breaking news
Bollywood
-
సుశాంత్తోనే ఈ సినిమా తీయాలనుకున్నా.. కానీ: డైరెక్టర్ అనురాగ్
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ ప్రస్తుతం నిషాంచి అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రంలో వినీత్ కుమార్ సింగ్ హీరోగా నటించారు. ఈ సినిమాతో ఐశ్వర్య థాకరే హీరోయిన్గా ఎంట్రీ ఇస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చేనెల 19న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన దర్శకుడు ఈ మూవీ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.ఈ మూవీని ఎంఎస్ ధోని హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్తో చేయాలని అనుకున్నానని అనురాగ్ కశ్యప్ వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్ను 2016లోనే ప్రకటించామని తెలిపారు. అయితే అప్పటికే సుశాంత్ ధర్మ ప్రొడక్షన్స్తో రెండు సినిమాలకు సంతకం చేశారని గుర్తు చేసుకున్నారు. అందువల్లే మా సినిమాకు అతను రెస్పాండ్ కాలేదని అనురాగ్ పంచుకున్నారు.అనురాగ్ కశ్యప్ మాట్లాడుతూ.." అప్పట్లో సుశాంత్ (సింగ్ రాజ్పుత్)తో చేయాలనుకున్న సినిమా ఇది. అప్పటికే అతనికి 'దిల్ బెచారా', 'డ్రైవ్' అనే రెండు పెద్ద సినిమాలు ఆఫర్ వచ్చాయి. అవి రెండూ కూడా ధర్మ ప్రొడక్షన్స్లోనివే. దీంతో అప్పుడు నా సినిమా ఆగిపోయింది. మా సినిమాకు ఓకే చెప్పేందుకు అతను స్పందించడం మానేశాడు. అందుకే నేను కూడా దూరంగా వెళ్లిపోయా. మొదట 2016లో సుశాంత్ హీరోగానే మూవీని ప్రకటించా" అని అన్నారు.అంతేకాకుండా తన నిర్మాణ సంస్థలో వచ్చిన 'హసీతో ఫసీ' సినిమా నుంచి సుశాంత్ తప్పుకున్న విషయాన్ని కూడా కశ్యప్ వెల్లడించారు. యష్ రాజ్ ఫిల్మ్స్ (YRF), ధర్మ ప్రొడక్షన్స్ నుంచి ఆఫర్లు రావడంతో సుశాంత్ మా ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారని వివరించారు. YRF నిర్మాణ సంస్థ 'శుద్ధ్ దేశీ రొమాన్స్' సినిమాకు సంతకం చేసిన సుశాంత్.. హసీ తో ఫసీ మూవీని వదులుకున్నాడని కశ్యప్ అన్నారు. అతని నిర్ణయంపై తనకు ఎలాంటి పగ లేదని కశ్యప్ తెలిపారు.నిషాంచి సినిమా చేసేందుకు చాలామంది నటులు ఆసక్తి చూపించారని అనురాగ్ కశ్యప్ తెలిపారు. కానీ 2016లో MS ధోని: ది అన్టోల్డ్ స్టోరీ విడుదలకు ముందే సుశాంత్ను సంప్రదించానని వెల్లడించారు. ఆ సినిమా సూపర్ హిట్ అయిన తర్వాత, సుశాంత్ తన వద్దకు తిరిగి రాలేదని ఆయన గుర్తు చేసుకున్నారు. కాగా.. సుశాంత్ సింగ్ రాజ్పుత్ 2013లో 'కై పో చే!' సినిమాతో బాలీవుడ్లోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత 'శుద్ధ్ దేశీ రొమాన్స్', 'పీకే', 'కేదార్నాథ్', 'చిచ్చోరే' లాంటి చిత్రాలలో కనిపించాడు. 'ఎంఎస్ ధోని: ది అన్టోల్డ్ స్టోరీ' బయోపిక్లో మహేంద్ర సింగ్ ధోని పాత్రలో మెప్పించాడు. కానీ ఊహించని విధంగా..34 ఏళ్ల సుశాంత్ సింగ్ రాజ్పుత్ జూన్ 14, 2020న తన బాంద్రా నివాసంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. -
ఖరీదైన అపార్ట్మెంట్ను అమ్మేసిన సోనూ సూద్.. ఎన్ని కోట్ల లాభం వచ్చిందంటే?
బాలీవుడ్ నటుడు సోనూ సూద్ తెలుగువారికి కూడా సుపరిచితమైన పేరు. అరుంధతి మూవీలో తన విలనిజంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఆ తర్వాత పలు టాలీవుడ్ స్టార్ హీరోల చిత్రాల్లో విలన్గా మెప్పించారు. ప్రస్తుతం బాలీవుడ్లో మాత్రమే సినిమాలు చేస్తున్నారు ఈ ఏడాది ఫతే మూవీతో ప్రేక్షకులను అలరించారు.తాజాగా సోనూ సూద్ తన ఖరీదైన అపార్ట్మెంట్ను అమ్మేసినట్లు తెలుస్తోంది. ముంబయిలోని లోఖండ్వాలా మినర్వా ప్రాంతంలో ఉన్న మహాలక్ష్మీ అపార్ట్మెంట్ను దాదాపు రూ.8.10 కోట్లకు అమ్మేసినట్లు సమాచారం. కాగా.. సోనూ సూద్ 2012లో ఈ భవనాన్ని రూ. 5.16 కోట్లకు కొనుగోలు చేశాడు. దాదాపు 13 ఏళ్ల తర్వాత రూ. 2.94 కోట్ల లాభానికి అమ్మేశాడు.ఇక సోనూ సూద్ సినిమాల విషయానికొస్తే చివరిసారిగా ఫతే చిత్రంలో కనిపించారు. ఈ చిత్రానికి సోనూనే దర్శకత్వం వహించారు. అయితే బాక్సాఫీస్ వద్ద ఊహించనంత స్థాయిలో రాణించలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద కేవలం రూ. 13.35 కోట్లు వసూలు మాత్రమే చేసింది. ఈ మూవీతో డైరెక్టర్గా ఎంట్రీ ఇచ్చాడు సోనూ సూద్. ప్రస్తుతం అతను ఎలాంటి కొత్త ప్రాజెక్ట్ను అనౌన్స్ చేయలేదు. -
పెళ్లయి 9 ఏళ్లు.. ఇంకా పిల్లలు వద్దంటోంది: నటుడు
హిందీ బిగ్బాస్ 19వ సీజన్ (Bigg Boss 19) ఘనంగా ప్రారంభమైంది. ఆగస్టు 24న బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ఈ షోను లాంచ్ చేశాడు. 16 మంది కంటెస్టెంట్లు బిగ్బాస్ హౌస్లో అడుగుపెట్టారు. వారిలో బుల్లితెర నటుడు గౌరవ్ ఖన్నా (Gaurav Khanna) ఒకరు! తాజాగా ఓ ఎపిసోడ్లో యూట్యూబర్ మృదుల్ తివారీతో తన కుటుంబ విషయాలను చర్చించాడు. నా భార్య పేరు ఆకాంక్ష చమోలా (నటి).. ఈ ఏడాది నవంబర్ నాటికి మా వైవాహిక జీవితానికి 9 ఏళ్లు నిండుతాయి అని చెప్పాడు.పిల్లలంటే ఇష్టం.. భార్య వద్దంటోందిఎంతమంది పిల్లలు అని మృదుల్ అడగ్గా.. ఎవరూ లేరని బదులిచ్చాడు గౌరవ్. నా భార్య పిల్లలు వద్దంటోంది. కానీ, నాకేమో పిల్లలంటే చాలా ఇష్టం. మాది ప్రేమ వివాహం. కాబట్టి తనేం చెప్పినా నేను ఒప్పుకుని తీరాల్సిందే! ప్రేమలో ఉన్నప్పుడు ఎదుటివారి అభిప్రాయాలను మనం గౌరవించాల్సిందే! తను అన్నదాంట్లో కూడా తప్పేం లేదు. ఎందుకంటే మాపై చాలా బాధ్యతలున్నాయి. నేను షూటింగ్స్ కోసం రోజంతా బయటే ఉండాల్సి వస్తుంది. తను కూడా షూటింగ్స్తో బిజీగా ఉంటుంది. ఎవరు చూసుకుంటారు?అలాంటప్పుడు ఇంట్లో పిల్లలుంటే వారిని ఎవరు చూసుకుంటారు? పిల్లల బాధ్యతను బయటవారికి అప్పజెప్పడం మాకిష్టం లేదు. ఓసారి నాకు పిల్లలు కావాల్సిందేనని తన దగ్గర పట్టుపట్టాను. అప్పుడు నన్ను కూర్చోబెట్టి మాట్లాడింది. ఆమె మాటలు విన్నాక తను చెప్పింది కూడా కరెక్టే అనిపించి చైల్డ్ ప్లానింగ్ వాయిదా వేసుకున్నాం అని చెప్పుకొచ్చాడు.దాంపత్యానికి 9 ఏళ్లుగౌరవ్.. సెలబ్రిటీ మాస్టర్ చెఫ్ ఇండియా రియాలిటీ షోలో పాల్గొని టైటిల్ గెలిచాడు. ఆ షోలోనే ఆకాంక్షతో ఎలా ప్రేమలో పడ్డాడో చెప్పుకొచ్చాడు. ఓ ఆడిషన్లో ఆమెను తొలిసారి చూడగానే లవ్లో పడ్డానని, అలా అతడే ధైర్యం కూడదీసుకుని ఓ అడుగు ముందుకేసి ఆమెతో మాట కలిపానని తెలిపాడు. అలా తమ జర్నీ పెళ్లివరకు వచ్చిందన్నాడు. గౌరవ్- ఆకాంక్ష 2016లో పెళ్లి చేసుకున్నారు.చదవండి: పడ్డచోటే నిలబడ్డ కల్కి, కంటతడి పెట్టుకున్న జవాన్.. -
భర్తతో కలిసి దీపికా గణపతి పూజ, రణ్వీర్ న్యూ లుక్ వైరల్
బాలీవుడ్ స్వీట్ కపుల్ దీపికా పదుకొనే-రణ్వీర్ సింగ్ గణేష్ చతుర్థి (ఆగస్టు 27న)ని ఉత్సాహంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఈ జంట అంబానీ నివాసాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా దురంధర్ నటుడు రణవీర్ న్యూలుక్ వైరల్గా మారింది. పాప పుట్టిన తరువాత పబ్లిక్ అప్పియరన్స్కు దూరంగా ఉన్న వీరిద్దరూ జంటగా కనిపించడంతో ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. పల్లవ్ పల్లీవాల్ ఇన్స్టాలో షేర్ చేసిన కొన్ని సెకన్లు మాత్రమే ఉన్న వీరి వీడియో ఆన్లైన్లో చక్కర్లు కొడుతోంది.గోల్డ్ అండ్గ్రీన్ దుస్తుల్లో దీపికా ,రణ్వీర్ సింగ్ మెరిసారు. ముఖ్యంగా ధురంధర్ షూటింగ్ ప్రారంభించిన నెలల తర్వాత వచ్చిన క్లీన్-షేవ్ లుక్ నెటిజన్లు ఆకర్షిస్తోంది. పొడవాటి జుట్టు, గడ్డాన్ని తొలగించి కనిపించాడు. ఈ దంపతులు ముంబైలోని వరసిద్ధి వినాయకుడిని ఎక్కువగా ఆరాధిస్తారు. గర్భంతో ఉన్నపుడు దీపికా ఈ గణపతిని దర్శించుకున్న సంగతి తెలిసిందే.దీపికా పదుకొనే- రణ్వీర్ సింగ్ గత ఏడాది సెప్టెంబర్ 8న తమ తొలి సంతానం దువాకు జన్మనిచ్చారు. దువాకు మరికొన్ని రోజుల్లో సంవత్సరం నిండనుంది. తమ కుమార్తెను ప్రజల దృష్టి నుండిదూరంగా ఉంచాలని నిర్ణయించుకున్నారు. ఫోటోలను తీయవద్దని కూడా అభ్యర్థించారు కూడా. మరి దువా ఫస్ట్ బర్త్డే వేడుకలు ఘనంగా ఉండబోతున్నాయా?ఈ సందర్భంగా నైనా పాపను చూపిస్తారా? అనే ఉత్కంఠ అభిమానుల్లో ఉందైంది. View this post on Instagram A post shared by Pallav Paliwal (@pallav_paliwal)కాగా రణ్వీర్ సింగ్ ధురంధర్ ఫస్ట్ లుక్ సినిమా హాళ్లలో సందడి చేయనుంది. ఇటీవల డిజిటల్గా లాంచ్ అయిన 2 నిమిషాల 42-సెకన్ల కట్, రేపు సినిమాల్లో విడుదలయ్యే పరమ సుందరికి జతచేయబడుతుంది. జాతీయ అవార్డు గ్రహీత ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 5 డిసెంబర్ 2025న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. -
'ఆ దేవుడు దిగి వచ్చినా మమ్మల్ని విడదీయలేడు'.. విడాకులపై గోవిందా భార్య
గత కొంతకాలంగా బాలీవుడ్ సీనియర్ హీరో గోవిందా ఆయన భార్యతో విడిపోతున్నారంటూ రూమర్స్ వస్తోన్న సంగతి తెలిసిందే. గతంలో చాలాసార్లు ఈ టాపిక్ తెరపైకి వచ్చినా.. ఆయన భార్య సునీతా వాటిని కొట్టిపారేసింది. ఇటీవల మరోసారి ఈ జంట విడాకులకు సిద్ధమయ్యారంటూ వార్తలొచ్చాయి. ఆ తర్వాత వీటిని గోవిందా తరఫు లాయర్ ఖండించారు. వీరిద్దరి విడాకులకు సంబంధించి ఏ కోర్టులోనూ పిటిషన్ దాఖలు చేయలేదని అభిమానులకు వెల్లడించారు.ఇవాళ వినాయక చవితి సందర్భంగా తమపై వస్తున్న విడాకుల రూమర్లకు చెక్ పెట్టారు గోవిందా దంపతులు. గణనాథునికి సతీసమేతంగా పూజలు చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ సందర్భంగా గోవిందా భార్య సునీతా అహుజా తమపై వస్తున్న విడాకుల రూమర్స్పై స్పందించారు. ఆ దేవుడు కూడా తమను వేరు చేయలేడంటూ కామెంట్స్ చేసింది. అలాంటి వార్తలు నమ్మొద్దని అభిమానులకు విజ్ఞప్తి చేసింది. దీంతో వీరిద్దరిపై వస్తున్న డివోర్స్ రూమర్స్కు ఇక చెక్ పడినట్లే.విడాకుల వార్తలపై సునీతా మాట్లాడుతూ.. "ఏదైనా జరిగి ఉంటే ఈరోజు మేము చాలా దగ్గరగా ఉండేవాళ్లం కాదు. మా మధ్య మరింత దూరం ఉండేది. పై నుంచి దేవుడు దిగి వచ్చినా మమ్మల్ని ఎవరూ విడదీయలేరు. నా గోవిందా నా వాడు మాత్రమే, మరెవరికి ఆయన హృదయంలో స్థానం లేదు. కాదు. మేము నోరు తెరిచి చెప్పే వరకు దయచేసి మా గురించి వచ్చే వార్తలను నమ్మొద్దు" అని హితవు పలికింది. కాగా.. గోవింద భార్య సునీతా అహుజా తన యూట్యూబ్ ఛానెల్లో ఓ భావోద్వేగ వీడియోను షేర్ చేయడంతో విడాకుల రూమర్స్ మొదలయ్యాయి. సునీత ముంబైలోని బాంద్రా ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం దాఖలు చేసినట్లు కొన్ని నివేదికలు పేర్కొన్నాయి.కాగా.. గోవిందా కూలీ నంబర్ 1, హీరో నంబర్ 1, హసీనా మాన్ జాయేగి, హద్ కర్ ది ఆప్నే, జోడి నంబర్ 1 లాంటి చిత్రాల్లో నటించారు. ఆయన చివరిసారిగా 'రంగీలా రాజా' అనే చిత్రంలో కనిపించారు. #WATCH | Mumbai | Denying rumours of filing for divorce from husband actor Govinda, Sunita Ahuja says, "If something had happened, then we would have been so close today. There would have been a distance between us. No one can separate us, not even if God comes from above... My… pic.twitter.com/Aj5NmlbGNV— ANI (@ANI) August 27, 2025 -
పరమ్ సుందరిపై నెటిజన్ల ట్రోల్స్.. జాన్వీ కపూర్ రియాక్షన్ ఇదే!
బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ ప్రస్తుతం పరమ్ సుందరిగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీలో కేరళ అమ్మాయిగా అభిమానులను అలరించనుంది. ఈ మూవీలో సిద్ధార్థ్ మల్హోత్రా సరసన కనిపించనుంది. ఇప్పటికే పరమ్ సుందరి ట్రైలర్ రిలీజ్ కాగా.. ఊహించని విధంగా వివాదంలో చిక్కుకుంది. చర్చిలో రొమాంటిక్ సీన్ కనిపించడంతో పలువురు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఆ సీన్స్ తొలగించాలంటూ కొందరు ఫిర్యాదు చేశారు. ట్రైలర్ రిలీజ్ తర్వాత నుంచి ఏదో సందర్భంలో వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఈ మూవీలో నటించేందుకు మలయాళీ నటి దొరకలేదా అంటూ విమర్శలు కూడా వచ్చాయి.ఇక ఈ సంగతి పక్కనపెడితే.. ఇప్పటికే తనపై వచ్చిన ట్రోల్స్కు జాన్వీ సమాధానమిచ్చారు. తాజాగా పరమ్ సుందరిని చెన్నై ఎక్స్ప్రెస్ మూవీతో పోలుస్తూ నెట్టింట ట్రోల్స్ మొదలయ్యాయి. సిద్ధార్థ్, జాన్వీ కపూర్ పోస్టర్.. అచ్చం చెన్నై ఎక్స్ప్రెస్ చిత్రంలోని షారుక్, దీపిక పదుకొణెలను కాపీ చేసినట్లు ఉందంటూ ట్రోల్స్ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే జాన్వీ కపూర్ తాజా ఇంటర్వ్యూలో స్పందించింది. దీపికా తమిళియన్గా నటిస్తే.. నేను మాత్రం ఇందులో సగం మలయాళీ, సగం తమిళియన్ అని తెలిపింది. చెన్నై ఎక్స్ప్రెస్ 'ఐకానిక్ మూవీ అని తెలిపింది.జాన్వీకపూర్ మాట్లాడూతూ.."నేను ఈ సినిమాలో కేరళకు చెందిన అమ్మాయిగా నటించా. దక్షిణాదికి చెందిన వారందరినీ ఒకచోట చేర్చలేము. ఎందుకంటే ఇది పూర్తిగా భిన్నమైన వాతావరణం. మా సినిమాను చెన్నై ఎక్స్ప్రెస్తో పోలుస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. కానీ ఆ సినిమాకు.. పరమ్ సుందరికి ఎలాంటి పోలిక ఉండదు. చెన్నై ఎక్స్ప్రెస్ పదేళ్ల క్రితం విడుదలైంది. ఇలాంటి ఐకానిక్ సినిమాలు ప్రతి సంవత్సరం విడుదల కావు. చెన్నై ఎక్స్ప్రెస్ ఒక ఐకానిక్ చిత్రం. అందులో షారూఖ్ ఖాన్, దీపికా పదుకొణె లాంటి అగ్ర నటులు నటించారని" తెలిపింది. కాగా.. పరమ్ సుందరి ఆగస్టు 29న థియేటర్లలో విడుదల కానుంది. -
ప్రియురాలికే తన ఫ్లాట్ అద్దెకిచ్చిన 'వార్ 2' హీరో
ప్రముఖ నటీనటులు.. ఇల్లు, అపార్ట్మెంట్ లాంటివి కొనడం, అమ్మడం, అద్దెకు ఇవ్వడం లాంటివి బాలీవుడ్లో ఎప్పటికప్పుడు వినిపిస్తూనే ఉంటాయి. తెలియని వాళ్లకు ఇచ్చేందుకు హిందీ సెలబ్రిటీస్ పెద్దగా ఆసక్తి చూపించరు. దీంతో తోటి యాక్టర్స్కి అద్దెకు ఇస్తుంటారు. దీని ద్వారా మంచి మొత్తమే అందుకుంటూ ఉంటారు. కానీ 'వార్ 2'తో రీసెంట్గా వచ్చిన హృతిక్ రోషన్ మాత్రం తన ప్రియురాలికి తన ఫ్లాట్ రెంట్కి ఇచ్చాడు. అవును మీరు విన్నది నిజమే.(ఇదీ చదవండి: 'సుందరకాండ' సినిమా రివ్యూ)క్రిష్, ధూమ్ 2 లాంటి సినిమాలతో చాన్నాళ్ల క్రితమే తెలుగులోనూ క్రేజ్ సొంతం చేసుకున్న హృతిక్ రోషన్.. చాలా గ్యాప్ తర్వాత 'వార్ 2'తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎన్టీఆర్ ఇందులో మరో హీరోగా నటించడం విశేషం. అయితే బాక్సాఫీస్ దగ్గర ఈ మూవీ ఫెయిలైంది. సరే ఈ సంగతి పక్కనబెడితే గతంలో సుస్సానే ఖాన్ అనే మహిళని పెళ్లి చేసుకున్న హృతిక్.. కొన్నేళ్ల క్రితం ఆమెకు విడాకులు ఇచ్చేశాడు. నటి షబా ఆజాద్తో రిలేషన్లో ఉన్నాడు.హృతిక్ ప్రస్తుతం షబా ఆజాద్తో డేటింగ్ చేస్తున్నప్పటికీ.. తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే అన్నట్లు ఫ్లాట్ని హృతిక్.. తన ప్రియురాలికే అద్దెకిచ్చాడు. ఇందుకుగానూ నెలకు రూ.75 వేలు చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకున్నారట. సాధారణంగా మార్కెట్లో లక్షల్లో అద్దె ఉంటే.. ప్రియురాలికి మాత్రం తక్కువ ధరకే ఇచ్చేశాడట. అంటే డిస్కౌంట్ అనమాట. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిపోయింది.(ఇదీ చదవండి: కోట్లు విలువ చేసే కారు కొన్న 'కేజీఎఫ్' విలన్) -
కోట్లు విలువ చేసే కారు కొన్న 'కేజీఎఫ్' విలన్
టాలీవుడ్లో స్టార్స్ వ్యక్తిగత విషయాల్ని ఆచితూచి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. బాలీవుడ్లో స్టార్స్.. ఇల్లు లేదా కారు లాంటివి కొన్న వెంటనే ఆ ఫొటోలు వైరల్ అవుతుంటాయి. ఇప్పుడు అలానే సీనియర్ నటుడు కమ్ దక్షిణాది చిత్రాల్లో విలన్గా చేస్తున్న సంజయ్ దత్ ఇప్పుడు ఖరీదైన లగ్జరీ కారు కొనుగోలు చేశాడు. ఇంతకీ ఆ కారు సంగతేంటి? దాని రేటు ఎంత?(ఇదీ చదవండి: 'సుందరకాండ' సినిమా రివ్యూ)అప్పట్లో హీరోగా ఎన్నో హిందీ సినిమాలు చేసిన సంజయ్ దత్.. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్లో కీలక పాత్రలు చేస్తూ ఆకట్టుకుంటున్నాడు. రీసెంట్ టైంలో అయితే కేజీఎఫ్ 2, లియో, ఇస్మార్ట్ శంకర్ చిత్రాల్లో ప్రతినాయక ఛాయలున్న రోల్స్ చేశాడు. కాకపోతే వీటిలో 'కేజీఎఫ్' సీక్వెల్లో ఈయన చేసిన పాత్ర బాగా వర్కౌట్ అయింది. ప్రస్తుతం హిందీలో పలు మూవీస్ చేస్తూ బిజీగా ఉన్నాడు. సంజయ్ దత్ ఇప్పుడు మెర్సిడెజ్ కంపెనీకి చెందిన మేబాచ్ జీఎల్ఎస్ మోడల్ కారుని కొనుగోలు చేశాడు. మార్కెట్లో దీని ధర రూ.4 కోట్ల వరకు ఉంది.(ఇదీ చదవండి: ఓటీటీలో తమిళ హిట్ సినిమా.. ఇప్పుడు తెలుగులోనూ) -
బాలీవుడ్ స్టార్స్ 'భగ్న' ప్రేమకథ!
టాలీవుడ్లో చాలా తక్కువ గానీ బాలీవుడ్లో మాత్రం హీరోహీరోయిన్ల ప్రేమ, రిలేషన్, పెళ్లి, బ్రేకప్ లాంటివి కాస్త ఎక్కువే. కలిసి నటించిన వాళ్లు చాలామంది ఉంటారు. అదే టైంలో గాఢంగా ప్రేమించుకుని.. పెళ్లి చేసుకోని వాళ్లు కూడా కాస్త ఎక్కువగానే ఉంటారు. అలాంటి వాళ్ల లిస్ట్ తీస్తే గత కొన్నేళ్లలో చూసుకుంటే స్టార్ హీరోహీరోయిన్లు చాలామంది ఉంటారు. వారిలో కొందరు గురించి మీకోసం.అభిషేక్ - కరిష్మా కపూర్అమితాబ్ బచ్చన్ కొడుకుగా అభిషేక్ అందరికీ పరిచయమే. 2000ల్లో హీరోయిన్ కరిష్మా కపూర్తో అభిషేక్ కొన్నేళ్ల పాటు డేటింగ్ చేశాడు. దీంతో వీళ్లిద్దరికీ పెద్దలు నిశ్చితార్థం కూడా చేశారు. కానీ 2003 టైంలో కారణాలేం చెప్పకుండా దీన్ని రద్దు చేసుకున్నారు. తర్వాత అభిషేక్.. ఐశ్వర్యారాయ్ని పెళ్లి చేసుకున్నాడు. వీళ్ల ప్రేమకు గుర్తుగా ఆరాధ్య అనే అమ్మాయి కూడా పుట్టింది.అక్షయ్ కుమార్-రవీనా-శిల్పాశెట్టి90ల్లో అక్షయ్ కుమార్ మంచి ఫాలోయింగ్ ఉన్న హీరో. అలా రవీనా టండన్తో కలిసి 'మోహ్రా' అనే సినిమా చేశాడు. అప్పటి నుంచి వీళ్లిద్దరి డేటింగ్ కూడా చేశారు. మరి ఏమైందో ఏమో గానీ 2001లో అలా విడిపోయారు. అనంతరం కొన్నాళ్లకు రవీనా.. అనిల్ తడానిని వివాహం చేసుకుంది.ఇదే అక్షయ్ కుమార్.. 90ల్లో శిల్పాశెట్టితోనూ డేటింగ్ చేసినట్లు వార్తలొచ్చాయి. 'మైన్ ఖిలాడీ తు అనారీ' సినిమా టైంలో ప్రేమ మొదలైందని మాట్లాడుకున్నారు. అలాంటిది వీళ్లిద్దరూ కూడా విడిపోయారు. అలా రవీనా, శిల్పా శెట్టితో విడిపోయిన అక్షయ్.. ట్వింకిల్ ఖన్నాని పెళ్లి చేసుకున్నాడు.రణ్బీర్-దీపిక-కత్రినా కైఫ్రణ్బీర్ కపూర్ పేరు చెప్పగానే అతడి సినిమాలతో పాటు డేటింగ్ స్టోరీలే గుర్తొస్తాయి. ఎందుకంటే చాలామంది హీరోయిన్లతో ప్రేమ వ్యవహారం నడిపినట్లు మాట్లాడుకున్నారు. కానీ దీపికా పదుకొణె, కత్రినా కైఫ్ పేర్లు మాత్రం కాస్త ఎక్కువగా వినిపించాయి. కలిసి సినిమాలు చేసిన రణ్బీర్-దీపిక.. రెండు మూడేళ్లపాటు డేటింగ్ చేసుకున్నారు. కానీ 2009లో విడిపోయారు. ఇది జరిగి ఎన్నాళ్లు కాలేదు. రణ్బీర్-కత్రినా కైఫ్ డేటింగ్ రూమర్స్ వినిపించాయి. దాదాపు ఏడేళ్ల పాటు రిలేషన్లో ఉన్నారని ఇండస్ట్రీలో టాక్. తర్వాత ఈమె నుంచి కూడా రణ్బీర్ విడిపోయాడు. ప్రస్తుతం ఈ ముగ్గురు కూడా వేర్వేరుగా పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు.సల్మాన్ ఖాన్-ఐశ్వర్యారాయ్-కత్రినా కైఫ్బాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనగానే అందరికీ గుర్తొచ్చే పేరు సల్మాన్ ఖాన్. ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఉండిపోయిన ఇతడు.. గతంలో ప్రపంచ సుందరి ఐశ్వర్యా రాయ్తో 1990-2000 వరకు ప్రేమ-డేటింగ్లో ఉన్నారని అప్పట్లో ఇండస్ట్రీలో తెగ మాట్లాడుకున్నారు. కానీ సల్మాన్ ప్రవర్తన కారణంగా ఐశ్వర్య ఇతడిని 2002 నుంచి దూరం పెట్టేసిందట. ఈమె తర్వాత కత్రినా కైఫ్తో కొన్నేళ్ల పాటు సల్మాన్ రిలేషన్షిప్ మెంటైన్ చేశాడు. కానీ ఈమెతోనే బ్రేకప్ అయిపోయింది. ఐశ్వర్య, కత్రినా వేర్వేరుగా పెళ్లి చేసుకున్నారు గానీ సల్మాన్ మాత్రం ఒంటరిగానే ఉండిపోయాడు.షాహిద్ కపూర్-కరీనా కపూర్-ప్రియాంక చోప్రామిలీయనల్స్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న షాహిద్ కపూర్.. 2004-07 టైంలో కరీనా కపూర్తో డేటింగ్ చేశాడు. కలిసి సినిమాలు చేస్తున్నప్పుడే వీళ్ల మధ్య ప్రేమ చిగురించినట్లు తెలుస్తోంది. కానీ 'జబ్ ఉయ్ మెట్' అనే మూవీ చేస్తున్న టైంలో బ్రేకప్ చెప్పుకొన్నారు. కానీ మూవీ మాత్రం బ్లాక్ బస్టర్ అయింది. ఈమె తర్వాత ప్రియాంక చోప్రాతోనూ షాహిద్ డేటింగ్ చేసినట్లు వార్తలొచ్చాయి కానీ ఎక్కడా వీళ్లు దీన్ని ధ్రువీకరించలేదు. కొన్ని రూమర్స్ మాత్రం వినిపించాయి. ప్రస్తుతం ఈ ముగ్గురు ఎవరికి వాళ్లు వివాహం చేసుకుని హ్యాపీగా ఉన్నారు.రణ్దీప్ హుడా-సుస్మితా సేన్మిస్ యూనివర్స్ సుస్మితా సేన్.. నటుడు రణ్దీప్ హుడాతో 2000 టైంలో డేటింగ్ చేసినట్లు వార్తలొచ్చాయి. దాదాపు మూడేళ్ల పాటు ప్రేమించుకున్నారు. కానీ ఇది కూడా ఎక్కువ కాలం నిలబడలేదు. తర్వాత కాలంలో రణ్దీప్.. నటి లిన్ లైస్రామ్ని పెళ్లి చేసుకోగా.. సుస్మితా మాత్రం ఎవరినీ పెళ్లి చేసుకోలేదు. కానీ ఇద్దరు అమ్మాయిల్ని దత్తత తీసుకుని పెంచుకుంటోంది. ఇలా బాలీవుడ్లో చాలానే 'భగ్న' ప్రేమకథలు ఉన్నాయి! -
‘బిగ్బాస్’లో ప్రేమాయణం.. పెళ్లి చేసుకున్న జంటలివే
బుల్లితెరపై ‘బిగ్బాస్’రియాల్టీ షోకి ఎంత పాపులారిటీ ఉందో అందరికి తెలిసిందే. బాలీవుడ్, టాలీవుడ్ మాత్రమే కాకుండా అంతటా ఈ షోకి మంచి ఆదరణ ఉంది. ఇక హిందీలో అయితే ఇప్పటికే 18 సీజన్లు పూర్తి చేసుకుంది. తాజాగా 19వ సీజన్ కూడా అట్టహాసంగా ప్రారంభం అయింది. మనుషుల ఎమోషన్తో సాగే ఈ షో.. కొంతమందికి జీవిత భాగస్వాములను కూడా వెతికిపెట్టింది. ఈ షోలో పాల్గొని, ప్రేమలో పడి..పెళ్లి చేసుకున్న జంటలు చాలానే ఉన్నాయి. ‘బిగ్బాస్’కలిపిన జంటలపై ఓ లుక్కేద్దాం.సారా ఖాన్- అలీ మర్చంట్ బిగ్బాస్ షో ద్వారా ప్రేమలో పడి పెళ్లి చేసుకున్న తొలి జంట సారా ఖాన్, అలీ మర్చంట్. హిందీ బిగ్బాస్ 4లో పాల్గొన్న వీరిద్దరు.. షోలో ఉన్నప్పుడే ప్రేమలో పడి వివాహం(2010లో) చేసుకున్నారు. అయితే, వీరి ప్రేమ కథ సుఖాంతం కాలేదు. పెళ్లి చేసుకున్న కొన్ని నెలలకే విడాకులు తీసుకున్నారు. ఆ తరువాత అలీ 2016లో అనమ్ మర్చంట్ను వివాహామాడారు. వీరిద్దరి మధ్య విభేదాలు రావడంతో 2021లో విడిపోయారు. కొన్నాళ్ల తర్వాత తన ఫ్రెండ్ ఆండ్లీబ్ జైదీని మూడో పెళ్లి చేసుకున్నారు.మోనాలిసా- విక్రాంత్ సింగ్ రాజ్పూత్భోజ్పురి హీరోయిన్ మోనాలిసా (అంతరా బిస్వాస్) బిగ్బాస్ 10లో పాల్గొన్నప్పుడు, ఆమె బాయ్ఫ్రెండ్ విక్రాంత్ సింగ్ రాజ్పూత్ షోలో సర్ప్రైజ్ ఎంట్రీ ఇచ్చి, జాతీయ టెలివిజన్లో ఆమెకు ప్రపోజ్ చేశారు. ఆ క్షణం అభిమానులకు ఎమోషనల్ మూమెంట్గా నిలిచింది. 2017లో వీరు బిగ్బాస్ హౌస్లోనే వివాహం చేసుకున్నారు, ఇది షో చరిత్రలో అరుదైన సంఘటన. తర్వాత వారు సాంప్రదాయ వివాహ వేడుకను కూడా జరుపుకున్నారు. వీరి బంధం ఇప్పటికీ బలంగా కొనసాగుతోంది.యువికా చౌదరి-ప్రిన్స్ నరులాహిందీ బిగ్బాస్ 9లో పాల్గొన్న ప్రిన్స్ నరులా, యువికా చౌదరితో స్నేహంగా మొదలైన బంధం క్రమంగా ప్రేమగా మారింది. షోలో ప్రిన్స్ యువికా కోసం హార్ట్ ఆకారంలో చపాతీ చేసి ప్రపోజ్ చేసిన సన్నివేశం అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. కొందరు దీన్ని గేమ్ స్ట్రాటజీ అనుకున్నప్పటికీ, షో తర్వాత వీరి ప్రేమ నిజమని నిరూపితమైంది. 2018 అక్టోబర్ 12న వీరు గ్రాండ్గా వివాహం చేసుకున్నారు. యువికా ప్రిన్స్ కంటే ఏడేళ్లు పెద్దవారైనప్పటికీ, వారి బంధం అభిమానులకు స్ఫూర్తిగా నిలిచింది.సుయాష్ రాయ్-కిష్వర్ మర్చంట్సుయాష్ రాయ్-కిష్వర్ మర్చంట్ బిగ్బాస్ 9లో పాల్గొన్నారు. వీరు 2011 నుంచి డేటింగ్లో ఉన్నప్పటికీ, షోలో వారి కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ, షో ఒత్తిడిలో కూడా వారి బంధం బలపడింది. 2016లో వీరు సన్నిహిత వేడుకలో వివాహం చేసుకున్నారు. 2021లో వీరికి నిర్వైర్ అనే కుమారుడు జన్మించాడు.పాయల్ రోహత్గీ- సంగ్రామ్ సింగ్బాలీవుడ్ నటి పాయల్ రోహత్గీ, రెజ్లర్ సంగ్రామ్ సింగ్ బిగ్బాస్ 7లో కలుసుకున్నారు. వీరి సంబంధం షో తర్వాత కూడా కొనసాగింది, దాదాపు 12 ఏళ్ల పాటు డేటింగ్లో ఉన్నారు.2022 జులై 9న ఆగ్రాలో వీరు వివాహం చేసుకున్నారు. -
లావు తప్ప మరేదీ కనపడదా..? హీరోయిన్ ఆక్రోశం
హీరోల విషయంలో లావా?సన్నమా? పొట్టా? బట్టా? జుట్టా? విగ్గా? ఇవేవీ సమస్యలుగా కనిపించవు. కానీ అదే హీరోయిన్ విషయానికి వచ్చేసరికి అన్ని విధాలుగా పర్ఫెక్ట్గా ఉండాలని ఆశిస్తారు. శరీరపు కొలతల దగ్గర నుంచి ప్రతీ ఒక్కటీ బాగుంటేనే ఆమె కధానాయిక అని లేకపోతే పనికిరాదు అంటూ ఈసడిస్తారు. ఆడైనా, మగ అయినా అభినయమే ప్రధాన అర్హతగా కొనసాగాల్సి ఉన్నా దానిని మహిళల విషయానికి వచ్చేసరికి పూర్తిగా పక్కన పెట్టేస్తున్నారు. ఒకప్పుడు అవకాశాలు ఇచ్చే నిర్మాతలు, దర్శకుల నుంచి మాత్రమే బాడీ షేమింగ్ ఎదుర్కున్న సినీ పరిశ్రమకు చెందిన యువతులు... ఇప్పుడు ఏ సంబంధం లేనివారు సైతం తమను, తమ శరీరాన్ని కామెంట్ చేస్తుంటే భరించాల్సిన పరిస్థితిని సోషల్ మీడియా సృష్టించింది. మొన్నటి విద్యాబాలన్ దగ్గర నుంచి నిన్నటి నిత్యా మీనన్ దాకా ప్రతీ ఒక్కరూ ఎదుర్కున్న సమస్య ఇది. ఇప్పుడు ఈ జాబితాలో మరో అందమైన నటి కూడా చేరారు. ఆమె మంజిమా మొహన్(Manjima Mohan ).తెలుగులో సాహసమే శ్వాసగా సాగిపో, కధానాయకుడు వంటి సినిమాల్లో నటించిన మంజిమా మోహన్ పలు మళయాళ డబ్బింగ్ సినిమాల ద్వారా కూడా దక్షిణాది ప్రేక్షకులకు చిరపరిచితులు. మళయాళ సినీతార మన్జిమా మొహన్,ఐదేళ్ల చిన్న వయసులోనే నటన ప్రారంభించి 2001 దాకా వరుసగా నటించారు. ఆ తరువాత ఒరు వేదక్కన్ సెల్ఫీ అనే చిత్రంతో 2015లో లీడ్ పాత్రలో తిరిగి కనిపించారు. ఆమె నటనకు ఎన్నో ప్రశంసలు వచ్చాయి. అయితే తర్వాత చిత్రాల్లో కూడా నటనకు ప్రశంసలతో పాటే దురదృష్టవశాత్తూ ఆమె శరీరపు బరువు కూడా ఎగతాళికి నోచుకుంది.మరీ ముఖ్యంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లపై తన బరువును ఉద్ధేశ్యించి పలువురు చేసిన క్రూర వ్యాఖ్యలు ఆమె మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపించాయి. ముఖ్యంగా కొన్ని వ్యాఖ్యలు ఆమెను భావోద్వేగాలను సంక్షోభం లోకి నెట్టాయని ఆమె ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తెలిపారు. ‘బరువు తగ్గించడం వల్ల మరి కొన్ని సినిమాల్లో అవకాశాలు వస్తాయేమో; కానీ అది ముఖ్యం కాదు. నిజానికి సినిమా రంగం దాటితే నా బరువు ఎవరికీ ఒక విషయమే కాదు. అవును...సినిమా నా జీవితంలో ఒక భాగమే. అయితే నా లక్ష్యాలు స్క్రీన్ కు మించినవి ఎన్నో ఉన్నాయ్‘ అని ఆమె చెప్పారు. అయినప్పటికీ ఈ వ్యాఖ్యల్ని తట్టుకోవడం తన వల్ల కావడం లేదని ఆమె అంగీకరించారు. అధిక బరువు అనే సమస్య వల్ల శారీరకంగా భావోద్వేగపరంగా సంక్లిష్టమైన దశను తాను అనుభవించానని, చివరకి బరువు తగ్గేందుకు డాక్టర్లను సంప్రదించానని కూడా ఆమె వెల్లడించారు. ఏదో రకంగా బరువు తగ్గాలని అనుకున్నా. అవసరమైతే సర్జరీ కూడా చేయించుకోవాలని అనుకున్నా ‘‘ అని ఆమె అన్నారుతనకు పిసిఓడి సమస్య ఉందని దీనిని దృష్టిలో ఉంచుకుని తాను తన ఆరోగ్య పరమైన మార్పు చేర్పులు చేసుకోవాల్సి ఉంటుందని ఆమె వెల్లడించారు. తాను బరువు కొంచెం ఎక్కువ ఉన్నప్పటికీ ఆరోగ్య సమస్యలేవీ లేనప్పుడు దాని గురించి చింతించాల్సిన అవసరం ఎవరికీ లేదన్నారు. నటుల అభినయమే ప్రధానం కావాలని వారి రూపు రేఖలు కాదని అంటున్న ఈ 32ఏళ్ల మహిళ ఆవేదన ఈ సోషల్ జమానా అర్ధం చేసుకుంటుందా? -
మిల్కీ బ్యూటీ తమన్నా లేటేస్ట్ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం పెద్దగా సినిమాలు చేయట్లేదు. ఈ ఏడాది ఓదెల-2 మూవీతో అలరించిన ముద్దుగుమ్మ.. అంతకుముందు ఒకట్రెండు స్పెషల్ సాంగ్స్లో మెరిసింది. ప్రస్తుతం బాలీవుడ్కే పరిమితమైన తమన్నా ఆసక్తికర వెబ్ సిరీస్తో ప్రేక్షకుల ముందుకు రానుంది తమన్నా భాటియా, డయానా పెంటీ నటించిన కామెడీ-డ్రామా వెబ్ సిరీస్ 'డూ యు వన్నా పార్టనర్'. ఈ సిరీస్కు అర్చిత్ కుమార్, కాలిన్ డికున్హా దర్శకత్వం వహించారు. కరణ్ జోహార్, అదార్ పూనవల్లా, అపూర్వ మెహతా సంయుక్తంగా నిర్మించారు.తాజాగా ఈ సిరీస్ స్ట్రీమింగ్ తేదీని మేకర్స్ ఫిక్స్ చేశారు. సెప్టెంబర్ 12 నుంచి అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగా కానుందని వెల్లడించారు. ఇద్దరు ప్రాణ స్నేహితుల కథ ఆధారంగా ఈ సిరీస్ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇద్దరు ఫ్రెండ్స్ సొంత ఆల్కహాల్ వెంచర్ను స్థాపించాలనే సాహసోపేతమైన నిర్ణయం ఎలాంటి మలుపులు తిరిగిందనేది ఈ సిరీస్లో చూపించనున్నారు. ఈ వెబ్ సిరీస్లో జావేద్ జాఫ్రే, నకుల్ మెహతా, సూఫీ మోతీవాలా, నీరజ్ కబీ, శ్వేతా తివారీ, రణ్విజయ్ సింఘా కీలక పాత్రల్లో నటించారు.raising a toast because they’re here with something brew-tiful 🍺#DoYouWannaPartnerOnPrime, New Series, September 12 pic.twitter.com/NM9tLCKPRG— prime video IN (@PrimeVideoIN) August 25, 2025 -
వినాయక చవితికి దూరంగా బాలీవుడ్ బ్యూటీ.. కారణం ఏంటంటే?
బాలీవుడ్ భామ శిల్పా శెట్టి అభిమానులకు బ్యాడ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాది వినాయక చవితి వేడుకలకు దూరంగా ఉంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ప్రతి ఏడాది గ్రాండ్గా సెలబ్రేట్ ఈ పండుగను జరుపుకోవడం లేదని తెలిపింది. తమ కుటుంబంలో ఒకరి వియోగం కారణంగా వేడుకలకు దూరంగా ఉంటున్నట్లు వెల్లడించింది.శిల్ప తన ఇన్స్టాగ్రామ్లో రాస్తూ.. "ప్రియమైన స్నేహితులారా బాధతో ఈ విషయాన్ని పంచుకుంటున్నా. మా కుటుంబంలో ఒకరి వియోగం కారణంగా ఈ సంవత్సరం మేము మా గణపతి వేడుకలను నిర్వహించుకోవడం లేదు. ఈ విషయాన్ని మీకు తెలియజేయడానికి మేము చింతిస్తున్నాం. మా సంప్రదాయం ప్రకారం 13 రోజుల పాటు సంతాప దినాలను పాటించాలి. అందుకే పండుగలు, ఉత్సవాలకు దూరంగా ఉంటాం.' అంటూ పోస్ట్ చేసింది.శిల్పా శెట్టి కెరీర్..ఇక శిల్పా శెట్టి కెరీర్ విషయానికొస్తే ప్రస్తుతం డ్యాన్స్ రియాలిటీ షో సూపర్ డాన్సర్ సీజన్- 5 లో న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తోంది. ఆమె చివరిసారిగా అమిత్ సాధ్, దిల్నాజ్ ఇరానీ, కుషా కపిల, పవ్లీన్ గుజ్రాల్ నటించిన సుఖీ చిత్రంలో కనిపించింది. ప్రస్తుతం శిల్పా శెట్టి కెడి: ది డెవిల్ అనే కన్నడ చిత్రంలో నటించింది. ఈ మూవీతో దాదాపు 18 సంవత్సరాల తర్వాత కన్నడలో రీ ఎంట్రీ ఇస్తోంది. ఈ మూవీలో సత్యవతి పాత్రలో అలరించనుంది. ఈ చిత్రంలో ధ్రువ సర్జాతో పాటు సంజయ్ దత్, వి. రవిచంద్రన్, రమేష్ అరవింద్, నోరా ఫతేహి కీలక పాత్రలు పోషించారు. -
తన పట్ల నాకు ఎలాంటి ద్వేషం లేదు: ఆశిష్ విద్యార్థి
పోకిరి మూవీతో తెలుగులో ఫేమస్ అయిన నటుడు ఆశిష్ విద్యార్థి. ప్రస్తుతం యూట్యూబ్ వీడియోలు చేస్తున్నారు. ఇటీవల కరణ్ జోహార్ హోస్ట్గా వచ్చిన ది ట్రైటర్స్ అనే రియాలిటీ షోకు పాల్గొన్న ఆయన.. ప్రముఖ ఇన్ఫ్లూయన్సర్ అపూర్వ ముఖిజా తనను అగౌరవపరిచేలా మాట్లాడారన్న కామెంట్స్పై స్పందించారు. ఆమెతో తన సంభాషణ చాలా ఉత్తేజకరంగా సాగిందని అభివర్ణించాడు. అయితే ఈ షో ముగిశాక తనకు ఆమె క్షమాపణలు చెప్పిందని ఆశిష్ విద్యార్థి తెలిపారు.ఆశిష్ విద్యార్థి మాట్లాడుతూ.."ఆ షో ముగిసిన మరుసటి రోజే తను నాకు వాట్సాప్ సందేశం పంపింది. సర్, నేను క్షమాపణ చెప్పాలనుకుంటున్నాను మేసేజ్ చేసింది. నేను వెంటనే ఆమెకు ఫోన్ చేసి అపూర్వ, నేను అక్కడ కూడా మీతో మాట్లాడాను. మీరు చాలా అద్భుతమైన మనిషి. అంతా బాగానే ఉందని చెప్పా. ఆ చర్చ పట్ల నేను సంతోషంగా ఉన్నా. ఆమె ఒక రోజు నాతో భోజనం చేయాలనుకుంటున్నట్లు చెప్పింది. కుదిరితే భవిష్యత్తులో ఆమెతో కలిసి డిన్నర్ చేస్తా. తనపట్ల నాకు ఎలాంటి ద్వేషం లేదని" వెల్లడించారు.కాగా.. ఆశిష్ విద్యార్థి ఇటీవల ‘ది సీక్రెట్ ఆఫ్ ది శిలేదార్స్’ అనే వెబ్ సిరీస్లో కనిపించారు. ఈ సిరీస్ ప్రస్తుతం జియోహాట్స్టార్లో ప్రసారం అవుతోంది. ఇందులో రాజీవ్ ఖండేల్వాల్, సాయి తమంహర్కర్ కూడా నటించారు. -
వయసులో తన కంటే పెద్దదైన మహిళను పెళ్లాడిన నటుడు!
ఇండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ తన కంటే వయసులో పెద్దదైన సానియా చందోక్ను పెళ్లాడబోతున్నాడు. ఈ విషయంలో తండ్రి బాటలో పయనిస్తున్నాడు. సచిన్ కూడా తన కంటే వయసులో పెద్ద అయిన అంజలిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. చాలా మంది ప్రముఖులు ఇదే విధంగా పెళ్లిళ్లు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. 56 ఏళ్ల క్రితం ఓ నటుడు తన కంటే వయసులో 15 ఏళ్లు పెద్దదైన మహిళను పెళ్లాడాడంటే నమ్మగలరా? ఆ నటుడు ఎవరో తెలుసుకోవాలని ఉందా? అయితే మీకు బాలీవుడ్ దిగ్గజ నటుడు నసీరుద్దీన్ షా మొదటి వివాహం గురించి చెప్పాల్సిందే!ప్రముఖ నటుడు నసీరుద్దీన్ షా (Naseeruddin Shah) భార్య రత్న పాఠక్ అని చాలా మందికి తెలుసు. కానీ ఆయన మొదటి భార్య పర్వీన్ మురాద్ గురించి ఎక్కువ మందికి తెలియదు. నటుడిగా నిలదొక్కుకోకముందే ఆయన పెళ్లయిపోయి, విడాకులు కూడా తీసేసుకున్నారు. మొదటి భార్యకు భరణం చెల్లించడానికే 12 ఏళ్ల పాటు కష్టాలు పడ్డారట షా.బాలీవుడ్ షాదీస్ ప్రచురించిన ఒక కథనం ప్రకారం.. నసీరుద్దీన్ అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయంలో విద్యార్థిగా ఉన్నప్పుడు పర్వీన్ను మొదటిసారి కలిశారు. అప్పటికి అతడి వయసు 19 ఏళ్లు. 34 ఏళ్ల పర్వీన్ అప్పటికే భర్త నుంచి విడాకులు తీసుకుని తన పిల్లలతో కలిసి జీవిస్తోంది. విద్యార్థిగా ఉన్న షా.. 1969లో సంప్రదాయబద్దంగా పర్వీన్ను పెళ్లిచేసుకున్నాడు. సంవత్సరం లోపు వీరికి కూతురు పుట్టింది. ఆమెకు హీబా అని పెట్టుకున్నారు. తర్వాత వీరి వివాహ బంధానికి బీటలు వారాయి.విడాకుల కష్టాలుపర్వీన్ను షా పెళ్లిచేసుకోవడం మొదటి నుంచి నసీరుద్దీన్ కుటుంబానికి ఇష్టం లేదు. విడాకులు తీసుకుని పిల్లలు ఉండడం, వయసులో ఎక్కువ వ్యత్యాసం కారణంగా వీరి వివాహాన్ని ఆమోదించలేదు. ఫలితంగా షా, పర్వీన్ కాపురంలో కలతలు రేగాయి. దీంతో వారిద్దరూ విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. విడాకులు ఇవ్వడానికి పర్వీన్ కుటుంబం భారీగా భరణం చేయడంతో షా ఒప్పుకున్నారు. నటన కొనసాగిస్తూనే భార్యకు భరణం చెల్లించారు. మసూమ్ చిత్రంతో బ్రేక్ రావడంతో తన మాజీ భార్యకు పూర్తిగా భరణం చెల్లించేశారని, దీనికి దాదాపు 12 సంవత్సరాలు పట్టిందని పలు మీడియా నివేదికలు వెల్లడించాయి.రత్న పాఠక్తో రెండో పెళ్లి1975లో థియేటర్లో పనిచేస్తున్న సమయంలో నసీరుద్దీన్ షాకు రత్న పాఠక్ (Ratna Pathak) పరిచయం అయ్యారు. వారి మధ్య స్నేహం ప్రేమగా మారడానికి ఎక్కువ సమయం పట్టలేదు. అప్పటికింకా చట్టబద్దంగా షా మొదటి వివాహం రద్దు కాలేదు. రత్న పాఠక్ను పెళ్లి చేసుకునే అవకాశం లేకపోవడంతో ఆమెతో సహజీవనం సాగించారు. దాదాపు ఏడేళ్ల పాటు వీరి లివింగ్ రిలేషన్షిప్ కొనసాగింది. 1982లో వీరిద్దరు వివాహం చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించారు. వీరికి ఇమాద్ షా, వివాన్ షా అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. తమ వివాహబంధానికి 40 దశాబ్దాలు పూర్తైనా షా, పాఠక్ తమ నటనా జీవితాన్ని ఇప్పటికీ కొనసాగిస్తూనే ఉన్నారు.చదవండి: హీరో నాని ఎంత మందికి ఐలవ్యూ చెప్పాడో తెలుసా?దిగ్గజ నటుడుఉత్తరప్రదేశ్లోని బారబాంకీ పట్టణానికి చెందిన నసీరుద్దీన్ షా.. చదువు పూర్తైన తర్వాత నటనలోకి అడుగుపెట్టారు. రాజేంద్ర కుమార్, సైరా బాను నటించిన అమన్ (1967) సినిమాతో తెరంగ్రేటం చేశారు. నిషాంత్, జునూన్, స్పర్శ్, ఆక్రోస్, మసూమ్, మిర్చ్ మసాలా, త్రికాల్, అర్థ్ సత్య, హమ్ పాంచ్ తదితర సినిమాల్లో నటించి గొప్ప నటుడిగా పేరు తెచ్చుకున్నారు. నటుడిగానే కాకుండా దర్శకుడిగా, రచయితగానూ ఆయన రాణించారు. ఉత్తమ నటుడిగా మూడు సార్లు జాతీయ, ఫిలింఫేర్ అవార్డులు అందుకున్నారు. ఆయన ప్రతిభను గుర్తించిన భారత ప్రభుత్వం పద్మశ్రీ, పద్మభూషణ్ పురస్కారాలతో గౌరవించింది. -
నటి పరిణీతి ప్రెగ్నెన్సీ.. నో కోల్డ్వార్.. పెద్దమ్మ ఫుల్ హ్యాపీ
తన జీవితంలో ముఖ్యమైన శుభవార్తను ప్రకటించింది నటి పరిణీతి చోప్రా. త్వరలోనే తామెతొలి బిడ్డకు జన్మనివ్వబోతున్నామని సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. దీంతో తన అభిమానుల అభినందనలు వెల్లువెత్తాయి. మరీ ముఖ్యంగా తల్లిదండ్రులు కాబోయే పరిణీతి, రాఘవ్ చద్దాకు అటు రాజకీయ ప్రముఖులు, ఇటు సినీ,ఇండస్ట్రీ మొత్తం అభినందించింది. ఈ జంట ఆగస్టు 25 న ఇన్స్టాగ్రామ్లో “1 + 1 = 3”, కేక్ , చిన్న పాదముద్రలను కలిగి ఉన్న ఒక అందమైన పోస్ట్ను పంచుకుని అందర్నీ ఆశ్చర్యపరిచారు. దీంతో పరిణీతి చోప్రా గర్భవతి అని తెలియగానే నటు కియారా అద్వానీ , నేహా ధూపియా, సోనమ్ కపూర్, భూమి పెడ్నేకర్, హుమా ఖురేషి రకుల్ ప్రీత్ సింగ్ ఇలా పలువురు శుభాకాంక్షలు తెలిపారు. వీరిలో పరిణీతి సోదరి 'మిమి దీదీ' ప్రియాంక చోప్రా (Priyanka Chopra) తెగ సంతోషడిపోయింది. పరిణీతి పోస్ట్ను ప్రియాంక కూడా తిరిగి షేర్ చేసి, త్వరలో తల్లిదండ్రులు కాబోతున్న వారిని అభినందించింది. దీంతో ప్రియాంక, పరిణీతి వివాహాన్ని మిస్ అయిన తర్వాత, ఇద్దరు సోదరీమణుల మధ్య కోల్డ్ వార్ జరుగుతుందని పుకార్లను తోసి పుచ్చింది.ఇదీ చదవండి: Vinayaka Chavithi 2025 : ప్రపంచంలో కొలువైన ఈ గణపయ్యల గురించి తెలుసా?పరిణీతి చోప్రా రాఘవ్ చద్దాల ప్రేమకథ మే 13, 2023న న్యూఢిల్లీలో వారి నిశ్చితార్థం తరువాత వెలుగులోకి వచ్చింది. ఈ జంట సెప్టెంబర్ 24, 2023న ఉదయపూర్లోని విలాసవంతమైన లీలా ప్యాలెస్లో ఘనంగా వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.చదవండి: Yoga మైగ్రేన్తో భరించలేని బాధా? బెస్ట్ యోగాసనాలు -
30 ఇయర్స్ ఇండస్ట్రీ.. బాలీవుడ్ అది మర్చిపోయి..: సిమ్రాన్
హీరోయిన్ సిమ్రాన్ (Simran) ఇండస్ట్రీకి వచ్చి నేటి(ఆగస్టు 25)కి 30 ఏళ్లు పూర్తవుతుంది. హర్జై అనే హిందీ చిత్రంతో 1995లో కెరీర్ ప్రారంభించింది సిమ్రాన్. బాలీవుడ్లో కన్నా సౌత్లోనే ఎక్కువ స్టార్డమ్ తెచ్చుకుంది. తెలుగు, తమిళ భాషల్లో అనేక సినిమాలు చేసింది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. హిందీలో నేను గుల్మొహర్ అనే సినిమా చేశాను. ఆ మూవీ టీమ్ అంతా కూడా చాలామంచివారు. అదే సమయంలో మరో ప్రాజెక్ట్ కూడా చేశాను. కానీ, అక్కడ ఎవరితోనూ కనెక్ట్ కాలేకపోయాను.వీడియో క్లిప్స్ పంపాలా?పైగా ఇక్కడ పాత్రకు నేను సూట్ అవుతానా? లేదా? అని లుక్ టెస్ట్ చేస్తుంటారు. అందుకు నేను అభ్యంతరమేమీ చెప్పను. ఓకే కానీ, కొందరు నాగురించి తెలియక.. పాత్రకు సరిపోతానో? లేదోనని వీడియో చేసి పంపించమంటారు. అంతేకాకుండా.. సౌత్ ఇండస్ట్రీలో ఇచ్చే రెమ్యునరేషన్లో పదో వంతు మాత్రమే చెల్లిస్తారు. అందుకే నా గురించి పూర్తిగా తెలుసుకున్నవారి దగ్గరే సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నాను.పెద్ద సినిమాల నుంచి ఆఫర్లు లేవ్టూరిస్ట్ ఫ్యామిలీ తర్వాత చిన్న, మధ్య తరహా సినిమా అవకాశాలు చాలానే వచ్చాయి. అందులోనూ మహిళా ప్రాధాన్యత ఉన్న స్క్రిప్టులే ఎక్కువ! కానీ, పెద్ద ప్రొడక్షన్ హౌస్ నుంచి, బడా దర్శకనిర్మాతల నుంచి మాత్రం ఒక్క ఆఫర్ కూడా రాలేదు. నా కెరీర్లో చాలా హిట్లు ఉన్నాయి. ఎంతోమంది యంగ్ టాలెంట్ నన్ను ఆదర్శంగా తీసుకుంటున్నందుకు సంతోషంగా ఉంది అని చెప్పుకొచ్చింది.సినిమాఈ ఏడాది సిమ్రాన్ ఫుల్ బిజీ. శబ్ధంతో అలరించిన ఆమె గుడ్ బ్యాడ్ అగ్లీలో అతిథి పాత్రలో మెరిసింది. టూరిస్ట్ ఫ్యామిలీతో సూపర్ హిట్టు అందుకుంది. ప్రస్తుతం ద లాస్ట్ వన్ అనే మూవీలో యాక్ట్ చేస్తోంది. విక్రమ్ సరసన నటించిన ధ్రువ నక్షత్రం ఇప్పటికీ విడుదలకు నోచుకోలేదు.చదవండి: క్యాన్సర్ బారిన పడ్డ నటి.. అన్నిటికంటే అదే దారుణమంటూ. -
పెళ్లయిన ఆరు నెలలకే పాప ఎలా పుట్టింది? అంతటా ఇదే చర్చ!
బాలీవుడ్ నటి నేహా ధూపియా (Neha Dhupia) 2018లో నటుడు అంగద్ బేడీని పెళ్లి చేసుకుంది. సీక్రెట్గా డేటింగ్ చేసిన వీరిద్దరూ తమ ప్రేమవిషయాన్ని ఎన్నడూ బయటపెట్టలేదు. అలాంటిది సడన్గా వీరి పెళ్లి ఫోటోలు నెట్టింట ప్రత్యక్షం కావడంతో అందరూ ఆశ్చర్యపోయారు. పెళ్లయిన ఆరు నెలలకే ఈ జంటకు మెహర్ అనే కూతురు జన్మించింది. కానీ.. మ్యారేజ్కు ముందే నేహా ప్రెగ్నెంట్ కావడంతో నెట్టింట విమర్శలు వెల్లువెత్తాయి.ఇదే రచ్చతాజాగా ఈ ట్రోలింగ్ గురించి నేహా ధూపియా మాట్లాడుతూ.. నేను అంగద్ను పెళ్లాడిన ఆరు నెలలకే పాప పుట్టింది. పెళ్లయిన ఆరు నెలలకే పాప ఎలా పుట్టింది? అలా ఎలా జరుగుతుంది? అని చర్చ మొదలుపెట్టారు. పెళ్లికి ముందే గర్భం దాల్చిన మహిళా నటుల గురించి ఇప్పటికీ స్టోరీలు వస్తూ ఉంటాయి. వాటిని నేను కూడా చూస్తూ ఉంటాను.ఆ లిస్టులో ఉన్నా..నీనా గుప్తా, ఆలియా భట్ల జాబితాలో నేను ఉన్నాను. కానీ దీన్ని ఇంతలా హైలైట్ చేయడం చూస్తుంటే చాలా హాస్యాస్పదంగా అనిపిస్తుంది అని చెప్పుకొచ్చింది. కాగా నీనా గుప్తా.. క్రికెటర్ వివియన్ రిచర్డ్స్ను ప్రేమించింది. వీరి అనురాగానికి గుర్తుగా మసాబా గుప్తా జన్మించింది. బాలీవుడ్ స్టార్ జంట ఆలియా భట్- రణ్బీర్ కపూర్.. 2018 నుంచి ప్రేమించుకున్నారు. 2022 ఏప్రిల్లో పెళ్లి చేసుకున్నారు. అదే ఏడాది నవంబర్లో కూతురు రాహా జన్మించింది.చదవండి: క్యాన్సర్ బారిన పడ్డ నటి.. అన్నిటికంటే అదే దారుణమంటూ.. -
బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్.. సోషల్ మీడియాలో పోస్ట్!
ప్రముఖ బాలీవుడ్ మాళవిక రాజ్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. తాను పండంటి బిడ్డకు జన్మనిచ్చినట్లు సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. 2023లో ప్రణవ్ బగ్గాను పెళ్లాడిన ముద్దుగుమ్మ.. ఈ ఏడాది మే నెలలో గర్భం ధరించిన విషయాన్ని రివీల్ చేసింది. తాజాగా తమకు పాప పుట్టిందని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఈ జంటకు అభినందనలు చెబుతున్నారు.కాగా.. 2001లో బాలీవుడ్లో హిట్ అయిన 'కభీ ఖుషీ కభీ ఘమ్' చిత్రంలో పాత్రతో గుర్తింపు తెచ్చుకుంది మాల్వికా రాజ్. అంతేకాకుండా రింజిన్ డెంజోంగ్పాతో కలిసి 'స్క్వాడ్' అనే యాక్షన్ చిత్రంలో కూడా నటించింది. కాగా.. 2023లో ప్రణవ్ బగ్గాతో ప్రేమలో పడిన మాల్వికా రాజ్ కొన్ని నెలల డేటింగ్ తర్వాత పెళ్లిబంధంలోకి అడుగుపెట్టింది. గోవాలోని బీచ్లో జరిగిన వీరిద్దరి పెళ్లి వేడుకలకు పలువురు సినీతారలు హాజరయ్యారు. తెలుగులో 'జయదేవ్' అనే చిత్రంలో కనిపించింది. ఇటీవలే క్రైమ్-థ్రిల్లర్ సిరీస్ 'స్వైప్ క్రైమ్'లోనూ నటించింది. View this post on Instagram A post shared by Malvika Raaj Bagga (@malvikaraaj) -
క్యాన్సర్ బారిన పడ్డ నటి.. అన్నిటికంటే అదే దారుణమంటూ..
బాలీవుడ్ నటి తనిష్టా చటర్జీ (Tannishtha Chatterjee) క్యాన్సర్ బారిన పడినట్లు వెల్లడించింది. ఇదే వ్యాధి కారణంగా తండ్రిని కోల్పోయిన ఆమె ఇప్పుడదే మహమ్మారితో పోరాడుతున్నానని చెప్పుకొచ్చింది. ఈ మేరకు తన జర్నీని సోషల్ మీడియాలో పంచుకుంది. గత 8 నెలలు ఎంతో కష్టంగా సాగాయి. క్యాన్సర్తో తండ్రిని కోల్పోయాను. ఇప్పుడదే మహమ్మారి నాకూ వచ్చింది. ఒలిగో మెటాస్టాటిక్ క్యాన్సర్ నాలుగో దశలో ఉన్నట్లు 8 నెలల క్రితం తేలింది. ఇద్దరికి నేనే ఆధారంనా బాధ చెప్పుకోవడానికి ఈ పోస్ట్ చేయడం లేదు. ప్రేమ, ఆత్మస్థైర్యం గురించి మాట్లాడేందుకు పోస్ట్ చేశాను. నాపై 70 ఏళ్ల తల్లి ఆధారపడి ఉంది. నాకు తొమ్మిదేళ్ల కూతురుంది(తనిష్టాకు పెళ్లవలేదు, పాపను దత్తత తీసుకుంది). ఇద్దరికీ అన్నీ నేనే! వారిని చూసుకోవాల్సిన నేను క్యాన్సర్తో పోరాడుతున్నా.. ఇంతకంటే దారుణం మరొకటి ఉండదు. ఇటువంటి కష్టసమయంలో వారి ప్రేమే నాకు సాంత్వననిస్తోంది. ఒంటరితనం దరిచేరనీయకుండా నా కుటుంబసభ్యులు, స్నేహితులు ఎల్లప్పుడూ నన్ను అంటిపెట్టుకునే ఉంటున్నారు. నా పెదాలపై చిరునవ్వును చెరిగిపోనివ్వడం లేదు.ఏదీ రీప్లేస్ చేయలేదుప్రపంచమంతా ఏఐ, రోబోలంటూ పరుగులు తీస్తోంది. కానీ నన్ను కాపాడుతున్న మానవుల ప్రేమను ఏదీ రీప్లేస్ చేయలేదు. వారి కరుణ, ప్రేమ, ఉనికి.. మానవత్వం.. నాకు కొత్త జీవితాన్ని ప్రసాదిస్తున్నట్లుగా ఉంది అంటూ తన స్నేహితులను ట్యాగ్ చేసింది. ఓ ఫోటోను కూడా జత చేసింది. అందులో నటి దివ్య దత్త, లారా దత్తా, విద్యా బాలన్, షబానా అజ్మీ, కొంకణ సేన్ శర్మ తదితరులున్నారు. సినిమాతనిష్టా చటర్జీ.. రోడ్- మూవీ, దేఖ్ ఇండియన్ సర్కస్, గులాబ్ గ్యాంగ్, సన్రైజ్, ఐ లవ్ న్యూఇయర్, పార్చ్డ్, డాక్టర్ రక్మంభాయి, ఝల్కి, జోరమ్ వంటి పలు చిత్రాల్లో నటించింది. బీబర్ అనే బెంగాలీ మూవీ, బ్రిక్ లేన్ అనే హాలీవుడ్ చిత్రంలోనూ యాక్ట్ చేసింది. చివరగా ద స్టోరీటెల్లర్ చిత్రంలో కనిపించింది. ఓటీటీలో కార్టెల్, మోడ్రన్ లవ్ ముంబై, స్కూప్ సిరీస్లలో మెరిసింది. View this post on Instagram A post shared by Tannishtha Chatterjee (@tannishtha_c) చదవండి: ఊరు నుంచి ఊపుకుంటూ వచ్చావ్.. నీకంత సీన్ లేదు: నవదీప్ -
బేబీ ఆన్ ద వే.. ప్రెగ్నెన్సీ ప్రకటించిన స్టార్ హీరోయిన్
మరో హీరోయిన్ తల్లి కాబోతుంది. 2023లో రాజకీయ నాయకుడిని పెళ్లి చేసుకున్న ఈమె.. ఓవైపు సినిమాలు చేస్తోంది. ఇప్పుడు గుడ్ న్యూస్ చెప్పేసింది. ప్రస్తుతం తాను ప్రెగ్నెన్సీతో ఉన్న విషయాన్ని ప్రకటించింది. ఈ మేరకు భర్తతో కలిసి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. దీంతో తోటి సెలబ్రిటీలు శుభాకాంక్షలు చెబుతున్నారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 27 సినిమాలు)చోప్రాస్ ఫ్యామిలీ నుంచి పరిణీతి.. 2012 నుంచి బాలీవుడ్లో సినిమాలు చేస్తోంది. ఇష్క్ జాదే, శుద్ద్ దేశీ రొమాన్స్, మేరీ ప్యారీ బిందు, కేసరి, అమర్ సింగ్ చమ్కీలా తదితర చిత్రాలు ఈమెకు మంచి పేరు తీసుకొచ్చాయి. చెప్పాలంటే సెన్సేషనల్ హిట్ 'యానిమల్'లోనూ ఈమెనే తొలుత హీరోయిన్ అనుకున్నారు. కానీ తర్వాత ఆ ఛాన్స్ రష్మికని వరించింది.ఓ సినిమా, వెబ్ సిరీస్ పూర్తి చేసింది. ప్రస్తుతానికైతే ఈమె చేతిలో కొత్త ప్రాజెక్టులేం లేవు. ఈ క్రమంలోనే తాను ప్రెగ్నెన్సీతో ఉన్న విషయాన్ని పరిణీతి బయటపెట్టింది. ఈమె ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన రాఘవ్ చద్దాని ప్రేమించి పెళ్లి చేసుకుంది. 2023 సెప్టెంబరులో వీళ్లిద్దరూ ఒకటి కాగా.. ఇప్పుడు రెండేళ్లు ముగేసరికి తాము తల్లిదండ్రులు కాబోతున్న విషయాన్ని ప్రకటించారు. బాలీవుడ్ సెలబ్రిటీలు ఈ జంటకు విషెస్ చెబుతున్నారు.(ఇదీ చదవండి: ఎంతో బాధ అనుభవించా.. పెళ్లి వల్ల గుర్తింపు రాలేదు: ఉపాసన) View this post on Instagram A post shared by @parineetichopra -
మీకెంత ధైర్యం అలా చేయడానికి?.. బాడీ షేమింగ్పై నటి ఆగ్రహం
బాలీవుడ్ హీరోయిన్ కాజోల్ను బాడీ షేమింగ్ చేయడాన్ని మరో నటి, టీవీ హోస్ట్ మిని మాథుర్ తప్పుపట్టింది. ఓ నెటిజన్ ఇన్స్టాగ్రామ్లో కాజోల్ వీడియోను పోస్ట్ చేయడంపై మండిపడింది. అసలు ఆమె బాడీని జూమ్ చేయడానికి నీకెంత ధైర్యం..తాను ఎలా కనిపించాలనేది తన ఇష్టమని.. మీరేలా డిసైడ్ చేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. కాజోల్ వీడియోను జూమ్ చేస్తూ పోస్ట్ చేసిన వీడియోపై మిని మాథుర్ ఈ విధంగా స్పందించింది.కాగా.. బాలీవుడ్ నటి కాజోల్ తన లేటేస్ట్ వెబ్ సిరీస్ ది ట్రయల్ రెండో సీజన్ ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి హాజరయ్యారు, ఇందులో ఆమె నోయోనికా సేన్గుప్తా అనే లాయర్ పాత్రను పోషించారు. ముంబై జరిగిన ఈ ఈవెంట్లో కాజోల్ బ్లాక్ స్కర్ట్ డ్రెస్లో కనిపించింది. దీంతో వెంటనే డ్రెస్పై నెటిజన్స్ ట్రోల్స్ చేశారు. ఇది చూసిన నటి మిని మాథుర్ అలాంటి వారికి ఇచ్చిపడేసింది. అయితే తనపై వచ్చిన బాడీ-షేమింగ్ వ్యాఖ్యలపై కాజోల్ ఇంకా స్పందించలేదు.మరోవైపు ది ట్రయల్ వెబ్ సిరీస్కు మొదటి సీజన్కు ప్రశంసలు వచ్చాయి. ఈ సిరీస్లో మరోసారి కాజోల్ న్యాయవాది నోయోనికా సేన్గుప్తాగా అలరించనుంది. ఈ చిత్రంలో జిషు సేన్గుప్తా ఆమె భర్తగా కనిపించనున్నారు. ఈ సిరీస్ మొదటి సీజన్ 2023లో విడుదలైంది. ఇందులో సోనాలి కులకర్ణి, షీబా చద్దా, అలీ ఖాన్, కుబ్రా సైట్, గౌరవ్ పాండే, కరణ్వీర్ శర్మ కీలక పాత్రల్లో నటించారు. ఈ సీజన్ సెప్టెంబర్ 19, 2025న జియోహాట్స్టార్లో స్ట్రీమింగ్ కానుంది. View this post on Instagram A post shared by Sunilkumar Gol (Photographer) (@goley.sunil_) -
సీక్రెట్గా వీడియో షూట్.. కోపంతో ఊగిపోయిన దీపికా పదుకొణె
సెలబ్రిటీలు కనిపిస్తే చాలు.. సెల్ఫీలంటూ ఎగబడిపోతుంటారు. వారు హడావుడిలో ఉన్నా, వద్దని చెప్తున్నా వినిపించుకోరు. కొందరైతే స్టార్స్కు తెలియకుండా వారిని ఫాలో చేసి సీక్రెట్గా ఫోటోలు, వీడియోలు తీస్తుంటారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె (Deepika Padukone) విషయంలో ఇప్పుడదే జరిగింది. కూతురు దువాతో కలిసి బయటకు వెళ్లిన దీపికను ఓ అభిమాని ఫాలో అయ్యాడు. దీపికా అసహనంముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో వాళ్లను సీక్రెట్గా కెమెరాలో చిత్రీకరించాడు. ఇది దీపికా కంట పడటంతో ఆమె ఆగ్రహానికి గురైంది. ఇలా చేయడం తప్పని మందలించింది. వీడియో డిలీట్ చేయమని కోరింది. ఇప్పటివరకు దీపికా జంట.. కూతురి ముఖాన్ని ఎక్కడా చూపించలేదు. పాపరాజీ (ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్స్) కూడా స్టార్స్ విన్నపం మేరకు దువా ఫోటోలను క్లిక్ చేయకుండా సహకరించారు.మందలించినా వినకుండా..దీపికా-రణ్వీర్ ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటే సదరు అభిమాని మాత్రం ఇలా వీడియో తీయడం.. అది వైరల్ కావడంతో నెటిజన్లు మండిపడుతున్నారు. పేరెంట్స్ అనుమతి లేకుండా దువా ఫేస్ను రివీల్ చేశాడని ఆగ్రహిస్తున్నారు. ఆమె వద్దని చెప్పినా వినకుండా వీడియో పోస్ట్ చేయడం తప్పని మందలించారు. ఆన్లైన్లో కూతురి ఫోటో ప్రత్యక్షం కావడంపై దీపికా అప్సెట్ అయినట్లు తెలుస్తోంది.దువాకాగా దీపికా, రణ్వీర్ 2018లో పెళ్లి చేసుకున్నారు. వీరికి గతేడాది సెప్టెంబర్ 8న కూతురు జన్మించింది. ఎన్నో ప్రార్థనల ఫలితంగా పుట్టిన పాపాయికి దువా అని నామకరణం చేశారు. దువా అంటే ప్రార్థన అని అర్థం. సినిమాల విషయానికి వస్తే.. రణ్వీర్.. ధురంధర్ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ డిసెంబర్ 6న విడుదల కానుంది. అలాగే డాన్ 3 సినిమాలోనూ యాక్ట్ చేస్తున్నాడు. దీపికా.. అల్లు అర్జున్- అట్లీ మూవీలో నటించనుంది. deepika herself requested not to click or post pictures or videos of dua yet people are still doing it please out of basic respect and privacy stop this behaviour— 🎀 (@mecoreeee) August 23, 2025baby dua is the cutest omggg 😭😭😭🤍🤍🤍🤍 i won't share the vid, dp is clearly bothered by whoever filmed it. it their choice to protect their daughter's privacy until they feel like sharing it with us. BUT BABYGIRL IS JUST TOO ADORABLE 🥹🫶🏼 bless her 🤍— srkdp (@srkdeepikaholic) August 23, 2025DELETE THE VIDEO, STOP SHARING AND SPREADING IT. It’s a breach of privacy, Deepika was asking the person to stop recording. They didn’t consent to Dua being clicked or recorded.— nikita💫 (@nikita1372) August 23, 2025 చదవండి: సిద్దిపేట మోడల్కు షాక్.. 16 మందికి అసలైన అగ్నిపరీక్ష! -
పదిహేడేళ్ల తర్వాత...
పదిహేడేళ్ల తర్వాత హీరోలు అక్షయ్ కుమార్–సైఫ్ అలీఖాన్ ‘హైవాన్’ సినిమా కోసం మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. ఈ హిందీ థ్రిల్లర్ సినిమాకు ప్రియదర్శన్ దర్శకత్వం వహిస్తున్నారు. కేవీఎన్ ప్రోడక్షన్స్, తెస్పియన్ ఫిల్మ్స్ పతాకాలపై వెంకట్ కె. నారాయణ, శైలజా దేశాయ్ ఫెన్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ శనివారం కొచ్చిలో ఆరంభ మైంది.ఊటీ, ముంబైలలో ఈ సినిమా చిత్రీకరణ జరపుకోనుంది. ఇక విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వంలోని హిందీ చిత్రం ‘తషాన్’ (2008)లో అక్షయ్ కుమార్–సైఫ్ అలీఖాన్ నటించారు. మళ్లీ ఇప్పుడు ‘హైవాన్’లో ఈ ఇద్దరు స్టార్స్ కలిసి నటిస్తున్నారు. -
ఆ సీన్ కోసం 28 టేకులు.. ఇప్పటికీ మర్చిపోలేను: విద్యాబాలన్
'పరిణీత' చిత్రంతో విద్యాబాలన్ (Vidya Balan) కెరీర్ మొదలైంది. ఈ సినిమా 2005 జూన్ 10న విడుదలైంది. శరత్ చంద్ర చటోపాధ్యాయ రాసిన పరిణీత (1914) అనే బెంగాలీ నవల ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. సంజయ్ దత్, సైఫ్ అలీ ఖాన్ ప్రధాన పాత్రలు పోషించారు. ప్రదీప్ సర్కార్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ 20 ఏళ్ల తర్వాత రీరిలీజ్ అవుతోంది. ఆగస్టు 29న మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.ఇంత పరిచయమా? నాకు తెలీదుఈ సందర్భంగా విద్యాబాలన్ ఆనాటి సంగతులను గుర్తు చేసుకుంది. నాకు బాగా గుర్తు.. సైఫ్ అలీ ఖాన్ తల్లి, బాలీవుడ్ స్టార్ షర్మిల ఠాగూర్ (Sharmila Tagore) ఓరోజు సెట్కు వచ్చింది. తనను చూసేందుకు నేను చాలా ఎగ్జయిట్ అయ్యాను. ఆవిడంటే నాకెంతో ఇష్టం. మామధ్య ఎంతో అనుబంధం ఉందన్నట్లుగా ఒకరినొకరం పలకరించుకున్నాం. అది చూసిన సైఫ్.. ఓహ్, మీ ఇద్దరికీ ఇంత పరిచయముందని నాకింతవరకు తెలీదు అని సరదాగా జోక్ చేశాడు. ఎప్పుడు గుర్తు చేసుకున్నా..వెంటనే నేను నాకు ఆమె తెలుసు.. కానీ తనకు నేను తెలియదని బదులిచ్చాను. సైఫ్ సరదాగా ఉంటూ ఎప్పుడూ నవ్విస్తుంటాడు. ఆ సంఘటన ఇప్పుడు గుర్తు చేసుకున్నా నవ్వొస్తుంటుంది. దాదా(ప్రదీప్ సర్కార్) వల్లే నటనలో మెళకువలు నేర్చుకున్నాను. ప్రతి చిన్నవిషయాన్ని కూడా గుర్తించి సీన్ మళ్లీ చేయిస్తాడు. అవసరమైతే వంద టేకులైనా తీసుకుంటాడు.కన్నీటి చుక్క సరిగ్గా రావాలని..కేవలం మా పర్ఫామెన్స్ కోసమే కాదు, వెనకాల పావురాలు ఎగిరే క్షణాలు కూడా సరిగ్గా రావాలనుకుంటాడు. అన్నీ సరిగ్గా కుదరాలని భావిస్తాడు. ఒక పాటలో నేను ఏడవాల్సి ఉంటుంది. ఆ పాటలోని ఓ లైన్ దగ్గర నా కన్నీటిచుక్క కిందపడాలి. దీని కోసం 28 టేకులు తీసుకున్నాను అని చెప్పుకొచ్చింది. ప్రదీప్ సర్కార్.. అనారోగ్యంతో 2023లో కన్నుమూశారు. -
రెండు బ్రేకప్స్.. మగవాడి తోడు అవసరం లేదు: హీరోయిన్
గతంలో రెండు బ్రేకప్స్ జరిగాయంటోంది బాలీవుడ్ హీరోయిన్ డైసీ షా (Daisy Shah). అందులో తనను బాగా ఇబ్బంది పెట్టిన రిలేషన్షిప్ గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది. ఓ అబ్బాయితో చాలా ఏళ్లు రిలేషన్లో ఉన్నాను. మొదటి నాలుగేళ్ల సమయంలో అసలు పెళ్లి ఆలోచనే రాలేదు. తర్వాత నాకు ఆ ఆలోచనే రాకుండా చేశాడు. ఏడో సంవత్సరంలో ఉండగా.. నేను సంతోషంగా లేనన్న విషయాన్ని గ్రహించి బ్రేకప్ చెప్పాను. రెండో రిలేషన్లో పరిస్థితి మరీ దారుణం. నేనెక్కడికి వెళ్తున్నా?.. అబ్బాయిలతో కలిసి పని చేస్తున్నానా? ఇలా ప్రతీది గుచ్చిగుచ్చి అడిగేవాడు. ఇక్కడ ఆశ్చర్యకర విషయమేంటంటే.. అతడు కూడా ఇదే ఇండస్ట్రీలో ఉన్నాడు. ఒకసారి మేమిద్దరం పార్టీలో ఉన్నాం. ఫ్రెండ్స్తో కలిసి డ్యాన్స్ చేస్తున్నాం. ఇంతలో ఒకరు నా వెనక నుంచి వచ్చి చేయి పట్టుకుని లాగి తనతో డ్యాన్స్ చేయమని అడిగాడు.నా తప్పేముంది?అందులో తప్పేముంది? దానికి నాపై కోప్పడాల్సిన అవసరం లేదుకదా! కానీ అతడు మాత్రం వేరే అమ్మాయిలతో డ్యాన్స్ చేస్తూ తనను అర్థం చేసుకోమన్నాడు. అతడి పద్ధతి నాకు చిరాకు తెప్పించేది. నన్నెప్పుడూ కంట్రోల్ చేయాలని చూసేవాడు. దానివల్ల మరింత ఫ్రస్టేట్ అయ్యేదాన్ని. బలమైన అమ్మాయిలను చూసి మగవాళ్లు అస్సలు ఓర్వలేరు. అలాంటివాళ్లను చాలామందిని చూశాను. ఇప్పట్లో అయితే పెళ్లి చేసుకోవాలన్న ఆసక్తి లేదు. పైగా నేను ఆర్థికంగా బాగానే ఉన్నాను. నా పోషణ కోసం ఒక మగవాడి తోడు అవసరం లేదు. అయితే నా స్నేహితురాలి సలహాతో అండాలు భద్రపరిచాను అని చెప్పుకొచ్చింది.కెరీర్డైసీ షా.. ప్రముఖ కొరియోగ్రాఫర్ గణేశ్ ఆచార్యకు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా కెరీర్ మొదలుపెట్టింది. భద్ర అనే కన్నడ చిత్రంతో హీరోయిన్గా మారింది. సల్మాన్ ఖాన్తో చేసిన 'జై హో' మూవీతో మంచి గుర్తింపు అందుకుంది. ఈమె చివరగా మిస్టరీ ఆఫ్ ద టాటూ మూవీ చేసింది. గతేడాది వచ్చిన రెడ్ రూమ్ అనే వెబ్ సిరీస్లో కనిపించింది. మరో రెండు రోజుల్లో (ఆగస్టు 25న) డైసీ షా 41వ వయసులోకి అడుగుపెట్టనుంది.చదవండి: బతికుండగానే చంపుతారా? సిగ్గు లేదు!: నటుడి ఆగ్రహం -
ఓటీటీలో 'కుబేర' విలన్ మూవీ.. ఎక్కడంటే?
అటు థియేటర్లో ఈ మధ్య అన్నీ పెద్ద సినిమాలే రిలీజవ్వగా ఇటు ఓటీటీ (OTT)లో చిన్నాపెద్ద తేడా లేకుండా అన్నిరకాల చిత్రాలు విడుదలవుతున్నాయి. ఈ క్రమంలోనే మరో ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. బాలీవుడ్ నటులు మనోజ్ బాజ్పాయ్, జిమ్ సర్బ్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ఇన్స్పెక్టర్ జెండే (Inspector Zende). మనోజ్.. మధుకర్ జెండె అనే పోలీస్గా నటించగా జిమ్ సర్బ్.. కార్ల్ భోజ్రాజ్ అనే స్విమ్సూట్ కిల్లర్గా కనిపించనున్నాడు.ఓటీటీలోబాలచంద్ర కడం, సచిన్ ఖేడెకర్, గిరిజ, హరీశ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. చిన్మయి మండ్లేకర్ దర్శకత్వం వహించిన ఈ మూవీ సెప్టెంబర్ 5 నుంచి అందుబాటులోకి రానున్నట్లు నెట్ఫ్లిక్స్ ప్రకటించింది. ఈ మేరకు ఓ పోస్టర్ వదిలింది. ఈ మూవీని ఓం రౌత్, జే షెవక్రమణి నిర్మించారు. ఇకపోతే మనోజ్ బాజ్పాయ్ చివరగా డిస్పాచ్ మూవీలో నటించాడు. ఓటీటీలో కిల్లర్ సూప్ సిరీస్లోనూ యాక్ట్ చేశాడు. ప్రస్తుతం ఫ్యామిలీ మ్యాన్ 3 సిరీస్ చేస్తున్నాడు. జిమ్ సర్బ్ విషయానికి వస్తే.. ఇతడు చివరగా బ్లాక్బస్టర్ మూవీ కుబేరలో నటించాడు. ఇందులో విలన్గా నటించి మెప్పించాడు. View this post on Instagram A post shared by Netflix India (@netflix_in)చదవండి: బతికుండగానే చంపుతారా? సిగ్గు లేదు!: నటుడి ఆగ్రహం -
తెరపైకి మరోసారి స్టార్ హీరో విడాకుల వివాదం
బాలీవుడ్ స్టార్ నటుడు గోవిందపై కొన్ని నెలలుగా విడాకుల వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ విషయంలో ఇప్పటికే చాలా సార్లు ఆయన భార్య సునీతా అహుజా క్లారిటీ ఇచ్చారు. తామిద్దరం కలిసే ఉన్నామని.. ఎవరూ ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేయకండి అంటూ ఆమె చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే మరోసారి గోవిందా తరఫు లాయర్ లలిత్ బింద్రా కూడా స్పందించారు. వారిద్దరి విడాకులకు సంబంధించి ఎలాంటి కేసు లేదని క్లారిటీ ఇచ్చారు. అయితే, కొందరు కావాలనే పాత విషయాలను తెరపైకి తీసుకొస్తున్నారని తెలిపారు. వినాయకచవితి పండగనాడు వారిద్దరినీ జంటగా చూడొచ్చని లాయర్ లలిత్ చెప్పారు. గోవింద, సునీత 1986లో వివాహం చేసుకున్నారు. వీరికి యశ్వర్ధన్ అహుజా, టీనా అహుజా అనే ఇద్దరు పిల్లలు సంతానం ఉన్నారు.నటుడు గోవింద మరో స్త్రీతో వివాహేతర సంబంధం పెట్టుకోవడం వల్లనే సునీతా అహుజా విడాకులు ఇస్తున్నట్లు వార్తలు వచ్చాయి. తన పట్ల క్రూరంగా వ్యవహరిస్తున్నాడని ఆమె ఆరోపించినట్టు పలు కథనాలు వచ్చాయి. 30 ఏళ్ల ఓ మరాఠీ నటితో గోవిందా దగ్గరగా ఉన్నారని పుకార్లు వినిపిస్తున్నాయి. ఆమె వల్లనే సునీతతో గొడవలు జరుగుతున్నాయని సమాచారం. -
బతికుండగానే చంపుతారా? సిగ్గు లేదు!: 'ఇంద్ర' నటుడి ఆగ్రహం
సోషల్ మీడియాను మంచికన్నా చెడుకే ఎక్కువమంది ఉపయోగిస్తున్నారు. ప్రాణాలతో ఉన్న నటులు చనిపోయారంటూ ఫేక్ వదంతులు సృష్టిస్తున్నారు. తాజాగా బాలీవుడ్ నటుడు రజా మురద్ (Actor Raza Murad) గురించి ఇటువంటి ఫేక్ ప్రచారం చేపట్టారు. యాక్టర్ చనిపోయాడని ప్రకటిస్తూ నివాళులు అర్పించారు. సదరు పోస్ట్పై రజా మురద్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఎన్నిసార్లు తాను బతికున్నానని నిరూపించుకోవాలని ఆవేదన వ్యక్తం చేశాడు. అసత్య ప్రచారం చేసినవారిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.సీరియస్ మ్యాటర్రజా మురద్ మాట్లాడుతూ.. నేను ఇంకా బతికున్నందుకు కొందరు చాలా బాధపడుతున్నారు. కారణమేంటో నాకర్థం కావట్లేదు. ఏకంగా నేను చనిపోయానంటూ సోషల్ మీడియాలో నివాళులు అర్పించారు. ఇండస్ట్రీలో ఎన్నో ఏళ్లు పనిచేశానని, కానీ నన్ను స్మరించుకోవడానికి కూడా ఎవరూ లేరని రాశారు. నా పుట్టినరోజు, అలాగే ఫేక్ డెత్ డెట్ కూడా ఆ పోస్ట్లో జత చేశారు. ఇది అంత తేలికగా తీసుకునే విషయం కాదు. చాలా సీరియస్.చెప్పీచెప్పీ గొంతెండిపోయిందినేను బతికే ఉన్నానని చెప్పీచెప్పీ నా గొంతు, నాలుక, పెదాలు తడారిపోయాయి. చనిపోయానన్న వార్త అంతటా వైరలవుతోంది. ప్రపంచవ్యాప్తంగా పలుచోట్ల నుంచి నాకు ఫోన్కాల్స్, మెసేజ్లు వస్తున్నాయి. ఇలాంటి వదంతి సృష్టించినవారిది వక్రబుద్ధి అయి ఉండాలి. జీవితంలో ఏదీ సాధించడం చేతకాక ఇలాంటి నీచపు పనులు చేసి ఆనందిస్తున్నాడు. కొంచెమైనా సిగ్గుండాలి! పోలీసులు ఆ దుర్మార్గుడిని పట్టుకుంటానని హామీ ఇచ్చారు. అతడిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.ఇక చాలుబతికుండగా ఎవరినీ చంపొద్దు.. ఇలాంటివి ఇకనైనా ఆపేయండి. నాగురించి మాత్రమే చెప్పడం లేదు. చాలామంది సెలబ్రిటీలను ఇలాగే సోషల్ మీడియాలో చంపేస్తున్నారు. అది పెద్ద తప్పు అని చెప్పుకొచ్చాడు. రజా మురద్.. జోధా అక్బర్, గోలియాకీ రాస్లీల రామ్లీల, బాజీరావు మస్తానీ, పద్మావత్ వంటి పలు చిత్రాల్లో నటించాడు. తెలుగులో.. ఇంద్ర, జానీ, సుభాస్ చంద్రబోస్, రుద్రమదేవి చిత్రాల్లో నటించాడు. బుల్లితెరపై మేఘ బర్సేంగె సీరియల్లో నటించాడు.చదవండి: ఎమోషనల్ స్టోరీ మామన్ మూవీ రివ్యూ -
పెళ్లి పీటలెక్కిన బిగ్బాస్ బ్యూటీ.. రాఖీ సావంత్ మాజీ బాయ్ఫ్రెండ్ సందడి!
ప్రముఖ నటి, బిగ్బాస్ కంటెస్టెంట్ సబా ఖాన్ పెళ్లి పీటలెక్కింది. ప్రముఖ వ్యాపారవేత్తను ఆమె పెళ్లాడింది. రాజస్థాన్లోని జోధ్పూర్లో వీరిద్దరి పెళ్లి గ్రాండ్గా జరిగింది. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. కాగా.. సభా ఖాన్ హిందీ బిగ్బాస్ సీజన్-12లో కంటెస్టెంట్గా అడుగుపెట్టింది. కానీ ఈ సీజన్ టైటిల్ను బుల్లితెర నటి దీపికా కక్కర్ గెలుచుకుంది.'బిగ్ బాస్ 12' ఫేమ్ సబా ఖాన్ వ్యాపారవేత్త వసీంను వివాహం చేసుకున్నారు. ఈ పెళ్లిలో రాఖీ సావంత్ మాజీ భాయ్ఫ్రెండ్ ఆదిల్ ఖాన్ సందడి చేశారు కాగా.. ఆదిల్.. సబా ఖాన్ సోదరి సోమి ఖాన్ను వివాహం చేసుకున్నాడు. కాగా.. సబా ఖాన్ భర్త వసీం జోధ్పూర్కు చెందిన నవాబ్ కుటుంబానికి చెందినవాడు. ఈ పెళ్లికి స్నేహితులు, బంధువులు మాత్రమే హాజరయ్యారు. View this post on Instagram A post shared by Saba Khan (@sabakhan_ks) -
ఒంటరి బతుకు.. నాకేమైనా అయితే ఎవరూ రారు.. నటి ఎమోషనల్
ఇండస్ట్రీలో అవకాశలెప్పుడూ ఒకేలా ఉండవు. వయసు పెరిగేకొద్దీ నటీనటులకు అవకాశాలు తగ్గిపోతుంటాయి. ముఖ్యంగా యాక్ట్రెస్లకు అవకాశాలు గణనీయంగా తగ్గిపోతాయి. కానీ, బాలీవుడ్ నటి ఉషా నదకర్ణి (Usha Nadkarni) మాత్రం ఎప్పుడూ షూటింగ్స్తో బిజీగా ఉంటోంది. తన వయసుకు తగ్గ పాత్రలు చేస్తూ బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తోంది. ఈమె గతంలో పవిత్ర రిష్తా సీరియల్లో నటించింది. ఈ సీరియల్లో ప్రధాన పాత్ర పోషించిన అంకిత లోఖండే.. తాజాగా నటి ఉషాను ఇంటర్వ్యూ చేసింది.గ్లిజరిన్ లేకుండా..ఈ సందర్భంగా ఉషా గొప్పతనాన్ని చెప్పుకొచ్చింది. ఉషాతో తాను అంత సన్నిహితంగా ఉండేదాన్ని కాదని, అయినా ఆమె తనకు చాలా విషయాలను దగ్గరుండి నేర్పించిందని తెలిపింది. గ్లిజరిన్ లేకుండా ఏడ్చేస్తుందని, ఎక్కువ మేకప్ వేసుకోదని పేర్కొంది. ఇప్పటికీ ఒంటరిగా ధైర్యంగా జీవిస్తోందని తెలిపింది. ఆ మాటతో ఉషా భావోద్వేగానికి లోనైంది. నాకంటూ ఎవరూ లేరు'అవును, ఒంటరిగా బతుకుతున్నా.. కానీ నాకూ ఎమోషన్స్ ఉంటాయి. ఒక్కోసారి భయమేస్తుంటుంది. సడన్గా స్లిప్ అయి కిందపడిపోతే ఎవరికీ తెలియదు. నన్ను చూసేందుకు ఎవరూ రారు. నా కొడుకు విదేశాల్లో నివసిస్తున్నాడు. ఓ సోదరుడిని ఈ మధ్యే కోల్పోయాను. ఇక్కడ నాకోసం ఎవరూ లేరు' అని భావోద్వేగానికి లోనైంది. అంకిత వెంటనే లేచి ఉషను హత్తుకుని నీకోసం నేనున్నానంటూ మాటిచ్చింది. ఏ అవసరమొచ్చినా ఒక్క ఫోన్ కాల్ చేస్తే వచ్చేస్తానంది. నేను చనిపోతే..ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సైతం తన ఒంటరితనం గురించి మాట్లాడింది. 1987 నుంచి నేను ఒంటరిగా ఉంటున్నాను. మొదట్లో భయమేసింది. ఎవరైనా తలుపు తీసుకుని వచ్చి నాపై దాడి చేస్తారేమోనని భయపడేదాన్ని. కానీ, ఇప్పుడా భయం లేదు. ఎవరి మరణం ఎలా రాసిపెట్టుందో ఎవరికీ తెలియదు. ఒకవేళ నేను నిద్రలోనే చనిపోతే పక్కింటివాళ్లు డోర్ కొడతారు, ఎంతకూ తలుపు తీయకపోతే చనిపోయానని వాళ్లే అర్థం చేసుకుంటారు అని చెప్పుకొచ్చింది.చదవండి: వందలకోట్ల వరకట్నం.. నేను గర్భంతో ఉండగా..: హీరో భార్య -
కచ్చా బాదమ్ సాంగ్ ఫేమ్.. ఇప్పుడేంటి ఇలా బార్ డ్యాన్సర్గా!
'కచ్చా బాదామ్' సాంగ్తో అప్పట్లో ఫేమస్ అయిన నటి అంజలి అరోరా. ఆ తర్వాత పలు రియాలిటీ షోలు, సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది. అంతేకాకుండా సోషల్ మీడియా ఇన్ఫ్లూయన్సర్గా కూడా గుర్తింపు తెచ్చుకుంది. బాలీవుడ్లో ది లవ్ ఈజ్ ఫరెవర్, దివాళియాన్, డెలియాన్ చిత్రాల్లో నటించింది. అయితే తాజాగా ఆమె పార్టీలో డ్యాన్స్ చేస్తూ కనిపించింది. ఈ వీడియో కాస్తా నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సినిమాల్లో నటించిన అంజలి అరోరా పబ్ డ్యాన్స్లు చేయడమేంటని నోరెళ్లబెడుతున్నారు.తాజాగా అంజలి అరోరా థాయ్లాండ్లోని ఓ పబ్లో డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది చూసిన నెటిజన్స్ సినిమా అవకాశాలు తగ్గడంతో ఇలా డ్యాన్స్ ప్రదర్శనలు చేస్తోందని కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరేమో గౌరవంగా బతకడం కోసం తన వృత్తిని కొనసాగిస్తోందని మద్దతుగా పోస్టులు పెడుతున్నారు. కాగా... అంజలి అరోరా ఇటీవల ఎంఎంఎస్ లీక్, వీడియో లీక్ వంటి వివాదాలతో మళ్లీ వార్తల్లో నిలిచింది. ఈ పబ్లిసిటీతో ఆమె కోట్లలో డబ్బు సంపాదించిందని కూడా ఆరోపణలొచ్చాయి. ఒకప్పుడు స్టార్గా ఉన్న అంజలి ఇప్పుడు పట్టాయాలో క్లబ్ డ్యాన్సర్గా మారిపోవడంతో ఆమె ఫ్యాన్స్ ఆశ్చర్యానికి గురవుతున్నారు.Anjali Arora, Insta dancers ki ‘role model’, Pattaya ke club mein apni ‘talent’ dikhate hue dikhin full jhatka thumka mode on. Wah, reel se deal tak ka asli startup model shayad isi ko kehte hain. pic.twitter.com/2FSwGAQ8QV— NoLawForMen (@MenTooRHuman) August 21, 2025Kacha Badam fame Anjali Arora seems to have made dancing in posh clubs her career.Here she is dancing in a club in Pattaya, Thailand.It is better to earn money than to ask for money. pic.twitter.com/6WzMFJUJrd— Param Choudhary (@Param_117_) August 21, 2025Anjali Arora of Kachcha Badam fame has taken up dancing in posh clubs as a career it seems.Here she is dancing at a Club in Pattaya, Thailand. pic.twitter.com/RXgWZit44Z— Sensei Kraken Zero (@YearOfTheKraken) August 21, 2025 -
హృతిక్ రోషన్ ప్రియురాలి మూవీ.. నేరుగా ఓటీటీలో రిలీజ్!
బాలీవుడ్ నటి, హృతిక్ రోషన్ ప్రియురాలు సబా ఆజాద్ నటించిన తాజా చిత్రం సాంగ్స్ ఆఫ్ ప్యారడైజ్. ఈ చిత్రాన్ని కశ్మీర్కు చెందిన ప్రముఖ సింగర్ రాజ్ బేగం జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి డానిష్ రెంజు దర్శకత్వం వహించారు. ఆపిల్ ట్రీ పిక్చర్స్ ప్రొడక్షన్, రెంజు ఫిల్మ్స్ ప్రొడక్షన్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మించారు.తాజాగా ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్ను మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రాన్ని నేరుగా ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు మేకర్స్. ఆగస్టు 29 నుంచి అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్కు రానున్నట్లు వెల్లడించారు. కాగా.. ఈ చిత్రంలో సోనీ రజ్దాన్ కీలక పాత్రలో కనిపించారు.సాంగ్స్ ఆఫ్ ప్యారడైజ్ చిత్రం ద్వారా కాశ్మీర్కు చెందిన దిగ్గజ సింగర్ రాజ్ బేగం జీవిత కథను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. కశ్మీర్ లోయ నుంచి సంగీతంలోకి అడుగుపెట్టిన మొదటి మహిళగా రాజ్ బేగం నిలిచింది. తన కెరీర్లో ఆమెకు ఎదురైన అడ్డంకులు, తను ఎలా విజయం సాధించన్నదే సాంగ్స్ ఆఫ్ ప్యారడైజ్ కథ. View this post on Instagram A post shared by prime video IN (@primevideoin) -
బిగ్బాస్ షోలో మైక్ టైసన్? పారితోషికంపై చర్చలు!
బుల్లితెర ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన షో బిగ్బాస్ (Bigg Boss Reality Show). సెలబ్రిటీల ముచ్చట్లు, గొడవలు, జీవిత కథలు, వారి కోపావేశాలు.. ఇలా ప్రతి విషయాన్ని దగ్గరుండి చూడటమంటే జనాలకు భలే సరదా! అందుకే బిగ్బాస్ ఏళ్ల తరబడి విజయవంతంగా రన్ అవుతోంది. ఇకపోతే ఈసారి ఈ రియాలిటీ షోలో బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ భాగం కానున్నారంటూ ప్రచారం జరుగుతోంది. తెలుగు బిగ్బాస్ అనుకునేరు, కాదు! హిందీ బిగ్బాస్ 19వ సీజన్లో ఆయన్ను వైల్డ్ కార్డ్గా ప్రవేశపెట్టాలని ప్లాన్ చేస్తున్నారట!వైల్డ్ కార్డ్గా..పారితోషికం గురించి చర్చలు కూడా జరుగుతున్నాయని తెలుస్తోంది. అన్నీ కుదిరితే అక్టోబర్లో బిగ్బాస్ హౌస్లో మైక్ టైసన్ అడుగుపెడతాడట! ఒక వారం లేదా పదిరోజులు మాత్రమే ఆయన హౌస్లో ఉంటాడని సమాచారం. టైసన్ ఎంట్రీ ఇస్తే షోకు మరింత క్రేజ్ వస్తుందని బిగ్బాస్ టీమ్ యోచిస్తోంది. మరి వీరి ప్లాన్ ఏమేరకు సక్సెస్ అవుతుందో చూడాలి! హిందీ బిగ్బాస్ 19వ సీజన్ ఆగస్టు 24న ప్రారంభం కానుంది.తెలుగు సినిమాలో..కెరీర్లో ఎన్నో ఘనతలు సాధించాడు. సుదీర్ఘ కెరీర్లో 50 విజయాలు సాధించిన 58 ఏళ్ల టైసన్... అందులో 44 బౌట్లను నాకౌట్ చేశాడు. 2005లో బాక్సింగ్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. తర్వాత పలు కేసుల్లో జైలు శిక్ష కూడా అనుభవించాడు. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లైగర్ మూవీలోనూ అతిథి పాత్రలో కనిపించాడు.చదవండి: నటి రెండో పెళ్లి.. తోడుగా నిలబడ్డ 12 ఏళ్ల కూతురు -
ఇంట్లోంచి బయటకు వచ్చేసినప్పుడే అనుకున్నా.. దత్తత తీసుకోవాలని!
35 ఏళ్లు వచ్చినా ఇంకా సింగిల్గానే ఉంది బుల్లితెర నటి జాస్మిన్ భాసిన్ (Jasmin Bhasin). పెళ్లి సంగతేమో కానీ కూతురు కావాలంటోందీ ముద్దుగుమ్మ. తప్పకుండా ఓ పాపను దత్తత తీసుకుంటానని గతంలోనే చెప్పింది. సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించిన జాస్మిన్.. మరోసారి ఆ విషయాన్ని ప్రస్తావించింది. అసలు పాపను దత్తత తీసుకోవాలన్న ఆలోచన ఎప్పుడొచ్చింది? అన్న అభిమాని ప్రశ్నకు ఇలా స్పందించింది.అందుకే దత్తత ఆలోచననేను ఇల్లు వదిలి వచ్చేసినప్పుడు చాలా కష్టాలు అనుభవించాను. అప్పుడే అనుకున్నా.. నాకంటూ మంచి జీవితం సంపాదించుకున్నప్పుడు కచ్చితంగా మరొకరికి లైఫ్ ఇవ్వాలని నిర్ణయించుకున్నా.. అందుకే ఓ పాపను దత్తత తీసుకుంటాను అని చెప్పుకొచ్చింది. హిందీ బిగ్బాస్ 14వ సీజన్లో ఉన్నప్పుడు కూడా ఈ విషయం గురించి మాట్లాడుతూ.. నేను కచ్చితంగా పెళ్లి చేసుకుంటానని చెప్పలేను. అలాంటి పెళ్లయితే చేసుకోనుఒకవేళ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టకపోయినా పర్వాలేదు. మంచి మనిషి దొరికితే పెళ్లి చేసుకుంటా.. లేదంటే ఏదో ఒకర్ని మ్యారేజ్ చేసుకుని తర్వాత విడిపోవాల్సి రావడం నాకైతే ఇష్టం లేదు. ఇకపోతే ఒక చిన్నారిని దత్తత తీసుకుని తనకు మంచి జీవితాన్ని ప్రసాదించాలనుకుంటున్నాను అని తెలిపింది. దిల్సే దిల్ తక్, నాగిన్ 4 వంటి సీరియల్స్తో జాస్మిన్కు పాపులారిటీ వచ్చింది. అర్ధ సర్బత్ దే భలే దీ, వార్నింగ్ 2, బద్నాం వంటి పంజాబీ చిత్రాల్లోనూ నటించింది. ద ట్రేటర్స్ అనే రియాలిటీ షోలోనూ పాల్గొంది.చదవండి: థూ.. అదీ ఒక సినిమానేనా? నా కొడుకు మూవీ నాకే నచ్చలేదు -
చిరకాల స్నేహితుడిని పెళ్లాడిన బుల్లితెర నటి.. పోస్ట్ వైరల్
ప్రస్తుతం శ్రావణమాసం కావడంతో పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఇండస్ట్రీలోనూ చాలామంది ఈ నెలలోనే పెళ్లి పీటలెక్కుతున్నారు. తాజాగా ప్రముఖ బుల్లితెర నటి గియా మానెక్ వివాహాబంధంలోకి అడుగుపెట్టింది. 'సాత్ నిభాన సాథియా', 'జీనీ ఔర్ జుజు' సీరియల్స్తో గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ నటుడు వరుణ్ జైన్ను పెళ్లాడింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు నూతన జంటకు అభినందనలు చెబుతున్నారు.గియా తన ఇన్స్టాలో రాస్తూ.. "ఆ దేవుడు, మా గురువుల దయతో, మీరు కురిపించిన ప్రేమతో మేము ఈ రోజు వివాహాబంధంలోకి అడుగుపెట్టాము. మేము ఇద్దరు స్నేహితులం.. కానీ ఈ రోజు చేయి చేయి కలిపి హృదయపూర్వకంగా మేము భార్యాభర్తలం అయ్యాం. ఈ రోజును ఇంత ప్రత్యేకంగా చేసిన మా ప్రియమైన వారందరి ప్రేమ, ఆశీర్వాదాలకు మా కృతజ్ఞతలు. ఎల్లప్పుడు నవ్వుతూ మిస్టర్ అండ్ మిసెస్గా జీవితాంతం కలిసి ఉండటానికి ఇదే మా మొదటి అడుగు." అంటూ పోస్ట్ చేసింది.కాగా.. గియా మానెక్, వరుణ్ జైన్ జంటగా తేరా మేరా సాత్ రహే సీరియల్లో నటించారు. అప్పుడు సహనటులుగా ఉన్న వీరిద్దరు.. ఇప్పుడు భార్యాభర్తలుగా కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. మరోపైపు గియా మానెక్ సీరియల్స్కతో పాటు సినిమాల్లోనూ నటించింది. కామ్ చాలు హై, నా గర్ కే.. నా ఘాట్ కే లాంటి చిత్రాల్లో కనిపించింది. View this post on Instagram A post shared by Gia Manek (@gia_manek) -
చెత్త ఎఫైర్లు పెట్టుకున్నా.. మగ తోడు అవసరం లేదు : సీనియర్ హీరోయిన్
బాలీవుడ్లో కొన్నేళ్ల పాటు నెం1 అందాల నటిగా యువ ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించింది మనీషా కొయిరాలా(Manisha Koirala ). సుభాష్ ఘయ్ తీసిన 1942 ఎ లవ్ స్టోరీ సినిమా, అందులోని పాటల్లో మనీషా కొయిరాలా అందాన్ని మర్చిపోవడం అంత తేలిక కాదు అంటారు బాలీవుడ్ సినీ ప్రేమికులు. నాగార్జున సరసన క్రిమినల్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకూ దగ్గరైంది ఈ నేపాలీ సుందరి. అద్భుతమైన విజయాలను చవిచూసినా, విధి ఆమె పట్ల చిన్న చూపు చూడడంతో క్యాన్సర్ బారిన పడింది. దాంతో ఆమె జీవితం పూర్తిగా తల్లకిందులైంది. ప్రస్తుతం క్యాన్సర్ నుంచి కోలుకుని ఇప్పుడిప్పుడే తన వయసుకు తగిన పాత్రలతో తిరిగి బాలీవుడ్లో రాణించేందుకు ప్రయత్నిస్తోంది. ఈ నేపధ్యంలో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మనీషా.. పలు విషయాలను పంచుకుంది. అందాల నటిగా తెరపై గ్లామర్ను గుబాళింపజేసిన మనీషా బాలీవుడ్లో అనేక అఫైర్స్ వార్తలకు కూడా కేరాఫ్గా నిలిచింది. ‘అగ్ని సాక్షి’ (1996) సినిమాలో కలిసి నటించినప్పుడు సహ నటుడైన నానా పటేకర్తో సంబంధం ఏర్పడింది. అప్పటికే పెళ్లయిన నానా పటేకర్ ప్రతీ తెల్లవారుఝామున మనీషా ఇంటి నుంచి తిరిగి రావడం అనేకమార్లు వెలుగులోకి వచ్చింది. అదే విధంగా సౌదాగర్ లో నటించిన వివేక్ ముష్రాన్తోనూ ఆమెకు సంబంధం ఉందని వార్తలు గుప్పుమన్నాయి. ఇక మార్కెట్ సినిమా సమయంలో కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కుంటున్న మనీషా కి ఆర్యన్ వేద్ ప్రేమ ఓదార్చింది.. సినిమా రంగంలో మాత్రమే కాదు సినీయేతర రంగాల వారితో కూడా ఆమె సంబంధాలు అప్పట్లో బాగా వెలుగు చూశాయి. నానా పటేకర్తో బ్రేకప్ బాధలో ఉండగా, హుస్సేన్ బాబాయ్గా పేరొందిన డిజె హుస్సేన్, నేపాల్లోని ఆస్ట్రేలియన్ అంబాసిడర్ క్రిస్పిన్ కొన్రాయ్, లండన్కు చెందిన నైజీరియన్ వ్యాపారి సిసిల్ ఆంథోనీ, అమెరికన్ స్పోర్ట్స్ కౌన్సిలర్ క్రిస్టోఫర్ డోరిస్...ఇలా పలువురితో ఆమె సంబంధాలు పెట్టుకుందని అప్పట్లో వెల్లడైంది. వీటన్నింటినీ వదిలించుకుని నేపాల్కు చెందిన సామ్రాట్ దహాయ్ని 2010లో పెళ్లి చేసుకుని కుటుంబ జీవితం ప్రారంభించినప్పటికీ ఆ బంధం కూడా రెండేళ్లోనే బెడిసి కొట్టింది. క్యాన్సర్తో పోరాడిన తర్వాత మనిషా కోయిరాలా చాలా మారిపోయింది. ‘‘ఆ వ్యాధి నాకు జీవితం విలువ తెలిసివచ్చేలా చేసింది, ఒక్క క్షణాన్ని కూడా వృధా చేసుకోకూడదని నేర్పింది. ఆ ఎదురుదెబ్బకు ముందు నేను అనేక చెత్త పనుల్లో, చెత్త సంబంధాల్లో చాలా సమయాన్ని వృధా చేసుకున్నాను,’’ అని మనీషా ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం తాను సింగిల్గా ఉన్నానని ఇలాగే ఉండాలని అనుకుంటున్నానని ఆమె అంటోంది. ‘‘ఇకపై నేను నిరర్థకమైన సంబంధాలేవీ పెట్టుకోను. ఒంటరితనం నుంచి రక్షించడానికి ఎవరైనా మగవాడు రావాలని కూడా ఎదురు చూడను. నేను సింగిల్నే కానీ ఒంటరిగా లేను. ఇప్పుడు నా సహవాసాన్ని నేనే ఆస్వాదించడం మొదలుపెట్టాను. నాకు లాంగ్ ట్రెక్కింగ్లు చేయడం ఇష్టం. దీర్ఘ ధ్యాన విరామాలు తీసుకుంటాను. అయితే నాలాగా జీవనశైలిని మార్చుకోవడానికి ఏదో పెద్ద నష్టం, కష్టం వచ్చే వరకూ ఎదురు చూడవద్దు. ఇప్పుడే మార్చుకోండి’’ అంటూ మనీషా తోటి మహిళలకు సలహా ఇస్తోంది. అనుభవం నేర్పిన పాఠాలతో ఒకనాటి సిల్వర్ స్క్రీన్ బ్యూటీ... భవిష్యత్తుని తీర్చిదిద్దుకుంటోంది. తన జీవితాన్ని ఓ పాఠంగా తీసుకోవాలని యువతులకు సూచిస్తోంది. -
ఆమె అంటే నాకు పిచ్చి.. బాలీవుడ్ నటి షాకింగ్ కామెంట్స్
బాలీవుడ్ నటి స్వర భాస్కర్ మరోసారి వార్తల్లో నిలిచింది. గతంలో ఛావా సినిమాపై బాలీవుడ్ నటి స్వర భాస్కర్ చేసిన ట్వీట్స్ వివాదానికి దారితీసిన సంగతి తెలిసిందే. దీంతో ఆమెపై పెద్దఎత్తున విమర్శలొచ్చాయి. ఎప్పుడు ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలిచే స్వరభాస్కర్ తాజాగా అలాంటి కామెంట్లతో మరోసారి చర్చనీయాంశంగా మారింది.తన భర్త ఫహద్ ఆహ్మద్తో కలిసి పతి పత్ని ఔర్ పంగా - జోడియోం కా రియాలిటీ చెక్ అనే రియాలిటీ షోకు హాజరైన బాలీవుడ్ భామ లైంగిక జీవితంపై సంచలన కామెంట్స్ చేసింది. ప్రతి ఒక్కరూ బై సెక్సువల్ అంటూ వ్యాఖ్యానించింది. అంతేకాకుండా తనకు సమాజ్వాది పార్టీ ఎంపీ డింపుల్ యాదవ్ అంటే క్రష్ అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇటీవలే ఆమెను కలిశానని కూడా తెలిపింది.జెండర్ అనేది వేల ఏళ్లుగా మనపై బలవంతంగా రుద్దబడిన భావజాలమంటూ స్వర భాస్కర్ మాట్లాడింది. ఇవీ కాస్తా నెట్టింట వైరల్ కావడంతో పలువురు ఆమెపై మండిపడుతున్నారు. దీంతో తన మాటలతో మరోసారి వివాదానికి కేరాఫ్ అడ్రస్గా మారింది స్వర భాస్కర్. కాగా.. స్వర భాస్కర్ హిందీలో తను వెడ్స్ మను, రాంఝనా, ప్రేమ్ రతన్ ధన్ పాయో లాంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించింది."Everyone is Bisexual. I have a crush on Dimple Yadav"Swara Bhaskar 💀Now I am feeling bad for Akhilesh Yadav and Swara's husband 🤣pic.twitter.com/JVc1z12w7n— Sunanda Roy 👑 (@SaffronSunanda) August 18, 2025 -
బుల్లితెర నటి రెండో ప్రెగ్నెన్సీ.. గ్రాండ్గా సీమంతం వేడుక!
బాలీవుడ్ భామ గౌహర్ ఖాన్ త్వరలోనే రెండో బిడ్డకు జన్మనివ్వనుంది. ఈ ఏడాది ప్రారంభంవో సెకండ్ ప్రెగ్నెన్సీ ప్రకటించిన ముద్దుగుమ్మ.. తాజాగా సీమంతం వేడుక సెలబ్రేట్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వేడుకను కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు.కాగా.. గౌహర్ ఖాన్ 2020లో సంగీత స్వరకర్త ఇస్మాయిల్ దర్బార్ కుమారుడు జైద్ను వివాహం చేసుకున్నారు. ఈ జంట మే 2023లో తమ మొదటి బిడ్డను స్వాగతించారు. ఆ తర్వాత ఏప్రిల్ 2025లో సెకండ్ ప్రెగ్నెన్సీని ప్రకటించారు. ఇక కెరీర్ విషయానికొస్తే గౌహర్ ఖాన్ బాలీవుడ్లో పలు సీరియల్స్లో నటించింది. ఆమె ఇటీవల ఇషా మాల్వియాతో కలిసి లవ్లీ లోల్లాలో కూడా కనిపించింది. View this post on Instagram A post shared by Varinder Chawla (@varindertchawla) -
వార్ 2లో కిక్కిచ్చిన 'సలాం అనాలి' ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసింది
బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్, టాలీవుడ్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం వార్ 2 (War 2 Movie). అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ లభించింది. ఈ మూవీ నుంచి తాజాగా సలాం అనాలి ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్ చేశారు. ఇందులో హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ పోటాపోటీగా డ్యాన్స్ చేశారు. ఎనర్జిటిక్ డ్యాన్స్వీరి ఎనర్జిటిక్ డ్యాన్స్ చూసేందుకు అభిమానులకు రెండు కళ్లు చాలవు. సినిమా సంగతేమో కానీ వీళ్ల డ్యాన్స్ మాత్రం అదిరింది అని కామెంట్లు చేస్తున్నారు. ఈ పాటకు ప్రీతమ్ సంగీతం అందించగా నకాశ్ అజీజ్, యాజిన్ నిజర్ ఆలపించారు. కృష్ణ కాంత్ తెలుగులో లిరిక్స్ సమకూర్చారు. వార్ 2 మూవీలో కియారా అద్వానీ కథానాయికగా నటించింది. యష్ రాజ్ ఫిలింస్ బ్యానర్పై ఆదిత్య చోప్రా నిర్మించారు. అక్షయ్ విధాని సహనిర్మాతగా వ్యవహరించారు. -
ఎటు చూసినా రక్తమే.. భయపడిపోయా: కంగనారనౌత్
ప్రతి ఆడపిల్లకు ఓ వయసు రాగానే నెలసరి ప్రారంభమవుతుంది. స్కూల్లో చదువుకునే రోజుల్లోనే బాలిక కౌమార దశలోకి అడుగుపెడుతుంది. అయితే తన ఫ్రెండ్స్ కంటే తాను ఆలస్యంగా మెచ్యూర్ అయ్యానని, దానికే అమ్మ కోప్పడిందని బాలీవుడ్ ఫైర్ బ్రాండ్, ఎంపీ కంగనా రనౌత్ చెప్పుకొచ్చారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె తన ఫస్ట్ పీరియడ్ అనుభవాలను పంచుకున్నారు. ఎటు చూసినా రక్తమే..కంగనా రనౌత్ మాట్లాడుతూ.. నా ఫ్రెండ్స్ అందరికీ ఆరో తరగతి నుంచి తొమ్మిదో తరగతి మధ్యలోనే పీరియడ్స్ మొదలయ్యాయి. నా ఫ్రెండ్స్ మెచ్యూర్ అవుతుంటే నేనింకా బొమ్మలతో ఆడుకుంటూ ఉండేదాన్ని. అప్పటికే నెలసరి రావట్లేదని కంగారుపడుతూ ఉంటే నేనేమో ఇలా బొమ్మలతో ఆడుకుంటున్నానని అమ్మ కోప్పడింది. ఆ బొమ్మల వల్లే ఇంకా పీరియడ్స్ రావడం లేదేమోనని కోపంతో వాటన్నింటినీ బయట పడేసింది. ఒకరోజు నేను నిద్రలేచేసరికి బెడ్షీట్ అంతా రక్తం.. ఎటు చూసినా రక్తమే కనిపించడంతో భయపడిపోయాను. కానీ, అమ్మ మాత్రం నాకు నెలసరి మొదలైందని సంతోషపడింది అని పేర్కొన్నారు.సినిమాసినిమాల విషయానికి వస్తే.. 2006లో గ్యాంగ్స్టర్ చిత్రంతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చారు. ఏక్ నిరంజన్ చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించారు. చివరగా ఎమర్జెన్సీ మూవీలో నటించారు. ఈ సినిమాలో దివంగత ప్రధాని ఇందిరాగాంధీగా నటించారు. అంతేకాకుండా ఎమర్జెన్సీకి స్వయంగా కంగనాయే దర్శకత్వం వహించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆకట్టుకోలేకపోయింది.చదవండి: స్నేహితుడి కోసం నాడు పూజలు.. ఫోటోతో గుడ్న్యూస్.. -
బిగ్బాస్ రియాలిటీ షో.. స్పెషల్ గెస్ట్గా స్టార్ హీరోయిన్!
బుల్లితెర ప్రియులను అలరిస్తోన్న బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్బాస్. ఈ షోకు ఫ్యాన్స్లో విపరీతమైన క్రేజ్ ఉంది. ప్రత్యేకంగా ఫ్యాన్స్ ఉన్నారు. దీంతో మరో సీజన్ బుల్లితెర ప్రియులను అలరించేందుకు వస్తోంది. ఇప్పటికే కంటెస్టెంట్స్ ఎవరనేది దాదాపు ఖరారు కాగా.. ఈనెల 24 బిగ్బాస్ సీజన్-19 షురూ కానుంది. ఈ ఏడాది కూడా స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హోస్ట్గా వ్యవహరిస్తున్నారు.అయితే ఈ సీజన్లో స్టార్ హీరోయిన్ సోనాలి బింద్రే గెస్ట్గా వస్తారని బాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. తాను హోస్ట్గా వ్యవహరిస్తోన్న కొత్త రియాలిటీ షో 'పతి పత్నీ ఔర్ పంగా' ప్రమోషన్స్ కోసం బిగ్బాస్ హౌస్లో అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. కాగా.. సోనాలి బింద్రే, సల్మాన్ ఖాన్తో 'హమ్ సాత్ సాత్ హై' చిత్రంలో హీరోయిన్గా నటించింది. దాదాపు 26 ఏళ్ల తర్వాత వీరిద్దరు కలవనున్నారు. దీంతో సల్మాన్ ఖాన్, సోనాలి బింద్రే ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.కాగా.. 1999లో సూరజ్ బర్జాత్య దర్శకత్వం వహించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ హమ్ సాత్ సాత్ హై చిత్రంలోలో సోనాలి, సల్మాన్ ఖాన్ జంటగా నటించారు. ఈ చిత్రంలో టబు, సైఫ్ అలీ ఖాన్, కరిష్మా కపూర్, అలోక్ నాథ్, రీమా కీలక పాత్రల్లో నటించారు. మరోవైపు సల్మాన్ ఖాన్ బిగ్బాస్ రియాలిటీ నాలుగో సీజన్ నుంచి హోస్ట్గా వ్యవహరిస్తున్నారు. ఈ సీజన్ ఆగస్టు 24 నుంచి జియో హాట్స్టార్, కలర్స్ టీవీలో స్ట్రీమింగ్ కానుంది. -
దెయ్యంగా రష్మిక.. 'వరల్డ్ ఆఫ్ థామా' చూశారా?
ప్రస్తుతం పాన్ ఇండియా హీరోయిన్లలో టాప్లో దూసుకుపోతున్న రష్మిక.. వరస సినిమాలతో బిజీగా ఉంది. ఈమె హిందీలో చేసిన లేటెస్ట్ మూవీ 'థామా'. 'స్త్రీ' యూనివర్స్లో భాగంగా వస్తున్న నాలుగో మూవీ ఇది. ఇంతకుముందు భేడియా, స్త్రీ, ముంజ్య చిత్రాలు వచ్చాయి. ప్రేక్షకుల్ని అలరించాయి. ఇప్పుడు 'థామా' పేరుతో ఈ మూవీలో రష్మిక, ఆయుష్మాన్ ఖురానా జంటగా నటించారు. తాజాగా టీజర్ని 'వరల్డ్ ఆఫ్ థామా' పేరుతో రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: బిగ్బాస్లోకి అనసూయ.. ఇదిగో క్లారిటీ)గతంలో రష్మిక చెప్పినట్లు అతీంద్రియ శక్తులతో కూడిన రొమాంటిక్ సినిమాగా 'థామా' తీశారు. టీజర్లో రష్మిక.. ఇదివరకు ఎన్నడూ చూడనటువంటి పాత్రలో కనిపించింది. బోల్డ్గా కనిపిస్తూనే భయపెట్టింది కూడా. ఇందులో రష్మిక, దెయ్యంగానూ యాక్ట్ చేసినట్లు అనిపిస్తుంది. ఈ సినిమాకు ఆదిత్య సర్పోట్దర్ దర్శకుడు. హారర్ స్టోరీ అయినప్పటికీ.. ప్రేమకథని కూడా చూపించబోతున్నారు. ఈ దీపావళికి మూవీ థియేటర్లలోకి రానుంది. (ఇదీ చదవండి: తండ్రి కాబోతున్న తెలుగు యంగ్ హీరో.. భార్యకు సీమంతం) -
దీపావళికి థామా
‘థామా’లో తడ్కాపాత్రలో తన తడాఖా చూపిస్తానంటున్నారు రష్మికా మందన్నా. ఆయుష్మాన్ ఖురానా, రష్మికా మందన్నా హీరో హీరోయిన్లుగా నటిస్తున్న హారర్, మిస్టరీ అండ్ లవ్స్టోరీ మూవీ ‘థామా’. మడాక్ హారర్ కామెడీ యూనివర్స్లో భాగంగా ఆదిత్య సర్పోత్థార్ దర్శకత్వంలో దినేష్ విజన్ నిర్మిస్తున్న ఈ ‘థామా’ ఈ దీపావళికి రిలీజ్ కానుంది.కాగా అతీంద్రియ శక్తులతో కూడిన ఈ హారర్ రొమాంటిక్ చిత్రంలోని ప్రధానపాత్రధారుల ఫస్ట్లుక్స్తోపాటుగా, ఈ సినిమాలోని వారిపాత్రల పేర్లను మేకర్స్ రిలీజ్ చేశారు. అలోక్పాత్రలో ఆయుష్మాన్ ఖురానా, తడ్కాపాత్రలో రష్మికా మందన్నా, యాక్షసాన్ గా నవాజుద్దీన్ , రామ్ బజాజ్ గోయెల్గా పరేశ్ రావల్ నటిస్తున్నట్లుగా మేకర్స్ తెలిపారు. కాగా ‘థామా’కి చెందిన తాజా వీడియో ‘థామా వరల్డ్’ పేరుతో నేడు విడుదలవుతోంది. -
అణువణువునా నువ్వే.. చనిపోయిన భార్యకోసం నటుడు ఏం చేశాడంటే?
'కాంటా లగా..' పాటతో ఫేమస్ అయిన బాలీవుడ్ నటి షెఫాలీ జరివాలా (42) జూన్ 27న మరణించింది. చిన్న వయసులోనే భార్య తనను వదిలి వెళ్లడంతో నటుడు పరాగ్ త్యాగి శోకసంద్రంలో మునిగిపోయాడు. అంత్యక్రియల సమయంలోనూ భార్య మృతదేహాన్ని పట్టుకుని బోరున విలపించాడు. రోజులు గడిచేకొద్దీ భార్య జ్ఞాపకాలతో మరింత కుమిలిపోతున్నాడే తప్ప ఆ బాధ నుంచి బయటపడలేకపోతున్నాడు. ఇంతలోనే వారి పెళ్లి రోజు వచ్చింది. వెడ్డింగ్ యానివర్సరీఇద్దరి ప్రేమ బంధానికి 15 ఏళ్లు. కానీ, ఈసారి వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకోవడానికి భార్య లేకుండా పోయింది. అయినా సరే.. పరి (షెఫాలీని ప్రేమగా పిల్చుకునే పేరు) కోసం ఇదే నా గిఫ్ట్ అంటూ ఓ వీడియో షేర్ చేశాడు. తన ఛాతీపై షెఫాలీ ముఖాన్ని పచ్చబొట్టు వేయించుకున్నాడు. పంటికింద నొప్పిని భరిస్తూ భార్య ఫోటోను ఎదపై భద్రంగా పదిలపర్చుకున్నాడు. ప్రేమకు పదేళ్లు 'తను నా హృదయంలో ఎల్లప్పుడూ ఉంటుంది. నా శరీరంలోని అణువణువునా తనే ఉంది. ఇప్పుడది అందరికీ స్పష్టంగా కనిపిస్తోంది' అని వీడియోకిచ్చిన క్యాప్షన్లో రాసుకొచ్చాడు. ఇది చూసిన అభిమానులు నీ ప్రేమను చూస్తుంటే మా కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి అని కామెంట్లు చేస్తున్నారు. షెఫాలీ జరివాలా, పరాగ్ త్యాగి.. 2010 ఆగస్టు 12న తొలిసారి కలుసుకున్నారు. కొద్దిరోజులకే ప్రేమలో పడ్డారు. 2014లో వీరు కలుసుకున్న ఆగస్టు 12వ తేదీనే పెళ్లి చేసుకున్నారు. ఇది షెఫాలీకి రెండో పెళ్లి. గతంలో ఆమె హర్మీత్ సింగ్ను పెళ్లి చేసుకోగా 2009లో విడాకులిచ్చింది. View this post on Instagram A post shared by Pari aur Simba ke Papa (@paragtyagi) చదవండి: కొత్తింట్లో గృహప్రవేశం చేసిన బిగ్బాస్ మానస్ -
అఫీషియల్ ప్రకటన.. ఓటీటీలో క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్
ఓటీటీలు వచ్చాక సరికొత్త సినిమాలు, సిరీస్లు సినీ ప్రియులను అలరిస్తూనే ఉన్నాయి. ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ అందిస్తూ ఆడియన్స్ను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా క్రైమ్ జోనర్లో వచ్చే సిరీస్లకు ఓటీటీలో విపరీతమైన డిమాండ్ ఉంటోంది. ఇప్పటికే ఆ జోనర్లో వచ్చిన చిత్రాలు, సిరీస్లు చాలా వరకు సూపర్ హిట్గా నిలిచాయి.తాజాగా మరో క్రైమ్ థ్రిల్లర్ మిమ్మల్ని అలరించేందుకు వస్తోంది. మీర్జాపూర్ నటుడు అలీ ఫజల్ లీడ్ రోల్లో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ విషయాన్ని అమెజాన్ ప్రైమ్ అఫీషియల్గా ప్రకటించింది. ఈ మేరకు ఓ పోస్టర్ను రిలీజ్ చేసింది.రాఖ్ (Raakh) పేరుతో ఈ ఆసక్తికర వెబ్ సిరీస్ను ప్రొసిత్ రాయ్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. గతంలో పాతాళ్ లోక్ అనే వెబ్ సిరీస్ను రూపొందించారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న ఈ క్రైమ్ థ్రిల్లర్ వచ్చే ఏడాది ప్రేక్షకులను అలరించనుంది. ఈ ఆసక్తికర వెబ్ సిరీస్లో సోనాలి బింద్రే, ఆమిర్ బషీర్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సిరీస్ను అనూష నందకుమార్, సందీప్ సాకేత్ నిర్మిస్తున్నారు. JUSTICE will rise from the ashes 🔥#RaakhOnPrime, New Original Series, Coming 2026#AliFazal #SonaliBendre @prosit_roy @EndemolShineIND @anusha_nkumar #AyushTrivedi #AamirBashir @sandeepsaket83 @deepak30000 @NegiR @sunandagj @BhaDiPa pic.twitter.com/mLulmaXj8X— prime video IN (@PrimeVideoIN) August 18, 2025 -
'ప్రతి రోజు చెబుతా'.. ట్రోలర్స్కు జాన్వీకపూర్ స్ట్రాంగ్ కౌంటర్!
బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ ప్రస్తుతం లవ్ అండ్ రొమాంటిక్ కామెడీ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో సిద్ధార్థ్ మల్హోత్రా సరసన కనిపించనుంది. ఈ సినిమాకు తుషార్ జలోటా దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదలన ట్రైలర్కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 29న థియేటర్లలో సందడి చేయనుంది.ఇక సినిమా సంగతి పక్కన పెడితే జాన్వీ కపూర్ తాజాగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలకు హాజరైంది. ఈ సందర్భంగా ఉట్టికొట్టే సమయంలో భారత్ మాతా కీ జై అంటూ నినాదం చేసింది. దీంతో ఆమెపై సోషల్ మీడియాలో పెద్దఎత్తున ట్రోలింగ్ మొదలైంది. ఇదేమీ ఇండిపెండెన్స్ డే కాదంటూ జాన్వీని ట్రోల్ చేశారు.తాజాగా తనపై వస్తున్న ట్రోల్స్కు జాన్వీ కపూర్ స్పందించింది. ఈ మేరకు తన ఇన్స్టాలో పోస్ట్ చేసింది. అక్కడ ఉన్నవారంతా నాకంటే ముందు భారత్ మాతాకీ జై అని అన్నారని తెలిపింది. ఆ తర్వాత నేను కూడా చెప్పానని.. వారి వీడియోను కట్ చేసి నా మాటలను మాత్రమే వైరల్ చేస్తున్నారని ట్రోలర్స్కు కౌంటరిచ్చింది. నా దేశాన్ని పొగిడేందుకు ప్రత్యేకంగా రోజంటూ లేదని రాసుకొచ్చింది. శ్రీ కృష్ణా జన్మాష్టమి నాడు మాత్రమే కాదు.. ప్రతిరోజూ భారత్ మాతాకీ జై అని చెబుతా అని ఇన్స్టా స్టోరీలో పోస్ట్ పెట్టింది. అంతేకాకుండా ఈ ఈవెంట్లో మరాఠీలో మాట్లాడిన జాన్వీ కపూర్ అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ చిత్రంలో కేరళ అమ్మాయిగా జాన్వీ కనిపించనుంది. ఢిల్లీ అబ్బాయితో ప్రేమలో పడిన మలయాళీ అమ్మాయి కథగా పరమ్ సుందరిని తెరకెక్కించారు.. ఈ చిత్రంలో రాజీవ్ ఖండేల్వాల్, ఆకాష్ దహియా కూడా కీలక పాత్రలు పోషించారు. -
ఇండస్ట్రీలో మా పరిస్థితి చాలా దారుణం: ప్రముఖ సింగర్ ఆవేదన
సినిమా ఇండస్ట్రీలో స్టార్డమ్ తర్వాత ఎక్కువగా వినిపించే మాట రెమ్యునరేషన్. హీరోకు ఎన్ని కోట్లు, హీరోయిన్కు ఎంత అనే చర్చ మొదలవుతుంది. ఆ తర్వాత ఒక్క సినిమాకు డైరెక్టర్ ఎంత తీసుకుంటున్నారు. ఇప్పుడున్న మార్కెట్లో స్టార్ హీరోలైతే కోట్ల రూపాయల్లో పారితోషికం అందుకుంటున్నారు. కొందరు డైరెక్టర్స్ సైతం హీరో రేంజ్లో రెమ్యునరేషన్ తీసుకునేవాళ్లు కూడా ఉన్నారు. కానీ ఇంత భారీ మొత్తంలో కోట్ల రూపాయలు తీసుకుంటున్న సినీ ఇండస్ట్రీలో సింగర్స్ పరిస్థితి మాత్రం భిన్నంగా ఉందని చెబుతోంది ప్రముఖ గాయని కనికా కపూర్. ఇండియాలో కొంతమంది సింగర్స్కు కనీస పారితోషికం కూడా దక్కడం లేదని అన్నారు.బేబీ డాల్, చిట్టియాన్ కలైయాన్ లాంటి హిట్ సాంగ్స్తో ఫేమ్ తెచ్చుకున్న ప్రముఖ సింగర్ కనికా కపూర్. ఇండియాలో సింగర్స్ రెమ్యునరేషన్పై ఆవేదన వ్యక్తం చేసింది. తాజాగా ఓ చిట్చాట్లో పాల్గొన్న ఆమె బాలీవుడ్లో సింగర్స్ ఎందుర్కొంటున్న ఆర్థిక సమస్యల గురించి మాట్లాడింది. తనకు సరైన పారితోషికం లభించడం లేదని తెలిపింది. నాతో పాటు స్టార్ హోదా గాయకుల పరిస్థితి కూడా ఇదేనన్నారు. సింగర్స్ లైవ్ కన్సర్ట్ ద్వారా మాత్రమే డబ్బులు సంపాదించే అవకాశముందని వెల్లడించారు.కనికా కపూర్ మాట్లాడుతూ.. " బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సింగర్స్కు తగిన పారితోషికం లభించదు. నాకు ఓ కాంట్రాక్ట్లో కేవలం రూ. 101 చెల్లించారు. అది కూడా ఈ డబ్బులతో మీకు సాయం చేస్తున్నామని నాతో గొప్పగా చెప్పారు. కేవలం నాకే కాదు.. స్టార్ హోదా ఉన్నవారి పరిస్థితి కూడా ఇలాగే ఉంది. భారతదేశంలో పెద్ద సింగర్ తన ఐకానిక్ పాటలకు చాలా వరకు డబ్బు పొందుతాడని నేను అనుకోవడం లేదు. సింగర్స్కు లైవ్ కన్సర్ట్స్ మాత్రమే డబ్బు సంపాదించే ఏకైక మార్గం. మీరు ప్రదర్శన ఇవ్వగలిగినంత వరకు సంపాదిస్తూనే ఉంటారు. అలాగే మాకు ఏదైనా జరిగితే పెన్షన్ పథకం కూడా లేదు" అని ఆవేదన వ్యక్తం చేసింది.కాగా.. కనికా కపూర్ 'రాగిణి ఎంఎంఎస్- 2'లోని 'బేబీ డాల్'పాటతో గుర్తింపు తెచ్చుకుంది. ఈ సాంగ్తో ఓవర్నైట్ స్టార్గా మారిపోయింది. ఆ తర్వాత లవ్లీ 'హ్యాపీ న్యూ ఇయర్', దేశీ లుక్ 'ఏక్ పహేలి లీలా', బీట్ పె బూటీ 'ఎ ఫ్లయింగ్ జాట్' వంటి వరుస హిట్ సాంగ్స్తో బాలీవుడ్లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. ఇటీవల బాలీవుడ్లో 'మేరే హస్బెండ్ కి బివి' చిత్రంలోని 'గోరీ హై కలైయాన్' పాటను పాడారు. -
తండ్రి వేదన... తనయుడి ఆవేదన
ఓటీటీలో ఇది చూడొచ్చు అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో హిందీ చిత్రం సర్ జమీన్ ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.మనవాడు అనేవాడు మనకోసం ఎప్పటికీ నిలబడతాడు. పగవాడు మన పతనం కోసం ఆరాటపడతాడు. మంచిని దూరం చేసుకుని చెడు మార్గాన వెళుతూ మనవాడు కూడా పగవాడైతే... అదే ‘సర్ జమీన్’ సినిమా. ఇదో దేశభక్తి స్ఫూర్తిగా అల్లుకున్న కథ. దర్శకుడు కాయోజీ ఇరానీ తెరకెక్కించిన ఈ సినిమాలో ముఖ్యపాత్రధారులుగా మలయాళ నటుడు పృథ్వీరాజ్, బాలీవుడ్ నటి కాజోల్, నటుడు సైఫ్ అలీఖాన్ కొడుకు ఇబ్రహీం అలీఖాన్ నటించారు. నాలుగు ముఖ్యపాత్రలు, రెండున్నర గంటల నిడివితో దేశ సరిహద్దు వివాదాంశంపై సైనిక నేపథ్యంలో కూడిన సినిమా తీయడం అంటే మాటలు కాదు. ఈ సినిమా స్క్రీన్ప్లేతో ప్రేక్షకుడిని ఉర్రూతలూగించారు దర్శకుడు. అంతలా ఏముందీ కథలో ఓసారి చూద్దాం. జమ్ము కాశ్మీర్ ప్రాంతంలో కల్నల్ విజయ్ మీనన్పోస్టింగ్ జరుగుతుంది. విజయ్ మీనన్ మహా దేశభక్తుడు. అతనికి హర్మన్ అనే కొడుకుంటాడు. దేశమా,ప్రాణమా అంటే నిర్మొహమాటంగా దేశం అని ఎంచుకునే రకం విజయ్. ఈ విషయంలోనే తన తండ్రి విజయ్ పై ద్వేషం పెంచుకుంటాడు హర్మన్. పైగా తను భయస్తుడు కూడా. ఓసారి తీవ్రవాదుల ఘర్షణలో హర్మన్ను టెర్రరిస్టులు కిడ్నాప్ చేస్తారు. తమ ముఖ్య అనుచరుడిని విడిపించాలని... లేదంటే నీ కొడుకుని చంపేస్తామని టెర్రరిస్టులు విజయ్ని హెచ్చరిస్తారు. ఇవన్నీ పట్టించుకోకుండా తాను బంధించిన టెర్రరిస్టులపై కాల్పులు జరుపుతాడు విజయ్. ఆ తరువాత విజయ్, అతని భార్య మెహర్ తమ బిడ్డ చనిపోయాడని భావిస్తారు. కానీ తీవ్రవాదులు హర్మన్కి తండ్రి మీదున్న ద్వేషాన్ని ఆయుధంగా చేసుకుని హర్మన్ని తీవ్రవాదిగా తయారు చేసి, మళ్ళీ విజయ్ దగ్గరకు పంపుతారు. ఆ తరువాత విజయ్, అతని భార్య తమ కొడుకు టెర్రరిస్ట్ అని కనిపెడతారా? లేదా అన్నదే సినిమా. దేశం మీద మమకారం పెంచుకున్న తండ్రి వేదన గెలుస్తుందా... లేక తండ్రి మీద తనయుడు పెంచుకున్న ద్వేషం గెలుస్తుందా? అన్నది హాట్ స్టార్లోనే చూడాలి. ఈ సినిమా ఓ సూపర్ పేట్రియాటిక్ థ్రిల్లింగ్ ఫీలింగ్ ఇస్తుంది. ఆఖర్లో వచ్చే ట్విస్ట్ సినిమా మొత్తానికే హైలైట్. మస్ట్ వాచ్. – హరికృష్ణ ఇంటూరు -
22 ఏళ్ల కొడుకు.. అయినా సరే రెండో పెళ్లికి నటి రెడీ
సినిమా సెలబ్రిటీలకు ప్రేమ, పెళ్లి, రిలేషన్ లాంటి వాటిపై పెద్దగా నమ్మకం ఉండదా అనే సందేహం ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఎప్పటికప్పుడు ఏదో ఒక వార్త వినిపిస్తూనే ఉంటుంది. సెలబ్రిటీలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వివాహమైన మూడేళ్లకే విడిపోయారు లాంటివి వింటూనే ఉంటాం. అలానే లేటు వయసులోనూ కొత్త జీవితం ప్రారంభించేందుకు రెడీ అని హింట్స్ కూడా ఇస్తుంటారు. ఇప్పుడు 'కెవ్వు కేక' బ్యూటీ ఓ స్టేట్మెంట్ ఇచ్చింది. అది ఇప్పుడు వైరల్ అవుతోంది.బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా.. ఐటమ్ సాంగ్స్తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులోనూ గబ్బర్ సింగ్ సినిమాలో 'కెవ్వు కేక' పాటలో డ్యాన్స్ చేసింది. ప్రస్తుతానికి సినిమాలేం చేయట్లేదు గానీ వ్యక్తిగత విషయాల్లో ఏదో ఒకలా వైరల్ అవుతూ ఉంటుంది. తాజాగా తనకు రెండో పెళ్లిపై ఆసక్తి ఉందని కామెంట్స్ చేసింది. అవి ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: చిరుతో సినిమా.. క్లర్క్ నన్ను చూసి జాలిపడ్డాడు: టాలీవుడ్ నిర్మాత)రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మలైకా, మళ్లీ పెళ్లి చేసుకోవడం గురించి మాట్లాడుతూ.. 'నేను చాలా రొమాంటిక్ మనిషిని. ప్రేమపై నాకు ఎంతో నమ్మకముంది. సరైన వ్యక్తి దొరికితే రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమే' అని చెప్పుకొచ్చింది. అలానే ప్రస్తుతం వివాహం చేసుకుంటున్న యువత.. ఆలోచించి ఈ నిర్ణయం తీసుకోవాలని సలహా ఇచ్చింది. తనకు చిన్న వయసులోనే పెళ్లి జరిగిందని, అయితే భర్త నుంచి విడాకులు తీసుకున్న తర్వాత తనని అందరూ స్వార్థపరురాలిగా చూశారని, కానీ విడాకుల తీసుకోవడంలోనే ఆనందాన్ని వెతుక్కున్నానని మలైకా చెప్పుకొచ్చింది.హీరో సల్మాన్ ఖాన్ తమ్ముడు అర్భాజ్ ఖాన్ని మలైకా అరోరా.. 1998లో పెళ్లి చేసుకుంది. అయితే దాదాపు 19 ఏళ్ల పాటు సంసారం చేసిన తర్వాత వీళ్లిద్దరూ 2017లో విడాకులు తీసుకున్నారు. తర్వాత కొన్నాళ్లకు హీరో అర్జున్ కపూర్తో డేటింగ్ చేసింది. ఫొటోలు, వీడియోలు తెగ వైరల్ అయ్యాయి. మరి ఏమైందో ఏమో గానీ అర్జున్-మలైకా విడిపోయారు. ఈమెకు అర్హాన్ ఖాన్ అని 22 ఏళ్ల కొడుకు కూడా ఉన్నాడు. మరి ఇప్పుడు రెండో పెళ్లిపై మనసు మళ్లడం చూస్తుంటే.. త్వరలోనే గుడ్ న్యూస్ చెబుతుందేమో అనిపిస్తుంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి లేటెస్ట్ బ్లాక్బస్టర్ మూవీ... తెలుగులోనూ) -
ఈ హీరోయిన్లో ఈ టాలెంట్ కూడా ఉందా? వీడియో వైరల్
కృష్ణాష్టమి అనగానే అందరూ రాధ, గోపికలుగా తయారై తెగ సందడి చేశారు. హీరోయిన్ అదా శర్మ (Adah Sharma) కూడా అందంగా ముస్తాబైంది. అయితే చేతిలో వేణువు పట్టుకుంది. ఊరికే ఫోటో కోసమే అలా స్టిల్ ఇచ్చిందనుకునేరు. కానే కాదు, ఫ్లూట్తో అద్భుతంగా ఓ పాట ట్యూన్ వినిపించింది. ఇది చూసిన అభిమానులు.. మీరు మల్టీటాలెంటెడ్ అని మెచ్చుకుంటున్నారు. కాగా అదా శర్మ.. లాక్డౌన్లో ఫ్లూట్ నేర్చుకుంది.సినిమాల విషయానికి వస్తే..అదా శర్మ.. 1920 అనే హారర్ చిత్రంతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. హార్ట్ ఎటాక్ మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. తెలుగులో సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, గరం, క్షణం, కల్కి, సీ.డీ: క్రిమినల్ ఆర్ డెవిల్ వంటి చిత్రాల్లో నటించింది. ద కేరళ స్టోరీ మూవీతో సెన్సేషన్ అయిన అదా చివరగా తుమ్కో మేరీ కసమ్ మూవీలో కనిపించింది. View this post on Instagram A post shared by Adah Sharma (@adah_ki_adah) View this post on Instagram A post shared by Adah Sharma (@adah_ki_adah) -
దర్శకుడిగా షారుక్ ఖాన్ కుమారుడు.. ఫస్ట్ లుక్ వీడియో అదుర్స్
బాలీవుడ్ ప్రముఖ నటుడు షారుక్ ఖాన్ (Shah Rukh Khan) కుమారుడు ఆర్యన్ ఖాన్ (Aryan Khan) దర్శకుడిగా తెరకెక్కిస్తున్న 'ది బా***డ్స్ ఆఫ్ బాలీవుడ్' ఫస్ట్ లుక్ విడుదలైంది. అయితే, సినిమా కాకుండా వెబ్సిరీస్ కోసం తొలిసారి మెగా ఫోన్ పట్టాడు. ఈ చిత్రాన్ని ‘నెట్ఫ్లిక్స్’ (Netflix), ‘రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్’ (Red Chillies Entertainment) సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ఆగష్టు 20న ప్రివ్యూ ఉంటుందని నెట్ఫ్లిక్స్ ప్రకటించింది. అయితే, ఈ మూవీకి కథ కూడా ఆర్యన్ రాయడం విశేషం. బాలీవుడ్లో ఇప్పటివరకూ చూడని సరికొత్త వెబ్సిరీస్ను అందించబోతున్నామని గతంలోనే ఆర్యన్ యూనిట్ ప్రకటించింది.ఈ వీడియోలో ఆర్యన్ వాయిస్ ఓవర్తో కథనం ప్రారంభమౌతుంది. కానీ, అతని తండ్రి షారుఖ్ ఖాన్ శైలిలో వీడియో ఉంది. తేడా ఏమిటంటే ఖాన్ ప్యార్ (ప్రేమ) గురించి మాట్లాడగా, కుమారుడు వార్ (దాడి) గురించి మాట్లాడుతాడు. ఇందులో బాబీ డియోల్, లక్ష్య (Kill ఫేమ్), మనోజ్ పహ్వా, మోనా సింగ్, మనీష్ చౌదరి, రాఘవ్ జుయల్, అన్య సింగ్ వంటి స్టార్స్ నటించనున్నారు. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, అలియాభట్ వంటి స్టార్స్ కూడా ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారని సమాచారం. -
ఓటీటీ సిరీస్లో లెస్బీయన్ లిప్లాక్.. అవసరమా?
సినిమాల్లో ఇప్పుడు లిప్లాక్ సీన్స్ కామన్ అయిపోయాయి. అవసరం ఉన్నా లేకపోయినా కొన్ని చిత్రాల్లో ముద్దు సన్నివేశాలను జోడిస్తున్నారు. ఇక వెబ్ సిరీస్లలో అలాంటి సన్నివేశాలకు అడ్డూ అదుపే లేదు. ప్రేక్షకులు కూడా వాటిని రొటీన్ సీన్లలాగే ట్రీట్ చేస్తున్నారు. ఒకప్పటిలా ఆ సన్నివేశాలపై చర్చించడం.. ఖండించడం జరగట్లేదు. కానీ చాలాకాలం తర్వాత మళ్లీ ఓ ముద్దు సీన్పై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఆ వెబ్ సిరీస్లో లెస్బియన్ మధ్య కిస్ సీన్ పెట్టడం అవసరమా అని ఓ వర్గం ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. వివరాల్లోకి వెళితే..హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘అంధేరా’ ఆగస్ట్ 14న ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ అయింది. అతీంద్రియ శక్తుల నేపథ్యంలో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్లో ప్రియా బాపట్, కరణ్వీర్ మల్హోత్రా, ప్రజక్తా కోలి, సుర్వీన్ చావ్లా తదితరులు కీలక పాత్రలు పోషించారు. రాఘవ్ ధర్ దర్శకత్వం వహించారు. ఈ వెబ్ సిరీస్కి మంచి టాక్ వచ్చినప్పటికీ.. ఇందులో ఇద్దరు నటీమణుల మధ్య వచ్చే లెస్బియన్ ముద్దు సన్నివేశంపై కొంతమంది విమర్శలు చేస్తున్నారు. కథలో భాగంగా సుర్వీన్ చావ్లా- ప్రియా బాపట్ మధ్య ముద్దు పెట్టుకోవాలి. ఇద్దరూ ఈ సీన్లో అద్భుతంగా నటించారు. వారిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. చాలా నేచురల్గా నటించారని కొంతమంది వారిపై ప్రశంసలు కురిపిస్తుంటుంటే.. మరికొంతమంది మాత్రం ఆ సీన్ అనవసరంగా పెట్టారని విమర్శిస్తున్నారు. అలాగే ఇలాంటి మెయిన్ స్ట్రీమ్ షోల్లో ఇటువంటి సీన్స్ అవసరం లేదని వాదిస్తున్నారు. -
సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత
మారాఠీ చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటి జ్యోతి చందేకర్ (69) కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఆగస్టు 16న సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. మరాఠీ సిరీయళ్లతో పాటు పలు చిత్రాల్లోనూ జ్యోతి నటించారు. 12 ఏళ్ల వయసులోనే కెరీర్ని ప్రారంభించి, తనదైన నటనతో ఇండస్ట్రీలో కి వచ్చిన అతి కొద్ది కాలంలోనే మంచి గుర్తింపు సంపాదించుకుంది. ‘ఛత్రీవాలీ’, ‘తూ సౌభాగ్యవతి హో’ సీరియళ్లు జ్యోతి కెరీర్ని మలుపు తిప్పాయి. బుల్లితెరపై వచ్చిన ఫేమ్తో సినిమా చాన్స్లు వచ్చాయి. ధోల్కీ, ‘తిచా ఉంబర్తా’. ‘మీ సింధుతాయ్ సప్కాల్’ వంటి చిత్రాలు జ్యోతికి నటిగా మంచి గుర్తింపుని సంపాదించిపెట్టాయి. మారాఠి ఇండస్ట్రీ నుంచి ఎన్నో అవార్డులను అందుకుంది. ఈ రోజు ఉదయం 11 గంటలకు పుణెలోని తమ నివాసం జ్యోతి చందేకర్ అంత్యక్రియలు నిర్వహించబోతున్నట్లు ఆమె కూతురు, నటి తేజస్విని పండిట్ తెలిపారు. -
డేటింగ్ యాప్స్, సహజీవనంపై స్టార్ హీరోయిన్ బోల్డ్ కామెంట్స్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్, ఎంపీ కంగనా రనౌత్(Kangana Ranaut) దేశంలో పెరిగిపోతున్న సహజీవనం సంస్కృతిపై తనదైన శైలిలో స్పందించింది. లీవ్-ఇన్ రిలేషన్ షిప్కు తను పూర్తిగా వ్యతిరేకం అని అంటుంది. అందులో భాగస్వాముల మధ్య భద్రత, నమ్మకం రెండూ ఉండవని అంటోంది."ఒకవేళ లీవ్-ఇన్లో మహిళ గర్భం దాలిస్తే ఆమెకు అబార్షన్ ఎవరు చేయిస్తారు? ఒకవేళ ఆ మహిళ అబార్షన్ వద్దనుకుంటే తనని ఎవరు సంరక్షిస్తారు? అప్పటివరకు సహజీవనం చేసిన ఆ పురుషుడు గర్భం చేసి పారిపోడన్న గ్యారెంటీ ఉందా?" అదే పెళ్లి చేసుకుంటే ఇద్దరి మధ్య ఓ బంద్ధం అంటూ ఉంటుందని, ఆ బంధానికి తల్లిదండ్రులు, బందువులు రక్షణగా ఉంటారని కంగనా చెబుతోంది.ఈ సంధర్భంగా డేటింగ్ యాప్స్పై కంగనా విరుచుకుపడింది. దేశంలో సహజీవనం సంస్కృతి పెరగడానికి కారణం డేటింగ్ యాప్స్ అని ఆరోపించింది.మహిళకు సామాజిక భద్రతతో పాటు ఆర్థిక స్వాతంత్య్రం కూడా ఉండాలి కానీ లీవ్-ఇన్ రిలేషన్ షిప్ కోసం ఆ స్వేచ్ఛను వాడడం సరైన పద్ధతి కాదని కంగనా అంటోంది. -
'కూలీ' vs 'వార్ 2'.. రెండు రోజుల కలెక్షన్ ఎవరికెంత?
స్వాతంత్ర్య దినోత్సవ వీకెండ్ సందర్భంగా రజినీకాంత్ 'కూలీ', ఎన్టీఆర్ 'వార్ 2' సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. అయితే రెండు కూడా పూర్తిస్థాయిలో హిట్ అనిపించుకోలేకపోయాయి. కొందరికి ఈ మూవీస్ నచ్చితే.. మరికొందరు మాత్రం ఓకే ఓకే ఉన్నాయని అంటున్నారు. ఏదైతేనేం లాంగ్ వీకెండ్ కలిసిరావడంతో ప్రేక్షకులు.. థియేటర్లకు వెళ్తున్నారు. ఈ క్రమంలో బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ కూడా బాగానే కనిపిస్తుంది. ఇంతకీ రెండు రోజుల్లో ఈ చిత్రాలకు ఎంతెంత వచ్చాయి? ఎవరు ముందున్నారు?'కూలీ' గురించి ముందుగా మాట్లాడుకుంటే.. తొలిరోజు రూ.151 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చినట్లు స్వయంగా నిర్మాతలే ప్రకటించారు. తమిళంలో తొలిరోజు అత్యధిక కలెక్షన్ వచ్చిన సినిమాగా రికార్డ్ కూడా సృష్టించినట్లు చెప్పుకొచ్చారు. అయితే మొదటిరోజుతో పోలిస్తే రెండోరోజు నంబర్లు కాస్త డౌన్ అయినట్లు తెలుస్తోంది. ఓవరాల్గా రూ.86 కోట్ల గ్రాస్ వచ్చినట్లు ట్రేడ్ సమాచారం. అంటే రెండు రోజుల్లో కలిపి దగ్గరదగ్గర రూ.240 కోట్ల వసూళ్లు వచ్చినట్లు టాక్.(ఇదీ చదవండి: 'కూలీ'తో సక్సెస్.. కాస్ట్లీ కారు కొన్న నటుడు సౌబిన్ షాహిర్)'కూలీ' రెండో రోజ వసూళ్లలో తమిళం నుంచి రూ.34 కోట్లు రాగా, తెలుగు-హిందీల నుంచి వరసగా రూ.13.5 కోట్లు, రూ.7.5 కోట్లు వచ్చినట్లు సమాచారం. లాంగ్ రన్లోనూ తమిళంతో పాటు తెలుగు నుంచి ఎక్కువగా కలెక్షన్స్ వస్తాయని దీనిబట్టి అంచనా వేయొచ్చు. రజినీకాంత్, నాగార్జున, ఉపేంద్ర, ఆమిర్ ఖాన్, శ్రుతి హాసన్, సౌబిన్ షాహిర్.. ఇలా స్టార్స్ ఉండటం ఈ మూవీకి ఓ రకంగా బాక్సాఫీస్ దగ్గర ప్లస్ అవుతోంది.మరోవైపు 'వార్ 2' విషయానికొస్తే.. నిర్మాతలు అధికారికంగా వసూళ్ల లెక్కలు ప్రకటించలేదు. కానీ ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం రెండు రోజుల్లో కలిసి రూ.115 కోట్ల నెట్ కలెక్షన్ వచ్చినట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా రెండోరోజు రూ.56.5 కోట్ల నెట్ వచ్చినట్లు వినిపిస్తోంది. మొదటిరోజుతో పోలిస్తే రెండోరోజే కాస్త పెరుగుదల కనిపించింది. ఓవరాల్గా హిందీలో రూ.75 కోట్ల నెట్ రాగా, తెలుగు నుంచి రూ.40 కోట్ల నెట్ వసూళ్లు వచ్చినట్లు సమాచారం. ప్రస్తుతానికైతే 'కూలీ'నే ముందంజలో ఉన్నట్లు కనిపిస్తుంది. మరి వీకెండ్ అయ్యేసరికి అధికారిక నంబర్లు ప్రకటిస్తారేమో చూడాలి?(ఇదీ చదవండి: సడన్గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమాలు) -
విడాకులతో సంతోషాన్ని వెతుక్కున్నా.. తప్పేముంది?: మలైకా
బాలీవుడ్ నటి మలైకా అరోరా (Malaika Arora) ప్రేమలో ఓడిపోతూనే ఉంది. మలైకా.. 1998లో నటుడు అర్బాజ్ ఖాన్ను పెళ్లాడింది. వీరికి 2002లో కుమారుడు అర్హాన్ ఖాన్ జన్మించాడు. మొదట్లో బాగానే ఉన్న దంపతులు తర్వాత దూరంగా ఉండటం మొదలుపెట్టారు. 2017లో విడాకులు తీసుకున్నారు. అయితే పిల్లాడి బాధ్యతను మాత్రం ఇద్దరూ తీసుకున్నారు. అనంతరం మలైకా.. నటుడు అర్జున్ కపూర్తో ప్రేమలో పడింది. దంపతులుగా విడిపోయినా..ఏళ్ల తరబడి రిలేషన్లో ఉన్న వీరు పెళ్లి చేసుకోవడమే ఆలస్యం అని అంతా అనుకున్నారు. అంతలోనే ఈ ప్రేమప్రయాణానికి ఫుల్స్టాప్ చెప్తూ బ్రేకప్ చెప్పుకున్నారు. తాజాగా మలైకా కో పెరింటింగ్ గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది. మేమిద్దరం భార్యాభర్తలుగా విడిపోయినా పిల్లాడి కోసం తల్లిదండ్రులుగా నిలబడ్డాం. ఇప్పుడు వాడికి 22 ఏళ్లు. తల్లి దగ్గర ఏం మాట్లాడాలి? తండ్రి దగ్గర ఎలా ఉండాలి? అనేది బాగా తెలుసు. కోరుకున్నవన్నీ జరగవుకాబట్టి ఇప్పుడు పరిస్థితులు అంత జటిలంగా లేవు. ఎవరి హద్దుల్లో వాళ్లం ఉన్నాం. విడాకుల వల్ల నా కొడుకు ఎఫెక్ట్ అవకూడదనుకున్నాను. అందుకే ఇద్దరం బాధ్యతలు తీసుకున్నాం. కానీ విడాకులు ప్రకటించగానే చాలామంది ఇలా చేస్తావా? ఇలా ఉండకూడదు అంటూ నాకు నీతులు చెప్పారు. నేనేమంటానంటే కొన్నిసార్లు బంధాలనేవి జటిలంగా ఉంటాయి. నా వివాహబంధం కొనసాగాలనే కోరుకున్నాను. కానీ, అది జరగలేదు. దానికి నేనేం చేయగలను?అమ్మ కష్టాలుఅలా అని నేను ప్రేమపై విశ్వాసాన్ని కోల్పోయానని కాదు. ఏదో ఘోర తప్పిదం చేశాననీ కాదు. అందరూ తప్పంతా నాదే అన్నట్లు నావైపే వేలు చూపించారు. సెల్ఫిష్గా ఆలోచించానన్నారు. మీకలా అనిపించుండొచ్చు. కానీ, నేను ఆనందంగా ఉండాలనుకున్నాను. అందుకే ఆ బంధం నుంచి బయటకు వచ్చేశాను. ఇప్పుడు సంతోషంగా ఉన్నాను. ఇకపోతే నేను మధ్యతరగతి కుటుంబంలో పుట్టి పెరిగాను. అమ్మ రోజంతా పని చేస్తూ బిజీగా ఉండేది. మాకోసం అహర్నిశలు శ్రమించింది. తన దగ్గరున్న వస్తువులమ్మేసి మరీ స్కూల్ ఫీజు కట్టేది. డబ్బు విలువ బాగా తెలుసుఅప్పుడు చెల్లిని నేనే చూసుకునేదాన్ని. కుటుంబం కోసం 17 ఏళ్లకే పని చేయడం మొదలుపెట్టాను. డబ్బు సంపాదించడమే నా లక్ష్యం. ఫ్రెండ్స్తో పార్టీలంటూ బయటకు వెళ్లేదాన్ని కాదు. ఇప్పటికీ డబ్బు విషయంలో నేనలాగే ఉంటాను. ప్రతి ఖర్చు పుస్తకంలో రాసుకుంటాను. మరీ ఖరీదైనవాటిని కొనుగోలు చేయడానికి ఇష్టపడను అని చెప్పుకొచ్చింది. కాగా 'చయ్య చయ్య' పాటతో ఫేమస్ అయిన మలైకా.. రాత్రైనా నాకు ఓకే (అతిథి), కెవ్వు కేక (గబ్బర్ సింగ్) పాటలతో టాలీవుడ్కు దగ్గరైంది.చదవండి: అగ్నిపరీక్ష.. ఏంటిది? బిగ్బాస్ వాయిస్ తేడాగా ఉందే! -
నెలసరిలో పర్యటనలు.. వాష్రూమ్కి వెళ్లలేకపోతున్నాం: కంగనా రనౌత్
సినిమాలలో కంటే రాజకీయాల్లోనే ఎక్కువ కష్టాలు అంటోంది నటి, ఎంపీ కంగనా రనౌత్(Kangana Ranaut). రాజకీయాల్లో ఉన్నప్పడు నెలసరి సమయంలో కూడా కష్టపడాల్సి వస్తోందని చెబుతోంది. సామాన్య మహిళలే కాదు ఎంపీలు కూడా నెలసరి సమయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఆ బాధను వర్ణించడం కూడా అసాధ్యం అని చెబుతోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కంగనా.. సినిమా, రాజకీయ రంగాలను పోలుస్తూ..మహిళగా తాను ఎదుర్కొంటున్న సమస్యల గురించి వివరించింది.‘సినిమాలు చేసినప్పుడు నెలసరి సమయంలో అంత ఇబ్బంది పడేదాన్ని కాదు. షూటింగ్ సమయంలో హీరోయిన్స్కి సపరేట్ కారవాన్లు ఉంటాయి. మా కోసం ప్రత్యేక సదుపాయాలు ఏర్పాటు చేస్తారు. పిరియడ్ సమయంలో మరింత జాగ్రత్తగా చూసుకుంటారు. వాష్రూమ్లకు వెళ్లేందుకు సదుపాయం ఉంటుంది. విశ్రాంతి తీసుకోవచ్చు. టీమ్తో మాట్లాడి మనకు కావల్సినవన్నీ తెప్పించుకోవచ్చు. కానీ రాజకీయాల్లో అలా ఉండదు. షెడ్యూల్ ముందే ఫిక్స్ అవుతుంది. ఒక్కోసారి పర్యటనలో భాగంగా రోజులకు 12 గంటల వరకు ప్రయాణించాల్సి వస్తుంది. కనీసం టాయిలెట్ వెళ్లడానికి కూడా వీలుపడదు. నాకే కాదు మహిళా ఎంపీలందరూ ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. అందరికి ఇది చిన్న సమస్యగా అనిపించొచ్చు కానీ.. ఇది చాలా పెద్ద ఇబ్బంది. దీన్ని వర్ణించడం కూడా అసాధ్యం’ అని కంగనా చెప్పుకొచ్చింది. హిమాచల్ ప్రదేశ్కి చెందిన రాజ్పుత్ కుటుంబంలో కంగనా.. 2006లో చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. ఏక్ నిరంజన్ సినిమాతో తెలుగు తెరపై మెరిసింది. హీరోయిన్గానే కాకుండా దర్శకురాలిగా, నిర్మాతగానూ రాణించింది. 2024లో జరిగిన లోకసభ ఎన్నికల్లో మండి నియోజకవర్గం(హిమాచల్ ప్రదేశ్) నుంచి కంగనా ఎంపీగా ఎన్నికయ్యారు. -
స్వామీజీకి కిడ్నీ దానం.. మానవత్వాన్ని ఎగతాళి చేస్తున్నారా?
మంచి చేయాలనుకుంటే అందులో కూడా చెడే చూస్తున్నారంటున్నాడు బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త, బిజినెస్మెన్ రాజ్ కుంద్రా (Raj Kundra). స్వామీజీ ప్రేమానంద్ మహారాజ్ అనారోగ్యం గురించి తెలుసుకున్న ఈయన స్వామికి కిడ్నీ దానం చేసేందుకు ముందుకు వచ్చాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు.కరుణ కూడా పీఆర్ స్టంటా?అయితే చాలామంది ఇదంతా పబ్లిసిటీ స్టంట్ అని కొట్టిపడేస్తున్నారు. తనపై ఉన్న కేసులను కప్పిపుచ్చడానికే ఇదంతా చేస్తున్నాడని విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ ట్రోలింగ్పై రాజ్ కుంద్రా అసహనం వ్యక్తం చేశాడు. ఒక మనిషి ప్రాణాలు కాపాడటం కోసం నా కిడ్నీ ఇచ్చేందుకు సిద్ధపడితే దాన్ని కూడా తప్పుపడుతున్నారు. పీఆర్ స్టంట్ అని తీసిపారేస్తున్నారు. ఇలాంటి వింత ప్రపంచంలో ఉంటున్నాం! కరుణ, జాలి అనేవి స్టంట్ అయితే.. ప్రపంచమంతా అది వ్యాపించాలి. వీలైతే ప్రేమించండిమానవత్వాన్ని ఎగతాళి చేస్తున్నారు. మానవత్వాన్ని స్ట్రాటజీ అని భావిస్తుంటే.. మీరందరూ దాన్ని ఫాలో కావాలి. మీ మెప్పు పొందడం కోసమైతే నేనలా మాట్లాడలేదు. మీ మాటలు, విమర్శలతో నా వ్యక్తిత్వం మారదు. వీలైతే ప్రేమించండి, అంతేకానీ, చులకనగా మాట్లాడకండి.. అప్పుడే ఇతరుల జీవితాల్లో మీరూ వెలుగులు నింపగలరు అని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చాడు.కిడ్నీ ఆఫర్.. తిరస్కరించిన స్వామీజీకాగా ప్రేమానంద్ మహారాజ్ దశాబ్దకాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు. బృందావన్ ఆశ్రమంలో స్వామీజీని కలిసిన రాజ్కుంద్రా.. నా రెండు కిడ్నీలలో ఒకటి మీదే అంటూ అవయవదానానికి ఆఫర్ ఇచ్చాడు. కానీ స్వామీజీ అందుకు నిరాకరించారు. రాజ్కుంద్రా కిడ్నీ ఆఫర్ చేసిన సమయంలో శిల్పా శెట్టి భర్త పక్కనే కూర్చుంది.చదవండి: అందం ఒక్కటే కాదు.. కలర్ ఉంటేనే షోలకు పిలుస్తారు: కీర్తి భట్ -
రాత్రుళ్లు నిద్రపోడు, 60ఏళ్ల హీరో సూపర్ ఫిట్
ఆరోగ్యంగా మంచి ఫిజిక్తో తమ వయసు కన్నా బాగా తక్కువున్నట్టు కనిపించే ఎవరిని ఫిట్నెస్ సీక్రెట్ చెప్పమన్నా....సాధారణంగా వచ్చే సమాధానాలు అన్నీ దాదాపుగా ఒకేలా ఉంటాయి. ‘‘ఉదయాన్నే లేస్తాను, వ్యాయామం చేస్తా, తాజా పండ్లు తింటాను..దురలవాట్లకు దూరంగా ఉంటా, రాత్రుళ్లు త్వరగా నిద్రపోతా, కనీసం 7గంటలైనా నిద్ర ఉండేలా చూసుకుంటా...’’వంటివి. అయితే వీటన్నింటికీ భిన్నంగా చెబుతున్నాడో హీరో. మరో రెండు నెలల్లో 60ఏళ్ల వయసుకు చేరుకోబోతున్న ఆ హీరో ఇప్పటికే సిక్స్ ప్యాక్ మాత్రమే కాదు ఎయిట్ ప్యాక్ కూడా చేసేశాడు. అది కూడా మద్యం సేవించడం, రాత్రుళ్లు నిద్రపోకపోవడం...వంటివి చేస్తూనే... ఎవరా హీరో? ఏమాతని కధ?వచ్చే నవంబర్ 2వ తేదీ నాటికి బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్(Shah Rukh Khan)కు 60 ఏళ్లు నిండుతాయి, కానీ అతని వయస్సులో సగం ఉన్న పురుషులను కూడా సిగ్గుపడేలా చేసే శరీరాకృతి అతని స్వంతం. గత ఎన్నో సంవత్సరాలుగా గ్రీకు వీరుని తలపించే ఫిజిక్తో ఈ సూపర్ స్టార్ కొనసాగుతున్నాడు. ఇటీవలే తన ఫిట్నెస్ అలవాట్లు ఆహార క్రమశిక్షణ గురించి మీడియాతో పంచుకున్నాడు. బాలీవుడ్లో అడుగుపెట్టిన తొలినాళ్లలో లాగే ఇప్పటికీ తనను చురుగ్గా కనిపించేలా చేసే దినచర్యల గురించి ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ నేషనల్ అవార్డ్ విన్నర్ వివరించాడు.‘నేను ఉదయం ఐదు గంటలకు పడుకుంటాను అంతేకాదు.. తొమ్మిది లేదా పది గంటలకు మేల్కొంటాను‘ అని ఆయన చెప్పాడు. అంతేకాదు రోజూ అర్ధరాత్రి దాటిన తర్వాత రెండు గంటలకు పని ముగించుకుని తాను ఇంటికి తిరిగి వస్తానన్నాడు. అప్పుడు ఆ టైమ్లోనే తాను వ్యాయామం చేస్తానని చెబుతున్నాడు. బహుశా చాలా మందికి ఇది అసాధ్యం., కానీ షారూఖ్కు కొన్ని సంవత్సరాలుగా అది సాధారణం. వ్యాయామం చేసి, స్నాన ం అన్నీ పూర్తి చేసుకుని తెల్లవారుఝామున 5గంటలకు నిద్రపోతాడన్నమాట. అంతేకాదు ఆసక్తికరంగా, షారూఖ్ తాను పండ్లు తిననని చెబుతున్నాడు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఉన్నవారి నుంచి సాధారణంగా ఇలాంటి మాట వినడం # జరగదు. ఆయన తన మందు అలవాటు గురించి మాట్లాడుతూ...‘‘ఒక నిర్దిష్ట పాత్ర కోసం ఒక షేప్ లోకి రావాలంటే మాత్రం ఆల్కహాల్ను మానేస్తాను అని చెప్పాడు. దానితో పాటే తెల్ల రొట్టె, తెల్ల బియ్యం, స్వీట్లు కూడా అంటూ వివరించాడు. కొన్నిసార్లు ఐస్ క్రీం లేదా చాక్లెట్ తింటాను అంటున్న షారుఖ్ జంక్ ఫుడ్ లేదా డెజర్ట్లను తానేమీ ప్రత్యేకంగా ఇష్టపడనని చెప్పాడు. అంతేకాదు తందూరీ చికెన్ అంటే తాను పడి చస్తానంటున్నాడీ హీరో.దశాబ్దాలుగా ఆయన వదల్లేని వంటకం ఏదైనా ఉంటే, అది తందూరీ చికెన్. దీనిని తన కంఫర్ట్ ఫుడ్ అని పేర్కొంటూ నేను దీనికి బానిసని చెప్పాలి. అవసరమైతే నేను సంవత్సరంలో 365 రోజులు ఇదే తినగలను’’ అన్నాడు.మరి మంచి లక్షణాలు, అలవాట్లు ఏమీ లేవా అంటే ఉన్నాయి. అందులో ముఖ్యమైనది కఠినమైన వ్యాయామం, ప్రోటీన్ అధికంగా ఉండే, శుభ్రమైన భోజనం తన ఆహారం, తన ఎవర్ గ్రీన్ ఎనర్జీకి ఆధారం అంటాడు షారుఖ్. తన ఆహారపు అలవాట్ల గురించి చెబుతూ ‘నేను గ్రిల్డ్ చికెన్, లీన్ మీట్స్, పప్పుధాన్యాలు తీసుకుంటాను. గుడ్డులోని తెల్లసొన మాత్రమే తింటాను‘ అని స్పష్టం చేశాడు. ‘నేను తక్కువ పరిమాణంలోనే ఆహారం తీసుకుంటాను. ‘ అని ఆయన చెప్పాడు. ఇది వివిధ సినిమా పాత్రల డిమాండ్లకు అనుగుణంగా తన శరీరాన్ని త్వరగా మార్చుకోవడానికి తాను అనుసరించే వ్యూహం అని చెప్పాడు.సినిమా సెట్లలో తయారుచేసిన ఆహారానికి బదులుగా ఇంట్లో వండిన భోజనం మాత్రమే తినడానికి ఇష్టపడతాడు. అతని సాధారణ మధ్యాహ్నం భోజనంలో తరచుగా చేపలు లేదా తందూరీ చికెన్ ఉంటుంది, కొన్నిసార్లు బీన్ స్ప్రౌట్స్ లేదా ఏదైనా వెజ్కర్రీ జతవుతుంది. ‘సాధారణంగా తందూరీ రోటీతో తందూరీ చికెన్, అప్పుడప్పుడు మటన్ డిష్‘ అంటూ తన డిన్నర్ మెనూ వివరిస్తాడు.ఆయన భార్య చిత్ర నిర్మాత ఇంటీరియర్ డిజైనర్ గౌరీ ఖాన్ ‘డైజెస్టివ్ బిస్కెట్లతో మంచి ఐస్ క్రీం‘ అని పిలిచే దానిని తయారు చేస్తారు. మీ 50 ఏళ్ల వయసు దాటాక ఫిట్గా ఉండటం అంటే విపరీతమైన భోజన ప్రియత్వమో, దురలవాట్లో కాదు అలాగే ఆకలితో అలమటించడం కూడా కాదు. శరీరానికి ఏది పని చేస్తుందో తెలుసుకోవడం ముఖ్యం అంటాడు షారూఖ్. -
పుట్టగానే అన్న చనిపోయాడు.. నాన్నమ్మ ఆస్పత్రికే పంపలేదు : కంగనా రనౌత్
బాలీవుడ్ నటి, ఎంపీ కంగనా రనౌత్కి ఫైర్ బ్రాండ్ అనే గుర్తింపు ఉంది. ఏ విషయాన్ని అయినా కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడుతుంది. తన వ్యక్తిగత విషయాలతో పాటు దేశంలో జరుగుతున్న పలు ఘటనలపై కూడా ఆమె స్పందిస్తుంటారు. వివాదస్పద వ్యాఖ్యలు చేయడం..ట్రోలింగ్ని ఎదుర్కొవడం ఆమెకు కొత్తేమి కాదు. అయితే ప్రతి ఇంటర్వ్యూలోనూ రాజకీయాలు, సినిమా అంశాలపై మాట్లాడే కంగనా..ఈ సారి మాత్రం తన ఫ్యామిలీ విషయాలను షేర్ చేసుకుంది. తన సోదరుడు పుట్టిన 10 రోజులకే చనిపోయాడని ఎమోషనల్ అయింది. తాజాగా ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కంగనా మాట్లాడుతూ.. ‘నా కంటే ముందే మా అమ్మకి బాబు పుట్టి చనిపోయాడు. మా అన్నయ్య పుట్టిన 10 రోజులకే ఆస్పత్రిలో చనిపోయాడట. సరైన కారణం తెలియదు కానీ ‘బొడ్డు తాడు కొంచెం ఎక్కువగా కత్తిరించడం వల్లే చనిపోయాడు’ అని మా అమ్మ నమ్మింది. ఈ విషయంలో చాలా బాధపడింది. ఇదంతా కళ్లారా చూసిన మా నాన్నమ్మ.. తర్వాత మా అమ్మని ఆస్పత్రికే పంపలేదు. అంతేకాదు ప్రసవానికి ఎవరూ ఆస్పత్రికి వెళ్లొద్దని కండీషన్ పెట్టింది. దీంతో మా అమ్మ ఇంట్లోనే ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది. మా అత్తమ్మ కూడా ఇంట్లోనే ఇద్దరు పిల్లలను కనింది. ఆస్పత్రికి వెళ్తే పిల్లలు చనిపోతారన్న మూఢనమ్మకంతో మా నాన్నమ్మ వాళ్లకు ఇంట్లోనే ప్రసవం అయ్యేలా ఏర్పాట్లు చేసింది’ అని కంగనా చెప్పుకొచ్చింది.నాన్న తక్కువ చేసి మాట్లాడేవాడు నాన్న ఎప్పుడూ తనను తక్కువ చేసి మాట్లాడేవాడని కంగనా గుర్తు చేసుకుంది. ‘బాగా చదువుకుంటేనే మనలాంటి మంచి ఫ్యామిలీ దొరుకుతుందని చెప్పువాడు. ఒకవేళ చదువుకోకపోతే..మంచి వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేయనని బెదిరించేవాడు. వాళ్లు చెప్పేది నా మంచి కోసమే అని తెలుసు. వాళ్లు కోరుకునే జీవితం బాగుంది. కానీ నాకు మాత్రం అలా జీవించాలని లేదు’ అని కంగనా చెప్పుకొచ్చింది. హిమాచల్ ప్రదేశ్కి చెందిన రాజ్పుత్ కుటుంబంలో కంగనా జన్మించింది. ఆమె తల్లి ఆశా రనౌత్ టీజర్. తండ్రి అమర్దీప్ రనౌత్ వ్యాపారవేత్త. కంగనాకు అక్క, తమ్ముడు ఉన్నారు. 2024లో జరిగిన లోకసభ ఎన్నికల్లో మండి నియోజకవర్గం(హిమాచల్ ప్రదేశ్) నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. -
లగ్జరీ ఫ్లాట్ కొన్న ఆదిపురుష్ బ్యూటీ.. ధర ఎన్ని కోట్లంటే?
ఆదిపురుష్ మూవీతో టాలీవుడ్లో అభిమానులను సంపాదించుకున్న బ్యూటీ కృతి సనన్. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. అంతేకాకుండా కోలీవుడ్ స్టార్ ధనుశ్తో కలిసి తేరే ఇష్క్ మే చిత్రంలో కనిపించనుంది. ఈ చిత్రం నవంబర్ 28న రిలీజ్ కానుంది. ఆ తర్వాత బాలీవుడ్ మూవీ కాక్టెయిల్-2లోనూ నటిస్తోంది. సినిమాలతో పాటు వ్యాపార రంగంలోనూ కృతి రాణిస్తోంది. 2023లో తన సొంత బ్యూటీ బ్రాండ్ హైఫన్ ప్రారంభించింది. స్కిన్ కేర్కు సంబంధించిన వ్యాపారంలో దూసుకెళ్తోంది. నటనతో పాటు 2022లోనే వ్యాయామ కార్యక్రమాలు, శిక్షణ, వెల్నెస్ కంటెంట్ను అందించే ఫిట్నెస్ బ్రాండ్ ది ట్రైబ్ను స్థాపించింది.అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ ఓ ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ముంబయిలోని బాంద్రా వెస్ట్లోని పాలి హిల్ ప్రాంతంలో డ్యూప్లెక్స్ పెంట్హౌస్ను కొనేసింది బాలీవుడ్ భామ. ఈ లగ్జరీ ఫ్లాట్ కోసం రూ.84.16 కోట్లకు పైగా చెల్లించినట్లు సమాచారం. ఇప్పటికే కృతికి ముంబయి సమీపంలో అత్యాధునిక సౌకర్యాలతో ఉన్న ఫ్లాట్ను కొనుగోలు చేసింది. అంతకుముందే బాంద్రాలోనే దాదాపు రూ.35 కోట్ల విలువైన 4 బీహెచ్కే అపార్ట్మెంట్ను తన సొంతం చేసుకుంది.ఈ ఖరీదైన బాంద్రా వెస్ట్ ప్రాంతంలో షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్, జావేద్ అక్తర్, రణబీర్ కపూర్, అలియా భట్, కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్, రేఖ వంటి బాలీవుడ్ ప్రముఖులు నివాసముంటున్నారు. బాలీవుడ్ కపుల్ దీపికా పదుకొణె, రణవీర్ సింగ్ కూడా త్వరలో తమ కొత్త బాంద్రా వెస్ట్ అపార్ట్మెంట్లోకి మారనున్నారు. -
రకుల్ నుంచి మానుషి వరకు.. మిలిటరీ బ్యాక్గ్రౌండ్ ఉన్న సెలబ్రిటీలు ఎవరంటే?
కాదేదీ సినిమాకు అనర్హం అన్నట్లుగా ప్రపంచంలో, సమాజంలో ఉన్న ప్రతీది ఓ కథా వస్తువే! కల్పితాలతో పాటు రియల్ స్టోరీలను కూడా వెండితెరపై చూపిస్తూ ఉంటారు. అలా దేశాన్ని సరిహద్దులో ఉండి కాపాడుతున్న సైనికుల పోరాటాలు, జీవన విధానాలు తెరపై ఎన్నోసార్లు ఆవిష్కృతమై బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు సృష్టించాయి. అయితే సినిమాలోనే కాకుండా నిజ జీవితంలోనూ కొందరు సైనికులుగా సేవ చేస్తే మరికొందరు సెలబ్రిటీలకేమో మిలిటరీ బ్యాక్గ్రౌండ్ ఉంది. నేడు (ఆగస్టు 15) స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సినీ ఇండస్ట్రీలో మిలటరీ నేపథ్యం ఉన్న తారలెవరో ఓసారి చూసేద్దాం..రకుల్, అనుష్క పేరెంట్స్..రకుల్ ప్రీత్ సింగ్ తండ్రి రాజేంద్ర సింగ్ ఆర్మీ అధికారి. అక్షయ్ కుమార్ (Akshya Kumar) తండ్రి హరి ఓం భాటియా విశ్రాంత ఆర్మీ అధికారి. అనుష్క శర్మ తండ్రి కల్నల్ అజయ్ కుమార్ శర్మ కార్గిల్ యుద్ధంలోనూ భాగమయ్యారు. అనుష్క విద్యాభ్యాసమంతా బెంగళూరులోని ఆర్మీ స్కూల్లోనే జరిగింది. ప్రియాంక చోప్రా తల్లిదండ్రులు మధు - అశోక్ చోప్రా ఇండియన్ ఆర్మీలో వైద్యులుగా సేవలందించారు. నటి లారా దత్తా తండ్రి ఎల్కే దత్తా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్గా పని చేశారు. ఉగ్రదాడిలో వీరమరణంసుష్మితా సేన్ తండ్రి శుభీర్ సేన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో వింగ్ కమాండర్గా సేవలందించారు. నిమ్రత్ కౌర్ తండ్రి, ఆర్మీ అధికారి మజోర్ భూపిందర్ సింగ్.. 1994లో జరిగిన ఉగ్రవాదుల దాడిలో వీరమరణం పొందారు. ప్రీతి జింటా తండ్రి దుర్గానంద్ కూడా ఓ జవానే! తెలుగు నటి గాయత్రి గుప్తా తాతయ్య సైతం ఆర్మీలో పని చేశాడు. బ్రిటీష్ వారి చేతిలో ఆయన ప్రాణాలు కోల్పోయాడు. శ్రద్ధా శ్రీనాథ్ తండ్రి కూడా ఆర్మీ అధికారే!దిశా పటానీ సోదరి కూడా..నేహా ధూపియా తండ్రి ప్రదీప్ సింగ్ ఇండియన్ నేవీలో కమాండర్గా పని చేశారు. మానుషి చిల్లర్ తండ్రి మిత్ర బసు చిల్లర్ డీఆర్డీఓ (డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్)లో ఫిజీషియన్గా పని చేశారు. గుల్ పనగ్ తండ్రి లెఫ్టినెంట్ జనరల్ పనగ్.. మిలిటరీలో అందించిన సేవలకుగానూ పరమ విశిష్ట్ సేవా పురస్కారం అందుకున్నారు. దిశా పటానీ సోదరి ఖుష్బూ పటానీ ఇండియన్ ఆర్మీలో మేజర్గా సేవలందిస్తున్నారు.చదవండి: బాలీవుడ్ తారలు.. నిజ జీవితంలో సైనికులు.. -
'నా కిడ్నీల్లో ఒకటి మీదే'.. స్వామిజీకి హీరోయిన్ భర్త బంపరాఫర్!
బాలీవుడ్లో ఎప్పుడు వివాదాల్లో ఉన్న జంట ఎవరైనా ఉన్నారంటే వాళ్లే. ఆ కపుల్ మరెవరో కాదు.. బాలీవుడ్ భామ శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రా. గతంలో ఓ కేసుతో సంచలనంగా మారిన రాజ్ కుంద్రా.. మరో కేసులో చిక్కుకున్నారు. తనను రూ.60 కోట్ల మోసం చేశారంటూ రాజ్ కుంద్రా, శిల్పాశెట్టిపై ఓ వ్యాపారవేత్త ఫిర్యాదు చేశారు. దీంతో ముంబయి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.అయితే ఇటీవల రాజ్ కుంద్రా, శిల్పా శెట్టి కలిసి ప్రేమానంద్ మహారాజ్ ఆశ్రమాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆధ్యాత్మిక గురువైన ప్రేమానంద్ మహారాజ్కు ఏకంగా తన కిడ్నీని దానం చేస్తానని రాజ్ కుంద్రా మాటిచ్చారు. ఇది విని అక్కడున్న వారంతా ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ వీడియోను ప్రేమానంద్ భజన్ మార్గ్ యూట్యూబ్ ఛానెల్లో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా రాజ్ కుంద్రాకు ప్రేమానంద్ ధన్యవాదాలు తెలిపారు. మథురలోని ప్రేమానంద్ మహారాజ్ ఆశ్రమాన్ని శిల్పాశెట్టి దంపతులు సందర్శించిన వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్గా మారింది. వ్యాపారవేత్తను రూ.60 కోట్ల మోసం చేశారనే ఆరోపణలు వచ్చిన సమయంలో ఈ వీడియో బయటకి రావడం విశేషం.రాజ్ కుంద్రా మాట్లాడుతూ.. 'నేను గత రెండేళ్లుగా మిమ్మల్ని అనుసరిస్తున్నా. నాకు ఏవైనా సందేహాలు, భయాలకు మీ వీడియోలు ఎల్లప్పుడూ సమాధానం ఇస్తాయి. ఇప్పుడు నాకు ఎటువంటి ప్రశ్నలు లేవు. మీరు అందరికీ ప్రేరణ. మీ ఆరోగ్య పరిస్థితి గురించి నాకు తెలుసు. అందుకే నేను సహాయం చేయగలిగితే నా రెండు కిడ్నీలలో ఒకటి మీదే." అని అన్నారు.అయితే ప్రేమానంద్ మహారాజ్కు రెండు కిడ్నీలు చెడిపోయినట్లు తెలుస్తోంది. గత పదేళ్లుగా ఈ వ్యాధితో బాధపడుతున్నారని సమాచారం. ఈ విషయం తెలుసుకున్న రాజ్ కుంద్రా కిడ్నీ ఆఫర్ చేశారు. ఈ నిర్ణయం శిల్పాశెట్టిని ఆశ్చర్యానికి గురిచేసింది. -
బాలీవుడ్ తారలు.. నిజ జీవితంలో సైనికులు..
పోరాటాలు, నిరసనలు, ప్రాణాత్యాగాలతోనే స్వాతంత్ర్యం వచ్చింది. భరతమాత తన సంకెళ్లు విదిలించుకుని స్వేచ్ఛను పొంది నేటి(ఆగస్టు 15)కి 79 ఏళ్లు. ఈ స్వాతంత్ర్య దినోత్సవంపై ఎన్నో సినిమాలు వచ్చాయి. దేశభక్తిని చాటిచెప్పే పాటలెన్నో ఉన్నాయి. అయితే ఈ రోజు మనం దేశాన్ని శత్రువుల బారి నుంచి కంటికిరెప్పలా కాపాడుతున్న ఆర్మీలో పని చేసిన సెలబ్రిటీల గురించి తెలుసుకుందాం. తెరపైనే కాకుండా నిజ జీవితంలోనూ రియల్ హీరో అనిపించుకున్న తారలకు సెల్యూట్ చేద్దాం..కెప్టెన్ రాజు80's, 90'sలో విలన్గా రాణించిన కెప్టెన్ రాజు ఒకప్పుడు భారత ఆర్మీకి కెప్టెన్గా వ్యవహరించారు. 1971లో బంగ్లాదేశ్ విముక్తి యుద్ధంలో పాల్గొన్నారు. ఐదేళ్లు సైన్యంలో ఉన్న రాజు తర్వాత ఆర్మీ ఉద్యోగాన్ని వదిలేసి సినిమాల్లోకి వచ్చారు.సునీల్ శెట్టిసునీల్ శెట్టి సైన్యంలో పని చేయలేదు, కానీ అతడి తండ్రి వీరప్ప శెట్టి లెఫ్టినెంట్ కల్నల్గా ఆర్మీలో సేవలందించారు.నానా పటేకర్నానాపటేకర్ మూడేళ్లపాటు ఆర్మీలో శిక్షణ తీసుకున్నారు. 1999లో కార్గిల్ యుద్ధ సమయంలో గౌరవ కెప్టెన్గా వ్యవహరించారు. కొంతకాలానికే గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదాను పొందారు. 2013లో ఆర్మీ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నారు.సంజయ్ దత్1947లో జరిగిన ఇండో పాక్ యుద్ధంలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ పాల్గొన్నాడు.అచ్యుత్ పోట్దార్నటుడు అచ్యుత్ చదువు పూర్తవగానే ఆర్మీలో చేరారు. ఆ తర్వాత సినిమాల్లో రంగప్రవేశం చేశారు.బిక్రంజీత్ కన్వర్పాల్బిక్రంజీత్ నటుడు కాకముందు ఒక జవాన్.. మేజర్గా ఉన్నప్పుడే ఆర్మీ నుంచి వైదొలిగారు.గుఫి పైంటల్మహాభారతం సీరియల్లో శకునిగా నటించిన గుఫి ఒకప్పుడు ఆర్మీలో పని చేసినవ్యక్తే.. భారత్-చైనా సరిహద్దులో జవాన్గా విధులు నిర్వర్తించారు.మహ్మద్ అలీ షాతండ్రి బాటలోనే నడుస్తూ అలీ షా కూడా సైన్యంలో చేరాడు. ఆర్మీలో మేజర్గా పని చేశారు. తర్వాత సినిమాల్లోకి వచ్చారు.రుద్రశిష్ ముజందార్చిచోరే, జెర్సీ ఫేమ్ రుద్రశిష్ ముజందార్ 2011లో సైన్యంలో చేరారు. 2018లో మేజర్గా ఉన్నప్పుడే రిటైర్మెంట్ తీసుకున్నారు.మనోజ్ బాజ్పాయ్సత్య నటుడు మనోజ్ బాజ్పాయ్ (Manoj Bajpayee)కు ఆర్మీలో పని చేయాలన్నది కల. జాతీయ డిఫెన్స్ అకాడమీ ప్రవేశ పరీక్ష రాసి పాసయ్యాడు, కానీ ఇంటర్వ్యూలో ఫెయిలయ్యాడు. నిజ జీవితంలో ఆర్మీలో చేరలేకపోయాడు కానీ 1971 సినిమాలో జవాన్గా నటించాడు.చదవండి: ‘కూలీ’ కంటే ‘వార్ 2’కే తక్కువ కలెక్షన్స్.. తొలి రోజు ఎంతంటే? -
'ఇదేం మీ ఇల్లు కాదు.. ముందు బయటికి వెళ్లండి'.. ఆలియా భట్ ఆగ్రహం
బాలీవుడ్ భామ ఆలియా భట్ ప్రస్తుతం సినిమాలకు కాస్తా గ్యాప్ ఇచ్చింది. ఈ ఏడాది అల్ఫా మూవీతో ప్రేక్షకులను పలకరించనుంది. గతేడాది వచ్చిన జిగ్రా అభిమానులను తీవ్రంగా నిరాశపర్చింది. దీంతో ఈ సినిమాపై అభిమానుల్లో ఆలియా భట్ ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు. ఈ మూవీని యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్లో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి శివ్ రావేల్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే షూటింగ్లకు కాస్తా విరామం దొరకడంతో ఆలియా భట్ ఫిట్నెస్ కోసం కసరత్తులు చేస్తోంది. ముంబయిలోని తన నివాసం వద్ద పాడిల్ బాల్ ఆడుతూ కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.అయితే అంతకుముందే పాడిల్ బాల్ ఆడేందుకు వచ్చిన ఆలియాను కారు దిగగానే ఫోటోగ్రాఫర్స్ చుట్టుముట్టారు. ఆమెను ఫోటోలు తీసేందుకు వెంటపడ్డారు. ఏకంగా ఆలియాతో పాటే బిల్డింగ్ లోపలికి వెళ్లేందుకు యత్నించారు. దీంతో ఆలియా భట్ వారిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. లోపలికి రావొద్దు.. దయచేసి బయటికి వెళ్లండి.. ఇది మీ భవనం కాదు అంటూ మండిపడింది. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. అయినా సెలబ్రిటీలను ఫోటోల కోసం ఇలా వెంటపడి వేధించడం సరికాదని కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. వారికి పర్సనల్ లైఫ్ ఉంటుందని.. ఇలా ఇబ్బంది పెట్టపెట్టడం కరెక్ట్ కాదని అంటున్నారు. ఇలా చేసేవారికి కొంతైనా కామన్ సెన్స్ ఉండాలని.. సెలబ్రిటీలను బాధపెట్టడం సరికాదని ఓ అభిమాని కామెంట్ చేశాడు.Alia Bhatt spotted playing Padel #AliaBhatt #padel pic.twitter.com/NPwpzi7iQ8— Aristotle (@goLoko77) August 14, 2025కాగా.. యశ్రాజ్ ఫిల్మ్స్ తన స్పై యూనివర్స్లో భాగంగానే ఆల్ఫా చిత్రం రానుంది. ఈ ఏడాది డిసెంబర్ 25న ఈ చిత్రం విడుదల కానుంది. స్పై యూనివర్స్లో రాబోతున్న మొదటి మహిళా గూఢచారి చిత్రంగా ఆల్ఫా రికార్డ్ క్రియేట్ చేయనుంది. దీంతో పాటు సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో రానున్న లవ్ అండ్ వార్ చిత్రంలో నటించనుంది. View this post on Instagram A post shared by F I L M Y G Y A N (@filmygyan) -
సిల్వర్ స్క్రీన్ పై రియల్ హీరోస్
దేశం కోసం అమరులైన వీరులు ఎందరో ఉన్నారు. అందరి కథలు వెండితెరపైకి రాక పోవచ్చు. అయితే దేశభక్తిని చాటి చెప్పే, దేశభక్తి స్ఫూర్తిని నింపే సినిమాలు ఎప్పటికప్పుడు వెండితెరపైకి వస్తూనే ఉంటాయి... ప్రేక్షకుల్లో దేశభక్తి స్ఫూర్తిని పెంపొందిస్తున్నాయి. కొందరు ‘రియల్ హీరోస్’ గాథలను గుర్తు చేస్తూనే ఉన్నాయి. అలా ప్రస్తుతం దేశభక్తిని చాటే కొన్ని సినిమాలు సెట్స్పై ఉన్నాయి. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశభక్తి నేపథ్యంలో రూపొందుతున్న కొన్ని చిత్రాల గురించి... యుద్ధానికి కొత్త నిర్వచనం‘సీతారామం’ సినిమాలో దేశభక్తి, ప్రేమ అంశాలను మిళితం చేసి, వెండితెరపై ప్రేక్షకులకు నచ్చేలా చూపించారు దర్శకుడు హను రాఘవపూడి. ఈ దర్శకుడు తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘ఫౌజి’ (ప్రచారంలో ఉన్న టైటిల్). భారతదేశ స్వాతంత్య్రానికి పూర్వం 1940 నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందని తెలిసింది. ఈ చిత్రంలో ప్రభాస్ సైనికుడి పాత్రలో కనిపిస్తారని సమాచారం. ఆదిపత్యం కోసమే యుద్ధాలు జరిగే ఆ రోజుల్లో యుద్ధానికి కొత్త నిర్వచనం చెప్పే ఓ యోధుడి పాత్రగా ప్రభాస్ క్యారెక్టరైజేషన్ ఉంటుందని యూనిట్ పేర్కొంది.అలాగే స్వాతంత్య్ర సమర యోధుడు సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఆజాద్ హిందూ ఫౌజ్, రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యాలు కూడా ఈ చిత్రంలో ఉంటాయని టాక్. కొన్ని చారిత్రక అంశాలతో ముడిపడిన కల్పిత కథతో కూడిన ఈ చిత్రంలో ఇమాన్వీ ఇస్మాయిల్ హీరోయిన్గా నటిస్తున్నారు. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది వేసవిలో విడుదల కావొచ్చు. బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్ దేశభక్తిని చాటి చెప్పే ఆర్మీ ఆఫీసర్గా నటిస్తున్నారు సల్మాన్ ఖాన్. 2020లో గాల్వాన్ లోయలో ఇండియా–చైనా సైనికుల మధ్య జరిగిన ఉద్రిక్త ఘర్షణల నేపథ్యంలో ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్’ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలోనే సల్మాన్ ఆర్మీ ఆఫీసర్గా నటిస్తున్నారు. ఇందుకోసం ఈ హీరో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. ఈ చిత్రంలో చిత్రాంగదా సింగ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. అపూర్వ లఖియా దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్ పతాకంపై సల్మాన్ ఖాన్ ఈ దేశభక్తి సినిమాను నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ సినిమాను విడుదల చేయాలని ΄్లాన్ చేస్తున్నారని బాలీవుడ్ సమాచారం. మేజర్ షైతాన్ సింగ్ మేజర్ షైతాన్ సింగ్ భాటి జీవితం ఆధారంగా రూపొందిన పీరియాడికల్ వార్ డ్రామా ‘120 బహదూర్’. ఈ హిందీ చిత్రంలో సిల్వర్ స్క్రీన్పై షైతాన్ సింగ్గా ఫర్హాన్ అక్తర్ నటిస్తున్నారు. ఇందులో రాశీ ఖన్నా హీరోయిన్. రజనీష్ ఘాయ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. 1962లో జరిగిన ఇండియా–చైనా వార్లో ప్రధానంగా చెప్పుకునే ‘రెజాంగ్ లా’ యుద్ధం సంఘటనలు ప్రధాన ఇతివృత్తంతో ‘120 బహదూర్’ సినిమా రూపొందుతోంది. దాదాపు 3 వేలమంది చైనా సైనికులను ఎదుర్కొని, 120 మంది భారతీయ సైనికులు ఎలా వీరోచితంగాపోరాడారు? అనే నేపథ్యంలో ‘120 బహదూర్’ సినిమా ఉంటుంది. ఈ చిత్రం ఈ నవంబరు 21న విడుదల కానుంది. రాజ్పాల్ పునియా యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ మిషన్లో భాగంగా వెస్ట్ ఆఫ్రికాకు వెళ్లిన 233 మంది భారతీయ సైనికులు అక్కడి రెబల్స్ ట్రాప్లో చిక్కుకున్నారు. దాదాపు 70 రోజులు ఎన్నో ఇబ్బందులు అనుభవించిన ఈ సైనికులను రెస్క్యూ చేసే ఆపరేషన్ను రాజ్పాల్ పునియా సక్సెస్ఫుల్గా లీడ్ చేశారు. పాతిక సంవత్సరాల క్రితం జరిగిన ఈ సంఘటల నేపథ్యంలో ‘ఆపరేషన్ ఖుక్రీ’ సినిమా రానుంది. ఈ చిత్రంలో రాజ్పాల్ పునియాగా రణ్దీప్ హుడా నటిస్తారు. ఆపరేషన్ ఖుక్రీ: ది ట్రూ స్టోరీ బిహైండ్ ది ఇండియన్ ఆర్మీస్ మోస్ట్ సక్సెస్ఫుల్ మిషన్ యాజ్ పార్ట్ ఆఫ్ ది యునైటెడ్ నేషన్స్’ బుక్ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ బుక్ హక్కులను రణ్దీప్ హుడా ఫిల్మ్స్, రాహుల్ మిత్రా ఫిల్మ్స్ దక్కించుకున్నాయి. బోర్డర్లో వార్ భారతీయ సైనికుల వీరత్వం, వీరోచితపోరాటం నేపథ్యంలో రూపొందుతున్న తాజా హిందీ చిత్రం ‘బోర్డర్ 2’. ఈ సినిమాలో సన్నీ డియోల్ లీడ్ రోల్ చేయగా, వరుణ్ ధావన్, అహన్ శెట్టి, దిల్జీత్ సింగ్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. అనురాగ్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సన్నీ డియోల్, వరుణ్ ధావన్, అహాన్ శెట్టి భారత సైనికుల పాత్రల్లో నటించారు. ఈ వార్ డ్రామా వచ్చే ఏడాది జనవరి 23న విడుదల కానుంది. ఇక 1971లో ఇండియా – పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో రూపొందిన ‘బోర్డర్’ (1977) సినిమాకు సీక్వెల్గా ‘బోర్డర్ 2’ చిత్రం తెరకెక్కిందనే టాక్ బాలీవుడ్లో వినిపిస్తోంది. గూఢచారి అడివి శేష్ హీరోగా నటిస్తున్న స్పై డ్రామా ‘జీ2’ (గూఢచారి 2). వినయ్ కుమార్ సిరిగినీడి దర్శకత్వంలోని ఈ చిత్రంలో వామికా గబ్బి, ఇమ్రాన్ హష్మీ, మురళీ శర్మ, సుప్రియ యార్లగడ్డ, మధు శాలిని కీలక పాత్రల్లో చేస్తున్నారు. అడివి శేష్, వామిక ప్రధాన స్పై పాత్రల్లో నటిస్తున్నారు. అనిల్ సుంకర, టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది మే 1న విడుదల కానుంది. అడివి శేష్ హీరోగా 2018లో విడుదలై, సూపర్హిట్గా నిలిచిన ‘గూఢచారి’కి సీక్వెల్గా ‘జీ2’ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ది ఇండియా హౌస్ దేశభక్తి నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం ‘ది ఇండియా హౌస్’. భారతదేశానికి స్వాతంత్య్రం రాకముందు 1905లో లండన్లో ఉన్న కొందరు భారత మేథావులు ఎలా సమావేశం అయ్యారు? భారతదేశానికి స్వాతంత్య్రం రావాలనే కార్యాచరణకు ఎలాంటి వ్యూహాలు రచించారు? అనే అంశాల నేపథ్యంలో ‘ది ఇండియా హౌస్’ రూపొందుతోందని సమాచారం. అలాగే వీర్ సవార్కర్ జీవితంలోని కొన్ని సంఘటనలు ఈ సినిమాలో కనిపిస్తాయి. నిఖిల్ హీరోగా, సయీ మంజ్రేకర్ హీరోయిన్గా అనుపమ్ ఖేర్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. రామ్చరణ్ సమర్పణలో వి మెగా పిక్చర్స్, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంస్థలు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక్కీస్ పరమ వీర పురస్కారగ్రహీత అరుణ్ ఖేత్రపాల్ జీవితం ఆధారంగా హిందీలో ‘ఇక్కీస్’ అనే దేశభక్తి చిత్రం రానుంది. 1971లో జరిగిన భారత్–పాకిస్తాన్ యుద్ధంలో వీరోచితంగాపోరాడి, అమరుడైన అరుణ్ ఖేత్రపాల్గా అగస్త్య నంద (అమితాబ్బచ్చన్ మనవడు) నటిస్తున్నారు. ధర్మేంద్ర, జైదీప్ అహ్లావత్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం అక్టోబరు 2న విడుదల కానుంది. ఇలా దేశభక్తి నేపథ్యంలో సాగే మరికొన్ని చిత్రాలు ఉన్నాయి. -
గ్యాంగ్స్టర్ ప్రేయసి
షాహిద్ కపూర్ హీరోగా విశాల్ భరద్వాజ్ దర్శకత్వంలో ఓ గ్యాంగ్స్టర్ మూవీ రానున్న సంగతి తెలిసిందే. 1990 నేపథ్యంలో ముంబై మాఫియా నేపథ్యంలో సాగే ఈ సినిమా చిత్రీకరణ త్వరలోనేప్రారంభం కానుంది. అయితే ఈ సినిమాలో మాఫియాతో పాటుగా ప్రేమ సన్నివేశాలు కూడా చాలా కీలకంగా ఉండబోతున్నాయని బాలీవుడ్ సమాచారం. ఇందుకు తగ్గట్లుగా విశాల్ భరద్వాజ్ నటీనటుల ఎంపికపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది.ఈ సినిమాలోని హీరోయిన్స్ పాత్రల కోసం త్రిప్తి దిమ్రి, దిశా పటానీలను ఎంపిక చేసుకున్నారట మేకర్స్. షాహిద్ కపూర్, త్రిప్తి దిమ్రి జోడీగా నటించనున్నారని బాలీవుడ్ సమాచారం. అంతేకాదు... ఈ చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రల్లో విక్రాంత్ మెస్సే, రణ్దీప్ హుడా, నానా పటేకర్, అవినాష్ తివారి నటించనున్నారని సమాచారం. షాహిద్ కపూర్, విక్రాంత్ మెస్సే, రణ్దీప్ హుడా వంటి పాపులర్ హీరోలు ఈ సినిమాలో భాగం కావడంతో ఈ మూవీపై అంచనాలు ఏర్పడుతున్నాయి. -
కాలేజీ క్యాంపస్ డ్రామాకి సై
నటిగా సూపర్ హిట్ అయిన ఆలియా భట్ నిర్మాతగా మాత్రం ఇంకా హిట్ స్టేటస్ను సాధించలేక పోతున్నారు. ఎటర్నల్ సన్షైన్ పిక్చర్స్ అనే నిర్మాణ సంస్థనుప్రారంభించిన ఆలియా భట్, ‘డార్లింగ్’, జిగ్రీస్’ సినిమాలను నిర్మించారు. ఈ రెండు సినిమాల్లోనూ ఆలియా భట్ లీడ్ రోల్ చేశారు. కానీ ఈ రెండు చిత్రాలూ హిట్ కాలేక పోయాయి. ఇప్పుడు ఆలియా భట్ మరో సినిమా నిర్మించేందుకు రెడీ అవుతున్నారని బాలీవుడ్ సమాచారం.అయాన్ ముఖర్జీ ‘బ్రహ్మాస్త్ర’ సినిమాకు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసిన శ్రీతీ ముఖర్జీ ఓ కాలేజీ క్యాంపస్ డ్రామా కథను సిద్ధం చేసి, ఈ కథను ఆలియా భట్కు వినిపించారట. ఆలియాకు ఈ కథ నచ్చడంతో నిర్మించేందుకు ఓకే అన్నారట. అయితే కాలేజ్ క్యాంపస్ డ్రామా కాబట్టి తాను నటించకుండా, నూతన నటీనటులకు చాన్స్ ఇవ్వాలని ఆలియా భావిస్తున్నారని, ఆ దిశగా ఈ బ్యూటీ ప్రయత్నాలు మొదలుపెట్టారని సమాచారం.ఈ ఏడాది అక్టోబరులో షూటింగ్ స్టార్ట్ కానుందని బాలీవుడ్ టాక్. మరోవైపు నటిగా ఆలియా భట్ ‘లవ్ అండ్ వార్’ సినిమాలో నటిసస్తున్నారు. ఈ చిత్రంలో రణ్బీర్ కపూర్ హీరోగా నటిస్తుండగా, విక్కీ కౌశల్ మరో లీడ్ రోల్ చేస్తున్నారు. సంజయ్లీలా భన్సాలీ డైరెక్షన్లోని ఈ సినిమా వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ కానుంది. -
నవ్వుల జాలీ
బాలీవుడ్ హిట్ ఫ్రాంచైజీ ‘జాలీ ఎల్ఎల్బీ’ నుంచి రానున్న తాజా చిత్రం ‘జాలీ ఎల్ఎల్బీ 3’. ఈ సినిమాలో అక్షయ్కుమార్, అర్షద్ వార్షి ప్రధాన పాత్రధారులుగా నటించారు. సౌరభ్ శుక్లా, హ్యూమా ఖురేషీ, అమ్రితా రావు ఇతర కీలక పాత్రల్లో నటించారు. సుభాష్ కపూర్ దర్శకత్వంలో అలోక్ జైన్, అజిత్ అంథారే నిర్మించిన ఈ చిత్రంసెప్టెంబరు 19న విడుదల కానుంది.ఈ చిత్రంలో లాయర్ జగదీశ్వర్ జాలీ మిశ్రా పాత్రలో అక్షయ్ కుమార్, లాయర్ జగదీష్ జాలీ త్యాగి పాత్రలో అర్షద్ వార్షి, జడ్జ్ పాత్రలో సౌరభ్ శుక్లా నటించారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం టీజర్ అక్షయ్, అర్షద్ల మధ్య గొడవలు, కోర్ట్ రూమ్లో జరిగే కామెడీ డ్రామాగా సాగుతుంది. -
జాన్వీ కపూర్ పరమ్ సుందరి.. అక్కడ రొమాన్స్ ఏంటి?
బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ ప్రస్తుతం పరమ్ సుందరిగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో సిద్ధార్థ్ మల్హోత్రాకు జంటగా కనిపించనుంది. ఇటీవలే ట్రైలర్ రిలీజ్ చేయగా.. డిఫరెంట్ లవ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు తుషార్ జలోటా దర్శకత్వం వహించారు. కేరళకు చెందిన అమ్మాయితో ఢిల్లీ అబ్బాయి ప్రేమలో పడితే ఎలా ఉంటుందోట్రైలర్లో చూపించారు.అయితే పరమ్ సుందరి ట్రైలర్తోనే ఊహించని విధంగా చిక్కుల్లో పడింది. ఈ ట్రైలర్లో చర్చిలో వచ్చే సీన్పై పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రార్థన మందిరంలో ఆ రొమాన్స్ సీన్స్ ఏంటని.. ఆ సన్నివేశాలు వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై వాచ్డాగ్ ఫౌండేషన్ సంస్థ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC)తో పాటు మహారాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఈ సన్నివేశాన్ని సినిమా వెంటనే తొలగించాలని లేఖలో కోరింది.ఎక్కువ మంది ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి దురుద్దేశంతో ఇలాంటి సీన్స్ సృష్టించే ధోరణిని అరికట్టాల్సిన అవసరం ఉందని వాచ్డాగ్ ఫౌండేషన్కు చెందిన న్యాయవాది గాడ్ఫ్రే పిమెంటా అన్నారు. చర్చి ఒక పవిత్రమైన ప్రార్థనా స్థలమని.. దానిని అసభ్యకరమైన కంటెంట్కు వేదికగా చిత్రీకరించవద్దని లేఖలో పేర్కొన్నారు. ఇలా చేయడం తమ ఆధ్యాత్మిక పవిత్రతను అగౌరవపరచడమే కాకుండా కాథలిక్ సమాజాన్ని కించపరచడమేనని లేఖలో వివరించారు. తమ మనోభావాలను దెబ్బతీసినందుకు పరమ్ సుందరి నిర్మాత, దర్శకుడితో పాటు నటీనటులపై వెంటనే కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కాగా.. దినేష్ విజన్ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 29న థియేటర్లలో విడుదల కానుంది. -
ఆ ఒక్క ప్రశ్నకు సమాధానం.. కోటీ రూపాయలు మిస్ చేసుకున్న యువతి!
బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ ప్రస్తుతం 'కౌన్ బనేగా కరోడ్పతి' షోతో బిజీగా ఉన్నాపు. ప్రస్తుతం 17వ సీజన్కు ఆయనే హోస్ట్గా వ్యవహరిస్తున్నారు. తాజా ఎపిసోడ్లో ఓ కంటెస్టెంట్ ఏకంగా కోటి రూపాయల ప్రశ్న వరకు దూసుకొచ్చింది. అయితే ఒక్క సమాధానం చెబితే కోటి రూపాయలు యువతి సొంతమయ్యేవి. కానీ ఊహించని విధంగా ఆ ప్రశ్నకు సమాధానం చెప్పకుండానే రూ.50 లక్షల ప్రైజ్మనీతోనే సరిపెట్టుకుంది. ఇంతకీ ఆ కోటి రూపాయల ప్రశ్న ఏంటో తెలుసుకోవాలనుందా? అయితే ఈ స్టోరీ చదివేయండి.తాజా ఎపిసోడ్లో ఢిల్లీకి చెందిన 21 ఏళ్ల యువతి కశీష్ సింఘాల్ రూ. 50 లక్షలతోనే సరిపెట్టుకుంది. ఈ డబ్బుతో తన తండ్రి చేసినరూ. 15 లక్షల రుణాన్ని తిరిగి చెల్లిస్తానంటూ సంతోషం వ్యక్తం చేసింది. ఇంతకీ ఆ యువతి సమాధానం చెప్పలేకపోయిన ఆ కోటి రూపాయల ప్రశ్న ఏంటో చూసేద్దాం.ప్రశ్న: విసిగోత్ రాజ్యానికి చెందిన ఏ రాజు రోమ్ నగరంపై దాడి చేయకుండా ఉండేందుకు మిరియాలు డిమాండ్ చేశాడు?ఎ) లుడోవిక్, బి) ఐమెరిక్, సి) అలారిక్ డి) థియోడోరిక్ ఆప్షన్స్ ఇవ్వగా.. కశీష్ సింఘాల్ సమాధానం చెప్పలేకపోయింది. దీంతో ఆట నుంచి నిష్క్రమించింది. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ సి..అలారిక్ అంటూ అమితాబ్ చెప్పారు. రూ.50 లక్షలు గెలిచిన ఆమె తన జర్నీని పంచుకని అందరినీ కన్నీళ్లు పెట్టించింది. ఈ రియాలిటీ షో సోనీటీవీతో పాటు సోనీలివ్ ఓటీటీలోనూ ప్రసారమవుతోంది. -
ఆ హీరోయిన్ మగాడిలా ఉంటుందన్న మృణాల్.. కౌంటరిచ్చిన హీరోయిన్
హీరోయిన్ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) కొంతకాలంగా తరచూ వార్తల్లో నిలుస్తోంది. మొన్నటివరకు హీరో ధనుష్తో డేటింగ్ రూమర్స్తో వార్తల్లో నిలిచిన ఆమె ఇటీవలే దానికి ఫుల్స్టాప్ పెట్టింది. ధనుష్ తనకు మంచి స్నేహితుడు మాత్రమేనని క్లారిటీ ఇచ్చింది. ఇకపోతే హీరోయిన్ బిపాసా బసు (Bipasha Basu) గురించి ఆమె గతంలో మాట్లాడిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.ఆ హీరోయిన్ మగాడిలా కనిపిస్తుందినేను బిపాసా కంటే అందంగా ఉంటాను. ఆమె కండలు తిరిగిన దేహంతో మగాడిలా కనిపిస్తుంది. ఆమెతో పోలిస్తే నేను చాలా బెటర్ అని కామెంట్స్ చేసింది. ఆ వీడియోపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ తరుణంలో బిపాసా బసు.. మృణాల్కు కౌంటర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆమె పేరును ప్రస్తావించకుండా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది.మృణాల్కు కౌంటర్?బలమైన మహిళలు ఎల్లప్పుడూ ఒకరి ఉన్నతి కోసం మరొకరు పాటుపడతారు. అందమైన స్త్రీలకు ఆ మజిల్స్ అవసరం. ఎందుకంటే.. మహిళలెప్పుడూ బలంగా, ధృడంగా ఉండాలి. అప్పుడే మనం శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండగలం. స్త్రీలు స్ట్రాంగ్గా కనిపించకూడదన్న పాతకాలపు ఆలోచనలను బద్ధలు కొట్టండి అని బిపాసా ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చింది.చదవండి: మహేశ్ బాబు మరదలికి తృటిలో తప్పిన ప్రమాదం -
‘వార్ 2 ’మూవీ రివ్యూ
టైటిల్ : వార్ 2నటీనటులు: హృతిక్ రోషన్, ఎన్టీఆర్, అనిల్ కపూర్, కియారా అద్వానీ, అశుతోష్ రాణా తదితరులునిర్మాణ సంస్థ: యశ్రాజ్ ఫిల్మ్స్నిర్మాత : ఆదిత్యా చోప్రాదర్శకత్వం: అయాన్ ముఖర్జీసంగీతం: ప్రీతమ్(పాటలు), సంచిత్ బల్హారా, అంకిత్ బల్హారా(బ్యాక్గ్రౌండ్ స్కోర్)సినిమాటోగ్రఫీ: బెంజమిన్ జాస్పర్విడుదల తేది: ఆగస్ట్ 14, 2025బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ యశ్రాజ్ ఫిలింస్ నుంచి వచ్చిన తాజా స్పై యాక్షన్ ఫిలిం వార్ 2. జూనియర్ ఎన్టీఆర్ నటించిన తొలి బాలీవుడ్ చిత్రం కావడంతో టాలీవుడ్లో కూడా ఈ మూవీపై భారీ హైప్ క్రియేట్ అయింది. దానికి తోడు ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది. మరి ఆ అంచనాలను వార్ 2 అందుకుందా లేదా? రివ్యూలో చూద్దాం.వార్ 2 కథేంటంటే..కలి.. ఓ అజ్ఞాత శక్తి. ఎవరికి కనిపించడు కానీ, ప్రపంచ దేశాలను వణికిస్తాడు. ఈసారి అతని చూపు భారత్పై పడుతుంది. భారత్ని తన చెప్పు చేతల్లో పెట్టుకోవాలనుకుంటాడు. అందుకు ‘ రా’ మాజీ ఏజెంట్ కబీర్ (హృతిక్ రోషన్)ని పావుగా వాడతాడు. కలి టీమ్లో చేరాలంటే.. తన గాడ్ ఫాదర్ లాంటి వ్యక్తి, కల్నల్ సునీల్ లూథ్రా(అశుతోష్ రాణా)ని చంపాలని కబీర్కు టాస్క్ ఇస్తాడు. సునీల్ లూథ్రాని కబీర్ చంపేస్తాడు. దీతో ‘రా’ కబీర్ని వెంటాడుతుంది. అతడిని పట్టుకోవడానికి ‘రా’ చీఫ్ (అనిల్ కపూర్) ఓ స్పెషల్ టీమ్ని నియమిస్తాడు. కేంద్రమంత్రి విలాస్ రావు సారంగ్ సూచనతో స్పెషల్ టీమ్కి మేజర్ విక్రమ్ చలపతి(ఎన్టీఆర్)ని లీడర్గా నియమిస్తాడు. తన తండ్రి సునీల్ లూథ్రాని చంపిన కబీర్పై పగ పెంచుకున్న వింగ్ కమాండర్ కావ్య లూథ్రా (కియారా అద్వానీ) కూడా విక్రమ్ టీమ్లో చేరుతుంది. విక్రమ్ టీమ్ కబీర్ని పట్టుకుందా? లేదా? అసలు కబీర్ దేశద్రోహిగా ఎందుకు మారాడు? అతని లక్ష్యం ఏంటి? విక్రమ్కి, కబీర్కి మధ్య ఉన్న సంబంధం ఏంటి? అజ్ఞాతంలో ఉన్న కలి ఎవరు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. స్పై యాక్షన్ థ్రిల్లర్ అనగానే కళ్లు చెదిరే యాక్షన్ విన్యాసాలు, ఊహించని ట్విస్టులు లాంటివి గుర్తుకొస్తాయి. ప్రేక్షకుడు కూడా వాటిని దృష్టిలో పెట్టుకొనే థియేటర్స్కి వస్తాడు. వార్ 2లో ఆ రెండూ ఉన్నాయి. కానీ ఇప్పటికే ఆ తరహా యాక్షన్ సీన్లు, ట్విస్టులు చూసి ఉండడంతో ఈ సినిమా చూస్తున్నంతసేపు ‘కొత్తగా ఏమీ లేదే’ అనిపిస్తుంది. కథ, కథనాలే పెద్దగా ఆసక్తి రేకెత్తించవు. దర్శకుడు ట్విస్టులు అనుకొని రాసుకున్న సీన్లు కూడా ఈజీగా ఊహించొచ్చు. విజువల్స్ పరంగానూ సినిమా ఆకట్టుకునేలా లేదు. ఒకటి రెండు యాక్షన్ సీన్లు మినహా మిగతావన్నీ రొటీన్గానే ఉంటాయి. ఎమోషనల్ సన్నివేశాలు మాత్రం కొంతమేర ఆకట్టుకుంటాయి. ఓ భారీ యాక్షన్ సీన్తో కథ ప్రారంభం అవుతుంది. కలి గ్యాంగ్.. హృతిక్కి ఒక టాస్క్ ఇవ్వడం.. అందులో భాగంగా కల్నల్ సునీల్ లూథ్రాని చంపేయడం.. అతన్ని పట్టుకునేందుకు ‘రా’ రంగంలోకి దిగడం అంతా రొటీన్గానే సాగుతుంది. ఇక మేజర్ విక్రమ్గా ఎన్టీఆర్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత కథనంపై ఆసక్తి పెరుగుతంది. భారీ ఎలివేషన్తో ఎన్టీఆర్ ఎంట్రీ ఉంటుంది. కబీర్ని పట్టుకునే క్రమంలో వచ్చే కార్ ఛేజింగ్ సీన్, మెట్రో ట్రైన్పై వచ్చే యాక్షన్ సీన్లు ఆకట్టుకుంటాయి. ఇంటర్వెల్కు ముందు విమానంపై వచ్చే యాక్షన్ సీన్ సినిమాకే హైలెట్. స్పై యాక్షన్ సినిమాలను చూసిన వారికి ఇంటర్వెల్ ట్విస్ట్ ఈజీగా ఊహించొచ్చు. సెకండాఫ్ ప్రారంభంలో హృతిక్, ఎన్టీఆర్పై వచ్చే ఫ్లాష్బ్యాక్ స్టోరీ ఆకట్టుకుంటుంది. కావ్య లూథ్రాకి అసలు నిజం తెలిసిన తర్వాత కథనం పరుగులు పెడుతుంది. ఈ క్రమంలో వచ్చే ట్విస్టులు ఆకట్టుకుంటాయి. చివరిలో హృతిక్, ఎన్టీఆర్ మధ్య వచ్చే యాక్షన్ సీన్ అదిరిపోతుంది. ఎవరెలా చేశారంటే.. ఎన్టీఆర్, హృతిక్ రోషన్..ఇద్దరూ గొప్ప నటులే. ఎలాంటి పాత్రల్లో అయినా ఒదిగిపోతారు. హృతిక్కు ఆల్రేడీ స్పై యాక్షన్ సినిమాలు చేసిన అనుభవం ఉంది కాబట్టి కబీర్ పాత్రలో అవలీలగా నటించాడు. యాక్షన్ సీన్లు అదరగొట్టేశాడు. ఎన్టీఆర్కి ఇది తొలి స్పై యాక్షన్ మూవీ. మేజర్ విక్రమ్గా అద్భుతంగా నటించాడు. యాక్షన్, డ్యాన్స్ విషయంలో హృతిక్తో పోటీ పడి యాక్ట్ చేశాడు. సినిమాలో ఎన్టీఆర్ పాత్రకే భారీ ఎలివేషన్, ట్విస్టులు ఉంటాయి. దాదాపు 80 శాతం కథ ఎన్టీఆర్, హృతిక్ల చుట్టే తిరుగుతుంది. ఇక కల్నల్ సునీల్ లూథ్రాగా అశుతోష్ రాణా తెరపై కనిపించేది కాసేపే అయినా.. తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. వింగ్ కమాండర్ కావ్య పాత్రకి కియరా అద్వానీ న్యాయం చేసింది. అయితే ఆమె పాత్రకి స్క్రీన్స్పేస్ చాలా తక్కువ అనే చెప్పాలి. హృతిక్తో వచ్చే యాక్షన్ సీన్లో కియారా అదరగొట్టేసింది. అనిల్ కపూర్తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. ప్రీతమ్ పాటలు ఓకే. సంచిత్ బల్హారా, అంకిత్ బల్హారా నేపథ్య సంగీతం సినిమాకు అదనపు బలం. సినిమాటోగ్రఫీ బాగుంది. యాక్షన్ సన్నివేశాలు ఒకటి, రెండు బాగున్నాయి. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్డెస్క్ -
అవ్వ - బువ్వ.. ఏదీ తేల్చుకోలేకపోతున్నా: మంచు మనోజ్
ఒకేరోజు రెండు పెద్ద సినిమాలు రిలీజవుతున్నాయి. ఆగస్టు 14న హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ 'వార్ 2', రజనీకాంత్ 'కూలీ' చిత్రాలు విడుదలవుతున్నాయి. రెండూ ఒకేరోజు వస్తుండటంతో ఏ మూవీ చూసేందుకు వెళ్లాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు సినీప్రియులు. హీరో మంచు మనోజ్ (Manchu Manoj) కూడా ఇదే ఇరకాటంలో పడ్డాడు. 'అవ్వ కావాలా? బువ్వ కావాలా?'.. అచ్చంగా ఇలాంటి పరిస్థితిలోనే ఉన్నా.. జోక్స్ పక్కనపెడితే కూలీ, వార్ 2.. ఒకేరోజు రిలీజవ్వడమనేది ఇండియన్ సినిమా చరిత్రలోనే ప్రత్యేకం. 20 మందిని తీసుకెళ్తా..రెండు చిత్రాలు బ్లాక్బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సినీ ప్రియులకు ఇదొక క్రేజీ డే. మీరు ఏ సినిమాకు ముందుగా వెళ్తున్నారో చెప్పండి. దాన్ని బట్టి నేను ఏది ఫస్ట్ చూడాలని నిర్ణయించుకుంటాను. అంతేకాదు, మీ కామెంట్లలో నుంచి ర్యాండమ్గా 20 మందిని సెలక్ట్ చేసి నాతోపాటు మిమ్మల్ని కూడా సినిమాకు తీసుకెళ్తా.. మనం కలిసి మూవీ చూసి ఎంజాయ్ చేద్దాం. మాటిస్తున్నా అని ట్వీట్ చేశాడు. అలాగే వార్ 2 చిత్రయూనిట్కు, కూలీ మూవీ యూనిట్కు ఆల్ద బెస్ట్ చెప్పుకొచ్చాడు. “Avva kavala, buvva kavala” ani adagadam lanti situation lo unnanu! 😄Jokes apart, what a historic day for Indian cinema 🎦 🙏🏼❤️🎸💥 #Coolie and #War2 releasing together. Wishing both these cinematic magics to become all-time blockbusters and roar across INDIA. Proud, crazy day… pic.twitter.com/hJBCmedeyx— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) August 13, 2025 చదవండి: బిగ్బాస్ అగ్నిపరీక్ష డేట్ వచ్చేసింది.. హోస్ట్ నాగార్జున కాదు! -
శ్రీదేవికి అలాంటి కాంప్లిమెంట్.. టీజ్ చేశానని ఫీలయింది: బోనీకపూర్
టాలీవుడ్ మాత్రమే కాదు..బాలీవుడ్లోనూ అందాల తార ఎవరంటే ఠక్కున ఆమె పేరే చెప్పేస్తారు. తెలుగు సినిమాల్లో అప్పట్లో ఓ వెలుగు వెలిగిన అతిలోక సుందరి ఆమె. కానీ ఊహించని విధంగా 2018లో ఈ లోకాన్ని విడిచి వెళ్లింది. ఇవాళ ఆమె జయంతి కావడంతో అభిమానులు వెండితెర అందాల రాణిని గుర్తు చేసుకుంటున్నారు. ఇంతకీ ఆమె ఎవరు అనుకుంటున్నారా? ఆమె మన అతిలోక సుందరి శ్రీదేవి. ఆగస్టు 13న 1963లో మీనంపట్టి అనే ప్రాంతంలో జన్మించింది.ఇవాళ శ్రీదేవి జయంతి కావడంతో ఆమె భర్త బోనీ కపూర్ అరుదైన క్షణాలను గుర్తు చేసుకున్నారు. 1990లో చెన్నైలో జరిగిన శ్రీదేవి 27వ బర్త్ డే వేడుకలో పాల్గొన్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆమె 27వ పుట్టినరోజు కావడంతో నేను మాత్రం హ్యాపీ 26th బర్త్ డే అని విష్ చేశానని ఇన్స్టాలో పోస్ట్ చేశారు. ఆమె మరింత యంగ్ అని చెప్పేందుకు అలా చేశానని అన్నారు. కానీ శ్రీదేవి మాత్రం తనను ఆటపట్టిస్తున్నారని చెప్పిందని గుర్తు చేసుకున్నారు.కాగా.. శ్రీదేవి.. బోనీ కపూర్ను 1996లో పెళ్లాడారు. వీరికి ఇద్దరు కుమార్తెలు జాన్వీ కపూర్, ఖుషీ కపూర్ ఉన్నారు. జాన్వీ కపూర్ ప్రస్తుతం టాలీవుడ్తో పాటు బాలీవుడ్లోనూ వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. తన తల్లిలాగే స్టార్ హీరోయిన్గా రాణిస్తోంది. శ్రీదేవి ఫిబ్రవరి 24, 2018న దుబాయ్లోని ఓహోటల్లో మరణించిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Boney.kapoor (@boney.kapoor) -
'ఛావా' లాంటి సినిమా అస్సలు చేయను: స్టార్ హీరో
బాలీవుడ్ సినిమాల పరిస్థితి ఒకప్పటితో పోలిస్తే ఘోరంగానే ఉంది. స్టార్ హీరోలు వరసగా మూవీస్ చేస్తున్నారు కానీ బాక్సాఫీస్ దగ్గర పెద్దగా వర్కౌట్ కావట్లేదు. అలాంటిది ఈ ఏడాది 'ఛావా' అనే చిత్రం అనుహ్యమైన విజయం సాధించింది. రూ.800 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి అందరినీ అబ్బురపరిచింది. దేశవ్యాప్తంగా ఈ మూవీ చూసి చాలామంది మెచ్చుకున్నారు. అయితే ఇలాంటి సినిమాలు తన లైఫ్లో అస్సలు చేయనని, ఇలాంటి తీయడం సరికాదు అని బాలీవుడ్కి చెందిన హీరో జాన్ అబ్రహం చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'సూపర్ మ్యాన్' లేటెస్ట్ సినిమా)జాన్ అబ్రహం లేటెస్ట్ సినిమా 'టెహ్రాన్'.. ఆగస్టు 14న నేరుగా జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. దీని ప్రమోషన్స్లో పాల్గొన్న జాన్.. ఓ ఇంగ్లీష్ వెబ్ ఛానెల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'ఛావా', 'ద కశ్మీర్ ఫైల్స్', 'ద కేరళ స్టోరీ' తదితర చిత్రాలపై షాకింగ్ కామెంట్స్ చేశాడు. జీవితంలో అలాంటి చిత్రాలు చేయనని తెగేసి చెప్పాడు. తన అభిప్రాయాన్ని కూడా వెల్లడించాడు.'ప్రేక్షకులు మనతో మంచిగా ఉంటారు. కాబట్టి అందుకు తగ్గ సినిమాలు తీయాల్సిన బాధ్యత ఫిల్మ్ మేకర్స్పై ఉంది. నేను రైట్ వింగ్ లేదా లెఫ్ట్ వింగ్కి చెందినవాడిని కాదు. నాకు రాజకీయాలతో సంబంధం లేదు. అయితే రైట్ వింగ్కి చెందిన కొన్ని సినిమాలు.. ఈ మధ్య కాలంలో ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడం చూస్తుంటే ఆందోళనగా ఉంది. ప్రేక్షకులకు నచ్చాయని తెలుసు కానీ నేను ఇప్పటివరకు 'ఛావా', 'కశ్మీర్ ఫైల్స్' సినిమాలు నేను చూడలేదు. ఇలాంటి మూవీస్ ఎప్పటికీ చేయను. ఓ వర్గం ప్రజల్ని ఇవి ప్రభావితం చేయడం చూస్తుంటే నాకు భయమేస్తోంది' అని జాన్ అబ్రహం తన అభిప్రాయాన్ని చెప్పాడు.(ఇదీ చదవండి: 'కూలీ' రెమ్యునరేషన్.. ఎవరికి ఎక్కువ ఎవరికి తక్కువ?) -
కూలీ, వార్ 2 సినిమాలకు ఏపీలో టికెట్ రేట్లు పెంపు
రజనీకాంత్ కూలీ సినిమాకు టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చిన ఏపీ ప్రభుత్వం. సినిమా విడుదల రోజు ఉదయం 5 గంటల షోకు అనుమతి ఇచ్చింది.సినిమా విడుదల రోజు నుండి పది రోజుల వరకు మల్టీప్లెక్స్లలో రూ.100, సింగిల్ స్క్రీన్స్లో రూ.75గా టికెట్ రేట్స్ పెంపు జరిగింది.అలానే హృతిక్ రోషన్, జూ. ఎన్టీఆర్ కలిసి నటించిన వార్ 2 సినిమాకు కూడా టికెట్ రేట్లు పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సినిమా విడుదల రోజు ఉదయం 5 గంటల షోకు అనుమతి ఇవ్వగా దాని టికెట్ ధర 500 గా నిర్ణయించింది. వార్ 2 విడుదల రోజు నుండి పది రోజుల వరకు మల్టీప్లెక్స్లలో రూ.100, సింగిల్ స్క్రీన్స్లో రూ.75గా టికెట్ రేట్స్ పెంపు జరిగింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం జీఓ విడుదల చేసింది. -
ఓటీటీకి వచ్చేస్తోన్న రూ.500 కోట్ల సినిమా.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!
ఇటీవలే విడుదలై లవ్ బర్డ్స్ను తెగ ఏడిపించేసిన సినిమా సయారా. జూలై 18న థియేటర్లలోకి వచ్చిన ఈ బాలీవుడ్ రొమాంటిక్ ఫీల్ గుడ్ ఊహించని విధంగా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ప్రేమకథ ఎమోషనల్గా కనెక్ట్ అవ్వడంతో ఆడియన్స్ థియేటర్లకు క్యూ కట్టారు. ఇప్పటివరకు సయారా చిత్రానికి దాదాపు రూ.500 కోట్లకు పైనే గ్రాస్ వసూళ్లు సాధించినట్లు నిర్మాణ సంస్థ వెల్లడించింది. ఓవర్సీస్లో అయితే ఏకంగా విక్కీ కౌశల్ ఛావా వసూళ్లు దాటేసింది. అంతలా సూపర్ హిట్గా ఈ మూవీ కోసం ఓటీటీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.తాజాగా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ రివీల్ చేశారు. అహాన్ పాండే, అనీత్ పద్దా నటించిన ఈ రొమాంటిక్ చిత్రం వచ్చేనెల 12 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానున్నట్లు వెల్లడించారు. సయారా మూవీ కాస్టింగ్ డైరెక్టర్ షానూ శర్మ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో ఈ విషయాన్ని పోస్ట్ చేశారు. అయితే ఈ చిత్ర నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. త్వరలోనే మేకర్స్ సైతం అఫీషియల్గా ప్రకటించే అవకాశముంది.కాగా.. ఈ సినిమాకు మోహిత్ సూరి దర్శకత్వం వహించారు. యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్లో సయారాను తెరకెక్కించారు. భారతీయ సినిమా చరిత్రలో అత్యధిక వసూళ్లు చేసిన రొమాంటిక్ చిత్రంగా సయారా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 500 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ సినిమా.. భారతదేశంలో రూ. 320 కోట్లు వసూలు చేసింది. -
'తెలుగులో అల్లు అర్జున్'.. జాన్వీ కపూర్ పరమ్ సుందరి ట్రైలర్ చూశారా?
సిద్ధార్థ్ మల్హోత్రా , జాన్వీ కపూర్ జంటగా నటించిన తాజా రొమాంటిక్ ఎంటర్టైనర్ పరమ్ సుందరి. తుషార్ జలోటా దర్శకత్వం వహించిన ఈ మూవీ విడుదలకు సిద్ధమైంది. ఇటీవలే క్రేజీ లవ్ సాంగ్ను రిలీజ్ చేసిన మేకర్స్.. తాజాగా ట్రైలర్ను విడుదల చేశారు. కేరళ అమ్మాయితో ఢిల్లీకి చెందిన అబ్బాయి ప్రేమలో పడితే ఎలా ఉంటుందనే ఆసక్తికర ప్రేమకథగా ఈ సినిమాను తెరకెక్కించారు.తాజాగా రిలీజైన ట్రైలర్ చూస్తుంటే జాన్వీ కపూర్, సిద్ధార్థ్ మధ్య సన్నివేశాలు నవ్వులు తెప్పిస్తున్నాయి. ఈ చిత్రాన్ని లవ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్గా తీర్చిదిద్దినట్లు ట్రైలర్లో అర్థమవుతోంది. ట్రైలర్ చివర్లో తమిళంలో రజినీకాంత్, మలయాళంలో మోహన్ లాల్, తెలుగులో అల్లు అర్జున్, కన్నడలో యశ్ అంటూ జాన్వీ కపూర్ చెప్పిన డైలాగ్ ఆడియన్స్ను అలరిస్తోంది. ఈ సినిమాను మాడాక్ ఫిల్మ్స్ బ్యానర్లో దినేశ్ విజన్ నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా ఆగస్టు 29న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో రెంజీ పనీకర్, సిద్ధార్థ్ శంకర్, మన్జోత్ సింగ్, సంజయ్ కపూర్, ఇనాయత్ వర్మ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు సచిన్ జిగర్ సంగీతమందించారు.#ParamSundariTrailer features the iconic "JHUKEGA NAHI" reference of our Icon Star. 🔥Wishing #JanhviKapoor, @SidMalhotra and @MaddockFilms all the best for Param Sundari on behalf of all Allu Arjun fans. ♥️ pic.twitter.com/wmGYQCi5ir— Trends Allu Arjun ™ (@TrendsAlluArjun) August 12, 2025 -
కపిల్ శర్మ టార్గెట్.. ఇంటి వద్ద భారీ భద్రత!
బాలీవుడ్ స్టార్ కమెడియన్ కపిల్ శర్మకు భారీగా భద్రతను పెంచారు. ఇటీవల మరోసారి కెనడాలోని ఆయన కేఫ్పై కాల్పులు జరగడంతో ముంబయి పోలీసులు చర్యలు చేపట్టారు. ముందస్తు చర్యల్లో భాగంగా కపిల్ శర్మ ఇంటి వద్ద భద్రత ఏర్పాటు చేసినట్లు సీనియర్ పోలీసు అధికారి వెల్లడించారు.కాగా.. ఆగస్టు 8న కెనడాలోని సర్రేలో ఉన్న కపిల్ శర్మ ఇటీవల ప్రారంభించిన రెస్టారెంట్ కాప్స్ కేఫ్పై కాల్పులు జరిగాయి. నెలలోపే ఇది రెండవ ఘటన కావడం ఆందోళనకు గురి చేస్తోంది. గతంలోనే జూలై 10న ఇదే తరహాలో దాడి జరిగింది. కపిల్ శర్మను లక్ష్యంగా చేసుకుని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఈ దాడులకు పాల్పడుతున్నట్లు సమాచారం.రెండోసారి దాడి తర్వాత బిష్ణోయ్ సన్నిహితుడు హ్యారీ బాక్సర్ నుంచి ఆడియో సందేశం వచ్చినట్లు తెలుస్తోంది. కపిల్ శర్మ నెట్ఫ్లిక్స్ షో ప్రీమియర్లో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కనిపించడమే దీనిని కారణమని ఆడియో సందేశంలో పేర్కొన్నారు. సల్మాన్ ఖాన్తో కలిసి పనిచేసే వారిని బిష్ణోయ్ గ్యాంగ్ లక్ష్యంగా పని చేస్తుందని ఆడియోలో వార్నింగ్ ఇచ్చారు. దీంతో ముంబయి పోలీసులు ఓషివారాలోని కపిల్ శర్మ నివాసాన్ని సందర్శించి భద్రతా చర్యలను కట్టుదిట్టం చేశారు. -
బాల అమితాబ్ గుర్తున్నాడా? ఇపుడు రూ. 200 కోట్ల కంపెనీకి అధిపతి
1970లలో యువ అమితాబ్ బచ్చన్ పాత్రలో ఇంటింటా గుర్తుండిపోయే పేరు బాలీవుడ్ ఐకానిక్ చిత్రాలైన ‘దీవార్’, ‘సీతా ఔర్ గీత’ ‘మజ్బూర్’లలో అద్భుతంగా నటించి ప్రేక్షక ఆదరణ పొందాడు. అతను మరెవ్వరో కాదు 100కి పైగా హిందీ చిత్రాల్లో నటించిన బాల నటుడు అలంకార్ జోషి. మాస్టర్ అలంకార్గా అందరి దృష్టినీ ఆకర్షించిన అలంకార్ జోష్ ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు? ఎలా ఉన్నారో తెలుసా?100కి పైగా హిందీ చిత్రాలలో నటించిన బాల నటుడు అలంకార్ జోషి. దీవార్ (1975), మజ్బూర్ (1974), సీతా ఔర్ గీత (1972) వంటి క్లాసిక్ చిత్రాల్లో నటించి బాల నటుడుగా ఆకట్టుకున్నాడు. టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ప్రకారం బాల్య నటుడుగా అంతటి గుర్తింపు తెచ్చుకున్న అలంకార్ మరాఠీ సినిమాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నప్పటికీ పెద్దగా ఫలితం లభించలేదు. నాలుగు హిందీ సినిమాలు, రెండు టీవీ సీరియల్స్ , మినీ సీరియల్స్ చేశాడు.కానీ వచ్చవన్నీ చిన్న పాత్రలే కావడంతో తన కెరీర్ను పూర్తిగా మార్చేసుకున్నాడు. అమెరికాకు మకాం మార్చి సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ చదివాడు. తరువాత 1996లో తన సొంత టెక్ సంస్థను స్థాపించాడు. పలు నివేదికల ప్రకారం రూ. 200 కోట్ల సంస్థకు అధిపతి కొనసాగుతున్నాయి. మరోవైపు ప్రముఖ నటి పల్లవి జోషి అలంకార్ జోషి సోదరి. ప్రస్తుతం కుమార్తె అనుజా జోషి ఇప్పుడు హాలీవుడ్లో కెరీర్ను కొనసాగిస్తోంది. ‘హలో మినీ’ అనే వెబ్ సిరీస్లో నటించింది. కుమారుడు ఆశయ్ సంగీతాన్ని అభ్యసిస్తున్నాడు, మరో కుమార్తె కూడా యాక్టింగ్లో ప్రవేశించేందుకు సిద్ధపడుతోంది.ఇదీ చదవండి: ‘స్వీట్’ కపుల్ : ఐటీని వదిలేసి, లక్ష పెట్టుబడితో ఏడాదికి రూ. 2కోట్లు -
యానిమల్, మార్కోను మించిన వయొలెన్స్.. ఆ ఏజ్ వాళ్లకు మాత్రమే టీజర్!
గతంలో వచ్చిన యానిమల్, మార్కో మోస్ట్ వయొలెంట్ చిత్రాలుగా పేరు సంపాదించుకున్నాయి. ఈ సినిమాల్లో మితిమీరిన వయొలెన్స్ ఉందంటూ కొందరు విమర్శించారు. అంతలోనే అంతకు మించిన వయొలెన్స్తో మరో మూవీ రాబోతోంది. తాజాగా విడుదలైన టీజర్ చూస్తే మరి ఇంత వయొలెన్స్ ఏంట్రా సామీ అనాల్సిందే. ఈ టీజర్ కేవలం 18 ఏళ్లు మించినవాళ్లకు మాత్రమే.బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్, సంజయ్ దత్ కీలక పాత్రల్లో వస్తోన్న మోస్ట్ వయోలెంట్ యాక్షన్ చిత్రం 'బాఘి 4'. తాజాగా ఈ టీజర్ విడుదలైంది. ఇందులో మోస్ట్ వయొలెంట్ విజువల్స్ ఆడియన్స్ వెన్నులో వణుకు పుట్టించేలా ఉన్నాయి. మార్కో, యానిమల్ చిత్రాలను మించిపోయేలా టీజర్ విజువల్స్ ప్రేక్షకులను భయపెట్టేస్తున్నాయి.ఈ చిత్రంలో హర్నాజ్ సంధు, సోనమ్ బజ్వా కీలక పాత్రల్లో నటించారు.ఈ మూవీలో టైగర్ ష్రాఫ్ తన మోస్ట్ వయొలెంట్ పాత్రలో రోనీగా కనిపించనున్నారు. ఈ టీజర్లో సంజయ్ దత్ స్క్రీన్ ప్రెజెన్స్ భయంకరంగా ఉంది. ఈ చిత్రానికి సాజిద్ నదియాద్వాలా కథ అందించగా.. ఎ హర్ష దర్శకత్వం వహించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 5న థియేటర్లలో విడుదల కానుంది. -
మంచినీళ్లు అమ్ముతున్న హీరోయిన్.. 750 ml @ రూ.200
బాలీవుడ్ నటి భూమి పెడ్నేకర్ (Bhumi Pednekar) బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టింది. సోదరి సమీక్షా పెడ్నేకర్ (Samiksha Pednekar)తో కలిసి బ్యాక్బే అనే బ్రాండ్ స్థాపించి ఎంటర్ప్రెన్యూర్గా మారింది. ప్రజలకు సురక్షితమైన మంచినీళ్లు అందివ్వడమే తన లక్ష్యం అని చెప్తోంది. ఈ ప్రాజెక్ట్ కోసం రెండేళ్లుగా పనిచేస్తున్నట్లు తెలిపింది. భూమి ఇంకా మాట్లాడుతూ.. హిమాచల్ ప్రదేశ్లో సొంతంగా ఓ ప్లాంట్ స్థాపించాం. అందుకు మాకెంతో గర్వంగా ఉంది. ప్లాస్టిక్ వాడకుండా..అక్కడ మహిళలే పని చేస్తున్నారు. మాది ప్రీమియం వాటర్ బ్రాండ్ కంపెనీ. మూడు రకాల ఫ్లేవర్స్తో లభ్యం అవుతుంది. ప్యాకేజింగ్ కోసం ప్లాస్టిక్ను వాడలేదు. బాటిల్ క్యాప్ భూమిలో కలిసిపోయేదిగా తయారు చేశాం. ఇలా పర్యావరణ స్పృహతో పనిచేస్తున్న వాటర్ కంపెనీ ఏదైనా ఉందా అంటే అది మాది మాత్రమే! అరలీటర్ వాటర్ బాటిల్ రూ.150, రూ.750 ml వాటర్ బాటిల్ ధర రూ.200గా నిర్ణయించాం. రూ.200కే మంచినీరుఅందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతోనే రూ.200కే హిమాలయ వాటర్ మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఈరోజుల్లో అందరూ ఎనర్జీ డ్రింక్స్ కోసం ఎంతైనా ఖర్చు చేస్తున్నారు. అన్నింటికన్నా ముఖ్యమైనది స్వచ్ఛమైన నీళ్లు. మా బాటిల్లో సహజసిద్ధమైన మినరల్స్, ఎలెక్టోలైట్స్ పుష్కలంగా ఉంటాయి. వచ్చే నాలుగేళ్లలో రూ.100 కోట్ల మార్కెట్ అందుకోవాలని టార్గెట్ పెట్టుకున్నాం. 15 ఏళ్లలో ప్రతి ఇంట్లో మా బాటిల్ కనిపించాలని ఆశపడుతున్నాం.పెట్టుబడి ఎలా?17 ఏళ్ల వయసులో నా సంపాదన మొదలైంది. యష్ రాజ్ ఫిలింస్ బ్యానర్లో పనిచేసినప్పుడు నాకు ఇచ్చిన తొలి పారితోషికం రూ.7 వేలు. అప్పటినుంచే నాకు పొదుపు చేయడం అలవాటు. అలా నా సంపాదనలో కొంతభాగాన్ని కూడబెడుతూ వచ్చాను. ఆ డబ్బుతోనే బ్యాక్బే ప్రారంభించగలిగాం అని చెప్పుకొచ్చింది. భూమి పెడ్నేకర్ చివరగా మేరే హజ్బెండ్ కి బివి సినిమాలో నటించింది. View this post on Instagram A post shared by Bhumi Pednekar (@bhumipednekar) చదవండి: ఆ సినిమాకు ఫహద్ ఫాజిల్ రెమ్యునరేషన్ రూ.1 లక్ష మాత్రమే! -
తారక్లో నన్ను నేను చూసుకున్నా: హృతిక్ రోషన్
జూనియర్ ఎన్టీఆర్-హృతిక్ రోషన్ హీరోలుగా నటించిన చిత్రం వార్-2. ఈ చిత్రం ఆగస్టు 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం హైదరాబాద్లో జరిగింది. హృతిక్ రోషన్ మాట్లాడుతూ.. తారక్ మీకు అన్న నాకు తమ్ముడు అంటూ ఎన్టీఆర్ అభిమానులను మనమంతా అన్నదమ్ములం. నేను తారక్ ఈ సినిమాను మొదలు పెట్టినప్పుడు కో స్టార్స్ లానే మొదలు పెట్టాం కానీ చిత్రం ముగిసే సమయానికి సొంత అన్నదమ్ముల్లా మారిపోయాం. ఎన్టీఆర్ అభిమానులను ఉద్ధేశిస్తూ.. నాకు మీరంతా ఒక మాట ఇవ్వాలి అదేంటంటే మీరు ఇప్పుడు ఏ విదంగా తారక్ను ప్రేమిస్తున్నారో అదే విదంగా ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉండాలని కోరుతున్నాను, ఎందుకంటే తారక్ దానికి అర్హుడు.తారక్ దగ్గర నేను చాలా నేర్చుకున్నాను. ఏ సీన్నైనా తారక్ తన వంద శాతం చేస్తాడు. తను ఒక సారి నటించాక ఇంకో షార్ట్ అనేది ఉండదు. తను మళ్లీ ఆ షార్ట్ను చెక్ కూడా చేయడు. అంత పర్ఫెక్ట్గా ఉంటుంది తన నటన.అది నేను తారక్ దగ్గర నేర్చుకునాన్నను. దాన్ని నేను నా తరువాత చిత్రాల్లో చూపిస్తాను. తన 25 ఏళ్ల కెరీర్లో తారక్లో నన్ను నేను చూసుకున్నాను. మా మధ్య కొన్ని సారూప్యతలున్నాయి. తారక్ కూడా తనలో నన్ను చూసి ఉంటాడు ఎంతోకొంత అని అనుకుంటున్నాను. అలానే తారక్ మంచి చెఫ్ కూడా బిర్యానీ చాలా బాగా చేస్తాడు, తామిందరం మళ్లీ కలిసి సినిమా చేసినా చేయకపోయినా తనకు ఆ బిర్యానీ మాత్రం లైఫ్లాంగ్ కావాలంటూ తారక్ను కోరాడు. -
బిగ్బాస్ కొత్త సీజన్లో పహల్గామ్ బాధితురాలు?
కొన్నాళ్ల క్రితం కశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి గుర్తుండే ఉంటుంది. హనీమూన్ కోసం అక్కడికి అదేరోజు వెళ్లిన నేవీ అధికారి వినయ్ నర్వాల్.. ఉగ్రవాదుల్లో కాల్పుల్లో మరణించాడు. ఇతడి పక్కనే రోదిస్తున్న భార్య హిమాన్షి నర్వాల్ ఫొటో అప్పుడు తెగ వైరల్ అయింది. ఆమెకు చాలామంది సానుభూతి తెలియజేశారు. అలాంటిది ఇప్పుడు ఈమె మరోసారి వార్తల్లో నిలిచింది. దానికి కారణం 'బిగ్బాస్'.ఈ నెల 24 నుంచి హిందీలో బిగ్బాస్ 19వ సీజన్ మొదలుకానుంది. దీనిలో ఎవరెవరు పాల్గొంటారు అనే విషయమై కొన్ని పేర్లు వినిపిస్తున్నాయి. వాటిలో హిమాన్షి నర్వాల్ పేరు కూడా ఉండటం చాలామందిని ఆశ్చర్యపరుస్తోంది. ఎందుకంటే భర్త, ఉగ్రదాడిలో చనిపోయి ఎన్నిరోజులు కాలేదు అలాంటిది ఈమె షోలో పాల్గొంటుందా అని మాట్లాడుకుంటున్నారు.(ఇదీ చదవండి: 'అరుంధతి' చైల్డ్ ఆర్టిస్ట్కి పెళ్లి.. ఫ్రెండ్స్తో బ్యాచిలర్ పార్టీ)బాలీవుడ్ మీడియా రిపోర్ట్స్ ప్రకారం.. ఈసారి బిగ్బాస్ షో నిర్వహకులు.. ప్రేక్షకులు కనెక్ట్ అయ్యే కంటెస్టెంట్స్ని కోరుకుంటున్నారని, ఈ క్రమంలోనే హిమాన్షిని తీసుకురావాలని అనుకుంటున్నారని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తుంది. అయితే ఇందులో నిజం లేదని మరికొందరు అంటున్నారు. ఇది దేశానికి సంబంధించిన చాలా సున్నితమైన అంశం అని.. అసలు నిర్వహకులు ఈమెని సంప్రదించలేదని, షోలో పాల్గొనే అవకాశమే లేదని కొట్టిపారేస్తున్నారు.హిమాన్షి కథ వెనకున్న విషాదం చాలామంది భారతీయుల్ని కదిలించింది. ఎందుకంటే పెళ్లి చేసుకుని కొన్నిరోజులకే హనీమూన్ కోసం పహల్గామ్ వెళ్లగా.. అక్కడ ఈ దంపతులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఆ దాడిలో ఈమె భర్త, నేవీ అధికారి వినయ్ నర్వాల్ చనిపోయారు. హిమాన్షి క్షేమంగా బయటపడింది. ఘటన స్థలంలోనే నిర్జీవంగా ఉన్న భర్త పక్కన ఈమె కన్నీళ్లు పెడుతున్న ఫొటోలు.. దేశవ్యాప్తంగా చాలామందిని ఎమోషనల్ అయ్యేలా చేసింది. (ఇదీ చదవండి: కొత్త ఇంట్లోకి టాలీవుడ్ లేడీ సింగర్ సమీర భరద్వాజ్.. ఫొటోలు) -
అనుపమ్ ఖేర్కు వింత అనుభవం.. టాయిలెట్ గుర్తులు చూసి ఆవేదన!
కశ్మీర్ ఫైల్ సినిమాతో దేశవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న నటుడు అనుపమ్ ఖేర్. ఆ తర్వాత బాలీవుడ్లో వరుస సినిమాలతో బిజీ అయిపోయారు. నటనతో పాటు దర్శకత్వం కూడా వహిస్తున్నారు. ఇటీవలే ఆయన డైరెక్షన్లో వచ్చిన తన్వి ది గ్కేట్ గత నెలలోనే థియేటర్లలో విడుదలైంది. కాగా.. అనుపమ్ ఖేర్ స్వీయ దర్శకత్వం వహించిన చిత్రం 'తన్వి ది గ్రేట్' ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటోంది. అయితే తాజాగా అనుపమ్ ఖేర్కు విచిత్రమైన అనుభవం ఎదురైంది. ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారాయన. ఇది కాస్తా సిల్లీగా అనిపించినా ఆయనకు మాత్రం పెద్ద సమస్యనే తెచ్చిపెట్టింది. టాయిలెట్ ప్రదేశాల్లో బయట ఉండే ఆడ, మగ గుర్తులను చూసి కన్ఫ్యూజ్ అయ్యానని ఏకంగా వీడియోను పంచుకున్నారు. ఇలా మీరు ఎప్పుడైనా కన్ఫ్యూజ్ అయ్యారా అని ఫ్యాన్స్ను అడిగారు. టాయిలెట్ బయట సింపుల్గా లేడీస్, జెంట్స్ అని రాస్తే సరిపోతుంది కదా? ఈ బొమ్మలు వేసి ఎందుకింత అయోమయానికి గురి చేస్తున్నారని అనుపమ్ ఖేర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజుల్లో నాకు అర్థం కాని విషయం.. గతంలో ఉన్నంత సరళంగా ఎందుకు ఉండకూడదని ప్రశ్నించారు.ఇదంతా ఫన్నీగా అనిపించినా వయస్సు పెరిగే కొద్ది చూపు కూడా తగ్గుతుంది. బహుశా అందువల్లే గుర్తు పట్టలేక తన బాధను ఇలా అభిమానులతో పంచుకున్నారు. ఏదేమైనా అందరూ సులభంగా గుర్తు పట్టేలా బొమ్మలతో పాటు పేర్లు కూడా రాస్తే సులభంగా ఉంటుందని నెటిజన్స్ సలహాలిస్తున్నారు.కాగా.. అనుపమ్ దర్శకత్వం వహించిన తన్వీ ది గ్రేట్ చిత్రం ఆటిజంతో బాధపడుతున్న ఓ యువతి తండ్రి స్ఫూర్తిలో భారత సైన్యంలో చేరాలని కలలు కంటుంది. ఆ యువతి స్ఫూర్తిదాయకమైన కథనే సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్తో పాటు శుభంగి దత్, బోమన్ ఇరానీ, కరణ్ ట్యాకర్, జాకీ ష్రాఫ్, అరవింద్ స్వామి, నాజర్ కీలక పాత్రల్లో నటించారు. అనుపమ్ ఖేర్ స్టూడియోస్ బ్యానర్లో నిర్మించిన 'తన్వి ది గ్రేట్' కేన్స్, న్యూయార్క్, హ్యూస్టన్, లండన్లో జరిగిన చలనచిత్రోత్సవాలలో అంతర్జాతీయంగానూ గుర్తింపును తెచ్చుకుంది. View this post on Instagram A post shared by Anupam Kher (@anupampkher) -
నేను నీ డైపర్లు మారిస్తే నువ్వేమో.. అమ్మతనంపై కియారా పోస్ట్
బాలీవుడ్ జంట సిద్దార్థ్ మల్హోత్రా (Sidharth Malhotra)- కియారా అద్వాణీ (Kiara Advani) పట్టలేనంత సంతోషంలో ఉంది. కారణం.. వీరికి ఈ ఏడాది జూలైలో పండంటి ఆడబిడ్డ జన్మించింది. అప్పటినుంచి పసిపాపతోనే వీలైనంత ఎక్కువ సమయం గడుపుతున్నారు. తొలిసారి మాతృత్వాన్ని అనుభవిస్తున్న కియారాకు అమ్మతనం కొత్తగానూ, తన్మయత్వంగానూ ఉంది. ఈ డీల్ బాగుంది..తన ఫీలింగ్స్ను సోషల్ మీడియా వేదికగా ఇలా రాసుకొచ్చింది.. నేను నీ డైపర్లు మారుస్తున్నాను.. నువ్వేమో నా ప్రపంచాన్నే మార్చేశావు. ఈ డీల్ చాలా బాగుంది అని రాసుకొచ్చింది. దీనికి కళ్లలో నీళ్లు తిరుగుతున్న ఎమోజీ, చేతితో హార్ట్ సింబల్ చూపిస్తున్న ఎమోజీని జత చేసింది. సిద్దార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ.. 2021లో వచ్చిన 'షేర్షా' సినిమాలో కలిసి నటించారు. అప్పుడు మొదలైన స్నేహం తర్వాత ప్రేమగా మారింది. 2023లో వీరు పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. సినిమారెండేళ్లకే పాప పుట్టడంతో ఆనందంలో తేలియాడుతున్నారు. సినిమాల విషయానికి వస్తే.. కియారా చివరగా గేమ్ ఛేంజర్ సినిమాలో కనిపించింది. ప్రస్తుతం ఈమె హీరోయిన్గా నటించిన 'వార్ 2' ఆగస్టు 14న థియేటర్లలోకి రానుంది. అలాగే యశ్ టాక్సిక్ మూవీలోనూ యాక్ట్ చేస్తోంది. సిద్దార్థ్ విషయానికి వస్తే ఇతడు ప్రస్తుతం పరమ్ సుందరి మూవీ చేస్తున్నాడు. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీ ఆగస్టు 29న విడుదల కానుంది.చదవండి: రాఖీ పండగరోజు ప్రభాస్ చెల్లి ఇలా చేసిందేంటి? -
ప్రముఖుల ‘బయోపిక్స్’
మిస్సైల్ మేన్ అబ్దుల్ కలామ్ జీవితం గురించి తెలుసుకోవాలని ఎవరికి ఉండదు? మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ ధైర్య సాహసాలు చూడాలని ఎవరికి ఉండదు? ట్రాజెడీ క్వీన్ మీనా కుమారి జీవితం గురించి తెలుసుకోవాలని ఎవరికి ఉండదు? కొందరు లెజెండ్స్ జీవితాలు అందరికీ ఆసక్తిదాయకంగానే ఉంటాయి. అందుకే వారి జీవితాలకు వెండితెర రూపం ఇస్తే... ఆ బయోపిక్కి ఉండే క్రేజే వేరు. ప్రస్తుతం బాలీవుడ్లో పలువురు లెజెండ్స్ జీవితాలతో సినిమాలు రూపొందుతున్నాయి. ఆ ప్రముఖుల ‘బయోపిక్స్’ గురించి తెలుసుకుందాం.మిస్సైల్ మేన్లా... భారత మాజీ రాష్ట్రపతి, ప్రముఖ శాస్త్రవేత్త డా. ఏపీజే అబ్దుల్ కలాం జీవితం ఆధారంగా ‘కలామ్’ చిత్రం రూపొందనుంది. ఈ మిస్సైల్ మేన్ పాత్రను ధనుష్ పోషించనున్నారు. ‘ఆది పురుష్’ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం టైటిల్ పోస్టర్ని ఈ ఏడాది మేలో ఫ్రాన్స్లో జరిగిన కాన్స్ చలన చిత్రోత్సవాల్లో ఆవిష్కరించారు. ‘ది మిస్సైల్ మేన్ ఆఫ్ ఇండియా’ అనేది ‘కలాం’ సినిమా టైటిల్కి ట్యాగ్లైన్గా నిర్ణయించింది యూనిట్.అభిషేక్ అగర్వాల్, అనిల్ సుంకర, భూషణ్కుమార్, క్రిషణ్ కుమార్, గుల్షన్ కుమార్, తేజ్ నారాయణ్ అగర్వాల్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. భారత అంతరిక్ష, రక్షణ కార్యక్రమాలకు అబ్దుల్ కలాం చేసిన సేవను ఈ చిత్రంలో చూపించనున్నారు. రామేశ్వరం నుండి రాష్ట్రపతి భవన్ వరకు కలాం స్ఫూర్తిదాయక జీవితాన్ని ప్రపంచానికి చూపించేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ చిత్రం షూటింగ్ని ఎప్పుడు ఆరంభిస్తారనేది తెలియాల్సి ఉంది.యువర్ హానర్... లాయర్గా కోర్టులో ఎలా వాదించాలో శిక్షణ తీసుకుంటున్నారు రాజ్కుమార్ రావ్. ఎందుకంటే ‘యువర్ హానర్’ అంటూ అసలు సిసలైన లాయర్గా ఒదిగి పోవడానికి. భారతదేశ ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ జీవితం ఆధారంగా రూపొందనున్న చిత్రంలో రాజ్కుమార్ రావ్ నటించనున్నారు. ఉజ్వల్ నికమ్ కెరీర్లో అత్యంత కీలకమైన ముంబై 26/11 ఉగ్రవాద దాడుల్లో అజ్మల్ కసబ్పై జరిగిన విచారణ నేపథ్యంలో ప్రధానంగా ఈ సినిమా సాగుతుంది.అవినాష్ అరుణ్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని దినేష్ విజన్ నిర్మించనున్నారు. ఎంతో పేరు, ప్రతిష్ఠలు ఉన్న ఉజ్వల్ నికమ్ పాత్రలో తన నటన గౌరవప్రదంగా ఉండటానికి రాజ్కుమార్ రావ్ ప్రత్యేకంగా వర్క్షాప్కి హాజౖరై, శిక్షణ తీసుకుంటున్నారట. ఈ చిత్రం షూటింగ్ని అక్టోబరులో ఆరంభించాలనుకుంటున్నారు. ‘‘ఉజ్వల్ నికమ్లాంటి గౌరవప్రదమైన న్యాయవాదికి గొప్ప నివాళిగా ఈ చిత్రం ఉంటుంది’’ అని దర్శక–నిర్మాతలు పేర్కొన్నారు. మరాఠా యోధుడు శివాజీ జీవితంతో... డ్రీమ్ ప్రాజెక్ట్తో బిజీగా ఉన్నారు రితేష్ దేశ్ముఖ్. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ జీవితాన్ని వెండితెరపై ఆవిష్కరించాలని, శివాజీ పాత్రను తానే చేయాలనీ రితేష్కి కొంత కాలంగా ఉన్న కల. ఆ కల నెరవేర్చుకుంటున్నారు. ‘రాజా శివాజీ’ టైటిల్తో రూపొందుతున్న ఈ చిత్రంలో రితేష్ నటించడం మాత్రమే కాదు... దర్శకత్వం వహిస్తుండటం విశేషం. మూడు నాలుగు నెలల క్రితం విడుదల చేసిన ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్కి మంచి స్పందన లభించింది. మహారాష్ట్ర దినోత్సవం సందర్భంగా ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది మే 1న విడుదల చేయనున్నారు.మరాఠీ, హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. ‘‘ఛత్రపతి శివాజీకి గొప్ప నివాళిగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. సంజయ్ దత్, అభిషేక్ బచ్చన్, ఫర్దీన్ ఖాన్, భాగ్యశ్రీ... ఇలా భారీ తారాగణంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘‘ఛత్రపతి శివాజీ మహారాజ్ కేవలం ఒక చారిత్రక వ్యక్తి మాత్రమే కాదు... లక్షలాది మంది హృదయాలలో నివసించే భావోద్వేగం. ఆయన అసాధారణ జీవిత కథలో ఒక భాగాన్ని చెప్పగలగడం గౌరవం, గొప్ప బాధ్యత’’ అని రితేష్ దేశ్ముఖ్ పేర్కొన్నారు. మేజర్ షైతాన్ సింగ్ పరమ వీర చక్ర పురస్కారగ్రహీత మేజర్ షైతాన్ సింగ్గా ఒదిగి పోవడానికి ఓ నటుడిగా ఏమేం చేయాలో అన్నీ చేస్తున్నారు ఫర్హాన్ అక్తర్. ఎందుకంటే ఆయన జీవితంలోని ముఖ్య ఘట్టంతో రూపొందిస్తున్న ‘120 బహదూర్’లో షైతాన్ సింగ్ భాటీ పాత్ర పోషిస్తున్నారు ఫర్మాన్ అక్తర్. 1962లో ఇండియా–చైనాల మధ్య జరిగిన యుద్ధంలో ‘రెజాంగ్ లా’ పోరాట ఘట్టం ముఖ్యమైనదిగా చెప్పుకుంటారు.ఈ ఘటన ప్రధానాంశంగా రూపొందుతున్న చిత్రం ‘120 బహదూర్’. ఈ సినిమాలో ఇండియా–చైనా యుద్ధానికి నాయకత్వం వహించిన మేజర్ షైతాన్ సింగ్గా ఫర్హాన్ అక్తర్ నటిస్తున్నారు. రజనీష్ ఘాయ్ ఈ సినిమాకు దర్శకుడు. ‘‘ఇది మన సైనికుల వీరత్వం, ధైర్యాన్ని చాటి చెప్పే కథ’’ అని పేర్కొన్నారు ఫర్హాన్. ఈ సినిమాను ఈ ఏడాది నవంబరు 21న రిలీజ్ చేయనున్నామని మేకర్స్ ప్రకటించారు. 62 ఏళ్ల వయస్కురాలిగా యామీ 62 ఏళ్ల వయసులో తనకు విడాకులు ఇచ్చిన భర్త నుంచి భరణం కోరుకుంటుంది షా బానో. అయితే అతను ససేమిరా అంటాడు. చేసేదేం లేక ఈ మహిళ కోర్టు మెట్లు ఎక్కుతుంది. భరణం కోసం న్యాయ పోరాటం చేస్తుంది. 1985లో జరిగిన ఈ కేసు ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రానికి సుపర్ణ్ ఎస్. వర్మ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో 62 ఏళ్ల వృద్ధురాలు షా బానో పాత్రను యామీ గౌతమ్ చేశారు.ఆమె భర్త అహ్మద్ ఖాన్ పాత్రను ఇమ్రాన్ హష్మీ పోషించారు. ఈ పాత్ర యామీకి ఓ సవాల్ లాంటిది. ఎందుకంటే మూడు పదుల వయసులో ఉన్న యామీ అంతకు రెండింతలు వయసు ఉన్న మహిళగా ఒదిగి పోవడం అంటే ఫిజికల్గా చాలా ట్రాన్స్ఫార్మ్ కావాలి... అలాగే ప్రోస్థెటిక్ మేకప్కి ఎక్కువ సమయం కేటాయించారు. నటనపరంగా కూడా చాలా జాగ్రత్త తీసుకున్నారు. ఈ చిత్రాన్ని ఈ ఏడాది అక్టోబరు లేదా నవంబరులో రిలీజ్ చేయాలనుకుంటున్నారు.ఆపరేషన్ ఖుక్రి యునైటెడ్ పీస్ కీపింగ్ మిషన్లో భాగంగా వెస్ట్ ఆఫ్రికాకి వెళ్లిన 233 మంది భారతీయ సైనికులు అక్కడి రెబల్ ఫోర్స్ ట్రాప్లో చిక్కుకుంటారు. ఆ తర్వాత 75 రోజుల పాటు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఈ సైనికుల రెస్క్యూ ఆపరేషన్ని రాజ్పాల్ పునియా లీడ్ చేశారు. 2000లో ఈ ఆపరేషన్ జరిగింది. ఈ ఆపరేషన్ ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘ఆపరేషన్ ఖుక్రి’. రాజ్పాల్ పునియా పాత్రను రణ్దీప్ హుడా పోషిస్తున్నారు.‘ఆపరేషన్ ఖుక్రి: ది అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ ది ఇండియన్ ఆర్మీస్ బ్రేవెస్ట్ పీస్ కీపింగ్ మిషన్ అబ్రాడ్’ పుస్తకం ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి రణ్దీప్ హుడా ఓ నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు. ‘‘నా హృదయాన్ని చాలా బలంగా తాకిన కథ ఇది’’ అని రణ్దీప్ ఇటీవల పేర్కొన్నారు. అయితే ఈ చిత్రం ఆగిందనే టాక్ వినిపిస్తోంది. చిత్రదర్శకుడు అమిత్ శర్మ ఈ సినిమాని వదిలి, వేరే ప్రాజెక్ట్స్ చేపట్టడమే దీనికి కారణం అనే ప్రచారం జరుగుతోంది.అగస్త్య నందాకి భలే చాన్స్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ మనవడు (అమితాబ్ కుమార్తె శ్వేత కుమారుడు) అగస్త్య నందాకి నటుడిగా రెండో సినిమాకే మంచి అవకాశం దక్కింది. ‘ఆర్చీస్’ (2023) చిత్రంతో నటుడిగా కెరీర్ ఆరంభించారు అగస్త్య. అయితే ఈ చిత్రం నేరుగా ఓటీటీలో విడుదలైంది. ఇక రెండో చిత్రంగా ‘ఇక్కీస్’ చిత్రానికి అవకాశం వచ్చింది. 1971 భారత్–పాక్ యుద్ధంలో పోరాడిన భారతీయ సైనికుడు అరుణ్ ఖేత్రపాల్ జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపొందింది.ఈ చిత్రంలో అరుణ్ ఖేత్రపాల్ పాత్రను అగస్త్య చేశారు. భారతదేశపు అతి పిన్న వయస్కుడైన పరమ వీర చక్ర పురస్కారగ్రహీత అరుణ్ ఖేత్రపాల్ శౌర్యం, త్యాగాన్ని ఆవిష్కరించేలా ఈ చిత్రాన్ని దర్శకుడు శ్రీరామ్ రాఘవన్ తెరకెక్కించారు. ఈ చిత్రంలో ప్రముఖ నటుడు ధర్మేంద్ర కూడా నటించారు. ఈ చిత్రం అక్టోబరు 2న విడుదల కానుంది. ఇవే కాదు... ఇంకొందరు ప్రముఖుల జీవితాలతో కొన్ని బయోపిక్స్ రూపొందుతున్నాయి. – డి.జి. భవాని -
'వార్ 2' ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక ఫైనల్
ఎన్టీఆర్ అభిమానులకు గుడ్న్యూస్... చాలా ఏళ్ల తర్వాత తమ అభిమాన హీరోను చూసే ఛాన్స్ 'వార్2' ద్వారా దొరికింది. వార్2 ప్రీ రిలీజ్ ఈవెంట్పై నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ అధికారికంగా ప్రకటించింది. హైదరాబాద్లోని యూసఫ్గూడ పోలీస్ గ్రౌండ్స్లో భారీ ఎత్తున ఈ కార్యక్రమం జరగనుంది. ఆగష్టు 10న వేడుక నిర్వహిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ కార్యక్రమలో ఎన్టీఆర్తో పాటు హృతిక్ రోషన్ కూడా పాల్గొననున్నారు. ఆదివారం సాయంత్రం 5 గంటలకు ఈ వేడుక ప్రారంభం కానుంది.ఎన్టీఆర్, హృతిక్ రోషన్ వంటి ఇద్దరు బిగ్స్టార్స్ వార్2 కోసం ఏకం కావడంతో సినిమాపై భారీ బజ్ క్రియేట్ అయింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. 'యశ్రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్'లో భాగంగా రూపొందిన ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. ఆగష్టు 14న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది. -
అవకాశాల్లేవంటున్న బ్యూటీ.. బాస్ పాటతోనైనా కలిసొచ్చేనా?
'నాగిని' సీరియల్తో పాపులారిటీ సంపాదించుకుంది బుల్లితెర నటి మౌనీ రాయ్ (Mouni Roy). బుల్లితెర నుంచి వెండితెరకు వెళ్లాలన్న ఆశ 'హీరో హిట్లర్ ఇన్ లవ్' అనే పంజాబీ చిత్రంతో నెరవేరింది. 'గోల్డ్' అనే హిందీ మూవీతో బాలీవుడ్లో అడుగుపెట్టింది. తొలి చిత్రానికి బెస్ట్ డెబ్యూగా ఫిలింఫేర్ అవార్డు అందుకుంది. భారీ బడ్జెట్ మూవీ 'బ్రహ్మాస్త్ర: పార్ట్ 1'లోనూ భాగమైంది. అంచనాలు తలకిందులుఈ చిత్రానికిగానూ ఉత్తమ సహాయనటిగా ఫిలింఫేర్, ఐఫా అవార్డులు గెలుచుకుంది. అయితే తాను ఊహించినంతగా భారీ సినిమాల అవకాశాలు మాత్రం రావడం లేదని బాధపడుతోంది. హాలీవుడ్ రిపోర్టర్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మౌనీరాయ్ మాట్లాడుతూ.. బ్రహ్మాస్త్ర మూవీ తర్వాత చాలా ఆఫర్లు వస్తాయనుకున్నాను. కానీ అది నిజమవలేదు. సినిమాకు ఎవర్ని సెలక్ట్ చేయాలన్నప్పుడు కనీసం నా పేరు కూడా ప్రస్తావించడం లేదనుకుంటా!ఏదో ఒక ప్రాజెక్టుతో బిజీఅందుకు గల కారణాలేంటో తెలియడం లేదు. అయితే కెరీర్ మాత్రం ఆగిపోలేదు. ఓటీటీ ప్రాజెక్టులతో పాటు రియాలిటీ షో జడ్జిగా వ్యవహరిస్తూ, స్పెషల్ సాంగ్స్ చేస్తూ ఇలా ఏదో ఒకరకంగా ఎప్పుడూ బిజీగా ఉంటున్నాను. అవకాశాలు సరైన సమయంలో వాటంతటవే వస్తాయని ఎదురుచూస్తున్నాను. దాని గురించి అంతగా బాధపడుతూ కూర్చోవట్లేదు.నా జర్నీని తక్కువ చేయలేనుఎందుకంటే నా కెరీర్ ఎక్కడో మొదలై.. ఇంతదూరం వచ్చాను. ఇప్పటివరకు ఎన్నో సాధించాను. ఈ విషయంలో సంతృప్తిగా ఉండాలే తప్ప చేసిన పనిని చులకన చేసి మాట్లాడలేను. అయినా సినిమా ఫైనలైజ్ అవ్వాలంటే ముందు ఎన్నో ఉంటాయి. స్క్రిప్ట్ కుదరాలి, నిర్మాణ సంస్థలు భాగమవ్వాలి, బడ్జెట్ లెక్కలేసుకోవాలి. ఇలా ఎన్నో ఉంటాయి. ఇవన్నీ ఓ కొలిక్కి వచ్చాకే నటీనటుల సెలక్షన్ ఉంటుంది. విశ్వంభరతోనైనా దశ తిరిగేనా?వాళ్లనుకునే పాత్రలో మనల్ని ఊహించుకోలేకపోతే కనీసం లుక్ టెస్ట్కు కూడా పిలవరు. కాబట్టి సినిమాలో భాగం అవడమనేది నటీనటుల చేతిలో ఉండదు అని చెప్పుకొచ్చింది. ఇకపోతే మౌనీరాయ్ టాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వనుందంటూ ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే! విశ్వంభర మూవీలో ఈ నటి చిరంజీవితో స్టెప్పులేసిందట! ఈ స్పెషల్ సాంగ్ షూటింగ్ ఇటీవలే పూర్తయింది. విశ్వంభరతోనైనా మౌనీ దశ తిరుగుతుందేమో చూడాలి!చదవండి: 49 ఏళ్ల వయసులో సత్తా చాటిన ప్రగతి.. జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ -
అందరిముందే తిట్టిన ప్రేయసి.. నటుడి సలహాతో బ్రేకప్ చెప్పిన బిగ్బీ
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan)- జయ బచ్చన్ పెళ్లి చేసుకుని 50 ఏళ్లు పైనే అవుతోంది. అయితే జయను ప్రేమించి పెళ్లాడటానికి ముందు బిగ్బీ ఓ అమ్మాయితో ప్రేమలో ఉన్నాడట! ఈ విషయాన్ని నటుడు, రచయిత హనిఫ్ జవేరీ వెల్లడించాడు. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హనిఫ్ మాట్లాడుతూ.. అమితాబ్ ముంబైకి రావడానికి ముందు ఓ అమ్మాయిని ప్రేమించాడు. తన పేరు మాయ. బ్రిటీష్ ఎయిర్వేస్లో పనిచేసేది. సినిమాల్లోకి రాకముందే లవ్స్టోరీ..అమితాబ్ తనను ఎంతగానో ప్రేమించాడు. ఆమె కూడా ఆయన్ను అంతే ఇష్టపడింది. సినిమాల్లో పని వెతుక్కుందామని అమితాబ్ ముంబై వచ్చేశాడు. ముంబైలోని జుహులో.. తల్లి తేజ్ బచ్చన్ స్నేహితురాలి ఇంట్లో ఉన్నాడు. తరచూ మాయ ఆ ఇంటికి వచ్చి అతడిని పలకరిస్తూ ఉండేది. అయితే బిగ్బీ తల్లి స్నేహితురాలు కూడా అదే ఇంట్లో ఉండేది. దీంతో తన ప్రేమ వ్యవహారం ఎక్కడ బయటకు పొక్కుతుందోనని అమితాబ్ చాలా భయపడ్డాడు.తొలి సినిమా షూటింగ్లో..ఆ ఇంటి నుంచి వచ్చేసి బయటెక్కడైనా రెంట్కు ఉండాలనుకున్నాడు. అప్పుడు అమితాబ్ తన ఫస్ట్ మూవీ సాట్ హిందుస్తానీ సినిమా చేస్తున్నాడు. ఇందులో నటుడు అన్వర్ అలీ (Anwar Ali)తో కలిసి నటించాడు. తన బాధను అన్వర్తో చెప్పుకున్నాడు. విషయం అర్థమైన అన్వర్.. బిగ్బీని తన ఇంట్లోనే ఉండమన్నాడు. అలా అన్వర్ అపార్ట్మెంట్లో బిగ్బీ, మాయ చాలాకాలంపాటు కలిసున్నారు. బహుశా వాళ్లు పెళ్లి కూడా చేసుకునుండొచ్చు. అందరి ముందు అవమానించేదికానీ ఆ సమయంలో అమితాబ్ కెరీర్ అంత ఆశాజనకంగా లేదు. అమితాబ్కు మొహమాటం ఎక్కువ. మాయ మాత్రం కన్నింగ్గా ఉండేది. నోటికొచ్చినట్లు మాట్లాడేది. కొన్నిసార్లు అమితాబ్ పక్కన ఎవరున్నారన్నది కూడా చూసుకోకుండా తిట్టేసేది. అమితాబ్ స్నేహితులకు ఆమె పద్ధతి అస్సలు నచ్చేది కాదు. అతడు కూడా ప్రియురాలు అవమానించడంతో సిగ్గుతో చచ్చిపోయేవాడు. ఒకసారి గోవాకు షూటింగ్కు వెళ్లినప్పుడు మాయకు బ్రేకప్ చెప్పమని అన్వర్ సలహా ఇచ్చాడు. ఫస్ట్ సినిమా రిలీజ్కు ముందే బ్రేకప్సినిమాల్లో ఇంకా పైస్థాయికి వెళ్లేకొద్దీ సమస్యలు ఎక్కువవుతాయని హెచ్చరించాడు. అమితాబ్కు కూడా అది నిజమేననిపించింది. తమ బంధంలో ఏదో సరిగా లేదని ఎన్నాళ్లుగానో అతడు అసంతృప్తిగా ఫీలవుతున్నాడు. దీంతో ఆమెను దూరం పెట్టాడు. తర్వాత బ్రేకప్ చెప్పుకుని ఎవరి దారి వారు చూసుకున్నారు అని చెప్పుకొచ్చాడు. అమితాబ్ తొలి చిత్రం సాట్ హిందుస్తానీ 1969లో రిలీజైంది. హీరోయిన్ జయను 1973లో పెళ్లి చేసుకున్నాడు. వీరికి శ్వేత బచ్చన్, అభిషేక్ బచ్చన్ సంతానం.చదవండి: ఛాన్సుల కోసం బిజీ రెస్టారెంట్లో పిచ్చిదానిలా ఏడవాలా? అక్కర్లేదు! -
ఛాన్సుల కోసం బిజీ రెస్టారెంట్లో పిచ్చిదానిలా ఏడవాలా? అక్కర్లేదు!
కొన్ని ఆడిషన్స్ చిత్రవిచిత్రంగా ఉంటాయి. ఎంత సిద్ధమై వచ్చినా సరే ఊహకందని పనులు చేయిస్తారు. అలా తనకు జరిగిన ఓ విచిత్ర ఆడిషన్ను గుర్తు చేసుకుంది బాలీవుడ్ నటి ఇషా తల్వార్ (Isha Talwar). ఓ ఆడిషన్ కోసం యష్ రాజ్ ఫిలింస్ సంస్థకు చెందిన కాస్టింగ్ డైరెక్టర్ షనూ శర్మను కలిశాను. నాకు ముంబై వెర్సోవాలో ఓ రెస్టారెంట్లో సీన్ ఉందన్నారు. అక్కడికి వెళ్లి అందరి మధ్యలో గట్టిగా ఏడవాలని చెప్పారు.రెస్టారెంట్లో ఏడవమన్నారునటి ఎటువంటి సన్నివేశాలకైనా అభ్యంతరం చెప్పకూడదన్నారు. షనూ, తన అసిస్టెంట్లతో కలిసి రెస్టారెంట్లో నా ముందే కూర్చుంది. అందరూ భోజనం చేస్తూ కబుర్లు చెప్పుకుంటున్నారు. రద్దీగా ఉన్న రెస్టారెంట్లో అందరికీ వినబడేలా గట్టిగా ఏడ్వాలని చెప్పేసరికి అంతా అయోమయంగా అనిపించింది. అలా చేసేందుకు ధైర్యం సరిపోలేదు. ఒక అమ్మాయిని ఇలా పదిమందిలో ఏడిపించడం దేనికో నాకస్సలు అర్థం కాలేదు. ఇదేం ఆడిషన్?ఆఫీస్లో ఆడిషన్ పెట్టుకుంటారు కానీ, ఇలా జనం మధ్యలోనా? పోనీ.. సహజంగా రావాలంటే ఏదైనా రెస్టారెంట్ను కాసేపటికి అద్దెకు తీసుకుని ఆడిషన్ చేయాలి!ఏదేమైనా ఇది దాదాపు పదేళ్ల కిందట జరిగిన సంఘటన. ఇండస్ట్రీకి కొత్తగా వచ్చేవాళ్ల కోసం ఈ స్టోరీ పెడుతున్నాను. ఎవరూ ఒత్తిడికి గురి కాకండి. నేనైతే అలా రెస్టారెంట్లో ఏడవనని చెప్పేశాను, దీంతో సదరు సినిమాలో అవకాశం కూడా దక్కలేదు. కానీ, ఛాన్సుల కోసం ఇలా రెస్టారెంట్లో అస్సలు ఏడవలేను అని చెప్పుకొచ్చింది. ఆ కాస్టింగ్ డైరెక్టర్ ఎవరంటే?ఇషా.. మీర్జాపూర్ వెబ్ సిరీస్, ఆర్టికల్ 15 చిత్రాల్లో నటించింది. కాగా ఈ సీనియర్ కాస్టింగ్ డైరెక్టర్ షనూ.. బాలీవుడ్కు ఎంతోమంది నటీనటులను పరిచయం చేసింది. వారిలో రణ్వీర్ సింగ్, భూమి పడ్నేకర్ వంటి స్టార్స్ ఉన్నారు. ఈ మధ్యే సయ్యారా మూవీతో అహాన్ పాండే, అనీత్ పడ్డాను ఇండస్ట్రీకి పరిచయం చేసింది.చదవండి: ఫ్యామిలీతో అల్లు అర్జున్ డిన్నర్.. అర్హకు ఇబ్బంది కలగొద్దని -
'పరమ్ సుందరి'గా జాన్వీ కపూర్.. వర్షంలో రొమాంటిక్ సాంగ్ చూశారా?
సిద్ధార్థ్ మల్హోత్రా, జాన్వీ కపూర్ జంటగా నటిస్తోన్న తాజా చిత్రం 'పరమ్ సుందరి'. ఈ సినిమాకు తుషార్ జలోటా దర్శకత్వం వహిస్తున్నారు. మాడాక్ ఫిల్మ్స్ బ్యానర్లో దినేశ్ విజన్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలోని ఫుల్ రొమాంటిక్ సాంగ్ను మేకర్స్ రిలీజ్ చేశారు.బీగీ శారీ అంటూ సాగే రొమాంటిక్ పాటను రిలీజ్ చేశారు. ఈ సాంగ్లో సిద్ధార్థ్- జాన్వీల కెమిస్ట్రీ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. వర్షంలో చేసిన ఈ పాట ఈ చిత్రానికి స్పెషల్ అట్రాక్షన్గా నిలవనుంది. ఈ అద్భుతమైన సాంగ్ను శ్రేయా ఘోషల్, అద్నాన్ సమీ, సచిన్ జిగర్ ఆలపించారు. ఈ పాటకు అమితాబ్ భట్టాచార్య లిరిక్స్ అందించగా.. సచిన్ జిగర్ కంపోజ్ చేశారు. ఈ సినిమా ఆగస్టు 29న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రాన్ని రొమాంటిక్ లవ్స్టోరీగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. -
ఒక్క ఎపిసోడ్కు నా రెమ్యునరేషన్ ఎంతంటే..: స్మృతి ఇరానీ
కేంద్ర మాజీమంత్రి స్మృతి ఇరానీ (Smriti Irani) మళ్లీ బుల్లితెరపై కనిపించారు. 'క్యోంకీ సాస్ భీ కభీ బహు థీ 2 ' (Kyunki Saas Bhi Kabhi Bahu Thi) సీరియల్ గత నెల నుంచే ప్రసారం అవుతుంది. అయితే, ఈ సిరీయల్ కోసం తను తీసుకుంటున్న రెమ్యునరేషన్ ఎంత అనేది తాజాగా స్మృతి ఇరానీ పంచుకున్నారు. తాను ఫుల్టైమ్ రాజకీయనాయకురాలు అని, పార్ట్టైమ్ యాక్టర్ అని ఆమె ఇప్పటికే చెప్పిన విషయం తెలిసిందే.క్యోంకీ సాస్ భీ కభీ బహు థీ -2 సీరియల్తో తులసి విరానీగా స్మృతి ఇరానీ తిరిగొచ్చారు. అయితే,తాను ఈ సిరీయల్ నటించేందుకు ఒక్కో ఎపిసోడ్ కోసం రూ. 14 లక్షలు తీసుకుంటున్నట్లు తెలిపారు. తాజాగా CNN-News18తో ఆమె మాట్లాడుతూ పలు విషయాలు పంచుకున్నారు. నిరంతరం మనం ఏదో పనిలో ఉంటూనే ముందుకు వెళ్లాలని చెప్పారు. కేవలం ఆదాయం కోసమే పనిచేస్తే అనుకున్నది సాధించడం కష్టమని స్మృతి తెలిపారు. ఇండియాలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే సీరియల్ నటిగా స్మృతి ఇరానీ రికార్డ్ క్రియేట్ చేశారు. హిందీలో బాగా పాపులర్ అయిన 'అనుపమ' సీరియల్ కోసం రూపాలీ గంగూలీ ఒక్కో ఎపిసోడ్కు రూ. 3 లక్షలు తీసుకున్నారు. ఇప్పటి వరకు ఉన్న ఆ రికార్డ్ను స్మృతి ఇరానీ దాటేశారు. మరో నటి హీనా ఖాన్ కూడా ఎపిసోడ్కు రూ. 2 లక్షలు రెమ్యునరేషన్ తీసుకుంటారు.సుమారు 25 ఏళ్ల క్రితం స్మృతి ఇరానీ నటించిన హిందీ సీరియల్ 'క్యోంకీ సాస్ భీ కభీ బహు థీ'. ఈ సీరియల్తో స్మృతి ఇరానీకి మంచి గుర్తంపు దక్కింది. 2000 ఏడాదిలో మొదలైన ఈ ధారావాహిక 2008 వరకు విజయవంతంగా ప్రసారమైంది. అందులో తులసి పాత్రలో నటించిన స్మృతి ప్రేక్షకుల ఆదరణతోపాటు ఎన్నో అవార్డులు అందుకున్నారు. దానికి సీక్వెల్గానే 'క్యోంకీ సాస్ భీ కభీ బహు థీ 2' జులై 29 నుంచి ప్రసారం అవుతుంది. -
ఇంట్లో కూర్చుని బాధపడలేను.. ఇకపై అలాంటి సినిమాలే చేస్తా!
సరైన పాత్రలు ఆఫర్ చేస్తేనే సినిమాలు చేస్తానంటున్నాడు ప్రముఖ నటుడు ఆశిష్ విద్యార్థి (Ashish Vidyarthi). తెలుగు, తమిళ, బెంగాలీ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అనేక సినిమాలు చేసి విశిష్ట నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు ఆశిష్ విద్యార్థి. ఈయన చివరగా కిల్, ఆవేశం చిత్రాల్లో నటించాడు. తాజాగా తన యూట్యూబ్ ఛానల్లో ఆశిష్ విద్యార్థి మాట్లాడుతూ.. కొన్ని విషయాలు ఈరోజు చర్చించి తీరాల్సిందే! ప్రేక్షకులుగా మీరెప్పుడూ కరెక్టే! గ్రేట్ యాక్టర్నుఈ మధ్యకాలంలో నేను ఎక్కువ సినిమాలు చేయడం లేదు. అందరు కాకపోయినా కొందరైనా దానికి గల కారణం తెలుసుకోవాలని ఎదురుచూస్తున్నారు. వారికోసమైనా నేను నోరు విప్పాల్సిందే! నేను గ్రేట్ యాక్టర్ని. కెరీర్లో ఎన్నో అద్భుతమైన పాత్రలు చేశాను. అయితే ఇంతవరకు చేయని పాత్రల కోసం వెయిట్ చేస్తున్నాను. కథలో కీలక పాత్రలు ఆఫర్ చేస్తే తప్పకుండా యాక్ట్ చేస్తాను. ఈ విషయాన్నే దర్శకనిర్మాతలకు చెప్పాను.11 భాషల్లో నటించా..నా 30 ఏళ్ల కెరీర్లో 300 సినిమాలు చేశాను. 11 భాషల్లో నటించాను. ఇప్పుడు కొత్తదనం కావాలనుకుంటున్నాను. ప్రధాన పాత్రలే చేయాలనుకుంటున్నాను. కొన్నిసార్లు మనం ప్రపంచానికి దూరంగా ఉంటాం. కానీ, అలా అందరికీ దూరంగా ఉండి.. ఇంట్లో కూర్చుని ఒత్తిడికి లోనయ్యే టైప్ కాదు నేను అని చెప్పుకొచ్చాడు. కాగా ద్రోహకాల్ సినిమాకుగానూ ఆశిష్ ఉత్తమ సహాయ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్న విషయం తెలిసిందే!చదవండి: మొన్న నేషనల్ అవార్డ్.. ఇప్పుడు తెలుగు సింగర్ నిశ్చితార్థం -
కమల్ హాసన్ కాలి ధూళితో కూడా షారూఖ్ సరిపోడు: నటుడు
బాలీవుడ్ హీరో షారూఖ్ ఖాన్ (Shah Rukh Khan).. తమిళ స్టార్ కమల్ హాసన్ కాలి మట్టితో కూడా సరిపోడంటున్నాడు బాలీవుడ్ నటుడు లిల్లీపుట్. షారూఖ్ మరుగుజ్జుగా నటించిన జీరో మూవీ (2018) బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం పొందింది. దీంతో అతడు కొంతకాలం పాటు యాక్టింగ్కు బ్రేక్ తీసుకున్నాడు. షారూఖ్ కంటే ముందు కమల్ హాసన్ 1989లో అపూర్వ సగోదరర్గల్ (తెలుగులో విచిత్ర సోదరులు) మూవీలో మరుగుజ్జుగా నటించి సూపర్ హిట్టందుకున్నాడు. మరుగుజ్జుగా నటించడం కష్టంఈ రెండు సినిమాలను పోలుస్తూ నటుడు లిల్లీపుట్ (Lilliput) సంచలన వ్యాఖ్యలు చేశాడు. కళ్లున్నా సరే అంధుడిగా నటించవచ్చు. కానీ మంచి ఎత్తు ఉన్నప్పటికీ మరుగుజ్జుగా నటించడమంటే చాలా కష్టం. ఎందుకంటే వాళ్లు అందరిలాగే మామూలుగానే ఉంటారు. అందరిలాగే నవ్వుతారు, అందరిలాగే ఆలోచిస్తారు. కానీ చూడటానికి మాత్రం కాస్త విచిత్రంగా కనిపిస్తుంటారు. దాన్ని తెరపై చూపించాలి. కాబట్టి మరుగుజ్జుగా కనిపించడమనేది కష్టమైన పని.ప్రతీది నిశితంగా గమనించి..కానీ కమల్ హాసన్ ఏం చేశాడు? మరుగుజ్జులు ఎలా ఉంటారు? అనేది ప్రతీది వివరంగా తెలుసుకున్నాడు. వారి చేతి వేళ్లు చిన్నగా, మందంగా ఉంటాయని గమనించాడు. ముఖం, మోచేతులు, పాదాలు కాస్త భిన్నంగా ఉంటాయని తెలుసుకున్నాడు. ఇవన్నీ గమనించకుండా యాక్ట్ చేస్తే అందులో కొత్తదనం ఏముంటుంది? పోషించే పాత్రను ప్రభావవంతంగా చూపించాలిగా! కమల్ అదే చేశాడు. వీఎఫ్ఎక్స్ వాడకుండా రియల్గా కనిపించాడు.కమల్ను కాపీ కొట్టావ్నువ్వు (షారూఖ్) వీఎఫ్ఎక్స్ సాయంతో పొట్టిగా కనిపించావు. కమల్ను కాపీ కొట్టావు. తనలాగే హావభావాలు ప్రదర్శించేందుకు ట్రై చేశావు. అయినప్పటికీ ఆయన కాలికి ఉన్న మట్టితో కూడా నువ్వు సమానం కాదు అని చెప్పుకొచ్చాడు. కాగా షారూఖ్ ఇటీవలే.. జవాన్ సినిమాకుగానూ ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు గెలుచుకున్నాడు. ప్రస్తుతం షారూఖ్.. సిద్దార్థ్ ఆనంద్ డైరెక్షన్లో కింగ్ సినిమా చేస్తున్నాడు. ఇందులో షారూఖ్ కూతురు సుహానా కూడా నటిస్తోంది. అభయ్ వర్మ, అభిషేక్ బ్చన్, జైదీప్ అహ్లావత్, జాకీ ష్రాఫ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.చదవండి: నువ్వు తెలుగేనా? మంచు లక్ష్మిని ఆటాడుకున్న అల్లు అర్హ -
జూ.ఎన్టీయార్...నా ప్రచార ‘యుద్ధం’ నాదే
హీరోలు హీరోయిన్లు సినిమా ప్రచారంలో పాల్గొంటారే తప్ప ప్రచార బాధ్యతల్ని స్వయంగా చేపట్టడం అనేది జరగదు. సాధారణంగా ఆ బాధ్యతను కూడా సినిమా నిర్మాతలు, నిర్మాణ సంస్థలే చూసుకుంటాయి. అయితే గత కొంత కాలంగా జూనియర్ ఎన్టీయార్ దీనికి కొంత విభిన్నంగా ప్రయాణిస్తున్నారు. సినిమా నిర్మాణ సంస్థల ప్రచారపు తీరుతెన్నులు ఎలా ఉన్నప్పటికీ... తాను కూడా వ్యక్తిగతంగా మరోవైపు నుంచి వీటిని నిర్వహిస్తున్నట్టు సమాచారం. గతంలో రాజమౌళి రూపొందించిన ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్ సమయంలో కూడా ఆయన ఇదే పంథాను అనుసరించారు. వ్యక్తిగతంగా అనేక వ్యయ ప్రయాసలకు ఓర్చుకుని అంతర్జాతీయ స్థాయి లో ప్రచార వ్యూహాలు అమలు చేశారట. ఆ సినిమా మల్టీ స్టారర్ అయినప్పటికీ జూ.ఎన్టీయార్(Jr NTR)కు వచ్చిన గుర్తింపు మరెవరికీ రాకపోవడానికి అదే కారణం అంటున్నారు. పలువురు హాలీవుడ్ దర్శకులు సైతం జూ.ఎన్టీయార్తో సినిమా చేయడానికి రెడీ అంటూ ప్రకటనలు గుప్పించిన సంగతి తెలిసిందే.(చదవండి: నువ్వు తెలుగేనా? మంచు లక్ష్మితో అల్లు అర్హ క్యూట్ వీడియో)తాజాగా వార్ 2 సినిమా విషయంలోనూ ఆయన ఇదే తరహా నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్తో తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకుంటున్న టాలీవుడ్ యంగ్ టైగర్... వార్ 2 ని రూపొందించిన యష్ రాజ్ ఫిలింస్ ప్రచార శైలి పట్ల కినుక వహించారో, లేక తను కూడా మరింత బలం చేకూర్చాలనుకున్నారో తెలీదు గానీ ఈ సినిమా ప్రచారం విషయంలో ఎన్టీయార్ తన పిఆర్ టీమ్ను అలర్ట్ చేశారట. మరోవైపు తాజాగా సయ్యారా సినిమా సంచలన విజయం సాధించిన తర్వాత, ఆ సినిమాను కూడా సమర్పించిన యశ్ రాజ్ ఫిలింస్ భవిష్యత్తు ప్రమోషన్ వ్యూహంలో కీలక మార్పులు చేశారని తెలుస్తోంది. (చదవండి: ఆ సీన్ చేయలేనని చెబితే.. సౌత్ స్టార్ హీరో నాపై కేకలు వేశాడు: తమన్నా)సయ్యారా సినిమా మార్కెటింగ్ను ఈ సంస్థ అత్యంత వినూత్నంగా నిర్వహించింది. ప్రధాన జంట ప్రమోషన్ కోసం చాట్ షోలు షాపింగ్ మాల్స్లో డ్యాన్స్ ప్రోగ్రామ్స్ వంటివి చేయడానికి బదులుగా, సినిమా పాటలు విజువల్ ప్రమోషన్ల ద్వారా మాత్రమే సినిమాపై ఆసక్తిని పెంచడం అనే కొత్త వ్యూహాన్ని ఈ సినిమా కోసం అవలంబించి విజయం సాధించారు. ఈ పరిణామాల నేపథ్యంలో వార్ 2 ప్రచార సరళిలో కూడా ఈ సంస్థ కీలక మార్పు చేర్పులు చేసినట్టు సమాచారం. అయితే ఈ మార్పు చేర్పుల పట్ల అంతగా సంతృప్తి చెందని జూనియర్ ఎన్టీఆర్ తన చిత్రం ప్రమోషన్ బాధ్యతలను తానే స్వయంగా చేపట్టారట. యశ్ రాజ్ ఫిలింస్ వారి మార్కెటింగ్ వ్యూహాన్ని వారు అనుసరిస్తున్నారని భావించిన ఎన్టీఆర్, తన వ్యక్తిగత మీడియా వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా మరో టాప్ హీరోతో కలిసి చేసే మల్టీ స్టారర్స్ విషయంలో జూ.ఎన్టీయర్ మరింత జాగ్రత్త పడుతున్నట్టుగా కనిపిస్తోంది.ప్రతిష్టాత్మకంగా రూపొందిన వార్ 2 సినిమా ఆగస్టు 14న విడుదలకు సిద్ధమవుతోంది. ఇందులో హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలు నటించడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అధికారిక ప్రమోషన్ కార్యక్రమాల్లో స్టార్స్ కనిపించకపోవచ్చుననే అంచనాలతో, అభిమానులు సోషల్ మీడియా ఇతర మార్గాల ద్వారా ఈ సినిమా ప్రచారాన్ని ఆసక్తిగా గమనిస్తున్నారు. -
సలాం అనాలి సాంగ్ టీజర్: డ్యాన్స్ ఇరగదీసిన స్టార్స్.. కానీ..!
హృతిక్ రోషన్ (Hrithik Roshan) హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ వార్ 2. ఈ చిత్రంతో జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్కు పరిచయమవుతున్నాడు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఆగస్టు 14న హిందీ, తెలుగు, తమిళ భాషల్లో రిలీజవుతోంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ అభిమానులకు విపరీతంగా నచ్చేసింది. ఇకపోతే చిత్రయూనిట్ ఆన్లైన్ ప్రమోషన్స్ మొదలుపెట్టింది.ఆన్లైన్ ప్రమోషన్స్ఇంటర్వ్యూలు, ప్రెస్మీట్లు అంటూ హంగామా చేయకుండా సోషల్ మీడియాలోనే ప్రమోషన్స్ నిర్వహిస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR).. వార్ 2 మూవీలోని తన పోస్టర్తో ఉన్న బిల్బోర్డ్ను హృతిక్ ఇంటికి పంపించాడు. ఈ యుద్ధాన్ని మాతో గెలవలేరు అంటూ హీరోకు సవాలు విసిరాడు. అందుకు హృతిక్.. తన పోస్టర్ ఉన్న బిల్బోర్డ్ను తారక్ ఇంటికి పంపాడు. మీరు నాటునాటు డ్యాన్స్ ఎంత చేసినా.. ఈ యుద్ధంలో గెలిచేది మాత్రం నేనే అని రిప్లై ఇచ్చాడు. అలా వీరి మధ్య సోషల్ మీడియాలో సరదా వార్ జరుగుతోంది.ఫుల్ సాంగ్ కావాలంటే..తాజాగా ఈ యుద్ధాన్ని పక్కనపెట్టి వీరిద్దరూ ఒకరితో మరొకరు పోటీపడుతూ స్టెప్పులేశారు. జనాబే ఆలి (తెలుగులో సలాం అనాలి) పాటకు స్టైలిష్ స్టెప్పులు వేస్తూ అదరగొట్టారు. అందుకు సంబంధించిన ప్రోమోను తాజాగా రిలీజ్ చేశారు. ఫుల్ సాంగ్ ఎప్పుడనుకుంటున్నారా? ఆగస్టు 14న.. యూట్యూబ్లో కాదు.. ఏకంగా థియేటర్లోనే ఫుల్ సాంగ్ చూసేయండని చెప్తున్నారు. ఏదేమైనా పాట మాత్రం అదిరిపోయిందంటున్నారు. The dance WAR you’ve been waiting for is almost here. Here’s the tease... #JanaabeAali full song in theatres only! pic.twitter.com/iUgdEWZbJ1#War2 releasing in Hindi, Telugu and Tamil in cinemas worldwide on 14th August.@ihrithik | @advani_kiara | #AyanMukerji | @ipritamofficial…— Jr NTR (@tarak9999) August 7, 2025 చదవండి: ఇబ్బందిగా ఉందని చెబితే.. సౌత్ స్టార్ హీరో నాపై కేకలు వేశాడు -
ఇబ్బందిగా ఉందని చెబితే.. సౌత్ స్టార్ హీరో నాపై కేకలు వేశాడు : తమన్నా
సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు స్టార్ హీరోయిన్లుగా కొనసాగుతున్న చాలామంది కెరీర్ ప్రారంభంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నవాళ్లే. అవమానాలను భరించి, అవకాశం వచ్చినప్పుడు తమ టాలెంట్ని నిరూపించుకున్నవాళ్లే ఇప్పుడు స్టార్స్గా కొనసాగుతున్నారు. అలాంటి వారిలో తమన్నా(Tamanna Bhatia ) కూడా ఒకరు. చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి వచ్చిన ఈ మిల్కీ బ్యూటీ.. కెరీర్ ప్రారంభంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వచ్చిదట. చాలామంది తనను అవమానించి, ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నించారట. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తొలినాళ్లలో తనకు ఎదురైన ఓ సంఘటన గురించి చెప్పింది. తనకు అసౌకర్యంగా ఉందని చెప్పినందుకు ఓ స్టార్ హీరో కేకలు వేసి.. తన స్థానంలో మరో నటిని తీసుకోవాలని ఆదేశించారట.(చదవండి: విడాకుల బాటలో మరో సీనియర్ హీరోయిన్!)‘చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి వచ్చాను కాబట్టి నాకేమి తెలియదని చాలా మంది అనుకున్నారు. నా ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నించారు. చాలాసార్లు నన్ను అవమానించేందుకు ప్రయత్నంచారు. కెరీర్ ప్రారంభంలో సౌత్కి చెందిన ఓ పెద్ద హీరోకి జోడిగా నటించే అవకాశం వచ్చింది. ఆయనతో కొన్ని సీన్లలో నటించాల్సి వచ్చినప్పుడు నాకు కాస్త అసౌకర్యంగా అనిపించింది. ఈ విషయాన్ని దర్శకనిర్మాతలకు చెప్పి.. నాకు ఇబ్బందిగా ఉంది చేయలేనన్నాను. వెంటనే ఆ స్టార్ వచ్చి నాపై కేకలు వేశాను. దర్శక నిర్మాతలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ‘హీరోయిన్ని మార్చేయండి’ అన్నారు. అప్పుడు నేను కాస్త బాధ పడ్డాను కానీ తిరిగి ఆ హీరోని ఏమి అనలేదు. మౌనంగా ఉండిపోయాను. మరుసటి రోజు ఆ స్టార్ హీరోనే నా దగ్గరకు వచ్చి క్షమాపణలు చెప్పాడు. కోపంలో అలా అరిచానని, అలా ప్రవర్తించి ఉండకూడదని పశ్చాత్తాపపడ్డాడు’ అని తమన్నా చెప్పుకొచ్చింది. అయితే ఆ హీరో పేరు చెప్పడానికి మాత్రం నిరాకరించింది.(చదవండి: 40 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న నటి.. 'మగవాడ్ని ఇలాంటి ప్రశ్నలు అడగ్గలరా?')తమన్నా సీనీ కెరీర్ విషయానికొస్తే.. 2005లో ‘చాంద్ సా రోష్ చెహ్రా’ మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత మంచు మనోజ్ శ్రీ సినిమాతో టాలీవుడ్లోకి అడుగుపెట్టింది. హ్యాపీడేస్తో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఆ తర్వాత టాలీవుడ్లో వరుస అవకాశాలు వచ్చాయి. చిరంజీవి, వెంకటేశ్ లాంటి సీనియర్ హీరోలతో పాటు మహేశ్ బాబు, ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలతోనూ సినిమాలు చేసింది. ఆ మధ్య ఓదెల 2 మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించారు. ప్రస్తుతం నాలుగు హిందీ సినిమాల్లో నటిస్తున్నారు. -
భార్యకు వండి పెడతా.. పిల్లల కోసమే ఆ పద్ధతి మార్చుకున్నా: తారక్
దేవర సినిమాతో సూపర్ హిట్టందుకున్న జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) వార్ 2తో ప్రేక్షకులను పలకరించనున్నాడు. వచ్చేవారమే (ఆగస్టు 14న) ఈ మూవీ బాక్సాఫీస్లో సందడి చేయనుంది. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కలిసి నటించిన ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. తాజాగా తారక్.. ఈస్క్వైర్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్నో ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు.అది నా ఫేవరెట్ముందుగా బాలీవుడ్లో ఎంట్రీ గురించి మాట్లాడుతూ.. నేను ఏదీ ముందుగా ప్లాన్ చేసుకోను. కుంగ్ఫు పాండా సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది. 'నిన్న ఒక చరిత్ర- రేపు ఓ రహస్యం- నేడు అనేది ఓ బహుమతి'. ఇది నా ఫేవరెట్. నేను గతం గురించి, జరగబోయేదాని గురించి ఆలోచించను. వర్తమానంపైనే ఫోకస్ చేస్తాను. వార్ 2 సినిమా విషయానికి వస్తే.. కథ నాకు బాగా నచ్చింది. అలాగే హృతిక్ సర్తో పని చేయాలన్న ఉత్సుకత వల్లే వార్ 2 మూవీకి ఓకే చెప్పాను.నెలంతా షూటింగ్స్కే..మొదట్లో ఫ్యామిలీని పక్కనపెట్టి మొత్తం సినిమాలకే పరిమితమయ్యాను. వారంలో ఏడురోజులు షూటింగ్కు వెళ్లేవాడిని. అంటే నెలలో 30 రోజులు షూటింగ్స్కే కేటాయించేవాడిని. కానీ, ఇప్పుడు ఆ పద్ధతి మార్చుకుంటున్నాను. ఆదివారం సెలవు తీసుకుంటున్నాను. నా పిల్లలు అభయ్, భార్గవకు సమయం కేటాయిస్తున్నాను. ఎందుకంటే వారితో నేను సరదాగా, ప్రశాంతంగా గడిపేది ఆ ఒక్కరోజే! వాళ్లకు నచ్చింది చేయనిస్తానా పిల్లలు కూడా నాలాగే యాక్టర్స్ కావాలని ఎప్పుడూ చెప్పను. అది చేయాలి, ఇది చేయాలని ఆదేశించడానికి బదులుగా వారు కోరుకున్న స్థాయికి చేరేందుకు వారధిలా నిలబడతాను. ఇకపోతే నాకు వంట చేయడం ఇష్టం. నా భార్య లక్ష్మీ ప్రణతికి ప్రేమగా వండిపెడతాను. తనకే కాదు, నా స్నేహితుల కోసం, నా చుట్టూ ఉన్నవారి కోసం రుచికరంగా వంట చేస్తుంటాను. నాకు బిర్యానీ ఇష్టమైన వంటకం అని తారక్ చెప్పుకొచ్చాడు.చదవండి: నటి సీమంతం వేడుక.. పెళ్లెందుకు చేసుకోలేదా? నా ఇష్టం! -
5 నెలల్లో 28 కిలోలు : అమీర్ ఖాన్ అద్భుత చిట్కాలు
బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ తనదైన నటన, వ్యక్తిత్వంతో మిస్టర్ పర్ఫెక్షనిస్ట్గా పేరు తెచ్చుకున్నారు. కరీయర్లో అనేక బ్లాక్ బస్టర్ మూవీలను అందించడమాత్రమే కాదు, హీరోగా, డైరెక్టర్గా, నిర్మాతగా కూడా తన ప్రత్యేకతను చాటుకున్నారు. తాను పోషించే పాత్ర కోసం ఎలాంటి ప్రయోగానికైనా వెనుకాడని నటుడు. ఫిట్నెస్ విషయంలో కూడా ఎక్కడా తగ్గకుండా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. బాలీవుడ్ సూపర్ స్టార్ తన ఫిట్నెస్ ప్రయాణంతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తారు. గజని మూవీనుంచి దంగల్ దాకా ఆయన చేసిన ప్రతీ ప్రయోగమూ సక్సెస్ను అందుకుంది. 5 నెలల్లో 25 కిలోలకు పైగా బరువు తగ్గినా, కొన్ని నెలల్లో బరువు పెరిగినా అది ఆయనకే చెల్లు.ముఖ్యంగా అమీర్ ఖాన్ 60 ఏళ్ళ వయసులో ఫిట్ అండ్ ఫ్యాబ్గా ఉండటంలో ఆయనకు ఆయనే సాటి. 2016లో వచ్చిన తన బ్లాక్ బస్టర్ సినిమా దంగల్ కోసం అనూహ్యంగా బరువు పెరిగి, పాత్ర పట్ల తన నిబద్ధతను చాటుకున్నారు. భారతీయ రెజ్లింగ్ ఛాంపియన్ మహావీర్ సింగ్ ఫోగట్లా కనిపించేందుకు పెద్ద సాహసమే చేశారు. ఒక ప్రధాన రెజ్లర్ నుండి మధ్య వయస్కుడైన తండ్రిలా కనిపించేందుకు బాడీసూట్ ధరించడం కంటే, ఆ పాత్రకు న్యాయం చేసేందుకు సహజంగానే బరువు పెరిగి, మళ్లీ బరువు తగ్గి అభిమానులను ఆశ్చర్యపరిచారు.. అమీర్ ఖాన్ దంగల్ సినిమా కోసం సుమారు 28 కిలోల బరువు తగ్గారు. కేవలం ఐదు నెలల్లో 97 కిలోల నుండి 68 కిలోలకు చేరుకున్నారు. ఈ సమయంలో తన శరీర కొవ్వు శాతాన్ని 37శాతం నుండి 9.67శాతానికి తగ్గించుకోవడం విశేషం. ఈ మూవీ దర్శకుడు నితేష్ తివారీ అమీర్ అంకితభావాన్ని ప్రశంసించకుండా ఉండలేకపోయాడు."బరువు పెరగడం సరదాగానే ఉంటుంది. కోరుకున్నది తినవచ్చు. కానీ చురుగ్గా కదలలేం. శ్వాస కూడా కష్టంగా మారుతుంది. బాడీ లాంగ్వేజ్, నడక , కూర్చునే విధానం... ప్రతిదీ మారుతుంది. కానీ ఆ తరువాత బరువు తగ్గడం చాలా కష్టం అనిపించింది’’ అంటారు అమీర్. కానీ కఠినమైన ఫిట్నెస్ విధానాన్ని అనుసరించి అనుకున్నది సాధించారు. శరీర బరువులో "ఆహారం నంబర్ వన్" అంటారాయన. మీరెంత వ్యాయామం చేసినా ఫుడ్ సరిగ్గా తీసుకోకపోతే ఫలితం ఉండదు. మొదట్లో నిరాశ అనిపించినా, క్రమశిక్షణతో సాగితే ఫలితం ఉంటుంది అనే ఫిట్నెస్ సీక్రెట్ను అమీర్ వెయిట్ లాస్ జర్నీ ద్వారా తెలుసుకోవచ్చు.యాభై శాతం ఆహారం. 25 శాతం వ్యాయామం, 25 శాతం విశ్రాంతి కావాలంటూ తన అనుభవాన్ని గతంలోనే వివరించారు అమీర్ ఖాన్. ఎనిమిది గంటలు నిద్ర లేనిదే వెయిట్లాస్ జర్నీలేదు అంటారాయన.రాత్రిపూట అన్నం మానేయడం, తక్కువ తినడం లేదా ఆకలితో అలమటించడం లేదా అధిక ప్రోటీన్ భోజనం తీసుకోవడం వంటివి చిట్కాలను చాలామంది పాటిస్తున్నప్పటికీ తాను మాత్రం బరువు తగ్గడానికి పాతకాలపు పద్ధతిని అనుసరించానని చెప్పారు. ‘‘2,000 యూనిట్ల శక్తిని ఖర్చు చేస్తే, అదే మోతాదులో కేలరీలు తింటే, బరువు అలాగే ఉంటుంది. అలా కాకుండా 2,000 యూనిట్ల శక్తిని ఖర్చు చేసి 1,500 కేలరీలు తింటే, ప్రతిరోజు 500 కేలరీలు తగ్గుతాయి. ప్రతిరోజూ 7 కిలోమీటర్లు నడిస్తే వారానికి 7వేల కేలరీలు ఖర్చవుతాయి. ఇది శాస్త్రం. దీంతోపాటు కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్, కొవ్వులు, ఫైబర్, సోడియంతో మన ఆహారాన్ని సమతులం చేసుకోవాలి అని అమీర్తెలిపారు. -
వాస్తవ సంఘటనల ఆధారంగా వస్తోన్న చిత్రం.. టీజర్ రిలీజ్
బాలీవుడ్ హీరో ఫర్హాన్ అక్తర్ కీలక పాత్రలో నటిస్తోన్న పీరియాడికల్ వార్ చిత్రం 120 బహదూర్. ఈ సినిమాను 1962 నాటి ఇండియా- చైనా యుద్ధం ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. మేజర్ షైతాన్ సింగ్ భాటి జీవిత కథగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. యుద్ధం సమయంలో జరిగిన వాస్తవ సంఘటనలతో ఈ మూవీని రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి రజనీశ్ దర్శకత్వం వహిస్తున్నారు.తాజాగా ఈ మూవీ టీజర్ను మేకర్స్ విడుదల చేశారు. ఈ చిత్రంలో ఫర్హాన్ అక్తర్ సోల్జర్గా కనిపించనున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుగుతోన్న ఈ సినిమాను నవంబర్ 21 రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. తాజాగా విడుదలైన టీజర్ చూస్తే అభిమానుల్లో అంచనాలు పెంచేసింది. విజువల్స్, డైలాగ్స్ ఫ్యాన్స్ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. కాగా.. ఈ చిత్రంలో రాశి ఖన్నా హీరోయిన్గా కనిపించనుంది. -
నటుడితో కాఫీ కోసం నాయకురాలు లేఖ.. రిప్లై ఇవ్వలేదట!
రాజకీయ నాయకులు కూడా వినోదం కోసం సినిమా చూస్తుంటారు. వాళ్లకూ అభిమాన హీరోహీరోయిన్లు ఉంటారు. అవకాశం వచ్చినప్పుడు తమ అభిమాన నటీనటులను కలుస్తుంటారు. కొంతమంది అయితే ఏ స్థాయిలో ఉన్నా.. తమ అభిమాన నటీనటులు కనిపిస్తే చాలు తమ హోదాని మరచి సాధారణ అభిమానిలాగే వ్యవహరిస్తారు. తాజాగా పశ్చిమ బెంగాల్ ఎంపీ మహువా మొయిత్రా కూడా అలానే ప్రవర్తించారు. ఇండియా టుడే చానెల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ఫేవరేట్ నటుడి గురించి, అతన్ని కలిసేందుకు చేసిన ప్రయత్నాల గురించి చెబుతూ.. సిగ్గు పడిపోయింది. పార్లమెంట్లో జంకు లేకుంగా గంభీరంగా మాట్లాడుతూ ఫైర్బ్రాండ్గా పేరు తెచ్చుకున్న మహువా మొయిత్రా.. ఇలా సిగ్గు పడుతూ మాట్లాడడం చూసి వీక్షకులు అవాక్కయ్యారు. ఇంతకీ మహువా మనసుకు నచ్చిన నటుడి పేరు చెప్పలేదు కదా.. విలక్షణమైన పాత్రలు పోషిస్తూ బాలీవుడ్తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చకున్న పంకజ్ త్రిపాఠినే ఆమె ఫేవరేట్ యాక్టర్. అతనితో కలిసి కాఫీ తాగేందుకు చాలా ప్రయత్నాలు చేసిందట. చివరకు లేఖ కూడా రాశానని.. కానీ రిప్లై రాలేదని మహువా చెప్పుకొచ్చింది.యాంకర్తో కబురు..పంకజ్ త్రిపాఠి నటన అంటే నాకు చాలా ఇష్టం. బయట కూల్గా కనిపిస్తాడు కానీ తెరపై మాత్రం భయంకరమైన పాత్రల్లో కనిపిస్తాడు. మిర్జాపూర్ వెబ్ సిరీస్లో ఆయన అద్భుతమైన విలనిజం పండించాడు. ఒకసారి అతన్ని కలిసేందుకు ప్రయత్నించాడు. అతనితో కలిసి కాఫీ తాగాలని ఉందని లేఖ రాసి.. అతన్ని ఇంటర్వ్యూ చేయబోయే యాంకర్ ద్వారా ఆ లేఖని అందించాను. కానీ ఆయన నుంచి రిప్లై రాకపోవడంతో నిరాశ చెందాను.సహచర ఎంపీ సహాయంతో..ఎంపీ అయిన తర్వాత సహచర ఎంపీ, నటుడు రవి కిషన్తో నా క్రష్ గురించి చెప్పాను. పంకజ్ త్రిపాఠి నటన అంటే చాలా ఇష్టమని , ఇలా లేఖ కూడా రాశనని చెప్పాను. అతను వెంటనే ఫోన్ చేసి పంకజ్తో మాట్లాడించాడు. అతనితో మాట్లాడే సమయంలో తెలియకుండానే నేను సిగ్గుపడిపోయాను. లేఖ రాసిన విషయాన్ని కూడా గుర్తు చేశాను’ అని ఎంపీ మహువా మొయిత్రా చెప్పుకొచ్చింది.పంకజ్ త్రిపాఠి విషయానికొస్తే.. 2004లో ఆయన బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చాడు. 2012లో వచ్చిన గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్ సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ‘మీర్జాపూర్’ వెబ్ సిరీస్తో అన్ని భాషల్లోనూ అభిమానులను సొంతం చేసుకున్నారు. ఒకవైపు వెబ్ సిరీస్లు మరోవైపు సినిమాలు చేస్తూ బీజీ ఆర్టిస్ట్గా మారిపోయాడు. ఇటీవల ఆయన మైన్ హీరా అనే సినిమాలో ఒక హీరోగా కనిపించాడు. -
నా ఐటమ్ సాంగ్ చూస్తూ పిల్లలు భోంచేస్తున్నారు: తమన్నా
తమన్నా.. ఈ పేరు చెప్పగానే ఒకప్పుడు హీరోయిన్గా చేసిన సినిమాలు గుర్తొచ్చేవి. కానీ గత కొన్నేళ్లలో చూసుకుంటే మాత్రం ఐటమ్ సాంగ్స్ గుర్తొస్తున్నాయి. ఎందుకంటే 'కావాలయ్యా', 'ఆజ్ కీ రాత్' తదితర గీతాలతో తెగ వైరల్ అయిపోయింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సౌత్, నార్త్లో ఈ తరహా సాంగ్స్ చేయడం వల్ల తనకొచ్చిన క్రేజ్ గురించి మాట్లాడింది. ఎంతోమంది పిల్లలు తన పాటలు చూస్తూ అన్నం తింటున్నారని చెప్పుకొచ్చింది.'ఓ పిల్లాడు నా పాట చూస్తూ తింటుంటే అలానే చూడనివ్వండి' అని తమన్నా చెప్పింది. మీరు ఏ సాంగ్ గురించి మాట్లాడుతున్నారని హోస్ట్ అడగ్గా.. 'స్త్రీ 2 మూవీలో ఆజ్ కీ రాత్ గురించి' అని తమన్నా బదులిచ్చింది. అలానే 'ఎందరో తల్లులు నాకు ఫోన్ చేసి, మా బిడ్డ మీ పాట వింటూ, చూస్తే తప్పితే భోజనం చేయట్లేదు అని చెప్పారో లెక్కలేదు. పిల్లలకు నచ్చింది కనిపిస్తే అలానే చేస్తుంటారుగా' అని తన ఆనందాన్ని పంచుకుంది.(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 37 సినిమాలు)తమన్నా కామెంట్స్పై స్పందించిన హోస్ట్.. ఇది తల్లులు చింతించాల్సిన విషయమే అని అన్నాడు. దీనికి కౌంటర్ ఇచ్చిన తమన్నా.. 'తమ పిల్లలు సరిగా తింటున్నారా లేదా అని తల్లులు చింతించాలి. అదే వాళ్లకు ముఖ్యం. అంతే కానీ ఏ సాంగ్ వింటున్నారనేది కాదు. అయినా ఏడాది పిల్లలకు లిరిక్స్ ఏం అర్థమవుతాయి? వాళ్లు సంగీతం మాత్రమే ఎంజాయ్ చేస్తారు. కొన్నిసార్లు మనం కూడా సినిమాల్ని మర్చిపోతాం కానీ పాటలు గుర్తుంచుకుంటాగా. అలానే ఇది' అని చెప్పింది.తమన్నా చెప్పింది నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే యూట్యూబ్లో మంచి బీట్ ఉన్న పాటలంటే ఎక్కువగా స్పెషల్ సాంగ్సే ఉంటాయి. వాటిని చూపిస్తూనే చాలామంది తల్లలు.. పిల్లలకు అన్నం తినిపిస్తున్నారేమో? ఇకపోతే తమన్నా కెరీర్ విషయానికొస్తే.. చివరగా తెలుగులో 'ఓదెల 2' సినిమా చేసింది. ప్రస్తుతం హిందీలో మూడు మూవీస్ చేస్తోంది. గతేడాది వరకు నటుడు విజయ్ వర్మతో చెట్టాపట్టాలు వేసుకుని తిరిగింది. కొన్నాళ్ల క్రితం వీళ్లకు బ్రేకప్ అయింది. ప్రస్తుతానికైతే తమన్నాకు సినిమాలే ప్రపంచం.(ఇదీ చదవండి: ఆటిట్యూడ్ హీరోలపై 'కూలీ' నిర్మాత సెటైర్లు) -
పదేళ్లలో ఆదాయం వందల కోట్లు,ఇదీ ప్రభాస్ హీరోయిన్ సత్తా..
ప్రస్తుతం హిందీ సినిమా పరిశ్రమలో అత్యంత సుపరిచితమైన విమర్శకుల ప్రశంసలు పొందిన పేర్లలో ఒకరిగా కృతిసనన్ ఎదిగింది. అయితే, ఆమె స్టార్డమ్కు మార్గం ఇంజనీరింగ్ క్లాస్రూమ్ల నుంచే మొదలైంది.ఇంజనీరింగ్ టూ సిల్వర్స్క్రీన్..సంప్రదాయ. ఇంజనీరింగ్ నేపథ్యం నుంచి వచ్చిన కృతి బాలీవుడ్ తో ఎటువంటి కుటుంబ సంబంధాలు లేకుండా, వినోద ప్రపంచంలోకి పూర్తిగా బయటి వ్యక్తిగా ప్రవేశించింది. ఆమె మొదట్లో మోడలింగ్ ద్వారా వెలుగులోకి వచ్చింది, క్రమంగా తన విలక్షణమైన శైలి ఆత్మవిశ్వాసంతో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకుంది. 2014లో ప్రముఖ నటుడు జాకీ ష్రో కుమారుడు టైగర్ ష్రోతో కలిసి యాక్షన్ రొమాన్స్ చిత్రం హీరోపంతిలో నటించడంతో ఆమెకు పెద్ద బ్రేక్ వచ్చింది. ఆ అరంగేట్రం విజయవంతమైన ప్రయాణానికి నాంది పలికింది. శరవేగంగా ఆకట్టుకునే అందాల తారగా మారి భారతీయ సినిమాలోని అత్యంత ప్రసిద్ధ వ్యక్తులతో కలిసి పనిచేసే అవకాశాన్ని సంపాదించింది. ఆదిపురుష్లో ప్రభాస్ సరసన సీత పాత్రలోనూ నటించింది.2015లో, రోహిత్ శెట్టి బ్లాక్ బస్టర్ దిల్ వాలేలో షారుఖ్ ఖాన్, కాజోల్ లతో కలిసి స్క్రీన్ స్పేస్ పంచుకుంది. తరువాతి కొన్ని సంవత్సరాలలో కృతి బరేలీ కి బార్, లుకా చుప్పీ, హౌస్ ఫుల్ 4 తదితర చిత్రాల ద్వారా స్థిరమైన విజయాలను దక్కించుకుంటూ వచ్చింది. మిమి (2021)లో పోషించిన సర్రోగేట్ తల్లి పాత్ర ఆమెకు ప్రతిష్టాత్మక జాతీయ చలనచిత్ర అవార్డును కూడా అందించింది. అందంతో పాటు అభినయ ప్రతిభ ఉన్న నటిగా బాలీవుడ్లో ఆమె స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంది.బిజినెస్లో బిజీ బిజీగా...అనంతరం కృతి అభిరుచులు కెమెరాకు మించి విస్తరించాయి. మోడలింగ్ సినిమా సెట్లలో గ్లామర్ సౌందర్య పోషణతో సంవత్సరాల తరబడి పరిచయం ఉండడంతో కృతి సులభంగా స్కిన్ కేర్ స్పేస్ లోకి ప్రవేశించింది. కోవిడ్, లాక్డౌన్ సమయంలో, ఆమె చర్మ సంరక్షణ దినచర్యలు, ఉత్పత్తులను లోతుగా అర్థం చేసుకోవడంలో మునిగిపోయింది. ఈ అభిరుచి 2023లో తన సొంత బ్యూటీ బ్రాండ్ హైఫర్ ను ప్రారంభించడానికి దారితీసింది. హైఫన్ ఇప్పుడు టాప్ సెలబ్రిటీ బ్యూటీ లేబుల్లలో ఒకటిగా నిలిచింది, ఫోర్బ్స్ నివేదిక ప్రకారం, ఈ చర్మ సంరక్షణ లేబుల్ దాని మొదటి సంవత్సరంలోనే రూ. 100 కోట్ల అద్భుతమైన ఆదాయాన్ని ఆర్జించింది, అత్యంత పోటీతత్వ మార్కెట్లో తనను తాను స్థిరపరచుకుంది. కత్రినా కైఫ్ కే బ్యూటీ, మీరా రాజ్పుత్ అకైండ్, ఆష్కా గోరాడియా రెనీ కాస్మెటిక్స్ వంటి వాటితో పోటీ పడుతోంది. కృతికి చర్మ సంరక్షణ పట్ల ఉన్న నిజమైన మక్కువ, ఆమె స్వయంగా అన్నింటినీ పర్యవేక్షించడం ఈ బ్రాండ్ శీఘ్ర విజయానికి మూలస్తంభంగా మారింది.ఫిట్...హిట్...స్కిన్ కేర్ ఉత్పత్తుల కంటే ముందే . 2022లో, ఆమె ఫిట్నెస్ బ్రాండ్ అయిన ది ట్రైబ్ను సహ యజమానురాలిగాస్థాపించింది. దీనికి ఆమె మిమి షూటింగ్ కోసం కృతి తన పాత్రను పండించడం కోసం దాదాపు 15 కిలోగ్రాముల బరువు పెరిగింది. లాక్డౌన్ కారణంగా జిమ్లు మూసేయడంతో అదనపు బరువు తగ్గడం ఆమెకు బాగా కష్టమైంది. దాంతో వర్చువల్ సెషల్ ద్వారా నలుగురు వ్యక్తిగత శిక్షకుల మార్గదర్శకత్వంలో తాను ఇంట్లోనే వ్యాయామం చేశానని కృతి వెల్లడించింది. ఈ లోతైన వ్యక్తిగత సవాలుతో కూడిన దశ ఆమెను ఆ శిక్షకులతో కలిసి ది ట్రైబ్ ఏర్పాటుకు ప్రేరేపించింది. అదే సంవత్సరంలో, ఆమె ముంబైలోని ఉన్నత స్థాయి జుహు ప్రాంతంలో తన మొదటి ఫిట్నెస్ స్టూడియోను ప్రారంభించింది. రెండు సంవత్సరాల తరువాత, 2024లో, ముంబైలోని మరొక ఉన్నత పరిసర ప్రాంతమైన బాంద్రాలో రెండవ స్టూడియో తెరిచింది. -
ఏఐ మాయ.. పాపం బాలీవుడ్ స్టార్స్ను ఇలా చేశారేంటి?
ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(ఏఐ) ఇటీవల ఈ పదం ఎక్కువగా వినిపిస్తోంది. ఎందుకంటే రాబోయే కాలంలో మనుషులకు ప్రత్యామ్నాయంగా మారనుందని టాక్ వినిపించడమే. అయితే ఏఐ వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో.. అంతే నష్టాలు కూడా ఉంటాయి. కృత్రిమ మేధతో ఉద్యోగాలు కూడా పోతాయన్నది ఓ వాదన. అయితే భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఏఐని మన జీవితంలో ఆహ్వానించక తప్పదేమో అనిపిస్తోంది.అయితే ఇటీవల సోషల్ మీడియాలో ఏఐ సాయంతో చేస్తున్న ఫోటోలు, వీడియోలు తెగ వైరలవుతున్నాయి. ఫన్ కోసం సినీతారల ఫోటోలను కోసం తెగ వాడేస్తున్నారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోలు, వారి సతీమణులతో ఉన్నట్లు చేసిన వీడియో నెట్టంట హల్చల్ చేస్తోంది. హీరోలు తమ భార్యలకు ఆహరం తినిపిస్తుండగా.. వాళ్లను మాత్రం బక్క చిక్కినట్లుగా ఇందులో చూపించారు. చివర్లో సల్మాన్ ఖాన్ మాత్రం ఒక్కడే తింటూ నిండుగా కనిపించారు. ఈ లెక్కన పెళ్లి చేసుకుంటే సినీ తారల పరిస్థితి కూడా ఇంతేనా?? అంటూ ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం ఈ ఏఐ ఫన్నీ వీడియో మీరు కూడా చూసేయండి.#SalmanKhan rocked 😅Watch till the end pic.twitter.com/ryhgna8fbQ— Adil Hashmi👁🗨 (@X4SALMAN) August 2, 2025 -
రజనీకాంత్ కాళ్లకు నమస్కరించిన బాలీవుడ్ హీరో
రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ మూవీ కూలీ (Coolie Movie). టాలీవుడ్ కింగ్ నాగార్జున, బాలీవుడ్ సూపర్స్టార్ ఆమిర్ ఖాన్, శాండల్వుడ్ స్టార్ ఉపేంద్ర, మలయాళ నటుడు సౌబిన్ షాహిర్, సత్యరాజ్, హీరోయిన్ శృతి హాసన్ కీలక పాత్రల్లో నటించారు. బుట్టబొమ్మ పూజా హెగ్డే ఐటమ్ సాంగ్లో కనిపించనుంది. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టు 14న విడుదల కానుంది.కూలీ సినిమా లుక్లో ఆమిర్శనివారం ఈ సినిమా ట్రైలర్, ఆడియో లాంచ్ ఈవెంట్ చేశారు. చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ ఈవెంట్కు ఆమిర్ ఖాన్ (Aamir Khan) కూడా హాజరయ్యాడు. కూలీ సినిమాలో చేతి నిండా పచ్చబొట్టుతో ఎలా కనిపించాడో అదే లుక్లో స్టేజీపై దర్శనమిచ్చాడు. భుజంపై జాకెట్ పట్టుకుని దర్జాగా నడుచుకుంటూ వచ్చి అభిమానులను పలకరించాడు. కాళ్లు మొక్కిన హీరోఆ తర్వాత రజనీకాంత్ కాళ్లకు నమస్కరించాడు. దీంతో తలైవా అతడిని వెంటనే పైకి లేపి మనసారా హత్తుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఇది చూసిన అభిమానులు.. ఆమిర్ ఖాన్ను మెచ్చుకుంటున్నారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండటమంటే ఇదేనని కామెంట్లు చేస్తున్నారు. Can’t keep calm when Mr. Perfectionist Aamir Khan walks in with full swag!😎 #CoolieUnleashed ✨@rajinikanth @Dir_Lokesh @anirudhofficial #AamirKhan @iamnagarjuna @nimmaupendra #SathyaRaj #SoubinShahir @shrutihaasan #Coolie #CoolieFromAug14 pic.twitter.com/DFv306PuI9— Sun Pictures (@sunpictures) August 2, 2025For this massive respect, I'll be one of #AmirKhan fan after this .Humble person and knew how to respect legends. pic.twitter.com/swIjQtbbMy— Daemon (@k3_butcher) August 2, 2025చదవండి: 36 ఏళ్ల తర్వాత రజనీ సినిమాకు ‘ఏ’ సర్టిఫికెట్ -
పాతికేళ్ల తర్వాత...!
పాతికేళ్ల క్రితం విడుదలైన ‘లగాన్’ సినిమా లొకేషన్స్కు వెళ్లారు బాలీవుడ్ నటుడు, దర్శక–నిర్మాత ఆమిర్ ఖాన్. ఆయన హీరోగా నటించిన తాజా హిందీ చిత్రం ‘సితారే జమీన్ పర్’. జెనీలియా హీరోయిన్గా నటించిన ఈ సినిమాకు ఆర్ఎస్ ప్రసన్న దర్శకత్వం వహించగా, ఆమిర్ ఖాన్ నిర్మించారు. జూన్ 20న విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 300 కోట్లు సాధించి, సూపర్హిట్గా నిలిచింది.ఈ ఆగస్టు 1 నుంచి ‘ఆమిర్ ఖాన్ టాకీస్–జనతా కా థియేటర్’ యూట్యూబ్ చానల్లో పే పర్ వ్యూ విధానంలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. కాగా ఈ సినిమాను గుజరాత్లోని భుజ్ నగరానికి దగ్గర్లో ఉన్న కునారియా గ్రామ ప్రజలకు ఉచితంగా ప్రదర్శించారు ఆమిర్ ఖాన్. వారితో కలిసి ప్రేక్షకుడిగా ఆమిర్ ఖాన్ ఈ సినిమాను చూసి, స్క్రీనింగ్ అనంతరం మాట్లాడారు. అలాగే అక్కడి లొకేషన్స్లో ‘లగాన్’ సినిమా చిత్రీకరించిన విషయాలను ఆమిర్ ఖాన్ గుర్తు చేసుకున్నారు. అలాపాతికేళ్ల తర్వాత ‘లగాన్’ సినిమాను చిత్రీకరించిన లొకేషన్స్కు వెళ్లి ఆమిర్ ఖాన్ నాటి విశేషాలను అక్కడి ప్రజలతో పంచుకోవడం విశేషం. -
శభాష్ ఖుషీ!
ఇండస్ట్రీలో రాణించాలంటే యాక్టింగ్ ప్రతిభతోపాటు స్క్రీన్పై ఫిట్గా కూడా కనిపించాల్సి ఉంటుంది. ఆ ఫిట్నెస్ కోసం కఠినమైన కసరత్తులు చేస్తుంటారు తారలు. ఇందులో భాగంగా వెయిట్ లిఫ్టింగ్ కూడా చేస్తుంటారు. అయితే ఓ అమ్మాయి ఓ వంద కేజీలు బరువు ఎత్తితేనే హాట్ టాపిక్ అయిపోతుంది. అలాంటిది ఖుషీ కపూర్ జిమ్లో ఏకంగా 290 కేజీల బరువును లిఫ్ట్ చేయడంతో చాలామంది షాక్ అయ్యారు.దివంగత ప్రముఖ తార శ్రీదేవి చిన్న కుమార్తె ఖుషీ కపూర్ హిందీ సినిమాలు చేస్తున్నారు. ఓ హీరోయిన్గా ఫిట్గా ఉండటం కోసం ఆమె వర్కౌట్స్ చేస్తుంటారు. ఈ క్రమంలోనే హిప్ థ్రస్ట్ వర్కౌట్లో భాగంగా 290 కిలోల బరువును ఖుషీ కపూర్ లిఫ్ట్ చేశారు. ఈ వీడియోను ఆమె తన ఇన్స్టా స్టేటస్లో షేర్ చేయగా వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు, ఆమె సోషల్ మీడియా ఫాలోయర్స్ విభిన్నరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.కొందరు శభాష్ ఖుషీ అని మెచ్చుకుంటుంటే, మరికొందరు ఈ ముద్దుగుమ్మకు ఎంత కష్టం వచ్చిందో అన్నట్లుగా కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఖుషీ కపూర్ సినిమాలు ఎంపిక చేసుకునే విషయంలో చాలా పర్టిక్యులర్గా ఉంటున్నారట. మంచి మాస్ కమర్షియల్ సబ్జెక్ట్ లేదా డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయడానికి ఆమె ఇష్టపడుతోందని రెగ్యులర్ లవ్స్టోరీ, గాళ్ నెక్ట్స్ డోర్... వంటివి చేసే ఆలోచన ప్రస్తుతానికి ఖుషీకి లేదని బాలీవుడ్లో ప్రచారం సాగుతోంది. -
గర్భంతో ఉండగా తల్లింట్లో.. విడాకుల వార్తలపై నటి ఏమందంటే?
యువికా చౌదరి (Yuvika Chaudhary).. మొదట్లో హీరోయిన్గా సినిమాలు చేసింది. తర్వాత సహాయనటిగా యాక్ట్ చేసింది. హిందీతో పాటు కన్నడ, పంజాబీ భాషల్లో పలు చిత్రాలు చేసింది. హిందీ బిగ్బాస్ 9వ సీజన్లోనూ పాల్గొంది. ఈ షోలోనే నటుడు ప్రిన్స్ నరూలాతో ప్రేమలో పడింది. షో తర్వాత కూడా వీరిద్దరూ ఆ ప్రేమను కొనసాగించారు. 2018లో పెళ్లి చేసుకున్నారు. ఐవీఎఫ్ ద్వారా 2024లో కూతురికి జన్మనిచ్చారు. అయితే గర్భంతో ఉన్న సమయంలో యువికా తల్లింట్లోనే ఉంది. దీంతో యువికా- ప్రిన్స్ విడిపోయారంటూ ప్రచారం జరిగింది.నా మనసంతా అదేఈ ప్రచారం గురించి ఇన్నాళ్లకు పెదవి విప్పింది యువికా చౌదరి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. నేను గర్భం దాల్చినప్పుడు నా మెదడులో, మనసులో పుట్టబోయే బిడ్డ గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉన్నాను. పనికిరాని రూమర్లకు ప్రాధాన్యత ఇవ్వకూడదనుకున్నాను. అందుకే వాటిని లైట్ తీసుకున్నాను. ఈ పుకార్లు లైఫ్లో వస్తుంటాయి, పోతుంటాయి. కానీ నా ప్రెగ్నెన్సీ ఎప్పుడంటే అప్పుడు రాదుగా.. అందుకే రూమర్స్ను పట్టించుకోలేదు. ఒకవేళ క్లారిటీ ఇచ్చినప్పటికీ పరిస్థితి చక్కబడటం కాదుకదా.. దాన్ని మరింత రచ్చ చేస్తారని భావించాను. మా మధ్య మనస్పర్థలు నిజమేఅయినా మౌనంగా ఉన్నా కూడా దాన్ని ఇంకా సాగదీశారు. ఏదేమైనా నాకు నా బిడ్డే ముఖ్యం. తనను నేను బాగా చూసుకోవాలి. తనకోసం మరింత స్ట్రాంగ్గా నిలబడాలి.. ఇవే నా మనసులో మెదిలేవి. నిజానికి ప్రిన్స్ నాకెంతో సపోర్ట్ చేస్తాడు. కాకపోతే అందరిలాగే మా మధ్య కూడా మనస్పర్థలు వచ్చాయి. లైఫ్లో ఇది కూడా ఓ ఫేజ్ అని, అదెంతో కాలం ఉండదని నాకు బాగా తెలుసు. ప్రెగ్నెన్సీలో సడన్గా సంతోషంగా ఉంటాం. అంతలోనే బాధగా అనిపిస్తుంది. కొన్నిసార్లు జీవిత భాగస్వామి మనపక్కనే ఉంటే బాగుండనిపిస్తుంది. కానీ మా ఇంట్లో ఇంటీరియర్ పనులు జరుగుతుండటంతో ప్రిన్స్ అవన్నీ దగ్గరుండి చూసుకున్నాడు. తల్లికంటే ఎక్కువ ఎవరు చూసుకోగలరు?మరోవైపు షూటింగ్స్తో బిజీగా ఉన్నాడు. అలాంటి సమయంలో నేను మా అమ్మ దగ్గర ఉండటమే మంచిదని భావించాడు. తల్లికంటే బాగా ఎవరూ చూసుకోలేరని పుట్టింటికి పంపించాడు. ప్రెగ్నెన్సీ సమయంలో అమ్మానాన్నతో కలిసి ఉండటం పాపమేమీ కాదు, అదందరూ చేసేదే! అది అర్థం చేసుకోలేనివాళ్లు పిచ్చి పుకార్లు సృష్టించారు. కానీ ప్రిన్స్ మా విడాకుల రూమర్స్ విని బాధపడ్డాడు. నేను పుట్టింట్లో.. తనేమో నాకు దూరంగా ఉండేవాడు. ఏదేమైనా ఆ ఫేజ్ దాటేశాం. హ్యాపీగా ఉన్నాం అని యువికా చౌదరి చెప్పుకొచ్చింది.చదవండి: కొన్నిరోజులే బతుకుతా.. దీనస్థితిలో హీరో.. సాయం చేసిన కమెడియన్ -
చాహల్ గర్ల్ఫ్రెండ్ ఆర్జే మహ్వశ్.. వామ్మో క్రికెట్ టీమ్నే కొనేశారా?
ప్రముఖ ఆర్జే మహ్వశ్ పేరు కొన్ని నెలలుగా తెగ వినిపిస్తోంది. ఎందుకంటే ఈ ముద్దుగుమ్మ టీమిండియా క్రికెటర్ చాహల్తో సన్నిహితంగా కనిపించడమే. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ తర్వాత మహ్వశ్ పేరు మార్మోగిపోయింది. ఆ తర్వాత ఐపీఎల్ మ్యాచ్ల్లోనూ పంజాబ్కు మద్దతుగా మ్యాచ్ల్లో సందడి చేసింది. దీంతో చాహల్తో ఈ ముద్దుగుమ్మ ప్రేమాయణం నడుపుతున్నట్లు చాలాసార్లు వార్తలొచ్చాయి. ఇటీవల వీరిద్దరు లండన్లో జంటగా కనిపించారు. ఇవన్నీ చూస్తుంటే ఈ జంట డేటింగ్లో ఉన్నట్లు అర్థమవుతోంది. అయితే తమపై వస్తున్న రూమర్స్పై ఇప్పటివరకు ఎవరూ కూడా క్లారిటీ ఇవ్వలేదు.అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ క్రికెట్ మ్యాచ్లు వీక్షించడమే కాదు.. ఏకంగా క్రికెట్ టీమ్నే సొంతం చేసుకుంది. ఇవాళ జరిగిన సీఎల్టీ10 లీగ్లో ఆక్షన్లో తళుక్కున మెరిసిన మహ్వశ్..ఆస్ట్రేలియా క్రికెటర్ షాన్ మార్ష్ను కొనుగోలు చేసింది. తన టీమ్కు కెప్టెన్గా షాన్ మార్ష్ను ఎంపిక చేసినట్లు తెలిపింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. ఆర్జే మహ్వశ్ టీమ్ కెప్టెన్..షాన్ మార్ష్ క్యాప్షన్ రాసుకొచ్చింది. ఇది కాస్తా నెట్టింట వైరల్ కావడంతో చాహల్ను కూడా మీ టీమ్లోకి తీసుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Mahvash (@rj.mahvash) -
ఇటీవలే రెండో బిడ్డకు జననం.. ఆస్పత్రిలో చేరిన దృశ్యం నటి..!
బాలీవుడ్ నటి ఇషితా దత్తా తెలుగువారికి కూడా సుపరిచితమే. తెలుగులో చాణక్యుడు సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ.. ఆ తర్వాత బాలీవుడ్లో చాలా సినిమాల్లో కనిపించింది. సినిమాలతోపాటు పలు బాలీవుడ్ సీరియల్స్లో నటించిన ఇషితా దత్తా.. ఆ తర్వాత బాలీవుడ్ నటుడు వత్సల్ సేథ్ను పెళ్లాడింది. ఇప్పటికే వీరిద్దరికీ ఓ కుమారుడు కూడా జన్మించాడు.ఈ ఏడాదిలో రెండో బిడ్డకు స్వాగతం పలికింది ముద్దుగుమ్మ. ఫిబ్రవరిలో అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన ఇషితా జూన్లో రెండో బిడ్డను తన జీవితంలో ఆహ్వానం పలికింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.అయితే తాజాగా ఇషాతా దత్తా ఆస్పత్రిలో చేరింది. తన రెండు నెలల కుమారుడితో కలిసి చికిత్స పొందుతున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఇద్దరి ఆరోగ్యం బాగానే ఉందని ఇషితా తెలిపింది. ఇది నిజంగా కఠినమైన నెల... నేను నా నవజాత శిశువుతో ఇంట్లో ఉండాల్సిన సమయంలో... ఆసుపత్రి చుట్టూ తిరుగుతున్నా అంటూ వివరించింది. మీలో చాలా మంది అనుకుంటున్నట్లు నా బరువు తగ్గడం వల్ల వచ్చిన అనారోగ్యం కాదని తెలిపింది.కాగా.. ఇషిత దత్తా -వత్సల్ సేత్ 2017లో వివాహం చేసుకున్నారు. రిష్టన్ కా సౌదాగర్ - బాజిగర్ అనే టీవీ సీరియల్ సమయంలో ఈ జంట ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత జూలై 19, 2023న, వారిద్దరు తమ మొదటి బిడ్డకు స్వాగతం పలికారు. కాగా.. ఇషిత దత్తా చివరిసారిగా 2022లో విడుదలైన దృశ్యం- 2లో కనిపించింది.ప్రస్తుతం ఆమె మరో ప్రాజెక్ట్లో నటిస్తోంది. మరోవైపు వత్సల్ చివరిగా 'ఆదిపురుష్' చిత్రంలో కనిపించారు. ఝార్ఖండ్లో పుట్టి పెరిగిన ఇషితా దత్తా.. 2004లో ఫెమినా మిస్ ఇండియా టైటిల్ గెలుచుకుంది. 2012లో తెలుగులో వచ్చిన చాణక్యుడు సినిమాలో హీరోయిన్గా నటించింది. హిందీలో దృశ్యం 1, దృశ్యం 2 , ఫిరంగి, బ్లాంక్ వంటి చిత్రాల్లో నటించింది. -
కష్టంగానే ఆ పాటకు ఓకే చెప్పా.. ప్రియాంక చోప్రా
‘రామ్-లీలా’ సినిమాలో ప్రియాంక చోప్రా ఓ స్పెషల్ సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. ‘రామ్ చాహే లీలా’ అంటూ సాగే ఆ పాట అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. సినిమా విజయంలో ఈ పాట కీలక పాత్ర పోషించింది. తాజాగా ఈ పాటకు సంబంధించిన ఓ క్లిప్ని షేర్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. అప్పటి జ్ఞాపకాలను పంచుకుంది.‘ఈ ప్రత్యేక పాట కోసం దర్శకుడు సంజయ్ లీలా నన్ను సంప్రదించినప్పుడు ‘నేను చేయగలనా’ అనుకున్నాను. కష్టంగానే ఆ పాటకు ఓకే చెప్పాను. సెట్లో దర్శకుడు నాకు బాగా ధైర్యం చెప్పాడు. పాటలోని ప్రతి పదానికి అర్థం వివరిస్తూ..హావభావాల దగ్గర నుంచి డ్యాన్స్ మూమెంట్స్ వరకూ సలహాలిచ్చారు. కొరియోగ్రాఫర్ అద్భుతంగా కంపోజ్ చేశాడు. లంచ్ బ్రేక్ టైంలో కూడా డ్యాన్స్ మూమెంట్స్ గురించి వివరించేవాడు. కష్టంగా ఒకే చెప్పినా..నాకు మంచి గుర్తింపుని తెచ్చిపెట్టింది. ఈ జ్ఞాపకాలన్నీ ఎప్పటికీ గుర్తుంటాయి’ అని ప్రియాంక ఇన్స్టాలో రాసుకొచ్చింది.రామ్-లీలా సినిమా విషయానికొస్తే.. 2013లో విడుదలైన ఈ సినిమా అప్పట్లోనే 200 కోట్లకు పైగా వసూళ్లను సాధించి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. రణ్వీర్-దీపికా పదుకొణె జంటగా నటించిన ఈ చిత్రానికి సంజయ్ లీలా భన్సాలీ దర్వకత్వం వహించాడు. గ్యాంగ్స్టర్ కుటుంబాలకు చెందిన ఇద్దరు ప్రేమికుల చుట్టు తిరిగే కథ ఇది. View this post on Instagram A post shared by Priyanka (@priyankachopra) -
యోగి ఆదిత్యనాథ్పై బయోపిక్.. విడుదలకు అడ్డుగా సెన్సార్ బోర్డ్
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆధారంగా రూపొందుతున్న సినిమా 'అజయ్: ది అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ ఎ యోగి'.. దర్వకుడు రవీంద్ర గౌతమ్ తెరకెక్కిస్తున్నారు. అయితే, ఈ సినిమా విడుదలకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) అడ్డుచెప్పింది. దీంతో చిత్ర యూనిట్ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. సర్టిఫికేషన్ దరఖాస్తులను తిరస్కరించడాన్ని సెన్సార్ను తప్పుబడుతూ వారు కోర్టులో సవాలు చేశారు.'అజయ్: ది అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ ఎ యోగి' చిత్రంలో యోగి ఆదిత్యనాథ్ పాత్రలో అనంత్ జోషి నటించారు. ఆయన గురువు మహంత్ పాత్రలో పరేష్ రావల్ నటించారు. అయితే, ఈ సినిమా విడుదలకు సెన్సార్ బోర్డు అడ్డుచెప్పింది. దీంతో చిత్ర నిర్మాతలు ముంబై కోర్టును ఆశ్రయించి తమ వాదనను వినిపించారు. గత ఎనిమిది సంవత్సరాలుగా ప్రజాక్షేత్రంలో ఉన్న నవల ఆధారంగానే ఈ చిత్రాన్ని తెరకెక్కించామని చిత్ర నిర్మాతలు కోర్టుకు తెలిపారు. దీంతో ఇదే విధంగానే న్యాయస్థానం కూడా సెన్సార్ బోర్డును ప్రశ్నించింది. పుస్తకంపై ఎలాంటి సమస్యలు లేనప్పుడు సినిమాకు అభ్యంతరాలు ఎందుకని న్యాయమూర్తులు రేవతి మోహితే డెరే, నీలా గోఖలేలతో కూడిన ధర్మాసనం సెన్సార్ బోర్డును ప్రశ్నించింది. పుస్తకం ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు లేని ఇబ్బంది సినిమా విడుదలకు ఎందుకు వస్తుందని న్యాయస్థానం నిలదీసింది. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని CBFCకి కోర్టు నోటీసు జారీ చేసింది. -
బిగ్బాస్ వచ్చేస్తున్నాడు.. డేట్ రివీల్ చేసిన ఓటీటీ సంస్థ
బుల్లితెర ప్రియులను అలరించే బిగ్బాస్ రియాలిటీ షోకు అంతా సిద్ధమైంది. ఇప్పటికే హోస్ట్గా మరోసారి ఆ స్టార్ హీరోనే అలరించనున్నారు. ఈ బిగ్బాస్ షోకు ఆడియన్స్లో విపరీతమైన క్రేజ్ ఉంది. ఏ భాషలో వచ్చిన ఈ రియాలిటీ షో బుల్లితెర అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. హిందీలో బిగ్బాస్ సీజన్-19కు సమయం ఆసన్నమైంది. ఈ విషయాన్ని ప్రముఖ ఓటీటీ సంస్థ జియో హాట్స్టార్ ప్రకటించింది.ఆగస్టు 24 నుంచి బిగ్బాస్-19 సీజన్ ప్రారంభం కానున్నట్లు ప్రకటించింది. సల్మాన్ ఖాన్ హోస్ట్గా ఈ సీజన్ అభిమానులను అలరించనుంది. ఇప్పటికే కంటెస్టెంట్స్ లిస్ట్ కూడా ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. ఈ రియాలిటీ షో జియో హాట్స్టార్తో పాటు కలర్స్ టీవీలో ప్రసారం కానుంది.రెమ్యునరేషన్ తగ్గించుకున్న సల్మాన్ ఖాన్..అయితే ఈ ఏడాది సీజన్కు సల్మాన్ ఖాన్ భారీగా పారితోషికం తగ్గించుకున్నారు. ఈ ఏడాది వీకెండ్కు రూ.8 - 10 కోట్ల మేర పారితోషికం తీసుకునేందుకు అంగీకరించాడు. ఈ లెక్కన 15 వారాలకుగానూ రూ.120-150 కోట్లు అందుకోనున్నాడు. అయితే ఈ హీరో బిగ్బాస్ 17వ సీజన్కు రూ.200 కోట్లు, 18వ సీజన్కు ఏకంగా రూ.250 కోట్లు పుచ్చుకున్నాడు. అలాంటిదిప్పుడు సగానికి సగం తగ్గించుకోవడం గమనార్హం.Bhai ke saath laut aaya hai Bigg Boss ka naya season!Aur iss baar chalegi - Gharwalon Ki Sarkaar👑Dekhiye #BiggBoss19, 24th August se, sirf #JioHotstar aur @colorstv par.@BeingSalmanKhan @danubeprop #VaselineIndia#BiggBossOnJioHotstar#BB19OnJioHotstar pic.twitter.com/MxqX8s0Cor— JioHotstar (@JioHotstar) July 31, 2025 -
పాపం.. ఊర్వశి.. మ్యాచ్ కోసం వెళ్తే రూ.70 లక్షల నగలు చోరీ!
బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలాకు చేదు అనుభవం ఎదురైంది. ఇటీవల వింబుల్డన్ టోర్నీ చూసేందుకు లండన్ వెళ్లగా తన ఖరీదైన ఆభరణాలు చోరీకి గురైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. లండన్లోని గాట్విక్ విమానాశ్రయంలో ఈ సంఘటన జరిగిందని తెలిపింది. దాదాపు రూ.70 లక్షల విలువైన ఆభరణాలు కలిగిన తన లగ్జరీ బ్యాగ్ పోయిందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. విమానాశ్రయ అధికారులు ఎలాంటి సహాయం చేయలేదని ఊర్వశి నిరాశ వ్యక్తం చేసింది. విమానాశ్రయంలోని బ్యాగేజ్ బెల్ట్ నుంచి నా లగేజీ చోరీకి గురైందని పేర్కొంది.ఈ విషయాన్ని తాజాగా సోషల్ మీడియా ద్వారా పంచుకుంది ముద్దుగుమ్మ. ఈ సంఘటనను వివరిస్తూ విమానాశ్రయంలో భద్రతా లోపాన్ని ప్రస్తావించింది. ప్లాటినం ఎమిరేట్స్ సభ్యురాలిగా వింబుల్డన్కు గ్లోబల్ ఆర్టిస్ట్గా హాజరైనట్లు వెల్లడించింది. ముంబయి నుంచి గాట్విక్ చేరుకోగా.. ఎయిర్పోర్ట్లో తన బ్యాగ్ దొంగిలించారని పోస్ట్ చేసింది. బ్యాగ్తో పాటు టికెట్ వివరాలను సైతం సోషల్ మీడియాలో పంచుకుంది. త్వరగా తన బ్యాగ్ తిరిగొచ్చేలా చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీసులకు విజ్ఞప్తి చేసింది. కానీ అక్కడి అధికారుల నుంచి తనకు ఎలాంటి సహకారం అందలేదని వాపోయింది.కాగా.. ఈ బాలీవుడ్ ముద్దుగమ్మ సినిమాలతో పాటు ప్రత్యేక సాంగ్స్తో అభిమానులను అలరించింది. టాలీవుడ్లోనూ స్టార్ హీరోల చిత్రాల్లో మెప్పించింది. బాలయ్య, మెగాస్టార్ సినిమాల్లోనూ కనిపించింది. -
నా సినిమా టిక్కెట్ రూ.20: అమితాబ్ పోస్ట్ పై చర్చ...
ప్రతి ఆదివారం జుహులో తన ఇంటి ముంగిటకు వచ్చే అభిమానులను పలకరించే దశాబ్దాల సంప్రదాయానికి పేరుగాంచిన అమితాబ్ బచ్చన్ ఇంకా ఈ ఆచారాన్ని కొనసాగిస్తున్నారు. ఈ బాలీవుడ్ మెగాస్టార్ అభిమానులను పలకరించిన తరువాత తన బ్లాగులో ఈ సమావేశానికి సంబంధించిన కొన్ని ఫోటోలను, కొన్ని సందేశాలను కూడా పంచుకుంటారు. ఇది సర్వసాధారణంగా జరిగేదే అదే విధంగా ఆయన తాజాగా కూడా ఓ పోస్ట్ పెట్టారు. అందులో భావోద్వేగ భరిత సందేశాలు కూడా ఉన్నాయి. అయితే వీటన్నింటి కన్నా అందరినీ ఆకట్టుకుంది 1975 నాటి భారతీయ సంచలనం... క్లాసిక్ సినిమా ’షోలే’ సినిమా టిక్కెట్. దాదాపు 50 ఏళ్ల వయసు కలిగిన ఈ టిక్కెట్ను అత్యంత జాగ్రత్తగా భధ్రపరచిన అమితాబ్ సోషల్ మీడియా ద్వారా దానిని అభిమానులతో పంచుకున్నారు. అంతేకాదు ఈ టిక్కెట్ ధర కేవలం రూ. 20 మాత్రమేననే విషయాన్ని ఆయన గుర్తు చేశారు .ఆయన తన పోస్ట్లో ‘‘‘’షోలే’ టికెట్ను జాగ్రత్తగా భద్రపరిచా... ఈ టిక్కెట్ అప్పుడు రూ. 20 !! ధర.. ఈ రోజుల్లో థియేటర్ హాళ్లలో ఎరేటెడ్ డ్రింక్ (సాఫ్ట్ డ్రింక్) ధర అదే నని నాకు చెప్పారు. అది నిజమా?? చెప్పడానికి చాలా ఉంది, కానీ చెప్పడానికి కాదు.. ఆప్యాయత ప్రేమ,‘ అంటూ ఆయన ఆ పోస్ట్లో నర్మగర్భంగా రాశారు.అయితే అమితాబ్ తన దగ్గరున్న ఈ టికెట్ ను పోస్ట్ చేయడం ఎంత ఆసక్తి కలిగించిందో నెటిజన్ల పాజిటివ్ రెస్పాన్స్ అందుకుందో.. అలాగే ఆయన రూ.20కి థియేటర్లో సాఫ్ట్ డ్రింక్ కొనవచ్చునని అనడం కూడా అంత చర్చకు దారి తీసింది. ఎందుకంటే ప్రస్తుతం ధియేటర్లలో రూ.20కి సాఫ్ట్ డ్రింక్ కొనే పరిస్థితి లేదు. రూ.100 ఆ పై ధరల్లో మాత్రమే అవి అందుబాటులో ఉన్నాయి. ఈ నేపధ్యంలో అమితాబ్ రూ.20కే లభిస్తాయనడంతో... సెలబ్రిటీలకు ధరలపై ఉన్న అవగాహన చాటుతోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. అంతేకాకుండా మల్టీ ఫ్లెక్స్ థియేటర్లలో టిక్కెట్ల ధరలు అదే విధంగా తినుబండారాల ధరలకు సంబంధించిన సోషల్ చర్చకు కూడా బిగ్ బి పోస్ట్ దారి తీసింది.మరోవైపు 1975లో విడుదలైన ‘షోలే‘, వచ్చే ఆగస్టు 15తో 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది, ఇందులో అమితాబ్తో పాటు ధర్మేంద్ర కూడా నటించారు ఈ సినిమా ఆ సంవత్సరం భారతదేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. రమేష్ సిప్పీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం, జై వీరు (అమితాబ్ మరియు ధర్మేంద్ర పోషించారు) అనే ఇద్దరు మాజీ ఖైదీల చుట్టూ తిరుగుతుంది, నటులు అమ్జాద్ ఖాన్, సంజీవ్ కుమార్ మరియు హేమ మాలిని మరియు జయ బచ్చన్ ఈ చిత్రంలోని తారాగణాన్ని ముగించారు. -
'ఛావా' రికార్డ్ బ్రేక్ చేసిన చిన్న సినిమా
చిన్న సినిమాలు అప్పుడప్పుడు అద్భుతాలు చేస్తుంటాయి. ఇప్పుడు కూడా 'సయారా' అనే బాలీవుడ్ మూవీ ఎవరూ ఊహించని కలెక్షన్స్ సొంతం చేసుకుంటోంది. అలానే కొన్ని రికార్డ్స్ని కూడా బ్రేక్ చేస్తోంది. ఇప్పుడు అలానే ఏకంగా 'ఛావా'ని దాటేయడం చర్చనీయాంశమైంది. ఇంతకీ ఏంటి విషయం?(ఇదీ చదవండి: బర్త్డే ప్రకటన.. గొప్ప మనసు చాటుకున్న సోనూసూద్)విక్కీ కౌశల్, రష్మిక నటించిన చారిత్రక సినిమా 'ఛావా'. ఛత్రపతి శివాజీ కుమారుడి జీవిత కథతో తెరకెక్కిన ఈ చిత్రం.. ఊహించని వసూళ్లు సాధించింది. ఓవర్సీస్లోనూ మంచి కలెక్షన్ అందుకుంది. ఇప్పుడు ఆ నంబర్లని 'సయారా' అధిగమించినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరిలో థియేటర్లలోకి వచ్చిన 'ఛావా'.. ఓవర్సీస్ బాక్సాఫీస్ దగ్గర రూ.91 కోట్లు సాధించింది. ఇప్పుడు ఆ నంబర్ని సయారా.. కేవలం 13 రోజుల్లోనే అధిగమించిందని బాలీవుడ్ మీడియా చెబుతోంది. ఇప్పటివరకూ సయరా సినిమాకు ఓవర్సీస్లో రూ.94 కోట్లు వచ్చినట్లు తెలుస్తోంది.ఓవరాల్గా చూసుకుంటే యువతని ఆకట్టుకుంటున్న సయారా చిత్రానికి ఇప్పటివరకు రూ.400 కోట్లకు పైనే వసూళ్లు వచ్చినట్లు నిర్మాణ సంస్థ ఈ మధ్యనే చెప్పుకొచ్చింది. కేవలం మన దేశంలోనే రూ.260 కోట్లు వరకు వచ్చాయని సమాచారం. పరిస్థితి చూస్తుంటే రూ.500 కోట్ల మార్క్ కూడా మరికొన్నిరోజుల్లో దాటేయడం గ్యారంటీ. ఇంతకీ సయారా బడ్జెట్ ఎంతనుకున్నారు? కేవలం రూ.30 కోట్లు. ఈ లెక్కన చూసుకుంటే నిర్మాణ సంస్థకు వేరే లెవల్ లాభాలు వచ్చినట్లే.(ఇదీ చదవండి: ఫిష్ వెంకట్ ఘటన మరవకముందే మరో విషాదం) -
నా జీవిత అనుభవాలతో...
‘‘నేను రాసిన పుస్తకాలు నా జీవిత అనుభవాల నుంచి వచ్చాయి. అవి నాకు నేర్పిన పాఠాలనే నా పుస్తకాల్లో పొందుపరిచాను’’ అని బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ అన్నారు. ఆయన విలక్షణమైన నటుడే కాదు.. మంచి రచయిత కూడా అనే సంగతి తెలిసిందే. ఆయన రాసిన పుస్తకాల్లో ఇప్పటికే మూడు బుక్స్ని రిలీజ్ చేశారాయన. తాజాగా ‘డిఫరెంట్ బట్ నో లెస్’ అనే నాలుగో పుస్తకాన్ని ఆవిష్కరించారు అనుపమ్ ఖేర్.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ–‘‘నా నిజ జీవిత ఘటనలతో రాసిన ఈ పుస్తకం నాకు చాలా ప్రత్యేకం. ఇందులో నేను దర్శకత్వం వహించిన ‘తన్వి ది గ్రేట్’ సినిమా కథ, షూటింగ్లో ఎదురైన సవాళ్లు, వాటిని ఎదుర్కొన్న విధానాన్ని ప్రస్తావించాను. నేను బాక్సాఫీస్ వసూళ్ల గురించి పెద్దగా పట్టించుకోను. మా సినిమా ఎప్పటికైనా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది’’ అని చెప్పారు. ఇదిలా ఉంటే.. కరణ్ టాకర్, జాకీ ష్రాఫ్, అరవింద్ స్వామి నటించిన ‘తన్వి ది గ్రేట్’ ఈ నెల 18న విడుదలైన సంగతి తెలిసిందే. -
ప్రేమకథ ఆలస్యం
హీరోయిన్ శ్రీలీల బాలీవుడ్లో నటిస్తున్న తొలి హిందీ చిత్రం రిలీజ్ వాయిదా పడింది. కార్తీక్ ఆర్యన్ , శ్రీలీల హీరో హీరోయిన్లుగా అనురాగ్ బసు దర్శకత్వంలో ఓ ప్రేమకథ రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాను ఈ ఏడాది దీపావళికి రిలీజ్ చేయనున్నట్లు గతంలో మేకర్స్ ప్రకటించారు. అయితే ఈ సినిమా ఈ దీపావళికి విడుదల కావడం లేదని, వచ్చే ఏడాది రిలీజ్ చేస్తామని దర్శకుడు అనురాగ్ బసు వెల్లడించారు.‘‘ఇప్పటి వరకు మా సినిమా చిత్రీకరణ 40 శాతం పూర్తయింది. కార్తీక్ ఆర్యన్ మా సినిమాతోపాటుగా మరో సినిమా కూడా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాల్లో కార్తీక్ డిఫరెంట్ లుక్స్తో కనిపిస్తాడు. ఈ లుక్స్ పరంగా ఇబ్బందులున్నాయి. ఆగస్టు లేదా సెప్టెంబరులో మా సినిమా కొత్త షెడ్యూల్ చిత్రీకరణను ప్రారంభిస్తాం.అయితే ‘సయారా’ సినిమా స్టోరీకి మా కథ దగ్గరగా ఉందని, దీంతో స్క్రిప్ట్లో మార్పులు చేయాల్సి రావడం వల్లే ఈ ఏడాది మా చిత్రం రిలీజ్ కావడం లేదన్న వార్తల్లో నిజం లేదు. ‘సయారా’ కథకు, మా సిని మాకు సంబంధం లేదు’’ అన్నారు అనురాగ్ బసు. ఇలా శ్రీలీల తొలి హిందీ సినిమా రిలీజ్ అనుకున్న సమయానికన్నా కాస్త ఆలస్యంగా కానుంది. ఇక ప్రస్తుతం తెలుగులో ‘ఉస్తాద్ భగత్సింగ్’, తమిళంలో ‘పరాశక్తి’ వంటి చిత్రాలతో శ్రీలీల బిజీగా ఉన్నారు. -
Ekta Kapoor: 17 ఏళ్ల వయసులోనే ఎంట్రీ.. ముచ్చటగా మూడు దశాబ్దాలు
వినోద పరిశ్రమలో మూడు దశాబ్దాల ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసింది ఏక్తా కపూర్. ఈ ప్రయాణంలో ఎన్నో పాఠాలు నేర్చుకుంది. తనను తాను తీర్చిదిద్దుకుంది. పదిహేడు సంవత్సరాల వయసులో కెరీర్ ప్రారంభించిన ఏక్తా కపూర్ హిందీలో ఎన్నో టీవీ సోప్ ఒపెరాలను నిర్మించింది. ‘క్యోంకీ సాస్ భీ కభీ బహూ థీ’ ‘కహాని ఘర్ ఘర్ కీ’... వంటివి వాటిలో బాగా పాపులర్ అయ్యాయి.‘బాలాజీ మోషన్ పిక్చర్స్’ బ్యానర్పై నిర్మాతగా ‘ది డర్టీ పిక్చర్’ ‘డ్రీమ్ గర్ల్’ ‘క్రూ’లాంటి సినిమాలు నిర్మించింది. 2017లో వీడియో ఆన్ డిమాండ్ ప్లాట్ఫామ్ ‘ఆల్ట్ బాలాజీ’ప్రారంభించింది.ఏక్తా కపూర్ది నల్లేరు మీద నడకేమీ కాదు. మొదట్లో కొన్ని ప్రాజెక్ట్లు ఫెయిల్ అయ్యాయి. ఆరు పైలట్ ఎపిసోడ్లు రిజెక్ట్ అయ్యాయి.‘హమ్ పాంచ్’ టీవీ సిరీస్ రూపంలో తొలి సక్సెస్ వచ్చింది. ఇక ఆ తరవాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఆంగ్ల ఆక్షరం ‘కె’ను లక్కీ ఆల్ఫాబెట్గా భావించే ఏక్తా ‘కె’తో ప్రారంభమయ్యే టైటిల్తో ఎన్నో షోలు నిర్మించింది. ఏక్తాకపూర్ అదృష్టాన్ని నమ్ముకుందా, తన కష్టాన్ని నమ్ముకుందా అనే విషయానికి వస్తే... ఒక ప్రసిద్ధ మాటను గుర్తు తెచ్చుకోవడం అవసరం.‘కష్టపడేవారినే అదృష్టం ఇష్టపడుతుంది’‘కింగ్డమ్ ఆఫ్ ది సోప్ క్వీన్: దీ స్టోరీ ఆఫ్ బాలజీ టెలిఫిల్మ్’ పేరుతో ఏక్తా కపూర్ బయోగ్రఫీ వచ్చింది. -
హిట్ అండ్ రన్ కేసులో ప్రముఖ నటి అరెస్ట్
హిట్ అండ్ రన్ కేసులో అస్సాం నటి నందినీ కశ్యప్ని పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం ఉదయం ఉత్తర గౌహతిలోని రాజధాని థియేటర్ రిహార్సల్ వద్ద ఆమెను అరెస్ట్ చేసి దిస్పూర్లోని మహిళా పోలీస్ స్టేషన్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ నెల 25న నందినీ తన కారుతో ఓ స్టూడెంట్ను ఢీ కొట్టి, అక్కడ నుంచి పారిపోయారంటూ వచ్చిన ఫిర్యాదు మేరకు నటిపై పోలీసులు ఇటీవల కేసు నమోదు చేశారు. చికిత్స పొందుతూ విద్యార్థి మంగళవారం రాత్రి మరణించాడు.ఢికొట్టి..ఆపై పారిపోయి..ఈ నెల 25న ఈ ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంతో నందినీ 120 కి.మీ వేగంతో కారును నడుపుతూ ఓ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సమియుల్ హక్ అనే 21 ఏళ్ల పాలిటెక్నిక్ విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదం జరిగిన వెంటనే ఆమె గాయపడిన విద్యార్థికి సాయం చేయకుండా అక్కడ నుంచి పారిపోయింది. నందినీ కశ్యప్ మద్యం మత్తులో ఉందని, ప్రమాదం జరిగిన వెంటనే ఆమె ఆగకుండా అక్కడి నుండి పారిపోయిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. స్థానికులే అతన్ని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు.ఈ ఘటనపై హిట్ అండ్ రన్ సు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారాలతో నందినీని అరెస్టు చేసినట్లు సమాచారం. ఈ ఘటనపై సమియుల్ హక్ తల్లి విలపిస్తూ తన కొడుకుకు న్యాయం జరగాలని కోరుకుంటున్నానని అన్నారు.నందినీ కశ్యప్ అస్సామీ చిత్రసీమలో ప్రముఖ నటి, రంగస్థల ప్రదర్శనల్లో కూడా గుర్తింపు పొందారు. అస్సామీ సాంస్కృతిక నాటకాలు, థియేటర్ ప్రదర్శనల్లో ఆమె పాత్రలు స్థానిక కళా ప్రేమికుల నుండి ప్రశంసలు అందుకున్నాయి. -
వార్ 2 కోసం బ్రహ్మాస్త్ర టీమ్.. హృతిక్, కియారాలతో రొమాంటిక్ సాంగ్!
హృతిక్ రోషన్, ఎన్టీఆర్, కియారా అద్వానీ ప్రధాన పాత్రల్లో నటించిన స్పై యూక్షన్ మూవీ ‘వార్ 2’. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో యశ్ రాజ్ ఫిలింస్ పతాకంపై ఆదిత్యా చోప్రా నిర్మించిన ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఆగస్టు 14న రిలీజ్ కానుంది. కాగా ఈ సినిమా కోసం హృతిక్–కియారాలపై చిత్రీకరించిన ‘ఆవన్ జావన్ ...’ అనే పాటను అతి త్వరలోవిడుదల చేయనున్నట్లు వెల్లడించి, ఈ పాట ఫస్ట్లుక్ రోస్టర్ను విడుదల చేశారు మేకర్స్.‘‘హృతిక్ రోషన్ – కియారా అద్వానీ కెమిస్ట్రీ ‘అవన్ జావన్ ..’ ఈ సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఈ పాట కోసం సంగీత దర్శకుడు ప్రీతమ్, లిరిక్ రైటర్ అమితాబ్ భట్టాచార్య, గాయకుడు అరిజీత్ సింగ్ కలిసి పని చే శారు. గతంలో వీరి ముగ్గురి కాంబినేషన్లో వచ్చిన ‘బ్రహ్మాస్త్ర’ సినిమాలోని ‘కేసరియా...’ పాట ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సాంగ్ తరహాలోనే ‘ఆవన్ జావన్ ..’ కూడా ప్రేక్షకులను తప్పకుండా మెప్పిస్తుందనే నమ్మకం ఉంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది.కాగా... ఈ నెల 31న కియారా అద్వానీ బర్త్ డే. ఈ సందర్భంగా ‘ఆవన్ జావన్ ...’ పాటని రిలీజ్ చేస్తారని సమాచారం. ఇదిలా ఉంటే... హృతిక్ రోషన్ హీరోగా నటించిన ‘వార్’ (2019) సినిమాకు సీక్వెల్గా ‘వార్ 2’ రూపొందిన సంగతి తెలిసిందే. -
దేశంలో సంచలనం సృష్టించిన కేసుపై సినిమా ప్రకటన
మేఘాలయ హనీమూన్ మర్డర్పై సినిమా తీస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. కొద్దిరోజుల క్రితం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ కేసు గురించి త్వరలో వెండితెరపై చూపించనున్నారు. ఈ మేరకు 'హనీమూన్ ఇన్ షిల్లాంగ్' పేరుతో సినిమా తీస్తున్నట్లు బాలీవుడ్ దర్శకుడు ఎస్పీ నింబావత్ ప్రకటించారు. ఇప్పటికే అందుకు కావాల్సిన అనుమతులు కూడా రాజా రఘువంశీ కుటుంబ సభ్యుల నుంచి తీసుకున్నామని ఆయన తెలిపారు.తన సోదరుడి మృతి గురించి సినిమా తీసేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని సచిన్ పేర్కొన్నారు. ఇందులో తప్పు ఎవరది అనేది ప్రపంచం తెలుసుకుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో ఇలాంటి ఘోరాలు చేసేందుకు మరోకరు ముందుకు రాకూడదనే ఆలోచనతోనే ఈ సినిమా తీసేందుకు సిద్ధమయ్యమని దర్శకుడు నింబావత్ తెలిపారు. స్క్రిప్ట్ పనులు పూర్తయ్యాయని కూడా ఆయన అన్నారు. ఇండోర్, మేఘాలయలోనే సినిమా అంతా తెరకెక్కిస్తామన్నారు.మేఘాలయ హనీమూన్ కిల్లింగ్ స్టోరీ ఏంటి..?రాజా రఘువంశీ అనే యువకుడితో మే 11న సోనమ్ పెళ్లి జరిగింది. అదే నెల 20న నవదంపతులు హనీమూన్ (Meghalaya Honeymoon Murder Case) కోసం మేఘాలయ వెళ్లారు. కేవలం వెళ్లడానికే తప్ప తిరిగి రావడానికి టికెట్లు బుక్ చేసుకోలేదు. మే 23న దంపతులు స్కూటీపై ఓ టూరిస్ట్ స్పాట్ చూసేందుకు వెళ్లారు. తర్వాత కనిపించకుండా పోయారు. అదృశ్యమైన 11 రోజుల తర్వాత (జూన్ 2న) రఘువంశీ మృతదేహం లభ్యమైంది. అతడి శరీరంపై తీవ్ర గాయాలున్నాయి. అతడిని దగ్గరుండి చంపించింది మరెవరో కాదు భార్య సోనమ్. సోనమ్కు రాజాతో పెళ్లి ఇష్టం లేదు. కారణం.. అప్పటికే ఆమె రాజ్ కుష్వాహను ప్రేమిస్తోంది. ఇంట్లోవాళ్లు ఈ ప్రేమకు ఒప్పుకోలేదు. ఈ క్రమంలో తన ప్రియుడు రాజ్ కుష్వాహతో కలిసి భర్తను హత్య చేసింది. రఘువంశీ మరణం తర్వాత ఆమె ప్రియుడు ఏమీ తెలియనట్లుగా అంత్యక్రియలకు వెళ్లి మృతుడి తండ్రిని ఓదార్చాడు. -
వంద రూపాయలకే రూ.260 కోట్ల సినిమా.. ఎక్కడ చూడాలంటే?
బాలీవుడ్ స్టార్ హీరో అమిర్ ఖాన్ ఇటీవల సితారే జమీన్ పర్ అంటూ అభిమానులను పలకరించాడు. ఈ సినిమాకు ఆర్ఎస్ ప్రసన్న దర్శకత్వం వహించగా.. అమిర్ ఖాన్ నిర్మించారు. గతనెల 20న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. గతంలో విడుదలైన అమిర్ ఖాన్ చిత్రం తారే జమీన్ పర్ మూవీకి సీక్వెల్గా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.ఓటీటీకి ఇచ్చేది లేదన్న అమిర్..అయితే ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయబోనని అమిర్ ఖాన్ ఇప్పటికే ప్రకటించారు. అయితే తాను ముందుగానే ప్రకటించినట్లు యూట్యూబ్లో స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ విషయాన్ని అమీర్ ఖాన్ అధికారికంగా ప్రకటించారు. ఆగస్టు 1వ తేదీ నుంచి రూ. 100 చెల్లించి ఈ సినిమాను చూడవచ్చని తెలిపారు. ఈ చిత్రం ఆమిర్ ఖాన్ అధికారిక యూట్యూబ్ ఛానల్.. ఆమిర్ ఖాన్ టాకీస్: జనతా కా థియేటర్లో రూ. 100కు అందుబాటులో ఉండనుంది. -
ఓటీటీకి మౌనీ రాయ్ స్పై థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలు వచ్చాక డిఫరెంట్ కంటెంట్తో సినీ ప్రియులను అలరిస్తున్నాయి. క్రైమ్ థ్రిల్లర్తో పాటు క్రేజీ కంటెంట్తో ఓటీటీ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. సరికొత్త జానర్లతో వస్తోన్న వెబ్ సిరీస్లు ఆడియన్స్ ఆదరణ దక్కించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే మరో ఆసక్తికర వెబ్ సిరీస్ మిమ్మల్ని అలరించేందుకు వచ్చేస్తోంది. స్పై జానర్లో వస్తోన్న సలాకార్ అనే ఓటీటీలో సందడి చేయనుంది.దేశ భద్రత కోసం ధైర్యసాహసాల్ని ప్రదర్శించిన స్పై మాస్టర్ కథగా ఈ వెబ్ సిరీస్ను ఫరూక్ కబీర్ దర్శకత్వంలో తెరకెక్కించారు. రియల్ స్టోరీ ఆధారంగా వస్తోన్న ఈ సిరీస్ ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది. ఆగస్టు 8వ తేదీ నుంచి జియో హాట్ స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ సిరీస్ ట్రైలర్ విడుదల చేస్తూ.. ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ అధికారికంగా వెల్లడించింది. సలకార్ వెబ్ సిరీస్ను హిందీతో పాట దక్షిణాది భాషల్లోనూ అందుబాటులో ఉండనుంది. ఈ వెబ్ సిరీస్లో మౌనీ రాయ్, నవీన్ కస్తూరియా ప్రధాన పాత్రల్లో నటించారు. -
షూటింగ్ కోసం వెళ్తే.. ముద్దు పెట్టుకోవాలని ఉందన్నాడు: నటి
సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. స్టార్ హీరోయిన్ల నుంచి క్యారెక్టర్ ఆరిస్టుల వరకు ఎంతోమంది అమ్మాయిలు ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఎదుర్కొంటున్నారు. అవకాశాల పేరుతో వారిని లొంగదీసుకోవడమే కాకుండా లైంగిక వేధింపులకూ గురి చేస్తున్నారు. అయితే ఇప్పుడిప్పుడే చాలా మంది ఈ వేధింపులపై తిరగబడుతున్నారు. తమను వేధించిన వారిపై కేసులు పెట్టడమే కాకుండా మీడియా ముఖంగా వారి బాగోతాలను బటయపెడుతున్నారు. తాజాగా మరో నటి, ‘తారక్ మెహతా కా ఊల్టా చష్మా’ఫేంజెన్నిఫర్ మిస్త్రీ(Jennifer Mistry ) కూడా ఓ నిర్మాతతో తనకు ఎదురైన ఛేదు అనుభవాన్ని మీడియాతో పంచుకుంది. షూటింగ్ కోసం విదేశాలకు వెళ్తే..గదిలోకి రమ్మని వేధించాడని, అంతేకాకుండా తన గురించి పచ్చిగా మాట్లాడని చెప్పింది.తారక్ మెహతా కా ఊల్టా చష్మా’లో మిసెస్ రోషన్ సోధీ పాత్ర పోషించి అందరిని ఆకట్టుకున్న జెన్నిఫర్ మిస్త్రీ. ఆ షో నిర్మాత అసిత్ కుమార్ మోదీ( Asit Kumarr Modi ) వల్ల ఎంతో మానసిక క్షోభను అనుభవించిందట. 2018లో షో ఆపరేషన్స్ హెడ్ సోహైల్ రమణితో గొడవ జరిగింది. అతనిపై ఫిర్యాదు చేద్దామని నిర్మాత అసిత్ కుమార్ మోదీ దగ్గరకు వెళ్లాను. కానీ అక్కడ ఆయన స్పదన చూసి షాకయ్యాను. నా ఫిర్యాదు పట్టించుకోకుండా ‘నువ్వు చాలా సెక్సీగా ఉన్నావ్’ అన్నారు. అలాగే 2019లో షూటింగ్ కోసం సింగపూర్ వెళ్తే.. అసిత్ నన్ను గదిలోకి రమ్మన్నాడు. తనతో గదిలోకి వచ్చి విస్కీ తాగాలని బలవంతం చేశాడు. కానీ నేను పట్టించుకోలేదు. దీంతో అతను మోనికా భడోరియా (బావ్రీ) దగ్గరకు వెళ్లి ఇలాగే మాట్లాడారు. ఆ మరుసటి రోజు మేమంతా కాఫీ తాగుతుంటే..అతను నా దగ్గరకు వచ్చి నీ పెదాలు చాలా సెక్సీగా ఉన్నాయి. నాకు ముద్దు పెట్టుకోవాలని ఉంది’ అని అన్నాడు. ఆయన మాటలను పట్టించుకోకుండా ఉండటానికి ప్రయత్నించినప్పటికీ అవి నాపై తీవ్ర ప్రభావం చూపాయి’ అని ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జెన్నిఫర్ మిస్త్రీ చెప్పుకొచ్చింది. -
మాంచెస్టర్లో ఇంగ్లాండ్ ప్లేయర్ల హైడ్రామా.. బెన్ స్టోక్స్పై అమితాబ్ సెటైర్లు!
టీమిండియా నాలుగో టెస్ట్ మ్యాచ్పై బిగ్ బీ అమితాబ్ బచ్చన్ స్పందించారు. మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రాఫోర్డ్లో చివర్లో జరిగిన హైడ్రామాపై సోషల్ మీడియా వేదికగా అమితాబ్ రియాక్ట్ అయ్యారు. ట్విటర్ వేదికగా చేసిన పోస్ట్కు తనదైన శైలిలో క్యాప్షన్ రాసుకొచ్చారు. అరే.. మనోడు తెల్లోడికి టీకా ఇచ్చిపడేశాడు అంటూ ట్వీట్ చేశారు. ఇది కాస్తా నెట్టంట వైరల్ కావడంతో ఫ్యాన్స్ సైతం ఈ పోస్ట్ రీపోస్ట్ చేస్తున్నారు.అయితే ఫోర్ట్ టెస్ట్లో జడేజా, సుందర్ సెంచరీకి చేరువలో ఉన్న సమయంలో ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ డ్రాకు అంగీకరించాలని జడేజాను కోరాడు. కానీ జడేజా, సుందర్ మ్యాచ్ను ముగించేందుకు నిరాకరించారు. అప్పటికీ ఇంకా 15 ఓవర్ల ఆట మిగిలి ఉండడంతో భారత బ్యాట్స్మెన్ డ్రాకు నిరాకరించారు. బెన్ స్టోక్స్ డ్రా ఆఫర్ను తిరస్కరించాక.. జడేజా, సుందర్ తమ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. ఆ తర్వాత ఇరు జట్ల కెప్టెన్ల అంగీకారంతో టెస్ట్ డ్రాగా ముగించారు. మ్యాచ్ చివర్లో ఇంగ్లాండ్ ప్లేయర్లు చేసిన హంగామాతో సోషల్ మీడియాలో ట్రోల్ పెద్దఎత్తున వైరలయ్యాయి. కాగా.. ఈ మ్యాచ్లో జడేజా 107 పరుగులు సాధించగా.. వాషింగ్టన్ సుందర్ 101 రన్స్తో నాటౌట్గా నిలిచారు.ఇక సినిమాల విషయానికొస్తే అమితాబ్ బచ్చన్ సెక్షన్ 84 అనే చిత్రంలో కనిపించనున్నారు. ఇందులో నిమ్రత్ కౌర్, డయానా పెంటీ, అభిషేక్ బెనర్జీ కీలక పాత్రల్లో నటించారు. ఆ తర్వాత టాలీవుడ్ మూవీ కల్కి 2898 ఏడీ పార్ట్-2లో నటించనున్నారు. Take !?? अरे गोरे को टिका (tika - sorry tayka diya ) दिया रे !!🤣 https://t.co/1ybakYvNFM— Amitabh Bachchan (@SrBachchan) July 27, 2025 -
నీతో పరిచయానికి ఏడేళ్లు.. ఆ బంధాన్ని గుర్తు చేసుకున్న హీరోయిన్ మాజీ ప్రియుడు!
బాలీవుడ్ నటి, ప్రపంచసుందరి సుస్మితాన్ సేన్ పేరు అందరికీ సుపరిచితమే. బాలీవుడ్లో పలు చిత్రాల్లో మెప్పించిన ముద్దుగుమ్మ ప్రస్తుతం సినిమాలేవీ చేయట్లేదు. చాలా ఏళ్ల తర్వాత ఎంట్రీ ఇచ్చిన సుస్మితా ఆర్య అనే వెబ్ సిరీస్లో కనిపించింది. ఆ తర్వాత తాలి అనే వెబ్ సిరీస్తో మరోసారి అభిమానులను ఆకట్టుకుంది. అయితే సినిమాల్లో సక్సెస్ అయిన సుస్మితా సేన్.. వ్యక్తిగత జీవితంలో మాత్రం విఫలమైంది. చాలామందితో డేటింగ్ చేసిన ఆమె.. ఎవరినీ కూడా తన జీవిత భాగస్వామిగా అంగీకరించలేకపోయింది. ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీతో లవ్లో పడ్డప్పటికీ ఈ ప్రేమ ఎంతోకాలం నిలవలేకపోయింది. ఆ తర్వాత మోడల్ రోహ్మన్ షాతో ప్రేమలో పడింది. కానీ వీరిద్దరు ప్రేమ మూడేళ్లు కూడా నిలవలేదు. 2018లో మొదలైన వీరి పరిచయం మూడేళ్లకే బ్రేకప్ అయింది. అయినప్పటికీ వీరిద్దరు ఫ్రెండ్స్గానే కొనసాగుతున్నారు.ఈ సందర్భంగా మాజీ ప్రియుడు రోహ్మన్ షాల్ తమ బంధాన్ని గుర్తు చేసుకున్నారు. నేటికి మన పరిచయానికి ఏడేళ్లు అంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. సుస్మితా సేన్తో సన్నిహితంగా ఉన్న ఫోటోను షేర్ చేశారు. జీవితంలో అనే విషయాలను నీ వద్ద నేర్చుకున్నానని పోస్ట్లో రాసుకొచ్చారు. నీతో పరిచయం తర్వాత నా జీవితం చాలా మారిపోయిందని ఇన్స్టాలో పంచుకున్నారు.రోహ్మన్ తన ఇన్స్టాలో రాస్తూ.. 'మన స్నేహానికి నేటికి 7 సంవత్సరాలు. కొన్ని కథలు వాటి శీర్షికలను మించిపోతాయి. కానీ వాటి అర్థం ఉండదు. నేను మీకు చెస్ నేర్పించాను. కానీ మీరు నన్ను కనికరం లేకుండా ఓడించారు. మీరు నాకు ఈత నేర్పించారు. నా లైఫ్లో బెస్ట్ హెయిర్ కట్స్ చేసినందుకు నేను మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పగలను. మేము మా పాత్రలు, భయాలు, బలాలను కూడా మార్చుకున్నాం. నీ ప్రేమకు, నీ నిశ్శబ్ద స్నేహానికి కృతజ్ఞతలు సుస్మితా సేన్' అంటూ పోస్ట్ చేశారు. కాగా.. సుష్మితా సేన్తో ఉన్న ఫోటోలు ఇద్దరు ఒకే జాకెట్ ధరించి కనిపించారు. View this post on Instagram A post shared by rohman shawl (@rohmanshawl) -
'కోట్ల రూపాయల అభిమానం.. చనిపోయే ముందు రూ.72 కోట్ల ఆస్తి రాసిచ్చింది'
బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ వరుస సినిమాలతో అభిమానులను అలరిస్తున్నాడు. సంజయ్ దత్కు కేవలం బాలీవుడ్లో మాత్రమే కాదు.. దక్షిణాదిలోనూ ఫేమస్ అయ్యారు. ప్రస్తుతం టాలీవుడ్లో ది రాజాసాబ్, అఖండ-2 చిత్రాల్లో నటిస్తున్నారు. వీటితో పాటు బాలీవుడ్లో దురంధర్, కన్నడలో కెడి - ది డెవిల్లో కనిపించనున్నారు. ఈ ఏడాది వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయారు సంజయ్ దత్.అయితే తాజాగా ఓ షాకింగ్ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు సంజయ్ దత్. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆయన.. ఓ అభిమాని తనకు రూ.72 కోట్ల ఆస్తిని రాసిచ్చిందని వెల్లడించారు. ఓ మహిళా అభిమాని తాను చనిపోయేముందు తన ఆస్తినంతా నా పేరుమీద రాసిందని పంచుకున్నారు. అయితే ఆ డబ్బుతో తాను ఏమి చేశాడో కూడా వెల్లడించారు. ఆ ఆస్తి మొత్తాన్ని మహిళ కుటుంబానికి తిరిగి ఇచ్చానని సంజయ్ దత్ తెలిపారు.కాగా..సంజయ్ దత్ 1981లో రాకీ చిత్రంతో బాలీవుడ్లో అడుగుపెట్టారు. ఆ తర్వాత విధాత, నామ్, సాజన్, ఖల్ నాయక్, వాస్తవ్ లాంటి చిత్రాలలో నటించారు. ప్రస్తుతం బాలీవుడ్తో పాటు దక్షిణాదిలోనూ సినిమాల్లో అలరిస్తున్నారు. -
అమిర్ ఖాన్ ఇంటికి 25 మంది ఐపీఎస్ అధికారులు.. ఎందుకు వచ్చారంటే?
బాలీవుడ్ స్టార్ హీరో అమిర్ ఖాన్ ఇటీవలే సితారే జమీన్ పర్ మూవీతో అభిమానులను అలరించారు. గతనెలలో థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ను సొంతం చేసుకుంది. 2018లో రిలీజైన సినిమాకు సీక్వెల్గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రస్తుతం రజినీకాంత్ హీరోగా వస్తోన్న కూలీ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనున్నారు.అయితే సినిమాల సంగతి పక్కనపెడితే.. అమిర్ ఖాన్ ఇంటికి ఐపీఎస్ అధికారులు రావడం బాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. అమిర్ ఇంటికి ఐపీఎస్ అధికారులు వచ్చిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలైంది. ఇది చూసిన ఫ్యాన్స్ అసలు ఎందుకు వచ్చారని ఆరా తీస్తున్నారు. అంతమంది ఐపీఎస్ అధికారులు రావడానికి కారణాలపై చర్చించుకుంటున్నారు.ఈ నేపథ్యంలోనే అమిర్ ఖాన్ టీమ్ స్పందించింది. ఐపీఎస్ అధికారుల ఆకస్మికంగా అమిర్ ఇంటికి రావడంపై కచ్చితమైన వివరాలు తెలియవని అమిర్ టీమ్ తెలిపింది. మేము కూడా అమిర్ ఖాన్ సంప్రదించి పూర్తి వివరాలు తెలియజేస్తామని వెల్లడించారు. అయితే ప్రస్తుతం శిక్షణలో ఉన్న ఐపీఎస్ శిక్షణార్థులు ఆమిర్ ఖాన్తో సమావేశం అయ్యారని సమాచారం. వారందరికీ హీరో తన నివాసంలో ఆతిథ్యం ఇచ్చారని ఆ బృందంలోని ఒక సభ్యుడు వెల్లడించినట్లు తెలుస్తోంది. View this post on Instagram A post shared by Instant Bollywood (@instantbollywood) -
ఆ హీరో నిజంగానే నా పీక కోశాడు: బాలీవుడ్ నటుడు
నెగెటివ్ పాత్రలు చేయడం అంత ఈజీ కాదు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా నటుల ప్రాణాలకే ప్రమాదం.. కొన్ని యాక్షన్ సీన్లలో అయితే వీరు చావు చివరి అంచులవరకు కూడా వెళ్లి వస్తుంటారు. తనకూ అలాంటి పరిస్థితే ఏర్పడిందంటున్నాడు బాలీవుడ్ నటుడు అశోక్ సరఫ్ (Ashok Saraf). ఎక్కువగా కామెడీ పాత్రల్లోనే అలరించిన ఈయన జాగృతి (1992) మూవీలో విలన్గా నటించాడు. ఇందులో సల్మాన్ ఖాన్ హీరోగా నటించాడు. నా మెడపై కత్తిపెట్టి..జాగృతి చిత్రీకరణ సమయంలో జరిగిన ఓ సంఘటనను అశోక్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. హీరో సల్మాన్ (Salman Khan) నా పీకపైన కత్తిపెట్టాల్సిన సన్నివేశం అది! ఆయన నిజమైన కత్తి పట్టుకున్నాడు. ఇద్దరం డైలాగ్స్ చెప్తున్నాం. ఆయన చాలా గట్టిగా కత్తిని అదిమిపట్టుకున్నాడు. అది నా మెడకు గుచ్చుకుంటోంది. అతడి చేతుల్లో నుంచి తప్పించుకోవాలనిపించింది. ఆ కత్తిని కిందపడేయమన్నాను. కానీ సల్మాన్.. కత్తి కిందపడేయకుండా కెమెరా మనవైపే ఉంది. ఏం చేయమంటావని అడిగాడు. ఓపక్క రక్తం కారుతున్నా..కెమెరా నావైపే ఉన్నట్లర్థమై సీన్ కంటిన్యూ చేశాం. ఇద్దరం డైలాగ్స్ చెప్పాం. తర్వాత చూసుకుంటే నా మెడ కట్ అయింది. కాస్త లోతైన గాయం ఏర్పడి రక్తం కారుతోంది. ఏమాత్రం నరాలు కట్ అయినా నా చాప్టర్ అక్కడే క్లోజ్ అయ్యేది. మరి సల్మాన్కు ఈ సంఘటన గుర్తుందో, లేదో? అయినా ఇలాంటివాటిని ఎవరూ గుర్తుపెట్టుకోరు, అక్కడే మర్చిపోతారు అని చెప్పుకొచ్చాడు.సినిమాసల్మాన్, అశోక్.. జాగృతి చిత్రంతో పాటు కరణ్ అర్జున్, ప్యార్ కియా తో డర్నా క్యా, బంధన్ వంటి పలు సినిమాల్లో నటించారు. ఇకపోతే సల్మాన్ చివరగా సికందర్ చిత్రంలో కనిపించాడు. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయింది. ప్రస్తుతం ఇతడు.. కిక్ సీక్వెల్తో పాటు గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణల ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రంలో నటిస్తున్నాడు.చదవండి: నువ్వు లేకపోతే నేను ఏమైపోయేదాన్నో..:కల్యాణి ప్రియదర్శన్ -
విశ్వంభర స్పెషల్ సాంగ్లో బుల్లితెర నటి.. రెమ్యునరేషన్ ఎంతంటే?
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi Konidela) హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ విశ్వంభర (Vishwambhara Movie). బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మధ్యే డైరెక్టర్ సినిమా కథ కూడా బయటపెట్టేశాడు. 'మనకు తెలిసినవి 14 లోకాలే.. ఈ పద్నాలుగు లోకాలకు పైనున్న లోకమే సత్యలోకం. విశ్వంభర కోసం వీటన్నింటినీ దాటుకుని పైకి వెళ్లాం. ఆ లోకంలో ఉండే హీరోయిన్ను హీరో వెతుక్కుంటూ వెళ్లి ఆమెను భూమి మీదకు ఎలా తీసుకొచ్చాడు? అన్నదే సినిమా కథ' అని చెప్పాడు.తెలుగులో తొలిసారి..సినిమా చిత్రీకరణ ఇటీవలే పూర్తయింది. బ్యాలెన్స్ ఉన్న స్పెషల్ సాంగ్ కూడా రెండు రోజుల క్రితమే పూర్తి చేశారు. ఈ పాటలో బుల్లితెర సీరియల్స్లో విలనిజం పండించిన మౌనీ రాయ్ను సెలక్ట్ చేశారు. ఈమె చిరుతో కలిసి తొలిసారి చిందేసింది. అంతేకాదు, టాలీవుడ్లో ఆమె నటించడం కూడా ఇదే మొదటిసారి! ఈ పాటకు గణేశ్ ఆచార్య కొరియోగ్రఫీ అందించాడు. అయితే ఆమె ఈ సినిమాకు ఎంత డబ్బు తీసుకుందన్న చర్చ మొదలైంది. నిమిషానికి లక్షల్లో..సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న కథనాల ప్రకారం.. మౌనీ రాయ్ నాలుగైదు నిమిషాల పాటకుగానూ రూ.50 లక్షలు తీసుకున్నట్లు తెలుస్తోంది. మౌనీ రాయ్.. నాగిణి సీరియల్తోనే చాలామందికి పరిచయం. ఈ పాటలో కూడా ఆమె నాగిణిగా కనిపించనుందన్న ప్రచారం జరుగుతోంది. ఇదెంతవరకు నిజమన్నది క్లారిటీ రావాల్సి ఉంది.విశ్వంభర ఆలస్యం?నిజానికి ఈ పాట కోసం మొదట బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ను సంప్రదించారట! కానీ, ఆమె రూ.8 కోట్లు డిమాండ్ చేయడంతో తనను పక్కన పెట్టేశారని తెలుస్తోంది. విశ్వంభర చిత్రంలో త్రిష కథానాయికగా నటిస్తుండగా ఇషా చావ్లా, ఆషికా రంగనాథ్ కీలక పాత్రలు పోషించారు. కీరవాణి సంగీత దర్శకుడిగా వ్యవహరించారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్లో రిలీజ్ చేయాలనుకున్నారు, కానీ వీఎఫ్ఎక్స్ పనుల వల్ల సినిమా మరింత వాయిదా పడే అవకాశమున్నట్లు కనిపిస్తోంది.చదవండి: 10 ఏళ్లుగా డిప్రెషన్.. చనిపోతానని నాన్న ఎప్పుడో చెప్పాడు -
పెళ్లి-పిల్లలు.. ఈ రెండూ కావాలి: మృణాల్ ఠాకూర్
హిందీ, తెలుగు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur). 32 ఏళ్ల ఈ మహారాష్ట్ర బ్యూటీ సీతారామం చిత్రంతో టాలీవుడ్కు ఎంట్రీ ఇచ్చింది. ఇక్కడ తొలి చిత్రంతోనే సూపర్ హిట్ అందుకున్న ఠాగూర్కు అక్కడ వరుస అవకాశాలు వచ్చాయి. అదేవిధంగా సీతారామం చిత్రం తమిళంలోనూ అనువాదమై అక్కడా మంచి గుర్తింపు లభించింది. దీంతో కోలీవుడ్లోనూ అవకాశాలు తలుపుతట్టాయి. అలా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో మదరాశి చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. అయితే ఏమైందో ఏమోకానీ, ఆ అవకాశాన్ని మృణాల్ ఠాకూర్ చేజార్చుకుంది. అప్పటినుంచి ఇప్పటివరకు తమిళ చిత్రపరిశ్రమ ఆమె వైపు చూడడం లేదు. ప్రస్తుతం హిందీలో మూడు చిత్రాలు చేస్తూ బిజీగా ఉన్న ఈ అమ్మడు తెలుగులో డకాయిట్ మూవీలో యాక్ట్ చేస్తోంది. అదేవిధంగా అల్లు అర్జున్ సరసన నటించే మరో లక్కీఛాన్స్ ఈ బ్యూటీని వరించినట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఈ బ్యూటీ పెళ్లి గురించి తన మనసులోని మాటను బయటపెట్టింది. పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలన్నది తన చిన్న వయసు నుంచే కల అని పేర్కొంది. అయితే ప్రస్తుతం తన దృష్టి అంతా చిత్ర పరిశ్రమపైనే ఉందని, సినిమాల్లో బాగా సక్సెస్ అవ్వాలని తెలిపింది.చదవండి: కెరీర్ పతనంతో డిప్రెషన్.. పిచ్చాసుపత్రిలో ట్రీట్మెంట్? 25 ఏళ్లుగా మిస్సింగ్ -
కుమార్తె గ్రాడ్యుయేషన్... ఏఆర్ రెహమాన్ పోస్ట్ వైరల్!
ఆస్కార్ అవార్డ్ గ్రహీత, మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ తన కూతురు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. తన కుమార్తె పట్టభద్రురాలైందని వెల్లడించారు. స్విట్జర్లాండ్లోని గ్లియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్లో తన విద్య పూర్తి చేసుకుందని తెలిపారు. హాస్పిటాలిటీ, ఎంటర్ప్రెన్యూర్షిప్, ఇన్నోవేషన్ కోర్సులో రహీమా మాస్టర్ ఆఫ్ సైన్స్ పూర్తి చేసింది. ఈ విషయాన్ని ఏఆర్ రెహమాన్ ఆనందంగా వ్యక్తం చేస్తూ అభిమానులతో పంచుకున్నారు.కాగా.. ఏఆర్ రెహమాన్ ప్రస్తుతం నార్త్ అమెరికాలో తన వండర్మెంట్ టూర్లో బిజీగా ఉన్నారు. మరోవైపు రెహమాన్కు సైరా బానుతో 1995లో వివాహం జరిగింది. ఈ జంటకు రహీమాతో పాటు ఖతీజా, అమీన్ అనే మరో ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే దాదాపు మూడు దశాబ్దాల తర్వాత ఏఆర్ రెహమాన్, తన భార్య సైరా బానుతో విడిపోయారు. గతేడాది నవంబర్లో విడిపోతున్నట్లు ప్రకటించారు. View this post on Instagram A post shared by ARR (@arrahman) -
కెరీర్ పతనంతో డిప్రెషన్.. పిచ్చాసుపత్రిలో ట్రీట్మెంట్? 25 ఏళ్లుగా మిస్సింగ్
ఆ రంగు, లుక్స్ చూసి ఫ్యూచర్ హీరో అనుకున్నారు. కొన్ని సినిమాలతోనే చాక్లెట్ బాయ్గా పేరు తెచ్చుకున్నాడు. అంతలోనే నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు చేసి విలనిజం కూడా చేయగలనని హింటిచ్చాడు. సినిమాలకే ఎందుకు పరిమితం కావాలనుకున్నాడో ఏమో కానీ బుల్లితెరపైనా తళుక్కుమని మెరిశాడు. రెండుచోట్లా గుర్తింపు సంపాదించుకున్న ఆయన 25 ఏళ్లుగా కనిపించకుండా పోయాడు. అతడే బాలీవుడ్ నటుడు రాజ్ కిరణ్..అగ్రతారగా ఎదుగుతాడనుకునేలోపే..రాజ్ కిరణ్ (Actor Raj Kiran).. 1975లో 'కాగజ్ కీ నవో' చిత్రంతో కెరీర్ ప్రారంభించాడు. రిషి కపూర్, గోవింద, అనిల్ కపూర్, శ్రీదేవి, రేఖ, హేమమాలిని వంటి పలువురు అగ్రతారలతో కలిసి పనిచేశాడు. బషీర, కర్జ్, అర్థ్, తేరి మెహర్బనియన్, మజ్దూర్, ఘర్ ఏక్ మందిర్.. వంటి ఎన్నో విజయాలను సొంతం చేసుకున్నాడు! వాకిట్లో ఎప్పుడూ విజయాలే సిద్ధంగా ఉంటాయా? మొదట్లో ఎంతో సక్సెస్ చూసిన రాజ్కిరణ్ తర్వాత ఫ్లాపుల్ని కూడా చూశాడు. కొన్ని సినిమాలైతే అర్ధాంతరంగా ఆగిపోయేవి. అంతా ఓకే అయ్యాక, షూటింగ్ కూడా మొదలుపెట్టాక అటకెక్కేవి. ఇలా తన కెరీర్ కిందకుపడిపోవడాన్ని చూసి తట్టుకోలేకపోయాడు. డిప్రెషన్కు వెళ్లిపోయాడు. 25 ఏళ్లుగా మిస్సింగ్దీంతో 2000వ సంవత్సరంలో మానసిక ఆరోగ్య కేంద్రంలో చేరినట్లు తెలుస్తోంది. దర్శకుడు మహేశ్ భట్ కూడా అతడిని చూసేందుకు పలుమార్లు వెళ్లొచ్చాడంటుంటారు. కానీ తర్వాత రాజ్కిరణ్ కనిపించకుండా పోయాడు. అతడి గురించి ఇంటిసభ్యులు వెతకని చోటంటూ లేదు. రిషికపూర్, దీప్తి నావల్.. సిటీ అంతా జల్లెడ పట్టారు. రోజులు నెలలయ్యాయి. నెలలు సంవత్సరాలయయ్యాయి. అయినా అతడి జాడలేదు. 25 ఏళ్లుగా అతడు కనిపించకపోవడం అనేది ఒక మిస్టరీగానే మిగిలిపోయింది.పిచ్చి ఆస్పత్రి నుంచి..నటుడి మిస్సింగ్ గురించి ఎన్నో రకాల ఊహాగానాలు ప్రచారంలో ఉన్నాయి. ముంబైలోని బైకుల్లా పిచ్చి ఆస్పత్రిలో రాజ్కిరణ్ ఉండేవాడని, అక్కడినుంచి సడన్గా మాయమైపోడని అంటుంటారు. కొందరేమో అట్లాంటాలోని పిచ్చాసుపత్రిలో ఉన్నాడంటారు. మరికొందరేమో న్యూయార్క్లో టాక్సీ డ్రైవ్ చేస్తూ కనిపించాడని చెప్తుంటారు. 2000వ సంవత్సరంలో రాజ్ కిరణ్ అదృశ్యమయ్యేనాటికి అతడి భార్య రూప, కూతురు రిషిక ఉన్నారు.ఎప్పటికైనా తిరిగొస్తాడని..తండ్రి ఎక్కడో ఒక చోట క్షేమంగానే ఉండుంటాడని, ఎప్పటికైనా తిరిగి వస్తాడని ఆశగా ఎదురుచూస్తోంది కూతురు రిషిక మహతని. తన తండ్రి అట్లాంటాలో పిచ్చాసుపత్రిలో ఉన్నాడన్న ప్రచారాన్ని సైతం ఖండించింది. పోలీసులు, డిటెక్టివ్ల సాయంతో తండ్రిని వెతికిస్తున్నామంది. అయినా ఇంతవరకు ఎటువంటి క్లూ కూడా దొరకలేదు. ఏళ్లు గడుస్తున్నా భర్త తిరిగిరాకపోవడంతో రూప రెండో పెళ్లి చేసుకుందని సమచారం.మాట నిలబెట్టుకోలేకపోయిన నటిరాజ్కిరణ్ కోసం సల్మాన్ ఖాన్ మాజీ ప్రేయసి, నటి సోమి అలీ కూడా తెగ వెతికింది. నీ క్లోజ్ ఫ్రెండ్ ఎక్కడుతన్నా వెతికి తీసుకొస్తాను అని రిషి కపూర్కు మాటిచ్చింది. 20 ఏళ్లపాటు వెతికినా ఫలితం లేకపోయింది. అసలు రాజ్ కిరణ్ ఎక్కడున్నాడు? ఏం చేస్తున్నాడు? ఎందుకు కనిపించకుండా పోయాడు? ప్రస్తుతం బతికే ఉన్నాడా? లేదా? అన్నది ఇప్పటికీ ఓ మిస్టరీగానే మిగిలిపోయింది.చదవండి: శ్రావణమాస ఉపవాసం.. రాత్రి మటన్ వండుకుని తిన్నా: హీరోయిన్ -
తండ్రైన ఛావా నటుడు.. సోషల్ మీడియాలో పోస్ట్
ఈ ఏడాది ఫిబ్రవరిలో వచ్చి బాక్సాఫీస్ను షేక్ చేసిన చిత్రం ఛావా. విక్కీ కౌశల్, రష్మిక కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాను ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా తెరకెక్కించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ఛావా బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.800 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రానికి లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించారు. అయితే ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు వినీత్ కుమార్ సింగ్ కీలక పాత్రలో మెప్పించారు.తాజాగా ఛావా నటుడు వినీత్ కుమార్ సింగ్ తండ్రైనట్లు ప్రకటించారు. ఈనెల 24న బాబు పుట్టాడని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ ఏడాది మే నెలలో తన భార్య రుచిరా గర్భంతో ఉన్నారని శుభవార్త చెప్పారు. తాజాగా ఈ జంట తమ మొదటి బిడ్డకు స్వాగతం పలికారు. కాగా.. వినీత్ కుమార్ సింగ్ 2021లో నటి రుచిరాను పెళ్లాడారు. ఈ విషయం తెలుసుకున్న 12th ఫెయిల్ నటుడు విక్రాంత్ మాస్సే అభినందనలు తెలిపారు. మీ చిన్నారిని కలిసేందుకు ఆసక్తిగా ఉన్నానంటూ తెలిపారు.కాగా.. వినీత్ కుమార్ సింగ్ ముక్కాబాజ్, గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్ లాంటి చిత్రాలతో బాలీవుడ్లో ఫేమస్ అయ్యారు. ఈ ఏడాది ఛావా మూవీతో బ్లాక్బాస్టర్ హిట్ అందుకున్నారు. ఈ చిత్రంలో చందోగమాత్య కవి కలష్ పాత్రలో కనిపించాడు. అంతేకాకుండా ఈ ఏడాది విడుదలైన జాట్ మూవీతోనూ కనిపించారు. అంతకుముందు 'సూపర్బాయ్స్ ఆఫ్ మాలెగావ్', గుంజన్ సక్సేనా, గుస్పాతియా, మ్యాచ్ ఫిక్సింగ్' లాంటి సినిమాలతో పాటు రంగ్బాజ్ అనే వెబ్ సిరీస్లోనూ నటించారు. View this post on Instagram A post shared by Viineet Kumar Siingh (@vineet_ksofficial) -
శ్రావణమాస ఉపవాసం.. రాత్రి మటన్ వండుకుని తిన్నా: హీరోయిన్
శ్రావణమాసంలో చాలామంది మాంసాహారానికి దూరంగా ఉంటారు. పూజలు, వ్రతాలు, ఉపవాసాలు అంటూ ఎక్కువగా దైవారాధానలోనే మునిగిపోతారు. ఆధ్యాత్మికబాటలో నడుస్తున్నానని చెప్పిన హీరోయిన్ తనుశ్రీ దత్తా (Tanushree Dutta) కూడా శ్రావణ ఉపవాసం చేస్తోంది. కానీ మాంసాహారం తింటోంది. అదేంటో మీరే చదివేయండి..చంపడానికి ప్రయత్నాలుసినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న తనుశ్రీ దత్తా ఇటీవల కన్నీళ్లు పెట్టుకుంటూ ఓ వీడియో షేర్ చేసింది. నటుడు నానాపటేకర్.. తనకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాడంది. తన మనుషులతో రాత్రిపూట ఇంటి బయట శబ్దాలు చేస్తూ భయపెడుతున్నారంది. బాలీవుడ్ మాఫియా చాలా పెద్దదని, సుశాంత్ సింగ్ రాజ్పుత్లాగే తననూ చంపడానికి ప్రయత్నిస్తున్నారని సంచలన ఆరోపణలు చేసింది. ఈ వీడియోలు వైరల్ కావడంతో ఇంటర్వ్యూల కోసం ఆమెను చాలామంది సంప్రదించారు. రోజంతా ఉపవాసం.. రాత్రవగానే..దానికామె కొన్నేళ్లుగా ఆధ్యాత్మిక జీవనశైలికి అలవాటు పడ్డానని, అందుకే మీడియా ముందుకు రావడం లేదని పేర్కొంది. కట్ చేస్తే.. తాజాగా ఇన్స్టాగ్రామ్లో శ్రావణమాసం సందర్భంగా మటన్ తింటున్నట్లు తెలిపింది. కొట్టు నుంచి తెచ్చుకున్న మటన్ను చూపిస్తూ.. రోజంతా తినకుండా ఉన్నానని, రాత్రి 7 గంటలకు మటన్ తిని ఉపవాసం పూర్తి చేశానంది. "ఎవరైనా మీ మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీసేలా టార్చర్ చేస్తుంటే మీరు తినే ఆహారంపై శ్రద్ధ పెట్టండి. మటన్ వండుకుని తిన్నాఎందుకంటే ఆహారమే అసలైన మెడిసిన్. శ్రావణమాసం కావడంతో రాత్రి ఏడు గంటల వరకు ఉపవాసమున్నాను. ఆ తర్వాత అధిక పోషకాలున్న పప్పు, మటన్ వండుకుని డిన్నర్ చేశాను. ఉపవాసాలు మరీ కఠినంగా ఉండాల్సిన అవసరం లేదు. ఎవరి అవసరాలకు తగ్గట్లుగా వారు దాన్ని మార్చుకోవచ్చు. నాకైతే ఇలాంటి ఉపవాసమే బాగా పనిచేస్తుంది" అని చెప్పుఒకచ్చింది. అందుకే లావైపోతున్నావ్శ్రావణంలో మటన్ తినడమేమో కానీ ఏకంగా ఉపవాసం రోజు మటన్ తినడమేంటని నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. ఓ వ్యక్తి అయితే నువ్వు కొవ్వు ఎక్కువగా తింటున్నావు, అందుకే లావవుతున్నావు అని కామెంట్ చేశాడు. దానికి తనుశ్రీ స్పందిస్తూ.. ముందుగా నా శరీరం గురించి కామెంట్ చేసేందుకు నీకు ఎటువంటి అర్హత లేదు. రెండోది.. బక్కపల్చగా లేనేమోకానీ ఫిట్గానే ఉన్నాను. ఎటువంటి డ్రెస్ వేసుకున్నా అందంగానే కనిపిస్తాను. కాబట్టి బొద్దుగా, అందంగా ఉండేవాళ్లను బాడీషేమింగ్ చేయడం ఆపండి. కొవ్వు మంచిదే!ప్రతి ఒక్కరూ సన్నగా ఉండాలని కోరుకోరు. అయినా కాస్త కొవ్వు పదార్థాలు తిన్నంతమాత్రాన శరీరంలో కొవ్వు చేరదు. ఆరోగ్యకరమైన కొవ్వు తీసుకోవడం వల్ల సన్నగా కూడా అవుతారు. మన శరీరం బాగా పనిచేయడానికి హెల్తీ ఫ్యాట్స్ అవసరం అని చెప్పుకొచ్చింది. హిందీలో అనేక సినిమాలు చేసిన తనుశ్రీ దత్తా.. తెలుగులో వీరభద్ర మూవీలో యాక్ట్ చేసింది. View this post on Instagram A post shared by Tanushree Dutta Miss India Universe (@iamtanushreeduttaofficial) చదవండి: పిల్లలు కావాలి.. వాళ్లతో ఎంజాయ్ చేయాలనుంది: నాగచైతన్య -
అది వారి వ్యక్తిగత విషయం.. మనకు అవసరం లేదు: కాజోల్
బాలీవుడ్ హీరోయిన్ కాజోల్ తాజాగా సర్జమీన్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ చిత్రంలో మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్కు జంటగా కనిపించింది. దేశభక్తి నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా నేరుగా ఓటీటీలోనే విడుదలైంది. ఈ మూవీలో ఇబ్రహీం అలీ ఖాన్ కీలక పాత్రలో కనిపించారు. ఈ చిత్రానికి కయోజ్ ఇరానీ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో కాజోల్.. మెహర్ అనే పాత్రలో కనిపించారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన కాజోల్.. అందం, గ్లామర్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. సినీ ఇండస్ట్రీలో కాస్మెటిక్ సర్జరీ, బోటాక్స్ గురించి ప్రస్తావించింది. అందం కోసం ఇలాంటి చేయించుకోవడం అనేది వ్యక్తిగత విషయమని పేర్కొంది. అలాంటి వారిని మనం జడ్జ్ చేయకూడదని తెలిపింది. ఆ విషయాన్ని వారికే వదిలేయాలని హితవు పలికింది. కాస్మోటిక్ సర్జరీలు కేవలం మహిళలకు మాత్రమే పరిమితం కాదని.. ఈ రోజుల్లో పురుషులు కూడా చేయించుకుంటున్నారని వెల్లడించింది.కాజోల్ మాట్లాడుతూ.. 'కత్తి కిందకు వెళ్లాలా, వద్దా అనేది ప్రతి ఒక్కరి వ్యక్తిగత నిర్ణయం. అందుకే ఇలాంటి విషయాలను అది వారికే వదిలివేయాలి. వాటిని మనం ప్రశ్నించకూడదు. ఇది కేవలం జెండర్కు సంబంధించినది కాదు. చాలా మంది పురుషులు కూడా చేయించుకుంటున్నారు. ఇప్పుడున్న రోజుల్లో అందరూ సమానమే.. వృద్ధాప్యం అనేది మనస్సుకు సంబంధించిన విషయం. అయితే వృద్ధాప్యాన్ని చేరుకోవడం అనేది మన చేతుల్లోనే ఉంది. కొంతమంది చిన్న వయస్సులోనే మరణించడంతో అసలు వృద్ధాప్యం పొందే అవకాశమే లేదు. అలాంటి వారు అదృష్టవంతులని కాదు. అంటే వారికి వృద్ధాప్యాన్ని అనుభవించడానికి, జీవితంలో ముందుకు పోయే ఛాన్స్ లేదు. అందుకే నాకు జీవించడానికి ఇంకా చాలా అద్భుతమైన సంవత్సరాలు మిగిలి ఉన్నాయి. వాటి కోసమే ఎదురు చూస్తున్నా' అని అన్నారు. -
సన్నగా అవ్వాలని తిండి మానేశా.. ఆ వ్యాధి వచ్చింది!
ఫేమస్ అవడానికి ఏదైనా చేస్తారు సినీతారలు. ఒక్కసారి పాపులర్ అయ్యాక దాన్ని కాపాడుకునేందుకు కూడా చాలా కష్టపడుతుంటారు. బాలీవుడ్ నటి ఉర్ఫీ జావెద్ (Uorfi Javed) కూడా అదే చేసింది. చిత్రవిచిత్ర వేషధారణతో సోషల్ మీడియాలో నిత్యం కనిపిస్తూ ఉండే ఈ బ్యూటీ.. మరింత అందంగా కనిపించాలని గతంలో లిప్ ఫిల్లర్స్ వేయించుకుంది. ఈ మధ్య వాటిని తీసేయించుకోవడానికి చాలా కష్టపడింది. తిండి మానేశా..ఆ ట్రీట్మెంట్ వల్ల పెదాలు, ముఖం అంతా ఉబ్బిపోయి అందవిహీనంగా మారిపోయింది. ఇప్పుడిప్పుడే మళ్లీ మామూలు స్థితికి వచ్చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సన్నగా కనిపించాలని తిండి మానేశానని చెప్తోంది. ఉర్ఫీ జావెద్ మాట్లాడుతూ.. నేను చాలాసార్లు కడుపుమాడ్చుకునేదాన్ని. తిండి తినకపోయేదాన్ని. చాలా సన్నగా కనిపించాలని నానాతిప్పలు పడ్డాను. దీంతో నాలుగేళ్ల క్రితం నాకు బాడీ డిస్మార్ఫిక్ అనే వ్యాధి వచ్చింది. నాలుగు పీసులు తినేదాన్నంతే!(అందంగా కనిపించడం లేదేమోనని కంగారుపడటం, శరీరంలో ఏదో ఒకటి బాగోలేదని బాధపడటం వంటివి ఈ వ్యాధి లక్షణాలు) మూడు లేదా నాలుగు చికెన్ ముక్కలు తిని రోజంతా ఖాళీ కడుపుతో ఉండేదాన్ని. వర్కవుట్స్ చేయకపోయేదాన్ని కానీ పరిగెత్తేదాన్ని. ఒంట్లో ఎక్కువ శక్తి లేకపోయేసరికి మైండ్ సరిగా పనిచేసేది కాదు. ఎప్పుడూ కోపంగా ఉండేదాన్ని, చిరాకుపడేదాన్ని. ఎవరైనా నన్ను పలకరించినా సరే నాతో ఎందుకు మాట్లాడుతున్నావ్? అనుకునేదాన్ని. .బక్కచిక్కిపోవాల్సిన అవసరం లేదుఅయితే తర్వాత నా పద్ధతి మార్చుకున్నాను. మరీ బక్కచిక్కిపోయి స్లిమ్గా ఉండాల్సిన అవసరం లేదనుకున్నాను. ఈ మధ్యే జిమ్కు వెళ్లడం మొదలుపెట్టాను. బరువులు ఎత్తుతున్నాను. బాగా తింటున్నాను. కచ్చితంగా సన్నగా ఉండాల్సిందేనని ఏమాత్రం ఆలోచించట్లేదు అని చెప్పుకొచ్చింది. ఉర్ఫీ జావెద్.. బుల్లితెరపై పలు సీరియల్స్లో యాక్ట్ చేసింది. హిందీ బిగ్బాస్ ఓటీటీ తొలి సీజన్లో పాల్గొంది. ఫాలో కర్లో యార్ వెబ్ సిరీస్లో నటించింది. ఇటీవల ద ట్రైటర్స్ ఇండియా అనే షోలో పాల్గొని విజేతగా నిలిచింది.చదవండి: డబుల్ ధమాకా: రెండో పెళ్లి చేసుకున్న నటుడు.. భార్య ఆరో నెల గర్భిణీ -
మేరా భారత్ మహాన్.. దేశభక్తి రగిలిస్తున్న స్టార్ హీరోలు
దేశ సరిహద్దుల్లో సైనికుల్లా, దేశంలో గూఢచారులుగా, ప్రభుత్వ నిఘా సంస్థల ప్రతినిధులుగా... ఇలా దేశం కోసం అహర్నిశలూ కష్టపడుతున్నవారు చాలామంది ఉన్నారు. ఇటీవల భారత ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ ఘటన ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ తరుణంలో దేశభక్తిని చాటే కొన్ని సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమౌతున్నాయి. ఇలా ‘మేరా భారత్ మహాన్’ అంటూ దేశభక్తిని చాటి చెప్పేలా కొందరు హీరోలు చేస్తున్న సినిమాలపై ఓ లుక్ వేద్దాం.ప్రభాస్ ఫౌజి వెండితెరపై ప్రభాస్ తొలిసారిగా సైనికుడిగా కనిపించనున్నారు. ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా రానున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘ఫౌజి’ అనే టైటిల్ను అనుకుంటున్నారట. ఈ సినిమా మిలటరీ వార్ బ్యాక్డ్రాప్లో ఉంటుందని, ఇందులో ప్రభాస్ సైనికుడిగా కనిపిస్తారని తెలిసింది. అలాగే కొంత లవ్స్టోరీ కూడా ఉంటుంది. అయితే ఈ సినిమాలోని వార్ సన్నివేశాల్లో ప్రభాస్ ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్లు సూపర్గా ఉంటాయని, ఈ సన్నివేశాల కోసం ప్రభాస్ కొత్తగా మేకోవర్ అయ్యారని సమాచారం. ఇమాన్వీ ఇస్మాయిల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో మిథున్ చక్రవర్తి, జయప్రద, అనుపమ్ ఖేర్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 2026 ద్వితీయార్ధంలో ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.డ్రాగన్లో దేశభక్తి హీరో ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో ‘డ్రాగన్’ అనే చిత్రం రూపొందుతోంది. ఇది ఓ పీరియాడికల్ యాక్షన్ గ్యాంగ్స్టర్ డ్రామా అనే ప్రచారం సాగింది. కానీ ఇటీవల జరిగిన ఈ సినిమా చిత్రీకరణలో వందేమాతరం అంటూ వందలమంది జూనియర్ ఆర్టిస్టులు చెబుతుంటే, ఓ భారీపాటను చిత్రీకరించారట. ‘వందేమాతరం’ అంటూ సాగే ఈపాట స్క్రీన్పై కనిపించే సమయంలో సూపర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారట ఈ చిత్రం మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్. దీంతో ఈ ‘డ్రాగన్’ సినిమాలో కొన్ని దేశభక్తి అంశాలకు చెందిన సన్నివేశాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. రుక్మిణీ వసంత్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో మలయాళ నటుడు టోవినో థామస్ విలన్గా నటిస్తారనే ప్రచారం సాగుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమా 2026 జూన్ 25న విడుదల కానుంది.బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్ ‘టైగర్ జిందా హై, ఏక్తా టైగర్, టైగర్ 3’ వంటి స్పై యాక్షన్ సినిమాల్లో ‘రా’ (రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్) ఆఫీసర్గా నటించి, మెప్పించారు సల్మాన్ ఖాన్. తాజాగా ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్’ సినిమాలో సల్మాన్ ఖాన్ ఆర్మీ ఆఫీసర్పాత్రలో నటించనున్నారు. 2020లో గాల్వాన్ లోయలో భారత్–చైనా సైనికుల మధ్య జరిగిన యుద్ధం, నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ మూవీలో చిత్రాంగదా సింగ్ మరో లీడ్ రోల్ చేయనున్నారు. సల్మాన్ ఖాన్ ఫిలింస్ బ్యానర్పై అపూర్వ లఖియా దర్శకత్వం వహించనున్న ఈ సినిమా చిత్రీకరణ వచ్చే నెల మొదటి వారంలో ప్రారంభం కానుంది.ప్రస్తుతం తాను పోషించే ఆర్మీ ఆఫీసర్పాత్ర కోసం సల్మాన్ ఖాన్ ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారు. డైలీ కసరత్తులు చేస్తున్నారు. ఇక ఈ ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్’ సినిమా కోసం లడఖ్లో ఓ భారీ షూటింగ్ షెడ్యూల్ ప్లాన్ చేశామని, గడ్డకట్టే చలిలో అక్కడ ఏడెనిమిది రోజులు లోయలో షూటింగ్ చేస్తామని, ఈ షెడ్యూల్ను తలచుకుంటే తనకు భయంగా ఉందని, కానీ తాను సిద్ధమౌతున్నానని సల్మాన్ ఖాన్ ఇటీవల ఈ ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్’ సినిమా ప్రయాణం గురించి చె΄్పారు. వీలైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్ను పూర్తి చేసి, వచ్చే గణతంత్ర దినోత్సవం సందర్భంగా రిలీజ్ చేయాలని సల్మాన్ ఖాన్ భావిస్తున్నారట. ఒకవేళ ఇది కుదరకపోతే వచ్చే రంజాన్కు విడుదల చేయాలని సల్మాన్ ఆలోచిస్తున్నారని బాలీవుడ్ సమాచారం. భజరంగీ భాయిజాన్ 2: పది సంవత్సరాల క్రితం సల్మాన్ ఖాన్ నటించిన ‘భజరంగీ భాయిజాన్’ సినిమా మంచి ఎమోషనల్ థ్రిల్లర్గా విజయం సాధించింది. విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమాకు కథ అందించగా, కబీర్ ఖాన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో కొన్ని దేశభక్తి అంశాలు కూడా ఉన్నాయి. కాగా ‘భజరంగీ భాయిజాన్’ సినిమాకు సీక్వెల్ తీసే ఆలోచనలో ఉన్నామని, వచ్చే ఏడాది ఈ సీక్వెల్ సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయని ఇటీవల ఓ సందర్భంలో కబీర్ ఖాన్ పేర్కొన్నారు. కరీనా కపూర్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో హర్షాలీ మల్హోత్రా, నవాజుద్దీన్ సిద్ధిఖీ ఇతర ప్రధానపాత్రల్లో నటించారు.మేజర్ షైతాన్ సింగ్ భారతదేశ సైనికుల వీరత్వాన్ని, ధైర్యాన్ని మరోసారి సిల్వర్ స్క్రీన్పై చూపించేందుకు రెడీ అయ్యారు బాలీవుడ్ దర్శక–నటుడు ఫర్హాన్ అక్తర్. 1962లో ఇండియా–చైనాల మధ్య యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో ‘రెజాంగ్ లా’ పోరాట ఘట్టం ముఖ్యమైనదిగా చెప్పుకుంటారు. ఈ ఘటన ప్రధానాంశంగా బాలీవుడ్లో రూపొందుతున్న చిత్రం ‘120 బహాదుర్’.ఈ సినిమాలో ఇండియా–చైనా యుద్ధానికి నాయకత్వం వహించిన మేజర్ షైతాన్ సింగ్గా ఫర్హాన్ అక్తర్ నటిస్తున్నారు. రజనీష్ ఘాయ్ ఈ సినిమాకు దర్శకుడు. గత ఏడాది సెప్టెంబరులో ఈ సినిమాను ప్రకటించారు. ‘‘1962లో జరిగిన ఇండియా–చైనా వార్లో ముఖ్యమైనదిగా గుర్తింపు పొందిన ‘రెజాంగ్ లా’ యుద్ధాన్ని ఈ ‘120 బహాదుర్’ చిత్రంలో ఆడియన్స్ చూడబోతున్నారు. ఇది మన సైనికుల వీరత్వం, ధైర్యాన్ని చాటి చెప్పే మరో కథ’’ అని పేర్కొన్నారు ఫర్హాన్ అక్తర్. ఈ సినిమాను ఈ ఏడాది నవంబరు 21న రిలీజ్ చేయనున్నట్లుగా గతంలో మేకర్స్ ప్రకటించారు.సైనికుడి వాగ్దానం సన్నీ డియోల్ హీరోగా నటించిన వార్ డ్రామా ‘బోర్డర్ (1997)’. 1971లో జరిగిన ఇండియా– పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాకు సీక్వెల్గా ‘బోర్డర్ 2’ రానుంది. ‘బోర్డర్’ సినిమాలో హీరోగా నటించిన సన్నీ డియోల్ ఈ ‘బోర్డర్ 2’లోనూ హీరోగా నటిస్తున్నారు. వరుణ్ ధావన్, అహాన్ శెట్టి, దిల్జీత్ సింగ్ ఇతర ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు. భారతీయ సైనికుల వీరత్వం, ధైర్య సాహసాల నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోంది.భూషణ్ కుమార్, క్రిషణ్ కుమార్, జేపీ దత్తా, నిధి దత్తా ఈ సినిమాను నిర్మిస్తుండగా, అనురాగ్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. నార్త్ ఇండియాలోని ప్రముఖ లొకేషన్స్తోపాటు కశ్మీర్లోనూ ఈ సినిమాను చిత్రీకరిస్తున్నారు. ‘‘ఒక సైనికుడు తన వాగ్దానాన్ని నెరవేర్చుకోవడం కోసం 27 ఏళ్ల తర్వాత తిరిగి వస్తున్నాడు. ఇండియన్ సినిమా చరిత్రలోనే ఓ పెద్ద వార్ ఫిల్మ్ ఇది’’ అని చిత్రయూనిట్ ఈ ‘బోర్డర్ 2’ సినిమా గురించి ఓ సందర్భంలో పేర్కొంది. వచ్చే గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ సినిమాను జనవరి 23న రిలీజ్ చేయనున్నట్లుగా గతంలో చిత్రయూనిట్ ప్రకటించింది.ఆపరేషన్ ఖుక్రీ పాతిక సంవత్సరాల క్రితం వెస్ట్ ఆఫ్రికాలోని సియోర్రా లియోన్లో జరిగిన ఆపరేషన్ ఖుక్రీ సంఘటన ఆధారంగా ఓ సినిమా రానుంది. యునైటెడ్ నేషన్స్ (ఐక్యరాజ్యసమితి) పీస్ కీపింగ్ మిషన్స్లో భాగంగా వెస్ట్ ఆఫ్రికాకు వెళ్లిన 233 మంది భారత సైనికులు, అక్కడి రెబల్స్ ట్రాప్లో చిక్కుకుని, 75 రోజులపాటు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సైనికుల రెస్క్యూ ఆపరేషన్ను రాజ్ పాల్ పునియా సక్సెస్ఫుల్గా లీడ్ చేశారు. ఈ సంఘటనల నేపథ్యంలో చోటు చేసుకున్న పరిస్థితులు, రాజ్ పాల్ సాహసోపేతమైన నిర్ణయాలు వంటి అంశాల ఆధారంగా ‘ఆపరేషన్ ఖుక్రీ’ అనే సినిమా రానుంది.‘ఆపరేషన్ ఖుక్రీ: ద అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ ది ఇండియన్ ఆర్మీస్ బ్రేవెస్ట్ పీస్ కీపింగ్ మిషన్ అబ్రాడ్’ అనే పుస్తకం ఆధారంగా ఈ సినిమా రానుంది. మేజర్ జనరల్ రాజ్ పాల్ పునియా, దామిని పునియా ఈ పుస్తకాన్ని రాయగా, ఈ బుక్ హక్కులను రాహుల్ మిత్రా ఫిల్మ్స్, రణ్దీప్ హుడా ఫిల్మ్స్ సంస్థలు దక్కించుకున్నాయి. ఈ పుస్తకం ఆధారంగా ‘ఆపరేషన్ ఖుక్రీ’ రానుంది. ఈ సినిమాలో మేజర్ రాజ్ పాల్ పునియాగా రణ్దీప్ హుడా నటిస్తారు. అతి త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది.స్వాతంత్య్రానికి పూర్వం... భారతదేశానికి స్వాతంత్య్రం రాకముందు, లండన్లో ఉన్న భారత మేధావులు కొందరు తరచూ సమావేశం అయ్యేవారు. ఈ సమావేశంలో భారతదేశానికి స్వాతంత్య్రం రావాలంటే ఏం చేయాలి? అనే వ్యూహ రచనలు, ప్రణాళికలను సిద్ధం చేసేవారు. ఈ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న సినిమా ‘ది ఇండియా హౌస్’. 1905 నేపథ్యంలో సాగే ఈ సినిమాలో నిఖిల్ హీరోగా నటిస్తుండగా, సయీ మంజ్రేకర్ హీరోయిన్గా నటిస్తున్నారు. అనుపమ్ ఖేర్ ఓ కీలకపాత్ర చేస్తున్నారు. రామ్చరణ్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, వి మెగా పిక్చర్స్ సంస్థలు ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. ఇటీవల ఈ సినిమా సెట్స్లో చిన్న ప్రమాదం జరగడంతో చిత్రీకరణకు తాత్కాలిక బ్రేక్ పడింది. అతి త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ఊపందుకోనుంది. 2026 చివర్లో ‘ది ఇండియా హౌస్’ సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది.ఆపరేషన్ సిందూర్ పహల్గాం ఉగ్రదాడికి వ్యతిరేకంగా మన దేశం చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ ఘటన దేశవ్యాప్తంగా సంచలనమైంది. ఈ ఘటన ఆధారంగా సినిమాలు తీసేందుకు కొందరు బాలీవుడ్ దర్శక–నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారని, కొంతమంది కొన్ని టైటిల్స్ను రిజిస్టర్ చేయించారనే టాక్ బాలీవుడ్లో వినిపిస్తోంది. ఆల్రెడీ ఉత్తమ్ నితిన్ ఓ సినిమాను ప్రకటించారు. కానీ ‘ఆపరేషన్ సిందూర్’ ఘటన జరుగుతున్నప్పుడే ఆయన సినిమాను ప్రకటించడంతో కాస్త వివాదాస్పదమైంది. మరి... ఉత్తమ్ తాను ప్రకటించిన సినిమాను సెట్స్పైకి తీసుకువెళ్తారా? లేదా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. ఇలా దేశభక్తి నేపథ్యంలో మరికొన్ని సినిమాలు ఉన్నాయి. – ముసిమి శివాంజనేయులు ⇒ గూఢచారుల నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రానున్న సినిమాల సంఖ్య కూడా కాస్త ఎక్కువగానే ఉంది. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ హీరోలుగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందిన స్పై యాక్షన్ డ్రామా సినిమా ‘వార్ 2’. ఈ చిత్రంలో కియారా అద్వానీ మరో కీలకపాత్రలో నటించారు. ఆదిత్యా చోప్రా నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 14న రిలీజ్ కానుంది. ఇక ‘వార్ 2’తోపాటు ‘యశ్ రాజ్ ఫిలింస్ స్పై యూనివర్స్’లో భాగంగా రూపొందిన మరో చిత్రం ‘ఆల్ఫా’. శివ్ రావైల్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా ఆలియా భట్, శర్వారీ ఈ సినిమాలో స్పైపాత్రలు చేశారు. ఈ చిత్రం డిసెంబరులో విడుదల కానుంది. ఇక కార్తీ హీరోగా నటించిన లేటెస్ట్ స్పై డ్రామా ‘సర్దార్ 2’. పీఎస్ మిత్రన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో కార్తీ ద్వి పాత్రాభినయం చేశారు. ఎస్. లక్ష్మణ్కుమార్ నిర్మించిన ఈ సినిమా ఈ ఏడాదే రిలీజ్ కానుంది. అలాగే మన తెలుగులో అడివి శేష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘గూఢచారి 2’. ఎస్. విజయ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటీనటులు వామికా, ఇమ్రాన్ హష్మి ఇతర ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. ఇలా దేశభక్తిని చాటుకునే స్పై బ్యాక్డ్రాప్ నేపథ్యంలో రానున్న సినిమాలు మరికొన్ని ఉన్నాయి. -
టెన్షన్ ఎందుకు? భర్త ఉద్యోగానికి వెళ్తే భార్య పిల్లల్ని చూసుకోవాలి!
భర్త ఉద్యోగానికి వెళ్తే భార్య పిల్లల్ని చూసుకోవాలి అంటున్నాడు బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి. ఆమాత్రం అర్థం చేసుకోకపోతే సంబంధాలు ఎలా నిలుస్తాయని ప్రశ్నిస్తున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సునీల్ శెట్టి (Suniel Shetty) మాట్లాడుతూ.. ఈరోజుల్లో పిల్లలకు బొత్తిగా ఓపిక ఉండట్లేదు. పెళ్లి అంటే కాంప్రమైజ్ అనుకుంటున్నారు. మీరు అర్థం చేసుకోవాల్సిందేంటే.. పెళ్లంటే ఒకరికోసం మరొకరు జీవించడం. భార్య పిల్లల్ని చూసుకోవాలిమీకు పిల్లలు ప్టుటారే అనుకోండి.. భర్త ఉద్యోగానికి వెళ్తే భార్య పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. భర్త కెరీర్ కూడా ముఖ్యమే కదా అని ఆలోచించి పిల్లల బాధ్యత తీసుకోవాలి. భర్త కూడా పిల్లల గురించి ఆలోచిస్తాడు, వారికి అండగా నిలబడతాడు. కానీ ఈరోజుల్లో ప్రతిదానికీ టెన్షన్ పడుతున్నారు. అన్నింటినీ ఒత్తిడిలా ఫీలవుతున్నారు. పైగా ఈ డిజిటల్ యుగంలో ప్రతి ఒక్కరూ సలహా ఇచ్చేవాళ్లే! పెద్దవాళ్లను చూసి నేర్చుకోండితల్లి ఎలా ఉండాలి? తండ్రి ఎలా ఉండాలి? ఏం తినాలి? ఏం చేయాలి? ఇవన్నీ ఆన్లైన్లో కూడా కనిపిస్తాయి. వాటితో ఇంట్లో వాళ్లను పోలుస్తూ.. నా భాగస్వామి ఇలా లేదేంటని బాధపడతారు. ఏదైనా సరే అనుభవాల నుంచి నేర్చుకుంటేనే మంచిది, లేదంటే అమ్మ, నానమ్మ, అమ్మమ్మ, అక్క, వదినలు.. వీరిని చూసి కూడా ఎంతోకొంత నేర్చుకోవచ్చు. వారిలో మీకు పనికొచ్చే లక్షణాలను ఎంపిక చేసి ఆచరించండి. పనికిరానివి వదిలేయండి. కానీ అవన్నీ ఇప్పుడెవరు చేస్తున్నారు. అలా పెళ్లయిందో లేదో ఇలా విడాకులు తీసుకుంటున్నారు అని చెప్పుకొచ్చాడు.ఫస్ట్ సినిమాకు ముందే 40 చిత్రాలుసినీ జర్నీ గురించి మాట్లాడుతూ.. నా తొలి సినిమా రిలీజవ్వడానికి ముందే నా చేతిలో 40 చిత్రాలున్నాయి. అందులో ఏవి ఆడతాయి? ఏవి ఫ్లాప్ అవుతాయి? అని నేను పెద్దగా ఆలోచించలేదు. అప్పట్లో మానసిక ఆరోగ్యం, డిప్రెషన్ అన్న పదాలే మాకు తెలియవు. కాస్త బాధపడుకుంటూ ఉన్నా సరే అమ్మ వచ్చి తిట్టగానే అదెటో వెళ్లిపోయేది. బాధపడుతూ కూర్చునేంత టైం ఇచ్చేవాళ్లు కాదు అని చెప్పుకొచ్చాడు. అయితే ఈ రోజుల్లో మానసిక ఆరోగ్యం దిగజారుతున్న నేపథ్యంలో 2023లో సునీల్ శెట్టి లెట్స్ గెట్ హ్యాపీ అనే హెల్త్ యాప్ రిలీజ్ చేశాడు. సినిమాల విషయానికి వస్తే.. బాలీవుడ్లో అనేక చిత్రాలు సునీల్ శెట్టి తెలుగులో మోసగాళ్లు, గని మూవీస్లో కనిపించాడు. ప్రస్తుతం వెల్కమ్ టు ద జంగిల్ చిత్రంలో నటిస్తున్నాడు.చదవండి: బ్లాంక్ చెక్ ఇచ్చాం.. అయినా అతడు రిజెక్ట్ చేశారు: మురళీ మోహన్ -
రూ.200 కోట్ల క్లబ్లో ‘సైయారా’.. ఖాన్స్ రికార్డ్స్ బద్దలు
బాలీవుడ్ మొత్తం ఇప్పుడు సైయారా జపం చేస్తోంది. ఎక్కడ చూసినా ఈ చిన్న సినిమా గురించే చర్చిస్తున్నారు. విడుదలై వారం రోజులు దాటినా..జనాలు ఈ సినిమాను మర్చిపోవడం లేదు. బాక్సాఫీస్ కలెక్షన్స్ రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. వారం రోజుల్లో ఈ చిత్రం రూ. 200 కోట్లకు పైగా వసూళ్లను సాధించి.. బడా హీరోల పేరిట ఉన్న రికార్డులను కొల్లగొడుతోంది.అహన్ పాండే, అనీత్ పడ్డా హీరోహీరోయిన్లు నటించిన ఈ చిత్రానికి మోహిత్ సూరి దర్శకత్వం వహించాడు. ఈ నెల 18న ఎలాంటి అంచనాలు లేకుండా కేవలం 800 థియేటర్స్లో మాత్రమే విడుదలైంది. తొలి రోజే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సంపాదించుకుంది. ఫలితంగా రెండో రోజు నుంచి ఈ సినిమా వసూళ్లు పుంజుకున్నాయి. ఎనిమిది రోజుల్లో రూ. 200 కోట్ల వరకు వసూళ్లను సాధించింది. ఇటీవల బాలీవుడ్లో విడుదలైన అన్ని చిత్రాల్లో ఇదే అత్యధిక కలెక్షన్స్. ఖాన్ సినిమాలు సైతం ఈ స్థాయిలో కలెక్షన్స్ని రాబట్టడం లేదు.(చదవండి: బాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్.. 'సయారా' రివ్యూ) ఆమిర్ ఖాన్ ‘సితారే జమీన్ పర్ (164 కోట్లు), అజయ్ దేవ్గన్ రైడ్ 2 (173 కోట్ల) చిత్రాలకు మించిన కలెక్షన్స్ని రాబట్టి.. అత్యధిక వసూళ్ల సాధించిన డెబ్యూ ఫిల్మ్గా రికార్డెకెక్కింది. సినిమాకు హిట్ టాక్ రావడంతో థియేటర్స్ సంఖ్య కూడా భారీగా పెరిగింది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 2000 థియేటర్స్లో ఈ సినిమా ప్రదర్శితం అవుతోంది. సైయారా కథ విషయానికొస్తే..వాణి బత్రా(అనీత్ పడ్డా) ఓ రైటర్. కాలేజీలో తన సీనియర్ అయిన మహేశ్ అయ్యర్ని ప్రేమించి, ఇంట్లో వాళ్లకి చెప్పి పెళ్లికి కూడా ఒప్పిస్తుంది. కానీ చివరి నిమిషంలో అతను హ్యాండ్ ఇస్తాడు. ఆరు నెలల వరకు వాణి ఆ డిప్రెషన్లోనే ఉంటుంది. తర్వాత ఓ కంపెనీలో ఉద్యోగంలో చేరుతుంది. అదే రోజు ఆమె జీవితంలోకి క్రిష్ కపూర్ (అహన్ పాండే) వస్తాడు. తానో సింగర్. అవకాశాల కోసం తిరుగుతుంటారు. వాణితో కలిసి ఓ పాట కోసం పని చేస్తారు. ఈ క్రమంలో ఇద్దరు ప్రేమలో పడిపోతారు. అదే సమయంలో వాణి జీవితంలోకి మళ్లీ మహేశ్ అయ్యర్ వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది. ఈ ఇద్దరిలో వాణి ఎవరికి దగ్గరైంది అనేదే మిగతా కథ. -
తరచు బరువు తగ్గి, పెరగడం వెనుక కారణం అదే..: విద్యా బాలన్
నిర్భయమైన వైఖరి స్వీయ వ్యక్తీకరణకు పేరుగాంచిన విద్యాబాలన్, నటన, గ్లామర్ల కలబోతగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నారు. దక్షిణాది నటి సిల్క్ స్మిత జీవిత కధ ఆధారంగా రూపొందిన డర్టీ పిక్చర్ ద్వారా సౌత్ ప్రేక్షకల ప్రశంసలూ దక్కించుకున్న విద్యాబాలన్కు తరచుగా ఎదురయే విమర్శ, లేదా సలహా ఏదైనా ఉందంటే అది ఆమె ఓవర్ వెయిట్ గురించి మాత్రమే. గతంలోనూ కొన్నిసార్లు బరువు పెరిగి తగ్గి, పెరిగి...మార్పులకు గురవుతున్న విద్యాబాలన్... ఇటీవల కొన్ని ఇంటర్వ్యూల సందర్భంగా తన శరీరపు బరువు విషయంలో సంవత్సరాలుగా తనపై వచ్చిన విమర్శల నేపధ్యంలో ఈ సమస్యను అధిగమించడానికి తాను పడిన వ్యయ ప్రయాసల్ని ఆమె వెల్లడించింది.‘ నేనొక సిగ్గుపడని ఆశావాదిని నాకు చాలా ఆత్మవిశ్వాసం ఉంది. బరువు తగ్గడానికి నేను చేయని పోరాటం లేదు. నిజాయితీగా చెప్పాలంటే, ఆ విషయానికి వస్తే నాలో ఏ తప్పు లేదని నేను అనుకుంటున్నాను అంటుందామె. బరువుపై విమర్శలను చూసి బెదిరిపోని ఆమె మనస్తత్వం, విమర్శలను తట్టుకోవడానికి సినీరంగంలో కొనసాగడానికి సహాయపడిందని ఆమె అభిప్రాయపడుతోంది. ‘‘ఆ వైఖరి నాకు సహాయపడింది. నేను ప్రధాన పాత్రలు పోషించడం కొనసాగించాను ఎలాంటి అభద్రతాభావాలు నన్ను ఎప్పుడూ వెనక్కి నెట్టలేదు‘ అంటూ ఓవర్ వెయిట్ అనే సమస్యను జయించడానికి ఆత్మవిశ్వాసం ఎంత అవసరమో చెప్పకనే చెబుతుందామె.‘నా జీవితాంతం, నేను సన్నగా మారడానికి ప్రయత్నించాను. తీవ్రమైన ఆహార నియమాలు పాటించాను. అన్ని రకాల వ్యాయామాలను చేశాను. కొన్నిసార్లు బరువు తగ్గాను, కానీ మళ్లీ తిరిగి బరువు పెరిగిపోయేదాన్ని.‘ అంటూ గుర్తు చేసుకుంది.ఇటీవల బాగా వెయిట్ లాస్ అయి స్లిమ్ గా కనపడుతున్న విద్యాబాలన్...ఈ సంవత్సరం ప్రారంభంలో చెన్నైకి చెందిన పోషకాహార సంస్థ తో కనెక్ట్ అయినప్పుడు తన సమస్య ఏమిటో తనకి అర్ధం అయిందని చెప్పింది. ‘వారు నాకు, ’మీది కొవ్వు కాదు, అది ఇన్ఫ్లమేషన్’ అని చెప్పారు. అది నా విషయంలో గేమ్–ఛేంజర్ గా పనిచేసింది అని ఆమె వివరించింది తాను స్వతహాగా శాఖాహారిని అని కూరగాయలు తింటున్నా కూడా బరువు పెరగడానికి కారణం ఈ సంస్థను కలిసిన తర్వాత తనకు అర్ధమైందని అంటోంది. ‘‘ అన్ని కూరగాయలు ఆరోగ్యకరమైనవని మనం అనుకుంటాము, కానీ అది నిజం కాదు. మీ శరీరానికి ఏది సరైనదో మీరు అర్థం చేసుకోవాలి. మరొకరికి పనికొచ్చేది మీకు పనికి రాకపోవచ్చు. అదే విధంగా పాలకూర సొరకాయ వంటి కొన్ని నాకు సరిపోవని నాకు అంతకు ముందు తెలియదు’’ అంటూ వెల్లడించింది.ఆత్మవిశ్వాసం అద్దం నుంచి రాదు అది లోపలి నుంచి వస్తుంది అని అంటున్న విద్య... దీర్ఘకాలంగా తాను చేస్తున్న బరువుపై పోరాటంలో సరైన సక్సెస్నే సాధించారని చెప్పొచ్చు. ప్రస్తుతం ఆమె తన ఆహారంలో ‘ఇన్ఫ్లమేషన్ను తొలగించే‘ విధానాన్ని అవలంబించింది, శరీర బరువు త్వరగా తగ్గించగలిగింది. అవగాహనతో కూడిన ఈ విజయం ఇకపైనా కొనసాగిస్తుందని ఆమె అభిమానులు ఆశించవచ్చు.