Nizamabad
-
మళ్లీ రాసుకోవచ్చు
పరీక్ష ఫెయిల్ అయితే జీవితంలో ఫెయిల్ అయినట్లు కాదు. అలా అనుకోవడం పొరపాటు. మళ్లీ పరీక్షలు రాసి మంచి మార్కులు సాధించవచ్చు. క్షణికావేశంలో తీసుసుకున్న నిర్ణయాలు జీవితాంతం బాధ కలిగిస్తాయి. విజయానికి చాలా మార్గాలున్నాయి. విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను గుర్తించి, టైమ్ తీసుకుని మళ్లీ ప్రయత్నించండి. తప్పకుండా మంచి ఫలితాలు సాధిస్తారు. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. జీవితం అమూల్యం. పరీక్ష ఫలితాలు ఎలా ఉన్నా తల్లిదండ్రుల అభయం పిల్లలకు చాలా అవసరం. – ఇజాప రమేశ్, కౌన్సెలింగ్ సైకాలజిస్ట్, మోటివేటర్ -
భారమవుతున్న బస్తా
డొంకేశ్వర్(ఆర్మూర్): రైతులు కొనుగోలు కేంద్రాల్లో విక్రయించిన ధాన్యం రైస్ మిల్లుల్లో దించుకునే వరకు గ్యారంటీ లేకుండా పోయింది. డొంకేశ్వర్ మండలంలోని దత్తాపూర్ గ్రామంలో మూడు రోజుల క్రితం బస్తాలను తూకం వేశారు. అదే రోజు 1,200లకు పైగా బస్తాలను రెండు లారీల్లో నింపారు. ధాన్యం లోడ్ ఏ రైస్ మిల్లుకు వెళ్లాలో కూడా అలాట్మెంట్ ఇచ్చిన సొసైటీ సిబ్బంది రైతుల నుంచి మొబైల్ ఓటీపీ సైతం తీసుకున్నారు. ఎందుకో తెలీదు కాని ధాన్యాన్ని దించుకోలేమని మిల్లర్లు చెప్పడంతో డ్రైవర్లు లోడ్ చేసుకున్న లారీలను దత్తాపూర్లోనే రోడ్డు పక్కన నిలిపి ఉంచారు. మూడు రోజులుగా లారీలు అలాగే ఉండడంతో ఏం జరిగిందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎండల కు ధాన్యం బరువు తగ్గే అవకాశం ఉందని, ఒకవేళ వర్షం కురిస్తే బస్తాలు తడిస్తే మిల్లర్లు తరుగు తీస్తార ని ఆందోళనకు గురవుతున్నారు. ఈ విషయంమై కుద్వాన్పూర్ సొసైటీ సీఈవో చిన్నయ్యను ‘సాక్షి’ వివరణ కోరగా.. వేరే మిల్లులకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. ఆదివారం నుంచి కొనుగోలు కేంద్రంలో ధాన్యం తూకం నిలిచిపోయింది. మిల్లర్లు వద్దనడంతో.. దత్తాపూర్లో మూడు రోజులుగా నిలిచిన తూకం -
కల్లెడిలో అధికారుల నిర్బంధం
మాక్లూర్: వ్యక్తిగత కమీషన్లకు అలవాటు పడి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కాంటాలు చేయకుండా ఆలస్యం చేస్తూ ఇబ్బందులు పెడుతున్నారని ఆలూర్ మండలం కల్లెడి గ్రామ రైతులు మాక్లూర్ సొసైటీ ప్రత్యేక అధికారి ఫిరోజ్ఖాన్, సీఈవో రతన్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రం వద్ద అధికారులతో మంగళవారం వాగ్వాదానికి దిగారు. హమాలీల కొరత ఉందని, దానికి తామేమి చేయాలని అధికారులు సమాధానమివ్వడంతో రైతులు మరింత ఆగ్రహానికి లోనయ్యారు. ఆర్ఎన్ఆర్ ధాన్యానికి ప్రాధాన్యత ఇస్తూ లారీ వెనుక రూ.20వేల నుంచి రూ.30వేల లాభం పొందుతున్నారని ఆరోపిస్తూ అధికారులను కొద్దిసేపు గ్రామ పంచాయతీ స్టోర్ రూమ్లో నిర్బంధించారు. సమాచారం అందుకున్న ఎస్సై–2 మొగులయ్య గ్రామానికి చేరుకుని అధికారులను విడిపించారు. అనంతరం కొనుగోలు కేంద్రం నుంచి ధాన్యం బస్తాలను తరలించిన అధికారులు.. బుధవారం నుంచి రోజుకు రెండు లారీల్లో ధాన్యం బస్తాలను తరలిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు. మాక్లూర్ సొసైటీ అధికారులతో వాగ్వాదం జీపీ భవనంలో ఉంచి తాళం వేసిన రైతులు పోలీసుల జోక్యంతో బయటికి.. రోజుకు రెండు లారీలు పంపుతామని అధికారుల హామీ -
నిర్లక్ష్యాన్ని ఉపేక్షించేది లేదు..
కమ్మర్పల్లి(భీమ్గల్): రైతుల ప్రయోజనాలతో ముడిపడిన అంశాల్లో విధులను నిర్లక్ష్యం వహిస్తే ఉ పేక్షించేది లేదని కలెక్టర్ ఇలా త్రిపాఠి స్పష్టం చేశా రు. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా సకాలంలో ధాన్యం సేకరణ జరిగేలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని ఆదేశించారు. భీమ్గల్ పట్టణంతోపాటు పల్లికొండలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ మంగళవారం సందర్శించారు. పల్లికొండలోని కొనుగోలు కేంద్రం నిర్వహణలో లోటుపాట్లను గుర్తించారు. సేకరించిన ధాన్యానికి సంబంధించిన వివరాలను సక్రమంగా నమోదు చేయకపోవడం, రిజిస్టర్ అందుబాటులో లేకపోవడాన్ని గుర్తించిన కలెక్టర్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్వహణ తీరు ఇలాగే ఉంటే కమీషన్ నిలిపివేస్తామని, వచ్చే సీజన్ నుంచి కొనుగోలు కేంద్రాన్ని కేటాయించబోమని హెచ్చరించారు. విధుల్లో అలసత్వాన్ని తీవ్రంగా పరిగణిస్తూ భీమ్గల్ మండల ఐకేపీ ఏపీఎంకు షోకాజ్ నోటీసు జారీ చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. అక్కడ ఉన్న రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. మాయిశ్చర్ యంత్రం ద్వారా తేమ శాతాన్ని, ధాన్యం బస్తాలను తూకం వేస్తున్న వేయింగ్ మిషన్ పనితీరును క్షుణ్ణంగా పరిశీలించారు. తరుగు, కోత వంటివి లేకుండా, రైతులు ఏ దశలోనూ నష్టపోకుండా పక్కాగా పర్యవేక్షణ చే యాలని అధికారులను ఆదేశించారు. వాతావరణ పరిస్థితుల సమాచారాన్ని ముందస్తుగానే రైతులకు తెలియజేస్తూ వారిని అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు. ట్రక్ షీట్లను వెంటదివెంట తెప్పించుకుంటూ, ట్యాబ్ ఎంట్రీలను వేగవంతం చేయాలని సూచించారు. తద్వారా సకాలంలో రైతుల ఖాతాలలో బిల్లులు జమ అవుతాయన్నా రు. తహసీల్దార్లు, వ్యవసాయ అధికారులు తప్పనిసరిగా క్షేత్రస్థాయిలో కొనుగోలు కేంద్రాలను సందర్శిస్తూ, నిర్వహణ తీరుతెన్నులను నిశితంగా పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట డీఎస్వో శ్రీకాంత్రెడ్డి, పౌర సరఫరాల శాఖ డీఎం ప్రవీణ్, డీసీవో శ్రీనివాస్, తహసీల్దార్ కిరణ్కుమా ర్, ఎంపీడీవో సంతోష్కుమార్ ఉన్నారు. కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి నిర్వహణలో నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం భీమ్గల్ ఐకేపీ ఏపీఎంకు షోకాజ్ నోటీసు జారీ చేయాలని ఆదేశం -
గోవూరులో ఒకరి ఆత్మహత్య
వర్ని: మోస్రా మండలం గోవురు గ్రామంలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వర్ని ఇన్చార్జి ఎస్సై భాస్కరచారి తెలిపిన వివరాల ఇలా.. గ్రామానికి చెందిన సాయిలు(42) మూడు సంవత్సరాల క్రితం ట్రాక్టర్ కొన్నాడు. దీంతో అతడికి ఆర్థికపరమైన ఇబ్బందులు తలెత్తడంతో మద్యానికి బానిసయ్యాడు. మద్యం మత్తులో ఆర్థిక ఇబ్బందులు భరించలేక మంగళవారం గ్రామ శివారులోని చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. హొన్నాజీపేట్లో ఒకరు.. ధర్పల్లి: మండలంలోని హొన్నాజీపేట్లో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా.. మండలంలోని హొన్నాజీపేట్కు చెందిన బాసబోయిన నర్సయ్య (50) తనకున్న ఎకరం పొలంలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. రెండేళ్ల క్రితం తన కూతురు పెళ్లికి అప్పులు చేశారు. దీంతో చేసిన అప్పులు ఎలా తీర్చాలంటూ ఆవేదన చెందేవాడు. ఈక్రమంలో మంగళవారం తన పొలం వద్ద ఓ చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వినయ్ తెలిపారు. లింగంపేట మండలంలో.. లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని శెట్పల్లి గ్రా మంలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై దీపక్కుమార్ తెలిపిన వి వరాలు ఇలా.. గ్రామానికి చెందిన శంకరయ్య(48) కొంత కాలంగా ఛాతి నొప్పితో బాధపడుతున్నాడు. దీంతో జీవితంపై విరక్తి చెంది మంగళవారం ఇంట్లో ఎవరు లేని సమయంలో దూలానికి తాడుతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడికి భార్య సంతోషి, ముగ్గురు కూతుర్లు ఉన్నారు. -
చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి
● ప్రభుత్వ సలహాదారు సుదర్శన్రెడ్డి నిజామాబాద్అర్బన్: యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి క్రీడలు, విద్యపై దృష్టి సారించాల ని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్రెడ్డి అన్నారు. నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రీమియర్ లీగ్ క్రీడల ముగింపు కా ర్యక్రమం నగరంలోని ఉమెన్స్ కళాశాల మైదానంలో మంగళవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా సుదర్శన్రెడ్డి హాజరై పీసీసీ చీఫ్ మహేశ్గౌడ్, రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డితోకలిసి విజేతలకు బహుమతులు అందజేశారు. మహేశ్కుమార్గౌడ్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలు, టూరిజం రంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని, జిల్లాలో రన్నింగ్, వాకింగ్ ట్రా క్ల నిర్మాణాలకు నిధు లు మంజూరు చేసినట్లు తెలిపారు. సీపీ సాయి చైతన్య, అదనపు డీసీపీ శుభం ప్రకాశ్, మేయర్ ఉమారాణి, నుడా చైర్మన్ కేశ వేణు, మార్కెట్ కమి టీ చైర్మన్ ముప్పగంగారెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, కాంగ్రెస్ జిల్లా, నగర అధ్యక్షులు నగేశ్రెడ్డి, బొబ్బిలి రామకృష్ణ, ఎన్ఎస్సీ ప్రధాన కార్యదర్శి కవితరెడ్డి, కోశాధికారి, సంయుక్త కార్యదర్శులు రజనీకాంత్, శిరీష్, శ్రీనివాస్రెడ్డి, డాక్టర్ ఉషా తదితరులు పాల్గొన్నారు. -
క్రీడలకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట
● రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి ● డిచ్పల్లి ఏడో బెటాలియన్లో రాష్ట్రస్థాయి బేస్బాల్ పోటీలు ప్రారంభండిచ్పల్లి(నిజామాబాద్రూరల్): రాష్ట్రంలో క్రీడలకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేయనున్నారని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి అన్నారు. డిచ్పల్లిలోని రాష్ట్ర ప్రత్యేక పోలీస్ ఏడవ బెటాలియన్ మైదానంలో మంగళవారం బేస్బాల్ జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యంలో బాల, బాలికల 6వ రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ బేస్బాల్ చాంపియన్షిప్ పోటీలు ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే భూపతిరెడ్డి హాజరై, క్రీడాకారులను పరిచయం చేసుకొని, జ్యోతి ప్రజ్వలన చేసి పోటీలను ప్రారంభించారు. కొద్దిసేపు క్రీడాకారులతో కలిసి బేస్బాల్ ఆడారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. క్రీడాకారులు అవకాశాలను అందిపుచ్చుకొని ఉన్నతంగా రాణించి రాష్ట్రానికి గొప్ప పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. అనంతరం స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు సాధించిన పలువురిని ఎమ్మెల్యే సన్మానించారు. కమాండెంట్ సత్యనారాయణ మాట్లాడుతూ.. క్రీడలతో శారీరక, మానసికోల్లాసం పెంపొందుతుందన్నారు. రాష్ట్ర బేస్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్వేత మాట్లాడుతూ.. పోటీలలో ప్రతిభ చూపిన క్రీడాకారులను ఎంపిక చేసి, వచ్చే నెల 24 నుంచి 28వరకు ఒరిస్సా రాష్ట్రం భువనేశ్వర్లో జరగబోయే జాతీయ పోటీలకు పంపిస్తామని తెలిపారు. ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు అమృతాపూర్ గంగాధర్, ప్రధాన కార్యదర్శి పొలసాని శ్రీనివాస్, సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షుడు మునిపల్లి చిన్నసాయరెడ్డి, సర్పంచ్ కోట్ల భాస్కర్, చిన్నోల్ల నర్సయ్య, రాంచందర్గౌడ్, షాదుల్లా, కార్పొరేటర్ అగ్గు భోజన్న, కార్యకర్తలు, బేస్బాల్ అసోసియేషన్ కోశాధికారి కృష్ణ, జిల్లా కార్యదర్శి సొప్పరి వినోద్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రతి పౌరుడు జనగణనలో భాగస్వామ్యం కావాలి
తెయూ(డిచ్పల్లి): ప్రతి పౌరుడు సామాజిక బాధ్యతగా భావించి జన గణనలో భాగస్వామ్యం కావా లని తెలంగాణ యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ లక్ష్మణ చక్రవర్తి పిలుపునిచ్చారు. తె యూ ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ‘నో యువర్ నేషన్: అవేర్నెస్ ఆన్ సెన్సెస్ –2026’ అనే అంశంపై అవగాహన కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మా ట్లాడారు. సరైన విధానాలు, సంక్షేమ పథకాలు రూ పొందించడంలో జనగణన డేటా కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. టుటా అధ్యక్షుడు పున్నయ్య మాట్లాడుతూ.. జనగణన ద్వారా దేశంలోని సామాజిక, ఆర్థిక పరిస్థితులపై స్పష్టమైన అవగాహన లభిస్తుందన్నారు. పీఆర్వో రమణాచారి మాట్లాడుతూ.. ప్రజల్లో సరైన సమాచారం చేరవేయడం అత్యంత ముఖ్యమన్నారు. ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు స్వామి, శ్రీనివాస్, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. -
గ్రామాభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలకం
దోమకొండ: గ్రామాల అభివృద్ధిలో సర్పంచ్ల పాత్ర కీలకమని తెలంగాణ విశ్వవిద్యాలయం వీసీ యాదగిరిరావు అన్నారు. దోమకొండలో గడికోట ట్రస్టు, తెలంగాణ విశ్వవిద్యాలయం సౌత్ క్యాంపస్ ఆధ్వర్యంలో మంగళవారం కామారెడ్డి డివిజన్కు చెందిన వివిధ గ్రామాల సర్పంచ్లకు గ్రామాల అభివృద్ధిలో సర్పంచ్ల పాత్రపై అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి వీసీ హాజరై, మాట్లాడారు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గ్రామాల్లో వసతుల కొరత వల్ల జరుగుతున్న వలసలను నివారించేందుకు సర్పంచులు ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పించాలని సూచించారు. సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికి చేరేలా కృషి చేయాలన్నారు. గ్రామానికి సంబంధించిన పూర్తి సమాచారం సర్పంచులు సేకరించాలన్నారు. ఈ తరహా అవగాహన సదస్సులు ఎంతో ఉపయోగకరమని పలువురు సర్పంచ్లు తెలిపారు. మహిళా సర్పంచులు మాట్లాడుతూ.. మహిళా సాధికారత కోసం, గ్రామ అభివృద్ధి కోసం, ప్రత్యేక కార్యక్రమాలను చేపడతామన్నారు. అనంతరం పాల్గొన్న సర్పంచ్, ఉప సర్పంచ్లకు సన్మానంతోపాటు, సర్టిఫికెట్లను అందించారు. సౌత్ క్యాంపస్ ప్రిన్సిపాల్ సుధాకర్గౌడ్, నారాయణ గుప్తా, ఇంద్రకరణ్ రెడ్డి, ట్రస్ట్ చైర్మన్ బాబ్జి, శ్రీకాంత్ గౌడ్, కిషన్, కిరణ్ రాథోడ్, గంగా కిషన్, రాజేష్, రామలింగం, ప్రవీణ్, లైఫ్ ఎన్జీవో స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి బాల ప్రసాద్, దోమకొండ సర్పంచ్ ఐరేని నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. -
ద్విచక్ర వాహనాలు ఢీకొని ఇద్దరికి గాయాలు
మాక్లూర్: మండలంలోని ధర్మోరా–మాందాపూ ర్ రోడ్డుపై రెండు ద్విచక్ర వాహనాలు ఎదురె దురుగా వచ్చి ఢీకొనడంతో ఇద్దరికి గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా.. ధర్మోరా గ్రామానికి చెందిన సాయన్నల్ల ప్రసాద్ తన బైక్పై మంగళవారం రాత్రి ధర్మోరా నుంచి మాందాపూర్ వైపు బయలుదేరాడు. అదే గ్రా మానికి చెందిన టాకిన్ మల్లయ్య టీవీఎస్ ఎక్సెల్పై మాందాపూర్ నుంచి ధర్మోరా వైపు బయలుదేరాడు. వీరిద్దరి వా హనాలు గ్రామ శివారు లో ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి. మల్లయ్యకు స్వ ల్ప గాయాలు కాగా, ప్రసాద్కు బలమైన గాయాలు అయ్యాయి. వీరిద్దరిని చికిత్స నిమిత్తం స్థానికులు జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. -
ధాన్యం కుప్పను ఢీకొన్న స్కూటీ.. యువతి మృతి
వర్ని: రోడ్డుపై వేసిన ధాన్యం కుప్పను స్కూటీ ఢీకొని యువ తి మృతి చెందింది. ఈ ఘటన మోస్రా మండల కేంద్రంలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. వర్ని ఇన్చార్జి ఎస్సై భాస్కరాచారి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. నిజామాబాద్ నగరంలోని నామ్దేవ్వాడకు చెందిన అక్కాచెల్లెళ్లు దేవిరెడ్డి(17), మహారెడ్డి మోస్రాలోని బంధువుల ఇంటికి ఆదివారం ద్విచక్ర వాహనంపై వెళ్లారు. సో మవారం రాత్రి తిరిగి నిజామాబాద్కు బయల్దేరారు. ఈ క్రమంలో మోస్రా శివారులో రోడ్డుపై వేసిన ధాన్యకుప్పను స్కూటీ ఢీకొనడంతో ఇద్దరికి గాయాలయ్యాయి. స్థానికు లు వారిని చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రానికి తరలించగా దేవిరెడ్డి అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మహారెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. దేవిరెడ్డి ఇంటర్మీడియెట్ విద్య పూర్తి చేయగా, మహారెడ్డి ప్రస్తుతం బీటెక్ చదువుతోంది. మృతురాలి తండ్రి జైపాల్రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ‘ఉపాధి’లో అలసత్వం వద్దు నిజామాబాద్ రూరల్: ఉపాధిహామీ పనుల్లో అలసత్వం తగదని డీఆర్డీవో సాయన్న అన్నారు. మండలంలోని మల్కాపూర్(తాళ్ల కొత్త పేట్) గ్రామంలో కొనసాగుతున్న ఉపాధి పనులను మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. పనులు కొనసాగుతున్న చోట్ల కూలీల కు టెండ్లు, తాగునీరు వంటి సదుపాయాలు కల్పించాలని సూచించారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలన్నారు. ఎండల తీవ్రత దృష్ట్యా ఉదయం త్వరగా పని ప్రదేశానికి చేరుకుని తమకు కేటాయించిన పనిని పూర్తి చేసుకుని ఇళ్లకు వెళ్లిపోవాలని కూలీలకు సూచించారు. ఆయనవెంట ఎంపీడీవో రామ్నారాయణ, ఎంపీవో ఎక్బాల్, ఏపీవో పద్మ, సర్పంచ్ తదితరులున్నారు. కాంగ్రెస్ భవన్ నిర్మాణానికి నేడు భూమిపూజ నిజామాబాద్ రూరల్: జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ భవన్ నిర్మాణ పనులకు ఇన్చార్జి మంత్రి సీతక్క, టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్ బుధవారం భూమి పూజ చేయనున్నా రు. రైల్వేస్టేషన్కు కొద్ది దూరంలో కొన్నేళ్లుగా పార్టీ కార్యాలయం కొనసాగుతుండగా.. సమీపంలోనే నూతన భవనం నిర్మించనున్నారు. అలాగే మంత్రి సీతక్క న్యూ అంబేడ్కర్ భవన్, రాజీగాంధీ ఆడిటోరియంలో నిర్వహించనున్న వివిధ కార్యక్రమాల్లో పా ల్గొంటారని డీసీసీ అధ్యక్షుడు కాటిపల్లి నగేశ్రెడ్డి తెలిపారు. కార్యక్రమానికి పెద్ద సంఖ్య లో పార్టీ శ్రేణులు హాజరుకావాలని ఆయన కోరారు. అలాగే నిజామాబాద్ రూరల్ మండలంలోని మల్కపూర్(ఎం) తాళ్ల కొత్తపేట్ గ్రామంలో ఉపాధి హామీ పనులను మంత్రి పరిశీలిస్తారని ఎంపీడీవో రామ్నారాయణ తెలిపారు. -
రైతు ఉత్పత్తిదారుల సంఘాలను బలోపేతం చేయాలి
జక్రాన్పల్లి: రైతు ఉత్పత్తిదారుల సంఘాలను బలోపేతం చేయాలని జేఎంకేపీఎం చైర్మన్ పాట్కూరి తిరుపతిరెడ్డి రెడ్డి అన్నారు. అదిలాబాద్ జిల్లాకేంద్రంలోని జిల్లా పరిషత్ సమావేశ గదిలో మంగళవారం ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, కెవికె కృషి విజ్ఞాన్ కేంద్రం ఆధ్వర్యంలో ఉత్తర తెలంగాణ మండల వ్యవసాయ పరిశోధన విస్తరణ సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా రైతు ఉత్పత్తిదారుల సంఘం తరఫున తిరుపతిరెడ్డి పాల్గొని మాట్లాడారు. హార్టికల్చర్, అగ్రికల్చర్, సెరికల్చర్, ఫిసికల్చర్ వెటర్నరీ సహా అన్ని రంగాల రైతులకు శాస్త్రవేత్తలు సరైన సలహా సూచనలు ఇవ్వాలన్నారు. పంటను ప్రభుత్వమే మార్కెటింగ్ చేయించి పంట పండించిన రైతులకు సరైన గిట్టుబాటు ధర కల్పించేలా చొరవ చూపాలన్నారు. కార్యక్రమంలో వివిధ జిల్లాల రైతు ఉత్పత్తిదారు సంఘాల ప్రతినిదులు, రైతులు, కెవికె శాస్త్రవేత్త శ్వేత, రాజు తదితరులు పాల్గొన్నారు. -
ఉపాధికి వడదెబ్బ ముప్పు!
డొంకేశ్వర్(ఆర్మూర్): నిప్పులు కక్కుతున్న ఎండలు సామాన్యులను వణికిస్తుండగా, ఉపాధిహామీ పనులకు వెళ్తున్న కూలీలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. జిల్లాలో 46 డిగ్రీల గరిష్ట స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో కూలీలకు వడదెబ్బ ము ప్పు పొంచి ఉంది. ఉదయం పనికి వచ్చిన కొద్ది సేపటికే భానుడు మండిపోతుండడంతో పని ప్ర దేశాల్లో కూలీలు అల్లాడుతున్నారు. తొమ్మిది గంటలకు వాతావరణం వేడెక్కి వడగాలులు వీస్తున్నాయి. దీంతో కూలీలు ఉక్కపోతతో డీహైడ్రేషన్కు గురవుతున్నారు. అలసటతో పని చేయలేకపోతున్నారు. ఆయా గ్రామాల్లో ఆరోగ్య సిబ్బంది, ప్ర జాప్రతినిధులు కూలీలకు ఓఆర్ఎస్, మజ్జిగ ప్యాకె ట్లు అందజేయడంతో కొంత వరకు ఉపశమనం పొందుతున్నారు. జిల్లాలోని 530 గ్రామ పంచాయతీల పరిధిలో ఉపాధిహామీ పనులు జరుగుతుండగా, ప్రస్తుతం 35వేల మందికి పైగా కూలీలు పనులను వస్తున్నారు. వేసవి కావడంతో నీళ్లు తగ్గిన చెరువులు, కుంటల్లో కూలీలతో మట్టి పూడిక తీయిస్తున్నారు. నల్ల రేగడి, ఎరుపు నేలలు కావడంతో భానుడి ప్రతాపానికి వాతావరణం తొందరగా వేడెక్కుతోంది. డొంకేశ్వర్ మండలం దత్తాపూర్ పెద్ద చెరువులో పూడిక తీస్తున్న ఉపాధి కూలీలు కొన్ని చోట్ల చిన్నపాటి టెంట్లు ఎండలు తీవ్రం కావడంతో పని ప్రదేశాల్లో పని చేసి అలసిపోయిన కూలీల కోసం నీడనిచ్చే టెంట్లు, తాగునీటి వసతి ఏర్పాటు చేయాలని జిల్లా ఉన్నతాధికారులు ఫీల్ట్ అసిస్టెంట్లను, పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. కొన్ని ప్రాంతాల్లో సౌకర్యాలు బాగా నే ఉన్నాయి. కానీ, మరికొన్ని ప్రాంతాల్లో చిన్నపాటి షేడ్ నెట్లు ఏర్పాటు చేశారు. వాటి కింద పదిమంది మాత్రమే కూర్చోగలుగుతున్నారు. మిగతా కూలీలు చెట్ల నీడకు సేద తీరుతున్నారు. తాగునీరు కూడా కొన్ని చోట్ల దూర ప్రాంతాలకు రవాణా చేయలేకపోతున్నారు. సౌకర్యాలపై స్పష్టమైన ఆదేశాలిచ్చాం తీవ్రమైన ఎండలను దృష్టిలో పెట్టుకుని కూలీలు పని చేసే చోట వారు సేద తీరేందుకు టెంట్లు, తాగునీటి సౌకర్యాలు కల్పించాలని గ్రామీణాభివృద్ధి శాఖ, జిల్లా పంచాయతీ శాఖ నుంచి స్పష్టమైన ఆదేశాలిచ్చాం. ఈ ఆదేశాలను అమలు చేయకపోతే శాఖాపరమైన చర్యలుంటాయి. కూలీలు వడదెబ్బ బారిన పడకుండా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. ఓఆర్ఎస్ ద్రవాన్ని తాగాలి. – సాయన్న, డీఆర్డీవో, నిజామాబాద్ ఉదయం 8గంటలకే భగభగ మంటున్న భానుడు వేడిగాలులు, ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి పని ప్రదేశాల్లో తగినంత నీడ, నీళ్లు లేక ఇబ్బందులు -
డిగ్రీ పరీక్షల్లో 302 మంది గైర్హాజరు
తెయూ(డిచ్పల్లి): తెలంగాణ వర్సిటీ పరిధిలో కొనసాగుతున్న డిగ్రీ రెగ్యులర్, బ్యాక్లాగ్ పరీక్షలు మంగళవారం ప్రశాంతంగా జరిగినట్లు అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పరిధిలో ఏర్పాటు చేసిన 29 పరీక్ష కేంద్రాలలో మొత్తం 7,118 మంది అభ్యర్థులకు గాను 6,816 మంది హాజరైనట్లు తెలిపారు. 302 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఉదయం జరిగిన ఆరవ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్ష కు 4,049 మందికి గాను 3,919 మంది హాజరు కాగా 130 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం జరిగిన మొదటి సెమిస్టర్ బ్యాక్లాగ్ పరీక్షకు 3,069 మంది విద్యార్థులకు గాను 2,897 మంది హాజరు కాగా 172 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని తెలిపారు. కాలభైరవుడికి 108 రకాల స్వీట్లతో నైవేద్యం రామారెడ్డి: ప్రముఖ పుణ్యక్షేత్రం ఇసన్నపల్లి(రామారెడ్డి) శ్రీకాలభైరవుడిని వైశాఖ మాసం రెండోవ మంగళవారం సందర్భంగా 108 ర కాల స్వీట్లతో అలంకరించారు. ఈ సందర్భంగా భక్తులు ఉదయం నుంచి స్వామి వారికి జ లాభిషేకాలు, సింధూర పూజలు నిర్వహించారు.అనంతరం స్వామి వారికి అర్చకులు 108 రకాల స్వీట్లతో అలంకరించి నైవేద్యం సమర్పించారు. స్వామికి అలంకరించే కరెన్సీ దండకు భక్తులు విరాళాలు అందజేశారు. అనంతరం అన్నదానం నిర్వహించారు. మూడో మంగళవారం 108 రకాల కూరగాయలతో స్వామివారికి నైవేద్యం సమర్పించనున్నారు. ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు చింతల శంకర్, ఈవో ప్రభుగుప్తా, అర్చకులు శ్రీనివాసశర్మ, జూనియర్ అసిస్టెంట్ లక్ష్మణ్ ఉన్నారు. -
మత్తు పదార్థాలు విక్రయిస్తే రూ.10వేల జరిమానా
● అంక్సాపూర్ జీపీ తీర్మానంవేల్పూర్: మండలంలోని అంక్సాపూర్ గ్రామంలో 21 ఏళ్లలోపు వారికి మత్తు పదార్థాలు విక్రయిస్తే రూ. 10వేల జరిమానా విధిస్తామని జీపీ పాలకవర్గం తీర్మానించింది. ఈమేరకు మంగళవారం దుకాణాల వద్ద పోస్టర్లు అతికించినట్లు సర్పంచ్ తీట్ల శ్రీనివాస్ తెలిపారు. జీపీ తీర్మానం ప్రకారం 21 ఏళ్లలోపు పిల్లలకు సిగరేట్లు, మత్తు పానీయాలు, పాన్ మసాలా, మద్యం విక్రయించరాదన్నారు. జీపీ తీర్మానాన్ని దిక్కరించిన వారికి రూ.10వేల జరిమానా విధిస్తామని పేర్కొన్నారు. -
జీవితం పరీక్ష కాదు
● ఫలితంపై ఆందోళన వద్దు ● మళ్లీ ప్రయత్నిస్తే అందరితోపాటు ముందుకు..ఖలీల్వాడి: జీవితం.. ఎన్నో దారులు, అనుభవాలు, అవకాశాలతో కూడినది. ఏడాదంతా కష్టపడి పరీక్షలు రాసిన విద్యార్థులు ఫలితం ఎలా వస్తుందోనని భయాందోళనకు గురికావడం సహజమే. అయితే జీవితమంటే ‘పరీక్ష’ మా త్రమే కాదు.. ఫలితాలు జీవితాన్ని నిర్ణయించలేవు. ఫెయి ల్ అయిన విద్యార్థికి మళ్లీ పరీక్ష రాసుకునే, తక్కువ మా ర్కులు వచ్చిన వారు రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్కు వెళ్లే అవకాశం ఉంటుంది. ఉత్తీర్ణత సాధించి అందరితో కలిసి ఉన్నత చదువులకు వెళ్లే అవకాశం ఉంటుంది. అయితే ఆశించిన స్థాయిలో మార్కులు, ర్యాంకు రాలేదని కొంత మంది, ఫెయిల్ అయ్యామని కొంత మంది విద్యార్థులు ఒ త్తిడికి గురవుతుంటారు. ఇదే సమయంలో తల్లిదండ్రులు వారికి భరోసా కల్పించాలి. ‘పరీక్ష’ తప్పిన విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలూ జిల్లాలో గతంలో చోటు చేసుకున్నాయి. చదువు జీవితంలో భాగమే కానీ.. అదే జీవితం కాదని విషయంపై టీచర్లు, ఫ్రెండ్స్, కుటుంబసభ్యులు ఆత్మస్థైర్యాన్ని నింపా లని వ్యక్తిత్వ వి కాస నిపుణులు సూచిస్తున్నారు. మొత్తం విద్యార్థులు 24,545.. విద్యాసంవత్సరం మార్చి 14 నుంచి ఏప్రిల్ 15వ తేదీ వ రకు ఎస్సెస్సీ బోర్డు పరీక్షలు జరిగాయి. జిల్లాలో రెగుల్య ర్, ప్రయివేట్, ఒకేషనల్ విద్యార్థులు మొత్తం 24,545 మంది పరీక్ష ఫీజు చెల్లించారు. ఇందులో 24,402 మంది రెగ్యులర్ విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 42 మంది గైర్హాజరయ్యారు. అలాగే ప్రయివేట్ విద్యార్థులు 143 మంది పరీక్షలు రాశారు. నిరుత్సాహం వద్దు పదో పరీక్ష ఫలితాల్లో తగిన మార్కులు రాలేదని, ఫెయిల్ అయ్యామని చాలామంది విద్యార్థులు నిరాశ చెందుతారు. భావోద్వేగాలను సమన్వయ పర్చుకుంటూ ఒత్తిడికి గురి కాకుండా జీవితంలో ముందుకు ఎలా వెళ్లాలో తల్లిదండ్రులు మార్గదర్శనం చేయాలి. ఆత్మ విశ్వాసం పెంపొందించే విషయాలు, కథలు, పలువురి అనుభవాలను వారికి వివరించాలి. పరీక్షలే జీవితానికి ముఖ్యం కాదని వారికి ఆర్థమయ్యే రీతిలో చెప్పాలి. జీవితంలో పైస్థాయికి చేరుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయని అవగాహన కల్పించాలి. – డాక్టర్ ఆకుల విశాల్, సైకాలజిస్ట్పరీక్షలు రాసిన వారు 24,503 రెగ్యులర్ 24360 ప్రయివేట్ 143 -
అటవీశాఖ అధికారి బైక్ దహనం..
సిరికొండ: మండలంలోని రావుట్ల అటవీ ప్రాంతంలో విధులకు వెళ్లిన అ టవీ బీట్ అధికారి శ్రీకాంత్ బైకును గుర్తుతెలియని వ్యక్తులు దహనం చేసినట్లు ఎఫ్ఆర్వో నర్సింగరావు తెలిపారు. రావుట్ల బీట్ పరిధిలోని కంపార్ట్మెంట్ నెంబర్ 395లో సోమవారం సెక్షన్ ఆఫీసర్ లచ్చయ్యతో కలిసి శ్రీ కాంత్ అటవీశాఖకు చెందిన బైక్పై గస్తీకి వెళ్లారు. ఒకచోట బైకును నిలిపి అటవీ ప్రాంతంలోకి వెళ్లి తిరిగి వచ్చి చూసేసరికి ద్విచక్ర వాహనం కాలిపోయిందని తెలిపారు. ఈ ఘటనపై ఫిర్యాదు చేయగా సిరికొండ ఎస్సై రామకృష్ణ వచ్చి బైక్ను పరిశీలించినట్లు ఎఫ్ఆర్వో తెలిపారు. అగ్నిప్రమాదంలో గడ్డి, లాండ్రీ షాప్ దగ్ధం మోపాల్: మండలంలోని మంచిప్పలో ఆదివారం జరిగిన అగ్నిప్రమాదంలో గడ్డి కట్టలు, లాండ్రీ షాప్ దగ్ధమయ్యాయి. వివరాలు ఇలా.. గ్రామంలో గోవూరు మహిపాల్కు చెందిన 300 గడ్డి కట్టలు ఉన్నాయి. గుర్తు తెలియని వ్యక్తులు సిగరేట్ అంటించుకొని అగ్గిపుల్లను ఆర్పకుండ పడేయంతో గడ్డి కట్టలకు మంటలు అంటుకున్నాయి. దీంతో మంటలు వ్యాపించి పక్కనే ఉన్న చాకలి సంజీవ్ లాండ్రీ షాప్నకు వ్యాపించాయి. ప్రమాదంలో ఇసీ్త్ర దుకాణంలో ఉన్న దుస్తులు, ఇతర పూర్తిగా కాలిబూడిదయ్యాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పేశారు. రెవెన్యూ అధికారులు, పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి పంచనామ నిర్వహించారు. -
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరి మృతి
నిజామాబాద్ జిల్లాలోని వేర్వేరు ప్రాంతాలలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతిచెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. నవీపేట: మండలంలోని రాంపూర్ గ్రామ శివారు లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధుడు మృతిచెందాడు. ఎస్సై శ్రీకాంత్ తెలిపిన వివరాలు ఇలా.. రాంపూర్ గ్రామానికి చెందిన ఎర్రోళ్ల చిన్న గంగారం(60) అనే వృద్ధుడు మంగళవారం రాంపూర్ నుంచి లక్ష్మీకిసాన్ఫారం వైపు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా.. వెనుక నుంచి వేగంగా వచ్చిన ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన చిన్న గంగారాంను స్థానికులు ఆస్పత్రి కి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందా డు. మృతుడి కుమారుడు వినీత్ ఫిర్యాదు మేరకు కే సు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. డివైడర్ను బైక్ ఢీకొనడంతో రైతు.. నవీపేట: మండలంలోని అభంగపట్నం గ్రామ సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ రైతు మృతిచెందాడు. ఎస్సై శ్రీకాంత్ తెలిపిన వివరాలు ఇలా.. మండలంలోని కమలాపూర్ గ్రామానికి చెందిన మూల వెంకట సుబ్బారెడ్డి (60) అనే రైతు మంగళ వారం వడ్ల లోడును లారీలో నిజామాబాద్కు తరలించగా, అతడు బైక్పై వెనకాల వెళ్లాడు. అభంగపట్నం గ్రామ సమీపంలో అతడి బైక్ అదుపుతప్పి డివైడర్ను ఢీకొనడంతో తీవ్రంగా గాయపడి, అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి భార్య నాగేశ్వరమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
‘ఇందిరమ్మ ఇళ్ల’పై నిర్లక్ష్యం వహించొద్దు
● పనులు త్వరగా పూర్తయ్యేలా లబ్ధిదారులకు అవగాహన కల్పించాలి ● అధికారులకు కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశం ● కలెక్టరేట్లో ఇందిరమ్మ ఇళ్లు, డబుల్ బెడ్రూం ఇళ్లపై సమీక్ష నిజామాబాద్ అర్బన్: ఇందిరమ్మ ఇళ్ల విషయంలో నిర్లక్ష్యానికి తావు కల్పిస్తే ఉపేక్షించబోమని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరించారు. జిల్లాకేంద్రంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో మంగళ వారం ఇందిరమ్మ ఇళ్ల పురోగతి, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపు తదితర అంశాలపై ఆమె సుదీర్ఘ స మీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మా ట్లాడుతూ.. ఇందిరమ్మ పథకం కింద మంజూరు చేసిన ఇళ్లను లబ్ధిదారులు వేగవంతంగా పూర్తి చేసుకునేలా అధికారులు ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలన్నారు. ఇళ్ల నిర్మాణాలలో వెనుకంజలో ఉన్న మండలాల అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మొద టి విడతలో ఆయా నియోజకవర్గాలకు కేటాయించిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తి స్థాయిలో గ్రౌండింగ్ జరగాల్సిందేనని స్పష్టం చేశారు. ఇంటి నిర్మాణం చేపట్టేందుకు ముందుకురాని వారి స్థానంలో అర్హులైన కొత్తవారిని లబ్ధిదారులుగా ఎంపిక చేయాలని ఆదేశించారు. ఈ ప్రక్రియ వారం రోజుల్లోపు పూర్తి చేయాలని గడువు విధించారు. సెల్ఫ్ స్టేజ్ క్యాప్చర్పై అవగాహన కల్పించాలి.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకంలో పారదర్శకతను పెంపొందించేందుకు ‘సెల్ఫ్ స్టేజ్ క్యాప్చర్ సిస్టమ్’ ను అమలు చేస్తోందని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపా రు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు తమ ఇంటి నిర్మా ణ దశలను వారే స్వయంగా మొబైల్ ఫోన్ ద్వారా ఫోటోలు తీసి, ప్రభుత్వ పోర్టల్లో అప్లోడ్ చేసే అ వకాశం కల్పించబడిందని తెలిపారు. ఈ విధానం ద్వారా లబ్ధిదారులకు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పనిభారం ఉండదని, నిర్మాణ దశల ధ్రువీకరణ వేగవంతం అవుతుందని, నిధుల విడుదలలో అనవసర జాప్యం నివారించబడుతుందన్నారు. క్షే త్రస్థాయిలో లబ్ధిదారులకు ఈ విధానంపై అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. లాటరీ విధానంలో డబుల్ ఇళ్ల కేటాయింపు.. రెండు పడక గదుల ఇళ్ల స్థితిగతులను క్షేత్రస్థా యిలో క్షుణ్ణంగా పరిశీలిస్తూ తక్షణమే సమగ్ర నివేదిక సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు. ఇప్పటికే నిర్మాణాలు పూర్తయిన చోట డబుల్ బెడ్రూమ్ కేటాయింపు కోసం లాటరీ విధానం ద్వారా లబ్ధిదారులను ఖరారు చేయాలని, పార దర్శకంగా ఈ ప్రక్రియ నిర్వహించాలని సూ చించారు. ఇదివరకు స్థలాలు పంపిణీ చేసి, ప్రొ సీడింగ్లు అందించిన వారికి ఎక్కడైనా పట్టా లు ఇవ్వకపోతే తక్షణమే పట్టాలు పంపిణీ చేయాలని అన్నారు. ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణాలకు పలుచోట్ల అటవీ సంబంధిత సమస్యలు నెలకొని ఉన్నాయని, వాటిని క్షేత్రస్థాయిలోనే పరిష్కరించాలని తహసీల్దార్లకు మార్గనిర్దేశం చేశారు. ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ నుంచి నల్లమట్టి, చెరువుల నుండి పూడిక మట్టిని వ్యవసా య అవసరాల కోసం రైతులు ఉచితంగా తరలించుకునేలా అనుమతించాలని సూచించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను క్రమం తప్పకుండా సందర్శిస్తూ పక్కాగా పర్యవేక్షణ జరపా లన్నారు.సమావేశాల్లో అదనపు కలెక్టర్ దిలీప్ కుమార్, సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియ, ని జామాబాద్ ఆర్డీవో రాజేంద్రకుమార్, హౌసింగ్ పీడీ గంగాధర్, ఏఈ నివర్తి మున్సిపల్ కమిషనర్లు, ఆయా మండలాల ఎంపీడీవోలు, తహసీల్దార్లు, హౌసింగ్ ఏఈలు పాల్గొన్నారు. -
నిజామాబాద్
బుధవారం శ్రీ 29 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026ధాన్యం సేకరణ ప్రక్రియ రైతన్నను ఆందోళనకు గురి చేస్తోంది. జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ధాన్యం రాశులు పేరుకుపోగా, మరికొన్ని ప్రాంతాల్లో తూకం వేసి బస్తాల్లో నింపిన ధాన్యం తరలించడం లేదు. మాక్లూర్ మండలంలో సీజన్ ప్రారంభం నుంచి రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటుండగా, తాజాగా డొంకేశ్వర్, నవీపేట తదితర మండలాల్లో సమస్య ఉత్పన్నమవుతోంది. లారీలు, హమాలీల కొరత, రైస్మిల్లర్లు అన్లోడ్ చేసుకోకపోవడం కారణంగా చాలాచోట్ల కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం బస్తాలు ఉండిపోయాయి. తాజాగా డీజిల్ కొరత పరిస్థితులు వస్తుండడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. తరుగుకు ఒప్పుకుంటేనే ధాన్యం తరలిస్తున్నారని లేదంటే నిరాకరిస్తున్నారని మోర్తాడ్ ప్రాంత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో సంబంధిత అధికారులు పర్యవేక్షిస్తేనే పరిస్థితి చక్కబడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
నేడు గులాబీ సంబురం!
● ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోనున్న బీఆర్ఎస్ ● ఊరూరా జెండావిష్కరణకు ఏర్పాట్లుసాక్షి ప్రతినిధి, కామారెడ్డి: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పురుడుపోసుకు న్న బీఆర్ఎస్ ఆవిర్భవించి పాతికేళ్లవుతోంది. 2001 ఏప్రిల్ 27న ఆ పార్టీ ఆవిర్భవించింది. ఆ పార్టీ తొలినాళ్లలోనే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవాలతో చరిత్ర సృష్టించింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పరిషత్ను కైవసం చేసుకుంది. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో ఎల్లారెడ్డిలో విజయం సాధించింది. ఆ తరువాత తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి, టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, నేతలు గులాబీ కండువా కప్పుకున్నారు. తెలంగాణ రా ష్ట్రం ఏర్పాటైన తర్వాత 2014లో జ రిగిన ఎన్నికల్లో ఉమ్మడి జిల్లా లో తొమ్మిది ఎమ్మెల్యే స్థానా లకు గాను అన్నింటిని ఆ పార్టీ గెలుచుకుంది. నిజామాబాద్, జహీరాబాద్ ఎంపీ స్థానాల్లోనూ ఘనవిజయం సాధించింది. అప్పటి నుంచి తిరుగులేని శక్తిగా ఎదిగింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్లారెడ్డి మినహా అన్నిచోట్ల బీఆర్ఎస్ అభ్యర్థులే గెలిచారు. రెండు పర్యాయాలు అంటే పదేళ్లపాటు గులాబీ పార్టీ రాష్ట్రంలో అధికారంలో కొనసాగింది. కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటుతో పాటు తండాలను పంచాయతీలుగా చేయడం ద్వారా పాలనను కేసీఆర్ ప్రజల చెంతకు తీసుకువెళ్లారు. అయితే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఎదురు దెబ్బ తగిలింది. బాన్సువాడ, బాల్కొండ నియోజకవర్గాల్లో మాత్రమే ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. పైగా పార్టీ అధినేత కేసీఆర్ కామారెడ్డిలో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2024 పార్లమెంటు ఎన్నికల్లో జహీరాబాద్, నిజామాబాద్ ఎంపీ స్థానాల్లోనూ ఆ పార్టీ అభ్యర్థులు ఓటమి చెందారు. బాన్సువాడ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన పోచారం శ్రీనివాస్రెడ్డి.. ఆ తర్వాత కాంగ్రెస్ గూటికి చేరారు. జిల్లాలో ఆయా నియోజకవర్గాలకు చెందిన పలువురు నేతలు సైతం గులాబీ పార్టీకి దూరమయ్యారు.బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఊరూరా గులాబీ జెండాలు ఆవిష్కరించాలని ఆ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు ఆదేశాలు జారీ చేశారు. గ్రామం, మండలం, నియోజకవర్గం, జిల్లా కేంద్రాల్లో పార్టీ జెండావిష్కరణ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. అధికారం కోల్పోయినప్పటికీ ఉమ్మడి జిల్లాలో ఆ పార్టీకి బలమైన నాయకత్వం ఉంది. -
బీటెక్ ఫలితాల పున: పరిశీలన కు దరఖాస్తు చేసుకోండి
తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో బీటెక్ మొదటి సెమిస్టర్ ఫలితాలపై పున:పరిశీలనకు విద్యార్థులు ఈనెల 30లోపు దరఖాస్తు చేసుకోవాలని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ సంపత్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. బీటెక్ కంప్యూటర్ సైన్స్–ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కంప్యూటర్ సైన్స్– ఇంజ నీరింగ్ విద్యార్థులు పున:పరిశీలనకు ప్రతి పేపర్కు చలాన్ ద్వారా రూ.800లు చెల్లించి దరఖా స్తు ఫారం (రూ.25)తో సంబంధిత పత్రాలు జత చేసి కార్యాలయంలో సమర్పించాలన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. -
స్వీయ గణన షురూ..
జిల్లా కేంద్రంలో సెల్ఫ్ ఎన్యుమరేషన్ చేస్తున్న ఎంపీ ధర్మపురి అరవింద్, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్య నారాయణ, కలెక్టర్ ఇలా త్రిపాఠి, నిజామాబాద్ నగర మేయర్ కూరగాయల ఉమారాణిజనాభా లెక్కల నమోదు కోసం చేపట్టిన సెల్ఫ్ ఎన్యుమరేషన్ (స్వీయగణన) ఆదివారం ప్రారంభమైంది. ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు తమ వివరాలను మొదటి రోజే ఆన్లైన్లో నమోదు చేసి కార్యక్రమ ప్రాధాన్యతను తెలియజెప్పారు. ప్రతి ఒక్కరూ సెల్ఫ్ ఎన్యుమరేషన్ చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఎంపీ అర్వింద్, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్, మేయర్ కూరగాయల ఉమారాణి, కలెక్టర్ ఇలా త్రిపాఠి తమ వివరాలను సెల్ఫ్ ఎన్యుమరేషన్ చేసుకున్నారు. – నిజామాబాద్ అర్బన్/నిజామాబాద్ రూరల్ -
సెలవుల్లో సెట్ చేద్దాం
● వచ్చే నెలలో జరుగనున్న కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ● విద్యార్థులు సన్నద్ధమైతే ఉత్తమ ర్యాంకులు సాధించే అవకాశంఖలీల్వాడి: జిల్లాలో పది, ఇంటర్ విద్యార్థులందరూ వార్షిక పరీక్షలు ముగియడంతో సెలవుల్లో సరదాగా గడుపుతున్నారు. ఎక్కువ మంది విద్యార్థులు స్మార్ట్ఫోన్లు, గేమ్స్, సినిమాలతో ఎంజాయ్ చేస్తూ గడిపేస్తుంటారు. ఇలా సెలవులను వృథా చే యకుండా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కోసం సన్నద్ధమవుతే ఉత్తమ ర్యాంకులు సాధించే అవకాశం ఉంటుంది. దీంతో ఉత్తమ కాలేజీల్లో సీటు పొందడంతోపాటు ఉజ్వల భవిష్యత్కు బాటలు వేసుకోవచ్చు. ప్రస్తుతం ఇంటర్మీడియట్ ఫలితాలు వెలువడగా పది పరీక్షల ఫలితాల కోసం విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. ఫలితాల తర్వాత పదవ తరగతి విద్యార్థులు పాలిటెక్నిక్, ఐఐఐటీ, ఇంటర్మీడియట్ గురుకులాల్లో (టీఎస్ఆర్జేసీ) ద్వారా ప్రవేశాలు పొందడానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులు ప్రవేశ పరీక్షలు రాసి, ఉత్తమ ర్యాంకులు సాధిస్తే సీటు లభించే అవకాశం ఉంటుంది. ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన విద్యార్థులు గురుకులం, డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు ‘దోస్త్’తోపాటు ఎప్ట్, నీట్, డీసెట్తో వివిధ కోర్సులు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే డిగ్రీలో వివిధ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు పీజీఈ సెట్, లాసెట్, ఐసెట్, ఎడ్సెట్, పీఈ సెట్, ఈ సెట్ లాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసే అవకాశం ఉంటుంది. దీంతోపాటు జాతీయస్థాయిలోనూ పలు కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కూడా ఉంటాయి. విద్యార్థులు చదువుతోపాటు ఆరోగ్యానికి కూడా ప్రాధాన్యం ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. సెలవుల్లో చదవడమే కాకుండా ఆరోగ్యం కోసం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యార్థికి మానసిక సన్నద్ధత, ఆత్మవిశ్వాసం కీలకం. అలాగే ఒత్తిడిని తగ్గించుకునేలా యోగా, ధ్యానం వంటి సాధనాలు ఉపయోగపడతాయి. అలాగే ఆహారం విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలా సెలవులను సద్వినియోగం చేసుకుంటే భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవచ్చు. -
ఘనంగా వాసవి కన్యకాపరమేశ్వరి జయంతి
నిజామాబాద్అర్బన్: వాసవీ మాత కన్యకాపరమేశ్వరి జయంతిని ఆదివారం కలెక్టరేట్ కార్యాలయంలో అధికారికంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి సాయాగౌడ్ వాసవీ మాత చిత్రపటానికి పూలమాలలు వేశారు. కార్యక్రమంలో జిల్లా యువజన, క్రీడల అభివృద్ధి అధికారి పవన్, వాసవి క్లబ్ ప్రతినిధులు, వైశ్య సంఘం నాయకులు పాల్గొన్నారు. పరీక్ష ఫీజు గడువు పెంపు ఖలీల్వాడి: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీలో 2025– 26 విద్యా సంవత్సరానికి మొదటి సంవత్సరం అడ్మిషన్ తీసుకున్న విద్యార్థులు సెమిస్టర్ పరీక్ష ఫీజును చెల్లించేందుకు రూ.500 అపరాధ రునుముతో గ డువును ఈనెల 30వ తేదీ వరకు పొడిగించినట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ పి రామ్మోహన్రెడ్డి, కో ఆర్డినేటర్ కె రంజిత ఆదివారం ఒక ప్రక టనలో తెలిపారు. అ లాగే పీజీ, ఎంబీఏ సె మిస్టర్ విద్యార్థుల్లో అసైన్మెంట్ సబ్మిట్ చేయని వారుంటే ఆ న్లైన్లో నుంచి ప్రశ్నా పత్రం డౌన్లోడ్ చేసుకుని, అసైన్ మెంట్ సబ్మిట్ చేయాలని సూ చించారు. ఇతర వివరాలకు యూనివర్సిటీకి సంబంధించిన వెబ్సైట్ www.braou online.inను సంప్రదించాలని పేర్కొన్నారు. ఖలీల్వాడి: టీటీసీ (టెక్నికల్ ట్రైనింగ్ సర్టిఫికెట్) కోర్సుకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కోర్సు డైరెక్టర్ సాయిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు 18 నుంచి 45 ఏళ్ల లోపు వయస్సు ఉండాలన్నారు. పదో తరగతి ఉత్తీర్ణత చెంది, తత్సమాన ట్రేడ్లో లోయర్ గ్రేడ్ ఉత్తీర్ణులై ఉండాలన్నారు. డ్రాయింగ్, టైలరింగ్, సంగీతం ఈ మూడు కోర్సులలో 42 రోజులపాటు శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. మే 1 నుంచి జూన్ 12 వరకు కోటగల్లీ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో శిక్షణకేంద్రం ఏర్పాటు చేసినట్లు వివరించారు. అదిలాబాద్, నిర్మల్, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల అభ్యర్థలకు ఇక్కడ శిక్షణ ఇవ్వబడుతుందన్నారు. ఆసక్తిగలవా రు తమ దరఖాస్తులను జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని డీఈవో కార్యాలయంలో సమ ర్పించాలన్నారు. నేడు సబ్ కలెక్టర్ రిలీవ్ ● వికాస్ మహతోకు వీడ్కోలు పలకనున్న అధికారులు ● సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి పనుల్లో తనదైన ముద్ర బోధన్: బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహ తో సోమవారం రిలీవ్ అవ్వనున్నారు. ఆయ న జీహెచ్ఎంసీ జోన ల్ కమిషనర్గా బదిలీ అయిన విషయం తెలిసిందే. 2022 తెలంగాణ కేడర్కు చెందిన ఐఏఎస్ అధికారి వికాస్ మహతో 5 సెప్టెంబర్ 2024న బోధన్ సబ్ కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులపై అన్ని శాఖల పనితీరును నిరంతరం పర్యవేక్షిస్తూ, సంబంధిత అధికారులకు పూర్తిస్థాయి అవగాహన కల్పిస్తూనే పనుల్లో పరుగులు పెట్టించారు. ఇటీవల గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సజావుగా పూర్తి చేయటంతో ఉన్నతాధికారుల మన్ననలు పొందారు. కార్యాలయానికి వచ్చి ప్రజలు చెప్పే సమస్యలను ఓపికగా ఆలకించి పరిష్కారానికి కృషి చేశారనే ప్రత్యేక గుర్తింపు పొందారు. బదిలీ సందర్భాన్ని పురస్కరించుకొని రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం పట్టణ కేంద్రంలోని లయన్స్ క్లబ్ కంటి ఆస్పత్రి ఆడిటోరియం హాల్లో వీడ్కోలు, సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. -
45 ఏళ్ల తర్వాత ఒక్కచోటికి..
రెంజల్(బోధన్): చిన్ననాటి మిత్రులందరూ దా దాపు 45ఏళ్ల తర్వాత కలుసుకోవడంతో వారంతా ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. రెంజల్ జి ల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల 1980– 81 బ్యాచ్ ఎస్సెస్సీ విద్యార్థులు ఆదివారం ‘పూ ర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం’ నిర్వహించా రు. ఏళ్ల తర్వాత వారంతా మళ్లీ ఒక్కచోట కలు సుకోవడంతో హర్షం వ్యక్తం చేశారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలుకరిస్తూ చిన్ననాటి తీపిగుర్తులను నెమరువేసుకున్నారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను సన్మానించారు. వేల్పూర్లో 40 ఏళ్ల తర్వాత.. వేల్పూర్: వేల్పూర్ హైస్కూల్లో చదువుకున్న 1985–86 బ్యాచ్ ఎస్సెస్సీ విద్యార్థులు ఆదివా రం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. వివిధ ప్రాంతాలలో స్థిరపడ్డ విద్యార్థులంతా ఒకచోట కలుసుకోవడంతో ఆనందం వ్యక్తం చేశారు. ఆనాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. నాడు చదువు చెప్పిన గురువులను ఘనంగా సన్మానించారు. -
సాహిత్య బడి కృషి అభినందనీయం
● తెలంగాణ రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాళేశ్వరం శంకరంనిజామాబాద్ రూరల్: జిల్లాలోని కవులందరినీ స మీకరించుకొని, వర్తమాన కవులకు మంచి మార్గద ర్శనం చేసేలా ఏర్పాటైన ‘సాహిత్య బడి – ఇందూ రు జిల్లా’ కృషి అభినందనీయమని ప్రముఖ క వి, తెలంగాణ రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నా ళేశ్వరం శంకరం పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ఇందూరు యువత కార్యాలయంలో ఆదివారం జి ల్లాస్థాయి కవి సమ్మేళనం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నాళేశ్వరం శంక రం మాట్లాడుతూ.. కవిత్వం నిరంతర తపస్సుతో సాధించాల్సిన వరమని, దానికి అధ్యయనం, అ భ్యాసం రెండు కళ్లని అన్నారు. పదునెక్కిన అక్షరాలే ఎదను తాకే కవితలుగా నిలుస్తాయని పేర్కొన్నా రు. అనంతరం ఇందూరు బడి నిర్వాహకులు డాక్టర్ కాసర్ల నరేశ్రావు, డాక్టర్ మద్దుకూరి సాయిబాబు ను అభినందించారు. కార్యక్రమంలో బైస దేవదా సు, కవులు దారం గంగాధర్, రజిత, నాగం సాయి లు, స్వప్న, సోనీ, రాజ్కుమార్, సిర్ప లింగం, శంకర్ గౌడ్, స్వర్ణ సమత తదితరులు పాల్గొన్నారు. -
కరెంట్షాక్తో హార్వెస్టర్ యజమాని మృతి
దోమకొండ: మండలంలోని సంఘమేశ్వర్ గ్రామంలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై ప్రభాకర్ తెలిపిన వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన కరికె రాజనర్సు(43) కుటుంబంలో కొన్నిరోజులుగా భూమి అమ్మిన డబ్బులు విషయంలో తగదాలు జరుగుతున్నాయి. ఈ విషయంలో సర్పంచ్ వద్ద గత ముడు రోజులుగా పంచాయితీ జరుగుంది. దీంతో అతడు మనస్తాపం చెంది ఆదివారం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈమేరకు మృతుడి భార్య లక్ష్మి ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.● మహిళకు గాయాలు నిజామాబాద్ రూరల్: మోపాల్ శివారులోని రేణుక ఎల్లమ్మ ఆలయం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళకు గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. ఆదివారం మంచిప్ప వైపు ఓ ఆటో వెళుతుండగా, మోపాల్ శివారులోని రేణుక ఎల్లమ్మ ఆలయం వద్ద హార్వెస్టర్ ఎదురుగా వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న మంచిప్పకు చెందిన పద్మకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు హార్వెస్టర్ డ్రైవర్ ఇంద్రజిత్తుపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై సుష్మిత తెలిపారు. లింగడంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని శెట్పల్లిసంగారెడ్డి శివారులో విద్యుత్ షాక్తో హార్వెస్టర్ యజమాని మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. వివరాలు ఇలా.. నాగిరెడ్డిపేట మండలం గోలిలింగాల గ్రామానికి చెందిన నీరడి రవి(42)కి భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. అతడు కొన్నేళ్లుగా చుట్టుపక్కల గ్రామాల్లో హార్వెస్టర్తో వరి పొలాల్లో కోతలు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఈక్రమంలో ఆదివారం అతడు శెట్పల్లిసంగారెడ్డి శివారులో వరి కోత యంత్రం బ్లేడ్లు ట్రాక్టర్ పైనుంచి కిందికి దించే క్రమంలో హైటెన్షన్ విద్యుత్ లైన్ తగిలాయి. దీంతో కరెంట్ షాక్తో అతడు అక్కడే కుప్పకూలిపోవడంతో స్థానికులు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. విషయం తెలుసుకున్న లింగంపేట ఎస్సై దీపక్కుమార్ ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని ధర్యాప్తు చేస్తున్నట్లు తెలిపా రు. అలాగే ట్రాన్స్కో ఏఈ హరీష్రావు సిబ్బందితో చేరుకొని ఘటనాస్థలాన్ని పరిశీలించారు. రైల్వే స్టేషన్లో గుర్తు తెలియని వృద్ధుడు.. కామారెడ్డి అర్బన్/భిక్కనూరు: భిక్కనూర్ రైల్వే స్టే షన్ ప్లాట్ఫామ్పై ఆదివారం ఉదయం గుర్తుతెలి యని వృద్ధుడు మృతి చెందినట్లు ఎస్సై సాధు లింబాద్రి తెలిపారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదన్నారు. గద్వాల్ నుంచి సికింద్రాబాద్ వరకు రై లు టికెట్ ఉందన్నారు. మృతు డు తెల్లని గడ్డం, బట్టతల, గో ధుమ రంగు చొక్కా, బ్లూ కలర్ బనియన్, మెడలో రుద్రాక్షమాల, ఇతర పూసలతో కలిపి నాలుగు దండలున్నాయన్నారు. వయస్సు సుమారు 65 నుంచి 70 ఏళ్ల వరకు ఉంటుందన్నారు. ఎవరైనా మృతుడిని గుర్తుపడితే 87126 58614 నంబర్కు సంప్రదించాలన్నారు. అనారోగ్యంతో హెడ్కానిస్టేబుల్.. ధర్పల్లి: ధర్పల్లి పోలీస్ స్టేషన్లోని హెడ్ కానిస్టేబుల్ అనారోగ్యం కారణంగా మృతిచెందాడు. వివరాలు ఇలా.. నిజామాబాద్లో నివాసం ఉండే కారుపాక నర్సయ్య (52) ధర్పల్లి పోలీస్ స్టేషన్లోని హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాడు. నర్సయ్యకు గతంలో గుండెకు సంబంధించిన సర్జరీ జరిగింది. గత 20 రోజుల నుంచి ఇంటి వద్దనే ఉంటూ చికిత్స పొందుతున్నాడు. పరిస్థితి విషమించడంతో శనివారం రాత్రి చనిపోయాడు. నగరంలోని ఆయన నివాసంలో భౌతిక కాయాన్ని సీఐ భిక్షపతి, ధర్పల్లి, సిరికొండ ఎస్సైలు వినయ్, రామకృష్ణ , పోలీస్ సిబ్బంది సందర్శించి పూలమాలవేసి నివాళులు అర్పించారు. నవీపేట: మండల కేంద్రంలోని సుభాష్నగర్ కాలనీలో ఆదివారం గడ్డి లోడ్తో వెళ్తున్న ట్రాక్టర్కు ప్రమాదవశాత్తు కరెంట్ తీగలు తగలడంతో గడ్డి పూర్తిగా దగ్ధమైంది. వెంటనే డ్రైవర్ అప్రమత్తమై కిందకు దూకడంతో ప్రాణాపాయం తప్పింది. ట్రాక్టర్ ట్రాలీ సైతం పూర్తిగా కాలిపోయినట్లు బాధితుడు గోత్రాల గంగాధర్ తెలిపాడు. -
వైభవంగా శ్రీవారి కల్యాణోత్సవం
రుద్రూర్: మండలంలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం ప్రాంగణంలోగల పద్మావతి –వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం శ్రీవారి కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. అంతకుముందు స్వామివార్ల ఉత్సవమూర్తులను పల్లకీలో పరిశోధన కేంద్రం నుంచి ఆలయం వరకు భక్తులు ఊరేగింపుగా తీసుకువచ్చారు. అనంతరం అర్చకులు సంప్రదాయబద్ధంగా కల్యాణం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల కోసం అన్నదానం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి పిట్ల కృష్ణ మహరాజ్ హాజరై భక్తులకు ప్రవచనాలు చేశారు. వ్యవసాయ పరిశోధన కేంద్రం అధిపతి పవన్ చంద్రరెడ్డి, రిటైర్ట్ హెడ్ మాస్టర్, లయన్స్ సీనియర్ సభ్యులు పీవీ సుబ్బారావ్, సర్పంచ్ రాంబాబు, మాజీ సర్పంచ్ గంగామణి, రాజా వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
భగ్గుమంటున్న భానుడు
● మరోసారి రాష్ట్రంలోనే జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు ● మెండోరాలో 44.4 డిగ్రీలునిజామాబాద్అర్బన్: భానుడు భగ్గుమంటున్నాడు. రాష్ట్రంలోనే జిల్లాలో మరోసారి ఆదివారం అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. మెండోరాలో అత్యధికంగా 44.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదుకావడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఇదే నెలలో ఆలూరు మండలం మచ్చర్లతోపాటు భీమ్గల్, నిజామాబాద్ ప్రాంతంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండల తీవ్రతకు ప్రజలు అల్లాడుతున్నారు. ఉదయం 9 గంటల నుంచే వేడి గాలులు వీస్తుండడంతో ఇళ్ల నుంచి బయటికి వెళ్లాలంటే ప్రజలు జంకుతున్నారు. వృద్ధులు, పిల్లలు బయటికి వెళ్లొద్దని వైద్యులు సూచిస్తున్నారు. -
ప్రమాదకరంగా వంతెన
నగరంలోని పద్మనగర్ రోడ్డులోగల లోలెవల్ వంతెన ప్రమాదకరంగా మారింది. వంతెనకు ఇరువైపులా రక్షణగా ఉండాల్సిన పోల్స్ విరిగిపోయాయి. దీంతో వంతెనపై వెళ్లే వాహనాలు అదుపుతప్పితే నీటిలో పడిపోయే ప్రమాదం ఉందని స్థానికులు పేర్కొంటున్నారు. అలాగే వంతెన రహదారి సైతం గుంతలు ఏర్పడి అధ్వానంగా మారింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి వంతెనకు మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. –సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, నిజామాబాద్ -
ఉద్యాన శాఖకు స్పైస్పార్క్!
● ఎనిమిదేళ్ల తర్వాత కొనసాగుతున్న అభివృద్ధి పనులు ● రూ.2.75 కోట్లతో సీసీ ప్లాట్ఫాంలు, టాయ్లెట్ల నిర్మాణంమోర్తాడ్(బాల్కొండ): పసుపు క్రయ, విక్రయాల కోసం వేల్పూర్ క్రాస్రోడ్ వద్ద కేటాయించిన స్థలంలో స్పైస్పార్క్ పనులు మళ్లీ మొదలయ్యాయి. స్పైస్పార్క్ ఏర్పడిన ఎనిమిది సంవత్సరాల తర్వాత అభివృద్ధి పనులు మొదలయ్యాయి. అయితే, పనుల అనంతరం దీనిని ఉద్యాన శాఖకు అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2016లో అప్పటి ప్రభుత్వం 75 ఎకరాల భూమిని స్పైస్పార్క్ కోసం కేటాయించారు. రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ(టీయస్ఐఐసీ) ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేయాలని నిర్దేశించారు. అప్పట్లో భూ సేకరణ, ప్రహరీ, సీసీ రోడ్లు నిర్మించేందుకు నిధులు సైతం విడుదల చేశారు. అయితే, సిమెంట్ ప్లాట్ఫాంలు, గోదాంలు, షెడ్లు, విశ్రాంతి గదులు, టాయ్లెట్స్ నిర్మాణం కోసం నిధులు మంజూరు చేస్తామని అప్పట్లో ప్రభుత్వం ప్రకటించినా ఆచరణలో సాధ్యం కాలేదు. ఎట్టకేలకు 2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.2.75 కోట్లు మంజూరు కావడంతో సీసీ ప్లాట్ఫాంలు, టాయ్లెట్స్ను నిర్మిస్తున్నారు. ఇతర పనుల కోసం నిధులు విడుదల చేయాల్సి ఉంది. ప్రస్తుత పనులతోనైనా స్పైస్పార్క్ వినియోగంలోకి వస్తే వచ్చే సీజన్లోనైనా స్థానికంగానే పసుపు క్రయ విక్రయాలు ప్రారంభమయ్యే పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారిస్తేనే స్పైస్పార్క్ వినియోగంలోకి వస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వేల్పూర్ శివారులోని స్పైస్పార్క్ సకాలంలో పూర్తి చేస్తాం స్పైస్పార్క్కు కేటాయించిన రూ.2.75 కోట్ల నిధులతో సకాలంలో పనులు పూర్తి చేస్తాం. పనులు పూర్తికాగానే ఉద్యాన శాఖకు అప్పగిస్తాం. మా సంస్థ ఆధ్వర్యంలో అన్నిరకాల అభివృద్ధి పనులు పూర్తిచేయాల్సి ఉంది. నిధులు విడుదల కావడంతో పనులు సాగుతున్నాయి. – శివ, జేఈ, టీఎస్ఐఐసీ -
సూపర్బ్రెయిన్ యోగాతో జ్ఞాపకశక్తి మెరుగు
డిచ్పల్లి: క్రమ పద్ధతిలో సూపర్ బ్రెయిన్ యోగ చేస్తే విద్యార్థుల్లో జ్ఞాపకశక్తి పెరుగుతుందని రాష్ట్ర అవార్డు గ్రహీత, గుంజీళ్ల అంతర్జాతీయ ప్రచారకులు అందె జీవన్రావు తెలిపారు. తెలంగాణా యూనివర్సిటీ జాతీయ సేవా పథకం యూనిట్ 2 ఆధ్వర్యంలో మండలంలోని డిచ్పల్లి గ్రామంలో నిర్వహిస్తున్న వేసవి ప్రత్యేక శిబిరంలో అందె జీవన్రావు సూపర్ బ్రెయిన్ యోగా అంశంపై వలంటీర్లకు అవగాహన కల్పించారు. సూపర్ బ్రెయిన్ యోగా ప్రాముఖ్యతను వివరిస్తూ దీనిని మెదడును చురుకుదనం చేసే వ్యాయామంగా అంతర్జాతీయంగా సాధన చేస్తున్నారని, సూపర్ బ్రెయిన్ యోగా అనేది గుంజీళ్ల మెరుగైన విధానమని పేర్కొన్నారు. విద్యార్థులచే గుంజీలు తీయించే పద్ధతిని మన దేశంలో శిక్షగా భావించడం వలన, పాఠశాలలలో ఈ పద్ధతి కనుమరుగవుతున్న తరుణంలో పాశ్చాత్య దేశాలలో ఇది ‘సూపర్ బ్రెయిన్ యోగా‘ అనే ఆధునిక పేరుతో ప్రాచుర్యంలోకి వచ్చిందని జీవన్రావు తెలిపారు. గుంజీళ్లు తీయడాన్ని శిక్షగా కాకుండా శిక్షణగా పరిగణించాలని అన్నారు. కార్యక్రమంలో భాగంగా వలంటీర్లచే 14 రౌండ్లు సూపర్ బ్రెయిన్ యోగా చేయించారు. కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్ ప్రొఫెసర్ అలీంఖాన్, అధ్యాపకులు, వలంటీర్లు పాల్గొన్నారు. -
రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు
డొంకేశ్వర్(ఆర్మూర్): ‘ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక’లో భాగంగా తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ, వ్యవసాయ శాఖ కలిసి ‘రైతు ముంగిట శాస్త్రవేత్తలు’ అలాగే ‘అగ్రికల్చర్ వీక్’ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. జిల్లాలో సోమవారం నుంచి మే 23వ తేదీ వరకు రైతులకు వివిధ అంశాలపై గ్రామాల్లో అవగాహన కల్పించనున్నారు. ‘రైతు ముంగిట శాస్త్రవేత్తలు’ కార్యక్రమాన్ని మొత్తం 64 గ్రామాల్లో నిర్వహించనుండగా, అగ్రికల్చర్ వీక్ను అన్ని రైతు వేదికలు లేదా గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో జరుపనున్నారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు ఆయా గ్రామాల్లో పర్యటించి రైతులకు పంటల సాగులో పద్ధతులపై అవగాహన కల్పిస్తారు. ముఖ్యంగా అధిక యూరియా వాడకం కారణంగా కలిగే నష్టాలు, నేల ఆరోగ్యం, రసాయనాల వాడకం, పంట మార్పిడి వల్ల కలిగే లాభాలు, సేంద్రియ సాగు అంశాలను వివరిస్తారు. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా పంటలు సాగు చేయడం, అధిక దిగుబడులు వచ్చే వంగడాలు, ఆధునిక వ్యవసాయం, ప్రభుత్వ పథకాల గురించి కూడా తెలియజేస్తారు. ఉద్యాన, సహకార, పశుసంవర్ధక, ఇతర వ్యవసాయ అనుబంధ శాఖలు కూడా కార్యక్రమాల్లో పాలు పంచుకోనున్నాయి. నేటి నుంచి మే 23 వరకు జిల్లాలో కార్యక్రమం యూరియా వాడకం, పంట మార్పిడి.. తదితర అంశాలపై అవగాహన అగ్రికల్చర్ యూనివర్సిటీ, వ్యవసాయ శాఖ సంయుక్తంగా నిర్వహణఎనిమిది బృందాల శాస్త్రవేత్తలు.. రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమాన్ని గ్రామాల్లో నిర్వహించడానికి మొత్తం ఎనిమిది బృందాల శాస్త్రవేత్తలను నియమించాం. వ్యవసాయ శాఖ సహకారంతో రైతులను పెద్ద సంఖ్యలో ఆహ్వానించి సాగులో అంశాలను, కొత్త పద్ధతులను వివరిస్తాం. దాదాపు నెల రోజుల పాటు కార్యక్రమాలు కొనసాగుతాయి. – ఇందుధర్రెడ్డి, సీనియర్ శాస్త్రవేత్త, కేవీకే, రుద్రూర్ రైతులు సద్వినియోగం చేసుకోవాలి రైతుల ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తు న్న కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలి. మే 4 నుంచి 9వ తేదీ వరకు అగ్రికల్చర్ వీక్ కూడా ఉంది. కార్యక్రమాలకు రైతులను ఆహ్వానించి విజయవంతంగా నిర్వహించాలని ఏఈవో, ఏవోలకు ఆదేశాలు జారీ చేశాం. – వీరాస్వామి, జిల్లా వ్యవసాయాధికారి -
చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలి
ఆర్మూర్టౌన్: విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని ఎంఎల్బీ ఇండియా ఇన్చార్జి డేవిడ్ (అమెరికా) అన్నారు. ఆర్మూర్లోని జావిద్బాయ్ మినీస్టేడియంలో ఈనెల 23 నుంచి 26 వరకు ఎంఎల్బీ (మేజర్ లీగ్ బేస్బాల్) తెలంగాణ రీజనల్ అండర్–11 కప్ పోటీలు నిర్వహించారు. మొత్తం 22 టీంలు పోటీల్లో పాల్గొనగా, గ్రూప్–ఏలో తొర్లికొండ జెడ్పీహెచ్ఎస్ జట్టు ప్రథమ స్థానం, గ్రూప్–బీలో సిరికొండ సత్యశోధక్ పాఠశాల జట్టు ప్రథమ స్థానంలో నిలిచాయని డేవిడ్ అన్నారు. జూన్ మొదటి వారంలో కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో జరిగే ఎంఎల్బి ఇండియా కప్ పోటీలలో రెండు జట్లు పాల్గొంటాయన్నారు. అనంతరం ఆయా జట్లకు ట్రోఫీలను అందజేశారు. తొర్లికొండ జట్టు కోచ్ మర్కంటి గంగా మోహన్, కిష్టాపురం సాయికుమార్, సత్యశోధక్ సిరికొండ జట్టు కోచ్ సంతోష్, దండు, ఎంఎల్బీ సంకీర్త్ శెట్టి, మోహన్ తదితరులు పాల్గొన్నారు. డిచ్పల్లి: మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈనెల 30న మెగా జాబ్మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ చంద్రవిఠల్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రముఖ కంపెనీ ఎంఎస్ఎన్ లాబొరేటరీస్ ఆధ్వర్యంలో ఈ జాబ్మేళా జరుగుతుందన్నారు. ఎంపీసీ, బైపీసీ, ఎంఎల్టీ, ఫార్మాటెక్ కోర్సులను పూర్తి చేసిన విద్యార్థులు (బాలురు) జాబ్మేళాకు అర్హులని తెలిపారు. ఇందులో ఎంపికై న విద్యార్థులకు ఉద్యోగంతో పాటు ప్రఖ్యాత టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ కంపెనీ నిధులతో స్పాన్సర్ చేయబడే బీఎస్సీ డిగ్రీ విద్య కోసం ఉచితంగా కళాశాలలో చేర్పిస్తారని తెలిపారు. ఉద్యోగ సమయంలో ఉచిత హాస్టల్ వసతి, కంపెనీకి వెళ్లేందుకు హాస్టల్ నుంచి బస్ వసతి సౌకర్యం ఉంటుందన్నారు. ఉదయం 9.30 గంటల నుంచి 12 గంటల వరకు ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ప్రక్రియ జరుగుతుందన్నారు. జాబ్మేళాను డిచ్పల్లి పరిసర ప్రాంతాల విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాల ని ఆయన కోరారు. రుద్రూర్: పోతంగల్ శివారులో విక్రయించేందుకు ఉంచిన ధాన్యం బస్తాలకు ప్రమాదవశాత్తు మంటలు అంటుకొని దగ్ధమైంది. పోతంగల్ శివారులోని పొలాల్లో వరి కొయ్యలకు ఆదివారం నిప్పు పెట్టగా, మంటలు వ్యాపించి బస్తాల్లో నింపిన ధాన్యంకు అంటుకున్నాయి. ఈ ఘటనలో పాత పోతంగల్లోని శంకర్ అనే రైతుకు చెందిన సుమారు 50 బస్తాల్లో ఉన్న ధాన్యం స్వల్పంగా దెబ్బతిన్నట్టు స్థానికులు తెలిపారు. ఎలాంటి అంక్షలు లేకుండా కాలిన ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పోగొట్టుకున్న ఫోన్ల అప్పగింత రుద్రూర్: కోటగిరి పోలీస్స్టేషన్ పరిధిలో ఫోన్ లు పోగొట్టుకున్న బాధితులకు ఆదివారం ఫో న్లను ఎస్సై సునీల్ తిరిగి అప్పగించారు. పో తంగల్ మండలం కల్లూర్కు చెందిన ప్రకాష్, పోతంగల్కు చెందిన యూసుఫ్, కోటగిరి మండలం బస్వాపూర్ గ్రామానికి చెందిన శ్రీదేవి, కొత్తపల్లి గ్రామానికి చెందిన రమణారెడ్డి, కోటగిరికి చెందిన బుజ్జన్నకు ఫోన్లను అందజేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు సీఈఐఆర్ పోర్టల్ ద్వారా ట్రేస్ చేసి ఫోన్లను రికవరీ చేశామని, ఇందులో రెండు ఫోన్లను బిహార్, హైదరాబాద్లో రికవరి చేసినట్టు ఎస్సై సునీల్ తెలిపారు. బాన్సువాడ : బీర్కూర్ సహకార సంఘం పరిధిలో ప్రారంభించిన కొనుగోలు కేంద్రాల్లో గ న్నీ సంచుల కొరతతో శనివారం రాత్రి సిబ్బందిపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీర్కూ ర్, కిష్టాపూర్ గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. కానీ గన్నీ సంచుల కొరతతో ధాన్యం కొనుగోలు చేయడం లే దు. దీంతో ఆగ్రహించిన రైతులు సహకార సంఘం సిబ్బందిని నిలదీశారు. సహకార సంఘం కార్యదర్శి విఠల్ సెలవులో ఉండడంతో సిబ్బంది సంచుల కొరతపై దృష్టి సారించడం లేదని రైతులు మండిపడ్డారు. అధికారులు స్పందించి సహకార సంఘానికి 20 వేల గన్నీ సంచులను తెప్పించాలని కోరారు. గన్నీ సంచులు తెప్పించకుంటే ధర్నా చేస్తామని హెచ్చరించారు. -
ఘనంగా కన్యకా పరమేశ్వరీ జయంతి
నిజామాబాద్ రూరల్: నగరంలోని కిసాన్గంజ్లోగల వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారి జయంతి వేడుకలను ఆర్యవైశ్యులు ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయంలో అమ్మవారి నామకరణ మహోత్సవం నిర్వహించారు. ఎంపీ ధర్మపురి అరవింద్తో కలిసి అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ నామకరణం చేశారు. అంతకుముందు పెద్ద బజారులోగల నగరేశ్వర ఆలయం వద్ద ఎమ్మెల్యే ధన్పాల్ శోభాయాత్రను జెండా ఊపి ప్రారంభించారు. శివాజీ నగర్ పెద్ద బజార్ గాంధీచౌక్ మీదుగా కన్యకాపరమేశ్వరి ఆలయం వరకు శోభాయాత్ర కొనసాగింది. ఒగ్గు కళాకారులు, పులి వేషాలు, బోనాలు, డప్పు వాయిద్యాల నడుమ అమ్మవారి ఊరేగింపు కొనసాగింది. అనంతరం ఆలయంలో అమ్మవారికి ఆభరణాలు సమర్పించారు. ఈసందర్భంగా ఎంపీ, ఎమ్మెల్యేలు మాట్లాడుతూ.. ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం వాసవి మాత జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించడం సంతోషకరమన్నారు. సనాతన ధర్మాన్ని కాపాడేందుకు ఆర్యవైశ్యులు ఎప్పుడు ముందుంటారన్నారు. మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా, ఆలయ కమిటీ అధ్యక్షుడు పాల్తే రవికుమార్, ప్రధాన కార్యదర్శి రాఘవేంద్ర, కోశాధికారి మామిడి శేఖర్, పట్టణ అధ్యక్షుడు ధన్పాల్ శ్రీనివాస్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. -
అంకితభావంతో విధులు నిర్వర్తించాలి
● కుక్కకాటు, పాముకాటు మందులు పీహెచ్సీల్లో అందుబాటులో ఉంచాలి ● డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ బీ రవీంద్రనాయక్ సుభాష్నగర్: వైద్య ఉద్యోగులు సమయపాలన పాటిస్తూ అంకితభావంతో విధులు నిర్వహించాలని డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ బీ రవీంద్రనాయక్ సూచించారు. శనివారం జిల్లాకు వచ్చిన ఆయన కలెక్టరేట్లోని డీఎంహెచ్వో చాంబర్లో డిప్యూటీ డీఎంహెచ్వోలు, ప్రోగ్రాం అధికారులతో జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. ప్రధానంగా వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం, క్షయ, లెప్రసీ నియంత్రణ, నేషనల్ క్వాలిటీ అష్యూరెన్స్, జీవనశైలి వ్యాధులపై సమీక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్ రవీంద్రనాయక్ మాట్లాడుతూ వైద్య, ఆరోగ్య ఉద్యోగులు అంకితభావంతో విధులు నిర్వర్తిస్తే ప్రజల నుంచి గౌరవం లభిస్తుందన్నారు. అన్ని ఆరోగ్య కేంద్రాల్లో కుక్కకాటు, పాముకాటు మందులను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. పీహెచ్సీ అవసరాలకు అనుగుణంగా మందులను ఫార్మసిస్టులు ఈ–ఔషధిలో నమోదు చేయాలని, దీంతో మందులు సరఫరా అవుతాయన్నారు. ఆరోగ్య ఉప కేంద్రాల నుంచి పీహెచ్సీలు, సీహెచ్సీ, ఏరియా ఆస్పత్రి, జీజీహెచ్లకు పేషెంట్లను రిఫర్ చేసినప్పుడే అన్నిస్థాయిలో వైద్య సేవలు సంపూర్తిగా అందించినట్లు అవుతుందని తెలిపారు. డివిజన్ల వారీగా ఆరోగ్య కేంద్రాల జనాభా ఆధారంగా నూతన పీహెచ్సీలు, సీహెచ్సీలు, ఆరోగ్య ఉప కేంద్రాలు, మానవ వనరులు, బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మరమ్మతుల వివరాలు, తదితర అవసరాలను గుర్తించి ప్రతిపాదనలు పంపించాలని సూచించారు. సమావేశంలో డీఎంహెచ్వో రాజశ్రీ, డీటీసీవో దేవీనాగేశ్వరి, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి అశోక్, డిప్యూటీ డీఎంహెచ్వో రవీందర్, డాక్టర్లు సమత, సికిందర్ నాయక్, ఏవో సుమంత్కుమార్, ప్రోగ్రాం అధికారులు వెంకన్న, రాకేశ్, వెంకటేష్, సుప్రియ, శిఖరా, శ్రావ్య తదితరులు పాల్గొన్నారు. -
జనగణనకు సిద్ధం
● నేటి నుంచి సెల్ఫ్ ఎన్యుమరేషన్ నిజామాబాద్అర్బన్: జనగణన–2027లో భాగంగా ఆదివారం నుంచి సెల్ఫ్ ఎన్యుమరేషన్ కార్యక్రమం ప్రారంభం కానుంది. జిల్లా లోని అన్ని శాఖల అధికారులు, ఉద్యోగులు, విద్యావంతులు, ప్రజలందరూ స్వీయ నమోదు చేసు కోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఒక ప్రకటనలో కోరారు. మే 10వ తేదీ వరకు https://se.census.gov. in పోర్టల్ అందుబాటులో ఉందని పేర్కొన్నారు. 2588 ఎన్యుమరేటర్లు.. జిల్లాలో జనగణనకు సంబంధించి 34 మండలాలకు 2,588 మంది ఎన్యుమరేటర్లను కేటాయించారు. నిజామాబాద్ కార్పొరేషన్తోపాటు మూడు మున్సిపాలిటీల్లో జనగణనకు 680 మంది ఎన్యుమరేటర్లు, 110 మంది సూపర్వైజర్లు విధులు నిర్వర్తించనున్నారు. వీరికి ఇది వరకు మొదటి దశ శిక్షణ పూర్తికాగా, మరో మూడు విడుతల్లో శిక్షణ ఇవ్వనున్నారు. జనగణనలో భాగంగా మే 11 నుంచి జూన్ 9 వరకు ఇళ్ల గణన చేపట్టనున్నారు. రెండవ దశ 2027 ఫిబ్రవరి 9 నుంచి 28వ తేదీ వరకు జనగణన, కులగణన కొనసాగుతుంది. ప్రశాంతంగా ‘ఓపెన్’ పరీక్షలు ఖలీల్వాడి: జిల్లాలో ఓపెన్ పదో తరగతి, ఇంటర్ పరీక్షలు ఐదో రోజు శనివారం ప్రశాంతంగా జరిగినట్లు డీఈవో పార్శి అశోక్ తెలిపారు. పదో తరగతికి 12 సెంటర్లు కేటాయించగా, సాంఘిక శాస్త్రం పరీక్షకు 2,548 మందికి 2,252 మంది హాజరుకాగా 296 గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. 15 సెంటర్లలో నిర్వహించిన ఇంటర్ హిస్టరీ పరీక్షకు మొత్తం 1,756 మందికి 1,585 మంది హాజరుకాగా, 171 మంది గైర్హాజరైనట్లు తెలిపారు. మధ్యాహ్నం ఉర్దూ పరీక్షకు 691 మందికి 639 హాజరుకాగా 52 మంది గైర్హాజరయ్యారు. గణిత పరీక్షకు 436 మందికి 374 మంది హాజరుకాగా 62 మంది గైర్హాజరైనట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాలను మూడు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు తనిఖీ చేశాయి. ‘త్వరితగతిన ధాన్యం తూకం వేయాలి’ఇందల్యాయి: నాణ్యతా ప్రమాణాలకు లోబడి ఉన్న ధాన్యాన్ని త్వరితగతిన తూకం జరిపించి, వెంటదివెంట రైస్మిల్లులకు పంపించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. మండలంలోని చంద్రాయన్పల్లి, గన్నారంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆమె శనివారం తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రాలలో ఉన్న సదుపాయాలను పరిశీలించారు. రైతులను పలుకరించి, ధాన్యం సేకరణ తీరుతెన్నులను అ డిగి తెలుసుకున్నారు. ధాన్యం సేకరణ ప్రక్రియలో అలసత్వానికి తావు లేకుండా పకడ్బందీగా వ్యవహరించాలన్నారు. సన్నరకంతోపాటు దొడ్డు రకం ధాన్యాన్ని సైతం కొనుగోలు చేయాలని, దొడ్డు రకం సేకరణపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని అన్నారు. వేసవి తీవ్రత నేపథ్యంలో కొనుగోలు కేంద్రాలలో షామియానాలు, తాగునీరు వంటి వసతులు తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలన్నారు. కలెక్టర్ వెంట డీఎస్వో శ్రీకాంత్ రెడ్డి, సివిల్ సప్లయ్ డీఎం ప్రవీణ్, డీసీవో శ్రీనివాస్, డీఏవో వీరస్వామి, ఏఎస్వో అరవింద్ రెడ్డి, ఎంపీడీవో అనంత్ రావు ఉన్నారు. -
రోడ్డెక్కిన ప్రగతి రథాలు
● చర్చలు సఫలం కావడంతో ఆర్టీసీ కార్మికుల సంబురాలు ● పూర్తిస్థాయిలో తిరిగిన బస్సులునిజామాబాద్ రూరల్: రాష్ట్ర ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ నాయకుల చర్చలు సఫలం కావడంతో డిపో నుంచి బస్సులు కదిలాయి. డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం అంగీకరించడంతో శనివారం ఉద యం ఆర్టీసీ కార్మికులు సంబురాలు నిర్వహించారు. డిపోల వద్ద పటాకులు కాల్చి స్వీట్లు తినిపించుకున్నారు. డిమాండ్ల పరిష్కారానికి ముందుకొచ్చిన ప్రభుత్వానికి కార్మికులు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం విధుల్లో చేరారు. నిజామాబాద్–1, 2తో పాటు ఆర్మూర్, బోధన్ డిపోల పరిధిలోని మొత్తం 650 బస్సులు నడిచాయని ఆర్టీసీ ఆర్ఎం జ్యోత్స్న వెల్లడించారు. ఆర్టీసీ డిపో–1 వద్ద కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాటిపల్లి నగేష్రెడ్డి కార్మికులకు స్వీట్లు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. -
ఉల్లాసంగా.. ఉత్సాహంగా..
కబడ్డీ ఆడుతున్న అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, సీపీ సాయిచైతన్య తదితరులువాలీబాల్ పోటీని ప్రారంభిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, చిత్రంలో సీపీ సాయిచైతన్య, ఎన్ఎస్సీ చైర్పర్సన్ కవితారెడ్డినిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో నిజామాబాద్ ప్రీమియర్ లీగ్ (ఎన్పీఎల్) క్రీడా పోటీలు శనివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, సీపీ సాయిచైతన్య పాల్గొని క్రీడాకారులను ఉత్సాహపరిచారు. ఎప్పుడూ పాలనా వ్యవహారాలు, రాజకీయాల్లో బిజీగా ఉండే వీరు క్రీడాకారులతో కలిసి కబడ్డీ, వాలీబాల్ ఆడారు. – నిజామాబాద్ అర్బన్ -
నిజామాబాద్
ఆర్టీసీ కార్మికులకు.. ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంటుందని డీసీసీ అధ్యక్షుడు నగేష్రెడ్డి, కార్పొరేషన్ డీసీసీ అధ్యక్షుడు రామకృష్ణ అన్నారు. ఆదివారం శ్రీ 26 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026– 8లో uరవీంద్రభారతిలో పేరిణి నృత్య ప్రదర్శన ఇస్తున్న రాజేశ్ బృందం (ఫైల్)సహజంగా నాట్యరంగంలో పురుషుల కన్నా మహిళలే ఎక్కువగా కనిపిస్తుంటారు. అయితే వాస్తవానికి నటరాజు అంటే పురుష రూపంలో ఉన్న పరమశివుడు. అందుకే పురుషులు సైతం ఎక్కువ సంఖ్యలో నాట్య కళలను నేర్చుకోవాలని ఆయా కళల గురువులు చెబుతుంటారు. కాగా, ఈ నృత్య కళలను నేర్చుకునేవారి సంఖ్య తగ్గిపోతోంది. ఈ నేపథ్యంలో పేరిణి నృత్యాన్ని ఉచితంగా నేర్పించేందుకు రాజేశ్ సంకల్పించాడు. ఇందులో భాగంగా తన గురువు భీమాన్ మాస్టర్ పేరిట ‘భీమాన్ నృత్యనికేతన్’ ఏర్పాటు చేశాడు. చివరి శ్వాస వరకు పేరిణి కళను భావితరాలకు అందించేందుకు శక్తివంచన లేకుండా పాటుపడతానని చెబుతున్నాడు రాజేశ్. ఇందుకు ప్రభుత్వం సహకరించాలని కోరుతున్నాడు. చివరి శ్వాస వరకు.. రాష్ట్ర అధికారిక నృత్య కళలో రాణిస్తున్న రాజేశ్ -
ఆర్మూర్ కాంగ్రెస్లో ప్రక్షాళన షురూ
● ‘మున్సిపోల్స్’లో పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన ఇద్దరిపై సస్పెన్షన్ వేటు ● ఉత్తర్వులు జారీ చేసిన డీసీసీ అధ్యక్షుడు నగేష్రెడ్డిఆర్మూర్: ఆర్మూర్ పట్టణ కాంగ్రెస్ పార్టీలో ప్రక్షాళన ప్రారంభమైంది. కోవర్టులకు చెక్ పెడుతూ అధిష్టానం కఠిన చర్యలకు పూనుకుంది. ఇటీవల నిర్వహించిన ఆర్మూర్ మున్సిపల్ ఎన్నికల్లో 17వ వార్డు నుంచి కౌన్సిలర్గా పోటీకి నిలిచిన కాంగ్రెస్ పార్టీ చైర్పర్సన్ అభ్యర్థి ఏబీ శ్రీదేవి (చిన్న) ఓటమికి విప క్ష పార్టీలతో కలిసి పనిచేసిన ఇద్దరు కాంగ్రెస్ నాయకులను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ డీసీసీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి శనివారం ఉత్తర్వులు జారీచేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఓడించడం కోసం విపక్షాలతో చేతులు కలిపి కోవర్టు రాజకీయం చేరనే ఆరోపణలతో కాంగ్రెస్ నాయకులు ఇమామొద్దీన్(అజ్జు), ఫయాజ్లపై పార్టీ అధిష్టానం సీరియస్ అ యింది. కాంగ్రెస్ ఆర్మూర్ పట్టణ అధ్యక్షుడు సా యిబాబాగౌడ్ ఫిర్యాదు మేరకు ఈ నెల 16న షో కాజ్ నోటీసులు జారీ చేశారు. దీంతో ఇద్దరి నుంచి స్పష్టమైన వివరణ రాకపోవడంతో పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇమామొద్దీన్ (అజ్జు) కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కా గా, ఫయాజ్ వదిన గత పాలకవర్గంలో కౌన్సిలర్గా విజయం సాధించగా పట్టణంలో ఫయాజ్ కౌన్సిలర్గా చలామణి అయ్యాడు. ఆర్మూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గంలో డైరెక్టర్గా సైతం ఫయాజ్ను నామినేట్ చేశారు. తాజాగా వీరి సస్పెన్షన్తో పట్టణ కాంగ్రెస్లో చర్చనీయాంశమైంది. కోవర్ట్, రెబల్స్ గుండెల్లో గుబులు.. ఇద్దరు కాంగ్రెస్ నాయకుల సస్పెన్షన్తో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు వ్యతిరేకంగా పోటీ చేసి న రెబల్ అభ్యర్థులపై సైతం చర్యలు తీసుకోవాలంటూ పలువురు కాంగ్రెస్ నాయకులు త మ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్లో ఉంటూ జంబి హనుమాన్ ఆలయ కమిటీ చైర్మన్గా కొనసాగుతున్న రేగుళ్ల సత్యనారాయణ 27వ వార్డు నుంచి బీజేపీ అభ్యర్థిగా తన సతీమణిని పోటీకి నిలిపాడు. పట్టణంలోని 1, 3, 13, 14, 18, 19, 20, 27, 30 తదితర వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఓటమిలో రెబల్స్తోపాటు కోవర్టులు కీలకపాత్ర పోషించారు. దీంతో వీరందరిపై ఫిర్యాదులు చేసేందుకు నాయకులు సిద్ధమవుతున్నారు. -
త్వరలోనే జిల్లా అక్రెడిటేషన్ కమిటీ సమావేశం
నిజామాబాద్అర్బన్: కలెక్టర్ అధ్యక్షతన త్వరలోనే జిల్లా మీడియా అక్రెడిటేషన్ కమిటీ సమావేశం ని ర్వహిస్తామని అదనపు కలెక్టర్ కిరణ్కుమార్ అన్నా రు. నిజామాబాద్ జిల్లా నూతన మీడియా అక్రెడిటే షన్ కమిటీ సభ్యులు శనివారం కిరణ్కుమార్ను మ ర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం సభ్యత్వ ప త్రాలు అందజేశారు. ఈసందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం జారీ చేసిన జీవోకు అనుగుణంగా అర్హులైన వారి కి అక్రెడిటేషన్ కార్డులు జారీ అయ్యేలా కృషి చేయాలని సభ్యులకు సూచించారు. పారదర్శకంగా ప్రక్రియ జరిగేలా చూడాలన్నారు. డీపీఆర్వో పద్మశ్రీ, డీఎంఏసీ సభ్యులు నర్సింలు, భూపతి, సాయి ప్రసాద్, జాన్సన్, మాజిద్, రాందయానంద్, గౌస్, బాల్ కుమార్, శ్రీకాంత్, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
ప్రతిభావంతులైన క్రీడాకారులను వెలికితీస్తాం
● రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ● ప్రారంభమైన ఎన్పీఎల్ క్రీడాపోటీలునిజామాబాద్అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి విశేష ప్రాధాన్యత ఇస్తుందని గ్రామీణ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు ప్రతిభావంతులైన క్రీడాకారులను వెలికి తీస్తామని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీ అన్నారు. జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ మైదానంలో శనివారం నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో నిజామాబాద్ ప్రీమియర్ లీగ్(ఎన్పీఎల్) క్రీడా పోటీలు ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని, పోటీలను ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్రెడ్డి అంతర్జాతీయ ప్రమాణాలతో స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో పని చేస్తున్నారన్నారు. ప్రతి జిల్లాలో క్రీడల మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు ఆర్థిక ప్రోత్సాహాలు, ఉద్యోగ అవకాశాలు కల్పించడం ద్వారా వారి భవిష్యత్తును భద్రపరిచేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అనంతరం నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ.. క్రీడాకాలకు మరింత ప్రోత్సాహం అందిస్తే వారిలో ఉన్న ప్రతిభను వెలికితీయవచ్చన్నారు. అంతకుముందు విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. సీపీ సాయి చైతన్య, మేయర్ ఉమారాణి, నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ కన్వీనర్ కవిత రెడ్డి, రజినీకాంత్, స్థానిక ప్రజాప్రతినిధులు క్రీడా సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.మాట్లాడుతున్న ఎమ్మెల్యే ధన్పాల్.. సీపీ సాయిచైతన్య.. కవితారెడ్డి.. మేయర్ ఉమారాణి -
డిగ్రీ పరీక్షల్లో కొనసాగుతున్న డిబార్లు
తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో జరుగుతున్న డిగ్రీ పరీక్షల్లో విద్యార్థుల డిబార్లు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు ఐదుగురు విద్యార్థులు డిబార్ అయ్యారు. శనివారం జరిగిన పరీక్షల్లో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పరీక్షా కేంద్రంలో మాల్ప్రాక్టీస్కు పాల్పడుతూ ఒక విద్యార్థి డిబార్ అయినట్లు అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పరిధిలో ఏర్పాటు చేసిన 29 పరీక్ష కేంద్రాలలో 7,487 మంది విద్యార్థులకు గానూ 7,200 మంది హాజరు కాగా 287 మంది గైర్హాజరైనట్లు ఆయన తెలిపారు. కొనసాగుతున్న ఎంఈడీ పరీక్షలు డిచ్పల్లి: తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో ఎంఈడీ మొదటి సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలు శనివారం ప్రశాంతంగా జరిగినట్లు అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. నిజామాబాద్ గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రంలో మధ్యాహ్నం జరిగిన పరీక్షకు 26 మంది విద్యార్థులకు గానూ 26 మంది హాజరైనట్లు ఆయన తెలిపారు. -
ఆడుకుంటుండగా బాలుడి మెడకు చుట్టుకున్న ప్లాస్టిక్ లాక్
● గమనించి ఆస్పత్రికి తరలించిన పోలీసులు ● వైద్యులు లాక్ను తొలగించడంతో తప్పిన ప్రమాదం పోలీసులకు కృతజ్ఞతలు తెలుపుతున్న బాలుడి కుటుంబీకులుబాలుడి మెడకు చుట్టుకున్న ప్లాస్టిక్ లాక్ పిట్లం(జుక్కల్): ఓ బాలుడు ఆడుకుంటుండగా మెడకు ప్లాస్టిక్ లాక్ చుట్టుకోవడంతో శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడగా, పోలీసులు ఆస్పత్రికి తరలించి కాపాడారు. వివరాలు ఇలా.. పిట్లంలోని జాతీయ రహదారి 161 పక్కన గల సర్వీస్ రోడ్డుపై శనివారం పలువురు చిన్నారులు ఆడుకుంటున్నారు. వారిలో కార్తీక్ అనే నాలుగేళ్ల బాలుడు ప్లాస్టిక్ లాక్తో ఆడుతుండగా, అతడి మెడకు లాక్ అయింది. దీంతో అతడు ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడగా, అటుగా వెళ్తున్న పోలీసులు గమనించారు. వెంటనే తమ వాహనంలో స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యురాలు బాలుడి మెడకు ఉన్న లాక్ను తొలగించడంతో ప్రాణాపాయం తప్పినట్టయింది. సకాలంలో స్పందించి ఆస్పత్రికి తీసుకొచ్చిన పోలీసులకు చిన్నారి తల్లిదండ్రులు, కుటుంబీకులు కృతజ్ఞతలు తెలిపారు. ఏఎస్సై రాచప్ప, శైలేష్ చారి, యశ్వంత్, ప్రియాంక, ఆస్పత్రి సిబ్బంది ఉన్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
మోర్తాడ్: మండలంలోని పాలెం–తిమ్మపూర్ దారిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. వివరాలు ఇలా.. మండలంలోని పాలెం గ్రామానికి చెందిన ఎనుగంటి గంగారాం(63) అనే వ్యక్తి శనివారం తిమ్మాపూర్ నుంచి పాలెంకు మోటార్సైకిల్పై బయలుదేరాడు. మార్గమధ్యలో అతడి వా హనాన్ని ఓ లారీ రివర్స్లో వస్తూ ఢీకొట్టింది. ఈ ఘటనలో గంగారాం తీవ్రంగా గాయపడగా, అక్కడికక్కడే మృతిచెందా డు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరు కొని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాము తెలిపారు. చికిత్స పొందుతూ మహిళా.. జక్రాన్పల్లి: రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. వివరాలు ఇలా.. మండలంలోని బాలానగర్కు చెందిన శివరాత్రి లక్ష్మీ (35)అనే మహిళ ఈనెల 23న భర్త లక్ష్మణ్తో కలిసి బైక్పై ఆర్మూర్కు బయలుదేరారు. సికింద్రాపూర్ గ్రామం వద్ద 44వ నెంబర్ జాతీయ రహదారిపై వడ్ల చిన్నమ్మ అనే వ్యక్తి వడ్లను ఆరబెట్టాడు. దంపతుల బైక్ వడ్ల కుప్పలపైకి వెళ్లడంతో అదుపుతప్పి కిందపడ్డారు. ఈఘటనలో లక్ష్మికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆమెను నిజామాబాద్ ఆస్పత్రికి తరలించారు. శనివారం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె మరణించినట్లు ఎస్సై మహేశ్ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. -
భక్తుల కొంగుబంగారంగా లక్ష్మీనారాయణస్వామి
● నేటినుంచి చౌట్పల్లి ఆలయ బ్రహ్మోత్సవాలు ● వారం రోజులపాటు కొనసాగనున్న వేడుకలుమోర్తాడ్(బాల్కొండ) : చారిత్రక నేపథ్యమున్న క మ్మర్పల్లి మండలంలోని చౌట్పల్లిలోగల లక్ష్మీనా రాయణస్వామి ఆలయం భక్తుల కొంగుబంగారంగా నిలుస్తోంది. ఈ ఆలయ బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానుండగా, వారంపాటు కొన సాగనున్నాయి. ద్రావిడ సాంప్రదాయం ప్రకారం ఆరాధనోత్సవాలు వారం రోజుల నుంచి కొనసాగుతున్నాయి. ఉత్సవాలకు చౌట్పల్లి గ్రామాభివృద్ధి క మిటీ అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఉత్సవాల్లో భా గంగా 28న స్వామివారి కల్యాణోత్సవం, 1న రథోత్సవం నిర్వహించనున్నారు. వేడుకల్లో చుట్టుపక్క ల గ్రామాల ప్రజలు భారీగా హాజరుకానున్నారు. చారిత్రక నేపథ్యం.. పూర్వ కాలంలో సప్త ఋషులలో ఒకరైన అగస్త్య మహాముని గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో శ్రీమహావిష్ణువును కీర్తిస్తూ కఠోరమైన తపస్సు చే యగా ఆయనకు సాక్షాత్కారమిచ్చిన ఆ దేవదేవుడు కలియుగంలో భక్తులను ఉద్దరించడానికి మూడు చోట్ల శ్రీలక్ష్మి నారాయణ స్వామి ఆలయాలను ని ర్మించాలని ఆదేశించారని చరిత్ర చెబుతోంది. దేవ దేవుని ఆదేశాల మేరకు అగస్త్య మహాముని జైనపు రి (ఆదిలాబాద్ జిల్లాలో ని జైనథ్), లక్ష్మిపురి( చౌట్పల్లి), మహాపురి(పెద్దపల్లి జిల్లాలోని మంథని)ల లో ఆలయాలను నిర్మించారని శిలాశాసనాల ద్వా రా వెల్లడైంది. లక్ష్మిపురి(చౌట్పల్లి) ఆలయ నిర్మాణంను 1279లో మాఘశుద్ధ దశమి శుక్రవారం రో హిణి నక్షత్ర శుభ ముహుర్తంలో ప్రారంభించి అనతికాలంలోనే పూర్తి చేసినట్లు తెలంగాణ దేవాలయా ల పరిశోధకులు హరిదాసు గతంలో వెల్లడించారు. కాకతీయుల రాజ్యం అంతమైన తరువాత గ్రామంలోని ఏలేటి, కేతిరెడ్డి వంశస్తుల సహకారంతో ని త్యం రెండు పూటలా పూజాకార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఎంతో మంది జీయర్ స్వాములు స్వామిని దర్శించుకుని తమ పూర్వీకులు ఈ ఆలయం గురించి చెప్పిన గొప్ప విషయాలను భక్తులకు వివరించారు. ప్రతి ఏటా వైశాఖ పౌర్ణమి రోజున స్వామివారి జాతరను నిర్వహిస్తారు. గొప్పగా నిర్వహిస్తాం.. ఎంతో మంది భక్తులకు కొంగుబంగారంగా శ్రీలక్ష్మీనారాయణ స్వామి నిలిచా రు. తాము కోరుకున్న కోరి కలను తీర్చే దేవదేవుడిగా స్వామివారు కీర్తించబడుతున్నారు. ఆలయ ఉత్సవాలను ఎంతో ఘనంగా ప్రతి ఏటా నిర్వహస్తున్నాం. ఏలేటి, కేతిరెడ్డి వంశీయు లు, గ్రామస్తుల సహకారంతో ఈసారి కూడా ఉత్సవాలను గొప్పగా నిర్వహిస్తాం. – సముద్రాల అమరనాథచార్యులు, ఆలయ ప్రధాన అర్చకులు, చౌట్పల్లి -
ఆర్టీసీ కార్మికులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం
● సమస్యలన్నింటిని పరిష్కరిస్తుంది ● డీసీసీ అధ్యక్షుడు కాటిపల్లి నగేష్రెడ్డినిజామాబాద్ రూరల్: ఆర్టీసీ కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని, వారి సమస్యలను పరిష్కరించేవిధంగా కృషి చేస్తోందని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాటిపల్లి నగేష్రెడ్డి, కార్పొరేషన్ డీసీసీ అధ్యక్షుడు రామకృష్ణ అన్నారు. ప్రభుత్వంతో ఆర్టీసీ నేతల చర్చలు సఫలం కావడంతో శనివారం వారు నగరంలోని డిపో–1 వద్దకు వెళ్లి, కార్మికులతో మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఆర్టీసీ యూనియన్లను తీసివేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం యూనియన్లను ప్రవేశపెడుతున్నదన్నారు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేసుకోవడానికి ప్రక్రియ కూడా ప్రారంభమైందన్నారు. ఇవేగాక ఆర్టీసీ కార్మికుల డిమాండ్లలో 30 వరకు ఆమోదం తెలుపుతూ ప్రజాప్రభుత్వంలో ఎవరు కూడా ఇబ్బంది కలగకుండా కాంగ్రెస్ సర్కార్ చర్యలు తీసుకుందని పేర్కొన్నారు. పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం.. ఆర్టీసీ కార్మికులతో చర్యలు సఫలం కావడం రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో కోట్ల బకాయిలను గణనీయంగా తగ్గించి ఆర్టీసీ సంస్థను పునరుద్ధరించిందన్నారు. రాష్ట్రం గతంతో పోలిస్తే ప్రస్తుత అభివృద్ధి దిశగా గణనీయమైన మలుపు తీసుకుందన్నారు. -
రైతులు పంట మార్పిడి విధానాన్ని పాటించాలి
నిజామాబాద్ రూరల్: రైతులు పంట మార్పిడి విధానాన్ని అనుసరించాలని రైతు కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్ ఒక ప్రకటనలో సూచించారు. ప్రస్తుతం రాష్ట్రంలో అధికంగా వరి సాగవుతుండటంతో ఇతర పంటల సాగు గణనీయంగా తగ్గిపోయిందన్నారు. దీంతో భవిష్యత్లో ఆహార కొరత ఏర్పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈనేపథ్యంలో రైతులు పంటల మార్పిడి పాటిస్తే లాభాలతోపాటు రాష్ట్రంలో ఆహార భద్రతను కూడా కాపాడవచ్చన్నారు. ఇటీవల సీఎం, మంత్రులతో జరిగిన సమావేశంలో ఈ అంశాలను ప్రస్తావించినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో కూరగాయల సాగును విస్తరించాల్సిన అవసరం ఉందని, దీనికి ప్రభుత్వం రైతులను ప్రోత్సహించేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. ఇటీవల కేరళ, నాసిక్ ప్రాంతాల్లో పర్యటించిన రైతు కమిషన్, అక్కడి రైతులు కూరగాయల సాగు ద్వారా ఆర్థికంగా లాభపడుతున్నట్లు గుర్తించినట్లు చెప్పారు. దీనిపై నివేదికలను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసినట్లు పేర్కొన్నారు. అలాగే రైతుల ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వం అధిక బడ్జెట్ కేటాయించడానికి సిద్ధంగా ఉందని వివరించారు. -
దరఖాస్తుల ఆహ్వానం
బోధన్: బోధన్లోని కేంద్రియ విద్యాలయంలో 5వ తరగతిలో ఖాళీగా ఉన్న 4 సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు అడ్మిషన్స్ ఇన్చార్జి అమోల్ సరోడే ఒక ప్రకటనలో తెలిపారు. ఆడ్మిషన్ ఫారాలు విద్యాలయంలో అందుబాటులో ఉన్నాయని, అర్హత, ఆసక్తి గల విద్యార్థుల తల్లిదండ్రులు ఈనెల 27లోపు నేరుగా విద్యాలయానికి వచ్చి, దరఖాస్తులు అందించాలని సూచించారు. స్కౌట్ మాస్టర్ల పోస్టుల భర్తీకి.. నిజామాబాద్అర్బన్: ఉమ్మడి జిల్లాలోని మండలాల వారీగా ది స్కౌట్ గైడ్స్ ఆర్గనైజేషన్లో పనిచేసేందుకు స్కౌట్ మాస్టర్ల ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలని ఉమ్మడి జిల్లా ది స్కౌట్ గైడ్స్ ఆర్గనైజేషన్ కమిషనర్ జాడి ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు మే 2లోపు విద్యుత్నగర్లోని ఉమ్మడి జిల్లా కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలన్నారు. అభ్యర్థులు ఏదైనా డిగ్రీ పాసై ఉండాలని, వయస్సు 18ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలన్నారు, వేతనం నెలకు రూ.15వేల వరకు ఉంటుందన్నారు. జిల్లాలోని నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు 96526 95670ను సంప్రదించాలన్నారు. నిజామాబాద్అర్బన్: జిల్లాకు చెందిన సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్ గత ఏడాది నేరస్థుడి చేతిలో హత్యకు గురయ్యాడు. దీంతో అతడి పిల్లల చదువుల నిమిత్తం టెర్మినాస్ గ్రూప్ సీఎండీ ఎస్పి రెడ్డి ఆర్థిక సహాయం అందించారు. ఈమేరకు చెక్కును శనివారం రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి చేతుల మీదుగా ప్రమోద్ కుమార్ కుటుంబ సభ్యులకు అందజేశారు. ఎస్పీ రెడ్డి తండ్రి ఎస్ఎల్ఎన్ రెడ్డి గతంలో బోధన్లో డీఎస్పీగా సేవలందించారు. సీపీ సాయి చైతన్య తదితరులు ఉన్నారు. డీఎస్పీ శ్రీశైలంకు అభినందన నిజామాబాద్అర్బన్: ఎస్బిలో సర్కిల్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న శ్రీశైలం డీఎస్పీగా పదోన్నతి పొందారు. ఈసందర్భంగా ఆయన శనివారం సీపీ కార్యాలయంలో సీపీ సాయి చైతన్యను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం శ్రీశైలంను సీపీ అభినందించారు. నల్లమట్టి వాహనాలకు జరిమానా నందిపేట్(ఆర్మూర్): రైతుల పేరిట గోదావరి పరివాహాక ప్రాంతం నుంచి అక్రమంగా నల్లమట్టి తరలిస్తున్న 9 వాహనాలను రెవెన్యూ అధికారులు పట్టుకుని జరిమానా విధించారు. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం గోదావరి నది నుంచి అక్రమంగా నల్లమట్టిని అధిక లోడుతో టిప్పర్లలో నింపుతూ నందిపేట మండలం మీదుగా వెళుతుండగా రెవెన్యూ అధికారులు 9 వాహనాలను పట్టుకున్నారు. ఒక్కొ వాహనానికి రూ. 15వేలతో రూ.లక్ష 35 వేలు జరిమానా విధించినట్లు తహసీల్దార్ సంతోష్రెడ్డి తెలిపారు. -
దోమల నివారణలో ప్రజలు భాగస్వాములు కావాలి
● డీఎంహెచ్వో రాజశ్రీ ● జిల్లా కేంద్రంలో ప్రపంచ మలేరియా డే అవగాహన ర్యాలీసుభాష్నగర్ : దోమల నివారణలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని డీఎంహెచ్వో రాజశ్రీ పిలుపునిచ్చారు. ప్రపంచ మలేరియా డే సందర్భంగా శనివారం కీటక జనిత వ్యాధుల నియంత్రణ విభాగం ఆధ్వర్యంలో వినాయక్నగర్ పీహెచ్సీ పరిధిలో అవగాహనా ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని డీఎంహెచ్వో జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇంటితోపాటు పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా శుభ్రత పాటించాలన్నారు. కిటికీలు, తలుపులకు దోమ తెరలు వాడాలని, ఐదేళ్లలో మలేరియా కేసులు నమోదు కాలేవని, కానీ దోమల ద్వారా వ్యాపించే ఇతర వ్యాధులు నమోదవుతున్నాయని పేర్కొన్నారు. డెంగీ వంటి కేసులు కూడా నమోదు కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఏఎన్ఎంలు, ఆశాలు గృహ సందర్శనలో జ్వర సర్వేను నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్వో సికందర్ నాయక్, మెడికల్ ఆఫీసర్ శ్రీలత, ఏఎంవో సలీం, డీహెచ్ఈ ఘన్పూర్ వెంకటేశ్వర్లు, సబ్ యూనిట్ అధికారులు, హెచ్ఈవోలు పాల్గొన్నారు. -
పోతంగల్లో కారు దహనం
రుద్రూర్: పోతంగల్ మండల కేంద్రంలో గుర్తు తెలి యని వ్యక్తులు కారును దహనం చేశారు. గ్రామానికి చెందిన మహమ్మద్ జుమ్మాఖాన్ తన పాత మారుతీ కారును ఇంటి ముందు ఉన్న ఖాళీ స్థలంలో నిలిపిఉంచేవాడు. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత గుర్తు తెలియని వ్యక్తులు కారుకు నిప్పంటించారు. దీంతో కారు పూర్తిగా కాలిపోయింది. కారు పక్కనే నిలిపి ఉంచిన జంగం విట్టల్కు చెందిన టీవీఎస్ ఎక్స్ఎల్ బండి కూడా కొంత మేరకు దెబ్బతింది. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై సునీల్ తెలిపారు. -
అడ్వకేట్స్ సొసైటీ అధ్యక్షుడిగా సాయిరెడ్డి
నిజామాబాద్ లీగల్: ఉమ్మడి నిజామాబాద్ జిల్లా న్యాయవాదుల సొసైటీకి జరిగిన ఎన్నికల్లో చింతకుంట సాయిరెడ్డి అధ్యక్షుడిగా, ప్రధాన కార్యదర్శి గా పడిగెల వెంకటేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం జరిగిన ఎన్నికల్లో నాలుగు డైరెక్టర్ స్థానాలకు ఐదుగురు అభ్యర్థులు పోటి చేయగా, చింతకుంట సాయిరెడ్డి, రెంజర్ల సురేష్, వి. దిలీప్, నర్సారెడ్డి ఎన్నికల్లో విజయం సాధించారు. కొత్తగా ఎన్నికై న నలుగురు డైరెక్టర్లు, అప్పటికే ఉన్న ఎనిమిది మంది డైరెక్టర్లు కలిపి సొసైటీకి కొత్త కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా సాయిరె డ్డి, ప్రధాన కార్యదర్శిగా వెంకటేష్, ఉపాధ్యక్షుడిగా ఆ ర్మూర్కు చెందిన విప్లవ్ కిరణ్, జాయింట్ సెక్రెటరీ గా బోధన్కు చెందిన రవీంధర్, ట్రెజరర్గా శ్రీనివాస్గౌడ్ ఎన్నికయ్యారు. వీరు ఏడాదిపాటు పదవీ లో కొనసాగనున్నారు. ఎన్నికల అధికారులు జగన్మోహన్ గౌడ్, జైపాల్, సొసైటి మాజీ ప్రధాన కా ర్యదర్శి వెంకట్రమణగౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
గంగాకావేరి వద్దు.. తెలంగాణ సోనా ముద్దు
● ఖరీఫ్లో మేలు రకాలను సాగు చేయాలంటున్న వ్యవసాయ శాఖడొంకేశ్వర్ (ఆర్మూర్): త్వరలో వానాకాలం సీజన్ (ఖరీఫ్) ప్రారంభం కానున్న నేపథ్యంలో వరిలో మేలు రకాలను సాగు చేయాలని వ్యవసాయ శాఖ రైతులకు సూచిస్తోంది. స న్నాల్లో చాలా రకాలను సాగు చేయడంతో ప్ర భుత్వం సూచించిన విధంగా గింజలో ప్రమాణాలు ఉండటం లేదని, ధృవీకరించబడిన ప లు మేలు రకాలను మాత్రమే సాగు చేయాల ని చెబుతోంది. దీంతో రైతులకు, రైస్ మిల్లర్ల కు ఇబ్బందులు ఉండవని అంటున్నారు. ఖరీఫ్లో గంగాకావేరి, ఎంటీయూ–1224, 1001, 1153, 1156, జేజీఎల్–24423 వంటి రకాలు సాగు చేయడంతో గింజ పొడవులో వ్యత్యాసం, మిల్లింగ్ సమయంలో నూక వస్తోందని ఫిర్యాదులు ఉన్నాయి. ఒక్కోసారి మిల్లర్లు ధాన్యాన్ని దింపుకోవడం లేదు. పైన సూచించిన రకాలను సాగు చేయడం తగ్గించాలని, మేలైన 11 రకాల వరి సాగు చేయ డం ఉత్తమమని అధికారులు చెప్తున్నారు. మేలు రకాలు ఇవే.. -
నిత్యం ట్రా‘ఫికరే..’
● మాధవనగర్ రైల్వే గేటు వద్ద వాహనదారుల ఇబ్బందులు ● పట్టించుకోని అధికారులునిజామాబాద్ రూరల్: నగర శివారులోని మాధవనగర్ రైల్వే గేటు వద్ద వాహనదారులకు నిత్యం ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఒక్క సారి గేటు పడిదంటే చాలు ఇరువైపులా అర కిలోమీటరు మేర వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఒకవైపు ఆర్వోబీ పనులు, మరోవైపు రోడ్డు ఇరుకుగా మారింది. వీటికి తో డు భారీ వాహనాల రాకపోకలతో తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. శుక్రవారం ఉదయం 10.30 గంటలకు రైల్వే గేటు వేయటంతో ఇరువైపులా పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయా యి. గేటు తీసిన తర్వాత ద్విచక్ర వాహనదారులు రాంగ్రూట్లో దూసుకురావడంతో ఇబ్బందులు ఏర్పడ్డాయి. ట్రాఫిక్ క్లియర్ అయ్యేలోపు మళ్లీ గేటు పడటంతో పరిస్థితి మొదటికొచ్చింది. ఇలా నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాహ నదారులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. అధికారు లు స్పందించి ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించాలి
నిజామాబాద్ రూరల్: రానున్న ఖరీఫ్ సీజన్లో రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించడమే ధ్యేయంగా రైతు కమిషన్ సభ్యులు పనిచేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. హైదరాబాద్లోని మంత్రి కార్యాలయంలో శుక్రవారం మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అధ్యక్షతన, కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా మంత్రి పలు అంశాలపై చర్చించారు. ఇరిగేషన్ మంత్రితో సమావేశం.. ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర రైతు కమిషన్ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా సమావేశంలో చెరువుల పరిరక్షణకు స్థిరమైన వ్యవస్థ, నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు ప్రాముఖ్యత వంటి అంశాలపై వారు చర్చించారు. చెరువుల మట్టి తొలగింపు అంశాలపై రూపొందించిన సమగ్ర నోట్ను మంత్రికి రాష్ట్ర రైతు కమిషన్ సభ్యులు సమర్పించారు. సభ్యులు రాములు నాయక్ (మాజీ ఎమ్మెల్సీ), భవాని మరికంటి, సునీల్ , గడుగు గంగాధర్,శ్రీ రాంరెడ్డి గోపాల్ రెడ్డి, సురేంద్ర మోహన్, మెంబర్ సెక్రెటరీ గోపాల్ తదితరులు పాల్గొన్నారు. -
డిగ్రీ పరీక్షల్లో ఒకరు డిబార్
తెయూ(డిచ్పల్లి): తెయూ పరిధిలో డిగ్రీ రెగ్యులర్, బ్యాక్లాగ్ పరీక్ష లు కొనసాగుతున్నాయి. శుక్రవారం కామారెడ్డిలోని సెంటర్లో ఓ వి ద్యార్థి మాల్ప్రాక్టీస్కు పాల్పడుతూ డిబార్ అయినట్లు అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని 29 పరీక్ష కేంద్రాల్లో 11,238 విద్యార్థులకు 10,773 మంది హాజరు కాగా 465 మంది గైర్హాజరయ్యారు. కామారెడ్డిలోని పరీక్ష కేంద్రాలను ఆడిట్ సెల్ డైరెక్టర్ చంద్రశేఖర్, కంట్రోలర్ సంపత్కుమార్, యూ జీసీ డీన్ సీహెచ్ ఆంజనేయులు తనిఖీ చేశారు. -
రసవత్తరంగా కుస్తీ పోటీలు
బాన్సువాడ: బాన్సువాడలో శుక్రవారం నిర్వహించిన బేతాళస్వామి కుస్తీ పోటీలు రసవత్తరంగా కొనసాగాయి. బేతాళస్వామి జాతరలో భాగంగా రెండో రోజు కుస్తీ పోటీలు నిర్వహించారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించిన కుస్తీ పోటీలకు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి పెద్ద ఎత్తున మల్లయోధులు తరలి వచ్చారు. మహారాష్ట్ర నుంచి ఇద్దరు అమ్మాయిలు వచ్చి కుస్తీ పట్టడం చూపరులను ఆకట్టుకుంది. కుస్తీ పోటీల్లో గెలుపొందిన మల్లయోధులకు ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాల్రాజ్ నగదు అందజేశారు. కుస్తీ పోటీలను ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్రెడ్డి తిలకించారు. మాజీ ఎమ్మెల్యే కత్తెర గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. -
కుక్కల దాడిలో లేగదూడ మృతి
మద్నూర్(జుక్కల్): మండల కేంద్రంలోని టీచర్స్ కాలనీలో కుక్కల దాడిలో శుక్రవారం లేగ దూడ మృతిచెందినట్లు గ్రామస్తులు తెలిపారు. టీచర్స్ కాలనీ లోని హనుమాన్ ఆలయానికి చెందిన లేగదూడపై వారం రోజుల క్రితం కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. దీంతో లేగదూడ వింతగా ప్రవర్తిస్తు మృతి చెందిందని వారు తెలిపారు. అలాగే ఇటీవల గ్రామంలోని రైతుల ఇళ్ల ముందు కట్టిన ప శువులపై సైతం కుక్కలు దాడి చేశాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి కుక్కల నివారణకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. -
జిల్లా బేస్బాల్ జట్ల ఎంపిక
ఆర్మూర్టౌన్: ఆర్మూర్ పట్టణంలోని జావిద్బాయ్ మినీ స్టేడియంలో శుక్రవారం జిల్లా సబ్ జూనియర్ బేస్బాల్ బాల, బాలికల జట్లను ఎంపిక చేసినట్లు జిల్లా బేస్బాల్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు మధుసూదన్ రెడ్డి, సొప్పరి వినోద్ తెలిపారు. బాలికల విభాగంలో 51 మంది పాల్గొనగా అందులో 25 మంది బాలికలను ఎంపిక చేశామని, బాలుర విభాగంలో 22 మంది హాజరు కాగ 18 మందిని ఎంపిక చేసినట్లు తెలిపారు. వారు శిక్షణ అనంతరం ఈనెల 28 నుంచి 30 వరకు డిచ్పల్లి 7వ బెటాలియన్లో జరిగే ఆరవ రాష్ట్ర సబ్ జూనియర్ బేస్బాల్ పోటీలలో పాల్గొంటారన్నారు. ప్రధాన కార్యదర్శి మర్కంటి గంగా మోహన్, జిల్లా వ్యాయమ ఉపాధ్యాయులు రమేష్, అనిల్, వీణ, కోచ్లు అనికేత్, మౌనిక, రాహుల్ తదితరులు పాల్గొన్నారు. -
అత్తింటి వద్ద పిల్లలతో నిరసన
నిజాంసాగర్(జుక్కల్): తనకు భర్త కావాలంటూ, అత్తింట్లోకి రానివ్వాలంటూ ఓ మహిళ తన పిల్లలతో కలిసి శుక్రవారం నిరసన చేపట్టింది. వివరాలు ఇలా.. మహమ్మద్ నగర్ మండలం బూర్గుల్ గ్రామానికి చెందిన మదునాల మహేందర్గౌడ్కు 2020లో తెల్గాపూర్ గ్రామానికి చెందిన కావ్యతో వివాహం జరిగింది. కొన్ని నెలల నుంచి భర్తతోపాటు అత్తామామలు వేధించడంతో కావ్య పుట్టింటింటికి వెళ్లింది. అప్పటికే ఆమె గర్భిణి కాగా, ఇద్దరు పండంటి మగ బిడ్డలకు జన్మనిచ్చింది. నెలలు గడుస్తున్నా అత్తింటి వారు కాపురానికి తీసుకు వెళ్లకపోవడంతో పెద్దల సమక్షంలో పంచాయితీలు, కోర్టులో కేసులు పెట్టుకున్నారు. అయినా ఆమెను అత్తింటివారు ఇంట్లోకి అనుమతించలేదు. దీంతో శుక్రవారం ఆమె తన పిల్లలతో కలిసి అత్తింటి వద్ద నిరసన దీక్ష చేపట్టింది. విషయం తెలుసుకున్న పోలీసులు వివరాలు సేకరించినట్లు సమాచారం. -
క్రైం కార్నర్
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి బాన్సువాడ: బాన్సువాడ పట్టణంలోని తాడ్కోల్ చౌరస్తా వద్ద జరిగిన రో డ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. వివరాలు ఇలా.. బిచ్కుంద మండలం గోపన్పల్లికి చెందిన కుర్మ హన్మండ్లు (55) గ్రామంలో వ్యవసా యం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం అతడు తన స్నేహితులతో కలిసి బాన్సువాడలో జరిగిన కుస్తీ పోటీలను తిలకించేందుకు బైక్పై బయలుదేరారు. తాడ్కోల్ చౌరస్తా వద్ద వారి బైక్ను కొయ్యగుట్ట నుంచి అతివేగంగా వస్తున్న డీసీఎం వ్యాను ఢీకొట్టింది. ఈ ఘటన లో హన్మండ్లు టైర్ల కిందపడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. వ్యాన్ డ్రైవర్ పరారయ్యాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వ డంతో వారు ఘటన స్థలానికి వచ్చి, వివరాలు సేకరించారు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ శ్రీధర్ తెలిపారు. -
తాగునీటి సరఫరాలో అంతరాయం ఉండొద్దు
● సంబంధిత అధికారులు, సిబ్బంది నిరంతరం పర్యవేక్షణ చేయాలి ● కలెక్టర్ ఇలా త్రిపాఠి బోధన్: వేసవిని దృష్టిలో పెట్టుకుని ప్రజలకు సరిపడా తాగునీటి సరఫరాను అంతరాయం లేకుండా అందించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం బోధన్, బాన్సువాడ నియోజకవర్గంలోని వివిధ మండలాల ఎంపీడీవోలు, ఆర్డబ్ల్యూఎస్ ఏఈఈలు, ఎంపీవోలు ఇతర శాఖల అధికారులతో తాగునీటి సరఫరా స్థితిగతులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రాబోయే రెండు, మూడు నెలలు ఎంతో కీలకమైనందున తాగునీరు సరఫరా వ్యవస్థపై నిరంతరం పర్యవేక్షణ జరపాలన్నారు. ఏ ఒక్క ప్రాంతంలోను నీటి కొరత ఏర్పడకుండా ప్రణాళిక బద్ధంగా వ్యవహరిస్తూ, అవసరమైన చోట యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. స్థానిక ప్రజాప్రతినిధులను సంప్రదించి చేతిపంపులు, బోరుబావులకు అవసరమైన చోట మరమ్మతులు చేపట్టాలన్నారు. పైప్లైన్స్, వాల్వ్లకు నష్టం కలిగేలా వ్యవహరించే వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయించాలని తెలిపారు. జిల్లాలో తాగునీటి సరఫరాపై సంబంధిత శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పని చేయాలని, నిర్లక్ష్యం వహిస్తే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎడపల్లి మండలంలోని జానకంపేట వద్ద ఏర్పాటు చేసిన తరహాలోనే అనంతగిరి, నెహ్రునగర్ గ్రామాలకు ఆన్లైన్ బూస్టర్ సిస్టం ఏర్పాటు చేయాలని తెలిపారు. బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ రాజేందర్, డీపీవో శ్రీనివాస్రావు, జెడ్పీ సీఈవో సాయాగౌడ్, డీఆర్డీవో సాయన్న, ఈఈలు రాకేశ్, స్వప్న, డీఎల్పీవో శ్రీనివాస్, నాగరాజు పాల్గొన్నారు. ‘యంగ్ ఇండియా’ స్కూల్ స్థలం పరిశీలన బోధన్రూరల్: బోధన్ శివారులోని బెల్లాల్ ప్రాంతంలో ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్’, వసతి గృహ సముదాయం కోసం ఎంపిక చేసిన స్థలాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి శుక్రవారం పరిశీలించారు. స్థలాన్ని ఖరారు చేసినందున, శంకుస్థాపన కార్యక్రమానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, డీఈ రాందాస్, తహసీల్దార్ విఠల్, సంబంధిత శాఖల అధికారులు ఉన్నారు. -
ఆరోగ్యంపై జాగ్రత్త అవసరం
● రాంపూర్ వృద్ధాశ్రమాన్ని సందర్శించిన డీఎంహెచ్వో ● వైద్య శిబిరం నిర్వహణడిచ్పల్లి(నిజామాబాద్రూరల్): వృద్ధులు తమ ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ప్ర తి ఉదయం చేతనైన వ్యాయామం చేస్తే శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కలిగి ఉంటారని డీఎంహెచ్వో రాజశ్రీ సూచించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు శుక్రవారం డిచ్పల్లి మండలం రాంపూర్ గ్రామంలో ని వృద్ధాశ్రమాన్ని ఆమె సందర్శించారు. వృద్ధులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. మెనూ ప్రకా రం వంటలు చేయాలని సిబ్బందికి సూచించారు. తీవ్ర ఎండల దృష్ట్యా చల్లదనం కోసం వృద్ధాశ్రమంలో కూలర్ సదుపాయం కల్పించాలన్నారు. అనంతరం ఇందల్వాయి పీహెచ్సీ ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా అసంక్రమిత వ్యాధుల ప్రాజెక్టు అధికారి వెంకన్న, డిప్యూ టీ డీఎంహెచ్వో సికిందర్ నాయక్, వైద్య నిపుణు లు చైతన్య, రవితేజ, స్నేహ, ఫణీంద్ర, స్థానిక వైద్యాధికారి షారోన్ షైనీ క్రిష్టినా, ఆరోగ్య విస్తరణ అధికారి శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
వేగం.. పారదర్శకం
సుభాష్నగర్ : యాసంగి 2025–26 సీజన్కు సంబంధించిన ధాన్యం కొనుగోలు ప్రక్రియను మరింత వేగవంతంగా, పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు ఓపీఎంఎస్ (ఆన్లైన్ ప్రొక్యూర్మెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్) సాఫ్ట్వేర్లో ప్రభు త్వం కీలకమార్పులు చేసింది. కొనుగోలు కేంద్రాలకు సమీపంలో ఉన్న రైస్మిల్లులకు ధాన్యం తరలించేలా చర్యలు చేపట్టారు. అలాగే ప్రతి రైస్మిల్లు సామర్థ్యాన్ని పరిగణనలోకి తీసుకొని, వాటి సామర్థ్యానికి అనుగుణంగా ధాన్యం కేటాయించేలా సాఫ్ట్వేర్ను ఆధునీకరించారు. దీంతో రవాణా సమయం, నిల్వ సమస్యలు, కొనుగోలు ప్రక్రియ వేగవంతం కానుంది. ఇప్పటివరకు కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి మిల్ అలాట్మెంట్, మిల్ అక్నాలెడ్జ్మెంట్లో మార్పులు చేసేందుకు జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారికి (డీసీఎస్వో) ప్రత్యేక లాగిన్ ఆప్షన్ ఇచ్చారు. అదేవిధంగా ఒకసారి మిల్లు కు ధాన్యం కేటాయించిన తర్వాత, మిల్లర్ ఏదైనా కారణంతో ధాన్యాన్ని అన్లోడ్ చేయలేని పరిస్థితి ఉంటే ఆ ధాన్యాన్ని మరో మిల్లుకు కేటాయించే అధికారం కూడా డీసీఎస్వోకు అవకాశమిచ్చారు. సాఫ్ట్వేర్లో మార్పులపై సమావేశం ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ఓపీఎంఎస్ సాఫ్ట్వేర్లో చేసిన మార్పులపై అదనపు కలెక్టర్ కిరణ్కుమార్ ఆదేశాల మేరకు శుక్రవారం సాయంత్రం జిల్లా పౌరసరఫరాల అధికారి శ్రీకాంత్రెడ్డి, సివిల్ సప్లయ్ జిల్లా మేనేజర్, జిల్లా సహకార అధికారి శ్రీనివాస్రావు, డీఆర్డీవో పీడీ సాయన్న, టెక్నికల్ స్టాఫ్, కొనుగోలు కేంద్రాల సీఈవోలు, ఏపీఎంలతో గూగుల్ మీట్ సమావేశాన్ని నిర్వహించారు. సాఫ్ట్వేర్లో జరిగిన మార్పులను వివరించి, సంబంధిత సందేహాలను నివృత్తి చేశారు. సాఫ్ట్వేర్ అప్డేట్ నేపథ్యంలో కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కొనుగోలు ప్రక్రియ మరింత సులభతరం చేసినట్లు వారు తెలిపారు. ధాన్యం సేకరణ సాఫ్ట్వేర్లో కీలక మార్పులు కొనుగోళ్లను సమర్థవంతంగా నిర్వహించడానికే.. సమీపంలోని మిల్లులకే వడ్లు తరలింపు -
నల్లమట్టి వాహనాల పట్టివేత
నందిపేట్ (ఆర్మూర్): గోదావరి పరివాహక ప్రాంతం నుంచి అక్రమంగా నల్లమట్టిని తరలిస్తున్న వా హనాలను శుక్రవారం రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు.నిర్మల్ జిల్లా లోకేశ్వర్ మండలం గోదా వరి నది నుంచి అక్రమంగా నల్లమట్టిని అధిక లో డుతో టిప్పర్లలో నింపుతూ నందిపేట మండలం మీదుగా వెళుతుండగా,9 వాహనాలను పట్టుకున్న ట్లు తహసీల్దార్ సంతోష్ రెడ్డి తెలిపారు. నిబంధన ల ప్రకారం జరిమానా విధించనున్నట్లు ఆయన తె లిపారు.రైతుల పేరిట కొందరు నల్ల మట్టి వ్యాపా రం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇందల్వాయి: మల్లాపూర్లో ని వాగు నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్ ను పట్టుకున్నట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు. ప్రభు త్వ అనుమతి లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారని సమాచారం రావడంతో వెంటనే పోలీసులు మల్లాపూర్ వాగు వద్దకు వెళ్లి ట్రాక్టర్ను పట్టుకున్నారు. డ్రైవర్ను పట్టుకొని విచారించగా ఎటువంటి అనుమతులు చూపించలేదన్నారు. వెంటనే ట్రాక్టర్ను పోలీస్స్టేషన్కు తీసుకవచ్చి, డ్రైవర్పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. -
సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలి
తెయూ(డిచ్పల్లి): విద్యార్థులు చదువుతోపాటు సమాజ సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని, తద్వారా నాయకత్వ లక్షణాలు, సామాజిక అవగాహన పెరుగుతాయని తెలంగాణ యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ అపర్ణ తెలిపారు. తెయూ ఎన్ఎస్ఎస్ యూనిట్–2 ఆధ్వర్యంలో శుక్రవారం డిచ్పల్లి గ్రామంలో ఎన్ఎస్ఎస్ వేసవికాల ప్రత్యేక శిబిరం ప్రారంభించారు. ఈసందర్భంగా అపర్ణ మాట్లాడుతూ.. విద్యార్థులను సామాజిక బాధ్యత కలిగిన పౌరులుగా తీర్చిదిద్దే వేదికగా ఈ కార్యక్రమాలు నిలుస్తాయన్నారు. సర్పంచ్ లొక్కిడి యాదగిరి మాట్లాడుతూ.. ఎన్ఎస్ఎస్ వలంటీర్లు పర్యావరణం, ప్రకృతి పరిరక్షణ, ప్రభుత్వ సంక్షేమ పథకాల పై గ్రామస్తులకు అవగాహన కల్పించాలని కోరారు. అనంతరం తొలిరోజు వలంటీర్లు గ్రామంలోని పలు ప్రాంతాల్లో మొక్కలు నాటారు. ప్రపంచ భూమి దినోత్సవం పురస్కరించుకుని గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ అలీమ్ ఖాన్, ప్రిన్సిపాల్ జి.రాంబాబు, వీడీసీ క్యాషియర్ ఆసది రవీందర్, వార్డు సభ్యులు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. -
జూనియర్ సివిల్ జడ్జీల బదిలీ
నిజామాబాద్ లీగల్: జిల్లా కోర్టులో జూనియర్ సివిల్ జడ్జీలుగా విధులు నిర్వహిస్తున్న ఖుష్భూ ఉపాధ్యాయ, కుమారం గోపీకృష్ణ ను హైదరాబాద్కు బదిలీ చేస్తూ రాష్ట్ర హైకో ర్టు ఉత్తర్వులు జారీ చేసింది. మూడేళ్లుగా వీరు నిజామాబాద్లో విధులు నిర్వర్తిస్తున్నా రు. రాష్ట్రంలోని వివిధ జిల్లాలో మొత్తం 49 మంది జూనియర్ సివిల్ జడ్జీల బదిలీలు జరుగగా, అందులో భాగంగా ఖుష్భూ ఉపా ధ్యాయ, గోపీకృష్ణను బదిలీ చేస్తూ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ (విజిలెన్స్) ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన జడ్జీ గోపీకృష్ణను సీనియర్ న్యాయవాదులు జక్కుల వెంకటేశ్వర్, ఆర్ఎస్ఎల్ గౌడ్, నరేందర్ రెడ్డి, కిషన్ రావు దేశ్ముఖ్, సంతోష్ నిర్మల్కర్, శ్యామ్బాబు, వేణు తదితరులు ఆయనను కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. కొనసాగుతున్న ‘ఓపెన్’ పరీక్షలు ఖలీల్వాడి: జిల్లాలో ఓపెన్ పదవ తరగతి, ఇంటర్ పరీక్షలు నాలుగవ రోజు శుక్రవారం ప్రశాంతంగా కొనసాగినట్లు డీఈవో అశోక్ తెలిపారు. 12 కేంద్రాల్లో జరుగుతున్న ఎస్సెస్సీ పరీక్షల్లో 2481 మందికి 2196 మంది హాజరైనట్లు తెలిపారు. అలాగే 15 కేంద్రాల్లో కొనసాగుతున్న ఇంటర్ పరీక్షల్లో 1756 మందికి 1585 మంది విద్యార్థులు హాజరైనట్లు పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాలను మూడు ఫ్లయింగ్ స్వ్కాడ్స్ తనిఖీలు చేసినట్లు చెప్పారు. ఎంఈడీ మొదటి సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో ఎంఈడీ మొదటి సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలు శుక్రవారం ప్రశాంతంగా ప్రారంభమైనట్లు అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. నిజామాబాద్ జీజీ కళాశాలలో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగిన పరీక్షకు 26 మంది విద్యార్థులకుగానూ 26 మంది హాజరైనట్లు ఆయన తెలిపారు. నిజామాబాద్ రూరల్: నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికుల పిల్లలకు విదేశాల్లో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టినట్లు జిల్లా లేబర్ డిప్యూటీ కమిషనర్ యాదయ్య ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన వారిని గుర్తించేందుకు ఏసీఎల్, ఏఎల్వోల ద్వారా కార్మిక శాఖ ఆధ్వర్యంలో ప్రత్యే క కార్యాచరణను రూపొందించినట్లు పేర్కొ న్నారు. కార్మిక శాఖలో వివరాలు నమోదు చేసుకున్న కార్మికుల పిల్లల్లో 18 ఏళ్ల నుంచి 30 ఏళ్ల లోపు వయస్సు ఉన్నవారు ఈ పథకానికి అర్హులని తెలిపారు. భాష, సాఫ్ట్ స్కిల్స్పై ఉచిత శిక్షణను ఇచ్చి విదేశాల్లో ఉపాధి అవకాశాలను కల్పిస్తామని పేర్కొన్నారు. -
హస్తం ఆశీర్వాదం ఎవరికో..
నామినేటెడ్ విధానంలో సహకార సంఘాల పదవులు ఇచ్చేందుకు కేబినెట్ నిర్ణయంసాక్షి ప్రతినిధి, నిజామాబాద్: సహకార సంఘాల పాలక వర్గాలు, డీసీసీబీ, డీసీఎంఎస్ పాలకవర్గాలను నామినేటెడ్ విధానంలో భర్తీ చేసేందుకు రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీంతో ఉమ్మడి జిల్లాలో సహకార సంఘాల పాలకవర్గ పదవుల కోసం, డీసీసీబీ, డీసీఎంఎస్ పదవుల కోసం అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరికి వారే గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. కేబినెట్ నిర్ణయించిన కొన్ని గంటలకే ఎవరికి వారు తమ ప్రయత్నాలు షురూ చేశారు. హైదరాబాద్ వెళ్లి కీలక నాయకులను వరుసగా కలుస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ కాలపరిమితి సగభాగం అయిపోవడంతో జిల్లాలో నామినేటెడ్ పదవులు ఆశించేవారు కళ్లు కాయుల కాసేలా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో గ్రామీణ ప్రాంతాల్లో రాజకీయ, ఆర్థిక అంశాలతో ముడిపడి ఉన్న ఈ సహకార సంఘాల పదవులకు డిమాండ్ ఒకింత ఎక్కువగా ఉంది. సర్పంచ్ ఎన్నికలు పూర్తి కావడం, పరిషత్ ఎన్నికల ప్రక్రియ ఆలస్యం అవుతుండడంతో పాటు రిజర్వేషన్లు ఎలా వస్తాయోననే లెక్కలేసుకుంటున్న నాయకులు సహకార పదవుల కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల మాదిరిగా సహకార ఎన్నికలు సైతం హోరాహోరీగా జరుగుతాయి. అయితే కేబినెట్ నిర్ణయంతో సహకార పదవులు అధికార పార్టీకి గంపగుత్తగా దక్కనుండడంతో ఆశావహులు పట్టు వదలకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్ల కోసం ప్రథమ శ్రేణి నాయకులు, డైరక్టర్లు, సహకార సంఘాల చైర్మన్ల కోసం ద్వితీయ శ్రేణి నాయకులు, సహకార సంఘాల డైరక్టర్ల పదవుల కోసం తృతీయ శ్రేణి నాయకులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. ● కీలకమైన డీసీసీబీ చైర్మన్ పీఠం కోసం మాత్రం విపరీతమైన పోటీ నెలకొంది. ఈ పీఠం కోసం రేసులో తాజా మాజీ డీసీసీబీ చైర్మన్ కుంట రమేష్రెడ్డి, మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మార చంద్రమోహన్రెడ్డి, మాజీ డీసీఎంఎస్ చైర్మన్ మునిపల్లి సాయిరెడ్డి ముందు వరుసలో ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రం ఉన్న సమయంలో డీసీఎంఎస్ చైర్మన్గా అత్యంత సమర్థవంతంగా పనిచేసిన తనకు ఈసారి డీసీసీబీ చైర్మన్గా అవకాశం దక్కుతుందని సీనియర్ నాయకుడు మునిపల్లి సాయిరెడ్డి ధీమాగా ఉన్నారు. పార్టీ కోసం పాటుపడుతున్న తనకు అవకాశం కల్పిస్తారనే ఆశాభావంతో సాయిరెడ్డి ఉన్నారు. ఇక మరో సీనియర్ నేత మార చంద్రమోహన్రెడ్డి సైతం రేసులో ఉన్నారు. యువజన కాంగ్రెస్ స్థాయి నుంచి దశాబ్దాలుగా పార్టీకి సేవలు అందిస్తూ వస్తుండడంతో పాటు, ఉమ్మడి జిల్లాలో మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్గా పని చేయడం, పార్టీ అభివృద్ధి కోసం ని రంతరం కృషి చేస్తున్న తనకు డీసీసీబీ చైర్మన్ ఇవ్వాలని మార చంద్రమోహన్రెడ్డి కోరుతున్నారు. ఇక తాజా మాజీ చైర్మన్ కుంట రమేష్రెడ్డి తనకు మరోసారి అవకాశం కల్పించాలని కోరుతున్నారు. కేవలం 22 నెలల పాటు మాత్రమే చైర్మన్గా వ్యవహరించి టర్నోవర్ రూ.1,400 కోట్లు పెంచిన తనకు మళ్లీ అవకాశం ఇవ్వాలని రమేష్రెడ్డి అడుగుతున్నారు. బాధ్యత లు తీసుకున్న సమయంలో రూ.1,300 కోట్ల టర్నోవర్ ఉండగా, పదవీ కాలం పూర్త య్యేనాటికి రూ.2,700 కోట్లకు పెంచానని, డిపాజిట్లు భారీగా పెంచడంతో పాటు రుణాలు ఎక్కువగా ఇచ్చినట్లు రమేష్రెడ్డి చెబుతున్నారు. 15 శాతం ఉన్న ఎన్పీఏని 5 శాతానికి తగ్గించినట్లు, ఆర్బీఐ నిబంధనల మేరకు 10 శాతం లోపే ఎన్పీఏ ఉండాలని, అదేవిధంగా రూ.2 కోట్ల నష్టం నుంచి రూ.21 కోట్ల లాభానికి తీసుకొచ్చానని చెబుతున్న రమేష్రెడ్డి మరోసారి తనకు అవకాశం ఇవ్వాలని ముఖ్య నాయకులను కోరుతున్నారు. కుంట రమేష్రెడ్డి మార చంద్రమోహన్రెడ్డి మునిపల్లి సాయిరెడ్డి సహకార పదవులు నామినేటెడ్ విధానంలో భర్తీ చేయనున్నట్లు గతంలోనే లీకులు వచ్చాయి. ఈ క్రమంలో ఇప్పటికే పలువురు అధికార కాంగ్రెస్ నాయకులు హైదరాబాద్ వెళ్లి జిల్లాకు చెందిన కీలక నేతలను కలిసి తమకు సహకార పదవులు దక్కేలా చూడాలని కోరారు. సహకారం తమకే అందించాలంటూ పలువురు ఆయా నాయకుల చుట్టూ చక్కర్లు కొట్టారు. ఇప్పుడు కేబినెట్ నిర్ణయంతో మళ్లీ రాష్ట్ర రాజధానిలో మకాం వేస్తున్నారు.సహకార సంఘాలు, డీసీసీబీ, డీసీఎంఎస్ పాలకవర్గాలను నామినేటెడ్ విధానంలో భర్తీ చేసేందుకు రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకోవడంతో అధికార పార్టీ కాంగ్రెస్ నాయకులు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. కేబినెట్ నిర్ణయించిన కొన్ని గంటలకే ఎవరికి వారు హైదరాబాద్ వెళ్లి కీలక నాయకులను కలుస్తున్నారు. డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్ స్థానాల కోసం పోటీ నెలకొంది. ప్రయత్నాలు ముమ్మరం చేసిన అధికార పార్టీకి చెందిన ఆశావహులు డీసీసీబీ, డీసీఎంఎస్ పీఠాల కోసం పలువురి పోటీ రేసులో ముందున్న మార చంద్రమోహన్రెడ్డి, కుంట రమేష్రెడ్డి, మునిపల్లి సాయిరెడ్డి -
వీడీసీల జోక్యం.. ఇసుక ధర భారం
● గ్రామాభివృద్ధి పేరిట ఇసుక పాయింట్ల వద్ద డబ్బుల వసూళ్లు ● ప్రభుత్వ ధరకు మూడింతలు ఎక్కువ ధరతో విక్రయిస్తున్న నిర్వాహకులు మోర్తాడ్(బాల్కొండ): ఇళ్ల నిర్మాణాల కోసం కావాల్సిన ఇసుక సుమారు మూడింతల ధరకు లభ్యమవుతుండటంతో వినియోగదారులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురువుతున్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంతోపాటు ఇతర భవనాల నిర్మాణం కోసం అవసరమైన ఇసుకను సులభతరంగా అందించడానికి ప్రభుత్వం మన ఇసుక వాహనం పేరిట ప్రత్యేక యాప్ను రూపొందించింది. కానీ గ్రామాభివృద్ధి కమిటీ(వీడీసీ)ల జోక్యంతో ఇసుక ధరకు రెక్కలు రావడంతో సామాన్యుల పరిస్థితి దయనీయంగా మారింది. రూ.1,212 నుంచి రూ.5,000కు.. జిల్లాలోని పెద్దవాగు, కప్పలవాగు, పసుపు వాగు, పూలాంగ్ వాగుల నుంచి ఇసుకను తరలించడానికి గతంలోనే భూగర్బ ఖనిజాల శాఖ అనుమతి ఇచ్చింది. ఆయా వాగులు మోర్తాడ్, భీమ్గల్, జక్రాన్పల్లి, సిరికొండ, డిచ్పల్లి, ఏర్గట్ల, నవీపేట్, వేల్పూర్, బోధన్ మండలాల్లో ఉన్నాయి. అధికారిక పాయింట్ల నుంచి ఇసుకను తరలించుకునేవారు తమ మొబైల్ ఫోన్లలో మన ఇసుక వాహనం యాప్ను డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంది. తాము నిర్మించే ఇంటి వివరాలు, గ్రామం, మండలం వివరాలను నమోదు చేసుకుని ప్రభుత్వం నిర్దేశించిన విధంగా ఒక్కో ట్రిప్పుకు ఎన్ని ట్రిప్పులు అవసరం ఉంటే అంత మొత్తంను ప్రభుత్వ ఖజానాకు జమ చేయాల్సి ఉంటుంది. ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కోసం ఒక్కో ట్రిప్పుకు రూ.1,212, ఇతర భవనాలకై తే రూ.1,773 చొప్పున ఖర్చు అవుతుంది. కానీ ఇసుక పాయింట్ల వద్ద గ్రామాభివృద్ధి పేరిట వీడీసీలు నిర్వాహకుల వద్ద వసూళ్లకు పాల్పడుతున్నాయి. ఒక్కో ట్రిప్పుకు సుమారు రూ.1వెయ్యి నుంచి రూ.2వేల వరకు వసూలు చేస్తుండటంతో, నిర్వాహకులు ఒక్కో ట్రిప్పు ఇసుకను వినియోగదారులకు రూ.4వేల నుంచి రూ.5వేల వరకూ విక్రయిస్తున్నారు. దీంతో ఇంటి నిర్మాణం చేపట్టిన వినియోగదారులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇదిలా ఉండగా కొన్ని గ్రామాభివృద్ధి కమిటీలు అధికారుల మాటను ఎంత మాత్రం ఖాతరు చేయడం లేదు. తాము అడిగినంతగా ఇస్తే తప్ప ఇసుక తరలించడానికి అంగీకరించబోమని స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటికై నా అధికార యంత్రాంగం గ్రామాభివృద్ధి కమిటీలపై ఉక్కుపాదం మోపుతే తప్ప ఇసుక ధరలు తగ్గే అవకాశం ఉండదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నిర్ధేశించిన మొత్తంలోనే ఇసుకకు చార్జీలను ఆన్లైన్లో చెల్లించాలి. కొన్ని చోట్ల గ్రామాభివృద్ధి కమిటీలు ఎక్కువ మొత్తంలో వసూలు చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. ప్రభుత్వ ఆశయానికి ప్రజలు సహకరించాలి. ఇసుకను ప్రభుత్వం సులభతరం చేస్తే ఇతరులు మాత్రం అధికంగా వసూలు చేయడం సరికాదు. –మల్లయ్య, తహసీల్దార్, ఏర్గట్ల -
మౌన ర్యాలీ.. మానవహారం
నిజామాబాద్ రూరల్: డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె జిల్లాలో మూడో రోజు శుక్రవారం ప్రశాంతంగా కొనసాగింది. ఆర్టీసీ కార్మికులు, డ్రైవర్లు, కండక్టర్లు డ్యూటీకి హాజరు కా లేదు. ప్రైవేటు బస్సుల డ్రైవర్, కండక్టర్లు మాత్రమే విధుల్లో పాల్గొన్నారు. పాత కలెక్టరేట్ మైదానంలో ఆర్టీసీ కార్మికులు మహాధర్నా చేపట్టారు. అనంతరం ఎన్టీఆర్ చౌరస్తా, దేవీ థియేటర్, ఫులాంగ్ చౌరస్తా నుంచి ఆర్ఆర్ చౌరస్తా, న్యాల్కల్ రోడ్లోని ఒకటో నెంబర్ డిపో వరకు మూతికి గుడ్డ కట్టుకొని మౌన ర్యాలీ నిర్వహించారు. అంతకుముందు ఎన్టీఆర్ చౌరస్తా వద్ద మానవహారం చేశారు. ఈ సందర్భంగా ఆర్టీసీ జేఏసీ నాయకులు మాట్లాడుతూ తమ డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, సీఎం స్వయంగా జోక్యం చేసుకొని ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్నారు. కార్మికులకు రావాల్సిన బెనిఫిట్స్, ఇంక్రిమెంట్లు తక్షణమే చెల్లించాలని పేర్కొన్నారు. అనంతరం ఆత్మహత్యకు పాల్పడిన వరంగల్ జిల్లా నర్సంపేట డిపో ఆర్టీసీ డ్రైవర్ కోల శంకర్ గౌడ్కు కార్మికులు నివాళులర్పించారు. ఆర్టీసీలో పనిచేసే కార్మికులు ఆత్మహత్యకు పాల్పడినా ప్రభుత్వంలో చలనం లేకపోవడం విడ్డూరం ఉందని పేర్కొన్నారు. నడిచిన 310 అద్దె బస్సులు జిల్లాలోని మొత్తం 650 అద్దె బస్సుల్లో శుక్రవారం 310 సర్వీసులు నడిచాయని ఆర్ఎం జ్యోత్స్న వెల్లడించారు. జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. రానున్న రోజుల్లో సర్వీసులను ఇంకా పెంచుతామని ఆర్ఎం తెలిపారు. కాగా, గ్రామీణ ప్రాంతాలకు ఆర్టీసీ బస్సులు నడవకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆటోల్లో డబుల్ చార్జీలు చెల్లించి వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.పనిగంటలు తగ్గించాలి రోజుకు 14 నుంచి 16 గంటలపాటు విధులు నిర్వహిస్తున్నాం. దీంతో అనారో గ్యం భారిన పడుతున్నాం. అందరిలాగా మాకూ ఎని మిది గంటల పని విధానం అమలు చేయాలి. మాకు రావాల్సిన రెండు పీఆర్సీ బకాయిలు ఇవ్వాలి. – బి.జీ.రామ్ డ్రైవర్కొత్త నియామకాలు చేపట్టాలి కొత్త రిక్రూట్మెంట్లు లేక ఉన్న మెకానికల్ సిబ్బందిపై తీవ్రపనిభారం పడుతోంది. సరైన అసిస్టెంట్లను ఇవ్వడం లేదు. సమయానికి స్పేర్స్, టూల్స్ సప్లయ్ చేయడం లేదు. పనిగంటలు ఎక్కువై రోగాల భారిన పడుతున్నాం. – ఆర్. మధుకర్, ఆర్టీసీ జేఏసీ కో కన్వీనర్ మూడోరోజు ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రశాంతం పాత కలెక్టరేట్ మైదానంలో మహాధర్నా మూతికి గుడ్డ కట్టుకొని ప్రదర్శన ఎన్టీఆర్ చౌరస్తా వద్ద నిరసన -
కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా శ్రీనివాస్రెడ్డి
సుభాష్నగర్: బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నూతుల శ్రీనివాస్రెడ్డి (ఆర్మూర్) నియమితులయ్యారు. ఈమేరకు కిసాన్ మోర్చా పూర్తిస్థాయి కార్యవర్గాన్ని రాష్ట్ర అధ్యక్షుడు బస్వాపురం లక్ష్మీనర్సయ్య గురువారం ప్రకటించారు. జిల్లా నుంచి శ్రీనివాస్రెడ్డికి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా అవకాశం లభించింది. ఆయన గతంలో కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా, జిల్లా ప్రధానకార్యదర్శిగా, బీజేపీ ఆర్మూర్ అసెంబ్లీ కన్వీనర్గా పనిచేశారు. తనకు ఈ అవకాశం కల్పించినందుకు జిల్లా, రాష్ట్ర నాయకత్వానికి శ్రీనివాస్రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. జిల్లాతోపాటు రాష్ట్రంలోని రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఉద్యమిస్తూనే, బీజేపీ బలోపేతం కోసం మరింత పని చేస్తానని ఆయన తెలిపారు. నిజామాబాద్ రూరల్: పిల్లలలో సాంస్కృతిక విలువలు, నైతికత ఆధ్యాత్మికతను పెంపొందించేందుకు ఇస్కాన్ నిజామాబాద్ ఆధ్వర్యంలో ‘సంస్కార్ సమ్మర్ క్యాంప్–2026’ ఈనెల 24న ప్రారంభమైంది. ప్రతి రోజు ఉదయం 8:00 గంటల నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకు క్యాంప్ కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు. 8ఏళ్ల నుంచి 15ఏళ్ల లోపు వయస్సు గల పిల్లలు ఈ శిబిరంలో పాల్గొనవచ్చాన్నారు. ఈ సమ్మర్ క్యాంప్ మే 4 వరకు కొనసాగుతుందన్నారు. శిబిరంలో ధ్యానం, యోగా, శ్లోక పఠనం, కీర్తన, నృత్యం, సాంప్రదాయ కళలు, విలువల ఆధారిత విద్యతోపాటు వినోదాత్మక ఆటలు, అల్పాహారం ప్రసాదం అందిస్తున్నట్లు అధ్యక్షులు శ్రీమాన్ సిద్ధ బలరాం దాస్ తెలిపారు. నందిపేట్ (ఆర్మూర్): నందిపేట్ మండలానికి చెందిన సర్పంచులు శుక్రవారం హైదరాబాద్లో రాష్ట్ర మంత్రులను కలిసి తమ సమస్యల ను విన్నవించుకున్నారు. ఆర్మూర్ నియోజకవ ర్గ ఇన్చార్జి వినయ్ రెడ్డి ఆధ్వర్యంలో ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహను కలిశారు.నందిపేటలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రా న్ని 30 పడకల ఆస్పత్రిగా అప్గ్రేడ్ చేసి 24 గంటలు వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందజేశారు. అనంతరం ఐటీ శాఖ మంత్రి శ్రీధర్బాబుని క లిసి లక్కంపల్లి శివారులో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలను నెలకొల్పాలని విన్నవించారు.మంత్రులు సా నుకూలంగా స్పందించినట్లు సర్పంచులు పే ర్కొన్నారు. మండల సర్పంచ్ల ఫో రం అధ్యక్షుడు ఎర్రం లింగం,వివిధ గ్రామాల సర్పంచు లు లక్ష్మీనారాయణ,శ్రీకాంత్,సాయి కుమార్, దేవేందర్,దేవదాసు,ముత్యం,నవీన్, మహమూద్,హనుమాన్,సుదన్,జీవన్ పాల్గొన్నారు. మోపాల్: మండలంలోని కులాస్పూర్ తండాలో గురువారం రాత్రి జరిగిన వివాహ కార్యక్రమంలో అధిక శబ్ధంతో డీజే పెట్టినందుకు ఆపరేటర్ కెతావత్ అశోక్పై కేసు నమోదు చేసిన్నట్లు ఎస్ఐ జాడె సుస్మిత శుక్రవారం తెలిపారు. డీజేను అదుపులోకి తీసుకుని పోలీస్స్టేషన్కు తరలించామన్నారు. డీజే శబ్ధంతో ప్రజలకు ఇబ్బంది కలగడంతో స్థానికులు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ముందస్తు అనుమతి తీసుకోకుండా డీజే నడుపుతున్నట్లు గుర్తించిన పోలీసులు డీజే ఆపరేటర్పై కేసు నమోదు చేశామన్నారు. అనుమతులు లేకుండా ఎవరైనా డీజేలు, లౌడ్ స్పీకర్లు వినియోగించకూడదని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినచర్యలు తప్పవని ఎస్ఐ హెచ్చరించారు. -
జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం
● ఆగి ఉన్న బస్సును ఢీకొట్టిన లారీ ● 13 మంది ప్రయాణికులకు గాయాలుజక్రాన్పల్లి : జక్రాన్పల్లి మండలంలోని అర్గుల్ వద్ద 44 నంబర్ జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో ఆర్టీసీ అద్దె బస్సును లారీ ఢీకొనడంతో 13 మందికి గాయాలు అయ్యా యి. కామారెడ్డి నుంచి 20 మందితో ఆర్మూర్కు బస్సు బయలుదేరింది. అర్గుల్ వద్ద నలుగురు దిగుతుండగా ఆగి ఉన్న బస్సును లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో బస్సు డివైడర్ పైకి ఎక్కి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. అనంతరం లారీ ఆగి ఉన్న మరో లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అర్గుల్కు చెందిన తెడ్డు లక్ష్మి, లోహిత, సుకన్య, ప్రియాంశీ, బస్సులోని తొమ్మిది మంది గాయపడ్డారు. లారీ క్యాబిన్లో ఇరుక్కుపోయిన క్లీనర్ను స్థానికులు బ యటకు తీశారు. లారీ డ్రైవర్ పరారీలో ఉన్నారు. బస్సు డ్రైవర్ అరుణ్, కండక్టర్ అనితకు స్వల్ప గా యాలు అయ్యాయి. క్షతగాత్రులను 108 అంబులెన్స్లో ఆర్మూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఏడేళ్ల ప్రియాంశీ పరిస్థితి విషమంగా ఉండడంతో నిజామాబాద్ ఆస్పత్రికి తరలించారు. ఘటన స్థలాన్ని పరిశీలించిన సీపీ సాయి చైతన్య వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఆర్మూర్ ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించి బాధితులను పరామర్శించారు. అర్గుల్లో ఘటన స్థలాన్ని పరిశీలిస్తున్న సీపీ సాయిచైతన్య గాయపడిన సుకన్య -
భర్త అక్రమ సంబంధం.. బట్టబయలు చేసిన భార్య!
సాక్షి, నిజామాబాద్: భర్త అక్రమ సంబంధాన్ని భార్య బట్టబయలు చేసిన ఘటన జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ కాలేజీ రోడ్డులో జరిగింది. గుత్పకు చెందిన శివ రంజనితో తన భర్త శ్రవణ్ కుమార్.. అక్రమ సంబంధం పెట్టుకున్నాడని బాధిత మహిళా సంధ్య ఆరోపిస్తోంది. ప్రియురాలు శివ రంజనితో భర్త శ్రవణ్ కుమార్ షాపింగ్ చేసి వస్తుండగా భార్య సంధ్య రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. ఇద్దరికీ దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించింది. వారి సెల్ ఫోన్లను పోలీసులు సీజ్ చేశారు.భర్త శ్రవణ్, అతని ప్రియురాలు శివరంజని ఇంటి ముందు భార్య సంధ్య ఆందోళనకు దిగింది. తాను ఉండగా మరో మహిళ తో అక్రమ సంబంధం పెట్టుకుని దుబ్బ రోడ్డులో సంసారం చేస్తున్నారంటూ బాధిత మహిళ ఆరోపిస్తుంది. తనకు న్యాయం చేయాలంటూ బాధితురాలు పోలీసుల కాళ్లు పట్టుకుంది. సంఘటన స్థలానికి వచ్చిన ప్రియురాలి భర్త శ్రీధర్పై శ్రవణ్కుమార్ దాడికి పాల్పడ్డారు. ప్రియురాలి భర్త శ్రీధర్ కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
ఎస్ఐఆర్ మ్యాపింగ్ వేగవంతంగా పూర్తి చేయాలి
● కలెక్టర్ ఇలా త్రిపాఠి నిజామాబాద్ అర్బన్: ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతంగా పూర్తిచేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. ఈఆర్వోలు, ఏఈఆర్వోలతో గురువారం సెల్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గం వారీగా ఓటరు మ్యాపింగ్ ప్రక్రియ పురోగతిని సమీక్షిస్తూ, అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. ఓటర్ మ్యాపింగ్లో వెనుకబడిన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని అన్నారు. మ్యాపింగ్ ప్రక్రియపై ఓటర్లకు అవగాహన పెంపొందించేలా విస్తృత స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. మ్యాపింగ్ ప్రక్రియపై ఎవరూ నిర్లక్ష్యం వహించొద్దని, వారం రోజుల్లో లక్ష్యాన్ని పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. సెల్ కాన్ఫరెన్స్లో ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ లీగల్: ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అడ్వకేట్స్ సహకార సొసైటీలో నాలుగు డైరెక్టర్ పదవుల కోసం శుక్రవారం ఎన్నికలు నిర్వహించనున్నట్టు ఎన్నికల అధికారులు మల్లెపూల జగన్ మోహన్ గౌడ్, పులి జైపాల్ తెలిపారు. బైలా ప్రకారం, సొసైటీలో మొత్తం 12 మంది డైరెక్టర్లు ఉన్నారని, వీరిలో ఏటా నలుగురు చొప్పున పదవి విరమణ చేస్తారని, ఆ నాలుగు స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నామన్నారు. సొసైటీలో ఉమ్మడి జిల్లాలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్, బాన్సువాడ, బిచ్కుంద, ఎల్లారెడ్డి కోర్టులకు చెందిన న్యాయవాదులు మొత్తం 395 మంది తమ ఓటు హక్కు వినియోగించుకుంటారని తెలిపారు. రెంజర్ల సురేష్, దిలీప్, చింతకుంట సాయిరెడ్డి, పి. నర్సారెడ్డి, మొహ్రానంద్ పవార్ ఎన్నికల బరిలో ఉన్నారని పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లా న్యాయవాద సొసైటీ సభ్యులు ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. నిజామాబాద్ అర్బన్: జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో గురువారం భగీరథ మహర్షి జయంతి ఉత్సవాలు నిర్వహించారు. అదనపు కలెక్టర్ కిరణ్కుమార్ ముఖ్యఅతిథిగా హాజరై భగీరథ మహర్షి చిత్రపటానికి పూలమాలలు నివాళులర్పించారు. సమాజహితం కోసం భగీరథ మహర్షి చేసిన కృషిని, పురాణ ఇతిహాసాలలో భగీరథుని ప్రాశస్త్యాన్ని గుర్తుచేశారు. మహనీయులను స్మరించుకుంటూ వారి స్ఫూర్తితో ముందుకు సాగాలని అన్నారు. కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి నర్సయ్య, సహాయ అధికారి సుజయ్, బీసీ సంఘాల ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. నిజామాబాద్ అర్బన్: పోలీస్ కమిషనరేట్లో ఎస్బీ సీఐగా పనిచేస్తున్న శ్రీశైలంకు డీఎస్పీగా పదోన్నతి లభించింది. కొన్నేళ్లుగా జిల్లా పోలీస్ శాఖలోని ఎస్బీ విభాగంలో పనిచేస్తున్నారు. -
సృజనాత్మకతను వెలికితీసేందుకే వేసవి శిక్షణ
● అదనపు కలెక్టర్ కిరణ్కుమార్ నిజామాబాద్ రూరల్: పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలిగితీయడానికే బాలభవన్ వివిధ కళలలో తీర్చిదిద్దుతుందని అదనపు కలెక్టర్ కిరణ్కుమార్ పేర్కొన్నారు. జిల్లా బాలభవన్లో వేసవి శిక్షణ తరగతులను ఆయన గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లా డుతూ బాలభవన్లో 30 రకాల అంశాలు నేర్పటం ఎంతో గొప్పగా ఉందని, ఈతరం పిల్లలకు నీతికథలు, శ్లోకాలు, మ్యాజిక్, కర్రసాము ఎంతో ఉపయోగపడతాయన్నారు. బాలభవన్ సూపరింటెండెంట్ ఉమాబాల మాట్లాడుతూ జూన్ 10 వరకు శిక్షణ తరగతులు కొనసాగుతాయన్నారు. అంతకుముందు జాదూ యుగంధర్ రంగనాథ్ ప్రదర్శించిన మ్యాజిక్ అలరించింది. కార్యక్రమంలో అదనపు ఇన్చార్జి విఠల్ ప్రభాకర్, వెంకటలక్ష్మి, పుష్పలత, శ్వేత, నటరాజ్, రాంచందర్, గణేశ్, పవన్, విజయ, రిచ, మాధవి, విద్యార్థులు పాల్గొన్నారు. -
సెలవులు వృథా చేసుకోవద్దు
● ఫోన్కు అలవాటుపడి భవిష్యత్తును పాడు చేసుకోవద్దు ● విద్యార్థులకు కలెక్టర్ ఇలా త్రిపాఠి ఉద్బోధ డిచ్పల్లి(నిజామాబాద్రూరల్): వేసవి సెలవులను చక్కగా సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి విద్యార్థులకు సూచించారు. సెలవులను వృథా చేసుకోవద్దని, స్మార్ట్ ఫోన్లకు అలవాటుపడి భవిష్యత్తును పాడు చేసుకోవద్దని మార్గనిర్దేశం చేశారు. తల్లిదండ్రులు సైతం పిల్లలను జాగ్రత్తగా గమని స్తూ ఉండాలని,వారంలో అరగంటకు మించి పిల్ల లు స్మార్ట్ ఫోన్ వినియోగించకుండా చూడాలన్నా రు డిచ్పల్లి మండలం సుద్దపల్లిలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకులపాఠశాల/కళాశాలలో గురువారం నిర్వహించిన పేరెంట్స్ – టీచర్స్ మీటింగ్కు కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై, విద్యార్థినులు వారి తల్లిదండ్రులతో భేటీ అయ్యారు. వేసవి సెలవులలో ఏం చేస్తారని విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు. సెలవులను ఉల్లాసంగా గడుపుతూ, ఇష్టమైన రంగంలో ప్రతిభను మరింతగా మెరుగుపర్చుకునేలా కృషి చేయాలని హితవు పలికారు. స్విమ్మింగ్, కరాటే, డ్యాన్స్, సంగీతం వంటి వాటిలో తమ అభిరుచికి అనుగుణంగా నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. వీలైతే చారిత్రక ప్రదేశాలను సందర్శించాలన్నారు. రెసిడెన్షియల్ స్కూల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.అనంతరం ఉత్తమ విద్యార్థినులకు కలెక్టర్ బహుమతులు ప్రదానం చేశారు. సమావేశంలో పాఠశాల ప్రిన్సిపాల్ నళిని, తహసీల్దార్ సతీశ్ రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
వివాదాస్పద స్థలం పరిశీలన
ఇందల్వాయి: మండలంలోని లోలం గ్రామంలో కొద్దిరోజులుగా గ్రామస్తులకు, కొందరు ముదిరాజ్ కులస్తులకు మధ్య వివాదానికి కారణమవుతున్న భూమిని ఆర్డీవో రాజేంద్రకుమార్ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వే నెంబరు 208, 209లో వివాదానికి కారణం అవుతున్న భూమికి త్వరలోనే పరిష్కారం చూపుతామన్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు భూమిని పరిశీలించి సమగ్ర నివేదికను రూపొందించి అందజేయనున్నట్లు తెలిపారు. అంతవరకు గ్రామంలో ఇరుపక్షాలు సంయమనం పాటించాలని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తించకూడదని సూచించారు. ఆయన వెంట తహసీల్దార్ బాలయ్య, సర్వేయర్ రంజిత్, ఆర్ఐ గంగాప్రసాద్, ఎస్సై సందీప్ ఉన్నారు. -
హైకోర్టు తీర్పు హర్షణీయం
నిజామాబాద్అర్బన్: కాళేశ్వరం ప్రాజెక్టుపై హైకోర్టు ఇచ్చిన తీర్పు హర్షణీయమని మాజీ ఎమ్మెల్యే బిగా ల గణేశ్ గుప్తా పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో గురువారం విలేకరులతో మాట్లాడారు. కోర్టు తీర్పుతో న్యాయం గెలిచిందన్నారు. పీసీ ఘోష్ కమిషన్ విచారణలో ప్రాథమిక నిబంధనలు పాటించలేదని కోర్టు స్ప ష్టం చేయడంతో ఆ నివేదికకు చట్టపరమైన ప్రాము ఖ్యత లేదన్నారు. సెక్షన్ 8 కింద సంబంధిత వ్యక్తులకు నోటీసులు ఇవ్వకుండా ఆరోపణలు చేయడం సరికాదని కోర్టు వ్యాఖ్యానించడం అత్యంత కీలక మని తెలిపారు. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావుపై రాజకీయంగా ఒత్తిడి తేవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కమిషన్లను అడ్డం పెట్టుకొని వేధింపులకు పాల్పడిందన్నారు. న్యాయస్థానాలపై నమ్మకంతో పోరాడగా చివరకు నిజం గెలిచిందన్నారు. కేసీఆర్ ప్రతిష్టను దెబ్బతీయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్, బీజేపీలు కక్షపూరితంగా వ్యవహరిస్తు న్నాయని పేర్కొన్నారు. ప్రాజెక్టు మరమ్మతులను సకాలంలో చేపట్టకుండా దాదాపు రెండున్నరేళ్లు ఆ లస్యం చేశారని, చివరకు గత్యంతరం లేక పనులు చేపడుతున్నారని విమర్శించారు. మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా బీఆర్ఎస్ పార్టీపై త ప్పుడు ఆరోపణలు చేస్తుందన్నారు. సమావేశంలో మాజీ మేయర్ నీతు కిరణ్, పార్టీ నగర అధ్యక్షుడు శిల్ప రాజు, నుడా మాజీ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, సుజిత్ సింగ్, నవీన్ ఇక్బాల్ పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా -
ఇసుక టిప్పర్లను అడ్డగించిన వ్యక్తుల అరెస్టు
బోధన్ టౌన్ (బోధన్): బోధన్ పట్టణ శివారు బాబా గార్డెన్ సమీపంలో ఇసుక టిప్పర్లను అడ్డగించి, డ్రైవర్లను భయభ్రాంతులకు గురిచేసి డబ్బులు వసూలు చేసేందుకు ప్రయత్నించిన నలుగురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ వెంకట నారాయణ తెలిపారు. మంజీరా నది పరీవాహక ప్రాంతం నుంచి ఇసుకను తరలిస్తున్న టిప్పర్లను పట్టణ శివారులోని బాబా గార్డెన్ వద్ద వసీం ఖురేషీ, సయ్యద్ ఓవేస్, షేక్ అర్బజ్, షేక్ అల్మాస్ ఈ నెల 22న సాయంత్రం రెండు ఆటోలలో వచ్చి ఇసుక టిప్పర్ను అడ్డుకున్నారు. డబ్బులు డిమాండ్ చేయగా డ్రైవర్ నిరాకరించడంతో నిందితులు రాళ్లతో టిప్పర్ అద్దాలను పగులగొట్టి, డ్రైవర్ను గాయపర్చారు. అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన మరో టిప్పర్ డ్రైవర్ ఈ దాడిని ఫోన్లో రికార్డు చేస్తుండగా అతనిపై కూడా దాడి చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు నిందితులను అదుపులోకి తీసుకున్నామన్నారు. రెండు ఆటోలను స్వాధీనం చేసుకొని, నిందితులను రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు. -
పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
● మానాల మోహన్రెడ్డి వేల్పూర్: పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర సహకార యూనియన్ చైర్మన్ మానాల మోహన్రెడ్డి పేర్కొన్నారు. వేల్పూర్ మండలం లక్కోర గ్రామంలో గురువారం ఆయన రేఖ భూమేశ్వర్, వి జయలక్ష్మి నిర్మించుకున్న ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల సొంతింటి కల తీర్చాలనే ల క్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ గృహాలు నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం సీఎం రేవంత్రెడ్డి రాష్ట్రంలోని 119 నియో జకవర్గాల్లో 3500 చొప్పున ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశారని చెప్పారు. గతంలో డబుల్ బెడ్రూం ఇళ్లు వస్తాయని పేదలు ఎంతో ఆశపెట్టుకోగా, వారి ఆశలు ఆవిరయ్యాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో లక్కోర, పడగల్, కుకునూర్ గ్రామాల సర్పంచులు దాసరి అపర్ణరాజు, నల్లరాజు, భూమారెడ్డి, ఉపసర్పంచ్ ఆత్మారాం, మండల కాంగ్రెస్ అధ్యక్షు డు గడ్డం నర్సారెడ్డి, రిటైర్డ్ ఎంవీఐ సుభాష్, గౌరా యి నరేందర్, ఆర్మూర్ మోహన్, చిన్న హన్మాండ్లు, ముత్యం, రమణ, రమేశ్, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
మాక్లూర్ సొసైటీలో మరో కుంభకోణం
మాక్లూర్: రాష్ట్రంలోనే అతిపెద్ద సొసైటీగా పేరుగాంచిన మాక్లూర్ సొసైటీలో ఇప్పటికే రూ. 3 కోట్ల 23 లక్షల అవినీతి జరిగి రైతులను అయోమయంలోనికి నెట్టివేసింది. తాజాగా ఇదే సొసైటీకి చెందిన కార్యదర్శి రతన్ మరో రూ.5 లక్షల కుంభకోణానికి తెరలేపాడు. సొసైటీకి సంబంధించి ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ (ఎఫ్పీవో)కు 700 మంది రైతుల సభ్యత్వం చేయాల్సి ఉంది. ఒక్కో రైతు నుంచి సభ్యత్వ రుసుము రూ.2 వేల చొప్పున మొత్తం రూ.14 లక్షలు సేకరిస్తే, కేంద్ర ప్రభుత్వం వాటికి మరో రూ.14 లక్షలు కలిపి రైతులు వ్యాపారం చేసుకునేందుకు ఇస్తోంది. కానీ, సొసైటీ కార్యదర్శి రతన్ మాత్రం రైతుల వద్ద సభ్యత్వ రుసుం తీసుకోకుండా నేరుగా సొసైటీ నిధుల నుంచి నిబంధనలకు విరుద్ధంగా రూ.4.83 లక్షలు తీసి ఒక్క గుంజ్లి గ్రామంలోనే 250 మందికి, ఇతర గ్రామాల్లోని పలువురు రైతులకు సభ్యత్వం కల్పించినట్లు సమాచారం. సొసైటీ నిధులను స్వలాభం కోసం ఉపయోగించి తనకున్న లారీలతో వ్యాపారం చేసుకునేందుకే ఇలా చేశారని రైతులు ఆరోపిస్తున్నారు. రైతులకు ముప్పుతిప్పలు.. ప్రస్తుత కార్యదర్శి గతంలో పనిచేసిన ఇందల్వాయి సొసైటీలో భారీ కుంభకోణానికి పాల్పడ్డాడని, అతన్ని మాక్లూర్కు కేటాయించొద్దని రైతులు మహాజన సభలో తీర్మానించారు. అయినప్పటికీ డీసీవో శ్రీనివాస్ పట్టుపట్టి అతన్నే కొనసాగించటంపై రైతులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. డీసీవో అండతోనే కార్యదర్శి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాడని రైతులు ఆరోపిస్తున్నారు. అయితే, కార్యదర్శికి సొంతంగా ఆరు లారీలు ఉన్నట్టు సమాచారం. వాటిని అడ్డంపెట్టుకొని మాక్లూర్ సొసైటీ పరిధిలో ఉన్న 13 కొనుగోలు కేంద్రాల్లో కార్యదర్శి రతన్ చక్రం తిప్పుతూ మాటవినని రైతుల వరి ధాన్యం కాంటాలు జరపకుండా ముప్పుతిప్పలు పెడుతున్నట్లు తెలిసింది. బస్తాకు రూ.15 ఉన్న కమీషన్ రూ. 20 వరకు వెళ్లడానికి సదరు కార్యదర్శే కారణమని రైతులు భావిస్తున్నారు. కలెక్టర్ ఈ విషయమై జోక్యం చేసుకొని రూ.4.83లక్షల సొసైటీ నిధులను పక్కదారి పట్టించిన కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. సొసైటీ నిధులను ఎఫ్పీవో సభ్యత్వాలకు మళ్లించిన కార్యదర్శి గతంలో కార్యదర్శి తమకొద్దని తీర్మానించిన రైతులు ఉన్నతాధికారి అండతో ఇష్టారాజ్యంగా కార్యదర్శి వ్యవహారం! -
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
డిచ్పల్లి: వాహనం అదుపుతప్పి ఓ యువకుడు మృతి చెందిన ఘటన డిచ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. ఎస్సై ఆరీఫ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇందల్వాయి మండలం గంగారాం తండాకు చెందిన గంగావత్ రాహుల్(19), మాలవత్ స్నేహిత్తో కలిసి డిచ్పల్లి మండలానికి వచ్చి పెరుగు బకెట్లను తీసుకొని స్కూటీపై ఇందల్వాయి వైపు బయల్దేరారు. మార్గమధ్యంలో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ వద్ద స్కూటీ అదుపుతప్పి పక్కనే ఉన్న సిమెంట్ పైపులను ఢీకొట్టింది. తీవ్రగాయాలైన ఇద్దరిని జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రాహుల్ మృతి చెందాడు. తండ్రి గంగావత్ పరశురాం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. -
క్రైం కార్నర్
తాడ్వాయి(ఎల్లారెడ్డి) : అప్పుల బాధలు భరించలేక ఓ యువకుడు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన తాడ్వాయి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఎస్సై నరేశ్ తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. తాడ్వాయికి చెందిన గాండ్ల శ్రీకాంత్(22)అనే యువకుడికి అప్పుల భారం ఎక్కువడంతో మానసిక ఆందోళన గురయ్యాడు. తల్లి స్వరూప వైద్య చికిత్స కోసం రూ. 2 లక్షల అప్పులు చేశాడు. స్వరూప భర్త సత్యం 20 సంవత్సరాల క్రితం మృతి చెందాడు. తల్లి స్వరూప ఈనెల 19న హైదరాబాద్లో ఉన్న కూతురు వద్దకు వెళ్లింది. ఇదే అదునుగా చూసుకొని జీవితంపై విరక్తి చెందిన శ్రీకాంత్ ఈ నెల 22న ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు గురువారం కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రైలు కిందపడి మరొకరు.. నిజామాబాద్ అర్బన్: నిజామాబాద్ రైల్వేస్టేషన్ సమీపంలో గురువారం ఓ వ్యక్తి రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హమాల్వాడికి చెందిన అనిల్ ఫొటోగ్రాఫర్గా పనిచేస్తున్నాడు. ఓ యువతిని ప్రేమించగా, తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే మనస్థాపానికి గురైన అనిల్ గురువారం నిజామాబాద్ రైల్వేస్టేషన్ సమీపంలో కరీంనగర్ డెమో రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు రైల్వే ఎస్సై సాయిరెడ్డి తెలిపారు. విద్యుత్ షాక్తో యువకుడు..బాన్సువాడ: బీర్కూర్ మండలం కిష్టాపూర్లో మహేశ్(26) అనే యువకుడు గురువారం ఉదయం విద్యుత్ షాక్తో మృతి చెందాడు. మహేశ్ కుటుంబసభ్యులు అద్దెఇంట్లో నివాసముంటున్నారు. ఇంట్లో విద్యుత్ సమస్య రావడంతో మహేశ్ స్వయంగా సరిచేస్తుండగా అకస్మాత్తుగా విద్యుత్ షాక్ తగిలి కిందపడ్డాడు. వెంటనే కుటుంబసభ్యులు బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తీసుకురాగా అప్పటికే మహేశ్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేశారు. -
రాహుల్గాంధీతో సమావేశమైన ‘ఆదివాసీ’ జిల్లా చైర్మన్లు
సుభాష్నగర్: కాంగ్రెస్ జాతీయ ఆదివాసీ, గిరిజన రాష్ట్ర, జిల్లా చైర్మన్లతో లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్గాంధీ గురువారం ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం ఇందిరా భవన్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ స్వయంగా జిల్లా అ ధ్యక్షులతో మాట్లాడారు. ఆదివాసీ, గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారాలు, కేంద్ర ప్రభుత్వ విధానాలతో కలుగుతున్న ఇబ్బందులపై చర్చించారు. సమావేశంలో కాంగ్రెస్ ఆది వాసీ, గిరిజన జిల్లా చైర్మన్ కెతావత్ యాదగిరి, నాయకులు కెతావత్ సురేష్ నాయక్ పాల్గొన్నారు. -
పరిశోధన గ్రంథం ఆవిష్కరణ
ఖలీల్వాడి: నగరంలోని జీజీ కళాశాల ఫిజికల్ డైరెక్టర్ ప్రొఫెసర్ బి.బాలమణి ఓయూ ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగం ప్రొఫెసర్ సునీల్ కుమార్ పర్యవేక్షణలో ‘కళాశాల స్థాయి వాలీబాల్ క్రీడాకారులలో మోటార్ ఫిట్నెస్ అర్వృద్ధిపై ఎంపిక చేసిన శిక్షణా పద్ధతుల ప్రభావం‘అనే అంశంపై రాసిన పరిశోధన గ్రంథాన్ని ప్రిన్సిపాల్ రామ్మోహన్ రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ రంగరత్నం గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగంలో ప్రొఫెసర్ బాలమణి అందిస్తున్న సేవలను, పరిశోధనలోనూ కృషి చేయడం గొప్ప విశేషమని అభినందించారు. కార్యక్రమంలో అధ్యాపకులు దండుస్వామి, రంజిత, రామస్వామి, రాజేశ్, మోబిన్, నాగజ్యోతి, తబస్సుం, శ్రీలేఖ, లావణ్య, ఏవో రాంకిషన్, సూపరింటెండెంట్ ఉదయ్ భాస్కర్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. తెయూ(డిచ్పల్లి): తెలంగాణ వర్సిటీ పరిధిలో డిగ్రీ రెగ్యులర్, బ్యాక్లాగ్ పరీక్షల్లో గురువారం మాల్ప్రాక్టీస్కు పాల్పడుతూ ఒక విద్యార్థి డిబార్ అయినట్లు అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పరిధిలో ఏర్పాటు చేసిన 29 పరీక్ష కేంద్రాలలో 7,008 మంది అభ్యర్థులకు 6,754 మంది హాజరుకాగా 253 మంది గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. భీంగల్ పరీక్ష కేంద్రంలో మాల్ప్రాక్టీస్కు పాల్పడుతూ ఒక విద్యార్థి డిబార్ అయినట్లు ఆయన తెలిపారు. నిజామాబాద్, ఆర్మూర్లోని పలు పరీక్ష కేంద్రాలను కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ కే సంపత్ కుమార్తో కలిసి అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఘంటా చంద్ర శేఖర్ తనిఖీ చేశారు. నిజామాబాద్ అర్బన్: పోలీస్ కమిషనరేట్లోని అదనపు డీసీపీ (అడ్మిన్)గా శుభం ప్రకాశ్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. వరంగల్ ఏఎస్పీగా పనిచేసిన శుభం ప్రకాశ్ను నిజామాబాద్ అదనపు డీసీపీగా బదిలీ చేశారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం సీపీ సాయి చైతన్యను డీసీపీ శుభం ప్రకాశ్ మర్యాదపూర్వకంగా కలిశారు. -
సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి
● ర్యాగింగ్కు పాల్పడితే కఠిన చర్యలు ● పోలీస్ కమిషనర్ సాయిచైతన్య సుభాష్నగర్: విద్యార్థులు సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని, సోషల్ మీడియా వినియోగంలో జాగ్రత్తలు పాటించాలని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సూచించారు. నగరంలోని ప్రభుత్వ మెడిక ల్ కళాశాలలో నిజామాబాద్ యాంటీ ర్యాగింగ్, మ త్తు పదార్థాల నివారణ, సైబర్ క్రైమ్పై గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన సీపీ సాయిచైతన్య.. విద్యార్థులకు చట్టపరమైన అవగాహనతోపాటు సమాజంలో బా ధ్యతాయుత పౌరులుగా ఉండాల్సిన అవసరాన్ని వివరించారు. ర్యాగింగ్ తీవ్రమైన నేరమని, ఎవరై నా ర్యాగింగ్కు పాల్పడితే కఠిన శిక్షలు ఉంటాయని హెచ్చరించారు. మత్తు పదార్థాల వినియోగం వి ద్యార్థుల ఆరోగ్యం, భవిష్యత్తును దెబ్బతీస్తుందని తెలిపారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కృష్ణమో హన్, జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నాగమోహన్ మాట్లాడుతూ కళాశాలలో ర్యాగింగ్కు జీరో టాలరెన్స్ విధానం అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. విద్యార్థుల భద్రతకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. అనంతరం ర్యాగింగ్కు వ్యతిరేకంగా, మత్తు పదార్థాలకు దూ రంగా ఉండటం, సైబర్ భద్రత పాటించాలని ప్రతిజ్ఞచేశారు. ఈగిల్ సెల్, ఆర్ఎన్సీసీ డీఎస్పీ సో మనాథం, సీసీపీఎస్ ఏసీపీ వెంకటేశ్వర్రావు,ఏసీపీ ప్రకాశ్, న్యాయవాది నారాయణ, వైద్యులు జలగం తిరుపతిరావు, కిశోర్, వన్ టౌన్ సీఐ రఘుపతి, కళాశాల సూపరింటెండెంట్ నాగరాజు పాల్గొన్నారు. -
ఆత్మహత్యలకు పాల్పడొద్దు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ఆర్టీసీ కార్మికులెవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని, కార్మికుల పోరాటానికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి గు రువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్ర ప్ర భుత్వ దుర్మార్గ విధానాల ఫలితంగా అన్నివర్గాల ప్రజలు రోడ్లపైకి రావాల్సిన పరిస్థితి ఆగ్రహం వ్యక్తం చేశారు. నర్సంపేటలో శంకర్ గౌడ్ అనే ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్యాయత్నం చేయడం దురదృష్టకరమని, ఆయనకు తక్షణమే మెరుగైన వైద్యం అందించి, బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తా మని కేసీఆర్ హయాంలో గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వంద రోజు ల్లో విలీన ప్రక్రియ పూర్తి చే స్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదని విమర్శించారు. విధిలేని పరిస్థి తుల్లోనే కార్మికులు సమ్మెకు వెళ్లారని పేర్కొన్నా రు. సమ్మె వెనుక హరీశ్ రావు ఉన్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ, హరీశ్రావు ఎప్పుడూ సమస్యల్లో ఉన్న వారికే మద్దతు ఇస్తారని పేర్కొన్నారు. ఉచిత బస్సు పథకానికి రూ.9 వేల కోట్లు కేటాయించా మని చెబుతున్న ప్రభుత్వం.. కార్మికుల సమస్య లను ఎందుకు పరిష్కరించడం లేదని ప్రశ్నించారు. -
ఇంకా అద్దె భవనాల్లోనే..
అద్దె భవనంలో కొనసాగుతున్న రూరల్ రిజిస్ట్రేషన్ కార్యాలయం సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ప్రభుత్వ కార్యాలయాలన్నీ ప్రభుత్వ భవనాల్లోనే ఉండాలంటూ రాష్ట్ర ప్రభుత్వం 2025 డిసెంబరు నెలలోనే ఆదేశాలు జారీ చేసింది. 2026 జనవరి 1 నుంచి అమలు చేయాలని ప్రభుత్వం చెప్పినప్పటికీ అమలు చేయడంలో ప్రభుత్వ యంత్రాంగం పట్టనట్లు వ్యవహరిస్తోంది. ఫిబ్రవరి 1 నుంచి అద్దె చెల్లింపులు నిలిపివేయనున్నట్లు ప్రభుత్వం సదరు జీవోలో పేర్కొంది. దీంతో జిల్లా యంత్రాంగం నాడు మొదలుపెట్టిన కసరత్తు మధ్యలోనే నిలిచిపోయింది. ఇప్పటికీ ఆయా కార్యాలయాలు ప్రైవేటు భవనాల్లోనే కొనసాగుతున్నాయి. ఇదిలా ఉండగా సీనియర్ సిటిజన్లు ఎక్కువగా సందర్శించే కార్యాలయాలు గ్రౌండ్ ఫ్లోర్లలోనే నడిపించాల్సి ఉన్నప్పటికీ ఈ అంశాన్ని పట్టించుకునే పరిస్థితుల్లో అధికార యంత్రాంగం లేకపోవడం గమనార్హం. ● బోధన్లోని శక్కర్నగర్ నిజాంషుగర్ ఫ్యాక్టరీకి చెందిన పాత భవనంలో అద్దె ప్రాతిపదికన డివిజన్ రవాణా శాఖ కార్యాలయం కొన్నేళ్లుగా కొనసాగుతోంది. కొత్త భవన నిర్మాణం స్థల సమస్య వల్ల ప్రతిపాదనలకే పరిమితమైంది. ● ఆర్మూర్లోని మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ కార్యాలయం ఇరుకు అద్దె భవనంలో కొనసాగుతోంది. వాహనాల ఫిట్నెస్, డ్రైవింగ్ లైసెన్స్ కోసం వచ్చేవారికి పరీక్షలు నిర్వహించేందుకు సరైన స్థలం అందుబాటులో లేదు. దీంతో అద్దె భవనం సమీపంలోని ప్రైవేట్ ప్లాట్లల్లో వాహనాలను నిలిపి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ● మోపాల్ ఎంపీడీవో, పోలీసు స్టేషన్, ఐకేపీ కార్యాలయాలు గత పదేళ్లుగా అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. ఎంపీడీవో కార్యాలయాలు సక్రమంగా అద్దె చెల్లించకపోవడంతో పలుసార్లు భవనాల యజమాని తాళం వేశారు. ఎంఈవో కార్యాలయం నిజామాబాద్లో నడిపిస్తున్నారు. ● మెండోరా, ముప్కాల్ మండలాల్లో ప్రభుత్వ కార్యాలయాలు గ్రామ అభివృద్ధి కమిటీ భవనాల్లో నడుస్తున్నాయి. ఏర్గట్ల తహసీల్దార్ కార్యాలయం, మోర్తాడ్లోని ఎలక్ట్రిసిటీ రెవెన్యూ కార్యాలయం అద్దె భవనంలో ఉన్నాయి. ● ఇందల్వాయి మండలంలో తొమ్మిది సంవత్సరా ల నుంచి ప్రభుత్వ కార్యాలయాలన్నీ అద్దె భవ నాల్లోనే కొనసాగుతున్నాయి. తహసీల్, పోలీస్ స్టేషన్, ఎంపీడీవో, పోస్టాఫీస్, ఐకేపీ కార్యాలయాలు, ఆరోగ్య ఉప కేంద్రాలు అద్దె భవనాల్లోనే ఉన్నాయి. మండల కేంద్రం శివారులో 787 సర్వే నంబర్లో 2019లో ప్రభుత్వ కార్యాలయాల కోసం రెండు ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించారు. అయితే ఇంతవరకు కార్యాలయాల నిర్మాణానికి నిధులు మంజూరు చేయలేదు. ● జిల్లాలో 1,501 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా, 611 అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. 177 అంగన్వాడీ కేంద్రాలు అర్బన్ ప్రాంతాల్లో ఉన్నా యి. ఒక్కో భవనానికి అద్దె రూ.6 వేల చొప్పున నెలకు రూ.10.62 లక్షలు చెల్లిస్తున్నా రు. రూరల్ ప్రాంతాల్లో 434 అంగన్వాడీలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. కేంద్రానికి రూ.2వేల చొప్పున నెలకు రూ.8.68 లక్షలు చెల్లిస్తున్నారు. అద్దె భవనంలో ఉన్న జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయం అద్దె భవనంలో ఉన్న డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్, ఎకై ్సజ్ కార్యాలయం అద్దె భవనంలో జిల్లా బీమా కార్యాలయం అద్దె భవనంలో కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ కార్యాలయం నిజామాబాద్ జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయం ప్రైవేటు కమర్షియల్ కాంప్లెక్స్లో నిర్వహిస్తున్నారు. నిజామాబాద్ అర్బన్, రూరల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు సైతం అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. బోధన్ రిజిస్ట్రేషన్ కార్యాలయం అద్దె భవనంలోనే ఉంది. ఇదిలా ఉండగా బోధన్ సబ్ రిజిస్టార్ కార్యాలయం అద్దె చెల్లించకపోవడంతో భవన యజమాని పలుసార్లు తాళం వేయడం గమనార్హం. ఇప్పటికీ నెలకు రూ.72 వేల చొప్పున రెండున్నర సంవత్సరాల అద్దె చెల్లించాల్సి ఉంది. పైగా ఈ కార్యాలయాల్లో సరైన సౌకర్యాలు లేకపోవడం గమనార్హం. నిజామాబాద్లోని ఉమ్మడి జిల్లా ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ కార్యాలయం ప్రైవేట్ అపార్ట్మెంట్లో కొనసాగుతోంది. నిజామాబాద్ డివిజన్ శిశు సంక్షేమ శాఖ కార్యాలయం సుభాష్నగర్లో అద్దె భవనంలో నడుస్తోంది. ప్రభుత్వ ఆదేశాలను పూర్తి స్థాయిలో అమలు చేయని యంత్రాంగం మధ్యలోనే నిలిచిపోయిన కసరత్తు జిల్లా కేంద్రంతో పాటు పలు మండలాల్లోనూ ఇదే పరిస్థితి -
వృద్ధాశ్రమ నిర్వహణ ఇలాగేనా?
డిచ్పల్లి(నిజామాబాద్రూరల్): అనాథ వృద్ధులను కుటుంబ సభ్యులుగా భావిస్తూ వారి ఆలనాపాలన చూసుకోవాలి కానీ.. వృద్ధాశ్రమ నిర్వహణ ఇలాగేనా..? అంటూ కలెక్టర్ ఇలా త్రిపాఠి అసంతృప్తి వ్య క్తం చేశారు. ప్రభుత్వం, రెడ్క్రాస్ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో డిచ్పల్లి మండలం రాంపూర్లో కొనసాగుతున్న వృద్ధాశ్రమాన్ని కలెక్టర్ గురువారం తని ఖీ చేశారు. నామ్ కే వాస్తే అన్నట్టు కాకుండా వృద్ధులపై మానవతా దృక్పథంతో వ్యవహరించాలని ని ర్వాహకులకు హితవు పలికారు. కిచెన్లో ఆహార పదార్థాలు, వంట సరుకుల నాణ్యతను పరిశీలించారు. కాలపరిమితి ముగిసిన పలు సరుకులు ఉండడాన్ని గమనించి ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుబాటులో ఉన్న సదుపాయాలు పరిశీలించారు. వృద్ధులు విశ్రాంతి తీసుకునే గదుల లో కూలర్లు, టెలివిజన్ వంటి సదుపాయాలు లేకపోవడాన్ని గ మనించి అసంతృప్తి వ్యక్తం చేశారు. తక్షణమే వా టిని సమకూర్చాలని, నిర్వహణ లోపభూయిష్టంగా ఉందని రెడ్ క్రాస్ సొసైటీ నిర్వాహకుల పనితీరుపై అసంతృప్తి వెలిబుచ్చారు. వృద్ధులకు అల్పాహా రం, భోజనం అందించే విషయంలోనూ తప్పనిసరి గా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, సరైన మోతాదులో పౌష్టికాహారం అందించాలని సూచించారు. అవసరమైన అన్ని రకాల ఔషధాలు అందుబాటులో ఉండాలన్నారు. తాను త్వరలోనే మళ్లీ ఆశ్రమాన్ని తనిఖీ చేస్తానని, నిర్వహణ తీరులో మార్పు కనిపించకపోతే తగిన చర్యలు తీసుకుంటామని నిర్వాహకులను హెచ్చరించారు. అన్ని సదుపా యాలు, వసతులు అందుబాటులో ఉండాలన్నారు. ఆశ్రమం చుట్టూ ముళ్ళ పొదలు, పిచ్చి మొక్కలను శుభ్రం చే యించాలని స్థానిక అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట జిల్లా సంక్షేమ అధికారిణి పద్మ, రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధి బుస్స ఆంజనేయులు, తహసీల్దార్ సతీశ్రెడ్డి, సర్పంచ్ రమ్య, ఆర్ఐ భూపతిప్రభు తదితరులు ఉన్నారు. అనాథ వృద్ధులను కుటుంబ సభ్యులుగా భావించాలి అల్పాహారం, భోజనం అందించడంలో జాగ్రత్తలు తీసుకోవాలి అన్ని రకాల ఔషధాలు అందుబాటులో ఉంచండి కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశాలు రాంపూర్లోని వృద్ధాశ్రమం తనిఖీ -
బోధన్ను లాజిస్టిక్ నోడ్గా మారుస్తాం
బోధన్: నిత్యావసర సరుకుల రవాణాను క్రమబద్ధీకరించడంతోపాటు స్థానిక పరిశ్ర మలు, వ్యవసాయ, వాణిజ్యానికి కీలకమై న బోధన్ను లాజిస్టిక్స్ నోడ్గా మార్చడ మే ల క్ష్యమని దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్ డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ (డీఆర్ఎం) సంతోష్కుమార్ వర్మ అన్నారు. రైల్వేలోని వివిధ విభాగాల ఉన్నతాధికారులతో కలిసి గురువారం ఆయన బోధన్ పట్టణంలోని రాకాసీపేట్ ప్రాంతంలో ఉన్న రైల్వే స్టేషన్ను తనిఖీ చేశారు. ట్రాక్లు, గూడ్స్యార్డ్ పనితీరు, భద్రత తదితర వాటిని పరిశీలించారు. రైల్వేస్టేషన్ కార్యాచరణ సంసిద్ధతను అంచనా వేయడం, గూడ్స్ యార్డు కోసం వ్యుహాత్మక పునర్నిర్మాణ ప్రణాళికను రూ పొందించడం తమ పర్యటన ప్రధాన ఉద్ధేశమని ఆయన వెల్లడించారు. రైల్వే మౌళిక సదుపాయాలను ఆధునీకరించడంతోపాటు బోధన్ ప్రాంతంతో సామాజిక, ఆర్థిక అనుసంధానాన్ని పెంపొందించడంపై ప్రత్యేక దృష్టిసారించామని పేర్కొన్నారు. ఆయన వెంట సీనియర్ డివిజనల్ ఇంజినీర్ (కో ఆర్డినేషన్) పీటీవీ దుర్గాప్రసాద్, సీనియర్ డీఈఈ మెయింట్నెన్స్ బీ.హేమానాయక్తోపాటు సీనియర్ అధికారులు ప్రశాంత సా యికృష్ణ, విజయ్కుమార్, శశాంక్ నామ్దేవ్, ఎం.లక్ష్మీనారాయణ, వి.విద్యాధర్, అనిరుధ్కుమార్, వై.సృజన్కుమార్ ఉన్నారు. డ్రైవర్, కండక్టర్ల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం నిజామాబాద్ రూరల్: కార్మికులు సమ్మె చేస్తున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా బస్సులు నడిపేందుకు డ్రైవర్లు, టికెట్ ఇవ్వడానికి కండక్టర్ల నియామకం కోసం అర్హులు దరఖాస్తు చేసుకోవాలని ఆర్టీసీ రీజినల్ మేనేజర్ జ్యోత్స్న గురువారం ఒక ప్రకటనలో కో రారు. డ్రైవర్లకు తెలుగులో రాయడం, చదవడం రావడంతోపాటు హెవీ ట్రాన్స్పోర్ట్ వె హికిల్, హెవీ గూడ్స్ వెహికిల్ లైసెన్స్ లేదా హెవీ ప్యాసింజర్ వెహికల్ లైసెన్స్ కలిగి 18 నెలల అనుభవం ఉండి, 25 నుంచి 50 ఏళ్ల లోపు వయస్సు వారై ఉండాలని పేర్కొన్నా రు. అలాగే కండక్టర్ పోస్టుకు దరఖాస్తు చేసుకునేవారు పదో తరగతి ఉత్తీర్ణులై, 21 నుంచి 58 సంవత్సరాలోపు వయస్సు వారై ఉండాలని, ఆసక్తి గల వారు ఆర్ఎం కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. ఆర్గానిక్ ఉత్పత్తులను రాయితీపై అందించాలి డొంకేశ్వర్(ఆర్మూర్): గ్రామీణ రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు ‘ఫ్యాక్ట్ కంపెనీ’ ద్వారా ఆర్గానిక్ ఉత్పత్తులను రాయితీపై అందించాలని ప్రభుత్వరంగ సంస్థ ఫ్యాక్ట్ కంపెనీ ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ కంపెనీ డీజీఎం సురేశ్ను జేఎంకేపీఎం ఎఫ్పీవో చైర్మన్ పాట్కూరి తిరుపతిరెడ్డి కోరారు. ఎఫ్పీవో డైరెక్టర్లతో కలిసి గురువారం హైదరాబాద్కు వెళ్లి డీజీఎంను కలిశారు. ఈ సందర్భంగా పసుపు ఉత్పత్తులను అందజేశారు. ఫ్యాక్ట్ కంపెనీ ద్వారా రైతు ఉత్పత్తిదారుల సంఘాలు రసాయన రహిత పసుపు పండించి దిగుబడిని పెంచే విధంగా సహకారం అందించాలని డీజీఎంను కోరారు. డైరెక్టర్లు పుప్పాల నాగేశ్, పెద్ద చిన్నయ్య తదితరులు డీజీఎంను కలిసిన వారిలో ఉన్నారు. -
రెండో రోజూ కొనసాగిన సమ్మె
నిజామాబాద్ రూరల్: ఆర్టీసీ కార్మికుల సమ్మె రెండో రోజైన గురువారం సైతం కొనసాగింది. గామీణ ప్రాంతలకు బస్సులు నడవకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మొత్తం 650 అద్దె బస్సులు ఉండగా, 325 సర్వీసులు కామారెడ్డి, బోధన్, వరంగల్, ఆర్మూర్, హైదరాబాద్ తదితర ప్రాంతాలకు గురువారం నడిచినట్లు డిప్యూటీ రీజినల్ మేనేజర్ మధుసూదన్ తెలిపారు. రానున్న రోజుల్లో సమ్మె ఇలాగే కొనసాగితే 650 సర్వీసులను నడుపుతామని ఆర్టీసీ అధికారులు పేర్కొన్నారు. అ ర్హులను డైవర్, కండక్టర్లుగా రిక్రూట్ చేసుకుంటామన్నారు. కార్మికుల సమ్మె నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని డిపో–1 డిపో–2, బస్టాండ్లో పోలీస్ పికె ట్ ఏర్పాటు చేశారు. కార్మికులు పాత కలెక్టరేట్ మైదానంలో సమ్మె చేశారు. కష్టం ఎక్కువ.. జీతం తక్కువ ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు రోజు కు 14 నుంచి 16 గంట లు విధు లు నిర్వర్తిస్తున్నప్పటికీ ప్రభు త్వ ఉద్యోగుల క న్నా 28శాతం జీతం తక్కువ గా ఉంది. మాకు కష్టం ఎక్కు వ, జీతం తక్కువ. 2021, 2025 వేతన సవరణలు వెంటనే చేపట్టాలి. – సామల శ్రీకాంత్, ఆర్టీసీ జేఏసీ నిజామాబాద్–1 డిపో కో కన్వీనర్ ఎనిమిది గంటల డ్యూటీ వేయాలి రోజుకు 12 నుంచి 16 గంటలు పనిచేస్తే గతంలో స్పెష ల్ ఆఫ్ డ్యూటీలుగా ఇచ్చేవా రు. ఇప్పుడు సిబ్బంది తగ్గ డంతో సింగిల్ క్రూలుగా మా ర్చి ఒకరోజు మస్టర్ మాత్ర మే ఇస్తున్నారు. ఎనిమిది గంటల డ్యూటీ వేయాలి. – అరుంధతి, కండక్టర్, నిజామాబాద్ డిపో – 1 ఇబ్బందులు ఎదుర్కొన్న బస్సు ప్రయాణికులు 325 సర్వీసులను నడిపిన ఆర్టీసీ అద్దె బస్సులను పెంచేందుకు చర్యలు చేపడుతున్న సంస్థ -
సాంగ్లీలో కష్టకాలం
మోర్తాడ్(బాల్కొండ): దొన్కల్కు చెందిన రైతు కల్లెం శ్రీనివాస్ 75 క్వింటాళ్ల పసుపును సాంగ్లీ మార్కెట్కు వారం రోజుల క్రితం తరలించారు. ని జామాబాద్ మార్కెట్ కన్నా సాంగ్లీలో ధర ఎక్కువ లభిస్తుందని భావించగా, అక్కడి మార్కెట్లో ధర పడిపోవడంతో తీవ్ర నిరాశ చెందారు. గోదాంలో పసుపు సంచులను నిలువ ఉంచి ఇంటికి తిరిగొ చ్చాడు. ధర పెరుగుతుందనే ఆశతో రెండు రోజుల క్రితం మళ్లీ సాంగ్లీకి వెళ్లగా ఇంకా తగ్గిపోయింది. చేసేదేమీ లేక ఆ రైతు ఇంటిముఖం పట్టాడు. ఇది ఒక్క రైతు శ్రీనివాస్కు ఎదురైన గడ్డు పరిస్థితే కాదు. ఎన్నో ఆశలతో సాంగ్లీ మార్కెట్కు పసు పును తరలిస్తున్న రైతులకు ఊహించని దెబ్బ తగులుతుండటంతో పంటను విక్రయించుకోలేక నిరాశ తో ఇంటికి వస్తున్నారు. ధర పెరిగినప్పుడే విక్రయించాలని రైతులు ఆశిస్తున్నారు. జాతీయ మార్కెట్గా ప్రసిద్ధి చెందిన సాంగ్లీలో నిజామాబాద్ మా ర్కెట్ కన్నా తక్కువ ధర పలుకుతోంది. పేరుకుపోయిన నిల్వలు.. పెద్ద వ్యాపారులతోపాటు కాస్మోటిక్, ఔషధ త యారీ కంపెనీల ప్రతినిధులు, విదేశాలకు ఎగు మ తి చేసేవారు సాంగ్లీ మార్కెట్లో పసుపు కొ నుగో లు చేస్తారు. వారం పది రోజులనుంచి సాంగ్లీ మా ర్కెట్కు తెలంగాణ, కర్ణాటక, ఏపీ నుంచి పసుపు బస్తాలను రైతులు తరలిస్తున్నారు. నిలువలు పేరుకుపోవడంతో కొనుగోలుదారులు ధర తగ్గించారు. మొదట్లో రూ.18 వేల వరకు ఉన్న ధర ఇప్పుడు రూ.12 వేలకు పడిపోయింది. నిజామాబా ద్లో నాణ్యత ఉన్న పసుపు క్వింటాల్ ధర రూ.12 వేల నుంచి రూ. 14 వేల వరకు పలకడం గమనార్హం. జాతీయ మార్కెట్లో పడిపోయిన పసుపు ధరలు ఊహించని విధంగా తగ్గిన ధర తరలించిన పసుపును అక్కడే నిలువ చేసి ఇంటి ముఖం పడుతున్న రైతులు ఇదే తొలిసారి సాంగ్లీలో నిజామాబాద్ మా ర్కెట్ కన్నా తక్కువ ధర ల భించడం ఇదే తొలిసారి. మే ము ఎన్నో ఏళ్ల నుంచి సాంగ్లీ మార్కెట్ను నమ్ముకొని పసు పును తరలించి విక్రయిస్తు న్నాం. ఈసారి భిన్నమైన పరిస్థితి నెలకొంది. – శ్రీధర్, రైతు, అంక్సాపూర్ -
మండుటెండలో హైటెన్షన్
ఎండలు మండిపోతున్నాయి. మధ్యాహ్నం 43 డిగ్రీలకుపైగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. బయటికి వెళ్లాలంటేనే జనాలు భయపడుతుండగా.. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండ తీవ్రతను లెక్క చేయకుండా కార్మికులు ఇలా హైటెన్షన్ టవర్లపై వైర్లు బిగిస్తున్నారు. ప్రమాదాన్ని లెక్క చేయకుండా సన్నటి వైర్లపై వేలాడుతూ నిజామాబాద్ నగర శివారులోని బోర్గాం(పి) ప్రాంతంలో పని చేస్తున్న కార్మికులను అటువైపు వెళ్తున్న వాహనదారులు, ప్రజలు ఆసక్తిగా తిలకించారు. వారి పనితీరును అభినందిస్తున్నారు. – డిచ్పల్లి(నిజామాబాద్రూరల్) -
స్త్రీనిధిలో నిజామాబాద్ టాప్
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: మహిళా సంఘాలకు స్త్రీనిధి రుణాల పంపిణీ.. తిరిగి రికవరీలో నిజామాబాద్ జిల్లా గత పది సంవత్సరాలుగా రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచింది. వరుసగా పదేళ్ల పాటు ఇతర జిల్లాలకు ఆదర్శంగా నిలుస్తూ వస్తోంది. ప్రభుత్వం ప్రతి ఏడాది నిర్ణయిస్తున్న లక్ష్యాన్ని జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ తేలికగా దాటడంతోపాటు లక్ష్యాన్ని మించి రుణాలు అందజేస్తోంది. జారీ చేసిన రుణాలను రికవరీ చేసే విషయంలోనూ నిజామాబాద్ జిల్లా ప్రథమంగా నిలుస్తోంది. దీంతో ఏటా నిజామాబాద్ జిల్లాకు స్టేట్ ఫస్ట్ అవార్డులు అందుతున్నాయి. » స్త్రీనిధి రుణాలను స్వయం సహాయక సంఘాల సభ్యులకు రూ.50 వేల నుంచి మొదలుకొని రూ.5 లక్షల వరకు ప్రభుత్వం అందజేస్తోంది. వివిధ వ్యాపారాలు, పరిశ్రమలకు, సోలార్ యూనిట్లు, ఎలక్ట్రిక్ వాహనాలు, ఇతర స్వయం ఉపాధి యూనిట్లకు రుణాలు అందజేస్తూ మహిళలను ప్రోత్సహిస్తున్నారు. గడిచిన పదేళ్లలో (2016–2026) రూ.1,372.12 కోట్లు స్వయం సహాయక గ్రూపుల మహిళా సభ్యులకు పంపిణీ చేశారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 108.06 శాతం రుణాలు అందజేసి రాష్ట్రంలో ఉత్తమ జిల్లాగా అవార్డు దక్కించుకుంది. రికవరీలోనూ 93–99 శాతం వసూలు చేసి పదేళ్లు వరుసగా సత్తా చాటి ప్రత్యేకత సాధించింది. ఉత్సాహాన్ని కొనసాగిస్తాం స్త్రీనిధి రుణాల పంపిణీలో నిజామాబాద్ జిల్లాను రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలబెట్టే విషయంలో స్వయం సహాయక సంఘాల మహిళల సహకారం చాలా ఉంది. రుణాలు అందజేయడం, రికవరీ విషయంలో సిబ్బంది కృషి సైతం చాలా ఉంది. పదేళ్లుగా వరుసగా సాధిస్తున్న అవార్డులు జిల్లాకు గర్వకారణం. – రాందాస్ –స్త్రీనిధి ఆర్ఎం -
హైకోర్టు తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కుట్రలకు రాష్ట్ర హైకోర్టు చెక్ పెట్టిందని మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు. హైకోర్టు తీర్పును యావత్ తెలంగాణ సమాజం హర్షిస్తోందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు జరిగాయనే అభియోగాలు పాలన చేతగాక ప్రజల దృష్టి మళ్లించేందుకేననే రాజకీయ ప్రేరేపిత అభియోగాలని రుజువైందన్నారు. కేసీఆర్ మీద కమిషన్ పేరుతో వేసిన కాంగ్రెస్ ప్రభుత్వ ఎత్తుగడ హైకోర్టు ముందు నిలవలేదన్నారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ కాళేశ్వరం విచారణ పేరుతో కేసీఆర్ పట్ల వ్యవహరించిన తీరు ప్రాథమిక న్యాయ సూత్రాలకు, రాజ్యాంగ హక్కులకు విరుద్ధమని హైకోర్టు స్పష్టం చేసిందన్నారు. ఈ కమిషన్ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవడం కు దరదని హైకోర్టు బల్లగుద్ది స్పష్టం చేసిందన్నారు. ఈ తీర్పు మేరకు కేసీఆర్ సహా సాక్షులుగా పిలిచినవారిపై చర్యలు చేపట్టడం కుదరదన్నారు. సాక్షులుగా పిలిచినవారిని విచారణ పేరుతో అగౌరవపరుస్తూ, ఏకపక్షంగా తప్పుడు ఉద్దేశాలు ఆపాదిస్తూ ఇష్టం వచ్చినట్లు వ్యవహరించడం కుదరదని తేలిందన్నారు. హైకోర్టు ధర్మాసనం తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వ చెంపలు పగలగొట్టే తీర్పు అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ రైతాంగానికి సాగునీరు, ప్రజలకు తాగునీరు అందించి రాష్ట్ర అభివృద్ధిలో కీలకపాత్ర పోషించిన ప్రతిష్టాత్మక నిర్మాణమని బాజిరెడ్డి అన్నారు. ఈ ప్రాజెక్టును బదనాం చేయాలనే కుట్రలు పనిచేయలేదన్నారు. ఈ తీర్పును గౌరవిస్తూ రేవంత్రెడ్డి ప్రభుత్వం అనవసర రాజకీయ ఆరోపణలను విరమించుకోవాలన్నారు. ఇప్పటికై నా బుద్ధి తెచ్చుకొని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరణ పనులు చేపట్టాలన్నారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక న్యాయ విరుద్ధం రేవంత్రెడ్డి కుట్రలకు చెక్ పెట్టిన న్యాయస్థానం విలేకరులతో మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ -
ప్రయాణికులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు
ప్రజారవాణా వ్యవస్థలో అత్యంత కీలకమైన ఆర్టీసీ సంస్థకు చెందిన కార్మికులు మంగళవారం అర్ధరాత్రి నుంచి సమ్మెకు పిలుపునివ్వడంతో ఆర్టీసీ అధికారులం అప్రమత్తమయ్యాం. సమ్మెకు ప్రత్యామ్నాయంగా అద్దె బస్సులను ఎక్కువ మొత్తంలో నడుపుతున్నాం. సమ్మె కాలంలో కార్మికులకు ఎలాంటి వేతనాలు చెల్లించబడవు. ప్రయాణికులకు ఇబ్బందులు కలుగకుండా ప్రజారవాణా వ్యవస్థకు సంబంధించి సమ్మె కాలం పాటు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాం. ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సుల యజమానులతో మాట్లాడి ఎక్కువ మొత్తంలో బస్సులు నడిపే విధంగా చొరవ తీసుకుంటాం. ఇప్పటికే జిల్లా మొత్తం 650 సర్వీసులకుగాను 206 సర్వీస్లను నడిపినట్లు ఆమె తెలిపారు. –జోత్స్న, ఆర్టీసీ ఆర్ఎం, నిజామాబాద్ -
ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలి
● ఎమ్మెల్సీ, ప్రజాగాయకుడు గోరటి వెంకన్న ● ఉత్సాహంగా తెలంగాణ యూనివర్సిటీ వార్షికోత్సవంతెయూ(డిచ్పల్లి): విద్యతోపాటు ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని, అప్పుడే సమాజంలో తగిన గుర్తింపు లభిస్తుందని ఎమ్మెల్సీ, ప్రజా గాయకుడు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత గోరటి వెంకన్న విద్యార్థులకు సూచించారు. తెలంగాణ యూనివర్సిటీ వార్షికోత్సవం బుధవారం సాయంత్రం ఘనంగా జరిగింది. వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరైన గోరటి వెంకన్న తనదైన శైలి పాటలతో విద్యార్థులను ఉత్తేజపరిచారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సమాజానికి విద్యార్థులు భూమిక లాంటి వారని, విద్యార్థుల భాగస్వామ్యం లేకుండా చరిత్రలో ఏ ఉద్యమం విజయవంతం కాలేదన్నారు. విద్యార్థులు తమ కుటుంబ ఆర్థికస్థితిగతులను తప్పకుండా పరిగణలోకి తీసుకొని ముందుకు సాగాలన్నారు. పాశ్చాత్య పోకడలకు దూరంగా ఉండాలని, మరీ ముఖ్యంగా మద్యం, మాదకద్రవ్యాల మత్తుకు బానిసలు కాకూడదని హితవు పలికారు. వర్సిటీ వీసీ ప్రొఫెసర్ యాదగిరిరావు మాట్లాడుతూ దేశ భవిష్యత్తు, అభివృద్ధి విద్యార్థుల ఎదుగుదలపై ఆధారపడి ఉంటుందన్నారు. ప్రణాళిక ప్రకారం కష్టపడి చదివి ఎంచుకున్న లక్ష్యాలను చేరుకొని కుటుంబాలకు, దేశానికి గర్వకారణంగా నిలవాలని పిలుపునిచ్చారు. రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యాదగిరి మాట్లాడుతూ మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆకలింపు చేసుకొని ముందుకు సాగాలని హితవు పలికారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను అలరించాయి. వేడుకల్లో వర్సిటీ కల్చరల్ ఆక్టివిటీస్ డైరెక్టర్ ప్రొఫెసర్ కే లావణ్య, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ రాంబాబు, ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సీహెచ్ ఆరతి, లా కళాశాల ప్రిన్సిపల్ కె.ప్రసన్న రాణి, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ డైరెక్టర్ బాలకిషన్, తెయూ పాలకమండలి సభ్యులు ప్రొఫెసర్ సీహెచ్ ఆంజనేయులు, దండు స్వామి తదితరులు పాల్గొన్నారు.పాటలతో విద్యార్థులను ఉత్తేజపరుస్తున్న ఎమ్మెల్సీ, ప్రజాగాయకుడు గోరటి వెంకన్న మాట్లాడుతున్న తెలంగాణ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ టీ యాదగిరిరావు -
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ రీజియన్ పరిధిలో ఆర్టీసీ సమ్మె మొదటి రోజు ప్రశాంతంగా నడిచింది. ఉమ్మడి జిల్లాలో ఆరు బస్సు డిపోల్లో 645 బస్సులకు గాను 206 బస్సులు నడిచాయి. అద్దె ప్రాతిపదికన ఉన్న బస్సులను ఆర్టీసీ అధికారులు నడిపించారు. ఉమ్మడి జిల్లాలో నిజామాబాద్ 1, 2, బోధన్, ఆర్మూర్, బాన్సువాడ, కామారెడ్డి డిపోలు ఉన్నాయి. ఈ డిపోల్లో 1,585 మంది కండక్టర్లు, డ్రైవర్లు సమ్మెలోకి దిగారు. అయితే అద్దె ప్రాతిపదికన నడిచే ఎలక్ట్రిక్ బస్సులను అధికారులు నడిపించారు. అద్దె బస్సుల యజమానులతో ఆర్టీసీ అధికారులు ఎప్పటికప్పుడు మాట్లాడి సర్వీసులు నడిచేలా చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు గురువారం నుంచి నిజామాబాద్ పాత కలెక్టరేట్ వద్ద నిరవధిక సమ్మె ప్రారంభించనున్నట్లు ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు ప్రకటించారు. నిజామాబాద్ 1,2 డిపోల నుంచి నడిచే సర్వీసుల్లో కొన్నింటిని నడిపించారు. ఇదిలా ఉండగా ఆటోవాలాలు మాత్రం ఇదే అదునుగా చార్జీలు భారీగా పెంచేశారు. ● బోధన్ డిపోలో ఉద్యోగులు, కార్మికులు విధులకు హాజరు కాలేదు. బస్టాండ్ ఆవరణలో కార్మికులు నిరసన తెలిపి నినాదాలు చేశారు. ఆర్టీసీ బస్సులతో పాటు అద్దె బస్సులను ఉదయం నిలిపేశారు. ఉదయం 10 గంటల తరువాత అద్దె బస్సులు బోధన్ నుంచి నిజామాబాద్, బాన్సువాడకు 27 సర్వీసులు నడిపారు. అవుట్ సోర్సింగ్ కండక్టర్లు బస్టాండ్ వద్ద ప్రయాణికులకు టిక్కెట్లు ఇచ్చారు. బస్టాండ్లో ప్రయాణికుల సంఖ్య గణనీయంగానే ఉంది. డిపో వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ● ఆర్మూర్ ఆర్టీసీ డిపోలో ఆర్టీసీ జేఏసీ పిలుపు మేరకు సమ్మె కొనసాగింది. డిపోలోనే బస్సులు నిలిచిపోయాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఆర్టీసీ డిపోల వద్ద పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. డిపో నుంచి బస్సులు బయటకు వెళ్లకుండా ఆర్టీసీ ఉద్యోగులు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు అక్కడే తిరిగారు. ఒకదశలో బస్సు బయటకు వెళుతున్న సమయంలో ఆర్టీసీ కార్మికులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు నిలువరించారు. బస్సును బయటకు పంపించారు. అద్దె బస్సులతో సర్వీసులు నడిచాయి. కొన్ని బస్సుల్లో కండక్టర్లు లేకపోవడంతో పురుషులు సైతం ఉచితంగా ప్రయాణాలు చేశారు. –వందేమాతరం శ్రీనివాస్, టీఎంయూ జిల్లా కార్యదర్శి –డి సంజీవ్, ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా నాయకులు నిజామాబాద్ అర్బన్: ఆర్టీసీ కార్మికులు శాంతియుతంగా సమ్మె నిర్వహించుకోవాలని పోలీస్ కమిషనర్ సాయిచైతన్య పేర్కొన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు చేకూర్చొద్దని బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్టీసీ సమ్మె కారణంగా ప్రజలకు ఇబ్బంది కలగకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. వి ద్యార్థులు, ఉద్యోగులు, అత్యవసర సేవల వినియోగించే ప్రజలు ఇబ్బంది పడకుండా ట్రాఫిక్ రవాణా వ్యవస్థపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. ప్రైవేటు డ్రైవర్లు తాత్కాలికంగా వి ధుల్లోకి వచ్చినా, ఆర్టీసీ డ్రైవర్లు తిరిగి డ్యూటీలో చేరినా పూర్తిస్థాయి బందోబస్తు కల్పిస్తామన్నా రు. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు నష్టం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.ఆర్టీసీ కార్మికులకు పెంచిన పని భారం తగ్గించాలి. పెండింగ్ లో ఉన్న రెండు పీఆర్సీలను వెంటనే ఇ వ్వాలి. మాస్టర్ స్కే లు అమలు చేయాలి. 18 వేల మంది రిటైర్డు అయినా ఒక్క కొత్త ఉద్యోగం ఇవ్వకుండా ఉన్నవారితో నెట్టుకొస్తున్నారు. అరకొర వేతనాలతో బతుకులీడుస్తున్న ఆర్టీసీ కార్మికులను అధికారులు అడ్డగోలుగా వేధిస్తున్నారు. వేధింపులు ఆపాలి. ఆర్టీసీని వెంటనే ప్రభుత్వంలో విలీనం చేయాలి. ఆర్టీసీ కార్మికులకు ఎనిమిది గంటల పని విధానం అమలు చేయాలి. -
తగ్గేదేలే..
వందకుడొంకేశ్వర్(ఆర్మూర్) : ఉపాధిహామీ (వీబీ జీ రామ్ జీ)లో వేసవి పనులు మొదలైన నేపథ్యంలో కూలీల హాజరుపై గ్రామీణాభివృద్ధి శాఖ దృష్టిసారించింది. ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో కూలీల హాజరు గణనీయంగా పెంచాలని, వంద మందికి తగ్గకుండా పనికి వచ్చేలా చూడాలని డీఆర్డీవో సాయన్న ఆ దేశాలు జారీచేశారు. పనులు కల్పించని వారిని ఉ పేక్షించేది లేదని, షోకాజ్ నోటీసులు జారీ చేస్తామ ని స్పష్టం చేశారు. డీఆర్డీవోతోపాటు ఎంపీడీవోలు, ఏపీవోలు, టీఏలు, ఈసీలు పనులు జరుగుతున్న ప్రాంతానికి వెళ్లి కూలీలు ఎంతమంది హాజరవుతున్నారో రోజువారీగా పర్యవేక్షణ చేస్తున్నారు. దీంతో గడిచిన వారం రోజుల్లో కొంతమేర కూలీల హాజరుశాతం పెరిగింది. ప్రస్తుతం దాదాపు 28 వేల మంది కూలీలు పనులకు హాజరవుతున్నారు. దీనిని రోజుకు 50 వేలకు పెంచాలని గ్రామీణాభివృద్ధి శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు కూలీల హాజరును బాగా పెంచి మంచి పనితీరు కనబరిచిన ఫీల్డ్ అసిస్టెంట్లకు రూ.1,000 చొప్పున నగదు ప్రోత్సాహం ఇవ్వాలని నిర్ణయించారు. కాగా, నిర్లక్ష్యంగా ఉన్న వారిపై చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోమని అధికారులు స్పష్టం చేస్తున్నారు. మే 31 వరకు 18 లక్షల పనిదినాలు లక్ష్యం... కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని ‘వీబీ జీ రామ్ జీ’గా పేరు మార్చడంతో జిల్లాకు రెండు నెల ల మట్టుకే పనిదినాల లక్ష్యాన్ని నిర్దేశించారు. ఏప్రి ల్, మే నెలలకు కలిపి మొత్తం 18 లక్షల పనిదినా లు కల్పించాల్సి ఉంది. ఇప్పటి వరకు 2.84 లక్షల పనిదినాలు పూర్తికాగా ఇంకా 15.16 లక్షల పనిదినాలను 38 రోజుల్లో పూర్తి చేయాల్సి ఉంది. తక్కువ సమయం ఉండటంతో కూలీల హాజరుశాతం మ రింత పెంచాలని అధికారులు ఫీల్డ్ అసిస్టెంట్లపై ఒత్తిడి పెంచుతున్నారు. ఉపాధి కూలీలకు ప్రభు త్వం రూ.300పైగా వేతనం ఇస్తుడటంతో కూలీలు కూడా పనులకు వచ్చేందుకు మొగ్గుచూపుతున్నా రు. పనిదినాల సంఖ్య పెంచడానికి రెండేళ్ల క్రితం ఆగిపోయిన చెరువుల్లో మట్టి పూడిక తీసే పనులను అధికారులు మళ్లీ ప్రారంభించారు. ప్రతి గ్రామ పంచాయతీలో వంద మందికి తగ్గకుండా కూలీలు పనులకు రావాలి. పెద్ద జీపీల్లో 200 మంది వచ్చేలా చూడాలి. ఈ విషయంపై ఫీల్డ్ అసిస్టెంట్లకు, ఏపీవోలకు ఆదేశాలిచ్చాం. కూలీల సంఖ్య పెంచే విషయంలో నిర్లక్ష్యం చేసిన వారిపై చర్యలు ఉంటాయి. బాగా పని చేసిన వారికి తగిన గుర్తింపు ఉంటుంది. – సాయన్న, డీఆర్డీవో, నిజామాబాద్ ఉపాధి హామీ పనులపై డీఆర్డీవో ఆదేశాలు ప్రతి జీపీలో హాజరుశాతం పెంచాల్సిందేనని స్పష్టం పర్యవేక్షణ పెంచిన ఎంపీడీవోలు, ఏపీవోలు -
గురుకులాన్ని ఆర్మూర్కు తరలిస్తాం
● కలెక్టర్ ఇలా త్రిపాఠి ● నూత్పల్లి జ్యోతీబా ఫూలే పాఠశాల తనిఖీడొంకేశ్వర్/ఆర్మూర్ : ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా డొంకేశ్వర్ మండలం నూత్పల్లి గ్రామంలోని మహాత్మా జ్యోతీబా ఫూలే బీసీ బాలుర గురుకుల పాఠశాలను కలెక్టర్ ఇలా త్రిపాఠి బుధవారం సందర్శించారు. స్టోర్ రూమ్, కిచెన్, డైనింగ్ హాల్, డార్మెటరీ, తరగతి గదులు తదితర వాటిని పరిశీలించారు. మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా లేదా అని ఆరా తీశారు. మౌలిక వసతులు, అందుబాటులో ఉన్న సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. స్థానికంగా విద్యార్థులకు పలు ఇబ్బందులు తలెత్తుతున్నాయని, పాఠశాలను ఆర్మూర్ పట్టణానికి తరలించే ప్రతిపాదనకు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి కూడా ఆమోదం ఉందని నిర్వాహకులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. దీంతో కలెక్టర్ ఆర్మూర్ పట్టణంలోని ప్రతిపాదిత భవనాన్ని సైతం క్షేత్రస్థాయిలో సందర్శించి పరిశీలన చేశారు. ప్రస్తుతం నూత్పల్లిలో ఉన్న భవనం కంటే ఇది సౌకర్యవంతంగా ఉంటుందని అధికారులు తెలుపగా, అవసరమైన మరమ్మతులు జరిపించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఆర్మూర్లోని నూతన భవనంలోకి పాఠశాలను మారుస్తున్న విషయాన్ని విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు తెలియజేస్తూ, వచ్చే విద్యా సంవత్సరంలో పూర్తిస్థాయిలో ప్రవేశాలు జరిగేలా చొరవ చూపాలన్నారు. అంతకుముందు కలెక్టర్ 5వ తరగతి గదికి వెళ్లి విద్యార్థులతో భేటీ అయ్యారు. ఆంగ్లం, గణితం, తెలుగు సబ్జెక్టులపై ప్రశ్నలు వేసి, విద్యార్థుల సామర్థ్యాన్ని అంచనా వేశారు. చక్కగా సమాధానాలు చెప్పిన విద్యార్థులకు బహుమతులు, చాక్లెట్లు అందించారు. అల్పాహారం, భోజనం రుచికరంగా ఉంటోందా? అన్ని వసతులు అందుబాటులో ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. చక్కగా చదువుకోవాలని హితవు పలికారు. కలెక్టర్ వెంట ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియా, ఆర్సీవో సత్యనాథ్ రెడ్డి, ఆర్మూర్ తహసీల్దార్ సత్యనారాయణ తదితరులు ఉన్నారు. -
క్రైం కార్నర్
రామారెడ్డి: ప్రమాదవశాత్తు కోనేరులో పడి ఓ వృద్ధురాలు మృతి చెందిన ఘటన రామారెడ్డి మండల పరిధిలోని మద్దికుంటలో చోటు చేసుకుంది. ఎస్సై రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని మనోహరాబాద్ గ్రామానికి చెందిన గడ్డం నర్సవ్వ(70) మద్దికుంటలో ఉన్న బుగ్గ వృద్ధాశ్రమంలో గత ఆరేళ్లుగా నివసిస్తోంది. బుధవారం ఉదయం 5 గంటలకు నిద్రలేచిన నర్సవ్వ తోటి వారితో కోనేరులో స్నానం చేసి వస్తానని చెప్పి తిరిగి రాలేదు. గంట గడిచినా ఆమె తిరిగి రాకపోవడంతో తోటి వారు కోనేరు వద్దకు వెళ్లి చూడగా, నర్సవ్వ నీటిలో పడి మృతి చెంది ఉండటాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ప్రమాదవశాత్తు కాలుజారి కోనేరులో పడిపోవడంతోనే ఆమె మృతిచెందినట్లు పోలీసులు నిర్ధారించారు. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. గుండెపోటుతో వలస కూలీ .. మోపాల్: మండలంలోని సిర్పూర్ ఇటుక బట్టీలో పని చేస్తున్న నీలేద్రి నాగ్ (35) అనే మహిళ గుండెపోటుతో మృతిచెందినట్లు ఎస్సై జాడె సుస్మిత తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిస్సా రాష్ట్రంలోని నవుపడా జిల్లా సిర్ణాపల్లి మండలం కందుకూనా గ్రామానికి చెందిన పితంబర్ నాగ్ తన భార్య నీలేద్రి నాగ్, ముగ్గురు పిల్లలతో కలిసి సిర్పూర్లో ఉన్న ఇటుక బట్టీలో పని చేసేందుకు గతేడాది డిసెంబర్లో వచ్చారు. బుధవారం ఉదయం బట్టీలో పని చేస్తుండగా నీలేద్రి నాగ్కు ఛాతిలో నొప్పితో కింద పడిపోయింది. ఆమె భర్త వెంటనే ఆటోలో జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు చెప్పారు. మృతురాలి భర్త పితంబర్ నాగ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. మాజీ ఎమ్మెల్యే భార్య ..మాక్లూర్: మండలంలోని వల్లభాపూర్ వాస్తవ్యుడు, దివంగత కంటోన్మెంట్ మాజీ ఎమ్మెల్యే జీ సాయన్న భార్య గీత(70) బుధవారం హైదరాబాద్లో అనారోగ్యంతో మృతి చెందారు. గురువారం హైదరాబాద్లోని అశోక్నగర్లో ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబీకులు తెలిపారు. గ్రామ ప్రజాప్రతినిధులు సంతాపం తెలిపారు. -
ఇంజినీరింగ్ సెమిస్టర్ ఫలితాలు విడుదల
తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల – 2026 మొదటి సెమిస్టర్ ఫలితాలను బుధవారం వర్సిటీ వైస్చాన్స్లర్ టీ యాదగిరిరావు, రిజిస్ట్రార్ ఎం యాదగిరి విడుదల చేశారు. వీసీ మాట్లాడుతూ.. ఈ విద్యా సంవత్సరమే ప్రా రంభమైన ఇంజినీరింగ్ విభాగంలో బీటెక్ కంప్యూటర్ సైన్స్, బీటెక్ కంప్యూటర్ సైన్స్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సుల మొదటి సెమిస్టర్ పరీ క్షా ఫలితాలను ఆవిష్కరించినట్లు తెలిపారు. బీటెక్ కంప్యూటర్ సైన్స్లో 56 మందికి 32 మంది విద్యార్థులు ఉత్తీర్ణులైనట్లు పేర్కొన్నారు.బీటెక్ కంప్యూట ర్ సైన్స్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సులో 15 మందికి 9 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. కార్యక్రమంలో వర్సిటీ రిజిస్ట్రార్ ఎం యాదగిరి, ప రీక్షల నియంత్రణాధికారి కే సంపత్కుమార్, అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఘంటా చంద్రశేఖర్, ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ సీహెచ్ ఆరతి,అడిషన ల్ కంట్రోలర్ టీ సంపత్,అధ్యాపకులు నందిని, భ్ర మరాంబిక,శాంతాబాయి పాల్గొన్నారు. తెయూ ఇంజినీరింగ్ సెమిస్టర్ ఫలితాలను విడుదల చేస్తున్న వీసీ, రిజిస్ట్రార్ -
ఆర్టీసీ కార్మికులు ఆందోళన చెందొద్దు
● డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ● కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాటిపల్లి నగేశ్రెడ్డి నిజామాబాద్ రూరల్: ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్దంగా ఉందని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాటిపల్లి నగేశ్రెడ్డి, నగర అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ అన్నారు. బుధవారం ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు చేస్తున్న సమ్మెను విరమింపజేసేలా వారితో చర్చలు జరపాలని రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొ న్నం ప్రభాకర్ ఆదేశాల మేరకు వారు ఆర్టీసీ ఉద్యోగులు,కార్మికులను కలిసి మాట్లాడారు. ఆర్టీసీ ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభు త్వం ఆర్టీసీకి అన్ని విధాలుగా సహాయం చేస్తుందని, కార్మికులు చెప్పిన డిమాండ్లను ఒక్కొక్కటిగా నెరవేరుస్తుందన్నారు. కార్మికులు చెప్పిన 32 డిమాండ్లలో ఇప్పటికే 29 డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించిందని, మిగిలిన మూడు డిమాండ్లను కూడా త్వరలోనే సీఎం నెరవేర్చే ప్రయత్నం చేస్తారని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి రాంభూపాల్, రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ మెంబర్ రామకృష్ణ, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రత్నాకర్గౌడ్, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు వెంకట్రావు రెడ్డి, గోపి గాదరి, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు విపుల్ గౌడ్, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ గౌడ్, జిల్లా సేవాదళ్ అధ్యక్షుడు సంతోష్, కార్పొరేటర్ మనోహర్, నగర ఎస్సీ సెల్ అధ్యక్షుడు వినయ్, యూత్ కాంగ్రెస్ నగర అధ్యక్షుడు మెయిన్, ఇర్ఫాన్ తదితరులు పాల్గొన్నారు. -
సుర్రుమంటోంది
ఎండల తీవ్రత పెరుగుతోంది. ప్రజలు భానుడి భగభగలను భరించలేకపోతున్నారు. జిల్లాలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. బుధవారం భీమ్గల్లో అత్యధికంగా 43.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వేడిగాలుల కారణంగా జనం బయటికి వచ్చేందుకు ప్రజలకు జంకుతున్నారు. జిల్లా కేంద్రంతోపాటు మండల కేంద్రాల్లోని ప్రధాన రోడ్లు మధ్యా హ్నం వేళ నిర్మానుష్యంగా మారుతున్నాయి. తప్పని పరిస్థితుల్లో బయటకు వచ్చిన వారు ఎండతీవ్రత నుంచి తమను తాము రక్షించుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, నిజామాబాద్ -
జాతీయ ఆదివాసీ సమావేశంలో జిల్లా నాయకులు
సుభాష్నగర్: అఖిల భారత ఆదివాసీ కాంగ్రెస్ జిల్లాల అధ్యక్షులతో బుధవారం ఢిల్లీలో నిర్వహించిన లీడర్షిప్ డెవలప్మెంట్ మిషన్ సమావేశంలో కాంగ్రెస్ జిల్లా గిరిజన, ఆదివాసీ చైర్మన్ కెతావత్ యాదగిరి హాజరయ్యారు. సమావేశానికి కాంగ్రెస్ లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్గాంధీ హాజరై దిశానిర్దేశం చేశారు. కెతావత్ యాదగిరి మాట్లాడుతూ.. ఆదివాసీలు దేశానికి వెన్నుముక లాంటి వారని, ఆదివాసీలు, బంజారాల సంస్కృతిని కాంగ్రెస్ గౌరవించి అభివృద్ధి చేసిందని గుర్తుచేశారు. గ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు వారి వారి జిల్లాల్లో లీడర్షిప్ డెవలప్మెంట్ కోసం కృషి చేయాలని, బీఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నా రు. కార్యక్రమంలో అఖిల భారత ఆదివాసీ కాంగ్రె స్ చైర్మన్ విక్రాంత్ బూరియా, జాతీయ నాయకులు కొప్పుల రాజు, తెలంగాణ రాష్ట్ర చైర్మన్ శంకర్ నా యక్, ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్, జిల్లా నాయకులు కెతావత్ సురేశ్ నాయక్ పాల్గొన్నారు. -
కుక్కల దాడిలో పలువురికి గాయాలు
లింగంపేట: మండలంలోని భవానిపేట గ్రామంలో బుధవారం వీధి కుక్కలు స్వైర విహారం చేశాయి. గ్రామానికి చెందిన ఉపసర్పంచ్ అస్కుల సాయిలు, బేస్త మమతతో పాటు పలువురిపై వీధి కుక్కలు దాడికి పాల్పడ్డాయి. దీంతో గాయపడిన వారిని గ్రామస్తులు అంబులెన్సులో ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కుక్కలు మనుషులతో పాటు ఆవులు, మేకలపై దాడి చేసి గాయపర్చినట్లు గ్రామస్తులు తెలిపారు. కొంత కాలంగా కుక్కల బెడద తీవ్రంగా ఉందని అధికారులు, పాలకులు స్పందించి కుక్కల బెడదను నివారించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఆర్మూర్టౌన్: ఆర్మూర్ పట్టణంలో సుదర్శన్ అనే వ్యక్తిపై పాత కక్షలతో ఇటీవల దాడికి పాల్పడిన బా శెట్టి హర్షవర్ధన్ను బుధవారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్హెచ్వో సత్యనారాయణ గౌడ్ తెలిపారు.వివరాలిలా ఉన్నాయి. స్థానికంగా ఉ న్న ఓ మిల్క్సెంటర్లో పనిచేస్తున్న సుదర్శన్పై పా త గొడవలతో అదే ప్రాంతంలో ఉన్న మాధవ్ అనే వ్యక్తి సుదర్శన్ కళ్లలో కారం చెల్లి స్క్రూడ్రైవర్తో తలపై బాది చంపడానికి ప్రయత్నించారు. పక్కనే ఉన్న దుకాణాదారులు చూసి వెంటనే వచ్చి సుదర్శన్ను కాపాడారు. బాధితుడు సుదర్శన్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పరారీలోఉన్న హర్షవర్ధన్ను ఉదయం అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్హెచ్వో తెలిపారు. -
ప్రధాని మోదీకి మల్లికార్జున్ ఖర్గే క్షమాపణ చెప్పాలి
● బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి సుభాష్నగర్: కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రధాని మోదీని ఉగ్రవాది అని సంబోధించడం ఆ పార్టీ దిగజారుడుతనానికి నిదర్శనమని, వెంటనే ప్రధానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ కులాచారి బుధవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ప్రధానిపై ఖర్గే చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఉగ్రవాదులతో కలిసి బిర్యానీలు తిని, స్నేహం చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని ఆరోపించారు. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో కశ్మీర్ వేర్పాటువాది, ఉగ్రవాది యాసిన్ మాలిక్తో ఢిల్లీలో అధికారికంగా చర్చలు జరిపిన విషయాన్ని ఖర్గే మర్చిపోయారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పూర్తిగా అర్బన్ నక్సలైట్ పార్టీగా మారిపోయిందని విమర్శించారు. దేశంలో మెజార్టీ ప్రజలు ఓట్లు వేసి గెలిపించిన ప్రధాని మోదీని అవమానించిన మల్లికార్జున ఖర్గే వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేకుంటే దేశ ప్రజలే కాంగ్రెస్కు తగిన బుద్ధి చెబుతారని ఆయన హెచ్చరించారు. ● సీపీ సాయి చైతన్య నిజామాబాద్ అర్బన్: పెండింగ్లో ఉన్న కేసు ల పురోగతిని వేగవంతంగా పూర్తి చేయాలని ిసీపీ సాయి చైతన్య పేర్కొన్నారు. బుధవారం కమిషనరేట్ కార్యాలయంలో సీఎంఆర్ కేసులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. ప్రతి కేసును ప్రాధాన్యతతో తీసుకొని నిర్ధిష్ట గడువులోగా పూర్తి చేయాలన్నారు. కేసుల దర్యాప్తులో ఎలాంటి నిర్లక్ష్యం చేయకూడదన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి కేసుల పరిష్కారాన్ని వేగవంతం చేయాలన్నారు. ప్రజల్లో పోలీసులపై నమ్మకం పెరిగేలా పారదర్శకంగా వ్యవహరించాలన్నారు. సమావేశంలో ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వరరెడ్డి, ఎస్బీ సీఐ శ్రీధర్రెడ్డి, అశోక్, సీసీఆర్బీ ఇన్స్పెక్టర్ అంజయ్య తదితరులు పాల్గొన్నారు. ఖలీల్వాడి: నగరంలోని దుబ్బాలో ఉన్న జీజీ కళాశాలలో బుధవారం నిర్వహించిన 2వ సెమిస్టర్ పరీక్షలకు 1221 మందికి 1191 మంది హాజరు కాగా 30 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు పరీక్షల నియంత్రణాధికారి భరత్రాజ్, ప్రిన్సిపాల్ రామ్మోహన్రెడ్డి తెలిపారు. 6వ సెమిస్టర్ బ్యాక్లాగ్ పరీక్షలకు విద్యార్థులందరూ హాజరయ్యారని వారు పేర్కొన్నారు. -
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ఎస్ఆర్ విద్యార్థుల ప్రతిభ
ఖలీల్వాడి: జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ఎస్ఆర్ కళాశాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబర్చినట్లు డీజీఎం గోవర్ధన్రెడ్డి, జోనల్ ఆఫీసర్ శ్రీకాంత్ తెలిపారు. కళాశాలలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. జేఈఈ మెయిన్స్ తోపాటు అడ్వాన్స్, నీట్, ఎంసెట్ పరీక్షలకు తమ కళాశాల విద్యార్థులు ప్రత్యేక శిక్షణతో జాతీయ ర్యాంకులు సాధించినట్లు వారు పేర్కొన్నారు. అధ్యాపకులు విద్యార్థులకు సరిగ్గా అర్థమయ్యే రీతిలో బోధన చేపట్టడంతో ర్యాంకులు సాధించినట్లు తెలిపారు. విద్యార్థులను ఎస్ఆర్ విద్యాసంస్థల చైర్మన్ ఎనుగందుల వరదారెడ్డి, డైరెక్టర్ సంతోష్రెడ్డి, మధుకర్రెడ్డి, సీఈవో సురేందర్రెడ్డి అభినందించి సన్మానించారు. కార్యక్రమంలో రాంబాబు, ప్రిన్సిపాళ్లు హన్మంత్రావు, నర్సింహారెడ్డి, దేవేందర్రెడ్డి, మహిపాల్రెడ్డి, శ్రీధర్రెడ్డి తదితరులు ఉన్నారు. -
ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు
నిజామాబాద్ రూరల్: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను నెరవేర్చాలని ఏఐటీయూసీ, సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. ఆర్టీసీ సంస్థ పరిరక్షణ కోసం జిల్లా వ్యాప్తంగా బుధవారం నుంచి నిర్వహిస్తున్న సమ్మెకు ఏఐటీయూసీ, సీఐటీయూ నాయకులు మద్దతు తెలిపారు. పాత కలెక్టరేట్ ఆవరణలో నిర్వహిస్తున్న సభలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి రమేశ్బాబు, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై ఓమయ్య మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులు, సంస్థకు అన్యాయం చేసిందని ఆరోపించారు. ఎలక్ట్రిసిటీ బస్సులను ప్రభుత్వమే టేక్ ఓవర్ చేసుకొని నడిపించాలని డిమాండ్ చేశారు. నాయకులు రఘురాం నాయక్, చందర్, సాయిలు, సంజీవ్, లింబాద్రి తదితరులు పాల్గొన్నారు. -
డిగ్రీ పరీక్ష కేంద్రాల తనిఖీ
తెయూ(డిచ్పల్లి): తెలంగాణ వర్సిటీ పరిధిలో డిగ్రీ రెగ్యులర్, బ్యాక్లాగ్ పరీక్షలు సోమవారం ప్రశాంతంగా జరిగినట్లు అడకమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పరిధిలో ఏర్పాటు చేసిన మొత్తం 29 పరీక్ష కేంద్రాలలో 5,375 మంది విద్యార్థులకు 5,183 మంది హాజరుకాగా 192 మంది గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పలు పరీక్ష కేంద్రాలను ప్రొఫెసర్ ఘంటా చంద్రశేఖర్ తనిఖీ చేశారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని, కాపీయింగ్కు అవకాశం ఇవ్వొద్ద ని ఇన్విజిలేటర్లకు సూచించారు. -
విద్యుదాఘాతంతో ఒకరి మృతి
ఆర్మూర్టౌన్: ఆర్మూర్ మండలం ఖానాపూర్ గ్రామానికి చెందిన అక్కనపల్లి శివరాం(58)అనే వ్యక్తి విద్యుదాఘాతంతో మృతి చెందినట్లు ఎస్హెచ్వో సత్యనారాయణగౌడ్ సోమవారం తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం శివరాం తన భూమిలో ఉన్న ఎర్రజొన్న సొప్పను తగలబెడుతున్నాడు. ప్రమాదవశాత్తు బోరుబావికి చెందిన పానెల్ బోర్డుకు మంటలు వ్యాపిస్తుండగా అందులోనుంచి కరెంటు వైర్లు తీసేందుకు శివరాం ప్రయత్నించాడు. అదే సమయంలో విద్యుత్ షాక్ తగిలి అక్కడిక్కకడే మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్హెచ్వో తెలిపారు. -
తల్లి అంత్యక్రియలు నిర్వహించిన కూతురు
రుద్రూర్: రుద్రూర్లో ఓ కూతురు తన తల్లికి అంతిమ సంస్కారాలు నిర్వహించి ఆదర్శంగా నిలిచింది. అనారోగ్యంతో బాధపడుతున్న వెంకటమ్మ (80) అనే వృద్ధురాలికి కూతురు కవిత తప్ప మరెవరూ లేరు. తల్లి ఆరోగ్యం క్షీ ణించడంతో కవిత తన అత్తవారిని ఒప్పించి రెండు నెలలుగా సేవలందించింది. సోమవా రం వెంకటమ్మ మృతి చెందగా స్థానిక సంప్రదాయం ప్రకారం కవిత అంతిమ సంస్కారా లు నిర్వహించింది. మృతదేహాన్ని ఖననం చే సి తల్లికి వీడ్కోలు పలికింది. కూతురు చూపి న మానవత్వం, తల్లిపట్ల ఉన్న మమకారాన్ని గ్రామస్తులు ప్రశంసించారు. -
కార్పెంటర్ షాప్లపై అటవీశాఖ అధికారుల దాడులు
కమ్మర్పల్లి(భీమ్గల్) : భీమ్గల్ మండలం మెండోర గ్రామంలోని కార్పెంటర్ వర్క్స్ షాప్లపై అటవీశాఖ బాసర సర్కిల్ ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు సోమవారం దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్రమంగా నిల్వ ఉంచిన టేకు కలపతోపాటు యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు. వర్క్ షాప్ యజమానులపై కేసులు నమోదు చేసి విచారణ జరుతున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. దాడుల్లో ఫ్లయింగ్ స్క్వాడ్ టీం సభ్యులు అనిత, ఇతర సిబ్బందితోపాటు కమ్మర్పల్లి రేంజ్ అధికారులు ఎఫ్ఆర్వో రవీందర్, డీఆర్వోలు శ్రీనివాస్, దేవీదాస్, సిబ్బంది పాల్గొన్నారు. -
డెస్క్ జర్నలిస్టులందరికీ అక్రెడిటేషన్లు ఇవ్వాలి
నిజామాబాద్ అర్బన్ : డెస్క్ జర్నలిస్టులందరికీ అక్రెడిటేషన్లు ఇవ్వాలని డెస్క్ జర్నలిస్టుల యూనియన్ ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈ విషయమై సోమవారం ప్రజావాణిలో వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా డెస్క్ జర్నలిస్టులు మాట్లాడుతూ ప్రస్తుతం జారీ చేసిన జీవో ప్రకారం అర్హులైన చాలా మంది డెస్క్ జర్నలిస్టులకు అన్యాయం జరిగే అవకాశాలున్నాయన్నారు. ఇటీవల జారీ చేసిన జీవోకు సవరణలు చేసి డెస్క్ జర్నలిస్టులు అందరికీ ఎడిషన్ కేంద్రంలోనే అక్రెడిటేషన్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో సాక్షి నిజామాబాద్ బ్యూరో ప్రతినిధి భద్రారెడ్డి, సాక్షి టీవి ప్రతినిధి కిరణ్కుమార్రెడ్డి, వివిధ పత్రికల్లో పనిచేస్తున్న ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన డెస్క్ జర్నలిస్టులు వెంకటరమణ, భీంరావు, స్వామి, రాకేశ్, మహేశ్, నర్సింగ్రావు, సంతోష్, జర్నలిస్టులు రాజ్కుమార్, భూమేశ్ పాల్గొన్నారు. -
తేనెటీగల దాడిలో పలువురికి గాయాలు
బిచ్కుంద(జుక్కల్): మహాత్మా బసవేశ్వర జయంతి ఉత్సవాల సందర్భంగా బిచ్కుంద పట్టణంలో సోమవారం లింగాయత్ సమాజ్ జెండా ర్యాలీ నిర్వహించారు. మందిరం వద్ద జెండా ఆవిష్కరణ సమయంలో తేనెటీగలు ఒక్కసారిగా ప్రజలపై దాడి చేశాయి. దీంతో ప్రజలు వాహనాలు వదిలి పరుగులు తీశారు. ఎనిమిది మంది గాయపడ్డారు. ర్యాలీలో ఏర్పాటు చేసిన డీజే శబ్దాలతోనే తేనెటీగలు గుంపుగా లేచి దాడిచేసినట్లు తెలుస్తోంది. బాధితులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. మాక్లూర్: ఆలూర్ మండలం రాంచంద్రాపల్లి గ్రామ పంచాయతీ ట్రాక్టర్కు ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పటించారు. దీంతో సర్పంచ్ తొగరి భూషన్ సోమవారం మాక్లూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై రాజశేఖర్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. గుర్తు తెలియని వ్యక్తులు ఉద్దేశపూర్వకంగానే నిప్పంటించినట్లు అనుమానం వ్యక్తంచేశారు. కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నట్టు ఎస్సై తెలిపారు. ఆలూర్ ఎంపీడీవో గంగాధర్ దగ్ధమైన జీపీ ట్రాక్టర్ను పరిశీలించారు. ప్రత్యేక శ్రద్ధతో విచారించి నిందితులను పట్టుకోవాలని ఎస్సై రాజశేఖర్తో చెప్పారు. -
బాల్య వివాహాలను ప్రోత్సహిస్తే రెండేళ్ల జైలు
బోధన్టౌన్(బోధన్): బాల్య వివాహాలు చేసినా, ప్రోత్సహించినా చట్టం ప్రకారం రెండేళ్ల జైలు శిక్ష, రూ. లక్ష వరకు జరిమానా ఉంటుందని డీహెచ్ఈడబ్ల్యూ జిల్లా సమన్వయకర్త స్వప్న హెచ్చరించారు. పట్టణంలోని రాకాసీపేట్, గాంధీగర్నగర్ కాలనీ అంగన్వాడీ సెంటర్లలో మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో ‘బేటీ బచావో.. బేటీ పఢావో’ కార్యక్రమంలో భాగంగా బాల్య వివాహాలపై అవగాహన కల్పించారు. ఈ సఽందర్భంగా స్వప్న మాట్లాడుతూ బాల్య వివాహాలతో అనేక అనర్థాలు జరుగుతాయని, ఆడపిల్లల చదువు కుంటుపడుతుందని, అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని అన్నారు. మహిళలంతా ఏకమై బాల్య వివాహాలను నిర్మూలించేందుకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో సూపర్వైజర్ రాధిక, అంగన్వాడీ టీచర్లు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
వర్సిటీ పాలకమండలి సభ్యులకు సన్మానం
తెయూ(డిచ్పల్లి) : నూతనంగా నియామకమైన తె లంగాణ యూనివర్సిటీ పాలకమండలి (ఈసీ) స భ్యులను సోమవారం వీసీ ప్రొఫెసర్ టి.యాదగిరి రావు, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం.యాదగిరి వర్సిటీలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వీసీ, రి జిస్ట్రార్లు యూనివర్సిటీ పనితీరు, కొనసాగుతు న్న అభివృద్ధి పనులను ఈసీ మెంబర్లకు వివరించా రు. వర్సిటీ అభివృద్ధికి అన్నివేళలా అందుబాటులో ఉంటామని ఈసీ మెంబర్లు హామీ ఇచ్చారు. అనంతరం ఈసీ మెంబర్లు వీసీ, రిజిస్ట్రార్లను శాలువా లతో సత్కరించారు. కార్యక్రమంలో నూతన పాలకమండలి సభ్యులు ప్రొఫెసర్ సీహెచ్ ఆంజనేయులు (తెయూ), ఆర్.సుధాకర్గౌడ్ (తెయూ, సౌత్ క్యాంపస్), కే సంజీవరావు (గౌతమి పీజీ కాలేజీ), దండు స్వామి (జీజీసీ), మదన్ మోహన్ దేవబక్తుని (ఇందూరు పీజీ కాలేజీ), చెరుకూరి రజినీకాంత్ (కాకతీయ విద్యాసంస్థలు), అల్లె లావణ్య (సాలూరా), మహమ్మద్ ఘాజీ (కామారెడ్డి), డాక్టర్ ఎస్.జయంత్ (అనురాగ్ యూనివర్సిటీ)తోపాటు అసిస్టెంట్ రిజిస్ట్రార్ సాయాగౌడ్ పాల్గొన్నారు. -
యూనివర్సిటీ వార్షికోత్సవ బ్రోచర్ ఆవిష్కరణ
● ముఖ్యఅతిథిగా హాజరుకానున్న ఎమ్మెల్సీ గోరటి వెంకన్నతెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీలో ఈ నెల 22న నిర్వహించబోయే వార్షికోత్సవ వేడుకలకు సంబంధించిన బ్రోచర్ను సోమవారం తన చాంబర్లో వర్సిటీ వీసీ ప్రొఫెసర్ టి.యాదగిరిరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వార్షికోత్సవానికి ఎమ్మెల్సీ, ప్రజావాగ్గేయకారుడు గోరటి వెంకన్న ముఖ్యఅతిథిగా హాజరవుతున్నారని అన్నారు. వార్షికోత్సవ కమిటీలన్నీ త్వరితగతిన పనులు పూర్తిచేసి వేడుకల నిర్వహణలో ఎలాంటి లోపాలు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో కమిటీల కన్వీనర్లు రాంబాబు, లావణ్య, సీహెచ్ ఆరతి, కే అపర్ణ, డాక్టర్ బాలకిషన్, డాక్టర్ నందిని తదితరులు పాల్గొన్నారు. -
దొడ్డు రకాలపై ఆందోళన వద్దు
మోర్తాడ్: యాసంగి సీజన్కుగాను సాగు చేసిన దొడ్డు రకం ధాన్యం కొనుగోలు చేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని విత్తనాభివృద్ధి సంస్థ డైరెక్టర్ రొక్కం మురళి అన్నారు. దొడ్డు రకాల కొనుగోలుపై రెండు రో జుల్లో సానుకూలమైన సమాధానం వస్తుందని ఆయన వెల్లడించారు. మంగళవారం తిమ్మాపూర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నాయకులు చిన్న రాజేశ్వర్, అజారొద్దీన్, మహేశ్ తదితరులు పాల్గొన్నారు. బోధన్టౌన్(బోధన్): తెలంగాణ రాష్ట్ర మైనారిటీ హక్కుల పోరాట సమితి నిజామాబాద్ జిల్లా కన్వీనర్గా బోధన్ పట్టణానికి చెందిన మహమ్మద్ అబ్దుల్ బషీర్ ఎన్నిక అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నాపై నమ్మకంతో జిల్లా కన్వీనర్గా నియమించిన రాష్ట్ర అధ్యక్షులు అబ్దుల్ వాహబ్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మహమ్మద్ వసీమ్లకు ధన్యావాదాలు తెలిపారు. డిచ్పల్లి: మండలంలోని ధర్మారం(బి) గ్రామంలో శ్రీదేవీ శ్రీభూదేవీ సహిత వేంకటేశ్వరస్వామి దేవాలయ సముదాయముంలో ఆలయాల 14వ వార్షికోత్సవాలు మంగళవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రీవిజయగణపతి, శ్రీఅభయాంజనేయ స్వామి, నవగ్రహ అభిషేకాలు, శ్రీగణపతి పూజ, స్వస్తి పుణ్యాహవాచనము, గోపూజ, ధ్వజారోహణం, ధ్వజారోహణం, ఉమా మహేశ్వర స్వామి వారికి రుద్రాభిషేకం, అన్నపూజ నిర్వహించారు. సాయంత్రం ఆదిశంకరాచార్య జయంతి నిర్వహించిన తర్వాత కనుల పండువగా శివపార్వతుల కల్యాణం నిర్వహించారు. అన్న పూజలో హంపీ పీఠాథిపతి విరూపాక్ష విద్యారణ్య భారతి స్వామి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు అనుగ్రహ భాషణం ఇచ్చారు. ఆలయ కమిటీ నిర్వాహకులు రావుల బ్రహ్మనందం, సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. లక్ష్మీనరసింహస్వామి ఉత్సవాల్లో మానాల..కమ్మర్పల్లి: కమ్మర్పల్లి మండలం శ్రీరాజరాజేశ్వరీనగర్లో శ్రీలక్ష్మీనరసింహస్వామి ఉత్సవాల్లో మంగళవారం రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్రెడ్డి పాల్గొన్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు. కాంగ్రెస్ మండలాధ్యక్షుడు సుంకెట రవి, నాయకులు కొమ్ముల రవీందర్రెడ్డి, సర్పంచ్ శైలేందర్, భాస్కర్, తిప్పిరెడ్డి శ్రీను తదితరులున్నారు. నిజామాబాద్అర్బన్: నగరంలోని పోలీస్ కమిషనర్ కార్యాలయంలో బదిలీపై వెళ్తున్న అదనపు డీసీపీ బస్వారెడ్డిని సీపీ సాయిచైతన్య మంగళవారం ఘనంగా సన్మానించారు. నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. సీపీ సాయి చైతన్య బస్వారెడ్డికి జ్ఞాపికను అందజేశారు. కార్యక్రమంలో సెక్యూరిటీ కౌన్సిల్ సభ్యులు కవితా రెడ్డి, రజినీకాంత్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ప్రతి రకం కొనుగోలు చేయాలి
రైతులు ఏరకం వరి పండించినా అన్ని రకాలను కొనుగోలు చేయాలి. మిల్లర్లు ధాన్యంను అన్లోడింగ్ చేసుకోకపోతే కఠిన చర్యలు తీసుకోవాలి. దొడ్డు రకాలను తూకం వేయకపోవడంతో వాతావరణం మారి ఏమైనా నష్టం జరిగితే రైతుల శ్రమ వృథా అవుతుంది. – పాపాయి పవన్, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్, మోర్తాడ్ ప్రభుత్వం పునరాలోచన చేయాలి దొడ్డు రకాలకే ఏ గ్రేడ్ ధర అమలు చేస్తున్నారు. దొడ్డు రకాలను కొనుగోలు చేయకపోతే అర్థమేలేదు. ప్రభుత్వం పునరాలోచన చేసి కొనుగోళ్ల కోసం స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలి. రైతులు కొనుగోలు కేంద్రాలకు వెళ్లి నిరాశతో తిరిగి వస్తున్నారు. – దడివె మోహన్, రైతు, మోర్తాడ్ -
ప్రతి గింజ కొంటున్నాం..
నిజామాబాద్ రూరల్: రైతులు పండించిన ప్రతి గింజను రాష్ట్ర ప్రభుత్వమే మద్దతు ధరతో కొనుగోలు చేస్తుందని రూరల్ ఎమ్మెల్యే డా.ఆర్.భూపతిరెడ్డి పే ర్కొన్నారు. మంగళవారం మోపాల్ మండలం ఎల్లమ్మకుంట గ్రామంలో బాడ్సి పీఏసీఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రా న్ని మంగళవారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఇందిరమ్మ లబ్ధిదారు సునీత– సుధాకర్ గృహ ప్రవేశంలో పాల్గొన్నారు. ప్రభుత్వం జిల్లాలో 739 కొనుగో లు కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సాయరెడ్డి, ిపీసీసీ డెలిగేట్ శేఖర్ గౌడ్, సర్పంచ్ ఫోరం జిల్లా అధ్యక్షుడు మునిపల్లి సాయిరెడ్డి, తారాచంద్ నాయక్,డివిజన్ నంబర్ 1 కార్పొరేటర్ అగ్గు భోజన్న, సర్పంచులు, నా యకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. చెక్డ్యాంకు మరమ్మతులు చేయించాలని వినతి సిరికొండ: మండలంలోని గడ్కోల్ గ్రామానికి చెందిన రైతులు ఎమ్మెల్యే భూపతిరెడ్డిని మంగళవారం కలిసి చెక్డ్యాంకు మరమ్మతులు చేయించాలని వి న్నవించారు. వర్షాకాలంలోపు మరమ్మతులు చే యించకపోతే మరిన్ని ఇబ్బందులు పడుతామని వా రు వాపోయారు. డీసీసీ ప్రధాన కార్యదర్శి వెల్మ భా స్కర్రెడ్డి, రైతులు కట్ట పెద్ద గంగారం, మంగళి స దానంద్, పెండ్లి రాములు, నర్సయ్య ఉన్నారు. నిజామాబాద్ రూరల్: ధర్పల్లి మండలం రేకులపల్లి గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఇందుకు కృషి చే సిన ఎమ్మెల్యే భూపతి రెడ్డిని స్థానిక సర్పంచ్ రాజేందర్, గ్రామాభివృద్ధి కమిటీ చైర్మన్ నారాయణ పలువురు గ్రామస్తులు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం గ్రామంలోని పలు సమస్యలపై ఎమ్మెల్యేకు వినతిపత్రం అందించారు. -
ఇటుక బట్టీ కార్మికులకు గుర్తింపుకార్డులు
రెంజల్(బోధన్): మండలంలోని ఇటుక బట్టీల్లో పని చేసే అసంఘటిత కార్మికులకు గుర్తింపు కార్డుల ను అందిస్తున్నట్లు తహసీల్దార్ శ్రావణ్కుమార్ తెలిపారు. మండలంలో 6 ఇటుక బట్టీలు ఉండగా అందులో సుమారు 26 మంది కార్మికులు ఉన్నట్లు గుర్తించినట్లు పేర్కొన్నారు. మంగళవారం తహసీల్దార్ కార్యాలయానికి జిల్లా సహయ కార్మిక శాఖ సిబ్బందిని పిలిపించి కార్మికుల వివరాలను నమో దు చేయించారు. కార్మికులకు సంబంధించిన ఆధా ర్కార్డు, బ్యాంకు ఖాతా పుస్తకం, రేషన్కార్డు, పాస్ఫోటోలతో మీసేవ కేంద్రాల్లో ఇటుక బట్టీ నిర్వాహకులచే దరఖాస్తు చేయించారు. జిల్లా సహయ కార్మి క శాఖ అధికారి పరిశీలించే కార్డును జారీ చేస్తారని పేర్కొన్నారు. కార్డు లభించిన మహిళా కార్మికులకు మొదటి, రెండవ ప్రసవాలకు రూ. 30 వేల చొప్పున, మహిళా కార్మికుల ఇద్దరు కుమార్తెలకు ఒక్కొక్కరికి రూ. 30 వేలతో పాటు ప్రసవ సమయంలో సైతం రూ. 30 వేల చొప్పున అందించడం జరుగుతుందన్నారు. కార్మికులు సహజ మరణం పొందితే రూ. లక్షా 30 వేలు, ప్రమాదావశాత్తు మృతిచెందితే రూ. 6 లక్షల 30 వేలు, అంగవైకల్యానికి గురైతే రూ. 30 వేల నుంచి 5 లక్షల వరకు ప్రభుత్వం కార్మిక శాఖ ద్వార పరిహారం అందిస్తుందన్నారు. కార్మికులందరు ఈ అవకాశాన్ని సద్వినియోగించుకునేలా ఇటుక బట్టీల నిర్వాహకులు చర్యలు తీసుకోవాలని సూచించారు. -
డ్రగ్స్ నిరోధానికి విస్తృత స్థాయిలో అవగాహన
● అదనపు కలెక్టర్ కిరణ్కుమార్ ● నగరంలో మత్తు పదార్థాల నిరోధక కమిటీ జిల్లా స్థాయి సమావేశం నిర్వహణ నిజామాబాద్ అర్బన్: డ్రగ్స్ (మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాల) నిరోధానికి విస్తృతస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ అన్నారు. నగరంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో మంగళవారం అదనపు కలెక్టర్ అధ్యక్షతన మత్తు పదార్థాల నిరోధక కమిటీ జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. మత్తు పదార్థాల నియంత్రణకు చేపట్టిన చర్యలపై చర్చించి, ఇకపై అవలంభించాల్సిన విధానాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. మాదక ద్రవ్యాల వల్ల కలిగే దుష్పరిణామాల గురించి ప్రజలలో అవగాహన పెంపొందించేందుకు సామాజిక మాధ్యమాలతో పాటు అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకోవాలని సూచించారు. నిరంతర దాడులు కొనసాగిస్తూనే, మత్తు పదార్థాల పట్ల ప్రజల్లో అవగాహన పెంపొందిస్తూ వారిని చైతన్యపర్చాల్సిన అవసరం ఉందని అన్నారు. ఎక్కడైనా గంజాయి, క్లోరల్ హైడ్రేట్, డైజోఫామ్, అల్ఫ్రాజోలం వంటి వాటి రవాణా, విక్రయాలు జరుగుతున్నట్లు గమనిస్తే వెంటనే సంబంధిత శాఖల అధికారులకు సమాచారం అందించాలని, టోల్ఫ్రీ నంబర్ 1908కు ఫోన్ చేసి సమాచారం తెలియజేయాలని సూచించారు. యాంటీ నార్కోటిక్స్ బ్యూరో నిజామాబాద్ జోన్ ఏసీపీ సోమనాథం, ఏసీపీ ప్రకాష్, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి, జిల్లా ఔషధ నియంత్రణ అధికారిణి శ్రీలత, డీఐఈవో రవికుమార్, ఎంవీఐ శ్రీనివాస్, కలెక్టరేట్ సూపరింటెండెంట్ భాస్కర్, సైకియాట్రిస్ట్ రవితేజ తదితరులు పాల్గొన్నారు. -
విమాన టికెట్ ధరలకు రెక్కలు
● యుద్ధ పరిస్థితులు కొలిక్కి రాకపోవడంతో ఇబ్బందులు ● గల్ఫ్ దేశాలకు ప్రయాణంపై తీవ్ర ప్రభావం ● రెండు, మూడింతలుగా చార్జీల వడ్డన మోర్తాడ్: పశ్చిమాసియాలో శాంతి చర్చలు ఇంకా కొలిక్కి రాకపోవడంతో ఆ ప్రభావం గల్ఫ్ దేశాలకు వెళ్లే వలస కార్మికులపై తీవ్రంగా పడుతోంది. శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి బహ్రెయిన్, కువైట్కు మినహా ఇతర గల్ఫ్ దేశాలకు వెళ్లే విమానాల టికెట్ ధరలు రెండుమూడింతలు పెరిగాయి. విమానయాన సంస్థలు ఊహించని విధంగా చార్జీలను పెంచడంతో వలస కార్మికులు ఆర్థిక భారాన్ని అధికంగా మోయాల్సి వస్తోంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ), ఒమన్, ఖతర్, సౌదీ అరేబియా దేశాలకు చార్జీలు సాధారణం కన్నా ఎక్కువగా పెరిగాయి. బహ్రెయిన్, కువైట్ దేశాలకు ఇంకా విమాన సర్వీసులు పునః ప్రారంభం కాలేదు. విమానయాన సంస్థలపై నియంత్రణ లేకపోవడంతోనే చార్జీలను రెండు, మూడింతలుగా పెంచారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గల్ఫ్ దేశాలకు వెళ్లే విమానాల్లో ఎక్కువ సంఖ్యలో వలస కార్మికులే ఉంటారు. విదేశాంగ శాఖతో పాటు పౌర విమానయాన మంత్రిత్వ శాఖలు స్పందించి వలస కార్మికులపై ఆర్థిక భారం తగ్గించేలా చొరవ తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. ఆయా దేశాలకు విమాన చార్జీలుదేశం సాధారణ రోజుల్లో.. ప్రస్తుతం యూఏఈ రూ.11వేల నుంచి రూ.13వేలు రూ.28వేల నుంచి రూ.33వేలు ఒమన్ రూ.6వేల నుంచి రూ.12వేలు రూ.20వేల నుంచి రూ.30వేలు ఖతర్ రూ.12వేల నుంచి రూ.20వేలు రూ.40వేల నుంచి రూ.50వేలు సౌదీ రూ.12వేల నుంచి రూ.15వేలు రూ.20వేల నుంచి రూ.25వేలు -
కుమారుడి చేతిలో తండ్రి హతం
నవీపేట : మండలంలోని మాన్సింగ్తండాకు చెందిన రాథోడ్ మురళి(45)తన కుమారుడు రా థోడ్ రాజేశ్ చేతిలో హత్యకు గురైనట్లు ఎస్సై శ్రీ కాంత్ మంగళవారం తెలిపారు. ఆయన కథనం మేరకు...మాన్సింగ్ తండాకు చెందిన రాథోడ్ రా జేశ్ మద్యానికి బానిసై తరచూ తల్లిదండ్రులతో గొడవపడేవాడు. ఎప్పటిలాగే సోమవారం రాత్రి మద్యం తాగి వచ్చి రాజే శ్ తల్లి లక్ష్మి, పిన్ని లతలతో గొడవపడ్డాడు. ఇంట్లో ఉన్న తండ్రి రాథోడ్ మురళి అడ్డు వెళ్లగా రాయితో అతడి తలపై రాజేశ్ బలంగా కొట్టాడు. తీ వ్ర రక్తస్రావం కావడంతో జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి తరలించారు. చికి త్స పొందుతూ మంగళవారం సాయంత్రం మృతి చెందాడు. మృతుడి భార్య లక్ష్మి ఫిర్యాదు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు. అక్బర్నగర్ వద్ద ఆటో బోల్తా రుద్రూర్: మండలంలోని అక్బర్నగర్ శివారులో మంగళవారం సాయంత్రం ప్రమాదవశాత్తు ఆటో బోల్తా పడిన ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వర్ని నుంచి ఆటో వస్తుండగా మూల మలుపు వద్ద ప్రమాదం జరిగింది. రుద్రూర్కు చెందిన లక్ష్మి, దత్తు, ఐదేళ్ల బాబుతో పాటు మరికొందరు గాయపడినట్లు స్థానికులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. -
ఆర్టీసీ కార్మికుల సమ్మె
● మంగళవారం అర్ధరాత్రి నుంచే బస్సులు బంద్నిజామాబాద్ రూరల్: ప్రభుత్వంతో జరిపిన చర్చ లు విఫలం కావడంతో ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగారు. దీంతో మంగళవారం అర్ధరాత్రి నుంచే జి ల్లాలో ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ సంస్థలోని 10 యూనియన్లు ఒకతాటిపైకి రావడంతో కార్మికులందరు ఏకమై సమ్మెకు పిలుపునిచ్చారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, కార్మిక సంఘాల పునరుద్ధరణ, ఎలక్ట్రిక్ బస్సుల వ్యవహారంపై సీఎం స్పందించాలంటూ ఇటీవల కార్మికులు కోరిన విషయం తెలిసిందే. కానీ ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో కార్మికులు సమ్మెకు పిలుపునిచ్చారు. ఇదిలా ఉండగా ఆర్టీసీలోని ప్రయివేట్ బస్సులను మాత్రం యథావిధిగా నడపనున్నట్లు యజమానులు తెలిపారు. -
సంక్షిప్తం..
పనుల్లో నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలి వర్ని: అభివృద్ధి పనుల్లో నాణ్యతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని నాణ్యత లోపిస్తే అధికారులు, కాంట్రాక్టర్పై శాఖ పరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి హెచ్చరించారు. మంగళవారం మండలంలోని వకీల్ఫా రం గ్రామంలో రూ. 20 లక్షల వ్యయంతో నిర్మాణం చేపట్టనున్న గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. వర్ని ఏఎంసీ చైర్మన్ సురేష్ బాబా, పీసీసీ డెలిగేట్ రాజిరెడ్డి, సర్పంచులు శ్రీనివాసరావు, బాల్ సింగ్, నాయకులు గిరి, వీర్రాజు పాల్గొన్నారు. పనులు వేగవంతం చేయాలి బోధన్టౌన్(బోధన్): అమృత్ 2.0 పథకం కింద చేపట్టిన పట్టణ శివారు బైపాస్ రోడ్డులో గల ఫాండు చెరువు పునరుద్ధరణ పనులను వేగవంతం చేయాలని అధికారులను సబ్ కలెక్టర్ వికాస్ మహతో ఆదేశించారు. మంగళవారం బల్దియా కమిషనర్ జాదవ్ కృష్ణతో కలిసి పాండు చెరువు పునరుద్ధరణ పనులను పరిశీలించారు. చెరువులోకి మురికి నీరు రాకుండా చూడాలని, వాటిని మురికి కాలువల్లోకి మళ్లించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. డంపింగ్ యార్డులో జరుగుతున్న ప్లాస్టిక్ వ్యర్థ్ధాల ప్రాసెసింగ్ యూనిట్ నిర్మాణ పనులను పర్యవేక్షించారు. డీఈ యోగేష్ సిబ్బంది ఉన్నారు. కళాకారులను ఆదుకోవాలి నిజామాబాద్ రూరల్: కళాకారులను ప్రభుత్వం ఆదుకోవాలని ప్రజానాట్య మండలి జిల్లా అధ్యక్షుడు సిర్పలింగం అన్నారు. నగరంలోని మల్లు స్వరాజ్యం ట్రస్ట్ కార్యాలయంలో మంగళవారం జిల్లా కమిటీ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కళాకారులకు, ప్రమాద బీమా, ఉద్యోగ అవకాశాలు, పెన్షన్, ఇళ్ల స్థలాలు అందించాలన్నారు. ఇటీవల హైదరాబాద్లో జరిగిన ప్రజానాట్య మండలి రాష్ట్ర మూడో మహాసభల్లో తనను రాష్ట్రకమిటీ ఉపాధ్యక్షుడిగా, అలాగే రాష్ట్ర కమిటీ సభ్యులుగా జిల్లాకు చెందిన నర్సారెడ్డి, మహిళా విభాగంలో విజయమాలను ఎన్నుకున్నట్లు తెలిపారు. అక్రమ ఇసుక రవాణాను అరికట్టాలి రుద్రూర్: పోతంగల్ మండలం మంజీరా నది పరివాహక ప్రాంతం నుంచి ఇసుక అక్రమంగా తరలిస్తుంటే అధికారులు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారని బీజేపీ, ఎమ్మార్పీఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం స్థానిక రైతులతో కలిసి వారు ఇసుక క్వారీలను పరిశీలించింనతరం అధికారుల నిర్లక్ష్య వైఖరిని తప్పుబట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... అక్రమ ఇసుక రవాణాను అరికట్టడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని మండిపడ్డారు. ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం వేల్పూర్/ఆర్మూర్టౌన్: వేల్పూర్ మండలం పచ్చలనడ్కుడ గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని స్థానిక సర్పంచ్ కొల్లె నర్సయ్య, ఉపసర్పంచ్ నచ్చన్నగారి రఘు, కాంగ్రెస్ నాయకులు మంగళవారం ప్రారంభించారు. ఆర్మూర్ పట్టణంలోని ధోబీఘాట్ వద్ద మంగళవారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో నాయకులు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఆర్మూర్ మున్సిపల్ వైస్చైర్మన్ కాటిపల్లి వెంకట్రెడ్డి, సొసైటీ కార్యదర్శి రాజేశ్వర్, ఆరు పంతాల సదర్లు, పెద్దకాపులు, కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షుడు గుడాల మోహన్, కిసాన్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు టక్కర్ గంగాధర్, ఐకేపీ సీసీ లక్ష్మీ, వీవోఏలు, రైతులున్నారు. -
తప్పులు లేకుండా జనగణన చేపట్టాలి
డిచ్పల్లి: జనగణనలో ఎలాంటి తప్పులు లేకుండా జాగ్రత్తగా వివరాలు నమోదు చేయాలని నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్రకుమార్ సూచించారు. డిచ్పల్లి మండలం ధర్మారం(బి) గ్రామంలోని జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో జనాభా లెక్కలు – 2027 లో భాగంగా జనగణన సర్వే ఎన్యుమరేటర్లు, సూ పర్వైజర్లకు గత మూడు రోజులుగా నిర్వహిస్తున్న తొలివిడత శిక్షణ మంగళవారం ముగిసింది. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడారు. ఎన్యుమరేట ర్లు, సూపర్వై జర్లు బాధ్యతాయుతంగా పని చేయాలని, సర్వేలో వారి పాత్ర ఎంతో కీలకమన్నారు. కా ర్యక్రమంలో డిచ్పల్లి తహసీల్దార్ కే.సతీష్రెడ్డి, ఏఎస్వో రవళి, ఎంఈవో నరేష్, ఆర్ఐ సంతోష్ , ట్రైన ర్లు, ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లతో ప్రతిజ్ఞ చేయించారు. -
ఇందూరు పసుపు ధర్మాబాద్ కారం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ఇందూరులో పెద్ద స్థాయిలో పసుపు మార్కెట్ నడుస్తుండడంతో ఇక్కడి పసుపునకు ప్రత్యేకత ఉంది. జిల్లాతోపా టు చుట్టుపక్కల జగిత్యాల, నిర్మల్ జిల్లాల్లో పండించిన పుసుపు నిజామాబాద్ వ్యవసాయ మా ర్కెట్ ద్వారా దేశవిదేశాలకు ఎగుమతి అవుతోంది. అయితే ఇందూరు పసుపు బ్రాండ్తోపాటు ధర్మాబాద్ కారం సైతం ఈ ప్రాంతంలో అంతే బ్రాండ్గా నిలుస్తోంది. ‘ఇందూరు పసుపు– ధర్మాబాద్ కారం’ ఇక్కడ స్పెషల్. నిజామాబాద్ జిల్లాలో కారం వ్యాపారులు సరిహద్దు మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో ఉన్న ధర్మాబాద్ పట్ట ణం పేరుతో ‘ధర్మాబాద్ కారం’ అని బ్రాండింగ్ చేస్తూ బిజినెస్ చేస్తున్నారు. జిల్లాకు ఆనుకుని మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో ఉన్న ధర్మాబా ద్ పట్టణానికి.. నిజామాబాద్ నగరానికి మధ్య రైల్వే సౌకర్యం ఉంది. దీంతో ప్రత్యేకంగా కారం కోసమే నిజామాబాద్, నిర్మల్, కామారెడ్డి జిల్లా ల నుంచి ధర్మాబాద్ వెళ్లడం నిత్యకృత్యంగా ఉంటోంది. దీంతో కారం రిటైల్ మార్కెట్ విషయంలో ధర్మాబాద్ తన ప్రత్యేకత నిలుపుకుంటూ వ స్తోంది. అనేక ఏళ్లుగా ధర్మాబాద్ అంటేనే కారం గుర్తుకొచ్చే పరిస్థితి. మహారాష్ట్రకు చివరి భాగంలో తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న ధర్మాబాద్ అనే చిన్న పట్టణం భారీ స్థాయిలో ఒక్క కారం విష యంలోనే రిటైల్ మార్కెట్లో ఇంతటి పేరు పొందడం విశేషం. ధర్మాబాద్ మహారాష్ట్రలో ఉన్నప్పటికీ నిజామాబాద్ జిల్లా ప్రజలు మా త్రం భావోద్వేగ అనుబంధం పెంచుకుని, అక్క డి కారంపై మమకారం చూపుతుండడం మరింత ప్రత్యేకం. వరంగల్, ఖమ్మం, గుంటూరు, హైదరాబాద్ నుంచి ధర్మాబాద్కు మిర్చి.. ధర్మాబాద్ కారం పరిశ్రమలకు తెలంగాణలోని వరంగల్, ఖమ్మం, మలక్పేట (హైదరాబాద్), ఏపీలోని గుంటూరు, మహారాష్ట్రలోని కొల్హాపూర్ మార్కెట్ల నుంచి మిర్చి వస్తుంది. ధర్మాబాద్ వ్యాపారులు ఆయా ప్రాంతాలకు వెళ్లి ఎండు మిర్చి కొనుగోలు చేసుకుని వస్తారు. వీటిలో తేజ, గుంటూరు రకాలు, సీ–5, 273 రకాలు ఉన్నాయి. ఇక్కడ కారంతో పాటు పసుపు, మసాలాలు సైతం రిటైల్గా భారీ స్థాయిలోనే అమ్ముతారు. కొవిడ్ తరువాత వ్యాపారం తగ్గింది కొవిడ్, లాక్డౌన్కు ముందు కారం వ్యాపారం భారీ స్థాయిలో ఉండేది. మా కారం పరిశ్రమలకు రెండు రాష్ట్రాల్లో గుర్తింపు ఉండేది. లాక్డౌన్ తరువాత నుంచి గతంలో మాదిరి వ్యాపారం లేకుండా పోయింది. మరోవైపు తెలంగాణ, ఏపీ మార్కెట్లలో ఎండు మిర్చి ధరలు బాగా పెరిగాయి. గతంలో క్వింటా మిర్చి రూ.12వేలు ఉండగా, ప్రస్తుతం రూ.22వేలు ఉంది. దీంతో వ్యాపారం ఆశించిన మేర చేయలేకపోతున్నాం. – మురళీధర్ నాగ్ల, ధర్మాబాద్ కారం వ్యాపారుల సంఘం అధ్యక్షుడు రెండు ప్రాంతాల మధ్య వీటికోసం ప్రత్యేకంగా ప్రయాణం కారం రిటైల్ మార్కెట్కు ధర్మాబాద్ ఫేమస్ పసుపుతో కళకళలాడుతున్న నిజామాబాద్ మార్కెట్ -
కాటేస్తున్న కుక్కలు
నిజామాబాద్జాగ్రత్తలు పాటించాలి రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతిఒక్కరూ తగిన జాగ్రత్తలు పాటించాలని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అన్నారు. బుధవారం శ్రీ 22 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026– 8లో uమాక్లూర్ మండలం కల్లెడి గ్రామానికి చెందిన ఐదేళ్ల బాలుడు బండారి నిహాన్ష్ 2023 డిసెంబర్ 25న తాత ధర్మయ్యతో కలిసి సరదాగా వ్యవసాయ క్షేత్రానికి వెళ్లాడు. మనవడు పొలం గట్టుపై కూర్చుని ఉండగా తాత పనిలో నిమగ్నమయ్యాడు. అంతలోనే గుంపుగా వచ్చిన కుక్కలు నిహాన్ష్పై దాడి చేశాయి. తీవ్ర గాయాలపాలైన నిహాన్ష్ను తల్లిదండ్రులు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా వైద్యులు చికిత్స అందించి వ్యాక్సిన్ వేశారు. మూడు రోజులకోసారి మరికొన్ని వ్యాక్సిన్లు వేయించాల్సి ఉంటుందని వైద్యులు సూచించారు. ఇంటికి వెళ్లిన మూడు రోజులకు నిహాన్ష్ తీవ్రజ్వరంతో బాధపడుతూ వాంతులు చేసుకోవడంతో తల్లిదండ్రులు అతడిని ప్రైవేట్ ఆస్పత్రికి అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలిస్తుండగా కన్నుమూశాడు. బాలుడి మృతి అందరినీ కలిచివేసింది. గుంపులు గుంపులుగా తిరుగుతున్న వీధి కుక్కలు వణికిస్తున్నాయి. ఏదో ఓ చోట పిల్లలతోపాటు పెద్దలపైనా దాడులు చేస్తున్నాయి. గత నెలలో ఏకంగా 52 మంది కుక్కల దాడిలో గాయపడి జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్స కోసం వచ్చారు. ఈనెలలో ఇప్పటికే 31 మంది కుక్కకాటుకు గురయ్యారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లిలో బాలికను కుక్కలు పీక్కుతున్న ఘటనతో ప్రజలు ఉలిక్కిపడ్డారు. -
సనాతన ధర్మాన్ని కాపాడుకుందాం
నిజామాబాద్ రూరల్: ప్రపంచ దేశాలకు ఆదర్శనీయమైన మన సనాతన ధర్మాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి కర్తవ్యమని పలువురు వక్తలు అన్నా రు. నగరంలోని నీలకంఠ బిస్తీ ఆధ్వర్యంలో శ్రీరా మ గార్డెన్లో హిందూ సమ్మేళనం నిర్వహించారు. సమ్మేళనానికి ఆర్ఎస్ఎస్ ఇందూర్ విభాగ్ సహకార్యవాహ వరంగంటి శ్రీనివాస్ హాజరై మాట్లాడారు. హిందువులకు తమ కర్తవ్యాన్ని గుర్తు చేయడం కోస మే హిందూ సమ్మేళనాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతి వ్యక్తి దేశ, దైవభక్తి కలిగి ఉండాలని ఇ స్కాన్ కంఠేశ్వర్ కేంద్ర వ్యవస్థాపక అధ్యక్షుడు రా మానంద రాయ్ గౌరదాస్ ప్రభుజీ అన్నారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అ లరించాయి. కార్యక్రమంలో హిందూ సమ్మేళన స మితి అధ్యక్షుడు ఉసెం రమేశ్రెడ్డి, ప్రధాన కార్య దర్శి గంగుల అశోక్, కోశాధికారి భాగవత పురుషోత్తం శర్మ, కార్యవర్గ సభ్యులు భూమేశ్వర్, చంద్రమోహన్, నాగేశ్వర్ రావు, గోపి, పాండురంగారా వు, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. నగరంలోని సీతారాంనగర్ కాలనీలో హిందూ సమ్మేళనం నిర్వహించారు. సమ్మేళనానికి మల్లారం గుట్ట ఆశ్ర మ వ్యవస్థాపకులు బాలయోగి పిట్లకృష్ణ మహరాజ్ హాజరై మాట్లాడారు. భారతదేశం కుటుంబ వ్యవస్థపై ఆధారపడి ఉందని అన్నారు. నగరంలోని నీల కంఠేశ్వర ఆలయంలో హిందూ సమ్మేళనం నిర్వహించారు. సమ్మేళనానికి తెలంగాణ సహప్రాంత ప్రచారక్ కల్పగురి ప్రభుకుమార్, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ హాజరై మాట్లాడారు. దేశ ధర్మ రక్షణకు రాష్ట్రీయ స్వయంసేవక సంఘం వందేళ్లుగా నిరంతరాయంగా కృషి చేస్తోందని, హిందూ సంస్కృతిని కాపాడటం ప్రతి హిందువు బాధ్య త అని వారు అన్నారు. కార్యక్రమంలో పలుగుట్ట ఆ శ్రమ వ్యవస్థాపకులు కేదారానంద స్వామీజీ, సేవి కా సమితి బౌద్ధిక్ ప్రముఖ్ కల్పన, హిందూ సమ్మే ళనం కమిటీ అధ్యక్షుడు విజయ్ కుమార్, నగర సే వ ప్రముఖ్ బాబురావు, కార్పొరేటర్లు నాగోల్ల లక్ష్మీనారాయణ, న్యాలం రాజు, అధ్యక్షులు గంగుల విజయ్ నాగోల్ల రవికుమార్, భక్తులు పాల్గొన్నారు. హిందూ సమ్మేళనాల్లో వక్తలు -
దొడ్డు ధాన్యానికి దిక్కెవరు?
● తాము తీసుకోలేమంటున్న మిల్లర్లు ● సేకరణకు ముందుకు రాని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు ● ఆందోళనలో రైతులు మోర్తాడ్(బాల్కొండ): దొడ్డు రకం ధాన్యం సాగు చేసిన రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చేసినా సేకరించేందుకు నిర్వాహకులు నిరాకరిస్తున్నారు. దీనికి ప్రధాన కారణంగా రైస్ మిల్లర్లు. అయితే రైస్ మిల్లుల నిర్వాహకులు మాత్రం తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరిస్తూ కొనుగోలు కేంద్రాల నుంచి దొడ్డు ధాన్యాన్ని దిగుమతి చేసుకోవడం లేదు. పశ్చిమాసియా దేశాల్లో యుద్ధ పరిస్థితుల కారణంగా దొడ్డు రకం ధాన్యాన్ని ఎగుమతి చేయలేకపోతున్నామని, ప్రభుత్వానికి ఇద్దామన్నా రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తోందని, ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో దొడ్డు ధాన్యంలో నూకశాతం ఎక్కువగా వస్తుందని అంటున్నారు. ఒక వేళ దొడ్డు రకం ధాన్యాన్ని తీసుకున్నా నిల్వ చేసుకునేందుకు అనువైన పరిస్థితులు లేవని తదితర కారణాలు చెబుతున్నారు. దీంతో యాసంగి సీజన్లో దొడ్డు రకం వరిని సాగు చేసిన రైతులకు గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. సుమారు 59వేల ఎకరాల్లో సాగు యాసంగి సీజన్లో సన్న రకాలను సాగు చేసే పరిస్థితులు ఉన్నా వాతావరణం, సాగునీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని రైతులు దొడ్డు రకాలను సాగు చేశారు. ఈ సీజన్లో సుమారు 59,834 ఎకరాల్లో దొడ్డు రకాలను సాగు చేశారు. కొనుగోలు కేంద్రాల ద్వారా 1.71లక్షల మెట్రిక్ టన్నుల దొడ్డు రకాలను సేకరించాలని లక్ష్యంగా నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వం రేషన్ వినియోగదారులకు సన్న బియ్యంను పంపిణీ చేస్తుంది. ఈ నేపథ్యంలో దొడ్డు రకాలను తాము తీసుకున్నా ప్రభుత్వానికి ఇచ్చే బియ్యంగా సన్న బియ్యం ఇస్తుండటంతో దొడ్డు రకాలను ఏమి చేయాలో అర్థం కావడం లేదని మిల్లర్లు చెబుతున్నారు. దొడ్డు రకాలను ఎగుమతి చేసుకోవడానికి అవకాశం ఉన్నా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అంతగా ఎగుమతి లేకపోవడం గమనార్హం. మిల్లర్ల తీరుతో కొనుగోలు కేంద్రాల్లో దొడ్డు రకాలు తూకం వేయడానికి నిర్వాహకులు అంగీకరించడం లేదు. ప్రభుత్వం స్పందించి దొడ్డు రకాల కొనుగోలుకు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. మోర్తాడ్ మండలం గాండ్లపేట్కు చెందిన రైతు గంగాధర్ తన పొలంలో యాసంగి సీజన్కుగాను దొడ్డు రకం వరిని సాగు చేశాడు. 185 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ఇటీవల మోర్తాడ్లోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయించేందుకు ధాన్యాన్ని తీసుకువెళ్తే.. దొడ్డు రకాలను ఇప్పట్లో కొనుగోలు చేయలేమని నిర్వాహకులు చెప్పారు. దొడ్డు రకం ధాన్యాన్ని రైస్మిల్లర్లు అన్లోడింగ్ చేసుకోకపోవడంతో కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు ముఖం చాటేస్తున్నారు. ఇది ఒక్క గంగాధర్కు ఎదురైన ఇబ్బంది కాదు. ఈ సీజన్లో దొడ్డు రకాలు సాగు చేసిన ప్రతి రైతూ దొడ్డురకం ధాన్యాన్ని విక్రయించుకోవడానికి నానా అవస్థలు పడుతున్నారు. -
ప్రమాదాల నివారణకు జాగ్రత్తలు పాటించాలి
● యువత డ్రగ్స్, ఆన్లైన్ బెట్టింగ్లకు దూరంగా ఉండాలి ● సీపీ సాయి చైతన్య బోధన్టౌన్ : ప్రమాదాల నివారణకు జాగ్రత్తలు పాటించాలని సీపీ సాయిచైతన్య అన్నారు. జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బోధన్ డివిజన్ పరిధిలో కొత్తగా ఎన్నికై న గ్రామ సర్పంచులు, కౌన్సిలర్లతో మన ఊరు – మన భద్రత – మన బాధ్యత కార్యక్రమాన్ని బోధన్లోని లయన్స్ క్లబ్ కంటి ఆస్పత్రి సమావేశపు హాల్లో మంగళవారం నిర్వహించారు. ఈకార్యక్రమానికి సీపీ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలు పాటించాలన్నారు. రైతులు రోడ్ల పై ధాన్యం ఆరబెట్టినప్పుడు భ ద్రత కోన్లు, బకెట్ పెట్టి స్టిక్కర్లు అంటించాలని అన్నారు. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్లు వాడకూడదన్నారు. యువత డ్రగ్స్కు, ఆన్లైన్ బెట్టింగ్కు దూరంగా ఉండాలన్నారు. రోడ్డు ప్రమాదాలతో ఎక్కువ మంది మృత్యువాత పడుతున్నారన్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాన్నారు. ఏసీపీ శ్రీనివాస్, సైబర్క్రైం ఏసీపీ వెంకటేశ్వర్రావు, ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ, మున్సిపల్ చైర్పర్సన్ తూము పద్మాశరత్రెడ్డి, వైస్ చైర్మన్ ఇలియాస్ అలీ, పట్టణ సీఐ వెంకటనారాయణ, ఎంవీఐ శ్రీనివాస్, రూరల్ సీఐ విజయ్బాబు, ఎన్ఎస్సీ ఎగ్జిక్యూటీవ్ మెంబర్ సాంబ శివరావ్, ఎన్ఎస్సీ మెంబర్ దుష్యంత్, కొడాలి కిశోర్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో కాకతీయ విద్యార్థుల ప్రతిభ
ఖలీల్వాడి: జేఈఈ మెయిన్స్ – 2026 ఫలితాల్లో ఇంటర్ చదువుతూ తొలి ప్రయత్నంలోనే ఆలిండియా ర్యాంకులను కాకతీయ విద్యార్థులు కై వనం చేసుకున్నట్లు కాకతీయ విద్యాసంస్థల డైరెక్టర్ రామోజీరావు మంగళవారం తెలిపారు. సీనియర్ ఇంటర్ విద్యార్థులు ఎస్ హేమ(132), రాఖీ(1,763), రమాదేవి(2,800), బీ సంధ్య(2984) ఆలిండియా ర్యాంకులు సాధించినట్లు ఆయన పేర్కొన్నారు. 10 మంది విద్యార్థులు జేఈఈ మెయిన్స్లో ఆలిండియా స్థాయి ర్యాంకులు సాధిస్తే 50 మంది విద్యార్థులు ఐఐటీ అడ్వాన్స్కు అర్హత సాధించారని అన్నారు. దీనికి కృషి చేసిన అధ్యాపక బృందానికి, ప్రోత్సాహాన్ని అందించిన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం కాకతీయ విద్యాసంస్థల డైరెక్టర్ సీహెచ్ తేజస్విని మాట్లాడుతూ.. ప్రాథమిక దశ నుంచే ఐఐటీ ఓరియెంటెడ్ కోచింగ్ ఇవ్వడంతోనే ఇంతటి అద్భుత ఫలితాలను సాధించగలిగామని అన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ సీహెచ్ రాజా, ఐఐటీ అకాడమిక్ డీన్ నాగరాజు, ప్రిన్సిపాళ్లు సందీప్ జ్యోత్స్న, బీ రణదీశ్, వైస్ ప్రిన్సిపాల్ శ్యామ్ తదితరులు ఉన్నారు. -
నీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకోవాలి
ధర్పల్లి: వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని డీపీవో శ్రీనివాస్ రావు సూచించారు. ధర్పల్లి మండల పరిషత్ కార్యాలయంలో ధర్పల్లి, సిరికొండ మండలాల పంచాయతీ కార్యదర్శులతో మంగళవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీపీవో మాట్లాడుతూ.. వేసవికాలం నేపథ్యంలో నీటి ఎద్దడి తలెత్తే అవకాశం ఉన్న గ్రామాలను ముందస్తుగా ప్రణాళికబద్దంగా మిషన్ భగీరథ నీరు క్రమం తప్పకుండా సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. తాగునీరు వృథా కాకుండా గ్రామాల్లో జీపీ అధికారులు ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. తాగునీటి ట్యాంకులకు ఎప్పటికప్పుడు శుభ్రం చేసి క్లోరినేషన్ చేయాలన్నారు. నర్సరీలోని మొక్కలను సంరక్షించి, గతంలో నాటిన ప్రతి మొక్క బతికేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో డీఎల్పీవో శ్రీనివాస్, ఎంపీడీవో లక్ష్మారెడ్డి, ఎంపీవోలు రాజేష్, తారాచంద్ , జీపీ సెక్రెటరీ లు తదితరులు పాల్గొన్నారు. -
అమ్మకు అక్షరమాలపై అవగాహన కల్పించాలి
● అమలు తీరుపై అధికారుల సమీక్షబోధన్: ఉల్లాస్ (అండర్ స్టాండింగ్ ఆఫ్ లైప్లాంగ్ లర్నింగ్ ఫర్ ఆల్ ఇన్ సొసైటీ) కార్యక్రమం కింద అమవుతున్న అమ్మకు అక్షరమాల కార్యక్రమం ప్రాధాన్యతపై నిరక్షరాస్యులకు అవగాహన కల్పించాలని జిల్లా వయోజన విద్య ఉపసంచాలకులు పురుషోత్తం సూచించారు. సోమవారం ఎడపల్లిలో వయోజన విద్య ఉద్యోగ, సిబ్బందితో కార్యక్రమం అమలు తీరుపై సమీక్షించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ 15 నుంచి 60 ఏళ్ల వయస్సు గల నిరక్షరాస్యులను గుర్తించి ఉల్లాస్ యాప్లో వారి పేర్లను నమోదు చేయాలన్నారు. కార్యక్రమం అమలులో అన్ని విభాగాల అధికారులతో సమన్వయంతో పని చేయాలన్నారు. మండలంలో ఎఫ్ఎల్ఎన్ఏటీ(ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ అసిస్మెంట్ టెస్ట్–పునాది అక్షరాస్యత , సంఖ్యా అంచనా పరీక్ష) ఇటీవల నిర్వహించగా, 1074 మందికిగాను 1038 మంది పరీక్షలకు హజరయ్యారని తెలిపారు. అనంతరం స్థానిక తహసీల్దార్ దత్తాద్రిని కలిసి కార్యక్రమం అమలు తీరు పై చర్చించారు. వివిధ శాఖల అధికారులు ఏపీవో అరుంధతి, ఏపీఎం రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. -
క్రీడలతో మానసిక, శారీరక చైతన్యం
● జిల్లా జడ్జి భారతలక్ష్మి ● అట్టహాసంగా నిజామాబాద్ ప్రీమియర్ లీగ్ –2026 ప్రారంభంనిజామాబాద్ అర్బన్: మానసిక, శారీరక చైతన్యానికి క్రీడలు ఎంతో దోహదపడతాయని జిల్లా జడ్జి భారతలక్ష్మి అన్నారు. నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘నిజామాబాద్ ప్రీమియర్ లీగ్ – 2026’ను జిల్లా కేంద్రంలోని ఉమె న్స్ కళాశాల గ్రౌండ్లో న్యాయమూర్తి సోమ వారం ప్రారంభించారు. ఉద్యోగుల్లో ముఖ్యంగా పోలీస్, న్యాయశాఖ వంటి శాఖల్లో ఉద్యోగులు విధి నిర్వహణలో ఎంతో ఒత్తిడి లోనవుతారని, ఇటువంటి పరి స్థితుల్లో శారీరక, మానసిక ఉత్సాహం కోసం ప్రతి ఒక్కరూ క్రీడల్లో పాల్గొనాలని సూచించారు. సీపీ సాయిచైతన్య, అదనపు ఎన్ఎస్ఈ కన్వీనర్, డీసీపీ (అడ్మిన్) జి బస్వారెడ్డి, అదనపు డీసీపీ (ఏఆర్) రామచంద్రరావు, ఎన్ఎస్ఈ జనరల్ సెక్రెటరీ డాక్ట ర్ కవితారెడ్డి , ట్రెజరర్ సంతోష్, స్పోర్ట్స్ కో ఆర్డినేటర్ శ్రీనివాస్రెడ్డి, జాయింట్ సెక్రెటరీ రజనీకాంత్, శివప్రసాద్, దుశ్శంత్, ఎన్ఎస్ఈ ఎగ్జిక్యూటీవ్ మెంబర్లు పాల్గొన్నారు. నిజామాబాద్, ఆర్మూర్, బోధ న్, సీటీసీ ట్రాఫిక్ ఏసీపీలు ప్రకాశ్, వెంకట్రెడ్డి, శ్రీనివాస్, రాజశేఖర్, మస్తాన్ అలీ, ఫోర్త్ అడిషనల్ జడ్జి దుర్గాప్రసాద్, సెకండ్ అడిష నల్ జడ్జి నారాయణ, పీడీఎం గోపీకృష్ణ, సీఐలు, ఎస్సైలు, అడ్వకేట్లు తదితరులు పాల్గొన్నారు. మొదటి మ్యాచ్లో పోలీస్ టీమ్ విన్ మొదటి మ్యాచ్లో న్యాయశాఖ జట్టుపై 44 పరుగు ల తేడాతో పోలీస్ టీమ్ గెలుపొందింది. మొదట పోలీస్ జట్టు బ్యాటింగ్చేసి 8 ఓవర్లలో ఒక వికెట్ కోల్పొయి 81 పరుగులు చేసింది, అనంతరం బ్యా టింగ్ చేసిన న్యాయశాఖ జట్టు 8 ఓవర్లలో కేవలం 37 పరుగులుచేయగా, 44 పరుగుల తేడాతో పోలీస్ జట్టు విజయం సాధించింది. -
ఆర్టీసీలో సమ్మె సైరన్!
● సంస్థ రక్షణ, డిమాండ్ల సాధన కోసం పోరుబాట ● రేపటినుంచి సమ్మెలోకి..● ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలి. ● 2021 వేతన సవరణను 30 శాతం ఫిట్మెంట్తో అమలు చేయాలి. 2025 వేతన సవరణ చేపట్టాలి. ● మహాలక్ష్మి డబ్బులు రూ. 400 కోట్లను నెలనెలా విడుదల చేయాలి. ● ఆర్టీసీ స్థలాలను ఈవీ బస్సుల కంపెనీలకు ఇవ్వొద్దు. ఎలక్ట్రిక్ బస్సులను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆర్టీసీకి ఇవ్వాలి. ● ట్రేడ్ యూనియన్లపై ఆంక్షలు ఎత్తివేసి, గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలి. ● ఆర్టీసీ ఉద్యోగులపై పనిభారం తగ్గించాలి. కండక్టర్, డ్రైవర్లపై కేఎంపీఎల్, ఏపీకే వేధింపులు మానుకోవాలి. ● 2019సమ్మె కేసులను ఎత్తేయాలి. ● రద్దీకనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచాలి. ● సంస్థలో అన్ని కేటగిరీలలో ఖాళీలను భర్తీ చేయాలి.సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ)లో చాలాకాలం తర్వాత కార్మికులు సమ్మెకు దిగుతున్నారు. ఆర్టీసీ రక్షణ, సమస్యల పరిష్కారమే ఎజెండాగా తెలంగాణ ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం నుంచి సమ్మెకు దిగుతున్నారు. ఒత్తిడిలో కార్మికులు... కామారెడ్డి డిపోలో 129 బస్సులు, బాన్సువాడ డిపోలో 94, ఆర్మూర్ డిపోలో 94 బస్సులు, బోధన్లో 118, నిజామాబాద్–1 డిపోలో 123, నిజమాబాద్–2 డిపోలో 89 కలిపి మొత్తంగా 647 బస్సులు నడుస్తున్నాయి. బస్సులు దాదాపు రోజూ 2.50 లక్షల కిలోమీటర్ల దూరం తిరుగుతుండగా, రూ. కోటిన్నర ఆదాయం వస్తోంది. అయితే ఖర్చులు తగ్గించుకునేందుకు ఆర్టీసీ యాజమాన్యం టిమ్స్ డ్యూటీలు పెంచుతూ ఇబ్బంది పెడుతోందని జేఏసీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఎనిమిది గంటలకు బదులు 12 నుంచి 16 గంటల దాకా పనిచేయిస్తున్నారని, స్పెషల్ ఆప్ కూడా ఇవ్వడం లేదని పేర్కొంటున్నారు. విరామం లేకుండా పనిచేయాల్సి రావడంతో డ్రైవర్లు, కండక్టర్లు ఇబ్బందులు పడుతున్నారంటున్నారు. మరోవైపు బస్సుల్లో 55 మంది ప్రయాణించా ల్సి ఉండగా మహాలక్ష్మి పథకం అమలులోకి వచ్చాక వంద నుంచి 120 మంది దాకా ప్రయాణిస్తున్నారు. దీంతో కండక్టర్లతోపాటు డ్రైవర్లు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డీలక్స్, సూపర్ లగ్జరీ బస్సుల డ్రైవర్లకే టికెట్ ఇచ్చే బాధ్యత ఉండడంతో వాహనం నడుపుతూ టికెట్లు ఇవ్వాల్సి రావడంతో వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పనిభారంతో కార్మికులు మానసికంగా, శారీరకంగా ఇబ్బంది పడుతున్నారని పేర్కొంటున్నారు. -
రైతన్నకు కడగండ్లు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: జిల్లాలో అకాల వర్షాలు కురుస్తుండడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. 20 రోజుల వ్యవధిలో మూడుసా ర్లు పంటలను నష్టపోవడం రైతుల పరిస్థితికి అద్దం పడుతోంది. ప్రకృతి ప్రకోపానికి జిల్లావ్యాప్తంగా 9,460 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. మొత్తం 6,793 మంది రైతులకు నష్టం వాటిల్లింది. పంట చేతికి వచ్చే సమయంలో వడగళ్లతో కురిసిన అకాల వర్షం కారణంగా కలిగిన నష్టానికి ప్రభుత్వం పరిహారం చెల్లించాలని రైతులు కోరుతున్నారు. జిల్లాలో అత్యధికంగా వరికి నష్టం వాటిల్లింది. మొక్కజొన్న, మామిడి, అరటి, బొప్పాయి. కూరగాయలు తదితర పంటలు కొద్దిమేర విస్తీర్ణంలో దెబ్బతిన్నాయి. అకాల వర్షం, వడగళ్ల కారణంగా పంటలు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నుంచి నష్టపరిహారం వస్తుందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి ఈనెల 5వ తేదీన ఓ ప్రకటన విడుదల చేశారు. రైతులు అధైర్యపడొద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు. ● ఈ నెల 5వ తేదీన కురిసిన అకాల వర్షం, వడగళ్లతో సిరికొండ, ధర్పల్లి, ఇందల్వాయి, డిచ్పల్లి, సాలూర మండలాల్లోని 22 గ్రామాల పరిధిలో 3,985 మంది రైతులకు చెందిన 6,088 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఇందులో అత్యధికంగా వరి 5,065 ఎకరాల్లో, మొక్కజొన్న 826 ఎకరాల్లో, మామిడి 138 ఎకరాల్లో, అరటి, కూరగాయలు 10 ఎకరాల్లో దెబ్బతిన్నాయి. ● గత నెల 31వ తేదీన కురిసిన అకాల వర్షానికి 14 మండలాల్లో 2,209 మంది రైతులకు చెందిన 2,559 ఎకరాల్లో వరి, మొక్కజొన్న, మామిడి, బొప్పాయి పంటలు దెబ్బతిన్నాయి. ఇందులో 95 శాతం వరి పంటే దెబ్బతినడం గమనార్హం. మార్చి 31వ తేదీన నిజామాబాద్ మార్కెట్ యార్డులో తడిసిన పసుపు కుప్పలుమార్చి 31న వీచిన ఈదురుగాలులకు నందిపేట మండలం బజార్కొత్తూర్లో నేలకొరిగిన నువ్వు దెబ్బ మీద దెబ్బ కొడుతున్న ‘అకాలం’ 20 రోజుల వ్యవధిలో మూడుసార్లు కన్నెర్రజేసిన ప్రకృతి జిల్లావ్యాప్తంగా 9,460 ఎకరాల్లో పంట నష్టం అత్యధికంగా నష్టపోయింది వరి రైతులే.. ఈ నెల 18, 19 తేదీల్లో వడగళ్లతో కురిసిన అకాల వర్షం కారణంగా సిరికొండ, ధర్పల్లి, ఇందల్వాయి మండలాల్లో 599 మంది రైతులకు చెందిన 813 ఎకరాల్లో వరి పంట దెబ్బతిన్నది. సిరికొండ మండలంలోని 9 గ్రామాల పరిధిలో 526 మంది రైతులకు చెందిన 691 ఎకరాల్లో, ధర్పల్లి మండలానికి చెందిన ఒక గ్రామంలో 28 మంది రైతులకు చెందిన 62 ఎకరాల్లో, ఇందల్యి మండలంలోని రెండు గ్రామాల్లో 45 మంది రైతులకు చెందిన 60 ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లింది. -
కథంతా కమీషన్ చుట్టే..
మాక్లూర్ మండలం నుంచి కదలని ధాన్యం బస్తాలుమాక్లూర్: ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభు త్వం ప్రారంభించి అధికారులపై వదిలేసింది. ఇక్కడే అసలు కథ మొదలైంది. ధాన్యం కాంటా, లోడింగ్కు కూలీలు ఎప్పటిలాగే సంచికి రూ.15 కమీషన్ తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నా.. కొందరు అధికారులు మాత్రం రూ.17 నుంచి రూ.18 వసూలు చేయాలని అటు కూలీలపై, ఆ మొత్తాన్ని చెల్లించాలని రైతులపై ఒత్తిడి చేస్తున్న ట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. సంచికి తమకు రూ.2 నుంచి రూ.3 చెల్లించాలని అప్పు డే కాంటా చేయిస్తామని అధికారులు కండీషన్ పెడుతున్నట్లు సమాచారం. తాము కమీషన్ అధికంగా వసూలు చేసి మీకెందుకు ఇవ్వాలని కూలీ లు అసలు కొనుగోలు కేంద్రాలకు రాని పరిస్థితి ఏర్పడింది. అటు రైతులు సైతం ఎప్పటిలాగే రూ.15 చెల్లిస్తామని చెబుతుండడంతో ధాన్యం కాంటా నిలిచిపోయింది. మాక్లూర్ సొసైటీ పరిధిలో సుమారు 15 రోజుల క్రితం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాగా.. ఇప్పటి వరకు ఒక్క గుంజ్లి కొనుగోలు కేంద్రంలో మాత్రమే కాంటా చేస్తూ ధాన్యాన్ని తరలిస్తున్నారు. ఇక్కడి రైతులు కమీషన్ రూ.18 వరకు చెల్లిస్తుండడంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం తరలుతోంది. కమీషన్ కండీషన్ పెట్టిన వారిలో ఒకరైన ఓ అధికారి తన సొంత లారీల ద్వారా ధాన్యాన్ని తరలిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. మండలంలోని ముల్లంగి(బి), గుత్ప, మా క్లూర్తోపాటు అదనంగా మరో 10 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. గుంజ్లి కొనుగోలు కేంద్రం నుంచి ధాన్యం తరలుతుండగా.. మిగ తా 12 చోట్ల మాత్రం రైతులకు పడిగాపులు తప్ప డం లేదు. చాలా కొనుగోలు కేంద్రాలకు ఇప్పటికీ హమాలీలు రాలేదు. కొన్ని కేంద్రాల్లో కొంత మేర ధాన్యం కాంటా అయినప్పటికీ అక్కడి నుంచి త రలించలేదు. ఒక్క గుంజ్లి కొనుగోలు కేంద్రం నుంచి మాత్రమే ఇప్పటి వరకు ధాన్యాన్ని రైస్మిల్లులకు తరలించారని, మిగతా కొనుగోలు కేంద్రాల్లో ఎందుకు కాంటా చేయడం లేదని రైతు లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్షాలు కురుస్తుండడంతో ధాన్యం తడవకుండా కాపాడు కునేందుకు నానా అవస్థలు పడుతున్నారు. అధికారుల తీరుతో విసుగెత్తిన చాలా మంది రైతులు ఇప్పటికే ప్రైవేట్ వ్యక్తులకు ధాన్యాన్ని విక్రయించినట్లు తెలుస్తోంది. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి మాక్లూర్ సొసైటీ పరిధిలోని కొనుగోలు కేంద్రాల్లో రూ.15 కమీషన్తో కాంటాలు జరిపించాలని రైతులు కోరుతున్నారు. హమాలీల కొరత వల్లే.. హమాలీల కొరత తీవ్రంగా ఉండటం వల్లే సంచికి రూ.15 బదులు రూ.18 కమీషన్ ఇవ్వాలని చెబుతున్నాం. ఇందులో మాకు రావాల్సింది ఏమీ ఉండదు. రూ.15 కమీషన్కు హమాలీలు ముందుకు రావడం లేదు. సంచికి రూ.18 చెల్లిస్తామంటేనే వస్తామంటున్నారు. అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో చేసేది లేక సంచికి రూ.18 కమీషన్ ఇస్తామని చెప్పి హమాలీలను తీసుకు వచ్చే పరిస్థితి ఏర్పడింది. ఇదే విషయం రైతులతో చెప్పాం. – స్వప్న, మాక్లూర్ సొసైటీ క్లస్టర్ అధికారిణి సంచికి రూ.17 నుంచి రూ.18 కమీషన్ చెల్లిస్తేనే కాంటా.. లేదంటే ఎక్కడి కుప్పలు అక్కడే లేబర్ చార్జీల్లోనూ కక్కుర్తి పడుతున్న అధికారులు! దిక్కుతోచని స్థితిలో రైతులు -
సర్కారు బడుల్లో సౌరకాంతులు
● జిల్లాలో 392 పాఠశాలల ఎంపిక ● 2 నుంచి 10 కిలో వాట్ల వరకు ● కిలో వాట్కు రూ.లక్ష చొప్పున నిధులు ఖలీల్వాడి: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యుత్ సమస్యను దూరం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. నాబార్డు నిధులతో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటుకు నిర్ణయించింది. ఫలితంగా విద్యుత్ బి ల్లుల భారం తప్పడమే కాకుండా అదనపు ఆదా యం సమకూరే అవకాశం ఉంది. జిల్లాలోని 392 పాఠశాలల్లో కొత్తగా సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీటిలో కేజీబీవీలు, మోడల్ స్కూళ్లు, ప్రభుత్వ, జెడ్పీహెచ్ఎస్, మండల పరిషత్, ప్రాథమికోన్నత, ప్రాథమిక స్కూళ్లు ఉన్నాయి. త్వరలో మిగితా వాటిలో కూడా ఏర్పాటు చేయనున్నారు. త్వరలోనే టెండర్లు.. పాఠశాలల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉచిత విద్యుత్ అమలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే విద్యుత్ సంస్థకు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. సోలార్ విద్యుత్ ఏర్పాటుతో ప్రభుత్వానికి బిల్లుల భారం తగ్గనుంది. సోలార్ ప్యానెల్స్ ద్వారా ఒక్కో పాఠశాలలో రెండు కిలోవాట్స్ విద్యుదుత్పత్తి చేయనున్నారు. ఒక కిలోవాట్కు రూ.50 వేల చొప్పున రెండింటికి కలిపి రూ.లక్ష వరకు ఖర్చవుతోంది. నిర్వహణ ఖర్చులను ప్రభుత్వం భరించనుంది. ఐదు సంవత్సరాలపాటు సంస్థతో నిర్వహణ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. త్వరలో ఇందుకు సంబంధించిన టెండర్లను ఆహ్వానించి పనులు ప్రారంభించనున్నారు. కాగా, సోలార్ ద్వారా ఉత్పత్తి అయిన విద్యుత్ను పాఠశాలల్లో అవసరం మేరకు వినియోగించుకొని, మిగిలిన విద్యుత్ను గ్రిడ్ ద్వారా విక్రయించే అవకాశం ఉంది. దీంతో పాఠశాలకు అదనపు ఆదాయం వస్తుంది. వచ్చిన నిధు లను పాఠశాల అభివృద్ధికి కేటాయించనున్నారు. మండలం పాఠశాలల సంఖ్య ఆలూర్ 07 ఆర్మూర్ 28 బాల్కొండ 09 భీంగల్ 16 బోధన్ 21 చందూర్ 01 ధర్పల్లి 12 డిచ్పల్లి 21 డొంకేశ్వర్ 03 ఇందల్వాయి 14 జక్రాన్పల్లి 15 కమ్మర్పల్లి 12 కోటగిరి 03 మాక్లూర్ 09 మెండోరా 07 మోర్తాడ్ 08 మోస్రా 03 మోపాల్ 16 నందిపేట్ 14 నవీపేట్ 15 సిరికొండ 15 వేల్పూర్ 14 వర్ని 09 ఎడపల్లి 16 ఏర్గట్ల 04 మండలాల వారీగా పాఠశాలలు సర్కారు బడులకు మేలు జిల్లాలో 392 పాఠశాలలకు సోలార్ ప్యానళ్లు ఏర్పాటు చేసేందుకు ఉత్తర్వులు వచ్చాయి. ఈ నిర్ణయంతో స ర్కారు బడులకు మేలు జరగనుంది. పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థ వీటి నిర్వహణ చేపట్టనుంది. కొన్ని పాఠశాలల్లో ఇదివరకు పైలెట్ ప్రాజె క్ట్ కింద ఏర్పాటు చేశారు. అది విజయవంతంగా కొనసాగుతున్నాయి. – పార్శి అశోక్, డీఈవో, నిజామాబాద్ -
పల్లె ఖజానాకు గండి
● మూడేళ్లలో రూ.7.91 కోట్లకు లెక్కల్లేవ్ ● లెక్క తప్పుతున్న ఖర్చులు ● పలు పంచాయతీల్లో అక్రమాలు డిచ్పల్లి(నిజామాబాద్రూరల్): జిల్లాలోని పలు గ్రామపంచాయతీల ఖర్చులు లెక్క తప్పుతున్నాయి. నిధులు భారీగా దుర్వినియోగవవుతున్నా యి. దుర్వినియోగమైన సొమ్మును ఖజానాలో జమ చేయించేలా ఆడిట్ శాఖ ఆదేశాలు జారీ చేస్తున్నప్పటికీ పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు త మకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఫలితంగా గత మూడేళ్లలో 16,621 అభ్యంతరాలకు సంబంధించి రూ.7.91 కోట్లకు లెక్కలు లేకుండాపోయాయి. పలు పనుల్లో అక్రమాలు 2023–24 ఆర్థిక సంవత్సరంలో జక్రాన్పల్లి మండలం అర్గుల్లో 20 అభ్యంతరాలకు సంబంధించి రూ.2.27 లక్షలకు లెక్కలు లేకుండా పోయాయి. అలాగే మునిపల్లిలో రూ. 1.79 లక్షలకు, తొర్లికొండలో రూ.41,620 సొమ్ముకు లెక్కలు లేవు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో కూడా జక్రాన్పల్లి మండలంలోని పలు గ్రామాల్లో అవకతవకలు జరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. 2024–25 సంవత్సరంలో జక్రాన్పల్లి మండలంలో ప్రత్యేక అధికారి పాలనలో పడకల్ గ్రామ పంచాయతీలో రూ.55,684 సొమ్ముకు లెక్కలు లేవని ఆడిట్ అధికారులు తేల్చారు. ఇదే గ్రామంలో 2021–22 ఆర్థిక సంవత్సరంలో రూ.7.31 లక్షల సొమ్ము దుర్వినియోగమైంది. ఇలా పరిశీలిస్తూ వెళ్తే జిల్లాలోని చాలా మండలాల్లో వందల సంఖ్యలో అభ్యంతరాలకు సంబంధించి రూ.లక్షల నిధులకు లెక్కలు లేకుండా పోయాయి. సర్పంచులతోపాటు ప్రత్యేక అధికారుల పాలనలో కుడా అవినీతి అక్రమాలు చోటుచేసుకున్నట్లు ఆడిట్ నివేదికలు తేటతెల్లం చేస్తున్నాయి. సంవత్సరం ఆడిటెడ్ జీపీలు అభ్యంతరాలు లెక్కలో లేని నిధులు 2022-23 530 7,308 1,93,42,669 2023-24 530 5,940 4,13,23,336 2024-25 530 3,373 1,54,46,503 16621 7,91,12,508ప్రతి ఏటా లక్షల్లో అక్రమాలుగ్రామ పంచాయతీలు సక్రమంగా పనిచేస్తే ప్రజలకు రోడ్లు, మురికి కాల్వలు, మౌలిక సదుపాయాలు సమకూరుతాయి. కానీ కొంతమంది సర్పంచులు ప్రజల సొమ్మును అప్పనంగా మింగేశారు. ఫలితంగా వేలల్లో ఆడిట్ అభ్యంతరాలు నమోదవుతున్నాయి. ఆడిట్శాఖ ప్రతి ఏడాది మే నెల నుంచి పంచాయతీలలో ఆడిట్ నిర్వహించి డిసెంబర్లో ప్రతి గ్రామపంచాయతీకి సంబంధించి సమగ్ర నివేదికను రూపొందించి ఉన్నతాధికారులకు సమర్పిస్తుంది. 60 రోజుల్లో సరైన బిల్లులు చూపించకపోతే చర్యలు తీసుకోనే అవ కాశం ఉంది. అయితే జిల్లాలో గత మూడేళ్లలో 16,621 అభ్యంతరాలకు సంబంధించి రూ.7.91 కోట్లకు లెక్కలు లేకుండా పో యాయి. సరైన బిల్లులు, ఆధారాలు చూపెట్టడంలో గ్రామ కార్యదర్శులు విఫలమవుతున్నారు. చాలా చోట్ల పనులు జరగకున్నా ఎంబీ రికార్డులు సృష్టించి బిల్లులు లేపుతున్నారు. -
ఆదర్శం.. నూత్పల్లి
సోమవారం శ్రీ 20 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026– 8లో uనూత్పల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం నూత్పల్లి.. ఎస్సారెస్పీలో ముంపునకు గురైన గ్రామాల్లో ఇదొకటి. డొంకేశ్వర్ మండలంలో ఉన్న ఈ గ్రామ పంచాయతీ ఇప్పుడు మోడల్ విలేజ్ను తలపిస్తోంది. దశాబ్దాల క్రితమే వేసిన మాస్టర్ ప్లాన్కు తోడుగా ఉపాధిహామీ పథకాన్ని వందశాతం ఉపయోగించుకొని అభివృద్ధికి బాటలు వేసుకుంది. వాణిజ్య పంటలు, పొలాల్లో కల్లాలు, విశాలమైన రోడ్లు, ఇంటికో చెట్టు, వీడీసీ వ్యవస్థ రద్దు, ప్లాస్టిక్ నిషేధం లాంటి నిర్ణయాలు గ్రామాన్ని జిల్లాలోనే ప్రత్యేకంగా నిలబెట్టాయి. పాలకుల సహకారం, ప్రజల భాగస్వామ్యంతో నూత్పల్లి ముందుకు దూసుకుపోతున్నది. డొంకేశ్వర్(ఆర్మూర్): శ్రీరామసాగర్ ప్రాజెక్టులో ముంపునకు గురైన నూత్పల్లి గ్రామాన్ని ఎగువ ప్రాంతంలో నిర్మించుకున్నారు. భవిష్యత్ను ఆలోచించి 1978లోనే ఇంజినీర్తో మాస్టర్ ప్లాన్ తయారు చేయించి ఇళ్ల స్థలాలు, రోడ్లను ఏర్పాటు చేసుకున్నారు. ఆనాడే ఇళ్లను విశాలంగా, ఒక క్రమ పద్ధతిలో నిర్మించుకున్నారు. పర్యావరణంపై మక్కువతో ప్రతి ఇంటి ఎదుట వేపచెట్లను పెంచి గ్రామాన్ని పచ్చదనంతో నింపేశారు. ఓపెన్ జిమ్, సొసైటీ గోదాములు, కమ్యూనిటీ భవనాలు, పాఠశాలలు, బ్యాంకులు సైతం ఏర్పడ్డాయి. ప్రభుత్వ పథకాలను వినియోగించుకోవడంలో ఈ గ్రామం జిల్లాలో ముందున్నది. ఉపాధిహామీ పథకంతో ఊరిలో అన్ని వీధుల్లో సీసీ రోడ్లు నిర్మించుకున్నారు. జిల్లాలో మరెక్కడా లేని విధంగా రైతుల సౌకర్యార్థం వారి తోటల్లోనే పంటలు ఆరబోసుకోవడానికి వందల్లో సీసీ కల్లాలు, పదుల సంఖ్యలో పశువుల షెడ్లు నిర్మించుకోవడం గమనార్హం. ఐహెచ్హెచ్ఎల్ పథకంలో భాగంగా ఇంటింటికీ మరుగుదొడ్లు, ఇంకుడు గుంతలు, తోటలకు మట్టి రోడ్లు నిర్మించుకున్నారు. వాణిజ్య పంటలు సాగు చేయడంలో నూత్పల్లి రైతులకు ప్రత్యేకత ఉంది. వంద ఎకరాల్లో పసుపు, మక్క, జొన్న, సజ్జ, ఆయిల్పాం, వరి పంటలు పండిస్తూ ఆర్థి కంగా ఎదుగుతు న్నారు. ఇప్పుడు ప్రతి రైతు ఇంటి ఎ దుట ఒక ట్రాక్టర్, కారు ఉంది. డొంకేశ్వర్ మండలంలోని నూత్పల్లి గ్రామ ముఖచిత్రంవీడీసీ రద్దు చేసి.. ప్లాస్టిక్ను నిషేధించి..గ్రామంలో అందరూ సమానమే అన్న భావనతో, ఎవరి పెత్తనం ఉండకూడదని కొన్ని నెలల కిందట వీడీసీ వ్యవస్థను రద్దు చేసుకున్నారు. దీంతో గ్రామ పంచాయతీ ద్వారానే ప్రజాస్వామ్యబద్ధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. అలాగే పర్యావరణ పరిరక్షణలో భాగంగా గ్రామంలో ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించి ఆదర్శంగా నిలిచారు. శుభకార్యాల్లో భోజనాల కోసం స్టీల్ ప్లేట్లు, గ్లాసులను గ్రామ పంచాయతీ ఉచితంగా అందిస్తోంది. దశాబ్దాల క్రితమే మాస్టర్ప్లాన్తో ఊరి నిర్మాణం విశాలమైన సీసీ రోడ్లు, ఇంటికో వేప చెట్టు ధాన్యం ఆరబోసేందుకు రైతుల తోటల్లో కల్లాలు ఉపాధి హామీ పథకాన్ని వందశాతం ఉపయోగించుకున్న ఏకై క గ్రామంగా పేరు ఇటీవల వీడీసీ వ్యవస్థ రద్దు, ప్లాస్టిక్ నిషేధంతో ప్రత్యేక గుర్తింపు -
సమష్టి కృషితోనే సుస్థిర అభివృద్ధి
పాలకుల సహకారం, ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామం ఇంతటి అభివృద్ధి సాధించింది. కలిసికట్టుగా తీసుకుంటున్న నిర్ణయాలతో ఊరిలో ఏ భేదాభిప్రాయాలు లేవు. వీడీసీ రద్దు, ప్లాస్టిక్ నిషేధం వంటి నిర్ణయాలు ప్రజల పూర్తి సహకారంతోనే సాధ్యమయ్యాయి. ప్రజల సంక్షేమం కోసం ఎలాంటి పని చేయడానికై నా గ్రామ పంచాయతీ సిద్ధంగా ఉంది. – సుకరంటి రాజారెడ్డి, సర్పంచ్ ఉపాధిహామీతో ఊరే మారిపోయింది దశాబ్దాల క్రితమే మాస్టర్ ప్లాన్ రూపొందించుకోవడం మా అదృష్టం. నేను సర్పంచ్గా పనిచేసిన కాలంలో ఉపాధిహామీ పథకాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాం. ఏ గ్రామంలో లేని విధంగా సీసీ రోడ్లు, కల్లాలు, ఇతర అభివృద్ధి పనులతో ఊరి రూపురేఖలు మారిపోయాయి. – కూనింటి రవి, మాజీ సర్పంచ్ గ్రామ వీధుల్లో ఇళ్ల ముందు వేప చెట్లు -
ప్రశాంతంగా మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష
ఖలీల్వాడి: మోడల్ స్కూళ్లలో ప్రవేశం కోసం ఆదివారం జిల్లా కేంద్రంలోని 11 కేంద్రాల్లో నిర్వహించిన పరీక్ష ప్రశాంతంగా ముగిసినట్లు డీఈవో పార్శి అశోక్ తెలిపారు. ఉదయం ఆరో తరగతి, మధ్యాహ్నం ఏడు నుంచి పదో తరగతి విద్యార్థులకు పరీక్ష నిర్వహించారు. ఆరో తరగతి విద్యార్థులు 1,365 మంది దరఖాస్తు చేసుకోగా 1,220 మంది హాజరయ్యారు. ఏడు నుంచి పదో తరగతి విద్యార్థులు 977 మంది దరఖాస్తు చేసుకోగా, పరీక్షకు 837 మంది హాజరయ్యారు. ఆర్మూర్, బాల్కొండ మోడల్ స్కూళ్లలోని పరీక్ష కేంద్రాలను డీఈవో పరిశీలించారు. మాచారెడ్డి : వడదెబ్బతో ఓ రైతు ప్రాణాలు వదిలాడు. ఈ ఘటన ఆదివారం పా ల్వంచ మండల కేంద్రంలో చోటు చేసుకుంది. గ్రామస్తు లు తెలిపిన వివరాలిలా ఉ న్నాయి. పాల్వంచ గ్రామాని కి చెందిన చాకలి మల్లయ్య(46) ఇటీవల వరి కోసి ధాన్యాన్ని కల్లంలో ఆరబోశాడు. మూడు నాలుగు రోజులుగా ఎండలో ధాన్యాన్ని ఆరబెడుతూ వడ దెబ్బకు గురయ్యాడు. ఆదివారం ఉదయం తీవ్ర అస్వస్థతకు గురై వడ్లపైనే కుప్పకూలిపోయాడు. దీంతో అతడిని కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకువెళ్లగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడికి భార్య శంకరమ్మ, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. వడదెబ్బతో మరణించిన రైతు కుటుంబాన్ని ఆదుకోవాలని సర్పంచ్ శేఖర్ ప్రభుత్వాన్ని కోరారు. ముందే వికసించిన ‘మే’ పుష్పం ఖలీల్వాడి: ప్రకృతి ప్రేమికులను కనువిందు చేసే ‘మే’ పుష్పం ముందే వికసించింది. నగరంలోని ఎల్లమ్మగుట్టకు చెందిన రిటైర్డ్ ప్రభుత్వ హెడ్మాస్టర్ మాడవేడి పవన్ కుమార్ ఇంట్లో ఉన్న మొక్కకు రెండు పూలు పూశాయి. వాతావరణంలోని మార్పులతో నెల ముందుగానే మే పుష్పాలు వికసిస్తుంటాయి. ఈ అరుదైన పుష్పాల ను కాలనీవాసులు ఆసక్తిగా తిలకించారు. -
మత్తు పదార్థాలతో కుటుంబాలపై తీవ్ర ప్రభావం
నిజామాబాద్అర్బన్: మత్తు పదార్థాల వినియోగంతో కుటుంబం, సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతాయని డీ అడిక్షన్ మెడిసిన్ స్పెషాలిటీ సెక్షన్ చైర్మన్ డాక్టర్ విశాల్ పేర్కొన్నారు. రాజస్థాన్లోని జైపూర్లో ఆదివారం ఇండియాన్ సైకియాట్రిక్ సొసైటీ ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో ఆయన పాల్గొని దేశంలో పెరుగుతున్న మత్తుపదార్థాల వినియోగం, ప్రవర్తన, వ్యసనాల సమస్యపై ప్రసంగించారు. ఆల్కాహాల్తో ఏటా ప్రపంచవ్యాప్తంగా 30 లక్షలు, పొగాకు వాడటంతో 80 లక్షల మరణాలు సంభవిస్తున్నాయని తెలిపారు. అంతర్జాతీయ సదస్సులో ప్రసంగించిన డాక్టర్ అంకం గణేశ్ నిజామాబాద్ రూరల్ : మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్ నగరంలో ఈ నెల 17, 18, 19 తేదీల్లో నిర్వహించిన ఇండియన్ అకాడమీ ఆఫ్ ఆర్థోసర్జన్ (ఐఏవోఎస్) ఐదో జాతీయ సదస్సులో జిల్లాకు చెందిన ఆర్థోపెడిక్ సర్జన్ అంకం గణేశ్ ప్రసంగించారు. వివిధ దేశాల నుంచి వచ్చిన 350కి పైగా ప్రముఖ వైద్యుల సమక్షంలో తన క్లినికల్ అనుభవం, ఆధునిక వైద్య విధానాలను ప్రదర్శించారు. అత్యంత క్లిష్టమైన కీలక కేసులను ప్రెజెంట్ చేయడం ద్వారా ప్రత్యేక గుర్తింపు పొందవచ్చని పేర్కొన్నారు. ఇందూర్ లలితకు ఉపాధ్యాయ ప్రేరణ అవార్డు బోధన్: బోధన్ పట్టణంలోని తట్టికోట ప్రభు త్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయురాలు ఇందూర్ లలిత రాష్ట్రస్థాయి ఉపాధ్యాయ ప్రేరణ అవార్డు –2026ను అందుకున్నారు. హైదరాబాద్కు చెందిన శారద ఎడ్యుకేషనల్ సొసైటీ విద్యతోపాటు వివిధ రంగాల్లో ప్రతిభచాటుతూ సమాజానికి స్ఫూర్తిగా నిలిచిన రాష్ట్రస్థాయిలో 50 మందికి పైగా ఉపాధ్యాయులు, మహిళలను అవార్డుకు ఎంపిక చేసింది. ఆదివారం హైదరాబాద్లోని బిర్లా ప్లానిటోరియం హాల్లో తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ ఇటికాల పురుషోత్తం చేతుల మీదుగా లలిత అవార్డు అందుకున్నారు. బాన్సువాడ : బీర్కూర్ మండలం భైరాపూర్ సహకార సంఘం కార్యాలయానికి ఆదివారం రైతులు తాళం వేసి నిరసన తెలిపారు. సొసైటీ పరిధిలో ప్రారంభించిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కాంటాలు చేయడం లేదని, ఇతర గ్రామాలకు ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపిస్తూ సొసైటీ కార్యాలయానికి తాళం వేశారు. వారం రోజులుగా సొసైటీ కార్యదర్శి విధులకు హాజరుకావడం లేదని, ఫోన్ చేసినా స్పందించడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్లపై ధాన్యం కుప్పలు ఉన్నాయని, వాతావరణంలో మార్పులు వస్తుండడంతో ఆందోళనగా ఉందని పేర్కొంటున్నారు. వెంటనే కాంటాలు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. -
నేడే రెండో విడత రైతు భరోసా
మోర్తాడ్(బాల్కొండ): రెండో విడత రైతు భరోసా సొమ్మును రైతుల ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం సోమ వారం జమ చేయనుంది. పాత విధానానికి పూర్తిగా భిన్నంగా ఈసారి రైతు భరోసా సొమ్మును విడుదల చేస్తున్నారు. గతంలో మొదటి రోజు ఒక ఎకరంలోపు వారికి, రెండో రోజు రెండు ఎకరాలలోపు వారికి, మూడో రోజు మూడు ఎకరాల వరకు అంటూ పెట్టుబడి సాయాన్ని జమ చేసేవారు. ఈసారి తొలి విడతలో ఎన్ని ఎకరాలు ఉన్నవారికై నా ఒక ఎ కరం వరకు పెట్టుబడి సాయాన్ని ఎకరానికి రూ.6 వేల చొప్పున జమ చేశారు. రెండో విడతలో రెండో ఎకరానికి, మూడో విడతలో మూడో ఎకరానికి అని ప్రభుత్వం వెల్లడించింది. మార్చి 23న తొలి విడత పెట్టుబడి సాయాన్ని విడుదల చేయగా, జిల్లాలోని 2,69,476 మంది రైతుల ఖాతాల్లో రూ.1,34,95,15,004 సొమ్మును జమ అయ్యింది. తొలి విడత సాయం అందించిన నెల రోజులకు రెండో విడత సొమ్మును విడుదల చేయనుండటం గమనార్హం. యాసంగి సీజన్ పంటలు చేతికి వచ్చే దశలో రైతు భరోసా సొమ్మును విడుదల చేస్తుండటంతో వచ్చే వర్షాకాలం సీజన్ ఏర్పాట్ల కోసం ఉపయోగపడుతుందని రైతులు భావిస్తున్నారు. అనేక మంది రైతులు భూసారం పెంచేందుకు నల్లమట్టి, పశువుల పేడను కొనుగోలు చేస్తారు. ఈ నేపథ్యంలో రైతు భరోసా సొమ్ము చేతికి అందుతుండటంతో కొంతైనా సద్వినియోగం అవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రెండో ఎకరానికి పెట్టుబడి సాయాన్ని జమ చేయనున్న ప్రభుత్వం పాత విధానానికి భిన్నంగా సాయం వర్షాకాలం పంటలకు పనికొస్తుందంటున్న రైతులు -
క్రైం కార్నర్
గాంధారి(ఎల్లారెడ్డి): మండల పరిధిలోని పోతంగల్ కలాన్ గ్రామంలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై మహేందర్ తెలిపిన వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన గొల్లపల్లి కిష్టయ్య(62) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈనెల 16న ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు బంధువుల వద్ద వెతికినా ఆచూకీ తెలియ లేదు. గ్రామ శివారులోని మామిడి విఠల్కు చెందిన పొలం వద్ద మంచెకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విఠల్ పొలాన్ని అదే గ్రామానికి చెందిన గైని రాములు కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాడు. ఆదివారం ఉదయం అతడు పొలం వద్దకు వెళ్లగా మంచెకు కిష్టయ్య ఉరివేసుకున్నట్లు గుర్తించాడు. వెంటనే మృతుడి కుటుంబీకులకు, పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, వివరాలు సేకరించారు. అనారోగ్య కారణాలతో ఆత్మహత్యకు పాల్పడినట్లు మృతుడి భార్య అంజవ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై తెలిపారు. వేల్పూర్: మండల కేంద్రంలోని కేసీఆర్ కాలనీలో వనందాస్ మహేందర్గౌడ్, శ్రావణ్కుమార్గౌడ్లకు చెందిన ద్విచక్రవాహనాలను శనివారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దహనం చేశారు. బాధితులు ఎప్పటిలాగే తమ వాహనాలను రాత్రి ఇంటివద్ద ఉంచి నిద్రించగా, గుర్తు తెలియని వ్యక్తులు నిప్పుపెట్టడంతో కాలిపోయినట్లు పేర్కొన్నారు. శ్రావణ్కుమార్గౌడ్కు చెందిన స్కూటీ, మహేందర్గౌడ్కు చెందిన బైక్ కాలిపోవడంతో సుమారు రూ.లక్ష 40వేల నష్టం వాటిల్లినట్లు వెల్లడించారు. ఘటనపై వేల్పూర్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితులు పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సంజీవ్ తెలిపారు.


