Nizamabad
-
జిల్లా తైక్వాండో అసోసియేషన్ కార్యవర్గం ఎన్నిక
నిజామాబాద్ నాగారం: నిజామాబాద్ జిల్లా తైక్వాండో అసోసియేషన్ నూతన కార్యవర్గం ఏర్పాటయింది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మీర్ వాహజ్ అలీ ఈ ఎన్నికలకు ముఖ్య అతిథిగా హాజరు కాగా, ఆయన సమక్షంలో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. చైర్మన్గా డాక్టర్ రమేష్ పవర్, అధ్యక్షుడిగా మహమ్మద్ అజ్మత్ ఖాన్, ప్రధాన కార్యదర్శిగా వినోద్ నాయక్, కోశాధికారిగా వినోద్, ఉపాధ్యక్షులుగా వాగ్మారే సుభాష్, శ్యామ్, మంజునాథ్, వినోద్రెడ్డి, రాము, సంయుక్త కార్యదర్శులుగా ప్రశాంత్ కుమార్, బుచ్చన్న, మురళి, వినోద్, ప్రవీణ్, సంతోష్ ఎన్నికయ్యారు. పూర్తి కార్యవర్గాన్ని త్వరలో నియమిస్తానని అధ్యక్షుడు అజ్మత్ ఖాన్ వెల్లడించారు. ఎన్నికలకు ఎలక్షన్ ఆఫీసర్గా ఫుట్బాల్ కోచ్ నాగరాజు వ్యవహరించారు. ఒలింపిక్ అసోసియేషన్ అబ్జర్వర్గా అబ్దుల్ ఉమర్ వ్యవహరించారు. నెట్ బాల్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వరరావు, జిల్లా వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జయపాల్ తదితరులు పాల్గొన్నారు. -
బడిబాటలో ‘ప్రత్యేక’ పిల్లల గుర్తింపు
ఆర్మూర్: బడి బాటలో ప్రత్యేక అవసరాలు గల పిల్లల గుర్తింపు కోసం విద్యాశాఖ అధికారులు కార్యాచరణ రూపొందించారు. సమాజంలో నిరాదరణకు గురవుతున్న ప్రత్యేక అవసరాలు గల పిల్లల (దివ్యాంగులు)ను బడుల్లో చేర్పించి, సాధారణ విద్యార్థులతో సమానంగా విద్యాబుద్ధులు నేర్పించడానికి విద్యాశాఖ, తెలంగాణ సమగ్ర శిక్ష సహిత విద్యా విభాగం సంయుక్తంగా ప్రణాళిక సిద్ధం చేసింది. రాష్ట్ర స్థాయి అధికారులు ఇచ్చిన సూచనల మేరకు ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు విద్యా హక్కును పూర్తిస్థాయిలో వారికి అందేలా అమలు చేయనున్నారు. అందుకు ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం ‘పాఠశాల సంసిద్ధత’ కార్యక్రమాన్ని అధికారులు సూచించిన ప్రణాళిక ప్రకారం నిర్వహిస్తున్నారు. బడి బాట కార్యక్రమంలో భాగంగా దివ్యాంగులను గుర్తించి వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించి వారిని బడిలో చేర్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఇంటింటికీ ప్రచారం.. విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి సాధారణ విద్యార్థులతో పాటు ప్రత్యేక అవసరాలు గల పిల్లలను పాఠశాలల్లో చేర్పించుకోవడానికి పాఠశాల సంసిద్దత కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. రాష్ట్రస్థాయి అధికారుల ఆదేశాల మేరకు జిల్లా అధికారులు క్షేత్ర స్థాయిలో కార్యాచరణను అమలు చేయడం ప్రారంభించారు. అందులో భాగంగా సమగ్ర శిక్ష సహిత విద్యా విభాగం పరిధిలో విధులు నిర్వహిస్తున్న ఇన్క్లూసివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్స్ (ఐఈఆర్పీ)ల సహకారంతో ముందుకు సాగుతున్నారు. గ్రామాలలో సర్వేల ఆధారంగా గుర్తించిన ప్రత్యేక అవసరాలు గల పిల్లలను ప్రభుత్వ పాఠశాలలు, ప్రతీ మండలంలో ఉన్న భవిత కేంద్రాల్లో చేర్చుతున్నారు. బడి బాట కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ ప్రచారం నిర్వహిస్తూ బడి బయటి ప్రత్యేక అవసరాలు గల పిల్లల ఇళ్లను సందర్శించి బడుల్లో చేర్పించే కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం ‘పాఠశాల సంసిద్ధత’ కార్యక్రమం ప్రతీ మండలంలో ఒక భవిత కేంద్రం ఏర్పాటు ఎంఈవోలు, ఐఈఆర్పీలకు ఉన్నతాధికారుల ప్రత్యేక సూచనలుసేవాభావంతో.. ప్రత్యేక అవసరాలు గల పిల్లలను పాఠశాలల్లో చేర్పిస్తూ ఐఈర్పీలు నిర్వహిస్తున్న బాధ్యతలు డ్యూటీగా కాకుండా సేవగా గుర్తిస్తారు. సేవా భావంతో పని చేస్తూ ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు పాఠశాల సంసిద్దత కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. – శ్రీనివాస్రావు, సెక్టోరల్ ఆఫీసర్, సమగ్ర శిక్ష, నిజామాబాద్ప్రత్యేక శ్రద్ధ చూపించాలి.. ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు శిక్షణనిస్తూ పాఠశాలల్లో చేర్పించే విషయంలో ఐఈర్పీలతో పాటు ఉపాధ్యాయులు, కుటుంబ సభ్యులు ప్రత్యేక శ్రద్ధ చూపించాలి. బడిబాట కార్యక్రమంలో భాగంగా బడి బయట పిల్లలు ఉండకుండా పక్కా ప్రణాళిక ప్రకారం వారిని బడిలో చేర్పించాలి. – అశోక్, డీఈవో, నిజామాబాద్ -
నేటి చిత్రం
మీ ప్రాంతంలో నెలకొన్న సమస్యను, ఫొటోను మాకు వాట్సాప్లో పంపించండి. ప్రచురించి అధికారుల దృష్టికి తీసుకెళ్తాము. పంపిన వారి పేరు, ఫొటో ప్రచురిస్తాము. నిజామాబాద్ అర్బన్ – 95531 30597 నిజామాబాద్ రూరల్ – 97053 46541 ప్రధాన రోడ్డులో నిలుస్తోన్న వర్షపు నీరుజక్రాన్పల్లి: మండలంలోని సికింద్రాపూర్ గ్రామ ప్రధాన రోడ్డులో వర్షం నీరు నిల్వ ఉండటంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి రోడ్డును బాగు చేయించాలి. – నవీన్, సికింద్రాపూర్ మాకు ఫొటో పంపండి -
శ్రీరాముడు చేసిన లింగం
మీకు తెలుసా? సిరికొండ మండల పరిధిలోని దట్టమైన లొంక అడవుల్లో కొలువైన నీలకంఠ రామలింగేశ్వరస్వామి ఆలయానికి ఎంతో విశిష్ఠత ఉంది. ● త్రేతాయుగంలో రావణుడు సీతమ్మను అపహరించగా, శ్రీరాముడు వెతుకుతూ ఈ అడవుల్లోకి వచ్చినట్లు పురాణాలు చెబుతున్నాయి. ● రాత్రికి అడవిలోనే బస చేసిన శ్రీరాముడు ఉదయం పూజ చేసుకోవడానికి సెలయేరులో నుంచి ఇసుకను తీసుకువచ్చి లింగం చేసి పూజలు చేసినట్లు తెలుస్తోంది. ● శ్రీరాముడే స్వయంగా చేసిన లింగం కావడంతో రామలింగేశ్వరస్వామి ఆలయంగా పేరు పొందింది. ● మండల కేంద్రం నుంచి 8కిలోమీటర్ల దూరంలో గల అడవుల్లో ఈ ఆలయం ఉంది. ఆలయం చుట్టు ఎత్తై గుట్టలు, పక్కన సెలయేరుతో ఎంతో ఆహ్లదభరితంగా ఉంటుంది. ● మహా శివవరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయంలో మూడు రోజుల పాటు ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు. – సిరికొండఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ఆర్టీసీ డిపో మేనేజర్ల నంబర్లుఆర్టీసీ డిపో ఫోన్ నంబర్ నిజామాబాద్ ఆర్ఎం 9959226011 ఆర్మూర్ డీఎం 9959226019 బోధన్ డీఎం 9959226001 నిజామాబాద్–1 డీఎం 9959226016 నిజామాబాద్–2 డీఎం 9959226017 కామారెడ్డి డీఎం 9959226018 బాన్సువాడ డీఎం 9959226020 -
మహాధర్నాను విజయవంతం చేయాలి
ధర్పల్లి: హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఈనెల 17న జరిగే మహా ధర్నాను విజయవంతం చేయాల ని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకులు బాలయ్య, కారల్మార్క్స్ కోరారు. మండల కేంద్రంలో ఆదివారం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ..కేంద్ర ప్రభుత్వం కాల్పుల విరమణ ప్రకటించి మావోయిస్టు పార్టీ నేతలతో శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేశారు.ఆపరేషన్ కగార్ పేరిట కొనసాగుతున్న హత్యాకాండను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆపాలని పేర్కొన్నారు.కార్యక్రమంలో నిమ్మల భూమేష్ , మ ల్కి సంజీవ్,నర్సగౌడ్ పాల్గొన్నారు. ఇందూరు తిరుమలలో ఘనంగా స్వామి వారి కల్యాణం మోపాల్ : స్వామి వారి కల్యాణం అంటే లోక కళ్యాణం అని, స్వామి వారి కల్యాణం చూస్తేనే సకల పాపాలూ పోతాయని ఆచార్య సంపత్ కుమార స్వామి పేర్కొన్నారు. మోపాల్ మండలం నర్సింగ్ పల్లి ఇందూరు తిరుమల ఆల యంలో శ్రవణ నక్షత్రం సందర్భంగా స్వామి వారి కల్యాణం ఘనంగా నిర్వహించారు. ప్రతి నెల శ్రవణ నక్షత్రం రోజు తొమ్మిది జంటలకు అవకాశం ఇచ్చి వారితో స్వామి వారి కల్యాణం నిర్వహిస్తామని ఆలయ ప్రధాన ధర్మ కర్త నర్సింహారెడ్డి తెలిపారు. కార్యక్రమంలో రోహి త్ కుమారాచార్య, నరాల సుధాకర్, విజయ్, అనిల్, నర్సారెడ్డి, పథ్వీ, భాస్కర్, సాయిలు, నరేష్, మురళి, తదితరులు పాల్గొన్నారు. ఇస్కాన్ సేవలు అభినందనీయం నిజామాబాద్ రూరల్ : సమాజంలో ఇస్కాన్ సేవలు అభినందనీయమని ఆర్ఎస్ఎస్ ఇందూర్ విభాగ్ ప్రచారక్ నర్రా వెంకటశివకుమార్ అన్నారు. ముబారక్నగర్లోని ఇస్కాన్ కేంద్రంలో ఆదివారం జగన్నాథ రథయాత్రకు సంబంధించి సన్నాహక సమావేశం నిర్వహించారు. జూలై 4వ తేదీన జరిగే జగన్నాథ రథయాత్ర కార్యక్రమాన్ని ఆనందోత్సహాల మధ్య జరుపుకోవాలన్నారు. భగవద్గీతను, రామాయణ, మహాభారతాలను చదవటమే కాకుండా వ్యక్తిగత జీవితంలో ఆచరణ చేయాలని సూచించారు. ఈకార్యక్రమంలో ఇస్కాన్ కంఠేశ్వర్ అధ్యక్షులు రామానందరాయ ప్రభుదాస్, స్వామి యాదవ్, ఎండల సుధాకర్, రఘు,ఇస్కాన్ కేంద్ర సభ్యులు, తదితరులు పాల్గొన్నారు. నగర యాదవ సంఘం అధ్యక్షుడిగా విక్కీ యాదవ్ నిజామాబాద్ సిటీ : నగర యాదవ సంఘం అధ్యక్షుడిగా విక్కీ యాదవ్ ఎన్నికయ్యారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని ఇంద్రాపూర్లోని యాదవ సంఘం సర్వసభ్య సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. కొత్త అధ్యక్షుడిగా విక్కీయాదవ్, గౌరవ అధ్యక్షుడిగా హన్మంతు యాదవ్, ప్రధాన కార్యదర్శిగా దేవేందర్ యాదవ్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. నగరంలో యాదవ సంఘం అభివృద్ధికి పాటుపడతానని విక్కీయాదవ్ తెలిపారు. పడకంటి రాముకు సన్మానం నిజామాబాద్నాగారం: అమెరికా విశ్వవిద్యాలయం నుంచి ఇటీవల డాక్టరేట్ అందుకున్న పడకంటి రామును ఆదివారం నగరంలోని బైపాస్రోడ్లో ఉన్న ఇంటిలో నాయకులు సన్మానించారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి తిప్పిరెడ్డి శ్రీనివాస్,జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి తక్కూరి దేవేందర్, కమ్మర్పల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సుంకెట్ రవి, కమ్మర్పల్లి మండల ఏఎంసీ డైరెక్టర్ మధులత శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ మండల స్థాయి నాయకుడు పేరం సుధాకర్ తదితరులున్నారు. -
లయన్స్ యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ చైర్మన్గా విజయానంద్
నిజామాబాద్నాగారం: లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ 320ఈ ప్రిలిమినరీ క్యాబినెట్ సమావేశం ఆదివారం హైదదార్లో జరిగింది. గవర్నర్ లయన్ అమర్నాథ్ రావు 2025– 26 సంవత్సరానికి యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ కార్యక్రమాల జిల్లా చైర్మన్ గా జిల్కార్ విజయానంద్ను నియమించారు. ప్రస్తు తం జోన్ చైర్మన్గా ఉన్న లయన్స్ క్లబ్ ఇందూర్కు పూర్వాద్యక్షులుగా విజయానంద్ వ్యవహరించారు. కార్యక్రమంలో జిల్లా వైస్ గవర్నర్ నరసింహరాజు, జిల్లా కోశాధికారి మర్రి ప్రవీణ్, జిల్లా కేబినెట్ అధికారులు దీకొండ యాదగిరి, లక్ష్మీనారాయణ, కరిపే రవీందర్, రమేష్ కులకర్ణి పాల్గొన్నారు. శ్రీశ్రీ కి ఘన నివాళులు నిజామాబాద్ రూరల్: తెలుగు సాహిత్యానికి ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకొచ్చిన ఘనత శ్రీ శ్రీకి దక్కిందని డీసీఈబీ కార్యదర్శి బి. సీతయ్య అన్నారు. ఆదివారం మహాకవి శ్రీశ్రీ 42వ వర్ధంతిని నాందేవ్వాడలోని పెన్షనర్స్ భవన్లో నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడారు. శ్రీశ్రీ రాసిన రచనలు కొనియాడారు. శ్రీశ్రీ చిత్రపటానికి కవులు, గాయకులు నివాళులు అర్పించారు. -
భక్తిశ్రద్ధలతో బోనాల పండుగ
డిచ్పల్లి: మండలంలోని ముల్లంగి(ఐ) గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం గ్రామస్తులు భక్తిశ్రద్ధలతో బోనాల పండుగ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ దేవతల విగ్రహాలను ఊరేగింపుగా తీసుకెళ్లి ప్రతిష్ఠించారు. అనంతరం ఇటీవలే నూతనంగా ప్రతిష్ఠించిన శ్రీమహాలక్ష్మీ అమ్మవారికి బోనాలు సమర్పించారు. గ్రామ దేవతలకు నైవేద్యాలు సమర్పించి కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో వీడీసీ సభ్యులు, మాజీ ఎంపీపీ చిన్నోల్ల నర్సయ్య, సొసైటీ ఛైర్మన్ గ్యానాజి గంగారెడ్డి, ఏఎంసీ డైరక్టర్ గంగారెడ్డి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. -
అసంపూర్తిగా డివైడర్ల నిర్మాణం
నిజామాబాద్నాగారం: నగరంలోని ప్రధాన రహదారుల మధ్యలో డివైడర్ల నిర్మాణం చేపట్టారు.. నలువైపులా పనులు పూర్తి చేశారు. కాగా, ఆర్మూర్ రోడ్లోని ముబారక్నగర్ ప్రాంతంలోని శ్రీ లక్ష్మీ ప్రియనగర్ చౌరస్తా నుంచి ఆర్టీసీ కాలనీ చౌరస్తా మీదుగా సుక్జిత్ ఫ్యాక్టరీ వరకు డివైడర్ల నిర్మాణ పనులు అసంపూర్తిగా వదిలేశారు. డాదిన్నరగా అధికారులు పర్యవేక్షణ లేకపోవడంపై అనుమానాలకు తావిస్తోంది. డివైడర్ల పనులు పూర్తి కాగానే చెట్లు పెంచాలి. వాహనాలు వెళ్తుంటే ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలనే ఉద్దేశ్యంతో పచ్చదనంతో కూడిన చెట్లు పెంచుతున్నారు. కంఠేశ్వర్ మీదుగా సుజిత్ ఫ్యాక్టరీ వరకు ఆర్మూర్ రోడ్లో డివైడర్ల నిర్మాణ పనులు అంతంత మాత్రంగానే చేపట్టారు. సుమారు ఒక్క కిలోమీటర్ మేర పొడవు ఉన్న డివైడర్ అధ్వానంగా మారుతోంది. ఎక్కడిక్కడ డివైడర్లు ధ్వంసమవుతున్నాయి. నిర్మాణ పనులు సైతం మధ్యలోనే ఆపేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో చేపట్టిన డివైడర్ల నిర్మాణ పనులు ఇంకా పూర్తి కాలేదు. కాంట్రాక్టర్ అనారోగ్యానికి గురయ్యాడని త్వరలోనే పనులు పూర్తి చేయిస్తానని అప్పటి ఈఈ సురేష్ తెలిపారు. ఏడాదిన్నర గడిచినా పనులు మాత్రం ప్రారంభం కాలేదు. నగరంలో శ్రీ లక్ష్మీప్రియనగర్ నుంచి సుక్జిత్ ఫ్యాక్టరీ వరకు పర్యవేక్షణ చేయని అధికారులు త్వరగా పనులు పూర్తి చేయాలి రోడ్డు మధ్యలో నిర్మించిన డివైడర్ల పనులు త్వరగా పూర్తి చేయాలి. డివైడర్లలో చెట్లు పెంచితే బాగుంటుంది. రాత్రుల్లో కూడా లైటింగ్ ఏర్పాటు చేయాలి. డివైడర్ల నిర్మాణం త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తేవాలి. –కృష్ణ, వాహనదారుడు, ముబారక్నగర్ మా పరిధి మేరకు పనులు పూర్తి చేశాం డివైడర్ల పనులకు సంబంధించి కాంట్రాక్టర్కు స్ట్రోక్ రావడంతో పనుల్లో కాస్త ఆలస్యమైంది. పనులు మాత్రం పూర్తి చేశాం. కాంట్రాక్టర్కు ఇప్పటి వరకు బిల్లులు కూడా రాలేదు. మా పరిధిలో ఉన్న పనులు మాత్రం పూర్తి చేయించాం. – సాయికుమార్, ఆర్అండ్బీ ఏఈ -
పూడుకుపోయిన నిజాంసాగర్ ఉపకాలువ
నవీపేట: మండలంలో పూడుకుపోయిన నిజాంసాగర్ ఉపకాలువ పూడుకుపోవడంతో కాలువ కింది రైతులు సొంత ఖర్చులతో మరమ్మతులు చేపట్టారు. మండలంలోని కమలాపూర్, నాడాపూర్ గ్రామాలకు విస్త్తరించుకున్న నిజాంసాగర్ డి 50/4/10 ఉప కాలువతో పాటు కాలువ గట్టు (కెనాల్ ఇన్స్పెక్షన్ పాత్) ఇరువైపులా పూడుకుపోయింది. గత కొన్నేళ్లుగా మరమ్మతులు లేకపోవడంతో ఇరువైపులా నడకకు అనుకూలంగా ఉన్న రోడ్డు చెత్తాచెదారం, పిచ్చిమొక్కలు, చెట్లు, గుంతలతో కూరుకుపోయింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు కాలువ కింది 250 ఎకరాల పరిధిలోని రైతులు ముందడుగు వేశారు. చదునుతోపాటు కాలువలోని పూడికను తొలగించేందుకు సంకల్పించిన రైతులు రూ. 2.70 లక్షల నగదును జమ చేశారు. ఆదివారం రైతులందరూ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని చకచకా పనులకు శ్రీకారం చుట్టారు. రెండున్నర కిలోమీటర్ల మేర పొక్లెయిన్తో చెట్లు, పొదలు, చెత్తాచెదారం, గుంతలను తొలగించి చదును చేశారు. పైపులైన్ను విస్తరించారు. పూర్తి మరమ్మతులకు అదనంగా ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలని రైతులు కోరుతున్నారు. సొంత ఖర్చులతో మరమ్మతులు చేపట్టిన అన్నదాతలు -
విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలి
నిజామాబాద్ నాగారం: విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలని డీఈవో పార్శి ఆశోక్ అన్నారు. ఆదివారం వినాయక పద్మశాలి ఐక్య వేదిక (వినాయక నగర్ తర్పా సంఘాల సమూహం)‘ ఆధ్వర్యంలో 10వ తరగతి, ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో 2025 సంవత్సరంలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు మెమెంటో, ప్రశంసపత్రం ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ డీఐఈవో లోకం రఘురాజ్, జిల్లా సంఘం అధ్యక్షులు బిజ్జు దత్తాద్రి, వర్కింగ్ ప్రెసిడెంట్ పుల్గం హన్మాండ్లు, నగర సంఘం అధ్యక్ష కార్యదర్శులు పెంట దత్తాద్రి, చౌటి భూమేశ్వర్, ఐక్య వేదిక అధ్యక్షులు గుడ్ల భూమేశ్వర్, ప్రధాన కార్యదర్శి పెంట ధనంజయ్, కోశాధికారి పగిడిమారి యాదగిరి, సలహాదారులు రాపెల్లి గురుచరణం, గుజ్జేటి వెంకట్ నర్సయ్య, చింత శంకర్, ఉపాధ్యక్షులు చింత మురళీధర్, కొండ గంగాచరణ్, సహాయ కార్యదర్శి గజ్జల శంకర్, తదితరులు పాల్గొన్నారు. -
కొడుకును చంపిన కేసులో తండ్రి అరెస్ట్
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): భార్యపై కోపంతో కొడుకును హతమార్చిన కేసులో తండ్రిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఎల్లారెడ్డి సీఐ రవీందర్నాయక్ తెలిపారు. నాగిరెడ్డిపేట పోలీస్స్టేషన్లో ఆదివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన కేసు వివరాలను వెల్లడించారు. నాగిరెడ్డిపేట మండలం పోచారం గ్రామానికి చెందిన అక్షితకు, లింగంపేట మండలం పొల్కంపేట గ్రామానికి చెందిన నర అనిల్కు కొన్నేళ్ల కిందట వివాహం జరుగగా, వారికి నాలుగేళ్ల శాశంక్ అనే కొడుకు, 7నెలల కూతురు మనుశ్రీ ఉన్నారు. కాగా ఈనెల 10న అనిల్ తన భార్య, పిల్లలతో కలిసి మెదక్ జిల్లా శాలీపేటలో జరిగిన బోనాల పండుగకు వెళ్లాడు. అక్కడ ఓ గొడవ జరగడంతో అనిల్ తన కుటుంబంతో కలిసి పొల్కంపేటకు చేరుకున్నాడు. ఇంటికి వచ్చాక మరోసారి గొడవ జరగగా అనిల్ తన భార్యను కొట్టాడు. ఈ నెల 12న అనిల్ తన భార్యను పోచారంలో దింపి కొడుకు శశాంక్ను బైక్పై ఎక్కించుకొని గ్రామశివారులోని పల్లెప్రకృతివనం వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ భార్యపై కోపంతో శశాంక్ నోరు, ముక్కు మూసి హత్య చేశాడు. అనంతరం కొడుకును పోచారంలోని తన అత్తగారింటికి తీసుకువచ్చి ఇంట్లో పడుకోబెట్టి వెళ్లిపోయాడు. అచేతనంగా ఉన్న కొడుకును చూసిన అక్షిత అనుమానంతో వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే బాలుడు మృతిచెందినట్లు డాక్టర్లు తెలిపారు. దీంతో తన కొడుకును హత్య చేశాడని తల్లి అక్షిత పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మెదక్ జిల్లా బూర్గుపల్లి గేట్ వద్ద అనిల్ను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారించగా తానే కొడుకును హత్య చేసినట్లు అంగీకరించాడు. అతడి బైక్ను స్వాధీనం చేసుకొని అనిల్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు. ఎస్సై మల్లారెడ్డి, హెడ్కానిస్టేబుల్ శ్రీనివాస్, కానిస్టేబుల్ శ్రీశైలం, హోంగార్డ్ కాశయ్యపాల్గొన్నారు. -
ఆత్మీయ పలకరింపులు.. మధుర స్మృతులు
సాక్షి నెట్వర్క్: ఆత్మీయ పలకరింపులు.. ఆపాత మధుర స్మృతులను గుర్తుకు తెచ్చుకుని పూర్వ విద్యార్థులు భావోద్వేగానికి లోనయ్యారు. అరే ఎన్నాళ్లయింది కలుసుకుని.. పూర్తిగా మారిపోయావంటూ ఆనాటి స్నేహితులు ఏళ్ల తర్వాత కలుసుకోవడంతో హర్షం వ్యక్తంచేశారు. ఉమ్మడి జిల్లాలోని వివిధ గ్రామాల ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల పదోతరగతి పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు. ఈసందర్భంగా చిన్నానాటి మిత్రులందరూ ఏళ్ల తర్వాత మళ్లీ ఒకే వేదికపై కలుసుకోవడంపై ఆనందం వ్యక్తం చేశారు. ఒకరినొకరు పలకరించుకుంటూ అనాటి జ్ఞాపకాలను గుర్తుకుతెచ్చుకున్నారు. నాడు చదువు నేర్పిన ఉపాధ్యాయులను సమ్మేళనానికి ఆహ్వానించి, సన్మానించారు. సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటపాటలతో ఉల్లాసంగా గడిపారు. అనంతరం విద్యార్థులు, గురువులు అందరూ కలిసి సహపంక్తి భోజనాలు చేశారు. అలాగే నగరంలోని ఓ హోటల్లో ఉమ్మడి జిల్లాలోని 2000 బ్యాచ్కు చెందిన పోలీస్ కానిస్టేబుళ్లు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. కామారెడ్డిలోని సిద్ధార్థ జూనియర్ కళాశాల 1999–2001 బ్యాచ్ బైపీసీ విద్యార్థులు పట్టణంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. జిల్లాలో పలుచోట్ల సమ్మేళనాలు నిర్వహించిన పూర్వవిద్యార్థులు ఏళ్ల తర్వాత కలుసుకోవడంతో భావోద్వేగానికి గురైన చిన్ననాటి మిత్రులు -
ఆలయంలో చోరీ
ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి మండలం హాజీపూర్ తండా జగదాంబ ఆలయంలో చోరీ జరిగినట్లు తండావాసులు ఆదివారం తెలిపారు. ఆలయంలో శనివారం పూజలు చేసి వెళ్లిన పూజారి దుష్యానాయక్ ఆదివారం ఉదయం గుడిని తెరిచేందుకు వెళ్లగా ఆలయంలోని హుండీ బయట ఉండటాన్ని గమనించి తండావాసులకు సమాచారం ఇచ్చారు. హుండీని పరిశీలించిన తండా వాసులు అందులో సుమారు రూ. 30వేల నగదు ఉన్నదని, గుర్తుతెలియని దుండుగులు చోరీ చేశారన్నారు. ఘటనపై వారు పోలీసులకు సమాచారం అందించడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ధాన్యం లారీ బోల్తా డిచ్పల్లి: మండలంలోని సాంపల్లి గ్రామం వద్ద గల 44వ నంబరు జాతీయ రహదారిపై ఆదివారం ధాన్యం లారీ అదుపు తప్పి బోల్తా పడింది. డిచ్పల్లి వైపు నుంచి ఆర్మూర్ వైపు ధాన్యం బస్తాల లోడుతో వెళుతున్న లారీని రహదారి పక్కన నిలిపే క్రమంలో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్, క్లీనర్ క్షేమంగా బయటపడినట్లు డిచ్పల్లి పోలీసులు తెలిపారు. -
నిరంతరం పారిశుధ్య పనులు
నిజామాబాద్ సిటీ : మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పారిశుధ్య పనులు నిరంతరం కొనసాగుతున్నాయి. పట్టణాలు, నగరాలు రూపురేఖలు మా ర్చేందుకు ప్రభుత్వం వంద రోజుల ప్రత్యేక కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. ఈకార్యక్రమాన్ని జూన్ 2 నుంచి సెప్టెంబర్ 10 వరకు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ అఽధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ప్రతి అంశాన్ని సమగ్రంగా అమలు చేయాలని, ఇందుకు తగిన కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని సూచించారు. దీంతో సెలవు రోజుల్లో సైతం పారిశుధ్య సిబ్బంది పనులు చేస్తున్నారు. ప్రత్యేక టీంలతో.. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో పారిశుధ్య పనులు వేగవంతం చేస్తున్నారు. ప్రతిరోజు పనిచేసే సిబ్బందితో పాటు ప్రత్యేక సిబ్బందితో పనులు చేయిస్తున్నారు. అపరిశుభ్రంగా ఉండే కాలనీలు, ఫిర్యాదులు వస్తున్న కాలనీల్లో వెంటనే సిబ్బందితో పనులు నిర్వహిస్తున్నారు. బోర్గాం (పి), వినాయక్నగర్, సాయినగర్ కాలనీ, ఫులాంగ్, గాయత్రినగర్, అర్సపల్లి, మాణిక్బండార్, ముబారక్నగర్ వంటి ప్రాంతాల్లో నిరంతరం శానిటరీ పనులు సాగుతున్నాయి. రెండోశనివారం, ఆదివారం సైతం శానిటరీ సిబ్బంది, జవాన్లు పనులు చేస్తున్నారు. వీరి పనులను క్షేత్రస్థాయిలో శానిటరీ ఇన్స్పెక్టర్లు, జోన్లలో జరుగుతున్న పనులను శానిటరీ సూపర్ వైజర్లు పర్యవేక్షిస్తున్నారు. ఆకస్మిక తనిఖీలు.. బల్దియాలో జరుగుతున్న 100 రోజుల ప్రత్యేక పారిశుధ్య పనులను మున్సిపల్ కమిషనర్ దిలీప్కుమార్ ఎప్పటికప్పుడూ పర్యవేక్షిస్తున్నారు. పలు మార్లు ఆకస్మికంగా తనిఖీలు చేసి, సిబ్బంది హాజరును పరిశీలించారు. కార్పొరేషన్లో కొనసాగుతున్న 100 రోజుల ప్రణాళిక పనులు చేయిస్తున్న శానిటరీ ఇన్స్పెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్న అధికారులు పట్టణాలు, నగరాల రూపురేఖలు మార్చేందుకు ప్రభుత్వం 100 రోజుల ప్రత్యేక కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా మున్సిపల్ సిబ్బంది స్థానికంగా ఉన్న పలు సమస్యలను గుర్తించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారు. సమస్యలను పరిష్కరిస్తాం నగరంలో పారిశుధ్య పనులు నిరంతరం జరుగుతున్నాయి. 100 రోజుల ప్రణాళిక కోసం ప్రత్యేక కార్యచరణ సిద్ధం చేశాం. నగరంలో ఎక్కడైన సమస్యలుంటే వాటిని తమ దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తాం. – దిలీప్కుమార్, కమిషనర్, బల్దియా -
దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలి
నిజామాబాద్ సిటీ/మోపాల్: : కేంద్ర కార్మిక సంఘాల పిలుపుమేరకు జూలై 9న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని జిల్లాలోని కార్మిక సంఘాల నాయకులు కోరారు. ఆ దివారం జిల్లా కేంద్రంలోని కోటగల్లి, ఎన్ఆర్ భవన్లో నిర్వహించిన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. టీయూసీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ముస్కె సుధాకర్, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై.ఓమయ్య, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్, ఐఏఫ్టీయూ జిల్లా అధ్యక్షులు జీ.భూమయ్య హాజరై మాట్లాడారు.ఈ సమావేశంలో ఐక్య కార్మిక సంఘాల నాయకులు నరేందర్, కాజా మొయినుద్దీన్, భూమేష్, ఆజాద్ పాల్గొన్నారు. రైస్ మిల్లు పరిశ్రమల్లో జూలై 9న జరిగే సమ్మెలో కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి వై ఓమయ్య కోరారు. ఏఐటీయూసీ రైస్ మిల్ ఫిట్టర్ యూనియన్ కార్యాలయంలో రైస్ మిల్లు ఇండస్ట్రీలో పనిచేస్తున్న కార్మికుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన 44 రకాల చట్టాలను పునరుద్ధరించి, నాలుగు లేబర్ కోడులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రైస్ మిల్ పరిశ్రమలో ఎనిమిది గంటలకు మించి పని చేస్తున్న కార్మికులకు చట్ట ప్రకారం ఓవర్ టైం డ్యూటీలు చెల్లించాలని, పీఎఫ్ ,ఈఎస్ఐ, ఇన్సూరెన్సు సౌకర్యం పకడ్బందీగా అమలు చేయాలన్నారు. సమావేశంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి బి. అనిల్, ఉపాధ్యక్షులు జాఫర్, సహాయ కార్యదర్శి సాయిలు, లాయక్ ,రమేష్, తిరుపతిరెడ్డి, శ్రీనివాసరెడ్డి, రాజు, శివకుమార్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు. -
అధిక వడ్డీలు.. వేధింపులు
● పల్లెల్లో మితిమీరుతున్న మైక్రో ఫైనాన్స్ ఆగడాలు ● తీవ్ర ఆందోళన చెందుతున్న బాధితులురామారెడ్డి: పల్లెల్లో మళ్లీ మైక్రో ఫైనాన్స్ సంస్థలు మహిళలు, చిరు వ్యాపారులకు రుణాలు ఇస్తూ వారిని నిండా ముంచుతున్నారు. ప్రజల అత్యవసరాన్ని ఆసరా చేసుకొని అధిక వడ్డీకి రుణాలు ఇచ్చి తీరా ఈఎంఐలు సకాలంలో చెల్లించకపోతే వేధింపులకు గురిచేస్తున్నారు. గతంలో మైక్రో ఫైనాన్స్ వేధింపులు తాళలేక ఎంతో మంది ఆత్మహత్య చేసుకున్న ఘటనలు జిల్లాలో ఉన్నాయి. అప్పట్లో ప్రభుత్వం వీటిని నిషేధించింది. కానీ మళ్లీ గ్రామాల్లో మైక్రో ఫైనాన్స్ సంస్థలు తమ కార్యకలాపాలు వేగంగా విస్తరింపజేస్తున్నాయి. వాయిదా చెల్లింపులు.. మైక్రో ఫైనాన్స్ నిర్వాహకులు ముందుగా తమ ఏజెంట్లను గ్రామాల్లోకి పంపి పేద మహిళలు, సంఘాల సభ్యులను కలుస్తున్నారు. వారం, 15 రోజుల వాయిదా చెల్లింపులతో రుణాల ఆశ చూపుతున్నారు. డ్వాక్రా గ్రూపుల్లో సకాలంలో చెల్లించని వారు మైక్రోసంస్థలను ఆశ్రయిస్తున్నారు. 10నుంచి 12మంది మహిళలను గ్రూపుగా ఏర్పాటు చేసి 15 రోజుల్లోనే రుణం అందిస్తున్నారు. ఒక్కో గ్రామంలో 20 నుంచి 30 గ్రూపులు ఏర్పాటు చేసి రుణాలు పొందినట్లుగా తెలుస్తుంది. కామారెడ్డి జిల్లాలో రామారెడ్డి, సదాశివనగర్ భిక్కనూరు, దోమకొండ, బీబీపేట మండలాల్లో ఈ తరహా రుణాలు ఎక్కువగా ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈజీగా రుణం వస్తుండడంతో మహిళలు వీటికి ఆకర్షితులు అవుతున్నారు. తీరా ఆర్థిక ఇబ్బందులతో ఈఎంఐ చెల్లించకపోతే వేధింపులకు గురిచేస్తున్నారు. గ్రామాలలో మైక్రో ఫైనాన్స్ తమ కార్యకలాపాలను విస్తరిస్తున్న సంబంధిత అధికారులు నిలువరించడంలో విఫలమవుతున్నారు. జిల్లావ్యాప్తంగా వడ్డీ వ్యాపారులపై దాడులు చేసి కేసులు నమోదు చేసిన పోలీసులు మైక్రో ఫైనాన్స్ సంస్థలను ఎందుకు నిలువరించడం లేదని అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి, మైక్రో ఫైనాన్స్ సంస్థలు నిలువరించాలని ప్రజలు కోరుతున్నారు.రామారెడ్డిలోని రమేష్ అనే వ్యక్తి ఇటీవల అవసరానికి మైక్రో ఫైనాన్స్ వారం గ్రూప్లో రూ.10వేలు అప్పు తీసుకున్నాడు. వారం వారం చెల్లింపుల్లో తేడా రావడంతో సదరు ఏజెంట్లు రాత్రి 10గంటల వరకు వేచి ఉండి వారం తాలూకా కిస్తీ పైసలు వసూలు చేసుకువెళ్లారు. రూ.పదివేలు తీసుకుంటే వడ్డీతో కలిపి రూ.17,000 వరకు మైక్రో ఫైనాన్స్ వారు వసూలు చేయడంతో అతడు తీవ్ర ఆవేదన చెందుతున్నాడు.అవగాహన కల్పిస్తున్నాం.. డ్వాక్రా సంఘాల మహిళలు ఎవరూ కూడా మైక్రో ఫైనాన్స్ రుణాలు తీసుకోవడం లేదు. మైక్రో ఫైనాన్స్ సంస్థలపై, వారి ఆగడాలపై ప్రజలకు అవగా హన కల్పిస్తున్నాం. గ్రామాలలో ప్రజలు రుణాల కోసం మైక్రో ఫైనాన్స్ సంస్థలను ఆశ్రయించవద్దు. – భూమాగౌడ్, సీసీ, డ్వాక్రా సంఘం, రామారెడ్డి -
చదువుతోనే మంచి భవిష్యత్తు
నిజామాబాద్ అర్బన్: చదువుతోనే మంచి భవిష్యత్తు ఉంటుందని విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకొని చదవాలని గౌడ అఫీషియల్స్ ప్రొఫెషనల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బండి సాయన్న గౌడ్ అన్నారు. ఆదివారం నగరంలోని గౌడ అఫీషియల్స్ ప్రొఫెషనల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గౌడ విద్యార్థులకు ప్రతిభ పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన గౌడ కులస్తులు ఎవరైనా ఇబ్బందులు ఎదుర్కొంటే అసోసియేషన్ తోడుగా ఉంటుందన్నారు. విద్యార్థులు మాత్రం చదువుకు దూరం కావద్దన్నారు. గౌడ కులస్తులకు సంబంధించి గౌడ హాస్టల్ నిర్మాణం చేపడుతున్నామన్నారు విద్యార్థుల విద్య బోధనకు సహాయ సహకారాలు అందించేందుకు ముందుంటామన్నారు గౌడ ప్రజాప్రతినిధులు విద్యావంతులు తమ వంతుగా సహాయ సహకారాలు అందించాలన్నారు. మంచి ప్రతిభ కలిగిన విద్యార్థులను ప్రోత్సహించడం జరుగుతుందన్నారు అనంతరం జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్ గౌడ్ మాట్లాడుతూ ప్రతి ఏటా గౌడ విద్యార్థులకు ప్రోత్సహించేందుకు ప్రతిభ పురస్కారాలు అందిస్తామన్నారు. ప్రతి ఒక్కరికి విద్య సౌకర్యాలు అందేలా చూస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ మారయ్య గౌడ్, పట్టణ గౌడ సంఘం ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ గౌడ్, రవీందర్ గౌడ్, సోమ లింగం గౌడ్, రాజా గౌడ్, భోజగౌడ్ శ్రీనివాస్ గౌడ్ సతీష్ గౌడ్, విపుల్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
యోగాతో మానసిక ప్రశాంతత
రుద్రూర్: యోగా ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుందని, ఆరోగ్య కరమైన జీవన శైలి అలవడుతుందని బోధన్ కోర్టు సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ శేషతల్ప సాయి అన్నారు. మండలంలోని అక్బర్నగర్లోగల సంస్కార్ ప్రకృతి చికిత్సాలయంలో ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా ఆదివారం యోగాపై అవగాహన, శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ఆయన హాజరై సాధకులతో కలిసి యోగాసనాలు వేశారు. అనంతరం మాట్లాడుతూ.. యోగా ద్వారా దైనందిన జీవితంలో వచ్చే ఒత్తిడిని తగ్గించుకోవచ్చునని అన్నారు. యోగా, ప్రాణాయామం, సూర్య నమస్కారాలు శారీరక, మానసిక, ఆధ్యాత్మిక అభ్యాసమని అన్నారు. వీటిని ఆచరించడం ద్వారా జీవన కాలం పెంపొందించుకోవచ్చునని అన్నారు. యోగా శిక్షణ కార్యక్రమాలను వినియోగించుకోవాలని సూచించారు. సంస్కార్ ప్రకృతి ఆశ్రమం వ్యవస్థాపకులు మార్ని రామ కృష్ణారావ్, యోగా మాస్టర్ సాయిలు, బచ్చు రాము తదితరులు పాల్గొన్నారు. ఆలయానికి రూ.లక్ష విరాళం బోధన్రూరల్: పట్టణంలోని ఆచన్పల్లి హనుమాన్ ఆలయానికి ఆదివారం ఫాదర్స్డే సందర్భంగా మహారాష్ట్రలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ హరిబాబు తన తండ్రి జ్ఞాపకార్థం రూ.1,01,606 విరాళం ప్రకటించారు. ఆలయ కమిటీ ప్రతినిధులకు ఆయన విరాళం అందించారు. కార్యక్రమంలో ఆచన్పల్లి పెద్దలు, ఆలయ ప్రతినిధులు పాల్గొన్నారు. ఓటు వేసిన రూరల్ ఎమ్మెల్యే డిచ్పల్లి: నిజామాబాద్లోని ముబారక్నగర్లోగల ఆర్బీవీఆర్ఆర్ పాఠశాల సొసైటీ ఎన్నికలు ఆదివారం జరిగాయి. ఈ సొసైటీ ఎన్నికల పోలింగ్కు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి హాజరై, తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. -
స్కానింగ్ సేవలు అందేనా..?
మోర్తాడ్(బాల్కొండ): మోర్తాడ్, ఏర్గట్ల మండల కేంద్రాలకు చెందిన గర్భిణులు లక్ష్మి, రాధ స్కానింగ్ చేయించుకునేందుకు మోర్తాడ్లోని 30 పడకల ఆ స్పత్రికి వచ్చారు. ఇక్కడ స్కానింగ్ యంత్రం ఉన్నా రేడియాలజిస్ట్ లేకపోవడంతో స్కానింగ్ చేసే అవకాశం లేదని వైద్యులు, సిబ్బంది చెప్పారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో వారు ఆర్మూర్లోని ప్రైవేట్ స్కానింగ్ సెంటర్లో ఫీజు చెల్లించి చేయించుకున్నారు. ఇది లక్ష్మి, రాధకు ఎదురైన పరిస్థితే కాదు. ఎంతో మంది గర్భిణులు తమ గర్భంలోని శిశువు ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు ప్రైవేట్ స్కానింగ్ సెంటర్లను ఆశ్రయించాల్సి వస్తోంది. గత ప్రభుత్వం సామాజిక ఆస్పత్రులకు స్కానింగ్ యంత్రాలను సమకూర్చినప్పటికీ రేడియాలజిస్ట్లను నియమించకపోవడంతో ఆ విభాగం సేవలు అందడం లేదు. మోర్తాడ్, బాల్కొండ, ధర్పల్లి, డిచ్ పల్లి, కోటగిరి, వర్ని, నవీపేట్లోని కమ్యూనిటీ ఆస్పత్రులు, బోధన్ ఏరియా ఆసుపత్రి, ఆర్మూర్ లోని వంద పడకల ఆస్పత్రి, జిల్లా కేంద్రంలోని జనరల్ ఆస్పత్రులకు స్కానింగ్ యంత్రాలను మంజూరు చేశారు. గైనకాలజిస్టులు, మత్తు వైద్యుల పోస్టులతోపాటు రేడియాలజిస్టుల పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. స్కానింగ్ సేవలు కేవలం జిల్లా కేంద్రంలోని జనరల్ ఆస్పత్రిలోనే అందుతున్నా యి. గర్భిణులు ప్రసవం వరకు కనీసం మూడు సా ర్లు స్కానింగ్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఒక్క సారి స్కానింగ్కు వెళ్తే రూ.2వేల నుంచి రూ.3వేల వరకు ఖర్చవుతోంది. ప్రభుత్వం దృష్టి సారిస్తేనే.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్యను పెంచేందుకు గత ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేప ట్టింది. అయితే లక్షలు వెచ్చించి స్కానింగ్ యంత్రాలను సమకూర్చి రేడియాలజిస్ట్ పోస్టులను భర్తీ చేయకపోవడంతో సేవలు అందడం లేదు. ప్రస్తుత ప్రభుత్వమైన ప్రభుత్వ ఆస్పత్రుల్లో స్కానింగ్ సేవ లు అందించాలని ప్రజలు కోరుతున్నారు. ఆస్పత్రుల్లో పడిఉన్న యంత్రాలు రేడియాలజిస్ట్లు లేక తప్పని కష్టాలు ప్రైవేట్ స్కానింగ్ సెంటర్లకు పరుగులు పెడుతున్న గర్భిణులు -
గ్రాంట్ గందరగోళం
నిజామాబాద్అధిక వడ్డీలు.. వేధింపులు పల్లెల్లో మళ్లీ మైక్రో ఫైనాన్స్ సంస్థలు మహిళలు, చిరు వ్యాపారులకు రుణాలు ఇస్తూ నిండా ముంచుతున్నాయి. సోమవారం శ్రీ 16 శ్రీ జూన్ శ్రీ 2025– 8లో u● ధర్పల్లి మండలంలోని ఓ కాంప్లెక్స్ హెచ్ఎం గ్రాంట్ వినియోగం కోసం సీనియర్ ఉపాధ్యాయులను పక్కనపెట్టి ఇటీవల బదిలీపై వచ్చిన ఓ జూనియర్ ఉపాధ్యాయునితో సంయుక్తంగా బ్యాంకు ఖాతా తీసి నిధులు డ్రా చేశారు. ● భీమ్గల్ మండలంలో పీఎంశ్రీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని నిధుల దుర్వినియోగంపై పిల్లల తల్లిదండ్రులు నిలదీశారు.న్యూస్రీల్ -
మూలకు చేరిన బగ్గీ వాహనం
నిజామాబాద్ సిటీ: ప్రజల సొమ్ముతో రూ.లక్షలు పెట్టి కొనుగోలు చేసిన వాహనం మూలనపడింది. ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధులు, అధికారులు నగరంలో పర్యటిస్తూ పనులను పర్యవేక్షించడానికి బ్యాటరీతో నడిచే బగ్గీ వాహనాన్ని కొనుగోలు చేశారు. రెండేళ్ల క్రితం అప్పటి అర్బన్ ఎమ్మెల్యే, ఇతర అధికారులతో ఈ వాహనం నగరంలో చక్కర్లు కొట్టింది. లక్షల రూపాయలు ఖర్చుచేసి ఆర్భాటంగా కొనుగోలు చేసిన బగ్గీ వాహనం ప్రస్తుతం బల్దియాలోని పార్కింగ్ స్థలంలో వృథాగా పడి ఉంది. అధికారులు స్పందించి వాహనాన్ని వినియోగంలోకి తేవాలని ప్రజలు కోరుతున్నారు. రూ. లక్షల ప్రజాధనం వృథా -
లక్ష్యాన్ని ఎంచుకుని ముందుకు సాగాలి
నిజామాబాద్నాగారం: జీవితంలో ప్రతి ఒక్క రూ ఒక లక్ష్యాన్ని ఎంచుకుని, ఆ లక్ష్య సాధన కోసం కష్టపడుతూ ముందుకు సాగితే ఫలితం దక్కుతుందని సీపీ పి సాయిచైతన్య అన్నారు. ఎస్సెస్సీ, ఇంటర్మీడియెట్లో ఉత్తమ ఫలితాలు సాధించిన తెలంగాణలోని 11 జిల్లాల విద్యార్థినీవిద్యార్థులు 200 మందికి ఎమ్మెస్సార్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రూ.10వేల చొప్పు న ప్రోత్సాహకాలు అందజేశారు. నగరంలోని బస్వాగార్డెన్లో నిర్వహించిన కార్యక్రమానికి సీపీ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. ఆర్థికస్థితిగతులతో సంబంధం లేకుండా కష్టపడి చదివిన విద్యార్థులకు ఎమ్మెస్సార్ ట్రస్ట్ నగదు ప్రోత్సాహకాలు అందజేసిందన్నారు. ఉన్నత విద్యాభ్యాసం కోసం పైతరగతులకు వెళ్తున్న విద్యార్థులు కొత్త పరిచయాలను తమ ఉన్నతి కోసం వాడుకోవాలని సూచించారు. చెడు పరిచయాలకు దూరంగా ఉండాలని, కొత్త పరిచయాల క్రమంలో మత్తు పదార్థాలకు అలవాటు పడొద్దన్నారు. వ్యక్తిత్వ వికాసం కోసం కష్టపడాలన్నారు. ఎమ్మెస్సార్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఎం సాంబశివారెడ్డి, డైరెక్టర్లు ధనుష్రెడ్డి, జి.రాజిరెడ్డి, డాక్టర్ అబ్బాపూర్ రవి, వడ్డె శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. -
జిల్లాలో భూసార పరీక్షలు
డొంకేశ్వర్(ఆర్మూర్) : జిల్లాలో వ్యవసాయ భూము ల్లో భూసార పరీక్షలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు పైలట్ ప్రాజెక్టుగా బోధన్ డివిజన్లోని సాలూర మండలాన్ని ఎంపిక చేసింది. మరో పక్క నేషనల్ మిషన్ ఫర్ నే చురల్ ఫార్మింగ్ (ఎన్ఎంఎన్ఎఫ్) కింద జిల్లా వ్యా ప్తంగా 15 క్లస్టర్లలో కూడా భూసార పరీక్షలు చేయా లని వ్యవసాయ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. అయితే ఈ మట్టి పరీక్షలు ప్రస్తుత ఖరీఫ్ నుంచే ప్రారంభించాలని సూచించింది. దీంతో పైల ట్ ప్రాజెక్టు అయిన సాలూరలో వ్యవసాయ విస్తీర్ణ అధికారులు (ఏఈవోలు) మట్టి నమూనాలు సేకరిస్తున్నారు. మొత్తం 8 వేల శాంపిల్స్ తీయాలని ల క్ష్యం ఉండగా సాలూర మండలంలో 6125, ఎన్ఎంఎన్ఎఫ్ కింద జిల్లా అంతటా 1,875 శాంపిల్స్ సేకరించనున్నారు. ప్రతి కమతం కవరయ్యే విధంగా భూసార పరీక్షలు చేపట్టాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ఇందుకు వారు ఆసక్తి గల రైతులను గుర్తించి పేర్లు నమోదు చేసుకుంటున్నారు. ఏఈవోలు రైతుల భూముల్లోకి వెళ్లి మట్టి నమూ నాలు సేకరించి జిల్లా కేంద్రం మార్కెట్ యార్డులో ని భూసార పరీక్షల కేంద్రానికి పంపనున్నారు. వారు భూసార పరీక్షల ద్వారా ఏయే పంటలకు నే ల అనుకూలంగా ఉందో నివేదిక ఇవ్వనున్నారు. భూమిలో కర్బనాలు, నత్రజని, భాస్వరం, భౌతిక లక్షణం వివరాలు పూర్తిగా నివేదికలో ఉంటుంది. త ద్వారా రైతులు నేల పరిస్థితిని బట్టి పంటలు సాగు చేసుకోవచ్చు. కాగా ఇప్పటి వరకు 400 మట్టి నమూనాలు సేకరించి ల్యాబ్కు పంపినట్లు జిల్లా వ్యవసాయాధికారి వీరాస్వామి తెలిపారు. రైతులు భూసార పరీక్షలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.● పైలట్ ప్రాజెక్టుగా సాలూర మండలం ఎంపిక ● ఎన్ఎంఎన్ఎఫ్ కింద జిల్లాలో 15 క్లస్టర్లలోనూ మట్టి పరీక్షలు -
ప్రజలతో మమేకమవుతున్నారు
కొత్తగా ‘ఫుట్ పెట్రోలింగ్’ సీపీ సాయిచైతన్య వచ్చిన తర్వాత కమిషనరేట్ పరిధిలోని అన్ని సర్కిళ్లలో కొత్తగా ఫుట్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. ప్రధాన ప్రాంతాల్లో పోలీసు బృందాలు డాగ్స్క్వాడ్ ద్వారా తనిఖీలు చేపడుతున్నాయి. హోటళ్లు, బస్టాండ్, రైల్వేస్టేషన్, ప్రధాన కూడళ్ల వద్ద ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించి అనుమానితుల వివరాలను సేకరిస్తున్నారు. అనుమానం ఉంటే స్టేషన్కు తరలించి ఆరా తీస్తున్నారు. ప్రయాణికులు, వాహనదారులకు ఇబ్బంది కలిగించేలా రోడ్డుపై అడ్డంగా వాహనాలు, తోపుడు బండ్లు, షాపులు ఏర్పాటు చేయకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఖలీల్వాడి : పోలీసులు ప్రజలతో మమేకం అవుతున్నారు. నేరాల నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రజల భాగస్వామ్యంతో ముందుకు కదులుతున్నారు. ఇప్పటికే కళాజాత బృందాల ద్వారా గ్రామాలు, పట్టణాల్లో వివిధ రకాల మోసాలపై ప్రజలకు నాటకాలు, పాటల రూపంలో అవగాహన కల్పిస్తున్నారు. గతంలో ఉన్న కార్డన్ సర్చ్ (నిర్బంధ తనిఖీలు)ని ప్రస్తుతం ‘కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం’గా మార్చారు. దీంతో అపరిచిత వ్యక్తులు సంచరించినప్పుడు పోలీసులకు తెలపడం, సీసీ కెమెరాల ఏర్పాటుతో ప్రయోజనాలు, మద్యం తాగి వాహనాలు నడపడంతో కలిగే దుష్పరిణామాలు, సైబర్ మోసాలు తదితర అంశాలపై వివరిస్తూ ప్రజలకు దగ్గరవుతున్నారు. భారీగా వాహనాలు స్వాధీనం పోలీసులు చేపడుతున్న కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం సత్ఫలితాలిస్తోంది. పోలీస్ కమిషనర్ పోతరాజు సాయిచైతన్య ఆదేశాల మేరకు పోలీ సు బృందాలు జిల్లాలో ఇప్పటి వరకు సుమారు 25 ప్రాంతాల్లో ఈ కార్యక్రమం నిర్వహించాయి. రిజిస్ట్రేషన్ పత్రాలులేని 700 లకు పైగా వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారించి వదిలేశారు. నల్లబెల్లం, రేషన్బియ్యం నిల్వలు, నిషేధిత పొగాకు ఉత్పత్తులు, దేశీదారు వంటి మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకుంటున్నారు. యువతపై ప్రత్యేక దృష్టి.. పోలీసు తనిఖీలంటే ప్రజలు భయపడకుండా ఉండేందుకు ‘కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం’ను నిర్వహిస్తున్నారు. స్థానిక ప్రజలతో సమావేశా లు ఏర్పాటు చేసి వారి సమస్యలను తెలుసుకొని వీలైనంత వరకు పరిష్కారానికి కృషి చేస్తున్నారు. అదే సమయంలో గుర్తు తెలియని వ్యక్తులకు ఆశ్రయిం ఇవ్వొద్దని సూచిస్తున్నారు. రేషన్ బియ్యం అక్రమ రవాణా చేస్తున్న వారి వివరాలను సేకరించి, తగు చర్యలు తీసుకోవడానికి పోలీసులు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా యువకులపై పోలీసులు ప్రధాన దృష్టి కేంద్రీకరించారు. ఎలాంటి దురలవాట్లకు గురికాకుండా ఉండేలా అవగాహన కల్పిస్తున్నారు. అపరిచిత వ్యక్తులు ఫోన్లకు పంపే లింకులు ఓపెన్ చేయడంతో కలిగే దుష్పరిణామాలు వివరిస్తున్నారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 టోల్ఫ్రీ నెంబర్ను సంప్రదించాలని సూచిస్తున్నారు. గుట్కా, గంజాయి, మద్యం తదితర వాటికి యువత దూరంగా ఉండాలని, లేకుంటే కుటుంబాలు ఛిన్నాభిన్నం అవుతాయని చెప్తున్నారు. ఘర్షణలు, హత్యలు, ఇతర నేరాలకు పాల్పడితే ఏర్పడే ఇబ్బందులను కూలంకషంగా వివరిస్తున్నారు. సత్ఫలితాలిస్తోన్న ‘కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం’ పట్టణ, గ్రామాల్లో విస్తృత తనిఖీలు పాత నేరస్తులు, అసాంఘిక కార్యకలాపాలపై ఆరా ఫుట్ పెట్రోలింగ్తో నిఘా నమ్మకం కలిగిస్తున్నాం పోలీసులపై ప్రజలకు నమ్మకం కలిగిస్తున్నాం. గతంలో గ్రామాలు, పట్టణాల్లో కొత్తగా ఎవరైనా వస్తే సులభంగా తెలిసేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం ద్వారా తనిఖీలు చేపడుతున్నాం. పాత నేరస్తుల కదలికలు, అసాంఘిక కార్యకలాపాలు, రేషన్ బియ్యం, ఇసుక అక్రమ రవాణా తదితర అక్రమ దందాలపై సమాచారం సేకరిస్తున్నాం. ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కారానికి కృషి చేస్తాం. – విజయ్బాబు, సీఐ, బోధన్ రూరల్ -
ప్రభుత్వం తక్షణమే పీఆర్సీని ప్రకటించాలి
నిజామాబాద్ అర్బన్ : రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పీఆర్సీని ప్రకటించి, పెండింగ్ డీఏ, బిల్లులను తక్షణమే చెల్లించాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి డి. సత్యానంద్ డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని మల్లుస్వరాజ్యం ట్రస్టు కార్యాలయంలో జిల్లా కమిటీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పాఠశాలల్లో ఉపాధ్యాయుల సర్దుబాటును పూర్తిగా నిలిపివేయాలని, ప్రాథమిక పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయుడిని, తరగతికి ఒక ఉపాధ్యాయుడిని నియమించాలని డిమాండ్ చేశారు. సీపీఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను పునరుద్ధరించాలని, 317 జీవో బాధితులను వారి స్థానికత ఆధారంగా సొంత జిల్లాలకు కేటాయించాలని, 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం అమలు చేయాలని కోరారు. అన్ని కేటగిరిల పాఠశాల విద్యార్థులకు నోట్ బుక్స్ అందజేయాలని, ఎయిడెడ్ పాఠశాలల ఉపాధ్యాయులకు ప్రతి నెల ఒకటో తేదీన వేతనం అందజేయాలని డిమాండ్ చేశారు. విద్యా రంగ, ఉపాధ్యాయ సమస్యలపై ప్రభుత్వం జాప్యం చేస్తే టీఎస్యూటీఎఫ్ పక్షాన పోరాటాలు చేస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు రమేష్, ప్రధాన కార్యదర్శి గంగాధర్, ఉపాధ్యక్షులు, మల్లేష్, ట్రెజరర్ రాజారామ్, జిల్లా కార్యదర్శులు జనార్దన్, సాయన్న, బాబులు, శ్రీనివాస్, జిల్లా కమిటీ సభ్యులు రఘు, రాజేశ్వర్, ప్రభాకర్, లింగం, బాలరాజు, లింబగిరి స్వామి, రవీందర్, భూమేశ్వర్, బాజన్న, సుధాకర్ శ్యామ్ రావ్, తదితరులు పాల్గొన్నారు. -
నర్సయ్య పోరాటస్పూర్తితో బలమైన ఉద్యమాలను నిర్మిద్దాం
డిచ్పల్లి: అఖిలభారత రైతు కూలీ సంఘం (ఏఐకేఎంఎస్) జిల్లా మాజీ గౌరవ అధ్యక్షులు, అమరుడు కామ్రేడ్ నాయక్వాడి నర్సయ్య పోరాటస్ఫూర్తితో బలమైన రైతాంగ ఉద్యమాలను నిర్మిద్దామని సీపీఐ(ఎంఎల్) న్యూడెమొక్రసీ మండల కార్యదర్శి జేపీ గంగాధర్ పేర్కొన్నారు. డిచ్పల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో శనివారం మెంట్రాజ్పల్లి గ్రామంలో కామ్రేడ్ నర్సయ్య చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జేపీ గంగాధర్ మాట్లాడుతూ.. నిజాంసాగర్ ఆయకట్టు కోసం జరిగిన రైతు ఉద్యమం, సారంగపూర్ చక్కెర ఫ్యాక్టరీ పునఃప్రారంభించాలని జరిగిన ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారని గుర్తు చేశారు. నర్సయ్య మరణం రైతు, ప్రజా ఉద్యమాలకు తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పీవైఎల్ జిల్లా ఉపాధ్యక్షులు వాసరి సాయినాథ్, పీవోడబ్ల్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.సుప్రియ, ఎన్.లక్ష్మి, శాంత, మేకల రాజమణి, పాండు, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు. -
ఇసుక లేక ఆగిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం
సినిమాలువేల్పూర్: మండలంలోని జాన్కంపేట్, సాహేబ్పే ట్, అమీనాపూర్, లక్కోర, పడగల్ గ్రామాలలో ఇ సుక లేక ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ఆగిపోయిందని లబ్ధిదారులు ఆవేదన చెందుతున్నారు. ఇందిరమ్మ ఇళ్లకు ప్రభుత్వం ఉచితంగా ఇసుక ఇస్తుందని ప్రక టించినా, ఇసుక సరఫరా కావడం లేదని వాపోతున్నారు. ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు తొందరగా పనులు ప్రారంభించాలని అధికారులు చెప్పగా గుంతలు తీసి సిద్ధం చేశామన్నారు. ఇసుక కోసం అధికారులను అడిగితే రెవెన్యూ సదస్సుల్లో బిజీగా ఉన్నామని, ఉన్నత అధికారుల నుంచి కూపన్ బుక్ లు రావాల్సి ఉందని చెబుతున్నారని వాపోయారు. వర్షాకాలం కావడంతో పిల్లర్ గుంతల్లో నీళ్లు నిండుతున్నాయని, ఇసుక ఉంటే ఈపాటికే అడుగు పిల్ల ర్లు పూర్తయ్యేవని పేర్కొంటున్నారు. వాగు సరిహ ద్దు ఉన్న గ్రామాల వారికి ఎటువంటి ఆటంకం లే కుండా ఇసుక లభిస్తుండగా, వాగు సరిహద్దు లేని తమ గ్రామాలకు ఇసుక లభించడం లేదన్నారు. రె వెన్యూ సదస్సులు ముగిసినందున వెంటనే ఇసుక సరఫరా చేసి, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు సహకరించాలని లబ్ధిదారులు కోరుతున్నారు. -
నెరవేరుతున్న సొంతింటి కల
ధర్పల్లి: ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు పైలట్ గ్రామంలో ముమ్మరంగా కొనసాగుతున్నాయి. నిరుపేద కుటుంబాల సొంతింటి కళను సహకారం చేయాలని సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇంటి పథకానికి శ్రీకారం చుట్టింది. వేగవంతంగా నిర్మాణ పనులు మండలంలోని సీతాయిపేట్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. మొదటి విడత పైలట్ ప్రాజెక్టు కింద ఎంపికై న సీతాయిపేట గ్రామానికి 113 ఇళ్లు మంజూరయ్యాయి. 400 నుంచి 600 చదరపు అడుగులలోపు ఇంటిని నిర్మించాలని నిబంధన మేరకు అధికారులు 55 ఇళ్ల నిర్మాణానికి ముగ్గు పోశారు. ఇందులో 32ఇళ్లు బేస్ మెంట్ వరకు,12 ఇళ్లు రూఫ్లెవెల్ వరకు , మరో రెండు ఇళ్లుకు స్లాబ్ పోయడం పూర్తయింది. 28 మంది లబ్ధిదారులకు లక్ష రూపాయల చొప్పున, రూఫ్ వరకు గోడలు కట్టిన లబ్ధిదారులకు రూ.2 లక్షల చొప్పున ప్రభుత్వం బిల్లులు చెల్లించింది. ఇళ్ల నిర్మాణ పనులను గహ నిర్మాణ, పంచాయతీరాజ్ శాఖల అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. నాలుగు దఫాలుగా బిల్లులు.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో బేస్మెంట్ వరకు పూర్తి చేసిన వెంటనే అధికారులు ఏఐ టెక్నాలజీతో ఫోటోలను అప్లోడ్ చేయగానే వారం రోజుల వ్యవధిలోనే రూ.లక్ష నగదు లబ్ధిదారుల ఖాతాల్లో జమ అవుతుంది. రూఫ్లెవెల్ గోడల వరకు నిర్మాణం పూర్తి చేస్తే రూ.లక్ష, స్లాబ్ పూర్తయ్యాక రూ.2 లక్షలు, ప్లాస్టరింగ్, డోర్ ఫిట్టింగ్, కలర్ పూర్తయ్యాక చివరి బిల్లు రూ.లక్ష అందిస్తారు. ఇలా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు ఎంత వేగంగా పూర్తి చేస్తే బిల్లులు కూడా అంతే వేగంగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ అవుతున్నాయి. దీంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. స్లాబ్ దశలో ఉన్న ఇందిరమ్మ ఇల్లు కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పైలట్ ప్రాజెక్టు కింద ధర్పల్లి మండలం సీతాయిపేట్ ఎంపిక సకాలంలో బిల్లులు చెల్లింపు హర్షం వ్యక్తం చేస్తున్న లబ్ధిదారులు -
జీపీ కార్మికులకు అందని వేతనాలు
నందిపేట్(ఆర్మూర్): మండలంలోని అన్ని గ్రామాలను పరిశుభ్రంగా ఉంచే పంచాయతీ కార్మికులకు మూడు నెలలుగా వేతనాలు అందడంలేదు. మండలంలో మొత్తం 20 గ్రామపంచాయతీలు ఉన్నాయి. జనాభా ప్రాతిపదికన గ్రామాల్లో పారిశుధ్య పనులు చేపట్టడం కోసం ప్రభుత్వం ఆయా జీపీల పరిధిలో మల్టీపర్పస్ వర్కర్ల పేరున 110 మంది పంచాయతీ కార్మికులను నియమించింది. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడంతో విశేష కృషి చేస్తున్న కార్మికులకు గత మార్చి, ఏప్రిల్, మే నెలలకు సంబందించి వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అసలే అరకొర వేతనాలు అవికూడ నెలనెలా రాకపోవడంతో ఇబ్బందిగా ఉందని వాపోతున్నారు. ఇప్పటికై న అధికారులు వెంటనే స్పందించి వేతనాలు విడుదల చేయాలని పంచాయతీ కార్మికులు కోరుతున్నారు. నందిపేటలో 110 మంది.. ఆర్థిక ఇబ్బందుల్లో కార్మికులు నిధులు విడుదల చేయాలని వినతి -
జనావాసాల మధ్య మురుగు
నేటి చిత్రంగౌతంనగర్లో జనావాసాల మధ్య నిలిచిన మురుగు నిజామాబాద్అర్బన్ : నగరంలో 40వ డివిజన్లోని గౌతంనగర్లో జనావాసాల మధ్య మురుగు నిల్వ ఉంటోంది. దీంతో దోమలు స్వైర విహరం చేస్తున్నాయి. మురుగు దుర్వసనతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలి. – మెతుకు శివకుమార్, 40వ డివిజన్ మీ ప్రాంతంలో నెలకొన్న సమస్యను, ఫొటోను మాకు వాట్సాప్లో పంపించండి. ప్రచురించి అధికారుల దృష్టికి తీసుకెళ్తాము. పంపిన వారి పేరు, ఫొటో ప్రచురిస్తాము. నిజామాబాద్ అర్బన్ – 95531 30597 నిజామాబాద్ రూరల్ – 97053 46541 మాకు ఫొటో పంపండి -
యువత స్వచ్ఛందంగా రక్తదానం చేయాలి
నిజామాబాద్నాగారం: యువత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయాలని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి రక్త నిధి కేంద్రం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కావ్య అన్నారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవం పురస్కరించుకొని శనివారం జోయ్ ఆలుక్కాస్ జ్యువెలరీ షోరూం నిజామాబాద్ బ్రాంచ్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి రక్తనిధి కేంద్రం సౌజన్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ కావ్య విచ్చేసి మాట్లాడారు. జోయ్ ఆలుక్కాస్ సిబ్బంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయడం అభినందనీయమన్నారు. ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి రక్త నిధి కేంద్రానికి రక్తదానం చేయడం వలన నిరుపేద రోగులకు ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. యువత అపోహలకు తావివ్వకుండా రక్తదానం చేయాలని సూచించారు. సామాజిక స్పహతో సిబ్బంది రక్తదానం చేయడం అభినందనీయమన్నారు. వీరిని స్ఫూర్తిగా తీసుకొని మరింత మంది రక్తదానానికి ముందుకు రావాలని కోరారు. కార్యక్రమంలో బ్రాంచ్ మేనేజర్ సంజయ్, అకౌంట్స్ మేనేజర్ జితిన్, ఫ్లోర్ మేనేజర్ మణికందన్, సిబ్బంది సనూప్, పీఆర్వో పిప్పెర నరేందర్, రక్త నిధి కేంద్రం సిబ్బంది ప్రేమ్ చంద్, సందీప్ తదితరులు పాల్గొన్నారు . -
క్రికెట్ లీగ్ టోర్నమెంట్ ప్రారంభం
నిజామాబాద్నాగారం : నిజామాబాద్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అండర్–19 క్రికెట్ లీగ్ టోర్నమెంట్ను శనివారం అర్సపల్లిలో శైలేజా మైదానంలో ప్రారంభమయ్యాయి. కోచ్ నయూమ్, ఫారస్లు టాస్ వేసి మ్యాచ్ను ప్రారంభించారు. మొదటి మ్యాచులో గ్రీన్ వర్సెస్ ఏల్లో మధ్య జరిగింది. టాస్ గెలిచి గ్రీన్జట్టు బ్యాటింగ్ చేయగా 10 వికెట్లకు గాను 255 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన ఏల్లో జట్టు 150 పరుగులకే అలౌట్కావడంతో గ్రీన్ జట్టు గెలిచింది. రెండో మ్యాచ్లో బ్లాక్ వర్సెస్ బ్లూ బ్లాక్ మధ్య పోటీ జరిగింది. ఇందులో టాస్ గెలిచిన బ్లూ బ్లాక్జట్టు నిర్ణీత ఓవర్లలో 130 పరుగులు చేసి అలౌటైంది. అనంతరం బ్యాటింగ్కు దిగిన బ్లాక్ జట్టు నిర్ణీత ఓవర్లలో 105 పరుగులు చేసి అలౌట్కావడంతో బ్లూ బ్లాక్జట్టు గెలిచింది. ఆలయాల పరిరక్షణ మన బాధ్యత నిజామాబాద్ రూరల్: ఆలయాలను పరిరక్షించుకోడం మన బాధ్యత అని జిల్లా ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. శనివారం నగరంలోని కబ్జాకు గురువుతున్న బోధన్ రోడ్లోని ఆటోనగర్ హనుమాన్ మందిరాన్ని రక్షించటానికి సహకరించాలని శ్రీ హనుమాన్ మందిర పరిరక్షణ కమిటీ ప్రతినిధులు ఎంపీని కోరారు. ఈ సందర్భంగా ఇందల్వాయి కిషన్ గంట్యాల వెంకటేశ్, అంబదాస్ రావు, మల్లేశ్ గౌడ్, దోర్నాల రవి, శాతాల లింబాద్రి, మధు తదితరులు అర్బన్ బీజేపీ క్యాంపు ఆఫీసులో అర్వింద్ కు వినతి పత్రం అందించారు. గౌడ విద్యార్థులకు ప్రతిభ పురస్కారాలు నిజామాబాద్ అర్బన్ : గౌడ అఫీషియల్స్ ప్రొఫెషనల్ అసోసియేషన్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో గౌడ విద్యార్థులకు ప్రతిభ పురస్కారాలు అందిస్తున్నట్లు సంఘం అధ్యక్షుడు ఎం.వెంకటేశ్వర్ గౌడ్ ప్రకటనలో తెలిపారు. 2024– 25 విద్యా సంవత్సరంలో 10వ తరగతి, ఇంటర్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థిని విద్యార్థులకు ఆదివారం న్యూ అంబేడ్కర్ భవన్లో ఉదయం 10 గంటలకు ఈ పురస్కారాలు అందిస్తున్నట్లు తెలిపారు. దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలి నిజామాబాద్ సిటీ : కేంద్ర ప్రభుత్వం కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని, వాటిని రద్దుచేసేవరకు కార్మికులు ఐక్యపోరాటాలకు సిద్ధంకావాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రమ అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని నాందేవ్వాడలోని పార్టీకార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో రమ మాట్లాడారు. కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను నిలువరించేందుకు, ప్రాథమిక హక్కులను రక్షించుకొనేందుకు కేంద్ర కార్మిక సంఘాలు, స్వతంత్ర ఫెడరేషన్లు, అసోసియేషన్లు చేయబోయే సమ్మెలో ప్రతి కార్మికుడు పాల్గొనాలని కోరారు. జులై 9న నిర్వహిస్తున్న దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలన్నారు. ఈ సమావేశంలో సీఐటీయూ నాయకులు రమేష్ బాబు, శంకర్ గౌడ్, నూర్జహాన్, గంగాధర్, నన్నేసావ్, శ్రీనివాస్, రాజ్, విజయ, మోహన్, గణేష్ , రమేష్, గంగాధర్, మహేష్ , జాదవ్, మురళి, రాములు, షేక్ అబ్దుల్, విమలమ్మ పాల్గొన్నారు. వాల్పోస్టర్ల ఆవిష్కరణ వేల్పూర్ : వేల్పూర్ మండలం లక్కోర గ్రామంలోని పీకేటీపీ బీడీ సెంటర్లో టీయూసీఐ రాష్ట్ర ప్రథమ మహాసభల వాల్పోస్టర్లను నాయకులు శనివారం ఆవిష్కరించారు. ఈనెల 19న సిరికొండ మండల కేంద్రంలో జరిగే నిజామాబాద్ ఉమ్మడి జిల్లా మహాసభ , 21,22 తేదీలలో నిజామాబాద్లో జరిగే రాష్ట్ర ప్రథమ మహాసభలను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో నిజామాబాద్ ఉమ్మడి జిల్లా సంయుక్త కార్యదర్శి జి.అరవింద్, నాయకులు గంగాధర్, లింబాద్రి, అన్వర్, పద్మ, హేమలత, సాయన్న, రాజేందర్, ఆనంద్, కావేరి తదితరులు పాల్గొన్నారు. -
రక్తదానం చేయడం అభినందనీయం
సిరికొండ: రక్తదానం చేయడం ఎంతో అభినందనీయమని హెల్పింగ్ హర్ట్స్ ఫౌండేషన్ చైర్మన్ అయినాల శ్రీకాంత్ పేర్కొన్నారు. మండలంలోని తూంపల్లి గ్రామంలో అంతర్జాతీయ రక్తదాన దినోత్సవాన్ని పురస్కరించుకొని రక్తదాతలకు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రశంసపత్రాలు అందజేశారు. పలుమార్లు రక్తదానం చేస్తు ప్రాణదాతలుగా నిలుస్తున్న హరీష్గౌడ్, బాలరాజ్, రాజు, కిషన్, , రవి, మహేష్, శేఖర్, రాజేశ్వర్, గోపాల్లను అభినందించారు. శ్రీకాంత్ మాట్లాడుతు రక్తదానం చేయడం వలన ఆరోగ్యానికి ఎంతో మేలు అన్నారు. వీడీసీ చైర్మన్ లక్ష్మణ్గౌడ్, ఫౌండేషన్ వైస్ చైర్మన్ రాజేందర్, రవి, ప్రశాంత్, యశ్వంత్, బాలరాజ్, అనిల్ తదితరులు పాల్గొన్నారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి నిజామాబాద్రూరల్ : యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని మోపాల్ ఎస్సై యాదగిరిగౌడ్ అన్నారు. శనివారం మండలంలోని కంజర్ గ్రామంలో గంజాయి, మత్తుపదార్థాలపై అవగాహన క ల్పించారు. గ్రామ అభివృద్ధి కమిటీల ఆధ్వర్యంలో సీసీ కెమెరాలు అమర్చుకోవాలని సూచించారు. వాహనదారులు హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. కేటీఆర్పై కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్య నిజామాబాద్ రూరల్: మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్పై కాంగ్రెస్ పార్టీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని జెడ్పీ మాజీ చైర్మన్ దాదాన్న గారి విఠల్ రావు పేర్కొన్నారు. ఈమేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఏసీబీ కేటీఆర్కు నోటీసులు జారీ చేయడంపై ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని హితవు పలికారు. -
అనాథ బాలికకు ఆర్థిక సహాయం
నందిపేట్(ఆర్మూర్): మండలంలోని బజార్కొత్తూర్లో త ల్లిదండ్రులను కోల్పోయిన అ నాథ బాలికకు ఆదివాసి నా యక్పోడు కులస్తులు ఆర్థిక స హాయం అందించారు. భవాని అనే బాలిక ఏడాది వ్యవధిలోనే తలిదండ్రులను కోల్పోయింది. దీంతో జిల్లా నాయక్పోడు కులస్తులు శనివారం గ్రామానికి వచ్చి భవానికి రూ. 90 వేల ఆ ర్థిక సహాయాన్ని, నెలకు సరిపడా నిత్యవసర వస్తువులను అందజేశారు. నిజామాబాద్లో ఉన్న విజయలక్ష్మి హాస్పిటల్ మేనేజింగ్ డైరక్టర్ బండారి భోజన్న తన వంతుగా రూ. 50 వేలతో పాటు కులసంఘం సభ్యులు పోగు చేసి రూ.40 వేలు అందజేశారు. ఇందులో నుంచి రూ. 75 వేల భవాని పేరు బ్యాంకులో డిపాజిట్ చేసి మిగతా రూ. 15 వేల నగదును నిత్యవసర జీవనోపాధి ఖర్చుల నిమిత్తం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆదివాసి నాయకపోడు గౌరవ అధ్యక్షులు బండారి భోజన్న, జిల్లా అద్యక్షులు గాండ్ల రాంచందర్, వర్కింగ్ ప్రెసిడెంట్ లోలం గంగాధర్, ఉద్యోగుల సేవాసంఘం అధ్యక్షులు కోండ్రు నవీన్, పీజీ హెచ్ఎం సింగం వనిత, మండల నాయకులు మన్నె సాగర్, దుంపల శ్రీనివాస్, మేడిపల్లి గౌతం, నరేశ్ తదితరులు పాల్గొన్నారు. -
చోరీ కేసులో ఒకరి అరెస్టు
ఎల్లారెడ్డి: పట్టణంలోని సత్యం కిరాణా దుకాణంలో చోరీకి పాల్పడిన వ్యక్తిని పట్టుకొని అరెస్టు చేసినట్లు ఎస్సై మహేశ్ శనివారం తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం.. మండలంలోని భిక్కనూర్ గ్రామానికి చెందిన కోడేనోళ్ల రాజు ఈ నెల 11న రాత్రి సత్యంకు చెందిన కిరాణా దుకాణంలో చోరీకి పాల్పడ్డాడు. శనివారం ఎల్లారెడ్డిలో వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా పోలీసులను చూసి పారిపోతున్న రాజును పట్టుకొని విచారించగా కిరాణా దుకాణంలో చోరీకి పాల్పడినట్లు ఒప్పుకున్నట్లు తెలిపారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్సై తెలిపారు. కంటైనర్, టీవీఎస్ ఎక్సెల్ ఢీ ● ఇద్దరికి గాయాలు నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): నాగిరెడ్డిపేట మండల కేంద్రం గోపాల్పేటలో జాతీయ రహదారిపై కంటైనర్, టీవీఎస్ ఎక్సెల్ ఢీకొని ఇద్దరు గాయపడిన ఘటన శనివారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం... లింగంపేట మండలం శెట్పల్లి సంగారెడ్డికి చెందిన ఒడ్డె గాలయ్య, సిద్ధవ్వ టీవీఎస్ ఎక్సెల్పై గోపాల్పేటలోని జాతీయ రహదారిపై ప్రయాణిస్తుండగా మెదక్ నుంచి ఎల్లారెడ్డి వైపు వెళ్తున్న కంటైనర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గాలయ్య, సిద్ధవ్వ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారంతో 108 అంబులెన్స్ సిబ్బంది క్షతగాత్రులను చికిత్స నిమిత్తం మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
దేశీదారు పట్టివేత
నిజాంసాగర్(జుక్కల్): మద్నూర్ మండలం రుశేగావ్ చౌరస్తా వద్ద శనివారం 10 దేశీదారు మద్యం బాటిళ్లను పట్టుకున్నట్లు బిచ్కుంద ఎక్సైజ్ ఎస్సై సత్యనారాయణ తెలిపారు. రుశేగావ్ నుంచి ద్విచక్ర వాహనంపై దేశీదారు మద్యం తరలిస్తున్నట్లు సమాచారం వచ్చిందన్నారు. ఈ మేరకు చౌరస్తా వద్ద ద్విచక్ర వా హనదారుడుని పట్టుకొని మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. దేశీదారు తరలిస్తున్న బండి సురేశ్తోపాటు దిగంబర్పై కేసు నమోదు చేశామని పేర్కొన్నారు. ఇసుక ట్రాక్టర్ల పట్టివేత ఇందల్వాయి: మండలంలోని లోలం వాగు నుంచి అనుమతి లేకుండా ఇసుకను తరలిస్తు న్న నాలుగు ట్రాక్టర్లను పట్టుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్సై సందీప్ శనివారం తెలిపారు. వాగు నుంచి కొందరు అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మే రకు వెళ్లి చూడగా ట్రాక్టర్ డ్రైవర్ల వద్ద అ నుమతి పత్రాలు లేవన్నారు. దీంతో కేసు న మోదు చేశామన్నారు. అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తే కేసులు నమోదు చేసి చ ర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు. -
ప్రైవేటు బస్సుల నిలువు దోపిడీ
మోర్తాడ్(బాల్కొండ): నిజామాబాద్, జగిత్యాల జిల్లాల నుంచి ముంబైకి వెళుతున్న ప్రయాణికులు నిలువు దోపిడీకి గురవుతున్నారు. ముంబైకి టీజీఎస్ ఆర్టీసీ ఒకటే బస్సు నడపడంతోపాటు ప్రయాణికుల సంఖ్యకు సరిపడా రైళ్లు లేకపోవడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో ప్రైవేటు బస్సులను ఆశ్రయిస్తున్నారు. వేసవి సెలవులు ముగియడం, విద్యా సంస్థలు పున: ప్రారంభం కావడంతో ముంబై నుంచి తెలంగాణ జిల్లాలకు వచ్చిన వారు తిరుగు పయనమవుతున్నారు. దీంతో ప్రైవేటు బస్సుల ఆపరేటర్లు టికెట్ ధరలను అమాంతం పెంచడంతో తమ జేబులకు చిల్లులు పడుతున్నాయని ప్రయాణికులు వాపోతున్నారు. ఆర్టీసీ సీట్లు ఫుల్.. వేములవాడ డిపో నుంచి లహరి బస్సు ఒక్కటే ముంబైకి ప్రయాణికులను చేరవేస్తుంది. ఈ బస్సులో స్లీపింగ్ బెర్త్కు రూ.1,700లు, సీటు కోసం రూ.1,300ల చార్జీ వసూలు చేస్తున్నారు. ఒకే బస్సు ఉండటంతో రెండు, మూడు రోజుల టిక్కెట్లు ముందుగానే బుకింగ్ అయిపోతున్నాయి. కాగా, నిజామాబాద్ నుంచి దేవగిరి ఎక్స్ప్రెస్(రైలు) ఒక్కటే ముంబైకి ప్రతి రోజూ వెళుతుంది. దీంతో ఆ రైలు కాస్తా ప్రయాణికులకు కిక్కిరిసిపోతుంది. ముంబైకి వెళ్లే ప్రయాణికుల జేబులకు చిల్లు ట్రావెల్ బస్సుల్లో అడ్డగోలు చార్జీలు ఆర్టీసీ బస్సు ఒకటే నడపడంతో ఇబ్బందులుఒక్క టికెట్ రూ.2,500 సరిపడా బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు ప్రైవేటు ట్రావెల్స్ బస్సులను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో ఇదే అదనుగా భావిస్తున్న టావెల్స్ ఆపరేటర్లు టికెట్ల ధరలను పెంచేశారు. గతంలో స్లీపింగ్ బస్సులో ఒక్కో టిక్కెట్కు రూ.1,200 ల నుంచి రూ.1,300 ల చార్జీ వసూలు చేసేవారు. ఇప్పుడు రూ.2,500 లకు టిక్కెట్ ధర పెంచారు. సీటులో కూర్చొని ప్రయాణించేవారికి రూ.900 ల చార్జీ ఉండగా రూ.1,700 లకు పెంచారు. జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, కమ్మర్పల్లి, మోర్తాడ్, ఆర్మూర్, నిజామాబాద్ బుకింగ్ పాయింట్ల నుంచి ముంబైకి ప్రయాణం సాగుతుంది. ఎక్కడి నుంచి బస్సు ఎక్కినా ఒక్కటే చార్జీని వసూలు చేస్తున్నారు. నిత్యం ఆరు, ఏడు ప్రయివేటు బస్సులు రెండు జిల్లాల నుంచి ముంబైకి ప్రయాణికులను తరలిస్తున్నాయి. కాగా, ముంబై నుంచి వచ్చే వారికి కూడా ఇదే విధమైన చార్జీలను వసూలు చేస్తున్నారని ప్రయాణికులు తెలిపారు. ప్రైవేటు బస్సుల చార్జీల నియంత్రణకు చర్యలు తీసుకునేవారు లేకపోవడంతో ఆపరేటర్లు చెప్పినంత ధరకు టికెట్లను కొనుగోలు చేయాల్సి వస్తుందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇద్దరికి రూ.5 వేలు ముంబైకి అత్యవసరంగా వెళ్లాల్సి ఉంది. చార్జీలు పెరిగినా తప్పనిసరి పరిస్థితుల్లో టికెట్లను కొనుగోలు చేసి బయల్దేరాం. నేను, నా భార్య ఇద్దరికే స్లీపర్ సీట్లకు రూ.5 వేలు ఖర్చు చేశాం. ఆర్టీసీ సంస్థ బస్సులను నడిపితే ప్రయాణికులకు ప్రయోజనంతోపాటు ప్రైవేటు బస్సుల్లో చార్జీలు నియంత్రణలోకి వచ్చేవి. – రాజన్న, తొర్తి(ముంబై) -
ప్రశ్నే ప్రగతికి మెట్టు
నిజామాబాద్నాగారం:. ప్రశ్నించడమే ప్రగతికి మెట్టని, రాజ్యాంగ చట్టాలపై అందరికీ అవగాహన అవసరమని వక్తలు పేర్కొన్నారు. జన విజ్ఞాన వేదిక జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శనివారం నగరంలోని పెన్షనర్స్ అసోసియేషన్ హాల్లో ప్రత్యేక తరగతులు నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా అధ్యక్షుడు కోయేడి నర్సింహులు అధ్యక్షత వహించగా, రాష్ట్ర అధ్యక్షుడు నర్రా రామారావు హాజరై మాట్లాడారు. జనవిజ్ఞాన వేదిక 1988 ఫిబ్రవరి 28 జాతీ య సైన్స్ దినోత్సవం రోజు ఆవిర్భవించిందని తెలిపారు. ఆవిర్భావం కంటే ముందు సమాజ మార్పు కోరే ఉద్యోగస్తులు, ఇంజనీర్లు, డాక్టర్లు, శాస్త్రవేత్తలు కలిసి భారత జన విజ్ఞాన జాత ద్వారా గ్రామాన్ని తెలుసుకో గ్రామాన్ని మార్చుకో అనే అంశంపై కళాజాత నిర్వహించారని గుర్తు చేశారు. అనంతరం మన విశ్వం అనే అంశంపై సురేశ్ కావాల్లా ప్రసంగించారు. రాజ్యాంగ ఆవశ్యకత, హక్కులు, చట్టాలు తదితర అంశాలపై సాయన్న అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి గంగాకిషన్, వెంకట మల్లయ్య, విజయ ఆనంద రావు, రామకృష్ణ, పెద్ది వెంకట్రాములు, జేవీవీ కార్యకర్తలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ● చట్టాలపై అవగాహన అవసరం ● జన విజ్ఞాన వేదిక ప్రత్యేక తరగతుల్లో వక్తలు -
నెట్బాల్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఏకగ్రీవం
నిజామాబాద్ నాగారం: నెట్బాల్ అసోసియేషన్ జిల్లా కార్యవర్గాన్ని శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నగరంలోని వినాయక్నగర్ అభ్యాస స్కూల్లో నిర్వహించిన ఎన్నికలకు పరిశీలకులుగా కామారెడ్డి జనరల్ సెక్రెటరీ రఘురాం, నిజామాబాద్ యూత్ స్పోర్ట్స్ ఆఫీసర్ ముత్తెన్న, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి బొబ్బిలి నర్సయ్య, ఎన్నికల అధికారిగా నాగేశ్వరావు వ్యవహరించారు. నూతన కార్యవర్గం 2029 వరకు కొనసాగుతుందని ఎన్నికల అధికారి ప్రకటించారు. అధ్యక్షుడిగా జీ వెంకటేశ్వర్ రావు, ప్రధాన కార్యదర్శిగా ఏ రమేశ్, కోశాధికారిగా పీ గంగాధర్, చైర్మన్గా రవీందర్, వైస్ ప్రెసిడెంట్లుగా సీహెచ్ అన్నపూర్ణ, నాగేశ్, రమేశ్, జాయింట్ సెక్రెటరీలుగా నాగరాజు, కృష్ణంరాజు, ఆశాజ్యోతి, అనిల్కుమార్, ఈసీ మెంబర్లుగా కుమార్, ప్రవీణ్, రాజు, సాగర్ , అప్పారావు , మధుకర్, ప్రసన్న ఎన్నికయ్యారు. అనంతరం నూతన అధ్యక్షుడు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రస్తుతం నెట్బాల్ పోటీల్లో క్రీడాకారులు ఉత్తమ ప్రతిభ కనబర్చేలా ప్రోత్సహిస్తామన్నారు. -
మహదేవుని ఆలయ నిర్మాణానికి రాణిరుద్రమ దేవి
మీకు తెలుసా? దోమకొండ గడికోటలోని మహదేవుని ఆలయ నిర్మాణానికి అప్పట్లో వరంగల్ సంస్థానంను పరిపాలించిన రాణి రుద్రమదేవి వచ్చినట్లు శిలాఫలకం ఉంది. ప్రస్తుతం ఏదైనా కార్యక్రమాన్ని మంత్రులు, ఇతర ప్రముఖులు ప్రారంభించినప్పుడు ఏ విధంగానైతే శిలా ఫలకాలు ఏర్పాటు చేస్తున్నారో ఆ రోజుల్లో సైతం ఆమె ఆలయ నిర్మాణానికి వచ్చినప్పుడు శిలాఫలకం ఏర్పాటు చేసినట్లు పురావస్తుశాఖ ప్రతినిధులు గుర్తించారు. వరంగల్లోని వేయి స్థంభాల ఆలయాన్ని పోలిన విధంగా అదే శిల్పాకళా నైపుణ్యంతో ఇక్కడి మహదేవుని ఆలయ నిర్మాణం ఉంటుంది. –దోమకొండ -
భూభారతిని సమర్థవంతంగా అమలు చేయాలి
నిజామాబాద్ అర్బన్: భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూ భారతి చట్టం జిల్లాలో సమర్థవంతంగా అమలయ్యేలా అంకిత భావంతో కృషి చేయాలని కలెక్టర్ టీ వినయ్ కృష్ణారెడ్డి రెవెన్యూ అధికారులకు సూచించారు. శనివారం ఆయన నిజామాబాద్ ఆర్డీవో, సౌత్, నార్త్ తహసీల్ కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా భూ భారతి రెవెన్యూ సదస్సుల సందర్భంగా వచ్చిన దరఖాస్తులు, వాటి పరిష్కారానికి చేపడుతున్న చర్యలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ దరఖాస్తులను వెంటదివెంట పరిశీలిస్తూ, నిర్ణీత గడువులోపు పరిష్కారమయ్యేలా చొరవ చూపాలన్నారు. తప్పిదాలకు ఆస్కారం లేకుండా, భూ భారతి చట్టంలోని నిబంధనలను తుచ తప్పకుండా పాటిస్తూ, పెండింగ్ దరఖాస్తులపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని సూచించారు. అందుబాటులో ఉన్న రెవెన్యూ రికార్డుల వివరాలతో సరిపోల్చుకుని, క్షేత్రస్థాయి విచారణను పకడ్బందీగా జరపాలని అన్నారు. కలెక్టర్ వెంట నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్రకుమార్, సౌత్, నార్త్ తహసీల్దార్లు బాలరాజు, విజయ్కాంత్, రెవెన్యూ అధికారులు ఉన్నారు. రైతు వేదికలను ముస్తాబు చేయాలి ఈ నెల 16న నిర్వహించనున్న రైతు నేస్తం కార్యక్రమానికి జిల్లాలోని అన్ని రైతు వేదికలను అందంగా ముస్తాబు చేయాలని కలెక్టర్ టీ వినయ్ కృష్ణారెడ్డి వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించా రు. డిచ్పల్లి మండలం నడిపల్లి, మోపాల్ మండల కేంద్రంలోని రైతు వేదికలను సందర్శించి, అందు బాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించారు. రై తు నేస్తం కార్యక్రమానికి ఆదర్శ రైతులతోపాటు స్థా నిక ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలని సూచించారు. సీఎం వీసీ ద్వారా రైతులతో ముఖాముఖి జరుపనున్నందున ఎలాంటి సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ వెంట జిల్లా వ్యవసా య అధికారి వీర స్వామి తదితరులు ఉన్నారు. కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆర్డీవో, తహసీల్ కార్యాలయాల తనిఖీ మోపాల్, నడిపల్లి రైతు వేదికలు పరిశీలన -
చెరువులో పడి మత్స ్యకారుడి మృతి
బీబీపేట: చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో పడి మత్స్యకారుడు మృతి చెందిన ఘటన శనివారం మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఎస్సై ప్రభాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గుర్రం లక్ష్మణ్ (35) శుక్రవారం స్థానిక పెద్ద చెరువులో చేపలవేటకు వెళ్లాడు. తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతికినా ఆచూకీ లభించలేదు. శనివారం ఉదయం చెరువు వద్దకు వెళ్లి చూడగా లక్ష్మణ్ మృతదేహం కనిపించింది. మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య మంజుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి ఒక కూతురు, కుమారుడు ఉన్నారు. కేజ్వీల్ ట్రాక్టర్ ఢీకొని ఒకరు..బోధన్రూరల్: మండలంలోని సంగం గ్రామంలో నాయకం ఎర్ర సాయిలు (48) కేజ్వీల్ ట్రాక్టర్ ఢీకొని అక్కడిక్కడే మృతి చెందినట్లు బోధన్ రూరల్ ఎస్సై మచ్చేందర్ రెడ్డి తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం నాయకం ఎర్ర సాయిలు గ్రామంలోని చౌరస్తా వద్ద గల హోటల్లో టీ తాగి నడుచుకుంటూ వెళుతున్నాడు. అదే సమయంలో గ్రామానికి చెందిన సూర శ్రీనివాస్ కేజ్వీల్ ట్రాక్టర్ను అతివేగంగా, అజాగ్రత్తగా నడుపుతూ సాయిలును ఢీకొట్టాడు. దీంతో దమ్ము చక్రాల కింద పడిపోవడంతో సాయిలు తలకు బలమైన గాయాలై అక్కడిక్కడే మృతి చెందాడు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు శనివారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మచ్చేందర్ రెడ్డి పేర్కొన్నారు. -
జీపీఎస్ ట్రాకర్తో వాహనం సేఫ్
ఖలీల్వాడి: రూ. లక్షలు పెట్టి కొనుగోలు చేసిన వాహనం చోరీకి గురైతే ఎవరికై నా బాధగా ఉంటుంది. అదే వాహన కొనుగోలు సమయంలో కొంత ఖర్చుపెట్టి జీపీఎస్ ట్రాకర్ను బిగిస్తే వాహనానికి భద్రత ఉంటుంది. ఇటీవల బైక్లకు జీపీఎస్ ట్రాకర్లు బిగించుకునేందుకు యజమానులు ఆసక్తి చూపుతున్నారు. వాహన జీపీఎస్ ట్రాకర్ వాడకంతో హైదరాబాద్ వంటి ప్రధాన నగరంలో వాహనాల చోరీల సంఖ్య గణనీయంగా తగ్గినట్లు తెలుస్తోంది. జీపీఎస్ పని చేసేది ఇలా.. జీపీఎస్(గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్) ట్రాకర్ శాటిలైట్ సిగ్నల్స్ ద్వారా అక్షాంశ, రేఖాంశాల ఆధారంగా వాహనం కచ్చితమైన స్థానాన్ని గుర్తిస్తుంది. మొబైల్ యాప్, వెబ్ ప్లాట్ఫాం ద్వారా వినియోగదారుడికి సమాచారం చేరుతుంది. వాహనంలో బయటికి కనిపించని ప్రాంతాల్లో జీపీఎస్ను బిగించి బ్యాటరీకి అనుసంధానం చేస్తారు. మరికొన్ని స్వ తంత్ర బ్యాటరీతో పనిచేస్తాయి. కంపెనీలు జీపీఎస్ ట్రాకర్లను అమర్చేందుకు రూ. 1500 నుంచి రూ. 5 వేల వరకు వసూలు చేస్తున్నాయి. ఇందులో ఉండే సిమ్ కార్డును రీఛార్జి చేసుకోవాల్సి ఉంటుంది. ఉపయోగాలివి.. రియల్ టైమ్ ట్రాకింగ్: జీపీఎస్ బిగించిన వాహనం చోరీకి గురైతే కచ్చితమైన స్థానాన్ని చూపిస్తుంది. పార్క్ చేసిన ప్రాంతం నుంచి కదిలిస్తే సెల్ఫోన్కు (మెసేజ్) హెచ్చరిక వెళుతుంది. మరికొన్ని ట్రాకర్లలో ఉన్న చోటి నుంచే వాహన ఇంజిన్ను ఆపేయవచ్చు. రికవరీ వేగవంతం: బైక్ను ఎత్తుకెళ్లితే వారు ఎక్కడికి తీసుకువెళ్లారో స్పష్టంగా తెలియడంతోపాటు జీపీఎస్ సాయంతో పోలీసులు వాహనాన్ని త్వరగా గుర్తించి స్వాధీనం చేసుకునే అవకాశం ఉంటుంది. చోరీ చేస్తే సులభంగా గుర్తించే వీలు పరికరం బిగించుకునేందుకు ఆసక్తి చూపుతున్న వాహనదారులు స్టేషన్లో ఫిర్యాదు చేయాలి వాహనాలు చోరీకి గురైతే వెంటనే స్థానిక పీఎస్లో ఫిర్యాదు చేయాలి. వాహన తనిఖీల్లో దొరికే అవకాశం ఉంటుంది. వాహనంపై ఏ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయినదో స్పష్టంగా తెలుస్తుంది. వాహనాల తనిఖీల్లో జీపీఎస్తో ఉన్న బైక్ దొరికితే అసలు యజమానిని సులభంగా తెలుసుకోవచ్చు. – ప్రసాద్, ట్రాఫిక్ సీఐ, నిజామాబాద్ -
కడుపునొప్పి భరించలేక ఒకరి ఆత్మహత్య
నందిపేట్(ఆర్మూర్): మండలంలోని బాద్గుణ గ్రామానికి చెందిన అల్లూరి లింగారెడ్డి (57) కడుపునొప్పి భరించలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలిలా ఉన్నాయి. అల్లూరి లింగారెడ్డి కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతున్నాడు. కాగా, శుక్రవారం నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం పంచగుడి గ్రామంలో ఉన్న తన చెల్లి వద్దకు వెళుతున్నానని చెప్పి ఇంటి నుంచి బయల్దేరాడు. కానీ, చెల్లెలి ఇంటికి వెళ్లకుండా మార్గమధ్యలో ఉమ్మెడ శివారులోని బ్రిడ్జి పైనుంచి గోదావరి నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి అల్లుడు తాటిపల్లి సాయిరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చిరంజీవి తెలిపారు. మనస్తాపంతో ఒకరు..నిజామాబాద్ రూరల్: మోపాల్ మండలంలోని మంచిప్ప తండాకు చెందిన గోవర్ధన్(38) మంచిప్ప పెద్ద చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై యాదగిరి గౌడ్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. గోవర్ధన్కు అతని భార్యకు తరచూ గొడవలు జరుగుతాయి. మద్యానికి బానిసయ్యాడని శనివారం ఇంట్లో గొడవ జరిగింది. దీంతో మనస్తాపం చెందిన గోవర్ధన్ మంచిప్ప పెద్ద చెరువులో దూకడాన్ని మృతుడి కుమారుడు శ్రీనివాస్ చూసినట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి ఇద్దరు పిల్లలున్నారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. -
ఉచిత శిక్షణకు దరఖాస్తులు
డిచ్పల్లి(నిజామాబాద్రూరల్): స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థ (ఆర్ఎస్ఈటీఐ) ఆధ్వర్యంలో ఈ నెల 17 నుంచి ఏసీ రిపేరింగ్ (30 రోజులు), సెల్ఫోన్ రిపేరింగ్ (30 రోజులు) శిక్షణ కోర్సులు ప్రారంభిస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ రవికుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కో ర్సుల్లో చేరేందుకు పురుషుల నుంచి మాత్ర మే దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. శిక్షణ కాలంలో నేర్చుకోవడానికి కావాల్సిన టూల్స్, యూనిఫామ్, శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత ధ్రువీకరణ పత్రం అందజేస్తామన్నారు. ఉచిత శిక్షణతోపాటు భోజన సదుపాయం, హాస్టల్ వసతి కల్పిస్తామని తెలిపారు. 19 నుంచి 40 సంవత్సరాల వయసు గల నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు చెందిన గ్రామీణ ప్రాంత యువకులు మాత్రమే అర్హులని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఆధార్ , రేషన్ కార్డు, 10వ తరగతి ధ్రువీకరణ పత్రం, ఐదు పాస్పోర్టు సైజ్ ఫొటోలు తీసుకొని వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు 08461– 295428 నంబర్లో సంప్రదించాలని డైరెక్టర్ రవికుమార్ పేర్కొన్నారు. ఇన్చార్జి మంత్రిని కలిసిన పీసీసీ అధికార ప్రతినిధి కమ్మర్పల్లి: జిల్లా ఇన్చార్జి మంత్రిగా నియమితులైన పంచాయతీ రాజ్, సీ్త్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ(సీతక్క)ను టీపీసీసీ అధికార ప్రతినిధి, కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పరిశీలకుడు బాస వేణుగోపాల్ యాదవ్ కలిశారు. హైదరాబాద్లోని మంత్రి నివాసంలో శనివారం మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి పుష్పగుచ్ఛం అందజేశారు. జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని కోరినట్లు వేణుగోపాల్యాదవ్ తెలిపారు. సాలూరలో కమ్యూనిటీ కాంటాక్ట్ బోధన్రూరల్: సాలూర మండల కేంద్రంలో బోధన్ రూరల్ పోలీసులు శనివారం కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలోని సాయినగర్ కాలనీలో బోధన్ ఏసీపీ శ్రీనివాస్ నేతృత్వంలో సమావేశం నిర్వహించి గ్రామస్తులకు శాంతి భద్రతలు, చట్టాలు, పోలీసుల విధులపై అవగాహన కల్పించారు. అనంతరం గ్రామంలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. కార్యక్రమంలో సీఐలు, ఎస్సైలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. రక్తదానం అభినందనీయం ● రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి నిజామాబాద్ రూరల్: మానవత్వంతో ఆలో చించి రక్తదానం చేసేందుకు కాంగ్రెస్ నాయకులు ముందుకు రావడం అభినందనీయమని నిజామాబాద్ రూరల్ శాసనసభ్యుడు డాక్టర్ భూపతి రెడ్డి పేర్కొన్నారు. నగరంలోని కంఠేశ్వర్ బైపాస్లో ఉన్న రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అంతర్జాతీయ రక్తదాన దినోత్సవం సందర్భంగా యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో శనివారం రక్తదాన శిబిరం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజ రైన ఎమ్మెల్యే భూపతిరెడ్డి మాట్లాడుతూ రక్తదానం చేయడం ప్రాణాపాయ స్థితిలో ఉన్న నిండు ప్రాణాలను రక్షించడంలాంటిదేనని అ న్నారు. శిబిరం నిర్వహించిన రూరల్ యువ జన కాంగ్రెస్ అధ్యక్షుడు తుంపల్లి మహేందర్, ఉమ్మజి నరేశ్లను అభినందించారు. కార్యక్రమంలో రూరల్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి ఆకాశ్ రెడ్డి, సోషల్ మీడియా కోఆర్డినేటర్ వినోద్, బైండ్ల ప్రశాంత్, వంశీ, వెంకటేశ్, దివాకర్ తదితరులు పాల్గొన్నారు. -
కలెక్టర్ను కలిసిన సీపీ
ఖలీల్వాడి : జిల్లా కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డిని సీపీ సాయిచైతన్య శనివారం కలెక్టరేట్ సముదాయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టర్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించగా.. సీపీ ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. జిల్లా రెడ్క్రాస్ సేవలు అభినందనీయం నిజామాబాద్నాగారం : రాష్ట్రంలో ఎనిమిది రక్తనిధి కేంద్రాలు పని చేస్తుండగా, వాటిలో నిజామాబాద్ జిల్లా రెడ్క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో బ్లడ్బ్యాంకు సేవలు, తలసేమియా వ్యాధిగ్రస్తులకు అందిస్తున్న ఉచిత సేవలు అభినందనీయమని రాష్ట్ర గవర్నర్ విష్ణుదేవ్ వర్మ అన్నారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా శనివారం రాజ్భవన్లోని సంస్కృతి భవన్లో గవర్నర్ అవార్డులను అందజేశారు. రక్తదాన శిబిరాలు, తలసేమియా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నందుకు జిల్లా రెడ్క్రాస్కు మూడోసారి ఐఎస్వో సర్టిఫికెట్ దక్కింది. అలాగే 67సార్లు రక్తదానం చేసిన గాదేవార్ గంగాధర్కు గవర్నర్ అవార్డును అందజేశారు. గవర్నర్ ప్రధాన కార్యదర్శి, ఇన్చార్జి చైర్మన్ దాన కిశోర్, సంయుక్త కార్యదర్శి భవానీశంకర్, నిజామాబాద్ జిల్లా చైర్మన్ బుసా ఆంజనేయులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తోట రాజశేఖర్, జిల్లా కోశాధికారి కలిపె రవీందర్ తదితరులు పాల్గొన్నారు. రూ.40 లక్షలతో పరారీ ఖలీల్వాడి: నగరంలోని ఎల్లమ్మగుట్ట ప్రాంతంలోని ఓ ప్రయివేటు సెక్యూరిటీ ఏజెన్సీలో పనిచేసే ఉద్యోగి ఏటీఎంలో డిపాజిట్ చేసే నగదు తీసుకొని పారిపోయినట్లు నాల్గో టౌన్ ఎస్సై శ్రీకాంత్ శనివారం తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఎల్లమ్మగుట్ట వద్ద ఉన్న ప్రయివేటు ఏజెన్సీ ద్వారా ప్రభుత్వ, ప్రయివేటు బ్యాంకులకు చెందిన ఏటీఎంలలో డబ్బులను డిపాజిట్ చేస్తారు. శనివారం ఉదయం విధులకు వచ్చిన న్యాల్కల్ రోడ్కు చెందిన రమాకాంత్ రూ.40 లక్షల 50 వేలు ఏజెన్సీ వద్ద ఉన్న వాహనంలో పెడుతుండగా ఎత్తుకొని పరారైనట్లు చెప్పారు. రమాకాంత్ ఎత్తుకెళ్లిన డబ్బులను బోధన్లోని ఓ బ్యాంక్ ఏటీఎంలో డిపాజిట్ చేయాల్సి ఉన్నట్లు సమాచారం. బ్యాంక్ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. గుర్తింపు లేని ప్రైవేట్ కళాశాలల్లో చేరొద్దు నిజామాబాద్ అర్బన్ : నిజామాబాద్ నగరంతో పాటు జిల్లాలో ప్రైవేట్ జూనియర్ కళాశాలలకు అఫ్లియేషన్ గుర్తింపు ఉందా లేదా అని స్పష్టంగా తెలుసుకొని మాత్రమే విద్యార్థులు అడ్మిషన్లు తీసుకోవాలని జిల్లా ఇంటర్ విద్యాధికారి శ్రీ తిరుమలపుడి రవికుమార్ స్పష్టం చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు అడ్మిషన్ల విషయంలో మోసపోకుండా జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. అఫ్లియేషన్ లేని జూనియర్ కళాశాలల్లో చేరిన తర్వాత ఇంటర్మీడియట్ బోర్డుకు ఎలాంటి సంబంధం ఉండదని స్పష్టం చేశారు. నీట్లో జిల్లా విద్యార్థులకు ర్యాంకులు నిజామాబాద్ అర్బన్: వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం దేశ వ్యాప్తంగా నిర్వహించిన నీట్ యూజీ ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. ఫలితాల్లో జిల్లాకు చెందిన విద్యార్థులు జాతీయ ర్యాంకులు సాధించారు. నగరంలో ఎస్ఆర్ జూనియర్ కళాశాలకు చెందిన రాథోడ్ కార్తిక్ 1623, జే అన్విక 1970, రాథోడ్ స్నేహ 3646 ర్యాంకులు సాధించారు. ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను కళాశాల యాజమాన్యం అభినందించింది. -
దేశ సేవలో కూతురు..
మోర్తాడ్(బాల్కొండ): ఆర్మీలో చేరి దేశ సేవ చే యా లని ఆశించినప్పటికీ సాధ్యం కాలేదని, కానీ తన కూతురు ఆర్మీలో చేరి దేశ సేవ చేస్తోందని గర్వంగా చెబుతున్నాడు గాండ్లపేట్ గ్రామానికి చెందిన ని మ్మల భోజారెడ్డి. పోలీసుశాఖలో కానిస్టేబుల్గా పని చేసిన ఆయన కుటుంబ సమస్యల కారణంగా ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి ఆర్టీసీలో డ్రైవర్గా చేరాడు. దేశానికి సేవ చేయాలనే తన తండ్రి కల నెరవేరకపోవడంతో.. తాను దానిని నిజం చేయా లని ఆయన కూతురు గీతారాణి సంకల్పించింది. శ్రీపద్మావతి యూనివర్సిటీలో ఎమ్మెస్సీ నర్సింగ్పూర్తి చేసింది. అమెరికా, యూరప్ దేశాల్లో ఎన్నో కంపెనీలు భారీ వేతన ప్యాకేజీ ఆఫర్ చేసినప్పటికీ తన తండ్రి కలను నెరవేర్చేందుకు ఆర్మీలోని నర్సింగ్ విభాగంలో చేరింది. -
సెక్యూరిటీ గార్డు కొడుకు కాబోయే డాక్టర్
నవీపేట: మెడికల్ కళాశాలలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్న మండల కేంద్రంలోని లింగంగుట్టకు చెందిన దర్శనాల గంగాధర్ తన కొడుకును ఎంబీబీఎస్ చదివిస్తున్నాడు. ప్రతి రోజూ తన కళ్ల ముందు కనిపించే వైద్యవిద్యార్థులను చూస్తూ కొడుకును సైతం డాక్టర్ని చేయాలని కలలుగన్నాడు. సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తే వచ్చే జీతం సరిపోకపోవడంతో ఉదయం వేళలో భార్య అన్నపూర్ణతో కలిసి ఉపాధి హామీ పనులకు వెళ్తున్నాడు. వారికి ఇద్దరు కుమారులు కాగా, పెద్ద కుమారుడు సిద్ధార్థ ప్రస్తుతం కరీంనగర్లోని ప్రతిమ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. -
కష్టార్జితమంతా కూతుళ్ల చదువుకే..
బోధన్: మహారాష్ట్ర సరిహద్దుల్లోని ఖండ్గాం గ్రామానికి చెందిన కాంబ్లే జనార్దన్ తన కూతుళ్లను ఉన్నత చదువులు చదివించాలనే కలతో బోధన్కు వచ్చి స్థిరపడ్డాడు. పెయింటింగ్ పని చేస్తూ కష్టాలకు ఎదురీదుతూ తాను అనుకున్నట్లుగానే కూతుళ్లు చందన, స్పందనను ఉన్నత చదువులు చదివించాడు. పెద్ద కూతురు చందన బోధన్లోని ఓ ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో బీఎస్సీ, ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఎస్సీ (జువాలజీ) పూర్తి చేసింది. బ్యాక్లాగ్ గ్రూప్–4 ఉద్యోగ అర్హత పరీక్షలో ప్రతిభ చాటి వైద్యారోగ్యశాఖలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం సాధించింది. 2020లో కామారెడ్డి జిల్లా వైద్యారోగ్య శాఖలో చేరగా, రెండేళ్ల తరువాత పదోన్నతి లభించింది. చందన ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా వైద్యారోగ్య శాఖలో సీనియర్ అసిస్టెంట్గా పని చేస్తోంది. తన చెల్లి స్పందన బీటెక్ పూర్తి చేసి ప్రస్తుతం ఓ ప్రముఖ కంపెనీలో మైసూర్లో ఉద్యోగం చేస్తోందని, మా నాన్న కష్టార్జితమే తమ చదువు, ఉద్యోగాలని స్పందన తెలిపింది. -
ఒకరు ఎంబీఏ.. మరొకరు ఎంఎస్
బోధన్: బోధన్ మండలం ఏరాజ్పల్లి గ్రామానికి చెందిన గీత కార్మికుడు అయిల దేవిదాస్గౌడ్ తన కూతుళ్లు ప్రత్యూష, ప్రణీతను ఉన్నత చదువులు చదివించారు. వృత్తి పనిలో అరకొర ఆదాయం ఉన్నా ఏనాడూ ఆ ప్రభావం పిల్లల చదువులపై పడ కుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. ఆయన ప్రోత్సాహంతో పెద్ద కూతురు ప్రత్యూష బోధన్లోని ఎస్వీ డిగ్రీ కళాశాలలో బీఎస్సీ (బీజెడ్సీ), ఎంబీఏ కోర్సు పూర్తి చేసి ప్రస్తుతం హైదరాబాద్లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. రెండో కూతురు ప్రణీత బీఎస్సీ కంప్యూటర్ సైన్స్, ఎంసీఏ కోర్సులు పూర్తి చేసింది. అమెరికాలో ఎంఎస్ పూర్తి చేసింది. నాన్న ప్రోత్సాహంతోనే ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా ముందుకు వెళ్లామని ఆ అక్కాచెల్లెళ్లు అంటున్నారు. తండ్రి దేవిదాస్గౌడ్తో కూతుళ్లు ప్రత్యూష, ప్రణీత -
కట్టుబాట్లను కాదని కూతుళ్లకు వేద బాట
మోర్తాడ్ (బాల్కొండ): మారుతున్న నాగరికతకు అనుగుణంగా సమాజంలో మార్పు తీసుకువచ్చే శక్తి ఆడవారికి ఉందని అందరికీ తెలిసేలా చేశారు చౌట్పల్లికి చెందిన కాశీరాం జోషి(హన్మాండ్ల పంతులు). వేద పఠనం, ఉపనిషత్తులు నేర్చుకోవడం, పౌరోహిత్యం మగవారికే పరిమితం అని గట్టిగా వాదించిన వారు ముక్కున వేలువేసుకునేలా చేశారు. తన పౌరోహిత్య వారసత్వాన్ని అందుకునే కొడుకులు లేరని బాధపడకుండా తన నలుగురు కూతుళ్లు ప్రణవేశ్వరి, రాజేశ్వరి, భువనేశ్వరి, జ్ఞానేశ్వరికి చిన్నతనం నుంచే వేదాలు, ఉపనిషత్తులు నేర్పించారు. ఆడవారికి ఉపనయం ఏమిటని అప్పట్లో ఎంతో మంది ప్రశ్నించినా ఎవరినీ లెక్క చేయకుండా సికింద్రాబాద్లోని ఆర్య సమాజ్ నిర్వాహకుడు పండిత్ నరేంద్రజీని చౌట్పల్లికి ఆహ్వానించి ఆయనతో 1972లో తన కూతుళ్లకు ఉపనయనం చేయించారు. ఆ రోజు కాశీరాం జోషి ఒక తండ్రిగా తన కూతుళ్లకు చూపిన వేద బాటను ఇప్పుడు ఎంతో మంది ఆచరిస్తున్నారు. 2022లో కాశీరాంజోషి శివైక్యం అయ్యారు. తమ తండ్రి చూపిన బాటను వృత్తిగా కాకుండా ధర్మంగా భావిస్తున్నామని ఆ నలుగురు అక్కాచెల్లెళ్లు అంటున్నారు. -
జిల్లాలో పనిచేయడం గొప్ప అనుభూతి
నిజామాబాద్ అర్బన్ : నిజామాబాద్ జిల్లాలో విఽ దులు నిర్వహించడం ఎంతో గొప్ప అనుభూతిని కలిగించిందని బదిలీ అయిన జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో శనివారం వీడ్కోలు సమావేశం నిర్వహించారు. నూతన జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన టి వినయ్ కృష్ణారెడ్డికి ఇదే వేదికపై స్వాగత కార్యక్ర మం ఏర్పాటు చేశారు. రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ కలెక్టర్గా తాను జిల్లాలో బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి కింది స్థాయి ఉద్యోగి మొ దలుకుని ప్రతి శాఖకు చెందిన అధికారులందరూ అన్ని విషయాల్లోనూ ఎంతగానో సహకరించారని అన్నారు. వారి తోడ్పాటు కారణంగానే జిల్లాను ధాన్యం సేకరణ వంటి అనేక అంశాలలో ముందంజలో నిలుపగలిగామని, వరుసగా వచ్చిన శాసన సభ, పార్లమెంటు, ఎమ్మెల్సీ ఎన్నికల ను ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సమర్థవంతంగా నిర్వహించడంలో సఫలీకతం కాగలిగామని అన్నారు. ముఖ్యంగా వ్యవసాయాధారిత ప్రాంతమైన జిల్లా లో పని చేయడం వల్ల ధాన్యం సేకరణ, పసుపు, ఎర్రజొన్న వంటి అంశాలతో పాటు, సాగు రంగంపై మంచి అనుభవం ఏర్పడిందని, మునుముందు నిర్వర్తించే విధులకు ఇది ఎంతగానో ఉపకరిస్తుందని అన్నారు. జిల్లా ప్రజలు ఎంతో మంచివారని, అన్ని వర్గాల వారు అందించిన సహకారంతోనే జిల్లాను ప్రగతి దిశలో ముందంజలో నిలుపగలిగామన్నారు. జిల్లా పాలనాధికారిగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్ టి వినయ్ కష్ణారెడ్డితో తనకు మంచి సాన్నిహిత్యం ఉందని తెలిపారు. జిల్లాకు సమర్థవంతమైన అధికారి కలెక్టర్గా వచ్చారని, ఆయన నేతృత్వంలో జిల్లా మరింతగా ప్రగతి దిశగా పయనిస్తుందనే పూర్తి నమ్మకం ఉందన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యతలను గుర్తిస్తూ అధికారులు అంకిత భావంతో విధులు నిర్వర్తించాలని, తనకు తోడ్పాటును అందించిన రీతిలోనే నూతన కలెక్టర్ కు కూడా పూర్తి స్థాయిలో సహాయ, సహకారాలు అందించాలని కోరారు. పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, ఆర్డీవోలు రాజేంద్ర కుమార్, రాజాగౌడ్ తదితరులు బదిలీపై వెళ్తున్న రాజీవ్ గాంధీ హనుమంతుతో కలిసి పని చేసిన అనుభవాలను నెమరువేసుకున్నారు. వీడ్కోలు సమావేశంలో అన్ని శాఖలకు చెంది న జిల్లా అధికారులు, కలెక్టరేట్ ఉద్యోగులతో పాటు గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు అలుక కిషన్, రెవెన్యూ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు రమణ్ రెడ్డి, టీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు సుమన్, పీఆర్టీయూ సంఘం జిల్లా అధ్యక్షుడు మోహన్ రెడ్డి, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు రవీందర్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధి వి మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.జిల్లా అభివృద్ధికి కలిసి పనిచేద్దాం : కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డికలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ బదిలీ పై వెళ్తున్న రాజీవ్ గాంధీ హనుమంతు జిల్లా కలెక్టర్ గా తనదైన ప్రత్యేకతను చాటారని, ఆయన ఒరవడిలోనే ముందుకు సాగుతూ జిల్లాను అన్ని రంగాలలో ముందంజలో నిలిపేలా కషి చేస్తానని అన్నారు. తాను ఉద్యోగులతో స్నేహపూర్వకంగా మెలుగుతానని, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ, అభివద్ధి కార్యక్రమాల లక్ష్య సాధనకు సమష్టిగా కృషి చేద్దామన్నారు. ఉద్యోగులు, అధికారుల సహకారం వల్లే ధాన్యం సేకరణ, ఇతర అంశాలలో జిల్లా ముందంజ శాసన సభ, పార్లమెంటు, ఎమ్మెల్సీ ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించగలిగాం వీడ్కోలు సమావేశంలో పూర్వ జిల్లా కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు -
150 మంది పిల్లలకు డాడీ
డిచ్పల్లి(నిజామాబాద్రూరల్): రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వం తరఫున అనాథ బాల, బా లికల కోసం డిచ్పల్లి మండల కేంద్రంలో 17 ఫిబ్రవరి 2016లో ‘మానవతసదన్’ ను ప్రారంభించారు. అప్పటి జిల్లా కలెక్టర్ యోగితారాణా ప్రత్యే క శ్రద్ధతో మానవతసదన్ ఏర్పాటుకు కృషి చేశారు. 14 మంది పిల్లలతో ప్రారంభమైన సదన్లో ప్రస్తుతం 150 మంది పిల్లలు (బాలురు 48, బాలికలు 102 మంది) ఉన్నారు. మానవతసదన్కు చైర్మన్గా జిల్లా కలెక్టర్ వ్యవహరిస్తారు. లైజనింగ్ ఆఫీ సర్గా పి.సుధాకర్రావు, కేర్టేకర్గా ఉపాధ్యాయుడు అందె రమేశ్ విధులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్గా పని చేస్తున్న రమేశ్ 24 గంటలూ పిల్లల బాగోగులను పర్యవేక్షిస్తుంటారు. అనాథ పిల్లలను తన సొంత బిడ్డలుగా భావించి వారిని ఆదర్శవంతులుగా, ఉ న్నత స్థాయికి చేర్చాలనే లక్ష్యంతో పని చేస్తున్నాడు. కొందరు పిల్లలు ప్రస్తుతం బీఎస్సీ నర్సింగ్, బీటెక్, హార్టికల్చర్ కోర్సులు చదువుతున్నారు. వారికి ఆయా కళాశాలల్లో ఫీజులు చెల్లించడానికి దాతలు సహకరిస్తున్నారు. దాతలు దొరకని సమయంలో వారి కళాశాల, హాస్టల్ ఫీజులు కేర్టేకర్ రమేశ్ చెల్లిస్తూ వారి ఉన్నత చదువులకు అండగా ఉంటూ తండ్రి లేని లోటును తీరుస్తున్నారు. మావనతసదన్లోని పిల్లలందరూ రమేష్ను ‘డాడీ’ అని ప్రేమగా పిలుస్తారు. ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్న ఆయన సతీమణి సహకారం కూడా ఎంతో ఉంది. అనాథ పిల్లలను ఆదర్శవంతులుగా తీర్చిదిద్దుతూ.. తండ్రి పాత్ర పోషిస్తున్న మానవతసదన్ కేర్టేకర్ రమేష్నా బిడ్డలుగా భావిస్తా పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తే పాఠా లు బోధించే వరకే బాధ్య త ఉంటుంది. మానవతసదన్లో పని చేస్తే ఇక్కడ ఉండే అనాథ పిల్లలను నా సొంత బిడ్డలుగా భా వించి తండ్రి పాత్ర పోషించే అవకాశం లభిస్తుంది. ప్రభుత్వ సహకారంతో పిల్లలను వారి ఆశయాలకు అనుగుణంగా ఉన్నత చదువులు చదివించేందుకు వీలుకలుగుతుంది. – అందె రమేశ్, మానవతసదన్ కేర్టేకర్ -
రాజీ పద్ధతిలో సత్వర న్యాయ పరిష్కారానికి అవకాశం
నిజామాబాద్ లీగల్ : దీర్ఘకాలిక న్యాయ వివాదాల పరిష్కారానికి జాతీయ లోక్ అదాలత్ చక్కని పరిష్కార మార్గమని జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్పర్సన్ జీవీఎన్ భరతలక్ష్మి అన్నారు. శనివారం జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యాలయంలో అదనపు జిల్లా జడ్జి కనకదుర్గ, తెలంగాణ బార్ కౌన్సిల్ సభ్యుడు మంథని రాజేందర్ రెడ్డి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మామిళ్ళ సాయిరెడ్డి, న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఉదయ భాస్కర్ రావు, అదనపు జిల్లా పోలీసు కమిషనర్ బస్వారెడ్డితో కలిసి ఆమె జ్యోతి ప్రజ్వలన చేసి జాతీయ లోక్ అదాలత్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ కోర్టుల్లో కేసులతో కక్షిదారులు విలువైన జీవితకాలాన్ని కోల్పోతారని, లోక్ అదాలత్ల ద్వార రాజీ పద్ధతిలో కేసులను పరిష్కరించుకుంటే సత్వర న్యాయానికి అవకాశముందని ఆమె అన్నారు. లోక్ అదాలత్లలో కేసులను పరిష్కరించుకోవాలని కక్షిదారులను బలవంతం చేయరాదని, ఇష్టపూర్వకంగా రాజీకి మాత్రమే ప్రయత్నించాలని జడ్జి కోరారు. అదనపు జిల్లా జడ్జి కనకదుర్గ మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమాజ అభివృద్ధికి వినియోగించాలని, వినాశానికి కాదని అన్నారు. నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సాయిరెడ్డి మాట్లాడుతూ లోక్ అదాలత్కు బార్ అసోసియేషన్ అండ గా నిలుస్తుందని అన్నారు. కార్యక్రమంలో జడ్జి హరీష, సీనియర్ సివిల్ జడ్జి సాయిసుధ, జూనియర్ సివిల్ జడ్జీలు గోపికృష్ణ, ఖుష్బు ఉపాధ్యాయి, శ్రీనివాస్ రావు, హరి కుమార్ తదితరులు పాల్గొన్నారు. జాతీయ లోక్ అదాలత్లో భాగంగా నిజామాబాద్, బోధన్, ఆర్మూర్ కోర్టుల్లో ఏర్పాటు చేసిన 18 బెంచ్ల ద్వార సివిల్, క్రిమినల్, బీమా కేసులకు సంబంధించి 29,725 కేసులను పరిష్కరించారు. కక్షిదారులకు 18 కోట్ల 36 లక్షల 61 వేల 156 రూ పాయల పరిహారం అందజేసినట్టు జిల్లా న్యాయసేవాధికార సంస్థ సూపరింటెండెంట్ శైలజ తెలి పారు. ఈ సందర్భంగా చోళ మండలం ఇన్సూరెన్స్ కంపెనీ ద్వార జెన్కో ఉద్యోగి ప్రేమ్దాస్ కుటుంబానికి రూ. 90 లక్షల పరిహారం చెల్లించారు. జిల్లా జడ్జి, న్యాయసేవాధికార సంస్థ చైర్ పర్సన్ భరత లక్ష్మి జాతీయ లోక్ అదాలత్లో 29,725 కేసుల పరిష్కారం రూ. 18 కోట్ల 36 లక్షలకు పైగా పరిహారం అందజేత -
నాణ్యమైన విద్య అందించేందుకు కృషి
బోధన్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించేందుకు కృషి చేస్తున్నామని జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ అన్నారు. పాఠశాలల్లో అన్ని రకాల మౌలిక సౌకర్యాలను ప్రభుత్వం కల్పి స్తోందని పేర్కొన్నారు. బడిఈడు పిల్లలను కచ్చితంగా ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని తల్లిదండ్రులకు సూచించారు. 11 ఏళ్లుగా మూతపడి ఉన్న బోధన్ మండలంలోని భవానీపేట మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను గ్రామ యువత, ప్రజల సహకారంతో మండల విద్యాశాఖ అధికారులు తెరిపించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ పాఠశాలను సందర్శించి పరిశీలించారు. అనంతరం పాఠశాల ప్రాంగణంలో నిర్వహించిన విద్యార్థుల సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమంలో పాల్గొని చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. పాఠశాల ఆవరణలో తరగతి గదులు, మరుగుదొడ్డి నిర్మింపజేసిన రుద్ర షౌండేషన్ ప్రతినిధులను, పాఠశాల పునరుద్ధరణకు సహకరించిన గ్రామ యువకులను డీఈవో అభినందించారు. ఎంపీడీవో బాలగంగాధర్ తిలక్, టీచర్ కార్తీక్, సీఆర్పీ విజయ్ తదితరులు పాల్గొన్నారు. -
నూతన కలెక్టర్కు శుభాకాంక్షల వెల్లువ
జిల్లా నూతన కలెక్టర్గా శుక్రవారం బాధ్యతలు స్వీకరించిన వినయ్ కృష్ణారెడ్డికి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. బాధ్యతలు స్వీకరించిన తరువాత ఆయనను జిల్లా ఉన్నతాధికారులు మర్యాదపూర్వకంగా కలిసి మొక్కలు, బొకెలు అందజేశారు. బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షుడు రమణ్రెడ్డి, కార్యదర్శి ప్రశాంత్కుమార్, కలెక్టరేట్ పర్యవేక్షకులు శ్రీనివాసరావు, భాస్కర్, రెవెన్యూ అధికారులు విజయకాంత్రావు తదితరులు కలెక్టర్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ నాయకులు కలెక్టర్ను కలిశారు. – నిజామాబాద్ అర్బన్ -
పాముకాటుతో..
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): నాగిరెడ్డిపేట మండలంలోని వాడి గ్రామానికి చెందిన బాల్లింగం కిష్టయ్య(67) అనే వ్యక్తి పాముకాటుతో మృతిచెందాడు. కిష్టయ్య గురువారంరాత్రి భోజనంచేసి తన ఇంట్లో నిద్రించాడు. శుక్రవారం వేకువజామున నాలుగు గంటలప్రాంతంలో తనను పాము కరిచిందని భార్య సిద్ధవ్వకు తెలిపాడు. వెంటనే ఆమె కుమారులతో కలిసి కిష్టయ్యను మెదక్ ఆస్పత్రికి తరలించింది. అక్కడ ప్రాథమిక చికిత్స చేసిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించాలని సూచించారు. హైదరాబాద్కు తరలిస్తుండగా మార్గమధ్యంలో కిష్టయ్య మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
అంతర్జాతీయ స్థాయిలో రాణించినా ఆటోనే కడుపునింపుతోంది
నవీపేట: మండలంలోని ఫతేనగర్ ఫస్ట్ ప్లాట్ గ్రామానికి చెందిన మహ్మద్ ఇమ్రాన్ అలీఖాన్ ఉషు(మార్షల్ ఆర్ట్స్లో కత్తితో విన్యాసం)లో ఉత్తమ ప్రతిభ కనబరుస్తున్నాడు. సర్వర్ అలీఖాన్, నసీమ్ సుల్తానాకు నలుగురు కుమారులు, ఒక కుమార్తె. క్రీడాకారుడైన సర్వర్ఖాన్ తన కుమారుల్లో ఒక్కరినైనా ఉత్తమ క్రీడాకారుడిగా తీర్చిదిద్దాలని కలలుగన్నాడు. కుమారుల్లో ఒకరైనా మహమ్మద్ ఇమ్రాన్ అలీఖాన్కు మార్షల్ ఆర్ట్స్లో ఉన్న ఉత్సాహాన్ని పసిగట్టి ఉషు వైపు పరుగులు పెట్టించాడు. అప్పు చేసి పంజాబ్లోని పాటియాల ఎన్ఐఎస్లో బీపీఈడీ(బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్)లో చేర్పించాడు. అక్కడి నుంచి డిప్లొమా సాధించిన ఇమ్రాన్ అలీఖాన్ ఉషు క్రీడపై మరింత దృష్టి సారించి, మెళకువలు నేర్చుకున్నాడు. అంతర్జాతీయ స్థాయిలో గోల్డ్మెడల్ రష్యా రాజధాని మాస్కోలో ఈనెల 1 నుంచి 7వ తేదీ వరకు 10వ ఇంటర్నేషనల్ ఉషు స్టార్స్ టోర్నమెంట్(2025)ను నిర్వహించారు. ఈ వేడుకలో 17 దేశాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు. మన దేశం నుంచి 58 మంది క్రీడాకారులు పాల్గొనగా తెలంగాణ నుంచి ఇద్దరు పాల్గొన్నారు. ఆ ఇద్దరిలో ఒకరైన మహ్మద్ ఇమ్రాన్ అలీఖాన్ ఉత్తమ ప్రతిభ కనబర్చి బంగారు పతకాన్ని సాధించాడు. ఆటో ఇంటి వద్ద ఉంటే పస్తులే! అంతర్జాతీయ స్థాయి ఉషులో ఉత్తమ ప్రతిభ కనబరిచి బంగారు పతకం సాధించిన మహమ్మద్ అలీఖాన్ జీవనోపాధి కోసం ఆటో నడుపుతున్నాడు. భార్య, నాలుగేళ్ల కుమారుడిని పోషించేందుకు ప్రతిరోజూ ఆటో నడపాల్సిందే. ఏ ఒక్కరోజూ ఆటో ఇంటి వద్ద ఉన్నా ఆ కుటుంబం పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా టోర్నీమెంట్లకు వెళ్లేందుకు మళ్లీ అప్పులు చేస్తున్నాడు. ఆయన ఉత్సాహాన్ని చూసి కుటుంబ సభ్యులు సైతం అడ్డుకోలేకపోతున్నారు. ఓ వైపు టోర్నమెంట్లలో పాల్గొంటూ.. మరో వైపు ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్న ఇమ్రాన్ అలీఖాన్ నిజామాబాద్లో ప్రతి రోజూ కొంత మంది పేద చిన్నారులకు ఉచితంగా ఉషు శిక్షణ ఇస్తున్నాడు. ఉషు క్రీడలో ఇమ్రాన్ అలీఖాన్ ప్రతిభ చిన్నారులకు ఉచిత శిక్షణ గోల్డ్మెడల్ సాధించినా మారని పరిస్థితులు ప్రభుత్వం ఆదుకోవాలి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకరిస్తే అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని పతకాలు సాధిస్తా. నన్ను ఆర్థికంగా ఆదుకోవాలని వేడుకుంటున్నా. జీవనోపాధి కోసం ఆటో తోలుకునే నాకు స్పోర్ట్స్ కోటాలో ఎక్కడైనా ఉద్యోగం కల్పించాలని కోరుతున్నా. మార్షల్ ఆర్ట్స్ విభాగంలోని ఉషులో రాణించేందుకు ప్రోత్సహించాలి. – మహ్మద్ ఇమ్రాన్ అలీఖాన్, ఉషు ఇంటర్నేషనల్ క్రీడాకారుడు -
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
బోధన్: వర్షాలు ప్రారంభమైన నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలని సబ్ కలెక్టర్ వికాస్ మహతో అధికారులను ఆదేశించారు. మున్సిపాలిటీలోని వార్డులు, గ్రామ పంచాయతీల పరిధిలో ఎక్కడా వర్షం, మురికినీరు నిల్వ ఉండకుండా చూడాలని, పారిశుధ్య నిర్వహణకు సంబంధించిన పనులు చేపట్టాలన్నారు. సీజనల్ వ్యాధుల నియంత్రణ చర్యల్లో భాగంగా పట్టణంలోని తన కార్యాలయంలో శుక్రవారం వివిధ శాఖల డివిజన్, మండల అధికారులు, ఉద్యోగులతో కో ఆర్డినేషన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ వారితో మాట్లాడుతూ.. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని మలేరియా, డెంగీ ప్రబలే హాట్ స్పాట్ పాయింట్లను గుర్తించేందుకు ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాలన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మలేరియా, డెంగీ వ్యాధుల నిర్ధారణ కిట్లు, పాముకాటు, ఇతర సీజనల్ వ్యాధులను నియంత్రించే మందులను అందుబాటులో ఉంచాలని సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలను సందర్శించి విద్యార్థుల ఆరోగ్యరక్షణ చర్యలను పర్యవేక్షించాలని ఆదేశించారు. సీజనల్ వ్యాధులపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. జిల్లా మలేరియా అధికారి డాక్టర్ తుకారాం రాథోడ్, డివిజన్ డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ సమత, మున్సిపల్ కమిషనర్ వెంకటనారాయణ, డీఎల్పీవో నాగరాజు, ఎంఈవో నాగయ్య, ఉద్యోగులు పాల్గొన్నారు. నీరు నిల్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలి గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని చర్యలు చేపట్టాలి కో ఆర్డినేషన్ సమావేశంలో బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో -
గుంతపూడ్చేది ఎప్పుడు సారూ..?
నేటి చిత్రంనిజామాబాద్రూరల్: నగరంలోని 13వ డివిజన్ సారంగాపూర్లో ప్రధాన రహదారిపై చాలా రోజుల క్రితం గుంత ఏర్పడింది. ఈ మార్గంలో నిజామాబాద్ నుంచి బోధన్కు వెళ్లే ప్రయాణికులు రాత్రివేళల్లో గుంతను గమనించక ప్రమాదాల బారిన పడుతున్నారు. గతంలో ఎన్నోసార్లు సమస్య గురించి అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదు. ఇప్పటికై న అధికారులు స్పందించి గుంతను పూడ్చాలని కోరుతున్నాం. – అక్బర్ నవాజుద్దీన్, 13వ డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు మీ ప్రాంతంలో నెలకొన్న సమస్యను, ఫొటోను మాకు వాట్సాప్లో పంపించండి. ప్రచురించి అధికారుల దృష్టికి తీసుకెళ్తాము. పంపిన వారి పేరు, ఫొటో ప్రచురిస్తాము. నిజామాబాద్ రూరల్ – 97053 46541 నిజామాబాద్ అర్బన్ – 95531 30597 మాకు ఫొటో పంపండి -
వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు మృతి
ఖలీల్వాడి: ప్రమాదవశాత్తు మురికికాలువలో పడి నగరంలోని సీతారాంనగర్ కాలనీకి చెందిన సిద్దులోల్ల మల్లేశ్(76) అనే వ్యక్తి మృతి చెందినట్లు నాల్గోటౌన్ పోలీస్స్టేషన్ ఎస్సై శ్రీకాంత్ శుక్రవారం తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి.. నగరంలోని ఆర్ఆర్ చౌరస్తాలో కూరగాయల షాపు నడిపే మల్లేశ్ గురువారం రాత్రి 7.30 గంటలకు సీతారాంనగర్ కాలనీలోని ఇంటి వచ్చాడు. ఆ తరువాత వైన్స్షాపునకు వెళ్లి ఇంటికి తిరిగిరాలేదు. శుక్రవారం ఉదయం గాయత్రినగర్లోని పద్మశాలి సంఘం వద్ద మురికికాలువలో ప్రమాదవశాత్తు పడి చనిపోయాడు. మృతుడి కుమారుడు ఆనిల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. రోడ్డు ప్రమాదంలో.. బాన్సువాడ రూరల్: నిజాంసాగర్ మండలం కొనతండాకు చెందిన దేవసోత్ మోతీలాల్ (48) అనే వ్యక్తి గురువారం రాత్రి తిర్మలాపూర్ శివారులో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. బాన్సువాడ మండలంలోని బుడిమి గ్రామంలో తాను పనిచేసే రైస్మిల్లుకు వస్తుండగా ద్విచక్రవాహనం అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. మోతీలాల్ ఘటనాస్థలంలోనే మృతిచెందాడు. మృతుడి భార్య దేవసోత్ లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మోహన్ తెలిపారు. మృతుడికి కూతురు, కొడుకు ఉన్నారు. -
ఆర్టీసీ హైకోర్టు స్టాండింగ్ కౌన్సిల్గా న్యాయవాది సుశ్మన్ రెడ్డి
నిజామాబాద్ లీగల్: తెలంగాణ ఆర్టీసీ స్టాండింగ్ కౌన్సిల్గా నిజామాబాద్కు చెందిన న్యాయవాది సుశ్మన్ రెడ్డి నియమితులయ్యారు. సుశ్మన్ రెడ్డి నియామకం పట్ల నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు మామిళ్ల సాయిరెడ్డి, మాణిక్రాజ్, బార్ కౌన్సిల్ సభ్యుడు రాజేందర్ రెడ్డి, సీనియర్ న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సుశ్మన్ రెడ్డిని నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సన్మానించారు. సీనియర్ న్యాయవాదులు అజార్ కిషన్ రావు, నారాయణదాస్, జగన్ గౌడ్, న్యాయవాదులు శ్యామ్ బాబు, శ్రీనివాస్ గౌడ్, సురేష్, ఇంతియాజ్, ప్రకాష్ గౌడ్, వినోద్ కుమార్ పాల్గొన్నారు. ఎత్తిపోతల ట్రాన్స్ఫార్మర్ ధ్వంసం● ఆయిల్, కాపర్ వైరు చోరీ ● రూ.10 లక్షల ఆస్తినష్టం రెంజల్(బోధన్): మండలంలోని తాడ్బిలోలి ఎత్తిపోతల పథకం మొదటి స్టేజీ గోదావరి నది ఒడ్డున ఉన్న ట్రాన్స్ఫార్మర్ను దుండగులు గురువారం రాత్రి ధ్వంసం చేసి ఆయిల్, కాయిల్స్ను ఎత్తుకెళ్లారు. 2016లో ఇదే తరహా చోరీ జరిగింది. ట్రాన్స్ఫార్మర్ను దుండగులు ధ్వంసం చేసి చోరీ చేసినట్లు శుక్రవారం గుర్తించిన స్థానిక రైతులు ఎత్తిపోతల కమిటీ చైర్మన్ మౌలానాకు సమాచారం అందించారు. ఆయన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఎస్సై చంద్రమోహన్ ఘటనా స్థలానికి చేరుకుని విచారించారు. సుమారు రూ.10 లక్షల విలువైన ఆయిల్, కాయిల్స్ను దుండగులు ఎత్తుకెళ్లారని గుర్తించారు. విషయం తెలిసినా విద్యుత్ అధికారులు అక్కడికి రాకపోవడంపై ఆయకట్టు రైతులు అసంతృప్తి వ్యక్తం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి
సిరికొండ: గంజాయి, డ్రగ్స్ లాంటి మత్తు పదార్థాలకు ప్రతి ఒక్కరు దూరంగా ఉండాలని ఎస్సై ఎల్.రామ్ సూచించారు. మండలంలోని చిన్నవాల్గోట్లో మత్తు పదార్థాలపై అవగాహన కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. గ్రామంలో ర్యాలీ చేపట్టారు. ఎస్సై మాట్లాడుతూ.. మత్తు పదార్థాలకు బానిసై జీవితాలను పాడు చేసుకోవద్దన్నా రు. ఎక్కడైనా ఎవరైనా గంజాయి, డ్రగ్స్ లాంటివి అమ్ముతుంటే 1908 నెంబర్కు ఫోన్ చేసి సమా చారం ఇవ్వాలని, వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని, తగిన పారితోషికం అందిస్తామని తెలిపారు.కాంగ్రెస్ నాయకులు గోవర్ధన్రెడ్డి, మహిపా ల్, సాయారెడ్డి,లింబాద్రి,కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. బానిసలు కావొద్దు ధర్పల్లి: యువత మత్తుకు బానిసలై తమ జీవితాలను బలి చేసుకోవద్దని ఎస్సై రామకృష్ణ సూచించారు. మండల కేంద్రంలో శుక్రవారం కమ్యూనిటీ ఔట్రీచ్ కార్యక్రమంలో భాగంగా మాదక ద్రవ్యాలపై పోలీసులు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. మాదకద్రవ్యాలు ఉపయోగించడం వల్ల కలిగే నష్టాలు, దుష్ప్రభావాలపై ప్రజలకు వివరించారు. నిజామాబాద్ రూరల్: మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని రూరల్ ఎస్హెచ్వో మహమ్మద్ ఆరిఫ్ తెలిపారు. శుక్రవారం నగరంలోని ఒకటో డివిజన్ ఖానాపూర్లో గంజాయి, మత్తు పదార్థాల నివారణ, రోడ్డు భద్రత గురించి ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రూరల్ ఎస్హెచ్వో మాట్లాడుతూ.. ప్రయాణికులు రోడ్డు భద్రత నియమాలు పాటించాలని సూచించారు. -
భూ భారతితో సమస్యలు పరిష్కారం
ధర్పల్లి: భూభారతి చట్టంతో రైతుల భూ సమస్యలను పరిష్కారమవుతాయని తహసీల్దార్ శాంత అన్నారు. మండల కేంద్రంలో శుక్రవారం భూభా రతి రెవెన్యూ సదస్సు నిర్వహించారు. దరఖాస్తులను రైతుల నుంచి స్వీకరించారు. ఇప్పటివరకు మండలంలో 892 దరఖాస్తులు వచ్చినట్లు పేర్కొన్నారు. ఆర్ఐ రాజేశ్వర్, సిబ్బంది పాల్గొన్నారు. మునిపల్లిలో.. జక్రాన్పల్లి: మునిపల్లిలో శుక్రవారం రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ కిరణ్మయి రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ చిన్న సాయిరెడ్డి, మాజీ ఉప సర్పంచ్ సాయన్న, రైతులు పాల్గొన్నారు. డిచ్పల్లి: గత పదిరోజులుగా డిచ్పల్లి మండలంలోని వివిధ గ్రామాల్లో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులు శుక్రవారం సాయంత్రం ముగిసినట్లు తహసీల్దార్ సతీష్ రెడ్డి తెలిపారు. ఘన్పూర్ జీపీ కార్యాలయంలో నిర్వహించిన సదస్సులో తహసీల్దార్ సతీష్ రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ శ్రీకాంత్, ఆర్ఐ సంతోష్, సిబ్బంది పాల్గొన్నారు. 35 మంది నుంచి దరఖాస్తులు స్వీకరించారు. -
డిచ్పల్లి సీఐగా వినోద్ రెడ్డి
డిచ్పల్లి: డిచ్పల్లి సర్కిల్ ఇనన్స్పెక్టర్గా కాడారి వినోద్ రెడ్డి శుక్రవారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల జరిగిన బదిలీలలో భాగంగా ఖమ్మం జిల్లా ట్రాన్స్కో విభాగంలో సీఐగా పని చేస్తున్న వినోద్రెడ్డి డిచ్పల్లి సీఐగా బదిలీపై వచ్చారు. ఇదివరకు డిచ్పల్లి సీఐగా పని చేసిన కొంక మల్లేష్ ఐజీ కార్యాలయానికి బదిలీపై వెళ్లారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం సీఐ మాట్లాడుతూ.. ఏవైనా సమస్యలు ఉంటే బాధితులు పోలీస్ స్టేషన్ను సంప్రదించాలని సూచించారు. బాధ్యతలు స్వీకరించిన సీఐ వినోద్ రెడ్డిని ఎస్సై మహ్మద్ షరీఫ్, సిబ్బంది కలిసి శుభాకాంక్షలు తెలిపారు. జాదూ రంగనాథ్కు సన్మానం నిజామాబాద్ రూరల్: జాదూ యుగంధర్ రంగనాథ్ను జిల్లా బాలభవన్ సిబ్బంది శాలువాతో ఘనంగా సన్మానించారు. తెలుగువారి ఆహ్వానం మేరకు పశ్చిమ అమెరికా వెళుతున్న సందర్భంగా రంగనాథ్ను ఘనంగా సన్మానించారు. బాలభవన్కు ఆయన చేసిన సేవలను కొనియాడారు. బాలభవన్ ఇన్చార్జి సూపరింటెండెంట్ ఉమాబాల, విశ్రాంత ఉద్యోగి విఠల్ ప్రభాకర్, వెంకటలక్ష్మి, లక్ష్మణ్, పుష్పలత, లలిత పాల్గొన్నారు. టీపీసీసీ అధ్యక్షుడికి.. నిజామాబాద్ నాగారం: మాలలకు మంత్రివర్గంలో స్థానం కల్పించినందుకు టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ని మాల మహనాడు ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్లోని ఎమ్మెల్యే క్వార్టర్స్లో కలిసి ఘనంగా సన్మానించారు. సంఘం జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య, నాయకులు గడుగు గంగాధర్, ఎడ్ల నాగరాజ్, వెంకటేష్, ఎల్లయ్య, అలుక కిషన్, దేవదాస్, వినయ్, గంగాధర్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల పరిశీలన డిచ్పల్లి: వెస్లీనగర్ తండాలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను శుక్రవారం ఎంపీడీవో బూక్య లింగం నాయక్ పరిశీలించారు.ఆయన మాట్లాడుతూ.. వెస్లీనగర్ తండాకు చెందిన ఏడుగురు లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కా గా అందులో ఆరు ఇళ్ల నిర్మాణ పనులు చు రుగ్గా కొనసాగుతున్నాయన్నారు. రాష్ట్రంలో సొంత ఇళ్లు లేని పేదలు ఉండకూడదనే లక్ష్యంతో ప్రభుత్వం అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తుందన్నారు. మాజీ సర్పంచ్లు అంబర్ సింగ్, బోడ సునీత రఘు, పంచాయతీ కార్యదర్శి శ్రావణి, లబ్ధిదారులున్నారు. ఆర్థిక సహాయం పెర్కిట్(ఆర్మూర్): ఆర్మూర్ మండలం చేపూర్ గ్రామానికి చెందిన బట్టు నాగార్జున కుటుంబానికి గౌడ సంఘం ఆర్మూర్ మండల అధ్యక్షుడు గడ్డమీది లింగం గౌడ్ శుక్రవారం రూ.10 వేల ఆర్థిక సహాయం అందజేశారు. గ్రామానికి చెందిన నాగార్జున నెల రోజుల క్రితం బతుకుదెరు వు కోసం అబుదాబి వెళ్లి అదృశ్యమయ్యాడు. దీంతో లింగం గౌడ్ బాధిత కుటుంబ సభ్యులకు చేయూతనందిస్తూ ఆర్థిక సహాయం చేశా రు. బీజేవైఎం మండల అధ్యక్షుడు వేల్పుల సతీష్, మేడిపల్లి సాగర్, వేల్పుల లక్కీ, మేడిపల్లి గిరీష్, రాజు, రాఘవ పాల్గొన్నారు. -
రాష్ట్రంలోనే ఏకైక పట్టు చేనేత సహకారం సంఘం
మీకు తెలుసా? తెలంగాణ ఉన్న ఏకైక పట్టు చేనేత సహకార సంఘం ఆర్మూర్ పట్టణంలో కొనసాగుతోంది. గోల్బంగ్లా వద్ద ఉన్న పట్టు చేనేత సహకార సంఘాన్ని 1951 ఏప్రిల్ 3వ తేదీన ఆప్కో రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు పండిత్ శివలింగు స్థాపించారు. ఈ ప్రాంతంలో ఉన్న పట్కారి (ఖత్రి) పట్టు కార్మికులకు ఉపాధి అవకాశాలు కల్పించడంతోపాటు చేనేత కార్మికులను భాగస్వాములను చేయాలనే ఉద్దేశంతో సహకార సంఘాన్ని ఏర్పాటు చేశారు. పట్టుచీరలు, పట్టు ధోవతులు, కండువాలు, తలపాగాలు, షర్టింగ్ పట్టు వస్త్రాలను మగ్గాలపై నేసి విక్రయించేందుకు దీన్ని నెలకొల్పారు. ఆర్మూర్ పట్టు చేనేత సహకార సంఘం స్థాపించనప్పుడు 98 మంది చేనేత కార్మికులు ఉండేవారు. 1990లో కార్మికుల సంఖ్య 576 మందికి పెరిగింది. ప్రస్తుతం సుమారు 468 మంది సభ్యులున్నారు. పట్టును బెంగళూరు నుంచి తీసుకొస్తారు. గతంలో కోల్కతా, కశ్మీర్ నుంచి తీసుకొచ్చేవారు. పట్టు వ స్త్రాలు నేసే ముడి సరుకు (అడ్డదారం, నిలువు దారం) ధరలు ప్రస్తుతం పెరగడంతో ఉత్పత్తి చేసిన పట్టువస్త్రాల అమ్మకాల్లో లాభాలు రాకపోవడంతో ఆర్థిక భారంతో నేత పనికి క్రమంగా స్వస్తి పలుకుతున్నారు. ఇక్కడ నేసిన పట్టు వస్త్రాలకు మన రాష్ట్రంతోపాటు జిల్లాలోనూ పెద్దగా ఆదరణ లేదు. పక్క రాష్ట్రమైన మహారాష్ట్రలోని నాందెడ్, బస్మత్, నాయ్గావ్, పర్బనీలో పట్టు వస్త్రాలను విక్రయిస్తారు. – ఆర్మూర్సమాచారంఅత్యవసర పరిస్థితులు, శాంతి భద్రతలకు వి ఘా తం కలిగితే సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు..డయల్ 100 స్పెషల్ బ్రాంచ్ 87126 59777 పోలీస్ కంట్రోల్ రూం 08462 226090 – ఖలీల్వాడి -
గుర్తింపు లేని పాఠశాల సీజ్
పెర్కిట్(ఆర్మూర్): ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని మామిడిపల్లి వేంకటేశ్వర కాలనీలో ప్రభుత్వ గుర్తింపు లేకుండా కొనసాగుతున్న హ్యాపీ కిడ్స్ పాఠశాలను ఎంఈవో రాజగంగారాం శుక్రవారం సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఎంఈవో మాట్లాడుతూ.. ప్రభుత్వ అనుమతులు లేని పాఠశాలల్లో తమ పిల్లల్ని చేర్పించొద్దని తల్లిదండ్రులకు సూచించారు. ప్రకటనలను చేసి మోసపోవద్దని, నాణ్యమైన విద్యనందించే పాఠశాలల్లో పిల్లలను చేర్పించాలన్నారు. రెండు గూడ్స్ వాహనాలు..ఆర్మూర్టౌన్: ఫిట్నెస్, పర్మిట్ లేని రెండు గూడ్స్ వాహనాలను సీజ్ చేసినట్లు ఎంవీఐ వివేకానందరెడ్డి తెలిపారు. ఆర్మూర్తోపాటు మోర్తాడ్, కమ్మర్పల్లి, భీమ్గల్ ప్రాంతాల్లో ప్రైవేట్ పాఠశాలల బస్సులను, గూడ్స్ వాహనాలను శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వివేకానందరెడ్డి మాట్లాడుతూ.. వాహనదారులు సరైన సమయంలో ఫిట్నెస్, ఇన్సురెన్స్, టాక్స్ చెల్లించాలని, లేనిపక్షంలో సీజ్ చేయడం జరుగుతుందన్నారు. సీజ్ చేసిన రెండు గూడ్స్ వాహనాలను పోలీస్స్టేషన్కు తరలించారు. తనిఖీలో ఆర్టీఏ సిబ్బంది మనోజ్, దశరథ్ పాల్గొన్నారు. శ్రీ చైతన్యకు అనుమతి లేదునిజామాబాద్ అర్బన్: నగరంలోని కంఠేశ్వర్ బైపాస్ రోడ్డులో నూతనంగా నిర్మించిన భవనంలో శ్రీ చైతన్య పాఠశాల అడ్మిషన్ల ప్రక్రియ చేపడుతోందని, ఆ పాఠశాలకు ఎలాంటి అనుమతి లేదని నిజామాబాద్ రూరల్ మండల విద్యాశాఖ అధికారి సేవల శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. గుర్తింపు లేని పాఠశాలలో తమ పిల్లలకు అడ్మిషన్లు తీసుకోవద్దని తల్లిదండ్రులకు ఆయన సూచించారు. హత్యాయత్నం కేసులో ఏడేళ్ల జైలుశిక్షనిజామాబాద్ లీగల్: హత్యాయత్నం కేసులో ఒకరికి ఏడేళ్ల జైలు శిక్షతోపాటు రూ.500 జరిమానా విధిస్తూ సీనియర్ సివిల్ జడ్జి పి సాయిసుధ తీర్పునిచ్చారు. వివరాలు ఇలా ఉన్నాయి.. నిజామాబాద్ నగరంలోని గౌతంనగర్కు చెందిన రేణుకకు పోచమ్మగల్లీకి చెందిన మద్దికుంట వెంకటితో వివాహమైంది. గొడవ కారణంగా రేణుక తన ఇద్దరు పిల్లలతో కలిసి తల్లిగారి ఇంటి వద్దే ఉంటోంది. అదే ఇంట్లో రేణుక అక్కయ్య అనుపమ సైతం ఉంటోంది. మరో వైపు రెండో పెళ్ళిచేసుకున్న వెంకటి తన పిల్లలను చూసేందుకు 2017 జనవరి 17న అత్తవారింటికి వచ్చాడు. వెంకటితో మాట్లాడేందుకు పిల్లలు నిరాకరించడంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన అతడు అత్త లక్ష్మి, వదిన అనుపమపై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. బాధితులు మూడో టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కేసును విచారించిన సీనియర్ సివిల్ జడ్జి ఐపీసీ 307 సెక్షన్ ప్రకారం నిందితుడికి ఏడు సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. ఈ కేసులో ప్రాసిక్యూటర్గా డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ పి లక్ష్మీనర్సయ్య వ్యవహరించారు. స్వగ్రామానికి చేరిన గల్ఫ్ మృతదేహండిచ్పల్లి: మండలంలోని మిట్టపల్లికి చెందిన సిర్నాపల్లి గంగాధర్(40) కువైట్లో సోమవారం గుండెపోటుతో మృతి చెందాడు. ఆయన మృతదేహం శుక్రవారం గ్రామానికి చేరగా, తల్లిదండ్రులు లక్ష్మి, చిన్న గంగారాంతోపాటు భార్య సుజాత, కూతుళ్లు, కొడుకు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. కుటుంబీకులు, బంధుమిత్రులు, గ్రామస్తులు గంగాధర్ అంత్యక్రియలను పూర్తి చేశారు. మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
ఆధార్ సీడింగ్ పూర్తి చేయాలి
డిచ్ పల్లి : వీలైనంత త్వరగా ఉపాధి కూలీలకు సంబంధించి ఆధార్ సీడింగ్ పూర్తి చేయాలని, సోషల్ ఆడిట్లో వచ్చిన ఆరోపణలను త్వరగా పరిష్కరించాలని డిచ్పల్లి ఎంపీడీవో బూక్య లింగం నాయక్ ఆదేశించారు. శుక్రవారం డిచ్పల్లి మండల పరిషత్ కార్యాలయంలో ఉపాధి హామీ సిబ్బందితో ఏర్పా టు చేసిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. వర్షాలు కురుస్తున్నందున వనమహోత్సం కార్యక్రమానికి ఏర్పాట్లు చేసుకోవాలని, ఇందుకోసం గ్రామ నర్సరీల్లో మొక్కలు సిద్ధం చేయాలన్నారు. ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తున్న లబ్ధిదారులకు అవగాహన కల్పించి ఇంటి ఆవరణలో ఇంకుడు గుంతను తప్పకుండా నిర్మించుకునేలా చూడాలన్నారు. ఇంకుడు గుంత, మరుగుదొడ్డి లేని ఇళ్లు ఉండకూడదని స్పష్టం చేశారు. ఈ నెల 17న పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లకు ఉపాధి హామీ పనులపై మండల పరిషత్ కార్యాలయంలో అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈజీఎస్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్ సుధాకర్ రెడ్డి, టెక్నికల్ అసిస్టెంట్లు ఉమేష్ కుమార్, పరమేశ్వర్, సాయికుమార్, అరుంధతి, కంప్యూటర్ ఆపరేటర్లు అన్నపూర్ణ, అనూష తదితరులు పాల్గొన్నారు. -
మండల కార్యాలయాలకు వెళ్లేదెట్లా..?
మోపాల్: మండల కేంద్రంలోని తహసీల్, ఎంపీడీవో కార్యాలయాలకు వెళ్లేందుకు ప్రజలు తిప్పలు పడుతున్నారు. గురువారం ఉదయం కురిసిన వర్షానికి కార్యాలయాలకు వెళ్లే రోడ్డుపై వర్షపు నీరు నిలిచి మడుగులా తయారైంది. ఆఫీస్కు నడక దారిన వచ్చే వారికి ఇబ్బందిగా మారింది. నిత్యం పదుల సంఖ్యలో ప్రజలు కార్యాలయాలకు వస్తూ పోతుంటారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి రోడ్డును బాగు చేయాలని ప్రజలు కోరుతున్నారు. అనుమతుల్లేకుండా అడ్మిషన్లు నిజామాబాద్అర్బన్: జిల్లా కేంద్రంలోని ఖిల్లా రోడ్డులోని గోల్డెన్ జూబ్లీ ఇంటర్మీడియట్ కళాశాలకు అనుమతులు లేకుండానే యాజమాన్యం అడ్మిషన్లు చేపడుతుందని అల్ ముర్తజా ఎడ్యుకేషన్ చారిటబుల్ ట్రస్టు కార్యదర్శి నాదిర్ షా రజానీ తెలిపారు. కళాశాలకు అల్ ముర్తజా ఎడ్యుకేషన్ చారిటబుల్ ట్రస్టు సంబంధించిన భవనాన్ని కొన్ని సంవత్సరాల క్రితం లీజుకు ఇచ్చినట్లు ఆయన తెలిపారు. అయితే సంబంధిత లీజు గడువు ముగిసిందని, అంతేగాకుండా లీజు గడువు ముగిసినా ఎటువంటి ఒప్పంద ప్రక్రియ లేకుండానే జూనియర్ ఇంటర్మీడియట్లో ప్రవేశాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. లీజు గడువు ముగిసిన నేపథ్యంలో భవనాన్ని ఖాళీ చేయాలని ఇది వరకే నోటీసులు ఇచ్చామని తెలిపారు. ఈ విషయంలో వివాదం చెలరేగకుండా ట్రస్టు నుంచి న్యాయస్థానాన్ని ఆశ్రయించామని.. తీర్పు తమకే అనుకూలంగా వచ్చిందని తెలిపారు. ఈ విషయంపై ఇంటర్మీడియట్ బోర్డు కమిషనర్కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశామని, వారు నిజామాబాద్ డీఐఈవోకు విచారణకు ఆదేశించారని తెలిపారు. అడ్మిషన్ల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని సూచించారు. సమావేశంలో అల్ ముర్తుజా ఎడ్యుకేషన్ ట్రస్టు కోశాధికారి రజియాతో పాటు, సిబ్బంది పాల్గొన్నారు. గోల్డెన్ జూబ్లీ కళాశాల అడ్మిషన్ల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలి అల్ ముర్తజా ఎడ్యుకేషన్ చారిటబుల్ ట్రస్టు కార్యదర్శి నాదిర్ షా రజానీ -
ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలి
నిజామాబాద్ రూరల్: రాష్ట్ర ప్రభుత్వం ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివే విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ డిమాండ్ చేశారు. నగరంలోని కంఠేశ్వర్లో గల రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నాయకులు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో నర్సరీ నుంచి ఇంటర్ వరకు ప్రైవేట్ విద్యా సంస్థలు రూ.లక్షల్లో ఫీజులను విద్యార్థుల నుంచి ముక్కు పిండి వసూలు చేస్తున్నారని, బుక్స్, యూనిఫామ్, షూ, ల్యాబ్, ఈవెంట్స్, సైన్స్ ఫెయిర్ వంటి రకరకాల పేర్లతో ఫీజుల దోపిడీ చేస్తున్నారని, వీటిని నియంత్రించడానికి ఫీజుల నియంత్రణ చట్టం రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావాలని అన్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాలలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలన్నారు. ఫీజుల నియంత్రణపై అధ్యయనం చేసిన తెలంగాణ విద్యా కమిషన్ ‘తెలంగాణ ప్రైవేట్ అండ్ ఎయిడెడ్ స్కూలు రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ ముసాయిదా బిల్లు 2025’ పేరిట జనవరి 24న రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిందని గుర్తు చేశారు. పేద విద్యార్థులు చదువుకునే ఇంటర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనాన్ని ఈ విద్యా సంవత్సరం నుంచి అమలు చేయాలని కోరారు. అనంతరం పీడీఎస్యూ ఆధ్వర్యంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డికి ఎమ్మెల్యే కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. సమస్యలపై ఎమ్మెల్యే భూపతిరెడ్డి స్పందిస్తూ.. డిమాండ్స్ను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతానని హామీ ఇచ్చారు. నాయకులు మనోజ్, సాయికిరణ్, రాజు, చరణ్ తేజ, రెడ్డి, వంశీ, నిఖిల్ తదితరులు పాల్గొన్నారు. ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అమలు చేయాలి ఎమ్మెల్యే రేకులపల్లి భూపతిరెడ్డికి వినతి పత్రం అందజేసిన పీడీఎస్యూ నాయకులు -
గంజాయి విక్రయిస్తున్న ఇద్దరి అరెస్ట్
ఖలీల్వాడి: గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని అరెస్టు చేశామని, మరొకరు పరారీలో ఉన్నారని ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ సీఐ స్వప్న శుక్రవారం తెలిపారు. సీఐ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. నిజామాబాద్ నగరంలోని జకీర్ఫామ్ హౌజ్లో తనిఖీ చేయగా షేక్ షకీల్ అనే వ్యక్తి వద్ద 134 గ్రాముల ఎండు గంజాయి పట్టుబడింది. అతడిని విచారించగా మధుకర్ వద్ద తాను గంజాయి కొనుగోలు చేశానని చెప్పాడు. వెంటనే మధుకర్ ఇంటి వద్ద తనిఖీలు చేసి 50 గ్రాముల గంజాయి సీజ్ చేశారు. షకీల్, దాతే మధుకర్తోపాటు దాగే దాతూరాం ముగ్గురు గంజాయి విక్రయిస్తున్నట్లు ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది గుర్తించారు. ముగ్గురిపై కేసు నమోదు చేసి పట్టుబడిన ఇద్దరిని రిమాండ్కు తరలించారు. గంజాయితోపాటు ఇతర మత్తుపదార్థాలు విక్రయించే వారికి సంబంధించిన సమాచారాన్ని 87126 58970 నంబర్కు అందించాలని, సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని సీఐ అన్నారు. ఎక్సైజ్ ఎస్సై రాము, హెడ్కానిస్టేబుల్ చిట్టి నారాయణరెడ్డి, హమీద్, శివ, ప్రీతమ్, అవినాష్, భోజన్న, విష్ణు, రాజన్న పాల్గొన్నారు. దాడి కేసులో ఆరుగురు..మోర్తాడ్(బాల్కొండ): మండల కేంద్రంలో రొయ్యల సురేశ్ అనే వ్యక్తిపై రెండు రోజుల క్రితం దాడికి పాల్పడిన ఆరుగురిని ఆరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్సై విక్రమ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రొయ్యల సురేశ్ కారులో వెళ్తుండగా రొడ్డుకు అడ్డంగా బైక్ నిలిపిన మహ్మద్ షాహబాజ్, అబ్దుల్ మజార్ను బైక్ తీయాలని అనడంతో వారు దాడికి పాల్పడ్డారని పేర్కొన్నారు. సురేశ్పై బైక్ను పడేసి తలపై రాడ్తో కొట్టారని, వారికి మహ్మద్ అస్లాం, అబ్దుల్ మాలిక్, అబ్దుల్ అర్భాజ్, మహ్మద్ ఫయాజ్లు మద్దతు తెలుపుతూ దాడికి ఉసిగొలుపుతూ బూతులు తిట్టారని తెలిపారు. తన భర్తపై దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సురేశ్ భార్య సౌమ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, నిందితులను రిమాండ్కు తరలించామని ఎస్సై తెలిపారు. -
పారిశుధ్యంపై అవగాహన
నిజామాబాద్ సిటీ:ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాల్లో భాగంగా నగరంలో పారిశుధ్య పనులు నిర్వహించా రు.శుక్రవారం చంద్రశేఖర్ కాలనీ,వి నాయక్నగర్లో ర్యాలీ నిర్వహించారు.గౌతంనగర్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పారిశుధ్యం, పరిశుభ్రతపై అవగాహన కల్పించారు.ఇళ్లలో తయారైన చెత్తను వేరుచేయడం, చుట్టుపక్కల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం, దోమలు వ్యాప్తిచెందకుండా తీసుకునే జాగ్రత్తలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.పలు డివిజన్లలో డ్రెయిన్లను శుభ్రం చేశారు. మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ జయ కుమార్, సూపర్వైజర్ సాజిద్ పాల్గొన్నారు. -
సామూహిక అక్షరాభాస్యం
డిచ్పల్లి: మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో శుక్రవారం పిల్లలకు సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించినట్లు ఎంఈవో శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. అనంతరం ఎంఈవో పిల్లలతో కలిసి సహపంక్తి (మధ్యాహ్న) భోజనం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో నిష్ణాతులైన ఉపాధ్యాయులు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందజేస్తారని ఆయన తెలిపారు. కోటగల్లీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో.. నిజామాబాద్ అర్బన్: బడి బాటలో భాగంగా శుక్రవారం కోటగల్లీ శంకర్ భవన్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. సరస్వతి దేవి చిత్రపటానికి పూలమాలవేసి పూజలు చేశారు. కోటగల్లి కాంప్లెక్స్ హెడ్మాస్టర్ మల్లేశం, సవిత, మమత, సౌందర్య, ముకుంద్, సంతోష్, నందిని, తల్లిదండ్రులు పాల్గొన్నారు. నాయీబ్రాహ్మణులకు సబ్సిడీపై రుణాలు అందించాలి నిజామాబాద్నాగారం: క్షౌ రశాలలను ఆధునీకరించడానికి సబ్సిడీపై రుణాలు ఇవ్వాలని తెలంగాణ నగర నాయీబ్రాహ్మణ దుకాణదారుల యూనియన్ అధ్యక్షుడు దేశాయి గంగాధర్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ రోజుల్లో కులవృత్తులను నాశనం చేసే విధంగా నాయీ బ్రాహ్మణుల పొట్టగొట్టి ఇతర మతస్తులు మంగళి పనిచేస్తూ మమ్మల్ని రోడ్డుపాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర మతస్తులు హెయిర్ సెలూన్లు పెట్టకుండా మున్సిపల్ అధికారులు అనుమతి ఇవ్వకూడదన్నారు. యాభై ఏళ్లు పైబడిన నాయీ బ్రాహ్మణులకు ఆసరా పెన్షన్ ఇచ్చి, ఇందిరమ్మ ఇళ్లలో కొంత శాతం కేటాయించాలన్నారు. రోగులకు పండ్లు పంపిణీ నిజామాబాద్ నాగారం: జాతీయ సర్జన్స్ వారోత్సవాల్లో భాగంగా ది అసోసియేషన్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఇండియా, ఐఎంఏ నిజామాబాద్ సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం ప్రభుత్వ ఆస్పత్రిలోని రోగులకు పండ్లు పంపిణీ చేశారు. రాష్ట్ర సర్జన్స్ సంఘం ప్రెసిడెంట్ డాక్టర్ జీవన్రావు, ఏఎస్ఐ జిల్లా అధ్యక్షులు టి.నరేంద్ర.. శస్త్ర చికిత్స , వారి పూర్వ అనుభవాలు, ఆధునిక వైద్య విధానం, రోగులకు సేవ చేసే పద్ధతుల గురించి ప్రభుత్వ సర్జికల్ పీజీ వైద్య విద్యార్థులకు అవగాహన కల్పించారు. ప్రధాన కార్యదర్శి కేవీ భాస్కర్రెడ్డి, కోశాధికారి రాకేష్, డాక్టర్లు రమేశ్, వెంకటరమణారెడ్డి, కౌశిక్, శ్రీలత, పీజీ సర్జన్స్ వైద్య విద్యార్థులు పాల్గొన్నారు. -
పరిశోధనలతోనే నూతన ఆవిష్కరణలు
నిజామాబాద్ రూరల్ : ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి తెలుగు సాహిత్యంలో డాక్టరేట్ అందుకున్న సారంగపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తెలుగు ఉపాధ్యాయుడు ఎస్.గంగాధర్ను పాఠశాలలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు లలిత మాట్లాడుతూ.. పరిశోధనలతోనే నూతన ఆవిష్కరణలు జరుగుతాయని.. పరిశోధనలు ముందు తరాలకు మార్గ నిర్దేశం చేస్తాయని అన్నారు. ‘తెలంగాణలో స్మృతి కవిత్వం– సమగ్ర పరిశీలన‘ అనే అంశంపై పరిశోధన చేసి డాక్టరేట్ అందుకున్న గంగాధర్ తమ పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు కావడం ఎంతో గర్వకారణమని అభినందించారు. ఆయన భవిష్యత్తులో విద్యార్థులను పరిశోధన వైపు దృష్టి సారించే విధంగా తీర్చిదిద్దుతారని ఆకాంక్షించారు. ఉపాధ్యాయులు సల్ల సత్యనారాయణ, రాధాకృష్ణ, డి.గోపాల్, జావిద్, విద్యాసాగర్, ఘనపురం దేవేందర్, కృష్ణంరాజు, సుజాత, స్వరూప, అనిత, లలిత, శ్రీలత పాల్గొన్నారు. -
విద్యార్థులకు పుస్తకాల పంపిణీ
సిరికొండ: మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం విద్యార్థులకు పుస్తకాలను ఎంపీడీవో మనోహర్రెడ్డి పంపిణీ చేశారు. జీహెచ్ఎం సతీష్గౌడ్, ఆసిఫ్, ధర్పల్లి బాబురావు తదితరులు పాల్గొన్నారు. జక్రాన్పల్లి : మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను కాంగ్రెస్ నాయకులు కాటిపల్లి నర్సారెడ్డి, వినోద్ పంపిణీ చేశారు. హెచ్ఎం లింగన్న, కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి వసంతరావు, మైనార్టీ శాఖ అధ్యక్షుడు అక్బర్, నట్ట తిరుపతి, ఆకాష్, మాడవేరి శంకర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మోపాల్: సిర్పూర్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం విద్యార్థులకు దుస్తులు, నూతనంగా అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్బుక్కులు ఎంఈవో గేమ్సింగ్ పంపిణీ చేశారు. గ్రామపెద్దలు ముత్యం, మధు, రజనీకాంత్, గంగాధర్, రాజేశ్వర్, ఉపాధ్యాయులు కాసర్ల నరేష్రావు, హజారే శ్రీనివాస్ పాల్గొన్నారు. -
చిగురిస్తున్న ఆశలు!
భూభారతితోమోర్తాడ్(బాల్కొండ): ఎన్నో ఏళ్లుగా పేరుకుపోయి న భూముల సమస్యలు భూభారతి గ్రామ సభల లో స్వీకరిస్తున్న దరఖాస్తులతో పరిష్కారం దొరుకుతుందని దరఖాస్తుదారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. గతంలో అమలు చేసిన ధరణి వల్ల ఎన్నో సమస్యలకు పరిష్కారం లభించలేదని, భూభారతి వల్ల తమకు పట్టాలు లభిస్తాయనే నమ్మకంతో వినతి పత్రాలు ఇస్తున్నారు. మోర్తాడ్, భీమ్గల్, వేల్పూర్, కమ్మర్పల్లి, మెండోరా, ముప్కాల్, బాల్కొండ, ఏర్గట్ల తదితర మండలాల్లో భూభారతి గ్రామసభల నిర్వహణ సాగుతోంది. ఈనెల 20 వరకు గ్రామసభలు సాగనున్నా యి. గ్రామసభలు ముగిసిపోయిన తర్వాతనే తమ కు అందిన దరఖాస్తులపై రెవెన్యూ అధికారులు క్షేత్ర స్థాయిలో సందర్శించి పరిశీలన చేయనున్నా రు. అనంతరం భూముల సమస్యలకు ఒక పరిష్కా రం లభించే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇదిలా ఉండగా ధరణి అమలులో ఉన్న సమయంలో తహసీల్దార్ స్థాయిలో పరిష్కారం కాని సమస్యలను ఆర్డీవో, జిల్లా కలెక్టర్ కార్యాలయాలకు పంపించేవారు. ఈసారి కూడా మండల స్థాయిలో ఆప్షన్ ఇవ్వకపోవడంతో గతంలో మాదిరిగానే ఆర్డీవో, జిల్లా కలెక్టర్ కార్యాలయాలకు పంపించాల్సి ఉంటుంది. రెవెన్యూ ఉద్యోగుల తప్పిదాల వల్ల పట్టా పాసుపుస్తకాలు అందుకోలేని వాళ్లు మండల స్థాయిలోనే కొత్త పట్టా బుక్కులు తీసుకునేలా సవరణ చేయాలనే డిమాండ్ బలంగా వినిపిస్తుంది. ఆప్షన్లలో మార్పు లేకపోయినా గతంలో కంటే వేగంగానే ఫైళ్లు కదలడానికి అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఒక్కో గ్రామంలో 50 నుంచి 80 వరకూ భూ సమస్యలకు సంబంధించి వినతి ప త్రాలు అధికారులకు అందుతున్నాయి. భూభారతి పోర్టల్ను పూర్తి స్థాయిలో అమలు చేసిన నేపథ్యంలో భూ సమస్యల పరిష్కారం త్వరితగతిన పూర్తి చేయాలని పలువురు కోరుతున్నారు. ధరణిలో సాంకేతిక కారణాలతో పేరుకుపోయిన సమస్యలు భూభారతి ద్వారా పరిష్కారం కావొచ్చనే ధీమాలో భూ యజమానులు ఈనెల 20 వరకు రైతుల నుంచి దరఖాస్తుల స్వీకరణ అధికారుల క్షేత్ర స్థాయి పరిశీలన అనంతరం భూ సమస్యల పరిష్కారానికి అవకాశం -
అమ్మకు అక్షరాభ్యాసం
పొతంగల్ ఖుర్దులో నిరక్షరాస్య మహిళలకు అక్షరాభ్యాసం చేయిస్తున్న తోటి సంఘం సభ్యులు కామారెడ్డి టౌన్ : వంద శాతం మహిళలను అక్షరాస్యులుగా చేయాలన్న లక్ష్యంతో కామారెడ్డి జిల్లాలో విద్యాశాఖ ‘అమ్మకు అక్షరాభ్యాసం’ పేరుతో కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందు లో భాగంగా జిల్లాలోని స్వయం సహాయక సంఘాలలో నిరక్షరాస్యులై న మహిళలను అక్షరా స్యులుగా చేయనున్నారు. జిల్లాలోని 25 మండలాల్లో 17,194 స్వ యం సహాయక సంఘాలున్నాయి. వాటిలో 42,749 మంది సభ్యులు నిరక్షరాస్యులని గు ర్తించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలోనే మొ ట్టమొదటిసారిగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని శు క్రవారం గాంధారి మండలం పొతంగల్ ఖు ర్దులో డీఈవో రాజు ప్రారంభించారు. వేదపండితుడితో అక్షరాభ్యాసం పూజ చే యించి పలకా బలపం పట్టించి అక్షరాలు దిద్దించారు. తోటి సభ్యులతో చదువుచెప్పించే ప్రణాళిక.. న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రామ్కు అనుసంధానంగా రాష్ట్ర ప్రభుత్వం వయోజన విద్యలో ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. స్వయం సహాయక సంఘాల్లోని నిరక్షరాస్యులైన మహిళలకు అదే గ్రూపులోని అక్షరాస్యులైన మహిళలతో చదువు చెప్పించనున్నారు. వయోజన విద్యా విభాగం ప్రత్యేక కార్యక్రమాలతో వారు అక్షరాలు చదివేలా, చిన్నపాటి లెక్కలు చేసేలా, ఇంగ్లిష్ చదివేలా చేయాలన్నది ఈ కార్యక్రమ ఉద్దేశం. జిల్లాలోని అన్ని మండలాల్లో ఒక్కో గ్రామాన్ని ఎంపిక చేసి బడిబాటలో భాగంగా నిర్వహిస్తున్న సామూహిక అక్షరాభ్యాసాలతో పాటు వయోజన విద్య విభాగానికి సంబంధించిన ’అమ్మకు అక్షరాభ్యాసం’ కార్యక్రమాలను సైతం ఘనంగా నిర్వహిస్తున్నామని అధికారులు పెర్కొన్నారు. వందశాతం అక్షరాస్యత జిల్లాగా మార్చేందుకు కృషి వంద శాతం అక్షరాస్యత కలిగిన జిల్లాగా మార్చేందుకు ‘అ మ్మకు అక్షరాభ్యాసం’ కార్యక్రమం ప్రారంభించాం. జిల్లావ్యాప్తంగా స్వయం సహాయ క సంఘాలలో వయసుతో సంబంధం లే కుండా నిరక్షరాస్యులైన వారిని గుర్తించాం. వారందరికీ ఈ కార్యక్రమంలో చదు వు నే ర్పుతాం. – రాజు, డీఈవో, కామారెడ్డి -
ఆస్పత్రిలో రోగి భర్త ఆత్మహత్య
ఖలీల్వాడి: నిజామాబాద్ నగరంలోని జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో కామారెడ్డి జి ల్లా జుక్కల్ మండలం మహమ్మద్ నగర్కు చెందిన సాయిలు (38) గురువారం అర్ధ రా త్రి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సాయిలు భార్య సంగీతను అనారోగ్యం కారణంగా ఈ నెల 6న ఆస్పత్రిలో చేర్పించారు. సంగీత రక్త హీనత లో బాధపడుతోంది. భార్యకు అనారోగ్యం, మరోవైపు ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపం చెందిన సాయిలు ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్హెచ్వో రఘుపతి తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. కక్షిదారు వద్దకు న్యాయమూర్తి ఆర్మూర్టౌన్: జాతీయ లోక్ అదాలత్లో భాగంగా ఆర్మూర్ కోర్టులో శుక్రవారం కొ ట్లాట కేసులో ఇరువురు రాజీపడ్డారు. అయి తే నడవలేని స్థితిలో ఉన్న కక్షిదారు దగ్గరకే న్యాయమూర్తి సరళ రాణి వచ్చారు. ఈ కేసులో రాజీ కుదిర్చారని ఎస్హెచ్వో సత్యనారాయణగౌడ్ తెలిపారు. నేడు జాతీయ లోక్ అదాలత్ ● జిల్లా వ్యాప్తంగా 18 బెంచ్ల ఏర్పాటు నిజామాబాద్ లీగల్ : కేసుల సత్వర పరిష్కారంలో భాగంగా జాతీయ న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జాతీ య లోక్ అదాలత్ నిర్వహించనున్నారు. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా ఉన్న కోర్టుల్లో మొత్తం 18 బెంచ్లు ఏర్పాటు చేశారు. నిజామాబాద్ కోర్టులో 11, బోధన్లో 4, ఆర్మూర్లో 3 బెంచ్లు కేసుల పరిష్కారం కోసం కృషిచేస్తాయని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఉదయభాస్కర్ రావు తెలిపారు. ఈ లోక్ అదాలత్లో సివిల్, క్రిమినల్, బ్యాంకు, మునిసిపల్, మోటారు బీ మా, కుటుంబ తగాదాలు, చెక్ బౌన్స్ కేసు లు పరిష్కరించనున్నట్టు తెలిపారు. కక్షిదారులు కేసుల సత్వర పరిష్కారం కోసం రాజీమార్గమే రాజమార్గం అన్న ధోరణితో లోక్ అదాలత్ను వినియోగించుకోవాలని సూచించారు. దరఖాస్తుల ఆహ్వానం నిజామాబాద్ అర్బన్: ఉమ్మడి జిల్లాకు చెందిన అభ్యర్థులు సివిల్ సర్వీస్ లాంగ్ టర్మ్ కోచింగ్ కోసం దరఖాస్తు చేసుకోవాలని బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ వెంకన్న శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. 2026 సివిల్ సర్వీస్ పరీక్షకు సన్నద్ధమయ్యే వారికి ఉచితంగా లాంగ్టర్మ్ కోచింగ్ ఇవ్వనున్నట్లు పేర్కొన్నా రు. ఈనెల 16 నుంచి జూలై 8వ తేదీ వరకు దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలని సూచించారు. ఉచిత కోచింగ్ హైదరాబాద్లోని లక్ష్మీనగర్లో ఉంటుందని, దరఖాస్తు చేసుకున్న వారిలో వందమంది ప్రతిభావంతులను ఎంపిక చేయడం జరుగుతుందని తెలిపారు. మరిన్ని వివరాలకు 08462 241055 నంబర్ను సంప్రదించాలని సూచించారు. రేపు ప్రణవానంద దాస్ స్వామీజీ రాక కామారెడ్డి టౌన్ : జిల్లా కేంద్రంలో ఆది వారం జరిగే పలు కార్యాక్రమాలలో పాల్గొనేందుకు అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం(ఇస్కాన్) ప్రతినిధి ప్రణవానంద దాస్ రానున్నారని పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు భూమేశ్ గుప్తా తెలిపారు. శుక్రవారం కన్యకాపరమేశ్వరి ఫంక్షన్ హాల్లో విలేకరులతో మాట్లాడారు. స్వామీజీ రాక సందర్భంగా ఆదివారం సాయంత్రం పట్టణంలోని హౌసింగ్ బోర్డు శారదామాత ఆలయం నుంచి ధర్మశాల వరకు బైక్ ర్యాలీ నిర్వహిస్తామన్నారు. అనంతరం కన్యకా పరమేశ్వరి ఆలయంలో స్వామివారి ప్రవచన కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. భక్తు లు అధిక సంఖ్యలో తరలిరావాలని కోరారు. కార్యక్రమంలో ఇస్కాన్ కామారెడ్డి ఇన్చార్జి వెంకటరాస్, కన్వీనర్ సిద్దిరాములు, ప్రతినిధులు శ్రీహరి, నందగోపాల్ తదితరులు పాల్గొన్నారు. -
ఫ్రస్ట్రేషన్లో కేసీఆర్ ఫ్యామిలీ
నిజామాబాద్ సిటీ: కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై కేసీఆర్, హరీశ్రావును విచారిస్తుంటే భరించలేక సీ ఎం రేవంత్రెడ్డిపై కేటీఆర్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపతిరెడ్డి మండిపడ్డారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ భవన్లో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి అనుమతులు లేకుండా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి కోట్లాది రూపాయలు అక్రమంగా సంపాదించారని, ఇప్పుడు విచారిస్తుంటే కేసీఆర్ ఫ్యామిలీ ఫ్రస్ట్రేట్ అవుతోందన్నారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న రేవంత్పై అభ్యంతకరవ్యాఖ్యలు చేస్తున్న కేటీఆర్ను బయటతిరనివ్వమన్నారు. కేసీఆర్ కుటుంబంలో ఇంటిపోరు నడుస్తోందని, ఒకవైపు బిడ్డ, మరోవైపు కొడుకు ఆధిపత్యం కోసం కొట్లాడుతున్నారన్నారు. కేసీఆర్ బిడ్డ లిక్కర్ కేసులో, కొడుకు ఫార్ముల వన్ కేసులో, హరీశ్రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇరుకున్నారని, వారిని బీజేపీ కాపాడుతోందని ఆరోపించారు. కేటీఆర్ తన వ్యాఖ్యలను మానుకోకుంటే భౌతిక దాడులకు కూడా వెనుకాడబోమని హెచ్చరించారు. మంత్రివర్గ విస్తరణలో జిల్లాకు అన్యా యం జరిగిందని, ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లామన్నారు. మలివిడత విస్తరణలో జిల్లా కు అవకాశం దక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేశా రు. సమావేశంలో మార్కెట్యార్డు చైర్మన్ ముప్పగంగారెడ్డి, నాయకులు మునిపల్లి సాయిరెడ్డి, వేణురాజ్, సంతోష్, బోర్గాం శ్రీనివాస్, ప్రవీణ్కుమార్, జువ్వాజి రమేశ్ తదితరులు పాల్గొన్నారు. కాళేశ్వరం అక్రమాలపై విచారణను భరించలేకపోతున్నారు సీఎం రేవంత్పై కేటీఆర్ వ్యాఖ్యలు అభ్యంతరకరం ఆయనను బయట తిరగనివ్వం మంత్రి పదవి కేటాయింపులో జిల్లాకు అన్యాయం జరిగింది నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే ఆర్ భూపతిరెడ్డి -
ఫార్మర్ రిజిస్ట్రీలో నందిపేట ముందంజ
నందిపేట్(ఆర్మూర్): కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని పూర్తిగా డిజిటలైజేషన్ చేయాలనే లక్ష్యంలో భాగంగా రైతులకు గుర్తింపు కార్డులు జారీ చేసేందుకు చర్యలు చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి అగ్రిస్టాక్ తెలంగాణ ఫార్మర్ ఈ రిజిష్ట్రీలో రైతుకు ఉన్న భూముల వివరాలను నమోదు చేసే ప్రక్రియను జూన్ 5 నుంచి వ్యవసాయ శాఖ అధికారులు ప్రారంభించారు. కాగా ఈ యాప్లో నమోదు ప్రక్రియలో భాగంగా నందిపేట మండలం ముందంజలో ఉంది. వ్యవసాయ శాఖ అధికారులు రైతుల వారీగా వివరాలను అత్యధికంగా నమోదు చేయడంతో జిల్లాలోనే అగ్రస్థానంలో నిలిచింది. అంతేగాకుండా రాష్ట్రంలో రెండవ స్థానంలో ఉంది. రైతుల వివరాలు నమోదు నందిపేట మండలంలో మొత్తం రైతులు 11,282 మంది ఉండగా ఇప్పటి వరకు 7008 మంది రైతుల వివరాలను 62.12 శాతం ఏఈవోలు యాప్లో నమోదు చేశారు. క్లస్టర్ల పరిధిలోని గ్రామాల వారీగా ఏఈవోలు ప్రతి రోజు ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తూ రైతుల వివరాలను సేకరిస్తున్నారు. రైతు ఆధార్కార్డు, పట్టదారు పాసుపుస్తకంలోని భూముల వివరాలు, యాప్లో నమోదు చేయగానే 11 నంబర్ల ప్రత్యేక యూనిక్ కోడ్ కెటాయిస్తున్నారు. అయితే యాప్లో నెలకొన్న సాంకేతిక సమస్యలతో రైతుల వివరాలను నమోదు చేసేందుకు ఏఈవోలు పడరాని పాట్లు పడుతున్నారు. రైతులకు చెందిన భూముల సమాచారం యాప్లో కనిపించకపోవడంతో వివరాలను నమోదు చేసే ప్రక్రియలో జాప్యం జరుగుతోంది. అదేవిధంగా రైతుల సెల్ఫోన్లలో ఓటీపీ నంబరు రాకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఆధార్కు లింక్ చేసిన ఫోన్ నంబరును రైతులు వాడకపోవడంతో ఇబ్బందులు వస్తున్నాయని ఏఈవోలు పేర్కొంటున్నారు. నిర్ణీత గడువుకు ముందే నమోదు చేసేందుకు ఏఈవోలు వివరాల సేకరణలో నిమగ్నమయ్యారు. అయితే పచ్చిరొట్ట విత్తనాల పంపిణీ, మట్టి నమూనాల సేకరణతో పాటు రైతు ముంగిట్లో వ్యవసాయం కార్యక్రమాలలో కొంత జాప్యం ఏర్పడుతుంది. నందిపేట మండలంలో ఫార్మర్ రిజిస్ట్రీ యాప్ వివరాలు జిల్లాలో ప్రథమ స్థానం, రాష్ట్రంలో రెండో స్థానంఅన్ని గ్రామాల్లో వివరాలు నమోదు ఏఈవోలు అన్ని గ్రామాలలో రైతుల వివరాలను ఫార్మర్ రిజిస్ట్రీ యాప్లో నమోదు చేస్తున్నారు. గడువుకు ముందే రైతులందరి వివరాలను నమో దు చేయాలనే లక్ష్యంతో ఏఈవోలు పనిచేస్తున్నారు. కొన్ని సాంకేతిక కారణాలతో వివరాల నమోదులో జాప్యం ఏర్పడుతోంది. – జోత్స్న భవాని, మండల వ్యవసాయాధికారిణి, నందిపేట -
బాధ్యతలు స్వీకరించిన కొత్త కలెక్టర్
నిజామాబాద్అర్బన్: జిల్లా కలెక్టర్గా టి వినయ్ కృష్ణారెడ్డి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. సాయంత్రం 4.45 గంటల సమయంలో సమీకృత జిల్లా కార్యాలయాల స ముదాయం వద్దకు చేరుకున్న ఆయనకు అదనపు కలెక్టర్లు స్వాగతం పలికారు. నేరు గా తన చాంబర్కు చేరుకున్న కృష్ణారెడ్డి అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో తదితరులతో భేటీ అయ్యి జిల్లా స్థితిగతులు, స్థా నిక పరిస్థితుల గురించి చర్చించారు. కొత్త కలెక్టర్ను ఆయన చాంబర్లో వివిధ శాఖల అధికారులు కలిసి పరిచయం చేసుకున్నారు. అదనపు కలెక్టర్లతో పాటు ఆర్మూర్ ఆర్డీవో రాజాగౌడ్, కలెక్టరేట్ ఏవో ప్రశాంత్, అన్ని శాఖలకు చెందిన జిల్లా అధికారులు, ఉద్యో గ సంఘాల నాయకులు కలెక్టర్కు పూల మొక్కలు అందించి స్వాగతం పలికారు. వినయ్ కృష్ణారెడ్డికి స్వాగతం పలికిన అదనపు కలెక్టర్లు, అధికారులు -
ఫోన్నంబర్లు..
ఖలీల్వాడి: ఆర్టీసీ బస్సు ప్రయాణికుల కోసం సంస్థ మరో సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. నిజామాబాద్ రీజియన్ పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్, బాన్సువాడ, కామారెడ్డి డిపోల నుంచి ఆయా ప్రాంతాలకు బస్సులు బయలుదేరు సమయం వివరాల తెలుసుకునేందుకు బస్టాండ్లకు వెళ్లే అవసరం లేకుండా ప్రత్యేక ఫోన్ నంబర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆ నంబర్లకు ఫోన్ చేసి బస్సుల వేళలు, చార్జీల వివరాలు తెలుసుకోవచ్చు. సంస్థ కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని సురక్షిత ప్రయాణం చేయాలని ఆర్ఎం జ్యోత్స్న శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. ఆర్మూర్ 73828 43133 బోధన్ 98495 00725 నిజామాబాద్ 99592 26022 బాన్సువాడ 94911 05706 కామారెడ్డి 73828 43747 ఫోన్ చేస్తే బస్సు వేళలు.. చార్జీల వివరాలు -
రాళ్ల గుట్టపై.. నీళ్ల బావి
ఆర్మూర్ పట్టణంలోని నళ్లని రాళ్లతో సహ జ సిద్ధంగా ఏర్పడిన నవనాథ సిద్దుల గుట్టపై తాగునీటి అవసరాలు తీర్చే చేద బావిలో నీళ్లు, కోనేరులో ఊట ద్వారా వచ్చే నీళ్లు భక్తులకు సంభ్రమాశ్చర్యాలను కలిగిస్తాయి. ● సాగు అవసరాల కోసం వందల ఫీట్లు బోరు బావులు తవ్వే ఈ ప్రాంతంలో రాళ్ల గుట్టపై ఊట లేదా వర్షం ద్వారా నీళ్లు ఆశ్చర్యానికి గురిచేస్తాయి. ● ఎత్తయిన రాళ్ల గుట్టపై నిత్యం నీరుండేలా కోనేరును ఉంది. ● రామాలయం ఎదురుగా తవ్విన బావిలో ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో సైతం నిత్యం నీళ్లు అందుబాటులో ఉండి ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ● వందల ఏళ్ల క్రితం నవనాథులు గుట్టపై తపస్సు చేసుకొంటూ సిద్ధేశ్వరుడిని కొలిచే కాలంలో ఈ చేద బావి, కోనేరును నిర్మించినట్లు స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. – ఆర్మూర్ మీకు తెలుసా? -
ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య
డీఈవో అశోక్ జక్రాన్పల్లి: ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన జరుగుతుందని డీఈవో అశోక్ పేర్కొన్నారు. జక్రాన్పల్లి మండలం లక్ష్మాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్, నోట్ బుక్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతిభ కలిగిన ఉపాధ్యాయులు ఉన్నారన్నారు. అనంతరం పదో తరగతిలో మండల టాపర్లుగా నిలిచిన విద్యార్థినులను డీఈవో అభినందించారు. ఐడీసీఎంఎస్ మాజీ చైర్మన్ మునిపల్లి సాయిరెడ్డి, మాజీ సర్పంచ్ చిన్న సాయరెడ్డి, ఎంఈవో శ్రీనివాస్, హెచ్ఎం శ్రీనివాసరెడ్డి, పీఆర్టీయూ మండల అధ్యక్షుడు గోపి, ప్రధాన కార్యదర్శి రవీణ్ తదితరులు పాల్గొన్నారు. -
శిలాఫలకం ధ్వంసం
● పోలీసులకు ఫిర్యాదు నందిపేట్(ఆర్మూర్): మండల కేంద్రానికి సమీపంలోని పలుగుట్ట ప్రాంతంలో మండల రజక సంఘం కల్యాణ మండప నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన శిలాఫలాకాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ మేరకు రజక సంఘం సభ్యులు గురువారం ఆందోళన చేపట్టి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అనంతరం తహసీల్దార్కు మెమోరండం అందజేశారు. ఈ సందర్భంగా రజక సంఘం మండల అధ్యక్షుడు గవాస్కర్ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డి రజకుల కల్యాణ మండపం కోసం ఎకరం భూమి కేటాయించి రూ. 20 లక్షల ప్రొసీడింగ్తో మాజీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి భూమిపూజ చేశారని తెలిపారు. శిలాఫలాకాన్ని ధ్వంసం చేసిన వ్యక్తులను గుర్తించి చర్యలు తీసుకోవాలని కోరారు. ఆటో బోల్తా.. పలువురికి గాయాలు గాంధారి(ఎల్లారెడ్డి): అదుపు తప్పి ఆటో బోల్తా పడడంతో ఒకే కుటుంబానికి చెందిన పలువురికి గాయాలైన ఘటన మండల పరిధిలోని మేడిపల్లి సమీపంలో గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానికులు, అంబులెన్సు సిబ్బంది ఈఎంటీ సురేశ్, పైలట్ ప్రకాశ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గాంధారి మండల కేంద్రానికి చెందిన ఆరిఫ్ కుటుంబసభ్యులతో బడాపహాడ్ దర్శనం కోసం ఆటోలో బయల్దేరారు. గాంధారి– బాన్సువాడ ప్రధాన రహదారిలో బుగ్గగండి ప్రాంతంలో ఆటో అదుపు తప్పి రోడ్డు పక్కన లోయలో పడిపోయింది. దీంతో ఆటో నడుపుతున్న ఆరిఫ్తోపాటు అందులో ప్రయాణిస్తున్న మహిళలు, పిల్లలకు గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు, గండివేట్ మాజీ సర్పంచ్ ఫారూఖ్ 108 అంబులెన్స్కు సమాచారం ఇచ్చారు. క్షతగాత్రులను లోయలో నుంచి పైకి తీసుకొచ్చి అంబులెన్సులో ఎక్కించారు. ఆరిఫ్తోపాటు చిన్నారులు అమ్రాన్, అర్ఫాన్, షరీనా, షాబీనాకు తీవ్రగాయాలు కాగా మహిళలకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలంలో సహాయం చేసిన మాజీ సర్పంచ్ ఫారూఖ్ను పలువురు అభినందించారు. పోలీసులకు పట్టించారని దాడి ఖలీల్వాడి: పోలీసులకు పట్టించారంటూ యూత్ సభ్యులపై దాడి చేసిన వ్యక్తులను రిమాండ్కు తరలించినట్లు మూడో టౌన్ ఎస్సై హరిబాబు తెలిపారు. గౌతమ్ నగర్ చెందిన షేక్ అబ్దుల్ గఫార్, అతని మిత్రులు షేక్ అవేజ్, మహేశ్, సచిన్ కలిసి బుధవారం రాత్రి యూత్ సభ్యులపై ఇటుకలు, కర్రలతో దాడి చేశారన్నారు. గఫార్ గత నెలలో గంజాయి కేసులో పోలీసులకు పట్టుబడడంతో గౌతమ్నగర్ చెందిన వారే పోలీసులకు పట్టించారనే అనుమానంతో యూత్ సభ్యులపై కక్షగట్టి రాత్రి దాడి చేసినట్లు తెలిపారు. గఫార్, అతని మిత్రులపై కేసు నమోదు చేసి ఇద్దరిని కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించినట్లు పేర్కొన్నారు. గఫార్తోపాటు అతని మిత్రులపై గతంలో కేసులు ఉన్నట్లు చెప్పారు. -
అనుమానాస్పదస్థితిలో ఒకరి మృతి
బాన్సువాడ : పట్టణంలోని వాసవీకాలనీలో అద్దె ఇంట్లో నివాసముంటున్న గోజే రాఘవేందర్ (36) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పోలీసు లు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పిట్లం మండలం మద్దెల్చెర్వు గ్రామానికి చెందిన రాఘవేందర్ మూడేళ్లుగా ఓ స్టీల్ దుకాణంలో పనిచేస్తూ బా న్సువాడలో నివాసముంటున్నాడు. గుంటూరుకు చెందిన అంబికను ప్రేమించి పెద్దల అంగీకరంతో వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నా రు. ఈ నెల 9న అంబిక తన బంధువుల ప్రథమ దినకర్మకు గుంటూరుకు వెళ్లింది. పిల్లలను మద్దెల్చెర్వులో ఉండే బావ రాజేందర్ ఇంట్లో ఉంచింది. రెండు రోజులుగా భర్త రాఘవేందర్కు ఫోన్ చేసినా కలవకపోవడంతో రాజేందర్కు స మాచారం ఇచ్చింది. దీంతో రాజేందర్ తల్లిని బాన్సువాడ లోని తమ్ముడి ఇంటికి పంప గా, లోపలి నుంచి తాళాలు వేసి ఉన్న విషయం తెలిపింది. రాజేందర్ డయల్ 100కు సమాచారం ఇవ్వ గా, పోలీసులు వచ్చి తలుపులు పగులగొట్టడంతో రాఘవేందర్ శవమై కనిపించాడు. కుటుంబసభ్యు ల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని బాన్సువాడ ఆస్పత్రికి తరలించారు. -
వ్యవసాయ వర్సిటీ స్థాపన దినోత్సవం
రుద్రూర్: హైదరాబాద్లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం 61వ స్థాపన దినోత్సవ కార్యక్రమాన్ని గురువారం రుద్రూర్ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో శాస్త్రవేత్తలు, విద్యార్థులు ఆన్లైన్లో వీక్షించారు. విశ్వవిద్యాలయం స్థాపించినప్పటి నుంచి చేపట్టిన పరిశోధనలు, రూపొందించిన వంగడాలు, రైతుల జీవితాల్లో తెచ్చిన మార్పులపై వక్తలు వివరించారు. కార్యక్రమంలో పరిశోధన కేంద్రం అధిపతి డాక్టర్ టీ అంజయ్య, కృషి విజ్ఞాన కేంద్రం, వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు, సిబ్బంది, వ్యవసాయ పాలిటెక్నిక్ విద్యార్థులు పాల్గొన్నారు. దరఖాస్తుల ఆహ్వానం నిజామాబాద్ అర్బన్: నిజామాబాద్ డైట్ కళాశాలలో తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్ మీడియంలో బోధించేందుకు అతిథి అధ్యాపక (గెస్ట్ లెక్చరర్) పోస్టుల భర్తీకి అర్హుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ టి శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. సొషియాలజీ, సైకాలజీ, సైన్స్, మ్యాథ్స్, సోషల్, తెలుగు, ఫైన్ ఆర్ట్స్, ఫిజికల్ డైరెక్టర్, సోషల్ సైన్స్ లెక్చరర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. సంబంధిత సబెక్ట్లో పీజీ, ఎంఈడీ చేసిన 65 సంవత్సరాలలోపు వారు ఈనెల 19వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎంఈడీ లేనిపక్షంలో బీఈడీ చేసిన వారికి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఈ నెల 21న అర్హుల జాబితా ప్రకటిస్తామని తెలిపారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.15,600 నుంచి రూ.23,400 వరకు వేతనం అందించనున్నట్లు పేర్కొన్నారు. అభ్యర్థులకు ఈ నెల 24 నుంచి 26వ తేదీ వరకు మెరిట్ ప్రాతిపదికన ఇంటర్వ్యూలు నిర్వహించి నియమిస్తామని తెలిపారు. మరిన్ని వివరాలకు 94404 14198 నంబర్ను సంప్రదించాలని సూచించారు. ఆలయంలో చోరీ నవీపేట: మండల కేంద్రంలోని లింగం గుట్ట రేణుకా ఎల్లమ్మ ఆలయంలో దుండగులు చోరీ కి పాల్పడినట్లు ఎస్సై వినయ్ గురువారం తెలిపారు. ఆలయ నిర్వాహకుడు శేఖర్గౌడ్ గురువారం ఆలయానికి వెళ్లగా తాళాలు పగులగొట్టి ఉన్నాయని పేర్కొన్నారు. గర్భగుడిలోకి వెళ్లి చూడగా పంచలోహాల ఉత్సవ విగ్రహం, మంగళహారతులు, మైక్సెట్ తదితర వస్తువులను ఎత్తుకెళ్లారని తెలిపారు. శేఖర్గౌడ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. పేకాడుతున్న 10 మంది అరెస్టు ఖలీల్వాడి: శాస్త్రీనగర్ గ్రామ శివారులో బుధవారం రాత్రి 12:30 గంటలకు పేకాడుతున్న 10 మందిని అరెస్ట్ చేసినట్లు ఆరో టౌన్ ఎస్సై వెంకట్రావు గురువారం తెలిపారు. మీర్జా జావీద్ బేగ్ ఖాళీ స్థలంలో ఉన్న రేకుల షెడ్డులో 10మంది పేకాట ఆడుతుండగా పట్టుకొని, వారి నుంచి రూ.76 వేలు, ఒక కారు, రెండు బైక్లు, 12 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు. ప్రభుత్వ భూములు కాపాడాలి ఆర్మూర్టౌన్: పెర్కిట్లో విజేత అపార్ట్మెంట్ పక్కన గల ఇరిగేషన్ ల్యాండ్ను అక్రమంగా కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ రాజుకు గురువారం ఖాందేశ్ ప్రశాంత్ ఫిర్యాదు చేశారు. గతంలో ప్రజావాణిలో సైతం ఫిర్యాదు చేశానన్నారు. ఇరిగేషన్, 10 శాతం ప్రభుత్వ భూములను కాపాడాలన్నారు. పొక్లెయిన్ సీజ్ నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): నాగిరెడ్డిపేట ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని అటవీ భూమిలో రెండు రో జుల క్రితం పొదలను తొలగించిన పొక్లెయిన్ ను పట్టుకొని సీజ్ చేసినట్లు ఫారెస్ట్ రేంజ్ అధి కారి వాసుదేవ్ గురువారం తెలిపారు. రెండు రోజుల క్రితం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తు లు ఎర్రకుంట తండా సమీపంలోని అటవీభూమిలో పొదలను తొలగించారని అందిన విశ్వసనీయ సమాచారం మేరకు విచారణ చేపట్టామన్నారు. పొదలను తొలగించిన మెదక్ జిల్లా కు చెందిన పొక్లెయిన్ను పట్టుకొని కేసు న మోదు చేసి సీజ్ చేసినట్లు వివరించారు. -
భార్యపై కోపంతో కొడుకు హత్య
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): భార్యపై కోపంతో నాలుగేళ్ల కొడుకును ఓ తండ్రి హతమార్చిన ఘటన గురువారం నాగిరెడ్డిపేట మండలం పోచారం గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్సై మల్లారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. పోచారం గ్రామానికి చెందిన బోయిని శ్రీహరి తన కూతురు అక్షితను ఐదేళ్ల క్రితం లింగంపేట మండలం పొల్కంపేట గ్రామానికి చెందిన నర్వ అనిల్కు ఇచ్చి పెళ్లి చేశాడు. వీరికి కొడుకు శశాంక్(4), కూతురు మనుశ్రీ (7 నెలలు) ఉంది. కాగా, అనిల్, అక్షిత పిల్లలతో కలిసి మంగళవారం మెదక్ జిల్లా శా లిపేట గ్రామంలో జరిగిన బోనాల పండుగ కో సం బంధువుల ఇంటికి వెళ్లారు. అక్కడ పిల్లలు ఆడుకుంటున్న క్రమంలో అనిల్ చెల్లెలు కూతురు ను శశాంక్ మెట్లపై నుంచి తోసేశాడు. ఈ విషయమై శాలిపేటలో గొడవ జరిగింది. తిరిగి పొ ల్కంపేటకు చేరుకున్న తర్వాత భార్యాభర్తలిద్ద రూ గొడవ పడ్డారు. అదే సమయంలో అనిల్ తన భార్య అక్షితను కొట్టాడు. గురువారం అక్షితకు వైద్యం చేయించేందుకు పిల్లలతో కలిసి పోచారం గ్రామానికి వచ్చారు. అనంతరం కొడుకు శశాంక్ను బయట తిప్పుతానని చెప్పి బైక్పై పోచారం గ్రామశివారుకు తీసుకెళ్లాడు. శశాంక్ ముక్కు, నోరు మూసి స్పృహ కోల్పోయేలా చేసి అత్తారింటికి తీసుకువచ్చాడు. గమనించిన కుటుంబసభ్యులు శశాంక్ను చికిత్స నిమ్తితం మండల కేంద్రంలోని ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వై ద్యులు బాలుడు అప్పటికే మృతి చెందాడని చె ప్పారు. అనిల్ను నిలదీయగా భార్యపై కోపంతో తానే శశాంక్ను హత్య చేశానని చెప్పి పారిపోయాడు. అక్షిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఊపిరాడకుండా చేసి అంతమొందించిన తండ్రి -
పోలీసులకు పట్టిస్తాడనే భయంతోనే చంపేశాడు
హత్య కేసులో ఒకరి రిమాండ్ ఖలీల్వాడి: బైక్ దొంగతనం చేసిన తనను పోలీసులకు ఎక్కడ పట్టిస్తాడోననే భయంతో పాంగ్రా శివారులో ఒకరిని హత్య చేసిన నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు నగర సీఐ శ్రీనివాస్ రాజు తెలిపారు. నగరంలోని తన కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ వివరాలు వెల్లడించారు. నాల్గో టౌన్ పరిధిలోని సంజీవ్రెడ్డి కాలనీకి చెందిన వసంత్కుమార్ అలియాస్ టిల్లు(38), గాజులపేట్కు చెందిన సర్దార్ తేజసింగ్ అలియాస్ దయాసింగ్ స్నేహితులు. వసంత్కుమార్ ఓ ఫైనాన్స్ కంపెనీలో పని చేస్తుండగా, తేజసింగ్ జులాయిగా తిరిగేవాడు. జల్సాలకు డబ్బులు అవసరమై తేజ్సింగ్ ఈ నెల 7న గంగస్థాన్ ఫేస్–2లో ఓ బైక్ను దొంగిలించాడు. ఆ బైక్ను అమ్మేందుకు ఈ నెల 9న సాయంత్రం వసంత్కుమార్కు ఫోన్ చేసి రూ.25 వేలు అవసరం ఉంది, బైక్పై లోన్ ఇప్పించాలని అడిగాడు. దీంతో వసంత్కుమార్ బైక్ ఆర్సీ, ఆధార్ తీసుకొని వస్తే మూడు రోజుల్లో లోన్ ఇప్పిస్తానని చెప్పాడు. తేజ్సింగ్ బైక్ తన పేరు మీద లేదని వేరే వాళ్లదని, అర్జెంటుగా డబ్బులు కావాలని బతిమిలాడగా, బైక్ను తాకట్టు పెట్టుకొని రూ.3 వేలు ఇస్తానని వసంత్కుమార్ తెలిపాడు. దీంతో ఇద్దరూ కలిసి పాంగ్రా శివారులో మద్యం సేవించేందుకు వెళ్లారు. అక్కడ డబ్బులు ఇచ్చిన వసంత్కుమార్ బైక్ పేపర్లు ఇవ్వాలని తేజ్సింగ్ను అడగడంతో సరైన సమాధానం చెప్పలేదు. దీంతో అనుమానం వచ్చి దొంగిలించిన బైక్ను తాకట్టు పెడుతున్నావా? అని తన డబ్బులు తిరిగి ఇచ్చేయాలనడంతో తర్వాత ఇస్తానని తేజ్సింగ్ చెప్పాడు. దీంతో వసంత్కుమార్ బైక్ ఎక్కడ దొంగతనం చేశావు, పోలీసులకు చెప్తానని అన్నాడు. భయపడిన తేజ్సింగ్ పక్కనే ఉన్న బండరాళ్లతో తల, ముఖంపై దాడి చేయడంతో వసంత్కుమార్ అక్కడిక్కకడే మృతి చెందాడు. 10న గుర్తు తెలియని వ్యక్తి హత్యగా కేసు నమోదు చేసుకొని సీపీ సాయి చైతన్య ఆదేశాల మేరకు ఏసీపీ పర్యవేక్షణలో దర్యాప్తు ప్రారంభించారు. మృతుడు వసంత్కుమార్ అలియాస్ టిల్లుగా గుర్తించి విచారణ వేగవంతం చేసినట్లు తెలిపారు. గురువారం పాంగ్రా గ్రామ శివారులో దొంగిలించిన మోటార్ సైకిల్పై అనుమానాస్పదంగా తిరుగుతున్న తేజ్సింగ్ను పట్టుకున్నట్లు పేర్కొన్నారు. నిందితుడి నుంచి రెండు సెల్ఫోన్లు, హత్యకు ఉపయోగించిన బండరాయి, బైక్ తదితర వాటిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కేసు ఛేదించిన సీఐ శ్రీనివాస్రాజ్, నాల్గో టౌన్ ఎస్సై కే శ్రీకాంత్, సిబ్బందిని ఏసీపీ అభినందించారు. -
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
మోపాల్(నిజామాబాద్రూరల్): వానాకాలం ప్రారంభమైన నేపథ్యంలో గ్రామాల్లో సీజనల్ వ్యా ధుల పట్ల సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా మలేరియా అధికారి, డిప్యూటీ డీఎంహెచ్వో తుకా రాం రాథోడ్ సూచించారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు, వైద్యసిబ్బందితో తాగునీటి సరఫరా, ఇందిరమ్మ ఇళ్లు, వన మహోత్సవం, బడిబాట తదితర అంశాలపై ఎంపీడీవో రాములు నాయక్ అధ్యక్షతన గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తుకారాం రాథోడ్ మాట్లాడుతూ గ్రామాల్లో వర్షపు నీరు నిల్వ ఉండకుండా చూడాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేలా చూడాలని తెలిపారు. మురుగుకాల్వలు ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని, తాగునీటిని క్లోరినేషన్ చేయాలని సూచించారు. ఎంపీడీవో రాములు నాయక్ మాట్లాడుతూ మండలానికి 502 ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయని, 178 ఇళ్ల నిర్మాణం ప్రారంభమైందన్నారు. సమావేశంలో మెడికల్ ఆఫీసర్ ప్రత్యూష, ఎంపీవో కిరణ్కుమార్, ఎంఈవో గేమ్సింగ్, ఏపీవో సునీత, ఏఈలు అన్నపూర్ణ, వినయ్కుమార్, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. -
సమస్యల పరిష్కారానికే భూ భారతి
అదనపు కలెక్టర్ కిరణ్కుమార్ మోపాల్(నిజామాబాద్రూరల్): రైతుల భూ సమస్యలను పరిష్కరించేందుకే ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని అమలు చేస్తుందని అదనపు కలెక్టర్ కిరణ్కుమార్ పేర్కొన్నారు. మండలంలోని కంజర్ రైతువేదికలో గురువారం భూ భారతి రెవెన్యూ సదస్సు నిర్వహించారు. తహసీల్దార్ రామేశ్వర్ రైతుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ భూ సమస్యలు ఉన్న రైతులంతా సదస్సులో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 2014కు ముందు రాసుకున్న సాదాబైనామా, భూమి విస్తీర్ణం, పట్టాపాస్ పుస్తకంలో పేర్లు, విస్తీర్ణంలో తప్పులు, ఇతరత్రా సమస్యలన్నింటికీ భూభారతిలో పరిష్కారం దొరుకుతుందన్నారు. మండలంలో 1,342 దరఖాస్తులు వచ్చాయని తహసీల్దార్ రామేశ్వర్ అదనపు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించారు. అంతకుముందు నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్రకుమార్ దరఖాస్తులను పరిశీలించారు. వారి వెంట ఆర్ఐ రాజేశ్వర్, సిబ్బంది ఉన్నారు. -
మొరం కుప్పల చదును
నవీపేట: మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో వేసిన మొరం కుప్పలను గురువారం చదును చేశారు. ఆవరణలో వర్షపు నీరు నిలుస్తుండడంతో మొరం వేసి చదును చేయించాలని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. కానీ, మొరం కుప్పలను వేసిన అధికారులు వాటిని చదును చేయడంలో నిర్లక్ష్యం ప్రదర్శించారు. పాఠశాల పునఃప్రారంభం రోజే దర్శనమిచ్చిన వర్షపు నీరు...మొరం కుప్పల దుస్థితిపై ‘సాక్షి’లో ‘సారూ..బడికి ఎలా వెళ్లాలి’ శీర్షికన బుధవారం వార్త ప్రచురితమైంది. స్పందించిన అధికారులు గురువారం మొరం కుప్పలను బ్లేడ్ ట్రాక్టర్తో చదును చేయించారు. -
ఇక అన్ని రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్
డొంకేశ్వర్(ఆర్మూర్) : జిల్లాలోని అన్ని రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ అందుబాటులోకి రానుంది. అవసరమున్న ప్రాంతాల్లో వేగంగా టీవీ యూనిట్లను బిగిస్తున్నారు. మొన్నటి వరకు మండలానికి ఒకటి చొప్పున 31 రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం ఉండగా, ప్రస్తుతం మూడో విడతలో 49 రైతు వేదికల్లో కూడా ఈ సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. దీంతో జిల్లాలో మొత్తం 106 రైతు వైదికలకు గాను ఇప్పటి వరకు 80 వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ అందుబాటులోకి వచ్చింది. మిగతా రైతు వేదికల్లో కూడా ఈ సదుపాయం త్వరలో అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రభుత్వం ప్రతి మంగళవారం రైతులకు సాగులో సలహాలు, సూచనలు అందిస్తున్న విషయం తెలిసిందే. ఏఈవోలు, ఏవోలపై భారం నిరుపయోగంగా ఉన్న రైతు వేదికలను ఉపయోగంలోకి తేవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వీడియో కాన్ఫరెన్స్ యూనిట్లను ఏర్పాటు చేసింది. ఐతే, వీటి ని ర్వహణకు మాత్రం నిధులు ఇవ్వడం లేదు. జిల్లా లోని 106 రైతుల వేదికలకు రెండేళ్ల క్రితం రూ.9 వే ల చొప్పున ఐదు నెలలకు నిధులు ఇచ్చింది. అప్ప టి నుంచి మళ్లీ నిధులు ఇవ్వకపోవడంతో ఏఈవో లు, ఏవోలపై భారం పడుతోంది. ఇప్పుడు వీడి యో కాన్ఫరెన్స్ అందుబాటులోకి రావడంతో దాని నిర్వహణ, ఇంటర్నెట్ ఖర్చులు కూడా అదనం అ య్యాయి. టీజీ ఫైబర్ ఇంటర్నెట్ సేవలు లేకపోవడంతో వ్యవసాయాధికారులు తమ ఫోన్ల వైఫై ద్వారా వీడియో కాన్ఫరెన్స్లను నడిపిస్తున్నారు. ఇప్పటి వరకు 80 ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన అధికారులు నిర్వహణకు నిధులు మాత్రం ఇవ్వని సర్కారునిధులు కోరుతాం.. అన్ని రైతు వేదికల్లో వీడి యో కాన్ఫరెన్స్ సౌకర్యం క ల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇ ది రైతులకు ఎంతో ఉపయోగకరం. అలాగే రైతు వేదికల నిర్వహణకు నిధులు రావడం లేదనే విషయం వాస్తవమే. నిధుల అవసరాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మంజూరయ్యేలా చూస్తాం. – వీరాస్వామి, జిల్లా వ్యవసాయాధికారి -
ఇఫ్కో ద్వారా నాణ్యమైన ఎరువులు
మోర్తాడ్: ఇఫ్కో ద్వారా రైతులకు నాణ్యమైన ఎరువులు అందుబాటులో ఉంటున్నాయని ఆ సంస్థ జాతీయ డైరెక్టర్, మార్క్ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి అన్నారు. మోర్తాడ్లో గురువారం ఇఫ్కో బజార్ను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సంస్థ తెలంగాణ సేల్స్ మేనేజర్ కృపా శంకర్, తెలుగు రాష్ట్రాల రీజినల్ మేనేజర్ పొన్నం రాజు, డీసీసీబీ డైరెక్టర్ మోత్కు భూమన్న, సంస్థ ఫీల్డు మేనేజర్ శివరామకృష్ణ, మోర్తాడ్, కమ్మర్పల్లి సహకార సంఘాల చైర్మన్లు బద్దం అశోక్, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు. -
బాల కార్మిక వ్యవస్థ నిర్మూలిద్దాం
నిజామాబాద్ లీగల్ : జిల్లాలో బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించి, బాల బాలికలకు మంచి భవిష్యత్తును అందిద్దామని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఉదయ భాస్కర్ రావు అన్నారు. ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినం సందర్భంగా బాలల హక్కుల పరిరక్షణ–మహిళ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చంద్రశేఖర్ కాలనీలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. బాల బాలికలను కార్మికులుగా మార్చకుండా వారికి మంచి విద్యను అందించి, ఉజ్వల భవిష్యత్తును కల్పించాలన్నారు. జిల్లా సంక్షేమ అధికారి రసూల్ బి మాట్లాడుతూ బాలల హక్కులను ప్రతి ఒక్కరూ కాపాడాలని అన్నారు. కార్మిక శాఖ అధికారి యోహాను మాట్లాడుతూ బాలబాలికలతో పనిచేయిస్తే వారికి కఠిన శిక్షలు ఉంటాయని తెలిపారు. ఈ సందర్భంగా అంగన్వాడీలో బాలబాలికలకు అక్షరాభ్యాసం చేయించారు. డీసీపీవో చైతన్య, సీడీపీవో స్వర్ణలత, సూపర్వైజర్లు ప్రియదర్శిని, శ్రీ ప్రియ, అంగన్వాడి టీచర్లు పాల్గొన్నారు.● జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఉదయ భాస్కర్ రావు -
జిల్లా ఇన్చార్జి మంత్రిగా సీతక్క
నిజామాబాద్అర్బన్ : జిల్లా ఇన్చార్జి మంత్రి గా రాష్ట్ర పంచాయతీరాజ్, సీ్త్ర శిశు సంక్షేమ, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంతకుముందు ఇన్చార్జి మంత్రిగా పనిచేసిన జూపల్లి కష్ణారావు అదిలాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రిగా నియామకమయ్యారు. ఆదిలాబాద్ ఇన్చార్జి మంత్రిగా కొనసాగిన సీతక్క ఇక్కడికి వస్తున్నారు. ఇదిలా ఉండగా ఇప్పటి వరకు జిల్లాకు మంత్రి పదవి దక్కకపోగా, ఇన్చార్జి మంత్రిగా సీతక్క రావడంపై రాజకీయ వర్గాల్లో చర్చజరుగుతోంది. ఆర్టీసీ కాలనీలో పిడుగుపాటుమాక్లూర్: మండలంలోని మానిక్భండార్ శి వారు ఆర్టీసీ కాలనీలో గురువారం ఉద యం చిట్యాల జనార్దన్ ఇంటిపై పిడుగుపడింది. ఇంటి పైకప్పు స్వల్పంగా ధ్వంసమైంది. ఇంట్లోని ఫ్యాన్లు, ఫ్రిజ్, టీవీ కూడా పనిచేయటం లేదని జనార్దన్ తెలిపారు. స్కూల్ బస్సుల తనిఖీ ఖలీల్వాడి : నగరంలోని వినాయక్ నగర్లో రవాణా శాఖ అధికారులు స్కూల్ బస్సుల తనిఖీలు నిర్వహించారు. డిప్యూటీ రవాణా శాఖ కమిషనర్ దుర్గా ప్రమీల ఆధ్వర్యంలో ప్రైవేట్ స్కూల్ బస్సులను ఆపి, బస్సులో లోపలి భాగంలో నిబంధనల మేరకు అన్నీ సక్రమంగా ఉన్నాయో? లేదో? పరిశీలించారు. ఫిట్నెస్ పత్రాలు లేని ఓ స్కూల్ బస్సుపై కేసు నమోదు చేశారు. నిబంధనల మేరకు లేని బస్సులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. తనిఖీల్లో ఇన్చార్జి డీటీవో రాహుల్, ఎంవీఐ కిరణ్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. ఎస్సారెస్పీలోకి 2,080 క్యూసెక్కుల వరద బాల్కొండ: స్థానిక ఎగువ ప్రాంతాల్లో కురిసి న వర్షాలతో శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లోకి 2,080 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్ట్ నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ప్రాజెక్ట్ నుంచి కాకతీయ కాలువ ద్వారా 100, మిషన్ భగీరథ ద్వారా 231, ఆవిరి రూపంలో 321 క్యూసెక్కుల నీరు పోతుంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091 (80.5 టీఎంసీలు) అడుగులు కాగా గురువా రం సాయంత్రానికి ప్రాజెక్ట్లో 1062.8 (13.36 టీఎంసీలు) అడుగుల నీరు నిల్వ ఉందని ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు. నిజాంసాగర్లోకి స్వల్ప ఇన్ఫ్లో నిజాంసాగర్(జుక్కల్): ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండడంతో నిజాంసాగర్ ప్రాజెక్టులోకి 590 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1405 అడుగులు (17.8 టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 1393.5 అడుగుల (5.9 టీఎంసీలు) నీరు నిల్వ ఉందన్నారు. సాయుధ దళాల నిధికి రూ.లక్ష విరాళం సుభాష్నగర్: దేశ రక్షణ కోసం తమ జీవితాలను త్యాగం చేస్తున్న భారత త్రివిధ దళాల సేవలు మరువలేనివని, వారి సంక్షేమానికి పౌరునిగా చేయూతనందిస్తూ సాయుధ దళాల పతాక నిధికి విద్యుత్ శాఖ రిటైర్డ్ ఉద్యోగి, కామారెడ్డికి చెందిన కే కృష్ణమూర్తి రూ.లక్ష విరాళం ప్రకటించారు. ఈ మేరకు నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల ప్రాంతీయ సైనిక సంక్షేమ అధికారి డీ రమేశ్కు ఆయన గురువారం చెక్కు అందజేశారు. ఈ సందర్భంగా కృష్ణమూర్తి శర్మ దంపతులను శాలువాతో సత్కరించి అభినందించారు. అనంతరం అధికారి రమేశ్ మాట్లాడుతూ కృష్ణమూర్తి శర్మను స్ఫూర్తిగా తీసుకొని ఉమ్మడి జిల్లాలోని వ్యాపారులు, ప్రజలు దేశ రక్షణలో విధులు నిర్వహిస్తున్న సైనికులు, వారి కుటుంబాలకు స్వచ్ఛందంగా విరాళాలు అందించి చేయూతనందించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ప్రాంతీయ సైనిక సంక్షేమ కార్యాలయ సిబ్బంది బదాం గంగామోహన్, ఉమేర్ తదితరులు పాల్గొన్నారు. -
జిల్లా కలెక్టర్గా వినయ్ కృష్ణారెడ్డి
నిజామాబాద్అర్బన్ : జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు బదిలీ అయ్యారు. నూతన కలెక్టర్గా టీ వినయ్ కృష్ణారెడ్డి జిల్లాకు వస్తున్నారు. ఈ మేర కు బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. 2013 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన వినయ్ కృష్ణారెడ్డి ప్రస్తుతం ఆర్, ఆర్ అండ్ ఎల్ఏ, ఐక్యాడ్ కమిషనర్గా పనిచేస్తున్నారు. గతంలో సూర్యపేట కలెక్టర్గా, నీటిపారుదల కమాండ్ ఏరియా అభివృద్ధి శాఖ కమిషనర్గా చేశారు. రాజీ వ్ గాంధీ హనుమంతు స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, రెవెన్యూ శాఖ స్పెషల్ సెక్రెటరీగా వెళ్తున్నారు. అలాగే ఆయనకు రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్, భూభారతి కమిషనర్గా అదనపు బాధ్యతలు కూడా అప్పగించారు. రా జీవ్ గాంధీ హనుమంతు 2023 ఫిబ్రవరి 1న జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు. ఈయన హయాంలో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు జరిగాయి. రెండు ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించారని పేరొచ్చింది. ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్రంలోనే జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. రెవెన్యూ స్పెషల్ సెక్రెటరీగా రాజీవ్ గాంధీ హనుమంతు బదిలీ -
పదవులు దక్కని సీనియర్లెవరు?
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : అధికార కాంగ్రెస్ పార్టీలో నామినేటెడ్ పదవుల కోసం జిల్లాకు చెందిన పలువురు సీనియర్లు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు డీసీసీ అధ్యక్ష పీఠం కోసం, బ్లాక్, మండల అధ్యక్ష పదవుల కోసం పలువురు నాయకులు పోటీ పడుతున్నారు. అయితే కీలకమైన స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు సైతం పలువురు ఆశావహులు ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేసుకుంటున్నారు. రిజర్వేషన్లు ఎలా వస్తాయనే విషయమై లెక్కలేసుకుంటూ ఎదురు చూస్తున్నారు. అయితే జిల్లా అధ్యక్ష పీఠం కోసం, మండల అధ్యక్ష పదవుల కోసం దరఖాస్తులు చేసుకునేవారు ఎక్కువగా ఉన్నారు. దీంతో పార్టీ కోసం కష్టపడినవారికి ఎక్కువ అవకాశాలు కల్పించేందుకు గాను పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ కసరత్తు చేస్తున్నారు. మీనాక్షి నటరాజన్ క్షేత్రస్థాయి నుంచి పార్టీ నిర్మాణాన్ని పకడ్బందీగా చేసే లక్ష్యంతో ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇందుకు అనుగుణంగానే పార్టీ పదవులు, స్థానిక సంస్థల ఎన్నికల్లో బరిలోకి దించేందుకు అవకాశాలు కల్పించేందుకు ఆమె కృషి చేస్తున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెప్పించుకుంటున్న మీనాక్షి నటరాజన్ పార్టీ పదవులతో పాటు స్థానిక సంస్థల పదవుల్లో ప్రాధాన్యత ఇచ్చేందుకు ప్రణాళిక ఎమ్మెల్యేలు, కీలక నాయకులతో విడివిడిగా చర్చించిన రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి ఆశావహుల్లో ఉత్కంఠ -
నిజామాబాద్
శుక్రవారం శ్రీ 13 శ్రీ జూన్ శ్రీ 2025– 8లో uనగరంలోని ఓ హోటల్ వద్ద ఆటో డ్రైవర్ను ఓ రౌడీషీటర్తోపాటు అనుచరులు బెదిరింపులకు పాల్పడ్డారు. కాగా, దాడి చేసిన వ్యక్తులపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు బాధితుడు భయపడ్డాడు. దీంతో సీపీ ఆదేశాల మేరకు పోలీసులు ఎంట్రీ ఇచ్చి సదరు రౌడీషీటర్తోపాటు అనుచరులపై కేసులు నమోదు చేశారు.జిల్లా కేంద్రంలో కొన్ని ప్రాంతాలు రౌడీ షీటర్లకు అడ్డాగా మారాయి. అమాయక ప్రజలను బెదిరించడం, దాడులు చేసిన ఘటనలు ఉన్నాయి. గ్యాంగ్ల మధ్య పోటీ పెరిగి ఇరువర్గాలు కత్తులు దూసుకోవడం, ఒకరినొకరు చంపుకోవడం మామూలుగా మారింది. రౌడీ షీటర్లపై సీపీ పోతరాజు సాయి చైతన్య దృష్టి సారించారు. వారు తీరుమార్చుకుంటే రౌడీషీట్ తొలగిస్తామ ని, లేకుంటే పీడీయాక్ట్ ప్రయోగిస్తామని హెచ్చరిస్తున్నారు. ఖలీల్వాడి : జిల్లాలోని రౌడీషీటర్ల ఆగడాలపై పోలీస్ బాస్ నిఘా పెంచారు. రౌడీలుగా చలామణి అవుతున్న వారి కార్యకలాపాలపై నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పోతరాజు సాయిచైతన్య ప్రత్యేక దృష్టి సారించారు. తమకు తాముగా మారితే రౌడీషీట్ తొలగిస్తామని, లేకుంటే పీడీయాక్ట్ ప్రయోగిస్తామని హెచ్చరిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 355 మంది రౌడీషీటర్లు ఉండగా, అందులో 240 మంది వరకు నగరంలోనే ఉన్నారు. ఇల్లీగల్ దందాను అడ్డుపెట్టుకొని రౌడీషీటర్లు అమాయక ప్రజలను బెదిరించడం, దాడులు చేసిన ఘటనలు ఉన్నాయి. గతంలో రౌడీషీటర్ల మధ్య ఆధిపత్య పోరుతో ఇబ్రహీం ఛావూస్ అలియాస్ జంగిల్ ఇబ్బు, ఆరిఫ్డాన్ హత్యకు గురైన విషయం తెలిసిందే. దీంతో రౌడీ షీటర్ల ఆటకట్టించేందుకు సీపీ ప్రత్యేకంగా సీసీఎస్, టాస్క్ఫోర్స్ పోలీసులను రంగంలోకి దించారు. ఆయా పోలీస్స్టేషన్ల పరిధిలోని నిఘా వర్గాల ద్వారా రౌడీషీటర్లు చేస్తున్న పనులపై ఆరా తీస్తున్నారు. ప్రత్యేక బృందాలు ఏర్పాటు.. రౌడీ షీటర్ల ఆటకట్టించేందుకు సీపీ సాయి చైతన్య ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. అక్రమ దందాలు నిర్వహించే, రౌడీ షీటర్ల ప్రభావం ఉండే ప్రాంతాలపై దృష్టి సారించి సామాన్యులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. అమాయక ప్రజలపై బెదిరింపులు, దాడులకు పాల్పడితే శిక్షలు కఠినంగా ఉంటాయని ఇప్పటికే పలువురు రౌడీ షీటర్లకు హెచ్చరికలు పంపారు. రౌడీ షీటర్లు ఎవరినైనా బెదిరించినా, భయపెట్టినా స్థానిక పోలీసులకు లేదా డ యల్ 100కు సమాచారం అందించాలని పోలీసు లు సూచిస్తున్నారు.న్యూస్రీల్ఆ ప్రాంతాల్లోనే అక్రమ దందాలునగరంలోని మాలపల్లి, ఆటోనగర్, సారంగా పూర్, నెహ్రూనగర్, బాబాన్సాహెబ్ పహాడ్, బోధన్ రోడ్డు, నాగారం ప్రాంతంలో అక్రమ దందా జోరుగా సాగుతోంది. ఇక్కడ బిహార్, పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర తదితర ప్రాంతా లకు చెందినవారు ఎక్కువగా ఉంటారు. గంజా యి, మట్కా, భూ మాఫియా, మామూళ్ల వసూ ళ్ల ఎక్కువగా జరుగుతాయి. వ్యాపారంలో పోటీ పెరగడంతో ఇరువర్గాల మధ్య కత్తులతో దాడు లు కొనసాగుతున్నాయి. రౌడీషీటర్లు ఎక్కువగా ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి వాటిని రూ.70 వేల నుంచి రూ. 2 లక్షల వరకు అమ్మకాలు సాగిస్తున్నారు. ప్లాట్లు కొనుగోలు చేసి అందు బాటులో లేని వారి స్థలాలను ఆక్రమించి ఇతరులకు విక్రయించేస్తున్నారు. దీంతో అసలు యజమానులు వచ్చేసరికి ఇంటి స్థలంలో నిర్మాణాలు కనిపిస్తున్నాయి. ఇదేమిటని ప్రశ్నిస్తే రౌడీషీటర్ల అనుచరులు దాడులు చేయడంతోపాటు కత్తులు చూపించి బెదిరింపులకు పాల్పడిన ఘటనలూ ఉన్నాయి. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు జంకే పరిస్థితి ఏర్పడింది. నగరంలో 240 మంది, ఇతర ప్రాంతాల్లో 115 మందిపై రౌడీ షీట్ అక్రమ దందాల అడ్డుకట్టకు సీపీ పోతరాజు సాయిచైతన్య దృష్టి రంగంలోకి సీసీఎస్, టాస్క్ఫోర్స్ బృందాలు అమాయకులను బెదిరిస్తే శిక్షలు కఠినంగా ఉంటాయని హెచ్చరికలు -
యూరియా అవసరం మేరకే వాడాలి
● డీఏవో వీరస్వామి మోపాల్(నిజామాబాద్రూరల్): రైతాంగం అవసరం మేరకే యూరియా వాడాలని జిల్లా వ్యవసాయ అధికారి (డీఏవో) వీరస్వామి పే ర్కొన్నారు. మోపాల్ సొసైటీలో యూరియా నిల్వలు, యూరియా పంపిణీ చేసేవిధానం, తదితర అంశాలను గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా వీరస్వామి మా ట్లాడుతూ జిల్లాలో ఖరీఫ్ సీజన్లో 5.35 లక్ష ల ఎకరాల్లో వరి సాగవుతుందని అంచనా వే శామన్నారు. వర్ని, మోస్రా, చందూర్, బోధ న్ సహా పలు మండలాల్లో వరినాట్లు ప్రారంభమైనట్లు తెలిపారు. రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉందని, ఎక్కడ కూడా కొరత లేదని పేర్కొన్నారు. యూరి యా కొరతపై దుష్ప్రచారాలను నమ్మొద్దని, రైతులు యూరియా నిల్వలు పెట్టుకొని కృత్రిమ కొరతను సృష్టించొద్దని సూచించారు. జిల్లాలో అధికంగా యూరియా వినియోగిస్తున్నారని, దీంతో పంట తెగుళ్ల బారినపడే అ వకాశముందని పేర్కొన్నారు. ఆయన వెంట ఏవో సౌమ్య, సొసైటీ సీఈవో సాయిచంద్ తదితరులు ఉన్నారు. -
క్రైం కార్నర్
కరెంట్ షాక్తో బాలుడి మృతి బాన్సువాడ రూరల్: మండలంలోని ఇబ్రహీంపేట్ గ్రామంలో ఓ బాలుడు కరెంట్ షాక్తో మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. ఇబ్రాహీంపేట్ గ్రామం గంగపుత్ర కాలనీకి చెందిన దుబాయ్ సాయిలుకు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు గోవర్ధన్(13), భార్య గంగవ్వ ఉన్నారు. ఇద్దరు కూతుళ్లకు పెళ్లిళ్లు జరుగగా, సాయిలు ఉపాధి నిమిత్తం మలేషియా వెళ్లాడు. ఇంటివద్ద భార్య గంగవ్వ, కుమారుడు గోవర్ధన్ ఉంటున్నారు. ఇటీవల కురిసిన వర్షాలు, ఈదురుగాలులకు వారి పెంకుటిళ్లు ముందర వేసిన రేకుల షెడ్డు ఇనుప పైప్కు విద్యుత్ వైర్లు తగిలి కరెంట్ సరఫరా అయ్యింది. దీన్ని గమనించని గోవర్ధన్ బుధవారం బయట ఆడుకుంటున్న సమయంలో ఇనుపపైప్కు తాకడంతో కరెంట్షాక్తో విగతజీవిగా మారాడు. కుటుంబసభ్యులు వెంటనే అతడిని బాన్సువాడ ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి తల్లి గంగవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మలేషియాలో ఉన్న తండ్రి సాయిలుకు ఫోన్లో సమాచారం అందించగా,కుమారుడి కడచూపుకు వస్తాన ని చెప్పడంతో అంత్యక్రియలు నిర్వహించలేదు. విద్యార్థి మృతిపట్ల ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి, రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మోపాల్ మండలంలో.. మోపాల్: మండలంలోని న్యాల్కల్లో ఓ బాలుడు కరెంట్షాక్తో మృతిచెందాడు. గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన రాజు–మమత దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడైన శ్రీ వర్షిత్ (9) నగరంలోని ఓ పాఠశాలలో 4వ తరగతి చదువుతున్నాడు. బుధవారం వారి ఇంటి వద్ద ఆడుకుంటున్న శ్రీ వర్షిత్కు తెగిపడ్డ బోరు మోటారు సర్వీస్ వైరు తగిలి విద్యుత్షాక్తో అక్కడికక్కడే మృతిచెందాడు. -
తగ్గుతున్న ప్రవేశాలు
సర్కారు బడుల్లోనిజామాబాద్అర్బన్: ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి ఏటా విద్యార్థుల ప్రవేశాలు తగ్గిపోతున్నాయి. ప్రతి ఏడాది బడిబాట కార్యక్రమం నిర్వహించినా ప్రవేశాలు మాత్రం నామమాత్రంగానే కొనసాగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా విచ్చలవిడిగా ప్రైవేట్ పాఠశాలలు నెలకొల్పడం వల్ల ప్రభుత్వ పాఠశాలలకు ఇబ్బందికరంగా మారింది. వీటితో పాటు గురుకుల పాఠశాలలు కూడా మెరుగైన స్థితిలో ఉండడంతో ఇక్కడ ప్రవేశాలు పెరుగుతున్నాయి. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుతు వస్తోంది. 38 పాఠశాలలు మూత గత నాలుగేళ్లుగా విద్యార్థుల ప్రవేశాల సంఖ్య తగ్గుతుండడంతో 38 ప్రాథమిక పాఠశాలలు విద్యార్థులు లేక మూతపడ్డాయి. ప్రస్తుతం ఈ మూతపడిన పాఠశాలల ప్రాంతంలో బడిబాట కార్యక్రమం నిర్వహించి మళ్లీ వాటిని కొనసాగించేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఒక బడికి కిలోమీటర్ లోపు మరో పాఠశాల ఉండి విద్యార్థుల సంఖ్య అతితక్కువగా ఉంటే సమీప పాఠశాలకు బదలాయింపు చేస్తున్నారు. ఒక కిలోమీటర్కు మించి దూరంలో ఉంటే అదే ప్రాంతంలో కొనసాగేలా చర్యలు తీసుకుంటున్నారు. 28 పాఠశాలల్లోనే బడిబాట.. ప్రతి ఏటా పాఠశాలల పున:ప్రారంభ సమయంలో విద్యాశాఖ బడిబాట కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ ఏడాది ఈనెల 6 నుంచి బడిబాట కార్యక్రమం ప్రారంభించగా 11వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా కేవలం 28 పాఠశాలలు మాత్రమే ఈ కార్యక్రమం నిర్వహించాయి. ఇందులో 280 మంది విద్యార్థులను నూతనంగా చేర్పించారు. మిగిత పాఠశాలలు ఈ కార్యక్రమంపై నిర్లక్ష్యం చేశాయి. ఈనెల 19 వరకు బడిబాట కార్యక్రమం కొనసాగనుండగా ప్రధానంగా దృష్టిసారిస్తామని విద్యాశాఖ అధికారులు పేర్కొంటున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో 2021–22 విద్యాసంవత్సరం, 2022–23 విద్యాసంవత్సరంలో లోకల్ బాడీ పాఠశాలలకు సంబంధించి 157 మంది విద్యార్థులు తగ్గిపోయారు. 2023–24, 2024–25 విద్యాసంవత్సరంలో మధ్య కాలంలో 261 మంది విద్యార్థులు తగ్గిపోయారు. రాష్ట్ర పరిధిలోని ఐదు ప్రాథమిక పాఠశాలలు ఉండగా 2021–22 , 2022–23 విద్యాసంవత్సరంలో 71మంది విద్యార్థులు తగ్గిపోయారు. 2023–24,2024–25 విద్యాసంవత్సరంలో 21 మంది విద్యార్థులు తగ్గిపోయారు. ‘ప్రయివేటు’ జోరు.. జిల్లా వ్యాప్తంగా 477 ప్రయివేట్ పాఠశాలలు ఉండగా ఇందులో ప్రతి ఏటా ప్రవేశాలు పెరుగుతూ వస్తున్నాయి. 2021–22 విద్యాసంవత్సరంలో 1,19,271 మంది విద్యార్థులు ఉన్నారు. 2022–23లో 1,35,549 మంది విద్యార్థులు. 2023–24లో 1,53,016 మంది విద్యార్థులు. 2024–25లో 1,66,424 మంది విద్యార్థులు నమోదయ్యారు. మరోవైపు పాఠశాలల్లో ఎల్కేజీ స్థాయిలోనే రూ.వేలల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు. ప్రత్యేక విద్యాబోధన పేరిట అదనపు ఫీజులు వసూలు చేస్తున్నారు. వీటితోపాటు పుస్తకాలు, వివిధ వస్తువుల విక్రయాలు చేపడుతున్నారు. అయినా తల్లిదండ్రులు విద్యార్థుల భవిష్యత్ కోసం ప్రయివేట్ బడులనే ఆశ్రయిస్తున్నారు. ప్రభుత్వ బడుల్లో అడ్మిషన్ల వివరాలు మేనేజ్మెంట్ స్కూళ్లు 2021–22 2022–23 2023–24 2024–25 ప్రభుత్వ పాఠశాలలు 112 14,914 14,757 14,106 13,845 ప్రభుత్వ పాఠశాల (రాష్ట్ర పరిధి) 5 211 140 119 98 ఎంపీపీ, జెడ్పీ పాఠశాలలు 1039 99,152 86,391 75,539 70,119 నామమాత్రంగానే కొనసాగుతున్న బడిబాట నేడు పాఠశాలల పున:ప్రారంభం మెరుగైన విద్యాబోధన అందిస్తాం.. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యాబోధన అందిస్తాం. ప్రతి పాఠశాలపై ప్రత్యేక దృష్టిసారిస్తున్నాం. బడుల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం. టీచర్లకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాం. –అశోక్, డీఈవో, నిజామాబాద్ -
వివాహేతర సంబంధమే కారణం
కామారెడ్డి క్రైం: ఇటీవల హత్యకు గురైన చిన్నకొడప్గల్ జీపీ కార్యదర్శి దరావత్ కృష్ణ కేసును పోలీసులు ఛేదించారు. హత్యకు వివాహేతర సంబంధమే కారణమని తేల్చారు. ఈమేరకు బుధవారం జిల్లాకేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ రాజేశ్చంద్ర వివరాలు వెల్లడించారు. పిట్లం మండలం రూమ్ తండాకు చెందిన దరావత్ కృష్ణ (28) చిన్న కొడప్గల్ పంచాయతీ కార్యదర్శిగా పని చేస్తుండేవాడు. చిన్నకొడప్గల్కు చెందిన లింగంపేట మల్కయ్య అలియాస్ మల్కన్న ఉపాధి నిమిత్తం హైదరాబాద్ వెళ్లి ఇటీవల ఇంటికి వచ్చాడు. తన భార్య సుజాతకు పంచాయతీ కార్యదర్శి కృష్ణతో వివాహేతర సంబంధం ఏర్పడిందని గుర్తించాడు. ఈ విషయంలో భార్యతో తరచుగా గొడవపడేవాడు.చివరికి తమ సంసారం చక్కబెట్టుకోవాలని భార్యాభర్తలు నిర్ణయించుకొని, కృష్ణను చంపాలనుకున్నారు. ఇందుకోసం తమ కులస్తులైన ఏరనోళ్ల బాల్రాజ్, మల్కయ్యల సహాయం తీసుకున్నారు. ఈనెల 5న సుజాత ద్వారా కృష్ణను ఇంటికి పిలిపించుకుని నలుగురూ కలిసి కత్తి, గొడ్డలి ఇనుపరాడ్డులతో కొట్టి చంపారు. ఆపై మృతదేహాన్ని, కృష్ణ బైక్ను సమీపంలోని రెడ్డి చెరువులో పడవేశారు. 7న గాయాలతో కూడిన కృష్ణ మృతదేహాన్ని రెడ్డి చెరువులో పోలీసులు గుర్తించారు. విచారణ చేపట్టి నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించినట్లు ఎస్పీ తెలిపారు. వారిని రిమాండ్కు తరలిస్తున్నామని వెల్లడించారు. హత్య కేసును చేధించిన బాన్సువాడ డీఎస్పీ విఠల్ రెడ్డి, రూరల్ సీఐ రాజేష్, పిట్లం ఎస్సై రాజును ఆయన అభినందించారు. చిన్నకొడప్గల్ జీపీ కార్యదర్శి హత్య కేసును ఛేదించిన పోలీసులు నలుగురు నిందితుల అరెస్ట్ వివరాలు వెల్లడించిన ఎస్పీ రాజేశ్ చంద్ర -
‘కాళేశ్వరం’ అక్రమాలపై సీబీఐతో విచారణ చేయించాలి
సుభాష్నగర్: రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకటేనని, ఈ ప్రభుత్వానికి దమ్ముంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ అక్రమాలపై సీబీఐతో విచారణ చేయించాలని బీజే పీ శాసనసభా పక్ష ఉపనేత, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ డిమాండ్ చేశారు. కేంద్రంలో నరేంద్ర మోదీ పాలన 11ఏళ్లు పూర్తయిన సందర్భంగా నగరంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో బుధవారం ఫొటో ఎగ్జిబిషన్, వివిధ రంగాల నిపుణులతో చర్చాగోష్టి కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు. కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులపాల్జేసిందని, అవినీతి, అక్రమాలకు పాల్పడిందని, ఆ పార్టీకి భవిష్యత్ లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు రూ.10.56లక్షల కోట్లు పదేళ్లలో ఇచ్చిందని, కేంద్ర నిధులతోనే గ్రామాల్లో, పట్టణాల్లో అనేక అభివృద్ధి పనులు చేపట్టారని గుర్తుచేశారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన నిధులు లేకుండా తెలంగాణలో ఒక్క ఇందిరమ్మ ఇళ్లయినా నిర్మిస్తున్నారా అని ప్రశ్నించారు. నాయకులు మురళీధర్గౌడ్, న్యాలం రాజు, లక్ష్మీనారాయణ, నాగోళ్ల లక్ష్మీనారాయణ, ఇప్పకాయల కిషోర్, నాగరాజు, ఆనంద్రావు, తారక్ వేణు, మాస్టర్ శంకర్, సందీప్, నారాయణ యాదవ్, పడాల భూపతి, చిరంజీవి, విజయ్ కృష్ణ, హరీష్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
బైక్ల చోరీ కేసులో నిందితుల అరెస్టు
ఖలీల్వాడి: బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరిని అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించినట్లు ఏసీపీ రాజావెంకట్రెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఏసీపీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఏసీపీ రాజావెంకట్రెడ్డి, టా స్క్ఫోర్స్ ఏసీపీ నాగేంద్రచారి వివరాలు వెల్లడించారు. నగరంలోని ఒకటో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం ఉదయం పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన ఇద్దరిని పట్టుకున్నారు. వారిని విచారించగా బైక్లను దొంగతనాలు చేసినట్లు తెలిపారు. నిందితులు బోధన్ పట్టణానికి చెందిన మాలోత్ రమేష్, కటం రవిగా గుర్తించారు. నిందితులు బాసర్ రైల్వేస్టేషన్లో ఒక బైక్, తిర్మన్పల్లి గ్రామంలో ఒక బైక్, వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో ఒకటి, నిజామాబాద్ పట్టణంలో మూడు బైకులను చోరీ చే సినట్లు ఒప్పుకున్నారు. వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు గతంలో బైక్ చోరీ కేసులో జైలుకు వెళ్లివచ్చినట్లు తెలిపారు. వారిపై కే సు నమోదు చేసి జైలుకు తరలించినట్లు తెలిపా రు.ఎస్హెచ్వో రఘుపతి,తదితరులు పాల్గొన్నారు. పేకాడుతున్న 10మంది.. ఖలీల్వాడి: నగరంలోని గౌతమ్నగర్లో విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు పేకాట స్థావరంపై దాడి చేశారు. పేకాడుతున్న 10 మందిని అరెస్ట్ చేశారు. 8సెల్ఫోన్లు, రూ. 5660 స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై హరిబాబు తెలిపారు. రౌడీషీటర్ గ్యాంగ్ సభ్యుడు.. ఖలీల్వాడి: నగరంలోని ఒకటో టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలోని ఓ హోటల్ వద్ద ఆటో డ్రైవర్ను బెదిరింపులకు పాల్పడిన కేసులో రౌడీషీటర్ బర్సాత్ ఆమీర్ అనుచరుడు ఇర్ఫాన్ను అరెస్ట్ చేసినట్లు ఎస్హెచ్వో రఘుపతి బుధవారం తెలిపారు. ఇర్ఫాన్ నుంచి ఒక తల్వార్, రెండు కత్తులు, రెండు పంచ్లు, 50 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. బర్సాత్ అమీర్తోపాటు మరో 10 మంది పరారీలో ఉన్నట్లు తెలిపారు. ఇర్ఫాన్ను రిమాండ్కు తరలించినట్లు చెప్పారు. -
60 వసంతాల ఆర్మూర్ మార్కెట్ యార్డు
మీకు తెలుసా? ఆర్మూర్: ఆర్మూర్ ప్రాంతంలోని రైతాంగం పండించిన పంటను అమ్ముకోవడానికి అనువుగా ఆర్మూర్ పట్టణంలో 1965 జూలై 6న వ్యవసాయ మార్కెట్ యార్డును నెలకొల్పారు. ● రైతులు తమ పంటల విక్రయాలు నిర్వహించుకోవడానికి 11.07 ఎకరాల సువిశాలమైన స్థలంలో యార్డును ఏర్పాటు చేశారు. ● ఆర్మూర్ మార్కెట్ యార్డు స్థాపించిన సమయంలో ఆర్మూర్, బాల్కొండ, వేల్పూర్, భీమ్గల్, మోర్తాడ్, కమ్మర్పల్లి, సిరికొండ, జక్రాన్పల్లి మండలాలు ఈ యార్డు పరిఽధిలో ఉండేవి. ● ప్రస్తుతం ఆర్మూర్ నియోజకవర్గం పరిధిలోని ఆర్మూర్ మండలం, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం పరిధిలోని జక్రాన్పల్లి మండలం మాత్రమే ఉన్నాయి. ● ఏఎంసీ పరిధిలో వెయ్యి మెట్రిక్ టన్నుల గోదాం, 600 మెట్రిక్ టన్నుల గోదాం, 200 మెట్రిక్ టన్నుల గోదాములు ఉన్నాయి. వెయ్యి మెట్రిక్ టన్నుల గోదామును సివిల్ సప్లై వారికి అద్దెకు కేటాయించారు. మిగిలిన రెండు గోదాములు ఐడీసీఎంఎస్ వారు అద్దెకు తీసుకున్నారు. -
సారూ.. బడిలోకి ఎలా వెళ్లాలి?
నవీపేట: వేసవి సెలవుల అనంతరం నేడు బడులు తెరుచుకోనున్నాయి. ఈక్రమంలో సర్కార్ బడుల్లో ప్రవేశాల సంఖ్యను పెంచడానికి, విద్యార్థులను ఆకర్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. కొత్త విద్యార్థులకు హంగుఆర్భాటాలతో స్వాగతం పలికేందుకు పాఠశాలలను ఉపాధ్యాయులు ముస్తాబు చేస్తున్నారు. కానీ మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాల మాత్రం విద్యార్థులు లోనికి రాకుండా మొరం కుప్పలు, వర్షపు నీటితో అధ్వానంగా మారింది. బడిబాటలో భాగంగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేసిన ఉపాధ్యాయు లు ఇంటింటికీ తిరిగి పాఠశాల గొప్పతనాన్ని వివరించారు. ప్రవేశాల సంఖ్య పెంచడానికి కృషి చేశా రు. కానీ బడుల పున:ప్రారంభం రోజే బడి ఆవర ణ ఇలా వర్షపు నీరు, మొరం కుప్పలతో నిండి ఉండడంతో పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల అలసత్వం.. ఇటీవల నవీపేటకు వచ్చిన ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి దృష్టికి బడి సమస్యను తీసుకెళ్లగా స్పందించారు. మొరం భర్తీకి నిధులు మంజూరు చేస్తానని హామీ ఇవ్వడంతో అధికారులు ముందుకువచ్చారు. కానీ వారు ఆలస్యంగా పనులు ప్రారంభించడంతో కొద్దిమేర మొరం కుప్పలను వేశారు. కుప్పలను చదును చేసేందుకు వీలున్నా అధికారులు అటువైపు వెళ్లలేదు. దీంతో బడి ఆవరణలో మొరం కుప్పలు అలాగే ఉండిపోయాయి. అధ్వానంగా మారిన నవీపేట జెడ్పీ బాలుర పాఠశాల ఆవరణ మొరం కుప్పలు, వర్షపు నీటితో బడిలోకి వెళ్లలేని పరిస్థితి -
సరికొత్త హంగులతో..
మాక్లూర్ : మాక్లూర్ మండలంలోని మాణిక్బండార్, అమ్రాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు ప్రత్యేక అలంకరణలు చేశారు. మానిక్బండార్లో ‘మన ఊరు – మన బడి’ కింద తరగతి గదులతో పాటు పాఠశాల అంతటికీ రంగులు వేశారు. 200 మంది విద్యార్థుల సంఖ్య ఉన్న ఈ పాఠశాల ఉత్తీర్ణతలోనూ ముందుంటోంది. పాఠశాల ఆవరణలో తాగునీటి కులాయిల వద్ద, మరు గుదొడ్లను ముందస్తుగా శుభ్రం చేయించారు. విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు చర్యలు చేపడుతున్నట్లు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు సత్యనారాయణ, సురేశ్ తెలిపారు. మరింత బలోపేతం చేస్తాం ప్రైవేట్ పాఠశాలలకు దీటు గా పాఠశాలల్లో విద్య అందుతోంది. తల్లిదండ్రులు త మ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకే పంపించడానికి మొగ్గు చూపుతున్నారు. వా రి నమ్మకాన్ని వమ్ము చేయం. – కె. సత్యనారాయణ, ఎంఈవో, మాక్లూర్మాణిక్బండార్ ప్రభుత్వ పాఠశాల -
75 ఏళ్ల ప్రస్థానం..
వేసవి సెలవుల అనంతరం గురువారం నుంచి పాఠశాలలు పున:ప్రారంభం కానున్నాయి. విద్యార్థులకు స్వాగతం పలికేందుకు కొత్త హంగులతో పాఠశాలలను ఇప్పటికే ఉపాధ్యాయులు సిద్ధం చేశారు. రంగులు వేసి, పూలతో అలంకరించి అందంగా తీర్చిదిద్దారు. మరోవైపు విద్యార్థులు సైతం నూతన విద్యాసంవత్సరంలోకి అడుగిడేందుకు ఉత్సాహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలోఉత్తమ ఫలితాలు సాధిస్తూ ఆదర్శంగా నిలుస్తున్న ప్రభుత్వ పాఠశాలలపై, ప్రభుత్వ పాఠశాలల్లో చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించి స్ఫూర్తిగా నిలుస్తున్న పూర్వ విద్యార్థుల పరిచయాలతో ప్రత్యేక కథనాలు..బోధన్ : సాలూర మండల కేంద్రంలో జడ్పీహెచ్ఎస్ ప్రారంభించి 75 ఏళ్లు పూర్తికావస్తోంది. అప్పట్లో పాఠశాలకు చుట్టూ ఉన్న 8 గ్రామాల విద్యార్థులు 6 నుంచి 10 వతరగతి వరకు చదువుకునేందుకు ఇక్కడి వచ్చి అడ్మిషన్ల కోసం పోటీ పడే వారు. ఈ పాఠశాలలో చదువుకున్న అనేక మంది పూర్వ విద్యార్థులు దేశ విదేశాల్లో వివిధ రంగాల్లో ఉన్నత స్థాయికి ఎదిగారు. కాలక్రమంలో అనేక కారణాల వల్ల విద్యార్థుల సంఖ్య తగ్గుతూ వచ్చింది. తాజాగా పాఠశాల పరిస్థితులు మెరుగుపడి పూర్వ వైభవం సంతరించుకుంటున్న దశలో ఉంది. గురువారం కొత్త విద్యాసంవత్సరం ప్రారంభమవుతున్నందున పాఠశాల ముఖద్వారాన్ని పూలతోరణాలతో అలంకరించి తీర్చిదిద్దారు. ఈ పాఠశాల హెచ్ఎం రాజీ మంజూష స్థానిక మండల విద్యాశాఖ అధికారిణిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ప్రైవేట్కు దీటుగా ఫలితాలు సాధిస్తూ పాఠశాల అభివృద్థిపథంలో ముందుకెళ్తోంది. నాణ్యమైన బోధన.. పాఠశాలలో మౌలిక సౌకర్యాలు సమకూర్చుకుంటూనే, నాణ్యమైన విద్యాబోధనకు హెచ్ఎం, ఉపాధ్యాయుల బృందం నిరంతరం చేస్తున్న కృషికి మంచి ఫలితాలు వస్తున్నాయి. రెండేళ్లుగా విద్యార్థుల సంఖ్య పెరుగుతూ ప్రస్తుతం 269 మందికి చేరింది. అన్ని సబ్జెక్టులను బోధించేందుకు సరిపడా ఉపాధ్యాయులున్నారు. ప్రభుత్వం కల్పించిన ఐఎఫ్పీ (ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానెల్) ద్వారా డిజిటల్ విధానంలో పాఠ్యాంశాలను బోధిస్తున్నారు. ఇటీవల పీ ఎం శ్రీ పాఠశాలగా ఎంపికై ంది. ఈ పథకం ద్వారా పాఠశాల అభివృద్ధికి నోచుకుంటోంది. అటల్ టింకరింగ్, కంప్యూటర్ ల్యాబ్లు అందుబాటులో ఉన్నా యి. ఈ పథకం కింద విద్యార్థులను విజ్ఞాన యాత్ర కు తీసుకెళ్తారు. శారీరక, మానసిక ఉల్లాసానికి వి ద్యార్థులకు యోగ, కరాటే, ఆటలు నేర్పిస్తున్నారు. ప్రతిభచాటిన విద్యార్థులు ఈ ఏడాది పదోతరగతి వార్షిక పరీక్షలో విద్యార్థులు 46 మందికిగాను 43 మంది మంచి మార్కులతో ఉత్తీర్ణులయ్యారు. నేషనల్ మీన్కమ్ మెరిట్ స్కాలర్ షిప్నకు 8వ తరగతి విద్యార్థులు 8 మంది ఎంపికయ్యారు. జిల్లా సైన్స్ఫేర్లో పలువురు విద్యార్థులు ప్రతిభ చాటారు. ఈ పాఠశాలలో 1971–72 సంవత్సరంలో పదో తరగతి చదువుకున్న సాలూరకు చెందిన ఇల్తెపు సాయన్న ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లో సీనియర్ సైంటిస్ట్ (సీనియర్ మేనేజర్)గా విధులు నిర్వర్తించి ఉద్యోగ విరమణ పొందారు. పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలి నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేస్తున్నాం. ప్రభుత్వం మౌలిక సౌకర్యాలు క ల్పిస్తోంది. ఉపాధ్యాయ బృందం సమష్టి కృషితో వి ద్యార్థులు పరీక్షల్లో మంచి ఫలితాలు సాధిస్తున్నారు. తల్లిదండ్రులు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలి. – రాజీ మంజూష, ఎంఈవో, హెచ్ఎం జెడ్పీహెచ్ఎస్ సాలూర పూర్వవైభవం సంతరించుకుంటున్న సాలూర జడ్పీహెచ్ఎస్ ప్రైవేట్కు దీటుగా పదో తరగతి పరీక్ష ఫలితాలు.. ఉపాధ్యాయుల సమష్టి కృషి స్ఫూర్తిదాయకం -
కువైట్లో గుండెపోటుతో మిట్టాపల్లి వాసి ..
డిచ్పల్లి: మండలంలోని మిట్టాపల్లి గ్రామానికి చెందిన సిర్నాపల్లి గంగాధర్ (45) బతుకుదెరువు కోసం కువైట్ దేశానికి వెళ్లగా, రెండు రోజుల క్రితం గుండెపోటుతో మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. గంగాధర్ ఐదేళ్ల క్రితం కువైట్ దేశానికి వెళ్లగా, గతంలో ఒకసారి గుండెపోటు రావడంతో చికిత్స పొందాడు. సెలవుపై స్వగ్రామానికి వచ్చి రెండు నెలల క్రితం తిరిగి వెళ్లాడు. రెండు రోజుల క్రితం డ్యూటీలో ఉండగా మరోసారి గుండెపోటు రావడంతో ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతివార్త కుటుంబసభ్యులకు తెలియడంతో వారు శోకసంద్రంలో మునిగిపోయారు. మృతుడికి తల్లిదండ్రులు, భార్య, ఒక కొడుకు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. మృతదేహాన్ని వీలైనంత త్వరగా స్వగ్రామానికి రప్పించేలా రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, ప్రభుత్వం కృషి చేయాలని, మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
ట్రాన్స్ఫార్మర్ కాపర్, ఆయిల్ చోరీ
బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లోని లక్ష్మి లిప్టు కోసం ముప్కాల్ మండలం నల్లూర్ శివారులో నిర్మించిన సబ్స్టేషన్ నుంచి ట్రాన్స్పార్మర్ కాపర్ కాయిల్స్, ఆయిల్ చోరీకి గురైంది. లిప్టు ఆపరేటర్ భానుచందర్ బుధవారం ఉదయం సబ్స్టేషన్ వద్దకు వెళ్లి చూడగా చోరీ జరిగినట్లు గుర్తించి, పోలీసులకు సమాచారం అందించారు. దీనిపై బుధవారం ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, ఆర్మూర్ రూరల్ సీఐ శ్రీధర్ రెడ్డి, ముప్కాల్ ఎస్సై రజనీకాంత్ విచారణ చేపట్టారు. మే31 నుంచి జూన్ 10 మధ్య కాలంలో చోరీ జరిగినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దుండగులు రెండు ట్రాన్స్ఫార్మర్లను కింద పడేసి కాపర్ కాయిల్స్, ఆయిల్ ఎత్తుకెళ్లారు. లక్ష్మి లిప్టు డిప్యూటీ ఈఈ సురేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. యువకుడి అదృశ్యం నవీపేట: మండల కేంద్రంలోని శివాజీనగర్కు చెందిన వగిరె విక్కీ(25)అదృశ్యమైనట్లు ఎస్సై వినయ్ బుధవారం తెలిపారు. గత కొంతకాలంగా మద్యానికి బానిసైన విక్కీ మతిస్థిమితం కోల్పోయాడన్నారు. ఈనెల 9న ఇంటి నుంచి బయటకు వెళ్లిన విక్కీ మళ్లీ ఇంటికి తిరిగిరాలేడు. దీంతో అతడి భార్య నాగలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. -
అడ్మిషన్లకు పోటీ..!
మోపాల్(నిజామాబాద్రూరల్) : జిల్లాలోని అన్ని పాఠశాలలతో పోల్చితే బోర్గాం(పి) జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల భిన్నం. ఇతర గ్రామాల్లో అడ్మిషన్ల కోసం బడిబాటలో భాగంగా ఉపాధ్యాయు లు, వీడీసీలు, యువజన సంఘాలతో కలిసి ఇంటింటికీ తిరిగితే.. ఈ పాఠశాలలో మాత్రం ఏప్రిల్ నుంచే అడ్మిషన్ల కోసం దరఖాస్తులు వెల్లువెత్తుతా యి. జిల్లాలో అడ్మిషన్ల కోసం పోటీ పడే ఏకై క ప్రభుత్వ పాఠశాల బోర్గాం(పి) జెడ్పీహెచ్ఎస్. 2025–26 సంవత్సరానికిగాను 240 పైగా దరఖా స్తులు వచ్చాయి. నేటి నుంచి దరఖాస్తులను పరిశీ లించి సీటు ఇవ్వనున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలుసైతం అడ్మిషన్ల కోసం పోటీ పడతారు. హెచ్ఎంలుగా చేసిన గడ్డం గంగారెడ్డి (2006), పండరి సత్యనారాయణ (2012), నర్ర రామారావు (2019)లో జాతీయ ఉత్తమ ఉపాధ్యా య అవార్డులు అందుకున్న చరిత్ర పాఠశాలకు ఉంది. హెచ్ఎంలతోపాటు ఉపాధ్యాయ బృందం నిబద్ధతతో పని చేస్తుండటం వల్లే పదోతరగతిలో ప్రతియేటా 95 శాతం వరకు ఫలితాలు వస్తున్నాయి. రాష్ట్రంలోనే టాప్ పది పాఠశాలల్లో బోర్గాం(పి) ఒకటి. సీటు దొరకని విద్యార్థులెందరో.. ఈ విద్యాసంవత్సరానికిగాను 240 పైగా దర ఖాస్తులు మే నాటికే వచ్చాయి. విద్యార్థులు టీసీ లు తీసుకొచ్చిన తర్వాతే అడ్మిషన్లు ఇస్తున్నారు. ప్రస్తుతం దరఖాస్తులు తీసుకోవడంలేదు. ప్రతి ఏడాది ఎంతో మందికి సీటు దొరకడం లేదు. వి ద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు క్రమశిక్షణ, నైతిక విలువలు నేర్పించడం పాఠశాల ప్రత్యేకత. రాష్ట్రంలోనే టాప్ టెన్ పాఠశాలల్లో ఒకటిగా గుర్తింపు 920 మంది విద్యార్థులతో కొనసాగుతున్న బోర్గాం(పి) జెడ్పీహెచ్ఎస్ -
ప్రభుత్వ పాఠశాలలో చదివి ఐఏఎస్ అధికారిగా..
సాలూర పీఎంశ్రీ జడ్పీహెచ్ఎస్ ముఖద్వారం.. పూలతోరణాలతో అలంకరణఆర్మూర్ : ప్రభుత్వ పాఠశాలలో చదివి ఉన్నత స్థానాలకు ఎదిగిన చిట్ల పార్థ సారథి నేటి తరం విద్యార్థులకు ఆదర్శంగా నిలిస్తున్నారు. ఐఏఎస్ అధికారిగా వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వహించి పదవీ విరమణ పొందిన ఆయన ప్రతియేటా తాను పుట్టిన ఊరుకు, చదివిన పాఠశాలకు సేవా కార్యక్రమాలు చేయడంలో ముందుంటున్నారు. పార్థసారథి పదో తరగతి వరకు ఆర్మూర్ లోని జిరాయత్ నగర్ ప్రభుత్వ బాలుర ఉన్న త పాఠశాలలో చదువుకున్నారు. ఆర్డీవోగా, ఎస్సీ కార్పొరేషన్ ఈడీగా, డీఆర్వోగా ఉద్యోగాలు చేశారు. యూపీఎస్ సీ ప్రొసీజర్ ఆధారంగా 1993 బ్యా చ్ ఐఏఎస్ అధికారిగా ఎంపికై తన లక్ష్యా న్ని అందుకున్నారు. కలెక్టర్ గా, మార్క్ఫెడ్ ఎండీగా, ఐ అండ్ పీఆర్ కమిషనర్గా, చలన చి త్ర, టీవీ, నాటక రంగం సంస్థ ఎండీగా కొనసాగారు. తెలంగాణలో సివిల్ సప్లయీస్ కార్యదర్శి గా, తెలంగాణ యూనివర్సిటీ ఇన్చార్జి వీసీ గా అదనపు బాధ్యతలు నిర్వహించారు. పదవీ విర మణ అనంతరం 2020 సెప్టెంబర్లో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా నియమించబడ్డారు.రుణం తీర్చుకోలేనిది.. కన్నతల్లి, సొంత ఊరు, చదివిన పాఠశాల రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిది. ప్రభుత్వ పాఠశాలల్లో సైతం పట్టుదలతో విద్యనభ్యసిస్తే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఏర్పాటు చేసుకొని ఆ లక్ష్య సాధన దిశ గా కష్ట పడితే విజయం వారి సొంతమవుతుంది. – చిట్ల పార్థ సారథి, సేవా కార్యక్రమాలు.. పార్థసారథి తన తల్లిదండ్రుల పేరిట చిట్ల ప్రమీల జీవన్ రాజ్ మెమోరియల్ ట్రస్టును ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రతియేటా ఉన్నత ఫలితాలు సాధించిన విద్యార్థులకు బంగారు పతకాల ను అందజేస్తున్నారు. విద్యార్థులను తరు చూ కలుస్తూ స్ఫూర్తి నింపుతున్నారు. ఉన్నత శిఖరాలకు ఎదిగిన పార్థసారథి రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా బాధ్యతల నిర్వహణ -
మత్తు పదార్థాల నిరోధానికి కృషి చేయాలి
నిజామాబాద్ అర్బన్: ప్రతిఒక్కరూ మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాల నిరోధానికి కృషి చేయాలని, వీటిపై విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ సూచించారు. ఈమేరకు యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఆధ్వర్యంలో రూపొందించిన గోడ ప్రతులు, కరపత్రాలను బుధవారం అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ తన ఛాంబర్లో ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాల నిర్మూలన కోసం ప్రభుత్వం కూడా ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తూ అనేక చర్యలు చేపడుతోందన్నారు. ఎక్కడైనా గంజాయి, క్లోరల్ హైడ్రేట్, డైజోఫామ్, అల్ఫ్రాజోలం వంటి వాటి రవాణా, విక్రయాలు జరుగుతున్నట్లు గమనిస్తే వెంటనే సంబంధిత శాఖల అధికారులకు సమాచారం అందించాలని, టోల్ ఫ్రీ నంబర్ 1908కు ఫోన్ చేసి సమాచారం తెలియజేయవచ్చన్నారు. నిజామాబాద్ జోన్ డీఎస్పీ సోమనాథం మాట్లాడుతూ.. ఇటీవలి కాలంలో సుమారు రూ. 42.98 కోట్ల విలువ చేసే ఆల్ఫ్రాజోలం నిల్వలను సీజ్ చేసినట్లు తెలిపారు. జిల్లా సహకార శాఖ అధికారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
టీచర్లు, అటెండర్లను నియమించండి
● అమ్మ ఆదర్శ పాఠశాలల బిల్లుల మంజూరు ఆలస్యమవుతోంది.. – రవి, కల్లూరు, ఎంపీటీసీ ● డీఈవో : పనులకు సంబంధించి వివరాలు తెలుసుకుని త్వరలోనే నిధులు విడుదల చేస్తాం.నిధుల కొరత ఎక్కడా లేదు. తక్షణమే అందించేందుకు ఆదేశాలు జారీ చేస్తా. ● మా పాఠశాలలో అటెండర్ లేరు. పాఠశాలకు ఓ స్వచ్ఛంద సంస్థ అందించిన కిటీకీలు అలాగే ఉండిపోయాయి. మూత్రశాలల నిర్వహణ సక్రమంగా లేదు. – వంశీ, జానకంపేట, వేల్పూర్ మండలం ● ప్రతి పాఠశాలల్లో స్కావెంజర్లను నియమించండం జరిగింది. మీ పాఠశాలకు కూడా అందుబాటులో ఉన్నారు. అవసర మైతే మండల వి ద్యాశాఖ అధికారి ని సంప్రదించి తె లుసుకుంటా. స్వ చ్ఛంద సంస్థ అందించిన సామగ్రిని ఉపయోగంలోకి తీసుకువస్తాం. ● ప్రైవేట్ పాఠశాలల్లో ఎల్కేజీకి రూ.30వేల వరకు వసూలు చేస్తున్నారు. ఫీజు వసూళ్లను నియంత్రించండి. – నరేశ్, నిజామాబాద్ ● ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణకు సంబంధించి గవర్నింగ్ బాడీ అందుబాటులో ఉంటుంది. కమిటీ సూచనల మేరకు ఫీజుల నిర్ణయం ఉంటుంది. అయినప్పటికీ ప్రైవేట్ పాఠశాలలు అధిక ఫీజులు వసూలు చేస్తే విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటాం. విద్యార్థుల తల్లిదండ్రులు సైతం విద్యాశాఖ దృష్టికి తీసుకురావాలి. ● వేల్పూర్ మండలం కుకునూర్ పాఠశాలలో పీఈటీ కొరత ఉంది. – ఆడెపు లింబాద్రి, నిజామాబాద్ ● పాఠశాలకు పీఈటీ సర్దుబాటు చేస్తాం. సమీప పాఠశాలలో ఉన్న పీఈటీ అక్కడ కొనసాగే విధంగా చూస్తాం. త్వరలోనే సమస్యను పరిష్కరిస్తాం. ● ఖలీల్వాడి పాఠశాలలో మూత్రశాలలు సక్రమంగా లేవు. – ఇర్ఫాన్, నిజామాబాద్ ● పాఠశాలను సందర్శించి మౌలిక సదుపాయాలను పరిశీలిస్తాం. నిధులు అందుబాటులో ఉన్నాయి. మూత్రశాలలు అవసరమైన చోట నిర్మిస్తాం. హెచ్ఎంల నుంచి ప్రతిపాదనలు తీసుకోవడం జరుగుతుంది. ● ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ల అటెండెన్స్పై దృష్టి సారించాలి. ఉపాధ్యాయ సంఘాల నాయకులు పాఠశాలలకు వెళ్లడం లేదు. – సంతోష్, నిజామాబాద్ ● నిత్యం ప్రభుత్వ పాఠశాలలను తనిఖీ చేస్తాం. గైర్హాజరైన టీచర్లపై చర్యలు తీసుకుంటాం. ఎవరికి మినహాయింపు ఉండదు. ప్రతి ఒక్కరూ పాఠశాల సమయంలో విద్యాబోధన చేపట్టాల్సిందే. పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేస్తాం. ● ప్రతిఏటా ప్రభుత్వ పాఠశాలలకు పాఠ్యపుస్తకాలు సకాలంలో అందడం లేదు. – నితిన్, బోధన్ ● ఈసారి ప్రభుత్వ పాఠశాలలకు పాఠ్యపుస్తకాల పంపిణీ పకడ్బందీగా చేపడుతున్నాం. ఇప్పటికే పాఠ్యపుస్తకాలను పాఠశాలలకు అందించడం జరిగింది. మరికొన్ని పాఠశాలలకు పంపిణీ కొనసాగుతోంది. ఎక్కడా ఇబ్బందులు లేవు. ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజు వసూళ్లను నియంత్రించాలి లైబ్రరీల నిర్వహణపై దృష్టి సారించండి సాక్షి ‘ఫోన్ ఇన్’లో డీఈవో అశోక్కు వినతులు సమస్యలు విన్నవెంటనే పరిష్కారం దిశగా ఆదేశాలిచ్చిన విద్యాశాఖాధికారి శంకర్ భవన్లో టీచర్ల సంఖ్య తక్కువగా ఉంది.. – గోదావరి, శంకర్ భవన్ పాఠశాల చైర్మన్ ప్రస్తుతం టీచర్ల సర్దుబాటు ప్రక్రియ కొనసాగుతోంది. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా టీచర్లను నియమించడం జరుగుతుంది. సబ్జెక్టుల వారీగా అవసరమైన టీచర్లను నియమిస్తాం. ప్రైవేట్ పాఠశాలల్లో పుస్తకాలు, ఇతర సామగ్రి విక్రయాలపై దృష్టిసారించండి. – మోహన్, డిచ్పల్లి ప్రైవేట్ పాఠశాలల్లో పుస్తకాలు, ఇతర సామగ్రి విక్రయాలపై దృష్టి సారిస్తాం. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై చర్యలు తీసుకుంటాం.నిజామాబాద్ అర్బన్ : ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్లు, అటెండర్లను నియమించాలని, ప్రైవేట్ స్కూళ్లలో ఫీజు వసూళ్లను నియంత్రించాలని పలువురు జిల్లా విద్యాశాఖాధికారి అశోక్ను కోరారు. వేసవి సెలవుల అనంతరం గురువారం నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో పాఠశాలల్లో నెలకొన్న సమస్యలు, పరిష్కారమార్గాలు, నూతన విద్యా సంవత్సరంలో విద్యార్థుల మార్గదర్శకాల కోసం మాట్లాడేందుకు ‘సాక్షి’ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన ఫోన్ ఇన్ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఉదయం 11 నుంచి 12గంటల వరకు జిల్లాకు చెందిన పలువురు వివిధ అంశాలపై జిల్లా విద్యాశాఖాధికారితో మాట్లాడారిలా.. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న భవనాల్లో ప్రైవే ట్ పాఠశాలలు కొనసాగుతున్నాయి. వాటిపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు. – రామ్మోహన్, వర్ని అనుమతులు ఇచ్చే సమయంలోనే భవనాలు నిబంధనలకు అనుకూలంగా ఉన్నాయా? లేదా? పరిశీలిస్తాం. అగ్నిమాపక శాఖ, మున్సిపల్ అనుమతులను పరిశీలించిన తరువాత మేము అనుమతులిస్తాం. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న భవనాల్లో కొనసాగుతున్న పాఠశాలలకు నోటీసులు ఇస్తాం. ప్రభుత్వ పాఠశాలల్లో లైబ్రరీల నిర్వహణ సక్రమంగా లేదు. పుస్తకాలు అందుబాటులో లేవు. – రవి, ఆర్మూర్ ఎంపిక చేసిన ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే లైబ్రరీలు కొనసాగుతున్నాయి. వాటిలో పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతున్నా యి. నిర్వహణ తీరును పరిశీలించి మరింత బలోపేతం చేస్తాం. -
సెంట్రల్ జైలును సందర్శించిన జడ్జి
నిజామాబాద్ లీగల్ : సారంగాపూర్లోని సెంట్రల్ జైలును జిల్లా కోర్టు న్యాయమూర్తి జీవీఎన్ భరతలక్ష్మి బుధవారం సందర్శించారు. జైలులోని వివిధ విభాగాలను పరిశీలించిన జడ్జి.. ఖైదీలతో మాట్లాడి వారికి అందుతున్న సౌకర్యాలు, లీగల్ ఎయిడ్ న్యాయవాదులు అందిస్తున్న న్యాయ సహాయం వి వరాలు తెలుసుకున్నారు. ఖైదీలు తయా రు చేస్తున్న వస్తువులను పరిశీలించారు. జైలులో సౌకర్యాలపై న్యాయమూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు. జడ్జి వెంట జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఉదయ భాస్కర్రావు, జైలు సూపరింటెండెంట్ దశరథ్, జైలర్లు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సిబ్బంది, జైలు సిబ్బంది తదితరులున్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు ఖలీల్వాడి: అల్లర్లకు పాల్పడుతూ శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు ప్రయత్నించిన వారిపై నిఘా ఉంటుందని, అటువంటి వ్యక్తులు తమ నడవడికను మార్చుకోవాలని సీపీ సాయిచైతన్య బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. లేనిపక్షంలో తగిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. పాతకక్షలను మనసులో పెట్టుకొని ఇందల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని సిర్నాపల్లిలో ఇటీవల మాజీద్ ఖాన్తోపాటు ఆయన కుటుంబ సభ్యులపై దాడి చేసిన వారిపై కేసులు నమోదు చేసి రిమాండ్కు తరలించామని పేర్కొన్నారు. ఎవ్వరి వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలగించే లేదా సమాజంలో ఉద్రిక్తతలు రేపే విధంగా వ్యవహరించిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు. శాంతియుత వాతావరణం కోసం పోలీస్శాఖ నిర్విరామంగా కృషి చేస్తుందని, దీనికోసం ప్రజల సహకారం ప్రధానమని పేర్కొన్నా రు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారి సమాచారాన్ని దగ్గరలోని పోలీస్స్టేషన్లకు లేదా డయల్ 100, స్పెషల్ బ్రాంచ్ నంబర్ – 87126 59777, పోలీస్ కంట్రోల్ రూమ్ 08462 – 226090 నంబర్లకు తెలుపాలని, సమాచారం అందించిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. బోధనా సామర్థ్యాలు మెరుగుపర్చుకోవాలి మోపాల్(నిజామాబాద్రూరల్): గురుకులాల అధ్యాపకులు బోధనా సామర్థ్యాలు, మెలకువలను పెంపొందించుకుని, విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో పాఠ్యాంశాలను బోధించాలని మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకులాల ఉమ్మడి జిల్లా ఆర్సీవో సత్యనాథ్రెడ్డి అన్నారు. మండలంలోని కంజర్ బీసీ గురుకులంలో జూనియర్ లెక్చరర్లకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమం బుధవారంతో ముగిసింది. ఈ సందర్భంగా సత్యనాథ్రెడ్డి మాట్లాడుతూ.. అధ్యాపకుల బోధనా సామర్థ్యాలను మెరుగుపర్చేందుకు ఓరియంటేషన్ ఎంతగానో దోహదపడుతుందన్నారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లాలోని 100 మంది అధ్యాపకులు పాల్గొన్నారు. -
పెంచిన బస్ పాస్ చార్జీలు వెంటనే తగ్గించాలి
నిజామాబాద్అర్బన్: పెంచిన బస్ పాస్ చార్జీలను తగ్గించాలని పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ డిమాండ్ చేశాడు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం.. ఆర్టీసీ బస్ పాస్ చార్జీలు దాదాపు 20 శాతం పెంచిందన్నారు. పెంపు వల్ల పేద, మధ్య తరగతి విద్యార్థులపై ఆర్థిక భారం పడుతుందన్నారు. స్కూళ్లు, కాలేజీలు ప్రారంభమవుతున్న సందర్భంలో ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం సరైనది కాదన్నారు. ఒకవైపు ఫ్రీ బస్సు ఇస్తున్నామని గొప్పలు చెప్పుకుంటూ మరొకవైపు పేద విద్యార్థుల నుంచి వసూలు చేయడం దుర్మార్గమని అన్నారు. సమావేశంలో నగర పీడీఎస్యూ నాయకులు మనోజ్, నిఖిల్, ముక్తశ్రీ, దుర్గాప్రసాద్, రాజు తదితరులు పాల్గొన్నారు. నిషేధిత ప్లాస్టిక్ వాడుతున్న టిఫిన్ సెంటర్లకు జరిమానా నిజామాబాద్ సిటీ: మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు వరుస తనిఖీలు నిర్వహిస్తున్నారు. నిబంధనలు పాటించని వారికి జరిమానాలు విధిస్తున్నారు. మంగళవారం నగరంలోని పలు హోటళ్లను తనిఖీ చేశారు. రోడ్లపై విక్రయిస్తున్న తినుబండారాలు, టిఫిన్ సెంటర్లను తనిఖీ చేశారు. బస్టాండ్, రైల్వేస్టేషన్, ఖిల్లా చౌరస్తా, అర్సపల్లి, మాలపల్లి, బోధన్ రోడ్డు, కంఠేశ్వర్, కంఠేశ్వర్ బైపాస్ ఏరియాల్లో ఏఎంసీ జయకుమార్ తనిఖీలు చేసి నిషేధిత ప్లాస్టిక్ వాడుతున్న టిఫిన్ సెంటర్లకు జరిమానా విధించారు. 7 టిఫిన్ సెంటర్లకు రూ.17 వేల జరిమానా విధించారు. తక్కువ మైక్రాన్లు ఉన్న ప్లాస్టిక్ వాడవద్దని సూచించారు. జరిమానా విధించినా మళ్లీ తిరిగి వాటిని వాడితే ఈ సారి హోటల్స్, టిఫిన్ సెంటర్లు మూసివేస్తామని హెచ్చరించారు. అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ జయకుమార్, సానిటరీ సూపర్వైజర్ సాజిద్ అలీ, ఇన్స్పెక్టర్లు శ్రీకాంత్, సునీల్, కృష్ణ, జవాన్లు ఇతర సిబ్బంది ఉన్నారు. పంట మార్పిడితో సుస్థిర ఆదాయం జక్రాన్పల్లి: వ్యవసాయ సాగులో పంటల మార్పిడి ద్వారా సుస్థిర ఆదాయం సంపాదించవచ్చని వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ మంజు భార్గవి(ప్రాంతీయ వరి పరిశోధన స్థానం రుద్రూర్) పేర్కొన్నారు. మంగళవారం పడకల్లో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులనుద్దేశించి ఆమె మాట్లాడుతూ.. రైతులకు వివిధ అంశాలపైన అవగాహన కల్పించారు. యూరియా, ఇతర ఎరువుల వాడకం, తెగుళ్లు, పురుగు మందుల వాడకం, రసీదు తీసుకోవడం, విత్తన శుద్ధి చేసుకోవడం మొదలగు అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు. విత్తన శుద్ధి ప్రాముఖ్యతను వివరించారు. ఏవో దేవిక, వ్యవసాయ విస్తరణ అధికారి సుభాష్య, రైతులు పాల్గొన్నారు. -
‘నర్సయ్య స్ఫూర్తితో ఉద్యమాలు’
మోపాల్: రైతాంగ పోరాటయోధుడు, అఖిలభారత రైతు కూలీ సంఘం గౌరవాధ్యక్షుడు నాయక్వాడి నర్సయ్య పోరాట స్ఫూర్తితో రైతాంగ ఉద్యమాలను నిర్మిద్దామని ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షుడు వేల్పూర్ భూమయ్య పేర్కొన్నారు. మంగళశారం ఏఐకేఎంఎస్ మోపాల్ మండల కమిటీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో నర్సయ్య సంతాప సభను నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళ్లర్పించారు. అనంతరం వేల్పూర్ భూమయ్య మాట్లాడుతూ.. నిజాంసాగర్ ఆయకట్టు రక్షణ కోసం జరిగిన రైతు ఉద్యమం, ఎన్సీఎస్ఎఫ్ సారంగపూర్ చక్కెర ఫ్యాక్టరీని తెరిపించాలని జరిగిన ఉద్యమంలో నాయక్వాడి నర్సయ్య కీలకంగా వ్యవహరించారని తెలిపారు. నర్సయ్య మరణం రైతు, ప్రజా ఉద్యమాలకు తీరని లోటు అని పేర్కొన్నారు. ఏఐకేఎంఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు అగ్గు ఎర్రన్న, నాయకులు బండమీది నర్సయ్య, బి గంగారాం, అగ్గు చిన్నయ్య, వేల్పూర్ రమేష్, తదితరులున్నారు. -
సినిమాలు
ఉషా ప్రసాద్ మల్టీప్లెక్స్ (గీతా ఏషియన్) స్క్రీన్–1 థగ్లైఫ్ –1.25,7.35, 10.40 స్క్రీన్–2 శ్రీశ్రీశ్రీ రాజావారు–10.40, 4.40, 10.35 – భైరవం–1.40, 7.40 స్క్రీన్–3 హౌస్ఫుల్–5(హిందీ)–10.30, 1.25, 4.30, 7.35, 10.40 పీవీఆర్ మల్టీప్లెక్స్ (వేణు మాల్) స్క్రీన్–1 కరాటే కిడ్ లెజెండ్స్–11.00, మిషన్ ఇంపాజిబుల్ (ఇంగ్లీష్)–1.15, భైరవం– 4.45, 10.35, భూల్ చుక్ మాఫ్(హిందీ)– 7.55 స్క్రీన్–2 హౌస్ఫుల్–5(హిందీ)–9.40, 3.40, 7.10, 10.40 ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్లైన్స్–1.10 స్క్రీన్–3 ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్లైన్స్–11.30 బద్మాషులు–2.00 ,థగ్లైఫ్–4.35, 10.40 పాడేరు 12 మైలు–8.00 స్క్రీన్ –4 మిషన్007 – 11.05, హౌస్ఫుల్–5బీ(హిందీ)– 1.40, శ్రీశ్రీశ్రీ రాజావారు– 5.10, 10.45, ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్లైన్స్–8.15 లలితామహల్ భైరవం దేవి శ్రీశ్రీశ్రీ రాజావారు నటరాజ్ హౌస్ఫుల్–5(హిందీ) విజయ్ థగ్లైఫ్ -
సాక్షిపై దాడి..కొమ్మినేని అరెస్టు అక్రమం
సాక్షినెట్వర్క్ : ‘సాక్షి’ కార్యాలయాలపై అకారణంగా టీడీపీ గూండాలు దాడులకు పాల్పడటాన్ని, ప్రముఖ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ నిజామాబాద్ అర్బన్, రూరల్ నియోజకవర్గాల పరిధిలో మంగళవారం సాక్షి సిబ్బందితో పాటు వివిధ జర్నలిస్టు సంఘాలు, వామపక్ష, ప్రజా సంఘాల నాయకులు ఆందోళనలు నిర్వహించారు. నల్లబ్యాడ్జీలు ధరించి ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వ తప్పిదాలను సాక్షి మీడియా ప్రశ్నిస్తున్నదన్న ఒక్క కారణంతోనే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కక్ష గట్టారని విమర్శించారు. ఇది ముమ్మాటికీ పత్రికా స్వేచ్ఛపై దాడేనని వ్యాఖ్యానించారు. టీడీపీ రౌడీ మూకలపై కఠిన చర్యలు తీసుకోవాలని ముక్త కంఠంతో కోరారు. పలు చోట్ల అధికారులకు వినతి పత్రాలు అందజేశారు. కొన్నిచోట్ల అంబేడ్కర్ విగ్రహాలకు వినతి పత్రాలిచ్చారు. -
రోడ్డు ఇలా.. గురుకులానికి వెళ్లేదెలా..?
నేటి చిత్రంగుంతలమయంగా మారిన గురుకులానికి వెళ్లే రోడ్డుమోపాల్(నిజామాబాద్రూరల్): మండలంలోని కంజర్ గ్రామ శివారులోగల మహాత్మాజ్యోతిబాపూలే బీసీ బాలుర గురుకుల పాఠశాలకు వెళ్లే దారి అధ్వానంగా మారింది. చిన్నపాటి వర్షానికే రోడ్డు గుంతలమయమై నీరు నిలిచింది. గురుకులానికి వెళ్లే వారికి ఇబ్బందిగా తయారైంది. రెండ్రోజుల్లో పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి వెంటనే రోడ్డు మరమ్మతులు చేయాలని కోరుతున్నారు. – ఇందల్ నాయక్, బైరాపూర్మీ ప్రాంతంలో నెలకొన్న సమస్యను, ఫొటోను మాకు వాట్సాప్లో పంపించండి. ప్రచురించి అధికారుల దృష్టికి తీసుకెళ్తాము. పంపిన వారి పేరు, ఫొటో ప్రచురిస్తాము. నిజామాబాద్ అర్బన్ – 95531 30597 నిజామాబాద్ రూరల్ – 97053 46541 మాకు ఫొటో పంపండి -
వేర్వేరు ఘటనల్లో పలువురి మృతి
రెండు బైక్లు ఢీకొని ఇద్దరు..బాన్సువాడ: బీర్కూర్ మండలం కిష్టాపూర్ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. చించోల్లి గ్రామానికి చెందిన ఇల్తాం గంగారం (40) ట్రాక్టర్లోకి డీజిల్ కోసం మంగళవారం రాత్రి బైక్పై బీర్కూర్ వెళ్లాడు. అదే రాత్రి డీజిల్ తీసుకుని బైక్పై చించోల్లికి బయలుదేరాడు. అలాగే అన్నారం గ్రామానికి చెందిన సంగెం నందు(18) అనే యువకుడు మార్కెట్ కోసం బీర్కూర్కు బైక్పై బయలుదేరాడు. బీర్కూర్ మండలం కిష్టాపూర్ శివారులో వీరిద్దరి బైక్లు ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి. ఈ ఘటనలో గంగారం, నందుకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న బాన్సువాడ ఎస్సై రాజశేఖర్ ఘటన స్థలానికి చేరుకొని, వివరాలు సేకరించారు. మృతదేహాలను బాన్సువాడ ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసుకున్నారు. రోడ్డు ప్రమాదంలో పక్కపక్క గ్రామాలకు చెందిన ఇద్దరు మృతి చెందడంతో ఆయా గ్రామాల ప్రజలు పెద్దఎత్తున ఘటన స్థలానికి చేరుకున్నారు. మృతుల కుటుంబసభ్యుల రోదనలు అందరిని కంటతడి పెట్టించాయి.నందిపేటలో..నందిపేట్(ఆర్మూర్): మండల కేంద్రానికి చెందిన ఓ యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా.. నందిపేటకు చెందిన ఇమ్ముల రంజిత్(21) అలియాస్ దేవళ్ల సిద్దు అనే యువకుడు ఉపాధి నిమిత్తం హైదరాబాద్లో ఉంటున్నాడు. రంజిత్ నందిపేట మండలం సీహెచ్ కొండూర్ గ్రామానికి చెందిన తన స్నేహితుడిని వెంటబెట్టుకుని బైక్పై మంగళవారం ఉదయం హైదరాబాద్ నుంచి నందిపేటకు బయలుదేరాడు. హైదరాబాద్ శివారులో రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా నిర్మించిన పిల్లర్ను వీరి బైక్ ఢీకొట్టింది. ఈ ఘటనలో రంజిత్ తీవ్ర గాయాలై అక్కడికక్కడే మరణించాడు. సీహెచ్ కొండూర్ గ్రామానికి చెందిన మరో యువకుడికి తీవ్ర గాయాలైనట్లు తెలిసింది.వేల్పూర్ మండలంలో..వేల్పూర్: మండలంలోని పడగల్ గ్రామంలోగల కొత్తచెరువులో ఓ పశువుల కాపరి ప్రమాదవశాత్తు పడి మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన పశువుల కాపరి సెవ్వ రాజయ్య(52) చాలాకాలంగా స్థానిక గురడికాపు వర్గానికి చెందిన పశువులను మేపేవాడు. సోమవారం పశువులను మేపడానికి తీసుకెళ్లగా, చెరువులోకి వెళ్లిన పశువులను తీసుకురావడానికి నీటిలోకి దిగాడు. పశువులను బయటకు తెచ్చే ప్రయత్నంలో ప్రమాదవశాత్తు నీటమునిగి మృతిచెందాడు. మంగళవారం అతడి మృతదేహం తేలడంతో పోలీసులు బయటకు తీసి,, పోస్టుమార్టం కోసం ఆర్మూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.రైలులో గుర్తుతెలియని వ్యక్తి...ఖలీల్వాడి: నిజామాబాద్ రైల్వేస్టేషన్ పరిధిలో రైలులో ప్రయాణిస్తున్న గుర్తు తెలియని వ్యక్తి అనారోగ్యంతో మృతి చెందినట్లు రైల్వే ఎస్సై సాయిరెడ్డి మంగళవారం తెలిపారు. సోమవారం అర్ధరాత్రి ఒక గుర్తుతెలియని వ్యక్తి గుంతకల్లు నుంచి బోధన్ (రైలు నెంబర్ 57411) వెళ్లు రైలులో ప్రయాణిస్తుండగా, అనారోగ్య కారణాలతో మృతిచెందాడు.నిజామాబాద్ స్టేషన్ మేనేజర్ దుర్గ ప్రసాద్ ఇచ్చిన సమాచారం పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి, పరిశీలించారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు దొరకలేదన్నారు. మృతుడి వయస్సు సుమారు 50–55ఏళ్ల మధ్య ఉంటుందన్నారు. కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఎవరికై నా మృతుడి సమాచారం తెలిస్తే రైల్వే ఎస్సై 87126 58591 నంబరుకు సమాచారం ఇవ్వాలన్నారు.చికిత్స పొందుతూ ప్రభుత్వ పీఈటీ..మాక్లూర్: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఒకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. వివరాలు ఇలా.. జక్రాన్పల్లి మండలం బ్రాహ్మణపల్లికి చెందిన గోడ దివాకర్(45)అనే ప్రభుత్వ వ్యాయామ ఉపాధ్యాయుడు నిజామాబాద్లోని కంఠేశ్వర్లో నివాసం ఉంటూ మోస్రా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పీఈటీగా విధులు నిర్వహిస్తున్నాడు. మే 30న స్కూటీపై తన స్వగ్రామం బ్రాహ్మణపల్లి వెళ్లి తిరిగి వస్తుండగా మాక్లూర్ మండలం దాస్నగర్ శివారులో 63వ నంబర్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్లోని నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున మృతి చెందినట్టు ఎస్సై రాజశేఖర్ తెలిపారు. మృతుడి భార్య నిరోషా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన వివిధ ఘటనల్లో పలువురు మృతిచెందారు. నందిపేట, బాన్సువాడ మండలాల పరిధిలో జరిగిన రెండు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృత్యువాతపడ్డారు. అలాగే వేల్పూర్ మండలంలో చెరువులో పడి ఒకరు, నిజామాబాద్ రైల్వే స్టేషన్ పరిధిలో గుర్తుతెలియని వ్యక్తి అనారోగ్యంతో మృతిచెందారు. -
ఎస్సారెస్పీలో పెరుగుతున్న నీటిమట్టం
బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లోకి స్థానిక ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల వల్ల వరద నీరు రావడంతో ప్రాజెక్ట్ నీటిమట్టం క్రమంగా పెరుగుతుంది. ప్రస్తుతం ప్రాజెక్ట్లోకి 2315 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రాజెక్ట్ నుంచి కాకతీయ కాలువ ద్వారా 100 క్యూసెక్కులు, మిషన్ భగీరథ ద్వారా 231 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 341 క్యూసెక్కుల నీరు పోతుంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091(80.5 టీఎంసీలు) అడుగులు కాగా మంగళవారం సాయంత్రానికి ప్రాజెక్ట్లో 1062.60 (13.23 టీఎంసీలు) అడుగుల నీరు నిల్వ ఉందని ప్రాజెక్ట్ అధికారులు అన్నారు. విత్తుకు జీవం పోసిన వాన బాల్కొండ: ప్రస్తుత సంవత్సరం ముందస్తుగా మే నెలలోనే వర్షాలు కురవడంతో అన్నదాతలు ముందస్తుగానే మక్క, పసుపు పంటను విత్తారు. కానీ పది రోజుల వరకు వర్షాలు కురువక పోవడంతో విత్తనాలు మొలకెత్తక అన్నదాతలు ఆందోళన చెందారు. రెండు రోజుల నుంచి వర్షాలు కురుస్తుండటంతో విత్తుకు ప్రాణం పోసినట్లయిందని అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పది రోజుల క్రితం విత్తిన విత్తనాలు మొలకెత్తుడకు డోఖా లేదంటున్నారు. మృగశిర కార్తే కాగానే వర్షాలు కురవడంతో విత్తనాలు పూర్తిచేయుటకు రైతులు పంటభూముల్లో బిజీగా గడుపుతున్నారు. 18లోపు ఫీజు చెల్లించండి నిజామాబాద్ అర్బన్: జిల్లా విద్యాశాఖ పరిధిలో ట్రైనింగ్ కోర్సు పూర్తి చేసుకున్న అభ్యర్థులు,గతంలో ఫెయిల్ అయిన వారు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఫీజు చెల్లించాలని జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 18 లోపు రూ.150 చె ల్లించాలన్నారు. రూ.50 అపరాధ రుసుముతో ఈనెల 24 లోపు ఫీజులు చెల్లించాలన్నారు. ఈవీఎం గోదాం పరిశీలన కామారెడ్డి క్రైం: ఎన్నికల సంఘం ఆదేశాల మే రకు ఈవీఎం గోడౌన్కు రక్షణ చర్యలు కల్పించాలని సెక్యూరిటీ సిబ్బందిని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆదేశించారు. మూడు నెలల సాధారణ తనిఖీల్లో భాగంగా మంగళవారం కలెక్టర్ ఈవీఎం గోడౌన్ను సందర్శించారు. గోడౌన్లో సెక్యూరిటీ కోసం చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈవీఎం గోడౌన్ను గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో పరిశీలించామన్నారు. -
14న జాతీయ లోక్ అదాలత్
నిజామాబాద్ లీగల్: ఈనెల 14న జరిగే జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా జడ్జి జీవీఎన్ భరతలక్ష్మి తెలిపారు. జిల్లా కోర్టులో మంగళవారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. లోక్ అదాలత్లో సివిల్, క్రిమినల్, మోటార్ వాహన బీమా, మున్సిపల్, పీఎల్సీ, కుటుంబ తగాదాలు, చెక్ బౌన్స్లకు సంబంధించిన కేసులను పరిష్కరించుకోవాలన్నారు. పట్టుదలకు పోకుండా పట్టువిడుపులతో తమ కేసులను పరిష్కరించుకునేందుకు లోక్ అదాలత్ చక్కని మార్గమన్నారు. కేసుల పరిష్కారం కోసం జిల్లావ్యాప్తంగా అన్ని కోర్టుల్లో ప్రత్యేక బెంచులు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఉదయ భాస్కర్రావు పాల్గొన్నారు. -
ఆర్మూర్లో బధిరుల పాఠశాల
ఆర్మూర్ పట్టణంలోని టీచర్స్ కాలనీలో 12 ఎకరాల సువిశాల స్థలంలో 1983 సెప్టెంబర్లో చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా, మెదక్ డయాసిస్ ఆధ్వర్యంలో తెలంగాణలోనే ఏకై క బధిరుల పాఠశాల ప్రారంభమైంది. ● ఐదుగురు విద్యార్థులతో ప్రారంభించిన పాఠశాల నేడు ఎంతో మందికి సేవలందిస్తూ ప్రత్యేక అవసరాలు గల పిల్లల్లో (దివ్యాంగుల్లో) ఆత్మ విశ్వాసాన్ని నింపుతోంది. ● ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాకు చెందిన విద్యార్థులతోపాటు ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాలకు చెందిన సుమారు 110 మంది విద్యనభ్యసిస్తున్నారు. వీరికి 15 మంది సిబ్బంది సేవలందిస్తున్నారు. ● పాఠశాల ప్రారంభం నుంచి సుమారు 500 మందికి పైగా చెవిటి, మూగ విద్యార్థులు విద్యాభ్యాసం పూర్తి చేసుకొని ఆయా ప్రాంతాలలో వివిధ వృత్తులలో జీవనం కొనసాగిస్తున్నారు. ● విద్యార్థులందరికీ సీఎస్ఐ గతంలో ఉచితంగా విద్యా, వసతిని కల్పించేది. ● ప్రస్తుతం నామమాత్రపు ఫీజులతో సంస్థను కొనసాగిస్తున్నారు. ● విద్యార్థులకు సామూహిక, వ్యక్తిగత వినికిడి యంత్రాల సహాయంతో పాఠ్యాంశాలను బోధిస్తూ ఆడిటరీ ట్రెయినింగ్, స్పీచ్ థెరపీని అందిస్తున్నారు. ● వృత్తి విద్య, సాంస్కృతిక, క్రీడా, విద్యా అంశాలలో బధిర విద్యార్థులను నిష్ణాతులుగా తీర్చిదిద్దుతున్నారు. – ఆర్మూర్మీకు తెలుసా? -
వెంటాడుతున్న సమస్యలు
బోధన్: నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితులు గతంతో పోలిస్తే కొంత మెరుగైనప్పటికీ.. తరగతి గదులు, ఉపాధ్యాయుల కొరత, కనీస మౌలిక సౌకర్యాలు తదితర సమస్యలు వెంటాడుతున్నాయి. ● సాలూర మండలం హున్సా మండల పరిషత్ ఉన్నత పాఠశాల శిథిలావస్థలో ఉన్న భవనంలో కొనసాగుతోంది. తరగతి గదులు ఎప్పుడు కూలిపోతాయో తెలియని పరిస్థితి ఉందని టీచర్లు, విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరుగుదొడ్ల నిర్మాణ పనులు అసంపూర్తిగా ఉన్నాయి. గ్రామ శివారులో నూతన భవన నిర్మాణ పనులు పునాది దశలో రెండేళ్ల క్రితమే ఆగిపోయాయి. ఖాజాపూర్ ప్రాథమికోన్నత పాఠశాల ఆవరణలో ఎండాకాలంలో ప్రారంభించిన మరుగుదొడ్డి నిర్మాణం ఇప్పటికీ పూర్తి కాలేదు. ఈ పాఠశాలలో ఏడు తరగతులకుగాను నాలుగు గదులున్నాయి. ఆఫీస్ గదిలో తరగతులు నిర్వహిస్తున్నారు. ● బోధన్ పట్టణంలోని అంబేడ్కర్నగర్ ప్రాథమిక పాఠశాల భవనం గదులు బీటల వారి కూలిపోయే దశకు చేరడంతో గత విద్యాసంవత్సరంలోనే సమీపంలోని ద్యాకంగల్లీ ప్రాథమికోన్నత పాఠశాలకు విద్యార్థులను షిప్ట్ చేశారు. తట్టికోట కాలనీలోని ప్రాథమిక పాఠశాలకు వెళ్లే దారి ఎత్తు ప్రదేశంలో ఉండటంతో ప్రమాదకరంగా ఉంది. ఈ పాఠశాల ప్రహరీ నిర్మాణ పనులు సగంలో నిలిచిపోయాయి. ● రెంజల్ మండలంలోని దూపల్లి ప్రాథమిక పాఠశాలలో రెండేళ్ల క్రితం రూ.40 లక్షలతో చేపట్టిన నాలుగు అదనపు తరగతి గదుల నిర్మాణ పనులు అర్ధంతంగా నిలిచిపోయాయి. -
వాటర్ ట్యాంక్ ఎక్కిన కాంగ్రెస్ నాయకులు
బోధన్టౌన్(బోధన్): ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డికి మంత్రి పదవి ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ బోధన్ పట్టణ యువజన కాంగ్రెస్ నాయకులు బీటీ నగర్ కా లనీలోని వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపారు. సీ నియర్ నాయకుడు, కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచిన సుదర్శన్రెడ్డికి అధిష్టానం మంత్రి పదవి ఇవ్వక పోవడం సరికాదని, సీఎం రేవంత్రెడ్డి తక్షణ మే అధిష్టానంతో మాట్లాడి మంత్రి పదవి ఇవ్వా లని డిమాండ్ చేశారు. సుదర్శన్రెడ్డికి మంత్రి పదవి ఇవ్వకపోతే తాము ట్యాంక్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటామని యువజన కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు తలారి నవీన్కుమార్తోపాటు మరో ముగ్గురు నాయకులు హెచ్చరించారు. సమాచారం అందుకున్న పోలీసులు బీటీనగర్ కాలనీకి చేరుకుని పార్టీ పట్టణ అధ్యక్షుడు పాషా మొయినొద్దీన్తో మా ట్లాడారు. వాటర్ ట్యాంక్ ఎక్కిన వారిని కిందికి ది గాలని పోలీసులు కోరారు. అయినప్పటికీ వారు వినకపోవడంతో కలగజేసుకున్న నాయకులు.. తాము పీసీసీ అధ్యక్షుడితో మాట్లాడామని చెప్పడంతో వారు ట్యాంక్పై నుంచి కిందికి దిగి వచ్చారు. సుదర్శన్రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని.. సముదాయించిన నాయకులు, పోలీసులు -
అమ్మమాట– అంగన్వాడీ బాట
కమ్మర్పల్లి: అంగన్వాడీ కేంద్రాలను మరింత బలోపేతం చేసేందుకు, చిన్నారుల ప్రవేశాల సంఖ్యను పెంచేందుకు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఈనెల 10 నుంచి 17 వరకు ’అమ్మమాట.. అంగన్వాడీ బాట’ పేరుతో ఒక్కో రోజు ఒక్కో కార్యక్రమం నిర్వహించాలని షెడ్యూల్ విడుదల చేసింది. స్పెషల్ అడ్మిషన్ డ్రైవ్ నిర్వహించి అర్హత గల పిల్లలందరూ అంగన్వాడీ కేంద్రాలకు వచ్చేలా ప్రణాళికలు రూపొందించింది. ఈమేరకు సిబ్బందికి ఆదేశాలు సైతం జారీ చేసింది. ఒక్కో రోజూ.. అంగన్వాడీ కేంద్రాల్లో అందుబాటులో ఉన్న సౌకర్యాలను వివరిస్తూ సిబ్బంది కార్యక్రమాన్ని కొనసాగించనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు కోసం కొనసాగుతున్న బడిబాట కార్యక్రమంలో ఉపాధ్యాయులతో కలిసి అంగన్వాడీలు, సిబ్బంది విద్యార్థుల నమోదు కోసం ఇప్పటికే ఇంటింటికి తిరుగుతున్నారు. ఈక్రమంలో అంగన్వాడీల్లోనూ ప్రవేశాల కోసం ప్రత్యేక కార్యాచరణను రూపొందించారు. ఒక్కో రోజు ఒక్కో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించారు. ● 10న అంగన్వాడీలను అందంగా అలంకరించాలి. చిన్నారులను, వారి తల్లిదండ్రులను కేంద్రాలకు ఆహ్వానించి సెల్ఫీలు తీసుకోవాలి, గ్రామస్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించాలి. ● 11న గ్రామాల్లో మూడేళ్లలోపు పిల్లలను గుర్తించాలి. వారిని అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించేలా పిల్లల తల్లిదండ్రులకు వివరించాలి. అంగన్వాడీ కేంద్రాల్లో అందుతున్న సౌకర్యాలను వివరించి ఆ సేవలు పొందేలా వారిని ప్రోత్సహించాలి. అంగన్వాడీ కేంద్రంలో చదువు పూర్తయిన విద్యార్థులకు సర్టిఫికెట్లు అందించాలి. అయిదేళ్లు దాటిన పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో చేరేలా ప్రోత్సహించాలి. ● 12,13,16 తేదీల్లో.. అంగన్వాడీ కేంద్రాల ఆవరణల్లో ‘పోషణ వాటిక’ (కిచెన్ గార్డెన్లు) అభివృద్ధి చేయాలి. పోషకాహారం గురించి ప్రజలకు వివరించాలి. అంగన్వాడీ కేంద్రాల్లో చెత్త, ఇతర వ్యర్థాలను తొలగించి, పరిసరాల్లో మొక్కలు నాటాలి. అంగన్వాడీ కేంద్రాల్లో విద్యార్థులను ఆకట్టుకునేలా తగిన వాతావరణాన్ని కల్పించాలి. ● 17న చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించాలి. అలాగే పాఠాలు, టైం టేబుల్, సాంస్కృతిక కార్యక్రమాలు తదితర అంశాలపై అవగాహన కల్పించాలి. స్టడీ మెటీరియల్ అందించాలి. అంగన్వాడీల్లో అడ్మిషన్ల సంఖ్య పెంచడమే లక్ష్యంగా కార్యాచరణ ఈనెల 10 నుంచి 17 వరకు వివిధ కార్యక్రమాల నిర్వహణ అంగన్వాడీ సేవలు సద్వినియోగం చేసుకోవాలి అంగన్వాడీ కేంద్రాల్లో అందుతున్న సౌకర్యాలను అర్హులు సద్వినియోగం చేసుకోవాలి. విద్యార్థుల నమోదు కోసం ఈనెల 10నుంచి 17 వరకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ ప్రకటించింది. ఇప్పటికే అంగన్వాడీ కేంద్రాలు తెరుచుకున్న తరుణంలో ఉపాధ్యాయులు, సిబ్బంది బడిబాట కార్యక్రమంలో పాల్గొంటూ తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు. షెడ్యూల్ ప్రకారం కార్యక్రమాలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నాం. –ఐ స్వర్ణలత, సీడీపీవో, భీమ్గల్ -
అరకొర వసతులు..
ఆర్మూర్ : మండల పరిషత్, ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో మౌలిక వసతులు కరువయ్యాయి. ఉన్నత పాఠశాల పాఠశాలల్లో సరిపడా మూత్రశాలలు, మరుగుదొడ్లు లేక బహిరంగ ప్రదేశాలను ఆశ్రయించాల్సిన దుస్థితి నెలకొంది. ఆర్మూర్ మండలంలో 21 ఉన్నత, 41 ప్రైమరీ పాఠశాలలున్నాయి. 50 సంవత్సరాల క్రితం నిర్మించిన కొన్ని పాఠశాలలు శిథిలావస్థలో ఉన్నాయి. ఆర్మూర్ మండలం ఫతేపూర్, గోవింద్పేట్ పాఠశాలలు శిథిలావస్థకు చేరుకున్నాయి. డొంకేశ్వర్ మండలం నూత్పల్లిలోని బీసీ బాలుర గురుకుల పాఠశాలలో బాత్రూం తలుపులు మరమ్మతులు చేయాల్సి ఉంది. అలాగే ఈ పాఠశాలకు సంబంధించిన మరో భవనం శిథిలావస్థలో ఉంది. శిథిలావస్థలో ఐలాపూర్ హాస్టల్ భవనం నందిపేట మండలంలోని ఐలాపూర్లో సంక్షేమ వసతిగృహం శిథిలావస్థకు చేరుకుంది. నూతన భవన నిర్మాణానికి ప్రభుత్వం రూ.2.45 కోట్లు మంజూరు చేసింది. కానీ ఇప్పటివరకు పనులు ప్రారంభించలేదు. ఓ వైపు హాస్టల్ భవనం కూలిపోయే స్థితిలో ఉండగా.. మరోవైపు వర్షా లు ప్రారంభం కావడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. -
విత్తన పసుపునకు డిమాండ్
బాల్కొండ: పసుపు పంటకు గత సీజన్లో మంచి ధర లభించడంతో చాలా మంది రైతులు పసుపు పంట సాగుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో విత్తన పసుపునకు డిమాండ్ పెరిగింది. రెండేళ్ల క్రితం వరకు పసుపు పంటకు ధర లేకపోవడంతో రైతులు గతేడాది సాగు విస్తీర్ణం తగ్గించారు. కానీ, ఊహించని విధంగా పసుపు పంటకు క్వింటాలుకు రూ. 20 వేల వరకు ధర పలకడంతో రైతులు మళ్లీ పసుపు పంట సాగుపై దృష్టి సారించారు. ప్రస్తుతం పసుపు సాగు చేసేందుకు విత్తనం అవసరం. కానీ, మార్కెట్లో విత్తనం అందుబాటులో ఉండదు. కేవలం రైతుల వద్దనే లభిస్తుంది. దీంతో ప్రస్తుతం బస్తాల చొప్పున పసుపు విత్తనం కొనుగోలు చేస్తున్నారు. ముక్కలు చేసిన పసుపు బస్తాను రూ. 2 వేలకు కొనుగోలు చేస్తున్నారు. పొరుగు జిల్లాల నుంచి వచ్చి.. పసుపు పంట నిజామాబాద్ జిల్లాలోనే అధికంగా సాగు చేస్తారు. కానీ, ప్రస్తుతం పొరుగు జిల్లాలు అయిన నిర్మల్, ఆదిలాబాద్ రైతులు అధికంగా పసుపు సాగుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో నిజామాబాద్కు వచ్చి విత్తన పసుపును కొనుగోలు చేస్తున్నారు. కొందరు వ్యాపారులు కూడా విత్తన పసుపుతో వ్యాపారం చేస్తున్నారు. ఇక్కడ బస్తా రూ 2 వేలకు కొనుగోలు చేసి వారి ప్రాంతంలో రూ. 2500 లకు విక్రయిస్తున్నారు. బస్తాకు రూ.2 వేలు కొనుగోలుకు ఆసక్తి చూపుతున్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రైతులు -
‘రూరల్‘లో మౌలిక సౌకర్యాలు కరువు
డిచ్పల్లి: డిచ్పల్లి మండలంలోని మిట్టపల్లిలో ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరింది. నూతన పాఠశాల భవనం నిర్మాణం కోసం మూడేళ్ల క్రితం ప్రతిపాదనలు పంపించారు. ఇప్పటి వరకు నిధులు మంజూరు కాలేదు. ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి ఉంది. అలాగే మెంట్రాజ్పల్లి ఉన్నత పాఠశాల, సాంపల్లి ప్రాథమికోన్నత పాఠశాల, కొరట్పల్లి, రైల్వేస్టేషన్, కమలాపూర్, డిచ్పల్లిలోని ప్రాథమిక పాఠశాలల అదనపు తరగతి గదుల కోసం ప్రతిపాదనలు పంపిస్తే ఇప్పటివరకు నిధులు మంజూరు కాలేదు. మోపాల్ మండలంలో.. మోపాల్లోని ఒడ్డెరకాలనీ ప్రాథమిక పాఠశాలలో ఇటీవల కురిసిన వర్షానికి తరగతి గది పెచ్చులూడిపోయాయి. రెండు గదులు మాత్రమే ఉండగా, ఒక గది శిథిలావస్థకు చేరింది. పెచ్చులూడిపోయిన విషయాన్ని పాఠశాల హెచ్ఎం బద్రినాథ్ ఎంఈవో, డీఈవో, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. సిరికొండ మండలంలో.. మండలంలోని 35 పాఠశాలల్లో అమ్మ ఆదర్శ పాఠశాల పథకం ద్వారా మరమ్మతులకు నిధులు మంజూరయ్యాయి. 32 పాఠశాలల్లో పనులు పూర్తికాగా, మూడు పాఠశాలల్లో కొనసాగుతున్నాయి. ధర్పల్లి, రూరల్ మండల్లాలో.. రూరల్ మండలంలోని తిర్మన్పల్లిలో ప్రాఽథమిక ఉన్నత, ప్రాథమిక పాఠశాలలు రెండు పక్కపక్కనే ఉన్నాయి. ప్రహరీ లేక పోవడంతో పాఠశాల ఆవరణలోకి పశువులు వస్తున్నాయి. ధర్పల్లి మండలంలో అమ్మ ఆదర్శ పాఠశాల పథకం కింద 25 పాఠశాలను అభివృద్ధి చేశారు. -
కనిపించని తల్లి చేపలు
బాల్కొండ : తల్లిచేపలు లేకపోవడంతో ప్రతి ఏటా చేపపిల్లల ఉత్పత్తి కోసం పోచంపాడ్లోని జాతీయ చేపపిల్లల ఉత్పత్తి కేంద్రం అధికారులు నానా తంటాలు పడుతున్నారు. కానీ, స్వతహాగా తల్లి చేపల పెంపకం చేపడితే నాణ్యమైన చేపపిల్లల ఉత్పత్తికి ఢోకా ఉండదని భావించి కేంద్ర ప్రభుత్వం 2017లో తల్లి చేపల కేంద్రం నిర్మాణానికి నిధులు మంజూరు చేసింది. దక్షిణ భారతదేశంలోనే పోచంపాడ్ కేంద్రంగా రూ. 5కోట్ల నిధులతో నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. కాగా, అందులో సగం వాట రారష్ట్ర ప్రభుత్వమే భరించాలని సూచించింది. దీంతో చేపపిల్లల పునరుద్ధరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధుల నుంచే తల్లిచేపల కేంద్రానికి నిధులను రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా మళ్లించింది. 2017లో పనులు ప్రారంభమైనా ఇప్పటి వరకు ఒక్క తల్లి చేపను ఉత్పత్తి చేయలేదు. తల్లి చేపల పెంపకంపై అధ్యయనం కోసం జిల్లా నుంచి మత్స్యకారులు, అధికారులు ఒడిశాకు వెళ్లి వచ్చారు. రెండేళ్ల క్రితం ఒడిశా నుంచి తల్లి చేపల పెంపకానికి నాణ్యమైన చేపలను ప్రభుత్వం సరఫరా చేసింది. కానీ, ఆ చేపలు ఎక్కడ ఉన్నాయో అధికారులకే తెలియదు. తల్లి చేపల కేంద్రంలో నీటి కొరత తీవ్రంగా ఉండటంతోనే ఆ చేపలు చనిపోయినట్లు అధికారులు చెబుతున్నారు. అందుబాటులోకి వస్తే.. తల్లి చేపల పెంపకాన్ని సరిగ్గా నిర్వహిస్తే నాణ్యమైన చేపపిల్లలను ఉత్పత్తి చేయొచ్చు. దీంతో జిల్లాలోని చెరువులకు, ప్రాజెక్టులోకి ఉచితంగా చేపపిల్లల సరఫరా చేసే అవకాశం కలుగుతుంది. కానీ, ఆ దిశగా పాలకులు, అధికారులు చర్యలు చేపట్టడం లేదు. దీంతో తల్లి చేపల కేంద్రం ముళ్ల పొదల్లో మగ్గుతోంది. తల్లిచేపల కేంద్రాన్ని అందుబాటులోకి తెస్తే తల్లి చేపల, చేపపిల్లల టెండర్లలో కమీషన్లకు గండి పడుతుందనే ఉద్దేశంతోనే నిర్లక్ష్యం వహిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ముళ్ల పొదల్లో మగ్గుతున్న కేంద్రం ఎనిమిదేళ్లుగా ఉత్పత్తి శూన్యంఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం పోచంపాడ్లోని తల్లిచేపల కేంద్రం పనుల అసంపూర్తిపై ఉన్నతాధికారులకు నివేదించాం. త్వరలోనే సంబంధిత అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. తల్లి చేపల పెంపకం ఇక్కడే చేపడితే నాణ్యమైన చేప పిల్లలను ఉత్పత్తి చేయొచ్చు. – దామోదర్, మత్స్య అభివృద్ధి అధికారి, పోచంపాడ్ -
నిజామాబాద్
14న జాతీయ లోక్ అదాలత్ ఈనెల 14న జరిగే జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాల ని జిల్లా జడ్జి జీవీఎన్ భరతలక్ష్మి అన్నారు.బుధవారం శ్రీ 11 శ్రీ జూన్ శ్రీ 2025– 8లో uడొంకేశ్వర్ మండలం నూత్పల్లిలో రేకులు పగిలిపోయి శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ పాఠశాల భవనం సుంకెట్ ఉన్నత పాఠశాల ఆవరణలో అసంపూర్తిగా ఉన్న డైనింగ్ హాల్ నిర్మాణం -
నేడు డీఈవోతో ‘సాక్షి’ ఫోన్ఇన్
95531 30597 / 79950 87611వేసవి సెలవుల అనంతరం గురువారం నుంచి పాఠశాలలు పున:ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం సాక్షి ఆధ్వ ర్యంలో జిల్లా విద్యాశాఖాధికారి అశోక్ తో సాక్షి ఫోన్ఇన్ కార్య క్రమం ఉంటుంది. పాఠశాలల్లో నెలకొన్న సమస్యలు, పరిష్కార మార్గాలు, నూతన విద్యా సంవత్సరంలో విద్యార్థుల మార్గదర్శకాల కోసం తల్లిదండ్రులు డీఈవోతో నేరుగా ఫోన్ చేసి మాట్లాడవచ్చు. సమయం: ఉదయం 11.00 గంటల నుంచి 12.00 గంటల వరకు..తేది : 11–06–2025 (బుధవారం)ఫోన్ చేయాల్సిన నంబర్: -
నాణ్యమైన భోజనం అందించాలి
మోపాల్: మధ్యాహ్న భోజనం తయారీ, పంపిణీలో హెచ్ఎంలు, ఏజెన్సీలు సమన్వయం చేసుకుని విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ సూచించారు. నగరశివారులోని బోర్గాం(పి) జి ల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్నభోజనంపై ఒకరోజు శిక్షణను మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ.. విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజన విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దని ఏజె న్సీల నిర్వాహకులు, హెచ్ఎంలకు సూచించా రు. వంట పాత్రలు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, వర్షాకాలంలో ఏమాత్రం అలసత్వం పనికిరాదన్నారు. కోర్సు డైరెక్టర్ శంకర్ మాట్లాడుతూ.. పాఠశాలల్లో పరిశుభ్రత పాటి స్తూ నాణ్యమైన భోజనం తయారు చేయాలని అన్నారు. పరిశుభ్రత పాటించే విధానాలపై రిసోర్స్ పర్సన్లు లింగన్న, సురేశ్ వీడియోల ద్వారా అవగాహన కల్పించారు. మధ్యాహ్న భోజనం వండే విధానాన్ని ప్రదర్శించి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జిల్లాలోని 80 మంది కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, 80 మంది కుక్ అండ్ హెల్పర్లు పాల్గొన్నారు. -
కూలిన చెట్లు.. విరిగిన స్తంభాలు
సుభాష్నగర్/నిజామాబాద్ అర్బన్: జిల్లా వ్యాప్తంగా సోమవారం రాత్రి కురిసిన ఈదురు గాలుల వర్షం బీభత్సం సృష్టించింది. సగటు వర్షపాతం 15.8 నమోదైంది. భారీ వృక్షాలు, 123 విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. 20 ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. జిల్లా కలెక్టరేట్ అధికారులు నష్టాన్ని అంచనా వేస్తున్నారు. నష్టం తీవ్రంగా ఉండడంతో విద్యుత్ శాఖ, రెవెన్యూ శాఖ అధికారులు పునరుద్ధరణ పనులు చేపట్టారు. నందిపేట్, మాక్లూర్, నవీపేట్ మండలాల్లో వడగండ్ల వాన కురిసింది. అక్కడక్కడా చెట్ల కొమ్మలు, వృక్షాలు తీగలపై పడి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మూడు వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్లు ధ్వంసం కాగా, ఎన్పీడీసీఎల్కు రూ.18.30 లక్షల నష్టం కలిగింది. గాలులకు ద్విచక్రవాహనాలు కింద పడిపోగా, ఇళ్లపై రేకులు ఎగిరిపోయాయి. హోర్డింగులు, ఫ్లెక్సీలు నేలకూలాయి. వర్షంతో కూడిన బలమైన ఈదురు గాలులకు ప్రజలు బెంబేలెత్తిపోయారు. ఏర్గట్ల, మోపాల్, పొతంగల్ మండలాల్లో మూడు వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్లు ధ్వంసమయ్యాయి. జిల్లా కేంద్రంలో చెట్ల కొమ్మలు విరిగి పడి 17 స్తంభాలు నేలకొరిగాయి. విద్యుత్ సిబ్బంది కూలిన విద్యుత్ స్తంభాల స్థానంలో కొత్త వాటిని ఏర్పాటు చేసి ఐదారు గంటల్లో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. ఎస్ఈ నుంచి సబ్స్టేషన్ ఆపరేటర్ వరకు రాత్రంతా విధుల్లోనే ఉన్నారు. మండలాల్లో మంగళవారం మధ్యాహ్నం వరకు పూర్తిస్థాయిలో విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు. వేగంగా విద్యుత్ పునరుద్ధరణపై వినియోగదారులు హర్షం వ్యక్తం చేశారు. గాలివాన బీభత్సం నేలకొరిగిన 123 విద్యుత్ స్తంభాలు మూడు వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్లు ధ్వంసం ఎన్పీడీసీఎల్కు రూ.18.30 లక్షల నష్టం పాక్షికంగా దెబ్బతిన్న 20 ఇళ్లు జిల్లాలో 15.8 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదు చెట్టు కూలి లైన్ ఇన్స్పెక్టర్ మృతి ఖలీల్వాడి/బాన్సువాడ : ఈదురు గాలి వర్షం వల్ల ఇద్దరు మృత్యువాత పడ్డారు. నిజామాబాద్ నగరం వినాయక్నగర్లో సోమవారం రాత్రి తీవ్రమైన వర్షానికి సంజీవరెడ్డి కాలనీకి చెందిన విద్యుత్ లైన్ ఇన్స్పెక్టర్ ఆస్వాడ్ శ్రీనివాస్ (55) తల దాచుకోడానికి పక్కనున్న కల్లు బట్టిలోకి వెళ్లాడు. అదే సమయంలో చెట్టుకూలి కల్లుబట్టి రేకులపై బడింది. రేకులు విరిగి శ్రీనివాస్ పై పడ్డాయి. దీంతో తీవ్రగాయాలైన అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసినట్లు నాల్గో టౌన్ ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలోని తాడ్కోల్ శివారులో గల డబుల్ బెడ్ రూం కాలనీకి చెందిన ప్రభు (55) రాత్రి తన ఇంటి డాబాపై పడుకున్నాడు. ఒక్కసా రిగా ఈదురు గాలులు రావడంతో నిద్రలోంచి లేచి కిందికి దిగుతుండగా కాలుజారి కింద పడ్డా డు. తల పగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసినట్లు సీఐ అశోక్ తెలిపారు. దాబాపై నుంచి పడి మరొకరు.. -
అవే శిథిల గదులు
నిజామాబాద్అర్బన్: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం చేపట్టిన పనులు అసంపూర్తిగా మిగిలాయి. సుమారు 68కి పైగా పాఠశాలల్లో కొన్ని చోట్ల పనులు ఇంకా కొనసాగుతుండగా.. మరికొన్ని చోట్ల ఇంకా ప్రారంభం కాలేదు. అసౌకర్యాల మధ్యే ఈ విద్యా సంవత్సరం సైతం ప్రారంభం కానుంది. గత ప్రభుత్వం ‘మన ఊరు – మన బడి’ కార్యక్రకమం కింద పాఠశాలల అభివృద్ధికి నిధులు మంజూరు చేసింది. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభు త్వం ‘మన ఊరు – మన బడి’ని నిలిపివేయడంతో 40 పాఠశాలల్లో పనులు అర్ధంతరంగా నిలిచిపో యాయి. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ‘అమ్మ ఆద ర్శ కమిటీలను తెరపైకి తీసుకవచ్చి పనులు చేపట్టినప్పటికీ పూర్తి చేయలేదు. 334 ప్రభుత్వ పాఠశాలలకు ప్రహరీలు, 154 బాలుర పాఠశాలల్లో మరుగుదొడ్లు లేవు. 72 స్కూళ్ల భవనాల మరమ్మతులు చేయాల్సి ఉంది. ఇందులో కొన్నింటిని అమ్మ ఆద ర్శ పాఠశాల కింద ఎంపిక చేసి మరమ్మతులు చేపట్టాలని నిర్ణయించినప్పటికీ పనులు ప్రారంభం కా లేదు. 57 పాఠశాలలకు అదనపు గదులు అవసరం ఉంది. 23 పాఠశాలల భ వనాలకు తక్షణమే మరమ్మతులు చేపట్టాల్సి ఉంది. 346 పాఠశాలలకు ఫర్నిచర్ కొరత ఉంది. అరకొర వసతుల మధ్యే ఈ ఏడాది సైతం పాఠశాలలు పున:ప్రారంభం కానున్నాయి. పాఠశాలల నిర్వహణ, మౌలిక వసతుల కల్పన కోసం ప్రభుత్వాలు ఎన్నికార్యక్రమాలు చేపడుతున్నా పరిస్థితిలో మార్పు కనిపించడం లేదు. నిధుల కొరత కారణంగా వేసవి సెలవుల్లో పనులు పూర్తి కాలేదు. జిల్లాలో 1156 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా.. ఇందులో అమ్మ ఆదర్శ పాఠశాలల కింద 760 స్కూళ్లను ఎంపిక చేశారు. రూ.42 కోట్ల 38 లక్షలు నిధులు మంజూరు చేయాల్సి ఉండగా.. రూ.21 కోట్ల 32 లక్షలు మాత్రమే మంజూరు చేశారు. సమస్యల వలయంలో ప్రభుత్వ పాఠశాలలు 68 స్కూళ్లలో పూర్తికాని పనులు నిధులు లేక ముందుకు సాగని పరిస్థితి రేపటి నుంచి పున:ప్రారంభం పనులు కొనసాగుతున్నాయి జిల్లాలో గుర్తించి ప్రభుత్వ బడుల్లో కొన్ని చోట్ల పనులు కొనసాగుతున్నయి. మరికొన్ని ఆలస్యంగా ప్రారంభం కావడంతో పనులు పూర్తి కావడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. అయినప్పటికీ విద్యార్థులకు ఇబ్బందులకు ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం. – అశోక్, జిల్లా విద్యాశాఖాధికారి పట్టని సంక్షేమం జిల్లాలో 42 ఎస్సీ, 33 బీసీ, 8 ఎస్టీ వసతిగృహాలున్నాయి. 18 ఎస్సీ వసతి గృహాల్లో మరమ్మతులు చేపట్టాల్సి ఉంది. వేసవి సెలవులకు ముందే వసతిగృహల్లో మరమ్మతులు చేపట్టాల్సి ఉండగా నిధులు లేకపోవడంతో పనులను ప్రారంభించలేదు. ఎస్టిమేషన్ నివేదికలు రాష్ట్ర ఉన్నతాధికారులకు పంపించి వేచి చూస్తున్నారు. అలాగే బీసీ, ఎస్టీ వసతిగృహాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. జిల్లా కేంద్రంలోని బీసీ వసతిగృహం పెచ్చులూ డి విద్యార్థులకు ఇబ్బందికరంగా మారింది. -
మూడు పెళ్లిళ్లు చేసుకున్నా ఒక్కరూ కాపురం చేయలేదు..!
కామారెడ్డి: డబ్బులు ఉన్నప్పుడు దుబార ఖర్చులు చేశారు. కాలక్రమేనా.. కనీసం టీ తాగటానికి కూడా డబ్బులు లేక సతమతమయ్యారు. దానికి తోడు కొడుకు సతీశ్కు ఆరు నెలల క్రితం పక్షవాతం రావటంతో సేవలు చేయటానికి కూడా ఎవ్వరు లేకపోవడంతో.. 75 సంవత్సరాల వృద్ధుడైన తండ్రి ఆకుల చిన్న సాయిలు ఓపిక ఉన్నకాడికి సేవలు చేశాడు. చివరికి నీకు సేవలు చేయటం నాతో కావటం లేదు బిడ్డా... ఇక నేను ఏదైన మందు తాగి చచ్చిపోతాను అని తన అభిప్రాయాన్ని ఈ నెల 6 న కొడుకు సతీశ్తో చెప్పాడు. నీతోపాటు నేను కూడా అదే పని చేస్తా బాపూ అంటూ చెప్పి అదే రోజు విష గుళికలు తెప్పించుకుని నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం మాణిక్భండార్ గ్రామంలోని సొంత ఇంట్లోనే ఇద్దరూ కలిసి విషగుళికలు మింగారు. ఇద్దరూ వాంతులు చేసుకోవటంతో గమనించిన సాయిలు పెద్ద కుమారుడు సంతోష్ వెంటనే వారిద్దరిని ఆస్పత్రికి తరలించాడు. చికిత్సపొందుతూ సతీశ్ (32) సోమవారం తెల్లవారుజామున మృతి చెందాడు. తండ్రి ఆకుల చిన్న సాయిలు (75) ఆదివారం మృతి చెందాడు. రెండ్రోజుల వ్యవధిలో తండ్రీకొడుకులు మృతి చెందటంతో మాణిక్భండార్ గ్రామంలో విషాదం నెలకొంది. వ్యవసాయ భూమి అమ్మగా వచ్చిన సుమారు రూ. 90 లక్షలకు పైగా డబ్బులను సతీశ్ దుబారాగా ఖర్చు చేశాడు. తీరా చేతిలో చిల్లి గవ్వకూడా లేకుండాపోయింది. పైగా సతీశ్ మూడు వివాహాలు చేసుకున్నప్పటికీ ఒక్క భార్య కూడా కాపురం చేయలేదు. దీంతో తీవ్రమనస్తాపానికి గురై గత సంవత్సం తల్లి అనారోగ్యంతో మృతి చెందింది. ఆరు నెలల క్రితం సతీశ్కు పక్షవాతం వచ్చి మంచం పట్టాడు. అప్పటి నుంచి తండ్రి సేవలు చేశాడు. డబ్బులు లేక ఆస్పత్రిలో వైద్యం చేయించుకోలేని పరిస్థితి ఏర్పడింది. -
మోక్షమెప్పుడో?
జలాల్పూర్– తిర్మన్పల్లి రోడ్డుకునిజామాబాద్ రూరల్ : మండలంలోని తిర్మన్పల్లి, జలాల్పూర్ రోడ్డు పనులతో ఖానాపూర్ ఎక్స్ రోడ్డు బైపాస్ పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. దీంతో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అప్పటి ఎమ్మెల్సీ, ప్రస్తుత రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి 2014లో తిర్మన్పల్లి– జలాల్పూర్ రోడ్డు నిర్మాణానికి రూ. 1.22 కోట్లు కేటాయించారు. ఆ తర్వాత భూపతి రెడ్డి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో రోడ్డుకు భూములిచ్చేందుకు రైతులు నిరాకరించడంతో పనులు ఆగిపోయాయి. జలాల్పూర్– తిర్మన్పల్లి రోడ్డు పనులు పూర్తయితే నవీపేట్కు వెళ్లాలంటే దాదాపు 15 కిలోమీటర్లు దూరం తగ్గేది. రోడ్డు పనులు మధ్యలోనే నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పాలవుతున్నారు. తిర్మన్పల్లి శివారులో జలాల్పూర్ గ్రామం అంటూ బోర్డు ఏర్పాటు చేయడంతో ప్రయాణికులు ఆ మార్గంలో రోడ్డు ఉందనుకొని వెళ్తున్నారు. తీరా కొంత దూరం పోయాక రోడ్డు లేదని గ్రహించి ప్రయాణికులు వెనుదిరుగుతున్నారు. ఇంకా 8 కిలోమీటర్ల రోడ్డు పనులు నిలిచిపోయాయి. ఇటీవల రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి..తిర్మన్పల్లి గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడానికి విచ్చేయగా ఈ రోడ్డు గురించి రైతులతో మాట్లాడారు. రోడ్డు పనులు త్వరలోనే పూర్తి చేయిస్తానని అన్నారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే రేకులపల్లి భూపతిరెడ్డి స్వగ్రామం రేకులపల్లి.ఎమ్మెల్యే చొరవ తీసుకోవాలి తిర్మన్పల్లి నుంచి జలాల్ పూర్ వరకు దాదాపు 3 కిలోమీటర్లు ఉంటుంది. గత ప్ర భుత్వ హయాంలో నిధులు మంజూరయ్యాయి. కొంతమేర పనులు చేసి వదిలేశా రు. కొందరు రైతులు అభ్యంతరం చెప్పడంతో పను లు నిలిచిపోయాయి. ఎమ్మెల్యే చొరవ తీసుకుని రోడ్డు పూర్తయ్యేలా చూడాలి. – నాగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మాజీ సర్పంచ్, తిర్మన్పల్లిదూరభారం తగ్గుతుంది తిర్మన్పల్లి నుంచి జలాల్పూర్ వెళ్లే రోడ్డు పూర్తయితే రైతులకు దూరభారం తగ్గుతుంది. రైతులకు ఎంతో ఉపయోగపడుతుంది. తిర్మన్పల్లి నుంచి జలాల్పూర్ వెళ్లాలంటే గుండారం మీదుగా దాదాపు 15 కిలో మీటర్లు తిరిగి వెళ్లాల్సి వస్తోంది. అధికారులు వెంటనే ఈ రోడ్డు పనులు పూర్తి చేసి అందుబాటులోకి తేవాలి. – రాంరెడ్డి, జలాల్పూర్ నిత్యం రాకపోకలు.. ఖానాపూర్ రోడ్డు మీదుగా నిత్యం వందల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగుతుంటాయి. ముందే ఆ ప్రాంతం మొత్తం రైస్ మిల్లుల దుమ్మూధూళితో స్థానికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఖానాపూర్ రోడ్డు నుంచి బైపాస్ రోడ్డు పూర్తి అయితే ప్రయాణికులకు తిప్పలు తప్పుతాయని స్థానికులు అంటున్నారు. అసంపూర్తి రోడ్డుతో రైతులకు దూరభారం గుండారం మీదుగా 15 కిలోమీటర్లు తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి ఎమ్మెల్యే చొరవ తీసుకోవాలంటున్న రైతులు -
గ్రామాల్లో చేపలకు మహా డిమాండ్
డిచ్పల్లి: మిరుగు(మృగశిర కార్తె)ను పురస్కరించుకుని ఆదివారం మండలంలోని అన్ని గ్రామాల్లో చేపలకు మహా డిమాండ్ కనిపించింది. ప్రజలు చేపల కొనుగోలు కోసం మత్య్సకారుల వద్ద బారులు తీరారు. మిరుగు రోజు చేపలు తింటే ఆరోగ్యానికి మంచిదనే నమ్మకం ఉంది. ఈ కార్తె మొదటి రోజు చేపలు తినడం ఆనవాయితీగా వస్తోంది. సిరికొండ : మండల కేంద్రంతో పాటు గ్రామాల్లో మృగశిర కార్తె వేడుకలను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. రైతులు తమ పంట పొలాల్లో వ్యవసాయ పనులకు శ్రీకారం చుట్టారు. ఇందల్వాయి : మండలంలోని గ్రామాల్లో చెరువుల వద్ద చేపలు కొనేందుకు ప్రజలు గంటల తరబడి వేచి చూశారు. గన్నారం, ఇందల్వాయి, సిర్నాపల్లి, నల్లవెల్లి, అన్సాన్పల్లి తదితర గ్రామాల్లో శనివారం సాయంత్రం నుంచే చెరువుల వద్ద జనాల సందడి మొదలైంది. -
సినిమాలు
నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం పెర్కిట్(ఆర్మూర్): ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లిలో సోమవారం ఉదయం 9 గంటల నుంచి 11 వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగనున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. అంకాపూర్ నుంచి వచ్చే 33 కేవీ విద్యుత్ లైన్ల నిర్వహణలో భాగంగా రెండు గంటల పాటు విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు తెలిపారు. ఉషా ప్రసాద్ మల్టీప్లెక్స్ (గీతా ఏషియన్) స్క్రీన్–1 థగ్లైఫ్ –1.25,7.35, 10.40 స్క్రీన్–2 శ్రీశ్రీశ్రీ రాజావారు–10.40, 4.40, 10.35 – భైరవం–1.40, 7.40 స్క్రీన్–3 హౌస్ఫుల్–5(హిందీ)–10.30, 1.25, 4.30, 7.35, 10.40 పీవీఆర్ మల్టీప్లెక్స్ (వేణు మాల్) స్క్రీన్–1 కరాటే కిడ్ లెజెండ్స్–11.00 మిషన్ ఇంపాజిబుల్(ఇంగ్లీష్)–1.15 భైరవం–4.45, 10.35 భూల్ చుక్ మాఫ్(హిందీ)– 7.55 స్క్రీన్–2 హౌస్ఫుల్–5(హిందీ)–9.40, 3.40, 7.10, 10.40 ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్లైన్స్–1.10 స్క్రీన్–3 ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్లైన్స్–11.30 బద్మాషులు–2.00 ,థగ్లైఫ్–4.35, 10.40 పాడేరు 12 మైలు–8.00 స్క్రీన్ –4 మిషన్ 007–11.05 హౌస్ఫుల్–5బీ(హిందీ)–1.40 శ్రీశ్రీశ్రీ రాజావారు–5.10, 10.45 ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్లైన్స్–8.15 లలితామహల్ భైరవం దేవి శ్రీశ్రీశ్రీ రాజావారు నటరాజ్ హౌస్ఫుల్–5(హిందీ) విజయ్ థగ్లైఫ్24 క్యారెట్స్ 97,500 22 క్యారెట్స్ 90,002 వెండి(కిలో) 1,04,000 – నిజామాబాద్ బిజినెస్చికెన్ ధరలు (కిలోకు) స్కిన్లెస్ 200 డ్రెస్స్డ్ 180 లైవ్ 140 మటన్ 800బంగారం ధరలు (10గ్రాములు)మాంసం ధరలు -
సీఎంఆర్ఎఫ్ పేదలకు వరంలాంటిది
మోపాల్: సీఎం సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) పేదలకు వరం లాంటిదని పీసీసీ డెలిగేట్, నిర్మల్ జిల్లా పరిశీలకులు బాడ్సి శేఖర్ గౌడ్ పేర్కొన్నారు. ఆదివారం బాడ్సి, సింగంపల్లి గ్రామాలకు చెందిన 18 మంది బాధిత కుటుంబాలకు సుమారు రూ.6 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా శేఖర్ గౌడ్ మాట్లాడుతూ.. వైద్యం ఖరీదైన నేపథ్యంలో అనారోగ్యాలకు గురైన పేద కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయని, అందుకే ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థికసాయం అందించి ఆదుకుంటుందని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీని రూ.10లక్షలకు పెంచిందని గుర్తుచేశారు. పేదల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కార్యక్రమంలోబాడ్సి సొసైటీ చైర్మన్ నిమ్మల మోహన్రెడ్డి, నాయకులు మల్లయ్య, రవి, జగదీష్రెడ్డి, కొండూరు దాస్, చాకలి లింగం, గూండ్ల పోశెట్టి, కాల్పోల్ వంశీ, తదితరులు పాల్గొన్నారు. మెంట్రాజ్పల్లిలో.. డిచ్పల్లి: ఎంతోమంది పేదలకు సీఎం సహాయనిధి వరంగా మారిందని డీసీసీ డెలిగేట్ ధర్మాగౌడ్ అన్నారు. మెంట్రాజ్పల్లిలో పది మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆయన అందజేశారు. కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు సాయన్న, ఆనంద్, నరేందర్రెడ్డి, వినోద్, సుధీర్, అభి, శంకర్, రాకేష్, బాలు, బాబా, తదిదతరులు పాల్గొన్నారు. కొండాపూర్లో.. సిరికొండ: కొండాపూర్లో పలువురు బాధితులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను కాంగ్రెస్ నాయకులు ఆదివారం పంపిణీ చేశారు. పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు బుచ్చన్న, నీరటి శ్రీధర్, ఆకుల జగన్, గౌసోద్దీన్, చంద్రాగౌడ్, ఫారూఖ్, బాలసాయిలు తదితరులు పాల్గొన్నారు. పీసీసీ డెలిగేట్ బాడ్సి శేఖర్ గౌడ్ -
జీవిత భాగస్వాములను ఎంచుకోవడానికి ఒక చక్కటి వేదిక
నిజామాబాద్నాగారం : పరిచయవేదిక ఎంతో మందికి జీవిత భాగస్వాములను ఎంచుకోవడానికి ఒక చక్కటి అవకాశాన్ని కల్పించిందని అఖిల భారత ప ద్మశాలి సంఘం సెంట్రల్ బోర్డు సభ్యుడు, పద్మ శాలి పరిచయ వేదిక అధ్యక్షుడు దాసరి నర్సింలు అ న్నారు. ఆదివారం నగరంలోని వినాయన్నగర్లో గల విజయలక్ష్మి గార్డెన్లో ఏడో పద్మశాలి వధూవరుల పరిచయ వేదిక నిర్వహించారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఏటా జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న ఈ పరిచయ వేదికకు వ ధూవరుల నుంచి విశేష స్పందన లభిస్తోందన్నా రు. నిజామాబాద్ జిల్లాతో పాటు కామారెడ్డి, ఆదిలాబాద్, నిర్మల్, కరీంనగర్, సిద్ధిపేట, మెదక్ జిల్లా ల నుంచి కూడా అధిక సంఖ్యలో యువతీయువకు లు హాజరయ్యారన్నారు. కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి మైసల నారాయణ, ఆర్గనైజింగ్ సెక్రటరీ భీమర్తి రవి, కోశాధికారి దిండిగల్ల శంకర్, సంయుక్త కార్యదర్శులు భీమర్తి సురేందర్, గర్ధాస్ శంకర్, ఉపాధ్యక్షులు అంకం జగదీష్, గాలిపల్లి నా రాయణ, గెంట్యాల వెంకటేశ్, రాజేంద్రప్రసాద్, బూస శ్రీనివాస్, నగర పద్మశాలి సంఘం అధ్యక్షు డు పెంట దత్తాద్రి, తదితరులు పాల్గొన్నారు. -
సర్కారు బడిలోనే చదివించండి
బాల్కొండ: సర్కారు బడిలోనే చదివించండి అంటూ బాల్కొండ, ముప్కాల్, మెండోరా మండలాల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు ఆదివారం బడిబాట నిర్వహించారు. మెండోరా మండల కేంద్రంలో ప్ర భుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు మహిళ సంఘాల సభ్యులతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో అందిస్తున్న సౌకర్యాల గురించి వివరించారు. సర్కార్ బడిలోనే నాణ్యమై విద్యా బోధన జరుగుతుందని తెలిపారు. కొనసాగుతున్న స్వచ్ఛ కార్యక్రమం ఆర్మూర్టౌన్: పట్టణంలోని రామాలయంలో ఆర్మూర్ మహాత్మ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం స్వచ్ఛ కార్యక్రమం నిర్వహించా రు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షుడు సుంకే శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రజలు వారంలో ఏ దో ఒక రోజు ఓ గంట పాటు తమ పరిసరాల ను శుభ్రం చేసుకోవాలని సూచించారు. అనంతరం ఆలయ పరిసరాలల్లో గల పిచ్చిమొక్కల ను, మురికి కాలువలో పేరుకుపోయిన పూడికను తొలగించారు. సభ్యులు జీడీ రాజ్ కుమా ర్, నిశాంత్, అంజనేయులు, గణే్ష్, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఎన్ఎంఎంఎస్కు ఇద్దరు విద్యార్థుల ఎంపిక రుద్రూర్: నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్(ఎన్ఎంఎంఎస్)కు మండల కేంద్రంలోని బాలికల హైస్కూల్కు చెందిన విద్యార్థినులు వై.మానస, బి.అలేఖ్య ఎంపికై నట్టు పాఠశాల ఉపాధ్యాయులు తెలిపారు. వీరికి ప్రతి ఏడాది రూ.12 వేల చొప్పున నాలుగేళ్లు స్కాలర్షిప్ పొందుతారు. స్కాలర్షిప్నకు ఎంపికై న విద్యార్థినులను రైడ్ కమిటీ సభ్యులు అభినందించారు. సుదర్శన్రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలి సిరికొండ: ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కయిన బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు బండారి నరేష్ డిమాండ్ చేశారు. రాష్ట్ర మంత్రివర్గంలో ఆయనకు చోటు కల్పించకపోవడం బాధాకరమన్నారు. ఆయన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో కాంగ్రెస్ పార్టీకి ఎంతో సేవ చేశారన్నారు. పదేళ్లు పార్టీ అధికారంలో లేకపోయినా పార్టీ కోసం, కార్యకర్తల కోసం అహర్నిశలు పాటుపడిన సుదర్శన్రెడ్డికి అధిష్టానం పునరాలోచించి తక్షణమే మంత్రి పదవి ఇవ్వాలని ఆయన కోరారు. వజ్రోత్సవాలను విజయవంతం చేయాలి రుద్రూర్: మండల కేంద్రంలోని శ్రీ సార్వజనిక్ గణే ష్ మండలి ఆధ్వర్యంలో నిర్వహించే 75వ ( వజ్రోత్సవ) వార్షికోత్సవంలో గ్రామస్తులు అందరు భాగస్వామ్యులు కావాలని నిర్వాహక కమిటీ సభ్యులు పిలుపునిచ్చారు. స్థానిక శ్రీ పాండురంగ విఠలేశ్వర స్వామి ఆలయంలో శనివారం రాత్రి ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. వేడుకలు వైభవంగా నిర్వహించాలని తీర్మానించారు. ఇందుకు వివి ధ కమిటీలు ఏర్పాటు చేశారు. సమావేశంలో గణేష్ మండలి అధ్యక్ష, కార్యదర్శులు చిదుర వీరేశం, గెంటీల సాయిలు, తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి బాల్కొండ: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని మెండోరా బీజేపీ అధ్యక్షుడు ముత్యంరెడ్డి అన్నారు. ఆదివారం బు స్సాపూర్లో పార్టీ ముఖ్య నాయకుల సమావేశం ని ర్వహించి మాట్లాడారు. ఆపరేషన్ సింధూర్ను విజయవంతం చేయడంపై మోదీకి కృతజ్ఞతలు తెలుపు తూ తీర్మానం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాల ను ప్రజలకు వివరించాలన్నారు. ప్రధాని మోదీ చేపడుతున్న అభివృద్ధి పనుల గురించి ప్రజల్లోకి తీ సుకెళ్లాలన్నారు. మండల ప్రభారి గంగా సాయన్న, మాజీ ఎంపీటీసీ నడ్పి సాయన్న, తదితరులు పాల్గొన్నారు. -
రాణంపల్లి క్యాంపు వద్ద బస్షెల్టర్ పునర్నిర్మించాలి
రుద్రూర్: మండలంలోని రాణంపల్లి క్యాంపు వద్ద బస్షెల్టర్ను పునర్నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు. రాణంపల్లి క్యాంపు, రాణంపల్లి గ్రామస్తులు కోటగిరి, రుద్రూర్ మండల కేంద్రానికి వెళ్లాలంటే ఇక్కడే బస్సు కోసం వేచి ఉంటారు. రోడ్డు వెడల్పులో భాగంగా రోడ్డు ఎత్తు పెరగడం వల్ల ఇక్కడి బస్షెల్డర్ కుంగి పోయింది. వర్షం కురిసినపుడు షెల్టర్లోకి నీరు చేరి పిచ్చి మొక్కలు పెరిగి ఆధ్వానంగా మారింది. దీంతో ప్రయాణికులు రోడ్డు పక్కన ఎండలో, వానలో నిలబడాల్సి వస్తోంది. ప్రయాణికుల అవస్థలు గుర్తించి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు. -
ఆలయం పేరే ఊరు పేరైంది
మీకు తెలుసా? ఉత్తర తెలంగాణ వరప్రదాయని ఎస్సారెస్పీసమాచారం..పాల్వంచ మండలం బండరామేశ్వర్పల్లి గ్రామంలో క్రీ.శ. 1264లో కాకతీయ సామ్రాజ్య విస్తరణలో భాగంగా రాణి రుద్రమదేవి అక్కడ గుండయ్య అనే సామంతుడిని నియమించి బండరాళ్లతో రామనాథుని ఆలయాన్ని నిర్మించినట్టు ఆలయంపై ఉన్న శిలాశాసనం చెబుతోంది. భక్తులు రానురాను రామనాథున్ని రామలింగేశునిగా, రాజరాజేశ్వర స్వామిగా కొలుస్తున్నారు. బండరాళ్లతో ఆలయాన్ని నిర్మించినప్పటి నుంచి గ్రామానికి బండరామేశ్వర్పల్లి అనే పేరు వచ్చినట్టు చరిత్రకారులు చెబుతున్నారు. – మాచారెడ్డిబాల్కొండ: మండలంలోని పోచంపాడ్ సమీపంలో 1963 జూలై 26న శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్నిర్మాణం కోసం దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ శంకుస్థాపన చేశారు. ● ప్రాజెక్ట్ నిర్మాణ పనులు 1978 వరకు పూర్తయ్యాయి. ● ప్రాజెక్ట్ నీటిమట్టం 1091 అడుగులు కాగా 112 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించారు. కాని పూడిక వలన ప్రస్తుతం 80.5 టీఎంసీలకు నీల్వ సామర్థ్యం పడిపోయింది. ● ప్రాజెక్ట్ ప్రధాన కాలువలుగా కాకతీయ, సర స్వతి, లక్ష్మి ఉన్నాయి. 2010 తరువాత వరద కాలువ ద్వారా నీటి విడుదల ప్రారంభమైంది. ● 1978లోనే అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మనందారెడ్డి ప్రాజెక్ట్ నుంచి తొలిసారి కాకతీయ కాలువ ద్వారా నీటి విడుదల ప్రారంభించారు. ● ఈ ప్రాజెక్ట్ ద్వారా 18 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు అందిస్తున్నారు. ● ఉత్తర తెలంగాణలోని నిజామాబాద్, నిర్మల్, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి నల్గొండ జిల్లాల ఆయకట్టుకు నీరు అందిస్తారు. -
వల్లభాపూర్ వాసికి అమెరికాలో ఫ్రీ సీటు
● పోటీపరీక్షలో ప్రతిభచాటి వైద్యవిద్య కోర్సుకు ఎంపికై న కేశెట్టి చరణ్సిద్ధార్థ్ మాక్లూర్: మండలంలోని వల్లభాపూర్కు చెందిన కేశెట్టి చరణ్ సిద్ధార్థ్ అమెరికాలో యూఎస్ఎంఎల్ఈ కోర్సులో ఫ్రీసీటు సాధించాడు. వల్లభాపూర్లో వ్యవసాయం చే సుకుంటూ జీవించే కేశెట్టి సూర్యప్రకాష్–వనజల ఏకై క కుమారుడు చరణ్ సిద్ధార్థ్. త ల్లిదండ్రులు పట్టభద్రులైనప్పటికీ వ్యవసాయం మీద ఉన్న ప్రేమతో గ్రామంలోనే జీవిస్తుండగా, కుమారుడిని మాత్రం వైద్యుడిని చేయాలనే లక్ష్యంతో చదివిస్తున్నారు. సి ద్దార్థ్ ఇటీవల ఎంబీబీఎస్ పూర్తి చేయగా, యూఎస్ఎంఎల్ఈ కోర్సుకుగాను పోటీ పరీక్షలో అత్యాధిక మార్కులు సాధించి ఫ్రీ సీటు పొందారు. మూడేళ్లపాటు ఉండే ఈ కో ర్సుకు గ్రాంటు మొత్తాన్ని అమెరికా ప్రభుత్వమే భరిస్తుంది. సంవత్సరానికి 80 వేల డాలర్లు అక్కడి ప్రభుత్వం నుంచి గ్రాంటు వస్తున్నట్టు తల్లిదండ్రులు తెలిపారు. తల్లిదండ్రుల ప్రోత్సాహం మరువలేనిది..నన్ను డాక్టర్ చేయటానికి నా తల్లిదండ్రులు ఎంతో కష్టపడుతున్నారు. వారి కోరిక మేరకు పెద్ద డాక్టర్ అయ్యాక, వారి ఆశయాలకు అనుగుణంగా పేదోళ్లకు ఉచిత వైద్య సేవలు అందించటంలో ముందుంటాను. –కేశెట్టి చరణ్ సిద్ధార్థ్, వల్లభాపూర్ -
మరమ్మతులు చేయరు.. వినియోగించరు
బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ కార్యాలయ భవనా లు ఏళ్ల తరబడి నిరుపయోగంగా ఉంటున్నాయి. ఆ భవనాలకు మరమ్మతులు లేకపోవడం, ఉపయోగించకపోవడంతో ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకున్నాయి. అయినా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇతర ప్రాంతాలకు తరలింపు.. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి ఏటా ఒక సబ్ డివిజన్ ఇతర ప్రాంతాలకు తరలిపోయింది. అంతేకాకుండ ముంపు గ్రామాల సమస్యల కోసం స్పెషల్ కలెక్టర్ కార్యాలయం కూడ నిర్మించారు. ప్రస్తుతం స్పెషల్ కలెక్టర్ వ్యవస్థనే ఇక్కడ లేకుండా చేశారు. ప్రాణహిత చెవెళ్ల నిర్మాణం కోసం సబ్ డివిజన్– 4 నిజామాబాద్, క్వాలిటీ కంట్రోల్ విభాగం నిర్మల్కు, లక్ష్మి కాలువ నిర్వహణ కార్యాలయం బాల్కొండకు, సరస్వతి కాలువ నిర్వహణ కార్యాలయం నిర్మల్కు తరలిపోయాయి. దీంతో ప్రాజెక్ట్ వద్ద ఉన్న కార్యాలయ భవనాలు నిరుపయోగంగా ఉన్నాయి. బహుళ అంతస్తుల భవనాలు కూడ నిరుపయోగంగా ఉన్నాయి. విద్యాసంస్థలకు కేటాయిస్తే మేలు.. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ వద్ద బాలికల, బాలుర గురుకులాలు, తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలు ఉన్నాయి. అందులో బాలుర, బాలికల గురుకులాలను ఆరేళ్ల క్రితం అప్గ్రేడ్ చేస్తు ఇంటర్మీడియట్ ఏర్పాటు చేశారు. కానీ భవనాలను నిర్మించలేదు. ఇరుకు గదుల్లో, చెట్ల కింద చదువులు నేర్పుతున్నారు. ఆ గురుకులాల కళాశాలల కోసం నిరుపయోగంగా ఉన్న భవనాలను కేటాయించవచ్చు. కానీ అటువైపుగా ఎవరు ఆలోచన చేయడం లేదు. పక్కా భవనాలు కావడంతో కొంతమేర మరమ్మతులు చేపడితే వినియోగించుకోవచ్చు. కానీ వాటిని వినియోగంలోకి తీసుకురావాడానికి పాలకులు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. కనీసం విద్యా సంస్థల నిర్వహణ కోసం ఈ కార్యాలయాల భవనాలను ఉపయోగంలోకి తీసుకురావాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఏళ్లుగా ఖాళీగా ఉంటున్న ఎస్సారెస్పీ కార్యాలయ భవనాలు శిథిలావస్థకు చేరినా పట్టించుకోని అధికారులుఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం.. ప్రాజెక్ట్ కార్యాలయాల భవనాలు ఖాళీగా ఉన్నాయి. వాటిని ఇతర సంస్థలకు అప్పగించే విషయం ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. వాటి నిర్వహణకు కూడ ఎలాంటి నిధులు రావడం లేదు. ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. – చక్రపాణి, ఈఈ, ఎస్సారెస్పీసమీకృత పాఠశాల ఏర్పాటు చేయాలి ఎస్సారెస్పీలో నిరుపయోగంగా ఉన్న కార్యాలయాల్లో సమీకృత పాఠశాలను ఏర్పాటు చేయాలి. విద్యా సంస్థలకు ఆ భవనాలను కేటాయిస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. పాలకులు వెంటనే స్పందించాలి. – నర్సింగ్రావు, రిటైర్డ్ పీడీ -
సూపర్ మార్కెట్లో చోరీ
ఆర్మూర్టౌన్: పట్టణంలోని సాయి చైతన్య సూపర్మార్కెట్లో గుర్తుతెలియని దుండగులు శనివారం అర్ధరాత్రి చోరీకి పాల్పడ్డారు. దుకాణం షెటర్ను లేపి లోనికి ప్రవేశించిన దుండగులు దుకాణంలోని వస్తువులతో పాటు సుమారు రూ. 80వేల నగదును ఎత్తుకెళ్లినట్లు తెలిసింది. సంతలో సెల్ఫోన్లు.. భిక్కనూరు: మండల కేంద్రంలో ఆదివారం జరిగిన వారంతపు సంతలో గుర్తుతెలియని దుండగులు ఐదుగురి సెల్ఫోన్లను చోరీచేశారు. దీంతో బాధితులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. ఒక బాలుడు సెల్ఫోన్ను ఎత్తుకుని వెళ్తుండగా స్థానికులు అతడివెంటపడ్డారు. కానీ సదరు బాలుడు చిక్కకుండ పారిపోయాడు. గతంలో కూడా సెల్ఫోన్ల చోరీలు జరగడంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈక్రమంలో సంతలో చోరీల నివారణకు పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. దాబా హోటల్లో మందుబాబుల హల్చల్ ఖలీల్వాడి: నగరంలోని సారంగాపూర్ కమాన్ సమీపంలోని ఓ దాబా హోటల్ వద్ద శనివారం అర్ధరాత్రి మందుబాబులు హల్చల్ చేశారు. మద్యం మత్తులో ఉన్న ఇద్దరు యువకులు బిర్యానీ కావాలని హోటల్ నిర్వాహకులతో గొడవకు దిగారు. పోలీసులకు సమాచారం అందడంతో అక్కడికి చేరుకుని రెండువర్గాలను వెళ్లగొట్టారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. వివాహిత అదృశ్యం సిరికొండ: మండలంలోని గడ్కోల్ గ్రామానికి చెందిన మున్నూరు శోభ అలియాస్ సంధ్య అదృశ్యమైనట్లు ఎస్సై రామ్ ఆదివారం తెలిపారు. ఈ నెల 7న ఆమె ఎలాంటి కారణం లేకుండానే ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని, ఇప్పటికీ తిరిగిరాలేదన్నారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎంత వెతికినా ఆమె ఆచూకీ లభించలేదు. ఆమె భర్త మహిపాల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. కామారెడ్డిలో వృద్ధుడు.. కామారెడ్డి టౌన్: జిల్లా కేంద్రంలోని ఆజాంపూర కాలనీకి చెందిన 65 ఏళ్ల మహమ్మద్ యాసిన్ఖాన్ అనే వృద్ధుడు అదృశ్యమైనట్లు పట్టణ సీఐ చంద్రశేఖర్రెడ్డి ఆదివారం తెలిపారు. ఈనెల 7న ఉదయం అతడు ఇంటి నుంచి తన స్కూటీపై బయటకు వెళ్లిపోయి, ఇప్పటికీ తిరిగిరాలేదు. ఆదివారం ఉదయం పట్టణంలోని కొత్త బస్టాండ్ వద్ద స్కూటీ లభ్యమవగా, కుటుంబసభ్యులు చుట్టుపక్కల ప్రాంతాల్లో అతడి కోసం గాలించినా ఆచూకీ లభించలేదు. దీంతో కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతున్నట్లు సీఐ తెలిపారు. అతడి ఆచూకీ తెలిస్తే పట్టణ పోలీస్ స్టేషన్లోగానీ, 8712686145, 8712666242 నంబర్లకు సంప్రదించాలన్నారు. తాడ్వాయిలో వాహనాల తనిఖీ తాడ్వాయి(ఎల్లారెడ్డి): తాడ్వాయి మండలంలోని కామారెడ్డి –ఎల్లారెడ్డి ప్రధాన రహదారిపై ఆదివారం పోలీసులు వాహనాల తనిఖీ చేశారు. లైసెన్స్లు, పొల్యూషన్, వాహనాలకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలతో పాటు సీటు బెల్టులు, హెల్మెట్లు ధరించని వారికి జరిమానా విధించారు. అలాగే పెండింగ్లో చాలనులు ఉన్న వాహనాలకు ఆన్లైన్లో డబ్బులు కట్టేలా చర్యలు తీసుకున్నారు. ఈకార్యక్రమంలో పోలీసు సిబ్బంది, హోంగార్డులు పాల్గొన్నారు. -
కామారెడ్డి శివారులో ట్రాలీ ఆటో– బైక్ ఢీ
● ముగ్గురికి గాయాలు కామారెడ్డి టౌన్: పట్టణ శివారులో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలయ్యాయి. దేవునిపల్లి ఎస్సై రాజు తెలిపిన వివరాలు ఇలా.. పట్టణ శివారులోని శాబ్ధిపూర్ రోడ్లో ప్రయాణిస్తున్న ట్రాలీ ఆటో, బైక్ ఢీకొన్నాయి. ఈఘటనలో బైక్పై ప్రయాణిస్తున్న రెడ్డిపేట గ్రామానికి చెందిన పోచవ్వ, నరేష్లకు, ఆటో నడుపుతున్న డ్రైవర్ ఓబుది సాయిలుకు గాయాలయ్యాయి. స్థానికులు గమనించి క్షతగాత్రులను చికిత్స నిమిత్తం జీజీహెచ్కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. నవీపేట మండలంలో.. నవీపేట: మండలంలోని యంచ శివారులోని బాసర బ్రిడ్జి సమీపంలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలైనట్లు గ్రామస్తులు తెలిపారు. రాథోడ్ విజయ్, రాథోడ్ రాజు బైక్పై బాసర్ నుంచి ఫకీరాబాద్ వైపు బయలుదేరగా, యంచ శివారులోని బ్రిడ్జి సమీంలో వారిని మరో బైక్ ఢీకొట్టింది. ఈఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాయ్యాయి. మరో బైక్ నడిపిస్తున్న బాధితుడిని ధర్మాబాద్ వాస్తవ్యుడిగా స్థానికులు గుర్తించారు. క్షతగాత్రులను స్థానికులు జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు.