breaking news
Bollywood
-
ది ఇండియా స్టోరీ పూర్తి
‘ది ఇండియా స్టోరీ’ సినిమాను పూర్తి చేశారు కాజల్ అగర్వాల్. శ్రేయాస్ తల్సాడే, కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న హిందీ సినిమా ‘ది ఇండియా స్టోరీ’. డీకే చేతన్ దర్శకత్వంలో ఎమ్ఐజీ ప్రోడక్షన్స్ అండ్ స్టూడియోస్ పతాకంపై సాగర్ బి. షిండే నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తయినట్లు సోమవారం ప్రకటించారు మేకర్స్. ఈ చిత్రంలో లాయర్గా నటించారు కాజల్.రైతుల కష్టాలు, కార్పొరేట్ సంస్థలు తయారు చేసే పంటల పిచికారీ మందుల వ్యా పారాలు వంటి అంశాల నేపథ్యంతో ఈ సినిమా కథనం సాగుతుందని బాలీవుడ్ సమాచారం. మురళీ శర్మ, మనీష్ వాధ్యా, త్రిషా సర్ధా కీలక పాత్రల్లో నటించిన ‘ది ఇండియా స్టోరీ’ని ఆగస్టు 15న రిలీజ్ చేయాలనుకున్నా కుదరలేదు. 2026లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు తాజాగా ప్రకటించారు మేకర్స్. -
58 ఏళ్ల వయసులో మరోసారి తండ్రయిన నటుడు
అన్న పెళ్లి మాటే మర్చిపోయాడు. కానీ తమ్ముడు రెండో పెళ్లి చేసుకోవడమే కాదు, 58 ఏళ్ల వయసులో రెండోసారి తండ్రిగా ప్రమోషన్ పొందాడు. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ తమ్ముడు అర్బాజ్ ఖాన్ (Arbaaz Khan) గతంలో మలైకా అరోరాను పెళ్లి చేసుకోగా వీరికి అర్హాన్ ఖాన్ సంతానం. దంపతుల మధ్య భేదాభిప్రాయాలు రావడంతో 2017లో విడాకులు తీసుకున్నారు. 2023 డిసెంబర్లో మేకప్ ఆర్టిస్ట్ షురా ఖాన్ను రెండో పెళ్లి చేసుకున్నాడు.ఏడాదిన్నర తిరిగేలోపు..ఈ ఏడాది ప్రారంభంలో షురా గర్భం దాల్చింది. నేడు (అక్టోబర్ 5న) ముంబైలోని ఓ ఆస్పత్రిలో పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలిసిన సల్మాన్.. ఫామ్హౌస్ నుంచి నేరుగా ఆస్పత్రికి పయనమయ్యాడట! అర్బాజ్ ఖాన్.. ప్యార్ కియా తో డర్నా క్యా, హలో బ్రదర్, దబాంగ్, దబాంగ్ 2, దబాంగ్ 3, నిర్దోష్, తేరే ఇంతేజార్, మే జరూర్ ఆవుంగా వంటి పలు చిత్రాల్లో నటించాడు. తెలుగులో జై చిరంజీవ మూవీలో విలన్గా నటించాడు. కిట్టు ఉన్నాడు జాగ్రత్త, శివం భజే సినిమాల్లోనూ యాక్ట్ చేశాడు.చదవండి: హిమాలయాల్లో రజనీకాంత్.. వారం రోజులు అక్కడే! -
ఏఆర్ రెహ్మాన్ను సైతం ఆకట్టుకున్న ఫాతిమా ఫ్యామిలీ
తిరువనంతపురంలోని ఆ ఇంట్లోకి అడుగు పెడితే సంగీత కళాశాలలోకి అడుగు పెట్టినట్లుగా ఉంటుంది. ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన ఈ కుటుంబ సంగీత కచేరి వీడియో వైరల్గా మారింది. ఈ వీడియోను చూసి ముచ్చటపడిన సంగీత దిగ్గజం ఏఆర్ రెహమాన్ ఆ కుటుంబానికి అభినందనలు తెలిపారు.ఫాతిమా వయోలిన్ వాయిస్తుంది. ఆమె చెల్లి గిటార్ వాయిస్తుంది. ఆమె తండ్రి తబలా వాయిస్తూ గానం చేస్తాడు. వీరందరూ కలిసి రెహమాన్ ట్యూన్ చేసిన ‘గురు’ సినిమాలోని ‘తెరే బినా’పాటను అద్భుతంగా ఆలాపించారు. ‘హార్ట్’ ‘క్లాప్’ ఇమోజీలతో కామెంట్ సెక్షన్ నిండిపోయింది. View this post on Instagram A post shared by Fathima Shadha (@fathimashadhav) కనుల, వీనుల విందు చేసే ఈ వీడియో చూస్తూ.... ‘ఆ ఇల్లు ఎంత అదృష్టం చేసుకుందో!’ అని స్పందించారు నెటిజనులు.కన్నుల.. వీనుల విందు -
అవి నా చేతుల్లో ఉండవు: హృతిక్ రోషన్
‘‘హీరో.. డైరెక్టర్.. నిర్మాత.. ఇలా ఓ సినిమాకి పనిచేసే నటీనటులు, సాంకేతిక నిపుణులు తమ సినిమా విజయం సాధించాలనే కోరుకుంటారు. అయితే అన్ని సినిమాలూ విజయం సాధిస్తాయని చెప్పలేం. వందశాతం ఎఫర్ట్ పెట్టి పనిచేయడమే నా చేతుల్లో ఉంటుంది. హిట్లు, ఫ్లాపులు అనేవి నా చేతుల్లో ఉండవు.. వాటిని నిర్ణయించేది ప్రేక్షకులే. ఓ సినిమా ఫలితం ఎలా ఉన్నా పాజిటివ్గానే తీసుకోవాలి’’ అని హీరో హృతిక్ రోషన్ తెలిపారు. ఎన్టీఆర్, హృతిక్ రోషన్, కియారా అద్వానీ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘వార్ 2’.అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో యశ్ రాజ్ ఫిల్మ్స్పై ఆదిత్యా చోప్రా నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 14న విడుదల అయింది. భారీ అంచనాల నడుమ రిలీజైన ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. ఈ విషయంపై హృతిక్ రోషన్ తాజాగా స్పందించారు. ‘‘వార్ 2’ కోసం అయాన్ ముఖర్జీ చాలా కష్టపడ్డారు. తన ఎనర్జీ చూసి నాకు కూడా ఎంతో ఉత్సాహంగా పని చేయాలనిపించేది. ఈప్రాజెక్ట్ గురించి నాకు పూర్తిగా తెలుసు కాబట్టి కబీర్ పాత్రను చాలా సరదాగా పూర్తి చేశాను. ఒక నటుడిగా మన బాధ్యతను 100 శాతం పూర్తి చే యాలి. ఫలితం ఎలా ఉన్నా ప్రతి దాన్ని సీరియస్గా కాకుండా ఈజీగానే తీసుకోవాలి. అన్ని సినిమాలూ హిట్ అవుతాయనే నమ్మకంతోనే చేస్తాం. కానీ, ఫలితం మాత్రం ప్రేక్షకులే ఇస్తారు. వీటన్నిటినీ మనం పాజిటివ్గానే తీసుకోవాలి’’ అంటూ హృతిక్ రోషన్పోస్ట్ చేశారు. -
ఐదేళ్ల తర్వాత చేతికి పాస్పోర్ట్.. హీరోయిన్ భావోద్వేగం
ఐదేళ్ల క్రితం లాక్డౌన్ టైంలో బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. అయితే ఈ విషయమై అప్పట్లో ఇతడి మాజీ ప్రియురాలు రియా చక్రవర్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. తర్వాత కోర్టు, కేసులు అంటూ ఆ కేసు చాన్నాళ్ల పాటు సాగుతూనే వచ్చింది. అయితే ఇన్నాళ్లకు ఈమెకు కొంతమేర విముక్తి దొరికినట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: బిగ్బాస్ నుంచి మాస్క్ మ్యాన్ ఎలిమినేట్.. కాకపోతే!)దాదాపు ఐదేళ్ల తర్వాత పాస్పోర్ట్ తన చేతికి తిరిగొచ్చిందని రియా చక్రవర్తి ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది. ఈ క్రమంలోనే తోటినటీనటులు కంగ్రాట్స్ చెబుతున్నారు. గత ఐదేళ్లుగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానని కొన్నాళ్ల క్రితం ఓ ఇంటర్వ్యూలో రియానే స్వయంగా చెప్పింది. వ్యక్తిగత జీవితంలోనూ ఎన్నో విషయాల్లో రాజీ పడాల్సి వచ్చిందని కూడా ఆవేదన వ్యక్తం చేసింది. సుశాంత్ సింగ్ కేసు విచారణ సమయంలో రియాకు విదేశీ ప్రయాణానికి అనుమతి ఇవ్వలేదు. పాస్పోర్ట్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు ఇన్నాళ్లకు తిరిగిచ్చేయడంతో రియా ఆనందగానికి హద్దుల్లేకుండా పోయింది.పశ్చిమ బెంగాల్కి చెందిన రియా చక్రవర్తి.. 'తూనీగ తూనీగ' అనే తెలుగు సినిమాతో హీరోయిన్గా పరిచయమైంది. తర్వాత పూర్తిగా హిందీకే పరిమితమైంది. మొత్తంగా ఏడెనిమిది చిత్రాల్లో మాత్రమే నటించింది. ఎప్పుడైతే సుశాంత్ సింగ్ చనిపోయాడో అప్పటినుంచి ఈమెకు సినిమా అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. ఇప్పుడు కొంతమేర క్లియర్ కావడంతో మళ్లీ సినిమా ఛాన్సులు వస్తాయేమో చూడాలి. ప్రస్తుతానికైతే రియా చక్రవర్తి.. బిగ్బాస్ షోలో పాల్గొని తనని తాను నిరూపించుకోవాలని అనుకుంటోంది.(ఇదీ చదవండి: నన్ను 'లేడీ ప్రభాస్' అని పిలుస్తుంటారు: శ్రీనిధి శెట్టి) View this post on Instagram A post shared by Rhea Chakraborty (@rhea_chakraborty) -
‘కల్కి’2 కి బ్రేక్.. సాయి పల్లవితో చర్చలు.. నాగ్ అశ్విన్ ప్లాన్ ఏంటి?
ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్(Nag Ashwin ) తెరకెక్కించిన పాన్ ఇండియా మూవీ ‘కల్కి’ 2898 ఏడీ’(Kalki 2898 AD) ఇండస్ట్రీని షేక్ చేసిన సంగతి తెలిసిందే. గతేడాది జూన్లో రిలీజైన అయిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 1000 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రానికి సీక్వెల్ ఉంటుందని రిలీజ్ సమయంలోనే ప్రకటించాడు. అంతేకాదు దానికి సంబంధించిన వర్క్పైనే నాగ్ అశ్విన్ ఇన్నాళ్లు దృష్టి పెట్టాడు. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అవుతుందని భావిస్తున్నవేళ ప్రభాస్ ఫ్యాన్స్కి నాగ్ చిన్నపాటి షాక్ ఇచ్చాడు. ఈ ప్రాజెక్టుని కొన్నాళ్ల పాటు పక్కకు పెట్టి.. ఓ లేడి ఓరియెంటెండ్ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడట.ఆలియా అవుట్.. సాయి పల్లవి ఇన్?కల్కి చిత్రానికి కంటే ముందే నాగ్ అశ్విన్ ఓ లేడీ ఓరియెంటెండ్ స్టోరీ రాసుకున్నాడు. ఈ చిత్రాన్ని కూడా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించాలని ప్లాన్ చేశాడు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్కి కథ కూడా వినిపించాడట. ఆమె కూడా ఈ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు గతంలో వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు మాత్రం ఈ ప్రాజెక్ట్ నుంచి ఆలియా తప్పుకుందట. డేట్స్ కుదరకపోవడంతో నాగ్ అశ్విన్కి నో చెప్పేసిందట. దీంతో నాగ్ అశ్విన్ ఇప్పుడు ఈ కథను సాయి పల్లవి(sai Pallavi)తో తెరకెక్కించాలని చూస్తున్నాడట. ఇప్పటికే సాయి పల్లకి స్టోరీ నెరేట్ చేశాడని..ఆమె కూడా ఒప్పుకుందని టాలీవుడ్లో టాక్ నడుస్తోంది.కల్కి 2 ఎప్పుడు?వాస్తవానికి నాగ్ అశ్విన్ ఇప్పుడు కల్కి 2 చిత్రాన్నే తెరకెక్కించాలి. ఈ మేరకు పనులు కూడా ప్రారంభించారు. అయితే ప్రభాస్ డేట్స్ కుదరడం లేదట. ప్రస్తుతం ఆయన రాజాసాబ్(పాటలు), ఫౌజీ సినిమాల షూటింగ్తో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత వెంటనే ‘స్పిరిట్’ చిత్రాన్ని పట్టాలెక్కించబోతున్నాడు. మరోవైపు సలార్ 2 స్క్రిప్ట్ కూడా రెడీగా ఉంది. వీటి తర్వాతే కల్కి 2కి ప్రభాస్ డేట్స్ ఇచ్చే చాన్స్ ఉంది. ఈ లెక్కన దాదాపు ఏడాది వరకు ప్రభాస్(Prabhas) డేట్స్ దొరకడం కష్టమే. మరోవైపు ఈ సినిమా నుంచి దీపికా పదుకొణెను తప్పించారు. ఇప్పుడు కొత్త హీరోయిన్ని ఎంపిక చేయాలి. దీనికి కొంత సమయం పడుతుంది. అందుకే నాగ్ అశ్విన్ ఈ గ్యాప్లో మరో సినిమాను తెరకెక్కించాలని భావిస్తున్నాడట. ప్రస్తుతం సాయి పల్లవి డేట్స్ కూడా ఖాలీగానే ఉన్నాయట. ‘రామాయణ్’ మినహా ఆమె చేతిలో మరో చిత్రమేది లేదు. నాగీ కూడా వచ్చే రెండు, మూడు నెలల్లోనే ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ చేయాలని చూస్తున్నాడట. అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాదిలోనే నాగ్ అశ్విన్- సాయి పల్లవిల సినిమాను తెరపై చూడొచ్చు. -
ఎంగేజ్మెంట్ : దేవ కన్యలా అన్షులా కపూర్, అమ్మకోసం అలా..!
బాలీవుడ్ నిర్మాత, అందాల నటి దివంగత నటి శ్రీదేవి భర్త బోనీ కపూర్ కుమార్తె అన్షులా కపూర్ (Anshula Kapoor) గోర్ ధన (నిశ్చితార్థం) వేడుకలో తన దివంగత తల్లి మోనా శౌరీ (Mona Shourie)పై చూపిన ప్రేమ నెట్టింట విశేషంగా నిలుస్తోంది.బోనీ కపూర్ మొదటి భార్య దివంగత మోనా శౌరీ కుమార్తె అన్షులా కపూర్ తన చిరకాల ప్రియుడు రోహన్ ఠక్కర్ను త్వరలోనే పెళ్లాడనుంది. దీనికి సంబంధించి కపూర్ కుటుంబం గోర్ ధన వేడుకను నిర్వహించింది. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను సోషల్మీడియాలో పంచుకుంది అన్షులా. ఈ క్రమంలో తన దివంగత తల్లి మోనా శౌరీ కోసం అన్షులా కపూర్ ఒక సీటును ఖాళీగా ఉంచడం, అందులో తనతోపాటు తల్లి ఉన్న ఫోటోను ఉంచడం అందరి హృదయాలను కరిగించింది. తన జీవితంలో ముఖ్యమైన రోజున తన తల్లి మిస్ అవుతున్న వైనాన్ని చెప్పకనే చెప్పింది. అమ్మ ప్రేమ.. అప్పటికీ... ఎప్పటికీ తమ చుట్టూనే ఉంటుంది. ఆమె మాట, ఆమె మాటల్లో పువ్వుల్లో ఆమె సీటులో, మా గుండెల్లో ఆమె ఎప్పుడూ శాశ్వతమే అని పోస్ట్ చేసింది. పర్పుల్ లెహంగాలో దేవకన్యలాఈ వేడుక కోసం అర్పితా మెహతా రూపొందించిన పర్పుల్ కరల్ లెహంగా, దానికి మ్యాచింగ్ చోళీ, దుప్పట్టాలో అన్షులా ఒక దేవకన్యలా కనిపించింది. ఆమె అందమైన మేకప్ జడతో తన లుక్ను అందంగా అమిరాయి. మరోవైపు, రోహన్ నల్లటి షేర్వానీలో అందంగా కనిపించాడు. అంతేకాదు జాన్వీ కపూర్ , ఖుషీ కపూర్ (బోనీ కపూర్ రెండో భార్య శ్రీదేవి పిల్లలు) తమ సోదరి అన్షులా గోర్ ధన వేడుకకు హాజరై సందడి చేశారు. కాబోయే బావగారితో ఫోటోలకు పోజులిచ్చారు. అన్షులా-రోహన్ పెళ్లి ఈ ఏడాది డిసెంబర్లో జరగనున్నట్లు సమాచారం.కాగా బోనీ కపూర్ మొదటి భార్య మోనాకు విడాకులిచ్చి, 1996లో హీరోయిన్ శ్రీదేవిని పెళ్లి చేసుకున్నాడు.అర్జున్ కపూర్, అన్షులా కపూర్ మొదటి భార్య మోనా పిల్లలు కాగా జాన్వీ, ఖుషి కపూర్ శ్రీదేవి పిల్లలు. -
ఇండియన్ అంకుల్లా ఉన్నా కదూ..: శోభిత ధూళిపాళ
కొంతమంది ఫోటోలు దిగడంలో దిట్ట. కొందరికేమో సరిగా ఫోటోలు దిగడమే రాదు. హీరోయిన్ శోభిత ధూళిపాళ (Sobhita Dhulipala) రెండో కోవలోకి వస్తుంది. ఫోటో దిగేటప్పుడు కెమెరా వైపు కాకుండా మరోవైపు బిత్తరచూపులు చూస్తోంది. ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. నేనెప్పుడు సెల్ఫీ తీసుకున్నా.. కెమెరా వైపు కాకుండా స్క్రీన్లో నన్ను నేను చూసుకుంటూ ఉన్నాను. ఇండియన్ అంకుల్స్ ఇలాగే చేస్తారు కదా!సెల్ఫీ ఫోటోలుఇట్స్ ఓకే.. నన్ను ఇండియన్ అంకుల్ అనుకోండి.. మరేం పర్వాలేదు అని క్యాప్షన్ ఇచ్చింది. తను యోగా చేస్తున్న ఫోటోను, తిన్న ఐస్క్రీమ్ను, అద్దంలోనుంచి బయటకు చూస్తున్న పిక్స్ను ఈ పోస్ట్లో జత చేసింది. అలాగే రెండు సెల్ఫీ పిక్స్ కూడా ఉన్నాయి. సినిమాల విషయానికి వస్తే.. తెలుగులో గూఢచారి, మేజర్ చిత్రాలతో మెప్పించిందీ తెలుగు బ్యూటీ.సినిమాహిందీలో.. రామన్ రాఘవ్ 2.0, చెఫ్, ద బాడీ, లవ్ సితార వంటి సినిమాలు చేసింది. తమిళంలో పొన్నియన్ సెల్వన్ ఫస్ట్, సెకండ్ పార్ట్స్లో నటించింది. మలయాళంలోనూ రెండు సినిమాలు చేసింది. ఓటీటీలో మేడ్ ఇన్ హెవెన్, ద నైట్ మేనేజర్ వెబ్ సిరీస్లలోనూ నటించింది. ప్రస్తుతం తమిళంలో పా.రంజిత్ డైరెక్షన్లో 'వెట్టువం' మూవీలో శోభిత యాక్ట్ చేస్తోంది. View this post on Instagram A post shared by Sobhita Dhulipala (@sobhitad) చదవండి: నెలరోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్న మిరాయ్.. ఎప్పుడంటే? -
రావణుడు కొంటెవాడు కానీ రాక్షసుడు కాదు: బాలీవుడ్ నటి
రావణాసురుడు కొంటెవాడే కానీ రాక్షసుడు కాదంటోంది బాలీవుడ్ సీనియర్ నటి సిమి గరేవాల్. దసరా పండగనాడు రావణుడి బొమ్మను దహనం చేయాల్సిన అవసరం ఏంటని ప్రశ్నిస్తోంది. ఈ మేరకు సోషల్ మీడియా ఖాతాలో ఓ పోస్ట్ పెట్టింది. ప్రతి ఏడాది దసరా రోజు చెడుపై మంచి సాధించిన విజయాన్ని పండగలా సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ రావణా.. నువ్వు కాస్త కొంటెగా ఉన్నావే తప్ప రాక్షసుడిలా ప్రవర్తించలేదు. కొంటెతనం తప్ప అంతకుమించి ఏ తప్పూ చేయలేదు.తిండి పెట్టావ్తొందరపడి ఒక అమ్మాయిని కిడ్నాప్ చేశావు. ఈ కాలంలో ఆడవాళ్లకు ఇస్తున్న గౌరవమర్యాదలతో పోలిస్తే అప్పట్లో నువ్వే ఒక స్త్రీ(సీతాదేవి)ని ఎంతో గౌరవించావు. ఆమెకు మంచి తిండి, ఆశ్రయం కల్పించావు. తన భద్రత కోసం మహిళా సెక్యూరిటీ గార్డులను నియమించావు(వాళ్లు అందంగా లేరనుకో..). పార్లమెంటులో ఉన్న సగం మంది సభ్యులకంటే కూడా నువ్వే ఎక్కువ చదువుకున్నావు. ట్వీట్ డిలీట్రావణుడి బొమ్మను కాల్చడానికి నాకెటువంటి అభ్యంతరం లేదు. కానీ ఆయనేం చేశారన్నదే నా ప్రశ్న.. అంతే! హ్యాపీ దసరా అని ట్వీట్ చేసింది. ఈ పోస్ట్పై విమర్శలు వెల్లువెత్తడంతో సదరు ట్వీట్ను డిలీట్ చేసింది. కాగా సిమి గరేవాల్.. దో బడాన్, మేరా నామ్ జోకర్, కర్జ్ వంటి సినిమాల్లో నటించింది. యాంకర్గా టాక్ షోలు కూడా చేసింది. కొన్ని సీరియల్స్, సినిమాలకు డైరెక్టర్గానూ వ్యవహరించింది.చదవండి: తప్పు లేకపోయినా దివ్య కాళ్లు మొక్కిన మాస్క్ మ్యాన్.. -
ఏఐతో అసభ్యకర వీడియోలు.. యూట్యూబ్కు ఐశ్వర్య దంపతుల షాక్!
ఇటీవల తమ అనుమతి లేకుండా ఫోటోలు వినియోగిస్తున్నారని బాలీవుడ్ స్టార్ కపుల్ అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. అనుమతి లేకుండానే అనేక వెబ్సైట్లు తన పేరును ఉపయోగించి పలు వస్తువులను విక్రయిస్తున్నాయని ఆరోపిస్తూ పిటిషన్ దాఖలు చేశారు. వీరి పిటిషన్ను స్వీకరించిన న్యాయస్థానం అనుకూలంగా తీర్పునిచ్చింది. వ్యక్తిగత భద్రతకు భంగం కలిగించేలా ఉన్న అలాంటి వాటిని తొలగించేలా ఆదేశాలిస్తామని కోర్టు వెల్లడించింది.తాజాగా ఈ జంట మరోసారి కోర్టును ఆశ్రయించారు. తమ వ్యక్తిత్వ హక్కులకు భంగం కలిగించేలా గూగుల్, యూట్యూబ్ తమ ఫోటోలు, వీడియోలను దుర్వినియోగం చేస్తున్నారంటూ రూ.4 కోట్ల దావా వేశారు. ఏఐ సాయంతో రూపొందించిన వీడియో కంటెంట్ను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నారని పిటిషన్లో ప్రస్తావించారు. లైంగికంగా అసభ్యకరమైన వీడియోలను రూపొందిస్తూ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారని.. ఏఐ బాలీవుడ్ ఇష్క్ అనే ఛానెల్లో దాదాపు 259 వీడియోల కంటే ఎక్కువగా ఉన్నాయని తెలిపారు.కాగా.. అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ 2008లో వివాహం చేసుకున్నారు. వీరికి ఆరాధ్య అనే కూతురు ఉన్నారు. ఇక కెరీర్ విషయానికొస్తే ఐశ్వర్య ప్రస్తుతం ఎలాంటి సినిమాలు ప్రకటించలేదు. ఆమె చివరిసారిగా మణిరత్నం తెరకెక్కించిన పొన్నియిన్ సెల్వన్-2 చిత్రంలో కనిపించింది. -
రూ.40 కోట్ల మాదక ద్రవ్యాలు.. అదుపులో బాలీవుడ్ నటుడు
బాలీవుడ్ నటుడు విశాల్ బ్రహ్మను డీఆర్ఐ అధికారులు అరెస్ట్ చేశారు. దాదాపు రూ.40 కోట్ల విలువైన డ్రగ్స్ను సరఫరా చేస్తూ చెన్నై ఎయిర్పోర్ట్లో దొరికిపోయారు. ఈ మాదకద్రవ్యాల రాకెట్ వెనుక నైజీరియా గ్యాంగ్ ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. అతని వద్ద డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.కాగా.. అస్సాంకు చెందిన నటుడు విశాల్ బ్రహ్మ ఇండస్ట్రీలో అవకాశాల్లేక ఆర్థిక సమస్యల వల్లే ఇలాంటి పనులు చేస్తున్నట్లు తెలుస్తోంది. డబ్బుల కోసం కొందరు స్నేహితుల నైజీరియా ముఠాతో పరిచయాలు ఏర్పడినట్లు సమాచారం. విశాల్ బ్రహ్మను కాంబోడియా ట్రిప్కు వెళ్లమని.. భారత్కు మాదకద్రవ్యాలు చేరవేసేందుకు కొంత నగదు ఇస్తామని ఆశ చూపినట్టు దర్యాప్తులో వెల్లడైంది. కాగా.. రెండు వారాల క్రితమే ఢిల్లీ నుంచి కాంబోడియా వెళ్లాడు. రిటన్ జర్నీలో ఓ నైజీరియన్ అతడికి ట్రాలీ బ్యాగ్ ఇచ్చాడని, అందులోనే డ్రగ్స్ ఉన్నట్టు సమాచారం. సింగపూర్ మీదుగా కాంబోడియా.. అక్కడి నుంచి చెన్నై.. చెన్నై నుంచి ఢిల్లీకి రైల్లో వెళ్లాలని నైజీరియా ముఠా అతనితో చెప్పినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కాగా.. విశాల్ బ్రహ్మ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 చిత్రంలో నటించారు. -
స్టార్ హీరోయిన్కు రెండోసారి ప్రెగ్నెన్సీ..!
బాలీవుడ్ భామ సోనమ్ కపూర్ (Sonam Kapoor) గురించి పరిచయం అక్కర్లేదు. బాలీవుడ్లో స్టార్ హీరోల సరసన మెప్పించింది. ఆ తర్వాత 2018లో పెళ్లి బంధంలోకి అడుగుపెట్టిన ముద్దుగుమ్మ.. ఆ తర్వాత 2022లో మొదటి బిడ్డకు వెల్కమ్ చెప్పింది. తన ముద్దుల కుమారుడికి వాయు అనే పేరు పెట్టుకుంది. తాజాగా సోనమ్ కపూర్ రెండోసారి ప్రెగ్నెన్సీ ధరించినట్లు లేటేస్ట్ టాక్. త్వరలోనే ఈ విషయాన్ని అఫీషియల్గా ప్రకటిస్తారని సమాచారం. సోనమ్ కపూర్ ప్రముఖ నటుడు అనిల్ కపూర్ కుమార్తె అన్న సంగతి తెలిసిందే. కాగా.. సోనమ్ కపూర్ తన ప్రియుడు, వ్యాపారవేత్త ఆనంద్ అహుజాని పెళ్లాడింది. (ఇది చదవండి: తల్లి అయ్యాక పూర్తిగా మారిపోయాను.. నచ్చితేనే చేస్తా : హీరోయిన్)ఇక సోనమ్ కపూర్ కెరీర్ విషయానికొస్తే..ఆమె చివరిసారిగా బ్లైండ్ (2023) చిత్రంలో కనిపించింది. ఈ మూవీని 2011లో అదే పేరుతో వచ్చిన కొరియన్ చిత్రానికి రీమేక్గా తెరకెక్కించారు. ఈ చిత్రంలో పురబ్ కోహ్లీ, వినయ్ పాఠక్, లిల్లెట్ దుబే కీలక పాత్రల్లో నటించారు. ఆ తర్వాత ఎలాంటి సినిమాను ప్రకటించలేదు. View this post on Instagram A post shared by Sonam A Kapoor (@sonamkapoor) -
దేనికీ భయపడను, ఎవరికీ తలవంచను: దీపికా పదుకొణె
తానెన్నడూ భయపడిందే లేదంటోంది స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె (Deepika Padukone). కష్టతరమైన మార్గంలోనూ దర్జాగా నడిచానని, ప్రశ్నించేందుకు ఎప్పుడూ వెనకడుగు వేయలేదని పేర్కొంది. ప్రముఖ ఎంటర్టైన్మెంట్ పోర్టల్ ఐఎమ్డీబీ (IMDB) 25 ఏళ్ల భారతీయ సినిమా (2000-2025) అంటూ 130 అత్యుత్తమ చిత్రాల జాబితాను రిలీజ్ చేసింది. అందులో 10 చిత్రాల్లో దీపికా పదుకొణె హీరోయిన్గా నటించడం విశేషం.కష్టాలదారిలోనే నడిచా..ఈ అరుదైన ఘనత అందుకోవడంపై దీపిక సంతోషం వ్యక్తం చేసింది. అలాగే రెండు పెద్ద సినిమాలైన స్పిరిట్, కల్కి 2లు చేజారడంపైనా పరోక్షంగా కామెంట్లు చేసింది. ఈ మేరకు తన జర్నీ గురించి దీపిక మాట్లాడుతూ.. నటిగా ప్రయాణం ప్రారంభించిన కొత్తలో నేనెలా ఉండాలి? ఏం చేస్తే సక్సెస్ అవుతానని నాకు సలహాలు, సూచనలు ఇస్తూ ఉండేవారు. అయితే కెరీర్ ప్రారంభం నుంచే నేను ముక్కుసూటిగా ఉన్నాను. ఏదైనా తప్పనిపిస్తే ప్రశ్నించేందుకు వెనకడుగు వేయలేదు. కష్టాలదారిలోనే కొనసాగాను, నాకెదురైన పరిస్థితులను సవాల్ చేస్తూ ముందడుగు వేశాను తప్ప ఎక్కడా తలవంచలేదు.నా తర్వాత వచ్చేవారికోసం..నా కుటుంబసభ్యులు, అభిమానులు నాపై ఉంచిన నమ్మకమే నేను తీసుకునే బలమైన నిర్ణయాలకు కారణం. నా తర్వాత వచ్చేవారు అనుసరించే మార్గాన్ని నేను శాశ్వతంగా మారుస్తానని ఆశిస్తున్నాను అని చెప్పుకొచ్చింది. బహుశా 8 గంటల షిఫ్ట్ గురించే ఆమె పై వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ఇకపోతే దీపికా ప్రస్తుతం షారూఖ్ ఖాన్తో కలిసి కింగ్ మూవీ చేస్తోంది. అలాగే అల్లు అర్జున్-అట్లీ మూవీలోనూ యాక్ట్ చేస్తోంది.చదవండి: విడాకులు తీసుకున్న జీవీ ప్రకాశ్-సైంధవి -
ప్రముఖ సింగర్ అనుమానాస్పద మృతి.. ఆ ఇద్దరు అరెస్ట్
ప్రముఖ గాయకుడు, కింగ్ ఆఫ్ హమ్మింగ్ జుబీన్ గార్గ్ (Zubeen Garg) మృతి కేసులో పోలీసులు ఇద్దర్ని అరెస్ట్ చేశారు. నార్త్ ఈస్ట్ ఇండియా ఫెస్టివల్ (NEIF) నిర్వాహకుడు శ్యాంకను మహంత, జుబీన్ గార్గ్ మేనేజర్ సిద్దార్థ శర్మను బుధవారం అదుపులోకి తీసుకున్నారు. సింగపూర్లో ఈవెంట్ ముగించుకుని వచ్చిన మహంతను న్యూఢిల్లీలోని ఎయిర్పోర్ట్లో, సిద్దార్థ శర్మను గురుగ్రామ్లోని అతడి అపార్ట్మెంట్లో అరెస్ట్ చేశారు. విచారణ కోసం వీరిద్దరినీ గౌహతికి తీసుకెళ్లినట్లు సీనియర్ పోలీస్ అధికారి మీడియాకు వెల్లడించారు.సింగర్ అనుమానాస్పద మృతిసింగపూర్లో జరిగిన నార్త్ ఈస్ట్ ఇండియా ఫెస్టివల్లో ప్రదర్శన ఇచ్చేందుకు వెళ్లిన జుబీన్.. సెప్టెంబర్ 19న సముద్ర స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు మరణించారు. ఆ సమయంలో అతని ఒంటి మీద లైఫ్ జాకెట్ లేదు. దీంతో ఆయన మృతిపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. సింగర్ మృతికి కారణమైనవారిని వదిలేది లేదని అస్సాం ముఖ్యమత్రి హిమంత బిశ్వశర్మ ప్రకటించారు. సీఎం ఆదేశాల మేరకు ఈ కేసును ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) విచారిస్తోంది.ఎవరీ జుబీన్ గార్గ్?జుబీన్ గార్గ్ అసలు పేరు మోహిని మోహన్. 1972 నవంబర్ 18న అస్సాంలో జన్మించారు. తల్లి గాయని, తండ్రి కవి కావడంతో ఇద్దరి ప్రతిభను అందిపుచ్చుకుని మంచి గాయకుడిగా మారారు. మూడేళ్ల వయసు నుంచే పాటలు పాడటం ప్రారంభించారు. ప్రఖ్యాత సంగీతకారుడు జుబీన్ మెహతా అంతటివాడు కావాలని జుబీన్ గార్గ్ అని పెట్టుకున్నారు. 40కిపైగా భాషల్లో పాటలు పాడారు. సింగర్గానే కాకుండా రచయిత, సంగీత దర్శకుడు, సినీ దర్శకుడు, నటుడిగా ప్రేక్షకులను అలరించారు.చదవండి: దుస్తులు విప్పేసి కొట్టేందుకు యత్నం.. హీరోయిన్పై కేసు -
వివాదాలు సృష్టించవద్దు!: ఫరా ఖాన్
దర్శకురాలు ఫరా ఖాన్, హీరోయిన్ దీపికా పదుకోన్ల మధ్య అబీప్రాయభేదాలొచ్చాయని, అందుకే ఇన్స్టాలో వీరిద్దరూ ఒకరినొకరు అన్ఫాలో చేసుకున్నారన్నది బాలీవుడ్ టాక్. దీపిక కెరీర్లోని రెండు బ్లాక్బస్టర్ చిత్రాలు ‘ఓం శాంతి ఓం’ (2007), ‘హ్యాపీ న్యూ ఇయర్’ (2014)లో షారుక్ ఖాన్ హీరోగా నటించగా, ఫరా ఖాన్ దర్శకత్వం వహించారు. ఇలా దీపిక–ఫరాల మధ్య మంచి అనుబంధం ఉంది.అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూ సందర్భంగా సినిమాల్లో హీరోయిన్స్ 8 గంటలే పని చేయాలన్నట్లుగా, ‘ఎయిట్ అవర్స్ షిఫ్ట్’ కాన్సెప్ట్ గురించి దీపిక మాట్లాడారు. ఈ కాన్సెప్ట్పై భిన్నాబీప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇటీవల ఓ షోలో పాల్గొన్న ఫరా ఈ ‘ఎయిట్ అవర్స్ షిప్ట్’ గురించి కాస్త వ్యంగ్యంగా మాట్లాడారు. దీంతో దీపికను ఉద్దేశించే ఫరా ఖాన్ అలా మాట్లాడారని, అందుకే వీరిద్దరూ ఒకరినొకరు ఇన్స్టాలో అన్ఫాలో అయ్యారని ప్రచారమవుతోంది.ఈ ప్రచారంపై ఫరా స్పందించారు. ‘‘హ్యాపీ న్యూ ఇయర్’ సినిమా షూటింగ్ సమయంలోనే నేను, దీపిక ఇన్స్టాలో కాకుండా డైరెక్ట్ మెసేజ్ లేదా ఫోన్ కాల్స్ ద్వారా మాట్లాడాలనుకున్నాం. అప్పుడే మేం ఒకరినొకరం అన్ఫాలో అయ్యాం. కొన్ని వెబ్పోర్టల్స్ కొత్త వివాదాలు సృష్టిస్తున్నారు’’ అంటూ తన ఇన్స్టా స్టోరీలో ఫరా షేర్ చేశారు. ఈ స్టోరీకి ఓ నమస్కారం ఎమోజీతో దీపిక స్పందించారు. -
గంగూభాయి కతియావాడి స్టోరీ.. ఆలియా భట్ కోసం కాదట!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ నటించిన సూపర్ హిట్ చిత్రం గుంగూభాయి కతియావాడి. సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ఈ సినిమా ఏకంగా జాతీయ అవార్డ్ను సాధించిపెట్టింది. అలియా భట్ లీడ్ రోల్లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ బ్లాక్బస్టర్గా నిలిచింది. దీంతో ఈ సినిమాకు ఏకంగా పది విభాగాల్లో ఫిలిం ఫేర్ అవార్డులు సాధించింది. అయితే ఈ సూపర్ హిట్ చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. సంజయ్ లీలా భన్సాలీ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్గా ఆదిత్య నారాయణ్ గంగూభాయి కతియావాడి మూవీ గురించి మాట్లాడారు.ఈ చిత్రానికి మొదట ఆలియా భట్ను తీసుకోవాలని అనుకోలేదని ఆదిత్య నారాయణ్ వెల్లడించారు. ప్రస్తుతం రైజ్ అండ్ ఫాల్ రియాలిటీ షోలో పాల్గొన్న ఆదిత్య నారాయణ్.. సంజయ్ లీలా భన్సాలీతో కలిసి పని చేయడంపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. గంగూబాయి కతియావాడి సినిమాను ఇటీవలే జాతీయ అవార్డ్ అందుకున్న రాణి ముఖర్జీతో తెరకెక్కించాలని అనుకున్నట్లు వెల్లడించారు. ఫిల్మ్ మేకింగ్ నేర్చుకోవాలనే ఆసక్తితోనే సంజయ్ వద్ద అసిస్టెంట్గా చేరానని తెలిపారు. అయితే మొదట్లో భన్సాలీ తనను సీరియస్గా తీసుకోలేదని.. విసుగొచ్చి మానేస్తాడని అనుకున్నాడని పేర్కొన్నారు. ఓ వారం తర్వాత నాకు పని చెప్పడం ప్రారంభించారని గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో సంజయ్ వద్ద రామ్-లీలా, గంగూబాయి కతియావాడి (2022) మూవీస్ స్క్రిప్ట్లు ఉన్నాయని తెలిపారు. అప్పుడే రాణి ముఖర్జీ ప్రధాన పాత్రలో గంగూబాయి కతియావాడిని నిర్మించాలని ఆలోచన ఉందని మాతో చెప్పాడని పేర్కొన్నారు. -
పెళ్లి చేసుకున్న చిన్నారి పెళ్లి కూతురు.. గ్రాండ్గా వెడ్డింగ్
చిన్నారి పెళ్లి కూతురు సీరియల్తో గుర్తింపు తెచ్చుకున్న అవికా గోర్ పెళ్లిబంధంలోకి అడుగుపెట్టింది. ఈ ఏడాది జూన్లో నిశ్చితార్థం ముద్దుగుమ్మ సామాజిక కార్యకర్త మిలింద్ చంద్వానిని పెళ్లాడింది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు నూతన జంటకు అభినందనలు చెబుతున్నారు. కాగా.. కొన్నేళ్ల పాటు ప్రేమలో ఉన్న వీరిద్దరు మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు.కాగా.. సీరియల్ నటిగా కెరీర్ మొదలుపెట్టిన అవికా.. తెలుగులోనూ పలు సినిమాల్లో హీరోయిన్గా చేసింది. 'ఉయ్యాలా జంపాలా' మూవీతో పరిచయంలోనే హిట్ కొట్టిన ఈమె.. తర్వాత సినిమా చూపిస్త మావ, లక్ష్మీ రావే మా ఇంటికి, ఎక్కడికి పోతావ్ చిన్నవాడా, రాజుగారి గది 3, థ్యాంక్యూ లాంటి తెలుగు మూవీస్ చేసింది, ప్రస్తుత 'షణ్ముఖ' సినిమాలో చేస్తోంది. అసలు విషయానికొస్తే.. 2019లో సామాజిక కార్యకర్త అయిన మిలింద్ని ఓ సందర్భంలో అవికా కలిసింది. అలా ఏడాది పాటు స్నేహితులుగా ఉన్న వీళ్లిద్దరూ 2020 నుంచి దాదాపు ఐదేళ్లుగా ప్రేమాయణం కొనసాగించారు. తాజాగా ఇవాళ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
హర్ట్ అయిపోయిన దీపిక.. ఆ డైరెక్టర్తో కటీఫ్
బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణె మరోసారి వార్తల్లో నిలిచింది. గతంలో రెండుసార్లు కలిసి పనిచేసిన ఓ దర్శకురాలి మాటలకు హర్ట్ అయింది. ఆమె ఏదో సరదాగా అన్న వ్యాఖ్యల్ని మరీ సీరియస్గా తీసుకున్న దీపిక.. దూరం పెట్టేసింది. సోషల్ మీడియాలోనూ అన్ ఫాలో కొట్టేసింది. ఇంతకీ ఏంటా విషయం? ఎవరా డైరెక్టర్?కొన్ని రోజులు క్రితం దీపిక పదుకొణెని ప్రభాస్ 'స్పిరిట్' కోసం హీరోయిన్గా తీసుకోవాలని సందీప్ రెడ్డి వంగా అనుకున్నాడు. ఈ మేరకు డిస్కషన్ జరిగింది. అంతా ఓకే అనుకునే టైంలో దీపిక చెప్పిన కండీషన్స్ నచ్చక.. సందీప్ తన మూవీ నుంచి దీపికని పక్కకు తప్పించాడనే టాక్ వచ్చింది. దీంతో ఈ టైంలో చాలామంది సందీప్ కి సపోర్ట్గా నిలిచారు. మరికొందరు దీపికకు సపోర్ట్ చేశారు. మొన్నీమధ్య ప్రభాస్ 'కల్కి' టీమ్ కూడా దీపిక తాము తీయబోయే సీక్వెల్లో ఉండదని తేల్చి చెప్పారు.(ఇదీ చదవండి: రెండు ఓటీటీల్లోకి వచ్చేసిన 'జూనియర్')అయితే దీపిక.. రోజుకు 7 గంటలే పనిచేస్తానని చెప్పిందని, తన టీమ్ దాదాపు 25 మంది కోసం ఫైవ్ స్టార్ హోటల్లో రూమ్స్, ఫుడ్ లాంటివి కావాలని అడిగిందని.. అలానే రెమ్యునరేషన్ కూడా తొలి పార్ట్కి తీసుకున్న దానికంటే భారీగా డిమాండ్ చేసిందని.. అందుకే 'కల్కి' మేకర్స్ దీపికని తప్పించారని మాట్లాడుకున్నారు. తాజాగా ఓ షోలో బాలీవుడ్ కొరియోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ ఫరా ఖాన్ పాల్గొంది. నటీనటుల వర్కింగ్ అవర్స్(పనిగంటలు) గురించి ఫన్నీగా కామెంట్ చేసింది.'ఆమె ఇప్పుడు పనిచేసేదే 8 గంటలు, ఇక ఈ షోకు ఎలా వస్తారా? ఆమెకు అంత టైమ్ ఎక్కడ ఉంటుంది' అని చెప్పి దీపికని ఉద్దేశిస్తూ పరోక్షంగా ఫరా ఖాన్ ఫన్నీగా మాట్లాడింది. ఈ మాటలకు దీపిక బాగానే హర్ట్ అయిపోయినట్లు ఉంది. ఇన్ స్టాలో ఫరా ఖాన్ని అన్ ఫాలో చేసింది. దీంతో ఫరా కూడా దీపికని అన్ ఫాలో చేసింది. గతంలో ఫరా తీసిన 'ఓం శాంతి ఓం', 'హ్యాపీ న్యూఇయర్' సినిమాల్లో దీపికనే హీరోయిన్. కానీ ఇప్పుడు కామెడీగా చేసిన కామెంట్స్ ఇద్దరి మధ్య దూరానికి కారణమైనట్లు కనిపిస్తున్నాయి.(ఇదీ చదవండి: పవన్ కల్యాణ్ ఓజీకి బిగ్ షాక్..!) -
మనం కలిసి బతుకుదామా...
‘‘నేను ఏ సినిమా చేసినా అందులో ఒక కొత్త కాన్సెప్ట్ ఉండేలా చూసుకుంటాను. ‘థామా’ సినిమా కాన్సెప్ట్ ఆడియన్స్ని అలరిస్తుంది. ఈ సినిమాలోని అలోక్ క్యారెక్టర్ చేయడం కొత్తగా అనిపించింది. ‘థామా’ చిత్రం కోసం యాక్షన్ సీక్వెన్స్ చాలా చేశాను’’ అని ఆయుష్మాన్ ఖురానా అన్నారు. ఆయుష్మాన్ ఖురానా, రష్మికా మందన్నా హీరో హీరోయిన్లుగా నటించిన హిందీ చిత్రం ‘థామా’. మాడాక్ హారర్ ఫిల్మ్స్ యూనివర్స్ (ఎమ్హెచ్సీయు) లో భాగంగా ఆదిత్య సర్పోత్దార్ దర్శకత్వంలో దినేష్ విజన్, అమర్ కౌశిక్ నిర్మించిన ఈ చిత్రం అక్టోబరు 21న విడుదల కానుంది.ఈ సందర్భంగా హైదరాబాద్లో ‘థామా’ సినిమా తెలుగు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ను నిర్వహించారు. ఈ వేడుకలో ఆయుష్మాన్ ఖురానా మాట్లాడుతూ– ‘‘నా సినిమా ప్రమోషన్స్ కోసం తొలిసారిగా హైదరాబాద్ వచ్చాను. ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. ‘థామా’ ఫుల్ పాన్ ఇండియా మూవీ. రష్మికగారితో తొలిసారి కలిసి నటించడం సంతోషంగా ఉంది. ఆమె బ్రిలియంట్ పెర్ఫార్మర్. ‘థామా’ సినిమాను థియేటర్స్లో చూసి, ఎంజాయ్ చేయండి’’ అని అన్నారు. ‘‘మాడాక్ హారర్ కామెడీ యూనివర్స్ నుంచి వచ్చే సినిమాలకు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ ఉంది.‘థామా’ సినిమా కూడా ప్రేక్షకులను అలరిస్తుంది. ఈ సినిమాలో ఆడియన్స్ని సర్ప్రైజ్ చేసే క్యారెక్టర్ చేశాను’’ అని తెలిపారు రష్మికా మందన్నా. ‘పోలీసుల కోసం నేను ఏమైనా చేస్తాను’, ‘ఏం చేశారో చెప్పండి’, ‘విక్రమార్కుడు సినిమా ఎనిమిది సార్లు చూశాను సార్’, ‘నేను వెళ్లక తప్పదు అలోక్... నా కారణంగా నువ్వు కూడా ప్రమాదంలో పడతావ్..’, ‘నాకేం కలిసి చనిపోయే ఉద్దేశం లేదు... మనం కలిసి బతుకుదామా!’, ‘నేను నీతో పాటు ఉండలేను... మన ప్రపంచాలు ఒకటి కావు’ అనే డైలాగ్స్ ‘థామా’ తెలుగు ట్రైలర్లో ఉన్నాయి. -
చాహల్తో పెళ్లి.. మొదటి ఏడాదిలోనే అంతా తెలిసిపోయింది: ధనశ్రీ వర్మ
ప్రముఖ కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మ విడాకులు తీసుకుని ఆరు నెలలైనా వార్తల్లో నిలుస్తూనే ఉంది. ప్రస్తుతం రైజ్ అండ్ ఫాల్ రియాలిటీ షోలో కంటెస్టెంట్గా ఉన్న ధనశ్రీ.. తన వివాహం, విడాకులపై కామెంట్స్ చేస్తూనే ఉంది. తాజాగా చాహల్ వివాహం తర్వాత ఎదురైన అనుభవాన్ని పంచుకుంది. చాహల్ తనను మోసం చేశాడని షాకింక్ విషయాన్ని రివీల్ చేసింది. పెళ్లైన మొదటి ఏడాది రెండో నెలలోనే అతని మోసాన్ని కనిపెట్టానని ధనశ్రీ తెలిపింది. దీంతో మరోసారి చాహల్- ధనశ్రీ వర్మ సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది.ఈ షోలో తన వివాహ బంధంపై ధనశ్రీ వర్మకు ఓ ప్రశ్న ఎదురైంది. చాహల్తో పెళ్లి.. పొరపాటు చేశానని మీకెప్పుడు అనిపించింది? అని మరో కంటెస్టెంట్ కుబ్రా సైత్ అడిగింది. దీనిపై చాహల్ మాజీ భార్య ధనశ్రీ స్పందించింది. పెళ్లైన మొదటి సంవత్సరం.. రెండవ నెలలోనే చాహల్ను పట్టుకున్నా అంటూ సమాధానమిచ్చింది. ఈ సమాధానం విన్న కుబ్రా సైత్ షాకింగ్రు గురైంది. కాగా.. చాహల్తో విడాకుల తర్వాత ధనశ్రీ పెద్ద మొత్తంలో భరణం డిమాండ్ చేసిందనే వార్తలొచ్చాయి. ఈ షోలోనే వీటిపై కూడా క్లారిటీ ఇచ్చింది. అవన్నీ ఫేక్ వార్తలు అంటూ కొట్టిపారేసింది ధనశ్రీ వర్మ. -
మాజీ భార్య మరణం.. స్పందించని అదుర్స్ నటుడు!
బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. టాలీవుడ్లో అదుర్స్, సాహో చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన బాలీవుడ్ నటుడు మహేశ్ మంజ్రేకర్ (Mahesh Manjrekar) మాజీ భార్య మరణించింది. ఆయన మొదటి భార్య, ఫ్యాషన్ డిజైనర్ దీపా మెహతా ఇవాళ కన్నుమూశారు. తల్లి మరణ వార్తను కుమారుడు సత్య మంజ్రేకర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మిస్ యూ అమ్మా అంటూ భావోద్వేగానికి లోనయ్యారు.దీపా మెహతా మరణ వార్త విన్న పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. మహేశ్ మంజ్రేకర్, దీపా మెహతాను 1987లో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత 1995లో విభేదాలు రావడంతో తమ వివాహ బంధానికి ముగింపు పలికారు. వీరిద్దరికి కుమారుడు సత్య మంజ్రేకర్, కుమార్తె అశ్వమి మంజ్రేకర్ ఉన్నారు. ఆ తర్వాత మహేశ్ మేధా మంజ్రేకర్ను వివాహం చేసుకున్నాడు. వీరికి సాయి మంజ్రేకర్ అనే కుమార్తె ఉంది. అయితే మాజీ భార్య మరణం పట్ల మహేశ్ ఎలాంటి పోస్ట్ చేయలేదు.కాగా.. మహేశ్ మంజ్రేకర్ (Mahesh Manjrekar) వాస్తవ్ అనే చిత్రంతో దర్శకుడిగా వెండితెరకు పరిచయమయ్యాడు. వాస్తవ్ సినిమాలో సంజయ్దత్, నమ్రత శిరోద్కర్ హీరోహీరోయిన్లుగా నటించారు. పరేశ్ రావల్, దీపక్, సంజయ్ నర్వేకర్ కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీ 1999 అక్టోబర్లో విడుదలైంది. వాస్తవ్ హిట్టవడంతో దర్శకుడు మహేశ్ దీనికి సీక్వెల్గా హత్యార్ తీశాడు. ఇందులోనూ సంజయ్ దత్ హీరోగా నటించాడు. ఫస్ట్ మూవీతోనే సక్సెస్ అందుకున్నాడు. ఆ తర్వాత పలు భాషల్లో నటుడిగా మెప్పించారు. తెలుగులో ఎన్టీఆర్ నటించిన అదుర్స్.. ప్రభాస్ సాహో మూవీస్లోనూ మెప్పించాడు. -
రష్మిక.. ఎప్పుడూ జిమ్లోనే ఉంటావా?
పాన్ ఇండియా లెవల్లో ప్రస్తుతం బిజీ యాక్టర్ ఎవరైనా ఉన్నారా అంటే అది రష్మిక మాత్రమే. ఎందుకంటే ఓవైపు ప్రాంతీయ చిత్రాల్లో నటిస్తూనే మరోవైపు బాలీవుడు మూవీస్ కూడా చేస్తోంది. ఈ ఏడాది ఇప్పటికే మూడు సినిమాలతో ప్రేక్షకుల్ని పలకరించింది. సరే ఇదంతా పక్కనబెడితే రష్మిక గురించి తోటి హీరోయిన్ ఓ ఫన్నీ వీడియో పోస్ట్ చేసింది. ఇదిప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: రష్మిక గ్లామరస్ సాంగ్ విడుదల)ఈ ఏడాది ఛావా, సికిందర్, కుబేర చిత్రాలతో వచ్చింది. వీటిలో రెండు హిందీ మూవీస్. వచ్చే నెలలో 'థామా' అనే బాలీవుడ్ హారర్ సినిమాతో రాబోతుంది. ఇది కాకుండా 'గర్ల్ ఫ్రెండ్' అనే తెలుగు చిత్రం కూడా రిలీజ్కి సిద్ధంగా ఉంది. ఇవి కాకుండా 'కాక్ టెయిల్ 2' అనే హిందీ మూవీ కూడా చేస్తోంది. ఇందులో రష్మికతో పాటు కృతి సనన్ హీరోయిన్గా చేస్తోంది. తాజాగా వీళ్లిద్దరూ ఓ జిమ్లో కలిశారు. అయితే కృతి అక్కడకి వెళ్లడానికంటే ముందే రష్మిత వర్కౌట్స్ చేస్తూ కనిపించింది.'రష్మిక నువ్వు ఎప్పుడు చూసినా జిమ్లోనే కనిపిస్తున్నావ్. కొంపదీసి ఇక్కడే బతికేస్తున్నావా?' అని కృతి సనన్ నవ్వుతూ అడగ్గా.. బదులిచ్చిన రష్మిక.. 'నువ్వు వచ్చేటప్పుడు నేను ఇక్కడ ఉంటున్నాను. ఎక్కువగా ఏం చేయడం లేదు' అని నవ్వేసింది. 'నువ్వు చాలా కష్టపడుతున్నావ్' అని కృతి సనన్ అనేసరికి వీళ్లిద్దరూ గట్టిగా నవ్వేసుకున్నారు. ఈ వీడియోని కృతి సనన్ తన ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ చేసింది.(ఇదీ చదవండి: విషాదం.. 'వీర్ హనుమాన్' బాల నటుడు మృతి)The only place @iamRashmika isn't tired is the gym! 💪 @kritisanon caught the gym beast in action. 😂 Can't wait for her to bring this energy to the sets of #Cocktail2 soon. More shooting pics with the cast, pls. 🙏Thank u kriti 4 this video 🫶#KritiSanon #RashmikaMandanna ❤️ pic.twitter.com/eMGk2hYSDG— Rashmika Delhi Fans (@Rashmikadelhifc) September 28, 2025 -
విషాదం.. 'వీర్ హనుమాన్' బాల నటుడు మృతి
ప్రమాదం ఏ వైపు నుంచి ఎప్పుడు ఎలా వస్తుందో అస్సలు ఊహించలేం. ఇప్పుడు కూడా అలా అనుకోని సంఘటన కారణంగా ఓ బాల నటుడు, అతడి సోదరుడు కన్నుమూశారు. ఇంట్లో ప్రశాంతంగా నిద్రపోతుండగా జరిగిన అగ్ని ప్రమాదం కాస్త ఆ కుటుంబంలో తీరని శోకాన్ని మిగిల్చింది. దీంతో ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.(ఇదీ చదవండి: 'స్పిరిట్'లో మలయాళీ భామ.. మరో బాలీవుడ్ బ్యూటీ ఔట్!)హిందీలో 'శ్రీమద్ రామాయణ్', 'వీర్ హనుమాన్' సీరియల్స్లో నటించిన వీర్ శర్మ(10), ఇతడి సోదరుడు శౌర్య శర్మ(15) ఆదివారం రాత్రి ఇంట్లో ఓ గదిలో నిద్రపోతున్నారు. షార్ట్ సర్క్యూట్ జరిగి, అన్నదమ్ములిద్దరూ పడుకుని ఉన్న రూంతో పాటు హాల్ అంతా పొగ వ్యాపించింది. అయితే గాఢనిద్రలో ఉండేసరికి వీర్, శౌర్య కదల్లేక పొగ పీల్చేసి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. అప్రమత్తమై ఆస్పత్రికి తీసుకెళ్లినప్పటికీ అప్పటికే పిల్లలిద్దరూ మరణించారని వైద్యులు ధ్రువీకరించారు.ఈ ప్రమాదం జరిగే సమయంలో వీర్ తల్లి మరో గదిలో ఉండగా.. తండ్రి బయటకు వెళ్లారు. దీంతో వీళ్లకు ఏమి కాలేదు. చిన్నారులు మాత్రం తుదిశ్వాస విడిచారు. అయితే కొడుకులు చనిపోయారే బాధలో ఉన్నప్పటికీ.. పిల్లలిద్దరూ కళ్లని దానం చేసేందుకు తల్లదండ్రులు ముందుకు వచ్చారు. ఇప్పుడు ఈ విషయం హిందీ ఇండస్ట్రీలో వైరల్ అవుతోంది. ఇప్పటికే సీరియల్స్ చేసిన వీర్.. త్వరలో ఓ హిందీ సినిమాతో బిగ్ స్క్రీన్పై కనిపించబోతున్నాడు. ఇంతలోనే ఇలా జరగడం ఆ పిల్లల తల్లిదండ్రులకు తీరని ఆవేదన మిగిల్చింది.(ఇదీ చదవండి: 'బాయ్కాట్ కాంతార'.. దీని వెనక ఎవరున్నారు? ఇప్పుడే ఎందుకిలా?) -
లతా మంగేష్కర్కి నివాళిగా...
బాలీవుడ్ దర్శక–నిర్మాత, నటుడు ఫర్హాన్ అక్తర్ ప్రధాన పాత్రలో నటించిన తాజా హిందీ చిత్రం ‘120 బహదూర్’. ఈ దేశభక్తి చిత్రానికి రజనీశ్ దర్శకత్వం వహించగా, రాశీ ఖన్నా కీలక పాత్రలో నటించారు. 1962లో జరిగిన భారత్–చైనా యుద్థం నేపథ్యంలో మేజర్ షైతాన్ సింగ్ భాటీ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో మేజర్ షైతాన్ సింగ్గా ఫర్హాన్ అక్తర్ నటిస్తున్నారు. రెజాంగ్ లా యుద్ధ సంఘటనలు ప్రధాన ఇతివృత్తంగా ఈ సినిమా సాగుతుంది. ఆదివారం ఈ సినిమా సెకండ్ టీజర్ను విడుదల చేశారు మేకర్స్. ఇదిలా ఉంటే... భారత్–చైనా (1962) యుద్ధంలో వీరమరణం పొందిన భారత అమరవీరులను గౌరవించేందుకు 1963లో దివంగత ప్రముఖ గాయని లతా మంగేష్కర్ ‘ఏ మేరే వతన్ కే లోగో’ అనే పాటను ఆలపించగా, ఈ పాట అందరి హృదయాల్లో నిలిచిపోయింది.ఆదివారం (సెప్టెంబరు 28) లతా మంగేష్కర్ జయంతి. తాజాగా విడుదలైన ‘120 బహదూర్’ సినిమా సెకండ్ టీజర్ బ్యాక్గ్రౌండ్లో ‘ఏ మేరే వతన్ కే..’ పాట వినిపించింది. ఈ విధంగా లతా మంగేష్కర్కు ‘120 బహదూర్’ టీమ్ ప్రత్యేక నివాళిగా సెకండ్ టీజర్ను రిలీజ్ చేసింది. ఈ ఏడాది నవంబరు 21న ఈ చిత్రం థియేటర్స్లో రిలీజ్ కానుంది. -
ప్రేమ విహారం
ఇటలీ వీధుల్లో ప్రేమవిహారం చేస్తున్నారు హీరోయిన్ రష్మికా మందన్నా. షాహిద్ కపూర్, కృతీ సనన్, రష్మికా మందన్నా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న యూత్ఫుల్ లవ్ అండ్ ఎమోషనల్ డ్రామా ‘కాక్టైల్ 2’. హోమి అడజానియా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం ఇటలీలో జరుగుతోందని తెలిసింది. షాహిద్ కపూర్, రష్మికా మందన్నా, కృతీ సనన్ పాల్గొనగా కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు మేకర్స్. ముఖ్యంగా షాహిద్ కపూర్, రష్మికల మధ్య ప్రేమ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట.అలాగే ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, సంజయ్ దత్ కీలక పాత్రల్లో నటిస్తున్నారని బాలీవుడ్ సమాచారం. ఇటలీ షూటింగ్ షెడ్యూల్లో టాకీ పార్టుతో పాటు సాంగ్స్ని కూడా చిత్రీకరించాలని ప్లాన్ చేశారని తెలిసింది. విదేశాల్లోనే ఈ సినిమా మేజర్ షూటింగ్ జరుగుతుందని బాలీవుడ్ భోగట్టా. దినేష్ విజన్, లవ్ రంజన్ నిర్మిస్తున్న ఈ ‘కాక్టైల్ 2’ సినిమా వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో రిలీజ్ కానుంది. ఇక సైఫ్ అలీఖాన్, దీపికా పదుకోన్, డయానా పెంటీ ప్రధాన పాత్రధారులుగా హోమి అడజానియా దర్శకత్వంలో రూపొందిన సూపర్ హిట్ మూవీ ‘కాక్టైల్ (2012)’కి సీక్వెల్గా ‘కాక్ టైల్ 2’ చిత్రం తెరకెక్కుతోంది. -
లతా మంగేష్కర్ జయంతి.. స్పెషల్ టీజర్తో నివాళి!
బాలీవుడ్ హీరో ఫర్హాన్ అక్తర్ కీలక పాత్రలో నటిస్తోన్న పీరియాడికల్ వార్ చిత్రం 120 బహదూర్. ఈ సినిమాను 1962 నాటి ఇండియా- చైనా యుద్ధం ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. మేజర్ షైతాన్ సింగ్ భాటి జీవిత కథగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. అప్పటి యుద్ధం సమయంలో జరిగిన వాస్తవ సంఘటనలతో ఈ మూవీని రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి రజనీశ్ దర్శకత్వం వహిస్తున్నారు.ఇప్పటికే రిలీజైన టీజర్ అభిమానులను ఆకట్టుకోగా.. తాజాగా మరో టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. లతా మంగేష్కర్ జయంతి సందర్భంగా ఆమె నివాళిగా ప్రత్యేక టీజర్ను విడుదల చేశారు. 1962 భారత-చైనా యుద్ధంలో అమరవీరులను గౌరవించటానికి లతా మంగేష్కర్ 1963లో మొదటిసారి 'ఏ మేరే వతన్ కే లోగోన్' అనే సాంగ్ను ఆలపించారు. ఈ పాట చాలా కాలం పాటు అభిమానుల గుండెల్లో నిలిచిపోయింది.కాగా.. ఈ చిత్రంలో ఫర్హాన్ అక్తర్ సోల్జర్గా కనిపించనున్నారు. తాజాగా విడుదలైన టీజర్ చూస్తే యుద్ధ సన్నివేశాలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. టీజర్లోని విజువల్స్, డైలాగ్స్ ఫ్యాన్స్ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. కాగా.. ఈ చిత్రంలో రాశి ఖన్నా హీరోయిన్గా కనిపించనుంది. ప్రస్తుతం షూటింగ్ జరుగుతోన్న ఈ సినిమాను నవంబర్ 21 రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. ఈ మూవీని ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్ బ్యానర్లో రితేష్ సిధ్వానీ, ఫర్హాన్ అక్తర్, అమిత్ చంద్రా నిర్మించారు. -
దుర్గాపూజలో భక్తిపారవశ్యం, నటీమణులు ఎమోషనల్, వీడియో వైరల్
ప్రతీ ఏడాది ముంబైలో జరిగి దసరా ఉత్సవాలు, దుర్గా పూజలో బాలీవుడ్ హీరోయిన్లు ఉత్సాహంగా పాల్గొనడం ఆనవాయితీ. ముఖ్యంగా కాజోల్ , రాణి ముఖర్జీ ఈ కార్యక్రమాల్లో ముందంజలో ఉంటూ బంధుజనంతో కలివిడిగా తిరుగుతూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచేవారు. అత్యంత భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. కానీ ఏడాది ఉత్సవాల్లో వారిద్దరూ తీవ్ర భావోద్వాగానికి లోనయ్యారు. అటు తన తండ్రి తరువాత అయాన్ ముఖర్జీ దుర్గా పూజ ఉత్సవాల్లో తొలిసారి పాల్గొన్నారు. తమ సమీప బంధువు, అత్యంత ఆప్తుడైన నటుడు దేబ్ ముఖర్జీ ఈ ఏడాదితమ మధ్య లేకపోవడమే ఇందుకు కారణం. ఆయనను గుర్తు చేసుకుని ఆయన మేనకోడళ్ళు నటీమణులు కాజోల్ , తనీషా రాణీ ముఖర్జీ భావోద్వాగానికి లోనయ్యారు. ఈ దృశ్యలు ఆన్లైన్లో దర్శనిమిచ్చాయి. ప్రతి సంవత్సరం దుర్గా పూజ పండల్ ఘనంగా దేబ్ ముఖర్చీ ఈ ఏడాది లేరు. ప్రముఖ బాలీవుడ్ నటుడు చిత్రనిర్మాత,బ్రహ్మాస్త్ర ఫేమ్ అయాన్ ముఖర్జీ తండ్రి దేబ్ ముఖర్జీ. ఫ్యామిలీ అంతా ప్రేమగా 'దేబు కాకా' అని పిల్చుకునే దేబ్ ముఖర్జీ మార్చి 14, 2025న కన్నుమూసిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో ఈ ఏడాది తమ కుటుంబ సంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్లి, ఉత్సవాలను కలిసి ప్రారంభించారు కాజోల్, రాణీ ముఖర్జీ తనీషా ముఖర్జీ తదితర కుటుంబ సభ్యులు నార్త్ బాంబే సర్బోజానిన్ దుర్గా పూజ పండల్ను ఆవిష్కరించారు.రాణి ముఖర్జీ కుటుంబం యొక్క దుర్గా పూజ 2025 కి సహ-నిర్వాహకురాలిగా ఉన్నారు.‘‘అయిగిరి నందిని’’అనే స్తోత్రం మధ్య కాజోల్, రాణి దుర్గా మాత విగ్రహాన్ని ఆవిష్కరించారు. అమ్మవారిని చూడగానే ఇద్దరూ భక్తితో చేతులో జోడించి నమస్కరించారు. అనంతర అటు అమ్మవారి రూపాన్ని చూసి, ఇటు దివంగత దేబ్ ముఖర్జీని స్మరించుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. VIDEO | Mumbai, Maharashtra: Actors Kajol and Rani Mukherjee witness the unveiling of the Goddess' idol at the North Bombay Sarbojanin Durga Puja Samiti. (Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/EgP2o1xVOH— Press Trust of India (@PTI_News) September 27, 2025ఈ సందర్భంగా తనీషా మాట్లాడుతూ"మా కుటుంబానికి ఇది కొంచెం విచారకరమైన సమయం, కొంచెం ఉత్సాహంతో పాటు, ఈ సంవత్సరం మా కుటుంబంలో ముగ్గురు ఆప్తులను కోల్పోయాం. ప్రతి సంవత్సరం దుర్గా పూజను నిర్వహించే మా దేబు కాకా (దేబ్ ముఖర్జీ) ఇక లేరు, ఈసారి పూజకు హాజరు కావడం కొంచెం కష్టంగానే అనిపించింది. అయినా గానీ ఆయన కలను ముందుకు తీసుకెళ్తున్నందున చాలా ఆనందంగా కూడా ఉంది." అన్నారు. View this post on Instagram A post shared by Rohit Saraiya (@rohitsaraiya.official) -
ఆమెకు ముద్దులిస్తే..వారానికి రూ. 1000 ఇచ్చేది : స్టార్ హీరో
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్(Saif Ali Khan).. కష్టపడి ఒక్కో మెట్టు ఎక్కి స్టార్గా ఎదిగాడు. ఆస్తులు, సినిమా బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పటికీ..ఆయనకు ఈజీగా చాన్స్లు రాలేదు. కెరీర్ తొలినాళ్లలో అవకాశాల కోసం చాలా కష్టపడ్డాడు. హీరోగా చాన్స్ రాకకోవడంతో సెకండ్, థర్డ్ లీడ్ క్యారెక్టర్స్ కూడా చేశారు. 1993లో పరంపర సినిమాతో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన.. హీరోగా నిలదొక్కుకోవడానికి చాలా కాలం పట్టింది. ఒకానొక దశలో పాత్రల కోసం అడుక్కోవాల్సి వచ్చిందంట. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్లో ఎదైరన ఓ వింత ఘటన గురించి చెప్పాడు. డబ్బుల కోసం ఓ మహిళా నిర్మాతకు పదిసార్లు ముద్దులు పెట్టానని చెప్పాడు.(చదవండి: సినిమా బాగోలేకపోతే నేనేం చేస్తా? మహేశ్ ఫ్యాన్స్ అన్న మాటలకు ఏడ్చేశా..)‘కెరీర్ ప్రారంభంలో చాన్స్లు రాలేదు. ఓ మహిళా నిర్మాత ఖర్చుల కోసం డబ్బులు ఇచ్చేది. అయితే ఆమె ఒక కండీషన్ పెట్టింది. తన బుగ్గలపై ముద్దు పెడితేనే డబ్బులు ఇస్తానని చెప్పింది. అలా 10 ముద్దులు పెట్టి వారానికి రూ. 1000 తీసుకునేవాడిని’అని సైఫ్ చెప్పుకొచ్చాడు.(చదవండి: ఇమ్మూ కెప్టెన్సీ, రీతూ జుట్టు.. మరి ఆ ఇద్దరు ఏం త్యాగం చేశారు? శ్రీజకు పనిష్మెంట్!)ఇక సినిమా బ్యాక్గ్రౌండ్ ఉండడంతోనే అవకాశాలు వచ్చాయన్న ఆరోపణలపై కూడా ఆయన స్పందించాడు. ‘నాకు సినిమా బ్యాక్గ్రౌండ్( బాలీవుడ్ నటి షర్మీలా ఠాగూర్ కొడుకే సైఫ్) ఉందని, అదృష్టంతో స్టార్ అయ్యానని అంతా అనుకుంటారు. కానీ నాకు అవకాశాలు అంత ఈజీగా రాలేదు. చాలా కష్టపడితే కానీ ఈ స్థాయికి రాలేనని నేను భావిస్తున్నాను. బ్యాక్గ్రౌండ్ ఉన్నంత మాత్రాన ఇండస్ట్రీలో రాణిస్తారని అనుకోవడం తప్పు. టాలెంట్ లేకపోతే ఇక్కడ ఎక్కువ రోజులు ఉండలేం’ అన్నారు. కాగా సైఫ్కు 2001లో వచ్చిన ‘దిల్ చాహ్తా హై’ మూవీతో మంచి బ్రేక్ వచ్చింది. ఈ చిత్రంలో పాత్రకు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఆ తర్వాత వరుస అవకాశాలు వచ్చాయి. చివరగా జ్యువెల్ థీఫ్: ది హీస్ట్ బిగిన్స్ అనే చిత్రంలో నటించాడు. ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో అందుబాటులో ఉంది. ప్రస్తుతం అక్షయ్ కుమార్తో కలిసి ‘హైవాన్’అనే మూవీలో నటిస్తున్నాడు. ఈ థ్రిల్లర్ చిత్రానికి పిరయదర్శన్ దర్శకత్వం వహిస్తున్నారు. పదిహేడేళ్ల క్రితం హిందీ చిత్రం ‘తషాన్’ (2008)లో అక్షయ్ కుమార్–సైఫ్ అలీఖాన్ నటించారు. మళ్లీ ఇప్పుడు ‘హైవాన్’లో ఈ ఇద్దరు స్టార్స్ కలిసి నటిస్తున్నారు. -
'ద ట్రయల్ 2' రివ్యూ: ఈ సిరీస్ పెద్దల కోసమే!
ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనేప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో ‘ది ట్రయల్’ రెండో సీజన్ ఒకటి. ఈ సిరీస్ గురించి తెలుసుకుందాం.ఏదైనా నేరం జరిగితే తగిన సాక్ష్యాలతో నేరస్థుడిని నిరూపించే ప్రక్రియలో న్యాయవాదులు ఉంటారు. ఆ న్యాయవాదుల సమూహంగా కొన్ని కంపెనీలు కూడా ఉంటాయి. ఆ కంపెనీలలో ఎంతో మంది న్యాయవాదులు తమ క్లయింట్ల తరఫున కోర్టులో విచారణకు హాజరవుతుంటారు. అటువంటి లా ఫర్మ్లపై తీసిన సిరీస్ ‘ది ట్రయల్’. 2023లో ఈ సిరీస్ మొదటి భాగం హాట్ స్టార్ వేదికగా రిలీజ్ అయింది. మళ్ళీ రెండేళ్ళకు దానికి కొనసాగింపుగా ఇప్పుడు 2025లో ‘ది ట్రయల్’ రెండో సీజన్ రిలీజ్ అయింది. కాజోల్ ప్రధాన పాత్రలో నటించగా ఆమె భర్త అజయ్ దేవగన్ ఈ సిరీస్కి నిర్మాతగా వ్యవహరించడం విశేషం.రెండు సిరీస్లు కలిపి 14 ఎపిసోడ్లతో ఉన్న ‘ది ట్రయల్’ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ సిరీస్ కథాంశానికొస్తే... న్యోనికాసేన్ గుప్తా ఓ పేరున్న ఫర్మ్లో మంచి లాయర్. ఆమె భర్త రాజకీయ నాయకుడు. ఆమె చేస్తున్న లా ఫర్మ్లో ఎన్నో రాజకీయాలతో ఆమె ప్రమోషన్ని అడ్డుకుంటూ న్యోనికా కుటుంబానికి కూడా ఆపద కలిగిస్తుంటారు ఆమె ప్రత్యర్థులు. ఆ లా ఫర్మ్లోకి వచ్చే కేసులు కూడా ఈ భార్యాభర్తలకు లింకు అవుతుంటాయి. ఆ లింకులు పెద్ద పెద్ద కష్టాలనే తెచ్చిపెడతాయి. మరి... ఆ కష్టాలన్నింటినీ తట్టుకుని తన క్లయింట్ల కేసులను వాదిస్తూ, ఫర్మ్లోని రాజకీయాలను ఎదుర్కొంటూ న్యోనికా నిజంగా ట్రయల్ గెలుస్తుందా? లేదా అన్నది మాత్రం సిరీస్లోనే చూడాలి. హాట్ స్టార్ వేదికగా స్ట్రీమ్ అవుతున్న ‘ది ట్రయల్’ మంచి కాలక్షేపం. ఈ లా ఫర్మ్ కథలు పెద్దలు మాత్రమే చూడదగినవి. ఎంజాయ్..– హరికృష్ణ ఇంటూరు -
బాలీవుడ్ ఎంట్రీ
‘హిట్ 2, గుంటూరు కారం, లక్కీ భాస్కర్, సంక్రాంతికి వస్తున్నాం’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించి, స్టార్ హీరోయిన్గా రాణిస్తున్నారు మీనాక్షీ చౌదరి. ఈ బ్యూటీ బాలీవుడ్ ఎంట్రీ ఖరారైందని సమాచారం. జాన్ అబ్రహాం నటించనున్న హిందీ చిత్రం ‘ఫోర్స్ 3’లోని హీరోయిన్ పాత్ర కోసం మీనాక్షీ చౌదరిని ఎంపిక చేసిందట యూనిట్. భావ్ దులియా దర్శకత్వం వహించనున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం షూటింగ్ ఈ నవంబరులో ప్రారంభం కానుంది. ఈ సినిమాలో మీనాక్షి పాత్రకూ యాక్షన్ సన్నివేశాలు ఉంటాయని, ఇందుకోసం ఆమె శిక్షణ తీసుకోనున్నారని తెలిసింది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రోడక్షన్ వర్క్స్ మొదలయ్యాయని, కొన్ని వర్క్షాప్స్ కూడా జరుగుతున్నాయని భోగట్టా. ఈ సినిమాను వచ్చే ఏడాది విడుదల చేయాలనుకుంటున్నారు. -
మల్టీస్టారర్ చేసేద్దాం మిత్రమా...
ప్రతి ఇండస్ట్రీలోనూ మల్టీస్టారర్ చిత్రాలు రూపొందుతూనే ఉంటాయి. ఓ సీనియర్ హీరో, ఓ రైజింగ్ హీరో కలిసి చేసిన మల్టీస్టారర్ చిత్రాలు ఉన్నాయి. అలాగే ఇద్దరు స్టార్స్ చేసిన ‘ఆర్ఆర్ఆర్’ వంటి మల్టీస్టారర్ సినిమాలూ ఉన్నాయి. కానీ ఇండస్ట్రీలో సుధీర్ఘమైన సక్సెస్ఫుల్ కెరీర్తో రాణించిన తర్వాత కొంత గ్యాప్ తీసుకుని, ఇద్దరు సీనియర్ హీరోలు మల్టీస్టారర్ సినిమాలు చేస్తుండటం, చేసేందుకు ఆసక్తి చూపిస్తుండటం ప్రజెంట్ ఇంట్రెస్టింగ్ టాపిక్గా మారింది. ‘మల్టీస్టారర్ చేసేద్దాం మిత్రమా’ అంటూ రెడీ అయిన కొంతమంది సీనియర్ హీరోలు చేస్తున్న మూవీస్పై ఓ లుక్ వేయండి.46 సంవత్సరాల తర్వాత... కెరీర్ తొలినాళ్ళలో ‘అపూర్వ రాగంగాళ్, మూండ్రు ముడిచ్చు, అంతులేని కథ’... ఇలా దాదాపు ఇరవైకి పైగా సినిమాల్లో కలిసి నటించారు రజనీకాంత్, కమల్హాసన్. కానీ 1979లో వచ్చిన ‘అల్లావుద్దీనుమ్ అద్భుత విళక్కుమ్’ తర్వాత రజనీకాంత్, కమల్హాసన్ కలిసి నటించింది లేదు. ఇప్పుడు వీరిద్దరూ కలిసి నటించే అవకాశం ఉంది. రజనీకాంత్తో మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం వస్తే హ్యాపీ అని ఇటీవల ఓ సందర్భంలో కమల్హాసన్ చె΄్పారు.ఇలా కమల్ చెప్పిన తక్కువ రోజుల్లోనే కమల్హాసన్తో తాను సినిమా చేస్తున్నానని, రెడ్ జెయింట్ మూవీస్–కమల్హాసన్ ప్రోడక్షన్ హౌస్ రాజ్కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ సంస్థలు ఈ సినిమాను నిర్మిస్తాయని రజనీకాంత్ స్పష్టం చేశారు. దీంతో రజనీకాంత్, కమల్హాసన్ కలిసి సినిమా చేయనున్నారనే ప్రచారం కోలీవుడ్లో ఊపందుకుంది.కాగా, ఈ చిత్రానికి తొలుత దర్శకుడు లోకేశ్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తారనే ప్రచారం జరిగింది. కమల్తో ‘విక్రమ్’ వంటి హిట్ మూవీ తీశారు లోకేశ్. అలాగే రజనీకాంత్కు ‘కూలీ’తో తమిళనాట మంచి విజయాన్ని అందించారు లోకేశ్. దీంతో కమల్–రజనీకాంత్ కాంబినేషన్ సినిమాకి లోకేశ్ దర్శకత్వం వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ మంచి కథ, స్క్రీన్ ప్లే కుదిరితేనే లోకేశ్తో సినిమా చేయాలని భావిస్తున్నారట కమల్–రజనీ. అంతేకాదు... మరికొంత మంది యువ దర్శకులను కూడా మంచి కథల కోసం అ్రపోచ్ అవుతున్నారట.తాజాగా ప్రదీప్ రంగనాథన్ పేరు తెరపైకి వచ్చింది. దర్శకుడిగా ‘కోమలి’ సినిమాతో తొలి ప్రయత్నంతోనే హిట్ అందుకున్న ప్రదీప్ రంగనాథ్ ఆ తర్వాత ‘లవ్ టుడే’ సినిమాతో దర్శకుడితో పాటు హీరోగానూ సక్సెస్ అయ్యారు. రజనీకాంత్–కమల్హాసన్ కాంబినేషన్కు తాజాగా ఈ యువ దర్శకుడి పేరు తెరపైకి వచ్చింది. ఫైనల్గా 46 సంవత్సరాల తర్వాత కమల్హాసన్–రజనీకాంత్ కాంబోతో రానున్న సినిమాకు ఎవరు దర్శకత్వం వహిస్తారనే విషయంపై సస్పెన్స్ వీడాలంటే మరికొన్ని రోజులు ఎదురు చూడక తప్పదు.పండక్కి వస్తున్నారు సిల్వర్స్క్రీన్పై ఒకే ఫ్రేమ్లో చిరంజీవి, వెంకటేశ్ కనిపిస్తే తెలుగు ఆడియన్స్కు పండగే. అదీ ఈ ఇద్దరు స్టార్ హీరోలు నటించిన సినిమా పండక్కి రిలీజైతే, ఈ పండగ సంక్రాంతి అయితే... ఇక చెప్పేది ఏముంది? వినోదాల సంబరాలు రెట్టింపు అవుతాయి. వచ్చే సంక్రాంతికి ఈ వినోదాల సంబరాలను సిల్వర్ స్క్రీన్పై చూపించనున్నారు ‘మన శంకర వరప్రసాద్గారు’. చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘మన శంకర వరప్రసాద్గారు’. ‘పండక్కి వస్తున్నారు’ అనేది ఈ సినిమా ట్యాగ్లైన్. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్గా నటిస్తుండగా, వెంకటేశ్, కేథరీన్, వీటీవీ గణేశ్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఓ ఇన్వెస్టిగేషన్ డ్రామాకు ఫ్యామిలీ ఎమోషన్స్ను జోడించి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి.ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్లో జరుగుతోందని తెలిసింది. చిరంజీవి పాల్గొనగా కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్లో వెంకటేశ్ కూడా పాల్గొననున్నారు. చిరంజీవి – వెంకటేశ్ కాంబినేషన్లో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు మేకర్స్. అలాగే చిరంజీవి–వెంకటేశ్–నయనతార– కేథరీన్ల కాంబినేషన్లో ఓ సెలబ్రేషన్ సాంగ్ను కూడా ప్లాన్ చేశారట అనిల్ రావిపూడి. సుస్మిత కొణిదెల, సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే సంక్రాంతికి థియేటర్స్లో రిలీజ్ కానుంది. అతి త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీపై కూడా స్పష్టత రానుంది. భీమ్స్ సిసిరోలియో ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.మరో మల్టీస్టారర్! మల్టీస్టారర్ మూవీస్ చేయడంలో సీనియర్ హీరో వెంకటేశ్ ముందు వరుసలో ఉంటారు. ‘ఎఫ్ 2, వెంకీమామ, గోపాల గోపాల’... ఇలా వెంకీ కెరీర్లో మల్టీస్టారర్ మూవీస్ మెండుగానే ఉన్నాయి. అయితే లేటెస్ట్గా వెంకటేశ్ మరో మల్టీస్టారర్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇటీవల అమెరికాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఓ సీనియర్ హీరోతో కలిసి సినిమా చేయనున్నట్లు వెంకటేశ్ తెలిపారు. అయితే ఈ చిత్రం ‘మన శంకర వరప్రసాద్గారు’ కాదు. దీంతో వెంకటేశ్ చేయనున్న లేటెస్ట్ మల్టీస్టారర్లోని తాజా చిత్రంలో బాలకృష్ణ హీరోగా నటించే అవకాశాలు ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.పేట్రియాటిక్ మూవీలో...మలయాళ స్టార్ హీరోలు మోహన్లాల్, మమ్ముట్టీ కలిసి కొన్ని చిత్రాల్లో నటించారు. కానీ 2008లో వచ్చిన యాక్షన్ ఫిల్మ్ ‘ట్వంటీ 20’ తర్వాత మమ్ముట్టీ, మోహన్లాల్ కలిసి మరో సినిమా చేయడానికి పదహారేళ్లు పట్టింది. మహేశ్ నారాయణ్ దర్శకత్వంలోని ‘పేట్రియాట్’ (వర్కింగ్ టైటిల్) సినిమాలో మమ్ముట్టీ, మోహన్లాల్ మళ్లీ కలిసి నటిస్తున్నారు. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్గా నటిస్తున్నట్లుగా తెలిసింది.ఫాహద్ ఫాజిల్, కుంచాకో బోబన్ ఈ చిత్రంలోని ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆల్రెడీ ఈ సినిమా కోసం ఓ లాంగ్ షూటింగ్ షెడ్యూల్ చిత్రీకరణ శ్రీలంకలో ముగిసింది. అయితే మమ్ముట్టీ ఆరోగ్య పరిస్థితుల కారణంగా ఈ సినిమాకు తాత్కాలిక బ్రేక్ పడినట్లుగా వార్తలు వస్తున్నాయి. అతి త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణ తిరిగి ప్రారంభం అవుతుందనీ అజర్ బైజాన్, యూకే, మిడిల్ ఈస్ట్ దేశాల లోకేషన్స్లో చిత్రీకరణను ప్లాన్ చేశారని తెలిసింది. ఈ విషయాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.పఠాన్ వర్సెస్ టైగర్! షారుక్ ఖాన్ హీరోగా చేసిన బ్లాక్బస్టర్ మూవీ ‘పఠాన్’లో సల్మాన్ ఖాన్ ఓ గెస్ట్ రోల్ చేశారు. సల్మాన్ ఖాన్ హీరోగా చేసిన ‘టైగర్ 3’ చిత్రంలో షారుక్ ఖాన్ గెస్ట్ రోల్ చేశారు. ఈ రెండు సినిమాల్లోనూ సల్మాన్ ఖాన్–షారుక్ ఖాన్ సిల్వర్ స్క్రీన్పై కనిపించినప్పుడు ఆడియన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. కానీ ఈ ఇద్దరూ కలిసి లీడ్ రోల్స్లో నటించి, దాదాపు 30 సంవత్సరాలవుతోంది. 1995లో వచ్చిన ‘కరణ్ అర్జున్’ సినిమా తర్వాత సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్లు కలిసి లీడ్ రోల్స్లో మరో సినిమా చేయలేదు. అయితే గత ఏడాదిగా సల్మాన్, షారుక్ హీరోలుగా ఓ సినిమా ప్లానింగ్ జరుగుతోందని బాలీవుడ్ సమాచారం.‘పఠాన్’, ‘టైగర్ 3’... ఈ రెండూ వైఆర్ఎఫ్ (యశ్రాజ్ ఫిలింస్) స్పై యూనివర్స్లోని చిత్రాలే. కాబట్టి ఈ స్పై యూనివర్స్లో భాగంగానే ‘పఠాన్ వర్సెస్ టైగర్’ అనే సినిమా రానుందని, యశ్రాజ్ ఫిలింస్ పతాకంపై ఆదిత్యా చోప్రా ఈ సినిమాను నిర్మిస్తారని టాక్. ‘పఠాన్, వార్’ సినిమాలకు దర్శకత్వం వహించిన సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తారని, కాకపోతే ఈ సినిమా అనౌన్స్మెంట్ రావడానికి కొంత సమయం పడుతుందనే వార్త బాలీవుడ్లో ప్రచారంలోకి వచ్చింది.అలాగే ‘వార్’ సినిమా కూడా వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్లో భాగమే కనుక హృతిక్ రోషన్ కూడా ఈ ‘పఠాన్ వర్సెస్ టైగర్’ చిత్రంలో గెస్ట్ రోల్ చేసే అవకాశం లేకపోలేదని, ఇదే నిజమమైతే అప్పుడు సల్మాన్, షారుక్, హృతిక్లను ఒకే ఫ్రేమ్లో చూడొచ్చని బాలీవుడ్ ఫ్యాన్స్ ఆశపడుతున్నారు. మరి... ఫ్యాన్స్ ఆశలు నిజమౌవుతాయా? లెట్స్ వెయిట్ అండ్ సీ.17ఏళ్ల తర్వాత... బాలీవుడ్ స్టార్ హీరోలు అక్షయ్ కుమార్, సైఫ్ అలీఖాన్ల కాంబినేషన్లో బాలీవుడ్లో ‘హైవాన్’ అనే మల్టీస్టారర్ మూవీ తెరకెక్కుతోంది. ఈ హిందీ థ్రిల్లర్ సినిమాకు ప్రియదర్శన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో సయామీ ఖేర్ ఓ హీరోయిన్గా నటిస్తున్నారు. వెంకట్ కె. నారాయణ, శైలాజా దేశాయ్ ఫెన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ కూడా మొదలైంది. కొచ్చి, ఊటీ లొకేషన్స్లో కొంత భాగం చిత్రీకరణ జరిపారు మేకర్స్. తాజా షూటింగ్ షెడ్యూల్ చిత్రీకరణ ముంబైలో జరుగుతోందనే టాక్ వినిపిస్తోంది.ఇక ఈ చిత్రదర్శకుడు ప్రియదర్శన్కు మోహన్లాల్తో మంచి అనుబంధం ఉంది. దీంతో ఈ ‘హైవాన్’లో మోహన్లాల్ ఓ గెస్ట్ రోల్ చేసేందుకు అంగీకరించారట. ఇక ఈ చిత్రంలో మోహన్లాల్నే ఎందుకు గెస్ట్ రోల్కి తీసుకోవాలనుకున్నారంటే.. ‘ఒప్పం’కు హిందీ రీమేక్గా ‘హైవాన్’ సినిమా తెరకెక్కుతోందనే టాక్ బాలీవుడ్లో వినిపిస్తోంది. మోహన్లాల్ హీరోగా ప్రియదర్శన్ దర్శకత్వంలో రూపొందిన ‘ఒప్పం’ సినిమా 2016లో విడుదలై, బ్లాక్బస్టర్ విజయాన్ని సాధించింది. మరోవైపు ‘తషాన్’ చిత్రం తర్వాత 17 ఏళ్లకు సైఫ్ అలీఖాన్, అక్షయ్ కుమార్ కలిసి నటిస్తున్న చిత్రం ‘హైవాన్’యే కావడం విశేషం. ముగ్గురు డాన్లు బాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ డాన్స్ ముగ్గురూ ఒకే ఫ్రేమ్లో కనిపించే అవకాశం కనిపిస్తోంది. రణ్వీర్ సింగ్ హీరోగా ఫర్హాన్ అక్తర్ దర్శకత్వంలో బాలీవుడ్లో ‘డాన్ 3’ అనే చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను 2023 ఆగస్టులోనే ప్రకటించినప్పటికీ ఇంకా సెట్స్పైకి వెళ్లలేదు. వచ్చే ఏడాది జనవరిలో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. అయితే 1978లో వచ్చిన ‘డాన్’ సినిమాలో నటించిన అమితాబ్ బచ్చన్, 2006, 2011లో వచ్చిన ‘డాన్, డాన్ 2’ చిత్రాల్లో నటించిన షారుక్ ఖాన్ సైతం ‘డాన్ 3’లో భాగం కానున్నారని, ఆ దిశగా ఫర్హాన్ అక్తర్ ప్లాన్ చేస్తున్నారని బాలీవుడ్ టాక్.మరి... రణ్వీర్ సింగ్, షారుక్ ఖాన్, అమితాబ్ బచ్చన్లు కలిసి ఒకే ఫ్రేమ్లో హిందీ సిల్వర్స్క్రీన్పై కనిపిస్తే, అంతకుమించిన ఆనందం హిందీ సినీ లవర్స్కి ఏముంటుంది. ఇక ‘డాన్ 3’లో హీరోయిన్గా కియారా అద్వానీ నటించనున్నారు. విలన్గా విజయ్ దేవరకొండ, విక్రాంత్ మెస్సే, అర్జున్ దాస్ వంటి వారి పేర్లు తెరపైకి వచ్చాయి. ఫైనల్గా ‘డాన్ 3’ చిత్రంలో ఎవరు విలన్గా నటిస్తారనే విషయంపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. 2027లో ‘డాన్ 3’ చిత్రం థియేటర్స్లో రిలీజ్ అయ్యే చాన్సెస్ కనిపిస్తున్నాయి.కథే హీరో కన్నడ స్టార్ హీరోలు శివ రాజ్కుమార్, ఉపేంద్ర ప్రధాన పాత్రధారులుగా ఆర్.బి. శెట్టి మరో ప్రధాన పాత్రధారిగా నటించిన సినిమా ‘45’. వందకు పైగా సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్గా పని చేసిన అర్జున్ జన్యా ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఎం. రమేశ్ రెడ్డి, ఉమా రమేశ్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ ఏడాది చివర్లో రిలీజ్ కానుంది.సనాతన ధర్మానికి సంబంధించిన అంశాలు ఈ సినిమాలో ఉంటాయని చిత్రయూనిట్ పేర్కొంది. అలాగే ఈ సినిమాలో ప్రత్యేకంగా హీరోలంటూ ఎవరూ లేరని, కథే ఈ సినిమాకు హీరో అని శివ రాజ్కుమార్ ఓ సందర్భంలో చె΄్పారు. ఇక ఉపేంద్ర దర్శకత్వంలో శివ రాజ్కుమార్ హీరోగా నటించిన ‘ఓం’ (1995) సినిమా సూపర్హిట్గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత శివ రాజ్కుమార్, ఉపేంద్ర కలిసి మళ్లీ అసోసియేట్ కావడం ఇదే అని టాక్. కొంత గ్యాప్ తర్వాతనో లేక సరికొత్తగానో మల్టీస్టారర్ సినిమాలు చేసే సీనియర్ హీరోలు మరికొందరు ఉన్నారు. – ముసిమి శివాంజనేయులు -
35 ఏళ్ల తర్వాత తల్లైయిన స్టార్ హీరోయిన్లు వీళ్లే..!
సినీ తారల పెళ్లిళ్లు కాస్త లేట్గానే అవుతుంటాయి. వయసులో ఉన్నప్పుడు కెరీర్పైనే ఎక్కువ ఫోకస్ చేస్తుంటారు. పెళ్లి చేసుకుంటే ఆఫర్లు రావనే భయంతో చాలా మంది హీరోయిన్లు వివాహాన్ని వాయిదా వేస్తూ ఉంటారు. ఇప్పుడు పరిస్థితి మారింది. పెళ్లయిన తర్వాత కూడా సినిమా చాన్స్లు వస్తున్నాయి. కానీ ఒకప్పుడు హీరోయిన్కి పెళ్లి అయిందంటే.. ఇండస్ట్రీకి దూరం అయినట్లే. మళ్లీ తెరపై కనిపించేవాళ్లు కాదు. అందుకే పెళ్లి కాస్త లేట్గా చేసుకునేవాళ్లు. దీంతో పిల్లలను కూడా లేటు వయసులోనే కనేవాళ్లు. 42 ఏళ్ల వయసులో కత్రినా కైఫ్ ఇప్పుడు గర్భవతి అయింది. కత్రినా మాత్రమే కాదు.. చాలా మంది తారలు 35 ఏళ్ల వయసు దాటిన తర్వాత అమ్మగా ప్రమోషన్ పొందారు. అలా తల్లైయిన తారలపై ఓ లుక్కేద్దాం.కరీనా కపూర్కరీనా కపూర్ 2012లో నటుడు సైఫ్ అలీ ఖాన్ ను వివాహం చేసుకున్నారు. 36 ఏళ్ల వయసులో మొదటి బిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత 40 ఏళ్ల వయసులో రెండో బిడ్డకు జన్మనిచ్చింది.బిపాషా బసుబిపాషా బసు 2016లో నటుడు కరణ్ సింగ్ గ్రోవర్ను వివాహం చేసుకున్నారు. పెళ్లయిన ఆరేళ్ల తర్వాత 2022లో ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చారు. అప్పటికీ బిపాషా వయసు 43 ఏళ్లు.ఐశ్వర్యరాయ్38 ఏళ్ల వయసులో ఐశ్వరరాయ్ బచ్చన్ తల్లయింది. 2011లో ఆమె ఓ ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. పేరు ఆరాధ్య. ఐశ్వర్య-అభిషేక్ల వివాహం 2007లో జరిగింది. పెళ్లయిన నాలుగేళ్ల తర్వాత ఐశ్వర్య అమ్మగా ప్రమోషన్ పొందింది.రాణి ముఖర్జీ2015లో రాణి ముఖర్జీ ఓ బిడ్డకు జన్మన్చింది. అప్పటికే ఆమె వయసు 37 ఏళ్లు. లేటు వయసులో తల్లయ్యారు. 47 ఏళ్ల వయసులో తొలిసారి జాతీయ అవార్డు అందుకున్నారు. మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే చిత్రానికిగాను ఆమెకు ఉత్తమ నటిగా అవార్డు అందుకున్నారు. -
ఓజీలో పవన్ కూతురిగా సాయేషా.. ఎవరీ పాప?
పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ఓజీ (They Call Him OG Movie). ఇందులో పవన్.. గ్యాంగ్స్టర్గానే కాకుండా తండ్రి పాత్రలోనూ యాక్ట్ చేశారు. సుజిత్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో ప్రియాంక మోహన్ హీరోయిన్గా నటించారు. సినిమాలో పవన్- ప్రియాంకల కూతురిగా సాయేషా అనే పాప యాక్ట్ చేసింది. వెండితెరపై ఆమె నటించిన తొలి చిత్రం ఇదే కావడం విశేషం!ఇదే ఫస్ట్ మూవీ!ముంబైకి చెందిన సాయేషా ఇప్పటివరకు అనేక వాణిజ్య ప్రకటనల్లో నటించింది. సంతూర్, లెన్స్కార్ట్, ఫస్ట్క్రై వంటి బ్రాండ్స్తో పాటు రియల్ ఎస్టేట్ యాడ్స్లోనూ యాక్ట్ చేసింది. మృణాల్ ఠాకూర్తోనూ ఓ రియల్ ఎస్టేట్ యాడ్లో నటించింది. ఇప్పుడీ చిన్నారి సినిమాల వైపు అడుగులు వేస్తోంది. లాగౌట్ అనే హిందీ సినిమాలో చిన్న పాత్రలో యాక్ట్ చేసింది. కానీ ఇది నేరుగా ఓటీటీలో రిలీజైంది. ఇప్పుడు ఓజీ సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో తనకు మొదటి సినిమా అయినప్పటికీ ఏమాత్రం బెరుకు లేకుండా అద్భుతంగా నటించింది. అందరికీ థాంక్స్ఈ పాపను చూసిన వారంతా తనకు మంచి భవిష్యత్తు ఉందని మెచ్చుకుంటున్నారు. ఓజీ మూవీ సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా చిత్రయూనిట్తో దిగిన ఫోటోలను సాయేషా సోషల్ మీడియాలో షేర్ చేసింది. హీరోయిన్ ప్రియాంకతో ఆటలు ఆడుకోవడం మిస్ అవుతానంది. తనకు చాక్లెట్లు ఇచ్చిన అర్జున్దాస్కు కృతజ్ఞతలు చెప్పింది. ప్రకాశ్ రాజ్తో పని చేయడం ఆనందంగా ఉందని తెలిపింది. తనకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన డైరెక్టర్ సుజిత్కు, అలాగే పవన్ సహా ఓజీ టీమ్కు థాంక్స్ చెప్పింది. View this post on Instagram A post shared by Sayesha Shah (@sayesha0307) చదవండి: ఆమె పనిచేసేది 8 గంటలే.. ఇంకెక్కడొస్తుంది!: దీపికపై సెటైర్లు -
చార్మినార్లో అనన్యా పాండే సందడి.. వీడియో వైరల్
స్టార్ట్ కెమెరా... టేక్ అన్నారు డైరెక్టర్ వివేక్ సోని. అంతే... హీరో లక్ష్య బైక్ స్టార్ట్ చేశారు... వెనకాల హీరోయిన్ అనన్యా పాండే కూర్చుకున్నారు. రయ్మంటూ బైక్ ముందుకు సాగింది. సీన్ పూర్తయింది. షాట్ ఓకే అన్నారు వివేక్. ఈ షూటింగ్ జరిగింది ఎక్కడంటే హైదరాబాద్లోని చార్మినార్ దగ్గర. ఎరుపు రంగు సంప్రదాయ దుస్తుల్లో లక్ష్య, అనన్య కలర్ఫుల్గా కనిపించారు. అక్కడి జనాలు వీరిని గుర్తు పట్టి, చుట్టుముట్టారు. సెల్ఫోన్లలో ఫొటోలు, వీడియోలు తీశారు. లక్ష్య, అనన్యా పాండే జంటగా నటిస్తున్న కాలేజ్ రొమాంటిక్ మూవీ ‘చాంద్ మేరా దిల్’ కోసమే ఈ సన్నివేశాన్ని చిత్రీకరించారు. ఈ చిత్రంలో ఈ ఇద్దరూ ఇంజినీరింగ్ స్టూడెంట్స్ పాత్రల్లో కనిపిస్తారు. ఈ చిత్రం షూటింగ్ని వారం రోజుల పాటు హైదరాబాద్లో ప్లాన్ చేశారు. చార్మినార్ తర్వాత మరో పాపులర్ ప్లేస్లో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తారట. ఈ చిత్రం ఈ ఏడాదే రిలీజ్ కానుంది. View this post on Instagram A post shared by mainly_hyderbadi ❤️📌 (@mainly_hyderabadi) -
ఆమె పనిచేసేది 8 గంటలే.. ఇంకెక్కడొస్తుంది!: దీపికపై సెటైర్లు
తల్లయ్యాక తనకంటూ కొన్ని హద్దులు గీసుకుంది బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె (Deepika Padukone). రోజుకు 8 గంటల కంటే ఎక్కువ పని చేయలేనని కరాఖండిగా చెప్తోంది! భారీ బడ్జెట్ సినిమాలకు ఇలాంటి కండీషన్లు పెడితే కష్టమని కల్కి 2 నుంచి ఆమెను తప్పించేశారు. దానికంటే ముందు స్పిరిట్ నుంచి కూడా దీపికా సైడ్ అయిపోయింది. దీంతో అసలు 8 గంటల షిఫ్ట్ తప్పా? ఒప్పా? అని ఎవరికి వారు చర్చల్లో మునిగిపోయారు.8 గంటలే దీపిక పనిఅయితే ఈ విషయంపై దీపికాపై ఫన్నీ సెటైర్లు వేసింది బాలీవుడ్ కొరియోగ్రాఫర్, దర్శకురాలు ఫరా ఖాన్ (Farah Khan). తన చెఫ్ దిలీప్తో కలిసి ముంబైలో నటుడు రోహిత్ సరఫ్ ఇంటికి వెళ్లింది ఫరా. ఈ మేరకు ఓ యూట్యూబ్ వ్లాగ్ చేసింది. అందులో మొదటిసారి రోహిత్ సరఫ్ తల్లిని చూపించింది. నా సినిమా కోసం దీపికను ఒప్పించడానికి కూడా ఇంత సమయం పట్టలేదేమో! అంటూ రోహిత్ తల్లిని హత్తుకుంది. ఇంతలో ఫరా చెఫ్ దిలీప్.. దీపిక పదుకొణె మేడమ్ మన షోకి ఎప్పుడొస్తారు? అని అడిగాడు. అందుకామె.. దీపిక ఇప్పుడు రోజులో 8 గంటలు మాత్రమే పని చేస్తుంది. మన షోకి వచ్చేంత తీరిక తనకెక్కడిది? అంది. సినిమాఫరాఖాన్ దర్శకత్వంలోనే దీపిక బాలీవుడ్లో హీరోయిన్గా పరిచయమైంది. వీరి కాంబినేషన్లో వచ్చిన ఫస్ట్ మూవీ ఓం శాంతి ఓం. ఇందులో షారూఖ్ హీరోగా నటించాడు. ఫరా, దీపికా, షారూఖ్.. ముగ్గురూ కలిసి హ్యాపీ న్యూ ఇయర్ (2014) అనే మరో సినిమా చేశారు. ఆమధ్య 'కల్కి' మూవీతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన దీపికా పదుకొణె.. చివరగా ఫైటర్ సినిమాలో కనిపించింది. ప్రస్తుతం షారూఖ్ ఖాన్తో కలిసి 'కింగ్' మూవీ చేస్తోంది. అలాగే అట్లీ-అల్లు అర్జున్ సినిమాలోనూ భాగమైంది. ట్రిపుల్ ఎక్స్: రిటర్న్ ఆఫ్ జాండర్ కేజ్ అనే హాలీవుడ్ సినిమా సీక్వెల్లోనూ భాగమైనట్లు ప్రచారం జరుగుతోంది.చదవండి: నా భార్య బ్రష్తో పళ్లు తోముకుంటున్నా: షెఫాలీ భర్త -
నా భార్య బ్రష్తో పళ్లు తోముకుంటున్నా: షెఫాలీ భర్త
బతికున్నప్పుడు ఆమె చేయి వదల్లేదు, చనిపోయాక తన జ్ఞాపకాలను, గుర్తులను వదలడం లేదు. ఆమె జీవించినప్పుడే కాదు మరణం తర్వాత కూడా తనని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాడు. 'కాంటా లగా' సాంగ్ ఫేమ్, బాలీవుడ్ నటి షెఫాలీ జరివాలా (Shefali Jariwala) మరణించి మూడు నెలలు కావస్తున్నా ఆమెను క్షణమైనా మర్చిపోలేకున్నాడు భర్త, నటుడు పరాగ్ త్యాగి (Parag Tyagi). అందుకే అణువణువునా ఉన్న ప్రేమను పచ్చబొట్టు రూపంలో హృదయంపై ఆమె ముఖచిత్రాన్ని పదిలంగా పరుచుకున్నాడు. భార్య దిండుపైనే నిద్రతాజాగా 'షెఫాలీ పరాగ్ త్యాగి' అంటూ ఓ పాడ్కాస్ట్ చానల్ను ప్రారంభించాడు. ఇందులో మొదట తన సెల్ఫ్ ఇంటర్వ్యూ ఇచ్చాడు. పరాగ్ మాట్లాడుతూ.. షెఫాలీ బ్రష్తోనే నా పళ్లు తోముకుంటున్నాను. తన దిండుపైనే నిద్రిస్తున్నాను. తన టీషర్ట్స్, షార్ట్స్ అన్నీ నా దగ్గరే ఉన్నాయి. వాటినెప్పుడూ నాపక్కనే పెట్టుకుంటున్నాను. అమెజాన్, ఫ్లిప్కార్ట్లో తను ఆర్డర్ చేసిన వస్తువులు ఇప్పటికీ డెలివరీ అవుతూనే ఉన్నాయి. ఆమె విడిచిన బట్టల్ని ఇంతవరకు ఉతకలేదు. అవి మరీ చిన్నగా ఉండటం వల్ల ధరించలేకపోతున్నాను. కానీ, వాటిని కప్పుకునే ప్రతిరోజు నిద్రిస్తున్నాను.సీపీఆర్ చేశా..షెఫాలీ చివరిరోజు మా సింబా(పెంపుడు శునకం)ను వాకింగ్కు తీసుకెళ్లమని నాకు చెప్పింది. బయటకు వెళ్లి వచ్చేలోపు అపస్మారక స్థితిలో పడి ఉంది. సీపీఆర్ కూడా చేశాను. రెండుసార్లు శ్వాస తీసుకుంది. ఆ వెంటనే కన్నుమూసింది అని చెప్పుకొచ్చాడు. యాంటీఏజింగ్ డ్రగ్స్ వల్లే షెఫాలీ మరణించిందన్న వార్తలను పరాగ్ కొట్టిపారేశాడు. తనెప్పుడూ డ్రగ్స్ వాడలేదని క్లారిటీ ఇచ్చాడు. కేవలం మల్టీ విటమిన్స్ టాబ్లెట్స్ తీసుకునేదని తెలిపాడు.చదవండి: మిడ్నైట్ ఎలిమినేషన్.. కార్నర్ చేసి పంపించారు! నేరుగా సీక్రెట్రూమ్కు -
నా కుమార్తెకు అనుమతి లేదు.. అందుకే ఆ నెక్లెస్ ధరించా: రాణీ ముఖర్జీ
బాలీవుడ్ నటి రాణీ ముఖర్జీ(Rani Mukerji ) 71వ జాతీయ చలన చిత్ర పురస్కారాల ప్రదానోత్సవ వేడుకలో చాలా ప్రత్యేకంగా కనిపించారు. మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే చిత్రంలో ఆమె నటించిన తీరుకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. దీంతో ఆమెకు ఉత్తమ నటిగా అవార్డ్ దక్కింది. రీసెంట్గా జరిగిన అవార్డ్ ప్రదానోత్సవ వేడుకలో రాణీ ముఖర్జీ ధరించిన నెక్లెస్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తన కూతురు అదిరా చోప్రా పేరులోని అక్షరాలతో ప్రత్యేకంగా తయారుచేయించుకున్న గోల్డ్ నెక్లెస్ను ఆమె ధరించారు. అయితే, నెక్లెస్ వెనుక దాగి ఉన్న ఎమోషనల్ స్టోరీని టైమ్స్ ఆఫ్ ఇండియాతో ఆమె పంచుకున్నారు.రాణి ముఖర్జీ తన కూతురు అదిరా గురించి ఇలా చెప్పింది. తనకు కలిసొచ్చిన ఒక అదృష్ట దేవతగా ఆమె చెప్పింది. 'నేషనల్ అవార్డ్స్ వేడుకలో పాల్గొనేందుకు అదిరా కూడా ఆసక్తి చూపింది. కానీ, 14ఏళ్ల లోపు ఉన్నవారికి అనుమతి లేదు. దీంతో చాలా నిరాశ చెందాము. నేను అవార్డ్ అందుకున్న సమయంలో ఆమె ప్రత్యక్షంగా చూడాలని కోరుకుంది. ఎన్నో ఆశలు పెట్టుకున్న 'అదిరా'ను శాంతింప చేసేందుకు ఏం చేయాలో నాకు తెలియలేదు. కానీ, ఆమె పేరులోని అక్షరాలతో ఒక నెక్లస్ చేయించాను. అవార్డ్ తీసుకుంటున్న సమయంలో నాతోనే ఉంటావని చెప్పాను. అప్పుడు ఆమె కాస్త కుదుట పడింది. అదిరాను సంతోష పెట్టేందుకు నాకు తోచింది నేను చేశాను.. కానీ, ఇన్స్టాగ్రామ్లో నెక్లెస్ ఫోటోలు, వీడియోలు బాగా వైరల్ అయ్యాయి. 'రాణి తన కూతురిని వెంట తీసుకెళ్లింది' అని చాలామంది పోస్ట్లు పెట్టారు. అవన్నీ అదిరాకు చూపించాను. అప్పుడు తను చాలా సంతోషించింది. వాటిని పోస్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ నేను ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను.' అని ఆమె పంచుకున్నారు. 14ఏళ్ల లోపు ఉండటంతో తన కుమార్తెను వేడుకలోకి తీసుకెళ్లలేకపోయానని రాణీ ముఖర్జీ చాలా బాధ పడ్డారు. ఈ చర్య చాలా అన్యాయం అంటూ ఆమె పేర్కొన్నారు.మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే చిత్రంలో తన నటనకు రాణి తన మొట్టమొదటి ఉత్తమ నటి జాతీయ అవార్డును గెలుచుకుంది. న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగిన కార్యక్రమంలో ఆమెను సత్కరించారు. ఈ కార్యక్రమంలో, ఆమె గోధుమ రంగు చీర, అదిరా అనే అక్షరాలు ఉన్న బంగారు హారాన్ని ధరించింది. రాణి 2014లో ఆదిత్య చోప్రాను వివాహం చేసుకుంది. ఈ జంట 2015లో తమ కుమార్తె అదిరాను స్వాగతించారు. -
మా ప్రపంచం వేరు
ఆయుష్మాన్ ఖురానా, రష్మికా మందన్నా ప్రధానపాత్రల్లో నటించిన హారర్ మిస్టరీ రొమాంటిక్ కామెడీ చిత్రం ‘థామా’. మడాక్ హారర్ కామెడీ యూనివర్స్లో భాగంగా రూపొందిన ఈ చిత్రానికి ‘ముంజ్య’ ఫేమ్ ఆదిత్య సర్పోత్థార్ దర్శకత్వం వహించారు. దినేష్ విజన్, అమర్ కౌశిక్ నిర్మించారు. ఈ చిత్రంలో అలోక్పాత్రలో ఆయుష్మాన్ ఖురానా, తడ్కాపాత్రలో రష్మికా మందన్నా నటించారు.ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ శుక్రవారం ముంబైలో జరిగింది. శ్రద్ధా కపూర్ ముఖ్య అతిథిగా హాజరై ట్రైలర్ని లాంచ్ చేశారు. ‘‘ఏ... నాటకాలు ఆపు... నీకేం కాలేదు, నా కొడుకు సైతాన్... సైతాన్, నేను నీతో ఉండలేను... మా ప్రపంచం వేరు’’ అని అర్థం వచ్చే డైలాగ్స్ ఈ హిందీ ట్రైలర్లో ఉన్నాయి. దీపావళి పండగ సందర్భంగా ‘థామా’ సినిమాను అక్టోబరు 21న రిలీజ్ చేయనున్నట్లుగా అధికారికంగా వెల్లడించారు. -
రష్మిక చేసిన దెయ్యం సినిమా.. ట్రైలర్ రిలీజ్
హీరోయిన్ రష్మిక చేస్తున్న లేటెస్ట్ బాలీవుడ్ సినిమా 'థామా'. భేడియా, స్త్రీ, స్త్రీ 2, ముంజ్య చిత్రాల తర్వాత హారర్ యూనివర్స్లో వస్తున్న మూవీ ఇది. ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటిస్తుండగా నవాజుద్దీన్ సిద్ధిఖీ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ దీపావళి సందర్భంగా అక్టోబరు 21న థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: బికినీ ఫొటోలు.. వెటకారంతో క్లారిటీ ఇచ్చిన సాయిపల్లవి)ట్రైలర్ చూస్తుంటే ఓవైపు భయపెడుతూనే మరోవైపు నవ్విస్తున్నారు. హీరో ఆయుష్మాన్.. వ్యాంపైర్ అవుతాడు. ఇతడి ప్రేమికురాలిగా రష్మిక నటించింది. మరి ప్రియుడిలో దెయ్యం లక్షణాలు వచ్చేసరికి రష్మిక ఏం చేసింది? చివరకు ఏమైంది అనే కాన్సెప్ట్తో మూవీ తీసినట్లు అనిపిస్తుంది. ట్రైలర్ ప్రామిసింగ్గా ఉంది. గతంలో వచ్చిన స్తీ, స్త్రీ 2 చిత్రాలు వందల కోట్ల కలెక్షన్స్ సాధించాయి. మరి ఇప్పుడు 'థామా' ఏం చేస్తుందో చూడాలి?(ఇదీ చదవండి: మోహన్ లాల్ 'హృదయపూర్వం' సినిమా రివ్యూ (ఓటీటీ)) -
ఆ హీరో అంటే విపరీతమైన క్రష్.. నా గదిలో కూడా: బద్రి హీరోయిన్
బాలీవుడ్ బ్యూటీ అమీషా పటేల్ తెలుగువారికి కూడా సుపరిచితమే. హిందీ మూవీస్తో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన భామ.. టాలీవుడ్లో బద్రిలో హీరోయిన్గా నటించింది. ఆ తర్వాత మహేశ్ బాబు 'నాని', ఎన్టీఆర్ 'నరసింహుడు', పరమవీరచక్ర తదితర చిత్రాల్లోనూ మెప్పించింది. దాదాపు ఐదేళ్ల గ్యాప్ తర్వాత గదర్-2లో మెప్పించింది. అయితే ఇటీవల ఓ పాడ్కాస్ట్కు హాజరైన అమీషా పటేల్ తన పెళ్లితో పాటు కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాల పంచుకుంది.అంతేకాకుండా తన క్రష్ గురించి కూడా ఈ పాడ్కాస్ట్లో మాట్లాడింది. హాలీవుడ్ సూపర్ స్టార్ టామ్ క్రూజ్ అంటే తనకు విపరీతమైన ప్రేమ ఉందని అమీషా పటేల్ మనసులోని మాటను బయటపెట్టింది. అతనితో ఒక నైట్ ఉండేందుకు కూడా తనకు ఎలాంటి అభ్యంతరం లేదని షాకింగ్ కామెంట్స్ చేసింది. అయితే టామ్ క్రూజ్ పట్ల తనకున్న అభిమానాన్ని అమీషా పటేల్ పంచుకోవడం ఇదేం మొదటిసారి కాదు.. 2023లోను తన గదిలో ఆ స్టార్ పోస్టర్లు ఉన్నాయని అమీషా వెల్లడించింది. టామ్తో కలిసి పనిచేయాలనేది తన కోరిక అని తెలిపింది.అమీషా పటేల్ మాట్లాడుతూ.. "నాకు టామ్ క్రూజ్ అంటే చాలా ఇష్టం. మీరు అతనితో పాడ్కాస్ట్ చేయగలిగితే.. దయచేసి నన్ను కూడా ఆ పాడ్కాస్ట్కి పిలవండి. ఎందుకంటే నా చిన్నప్పటి నుంచి టామ్ క్రూజ్ అంటే ఇష్టం. నా పెన్సిల్ బాక్స్లో.. నా ఫైల్స్లో అతని ఫోటో ఉండేది. నా గదిలో ఉన్న ఏకైక పోస్టర్ టామ్ క్రూజ్దే. అతను ఎప్పుడు.. ఎప్పటికీ నా క్రష్. నేను అతని కోసం ఏదైనా చేయడానికి సిద్ధం. అతనితో ఒక నైట్ ఉండేందుకు కూడా వెనకాడను. అతనికి పెద్ద అభిమానిని అని.. అవకాశం ఇస్తే పెళ్లి చేసుకునేదాన్ని" అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. తాను పెళ్లికి వ్యతిరేకం కాదని..సరైన వ్యక్తి దొరికితే మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెడతానని కూడా అంటోంది అమీషా పటేల్.ఇక కెరీర్ విషయానికొస్తే.. ఐదేళ్ల విరామం తర్వాత అమీషా పటేల్.. గదర్- 2తో రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీలో సన్నీ డియోల్, ఉత్కర్ష్ శర్మ కీలక పాత్రలు పోషించారు. 2023లో రిలీజైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ.686 కోట్లు వసూలు చేసి బ్లాక్బస్టర్గా నిలిచింది. ఆమె చివరిసారిగా 2024లో వచ్చిన తౌబా తేరా జల్వా మూవీలో కనిపించింది. ప్రస్తుతం ఈ 50 ఏళ్ల బ్యూటీ ఎలాంటి ప్రాజెక్ట్ను ప్రకటించలేదు. -
మహిళలపై ట్రోలింగ్.. అలావాటు పడిపోయాం: హీరోయిన్
ప్రముఖ బాలీవుడ్ నటి భూమి పెడ్నేకర్ ప్రస్తుతం దల్దాల్ అనే వెబ్ సిరీస్లో కనిపించనుంది. ఇందులో పోలీస్ అధికారి పాత్రలో మెప్పించనుంది. ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రీమియర్ కానుంది. ఈ ఏడాది మేరే హస్బెండ్ కి బీవీ చిత్రంలో మెప్పించిన బ్యూటీ.. ఇప్పుడు ఓటీటీ సిరీస్లతో బిజీగా ఉంది. అయితే ఇటీవల ముంబయిలో జరిగిన ఇండియా టుడే కాన్క్లేవ్కు హాజరైన బాలీవుడ్ భామ మహిళలపై జరుగుతున్న ట్రోలింగ్పై మాట్లాడింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో మహిళలే లక్ష్యంగా ట్రోల్స్ చేస్తున్నారని.. వీటిని ఎదుర్కోవడంతో ఉమెన్స్ ఇబ్బందులు పడుతున్నారని తెలిపింది.భూమి పెడ్నేకర్ మాట్లాడుతూ.. "ట్రోలింగ్.. బెదిరింపులు.. దీన్ని మీరు ఏ విధంగా పిలిచినా.. మనం దానికి అలవాటు పడ్డాం. కానీ మహిళలను లక్ష్యంగా చేసుకున్నప్పుడు.. వాటిని ఎలా ఎదుర్కోవాలో నాకు తెలియదు. ఎందుకంటే నాకు అంత ధైర్యం లేదు. ఇంకో మార్గం లేనందున నన్ను నేనే సర్ది చెప్పుకుంటా. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది. నాపై వచ్చే ట్రోల్స్ను ఎలాగైనా తట్టుకోగలగనని తెలుసుకున్నా" అని తెలిపింది.సోషల్ మీడియా ఆధిపత్యం చెలాయించే ఈ రోజుల్లో జీవించడం నిరంతరం భిన్నమైన అభిప్రాయాలను తీసుకొస్తుందని తెలిపింది. నా జీవితంలో పరిస్థితులు నాకు చాలా ఎక్కువగానే నేర్పించాయని గుర్తు చేసుకుంది. తన తొలి చిత్రం దమ్ లగా కే హైషా సినిమా తన జీవితాన్ని మార్చేసిందని భూమి తెలిపింది. టీనేజ్ వయసులో ఉన్నప్పుడే హీరోయిన్ కావాలనే పెద్ద కలతో నా ప్రయాణాన్ని ప్రారంభించానని పేర్కొంది. అప్పట్లో అవకాశాల కోసం వేచి చూసేదాన్ని అని వెల్లడించింది. కానీ ఈ రోజు నా లక్ష్యంతో పాటు ఒక వ్యక్తిగా అభివృద్ధి చెందానని భూమి పెడ్నేకర్ పంచుకుంది. ఇక సినీ కెరీర్ విషయానికొస్తే భూమి చివరిసారిగా ది రాయల్స్లో అనే వెబ్ సిరీస్లో కనిపించింది. -
నాకు పిల్లలు కావాలి: సల్మాన్ ఖాన్
ఆరు పదుల వయసుకు దగ్గర పడుతున్నారు సల్మాన్ ఖాన్. కానీ సల్మాన్ ఖాన్ ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఫలానా హీరోయిన్తో ప్రేమలో ఉన్నారని, ఫలానా అమ్మాయితో సల్మాన్ పెళ్లి అని చాలా వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. కానీ సల్మాన్ మాత్రం ఏ అమ్మాయితోనూ ఏడడుగులు వేయలేదు. అయితే భవిష్యత్లో మాత్రం తనకు పిల్లలు కావాలని చెబుతున్నారు సల్మాన్ ఖాన్. ‘టూ మచ్ విత్ కాజోల్ అండ్ ట్వింకిల్ షో’లో ఆమిర్ ఖాన్తో కలిసి సల్మాన్ ఖాన్ పాల్గొన్నారు. ఈ షోలో సల్మాన్ ఖాన్ పెళ్లి, ప్రేమ అంశాల ప్రస్తావనను తీసుకువచ్చారు ట్వింకిల్.గతంలో కాఫీ విత్ కరణ్ షోలో సల్మాన్ ఖాన్ తనను తాను నవమన్మథుడిగా చెప్పుకున్నారు. ఈ విషయాన్ని ట్వింకిల్ ప్రస్తావిస్తూ, సల్మాన్కు డజనుమంది పిల్లలు ఉండి ఉండొచ్చని, వాళ్ల గురించి మనకు తెలియదని, ఈ విషయం సల్మాన్కు కూడా తెలియదన్నట్లుగా కాస్త చమత్కారంగా మాట్లాడారు. ఈ విషయంపై స్పందిస్తూ– ‘‘నాకు పిల్లలు ఉంటే నీకు తెలియకుండా ఉంటుందా? ఒకవేళ నాకు పిల్లలు ఉంటే మీ ముందుకు తీసుకురాకుండా ఉంటానా?’’ అని పేర్కొన్నారు సల్మాన్.ఆ తర్వాత పిల్లల్ని దత్తత తీసుకునే చాన్స్ ఏమైనా ఉందా? అని సల్మాన్ను ట్వింకిల్ ప్రశ్నించగా, ‘‘దత్తత తీసుకునే ఆలోచన అయితే లేదు. కచ్చితంగా ఒక బిడ్డ అయితే ఉంటుంది. అది ఎప్పుడైనా జరగొచ్చు. భవిష్యత్లో ఏం జరుగుతుందో ఊహించి చెప్పలేం. అంతా దేవుడి దయ. నాకు పిల్లలు పుడితే వారి ఆలనా పాలనా చూసుకునేందుకు నా కుటుంబం ఉంది. అయాన్ (సల్మాన్ మేనల్లుడు), అలీజ్ ( మేనకోడలు)లు ఉన్నారు. వీరు పెద్దవాళ్లు అయ్యారు. అంతా ఇంట్లోవాళ్లే చూసుకుంటారు’’ అని చెప్పుకొచ్చారు సల్మాన్ ఖాన్. ఇక ప్రస్తుతం ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్’ చిత్రం షూటింగ్తో సల్మాన్ ఖాన్ బిజీగా ఉన్నారు. -
సీక్వెల్కి గ్రీన్ సిగ్నల్
బాలీవుడ్ ‘క్రూ’లోకి మళ్లీ తిరిగొచ్చారట హీరోయిన్ కరీనా కపూర్. టబు, కరీనా కపూర్, కృతీ సనన్ లీడ్ రోల్స్లో నటించిన చిత్రం ‘క్రూ’. రాజేశ్ ఎ. కృష్ణన్ దర్శకత్వం వహించిన ఈ కామెడీ డ్రామా చిత్రం 2024లో విడుదలై, సూపర్ హిట్గా నిలిచింది. ఈ చిత్రనిర్మాతల్లో ఒకరైన ఏక్తా కపూర్ ‘క్రూ’కు సీక్వెల్ను ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఈ సన్నాహాల్లో భాగంగానే కరీనా కపూర్ను మేకర్స్ సంప్రదించగా ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట.‘క్రూ’ సినిమాలో మాదిరిగానే ‘క్రూ 2’లోనూ ముగ్గురు హీరోయిన్లు ఉంటారట. కాక పోతే తొలి భాగంలో నటించిన టబు, కృతీ సనన్ రెండో భాగంలో ఉండరనే విషయంపై చర్చలు జరుగుతున్నాయని బాలీవుడ్ టాక్. ఈ ఇద్దరి స్థానంలో ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్న ఇద్దరు కొత్త హీరో యిన్లు అయితే బాగుంటుందని మేకర్స్ అనుకుంటున్నారట. మరి... ఫైనల్గా ‘క్రూ 2’లో కరీనాతో పాటు నటించే ఆ ఇద్దరు హీరోయిన్లు ఎవరు అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఎదురు చూడక తప్పదు. -
తెలుగు డైరెక్టర్ సినిమా.. నాలుగేళ్ల చిన్నారికి జాతీయ అవార్డ్
ఇటీవల ఢిల్లీలో జాతీయ చలన చిత్రం అవార్డుల కార్యక్రమం గ్రాండ్గా జరిగింది. 2023కు గానూ 71వ జాతీయ సినీ అవార్డ్స్ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అందజేశారు. ఈ వేడుక సెప్టెంబర్ 23న ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో అట్టహాసంగా జరిగింది. ఈ మెగా ఈవెంట్లో మలయాళ స్టార్ మోహన్ లాల్ ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ అందుకున్నారు. టాలీవుడ్ నుంచి ఎంపికైన సినీ ప్రముఖులు జాతీయ అవార్డులు స్వీకరించారు.అయితే ఈ జాతీయ అవార్డుల వేడుకల్లో అందరి దృష్టి ఆ చిన్నారి వైపు మళ్లింది. అత్యంత పిన్న వయసులో జాతీయ చలనచిత్ర అవార్డు అందుకున్న చైల్డ్ ఆర్టిస్ట్గా ఘనత సాధించింది. ఉత్తమ బాలనటిగా త్రీషా వివేక్ తోసర్ నిలిచింది. మహారాష్ట్రకు చెందిన నాలుగేళ్ల చిన్నారి ఏకంగా రాష్ట్రపతి చేతుల మీదుగా జాతీయ అవార్డ్ అందుకుంది. ఉత్తమ బాలనటి అవార్డును అందుకున్న అతి పిన్న వయస్కురాలిగా చరిత్ర సృష్టించింది.మరాఠీ చిత్రం 'నాల్ 2'లో నటనకు గానూ ఈ అవార్డ్ దక్కించుకుంది. ఈ సినిమాను తెలుగు వ్యక్తి సుధాకర్ రెడ్డి యక్కంటి దర్శకత్వంలో తెరకెక్కించారు. నాగరాజ్ ముంజులే నిర్మించిన ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ బ్యానర్లో తెరకెక్కించారు. ఈ మూవీ షూటింగ్ సమయంలో త్రీషాకు మూడేళ్లే కావడం విశేషం. ఈ ప్రతిష్టాత్మక అవార్డ్ అందుకున్న నాలుగేళ్ల త్రీషా వివేక్ తోసర్ను ట్విటర్ వేదికగా కమల్ హాసన్ అభినందించారు. మీరు నా రికార్డును అధిగమించారని చిన్నారిని కొనియాడారు. నేను ఆరేళ్ల వయసులో మొదటిసారిగా అవార్డు అందుకున్నానని తెలిపారు.జాతీయ చలనచిత్ర అవార్డు గెలుచుకున్న తర్వాత త్రీషా తోసర్ తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. రాష్ట్రపతి నన్ను అభినందించినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నానని తెలిపింది. ఈ చిన్నారితో మోహన్ లాల్, షారూఖ్ ఖాన్ ఫోటోలు దిగారు. -
షారూఖ్ ఖాన్కు బిగ్ షాక్.. రెండు కోట్ల పరువు నష్టం కేసు!
బాలీవుడ్ స్టార్ షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ దర్శకత్వంలో ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ వెబ్ సిరీస్ను తెరకెక్కించారు. ఈ నెల 18న ఓటీటీకి వచ్చిన ఈ సిరీస్ ఊహించని విధంగా చిక్కుల్లో పడింది. ఈ వెబ్ సిరీస్లో తనను తప్పుగా చూపించారంటూ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో మాజీ అధికారి సమీర్ వాంఖడే పరువు నష్టం కేసు దాఖలు చేశారు. ఈ మేరకు ఆయన ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ సిరీస్లోని ఓ ఎపిసోడ్లో ఆర్యన్ను డ్రగ్ కేసులో అరెస్టు చేసిన అధికారి సమీర్ వాంఖడేతో పోలిక ఉందని నెటిజన్లు కామెంట్స్ చేయడంతో ఈ వివాదానికి దారితీసింది.దీంతో తనను ఉద్దేశపూర్వకంగానే తప్పుగా చూపించారని మాజీ అధికారి సమీర్ వాంఖడే ఆరోపిస్తూ.. షారుఖ్ ఖాన్, ఆయన సతీమణి గౌరీ ఖాన్కు చెందిన రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్తో పాటు నెట్ఫ్లిక్స్పై పరువు నష్టం కేసు దాఖలు చేశారు. రెండు కోట్ల రూపాయల పరిహారం కోరుతూ పిటిషన్ వేశారు. ఇందులో తనపై దురుద్దేశంతోనే తప్పుగా చిత్రీకరించారని సమీర్ వాంఖడే ఆరోపించారు. ఇలాంటి వాటితో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో లాంటి దర్యాప్తు సంస్థలపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తుందని పిటిషన్లో ప్రస్తావించారు. ఈ రూ. 2 కోట్ల పరిహారాన్ని క్యాన్సర్ రోగుల చికిత్స కోసం టాటా మెమోరియల్ క్యాన్సర్ హాస్పిటల్కు విరాళంగా ఇవ్వాలని పిటిషన్లో ప్రతిపాదించారు.కాగా.. గతంలో సమీర్ వాంఖడే ముంబై తీరంలో కార్డెలియా క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసులో షారూఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ను అరెస్టు చేశారు. ఆ సమయంలో సమీర్ వాంఖడే ఈ కేసును డీల్ చేశారు. ఈ కేసులో ఆర్యన్ను దాదాపు నెల రోజులు జైలులో ఉంచారు. ఆ తర్వాత అతను బెయిల్పై విడుదలయ్యాడు. అయితే ఆ తర్వాత 2023లో ఈ కేసులో ఉన్న వారి నుంచి రూ.25 కోట్లు వసూలు చేయడానికి కుట్ర పన్నారనే ఆరోపణలపై వాంఖడేతో పాటు మరో నలుగురు అధికారులపై సీబీఐ అవినీతి కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.Sameer Wankhede, former NCB Mumbai zonal director, has filed a defamation suit in the Delhi High Court against Red Chillies Entertainment Pvt. Ltd., owned by actor Shah Rukh Khan and Gauri Khan, global streaming platform Netflix, and others. He alleges that their series “Ba**ds…— ANI (@ANI) September 25, 2025 -
రోడ్డుపై అమిర్ ఖాన్ ప్రియురాలు.. ఇక్కడ కూడా వదలరా?
బాలీవుడ్ స్టార్ అమిర్ ఖాన్ ఈ ఏడాది అభిమానులకు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారు. తన బర్త్ డే రోజున ప్రియురాలిని ఫ్యాన్స్కు పరిచయం చేశారు. బెంగళూరుకు చెందిన గౌరీ స్ప్రాట్తో డేటింగ్ ఉన్నానని ప్రకటించి అందరికీ షాకిచ్చారు. ఆరు పదుల వయస్సులో లవ్లో పడ్డానంటూ రివీల్ చేశారు. ఆ తర్వాత వీరిద్దరు పలు ఈవెంట్లలో జంటగా కనిపించారు.ఇదిలా ఉంచితే తాజాగా అమిర్ ఖాన్ ప్రియురాలు గౌరీ స్ప్రాట్ తాజాగా ముంబయిలోని బాంద్రాలో కనిపించింది. రోడ్డుపై నడుచకుంటూ వెళ్తున్న ఆమెను కొందరు ఫోటోగ్రాఫర్స్ వెంటపడ్డారు. దీంతో అసహనానికి గురైన గౌరీ.. దయచేసి నన్ను ఒంటరిగా వదిలేయండి.. నేను వాకింగ్కు వెళ్తున్న అంటూ తన ఫోటోలు తీస్తున్న వారిపై మండిపడింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వాకింగ్ చేసేందుకు వెళ్తున్న ఆమెను వెంటపడమేంటని నెటిజన్స్ సైతం తప్పు పడుతున్నారు. సెలబ్రిటీలను ఇలా రోడ్లపై వేధించడం సరికాదని హితవు పలుకుతున్నారు.ఇక అమిర్ ఖాన్ విషయానికొస్తే ఈ ఏడాది 'సితారే జమీన్ పర్' చిత్రంలో బాస్కెట్బాల్ కోచ్గా నటించి మెప్పించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రపంచవ్యాప్తంగా రూ. 200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అంతేకాకుండా ఇటీవల విడుదలైన రజినీకాంత్ కూలీ చిత్రంలో కీలక పాత్రలో నటించారు. View this post on Instagram A post shared by Bollywood Pap (@bollywoodpap) -
పగోడికి కూడా ఇలాంటి కష్టం రాకూడదు: సల్మాన్ ఖాన్
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ (Salman Khan)కు తీవ్రమైన ఆరోగ్య సమస్యలున్నాయి. బ్రెయిన్ ఎన్యోరిజమ్ (మెదడులో వచ్చే సమస్య), ఏవీ మాల్ఫొర్మేషన్ (రక్తనాళాల్లో నెలకొన్న అసాధారణ స్థితి). వీటివల్ల ఎముకలు విరుగుతూ.. అతడి శరీరం ఎంతో ఒత్తిడికి గురవుతూనే ఉంది. గతంలో ట్రైజెమినల్ న్యూరాల్జియా (ముఖంలో వచ్చే తీవ్రమైన నొప్పి)తోనూ బాధపడ్డాడు. అయితే ఈ వ్యాది పగవాడికి కూడా రాకూడదంటున్నాడు సల్లూ భాయ్.ఎనిమిదేళ్లు బాధపడ్డా..తాజాగా ఓ ఇంటర్వ్యూకి హాజరైన సల్మాన్.. ట్రైజెమినల్ న్యూరాల్జియా వల్ల నేను పడ్డ నరకం మాటల్లో చెప్పలేనిది. పగోడికి కూడా ఇలాంటి కష్టం రాకూడదనే కోరుకుంటాను. ఏడెనిమిదేళ్లు ఈ వ్యాధితో బాధపడ్డాను. ప్రతి నాలుగైదు నిమిషాలకోసారి నొప్పి నన్ను వేధించేది. దానివల్ల బ్రేక్ఫాస్ట్ చేయడానికి కూడా గంటన్నర సమయం పట్టేది. ఒక ఆమ్లెట్ తినాలన్నా కూడా కష్టంగా ఉండేది. నొప్పి నన్ను వెంటాడేది.దాన్ని భరించలేక ప్రాణాలు వదిలేవారుబలవంతంగా ఆమ్లెట్ నోట్లో కుక్కుకునేవాడిని. పెయిన్కిల్లర్స్ వాడినా ఫలితం లేదు. ఈ వ్యాధి వచ్చిన చాలామంది దాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకునేవారు. ఇప్పుడు దానికి చికిత్స లభిస్తోంది. ఏడెనిమిది గంటలపాటు సర్జరీ చేసి ముఖంలో మనల్ని ఇబ్బందిపెడుతున్న నరాలను ఫిక్స్ చేస్తున్నారు. నేనూ ఆ సర్జరీ చేయించుకున్నా.. ఇకమీదట నొప్పి 30% తగ్గుతుందన్నారు. అదృష్టవశాత్తూ ఆ వ్యాధి పూర్తిగా తగ్గిపోయింది అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం సల్మాన్.. బ్యాటిల్ ఆఫ్ గల్వాన్ సినిమా చేస్తున్నారు.చదవండి: మోహన్లాల్ రికార్డ్.. ఒకే ఏడాదిలో రూ. 600 కోట్లు -
నేనూ సెలవు తీసుకుంటా!
బాలీవుడ్ స్టార్ హీరోల్లో అక్షయ్ కుమార్ ఒకరు. ఎప్పుడూ వరుస సినిమాలతో, క్రేజీ ప్రాజెక్ట్స్తో బిజీ బిజీగా ఉండే ఆయన కూడా సెలవులు తీసుకుంటారట. అది కూడా ఏడాదిలో 125 రోజులట. ఇటీవల ఓ టీవీ షోలో పాల్గొన్న అక్షయ్ కుమార్ ఈ విషయాన్ని స్వయంగా తెలిపారు. ‘‘మనందరికీ రోజుకి 24 గంటలుంటాయి. ఏడాదికి 365 రోజులే. అందరిలానే నేను కూడా సెలవులు తీసుకుంటా. అది కూడా దాదాపు 125 రోజులు. ఏడాదిలో 52 ఆదివారాలు, 40 రోజుల వేసవి విహారయాత్ర, క్రిస్మస్కు 12 రోజులు, దీపావళికి 3 రోజులు. ఇవి కాకుండా ప్రతి మూడు నెలలకు కుదిరితే ఓ వారం పాటు విశ్రాంతి తీసుకుంటాను. నేనయినా.. ఇతరులైనా సమయాన్ని సరిగ్గా నిర్వహణ చేసుకోవడమే జీవితమంటే. సంతోషంగా ఉండమని దేవుడు మనల్ని భూమ్మీదకు పంపించారు. ఎందుకంటే ఈ భూమి కూడా స్వర్గానికి ప్రతిరూపం. ఎలాంటి ఒత్తిడి జోలికి పోకుండా సంతోషంగా ఉండాలి’’ అని అక్షయ్ చెప్పారు. -
ఇంటిమేట్ సీన్.. హీరోను ఏడిపించిన హీరోయిన్
'బాబీ' సినిమాతో ఓవర్నైట్ స్టార్ అయిపోయింది డింపుల్ కపాడియా (Dimple Kapadia). హిందీలో అనేక హిట్ సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్గా రాణించింది. అయితే అనిల్ కపూర్ (Anil Kapoor)తో చేసిన ఓ సినిమాలో మాత్రం డింపుల్ బాగా ఇబ్బందిపడింది. ఆ సీన్ కహానీ ఏంటో చూసేద్దాం.. 1986లో జన్బాజ్ మూవీలో అనిల్ కపూర్, డింపుల్ కపాడియా జంటగా నటించారు. ఫిరోజ్ ఖాన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ సూపర్ హిట్గా నిలిచింది. ఇందులోని పాటలు ఇప్పటికీ పాడుకుంటూ, వింటూ ఉంటారు.అనిల్ కపూర్, డింపుల్ కపాడియారొమాంటిక్ సీన్అయితే ఈ మూవీలోని ఓ షాట్ కోసం.. ఫిరోజ్ ఖాన్ ఫామ్హౌస్ను ఎంచుకున్నారు. అక్కడ హీరోహీరోయిన్ల మధ్య కాస్త క్లోజప్ (ఇంటిమేట్) సీన్స్ పెట్టారు. ఆ విషయం హీరోహీరోయిన్లిద్దరికీ చెప్పారు. సమయానికి ఇద్దరూ సెట్లోకి వచ్చారు. కానీ అనిల్ చొక్కా విప్పగానే డింపుల్ అడుగు ముందుకు వేయలేదట! కారణం.. అతడి ఛాతీనిండా గుబురుగా వెంట్రుకలు ఉండటం! దీంతో దర్శకుడు ఆమెను బతిమాలుకోవడం మొదలుపెట్టాడు. చిట్టచివరకు ఆమె ఆ సీన్ చేసేందుకు అంగీకరించింది. అనిల్ ఛాతీపై వెంట్రుకలు చూసి డింపుల్ అతడిని చాలారోజులపాటు ఏడిపించిందట! ఇకపోతే జన్బాజ్ మూవీలోని ఓ సాంగ్లో హీరోయిన్ శ్రీదేవి తళుక్కుమని మెరిసింది.చదవండి: అర్ధరాత్రి ఇంటికి రీతూ.. తననలాగే చూస్తా! డిప్రెషన్లో ఉన్నా: ధర్మ మహేశ్ -
'ఆదిపురుష్' రిజల్ట్.. ఇన్నాళ్లకు ఒప్పుకొన్న ఓం రౌత్
ఆదిపురుష్.. ఈ పేరు చెబితే చాలు ప్రభాస్ ఫ్యాన్స్, దర్శకుడు ఓం రౌత్పై ఇంతెత్తున ఎగిరిపడతారు. ఎందుకంటే మూవీలోని గ్రాఫిక్స్ మరీ నాసిరకంగా ఉంటుంది. పురాణాల్లో రాముడు, రావణాసురుడు అంటే కొన్ని అంశాలు దాదాపు ఒకేలా ఉంటాయి. కానీ వాటిని పూర్తిగా మార్చేసి ఇష్టమొచ్చినట్లు ఓం రౌత్ తీయడంపై అప్పట్లో పెద్ద చర్చ నడిచింది. తర్వాత ఏ గ్రాఫిక్స్ మూవీ వచ్చినా సరే ఔం రౌత్పై కచ్చితంగా ట్రోలింగ్ జరుగుతుంది. అయితే రిలీజ్ తర్వాత దీని గురించి ఎప్పుడూ మాట్లాడని ఈ దర్శకుడు.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తొలిసారి స్పందించాడు. విమర్శలు, ట్రోలింగ్ వల్ల ఎంతో మానసిక క్షోభకు గురయ్యాడో చెప్పాడు.(ఇదీ చదవండి: హైకోర్ట్ తీర్పు.. 'కాంతార'కు లైన్ క్లియర్)'జీవితంలో తప్పులు చేయడం సహజం. హిట్ సంతోషాన్ని ఇస్తుంది. ఫ్లాప్ పాఠం నేర్పిస్తుంది. తప్పుల నుంచి గుణపాఠాలు నేర్చుకుని మళ్లీ అలాంటివి జరగకుండా ముందుకెళ్లిపోవడమే జీవితం. అదే మనిషిని బతికిస్తుంది. 'ఆదిపురుష్' విషయంలో వచ్చిన విమర్శల వల్ల చాలా మానసిక ఒత్తిడికి గురయ్యాను. టీమ్తో పాటు ఆ ప్రభావం నా కుటుంబంపైనా పడింది. ఫలితంగా నా కాన్ఫిడెన్స్ అంతా పోయింది. ఆ సమయంలో నా కుటుంబం, స్నేహితులు అండగా నిలిచారు. అలా కోలుకోగలిగాను. ప్రేక్షకుల నమ్మకం తిరిగి పొందేందుకు ఇప్పుడు చాలా కష్టపడాలి' అని ఓం రౌత్ చెప్పుకొచ్చాడు.2015లో 'లోక్మాన్య' అనే మరాఠీ సినిమాతో దర్శకుడు అయిన ఓం రౌత్.. తర్వాత హిందీలో 'తానాజీ' అనే పీరియాడికల్ మూవీతో హిట్ కొట్టాడు. ఎప్పుడైతే 'ఆదిపురుష్' వచ్చిందో ఇతడిపై విపరీతమైన ట్రోలింగ్ వచ్చింది. అప్పటినుంచి మరో చిత్రం చేయలేదు. రీసెంట్గా 'ఇన్స్పెక్టర్ జెండే' మూవీని నిర్మించగా ఇది నేరుగా నెట్ఫ్లిక్స్లో రిలీజైంది. రెస్పాన్స్ బాగానే వచ్చింది. ప్రస్తుతం ధనుష్తో అబ్దుల్ కలాం బయోపిక్ తీస్తున్నాడు. దీంతో హిట్ కొట్టాడా సరేసరి లేదంటే మాత్రం అంతే!(ఇదీ చదవండి: 'కాంతార' షూట్లో 4-5 సార్లు నేను చనిపోయేవాడిని: రిషభ్ శెట్టి) -
తల్లి కాబోతున్న స్టార్ హీరోయిన్.. అప్పుడు భర్తకే తెలియదా?
సినిమా తారల కెరీర్ విషయాలే కాకుండా వ్యక్తిగత విషయాలపై కూడా జనాలకు ఆసక్తి ఎక్కువ. వాళ్లు తినే తిండి మొదలు.. ధరించే దుస్తుల వరకు ప్రతీది సాధారణ ప్రజలకు వార్తే అవుతుంది. ఇక వాళ్ల పర్సనల్ లైఫ్పై కూడా ఫోకస్ ఎక్కువగానే ఉంటుంది. ప్రేమ, పెళ్లి.. ప్రెగ్నెన్సీ.. ఇలాంటి శుభవార్తలను విని ఆనందించే అభిమానులు చాలా మందే ఉన్నారు. అందుకే కొంతమంది స్టార్స్ సోషల్ మీడియా వేదికగా పర్సనల్ విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంటారు. మరికొంతమంది అయితే.. వ్యక్తిగత విషయాలను బయటకు వెల్లడించేందుకు అంతగా ఆసక్తి చూపించరు. అలాంటి వారిలో బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్(Vicky Kaushal ) కూడా ఒకరు. ఆయన పర్సనల్ లైఫ్ని గోప్యంగా ఉంచేందుకు ఇష్టపడతాడు. ముఖ్యమైన విషయాలను మాత్రమే అభిమానులతో షేర్ చేసుకుంటాడు. తాజాగా ఆయన ఓ గుడ్ న్యూస్ని తన ఫ్యాన్స్తో షేర్ చేసుకున్నాడు. త్వరలోనే ఆయన తండ్రి కాబోతున్నాడు. ఆయన సతీమణి, స్టార్ హీరోయిన్ కత్రీనా కైఫ్(Katrina Kaif ) గర్భం దాల్చింది. ఈ విషయాన్ని తాజాగా ఇద్దరూ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా తెలియజేస్తూ..‘మా జీవితంలో కొత్త చాప్టర్ ప్రారంభమైంది’ అని రాసుకొచ్చారు. అప్పుడు అలా.. కత్రినా కైఫ్ గర్భం దాల్చిందని గత కొన్నాళ్ల క్రితమే వార్తలు వచ్చాయి. ఆమె ప్రెగ్నెంట్ అని.. అందుకే బయటకు ఎక్కువ రావడం లేదని బాలీవుడ్ మీడియా పేర్కొంది. ఇదే విషయాన్ని ఓ సినిమా ఈవెంట్ని విక్కీ కౌశల్ని అడిగితే.. అలాంటిదేమి లేదని, శుభవార్త ఉంటే తామే చెబుతామని అన్నారు. దీంతో కత్రినా ప్రెగ్నెంట్ రూమర్ మాత్రమే అని అంతా అనుకున్నారు. కానీ తాజాగా ఆమె బేబీ బంప్ ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. కత్రినా తన నివాసంలో బేబీ బంప్తో ఫోటో షూట్ చేసిన నిర్వహించింది. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ కావడంతో మరోసారి ఈ జంట వార్తల్లో నిలిచింది. కత్రినా ప్రెగ్నెంట్ విషయం భర్తకే తెలియదా..విక్కీ ఎందుకు అలా చెప్పాడంటూ నెటిజన్స్ కామెంట్స్ చేశారు. అయితే తాజాగా ఈ విషయాన్ని ఈ జంట అధికారికంగా వెల్లడించింది. దీంతో అభిమానులు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.నాలుగేళ్ల తర్వాతకొన్నాళ్ల పాటు డేటింగ్ చేసిన కత్రినా కైఫ్, విక్కీ కౌశల్.. 2021 డిసెంబర్ 9న పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. వయసులో కత్రినా కంటే విక్కీ చిన్నవాడు. పెళ్లయిన నాలుగేళ్ల తర్వాత ఈ జంట తల్లిదండ్రులుగా మారబోతున్నారు. సినిమాల విషయానికొస్తే.. ‘ఛావా’తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విక్కీ.. ప్రస్తుతం లవ్ అండ్ వార్' అనే చిత్రంలో నటిస్తున్నాడు. కత్రినా విషయానికొస్తే.. ‘మల్లీశ్వరి’ చిత్రంతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. బాలకృష్ణతో కలిసి నటించిన అల్లరి ప్రియుడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. అయితే ఈ రెండు చిత్రాల తర్వాత కత్రినా.. తన మకాంని బాలీవుడ్కి మార్చింది.అక్కడ వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్గా ఎదిగింది. చివరగా 2024లో విజయ్ సేతుపతితో కలిసి ‘మేరి క్రిస్మస్’ చిత్రంలో నటించింది. View this post on Instagram A post shared by Katrina Kaif (@katrinakaif) -
అమ్మ చీర చుట్టేసి..ఫ్యాన్స్ను కట్టిపడేసి : జాన్వీ అమేజింగ్ లుక్
ముంబైలో జరిగిన హోమ్బౌండ్ స్పెషల్ స్క్రీనింగ్లో జాన్వీ కపూర్ (Janhvi Kapoor) చాలా ప్రత్యేకంగా కనిపించింది. తన తల్లి, దివంగత లెజెండరీ నటి శ్రీదేవి చీరలో అందరి దృష్టిని ఆకర్షించింది తన రాబోయే చిత్రం హోమ్బౌండ్ ప్రత్యేక షోలో ఒకపుడు శ్రీదేవి ధరించిన నేవీ (రాయల్ బ్లూ ) బ్లూ చీర, జాకెట్టులో తళుక్కున మెరిసింది. బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ ,విరాట్ కోహ్లీ వివాహ రిసెప్షన్లో శ్రీదేవి ఈ చీరను ధరించారు. అదే చీరలో అద్భుతమైన తన లుక్తో జాన్వీ అభిమానులను ఆశ్చర్యపరిచింది.బంగారు ఎంబ్రాయిడరీతో రూపుదిద్దుకున్న ఈ నేవీ బ్లూ చీరకు బ్లాక్ వెల్వెట్ బ్లౌజ్తో జత చేయగా, స్టేట్మెంట్ చెవిపోగులు, చోకర్-స్టైల్ నెక్లెస్ , సొగసైన బన్తో లుక్ను పూర్తి చేసింది. నీరజ్ ఘయ్వాన్ దర్శకత్వం వహించిన హోమ్బౌండ్ 2026 ఆస్కార్లో ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో భారతదేశం నుంచి అధికారిక ఎంట్రీ అని ప్రకటించిన తర్వాత ఈ ప్రీమియర్ షోకు మరింత ప్రాధాన్యత ఒనగూడింది.ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (FFI) ఈ చిత్రాన్ని 98వ అకాడమీ అవార్డులలో ఉత్తమ అంతర్జాతీయ చలనచిత్రంగా దేశ పోటీదారుగా ప్రకటించింది. ఈ చిత్రం గతంలో 2025 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్, టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (TIFF) మరియు ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ (IFFM)లలో ప్రదర్శించబడింది. ఇది సెప్టెంబర్ 26న భారతదేశంలో థియేటర్లలో విడుదల కానుంది. View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) -
నిషేధ చట్టాన్ని ఉల్లంఘించిన రణ్బీర్ కపూర్పై చర్యలు
బాలీవుడ్ నటుడు రణ్బీర్ కపూర్ చిక్కుల్లో పడ్డారు. నిషేధ చట్టాన్ని ఆయన ఉల్లంఘించారని జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) చర్యలకు సిద్ధమైంది. షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ దర్శకత్వం వహించిన తొలి సిరీస్ బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ లో రణ్బీర్ కపూర్ అతిథి పాత్రలో నటించారు. అయితే, ఒక సీన్లో ఈ-సిగరెట్తో ఆయన కనిపిస్తారు. భారత్లో ఎలక్ట్రానిక్ సిగరెట్ట నిషేధ చట్టం ఉంది. దీనిని ఆయన ఉల్లంఘించారని ఎన్హెచ్ఆర్సీ పేర్కొంది.బాలీవుడ్ నటుడు రణ్బీర్ కపూర్తో పాటు చిత్రనిర్మాతలు, ఓటీటీ ప్లాట్ఫామ్పై చట్టపరమైన చర్యలకు ఎన్హెచ్ఆర్సీ సిద్ధమైంది. భారత్లో నిషేధించిన ఉత్పత్తులను నెట్ఫ్లిక్స్ ఎలా చూపించిందంటూ కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శికి ఎన్హెచ్ఆర్సీ నోటీసులు జారిచేసింది. ఈ సిరీస్లో రణ్బీర్ కపూర్ ఎటువంటి చట్టబద్ధమైన హెచ్చరిక లేకుండా ఈ-సిగరెట్ తాగుతున్నట్లు చూపించారని లీగల్ రైట్స్ అబ్జర్వేటరీ దాఖలు చేసిన ఫిర్యాదులో పపేర్కొన్నారు. నిషేధిత పదార్థాలను ఇలా ప్రోత్సాహించడం నేరం దాని ద్వారా యువతను తప్పుదారి పట్టించేలా ప్రభావితం చేస్తుందని తెలిపారు.అయితే, ఈ వివాదం జరిగిన కొద్దిసేపటికే ఎన్హెచ్ఆర్సీ సభ్యులు ప్రియాంక్ కనూంగో స్పందించారు. 'భారతదేశంలో ఈ-సిగరెట్లు నిషేధం. ఇక్కడి చట్టం ప్రకారం ఏ వ్యక్తి కూడా ఈ-సిగరెట్లను ప్రోత్సహించకూడదు. ఎవరైనా భారత్లో వాటిని విక్రియించినా లేదా దిగుమతి చేసుకున్నా నేరం. కనీసం ఎలాంటి అమ్మకాలు జరిపేందుకు అనుమతి లేదు. రణ్బీర్ కపూర్తో పాటు నిర్మాణ సంస్థ, ఓటీటీ ప్లాట్ఫామ్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాని ముంబై పోలీసు కమిషనర్కు ఫిర్యాదు చేశాం' అని చెప్పారు. -
మెరుగైన ఇంటి వైపు హోమ్బౌండ్
ఈ దేశవాసులకు ఈ దేశమే ఇల్లు. ఇక్కడే ఉండాలి. జీవించాలి. కాని ఈ నేల ప్రతి ఒక్కరికీ నివాసయోగ్యంగా ఉందా? ప్రతి ఒక్కరినీ సమానంగా, గౌరవంగా చూస్తోందా? ఏ మహమ్మారో వస్తే వలస కూలీలను ‘మీ ఊరికి పోండి’ అని సాటి మనుషులే తరిమికొడితే ‘ఇంటి వైపు’ నడక సాగుతుందా? మన హైదరాబాదీ దర్శకుడు నీరజ్ ఘెవాన్ తీసిన ‘హోమ్బౌండ్’ ఎన్నో సామాజిక ప్రశ్నలు లేవనెత్తుతోంది. వివక్షలను ప్రశ్నిస్తోంది. భారత దేశం నుంచి ఆస్కార్కు ఆఫీషియల్ ఎంట్రీగా ఎంపికైన ఈ సినిమా వివరాలు.మే 21, 2025. కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో కనీవినీ ఎరగనట్టుగా స్టాండింగ్ ఒవేషన్ ఇస్తున్నారు ప్రేక్షకులు. సినిమా అయ్యాక లేచి నిలబడి చప్పట్లు కొడుతున్నారు. ఒక నిమిషం... రెండు నిమిషాలు... చప్పట్లు ఆగడం లేదు... 9 నిమిషాల పాటు చప్పట్లు మోగుతూనే ఉన్నాయి. ఆ సినిమాలో నటించిన నటీనటులు, నిర్మాత, దర్శకుడు ఉద్వేగంతో కన్నీరు కారుస్తూ ఒకరిని ఒకరు హత్తుకున్నారు. బహుశా ఆ చప్పట్ల మోత ‘ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా’ను తాకినట్టున్నాయి. 2026లో జరగనున్న 98వ ఆస్కార్ అవార్డ్స్ పోటీకి ‘బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్’ కేటగిరి కోసం ఇండియా నుంచి అఫీషియల్ ఎంట్రీగా ఆ సినిమాను ఎంపిక చేశారు. పేరు: హోమ్బౌండ్ (Homebound).→ అదే దర్శకుడికి అదే గుర్తింపు‘హోమ్బౌండ్’ (ఇంటి వైపు) దర్శకుడు నీరజ్ ఘేవాన్ (Neeraj Ghaywan). ఇంతకు ముందు ఇతను తీసిన ‘మసాన్’ సినిమా మన దేశంలోనే కాదు విదేశాల్లో కూడా విపరీతమైన ప్రశంసలు పొందింది. దానికి కారణం ఆ సినిమాలో ఎత్తి చూపించిన వివక్ష, తాత్త్వికత. ఇప్పుడు కూడా అలాంటి వివక్షను, ఆధిపత్యాన్ని దర్శకుడు గొప్ప కళాత్మకంగా, సెన్సిబుల్గా చూపించడం వల్లే ‘హోమ్బౌండ్’కు ఘన జేజేలు దక్కుతున్నాయి. హాలీవుడ్ దిగ్గజం మార్టిన్ స్కోర్సెసి ఈ సినిమాకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉండటమే కాదు సినిమా విపరీతంగా నచ్చడంతో పొగడ్తలతో ప్రచారంలోకి తెచ్చాడు. ఆ తర్వాత ఫిల్మ్ఫెస్టివల్స్లో సినిమాకు ప్రశంసలు మొదలయ్యాయి. కాన్స్ తర్వాత టొరెంటో ఫిల్మ్ ఫెస్టివల్లో ‘హోమ్బౌండ్’ రెండవ స్థానంలో నిలిచింది. ‘మసాన్’ సినిమా సమయంలో కేన్స్లో పాల్గొన్న నీరజ్ తిరిగి ఈ సినిమాతో అదే కేన్స్లో సగర్వంగా నిలిచాడు.→ ఇద్దరు స్నేహితుల కథ‘హోమ్బౌండ్’ షోయెబ్, చందన్ కుమార్ అనే ఇద్దరు మిత్రుల కథ. వీరిద్దరూ అట్టడుగు ఆర్థిక పరిస్థితుల్లో ఉన్న యువకులు. చిన్నప్పటి నుంచి వీరు పోలీస్ కానిస్టేబుళ్లు అవ్వాలనుకుంటారు. అందుకై ప్రయత్నిస్తూ నగరంలో అంత వరకూ చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు. కాని ఒకసారి ఊరు విడిచి నగరానికి చేరుకున్నాక ప్రపంచపు పోకడ, మన దేశంలో వేళ్లూనుకుని ఉన్న వివక్ష వారికి అనుభవంలోకి వస్తుంది. చందన్ దళితుడైన కారణంగా అవమానాలు ఎదుర్కొంటుంటే, షోయెబ్ ముస్లిం కావడం వల్ల వివక్షను ఎదుర్కొంటూ ఉంటాడు. ఈ ‘దేశం’ అనే ‘ఇల్లు’ వీరికి ‘కొందరికి’ ఇస్తున్నట్టుగా మర్యాద, గౌరవం ఇవ్వడం లేదు. ‘కానిస్టేబుల్ ఉద్యోగం’ వస్తే అన్ని వివక్షలు పోతాయని వీరు అనుకుంటారుగాని అదంతా ఉత్తమాట... కొందరు ఎంత ఎదిగినా కిందకే చూస్తారని కూడా అర్థమవుతుంది. వీరికి పరిచయమైన అమ్మాయి సుధా భారతి అంబేద్కరైట్గా సమాజంలో రావలసిన చైతన్యం గురించి మాట్లాడుతుంటుంది. ఈలోపు పులి మీద పిడుగులా లాక్డౌన్ వస్తుంది. అక్కడి నుంచి ఆ స్నేహితులిద్దరూ సొంత ఊరికి బయలుదేరడంతో ఆ ప్రయాణం వారిని ఎక్కడికి చేర్చిందనేది కథ. ఇందులో ఇద్దరు స్నేహితులుగా విశాల్ జేత్వా, ఇషాన్ ఖట్టర్ నటించారు. సుధా భారతిగా జాన్వీ కపూర్ (Janhvi Kapoor) నటించింది. కరణ్ జొహర్, అదర్ పూనావాలా (కోవీషీల్డ్ తయారీదారు) నిర్మాతలు. సహజమైన పాత్రలు, గాఢమైన సన్నివేశాలు, దర్శకుడు సంధించే ప్రశ్నలు ఈ సినిమా చూశాక ప్రేక్షకులను వెంటాడుతాయని ఇప్పటి వరకూ వస్తున్న రివ్యూలు చెబుతున్నాయి. ఆస్కార్ నామినేషన్స్ను జనవరి 22, 2026న ప్రకటిస్తారు. హోమ్బౌండ్ నామినేట్ అవుతుందని ఆశిద్దాం. మరో ఆస్కార్ ఈ సినిమా వల్ల వస్తే అదీ ఘనతే కదా. నిజ సంఘటన ఆధారంగా...ఈ సినిమాను నిజ జీవిత సంఘటన ఆధారంగా దర్శకుడు నీరజ్ ఘెవాన్ తీశాడు. 2020లో న్యూయార్క్ టైమ్స్లో కశ్మీర్ జర్నలిస్ట్ బషారత్ పీర్ ఒక ఆర్టికల్ రాశాడు. ఒక మిత్రుడి సమాధి పక్కన కూచుని ఉన్న మరో మిత్రుడి ఫొటో వేసి. ‘టేకింగ్ అమృత్ హోమ్’ అనే ఆ ఆర్టికల్ కోవిడ్ కాలంలో సూరత్ ఫ్యాక్టరీల్లో పని చేస్తున్న ఇద్దరు మిత్రులు ఉత్తర్ ప్రదేశ్లోని తమ సొంత ఊరుకు బయలుదేరి ఎలా సర్వం కోల్పోయారో, వారిలో ఒక మిత్రుడు చనిపోతే మరో మిత్రుడు కోవిడ్కు భయపడకుండా ఆ శవాన్ని ఎలా ఇంటికి చేర్చాడో బషారత్ ఆ ఆర్టికల్లో రాశాడు. అది చదివిన నీరజ్ కోవిడ్ సమయాన్ని నేపథ్యంగా ఉంచుతూనే ఈ దేశంలో వ్యాపించిన సామాజిక దుర్నీతులను ముందు వరుసలో పెట్టి ‘హోమ్బౌండ్’ను తీశాడు. -
సీట్ ఎడ్జ్ థ్రిల్లర్
రాణి ముఖర్జీ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘మర్దానీ 3’. అభిరాజ్ మినావాలా దర్శకత్వంలో యష్ రాజ్ ఫిల్మ్స్పై ఆదిత్యా చోప్రా నిర్మిస్తున్నారు. దసరా నవరాత్రులు శుభారంభం సందర్భంగా ‘మర్దానీ 3’ పోస్టర్ను ఆవిష్కరించారు మేకర్స్. ‘‘మర్దానీ (2014), మర్దానీ 2 (2019)’ వంటి విజయాల తర్వాత ప్రేక్షకులకు సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ను ఇచ్చేలా ‘మర్దానీ 3’ తెరకెక్కుతోంది.మంచికి, చెడుకి మధ్య జరిగే పోరాటాల్ని ఈ సినిమాలో చూపించబోతున్నాం. తనకు ఎంతో ఇష్టమైన, ప్రేమించిన డేర్ డెవిల్ పోలీస్ శివానీ శివాజీ రాయ్ పాత్రలో రాణి ముఖర్జీ మరోసారి కనిపించబోతున్నారు. ఓ కేసుని పరిష్కరించడానికి, దాని కోసం తన ప్రాణాలను పణంగా పెట్టే శివానీ సంకల్పం ఎలాంటిదో సినిమాలో చూడాలి’’ అని యూనిట్ తెలిపింది. ఈ చిత్రం 2026 ఫిబ్రవరి 27న రిలీజ్ కానుంది. -
రణ్వీర్ సింగ్ విలన్గా ఊహించని పేరు.. ఎంట్రీ ఇస్తాడా?
బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ ఈ ఏడాది వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం దురంధర్ మూవీ చేస్తోన్న బాలీవుడ్ స్టార్.. డాన్-3 మూవీ కూడా చేయనున్నారు. ఈ చిత్రంలో మొదటి కియారా అద్వానీని హీరోయిన్గా ప్రకటించారు. అయితే అంతలోనే ఏమైందో తెలియదు కానీ ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. కియారా ప్లేస్లో ఆదిపురుష్ భామ కృతి సనన్ను తీసుకున్నట్లు తెలుస్తోంది.ఇప్పటికే హీరోయిన్ను మార్చేసిన మేకర్స్.. విలన్ విషయంలో అదే జరుగుతోందని టాక్. డాన్-3లో మొదట 12th ఫెయిల్ నటుడు విక్రాంత్ మాస్సేను అనుకున్నారు. కానీ ఊహించని విధంగా ఈ రోల్కు విక్రాంత్ మాస్సే నో చెప్పినట్లు తెలుస్తోంది. పాత్రలో లోతు లేకపోవడం వల్ల అతను వెనక్కి తగ్గినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే విలన్ రోల్కు ఊహించని పేరు తెరపైకి వచ్చింది.ఈ ఏడాది అజిత్ కుమార్ నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీలో తన విలనిజంతో మెప్పించిన అర్జున్ దాస్ను విలన్గా ఎంపిక చేయనున్నట్లు లేటేస్ట్ టాక్. అయితే ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించలేదు. ఇదే నిజమైతే ఈ కోలీవుడ్ యాక్టర్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. అర్జున్ దాస్ ఇప్పటికే మాస్టర్, గుడ్ బ్యాడ్ అగ్లీ, కైతి లాంటి హిట్ సినిమాలతో తన విలనిజాన్ని చూపించాడు. ప్రస్తుతం అర్జున్ దాస్తో దర్శకుడు ఫర్హాన్ అక్తర్ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. కాగా.. ఈ మూవీ వచ్చే ఏడాది జనవరిలో సెట్స్ పైకి వెళ్లే అవకాశముంది. ఈ చిత్రంలో భారీ యాక్షన్ సీన్స్ ఉండనున్నట్లు తెలుస్తోంది. హాలీవుడ్ రేంజ్లో యాక్షన్ సన్నివేశాలను రూపొందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారని టాక్ వినిపిస్తోంది. -
'అతని నుంచి ప్రేరణ పొందా'.. ఫ్యాన్స్కు అమితాబ్ చిరు కానుకలు
బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ తన అభిమానులకు గిప్ట్లు అందించారు. తన నివాసం వద్దకు వచ్చిన ఫ్యాన్స్కు హెల్మెట్స్ అందజేశారు. అంతేకాకుండా దాండియా ఆట ఆడే కర్రలు కూడా ఇచ్చారు. కౌన్ బనేగా కరోడ్పతి కంటెస్టెంట్ రాఘవేంద్ర కుమార్ నుంచి తాను ప్రేరణ పొందినట్లు వెల్లడించారు. ప్రతి ఆదివారం తన అభిమానులను కలుస్తోన్న అమితాబ్ వారికి చిరు కానుకలు అందజేస్తున్నారు. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా పంచుకున్నారు. జీవితంలో ప్రతి రోజు ఏదో ఒక కొత్త విషయం నేర్చుకోవాలని అభిమానులకు పిలుపునిచ్చారు.అమితాబ్ తన ట్వీట్లో రాస్తూ.. కేబీసీలో హెల్మెట్ మ్యాన్ని కలవడం నాకు చాలా గౌరవంగా ఉంది.. ఆయన బైక్ రైడర్లకు భద్రత కోసం స్వచ్ఛందంగా హెల్మెట్లు ఇస్తారు. అతన్ని చూసి నేను కూడా ప్రేరణ పొందాను. అందుకే ప్రతి ఆదివారం అభిమానుల సమావేశంలో దాండియా కర్రలతో పాటు.. వీలైనన్ని ఎక్కువ మందికి హెల్మెట్లు ఇచ్చాను' అని పోస్ట్ చేశారు.కాగా.. కౌన్ బనేగా కరోడ్పతి షో పాల్గొన్న రాఘవేంద్ర కుమార్ రోడ్డు భద్రతను ప్రోత్సహించే విషయంలో భారతదేశం అంతటా గుర్తింపు పొందారు. అతను ఇప్పటికే వేలాదిమందికి హెల్మెట్లను అందించారు. అంతేకాకుండా రోడ్డు ప్రమాదాలపై ప్రచారం చేస్తూనే ఉన్నాడు. ఈ పోస్ట్ చూసిన కుమార్.. అమితాబ్కు కృతజ్ఞతలు తెలిపారు. మీ ప్రశంసలు తన జీవితంలో దక్కిన గొప్ప అవార్డు సంతోషం వ్యక్తం చేశారు. తన కలకు మీరు తోడుగా నిలవడం నాకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చిందన్నారు.కాగా.. బిగ్ బి ప్రస్తుతం కౌన్ బనేగా కరోడ్పతి -17 సీజన్కు హోస్ట్గా వ్యవహరిస్తున్నారు. ఆయన చివరిసారిగా నాగ్ అశ్విన్ డైరెక్షన్లో వచ్చిన కల్కి 2898 ADలో కనిపించారు. ఈ చిత్రంలో అశ్వత్థామ పాత్రలో అభిమానులను మెప్పించారు. ఈ చిత్రంలో కమల్ హాసన్, ప్రభాస్, దీపికా పదుకొనే, దిశా పటానీ కీలక పాత్రల్లో నటించారు. T 5510 - Honoured to have met the "HELMET MAN" at KBC .. who voluntarily gives out helmets to bike riders for safety .. A learning for me .. so I followed and gave out at the Sunday Fan meet .. dandiya sticks for dandiya and helmets to as many as I could .. Each day is a… pic.twitter.com/jfdwe1Zi9j— Amitabh Bachchan (@SrBachchan) September 21, 2025 -
రూ.100 కోట్లు.. కాదు వెయ్యి.. రెండు వేల కోట్ల FD ఉంటే చాలు!
దేశంలోని అత్యంత ధనిక నటుల్లో అక్షయ్ కుమార్ (Akshay Kumar) ఒకరు. ఒకానొక సమయంలో భారత్లో అత్యధిక మొత్తంలో ఆదాయ పన్ను చెల్లించి వార్తల్లోకెక్కాడు. నిజాయితీగా ట్యాక్స్ కట్టినందుకుగానూ ఆదాయపన్నుశాఖ ఆయనకు ప్రశంసాపత్రాన్ని సైతం అందించింది. అయితే అక్షయ్కు డబ్బుపిచ్చి ఉందన్న ప్రచారం జరిగింది. తాజాగా ద కపిల్ శర్మ షోకి హాజరైన అక్షయ్ మనీ మైండెడ్ అని తనపై పడిన ముద్రపై స్పందించాడు. రూ.100 కోట్లు ఎఫ్డీ చేస్తే..హీరో మాట్లాడుతూ.. జితేంద్ర సాహెబ్ రూ.100 కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నాడని నేను ఎక్కడో వార్త చదివాను. నాకు బాగా గుర్తు.. అది చూశాక నేను మా నాన్న దగ్గరకు పరుగెత్తుకెళ్లాను. డాడీ, రూ.100 కోట్లు ఎఫ్డీ చేస్తే ఎంత వడ్డీ వస్తుంది? అని అడిగాను. అప్పట్లో ఇంట్రెస్ట్ రేట్ 13% ఉండేది. ఈ లెక్కన నెలకు రూ.1.3 కోట్లు అన్నాడు. అంటే నేను రూ.100 కోట్లు ఎఫ్డీ చేసుకోగలిగితే నాకు ఆర్థిక స్వేచ్ఛ లభించినట్లే అని ఫీలయ్యాను. ఆశకు హద్దు లేదుకానీ మనషుల ఆశకు అంతెక్కడిది? రూ.100 కోట్లు కాస్తా వెయ్యి కోట్లయితే బాగుండు.. వెయ్యెందుకు? రూ.2 వేల కోట్లయితే బాగుంటుంది అనుకునేవాడిని. అలా మనలో డబ్బు ఆశకు అంతం లేదు అన్నాడు. మరి ఇప్పటివరకు ఎంత ఫిక్స్డ్ డిపాజిట్ చేశావు? అని కపిల్ అడగ్గా.. అది నేను చెప్పనుగా అని తప్పించుకున్నాడు అక్షయ్.8 ఏళ్లుగా నేనే..ఆప్కీ అదాలత్ షోకి వెళ్లినప్పుడు కూడా అక్షయ్కు డబ్బు గురించే ప్రశ్న ఎదురైంది. అందుకీ బాలీవుడ్ స్టార్.. నేను కష్టపడి సంపాదించుకుంటున్నాను తప్ప ఎవరినీ దోపిడీ చేయడం లేదు కదా.. గత 8 ఏళ్లుగా ప్రభుత్వానికి నేనే ఎక్కువ ట్యాక్స్ కడుతున్నాను. అలా అని నేను మనీ మైండెడ్ అని అర్థం కాదు. బతకాలంటే డబ్బు అవసరం.నేనేమైనా దొంగతనం చేస్తున్నానా?నేను సంపాదిస్తున్నా.. ట్యాక్స్ కడుతున్నా, సేవ చేస్తున్నా.. సేవాగుణం నా మతం. అందరూ ఏమనుకుంటున్నారనేది నాకు అనవసరం. ఎవరైనా కార్యక్రమానికి రండి, డబ్బులిస్తాం అన్నారనుకోండి. తీసుకుంటే తప్పేంటి? మనమేం ఎవరి జేబులోనో చేయి పెట్టి దొంగిలించట్లేదు కదా! అని చెప్పుకొచ్చాడు. అక్షయ్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ జానీ:LLB మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.50 కోట్లు దాటేసింది.చదవండి: ఆ ఒక్క పని వల్లే మనీష్ ఎలిమినేట్! రెండువారాల్లో ఎంత సంపాదించాడంటే? -
'చిన్నారి పెళ్లికూతురు'కి ఇప్పుడు నిజంగానే పెళ్లి
'చిన్నారి పెళ్లి కూతురు' సీరియల్తో గుర్తింపు తెచ్చుకున్న అవికా గోర్.. ఇప్పుడు నిజంగానే పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైంది. సామాజిక కార్యకర్త మిలింద్ చంద్వానితో ఒక్కటి కానుంది. గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న వీళ్లిద్దరూ ఇప్పుడు శుభవార్త చెప్పేశారు. ఓ రియాలిటీ షోలో జంటగా పాల్గొన్న వీళ్లిద్దరూ ఈ సంగతి బయటపెట్టారు. ఇంతకీ పెళ్లెప్పుడు?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 27 సినిమాలు)సీరియల్ నటిగా కెరీర్ మొదలుపెట్టిన అవికా.. తెలుగులోనూ పలు సినిమాల్లో హీరోయిన్గా చేసింది. 'ఉయ్యాలా జంపాలా' మూవీతో పరిచయంలోనే హిట్ కొట్టిన ఈమె.. తర్వాత సినిమా చూపిస్త మావ, లక్ష్మీ రావే మా ఇంటికి, ఎక్కడికి పోతావ్ చిన్నవాడా, రాజుగారి గది 3, థ్యాంక్యూ తదితర తెలుగు మూవీస్ చేసింది, ప్రస్తుత 'షణ్ముఖ' సినిమాలో చేస్తోంది.అసలు విషయానికొస్తే.. 2019లో సామాజిక కార్యకర్త అయిన మిలింద్ని ఓ సందర్భంలో అవికా కలిసింది. అలా ఏడాది పాటు స్నేహితులుగా ఉన్న వీళ్లిద్దరూ 2020 నుంచి డేటింగ్లో ఉన్నారు. దాదాపు ఐదేళ్లుగా ప్రేమలో ఉన్నారు. ఈ ఏడాది జూన్లో నిశ్చితార్థం చేసుకున్నారు. ఇప్పుడు సెప్టెంబరు 30న పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ విషయాన్ని అవికా.. ఓ ఇంగ్లీష్ వెబ్సైట్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బయటపెట్టింది. ఈ క్రమంలోనే కాబోయే వధూవరులకు అందరూ కంగ్రాట్స్ చెబుతున్నారు.(ఇదీ చదవండి: మనీష్ ఎలిమినేట్.. రెండువారాల సంపాదన ఎంతంటే?) -
ఉన్ని ముకుందన్ బర్త్డే.. 'మా వందే' నుంచి పోస్టర్ రిలీజ్
భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ (Narendra Modi) జీవిత చరిత్ర వెండితెరపై ఆవిష్కృతమవుతోంది. 'మా వందే' (Maa Vande Movie) పేరిట ఆయన బయోపిక్ తెరకెక్కుతోంది. ఈ మూవీలో మలయాళ హీరో ఉన్ని ముకుందన్ (Unni Mukundan).. మోదీగా నటించనున్నారు. క్రాంతి కుమార్ సీహెచ్ దర్శకత్వం వహిస్తుండగా వీర్ రెడ్డి.ఎం నిర్మిస్తున్నారు. ఇటీవల (సెప్టెంబర్ 17న) మోదీ బర్త్డే సందర్భంగా మా వందే ప్రాజెక్ట్ ప్రకటించారు. నేడు (సెప్టెంబర్ 22) ఉన్ని ముకుందన్ పుట్టినరోజు సందర్భంగా సినిమా నుంచి కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు.మోదీ బయోపిక్..ఇందులో మోదీ జనం ఎదుట స్టేజీపై నడుస్తున్నట్లుగా ఉంది. అతడి ఆశయాన్ని, సంకల్పాన్ని తల్లి ఆశీర్వదిస్తున్నట్లుగా పోస్టర్లో చూపించారు. ఈ మూవీలో మోదీ బాల్యం నుంచి నేటి వరకు జరిగిన ఎన్నో అంశాలను చూపించనున్నారు. వ్యక్తిగత, రాజకీయ జీవితంలోని కీలక ఘట్టాలను కళ్లకు కట్టినట్లు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. మోదీ ప్రపంచనాయకుడిగా ఎదగడం వెనక ఆయన మాతృమూర్తి హీరాబెన్ ప్రేరణ ఎంతో ఉంది. దీన్ని ఆధారంగా చేసుకుని.. ఎన్నో పోరాటాల కన్నా తల్లి సంకల్ప బలం గొప్పదనే సందేశం ఇవ్వనున్నారు. ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, ఇంగ్లీష్తో పాటు దేశంలో ఉన్న అన్ని భాషల్లోనూ రిలీజ్ చేయనున్నారు.From Maa’s blessing to the nation’s anthem… ✨Team #MaaVande wishes @Iamunnimukundan a very Happy Birthday! ❤️🤗#HBDUnniMukundan@silvercast_prod @sannajaji @veerreddy_m @DOPSenthilKumar @RaviBasrur @Sreekar_Prasad @sabucyril @SolomonStunts @GangadharNS1 @MaaVandeMovie pic.twitter.com/rb6JsF30yp— Maa Vande (@MaaVandeMovie) September 22, 2025చదవండి: హౌస్లో తనే నెం.1, ఇచ్చిపడేసిండు.. ప్రియపై మనీష్ బిగ్బాంబ్ -
ఒక్క మూవీతో ప్రేమలో పడ్డారా?.. సూపర్ హిట్ జంటపై డేటింగ్ రూమర్స్!
ఈ ఏడాది బ్లాక్ బస్టర్ లిస్ట్లో రొమాంటిక్ లవ్ స్టోరీ సైయారా. చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్ను షేక్ చేసింది. ఈ మూవీ ఏకంగా రూ.580 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రంలో అనీత్ పద్దా, అహాన్ పాండే జంటగా నటించారు. ఈ సినిమాలో వీరిద్దరి కెమిస్ట్రీ ఆడియన్స్ను ఆకట్టుకుంది. తొలి సినిమానే సూపర్ హిట్ కావడంతో అందరి దృష్టి వీరిద్దరిపైనే పడింది. దీంతో ఆన్ స్క్రీన్ జోడీ.. ఆఫ్ స్క్రీన్ లైఫ్లో జత కట్టనున్నారా? అనే చర్చ మొదలైంది.సైయారాలో అనీత్ పద్దా, అహాన్ పాండే కెమిస్ట్రీకి ఫిదా అయ్యారు. దీంతో నిజ జీవితంలోనూ డేటింగ్లో ఉన్నారని టాక్ తెగ వైరలవుతోంది. ఈ ఆన్ స్క్రీన్ జంట ప్రస్తుతం డేటింగ్ చేస్తున్నట్లు సమాచారం. అయితే ప్రస్తుతానికి తన రిలేషన్ గోప్యంగా ఉంచారని టాక్ నడుస్తోంది. ఒక్క సినిమాకే వీరిపై డేటింగ్ రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే వీటిపై ఎవరూ కూడా స్పందించలేదు.ఓ నివేదిక ప్రకారం నిర్మాత ఆదిత్య చోప్రాకు దగ్గరి వ్యక్తి ఒకరు 'సైయారా' సినిమా షూటింగ్ సమయంలో అనీత్, అహాన్ ప్రేమలో పడ్డారని చెప్పారట. ఈ మూవీ కూడా ప్రేమకథ కావడంతో.. 'సైయారా' సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు ఇది సహజంగానే జరిగిందని అన్నారట. షూట్లో మొదలైన స్నేహం.. ప్రేమగా మారిందని చెప్పాడట. ప్రస్తుతం ఈ జంట సాన్నిహిత్యంగా ఉన్నప్పటికీ.. ఎక్కడా బయట పడకుండా జాగ్రత్త పడుతున్నారని నివేదికలో వెల్లడైంది. నిజంగానే ఆన్-స్క్రీన్ జోడీ ఆఫ్-స్క్రీన్ జంట కానుందా అనేది క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.కాగా.. మోహిత్ సూరి దర్శకత్వం వహించిన 'సైయారా' జూలై 18న విడుదలైంది. ఈ ఏడాది బ్లాక్బస్టర్ హిట్గా నిలిచింది. 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన రెండవ హిందీ చిత్రంగా ఘనత సాధించింది. ప్రస్తుతం ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. కేవలం ఐదు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వీక్షించిన ఆంగ్లేతర చిత్రంగా నిలిచింది. -
షారుక్ చెప్పిన పాఠాన్ని ఫాలో అవుతున్నా!
‘‘పద్దెనిమిది సంవత్సరాల క్రితం ‘ఓం శాంతి ఓం’ సినిమా చేస్తున్నప్పుడు షారుక్ ఖాన్ నాకు కొన్ని పాఠాలు నేర్పారు. ఓ సినిమా మేకింగ్, ఆ సినిమా నుంచి మనం ఏం నేర్చుకున్నాం, ఆ సినిమాలో ఎవరితో కలిసి నటించాం అనే అంశాలు ఆ సినిమా విజయాని కన్నా ముఖ్యమైనవి అని ఆయన చె΄్పారు. షారుక్ నాకు నేర్పిన తొలి పాఠం ఇదే. అప్పట్నుంచి నేను తీసుకునే నిర్ణయాలకు ఈ పాఠాన్నే అమలు చేస్తున్నాను. షారుక్తో ఆరోసారి సినిమా చేస్తుండటానికి ఈ పాఠమే కారణమై ఉండొచ్చు’’ అని తన తాజా ఇన్స్టా పోస్ట్లో దీపికా పదుకోన్ పేర్కొన్నారు.షారుక్ ఖాన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘కింగ్’. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలోని ఈ చిత్రంలో దీపికా పదుకోన్ హీరోయిన్గా నటిస్తుండగా, షారుక్ తనయ సుహానా ఖాన్, అభిషేక్ బచ్చన్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారనే ప్రచారం సాగుతోంది. కాగా ‘కింగ్’ సినిమా షూటింగ్లోకి తాను అడుగుపెట్టినట్లుగా స్పష్టం చేస్తూ దీపికా పదుకోన్ ఇన్స్టా వేదికగా ఓ పోస్ట్ను షేర్ చేశారు.ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ పోల్యాండ్లో జరుగుతోందని, ఈ షెడ్యూల్ దాదాపు నెల రోజులకు పైనే ఉంటుందని బాలీవుడ్ టాక్. ఇక ‘ఓం శాంతి ఓం, చెన్నై ఎక్స్ప్రెస్, హ్యాపీ న్యూ ఇయర్, పఠాన్, జవాన్’ చిత్రాల్లో షారుక్–దీపిక హీరో హీరోయిన్లుగా నటించిన సంగతి గుర్తుండే ఉంటుంది. తాజాగా ‘కింగ్’ సినిమా కోసం ఈ ఇద్దరు ఆరోసారి కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. మరోవైపు ‘కల్కి 2’ చిత్రంలో దీపిక నటించడం లేదని ఆ చిత్రం మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. -
కొంపముంచిన కామెడీ స్పూఫ్.. ఏకంగా రూ.25 కోట్ల దావా
కామెడీ, ఎంటర్ టైన్మెంట్ షోల్లో రకరకాలుగా ఆకట్టుకుంటూ ఉంటారు. ఎవరైనా సెలబ్రిటీలు వస్తే ఆయా హీరో లేదా హీరోయిన్ల సినిమాల్లోని పాత్రల స్పూఫ్స్ చేస్తూ అలరించేందుకు ప్రయత్నిస్తుంటారు. ఇప్పుడు అలా చేయడం వల్ల ఓ నిర్మాత హర్ట్ అయ్యాడు. ఏకంగా షో నిర్వహకులపై రూ.25 కోట్ల దావా వేశాడు. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియలో చర్చనీయాంశంగా మారింది.బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ హిట్ సినిమాల్లో 'హేరా పేరి'కి ప్రత్యేక స్థానం ఉంటుంది. 2000లో వచ్చిన ఈ చిత్రంలో బాబురావు అనే పాత్రలో పరేశ్ రావల్ చేసే కామెడీ ఐకానిక్గా నిలిచిపోయింది. సరే ఇదంతా పక్కనబెడితే రీసెంట్గా తన కొత్త సినిమా ప్రమోషన్ కోసం అక్షయ్ కుమార్.. కపిల్ శర్మ షోకి వచ్చాడు. ఈ క్రమంలోనే బాబురావు పాత్ర స్పూఫ్ చేశారు. కమెడియన్ కికు శారదా ఈ పాత్ర మేనరిజాన్ని ఇమిటేట్ చేసి ఆకట్టుకున్నాడు.(ఇదీ చదవండి: ఓటీటీల్లోకి వచ్చేసిన రెండు తెలుగు సినిమాలు)ఈ ఎపిసోడ్కి సంబంధించిన ప్రోమోని రిలీజ్ చేయగా.. 'హేరా పేరి' నిర్మాత ఫిరోజ్ నడియవాలా హర్ట్ అయ్యారు. తన అనుమతి లేకుండా ఈ పాత్రని కపిల్ శర్మలో షోలో ఇమిటేట్ చేయడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. 'బాబురావు అనేది ఓ క్యారెక్టర్ మాత్రమే కాదు. హేరా పేరికి ఆత్మ. మా కష్టం, విజన్, క్రియేటివిటీతో ఆ పాత్రకు ప్రాణం పోశాం. ఆర్థిక లాభాపేక్ష కోసం ఆ పాత్రని ఉపయోగించే హక్కు ఎవరికీ లేదు. ఈ పాత్రని ఇమిటేట్ చేస్తూ ఉన్న కంటెంట్ మొత్తాన్ని సోషల్ మీడియా, నెట్ఫ్లిక్స్, టీవీ ఛానెల్స్ నుంచి తొలగించాలి' అని నిర్మాత ఫిరోజ్ సూచించారు.తన అనుమతి లేకుండా బాబురావు పాత్రని ఇమిటేట్ చేసినందుకుగానూ 24 గంటల్లో క్షమాపణలు చెప్పాలి. అలానే నోటీసులు అందిన రెండు రోజుల్లోగా రూ.25 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని నిర్మాత ఫిరోజ్.. కపిల్ శర్మ షో నిర్వహకులైన నెట్ఫ్లిక్స్కు అల్టిమేటం ఇచ్చారు. ఒకవేళ చేయకపోతే చట్టపరమైన, క్రిమినల్ చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు. మరి షో నిర్వహకులు ఏం చేస్తారో చూడాలి?(ఇదీ చదవండి: ఆస్కార్ రేసులో పుష్ప 2, సంక్రాంతికి వస్తున్నాం, కన్నప్ప) -
శివుడి పెయింటింగ్ అద్భుతంగా వేసిన టాలీవుడ్ హీరో
టాలీవుడ్ హీరో సుధీర్బాబు (Sudheer Babu) నటుడు మాత్రమే కాదు, తనలో మరో కళ కూడా ఉంది. అదే పెయింటింగ్ కళ! తాజాగా అతడు తన చేతులతో ఓ అద్భుతాన్ని సృష్టించాడు. నీలకంఠుడి పెయింటింగ్ వేశాడు. అందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అందులో సుధీర్బాబు మాట్లాడుతూ.. నేను ఎవరి పెయింటింగ్ వేస్తున్నాననుకుంటున్నారు? ఎవరైనా అందమైన అమ్మాయిల బొమ్మలు గీస్తుంటారు. అందగాడి బొమ్మ గీస్తున్నా..కానీ నేను ఒక అందగాడి బొమ్మను గీస్తున్నా.. ఆయన ఎలాంటి అందగాడంటే అందాన్ని చందమామతో పోలుస్తాం కదా.. ఆ చందమామ ఆయన తలలో ఏదో ఒక మూలన పడి ఉంటుంది. అసలాయన అందం ముందు చందమామను ఎవరూ పట్టించుకోరు. మనమంతా అందంగా కనిపించడానికి మంచిగా హెయిర్స్టైల్ చేసుకుంటే ఆయనేమో జుట్టునసలు పట్టించుకోనే పట్టించుకోడు. అందుకే ఆయన జుట్టు ఎప్పుడూ ఏదో దారాలు చిక్కుక్కున్నట్లు చిక్కుముడుల్లా ఉంటుంది. ఆ బొమ్మే జటాధరఅందుకే ఆయన్ని జటాధర అని పిలుస్తారు. ఆయన గురించి ఇంకా చాలా చెప్పాలి. అందుకోసం నేనో బొమ్మ (సినిమా) తీశాను.. ఆ బొమ్మే జటాధర. అందరూ థియేటర్లలో జటాధర చూడండి అని చెప్పుకొచ్చాడు. జటాధర విషయానికి వస్తే.. సుధీర్బాబు, సోనాక్షి సిన్హ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీని దర్శక ద్వయం వెంకట్ కల్యాణ్– అభిషేక్ జైస్వాల్ తెరకెక్కించారు. శిల్పా శిరోద్కర్, దివ్య ఖోస్లా కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీ తెలుగు, హిందీ భాషల్లో నవంబర్ 7న విడుదల కానుంది. View this post on Instagram A post shared by Sudheer Babu (@isudheerbabu) చదవండి: గాజులేసుకుని కూర్చో.. సుమన్పై సంజనా చీప్ కామెంట్స్ -
2700 కోట్ల ఆస్తి.. బ్యాంకు జాబ్ వదిలి సినిమాల్లోకి.. ఎవరా స్టార్ హీరోయిన్?
సినిమా రంగంలో సక్సెస్ అనేది చాలా తక్కువ. అయినా చాలా మంది ఈ రంగుల ప్రపంచంలోకి రావాలని ఆశపడతారు. ఇతర రంగాలలో బలంగా స్థిరపడినా సరే.. దాన్ని వదులుకొని మరీ ఇండస్ట్రీలోకి వస్తారు. వారిలో కొంతమంది మాత్రమే సక్సెస్ అయి ‘స్టార్స్’ అవుతారు. అలాంటి వారిలో నటి సోహా అలీఖాన్ ఒకరు.ఇంటర్నేషనల్ బ్యాంకులో జాబ్ఆమె లెజెండరీ నటి షర్మిలా ఠాగూర్, క్రికెటర్ మన్సూర్ అలీ ఖాన్ పటౌడి కుమార్తె, స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ సొదరి అయినప్పటికీ.. చిత్ర పరిశ్రమలోకి రావాలని ఆమె అస్సలు అనుకోలేదు. పెరెంట్స్ కూడా ఆమెను ఇండస్ట్రీకి దూరంగానే పెంచారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో చదువుకున్న సోహా.. ఈ తర్వాత ముంబైకి వచ్చి ఓ ఇంటర్నేషనల్ బ్యాంకులో ఉద్యోగం చేసింది. అప్పుడు ఆమె జీతం నెలకు రూ. 18 వేలు మాత్రమే ఉండేది. ముంబైలో ఆమె నివసించే ఇంటి రెంట్కే రూ. 17000 పోయేవి అట. అయినా కూడా ఇండిపెండెంట్గా బతకాలనే ఉద్దేశ్యంతో ఉద్యోగం చేసేదట. తన తల్లిదండ్రులు షర్మిలా ఠాగూర్, మన్సూర్ అలీ ఖాన్ పటౌడి అప్పట్లోనే 2700 కోట్ల ఆస్తి ఉండేదట. డబ్బుకు కొదవ లేకున్నా.. పెరెంట్స్ని అడగడం ఇష్టంలేక జాబ్ చేసి తన అవసరాలు తానే తీర్చుకునేదానిని అని ఓ ఇంటర్వ్యూలో సోహా అలీఖాన్ చెప్పింది. అలా సినిమాల్లోకి.. బ్యాంకింగ్ జాబ్ చేస్తున్న సమయంలోనే సోహా మనసు సినిమా రంగంపై పడింది. సినిమా చాన్స్ల కోసం చేస్తున్న సమయంలో ఓ మోడలింగ్ కాంట్రాక్టు దక్కింది. ఆ తర్వాత ఆమె జీవితం మారిపోయింది. మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టిన తర్వాత సినిమా చాన్స్ వచ్చింది. షాహిద్ కపూర్కు జోడీగా ‘దిల్ మాంగే మోర్(2004)’లో ఆఫర్ వచ్చింది. ఈ సినిమాకు ఆమె అందుకున్న రెమ్యునరేషన్ రూ. 10 లక్షలు . నిజానికి సోహా ఈ సినిమా కంటే ముందే షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన ‘పహేలి’లో నటించాల్సింది. ఆ ఆఫర్ వచ్చిందనే తన ఉద్యోగానికి రాజీనామా చేసి ఇండస్ట్రీలోకి వచ్చింది. కానీ కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్టు రాణి ముఖర్జీ చేతికి వెళ్లింది. దీంతో సోహా నిరుద్యోగిగా మారిపోయింది. అదే టైమ్లో షాహిద్ కపూర్తో ‘దిల్ మాంగే మోర్’ అవకాశం దక్కింది. ఆ సినిమా తర్వాత సోహకు బాలీవుడ్లో వరుస ఆఫర్లు వచ్చాయి. కొన్నాళ్లకే స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ఆమె కెరీర్లో రంగ్ దే బసంతి, అహిస్టా అహిస్టా, ఖోయా ఖోయా చంద్, ముంబై మేరీ జాన్, 99, సాహెబ్, బివి ఔర్ గ్యాంగ్స్టర్ రిటర్న్స్ లాంటి హిట్ చిత్రాలు ఉన్నాయి. అయితే హీరోయిన్గా ఆమెకు అపజయాలే ఎక్కువ వచ్చాయి. యాక్టింగ్తో పాటు రైటర్గానే మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఆమె రాసిన బుక్, ‘ది పెరిల్స్ ఆఫ్ బీయింగ్ మోడరేట్లీ ఫేమస్’ క్రాస్వర్డ్ బుక్ అవార్డును గెలుచుకుంది. సోహా అలీ ఖాన్ వ్యక్తిగత జీవితానికి వస్తే.. 2015లో నటుడు కునాల్ ఖేముని వివాహం చేసుకుంది. వారికి ఇనాయ అనే కుమార్తె ఉంది. -
నాకు గర్ల్ఫ్రెండ్స్ ఉండగా మా అమ్మకు బాయ్ఫ్రెండ్స్ ఉంటే తప్పేంటి?
బిగ్బాస్ షో (Bigg Boss Reality Show)లో సెలబ్రిటీలు అడుగుపెట్టినప్పుడు వారి పుట్టుపూర్వోత్తరాలు అన్నీ లాగుతుంటారు. కొన్నిసార్లు వాళ్లే గతాన్ని గుర్తు చేసుకుని పక్కవారితో చెప్పుకుని బాధపడుతూ ఉంటారు. బాలీవుడ్ నటి, సింగర్ కునిక సదానంద్ అదే పని చేసింది. ఈమె ప్రస్తుతం హిందీ బిగ్బాస్ 19వ సీజన్లో పాల్గొంది. నాకింకా పెళ్లి కాలేఈమె కెరీర్ తొలినాళ్లలో సింగర్ కుమార్ సానును ప్రేమించింది. ఈ విషయాన్ని ఆమె బిగ్బాస్ హౌస్లో వెల్లడించింది. నేను సింగర్ (కుమార్ సాను)ని ప్రేమించాను. అప్పటికి నాకింకా పెళ్లి కాలేదు. అతడు భార్యతో విడిపోయి ఉంటున్నాడు. దీంతో మేమిద్దరం కలిసుండేవాళ్లం. తనను ఎంతగానో నమ్మాను. కానీ ఓరోజు తనకు వేరే అమ్మాయితో ఎఫైర్ ఉందని తెలిసింది. తప్పేంటి?ఆ విషయం అతడే ఒప్పుకోవడంతో తనకు బ్రేకప్ చెప్పాను అంది. తల్లికి యుక్తవయసులో ఉన్న రిలేషన్షిప్ గురించి కునిక కుమారుడు అయాన్ లాల్ స్పందిస్తూ.. నాకు గర్ల్ఫ్రెండ్స్ ఉన్నప్పుడు అమ్మకు బాయ్ఫ్రెండ్స్ ఉంటే తప్పేంటి? అప్పుడు తన వయసు 27 ఏళ్లే కదా! అప్పుడు నేనింకా పుట్టనేలేదు. కానీ, అమ్మ ప్రేమ విషయం నాకు తర్వాత తెలిసింది. 27 ఏళ్ల వయసులో లవ్అమ్మ అతడిని (కుమార్ సాను) సింగర్గా ఇష్టపడేది. ఇంట్లో అతడి పాటలు పాడుతూ ఉండేది. ఇప్పటికీ పాడుతుంది కూడా! అతడి ప్రతిభను ఇష్టపడుతుంది, కానీ ఆ వ్యక్తిని కాదు. వాళ్ల ప్రేమాయణం 27 ఏళ్లు సాగిందని అందరూ అనుకుంటారు, అది నిజం కాదు! అమ్మ 27 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు మాత్రమే ప్రేమలో పడిందంతే! కొన్నేళ్లకే విడిపోయారు అని చెప్పుకొచ్చాడు.రెండు పెళ్లిళ్లు- విడాకులుకునికకు రెండు పెళ్లిళ్లయ్యాయి. ఢిల్లీకి చెందిన అభయ్ కొటారిని పెళ్లి చేసుకోగా వీరికి ఓ కొడుకు పుట్టాడు. తర్వాత దంపతుల మధ్య విభేదాలు రావడంతో విడిపోయారు. 35 ఏళ్ల వయసులో వినయ్ లాల్ అనే వ్యక్తిని పెళ్లాడింది. వీరికి ఓ కుమారుడు సంతానం. కానీ ఈ జంట కూడా ఎంతోకాలం కలిసుండలేదు, భేదాభిప్రాయాల వల్ల విడాకులు తీసుకున్నారు.చదవండి: పిచ్చిపట్టినట్లుగా ప్రవర్తించిన రీతూ.. ఓనర్గా రాము రాథోడ్ -
నా నిర్ణయానికి కారణం ఇదే.. ఇదొక పాఠం : దీపికా పదుకొణె
బాలీవుడ్ నటి దీపికా పదుకొణె రెండురోజుల నుంచి సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యారు. దీనికి కారణం ఆమె 'కల్కి 2898 ఏడీ' సీక్వెల్లో నటించకపోవడమేనని చెప్పవచ్చు. కల్కి సీక్వెల్లో దీపిక భాగం కావడం లేదని వైజయంతి మూవీస్ అధికారికంగా ప్రకటించిన తర్వాత పాన్ ఇండియా రేంజ్లో ఈ వార్త వైరల్ అయిపోయింది. దీపికా పదుకొణె ఏ కారణంతో నటించడం లేదో తెలియనప్పటికీ, సామాజిక మాధ్యమాల్లో ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందిస్తున్నారు. అయితే, తాజాగా దీపికా తన కొత్త సినిమా గురించి ఒక పోస్ట్ చేశారు.దీపికా పదుకొణె, షారుక్ ఖాన్ ఆరోసారి జంటగా మరో సినిమా చేస్తున్నారు. ఈ విషయాన్ని ఆమె అధికారికంగా ప్రకటిస్తూ ఇలా ఒక పోస్ట్ చేశారు. '18 సంవత్సరాల క్రితం 'ఓం శాంతి ఓం సినిమా' చేస్తున్నప్పుడు ఆయన (షారుక్ ఖాన్) నాకు మొదటి పాఠం నేర్పారు. ఒక సినిమాతో మనం ఏం నేర్చుకున్నాం.. ఎవరితో కలిసి పనిచేస్తున్నామనే విషయాలే ఉన్నాయి. ఒక సినిమా విజయం కంటే ఎంతో ముఖ్యమైన విషయాలను చెప్పారు. ఆ మాటలనే ఇప్పటికీ నమ్ముతాను. ఆ రోజు నుంచి నేను తీసుకునే ప్రతి నిర్ణయం వెనక ఆ పాఠాన్నే అమలుచేస్తున్నాను. అందుకే మేము మళ్ళీ కలిసి 6వ సినిమా చేస్తున్నాము.' అని తెలిపారు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కింగ్ సినిమాలో వీరిద్దరూ కలిసి నటిస్తున్నారనే విషయం తెలిసిందే.కల్కి సినిమా నుంచి ఆమెను తప్పించిన తర్వాత ఈ పోస్ట్ చేయడంతో నెట్టింట వైరల్ అవుతుంది. కల్కిలో దీపికా పదుకొణె పర్ఫార్మెన్స్ చాలా బాగుందని గతంలోనే తెలుగు అభిమానులు కూడా చెప్పుకొచ్చారు. తన క్యారెక్టర్లో ఆమె లీనమై నటించారని ప్రశంసించారు. ఇప్పుడు ఆమె పాత్రలో మరొకర్ని ఊహించుకోవడం కష్టమని సోషల్ మీడియాలో కొందరు కామెంట్లు పెడుతున్నారు. ఇప్పుడు ఆమె పాత్రను రీప్లేస్ చేసే సత్తా ఉన్న నటి ఎవరనేది పెద్ద చర్చగా కొనసాగుతుంది. View this post on Instagram A post shared by दीपिका पादुकोण (@deepikapadukone) -
సందడిగా షబానా పుట్టినరోజు వేడక
బాలీవుడ్ సీనియర్ నటి షబానా ఆజ్మీ ఎంతో ఉత్సాహంగా ‘ప్రెట్టీ లిటిల్ బేబీ’ పాటకు డ్యాన్స్ చేశారు. 75 ఏళ్ల వయసులో ఆమె ‘లిటిల్ బేబీ’ అంటూ డ్యాన్స్ చేయడానికి కారణం ఉంది. గురువారం (సెప్టెంబరు 18) షబానా 75వ పుట్టినరోజు. ఈ సందర్భంగా గ్రాండ్ బర్త్ డే పార్టీని ఏర్పాటు చేసి, పలువురు బాలీవుడ్ స్టార్స్ని ఆహ్వానించారు. అమెరికన్ సింగర్ కోనీ ఫ్రాన్సిస్ ఫేమస్ పాట ‘ప్రెట్టీ లిటిల్ బేబీ’కి భర్త జావేద్ అక్తర్తో కలిసి డ్యాన్స్ చేశారు షబానా.ఈ వీడియో వైరల్ అవుతోంది. ఇక ఈ నైట్ పార్టీలో డ్యాన్సింగ్ క్వీన్ మాధురీ దీక్షిత్ ‘పరిణీత’ సినిమాలోని పాపులర్ సాంగ్ ‘కైసీ పహేలీ జిందగాని’కి డ్యాన్స్ చేసి, ఆకట్టుకున్నారు. మాధురీతో కలిసి సీనియర్ నటి రేఖ స్టయిల్గా వేసిన స్టెప్పులు అందర్నీ అలరించాయి. విద్యాబాలన్, మాధురీ దీక్షిత్, ఊర్మిళ కలిసి డ్యాన్స్ చేసిన వీడియోలూæ వైరల్ అయ్యాయి.‘ఓజీ క్వీన్స్ ఆఫ్ బాలీవుడ్’ అనే క్యాప్షన్తో ఓ వీడియోను నటుడు–నిర్మాత సంజయ్ కపూర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇంకా ‘జిందగీ న మిలేగీ దోబారా’ చిత్రంలోని ‘సెనోరిటా’ పాట పాడుతూ, డ్యాన్స్ చేస్తూ సందడి చేశారు దర్శక–నిర్మాత–నటుడు ఫర్హాన్ అక్తర్. ఈ వేడుకలో హృతిక్ రోషన్, సోనూ నిగమ్, కరణ్ జోహార్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. -
విడుదలకు ముందే జాన్వీ కపూర్ మూవీ ఘనత.. ఏకంగా ఆస్కార్ అవార్డుకు ఎంట్రీ
జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోన్న తాజా చిత్రం హోమ్ బౌండ్ విడుదలకు ముందే రికార్డులు సృష్టిస్తోంది. తాజాగా ఈ చిత్రం భారత్ నుంచి అధికారికంగా ఆస్కార్-2026 అవార్డులకు ఎంట్రీ దక్కించుకుంది. నీరజ్ గేవాన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇప్పటికే అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటింది. ఈ చిత్రంలో ఇషాన్ ఖట్టర్, విశాల్ జెత్వా కీలక పాత్రలు పోషించారు. (ఇది చదవండి: జాన్వీ కపూర్ లేటేస్ట్ మూవీ.. ట్రైలర్ వచ్చేసింది)తాజాగా ఈ చిత్రం 2026 ఆస్కార్ అకాడమీ అవార్డులకు ఇండియా నుంచి అఫీషియల్గా ఎంట్రీ సాధించింది. వచ్చే ఏడాది జరగనున్న ఆస్కార్ అవార్డులకు బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో హౌమ్ బౌండ్ పోటీపడనుంది. ఈ సినిమాను కరణ్ జోహార్, అదార్ పూనావాలా, అపూర్వ మెహతా, సోమెన్ మిశ్రా నిర్మించారు. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 26న విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. హాలీవుడ్ చిత్రనిర్మాత మార్టిన్ స్కోర్సెస్ ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ప్రొడ్యూసర్గా వ్యవహరించారు. కాగా.. ఇప్పటికే ఈ సినిమాను కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్, టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్ వంటి అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శించారు. Taking back home a ton of love!#Homebound bags two awards : Best Film & Best Director (@ghaywan) at the IFFM 2025. pic.twitter.com/2CucgSEUDI— Dharma Productions (@DharmaMovies) August 15, 2025 India's official entry for the Oscars 2026 Best International Feature Film category is Homebound directed by Neeraj Ghaywan. Produced by Dharma, the film stars Ishaan Khatter, Vishal Jethwa, Janhvi Kapoor. N Chandra announced the same in Kolkata. #Homebound #Oscars2026 pic.twitter.com/iwBE4Ge9yd— Anindita Acharya (@Itsanindita) September 19, 2025 -
నైట్ పార్టీలో రేఖ డ్యాన్స్ వైరల్.. మాధురీ, ఊర్మిళ సైతం వెలవెల!
ఎవర్ గ్రీన్ గ్లామర్ స్టార్గా వెలుగొందుతున్న బాలీవుడ్ నటి రేఖ..మరోసారి తన డ్యాన్స్ స్కిల్స్తో అభిమానుల మనసు దోచుకుంది. ఏడు పదుల వయస్సులో ఇప్పటికీ వన్నె తరగని వర్ఛస్సుతో ఆమె చేసిన డ్యాన్స్ వైరల్గా మారింది. అయితే ఈ డ్యాన్స్ ఆమె తాజా సినిమాలోది కాదు.. ఒక నైట్ పార్టీలో కావడం విశేషం.ఈ అపురూప నృత్య సన్నివేశం చోటు చేసుకుంది బాలీవుడ్ సీనియర్ నటి షబానా ఆజ్మీ పుట్టిన రోజు నాడు కావడం విశేషం. తన కుటుంబ సభ్యులతో పాటు ఇండస్ట్రీలోని సన్నిహితులతో షబానా 75వ పుట్టినరోజును ఘనంగా జరుపుకున్నారు. అనేక మంది బాలీవుడ్ స్టార్లు హాజరైన ఈ పుట్టినరోజు వేడుకల్లో రేఖ, హృతిక్ రోషన్, స్నేహితురాలు సబా ఆజాద్, సోను నిగమ్, మాధురి దీక్షిత్, కరణ్ జోహార్ తదితరులు ప్రముఖంగా కనిపించారు. బాలీవుడ్లో ఇలాంటి పార్టీలు జరగడం సహజమే అయినా ఈ పార్టీలోని వీడియోలు వైరల్ కావడానికి మరో సీనియర్ నటి రేఖ డ్యాన్స్ దోహదం చేసింది. ’పరిణీత’లోని ’కైసీ పహేలి జిందగని’ పాట కోసం రేఖ చేసిన నృత్యం నెటిజన్లను సంభ్రమాశ్చర్యాలకు గురి చేసింది.రేఖ తన ట్రేడ్మార్క్ గ్రేస్ ఎనర్జీతో ఈ నృత్యానికి కేంద్ర బిందువుగా మారిన వెంటనే, ఆ పార్టీకి హాజరైన వారంతా అక్కడే గుమికూడడం గమనార్హం. అంతేకాదు రేఖ అడుగులు కదుపుతుంటే అందరూ చప్పట్లు కొట్టి, ఉత్సాహపరుస్తూ హర్షామోదాలు వ్యక్తం చేశారు. ఈ నృత్యం ద్వారా ఆమె బాలీవుడ్ ఫరెవర్ దివాగా తాను ఎందుకు ఎప్పటికీ కొనసాగుతుందో మరోసారి అందరికీ గుర్తు చేశారు. ’డ్యాన్సింగ్ క్వీన్’ గా పిలువబడే మాధురీ దీక్షిత్, రంగీలా లో డ్యాన్స్లతో షాకిచ్చిన ఊర్మిలా మాతోండ్కర్, డర్టీ పిక్చర్తో స్మితను గుర్తు చేసిన విద్యాబాలన్ వంటి రేఖ తదుపరి తరం హీరోయిన్స్ సైతం రేఖతో చేతులు కలిపి నృత్యం చేయడానికి ఒకరితో ఒకరు పోటీపడడం కనిపించింది. తమదైన శైలిలో వారు కూడా డ్యాన్స్ చేసినప్పటికీ అందరి చూపూ రేఖ మీదే ఉండిపోవడం గమనార్హం. ఈ సందర్భంగా తీసిన ఈ పార్టీలోని వీడియోలు, ఫొటోలు నెట్టింట వైరల్గా మారి అభిమానులకు ఆనందోత్సాహాలను పంచాయి. వైరల్ క్లిప్లలో, రేఖ, ఊర్మిళ, మాధురి, విద్య, షబానా అజ్మీ కలిసి నృత్యం చేసే అరుదైన సందర్భం అందరినీ ఆకట్టుకుంది. రేఖ మొదట మాధురి, ఊర్మిళ, విద్య...ఇలా ఒకరి తర్వాత ఒకరితో కలిసి డ్యాన్స్ చేయడం కనిపించింది. తరువాత, ఆమె తన తరం నటి షబానాను తనతో డ్యాన్స్ చేయడానికి ఆహ్వానించింది. ఈ పార్టీలో బర్త్ డే గాళ్ షబానా అజ్మీ సైతం తన భర్త జావేద్ అఖ్తర్తో కలిసి ’ప్రెట్టీ లిటిల్ బేబీ’కి చేసిన నృత్యం ఆహ్లాదకరంగా ఆకట్టుకుంది. అలాగే షబానా అజ్మీ తన భర్త జావేద్ అఖ్తర్తో కలిసి కోనీ ఫ్రాన్సిస్ ప్రసిద్ధ పాట ’ప్రెట్టీ లిటిల్ బేబీ’కి నృత్యం చేశారు. ఈ పాటలు, నృత్యాల తాలూకు వీడియోలు నెట్టింట సందడి చేస్తున్నాయి View this post on Instagram A post shared by Rekha (@legendaryrekhaofficial) -
తమన్నా మరో ఐటమ్ సాంగ్.. వీడియో రిలీజ్
బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్.. రీసెంట్గానే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. 'ద బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్' సిరీస్తో దర్శకుడిగా మారాడు. నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ ఏడు ఎపిసోడ్ల ఈ సిరీస్.. గురువారం(సెప్టెంబరు 18) నుంచి అందుబాటులోకి వచ్చింది. దీనికి మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది. బాలీవుడ్ నటీనటులతో పాటు రాజమౌళితో అతిథి పాత్ర చేయించినప్పటికీ పెద్దగా వర్కౌట్ కాలేదని అంటున్నారు.(ఇదీ చదవండి: 'మిరాయ్' విలనిజం తెచ్చిన మెగా అవకాశం?)అయితే ఈ సిరీస్ కోసం తమన్నాతో ఓ స్పెషల్(ఐటమ్) సాంగ్ చేయించారు. 'గఫూర్' అంటూ సాగే ఈ పాట వీడియోని తాజాగా రిలీజ్ చేశారు. ఈ మధ్య కాలంలో తమన్నా.. వరసగా స్పెషల్ సాంగ్స్ చేస్తూ రచ్చ చేస్తోంది. ఈ గీతం కూడా వాటికి ఏ మాత్రం తగ్గకుండా ఉంది. ఇందులో బాలీవుడ్ ఒకప్పటి విలన్స్ అయిన శక్తి కపూర్, గుల్షన్ గ్రోవర్, రంజీత్ కనిపించడం విశేషం. ఈ సాంగ్పై మీరు ఓ లుక్కేసేయండి.(ఇదీ చదవండి: మౌళి.. రౌడీ టీ షర్ట్, మహేశ్ ట్వీట్.. ఇవన్నీ ఫేక్: బండ్ల గణేశ్) -
అతనితోనే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ డేటింగ్.. రూమర్స్కు ఫుల్స్టాప్!
బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్ గతేడాది బ్లాక్ బస్టర్ హిట్ను తన ఖాతాలో వేసుకుంది. రాజ్కుమార్ రావు నటించిన స్త్రీ-2 మూవీతో సూపర్ హిట్ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది ముద్దుగుమ్మ. నాగిన్ మూవీతో పాటు మరో రెండు చిత్రాల్లో కనిపించనుంది. అటు షూటింగ్లతో బిజీగా ఉండే శ్రద్ధా కపూర్ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటోంది. ఎక్కడికెళ్లినా నెట్టింట పోస్టులు పెడుతూనే ఉంది. గతంలో స్క్రిప్ట్ రైటర్ రాహుల్ మోడీతో ఉన్న ఫోటోలు షేర్ చేయడంతో శ్రద్ధాపై డేటింగ్ రూమర్స్ వినిపించాయి. ముంబయిలో డిన్నర్ డేట్ తర్వాత అతనితో కలసి రెస్టారెంట్ నుంచి బయటకు వస్తున్న వీడియోలు అప్పట్లో వైరలయ్యాయి. ఆ తర్వాత చాలాసార్లు అతనితో కలిసి జంటగా కనిపించింది.అనిల్ అంబానీ పెళ్లి వేడుకలోనూ మెరిశారు. దీంతో వీరిద్దరి డేటింగ్ నిజమేనని బాలీవుడ్లో టాక్ వినిపిస్తూనే ఉంది.తాజాగా శ్రద్ధా కపూర్ సోషల్ మీడియాలో ఓ వీడియోను షేర్ చేసింది. మీ కోపా తాపాలను భరించే వ్యక్తి మీ లైఫ్లో కనుగొనండి అంటూ వీడియోకు క్యాప్షన్ రాసుకొచ్చింది. అంతేకాకుండా తన బాయ్ఫ్రెండ్గా భావిస్తోన్న రాహుల్ మోదీని ట్యాగ్ చేసింది. ఆ వీడియోను రాహులే తీసినట్లు తెలుస్తోంది. మీ జీవితంలో హట్ లాంటివి వినే వాళ్లు ఎవరై ఉంటారని హింట్ ఇచ్చింది. ఇది చూసిన అభిమానులు రాహుల్తో డేటింగ్ కన్ఫామ్ చేసేసిందని కామెంట్స్ పెడుతున్నారు. ఈ వీడియోతో రాహుల్తో డేటింగ్లో ఉన్నట్లు పరోక్షంగానే చెప్పేసిందని పోస్ట్ చేస్తున్నారు.గతడాది డిసెంబర్లోనూ రాహుల్తో వడా పావ్ డేట్ గురించి పోస్ట్ చేసింది. అంతకుముందు ఆమె ఫోన్ వాల్పేపర్లో అతనితో దిగిన ఫోటోతో దొరికిపోయింది. ఇవాళ పోస్ట్ చేసిన వీడియోతో వీరిద్దరి డేటింగ్ ఉన్నట్లేనని అభిమానులు భావిస్తున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే చివరిసారిగా 'స్త్రీ- 2'లో కనిపించింది. ప్రస్తుతం ఆమె నిఖిల్ ద్వివేది తెరకెక్కిస్తోన్న 'నాగిన్'లో కనిపించనుంది. View this post on Instagram A post shared by Shraddha ✶ (@shraddhakapoor) -
సగం వయసున్న వాళ్లతో డేటింగ్.. నేను కూడా రెడీ
కెరీర్ పోతుందేమోనని భయంతో చాలామంది హీరోయిన్లు వయసులో ఉన్నప్పుడు పెళ్లి చేసుకోరు. కానీ ఓ దశ వచ్చిన తర్వాత మాత్రం బిజినెస్మ్యాన్ లేదంటే ఎవరో ఒకరిని వివాహం చేసుకుని సెటిలైపోతుంటారు. కానీ కొందరు మాత్రం ఏజ్ పెరిగిపోతున్నా సరే సింగిల్గానే ఉండిపోతుంటారు. అలాంటి వారిలో హీరోయన్ అమీషా పటేల్ ఒకరు. ఈ బ్యూటీ 50 ఏళ్లు. అయినా సరే గ్లామర్ విషయంలో తగ్గేదే లే అంటోంది. తాజాగా ఓ పాడ్కాస్ట్లో మాట్లాడుతూ తాను పెళ్లి చేసుకోకపోవడానికి గల కారణాల్ని చెప్పుకొచ్చింది.'నన్ను పెళ్లి చేసుకునేందుకు చాలామంది ఆసక్తి చూపించారు. అయితే వాళ్లందరూ వివాహం తర్వాత నటన మాసేసి పూర్తిగా ఇంటికే పరిమితం కావాలని కండీషన్ పెట్టారు. ఇలాంటవన్నీ నచ్చక చాలామంది ప్రపోజల్స్ రిజెక్ట్ చేశాను. ప్రేమించే వ్యక్తులు ఎప్పుడూ కెరీర్లో రాణించేందుకు ప్రోత్సాహం ఇవ్వాలి. సినిమాల్లోకి రాకముందే నేను ఒకరితో సీరియస్ రిలేషన్షిప్లో ఉన్నాను. మా ఇద్దరి కుటుంబ నేపథ్యం, ఇష్టాయిష్టాలు కలిశాయి. అయితే నేను నటిగా మారతానని చెప్పాను. పబ్లిక్ లైఫ్లో ఉండే వ్యక్తి పార్ట్నర్గా వద్దని అతడి చెప్పేసరికి ప్రేమని వదులుకున్నాను. కెరీర్ని ఎంచుకున్నాను'(ఇదీ చదవండి: కర్మ నుంచి ఎవరూ తప్పించుకోలేరు.. దీపికకు నాగ్ అశ్విన్ కౌంటర్)'అలా అని నేనేమి పెళ్లికి వ్యతిరేకం కాదు. సరైన వ్యక్తి దొరికితే తప్పకుండా పెళ్లి చేసుకుంటాను. ఇప్పటికీ నాకు మంచి కుటుంబాల నుంచి సంబంధాలు వస్తూనే ఉన్నాయి. తనలో సగం వయసున్న వారు కూడా డేటింగ్కి రమ్మని పిలుస్తున్నారు. దానికి నేను కూడా రెడీ. కాకపోతే మెచ్యూరిటీ ఉన్న వ్యక్తి అయితే నాకు ఎలాంటి అభ్యంతరం లేదు' అని అమీషా పటేల్ చెప్పుకొచ్చింది.'కహోనా ప్యార్ హై' అనే హిందీ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అమీషా.. తెలుగులోకి 'బద్రి' సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. తర్వాత మహేశ్ బాబు 'నాని', ఎన్టీఆర్ 'నరసింహుడు', పరమవీరచక్ర తదితర చిత్రాల్లో నటించింది. కొన్నేళ్లపాటు నటనకు దూరంగా ఉన్న ఈమె.. 2023లో వచ్చిన 'గదర్ 2' మూవీతో హిట్ అందుకుంది. గతేడాది 'తౌబా తేరా జల్వా' అనే సినిమాలో చివరగా కనిపించింది. ప్రస్తుతానికి సోషల్ మీడియాలో గ్లామరస్ ఫొటోలు పోస్ట్ చేస్తూ ఎంటర్టైన్ చేస్తోంది.(ఇదీ చదవండి: హీరో శర్వానంద్ దంపతులు విడిపోయారా?) -
పైరసీ భూతం.. జియోస్టార్ కొత్త ప్రయత్నం!
పైరసీ.. చిత్ర పరిశ్రమను ఎన్నో ఏళ్లుగా పట్టి పీడిస్తున్న చీడపురుగు. వేల మంది కష్టాన్ని మింగేస్తూ.. కోట్ల రూపాయాల వ్యాపారానికి నష్టాన్ని కలిగిస్తుంది. సినిమా విడుదలైన ఒకటి, రెండు రోజుల్లోనే సోషల్ మీడియాలో పైరసీ కాపీలు ప్రత్యక్షమవుతున్నాయి. కరోనా తర్వాత ఓటీటీ వాడకం పెరగడంతో కొన్నాళ్ల పాటు నివురు గప్పిన నిప్పులా ఉన్న పైరసీ భూతం ఇప్పుడు మళ్లీ జడలు విప్పింది. వందల కోట్లతో నిర్మించిన చిత్రాలు.. రిలీజైన రోజే పైరసీ వెబ్సైట్లలో ప్రత్యేక్షం అవుతున్నాయి. దీని వల్ల నిర్మాతలకు కోట్ల రూపాయలు నష్టపోతున్నారు. టాలీవుడ్లో ఇటీవల రిలీజైన మిరాయ్ చిత్రాన్ని సైతం ఈ పైరసీ బూతం వదల్లేదు. ఈ నేపథ్యంలో ఓటీటీ సంస్థ జియోస్టార్ పైరసీ అడ్డుకట్టకు వినూత్న మార్గాన్ని ఎంచుకుంది. స్ట్రీమింగ్ రైట్స్తో పాటు అన్ని హక్కులను కొనుగోలు చేసిన ఓ బాలీవుడ్ మూవీని పైరసీ నుంచి కాపాడాలంటూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. విచారణ జరిపిన ధర్మాసనం.. 72 గంటల్లోగా పైరసీ వెబ్సైట్లను బ్లాక్ చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.రిలీజ్కు ముందే..బాలీవుడ్లో కామెడీ ఆధారంగా రూపొందిన కోర్ట్ రూమ్ డ్రామా జాలీ ఎల్ఎల్బీ, జాలీ ఎల్ఎల్బీ 2 చిత్రాలు ఘన విజయం సాధించాయి. ఆ తర్వా త ఈ సిరీస్లో మూడో చిత్రంగా వస్తున్న చిత్రం జాలీ ఎల్ఎల్బీ 3. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్, సీనియర్ నటుడు అర్హద్ వార్సీ, సౌరబ్ శుక్లా, అమృత రావు, హ్యుమా ఖురేషి, బోమన్ ఇరానీ, సీమా బిశ్వాస్, గజరాజ్ రావు, రామ్ కపూర్, అన్ను కపూర్ కీలక పాత్రలు పోషించారు. అలోక్ జైన్, అజిత్ అంధారి నిర్మించిన ఈ కామెడీ లీగల్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రానికి సుభాష్ కపూర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 19న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఆ మూవీ డిజిటల్ రైట్స్ కొనుగోలు చేసిన జియోస్టార్..ఈ సినిమాని అక్రమంగా స్ట్రీమింగ్ చేయకుండా చర్యలు తీసుకోవాలంటూ హైకోర్టులో పిటిషన్ వేసింది. పైరసీ చేస్తున్న సుమారు 20 వెబ్సైట్లకు సంబంధించిన వివరాలను తెలియజేస్తూ..వాటిని బ్లాక్ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది.72 గంటల్లోగా బ్లాక్ చేయాలివిచారణ చేపట్టిన ధర్మాసనం.. ఆ 20 వెబ్సైట్లకు సంబంధించినడొమైన్ రిజిస్ట్రేషన్లను 72 గంటల్లోపు నిలిపివేయాలని డొమైన్ నేమ్ రిజిస్ట్రార్లు (DNRలు), ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు, టెలికమ్యూనికేషన్స్ విభాగంతో పాటు ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ అధికారులను ఆదేశించింది. అంతేకాదు సినిమా విడుదలకు ముందు లేదా విడుదల సమయంలో కనుగొనబడిన అదనపు పైరసీ వెబ్సైట్ల వివరాలను తెలియజేయడానికి జియోస్టార్కు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నామని, వాటిని కోర్టు ఆదేశాలు లేకుండానే బ్లాక్ చేయొచ్చని తీర్పులో వెల్లడించింది. తప్పుగా బ్లాక్ చేస్తే..కోర్టును సంప్రదించి, సవరించుకోవచ్చుననని ఆదేశాలు జారీ చేసింది. పైరసీ వెబ్సైట్లలనో సినిమాను ప్రసారం చేయడం వల్ల నిర్మాతల ఆదాయం గణనీయంగా తగ్గుతుందని, కోలుకోలేని నష్టాన్ని నివారించడానికి త్వరిత జోక్యం అవసరమని ధర్మాసనం ఈ సందర్భంగా గుర్తు చేసింది. తదుపరి విచారణనను వచ్చే ఏడాది జనవరి 20కి వాయిదా వేసింది. -
సల్మాన్ ఒక గూండా, నీచుడు.. ఆ స్టార్ హీరో దర్శకుడిని చితకబాదాడు!
బాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు, నటుడు అనురాగ్ కశ్యప్ హిందీ చలనచిత్ర పరిశ్రమకు గుడ్బై చెప్పేసి సౌత్కు షిఫ్ట్ అయిపోయాడు. అనురాగ్ సోదరుడు అభినవ్ కశ్యప్ (Abhinav Kashyap) కూడా దర్శకుడిగా హిందీలో రెండే రెండు సినిమాలు చేసి సైలెంట్ అయిపోయాడు. అవి దబాంగ్, బేషరం. సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన దబాంగ్ మూవీ బ్లాక్బస్టర్ విజయం సాధించింది. దీనికి దబాంగ్ 2, 3 అంటూ రెండు సీక్వెల్స్ కూడా వచ్చాయి.ధర్మేంద్రను తీసుకోవాలంటే భయంవాటిలో సల్మాన్ (Salman Khan) హీరోయే కానీ దర్శకుడు మాత్రం మారిపోయాడు. అందుకు గల కారణాన్ని దర్శకుడు అభినవ్ తాజాగా బయటపెట్టాడు. ఇండియన్ ఎక్స్ప్రెస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతడు మాట్లాడుతూ.. దబాంగ్ సినిమా ప్రారంభంలో అంతా బానే ఉంది. అందరం అనుకున్నట్లుగా అనుపమ్ ఖేర్, ఓం పురిని తీసుకున్నాం. కానీ, ధర్మేంద్రను సెలక్ట్ చేసుకోవాలంటే భయమేసింది. అందుకే ఆయనకు బదులుగా వినోద్ ఖన్నాను తీసుకున్నాను.దర్శకుడిని చితకబాదిన హీరోనిజానికి దబాంగ్ మూవీ చేయమని ధర్మేంద్రను కలిశాను. అందుకాయన.. బేటా, ముఖ్యమైన పాత్ర ఉంటేనే ఇవ్వు, లేదంటే వద్దు అని చెప్పాడు. దాంతో నాకు భయమేసింది. ఆయన ఎలాంటి పాత్ర ఆశిస్తున్నాడో అర్థం కాలేదు. ఎందుకంటే ధర్మేంద్రతో అసభ్య సన్నివేశం చిత్రీకరించినందుకుగానూ దర్శకుడు కాంతిషాపై హీరో సన్నీడియోల్ (Sunny Deol) చేయి చేసుకున్నాడని రూమర్లున్నాయి. ఏదైనా తేడా వస్తే గొడవ ఖాయం అని అర్థమై ధర్మేంద్రను పక్కనపెట్టాను. ఇక నేను ఏ నటుడితో మంతనాలు జరిపినా సల్మాన్ సోదరుడు సోహైల్ నా వెంటే వచ్చేవాడు.తండ్రి ధర్మేంద్రతో బాలీవుడ్ స్టార్ సన్నీడియోల్సల్మాన్ ఓ గూండాతనే అందరి పారితోషికం గురించి చర్చలు జరిపాడు. వాళ్ల సూచనల ప్రకారమే యాక్టర్స్ను సెలక్ట్ చేసుకున్నా.. కానీ వారికి వ్యతిరేకంగా సోనూసూద్ను సినిమాలో తీసుకున్నా.. సోనూ ఫిజిక్ చూసి సల్మాన్ ఈర్ష్య పడేవాడు. అయినా సరే, వాళ్ల మాటను కాదని సోనూసూద్ను ఎంపిక చేసుకున్నాను. దబాంగ్ సినిమా ముందువరకు సల్మాన్ ఏంటో నాకు తెలీదు. కానీ, తర్వాత అర్థమైంది అతడో పెద్ద గూండా అని! అతడికి యాక్టింగ్ అంటే ఆసక్తి లేదు. సెలబ్రిటీ హోదాను మాత్రం ఇష్టపడేవాడు. అతడో నీచుడు, చెడ్డ వ్యక్తి అని అభినవ్ కశ్యప్ చెప్పుకొచ్చాడు.డైరెక్టర్పై సన్నీడియోల్ ఆవేశం.. అసలు కథ2017లో మిడ్డేలో వచ్చిన వార్తా కథనం ప్రకారం.. ధర్మేంద్ర స్టార్డమ్ కోల్పోయిన సమయంలో బీ గ్రేడ్, సీ గ్రేడ్ (తక్కువ బడ్జెట్, తక్కువ క్వాలిటీతో) సినిమాలు చేశారు. అందులో కొన్ని దర్శకనిర్మాత కాంతి షా తెరకెక్కించారు. అందులో ఓ సినిమాలో ధర్మేంద్రకు గుండెపోటు వచ్చినట్లుగా నటించమన్నాడు. కానీ దాన్ని ఎడిటింగ్లో పూర్తిగా మార్చేశాడు. బెడ్రూమ్ సన్నివేశాల్లో నటించినట్లుగా అశ్లీలంగా రీఎడిట్ చేశాడు. అశ్లీల సీన్లో ధర్మేంద్ర!మొదటగా ఈ సినిమాను పంజాబ్లో రిలీజ్ చేశారు. ఎంతో పేరు ప్రఖ్యాతలున్న ధర్మేంద్ర ముసలితనంలో ఇలా ఓ అమ్మాయితో బెడ్పై కనిపించడం చూసి అభిమానులు షాకయ్యారు. దీంతో ధర్మేంద్ర కుమారుడు సన్నీ డియోల్ ఆ దర్శకుడికి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నాడు. ఓ కథ గురించి చర్చించుకుందాం రమ్మని దర్శకుడు కాంతిని ఆఫీస్కు పిలిపించాడు. ఆ తర్వాత అతడిని దారుణంగా కొట్టాడు.చదవండి: ఓటీటీలో సూపర్ హిట్ హారర్ సినిమా.. ఎక్కడంటే? -
బాయ్ ఫ్రెండైనా ఉండాలి..బ్యాగ్రౌండ్ ఐనా ఉండాలి
చలనచిత్ర రంగంలో తారలుగా రాణించాలని చాలా మందికి ఉంటుంది. అయితే అది అందరి వల్లా సాధ్యపడేది కాదు టాలెంట్ మాత్రమే ఉంటే చాలదు ఇంకా చాలా చాలా ఉండాలి. అలాంటి వాటిలో ఇటీవల బాగా చర్చనీయాంశం అవుతున్న విషయం సినీ పరిశ్రమలో అప్పటికే స్థిరపడిన కుటుంబాలు, వారికి సంబంధీకులకే తప్ప బయటివారికి అండా దండా లభించవనేది. అందువల్లే బయటివారికి సినిమా రంగంలో అంత త్వరగా అవకాశాలు రావని, ఏదోలా వచ్చినా సక్సెస్ అయినా కూడా స్థిరపడడం కష్టమేనని బయటి నుంచి ఆ రంగంలోకి వచ్చిన వారి ఆరోపణ. అలా ఆరోపిస్తున్నవారిలో తాజాగా సీనియర్ నటి అమీషా పటేల్ కూడా చేరింది. కహోనా ప్యార్ హై సినిమాలో హృతిక్ రోషన్ తో పాటు తెరంగేట్రం చేసిన ఈ నటి ఆ తర్వాత హిందీలో పలు సినిమాల్లో నటించింది. పవన్ కళ్యాణ్ సరసన బద్రి, నాని, నరసింహుడు, పరమవీర చక్ర..సినిమాలతో తెలుగు ప్రేక్షకులకూ దగ్గరైంది. ఆ తర్వాత అకస్మాత్తుగా సినిమాలకు దూరమైన అమీషా ఐదు సంవత్సరాల విరామం తర్వాత 2023లో సన్నీ డియోల్, ఉత్కర్ష్ శర్మతో కలిసి గదర్ 2 చిత్రంతో తిరిగి తెరపైకి వచ్చింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ దగ్గర రూ.686 కోట్లు వసూలు చేసి బ్లాక్బస్టర్గా నిలిచింది. ఆ తర్వాత ఆమె చివరిగా 2024లో విడుదలైన తౌబా తేరా జల్వా చిత్రంలో కనిపించింది. ఈ చిత్రానికి విమర్శకుల నుంచి ప్రతికూల సమీక్షలు వచ్చాయి, కానీ అమీషా నటనకు మాత్రం ప్రశంసలు లభించాయి. ఆ తర్వాత మళ్లీ తన తదుపరి ప్రాజెక్ట్ గురించి అమీషా ఇంతవరకూ ప్రకటించలేదు.ఎన్ని హిట్ సినిమాల్లో చేసినా అమీషాకు రావాల్సినంత స్టార్ డమ్ రాలేదు. ఈ నేపధ్యంలో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను టాప్ హీరోయిన్ కాకపోవడానికి కారణమైన సినిమా పరిశ్రమ పరిస్థితులపై నిర్మొహమాటంగా తన అభిప్రాయాల్ని వ్యక్త పరచింది.తన మనస్తత్వం కారణంగా సినీ పరిశ్రమ లోపలి వ్యక్తులు తనను ఇష్టపడరని అమీషా చెప్పింది, సినీరంగంలో రాణించాలంటే ఏదో ఒక శిబిరానికి చెందిన వారై ఉండాలంది. ‘ నేను శిబిరాలకు చెందినదానిని కాదు, వారితో పంచుకోవడానికి నాకు దురలవాట్లు లేవు. మందు తాగను, సిగిరెట్ త్రాగను లేదా పని కావాలని మస్కా–లగావో (కాకాపట్టడం లాంటివి) చేయను నా అర్హత ప్రకారం నాకు ఏది దొరికితే అది నాకు లభిస్తుంది. ఆ కారణంగా వారు నన్ను ఇష్టపడరు. అయినా సరే నేను లొంగిపోను.‘ అంటూ తేల్చి చెప్పేసింది. తనకు తొలి చిత్రం అవకాశం కూడా అతి కష్టమ్మీద వచ్చిందని అంది. ‘కహో నా... ప్యార్ హై’ సినిమా కోసం తాను మొదటి ఎంపిక కాదని, తొలుత కరీనా కపూర్ ను ఎంచుకున్నారని తెలిపింది. అయితే నిర్మాత రాకేష్ రోషన్ కు కరీనా కపూర్తో విభేదాలు వచ్చాక ఆమె ప్రవర్తన పట్ల అసంతృప్తి వచ్చిన కారణంగా ఆమెను ఆ సినిమా నుంచి తొలగించిన తర్వాత మాత్రమే తనకు ఆ అవకాశం వచ్చిందని ఆమె గుర్తుచేసుకుంది. పరిశ్రమ లో సన్నిహితుడో, భాగస్వామి లేనప్పుడు ఒంటరిగా అందులో ఇమడడం చాలా కష్టం అంటోందామె. ‘సినిమా పరిశ్రమకు చెందిన ఓ బాయ్ఫ్రెండ్ లేదా ఒక భర్త లేనప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. మీరు పవర్ ఫుల్ కపుల్గా లో ’సగం’ కానప్పుడు రాణింపు చాలా కష్టం. ఎందుకంటే మీకు మద్దతు ఇచ్చే వ్యక్తులు ఉండరు. మిమ్మల్ని సమర్థించడానికి ఎటువంటి కారణం లేదు కదా ఆఫ్ట్రాల్.. మీరు బయటి వ్యక్తి.’’ అంటూ ఆమె వ్యాఖ్యానించింది. -
బాక్సాఫీస్ మాత్రమే కాదు.. ఓటీటీలోనూ సంచలనమే!
ఈ ఏడాది సూపర్ హిట్గా నిలిచన రొమాంటిక్ లవ్ స్టోరీ సైయారా. మోహిత్ సూరీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.580 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టింది. ఎలాంటి బజ్ లేకుండా వచ్చిన ఈ సినిమా ఊహించని విధంగా బాక్సాఫీస్ను షేర్ చేసింది. ఈ చిత్రం ద్వారా అహాన్ పాండే (Ahaan Panday), అనీత్ పడ్డా (Aneet Padda) బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చారు. జులై 18న విడుదలైన ఈ సినిమా సంచనాలు క్రియేట్ చేసింది. కేవలం మౌత్ టాక్ పవర్తో బాక్సాఫీస్ రికార్డ్లను తిరగరాసింది. 60 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం బాలీవుడ్లో అనేక చిత్రాల కలెక్షన్స్ను దాటి రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఈ ఏడాది ఓవర్సీస్లో అత్యధిక వసూళ్లు సొంతం చేసుకున్న బాలీవుడ్ సినిమాగా రికార్డు నెలకొల్పింది. ఈ ఏడాది బాలీవుడ్ హిట్ సినిమా ఛావా రికార్డ్ను కూడా దాటేసింది.ఈ యూత్ఫుల్ ఎంటర్టైనర్ ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లో సందడి చేస్తోంది. సెప్టెంబర్ 12 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. బాక్సాఫీస్ వద్ద అదరగొట్టిన సైయారా ఓటీటీలోనూ తగ్గేదేలే అంటోంది. ఓటీటీకి వచ్చిన తొలి వారంలోనే ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వ్యూస్ సొంతం చేసుకున్న నాన్- ఇంగ్లీష్ చిత్రంగా నిలిచింది. వరల్డ్ వైడ్గా ఆంగ్లేతర చిత్రాల జాబితాలో అగ్రస్థానంలో సైయారా కొనసాగుతోంది. ఈ రొమాంటిక్ డ్రామా జర్మన్ చిత్రం 'ఫాల్ ఫర్ మీ', హిందీ మూవీ 'ఇన్స్పెక్టర్ జెండే'లను అధిగమించింది. ఈ చిత్రం కేవలం ఐదు రోజుల్లోనే అగ్రస్థానానికి చేరుకుంది, 'ఫాల్ ఫర్ మీ' మూవీతో సహా అనేక చిత్రాలను దాటేసింది.ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లో ప్రపంచవ్యాప్తంగా ఆంగ్లేతర చిత్రాల జాబితాలో సైయారా మొదటి స్థానంలో ఉంది. ఈ చిత్రం 3.7 మిలియన్ల వ్యూస్తో పాటు 9.3 మిలియన్ గంటల వీక్షణలతో దూసుకెళ్తోంది. జర్మన్ థ్రిల్లర్ మూవీ 'ఫాల్ ఫర్ మీ' 6.5 మిలియన్ గంటల వ్యూస్తో రెండో స్థానంలో ఉంది. ఆ తర్వాత మనోజ్ భాజ్పాయ్ నటించిన 'ఇన్స్పెక్టర్ జెండే' 6.2 మిలియన్ గంటల వీక్షణలతో మూడో స్థానంలో కొనసాగుతోంది. ఈ జాబితాలో విజయ్ దేవరకొండ నటించిన 'కింగ్డమ్' 2.5 మిలియన్ గంటల వ్యూస్తో తొమ్మిదో స్థానంలో ఉంది. -
జాన్వీ కపూర్ లేటేస్ట్ మూవీ.. ట్రైలర్ వచ్చేసింది
బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. ఇటీవలే పరమ్ సుందరిగా మెప్పించిన ముద్దుగుమ్మ సన్నీ సంస్కారి కీ తులసి కుమారి అనే చిత్రంలోనూ కనిపించనుంది. అంతే కాకుండా జాన్వీ కపూర్ మరో మూవీలో కనిపించనుంది. ఇషాన్ కట్టర్, విశాల్ జైత్య ప్రధాన పాత్రల్లో వస్తోన్న హోమ్ బౌండ్లోనూ హీరోయిన్గా మెప్పించనుంది. ఈ సినిమాను నీరజ్ ఘైవాన్ దర్శకత్వంలో తెరకెక్కించారు.తాజాగా ఈ మూవీ ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమాను కరణ్ జోహార్, అదార్ పూనావాలా, అపూర్వ మెహతా, సోమెన్ మిశ్రా నిర్మించారు. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 26న విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. హాలీవుడ్ చిత్రనిర్మాత మార్టిన్ స్కోర్సెస్ ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ప్రొడ్యూసర్గా వ్యవహిరించారు. కాగా.. ఇప్పటికే ఈ సినిమాను కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్, టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్ వంటి అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శించారు.హౌమ్ బౌండ్ కథేంటంటే..నార్త్ ఇండియాకు చెందిన ఇద్దరు చిన్ననాటి స్నేహితులు జీవితంలో పోలీస్ ఆఫీసర్లుగా స్థిరపడాలనుకుంటారు. ఇందుకోసం ఎంతో కష్టపడుతుంటారు. మరి... వారు అనుకున్నది ఎలా సాధించారు? వీరిద్దరి జీవితాల్లో ఓ అమ్మాయి వచ్చిన తర్వాత ఏం జరిగింది? అనే అంశాల ఆధారంగా ‘హోమ్ బౌండ్’ సినిమా కథను తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. -
ఐశ్వర్య అంటే ఆ హీరోకి పిచ్చి.. ఆమె ఇంటిముందు సీన్ క్రియేట్ చేసేవాడు
ఐశ్వర్య రాయ్ (Aishwarya Rai) అందానికి మంత్రముగ్ధులు కానివారు ఉండరు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ ఆమెను ఆరాధించారు. కొందరు ఆమెతో ప్రేమలో పడ్డారు, ఒకరిద్దరు ఆమె ప్రేమను తిరిగి పొందారు. వారిలో ఒకరే బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan). ఒకప్పుడు సల్మాన్ - ఐశ్వర్య ప్రేమించుకున్నారు. కానీ కొంతకాలానికే బ్రేకప్ చెప్పుకున్నారు. 2002లో వీరి బ్రేకప్ స్టోరీ బీటౌన్లో సంచనలంగా మారింది. సల్మాన్తో బ్రేకప్తాజాగా దర్శకుడు ప్రహ్లాద్ కక్కర్.. ఐష్- సల్మాన్ల బ్రేకప్ గురించి మాట్లాడారు. ఈయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సల్మాన్తో బ్రేకప్ అయ్యాక బాలీవుడ్ ఇండస్ట్రీ ఆమెను దూరం పెట్టింది. అప్పుడు తను చాలా బాధపడింది. వీటి గురించి పట్టించుకోవద్దని ఆమెకు ధైర్యం చెప్పేవాడిని. సల్మాన్ కోసం ఇండస్ట్రీ తనను వెలేయడం తట్టుకోలేకపోయింది. అయితే బ్రేకప్ తర్వాతే తను కాస్త ప్రశాంత జీవితం గడిపింది. ఎందుకంటే తను అతి ప్రేమ, కోపంతో పిచ్చిపట్టినట్లు ప్రవర్తించేవాడు. తల గోడకేసి బాదుకునేవాడునేనూ అదే అపార్ట్మెంట్లో ఉండేవాడిని కాబట్టి తను వచ్చివెళ్లేది కనిపిస్తూ ఉండేది. అతడి ప్రవర్తన చూశాక.. ఇలాంటి వ్యక్తితో ఎలా ఉంటున్నావ్? అని అడిగాను. అతడు ఐశ్వర్య కోసం ఆమె ఇంటికి వచ్చి పెద్ద సీన్ క్రియేట్ చేసేవాడు. తల గోడకేసి బాదుకునేవాడు. అధికారికంగా ప్రకటించే సమయానికంటే ముందే వీళ్లిద్దరూ విడిపోయారు అని చెప్పుకొచ్చారు. కాగా 2007వ సంవత్సరంలో ఐశ్వర్య.. బిగ్బీ కుమారుడు, నటుడు అభిషేక్ బచ్చన్ను పెళ్లి చేసుకుంది. వీరికి కూతురు ఆరాధ్య సంతానం.చదవండి: ఒక్క డైలాగ్తో ఫేమస్.. నా గొంతు మార్చేశారు, ఇది చాలా తప్పు! -
టీఐఎఫ్ఎఫ్లో హోమ్ బౌండ్కు అవార్డు
టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్ (టీఐఎఫ్ఎఫ్) గోల్డెన్ ఎడిషన్ (50వ ఎడిషన్) అవార్డ్స్ వేడుకలో భారతీయ చిత్రాలు ‘హోమ్ బౌండ్, ఇన్ సెర్చ్ ఆఫ్ ది స్కై’లకు అవార్డులు దక్కాయి. హైదరాబాదీ ఫిల్మ్మేకర్ నీరజ్ ఘైవాన్ దర్శకత్వంలో ఇషాన్ కట్టర్, విశాల్ జైత్యా, జాన్వీ కపూర్ లీడ్ రోల్స్లో నటించిన చిత్రం ‘హోమ్ బౌండ్’. కరణ్ జోహార్, అదార్ పూనా వాలా, అపూర్వా మెహతా, సోమెన్ మిశ్రా నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 26న థియేటర్స్లో రిలీజ్ కానుంది.కాగా ఈ సినిమాకు టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్లో ఇంటర్నేషనల్ పీపుల్ చాయిస్ రెండో అవార్డు లభించింది. సౌత్ కొరియన్ సెటైరికల్ బ్లాక్ కామెడీ థ్రిల్లర్ మూవీ ‘నో అదర్ చాయిస్’ సినిమాకు ‘ఇంటర్నేషనల్ పీపుల్ చాయిస్’ మొదటి అవార్డు దక్కింది. మరో భారతీయ చిత్రం ‘ఇన్ సెర్చ్ ఆఫ్ ది స్కై’కి జ్యూరీకి చెందిన ఎన్ఈటీపీఏసీ అవార్డు దక్కింది. ఈ చిత్రానికి జితాంగ్ సింగ్ గుర్జార్ దర్శకత్వం వహించగా మేఘనా అగర్వాల్, రాఘవేంద్ర భడోరియా, నిఖిల్ ఎస్. యాద్ ప్రధానపాత్రల్లో నటించారు.ఇక ఈ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రధాన అవార్డుగా భావించే ‘పీపుల్ చాయిస్ అవార్డు’ హిస్టారికల్ డ్రామా ‘హామ్నెట్’ చిత్రానికి దక్కింది. ఈ బ్రిటిష్ అమెరికన్ చిత్రానికి క్లోయ్ జావో దర్శకత్వం వహించగా, జెస్సీ బక్లీ,పాల్ మెస్కల్, ఎమిలీ వాట్సన్ ప్రధానపాత్రల్లో నటించారు. అలాగో ఈ ఫెస్టివల్లో మరో ప్రతిష్ఠాత్మకమైన ప్లాట్ఫామ్ ప్రైజ్ అవార్డు ఉక్రెయిన్స్ ఫిల్మ్ ‘టు ది విక్టరీ’కి దక్కింది. ఈ చిత్రంలో వాలెంటైన్స్ వాస్యనోవిచ్ ప్రధానపాత్రలో నటించి, దర్శకత్వం వహించారు. -
నలుగురితో ప్రేమాయణం.. ముగ్గురితో పెళ్లి..ఇప్పుడు సింగిల్గానే స్టార్ హీరోయిన్!
చిత్రపరిశ్రమలో ప్రేమ వివాహాలు ఎంత కామనో.. విడాకులు అంతే కామన్. జీవితాంతం కలిసి ఉంటామంటూ గ్రాండ్గా పెళ్లి చేసుకొని..కొన్నాళ్లకే విడాకులకు అప్లై చేసిన జంటలు చాలానే ఉన్నాయి. ఇక లవ్ బ్రేకప్ల గురించి చెప్పనక్కర్లేదు. ఇలా ప్రేమలో పడి..అలా విడిపోయిన వారు పదుల సంఖ్యల్లో ఉన్నారు. ప్రేమ, పెళ్లిళ్లపై విరక్తి కలిగి ఒంటరి జీవితమే బెటర్ అనుకొనే‘స్టార్స్’ సైతం ఉన్నారు. అలాంటి వారిలో ఒకరు బాలీవుడ్ నటి సల్మా ఆఘా(Salma Agha) ఒకరు. నలుగురితో ప్రేమాయణం నడిపి..ముగ్గురిని పెళ్లి చేసుకొని.. ఇప్పుడు ఒంటరి జీవితాన్ని గడుపుతున్న ఈ నటి..పర్సనల్ లైఫ్ ఓ విషాద ప్రేమకథ చిత్రాన్ని గుర్తు చేసేలా ఉంటుంది.1982లో వచ్చిన ‘నికాహ్’ మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సల్మా.. తొలి సినిమాతోనే నటిగా మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఈ చిత్రంలో ‘దిల్ కే ఆర్మాన్’ అనే పాటను కూడా ఆలపించి ఆకట్టుకుంది. ఆ తర్వాత వరుస అవకాశాలు వచ్చాయి. ‘కసమ్ పైదా కర్నేవాలేకీ’, ‘బాబీ’, ‘కోబ్రా’, ‘ఫూలన్ దేవి’'పతీ పత్నీ ఔర్ తవైఫ్' లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో ఆమె హీరోయిన్గా నటించింది.ఇలా కెరీర్ పరంగా వరుస విజయాలతో ‘స్టార్’ హీరోయిన్గా ఎదిగిన సల్మా..వ్యక్తిగత జీవితంలో మాత్రం వరుస పరాజయాలే అందుకుంది. కెరీర్ పీక్స్లో ఉన్నప్పడు లండన్ వ్యాపారవేత్త అయ్యాజ్ సిప్రాతో ఆమె ప్రేమలో పడింది. కొన్నాళ్ల పాటు రిలేషన్లో ఉన్నా.. అది పెళ్లి వరకు వెళ్లలేదు. ఆ తర్వాత పాకిస్తాన్ నటుడు జావేద్ షేక్ని పెళ్లి చేసుకొని..కొన్నాళ్లకే విడాకులు తీసుకుంది. తర్వాత స్క్వాచ్ ప్లేయర్ రెహ్మత్ ఖాన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ బంధం కూడా ఎక్కువ కాలం నిలబడలేదు. 2011లో దుబాయ్ వ్యాపారతవేత్త మంజర్ షాని పెళ్లి చేసుకుంది. కానీ కొన్నాళ్ల తర్వాత ఆయనకు కూడా విడాకులు ఇచ్చింది. 67 ఏళ్ల వయసు ఉన్న సల్మా ప్రస్తుతం ముంబైలో ఒంటరిగానే ఉంటుంది. -
దిశా పటానీ కుటుంబానికి అండగా సీఎం యోగి
బాలీవుడ్ హీరోయిన్ దిశా పటానీ కుటుంబానికి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి బరోసా కల్పించారు. కొద్దిరోజుల క్రితం బరేలీలోని ఆమె నివాసం వద్ద గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఆ సమయం నుంచి ఆమె కుటుంబం ఆందోళనలో ఉంది. ఈ విషయం గురించి దిశా తండ్రికి ముఖ్యమంత్రి ఫోన్ చేశారు. కాల్పులు జరిపిన వారిని తప్పుకుండా పట్టుకుంటామని సీఎం హామీ ఇచ్చారు. ఇదే విషయాన్ని మీడియాతో దిశా పటానీ తండ్రి జగదీశ్ తెలిపారు.సీఎం యోగి ఆదిత్యనాథ్ ఫోన్ సంభాషణ గురించి ఇలా చెప్పారు. ' మా కుటుంబానికి సీఎం ధైర్యాన్నిచ్చారు. మాకు పూర్తి భద్రత కల్పిస్తామని ఫోన్లో చెప్పారు. కాల్పులు జరిపిన వారు అండర్ గ్రౌండ్లో ఉన్నా సరే పట్టుకుని తీరుతామన్నారు. రాష్ట్ర ప్రజలు కూడా అండగా ఉంటారని ఆయన అన్నారు. మాకు ఇంత ధైర్యాన్ని ఇచ్చిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం.' అని ఆయన అన్నారు.దిశా పటానీ తండ్రి రిటైర్డ్ డీఎస్పీదిశా పటానీ సోదరి ఖుష్బూ పటానీ కొద్దిరోజుల క్రితం చేసిన వ్యాఖ్యలు ఒక వర్గం మనోభావాలను దెబ్బతీసినట్లు తెలుస్తోంది. ఈ కారణం వల్లే ఈ కాల్పులు జరిగాయని పోలీసులు భావిస్తున్నారు . దిశా పటానీ సోదరి ఖుష్బూ మాజీ ఆర్మీ అధికారిణి అనే విషయం తెలిసిందే. దిశా పటానీ తండ్రి జగదీశ్ సింగ్ పటానీ ఒక రిటైర్డ్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (DSP). ఆయన ఉత్తరప్రదేశ్ పోలీస్ విభాగంలో సేవలందించారు. చివరి పోస్టింగ్ బరేలీలో జరిగింది. జగదీశ్ పటానీ నిజాయితీ గల పోలీస్ అధికారిగా గుర్తింపు ఉంది. రిటైర్మెంట్ తర్వాత కూడా సామాజిక సేవ, వ్యవసాయం వంటి రంగాల్లో చురుకుగా ఉన్నారు. -
అతనితో పెళ్లి వార్తలు.. స్పందించిన జాన్వీ కపూర్!
ఇటీవలే పరమ్ సుందరితో అభిమానులను అలరించిన బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్. అంతలోనే మరో మూవీతో అలరించేందుకు సిద్ధమైంది. సన్నీ సంస్కారి కీ తులసి కుమారి అనే సినిమాలో హీరోయిన్గా కనిపించనుంది. వరుణ్ ధావన్ హీరోగా వస్తోన్న ఈ మూవీ ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు. ఈ ఈవెంట్కు జాన్వీ కపూర్ కూడా హాజరైంది.ఈ సందర్భంగా జాన్వీ కపూర్కు తన పెళ్లి గురించి మరోసారి ప్రశ్న ఎదురైంది. ఈ ప్రశ్నకు జాన్వీ కపూర్ స్పందించారు. ప్రస్తుతానికి తనకైతే పెళ్లి చేసుకునే ఆలోచన లేదని చెప్పింది. ఇప్పుడు నా దృష్టి కేవలం సినిమాలపైనే ఉందని తెలిపింది. వివాహానికి ఇంకా చాలా సమయం ఉందని వెల్లడించింది. దీంతో తనపై వస్తున్న మ్యారేజ్ రూమర్స్కు చెక్ పెట్టింది ముద్దుగుమ్మ.అయితే గతంలో ఆమె.. శిఖర్ పహారియాను పెళ్లి చేసుకోనున్నట్లు వార్తలొచ్చాయి. ఎందుకంటే వీరిద్దరు చాలాసార్లు జంటగా కనిపించడంతో రూమర్స్ వినిపించాయి. గత ఇంటర్వ్యూలో తన ఫోన్లో స్పీడ్ డయల్ లిస్ట్లో బోనీ కపూర్, ఖుషీ కపూర్తో పాటు శిఖర్ పేరును కూడా చెప్పడంతో డేటింగ్ రూమర్స్ మొదలయ్యాయి. కాగా.. శిఖర్ పహారియా మహారాష్ట్ర మాజీ సీఎం సుశీల్ కుమార్ షిండే మనవడు అన్న సంగతి తెలిసిందే. మరోవైపు ప్రస్తుతం బాలీవుడ్లో బిజీగా ఉన్న జాన్వీ కపూర్.. టాలీవుడ్లో రామ్ చరణ్ సరసన పెద్దిలో హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీకి బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్నారు. రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ కానుంది. -
'పురుషులు, మహిళలు ఓకే బెడ్పై.. బిగ్బాస్పై నటి షాకింగ్ కామెంట్స్'
బాలీవుడ్ భామ తనుశ్రీ దత్తా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొద్ది రోజుల క్రితమే ఇంట్లో వేధింపులు తట్టుకోలేకపోతున్నానంటూ ఏడుస్తూ ఓ వీడియోను రిలీజ్ చేసింది. తన ఇంట్లోనే తనని వేధిస్తున్నారని.. ఈ బాధ తట్టుకోలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేసింది. ప్లీజ్ ఎవరైనా వచ్చి సాయం చేయండి అంటూ అభ్యర్థించింది. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.తాజాగా ఈ బాలీవుడ్ భామ బిగ్ బాస్ రియాలిటీ షోపై సంచలన కామెంట్స్ చేసింది. గత 11 ఏళ్లుగా తనకు బిగ్బాస్ ఆఫర్ వస్తోందని తెలిపింది. కానీ ఈ అవకాశాన్ని తాను తిరస్కరిస్తూనే ఉన్నానని వెల్లడించింది. తనకు రూ. 1.65 కోట్లు ఆఫర్ చేసినా కూడా ఈ షోలో పాల్గొనని మేకర్స్కు తేల్చి చెప్పానని పంచుకుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజైరన తనుశ్రీ దత్తా బిగ్బాస్ షోపై తీవ్రమైన ఆరోపణలు చేసింది. నిర్మాతలు తనకు నింగి నుంచి చంద్రుడిని తీసుకొచ్చినా.. నా లైఫ్లో ఎప్పటికీ బిగ్బాస్లో పాల్గొనని చెప్పింది.తనుశ్రీ దత్తా మాట్లాడుతూ..'బిగ్బాస్ ఆఫర్ ప్రతి ఏటా వస్తోంది. ఈ షోలో పాల్గొనాలని మేకర్స్ తనను సంప్రదిస్తారు. ప్రతి ఏటా ఈ రియాలిటీ షో కోసం నాకు రూ. 1.65 కోట్లు ఆఫర్ చేశారు. ఎందుకంటే వారు మరో బాలీవుడ్ సెలబ్రిటీకి కూడా అంతే మొత్తాన్ని ఇచ్చారు. ఆమె కూడా నా స్థాయి నటినే. అంతకంటే ఎక్కువ డబ్బు కూడా ఇస్తామని బిగ్బాస్ మేకర్స్లో ఒకరు ఆఫరిచ్చారు. కానీ తిరస్కరించాను. ఎందుకంటే ఈ షోలో పురుషులు, మహిళలు ఓకే బెడ్పై పడుకుంటారు. అదే ప్లేస్లో కోట్లాడుకుంటారు. నా ఆహారం విషయంలో నేను చాలా జాగ్రత్తగా ఉంటా. ఈ రియాలిటీ షో కోసం ఒకే మంచంపై మరో వ్యక్తితో పడుకునే అమ్మాయిని అని వారు ఎలా అనుకుంటారు?.. నేను అంత చీప్ కాదు. వారు నాకు ఎన్ని కోట్లు ఇచ్చినా బిగ్బాస్కు వెళ్లను. నేను నా ఫ్యామిలీతోనే కలిసి ఉండనని.. తనకంటూ ప్రత్యేక స్పేస్ కోరుకునేదాన్ని' అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.బిహార్కి చెందిన తనుశ్రీ దత్తా.. 2004లో ఫెమినా మిస్ ఇండియా యూనివర్స్ విజేతగా నిలిచింది. కానీ 'ఆషిక్ బనాయా అప్నే' పాటతో ఈమెకు చాలా గుర్తింపు వచ్చింది. తెలుగులోనూ 2005లో 'వీరభద్ర' అనే మూవీ చేసింది. తమిళంలోనూ 2010లో తీరదు విలాయాట్టు పిళ్లై అనే చిత్రంలో నటించింది. ఇవి తప్పితే 2013 వరకు హిందీలోనే పలు చిత్రాలు చేసింది. తర్వాత పూర్తిగా సినిమాలకు దూరమైంది. -
ఏడాదిగా డేటింగ్.. సీక్రెట్గా హీరోయిన్ నిశ్చితార్థం?
మరో హీరోయిన్ పెళ్లికి సిద్ధమైపోయింది. బాలీవుడ్కి హ్యుమా ఖురేషి.. ఇప్పుడు రహస్యంగా నిశ్చితార్థం చేసుకుందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. ఏడాది నుంచి ఓ యాక్టింగ్ కోచ్తో ఈమె రిలేషన్లో ఉందని, రీసెంట్గానే టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్కి కూడా వెళ్లొచ్చారని, ఇప్పుడు పెద్దగా హడావుడి లేకుండానే ఎంగేజ్మెంట్ చేసుకున్నారని టాక్ నడుస్తోంది. ఇంతకీ ఏంటి విషయం? హ్యుమా కాబోయే భర్త ఎవరు?(ఇదీ చదవండి: నేను ధనుష్ని వెన్నుపోటు పొడవలేను: జీవీ)'గ్యాంగ్స్ ఆఫ్ వస్సేపుర్' సినిమాలతో నటిగా పరిచయమైన హ్యుమా ఖురేషి.. 2012 నుంచి హిందీలో ఆడపాదడపా మూవీస్ చేస్తూనే ఉంది. మలయాళంలో వైట్, తమిళంలో అజిత 'వలిమై', రజినీకాంత్ 'కాలా' చిత్రాల్లోనూ హీరోయిన్గా చేసింది. 'మహారాణి' వెబ్ సిరీస్తోనూ మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఈమె.. గత ఏడాది నుంచి యాక్టింగ్ కోచ్ రచిత్ సింగ్తో ప్రేమలో ఉందని తెలుస్తోంది. హీరోయిన్ సోనాక్షి పెళ్లికి కూడా ఇద్దరూ కలిసే వెళ్లారని, అయితే తమ రిలేషన్ గురించి బయటకు తెలియకుండా జాగ్రత్త పడుతూ వచ్చారు.రీసెంట్గానే టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్కి కూడా హ్యుమా-రచిత్ వెళ్లొచ్చారు. ఇప్పుడు సీక్రెట్గా ఎంగేజ్మెంట్ చేసుకున్నారని బాలీవుడ్లో వినిపిస్తుంది. ఇది నిజమే అయినప్పటికీ విషయాన్ని రహస్యంగా ఉంచాలనుకుంటున్నారని సన్నిహితుల మాట. హ్యుమాకి ప్రస్తుతం 39 ఏళ్లు. రచిత్ విషయానికొస్తే ఉత్తరప్రదేశ్కి చెందిన కుర్రాడు. మోడలింగ్ చేసేటప్పుడు ఢిల్లీలో ఉన్నాడు. 2016లో ముంబై వచ్చేసిన తర్వాత యాక్టింగ్ కోచ్గా మారిపోయి సొంతంగా కంపెనీ పెట్టుకున్నాడు. ఇప్పుడు ఓ ఇంటివాడు కాబోతున్నాడు. మరి హ్యుమా-రచిత్.. తమ నిశ్చితార్థం నిజం ఎప్పుడు చెబుతారో చూడాలి?(ఇదీ చదవండి: Bigg Boss 9 తెలుగు 2వ వారం నామినేషన్స్లో ఎవరెవరంటే?) -
వచ్చే నెలలో కత్రినా కైఫ్ గుడ్ న్యూస్.. సోషల్ మీడియాలో వైరల్!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ గురించి పరిచయం అక్కర్లేదు. తనకంటే వయసులో చిన్నవాడైన విక్కీ కౌశల్ను పెళ్లాడింది. 2021లో వీరిద్దరు వివాహం బంధంలోకి అడుగుపెట్టారు. అప్పటి నుంచి ఈ జంటపై రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. కత్రినా గర్భంతో ఉన్నారని చాలాసార్లు కథనాలొచ్చాయి. దీనిపై ఇప్పటివరకు ఎవరూ కూడా స్పందించలేదు.అయితే ఈసారి ఏకంగా ఈ జంటపై మరో ప్రచారం మొదలైంది. వచ్చేనెలలోనే కత్రినా కైఫ్ బిడ్డకు జన్మనివ్వబోతున్నారని టాక్ నడుస్తోంది. వచ్చే నెల అంటే అక్టోబర్లో అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పనున్నారని సోషల్ మీడియాలో వైరలవుతోది. ప్రస్తుతం ఆమె మూడో త్రైమాసికంలో ఉన్నారని.. వచ్చేనెల లేదా నవంబర్లో బిడ్డకు స్వాగతం పలకనున్నారని నెట్టింట చర్చ మొదలైంది. కత్రినా ప్రసవం తర్వాత సుదీర్ఘంగా విరామం తీసుకోవాలని యోచిస్తోందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ విషయంపై ఈ జంట ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.రెండు నెలల క్రితం కత్రినా కైఫ్ ఓవర్సైజ్ షర్ట్లో కనిపించడంతో మరోసారి ప్రెగ్నెన్సీ రూమర్స్ వినిపించాయి. ఆ పాత వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే తమపై వస్తున్న ప్రెగ్నెన్సీ వార్తలపై గతంలోనే విక్కీ కౌశల్ కూడా క్లారిటీ ఇచ్చారు. అలాంటిదేమీ లేదని.. ఏదైనా ఉంటే తామే స్వయంగా చెబుతామన్నారు. అంతేకాకుండా 'బ్యాడ్ న్యూజ్' ట్రైలర్ సమయంలో కూడా కత్రినా గర్భం ధరించారని రూమర్స్ వచ్చాయి. ఆ సమయంలో కూడా ఇలాంటి వార్తల్ని ఆయన ఖండించారు. అయినప్పటికీ ఈ జంటపై పలు సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతూనే ఉన్నాయి. రెండు రోజుల క్రితమే కత్రినా తన కాస్మెటిక్ బ్రాండ్ను ప్రమోట్ చేస్తూ ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియోను షేర్ చేసింది. ఆ వీడియో చూసిన నెటిజన్స్ మరోసారి ఆమె గర్భవతి అంటూ కామెంట్స్ చేశారు. తాజాగా వస్తోన్న కథనాలపై కత్రినా, విక్కీ కౌశల్ క్లారిటీ ఇస్తే కానీ ప్రెగ్నెన్సీ రూమర్స్కు చెక్ పడేలా కనిపించడం లేదు.మరోవైపు విక్కీ కౌశల్ ఈ ఏడాది ఛావాతో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. రష్మిక మందన్నా హీరోయిన్గా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్గా నిలిచింది. ఏకంగా రూ.800 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఛత్రపతి శివాజీ తనయుడు శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు. విక్కీ ప్రస్తుతం రణబీర్ కపూర్, ఆలియా భట్తో కలిసి 'లవ్ అండ్ వార్' సినిమాలో నటిస్తున్నారు.We got #VickyKaushal - #KatrinaKaif content today, but wait a minute….. are they expecting 👩🍼? pic.twitter.com/QrhZ1z5Xnf— Bollywood Talkies (@bolly_talkies) July 30, 2025 -
ఐశ్వర్య-అభిషేక్ బాటలో ప్రముఖ నిర్మాత!
ఇటీవల బాలీవుడ్ కపుల్ ఐశ్వర్య రాయ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ తమ వ్యక్తిగత హక్కుల కోసం ఢిల్లీ హైకోర్ట్ను ఆశ్రయించారు. తమ అనుమతి లేకుండా ఫోటోలు, వీడియోలు వినియోగించకుండా అడ్డుకోవాలని పిటిషన్ వేశారు. కొందరు ఎలాంటి అనుమతులు లేకుండా దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఐశ్వర్య, అభిషేక్ తమ పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం వారికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది.తాజాగా ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ సైతం ఇదే విషయంలో ఢిల్లీ హైకోర్ట్ను ఆశ్రయించారు. తన పేరుతో నిధులను సేకరించి దుర్వినియోగానికి పాల్పడుతున్నారని పిటిషన్ వేశారు. ఈ మేరకు కరణ్ తరఫున సీనియర్ న్యాయవాది రాజశేఖర్ రావు వాదనలు వినిపించారు. ఎలాంటి అనుమతి లేకుండా తన ఫోటోలు వినియోగిస్తున్నారని పిటిషన్లో ప్రస్తావించారు. అంతేకాకుండా సోషల్ మీడియా ఫ్లాట్ఫామ్స్లో కరణ్ పేరుతో అనధికార పేజీలు ఉన్నాయని కోర్టుకు వివరించారు. దీనిపై ఢిల్లీ ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. -
మాజీ లవర్ పెళ్లికి వెళ్లి మరొకరితో ప్రేమలో.. ఫన్నీగా ట్రైలర్
ప్రస్తుతం 'పెద్ది' సినిమాతో బిజీగా ఉన్న జాన్వీ కపూర్.. ఓ హిందీ మూవీని విడుదలకు సిద్ధం చేసింది. 'సన్నీ సంస్కారి కీ తులసి కుమారి' పేరుతో తీసిన ఈ చిత్రంలో వరుణ్ ధావన్, సన్యా మల్హోత్రా కూడా ప్రధాన పాత్రలు పోషించారు. అక్టోబరు 2న సినిమాని థియేటర్లలోకి తీసుకురానున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 15 సినిమాలు రిలీజ్)ట్రైలర్ బట్టి చూస్తే ఇదో రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. సన్నీ(వరుణ్ ధావన్).. అనన్య (సన్య మల్హోత్రా)ని ప్రేమిస్తాడు. ప్రపోజ్ చేస్తాడు. కానీ ఆమె ఇతడిని రిజెక్ట్ చేసి విక్రమ్(రోహిత్ షరాఫ్)తో పెళ్లికి సిద్ధమవుతుంది. మరోవైపు విక్రమ్.. తన ప్రియురాలు తులసి(జాన్వీ కపూర్)కి బ్రేకప్ చెప్పేస్తాడు. దీంతో సన్నీ-తులసి కలిసి విక్రమ్-అనన్య పెళ్లికి వెళ్తారు. నానా హంగమా చేస్తారు. చివరకు ఏమైందనేదే స్టోరీ.(ఇదీ చదవండి: 'బిగ్బాస్'లో లెస్బియన్ జోడీ.. అవమానించిన మరో లేడీ కంటెస్టెంట్) -
ఏఐ సాయంతో నటుడి ఫోటోలు మార్ఫింగ్.. యువతిపై కేసు
సాక్షి, బంజారాహిల్స్: ఏఐ టెక్నాలజీతో ఓ బాలీవుడ్ నటుడి ఫోటోలను నగ్నంగా మార్ఫింగ్ చేస్తూ ఆయన స్నేహితులకు, దర్శక, నిర్మాతలకు, కుటుంబ సభ్యులకు పోస్ట్ చేసి బ్లాక్మెయిల్కు పాల్పడుతున్న యువతిపై బంజారాహిల్స్లో పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముంబై నివాసి, ఫ్రీలాన్స్ నటుడు ఆనంద సురేష్ కుమార్ రెన్వా (36)ను జియా ఉనిస్సా నస్రీన్ అనే మహిళ మూడు సంవత్సరాలుగా నిరంతరం వేధిస్తోంది. ఏఐతో మార్ఫింగ్అతని ఇన్స్ట్రాగామ్, వాట్సప్, ఫోన్ అకౌంట్స్ హ్యాక్ చేసి, అతని పేరుతో ఏఐ ద్వారా మార్ఫింగ్ చేసిన సెమీ న్యూడ్, న్యూడ్ ఫోటోలు, వీడియోలు సృష్టించింది. ఆ మార్ఫింగ్ ఫోటోలు, వీడియోలను పరిశ్రమలోని దర్శకులకు, రెండు ప్రొడక్షన్ హౌస్లకు పంపించి అరాచకానికి పాల్పడిందని, ఈ కారణంగా తన వృత్తిపై తీవ్ర ప్రభావం చూపిందంటూ బాధిత నటుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. సోదరికి సైతం అశ్లీల సందేశాలుదాదాపు 15 నుంచి 20 నకిలీ ఖాతాల ద్వారా అతన్ని అవమానపరిచేలా పలు సందేశాలను, వీడియోలను పంపింది. అతని కుటుంబాన్ని టార్గెట్ చేయడంతో తీవ్ర మానసిక ఒత్తిడి ఏర్పడిందని, హృద్రోగ లక్షణాలు కూడా వచ్చాయని బాధితుడు పేర్కొన్నాడు. అంతేకాకుండా అతని సోదరికి కూడా అశ్లీల సందేశాలు పంపినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఆనంద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.చదవండి: ఇడ్లీ తినాలని కోరిక.. డబ్బులుండేవి కావు: ధనుష్ ఎమోషనల్ -
రామ్ చరణ్, జూ.ఎన్టీయార్.. చేతి వాచీలు అంత ఖరీదా?
సగటు మనిషికి చేతి గడియారం అంటే సమయాన్ని తెలుసుకునే ఒక అవసరమైన వస్తువు మాత్రమే కావచ్చు. కానీ సెలబ్రిటీలకు, ఇది ఒక స్టైల్ స్టేట్మెంట్, పెట్టుబడి, స్టేటస్ సింబల్... అంతేకాదు అన్నింటికీ మించి ఒక కళా ఖండం కూడా. బాలీవుడ్ తారల నుంచి క్రికెటర్లు వ్యాపార దిగ్గజాల వరకు, భారతదేశంలోని అత్యంత ప్రముఖు వ్యక్తులలో కొందరు లగ్జరీ కార్లు లేదా బహుళ అంతస్తుల భవనాల కంటే ఎక్కువ ఖరీదు పెట్టి కేవలం చేతి గడియారాలను కలిగి ఉన్నారంటే.. అర్ధమవుతుంది విలాసం అనేది ఏ స్థాయిలో పెరిగిందో...ఒక్కసారి ఖరీదైన చేతివాచీలు కలిగి ఉన్న సెలబ్రిటీల జాబితా చూద్దామా...అత్యంత ఖరీదైన వాచీ ఎవరిదంటే...నెం1 సినిమా తారల్ని సైతం ఇంటి ముంగిట డ్యాన్స్ చేయించేంత డబ్బు, పలుకుబడి ఉన్న భారతదేశపు కుబేరుడు ముఖేష్ అంబానీ కుమారుడి వాచీ అత్యంత ఖరీదైనదిగా తెలుస్తోంది. ఇప్పటివరకు తయారు చేయబడిన అత్యంత సంక్లిష్టమైన గడియారాలలో ఒకటైన పటేక్ ఫిలిప్ గ్రాండ్ కాంప్లికేషన్స్ స్కై మూన్ టూర్బిల్లాన్ ను అనంత్ అంబానీ కలిగి ఉన్నాడు. ఆ చేతి వాచీ విలువఏకంగా రూ. 70.48 కోట్లు , ఇది డబుల్ డయల్స్ తో ఖగోళ విధులను సైతం అందిస్తుంది, ఇది చేతివాచీల తయారీ శాస్త్రమైన హోరాలజీలో ఒక గొప్ప కళాఖండంగా ఖ్యాతి పొందింది.కండల వీరుడూ...కాస్ట్లీ వాచ్బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ సైతం రూ. 64.43 కోట్లు విలువైన పటేక్ ఫిలిప్ అక్వానాట్ హౌట్ జోయిలెరీ రెయిన్ బో జెమ్స్టోన్స్, డైమండ్స్ వాచ్ను ధరిస్తాడు. విలువైన రాళ్లతో కూడిన అద్భుతమైన ఇంద్రధనస్సుతో, ఈ చేతివాచీ అతని ఆడంబరమైన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది.పాండ్యా... వాచ్ ఇట్...ప్రముఖ క్రికెటర్ హార్దిక్ పాండ్యా పిచ్ మీద బ్యాట్తో తన ఆటతీరుకు మాత్రమే కాదు బయట తన విలాసవంతమైన జీవనశైలికి కూడా అంతే ప్రసిద్ధి చెందాడు. అతని పటేక్ ఫిలిప్ నాటిలస్ ట్రావెల్ టైమ్ బ్లూ డైమండ్ బాగెట్స్ చేతి వాచీ దర ఏకంగా రూ. 43.83 కోట్లు వజ్రాల ధగధగలతో ఇది మైదానంలో అతని బ్యాటింగ్ మెరుపుల్ని తలపిస్తుంది.రిచ్ దా...బాద్షా...భారతదేశపు ర్యాప్ స్టార్ బాద్షా ‘‘రిచర్డ్ మిల్లె ఆర్ఎమ్ఫైవ్3–01 టూర్బిల్లాన్ పాబ్లో మాక్ డోనఫ్’’ లిమిటెడ్ ఎడిషన్ ను కలిగి ఉన్నాడు. ఇది అడ్వాన్స్డ్ డిజైన్స్ తో ఈ రూ. 24.85 కోట్లు ఖరీదు చేస్తుంది. ఈ వాచ్ అతని సంగీతం లాగే మహా బోల్డ్గా ఉంటుంది.యంగ్ టైగర్...వాచ్ కా షేర్...టాలీవుడ్ గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ ‘‘రిచర్డ్ మిల్లె ఆర్ఎమ్ 40–01 మెక్లారెన్ స్పీడ్టైల్ ఆటోమేటిక్ టూర్బిల్లాన్ ’’ను కలిగి ఉన్నాడు. దీని ధర రూ. 8.93 కోట్లు. రేసింగ్–ప్రేరేపిత డిజైన్ కలిగిన ఈ వాచీ ఆయన పవర్ ప్యాక్డ్, శక్తివంతమైన పెర్మార్మెన్స్కు సరిగ్గా నప్పుతుంది.→ పటేక్ ఫిలిప్ గ్రాండ్ కాంప్లికేషన్స్ పెర్పెచువల్ క్యాలెండర్ క్రోనోగ్రాఫ్ క్లాసిక్ వాచీని బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ ధరిస్తాడు. ఆయన దీని కోసం రూ. 6.48 కోట్లు ఖర్చు చేశాడు→ క్రికెట్ లెజెండ్ విరాట్ కోహ్లీ రంగురంగుల రోలెక్స్ ఓయిస్టర్ పెర్పెచువల్ కాస్మోగ్రాఫ్ డేటోనా రెయిన్ బో వాచీని వినియోగిస్తాడు. దీని ధర రూ. 4.36 కోట్లు ఇది రోలెక్స్ అత్యంత అద్భుతమైన పీస్లలో ఒకటి.→ మరో ప్రముఖ భారతీయ క్రికెటర్ రోహిత్ శర్మ: రిచర్డ్ మిల్లె ఆర్ఎమ్65–01 వాచీని వాడతాడు. దీని ధర రూ. 4.36 కోట్లు.→ బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ రోలెక్స్ కాస్మోగ్రాఫ్ డేటోనా ఎవెరోస్ వాచ్ ఖరీదు రూ. 4.25 కోట్లు.→ టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్: జాకబ్ – కో. ఆస్ట్రోనోమియా సోలార్ కాన్సెటలేషన్స్ వాచీని వినియోగిస్తున్నాడు. దీని ధర రూ. 3.05 కోట్లు.→ గాయకుడు, నటుడు యో యో హనీ సింగ్ రిచర్డ్ మిల్లె ఆర్ఎమ్ 011 ఫెలిపే మాస్సా వాచీతో కనిపిస్తాడు. ఈ వాచీ ఖరీదు రూ. 2.18 కోట్లు.→ అంబానీల కుటుంబానికి చెందిన ఆకాష్ అంబానీ రిచర్డ్ మిల్లె ఆర్ఎమ్67–02 బ్రాండ్ని ధరిస్తాడు. ఈ వాచీ విలువ రూ. 2.51 కోట్లు. -
పెళ్లి, తల్లి అయితే ఏంటి.. దూసుకెళ్తున్న హీరోయిన్లు!
హీరోయిన్ల కెరీర్ అంటే పెళ్లికి ముందు పెళ్లి తర్వాత అనే నానుడి ఇండస్ట్రీలో ఉంది. పెళ్లికి ముందు ఫుల్ క్రేజ్తో దూసుకెళ్లే నాయికల కెరీర్ మిసెస్ అయ్యాక జోరు తగ్గుతుందని, అవకాశాలు అరకొరగా వస్తాయని అంటుంటారు. అయితే ఇప్పుడు ఈ పరిస్థితి లేదు. ‘మిసెస్ అయితే ఏంటి?’ అని ఇండస్ట్రీ అనుకుంటోంది... పెళ్లయ్యాకా కెరీర్లో దూసుకెళ్లాలని హీరోయిన్లు అనుకుంటున్నారు. అయితే పెళ్లి తర్వాత చాన్స్లు వచ్చినా అక్క, చెల్లి, వదిన... వంటి పాత్రలకే వారిని పరిమితం చేస్తుంటారనే వారూ ఇండస్ట్రీలో లేకపోలేదు. కానీ ఈ పరిస్థితి కూడా మారింది. ప్రస్తుతం మాత్రం పెళ్లి అయినా కెరీర్లో ఏ మాత్రం జోరు తగ్గకుండా దూసుకెళుతున్నారు పలువురు హీరోయిన్లు. మిసెస్ అయినా క్రేజ్, చాన్స్ల విషయంలో తగ్గేదే లే అంటూ అవకాశాలు అందిపుచ్చుకుంటున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ... ఇలా ఆయా భాషల హీరోయిన్లు వివాహ బంధంలోకి అడుగు పెట్టినా, తల్లిగా ప్రమోషన్ పొందినా అవకాశాల్లో మాత్రం జోరు చూపిస్తున్నారు. పెళ్లి తర్వాత కూడా కెరీర్లో విజయవంతంగా దూసుకుపోతున్న హీరోయిన్లు ఎవరో ఓ లుక్ వేద్దాం. ఇష్టంతో... తెలుగు చిత్ర పరిశ్రమకు ‘ఇష్టం’తో (2001) వచ్చారు శ్రియ శరణ్. ఆ తర్వాత ‘సంతోషం, నువ్వే నువ్వే, ఠాగూర్, ఎలా చెప్పను, నేనున్నాను, ఛత్రపతి, గౌతమిపుత్ర శాతకర్ణి, పైసా వసూల్’ వంటి పలు విజయవంతమైన సినిమాల్లో నటించి, ప్రేక్షకులను అలరించారు శ్రియ. అదే విధంగా మలయాళ, తమిళ, కన్నడ, హిందీ భాషల్లోనూ నటించారామె. కెరీర్ జోరుగా ఉన్న సమయంలోనే 2018 మార్చి 19న ఆండ్రీ కోస్చీవ్తో పెళ్లి పీటలెక్కారు శ్రియ. అయితే వివాహం తర్వాత కూడా ఆమె వరుస చాన్స్లు అందిపుచ్చుకున్నారు. 2021 జనవరి 10న ఓ ΄ాపకు జన్మనిచ్చారు శ్రియ. ఆ సమయంలో కొంచెం విరామం తీసుకున్న ఆమె 2022 నుంచి వరుస సినిమాలు చేస్తున్నారు. ఈ ఏడాది ఆమె నటించిన సూర్య ‘రెట్రో’ (ప్రత్యేక పాట) సినిమా మే 1న విడుదలైంది. తేజ సజ్జా హీరోగా నటించిన ‘మిరాయ్’ చిత్రం శుక్రవారం ΄ాన్ ఇండియా స్థాయిలో విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో తేజ సజ్జా తల్లిగా అంబిక ΄ాత్రలో నటించారు శ్రియ. ఆమె ΄ాత్రకి మంచి ఆదరణ వస్తోంది. ఇంకా శ్రియ చేతిలో మరికొన్ని సినిమాలు ఉన్నాయి. తన తొలి సినిమా (ఇష్టం) లానే కెరీర్ అంటే ఉన్న ఇష్టంతో సినిమాల్లో కంటిన్యూ కావాలనుకుంటున్నారు శ్రియ. జోరుగా చందమామ రెండు దశాబ్దాలుగా అందం, అభినయంతో ప్రేక్షకులను అలరిస్తున్నారు కాజల్ అగర్వాల్. ‘క్యూ! హో గయా నా’ (2004) అనే బాలీవుడ్ మూవీలో అతిథి ΄ాత్రలో కనిపించిన ఈ బ్యూటీ తేజ దర్శకత్వం వహించిన ‘లక్ష్మీ కళ్యాణం’ (2007) సినిమా ద్వారా తెలుగుకి పరిచయమయ్యారు. అయితే కృష్ణవంశీ దర్శకత్వం వహించిన ‘చందమామ’ (2007) చిత్రంతో ఓవర్ నైట్ ΄ాపులర్ అయ్యారు కాజల్. ఆ సినిమా తర్వాత ఆమెని టాలీవుడ్ చందమామ అంటూ ముద్దుగా పిలుచుకుంటున్నారు అభిమానులు. ఆ తర్వాత తెలుగులో ‘మగధీర, ఆర్య 2, డార్లింగ్, బృందావనం, మిస్టర్ పర్ఫెక్ట్, బిజినెస్ మేన్, సారొచ్చారు, నాయక్, బాద్షా, టెంపర్, ఖైదీ నంబర్ 150, నేనే రాజు నేనే మంత్రి, భగవంత్ కేసరి’ వంటి పలు విజయవంతమైన సినిమాల్లో నటించారామె. తెలుగు, తమిళ, హిందీ సినిమాలతో ప్రేక్షకులను తనదైన నటనతో అలరించిన ఈ బ్యూటీ 2020 అక్టోబరు 30న గౌతమ్ కిచ్లుతో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. పెళ్లి తర్వాత కూడా వరుస సినిమాలు చేశారు ఈ బ్యూటీ. 2022 ఏప్రిల్ 19న ఓ బాబుకి జన్మనిచ్చారు కాజల్. ఆ సమయంలో కొంచెం విరామం తీసుకున్న ఈ చందమామ సెకండ్ ఇన్నింగ్స్లోనూ మళ్లీ అదే జోరు చూపిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ‘ది ఇండియా స్టోరీ, రామాయణ: పార్ట్ 1, రామాయణ: పార్ట్ 2’ వంటి హిందీ మూవీస్తో పాటు ‘ఇండియన్ 3’ అనే తమిళ సినిమా చేస్తున్నారు. అదే జోరు చిత్ర పరిశ్రమలో రెండు దశాబ్దాలకుపైగా కెరీర్ని సొంతం చేసుకున్నారు నయనతార. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ చిత్రాల్లో నటిస్తూ తనకంటూ స్పెషల్ ఇమేజ్, క్రేజ్ని సంపాదించుకున్నారామె. ‘మనస్సినక్కరే’ (2003) అనే మలయాళ సినిమాతో చిత్ర పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ప్రస్తుతం లేడీ సూపర్ స్టార్గా కంటిన్యూ అవుతున్నారు. ఓ వైపు హీరోలకి జోడీగా వాణిజ్య సినిమాల్లో నటిస్తూనే మరోవైపు లేడీ ఓరియంటెడ్ సినిమాలతోనూ తానేంటో నిరూపించుకుంటున్నారు. హీరోయిన్గా జెట్ స్పీడ్లో దూసుకెళుతున్న సమయంలోనే దర్శకుడు విఘ్నేశ్ శివన్ తో పెళ్లి పీటలెక్కారు నయన్. 2022 జూన్ 9న వీరి వివాహం జరిగింది. వారికి ఉయిర్, ఉలగమ్ అనే ట్విన్స్ ఉన్న సంగతి తెలిసిందే. ఆమెతో పాటు కెరీర్ స్టార్ట్ చేసిన మిగతా హీరోయిన్లు కెరీర్లో స్లో అయినప్పటికీ నయన్∙మాత్రం ఇప్పటికీ అదే జోరు కొనసాగిస్తున్నారు. ఇప్పటికీ చేతినిండా సినిమాలతో బిజీ బిజీగా దూసుకెళుతున్నారామె. నయనతార ప్రస్తుతం తెలుగులో చిరంజీవి సరసన ‘మన శంకరవరప్రసాద్గారు’ చిత్రంలో నటిస్తున్నారు. అలాగే తమిళ, మలయాళ, కన్నడ భాషల్లోనూ అరడజనుకు పైగా సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు. బిజీ బిజీగా... ‘గిల్లి’ (2009) సినిమాతో కన్నడ ఇండస్ట్రీలో హీరోయిన్గా అడుగుపెట్టారు రకుల్ప్రీత్ సింగ్. ‘కెరటం’ (2011) చిత్రంతో తెలుగు పరిశ్రమకు పరిచయమయ్యారామె. ‘వెంకటాద్రి ఎక్స్ప్రెస్’ (2013) సినిమాతో తెలుగులో తొలి హిట్ని తన ఖాతాలో వేసుకున్నారు రకుల్. ఆ తర్వాత ‘లౌక్యం, నాన్నకు ప్రేమతో, సరైనోడు, రారండోయ్ వేడుక చూద్దాం’ వంటి పలు హిట్ మూవీస్ చేశారు. తెలుగులో స్టార్ హీరోయిన్లలో ఒకరిగా వెలుగొందిన ఈ బ్యూటీ హిందీ, తమిళ చిత్రాల్లోనూ నటించి, ప్రేక్షకులను అలరించారు. హీరోయిన్గా బిజీగా ఉన్న సమయంలోనే వ్యాపారవేత్త, నటుడు–నిర్మాత జాకీ భగ్నానీతో 2024 ఫిబ్రవరి 21న ఏడడుగులు వేశారు. పెళ్లి తర్వాత కూడా వరుస చాన్స్లతో కెరీర్ని కంటిన్యూ చేస్తున్నారామె. ఈ ఏడాది ఫిబ్రవరిలో ‘మేరే హస్బెండ్ కి బీవీ’ చిత్రంతో సందడి చేశారు రకుల్. ప్రస్తుతం హిందీలో ‘దే దే ΄్యార్ దే 2, పతీ పత్నీ ఔర్ ఓ 2’ వంటి మూవీస్తో బిజీ బిజీగా ఉన్నారు రకుల్ ప్రీత్ సింగ్. అలాగే కమల్హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూ΄÷ందిన ‘ఇండియన్ 3’లో రకుల్ నటించారు. ఈ చిత్రం విడుదల కావాల్సి ఉంది. షార్ట్ బ్రేక్ తర్వాత... ‘అందాల రాక్షసి’ (2010) సినిమాతో టాలీవుడ్కి హీరోయిన్గా పరిచయమయ్యారు లావణ్యా త్రి΄ాఠి. ఆ తర్వాత ‘మనం, భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్నినాయనా’ వంటి పలు హిట్ మూవీస్లో యాక్ట్ చేశారామె. తెలుగులోనే కాదు... పలు తమిళ చిత్రాల్లోనూ నటించారు లావణ్య. 2023 నవంబరు 1న హీరో వరుణ్ తేజ్ని ప్రేమ వివాహం చేసుకున్నారు లావణ్య. వివాహం తర్వాత కూడా ఆమె సినిమాలు చేశారు. లావణ్య నటించిన తమిళ చిత్రం ‘టన్నెల్’, తెలుగు సినిమా ‘సతీ లీలావతి’ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అథర్వా మురళి, లావణ్యా త్రిపాఠి జంటగా నటించిన చిత్రం ‘టన్నెల్’. రవీంద్ర మాధవ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని తెలుగులో లచ్చురామ్ ప్రొడక్షన్స్పై ఎ.రాజు నాయక్ విడుదల చేస్తున్నారు. అదేవిధంగా లావణ్యా త్రి΄ాఠి, దేవ్ మోహ¯Œ జంటగా నటించిన చిత్రం ‘సతీ లీలావతి’. ‘భీమిలీ కబడ్డీ జట్టు, ఎస్.ఎం.ఎస్(‘శివ మనసులో శృతి’) సినిమాల ఫేమ్ తాతినేని సత్య దర్శకత్వం వహించారు. నాగమోహన్ నిర్మించిన ఈ సినిమా విడుదలకు ముస్తాబవుతోంది. ఇదిలా ఉంటే ఈ నెల 10న లావణ్యా త్రి΄ాఠి ఓ బాబుకి జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుని, మళ్లీ సినిమాలతో బిజీ అవుతారని ఊహించవచ్చు. పెళ్లయిన వెంటనే ప్రమోషన్తో... ‘పైలెట్స్’ (2000) సినిమాతో బాలనటిగా మలయాళంలో అడుగుపెట్టారు కీర్తీ సురేశ్. 2013లో విడుదలైన ‘గీతాంజలి’ చిత్రంతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చారు. అప్పటి నుంచి మలయాళ, తెలుగు, తమిళ, హిందీ చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. 2016లో విడుదలైన ‘నేను శైలజ’ సినిమా ద్వారా తెలుగులో హీరోయిన్గా పరిచయం అయ్యారామె. ఆ తర్వాత ‘నేను లోకల్, అజ్ఞాతవాసి, మహానటి, రంగ్ దే, సర్కారువారి పాట, దసరా, భోళా శంకర్, ఉప్పు కప్పురంబు’ వంటి పలు సినిమాల్లో నటించారు. దివంగత నటి సావిత్రి బయోపిక్గా రూపొందిన ‘మహానటి’ చిత్రానికిగానూ జాతీయ ఉత్తమ నటి అవార్డు గెలుచుకున్నారు కీర్తి. వరుస అవకాశాలతో బిజీ బిజీగా ఉన్న ఆమె... తన చిన్ననాటి స్నేహితుడు ఆంటోని తట్టిల్ని 2024 డిసెంబరు 12న వివాహం చేసుకున్నారు. గోవాలో హిందు, క్రిస్టియన్ సంప్రదాయ పద్ధతుల్లో వీరి పెళ్లి జరిగింది. వివాహం అనంతరం హనీమూన్కి కూడా వెళ్లకుండా తాను కథానాయికగా నటించిన తొలి హిందీ చిత్రం ‘మేరీ జాన్’ ప్రమోషనల్ కార్యక్రమాల్లో మెడలో పసుపుతాడుతో పాల్గొని, టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యారు. పెళ్లి తర్వాత కూడా కీర్తీ సురేశ్ జోరు ఏ మాత్రం తగ్గలేదు. ఆమె నటించిన ‘ఉప్పు కప్పురంబు’ చిత్రం ఈ ఏడాది జూలై 4న రిలీజ్ అయింది. ప్రస్తుతం ‘రివాల్వర్ రీటా, కన్నివెడి’ వంటి తమిళ సినిమాలతో బిజీగా ఉన్నారు కీర్తి. టాప్ ప్లేస్లో... బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరిగా దూసుకెళుతున్నారు దీపికా పదుకోన్. ‘ఐశ్వర్య’ (2006) అనే కన్నడ సినిమాతో హీరోయిన్గా పరిచయమైన ఈ బ్యూటీ రెండు దశాబ్దాల కెరీర్కి చేరువ అవుతున్నారు. కన్నడ, హిందీ, తమిళ, తెలుగు, ఇంగ్లిష్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించారామె. కెరీర్ పీక్స్లో ఉన్నప్పుడే బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్తో ఏడడుగులు వేశారు. 2018 నవంబరు 14న వీరి వివాహం జరిగింది. పెళ్లి తర్వాత కూడా దీపిక క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. వరుస క్రేజీ ్ర΄ాజెక్టులను సొంతం చేసుకుని, ఔరా అని ఆశ్చర్యపరిచారామె. ఇప్పటికీ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ల జాబితాలో దీపికా పదుకోన్ పేరు టాప్ ప్లేస్లో ఉండటం విశేషం. పైగా పెళ్లయినప్పటికీ హిందీలో అత్యధిక ΄ారితోషికం తీసుకుంటున్న హీరోయిన్గా కంటిన్యూ అవుతున్నారీ బ్యూటీ. రణ్వీర్–దీపిక దంపతులకు దువా పదుకోన్ సింగ్ అనే ΄ాప ఉంది. 2024లో అమ్మగా ప్రమోషన్ పొందారు దీపిక. ప్రస్తుతం మాతృత్వపు మాధుర్యాన్ని ఆస్వాదిస్తున్న ఆమె సినిమాలకు కొంచెం విరామం ఇచ్చారు. ఆ తర్వాత ఎలాగూ బిజీ అవుతారని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ప్రస్తుతం ఆమె చేతిలో ‘కింగ్’(వర్కింగ్ టైటిల్) అనే సినిమా ఉంది. భలే జోరు... అందం, అభినయంతో ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు ఆలియా భట్. ‘సంఘర్‡్ష’ (1999) సినిమాతో బాలనటిగా వెండితెరపై మెరిసిన ఆమె ఇప్పటికీ కెరీర్ని దిగ్విజయంగా కొనసాగిస్తున్నారు. హీరోయిన్గా బిజీ బిజీగా ఉన్న సమయంలోనే హీరో రణబీర్ కపూర్ని పెళ్లి చేసుకున్నారు. 2022 ఏప్రిల్ 14న వీరు వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. పెళ్లి తర్వాత కూడా పెద్దగా బ్రేక్ తీసుకోకుండానే కెరీర్ కంటిన్యూ చేశారు ఆలియా. వరుస అవకాశాలు అందిపుచ్చుకుని తన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదంటూ నిరూపించారామె. రణబీర్ కపూర్–ఆలియా భట్లకు రాహా అనే పాప ఉంది. 2022 నవంబరు 6న వీరు తల్లితండ్రులుగా ప్రమోషన్ పొందారు. పాప పుట్టిన తర్వాత సినిమాలకు కొంచెం విరామం ఇచ్చిన ఈ బ్యూటీ ఆ తర్వాత మళ్లీ బిజీ బిజీ అయ్యారు. వరుస ఆఫర్స్ అందుకుంటూ దూసుకెళుతున్నారు. ప్రస్తుతం ఆమె చేతిలో ‘ఆల్ఫా, లవ్ అండ్ వార్’ సినిమాలున్నాయి. ఇదిలా ఉంటే... 2022లో రిలీజైన తెలుగు చిత్రం ‘ఆర్ఆర్ఆర్’లో రామ్చరణ్కి జోడీగా సీత పాత్రలో ఆలియా భట్ నటించిన సంగతి తెలిసిందే. ఇక బ్రేక్ లేకుండా... హీరోయిన్ కియారా అద్వానీ క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. కేవలం బాలీవుడ్లోనే కాదు... టాలీవుడ్లోనూ ఈ బ్యూటీకి యూత్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ‘ఫగ్లీ’ (2014) అనే సినిమాతో హీరోయిన్గా బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన కియారా దశాబ్దానికి పైగా దూసుకెళుతున్నారు. మహేశ్బాబు హీరోగా నటించిన ‘భరత్ అనే నేను’ (2018) చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయమైన ఈ బ్యూటీ ‘వినయ విధేయ రామ, గేమ్ ఛేంజర్’ వంటి సినిమాల్లో నటించారు. బాలీవుడ్లో వరుస అవశాలతో దూసుకెళుతున్న సమయంలోనే హీరో సిద్ధార్థ్ మల్హోత్రాని వివాహం చేసుకున్నారామె. 2023 ఫిబ్రవరి 7న రాజస్థాన్ లో వీరి పెళ్లి జరిగింది. వివాహం తర్వాత కూడా సినిమాల్లో నటిస్తున్నారు కియారా. ఆమె నటించిన ‘గేమ్ ఛేంజర్’ ఈ ఏడాది జనవరి 10న, ‘వార్ 2’ మూవీ ఆగస్టులో విడుదలైంది. ఈ ఏడాది జూలై 15న ఒక పాపకు జన్మనిచ్చారామె. ప్రస్తుతం ఆమె చేతిలో ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’ అనే కన్నడ– ఇంగ్లిష్ చిత్రం ఉంది. పెళ్లి, తల్లయిన కారణంగా కొంత గ్యాప్ తీసుకున్నారు కియారా. అయితే ఇక బ్రేక్ లేకుండా వరుసగా సినిమాలు చేయాలనుకుంటున్నారు. వీళ్లే కాదు... ప్రియాంకా చోప్రా, కరీనా కపూర్, కాజోల్, రాణీ ముఖర్జీ, జ్యోతిక, కత్రినా కైఫ్, విద్యాబాలన్, యామి గౌతమ్, మౌని రాయ్.. ఇలా పలువురు హీరోయిన్లు పెళ్లి తర్వాత కూడా అవకాశాలు అందుకుంటూ తమ జోరు చూపిస్తున్నారు. – డేరంగుల జగన్ మోహన్ -
స్నేహితుల కథ
కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్, టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్ వంటి అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శితమైన ‘హోమ్బౌండ్’ సినిమా థియేటర్స్లో విడుదలకు సిద్ధమైంది. ఇషాన్ కట్టర్, విశాల్ జైత్య, జాన్వీ కపూర్ ప్రధాన పాత్రల్లో నటించిన హిందీ చిత్రం ‘హోమ్ బౌండ్’. హైదరాబాదీ ఫిల్మ్ మేకర్ నీరజ్ ఘైవాన్ తెరకెక్కించారు. కరణ్ జోహార్, అదార్ పూనావాలా, అపూర్వ మెహతా, సోమెన్ మిశ్రా నిర్మించారు. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 26న విడుదల చేయనున్నట్లుగా మేకర్స్ శనివారం వెల్లడించారు. హాలీవుడ్ చిత్రనిర్మాత మార్టిన్ స్కోర్సెస్ ఈ ‘హోమ్ బౌండ్’ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ప్రొడ్యూసర్గా చేశారు. అంతర్జాతీయ రిలీజ్ను మార్టిన్ పర్యవేక్షిస్తున్నారట. ఇక నార్త్ ఇండియాకు చెందిన ఇద్దరు చిన్ననాటి స్నేహితులు జీవితంలో పోలీస్ ఆఫీసర్లుగా స్థిరపడాలనుకుంటారు. ఇందుకోసం ఎంతో కష్టపడుతుంటారు. మరి... వారు అనుకున్నది ఎలా సాధించారు? వీరి జీవితాల్లో ఓ అమ్మాయి వచ్చిన తర్వాత ఏం జరిగింది? అనే అంశాల ఆధారంగా ‘హోమ్ బౌండ్’ సినిమా కథనం సాగుతుందనే ప్రచారం సాగుతోంది. -
Heer Express: బాలీవుడ్లోకి వచ్చిన మరో ప్రేమ కథ
‘సైయారా’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత బాలీవుడ్లో మరో లవ్ స్టోరీ రిలీజైంది. అదే ‘హీరో ఎక్స్ప్రెస్’. ’ఓ మై గాడ్’, ‘102 నాట్ అవుట్’ ఫేం ఉమేష్ శుక్లా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దివిత జునేజా, ప్రిత్ కమాని హీరోహీరోయిన్లుగా నటించారు. అశుతోష్ రానా, గుల్షన్ గ్రోవర్, సంజయ్ మిశ్రా, మేఘనా మాలిక్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. భారీ అంచనాల మధ్య నిన్న(సెప్టెంబర్ 12) విడుదలైన ఈ చిత్రానికి తొలి రోజే హిట్ టాక్ వచ్చింది.ఈ సినిమా కథ విషయానికొస్తే.. వంట చేయడంలో ఆసక్తిగల హీర్ వాలియా(దివిత జునేజా) అనే పంజాబీ అమ్మాయి, తన వంట నైపుణ్యాలతో ప్రపంచాన్ని జయించాలని కలలు కంటుంది. సొంతంగా రెస్టారెంట్ ప్రారంభించాలనే లక్ష్యంతో చెఫ్గా పనిచేయడానికి లండన్కు వెళ్తుంది. అక్కడ ఆమెకు ఎదురైన సవాళ్లు ఏంటి, హీర్ చివరకు తన లక్ష్యాన్ని చేరుకుందా లేదా? అనేదే మిగతా కథ. ఫ్యామిలీ ఎమోషన్, వినోదం, క్యూట్ లవ్స్టోరీతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా సినిమా ఉందని బాలీవుడ్ రివ్యూస్ చెబుతున్నాయి. ఇక ఈ చిత్రాన్ని ఉమేష్ శుక్లా, ఆశిష్ వాఘ్, మోహిత్ ఛబ్రా, మరియు సంజయ్ గ్రోవర్ సంయుక్తంగా నిర్మించారు. సంపదా వాఘ్ సహ నిర్మాతగా వ్యవహరించారు. -
'కూలీ'లో నటించి తప్పు చేశా.. ఆమిర్ అంత మాటన్నాడా?
గత నెలలో మంచి హైప్తో థియేటర్లలోకి వచ్చిన సినిమా 'కూలీ'. రజినీకాంత్, నాగార్జున, సౌబిన్ షాహిర్, ఉపేంద్ర, ఆమిర్ ఖాన్.. ఇలా చాలామంది స్టార్స్ ఉండేసరికి ప్రేక్షకులు అంచనాలు పెట్టుకున్నారు. కానీ మూవీ ఓ మాదిరిగా ఉండటం వాళ్లని నిరాశపరిచింది. అసలు లోకేశ్ కనగరాజ్ ఈ చిత్రం తీశాడా? అని సోషల్ మీడియాలో కామెంట్స్ చేశారు. ఇప్పుడు ఆమిర్ కూడా ఈ సినిమాలో నటించానని తప్పు చేశానని అన్నట్లు ఓ న్యూస్ తెగ వైరల్ అవుతోంది.ఇంతకీ నిజమేంటి?'కూలీ'లో బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ అతిథి పాత్రలో కనిపించాడు. క్లైమాక్స్లో దహా అనే రోల్ చేశాడు. అయితే ఇది కేవలం రజినీకాంత్ కోసమే చేశానని ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆమిర్ చెప్పాడు. తీరా మూవీలో చూస్తే అది ఏ మాత్రం ప్రభావం చూపించకపోగా, సీరియస్ సీన్లో ఆమిర్ కామియో మరీ కామెడీగా అనిపించింది. విపరీతమైన ట్రోల్స్ కూడా వచ్చాయి.(ఇదీ చదవండి: Bigg Boss 9 డేంజర్ జోన్లో వీళ్లే.. లక్స్ పాపపై ఎలిమినేషన్ వేటు?)అసలు విషయానికొస్తే రెండు మూడు రోజుల నుంచి బాలీవుడ్ మీడియాలో ఆమిర్-లోకేశ్ కనగరాజ్ చేయాల్సిన సూపర్ హీరో సినిమా ఆగిపోయిందనే రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి వీటిలో ఎంత నిజముందనేది తెలియదు గానీ ఇప్పుడు ఏకంగా ఆమిర్ మాట్లాడినట్లు ఓ పేపర్ క్లిప్పింగ్ వైరల్ అవుతోంది. 'కూలీలో నటించి పెద్ద తప్పు చేశా' అని ఆమిర్ అన్నట్లు అందులో రాసుకొచ్చారు. అయితే ఎక్కడ ఎప్పుడు ఆమిర్ ఇలా మాట్లాడారనేది వెతికితే మాత్రం అలాంటి సమాచారం కనిపించలేదు.అయితే ఈ రూమర్స్ని దళపతి విజయ్ ఫ్యాన్స్ కావాలనే స్ప్రెడ్ చేస్తున్నారని ట్విటర్లో కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అందుకు తగ్గట్లు కొన్ని స్క్రీన్ షాట్స్ని పోస్ట్ చేస్తున్నారు. తమిళంలో విజయ్-రజినీకాంత్ అభిమానుల మధ్య అప్పుడప్పుడు ఇలా ఫ్యాన్ వార్స్ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు కూడా విజయ్ ఫ్యాన్సే ఈ పుకారు సృష్టించారా అనే సందేహం వస్తోంది.(ఇదీ చదవండి: ‘మిరాయ్’పై మంచు విష్ణు ట్వీట్.. రిప్లై ఇచ్చిన మనోజ్!) -
సిరిసిల్లవాసి.. బాలీవుడ్లో తిరుగులేని హీరోగా స్టార్డమ్
తెలుగు నేల మీద పుట్టి, ముంబై మహానగరానికి వెళ్లి, అక్కడ హీరోగా విశేషమైన పేరు తెచ్చుకున్న ఓ వ్యక్తి ఉన్నారు. ఆయనే పైడి జైరాజ్ (Paidi Jairaj). పైడి జైరాజ్ పూర్తి పేరు పైడిపాటి జైరాజ్. ఆయన తెలంగాణ రాష్ట్రం సిరిసిల్లలో 28 సెప్టెంబర్ 1909న జన్మించారు. ఆయనకు ఇద్దరు అన్నలు. పైడిపాటి సుందరరాజా, పైడిపాటి దీనదయాళ్. జైరాజ్ చిన్నవాడు కావడంతో అందరూ అతణ్ని అపురూపంగా చూసుకునేవారు. హైదరాబాద్ నగరంలోని నిజాం కళాశాలలో జైరాజ్ డిగ్రీ చదువుకున్నారు. మూకీ సినిమాలుఆ సమయంలో నాటక రంగం, చలనచిత్రాలపై ఆసక్తి పెంచుకున్నారు. ఎలాగైనా సినిమాల్లో చేరాలన్న ఉద్దేశంతో 1929లో బొంబాయికి వెళ్లిపోయారు. ‘స్టార్ క్లింగ్ యూత్’ అనే నిశ్శబ్ద చిత్రంతో నటుడిగా కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత ‘మాతృభూమి’, ‘ఆల్ ఫర్ లవర్’, ‘మహాసాగర్ మోతి’, ‘ఫ్లైట్ ఇంటూ డెత్’ తదితర సైలెంట్ సినిమాల్లో నటించారు.బాలీవుడ్లో రాణించిన తెలుగు వ్యక్తిమంచి నటుడిగా పేరు తెచ్చుకొని హమారీ బాత్ (1943), సింగార్ (1949), అమర్ కహానీ(1949), రాజ్పుత్ (1951), రేషమ్(1952) తదితర చిత్రాల్లో హీరోగా నటించారు. పృథ్వీరాజ్ చౌహాన్, మహారాణా ప్రతాప్ వంటి కీలకమైన పాత్రల్లో నటించి మెప్పించారు. 1952లో ‘సాగర్’ అనే సినిమాను తనే నిర్మించి దర్శకత్వం వహించారు. తెలుగు వ్యక్తిగా హిందీ సినిమాల్లో హీరోగా ఎదిగిన అరుదైన ఘనతను సాధించారు. జీవితంపై డాక్యుమెంటరీనటుడిగా ఎదుగుతున్న సమయంలోనే ఢిల్లీకి చెందిన పంజాబీ మహిళ సావిత్రిని వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. భారతీయ సినీరంగానికి ఆయన చేసిన సేవలకు గానూ 1980లో దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం అందించారు. జైరాజ్ 2000వ సంవత్సరం 11 ఆగస్టున ముంబైలో మరణించారు. ఆయన జీవితంపై 2018లో తెలంగాణ ప్రభుత్వం ‘లైఫ్ జర్నీ ఆఫ్ జైరాజ్’ అనే డాక్యుమెంటరీని రూపొందించింది.చదవండి: 'మిరాయ్' విజయం.. మనోజ్ తల్లి ఎమోషనల్.. వీడియో వైరల్ -
రామాయణ కంటే ముందే సాయిపల్లవి బాలీవుడ్ ఎంట్రీ..
హీరోయిన్ సాయిపల్లవి హిందీలో నటించిన తొలి చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఆమిర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్, సాయిపల్లవి హీరో హీరోయిన్లుగా నటించిన రొమాంటిక్ లవ్స్టోరీ చిత్రం ‘మేరే రహో’. సునీల్ పాండే దర్శకత్వంలో ఆమిర్ ఖాన్, మన్సూర్ ఖాన్ నిర్మించిన ఈ చిత్రం డిసెంబరు 12న రిలీజ్ కానుంది. ఒకరితో ఒకరికి పరిచయం లేని ఓ అబ్బాయి, అమ్మాయి ఓ రోజు విచిత్రకరమైన పరిస్థితుల్లో కలుసుకుంటారు.ఆ పరిచయం వారి జీవితాలను ఎలా మార్చేసింది? అన్న కోణంలో ఈ ‘మేరే రహో’ సాగుతుందని బాలీవుడ్ సమాచారం. తొలుత ఈ సినిమాకు ‘ఏక్ దిన్’ అనే టైటిల్ అనుకున్నారు. నవంబరులో రిలీజ్ ప్లాన్ చేశారు. శుక్రవారం ఈ సినిమా టైటిల్, విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్. ఈ సినిమా కాకుండా హిందీలో ‘రామాయణ’ సినిమాలో సీతగా సాయిపల్లవి నటిస్తున్న సంగతి తెలిసిందే. -
30 ఏళ్లకే తల్లి పాత్రలా?.. ఛావా నటి ఆవేదన
ఈ ఏడాది ఛావా, ఆజాద్ చిత్రాలతో మెప్పించిన బాలీవుడ్ డయానా పెంటీ ఆసక్తికర కామెంట్స్ చేశారు. సినీ ఇండస్ట్రీలో మహిళలను ట్రీట్ చేసే విధానంపై స్పందించారు. ఇండస్ట్రీలో మహిళలను సామర్థ్యం కంటే.. కేవలం బాహ్య రూపానికే ప్రాధాన్యత ఇస్తారని తెలిపింది. కేవలం 30 ఏళ్ల వయసులేనే ఎంతోమంది పిల్లలకు తల్లిగా నటించే పాత్రలు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన డయానా మహిళా నటుల పట్ల చిత్ర పరిశ్రమ వైఖరిని ప్రశ్నించింది.డయానా మాట్లాడుతూ.. 'ఉదాహరణకు ఒక వేదికపై మిమ్మల్ని పరిచయం చేసినప్పుడు.. మీ అందం మీరు అద్భుతం ప్రశంసిస్తారు. ప్రజలు మర్యాదగా ప్రవర్తిస్తూ మీ రూపాన్ని ప్రశంసించడం చాలా బాగుంది. కానీ ఒక మహిళగా అది అంతకు మించి ఉంటుందని ఆశిస్తారు. ఒక నటిగా కేవలం అందం మాత్రమే కాకుండా.. నైపుణ్యం, నటనతో ప్రసిద్ధి చెందగలమని ఆశిస్తాం. అది మాకు చాలా అవసరం కూడా. మహిళ నటులను కేవలం బ్యూటీఫుల్, అద్భుతం అని పిలవడం మంచిదే.. కానీ అది సరిపోదు. ఇది ఒక పోరాటం కాదు. కొంతకాలంగా ఒక ఈ పద్ధతిని అంగీకరించడం ప్రారంభించారు. నేను అలాంటి దానిలో భాగం కావాలా వద్దా అనేది నా సొంత నిర్ణయం. దీన్ని ఎదుర్కోవడానికి అదే ఉత్తమ మార్గం. ఇది నాకు మాత్రమే కాదు.. అందరికీ వర్తిస్తుంది' అని పంచుకున్నారు.కాగా.. డయానా ప్రస్తుతం 'డు యు వాన్నా పార్టనర్' అనే వెబ్ సిరీస్తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సిరీస్లో తమన్నా భాటియా, జావేద్ జాఫెరి, నకుల్ మెహతా, శ్వేతా తివారీ, నీరజ్ కబీ కీలక పాత్రల్లో నటించారు. ఈ సిరీస్కు కోలిన్ డి'కున్హా, అర్చిత్ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ సిరీస్ను కరణ్ జోహార్, అదార్ పూనవల్లా, అపూర్వ మెహతా సహ నిర్మాతలుగా ఉన్నారు. ప్రస్తుతం డు యు వన్నా పార్టనర్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. -
తమన్నా లాంటి భార్య దొరికిందని అతడు ఆనందపడాలి
దాదాపు 20 ఏళ్లుగా సినిమాలు చేస్తున్న తమన్నా.. ఇప్పటికీ అదే ఊపు, జోష్ చూపిస్తూ కుర్ర హీరోయిన్లకు పోటీ ఇస్తోంది. కొత్త చిత్రాలు, వెబ్ సిరీసులు అంతే ఉత్సాహంతో ప్రమోషన్లలో పాల్గొంటూ ఆకట్టుకుంటోంది. నటన పరంగా ఈమె దూసుకుపోతున్నప్పటికీ.. ప్రేమ పరంగా ఈమె జీవితంలో ఓ బ్రేకప్ ఉంది. హిందీ నటుడు విజయ్ వర్మతో కొన్నాళ్ల పాటు డేటింగ్ చేసిన ఈమె.. కొన్నాళ్ల క్రితం బ్రేకప్ చెప్పేసుకుంది. ప్రస్తుతానికైతే సింగిల్గానే ఉంటోంది.అయితే త్వరలోనే తనకు కాబోయే అదృష్టవంతుడిని చూస్తారని తమన్నా ఇప్పుడు చెప్పడం ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే విజయ్ వర్మతో బ్రేకప్ అయి ఎన్నాళ్లు కాలేదు ఇప్పుడు తమన్నా ఈ తరహా కామెంట్స్ చేయడం కొత్త సందేహాలు రేకెత్తిస్తోంది. ఈమె నటించిన లేటెస్ట్ వెబ్ సిరీస్ 'డూ యూ వాన్నా పార్ట్నర్' ఈరోజు(సెప్టెంబరు 12) నుంచే స్ట్రీమింగ్ కానుంది. దీని ప్రమోషన్లలోనే మాట్లాడుతూ తన కాబోయే భాగస్వామి గురించి చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: ‘మిరాయ్’ మూవీ రివ్యూ)'మంచి జీవిత భాగస్వామిగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నాను. ప్రస్తుతం నా ఆలోచన అదే. గత జన్మలో ఎంత పుణ్యం చేసుంటే నాకు తమన్నా లాంటి భార్య దొరికిందని నా భర్త ఆనందపడాలి. దానికోసమే నా ప్రయత్నం. అయితే ఆ లక్కీ పర్సన్ ఎవరనేది నాకు తెలియదు. త్వరలోనే మీరు అతడిని చూస్తారేమో?' అని తమన్నా చెప్పింది. ఈమె మాట్లాడిన దానిబట్టి చూస్తుంటే మళ్లీ ప్రేమలో పడిందా అనే డౌట్ వస్తోంది. ఒకవేళ రిలేషన్లో ఉంటే అతడెవరా అనేది తెలియాల్సి ఉంది.2005 నుంచి తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటిస్తున్న తమన్నా ఇప్పటివరకు దాదాపు 90 సినిమాలు చేసింది. అలానే పలు వెబ్ సిరీసులు కూడా చేసింది. వయసు పెరుగుతున్నా సరే అదే అందాన్ని మెంటైన్ చేస్తూ అప్పుడప్పుడు ఐటమ్ సాంగ్స్ కూడా చేస్తూ యూత్ని అలరిస్తోంది. మరి పెళ్లెప్పుడు చేసుకుంటుందో చూడాలి?(ఇదీ చదవండి: ఏడాదిన్నర గ్యాప్.. హీరోయిన్ చేతిలో ఇప్పుడు 8 సినిమాలు) -
మద్యానికి, సిగరెట్కు గుడ్బై.. శాకాహారిగా మారిపోయిన రణ్బీర్!
ఉన్నది ఒక్కటే జిందగీ.. నాకు నచ్చినట్లు బతికేస్తా అని ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే కుదరదు. ఆరోగ్యాన్ని లెక్క చేయకపోతే వెంటనే అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. వయసుపైబడే కొద్దీ మరింత జాగ్రత్తగా ఉండాలి. సెలబ్రిటీలైతే నోరు చంపుకుని, వ్యసనాలు వదిలించుకుని ఫిట్నెస్పై మరింత ఫోకస్ పెంచాల్సి ఉంటుంది. అందులోనూ ఆధ్యాత్మిక సినిమాలు చేస్తున్నప్పుడు కొందరు చెడు వ్యసనాల జోలికి వెళ్లకుండా నిష్టగా ఉంటారు. బాలీవుడ్ స్టార్ రణ్బీర్ కపూర్ (Ranbir Kapoor) కూడా అదే చేశాడు.శాఖాహారిగా మారిపోయాప్రస్తుతం ఇతడు దేశంలోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రం రామాయణలో శ్రీరాముడిగా నటిస్తున్నాడు. సాయిపల్లవి సీతగా, యష్ రావణుడిగా కనిపించనున్నారు. రామాయణ (Ramayana Movie) ప్రారంభానికి ముందు రణ్బీర్ తన లైఫ్స్టైల్లో చాలా మార్పులుచేర్పులు చేసుకున్నాడు. సిగరెట్ తాగడం మానేశాడు, మద్యపానానికి గుడ్బై చెప్పాడు. పూర్తిగా శాకాహారిగా మారినట్లు తెలిపాడు. యోగా, ధ్యానం కూడా చేస్తున్నానని పేర్కొన్నాడు. రామాయణ మూవీ ప్రారంభానికల్లా చెడు అలవాట్లు శాశ్వతంగా మానేస్తానని తెలిపాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. రణ్బీర్ తీసుకున్న నిర్ణయాన్ని నెటిజన్లు అభినందిస్తున్నారు.సినిమారామాయణ సినిమాను నితీశ్ తివారి డైరెక్ట్ చేస్తున్నాడు. దాదాపు రూ.4 వేల కోట్ల భారీ బడ్జెట్తో రామాయణ రెండు భాగాలుగా తెరకెక్కించనున్నామని నిర్మాత నమిత్ మల్హోత్రా ప్రకటించారు. ఏఆర్ రెహమాన్, హాన్స్ జిమ్మర్ సంగీతం అందించనున్నారు. ఈ మూవీలో లక్ష్మణుడిగా రవిదూబే, హనుమంతుడిగా సన్నీడియోల్ నటిస్తున్నారు. రామాయణ పార్ట్ 1.. 2026 దీపావళికి, రామాయణ పార్ట్ 2.. 2027 దీపావళికి రిలీజ్ కానున్నాయి. రామాయణ్తో పాటు రణ్బీర్ మరో సినిమా చేస్తున్నాడు. భార్య, హీరోయిన్ ఆలియా భట్తో కలిసి లవ్ అండ్ వార్ మూవీ చేస్తున్నాడు. సంజయ్లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన ఈ మూవీ 2026 మార్చి 20న విడుదల కానుంది. 🚨 Ranbir Kapoor has given up smoking, drinking, and has even turned vegetarian — all in preparation for his role as Lord Ram in #Ramayana. A true embodiment of discipline and devotion. ✨🔥 pic.twitter.com/W5F3akrREK— Ramayana: The Epic (@RamayanaMovieHQ) September 7, 2025 చదవండి: నా కడుపులో తన్నాడు, ముఖంపై పిడిగుద్దులు..: బుల్లితెర నటి -
రైల్లో నుంచి దూకేసిన బాలీవుడ్ హీరోయిన్
బాలీవుడ్ హీరోయిన్ కరిష్మా శర్మ (Actress Karishma Sharma) కదులుతున్న రైలు నుంచి దూకేసింది. ముంబైలో బుధవారం నాడు లోకల్ ట్రైన్ ఎక్కిన ఆమె సడన్గా కిందకు దూకేయడంతో వెన్నెముకకు, తలకు గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. తన ఆరోగ్య పరిస్థితి గురించి ఆమె సోషల్ మీడియా వేదికగా అప్డేట్ ఇచ్చింది.కదులుతున్న రైలు నుంచి దూకేశా'షూటింగ్ కోసం వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. రైలులో చర్చ్గేట్కు వెళ్దామనుకున్నాను. స్టేషన్కు వెళ్లి ట్రైన్ ఎక్కాను. కాస్త వేగం పుంజుకున్నాక నా ఫ్రెండ్స్ ఇంకా ఎక్కలేదన్న విషయం గమనించాను. అప్పుడు నేను చీర కట్టుకుని ఉన్నాను. అయినా ధైర్యం చేసి దూకేయగా తలకు, వెన్నెముకకు దెబ్బ తగిలింది. MRI స్కాన్ చేశారు. కొద్దిరోజులు అబ్జర్వేషన్లో ఉంచాలన్నారు. సినిమాఈ ప్రమాదం జరిగినప్పటినుంచి నొప్పితో విలవిల్లాడుతున్నాను. మీ ప్రేమాభిమానాలే నన్ను కోలుకునేలా చేస్తాయి. దయచేసి నా కోసం ప్రార్థించండి' అని కోరింది. కాగా కరిష్మా శర్మ.. ప్యార్ కా పంచనామా 2, ఉజ్దా చమాన్, హోటల్ మిలన్, ఏక్ విలన్ రిటర్న్స్ మూవీస్లో నటించింది. రాగిణి ఎమ్ఎమ్ఎస్: రిటర్న్స్ వెబ్ సిరీస్లో ప్రధాన పాత్ర పోషించింది. బుల్లితెరపై పవిత్ర రిష్తా, కామెడీ సర్కస్, సిల్సిలా ప్యార్ కా వంటి సీరియల్స్లోనూ యాక్ట్ చేసింది.చదవండి: మర్యాద మర్చిపోయిన మనీష్.. ఎందుకు పట్టుకొచ్చావ్ శ్రీముఖి? -
ఆ కేసులో హీరోయిన్ హన్సికకు షాక్..!
హీరోయిన్ హన్సిక సినిమాల కంటే వ్యక్తిగత వివాదాలతోనే వార్తల్లో నిలుస్తోంది. ఇటీవలే ఆమె తన భర్తతో విడిపోతోందంటూ రూమర్స్ గట్టిగానే వినిపించాయి. తన ఇన్స్టా అకౌంట్ నుంచి హన్సిక పెళ్లి ఫోటోలు, వీడియోలు డిలీట్ చేయడంతో రూమర్స్ మొదలయ్యాయి. అంతేకాకుండా సోహెల్కు రెండో పెళ్లి కావడంతోనే వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయని మరో టాక్ వినిపించింది. అయితే ఇవన్నీ చూస్తుంటే తనకు నవ్వొస్తుందని హన్సిక కొట్టిపారేసింది.ఈ సంగతి అటుంచితే గతంలో హన్సికతో ఆమె తల్లి జ్యోతిలపై సోదరుడి భార్య ముస్కాన్ గృహ హింస కేసు పెట్టారు. తనను వేధింపులకు గురి చేశారని బుల్లితెర నటి ముస్కాన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఈ కేసులో ఇప్పటికే హన్సిక, ఆమె తల్లికి ముంబయి సెషన్స్ కోర్ట్ బెయిల్ మంజూరు చేసింది. కానీ ఈ కేసును క్వాష్ చేయాలంటూ హన్సిక బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.తాజాగా హన్సిక పిటిషన్పై విచారణ చేపట్టిన ధర్మాసనం ఆమె విజ్ఞప్తిని తిరస్కరించింది. హన్సిక దాఖలు చేసిన పిటిషన్ బాంబే హైకోర్టు కొట్టిపారేసింది. దీంతో ఈ కేసులో నిరాశే ఎదురైంది. కాగా.. హన్సిక సోదరుడు ప్రశాంత్ మోత్వానీ.. టీవీ నటి ముస్కాన్ జేమ్స్ను 2020లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో 2022లో విడిపోవాలని నిర్ణయించుకున్నారు. అదే సమయంలో హన్సికతో పాటు సోదరుడు ప్రశాంత్, తల్లి జ్యోతిలపై ముస్కాన్ ఫిర్యాదు చేసింది. -
ఫ్లాష్ బ్యాక్...అన్నయ్యతో ఆన్ స్క్రీన్ రొమాన్స్!
నటనే అయినప్పటికీ కూడా నిజ జీవితంలో అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్లు... తెరపై జంటగా కనిపించడాన్ని భారతీయ ప్రేక్షకులు ఏ మాత్రం ఒప్పుకోరు. అందుకే నటనను ఎంత ప్రొఫెషనల్గా తీసుకున్నప్పటికీ అలాంటి సాహసం మన దేశంలోని ఏ నటిగానీ ఏ నటుడుగానీ చేయరు. కానీ చాలా కాలం క్రితమే అలాంటి ధైర్యం చేసింది ఓ అందాల బాలీవుడ్ నటి. తన స్వంత అన్నయ్యతో రొమాంటిక్ జోడిగా నటించి, నర్తించి ఆ తర్వాత జనాగ్రహానికి గురైంది. ఆమె పేరు మిను ముంతాజ్.భారతీయ సినిమాలో ప్రతిభావంతులైన నృత్యకారిణి, క్యారెక్టర్ నటిగా ప్రసిద్ధి చెందిన మిను ముంతాజ్, ముంబైలో జన్మించిన ఆమె తండ్రి ముంతాజ్ అలీ కూడా ప్రముఖ నటుడు నృత్యకారుడు కూడా. ఆమె అతని నుంచి నృత్య కళను నేర్చుకోవడం దగ్గర నుంచి అతని అడుగుజాడల్లోనే నడిచింది, కాలక్రమంలో ఆమె తండ్రి మద్యానికి బానిసగా మారాడు. దాంతో టీనేజ్లోనే మిను కుటుంబ ఆర్థిక భారాన్ని మోయవలసి వచ్చింది.నటనపై ఇష్టం అనే కన్నా సంపాదన కోసమే మిను 1955లో 13 సంవత్సరాల వయసులో నానాభాయ్ భట్ చిత్రం హకీమ్ ద్వారా తెరంగేట్రం చేసింది. ఆమె తల్లికి ఇష్టం లేకున్నా, సినిమా కెరీర్ను తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ, మిను ముంతాజ్ తన కుటుంబాన్ని పోషించడానికి తప్పనిసరై నటనను కొనసాగించింది. 14 సంవత్సరాల వయస్సులోనే పలు విజయవంతమైన చిత్రాలలో నటించి ప్రజాదరణ పొందింది. హిందీ చిత్ర పరిశ్రమలో 1950లు 60లలో, ఆమె ప్రముఖ సెలబ్రిటీగా మారింది. అప్పటి చాలా మంది తారల్లాగే మిను ముంతాజ్ది కూడా ఒక పెద్ద కుటుంబం ఆమెకు నలుగురు సోదరులు నలుగురు సోదరీమణులు ఉండేవారు. ఆమె అన్నయ్య మెహమూద్ సైతం అప్పటికే బాలీవుడ్లో స్థిరపడిన హాస్య నటుడు. అతను నటించిన హౌరా బ్రిడ్జి సినిమా 1958 లో విడుదలైంది. అయితే ఈ సినిమాలో ‘‘కోరా రంగ్ సునారియా కలి’’ అనే రొమాంటిక్ పాటలో మెహమూద్ సరసన మిను ముంతాజ్ ప్రియురాలిగా హొయలొలికిస్తూ నటించారు. సినిమా విడుదలైన తర్వాత, ఆ రొమాంటిక్ పాత్రలో నటించిన నటులు నిజ జీవితంలో తోబుట్టువులని తెలుసుకుని ప్రేక్షకులు షాక్కి గురయ్యారు. ఈ తారల నైతికత కుటుంబ సంబంధాల సున్నితత్వాన్ని ప్రశ్నిస్తూ ప్రజలు వీధుల్లో కి వెళ్లి మరీ నిరసన తెలిపారు. దీనికి స్పందించిన నటులు క్షమాపణ చెప్పడమే కాక మిను ముంతాజ్ తాను కుటుంబ ఆర్ధిక పరిస్థితి దృష్ట్యా మాత్రమే ఆ పనిచేశానని పశ్చాత్తాపం వ్యక్తం చేయడంతో కొంత కాలానికి ఆ వివాదం సద్దుమణిగింది. ఆ తర్వాత ఆ వివాదం ప్రభావమో మరొకటో గానీ మిను ముంతాజ్ స్వల్ప కాలంలోనే అవకాశాలు లేక పరిశ్రమకు దూరమై, ఒక దర్శకుడిని వివాహం చేసుకుని ు కెనడాలో స్థిరపడింది, అక్కడ నివసిస్తూ 2003లో, మిను ముంతాజ్ ఆరోగ్యం క్షీణించడం జ్ఞాపకశక్తి కోల్పోవడం ప్రారంభమైంది వైద్య పరీక్షల్లో ఆమెకు 15 సంవత్సరాలుగా గుర్తించబడని మెదడు కణితి ఉందని తేలింది. అనారోగ్యంతో చాలా కాలం పోరాడిన మిను ముంతాజ్ 2021లో మరణించారు, -
నేషనల్ అవార్డ్ విన్నర్ కొత్త సినిమా.. రేపే రిలీజ్
తొలి సినిమా 'తిథి' (కన్నడ మూవీ)తోనే జాతీయ అవార్డు అందుకున్న రామ్ రెడ్డి మరో కొత్త చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఆయన దర్శకత్వం వహించిన లేటెస్ట్ మూవీ జుగ్నుమా (Jugnuma - The Fable film). ఈ మూవీ ద ఫేబుల్ పేరిట అంతర్జాతీయ స్థాయిలో విడుదలైంది. ఇప్పుడు దేశీయ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. సెప్టెంబర్ 12న ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అలరించనుంది. జుగ్నుమా కథ ఇప్పటిది కాదు! తొమ్మిదేళ్ల క్రితం హిమాలయాల్లో అగ్నిప్రమాదం జరిగినప్పుడు వాటిని ఆర్పేందుకు అగ్నిమాపక దళాలకు తనవంతు సాయం చేశాడు రామ్ రెడ్డి. ఆ సమయంలో ఈ కథ పురుడు పోసుకుంది. భారత్- నేపాల్ సరిహద్దులోని హిమాలయ ప్రాంతాల్లో ఈ మూవీ షూటింగ్ చేశారు. ఇందులో అడవిలో చెట్లను పరిరక్షించాల్సిన ఆవశ్యకత గురించి నొక్కి చెప్పారు. మనోజ్ బాజ్పాయ్, ప్రియాంక బోస్ ప్రధాన పాత్రలు పోషించారు. బెర్లిన్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవ వేడుకలో జుగ్నుమా ప్రదర్శితమైంది. లీడ్స్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో ఉత్తమ చిత్రం అవార్డు దక్కించుకుంది. సినిమా ప్రదర్శితమైన ప్రతి చోటా దర్శకుడి ప్రతిభకు ప్రశంసలు దక్కాయి. దర్శకనటుడు అనురాగ్ కశ్యప్, నిర్మాత గునీత్ మోంగా సైతం సినిమా చూసి అభినందించారు. -
సతీమణి బాటలో అభిషేక్ బచ్చన్.. 24 గంటల్లోనే కోర్టుకు!
బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్(Abhishek Bachchan) గురించి ప్రస్తుతం పెద్దగా సినిమాలేవీ చేయట్లేదు. ఒకట్రెండు చిత్రాల్లో కనిపించినా అవీ కూడా ఓటీటీల్లోనే నేరుగా రిలీజయ్యాయి. ఈ ఏడాది హౌస్ఫుల్ -5, కాళీధర్ లపత్తా లాంటి చిత్రాలతో అభిమానులను మెప్పించారు.ఇక సినిమాల సంగతి పక్కనపెడితే.. ఇటీవలే అభిషేక్ సతీమణి ఐశ్వర్య రాయ్ తన అనుమతి లేకుండా ఫోటోలు, పేరును వినియోగించకుండా చూడాలని కోర్టును ఆశ్రయించారు. తన ఫోటోలను పలు వాణిజ్య ప్రకటనల కోసం ఉపయోగిస్తున్న వాటిని తొలగించాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఎలాంటి ముందస్తు పర్మిషన్ లేకుండానే అనేక వెబ్సైట్లు తన పేరును ఉపయోగించి పలు వస్తువులను విక్రయిస్తున్నాయని ఆమె పేర్కొంది. ఏఐ- జనరేటెడ్ ద్వారా తన పోటోలను మార్ఫింగ్ చేసి వీడియోలను కూడా ప్రసారం చేస్తున్నారని ఐశ్వర్య ప్రస్తావించారు.అదే బాటలో అభిషేక్ బచ్చన్..అయితే తన భార్య పిటిషన్ వేసిన 24 గంటల్లోనే అభిషేక్ బచ్చన్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన పబ్లిసిటీ, వ్యక్తిగత హక్కులకు రక్షణ కల్పించాలని న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. కొన్ని వెబ్సైట్లు తన అనుమతి లేకుండా ఫొటోలు, వీడియోలు వాడుకుంటున్నాయని పిటిషన్లో ప్రస్తావించారు. ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేయాలని కోర్టును కోరారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం కొన్ని వెబ్సైట్లు, యూట్యూబ్ ఛానెల్స్ అనధికారికంగా ఫోటోలను ఉపయోగించడంపై నిషేధం విధించాలని ఆయన అభ్యర్థించారు.దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. దయచేసి ఆ వెబ్సైట్ల వివరాలు సమర్పిస్తే చర్యలకు ఆదేశాలు జారీ చేస్తామని అభిషేక్ తరఫు న్యాయవాదికి సూచించారు. ఒక రోజు సమయం ఇస్తే పూర్తి వివరాలు అందజేస్తామని న్యాయవాది ప్రవీణ్ ఆనంద్ కోర్టుకు తెలిపారు. కొందరు వ్యక్తులు ఏఐతో అభిషేక్ ఫొటోలు క్రియేట్ చేసి అశ్లీల కంటెంట్కు ఉపయోగించుకుంటున్నట్లు కోర్టుకు వివరించారు. -
ప్రభాస్ సినిమా చూసి భారతీయ సినిమాలను నిషేధించాడు!
భారత్కు చిరకాల మిత్ర దేశం, పొరుగు దేశమైన నేపాల్ అల్లర్లతో అట్టుడికిపోతోంది. అవినీతితో పాటు సోషల్ మీడియాపై నిషేధాలతో మొదలైన ప్రజాగ్రహానికి ప్రధాని సహా ప్రభుత్వం మొత్తం దాసోహమైపోయింది. అల్లర్లకు బాధ్యత వహిస్తూ ప్రధాని , దేశాధ్యక్షుడు సహా రాజీనామా చేసేశారు. ఈ నేపధ్యంలో ఆ దేశ ప్రధానిగా బాలేంద్ర షా పగ్గాలు చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఖాట్మాండు మేయర్గా ఉన్న బాలేంద్ర కు యువతలో ఉన్న ఆదరణ, ఆయనను ప్రధానిగా కోరుకుంటున్న వారు పెద్ద సంఖ్యలో ఉండడంతో తదుపరి ప్రధాని ఆయనే అనే ఆలోచన బలపడుతోంది.ఈ నేపధ్యంలో కాబోయే ప్రధానిగా పేర్కొంటున్న బాలేంద్ర షా కు భారత్ తో ఉన్న వైరుధ్యాలు ప్రస్తావనకు వస్తున్నాయి. అందులో మరీ ముఖ్యంగా ఆయన రెండేళ్ల క్రితం భారత సినిమాలపై చూపించిన అవసరానికి మించిన ఆగ్రహం ప్రస్తావనార్హంగా మారింది. రెండేళ్ల క్రితం ఖాట్మండు మేయర్ హోదాలో ఆయన ఖాట్మాండు నగరంలో భారతీయ సినిమాల ప్రదర్శనలను నిలిపేయాలని ఆదేశించారు. దాంతో ఖాట్మాండు మెట్రోపాలిస్తో పాటు, పోఖారా మెట్రోపాలిటన్ నగరం కూడా భారతీయ చిత్రాల ప్రదర్శనపై నిషేధం విధించింది. ఈ విషయంలో పోఖారా మేయర్ ధనరాజ్ ఆచార్య కూడా బాలేంద్ర షా మార్గాన్నే అనుసరిస్తూ బాలీవుడ్ చిత్రాల ప్రదర్శనను నిలిపివేయాలని మధ్య నేపాల్లోని మెట్రోపాలిటన్ నగరంలోని సినిమా హాళ్లను ఆదేశించారు. రెండు మెట్రోపాలిటన్ నగరాల మేయర్ల ఆదేశాల తర్వాత, అక్కడ సినిమా హాళ్లు హిందీ లేదా బాలీవుడ్ చిత్రాల ప్రదర్శనను రద్దు చేసి, వాటి స్థానంలో హాలీవుడ్ నేపాలీ సినిమాలను అప్పటికప్పుడు ప్రవేశపెట్టాయి. ఇంతకీ ఇలా బాలీవుడ్ చిత్రాలపై నేపాల్ మేయర్ల ఆగ్రహానికి కారణమైంది టాలీవుడ్ రెబల్ స్టార్ నటించిన ఆదిపురుష్ సినిమా కావడం విశేషం. దీనికి కారణాలను బాలేంద్ర షా సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు. ‘భారతీయ చిత్రం ఆదిపురుష్ చూశాను. ఆ సినిమాలో రాముని సతీమణి జానకి జన్మ స్థలంపై తప్పు సమాచారం ఉంది . అందులో ఆమెను భారతదేశపు కుమార్తె అని చెప్పే సంభాషణ ఉంది (నేపాలీయులు సీతమ్మ తమ నేలపైనే జన్మించినట్టు విశ్వసిస్తారు), ఇది సరికాదని, అభ్యంతరకరమైనదని మేం వారి దృష్టికి తీసుకెళ్లాం. తప్పును సరిదిద్దడానికి 3 రోజుల సమయంతో అల్టిమేటం ఇచ్చాము. అయినా వారు పట్టించుకోలేదు. నేపాల్ స్వేచ్ఛ, స్వాతంత్య్రం ఆత్మగౌరవాన్ని చెక్కుచెదరకుండా ఉంచడం ద్వారా జాతీయ ప్రయోజనాలను కాపాడటం ప్రతి ప్రభుత్వం, ప్రభుత్వ సంస్థ, ప్రభుత్వేతర రంగం నేపాలీ పౌరుడి ప్రథమ కర్తవ్యం అనడంలో ఎటువంటి సందేహం లేదు‘ అని ఖాట్మండు మేయర్ అప్పట్లో తన ఫేస్బుక్ పోస్ట్లో పేర్కొన్నారు.అయితే ఆ తర్వాత నేపాలీ రాజధానిలో ప్రదర్శనపై నిషేధం నేపధ్యంలో, ’ఆదిపురుష్’ నిర్మాణ సంస్థ ’టి–సిరీస్’ నేపాలీ మేయర్కు లేఖ రాసింది. అనంతరం సినిమాల నిషేధాన్ని ఎత్తివేయాలని ఆదేశాలిస్తూ న్యాయస్థానాలు జోక్యం చేసుకోవడంతో ఈ వివాదం సద్ధుమణిగింది. -
చిన్నారికి అరుదైన వ్యాధి.. హీరోయిన్ ఆపన్నహస్తం
అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారిని ఆదుకునేందుకు ముందుకు వచ్చింది బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ (Jacqueline Fernandez). బాబు ఇంటికి వెళ్లి తనతో కబుర్లు చెప్పి, ఆడించి నవ్వించే ప్రయత్నం చేసింది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అందులోని బాబు తల బెలూన్లా ఉబ్బిపోయి ఉంది. తలపై నరాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితిని హైడ్రోసెఫాలస్ (Hydrocephalus) అని పిలుస్తారు. అరుదైన వ్యాధిఈ వ్యాధి వచ్చిన శిశువుల తల అసాధారణంగా పెద్దగా ఉంటుంది. ఈ వ్యాధితో ఓ బాలుడు బాధపడుతున్నాడని తెలిసి జాక్వెలిన్ చలించిపోయింది. వెంటనే అతడి కుటుంబాన్ని కలిసి సర్జరీ చేయిస్తానని హామీ ఇచ్చింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ హుస్సేన్ మన్సూరి వెల్లడిస్తూ జాక్వెలిన్కు అభినందనలు తెలిపాడు. పిల్లవాడు మళ్లీ మామూలు స్థితికి వస్తాడని ఆశిద్దామని పోస్ట్ పెట్టాడు. మంచి మనసుకాగా జాక్వెలిన్ పలు స్వచ్ఛంద సంస్థలకు సాయం చేస్తూ ఉంటుంది. మూగ జీవాల సంరక్షణ, పిల్లల చదువులు.. ఇలా అన్నింటికోసం పాటుపడుతూ ఉంటుంది. అలాగే శారీరక ఆరోగ్యమే కాదు మానసిక ఆరోగ్యం కూడా ఎంతో ముఖ్యమని జనాల్లో అవగాహన కల్పించేందుకు క్యాంపెయిన్స్ చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం జాక్వెలిన్.. వెల్కమ్ టు ద జంగిల్ సినిమా చేస్తోంది. అహ్మద్ ఖాన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఈ ఏడాది చివర్లో విడుదల కానుంది. View this post on Instagram A post shared by Hussain Mansuri (@iamhussainmansuri) చదవండి: నీ దయాదాక్షిణ్యాలతో బతుకుతున్నామా? రెచ్చిపోయిన మాస్క్మ్యాన్ -
స్పై మ్యూజియంలో...
సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ హీరో, హీరోయిన్లుగా నటించిన స్పై యాక్షన్ డ్రామా ‘ఏక్ థా టైగర్’. ఈ చిత్రానికి అరుదైన గౌరవం దక్కింది. వాషింగ్టన్ డీసీలోని ఇంటర్నేషనల్ స్పై మ్యూజియంలో ఈ సినిమా పోస్టర్ను ప్రదర్శించారు. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ చిత్రం ‘ఏక్ థా టైగర్’ కావడం విశేషం. ఈ విషయంపై ‘ఏక్ థా టైగర్’ దర్శకుడు కబీర్ ఖాన్ మాట్లాడుతూ– ‘‘అప్పట్లో అత్యధిక కలెక్షన్స్ సాధించిన ఈ చిత్రానికి ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించడం సంతోషంగా ఉంది. ఓ సినిమా సక్సెస్ను బాక్సాఫీస్ వసూళ్లు మాత్రమే నిర్ణయించలేవు.ఆ సినిమా ప్రేక్షకులకు ఎంతకాలం గుర్తుంటుందన్నది కూడా ముఖ్యమే’’ అని పేర్కొన్నారు. ఇక వాషింగ్టన్ డీసీలోని ఇంటర్నేషనల్ స్పై మ్యూజియంలో ‘జేమ్స్బాండ్, మిషన్ ఇంపాజిబుల్’ తదితర స్పై చిత్రాల పోస్టర్స్ను ప్రదర్శించారు. ఈ హాలీవుడ్ చిత్రాల చెంత హిందీ మూవీ చేరడం ఓ విశేషం. రూ. 75 కోట్ల బడ్జెట్తో ఆదిత్య చోప్రా నిర్మించిన ‘ఏక్ థా టైగర్’ (2012) దాదాపు రూ. 300 కోట్లకుపైగా వసూళ్లు సాధించింది. ఈ సినిమాకు సీక్వెల్స్గా వచ్చిన ‘టైగర్ జిందా హై, టైగర్ 3’ చిత్రాలు కూడా సక్సెస్ అయ్యాయి. ఇక ప్రస్తుతం ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్’ చిత్రం షూట్తో హీరోగా బిజీగా ఉన్నారు సల్మాన్. -
రూ.80 కోట్ల మోసం.. ఆ డెరెక్టర్ పెద్ద మోసగాడు: ప్రముఖ నిర్మాత
బాలీవుడ్ ప్రముఖ నిర్మాత వాసు భగ్నానీ సంచలన ఆరోపణలు చేశారు. ‘సుల్తాన్’, ‘టైగర్ జిందా హై’ వంటి బ్లాక్బస్టర్ చిత్రాలకు దర్శకత్వం వహించిన అలీ అబ్బాస్ జాఫర్ తనను మోసం చేశారంటూ కామెంట్స్ చేశారు. సినిమా నిర్మాణంలో దాదాపు రూ.80 కోట్ల వరకు అవతవకలకు పాల్పడారంటూ ఆరోపించారు. అక్షయ్ కుమార్ నటించిన ‘బడే మియాన్ చోటే మియాన్’ సినిమా నిర్మించే సమయంలో తన ఫేక్ కంపెనీతో మనీ లాండరింగ్కు పాల్పడ్డాడని వాసు భగ్నానీ వెల్లడించారు.తన ఫేక్ కంపెనీ పేరుతో ఆర్థిక నిర్వహణలో తీవ్రమైన అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపించారు. అబుదాబిలో రిజిస్టర్ చేసిన కంపెనీ పేరుతో.. ముంబయిలో జాలీ జంపర్ ఫిల్మ్స్ ఎల్ఎల్సీ పేరుతో మనీలాండరింగ్ చేశాడని అన్నారు. సినిమా బడ్జెట్ను దాదాపు రూ. 80 కోట్లు పెంచారని భగ్నాని వెల్లడించారు. ఆఖరికి నటీనటుల పారితోషికం తగ్గించినా భారీ మోసం కావడంతో ఇబ్బందులు పడ్డానని తెలిపారు. దీనిపై బాంద్రా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. కేవలం నా డబ్బును తిరిగి పొందడం మాత్రమే కాదు. మరే ఇతర నిర్మాత ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సిన అవసరం రాకూడదని నిజం బయటకు రావాలని పోరాడుతున్నట్లు వాసు భగ్నానీ అన్నారు.నిర్మాత వాసు భగ్నానీ మాట్లాడుతూ.. 'అలీ అబ్బాస్ జాఫర్, హిమాన్షు మెహ్రా.. ఏఏజెడ్ ఫిల్మ్స్ అనే బ్యానర్ కింద పనిచేస్తున్నారు. మేము బడే మియాన్ చోటే మియాన్ మూవీ కోసం వారితో జతకట్టా. నేను ఈ ప్రాజెక్ట్ కోసం ఆర్థిక సహాయం కూడా చేశా. వారికి దర్శకత్వాన్ని బాధ్యతలు అప్పగించా. సృజనాత్మక నిర్ణయాలలో తాను పెద్దగా జోక్యం చేసుకోలేదని.. లండన్తో పాటు ఇండియాలో జాఫర్ సూచించిన షూటింగ్ ప్రదేశాలను ఆమోదించా. అయితే రెండు నెలల క్రితమే జాలీ జంపర్ ఫిల్మ్స్ ఎల్ఎల్సీ సంస్థ గురించి తెలుసుకున్నా. అది జాఫర్ సహాయకుడి పేరుతో రిజిస్టర్ చేశారు. ఇదంతా బయటికి రాకుండా రహస్యంగా నిర్వహించారు. సినిమా ఖర్చులను పెంచడం, నకిలీ ఇన్వాయిస్లు సృష్టించి నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారు" అని అన్నారు. కాగా.. గతంలో బాలీవుడ్ నిర్మాత, హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ భర్త జాకీ భగ్నానీ కూడా ఈ సినిమా కోసం ఆస్తులు తాకట్టు పెట్టామని ఆవేదన చెందారు. -
రూ.30 వేల కోట్లు కొట్టేసే ప్లాన్.. సవతి తల్లిపై హీరోయిన్ పిల్లలు ఆరోపణ
బాలీవుడ్లో మరో ఆస్తి వివాదం హాట్ టాపిక్ అయింది. ప్రముఖ హీరోయిన్ కరిష్మా కపూర్ పిల్లలు ఇప్పుడు ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించడంతో ఈ విషయం కొత్త మలుపు తిరిగింది. తమకు సవతి తల్లి ఫేక్ వీలునామా ఇచ్చిందని ఈ పిల్లలిద్దరూ ఆరోపణ చేస్తున్నారు. తండ్రి ఆస్తిలో తమ వాటా కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇంతకీ ఏంటి విషయం? అసలేం జరుగుతోంది?బాలీవుడ్ నటి కరిష్మా కపూర్.. 2003లో సంజయ్ కపూర్ అనే బిజినెస్మ్యాన్ని పెళ్లి చేసుకుంది. అప్పటికే అతడికి ఓసారి పెళ్లయి విడాకులు తీసుకున్నాడు. అంటే కరిష్మా రెండో భార్య. దాదాపు 13 ఏళ్ల పాటు ఈమెతో కలిసున్న సంజయ్.. 2016లో విడాకులు ఇచ్చేశాడు. వీళ్లకు సమైరా, కియాన్ అని ఇద్దరు పిల్లలు. కరిష్మాకు విడాకులు ఇచ్చిన తర్వాత సంజయ్.. ప్రియ సచ్దేవ్ని వివాహమాడాడు.(ఇదీ చదవండి: జైల్లో ఉండలేకపోతున్నా.. ఇంత విషం ఇవ్వండి: హీరో దర్శన్)ఈ ఏడాది జూన్లో సంజయ్ కపూర్.. గుండెపోటుతో చనిపోయాడు. అప్పటినుంచి తమ తండ్రి ఆస్తిలో తమకు వాటా దక్కకుండా సవతి తల్లి ప్రియ మోసం చేస్తోందని కరిష్మా కపూర్ పిల్లలు అంటున్నారు. ఇటీవల జరిగిన ఫ్యామిలీ మీటింగ్లోనూ నకిలీ వీలునామా చూపించిందని, తండ్రి మరణానంతరం ఆస్తి వివరాలు చెప్పేందుకు గానీ సంబంధిత డాక్యుమెంట్స్ చూపించేందుకు గానీ ఆమె నిరాకరిస్తోందని పేర్కొన్నారు. చట్టపరంగా ఆస్తిలో తమకు రావాల్సిన వాటాని ఇప్పించాలని కోర్టుని ఆశ్రయించారు.సంజయ్ కపూర్ రాసిచ్చిన అసలు వీలునామా దాచిపెట్టి నకిలీది సవతి తల్లి ప్రియ తమకు చూపించిందనేది కరిష్మా కపూర్ పిల్లల ఆరోపణ. మరోవైపు ప్రియ సచ్దేవ్తో పాటు పలువురు వ్యక్తులు బలవంతంగా తమ తల్లి నుంచి సంతకాలు తీసుకున్నారని సంజయ్ సోదరి మందిర కపూర్ మీడియాకు చెప్పింది. దీంతో ఇది కాస్త ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సంజయ్ మరణించే నాటికి అతడి ఆస్తి విలువ దాదాపు రూ.30 వేల కోట్లు అని సమాచారం.(ఇదీ చదవండి: సీక్రెట్గా పెళ్లి చేసుకున్న యువ హీరోయిన్) -
'అందుకే చాహల్ను అగౌరవపరచలేదు'.. మాజీ భార్య ధనశ్రీ వర్మ
కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మ గురించి పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే క్రికెటర్ చాహల్ పెళ్లాడిన ఆమె.. కొన్నేళ్లకే వివాహ బంధానికి ఎండ్ కార్డ్ పడేసింది. 2020లో పెళ్లి బంధంలోకి అడుగుపెట్టిన ఈ జంట.. ఈ ఏడాది ఫిబ్రవరిలో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత చాహల్, ఆర్జే మహ్వశ్తో డేటింగ్లో ఉన్నట్లు కథనాలొచ్చాయి. వీరిద్దరు తమ వస్తున్న రూమర్స్పై ఇప్పటి వరకు స్పందించలేదు.అయితే చాహల్తో విడాకుల తర్వాత మాజీ భార్య ధనశ్రీ వర్మ ఈ విషయంపై మాట్లాడింది. రియాలిటీ షో రైజ్ అండ్ ఫాల్లో పాల్గొన్న ధనశ్రీ వర్మ విడాకుల తర్వాత తనను చాలా అగౌవరంగా మాట్లాడారని గుర్తు చేసుకుంది. అయితే తాను తిరిగి చాహల్ పట్ల అగౌరవపరిచేలా వ్యవహరించకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. ఎందుకంటే ఒకప్పుడు అతను నా భర్త కావడం వల్లే తనకు గౌరవం ఉందని పేర్కొంది.మీరు బాధ్యతాయుతంగా ఉన్నప్పుడు.. ఇతరులను గౌరవించడం కూడా మీ చేతుల్లో ఉంటుందని ధనశ్రీ వర్మ అన్నారు. ఒక మహిళగా నాకు ఈ విషయాలు చెప్పే హక్కు లేదా? అని ప్రశ్నించారు. అతను నా భర్త.. నేను వివాహం చేసుకున్నప్పుడు కూడా చాహల్ను గౌరవించానని తెలిపింది. మన ఇమేజ్ కోసం ఇతరులను తక్కువ చేయాల్సిన అవసరం లేదన్నారు. నాపై ఎంత నెగెటివ్ ప్రచారం చేసినా.. ఎంత బ్యాడ్గా చెప్పినా.. మీ టైమ్ వేస్ట్ తప్ప ఎలాంటి ఫలితం ఉండదని ధనశ్రీ వర్మ పేర్కొన్నారు. -
అతని కోసం రూ.70 లక్షలు వదులుకున్న శ్రీదేవి: బోనీ కపూర్
దివంగత నటి శ్రీదేవి చివరి రోజుల కొన్ని దశాబ్దాల పాటు సినీ ప్రియులను అలరించింది. వెండితెరపై తనదైన అందం, నటనతో ఆకట్టుకుంది. కానీ ఊహించని విధంగా 2018లోనే ఓ హోటల్లో మరణించింది. ఆమె చివరిసారిగా నటించిన చిత్రం మామ్. ఆమె భర్త బోనీ కపూర్ నిర్మాతగా ఈ మూవీని తెరకెక్కించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన బోనీ కపూర్ ఈ చిత్రం గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. మామ్ కోసం శ్రీదేవి చాలా కష్టపడిందని అన్నారు. ఈ సినిమాకు తెలుగు, తమిళ, హిందీ వర్షన్స్కు తానే స్వయంగా డబ్బింగ్ చెప్పుకుందని తెలిపారు. ఈ మూవీ కోసం తన రెమ్యునరేషన్ సైతం వదులుకుందని వెల్లడించారు.బోనీ మాట్లాడుతూ.. "మామ్ షూటింగ్ సమయంలో మేము ఏఆర్ రెహమాన్ను తీసుకోవాలనుకున్నాం. కానీ అతనికి భారీగా పారితోషికం ఇవ్వాల్సి వస్తుంది. అంత ఖర్చు మేం భరించలేకపోయా. శ్రీదేవి రెమ్యునరేషన్ కోసం కొంత మొత్తాన్ని పక్కనపెట్టాం. కానీ ఆమె నాకు బ్యాలెన్స్ డబ్బులేవీ వద్దు. ఆ మిగిలిన మొత్తం రూ.70 లక్షలు రెహమాన్కు ఇచ్చిన తీసుకురావాలని చెప్పిందని' గుర్తు చేసుకున్నారు.అంతేకాకుండా మామ్ షూటింగ్ సమయంలో తనతో గది పంచుకోవడానికి కూడా శ్రీదేవి నిరాకరించిందని బోనీ కపూర్ వెల్లడించారు. సినిమా పట్ల అంత నిబద్ధతగా పనిచేసిందని తెలిపారు. ఈ సినిమా ఎక్కువ భాగం ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో.. ఆ తర్వాత జార్జియాలో చిత్రీకరించామన్నారు. సినిమా షూటింగ్ మొత్తం కాలంలో శ్రీదేవి ఎప్పుడూ గది పంచుకోలేదని వివరించారు. తన మైండ్సెట్ డైవర్ట్ కాకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకుందన్నారు. ఆమె ఆ పాత్ర పట్ల ఎంతో నిబద్ధతతో పనిచేసిందని పంచుకున్నారు.కాగా.. ఇటీవల ఐఫా రజతోత్సవ వేడుకల సందర్భంగా బోనీ కపూర్.. మామ్ మూవీకి సీక్వెల్ను ప్రకటించారు. ఈ చిత్రం శ్రీదేవి కుమార్తె ఖుషీ కపూర్ ప్రధాన పాత్రలో నటించే అవకాశముందని బోనీ అన్నారు. కాగా.. 2017లో విడుదలైన మామ్ చిత్రంలో నవాజుద్దీన్ సిద్ధిఖీ, అక్షయ్ ఖన్నా కూడా నటించారు. రూ.30 కోట్లతో రూపొందించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.175 కోట్లు వసూలుచేసింది. -
హీరో కుటుంబంతో కలిసి శ్రీలీల పండగ సెలబ్రేషన్స్
శ్రీలీల ప్రస్తుతం తెలుగు, తమిళ, హిందీలో సినిమాలు చేస్తోంది. అయితే ఈ ఏడాది ప్రారంభం నుంచి ఈమెపై రూమర్స్ వస్తున్నాయి. బాలీవుడ్ యంగ్ హీరో కార్తిక్ ఆర్యన్తో ఈమె డేటింగ్లో ఉందని అంటున్నారు. అందుకు తగ్గట్లు పలుమార్లు కలిసి కనిపించడం పుకార్లకు ఊతమిస్తోంది. తాజాగా వీళ్లిద్దరూ కలిసి వినాయక చవితి సెలబ్రేట్ చేసుకోవడం కొత్త సందేహాలు రేకెత్తిస్తోంది. ఇంతకీ ఏంటి విషయం?శ్రీలీల ఇప్పటివరకు పలువురు హీరోలతో కలిసి పనిచేసింది. కానీ కార్తిక్ ఆర్యన్తో కాస్త చనువుగా ఉన్నట్లు కనిపిస్తుంది. ఎందుకంటే కొన్నిరోజుల క్రితం సోదరి డాక్టర్ పట్టా అందుకున్న సందర్భంగా కార్తిక్ ఆర్యన్ ఇంట్లో చిన్న పార్టీ చేసుకున్నారు. ఇందులో కార్తిక్ ఫ్యామిలీతో పాటు శ్రీలీల కనిపించారు. అలానే కొన్నాళ్ల క్రితం ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన కార్తిక్ తల్లి.. తమకు డాక్టర్ చదువుకొన్న కోడలు రావాలనుకుంటున్నానని చెప్పింది. శ్రీలీల డాక్టర్ కోర్స్ పూర్తి చేసింది. కార్తిక్ తల్లి ఈమె గురించి మాట్లాడిందా అనేది క్వశ్చన్ మార్క్.(ఇదీ చదవండి: 'లిటిల్ హార్ట్స్'.. ఇది ఒరిజినల్ సాంగ్)ఇకపోతే ఇప్పుడు ముంబైలోని కార్తిక్ ఆర్యన్ ఇంట్లో వినాయక చవితి సెలబ్రేషన్స్ జరగ్గా.. శ్రీలీలతో పాటు ఆమె తల్లి కూడా హాజరైంది. అయితే ఇది పార్టీ గెదరింగ్ లేదంటే తమ రిలేషన్ని కార్తిక్-శ్రీలీల పరోక్షంగా బయటపెడుతున్నారా అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.ప్రస్తుతం వీళ్లిద్దరూ అనురాగ్ బసు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఇది రొమాంటిక్ లవ్ స్టోరీతో తీస్తున్నారు. వచ్చే ఏడాది ఇది రిలీజ్ కానుంది. మరి కార్తిక్ ఆర్యన్-శ్రీలీలది ఫ్యామిలీ బాండింగా లేదంటే డేటింగ్ అనేది తెలియాలంటే వీళ్లలో ఎవరో ఒకరు నోరు విప్పాలి.(ఇదీ చదవండి: మల్లెపూలు ఎంత పనిచేశాయ్.. నటికి రూ.1.14 లక్షల జరిమానా) -
జపనీస్ అమ్మాయిలా రష్మిక.. ముంబై స్క్రీనింగ్లో
యనిమే అభిమానుల కోసం క్రంచిరోల్, సోనీ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్ ఇండియా సంయుక్తంగా 'డీమన్ స్లేయర్: కిమెట్సు నో యైబా ఇన్ఫినిటీ క్యాసిల్' సినిమాని రిలీజ్ చేస్తున్నాయి. సెప్టెంబరు 12న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే రీసెంట్గా ముంబైలో యనిమే అభిమానుల కోసం స్పెషల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేశారు. హీరోయిన్ రష్మిక, హీరో టైగర్ ష్రాఫ్ కూడా సందడి చేశారు.(ఇదీ చదవండి: నేను వెళ్లిపోవడానికి కూడా రెడీ.. బిగ్బాస్ 9 Day 1 ప్రోమోస్ రిలీజ్)రష్మిక.. టాంజిరో, నెజుకో సోదర సోదరీమణులకి ప్రేరణగా ఉండే ప్రత్యేక జపనీస్ డ్రస్సులో కనిపించింది. రష్మిక కూడా అభిమానులను వారి ఫేవరెట్ సీన్ గురించి అడిగింది. దీనికి పెద్ద ఎత్తున స్పందన రావడంతో 'అకాజా vs గియు మరియు టాంజిరో' ఫైట్ సీక్వెన్స్కు మంచి రెస్పాన్స్ లభించింది. మన దేశంలో దాదాపు 750కి పైగా స్క్రీన్స్లో ఈ సినిమా విడుదలవుతోంది. ఓ యనిమే మూవీకి ఇంతలా రిలీజ్ దక్కుతుండటం ఇదే మొదటిసారి అని చెప్పొచ్చు. తెలుగు డబ్బింగ్తోనూ ఈ మూవీ ఉండనుంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 17 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్) -
హిందీ వెబ్ సిరీస్లో రాజమౌళి.. ట్రైలర్ రిలీజ్
రాజమౌళి పేరు చెప్పగానే బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలు గుర్తొస్తాయి. ప్రస్తుతం మహేశ్ బాబుతో ఓ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తున్నాడు. అదే టైంలో ఈ మధ్య కాలంలో యాడ్స్, ఈవెంట్స్లో తరుచుగా కనిపిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు ఎవరూ ఊహించని విధంగా ఓ హిందీ వెబ్ సిరీస్లోనూ జక్కన్న నటించడం విశేషం. తాజాగా రిలీజైన ట్రైలర్తో ఈ విషయం బయటపడింది.(ఇదీ చదవండి: మల్లెపూలు ఎంత పనిచేశాయ్.. నటికి రూ.1.14 లక్షల జరిమానా)షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్.. దర్శకుడిగా మారి తీసిన సిరీస్ 'ద బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్'. హిందీ చిత్రసీమలో తెరవెనక జరిగే సంగతుల్ని ఆధారంగా చేసుకుని కామెడీ ఎంటర్టైనర్గా దీన్ని తీశాడు. సెప్టెంబరు 18 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇందులోనే ఓ సీన్లో ఆమిర్ ఖాన్, రాజమౌళి కనిపించారు. వీళ్లతో పాటు దర్శకనిర్మాత కరణ్ జోహార్, దిశా పటానీ, షారుఖ్ ఖాన్, ర్యాపర్ బాద్ షా కూడా అతిథి పాత్రల్లో కనిపించారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 17 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్) -
పిల్ల తెమ్మెర... హోరు గాలి ఆశా భోస్లే స్వరం!
'ఓ హసీన్దర్ద్దేదో జిసే మై గలే లగా లూ' అంటారు ఆశా భోస్లే ఓ పాటలో. ఆ పాట సందర్భం ఏదైనా ‘హసీన్ దర్ద్’ అనే మాట ఎంత బావుందో కదా. అది ఆశాజీ స్వరానికి చక్కగా సరిపోతుంది. ఆవిడ తన పాటతో మనందరికి అలాంటి అందమైన బాధనే కదా పుట్టిస్తారు. ఇంకో పాటలో 'దిల్చీజ్క్యా హై ఆప్మేరీ జాన్లీజియే' అంటారు. నిజమే ఆవిడ గొంతుక అంటే పడి చచ్చేవాళ్లంతా ముక్త కంఠంతో చెప్పే మాట ఇది మీ కోసం మా గుండెలే కాదు ప్రాణాలు కూడా ఇచ్చేస్తామని! ఈ పాట ఆశ పాడిన గొప్ప పాటల్లో ఒకటి. షహరయార్ రచన, ఖయ్యాం సంగీతం, రేఖ అభినయం ఒక ఎత్తు అయితే ఆశా భోంస్లే స్వరం ఒక్కటే ఒక ఎత్తు. అందుకే ఈ పాట ఆశాజీకి జాతీయ అవార్డు తెచ్చిపెట్టింది. దీంతో పాటు ఆవిడ మరో పాటకు కూడా జాతీయ అవార్డు అందుకున్నారు. ఆ పాట చాలా విలక్షణమైనది సాహిత్యపరంగా, సంగీతపరంగాను!అదే 'మేరా కుఛ్ సామాన్... తుమ్హారే పాస్ పడా హై' సాంగ్ గుల్జార్ దర్శకత్వం వహించిన ఇజాజత్ సినిమాలోనిది. ఈ పాట లిరిక్స్ కూడా ఆయనే రాశారని వేరే చెప్పాలా? ఇజాజత్ 1987లో రిలీజైంది. ఆర్డీ బర్మన్ ఈ సినిమాకి సంగీత దర్శకుడు. ఓరోజు గుల్జార్ ఒక పాటకి లిరిక్స్ రాసి రికార్డింగ్కి పట్టుకెళ్లారు. ఆ లిరిక్స్ చూసి బర్మన్ దా ఇది పాట సాహిత్యమా లేక న్యూస్ పేపరా అని అడిగారు. గుల్జార్ మౌనంగా ఉండిపోయారు. ఆ పాట పాడాల్సిన ఆశా భోస్లే లిరిక్స్ చేతికి తీసుకుని మెల్లగా హమ్ చేస్తూపోయారు. అది వింటున్న బర్మన్ దాకి ఏదో స్ఫురించింది. అంతే! పదిహేను నిముషాల్లో బాణీ కట్టేశారు. అలా పుట్టిందే మేరా కుఛ్ సామాన్ అనే పాట!ఈ పాట లిరిక్స్నిజంగానే పైకి ప్లెయిన్గా కనిపిస్తాయి. కానీ తరచి చూస్తే ఆ పదాల్లో ఎంతటి అర్థం దాగుందో తెలుస్తుంది. సుతిమెత్తగా ఉన్నట్లు కనిపించినా ఈ పాట బాణీ చాలా కష్టమైంది. ఆలాపన మొదలుకొని చివరి దాకా ఒక ప్రవాహంలాగా సాగిపోతుంది. పల్లవి, చరణం లాంటి సంప్రదాయ పద్ధతులు కనిపించవు. ఈ పాట పాడ్డం అప్పట్లో ఆశా భోస్లేకి పెద్ద సవాలుగా తోచింది. మాధుర్యం చెడకుండా మంద్రస్థాయి నుంచి తారస్థాయికి.. అక్కడి నుంచి మళ్లీ మధ్యమస్థాయి, మంద్రస్థాయులకు ప్రయాణిస్తూ ఆశా ఈ పాటకు పూర్తి న్యాయం చేశారు. మధ్యమధ్యలో మాటలు, విరక్తి నవ్వులు కూడా వినిపించారు. ఇంత బాగా పాడినందుకు ఆవిడకు, అంత విభిన్నంగా రాసినందుకు గుల్జార్కి 1988 సంవత్సరానికిగాను జాతీయ అవార్డులు దక్కాయి. ఈ పాట విన్నప్పుడల్లా ఆర్డీ బర్మన్తో గడిపిన రోజులే గుర్తొస్తాయని ఆశా భోస్లే ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అందుకే ఈ పాటంటే ఆవిడకి ప్రాణమట!1933లో సెప్టెంబర్ 8న పుట్టిన ఆశా భోస్లే అక్క లతా మంగేష్కర్సాయంతో సినిమాల్లో పాడడం మొదలుపెట్టినా తొందరలోనే తనకంటూ ఒక స్టైల్ క్రియేట్చేసుకున్నారు. మత్తుగా, గమ్మత్తుగా పలికే ఆమె స్వరానికి ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ఉంది. ‘ఆయియే మెహర్బాన్’ అంటూ ఒక పాటలో కవ్విస్తే ‘ఓ మేరే సోనారే’ అంటూ మరో పాటలో మురిపిస్తారు. ‘హరే రామ హరే కృష్ణ’లోని ‘దమ్మారో దమ్’ అనే రాక్ నంబర్ పాడినా ‘ఉమ్రావ్జాన్లోని ‘ఇన్ఆంఖోంకీ మస్తీ కే’ అనే ఘజల్ ఆలపించినా ఆశా స్టైల్ దేనికదే ప్రత్యేకం. హెలెన్కోసం ‘పియా తూ అబ్తో ఆజా’ మొదలుకొని చాలా పాటలే పాడారూ ఆశాజీ. ఆ పాటలన్నీ ఎవర్గ్రీన్హిట్సే! ఏ మేరా దిల్ యార్కా దివానా, ఓ హసీనా జుల్ఫోవాలీ లాంటి డాన్స్నంబర్స్ని ఎవరు మాత్రం మర్చిపోగలరు? 90స్ తర్వాత ఎ. ఆర్. రహమాన్ ఆశా భోస్లేకి మంచి హిట్స్ ఇచ్చారు. రంగీలా టైటిల్ సాంగ్, ‘తన్హా తన్హా’ పాటలు ఆవిడ వర్సటాలిటీకి అద్దం పడతాయి. ఇక 2001లో విడుదలైన ‘లగాన్’లోని ‘రాధ కైసే న జలే’ అనే పాటయితే జనం గుండెల్లో అలా నిలిచిపోయింది.అన్నట్లూ ఆశాజీ మన తెలుగులో కూడా కొన్ని పాటలు పాడారు. 1988లో జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన ‘చిన్ని కృష్ణుడు’ సినిమాలోని ‘జీవితం సప్త సాగర గీతం’ అన్న ఆర్డీ బర్మన్ కంపోజిషన్ ఇప్పటి తరానికి కూడా బాగా తెలుసు. ఇక ‘చందమామ’ సినిమా కోసం కె.ఎం. రాధాకృష్ణన్పాడించిన ‘నాలో ఊహలకు’ అనే పాట ఎంత హాయిగా, లయబద్ధంగా సాగిపోతుందో వేరే చెప్పాలా? ఆశా భోస్లే స్వరం మెత్తగా లాలించే పిల్ల తెమ్మెరే కాదు గుండెను పట్టి కుదిపేసే హోరుగాలి కూడా, మెల్లగా సాగే సెలయేరే కాదు, ఉవ్వెత్తున దూకే జలపాతం కూడా. ఆ స్వర ప్రవాహంలో తడిసి ముద్దవడం తప్ప సామాన్య శ్రోతలుగా మనమింకేం చేయగలం?-శాంతి ఇశాన్ -(సెప్టెంబర్ 8 ఆశా భోస్లే పుట్టినరోజు సందర్భంగా) -
సల్మాన్ ఖాన్ ఓ గూండా.. బాలీవుడ్ దర్శకుడు సంచలన కామెంట్స్
బాలీవుడ్ స్టార్ హీరోల్లో సల్మాన్ ఖాన్ ఒకడు. దాదాపు 7-8 ఏళ్ల నుంచి ఇతడు సినిమాలైతే చేస్తున్నాడు గానీ హిట్ పడట్లేదు. అలాంటిది ఇతడిపై ఓ బాలీవుడ్ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. సల్మాన్ ఓ గుండా, అతడికి నటన అంటే అసలు ఆసక్తి లేదు. సెలబ్రిటీ హోదా కోసమే మూవీస్ చేస్తున్నాడని సంచలన ఆరోపణలు చేశాడు. ఇప్పుడు ఈ విషయం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 17 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్)తెలుగులో 'గబ్బర్ సింగ్' మూవీ పెద్ద హిట్. దాని ఒరిజినల్ చిత్రం 'దబంగ్'. 2010లో రిలీజైన ఈ హిందీ సినిమాకు అభినవ్ కశ్యప్ దర్శకుడు. ఇతడు అనురాగ్ కశ్యప్కి అన్నయ్య. అయితే సల్మాన్తో ఈ మూవీ చేసిన తర్వాత అభినవ్.. ఇండస్ట్రీలో అడ్రస్ లేకుండా పోయాడు. అయితే దీనికి సల్మాన్, అతడి కుటుంబమే కారణమని గతంలోనే అభినవ్ ఆరోపించాడు. ఇప్పుడు మరోసారి సంచలన కామెంట్స్ చేశాడు.'2010లో 'దబంగ్' సీక్వెల్ చేయమని సల్మాన్ కుటుంబం నన్ను అడిగింది. దానికి నేను నో చెప్పాను. అప్పటినుంచి నాపై పగ పెంచుకున్నారు. సల్మాన్కి నటనపై ఆసక్తి లేదు. 25 ఏళ్లుగా అతడు నటించడం లేదు. సెలబ్రిటీగా ఉండటానికే సెట్కి వస్తాడు. అతడొక గూండా. పగ-ప్రతీకారంతో రగిలిపోయే ఓ అసభ్యకరమైన వ్యక్తి. వారు చెప్పిన మాట కాదంటే వెంటాడి మరీ వేధిస్తాడు. వారందరూ రాబందులు. సల్మాన్ మాత్రమే కాదు బోనీ కపూర్ కూడా అలాంటోడే. నా తమ్ముడు అనురాగ్తో బోనీ అసభ్యంగా ప్రవర్తించాడు. అందుకే అతడి సినిమా నుంచి అనురాగ్ బయటకొచ్చేశాడు. ఈ రాబందుల గురించి ముందే నా తమ్ముడు చెప్పాడు' అని అభినవ్ తాజాగా ఇంటర్వ్యూలో చెప్పాడు.(ఇదీ చదవండి: సడన్గా ఓటీటీలోకి వచ్చిన లేటెస్ట్ తెలుగు సినిమా) -
పోటీకి సై
వచ్చే ఈద్ పండక్కి బాక్సాఫీస్ ఫైట్కి సై అంటున్నారు అజయ్ దేవగణ్, రణ్బీర్ కపూర్. అజయ్ దేవగణ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ధమాల్ 4’. రితేష్ దేశ్ముఖ్, సంజయ్ మిశ్రా, అర్షద్ వార్సీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు ఇంద్ర కుమార్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. భూషణ్ కుమార్, క్రిషణ్ కుమార్, అశోక్ థాకరియా నిర్మించిన ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఈద్ పండక్కి రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. ఇక మరోవైపు ‘లవ్ అండ్ వార్’ సినిమాను ఈద్ పండగ సందర్భంగా 2026 మార్చి 20న రిలీజ్ చేయనున్నట్లుగా గతంలోనే వెల్లడించారు ఈ చిత్రదర్శక–నిర్మాత సంజయ్లీలా భన్సాలీ. ఈ చిత్రంలో రణ్బీర్ కపూర్, విక్కీ కౌశల్, ఆలియా భట్ లీడ్ రోల్స్లో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. మరి... బాక్సాఫీస్ వద్ద వచ్చే ఈద్కి రణ్బీర్ది పై చేయి అవుతుందా? లేక అజయ్ దేవగణ్ హిట్ అవుతారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. -
పేరుకే ఫ్రాంచైజీ.. అన్నీ మన రీమేక్లే
ఒకప్పుడు రీమేక్ అంటే బాక్సాఫీస్ దగ్గర బాగానే వర్కౌట్ అయ్యేది. కానీ ఇప్పుడు కాలం మారిపోయింది. ఎంత బాగా తీసినా సరే జనాలు.. ఒరిజినల్తో పోల్చి చూస్తున్నారు. దీంతో గత కొన్నేళ్లలో పలు భాషల్లో వచ్చిన, వస్తున్న రీమేక్స్ అన్నీ ఫ్లాప్స్ అవుతున్నాయి. రెండు రోజుల క్రితం హిందీలోనూ 'బాఘీ 4' పేరుతో ఓ మూవీ రిలీజైంది. టైగర్ ష్రాఫ్ హీరోగా నటించిన ఈ చిత్రం కూడా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడీ చిత్రం కూడా రీమేక్ అనే సంగతి బయటపడింది.(ఇదీ చదవండి: 'లిటిల్ హార్ట్స్'తో మరో హిట్.. ఈ బ్యూటీ ఎవరో తెలుసా?)ప్రముఖ నటుడు జాకీ ష్రాఫ్ వారసుడిగా టైగర్ ష్రాప్.. ఇండస్ట్రీలోకి వచ్చాడు. 'హీరో పంతి' అనే సినిమాతో నటుడిగా పరిచయమయ్యాడు. ఇది యావరేజ్ అనిపించుకుంది. టైగర్ యాక్ట్ చేసిన తొలి మూవీ ఓ రీమేక్. అల్లు అర్జున్ 'పరుగు' చిత్రమే ఇది. అలానే టైగర్ ష్రాఫ్ పేరు చెప్పగానే గుర్తొచ్చేది 'బాఘీ' ఫ్రాంచైజీ. ఇప్పటివరకు ఇందులో నాలుగు మూవీస్ రిలీజ్ కాగా అవన్నీ దక్షిణాది చిత్రాల ఆధారంగా తీసిన రీమేక్స్. కాకపోతే ఎక్కడా అధికారికంగా ఇది దీని రీమేక్ అని టీమ్ చెప్పలేదు.బాఘీ.. ప్రభాస్ 'వర్షం' రీమేక్, బాఘీ 2.. అడివి శేష్ 'క్షణం' రీమేక్, బాఘీ 3.. తమిళ చిత్రం 'వెట్టై' రీమేక్, తాజాగా రిలీజైన బాఘీ 4.. తమిళ మూవీ 'ఐతు ఐతు ఐతు'కి రీమేక్. ఇలా పేరుకే యాక్షన్ ఫ్రాంచైజీ అని పెట్టుకున్నారు కానీ నచ్చిన రీమేక్స్ని ఇష్టమొచ్చినట్లు మార్చేసి తీసిపడేస్తున్నారు. మొదటి భాగానికే ఫ్లాప్ టాక్ వచ్చింది. అయినా సరే వరసగా సీక్వెల్స్ తీస్తూనే ఉన్నారు. తాజాగా రిలీజైన నాలుగో భాగానికి కూడా ఏ మాత్రం పాజిటివ్ రివ్యూలు రాలేదు. టాప్ ఇంగ్లీష్ వెబ్ సైట్స్ అన్నీ 1 రేటింగ్ ఇచ్చాయి. మరి ఇప్పటికైనా టైగర్.. బాఘీ ఫ్రాంచైజీని ఆపుతాడా? లేదంటే త్వరలో ఐదో పార్ట్తో వస్తాడా? అనేది చూడాలి?(ఇదీ చదవండి: మహేశ్, అల్లు అర్జున్ బాటలో రామ్ చరణ్?) -
‘నోబెల్ బహుమతి కావాలంట’.. ట్రంప్పై విరుచుకుపడ్డ సల్మాన్ ఖాన్!
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ పరోక్షంగా విమర్శలు గుప్పించారు. బిగ్బాస్ 19వ (Bigg Boss 19) సీజన్ తొలి వీకెండ్ ఎపిసోడ్లో హోస్ట్గా వ్యవహరిస్తున్న సల్మాన్.. హౌస్లో ఉన్న కంటెస్ట్ల తీరును ప్రశ్నించారు. కొంతమంది కంటెస్టులు వివాదాలకు ఆజ్యం పోస్తుంటారు.పైకి మాత్రం శాంతిదూతలుగా నటిస్తుంటారని అని మండిపడ్డారు. కానీ అసలు విషయం ఏంటంటే? ఈ ప్రపంచంలో ఎక్కువగా సమస్యలు సృష్టిస్తున్న వారే తమకు నోబెల్ శాంతి బహుమతి కావాలని కోరుకుంటుంటారు’అని ఎద్దేవా చేశారు.ఇంతకీ ఏం జరిగిందంటే?సల్మాన్ ఖాన్ కంటెస్టెంట్ ఫర్హానా భట్ గురించి మాట్లాడారు.‘తనను తాను శాంతి దూతగా చెప్పుకునే ఫర్హానా.. అందుకు అనుగుణంగా లేదు. ఆమె తరచుగా కంటెస్టెంట్ల మధ్య తగాదాలను ప్రేరేపించడం,అనవసరమైన సమస్యలను సృష్టిస్తుంది. అంటూ (‘యే హో క్యా రహా హై? పూరీ దునియా మే జో సబ్సే జ్యాదా ట్రబుల్ ఫైలా రహే హైం, ఉంకో హై శాంతి బహుమతి చాహియే’). శాంతి దూతలని చెప్పుకునే తిరేవారు గొడవలు పరిష్కరించి,ప్రజలను కలిపే వ్యక్తి కావాలి. కానీ ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసా?. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా సమస్యలు సృష్టించే వాళ్లే శాంతి బహుమతులు కోరుకుంటున్నారు’ అని వ్యాఖ్యానించారు. ట్రంప్ పేరును సల్మాన్ ప్రస్తావించనప్పటికీ.. అమెరికా అధ్యక్షుడిపైనే ఈ వ్యాఖ్యలు చేశారంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. Megastar #SalmanKhan trolling Donald Trump 😂😭 #BiggBoss19"Is Dunia me jo sabse jyada trouble faila rahe h, unhe hi peace prize chahiye" pic.twitter.com/Z4SfUNm1Lb— MASS (@Freak4Salman) September 7, 2025 నోబెల్ శాంతి బహుమతిపై గంపెడాశలు పెట్టుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు నోబెల్ ఆశలపై భారత్ నీళ్లు చల్లింది. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్-పాక్ల మధ్య ఘర్షణను ఆపేందుకు ట్రంప్ మధ్యవర్తిత్వం వహించేందుకు ప్రయత్నించారు. అందుకు భారత్ ఒప్పుకోలేదు. ఫలితంగా తనకు దక్కాల్సిన నోబెల్ ఫ్రైజ్ భారత్ వల్లే దూరమైందనే అక్కుసతో భారత్పై టారిఫ్లు మోపుతున్నారు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్నా అమెరికాకు చెందిన ప్రముఖ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ జెఫరీస్ ఓ నివేదికను విడుదల చేసింది. ఆ నివేదికలో భారత్పై ట్రంప్ చేస్తున్న కుట్ర వెలుగులోకి వచ్చింది. ట్రంప్ తన వ్యక్తిగత స్వార్ధం కోసమే భారత్పై టారిఫ్లు విధిస్తున్నారని,ఇందులో దేశ ప్రయోజనాలే లేవని హైలెట్ చేసింది. -
థ్రిల్లింగ్గా ఉంది
బాలీవుడ్ దర్శక–నిర్మాత విక్రమాదిత్య మొత్వాని, నటి సన్నీ లియోన్ అంతర్జాతీయ స్థాయిలో ఓ బయోపిక్ చేయనున్నారు. వెబ్ సిరీస్గా రానున్న ఈ బయోపిక్ హక్కులు సన్నీ లియోన్కి చెందిన సన్సిటీ సంస్థ దక్కించుకుందట. దీంతో విక్రమాదిత్య మొత్వానికి చెందిన ఆండొలన్ ఫిల్మ్స్, సన్నీ లియోన్ ‘సన్ సిటీ’ సంస్థలు ఈ అంతర్జాతీయ బయోపిక్ను రూ పొందించనున్నాయి. ‘‘ఈ ప్రాజెక్ట్ కోసం అసోసియేట్ అవుతున్నందుకు చాలా థ్రిల్లింగ్గా ఉంది. ఈ బయోపిక్లోని స్టోరీ నన్ను ఇన్స్పైర్ చేసింది’’ అని సన్నీ లియోన్ పేర్కొన్నారు. ఇక... ఇది ఎవరి బయోపిక్? ఇందులో నటీనటులు ఎవరు? సన్నీ లియోన్ కూడా ఈ సిరీస్లో నటిస్తారా? అనే విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది. -
బాలీవుడ్ నటుడు ఆశిష్ వారంగ్ హఠాన్మరణం
బాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు ఆశిష్ వారంగ్ (55) హఠాన్మరణం చెందారు. శుక్రవారం ఆయన మృతి చెందిన ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా తన ప్రస్థానం ప్రారంభించిన ఆశిష్ పలు సినిమాల్లో తనదైన నటనతో ప్రేక్షకులను అలరించారు.అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ‘సూర్యవంశీ’, అజయ్ దేవగణ్ కథానాయకుడిగా నటించిన ‘దృశ్యం’, రాణీ ముఖర్జీ లీడ్ రోల్ పోషించిన ‘మర్దానీ’, సిద్ధార్థ్ మల్హోత్రా ‘ఏక్ విలన్’ వంటి పలు హిట్ సినిమాల్లో నటించి, మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఆశిష్ వారంగ్. హిందీ సినిమాల్లోనే కాదు... మరాఠీ చిత్రాల్లోనూ నటించారాయన. ఆశిష్ వారంగ్ మృతిపై పలువురు నటీనటులు, దర్శకులు, సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలిపారు. ఇదిలా ఉంటే... ఆయన మృతికి కారణం ఏంటి? అనే విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. కానీ, బాలీవుడ్ మీడియాలో మాత్రం రకరకాల కథనాలు ప్రసారం అవుతున్నాయి. -
శ్రీదేవికి తక్కువ పారితోషికం.. నిర్మాతలే రాజమౌళికి ఎక్కించి చెప్పారు!
బాహుబలి సినిమా (Bahubali Movie)తోనే పాన్ ఇండియా ట్రెండ్ పాపులర్ అయింది. ఆ తర్వాత సౌత్ నుంచి వచ్చిన ఎన్నో సినిమాలు బాలీవుడ్ బాక్సాఫీస్ను ఏలాయి. దక్షిణాది సినిమాల మార్కెట్ విస్తరణకు బాహుబలి తోడ్పడింది. ఈ మూవీలో ప్రభాస్, రానా, అనుష్క, రమ్యకృష్ణ, తమన్నా ప్రధాన పాత్రల్లో నటించారు. నిజానికి ఈ సినిమాలో దివంగత హీరోయిన్ శ్రీదేవి (Sridevi) నటించాల్సిందట!ఇప్పటికీ నా దగ్గరే..శివగామి పాత్ర కోసం తొలుత శ్రీదేవిని అనుకున్నారు. మరి అదెందుకు కార్యరూపం దాల్చలేదన్నదానిపై శ్రీదేవి భర్త, నిర్మాత బోనీ కపూర్ (Boney Kapoor) స్పందించాడు. బోనీ కపూర్ మాట్లాడుతూ.. శ్రీదేవి అభిమానిని అని రాజమౌళి పంపిన మెసేజ్ ఇప్పటికీ నా దగ్గర ఉంది. సినిమా కోసం ఆమె చెప్పిన సూచనలు విన్నాక ఆయనకు శ్రీదేవిపై గౌరవం రెట్టింపైంది. కానీ, నిర్మాతల వల్ల ఆ సినిమా తను చేయలేకపోయింది.చాలా తక్కువ పారితోషికంరాజమౌళి మా ఇంటికి వచ్చి తన సినిమా గురించి మాట్లాడుతూ ఉండేవాడు. ఆయన గది నుంచి బయటకు వెళ్లగానే నిర్మాతలు ఎంటరయ్యేవారు. చాలా తక్కువ రెమ్యునరేషన్ ఆఫర్ చేశారు. ఇంగ్లీష్ వింగ్లీష్ సినిమాకు శ్రీదేవి తీసుకున్నదానికంటే కూడా తక్కువే ఇస్తామన్నారు. ఆమె చిన్న నటి కాదు కదా! తనవల్ల సినిమాకు కూడా ఎంతో కొంత మైలేజ్ వస్తుంది. తమిళం, హిందీలోనూ కొంత పాపులారిటీ వస్తుంది. అలాంటప్పుడు నా భార్యను ఒక మెట్టు దిగి సినిమా చేయమని నేనెందుకు చెప్తాను?రివర్స్లో చెప్పారుకానీ నిర్మాతలు మాత్రం రాజమౌళికి అంతా రివర్స్లో చెప్పారు. హోటల్లో ఒక ఫ్లోర్ మొత్తం తనే కావాలంటోందని చాడీలు చెప్పారు. మేము అడిగిందొక్కటే.. మా పిల్లలకు హాలీడేస్ ఉన్నప్పుడు పెద్ద షెడ్యూల్ పెట్టుకోమన్నాము. అంతకుమించి పెద్ద డిమాండ్లేమీ చేయలేదు. కానీ నిర్మాతలు రాజమౌళికి వేరేవిధంగా ఎక్కించారు. నిర్మాత శోభు యార్లగడ్డకు డబ్బు ఖర్చు చేయడం ఇష్టం లేకే ఇలాంటి పుకార్లు సృష్టించాడు. తను ప్రొఫెషనల్గా ఉండదని కామెంట్ చేశాడు. రూ.10 కోట్ల డిమాండ్?అదే నిజమైతే రాకేశ్ రోషన్, యష్ చోప్రా, రాఘవేందర రావు.. వీళ్లందరూ తనతో ఎలా పని చేశారు? ఆమెను అన్ప్రొఫెషనల్ అని ఎలా అంటారు? అని అసహనం వ్యక్తం చేశాడు. కాగా బాహుబలి రిలీజైన సమయంలో శ్రీదేవి డిమాండ్లపై పెద్ద చర్చే జరిగింది. ఈ సినిమాకుగాను రూ.10 కోట్లు, 10 ఫ్లైట్ టికెట్స్, హోటల్లో ఓ అంతస్తు మొత్తం తనకే కావాలని శ్రీదేవి డిమాండ్ చేసిందని రాజమౌళి అప్పట్లో ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఆ కామెంట్స్ విని బాధపడ్డ శ్రీదేవి.. 50 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్నా.. 300కి పైగా సినిమాలు చేశాను. అలాంటి డిమాండ్లు చేసే ఈ స్థాయికి చేరాననుకుంటున్నారా? నిజంగా అలా చేస్తే ఇప్పటికీ ఇండస్ట్రీలో ఉండేదాన్నా? నా గురించి అలా తప్పుగా మాట్లాడుతుంటే బాధగా ఉంది. నిర్మాతలే రాజమౌళికి ఇలా నాగురించి తప్పుగా చెప్పి ఉండొచ్చు! కానీ, ఇలా పబ్లిక్గా మాట్లాడకపోయుంటే బాగుండేది అని విచారం వ్యక్తం చేసింది. దీంతో రాజమౌళి సైతం పబ్లిక్గా అలాంటి మాటలు మాట్లాడకుండా ఉండాల్సింది అని బాధపడ్డాడు. కాగా శ్రీదేవి 2018లో మరణించింది. బాహుబలి విషయానికి వస్తే మొదటి భాగం 2015లో రెండో భాగం 2017లో విడుదలైంది. ఈ చిత్రాలను శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మించారు.చదవండి: నిన్ను పెళ్లి చేసుకుంటే భార్యను కాదు తల్లినవుతా!: హీరోయిన్ -
మగాళ్లూ..కన్యత్వం గురించి లైట్ తీస్కోండి..అది ఒక్కరాత్రి మేటర్
సెలబ్రిటీల వ్యాఖ్యలు ఇటీవల రేపుతున్నంత దుమారం మరేవీ రేపడం లేదనేది వాస్తవం. విభిన్న రకాల మాధ్యమాలు అందుబాటులోకి రావడం, వాటిలో వారు తమ అభిప్రాయాలను పంచుకోవడం, అనేక వేదికల మీద ఇంటర్వ్యూలలో మాట్లాడే మాటలు.. వాటిలో ఏ కాస్త తేడా ఉన్నా అవి స్వల్ప కాలంలోనే వైరల్ అయి ఆ సెలబ్రిటీల గొంతులో పచ్చి వెలక్కాయలా మారడం చూస్తూనే ఉన్నాం.అదే విధంగా ఇటీవల మరో సెలబ్రిటీ చేసిందంటూ వెలుగులోకి వచ్చిన వ్యాఖ్యలు పెను సంచలనం కలిగించాయి. సంప్రదాయాలకు, నైతికతకు విలువిచ్చే భారతీయుల మనోభావాలు గాయపడే విధంగా మాజీ మిస్ వరల్డ్ ప్రస్తుత హాలీవుడ్ నటి, పాశ్చాత్యుడిని పెళ్లాడిన ప్రియాంక చోప్రా వ్యాఖ్యానించారంటూ వార్తలు వచ్చాయి. ప్రస్తుతం ప్రియాంక చోప్రా టాలీవుడ్ సూపర్స్టార్ మహేష్బాబు సరసన రాజమౌళి సినిమాలో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఆ మధ్య ఆమె ‘కన్యత్వం ఒక రాత్రిలో ముగుస్తుంది, కానీ మర్యాదలు శాశ్వతంగా ఉంటాయి‘ కాబట్టి మగవాళ్లు కన్యల కోసం వెదకి వేసారి పోవాల్సిన అవసరం లేదనీ మనిషిగా పరస్పర మర్యాదలు ముఖ్యం అంటూ ఆమె చేసిందన్న వ్యాఖ్యల్ని అనేక మాధ్యమాలు హైలెట్ చేశాయి.సహజంగానే ఈ వ్యాఖ్యలు చాలా త్వరగా వైరల్ కావడంతో విపరీతమైన దుమారం చెలరేగింది. దీనిపై అప్పట్లో నెటిజన్లు తీవ్రమైన ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. మొదటి నుంచీ పాశ్చాత్య పోకడల్ని ఇష్టపడే వ్యక్తిగా ప్రియాంక చోప్రా కు ఉన్న పేరు ఈ వ్యాఖ్యలు ఆమే చేసిందంటూ అత్యధికులు నమ్మేందుకు కూడా దోహదం చేసింది. గత కొంత కాలంగా ప్రియాంక మన బాలీవుడ్ సినిమాల కంటే ..హాలీవుడ్ సినిమాల్లో మాత్రమే ఎక్కువగా కనిపిస్తుండడం వంటివి కూడా దీనికి కొంత వరకూ కారణం. ఈ నేపధ్యంలో ఆమె వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ చిచ్చు రాజుకున్న కొన్ని రోజుల తర్వాత తీవ్రత గమనించిన ప్రియాంక నష్ట నివారణ చర్యలకు దిగారు. ఆ వ్యాఖ్యలు తాను చేయలేదని ఆమె ఖండించారు. ఆ మాటలు తనవి కాదంది, ‘ఏదైనా సరే ఆన్లైన్లో ఉన్నంత మాత్రాన అది నిజం కాదు‘ అని ప్రియాంక చోప్రా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తను ఖండించారు. తనదిగా సూచించే ఈ కోట్ నకిలీదని వైరల్ కావడానికి పన్నిన వ్యూహమని ఆమె ఇన్స్ట్రాగామ్లో స్పష్టం చేసింది. ఇలా వైరల్ అయ్యేందుకు కూడా కల్పిత కంటెంట్ సృష్టిస్తున్నారని ఆన్లైన్ విశేషాల పట్ల జాగ్రత్తగా ఉండాలని ఏదైనా సమాచారాన్ని నమ్మే ముందు దాన్ని థృవీకరించుకోవాలని చోప్రా తన అభిమానులను కోరారు. -
దృశ్యం నటుడు కన్నుమూత
ప్రముఖ బాలీవుడ్ నటుడు ఆశిష్ వారంగ్ (55) ఇక లేరు. హిందీలో దృశ్యం, సూర్యవంశి వంటి హిట్ చిత్రాల్లో నటించిన ఆయన శుక్రవారం మరణించారు. నటుడి మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఆశిష్ (Actor Ashish Warang) మరణ వార్త తెలిసి సన్నిహితులు, అభిమానులు షాకవుతున్నారు. దర్శకనిర్మాత అరిణ్ పాల్ సోషల్ మీడియా వేదికగా నటుడి మృతి పట్ల సంతాపం ప్రకటించాడు. మృదుస్వభావిఆశిష్ చనిపోయారని తెలిసి షాకయ్యాను. ఆయనతో కలిసి పనిచేసే అదృష్టం నాకు లభించినందుకు గర్వంగా ఉంది. ఆయన మృదుస్వభావి, కళపట్ల అంకితభావంతో మెదిలేవాడు. ప్రతి సీన్లోనూ ప్రాణం పెట్టి యాక్ట్ చేసేవాడు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను అని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టాడు. కాగా ఆశిష్.. అక్షయ్కుమార్ 'సూర్యవంశీ', అజయ్ దేవ్గణ్ 'దృశ్యం' చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు. రాణి ముఖర్జీ 'మర్దానీ' సినిమాలోనూ తన నటనతో ఆకట్టుకున్నాడు. హిందీలోనే కాకుండా మరాఠీ చిత్రాల్లోనూ యాక్ట్ చేశాడు. View this post on Instagram A post shared by Arin Paul (@arinpaul) చదవండి: ఓటీటీలో అదరగొడుతున్న స్పై సిరీస్.. రెండు కథలు ఒకటే! -
అమ్మాయిలూ.. ప్రెగ్నెంట్ అవడం ఈజీ!: బాలీవుడ్ నటి
అన్నీ అర్థం చేసుకునే భర్త దొరికితే అంతకన్నా అదృష్టం ఇంకేముంటుంది? కష్టసుఖాల్నే కాదు ఇంటిపనినీ సమంగా పంచుకుంటాడు బాలీవుడ్ హీరో రాజ్ కుమార్ రావు. భార్యకు అన్నివిధాలుగా అండగా ఉండే ఇతడు త్వరలోనే తండ్రి కాబోతున్నాడు. రాజ్కుమార్ భార్య, నటి పాత్రలేఖ (Patralekha) జూలై నెలలో తన ప్రెగ్నెన్సీ ప్రకటించింది. అయితే అంతకన్నా ముందు ఆమె తన ఎగ్స్ (అండాలను) భద్రపరిచింది.ప్రెగ్నెన్సీయే సులువుఈ విషయం గురించి పాత్రలేఖ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మూడేళ్ల కిందట నేను నా అండాలను భద్రపరిచాను. కానీ, ఇప్పుడు వాటి సాయం లేకుండా సహజంగా గర్భం దాల్చాను. నాకు తెలిసినంతవరకు ఎగ్స్ భద్రపరచడం కన్నా ప్రెగ్నెన్సీయే ఈజీ అనిపిస్తోంది. ఎగ్స్ ఫ్రీజ్ చేసే ప్రక్రియ కాస్త కఠినంగా ఉంటుంది. దాని గురించి మా డాక్టర్ ముందుగా మాకెటువంటి సమాచారం ఇవ్వలేదు. ఈ ప్రక్రియ అయిపోయాక నాకు తెలియకుండానే కాస్త డల్ అయ్యాను. కాబట్టి నేనేమంటానంటే.. అమ్మాయిలూ, ఎగ్స్ ఫ్రీజ్ చేసుకోవడానికి బదులు ప్రెగ్నెంట్ అవడానికి ట్రై చేయండి. కిట్లో నెగెటివ్ రిజల్ట్నేను సహజంగా గర్భం దాల్చాను. నిజానికి ప్రెగ్నెన్సీ కిట్లో కూడా నెగెటివ్ ఫలితమే చూపించింది. ఎందుకైనా మంచిదని గైనకాలజిస్ట్ను కలిస్తే అప్పుడు ప్రెగ్నెన్సీ విషయం బయటపడింది. మూడు నెలలవరకైనా ఈ విషయం బయటకు చెప్పకూడదనుకున్నాం. కానీ గతేడాది డిసెంబర్లో ఓ ఈవెంట్కు వస్తామని రాజ్, నేను ఓ ఈవెంట్కు మాటిచ్చాం. సడన్గా రామని హ్యాండిస్తే మాట పోతుందని ఏప్రిల్లో ఆ ఈవెంట్కు వెళ్లాం. దానికంటే ముందు నెలలో అంటే మార్చిలో నేను గర్భం దాల్చాను అని చెప్పుకొచ్చింది.చదవండి: లగ్జరీ ఫ్లాట్ అమ్మేసిన బాలీవుడ్ బ్యూటీ.. మంచి బేరమే! -
లగ్జరీ ఫ్లాట్ అమ్మేసిన బాలీవుడ్ బ్యూటీ.. మంచి బేరమే!
బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా (Malaika Arora) లగ్జరీ ఫ్లాట్ అమ్మేసింది. ముంబైలోని అంధేరీ వెస్ట్లో ఉన్న ఓ అపార్ట్మెంట్ను గత నెలలో విక్రయించింది. దాదాపు 182 గజాల వైశాల్యంలో ఉన్న తన ఫ్లాట్ను రూ.5.30 కోట్లకు అమ్మింది. గతంలో అంటే 2018లో మలైకా ఇదే ఫ్లాట్ను రూ.3.26 కోట్లకు కొనుగోలు చేసింది. ఇప్పుడు ఐదున్నర కోట్లకు విక్రయించింది. అంటే దాదాపు రెండు కోట్ల మేర లాభాలను ఆర్జించింది.సినిమాసినిమాల విషయానికి వస్తే.. మలైకా అరోరా చయ్య చయ్య పాటతో సెన్సేషనల్ అయింది. హిందీలో అనేక స్పెషల్ సాంగ్స్లో తళుక్కుమన్న ఆమె తెలుగులో కెవ్వు కేక, రాత్రైన నాకు ఓకే వంటి ఐటం సాంగ్స్తో అలరించింది. బుల్లితెరపై జలక్ దిక్లాజా, ఇండియాస్ గాట్ టాలెంట్, ఇండియాస్ బెస్ట్ డ్యాన్సర్ వంటి రియాలిటీ షోలకు జడ్జిగానూ వ్యవహరించింది.థామాలో స్పెషల్ సాంగ్ప్రస్తుతం రష్మిక మందన్నా ప్రధాన పాత్రలో నటిస్తున్న థామ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆదిత్య సర్పోత్దార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఆయుష్మాన్ ఖురానా ప్రధానపాత్ర పోషిస్తున్నాడు. మ్యాడ్డాక్ హారర్ కామెడీ యూనివర్స్లో భాగంగా వచ్చిన ‘స్త్రీ’ యూనివర్స్లో నాలుగో చిత్రంగా ‘థామా’ తెరకెక్కుతోంది.చదవండి: అన్ని సినిమాలు మహావతార్, సయారాలు కావుగా!: నిర్మాత -
అన్ని సినిమాలు మహావతార్, సయారాలు కావుగా!: నిర్మాత
ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి రూ.310 కోట్లు కొల్లగొట్టింది మహావతార్ నరసింహ మూవీ (Mahavatar Narsimha). అటు బాలీవుడ్లో కొత్తవారితో తీసిన సయారా చిత్రం ఏకంగా రూ.580 కోట్లు దాటేసింది. ఈ రెండు సినిమాలు ఎంత సెన్సేషన్ అయ్యాయో అందరికీ తెలిసిందే! అయతే కొత్తవారితో తీసిన ప్రతి సినిమా సయారాలా సెన్సేషన్ హిట్ అందుకోలేదంటున్నాడు బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్.భారీ బడ్జెట్ సినిమాలు ఫ్లాప్.. ఎందుకు?తేజ సజ్జ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ మిరాయ్. ఈ సినిమాను హిందీలో ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ నుంచి కరణ్ జోహార్ (Karan Johar) విడుదల చేస్తున్నాడు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ మూవీ సెప్టెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్స్లో కరణ్ జోహార్ పాల్గొన్నాడు. అక్కడ.. భారీ బడ్జెట్ సినిమాలు ఫ్లాప్ అవడానికి పెరిగిపోతున్న నిర్మాణ వ్యయం లేదా స్టార్స్ తీసుకుంటున్న రెమ్యునరేషన్.. ఏది కారణం? అని ఓ ప్రశ్న ఎదురైంది.ఎవర్నీ తప్పుపట్టలేంఅందుకు కరణ్ స్పందిస్తూ.. ప్రతి సినిమాకు దాని ఫలితం ముందే రాసిపెట్టి ఉంటుంది. పెద్ద హీరోలతో తీసిన భారీ బడ్జెట్ సినిమాలు కూడా హిట్టయిన రోజులున్నాయి. కాకపోతే పరిస్థితులు సరిగా లేవు. అందుకే ఇప్పుడందరూ సినిమాను మరోసారి అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కాబట్టి మనం ఎవరినీ తప్పుపట్టలేము. అలాగే కొత్తవారితో పెద్ద సినిమా తీసినప్పుడు అవి సక్సెస్ అయిన రోజులున్నాయి, అలాగే ఫెయిలైన సందర్భాలూ ఉన్నాయి. కాబట్టి ఎప్పుడేం జరుగుతుందనేది కచ్చితంగా ఎవరూ చెప్పలేరు.దరిదాపుల్లోకి కూడా రాలేవ్సంగీతాన్ని ప్రధానంగా తీసుకుని వచ్చే ప్రతి సినిమా సయారాలా హిట్టవలేదు. యానిమనేషన్ సినిమాలు కూడా ఎన్నో వస్తుంటాయి, పోతుంటాయి. అవన్నీ మహావతార్ నరసింహకు దరిదాపుల్లోకి కూడా రాలేవు అని కరణ్ జోహార్ చెప్పుకొచ్చాడు.చదవండి: సెంచరీలతో స్టార్ హీరో దూకుడు.. మరో హాఫ్ సెంచరీ! -
రెండో భర్తతో విడాకులు.. ఆ విషయంలో వదిలిపెట్టేది లేదన్న బుల్లితెర నటి!
బాలీవుడ్ బుల్లితెర నటి దల్జీత్ కౌర్ చెప్పాల్సిన పనిలేదు. సినీ కెరీర్ కంటే వ్యక్తిగత జీవితంలో జరిగిన పరిణామాలతో ఎక్కువగా వార్తల్లో నిలిచింది. మొదటి భర్తతో విడిపోయినా ఆమె.. రెండో పెళ్లి కూడా కలిసిరాలేదు. వ్యాపారవేత్త నిఖిల్ పటేల్ను రెండో పెళ్లి చేసుకోగా.. ఆతర్వాత విభేదాలు రావడంతో విడిపోయారు. 2023లో వీరిద్దరు పెళ్లి పీటలెక్కగా కొన్ని నెలలకే విడిపోతున్నట్లు ప్రకటించారు.తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన దల్జీత్ కౌర్ తన విడాకులపై మరోసారి మాట్లాడింది. తన మాజీ భర్త నిఖిల్ పటేల్పై విమర్శలు చేసింది. విడిపోయాక తన లైఫ్లో ఎదుర్కొన్న భావోద్వేగ పరిస్థితులను పంచుకుంది. ఈ విషయంలో నిఖిల్ పటేల్ తనకు క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్ చేసింది. ఈ విషయంలో మాత్రం తాను మౌనంగా ఉండనని స్పష్టం చేసింది. అతను క్షమాపణ చెప్పేవరకు పోరాటం చేస్తానని దల్జీత్ కౌర్ తెలిపింది.దల్జీత్ కౌర్ మాట్లాడుతూ.. 'పెళ్లి చేసుకోవడం నాకు చాలా సంతోషంగా అనిపించింది. కానీ నా లైఫ్లో మళ్లీ ఇలా జరగడం చాలా కోపం తెప్పించింది. ఈ విషయంలో తాను మౌనంగా ఉండనన్న విషయం నిఖిల్ తెలుసుకోవాలి. అతను నాకు క్షమాపణ చెప్పి తీరాల్సిందే. ఈ విషయంలో నా ఊపిరి ఉన్నంత వరకు పోరాడతా. నాకు అతని వద్ద నుంచి క్షమాపణ రావాలి. దానికోసం ప్రపంచంలోని ఏ మూలకైనా వెళ్తా ' అని అన్నారు.కాగా.. నిఖిల్తో పెళ్లి తర్వాత కెన్యా వెళ్లిన ఆమె కేవలం పది నెలలకే ఇండియాకు తిరిగొచ్చింది. తన కుమారుడితో సహా వచ్చిన తర్వాత అతనిపై తీవ్ర విమర్శలు చేసింది. నిఖిల్ తనను మోసం చేశాడని ఆరోపణలు చేసింది. అతనికి మరొకరితో వివాహేతర సంబంధాలు ఉన్నాయని..తనను మానసిక వేధింపులకు గురి చేశాడని ఆవేదన వ్యక్తం చేసింది. ఆ తర్వాత నిఖిల్ తన స్నేహితురాలు సఫీనా నాజర్తో కూడా ముంబయిలో కనిపించారు.2009లో మొదటి పెళ్లి..కాగా చూపులు కలిసిన శుభవేళ (ఇస్ ప్యార్ కో క్యా నామ్ ధూ) ఫేమ్ దల్జీత్.. 2009లో నటుడు షాలిన్ బానోత్ను పెళ్లాడింది. వీరి దాంపత్యానికి గుర్తుగా జైడన్ అనే కుమారుడు జన్మించాడు. ఆ తర్వాత జంట మధ్య మనస్పర్థలు తలెత్తడంతో 2013లో విడాకులు తీసుకున్నారు. అనంతరం ఓ పార్టీలో నిఖిల్ అనే వ్యక్తిని కలిసింది. ఇతడు కూడా మొదటి భార్యకు విడాకులు ఇచ్చాడు. ఆ తర్వాత వీరిద్దరి పరిచయం కావడంతో రెండో పెళ్లి చేసుకున్నారు. -
ప్లాన్ వరల్డ్
ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక్కోసారి ఒక్కో ట్రెండ్ కనిపిస్తుంటుంది. నిన్న మొన్నటి వరకు తెలుగు హీరోలు, దర్శక–నిర్మాతలు పాన్ ఇండియా మంత్రం జపించారు. ఇప్పుడు పాన్ వరల్డ్’ అంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా విదేశీ భాషల్లోనూ తెలుగు సినిమాలను రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇలా పాన్ వరల్డ్ రిలీజ్ ప్లాన్లో ఉన్న చిత్రాలపై ఓ లుక్ వేద్దాం.తెలుగు సినిమా హీరోలు, దర్శక–నిర్మాతలే కాదు.. బాలీవుడ్, కన్నడ వంటి సినీ పరిశ్రమలు కూడా హాలీవుడ్ మార్కెట్పై దృష్టి సారించాయి. భారతీయ ఇతిహాసం ‘రామాయణం’ ఆధారంగా హిందీలో ‘రామాయణ’ అనే సినిమా రూ పొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో రాముడిగా రణ్బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, హనుమంతుడిగా సన్నీ డియోల్, రావణుడిగా యశ్ నటిస్తున్నారు. కాగా ‘రామాయణ’ సినిమా రెండు భాగాలను దాదాపు 4 వేల కోట్ల రూపాయల బడ్జెట్తో రూ పొందిస్తున్నామని, హాలీవుడ్ సినిమాలకు ఏమాత్రం ఈ సినిమా తీసి పోదని ఈ చిత్రనిర్మాత నమిత్ మల్హోత్రా ఓ సందర్భంలో తెలిపారు.అలాగే విదేశీ ప్రేక్షకులు సైతం మెచ్చుకునేలా ‘రామాయణ’ సినిమాను తీస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు. ఇలా ‘రామాయణ’ సినిమాను విదేశీ భాషల్లో కూడా రిలీజ్ చేస్తున్నట్లుగా ఆయన పరోక్షంగా వెల్లడించారు. ‘రామాయణపార్ట్ 1’ చిత్రం వచ్చే ఏడాది దీపావళికి, ‘రామాయణపార్ట్ 2’ చిత్రం ఆపై వచ్చే ఏడాది దీపావళికి రిలీజ్ కానున్నాయి.ఇంకా రిషబ్ శెట్టి ‘కాంతార: చాప్టర్ 1’, యశ్ ‘టాక్సిక్’ చిత్రాలు కొన్ని భారతీయ భాషలతోపాటు ఇంగ్లిష్ వెర్షన్స్ను కూడా రిలీజ్ చేయనున్నాయి. ఈ విధంగా విదేశీ మార్కెట్పై భారతీయ ఫిల్మ్మేకర్స్ దృష్టి పెట్టారు. ఇక ‘కాంతార: చాప్టర్ 1’ చిత్రం ఈ అక్టోబరు 2న విడుదల కానుండగా, ‘టాక్సిక్’ చిత్రం వచ్చే ఏడాది మార్చి 19న విడుదల కానుంది.అవతార్ను మించి..! హాలీవుడ్లో ప్రంపచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాలుగా చెప్పుకునే ‘అవతార్’, ‘అవెంజర్స్’ వంటివి దాదాపు వంద దేశాల్లో విడుదలయ్యాయి. అలాంటిది హీరో మహేశ్బాబు, దర్శకుడు రాజమౌళి కాంబినేషన్లోని ఫారెస్ట్ అడ్వెంచరస్ యాక్షన్ డ్రామా ‘ఎస్ఎస్ఎమ్బీ 29’ (వర్కింగ్ టైటిల్) మాత్రం అంతకు మించి, 120కిపైగా దేశాల్లో రిలీజ్ అయ్యేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ‘ఎస్ఎస్ఎమ్బీ 29’ హాలీవుడ్ సినిమాలకు ఏ మాత్రం తీసి పోదని.ఇంకా చెప్పాలంటే... హాలీవుడ్ చిత్రాలకే పోటీగా నిలుస్తున్న సినిమా ఇది. పైగా ఈ సినిమా అప్డేట్స్కి కూడా గ్లోబల్ రీచ్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు దర్శకుడు రాజమౌళి. ఈ ‘ఎస్ఎస్ఎమ్బీ29’ సినిమా ఫస్ట్ లుక్ను ‘టైటానిక్, అవతార్’ వంటి మూవీస్ని డైరెక్ట్ చేసిన జేమ్స్ కామెరూన్ చేతుల మీదుగా రిలీజ్ చేసేందుకు రాజమౌళి అండ్ టీమ్ సన్నాహాలు చేస్తోందని తెలిసింది.నవంబరులో తన సినిమా ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ ప్రమోషన్స్లో భాగం దర్శకుడు జేమ్స్ కామెరూన్ ఇండియాకు రానున్నారని, ఈ సందర్భంగా ఆయన చేతుల మీదుగా ‘ఎస్ఎస్ఎమ్బీ 29’ ఫస్ట్ లుక్ని రిలీజ్ చేయించేలా రాజమౌళి ఏర్పాట్లు చేస్తున్నారనే టాక్ తెరపైకి వచ్చింది. ఇలా చేస్తే ‘ఎస్ఎస్ఎమ్బీ 29’ రీచ్ గ్లోబల్ స్థాయిలో ఉంటుందన్నది టీమ్ ఆలోచనగా తెలుస్తోంది. ⇒ ఇక ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ కెన్యాలో జరుగుతోంది. ఈ చిత్ర హీరో మహేశ్బాబుతోపాటుగా ఇతర ప్రధాన తారాగణం ప్రియాంకా చో్రపా, పృథ్వీరాజ్ సుకుమారన్పాల్గొంటుండగా ఆఫ్రికా అడవుల్లో కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ఈ సినిమా బడ్జెట్ దాదాపు రూ.1200 కోట్లు అని, ఈ సినిమాకు ‘జెన్ –63’ అనే టైటిల్ను అనుకుంటున్నారని, దాదాపు 20కిపైగా భాషల్లో ఈ సినిమాను అనువదించి, 2027 మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇంకా ఈ సినిమాలో క్రిస్ హెమ్స్వర్త్ వంటి హాలీవుడ్ నటులు కూడా కనిపిస్తారని, ఇందుకు సంబంధించి ఓ ప్రముఖ హాలీవుడ్ యాక్టింగ్ ఏజెన్సీతో రాజమౌళి ఒప్పందం కుదుర్చుకున్నారనే వార్తలు ఉన్నాయి. అయితే ఈ విషయాలపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది.ఫారిన్ స్పిరిట్ ప్రభాస్ ది ఇంటర్నేషనల్ హీరో కటౌట్. ప్రభాస్ హీరోగా నటించిన ‘బాహుబలి, కల్కి2898 ఏడీ’ వంటి చిత్రాలు జపాన్ దేశంలో విడుదలై, అక్కడి ప్రేక్షకులను అలరించాయి. ఇక ప్రభాస్ హీరోగా నటించనున్న చిత్రాల్లో ‘స్పిరిట్’ కూడా ఒకటి. ‘అర్జున్ రెడ్డి, యానిమల్’ చిత్రాల ఫేమ్ సందీప్రెడ్డి వంగా ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు.యూవీ క్రియేషన్స్, టీ–సిరీస్, భద్రకాళి పిక్చర్స్ ఈ సినిమాను నిర్మించనున్నాయి. అయితే ఈ సినిమా అనౌన్స్మెంట్ సమయంలోనే ‘స్పిరిట్’ను భారతీయ భాషలతోపాటు ఇంగ్లిష్, చైనా, జపాన్, కొరియా భాషల్లో కూడా రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ పేర్కొన్నారు. దీంతో ‘స్పిరిట్’ చిత్రం ఇంటర్నేషనల్ లెవల్లో రిలీజ్ కానుంది. ఇంకా ‘స్పిరిట్’ సినిమా చిత్రీకరణ మొదలు కాలేదు. రిలీజ్ సమయానికి ‘స్పిరిట్’ మరిన్ని విదేశీ భాషల్లో రిలీజ్ అయ్యే అవకాశాలు లేక పోలేదు.ఇక ఈ చిత్రంలో తొలిసారిగా ప్రభాస్ పోలీస్ ఆఫీసర్గా నటిస్తున్నారు. ‘యానిమల్’ ఫేమ్ త్రిప్తి దిమ్రి హీరోయిన్గా నటించనున్నారు. నిజానికి ఈ సినిమా చిత్రీకరణ ఈపాటికే మొదలు కావాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతోంది. కాగా ఈ సినిమాలోని ఓ మేజర్ షూటింగ్ షెడ్యూల్ను మెక్సికోలో ప్లాన్ చేసినట్లుగా ఈ చిత్రదర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఇటీవల ఓ సందర్భంలో వెల్లడించిన విషయం గుర్తుండే ఉంటుంది.ఇంకా ఈ చిత్రంలో సౌత్ కొరియన్ నటుడు డాన్ లీ విలన్గా నటించనున్నారనే టాక్ వినిపిస్తోంది. డాన్ లీతో తెలుగు నటుడు శ్రీకాంత్ ఉన్న ఫొటోలు ఇంటర్ నెట్లో వైరల్ అయ్యాయి. దీంతో..‘స్పిరిట్’ చిత్రంలో డాన్ లీ, శ్రీకాంత్ ఏమైనా భాగం అయ్యారా? అనే టాక్ తెరపైకి వచ్చింది. అయితే ఈ విషయాలపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది.గ్లోబల్ డ్రాగన్ హీరో ఎన్టీఆర్–దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రూ పొందుతున్న సినిమా ‘డ్రాగన్’. ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామాలో రుక్మిణీ వసంత్ హీరోయిన్గా నటిస్తున్నారు. మలయాళ నటుడు టొవినో థామస్ విలన్గా కనిపిస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ సినిమా అనౌన్స్మెంట్ సమయంలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెరపైకి వచ్చాయి. ఈ సినిమాను దాదాపు 15 దేశాల్లో చిత్రీకరించాలని ప్రశాంత్ నీల్ ప్లాన్ చేశారన్నది ఆ వార్తల సారాంశం. ఇందుకు తగ్గట్లుగానే ఈ ‘డ్రాగన్’ కోసం ఇంటర్నేషనల్ కనెక్ట్విటీ ఉండే ఓ ప్రపంచాన్ని ప్రశాంత్ నీల్ క్రియేట్ చేస్తున్నారనే టాక్ తాజాగా తెరపైకి వచ్చింది.అంతేకాదు... ఈ సినిమా విదేశీ షూటింగ్ షెడ్యూల్స్ నవంబరులో ప్రారంభం అవుతాయట. మరి... ఇంటర్నేషనల్ కనెక్టివిటీ ఉన్న స్టోరీని రెడీ చేసుకుని, ఇంటర్నేషనల్ లొకేషన్స్లో చిత్రీకరణకు ప్లాన్ చేసినప్పుడు, ఇంటర్నేషనల్ రేంజ్ రిలీజ్ను కూడా ప్లాన్ చేయకుండా ఉంటారా? ‘డ్రాగన్’ టీమ్ ఈ దిశగా ఆలోచిస్తోందట. గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్, టీ సిరీస్ ఫిల్మ్స్ పతాకాలపై కల్యాణ్ రామ్ నందమూరి, నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు నిర్మిస్తున్న ఈ సినిమా 2026 జూన్ 25న విడుదల కానుంది.ఇదిలా ఉంటే... ‘ఆర్ఆర్ఆర్’ (ఇందులో రామ్చరణ్ మరో హీరో) చిత్రంలో మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు ఎన్టీఆర్. ఈ సినిమా ఆస్కార్ క్యాంపైన్ ప్రమోషన్స్లో ఉత్సాహంగాపాల్గొన్నారు ఎన్టీఆర్. ఈ విధంగా ప్రపంచవ్యాప్త సినిమా ఆడియన్స్కు ఎన్టీఆర్ గురించి ఓ అవగాహన ఉంది.ఇంటర్నేషనల్ పెద్ది స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ సినిమాలకు ఓ సౌలభ్యం ఉంటుంది. భాష అర్థం కాక పోయినా గేమ్, ఇందులోని స్ట్రాటజీస్ ఏ భాషవారికైనా కనెక్ట్ అవుతాయి. హిందీలో ‘మేరికోమ్, భాగ్ మిల్కా సింగ్, చక్ దే ఇండియా’ వంటి సినిమాలు వచ్చినప్పుడు ఇక్కడి తెలుగు ఆడియన్స్ కూడా ఈ సినిమాలను హిందీ భాషలోనే చూసి, ఈ చిత్రాలను సూపర్ హిట్ చేశారు. ఇప్పుడు ‘పెద్ది’ టీమ్ కూడా ఇదే చేయనుందట. కాక పోతే ఇంటర్నేషనల్ లెవల్లో. రామ్చరణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ పీరియాడికల్ మల్టీస్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’. బుచ్చిబాబు సానా ఈ సినిమాకు దర్శకుడు.ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా జగపతిబాబు, దివ్యేందు శర్మ, శివరాజ్కుమార్ ఇతర కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ మైసూర్లో జరుగుతోంది. రామ్చరణ్పాల్గొంటుండగా ఓపాటతోపాటు కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ పతాకాలపై వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా రామ్చరణ్ బర్త్ డే సందర్భంగా మార్చి 27న విడుదల కానుంది.కాగా ఈ సినిమాను గ్లోబల్ స్థాయిలో రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. మంచి ఎమోషన్స్ ఉన్న స్పోర్ట్స్ డ్రామా కాబట్టి యూనివర్సల్ అప్పీల్ ఉంటుందని టీమ్ భావిస్తోందట. ఈ దిశగా ప్రయత్నాలను మొదలు పెట్టిందట టీమ్. ఇక ‘ఆర్ఆర్ఆర్’ (ఈ చిత్రంలో ఎన్టీఆర్ మరో హీరో) చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా రామ్చరణ్కు క్రేజ్ వచ్చింది. ఈ సినిమా ఆస్కార్ ప్రమోషన్స్లోనూ రామ్చరణ్ ఉత్సాహంగాపాల్గొన్నారు. ‘ఆర్ఆర్ఆర్’లో రామ్చరణ్ పెర్ఫార్మెన్స్ను కొందరు హాలీవుడ్ దర్శకులు మెచ్చుకున్నారు. ఇదంతా ‘పెద్ది’ సినిమాను ఇంటర్నేషనల్ ఆడియన్స్కు దగ్గర చేయడంలో ఉపయోగపడుతుందని టీమ్ భావిస్తోందని ఫిల్మ్నగర్ భోగట్టా.హాలీవుడ్ అసోసియేషన్ ‘పుష్ప’ ఫ్రాంచైజీ నుంచి వచ్చిన ‘పుష్ప: ది రైజ్, పుష్ప: ది రూల్’ చిత్రాల తర్వాత అల్లు అర్జున్ క్రేజ్ బాగా పెరిగింది. ‘పుష్ప:ది రూల్’ వంటి బ్లాక్బస్టర్ తర్వాత హీరో అల్లు అర్జున్ అంతర్జాతీయ స్థాయిలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి తమిళ దర్శకుడు అట్లీ డైరెక్టర్. భారీ బడ్జెట్తో ఈ సినిమాను సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. కాగా ఈ సినిమాను అంతర్జాతీయ స్థాయిలో రిలీజ్ చేయాలని టీమ్ ప్లాన్ చేస్తోంది. ఇందుకోసం సన్నాహాలు కూడా మొదలుపెట్టింది.హాలీవుడ్లో ‘అవతార్, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్, డ్యూన్, జురాసిక్ వరల్డ్’ వంటి సినిమాల ప్రమోషన్స్లో క్రీయాశీలకంగా వ్యవహరించిన హాలీవుడ్ ప్రముఖ మార్కెటింగ్ ఏజెన్సీ ‘కనెక్ట్ మాబ్ సీన్’తో అల్లు అర్జున్–అట్లీ టీమ్ అసోసియేట్ అయ్యేందుకు చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో భాగంగానే ‘కనెక్ట్ మాబ్ సీన్’ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ క్రియేటివ్ కంటెంట్ అలెగ్జాండ్రా ఈ. విస్కోంటి ఇటీవల ముంబై వచ్చి, అల్లు అర్జున్–అట్లీ అండ్ టీమ్ని కలిసి మాట్లాడారు. ‘కనెక్ట్ మాబ్ సీన్’తో అసోసియేషన్ దాదాపు ఓకే అయ్యిందని, త్వరలోనే అధికారిక ప్రకటన ఉండొచ్చనే టాక్ వినిపిస్తోంది. ⇒ కాగా ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ ముంబైలో జరుగుతోంది. అల్లు అర్జున్తోపాటు ఈ చిత్రంలోని కీలక తారాగణంపాల్గొంటుండగా కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ఇక ఈ సినిమాలో దీపికా పదుకోన్ ఓ హీరోయిన్గా నటిస్తున్నారు. కథ రీత్యా ఈ చిత్రంలో ఐదుగురు హీరోయిన్స్కు స్కోప్ ఉందని, దీపికా పదుకోన్ ,మృణాల్ ఠాకూర్ కన్ఫార్మ్ అయ్యారని, మిగతా హీరోయిన్స్గా జాన్వీ కపూర్, ఆలియా.ఎఫ్, భాగ్యశ్రీ బోర్సే వంటివారు కనిపించే అవకాశం ఉందనే టాక్ తెరపైకి వచ్చింది.ఇంకా ఈ చిత్రంలో రమ్యకృష్ణ, యోగిబాబు, విజయ్ సేతుపతి వంటి వారు ఇతర కీలకపాత్రల్లో కనిపిస్తారనే ప్రచారం జరుగుతోంది. అంతేకాదు... ఈ చిత్రంలో అల్లు అర్జున్ నాలుగుపాత్రల్లో కనిపిస్తారనే టాక్ వినిపిస్తోంది. తాత – తండ్రి–ఇద్దరు కొడుకులపాత్రల్లో అల్లు అర్జున్ కనిపిస్తారట. ఇక అల్లు అర్జున్ కెరీర్లోని ఈ 22వ సినిమా 2027 ఆగస్టులో రిలీజ్ కానుందనే ప్రచారం జరుగుతోంది.ది ప్యారడైజ్ ‘దసరా’ వంటి బ్లాక్బస్టర్ మూవీ తర్వాత నాని–దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో రూ పొందుతున్న చిత్రం ‘ది ప్యారడైజ్’. సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 26న విడుదల కానుంది. కాగా ‘ది ప్యారడైజ్’ సినిమాను కొన్ని భారతీయ భాషలతోపాటు స్పానిష్, ఇంగ్లిష్ భాషల్లో కూడా రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు.ఇందుకు తగ్గట్లుగానే హాలీవుడ్ ప్రముఖ మార్కెటింగ్ ఏజెన్సీ ‘కనెక్ట్ మాబ్ సీన్’ సంస్థతో ఇటీవల చర్చలు జరిపారు మేకర్స్. అంతేకాదు... ‘ది ప్యారడైజ్’ సినిమా ఇంటర్నేషనల్ వెర్షన్ రిలీజ్ కోసం ఓపాపులర్ హాలీవుడ్ యాక్టర్తో అసోసియేట్ కావాలనుకుంటున్నారు మేకర్స్. ఈ దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టారు. త్వరలోనే ఈ విషయంపై మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి.వీరే కాదు.. మరికొంతమంది తెలుగు హీరోలు కూడా తమ మార్కెట్ పరిధిని గ్లోబల్ స్థాయిలో పెంచుకునేందుకు ఇప్పట్నుంచే వ్యూహ రచనలు చేస్తున్నారనే టాక్ ఫిల్మ్నగర్ సర్కిల్స్లో వినిపిస్తోంది. – ముసిమి శివాంజనేయులు -
నేను ఐశ్వర్యరాయ్ కంటే అందగత్తెను: బిగ్బాస్ బ్యూటీ
నేను ఐశ్వర్య రాయ్ కంటే అందగత్తెను అంటోంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, బిగ్బాస్ బ్యూటీ తాన్య మిట్టల్ (Tanya Mittal). తాన్య ప్రస్తుతం హిందీ బిగ్బాస్ 19వ సీజన్లో పాల్గొంది. ఈ షో కోసం ఏకంగా 800 చీరలు, దానికి మ్యాచింగ్ జ్యువెలరీ పట్టుకెళ్లింది. పూటకో చీర మారుస్తానని, దానికి మ్యాచింగ్ కోసం కిలోల కొద్ది నగల్ని బిగ్బాస్ హౌస్కు పట్టుకెళ్లింది. అక్కడకు వెళ్లాక.. తనకు ఫ్రిజ్ డోర్ తీయడం రాదని, తలస్నానం చేయడం రాదంటూ షోలో ఒకటే ఓవరాక్షన్ చేస్తోంది.అవన్నీ నావల్ల కాదుఈ క్రమంలో ఈమె గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన వీడియో క్లిప్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అందులో తాన్య.. నాకు చాలా వింత కోరికలున్నాయి. సుష్మితా సేన్ గెలిచిన మిస్ యూనివర్స్ కిరీటాన్ని నాకు బహుకరించినట్లు కలగన్నాను. పైగా నేను ఐశ్వర్యరాయ్ కంటే అందంగా ఉంటాను.. కానీ ఇవన్నీ ఎలా సాధ్యమవుతాయి? సాయంత్రం ఆరు దాటిందంటే బయటకు వెళ్లకూడదు, ఫోన్లో అబ్బాయిలతో మాట్లాడకూడదు, జీవితంలో వంట తప్ప ఏదీ నేర్చుకోకూడదు.. ఇలా నేను బతకలేను. అందంపైనే ఆసక్తి ఏర్పడింది. అందంగా కనిపించాలన్న కోరిక నాలో ఎక్కువవుతూ వచ్చింది అని చెప్పుకొచ్చింది. అలాగే తను 12వ తరగతివరకు మాత్రమే చదివినట్లు తాన్య పేర్కొంది.చదవండి: నేను క్షేమంగా ఇంటికి రావాలని ప్రార్థిస్తూ ఉంటుంది.. సారీ అమ్మా! -
అనురాగ్ కశ్యప్ నిశాంచి.. ఆసక్తిగా ట్రైలర్
ఐశ్వరి థాకరే హీరోగా ఎంట్రీ ఇస్తోన్న చిత్రం నిశాంచి. ఈ సినిమాకు అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో హీరో ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఈ మూవీని జార్ పిక్చర్స్ బ్యానర్పై అజయ్ రాయ్, రంజన్ సింగ్ నిర్మించారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి ప్రసూన్ మిశ్రా, రంజన్ చండేల్, అనురాగ్ కశ్యప్ కథ అందించారు.ట్రైలర్ చూస్తుంటే ఉత్తరప్రదేశ్ నేపథ్యంలో సాగే యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. 2000వ దశకంలో సాగిన ఈ కథలో యాక్షన్, డ్రామా, రొమాన్స్, కామెడీ ఎంటర్టైనర్గా రూపొందించినట్లు అర్థమవుతోంది. ఈ మూవీ సెప్టెంబర్ 19న థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రంలో ఐశ్వర్య థాకరే కవలలుగా ద్విపాత్రాభినయం సినీ ప్రియులను ఆకట్టుకునేలా ఉంది. ఈ చిత్రంలో వేదిక పింటో, మోనిక పన్వర్, మొహమ్మద్ జీషాన్ ఆయుబ్, కుముద్ మిశ్రా కీలక పాత్రల్లో నటించారు. -
పరమ్ సుందరిలో యూత్ కలల రాణి.. షాకవుతున్న ఫ్యాన్స్!
జాన్వీ కపూర్, సిద్ధార్థ్ మల్హోత్రా జంటగా రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ పరమ్ సుందరి. కేరళ బ్యాక్డ్రాప్లో ఈ సినిమాను తెరకెక్కించారు. ప్రస్తుతం ఈ మూవీ థియేటర్లలో సందడి చేస్తోంది. పరమ్ సుందరి ట్రైలర్ రిలీజ్ తర్వాత చర్చిలో ఓ వివాదాస్పద సీన్తో విమర్శలొచ్చాయి. ఆ తర్వాత ఆ సీన్ మార్చడంతో వివాదానికి ఫుల్ స్టాప్ పడింది. అంతేకాకుండా ఈ మూవీలో నటించడానికి మీకు కేరళ నటి ఒక్కరు కూడా దొరకలేదా అంటూ మేకర్స్ను కొందరు విమర్శించారు. కేరళ అమ్మాయి పాత్రకు జాన్వీ కపూర్ను తీసుకోవడంపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. మలయాళీ నటులకు టాలెంట్ లేదా? అని మేకర్స్ను ప్రశ్నించారు.ఇదిలా పక్కనపెడితే పరమ్ సుందరిలో మలయాళీ ముద్దుగుమ్మ నటించినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో ఈ సినిమాకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది. ఒక్క కనుచూపుతో ఓవర్నైట్ స్టార్గా ఎదిగిపోయిన ప్రియా ప్రకాశ్ వారియర్ ఈ సినిమాలో కనిపించారు. అయితే ఇందులో ఆమె జూనియర్ ఆర్టిస్ట్గా కనిపించడంతో ఫ్యాన్స్ షాక్కు గురవుతున్నారు.జాన్వీకపూర్ కంటే ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోయిన్గా తీసుకుంటే బాగుండని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అప్పట్లో ఓరు అదార్ లవ్ మూవీలో ఒక్క కన్నగీటుతో యూత్ కలల రాణిగా ఫేమ్ తెచ్చుకుంది ప్రియా ప్రకాశ్. ఆ తర్వాత పలు మలయాళ సినిమాల్లో నటించింది. ప్రస్తుతం బాలీవుడ్లో కూడా కనిపించనుంది. ఇక పరమ్ సుందరి విషయానికొస్తే బాక్సాఫీస్ వద్ద బాగానే రాణిస్తోంది. రూ. 60 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించిన ఈ సినిమా ఐదు రోజుల్లో దేశవ్యాప్తంగా రూ. 34.25 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టింది. -
మాజీ ప్రియుడిని ఫ్యామిలీ అంటున్న భార్యలు.. జర జాగ్రత్త!: నటుడి హెచ్చరిక
ప్రేమలో ఇన్వెస్ట్ చేస్తే ఏమీ మిగలదు అంటున్నాడు బాలీవుడ్ నటుడు రణ్వీర్ షోరే (Ranvir Shorey). చిన్నప్పటి నుంచి తనకు ప్రేమ కలిసిరావడం లేదని చెప్తున్నాడు. కానీ తాను బంబుల్ అనే ఓ డేటింగ్ యాప్లో ఉన్నట్లు తెలిపాడు. రణ్వీర్ ఇంకా మాట్లాడుతూ.. స్త్రీపురుషుల మధ్య దూరం పెరిగింది. మాజీ ప్రియుడితో కలిసి భర్తను చంపుతున్న భార్య.. కుటుంబసభ్యుల అండదండలతో భార్య ప్రాణాలు తీసిన భర్త.. ఇలాంటి వార్తలే తరచూ కనిపిస్తున్నాయి. ప్రేమలో ఇన్వెస్ట్?నాకైతే చిన్నప్పటినుంచి ఈ ప్రేమలు కలిసిరావడం లేదు. ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ను బట్టి ప్రేమలో పడేందుకు ఇది సరైన సమయం కాదేమో అనిపిస్తోంది. మార్కెట్ పడిపోతున్నప్పుడు ఇన్వెస్టర్లు డబ్బు పెట్టరు. ప్రేమ విషయంలోనూ అంతే.. ఇప్పుడు మార్కెట్ బాగోలేదు. కాబట్టి లవ్లో ఇన్వెస్ట్ చేయడం కరెక్ట్ కాదు. రోజులెలా ఉన్నాయంటే.. నా మాజీ ప్రియుడు కూడా నా కుటుంబ సభ్యుడే అని భార్య ఎదురుతిరిగి చెప్తోంది. మార్కెట్ బాగోలేదుఆమె అన్నదాంట్లో తప్పేముందని పదిమంది తనకు వత్తాసు పలుకుతున్నారు. దీన్నే డౌన్ మార్కెట్ అంటున్నాను. ఇలాంటి సమయంలో ప్రేమ జోలికి పోకుండా.. బుద్ధిగా ఇంట్లో ఉండి బాడీ బిల్డింగ్పై ఫోకస్ చేస్తే మీకే మంచిది అని సలహా ఇచ్చాడు. కాగా రణ్వీర్ షోరే.. గతంలో పూజా భట్ను ప్రేమించాడు. కొంతకాలం పాటు డేటింగ్లో ఉన్న వీరిద్దరూ తర్వాత బ్రేకప్ చెప్పుకున్నారు. పెళ్లి2010లో నటి కొంకణసేన్ శర్మను పెళ్లాడాడు. వీరికి కుమారుడు హరూన్ సంతానం. భార్యాభర్తల మధ్య పొరపచ్చాలు రావడంతో 2015లో విడిపోయారు. 2020లో విడాకులు తీసుకున్నారు. రణ్వీర్ చివరగా బిండియాకే బాహుబలి అనే సిరీస్లో కనిపించాడు. హిందీ బిగ్బాస్ ఓటీటీ మూడో సీజన్లోనూ పాల్గొన్నాడు.చదవండి: ఆ బాధ భరించలేకపోతున్నా: కిచ్చా సుదీప్ భావోద్వేగం -
రెండో బిడ్డకు జన్మనిచ్చిన ప్రముఖ బుల్లితెర నటి.. సోషల్ మీడియాలో పోస్ట్
ప్రముఖ బుల్లితెర నటి గౌహర్ ఖాన్ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఏడాది ఏప్రిల్లో అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన ముద్దుగుమ్మ.. తాజాగా రెండో బిడ్డ పుట్టిన విషయాన్ని సోషల్ మీడియాలో వేదికగా పంచుకుంది. సెప్టెంబర్ 1వ తేదీన తనకు బిడ్డ జన్మించాడని పోస్ట్ చేసింది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు, నటీనటులు ఈ జంటకు అభినందనలు చెబుతున్నారు. కొద్ది రోజుల క్రితమే సీమంతం వేడుక గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలయ్యాయి. కాగా.. గౌహర్ ఖాన్ 2020లో సంగీత స్వరకర్త ఇస్మాయిల్ దర్బార్ కుమారుడు జైద్ను వివాహం చేసుకున్నారు. ఈ జంట మే 2023లో తమ మొదటి బిడ్డకు స్వాగతం పలికారు. ఏప్రిల్ 2025లో సెకండ్ ప్రెగ్నెన్సీని ప్రకటించారు. ఇక కెరీర్ విషయానికొస్తే గౌహర్ ఖాన్ బాలీవుడ్లో పలు సీరియల్స్లో నటించింది. ఆమె ఇటీవల ఇషా మాల్వియాతో కలిసి లవ్లీ లోల్లాలో కూడా కనిపించింది. అంతేకాకుండా హిందీ బిగ్బాస్లో విన్నర్గా నిలిచింది. View this post on Instagram A post shared by Gauahar Khan (@gauaharkhan) -
15 ఏళ్ల వివాహ బంధానికి బుల్లితెర నటి గుడ్ బై..!
సినీ ఇండస్ట్రీలో విడాకులు అనే పదం కామన్గా అయిపోయింది. కొన్నేళ్ల పాటు కలిసి ఉన్న జంటలు అభిమానులకు సడన్గా ఇలాంటి షాక్లు ఇస్తుంటారు. తాజాగా ప్రముఖ బుల్లితెర నటి సింపుల్ కౌల్ తన వివాహా బంధానికి ఎండ్ కార్డ్ పడేసింది. 15 ఏళ్ల తర్వాత తన భర్త, వ్యాపారవేత్త రాహుల్ లూంబాతో విడిపోతున్నట్లు ప్రకటించింది.(ఇది చదవండి: చెఫ్గా మారిన శోభిత ధూళిపాళ్ల.. నాగచైతన్య కామెంట్ చూశారా?)భర్తతో విడాకులపై సింపుల్ కౌల్ మాట్లాడుతూ.. "అవును మేమిద్దరం ఇటీవలే విడిపోయాం. మేము పరస్పరం చాలా పరిణతి చెందిన మనుషులం. నా జీవితంలో చాలా సంవత్సరాలు ఆయనతో కలిసి ఉన్నా. ఇకపై మేమిద్దరం పరస్పర నిర్ణయంతో విడిపోవాలని నిర్ణయించుకున్నాం' అని తెలిపింది. గత ఇంటర్వ్యూలో సింపుల్ కౌల్ మాట్లాడుతూ.."అతను విదేశాల్లో ఎక్కువ రోజులు ఉంటారు. కొన్నిసార్లు నేను అతనిని మిస్ అవుతూ ఉంటా. కానీ మా మధ్య మంచి అవగాహన ఉంది. మా బంధం చాలా బలంగా ఉంటుంది. అందుకే మా జీవితాన్ని సమతుల్యంగా చేసుకున్నా. ఆయన లేనప్పుడు నా కెరీర్పై కూడా దృష్టి పెట్టగలుగుతున్నా. మా ఇద్దరికీ సంతోషకరమైన పనితో పాటు జీవితంలో సమానంగా ఎదుగుతున్నాం" అని తెలిపింది.కాగా.. సింపుల్ కౌల్, రాహుల్ లూంబా 2010లో వివాహం చేసుకున్నారు. కుస్సుమ్తో తన కెరీర్ ప్రారంభించిన సింపుల్ కౌల్ పలు బాలీవుడ్ సీరియల్స్లో మెప్పించింది. అంతేకాకుండా 'శరరత్', 'తారక్ మెహతా కా ఊల్తా చాష్మా', 'యే మేరీ లైఫ్ హై' వంటి అనేక ప్రముఖ రియాలిటీ షోలలో కనిపించింది. సింపుల్ కౌల్ చివరిసారిగా 2022లో జిద్ది దిల్ మానే నా అనే సీరియల్లో కనిపించారు. అయితే విడిపోవడానికి గల కారణాన్ని ఆమె వెల్లడించలేదు. View this post on Instagram A post shared by Simple Kaul (@simplekaul) -
గుడ్ న్యూస్ చెప్పిన ఇలియానా.. ఇప్పుడే కాదు కానీ..
ఇలియానా..ఒకప్పుడు టాలీవుడ్లో స్టార్ హీరోయిన్. ఎన్టీఆర్, ప్రభాస్, మహేశ్ బాబు..ఇలా స్టార్ హీరోలందరితోనూ ఆమె నటించింది. ఆ తర్వాత బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. అక్కడ కొన్ని సినిమాలు చేసినా అంతగా గుర్తింపు రాలేదు. పెళ్లి తర్వాత కూడా ఒకటి రెండు సినిమాల్లో నటించింది. అయితే పిల్లలు పుట్టడంతో గత కొంతకాలంగా ఆమె సినిమాలకు దూరంగా ఉంటుంది. ఇలియానా రీఎంట్రీ ఇస్తే బాగుండని చాలా మంది ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇలాంటి సమయంలో తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది ఇలియానా(Ileana D'cruz). త్వరలోనే మళ్లీ వెండితెరపై ఎంట్రీ ఇస్తానని చెప్పింది.తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం తల్లిగా పూర్తి సమయాన్ని నా ఇద్దరి పిల్లలకే కేటాయిస్తున్నాను. ఇప్పుడే సినిమాల్లో నటించాలనే ఆసక్తి లేదు. అభిమానులు నన్ను ఎంత మిస్ అవుతున్నారో అర్థం చేసుకోగలను. నటన అంటే నాకు కూడా ఇష్టమే. కానీ దానికంటే ముందు నా పిల్లల బాగోగులు చూసుకేనే బాధ్యత నాకుంది. అందుకే కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్నాను. త్వరలోనే మళ్లీ మీ ముందుకు వస్తాను. అయితే అది ఎప్పుడు, ఏ సినిమా అనే విషయం మాత్రం ఇప్పుడే చెప్పలేను. రీఎంట్రీ ఇచ్చే ముందు నేను మానసికంగానే కాకుండా శారీరకంగానూ కొన్ని మార్పులు చేసుకోవాలి. దానికి కొంత సమయం పడుతుంది’ అని ఇలియానా చెప్పుకొచ్చింది. త్వరలోనే ఇలియానా వెండితెరపై మెరవనుందని తెలియడంతో ఆమె ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.కాగా, 2006లో దేవదాస్ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ఇలియానా. చివరిగా 2018లో రవితేజతో ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ సినిమా చేసింది. 2023లో మైఖేల్ డోలన్ అనే విదేశీయుడిని పెళ్లి చేసుకొని..అదే ఏడాది చివరిలో ఓ కొడుక్కి జన్మనిచ్చింది. ఈ ఏడాది జులైలో రెండో కొడుకు పుట్టినట్లు ఇలియానా ప్రకటించింది. -
అతియా శెట్టి- కేఎల్ రాహుల్ నూతన గృహ ప్రవేశం.. పూజలు చేసిన దంపతులు!
బాలీవుడ్ నటి అతియా శెట్టి, టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ నూతన గృహ ప్రవేశం చేశారు. తమ సొంతింటిలో పూజలు నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ ఏడాదిలోనే ఈ జంటకు కూతురు పుట్టింది. మార్చి నెలలో అతియా శెట్టి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. వీరి ముద్దుల కూతురికి ఈవారా విపుల రాహుల్ అని పేరు పెట్టారు.(ఇది చదవండి: కేఎల్ రాహుల్ ముద్దుల కూతురు.. పేరు రివీల్ చేసిన అతియాశెట్టి!)కాగా.. 2019లో ఓ ఫ్రెండ్ ద్వారా పరిచయమైన కేఎల్ రాహుల్, అతియా శెట్టి కొన్నేళ్ల పాటు డేటింగ్ చేశారు. ఆ తర్వాత ఇరు కుటుంబాల అనుమతితో జనవరి 2023లో వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లి వేడుక ముంబయిలోని ఓ ఫామ్హౌస్లో గ్రాండ్గా జరిగింది. ఈ వివాహా వేడుకలో సన్నిహితులు, స్నేహితులు మాత్రమే పాల్గొన్నారు. కాగా.. అతియా శెట్టి ప్రముఖ బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కూతురని దాదాపు అందరికీ తెలిసిందే. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
హీరోయిన్లు అంటే చిన్నచూపు.. హీరోలకు ఆ మాట చెప్పలేరు
సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లకు ఎప్పటికప్పుడు ఏదో ఒక ఇబ్బంది ఎదురవుతూనే ఉంటుంది. మరీ ముఖ్యంగా లైంగిక వేధింపులు లాంటివి ఏదో మూల వినిపిస్తూనే ఉంటాయి. ఈ విషయమై అప్పుడప్పుడు పలువురు కథానాయికలు స్పందిస్తూనే ఉంటారు. తమ అభిప్రాయాల్ని చెబుతుంటారు. ఇప్పుడు హీరోయిన్ కృతి సనన్ అలాంటి ఓ విషయం గురించి మాట్లాడింది. హీరోయిన్లని చిన్నచూపు చూడటం కరెక్ట్ కాదని చెప్పుకొచ్చింది.'సౌకర్యాల విషయంలోనే కాదు.. గౌరవించడంలోనూ చిన్నచూపు చూస్తుంటారు. హీరోలకు పెద్దకార్లు, లగ్జరీ రూమ్స్ ఇస్తారు. ఇది చాలా చిన్న విషయమే కావొచ్చు. కానీ అలా ఎందుకు చేస్తారని బాధపడుతుంటాను. కేవలం కార్లు, సౌకర్యాల గురించే కాదు మహిళలని తక్కువ చేసి చూడటం గురించి నేను మాట్లాడుతున్నాను. హీరోలతో సమానంగా గౌరవించడానికి మేం కూడ అర్హులమే. షూటింగ్ విషయంలోనూ ఇలానే జరుగుతోంది' (ఇదీ చదవండి: పెళ్లైన 13 ఏళ్లకు తల్లి కాబోతున్న టాలీవుడ్ హీరోయిన్)'హీరోలు సెట్స్కి ఆలస్యంగా వస్తారు. కానీ హీరోయిన్లు మాత్రం టైమ్ కంటే ముందే వెళ్లి వారి కోసం ఎదురుచూస్తూ ఉండాలి. అసిస్టెంట్ డైరెక్టర్లు నన్ను ముందే సెట్స్కి రావాలని పిలుస్తారు. హీరోలకు మాత్రం ఆ మాట చెప్పలేరు. ఇలాంటి ఆలోచనా విధానంలోనే మార్పు రావాలి' అని కృతి సనన్ తన ఆవేదన బయటపెట్టింది.కృతి సనన్కి ఏయే సినిమాలు, హీరోలతో ఇలాంటి అనుభవం ఎదురైందో గానీ ధైర్యంగా బయటకు చెప్పింది. మిగతా హీరోయిన్లు మాత్రం కొందరు ఇలాంటి వాటికి సర్దుకుపోతూ ఉంటారు. 2023లో 'ఆదిపురుష్' మూవీతో పాన్ ఇండియా వైడ్ ప్రేక్షకుల్ని పలకరించిన కృతి సనన్.. తర్వాత ఓ నాలుగు చిత్రాలు చేసింది గానీ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం ఈమె చేతిలో రెండు చిత్రాలు ఉన్నాయి. అవికూడా అప్ కమింగ్ హీరోలతో చేస్తున్నావే. ఈమె స్టార్ హీరోలతో పనిచేసే చాలాకాలమైపోయింది.(ఇదీ చదవండి: విజయ్-రష్మిక.. సైలెంట్గా మొదలుపెట్టేశారు) -
ఖరీదైన కారు కొన్న సీనియర్ నటి.. ధర ఎంతంటే?
ప్రముఖ బాలీవుడ్ నటి, హేమ మాలిని ఖరీదైన కారును కొనుగోలు చేసింది. తన కొత్త కారుకు పూజ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ లగ్జరీ కారు విలువు దాదాపు రూ.75 లక్షలకు పైగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఇది చూసిన అభిమానులతో పాటు నెటిజన్స్ సైతం అభినందనలు చెబుతున్నారు.బాలీవుడ్లో డ్రీమ్ గర్ల్పై పేరున్న హేమ మాలిని పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. పలువురు అగ్ర హీరోల సరసన మెప్పించారు. 1970-80 సమయంలో స్టార్ హీరోయిన్గా రాణించారు. ఆమె చివరిసారిగా 2020లో విడుదలైన సిమ్లా మిర్చి చిత్రంలో కనిపించింది. ప్రస్తుతం మధుర నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
బిపాసా బసు వివాదం.. మరో స్టార్ హీరోయిన్పై మృణాల్ ఠాకూర్ కామెంట్స్!
హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ఇటీవలే ఓ వివాదంలో చిక్కుకుంది. బాలీవుడ్ నటి బిపాసా బసును ఉద్దేశించి గతంలో ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరలయ్యాయి. దీంతో మృణాల్ ఠాకూర్పై నెటిజన్స్తో పాటు బాలీవుడ్కు చెందిన పలువురు సినీస్టార్స్ సైతం స్పందించారు. ఆ తర్వాత ఆ వయసులో తెలియక అలా మాట్లాడానని.. ఎవరినైనా బాధపెట్టి ఉండే క్షమించాలని సోషల్ మీడియా వేదికగా కోరింది. దీంతో ఆ వివాదానికి అక్కడితో ఫుల్స్టాప్ పడింది.అయితే మృణాల్ ఠాకూర్ సంబంధించిన మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. బాలీవుడ్లో తాను నటించాల్సిన సినిమా గురించి అందులో మాట్లాడింది. ఆ మూవీని తాను తిరస్కరించినట్లు మృణాల్ తెలిపింది. ఒకవేళ నేను ఆ చిత్రంలో చేసి ఉంటే.. నన్ను నేను కోల్పోయేదాన్ని అంటూ కామెంట్స్ చేసింది. కానీ ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో నా స్థానంలో నటించిన ఆమెకు స్టార్డమ్ను తీసుకొచ్చిందని మృణాల్ ఠాకూర్ తెలిపింది. అయితే ప్రస్తుతం ఆమె సినిమాలు చేయట్లేదని పేర్కొంది.ఆ సినిమా పేరు చెప్పకపోయినప్పటికీ నెటిజన్స్ మాత్రం మృణాల్ ఠాకూర్పై మండిపడుతున్నారు. సల్మాన్ ఖాన్ నటించిన సుల్తాన్ సినిమా గురించే మాట్లాడారని కామెంట్స్ చేస్తున్నారు. ఆ చిత్రంలో హీరోయిన్గా అనుష్క శర్మ నటించారని.. ఆమెను అవమానపరిచేలా ఉన్నాయంటూ నెటిజన్స్ మరోసారి ఫైరవుతున్నారు. ఆ సినిమాలో చేసినందుకు ఇప్పుడు అనుష్క శర్మ నటించడం లేదని.. ఆమెను తక్కువ చేసి మాట్లాడటం సరికాదని హితవు పలుకుతున్నారు. ఇటీవలే బిపాసా బసుపై కామెంట్స్తో వివాదానికి కారణమైన సీతారామం బ్యూటీ.. మరోసారి బాలీవుడ్లో హాట్టాపిక్గా మారింది. -
పోలీస్ స్టేషన్లో దెయ్యాలు.. ఆర్జీవీ కొత్త సినిమా పోస్టర్
కెరీర్ మొదట్లో ఎన్నో గొప్ప సినిమాలు తీశాడు దర్శకుడు రామ్గోపాల్ వర్మ (Ram Gopal Varma). తర్వాత ట్రాక్ తప్పి అన్నీ ఫ్లాపులే తీశాడు. ఇటీవలే తన తప్పు తెలుసుకున్న ఆర్జీవీ.. ఇకపై మంచి సినిమాలే చేస్తానని శపథం చేశాడు. అప్పుడే సిండికేట్ అనే భారీ చిత్రాన్ని ప్రకటించాడు. కానీ తర్వాత సిండికేట్ గురించి మళ్లీ ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదు. దాన్ని పక్కనపెట్టి ఓ హారర్ సినిమా చేస్తున్నాడు. అదే పోలీస్ స్టేషన్ మే భూత్. యు కాంట్ అరెస్ట్ ద డెడ్ అన్నది క్యాప్షన్!కాంబినేషన్ రిపీట్బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్పాయ్ ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. ‘సత్య (1988), కౌన్ (1999), శూల్’ (1999) చిత్రాల తర్వాత వీరి కాంబినేషన్లో వస్తున్న నాలుగో సినిమా ఇది! ఇందులో జెనీలియా హీరోయిన్గా నటించింది. తాజాగా ఈ సినిమా పోస్టర్ గ్లింప్స్ను ఆర్జీవీ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఎవరి వల్లయినా మనకు భయం వేస్తే పోలీసుల దగ్గరకు వెళ్తాం.. మరి పోలీసులే భయపడితే వాళ్లెక్కడికి పరుగుతీస్తారు? అంటూ ట్వీట్ చేశాడు. ఈ పోస్టర్ గ్లింప్స్ ఏఐ వీడియో అని తెలుస్తోంది.కథ అదేనా?పోలీస్ స్టేషన్ మే భూత్ సినిమా విషయానికి వస్తే.. ఓ పోలీస్ స్టేషన్లో జరిగిన భారీ ఎన్కౌంటర్లో కొంతమంది గ్యాంగ్స్టర్స్ చనిపోతారు. వాళ్లందరూ భూతాలుగా మారడంతో ఈ పోలీస్ స్టేషన్ ఓ హాంటెడ్ స్టేషన్గా మారి పోతుంది. భూతాలైన గ్యాంగ్స్టర్స్ పోలీసులను ఎలాంటి ఇబ్బందులకు గురి చేశారు? ఈ సమస్య నుంచి పోలీసులు ఎలా తప్పించుకోగలిగారు? అన్నదే సినిమా కథ అని తెలుస్తోంది! A DREADED GANGSTER is KILLED by an ENCOUNTER COP and he COMES BACK as a GHOST to HAUNT the POLICE STATION ..Hence the title “POLICE STATION MEIN BHOOT” You Can’t Arrest The Dead @BajpayeeManoj @geneliad @VauveEmirates @KarmaMediaEnt #uentertainmenthub #PoliceStationMeinBhoot pic.twitter.com/eMOyusT8iy— Ram Gopal Varma (@RGVzoomin) September 1, 2025 చదవండి: జున్ను కాలికి ఫ్రాక్చర్.. అర్ధరాత్రి నొప్పితో ఏడుపు.. చూడలేకపోయా! -
800 చీరలు, 50 కిలోల జ్యువెలరీతో బిగ్బాస్లోకి.. ఎవరీ బ్యూటీ?
బిగ్బాస్ షో (Bigg Boss Reality Show)కు వెళ్లేముందు.. అక్కడేం చేయాలి? ఎలా సిద్ధంగా ఉండాలి? అవతలివారిని ఎలా ఢీకొట్టాలి? మానసికంగా ఎంత స్ట్రాంగ్గా ఉండాలి? ఇలా రకరకాలుగా ఆలోచిస్తుంటారు కంటెస్టెంట్లు. కానీ ఒక్కరు మాత్రం అవన్నీ పక్కనపెట్టి ఎలా రెడీ అవాలి? తన రాయల్ లైఫ్ను ప్రజలకు ఎలా చూపించాలి? అన్నదానిపైనే ఎక్కువ శ్రద్ధ పెట్టింది. ఆవిడే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, ఎంటర్ప్రెన్యూర్ తాన్య మిట్టల్ (Tanya Mittal).50 కిలోల నగలుఈమె ప్రస్తుతం హిందీ బిగ్బాస్ 19వ సీజన్లో పాల్గొంది. ఈమె బిగ్బాస్ హౌస్కి ఏకంగా 800 చీరలు తీసుకెళ్లింది. అంతే కాదు, 50 కిలోల నగలను సైతం పట్టుకెళ్లిందట! ఇంత ఆర్భాటం ఎందుకన్న ప్రశ్నకు.. నా లగ్జరీలను నేనెందుకు వదిలేసుకోవాలి? నా చీరలు, నగలు అన్నీ నాతోపాటే తీసుకెళ్తా.. రోజుకు మూడు చీరలైనా కట్టుకోవాలని నిర్ణయించుకున్నాను అని షోకి వెళ్లడానికి ముందే చెప్పింది. వెండి వస్తువులను కూడా వెంట తీసుకెళ్లింది. ఇలాంటి వీఐపీ ట్రీట్మెంట్ తాన్యకు మాత్రమే దక్కడం గమనార్హం!ఎవరీ తాన్య?మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో 2000వ సంవత్సరంలో తాన్య మిట్టల్ జన్మించింది. 19 ఏళ్ల వయసులో కేవలం రూ.500తో 'హ్యాండ్మేడ్ లవ్ బై తాన్య' పేరిట హ్యాండ్బ్యాగ్, నగల బిజినెస్ ప్రారంభించింది. తర్వాత ఇందులో చీరలు అమ్మడం కూడా మొదలుపెట్టింది. 2018లో మిస్ ఆసియా టూరిజం యూనివర్స్ టైటిల్ గెలిచింది. తనకు ఇన్స్టాగ్రామ్లో 2.5 మిలియన్ ఫాలోవర్లున్నారు. బిజినెస్, యాడ్స్ ద్వారా నెలకు రూ.6 లక్షలు సంపాదిస్తోంది. View this post on Instagram A post shared by Tanya Mittal (@tanyamittalofficial) చదవండి: మా ఇంట్లో ఎవరూ బీఫ్ తినరు: సల్మాన్ ఖాన్ తండ్రి -
సీక్రెట్గా పెళ్లి.. తొలిసారి భర్తతో మీడియా ముందుకు హీరోయిన్
బాలీవుడ్ హీరోయిన్ నర్గీస్ ఫక్రి (Nargis Fakhri) ఈ ఏడాది ఫిబ్రవరిలో సీక్రెట్గా పెళ్లి చేసుకుంది. వ్యాపారవేత్త టోనీ బేగ్ (Tony Beig)ను పెళ్లాడింది. అమెరికాలోని కాలిఫోర్నియాలో వివాహ తంతు పూర్తి చేసుకుని అట్నుంచటే కొత్త దంపతులు స్విట్జర్లాండ్ వెళ్లారు. అయితే తనకు మ్యారేజ్ అయిందని నర్గీస్ ఎక్కడా చెప్పలేదు, అలాగే పెళ్లి ఫోటోలు కూడా షేర్ చేయలేదు. ఇంతవరకు జంటగా కనిపించిందీ లేదు. పెళ్లయిన ఆరు నెలల తర్వాత తొలిసారి భర్తతో కనిపించిందీ బ్యూటీ. ముంబైలో నీతా ముకేశ్ అంబానీ కల్చరల్ సెంటర్ (NMACC)లో ఆగస్టు 30న జరిగిన ఓ కార్యక్రమానికి భర్తతో కలిసి హాజరైంది.పెళ్లయ్యాక తొలిసారి..వీరితో కొరియోగ్రాఫర్, దర్శకురాలు ఫరా ఖాన్ (Farah Khan) కూడా జత కలిసింది. రెడ్ కార్పెట్పై నర్గీస్, ఫరా ఖాన్ జంటగా ఫోటోలు దిగారు. అనంతరం ఫరా.. నీ భార్య పక్కన వచ్చి నిల్చో అంటూ టోనీని పిలిచింది. దీంతో వారిద్దరి పెళ్లి జరిగిపోయిందని అభిమానులకు క్లారిటీ వచ్చేసింది. నర్గీస్ ఫక్రి.. మద్రాస్ కేఫ్, డిష్యుం, హౌజ్ఫుల్ 3, అమావాస్... తదితర సినిమాల్లో నటించింది. హాలీవుడ్ సినిమా ‘స్పై’లోనూ అలరించింది. చివరగా హౌస్ఫుల్ 5 మూవీలో కనిపించింది. దాదాపు రూ.250 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా రూ.288 కోట్లు రాబట్టింది. View this post on Instagram A post shared by Buzzzooka Prime (@buzzzookaprime) -
మా ఇంట్లో ఎవరూ బీఫ్ తినరు: సల్మాన్ ఖాన్ తండ్రి
మా ఇంట్లో ఎవరమూ బీఫ్ తినము అని చెప్తున్నాడు బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ (Salman Khan) తండ్రి, రచయిత సలీమ్ ఖాన్. ఫ్రీ ప్రెస్ జర్నల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సలీం ఖాన్ మాట్లాడుతూ.. మేము ఎన్నడూ బీఫ్ తినలేదు. మా ఇంట్లో ఎవరికీ ఆ అలవాటు లేదు. ఆవుపాలు తల్లిపాలవంటివి అని మా ప్రవక్త బోధనల్లో స్పష్టంగా చెప్పాడు. కాబట్టి వాటిని సంహరించకూడదు.ఘనంగా సెలబ్రేషన్స్హిందూ సాంప్రదాయాలంటే నాకు చాలా ఇష్టం. నా చిన్నప్పుడు మా గల్లీలలో హిందూ పండగలను గొప్పగా సెలబ్రేట్ చేసుకునేవాళ్లం. చిన్నపెద్ద తేడా లేకుండా అందరూ ఆ వేడుకల్లో పాల్గొనేవాళ్లు. సుశీలతో పెళ్లికి కూడా మా కుటుంబం ఎటువంటి అభ్యంతరం చెప్పలేదు. మేము అన్ని పండగలను సెలబ్రేట్ చేసుకుంటాం. అన్నింటినీ గౌరవిస్తాం. అందుకే 60 ఏళ్లుగా సంతోషంగా కలిసున్నాం. ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా గణపతిని ఇంట్లో ప్రతిష్టించి పూజించుకున్నాం అని తెలిపాడు.గణపతి పూజకాగా ఇటీవల సల్మాన్ చెల్లెలు అర్పిత ఖాన్ ఇంట్లో గణపతి పూజ ఘనంగా నిర్వహించారు. ఈ పూజలో సల్మాన్, అతడి పేరెంట్స్ సలీం- సల్మా (సుశీల) గణనాథుడికి హారతిచ్చారు. ఈ పూజా కార్యక్రమానికి సల్మాన్ కుటుంబసభ్యులతో పాటు పలువురు సెలబ్రిటీలు సైతం హాజరయ్యారు. pic.twitter.com/qfa76sFxCj— Salman Khan (@BeingSalmanKhan) August 27, 2025 చదవండి: జీవితంపైనే అసహ్యం.. నాకు చావే దిక్కు!: హీరో రెండో భార్య -
రూ. 40 కోట్ల బడ్జెట్..300 కలెక్షన్స్.. ఆస్తులన్నీ అమ్ముకున్నాం : డైరెక్టర్
పాన్ ఇండియా హీరోలు..స్టార్ డైరెక్టర్లు.. భారీ బడ్జెట్.. ఇవన్నీ ఉన్నా కూడా థియేటర్స్కి ప్రేక్షకులు రాలేకపోతున్న రోజులివి. స్టార్ హీరోల సినిమాలకు కూడా సూపర్ హిట్ టాక్ వస్తేనే కాస్తో కూస్తో జనాలు థియేటర్స్కి వస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఓ యానిమేషన్ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ని షేక్ చేసింది. అదే ‘మహావతార్ నరసింహా’.బడా చిత్రాలు సైతం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతుంటే.. ఈ మూవీ మాత్రం ఐదు వారాలుగా థియేటర్స్లో సందడి చేస్తూనే ఉంది. దాదాపు రూ. 40 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటి వరకు 300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి.. అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన ఇండియన్ సినిమాగా రికార్డుకెక్కింది. ఈ సినిమాకు అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించడంతో పాటు నిర్మాతగాను వ్యవహరించాడు. ఈ క్రమంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నానని, ఐదేళ్ల పాటు పడిన కష్టానికి ఫలితం దక్కిందని అంటున్నాను. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమా తీసే క్రమంలో ఎదురైన కష్టాల గురించి చెప్పుకొచ్చాడు.దేవుడిని నమ్మేవాడిని కాదు..మాది మహారాష్ట్ర. చదువుకునే రోజుల్లో దేవుడిని నమ్మేవాడిని కాదు. దేవుడే ఉంటే..కొందరికి కష్టాలు, కొందరికి సుఖాలు ఎందుకు ఇస్తాడని ప్రశ్నించేవాడిని. అయితే కొన్ని సమస్యలు, ఒత్తిళ్లు రావడంతో కృష్ణభక్తుడైన శ్రీలప్రభుపాద రచనలు, భగవద్గీతా చదివాను. దీంతో నేను కృష్ణ భక్తిడిగా మారిపోయా. అప్పుడే వీఎఫ్ఎక్స్ ఉపయోగించి త్రీడీలో ప్రహ్లాదుడు-నరసింహా స్వామి కథను తీయాలనుకున్నా. దాదాపు ఐదేళ్ల క్రితం మహావతార్ నరసింహ కథకి బీజం పడింది.ఆస్తులన్నీ అమ్ముకున్నాం.. ఈ సినిమా కోసం మా ఆస్తులన్నీ అమ్ముకున్నాం. మొదట్లో మా దగ్గర ఉన్న డబ్బుతో సినిమా తీద్దాం అనుకున్నాం. కానీ వర్క్ స్టార్ట్ అయిన తర్వాత సంపాదించిదంతా కొన్నాళ్లకే అయిపోయింది. నా భార్య దగ్గర ఉన్న డబ్బులు కూడా ఈ సినిమాకే ఖర్చు చేశాం. బడ్జెట్ ఊహించనంత పెరిగిపోయింది. ఇన్వెస్టర్లను వెతికాం. కొంతమంది పెట్టుబడి పెడతామని చెప్పి చివర్లో హ్యాండిచ్చారు. అలా దాదాపు వంద మందికి పైగా నిర్మాతలను, ఇన్వెస్టర్లను కలిశాం. చివరకు నా భార్య నగలు, కారు, ఇష్టంగా కట్టుకున్న ఇళ్లు కూడా అమ్మేసి సినిమా నిర్మాణానికి ఖర్చు చేశాం.ఎవరు చూస్తారంటూ భయపెట్టారుసినిమా కోసం మా టీమ్ అంతా చాలా కష్టపడింది. రోజుకు 16 గంటలు పని చేసేవాళ్లం. నెలాఖరు రాగానే టీమ్ జీతాల కోసం ఎక్కడ అప్పులు తేవాలని నా భార్య ఆలోచించేంది. ఇలా మా అవస్థలేవో మేం పడుతుంటే.. మరికొందరు ‘దేవుడి సినిమా ఇప్పుడు ఎవరు చూస్తారు? ఉన్న ఆస్తులన్నీ అమ్మేస్తున్నారు.. సినిమా పోతే మీ పరిస్థితి ఏంటి? అని కొంతమంది భయపెట్టేవాళ్లు. కానీ నా భార్య, నేను ఒక్కటే అనుకున్నాం. ఒకవేళ సినిమా పోతే.. ‘అది మన ఖర్మ’ అనుకొని వదిలేసి.. గతంలో మాదిరి మళ్లీ వీఎఫ్ఎక్స్ పనులు చేసుకుందాం’ అని నిర్ణయించుకున్నాం. చాలా ఇబ్బందులు పడి జులై 25న ఈ చిత్రాన్ని విడుదల చేశాం. రూ.40 కోట్లతో తెరకెక్కించిన ఈ చిత్రం పది రోజుల్లోనే రూ. 100 కోట్లను వసూళ్లు చేసింది. ఇప్పటి వరకు దాదాపు 300 కోట్ల వరకు రాబట్టింది. మా ఐదేళ్ల కష్టానికి ఫలితం దక్కింది. చాలా సంతోషంగా ఉంది’ అని అశ్వి కుమార్ అన్నారు. -
సక్సెస్ అంటే డబ్బు సంపాదించడం కాదు: రకుల్ ప్రీత్ సింగ్
రకుల్ ప్రీత్ సింగ్.. పేరు వినగానే, హీరోయిన్గానే కాకుండా ఫిట్నెస్ అండ్ హెల్త్ గుర్తొస్తుంది. ఆమె గురించి తెలుసుకోవాలంటే ఎప్పటికప్పుడు కొత్త విషయాలు ఉంటూనే ఉంటాయి. నటిగానే కాకుండా ఆమె ఫిట్నెస్, డ్యాన్స్, స్పోర్ట్స్, సోషల్ యాక్టివిటీస్, ఆంత్రప్రెన్యూర్షిప్లో తనకంటూ ప్రత్యేకతను ఏర్పరచుకుంది. రకుల్ గురించి ఇంకొన్ని విషయాలు...నాన్న ఆర్మీ ఆఫీసర్రకుల్ ప్రీత్ సింగ్ న్యూఢిల్లీలోని సిక్కు కుటుంబంలో పుట్టింది. ఆమె తండ్రి కుల్వీందర్ సింగ్ ఆర్మీ ఆఫీసర్గా పని చేసేవారు. దాంతో ఆమె ఆర్మీ స్కూల్లోనే స్కూలింగ్ చేసి, ఆపైన జీసస్ అండ్ మేరీ కాలేజీలో డిగ్రీ పూర్తి చేసింది. రకుల్ ప్రీత్ జాతీయ స్థాయి గోల్ఫ్ ప్లేయర్. అంతేకాదు, ఎంతో ఆసక్తితో భరతనాట్యం కూడా నేర్చుకుంది. అలాగే ఆమెకు గుర్రపు స్వారీ చేయడం కూడా చాలా ఇష్టం.మోడలింగ్మోడలింగ్ను కెరీర్గా ఎంచుకున్నాక, రకుల్ 18 ఏళ్లకే కన్నడ సినిమా ‘గిల్లి’ ద్వారా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. తెలుగు, కన్నడ, తమిళ సినిమాల్లో నటించి.. ప్రస్తుతం బాలీవుడ్లో టాప్ హీరోయిన్ల జాబితాలో చేరిపోయింది. ‘ఫెమినా’ మిస్ ఇండియా–2011లో రకుల్ ఐదో స్థానంలో నిలిచింది. అందులోనే పాంటలూన్స్ మిస్ ఫ్రెష్ ఫేస్, ఫెమినా మిస్ టాలెంటెడ్, మిస్ బ్యూటిఫుల్ స్మైల్, మిస్ బ్యూటిఫుల్ ఐస్, పీపుల్స్ చాయిస్ మిస్ ఇండియా టైమ్స్ వంటి టైటిల్స్ గెలుచుకుంది.కోవిడ్ టైంలో..‘మనకంటూ ప్రత్యేకంగా టైమ్ కేటాయించుకోవాలి. ఎవరి సంతోషం వాళ్ల చేతుల్లోనే ఉంటుంది. దానికోసం ఎవరిపైనా ఆధారపడొద్దు’ అన్నది రకుల్ అభిప్రాయం. రకుల్ తన సామాజిక బాధ్యతను ఎప్పుడూ మరిచిపోలేదు. కోవిడ్ సమయంలో వంద కుటుంబాలను ఆదుకోవడమే కాకుండా, క్రౌడ్ ఫండింగ్ చేసి పేదలకు డొనేషన్స్ అందించింది. 2017లో రకుల్ ‘తెలంగాణ బేటీ బచావో, బేటీ పఢావో’ ప్రచారానికి బ్రాండ్ అంబాసిడర్గా అపాయింట్ అయింది.నాన్న నుంచే వచ్చాయి..2024లో తను ప్రేమించిన జాక్కీ భగ్నానీ (Jackky Bhagnani)ని గోవాలో వివాహం చేసుకుంది. మొదట ఓవర్సీస్లో పెళ్లి వేడుకలు జరపాలనుకున్నారట! కాని, దేశ ఆర్థిక వ్యవస్థకు తోడ్పడాలనే ఆలోచనతో గోవాలోనే ఘనంగా వేడుకలు జరుపుకున్నారు. ‘సక్సెస్ అంటే పేరు, డబ్బు కాదు. మనసుకు నచ్చిన పని చేస్తూ ప్రశాంతమైన జీవితాన్ని గడపడం. చిన్నప్పటి నుంచి నాన్న నుంచి వచ్చిన డిసిప్లిన్, పంక్చువాలిటీ నన్ను ఎప్పటికీ హ్యాపీ లైఫ్ వైపే తీసుకెళ్తాయి.ఇష్టందానివల్లే చేయాల్సిన పనిలో రెండు నిమిషాలు ఆలస్యమైనా నాకు ప్యానిక్ అటాక్ వచ్చేస్తుంది. సోషల్ ఎంటర్టైనర్స్ చేయడం నాకు చాలా ఇష్టం. వాటితో సమానంగా సోషల్ రెస్పాన్సిబుల్ సినిమాలూ చేయాలని ఉంది. ఫ్యాషన్, డ్రెస్సింగ్ విషయానికొస్తే, నాకు ఏది కంఫర్ట్ ఉంటే అదే ఎంచుకుంటాను’ అని చెబుతుందిపర్యావరణాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత. 2047 నాటికైనా మనమంతా కాలుష్యరహిత దేశంలో ఉంటామని ఆశిస్తున్నాను. ప్రతి భారతీయ పౌరుడు బాధ్యతగా ఉంటేనే ప్లానెట్ ఎర్త్ బాగుంటుంది.– రకుల్ప్రీత్ సింగ్ -
పవన్ సింగ్ కాంట్రవర్సీ... అంతలోనే మరో నటుడు అసభ్య ప్రవర్తన!
భోజ్పురి నటుడు పవన్ సింగ్ వివాదం మరవకముందే మరో స్టార్ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇప్పటికే నటి అంజలి రాఘవ్ను ఓ ఈవెంట్లో వేదికపై అసభ్యంగా తాకాడ. దీంతో అతనిపై నెటిజన్స్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇది కాస్తా వివాదానికి దారి తీయడంతో ఆమెకు క్షమాపణలు కూడా చెప్పారు. ఈ సంఘటన జరిగిన వెంటనే అంజలి సైతం భోజ్పురి ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసింది.ఒకవైపు ఇదంతా జరుగుతూ ఉండగానే మరో భోజ్పురి నటుడు ఖేసరి లాల్ యాదవ్ ఓ మహిళా అభిమానితో అసభ్యంగా ప్రవర్తించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఈ ప్రవర్తనతో సోషల్ మీడియా వేదికగా పెద్దఎత్తన విమర్శలొస్తున్నాయి. అతన్ని చీప్ క్యారెక్టర్ అంటూ పలువురు నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అభిమానులతో ఇలా అసభ్యంగా ప్రవర్తిస్తారా అంటూ భోజ్పురి నటుడిపై మండిపడుతున్నారు. కేవలం రెండు రోజుల వ్యవధితో మరో వివాదం తలెత్తడంతో ఆ సినిమా ఇండస్ట్రీపై తీవ్రమైన విమర్శలొస్తున్నాయి.What Khesari Lal Yadav did with this girl is more shameless or similar to what Pawan Singh did. These so called Bhojouri superstars are so cheap. #PawanSingh #khesarilalyadav pic.twitter.com/C1ugsrN5mJ— Avinash Choubey (@avinashchoubey) August 31, 2025