన వర్షం పడుతున్నప్పుడు పిడుగు పడితే ఆరుబయట ఉన్నప్పుడు భూమిపై కూర్చుండాలి. పిడుగు పడే సమయంలో ఎక్కువ శబ్దం వస్తుంది. కావున ఆ సమయంలో చెవులు మూసుకోవాలి. ● రైతులు వర్షాలు పడేసమయంలో బోరుబావుల వద్దకు, మోటర్లు వద్దకు వెళతారు. అలాంటి సమయంలో సురక్షిత ప్రాంతానికి వెళ్లాలి. సెల్ఫోన్లు వాడకూడదు. ● ఉరుములు, మెరుపులతో వర్షం పడినప్పుడు ఇంటి పైకప్పుపైన గాని, బయట ఉండకూడదు. వ్యవసాయక్షేత్రాలు, బయట పనిచేయడం, పశువులను మేపడం, చేపలు పట్టడం చేయరాదు. చెరువులు, కుంటలకు దూరంగా ఉండాలి. ● టవర్లు, చెట్లు, కరెంట్ స్తంభాలు, ఎత్తైన ప్రాంతాలకు వెళ్లకుండా దూరంగా ఉండాలి. ఎత్తైన ప్రదేశాలు పిడుగులను ఆకర్షిస్తాయి. వర్షం పడుతున్నప్పుడు సమీపంలో ఉండే ఇంటిలోకి వెళ్లాలి. ● ట్రాన్స్ఫార్మర్స్, విద్యుత్ సబ్స్టేషన్లకు దూరంగా ఉండాలి. ఎలక్ట్రికల్ వస్తువులైన కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు, విద్యుత్ వైర్ల వద్ద ఉండవద్దు.ఇళ్లపై పిడుగులు పడితే ఇంట్లోని విద్యుత్ పరికరాలు, సామగ్రి కాలిపోవడంతోపాటు, ఇళ్లు దెబ్బతినే అవకాశం ఉంది. దీంతో ఇళ్లపై పిడుగులు పడకూడదంటే ఇంటికి ‘లైట్నింగ్ అరెస్టర్’ను ఏర్పాటు చేసుకోవాలి. ఎత్తైన భవనాలకు దీనిని ఏర్పాటు చేసుకోవడం వల్ల ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.మేఘాలు వేగంగా రావడంతోనే పిడుగులు.. వర్షాకాలం ప్రారంభంలో మేఘాలు వేగంగా ప్రయాణించడంతో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయి. పిడుగులు పడే సమయంలో వ్యవసాయక్షేత్రాలతోపాటు ఆరుబయట ఉన్నవారు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలి. ఇళ్లు, వ్యాపార సముదాయాల దగ్గర తప్పనిసరిగా ఎర్తింగ్ పెట్టుకోవాలి. పిడుగులపై చిన్న నిర్లక్ష్యం వహించినా ప్రాణాల మీదికి వచ్చే అవకాశం ఉంటుంది. – జి పరమేశ్వర్, జిల్లా అగ్నిమాపకశాఖ అధికారి, నిజామాబాద్ -
మోతాదు మేరకే ఎరువులు వాడాలి
వేల్పూర్: అధికారులు సూచించిన మోతాదు మేరకే ఎరువులు వాడాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారి వీరస్వామి రైతులకు సూచించారు. వేల్పూర్, పచ్చలనడ్కుడ, జాన్కంపేట్, మోతె, పడగల్, లక్కోర గ్రామాల్లోని గిడ్డంగులలో ఉన్న ఎరువుల నిల్వలను, రికార్డులను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టాదారు పాస్బుక్లో ఉన్న సాగు విస్తీర్ణం, పంట దశ ఆధారంగా ఎరువులను ఇవ్వాలని, దానివల్ల యూరియా సరఫరాలో ఇబ్బంది తలెత్తకుండా ఉంటుందన్నారు. మండలంలో దాదాపు 300 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని, రైతులు ఎటువంటి ఆందోళన చెందరాదన్నారు. మోతె గ్రామంలో మొక్కజొన్న పంటను పరిశీలించి ఎరువులు పిచికారి చేస్తున్న రైతులతో మాట్లాడారు. యూరియా అధికంగా వాడడం వల్ల పంటపై పురుగులు, తెగుళ్ల తాకిడి ఎక్కువ అవుతుందన్నారు. ఏవో శృతి, సొసైటి సిబ్బంది ఉన్నారు. -
అనుమతి లేని పాఠశాల సీజ్
బాన్సువాడ: బాన్సువాడ పట్టణంలో గల మార్కెట్ రోడ్డులో శ్రీ చైతన్య పేరుతో నడుస్తున్న పాఠశాలను ఎంఈవో నాగేశ్వరావు సీజ్ చేశారు. శుక్రవారం లంబాడి స్టూడెంట్ ఆర్గనైజేషన్, ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. దీనితో ఎంఈవో పాఠశాల అనుమతి పత్రాలను తనిఖీ చేసి చూడగా ఎటువంటి అనుమతులు లేకపోవడంతో సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఎంఈవో మాట్లాడుతూ.. అనుమతులు లేని పాఠశాలలో విద్యార్థులను చేర్పించవద్దని సూచించారు. నేతలు రాథోడ్ జీవన్, వంశీ నాయక్ ఉన్నారు. అటవీభూములను ఆక్రమిస్తే కఠిన చర్యలునాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): నాగిరెడ్డిపేట పరిధిలోని అటవీ భూములను కబ్జా చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని స్థానిక ఎఫ్ఆర్వో వాసుదేవ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అక్రమంగా అటవీ భూమిలోకి ప్రవేశించి చెట్లను, వాటి కొమ్మలను నరికినా, అటవీ భూమిని చదునుచేసినా, దున్నినా, అడవిలో దారులు ఏర్పాటు చేసినా, అటవీభూముల సరిహద్దులను చెరిపేసినా బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీంతోపాటు అటవీభూముల నుంచి ఇసుక, మొరం, రాళ్లు తరలించినా, వన్యప్రాణులను వేటాడినా కేసులు నమోదు చేస్తామన్నారు. ఉపయోగించిన జేసీబీ, ట్రాక్టర్, లారీ, ఆటో, బైక్ వంటి వాహనాలను సైతం సీజ్ చేస్తామని చెప్పారు. -
ప్రమాదవశాత్తు కంటైనర్ దగ్ధం
సదాశివనగర్(ఎల్లారెడ్డి): మండలంలోని దగ్గి గ్రామ శివారులోగల 44వ జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం ఓ కంటైనర్ ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదానికి గురైంది. నిజామాబాద్ వైపు నుంచి హైదరాబాద్ వైపునకు వెళ్తున్న కంటైనర్ దగ్గి శివారులోకి రాగానే వాహనం నుంచి మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన డ్రైవర్ వాహనాన్ని రోడ్డు పక్కన నిలిపాడు. లారీలో ఉన్న వివిధ రకాల పార్సిళ్లు, కొరియర్ వస్తువులు దగ్ధమయ్యాయి. విషయం తెలుసుకున్న సదాశివనగర్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టారు. ఒకరిపై దాడి– నిందితుల అరెస్టు నిజామాబాద్ రూరల్: రూరల్ పోలీస్స్టేషన్ పరిధిలోని గొల్లగుట్టతండాకు చెందిన షాబాజ్ సలావుద్దీన్ గురువారం మధ్యాహ్నం తన ప్లాట్లలో పెరిగిన కంపచెట్లను జేసీబీతో శుభ్రం చేస్తుండగా తండాకు చెందిన రాము, రామునాయక్, బాదావత్ సంతోష్, అతని కొడుకులు సలావుద్దీన్పై దాడిచేసి గాయపరిచారు. ఈమేరకు బాధితుడు రూరల్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు ఎస్సై తెలిపారు. శుక్రవారం రాము, రామునాయక్లను రిమాండ్కు తరలించినట్లు, మిగిత ఇద్దరిని కూడా త్వరలో రిమాండ్ చేస్తామని ఎస్సై ఆరీఫ్ తెలిపారు. గంజాయి విక్రేతల.. ఖలీల్వాడి: నగర శివారులోని దుబ్బ బైపాస్ రోడ్డులో గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఎకై ్సజ్ ఎన్ఫోర్స్ మెంట్ సీఐ వెంకటేష్ తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఎకై ్సజ్ఎన్ఫోర్స్మెంట్ బృందం శుక్రవారం సాయంత్రం బైపాస్ రోడ్డులో నిఘా ఉంచగా, రెంజల్ మండలం నీలా గ్రామానికి చెందిన పుల్లె లక్ష్మీనర్సింహ గంజాయి విక్రయిస్తుండగా పట్టుకున్నట్లు తెలిపారు. అతని వద్ద నుంచి 250 గ్రాముల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఎస్సై నర్సింహచారీ, హెడ్ కానిస్టేబుళ్లు భూమన్న, రాజన్న, కానిస్టేబుళ్లు భోజన్న, విష్ణు, అవినాష్, సాయి కుమార్, రాంబచ్చన్ ఉన్నారు. ఖలీల్వాడి: నగరంలోని దుబ్బ బైపాస్ రోడ్డు వద్ద గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తలను పట్టుకున్నట్లు మూడో టౌన్ ఎస్సై హరిబాబు శు క్రవారం తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు నిఘా ఉంచగా, జ్ఞానేశ్వర్, షేక్ అయాజ్ అనే ఇద్దరు వ్యక్తులు గంజాయి విక్రయిస్తుండగా పట్టుకున్నట్లు తెలిపారు. వారి నుంచి 60 గ్రాముల గంజాయిని సీజ్ చేసి, వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. డ్రంకెన్డ్రైవ్ కేసులో ఒకరికి జైలుబోధన్: పట్టణంలో ఇటీవల పోలీసులు డ్రంకెన్డ్రైవ్ తనిఖీలు నిర్వహించగా రాకాసీపేటకు చెందిన అర్షద్ మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడ్డాడు. పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి శుక్రవారం బోధన్ కోర్టులో హాజరుపర్చారు. జడ్జి శేషతల్ప సాయి అతడికి రెండు రోజుల జైలు శిక్ష విధించారని టౌన్ సీఐ వెంకట నారాయణ తెలిపారు. చెరువులో పడి ఒకరి మృతి బోధన్: ఎడపల్లి మండలం ధర్మారం గ్రామ శివారులోని సిద్ధ చెరువులో ఓ వ్యక్తి చెరువులో పడి మృతిచెందినట్లు ఎస్సై వంశీకృష్ణారెడ్డి శుక్రవారం తెలిపారు. ధర్మారం గ్రామానికి చెందిన మేకల ప్రశాంత్ అనే వ్యక్తి ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఆయన వెల్లడించారు. -
రామారెడ్డిని రక్షించే అష్ట భైరవులు
మీకు తెలుసా? రామారెడ్డి గ్రామా న్ని పురాతన కాలం నుంచి ఊరు చుట్టూ ఉన్న అష్ట భైరవులు రక్షిస్తుంటారని గ్రామస్తుల ప్రగాడ విశ్వాసం. అష్ట భైరవు లు స్వయంభుగా వెలియగా, కాలక్రమేణ రెండు విగ్రహాలు మాత్రమే పూజలందుకుంటున్నాయి. ● గ్రామంలోని 12ఫీట్ల దిగంబర కాలభైరవుడి విగ్రహానికి ఆలయంతోపాటు నిత్య పూజలందుకుంటుండగా, మరో విగ్రహం కాశిపల్లి కా లభైరవుడిగా పూజలు అందుకుంటున్నాడు. మిగతా విగ్రహాలు కనుమరుగయ్యాయి. ● దేశంలోని కాశీ, కాశ్మీర్, ఉజ్జయిని వంటి ప్రాంతాల్లో అక్కడక్కడ కాలభైరవుడి ఆలయాలు ఉన్నా, ప్రత్యేకంగా ఆలయం ఉన్నది మాత్రం ఇక్కడే. ● స్వామివారికి వైశాఖమాసంలో విశేష కార్యక్రమాలు నిర్వహిస్తారు. ● ప్రతి యేటా కార్తీక బహుళ పంచమి నుంచి నవమి వరకు కాలభైరవుడి జన్మదిన ఉత్సవాలు నిర్వహిస్తారు. ● గతంలో కరువు కాటకాలు వచ్చినప్పుడు గ్రామస్తులందరూ కాలభైరవుడి భయంకర విగ్రహానికి ఆవు పేడ పూసి కానరాకుండా చేయడంతో రెండు మూడు రోజులకే సమస్యలన్నీ పరిష్కారం అయ్యేవి. ● గ్రామాన్ని కాలభైరవుడు రక్షిస్తుండటంతో ప్రజలు భక్తితో పూజలు నిర్వహిస్తూ, అభివృద్ధిలోకి తెచ్చారు. ● స్వామివారికి వామాచార, దక్షిణాచార పద్ధతుల్లో పూజలు నిర్వహిస్తారు. ● ఈ ఆలయం 1978 నుంచి దేవాదాయశాఖ ఆధ్వర్యంలో ఉంది. – రామారెడ్డిసమాచారంఅత్యవసరంలో డయల్ 112 ఖలీల్వాడి: రాష్ట్ర ప్రభుత్వం అత్యవసర సేవలన్నింటి కోసం డయల్ 112ను అమలులోకి తీసుకువచ్చింది. డయల్ 100, 108, 101 స్థానంలో 112 సేవలను రాష్ట్రవ్యాప్తంగా అమలులో ఉంటాయి. హైదరాబాద్లోని ఇంటిగ్రేటెడ్ పోలీస్ కమాండ్ కంట్రోల్ నుంచి ఈ సేవలను ఆపరేట్ చేస్తారు. సెల్ఫోన్ లేదా ఫోన్ నుంచి 112కు కాల్ చేస్తే పోలీస్, ఫైర్ర్, మెడికల్, చిల్డ్రన్, ఉమెన్, రోడ్డు ప్రమాదాలకు సంబంధించి అత్యవసర సేవలను ఈ ఒక్క నంబర్ ద్వారా సంప్రదించవచ్చు. -
శుభకార్యాలు చేసుకునేదెలా?
నవీపేట: ప్రజలకు తక్కువ ధరలో ఫంక్షన్హాల్ సౌకర్యం కల్పించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో మారుమూల గ్రామాలలో టీటీడీ కల్యాణ మండపాలను నిర్మించింది. కానీ మండపాల నిర్వహణను ఏళ్లు గడుస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రస్తుతం అధ్వానంగా మారాయి. కనీస సౌకర్యాలు కల్పించకపోవడంతోపాటు మండపాల పరిసరాలు అపరిశుభ్రంగా మారడంతో ఎవరూ కూడా టీటీడీ కల్యాణ మండపాల్లో శుభకార్యాలు నిర్వహించడం లేదు. ఇదీ పరిస్థితి.. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరంలో రెండు కల్యాణ మండపాలు, నవీపేట, ఆర్మూర్, బాల్కొండ, ధర్పల్లిలో ఒక్కొక్కటి చొప్పున కొన్నేళ్ల క్రితం నిర్మించారు. వీడీసీల ప్రోత్సాహంతో నిరుపేదలకు ఆసరాగా నిలవాలని అన్ని ఏర్పాట్లతో నిర్మించారు. కానీ నిర్మించిన కల్యాణ మండపాలపై పాలకవర్గం చిన్నచూపు చూస్తోంది. ఏళ్ల కిందట నిర్మించిన మండపాలకు మరమ్మతులు కరువవడంతో శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. నవీపేట, బాల్కొండలలోని మండపాల చుట్టూ ఉన్న ప్రహరీలు కూలాయి. ఆర్మూర్, ధర్పల్లిలలో తాగునీటి సమస్య ఉంది. ఆర్మూర్లో పలుమార్లు బోరుబావుల తవ్వకం జరిపిన ఫలించలేదు. తరచూ సమస్యలు రావడంతో జిల్లా కేంద్రంలోని రెండు మండపాలను ప్రయివేట్ వ్యక్తులకు లీజుకు ఇచ్చారు. నవీపేటలోని మండపంలో పార్కింగ్ కోసం ఏర్పాటు చేసిన ఆవరణలో ఇటీవల కురిసిన వర్షపు నీరు నిలిచి చెరువులను తలపింపజేస్తున్నాయి. ఆధునిక సౌకర్యాలతో ప్రయివేట్ వ్యక్తులు ఫంక్షన్హాల్లను నిర్మించడంతో టీటీడీ కల్యాణ మండపాల వినియోగం తగ్గింది. తక్కువ ధరే అయినా సౌకర్యాల లేమి కారణంగా ఔత్సాహికులకు నిరాశ కలిగిస్తుంది. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి టీటీడీ కల్యాణ మండపాలను ఆధునికీరించడంతోపాటు తగిన సౌకర్యాలు కల్పించాలని ప్రజలు కోరుతున్నారు. అధ్వానంగా టీటీడీ కల్యాణ మండపాలు కనీస వసతులు కరువు పట్టించుకోని అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశాం.. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న టీటీడీ కల్యాణ మండపాల బాగోగులపై ఇటీవల సమావేశం జరిగింది. మండపాల్లోని సమస్యలను గుర్తించి ప్రతిపాదనలు పంపించమని ఆదేశించారు. డివిజన్లోని మండపాలలో నెలకొన్న సమస్యలపై ప్రతిపాదనలు సిద్ధం చేశాం. నిధులు మంజూరు కాగానే పనులు ప్రారంభిస్తాం. తాగునీటి సౌకర్యం, ప్రహరీల నిర్మాణం, భవనాల పగుళ్లకు మరమ్మతులు చేపడుతాం. –రాజేష్, నిజామాబాద్ డివిజన్ టీటీడీ కల్యాణ మండపాల ఇన్చార్జి -
బాధ్యతల స్వీకరణ
ఖలీల్వాడి: నిజామాబాద్ ఇన్చార్జి ఎకై ్సజ్ ఎస్హెచ్వోగా సుస్మిత గురువారం బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ పనిచేసిన ఎకై ్సజ్ ఎస్హెచ్వో దిలీప్ ఇటీవల సాలూర చెక్ పోస్టుకు బదిలీ అయ్యారు. నగరంలోని ఓ కల్లుడిపోకు చెందిన రెండు కల్లు దుకాణాలను ఈత వనాలు లేనందున ఎకై ్సజ్ అధికారులు సీజ్ చేశారు. ఈ వ్యవహారంలోనే బదిలీ జరిగినట్లు ఎకై ్సజ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇసుక లారీ పట్టివేత బోధన్: బోధన్ నుంచి నిజామాబాద్ వైపు అక్రమంగా ఇసుక లోడ్తో వెళ్తున్న లారీని గురువారం పట్టుకున్నట్లు ఎడపల్లి ఎస్సై వంశీ కృష్ణారెడ్డి తెలిపారు. లారీ యాజమాని అజీజ్, డ్రైవర్ సిరాజ్ అదుపులోకి తీసుకుని చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు పోలీస్ స్టేషన్కు తరలించినట్లు పేర్కొన్నారు. -
ఇందూరు జిల్లా క్రీడాకారులకు పుట్టినిల్లు
నిజామాబాద్నాగారం: ఇందూరు జిల్లా క్రీడాకారులకు పుట్టినిల్లు అని, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో జిల్లా క్రీడాకారులు రాణిస్తూ తెలంగాణలో ఆదర్శంగా నిలుస్తున్నారని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. తైక్వాండో ఫెడరేషన్ అఫ్ ఇండియా, తెలంగాణ రాష్ట్ర తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ఇటీవల 8వ ఓపెన్ నేషనల్ చాంపియన్షిప్ పోటీలు నిర్వహించారు. పోటీల్లో జిల్లాకు చెందిన 38 మంది క్రీడాకారులు మెడల్స్ సాధించగా గురువారం ఎమ్మెల్యే వారిని మెడల్స్తో సత్కరించి అభినందించారు. అలాగే కోచ్ మనోజ్ను అభినందించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మొట్టమొదటిసారిగా జాతీయస్థాయిలో 24 గోల్డ్ మెడల్స్, 11 సిల్వర్ మెడల్స్, 3 కాంస్య పతకాలు సాధించడం ఇందూరు జిల్లాకే గర్వకారణమన్నారు. క్రీడలతోపాటు విద్యలో కూడా రాణించాలని, అప్పుడే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని క్రీడాకారులకు తెలిపారు. క్రీడాకారులను ప్రోత్సహించేలా వారికి అండగా ఉంటానని, జిల్లాలో ఇండోర్ స్టేడియం నిర్మాణానికి కృషి చేస్తానని హామీనిచ్చారు. కార్యక్రమంలో క్రీడాకారులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
చికిత్స పొందుతూ గుర్తుతెలియని వ్యక్తి మృతి
ఖలీల్వాడి: నగరంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో గుర్తుతెలియని వ్యక్తి చికిత్స పొందుతూ మృతిచెందినట్లు నాలుగో టౌన్ పోలీసులు తెలిపారు. గత నెల 25న నగరంలోని బింగి ఫంక్షన్ హాల్ సమీపంలో ఒక గుర్తు తెలియని వ్యక్తి అనారోగ్యంతో పడిఉండగా, పోలీసులు గుర్తించి చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈక్రమంలో గురువారం అతడు చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడి వయస్సు సుమారు 55 నుంచి 60ఏళ్ల లోపు ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. మృతుడి ఒంటిపై తెలుపు రంగు షర్ట్, లుంగీ ధరించినట్లు పేర్కొన్నారు. మృతుడి వివరాలు ఎవరికై నా తెలిసినచో నాలుగవ టౌన్ పోలీస్ స్టేషన్లో గాని, 87126 59840, 87126 59719ను సంప్రదించాలన్నారు. ట్రాన్స్ఫార్మర్ను ఢీకొన్న లారీ ● డ్రైవర్ మృతి నిజామాబాద్ రూరల్: రూరల్ పోలీస్స్టేషన్ పరిధిలోని కంఠేశ్వర్ బైపాస్ వద్ద రోడ్డు పక్కన ఉన్న ట్రాన్స్ఫార్మర్ను ఓ లారీ ఢీకొనడంతో డ్రైవర్ మృతిచెందాడు. వివరాలు ఇలా.. ఉత్తరప్రదేశ్కు చెందిన పర్వేజ్ఖాన్ (32) ఆదిలాబాద్లోని కేటీపీ ట్రాన్స్పోర్ట్ కంపెనీలో గత ఐదేళ్లుగా లారీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. నగరంలోని కంఠేశ్వర్ బైపాస్లోగల లహరి హోటల్ పక్కన ఓ భవన నిర్మాణం కొనసాగుతుండగా మంగళవారం అతడు లారీలో సిమెంట్ లోడ్ను తీసుకువచ్చాడు. ప్రమాదవశాత్తు సమీపంలోని ట్రాన్స్ఫార్మర్ను లారీ ఢీకొనడంతో డ్రైవర్ పర్వేజ్ఖాన్ మృతిచెందాడు.మృతుడి సన్నిహితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొ ని దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్హెచ్వో ఆరీఫ్ గురువారం తెలిపారు. -
మృత్యువులోనూ వీడని స్నేహం
నిజాంసాగర్: ముగ్గురు స్నేహితులు ఒక బైక్పై కలిసి వెళ్లగా, ఘోర రోడ్డు ప్రమాదంలో మృత్యువాతచెందారు. పెద్దకొడప్గల్ మండలం జగన్నాథ్పల్లి వద్ద గల సంగారెడ్డి–నాందేడ్ 161 జాతీయ రహదారిపై జరిగిన ఘటన వివరాలు ఇలా.. జుక్కల్ మండలం మహమ్మదాబాద్ గ్రామానికి చెందిన పోనుగంటి వెంకటి(22), మంగళి గణేశ్(18), బిచ్కుందకు చెందిన దొడ్లవార్ నవీన్(24) ముగ్గురు స్నేహితులు. గణేశ్ మూడు నెలల కిందట పల్సర్ బైక్ కొనుగోలు చేశాడు. బుధవారం సాయంత్రం వారు ముగ్గురు కలిసి బైక్పై పిట్లంకు వెళ్లారు. రాత్రి వేళ ముగ్గురు స్నేహితులు బైక్పై నాందేడ్–సంగారెడ్డి జాతీయ రహదారిపై ప్రయాణిస్తుండగా.. అప్పటికే రోడ్డు ప్రమాదానికి గురై, నిలిచి ఉన్న కంటెయినర్ను వెనుక నుంచి బలంగా ఢీకొట్టారు. ఈ ఘటనలో ముగ్గురి తలలు పగిలి తీవ్ర రక్తస్రావం జరుగగా, ఇద్దరు ఘటన స్థలంలో మృతిచెందారు. ఒకరు మార్గమధ్యలో మృతి చెందారు. సమాచారం అందుకున్న జాతీయరహదారి సిబ్బంది,పోలీసులు మృతదేహాలను అంబులెన్స్ లో బాన్సువాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. జుక్కల్ మండలం మహమ్మదబాద్ గ్రామానికి చెందిన పొనుగంటి సాయవ్వ–గంగారాం దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. చిన్నకుమారు డైన వెంకటి ఇంటర్ వరకు విద్యను అభ్యసించాడు. తల్లిదండ్రులకు వ్యవసాయ పనుల్లో చేదోడు, వాదో డుగా ఉన్నాడు. అలాగే అదే గ్రామానికి చెందిన మంగళి హన్మండ్లు–లక్ష్మీబాయి దంపతుల పెద్ద కుమారుడు గణేశ్ నిజామాబాద్లో ఇంటర్ చదువుతున్నాడు. బిచ్కుంద పట్టణానికి చెందిన దొడ్లవార్ నాందేవ్–శోభ దంపతుల కుమారుడు నవీన్. వీరు ముగ్గురు స్నేహితులు కాగా, చేతికొచ్చిన కుమారులు రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. రోడ్డు ప్రమాదంలో ముగ్గురు స్నేహితుల మృతి మూడు కుటుంబాల్లో తీరని విషాదం -
క్రీడల్లో నిరంతర సాధనతోనే విజయం సాధ్యం
నిజామాబాద్నాగారం: క్రీడాకారులు ప్రతినిత్యం క్రీడల్లో సాధన చేస్తేనే పోటీల్లో విజయం సాధిస్తారని జిల్లా యువజన క్రీడల అధికారి పవన్కుమార్ అన్నారు. నిజామాబాద్ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నాగారంలోని రాజారం స్టేడియంలో అథ్లెటిక్స్ చాంపియన్షిప్ పోటీలు నిర్వహించగా, గురువారం విజేతలకు బహుమతుల ప్రదాన కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పవన్కుమార్ హాజరై మాట్లాడారు. ప్రతిఒక్కరూ క్రీడలు ఆడడం వల్ల చెడు ఆలవాట్లకు దూరంగా ఉంటారన్నారు. వయస్సుతో సంబంధం లేకుండా ప్రతినిత్యం క్రీడలు ఆడాలన్నారు. అనంతరం విజేతలకు ట్రోఫీలను అందజేశారు. జిల్లా ట్రస్మా చీఫ్ అడ్వైజర్ మామిడాల మోహన్, టీచర్స్ యూనియన్ బీసీ నాయకులు మురళీకృష్ణ, అసోసియేషన్ సభ్యులు మధు, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. విజేతలు వీరే.. బాలుర విభాగంలో.. మొదటి ఓవరాల్ చాంపియన్షిప్ మహాత్మ జ్యోతిబాపూలే మోర్తాడ్ జట్టు కై వసం చేసుకుంది. రెండో చాంపియన్షిప్ క్షత్రియ పాఠశాల పెర్కిట్ అందుకుంది. మూడో చాంపియన్షిప్ సిద్ధార్థ పాఠశాల నందిపేట్ సాధించింది. బాలికల విభాగంలో.. మొదటి చాంపియన్షిప్ కేజీబీవీ సిరికొండ సాధించింది. రెండో చాంపియన్షిప్ విజయ హైస్కూల్ నిజామాబాద్ అందుకుంది. మూడో చాంపియన్షిప్ విద్యా హైస్కూల్ డిచ్పల్లి కై వసం చేసుకుంది. -
ఎకరానికి ఎంత భూమి..
మీకు తెలుసా? బాల్కొండ: వ్యవసాయ భూములను ఎకరాల్లో(బిగాల్లో) రైతులు తెలుపుతుంటారు. ఎకరానికి ఎంత భూమి అనే విషయాన్ని కింద తెలుసుకుందాం.. ● 40 గుంటలకు ఎకరం అవుతుంది. ● రెండు గుంటలకు ఇసా భూమి అవుతుంది ● 20 ఇసాలకు ఎకరం అవుతుంది ● ఎకరానికి 4840 గజాలు అవుతుంది. ● ఎకరానికి 100 సెంట్లు, గుంటకు 2.5 సెంట్లు ● గుంటకు 121 గజాలు ● ఒక సెంట్ భూమికి 48.4 గజాలు ● ఇంటి నిర్మాణాల స్థలాలను ప్లాట్లు అంటారు. ప్లాట్లను గజాల చొప్పున కొనుగోలు చేస్తారు. -
అత్తను హతమార్చిన అల్లుడు
పిట్లం(జుక్కల్): రూ.1లక్ష కోసం అత్తను అల్లుడు హతమార్చిన ఘటన పిట్లం మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా.. బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన లక్ష్మి(43)కి భర్త, కుమారుడు, కూతురు స్వప్న ఉన్నారు. స్వప్నకు అదే గ్రామానికి చెందిన బాగరాజుతో ఏడేళ్ల క్రితం వివాహం అయింది. ఈక్రమంలో లక్ష్మి కొన్ని నెలల క్రితం అల్లుడు అయిన బాగరాజుకు లక్ష రూపాయలను ఇచ్చింది. బాగరాజు ఇటీవల సాగు చేసిన జొన్న పంటను తన పేరుపై కొద్దిగా, అత్త లక్ష్మి పేరున కొద్దిగా విక్రయించాడు. దీంతో ఇద్దరి బ్యాంకు ఖాతాలలో జొన్నలు విక్రయించిన డబ్బులు పడ్డాయి. దీంతో లక్ష్మి అల్లుడికి గతంలో ఇచ్చిన డబ్బులను తిరిగి ఇవ్వమని అడిగింది. ఈ విషయంపై గురువారం ఉదయం ఇద్దరి మధ్య గొడవ జరుగగా, గ్రామస్తులు సర్ది చెప్పారు. అనంతరం లక్ష్మి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం వండటానికి వెళ్లి, మధ్యాహ్నం ఇంటికి బయలుదేరింది. మార్గమధ్యలో ఆమెను బాగరాజు అడ్డగించి కమ్మకత్తితో దాడి చేశాడు. తీవ్ర గాయాలు కావడంతో లక్ష్మి అక్కడిక్కడే మృతి చెందింది. బాగరాజు తన అత్తను చంపేశాను పోలీసులకు లొంగిపోతున్న అని గ్రామ మాజీ సర్పంచ్కు సమాచారం ఇచ్చాడు. వెంటనే మాజీ సర్పంచ్, గ్రామస్తులు ఘటన స్థలానికి చేరుకొని చూడగా ఆమె అప్పటికే మృతి చెందడంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఎలాంటి గొడవలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. బాన్సువాడ డీఎస్పీ విఠల్రెడ్డి ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతురాలి కుమారుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇచ్చిన రూ.లక్ష తిరిగి ఇవ్వాలని అడిగినందుకు ఘాతుకం -
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలి
తెయూ(డిచ్పల్లి): మూడు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయి నిధులను వెంటనే విడుదల చేయాలని పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈమేరకు పీడీఎస్యూ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టగా గురువారం తెలంగాణ యూనివర్సిటీలో పీజీ కళాశాలల తరగతులు బంద్ చేయించారు. అనంతరం డిచ్పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ, ప్రయివేటు డిగ్రీ కళాశాలల తరగతులు బంద్ చేయించి విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా రాజేశ్వర్ మాట్లాడుతూ.. ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయకపోవడంతో విద్యాభ్యాసం పూర్తిచేసుకున్న విద్యార్థులకు ప్రయివేట్ యూజీ, పీజీ, ఇంజినీరింగ్ కళాశాలలు సర్టిఫికెట్స్ ఇవ్వడం లేదన్నారు. దీంతో ఉన్నత చదువులకు, ఉద్యోగాలకు పేద విద్యార్థులు దూరం అవుతున్నారన్నారు. అలాగే యూనివర్సిటీలలో విద్యార్థులకు మెస్ బకాయిలు పూర్తిస్థాయిలో చెల్లించాలని డిమాండ్ చేశారు. నాయకులు ప్రిన్ప్రిన్స్, నిఖిల్, హుస్సేన్, సాయికిరణ్, సాయి, దుర్గాప్రసాద్, కల్యాణ్, విద్యార్థులు పాల్గొన్నారు. పీడీఎస్యూ నాయకుల డిమాండ్ కళాశాలల్లో తరగతుల బహిష్కరణ -
విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న రోడ్డు రోలర్
నస్రుల్లాబాద్: మండలంలో కొద్దిరోజులుగా 765 డి జాతీయ రహదారి పనులు కొనసాగుతున్నాయి. ఈక్రమంలో గురువారం దుర్కి గ్రామ ప్రధాన రహదారిపై రోడ్డు రోలర్తో పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. దీంతో స్తంభం విరిగిపోయింది. విద్యుత్ తీగలు తెగిపడకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. ఒకవేళ విద్యుత్ తీగలు తెగి వాహనంపై పడినా.. లేదా రోడ్డుపై వెళుతున్న వాహనదారులపై పడిన ప్రాణాపాయం జరిగేదని స్థానికులు భయాందోళనకు గురయ్యారు. స్తంభం విరిగినా కూడా తృటిలో పెను ప్రమాదం తప్పిందని పేర్కొన్నారు. సంబంధిత వ్యక్తులు కొత్త స్తంభం వేయించి సరిచేసి ఇస్తానని అధికారులు తెలపడంతో గ్రామానికి ప్రత్యమ్నాయం మార్గం ద్వారా విద్యుత్ సరఫరా చేశారు. స్తంభం విరిగినా వైర్లు తెగకపోవడంతో తప్పిన ప్రమాదం -
రోడ్లు నిర్మించాలి
అధికారులు స్పందించి రో డ్డు లేని ప్రాంతాలలో రోడ్లు నిర్మించాలి. పన్ను వసూలు చేసే మున్సిపల్ అధికారులు రోడ్లు, డ్రెయినేజీ వ్యవస్థను పట్టించుకోవడం లేదు. పరిస్థితిలో మార్పు రావాలి. – పండరి, కోటగల్లి ప్రతి వర్షాకాలంలో ఇబ్బంది ప్రతి వర్షాకాలంలో ఇబ్బందులు పడుతున్నాం. మట్టి రోడ్ల గుండా నడవలేక పోతున్నాం. వాహనాలు వెళ్లలేకపోతున్నాయి. చీకట్లో మరింత ఇబ్బంది పడుతున్నాం. రో డ్లు నిర్మిస్తే ఎంతో బాగుంటుంది. – సంతోష్, ముబారక్నగర్ -
ముహూర్తమెన్నడో..?
తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ మెయి న్ క్యాంపస్లో బాలికల నూతన హాస్టల్ నిర్మాణ పనులకు ముహూర్తం కుదరడం లేదు. నూతన గర్ల్స్ హాస్టల్ నిర్మాణం కోసం రూ.7కోట్ల రూసా నిధులు అందుబాటులో ఉన్నా, నిర్మాణ పనులకు మోక్షం లభించడం లేదు. తెయూ మెయిన్ క్యాంపస్లో బాలురకు రెండు హాస్టల్స్ ఉండగా, బాలికలకు మాత్రం ఒకే హాస్టల్ ఉంది. బాలుర రెండు హాస్టల్స్లో కలిపి 447 మంది ఉండగా, బాలికలకు ఉన్న ఒక్క హాస్టల్లోనే 440 మంది బాలికలు ఉంటున్నారు. దీంతో బాలికలు ఒకే గదిలో 6నుంచి 8మంది ఉండాల్సి రావడంతో బాలికలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 2022లో యూజీసీ ఆదేశం వర్సిటీ క్యాంపస్లో బాలురు, బాలికలకు సరిపడా నూతన హాస్టల్స్ నిర్మించాలని యూజీసీ 2022 నవంబర్లో ఆదేశాలు జారీ చేసింది. రెండున్నరేళ్లు కావొస్తున్నా హాస్టల్ నిర్మాణానికి ఇప్పటికీ అడుగు ముందుకు పడటం లేదు. గత విద్యాసంవత్సరం మేలో తెలంగాణ యూనివర్సిటీకి రూ.8.60 కోట్ల రూసా నిధులు మంజూరయ్యాయి. ఇందులో రూ.7కోట్లు నూతన బాలికల హాస్టల్ నిర్మాణానికి, ఫుట్పాత్ నిర్మాణానికి రూ.కోటి, కంప్యూటర్ సైన్స్ కాలేజీ వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి రూ.60 లక్షలు వెచ్చించాల్సి ఉంది. టెండర్ పూర్తయినప్పటికీ సదరు కాంట్రాక్టర్ టీఎస్ఈడబ్య్లూఐడీసీ (తెలంగాణ స్టేట్ ఎడ్యుకేషన్ ఉమెన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్)తో అగ్రిమెంట్ చేసుకోక పోవడంతో నిర్మాణ పనుల్లో జాప్యం జరుగుతోంది. ఇప్పటికై నా వర్సిటీ వీసీ, ఉన్నతాధికారులు స్పందించి హాస్టల్ నిర్మాణం వెంటనే చేపట్టాలని విద్యార్థినులు కోరుతున్నారు. తెయూలో బాలికల నూతన హాస్టల్ భవనానికి రూ.7 కోట్లు మంజూరు పూర్తయిన టెండర్ ప్రక్రియ ఇప్పటికీ ప్రారంభం కాని పనులు త్వరలో పనులను ప్రారంభించేందుకు కృషి తెయూలో బాలికల నూతన హాస్టల్ భవన నిర్మాణానికి టెండర్ ప్రక్రియ పూర్తయింది. రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీ టీఎస్ఈడబ్ల్యూఐడీసీతో కాంట్రాక్టర్ అగ్రిమెంట్ చేసుకోవాల్సి ఉంది. కానీ అగ్రిమెంట్ కాకపోవడంతో నిర్మాణ పనులు ప్రారంభించడంలో జాప్యం జరుగుతోంది. ఈ విషయమై సదరు కాంట్రాక్టర్తో వీసీ యాదగిరిరావు మాట్లాడారు. వీలైనంత త్వరగా హాస్టల్ నిర్మాణ పనులు ప్రారంభించేందుకు కృషి చేస్తున్నాం. – యాదగిరి, రిజిస్ట్రార్, తెలంగాణ యూనివర్సిటీ -
మళ్లీ సెప్టెంబర్లో..
కొనసాగుతున్న ఏరివేత! జిల్లావ్యాప్తంగా ఆహారభద్రత కార్డుల్లో బోగస్ పేర్ల (చనిపోయిన, ఇతర రాష్ట్రాలకు చెందిన వారు, విదేశాలకు వెళ్లిన వారు) ఏరివేత ప్రక్రియ కొనసాగుతోంది. సుమారు 9వేల మంది ఉన్నట్లు పౌరసరఫరాలశాఖ అధికారులు అంచనా వేశారు. ఈ మేరకు జాబితాను తహసీల్ కార్యాలయాలకు పంపించారు. రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి బోగస్ పేర్లను తొలగించనున్నారు. సుభాష్నగర్: వర్షాకాలం నేపథ్యంలో కేంద్ర ప్రభు త్వ సూచనల మేరకు మూడు నెలలకు సంబంధించి రేషన్ బియ్యం పంపిణీని జూన్లోనే పూర్తిచేశా రు. నెలరోజులపాటు అందుబాటులో ఉండి కా ర్డుదారులందరికీ సన్న బియ్యం పంపిణీ చేయాలని డీలర్లను ఆదేశించారు. ఈ మేరకు డీలర్లు నెలరోజు ల్లో జూన్, జూలై, ఆగస్టు నెలలకు సంబంధించి 96.99శాతం కార్డుదారులకు సుమారు 25,190 మె ట్రిక్ టన్నుల బియ్యాన్ని పంపిణీ చేశారు. మళ్లీ సెప్ట్టె ంబర్లోనే రేషన్ బియ్యం పంపిణీ చేయనున్నారు. మూడు నెలల రేషన్ బియ్యం ఒకేసారి పంపి ణీ చేస్తారని ఓ వైపు ప్రకటించడంతోపాటు ఒక్క నెలలోనే 1,293 కొత్త కార్డులు జారీ చేశారు. 18,399 మంది లబ్ధిదారులు కొత్తగా చేరారు. ప్రస్తుతం కొత్త కార్డులు, పేర్లను నమోదు చేసేందుకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మీసేవ ద్వారా కొనసాగుతోంది. వేల సంఖ్యలో దరఖాస్తులు వస్తు న్నాయి. పేర్లు చేర్పు కోసం 19వేలు, కొత్త కార్డుల కోసం 14,500 వరకు దరఖాస్తులు వచ్చినట్లు అధికార వర్గాల ద్వారా తెలిసింది. నిత్యం వందల సంఖ్యలో జిల్లా పౌరసరఫరాల శాఖ కార్యాలయానికి దరఖాస్తుదారులు తరలివస్తున్నారు. రేషన్ దుకాణాలు 759 ఆహార భద్రత కార్డులు 4,03,510 లబ్ధిదారులు 13,32,864 మూడు నెలల రేషన్ కోటా జూన్లోనే పంపిణీ బియ్యం అందుకున్న 96.99శాతం కార్డుదారులు తహసీల్ కార్యాలయాలకు బోగస్ పేర్ల జాబితా నూతన కార్డులు, పేర్ల నమోదుకు అందుతున్న దరఖాస్తులు సమస్య లేకుండా పంపిణీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సూ చనల మేరకు జిల్లాలోని 759 రేషన్షాపుల ద్వారా రేషన్ పంపిణీ చేపట్టాం. 96.99 శాతం మందికి సన్నబియ్యం పంపిణీ పూర్తయ్యింది. మళ్లీ సెప్టెంబర్లోనే రేషన్ దుకాణాల ద్వారా బియ్యం పంపిణీ చేపడుతాం. కొత్త కార్డులు, పేర్ల నమోదు ప్రక్రియ కొనసాగుతోంది. అర్హులు మీసేవ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. – అరవింద్రెడ్డి, జిల్లా పౌరసరఫరాల శాఖాధికారి25,190 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకు జిల్లాలో 25,190 మెట్రిక్ టన్నుల బియ్యం 759 రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేశారు. ఒక్కొక్కరికి మూడు నెలల బియ్యం 18 కిలోల చొప్పున అందజేశారు. జూన్ నెల మొత్తం రేషన్డీలర్లు దుకాణాలు తెరిచి ఉంచి 96.99శాతం పంపిణీ పూర్తిచేశారు. 3,78,095 మంది కార్డుదారులకు బియ్యం పంపిణీ చేయగా, 25,415 మంది కార్డుదారులు బియ్యం తీసుకోలేదని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. బియ్యం పంపిణీ సమయంలో కార్డుదారులు మూడుసార్లు వేలిముద్రలు వేయాల్సి ఉండగా, జూన్ మొదటివారంలో సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. కేంద్రప్రభుత్వం ఆ సమస్యలను పరిష్కరించడంతో పంపిణీ ప్రక్రియ సాఫీగా పూర్తయ్యింది. -
గెట్ అవుట్..!
శుక్రవారం శ్రీ 4 శ్రీ జూలై శ్రీ 2025– 4లో uకాంగ్రెస్ కోవర్టా.. ఆ మాజీ ప్రజాప్రతినిధి నిత్యం కేసీఆర్తో, ఫామ్హౌస్లో ఉంటూనే పార్టీ అంతర్గత విషయాలు, వ్యవహారాలన్నింటినీ ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సన్నిహితుడికి వాట్సాప్ ద్వారా చేరవేసినట్లు కేసీఆర్, కేటీఆర్ తెలుసుకున్నట్లు తెలిసింది. దీంతో కేసీఆర్ అతడిని ఫామ్హౌస్ నుంచి గెట్ అవుట్ అని గద్దించారని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పార్టీ ప్రతి అంతర్గత వ్యవహారాన్ని పూసగుచ్చినట్లు కాంగ్రెస్ నాయకులకు చేరవేశాడని పలువురు కార్యకర్తలు ఆ గ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు నియోజకవర్గంలో, హైదరాబాద్లో విచ్చలవిడిగా భూ ఆక్రమణలు, బెదిరింపులు, దౌర్జన్యాలు చేశాడని, అలాంటి వ్యక్తిని భవిష్యత్లో దరిదాపుల్లోకి రానివ్వొద్దని పలువురు కార్యకర్తలు సోషల్ మీడియాలో పోస్టులు చే స్తున్నారు. నియోజకవర్గంలో సైతం అభివృద్ధి పనుల పేరిట పలువురి వద్ద, అలాగే ఎన్ఆర్ఐల నుంచి అప్పు పేరుతో డబ్బులు తీసుకుని ఎగ్గొట్టినట్లు కథలుకథలుగా బయటకు వస్తున్నాయి. అధికారం ఉన్న సమయంలో అనేకమంది స్థానిక ప్రజాప్రతినిధులను చంపేస్తానని బెదిరించిన సదరు మాజీ.. ఇప్పటికీ తన తీరు మార్చుకోలేదని పలువురు అంటున్నారు. అతడి కారణంగా ఓ సర్పంచ్ దంప తులు జైలుపాలైన విషయాన్ని గుర్తు చేస్తున్నా రు. నియోజకవర్గ ప్రజలు ఎన్నికల్లో ఈడ్చికొట్టిన ఇన్నాళ్లకై నా కేసీఆర్ గెంటేయడం పార్టీకి మేలు చేస్తుందని జిల్లా పార్టీ శ్రేణులు పేర్కొంటున్నాయి. పార్టీని అన్నీతానై నడిపిస్తున్నానని, అధినేత కుటుంబానికి వీరవిధేయుడినని తన వ్యవహార శైలితో సెల్ఫ్డబ్బా కొట్టుకునే జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేను బీఆర్ఎస్ అధినేత ‘గెట్ అవుట్’ అన్నట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అధికారంలో ఉన్న కాలంలో వివాదాలకు కేంద్రంగా ఉన్న ఆయన.. అధికారం దూరమైన తరువాత అంతకు మించి సెంటర్పాయింట్ అయ్యారు. తాజాగా ఆ మాజీ ప్రజాప్రతినిధిని బీఆర్ఎస్ అధినేత దూరంపెట్టినట్లు సమాచారం. ● జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేపై కేసీఆర్ కన్నెర్ర ● ఫామ్హౌస్ నుంచి బయటికి గెంటేసినట్లు ప్రచారం ● పార్టీ అంతర్గత వ్యవహారాలను కాంగ్రెస్కు చేరవేశాడనే ఆరోపణలు ● సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వ్యవహారం సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: కేసీఆర్ కుటుంబానికి వీరవిధేయుడినని తనకుతాను ప్రచారం చేసుకునే ఓ మాజీ ఎమ్మెల్యేను ‘గెట్ అవుట్’ అంటూ బయటకు గెంటేసినట్లు వివిధ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఆ మాజీ.. అధికార పార్టీకి కోవర్టుగా మారి వెలగబెట్టిన వ్యవహారాలపై చర్చించుకుంటూ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలే కాదు కేసీఆర్ సైతం విస్తుపోయినట్లు సమాచారం. కేసీఆర్ చరిష్మాతో వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన సదరు నేత అధికారాన్ని విచ్చలవిడిగా దుర్వినియోగం చేశారని ఇప్పటికే అన్నివర్గాల్లో ఆగ్రహం ఉంది. అయితే సదరు మాజీ ఎమ్మెల్యే వ్యవహారాలు, అతడిని ఫామ్హౌస్ నుంచి గెంటేసిన దానిపై సోషల్ మీడియాలోనూ చర్చ సాగు తోంది. అధికారంలో ఉన్న సమయంలో అడ్డూఅదుపు లేకుండా, రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తూ విచ్చలవిడిగా భూదందాలు, దౌర్జన్యాలకు పాల్పడిన అతడిని నియోజకవర్గ ప్రజలు ఎన్నికల్లో మూడోస్థానానికి పరిమితం చేశారు. ఇప్పటికీ ఆయన నియోజకవర్గంలో పూర్తిస్థాయిలో తిరగలేని పరిస్థితి. అధికారం దూరమైన తరువాత ఏదో వచ్చామని చెప్పుకునేలా వేళ్లమీద లెక్కపెట్టేన్ని సార్లు మాత్రమే నియోజకవర్గానికి రావడం గమనార్హం. అయితే సదరు మాజీ ఎమ్మెల్యే ప్రతిరోజూ కేసీఆర్ కుటుంబంతో, ఫామ్హౌస్లో ఉంటున్నారని అంతా భావించారు. పరిస్థితి మాత్రం ఇందుకు విరుద్ధంగా ఎవరూ ఊహించని రీతిలో ఉండడంతో పార్టీ శ్రేణులు ఆశ్చర్యపోతున్నాయి. పార్టీని గాలికొదిలేసి.. అధికారంలో ఉన్న సమయంలో ఎమ్మెల్యేలుగా అడ్డగోలు వ్యవహారాలు నడిపిన వారు ఓటమి తరువాత పార్టీని గాలికొదిలేశారని బీఆర్ఎస్ శ్రేణులు వాపోతున్నాయి. కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయని గత కొంతకాలంగా కవిత ఆరోపణలు చేస్తున్నారు. ఓ మాజీ ఎమ్మెల్యే సీఎంఆర్ బియ్యం ఇవ్వకుండా తప్పించుకుని తిరుగుతుండగా, మూడో స్థానంతో ఓటమి పాలైన మరో మాజీ నియోజకవర్గానికి తూతూమంత్రంగా వచ్చి వెళ్తున్నాడని కార్యకర్తలు అంటున్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ను, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని కౌంటర్ చేయడంలో మూడో స్థానంతో సరిపెట్టుకుని ఓటమిపాలైన ఆ మాజీ ఎమ్మెల్యే తనకేమీ సంబంధం లేదన్నట్లు వ్యవహరిస్తున్నాడని పార్టీ శ్రేణులు పేర్కొంటున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎత్తిచూపేందుకు కనీసం ప్రెస్మీట్ సైతం పెట్టలేదని దీంతోపాటు అనేక అంశాలను కేసీఆర్ పరిశీలిస్తున్నారని వివిధ వర్గాల్లో చర్చ సాగుతోంది. బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్రెడ్డి మాత్రమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కౌంటర్ చేస్తుండడం ఇందుకు నిదర్శనమని బీఆర్ఎస్ కార్యకర్తలు పేర్కొంటున్నారు. న్యూస్రీల్కవిత ఓటమిలోనూ కీలక పాత్ర..! తాజాగా కేసీఆర్ కన్నెర్రజేసి బయటకు వెళ్లగొట్టిన ఆ మాజీ ఎమ్మెల్యే.. ఎంపీగా కవిత ఓటమిపాలు కావడంలో కీలక పాత్ర పోషించినట్లు నాటి నుంచి చర్చ జరుగుతోంది. కవిత ఓటమి తరువాత హైదరాబాద్, గోవా, దుబాయ్లలో దావత్లు చేసుకున్నట్లు పలువురు కార్యకర్తలు చెబుతున్నారు. కవిత ఓటమిలో జిల్లాకు చెందిన మరికొందరు మాజీ ఎమ్మెల్యేలు ఉండడం గమనార్హం. -
రోత పుట్టిస్తున్న రోడ్లు
● నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలో అధ్వానంగా పరిస్థితులు ● భారీ గుంతలు.. కనిపించని కల్వర్టులు ● నగర ప్రజలకు తప్పని ఇబ్బందులు నిజామాబాద్అర్బన్: నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నివాస గృహాల సంఖ్య వేగంగా పెరుగుతోంది. నలుదిశలా కాలనీలు విస్తరిస్తున్నాయి. ఇప్పటికే తొమ్మిది గ్రామాలను కార్పొరేషన్ లో విలీనం చేశారు. అయితే ఆయా ప్రాంతాలను కలిపే రోడ్లు మాత్రం రోతపుట్టిస్తున్నాయి. కార్పొరేషన్ పరిధిలో రోడ్ల పరిస్థితి మెరుగుపడడం లేదు. కార్పొరేషన్ పరిధిలో మొత్తం రోడ్లు 914 కిలో మీటర్ల మేర ఉండగా.. ఇందులో ఆర్అండ్బీ రోడ్లు 55 కిలో మీటర్లు, సీసీ రోడ్లు 415 కిలోమీటర్లు, బీటీ రోడ్లు 148 కిలోమీటర్లు, గ్రావిటీ రోడ్లు 296 కిలో మీటర్ల మేర ఉన్నాయి. రోడ్లు లేక ఇబ్బందులు.. 60 డివిజన్ పరిధిలో 4లక్షల 30వేల జనాభా ఉండ గా రోడ్లు మాత్రం అధ్వానంగా ఉన్నాయి. డ్రెయినే జీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో రోడ్లపై మురికి నీ రు నిలుస్తోంది. శివారు ప్రాంతాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. ముబారక్ నగర్, మారుతినగర్, లక్ష్మీప్రియనగర్ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణాలు వేగంగా సాగుతుండగా రోడ్ల వసతి మాత్రం లేదు. ధర్మపురి హిల్స్, నిజాంకాలనీ, వెంగళరావునగర్ కాలనీ, నా గారం, ఆటోనగర్, మాలపల్లి ప్రాంతాల్లో సైతం నేటికీ రోడ్ల వసతి సక్రమంగా లేదు. సీసీ రోడ్లు ఉన్న చాలా ప్రాంతాల్లో లింక్రోడ్లు మట్టివి ఉన్నాయి. వర్షాకాలంలో ప్రజలు తీవ్ర ఇ బ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్లు సరిగా లేక రాత్రి వేళలో వీధి దీపాలు వెలగకపోవడంతో వాహ నదారులు ప్రమాదాలబారినపడుతున్నారు. మాలపల్లి, ధర్మపురి హిల్స్, అర్సపల్లి, చంద్రశేఖర్కాలనీ, గౌతమ్నగర్, దుబ్బ ప్రాంతాల్లో పరిస్థితి అధ్వానంగా మారుతోంది. చంద్రశేఖర్ కాలనీ, వివేకానంద నగర్ కాలనీల్లో ఇప్పటికీ మట్టి రోడ్లే ఉన్నాయి. -
ఆర్మూర్లో జూనియర్ కళాశాల సీజ్
ఆర్మూర్: నిబంధనలకు విరుద్ధంగా పట్టణంలోని మహాలక్ష్మి కాలనీలో ఉన్న ఓ భవనంలో కొనసాగుతున్న క్షత్రియ జూనియర్ కళాశాలను జిల్లా ఇంటర్ విద్యాధికారి (డీఐఈవో) రవికుమార్ గురువారం సీజ్ చేశారు. విద్యార్థులను ఇళ్లకు పంపించి యా జమాన్యానికి నోటీసులు జారీ చేశారు. ఆ భవనంలో కళాశాలను నిర్వహణకు మూడేళ్ల క్రితం ఇంటర్మీడియట్ బోర్డు అనుమతులను నిరాకరించింది. దీంతో క్షత్రియ జూనియర్ కళాశాల యాజమాన్యం ఆర్మూర్ మండలం చేపూర్ శివారులోని క్షత్రియ ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణంలో కళాశాల నిర్వహణకు అనుమతులు తీసుకున్నారు. కానీ నిబంధనలకు విరుద్ధంగా పట్టణంలో ప్రమాదకరంగా ఉన్న భవనంలోనే తరగతులను నిర్వహిస్తూ వస్తున్నారు. సుమారు 500 మంది బాలబాలికలు ఇదే భవనంలోని పై అంతస్తుల్లో హాస్టల్లో ఉంటుండగా, మరో 300 మంది విద్యార్థులు డే స్కాలర్స్గా చదువుకుంటున్నారు. మరో ప్రైవేట్ కళాశాల యజమాని క్షత్రి య జూనియర్ కళాశాలపై అధికారులకు రాత పూ ర్వకంగా ఫిర్యాదు చేయడంతోపాటు విలేకరుల స మావేశం నిర్వహించి నిబంధనలను అతిక్రమించిన తీరును వివరించారు. స్పందించిన అధికారులు కళాశాలను సందర్శించి సీజ్ చేసి దిద్దుబాటు చర్య లు చేపట్టారు. అడ్మిషన్ తీసుకున్న సుమారు 800 మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఏం చేయా లో పాలుపోక అయోమయానికి గురవుతున్నారు. మూడేళ్లకు పైగా నిబంధనలకు విరుద్ధంగా పట్టణంలో జూనియర్ కళాశాలను నిర్వహిస్తున్నా తమకేమీ తెలియదన్నట్లు వ్యవహరించిన అధికారుల తీరుపై పలువురు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. అనుమతులు ఒకచోట.. నిర్వహణ మరోచోట అయోమయంలో 800 మంది విద్యార్థులు -
నేటితో ముగియనున్న వారాహి నవరాత్రులు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: నగరంలోని అమ్మ వెంచర్లో నిర్మిస్తున్న శ్రీ వారాహి మా త ఆలయం వద్ద గత నెల 26వ తేదీ నుంచి నిర్వహిస్తున్న నవరాత్రి ఉత్సవాలు శుక్రవారంతో ముగియనున్నాయి. ఆలయ కమి టీ చైర్మన్ మంచాల జ్ఞానేందర్ గుప్తా ఆధ్వ ర్యంలో ప్రతిరోజూ రాత్రి 7 నుంచి 9 గంటల వరకు అమ్మవారికి శోడశోపచార పూజలు వైభవంగా నిర్వహిస్తున్నారు. ఏటా ఆషాఢ శుద్ధ ప్రతిపద నుంచి ఆషాఢ శుద్ధ నవమి వరకు నవరాత్రి పూజలు నిర్వహించడం సంప్రదాయం. ప్రతిరోజూ పూజా కార్యక్ర మాల అనంతరం అన్నప్రసాద వితరణ కా ర్యక్రమం నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పలుమార్లు పాల్గొన్నారు. రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్కు ఎంపిక నందిపేట్(ఆర్మూర్): నందిపేట మండల కేంద్రానికి చెందిన ఎనిమిదో తరగతి విద్యార్థి ఎస్కే అనాస్ రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్కు ఎంపికయ్యాడు. జిల్లా కేంద్రంలోని నాగారంలో జరిగిన జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో నందిపేట సిద్ధార్థ పాఠశాలకు చెందిన ఎస్కే అనాస్ అండర్–14 విభాగంలోని బ్యాక్ త్రోలో బంగారు, లాంగ్జంప్లో వెండి, 60 మీటర్ల పరుగు పోటీలో వెండి పతకం సాధించాడు. దీంతో అనాస్ను జిల్లా అథ్లెటిక్ సంఘం రాష్ట్రస్థాయికి ఎంపిక చేశారు. పాఠశాల కరస్పాండెంట్ దేవన్న, డైరెక్టర్ వంశీ, పీఈటీ రంజిత్, ఉపాధ్యాయులు అనాస్ను అభినందించారు. జావెలిన్ త్రో పోటీలకు.. మోపాల్(నిజామాబాద్రూరల్): మండలంలోని కంజర్ జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న కుందెన్ సిద్ధాంత్ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై నట్లు హెచ్ఎం గోపాలచారి తెలిపారు. నగరంలోని నాగారం రాజారాం స్టేడియంలో జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో పాఠశాల నుంచి 16 మంది విద్యార్థులు పాల్గొనగా, అండర్–12 జావెలిన్ త్రో బాలుర విభాగంలో సిద్ధాంత్ ఉత్తమ ప్రతిభ కనబర్చి రాష్ట్రస్థాయి ఎంపికయ్యారని పేర్కొన్నారు. ఈ నెల 6న హన్మకొండలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో విద్యార్థి పాల్గొంటాడన్నారు. రాష్ట్రస్థాయికి ఎంపికై న సిద్ధాంత్ను హెచ్ఎం, ఉపాధ్యాయులు గోపాలకృష్ణ, అరుణ శ్రీ, ఎంఎస్ రాణి, కాంతి కిరణ్, ఉమా గౌరి, భూమయ్య, విజయలక్ష్మి అభినందించారు. నలుగురికి ఏడీఏలుగా పదోన్నతి డొంకేశ్వర్(ఆర్మూర్): జిల్లా వ్యవసాయ శాఖ లో పనిచేస్తున్న నలుగురు ఏవోలకు ఏడీఏలుగా పదోన్నతి లభించింది. పదోన్నతితో పాటు పోస్టింగులు ఇస్తూ రాష్ట్ర వ్యవసాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా కార్యా లయంలో టెక్నికల్ విభాగంలో ఉన్న గోపికి మంచిర్యాల, శ్రీనివాస్కు ఆదిలాబాద్, రెంజల్ ఏవో శ్రీనివాస్ రావుకు కుమురం భీం, డిచ్పల్లి ఏవో సుధా మాధురికి ఎల్లారెడ్డి ఏడీఏగా పదోన్నతి పోస్టింగ్లు లభించాయి. పదోన్నతులు పొందిన అధికారులకు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వీరాస్వామితోపా టు సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. ఎస్సారెస్పీలోకి 8,718 క్యూసెక్కుల ఇన్ఫ్లో బాల్కొండ: శ్రీరాంసాగర్ జలాశయంలోకి ఎగువ ప్రాంతాల నుంచి 8,718 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్ట్ నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ప్రాజెక్ట్ నుంచి కాకతీయ కాలువ ద్వారా 100, ఆవిరి రూపంలో 304, మిషన్ భగీరథ ద్వారా 231 క్యూసెక్కుల నీరు పోతుంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091 (80.5 టీఎంసీలు) అడుగులు కాగా గురువారం సాయంత్రానికి 1065.90 (17.5 టీఎంసీలు) అడుగుల నీరు నిల్వ ఉందని అధికారులు పేర్కొన్నారు. -
పసుపు రైతులకు క్షమాపణలు చెప్పాలి
సుభాష్నగర్: పసుపు బోర్డు ఏర్పాటు కావడంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సుదర్శన్రెడ్డి, భూపతిరెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రశాంత్రెడ్డి, ఎమ్మెల్సీ కవిత, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డి అక్కసు వెళ్లగక్కుతున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ పటేల్ కులాచారి విమర్శించారు. పదేళ్లు అధికారంలో ఉండి బీఆర్ఎస్, 18 నెలలుగా కాంగ్రెస్ పసుపు రైతులకు ఏం చేయలేదని, వెంటనే వారికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. నగరంలోని బీజేపీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రశాంత్రెడ్డి వేల్పూర్లో పుట్టి పదేళ్లు అధికారంలో ఉండి కూడా పసుపు రైతులకు ఏం చేయలేదని విమర్శించారు. జీవన్రెడ్డి ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే అర్థం కావడంలేదని, నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. పసుపు రైతులు నామినేషన్ వేసి ఓడించిన విషయాన్ని కవిత మర్చిపోయిందా అని ప్రశ్నించారు. 18 నెలలు గడిచినా సుదర్శన్రెడ్డికి లెటర్ ప్యాడ్ లేదని, మరో ఎమ్మెల్యే భూపతిరెడ్డికి క్యాంపు కార్యాలయం లేదని ఎద్దేవా చేశారు. పసుపు బోర్డుతో ప్రయోజనాలేంటో మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు వివరించారని, పక్కనే ఉన్న భూపతిరెడ్డికి అర్థం కాలేదా అని ప్రశ్నించారు. బోర్డుకు శాశ్వత కార్యాలయం కోసం జెడ్పీ ఆవరణలో 2 ఎకరాల స్థలం కావాలని కలెక్టర్కు లేఖ రాశామన్నారు. పసుపు బోర్డు క్రెడిట్ అర్వింద్కే దక్కుతుందని, విమర్శలు చేసే వారికి ప్రజలే బుద్ధి చెప్తారని హెచ్చరించారు. సమావేశంలో నాయకులు న్యాలం రాజు, నాగోళ్ల లక్ష్మీనారాయణ, మాస్టర్ శంకర్, గంగోనె సంతోష్, అనంత్రెడ్డి, నారాయణ యాదవ్, బద్దం కిషన్, కిశోర్ తదితరులు పాల్గొన్నారు. బోర్డు ఏర్పాటుతో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల అక్కసు బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ పటేల్ కులాచారి -
స్వగ్రామానికి చేరిన మృతదేహం
కమ్మర్పల్లి: ఒమన్ దేశంలో ఆత్మహత్యకు పాల్పడిన కమ్మర్పల్లి మండలం హాసకొత్తూర్ గ్రామానికి చెందిన జుంబరాత్ అన్వేశ్(27) మృతదేహం బుధవారం రాత్రి స్వగ్రామానికి చేరుకుంది. దీంతో కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. 15 రోజుల క్రితం అన్వేశ్ ఆత్మహత్యకు పాల్పడగా, మృతదేహం తీసుకురావడంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో కుటుంబసభ్యులు రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ ఈరవత్రి అనిల్, కాంగ్రెస్ నేత సునీల్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. వారు గల్ఫ్ కన్వీనర్ భీమ్రెడ్డితో మాట్లాడి, రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు తెలిపారు. ఎంబసీ అధికారులతో మాట్లాడి మృతదేహం స్వగ్రామానికి రావడానికి కృషి చేశారు. -
రోడ్డు ప్రమాదంలో మెదక్ జిల్లా వాసి మృతి
భిక్కనూరు: మండల కేంద్రంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మెదక్ జిల్లా అక్కన్నపేటకు చెందిన ఒకరు మృతి చెందినట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. అక్కన్నపేటకు చెందిన కొత్తిన్న లక్ష్మీనారాయణ(54) జంగంపల్లి గ్రామశివారులోని విజయ సాయి ల్యాబొరెటరీలో ఫిట్టర్గా పనిచేస్తూ అదే గ్రామంలో అద్దెకు ఉంటున్నాడు. బుధవారం వ్యక్తిగత పనుల నిమిత్తం అక్కన్నపేట గ్రామానికి బైక్పై ఉదయం వెళ్లి మధ్యాహ్నం తిరిగి జంగంపల్లికి వస్తున్నాడు. భిక్కనూరు చర్చి సమీపంలో జాతీయ రహదారిపై వెనుక నుంచి కంటైనర్ ఢీకొట్టడంతో లక్ష్మీనారాయణకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే కామారెడ్డి ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి భార్య యాదమ్మ ఫిర్యాదు మేరుకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు. -
వేతనం లేక.. ఇంటికి రాలేక..
మోర్తాడ్(బాల్కొండ): ఎన్నో ఆశలతో ఉపాధిని వెతుక్కుంటూ కువైట్కు వెళ్లిన ముగ్గురు వలస కార్మికులు యజమాని వంచనతో నరకయాతన అనుభవిస్తున్నారు. భీమ్గల్ మండలం బడాభీమ్గల్కు చెందిన నరేశ్, పవన్, కరీంనగర్ జిల్లా గన్నేరువరానికి చెందిన కోంపల్లి ప్రవీణ్లు తమ వేదనను సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు. కువైట్లో ఒక వ్యాపారి వద్ద పని కోసం ఏ జెంట్ల ద్వారా పది నెలల కింద వెళ్లారు. పనిచే యించుకున్న యజమాని చేసిన పనికి వేతనం ఇవ్వలేదు. జీతం లేకపోవడంతో యజమాని నుంచి పాస్పోర్టులు తీసుకుని బయటకు వచ్చా రు. ఫలితంగా వర్క్ పర్మిట్ను కోల్పోయారు. ఇంటికి వచ్చేందుకు ఎంబసీలో సంప్రదిస్తే క్రిమినల్ కేసు నమోదైనట్లు ఉందని, ఇంటికి వెళ్లలేరని అధికారులు స్పష్టం చేశారు. వేతనం ఇవ్వకుండా వేధించడమే కాకుండా యజమాని తమపై తప్పు డు కేసులు పెట్టాడని వలస కార్మికులు వాపోతున్నారు. కేసును ఎదుర్కొనేందుకు లాయర్కు ఫీజు చెల్లించే స్థోమత తమకు లేదని వలస కార్మికులు వెల్లడిస్తున్నారు. తాము పడుతున్న కష్టాల ను వీడియో రూపంలో ట్విట్టర్ ద్వారా బీఆర్ఎస్ నేత హరీశ్రావుకు విన్నవించారు. హరీశ్రావు, కేటీఆర్లు స్పందించి తమను ఎలాగైనా ఇంటికి రప్పించాలని వారు వేడుకున్నారు. తమవారిని ఎలాగైనా తీసుకురావాలని బాధిత కుటుంబాల సభ్యులు కోరుతున్నారు. కువైట్లో నరకయాతన అనుభవిస్తున్న వలస కార్మికులు స్వదేశానికి రప్పించాలని సామాజిక మాధ్యమాల ద్వారా వేడుకోలు -
చోరీ కేసులో ఒకరి అరెస్ట్
కమ్మర్పల్లి: కమ్మర్పల్లి మండలం ఉప్లూర్, కమ్మర్పల్లి, ఏర్గట్ల మండలం తొర్తి ఆలయాల్లో దొంగతనం చేసిన కేసులో ఒకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. కమ్మర్పల్లి పోలీస్స్టేషన్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భీమ్గల్ సీఐ పీ సత్యనారాయణ వివరాలను వెల్లడించారు. ఉప్లూర్ ఎల్లమ్మ, పోచమ్మ, పెద్దమ్మ ఆలయాలు, కమ్మర్పల్లి గుండ్లకుంట హన్మాన్, ఏర్గట్ల మండలం తొర్తిలో శుక్రవారందేవీ ఆలయాల్లో మూడు నెలల క్రితం చోరీ జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బుధవారం కమ్మర్పల్లి మండల కేంద్రంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం రేగుర్తి గ్రామానికి చెందిన తూర్పాటి కనకయ్యను అదుపులోకి తీసుకొని విచారించగా ఆలయాల్లో దొంగతనానికి పాల్పడింది తానేనని ఒప్పుకున్నాడు. నిందితుడి నుంచి రూ.2,700 నగదుతోపాటు ఆలయాల్లో దొంగిలించిన ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. కేసు ఛేదనలో పాల్గొన్న ఐడీ పార్టీ కానిస్టేబుళ్లు షౌకత్ అలీ, నవీన్చంద్ర, వినయ్ను అభినందించారు. కార్యక్రమంలో ఎస్సై అనిల్రెడ్డి పాల్గొన్నారు. -
తెలంగాణపై కేంద్రం వివక్ష
నిజామాబాద్ సిటీ: కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై చిన్నచూపు చూస్తోందని, రాష్ట్రానికి సరిపడా ఎరువులు కేటాయించకుండా పక్షపాతం వహిస్తోందని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేశ్ రెడ్డి మండిపడ్డారు. హైదరాబాద్లోని హాకా భవన్ (సీడ్స్ కార్పొరేషన్)లో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి రైతు సంక్షేమ పాలన సాగిస్తుంటే ప్రధాని మోదీ సహకరించడం లేదన్నారు. కేంద్రమంత్రులుగా ఉన్న బండి సంజయ్, కిషన్రెడ్డిలు తెలంగాణకు నిధులు తేవడంలో విఫలమయ్యారన్నారు. పంట పొలాలకు వాడే యూరియా కూడా సరిగా సరఫరా జరగడం లేదన్నారు. ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన కోటా కింద 5 లక్షల మెట్రిక్ టన్నులు కేటాయిస్తే.. 3.06 లక్షల మెట్రిక్ టన్నులు రావడంతో 1.94 లక్షల మెట్రిక్ టన్నుల లోటు ఏర్పడిందన్నారు. సరిపడా ఎరువులు లేకపోవడంతో రైతులు ఇబ్బందిపడుతున్నారన్నారు. ఎరువుల కోసం రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు లేఖలు రాశారని గుర్తుచేశారు. సంబంధిత కేంద్ర మంత్రులు జగత్ ప్రకాశ్ నడ్డా, శివరాజ్ సింగ్ చౌహాన్లపై బీజేపీ మంత్రులు, ఎంపీలు ఒత్తిడి తీసుకురావాలని సూచించారు. బీజేపీ నాయకుల వైఖరి చూస్తుంటే.. వ్యవసాయాన్ని విధ్వంసం చేసి ఆ పాపాన్ని కాంగ్రెస్ మీదకు నెట్టే కుట్ర పూరిత వైఖరి అవలంబిస్తోందన్న అనుమానం కలుగుతోందన్నారు. సమావేశంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, రైతు సంఘం నాయకులు నల్లమల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఎరువుల కేటాయింపులో జాప్యం పట్టించుకోని కేంద్రమంత్రులు తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ కార్పొరేషన్ చైర్మన్ అన్వేశ్ రెడ్డి -
పహాణి అంటే..?
పహాణి అంటే భూమికి సంబంధించిన రెవెన్యూ రికార్డుల ముఖ్యమైన పత్రం. దీనిని అడంగళ్ అని కూడా అంటారు. ● పహాణిలో భూమి యజమాని, సాగు చేస్తున్న వారి పేరు, సర్వే నంబర్, ఖాతా నంబర్, భూమి యొక్క విస్తీర్ణం, కొలతలు ఉంటాయి. ● భూమికి నీటి సదుపాయం(బావి, కాలువ, చెరువు), నేల రకం(సారవంతమైన, రాతి నేల) అనే స్వభావం పేర్కొనబడి ఉంటుంది. ● పహాణిలో భూమిలో సాగు చేస్తున్న పంటల వివరాలు, ఇతర ముఖ్యమైన సమాచారం ఉంటుంది. ● పహాణి భూమి యజమానికి చట్టపరమైన హక్కులను కల్పిస్తుంది. భూమి కొనుగోలు, అమ్మకం లేదా బదిలీ సమయంలో చాలా ఉపయోగపడుతుంది. ● భూమికి సంబంధించిన వివాదాలను పరిష్కరించే సమయంలో ఉపయోగపడుతుంది. ● బ్యాంకు నుంచి పంట రుణం, ఇతర రుణాలు తీసుకోవడానికి, ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేసుకోవడానికి పహాణి ఉపయోగపడుతుంది. – బాల్కొండమీకు తెలుసా? -
ఇసుక ట్రాక్టర్ పట్టివేత
రుద్రూర్: కోటగిరి గ్రామ శివారు నుంచి అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ను బుధవారం పట్టుకున్నట్టు ఎస్సై సునీల్ తెలిపారు. ట్రాక్టర్ను పోలీస్స్టేషన్కు తరలించి డ్రైవర్, యజ మానిపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. యువకుడి ఆత్మహత్య సదాశివనగర్(ఎల్లారెడ్డి): మండలంలోని మర్కల్ గ్రామానికి చెందిన పల్లె మనోహర్(18) అనే యువకుడు బుధవారం వ్యవసాయ బావి వద్ద చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై రంజిత్ కుమార్ తెలిపారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు. మృతికి గల కారణాలు తెలియరాలేదని ఎస్సై పేర్కొన్నారు. -
అడ్మిషన్లు ఒకచోట.. చదువులు మరోచోట..
● పాత వర్నిలోని జ్యోతిబా పూలే విద్యాలయం నిర్వాకం ● ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు వర్ని: మండలంలోని పాత వర్నిలో జ్యోతిబా పూలే బాలికల పాఠశాల/కళాశాల ఉంది. ఇక్కడ పాఠశాల స్థాయి విద్యా బోధన కొనసాగుతుండగా, ఇంటర్, డిగ్రీ కళాశాల పేరుకే ఇక్కడ ఉంది. ఇంటర్, డిగ్రీలో అడ్మిషన్లు మాత్రమే ఇక్కడ తీసుకుంటున్నారు. బోధన మాత్రం ఇంటర్ విద్యార్థులకు కామారెడ్డి జిల్లాలోని పిట్లం మండల కేంద్రంలో, డిగ్రీ విద్యార్థులకు జక్రాన్పల్లి మండలంలోని మునిపల్లిలో చేస్తున్నారు. దీంతో అడ్మిషన్లు తీసుకున్న విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గదుల కొరతే కారణం.. ఈ విద్యాలయంలో ఐదో తరగతి నుంచి డిగ్రీ వరకు విద్యా బోధన అందించాల్సి ఉండగా భవనాల కొరతతో గత మూడు సంవత్సరాలుగా ఇంటర్ పిట్లంలో, డిగ్రీ మునిపల్లిలో కొనసాగిస్తున్నారు. వర్నిలో కేవలం ఐదు తరగతులకు సరిపడా గదులు ఉండటంతో ఇంటర్, డిగ్రీ బోధన ఇతర ప్రాంతాల్లో నిర్వహిస్తున్నారు. ఇంటర్లో ఎంపీసీ, బైపీసీ గ్రూపులుండగా మొదటి సంవత్సరంలో 38, ద్వితీయ సంవత్సరంలో 30 మంది విద్యార్థులు ఉన్నారు. డిగ్రీలో 8 సబ్జెక్టులకు గాను 320 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఈ విద్యాలయంలో కళాశాలలను నిర్వహించాలంటే సుమారు 30 గదులు ఉంటేనే బోధనకు సాధ్యమవుతుంది. ప్రస్తుతం 10 గదుల్లో మాత్రమే విద్యాబోధన, హాస్టల్కొనసాగుతోంది. అరకొర వసతుల మధ్య కళాశాల నిర్వహణ కొనసాగుతోంది. ఇప్పటికై నా అధికారులు స్పందించి, విద్యాలయానికి తగిన భవనాలు, గదులను నిర్మించాలని విద్యార్థినులు కోరుతున్నారు. హైస్కూల్ మాత్రమే నిర్వహిస్తున్నాం.. విద్యాలయంలో కళాశాల బోధన కొనసాగించాలంటే మరో 25 గదుల వరకు అవసరం ఉంటుంది. ప్రస్తుతం 10 గదుల్లో హైస్కూల్ సెక్షన్ మాత్రమే నిర్వహిస్తున్నాం. హాస్టల్ నిర్వహణకు కూడా గదుల కొరత తీవ్రంగా ఉంది. ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి కళాశాల నిర్వహణకు నిధులు మంజూరు చేసి, అదనపు గదులు నిర్మించాలి. –పద్మజ, ప్రిన్సిపాల్, జ్యోతిబా పూలే విద్యాలయం, వర్ని -
రికార్డుల్లో ఎక్కువ.. తరగతుల్లో తక్కువ
నిజామాబాద్అర్బన్: ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ అస్తవ్యస్తంగా మారుతోంది. క్షేత్రస్థాయిలో తనిఖీలు లేకపోవడంతో విద్యాబోధన, ప్రభుత్వ నిబంధనలు సక్రమంగా జరగడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. జిల్లా కేంద్రంలోని మమ్మదేవినగర్ పాఠశాల నిర్వహణ చూస్తే మారుమూల ప్రాంతంలో ఉన్న పాఠశాలల నిర్వహణ ఎలా ఉంటుందో అర్థమవుతుంది. సదరు పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండగా, టీచర్లు రికార్డుల్లో ఎక్కువగా చూపిస్తున్నారు. 81 మందికి 106 మంది.. మమ్మదేవినగర్ పాఠశాల ఒకటి నుంచి ఆరో తరగతి వరకు కొనసాగుతుండగా, ఐదుగురు టీచర్లు ఉన్నారు. ఇటీవల ‘సాక్షి’ పాఠశాలను సందర్శించగా.. ఒకటో తరగతిలో 9 మంది, రెండో తరగతిలో 11 మంది, మూడో తరగతిలో 14 మంది, నాల్గో తరగతిలో 18 మంది, ఐదో తరగతిలో 16 మంది, ఆరో తరగతిలో 13 మంది మొత్తం 81మంది విద్యనభ్యసిస్తున్నారు. కానీ పాఠశాల ఉపాధ్యాయులు మాత్రం రికార్డుల్లో 106 మంది విద్యార్థులు చదువుతున్నట్లు నమోదు చేస్తున్నారు. ఇక్కడ విద్యార్థుల సంఖ్యను ఎక్కువగా చూపడంతో టీచర్లు సర్దుబాటు నుంచి తప్పించుకొని ఇదే పాఠశాలలో కొనసాగాలనే ప్రయత్నం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మధ్యాహ్న భోజనం చేసే విద్యార్థుల సంఖ్య కూడా 100కు పైబడి నమోదు చేస్తున్నారు. కేవలం 20 నుంచి 30 మంది విద్యార్థులు మాత్రమే ప్రతిరోజు భోజనం చేస్తున్నారు. జిల్లా కేంద్రంలోని బడిలోనే ఈ దుస్థితి ఉంటే జిల్లా సరిహద్దు ప్రాంతాలలోని బడుల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. విద్యాశాఖ అధికారులు తనిఖీలు చేపట్టకపోవడంతోనే ప్రభుత్వ బడుల్లో ఇలాంటి దుస్థితి నెలకొందని పలువురు పేర్కొంటున్నారు. ఇప్పటికై నా అధికారులు క్షేత్రస్థాయిలో పాఠశాలలను నిత్యం తనిఖీ చేస్తే ఇలాంటి అనేక లోటుపాట్లు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. 6వ తరగతిలో తక్కువగా ఉన్న విద్యార్థులు నగరంలోని మమ్మదేవినగర్ ప్రభుత్వ బడిలో విద్యార్థుల సంఖ్యలో తేడాలు పర్యవేక్షణ చేయని ఉన్నతాధికారులు పరిశీలన చేస్తాం మమ్మదేవినగర్ పాఠశాలను తనిఖీ చేస్తాం. విద్యార్థుల సంఖ్యను పరిశీలించి, తేడాలుంటే చర్యలు తీసుకుంటాం. అదనంగా ఉన్న టీచర్లను సైతం అవసరం ఉన్న పాఠశాలలకు పంపిస్తాం. – సాయారెడ్డి, సౌత్ మండల ఎంఈవో, నిజామాబాద్ -
పీజీ పరీక్షల ఫీజు చెల్లించాలి
తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని పీజీ, ఇంటిగ్రేటెడ్ (ఐదేళ్ల) పీజీ సెమిస్టర్స్లకు సంబంధించి రెగ్యులర్, ప్రాక్టికల్, బ్యాక్లాగ్ పరీక్షల ఫీజు చెల్లింపు నోటిఫికేషన్ బుధవారం వెలువడింది. పీజీ 2, 4వ సెమిస్టర్ రెగ్యులర్ (థియరీ, ప్రాక్టికల్), ఇంటిగ్రేటెడ్ ఐఎంబీఏ 8, 10వ సెమిస్టర్, బీఎల్ఐఎస్సీ 2వ సెమిస్టర్ బ్యాక్లాగ్ పరీక్షల ఫీజు చెల్లించాలని కంట్రోలర్ ప్రొఫెసర్ కే సంపత్కుమార్ తెలిపారు. పీజీతోపాటు ఇంటిగ్రేటెడ్ పీజీ ఏపీఈ అన్ని సబ్జెక్టులకు కలిపి రూ.500 లు ఫీజు, ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం, ఇంటిగ్రేటెడ్ పీసీహెచ్ అన్ని సబ్జెక్టులకు కలిపి రూ.600 లు ఫీజు, ఎంఏబీ, ఐఎంబీఏ, ఎంసీఏ అన్ని సబ్జెక్టులకు కలిపి రూ.800 లు ఫీజు ఈ నెల 15 వరకు చెల్లించాలని కంట్రోలర్ తెలిపారు. రూ. 100 ల అపరాధ రుసుముతో ఈ నెల 18వరకు చెల్లించే అవకాశం ఉంటుందన్నారు. బ్యాక్లాగ్ పరీక్షల ఫీజు.. తెయూ పరిధిలోని పీజీ 1, 3, 5, 7, 9వ సెమిస్టర్, ఎల్ఎల్బీ, ఇంటిగ్రేటెడ్ పీజీ ఏపీఈ, ఐంఎబీఏ, ఐపీసీహెచ్, 2వ, 6వ సెమిస్టర్, ఐఎంబీఏ 8, 10వ సెమిస్టర్, బీఎల్ఐఎస్సీ 1వ సెమిస్టర్ బ్యాక్లాగ్ పరీక్షల ఫీజు ఈ నెల 15 వరకు చెల్లించాలని కంట్రోలర్ ప్రొఫెసర్ కే సంపత్కుమార్ తెలిపారు. రూ. 100ల అపరాధ రుసుముతో ఈ నెల 18వరకు చెల్లించే అ వకాశం ఉంటుందన్నారు. వివరాలకు వర్సిటీ వెబ్సైట్ www. telanganauniversity. ac. in ను సందర్శించాలని సూచించారు. తీర్థయాత్రకు ఆర్టీసీ ప్రత్యేక బస్సు ఆర్మూర్ టౌన్: ఆర్మూర్ ఆర్టీసీ డిపో నుంచి పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సు నడపుతున్నట్లు మేనేజర్ రవికుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కాణిపాకం, వేలూరు గోల్డెన్ టెంపుల్, అరుణాచలం, జోగులాంబ శక్తిపీఠం దర్శనానికి బస్సు నడపుతున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 8న బస్సు బయల్దేరుతుందని, తిరిగి 11వ తేదీన రాత్రి 10 గంటలకు ఆర్మూర్కు చేరుకుంటుందన్నారు. పెద్దలకు రూ. 5100, పిల్లలకు రూ.2600 కలదన్నారు. ఆసక్తిగల భక్తులు రిజర్వేషన్ కౌంటర్ లో టికెట్ బుక్ చేసుకోవాలని తెలిపారు. యోగా భవన్కు అర్బన్ ఎమ్మెల్యే విరాళం కామారెడ్డి అర్బన్: కామారెడ్డి జిల్లా యోగా భవన్కు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా కిసాన్ క్లాథ్ ఎంపోరియం ద్వారా రూ.లక్ష విరాళం అందజేసినట్లు జిల్లా యోగా అండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రాంరెడ్డి తెలిపారు. తాము కోరిన వెంటనే రూ.లక్ష విరాళం అందజేసిన ఎమ్మెల్యేకు అసోసియేషన్ ప్రతినిధులు అంజయ్యగుప్తా, రఘుకుమార్ ధన్యవాదాలు తెలిపారు. ఇన్చార్జి ఎంహెచ్వోగా రవిబాబు నిజామాబాద్ సిటీ: మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ ఎం రవిబాబుకు కమిషన ర్ దిలీప్కుమార్ ఇన్ చార్జి ఎంహెచ్వోగా బుధవారం అదనపు బాధ్య తలు అప్పగించారు. గతంలో డీసీ రాజేంద్రకుమార్ కూడా శానిటేషన్ బాధ్యతలు నిర్వర్తించారు. శానిటేషన్ విభాగాన్ని గాడిలో పెట్టాలని కమిషనర్ రవిబాబుకు సూచించారు. బల్దియాకు పర్మినెంట్ ఎంహెచ్వో పోస్టు ఖాళీగా ఉంది. రెండేళ్లకు పైగా మున్సిపల్ వైద్యాధికారి లేకపోవడంతో శానిటేషన్ వ్యవస్థ అధ్వానంగా త యారైంది. శానిటరీ ఇన్స్పెక్టర్లు, జవాన్లు అవి నీతిలో కూరుకుపోయారు. మున్సిపల్ కమిషనర్ దిలీప్కుమార్ క్షేత్రస్థాయిలో పర్యటించి సిబ్బందిని హెచ్చరించినా వారు తమ పనీతీరు మార్చుకోవడం లేదు.దీంతో డీసీ రవిబాబుకు అదనపు బాధ్యతలు అప్పగించారు. గదిలేక రోడ్డు పక్కనే.. ● పిల్లలు, గర్భిణులకు టీకాలు ఆర్మూర్టౌన్: ఆర్మూర్ పట్టణంలోని 35 వ వార్డులో ప్రతి బుధవారం చిన్నారులకు, గర్భిణులకు ఏఎన్ఎంలు టీకాలు ఇస్తుంటారు. కా నీ, సరైన గది సౌకర్యం లేకపోవడంతో రోడ్లపై నే టీకాలు వేయాల్సిన దుస్థితి ఏర్పడింది. రో డ్లపై నిలబడాలంటే ఇబ్బందిగా ఉందని, కూ ర్చునేందుకు సరైన స్థలం కూడా లేదని గర్భి ణులు వాపోయారు. ప్రభుత్వం స్పందించి గది కేటాయించాలని కోరుతున్నారు. ఈ విషయ మై ఏఎన్ఎంలు రాజవ్వ, ప్రవళికతో మా ట్లాడగా గతంలో ఓ సంఘంలో కూర్చొని టీకా లు వేసే వాళ్లమని, ఇప్పుడు లేదన్నారు. -
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలలో పురోగతి సాధించాలి
ఆర్మూర్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలులో పురోగతి సాధించాలని కలెక్టర్ టీ వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. ఆర్మూర్ మున్సిపాలిటీని బుధవారం ఆయన సందర్శించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, వన మహోత్సవం, సీజనల్ వ్యాధుల నియంత్రణ కోసం చేపడుతున్న చర్యలు, ప్లాట్ల క్రమబద్ధీకరణ తదితర అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. వార్డుల వారీగా ఆయా అంశాలలో ప్రగతిని సమీక్షించిన కలెక్టర్, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలలో ఆశించిన స్థాయిలో ప్రగతి లేదని అసంతప్తి వ్యక్తం చేశారు. 617 మందికి ఇళ్లను మంజూరు చేయగా కేవలం 183 మాత్రమే గ్రౌండింగ్ జరిగాయన్నారు. అధికారులు, వార్డు ఆఫీసర్ల పనితీరును ఆక్షేపించారు. అలసత్వ వైఖరిని వీడాలని, ఇకనైనా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఇళ్లను నిర్మించుకునేలా లబ్ధిదారులను ప్రోత్సహించాలని సూచించారు. వచ్చే వారం మళ్లీ సమీక్ష నిర్వహిస్తానని, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలలో స్పష్టమైన ప్రగతి కనిపించాలని అన్నారు. వన మహోత్సవం విజయవంతం అయ్యేలా ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని కలెక్టర్ హితవు పలికారు. నర్సరీల్లో మొక్కలు పంపిణీకి సిద్ధంగా ఉంచాలన్నారు. వర్షాకాలంలో వ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. దోమల వ్యాప్తిని నిరోధించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. నిర్ణీత రుసుము చెల్లించిన వారికి త్వరితగతిన ప్లాట్ల క్రమబద్ధీకరణ అనుమతి మంజూరు చేయాలన్నారు. పనులు ప్రారంభించాలి పట్టణంలోని 11, 12 వార్డులలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదారులను కలెక్టర్ టీ వినయ్ కృష్ణారెడ్డి కలిశారు. ఇళ్ల నిర్మాణాలు చేపట్టేందుకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. మంజూరీ లభించినందున వెంటనే పనులు ప్రారంభించాలని హితవు పలికారు. ఆయన వెంట జిల్లా మలేరియా నియంత్రణ విభాగం అధికారి డాక్టర్ తుకారాం రాథోడ్, ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ రాజు తదితరులు ఉన్నారు. కలెక్టర్ టీ వినయ్ కృష్ణారెడ్డి ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో అభివృద్ధి పనుల ప్రగతిపై సమీక్ష -
పీడీఏ జిల్లా అధ్యక్షుడిగా ప్రతాప్గుప్తా
బోధన్ : పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ (పీడీఏ) జిల్లా అధ్యక్షుడిగా బోధన్ పట్టణంలోని హెడ్ పోస్టాఫీస్ ప్రాంతానికి చెందిన చిదుర ప్రతాప్గుప్తా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇటీవల జిల్లా కేంద్రంలో అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నికలు నిర్వహించారు. అధ్యక్షుడిగా ప్రతాప్గుప్తా, ప్ర ధాన కార్యదర్శిగా పూర్ణప్రసాద్, కోశాధికారి గా విజయ్కుమార్స్వామి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పట్టణంలోని లయన్స్ కంటి ఆ స్పత్రిలో ప్రతాప్గుప్తాను బుధవారం లయ న్స్ క్లబ్ ఆఫ్ బోధన్ ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. లయన్స్ కంటి ఆస్పత్రి వ్య వస్థాపకులు పోలవరపు బసవేశ్వర్రావు, క్ల బ్ ప్రతినిధులు కొడాలి కిశోర్, వై శ్రీనివాస్రావు, పావులూరి వెంకటేశ్వర్రావు, శ్రీధర్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు. ఎస్సారెస్పీలోకి పెరిగిన ఇన్ఫ్లో బాల్కొండ : శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లోకి ఎగువ ప్రాంతాల నుంచి ఇన్ఫ్లో పెరుగుతోంది. మంగళవారం బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లు ఎత్తడం, ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షం కురువడంతో వరద ప్రవాహం పెరిగి 6,700 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్ట్ నీటి మట్టం పెరుగుతోంది. కాకతీయ కాలువ ద్వారా 100 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండగా మిషన్ భగీరథ అవసరాలకు 231 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నారు. ఆవిరి రూపంలో 304 క్యూసెక్కుల నీరుపోతోంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 1091(80.5 టీఎంసీలు) అడుగులు కాగా బుధవారం సాయంత్రానికి 1065.40(16.8టీఎంసీలు) అడుగుల నీరు నిల్వ ఉందని సంబంధిత అధికారులు తెలిపారు. గతేడాదితో పోలిస్తే ప్రస్తుతం 6 టీఎంసీల నీరు ఎక్కువగా ఉంది. గతేడాది ఇదే రోజున ప్రాజెక్ట్లో 10.8 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ‘సహకారం’తో రైతులు, కార్మికులకు ప్రయోజనం సుభాష్నగర్ : సహకార వ్యవస్థ ద్వారా ప్రపంచవ్యాప్తంగా రైతులు, కార్మికులు, వ్యాపారులు లాభపడుతున్నారని ఉమ్మడి నిజామాబాద్ డీసీసీబీ చైర్మ న్ కుంట రమేశ్రెడ్డి పేర్కొన్నారు. ఇంటర్నేషనల్ కో ఆపరేటీవ్ అలయెన్స్ (ఐసీఏ) ఆధ్వర్యంలో లండన్ లోని మాంచెస్టర్ నగరంలో కో ఆపరేటీవ్ యాక్టివిటీస్ అనే అంశంపై బుధవారం సదస్సు నిర్వహించారు. నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ స్టేట్ కో ఆపరేటీవ్ బ్యాంక్స్ లిమిటెడ్ (ఎన్ఏఎఫ్ఎస్సీఓబీ) తరఫున కుంట రమేశ్రెడ్డి సదస్సుకు హాజరై ప్రసంగించారు. యూఎన్వో 2025 సంవత్సరాన్ని అంతర్జాతీయ స హకార సంవత్సరంగా ప్రకటించినందుకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సహకార సంస్థలు రైతులకు అనేక రకాల సేవలు అందిస్తున్నాయని, గ్రామీణ వ్యవస్థకు మూలాధారంగా ఉన్నాయని పే ర్కొన్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో సహకార బ్యాంకుల ద్వారా రైతులకు అందిస్తున్న సౌ కర్యాలను రమేశ్రెడ్డి వివరించారు. 5న ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ రాక నిజామాబాద్అర్బన్ : ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ఈనెల 5వ తేదీన జిల్లాకు రానున్నారు. ఉదయం 11 గంటలకు కలెక్టరేట్లో నిర్వహించనున్న సమీక్షాసమావేశంలో పాల్గొంటారు. ఎస్సీ రిజర్వేషన్ అమలు, ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తే దాని కి సంబంధించిన విధివిధానాలు, రిజర్వేషన్లపై సమీక్షించనున్నారు. మధ్యాహ్నం రెండు గంటల వరకు సమీక్ష సమావేశంలో వెంకటయ్య పాల్గొని అనంతరం కామారెడ్డికి వెళ్తారు. -
డీవైఎస్వోగా పవన్కుమార్
నిజామాబాద్నాగారం: జిల్లా యువజన క్రీడల అధికారిగా బక్కూరి పవన్కుమార్ నియమితులయ్యారు. జిల్లాలో సీనియర్ వ్యాయామ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న పవన్కుమార్ను జిల్లా కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి ఆదేశాల మేరకు ఇన్చార్జి డీవైఎస్వోగా నియమించారు. బుధవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. పవన్ ప్రస్తుతం జక్రాన్పల్లి ప్రభుత్వ పాఠశాలలో ఫిజికల్ డైరెక్టర్గా విధులు నిర్వహిస్తున్నారు. గతంలో ఎస్జీఎఫ్ సెక్రెటరీగా రెండేళ్లపాటు విధులు నిర్వర్తించిన ఆయన జిల్లాకు రాష్ట్రస్థాయిలో మరింత గుర్తింపు తెచ్చారు. కార్యాలయ ఉద్యోగులు మహిపాల్రెడ్డి, దాసు, సురేశ్, మహేశ్, ప్రశాంత్, క్రీడాసంఘాల ప్రతినిధులు పవన్కు శుభాకాంక్షలు తెలిపారు. -
ఇన్వెస్టిగేషన్ టూల్గా సైన్స్
ఖలీల్వాడి: మారుతున్న కాలానికి అనుగుణంగా చట్టాలను, సైన్స్ను ఇన్వెస్టిగేషన్ టూల్గా మార్చుకోవాలని పోలీస్ కమిషనర్ సాయిచైతన్య సిబ్బందికి సూచించారు. జోన్ – 2 బాసర లెవల్ పోలీస్ డ్యూటీమీట్ – 2025ను నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సీపీ బుధవారం ప్రారంభించారు. విధి నిర్వహణ సామర్థ్యం పెంచే ఉద్దేశంతో నిర్వహిస్తున్న మీట్లో మూడు రోజులపాటు డిపార్ట్మెంటల్ పోటీలు కొనసాగనుండగా, నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన పోలీసు సిబ్బంది పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా సీపీ సాయిచైతన్య మాట్లాడుతూ.. పోటీల ద్వారా పోలీస్ విభాగంలో కానిస్టేబుల్ స్థాయి నుంచి సీఐ స్థాయి వరకు పని పద్ధతులు మెరుగుపడి ఇన్వెస్టిగేషన్ స్థాయి పెరుగుతుందని, పనిలో పోటీతత్వం అలవడుతుందని పేర్కొన్నారు. సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్, ఫొరెన్సిక్, ఫింగర్ ప్రింట్ ఇన్వెస్టిగేషన్ ఎంపికల్లో భాగంగా నేరం జరిగిన చోట ‘క్లూస్’ సేకరణకు సంబంధించి పరీక్షను మొదటి రోజు నిర్వహించామన్నారు. విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబర్చేందుకు ఈ పోటీలు ఉపయోగపడతాయని సీపీ పేర్కొన్నారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారిని రాష్ట్ర స్థాయిలో నిర్వహించే డ్యూటీ మీట్కు పంపిస్తామని తెలిపారు. కార్యక్రమంలో అదనపు డీసీపీలు బస్వారెడ్డి (అడ్మిన్), రామ్చందర్రావు(ఏఆర్), సీసీఎస్ ఏసీపీ నాగవేంద్రచారి, జగిత్యాల, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్ సీఐలు, ఏఎస్సైలు తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ సీపీ సాయిచైతన్య కమిషనరేట్లో బాసర జోన్ – 2 పోలీస్ డ్యూటీ మీట్ హాజరైన నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్, ఆదిలాబాద్ పోలీస్ సిబ్బంది -
నిజామాబాద్
పసుపు రైతులకు.. బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు పసుపు రైతులకు క్షమాపణలు చెప్పాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ కులాచారి అన్నారు. గురువారం శ్రీ 3 శ్రీ జూలై శ్రీ 2025– 8లో uకసాబ్గల్లీలో నీటి కుళాయి గుంతలోకి చేరిన మురుగు నీరుమారుతినగర్ రోడ్ నెం.5 లో నివాసాల మధ్య నిలిచిన మురుగునీరునిజామాబాద్నాగారం : మున్సిపాలిటీ స్థాయి నుంచి కార్పొరేషన్గా అప్గ్రేడ్ అయిన నిజామాబాద్ నగరంలో ఆ స్థాయి సౌకర్యాలు మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. శానిటేషన్ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారి నగరానికి రోగాల ముప్పు పొంచి ఉంది. రోడ్లపక్కన ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్త కుప్పలు దర్శనమిస్తున్నాయి. డ్రెయినేజీ వ్యవస్థ సరిగా లేక పలు ప్రాంతాల్లో మంచినీటి కుళాయి గుంతల్లోకి మురుగు నీరు చేరుతోంది. దశాబ్దన్నర క్రితం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యూజీడీ (అండ్ గ్రౌండ్ డ్రెయినేజీ) పనులు ఇప్పటికీ ఓ కొలక్కి రాకపోవడం నగరంలోని పరిస్థితులకు అద్దం పడుతోంది. నిజామాబాద్ నగరంలో 60 డివిజన్లు.. ఒక్కో డివిజన్ పరిధిలో 8 నుంచి 10వరకు కాలనీలు ఉన్నాయి. సుమారు లక్షా 10వేల కుటుంబాలు ఉండగా.. 4.30లక్షల జనాభా ఉంది. చంద్రశేఖర్కాలనీ, మారుతినగర్, కంఠేశ్వర్, దుబ్బ, గౌతంనగర్, కెనాల్కట్ట, నాగారం, సాయినగర్, గాయత్రినగర్, ఆనంద్నగర్, పద్మనగర్, వినాయక్నగర్, సీతారాంనగర్కాలనీ, వర్నిరోడ్, మాలపల్లి, కోజాకాలనీ, హైమద్పురాకాలనీ తదితర ప్రాంతాల్లో పరిస్థితి అధ్వానంగా ఉంది. అపరిశుభ్ర వాతావరణం కారణంగా కాలనీలు కంపుకొడుతున్నాయి. వర్షాలు కురుస్తుండడంతో పరిస్థితి మరింత అధ్వానంగా మారుతోంది. ఆరు జోన్లు.. కార్పొరేషన్ పరిధిలో జోన్ – 1 (నాందేవ్వాడ), జోన్ – 2(గోల్ హనుమాన్), జోన్ – 3(పెద్దబజార్), జోన్ – 4ఏ(రాజీవ్గాంధీ ఆడిటోరియం), జోన్ – 4బీ(కంఠేశ్వర్), జోన్ – 5(అర్సపల్లి) మొత్తం ఆరు జోన్లు ఉన్నాయి. ఒక్కో జోన్ పరిధిలో సుమారు 180 మందికిపైగా కార్మికులు, జవాన్, శానిటరీ ఇన్స్పెక్టర్ విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే ఒక ప్రాంతంలో డ్రెయినేజీలను శుభ్రం పరిచిన తరువాత మళ్లీ అటువైపు మూడునాలుగు నెలలపాటు రావడం లేదని స్థానికులు అంటున్నారు. యూజీడీ.. ట్రాజెడీ 15 ఏళ్ల క్రితం నగరంలో చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ (యూజీడీ) పనుల వ్యవహారం ట్రాజెడీగా మిగిలింది. 2008లో రూ. 94 కోట్లతో ప్రారంభమైన పనులు మధ్యలో ఆగిపోయాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతిపదనలను రూ. 231 కోట్లకు పెంచినప్పటికీ పనులు పూర్తికాకపోవడంతో మళ్లీ రూ.85 కోట్లకు ప్రతిపాదనలు పంపారు. పనుల్లో భాగంగా రోడ్లను ఎక్కడపడితే అక్కడ తవ్వారు. యూజీడీ పేరుతో అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంట్రాక్టర్లు కమిషన్లను జేబుల్లో వేసుకుంటున్నారని నగరవాసులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో నామమాత్ర సేవలు.. వినాయక్నగర్, చంద్రశేఖర్ కాలనీ, దుబ్బ, సీతారాంనగర్కాలనీ, అర్సపల్లి, మాలపల్లి, గౌతంనగర్ లో మొత్తం ఏడు అర్బన్ హెల్త్ సెంటర్లు ఉండగా, నాగారం, ఖానాపూర్లో బస్తీ దవాఖానాలు ఉన్నాయి. అయితే ఎక్కడా కూడా సమయ పాలన పాటించడం లేదని రోగులు చెబుతున్నారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4గంటల వరకు అందుబాటులో ఉండాల్సిన వైద్యులు రావడం లేదంటున్నారు. కిందిస్థాయి సిబ్బంది సమయ పాలన పాటిస్తున్నా.. వైద్యులు మాత్రం ఇష్టారాజ్యంగా వస్తూవెళ్తున్నారంటున్నారు. దీంతో రోగులకు ఫార్మసిస్ట్లు మాత్రమే మందులు ఇచ్చి పంపిస్తున్నారు.న్యూస్రీల్కార్పొరేషన్ కహానీ – 2ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావంనగరంలో శానిటేషన్ వ్యవస్థ సరిగాలేకపోవడంతో ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతోంది. సరైన డ్రైయినేజీలు లేకపోవడంతో మురుగునీరు రోజుల తరబడి నిల్వ ఉండి దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. వర్షాలు కురుస్తుండడంతో ఎక్కడపడితే అక్కడ నీరు నిలుస్తోంది. వర్షాకాలం ప్రారంభంలోనే నగరవాసులు దగ్గు, చలి, నొప్పులు, వైరల్ ఫీవర్ తదితర వాటితో బాధపడుతూ ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. పిల్లలు అనారోగ్యం బారినపడితే భయంతో ప్రైవేట్ ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు.అస్తవ్యస్తంగా శానిటేషన్ రోడ్ల పక్కన చెత్త కుప్పలు, ప్లాస్టిక్ వ్యర్థాలు అధ్వానంగా డ్రెయినేజీలు మంచి నీటి కుళాయి గుంతల్లోకి మురుగునీరు బస్తీ దవాఖానాలు, అర్బన్ హెల్త్ సెంటర్లలో అంతంతమాత్రంగానే వైద్య సేవలు అస్తవ్యస్తంగా శానిటేషన్ రోడ్ల పక్కన చెత్త కుప్పలు, ప్లాస్టిక్ వ్యర్థాలు అధ్వానంగా డ్రెయినేజీలు మంచి నీటి కుళాయి గుంతల్లోకి మురుగునీరు బస్తీ దవాఖానాలు, అర్బన్ హెల్త్ సెంటర్లలో అంతంతమాత్రంగానే వైద్య సేవలు -
పరిమితి లేని పెట్టుబడి సాయం
డొంకేశ్వర్(ఆర్మూర్): రాష్ట్ర ప్రభుత్వం రైతులు ఊహించని విధంగా పంట పెట్టుబడి సాయాన్ని అందించింది. కొంత ఆలస్యమైనప్పటికీ ఎకరాల విషయంలో పరిమితి లేకుండా రైతులందరికీ ఖరీఫ్ సీజన్కు ‘భరోసా’ కల్పించింది. గత రబీ సీజన్లో పెట్టుబడిసాయాన్ని నాలుగు ఎకరాలకే పరిమితం చేసిన ప్రభుత్వం.. ప్రస్తుతం 36 ఎకరాల వరకు భూమి ఉన్న రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసింది. దీంతో జిల్లా రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల రైతు వేదికల వద్ద రైతులతో కలిసి కాంగ్రెస్ శ్రేణులు సంబురాలు సైతం నిర్వహించారు. రూ.300 కోట్లకు పైగా.. జిల్లాలో 2,72,596మంది రైతులకు చెందిన 5,27,746 ఎకరాలకు మొత్తం రూ.316.64కోట్ల పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం అందజేసింది. పెట్టుబడి సాయం అందుకున్న వారిలో ఒక గుంట భూమి నుంచి 36 ఎకరాలున్న రైతులు కూడా ఉన్నారు. ఎకరానికి రూ.6వేల చొప్పున పంట పెట్టుబడి సాయాన్ని అందించగా, ఎక్కువ భూమి ఉన్న రైతులు ఎక్కువ లబ్ది పొందారు. అత్యధికంగా బోధన్ మండలంలో 17,164 మంది రైతులు రూ.20.84 కోట్లు పొందారు. గత రబీ సీజన్లో అందిన పెట్టుబడి సాయాన్ని పరిశీలిస్తే నాలుగు ఎకరాల వరకు భూమి ఉన్న 2,32,484 మంది రైతులకు రూ.206.49 కోట్ల పెట్టుబడి సాయం అందింది. రబీతో పోలిస్తే చూస్తే ఖరీఫ్లో రైతుల కోసం ప్రభుత్వం రూ.110 కోట్లు అదనంగా వెచ్చించింది. ప్రస్తుత ఖరీఫ్లో రైతులందరికీ ‘భరోసా’! 36 ఎకరాలున్న రైతులకు కూడా అందించిన ప్రభుత్వం హర్షం వ్యక్తం చేస్తున్న కర్షకులు -
చేపల వేటపై నిషేధం
బాల్కొండ: చేపల పిల్లల ఉత్పత్తి కాలంగా పరిగణించే జూలై, ఆగస్టు నెలల్లో శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో చేపల వేటపై అధికారులు నిషేధం విధించారు. అయితే వేట నిషేధిత కాలంలో తమ పూట గడిచేది ఎట్లా అని మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో కలిపి 6 వేల మత్స్యకార కుటుంబాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లో చేపల వేటపై ఆధారపడి జీవిస్తున్నాయి. రెండు నెలల కాలానికి ప్రభుత్వం తమకు ఆర్థిక సాయం అందించాలని వేడుకుంటున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అందిన సాయం.. చేపల వేట నిషేధం అమలులో ఉన్న కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మత్స్యకారులను ఆదుకునేందుకు ఒక్కో కుటుంబానికి నెలకు 10 కిలోల బియ్యం, రూ.2 వేల నగదు అందించారు. ప్రత్యేక తెలంగాణ ఆవిర్భావం తరువాత సాయం అందడం లేదని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ కుటుంబాలకు రెండు నెలలకు సరిపడా బియ్యం, నిత్యావసరాలు అందించే వారని, ఇప్పుడు అందడం లేదని వాపోతున్నారు. సాయం అందించని పక్షంలో తమకు ప్రత్యామ్నాయ ఉపాధిని ప్రభుత్వం చూపించాలని అంటున్నారు. ఎస్సారెస్పీలో రెండు నెలలపాటు.. వేట సాగకపోతే పూట గడిచేదెట్లా అంటున్న మత్స్యకారులు ఉమ్మడి రాష్ట్రంలో బియ్యం, నగదు అందజేత ప్రస్తుతం సాయం ఊసెత్తని వైనంగతంలో ఇచ్చారు జూలై, ఆగస్టు నెలలు చేపలు పిల్లలను అధికంగా ఉత్పత్తి చేసే కాలం కావడంతో ప్రతి ఏటా చేపల వేటను నిషేధిస్తారు. గతంలో మాకు బియ్యం, డబ్బులు ఇచ్చేవారు. కానీ ప్రస్తుతం ఇవ్వడం లేదు. ప్రభుత్వం ఆలోచించి మమ్మల్ని ఆదుకోవాలి. – భాస్కర్, మత్స్యకారుడు చేపలను వేటాడొద్దు చేపలు పిల్లలను జూలై, ఆగస్టు నెలల్లో సహజ సిద్ధంగా ఉత్పత్తి చేస్తాయి. కాబట్టి రెండు నెలలపాటు చేపలను వేటాడొద్దు. నిషేధ కాలంలో మత్స్యకారులను ఆదుకోవడానికి ఇప్పటి వరకు ఎలాంటి ఆదేశాలు ప్రభుత్వం నుంచి రాలేదు. – దామోదర్, ఎఫ్డీవో, పోచంపాడ్ -
రోడ్డు ప్రమాదాల నియంత్రణకు చర్యలు
● రోడ్డు భద్రతా కమిటీ సమావేశంలో కలెక్టర్, సీపీనిజామాబాద్అర్బన్ : రోడ్డు ప్రమాదాలను నియంత్రించేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సంబంధిత అధికారులకు సూచించారు. స మీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో కలెక్టర్ అధ్యక్షతన బుధవారం రోడ్డు భద్రతా జిల్లా కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. పోలీస్, రవా ణా, ఆర్ అండ్ బీ, పంచాయతీ రాజ్, జాతీయ ర హదారుల సంస్థ, జిల్లా వైద్యారోగ్య శాఖ, ఆర్టీసీ, రెడ్ క్రాస్ ప్రతినిధులు పాల్గొనగా, రోడ్డు ప్రమాదా ల నియంత్రించేందుకు చేపట్టాల్సిన చర్యలపై చ ర్చించారు. 44, 63వ నంబర్ జాతీయ రహదారులపై తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్ర మాదాలు ఎక్కువగా చోటుచేసుకుంటున్న ప్రదేశాలను ఇప్పటికే బ్లాక్ స్పాట్లుగా పరిగణిస్తూ గత స మావేశాల్లో చేపట్టాల్సిన చర్యలపై తీసుకున్న నిర్ణయాలు అమలయ్యేలా చూడాలన్నారు. పోలీస్, ఆర్ అండ్ బీ, రోడ్ ట్రాన్స్పోర్ట్ తదితర శాఖలు స మన్వయంతో పని చేయాలన్నారు. ఇప్పటికే కొన్ని బ్లాక్స్పాట్ల వద్ద చర్యలు చేపట్టడంతో 2023 సంవత్సరం నుంచి పోలిస్తే రోడ్డు ప్రమాదాలు తగ్గు తూ వస్తున్నాయన్నారు. నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ పట్టణాల్లోని ముఖ్య కూడళ్లు, ప్రధాన మా ర్గాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా, ప్రమాదాలు చోటుచేసుకోకుండా ప్రత్యేక దష్టి సారించాలని అన్నారు. రోడ్లను ఆక్రమించి బోర్డులు దుకాణాల యజమానులకు నోటీసులు జారీ చేసి వాటిని తొలగించాలని, రోడ్లపై వాహనాలు పార్కింగ్ చే యకుండా చూడాలన్నారు. ప్రధాన రహదారులపై ధాన్యం, మొక్కజొన్న వంటి పంట దిగుబడలు ఆరబోయకుండా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. వివిధ శాఖల అధికారులు, రెడ్క్రాస్ ప్రతినిధి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. -
అవసరం మేరకే ఎరువులు తీసుకోవాలి
ఇందల్వాయి: యూరియాతో సహా అన్ని ఎరువుల నిల్వలు సరిపడా అందుబాటులో ఉన్నాయని, రైతులు ప్రస్తుత అవసరం మేరకే ఎరువులను కొనుగోలు చేసుకోవాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి అన్నారు. ముందస్తుగా నిల్వ చేసుకోవద్దని సూచించారు. ఇందల్వాయి మండల కేంద్రంలో కలెక్టర్ మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తహసీల్ కార్యాలయంతోపాటు రేషన్ షాపు, ఎరు వుల దుకాణం, గ్రామీణ పశు వైద్యశాలను సందర్శించి పని తీరును పరిశీలించారు. ముందుగా తహసీల్ కార్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్ భూ భారతి రెవెన్యూ సదస్సుల ద్వారా అందిన దరఖాస్తుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. మొత్తం 3480 దరఖాస్తులు అందాయని తహసీల్దార్ వెంకట్రావు తెలుపగా.. దరఖాస్తుదారులకు రసీదులు అందించారా అని కలెక్టర్ ఆరా తీశారు. అనంతరం 12 నంబర్ రేషన్ దుకాణాన్ని తనిఖీ చేశారు. లబ్ధిదారులకు మూడు నెలలకు సంబంధించి సన్నబియ్యం పంపిణీ పూర్తయ్యిందా అని డీలర్ను ప్రశ్నించగా, జూన్ నెలాఖరునాటికే పూర్తి చేశామని ఆయన సమాధానమిచ్చారు. అక్కడి నుంచి ఎరువుల పంపిణీ కేంద్రానికి చేరుకొని స్టాక్ను పరిశీలించారు. ఎరువుల కొనుగోలు కోసం వచ్చిన రైతులతో మాట్లాడారు. అవసరమైన ఎరువులు సక్రమంగా అందుతున్నాయా అని ప్రశ్నించగా రైతులు అందుతున్నాయని సమాధానమిచ్చారు. అక్కడి నుంచి గ్రామీణ పశు వైద్యశాలకు చేరుకున్న కలెక్టర్.. భవనాన్ని పరిశీలించారు. అవసరమైన మరమ్మతులు చేయించాలని పశువైద్యుడు గంగాప్రసాద్కు సూచించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ వెంకట్రావు, మండల వ్యవసాయ అధికారి శ్రీకాంత్ తదితరులున్నారు. అందుబాటులో యూరియా సహా ఇతర ఎరువులు ఇందల్వాయిలో కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి రేషన్ దుకాణం, ఎరువుల పంపిణీ కేంద్రం, పశువైద్యశాల సందర్శన భూభారతి దరఖాస్తులపై ఆరా -
నేను వీసీ మనిషిని..
● తెయూలో ఓ అధికారి ఇష్టారాజ్యం ● డబ్బులు దండుకునేందుకు దొంగ లెక్కలు ● సహచర సిబ్బందికి వేధింపులు విచ్చలవిడిగా అడ్వాన్సులు.. ఇటీవల జరిగిన కళాశాల వార్షికోత్సవంలోనూ నాలుగు ఫ్లడ్లైట్లు, సౌండ్ సిస్టమ్ ఏర్పా టు చేయించి ఏకంగా రూ.2.35 లక్షల బిల్లు క్లెయి మ్ చేయడంతోపాటు నిర్వహణ ఖర్చుల కింద మరో రూ.40 వేల బిల్లు పెట్టినట్లు విశ్వసనీయ సమాచారం. మే నెలలో మహనీయుల జయంతి పేరుతో ఆయా అధికారులకు నిర్వహణ బాధ్యతలను అప్పగించినప్పటికీ సదరు అధికారి తానే అజమాయిషీ చెలాయించాడనే విమర్శలు ఉన్నా యి. మహనీయుల జయంతి సందర్భంగా మహి ళా, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సెల్లు ఏర్పాటు చేసే కార్యక్రమాలకు తానే వర్సిటీ నుంచి డ బ్బులు తీసుకునందుకు చేసిన ప్రయత్నం బెడిసికొట్టినట్లు సమాచారం. ఇప్పటికే కీలక పదవిలో ఉన్న ఆయనకు ఇటీవల వసతిగృహాల అదనపు బాధ్యతలు అప్పగించారు. సంబంధిత విభాగంలో విచ్చలవిడిగా అడ్వాన్సులు తీసుకుంటున్న ట్టు తెలిసింది. వీసీ మనిషి కావడంతో ఎవ్వరు కూడా అభ్యంతరం చెప్పలేని పరిస్థితి. ముగ్గురు బోధనేతర మహిళా సిబ్బందిని సదరు అధికారి వేధిస్తున్నట్లు సమాచారం. ఆ ముగ్గురు ఉద్యోగులు రిజిస్ట్రార్ను కలువగా, తానేమీ చేయలేనని, వీసీని కలవాలని సూచించినట్లు సమాచారం. ఇదిలా ఉండగా వీసీని కలిసి ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో సదరు అధికారి మరింత విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారనే చర్చ వర్సిటీలో సాగుతోంది. సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ‘నేను వీసీ మనిషిని.. నన్ను ఆపేదెవరు..’ అంటూ తెలంగాణ యూనివర్సిటీలో ఓ అధికారి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తు న్నాని విద్యార్థి సంఘాల నాయకులు ఆగ్రహం వ్య క్తం చేస్తున్నారు. ఏ చిన్న అవకాశం దొరికినా లెక్క ల్లో గోల్మాల్ చేస్తూ డబ్బులు నొక్కేస్తున్నాడని, వైస్ ఛాన్స్లర్ ఎదుట మాత్రం ‘ఎస్ బాస్’ అన్నట్లుగా వ్యవహరిస్తూ సహచర సిబ్బందిని మాత్రం వేధిస్తున్నాడని విద్యార్ధి నాయకులు అంటున్నారు. మే 3వ తేదీన ‘నీట్ యూజీ’ ఆన్లైన్ పరీక్ష నిర్వహించగా, యూనివర్సిటీ కళాశాలతోపాటు వర్సిటీలోని మరో కళాశాలతో కలిపి రెండు పరీక్ష కేంద్రాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) కేటాయించింది. ఈ కేంద్రాల్లో దాదాపు 1,100 మంది అభ్యర్థులను కేటాయించారు. ఈ పరీక్ష కేంద్రాలకు సదరు అధికారిని, మరో కళాశాలకు అతడి సన్నిహితుడిని సూపరింటెండెంట్లుగా నియమించారు. పరీక్ష నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా స్టేషన రీ ఖర్చులు, తాగునీరు, శానిటైజేషన్, నంబర్లు వేయడం వంటి పనులకు, సంబంధిత సబ్ స్టాఫ్కు చెల్లించేందుకు అదనంగా పరీక్ష కేంద్రం నిర్వహణ కోసం ఒక్కో అభ్యర్థికి రూ.60 చొప్పున పరీక్ష తేదీకి వారం రోజులు ముందుగానే ఎన్టీఏ చెల్లించింది. రెండు పరీక్ష కేంద్రాల్లో పనిచేసిన సిబ్బందికి ఎన్టీఏ నిర్ణయించిన మొత్తాన్ని ఇవ్వలేదనే ఆరోపణలు వస్తున్నాయి. అయితే తాను వీసీ మనిషిని అని సదరు అధికారి చెబుతుండడంతో సిబ్బంది మిన్నకుండి పోయారని సమాచారం. ఇదిలా ఉంటే యూనివర్సిటీకి చెల్లించాల్సిన రూ.66వేలను సైతం గుట్టుచప్పుడు కాకుండా నొక్కేసినట్లు తెలుస్తోంది. పరీక్ష పూర్తయిన వెంటనే రిజిస్ట్రార్ అకౌంట్లో జమ చేయాల్సిన ఆ మొత్తాన్ని జేబులో వేసుకున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. అయితే 2009లో ఆచార్య లింబాగౌడ్ ప్రిన్సిపల్గా ఉన్నప్పటి నుంచి ఇప్పటివరకు బయటి సంస్థలు ఎలాంటి పరీక్షలు జరిగినా సెంటర్ నిర్వహణ కోసం నిర్దేశిత మొత్తాన్ని నిర్వహణ ఖర్చుల కోసం యూనివర్సిటీ అకౌంట్లో జమ చేసే అనవాయితీ పాటిస్తూ వస్తున్నారు. -
ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
నిజామాబాద్ సిటీ: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తు న్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని, ప్రతి కార్యకర్త పార్టీ సిద్ధాంతాలు, విధివిధానాలను కచ్చితంగా తెలసుకుని ముందుకు వెళ్లా లని జిల్లా ఇన్చార్జి మంత్రి ధనసరి అనసూయ (సీ తక్క) అన్నారు. ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్లమెంట రీ విస్తృత స్థాయి సమావేశాన్ని నిజామాబాద్ డీసీ సీ అధ్యక్షుడు మానాల మోహన్రెడ్డి అధ్యక్షతన జి ల్లా కేంద్రంలోని ఈవీఎం గార్డెన్స్లో మంగళవారం నిర్వహించారు. నిజా మాబాద్, కామారెడ్డి, నిర్మల్, కోరుట్ల, జగిత్యాల, జుక్కల్ల నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీ లు, ఆయా కార్పొరేషన్ల చైర్మన్ లు, జిల్లా బాధ్యులు, పలు విభాగాలకు చెందిన నాయకులు హాజరయ్యారు. కార్యకర్తలనుద్దేశించి మంత్రి సీతక్క మాట్లాడుతూ.. సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన వేల కోట్ల రూపాయలతో సంక్షేమ పథకాలు విజయవంతంగా అమలుచేస్తున్నామన్నారు. కేవలం తొమ్మిదిరోజుల్లో రూ.9 వేల కోట్ల రూపాయల రైతుభరోసా ఇచ్చామన్నారు. సన్నబియ్యం ఇస్తున్న రాష్ట్రం దేశంలో కేవలం తెలంగాణ మాత్రమేనని పేర్కొన్నారు. రూ.21 వే కోట్ల రుణమాఫీ చేసిన ఘనత ప్రభుత్వానికి దక్కతుందని, అధికారంలోకి రాగానే 60 వేల ఉద్యోగాలు ఇచ్చామని గుర్తుచేశారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయా ణం వంటి పథకాలు విజయవంతంగా అమలు చేస్తున్నామని, నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరుచేశామని వివరించారు. ఇన్ని మంచి పథకాలు అమలు చేస్తున్నా.. వాటిని ప్రజలకు చేరవేయడంలో కార్యకర్తలు వెనుకబడి ఉన్నారన్నారు. ఈనెల 4న హైదరాబాద్లో నిర్వహించే కార్యకర్తల సదస్సుకు వేల సంఖ్యలో కార్యకర్తలు హాజరు కావాలని, ప్రతి గ్రామం నుంచి 500 మందిని తీసుకురావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, ఎమ్మెల్యేలు సుదర్శన్రెడ్డి, భూపతిరెడ్డి, మదన్మోహన్, డాక్టర్ సంజయ్, వెడ్మ బొజ్జు, లక్ష్మీకాంతారావు, ఎంపీ సురేశ్ షెట్కార్, మాజీ ఎమ్మెల్సీ జీవన్రావు , కార్పొరేషన్ల చైర్మన్లు ఈరవత్రి అని ల్, తాహెర్బిన్ హందాన్, మానాల మోహన్రెడ్డి, ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, ఏనుగు రవీందర్రెడ్డి, సునీల్రెడ్డి, వినయ్రెడ్డి, నిజామాబాద్ నగర కాంగ్రెస్ అధ్యక్షుడు, నుడా చైర్మన్ కేశ వేణు, నాయకులు రాంభూపాల్, విపుల్గౌడ్, బాడ్సి శేఖర్ గౌడ్, కేతావత్ యాదగిరి, నరాల రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు. పార్టీ సిద్ధాంతాలు, విధివిధానాలను కార్యకర్తలు తెలుసుకోవాలి దేశంలో ఎక్కడాలేనన్ని సంక్షేమ పథకాలు ఇక్కడ అమలవుతున్నాయి.. క్షేత్రస్థాయిలో ప్రచారం చేయాలి జిల్లా ఇన్చార్జి మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) -
నిజామాబాద్
బుధవారం శ్రీ 2 శ్రీ జూలై శ్రీ 2025జిల్లా కేంద్రమైన నిజామాబాద్ నగరం నలుదిశలా వేగంగా విస్తరిస్తోంది. ఎంత వేగంగా విస్తరిస్తోందో.. అంతే వేగంగా సమస్యలు పెరుగుతున్నాయి. రాష్ట్రంలోని ప్రముఖ నగరాల్లో ఒకటిగా గుర్తింపు ఉన్న నిజామాబాద్ నగరంలో ఐదు దశాబ్దాల క్రితం(1972) నాటి మాస్టర్ ప్లాన్ అమలులో ఉంది. 2018లో నూతన మాస్టర్ ప్లాన్ను రూపొందించినప్పటికీ దాని ప్రస్తావన ఎక్కడా లేకుండాపోయింది. నగర జనాభా రోజురోజుకూ పెరుగుతుండగా అందుకు అనుగుణంగా సౌకర్యాలు మాత్రం కనిపించడం లేదు. న్యూస్రీల్ -
ఆక్రమణలను తొలగిస్తాం
నగరంలో ఫుట్పాత్ల ఆక్రమణలను తొలగించాల్సిందే. పాదచారులకు ఇబ్బందులు కలిగించేవిధంగా ఫుట్పాత్ల మీద వ్యాపారాలు చేయడం నేరం. దుకాణదారులు తమ వాహనాలను సెల్లార్లలో పార్క్ చేసుకోవాలి. త్వరలోనే ప్రత్యేక టీమ్తో ఫుట్పాత్ల ఆక్రమణలు తొలగిస్తాం. ట్రాఫిక్ ఉండే ప్రాంతాల్లో తోపుడుబండ్లవారిని అనుమతించం. వారికి కేటాయించిన స్థలాల్లోమాత్రమే వ్యాపారాలు చేసుకోవాలి. బల్దియా తరఫున పెయిడ్ పార్కింగ్ ఏర్పాటును కూడా పరిశీలిస్తున్నాం. – దిలీప్ కుమార్, మున్సిపల్ కమిషనర్ -
దశాబ్దాలైనా మారని దశ
కార్పొరేషన్గా మారి 20 ఏళ్లు.. ●● నిజామాబాద్ నగరంలో అమలవుతున్న 1972 మాస్టర్ ప్లాన్ ● ఫుట్పాత్లపై వ్యాపారం.. రోడ్లపై పార్కింగ్ ● అనుమతులు ఓ రకంగా.. నిర్మాణాలు మరో రకంగా.. ● రోజురోజుకూ తీవ్రమవుతోన్న ట్రాఫిక్ సమస్య ● ప్రభుత్వ స్థలాల్లో పార్కింగ్ చేస్తే సమస్యకు పరిష్కారం! ● కొత్త మాస్టర్ప్లాన్ అమలుకు నోచుకునేదెన్నడో..? -
కార్పొరేషన్ కహానీ–1
సుభాష్నగర్: నిజామాబాద్ నగరం మున్సిపల్ కార్పొరేషన్ హోదా దక్కించుకుని 20 ఏళ్లు గడుస్తున్నా నగరవాసులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు మాత్రం అలానే ఉన్నాయి. కార్పొరేషన్ స్థాయిలో పన్ను వసూలు చేస్తున్నా సౌకర్యాలు మాత్రం అధ్వానంగా ఉన్నాయి. ముఖ్యంగా రోడ్లు, ఫుట్పాత్లు, ట్రాఫిక్ సమస్య ప్రజలను తీవ్రంగా వెంటాడుతోంది. పెద్దపెద్ద వ్యాపార సముదాయాలకు అనుమతులు ఒక రకంగా తీసుకుంటూ మరో రకంగా నిర్మాణాలు చేపట్టడమే ఇందుకు కారణమవుతోంది. కొన్ని చోట్ల ఫుట్పాత్లపై వ్యాపారాలు చేస్తుండగా, మరికొన్ని చోట్ల వాహనాలు పార్కింగ్ చేస్తున్నారు. నిజామాబాద్ నగరంలో సుమారు ఐదు లక్షల మంది నివసిస్తుండగా, వివిధ ప్రాంతాల నుంచి పనుల నిమిత్తం ప్రతిరోజూ వేల సంఖ్యలో వస్తూవెళ్తుంటారు. ప్రస్తుతం నిజామాబాద్లో 1972 మాస్టర్ ప్లాన్ అమలవుతోంది. చాలా ప్రాంతాల్లో రోడ్లు చిన్నగా ఉండగా, విస్తరణ కోసం ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం 20 ఏళ్లుగా ఎలాంటి చొరవ తీసుకోకపోవడం, గడిచిన 15 ఏళ్లలో వాహనాల వినియోగం విపరీతంగా పెరగడంతో ట్రాఫిక్ సమస్య రోజురోజుకూ తీవ్రమవుతోంది. టౌన్ ప్లానింగ్ బాధ్యత మరిచిందా? నగరంలో నిత్యం వందల సంఖ్యలో నూతన నిర్మాణాలు చేపడుతున్నారు. ముఖ్యంగా వ్యాపార సముదాయాలు ఉన్న ప్రాంతాల్లో భవనాల నిర్మా ణాల విషయంలో టౌన్ ప్లానింగ్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అనుమతుల ఓ రకంగా.. నిర్మాణాలు మరో రకంగా ఉంటున్నాయంటూ ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయి. అయితే ఆ ఫిర్యాదులు అధికారులకు కాసులు కురిస్తున్నాయని, తూతూ మంత్రంగా తనిఖీలు చేపట్టి చేతులు దులుపుకుంటున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. సెల్లార్లు నిర్మిస్తున్నా.. వాటిని ఇతర అవసరాలకు వాడుతున్నారనేది బహిరంగ రహస్యం. ఇళ్ల నిర్మాణాలను క్షుణ్ణంగా పరిశీలించే అధికారులు.. వ్యాపార సముదాయాల విషయంలో మాత్రం ఎందుకంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనేది ప్రశ్నార్థకంగా మారింది. మాస్టర్ ప్లాన్ కోసం ఎదురుచూపులు నగరంలో కొత్త మాస్టర్ ప్లాన్ అమలైతే అనేక సౌకర్యాలు ప్రజలకు అందుబాటులోకి వస్తాయి. ముఖ్యంగా విశాలమైన రోడ్లు, పార్కులు అందుబాటులోకి వస్తాయి. మాస్టర్ ప్లాన్ అమలైతే ట్రాఫిక్ సమస్యకు కొంతవరకు పరిష్కారం లభిస్తుంది. వ్యాపార సముదాయాలున్న ప్రాంతాల్లోని ప్రభుత్వ స్థలాల్లో పార్కింగ్ (టెండర్) ఏర్పాటు చేస్తే ఫుట్పాత్లపై వాహనాల పార్కింగ్కు అవకాశం ఉండదు. అదేవిధంగా వ్యాపార సముదాయాల నిర్మాణం విషయంలో టౌన్ ప్లానింగ్ అధికారులు నిక్కచ్ఛిగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వన్ వేలు చేయడం, వీధి వ్యాపారాలను కంట్రోల్లో ఉంచడం, అక్రమ పార్కింగ్లపై స్పెషల్ డ్రైవ్ చేపట్టడం వంటి వాటితో ట్రాఫిక్, ఫుట్పాత్ సమస్యను చెక్ పెట్టొచ్చని నగరవాసులు అంటున్నారు.ఫుట్పాత్ను ఆక్రమించి వ్యాపారం.. రోడ్డుపై పార్కింగ్..రాజీవ్గాంధీ ఆడిటోరియం రోడ్డులో ట్రాఫిక్ -
సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
నిజామాబాద్అర్బన్: మైనారిటీల అభ్యున్నతి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన వారందరూ సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర మైనార్టీ కమిషన్ చైర్మన్ తారిఖ్ అన్సారీ అన్నారు. నిజామాబాద్ నగరానికి మంగళవారం ఆయన విచ్చేయగా, వివిధ శాఖల అధికారులు పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు. అనంతరం ఆయన ఆర్అండ్బీ అతిథిగృహంలో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డితోపాటు ఇతర జిల్లాల అధికారులతో భేటీ అయ్యారు. జిల్లాలో మైనారిటీ వర్గాల స్థితిగతుల గురించి అడిగి తెలుసుకున్నారు. అన్సారీ మాట్లాడుతూ.. మైనారిటీల కోసం ఉద్దేశించిన సంక్షేమ, అభివృద్ధి పథకాల గరించి అవగాహన కల్పించేందుకు విస్తృత ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. అనంతరం మైనారిటీ వర్గాల నుంచి కమిషన్ చైర్మన్ వివిధ సమస్యలపై వినతులు స్వీకరించారు. నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్రకుమార్, జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారిణి కృష్ణవేణి, తదితరులు పాల్గొన్నారు. -
వ్యవసాయంలో ‘డ్రోన్’ సాయం
బాల్కొండ: వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు రావడంతో అంతా యాంత్రికమైంది. అందులో భాగంగా పంటల్లో గడ్డి మందు, పురుగు మందు పిచికారి కోసం డ్రోన్ పంపులను వినియోగిస్తున్నారు. డ్రోన్ పంపు ధర రూ. 5 లక్షల వరకు ఉంటుంది. పది నిమిషాల వ్యవధిలో ఎకరం పంటలో మందును పిచికారి చేస్తుంది. వ్యవసాయంలో డ్రోన్ సాయంతో మందుల పిచికారి ఎంతో సొంపుగా ఉంటుందని రైతులు పేర్కొంటున్నారు. ఎకరానికి రూ. 500 తీసుకుని పంపు స్ప్రే చేస్తున్నారు. మందు కూడా పూర్తి స్థాయిలో వినియోగం జరుగుతుందని అంటున్నారు. డ్రోన్ ద్వారా స్ప్రే చేయడం వల్ల శ్రమ తగ్గడంతో పాటు ధర కూడ తక్కువే అవుతుందని రైతులు పేర్కొంటున్నారు. -
విధుల్లో చేరిన డీపీఎంలు
డొంకేశ్వర్(ఆర్మూర్): ఐకేపీలో బదిలీలు పూర్తి చేసుకున్న డీపీఎంలు వారికి కేటాయించిన ప్రాంతాలకు వెళ్లి విధుల్లో చేరారు. వేరే జిల్లాల నుంచి మన జిల్లాకు వచ్చిన మోహన్కు మార్కెటింగ్, రాజేశ్వర్కు పెన్షన్, కిరణ్కు ఫైనాన్స్ సెక్షన్లు ఇచ్చారు. అలాగే మన జిల్లాలోనే ఉన్న డీపీఎంలు నీలిమాకు ఐబీ, రాచయ్యకు జీవనోపాధుల విభాగాలను కేటాయించారు. విధుల్లో చేరి సెక్షన్ల బాధ్యతలు చేపట్టిన డీపీఎంలు మంగళవారం డీఆర్డీవో సాయాగౌడ్ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈసందర్భంగా డీఆర్డీవో డీపీఎంలకు శుభాకాంక్షలు తెలిపారు. బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని, ఎలాంటి ఫిర్యాదులు రాకుండా పని చేయాలని వారికి సూచించారు. -
సంఘ సభ్యుడి మృతి: ఆర్థికసాయం అందజేత
డిచ్పల్లి: తమ సంఘంలోని సభ్యుడు మృతిచెందగా, బాధిత కుటుంబానికి ఆర్థికంగా చేయూతనందించడానికి రూ.3.10లక్షల నగదును అందించింది బహ్రెయిన్ సంఘం. మండలంలోని ఖిల్లా డిచ్పల్లి గ్రామానికి చెందిన పట్నం చిన్న లక్ష్మణ్ గతంలో బతుకుదెరువు కోసం బహ్రెయిన్ దేశానికి వెళ్లాడు. అక్కడ గ్రామానికి చెందిన వలస కార్మికులతో కలిసి బహ్రెయిన్ సంఘం ఏర్పాటు చేసుకున్నారు. ప్రతినెలా డబ్బు జమ చేస్తూ, సంఘ సభ్యుల్లో అవసరమైన వారికి ఇచ్చేవారు. సంఘ సభ్యుడిగా ఉన్న లక్ష్మణ్ కరోనా సమయంలో స్వగ్రామానికి వచ్చి, లాక్డౌన్ వల్ల తిరిగి వెళ్లలేకపోయాడు. ఈక్రమంలో అనారోగ్యంతో మృతిచెందాడు. దీంతో అతడి కుటుంబాన్ని ఆదుకోవడానికి సంఘం సభ్యులందరు జమ చేసిన రూ.3.10 లక్షల నగదు మంగళవారం లక్ష్మణ్ భార్య విజయకు అందించారు. -
డబుల్ ఇంజిన్ సర్కార్తో లాభం లేదు
జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్కకు ఘన స్వాగతంమోపాల్: నగరంలో నిర్వహించిన నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గస్థాయి సమావేశానికి హాజరైన జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్కకు మంగళవారం రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, పీసీసీ డెలిగేట్, నిర్మల్ జిల్లా పరిశీలకులు బాడ్సి శేఖర్గౌడ్ ఘన స్వాగతం పలికారు. ఈసందర్భంగా ఆమెను శాలువాతో సన్మానించారు.నిజామాబాద్ సిటీ: ఇటీవల జిల్లాకు వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్షా డబుల్ ఇంజిన్ సర్కార్ వ స్తుందని మాట్లాడుతున్నారని, డబుల్ ఇంజిన్ స ర్కార్తో ఏమీ లాభం లేదని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. నగరంలో మంగళవారం ని ర్వహించిన ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్లమెంటరీ వి స్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. బీ జేపీ పాలిత రాష్ట్రాల్లో ఎలాంటి అభివృద్ధి లేదన్నా రు. తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథ కాలు డబుల్ ఇంజిన్ సర్కార్ ఉన్న రాష్ట్రాల్లో ఎందు కు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. రేషన్ దు కాణాల్లో మోదీ బొమ్మ పెట్టాలనడం అర్థరహితమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకా లు అమలుచేస్తున్నా, వాటిని క్షేత్రస్థాయిలో ప్రచా రం చేయడంలో మాత్రం వెనుకబడి ఉన్నామన్నా రు. ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మాట్లాడుతూ.. రా బోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చా టాలన్నారు. విభేదాలు పక్కనపెట్టి అంతా కలిసి మెలిసి పనిచేయాలన్నారు. ఎమ్మెల్సీ జీవన్రెడ్డి మా ట్లాడుతూ.. పాత, కొత్త తేడా లేకుండా కార్యర్తలు, నాయకులు కలిసిమెలిసి పనిచేయాలన్నారు. బోధ న్ ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి మాట్లాడుతూ.. సీఎం రే వంత్రెడ్డి అమలుచేస్తున్న పథకాలు చూసి బీఆర్ఎ స్ నాయకులు అసూయపడుతున్నారన్నారు. రూర ల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి మాట్లాడుతూ.. పసుపు బోర్డుతో కాకుండా, మద్దతు ధర లభించినప్పుడే పసుపు రైతుల కళ్లల్లో ఆనందం వస్తుందన్నారు. కార్యక్రమంలో జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్ తదితరులు మాట్లాడారు. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ నగరంలో ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్లమెంటరీ విస్తృత స్థాయి సమావేశం -
ఉచిత శిక్షణ.. ఉపకార వేతనం
నందిపేట్: పేద విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు తన మేధాశక్తిని పంచుతూ స్టడీ మెటీరియల్ను అందిస్తున్నాడు నందిపేట్ మండలం లక్కంపల్లికి చెందిన సౌదారి సాగర్. గత 15 ఏళ్లుగా 76 మంది పేద విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు పునాదులు వేశాడు. ప్రతి ఏడాది కేంద్ర ప్రభుత్వం నేషనల్ మీన్స్ మెరిట్ స్కాలర్షిప్ (ఎన్ఎంఎంఎస్) పేరిట ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద పిల్లలకు ఉపకార వేతనాలు అందిస్తుంది. 8వ తరగతి అర్హత సాధిస్తే ఇంటర్ వరకు నాలుగేళ్ల పాటు నెలకు రూ. వెయ్యి ఉపకార వేతనం అందిస్తుంది. ఇలా ఒక్కో విద్యార్థికి రూ. 48 వేలు ఆర్థిక సహాయం అందుతుంది. అత్యంత కీలకమైన పది, ఇంటర్ చదువులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ సాయం ఆసరా అవుతుంది. కాగా ఇందుకుగాను ఎన్ఎంఎంఎస్ పరీక్షలో మంచి మార్కులు సాధిస్తే ఉపకార వేతనాలకు ఎంపికవుతారు. 15 ఏళ్లుగా శిక్షణ.. ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసించే విద్యార్థులు పడుతున్న కష్టాలను స్వయంగా అనుభవించిన సాగర్ వారిలో ఉత్సాహం, ఉత్తేజం నింపేందుకు వారి తల్లిదండ్రులు ప్రోత్సహించేలా వెన్నుతట్టాడు. ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద విద్యార్థులకు చేతనైనంత సాయం చేయాలని భావించిన సాగర్ గత 15 ఏళ్లుగా 2009 నుంచి ఉచితంగా ఎన్ఎంఎంఎస్ పరీక్షలకు విద్యార్థులకు సన్నద్ధం చేసేందుకు బోధించడం మొదలుపెట్టాడు. ఉన్నంతలో పుస్తకాలు, స్టడీ మెటీరియల్ అందించి విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నాడు. కీలకమైన మేధానైపణ్యంపై దృష్టిపెట్టి శిక్షణ అందిస్తూ వారిని ముందుకు నడిపిస్తున్నాడు. ఇలా ఇప్పటి వరకు 76 మంది విద్యార్థులు ఎన్ఎంఎంఎస్ ప్రతిభా పరీక్షకు ఎంపికయ్యారు. వారంతా ఇప్పుడు ఐఐటీ, ఐఐఐటీల్లో చదువుతున్నారు. ఎన్ఎంఎంఎస్ కోసం విద్యార్థులకు శిక్షణ పదిహేను ఏళ్లుగా ఉదారంగా సేవలందిస్తున్న సౌదారి సాగర్పేద విద్యార్థుల కోసం.. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు హైస్కూల్, ఇంటర్ స్థాయిలో ఆర్థికపరమైన ఇబ్బందులతో అనేక మంది చదువుకు దూరమవుతున్నారు. కేంద్రం అందించే ఉపకార వేతనం అందితే వారికి ఎంతో చేయూత కలుగుతుందని భావించాను. నాకున్న ఖాళీ సమయాన్ని వారి కోసం వినియోగిస్తున్నాను. – సౌదారి సాగర్, లక్కంపల్లి, నందిపేట -
నాటి మా రాముని పల్లెనే.. నేటి మారంపల్లి
మీకు తెలుసా? గోదావరి సమీపంలో ఉన్న మారంపల్లికి తెలుసుకోదగిన చరిత్ర ఉంది. రాముడు గంగానది వెంట పరిక్రమణ చేసినట్లు స్థల పురాణం ఉంది. ఎస్సారెస్పీలో ముంపునకు గురైన పాత కుస్తాపురం శివలింగాన్ని స్వయంగా రాముడే ఇసుకతో తయారు చేసినట్లు చరిత్ర ఉంది. రాముడు తిరిగిన నేల కావడంతో ఆయనపై ప్రేమతో ‘మా రాముని పల్లె’గా నామకరణం చేశారు. కాలక్రమేనా అది మారంపల్లిగా మారింది. ● సుమారు 300 ఏళ్ల క్రితం మా రాముని పల్లెను స్థాపించుకున్నారు. మొదట ఇక్కడ 15 నుంచి 20 ఇళ్లు మాత్రమే ఉండేవి. ప్రస్తుతం 660 వరకు ఉన్నాయి. వ్యవసాయ భూములు కలుపుకొని ఊరి పూర్తి విస్తీర్ణం సుమారు 1,150 ఎకరాలు. ● ఊరిలో ఒకప్పుడు పెద్ద గడీ ఉండేది. ఈ గడీ గుండానే అప్పటి రాజులు, దొరలు పాలించేవారు. గడీ కూలిపోయి చాలా సంవత్సరాలు అవుతుంది. ● గ్రామానికి నలుదిక్కులా ఆరు చెరువులు ఉన్నాయి. వాటి పేర్లు సత్తర్కుంట, నాంకుంట, చించెరు, పెద్దచెరు, బందం కుంట, కమ్మరి కుంట. వీటిని ఇప్పటికీ ఇలాగే పిలుస్తున్నారు. వానాకాలంలో ఇవి పూర్తిగా నిండి ఊరు ఒక ద్వీపం మాదిరిగా కనిపిస్తుంది. ● ఊరు కళాకారులకు నిలయమని చెప్పవచ్చు. అప్పట్లో నాటకాలు వేయడంలో ప్రసిద్ధులు. నేటి తరం దానిని అందిపుచ్చుకుని ఇప్పుడు భజనలు, కీర్తనలు చేస్తున్నారు. ● 1959లో ఊరిలో ప్రభుత్వ పాఠశాల ఏర్పాటు కాగా, 1966లో గ్రామానికి మొదటి సర్పంచ్గా కృష్ణారెడ్డి పనిచేశారు. – డొంకేశ్వర్(ఆర్మూర్) -
నత్తనడకన బదిలీలు.. నిరాశలో సెర్ప్ సిబ్బంది
డొంకేశ్వర్(ఆర్మూర్): సెర్ప్ ఉద్యోగుల బదిలీల ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. బదిలీల జీవో వచ్చి రెండు నెలలు దాటినా ప్రక్రియను పూర్తిచేయకుండా రాష్ట్ర శాఖ అధికారులు సాగదీస్తున్నారు. కేవలం ఏపీడీ, డీపీఎంల బదిలీలను నిర్వహించిన ఉన్నతాధికారులు ఏపీఎంలు, సీసీలు, ఇతర ఉద్యోగుల విషయంలో నాన్చుతున్నారు. దీంతో పక్షం రోజుల్లో పూర్తయ్యే బదిలీలకు నెలలు గడుస్తున్నాయని సిబ్బంది వాపోతున్నారు. జిల్లాలో సుమారు 200 మంది.. గ్రామీణాభివృద్ధి శాఖలో ఐకేపీ ఉద్యోగులకు గత ప దేళ్లుగా బదిలీలు లేవు. రాష్ట్ర ఉన్నతాధికారులపై ఒ త్తిడి పెట్టి ఇటీవల ఏపీడీ, డీపీఎంలు బదిలీలు పూర్తి చేసుకున్నారు. మండల స్థాయిలో పని చేసే ఏపీఎంలు, సీసీలు స్థానచలనం కోసం ఆప్షన్లు పెట్టుకుని బది లీల కోసం వేచి చూస్తున్నారు. జిల్లాలో బదిలీల కో సం వేచి చూస్తున్న ఏపీఎంలు 30మంది, సీసీలు 165 వరకు ఉండగా ఇతర సిబ్బంది 10మంది ఉన్నారు. ఈ నెలాఖరు నాటికి సెర్ప్లో అన్ని కేడర్ ఉద్యోగుల బదిలీలు పూర్తి కావాల్సి ఉండగా, ఉన్నతాధికారులు సాగదీయడం పట్ల ఏపీఎంలు, సీసీలు అసంతృప్తిగా ఉన్నారు. బదిలీలు ఆలస్యమైతే స్థానిక సంస్థల ఎలక్షన్ కోడ్ వచ్చే అవకాశముందని భయపడుతున్నారు. అదే జరిగితే రాకరాక వచ్చిన అవకాశం ఎక్కడ చేజారిపోతుందని వారు ఆందోళన చెందుతున్నారు. జిల్లాకు చేరని సీనియారిటీ లిస్టు.. ఏపీఎంలు, సీసీల బదిలీలకు సంబంధించిన ప్రక్రియ ఇంకా ముందుకు కదల్లేదు. జిల్లాలో పని చేస్తున్న వారందరి సీనియారిటీ లిస్టును రాష్ట్ర అధికారులు తెప్పించుకున్నారు. దానిని పరిశీలించి జిల్లాకు పంపాల్సి ఉంది. కానీ, సీనియారిటీ జాబితా ఇంత వరకు జిల్లాకు రాలేదు. జోనల్ స్థాయి ప్రకారమా? లేదా జిల్లా స్థాయా? ఎలా నిర్ణయించి జాబితాను పంపుతారానేది స్పష్టత లేదు. జిల్లా కలెక్టర్కు లిస్టు అందిన తర్వాత ఏపీఎంలు, సీసీలకు బదిలీలకు కౌన్సెలింగ్ చేపట్టనున్నారు. ఇదంతా జరిగే సరికి మరో పదిహేను రోజులు పట్టే పరిస్థితి కనిపిస్తోంది. ఎన్నికల కోడ్ రాకముందే తమ బదిలీలు కూడా పూర్తి చేయాలని వారు ఉన్నతాధికారులను కోరుతున్నారు. జీవో వచ్చి రెండు నెలలు దాటినా పూర్తికాని ప్రక్రియ ఎక్కడ ఎలక్షన్ కోడ్ వస్తుందోనని భయం -
పరీక్ష ఫీజు చెల్లించండి
తెయూ(డిచ్పల్లి): తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలో బీఈడీ, బీపీఎడ్ రెండో, నాల్గో సెమిస్టర్ రెగ్యులర్ (2024–25), బ్యాక్ లాగ్ (2021 విద్యా సంవత్సరం) 1, 2, 3, 4 సెమిస్టర్ పరీక్ష ఫీజును ఈనెల 14వరకు చెల్లించాలని కంట్రోలర్ సంపత్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. రూ. 100 అపరాధ రుసుంతో ఈనెల 15 వరకు ఫీజు చెల్లించే అవకాశం ఉంటుందని కంట్రోలర్ తెలిపారు. పూర్తి వివరాల కోసం తెలంగాణ వర్సిటీ వెబ్సైట్ను సంప్రదించాలని సూచించారు రాష్ట్రస్థాయి ఫుట్బాల్ టోర్నమెంట్ విజేత రంగారెడ్డి● రన్నర్గా నిజామాబాద్ ● విజేతలకు ట్రోఫీ ప్రదానం చేసిన సీపీ సాయి చైతన్య నిజామాబాద్ నాగారం/ఖలీల్వాడి: జిల్లాకేంద్రంలోని రాజారాం స్టేడియంలో నాలుగు రోజులుగా సాగిన రాష్ట్రస్థాయి ఫుట్బాల్ టోర్నమెంట్ పోటీలు మంగళవారం ముగిశాయి. పోటీల్లో వి జేతగా రంగారెడ్డి జిల్లా జట్టు నిలువగా, రన్నర్గా నిజామాబాద్ జట్టు నిలిచింది. ముగింపు కార్యక్రమానికి సీపీ సాయిచైతన్య ముఖ్య అతిథిగా హాజరై, విజేతలకు బహుమతులు ప్రదానం చేశా రు. ఈసందర్భంగా సీపీ మాట్లాడుతూ.. ఆటలో గెలుపు ఓటములు సహజమని, క్రీడా స్ఫూర్తితో ఆడాలన్నారు. విన్నర్, రన్నర్ టీమ్లను అభినందించారు. ఫుట్బాల్ అసోసియేషన్ ప్రతినిధులు, జావిద్, కరీం, ఒలింపిక్ సంఘం ప్రతినిధులు బొబ్బిలి నర్సయ్య, కోచ్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
ఒకరి ఆత్మహత్య
వర్ని: మోస్రా మండలం చింతకుంట గ్రామంలో ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ నాంపల్లి రాములు(53) మంగళవారం ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు వర్ని ఎస్ఐ మహేష్ వెల్లడించారు. రాములు మృతికి గల కారణాలు తెలియరాలేదని అతడి తల్లి పోశవ్వ ఫిర్యాదులో పేర్కొంది. ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు. గుర్తుతెలియని వ్యక్తి మృతి ఖలీల్వాడి: నగరంలోని పులాంగ్ వాగు వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందినట్లు నాలుగో టౌన్ ఎస్సై శ్రీకాంత్ మంగళవారం తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలానికి వెళ్లి, వివరాలు సేకరించారు. మృతుడు చిత్తు కాగితాలు ఏరుకునే వ్యక్తిగా కనిపిస్తున్నట్లు తెలిపారు. గత కొద్దిరోజులుగా ఇక్కడే చుట్టుపక్కల తిరుగుతూ రోడ్డుపై పడుకుంటున్నట్లు పేర్కొన్నారు. మృతుడి వయస్సు సుమారు 55 నుంచి 60 ఏళ్ల మధ్య ఉండొచ్చని భావిస్తున్నారు. అతడు బ్రౌన్ కలర్ నైట్ ప్యాంట్ ధరించాడని, ఎవరికై నా తెలిసినట్లయితే పోలీస్ స్టేషన్లో గాని, 8712659840, 8712659719ను సంప్రదించాలని సూచించారు.గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం కామారెడ్డి క్రైం: కామారెడ్డి రైల్వే స్టేషన్ మూడో ప్లాట్ఫాం పక్కనే ఉన్న ఓ గుంతలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. స్థానికులు మంగళవారం మృతదేహాన్ని గుర్తించి, పోలీసులకు సమాచారం అందించగా, పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరిపారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదు. అతడి వయస్సు 30–40 ఏళ్ల మధ్య ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతుడు నలుపు, తెలుపు రంగుల పూల షర్టును ధరించాడన్నారు. మృతదేహాన్ని కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. మృతుడి ఆనవాళ్లు తెలిసిన వారు పట్టణ పోలీసులను సంప్రదించాలని ఎస్హెచ్వో నరహరి కోరారు. డ్రంకన్డ్రైవ్ కేసులో పలువురికి జైలు ఖలీల్వాడి: నిజామాబాద్ డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధుల్లో ఇటీవల డ్రంకన్డ్రైవ్ తనిఖీలు నిర్వహించగా, 17మంది మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డట్లు ఏసీపీ రాజావెంకట్ రెడ్డి తెలిపారు. వారికి మంగళవారం సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులు కౌన్సెలింగ్ నిర్వహించి, జిల్లా కోర్టులో హాజరుపరిచినట్లు పేర్కొన్నారు. మేజిస్ట్రేట్ నూర్జహాన్ బేగం వారిలో ఆరుగురికి జరిమానా వేయగా, ఆరుగురికి ఒక రోజు, ఐదుగురికి రెండు రోజుల జైలు శిక్ష విధించారు. నవీపేట: నవీపేట శివారులో పోలీసులు ఇటీవల డ్రంకన్డ్రైవ్ తనిఖీలు నిర్వహించగా ఓ వ్యక్తి మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడ్డాడు. పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి, మంగళవారం నిజామాబాద్ కోర్టులో హాజరుపర్చారు. జడ్జి అతడికి 7రోజుల జైలుశిక్ష విధించారు. మోత్కూర్ పోలీసుల అదుపులో జిల్లా వృద్ధుడు ఖలీల్వాడి: నిజామాబాద్ జిల్లాకు చెందిన వృద్ధుడు యాద్రాది జిల్లా మోత్కూర్ పోలీసుల అదుపులో ఉన్నట్లు నాలుగో టౌన్ ఎస్సై శ్రీకాంత్ మంగళవారం తెలిపారు. నిజామాబాద్కు చెందిన దండు గోవర్ధన్(60) అనే వృద్ధుడు మోత్కూర్లో సంచరిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన వ్యక్తి కావడంతో ఇక్కడి పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. ఇతని వివరా లు తెలిసినవారు మోత్కూర్ పీఎస్ 70970 52763 లేదా నాలుగో టౌన్ పోలీసులు 87126 59840, 8712659719ను సంప్రదించాలన్నారు. -
భూ సేకరణ, చెల్లింపులు వేగవంతం చేయాలి
● అభివృద్ధి పనుల్లో జాప్యం జరగొద్దు ● కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి నిజామాబాద్అర్బన్: జిల్లాలో చేపట్టే రోడ్ల విస్తరణ, ఇతర అభివృద్ధి పనుల్లో జాప్యం జరగొద్దని, ఇందుకోసం భూ సేకరణ ప్రక్రియ, చెల్లింపులు త్వరితగతిన జరిగేలా చూడాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. నగరంలోని ఐడీవోసీ సమావేశ హాల్లో మంగళవారం వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. బోధన్–బాసర్–భైంసా రోడ్డు నిర్మాణానికి సేకరించిన భూమికి సంబంధించిన చెల్లింపులు త్వరితగతిన జరిగేలా చూడాలన్నారు. అలాగే ఇతర అభివృద్ధి పనుల కోసం భూసేకరణ ప్రక్రియకు సంబంధించి రైతులతో సంప్రదింపులు జరుపుతూ, నష్టపరిహారం నిర్ణయంలో సానుకూల ధోరణిని అవలంభించాలని సూచించారు. నిబంధనలకు అనుగుణంగా వ్యవహరిస్తూ, భూసేకరణపై పెండింగ్లో ఉన్న అప్పీల్లను వేగంగా పరిష్కరించాలని అన్నారు. వారం అనంతరం భూసేకరణపై మళ్లీ సమీక్ష చేస్తామని, స్పష్టమైన ప్రగతి కనిపించాలని సూచించారు. అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, నిజామాబాద్, ఆర్మూర్ ఆర్డీవోలు రాజేంద్ర కుమార్, రాజాగౌడ్, ఎస్సారెస్పీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాజేందర్, కలెక్టరేట్ పర్యవేక్షకుడు భాస్కర్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. -
రెండే గదుల్లో నాలుగు తరగ తులా..?
నిజామాబాద్ లీగల్: ఒకటి నుంచి నాలుగో తరగతి వరకు రెండే తరగతి గదుల్లోనే పాఠశాల నిర్వహిస్తున్నారా అని సీనియర్ సివిల్ జడ్జి ఉదయ్ భాస్కర్ రావు ఉపాధ్యాయులను ప్రశ్నించారు. సోమవారం నగరంలోని ధర్మపురిహిల్స్లో ఉన్న ప్రాథమిక పాఠశాలను జడ్జి తనిఖీ చేశారు. పాఠశాల ఆవరణలో ఖాళీ బీరు బాటిల్స్, పాన్ పరాగ్ లాంటి వస్తువులు ఉండటం గమనించారు. రాత్రి వేళల్లో అసాంఘిక శక్తులకు పాఠశాల అడ్డాగా మారకుండా చూడాలని ఉపాధ్యాయులకు సూచించారు. రాత్రి వేళ పోలీసులు పెట్రోలింగ్ చేసేలా ఆదేశాలు జారీ చేస్తామని, హెచ్ఎం పోలీసులకు ఫిర్యాదు చేయాలని జడ్జి సూచించారు. -
ప్రభుత్వ టీచర్లు అంకితభావంతో పనిచేయాలి
నిజామాబాద్అర్బన్: ప్రభుత్వ బడుల్లో నిష్ణాతులైన ఉపాధ్యాయులు ఉన్నారని, వారు అంకితభావంతో విధులు నిర్వర్తిస్తూ నాణ్యమైన విద్యను బోధిస్తే మరింత మెరుగైన ఫలితాలు సాధించవచ్చని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. నగరంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం పదో తరగతిలో అత్యుత్తమ మార్కులు సాధించి, టాపర్లుగా నిలిచిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు జిల్లా విద్యా శాఖ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా విద్యార్థులను ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సన్మానించారు. అలాగే వంద శాతం ఉత్తీర్ణత సాధించిన పల్లికొండ, డొంకేశ్వర్, రాంపూర్, మెండోరా, అమ్రాద్, చౌట్పల్లి, జక్రాన్పల్లి, మోస్రా, కల్లెడి, రెంజల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులను కూడా సత్కరించారు. ప్రభుత్వ బడుల్లో అత్యధికంగా విద్యార్థులను చేర్పించిన బోర్గం(పి) హైస్కూల్, బోధన్ రాకాసిపేట్ బాలికల ఉన్నత పాఠశాల, చిట్టాపూర్ ప్రైమరీ స్కూల్, తుంపల్లి ప్రైమరీ స్కూల్, ఫులాంగ్ బాలుర ఉచ్ఛతర ప్రాథమిక పాఠశాలల హెచ్ఎంలను సత్కరించారు. సోమవారం పదవీ విరమణ చేసిన ముగ్గురు ఎంఈవోలు, ముగ్గురు హెచ్ఎంలను సన్మానించి వీడ్కోలు తెలిపారు. రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్బిన్ హందాన్, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ, రైతు కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, అదనపు కలెక్టర్ అంకిత్, డీఈవో అశోక్ తదితరులు పాల్గొన్నారు. -
పోచంపాడ్లో పిచ్చికుక్కల స్వైర విహారం
బాల్కొండ: మెండోరా మండలం పోచంపాడ్లో సోమవారం ఉదయం పిచ్చి కుక్కలు స్వైర విహారం చేశాయి. గ్రామంలో వీధుల గుండా కనిపించిన వారిపై దాడి చేశాయి. దీంతో ముగ్గురుకి తీవ్ర గాయాలయ్యాయి. గ్రామానికి చెందిన రజిత చేతిపై, విఠల్, విష్ణులకు కంటి, కాలి భాగాలపై దాడి చేసి గాయపర్చాయి. వెంటనే స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందించారు. పోచంపాడ్లో వీధి కుక్కులు ఎక్కువ కావడంతో కనిపిస్తే కరుస్తున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డీఎస్ విగ్రహావిష్కరణలో దొంగల చేతివాటంనిజామాబాద్ రూరల్: కంఠేశ్వర్ బైపాస్ సిగ్నల్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన డీఎస్ విగ్రహావిష్కరణలో కేంద్ర మంత్రి అమిత్షా చేతుల మీదుగా జరిగిన విషయం తెలిసిందే. ఈ ఆవిష్కరణలో మారుతినగర్కు చెందిన ప్రభుత్వ ఉద్యోగి కాసుల రఘు, అలాగే బాశెట్టి గంగాధర్కు చెందిన బంగారు గొలుసులను గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించినట్లు రూరల్ ఎస్హెచ్వో ఆరిఫ్ తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అంతర్జిల్లా దొంగల ముఠా రిమాండ్● 12 తులాల బంగారం, బైక్ స్వాధీనం వేములవాడ: వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్జిల్లా దొంగల ముఠాను రిమాండ్కు తరలించినట్లు వేములవాడ పోలీసులు సోమవారం తెలిపారు. వేములవాడ టౌన్ పీఎస్లో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎస్పీ మహేశ్ బీ గీతే వివరాలు వెల్లడించారు. జగిత్యాల జిల్లాకు చెందిన బోదాసు మహేశ్ నిజామాబాద్ జిల్లాకు చెందిన గద్దల స్వప్న, విశాల్సింగ్, జగిత్యాల జిల్లాకు చెందిన నేరెళ్ల శ్రీనివాస్, నేరెళ్ల రాణి, గోత్రాల బాలమణి ముఠాగా ఏర్పడి ఆర్మూర్, నిజామాబాద్, వేములవాడ, కోనరావుపేట, బోయినపల్లి ప్రాంతాల్లో గత రెండు నెలలుగా దొంగతనాలకు పాల్పడ్డారు. టెక్నాలజీ సాయంతో వీరు వేములవాడ సమీపంలో తిప్పాపూర్ బస్టాండ్ ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 12 తులాల బంగారం, ఒక బైక్ను స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. దొంగలను పట్టుకున్న వేములవాడ టౌన్ సీఐ వీరప్రసాద్, ఎస్సైలు అనిల్కుమార్, వెంకట్రాజం, సిబ్బంది గోపాల్, పంతులు, లత, సాహెబ్ హుస్సేన్, దేవేందర్, సమియుద్దీన్ను అభినందించారు. నలుగురు కానిస్టేబుళ్లకు పదోన్నతిఖలీల్వాడి: నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నలుగురు కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుళ్లలుగా పదోన్నతి పొందారు. పదోన్నతి పొందిన కానిస్టేబుళ్లు ఎండీ తయ్యబ్ అలీ(మోర్తాడ్), ఈ ఈశ్వర్(ఇందల్వాయి), పి రాకేశ్(నిజామాబాదు రూరల్), ఎన్ వెంకట్ రామ్(సీసీఎస్, నిజామాబాద్) సీపీ సాయిచైతన్యను సోమవారం సీపీ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం సీపీ సిబ్బందిని అభినందించారు. -
నీవు లేని జీవితం నాకొద్దని..
వర్ని: ప్రేమతో వారిద్దరి మనసులు కలిశాయి. వివాహ బంధంతో ఒక్కటయ్యారు. జీవితాంతం ఒకరికొకరు కష్టసుఖాల్లో తోడునీడగా ఉండాలని భావించారు. కానీ విధి ఆడిన వింత నాటకంలో భార్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా ఆమె మృతుని తట్టుకోలేని భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన వర్ని మండలం వడ్డేపల్లిలో సోమవారం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. రుద్రూర్ మండలం అంబం గ్రామానికి చెందిన ఎరుకల పోశెట్టి(25) వడ్డేపల్లిలో ఉండే తన బంధువుల ఇంట్లో చిన్న నాటి నుంచి ఉంటున్నాడు. అదే గ్రామానికి చెందిన అనితను ఆరు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరి జీవితం సాఫీగా సాగుతుందనుకుంటున్న సమయంలో ఇటీవల ఆమె అనారోగ్యంతో మృతి చెందింది. ఆమె మృతిని తట్టుకోలేని పోశెట్టి తన ఇంటి సమీపంలోని చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి అన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మహేశ్ తెలిపారు. భార్య మృతి తట్టుకోలేక భర్త ఆత్మహత్య -
ప్రజావాణి అర్జీలను పరిష్కరించాలి
నిజామాబాద్అర్బన్: ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో వచ్చే ఫిర్యాదులకు త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 127 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్తో పాటు, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, ట్రెయినీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావీ, డీఆర్డీవో సాయాగౌడ్, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, మెప్మా పీడీ రాజేందర్కు అర్జీలను సమర్పించారు. అర్జీలను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఫిర్యాదులపై చేపట్టిన చర్యలను వివరిస్తూ అర్జీదారులకు సమాచారం అందించాలన్నారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి -
మొక్కలు నాటి వాటిని సంరక్షించాలి
డిచ్పల్లి: పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నివారణ కోసం ప్రతి ఒక్కరూ తమ ఇంటి వద్ద 6 మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని డిచ్పల్లి ఎంపీడీవో బుక్య లింగం నాయక్ సూచించారు. సోమవారం మండలంలోని ఘన్పూర్ గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో పలువురు మహిళలకు మొక్కలు అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీ నర్సరీలో 10వేల మొక్కలు ఉండగా అందులో గ్రామంలోని ఇంటికి 6 మొక్కల చొప్పున 6,626 మొక్కలు పంపిణి చేస్తున్నట్లు తెలిపారు. మిగిలిన గ్రామాల్లో ఇలాగే ఇంటికి ఆరు మొక్కలు పంపిణీ చేయాలని ఆయన సూచించా రు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రమే ష్,సిబ్బంది,మహిళలు తదితరులు పాల్గొన్నారు. -
జీపీ నిర్మాణ పనులకు భూమిపూజ
డిచ్పల్లి: డిచ్పల్లి మండలం అమృతాపూర్ గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణ పనులకు సోమవారం మండల కాంగ్రెస్ అధ్యక్షుడు అమృతాపూర్ గంగాధర్ భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా గంగాధర్ మాట్లాడుతూ.. ప్రస్తుతం ఉన్న జీపీ భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి నూతన భవనం నిర్మాణం కోసం రూ.20లక్షలు నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. భవన నిర్మాణ పనులను నాణ్యతతో చేపట్టాలని కాంట్రాక్టర్కు సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు శ్యాంసన్, ధర్మాగౌడ్, గంగాధర్గౌడ్, నర్సయ్య, బాలయ్య, కృష్ణ, పీఆర్ ఏఈ శ్రీధర్, పంచాయతీ కార్యదర్శి భూలక్ష్మి, గ్రామపెద్దలు తదితరులు పాల్గొన్నారు. -
అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి
నిజామాబాద్ రూరల్: అన్ని వర్గాల అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని రూరల్ ఎమ్మెల్యే రేకులపల్లి భూపతి రెడ్డి అన్నారు. సోమవారం నగరంలోని రూరల్ ఎమ్మెల్యే కాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేను జక్రాన్పల్లి మండల రజక సంఘ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువా, పుష్పగుచ్ఛంతో సన్మానించారు. మండలంలోని అర్గుల్ గ్రామంలో చాకలి ఐలమ్మ విగ్రహ ఆవిష్కరణకు రావాలని వారు ఎమ్మెల్యేను ఆహ్వానించారు. కార్యక్రమంలో రజకసంఘం మండల అధ్యక్షుడు చిన్నరెడ్డి, ఉపాధ్యక్షుడు సుధాకర్, సభ్యులు ప్రభాకర్, గంగాధర్, నారాయణ, జైపాల్. మైపాల్, రాజు, శివకుమార్, శ్రీనివాస్, స్వామి, నాగరాజ్, తదితరులు పాల్గొన్నారు. -
పేదలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం
నిజామాబాద్అర్బన్ : పేదలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ ఆలీ అన్నారు. సోమవారం ఆర్అండ్బీ గెస్ట్హౌస్లో 27మంది బాధితులకు రూ.16 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆయన పంపిణీ చేశారు.ఈ సందర్భంగా షబ్బీర్ ఆలీ మాట్లాడుతూ..అర్హులకు ఇందిరమ్మ ఇల్లు, కొత్త రేషన్ కార్డులు అందిస్తామన్నారు. జిల్లా కేంద్రంలోని ఎమ్ఆర్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను షబ్బీర్ ఆలీ అందించారు. అర్బన్ నియోజకవర్గంలో 1300 మంది లబ్ధిదారులను ఎంపిక కాగా, త్వరలోనే ఇంకా 2200 మంది లబ్ధిదారులను ఎంపిక చేస్తామన్నారు. పెండింగ్లో ఉన్న బెస్ట్ అవైలబుల్ స్కీం బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ నాయకులు షబ్బీర్ ఆలీకి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ, జిల్లా కార్యదర్శి రాచకొండ విగ్నేష్, బొర్రా నాగరాజు మాట్లాడుతూ ప్రభుత్వం గత రెండేళ్లుగా రూ. 300 కోట్లు చెల్లించడంలేదన్నారు. దీంతో దళిత గిరిజన విద్యార్థుల చదువుకు కోత పడే అవకాశం ఉందన్నారు. నగరంలోని ఇంపీరియల్ గార్డెన్లో షాహిన్ కాలేజ్ విద్యార్థుల సన్మాన కార్యక్రమంలో షబ్బీర్ ఆలీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా షబ్బీర్ ఆలీ మాట్లాడుతూ ముస్లింల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందన్నారు. షాహిన్ కాలేజీలో 22 మంది విద్యార్థులకు 4 శాతం రిజర్వేషన్ ద్వారా ఎంబీబీఎస్ సీట్లు సాధించడంపై హర్షం వ్యక్తం చేశారు. వైఎస్ రాజశేఖర్రెడ్డి హయంలో ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు చేసిన ఘనత ఉందన్నారు. ఈకార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, షాహిన్ కాలేజీ యాజమాన్యం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ ఆలీ -
అమిత్ షా దిష్టిబొమ్మ దహనం
నిజామాబాద్ సిటీ: కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిజామాబాద్ పర్యటనలో వామపక్ష పార్టీ, ప్రజాసంఘాల నాయకులను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో అమిత్ షా దిష్టిబొమ్మను ధర్నాచౌక్ వద్ద దహనం చేశారు. సోమవారం ఎన్టీఆర్ చౌరస్తా వరకు ర్యాలీగా వెళ్లి అమిత్ షా దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ.. ముందస్తు పేరుతో అరెస్టు చేసి పోలీస్స్టేషన్లలో నిర్బంధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఎలాంటి ఆందోళనలకు, నిరసనలకు పిలుపు ఇవ్వకున్నా ముందస్తు పేరుతో అరెస్టులు చేయడం అన్యాయమన్నారు. ఇది వ్యక్తిగత స్వేచ్ఛను హరించడమే అవుతుందన్నారు. కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ప్రముఖులు జిల్లా పర్యటనకు వచ్చినప్పుడల్లా ఇలా ముందస్తు పేరుతో అరెస్టులు చేయడం పోలీసులకు పరిపాటిగా మారిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. అమిత్ షా జిల్లా పర్యటనతో ప్రజలకు, రైతులకు ఎలాంటి లబ్ధి చేకూరలేదన్నారు. పసుపు బో ర్డుకు అధికారులను, సిబ్బందిని, నిధులను కేటాయించాలని డిమాండ్ చేశారు.కార్యక్రమంలో నా యకులు కృష్ణ, ఎం నరేందర్, డి రాజేశ్వర్, కె గంగాధర్, ఎం సుధాకర్, డి కిషన్, కె గణేశ్, కిషన్, సజన్,గంగాధర్ చరణ్,సంతోష్,లక్ష్మి,వసంత్, సాయి లు,నరేశ్, ప్రణయ్ తదితరులు పాల్గొన్నారు. -
వనమహోత్సవానికి సర్వం సిద్ధం
ధర్పల్లి: పచ్చదనాన్ని పెంచేందుకు ఏటా వనమహోత్సవం కార్యక్రమాన్ని అధికారులు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ ఏడాది వానాకాలంలో మొక్కలు నాటేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. పట్టణాలు, పల్లెల్లో పచ్చదనం పెంచాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఏటా మొక్కలు పెంచే కార్యక్రమాన్ని చేపడుతోంది. ఇందులో భాగంగానే ఈ ఏడాది కూడా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందించారు. గత ప్రభుత్వం తెలంగాణ హరితహారం పేరుతో నాటిన మొక్కలు పెరిగి చెట్లుగా ఎదగడంతో గ్రామాల్లో పచ్చదనం కనువిందు చేస్తోంది. పల్లెల్లో, రహదారుల వెంట నాటిన మొక్కలు నీడనిస్తున్నాయి. ఇదే కార్యక్రమాన్ని ప్రస్తుత ప్రభుత్వం వన మహోత్సవం పేరుతో మొక్కలను నాటుతున్నారు. ఈ క్రమంలో జూలైలో మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు పేర్కొంటున్నారు. 22 జీపీల్లో.. ఈ ఏడాది కూడా వనమహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు నర్సరీలు లో పెంచిన మొక్కలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. వర్షాలతో పాటు ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే జూలై మొదటి వారంలో మొక్కలు నాటేందుకు సంబంధిత అధికారులు సమాయత్తమవుతున్నారు. ధర్పల్లి మండలంలోని 22 జీపీల్లో మొక్కలు పెంచేందుకు 21 నర్సరీలను ఏర్పాటు చేశారు. ఒక్కొక్క నర్సరీలో 8 వేల మొక్కల చొప్పున మండలంలో మొత్తం 1 లక్ష 76 వేల మొక్కలను గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా నర్సరీలో మొక్కలను పెంచారు. లక్ష్యానికి అనుగుణంగా అన్ని గ్రామాల్లో మొక్కలు నాటేందుకు అనువైన స్థలాలను ఇప్పటికే అధికారులు గుర్తించి గ్రామాల్లో గుంతలు తీసే ప్రక్రియను షురూ చేశారు. ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటనున్నారు. ఇళ్లల్లో పెంచేందుకు వీలుగా గ్రామాల్లో ఏర్పాటు చేసిన నర్సరీలో ఇళ్లల్లో పెంచేందుకు వీలుగా గులాబీ, మల్లె, జామ, దానిమ్మ, తులసి, ఉసిరి, నిమ్మ, బొప్పాయి, అల్లనేరేడు, ఆకాశమల్లి వంటి 20 రకాల మొక్కలతోపాటు ఇతర ప్రదేశాల్లో నాటేందుకు ఈత, తాటి మొక్కలు నాటేందుకు సిద్ధంగా ఉన్నాయి. ధర్పల్లి మండలంలో లక్షా 76 వేల మొక్కలు నాటాలని లక్ష్యం ఒక్కో నర్సరీలో 8 వేల వరకు మొక్కల పెంపకం గ్రామంలో గుంతలుతీసే ప్రక్రియ షురూ ప్రతి గ్రామానికి పంపిణీ చేస్తాం ప్రతి గ్రామంలో మొక్కల పంపిణీకి ఏర్పాట్లు సిద్ధం చేశాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు వర్షాలు పడగానే జూలై మొదటి వారంలో మొక్కలు నాటే కార్యక్రమం చేపడతాం. ప్రతి గ్రామంలో ఇచ్చిన లక్ష్యం మేరకు మొక్కలను నాటిస్తాం. – బాలకృష్ణ, ఎంపీడీవో, ధర్పల్లి -
పీసీసీ చీఫ్ను కలిసిన శ్యాం బాబు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : పీసీసీ చీఫ్ మహేష్ కుమార్గౌడ్ను మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ శ్యాంబాబు హైదరాబాద్లో మర్యాదపూర్వకంగా కలిశారు. సోమవారం గాంధీభవన్లో స్టేట్ లీగల్ సెల్ వైస్ చైర్మన్ దయాకర్గౌడ్, టీపీసీసీ క్రమశిక్షణ సంఘం సభ్యుడు జి.వి రామకృష్ణతో కలిసి వెళ్లారు.. తనను మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్గా నియమించినందుకు ధన్యవాదాలు తెలిపారు. లయన్స్క్లబ్ చైర్మన్గా అవన్కుమార్ నిజామాబాద్నాగారం: జిల్లాలోని నాలుగు లయన్స్ క్లబ్లకు జోన్ చైర్మన్గా నగరానికి చెందిన లయన్స్ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ పూర్వ అధ్యక్షుడు కాలేరు అవన్ కుమార్కు లయన్స్ ఇంటర్నేషనల్ జిల్లా గవర్నర్ అమర్నాథ్రావు సోమవారం నియామకపత్రం అందజేశారు. ఈ మేరకు జిల్లాలోని లయన్స్ క్లబ్ ఆఫ్ తెలంగాణ, నిజామాబాద్, డైమండ్, సెంట్రల్ క్లబ్లకు అవన్ కుమార్ జోన్ చైర్మన్గా వ్యవహరిస్తారు. లయన్స్ సేవలను మరింత విస్తృత పరుస్తానని అవన్కుమార్ పేర్కొన్నారు. జాతీయ స్థాయి హాకీ పోటీలకు ఎంపిక సిరికొండ: జాతీయ స్థాయి హాకీ పోటీలకు తూంపల్లి గ్రామానికి చెందిన క్రీడాకారిణి బైకన్ జశ్విత ఎంపికై నట్లు జెడ్పీహెచ్ఎస్ పీడీ సడాక్ నగే్శ్ సోమవారం తెలిపారు. తెలంగాణ హాకీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్యాంపులో ప్రతిభ కనబర్చి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై ందన్నారు. జార్ఖండ్ రాష్ట్రంలో జూలై 03 నుంచి 08 వరకు జరగనున్న జాతీయ స్థాయి సబ్ జూనియర్ పోటీల్లో జశ్విత పాల్గొననున్నట్లు పీడీ తెలిపారు. జశ్విత జాతీయ స్థాయి పోటీలకు ఎంపికవ్వడంపై ఎంఈవో రాములు, ఇన్చార్జి హెచ్ఎం మనోహర్, జిల్లా హకీ అసోసియేషన్ అధ్యక్షుడు విశాఖ గంగారెడ్డి, కార్యదర్శి రమణలు హర్షం వ్యక్తం చేశారు. ఫీజు నియంత్రణ చట్టం అమలు చేయాలి నిజామాబాద్అర్బన్ : ఫీజు నియంత్రణ చట్టం అమలు చేయాలని, అధిక ఫీజు వసూలు చేస్తున్న నారాయణ పాఠశాలపై చర్యలు తీసుకోవాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం పాఠశాల ఎదుట వారు ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా అ ధ్యక్ష ,కార్యదర్శులు రఘురాం, అంజలి మా ట్లాడారు. ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్య దర్శి కుషాల్, నాయకులు నవీన్ కృష్ణ, లక్ష్మణ్, రమేష్, దినేష్, తదితరులు పాల్గొన్నారు. ధాన్యం తూకంలో అక్రమాలపై అదనపు కలెక్టర్కు ఫిర్యాదు నిజామాబాద్అర్బన్: వరి ధాన్యం తూకంలో రైస్మిల్ యాజమానులు అక్రమాలకు పాల్పడినట్లు భారతీయ కిసాన్సంఘ్ జిల్లా కమిటీ ఆరోపించింది. ఈ మేరకు సోమవారం అదనపు కలెక్టర్ కిరణ్కుమార్ ఫిర్యాదు చేశారు. మోపాల్ మండలం సిర్పూర్ గ్రామం రైతులు యాసంగి ధాన్యం కొనుగోలు సమయంలో అకాల వర్షాలు కురిస్తాయి. అప్పటికే ధాన్యం విక్రయించిన రైతులు ధాన్యంను లారీల్లో రైస్మిల్లులకు తరలించారు. 745 వరిధాన్యం బస్తాలు అమ్మితే 560 బస్తాల ధాన్యం మాత్రమే అమ్మినట్లు ట్యాక్షీట్లో చూపించారని రైతులు వాపోయారు. విచారణ జరిపి రైతులకు న్యాయం చేయాలని వారు పేర్కొన్నారు. భారతీయ కిసాన్ సంఘ జిల్లా అధ్యక్షుడు సాయిరెడ్డి, కోశాధికారి భూమారెడ్డి, నగర అధ్యక్షలు దశరత్రెడ్డి, కార్యవర్గ సభ్యుడు గంగారెడ్డి, సిర్పూర్ గ్రామ రైతులు, తదితరులు పాల్గొన్నారు. -
వరినాట్లలో పశ్చిమబెంగాల్ కూలీలు
ధర్పల్లి: మండలంలో వరి సాగు పనులు జోరుగా కొనసాగుతున్నాయి. రామడుగు, మైలారం, దుబ్బాక, ధర్పల్లి, హోన్నాజీపేట్ గ్రామాల్లో ఇప్పటికే వరినాట్లు ప్రారంభమయ్యాయి. స్థానికంగా కూలీల కొరత అధికంగా ఉండడంతో ఇతర రాష్ట్రాలకు చెందిన కూలీలు (మగ) వరి నాట్లు వేసేందుకు ఇక్కడికి వలస వస్తున్నారు.హోన్నాజీపేట్ గ్రామ శివారులో పశ్చిమ బెంగాల్ చెందిన కూలీలు వరి నాట్లు వేస్తున్నారు. ఎకరాకు రూ. 4000 నుంచి రూ.4500 వరకు వరి నాట్లు వేయడానికి రైతులు వీరికి చెల్లిస్తున్నారు. రోజువారీగా ఐదు నుంచి ఆరు ఎకరాల వరకు నాట్లు వేస్తున్నారు. రేపటి నుంచి డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్ కళాశాలల బంద్ నిజామాబాద్అర్బన్: రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 2, 3, 4 తేదీల్లో 72 గంటల పాటు డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్, ప్రొఫెషనల్ కళాశాలల బంద్ చేపట్టినట్లు పీడీఎస్యూ జిల్లా కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పీడీఎస్యూ ఆధ్వర్యంలో బంద్కు పిలుపునిచ్చినట్లు తెలిపారు. విద్యార్థులు, కళాశాలల యాజమాన్యాలు సహకరించి బంద్ను విజయవంతం చేయాలన్నారు.ఈమేరకు సోమవారం నగరంలోని నీలం రామచంద్య్ర భవన్లో బంద్కు సంబంధించిన పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. నాయకులు నిఖిల్, దేవిక, సాయి కిరణ్, దుర్గా ప్రసాద్, రాజు పాల్గొన్నారు. బీఎస్పీ రూరల్ నియోజకవర్గ ఇన్చార్జిగా నీరడి లక్ష్మణ్ నిజామాబాద్నాగారం: బహుజన్ సమాజ్ పార్టీ నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఇన్చార్జిగా నీరడి లక్ష్మణ్ నియమితులయ్యారు. ఈ నెల 28న ఆయన బీఎస్పీలో చేరారు. రాష్ట్ర అధ్యక్షులు మంద ప్రభాకర్ ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు ఎస్ పాండు నీరడి లక్ష్మణ్ను నియోజకవర్గ ఇన్చార్జిగా నియమించారు. నియోజకవర్గంలో బీఎస్పీ అభివృద్ధికి పాటుపడతానని తెలిపారు. -
టెక్సాస్ యూనివర్సిటీలో తెయూ అధ్యాపకురాలి ప్రసంగం
తెయూ(డిచ్పల్లి): అమెరికాలోని టెక్సాస్ యూనివర్సిటీ ఆస్టీన్లో నిర్వహించిన అంతర్జాతీయ వర్క్షాప్లో తెలంగాణ యూనివర్సిటీ ఉర్దూ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ గుల్–ఏ–రాణా తన ప్రసంగంతో ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో ఆమె ముజ్తబా హుస్సేన్తో సహా ఉర్దూ వినోదం, హాస్య సాహిత్యంపై చేసిన ప్రసంగం విద్యావేత్తలు, పీహెచ్డీ విద్యార్థులను ఎంతగానో ఆకట్టుకుంది. ప్రొఫెసర్ అక్బర్ హైదర్, ప్రఖ్యాత కవయిత్రి ఇశ్రాత ఆప్రిన్, ఇతర పండితులు హైదరాబాద్లో ఉర్దూ భాష స్థితిగతులపై ప్రసంగించారు. టెక్సాస్ యూనివర్సిటీ వర్క్షాప్లో పాల్గొన్న గుల్–ఏ–రాణాను తెయూ వీసీ ప్రొఫెసర్ యాదగిరిరావు, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యాదగిరి, ఆర్ట్స్ డీన్ లావణ్య, ప్రిన్సిపాల్ మామిడాల ప్రవీణ్, ఉర్దూ విభాగం అధ్యాపకులు ప్రత్యేకంగా అభినందించారు. -
నిర్భంద అరెస్టులు సరికాదు
నిజామాబాద్ సిటీ: కేంద్ర హోంమంత్రి అమిత్షా ఇందూరు పర్యాటన సందర్భంగా సందర్భంగా వామపక్ష నేతల గృహనిర్భందం, అరెస్టులు సరికాదని సీపీఎం జిల్లా కార్యదర్శి రమేశ్ బాబు అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎంపీ అర్వింద్ పెండింగ్ రైల్వే లైన్ పనులకు నిధులను కేంద్రం నుంచి తీసుకురాలేదన్నారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీని తిరిగి ఓపెన్ చేస్తానని చెప్పిన మాట ఇప్పటికీ నెరవేరలేదన్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలో లక్కంపల్లి సేజ్ కోసం 500 ఎకరాల భూమిని సేకరించిన ఒక్క పరిశ్రమను తీసుకురాలేదన్నారు. ఈ సమావేశంలో నాయకులు వెంకటేశ్, నాగన్న, నన్నేసాహెబ్, జంగం గంగాధర్, కొండ గంగాధర్ సాయిలు తదితరులు పాల్గొన్నారు. బంగారం ధరలు (10గ్రాములు) -
సంక్షిప్తం
బెస్ట్ అవైలబుల్ స్కీం బకాయిలను విడుదల చేయాలి నిజామాబాద్అర్బన్: జిల్లావ్యాప్తంగా బెస్ట్ అవైలబుల్ స్కీం బకాయిలను విడుదల చేయాలని యుఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి పెద్ద సూరి ఒక ప్రకటనలో రాష్ట్ర ప్రభుత్వాన్ని డి మాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ పేద విద్యార్థులకు చేయూతనందించడానికి తెచ్చిన ఈ పథకానికి నిధులు రాకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. రాష్ట్ర ప్రభు త్వం స్పందించి వెంటనే నిధులను విడుదల చేయాలన్నారు. సారంగపూర్ చక్కెర ఫ్యాక్టరీ తెరిపించాలి నిజామాబాద్ సిటీ: రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సారంగాపూర్లోని సహకార చక్కెర ఫ్యాక్టరీని వెంటనే తెరిపించాలని చెరుకు ఉత్పత్తిదారుల సంఘం కన్వీనర్ ఆకుల పాపయ్య డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షాకు ఇటీవల ఎన్సీఎస్ఎఫ్ సారంగాపూర్ చక్కెర ఫ్యాక్టరీని తెరిపించాలని రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి వినతిపత్రం ఇవ్వడం అభినందనీయమన్నారు. కేంద్ర ప్రభుత్వం చెరుకుకు టన్నుకు రూ.4వేల ధర ప్రకటించి రైతులను ప్రోత్సహించాలన్నారు. ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షుడు వేల్పూర్ భూమయ్య, నాయకులు కొట్టె గంగాధర్, మురళి తదితరులు పాల్గొన్నారు. కొనసాగుతున్న వారాహిమాత నవరాత్రి ఉత్సవాలు నిజామాబాద్ రూర ల్:నగరంలోని అ మ్మ వెంచర్లో గల వారాహిమాత ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నా యి. సోమవారం భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు ని ర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ మంచాల జ్ఞానేంద్ర గుప్తా భక్తులు పాల్గొన్నారు. 6న ఆర్యవైశ్య సంఘం ఎన్నికలు నిజామాబాద్నాగారం: నగరంలోని శివాజీనగర్లోగల వైశ్య ఉన్నత పాఠశాల మాణిక్భవన్లో ఈనెల 6న ఆర్యవైశ్య సంఘం అధ్యక్ష, కార్యవర్గ ఎన్నికలు నిర్వహించనున్నట్లు అధ్యక్ష అభ్యర్థి అర్వపల్లి పురుషోత్తం గుప్తా అన్నారు. నగరంలోని ప్రెస్క్లబ్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్టణంలోని ఆర్యవైశ్యులంతా తనకు మద్దతు తెలిపి, ఓటు వేయాలని, అలాగే తమ ప్యానెల్ సభ్యులను కూడా గెలిపించాలని కోరారు. తహిసీల్దార్ను కలిసిన డీఎస్పీ నాయకులు ధర్పల్లి: ధర్పల్లి తహసీల్దార్గా ఇటీవలే బాధ్యతలు స్వీకరించిన శాంతను ధర్మ సమాజ్ పార్టీ (డీఎస్పీ) నాయకులు సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో డీఎస్పీ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు ప్రశాంత్, మండల అధ్యక్షులు మహిపాల్, నాయకులు కిషన్ గంగాధర్ , శ్రీకాంత్ ,చంటి తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ కాసర్ల కృషి అపూర్వం నిజామాబాద్ రూరల్:జాతీయస్థాయి ఉత్తమ ఉపాధ్యాయు లుగా వరల్డ్ చారిటీ వెల్ఫేర్ సంస్థ వారిచే గౌరవింపబడిన డాక్టర్ కాసర్ల అపూర్వమని ప్రముఖ సామాజిక ఆధ్యాత్మిక వేత్త రాజ్కుమార్ సుబేదార్ అన్నారు. సోమవారం తెలుగు వెలుగు సాంస్కతిక సంస్థ ఆధ్వర్యంలో అధ్యక్షులు చంద్రశేఖర్ అధ్యక్షతన సంస్థ కార్యాలయంలో డాక్టర్ కాసర్ల అభినందన సభ నిర్వహించారు. ఈసభలో సుప్రసిద్ధ కవులు డాక్టర్ గణపతి, అశోక శర్మ, మహేశ్ బాబు,వి.పి. చందన్ రావు, సూర్య ప్రకాశరావు, డాక్టర్ గంట్యాల ప్రసాద్, కందకుర్తి ఆనంద్, చింతల శ్రీనివాస్ గుప్త తదితరులు పాల్గొన్నారు. -
సాగే కాదు.. ఎగుమతులు కూడా
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్లో ఏర్పాటు చేసిన పసుపు బోర్డుకు అనుబంధంగా పసుపు ఎగుమతుల పెంపు లక్ష్యంతో ‘భారత్ ఆర్గానిక్ కోఆపరేటివ్ లిమిటెడ్’ను ఏర్పాటు చేసి దాని ఆధ్వర్యంలో ఆర్గానిక్ పసుపు పండించే విషయమై స్థానికంగా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ (ఆర్అండ్డీ) సెంటర్ను ఏర్పాటు చేస్తామన్న కేంద్ర సహకార, హోంశాఖ మంత్రి అమిత్షా ప్రకటనతో రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. అదేవిధంగా కో ఆపరేటివ్ ఎక్స్పోర్ట్ ఓరియంట్ యూనిట్ ఏర్పాటుకు సైతం కేంద్రం సన్నాహాలు చేస్తుండటంతో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.దీని ద్వారా పసుపు బ్రాండింగ్–మార్కెటింగ్–ఎక్స్పోర్ట్ పాలసీతో వచ్చే ఐదేళ్లలో ఒక బిలియన్ డాలర్ల (రూ.8 వేల కోట్లు) ఎగుమతులు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘ఇందూరు బ్రాండ్’ పేరిట తామే పసుపు సేద్యం చేయడంతో పాటు ఎగుమతులు చేసేందుకు కూడా అవకాశాలు లభిస్తాయని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎగుమతులు భారీగా పెరిగితే ప్రస్తుతం ఉన్న క్వింటాల్ పసుపు ధర రూ.15 వేల నుంచి రూ.50 వేలకు పెరుగుతుందని చెప్పడంతో రైతుల్లో ఉత్సాహం వెల్లువెత్తుతోంది. తమ ప్రాంతానికి అంతర్జాతీయ ఖ్యాతి దక్కుతుందంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.విత్తనం నుంచి ఎగుమతుల వరకు అండగా..కొంతకాలం క్రితం వరకు సుగంధ ద్రవ్యాల బోర్డు కింద ఉన్న పసుపు పంటను విడదీసి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా పసుపు బోర్డు ఏర్పాటు చేయడమే కాకుండా దీన్ని నిజామాబాద్లో నెలకొల్పింది. ప్రత్యేక బోర్డుతో రైతులకు అభివృద్ధి చేసిన, తెగుళ్లు తట్టుకునే కొత్త వంగడాలు అందుబాటులోకి వస్తాయి. విత్తనాలు మొదలు పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్మెంట్, మార్కెటింగ్ వరకు రైతులకు సహకారం లభిస్తుంది. అవసరాన్ని బట్టి పసుపు బోర్డు రైతులకు విత్తనం అందించి పంటను బై బ్యాక్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. మరోవైపు రాయితీలు సైతం పెరుగుతాయి. పసుపు తవ్వకం, ఆర బెట్టడం, ఉడక బెట్టడం, ఎండబెట్టడం, పాలిష్ చేయడానికి అవసరమైన యంత్రాలను రాయితీపై అందిస్తారు. కొత్త వంగడాల అభివృద్ధితో పాటు పసుపు పంట విత్తిన తర్వాత సాగుకు శాస్త్రీయ, సాంకేతిక పద్ధతులు అవలంబించే విషయంలో శాస్త్రవేత్తలు సలహాలు, సూచనలు ఇస్తారు.తద్వారా దిగుబడి పెరడమే కాకుండా పంటలో నాణ్యతకు అవకాశం ఉంటుంది. ఇక పసుపు పంట మార్కెటింగ్ కోసం అంతర్జాతీయ కంపెనీలను తీసుకువచ్చే బాధ్యత సైతం బోర్డు తీసుకుంటుంది. ఎఫ్పీవోలు (రైతు ఉత్పత్తిదారుల సంఘాలు) ద్వారా పసుపు ఆరబెట్టి, ఉడకబెట్టి, పాలిష్ చేసి, పౌడర్ చేసి, ప్యాకెట్లు చేసి ప్రత్యేక బ్రాండ్ల ద్వారా నేరుగా ఎగుమతులు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు కూడా కేంద్రమంత్రి ప్రకటించారు. తదుపరి దశలో ఇక్కడ పసుపు శుద్ధి కర్మాగారం ఏర్పాటు చేసేందుకు కూడా కేంద్రం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు జిల్లాకు పసుపు శుద్ధి కర్మాగారాలు తరలి వస్తాయని, దీంతో ఈ ప్రాంతంలో ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుందని స్థానికులు చెబుతున్నారు. సాగు పెంచేలా ప్రణాళికలుపసుపు బోర్డు నేపథ్యంలో పసుపు సాగు విస్తీర్ణాన్ని 2008లో మాదిరిగా లక్ష ఎకరాలకు పైగా పెంచేలా ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు కేంద్రం ప్రణాళికలు తయారు చేస్తోంది. నిజామాబాద్ మార్కెట్కు గతంలో 12 లక్షల క్వింటాళ్లకు పైగా పసుపు వచ్చేది. రానురాను విస్తీర్ణం తగ్గడంతో పంట ఉత్పత్తి సైతం భారీగా తగ్గుతూ వస్తోంది. గత సీజన్లో రాష్ట్రంలో 40 వేల ఎకరాల లోపే పసుపు సాగు చేశారు. తాజాగా ముగిసిన సీజన్లో నిజామాబాద్ మార్కెట్కు 8 లక్షల క్వింటాళ్ల పసుపు మాత్రమే వచ్చింది. రాష్ట్రంలో మొత్తం పసుపు సాగులో 65 శాతం ఒక్క నిజామాబాద్ జిల్లాలోనే ఉండటం గమనార్హం. తదుపరి స్థానాల్లో జగిత్యాల, నిర్మల్, వికారాబాద్, మహబూబాబాద్ జిల్లాలు ఉన్నాయి.రైతులకు ఎగుమతి అవకాశాలుపసుపు బోర్డు ఏర్పాటుతో తెలంగాణలో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతుంది. భారత్ ఆర్గానిక్ కోఆపరేటివ్ లిమిటెడ్ పేరిట పసుపు ఎగుమతులు చేసేందుకు నేరుగా రైతులకే అవకాశం లభిస్తుంది. విలువ ఆధారిత పంట ఉత్పత్తులను రైతులే అంతర్జాతీయ స్థాయిలో ఎగుమతి చేసే అవకాశం కలుగుతుంది. దీంతో రైతులకు మరింత లబ్ధి చేకూరుతుంది. – పాట్కూరి తిరుపతిరెడ్డి, పసుపు రైతు, ఎఫ్పీవో చైర్మన్, మనోహరాబాద్పోరాటానికి దక్కిన గౌరవంపసుపు బోర్డు సాధన కోసం ఏళ్ల తరబడి అనేక పోరాటాలు చేశాం. ఈ క్రమంలో మాపై అనేక కేసులు అయ్యాయి. వీటికి సంబంధించి ఇప్పటికీ కోర్టుకు తిరుగుతున్నాం. పసుపు బోర్డు రావడంతో మా పోరాటా నికి గౌరవం దక్కింది. 9 నెలల పాటు సాగు చేసే ఈ పంటకు బోర్డుతో మద్దతు ధర దక్కడంతో పాటు ఎగుమతులు సైతం చేసుకునే అవకాశం కలుగుతుందని ఆశిస్తున్నాం. – చింతలపల్లి గంగారెడ్డి, పసుపు రైతు, మునిపల్లి -
‘అందరికీ ఇచ్చారు అవకాశం.... ఈసారి బీజేపీకి ఇవ్వండి అధికారం’
నిజామాబాద్: వచ్చే ఎన్నికల్లో బీజేపీకి అధికారం ఇవ్వాలని కేంద్ర మంత్రి, ఎంపీ బండి సంజయ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రైతును రాజును చేయడమే మోదీ సర్కారు లక్ష్యమని, అందుచేత బీజేపీకి అధికారం ఇవ్వాలని బండి సంజయ్ విన్నవించారు. నిజామాబాద్లో పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి అమిత్షా ప్రారంభించారు. దీనిలో భాగంగా ఇందూరు రైతు మహా సమ్మేళన సభలో బండి సంజయ్ ప్రసంగించారు. ‘ రైతును రాజును చేయడమే మోదీ సర్కారు లక్ష్యం. పసుపు బోర్డు సాధించుకున్న ఇందూర్ రైతులు హీరోలు. ధర్మపురి అరవింద్ పసుపు అరవింద్ అయ్యారు’ అని బండి సంజయ్ పేర్కొన్నారు.బండి సంజయ్న ప్రసంగానికి ఆహ్వానించిన క్రమంలో సభ చఘ్పట్లతో దద్దరిల్లింది. ప్రజా స్పందనను ఆస్వాదిస్తూ బండి సంజయ్ ప్రసంగాన్ని ఆలకించారు అమిత్ షా. దేశ ప్రజల ఆరోగ్యంలో పసుపు రైతులది కీలక పాత్ర: అమిత్ షా -
దేశ ప్రజల ఆరోగ్యంలో పసుపు రైతులది కీలక పాత్ర: అమిత్ షా
సాక్షి, నిజామాబాద్: పసుపు రైతుల దశాబ్దాల కల అయిన పసుపు బోర్డు జాతీయ కార్యాలయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం ప్రారంభించారు. అనంతరం కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క, ఎంపీ అర్వింద్, ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ తదితరులు హాజరయ్యారు. పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభం అనంతరం పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో పసుపు ఉత్పత్తులను అమిత్ షా పరిశీలించారు.కిసాన్ సమ్మేళన్(రైతు సమ్మేళనం) బహిరంగ సభలో అమిత్ షా మాట్లాడుతూ.. దేశ ప్రజలను ఆరోగ్యంగా ఉంచడంలో పసుపు రైతులు కీలక పాత్ర వహిస్తున్నారన్నారు. పసుపు రైతులకు ప్రధాని మోదీ ఇచ్చిన హామీ నెరవేరిందన్నారు. ఈ సందర్భంగా దేశంలోని పసుపు రైతులకు ఆయన అభినందనలు తెలిపారు. పసుపు బోర్డు వల్ల ప్రపంచంలోనే పలు దేశాలకు నిజామాబాద్ పసుపు వెళ్తుందన్న అమిత్ షా.. కొనుగోలు, రవాణా, ఎగుమతి అన్నీ పసుపు బోర్డు చూసుకుంటుందన్నారు. పసుపును ప్రపంచం అద్భుత ఔషధంగా చూస్తుందని అమిత్ షా అన్నారు.‘‘ఒక బిలియన్ డాలర్లు విలువ చేసే పసుపును ఎగుమతి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నాం. రైతులకు మంచి ధర రావాలన్నదే మా లక్ష్యం. నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్, మెట్పల్లిలో పసుపును అధికంగా పండిస్తారు. రైతులకు బోర్డు ద్వారా నూతన సాగు విధానంపై శిక్షణ ఇస్తాం. పసుపు రైతుల సంక్షేమానికి కేంద్రం కట్టుబడి ఉంది. తెలంగాణకు పసుపు బోర్డు ఇవ్వడమే కాకుండా బోర్డు ఛైర్మన్గా తెలంగాణ వ్యక్తినే నియమించాం. పసుపు బోర్డు కోసం బీజేపీ ఎంపీలు ఎంతో పోరాడారు’’ అని అమిత్ షా ప్రశంసించారు.‘‘ఆపరేషన్ సిందూర్తో పాకిస్థాన్కు గట్టిగా బుద్ధి చెప్పాం. పాక్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి ఉగ్రవాదులను హతమార్చాం. ఆపరేషన్ సిందూర్పై రాహుల్ ఆధారాలు అడుగుతున్నారు. పాకిస్థాన్ మాట రాహుల్ గాంధీ నోట వినపడుతోంది. గత కాంగ్రెస్ సర్కార్ పాక్ విషయంలో మెతుక వైఖరి అవలంబించింది. మోదీ సర్కార్ ఈ పదేళ్లలో మూడుసార్లు పాక్కు భారత్ తడాఖా ఏంటో చూపింది.ఆపరేషన్ కగార్ చేయాలా? వద్దా..?. లొంగిపోవాలని హెచ్చరించినా లొంగిపోలేదు.. కాబట్టే ఆపరేషన్ కగార్ చేపట్టాం. 2026 నాటికి మావోయిస్ట్ ముక్త్ భారత్. బీఆర్ఎస్ సర్కార్ ఎలాంటి అవినీతికి పాల్పడిందో మీకు తెలుసు. కాళేశ్వరం బీఆర్ఎస్కు ఏటీఎం అయితే.. ఇక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఢిల్లీకి ఏటీఎంగా తయారైంది. తెలంగాణా జనం బీఆర్ఎస్ జెండా పీకి పారేశారు. ఇక్కడ కాంగ్రెస్కు కూడా నూకలు చెల్లే రోజు వస్తోంది’’ అని అమిత్ షా వ్యాఖ్యానించారు. -
భరతనాట్యంలో జిల్లా విద్యార్థినుల ప్రతిభ
నిజామాబాద్ రూరల్: తిరుమల తిరుపతి దేవస్థానంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి సన్నిధిలో జల్లా కేంద్రానికి చెందిన సిద్ధార్థ కళాక్షేత్రానికి చెందిన జయలక్ష్మి ఆధ్వర్యంలో 27 మంది విద్యార్థినులు భరతనాట్యం, కూచిపూడి ప్రదర్శనలు ఇచ్చారు. ఆషాఢ మాసం పుర్కసరించుకొని కార్యక్రమాల్లో పాల్గొన్నట్లు తెలిపారు. జల్లా కేంద్రంలోని తేనె సాయిబాబా ఆలయంలో ప్రతి ఆదివారం కూచిపూడి, భరతనాట్యం క్లాసులు నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు. తమిళనాడు, కర్నాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నిర్వహించిన పోటీలు ముగించుకొని విద్యార్థినులు ఆదివారం జిల్లాకు చేరుకోనున్నట్లు పేర్కొన్నారు. -
కడుపునొప్పి భరించలేక ఒకరి ఆత్మహత్య
మద్నూర్(జుక్కల్): డోంగ్లీ మండలం లింబూర్ గ్రామానికి చెందిన కిస్వే సంజయ్(45) శనివారం కడుపునొప్పి భరించలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై విజయ్కొండ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. లింబూర్కు చెందిన సంజయ్ మహారాష్ట్రలోని పుణె నగరంలో కుటుంబసభ్యులతో కలిసి కూలీ పని చేసేవాడు. గత కొంత కాలంగా కడుపునొప్పితో బాధపడుతున్న సంజయ్.. చికిత్స కోసం చాలా ఆస్పత్రులు తిరిగినా నయం కాలేదని కుటుంబసభ్యులు చెప్పారు. దీంతో 15 రోజుల క్రితం సొంతూరికి వచ్చి కూలీ పని చేసుకుంటున్నాడు. కడుపునొప్పి తీవ్రం కావడంతో శనివారం లింబూర్ శివారులో రోడ్డు పక్కన చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. జీవితంపై విరక్తితో రైలుకు ఎదురెళ్లి ..ఖలీల్వాడి: జీవితంపై విరక్తితో ఓ యువకుడు రైలుకు ఎదురెళ్లి ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే ఎస్సై సాయిరెడ్డి తెలిపారు. రైల్వే ఎస్సై చెప్పిన ప్రకారం.. నగరంలోని ఎల్లమ్మగుట్టకు చెందిన జాదవ్ శివతేజ(19) శనివారం ఉదయం 8.50 గంటల సమయంలో జీవితంపై విరక్తి చెంది రైలుకు అడ్డుగా వెళ్లి బలవన్మరణం చెందాడు. నిజామాబాద్ స్టేషన్ మేనేజర్ చందన్ కుమార్ సమాచారం మేరకు ఘటనా స్థలాన్ని సందర్శించి, మృతదేహాన్ని జీజీహెచ్కు తరలించారు. మృతుడు నగరంలోని తిలక్గార్డెన్ వద్ద ఉన్న కమర్షియల్ కాంప్లెక్స్లోని అశోక్ టీ పాయింట్లో పని చేసేవాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
స్కూటీ, బైక్ ఢీ..
● నలుగురికి తీవ్ర గాయాలు కామారెడ్డి క్రైం: ఎదురెదురుగా వచ్చిన స్కూటీ, బైక్లు ఢీకొన్న ప్రమాదంలో నలుగురు యువకులకు తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన జిల్లా కేంద్రంలోని రైల్వేస్టేషన్ మూడో ప్లాట్ఫామ్ రోడ్డుపై శుక్రవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఎక్కువగా గూడ్స్ రైళ్లు నిలిచే మూడో నెంబరు ప్లాట్ఫాం వెంబడి కోర్టు రోడ్డు నుంచి అశోక్నగర్ వరకు వాహనాల రాకపోకలకు వీలుగా రోడ్డును నిర్మించారు. కొంతకాలంగా ఈ రోడ్డు గుండా వాహనాల రాకపోకలు జరుగుతున్నాయి. ఇదే దారిపై శుక్రవారం రాత్రి ఎదురెదురుగా వేగంగా వచ్చిన స్కూటీ, బైక్లు ఢీకొన్నాయి. రెండు వాహనాలపై ప్రయాణిస్తున్న నలుగురు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు, పోలీసులు వారిని వెంటనే ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిని పట్టణంలోని అశోక్నగర్ కాలనీకి చెందిన శ్రీధర్, మురారి, బొంతల లెనిన్, లోకేశ్గా గుర్తించారు. వారిలో లెనిన్, లోకేశ్లు మైనర్లుగా తెలుస్తోంది. శ్రీధర్, మురారిల కుటుంబాలు ప్రకాశం జిల్లా నుంచి వలస వచ్చి మేసీ్త్ర పనులు చేసుకుంటున్నాయి. వారిద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు రిఫర్ చేశారు. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఎంఆర్టీ అండ్ కన్స్ట్రక్షన్ డీఈగా వెంకటరమణ
సుభాష్నగర్: నార్తన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలో ఎంఆర్టీ, కన్స్ట్రక్షన్ విభాగం డీఈగా డీ వెంకటరమణ శనివారం పవర్హౌస్లో బాధ్యతలు స్వీకరించారు. నార్తన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలో ఎంఆర్టీ, కన్స్ట్రక్షన్ విభాగం పునర్ వ్యవస్థీకరణలో భాగంగా విలీనం చేసిన విషయం తెలిసిందే. బాధ్యతలు స్వీకరించిన డీఈని డివిజన్ ఏడీఈలు, ఏఈలు, సబ్ ఇంజినీర్లు, జేఏవోలు, ఓఎం స్టాఫ్ సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఏడీఈలు తోట రాజశేఖర్, నటరాజ్, ఏఈలు కాశీనాథ్, దుర్గాప్రసాద్, నవీన్రెడ్డి, మౌనిక రెడ్డి, సాయిలు, గయాస్ హైమద్, భాస్కర్, ప్రసాద్, వివిధ సెక్షన్ల ఓఎం స్టాఫ్, యూనియన్ నాయకులు పాల్గొన్నారు. -
పోరుబాటలో ఎన్నో విజయాలు..
ఆర్మూర్ : వ్యవసాయ క్షేత్రంలో ఆరుగాలం శ్రమించి పంట పండించడమే కాదు, తమ డిమాండ్ల సాధనకు అవసరమైతే ఉద్యమించి ప్రభుత్వాల మెడలు వంచి ఒప్పించగల నేర్పరులు ఆర్మూర్ ప్రాంత రైతులు. రైతు ఐక్య కార్యాచరణ కమిటీల ఆధ్వర్యంలో పోరాడి డిమాండ్లు సాధించుకుంటున్నారు. రైతుల ఉద్యమాల ఫలితంగానే 2003లో అర్గుల రాజారాం(గుత్ప) ఎత్తిపోతల పథకం నిర్మాణానికి అడుగులుపడ్డాయి. 2008లో ఎర్రజొన్న వ్యాపారి చేతిలో మోపోయిన రైతులకు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రూ.35 కోట్లు చెల్లించింది. 2009లో అప్పటి సీఎం రోశయ్య కమ్మర్పల్లిలో పసుపు పరిశోధన కేంద్రం ఏర్పాటు చేశారు. 2024 ఆగస్టులో ప్రధాని నరేంద్ర మోదీ పసుపు బోర్డును తెలంగాణలో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా పసుపు బోర్డు కేంద్ర కార్యాలయాన్ని జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేశారు. ఈ విజయాలన్నింటి వెనక రాజకీయాలకు అతీతంగా ఐకమత్యంతో పోరాటాలు చేసిన రైతులే ఉన్నారు. పసుపు పరిశోధనకు.. 2007లో అప్పటి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్ సూచన మేరకు ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం సహకారంతో 2009లో కమ్మర్పల్లిలోని 36 ఎకరాల్లో పసుపు పరిశోధన కేంద్రం ఏర్పాటు చేశారు. దీనిని అప్పటి సీఎం రోశయ్య ప్రారంభించగా శాస్త్రవేత్తలు ఇక్కడ కొత్త వంగడాలను సృష్టిస్తూ పసుపు పంట పండించడంలో రైతులకు మెళకువలు నేర్పుతున్నారు. బోర్డు కోసం ఢిల్లీ వరకు.. పసుపు బోర్డు ఏర్పాటు కోసం ఢిల్లీ వీధుల్లో ధర్నాలు చేశారు. రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ప్రతినిధులు 2018–19లో ఉద్యమ బాటపట్టారు. ఫలితంగా బీజేపీ ప్రభుత్వం పసుపునకు ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వాలను ఒప్పించి డిమాండ్లు సాధించే నేర్పరులు ఆర్మూర్ రైతులు ఐకమత్యంలో ఆదర్శం ఎర్రజొన్న, రుణమాఫీ, లిఫ్ట్ సాధనసాధించి చూపారు.. నిజాంసాగర్ చివరి ఆయకట్టు ప్రాంతమైన ఆర్మూర్, బాల్కొండకు సాగు నీరందకపోవడంతో గుత్ప ఎత్తిపోతల పథకానికి రూపకల్పన చేశారు. ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ను ఎత్తిపోతల ద్వారా ఆర్మూర్కు తీసుకురావడం సాధ్యం కాదని అప్పటి ప్రభుత్వాలు పేర్కొడంతో 2003లో రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో ఉద్యమించి ఎత్తిపోతల పథకాన్ని సాధించుకున్నారు. రైతులు చేసిన ఉద్యమానికి దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం కదలి వచ్చి రూ. 204 కోట్లతో అర్గుల్ రాజారాం (గుత్ప) ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసింది. 2008 మార్చి 18న గుత్ప ఎత్తిపోతల పథకం పూర్తికావడంతో ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాల పరిధిలోని 38,792 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరిగింది. -
ఆటకు దూరమైన చిన్నారి లోకం
నిజామాబాద్నాగారం: ఆటా..పాటా లేక చిన్నారి లోకం ఉసూరుమంటోంది. ఆడుకోవాల్సిన వయసులో పిల్లలు స్మార్ట్ ఫోన్లకు బందీలవుతున్నారు. పాఠశాలల్లో సరైన క్రీడా మైదానాలు, వసతులు లేక చదువులకే అంకితమవుతున్నారు. ఫలితంగా పిల్లల జీవనశైలి మారుతోంది. ఆటలు దూరంగా ఉండడంతో మానసిక, శారీరక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రైవేటులో అంతంత మాత్రమే.. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు 1171 ఉండగా, ప్రైవేట్ పాఠశాలలో 475 ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలలో 80 శాతానికి పైగా క్రీడా మైదానాలు ఉన్నాయి. ఇందులో పీఈటీలు ఉన్నారు. అయితే క్రీడా సామగ్రి లేకపోవడంతో అంతంత మాత్రంగానే ఆటలు ఆడిస్తున్నారు. ఇక 90 శాతం ప్రైవేట్ పాఠశాలలు క్రీడా మైదానాలు లేకుండానే కొనసాగుతున్నాయి. ఫలితంగా పాఠశాలలో విద్యార్థులకు ఆటలు కరువయ్యాయి. ప్రైవేట్ పాఠశాలలో పేరుకు మాత్రమే పీఈటీలను తీసుకొని నవంబర్ , డిసెంబర్లల్లో తొలగిస్తున్నారు. బోర్డులే మిగిలాయి.. గత ప్రభుత్వం జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలల్లో క్రీడా ప్రాంగణాలను డీఆర్డీఏ, పంచాయితీరాజ్ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసింది. జిల్లా యువజన క్రీడల కార్యాలయానికి కేటాయించలేదు. ప్రాంగణాల్లో బోర్డులు మాత్రమే మిగిలాయి. క్రీడా పరికరాలు లేవు. జిల్లాలోని కమ్మర్పల్లి, వేల్పూర్, బోధన్, జక్రాన్పల్లి, నాగారం, ఆర్మూర్ తదితర ప్రాంతాల్లో మినీ స్టేడియాలు ఉన్నా పరికరాలు, కోచ్లు లేరు. సమయం కరువు.. నిత్యం ఉదయం, సాయంత్రం ఆటలు ఆడే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ పాఠశాలకు చెందిన పిల్లలు మాత్రం ఎంతో కొంత ఆటలు ఆడుతున్నారు. ప్రైవేట్ పాఠశాలలో ఆటలు ఆడే పరిస్థితి పదుల సంఖ్యలో మాత్రమే కనిపిస్తుంది. యాజమాన్యాలు చిన్నప్పటి నుంచే ర్యాంకుల పేరుతో పిల్లలపై చదవాలని ఒత్తిడి పెంచుతున్నారు. తల్లిదండ్రులకు సైతం క్రీడల కన్నా చదువుపైనే ఫోకస్ పెట్టాలని పట్టుబడుతున్నారు. దీంతో చాలా మంది పిల్లలు ఆన్లైన్లో చదువుకుంటున్నామని చెప్పి వీడియో గేమ్స్, బొమ్మలు, రీల్స్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. స్మార్ట్ ఫోన్లలో ఆటలు.. మూడేళ్లు వచ్చే పిల్లల నుంచి పాఠశాల, కళాశాల స్థాయి చదివే విద్యార్థుల వరకు స్మార్ట్ ఫోన్లకు బందీలవుతున్నారు. ఉదయం, సాయంత్రం, రాత్రి అని తేడా లేకుండా ఫోన్లకు అతుక్కపోతున్నారు. ఫోన్ ఇస్తేనే అన్నం తింటామని మారాం చేస్తున్నా రు. సెలవుల సమయంలో గంటల తరబడిగా ఫోన్ లు లేదంటే టీవీలు చూస్తూ కాలక్షేపం చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అరకొర వసతులు పీఈటీలు ఉన్నా సామగ్రి కరువు ప్రైవేట్ పాఠశాలలో క్రీడా మైదానాల కొరత పల్లె, పట్టణాల్లో పేరుకే క్రీడా ప్రాంగణాలు ఫలితంగా సెల్ఫోన్లకు బందీలుగా పిల్లలు పిల్లలను కచ్చితంగా ఆడించాలి చిన్నప్పటి నుంచే పిల్లలకు నచ్చిన ఆటలో మెళకువలు నేర్పించాలి. పాఠశాలలో క్రీడలు ఆడితేనే భవిష్యత్తులో మంచి క్రీడాకారునిగా తయారవుతారు. క్రీడలతో క్రమశిక్షణ అలవడుతుంది. వ్యసనాలకు దూరంగా ఉంటారు. చదువు ఎంత ముఖ్యమో క్రీడలూ అంతే ముఖ్యం. కచ్చితంగా ఆడించాలి. – ముత్తెన్న, జిల్లా యువజన క్రీడల అధికారి -
అటవీ భూమిని దున్నుతున్న ట్రాక్టర్ పట్టివేత
సిరికొండ: సిరికొండ అటవీ రేంజ్ తూంపల్లి సెక్షన్ గుడిలింగాపూర్ తూర్పు బీట్ పరిధిలో అటవీభూమిని దున్నుతున్న ట్రాక్టర్ను పట్టుకున్నట్లు రేంజర్ రవీందర్ తెలిపారు. గుడిలింగాపూర్కు చెందిన మలావత్ మంగికి చెందిన ట్రాక్టర్ను సీజ్ చేసి సిరికొండ పోలీస్ స్టేషన్లో ఉంచినట్లు పేర్కొన్నారు. అటవీ భూమిని అక్రమంగా దున్నడం నేరమని ట్రాక్టర్ యజమానికి గతంలో నోటీసు ఇచ్చినట్లు తెలిపారు. నోటీసులను బేఖాతరు చేస్తూ అటవీ భూమిని దున్నుతుండటంతో పట్టుకొని కేసు నమోదు చేశామన్నారు. దాడిలో డిప్యూటీ రేంజర్ గంగారం, సెక్షన్ అధికారి కృష్ణగీత్, బీట్ అధికారులు నాగేశ్, రీజేందర్, నవీన్, హరీశ్ పాల్గొన్నారు. -
నియామకం
మోపాల్: సేవాలాల్ సేన మహాసభ తెలంగాణ రాష్ట్ర ప్రధానకార్యదర్శిగా మండలంలోని అమ్రాబాద్కు చెందిన బానో త్ నరేశ్ నాయక్ నియమితులయ్యారు. ఈమేరకు శనివారం హైదరాబాద్లోని సుందరయ్య వి జ్ఞాన కేంద్రంలో వ్యవస్థాపక అధ్యక్షుడు సంజీవ్ నాయక్ నరేశ్కు నియామకపత్రాన్ని అందజేశారు. అనంతరం నరేశ్నాయక్ మాట్లాడు తూ.. తనపై నమ్మకంతో ప్రధాన కార్యదర్శిగా నియమించినందుకు సంజీవ్ నాయక్కు, రాష్ట్ర కార్యవర్గానికి ధన్యవాదాలు తెలిపారు. గిరిజన జాతి అభివృద్ధికి అహర్నిశలు కృషి చేసి శక్తి వంచన లేకుండా పని చేస్తానని పేర్కొన్నారు. -
సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి
నిజామాబాద్ సిటీ: కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జూలై 9న చేపట్టే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని వెజిటేబుల్ ఆటో–మోటర్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి శివకుమార్ అన్నారు. నగరంలోని కోటగల్లి ఎన్ఆర్ భవన్లో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆటో కార్మికుల కోసం సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. సమావేశంలో నాయకులు ఇమ్రాన్, సురేశ్, బాబా ప్రసాద్, హైమద్, రంజిత్ పాల్గొన్నారు. -
క్యూసెక్కు, టీఎంసీ అంటే..
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లోకి ఎగువ ప్రాంతాల నుంచి క్యూసెక్కుల వరద నీరు, టీఎంసీల వరద నీరు వచ్చి చేరిందని ప్రాజెక్ట్ అధికారులు పేర్కొంటారు. అసలు క్యూసెక్కు, టీఎంసీ అనే పదాల పూర్తి అర్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.. ● క్యూసెక్కు అనేది నీటి ప్రవాహ వేగాన్ని కొలిచే ప్రమాణం. క్యూబిక్ ఫీట్ పర్ సెకండ్(క్యూసెక్). ఒక సెకను కాలంలో 28 లీటర్లు నీరు వచ్చి చేరడం, లేదా విడుదలవ్వడం. ● క్యూసెక్కును ప్రాజెక్ట్లోకి వచ్చే ఇన్ఫ్లో, అవుట్ఫ్లోలో వినియోగిస్తారు. ● టీఎంసీ అంటే థౌసండ్ మిలియన్ క్యూబిక్ ఫీట్ (శత కోటి ఘనపుటడుగులు) అని అర్థం. ● ఒక్క టీఎంసీకి 2831 కోట్ల లీటర్ల నీరు. ● ప్రాజెక్ట్లోకి వచ్చే నీటిని, వదిలిన నీటికి క్యూసెక్కుల్లో తెలుపుతారు. పూర్తి నీటి నిల్వ, నీటి విడుదలను టీఎంసీల్లో చూపుతారు. ● వెయ్యి అడుగుల వెడల్పు, వెయ్యి అడుగుల పొడవు, వెయ్యి అడుగుల ఎత్తులో ఉండే నీరు ఒక టీఎంసీ అవుతుంది. ● 2300 ఎకరాల్లో ఒక్క అడుగు నీరు నిల్వ ఉంటే టీఎంసీకీ సమానం. – బాల్కొండ మీకు తెలుసా? -
ఎస్సారెస్పీని సందర్శించిన ఆర్మీ బృందం
బాల్కొండ: శ్రీరాంసాగర్ జలాశయాన్ని ఆర్మీ ప్రత్యేక బృందం శనివారం సందర్శించింది. ఆర్మీ సబ్ ఇన్స్పెక్టర్ నీతూ రామ్ ఆధ్వర్యంలోని బృందం ప్రాజెక్ట్లోకి ఒకేసారి భారీ వరద వచ్చి ముంపు తలెత్తితే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, బెటాలియన్ బృందాలు చేపట్టాల్సిన చర్యలపై పరిశీలించారు. గతంలో ప్రాజెక్ట్లోకి వచ్చిన వరదల వివరాలను అధికారులు అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్ట్ భద్రతతోపాటు దిగువన ఉన్న గ్రామాల ప్రజలను ఎలా సురక్షితంగా కాపాడవచ్చో పరిశీలించారు. వారి వెంట ప్రాజెక్ట్ ఏఈఈ అక్తర్, సిబ్బంది ఉన్నారు. వ్యవసాయశాఖ మంత్రిని కలిసిన డీసీసీబీ చైర్మన్ సుభాష్నగర్ : రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావును ఉమ్మడి నిజామాబాద్ డీసీసీబీ చైర్మన్ కుంట రమేశ్ రెడ్డి శనివారం హైదరాబాద్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రైతులకు వానాకాలం పంట పెట్టుబడి సాయంగా రైతు భరోసా అందించినందుకు జిల్లా రైతాంగం తరఫున మంత్రికి పుష్పగుచ్చం అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఉమ్మడి జిల్లాలో యూరియా కొరతపై మంత్రి దృష్టికి తీసుకెళ్లగా, సానుకూలంగా స్పందించిన మంత్రి.. అవసరం మేరకు యూరియాను అందుబాటులో ఉంచుతామని హామీనిచ్చినట్లు చైర్మన్ తెలిపారు. కళాశాల విద్యార్థినులకు హాస్టల్ వసతి నిజామాబాద్అర్బన్: నిజామాబాద్ నగరంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పించినట్లు ప్రిన్సిపల్ బుద్ధిరాజ్ తెలిపారు. దూర ప్రాంతాల నుంచి వచ్చి కళాశాలలో విద్యాభ్యాసం చేస్తున్న బాలికలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న దృష్ట్యా కలెక్టర్కు పలుమార్లు విజ్ఞప్తి చేయడంతో నామ్దేవ్వాడ ప్రాంతంలో ఎస్సీ వసతి గృహంలో వసతి కల్పించినట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మొదటి సంవత్సరం విద్యార్థులు కళాశాలలో అడ్మిషన్ పొందాలని పేర్కొన్నారు. నిజామాబాద్ సీసీఆర్బీ ఏసీపీ బదిలీ ఖలీల్వాడి: నిజామాబాద్ సీసీఆర్బీ ఏసీబీగా పనిచేస్తున్న అంబటి రవీందర్రెడ్డిని బదిలీ చేస్తూ డీజీపీ జితేందర్రెడ్డి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 44 మంది డీఎస్పీలు బదిలీలు జరిగాయి. ఏసీపీ రవీందర్రెడ్డిని సైబరాబాద్లోని సైబర్ క్రైమ్ ఏసీపీగా బదిలీ అయ్యారు. నిజామాబాద్ ఎస్బీ సెక్యూరిటీ ఏసీపీగా సత్యనారాయణ బదిలీపై రానున్నారు. ఆయన గద్వాల జిల్లాలో ఎస్డీపీవో ఉండగా హైడ్రా ఏసీపీగా పనిచేస్తున్నారు. ఎస్బీ ఏసీపీగా పనిచేసిన శ్రీనివాస్రావు డీసీపీగా పదోన్నతిపై వెళ్లడంతో కొన్ని రోజులుగా ఆ పోస్టు ఖాళీగా ఉంది. -
నాణ్యత డొల్ల!
● పనులు చేపట్టిన మూడు నెలలకే పగుళ్లు ఏర్పడిన రోడ్డు ఇందల్వాయి: ఇందల్వాయి–ధర్పల్లి రోడ్డు మార్గంలో వెంగల్పాడ్ వద్ద నూతనంగా నిర్మించిన హైలెవెల్ వంతెనకు ఇరువైపుల వేసిన రోడ్డు ఇటీవల కురిసిన వర్షానికి కుంగి ప గుళ్లు ఏర్పడ్డాయి. ఏళ్ల తరబడి మ న్నికగా ఉండాల్సిన రోడ్డు మూడు నెలలకే కుంగడంపై వాహనదారులు నాణ్యత లోపాలను విమర్శిస్తున్నారు. రోడ్డుకు ఇరువైపుల పోసిన మొరం వర్షానికి కొట్టుకుపోయింది. ఇకనైనా అధికారులు స్పందించి రోడ్డు పాడవకముందే మరమ్మతులు చేయించాలని వాహనదారులు కోరుతున్నారు. -
ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి
ధర్పల్లి: ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్ అన్నారు. మండల కేంద్రంలో శనివారం ఆదర్శ పాఠశాల విద్యార్థులు ట్రాఫిక్ నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించారు. హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడుపుతున్న వాహనదారులకు పుష్పగుచ్ఛం అందించి హెల్మెట్ ప్రాముఖ్యతను వివరించారు. రాత్రి సమయంలో ప్రమాదాల నివారణకు వాహనాలకు రేడియం స్టిక్కర్లను అతికించారు. ఉపాధ్యాయులు లక్ష్మీనర్సయ్య, డేనియల్, రంజిత్ తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయుల కృషి అభినందనీయం మోపాల్: ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి, విద్యాభివృద్ధికి కృషి చేస్తున్న సిర్పూర్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులను హెచ్ఎం సత్యనారాయణ అభినందించారు. మోపాల్ మండలంలోని సిర్పూర్ ప్రాథమిక పాఠశాలలో వంద మంది విద్యార్థులకు కంపాస్ బాక్సులు, పెన్నులు, పెన్సిళ్లు, తదితర వస్తువులను శనివారం పంపిణీ చేశారు. కాగా పాఠశాలలో నో బ్యాగ్ డే సందర్భంగా విద్యార్థులు తయారు చేసిన ఇన్నోవేటివ్ వస్తువులను ప్రదర్శించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాజేందర్, అక్బర్ భాషా, వసంత, అనురాధ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకు నోట్బుక్స్ పంపిణీ ఇందల్వాయి: మండలంలోని గండితండా జీపీ సెక్రటరి అశోక్ ప్రోత్సాహంతో హైదరాబాద్కి చెందిన డాక్టర్ అనీల గ్రామ పాఠశాల విద్యార్థులకు రూ. పదివేలు విలువ చేసే నోట్స్ బుక్స్, పెన్సులను శనివారం అందించారు. ఎంఈవో శ్రీధర్, ఎంపీడీవో అనంత్రావు, హెచ్ఎం పరమేశ్వర్, ఉపాధ్యాయులు ఉన్నారు. కేంద్ర మంత్రి కార్యక్రమాన్ని అడ్డుకుంటాం నిజామాబాద్అర్బన్: జిల్లా కేంద్రంలో కేంద్ర మంత్రి అమిత్ షా నిర్వహించే కార్యక్రమాన్ని అడ్డుకుంటామని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి విఘ్నేశ్ అన్నారు. శనివారం నగరంలోని ఎస్ఎఫ్ఐ కార్యాలయంలో నిర్వహించిన సమావే శంలో మాట్లాడారు. పార్లమెంట్లో అంబేడ్కర్ ను అవమానించిన హోం మంత్రి వెంటనే క్షమాపణ చెప్పాలని లేదంటే జిల్లా పర్యటనను అడ్డుకుంటామన్నారు. నాయకులు రాజు, ఆజాద్, గణేశ్ తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి పనులు ప్రారంభం సిరికొండ: మండలంలోని కొండాపూర్లో పలు అభివృద్ధి పనులను కాంగ్రెస్ నాయకులు శనివారం ప్రారంభించారు. 350 మీటర్ల సీసీ డ్రెయినేజీ నిర్మాణానికి రూ. ఏడున్నర లక్షలు, సీసీ రోడ్డు నిర్మాణానికి రూ. మూడు లక్షల నిధులను ఎమ్మెల్యే భూపతిరెడ్డి మంజూరు చేశారని వారు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు నల్ల బుచ్చన్న, ఆకుల జగన్, నీరటి శ్రీధర్, గౌసొద్దీన్, కిశోర్గౌడ్, చంద్రాగౌడ్, ఎల్లయ్య, శంకర్గౌడ్, రవిగౌడ్ పాల్గొన్నారు. రక్తదాన శిబిరం నిజామాబాద్నాగారం: నగరంలోని రెడ్క్రా స్లో జమాల్పూర్ విఠల్ వ్యాస్ మెమోరియల్ సొసైటీ ఆధ్వర్యంలో శనివారం రక్తదాన శిబి రం నిర్వహించారు. జర్నలిస్టు విఠల్ వ్యాస్ ఐ దో వర్ధంతి సందర్భంగా 19 మంది రక్తదానం చేశారు. కార్యక్రమంలో వైద్యులు బొద్దుల రాజేంద్రప్రసాద్, ధన్పాల్ వినయ్, సందీప్రావు, సొసైటీ అధ్యక్షుడు జమాల్పూర్ రాజశేఖర్, రెడ్క్రాస్ చైర్మన్ ఆంజనేయులు, మెడికల్ ఆఫీసర్ వి రాజేశ్, విజయానంద్, బైర శేఖర్, చింతల గంగాదాస్, అర్వింద్, పంచరెడ్డి శ్రీకాంత్, సుభాష్, మధుసూదన్, ఆశ నారాయణ, దయాకర్ గౌడ్, సభ్యులు పాల్గొన్నారు. చంద్రశేఖర్కు పీహెచ్డీ ప్రదానం డిచ్పల్లి: తెలంగాణ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా విధులు నిర్వహిస్తున్న మైస చంద్రశేఖర్ ఏపీ లోని ద్రవిడ విశ్వవిద్యాలయం నుంచి గణిత శాస్త్రంలో పీహెచ్డీ పట్టాను శనివారం అందుకున్నారు. ‘సమ్ జనరలైజేషన్స్ యూసింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంపెటబిలిటి’ అనే అంశంపై గ్రంథాన్ని సమర్పించారు. పీహెచ్డీ పొందిన చంద్రశేఖర్ను యూనివర్సిటీ అధ్యాపకులు అభినందించారు. -
ఆరు గ్యారంటీలను అమలు చేయాలి
మోపాల్: ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలను ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని ఎంసీపీఐ(యూ) జిల్లా కార్యదర్శి కర్రోళ్ల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈమేరకు శనివారం మోపాల్ మండల కమిటీ ఆధ్వర్యంలో తహసీల్దార్ రామేశ్వర్కు వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం అనుసరించిన ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకించిన ప్రజలు ఎన్నికల్లో కాంగ్రెస్ గ్యారంటీలను నమ్మి గెలిపించారని అన్నారు. కానీ అధికారంలోకి వచ్చి 18 నెలలు గడిచినా పూర్తి స్థాయిలో హామీలను అమలు చేయడం లేదన్నారు. నిరుద్యోగ యువతకు పెన్షన్, ఆటో కార్మికులకు రూ.12వేలు, కౌలు రైతుల హామీలు, జర్నలిస్టులకు ఇంటి స్థలాలు, ఉద్యమ పెన్షన్, తదితర హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏఐఎఫ్డీఎస్ జాతీయ కన్వీనర్ మేత్రి రాజశేఖర్, నాయకులు రవితేజ, గుర్రం రమాదేవి, బొడ్డు సునీత, తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ఇలా.. హైస్కూల్కు వెళ్లేదెలా..
డిచ్పల్లి: మండలంలోని రాంపూర్లో ప్రధాన బీటీ రోడ్డు పూర్తిగా గుంతలు పడి అధ్యానంగా మారింది. గ్రామానికి చెందిన పలువురు విద్యార్థులు ఇదే రోడ్డుగుండా జెడ్పీ హైస్కూల్కు వెళ్తుంటారు. చిన్నపాటి వర్షం కురిసినా రోడ్డుపై ఉన్న గుంతల్లో నీరు చేరడంతో రాకపోకలకు ఇబ్బంది పడుతున్నారు. నీరు ఎక్కువగా నిలిచినప్పుడు గుంతలు కనబడక సైకిల్ పై వెళ్లే విద్యార్థులు, బైక్లపై వెళ్లే వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి బీటీ రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని గ్రామస్తులు, విద్యార్థులు కోరుతున్నారు. -
ప్రధాన రహదారిపై గుంతలు
నేటి చిత్రంమాకు ఫొటో పంపండినిజామాబాద్ రూరల్ – 97053 46541 రోడ్డుపై ప్రమాదకరంగా ఉన్న గుంతలు సిరికొండ: సిరికొండ నుంచి గడ్కోల్ వెళ్లే మార్గంలో ప్రధాన రహదారిపై గుంతలు ఏర్పడ్డాయి. గుంతలతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రమాదకర గుంతలను పూడ్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలి. – సి బాలకిషన్, గడ్కోల్ మీ ప్రాంతంలో నెలకొన్న సమస్యను, ఫొటోను మాకు వాట్సాప్లో పంపించండి. ప్రచురించి అధికారుల దృష్టికి తీసుకెళ్తాము. పంపిన వారి పేరు, ఫొటో ప్రచురిస్తాము. నిజామాబాద్ అర్బన్ – 95531 30597 -
వ్యవసాయానికి సాంకేతికతను జోడించాలి
మోపాల్: వ్యవసాయరంగంలో కూలీల కొరతను అధిగమించేందుకు సాంకేతికతను జోడించాలని, తద్వారా అద్భుత ఫలితాలు సాధించవచ్చని డివిజనల్ ఆగ్రోనామిస్ట్ డాక్టర్ సుధాకర్రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని బాడ్సి సొసైటీ పరిధిలో అంతర్జాతీయ సహకార సంవత్సరం–2025 ఉత్సవాల్లో భాగంగా జిల్లాస్థాయి డ్రోన్ సాంకేతికత ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన వ్యవసాయ సాంకేతికతలపై అవగాహన కల్పించేందుకు డ్రోన్ ప్రదర్శనను చేపట్టారు. డ్రోన్ల వినియోగం, వాటి పద్ధతులు, ప్రయోజనా లు, వ్యవసాయ రంగంలో వాటి పాత్రపై నానో బి జినెస్ మేనేజర్ ఎల్ఎస్ స్వరూప్, సీనియర్ ఆగ్రోనామిస్ట్ పాపిరెడ్డి, ఆగ్రోనామిస్ట్ డాక్టర్ వంశీ రైతులకు వివరించారు. డ్రోన్ల సహాయంతో కీటక నాశినుల స్ప్రే, పంటల ఆరోగ్య నిర్ధారణ, భూమి పర్యవేక్షణ, తదితర అంశాలపై వ్యవసాయ క్షేత్రంలో ప్ర దర్శనలిచ్చారు. రైతులు ప్రత్యక్షంగా వీక్షించి, నిపుణులతో చర్చించి తమ సందేహాలను నివృత్తి చేసు కున్నారు. బాడ్సి సొసైటీ చైర్మన్ నిమ్మల మోహన్రెడ్డి, డైరెక్టర్ పృథ్వీరాజ్, సహకారశాఖ సీనియర్ ఇన్స్పెక్టర్ ఎం శ్రీనివాస్, రైతులు మహిపాల్రెడ్డి, శే రు మల్లయ్య, ఉపసర్పంచ్ రవి, రైతులు, సంఘాల ప్రతినిధులుపాల్గొన్నారు. డివిజనల్ ఆగ్రోనామిస్ట్ డాక్టర్ సుధాకర్రెడ్డి బాడ్సిలో జిల్లాస్థాయి డ్రోన్ సాంకేతికత ప్రదర్శన -
మాజీ ప్రధాని పీవీ బహుభాషా కోవిదుడు
నుడా చైర్మన్ కేశ వేణు మోపాల్: మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు బహుభాషా కోవిదుడు అని, ఆర్థిక సంస్కరణలకు ఆధ్యుడని నుడా చైర్మన్ కేశ వేణు అన్నారు. శనివారం తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మాజీ ప్రధాని, భారత రత్న పీవీ నర్సింహారావు 104వ జయంతి సందర్భంగా నగరశివారులోని బోర్గాం(పి) చౌరస్తాలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పీవీ తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణల వల్లే దేశం అభివృద్ధి చెందుతోందని అన్నారు. సంఘం జిల్లా అధ్యక్షుడు శశికాంత్ కులకర్ణి మాట్లాడుతూ.. బ్రాహ్మణ ముద్దుబిడ్డ, అపర చాణక్యుడు పీవీ నర్సింహారావు అని, వారిని భారతరత్నతో గతంలోనే కేంద్ర ప్రభుత్వం సత్కరించడం బ్రాహ్మణ జాతికి గర్వకారణమన్నారు. కార్యక్రమంలో ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు, నుడా మాజీ చైర్మన్ ఈగ సంజీవ్రెడ్డి, బ్రాహ్మ ణ సంఘం ప్రతినిధులు కంజర్కర్ భూపతిరావు, రమేశ్బాబు,కోళవి విజయ్కుమార్, మిలింద్, రమే శ్, కిరణ్ దేశ్ముఖ్, పుల్కల్ రమేశ్, లక్ష్మీనారాయణ భరద్వాజ్, జయంత్రావు, మల్లికార్జున్, లక్ష్మీకాంత్, అప్పాల కిష్టయ్య, అమర్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ భవన్లో.. నిజామాబాద్ రూరల్: హైదరాబాద్లోని తెలంగా ణ భవన్లో శనివారం నిర్వహించిన మాజీ ప్రధాని పీవీ నరసింహరవు జయంతి వేడుకల్లో జెడ్పీ మాజీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు పాల్గొన్నారు. దేశానికి ఆయన అందించిన సేవలను కొనియాడారు. నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
పోలీసులు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి
● బెటాలియన్ కమాండెంట్ సత్యనారాయణ డిచ్పల్లి: విధి నిర్వహణలో పోలీసులు ఒత్తిడికి గురవుతుంటారని, ఒత్తిడిని జయించి ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలని టీజీఎస్పీ ఏడో బెటాలియన్, డిచ్పల్లి కమాండెంట్ పి సత్యనారాయణ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని మెడికవర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో శనివారం బెటాలియన్లో ఉచిత మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు. హాస్పిటల్కు చెందిన వివిధ విభాగాల డాక్టర్లు బెటాలియన్ అధికారులు, సిబ్బంది, వారి కుటుంబసభ్యులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు అందజేశారు. కమాండెంట్ మాట్లాడుతూ.. మెడికవర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించడం హర్షనీయమన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ కేపీ శరత్కుమార్, ఆర్ఐలు, ఆర్ఎస్సైలు, బెటాలియన్ సిబ్బంది, వారి కుటుంబసభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
ఫ్లెక్సీల ఏర్పాటు
జిల్లా కేంద్రానికి ఆదివారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా రానున్నారు. పసుపు బోర్డు జాతీయ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా నగరంలో భారీగా ఫ్లెక్సీలు వెలిశాయి. డీఎస్ ప్రథమ వర్ధంతి పురస్కరించుకుని కంఠేశ్వర్ బైపాస్ చౌరస్తాలో కాంస్య విగ్రహాన్ని అమిత్ షా ఆవిష్కరించనున్నారు. అనంతరం పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో నిర్వహించనున్న కిసాన్ సమ్మేళన్(రైతు సమ్మేళనం) బహిరంగ సభలో అమిత్షా ప్రసంగించనున్నారు. బైపాస్ చౌరస్తాలో భారీ ఎత్తున సిగ్నల్ లైట్స్, కెమెరాలను ట్రాఫిక్ పోలీసులు ఏర్పాటు చేశారు. – సాక్షి నెట్వర్క్