breaking news
Bollywood
-
మీరనుకున్నట్లు శ్రీదేవి అమాయకురాలు కాదు: సీనియర్ నటి పూనమ్
టాలీవుడ్ ప్రియుల గుండెల్లో అతిలోక సుందరిగా ముద్రవేసుకున్న హీరోయిన్ శ్రీదేవి. బాలీవుడ్తో పాటు తెలుగులోనూ స్టార్ హీరోయిన్గా మెప్పించింది. తాజాగా ఆమెపై మరో నటి, హీరోయిన్ పూనమ్ ధిల్లాన్ ప్రశంసలు కురిపించారు. అందరూ అనుకున్నట్లుగా తానేమీ తెలివితక్కువ వ్యక్తి కాదని తెలిపింది. తను చాలా అందమైన, అద్భుతమైన మనిషి అని అన్నారు. మీడియాలో చూపినట్లుగా మాటలు రాని వ్యక్తి కాదని పేర్కొన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన నటి పూనమ్ ధిల్లాన్.. శ్రీదేవిని ఉద్దేశించి ఇలా కామెంట్స్ చేశారు.నటి పూనమ్ ధిల్లాన్ మాట్లాడుతూ.. 'శ్రీదేవి చాలా తెలివైన నటి. మీడియా ఆమెను మాటలు రాని వ్యక్తిగా ముద్ర వేసింది. కానీ ఆమె అంత తెలివైనది కాదు. తనను అమాయకురాలిగా ముద్ర వేయడం అదంతా ఒక కుట్ర అని నేను చెప్తున్నా. ఎందుకంటే ఆమె చాలా తెలివిగల అమ్మాయి. అలా కాకపోతే ఆమె అంత అద్భుతమైన నటి ఎలా అవుతుంది? అందుకే శ్రీదేవి అమాయకురాలిగా నమ్మడాన్ని నిరాకరిస్తున్నా. నేను ఎల్లప్పుడూ ఆమె పనిని ఆరాధించేదాన్ని. తనతో కలిసి రెండు చిత్రాలలో పనిచేశా. శ్రీదేవి చాలా నిగ్రహం కలిగిన వ్యక్తి.' అని పంచుకుంది. కాగా.. శ్రీదేవి, పూనమ్ ధిల్లాన్ 'సోనే పే సుహాగా', 'జుదాయి' వంటి చిత్రాల్లో కలిసి పనిచేశారు.ఇక సినిమాల విషయానికొస్తే నటి పూనమ్ ధిల్లాన్ చివరిసారిగా రితేష్ దేశ్ముఖ్, తమన్నా భాటియా నటించిన 'ప్లాన్ ఎ ప్లాన్ బి'లో కనిపించింది. ఆమె జియో హాట్స్టార్ షో 'దిల్ బెకరార్'లో కూడా కనిపించనుంది. -
ఓటీటీలో మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!
ఓటీటీల్లో మిస్టరీ థ్రిల్లర్స్కు ఆదరణ విపరీతంగా పెరిగిపోయింది. ఓటీటీలో ఇలాంటి కంటెంట్నే ఆడియన్స్ ఎక్కువగా ఆదరిస్తున్నారు. ప్రేక్షకుల అభిరుచికి తగినట్లుగానే అలాంటి సరికొత్త కంటెంట్తో వెబ్ సిరీస్లు, చిత్రాలు వచ్చేస్తున్నాయి. తాజాగా ఓటీటీ ప్రియులను అలరించేందుకు మరో సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ వచ్చేస్తోంది. బాలీవుడ్ నటి వాణి కపూర్ ప్రధాన పాత్రలో తెరకెక్కించిన మండల మర్డర్స్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్కు సిద్ధమైంది.ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ అధికారికంగా వెల్లడించింది. జూలై 25 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుందని సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఈ మేరకు క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ కొత్త పోస్టర్ను నెట్ఫ్లిక్స్ విడుదల చేసింది. ఈ సిరీస్లో వాణికపూర్ తొలిసారి డిటెక్టివ్ పాత్రలో కనిపించనుంది. ఈ సిరీస్లో వైభవ్ రాజ్ గుప్తా, సుర్వీన్ చావ్లా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ను చరణ్దాస్పూర్ పట్టణం నేపథ్యంలో తెరకెక్కించారు. శతాబ్దాల క్రితం జరిగిన హత్యల నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ను యశ్రాజ్ ఫిల్మ్స్ బ్యానర్లో నిర్మించారు. ఈ మిస్టరీ థ్రిల్లర్ సిరీస్కు గోపి పుత్రన్ దర్శకత్వం వహించారు. ఈ సిరీస్ను ఆదిత్య చోప్రా, ఉదయ్ చోప్రా, యోగేంద్ర మోగ్రే, అక్షయ్ విధాని నిర్మించారు. 'ది రైల్వే మెన్' (2023) తర్వాత నెట్ఫ్లిక్స్, యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్లో వస్తోన్న సిరీస్ ఇదే కావడం విశేషం. Har vardaan mein ek shraap chhupa hai, mol chukane ka waqt jald aane wala hai 🕸️Watch Mandala Murders, out 25 July, only on Netflix.#MandalaMurders #MandalaMurdersOnNetflix #VaibhavRajGupta @SurveenChawla @ShriyaP #JameelKhan @gopiputhran @manan_rawat @MogreYogendra… pic.twitter.com/eQm3iX4x8a— Vaani Kapoor (@Vaaniofficial) June 30, 2025 -
'నేను ఏం మాట్లాడిన అలానే తీసుకుంటారు'.. విడాకుల రూమర్స్పై అభిషేక్ బచ్చన్!
బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్-ఐశ్వర్య జంటపై గత కొన్ని నెలలుగా రూమర్స్ వస్తూనే వినిపిస్తున్నాయి. వీరిద్దరు విడాకుల తీసుకోబోతున్నారంటూ చాలాసార్లు కథనాలొచ్చాయి. గతంలో ఐశ్వర్యరాయ్ తన కూతురు ఆరాధ్యతో కలిసి చాలాసార్లు కనిపించడంతో ఈ రూమర్స్ ఎక్కువయ్యాయి. అంతేకాకుండా ఐశ్వర్య బర్త్ డే ఆలస్యంగా విష్ చేయడం.. ఆమెతో అభిషేక్ బచ్చన్ ఎక్కువగా కనిపించకపోవడంతో విడాకుల వార్తలకు మరింత బలం చేకూరింది. అయితే ఈ వార్తలపై అభిషేక్ ఇప్పటివరకు స్పందించలేదు.తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన అభిషేక్ బచ్చన్.. తనపై వస్తున్న రూమర్స్పై స్పందించారు. సోషల్ మీడియాలో తన గురించి జరుగుతున్న తప్పుడు సమాచారంపై తాను ఎందుకు స్పందించలేదనే విషయాన్ని వెల్లడించారు. నెగెటివ్ వార్తలు రాయడం అనేది ఈ రోజుల్లో కొత్త ట్రోలింగ్ ట్రెండ్ అని అభిషేక్ అన్నారు. తాను ఏం మాట్లాడిన ప్రజలు నెెగెటివ్గానే తీసుకుంటారని స్పష్టం చేశారు.అభిషేక్ బచ్చన్ మాట్లాడుతూ.. "గతంలో నా గురించి వచ్చిన కథనాలేవీ నన్ను ఎలాంటి ప్రభావితం చేయలేదు. ఎందుకంటే ఈ రోజు నాకు ఒక కుటుంబం ఉంది. నేను ఏదైనా మాట్లాడితే అది వారిని చాలా బాధ పెడుతుంది. నేను ఏం చెప్పినా ప్రజలు దాన్ని నెగెటివ్గానే తీసుకుంటారు. ఎందుకంటే నెగెటివ్ వార్తలే ఎక్కువగా అమ్ముడవుతాయి. అలాంటి ప్రతికూలతను బయటపెట్టే వ్యక్తులు తమ మనస్సాక్షితో జీవించాలి. ఇక్కడ మనందరికీ కూడా కుటుంబాలు ఉన్నాయి. ఈ రోజుల్లో ఇది ఒక కొత్త ట్రోలింగ్ ఫ్యాషన్. మీరు సోషల్ మీడియాలో ఏదైనా చెప్పే బదులు.. డైరెక్ట్గా నాతో వచ్చి చెప్పడానికి మీకు అనుమతి ఇస్తా. కానీ నా ఎదురుగా వచ్చి చెప్పడానికి మీకు ధైర్యం ఉండదు. ఎవరైనా నా ఎదురుగా వచ్చి మాట్లాడితే వారిని స్వయంగా నేనే గౌరవిస్తా" అని అన్నారు. కాగా.. అభిషేక్ ప్రస్తుతం కాళిధర్ లపతా చిత్రంలో కనిపించనున్నారు. ఈ సినిమాకు మధుమిత దర్శకత్వం వహించారు. మరోవైపు అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ 2007లో వివాహం చేసుకున్నారు. ఈ జంటకు 13 ఏళ్ల కుమార్తె ఆరాధ్య బచ్చన్ ఉన్నారు. -
'మీ పిల్లలకు తల్లి లేకుండా చేస్తున్నావ్'.. చాలా బాధేసింది: డైరెక్టర్
సింగిల్ పేరెంటింగ్ అన్నది చాలా కష్టం. తల్లి/తండ్రి లేని లోటు తెలియకుండా పిల్లల్ని పెంచాలి. అమ్మానాన్న అన్నీ ఒక్కరై పిల్లల్ని చూసుకోవాలి. ఇద్దరి ప్రేమను ఒక్కరే పంచాలి. బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్ (Karan Johar) కూడా అదే పని చేస్తున్నాడు. 2017లో సరోగసి ద్వారా కవలలకు తండ్రయ్యాడు. అప్పటినుంచి అన్నీ తానై పిల్లల్ని చూసుకుంటున్నాడు. కానీ కొందరు దీన్ని కూడా తప్పుపట్టారు. ఆ చిన్నారులకు తల్లి లేకుండా చేశావని నిర్మాతను విమర్శించారు. ఆ మాటలు తననెంతగానో బాధపెట్టాయంటున్నాడు కరణ్ జోహార్.నాపై నాకే అనుమానంతాజాగా ఓ ఇంటర్వ్యూలో కరణ్ మాట్లాడుతూ.. నీ పిల్లలకు తల్లి లేకుండా చేస్తున్నావన్న విషయం నీకర్థమవుతోందా? అన్న కామెంట్లు చూసి భరించలేకపోయాను. నేనేమైనా తప్పు చేస్తున్నానా? అని నామీద నాకే అనుమానమేసింది. అప్పుడు వెంటనే పిల్లల గదిలోకి వెళ్లాను. అప్పుడు వారి వయసు ఐదేళ్లుంటాయంతే! మీరు సంతోషంగానే ఉన్నారా? అని అడిగాను. నువ్వు మా నాన్నవి కాబట్టి హ్యాపీగా ఉన్నామన్నారు. నేను ఆ సమాధానం కోసమే ఎదురుచూశాను. సింగిల్ పేరెంట్గా..వారి రెస్పాన్స్ విన్నాక నాకు కొండంత ధైర్యం వచ్చింది. ఎవరేమనుకున్నా నాకనవసరం అనిపించింది. సింగిల్ పేరెంట్గా ఉన్నందుకు గర్వంగా ఫీలయ్యాను. మా అమ్మానాన్నకు నేను ఒక్కడినే సంతానం. ఇప్పుడు నేను సింగిల్ పేరెంట్గా ఉన్నాను. నాకు అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ములు, లైఫ్ పార్ట్నర్ అంటూ ఎవరూ లేరు. ఉన్నదల్లా నా కుటుంబం, స్నేహితులు.. వీళ్లెప్పుడూ నా వెన్నంటే ఉంటారు. అందుకు గర్విస్తున్నాను అని చెప్పుకొచ్చాడు.చదవండి: తెలుగు డైరెక్టర్లు ఎవరూ నాతో సినిమా చేయరు.. అందుకే!: విష్ణు -
తెలుగు డైరెక్టర్లు ఎవరూ నాతో సినిమా చేయరు.. అందుకే!: విష్ణు
టాలీవుడ్ హీరో మంచు విష్ణు (Vishnu Manchu)కు హిట్టు పడి చాలా ఏళ్లే అయింది. ఆయన చివరగా జిన్నా మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. 2022లో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఈసారి రొటీన్ సినిమాలు కాదని తన డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్పను పట్టాలెక్కించాడు. దీనికోసం ఎంతో అధ్యయనం చేసిన తర్వాతే కన్నప్ప షూటింగ్ మొదలుపెట్టాడు. మోహన్బాబు, మోహన్లాల్, ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, శరత్ కుమార్ వంటి బడా తారలు కీలక పాత్రలు పోషించారు. కన్నప్పపై ట్రోలింగ్మహాభారత్, రామాయణ్ సీరియల్స్ తెరకెక్కించిన హిందీ దర్శకుడు ముకేశ్ కుమార్ సింగ్ (Mukesh Kumar Singh) ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు. జూన్ 27న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ లభిస్తోంది. దీంతో సినిమా సక్సెస్ మీట్ కూడా నిర్వహించారు. ఈ వేడుకలో విష్ణు.. కన్నప్పపై జరిగిన ట్రోలింగ్ గురించి మాట్లాడాడు. కన్నప్ప సినిమా టీజర్ రిలీజైనప్పుడు ఉత్తి పుణ్యానికే నెగెటివిటీ ప్రచారం చేశారు. యూట్యూబ్లో నాన్నగారి గురించి, నా గురించి ఏమీ లేకపోయినా నెగెటివ్ థంబ్నైల్స్ పెడితే వారికి ఎక్కువ క్లిక్స్ వస్తున్నాయి, ఆదాయం వస్తోంది. వీఎఫ్ఎక్స్ గుర్తించలేకపోయారుఅది ఎంత పెద్ద తప్పని వారు రియలైజ్ అవట్లేదు. లొకేషన్స్ బాలేవు, గ్రాఫిక్స్ బాగోలేవు అని నానామాటలు అన్నారు. చాలామందికి తెలియని విషయమేంటంటే నేను రిలీజ్ చేసిన మొదటి టీజర్లో చాలా తక్కువ వీఎఫ్ఎక్స్ ఉన్నాయి. రెండో టీజర్లో మాత్రం 70% వీఎఫ్ఎక్స్ ఉన్నాయి. అదెవరూ గుర్తించలేకపోయారు. మోహన్లాల్గారి ఎపిసోడ్లో ఆ బాణాలు తప్ప అన్నీ ఒరిజినలే! రియల్ లొకేషన్లో షూట్ చేశాం అన్నాడు. నాతో ఎవరూ చేయరుతెలుగులో లెజెండరీ డైరెక్టర్స్ ఉన్నా, హిందీలో ముకేశ్ కుమార్నే ఎందుకు నమ్మారు? ఆయనకే ఎందుకు డైరెక్షన్ బాధ్యతలు ఇచ్చారన్న ప్రశ్న ఎదురైంది. అందుకు విష్ణు స్పందిస్తూ.. నాతో తెలుగులో ఏ డైరెక్టర్ పని చేయరని నాకు తెలుసు. కన్నప్ప స్క్రిప్ట్ తీసుకెళ్తే ఎవరూ నాతో చేయరని అందరికీ తెలుసు. పైగా దీనికంటే ముందు నేను చేసిన రెండు,మూడు సినిమాలు కూడా పెద్దగా ఆడలేదు. అందువల్ల ఇక్కడ ఎవరూ చేయరు. మహాభారతాన్ని (సీరియల్) అంత గొప్పగా తీసిన ముకేశ్ కన్నప్పను అంతే అద్భుతంగా తెరపై చూపించగలరని నమ్మాను అని చెప్పాడు. ముకేశ్ కుమార్ సింగ్కు దర్శకుడిగా ఇదే తొలి సినిమా కావడం విశేషం!చదవండి: మనస్ఫూర్తిగా ప్రేమించినప్పుడు బాధపడొద్దు: శ్రావణ భార్గవి పోస్ట్ -
డైరెక్ట్గా ఓటీటీకి సలార్ హీరో సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
సలార్ మూవీతో టాలీవుడ్ ప్రేక్షకుల్లో ఫేమ్ తెచ్చుకున్న హీరో పృథ్వీరాజ్ సుకుమారన్. ఆ తర్వాత ఆడుజీవితం సినిమాతో మరోసారి సినీ ప్రియులను అలరించాడు. ఈ ఏడాది ఎంపురాన్-2 మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. మోహన్ లాల్ కీలక పాత్ర పోషించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. ఈ సినిమాకు తానే స్వయంగా దర్శకత్వం వహించారు.ప్రస్తుతం మరో యాక్షన్ థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. కాయోజ్ ఇరానీ దర్శకత్వం వహిస్తోన్న సర్జమీన్ అనే బాలీవుడ్లో చిత్రంలో కనిపించనున్నారు. ఈ మూవీలో కాజోల్ హీరోయిన్గా కనిపించనుంది. దేశభక్తి నేపథ్యంలో వస్తోన్న ఈ మూవీ సైఫ్ అలీ ఖాన్ తనయుడు ఇబ్రహీం అలీ ఖాన్ కీ రోల్ ప్లే చేస్తున్నాడు. ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమార్ ఆర్మీ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్ను మేకర్స్ విడుదల చేశారు. ఈ సినిమాను నేరుగా ఓటీటీలోనే విడుదల చేయనున్నారు.సర్జమీన్ మూవీని జూలై 25 నుంచి జియో హాట్స్టార్ వేదికగా స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ మేరకు అఫీషియల్ ప్రకటన పేరుతో ఓ వీడియోను పంచుకున్నారు. ఈ చిత్రంలో ఇబ్రహీం అలీ ఖాన్ ఉగ్రవాదిగా కనిపంచనున్నట్లు తాజాగా రిలీజ్ చేసిన వీడియో చూస్తే అర్థమవుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ నిర్మిస్తున్తారు. ఈ సినిమాతోనే కాయోజ్ ఇరానీ డైరెక్టర్గా అరంగేట్రం చేస్తున్నారు.సర్జమీన్' కథేంటంటే?కశ్మీర్ నేపథ్యంతో ఈ మూవీని తెరకెక్కించారు. తన విధి పట్ల ఎంతో నిబద్ధత చూపించే విజయ్ మీనన్ (పృథ్వీరాజ్) చుట్టూ తిరుగుతుంది. ఇక ఈ సినిమాలో మీరా పాత్రలో కాజోల్, హర్మన్ పాత్రలో ఇబ్రహీం అలీ ఖాన్ నటించారు. మాతృభూమిని కాపాడటం కంటే ముఖ్యమైనది మరొకటి లేదు అనే క్యాప్షన్తో జియోహాట్స్టార్ ఈ వీడియోను షేర్ చేసింది. Sarzameen ki salamati se badhkar kuch nahi 🇮🇳#Sarzameen, releasing July 25, only on @JioHotstar!#SarzameenOnJioHotstar@itsKajolD #IbrahimAliKhan #KaranJohar @adarpoonawalla @apoorvamehta18 @AndhareAjit @kayoze @MARIJKEdeSOUZA @somenmishra0 @Soumil1212 #ArunSingh… pic.twitter.com/qtxTBsq4Iq— Prithviraj Sukumaran (@PrithviOfficial) June 30, 2025 -
రూ. 25 కోట్ల ఎఫెక్ట్.. అక్షయ్ సినిమాపై మనసు మార్చుకున్న 'పరేష్ రావల్'
బాలీవుడ్లో వినోదాలు పంచిన సిరీస్ల్లో ‘హెరాఫెరీ’ (Hera Pheri) ఒకటి. గత కొన్ని నెలలుగా ‘హెరాఫెరీ 3’ మూవీ సీక్వెల్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. సుమారు 20 ఏళ్ల తర్వాత పార్ట్-3 ప్లాన్ చేశారు. అక్షయ్ కుమార్, సునీల్ శెట్టి, పరేష్ రావల్, టబు, ఓం పురి, గుల్షన్ గ్రోవర్ వంటి స్టార్స్ ఈ సిరీస్లలో నటించారు. అక్షయ్ కుమార్ నిర్మాణ సంస్థ, కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్ సంస్థ ప్రస్తుత సీక్వెల్ను నిర్మిస్తున్నట్లు ప్రకటించింది. అయితే, సడెన్గా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రముఖ నటుడు పరేష్ రావల్ (శంకర్ దాదా ఎంబిబిఎస్ ఫేం) కొద్దిరోజుల క్రితం ప్రకటించారు. కామెడీ ప్రధాన కాన్సెప్ట్తో వచ్చిన గత రెండు సిరీస్లో ఆయన పాత్ర చాలా కీలకం. కానీ, పార్ట్-3 నుంచి ఆయన తప్పుకుంటున్నట్లు చెప్పడంతో సినిమాపై అంచనాలు అన్నీ తారుమారు అయిపోయాయి. దీంతో అక్షయ్ కుమార్ నిర్మాణ సంస్థ రంగంలోకి దిగింది. ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు వారు చర్యలు ప్రారంభించారు. దీంతో పరేష్ రావల్ దిగొచ్చినట్లు తెలుస్తోంది. హెరాఫెరీ-3లో తాను నటిస్తున్నట్లు తాజాగా ప్రకటించారు.'హేరా ఫేరి 3' సినిమా నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన నెల రోజుల తర్వాత తిరిగి అందులో భాగమవుతున్నానని నటుడు పరేష్ రావల్ తాజాగా స్పష్టం చేశారు. ఇటీవల పాడ్కాస్ట్లో కనిపించిన ఆయన, చిత్ర బృందంతో పరిస్థితులు చక్కబడ్డాయని, దర్శకుడు ప్రియదర్శన్తో మంచి స్నేహం ఉందని చెప్పారు. అక్షయ్ కుమార్, సునీల్ శెట్టితో కలిసి ఈ ప్రాజెక్ట్లో చేరానని తెలిపారు. వారు ముగ్గురు మంచి స్నేహితులని పరేష్ రావల్ అన్నారు. ఆపై అక్షయ్ కుమార్ తనకు చిరకాల స్నేహితుడని ఆయన కితాబు ఇచ్చారు. రావల్ అకస్మాత్తుగా సినిమా నుండి నిష్క్రమించిన తర్వాత.., అక్షయ్ కుమార్ నిర్మాణ సంస్థ అతనిపై రూ. 25 కోట్ల దావా వేసింది, అతని చర్యల వల్ల ఆర్థిక నష్టాలు సంభవించాయని, నిర్మాణ షెడ్యూల్కు అంతరాయం కలిగిందని ఆరోపించింది. ఈ కారణం వల్లే ఆయన తిరిగి ఈ ప్రాజెక్ట్లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. పరేష్ రావల్ ఈ మూవీ కోసం రూ. 15 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. ఆయన ఇప్పటికే చిత్ర నిర్మాణ సంస్థ నుంచి అడ్వాన్స్ కూడా తీసుకున్నారట. అందుకే న్యాయపరమైన చిక్కులు వస్తాయిని తన మనసు మార్చుకున్నారని టాక్. బాలీవుడ్లో వినోదాత్మక చిత్రాభిమానులను అలరిస్తుందనే భారీ అంచనాల మధ్య రూపొందుతున్న చిత్ర ‘హేరా ఫేరి 3‘(Hera Pheri 3) . ఈ సినిమాలో బాలీవుడ్ అగ్ర కధానాయకుడు అక్షయ్ కుమార్ నటిస్తున్నాడు. ప్రియదర్శన్ దర్శకత్వం వహిస్తున్నారు. -
మొదటి భార్యతో విడాకులు.. మద్యానికి బానిసయ్యా: అమిర్ ఖాన్
ఇటీవలే సితారే జమీన్ పర్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు బాలీవుడ్ స్టార్ హీరో అమిర్ ఖాన్. ప్రస్తుతం ఈ మూవీ థియేటర్లలో సందడి చేస్తోంది. ఆమిర్ఖాన్ నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన హిట్ ఫిల్మ్ ‘తారే జమీన్ పర్’ (2007)కు సీక్వెల్గా ఈ మూవీ తెరకెక్కించారు. ఈ మూవీ జెనీలియా కీలక పాత్రలో నటించారు. ఆర్ఎస్ ప్రసన్న దర్శకత్వం వహించగా ఆమిర్ఖాన్ ప్రొడక్షన్స్ బ్యానర్పై ఆమిర్ఖాన్, అపర్ణ పురోహిత్ నిర్మించారు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ను సొంతం చేసుకుంది.తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన అమిర్ ఖాన్.. తన వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తన భార్య రీనా దత్తాతో విడిపోయాక ఎదుర్కొన్న పరిస్థితిని వివరించారు. ఆ టైమ్లో తీవ్రమైన ఒత్తిడి, బాధకు గురయ్యానని వెల్లడించారు. దీంతో మద్యానికి బానిసైనట్లు తెలిపారు. నా సినిమా లగాన్ విజయం సాధించినప్పటికీ.. జీవితంలో ఏదో కోల్పోయినట్లు అనిపించదన్నారు. అది తన జీవితంలో చీకటిదశ అని పేర్కొన్నారు.అమిర్ ఖాన్ మాట్లాడుతూ.. 'రీనాతో నేను విడిపోయినప్పుడు ఆ రోజు సాయంత్రంమే మద్యం ఫుల్ బాటిల్ తాగాను. ఆ తర్వాత దాదాపు ఏడాదిన్నర పాటు ప్రతిరోజూ మద్యం తాగాను. ఆ సమయంలో ఎప్పుడూ నిద్రపోలేదు. అధిక మద్యం సేవించడం వల్ల నేను స్పృహ కోల్పోయేవాడిని. ఒక సమయంలో ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించా. ఆ సమయంలో ఎవరినీ కలవడానికి ఇష్టపడలేదు. అదే ఏడాది నా సినిమా లగాన్ రిలీజైంది. అప్పట్లో నన్ను మ్యాన్ ఆఫ్ ది ఇయర్ అని పిలిచారు. అది నాకు చాలా వ్యంగ్యంగా అనిపించింది' అని పంచుకున్నారు.కాగా.. ఆమిర్, రీనా చాలా ఏళ్లుగా ప్రేమలో ఉన్నారు. అంతేకాదు అమిర్ ఖాన్ తన రక్తంతో ఆమెకు ఒక లేఖ కూడా రాశాడు. రీనా మొదట అమిర్ ప్రేమను అంగీకరించలేదు.. కానీ తరువాత ఓకే చెప్పి.. ఇద్దరూ రహస్యంగా వివాహం చేసుకున్నారు. అంతేకాకుండా రీనా దత్తా ఆమిర్ మొదటి చిత్రం 'ఖయామత్ సే ఖయామత్ తక్'లో కూడా ఒక చిన్న పాత్ర పోషించింది. వీరి వివాహమైన 16 ఏళ్ల తర్వాత విడిపోయారు. ఈ జంటకు జునైద్, ఐరా అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. రీనాతో విడాకులు తీసుకున్న తర్వాత.. ఆమిర్ 2005లో చిత్రనిర్మాత కిరణ్ రావును వివాహం చేసుకున్నాడు. ఈ జంట 16 సంవత్సరాల తర్వాత 2021లో విడిపోతున్నట్లు ప్రకటించారు. ఆమిర్ ప్రస్తుతం తన చిరకాల స్నేహితురాలు గౌరీ స్ప్రాట్తో రిలేషన్లో ఉన్నారు. -
దాదాసాహెబ్... అంత ఈజీ కాదు: ఆమిర్ ఖాన్
దివంగత ప్రముఖ దర్శక–నిర్మాత–స్క్రీన్ రైటర్ దాదాసాహెబ్ ఫాల్కే (Dada Saheb Phalke) జీవిత చరిత్ర వెండితెరపైకి రానుంది. ఈ చిత్రంలో ఆమిర్ ఖాన్ టైటిల్ రోల్ చేయనున్నారు. ఆమిర్ ఖాన్ (Aamir Khan)తో ‘త్రీ ఇడియట్స్, పీకే’ వంటి హిట్ చిత్రాలు తెరకెక్కించిన రాజ్కుమార్ హిరాణి దర్శకత్వంలో ఈ దాదాసాహెబ్ బయోపిక్ రూపొందనుంది. తాజాగా ఈ సినిమా గురించి ఆమిర్ ఖాన్ మాట్లాడారు. ‘‘దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ చేయడం అనేది పెద్ద చాలెంజ్. వాణిజ్యపరమైన అంశాలున్న సాధారణ సినిమా కాదు ఇది. ఆ రోజుల్లోనే ఎవరూ ఊహించలేని విధంగా అడ్వెంచర్ చేసిన వ్యక్తి కథ ఇది. అంత ఈజీ కాదుఆయన జీవితంలో ఎన్నో ఎగ్జైట్ చేసే అంశాలు, సంగతులు, సంఘటనలు ఉన్నాయి. అడ్వెంచర్ జర్నీలాంటి ఈ సినిమా చేయడం అంత సులభం కాదు. దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ చేయడాన్ని నేను, రాజు (దర్శకుడు రాజ్కుమార్ హిరాణి కావొచ్చు) పెద్ద గౌరవంగా ఫీల్ అవుతున్నాం. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా చిత్రీకరణను ప్లాన్ చేశాం’’ అని ఆమిర్ ఖాన్ పేర్కొన్నారు. వచ్చే ఏడాది క్రిస్మస్ సందర్భంగా ఈ సినిమాను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని బాలీవుడ్ సమాచారం.చదవండి: '21 లగ్జరీ కార్లు చూసి పడిపోయింది'.. తట్టుకోలేక ఏడ్చేసిన శుభశ్రీ -
షఫాలీ మరణానికి కారణం.. ఉపవాసం సమయంలో అలాంటి ఇంజెక్షనే!
‘కాంటా లగా’ పాటతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటి షఫాలీ జరివాలా (42) (Shefali Jariwala) ఆకస్మిక మరణం అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. 2002 సమయంలో వచ్చిన ఈ సాంగ్తో మొదటి వైరల్ సెలబ్రిటీగా ఆమె గుర్తింపు పొందింది. ఆ సమయంలో ఇన్స్టాగ్రామ్, రీల్స్ వంటివి లేకున్నా ఈ ఒక్క సాంగ్తో యూత్కు దగ్గరైంది. జూన్ 27న కార్డియాక్ అరెస్ట్తో ఆమె మరణించినట్లు మొదట వార్తలు వచ్చాయి. కానీ, ముంబై పోలీసులు ఎలాంటి వివరాలు ప్రకటించలేదు. అయితే, తాజాగా ఆమె మరణం పట్ల పలు విషయాలు తెరపైకి వస్తున్నాయి. ఆమె ఎప్పటికీ అందంగా ఉండాలనే కోరికే ప్రాణం మీదకు తీసుకొచ్చిందిని తెలుస్తోంది.నటి షఫాలీ జరివాలా మరణించిన వెంటనే, ముంబై పోలీసులు విచారణ ప్రారంభించి, ఆమె మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం కూపర్ ఆసుపత్రికి పంపారు. శవపరీక్ష నిర్వహించినప్పటికీ, మరణానికి గల కారణం గురించి వారు ఇంకా వెళ్లడించలేదు. తదుపరి వైద్య విశ్లేషణ కోసం వేచి ఉన్నారు. అయితే, ప్రాథమిక దర్యాప్తులో వైద్యపరమైన కారణాలు ఉండవచ్చని తెలుస్తోంది. షెఫాలి చాలా సంవత్సరాలుగా వృద్ధాప్య వ్యతిరేక (యాంటీ ఏజింగ్) ఇంజెక్షన్లు తీసుకుంటుందని పోలీసు వర్గాలు తెలిపాయి. ఆమె అందుకు సంబంధించిన మెడిసిన్స్తో పాటు ఇంజెక్షన్లను వారు స్వాధీనం చేసుకున్నారు. ఆమె మరణించిన రోజున శుక్రవారం ఇంట్లో పూజా కార్యక్రమాలు జరగడంతో.. ఆమె ఉదయం నుంచి ఉపవాసం ఉన్నారని సమాచారం. దీంతో ఖాళీ కడుపుతోనే యాంటీ ఏజింగ్కు సంబంధించిన ఇంజెక్షన్ తీసుకోవడంతో కార్డియాక్ అరెస్టై ఉంటారని బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆమె ఇంజెక్షన్ తీసుకున్న తర్వాత ఆమె పరిస్థితి ఆందోళనగా మారిందని, ఆమె శరీరం అంతా బాగా వణికిపోయిందని ఆపై స్పృహ కోల్పోయిందని సంఘటన స్థలంలో ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. పోస్ట్మార్టం, ల్యాబ్ నివేదికలను విశ్లేషించిన తర్వాత మరణానికి తుది కారణం నిర్ధారించబడుతుందని పోలీసులు తెలిపారు. జూన్ 29న, షెఫాలి భౌతికకాయాన్ని ఓషివారా శ్మశానవాటికలో దహనం చేశారు. ఆమె భర్త పరాగ్ త్యాగి అంత్యక్రియలు చేస్తుండగా విలపిస్తూ కనిపించారు. తొలుత గాయకుడు హర్మీత్ సింగ్ను ఆమె పెళ్లి చేసుకున్నారు. కొంతకాలానికే వీరు విడిపోయారు. అనంతరం నటుడు పరాగ్ త్యాగీని వివాహమాడారు. -
16 ఏళ్ల పాటు షూటింగ్.. భారతీయ సినీ చరిత్రలో నిలిచిపోయిన సినిమా!
రూ.వందల కోట్ల పెట్టుబడి గురించి ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు గానీ, దాదాపు అరవై ఐదు సంవత్సరాల క్రితమే, భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత ఖరీదైన సినిమా విడుదలైంది. ఈ సెల్యులాయిడ్ దృశ్య కావ్యం కేవలం ఒక సినిమా కాదు. ఓ రకంగా అది ఒక ఒక ఉద్యమం అని చెప్పాలి. దాదాపు 16 సంవత్సరాల పాటు సాగిన నిర్మాణం భారతీయ చలనచిత్ర పరిశ్రమలో నభూతో నభవిష్యతిగా నిలిచింది. అప్పట్లోనే అకౌంటెంట్లకు చెమటలు పట్టించే బడ్జెట్తో రూపొందింది. ఒక హిందీ సినిమా మొత్తం వ్యయం సగటున రూ. 10 లక్షల లోపు ఉన్న సమయంలో కేవలం ఒక పాట గురించి రూ.కోటి ఖర్చు చేశారంటే ఆ సినిమా రూపకర్త గుండెధైర్యం గురించి ఏం చెప్పాలి?అందుకే ఇప్పటికీ ఆ సినిమా గురించి చెప్పుకుంటున్నారు. ఆ సినిమా పేరు.. మొఘల్–ఎ–ఆజమ్ ,ఈ సినిమాకు కె. ఆసిఫ్ నిర్మాణంతో పాటు దర్శకత్వం కూడా వహించారు మొఘల్–ఎ–ఆజం చిత్రాన్ని అనేక చిన్న ద్వీపాలను కొనుగోలు చేయగల బడ్జెట్తో తీశారని అప్పట్లో ఒక ట్రేడ్ విశ్లేషకుడు వర్ణించారు. ఈ క్లాసిక్ ఇండియన్ సినిమాలో పృథ్వీరాజ్ కపూర్, దిలీప్ కుమార్, మధుబాల దుర్గా ఖోటే వంటి నాటి మేటి నటులు నటించారు. 1960లో విడుదలైన మొఘల్–ఎ–ఆజం(Mughal-E-Azam) మొఘలుల రాచరిక ప్రపంచపు అహాలను వ్యూహాలను మాత్రమే కాదు ప్రేమైక హృదయాలను కూడా మనకు దగ్గర చేస్తుంది. నాటి అందాల నటి మధుబాలపై చిత్రీకరించిన ప్రేమికులకు ఇప్పటికీ ధైర్య సాహసాలను ప్రబోధించే గీతం ‘ప్యార్ కియా తో దర్నా క్యా‘, పాట చిత్రీకరణకు ఏకంగా రూ. 1 కోటి ఖర్చు అయింది. ఈ పాటను లాహోర్ కోటలోని షీష్ మహల్ కు ప్రతిరూపంలో చిత్రీకరించారు. ఈ పాట సెట్ నిర్మాణానికి ప్రస్తుతం ఒక భారీ చిత్ర నిర్మాణానికి అయ్యే విధంగా దాదాపు రెండు సంవత్సరాలు పట్టింది. చక్రవర్తి అక్బర్గా పృథ్వీరాజ్ కపూర్, అధికార సునామీలా ఆదేశాలను అమలు చేస్తూంటే, రాజకీయ ఉద్రిక్తత రాజభవన కుట్రల మధ్యలో ప్రేమ కోసం తిరుగుబాటుదారుడుగా మారిన యువరాజు సలీమ్గా దిలీప్ కుమార్, ఆయన ప్రేయసి అనార్కలిగా మధుబాల మనకు ఈ చిత్రంలో కనిపిస్తారు. ఈ చిత్రంలో అనార్కలి ప్రేమకథను చూడటం మాత్రమే కాదు కళ వేదన మధ్య నిజ జీవిత యుద్ధాన్ని ప్రేక్షకులు చవిచూస్తారు.అత్యధిక కాలం ఈ చిత్ర నిర్మాణం జరగడానికి తరచుగా షూటింగ్స్కు అంతరాయాలు కూడా దీనికి కారణం. నిర్మాణ విరామాలతో పాటు రెండవ ప్రపంచ యుద్ధం నేపధ్యంలో రూపొందడం, నటీనటుల మార్పులు (సలీం పాత్ర పోషించిన మొదటి నటుడు స్థానంలో దిలీప్ కుమార్ వచ్చారు) ఆర్ధిక సమస్యలు వెంటాడడం... ఇలాంటివెన్నో సంభవించాయి. అవన్నీ ఎదుర్కుంటూనే కె. ఆసిఫ్ తన సర్వశక్తులు కేంద్రీకరించి మొఘల్–ఎ–ఆజం ను ఒక సినిమాలా కాకుండా యజ్ఞంలా తలపోయడంతో..ప్రతి సన్నివేశం ఒక కళాఖండంలా అనిపిస్తుంది. దీనికో ఉదాహరణ యుద్ధ సన్నివేశాల కోసం నిజమైన సైనికులను తీసుకోవాలని భావించిన కె. ఆసిఫ్ అందుకు భారత సైన్యాన్ని ఒప్పించడం , 1960 ఆగస్ట్ 5న విడుదలైన మొఘల్–ఎ–ఆజం రూ. 11 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. ద్రవ్యోల్బణం, ప్రేక్షక జనసాంద్రత వగైరాలను పరిగణనలోకి తీసుకుంటే మొఘల్–ఎ–ఆజం ఇప్పటిదాకా అత్యధిక వ్యయంతో పాటు వసూళ్లు చేసిన హిందీ చిత్రంగా నిలుస్తుందని వాణిజ్య విశ్లేషకులు అంటున్నారు.మొదట నలుపు–తెలుపులో ఒకే ఒక పాటతో విడుదలైన ఈ చిత్రాన్ని ఆ తర్వాత డిజిటల్గా రంగులు వేసి 2004లో తిరిగి విడుదల చేశారు తద్వారా కలర్ ఫుల్గా మారిన మొదటి నలుపు–తెలుపు భారతీయ చిత్రంగా కూడా ఇది నిలిచింది. తొలి రీరిలీజ్ చిత్రంగా, మరోసారి బాక్సాఫీస్ వద్ద హిట్ అయింది. అటు కలెక్షన్ల రికార్డ్స్తో పాటు జాతీయ అవార్డ్ సహా పలు ఫిల్మ్ ఫేర్ అవార్డులను సైతం దక్కించుకున్న ఈ సినిమా..భారతీయ సినిమా చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక పేజీని దక్కించుకుంది. -
తెలుగులో ఎప్పుడో నటించిన దీపికా.. ఆమె ఆస్తి ఎంతో తెలుసా?
బ్యాడ్మింటన్ కోర్టు వదిలేసి, మోడలింగ్ ప్రపంచంలో నాజూకు అడుగులతో మొదలుపెట్టింది. నేడు వెండితెర మీద తనదైన సామ్రాజ్యం నిర్మించుకుంది నటి దీపికా పదుకొణే. ఇప్పుడు కాస్త గ్యాప్ తీసుకొని త్వరలో రాబోతుండటంతో, ఎక్కడ చూసినా ఆమె పేరే ఒక హాట్ టాపిక్! అల్లు అర్జున్ – అట్లీ కాంబినేషన్లో రూపొందే సినిమాలో ఆమెను కథానాయికగా ఎంపిక చేయడం సినీ పరిశ్రమలో పెద్ద వార్తగా మారింది. ఆమె గురించి కొన్ని విషయాలు మీకోసం..బ్యాడ్మింటన్ ఆట నుంచి..దీపికా పదుకొణె (Deepika Padukone) కొంకణి అమ్మాయి. ఆమె తండ్రి ప్రకాశ్ పదుకొణే భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన బ్యాడ్మింటన్ క్రీడాకారుడు. తండ్రి ప్రభావంతో బ్యాడ్మింటన్ ఆడిన దీపికా, రాష్ట్రస్థాయి పోటీల్లోనూ పాల్గొంది. కాని తనకు సినిమా, మోడలింగ్పై ఆసక్తి ఎక్కువగా ఉండటంతో నటన వైపు మొగ్గుచూపింది. ఆమె సినీ ప్రయాణం తెలుగు సినిమా ‘మన్మథుడు’ ఆధారంగా రూపొందిన కన్నడ రీమేక్ ‘ఐశ్వర్య’ చిత్రంతో మొదలైంది. తెలుగులో ఎప్పుడో యాక్ట్ చేసిందితెలుగు దర్శకుడు జయంత్ సి. పరాన్జీ, దీపికాకు తెలుగులో మొదటి అవకాశం ఇచ్చారు. ఓ యువ ప్రేమకథలో ప్రత్యేక పాటలో నాట్యం చేసింది. ఆ సినిమా పూర్తయింది. కానీ, ఇప్పటికీ విడుదల కాలేదు. లేకపోతే ఆమె టాలీవుడ్లో ఎప్పుడో అడుగుపెట్టేది. ‘కల్కి’ సినిమాలో సుమతి పాత్రతో ఆకట్టుకున్న దీపికా, ఇప్పుడు మళ్లీ అల్లు అర్జున్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.గ్లామర్లో తగ్గేదేలే‘రామ్ లీలా’ సినిమా చిత్రీకరణ సమయంలో రణ్వీర్ సింగ్తో పరిచయం ప్రేమగా మారింది. అంతకు ముందు రణ్బీర్ కపూర్తో ప్రేమలో ఉన్న ఆమె, ఆ బ్రేకప్ తర్వాత కొత్త జీవితం మొదలుపెట్టింది. పెళ్లి అయినా, తల్లి అయినా, దీపికా తన గ్లామర్ను తగ్గించుకోలేదు. తన పని పట్ల నిబద్ధతతో ప్రవర్తించేది. హిందీ సినీ ప్రపంచంలో ఆమె తొలి సినిమా ‘ఓం శాంతి ఓం’, షారుఖ్ ఖాన్తో కలసి నటించింది. ఆ చిత్రం ఆమె సినీ జీవితాన్ని మలుపు తిప్పింది. ఆ తర్వాత ‘చెన్నై ఎక్స్ప్రెస్’, ‘హ్యాపీ న్యూ ఇయర్’, ‘పఠాన్’, ‘జవాన్’లాంటి హిట్ సినిమాల్లో నటించింది.రూ.500 కోట్లకు పైగా ఆస్తులుహాలీవుడ్లోనూ నటించే అవకాశం పొందిన దీపికా, ప్రపంచ సినీరంగంలో కూడా తనకంటూ ఓ స్థానాన్ని ఏర్పరచుకుంది. ప్రస్తుతం దీపికా ఆస్తుల విలువ దాదాపు రూ.500 కోట్లకు పైగా ఉంది. ముంబైలో ఆమెకు అంధేరి, బాంద్రా, ప్రభాదేవి ప్రాంతాల్లో మూడు ఇళ్లు ఉన్నాయి. 2022లో ఆమె సొంతంగా సౌందర్య ఉత్పత్తుల బ్రాండ్ను ప్రారంభించింది. ఇళ్లపై పెట్టుబడులు పెట్టడాన్ని ఆమె ఇష్టంగా భావిస్తుంది.రహస్యాన్ని అతడికే చెప్తాఓ ఇంటర్వ్యూలో తల్లి అయ్యాక, తన పాత్రల ఎంపికలో మరింత జాగ్రత్త వహిస్తున్నానని, బిడ్డకు సమయాన్ని ఇచ్చేలా ప్రయత్నిస్తున్నానని చెప్పింది. ఓ కార్యక్రమంలో ‘ఒక రహస్యాన్ని చెవిలో చెప్పాలంటే ఏ హీరోకి చెబుతారు?’ అన్న ప్రశ్నకు వెంటనే షారుఖ్ ఖాన్ అని బదులిచ్చింది. 2007లో రణ్బీర్ కపూర్తో పరిచయం, ప్రేమగా మారింది. ఒకే మేకప్ ఆర్టిస్ట్ కారణంగా ఫోన్ నంబర్లు మార్చుకుని ప్రేమలో పడ్డారు. తన మెడ వెనక అతడి పేరు టాటూ వేయించుకుంది. కాని, ఏడాదిలోనే బ్రేకప్ జరిగింది.డిప్రెషన్రణ్బీర్ కపూర్ మరో అమ్మాయితో సంబంధం పెట్టుకోవడం వల్ల విడిపోయినట్లు ఓ సందర్భంలో దీపిక చెప్పింది. దీని వలన డిప్రెషన్కు లోనైనా, కెరీర్పై ప్రభావం రాకుండా చూసుకుంది. ‘ఏ జవానీ హై దివానీ’ సినిమా అదే సమయంలో పూర్తి చేసింది. ఇప్పుడు ఇద్దరూ ఎవరి జీవితాల్లో వాళ్లు బిజీ అయిపోయారు. దీపికా – రణ్వీర్ సింగ్ను పెళ్లి చేసుకుని ఒక పాపకు జన్మనిచ్చింది. మరోవైపు రణ్బీర్ కపూర్ – ఆలియా భట్ను వివాహం చేసుకుని పాపకు తండ్రయ్యాడు. ఇప్పటికీ వీరిద్దరూ ఒకరిని ఒకరు ప్రొఫెషనల్గానే పలకరించుకుంటారు.చదవండి: స్క్విడ్ గేమ్ 3 రివ్యూ.. ఊహించని క్లైమాక్స్, అందరికీ రుచిస్తుందా? -
5 పెళ్లిళ్లు.. 300 సినిమాలు.. చేతిలో చిల్లిగవ్వ లేక దిక్కులేని స్థితిలో..
కరాటేలో బ్లాక్బెల్ట్.. డ్యాన్సర్, మోడల్. ఇవన్నీ కాదని నటనవైపు అడుగులు వేశాడు. 300 సినిమాలు చేశాడు. తెలుగు, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో విలనిజం పండించాడు. వెండితెరపై తిరుగులేని నటుడిగా రాణించాడు. కానీ, నిజ జీవితంలో మాత్రం ఒంటరితనంతో పోరాడి పేదరికంలో మగ్గిపోయి మరణించాడు. అతడే నటుడు మహేశ్ ఆనంద్ (Mahesh Anand).కెరీర్1982లో సనమ్ తేరీ కసం మూవీలో బ్యాక్గ్రౌండ్ డ్యాన్సర్గా పనిచేశాడు. రెండేళ్ల గ్యాప్ తర్వాత కమల్ హాసన్ 'కరిష్మా' చిత్రంతో నటుడిగా మారాడు. సస్తి దుల్హన్ మహేంగ దుల్హ చిత్రంతో హీరోగా మారాడు. అది వర్కవుట్ కాకపోవడంతో విలన్గా స్థిరపడిపోయాడు. బాలీవుడ్లో కరడుగట్టిన విలన్గా పేరు గడించిన మహేశ్ ఆనంద్.. తెలుగులో లంకేశ్వరుడు, ఎస్పీ పరశురామ్, బొబ్బిలి సింహం, ఘరానా బుల్లోడు, అల్లుడా మజాకా, నెంబర్ వన్, బాలు వంటి చిత్రాల్లో యాక్ట్ చేసి ఇక్కడి జనానికి దగ్గరయ్యాడు.ఐదు పెళ్లిళ్లువెండితెరపై ఇంత పాపులారిటీ సంపాదించుకున్న ఈయన వైవాహిక జీవితంలో మాత్రం విఫలమవుతూనే వచ్చాడు. మొదట బర్క రాయ్ను పెళ్లి చేసుకుని విడాకులిచ్చాడు. 1987లో మిస్ ఇండియా ఇంటర్నేషనల్ ఎరిక డిసౌజను వివాహం చేసుకున్నాడు. కానీ ఈ బంధం కూడా ఎంతోకాలం నిలవలేదు. ఆమెకు విడాకులిచ్చేశాక 1992లో మధు మల్హోత్రాను పెళ్లి చేసుకున్నాడు. మూడో పెళ్లి కూడా మూణ్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. అవకాశాలు దూరంఅనంతరం నటి ఉషా బచ్చనిని పెళ్లాడాడు. రెండేళ్లకే (2000-2002) వీరిద్దరూ విడిపోయారు. ఈ సమస్యలు మహేశ్ కెరీర్ను కూడా ప్రభావితం చేశాయి. 2005 తర్వాత ఆయనకు సినిమా అవకాశాలే రాలేదు. 2019లో రంగీలా రాజా అని ఒకే ఒక్క మూవీ చేశాడు. ఇదే ఆయన ఆఖరి చిత్రం. దాంపత్య జీవితంలో నాలుగుసార్లు విఫలమైన మహేశ్.. 2015లో రష్యన్ యువతి లనాను ఐదో పెళ్లి చేసుకున్నాడు. కానీ తర్వాత ఆమె కూడా నటుడిని వదిలేసినట్లు తెలుస్తోంది. పేదరికంలో మగ్గిన నటుడువందల సినిమాలు చేసిన మహేశ్.. దాదాపు 18 ఏళ్లపాటు కటిక పేదరికంలోనే మగ్గిపోయాడు. ఈ విషయాన్ని అతడే ఓ ఫేస్బుక్ పోస్ట్లో వెల్లడించాడు. నేను తాగుబోతునని అందరూ అంటుంటారు. నాకంటూ ఎవరూ లేరు. నా స్టెప్ బ్రదర్ రూ.6 కోట్లు తీసుకుని మోసం చేశాడు. 300కి పైగా సినిమాలు చేశా.. కానీ, ఇప్పుడు నీళ్ల బాటిల్ కొనుక్కునేందుకు కూడా డబ్బుల్లేవు. ఈ ప్రపంచంలో నాకంటూ ఒక్క స్నేహితుడు కూడా లేకపోవడం విషాదకరం అని రాసుకొచ్చాడు.మూడురోజులుగా కుళ్లిపోయిన మృతదేహం2019 ఫిబ్రవరి 9న మహేశ్ తన ఇంట్లోనే విగతజీవిగా కనిపించాడు. మూడు రోజులుగా ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో అతడి సోదరికి అనుమానం వచ్చింది. పోలీసులకు సమాచారమివ్వడంతో వారు వెళ్లి చూడగా నటుడు సోఫాలో శవమై కనిపించాడు. అతడి పక్కనే మందు బాటిళ్లు కూడా ఉన్నాయి. అది సహజ మరణమేనని వైద్యులు ధ్రువీకరించారు. కానీ, అప్పటికే మరణించి మూడు రోజులైనట్లు వెల్లడించారు.చదవండి: ఆ డైరెక్టర్ తిట్టాడు.. నావల్ల కాక ఏడ్చేశా: కీర్తి సురేశ్ -
ఆ సీన్ తర్వాత గతం మర్చిపోయిన అమ్రిష్ పురి..
హీరోయిన్ కాజోల్కు మతిమరుపు ఉండేది. కుచ్కుచ్ హోతా హై సినిమా సెట్లో పదేపదే అన్నింటినీ మర్చిపోయేది. ఓసారి తనే ఈ విషయాన్ని వెల్లడించింది. అయితే లెజెండరీ నటుడు అమ్రిష్ పురి (Amrish Puri) ఒకానొక సందర్భంలో తనెవరన్నది కూడా మర్చిపోయాడని చెప్పింది. ఓ ఇంటర్వ్యూలో కాజోల్ మాట్లాడుతూ.. అజయ్ దేవ్గణ్, అమ్రిష్ పురి ఓ సినిమాలో కలిసి నటించారు. అంతా మర్చిపోయిన అమ్రీష్పురిఅందులో అమ్రీష్.. జలపాతం కింద నిల్చునే సీన్ ఉంది. అందుకోసం ఆయన వాటర్ఫాల్ కింద నిలబడ్డారు. పైనుంచి ఎంతో వేగంగా వస్తున్న నీళ్లు ఆయన తలను కొట్టుకుంటూ కిందపడేవి. తలకు రక్షణగా ఏదీ పెట్టలేదు. సన్నివేశం అయిపోగానే ఆయన వాటర్ఫాల్ నుంచి వచ్చేశారు. కానీ అన్నీ మర్చిపోయాడు. అసలేదీ గుర్తులేదు. నేనెవర్ని? నేనిక్కడేం చేస్తున్నాను? అని ప్రశ్నించాడు. సెట్లో ఉన్నవాళ్లందరికీ భయంతో చెమటలు పట్టాయి. తనకు జ్ఞాపకశక్తి రావడానికి మూడు గంటలు పట్టింది. కరడుగట్టిన విలన్గా..ఇప్పుడు తల్చుకుంటే సరదాగా అనిపిస్తుందేమోకానీ ఆ సమయంలో మాత్రం అందరూ చాలా భయపడ్డారు అని చెప్పుకొచ్చింది. అమ్రీష్ పురి, అజయ్ దేవ్గణ్.. టార్జాన్: ద వండర్ కార్, ఫూల్ ఔర్ కాంటే, హల్చల్, గెయిర్ వంటి చిత్రాల్లో కలిసి నటించారు. హిందీలో వందలాది సినిమాలు చేసిన అమ్రిష్ పురి.. ఆదిత్య 369, బాబా, జగదేక వీరుడు అతిలోక సుందరి, మేజర్ చంద్రకాంత్, నిప్పురవ్వ వంటి పలు చిత్రాల్లో నటించారు. కరడుగట్టిన విలన్గా ప్రేక్షకులను తన ఆహార్యంతోనే భయపెట్టేవారు. 2005లో బ్లడ్ క్యాన్సర్తో కన్నుమూశారు.చదవండి: కన్నప్పలో ప్రభాస్ పెళ్లి టాపిక్.. రచ్చ లేపిన ఫ్యాన్స్ -
గుండె పోటు కాదు.. 42 ఏళ్ల నటి మృతిపై అనుమానాలు!
‘కాంటా లగా’ఫేం, బాలీవుడ్ నటి షెఫాలీ జరివాలా(42) మృతితో బాలీవుడ్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రియాంక చోప్రా, లారదత్తాతో పాటు పలువుడు బాలీవుడ్ తారలు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు. శుక్రవారం ఆమె గుండెపోటుతో మరణించినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆమె గుండెపోటుతో మరణించినట్లు ఆధారలేవి లేవని, మృతికి ఇంకా కారణాలు తెలియలేదని పోలీసులు చెబుతున్నారు.అసలేం జరిగిందంటే.. శుక్రవారం రాత్రి షెఫాలి తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఆమె భర్త పరాగ్ త్యాగి ఆమెను అంథేరిలోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. ఆమెను పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు వెల్లడించారు. అమె కార్డియాక్ అరెస్ట్తో మృతి చెందినట్లు తొలుత వార్తల వచ్చాయి. కానీ ఆమె కుటుంబ సభ్యులు మాత్రం వాటిని ధ్రువీకరించలేదు.పోలీసులు ఏం చెబుతున్నారంటే.. షఫాలీ మృతిపై తాజాగా ముంబై పోలీసులు అప్డేట్ ఇచ్చారు. ఆమె మృతికి గల కారణాలు ఇంకా తెలియలేదని, ప్రస్తుతం అనుమానాస్పద ఘటనగానే పరిగణలోకి తీసకొని దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. ‘అర్థరాత్రి ఒంటిగంట సమయంలో మాకు సమాచారం వచ్చింది. అంధేరీలోని షఫాలి నివాసంలో ఆమె మృతదేహాన్ని పరిశీలించాం. పోస్ట్మార్టం నిమిత్తం మృతదేహాన్ని కూపర్ ఆస్పత్రికి తరలించాం. మరణానికి గల కారణాలపై ఇంకా స్పష్టత రాలేదు. ప్రస్తుతం ఆమె అపార్ట్మెంట్లో ఫోరెన్సిక్ నిపుణులు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. అలాగే ఇంట్లో పని చేస్తున్న వారిని, వంట మనిషిని ప్రశిస్తున్నాం. ప్రస్తుతానికి అయితే అనుమానస్పద ఘటనగానే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం’ అని ముంబై పోలీసులు తెలిపారు.రీమిక్స్ సాంగ్తో ఫేమస్.. 2002లో వచ్చిన ‘కాంటా లగా’ రీమిక్స్ సాంగ్తో ఫేమస్ అయింది షెఫాలి. ఈ గుర్తింపుతోనే సినిమా అవకాశాలు వచ్చాయి. సల్మాన్ ఖాన్ ముజ్సే షాదీ కరోగా చిత్రంలో కీలక పాత్ర పోషించింది. అనంతరం పలు టీవీ రియాలిటీ షోలతో పాపులారిటీ సంపాదించుకుంది. హిందీ బిగ్బాస్ సీజన్ 13లోనూ కంటెస్టెంట్గా పాల్గొని అలరించింది. 2004లో సంగీత దర్శకుడు హర్మీత్ సింగ్ని వివాహం చేసుకుంది. 2009లో అతనితో విడాకులు తీసుకొని.. 2015లో నటుడు పరాగ్ త్యాగిని రెండో వివాహం చేసుకుంది. -
రెండో బిడ్డ జననం.. ఫోటో షేర్ చేసిన ఇలియానా
దేవదాసు, పోకిరి, జులాయి వంటి చిత్రాలతో తెలుగులో టాప్ హీరోయిన్గా రాణించింది ఇలియానా డీక్రూజ్ (Ileana D'Cruz). ఒకప్పుడు వరుసపెట్టి సినిమాలు చేసిన ఈ బ్యూటీ ప్రస్తుతం యాక్టింగ్ పక్కన పెట్టి కుటుంబానికే పెద్ద పీట వేస్తోంది. ఇటీవలే ఆమె రెండో బిడ్డకు జన్మనిచ్చింది. తాజాగా ఈ బుడ్డోడి ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అలాగే అతడికి ఏం పేరు పెట్టిందో కూడా వెల్లడించింది. శుభాకాంక్షల వెల్లువజూన్ 19న జన్మించిన కెయాను రఫె డోలన్ను మీ అందరికీ పరిచయం చేస్తున్నందుకు మా హృదయాలు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నాయి అని క్యాప్షన్ జోడించింది. ఈ పోస్ట్కు హీరోయిన్ ప్రియాంక చోప్రా స్పందిస్తూ.. శుభాకాంక్షలు తెలిపింది. పలువురు సెలబ్రిటీలు, అభిమానులు.. ఇలియానాకు అభినందనలు తెలియజేస్తున్నారు.పెళ్లి- పిల్లలుఇలియానా.. 2023లో విదేశీయుడు మైఖేల్ను పెళ్లి చేసుకుంది. అదే ఏడాది ఆగస్టులో పండంటి కొడుక్కి జన్మనిచ్చింది. అతడికి కోవా ఫోనిక్స్ డోలన్ అని నామకరణం చేసింది. ఇప్పుడు మరోసారి కొడుకే జన్మించాడు. ఇకపోతే ఇలియానా చివరగా 'దో ఔర్ దో ప్యార్' సినిమాలో కనిపించింది. 'రైడ్ 2'లో నటించే ఆఫర్ వచ్చినప్పటికీ చిన్న పిల్లాడు ఉన్నందున ఆ సినిమాను వదిలేసుకుంది. View this post on Instagram A post shared by Ileana D'Cruz (@ileana_official) చదవండి: 'కాంటా లగా' సాంగ్తో సెన్సేషన్.. నటి కన్నుమూత -
'కాంటా లగా' సాంగ్తో సెన్సేషన్.. నటి కన్నుమూత
బాలీవుడ్ నటి, కాంటా లగా సాంగ్ ఫేమ్ షెఫాలీ జరివాలా (42) ఆకస్మికంగా మరణించారు. శుక్రవారం రాత్రి ఆమె తీవ్ర అస్వస్థతకు గురికావడంతో భర్త పరాగ్ త్యాగి వెంటనే ఆమెను అంధేరిలోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లాడు. ఆమెను పరీక్షించిన వైద్యులు అప్పటికే నటి మృతి చెందినట్లు వెల్లడించారు. పోస్టుమార్టమ్ కోసం ఆమె మృతదేహాన్ని కూపర్ ఆస్పత్రికి తరలించారు. తొలుత ఆమె గుండెపోటుతో మరణించినట్లుగా వార్తలు వెలువడ్డాయి. దీనిపై పోలీసులు స్పందిస్తూ.. నటి మృతికి ఇంకా కారణాలు తెలియలేదన్నారు. ఫోరెన్సిక్ నిపుణులు ఆమె నివాసంలో పలు ఆధారాలను సేకరిస్తున్నారని తెలిపారు. షెఫాలి (Shefali Jariwala) మృతి పట్ల సెలబ్రిటీలు, అభిమానులు తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేస్తున్నారు.నటి ప్రయాణం సాగిందిలా..షెఫాలీ జరివాలా 2002లో వచ్చిన కాంటా లగా సాంగ్తో ఒక్కసారిగా ఫేమస్ అయ్యారు. అప్పటినుంచి అభిమానులు ఆమెను కాంటా లగా గర్ల్ అనే పిలుచుకుంటున్నారు. ఈ గుర్తింపుతోనే ముజ్సే షాదీ కరోగి చిత్రంలో షెఫాలీకి నటించే ఛాన్స్ వచ్చింది. అలాగే కన్నడలో హుడుగరు మూవీలో యాక్ట్ చేశారు. బేబీ కమ్నా అనే వెబ్ సిరీస్లోనూ కనిపించారు. హిందీ బిగ్బాస్ 13వ సీజన్లోనూ పాల్గొన్నారు. షెఫాలి.. 2004లో సంగీత దర్శకుడు హర్మీత్ సింగ్ను పెళ్లాడారు. కానీ ఈ బంధం ఎంతోకాలం నిలవలేదు. 2009లో విడిపోయారు. అనంతరం 2015లో నటుడు పరాగ్ త్యాగిని రెండో పెళ్లి చేసుకున్నారు.చదవండి: ఆస్కార్ కమిటీలో ఇండియన్ స్టార్స్ -
ఆస్కార్ కమిటీలో ఇండియన్ స్టార్స్
‘‘ప్రపంచ సినిమాకి చెందిన నటీనటులను, సాంకేతిక నిపుణులను అకాడమీలోకి ఆహ్వానిస్తున్నందుకు మాకెంతో థ్రిల్గా, ఆనందంగా ఉంది. అంకితభావం, నిబద్ధతతో ప్రపంచ చలన చిత్ర పరిశ్రమ పురోగతికి కృషి చేస్తున్న ప్రతిభావంతులు వీరు ’’ అంటూ ఆస్కార్ అకాడమీ కమిటీ సీఈవో బిల్ క్రామర్, ప్రెసిడెంట్ జానెట్ యాంగ్ పేర్కొన్నారు. 98వ ఆస్కార్ అవార్డు వేడుక వచ్చే ఏడాది మార్చి 15 (భారతీయ కాలమానం ప్రకారం మార్చి 16)న లాస్ ఏంజెల్స్లో జరగనుంది. ఈ నేపథ్యంలో ఆస్కార్ అవార్డు కమిటీ ఈ వేడుకకు సంబంధించిన పనులు మొదలుపెట్టింది.ఇందులో భాగంగా విజేతల ఎంపిక ఓటింగ్ కోసం అకాడమీలో సభ్యులుగా చేరాలంటూ దేశ, విదేశాలకు చెందిన సినిమా తారలకు ఆహ్వానం పంపింది కమిటీ. ఆ జాబితాను విడుదల చేసింది. ఈ ఏడాది కొత్తగా 534 మందికి సభ్యత్వం ఇస్తున్నట్లుగా పేర్కొంది. వారిలో యాక్టింగ్ విభాగంలో ఇండియన్ స్టార్స్ కమల్హాసన్, ఆయుష్మాన్ ఖురానాలకు, దర్శకురాలుపాయల్ కపాడియా, సినిమాటోగ్రాఫర్ రణబీర్ దాస్, క్యాస్టింగ్ డైరెక్టర్ కరణ్, ఫ్యాషన్ డిజైనర్ మ్యాక్సిమా బసు, డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ స్మృతీ ముంద్రాలకు ఆహ్వానం పంపారు.ఆస్కార్ అవార్డు విజేతల ఎంపిక ప్రక్రియలో వీరికి ఓటు హక్కు లభిస్తుంది. నామినేషన్ల దశ నుంచి విజేతల ఎంపిక వరకూ సభ్యులు ఓటింగ్లోపాలు పంచుకోవాల్సి ఉంటుంది. కాగా కొత్తగా ఎంపిక చేసిన 534 మంది సభ్యుల్లో స్త్రీల సంఖ్య 41 శాతం ఉన్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. జనవరి 12 నుంచి 16 వరకు నామినేషన్ ప్రక్రియ జరుగుతుంది. నామినేషన్ దక్కించుకున్నవారి జాబితాను జనవరి 22న ప్రకటిస్తారు. -
వార్కు కౌంట్డౌన్ స్టార్ట్
థియేటర్స్లో ‘వార్ 2’కి యాభై రోజుల కౌంట్డౌన్ మొదలైంది. హృతిక్ రోషన్, ఎన్టీఆర్, కియారా అద్వానీ లీడ్ రోల్స్లో నటించిన స్పై యాక్షన్ సినిమా ‘వార్ 2’. ‘వైఆర్ఎఫ్ (యశ్రాజ్ ఫిల్మ్స్)’ స్పై యూనివర్స్లో భాగంగా రూపొందిన ‘వార్ 2’ని అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ఆదిత్యా చోప్రా నిర్మించారు. ఈ చిత్రం ఆగస్టు 14న విడుదల కానుంది.కాగా ఈ సినిమా విడుదలకు సరిగ్గా 50 రోజులు ఉన్న నేపథ్యంలో ఈ సినిమాలో నటించిన ఎన్టీఆర్, హృతిక్ రోషన్, కియారా అద్వానీల పోస్టర్స్ను మేకర్స్ గురువారం విడుదల చేశారు. అలాగే ‘వార్ 2’ సినిమాను ఉత్తర అమెరికా, మిడిల్ ఈస్ట్, యూకె, యూరప్, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, సౌత్ ఈస్ట్ ఆసియా సహా భారతదేశంలో ఐమ్యాక్స్ థియేటర్లలో విడుదల చేయనున్నట్లుగా కూడా మేకర్స్ తెలిపారు. ‘‘భారతీయ సినీ పరిశ్రమలో ఇద్దరు సూపర్ స్టార్స్ హృతిక్ రోషన్, ఎన్టీఆర్ల మధ్య జరిగే ఈ అద్భుతమైన పోరును ఐమ్యాక్స్ ఫార్మాట్లో ప్రదర్శించడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులకు, ప్రేక్షకులకు ఒక అద్భుతమైన అనుభూతిని అందించనున్నాం’’ అని తెలిపారు యశ్ రాజ్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిబ్యూషన్ వైస్ ప్రెసిడెంట్ నెల్సన్ డిసౌజా. ‘‘యాక్షన్’ చిత్రాలకే ‘వార్ 2’ సినిమా ఓ పాఠంలా ఉంటుంది. ప్రేక్షకులు మర్చిపోలేని సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ను ఐమ్యాక్స్లో మాత్రమే పొందగలరు’’ అని పేర్కొన్నారు ఐమ్యాక్స్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్, డిస్ట్రిబ్యూషన్ వైస్ ప్రెసిడెంట్ క్రిస్టఫర్ టిల్లా్మన్. -
తమన్నా మాజీ ప్రియుడితో డేటింగ్.. దంగల్ నటి ఏమన్నారంటే?
దంగల్ ఫేమ్ ఫాతిమా సనా షేక్ ఇటీవల ఎక్కువగా వినిపిస్తోంది. అమిర్ ఖాన్ దంగల్ మూవీలో గీతా ఫోగట్ పాత్రలో ఆమె అదరగొట్టేసింది. 2015లో ఆమె తెలుగులో నటించిన ‘నువ్వు నేను ఒకటవుదాం’ అనే చిత్రంలోనూ నటించింది. అయితే ఆ మూవీ తర్వాత మరో సినిమా చేస్తున్న క్రమంలోనే ఒక నిర్మాత నుంచి కాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నట్లు గతంలో చెప్పుకొచ్చింది. ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం ఆమె 'మెట్రో... ఇన్ డినో' అనే మూవీలో కనిపించనుంది.ఈ మూవీ తర్వాత ఫాతిమా సనా షేర్.. గుస్తాక్ ఇష్క్ అనే చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాలో తమన్నా మాజీ బాయ్ఫ్రెండ్ విజయ్ వర్మ హీరోగా నటిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇద్దరు కలిసి జంటగా కనిపించారు. దీంతో ఈ జంటపై డేటింగ్ రూమర్స్ మొదలయ్యాయి. విజయ్ వర్మతో సనా డేటింగ్లో ఉందంటూ రూమర్స్ పుట్టకొచ్చాయి. ఈ నేపథ్యంలో తనపై వస్తున్న ఊహాగానాలపై ఫాతిమా సనా షేక్ స్పందించింది. తన రాబోయే చిత్రం ఆప్ జైసా కోయి' ట్రైలర్ లాంచ్ సందర్భంగా ఆమె మాట్లాడారు. మీ జీవితంలో ఎవరైనా ఉన్నారా? అడిగిన ప్రశ్నకు ఆమె క్లారిటీ ఇచ్చారు. తాను ప్రస్తుతం ఒంటరిగా ఉన్నానని. నా జీవితంలో ఎవరూ లేరని స్పష్టం చేసింది.ఫాతిమా సనా షేక్ మాట్లాడుతూ..'ప్రస్తుతం నేను ఒంటరిగానే ఉన్నా. నా లైఫ్లో ఎవరూ లేరు. ఎందుకంటే ఇప్పుడు మంచి వ్యక్తులంటూ ఎవరూ లేరు. మంచివాళ్లు కేవలం సినిమాల్లో మాత్రమే ఉంటారు. మీరు ఏదైనా పార్ట్నర్షిప్లో ఉంటే మిమ్మల్ని మీరు కోల్పోకుండా రిలేషన్ స్ట్రాంగ్ ఉండేందుకు కృషి చేస్తారు. రిలేషన్ బలంగా ఉండాలంటే అదే మార్గమని నేను భావిస్తున్నా' అని క్లారిటీ ఇచ్చేసింది.ఆప్ జైసా కోయి మూవీ గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. ప్రేమ, సమానత్వం అంటే ఇద్దరు వ్యక్తులు ఒకరినొకరు గౌరవిస్తారు. వారు ఒకరి మాట ఒకరు వింటారు. వాటిని తిరస్కరించరు. ఈ సినిమాలో ప్రేమ, సమానత్వం గురించేనని.. ఈ విషయంలో ఇద్దరూ రాజీ పడాలని ఫాతిమా సనా షేక్ తెలిపింది. కాగా.. ఆప్ జైసా కోయి చిత్రంలో ఆర్ మాధవన్ సరసన నటించింది. మాధవన్తో కలిసి పనిచేయడం నాకు చాలా అద్భుతంగా అనిపించిందని వెల్లడించింది. ఇప్పటికే 'ఆప్ జైసా కోయి' ట్రైలర్ విడుదల కాగా మంచి స్పందనను సొంతం చేసుకుంది. ఈ చిత్రం జూలై 11న నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. -
ఆరేళ్లపాటు డేటింగ్.. మాజీ ప్రియుడిని మరవలేకపోతున్న బ్యూటీ!
బాలీవుడ్ భామ మలైకా అరోరా పేరు చెప్పగానే ఐటమ్ సాంగ్సే గుర్తొస్తాయి. ఆ తర్వాత ఆమె డేటింగ్ వ్యవహారం గుర్తొస్తుంది. ఎందుకంటే హీరో సల్మాన్ ఖాన్ తమ్ముడు అర్భాజ్ ఖాన్ పెళ్లి చేసుకున్న ఈమె.. దాదాపు 19 ఏళ్ల తర్వాత విడాకులు తీసుకుంది. ఆ తర్వాత కొన్నేళ్లకు తన కంటే చిన్నవాడైన అర్జున్ కపూర్తో ప్రేమాయణం నడిపించింది. అయితే వీరి ప్రేమబంధం ఎక్కువ రోజులు నిలవలేదు. దాదాపు ఆరేళ్ల డేటింగ్ అనంతరం బ్రేకప్ చెప్పేసుకుని అభిమానులకు షాకిచ్చారు. అయితే కొన్నినెలల క్రితం ఐపీఎల్ మ్యాచ్లో శ్రీలంక మాజీ క్రికెటర్ కుమార సంగక్కర పక్కన మలైకా కనిపించడంతో వీరిద్దరు డేటింగ్లో ఉన్నారా? అంటూ రూమర్స్ వినిపించాయి. అయితే దీనిపై ఎవరూ కూడా స్పందించలేదు.తాజాగా తన మాజీ భాయ్ ఫ్రెండ్ అర్జున్ కపూర్ బర్త్ డే కావడంతో విషెస్ తెలిపింది ముద్దుగుమ్మ. ఈ మేరకు తన ఇన్స్టాలో పోస్ట్ చేసింది. హ్యాపీ బర్త్డే, అర్జున్ కపూర్' మాజీ ప్రియుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపింది. ప్రస్తుతం ఒంటరిగానే ఉంటోన్న మలైకా అరోరా మాజీ లవర్కు విషెస్ చెప్పడంపై నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.అయితే గతేడాది బ్రేకప్ చెప్పుకున్న ఈ జంట మాత్రం సోషల్ మీడియాలో ఫ్రెండ్షిప్ కొనసాగిస్తూనే ఉన్నారు. కాగా.. అర్జున్ కపూర్ ఇటీవలే తెరపైకి వచ్చిన 'మేరే హస్బెండ్ కి బివి' అనే రొమాంటిక్ కామెడీ చిత్రంలో కనిపించారు. ప్రస్తుతం 'నో ఎంట్రీ 2' అనే మూవీలో నటించనున్నారు. -
ధోనీని గంగూలీ బీట్ చేయగలడా? క్రికెటర్లలో ఎవరి బయోపిక్ రేంజ్ ఏంటి?
ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది గంగూలీ బయోపిక్. ఎప్పటి నుంచో ప్లాన్స్ వేసినప్పటికీ తాజాగా ఈ సినిమా పట్టాలక్కనుంది వచ్చే జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. తాజా సెన్సేషన్ మాలిక్ చిత్రంలో హీరోగా చేసిన రాజ్కుమార్ రావ్ గంగూలీ పాత్ర పోషించనున్నాడు. అది తప్ప ఇంకా ఈ సినిమాకు సంబంధించిన వివరాలు విశేషాలు ప్రకటించలేదు. ఈ నేపధ్యంలో... గత కొంత కాలంగా ఊపందుకున్న క్రికెటర్ల బయోపిక్స్..వాటికి దక్కిన ప్రేక్షకాదరణను ఒక్కసారి పరిశీలిస్తే...సచిన్..విన్సచిన్ ఎ బిలియన్ డ్రీమ్స్ ఫిల్మ్ 2017లో విడుదల అయింది. ఇండియన్ క్రికెట్ గాడ్గా అభిమానులు పిలుచుకునే సచిన్ జీవితం ఆధారంగా ఇది పూర్తి స్థాయి డాక్యుమెంటరీ ఫిల్మ్గా తయారైంది. కధ విషయానికి వస్తే సచిన్ బాల్య దశ నుంచి 2011 వరల్డ్ కప్ గెలుపు వరకు ఈ చిత్రంలో చూపించారు. ఇందులో సచిన్ స్వయంగా తన పాత్ర పోషించడం విశేషం. ఈ డాక్యుమెంట్రీ రూ.76 కోట్ల వరకూ వసూలు చేసి విమర్శకుల ప్రశంసలు, ఫ్యాన్స్ ఆదరణ దక్కించుకుంది.థోనీ...ధనాధన్ మాజీ కెప్టెన్ ఎమ్.ఎస్. ధోనీ ద అన్టోల్డ్ స్టోరీ 2016లో విడుదలైంది. ఇందులో థోనీ పాత్రను దివంగత బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ పోషించాడు. ఇందులో కథ ధోనీ క్రికెటర్గా మారడం నుంచి భారత కెప్టెన్గా ఎదగడం దాకా కొనసాగుతుంది. ఈ సినిమా రూ.216 కోట్లు వసూలు బాక్స్ ఆఫీస్ బ్లాక్బస్టర్గా నిలిచింది. సినిమాలో సుశాంత్ నటనకు ప్రశంసలు దక్కాయి. దేశవ్యాప్తంగా ధోనీ అభిమానుల ఆదరణ పొందింది. అజహర్...యావరేజ్ సర్..మహ్మద్ అజారుద్దీన్ జీవిత కధ ఆధారంగా రూపొందిన అజహర్ చిత్రం కూడా 2016లోనే విడుదలైంది. దీనిలో అజహర్ పాత్రను బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి పోషించాడు. క్రికెటర్గా అజార్ కెరీర్ కొనసాగిన విధం, మ్యాచ్ ఫిక్సింగ్ వివాదం వరకు సినిమా సాగుతుంది. మొత్తంగా రూ.50 కోట్లు వసూలు చేసి యావరేజ్ చిత్రంగా నిలిచింది. విమర్శకుల నుంచి మిశ్రమ స్పందన మాత్రమే దక్కించుకుంది.మిథాలీ...సారీ...మహిళల క్రికెట్కు భారత్లో చక్కని బాట వేసిన మిథాలి రాజ్ జీవితం ఆధారంగా రూపొందిన శభాష్ మిథు..2022లో విడుదలైంది.ఇందులో మిథాలి పాత్రను బాలీవుడ్ నటి తాప్సీ పన్ను పోషించింది. భారత మహిళా క్రికెట్ తో పాటుగా ఎదిగిన మిథాలీ జీవితాన్ని చూపించిన ఈ చిత్రం అట్టర్ ఫ్లాప్గా నిలిచింది. కనీసం రూ.2 కోట్లు కూడా వసూలు చేయలేక కమర్షియల్గా ఘోర పరాజయం పొందింది. ఈ సినిమా కథన శైలి, స్క్రీప్లేపై తీవ్రమైన విమర్శలు వచ్చాయి. అయితే, మిథాలి పాత్రను తాప్సీ సమర్ధంగా పోషించిందని ప్రశంసలు రావడం ఒక్కటే ఈ సినిమాకు దక్కిన ఊరట.కపిల్...కప్ ఫుల్...కపిల్దేవ్ 83 పేరిట రూపొందిన చిత్రం భారత క్రికెట్ దిగ్గజం కపిల్ జీవితంలో ముఖ్య ఘట్టమైన ప్రపంచ కప్ విజయం ఆధారంగా తెరకెక్కింది. ఇందులో కపిల్ పాత్రను బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ పోషించారు. 2021లో విడుదలైన ఈ చిత్రం రూ.193 కోట్లతో మంచి వసూళ్లే రాబట్టినా, చిత్రం బడ్జెట్ ప్రకారం కమర్షియల్ సక్సెస్ అనిపించుకోలేకపోయింది. అయితే విమర్శలు ప్రశంసలు బాగానే అందుకుంది.మొత్తం గా చూస్తే ధోనీ బయోపిక్ మాత్రమే అన్ని రకాలుగా విజయం సాధించింది అని చెప్పొచ్చు మరి గంగూలీ ఈ విషయం లో ధోని ని బీట్ చేయగలడా... -
ఐశ్వర్య రాయ్తో పెళ్లికి ముందు ఆ హీరోయిన్తో ఎంగేజ్మెంట్!
పెళ్లిళ్లు స్వర్గంలోనే నిర్ణయిస్తారు అంటుంటారు. అందుకేనేమో.. పీకల్లోతు ప్రేమలో ఉన్న అభిషేక్ బచ్చన్, కరిష్మా కపూర్.. ఎంగేజ్మెంట్ వరకు వచ్చి ఆగిపోయారు. మనసు నిండా ఒకరినొకరు నింపుకున్నారు కానీ, తలరాతల్లో మాత్రం లేకుండా పోయారు. జంటగా నడవాలనుకుంటే వేర్వేరుగా ప్రయాణించారు. అభిషేక్.. ఐశ్వర్యను, కరిష్మా.. సంజయ్ను పెళ్లాడారు. అసలు ఆనాడేం జరిగిందో ఓసారి గుర్తు చేసుకుందాం..అభిషేక్- కరిష్మా ప్రేమసినీరంగంలో సత్తా చాటుతున్న కపూర్ ఫ్యామిలీలో పుట్టింది కరిష్మా (Karisma Kapoor). 17 ఏళ్ల వయసులోనే నటిగా ప్రయాణం ప్రారంభించింది. మొదట్లో కొన్ని వైఫల్యాలు చూసిన కరిష్మా.. రాజా హిందుస్తానీ చిత్రంతో సక్సెస్ అందుకుంది. తర్వాత ఈ బ్యూటీ బిగ్బీ తనయుడు అభిషేక్ బచ్చన్ (Abhishek Bachchan)తో ప్రేమలో పడింది. అభిషేక్ సోదరి శ్వేత బచ్చన్ పెళ్లిలోనే వీరి చూపులు కలిశాయి. ఐదేళ్లపాటు ప్రేమించుకున్నారు. రెండు కుటుంబాలు ఏమీ అభ్యంతరం చెప్పలేదు. జయా బచ్చన్తో కరిష్మా కపూర్నా కోడలు: జయా బచ్చన్దీంతో 2002లో అమితాబ్ బచ్చన్ 60వ పుట్టినరోజు వేడుకల్లో జయా బచ్చన్.. అభిషేక్, కరిష్మాల ఎంగేజ్మెంట్ను ప్రకటించింది. కరిష్మాను తన కోడలిగా చేసుకోనున్నట్లు వెల్లడించింది. బాలీవుడ్లో పెద్ద పండగే జరగబోతుందనుకున్నవారికి షాకిస్తూ వీరి ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయింది. అమితాబ్ తన సంపదలో కొంత భాగం అభిషేక్ పేరు మీదకు ట్రాన్స్ఫర్ చేయాలని కరిష్మా తల్లి బబిత డిమాండ్ చేసిందట! ఈ నిశ్చితార్థం రద్దవడానికి ఈ డిమాండే ముఖ్య కారణమని అప్పట్లో ప్రచారం జరిగింది.పెళ్లిఎంగేజ్మెంట్ ఆగిపోయిన కొద్ది నెలలకే బబిత.. తన కూతురికి మంచి వ్యాపారవేత్తను చూసి పెళ్లి చేసింది. 2003లో కరిష్మా, సంజయ్ కపూర్ల పెళ్లి జరిగింది. ఇతడికిది రెండో పెళ్లి కావడం గమనార్హం. కానీ ఈ బంధం ఎంతోకాలం నిలవలేదు. పిల్లలు పుట్టిన కొంతకాలానికే కరిష్మా- సంజయ్ విడాకుల కోసం కోర్టుకెక్కారు. 2014లో విడాకుల కోసం దరఖాస్తు చేయగా 2016లో డివోర్స్ మంజూరయ్యాయి. కొద్దిరోజుల క్రితమే సంజయ్ కపూర్ కన్నుమూశాడు. ఇకపోతే అభిషేక్ బచ్చన్.. 2007లో ఐశ్వర్యరాయ్ను పెళ్లి చేసుకున్నాడు. వీరికి కూతురు ఆరాధ్య జన్మించింది. అభిషేక్- ఐశ్వర్య అయినా సంతోషంగా ఉన్నారా? అంటే.. అప్పుడే దూరంగా ఉన్నట్లు అనిపిస్తారు. అంతలోనే జంటగా కనిపిస్తారు. వీరి మధ్య ఏం జరుగుతుందనేది వారికే తెలియాలి! #KarismaKapoor and #AbhishekBachchan's #wedding announcement in the early 2000s was a highly anticipated union between two of #Bollywood's most prominent families. However, the engagement was abruptly called off, and the wedding never took place.#bollywood #aishwaryarai pic.twitter.com/U1dRUrmnT2— The Cheshire Cat (@C90284166) November 5, 2024 చదవండి: కాస్టింగ్ కౌచ్.. ఓ గొప్ప ఫిలింమేకర్ కాంప్రమైజ్ అడిగాడు: నటుడు -
బెట్ ఇలాంటి ‘వార్’ చూసి ఉండరు: ఎన్టీఆర్
ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘వార్ 2’. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కియరా అద్వానీ హీరోయిన్. యశ్రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ నిర్మించిన స్పై యాక్షన్ మూవీ ‘వార్’ (2019) కొనసాగింపుగా వార్ 2 తెరకెక్కుతుంది. ఆగస్ట్ 14న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం కౌంట్డౌన్ మొదలు పెట్టింది. మరో 50 రోజుల్లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు కొత్త పోస్టర్ల ద్వారా తెలియజేశారు.ఈ పోస్టర్లను ఎన్టీఆర్ తన ఎక్స్ (ట్విటర్)లో షేర్ చేస్తూ.. ‘బెట్ కాస్తున్నా.. ఇలాంటి ‘వార్’ చిత్రాన్ని మీరెప్పుడూ చూసి ఉండరు. కౌంట్డౌన్ మొదలు పెట్టండి’ అని రాసుకొచ్చాడు. ఎన్టీఆర్ ట్వీట్తో ఈ సినిమాపై మరింత అంచనాలు పెరిగాయని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా కోసమే గురువారం ఎన్టీఆర్ ముంబైకి వెళ్లారు.కూలీతో పోటీఆగస్ట్ 14న వార్ 2 తో పాటు మరో భారీ పాన్ ఇండియా చిత్రం కూడా రిలీజ్ కానుంది. అదే ‘కూలీ’. రజనీకాంత్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు. నాగార్జున, ఆమిర్ ఖాన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సౌత్లో రజనీకాంత్ మేనియా ఏ రేంజ్లో ఉంటుందో తెలిసిందే. అలాంటి హీరోతో ఎన్టీఆర్ పోటీ పడుతున్నాడు. మరి ఈ బాక్సాఫీస్ వార్లో గెలిదెవరో చూడాలి. Bet you haven’t ever seen a WAR like this! Let’s count it down #50DaysToWar2 … Releasing in Hindi, Telugu & Tamil on August 14th in cinemas worldwide! @iHrithik | @advani_kiara | #AyanMukerji | #War2 | #YRFSpyUniverse | @yrf pic.twitter.com/22ar5Mau9y— Jr NTR (@tarak9999) June 26, 2025 -
కాస్టింగ్ కౌచ్.. ఓ గొప్ప ఫిలింమేకర్ కాంప్రమైజ్ అడిగాడు: నటుడు
అడ్జస్ట్ అయితేనే అవకాశాలు ఇస్తామంటున్నారు అని ఎంతోమంది నటీమణులు మీడియా ముందు గోడు వెల్లబోసుకున్నారు. అయితే తనకూ అలాంటి పరిస్థితే ఎదురైందంటున్నాడు బాలీవుడ్ నటుడు సుధాన్షు పాండే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సుధాన్షు పాండే మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉంది. నేను కూడా ఆ ఇబ్బందులను ఎదుర్కొన్నాను. ఓ ప్రముఖ దర్శకనిర్మాత తను అడిగింది చేస్తే మంచి ఆఫర్ ఇస్తానన్నాడు.కాంప్రమైజ్ అయితేనే..ఇప్పుడాయన బతికి లేడు. గొప్ప ఫిలింమేకర్స్లో ఆయన ఒకరు. ఆయన అడిగినదానికి కాంప్రమైజ్ అయితేనే రోల్ ఇస్తానన్నాడు. ఆయనపై నాకెలాంటి కోపం, పగ లేదు. ఎందుకంటే వాళ్లు అడిగినదానికి ఒప్పుకోవడం, ఒప్పుకోకపోవడం అనేది మన చేతుల్లోనే ఉంది. ఆయన అడిగింది నా వల్ల కాదని సున్నితంగా తిరస్కరించాను. మర్యాదగా అడిగాడు కాబట్టి అంతే గౌరవంగా బదులిచ్చాను. బలవంతం చేస్తే నచ్చదుఅలా కాకుండా నాతో అసభ్యంగా ప్రవర్తించుంటే లాగిపెట్టి కొట్టేవాడిని. ఎవరైనా నన్ను బలవంతం చేస్తే నాకు చాలా కోపం వస్తుంది. నాకు నచ్చినపనే చేస్తాను. నచ్చినవాటివైపే నిలబడతాను. ఇష్టం లేకుండా ఏ పనీ చేయను అని చెప్పుకొచ్చాడు. సుధాన్షు పాండే.. ఖిలాడీ 420, ద మిత్, యాకీన్, మర్డర్ 2, రాజధాని ఎక్స్ప్రెస్ వంటి పలు చిత్రాలు చేశాడు. రోబో 2.0, మన్మథుడు 2 వంటి చిత్రాలతో తెలుగువారికీ సుపరిచితుడే.. ప్రస్తుతం ప్రైవేట్ సాంగ్స్లో కనిపిస్తున్నాడు.చదవండి: లయ కూతుర్ని చూశారా? ఎంత పెద్దగా అయిపోయిందో! -
విమానంలో మూర్ఛ వచ్చింది.. ఎక్కువ డోస్ ఇవ్వడంతో..: హీరోయిన్
బాలీవుడ్ హీరో విజయ్ వర్మ.. తమన్నాకు బ్రేకప్ చెప్పాక మరో హీరోయిన్తో ప్రేమలో పడ్డాడని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. దంగల్ బ్యూటీ ఫాతిమా సనా షైఖ్ (Fatima Sana Shaikh)తో పలుమార్లు కనిపించడంతో వీళ్లు లవ్ బర్డ్స్ అయుండొచ్చని పలువురూ అభిప్రాయపడ్డారు. కానీ, అందులో ఏమాత్రం నిజం లేదంటోంది ఫాతిమా. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ప్రేమలో ఉన్నప్పుడు ఇద్దరూ సమాన గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలి. ఒకరు చెప్పేది మరొకరు వినాలి. సింగిల్ లైఫ్కొన్నిసార్లు ఒకరి కోసం మరొకరు కాంప్రమైజ్ అవ్వాలి. మిమ్మల్ని మీరు కోల్పోకుండా మీ అనుబంధాన్ని ముందుకు నడిపించాలి. అప్పుడే ఆ బంధం విజయవంతంగా కొనసాగుతుంది. అలాంటి వ్యక్తి నా జీవితంలో ఎవరూ లేరు. మంచివాళ్లు కేవలం సినిమాల్లోనే ఉంటారు అంటూ తన రిలేషన్షిప్ స్టేటస్ సింగిల్ అని వెల్లడించింది. అలాగే తన అనారోగ్యం గురించి మాట్లాడుతూ.. నాకు మూర్ఛ రోగం (Epilepsy) ఉంది. అమెరికా వెళ్తున్నప్పుడు విమానంలో ఉండగా మూర్ఛ వచ్చింది. దాంతో నన్ను ఎయిర్పోర్ట్ హాస్పిటల్కు తీసుకెళ్లి చికిత్స అందించారు. ఫిట్స్ వచ్చి పడిపోయాఅయినా మూర్ఛ తగ్గకపోవడంతో ఎక్కువ డోసు ఇచ్చారు. దానివల్ల నా శరీరం ఎఫెక్ట్ అయింది. బెడ్రెస్ట్ తీసుకోక తప్పలేదు. అప్పుడు నా చేతిలో రెండు సినిమాలున్నాయి. వాటి షూటింగ్స్ క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది. షూటింగ్కు రమ్మని పిలిచినప్పుడు బాధ తట్టుకోలేక ఏడ్చేశాను. నాకున్న మూర్ఛ వ్యాధి గురించి అందరికీ చెప్పాలని డిసైడయ్యాను. అప్పుడే నాకు ఫిట్స్ ఉన్నట్లు వెల్లడించాను అని చెప్పుకొచ్చింది. ఫాతిమా.. మాధవన్ సరసన ఆప్ జైసా కోయ్ మూవీలో నటించింది. ఈ చిత్రం జూలై 11న నెట్ఫ్లిక్స్లో విడుదల కానుంది. ఫాతిమా నటించిన మరో చిత్రం 'మెట్రో ఇన్ డినో' జూలై 4న థియేటర్లలో రిలీజవుతోంది.చదవండి: నేను చెప్పానా.. జనాల్ని ఎలా ఫూల్స్ చేశారో చూశారా?: సింగర్ -
కరీనా కపూర్ బాత్రూమ్లో నా పోస్టర్ అతికించుకుంది: సల్మాన్ ఖాన్
అభిమాన హీరో, హీరోయిన్ల ఫోటోలు, పోస్టర్లు గది నిండా నింపుకుంటుంటారు చాలామంది. అయితే ఓ హీరోయిన్ తన బాత్రూమ్లో స్టార్ హీరో పోస్టర్లు అతికించిందుకుందట! ఈ విషయాన్ని భాయ్జాన్ సల్మాన్ ఖాన్ (Salman Khan) బయటపెట్టాడు. ఇంతకీ ఆ హీరోయిన్ మరెవరో కాదు.. కరీనా కపూర్! ఆమె అతికించిన పోస్టర్దో ఎవరికో కాదు సల్మాన్దే!సల్మాన్పై ఫన్నీ పోస్టర్లుసల్మాన్ ఖాన్.. ద గ్రేట్ ఇండియన్ కపిల్ షో మూడో సీజన్కు మొదటి గెస్టుగా విచ్చేశాడు. షోలో ప్రసారం చేయని అన్సీన్ ఫుటేజ్ను తన యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ చేశాడు. అందులో రోడ్డు పక్కన, కళ్లజోడు దుకాణంలో, మెన్స్ సెలూన్లో సల్మాన్ను ఎలా వాడేస్తున్నారనేది తెలియజేస్తూ ఆయా పోస్టర్లను చూపించాడు. అవి చూసి నవ్వేసిన హీరో ఓ ఆసక్తికర విషయాన్ని తెలియజేశాడు.కరీనా బాత్రూమ్లో నా పోస్టర్కరీనా కపూర్ బాత్రూమ్లో కూడా నా పోస్టర్ ఉందని విన్నాను. తర్వాత నేనోసారి ఆమె ఇంటికి వెళ్లినప్పుడు చూశాను. అప్పుడామె వయసు 8 ఏళ్లుంటాయనుకుంటాను. తనకు 15 ఏళ్లొచ్చాక నా పోస్టర్ తీసేసి రాహుల్ రాయ్ పోస్టర్ పెట్టుకుంది అని చెప్పుకొచ్చాడు. కాగా కరీనా, సల్మాన్ బాడీగార్డ్, క్యూంకీ, బజ్రంగీ భాయ్జాన్ వంటి చిత్రాల్లో నటించారు.ట్రిప్పుకెళ్తాంబాలీవుడ్ ట్రియో (ఆమిర్ ఖాన్, షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ త్రయం) గురించి చెప్తూ.. ఆమిర్ ఖాన్, నేను, షారూఖ్.. ముగ్గురం కలిసి ఓ ట్రిప్కు వెళ్దామని ఆమిర్ అన్నాడు. ఎవరికీ తెలియని ప్రదేశానికి వెళ్లాలనుకుంటున్నాం అన్నాడు. ఇంతలో అర్చన పూరణ్ సింగ్ కలగజేసుకుంటూ ఎవరికీ తెలియని చోటంటూ భూమిపై ఏదీ లేదు. మీరు చందమామ పైకి వెళ్తే బాగుంటుంది అని సలహా ఇచ్చింది. అందుకు హీరో నవ్వుతూ.. అవును, అది ట్రై చేయొచ్చు, కానీ ఎంతకాలం పడుతుందో చెప్పలేం అని సరదాగా అన్నాడు.చదవండి: ఆయన కోపం, తిట్లు భరించలేకపోయా.. మధ్యలోనే వెళ్లిపోయా! -
ఆయన కోపం, తిట్లు భరించలేకపోయా.. మధ్యలోనే వెళ్లిపోయా!
దర్శకుడు సాజిద్ ఖాన్ (Sajid Khan) సెట్లో తనను ఇబ్బంది పెట్టాడంటోంది బాలీవుడ్ బ్యూటీ ఈషా గుప్తా (Esha Gupta). సాజిద్ డైరెక్ట్ చేసిన హమ్షకల్ (2014) మూవీలో ఈషా హీరోయిన్గా నటించింది. ఆనాటి చేదు అనుభవాల గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది. నన్నెవరైనా చులకనగా చూస్తే అస్సలు ఊరుకోను. అలాంటిది సాజిద్ నన్ను సెట్లోనే తిట్టేవాడు. నేనెందుకు ఊరుకుంటాను? తిరిగి ఇచ్చిపడేసేదాన్ని. కొంతమందికి ఆలోచన తక్కువ.. ఫ్రస్టేషన్ ఎక్కువుంటుంది. సారీ చెప్పడంతో వెళ్లా..ఈయన పదేపదే కోప్పడుతుండేవాడు. ఎంతవరకని భరిస్తాం? అప్పటికే సినిమాను కష్టపడి ప్రమోట్ చేశాం. అయినా కూడా కనీస గౌరవం ఇవ్వడం లేదు. అందరిపైనా అరుస్తూ తన పరువు తనే తీసుకునేవాడు. ఓరోజు ఆయన వైఖరిపై కోపమొచ్చి నేరుగా కారెక్కి ఇంటికి వెళ్లిపోయాను. ఆ సినిమానే వదిలేయాలనుకున్నాను. కానీ నిర్మాత వాసు భగ్నానీ పిలిచి సారీ చెప్పడంతో వెళ్లాను. దర్శకుడు సాజిద్ కూడా క్షమాపణలు చెప్పాడు.. కానీ నా మనసులో మాత్రం ఆయన్ను క్షమించలేకపోయాను అని చెప్పుకొచ్చింది. సినీ జర్నీహమ్షకల్ మూవీలో సైఫ్ అలీ ఖాన్, రితేశ్ దేశ్ముఖ్, రామ్ కపూర్ హీరోలుగా నటించారు. తమన్నా భాటియా, బిపాషా బసు, ఈషా గుప్తా కథానాయికలుగా యాక్ట్ చేశారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మెప్పించలేకపోయింది. ఈషా గుప్తా సినీజర్నీ విషయానికి వస్తే.. 'జన్నత్ 2' (2012) చిత్రంతో కెరీర్ ప్రారంభించింది. తెలుగులో వీడెవడు మూవీ చేసింది. వినయ విధేయ రామలో 'ఏక్ బార్ ఏక్ బార్..' అనే ఐటం సాంగ్లో యాక్ట్ చేసింది. చివరగా 'వన్ డే: జస్టిస్ డెలివర్డ్' మూవీలో డీసీపీ లక్ష్మీగా నటించింది. ప్రస్తుతం ప్రైవేట్ సాంగ్స్లో కనిపిస్తోంది.చదవండి: హార్దిక్తో డేటింగ్.. ముందే అది ఫిక్స్ అయ్యాం: బాలీవుడ్ నటి -
బాలీవుడ్లోనే అతి ఖరీదైన బంగ్లా అదే.. అమితాబ్, షారూఖ్ది కాదు..
ముంబయిలో అత్యంత ఖరీదైన భవనాలు చాలానే ఉన్నాయి. సహజంగానే వాటిలో ఎక్కువ బాలీవుడ్ ప్రముఖులవే. మరీ ముఖ్యంగా షారూఖ్ ఖాన్ మన్నత్ నివాసం ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటుంది. బాలీవుడ్ సూపర్ స్టార్లు ఒకరిని మించి ఒకరు ఖరీదైన భవనాల యజమానులుగా కావడానికి ఉవ్విళ్లూరుతుంటారు.. అయితే షారూఖ్, అమితాబ్ తదితర బిగ్స్టార్లు అందరినీ తోసి రాజని ఓ యువ జంట కొనుగోలు చేసిన ఓ ఇల్లు వార్తల్లో నిలుస్తోంది. ఇప్పటిదాకా బాలీవుడ్ ప్రముఖుల అన్ని భవనాల కన్నా ఇదే ఖరీదైనదిగా తెలుస్తోంది.ముంబై రియల్ ఎస్టేట్ మార్కెట్లో సరికొత్త రికార్డు సృష్టించింది ఆ యువ జంట కొన్న భవనం. ముంబైలో వీరు కొనుగోలు చేసిన భవనం ఇప్పుడు బాలీవుడ్ సర్కిల్లో మాత్రమే కాదు ముంబయి నగరంలోననూ హాట్ టాపిక్గా మారింది. ఈ లగ్జరీ బంగ్లా ధర మన్నత్ (షారూక్ ఖాన్ స్వంతమైన ఫేమస్ బంగ్లా) కంటే ఎక్కువ కావచ్చన్న ఊహాగానాలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ భవనానికి వీరు వెచ్చించిన మొత్తం ముంబై రియల్ ఎస్టేట్ మార్కెట్లో కొత్త ప్రమాణాలు సృష్టించిందని విశ్లేషకులు చెబుతున్నారు.ఎక్కడ ఉందీ బంగ్లా?ఈ అత్యంత ఖరీదైన భవనం ముంబై నగరంలోని ప్రముఖుల నివాసాలకు ప్రసిద్ధిగాంచిన హై–ఎండ్ లోకాలిటీ పాలి హిల్ ప్రాంతంలో ఉంది. ఈ లగ్జరీ ప్రాపర్టీ ధర రూ. 250 కోట్ల వరకు ఉండొచ్చని అంచనాలు ఉన్నాయి. అంటే ఇది షారుఖ్ ఖాన్ మన్నత్ కంటే ఖరీదైన ప్రాపర్టీ అవుతుంది. ఎందుకంటే మన్నత్ విలువను 200 కోట్ల వరకు ఉంటుందని అంచనా. దీంతో ఈ తాజా కొనుగోలు ముంబై రియల్ ఎస్టేట్ మార్కెట్కు పెద్ద ప్రోత్సాహంగా మారింది. ప్రముఖుల ఇళ్ల ఖరీదు ఇప్పటివరకు 100–150 కోట్ల మధ్యే ఉండగా, ఈ డీల్ మార్కెట్ను మరింత ఎగబాకేలా చేసింది. ముంబై నగరంలో ఇదొక కొత్త చరిత్రగా నిలిచింది.ఎవరీ జంట?ఈ భవనాన్ని కొనుగోలు చేయడం ద్వారా వార్తల్లో నిలిచిన బాలీవుడ్ స్టార్ జంట రణబీర్ కపూర్, ఆలియా భట్. వీరి కొత్త బంగ్లా మన్నత్ కంటే ఖరీదైనది కాగా ఈ బంగ్లా కొనుగోలు తమకు పెద్ద గౌరవంగా భావిస్తున్నామని రణబీర్–ఆలియా సన్నిహితులతో అంటున్నారని సమాచారం. ఎంతో స్పెషల్గా నిర్మించిన ఇంట్లో పర్సనల్ జిమ్, ప్రైవేట్ థియేటర్, హైసెక్యూరిటీ వగైరాలతో పాటు అత్యంత ఆధునిక సదుపాయాలు అన్నీ ఉన్నాయట. ఈ ఇంటిని కేవలం ఇన్వెస్ట్మెంట్ కోసం కాకుండా, రణబీర్–ఆలియా తమ ఫ్యామిలీతో నివసించడానికి ప్రత్యేకంగా సిద్ధం చేస్తున్నారు. వారి కుమార్తె రాహా కోసం కూడా అనేక సదుపాయాలు ఇంట్లో ఏర్పాటు చేయబడ్డాయి. ఈ స్టార్ జంట కొత్త ఇంట్లోకి త్వరలోనే గృహ ప్రవేశం చేయనుంది. -
హార్దిక్తో డేటింగ్.. ముందే అది ఫిక్స్ అయ్యాం: బాలీవుడ్ నటి
సినిమా, క్రికెట్ సెలబ్రిటీల బంధాల గురించి ఎప్పటికప్పుడు ఏదో ఒక రూమర్ వినిపిస్తూనే ఉంటుంది. కొన్నిసార్లు అది నిజమైతే కొన్నిసార్లు అది పుకారుగానే మిగిలిపోతుంది. కొన్నిరోజుల క్రితం హార్దిక్ పాండ్య, నటి ఈషా గుప్తా డేటింగ్ గురించి కొన్ని రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు వాటిపై సదరు నటి స్పందించింది. అసలేం జరిగిందో చెప్పి పూర్తి క్లారిటీ ఇచ్చేసింది.'కొన్నినెలల పాటు మేమిద్దరం మాట్లాడుకున్నాం. మా మధ్య స్నేహం ఏర్పడింది. మేం డేటింగ్లో ఉన్నామని అనుకోవట్లేదు. మేం మాట్లాడుకోవడం మొదలుపెట్టినప్పుడు.. డేటింగ్లోకి వెళ్లే ఛాన్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చని ముందే ఫిక్స్ అయ్యాం. కానీ రిలేషన్లోకి అడుగుపెట్టకుండానే విడిపోయాం. రెండు, మూడుసార్లు కలిసుంటాం. కానీ కొన్నినెలల పాటు మా రిలేషన్ కొనసాగింది. తర్వాత అది ముగిసిపోయింది' అని ఈషా గుప్తా చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: ప్రభాస్ కాదు.. ఆ డ్రీమ్ ప్రాజెక్ట్లో అల్లు అర్జున్?)2012లో 'జన్నత్' అనే హిందీ సినిమాతో నటిగా ఈషా గుప్తా కెరీర్ ప్రారంభించింది. బేబీ, రుస్తుం, కమాండో 2 తదితర హిందీ చిత్రాల్లో నటించింది. వీడెవడు అనే తెలుగు మూవీలో హీరోయిన్గా చేసిన రామ్ చరణ్ 'వినయ విధేయ రామ'లో ఐటమ్ సాంగ్లోనూ ఈమె మెరిసింది. 2019 తర్వాత పూర్తిగా సినిమాలు చేయడం మానేసింది. అయితేనేం సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు హాట్ ఫొటోస్ పోస్ట్ చేస్తూ ఎంటర్టైన్ చేస్తూనే ఉంటుంది.హార్దిక్ పాండ్య విషయానికొస్తే.. టీమిండియా తరఫున ఆల్రౌండర్గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఐపీఎల్లో ప్రస్తుతం ముంబై ఇండియన్స్కి కెప్టెన్సీ చేస్తున్నాడు. వ్యక్తిగత జీవితానికొస్తే నటాషా స్టాంకోవిచ్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీళ్లకు అగస్త్య అని కొడుకు కూడా పుట్టాడు. కానీ కొన్నాళ్లకే మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతానికైతే హార్దిక్ సింగిల్గానే ఉంటున్నాడు.(ఇదీ చదవండి: మరో హీరోయిన్తో తమన్నా మాజీ ప్రియుడు డేటింగ్?) -
నా తల్లి అల్లా దగ్గరకు వెళ్లిపోయింది.. హీరోయిన్ ఎమోషనల్ పోస్ట్
ప్రముఖ నటి, ‘బిగ్బాస్’ ఫేం సనాఖాన్( Sana Khan) ఇంట విషాదం నెలకొంది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె తల్లి మంగళవారం మృతి చెందారు. ఈ విషయాన్ని సనాఖాన్ ఇన్స్టా వేదికగా అభిమానులతో తెలియజేస్తూ..ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ‘నా తల్లి అనారోగ్య సమస్యలతో బాధపడుతూ..ఇప్పుడు అల్లా వద్దకు చేరుకున్నారు’ అంటూ సనా భావోద్వేగానికి లోనయ్యారు.తన తల్లి ఆత్మకు శాంతి కలగాలని, అందరూ ప్రార్థనలు చేయాలని ఆమె కోరారు. తల్లి మరణంతో తీవవ్ర దుఖంలో మునిగిన సనాను పలువురు సినీ ప్రముఖులు ఓదార్చారు. అభిమానులు, సినీ ప్రముఖులు సనాకు సంతాపం తెలుపుతూ సందేశాలు పంపుతున్నారు.సనా ఖాన్ సినిమాల విషయానికి వస్తే.. సల్మాన్ ఖాన్ నటించిన 'జై హో' చిత్రం, వెబ్ సిరీస్ 'స్పెషల్ ఆప్స్' వంటి ప్రాజెక్ట్లతో పాటు హింది బిగ్ బాస్ షో ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకుంది. జర్నీ బాంబే టు గోవా మూవీలోనూ ఐటం సాంగ్ చేసింది. గోల్ సినిమాలో ఆమె చేసిన బిల్లో రాణి సెన్సేషన్ హిట్టయింది. ఈ సాంగ్తోనే విశేషమైన గుర్తింపు తెచ్చుకుంది. సిలంబట్టం (తమిళ) చిత్రంతో హీరోయిన్గా మారింది. కల్యాణ్ రామ్ కత్తి(2010) సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తెలుగులో గగనం, మిస్టర్ నూకయ్య మూవీస్ చేసింది. మలయాళ, కన్నడ భాషల్లోనూ పలు సినిమలు చేసింది. 2020లో ముస్లిం మత గురువు ముఫ్తీ అనాస్ సయ్యద్ని వివాహం చేసుకుంది. ఈ జంటకు 2023లో బాబు పుట్టాడు. పెళ్లి తర్వాత సనా సినిమాలకు దూరంగా ఉంటుంది. -
గంగూలీ బయోపిక్లో ఫిక్స్
ప్రముఖ క్రికెటర్, టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ బయోపిక్కి సన్నాహాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ బయోపిక్కి సంబంధించిన పనులు దాదాపు నాలుగేళ్లుగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో గంగూలీగా నటించనున్నారంటూ రణ్వీర్ సింగ్, ఆయుష్మాన్ ఖురానా వంటి నటుల పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఓ కార్యక్రమంలో తన బయోపిక్లో రాజ్కుమార్ రావు నటించనున్నారన్న సమాచారం ఉందని, అయితే ఆయన కాల్షీట్స్ కేటాయింపులో కొన్ని సమస్యలు ఉన్నాయన్నట్లుగా గుంగూలీ పేర్కొన్నారు.తాజాగా గంగూలీ బయోపిక్లో రాజ్కుమార్ రావు నటించనుండటం కన్ఫార్మ్ అయిపోయింది. ఈ బయోపిక్లో నటించనున్నట్లుగా రాజ్కుమార్ రావు ఓ జాతీయ ఆంగ్ల మీడియా సంస్థకు వెల్లడించి, ఆనందం వ్యక్తం చేశారు. ‘‘గంగూలీగారి బయోపిక్లో నటించడమనేది చాలా పెద్ద బాధ్యత. కాస్త ఆందోళనగా ఉంది. కానీ ఫుల్ ఫన్గా కూడా ఉంటుందని అనుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు రాజ్కుమార్.బెంగాలీకి చెందిన క్రికెటర్ గంగూలీ. రాజ్కుమార్ రావు భార్య పత్రలేఖ బెంగాలీ. దీంతో తన భార్య వద్ద బెంగాలీ భాషలో నైపుణ్యతను సంపాదించుకున్నారట రాజ్కుమార్. సో... భాష, ఉచ్చారణ పరంగా ఆయనకు సమస్య లేదు. ఇక తన బయోపిక్ చిత్రీకరణ 2026 జనవరిలో ప్రారంభమవుతుందని, అదే ఏడాది డిసెం బరులో రిలీజ్ కావొచ్చని ఓ సందర్భంలో గంగూలీ పేర్కొన్నారు. -
ఓటీటీకి అజయ్ దేవ్గణ్ క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
అజయ్ దేవ్గణ్ , రితేశ్ దేశ్ముఖ్ ప్రధాన పాత్రల్లో వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ రైడ్-2. గతంలో విడుదలైన రైడ్ మూవీకి సీక్వెల్గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. రాజ్ కుమార్ గుప్తా డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా గత నెలలో బాక్సాఫీస్ వద్ద సందడి చేసింది. థియేటర్ల వద్ద దాదాపు రూ. 157.88 కోట్ల నికర వసూళ్లు సాధించింది.తాజాగా ఈ మూవీ ఓటీటీలో వచ్చేందుకు సిద్ధమైంది. ఈనెల 26 నుంచి నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో రైడ్-2 ట్రైలర్ను విడుదల చేసింది నెట్ఫ్లిక్స్. ఈ చిత్రంలో అజయ్ దేవ్గన్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ ఆఫీసర్ అమయ్ పట్నాయక్ పాత్రలో కనిపించారు. రితేష్ దేశ్ముఖ్ ఎప్పుడూ చూడని పవర్ఫుల్ రోల్లో కనిపించారు. అంతేకాకుండా ఈ చిత్రంలో వాణి కపూర్, సౌరభ్ శుక్లా ప్రత్యేక పాత్రల్లో నటించారు.Aaj se ulti ginti shuru 🔥Amay Patnaik is back with a new case and the same old fire 👊 Watch Raid 2, out 26 June, on Netflix.#Raid2OnNetflix pic.twitter.com/f06uJB6feQ— Netflix India (@NetflixIndia) June 24, 2025 -
మీ కోడలు ఐశ్వర్యను ఎందుకు మెచ్చుకోరు?.. అమితాబ్ సమాధానం ఇదే?
సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే సీనియర్ హీరోలలో అమితాబ్ బచ్చన్ ఒకరు. సినిమా అప్డేట్లతో పాటు పర్సనల్ విషయాలను కూడా అభిమానులతో షేర్ చేసుకుంటారు. అంతేకాదు సమయం దొరికినప్పుడల్లా లైవ్లోకి వచ్చి ఫ్యాన్స్తో చిట్చాట్ చేస్తుంటాడు. వారు అడిగే ప్రతి ప్రశ్నకు ఓపికగా సమాధానం చెబుతుంటాడు. తాజాగా ఓ అభిమాని.. అమితాబ్ని విమర్శిస్తూ అడిగిన ఓ ప్రశ్నకు తనదైన శైలీలో సమాధానం చెప్పాడు బిగ్బీ.కొడుకుపై మాత్రమే ప్రశంసలు..! అమితాబ్పై ఓ విమర్శ ఉంది. ఆయన ఎప్పుడూ కొడుకు అభిషేక్ బచ్చన్ని పొగుడుతూనే ఉంటాడని.. అదే కోడలు ఐశ్వర్య, భార్య జయా బచ్చన్లను ప్రశంసిస్తూ ఒక్క ట్వీట్ కూడా చేయడు. కొడుకుని ప్రశంసినట్లుగానే భార్య, కోడలుని ఎందుకు ప్రశంసించరని కొందరు ఆయనను ట్రోల్ చేస్తుంటారు. తాజాగా ఓ అభిమాని ఇదే ప్రశ్నను డైరెక్ట్గా అమితాబ్నే అడిగాడు. ఐశ్వర్య, జయా బచ్చన్లను ఎందుకు ప్రశంసించరని ప్రశ్నించాడు. దానికి బిగ్బీ ఇలా సమాధానం ఇచ్చాడు.పబ్లిక్గా ప్రశంసించను కానీ.. నిజమే.. నేను అభిషేక్ని ఎప్పుడూ ప్రశంసిస్తూనే ఉంటాను. అలాగే నా భార్య జయాబచ్చన్, కోడలు ఐశ్వర్యతో పాటు కూతురుని కూడా పొగుడుతుంటాను. కాకపోతే వారిని మనసులోనే మెచ్చుకుంటుంటాను. అది నాకు మహిళలపై ఉన్న గౌరవం’అని రిప్లై ఇచ్చాడు. మరో యూజర్..‘అమితాబ్ రిప్లై ఇచ్చే వారంతా పెయిడ్ ఫ్యాన్స్’ అని కామెంట్ చేయగా.. దానికి బిగ్బీ ఇలా రిప్లై ఇచ్చాడు. ‘పెయిడ్ ఫ్యాన్స్ అని నిరూపించగలవా? నీది చాలా చిన్న మైండ్. అందుకే అలా భావిస్తున్నావు. నువ్వు కూడా డబ్బులు పెట్టి అభిమానులను సంపాదించుకోవచ్చు కదా? అని బిగ్బీ కౌంటర్ ఇచ్చాడు. -
మరో హీరోయిన్తో తమన్నా మాజీ ప్రియుడు డేటింగ్?
సినిమా ఇండస్ట్రీలో ప్రేమ, రిలేషన్, పెళ్లి.. ఇలాంటివన్నీ చాలా సాధారణమైన విషయాలు. టాలీవుడ్లో తక్కువ గానీ బాలీవుడ్లో మాత్రం ఫలానా హీరో.. ఫలానా హీరోయిన్తో డేటింగ్లో ఉన్నాడనే రూమర్స్ ఎప్పటికప్పుడు వినిపిస్తూనే ఉంటాయి. ఇవి నిజమనేటట్లు సదరు హీరోహీరోయిన్ జంటగా కనిపించడం, బయట కూడా కెమిస్ట్రీ పండించడం లాంటివి చూస్తే నిజమేనేమో అనిపిస్తుంది. కొన్నిరోజుల క్రితం వరకు తమన్నా-విజయ్ వర్మ గురించి ఇలానే మాట్లాడుకున్నారు.(ఇదీ చదవండి: 'గేమ్ ఛేంజర్'.. నేను చేసిన పెద్ద తప్పు: దిల్ రాజు)దాదాపు రెండు మూడేళ్ల పాటు తమన్నా.. నటుడు విజయ్ వర్మతో డేటింగ్ చేసిందనే ప్రచారం అయితే గట్టిగానే నడించింది. అందుకు తగ్గట్లు జంట పక్షుల్లా ఎక్కడపడితే అక్కడ వీళ్లిద్దరూ కనిపించేవారు. ప్రేమ, పెళ్లి గురించి ఇన్ డైరెక్ట్గా మాట్లాడేవారు కూడా. మరి ఏమైందో ఏమోగానీ ఈ జంట బ్రేకప్ చెప్పేసుకుంది. కలిసి కనిపించడమే మానేశారు. ప్రస్తుతం తమన్నా.. సినిమాలు, ఐటమ్ సాంగ్స్ చేస్తూ బిజీగా ఉంది. విజయ్ ఏం ప్రాజెక్టులు చేస్తున్నాడో తెలీదు.అలాంటిది ఇప్పుడు విజయ్ వర్మ.. మరోసారి వార్తల్లో నిలిచాడు. 'దంగల్' బ్యూటీ, హీరోయిన్ ఫాతిమా సనా షేక్తో కనిపించాడు. దీంతో వీళ్లిద్దరూ డేటింగ్లో ఉన్నారనే పుకార్లు మొదలయ్యాయి. వీటిలో ఎంత నిజముందో తెలీదు. రూమర్స్ అయితే గట్టిగానే వినిపిస్తున్నాయి. మరోవైపు విజయ్-ఫాతిమా ప్రస్తుతం జంటగా 'గుస్తాఖ్ ఇష్క్' అనే మూవీ చేస్తున్నారు. మరి ఈ సినిమా చేస్తున్నప్పుడు ఏమైనా ప్రేమలో పడ్డారా? లేదంటే ఇవి కేవలం రూమర్సేనా అనేది క్లారిటీ రావాలి?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్) -
మూడుభాషల్లో ఒకేసారి దృశ్యం 3
‘దృశ్యం’ సినిమాలకున్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. మలయాళ, తెలుగు, హిందీ భాషల్లో ‘దృశ్యం, దృశ్యం 2’ చిత్రాలు ఘన విజయం సాధించాయి. ఈ సిరీస్లో రానున్న మూడో చిత్రం ‘దృశ్యం 3’పై ఇటు ఇండస్ట్రీ, అటు ప్రేక్షకుల్లో ఫుల్ క్రేజ్ నెలకొంది. మోహన్ లాల్ హీరోగా జీతూ జోసెఫ్ దర్శకత్వంలో మలయాళంలో వచ్చిన ‘దృశ్యం, దృశ్యం 2’ చిత్రాలు విజయాన్ని అందుకున్నాయి. తెలుగులో వెంకటేశ్ హీరోగా శ్రీప్రియ దర్శకత్వం వహించిన ‘దృశ్యం’, వెంకటేశ్–జీతూ జోసెఫ్ కాంబినేషన్లో రూపొందిన ‘దృశ్యం 2’ హిట్గా నిలిచాయి.ఇక హిందీలో అజయ్ దేవగణ్ హీరోగా డైరెక్టర్ నిషికాంత్ కామత్ తెరకెక్కించిన ‘దృశ్యం’, అజయ్ దేవగణ్– డైరెక్టర్ అభిషేక్ పాఠక్ కాంబినేషన్లో వచ్చిన ‘దృశ్యం 2’ సినిమాలు కూడా మంచి విజయం సాధించాయి. ఇకపోతే ఈ సిరీస్లో మూడో భాగం ముందుగా మలయాళంలో రూపొందనున్న సంగతి తెలిసిందే. మూడో భాగంలోనూ మోహన్లాల్ నటించనుండగా జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించనున్నారు. ప్రీప్రోడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం అక్టోబరులో సెట్స్పైకి వెళ్లనుంది.ఇదిలా ఉంటే... జీతూ జోసెఫ్ కథతో సంబంధం లేకుండా హిందీలో ‘దృశ్యం 3’ ఉంటుందని అజయ్ దేవ్గణ్ ప్రకటించడం చర్చనీయాంశమైంది. దీనిపై తాజాగా జీతూ జోసెఫ్ మాట్లాడుతూ–‘‘మలయాళంలో నేను రాసిన కథతోనే తెలుగు, హిందీ భాషల్లోనూ ‘దృశ్యం 3’ సినిమా వస్తుంది. స్క్రిప్ట్ పని పూర్తయ్యాక హిందీ మూవీ టీమ్కు ఇస్తాను. అక్కడి సంస్కృతి, నేటివిటీకి తగ్గట్టు వాళ్లు కథలో మార్పులు చేసుకుంటారు.మూడు భాషల్లో ఒకేసారి ‘దృశ్యం 3’ని చిత్రీకరించడం సాధ్యం కాకపోయినప్పటికీ అన్ని భాషల్లోనూ ఒకేసారి విడుదల చేయాలనే ఆలోచన ఉంది’’ అని స్పష్టం చేశారాయన. ‘దృశ్యం 3’ తెలుగులో వెంకటేశ్, హిందీలో అజయ్ దేవగణ్ హీరోలుగా నటిస్తారని ఊహించవచ్చు. అయితే దర్శకులు ఎవరనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. -
మీనా కుమారి?
దివంగత ప్రముఖ నటి మీనాకుమారి జీవితం ఆధారంగా హిందీలో ‘కమల్ ఔర్ మీనా’ అనే సినిమా తెరకెక్కనుంది. ‘హిచ్ కీ, మహారాజ్’ వంటి చిత్రాల ఫేమ్ సిద్ధార్థ్ పి. మల్హోత్రా దర్శకత్వం వహించనున్నారు. కాగా ఈ సినిమాలోని మీనాకుమారి పాత్ర కోసం కృతీసనన్, కియారా అద్వానీ వంటి హీరోయిన్ల పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే సిద్ధార్థ్ పి. మల్హోత్రా ఇటీవల ఈ సినిమా కథని కియారా అద్వానీకి వినిపించగా, ఆమె గ్రీన్సిగ్నల్ ఇచ్చారని బాలీవుడ్ సమాచారం. నటుడు సిద్ధార్థ్ మల్హోత్రాతో వివాహ బంధంలో అడుగుపెట్టిన కియారా ప్రస్తుతం గర్భవతిగా ఉన్నారు.ఆమె ప్రసవం, కొంత విశ్రాంతి తర్వాత ఈ సినిమా చిత్రీకరణను ప్రారంభించాలన్నది మేకర్స్ ప్లాన్. అయితే ప్రెగ్నెన్సీ తర్వాత మీనాకుమారిలా కనిపించాలనుకోవడం కియారాకు పెద్ద సవాల్ అని, అయినప్పటికీ కథ నచ్చి ఒప్పుకున్నారని బాలీవుడ్ టాక్. ట్రాజెడీ క్వీన్ ఆఫ్ ఇండియన్ సినిమాగా చెప్పుకునే మీనా కుమారిగా కియారా నటిస్తే, ఈ సినిమాలోని దర్శకుడు కమల్ అమ్రోహి పాత్రను ఎవరు పోషించనున్నారనే చర్చకూడా జరుగుతోంది. సిద్ధార్థ్ పి. మల్హోతా, అమ్రోహి ఫ్యామిలీ, సరెగమా సంస్థలు ఈ సినిమాను నిర్మించనున్నాయి. -
ప్రముఖ సింగర్కు అరుదైన గౌరవం.. ఆయన పేరిట ఏకంగా కోర్సు!
ప్రముఖ సింగర్ దిల్జీత్ దోసాంజ్కు అరుదైన ఘనత దక్కింది. ఆయన పేరుపై ఏకంగా కోర్సు ప్రారంభించనున్నట్లు కెనడాకు చెందిన యూనవర్సిటీ ప్రకటించింది. ఈ పంజాబ్ గాయకుడిపై ఏకంగా కోర్సును అందిస్తున్నట్లు వెల్లడించింది. బోర్న్ టు షైన్ పేరుతో టొరంటో మెట్రోపాలిటన్ యూనివర్సిటీకి చెందిన ది క్రియేటివ్ స్కూల్లో వచ్చే ఏడాది నుంచి అతని పేరిట కోర్సు ప్రారంభించాలని నిర్ణయించింది. తాజాగా జరిగిన సమ్మిట్లో ఈ విషయాన్ని ప్రకటించారు.కాగా.. పంజాబ్కు చెందిన దిల్జీత్ దోసాంజ్ ప్రపంచ వేదికపై సత్తా చాటారు. గత ఇరవై ఏళ్లుగా అంతర్జాతీయ వేదికలపై తన గాత్రంతో అభిమానులను అలరించారు. 'మూన్చైల్డ్ ఎరా', 'గోట్' లాంటి మ్యూజిక్ ఆల్బమ్లు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందాయి. 'మూన్చైల్డ్ ఎరా' కెనడియన్ ఆల్బమ్ల జాబితాలో ఏకంగా 32వ స్థానానికి చేరుకుంది. ఒక భారతీయ కళాకారుడిగా అరుదైన ఘనత సాధించారు. తాజాగా ఆయనపై కోర్సు అందించడం అతని ప్రతిభకు నిదర్శనమని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.దిల్జీత్ దోసాంజ్ తన నటనా జీవితంలో అద్భుతంగా రాణించారు. 'జాట్ అండ్ జూలియట్', 'పంజాబ్ 1984', 'సజ్జన్ సింగ్ రంగ్రూట్' వంటి అనేక పంజాబీ సూపర్ హిట్స్ చిత్రాల్లో నటించారు. అలాగే 'ఉడ్తా పంజాబ్' లాంటి బాలీవుడ్ మూవీలోనూ కనిపించారు. గతేడాది 'చమ్కిలా' అనే చిత్రంలో నటనకు గానూ ప్రశంసలు అందుకున్నారు. అంతేకాకుండా 2023లో అతను తన 'దిల్-లుమినాటి' పర్యటనతో ఉత్తర అమెరికాలో చరిత్ర సృష్టించాడు. ఆ తర్వాత కెనడాలో జరిగిన అతిపెద్ద పంజాబీ కచేరీలతో పేరు సంపాదించారు. -
'ఈ ముసలాడికి పిచ్చి పట్టినట్లుంది' అమితాబ్ ఆన్సరిదే!
సమాజంలో రోజురోజుకూ సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం.. సైబర్ క్రైమ్పై అవగాహన పెంచే కాలర్ ట్యూన్లను ఆ మధ్య తెగ ప్రసారం చేసింది. ఓటీపీలు షేర్ చేయొద్దు, లింక్స్ క్లిక్ చేయొద్దు.. సైబర్ నేరగాళ్లతో జాగ్రత్త! అంటూ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan)తోనూ చెప్పించింది. రోజుకు 8- 10 సార్లు ఈ కాలర్ ట్యూన్లు వినిపించేవి.పిచ్చి పట్టినట్లుందిదాని గురించి కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో నసుగుతూ కామెంట్లు చేశారు. దీంతో ఆగ్రహించిన బిగ్బీ.. అయితే వెళ్లి ప్రభుత్వానికి చెప్పండి. నేను వారు చెప్పిందే చేశాను అని రిప్లై ఇచ్చారు. ఈ ముసలాడికి పిచ్చి పట్టినట్లుంది అన్న కామెంట్కు.. ఏదో ఒక రోజు నువ్వు కూడా ముసలాడివి అవుతావు. వయసు పెరిగినవారికి కొండంత అనుభవం, జ్ఞానం ఉంటుందని అంటుంటారు, తెలీదా? అని కౌంటర్ ఇచ్చారు. కాగా అమితాబ్ బచ్చన్ గతేడాది కల్కి 2898 ఏడీ, వేట్టయాన్ వంటి చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం రామాయణ: పార్ట్1 సహా మరో చిత్రంలో నటిస్తున్నారు.చదవండి: థగ్ లైఫ్ డిజాస్టర్.. క్షమాపణలు మాత్రమే చెప్పగలను.. మణిరత్నం -
ఫేక్ కలెక్షన్స్నే ఎక్కువగా ఎంజాయ్ చేస్తున్నారు: సన్నీ డియోల్
ఈ ఏడాది జాట్ మూవీతో సూపర్ హిట్ కొట్టిన బాలీవుడ్ హీరో సన్నీ డియోల్. టాలీవుడ్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగానే వసూళ్లు సాధించింది. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. సన్నీ డియోల్ ప్రస్తుతం బోర్డర్-2 మూవీలో నటిస్తున్నారు. అంతేకాకుండా నితీశ్ తివారీ తెరకెక్కించనున్న రామాయణంలోనూ కనిపించనున్నారు.అయితే తాజా ఇంటర్వ్యూకు హాజరైన సన్నీ డియోల్ మూవీ కలెక్షన్స్పై ఆసక్తికర కామెంట్స్ చేశారు. అభిమానులు ఫేక్ కలెక్షన్స్ను ఎంజాయ్ చేస్తున్నారని అన్నారు. అలాంటి వ్యక్తులు ఎలాంటివారో తనకు అర్థం కావడం లేదన్నారు. నకిలీ బాక్సాఫీస్ నంబర్స్ చూపించడం సరైన పద్ధతి కాదన్నారు. సినీ పరిశ్రమ ప్రమాణాల కంటే కేవలం హైప్పైనే ఆధారపడడంపై సన్నీ డియోల్ తప్పుబట్టారు.సన్నీ డియోల్ మాట్లాడుతూ.. 'ఇది చాలా బాధాకరం. ఎందుకంటే అభిమానులు వాస్తవికతను నమ్మడానికి ఇష్టపడరు. బాక్సాఫీస్ సంఖ్యలను పెంచి కానీ వాస్తవానికి భిన్నంగా చూపిస్తారు. టిక్కెట్లను పెద్దమొత్తంలో కొనుగోలు చేయడం.. నకిలీ బాక్సాఫీస్ సంఖ్యలు చూపించడం సరైంది కాదు. అది అలా ఉండకూడదు. మిమ్మల్ని మీరు హిట్ చేసుకోవడానికి ఇది మార్గం కాదు. అందువల్లే చాలా మంది యువకుల కథలు బయటకు రావడం లేదు. ప్రజలు కూడా మంచి కథకు విలువ ఇవ్వడం లేదు. ఈ రోజుల్లో కథ ప్రభావం కంటే ఫేక్ కలెక్షన్స్ ద్వారా విజయం డిసైడ్ చేస్తున్నారు' అని అన్నారు.సన్నీ డియోల్ చివరిసారిగా 'జాట్' చిత్రంలో కనిపించాడు. ఈ మూవీ ద్వారానే గోపీచంద్ మలినేని హిందీలో అరంగేట్రం చేశారు. ఈ చిత్రంలో రెజీనా , రణదీప్ హుడా, సయామి ఖేర్, రమ్య కృష్ణన్ కూడా నటించారు. -
ఈ మూవీ నవ్విస్తుంది, ఏడిపిస్తుంది.. చప్పట్లు కొట్టేలా చేస్తుంది
బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం సితారే జమీన్ పర్ (Sitaare Zameen Par). ‘సబ్ కా అప్న అప్న నార్మల్’ అనేది ఉపశీర్షిక. ఆమిర్ఖాన్ నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన హిట్ ఫిల్మ్ ‘తారే జమీన్ పర్’ (2007)కు సీక్వెల్గా ఈ మూవీ తెరకెక్కింది. జూన్ 20న విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తోంది.తాజాగా ఈ సినిమాకు సూపర్ స్టార్ మహేశ్బాబు (Mahesh Babu) రివ్యూ ఇచ్చాడు. సితారే జమీన్ పర్.. అందరి మనసులు దోచుకుంటోంది. ఈ మూవీ మిమ్మల్ని నవ్విస్తుంది, ఏడిపిస్తుంది. అలాగే చప్పట్లు కొట్టేలా చేస్తుంది. ఈ సినిమా చూశాక కచ్చితంగా చిరునవ్వుతో బయటకు వస్తారు అని రాసుకొచ్చాడు.సితారే జమీన్ పర్ మూవీలో ఆమిర్ ఖాన్, జెనీలియా జంటగా నటించారు. ఆర్ఎస్ ప్రసన్న దర్శకత్వం వహించగా ఆమిర్ఖాన్ ప్రొడక్షన్స్ బ్యానర్పై ఆమిర్ఖాన్, అపర్ణ పురోహిత్ నిర్మించారు. ఈ చిత్రంలో ఆరోష్ దత్తా, గోపీకృష్ణ వర్మ, సంవిత్ దేశాయ్, వేదాంత్ శర్మ, ఆయుష్ భన్సాలీ, ఆశిష్ పెండ్సే, రిషి షహానీ, రిషబ్జైన్ , నమన్ మిశ్రా, సిమ్రాన్ మంగేష్కర్ వంటి వారు కీలకపాత్రల్లో నటించారు. #SitaareZameenPar …Shines so bright and how…..It’ll make you laugh, cry and clap!! Like all Aamir Khan’s classics, you’ll walk out with a big smile on your face… Love and Respect..♥️♥️♥️#AamirKhan @geneliad @r_s_prasanna @AKPPL_Official @ShankarEhsanLoy #AmitabhBhattacharya…— Mahesh Babu (@urstrulyMahesh) June 22, 2025 చదవండి: మహేశ్బాబుతో పనిచేసేటప్పుడు గిల్టీగా ఫీలయ్యా: త్రిష -
త్రిప్తి డిమ్రి ఫేవరెట్ హీరోయిన్ ఎవరో తెలుసా? ఆమెలాగే హెయిర్కట్..
‘ఆ ఛాన్స్ నాకు ఎక్కడ దక్కుతుంది?’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పిన త్రిప్తికి.. కొన్ని రోజుల్లోనే ఆ అవకాశం పెద్ద పెద్ద స్టార్ హీరోయిన్స్ చుట్టూ తిరిగి చివరకు ఆమెనే వరించింది. దీపికా పదుకొణే ప్లేస్ని భర్తీ చేసిన త్రిప్తి తాజా జర్నీ ఆసక్తికరమే కాదు, ఆశ్చర్యకరమైనది కూడా!టాలీవుడ్లోనూ గుర్తింపుబాలీవుడ్ హీరోయిన్ త్రిప్తి డిమ్రి (Tripti Dimri).. సందీప్ రెడ్డి వంగా ‘యానిమల్’ సినిమాలో నటించి టాలీవుడ్లోనూ మంచి గుర్తింపు సంపాదించింది. ఇప్పుడదే దర్శకుడు ప్రభాస్తో చేస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘స్పిరిట్’లో హీరోయిన్ ఛాన్స్ దక్కించుకొని ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోయింది. త్రిప్తి.. దీపికా పదుకొణెకు పెద్ద అభిమాని. చిన్నతనంలో ‘చాందినీ చౌక్ టు చైనా’ సినిమాలో దీపికా లుక్ చూసి, అదే స్టయిల్లో హెయిర్ కట్ చేసుకుందట!మందు జోలికి వెళ్లనుమొన్నటి వరకు టీ ఎక్కువగా తాగే త్రిప్తి, ఇప్పుడు కాఫీ మీద మక్కువ పెంచుకుందట. టీ, కాఫీ తప్ప... ఇప్పటివరకు ఎప్పుడూ ఆల్కహాల్ టేస్ట్ చేయలేదని, భవిష్యత్తులో చేయాలనే ఆలోచన కూడా లేదని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ఇండియన్ సినిమాల్లో న్యూడ్గా నటించేందుకు ధైర్యం చేసిన అరుదైన నటీమణుల్లో త్రిప్తి ఒకరు. ‘యానిమల్’లో బోల్డ్ సీన్లు చేసిన తర్వాత స్టార్ అయింది. అయితే ఆ సీన్లు చూసి తల్లిదండ్రులు ఇబ్బంది పడ్డారని ఒప్పుకుంది. అయినా కెరీర్ కోసం ఇలాంటి సాహసాలు అవసరమే అంటోంది.యానిమల్ మూవీతో దశ తిరిగిందిత్రిప్తి 2017లో ‘పోస్టర్ బాయ్స్’ సినిమాతో రంగ ప్రవేశం చేసింది. ‘లైలా మజ్ను’, ‘బుల్ బుల్’ వంటి చిత్రాల్లో నటించినా పెద్దగా పాపులారిటీ రాలేదు. చిన్నప్పటి నుంచే టాప్ హీరోయిన్ కావాలని కలలు కన్న త్రిప్తి, అవి నెరవేరక మొదట్లో చాలా డిజప్పాయింట్ అయిందట! సరిగ్గా అలాంటి సమయంలో ‘యానిమల్’ ఛాన్స్ రావడంతో వదులుకోలేకపోయింది. ఆ సినిమా ఆమె కెరీర్ను ఊహించని ఎత్తులకు చేర్చింది. రష్మిక మందన్నా కన్నా త్రిప్తికి ‘ఛోటా భాభీ’గా ఎక్కువ క్రేజ్ వచ్చింది. బాలీవుడ్ సినిమాలుఆ తర్వాత కూడా బోల్డ్ కథలే త్రిప్తిని వెతుక్కుంటూ వచ్చాయి. ‘బ్యాడ్ న్యూస్’ చిత్రంలో ఇద్దరు బాయ్ఫ్రెండ్స్లో ఎవరి వల్ల గర్భం దాల్చిందో తెలియని యువతి పాత్రలో నటించింది. అలాగే, ‘విక్కీ విద్యా కా వోహ్ వాలా వీడియో’ అనే సినిమా హాలీవుడ్ సెక్స్ టేప్ కాన్సెప్ట్ ఆధారంగా తెరకెక్కింది. కొత్తగా పెళ్లైన జంట తమ మొదటి రాత్రిని షూట్ చేయడం, ఆ వీడియో లీక్ కావడం చుట్టూ కథ తిరుగుతుంది. ఈ సినిమాలో రాజ్ కుమార్ రావుతో కలిసి నటించింది.విమర్శలుత్రిప్తి నటనపై, డ్యాన్స్పై కొన్ని విమర్శలు వచ్చినా.. గ్లామర్, టాలెంట్, సక్సెస్ వల్ల అవకాశాలు మళ్లీ మళ్లీ వస్తున్నాయి. ‘యానిమల్’లో న్యూడ్ సీన్ తీసే సమయంలో డైరెక్టర్, హీరో ఎంతో మద్దతు ఇచ్చారని తెలిపింది. ఆ సీన్ను చాలా అందంగా చూపించారని, ఏ కాస్త అసౌకర్యంగా ఫీల్ అయినా షూటింగ్ ఆపేస్తామని మాట ఇచ్చిన తర్వాతే షూట్ చేశారని చెప్పింది త్రిప్తి.స్పిరిట్లో నేనా?ఒకసారి ఓ జర్నలిస్టు త్రిప్తిని ‘స్పిరిట్ సినిమాలో మీకు ఛాన్స్ వస్తుందా?’ అని అడిగినప్పుడు ‘ఒక్క శాతం కూడా అవకాశం లేదు. అంత పెద్ద ప్రాజెక్ట్లోకి ఎలా వస్తాను?’ అని ఆశ్చర్యంగా అంది. పైగా సందీప్ రెడ్డి వంగా తనకే మళ్లీ ఛాన్స్ ఇస్తాడా? అంటూ ఎదురు ప్రశ్నించింది. కానీ, విధి, సినిమా రంగం రెండూ మాయామయం! చివరకు దీపికా పదుకొణె స్థానంలో త్రిప్తి వచ్చి చేరింది.చదవండి: షూ విప్పడం కూడా రాదా? ఇంకేం యోగా చేస్తావ్? -
షూ విప్పడం కూడా రాదా? ఇంకేం యోగా చేస్తావ్?
బాలీవుడ్ హీరోయిన్ నుష్రత్ బరుచ (Nushrratt Bharuccha) విమర్శలపాలైంది. యోగా ఈవెంట్కు వెళ్లి ఆమె చేసిన పనికి అందరూ ఆమెను తిట్టిపోస్తున్నారు. అసలేం జరిగిందంటే.. శనివారం నాడు ముంబైలో జరిగిన యోగా ఉత్సవాల్లో నుష్రత్ పాల్గొంది. తెలుపు దుస్తుల్లో అక్కడికి హాజరైన ఆమెకు సొంతంగా షూలు విడిచేందుకు కూడా కష్టమైంది. అక్కడున్న మహిళా వాలంటీర్ల సాయం తీసుకుంది. అమ్మాయి కింద కూర్చుని హీరోయిన్ కాలు పట్టుకుని ఆమె షూ లేస్ తీసింది.. ఇంతలో నుష్రత్.. మరో కాలి షూ కూడా తీసేయమని వేలు పెట్టి చూపించింది. దీంతో ఆమె మరో కాలి షూ కూడా తీసేసింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.అది కూడా చేతకాదా?'నీ చేతులతో నువ్వు షూ లేస్ తీసేసి పక్కన విడిచిపెట్టలేవా?', 'నీ కాలికున్న షూలు తీసుకోలేవు కానీ యోగా చేస్తున్నావా?', 'నువ్వింకా చిన్న పిల్ల అనుకుంటున్నావా? డబ్బు, పాపులారిటీ చూశాక గర్వం తలకెక్కినట్లుంది' అని నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. నుష్రత్.. చివరగా చోరీ 2 సినిమాలో కనిపించింది. విశాల్ ఫ్యురియా దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ ఏప్రిల్ 11న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈమె తెలుగులో శివాజీ తాజ్మహల్ (2010) మూవీలో హీరోయిన్గా నటించింది. View this post on Instagram A post shared by TCX.official (@tellychakkar) చదవండి: న్యూజిలాండ్లో 7000 ఎకరాలు కొన్నాం: మోహన్బాబు -
రెండోసారి ప్రెగ్నెంట్? వీడియోతో క్లారిటీ వచ్చినట్లే!
బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ (Alia Bhatt) మరోసారి గర్భం దాల్చిందని కొన్ని వారాలుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కేన్స్ ఫిలిం ఫెస్టివల్కు ఆలియా హాజరైనప్పటి నుంచి ఈ రూమర్స్ మొదలయ్యాయి. పైగా జిమ్కు వెళ్లినప్పుడు కూడా కెమెరాలు కనిపించగానే ఎవరినీ పలకరించకుండా హడావుడిగా వెళ్లి కారులో కూర్చునేది. దీంతో నిజంగానే ఆలియా ప్రెగ్నెంట్ అయిందేమోనన్న అనుమానాలు వెలువత్తాయి. డ్యాన్స్ రిహార్సల్స్..కానీ, హీరోయిన్ లేటెస్ట్ వీడియోతో ఇవన్నీ వుట్టి పుకార్లేనని తేలిపోయాయి. ఆల్ఫా సినిమా కోసం డ్యాన్స్ రిహార్సల్స్ చేసిన ఆలియా తాపీగా వెళ్లి కారెక్కింది. మధ్యలో అక్కడున్నవారిని కూడా పలకరించింది. పైగా తనకు పొట్ట కూడా లేకపోవడంతో సెకండ్ ప్రెగ్నెన్సీ అంటూ వస్తున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని తేలిపోయింది. రాహా మూడో బర్త్డే..ఆలియా భట్ - రణ్బీర్ కపూర్ 2022లో పెళ్లి చేసుకున్నారు. అదే ఏడాది కూతురు రాహా జన్మించింది. ఈ ఏడాది రాహా మూడో బర్త్డే సెలబ్రేట్ చేసుకోనుంది. సినిమాల విషయానికి వస్తే ఆలియా ప్రస్తుతం 'ఆల్ఫా' మూవీ చేస్తోంది. 'ముంజ్య' హీరోయిన్ శార్వరితో కలిసి నటిస్తున్న ఈ మూవీ క్రిస్మస్కు విడుదల కానుంది. View this post on Instagram A post shared by Instant Bollywood (@instantbollywood) చదవండి: నా కూతురి జోలికొస్తే కారుతో తొక్కేస్తా.. కాజోల్ వార్నింగ్ -
వివాహ బంధానికి గుడ్ బై చెప్పిన ప్రముఖ బుల్లితెర జంట
ఇటీవల సినీ ఇండస్ట్రీలో విడాకుల వార్తలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే పలువురు స్టార్ నటీనటులు సైతం తమ వివాహ బంధానికి గుడ్ బై చెప్పేస్తున్నారు. తాజాగా మరో జంట తమ పెళ్లి బంధానికి ఎండ్ కార్డ్ పడేసింది. ప్రముఖ సీరియల్ నటి లతా సబర్వాల్.. తన భర్త సంజీవ్ సేథ్తో విడిపోతున్నట్లు ప్రకటించారు. సుదీర్ఘమైన చర్చల తర్వాత నేను.. నా భర్త విడిపోవాలని నిర్ణయించుకున్నాం. నాకు అందమైన కొడుకును ఇచ్చినందుకు అతనికి కృతజ్ఞతలు తెలుపుతున్నా. అతని భవిష్యత్తు బాగుండాలని శుభాకాంక్షలు' అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దాదాపు పెళ్లైన 16 ఏళ్లకు తమ వైవాహిక బంధానికి ముగింపు పలికారు. ఈ విషయంపై ఎటువంటి ప్రశ్నలు అడగకుండా తనను, తన కుటుంబాన్ని గౌరవించాలని ప్రతి ఒక్కరిని అభ్యర్థించింది. వీరిద్దరు బుల్లితెర నటీనటులు కాగా.. 'యే రిష్టా క్యా కెహ్లతా హై' సీరియల్ సెట్స్లో కలుసుకున్నారు. ఈ సీరియల్ బాలీవుడ్లో అత్యంత ఆదరణ దక్కించుకున్న వాటిలో ఒకటిగా నిలిచింది. ఇందులో భార్య, భర్తల పాత్రల్లో వీరిద్దరు నటించారు. అంతేకాకుడా ఈ జంట 2013లో 'నాచ్ బలియే 6' అనే డ్యాన్స్ షోలో కూడా పాల్గొన్నారు. ఆ తర్వాత ప్రేమలో పడిన జంట 2009లో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత ఈ జంటకు 2013లో ఓ కుమారుడు జన్మించారు. మరోవైపు సంజీవ్ సేత్ గతంలోనే నటి రేషమ్ టిప్నిస్ను వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత 2004లో ఈ జంట విడిపోయారు. అయితే పలు సీరియల్స్లో తనదైన నటనతో మెప్పించిన లతా సబర్వాల్ 2021లో నటనకు గుడ్బై చెప్పేసింది. ఆమె సీరియల్స్తో పాటు 'వివా', 'ఇష్క్ విష్క్' వంటి చిత్రాలలో కూడా కనిపించింది. -
ఇదెక్కడి ఆచారం రా నాయనా?.. హీరోకు ఏకంగా గిన్నె ఇచ్చారట!
బాలీవుడ్ నటుడు రణ్దీప్ హుడా ఇటీవలే జాట్ మూవీలో కనిపించారు. సన్నీ డియోల్ కీలక పాత్రలో నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్హిట్గా నిలిచింది. ఈ సినిమా ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లో ప్రసారమవుతోంది. అయితే బాలీవుడ్లో పలు సినిమాల్లో మెప్పించిన రణ్దీప్ హుడా రెండేళ్ల క్రితం తన ప్రియురాలు లిన్ లైస్రామ్ను పెళ్లాడారు. 2023లో మణిపూర్కు చెందిన లిన్ లైస్రామ్ను సంప్రదాయ వేడుకలో వివాహం చేసుకున్నారు.తాజాగా ఆ పెళ్లి వేడుకలో తనకెదురైన విచిత్రమైన అనుభవాన్ని పంచుకున్నారు. మణిపూరి సంప్రదాయంలో జరిగిన ఈ వేడుకలో తనకు మూత్ర విసర్జన కోసం గిన్నె ఇచ్చారని రణదీప్ హుడా గుర్తు చేసుకున్నారు. ఒకరకంగా ఈ పెళ్లి తంతు తనకు అంతర్యుద్ధం లాంటి పరిస్థితిని తలపించేలా చేసిందని తాజా ఇంటర్వ్యూలో పంచుకున్నారు.ఆ సంఘటనను రణ్దీప్ హుడా వివరిస్తూ..' పెళ్లిలో నాతో పాటు ఒక సహాయకుడు ఉన్నాడు. ఒక ట్యూటర్ లాగా. నేను నా వస్తువులను తలపై పెట్టుకున్న తర్వాత ఇక తలను వంచడం సాధ్యం కాదు. అప్పుడే నాకు ఒక గిన్నె, గొడుగు ఇచ్చారు. అప్పుడు మనల్ని ఓ ప్రదేశంలో ఉంచుతారు. అక్కడికి అందరూ వచ్చి మనల్ని చూడాలి. ఆ సమయంలో మనం చాలా గౌరవంగా కనిపించాలి. అయితే నేను గిన్నె దేనికోసం అని వారిని అడిగాను. మీరు మూత్ర విసర్జన చేయవలసి వస్తే.. మీకిచ్చిన ఆ గొడుగు తెరిచి అక్కనే మూత్ర విసర్జన చేయండి. ఎందుకంటే ఇప్పుడు మీరు దేవుడు కాబట్టి అక్కడి నుంచి కదల్లేరన్నాడు. వాళ్ల సంస్కృతి చాలా కఠినమైనది. అలాగే చాలా సిస్టమాటిక్ కూడా " అని తనకెదురైన విచిత్ర అనుభవాన్ని వివరించారు.తన పెళ్లి గురించి మాట్లాడుతూ. 'నా పెళ్లి సమయంలో మణిపూర్లో ఒక పెద్ద సమస్య తలెత్తింది. కానీ మేమిద్దరం వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. అంతేకాకుండా ఒక అమ్మాయి ఇంట్లో వివాహం చేసుకోకపోతే అది కూడా వివాహమేనా అని అక్కడే వివాహం చేసుకుంటానని తాను దృఢంగా చెప్పాను. ఈ పెళ్లి విషయంలో తనకు అస్సాం రైఫిల్స్లో బ్రిగేడియర్గా ఉన్న తన స్నేహితుడు సాయం చేశాడు. మీరు రండి పెళ్లి నేను జరిపిస్తాను అన్నాడు. దీంతో మేము దాదాపు 10 నుంచి 12 మంది అక్కడికి చేరుకున్నాం.' అని తెలిపారు. అయితే మేము లిన్ లైస్రామ్ ఇంటికి చేరుకున్నప్పుడు మంచి శాఖాహారం తిన్నారని.. వివాహం చేసుకునే ముందు వారి దేవుళ్లందరినీ పూజించారని గుర్తు చేసుకున్నాడు. అలాగే నా స్నేహితులు కూడా వివాహానికి తీసుకొచ్చావా? పవిత్ర తీర్థయాత్రకు తీసుకువచ్చావా? అంటూ తనతో జోక్ చేశారని రణ్దీప్ హుడా వెల్లడించారు. -
ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ సినిమాలివే!
ఇండియన్ సినిమా పేరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోతోంది. హాలీవుడ్ రేంజ్లో సినిమాలు తెరకెక్కించే స్థాయికి ఇప్పుడిప్పుడే చేరుకుంటున్నారు. త్వరలోనే మన సినిమాలు హాలీవుడ్ స్థాయిని అందుకునే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. రాజమౌళి ఆర్ఆర్ఆర్ మూవీ (RRR Movie) ఆస్కార్ అవార్డ్ దక్కించుకున్న తర్వాత భారతీయ చలనచిత్ర పరిశ్రమ పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోయింది. ప్రపంచవ్యాప్తంగా మన ఇండియన్ సినిమాలు భారీ వసూళ్లతో సరికొత్త రికార్డులు సృష్టించాయి. అలాగే దేశవ్యాప్తంగా సైతం అత్యధిక వసూళ్లతో రికార్డ్ సృష్టించిన టాప్-10 చిత్రాలేవో చూసేయండి.ప్రపంచవ్యాప్తంగా అమిర్ ఖాన్ దంగల్ అత్యధిక వసూళ్లతో మొదటిస్థానంలో నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 2,000 కోట్ల మార్కును దాటిన మొదటి భారతీయ చిత్రంగా నిలిచింది. ఈ రికార్డును ఇప్పటి వరకు ఏ సినిమా దాటలేకపోయింది. తర్వాత సెకండ్ ప్లేస్లో ఎస్ఎస్ రాజమౌళి బాహుబలి-2 నిలవగా.. మూడోస్థానంలో అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప-2 నిలిచింది. ఆ తర్వాత స్థానాల్లో వరుసగా ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్-2, జవాన్, పఠాన్, కల్కి, భజరంగీ భాయిజాన్, యానిమల్ ఉన్నాయి. బాలీవుడ్తో సమానంగా సౌత్ ఇండియా చిత్రాలు సత్తా చాటాయి.ప్రపంచవ్యాప్తంగా దంగల్ ఎక్కువ వసూళ్లు సాధించినప్పటికీ భారత్లో ఎక్కువ కలెక్షన్స్ రాబట్టింది మాత్రం బాహుబలి 2 మూవీయే! 2017లో బాహుబలి 2: ది కన్క్లూజన్ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ. 1400 కోట్లు దాటిన తొలి భారతీయ చిత్రంగా చరిత్ర సృష్టించింది. ఈ మూవీ కేవలం 21 రోజుల్లోనే ఈ ఘనత సాధించింది. గతేడాది డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకొచ్చిన అల్లు అర్జున్ 'పుష్ప 2: ది రూల్'.. బాహుబలి 2 రికార్డుకు దగ్గరగా వచ్చి ఆగిపోయింది.బాహుబలి-2 కంటే కేవలం రూ. 46 కోట్ల తక్కువ వసూళ్లు సాధించింది. అయితే రూ. 1,000 కోట్ల క్లబ్లోకి అత్యంత వేగంగా చేరిన భారతీయ చిత్రంగా తిరుగులేని రికార్డ్ సృష్టించింది. కేజీఎఫ్-2 మూవీతోనే కన్నడ సినిమా పేరు మార్మోగిపోయింది. ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్లో చిత్రాలు తెరకెక్కించే స్థాయికి ఎదిగిపోయింది.ప్రపంచ బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు చేసిన టాప్-10 ఇండియన్ సినిమాలు -
చీప్గా చూశారు, దెబ్బకు తిరిగి వెళ్లిపోతాననుకున్నారు: నటి
సినీ నటిగా, యాంకర్గా మందిరా బేడీ (Mandira Bedi) అందరికీ సుపరిచితురాలు. క్రికెట్ ఈవెంట్స్కు కూడా ఈమె వ్యాఖ్యాతగా వ్యవహరించింది. అయితే ఆ సమయంలో ఎవరూ తనను లెక్క చేయలేదని, చులకనగా చూశారంటోంది నటి. జూమ్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మందిరా బేడీ మాట్లాడుతూ.. ఏదైనా డిఫరెంట్గా చేసేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు అందరూ మనల్నే పరిశీలిస్తుంటారు. ఏదో ఒకటి అనేందుకు సిద్ధంగా ఉంటారు. అది వారి అభిప్రాయం అనుకోండి.మొదటివారమే డిజాస్టర్కొందరు మనల్ని ఇష్టపడతారు. మరికొందరేమో ద్వేషిస్తారు. అయితే నాకు టీమ్ నుంచి మంచి ఎంకరేజ్మెంట్ ఉండేది. అలా మొదటిసారి ఒక టోర్నమెంట్లో హోస్టింగ్ చేశాను. కానీ మొదటివారమే డిజాస్టర్ అయింది. మా టీమ్ నన్ను పిలిచి నీమీద ఎలాంటి ఒత్తిడి తీసుకురాము. నువ్వేం భయపడకు. వెయ్యిమంది అమ్మాయిల్ని ఆడిషన్ చేశాకే నిన్ను తీసుకున్నాం. నీలో ఆ సత్తా ఉంది అని ప్రోత్సహించారు.మైండ్సెట్ మార్చా..ఆ మాటలు నాకు కొండంత ధైర్యాన్నిచ్చాయి. ఇంత మంచి అవకాశం ఎవరికి దక్కుతుంది? భయపడి వెనకడుగు వేయడం దేనికి? అని ఆలోచించాను. ఉత్సాహంగా ముందుకు సాగాను. నెమ్మదిగా ప్యానెల్లో, ప్రేక్షకుల్లో నాపై ఉన్న అభిప్రాయాలు మారాయి. చాలామంది మైండ్సెట్ను నేను మార్చగలిగాను. నిజానికి ప్యానెల్లో ఉన్న వారికి నేనుండటమే ఇష్టం లేదు. నాకు కాస్తైనా మర్యాద ఇచ్చేవారు కాదు. చీప్గా చూసేవారు, పక్కన పడేసేవారు. డమ్మీ అని తిట్టారుమొదట్లో బాధపడ్డాను. కానీ నేనెందుకు తలదించుకోవాలనుకున్నాను. వాళ్లు వినిపించుకోకపోయినా ఒకటికి రెండుసార్లు ప్రశ్నలు అడిగేదాన్ని. కెమెరాలున్నాయి కాబట్టి వాళ్లు చచ్చినట్లు సమాధానం చెప్పేవాళ్లు. ఈమె తిరిగి వెళ్లిపోయేలా లేదని వాళ్లకర్థమైంది. చివరకు నన్ను ప్యానెల్లో మెంబర్గా స్వీకరించారు. సోషల్ మీడియాలో కూడా నేనో తెలివితక్కువదాన్ని, డమ్మీ అని తిట్టేవారు. నేనేదీ లెక్కచేయలేదు.యాంకర్గా, నటిగా..ఇక సౌతాఫ్రికా టోర్నమెంట్ నుంచి తిరిగి రాగానే నా ఇంటర్వ్యూల కోసం ఎగబడ్డారు. జనాలు నా గురించి తెలుసుకోవాలని ఆరాటపడ్డారు. అలా రోజుకు నాలుగైదు ఇంటర్వ్యూలు ఇచ్చాను అని చెప్పుకొచ్చింది. పలు హిందీ సీరియల్స్లో యాక్ట్ చేసిన మందిరా.. ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ (2003, 2007), ఛాంపియన్స్ ట్రోఫీ (2004, 2006)లకు హోస్టింగ్ చేసింది. మన్మథుడు, సాహో వంటి చిత్రాల్లోనూ యాక్ట్ చేసింది. చివరగా ఐడెంటిటీ అనే మలయాళ చిత్రంలో నటించింది.చదవండి: నా కూతురి జోలికొస్తే కారుతో తొక్కేస్తా.. కాజోల్ వార్నింగ్ -
నా కూతురి జోలికొస్తే కారుతో తొక్కేస్తా.. కాజోల్ వార్నింగ్
నా జోలికొస్తే ఊరుకుంటానేమో కానీ నా కూతురి జోలికొస్తే మాత్రం అంతు చూస్తానంటోంది హీరోయిన్ కాజోల్ (Kajol). ప్రస్తుతం ఆమె మా సినిమా ప్రమోషన్స్లో బిజీగా ఉంది. ఈ మూవీ జూన్ 27న విడుదల కానుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కాజోల్.. తన కూతురిని ట్రోల్ చేసేవారికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా.. నా కూతుర్ని విమర్శించేవాళ్లెవరూ నా కారు ముందుకు రావొద్దు. నా కారు ముందుకొచ్చారంటే..ఒకవేళ వచ్చారే అనుకోండి.. నా కారుతో మిమ్మల్ని ఢీ కొట్టి మీ శరీరాలపై నుంచే నా కారును పోనిస్తాను. సోషల్ మీడియాలో వెయ్యి మెసేజ్లు వస్తే అందులో 999 తను అందంగా ఉంది, మీరు అమేజింగ్.. ఇటువంటి కామెంట్లే ఉంటాయి. కానీ ఏదో ఒక్కటి మాత్రం బ్యాడ్ కామెంట్ ఉంటుంది. అలా చెత్త వాగుడు వాగేవారు ఎందుకున్నారో అర్థం కాదు. అయినా నేను మంచి గురించే ఎక్కువగా పట్టించుకుంటాను. చెడు గురించి కాదు అని చెప్పుకొచ్చింది.హారర్ సినిమాహారర్ సినిమాలను మ్యూట్లో పెట్టుకునే చూసే కాజోల్.. తొలిసారి ఈ జానర్లో నటిస్తోంది. విశాల్ ఫ్యురియా దర్శకత్వం వహిస్తున్న మా చిత్రంలో రోనిత్ రాయ్, ఇంద్రనీల్ సేన్గుప్తా, కెరిన్ శర్మ, నితిన్, సూర్జ్యశిఖ దాస్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాజోల్ చివరగా క్రూ సినిమాలో నటించింది. కాజోల్, బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్గణ్.. 1999లో పెళ్లి చేసుకున్నారు. 2003లో వీరికి కూతురు నైసా జన్మించింది. 2010లో కుమారుడు యుగ్ పుట్టాడు.చదవండి: ఎయిరిండియాకు నటుడి సపోర్ట్.. ఫ్రీ టికెట్ ఇచ్చారా? -
విషాదంగా ముగిసిన దర్శకుడి మిస్సింగ్ మిస్టరీ!
మ్యూజిక్ ఆల్బమ్స్ డైరెక్టర్, గుజరాతీ సినీ దర్శకుడు మహేష్ జీరావాలా(Mahesh Jirawala ) మిస్సింగ్ మిస్టరీ విషాదంగా ముగిసింది. ఆహ్మదాబాద్బాద్లో జరిగిన విమాన ప్రమాదంలో ఆయన మృతి చెందినట్లు అధికారికంగా ప్రకటించారు. అతని మృతదేహాన్ని డీఎన్ఏ పరీక్ష ద్వారా గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. ప్రమాద స్థలంలో దొరికిన యాక్టివా స్కూటర్, ఫోన్ కూడా అతన్ని గుర్తింపుని నిర్ధారించడంలో ఉపయోగపడ్డాయి.అసలేం జరిగింది?అహ్మదాబాద్ ఎయిర్ పోర్ట్లో జూన్ 12న లండన్ బయల్దేరిన ఎయిరిండియా విమానం ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. టేకాప్ అయిన కాసేపటికే ఆ విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 270 మందికి పైగా మృతి చెందారు. డీఎన్ఏ ద్వారా మృతదేహాలను గుర్తించారు. అయితే ఈ ప్రమాదం జరిగిన రోజు నుంచి దర్శకుడు మహేశ్ జీరావాలా కనిపించకుండా పోయారు. ఆ రోజు ఎయిర్ పోర్ట్ సమీపంలో ఒకరిని కలిసేందుకు వెళ్లాడని అతని భార్య హేతల్ తెలిపారు. ప్రమాదం జరిగిన ప్రదేశానికి సమీపంలో అతని ఫోన్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే అతని మృతదేహం మాత్రం లభించలేదు. దీంతో ఇన్నాళ్ల పాటు అతని మిస్సింగ్ మిస్టరీ వీడలేదు.డీఎన్ఏ ద్వారా గుర్తింపు..విమాన ప్రమాదంలోనే మహేశ్ జీరావాలా మృతి చెంది ఉంటారాని తొలుత పోలీసులు భావించారు. అక్కడ లభించిన మొబైల్, యాక్టివా బండి ద్వారా ఈ విషయాన్ని నిర్ధారించి, మృతదేహాన్ని అప్పగించే ప్రయత్నం చేశారు. కానీ మహేశ్ కుటుంబ సభ్యులు మాత్రం అందుకు అంగీకరించలేదు. ఆయన ఎయిర్పోర్ట్కు రాకపోవచ్చని, ఆ మృతదేహం అతనిది కాదని వాదించారు. దీంతో కుటుంబ సభ్యుల నుంచి డీఎన్ఏ సేకరించి, మృతదేహం డీఎన్ఏతో పోల్చి చూశారు. డీఎన్ఏ రిపోర్ట్.. ఆ మృతదేహం మహేశ్దే అని నిర్ధారించడంతో మిస్సింగ్ మిస్టరీ విషాదంగా ముగిసింది.మహేష్ జీరావాలా విషయానికొస్తే.. గుజరాత్లోని నరోదాకు చెందిన ఈయన అసలు పేరు మహేష్ కలవాడియా. మ్యూజిక్ ఆల్బమ్స్కు దర్శకత్వం వహించిన ఆయన ప్రేక్షకుల్లో మంచి గుర్తింపుని సొంతం చేసుకున్నారు. నిర్మాతగాను వ్యవహరించాడు. 2019లో ఆయన కాక్టెయిల్ ప్రేమి పాగ్ ఆఫ్ రివెంజ్ అనే గుజరాతీ సినిమాకు దర్శకత్వం వహించారు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
ఎయిరిండియాకు నటుడి సపోర్ట్.. ఫ్రీ టికెట్ ఇచ్చారా?
బాలీవుడ్ నటుడు, కమెడియన్ విర్ దాస్ (Vir Das) చిక్కుల్లో పడ్డాడు. ఎయిరిండియాకు సపోర్ట్ చేస్తూ ట్వీట్ చేయడంతో అతడిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల అహ్మదాబాద్లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదంలో ప్రయాణికులు, సిబ్బంది సహా 241 మంది మరణించారు. అంతమంది చావుకు కారణమైన ఎయిరిండియాను పొగుడుతూ తాజాగా అతడు ఓ ట్వీట్ వేశాడు.పీఆర్ స్టంట్?నేను లండన్ నుంచి ఇంటికి ఎయిరిండియా (Air India) విమానంలోనే వచ్చాను. నాకెంతో గొప్పగా అనిపించింది. సిబ్బంది సాదరంగా ఆహ్వానించారు. వారిది ఎంతో మంచి మనసు అని రాసుకొచ్చాడు. ఇది చూసిన నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. నీకు ఫ్రీ టికెట్ ఇచ్చారా?, ఈ చెత్త పీఆర్ స్టంట్ చేసేవారికి నేను చెప్పేది ఒక్కటే.. ఇలాంటి సమయంలో ఈ ట్వీట్లు వేయడం బాధాకరం. మీ స్థాయిని మీరే తగ్గించేసుకుంటున్నారు అని పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.మా తాత..దాంతో విర్ దాస్.. తనది పీఆర్ స్టంట్ కాదని వివరణ ఇచ్చాడు. ఎయిరిండియాకు నేనెందుకు సపోర్ట్ చేస్తున్నానో మీకు చెప్తాను.. మా తాత ఎయిరిండియాలోనే పని చేసేవాడు. ఆ సంస్థ విమానాల్లోనే నేను నలుమూలలా ప్రయాణించాను. ఆ విమానాల్లో నేను కూర్చోని సీటు అంటూ లేదు. అయితే, ఈ ఎయిరిండియాలో కొన్ని సమస్యలున్నాయి. కానీ, ఏ సిబ్బంది కూడా మిమ్మల్ని చులకనగా చూడరు. నవ్వుతూ ఆహ్వానిస్తారు. వారిని కూడా ఈ విమాన ప్రమాదంలో మనం కోల్పోయాం. ఈ నష్టాన్నెందుకు ఎవరూ గుర్తించడం లేదు. నేను మాత్రం వారికి మద్దతిస్తున్నాను అని క్లారిటీ ఇచ్చాడు. అనంతరం ఈ ట్వీట్ను డిలీట్ చేశాడు.అప్పుడు కూడా ఇంతే!జూన్ 12న అహ్మదాబాద్ విమాన ప్రమాదం జరిగినప్పుడు కూడా విర్ దాస్ ఎయిరిండియాకు సపోర్ట్ ఇచ్చాడు. ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపిన రోజు ఇది! వారి కుటుంబాలకు ఇదే నా ప్రగాఢ సానుభూతి. విమాన సిబ్బందికి కూడా నా సపోర్ట్ తెలియజేస్తున్నాను. నా జీవితం మొత్తం ఎయిరిండియాలోనే తిరిగాను. ఇక్కడ సమస్యలు లేవని కాదు, కానీ, ఎప్పుడూ ఫెయిల్ కాలేదు. కానీ, ఎయిరిండియాలో పనిచేసే సిబ్బంది బెస్ట్ క్రూ అని మాత్రం బాగా తెలుసు. అసలు ఈ విషాదం ఎలా జరిగిందనేది సమయమే నిర్ధారిస్తుంది. పని చేస్తున్న ప్రదేశంలోనే ప్రాణాలు కోల్పోవడం ఎంత బాధాకరమో ఊహకు అందకుండా ఉంది అని ట్వీట్ చేశాడు. I flew Air India home from London. It was all great. The crew, happy to report, still the kindest in the sky. @airindia— Vir Das (@thevirdas) June 20, 2025 చదవండి: కుబేర' కలెక్షన్.. తొలిరోజు అన్ని కోట్లు వచ్చాయా? -
ఆమిర్ కొత్త సినిమా.. Day 1 కలెక్షన్స్ ఎంత?
రీసెంట్ టైంలో బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ పరిస్థితి అస్సలు బాగోలేదు. ఎందుకంటే అప్పుడెప్పుడో 2018లో 'థగ్స్ ఆఫ్ హిందూస్థాన్'తో వస్తే దారుణమైన డిజాస్టర్. 2022లో 'లాల్ సింగ్ చద్దా'తో వస్తే అదే సీన్ రిపీట్. దీంతో విపరీతమైన ట్రోలింగ్. కట్ చేస్తే యాక్టింగ్ కొన్నాళ్ల పాటు చేయనని చెప్పిన ఆమిర్.. దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత 'సితారే జమీన్ పర్' మూవీతో థియేటర్లలోకి వచ్చాడు. పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రానికి తొలిరోజు ఎంత కలెక్షన్ వచ్చాయంటే?స్పానిష్ మూవీ 'ఛాంపియన్స్'కి రీమేక్గా 'సితారే జమీన్ పర్' సినిమా తీశారు. రిలీజ్కి ముందే ఆమిర్ ఖాన్ ప్రమోషన్లలో కాస్త హడావుడి చేశాడు గానీ బుకింగ్స్ ఏ మాత్రం ఆశాజనకంగా లేవు. దీంతో తొలిరోజు దేశవ్యాప్తంగా రూ.11.5 కోట్ల మాత్రమే వసూళ్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది రిలీజైన హిందీ చిత్రాల్లో తొలిరోజు అత్యధిక కలెక్షన్ వచ్చిన 6వ చిత్రంగా నిలిచింది. అయితే ఆమిర్ స్టార్డమ్కి ఈ కలెక్షన్ చాలా తక్కువనే చెప్పొచ్చు.(ఇదీ చదవండి: 'కుబేర' కలెక్షన్.. తొలిరోజు అన్ని కోట్లు వచ్చాయా?)ఎందుకంటే ప్రాంతీయ భాషల్లో తీస్తున్న సినిమాలే తొలిరోజు రూ.10-20 కోట్లు వసూళ్లు సాధిస్తున్నాయి. అలాంటిది ఆమిర్ ఖాన్ సినిమాకు తొలిరోజు దాదాపు రూ.11 కోట్లు మేర వసూళ్లు రావడం అంటే ఆలోచించాల్సిన విషయం. అయితే మూవీకి పాజిటివ్ టాక్ వచ్చింది కాబట్టి వీకెండ్స్లో ఈ నంబర్స్ పెరగొచ్చేమో చూడాలి? ఈ సినిమాని ఏ ఓటీటీకి అమ్మని ఆమిర్.. 8 వారాల తర్వాత యూట్యూబ్లో పే పర్ వ్యూ పద్ధతిలో రిలీజ్ చేస్తానని క్లారిటీ ఇచ్చాడు.'సితారే జమీన్ పర్' విషయానికొస్తే.. ఢిల్లీ బాస్కెట్ బాల్ టీమ్కి అసిస్టెంట్ కోచ్గా గుల్షన్ అరోరా(ఆమిర్ ఖాన్) పనిచేస్తుంటాడు. హెచ్ కోచ్తో గొడవ జరిగి అతడిని కొడతాడు. ఆ కోపంలో తాగి బండి నడిపి పోలీస్ వాహనాన్ని గుద్దేస్తాడు. దీంతో కోర్ట్.. శిక్ష విధించకుండా మానసిక దివ్యాంగులకు మూడు నెలల పాటు బాస్కెట్ బాల్ కోచింగ్ ఇవ్వాలని ఆదేశిస్తుంది. అలా 10 మంది దివ్యాంగులకు కోచ్గా మారతాడు. వాళ్లకు ట్రైనింగ్ ఇచ్చే విషయంలో గుల్షన్ ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నాడు? నేషనల్ బాస్కెట్ బాల్ ఛాంపియన్షిప్లో 'సితారే' టీమ్ గెలిచిందా అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 24 సినిమాలు) -
హీరోయిన్ అంటే గ్లామర్ అనుకుంటివా..ఫైర్.. ‘తగ్గేదే లే’
ఒకరు తుపాకీ పట్టుకున్నారు.... మరొకరు ఖడ్గం అందుకున్నారు... ఇంకొకరు చేతికి దొరికిన ఆయుధం తీసుకున్నారు... చూడ్డానికి సున్నితంగా కనిపించే ఈ భామలందరూ ఇలా ‘వెపన్స్’ పట్టుకున్నది విలన్లను రఫ్ఫాడించడానికే. ప్రస్తుతం బాలీవుడ్ పాపులర్ హీరోయిన్లు కొందరు ‘యిన్ యాక్షన్’ అంటూ యాక్షన్ రోల్స్ చేస్తున్నారు. సిల్వర్ స్క్రీన్పై మెరుపు తీగల్లా కనిపించే ఈ తారలు మెరుపు వేగంతో ఫైట్స్ చేయడానికి ‘సై’ అన్నారు. ఆ పోరాటాల్లోకి వెళదాం. శివానీ రిటర్న్స్ శివానీ శివాజీ రాయ్ని తొలిసారి ప్రేక్షకులు ‘మర్దానీ’ (2014) చిత్రంలో చూశారు. ఈ పవర్ఫుల్ పోలీసాఫీసర్ పాత్రను రాణీ ముఖర్జీ అద్భుతంగా చేశారు. ఆ సినిమాకి సీక్వెల్గా వచ్చిన ‘మర్దానీ 2’ (2019)లోనూ పోలీస్గా విజృంభించారు రాణి. ఈ చిత్రం కూడా ఘనవిజయం సాధించింది. మరోసారి శివానీ శివాజీ రాయ్గా ‘మర్దానీ 3’లో కనిపించనున్నారు రాణీ ముఖర్జీ. ప్రదీప్ సర్కార్ దర్శకత్వంలో తొలి భాగం ‘మర్దానీ’ని, రెండో భాగాన్ని గోపీ పుదిరన్ దర్శకత్వంలో నిర్మించిన యశ్ రాజ్ ఫిల్మ్స్ మూడో భాగం ‘మర్దానీ 3’ని అభిరాజ్ మినావాలా దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. తొలి, మలి భాగాల్లో సిన్సియర్ పోలీస్ ఆఫీసర్గా చేసిన రాణీ ముఖర్జీ ‘మర్దానీ 3’లోనూ ఆ పాత్ర చేస్తున్నారు. కాగా ఈ చిత్రం టీజర్, ట్రైలర్స్లో రాణి చేసిన యాక్షన్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. పదేళ్ల క్రితం ఫస్ట్ పార్ట్లో ఎంత ఎనర్జిటిక్గా కనిపించిందో ఇప్పుడూ అలానే కనిపిస్తోందనే కితాబులు ఆమెకు దక్కాయి. ఇక సినిమాలో ఏ రేంజ్లో విజృంభించారో చూడాలంటే వచ్చే ఏడాది ఫిబ్రవరి 27 వరకూ ఆగాల్సిందే. ‘‘చెడుపై పోరాటం చేసే శివానీ శివాజీ రాయ్ని తెరపైకి తీసుకురావడానికి హోలీ కన్నా మంచి సమయం ఏం ఉంటుంది. 2026 మార్చి 4న హోలీ. ఓ వారం ముందే ఫిబ్రవరి 27న మా శివానీ థియేటర్స్కి వస్తుంది’’ అని యశ్ రాజ్ సంస్థ ఓ సందర్భంలో పేర్కొంది. వారియర్ క్వీన్ సిల్వర్ స్క్రీన్పై మెరుపు తీగలా కనిపించే దీపికా పదుకోన్ మెరుపు వేగంగా ఫైట్ చేయడం కూడా చూశాం. అందుకు ఉదాహరణగా ఈ మధ్య వచ్చిన చిత్రాలు ‘పఠాన్, ఫైటర్, సింగమ్ ఎగైన్’లను చెప్పుకోవచ్చు. ఇప్పుడు సౌత్ సినిమాలో తన యాక్షన్ని చూపించడానికి రెడీ అయ్యారు దీపికా పదుకోన్. అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న ΄పాన్ ఇండియన్ మూవీ ‘ఎఎ22 ఎ6’ (వర్కింగ్ టైటిల్)లో దీపికా పదుకోన్ కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ఆమె వారియర్ క్వీన్గా కనిపించనున్నారు. ఈ పోరాట యోధురాలికి సంబంధించిన లుక్ని ఇటీవల విడుదల చేయగా, దీపిక ఆ లుక్లో పవర్ఫుల్గా కనిపించారు. అట్లీ దర్శకత్వంలో రూపొందిన ‘జవాన్’లో దీపికా పదుకోన్ కీలక పాత్రలో కనిపించారు. ఇప్పుడు ‘ఎఎ22 ఎ6’లో పూర్తి స్థాయి కథానాయికగా వారియర్ క్వీన్గా నటిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతోందని సమాచారం. షాపింగ్ మాల్లో ఫైట్ ఎన్టీఆర్–హృతిక్ రోషన్ కాంబినేషన్లో రూపొందిన ‘వార్ 2’పై భారీ అంచనాలు ఉన్న విషయం తెలిసిందే. ఈ మాస్ హీరోలిద్దరూ సిల్వర్ స్క్రీన్పై ΄పోటా పోటీగా చేసిన వార్ని చూడ్డానికి ఇద్దరి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్లో భాగంగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. కాగా... ఈ చిత్రంలో మరో లీడ్ రోల్లో నటించిన కియారా అద్వానీ కూడా ఫైట్ చేశారట. నిజానికి ‘వార్ 2’ టీజర్లో కియారా ఎల్లో కలర్ బికినీలో గ్లామరస్గా కనిపించి, హాట్ టాపిక్ అయ్యారు. అయితే ఇంత హాట్గా కనిపిస్తూనే మరోవైపు ఇదే సినిమాలో ఓ షాపింగ్ మాల్లో డైనమిక్ ఫైట్లోనూ కుర్ర కారు గుండె లబ్ డబ్ పెంచనున్నారు. ఈ ఒక్క ఫైట్ మాత్రమే కాదు... మరికొన్ని ఫైట్ సీన్స్ కూడా చేశారట. ‘ఎట్రాక్షన్ మాత్రమే కాదు యాక్షన్’ కూడా అన్నమాట. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ఆగస్టు 14న ఈ చిత్రం విడుదల కానుంది. లేడీ డాన్ కృతీ సనన్ వెండితెరపై తొలిసారి ఓ రేంజ్లో ఫైట్స్లో విజృంభించిన చిత్రం ‘గణపత్’ (2023). ఈ చిత్రంలో చేసిన జస్సీ సింగ్ పాత్ర కోసం ఆమె ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకున్నారు. మార్షల్ ఆర్ట్స్లో ఓ కళ అయిన ‘నన్చాకు’ని నేర్చుకున్నారు. ఇప్పుడు రెండేళ్లకు మరోసారి ఫైట్స్లో స్పెషల్గా ట్రైనప్ అవుతారట. కృతీ సనన్కి వచ్చిన ఆఫర్లాంటిది మరి. ఈ బ్యూటీ లేడీ డాన్గా కనిపించనున్నారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ఈ క్యారెక్టర్ కోసమే శిక్షణ తీసుకోనున్నారట. ఫర్హాన్ అక్తర్ దర్శకత్వంలో షారుక్ ఖాన్ టైటిల్ రోల్లో వచ్చిన ‘డాన్, డాన్ 2’ చిత్రాలకు ఉన్న క్రేజ్ తెలిసిందే. అయితే ఈ సిరీస్లో భాగంగా రూపొందనున్న ‘డాన్ 3’లో ఈసారి రణ్వీర్ సింగ్ డాన్గా కనిపించనున్నారు. లేడీ డాన్గా కియారా అద్వానీని ఖరారు చేశారు. కానీ ఆ తర్వాత కియారా ప్రెగ్నెన్సీ కన్ఫార్మ్ కావడంతో ఆమె ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. అప్పట్నుంచి ఈ పాత్రకు పలువురు కథానాయికల పేర్లు వినిపించాయి. ఆ పేర్లలో కృతీ సనన్ పేరు కూడా ఉంది. ఫైనల్లీ కృతీ సనన్నే ఫిక్స్ చేశారట చిత్ర దర్శక–నిర్మాత ఫర్హాన్ అక్తర్. ఈ ఏడాదే ఈ చిత్రం షూటింగ్ ఆరంభం కానుంది. మహిళా గూఢచారుల కథ ఇద్దరు మహిళా గూఢచారులు బరిలోకి దిగారు. ఈ ఇద్దరూ ప్రమాదకరమైన మిషన్లు ఎదుర్కొంటారు. తగ్గేదే లే అంటూ సాహసాలు చేస్తారు. ఈ ఇద్దరూ చేసిన సాహసాలేంటి? అనేది ‘ఆల్ఫా’ చిత్రంలో చూడాల్సిందే. ఆలియా భట్, శార్వరీ ఏజెంట్స్గా నటిస్తున్న చిత్రం ఇది. శివ్ రావైల్ దర్శకత్వం వహిస్తున్నారు. వైఆర్ఆఫ్ (యశ్ రాజ్ ఫిల్మ్స్) యూనివర్స్లో భాగంగా రూపొందుతున్న చిత్రం ‘ఆల్ఫా’. ఈ యూనివర్స్లో భాగంగా వచ్చిన గూఢచారుల చిత్రాల్లో హీరోలు లీడ్ రోల్స్ చేశారు. అయితే ఈ స్పై యూనివర్స్లో మహిళా గూఢచారులే ప్రధాన పాత్రలుగా వైఆర్ఆఫ్ నిర్మిస్తున్న తొలి చిత్రం కావడంతో ‘ఆల్ఫా’పై భారీ అంచనాలు ఉన్నాయి. పైగా ఆలియా, శార్వరీ రిస్కీ స్టంట్స్ చేశారట. ఈ సినిమా షూటింగ్ ఆరంభించే ముందు ఇద్దరు నాయికలకు ఫైట్స్లో ప్రత్యేక శిక్షణ ఇప్పించారు. ఈ చిత్రంలో అనిల్ కపూర్, బాబీ డియోల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. బాబీ, ఆలియా పాల్గొనగా హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ల నేతృత్వంలో భారీ పోరాట సన్నివేశం చిత్రీకరించారని, ఇంకా బోలెడన్ని రిస్కీ ఫైట్స్ ఉన్నాయని బాలీవుడ్ టాక్. ఇదిలా ఉంటే... ఈ చిత్రంలో ఆలియా భట్ గురువు ΄ాత్రలో స్టార్ హీరో హృతిక్ రోషన్ కనిపించనున్నారట. ఆదిత్యా చో్ర΄ా నిర్మిస్తున్న ఈ చిత్రం హిందీ, తెలుగు, తమిళ భాషల్లో డిసెంబరు 25న విడుదల కానుంది. పగ తీర్చుకోవడానికి... సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందిన ‘యానిమల్’ చిత్రంలో బోల్డ్ క్యారెక్టర్లో ఎలాంటి హద్దులు పెట్టుకోకుండా నటించారు త్రిప్తీ దిమ్రి. తనలో మంచి గ్లామరస్ నటి ఉందనే విషయాన్ని నిరూపించుకున్నారామె. మళ్లీ సందీప్ రెడ్డి దర్శకత్వంలో ‘స్పిరిట్’ చిత్రంలో హీరోయిన్గా నటిస్తున్నారీ బ్యూటీ. అయితే ఈ చిత్రంలో త్రిప్తి పాత్ర ఏంటనే వివరాలు బయటకు రాలేదు. కాగా తనలో మంచి యాక్షన్ హీరోయిన్ ఉన్న విషయాన్ని నిరూపించుకోవడానికి రెడీ అయిపోయారు ఈ హీరోయిన్. ఓ హిందీ చిత్రంలో త్రిప్తి యాక్షన్ రోల్ చేస్తున్నారు. విశాల్ భరద్వాజ్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. షాహిద్ కపూర్ హీరోగా నటిస్తున్నారు. ‘కమీనే, హైదర్, రంగూన్’ వంటి విశ్లేషకుల ప్రశంసలూ దక్కించుకున్న చిత్రాల తర్వాత మళ్లీ షాహిద్ కపూర్–విశాల్ భరద్వాజ్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం ఇది. ఈ ఫుల్ ΄్యాక్డ్ యాక్షన్ మూవీలో త్రిప్తీ దిమ్రి పగ తీర్చుకునే ΄ాత్రలో కనిపిస్తారట. ఎవరిపై పగ? ఏంటా కథ అనేది తెలియాల్సి ఉంది. రివెంజ్ తీర్చుకునే క్రమంలో ΄ోరాటాలు చేస్తారట. ఈ ΄ాత్ర కోసం త్రిప్తి ప్రత్యేకంగా ప్రిపేర్ అయ్యారని సమాచారం. ఇక ఈ చిత్రంలో గ్యాంగ్స్టర్గా కనిపించనున్నారట షాహిద్ కపూర్. ఈ ΄ాత్ర రిస్కీ ఫైట్స్ చేస్తుందని టాక్. ఈ నేపథ్యంలో ఫైట్స్ కోసం షాహిద్, త్రిప్తి ఒకేసారి శిక్షణ తీసుకున్నారని బాలీవుడ్ ఖబర్. ఈ ఏడాది డిసెంబరు 5న ఈ చిత్రం రిలీజ్ కానుంది. యాక్షన్తో ఇంట్రడక్షన్ సిల్వర్ స్క్రీన్పై ఫస్ట్ టైమ్ కనిపించడం కనిపించడమే ఓ యాక్షన్ రోల్లో కనిపించనున్నారు షారుక్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్. తండ్రి కాంబినేషన్లో ఆమె నటిస్తున్న తాజా చిత్రం ‘కింగ్’. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో షారుక్ ఖాన్ డాన్ క్యారెక్టర్ చేస్తున్నారు. ఈ చిత్రం ప్రధానాంశం గురు–శిష్యుల నేపథ్యంలో ఉంటుందని సమాచారం. తండ్రీ కూతురు షారుక్–సుహానా వెండితెరపై గురు–శిష్యులుగా కనిపిస్తారట. గురువు క్యారెక్టర్ నెగటివ్ షేడ్స్తో ఉంటుందని భోగట్టా. అంటే... షారుక్ గ్రే షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తారని స్పష్టం అవుతోంది. నైపుణ్యం గల హంతుకుడిగా ఈ గురువు తన శిష్యురాలికి ΄ోరాటాల్లో శిక్షణ ఇస్తాడట. ఇద్దరూ కలిసి అత్యంత ప్రమాదకరమైన మిషన్ని ఛేదిస్తారట. ఈ యాక్షన్ రోల్ కోసం సుహానా ఫైట్స్లో ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నారు. వచ్చే ఏడాది అక్టోబరు 2న ఈ చిత్రం విడుదలయ్యే అవకాశం ఉంది. మరి... యాక్షన్ రోల్తో ఇంట్రడ్యూస్ కానున్న సుహానా ఖాన్ ఎన్ని మార్కులు తెచ్చుకుంటారో చూడాలి.ఇంకా సోనాక్షీ సిన్హా, తాప్సీ తదితర తారల డైరీలో యాక్షన్ మూవీస్ ఉన్నాయి. హీరోయిన్లంటే గ్లామర్ మాత్రమే కాదు... చాన్స్ వస్తే తమలోని ఫైర్ని బయటికి తీస్తామని యాక్షన్ మూవీస్ ద్వారా నిరూపించుకుంటుంటారు. అయితే ఒకేసారి ఈ తారలందరూ యాక్షన్ రోల్స్ చేయడం మంచి పరిణామం. కథానాయికల ప్రాధాన్యత పెరుగుతోందనడానికి ఇదో నిదర్శనం. -
నెలకు ఆరున్నర లక్షలా?.. ఖరీదైన ఫ్లాట్ తీసుకున్న స్టార్ హీరో భార్య!
ఈ రోజుల్లో నెలకు లక్ష రూపాయలు అద్దెకు ఇల్లు తీసుకోవడం అంటే ఎవరైనా సరే నోరెళ్లబెట్టాల్సిందే. కానీ సినీతారల విషయానికొస్తే ఈ లెక్క మారుతుంది. వారు మినిమం లక్షకు పైగానే రెంట్ ఉంటుంది. ఇక పెద్ద పెద్ద స్టార్స్ అయితే రెండు, మూడు లక్షల పైమాటే. అయితే తాజాగా స్టార్ హీరో ఆర్ మాధవన్ భార్య సరిత ఏకంగా ఆరున్నర లక్షలకు ఓ అపార్ట్మెంట్ను లీజ్కు తీసుకుంది. ముంబయిలోని ఖరీదైన ప్రాంతమైన బాంద్రా కుర్లా కాంప్లెక్స్లో నెలకు దాదాపు రూ.6.50 లక్షలు చెల్లించేలా ఫ్లాట్ను అద్దెకు తీసుకున్నారు. ఇందుకోసం దాదాపు రూ.39 లక్షల సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించినట్లు తెలుస్తోంది. ముంబయిలో అత్యంత డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో బాంద్రా ఒకటి. ఈ ఏరియాలో పలువురు బాలీవుడ్ ప్రముఖులు నివాసమున్నారు.ఇక మాధవన్ సినిమాల విషయానికొస్తే మా అనే చిత్రంలో నటించారు. కాజోల్ లీడ్ రోల్ పోషించింది. ఈ చిత్రంలో కేవలం అతిథి పాత్రలో కనిపిస్తాడు. దీంతో పాటు ఫాతిమా సనా షేక్ జంటగా ఆప్ జైసా కోయి అనే సినిమాలో కూడా నటించారు. ఈ రొమాంటిక్ సినిమా జూలై 2025లో నెట్ఫ్లిక్స్లో విడుదల కానుంది. మాధవన్ చివరిసారిగా అక్షయ్ కుమార్, అనన్య పాండే జంటగా నటించిన చిత్రం కేసరి చాప్టర్-2లో కనిపించాడు.అంతే కాకుండా ఈ ఏడాది ప్రారంభంలో మాధవన్ ప్రధాన పాత్రలో నటించిన హిసాబ్ బరాబర్ విడుదలైంది . అశ్వని ధర్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో కీర్తి కుల్హరి, నీల్ నితిన్ ముకేశ్, రష్మీ దేశాయ్, ఫైజల్ రషీద్ కీలక పాత్రల్లో నటించారు. ఈ థ్రిల్లర్ సినిమా నేరుగా ఓటీటీలో రిలీజైంది. జనవరి 24 నుంచి జీ5లో ప్రసారమవుతోంది. View this post on Instagram A post shared by Sarita Birje Madhavan (@msaru15) -
స్టార్ హీరో కుమారుడిని గుర్తు పట్టలేదా?.. ఇజ్జత్ మొత్తం పాయే!
బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ నటించిన తాజా చిత్రం సితారే జమీన్ పర్. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజైంది. ఈ సినిమాను చూసేందుకు మరో స్టార్ హీరో సల్మాన్ ఖాన్ స్పెషల్ షోకు హాజరయ్యారు. అయితే ఈ మూవీ వీక్షించేందుకు అమిర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ కూడా వచ్చాడు. థియేటర్ వద్ద అదే సమయంలో సల్మాన్ ఖాన్ దగ్గరికి వచ్చేందుకు జునైద్ ఖాన్ యత్నించాడు. అయితే అతన్ని గుర్తుపట్టని బాడీగార్డ్స్ ఒక్కసారిగా పక్కకు తోసేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. స్టార్ హీరో కుమారుడిని కూడా గుర్తు పట్టలేరా అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు గతంలో విక్కీ కౌశల్తో ఇలాంటి సంఘటన జరిగిన క్షణాన్ని గుర్తు చేసుకున్నారు. 2023 ఐఫా అవార్డుల సమయంలో విక్కీ కౌశల్.. సల్మాన్ ఖాన్ను పలకరించడానికి ప్రయత్నించాడు. ఆ సమయంలో అతని గార్డులు వెంటనే విక్కీ కౌశల్ను పక్కకు నెట్టారు.మరోవైపు అమిర్ ఖాన్- రీనా దత్తాల కుమారుడైన జునైద్ ఖాన్ 2024లో మహారాజ్ చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం ఏక్ దిన్ అనే చిత్రంలో కనిపించనున్నాడు. ఈ మూవీతో సాయి పల్లవి బాలీవుడ్ అరంగేట్రం చేయనుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ సంవత్సరం చివరి నాటికి విడుదలయ్యే ఛాన్స్ ఉంది. అయితే ఈ ఏడాది ఖుషీ కపూర్తో కలిసి నటించిన లవ్యాపా చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయింది. ఈ చిత్రం తర్వాత జునైద్ ఖాన్ను దారుణంగా ట్రోల్ చేశారు. #SalmanKhan security 🤣 #JunaidKhan pic.twitter.com/cWXbxgxVaw— $@M (@SAMTHEBESTEST_) June 20, 2025 -
'చాహల్ వల్లే నీకు కెరీర్'.. ఆర్జే మహ్వశ్ రిప్లై చూశారా?
బాలీవుడ్లో ప్రముఖ ఆర్జే మహ్వశ్ (RJ Mahvash) గత కొంతకాలంగా తెగ వైరలైంది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆమె పేరు మార్మోగిపోయింది. దానికి కారణం దుబాయ్లో జరిగిన ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్. ఆ మ్యాచ్ తర్వాత అప్పటి వరకు ఎవరికీ పెద్దగా తెలియని ఆమెపేరు ఒక్కసారిగా నెట్టింట హల్చల్ చేసింది. టీమిండియా క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్తో కలిసి స్టేడియంలో కనిపించడంతో ఆర్జే పేరు వైరలైపోయింది. ఆ తర్వాత ఐపీఎల్ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ టీమ్కు మద్దతుగా మహ్వశ్ మ్యాచుల్లో సందడి చేసింది. దీంతో వీరిద్దరు డేటింగ్లో ఉన్నారంటూ సామాజిక మాధ్యమాల్లో కోడై కూసింది. తనపై వస్తున్న రూమర్స్పై కూడా ఆమె స్పందించింది.తాజాగా ఆర్జే మహ్వశ్ సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ వైరల్గా మారింది. అందులో నెటిజన్స్ చేసిన కామెంట్స్ను ప్రస్తావించింది. వాటికి వివరణ ఇస్తూ ఓ వీడియోను పంచుకుంది. 'యూజీ భాయ్నే ఇస్కా కెరీర్ బనా దియా'(యుజ్వేంద్ర చాహల్ ఆమె కెరీర్ను నిలబెట్టాడు) అంటూ ఓ నెటిజన్ చేసిన కామెంట్స్కు తనదైన స్టైల్లో సమాధానమిచ్చింది.నేను 2019 నుంచి ఇండస్ట్రీలో ఉన్నా.. 2023లో సొంతగా నిర్మాణ సంస్థను కూడా స్థాపించానని ఆర్జే మహ్వశ్ తెలిపింది. నవాజుద్దీన్ సిద్దిఖీ హీరోగా సెక్షన్-108 మూవీని నిర్మించినట్లు పేర్కొంది. అంతేకాకుండా మరో సినిమాను నిర్మించేందుకు రెడీ అయినట్లు కూడా వెల్లడించింది. ఆ తర్వాత మీకు క్రికెట్ గురించి ఏమైనా తెలుసా? అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. మీరు పుట్టకుముందు నుంచే తాను క్రికెట్ మ్యాచ్లు చూస్తున్నానని కుల్దీప్ యాదవ్, ధోని, బ్రెట్ లీ, సురేశ్ రైనా, క్రిస్గేల్, అక్తర్, జాక్వస్ కలిస్తో దిగిన ఫోటోలను కూడా వీడియో చూపించింది. మీరు ఏదైనా మాట్లాడేముందు తన గురించి తెలుసుకోవాలని హితవు పలికింది. అంతేకానీ ఎవరో పంపిన వాటిని ఫార్వార్డ్ చేయకండి అంటూ మహ్వశ్ అదిరిపోయే రిప్లై ఇచ్చింది. ఈ లెక్కన ఆర్జే మహ్వశ్.. యుజ్వేంద్ర చాహల్ పరిచయానికి ముందే క్రికెట్తో అనుబంధం ఉందన్నమాట. View this post on Instagram A post shared by Mahvash (@rj.mahvash) -
జెన్ Z అంటే ఇదేనా? ఆశిష్ను అగౌరవపరుస్తావా? నటుడి ఆగ్రహం
గుడుంబా శంకర్, పోకిరి, అన్నవరం వంటి చిత్రాలతో తెలుగులో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు ఆశిష్ విద్యార్థి (Ashish Vidyarthi). తెలుగుతో పాటు తమిళ, మలయాళ, బెంగాలీ, కన్నడ, హిందీ భాషల్లోనూ అనేక చిత్రాలు చేశాడు. ప్రస్తుతం ద ట్రేటర్స్ అనే రియాలిటీ షోలో పాల్గొన్నాడు. ఈ షోలో నటి అపూర్వ ముఖిజ .. ఆశిష్కు కనీస గౌరవం ఇవ్వకుండా మాట్లాడింది. ఆశిష్.. అని ఏకవచనంతో సంభోదించింది. నీ తీరు బాగోలేదుఅంత సీనియర్ను పేరు పెట్టి పిలవడమేంటని నటుడు సుధాన్షు పాండే ఆగ్రహం వ్యక్తం చేశాడు. ద రెబల్ కిడ్ అపూర్వ (Apoorva Mukhija)కు ఉన్న వివాదాలు సరిపోవడం లేదా? తను చెడ్డదని చెప్పడం లేదు. ఆమె మంచి అమ్మాయే! తనకు మంచి మనసుంది. కానీ నీ మాటతీరు మాత్రం అస్సలు బాగోలేదు. అదే నీకు చెడుగా మారుతుంది. నీకంటే సీనియర్ల గురించి ఎలా మాట్లాడాలనేది తెలియకపోతే మొత్తం వ్యవహారమే తలకిందులవుతుంది జాగ్రత్త!చెత్త మాటలుఆశిష్ విద్యార్థి.. నీకే కాదు నాక్కూడా సీనియర్. నా వెనక నిల్చున్నప్పుడు ఆశిష్ వెళ్లిపోతే బాగుంటుంది అని మాట్లాడావు. ఆయన నీ చిన్ననాటి స్నేహితుడా? నీ తల్లిదండ్రుల కంటే పెద్దవాళ్లైన సీనియర్ల గురించి ఇలాగేనా మాట్లాడేది? దీని ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు? జెన్ Zకు ఇదంతా కూల్గా అనిపిస్తోంది. కానీ ఇదస్సలు లైట్ తీసుకునే విషయం కాదు. ఇవన్నీ చెత్త మాటలు అంటాను. ఈ ధోరణి మన సమాజానికి ఒక శాపం అని చెప్పుకొచ్చాడు. అపూర్వ.. నడానియన్ సినిమాలో నటించింది. అలాగే కొన్ని సిరీస్లు కూడా చేసింది. సుధాన్షు.. తమిళ, పంజాబీ, హిందీ భాషల్లో అనేక చిత్రాలు చేశాడు. తెలుగులో మన్మథుడు 2లోనూ యాక్ట్ చేశాడు. హీరోయిన్ మాజీ ప్రియుడిగా నటించాడు.చదవండి: అమ్మా.. అంటూ తిరుపతిలో భిక్షమెత్తా: హీరో ధనుష్ -
అర్ధరాత్రుళ్లు తలుపులు కొట్టేవారు.. తప్పించుకోడానికి ఏం చేశానంటే: నటి
ఆమె మన హైదరాబాద్కు చెందిన అమ్మాయే. ప్రస్తుతం బాలీవుడ్లో స్థిరపడింది. అందాల కిరీటాన్ని గెలుచుకున్న దియామీర్జా(Dia Mirza) ఇప్పుడు మంచి పేరున్న బాలీవుడ్ నటిగా కొనసాగుతోంది. తమిళ సినిమాల్లో ఓ చిన్న పాత్రలో, బ్యాక్గ్రౌండ్ డ్యాన్సర్గా కెరీర్ను ప్రారంభించిన దియా, 2000లో మిస్ ఆసియా పసిఫిక్ ఇంటర్నేషనల్ కిరీటాన్ని గెలిచిన తరువాత, హిందీ సినిమాల్లో అడుగుపెట్టింది. ఆమె ఆర్. మాధవన్ సరసన తొలి చిత్రం రెహ్నా హై తెరే దిల్ మేన్లో నటించింది. ఈ నేపధ్యంలో ఇటీవల దియా మీర్జా తన సినీ ప్రస్థానంలో ఎదుర్కొన్న ఒడిదుడుకుల గురించి ఓ ఇంటర్వ్యూలో మనసు విప్పి మాట్లాడింది. ఒక అవుట్సైడర్గా ఇండస్ట్రీలో అడుగుపెట్టడం ఎంత కష్టం అనేది చెప్పిన దియా, ‘ఆ ప్రయాణాన్ని వివరించాలంటే ఓ పుస్తకమే రాయాల్సి వస్తుంది. అది చాలా భయంకరం, కఠినం.‘ అని చెప్పింది.ఇండస్ట్రీలో పుష్కలంగా అవకాశాలు ఇచ్చే పరిస్థితులు ఉన్నప్పటికీ, అవి బలమైన బ్యాగ్రౌండ్ ఉన్న వారికే ఇచ్చే పరిస్థితులు ఉండేవని ఆమె చెప్పారు. ‘‘పలు సినిమాలు నాకు ఇవ్వకుండా ఇండస్ట్రీ బ్యాకింగ్ ఉన్న నటీమణులకు ఇచ్చారు. అదీ నిజం’’ అన్నారామె. ఇప్పటి సినిమాల్లో మహిళా పాత్రల రాస్తున్న రచయితలు, కథనాలు మెరుగయ్యాయని ఆమె అభిప్రాయపడ్డారు. ‘గతంలో కొన్ని పాత్రలు ఎలా రాసేవారో , అవి ఎంత రెగ్రెసివ్గా ఉండేవో, నాకు ఇప్పుడు తెలుస్తోంది. అప్పట్లో సీన్ చేయడం మీదే దృష్టి ఉండేది. అప్పటి జీర్ణించుకుపోయిన మనస్తత్వం, పురుషాధిపత్యం ఎలా ఉండేదో ఇప్పుడు అర్థమవుతోంది. ఈ అవగాహన వల్లే ఇప్పుడు సరైనవి ఎంచుకోగలుగుతున్నాను‘ అని ఆమె పేర్కొంది.అంతేకాదు..ఒకప్పుడు మగవాళ్లు అర్ధరాత్రుళ్లు తారల రూమ్ తలుపులు కొట్టేవారంటూ ఆమె చెప్పకనే చెప్పడం విశేషం. అలా అర్ధరాత్రుళ్లు తలుపులు కొట్టేవారి నుంచి తప్పించుకోవడం కోసం తన హెయిర్డ్రెస్సర్తో గదిని పంచుకున్నానని ఆమె గుర్తు చేశారు. ‘చాలా మంది నటీమణులకు అలాంటి సమయంలో తల్లిదండ్రుల మద్దతు ఉండేది. నా వెంట మాత్రం ఎప్పుడూ నా టీమ్ హెయిర్డ్రెస్సర్, మేకప్ ఆర్టిస్ట్, స్పాట్బాయ్ లు మాత్రమే ఉండేవారు. వాళ్లే నా రక్షక వలయం,‘ అని చెప్పింది.‘‘ప్రసాద్ అన్నా నా స్పాట్బాయ్గా ఎన్నో సంవత్సరాలు నా వెంట ఉన్నాడు. కోవిడ్ సమయంలో ఆయనను కోల్పోయాను. నా హెయిర్డ్రెస్సర్ 16–17 సంవత్సరాలు నా కోసం పని చేసింది. అలా వారితో కలిసి నేను నా చుట్టూ ఒక ప్రపంచాన్ని నిర్మించుకున్నాను,’’ అని చెప్పిన దియా వివరించింది. ప్రస్తుతం దియా మీర్జా, నెట్ఫ్లిక్స్ చిత్రం నాదానియాన్లో నటించింది. ఈ సినిమాలో ఖుషీ కపూర్, ఇబ్రహీం అలీ ఖాన్ తదితరులు ఉన్నారు. -
లండన్లో పెద్ది మూవీ హీరోయిన్.. ప్రియుడితో కలిసి చిల్!
బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ ప్రస్తుతం రామ్ చరణ్ సరసన కనిపించనుంది. బుచ్చిబాబు సనా డైరెక్షన్లో వస్తోన్న స్పోర్ట్స్ ఓరియంటెడ్ డ్రామాలో దేవర భామ నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. జూనియర్ సరసన దేవరతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ ఏకంగా గ్లోబల్ స్టార్తో ఛాన్స్ కొట్టేసింది.ఇక సినిమాల సంగతి పక్కనపెడితే జాన్వీ కపూర్ ప్రస్తుతం లండన్లో చిల్ అవుతోంది. తన సిస్టర్ ఖుషీ కపూర్తో పాటు వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది. దీనిక సంబంధించిన ఫోటోలను సైతం సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. అయితే వీరితో పాటు ఆమె బాయ్ఫ్రెండ్గా భావిస్తోన్న శిఖర్ పహారియా కూడా ఉన్నారు. ఒకరినొకరు చేయి పట్టుకుని సరదాగా కనిపించారు. ఈ వీడియోలో వీరిద్దరు చాలా సన్నిహితంగా ఉన్నారు. ఈ ప్రేమ జంటను చూసిన నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) -
అతడు చెప్పేదంతా అబద్ధం.. తీసుకెళ్లి పిచ్చి ఆస్పత్రిలో వేయండి: నటి
సెలబ్రిటీలు ఏం మాట్లాడాలన్నా, ఎలాంటి పోస్టులు వేయాలన్నా కాస్త ఆచితూచి వ్యవహరించాలి. లేదంటే చిక్కుల్లో పడటం ఖాయం. గాయని, నటి సుచిత్రా కృష్ణమూర్తి (Suchitra Krishnamoorthi) ఇప్పుడలాంటి పరిస్థితిలో ఇరుక్కుంది. ఇటీవల జరిగిన అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ఒక్కరు మినహా ఫ్లైట్లో ఉన్న అందరూ చనిపోయిన సంగతి తెలిసిందే! మృత్యుంజయుడిగా బయటకు వచ్చిన అతడి పేరు విశ్వాస్ కుమార్ రమేశ్. చిన్నపాటి గాయాలతో సంఘటనా స్థలం నుంచి నడుచుకుంటూ బయటకు వచ్చాడు.అతడు చెప్పేది అబద్ధంఅతడి గురించి సామాజిక మాధ్యమాల్లో తప్పుడు కథనాలు కూడా వ్యాప్తిలో ఉన్నాయి. విశ్వాస్ అబద్ధం చెప్తున్నాడని కొందరు పుకార్లు సృష్టించారు. అది నిజమని నమ్మిన సుచిత్రా కృష్ణమూర్తి ఆ రూమర్స్ను తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. రమేశ్ అన్నీ అబద్ధాలు చెప్తున్నాడు. అదేగనక నిజమైతే అతడికి కఠిన శిక్ష విధించాలి. లేదంటే పిచ్చి ఆస్పత్రిలో వేయాలి అని ట్వీట్ చేసింది.ట్వీట్ డిలీట్ఇది చూసిన నెటిజన్లు అసత్యాలను ఎందుకు ప్రచారం చేస్తున్నావని విమర్శించారు. ఆయన విమాన ప్రమాదంలోని బాధితుడే అని అహ్మదాబాద్లోని ఆస్పత్రి అధికారులే ధృవీకరించాక ఇంకేంటి సమస్య? అని ప్రశ్నించారు. దీంతో తప్పు తెలుసుకున్న సుచిత్ర.. వెంటనే సదరు ట్వీట్ను డిలీట్ చేసింది. తప్పుడు వార్తలను ఎందుకు ప్రచారం చేస్తారో ఆ దేవుడికే తెలియాలి. ఏదేమైనా దాన్ని పోస్ట్ చేసినందుకు సారీ అని ట్వీట్ చేసింది.నటిగా..గాయని, నటి, రచయిత, చిత్రకారిణి.. ఇలా అన్నిరంగాల్లో అందెవేసిన చేయి సుచిత్రా కృష్ణమూర్తిది. 1991లో వచ్చిన మలయాళ చిత్రం 'కిలుక్కింపెట్టి'తో జయరామ్ సరసన హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది . తర్వాత తమిళ చిత్రం 'శివరంజని'లో టైటిల్ రోల్ పోషించి ఆకట్టుకుంది. తర్వాత షారుక్ ఖాన్ కభీ హా కభీ నా, జజ్బాత్, రోమియో అక్బర్ వాల్టర్ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకుంది. 'గిల్టీ మైండ్స్' వెబ్ సిరీస్లోనూ నటించింది. 1999లో తనకంటే 30 ఏళ్లు పెద్దవాడైన దర్శకుడు శేఖర్కపూర్ను వివాహమాడింది. వీరికి కావేరీ అనే కూతురు జన్మించింది. 2007లో సుచిత్రా- శేఖర్ విడాకులు తీసుకున్నారు. Took out my last tweet on the air india crash survivor. Seems to be false news circulated for God knows what reason. My apologies— Suchitra Krishnamoorthi (@suchitrak) June 19, 2025 చదవండి: ధనుష్తో కుబేర చూసిన శేఖర్.. రెస్పాన్స్ అదిరిపోలా! -
సౌత్లో బాడీ షేమింగ్.. ఇండస్ట్రీ నుంచే వెలేశారు: హీరోయిన్
వాణిజ్య ప్రకటనలతో ప్రయాణం మొదలుపెట్టిన బనితా సంధు (Banita Sandhu) ప్రస్తుతం హీరోయిన్గా రాణిస్తోంది. తమిళంలో ఆదిత్య వర్మ (అర్జున్ రెడ్డి రీమేక్).. హిందీలో అక్టోబర్, సర్దార్ ఉద్ధమ్, మదర్ థెరిస్సా అండ్ మి చిత్రాలు చేసింది. హాలీవుడ్లో సినిమాతో పాటు వెబ్ సిరీస్లలోనూ యాక్ట్ చేసింది. ప్రస్తుతం అడివి శేష్ గూఢచారి 2 చిత్రం చేస్తోంది. అలాగే ఆమె నటించిన డిటెక్టివ్ షెర్డిల్ మూవీ జీ5లో శుక్రవారం (జూన్ 20) రిలీజ్ కానుంది.నిద్ర లేకుండా షూటింగ్ఈ సందర్భంగా ప్రమోషన్స్లో బనితా సంధు మాట్లాడుతూ.. బాలీవుడ్లో ఇప్పుడిప్పుడే అంతా మెరుగవుతోంది. కెరీర్ తొలినాళ్లలో ఇండస్ట్రీ ఎలా ఉంటుందో నాకు తెలీదు. నేను ఊహించినదానికన్నా భిన్నంగా ఉండేది. 16-18 గంటలు పని చేసేదాన్ని. రోజంతా షూటింగ్ చేయించుకుని రాత్రికి పంపించేవాళ్లు. సరైన నిద్ర ఉండేది కాదు. ఒక్కోసారి 24 గంటలు మేల్కొనే ఉండాల్సి వచ్చేది. అప్పుడు నేను.. నాకోసం, మిగతా సిబ్బంది కోసం నిలబడ్డాను. బ్లాక్లిస్ట్.. లెక్కచేయనుఇది మంచి పద్ధతి కాదని నిర్మాతలను వారించాను. బహుశా అందుకేనేమో నన్ను ఆ ఇండస్ట్రీలో బ్లాక్లిస్ట్లో పెట్టారు. అయినా నేను అస్సలు పట్టించుకోను. నాకు ఏదనిపిస్తే అదే చేస్తాను. దక్షిణాది సినిమా (ఆదిత్య వర్మ) చేసినప్పుడు నన్ను బాడీ షేమింగ్ చేశారు. పీలగా, చెండాలంగా ఉన్నానని కామెంట్లు చేశారు. సినిమాలో ఇలాంటిదానికి హీరో ఎలా పడిపోయాడని వెకిలిగా మాట్లాడారు. బాడీ షేమింగ్ అనుభవించడం అదే మొదటిసారి అని బనితా చెప్పుకొచ్చింది.చదవండి: సౌత్లో మంచి రోల్స్ ఇవ్వలే? యాంకర్కు కౌంటర్ ఇచ్చిన జెనీలియా -
అందరిచూపు సౌత్వైపే.. ఇక్కడే పాగా వేస్తానంటున్న బ్యూటీ
ఒకప్పుడు సౌత్ సినిమాలంటే చిన్నచూపు ఉండేది కానీ ఇప్పుడు దక్షిణాది చిత్రాలు దేశాన్నే ఏలుతున్నాయి. ఖండాలు దాటి ప్రపంచ సినిమాను తమవైపు తిప్పుకునేలా చేస్తున్నాయి. అందుకే సౌత్ సినిమాలు చేయడానికి హీరోయిన్లు కూడా నూతన ఉత్సాహం చూపిస్తున్నారు. హిందీ బిగ్బాస్ 18 ఫేమ్, హీరోయిన్ యామిని మల్హోత్రా (Yamini Malhotra) కూడా దక్షిణాదిన రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది.అన్నీ ప్రత్యేకమేదంత వైద్యురాలు అయిన యామిని తెలుగులో చుట్టాలబ్బాయి సినిమాలో ఓ కీలక పాత్ర చేసింది. తాజాగా బాలీవుడ్ బబుల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో యామిని మాట్లాడుతూ.. నేడు సౌత్లో చెప్తున్న కథలు ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అక్కడి కథలు, స్క్రీన్ప్లే, విజన్ కూడా అన్నీ కూడా ప్రత్యేకంగా ఉంటాయి. బలమైన పాత్రలే ఎక్కువగా కనిపిస్తాయి. కాబట్టి సౌత్లోకి మరోసారి ప్రవేశించడానికి ఇదే సరైన సమయం అని నాకనిపిస్తోంది.ఎగ్జయిట్ అయ్యా.. కానీ!తెలుగులో, పంజాబీలో చేసిన సినిమాలు రెండూ ఒకేరోజు విడుదలైనప్పుడు చాలా ఎగ్జయిట్ అయ్యాను. అయితే అప్పుడు పంజాబీ సినిమాపైనే ఎక్కువ మొగ్గు చూపాను. ఎందుకంటే ఆ భాష నాకు కంఫర్టబుల్గా అనిపించేది. తెలిసినవాళ్లు కూడా ఉండటంతో ఇక్కడ ఎదగడం ఈజీ అనుకున్నాను. భాష అడ్డంకి అనుకున్నాను. కానీ అది నిజం కాదని అనుభవంతో తెలుసుకున్నాను అని యామిని చెప్పుకొచ్చింది. ఈ బ్యూటీ 'చిల్ మార్ నా బ్రో' మూవీతో ఇటీవలే బాలీవుడ్లో అడుగుపెట్టింది.చదవండి: సౌత్లో మంచి రోల్స్ ఇవ్వలే? యాంకర్కు కౌంటర్ ఇచ్చిన జెనీలియా -
సౌత్లో మంచి రోల్స్ ఇవ్వలే? యాంకర్కు కౌంటర్ ఇచ్చిన జెనీలియా
జెనీలియా.. హహ.. హాసినిగా ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే! బొమ్మరిల్లు ఒక్కటే కాదు సై, నా అల్లుడు, హ్యాపీ, ఢీ, రెడీ, ఆరెంజ్.. ఇలా ఎన్నో చిత్రాలు చేసింది. ఇందులో కొన్ని సినిమాలు పలు భాషల్లో రీమేక్ అయ్యాయి కూడా! అందులో రామ్పోతినేనితో చేసిన రెడీ మూవీ ఒకటి. ఇది హిందీలో సల్మాన్ ఖాన్తో రీమేక్ చేశారు. కానీ హీరోయిన్గా జెనీలియా (Genelia D'Souza)కు బదులుగా అసిన్ను తీసుకున్నారు. జెనీలియాను సల్మాన్ వద్దనడంపై అప్పట్లో చర్చ జరిగింది.ఇంకో అవకాశం ఎదురుచూస్తుందేమో..సితారే జమీన్ పర్ సినిమా ప్రమోషన్స్తో బిజీగా ఉన్న జెనీలియాకు ఇదే ప్రశ్న ఎదురైంది. రెడీ హిందీ రీమేక్లో మిమ్మల్ని తీసుకోనందుకు బాధపడ్డారా? అని ఇంటర్వ్యూ చేసే వ్యక్తి అడిగాడు. అందుకు హీరోయిన్.. అలాంటిదేం లేదు. కానీ నన్ను సంప్రదించుంటే సంతోషంగా ఒప్పుకునేదాన్ని. ఎందుకంటే అది నా సినిమా. అయినా ఆ అవకాశం పోయిందంటే సల్మాన్తో నటించేందుకు మరో మూవీ నాకోసం ఎదురుచూస్తూ ఉంటుందేమో.. అని చెప్పుకొచ్చింది.రుణపడి ఉన్నాతర్వాత యాంకర్.. దక్షిణాదిన మంచి పాత్రలు దక్కలేదు కదా? అని ప్రశ్నించగా వెంటనే జెనీలియా కాదంటూ మధ్యలోనే అడ్డుకుంది. ఆమె మాట్లాడుతూ.. సౌత్లో నాకెప్పుడూ మంచి పాత్రలే దక్కాయి. నా సినిమాలు చూస్తే సౌత్లో నాకు ఎంత అద్భుతమైన పాత్రలు దక్కాయో తెలుస్తుంది. అక్కడ ఎంతో నేర్చుకున్నాను. నాకు మంచి సినిమాలు ఇచ్చారు.. అందుకు నేనెప్పటికీ రుణపడి ఉంటాను. మీరు ఈరోజు హైదరాబాద్కు వెళ్లినా సరే హాసిని(బొమ్మరిల్లులో జెనీలియా పాత్ర పేరు) అంటే చాలు నా పేరు చెప్తారు. ఎంజాయ్ చేశాతమిళంలో హరిణి (సంతోష్ సుబ్రహ్మణ్యం), మలయాళంలో ఆయేషా (ఉరుమి).. ఈ పేర్లతోనే నన్ను ఇప్పటికీ పిలుస్తుంటారు. అలాంటి పాత్రలు దక్కడం నా అదృష్టం. శంకర్, రాజమౌళి వంటి టాప్ డైరెక్టర్లతోనే కాకుండా కొత్త దర్శకులతోనూ పని చేశాను. ఈ మొత్తం ప్రక్రియను నేను ఎంజాయ్ చేశాను అని చెప్పుకొచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సౌత్ ఇండస్ట్రీపై విషం కక్కాలనుకున్న యాంకర్కు జెనీలియా గట్టిగానే బుద్ధి చెప్పిందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. Anchor: South films never used to give solid roles.Genelia : No, I always got - if you see my South films, I've had the best roles ever. It was my learning ground. I am eternally indebted to the work that I got there.#GeneliaDeshmukh pic.twitter.com/OBOhFQAAqZ— Whynot Cinemas (@whynotcinemass_) June 18, 2025చదవండి: బిగ్బాస్లో ఎన్ని లక్షలు వచ్చాయో చెప్పిన గౌతమ్.. లైవ్లోనే -
నేరుగా ఓటీటీకి స్టార్ హీరో సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
అమితాబ్ తనయుడు అభిషేక్ బచ్చన్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం 'కాళిధర్ లపతా'. ఈ సినిమాకు మధుమిత దర్శకత్వం వహించారు. ఈ మూవీని జీ స్టూడియోస్ బ్యానర్లో తెరకెక్కించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాపై విడుదలకు సిద్ధమైంది.అయితే ఈ చిత్రాన్ని థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోనే రిలీజ్ చేస్తున్నట్లు అభిషేక్ బచ్చన్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఈ మేరకు కాళిధర్ లపతా పోస్టర్ను పంచుకున్నారు. ఈ చిత్రం జూలై 4న జీ5లో ప్రీమియర్ అవుతుందని తెలిపారు. ఈ సినిమాలో అభిషేక్ బచ్చన్ టైటిల్ రోల్ పోషించగా.. దైవిక్ భగేలా, జీషన్ అయూబ్ కీలక పాత్రల్లో నటించారు. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కించిన ఈ సినిమాను ఓటీటీలోనే చూసేయండి.తన కుటుంబం తనను వదిలించుకోవాలని చూస్తున్న విషయం తెలుసుకున్న ఓ వృద్ధుడి చుట్టూ ఈ కథ తిరుగుతుంది. కుటుంబానికి దూరంగా పారిపోవడానికి ఆ వృద్ధుడు యత్నిస్తాడు. అతనికి ఎనిమిదేళ్ల అనాథ అయిన బల్లుతో ఊహించని పరిచయం.. జీవితాన్ని మార్చే సంఘటనకు దారితీస్తుంది. ఆ తర్వాత జరిగే పరిణామాలే ఈ చిత్రంలో చూపించారు. కాగా.. అభిషేక్ బచ్చన్ చివరిసారిగా 'హౌస్ఫుల్ 5'చిత్రంలో కనిపించారు. ఈ సినిమా ప్రస్తుతం థియేటర్లలో ప్రదర్శితమవుతోంది. चर्चाओं पर अब फुल स्टॉप! Sometimes, getting lost isn’t a detour, it’s where the real story begins.Full of dreams, twists, and the people who make it worth it. 😊#KaalidharLaapata premieres 4th July, only on #ZEE5.#KaalidharLaapataOnZEE5@Mdzeeshanayyub #DaivikBaghela… pic.twitter.com/0BDqAumEUR— Abhishek 𝐁𝐚𝐜𝐡𝐜𝐡𝐚𝐧 (@juniorbachchan) June 19, 2025 -
రామోజీ ఫిలిం సిటీ.. రాశీ, తాప్సీలకు అదే భయానక అనుభవాలు
కొన్ని ప్రదేశాలు నెగెటివ్ వైబ్స్ ఇస్తుంటాయి. హైదరాబాద్లోని రామోజీ ఫిలిం సిటీకి వెళ్లినప్పుడు తనకూ అలాంటి నెగెటివ్ వైబ్స్ వచ్చాయంది బాలీవుడ్ హీరోయిన్ కాజోల్ (Kajol). షూటింగ్ కోసం అక్కడికి వెళ్లినప్పుడు అంతా సరిగా ఉన్నట్లు అనిపించలేదని, వెంటనే తిరిగి వెళ్లిపోవాలనిపించిందని పేర్కొంది. ప్రపంచంలోనే అత్యంత భయానకమైన చోటుగా రామోజీ ఫిలిం సిటీని వర్ణించింది.హోటల్లో దెయ్యాలు?ఇలాంటి చేదు అనుభవం కాజోల్కు మాత్రమే కాదు, తాప్సీ (Taapsee Pannu), రాశీఖన్నా, మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణికి కూడా ఎదురైందట! గతంలో తాప్సీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. దెయ్యాలున్నాయని నేను బలంగా నమ్ముతాను. అవంటే నాకు చాలా భయం. రామోజీ ఫిలిం సిటీలోని ఓ హోటల్ గదిలో బస చేసినప్పుడు నాతో పాటు ఎవరో ఉన్నట్లే అనిపించింది. ఆ హోటల్లో దెయ్యాలున్నాయని అందరూ అంటుంటే విన్నాను. కానీ, తొలిసారి అది ఎక్స్పీరియన్స్ చేశాను. నేను గదిలో ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరో నడుచుకుంటూ వస్తున్న శబ్ధాలు వినిపించాయి. దెయ్యంతో పోరాడలేనుభయంతో వణికిపోయినప్పటికీ అదంతా నా భ్రమే అని నాకు నేను సర్ది చెప్పుకుని నిద్రపోవడానికి ప్రయత్నించాను. దెయ్యంతో పోరాడేంత సినిమా నాకు లేదు అని చెప్పుకొచ్చింది. రాశీఖన్నా (Raashii Khanna) కూడా.. అదే హోటల్లో బస చేసినప్పుడు తన బెడ్ దానంతటదే ఊగిపోయిందని, తను కప్పుకున్న దుప్పటి కూడా ఎవరో లాగేశారంది. ఆ గదిలో కచ్చితంగా దెయ్యం ఉందని అభిప్రాయపడింది. ఎందుకంటే, తనకంటే ముందు పలువురు యాక్టర్స్కు ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయని చెప్పినట్లు ఓ క్లిప్పింగ్ వైరల్ అవుతోంది.కీరవాణిదీ అదే అభిప్రాయంఅలాగే ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి (MM Keeravani)కి కూడా చంద్రముఖి 2 సినిమా సమయంలో ఇలాంటి చేదు అనుభవం ఎదురైంది. కీరవాణి మాట్లాడుతూ.. అత్యంత భయంకరమైన ప్రదేశం ఏది? అని ఇంటర్నెట్లో కొడితే రామోజీ ఫిలిం సిటీ (Ramoji Film City) పేరే వస్తుంది. అక్కడున్న సింఫనీ స్టూడియోలో లేడీ సింగర్స్ పాట పాడుతున్నారు. అప్పుడు వారి చెవిలో ఏవో శబ్ధాలు వినిపించాయి అని చెప్పాడు. సెలబ్రిటీలందరూ ఇంత ఓపెన్గా చెప్తున్నారంటే రామోజీ ఫిలిం సిటీలో నిజంగానే ఏదో ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.చదవండి: నా కళ్లలో నీళ్లు తిరిగాయి.. అందుకే ఆమె పెళ్లికి సాయం చేశా: శేఖర్ -
వాళ్ల కోసం అన్నీ ఇచ్చేశా.. ఒంటరిగా ఉండాలని ఉంది: అభిషేక్ బచ్చన్
బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్( Abhishek Bachchan) నటించిన కొత్త సినిమా హౌస్ఫుల్ 5 కొద్దిరోజుల క్రితమే విడుదలైంది. ఆయన సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి స్పందనను పొందుతోంది. ఇంతలో, ఆయన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ను పంచుకున్నారు. ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. ప్రియమైన వారికోసం అన్నీ ఇచ్చేశానంటూ అందులో పేర్కొన్నాడు. దీంతో కుటుంబ సమస్యల వల్ల ఆయన ఇలాంటి పోస్ట్ చేశారా అంటూ నెటిజన్లు సందేహిస్తున్నారు. కొంతకాలంగా నటి ఐశ్వర్యరాయ్( Aishwarya Rai)- అభిషేక్ బచ్చన్ల విడాకుల వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో ఆయన చేసిన పోస్ట్ మరింత బలాన్ని ఇచ్చేలా ఉంది.అభిషేక్ బచ్చన్ తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో రోజువారీ జీవితంలో ఎదురయ్యే బాధ్యతల మీద మాత్రమే దృష్టి పెట్టడం కంటే, అంతర్గత ఆనందం గురించి ఆలోచించడం ఎంత కీలకమో ఆయన నొక్కి చెప్పారు. ' నేను మరోసారి ఒంటిరిగా ఉండాలని ఉంది. నా కోసం నేను కొంత సమయం కేటాయించుకోవాలనిపిస్తుంది. ఈ జనసమూహం నుంచి దూరంగా ఉంటూ నన్ను నేను వెతుక్కోవాలనుకుంటున్నాను. నా ప్రియమైన వారికోసం అన్నీ ఇచ్చేశాను. ఇప్పుడు నాకూ కొంత సమయం కావాలి. నా గురించి నేను తెలుసుకునేందుకు ఒంటరిగా ఉండాలని ఉంది.' అంటూ హిందీలో రాసుకొచ్చారు.(ఇదీ చదవండి: ఎన్టీఆర్ను చిన్నతనంలోనే పక్కన పెట్టడానికి కారణాలు ఉన్నాయి: పురందేశ్వరి)నెటిజన్లు అభిషేక్ బచ్చన్ పోస్ట్పై ఇలా కామెంట్లు చేస్తున్నారు. మిస్ ఇండియాను వివాహం చేసుకున్న తర్వాత ఒక వ్యక్తి సంతోషంగా లేడు అంటే ఏమిటి..? సంతోషానికి కొలమానం ఉంటుందా అంటూ ప్రశ్నిస్తున్నారు. మరొక వ్యక్తి సలహా ఇచ్చాడు- 'సార్, మీ భార్య, పిల్లలతో కొంత సమయం గడపండి, మీరు మంచిగా రీసెట్ అవుతారు.' అంటూ పేర్కొన్నాడు.సుమారు 17 ఏళ్ల క్రితం అభిషేక్ - ఐశ్వర్యలకు వివాహం జరిగిన విషయం తెలిసిందే. వీరికి ఆరాధ్య(15) అనే కుమార్తె ఉంది. ఈ జంట విడాకులు తీసుకోనున్నారంటూ గత కొంతకాలంగా పలు కథనాలు వైరల్ అయ్యాయి. అయితే, ఆ వార్తల్లో నిజం లేదని వీరిద్దరూ ఇప్పటికే పరోక్షంగా స్పందించారు. అయినప్పటికీ ఆ వార్తల ప్రచారం ఆగలేదు. ఇప్పుడు అభిషేక్ షేర్ చేసిన పోస్ట్తో మరోసారి విడాకుల అంశం తెరపైకి వచ్చింది. -
OTT: రాజీవ్ గాంధీ హత్య కేసు ఆధారంగా 'ద హంట్'
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసును ఆధారంగా చేసుకుని ఓ వెబ్ సిరీస్ తెరకెక్కుతోంది. అదే ద హంట్ (The Hunt: The Rajiv Gandhi Assassination Case). ఈ విషయాన్ని ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ సోనీలివ్ అధికారికంగా ప్రకటించింది. జూలై 4 నుంచి సోనీలివ్లో ప్రసారం కానున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ఓ టీజర్ కూడా రిలీజ్ చేసింది. అందులో.. 'రాజీవ్ గాంధీ బతికే ఉన్నారా? ఆయనింకా బతికే ఉన్నారా?' అని శ్రీలంకలోని భారత హై కమిషనర్ కార్యాలయానికి ఫోన్ రావడంతో టీజర్ మొదలవుతుంది. బాంబు పేల్చి రాజీవ్గాంధీని చంపిందెవరు? వారి ఉద్దేశ్యం ఏంటి? అన్న కోణాల్లో విచారణ మొదలుపెడతారు. ప్రతి సెకను కూడా ముఖ్యమేనంటూ నిందితులను పట్టుకునే పనిలో ఉంటారు. తర్వాత ఏం జరిగిందన్నది తెలియాలంటే ఓటీటీలో సిరీస్ చూడాల్సిందే! ద హంట్కు నగేశ్ కుకునూర్ దర్శకత్వం వహించాడు. కాగా 1991, మే 21న తమిళనాడులోని శ్రీ పెరంబుదూర్లో నాటి దేశ ప్రధాని రాజీవ్ గాంధీ ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. ఆ సమయంలో లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం ఆత్మాహుతి దాడికి పాల్పడటంతో రాజీవ్ గాంధీ హతమయ్యారు. The assassination that shook the nation. The manhunt that stunned the world.The Hunt - The Rajiv Gandhi Assassination Case, streaming from 4th July on Sony LIV.#TheHuntOnSonyLIV pic.twitter.com/ExOXEZxYFK— Sony LIV (@SonyLIV) June 18, 2025 -
కోటి రూపాయల కారులో మోనాలిసా.. ఇప్పుడదే నా ఫ్రెండ్!
ఒక్క ఛాన్స్.. ఒకే ఒక్క ఛాన్స్ అంటూ సినిమా అవకాశాల కోసం ఏళ్లతరబడి ఆఫీసుల చుట్టూ తిరిగేవారు చాలామంది. అదే సమయంలో అనుకోకుండా సినిమాల్లోకి వచ్చేవారూ బోలెడంతమంది ఉన్నారు. అందులో కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా ఒకరు. కుంభమేళాలో పూసలమ్ముకున్న ఈమె.. సోషల్ మీడియా పుణ్యమా అని ఒక్కసారిగా వైరల్ అయిపోయింది. సినిమా అవకాశాలు ఆమె తలుపుతట్టాయి. కుంభమేళాతో పాపులర్షాప్ ఓపెనింగ్స్కు రమ్మని ఆహ్వానాలు అందాయి. అవన్నీ చూసి పొంగిపోయింది మోనాలిసా. జీవితం ఇచ్చిన అవకాశాన్ని ఎందుకు వదులుకోవాలని ఆలోచించింది. అన్నింటినీ నవ్వుతూ ఓకే చెప్పింది. ఈ మధ్యే ఆమె నటించిన ఫస్ట్ సాంగ్ 'సాద్గి' కూడా రిలీజైంది. అందులో మోనాలిసా మరింత అందంగా కనిపించింది. కాకపోతే యాక్టింగ్ ఇంకాస్త మెరుగవ్వాల్సిన అవసరం ఉందన్న కామెంట్లు వినిపించాయి. కెమెరా ముందు నటించడం అదే తనకు తొలిసారి. నా ఫ్రెండ్.. కెమెరాఈ అనుభవం గురించి మోనాలిసా మాట్లాడుతూ.. సింగర్ ఉత్కర్ష్ శర్మ సర్ తన పాటలో నటించాలని అడగ్గానే ముందు మా ఇంట్లో మాట్లాడమన్నాను. వారు ఓకే అన్న తర్వాతే నేను అందులో యాక్ట్ చేశాను. అలాగే సాంగ్ కూడా నాకెంతగానో నచ్చింది. ఇప్పుడు కెమెరానే నా ఫ్రెండ్. కెమెరా ఎదుట కళ్లతోనే భావాలు పలికించడం, డ్యాన్స్ చేయడం కొత్తగా బాగుంది అని చెప్పుకొచ్చింది.రూ.1 కోటి కారులో మోనాలిసాఇదిలా ఉంటే తాజాగా మోనాలిసా ఖరీదైన కారులో కూర్చున్న ఫోటో ఒకటి నెట్టింట వైరలవుతోంది. ఈ కారు ధర దాదాపు రూ.1 కోటి ఉండొచ్చని అంటున్నారు. రూ.100కు పూసల దండ అమ్ముకున్న మోనాలిసా ఇప్పుడు కోటి విలువైన కారులో తిరుగుతుండటం చూసి ఫ్యాన్స్ సంతోషంగా ఫీలవుతున్నారు. మోనాలిసా ప్రస్తుతం ద డైరీ ఆఫ్ మణిపూర్ అనే సినిమా చేస్తోంది. View this post on Instagram A post shared by Monalisa Official (@_monalisa_official) View this post on Instagram A post shared by Utkarsh Singh (@utkarshsinghofficial_)చదవండి: చై-శోభితను పట్టించుకోని మహేశ్? వీడియోతో ఆన్సర్ దొరికేసింది! -
రామోజీ ఫిల్మ్ సిటీ భయంకరమైన ప్లేస్: హీరోయిన్ కాజోల్
బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ కాజోల్.. హైదరాబాద్లో ఉన్న రామోజీ ఫిల్మ్ సిటీ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. అదో భయంకరమైన ప్రదేశమని, జీవితంలో మళ్లీ అక్కడికి వెళ్లాలని అనుకోవట్లేదని చెప్పుకొచ్చింది. అందుకు గల కారణాన్ని కూడా వెల్లడించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: కారులో విజయ్-రష్మిక జంటగా.. ప్రేమని కన్ఫర్మ్ చేస్తున్నారా?)హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న కాజోల్.. ప్రస్తుతం 'మా' అనే సినిమా చేసింది. జూన్ 20న ఇది థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా పలు ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా ఓ యూట్యూబ్ ఛానెల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రామోజీ ఫిల్మ్ సిటీ అత్యంత భయానక ప్రదేశం అని చెప్పుకొచ్చింది. 'ఎందుకో అక్కడ షూటింగ్ చేస్తున్నప్పుడు నెగెటివ్ వైబ్స్ వచ్చాయి. కొన్ని ప్రదేశాలు చాలా భయపెడతాయి. వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవాలని, మరోసారి అక్కడికి రాకూడదు అనిపిస్తుంది. హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీ అలాంటిదే. ప్రపంచంలోనే అత్యంత భయానకమైన చోటు అది' అని కాజోల్ చెప్పింది.మరి కాజోల్ని అంతలా భయపెట్టిన సంఘటన ఏంటనేది మాత్రం రివీల్ చేయలేదు. కాజోల్ కెరీర్ విషయానికొస్తే.. 1992 నుంచి సినిమాలు చేస్తోంది. బాలీవుడ్ క్లాసిక్స్లో ఒకటైన 'దిల్ వాలియా దుల్హానియా లే జాయేంగే' సినిమాలో హీరోయిన్ ఈమె. తర్వాత కూడా పలువురు స్టార్స్తో మూవీస్ చేసింది. కొన్నాళ్లకు హీరో అజయ్ దేవగణ్ని పెళ్లి చేసుకుంది. వీళ్లకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. రీసెంట్ టైంలో సలాం వెంకీ, లస్ట్ స్టోరీస్ 2, దో పత్తి తదితర చిత్రాలతో కాజోల్ ఆకట్టుకుంది. ఇప్పుడు 'మా' అనే హారర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.(ఇదీ చదవండి: 19 ఏళ్ల హీరోయిన్ అనంతిక.. ఇన్ని టాలెంట్స్ ఉన్నాయా?)"I’ve felt negative vibes during shoots. Some places were so scary, I just wanted to leave and never come back.Like Ramoji Film City in Hyderabad itself, which is known as one of the most haunted places in the world."- Bollywood Actress #Kajol pic.twitter.com/0znOCXyQ4s— Movie Threat (@MovieThreat) June 18, 2025 -
'సితారే జమీన్ పర్' రిలీజ్.. రూ.120 కోట్ల ఆఫర్ వద్దన్న అమిర్ ఖాన్!
బాలీవుడ్ స్టార్ అమిర్ ఖాన్ నటించిన తాజా చిత్రం సితారే జమీన్ పర్. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా జూన్ 20న థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రంలో జెనీలియా దేశ్ముఖ్ కూడా ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమాకు ఆర్ఎస్ ప్రసన్న దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని ఆమిర్ ఖాన్, అపర్ణ పురోహిత్ నిర్మించారు. ఇటీవలే సెన్సార్ ప్రక్రియ కూడా పూర్తి చేసుకుంది. ఎటువంటి కట్స్ లేకుండానే సితారే జమీన్ పర్ విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ డీల్ తెగ వైరలవుతోంది. ఈ మూవీకి దాదాపు రూ.120 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసేందుకు అమెజాన్ ప్రైమ్ ముందుకొచ్చింది. అయితే ఈ డీల్ను అమిర్ ఖాన్ తిరస్కరించినట్లు తెలుస్తోంది. ఈ సినిమా కేవలం థియేటర్లలోనే ఆడుతుందని.. ఓటీటీలో విడుదల ఉండదని అమిర్ ఖాన్ స్పష్టం చేసినట్లు సమాచారం. ఓటీటీలో సినిమా రిలీజ్ చేయకపోవడం వల్ల ఆడియన్స్ థియేటర్లకు రప్పించేందుకు అమిర్ ఖాన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.అయితే సితారే జమీన్ పర్ థియేటర్లలో ప్రదర్శన తర్వాత యూట్యూబ్లో అందుబాటులో ఉంచుతారని అమిర్ ఖాన్ చెబుతున్నారు. కానీ అది ఉచితం కాదు.. ప్రేక్షకులు సినిమా చూడటానికి డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఈ చిత్రం థియేటర్లలో విడుదలైన వెంటనే యూట్యూబ్లో అందుబాటులోకి వస్తుందో లేదో అన్నదానిపై క్లారిటీ లేదు. అయితే ఎనిమిది వారాల థియేటర్ రన్ తర్వాత విడుదల కోసం అమెజాన్ రూ. 120 కోట్లు ఆఫర్ చేసింది. -
హీరామండి సక్సెస్.. అవకాశాలు మాత్రం నిల్: అదితిరావు హైదరి
బాలీవుడ్ నటి అదితి రావు హైదరీ గతేడాది పెళ్లిబంధంలోకి అడుగుపెట్టింగి. హీరో సిద్ధార్థ్ను పెళ్లాడిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం వైవాహిక జీవితంలో ఫుల్ బిజీగా మారిపోయింది. ఆమె చివరిసారి సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన వెబ్ సిరీస్ 'హీరామండి: ది డైమండ్ బజార్'లో కనిపించింది. ఈ సిరీస్లో తన నటనకు గానూ ప్రశంసలు అందుకున్నారు. అయితే ఈ సిరీస్ తర్వాత పెళ్లి చేసుకున్న బ్యూటీ.. ఇప్పటి వరకు ఎలాంటి కొత్త సినిమాను ఓకే చేయలేదు. ఈ విషయాన్ని తాజా ఇంటర్వ్యూలో అదితి రావు హైదరీ వెల్లడించింది. ముఖ్యంగా సినీ పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి మాట్లాడింది.అదితి రావు మాట్లాడుతూ.. ' హీరామండి తర్వాత నాకు చాలా అద్భుతంగా అనిపించింది. ఎందుకంటే చాలా ప్రేమ, ప్రశంసలు వచ్చాయి. అయితే నేను నా నెక్ట్స్ ఎలాంటి సినిమాకు ఇప్పటి వరకు సంతకం చేయలేదు. ఇంకా అవకాశాల కోసం వేచి ఉన్నా. జీవితంలో సమాన భాగస్వామిలాగే తెరపై మహిళలకు కూడా సమాన అవకాశాలు రావాలని కోరుకుంటున్నా' అని పంచుకుంది.కాగా.. బాలీవుడ్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన 'హీరామండి: ది డైమండ్ బజార్' మే 1, 2024న నెట్ఫ్లిక్స్లో విడుదలైంది. ఈ సిరీస్లో మనీషా కోయిరాలా, సోనాక్షి సిన్హా, రిచా చద్దా, సంజీదా షేక్, షర్మిన్ సెగల్, తహా షా బాదుస్షా, అదితి రావు హైదరీ కీలక పాత్రల్లో మెప్పించారు. ప్రస్తుతం అదితి రావు హైదరి 'ఓ సాథీ రే'లో అనే సిరీస్లో నటించనుంది. ఆ తర్వాత 'పరివారిక్ మనురంజన్' అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్లో కనిపించనుంది. -
డైరెక్ట్గా ఓటీటీలోకి రానున్న ఆర్.మాధవన్ సినిమా
ఆర్.మాధవన్ నటించిన 'ఆప్ జైసా కోయి' (Aap Jaisa Koi) చిత్రం డైరెక్ట్గా ఓటీటీలో విడుదల కానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది. బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ ఈ చిత్రాన్ని నిర్మించగా వివేక్ సోని దర్శకత్వం వహించారు. రొమాంటిక్ కామెడీ డ్రామాతో తెరకెక్కిన ఈ ఫిల్మ్ ప్రేక్షకులను మెప్పిస్తుందని మేకర్స్ అభిప్రాయపడ్డారు. ఇందులో హీరోయిన్గా ఫాతిమా సనా షేక్ నటించారు.'ఆప్ జైసా కోయి' సినిమా నెట్ఫ్లిక్స్ (Netflix) వేదికగా జులై 11 నుంచి అందుబాటులో ఉండనుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడలో విడుదల కానుంది. ఇద్దరు వేర్వేరు మనస్తత్వాల జోడీని ప్రపంచానికి చూపాలనే ఉద్దేశంతో ఈ చిత్రాన్ని నిర్మించారు. దంపతుల మధ్య పదేళ్ల గ్యాప్ ఉంటే ఎలాంటి చిక్కులు రావచ్చు.. వస్తే వాటిని ఎలా పరిష్కరించుకుంటారనేది ఈ చిత్రంలో చూపించనున్నారు.మహేశ్బాబు- రాజమౌళి సినిమా 'SSMB29'లో మాధవన్ నటించబోతున్నారని తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్లోని ఒక కీలకమైన పాత్రలో నటించాలని ఇప్పటికే మేకర్స్ సంప్రదించారట. కెన్యాలో జరగబోయే షూటింగ్ సెట్స్లో ఆయన ఎంట్రీ ఇవ్వబోతున్నారని సమాచారం. అయితే, ఈ విషయంపై త్వరలో అధికారికంగా ప్రకటన రావచ్చని తెలుస్తోంది. -
ఆ హీరోతో పెళ్లి వార్తలు.. బొమ్మరిల్లు హీరోయిన్ రియాక్షన్!
బొమ్మరిల్లు హీరోయిన్ జెనీలియా తెలుగువారికి సుపరిచితమైన పేరు. టాలీవుడ్ సినిమాల్లో నటించిన ముద్దుగుమ్మ ఆ తర్వాత నటుడు రితేశ్ దేశ్ముఖ్ను పెళ్లాడింది. పెళ్లి తర్వాత దాదాపు సినిమాలకు దూరమైంది. ప్రస్తుతం అమిర్ ఖాన్ చిత్రం సితారే జమీన్ పర్లో కనిపించనుంది. ఆమిర్ ఖాన్ హీరోగా నటించిన ఈ చిత్రం జూన్ 20న విడుదల కానుంది.అయితే గతంలో హీరో జాన్ అబ్రహంతో జెనీలియా పెళ్లి జరిగిందన్న వార్తలొచ్చాయి. దాదాపు 14 ఏళ్ల క్రితం జరిగిన ఈ ప్రచారంపై తాజాగా జెనీలియా స్పందించారు. ఆ వార్తలు ఎవరో సృష్టించారో తనకు తెలుసన్నారు. దానికి వాళ్లే సమాధానం చెప్పాలన్నారు.తాజా ఇంటర్వ్యూలో జెనీలియా మాట్లాడుతూ..'బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం.. నేు ఓ ప్రాజెక్ట్ కోసం కలిసి వర్క్ చేశాం. ఆ సినిమా సెట్లో అనుకోకుండా మా పెళ్లి జరిగిందంటూ అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే అదంతా కేవలం రూమర్స్ మాత్రమే. అందులో ఎలాంటి వాస్తవం లేదు. మాకు పెళ్లి జరగలేదు. కొంతమంది పీఆర్లు ఇలాంటి చెత్త న్యూస్ క్రియేట్ చేశారు. ఇలాంటి వార్తలు ఎందుకు ప్రచారం చేశారో వారినే అడగండి' అని అన్నారు. కాగా.. జెనీలియా - జాన్ అబ్రహం జంటగా ఫోర్స్ అనే చిత్రంలో నటించారు. ఈ సినిమా 2011లో విడుదల కాగా.. ఓ సీన్లో భాగంగా వీరిద్దరికీ నిజంగానే పెళ్లి చేశారంటూ తెగ వైరలైంది. ఆ కథనాలకు చెక్ పెడుతూ ఆ తర్వాత ఏడాదిలోనే రితేశ్ దేశ్ముఖ్ను పెళ్లాడారు. -
'నా తమ్ముడి మరణానికి కారణం అదే'.. రూమర్స్పై రాహుల్ దేవ్!
రామ్ చరణ్ మూవీ ఎవడు చిత్రంలో అభిమానులను మెప్పించిన బాలీవుడ్ నటుడు రాహుల్ దేవ్. విలన్గా మాత్రమే కాకుండా విభిన్నమైన పాత్రల్లో ఫ్యాన్స్ను మెప్పించారు. సౌత్లో చివరిసారిగా అజిత్ కుమార్ నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీలోనూ కనిపించారు. విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న రాహుల్ దేవ్ కుటుంబంలో ఇటీవల విషాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఆయన తమ్ముడు, నటుడైన ముకుల్ దేవ్ ఆకస్మిక మరణం చిత్ర పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆ తర్వాత ముకుల్ మరణంపై పలు రూమర్స్ వినిపించాయి. డిప్రెషన్ వల్లే అతను మృతి చెందాడని కథనాలొచ్చాయి.అయితే తాజాగా ఈ రూమర్లపై రాహుల్ దేవ్ స్పందించారు. ముకుల్ ఆరోగ్యం క్షీణించడానికి మానసిక ఆరోగ్య సమస్యలు కారణం కాదని తెలిపారు. అతని ఆహారపు అలవాట్లే కారణమని రాహుల్ దేవ్ వెల్లడించారు. చివరి నాలుగైదు రోజు తినడం పూర్తిగా మానేశాడని.. ఒంటరిగా ఉండేవాడని అన్నారు. ముఖ్యంగా అతనికి జీవితంపై ఆసక్తి కోల్పోయాడని.. ఎన్ని ఆఫర్స్ వచ్చినా తిరస్కరించేవాడని రాహుల్ దేవ్ వివరించారు.2019లో అనారోగ్యంతో ఉన్న తండ్రిని చూసుకోవడానికి ఢిల్లీకి వెళ్లాడని రాహుల్ పంచుకున్నారు. అదే ఏడాదిలో తండ్రి మరణం.. 2023లో తల్లిని కోల్పోవడం అతని ఒంటరితనం మరింత ఎక్కువైందని వెల్లడించారు. ఒంటరిగా జీవించడం పరిస్థితిని మరింత దిగజార్చిందని అతను పేర్కొన్నాడు. ముకుల్ తన కుమార్తెను మిస్ అవుతున్నాడని.. తనను జాగ్రత్తగా చూసుకోవడం లేదని కూడా బాధపడేవాడని రాహుల్ అన్నారు. ముకుల్ మరణం తరువాత సోషల్ మీడియాలో వచ్చిన కథనాలన్నీ అవాస్తవమని కొట్టిపారేశారు. అతను నిజంగా సూపర్ పవర్ అని.. అలాగే సున్నితమైన వ్యక్తిగా గుర్తుంచుకోవాలన్నారు.ఇక సినిమాల విషయానికొస్తే ముకుల్ 1996లో సుష్మితా సేన్ సరసన దస్తక్ చిత్రంతో నటుడిగా అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత జై హో, హిమ్మత్ వాలా, మేరే దో అన్మోల్ రతన్, యమ్లా పగ్లా దీవానా, సన్ ఆఫ్ సర్దార్, భాగ్ జానీ వంటి లాంటి చిత్రాలలో నటించాడు. అంతే కాకుండా ముమ్కిన్, ఘర్వాలీ ఉపర్వాలి, కషీష్, ఫిర్ కోయి హై, కుంకుమ్ ఏక్ ప్యారా సా బంధన్ లాంటి టీవీ సీరియల్స్లో నటించారు -
'ఎప్పటికీ నయం కానీ గాయం'.. ఎయిరిండియా సిబ్బందిపై నటి ప్రశంసలు!
అహ్మదాబాద్ ఎయిరిండియా ప్రమాదం తర్వాత బాలీవుడ్ నటి రవీనా టాండన్ ఎమోషనల్ పోస్ట్ చేసింది. ఈ ప్రమాదం జరిగిన తర్వాత తొలిసారి ఎయిరిండియా ఫ్లైట్లో ప్రయాణిస్తున్న ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. ఈ విషాదం తర్వాత కూడా ప్రయాణికుల కోసం చిరునవ్వుతో పలకరిస్తున్న ఎయిరిండియా క్యాబిన్ సిబ్బందిపై ఆమె ప్రశంసలు కురిపించారు. విమాన ప్రమాదం తర్వాత సిబ్బంది, ప్రయాణీకులలో నెలకొన్న భయం, మానసిక స్థితి గురించి ప్రస్తావించింది.రవీనా ఇన్స్టాలో రాస్తూ.. 'కొన్ని ప్రారంభాలు అన్ని అడ్డంకులను తట్టుకుని నిలవాలి. ప్రస్తుతం ఎయిరిండియా సిబ్బంది బాధలో ఉన్నప్పటికీ కొత్త సంకల్పం కోసం చిరునవ్వులతో ప్రయాణికులను స్వాగతిస్తున్నారు. ప్రయాణీకులు, సిబ్బంది మధ్య ఏదో తెలియని బంధం ఏర్పరుచుకున్నారు. ఈ విషాదంలో తమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు సంతాపం. ఇది ఎప్పటికీ నయం కాని గాయం. కానీ ఎయిరిండియా ఎల్లప్పుడూ ఇలాంటి వాటిని అధిగమించి మళ్లీ బలంగా నిలబడాలనేదే వారి సంకల్పం' అంటూ ఫ్లైట్లో తాను దిగిన ఫోటోలను కూడా పంచుకుంది. బాధలోనూ తమ సంస్థ కోసం సిబ్బంది కష్టపడుతున్న తీరుపై రవీనా టాండన్ ప్రశంసలు కురిపించారు. కాగా.. జూన్ 12న జరిగిన విమాన ప్రమాదంలో 241 మంది మరణించిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Raveena Tandon (@officialraveenatandon) -
Plane Crash: జీవితాల్ని నిలబెట్టిన విషాదం.. విడాకులు రద్దు
అహ్మదాబాద్ విమాన ప్రమాదం బాధిత కుటుంబాలను శోకసంద్రంలోకి నెట్టేసింది. జీవితం శాశ్వతం కాదని, మరణం ఎప్పుడు, ఎటువైపు నుంచి వస్తుందనేది చెప్పలేమని సమస్త ప్రజానీకానికి గుర్తు చేసింది. భూమిపై ఉన్నన్ని రోజులు గొడవలు తగ్గించి ప్రశాంతంగా, అయినవారితో సంతోషంగా గడపమని సందేశాన్ని పంపింది. విమాన ప్రమాదం అనే విషాదం కొందరి జీవితాల్లో మార్పు తెచ్చిందంటోంది సింగర్, నటి రాగేశ్వరి. విడాకులకు సిద్ధమైన వారు కూడా మనసు మార్చుకుని కలిసిపోయారని చెప్తోంది. సడన్గా ఎందుకీ మార్పు?మీకో విషయం తెలుసా? విమాన ప్రమాదం (Ahmedabad Air India Plane Crash) తర్వాత చాలామంది వారి కుటుంబాలకు ఫోన్ చేసి యోగక్షేమాలు అడుగుతున్నారు, కాసేపు మాట్లాడుతున్నారు. నాకు తెలిసిన రెండు జంటలు విడాకుల వరకు వెళ్లగా.. ఇప్పుడు కలిసిపోయారు. సడన్గా వారిద్దరి కుటుంబాలు అహంకారాన్ని పక్కనపెట్టేశాయి. సమస్యలను పరిష్కరించుకున్నారు. అకస్మాత్తుగా ఎందుకింత మార్పు వచ్చింది? విపత్తులు వచ్చినప్పుడే మనకు జీవితం విలువ తెలిసొస్తుందని సైకాలజిస్టులు అంటున్నారు.ప్రమాదాలే గుర్తు చేస్తాయిఎన్నో అపజయాలను చవిచూస్తే తప్ప విజయం అందదు. కొన్ని ఒడిదుడుకులను అధిగమిస్తే కానీ పైకి వెళ్లలేరు. ఇలాంటి విషాదాలు మనల్ని ఒక్కసారిగా ఆపేస్తాయి. జీవితంలో మనకు ఏది ముఖ్యమనేది గుర్తు చేస్తాయి. కాబట్టి ఇప్పుడైనా మీ కుటుంబానికి కాస్త సమయం కేటాయించండి. నువ్వెలాంటి బట్టలు వేసుకున్నావు? ఎలా కనిపిస్తున్నావు? ఏం మాట్లాడావు? అనేది జనాలు గుర్తుపెట్టుకోరు. కానీ ఎదుటివారితో ఎలా ప్రవర్తిస్తున్నావు? కుటుంబాన్ని ప్రేమించండివారిని ఎంత స్పెషల్గా చూస్తున్నావనేదే గుర్తుపెట్టుకుంటారు. మీ కుటుంబం ఎంత విలువైనదో గ్రహించండి. జీవితంలో ఏదీ శాశ్వతం కాదు. భూమిపై ఉన్నన్నాళ్లూ మనం పీల్చుకునే ఊపిరి, పొందే ప్రేమ మాత్రమే శాశ్వతం. కాబట్టి వీలైతే క్షమించండి, సున్నితంగా మాట్లాడండి, ప్రేమగా ఉండండి అని చెప్పుకొచ్చింది. రాగేశ్వరి లూంబ్.. ఆంఖెన్, మై ఖిలాడీ తు అనారీ, దిల్ కిత్నా నడాన్ హై వంటి పలు చిత్రాల్లో నటించింది. దునియా, ప్యార్ కా రంగ్, సచ్ కా సాత్ వంటి ఎన్నో పాటలు పాడింది.విమానయానం విషాదం..అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఎయిరిండియా విమానం జూన్ 12న మెడికల్ కాలేజీపై కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న ఓ వ్యక్తి తప్ప అందరూ సజీవ సమాధి అయ్యారు. అలాగే మెడికల్ కాలేజీ క్యాంటీన్లో భోజనం చేస్తున్న పలువురు మృతి చెందగా కొందరికి తీవ్రగాయాలయ్యాయి. View this post on Instagram A post shared by Raageshwari 🌏 (@raageshwariworld)చదవండి: ప్రభాస్.. ఇద్దరు హీరోయిన్లు కావాలన్నాడు: మారుతి -
ఈ ఏడాదిలోనే జాన్వీ పెళ్లి.. జ్యోతిషుడి కామెంట్స్
సినిమా సెలబ్రిటీలు ప్రేమ, పెళ్లి అనేది ఇంట్రెస్టింగ్ టాపిక్. దీని గురించి ఏ చిన్న రూమర్ వినిపించినా సరే అభిమానులు ఎగ్జైట్ అవుతుంటారు. కొన్నిసార్లు కొందరు జ్యోతిషులు.. పలువురు నటీనటుల భవిష్యత్ గురించి అంచనా వేసి చెబుతుంటారు. కొన్నిసార్లు ఇది నిజమైతే, కొన్నిసార్లు ఇది జరగదు. గతంలో వేణుస్వామి ఎంత రచ్చ చేశారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు బాలీవుడ్లోనూ సుశీల్ కుమార్ అనే జ్యోతిషుడు.. హీరోయిన్ జాన్వీ కపూర్ పెళ్లి గురించి కామెంట్స్ చేశాడు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 22 సినిమాలు రిలీజ్)సిద్ధార్థ్ కన్నన్ యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడిన సదరు జ్యోతిషుడు.. జాన్వీ కపూర్ కెరీర్ 2026లో మంచి స్థాయికి వెళ్తుందని చెప్పారు. అలానే ఈ ఏడాదిలోనే జాన్వీ పెళ్లి చేసుకుంటుందని, ఒకవేళ లేదంటే మాత్రం 33 ఏళ్లకు ఆమెకు వివాహం జరుగుతుందని అంచనా వేశాడు. ఓవైపు ఆమె వైవాహిక జీవితం సాఫీగా ఉంటుందని చెబుతూన.. గ్రహాగతుల వల్ల కొన్ని ఇబ్బందులు కూడా తలెత్తే అవకాశముందని అభిప్రాయపడ్డాడు.ఏదేమైనా ఇప్పుడు జ్యోతిషుడు సుశీల్ కుమార్ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. జాన్వీ కపూర్కి బాయ్ ఫ్రెండ్ ఉన్నమాట నిజమే. గతంలో ఇతడితోనే పలుమార్లు తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకుంది. గతంలో ఓసారి మాట్లాడుతూ.. తాను పెళ్లి చేసుకుని తిరుపతిలోనే సెటిల్ కావాలనుకుంటున్నానని జాన్వీ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈమె చేతిలో రామ్ చరణ్ 'పెద్ది', బన్నీ-అట్లీ ప్రాజెక్ట్ తదితర క్రేజీ మూవీస్ ఉన్నాయి. ఇలాంటి టైంలో పెళ్లి చేసుకుంటుందా అంటే కచ్చితంగా లేదని చెప్పొచ్చు. మరి సదరు జ్యోతిషుడు ఏ అంచనాతో చెప్పాడో ఏమో?(ఇదీ చదవండి: 'ది రాజాసాబ్' టీజర్ రిలీజ్.. భయపెట్టడమే కాదు) -
సీక్రెట్ చెప్పిన శోభిత.. ట్రోలర్స్కు కౌంటర్?
కింగ్ అక్కినేని నాగార్జున (Nagarjuna Akkineni) తీరిక లేకుండా వరుస పనులతో బిజీగా ఉన్నాడు. గతేడాది చివర్లో పెద్ద కొడుకు నాగచైతన్య పెళ్లి చేశాడు. ఆ తర్వాత షూటింగ్స్లో మునిగాడు. ఈ నెలలో (జూన్ 6న) చిన్నకుమారుడు అఖిల్ వివాహం జరిపించాడు. అతడు ప్రేమించిన అమ్మాయి జైనబ్ రవ్జీతోనే ఘనంగా పెళ్లి జరిపించి ఆమెను చిన్న కోడలిగా స్వీకరించాడు. పెళ్లి సింపుల్గా అయిపోయినా రిసెప్షన్ మాత్రం ఎంతో ఘనంగా జరిగింది. అందంగా ముస్తాబైన శోభితతాజాగా చై సతీమణి, హీరోయిన్ శోభిత ధూళిపాళ (Sobhita Dhulipala) జూన్ ముచ్చట్లు అంటూ కొన్ని ఫోటోలు షేర్ చేసింది. అందులో అఖిల్ పెళ్లి సెలబ్రేషన్స్లో తను ముస్తాబైన పిక్స్ను పంచుకుంది. ఓ ఫోటోలో ఆరెంజ్ డ్రెస్లో శోభిత చాలా అందంగా మెరిసిపోగా.. మరోదాంట్లో మామ నాగార్జునను ఆత్మీయంగా హత్తుకుంది. అలాగే బరాత్ కోసం ఏర్పాటు చేసిన డీజే ఫోటోను కూడా యాడ్ చేస్తూ ఫుల్గా ఎంజాయ్ చేశామని చెప్పకనే చెప్పింది.ట్రోలర్స్కు కౌంటర్?పనిలో పనిగా ఓ సీక్రెట్ చెప్పింది. నా సీక్రెట్ ఏంటో తెలుసా? ఎవరేమనుకుంటున్నారు? అసలేం జరుగుతుందనేది పట్టించుకోకపోవడమే అని కృష్ణమూర్తి చెప్పిన మాటను యథాతథంగా పొందుపరిచింది. అఖిల్ పెళ్లిలో శోభిత లుక్పై చాలానే ట్రోల్స్ వచ్చాయి. తను.. నాగచైతన్య పక్కన భార్యలా కాదు, ఆంటీలా ఉందని కొందరు నెగెటివ్ కామెంట్లు చేశారు. తన డ్రెస్సింగ్ స్టైల్, లుక్పైనా విమర్శలు వచ్చాయి. వాటన్నింటికీ కౌంటర్గానే ఐ డోంట్ కేర్ అనే సందేశాన్ని యాడ్ చేసినట్లు తెలుస్తోంది. View this post on Instagram A post shared by Sobhita Dhulipala (@sobhitad)చదవండి: రూ.230 కోట్ల మూవీ.. డైలాగ్తో సహా కథంతా కాపీయే!: దర్శకుడి -
ఖరీదైన కారు కొనుగోలు చేసిన నటుడు.. తొలి ఇండియన్గా ఘనత!
ప్రముఖ బాలీవుడ్ నటుడు రామ్ కపూర్ ఖరీదైన కారును కొనుగోలు చేశారు. లగ్జరీ కార్ల బ్రాండ్లలో ఒకటైన లంబోర్గిని ఎస్ఈని తన సొంతం చేసుకున్నారు. ఈ ప్రత్యేక మోడల్ను కొనుగోలు చేసిన మొదటి భారతీయ నటుడిగా నిలిచారు. తన భార్య గౌతమి కపూర్తో కలిసి ఫోటోలకు పోజులిచ్చారు. ఈ కారు విలువ దాదాపు రూ.5.21 కోట్లకు పైగానే ఉంటుందని తెలుస్తోంది.ఈ లంబోర్గిని ఉరుస్ ఎస్ఈ మోడల్ కారును 2024లో అధికారికంగా భారతదేశంలో రిలీజ్ చేశారు. ఇప్పటి వరకు ఏ నటుడు ఈ కారును కొనలేదు. దీంతో మొదట ఈ లగ్జరీ కారు కొన్న నటుడిగా రామ్ కపూర్ నిలిచారు. రామ్ తన బ్రాండ్ న్యూ లంబోర్గిని కారుతో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. దీంతో ఇప్పటికే అతని వద్ద రామ్ పోర్స్చే , పోర్సే, ఫెరారీ , రేంజ్ రోవర్, మెర్సిడెస్ బెంజ్ వంటి కార్లను కూడా కలిగి ఉన్నారు.ఇక సినిమాల విషయానికొస్తే రామ్ కపూర్ ప్రస్తుతం వెబ్ సిరీస్ మిస్త్రీలో కనిపిస్తాడు. ఇది అమెరికన్ సిరీస్ ఆధారంగా తెరెకెక్కించారు. ఇందులో అతను డిటెక్టివ్ పాత్రలో కనిపించనున్నారు. ఈ వెబ్ సిరీస్ జూన్ 27 నుంచి జియో హాట్ స్టార్లో స్ట్రీమింగ్ కానుంది. అంతేకాకుండా గతేడాది యుధ్రా మూవీలోనూ మెరిశారు. View this post on Instagram A post shared by Auto Journal India (@autojournal_india) -
'భాయ్ ఇంకా మనతోనే ఉన్నారు'.. సుశాంత్ సోదరి ఎమోషనల్ పోస్ట్
ధోని మూవీలో అభిమానులను అలరించిన బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్. పలు బాలీవుడ్ చిత్రాల్లో నటించిన సుశాంత్ ఊహించని రీతిలో మృతి చెందారు. నేటికి సుశాంత్ మనకు దూరమై ఐదేళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా సుశాంత్ను గుర్తు చేసుకున్న అతని సోదరి శ్వేతా సింగ్ కీర్తి ఎమోషనల్ పోస్ట్ చేసింది. తనను చాలా మిస్సవుతున్నట్లు రాసుకొచ్చింది. భౌతికంగా మీరు లేకపోయినా మాతో పాటు అభిమానుల గుండెల్లో నిలిచి ఉన్నారంటూ ఎమోషనలైంది. శ్వేత ఇన్స్టాలో రాస్తూ..' మా అన్న జూన్ 14, 2020న ఈ లోక విడిచి వెళ్లిపోయారు. ఇప్పుడు సీబీఐ కోర్టుకు ఒక నివేదికను సమర్పించింది. దాని కోసం మేము ప్రయత్నిస్తున్నాం. కానీ ఈ రోజు నేను చెప్పాలనుకుంటున్న ఏమిటంటే.. ఏమి జరిగినా దేవునిపై విశ్వాసం కోల్పోకండి. మన సుశాంత్ జీవితాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. అతని చిరునవ్వు, చిన్నపిల్లవాడిలాంటి అమాయకత్వం ఎవరి హృదయాన్నైనా ప్రేమతో కదిలించగలదు. మన సుశాంత్ దేనికోసం నిలబడ్డారో.. మనం దానికోసం నిలబడాలి' అంటూ రాసుకొచ్చింది.'భాయ్ ఎక్కడికీ వెళ్లలేదు. అతను మీలో, నాలో, మనందరిలోనే ఉన్నాడు. మనం మరింత నేర్చుకోవాలనుకునే ప్రతిసారీ అతన్ని గుర్తు చేసుకుందాం. అతనికి ఇష్టం లేని నెగెటివ్ భావనను వ్యాప్తి చేయడానికి భాయ్ పేరును ఎప్పుడూ ఉపయోగించవద్దు. ఎందుకంటే సుశాంత్ దాని కోసం నిలబడలేదు. భాయ్ ఎంత మంది హృదయాలను ప్రభావితం చేశాడో చూడండి. అన్న పేరును నిలిచిపోయేలా చేయండి.' అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది.కాగా.. సుశాంత్ సింగ్ రాజ్పుత్ జూన్ 14, 2020న ముంబైలోని తన అపార్ట్మెంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాపు. ఆ తర్వాత కొందరు ఆత్మహత్యగా భావించారు. కానీ ఆయన కుటుంబం న్యాయం కోసం ఇప్పటికీ పోరాడుతోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన దాదాపు ఐదేళ్ల తర్వాత.. ఆరోపణలను నిరూపించడానికి ఎటువంటి ఆధారాలు లభించలేదని పేర్కొంటూ సీబీఐ నివేదికను కోర్టుకు సమర్పించింది. View this post on Instagram A post shared by Shweta Singh Kirti (@shwetasinghkirti) -
Bhool Chuk Maaf Review: తెల్లారితే పెళ్లి.. కానీ రోజు మారదు.. ఇదేం ట్విస్ట్!
ఈ రోజుల్లో తాము చేసిన తప్పుని తెలుసుకొని సరిదిద్దుకునే వాళ్ళు అరుదుగా ఉంటారు. చాలామంది భయం లేకుండానే తప్పులు చేస్తుంటారు. మరి తప్పు చేసినవాడికి తన తప్పు తెలుసుకోవడానికి చిన్న పాటి భయం కలిగిస్తే అన్న ఆలోచనతోనే రూపుదిద్దుకున్న సినిమా భూల్ చుక్ మాఫ్. కరణ్ శర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వర్ధమాన బాలివుడ్ నటుడు రాజ్కుమార్ రావు హీరోగా నటించారు. ఈ సినిమా కథ చాలా గమ్మత్తుగా ఉంటుంది. అంతే సరదాగా సినిమా అంతా సాగిపోతుంది కూడా.అంతలా కథలో ఏముందంటే... వారణాసి నగరానికి చెందిన తితిలి మిశ్ర, రంజన్ తివారి ప్రేమించుకుంటుంటారు. తితిలి తల్లిదండ్రులకు ఈ విషయం తెలిసి తమ కూతురుని రంజన్ పెళ్ళాడాలంటే గవర్నమెంట్ ఉద్యోగం తప్పని సరి అని కండిషన్ పెడతారు. ఇది విన్న రంజన్ హమీద్ అంసారీ అనే బ్రోకర్ ద్వారా దొంగ దారిలో గవర్నమెంట్ ఉద్యోగం త్వరగానే సంపాదిస్తాడు. ఇంకేముంది ఇరు కుటుంబాలు కలిసి ఇద్దరికీ పెళ్ళి చేయాలని ఓ తేదీని నిర్ణయిస్తాయి. రేపు పెళ్ళి అనగా ఈ రోజు నిద్ర లేచి నలుగు కార్యక్రమానికి రెడీ అవుతుంటాడు రంజన్. రోజంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా గడిపి రేపటి తన పెళ్ళి గురించి కలలు కంటూ మరుసటి రోజు నిద్ర లేస్తాడు.కాని ట్విస్ట్ ఏంటంటే మళ్ళీ నలుగు కార్యక్రమం రోజే రంజన్ నిద్ర లేస్తాడు. ఇలా ఎన్ని రోజులైనా అదే రోజు నిద్ర లేస్తూ ఉంటాడు. రంజన్ టైం లూప్ లో ఇరుక్కుపోయి ఇలా జరుగుతూ ఉంటుంది. ఏదో గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించి చక్కగా పెళ్ళి చేసుకుందామన్న సమయంలో ఈ సమస్య రంజన్ ను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. మరి రంజన్ ఈ టైం లూప్ నుండి బయటపడి పెళ్ళి చేసుకోగలుగుతాడా, అసలు ఇలాంటి సమస్య రంజన్ కు ఎందుకు వచ్చింది. ఇలాంటి ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరకాలంటే ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమ్ అవుతున్న భూల్ చుక్ మాఫ్ చూడాల్సిందే. ఈ సినిమా కథలో చిన్న కన్ఫ్యూజన్ ఉన్నా కామెడీతో దానిని ప్రేక్షకుడికి చక్కగా అర్ధమయ్యేలా తీశాడు దర్శకుడు. సినిమా ఆద్యంతం నవ్వులతో గిలిగింతలు పెడుతూ హాయిగా సాగుతుంది. వర్త్ ఫుల్ వాచ్ ఫర్ ది వీకెండ్. -
'స్క్విడ్ గేమ్ 3' హైస్పీడ్లో ఫైనల్ గేమ్ (ట్రైలర్)
నెట్ఫ్లిక్స్ వేదికగా విడుదలై ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ పొందిన కొరియన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ స్క్విడ్గేమ్ (Squid Game) నుంచి ఫైనల్ సీజన్ వచ్చేస్తుంది. 'స్క్విడ్ గేమ్ 3' ఫైనల్ గేమ్ పేరుతో తాజాగా ట్రైలర్ను విడుదల చేశారు. హ్యాంగ్ డాంగ్ హ్యుక్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదలైన రెండు సీజన్లు మంచి విజయాన్ని అందుకున్నాయి. జూన్ 27 నుంచి నెట్ఫ్లిక్స్ (Netflix) వేదికగా ఫైనల్ గేమ్ స్ట్రీమింగ్ కానున్నట్లు టీమ్ తెలిపింది. తెలుగుతో పాటు సుమారు పదికి పైగా భాషలలో విడుదల అవుతుంది.ఈ సిరీస్ ప్రపంచాన్నే ఓ ఊపు ఊపేసింది. గేమ్లో గెలిస్తే చాలు.. కలలో కూడా ఊహించలేనంత డబ్బు మీ సొంతం అనడంతో వందలాది మంది గేమ్ ఆడేందుకు వెళ్తారు. తీరా అక్కడికి వెళ్లాక గేమ్లో ఓడినవారి ప్రాణాలు తీస్తారు. తమ గెలుపు కోసం కొందరు ప్లేయర్స్ పక్కవారి ప్రాణాలు తీయడానికీ వెనకాడరు. చివరకు ఒకే ఒక్కరు విజేతగా నిలిచి డబ్బు గెలుచుకుంటారు. అలా ప్లేయర్ 456 ఓసారి గేమ్లో గెలిచి కోట్లాది ధనం పొందుతాడు.ఫస్ట్ సీజన్లో రెడ్ లైట్- గ్రీన్ లైట్ అని గేమ్ ఆడించిన ఓ బొమ్మను మరోసారి ఈ సీజన్లో ప్రవేశపెట్టారు. ఈ సారి గేమ్ మరింత క్రూరంగా ఉండనున్నట్లు కనిపిస్తోంది. ప్లేయర్ 456.. పాశవికమైన ఆట ఆడిస్తున్న వ్యక్తిని నేరుగా కలిసినట్లు చూపించారు. మరి అతడు ఈ ఆటను ఆపగలిగాడా? లేదా? అనేది తెలియాలంటే ఈ నెలాఖరులో స్క్విడ్ గేమ్ చివరి సీజన్ చూసేయాల్సిందే! -
పాకిస్తాన్లో 'దంగల్' ఎందుకు రిలీజ్ చేయలేదో చెప్పిన ఆమిర్ ఖాన్
బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్( Aamir Khan) నటించిన 'దంగల్' చిత్రం 2016లో విడుదలైంది. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ఈ మూవీని రిలీజ్ చేశారు. కానీ, పాకిస్తాన్లో భారత సినిమాలకు పెద్ద మార్కెట్ ఉంది. అయితే, దంగల్ చిత్రాన్ని పాక్లో ఎందుకు విడిదల చేయలేదో తాజాగా ఆ చిత్ర నటుడు ఆమిర్ ఖాన్ వెళ్లడించారు. రెజ్లర్ మహవీర్ ఫోగట్ జీవితకథతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 2,070 కోట్లు రాబట్టింది. నితేష్ తివారీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.దంగల్ పాకిస్తాన్లో ఎందుకు విడుదల కాలేదో ఆమిర్ ఖాన్ ఇలా చెప్పారు. 'పాక్లో దంగల్ విడుదల కావాలంటే వారు రెండు షరతులు పెట్టారు. మన జాతీయ గీతం, జాతీయ జెండాను మూవీ నుంచి తొలగించాలని అక్కడి సెన్సార్ బోర్డు కోరింది. నేను అందుకు అంగీకరించలేదు. గీతా ఫోగట్ మ్యాచ్ గెలిచిన సన్నివేశంలో భారత జెండాతో పాటు జాతీయ గీతం ఉంటుంది. వాటిని తొలగిస్తినే ఈ చిత్రానికి అనుమతి ఉంటుందని పాక్ సెన్సార్ చెప్పింది. దీంతో ఒక సెకనులోపు, మా సినిమా పాకిస్తాన్లో విడుదల కాదని నేను వారికి చెప్పాను. పాకిస్తాన్ విడుదలను రద్దు చేయడం వల్ల తమ వ్యాపారంపై ప్రతికూల ప్రభావం పడుతుందని నిర్మాతలు నాతో చెప్పారు. అయినప్పటికీ, భారతదేశానికి వ్యతిరేకంగా ఉన్న దేనికీ మద్దతు ఇవ్వకూడదని స్పష్టంగా ఆరోజే చెప్పాను.ఏప్రిల్లో జరిగిన పహల్గాం దాడికి 'ఆపరేషన్ సిందూర్' పేరుతో పాక్పై భారత్ ప్రతీకారం తీర్చుకున్న విషయం తెలిసిందే. ఆ సమయంలో పాక్ నటీనటులను బ్యాన్ చేయాలని ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ కోరింది. దీంతో వారిని పూర్తిగా భారత్లో నిషేధించారు. -
రెండు గంటలు... ఏడు ప్రాజెక్ట్లు!
ఎనిమిది పదుల వయసులో ఎంతో చురుకుగా సినిమాలు, వాణిజ్య ప్రకటనలు, టీవీ షోలు చేస్తూ బిజీ బిజీగా ఉంటున్నారు అమితాబ్ బచ్చన్. వేగంగా పని చేయడం తనకు ఇష్టం అంటున్నారు ఈ బిగ్ బి. అందుకు ఉదాహరణగా ఇటీవల తాను రెండు గంటల్లో ఏడు ప్రాజెక్ట్లు (ఐదు వాణిజ్య ప్రకటనలు, రెండు ఫొటోషూట్లు) చేసిన విషయం గురించి చెప్పారు. ‘‘ఈ మధ్య నేను రెండు గంటల్లో ఏడు ప్రాజెక్ట్లు చేయడంతో నా డైరెక్టర్ ఫ్రెండ్ ఒకరు ‘ఇలా పని చేయడం సరి కాదు.ఒక్క రోజులో పూర్తి చేయాల్సిన పనిని నువ్వు రెండు గంటల్లో పూర్తి చేస్తే ఎలా? నువ్వు పని వి«ధానాన్నిపాడు చేస్తున్నావు. ఇలా చేస్తే క్లైంట్లు ఒకే రోజులో ఎక్కువ ప్రాజెక్ట్లు చేయమంటారు. అది కరెక్ట్ కాదు’ అని చమత్కారంగా అన్నాడు. ఆ మాటలు నాకు చాలా ఆనందాన్నిచ్చాయి. నాకు ఇలా స్పీడ్గా పని చేయడం ఇష్టం’’ అని పేర్కొన్నారు అమితాబ్ బచ్చన్. -
పూర్ణ పెళ్లిరోజు.. శుభశ్రీ హల్దీ.. మెహరీన్ చిల్ మోడ్..
యూట్యూబ్లో హల్దీ సెలబ్రేషన్స్ వీడియో షేర్ చేసిన బిగ్బాస్ బ్యూటీ శుభశ్రీనో క్యాప్షన్ అంటున్న నటి కీర్తి భట్ వెకేషన్లో ప్రియా వారియర్పెళ్లిరోజు సెలబ్రేట్ చేసుకున్న పూర్ణ View this post on Instagram A post shared by PRUDHVI RAJ (@portraitsbyprudhviraj) View this post on Instagram A post shared by Keerthi Keshav Bhat (@keerthibhatofficial) View this post on Instagram A post shared by Shamna Kkasim ( purnaa ) (@shamnakasim) View this post on Instagram A post shared by Priya Prakash Varrier✨ (@priya.p.varrier) View this post on Instagram A post shared by Nidhi Agarwal (@nidhiagarwal_) View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) View this post on Instagram A post shared by Shraddha ✶ (@shraddhakapoor) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) -
'క్షీణించిన బిగ్బాస్ విన్నర్ ఆరోగ్యం.. అలా జరగకూడదని కోరుకుంటున్నా'
బాలీవుడ్ నటి, బిగ్బాస్ విన్నర్ సనా మక్బుల్ ఆస్పత్రిలో చేరింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించింది. లివర్ సైరోసిస్ అనే వ్యాధితో సనా పోరాడుతోంది. ఇటీవల సనా హాస్పిటల్ బెడ్పై ఫోటోను పోస్ట్ చేయడంతో ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే సనా ఐదేళ్లుగా ఆటో ఇమ్యూన్ హెపటైటిస్తో బాధపడుతోంది. గతంలోనే చికిత్స తీసుకున్నప్పటికీ ఏమాత్రం మెరుగవ్వలేదని తెలుస్తోంది.తన ఆరోగ్యంపై సనా మాట్లాడుతూ.. 'నేను కొంతకాలంగా ఆటో ఇమ్యూన్ హెపటైటిస్తో బాధపడుతున్నా. కానీ ఇటీవల పరిస్థితులు మరింత దిగజారాయి. నా రోగనిరోధక వ్యవస్థ మెరుగ్గా లేదు. నా కాలేయంపై దాడి చేయడం ప్రారంభించింది. ప్రస్తుతం నాకు లివర్ సిర్రోసిస్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. కానీ నేను బలంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నా. ఇమ్యునోథెరపీని ప్రారంభించానని.. ప్రస్తుతం కోలుకోవడంపై దృష్టి సారించానని' ఆమె తెలిపింది.అయితే వైద్యులు కాలేయ మార్పిడి అవసరం రాకుండా చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని సనా తెలిపింది కొన్ని రోజులు కష్టమైన సరే కోలుకునేందుకు ప్రయత్నిస్తానని వెల్లడించింది. ఇది అంత సులభం కాదని.. కానీ నేను అంత తేలికగా వదిలిపెట్టనని సనా మక్బుల్ అన్నారు. ప్రస్తుతం నెమ్మదిగా నడుస్తున్నానని తెలిపింది. ఈ పరిస్థితి తనను శారీరకంగా, మానసికంగా ప్రభావితం చేసిందని చెప్పింది.కాగా.. సనా మక్బుల్ బిగ్బాస్ ఓటీటీ సీజన్-3 విన్నర్గా నిలిచింది. తెలుగులో దిక్కులు చూడకు రామయ్యా, మామ ఓ చందమాల చిత్రాల్లో నటించింది. బాలీవుడ్లో పలు సీరియల్స్తో పాటు సినిమాల్లోనూ నటించింది. -
లగ్జరీ ఫ్లాట్లను అమ్మేసిన స్టార్ హీరో.. ఎన్ని కోట్లు వచ్చాయంటే?
బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ ప్రస్తుతం వార్-2 మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా.. డబ్బింగ్ పనులు జరుగుతున్నాయి. ఈ చిత్రంలో యంగ్ టైగర్ జూనియర్ కూడా నటించారు. ఈ మూవీ ద్వారానే బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ భారీ యాక్షన్ చిత్రం ఆగస్టు 15న థియేటర్లలో సందడి చేయనుంది.అయితే సినిమాల సంగతి పక్కనపెడితే హృతిక్ రోషన్ ఆయన తండ్రితో కలిసి ఖరీదైన మూడు ఫ్లాట్లను అమ్మేసినట్లు తెలుస్తోంది. ముంబయిలోని ఆంధేరి వెస్ట్లో ఉన్న మూడు రెసిడెన్షియల్ ఫ్లాట్లను దాదాపు రూ.6.75 కోట్లకు విక్రయించారు. ఈ ఆస్తులు ముంబైలోని అంధేరి శివారులోనే ఉండగా.. వాటిలో రెండు ఆయన తండ్రి రాకేశ్ రోషన్వి కాగా.. మూడో ఫ్లాట్ హృతిక్ రోషన్కు చెందినదిగా సమాచారం.మరోవైపు హృతిక్ రోషన్ క్రిష్-4 మూవీ తీసేందుకు రెడీ అవుతున్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ను రాకేశ్ రోషన్ నిర్మించనున్నారు. ఈ సినిమాకు హృతిక్ దర్శకత్వం వహించనున్నారు. ఇటీవల పాప్ స్టార్ జాక్సన్ వాంగ్ రోషన్ దంపతులను వారి నివాసంలో కలిశారు. అతను క్రిష్ 4లో భాగం అవుతానని ఇప్పటికే ధృవీకరించారు. దీంతో ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. అయితే క్రిష్-4 ఇంకా సెట్స్పైకి వెళ్లాల్సి ఉంది. -
అహ్మదాబాద్ ఘటన.. ఎయిరిండియాపై ప్రియాంక చోప్రా సిస్టర్ ఆగ్రహం!
అహ్మదాబాద్ విమానం ప్రతి ఒక్కరినీ కదిలిస్తోంది. మనిషి ప్రాణాలు పోవడానికి ఒక్క సెకను చాలు అనేది కళ్లముందు కనిపిస్తోంది. ఈ విషాద ఘటన తర్వాత దేశవ్యాప్తంగా ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. అయితే ఈ ఘటన తర్వాత పలువురు విమానం ఎక్కాలంటేనే ఆలోచించే పరిస్థితి ఎదురవుతోంది. విమాన ప్రయాణం ఇంత విషాదంగా మారడంతో భద్రతపై ప్రతి ఒక్కరిలో అనుమానాలు మొదలయ్యాయి.ఈ ప్రమాదం జరిగిన వెంటనే పలువురు టికెట్స్ రద్దు చేసుకున్నారు. అందులో బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా కజిన్ సిస్టర్ మీరా చోప్రా భర్త కూడా ఉన్నారు. ఆమె భర్త ఈనెల 15న దుబాయ్కు ఎయిరిండియా విమానంలో వెళ్లాల్సి ఉంది. అహ్మదాబాద్ ప్రమాదం తర్వాత భద్రతపై నమ్మకం లేకపోవడంతో టికెట్ రద్దు చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు మీరా చోప్రా తెలిపింది. అయితే ఎయిరిండియా తమ టికెట్ డబ్బులను వెనక్కి ఇచ్చేందుకు నిరాకరించిందని ట్విటర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎయిర్లైన్స్ సిబ్బంది తీరుపై మీరా చోప్రా తీవ్ర నిరాశను వ్యక్తం చేసింది.మీరా చోప్రా ట్వీట్లో రాస్తూ.. 'ఎయిరిండియా తీరు చాలా దిగ్భ్రాంతికరంగా ఉంది. నా భర్త జూన్ 15న ఎయిరిండియాలో దుబాయ్కు ప్రయాణించాల్సి ఉంది. భద్రతా చర్యలు తీసుకోకపోవడంతో మేము ప్రయాణం రద్దు చేసుకోవాలనుకున్నాం. కానీ ఎయిర్ ఇండియా వారికి ఎటువంటి సలహా రాలేదని పేర్కొంటూ టికెట్ ధర మొత్తాన్ని తిరిగి చెల్లించడానికి నిరాకరించింది. ఎయిర్ ఇండియాను నడపడంలో మేమందరం గర్వపడ్డాం. ఎందుకంటే ప్రముఖ టాటా గ్రూప్ నడుపుతున్న మన జాతీయ విమానయాన సంస్థ. కానీ ఈ రోజు ఏమి జరిగిందో మనం చూశాం. ఇప్పుడు వారు విమానాలు ఎలా నిర్వహిస్తున్నారో తీవ్ర నిరాశపరిచింది. ఈ ఘటన వారికి సిగ్గుచేటు. ఈ ఘటనలో 241 మంది ప్రాణాలు కోల్పోయారు. కానీ ఎయిరిండియా వీటిని అస్సలు పట్టించుకోదు' అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.అయితే మీరా చోప్రా టికెట్ రీఫండ్ చేయమని అడగడంపై నెటిజన్లు ట్రోల్ చేశారు. టికెట్ రద్దు విధానాన్ని ముందుగా చదుకోవాలని ఆమెకు సలహాలిచ్చారు. నిబంధనల ప్రకారం మీరు విమాన సమయాన్ని మార్చినట్లయితే రద్దు చేసి డబ్బులిస్తారని ఓ నెటిజన్ రాసుకొచ్చాడు. నిబంధనలకు విరుద్ధంగా మీ సొంత కారణాలతో టికెట్ రద్దు చేసుకుంటే డబ్బులు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదని మరో నెటిజన్ మీరాకు కౌంటరిచ్చారు. కాగా.. గురువారం జరిగిన ఎయిరిండియా ప్రమాదంలో ఒక్కరు మినహా 241 అందరూ ప్రాణాలు కోల్పోయారు. #AirIndia insensitivity is beyond shocking..My husband is scheduled to travel to Dubai on 15th June on @airindia and we wanted to cancel the flight due to the lack of safety measures. But Air India declined to refund any amount citing no advisory has come to them. We all took…— Meerraa Chopraa (@MeerraChopra) June 12, 2025 -
శూర్పణఖగా ప్రియాంక అవుట్.. రకుల్తో డీల్?
ప్రస్తుతం తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రాల్లో రామాయణ్ (Ramayan Movie) ఒకటి. రణ్బీర్ కపూర్ రాముడిగా, సౌత్ స్టార్ హీరోయిన్ సాయిపల్లవి సీతగా నటిస్తోంది. కన్నడ స్టార్ యశ్ రావణుడి పాత్ర పోషిస్తున్నాడు. నితేశ్ తివారీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇదివరకే మొదలైంది. వచ్చే ఏడాది దీపావళికి తొలి భాగాన్ని, 2027లో రెండో భాగాన్ని రిలీజ్ చేయాలని మేకర్స్ ఆలోచిస్తున్నారు.ప్రియాంక అవుట్తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం ఫిల్మీదునియాలో చక్కర్లు కొడుతోంది. రావణుడి చెల్లెలు శూర్పణఖ పాత్ర కోసం స్టార్ హీరోయిన్లను సంప్రదించారట! మొదట ఈ అవకాశం గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రాను వరించిందట. కానీ, తన చేతిలో ఉన్న ప్రాజెక్టులతో ఆమె ఫుల్ బిజీగా ఉందట. దీంతో రామాయణ్ చిత్రయూనిట్.. ప్రియాంకను వదిలేసి రకుల్ ప్రీత్ సింగ్ను శూర్పణఖ పాత్ర కోసం సంప్రదించినట్లు తెలుస్తోంది. ఇంత పెద్ద ప్రాజెక్టులో భాగం కావడం కంటే సంతోషం ఇంకేముంటుందని రకుల్ వెంటనే రామాయణ్కు ఓకే చెప్పినట్లు భోగట్టా!రామాయణ్..ఈ క్రమంలో ఆమెకు లుక్ టెస్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం. మరి ఇదెంతవరకు నిజమన్నది తెలియాల్సి ఉంది. రామాయణ్ విషయానికి వస్తే సన్నీ డియోల్ హనుమంతుడిగా, లారా దత్తా కైకేయిగా కనిపించనున్నారు. ఇక ప్రియాంక చోప్రా.. ప్రస్తుతం రాజమౌళి- మహేశ్బాబు (SSMB29) సినిమాతో బిజీగా ఉంది. అటు రకుల్.. చివరగా మేరే హజ్బెండ్ కీ బీవీ మూవీలో కనిపించింది. ప్రస్తుతం ఇండియన్ 3, దేదే ప్యార్ దే 2 చిత్రాల్లో నటిస్తోంది.చదవండి: కూతురి బర్త్డే సెలబ్రేట్ చేసిన బ్యూటీ.. ఎవరో గుర్తుపట్టారా? -
కూతురి బర్త్డే సెలబ్రేట్ చేసిన బ్యూటీ.. ఎవరో గుర్తుపట్టారా?
సెలబ్రిటీలు అందం విషయంలో తీసుకునే జాగ్రత్తలు అంతా ఇంతా కావు. పిల్లల పక్కన నిల్చుంటే వారికి అక్కలానో, అన్నలానో ఉంటున్నారు తప్ప పేరెంట్స్లా మచ్చుకైనా కనిపించడం లేదు. ఇక్కడ కనిపిస్తున్న బ్యూటీ కూడా అంతే! ఇంతకీ కూతురి బర్త్డేకు కేక్ కట్ చేయించి తనకు ప్రేమగా తినిపిస్తున్న ఈ హీరోయిన్ను గుర్తుపట్టారా?ఫేమస్ సాంగ్..తెలుగులో ఓ ఫేమస్ పాటతో ఓ ఊపు ఊపేసింది. ప్రేమ.. ఓ ప్రేమ.. వచ్చావా ప్రేమ.. అనుకుంటేనే ఉన్నా రామ్మా.. అంటూ ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. ఆవిడే మహిమ చౌదరి (Mahima Chaudhry). శ్రీకాంత్, జగపతిబాబు నటించిన 'మనసులో మాట' సినిమాలోనిదే ఈ పాట. ఎక్కువగా హిందీ సినిమాలే చేసిన మహిమ 2016 తర్వాత వెండితెరపై కనిపించనేలేదు. కానీ, 8 ఏళ్ల తర్వాత ద సిగ్నేచర్ అనే హిందీ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చింది. ఈ ఏడాది వచ్చిన ఎమర్జెన్సీ, నడానియన్ వంటి చిత్రాల్లో కీలక పాత్ర పోషించింది. తాజాగా ఆమె సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేసింది. కూతురి బర్త్డే..తన కూతురు అరియానా పుట్టినరోజు సెలబ్రేషన్స్ను అభిమానులతో పంచుకుంది. హ్యాపీ బర్త్డే మై బేబీ అని క్యాప్షన్ జోడించింది. ఇక ఈ వీడియోలో తల్లి చేతుల్ని పట్టుకుని నమస్కరించింది అరియానా. ఆ తర్వాతే క్యాండిల్స్ ఊది కేక్ కట్ చేసింది. ఇది చూసిన అభిమానులు.. మహిమ అసలు తల్లిలా కాదు, ఆమెకు అక్కలా కనిపిస్తోంది అని కామెంట్లు చేస్తున్నారు.అందమైన కూతురుఅరియానా ఇటీవలే తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. తనను చాలా మంది అయితే హాలీవుడ్ నటి సెలీనా గోమెజ్తో లేదంటే పాతకాలం నాటి అమూల్ యాడ్లో కనిపించే అమాయకపు అమ్మాయితో పోలుస్తారు. షారూఖ్ ఖాన్ పర్దేశ్ సినిమాతో కెరీర్ ఆరంభించిన మహిమా 35కు పైగా సినిమాలు చేసింది. 2022లో రొమ్ము క్యాన్సర్ బారిన పడగా.. ఆత్మస్థైర్యంతో దాన్ని జయించింది. View this post on Instagram A post shared by Mahima Chaudhry (@mahimachaudhry1) చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 22 సినిమాలు -
తెలుగు నిర్మాతపై కాస్టింగ్ కౌచ్ కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన నటి
ఈ ఏడాది ప్రారంభంలో ‘దంగల్’ నటి ఫాతిమా సనా షేక్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. దక్షిణ చిత్ర పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ వల్ల ఇబ్బంది పడ్డానని చెప్పింది. హైదరాబాద్కు చెందిన కొందరు ఏజెంట్లు ఛాన్స్లు ఇప్పిస్తానంటూనే 'ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారా..?' అని అడిగినట్లు తెలిపింది. ఆపై కొందరు టాలీవుడ్ నిర్మాతలు కూడా తనని పరోక్షంగా అలాంటి ప్రశ్నలే వేశారని చెప్పింది. ఆ సమయంలో ఆమె చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేగాయి. అయితే, తాజాగా మరోసారి ఫాతిమా రియాక్ట్ అయ్యారు.దక్షిణాదిలో తాను క్యాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నట్లు గతంలో చెప్పిన మాటలు నిజమేనని మరోసారి 'దంగల్' నటి ఫాతిమా పేర్కొంది. కానీ, తను చేసిన వ్యాఖ్యలను కొందరు తప్పుగా అర్ధం చేసుకున్నారని తెలిపింది. ఒక వ్యక్తి వల్ల మాత్రమే తాను ఇబ్బంది ఎదుర్కొన్నానని క్లారిటీ ఇచ్చింది. అతను ఒక ఏజెంట్ కావచ్చు లేదా చిన్న నిర్మాత కావచ్చని చెప్పింది. కానీ, దక్షిణాది చిత్ర పరిశ్రమ మొత్తాన్ని తాను తప్పుపట్టలేదని స్పష్టత ఇచ్చింది. ఒకరి గురించి చెప్పిన మాటలను కొందరు అదేపనిగా అక్కడి పరిశ్రమ మొత్తాన్ని ఆపాదిస్తూ ప్రచారం చేయడం చాలా తప్పని పేర్కొంది. ' కాస్టింగ్ కౌచ్ అనేది ప్రతి పరిశ్రమలో ఉంది. అనేక రంగాలలో కూడా ఇలాంటి వాతావరణమే ఉంది. దారి వెంట వెళ్తున్న ఒక స్త్రీని అదేపనిగా చూస్తూ ఆమెను తప్పుగ చూసే వారు ఎందరో ఉన్నారు. వాటిని దాటుకుని నేటి మహిళ ముందుకు వెళ్తుంది.' అని ఆమె చెప్పింది.ఫాతిమా గతంలో ఏం చెప్పిందంటే..అమిర్ ఖాన్ నటించిన దంగల్ మూవీతో నటి ఫాతిమాకు మంచి గుర్తింపు వచ్చింది. గీతా ఫోగట్ పాత్రలో ఆమె అదరగొట్టేసింది. 2015లో ఆమె తెలుగులో నటించిన ‘నువ్వు నేను ఒకటవుదాం’ చిత్రం విడుదలైంది. ఆ మూవీ తర్వత మరో సినిమా చేస్తున్న క్రమంలోనే ఒక నిర్మాత నుంచి కాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నట్లు గతంలో ఇలా చెప్పింది. ' హైదరాబాద్లో నేను చిన్నస్థాయి నిర్మాతలను కలుసుకున్నాను. ఒక హౌటల్లో దిగాను. ఆ నిర్మాతలు కాస్టింగ్ కౌచ్ గురించి నాతో మాట్లాడారు. నీకు అవకాశం ఇవ్వాలంటే మేము చెప్పిందల్లా చేయాలని అన్నాడు. నేను కాదని చెప్పడంతో ఆ నిర్మాత నన్ను తదేకంగా చూస్తూ ఉండిపోయాడు. చాలా అసభ్యకరంగా క్యాస్టింగ్ కౌచ్ గురించి పచ్చిగానే అడిగేశాడు. ఇంకోకరు అదే విషయాన్ని డైరెక్ట్గా చెప్పకపోయినా.. వారు చెప్పినదాని అర్థం ఏమిటో స్పష్టంగా అర్థమైంది. ఒకప్పుడు బాలీవుడ్లో మంచి పాత్రలు రావడానికి సౌత్ సినిమా మొదటి అడుగు అని తాను నమ్ముతాను. కానీ, నాకు ఇలా జరుగుతుందని అనుకోలేదు.' అని ఆమె గతంలో వెల్లడించింది. -
విషాదం.. పోలో ఆడుతూ హీరోయిన్ మాజీ భర్త హఠాన్మరణం!
బాలీవుడ్లో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటి కరిష్మా కపూర్(Karisma Kapoor) మాజీ భర్త సంజయ్ కపూర్(53) గుండెపోటుతో మృతి చెందాడు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారంలో .. ఇంగ్లాండ్లో సంజయ్ పోలో అడుతుండగా నోట్లోకి అకస్మాత్తుగా ఒక తేనెటీగ దూరిందట. దీనివల్ల తీవ్రమైన అలెర్జీ రియాక్షన్ వచ్చి, ఆయనకు ఊపిరాడలేదు. ఈ పరిస్థితి గుండెపోటుకు దారితీసిందని సమాచారం. వెంటనే ఆటను నిలిపివేసి, ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.సంజయ్ కపూర్ ఇండియాలో ప్రముఖ వ్వ్యాపారవేత్తలలో ఒకరు. 2003లో కరిష్మాని వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు. కొన్నాళ్ల తర్వాత ఇద్దరి మధ్య విభేధాలు వచ్చాయి. దీంతో ఇద్దరు 2014లో విడాకులకు దరఖాస్తు చేయగా.. 2016లో విడాకులు మంజూరు అయ్యాయి. ఆ తర్వాత మోడల్, నటి ప్రియా సచ్దేవ్ను సంజయ్ పెళ్లాడారు. కరిష్మా మాత్రం ఒంటరిగానే ఉంటోంది. -
అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. 12th ఫెయిల్ నటుడి ఇంట్లో విషాదం
అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన 12th ఫెయిల్ నటుడు విక్రాంత్ మాస్సేకు తీవ్ర విషాదం మిగిల్చింది. ఇదే ఫ్లైట్లో తన బంధువు మృతి చెందినట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తన మామయ్య అయిన క్లిఫర్డ్ కుందర్ కుమారుడు క్లైవ్ కుందర్ మరణించాడని విక్రాంత్ తన బాధను వ్యక్తం చేశారు. విక్రాంత్ తన బంధువు మృతికి సంతాపం తెలుపుతూ ఇన్స్టా స్టోరీస్లో పోస్ట్ చేశారు. ఈ ప్రమాద బాధిత కుటుంబాలందరికీ తన సానుభూతిని తెలియజేశారు.విక్రాంత్ మాస్సే ఇన్స్టాలో రాస్తూ..' "ఈరోజు అహ్మదాబాద్లో జరిగిన ఊహించలేని విషాదం జరిగింది. విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను చూసి నా హృదయం ముక్కలైంది. ఈ ఘటనలో మా మామ క్లిఫోర్డ్ కుందర్ తన కుమారుడు క్లైవ్ కుందర్ను కోల్పోయారని తెలిసి మరింత బాధగా ఉంది. ఎందుకంటే అతను ఈ విమానంలో పనిచేస్తున్న మొదటి అధికారి" అని రాసుకొచ్చారు.కాగా.. గురువారం మధ్యాహ్నం 242 మంది ప్రయాణికులతో లండన్ బయలు దేరిన ఎయిర్ ఇండియా బోయింగ్ 787 డ్రీమ్లైనర్ విమానం బయలుదేరిన కొద్ది నిమిషాలకే కూలిపోయింది. ఈ ప్రమాదంలో 241 మంది ప్రాణాలు కోల్పోగా.. రమేశ్ విశ్వాస్ కుమార్ అనే వ్యక్తి మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటనలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా మరణించారు. -
అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. సినీ తారల దిగ్భ్రాంతి
అహ్మదాబాద్ విమాన ప్రమాదం బాలీవుడ్ సినీతారలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ విషాద ఘటన తనను షాక్కు గురి చేసిందని స్టార్ హీరో అక్షయ్ కుమార్ అన్నారు. ఇలాంటి సమయంలో వారందరి కుటుంబాల కోసం మనందరం ఆ దేవుడిని ప్రార్థించాలని ట్వీట్ చేశారు. ఈ ప్రమాదం మరో నటుడు రితేశ్ దేశ్ముఖ్ సైతం స్పందించారు. విమాన ప్రమాదం గురించి విని తన గుండె పగిలిందని అన్నారు. ఈ కష్ట సమయంలో ప్రయాణీకులందరికీ, వారి కుటుంబాలకు అండగా నిలవాలని కోరారు.ఈ ఘటనపై యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో బాధితుల కోసం దేవుడిని ప్రార్థిస్తున్నట్లు పోస్ట్ చేశారు. ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న రణదీప్ హుడా ఈ ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని అన్నారు. వారంతా క్షేమంగా ఉండాలని ఆ దేవుడిని ప్రార్థించాలని కోరారు. ఈ విషాద సమయంలో వారి కుటుంబాలకు అండగా నిలవాలని పోస్ట్ చేశారు. ఈ విషాద సంఘటన గురించి తెలుసుకున్న సన్నీ డియోల్ విచారం వ్యక్చం చేశారు. ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని.. ఈ సమయంలో వారి కుటుంబాలు ధైర్యంగా ఉండాలని కోరారు.అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం నన్ను కదిలించిందని జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ విషాదాన్ని మాటల్లో చెప్పలేను.. విమానంలో ప్రయాణీకులు, సిబ్బంది, ప్రతి కుటుంబం కోసం తాను దేవుడిని ప్రార్థిస్తున్నానని రాసుకొచ్చింది. మరో నటి అనన్య పాండే ఈ సంఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ మేరకు తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో బాధను వ్యక్తం చేస్తూ ఒక పోస్ట్ను పంచుకున్నారు. అంతేకాకుండా పరిణీతి చోప్రా, ఆమె భర్త రాఘవ్ చద్దా ఈ ప్రమాద ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ విషాదాన్ని నమ్మలేకపోతున్నానంటూ సీినియర్ నటి ఖుష్బూ సుందర్ ట్వీట్ చేసింది. కాగా.. గురువారం మధ్యాహ్నం అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి లండన్కు వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన ఐదు నిమిషాలకే కూలిపోయింది. ఈ విమానంలో 230 మంది ప్రయాణికులతో పాటు 12 మంది సిబ్బంది ఉన్నారు. Heartbroken by the tragic Ahmedabad Air India flight crash. My deepest condolences to the families of the victims. May their souls rest in peace. Truly heart-wrenching 💔— Allu Arjun (@alluarjun) June 12, 2025 Deeply saddened by the Ahmedabad Air India flight crash. Prayers and strength to everyone affected. My thoughts are with the passengers, crew members, and their families.— Jr NTR (@tarak9999) June 12, 2025 Extremely shocked and in disbelief to hear the crash of Air India flight from Ahmedabad to London, with 232 passengers on board, just after take off. Prayers for the safety of the passengers and the crew. #GodBeWithThem #planecrash— KhushbuSundar (@khushsundar) June 12, 2025 Heartbreaking to hear about the tragic plane crash in Ahmedabad.My thoughts and prayers are with all those affected.Hoping for survivors and strength for the rescue teams.May the departed rest in peace, and may their families find the strength to endure this immense loss. 🙏— Randeep Hooda (@RandeepHooda) June 12, 2025 Absolutely heartbroken and in shock after hearing about the tragic plane crash in Ahmedabad. My heart goes out to all the passengers, their families, and everyone affected on the ground. Holding them all in my thoughts and prayers during this incredibly difficult time.— Riteish Deshmukh (@Riteishd) June 12, 2025 Shocked and speechless at the Air India crash. Only prayers at this time 🙏— Akshay Kumar (@akshaykumar) June 12, 2025 -
సినిమాలతో కాదు.. ఆ ఒక్క డీల్తో కోట్ల రూపాయలు!
బాలీవుడ్ నటులు ఒక్కో సినిమాకు దాదాపు కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటారు. అది సినిమాల్లో మాత్రమే సాధ్యమవుతుంది. కేవలం సినిమాలు మాత్రమే కాదు.. బిజినెస్లోనూ కొందరు స్టార్స్ కోట్ల రూపాయలు గడిస్తున్నారు. అలాంటి లిస్ట్లో బాలీవుడ్ స్టార్ హీరో జాన్ అబ్రహం కూడా చేరిపోయారు. ఇంతకీ ఆయన ఏం చేశారో తెలుసుకుందాం. ముంబయిలోని ఖరీదైన ప్రాంతమైన బాంద్రా వెస్ట్ శివారులో మూడు అపార్ట్మెంట్లను ఆయన లీజ్కు తీసుకున్నట్లు సమాచారం. వాటి ద్వారా ఐదేళ్లలో దాదాపు రూ.4.30 కోట్ల వరకు అర్జించనున్నారు. తాను లీజ్ తీసుకున్న మూడు అపార్ట్మెంట్లలో నెలవారీ అద్దె రూ. 6.30 లక్షలుగా ఉన్నట్లు టాక్. ఈ లెక్కన వచ్చే ఐదేళ్లలో దాదాపు రూ.4 కోట్లకు పైగా సంపాందించనున్నారు జాన్ అబ్రహం. ఈ డీల్ను గత నెలలోనే క్లోజ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ మూడు ఫ్లాట్లకు కలిపి రూ.36 లక్షల సెక్యూరిటీ డిపాజిట్ కూడా చెల్లించారు.ప్రధానంగా ముంబయిలోని అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో బాంద్రా ఒకటి. సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, ఆమిర్ ఖాన్, జావేద్ అక్తర్, రణబీర్ కపూర్, అలియా భట్, కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్, రేఖ వంటి బాలీవుడ్ ప్రముఖులు ఈ ప్రాంతంలోనే నివసిస్తున్నారు. దీపికా పదుకొనే, రణవీర్ సింగ్ కూడా త్వరలో తమ కొత్త బాంద్రా వెస్ట్ అపార్ట్మెంట్లోకి మారనున్నారు.ఇక జాన్ అబ్రహం సినిమాల విషయానికొస్తే చివరిసారిగా ది డిప్లొమాట్ చిత్రంలో కనిపించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. ప్రస్తుతం నటించిన టెహ్రాన్ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ మూవీలో మానుషి చిల్లర్ ప్రధాన పాత్రలో నటించింది. -
బాస్ కూతురితోనే ప్రేమలో.. 12 ఏళ్ల తర్వాత పెళ్లి చేసుకున్న నటుడు!
సినిమా ఇండస్ట్రీలో ప్రేమ వివాహాలు సర్వసాధారణం. నటీనటుల మధ్య స్నేహం ఏర్పడడం.. అదికాస్త ప్రేమగా మారి చివరకు మూడు మూళ్ల బంధంలో ఒక్కటైపోతుంటారు. అలా ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటల్లో బాలీవుడ్ నటుడు పరేష్ రావల్-నటి స్వరూప్ సంపత్ జంట ఒకటి. బాలీవుడ్లో ఒక ఐకానిక్ జంటగా గుర్తింపు పొందిన పరేష్-స్వరూప్ సంపత్ ప్రేమ కథ సినిమా స్టోరీకి ఏమాత్రం తీసిపోదు. ఒకరికోసం ఒకరు దాదాపు 12 ఏళ్లు ఎదురుచూసి పెళ్లి చేసుకున్నారట.అలా ప్రేమలో.. హిందీలోనే కాదు తెలుగులోనూ పరిచయం అక్కర్లేని పేరు పరేష్ రావల్ . 'హేరా ఫేరీ', 'ఓఎమ్జీ', 'సర్దార్', ‘హంగామా’తదితర చిత్రాలతో బాలీవుడ్ని ఆకట్టుకున్న పరేష్.. మనీ, క్షణ క్షణం, శంకర్ దాదా ఎంబిబిఎస్( లింగం మామ పాత్ర), రిక్షావోడు, గోవిందా గోవిందా తదితర చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల మనసునూ దోచుకున్నాడు. ఈ విలక్షణ నటుడు నాటక రంగం నుంచే చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టాడనే సంగతి అందరికి తెలిసిందే. నాటకాలు వేస్తున్న సమయంలోనే స్వరూప్ సంపత్తో ప్రేమలో పడ్డాడట. 1970లలో ముంబైలో జరిగిన ఇండియన్ నేషనల్ థియేటర్ ఫెస్టివల్లో నాటకం ప్రదర్శించేందుకు పరేష్ తన కాలేజీ స్నేహితులతో కలిసి వెళ్లాడు. అదే సమయంలో అక్కడి స్వరూప్ వచ్చింది. అప్పుడే స్కూలింగ్ అయిపోయిన స్వరూప్.. చేతిలో ఈవెంట్కి సంబంధించిన పత్రాలను పట్టుకొని బయట నిలబడి ఉందట. ఆమెను చూడగానే ప్రేమలో పడిపోయాడు పరేష్. ఆమె అందానికి ముగ్థుడైపోయి.. స్నేహితుడి మహేద్రతో .. ‘నేను ఈ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను’ అని స్వరూప్ని చూపించాడట. ఆమె గురించి ఆరా తీస్తే.. వారి బాస్ కూతురే అని తెలిసింది. ‘చీఫ్ ప్రొడ్యూసర్ కూతురినే ప్రేమిస్తావా?’ అని మహేద్ర నన్ను బెదిరించాడు. ‘ఎవరి కూతురు అయినా సరే.. నేను మాత్రం ఆమెనే పెళ్లి చేసుకుంటా’ అని అప్పేడే వాడికి చెప్పేశా’అని పరేష్ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.12 ఏళ్లు ఎదురుచూసి..పరేష్ నటనకు ఫిదా అయిన స్వరూప్.. అతనితో స్నేహం చేసింది. పరేష్ మాత్రం ఆమెతో తొలి చూపులోనే ప్రేమలో పడిపోయాడు. కొన్ని నెలల తర్వాత తన ప్రేమ విషయాన్ని ఆమెతో చెప్పాడు. ‘స్వరూప్కి సింపుల్గా ప్రపోజ్ చేశా. ఆమెతో 3-4 నెలలు స్నేహం చేసిన తర్వాత ఒక రోజు నా ప్రేమ విషయాన్ని చెప్పేశాను. ‘నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఒకరినొకరం తెలుసుకుందాం అని చెప్పకు. ఇద్దరం కలిసి జీవిస్తూ తెలుసుకుందాం’ అని చెప్పాను’ అని ఓ ఇంటర్వ్యూలో పరేష్ తన ప్రేమ విషయాన్ని పంచుకున్నాడు.అయితే వీరిద్దరు ప్రపోజ్ చేసుకున్న 12 ఏళ్ల తర్వాత పెళ్లి చేసుకున్నారట. అప్పుడప్పడే పరేష్ ఇండస్ట్రీలోకి వెళ్లడం.. కెరీర్ పరంగా సెట్ అయ్యాకనే పెళ్లి చేసుకోవాలకున్నాడట. ఈ విషయం స్వరూప్తో చెబితే.. ఆమె కూడా అర్థం చేసుకొని 12 ఏళ్ల పాటు ఎదురు చూసి 1987లో వివాహ బంధంలో ఒక్కటయ్యారు. వీరిద్దరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. స్వరూప్ విషయానికొస్తే.. 1979లో మిస్ ఇండియా విజేతగా నిలిచింది. బాలీవుడ్లో 'నరం గరం' (1981), 'సాగర్' (1985) వంటి చిత్రాలతో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నారు. -
బిడ్డకు జన్మనిచ్చిన బుల్లితెర నటి.. సోషల్ మీడియాలో పోస్ట్!
ప్రముఖ బుల్లితెర నటి షిరీన్ మీర్జా అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా బిడ్డకు జన్మనిచ్చినట్లు సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. బాలీవుడ్లో పలు సీరియల్స్లో నటించిన షిరీన్.. పెళ్లైన నాలుగేళ్ల తర్వాత మొదటి బిడ్డకు ఆహ్వానం పలికింది. జూన్ 9న తమకు బాబు పుట్టాడని దంపతులిద్దరూ ఈ శుభవార్తను పంచుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు ఆమెకు అభినందనలు తెలిపారు.కాగా.. షిరీన్ మీర్జా బాలీవుడ్లో యే హై మొహబ్బతేన్ సీరియల్ ద్వారా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత బోహోత్ ప్యార్ కర్తే హై, దై కిలో ప్రేమ్, యే హై ఆషికి, గుతుర్ గు, అన్హోనియోన్ కా అంధేరా లాంటి సీరియల్స్లో మెప్పించింది. షిరీన్ చివరిసారిగా యే హై చాహతేన్ షోలో కనిపించింది. షిరీన్ 2021లో హసన్ సర్తాజ్ను వివాహం చేసుకుంది. దాదాపు పెళ్లైన నాలుగేళ్ల తర్వాత బిడ్డ పుట్టడంతో బుల్లితెర దంపతులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. View this post on Instagram A post shared by Mirzashireen (@shireenmirza) -
ప్రియుడితో 'చిన్నారి పెళ్లికూతురి' ఎంగేజ్మెంట్
చిన్నారి పెళ్లికూతురు సీరియల్తో సెన్సేషన్ సృష్టించిన అవికా గోర్ (Avika Gor) పెళ్లికి రెడీ అయింది. ప్రియుడు మిలింద్ చంద్వానీతో ఏడడుగులు వేసేందుకు సిద్ధపడింది. ఈ క్రమంలోనే వీరి నిశ్చితార్థం జరిగింది. ఐదేళ్ల ప్రేమాయణం తర్వాత వీరిద్దరూ ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.సంతోషంతో అరిచేశా..ఈ సందర్భంగా అవికా.. 'ఆయన నోరు తెరిచి అడగ్గానే.. సంతోషంతో ఏడ్చేశాను. ఈ క్షణం కోసమే ఎదురుచూస్తున్నట్లుగా అవును అంటూ గట్టిగా అరిచాను. పూర్తిగా సినిమాల్లో మునిగినందున.. నాకు మైండ్లో మంచి బీజీఎమ్ వినిపిస్తోంది. స్లో మోషన్లో మా కల నెరవేరినట్లు కనిపిస్తోంది. అతడేమో ప్రశాంతగా ఉన్నాడు, తెలివిగా కనిపిస్తున్నాడు. అయినా మేమిద్దరం జంటగా ఫిట్టయ్యాం.కన్నీళ్లు..ఎప్పుడైతే అతడు నన్ను పెళ్లి చేసుకుంటావా? అని అడిగాడో అప్పుడు నాలో ఉన్న హీరోయిన్ నన్ను పూర్తిగా ఆవహించింది. గాల్లో తేలియాడిపోయా.. కళ్లనిండా నీళ్లు.. మెదడు ఆలోచించడమే మానేసినట్లు.. ఇలా రకరకాలుగా అనిపించింది. నిజమైన ప్రేమంటే ఇదే కదా! ప్రేమలో అన్నీ పర్ఫెక్ట్గా ఉండకపోవచ్చు. కానీ అందులో ఉన్న మ్యాజిక్కే వేరు అని అవికా రాసుకొచ్చింది. ఇది చూసిన అభిమానులు.. అవికాకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.కెరీర్ముంబైలో పుట్టిన అవికా గోర్.. పదేళ్ల వయసులోనే నటనా రంగంలోకి అడుగుపెట్టింది. ‘బాలికా వధు’ సీరియల్తో ఆమె జీవితమే మారిపోయింది. ఇదే తెలుగులో ‘చిన్నారి పెళ్లికూతురి’గా ప్రసారమైంది. ఉయ్యాల జంపాల సినిమాతో తెలుగు వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. ‘లక్ష్మీ రావే మా ఇంటికి’, ‘సినిమా చూపిస్త మావా’, ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’, 'బ్రో', 'షణ్ముఖ' ఇలా అనేక సినిమాల్లో నటించింది. View this post on Instagram A post shared by Avika Gor (@avikagor) చదవండి: మంగ్లీ బర్త్డే పార్టీ.. తప్పు నామీదకు తోస్తారేంటి?: దివి -
'చాలా అందంగా ఉన్నారు.. పెళ్లి ఎందుకు చేసుకోలేదు'.. ఛావా నటి ఆన్సర్ ఇదే!
30 ఏళ్లు వచ్చినా ఇంకా పెళ్లి కాలేదా? ఇలాంటి ప్రశ్నలు సాధారణంగా వినిపిస్తుంటాయి. కెరీర్, జాబ్ అంటూ వివాహాలు చేసుకోకుండా చాలామంది సింగిల్స్గానే బతికేస్తున్నారు. ఇక సినీ ఇండస్ట్రీలో వాళ్లయితే ఏకంగా 40 పదుల వయస్సు దాటినా సింగిల్గానే ఉంటున్నారు. అలాంటి సల్మాన్ ఖాన్, సుస్మితా సేన్, త్రిష, ప్రభాస్ లాంటి అగ్రతారలేందరో ఉన్నారు. అలా సినీ ఇండస్ట్రీలో 40 పదుల వయస్సు దాటినా పెళ్లి చేసుకోకుండా ఉన్నవారిలో మరో బాలీవుడ్ భామ దివ్య దత్తా ఒకరు. ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆమె పెళ్లి ఎందుకు చేసుకోలేదనే ప్రశ్నకు ఆసక్తికర సమాధానం ఇచ్చింది. ఇంతకీ ఆమె ఏమన్నారో తెలుసుకుందాం.దివ్య పెళ్లి బంధం గురించి మాట్లాడుతూ.. “మీరు మంచి భాగస్వామి దొరికితే వివాహం చేసుకోవడం చాలా బాగుంటుంది. అదే పెళ్లి లేకపోతే జీవితం ఇంకా అందంగా సాగుతుంది. అందుకే పెళ్లి చేసుకోవడం కంటే మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం మంచిది. నాపై చాలా మంది పురుషులు శ్రద్ధ పెడుతుంటారు. నేను వాటిని ఆస్వాదిస్తా అంతే. కానీ మీరు కనెక్ట్ అయితేనే రిలేషన్లో ఉండాలి. ఆ వ్యక్తి మీ చేయి పట్టుకోగలడని మీరు భావించాలి. ఒకవేళ అది జరగకపోతే నాకు చాలా మంది స్నేహితులు ఉన్నారు. నా కోసం నేను ఉన్నా.' అని మాట్లాడింది.దివ్య దత్తా ఇంకా మాట్లాడుతూ.. "నేను పెళ్లి చేసుకోవాలనుకోవడం లేదు. కేవలం ఎవరైనా నాతో ప్రయాణించగల సహచరుడిగా ఉండటానికి ఇష్టపడతా. అది లేకపోయినా నేను ఇప్పటికీ సంతోషంగా ఉన్నా. నా ప్రాణ స్నేహితుడు నాకు ఒక కోట్ పంపాడు. 'నువ్వు ఎందుకు ఒంటరిగా ఉన్నావు? నువ్వు అందంగా, ఆకర్షణీయంగా ఉన్నావు' కదా అని అడిగాడు. దానికి నేను ఆ స్టేజ్ ఎప్పుడో దాటిపోయానని చెప్పా. మంచి భాగస్వామి మీ జీవితంలోకి ప్రవేశించినప్పుడు మాత్రమే మీరు పరిపూర్ణం కావాలని అవసరం లేదు. గతంలో నాకు కూడా ఆ అపోహ ఉండేది." అని పెళ్లిపై తన అభిప్రాయం వ్యక్తం చేసింది బాలీవుడ్ భామ.ఇక సినిమాల విషయానికొస్తే దివ్య దత్తా చివరిసారిగా ఛావా చిత్రంలో కనిపించింది. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విక్కీ కౌశల్ , అక్షయ్ ఖన్నా, రష్మిక మందన్న కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది ప్రపంచవ్యాప్తంగా రూ.800 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ప్రస్తుతం దివ్య అర్జున్ రాంపాల్తో కలిసి నాస్టిక్లో కనిపించనుంది. ఈ సినిమాకు శైలేష్ వర్మ దర్శకత్వం వహించారు. -
ఆడవారి వాష్రూమ్కు వెళ్తుంటే గెంటేశారు: ట్రాన్స్జెండర్ నటి
ఎన్నో అవమానాలు, ఆటంకాలు దాటుకుని వైద్య విద్యను అభ్యసించింది త్రినేత్ర హల్దార్ గుమ్మరాజు (Trinetra Haldar Gummaraju). దేశంలోనే రెండో ట్రాన్స్జెండర్ డాక్టర్గా ఆ మధ్య తన పేరు వార్తల్లో మార్మోగిపోయింది. రెండేళ్ల క్రితం వచ్చిన మేడ్ ఇన్ హెవెన్ రెండో సీజన్తో నటిగానూ మారింది. ఈ మధ్యే కంఖజుర అనే థ్రిల్లర్ వెబ్ సిరీస్లో యాక్ట్ చేసింది. ఇది మే 30 నుంచి సోనీలివ్లో ప్రసారమవుతోంది.హాస్పిటల్లో చేదు అనుభవంతాజాగా త్రినేత్ర.. తనకు ఎదురైన ఓ చేదు అనుభవాన్ని బయటపెట్టింది. టైమ్స్ నౌకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. నేను అమ్మాయిగా మారేందుకు ఆపరేషన్ చేయించుకున్నాక ఒకసారి డాక్టర్ను కలిసేందుకు వెళ్లాను. ఆస్పత్రిలో ఉన్న్పపుడు వాష్రూమ్ వెళ్లాల్సిన అవసరం వచ్చింది. అప్పటికి నా ముఖంలో అమ్మాయి పోలికలే లేవు. అలా అని అబ్బాయిల రెస్ట్రూమ్ వాడుకోలేను. ఏదైతే అదైందని అమ్మాయిల బాత్రూమ్లోకి వెళ్లాను. అంతే.. అక్కడున్న సెక్యురిటీ గార్డు నన్ను కోపంతో బయటకు తరిమేసింది. రచ్చ చేయాలనుకోలే..నేను అబ్బాయిని అనుకుని లోపలకు వెళ్లనివ్వలేదు. నేను ఏమీ అనలేదు. దాన్ని గొడవ చేసి రచ్చ చేయాలనుకోలేదు. అందుకే సైలెంట్గా అక్కడినుంచి వెళ్లిపోయాను. కానీ దీనివల్ల నా మనసు గాయపడింది. అమ్మాయిగా మారినప్పటికీ ఆడవారి బాత్రూమ్ ఉపయోగించుకోలేకపోయాను. ఇలాంటి ఇబ్బందుల్ని, అవమానాల్ని ఊహించే కాలేజీలో చదువుకునే రోజుల్లో వాష్రూమ్కి వెళ్లేదాన్నే కాదు. ఇందుకోసం నీళ్లు సరిగా తాగేదాన్ని కాదు. దీనివల్ల నేను యూరినరీ ఇన్ఫెక్షన్ కూడా వచ్చింది. ఇలా వివక్ష ఎదుర్కొనే సమాజంలో బతకడం దురదృష్టకరం అని చెప్పుకొచ్చింది.చదవండి: శ్రీలీల కోసం మంత్రి స్పీచ్ ఆపేసిన యాంకర్ ఝాన్సీ.. వీడియో వైరల్ -
ముందుగానే వచ్చేస్తోన్న పంచాయత్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!
ఓటీటీలు వచ్చాక సినీ వినోదం ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. థియేటర్లలో కేవలం సినిమాలే కాదు.. ఓటీటీల్లో వచ్చే వెబ్ సిరీస్లకు ప్రత్యేకమై క్రేజ్ ఉంది. అలాంటి వాటిలో ప్రేక్షకుల ఆదరణ దక్కించుకున్న సరికొత్త సిరీస్ పంచాయత్. ఇప్పటికే విడుదలైన మూడు సీజన్స్కు సినీ ప్రియుల నుంచి ఆదరణ దక్కింది. 2020లో మొదటి సీజన్ విడుదలైతే.. 2022లో రెండో సీజన్.. 2024లో మూడో భాగం ప్రేక్షకులను అలరించాయి. ఈ సిరీస్కు ప్రత్యేక ఆదరణ దక్కడంతో మేకర్స్ మరో సీజన్కు రెడీ అయిపోయారు. ఇప్పటికే స్ట్రీమింగ్ తేదీ ప్రకటించిన మేకర్స్.. ఇంకాస్తా తొందరగానే స్ట్రీమింగ్కు తీసుకొస్తున్నారు.విలేజ్ నేపథ్యంలో సాగే సరికొత్త కామెడీ డ్రామా సిరీస్గా వస్తోన్న నాలుగో సీజన్ ఈ నెలలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. పంచాయత్ సీజన్- 4 జూన్ 24 నుంచే స్ట్రీమింగ్ కానుందని మేకర్స్ ప్రకటించారు. మొదటి ప్రకటించిన తేదీ కంటే వారం రోజులు ముందుగానే రిలీజ్ చేస్తున్నారు. మొదట జూలై 2న స్ట్రీమింగ్ కానుందని ప్రకటించారు. తాజాగా తేదీ మారడంతో ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్లో ఈనెలలోనే సినీ ప్రియులకు అందుబాటులోకి రానుంది.కాగా.. ఈ సిరీస్లో జితేంద్ర కుమార్, నీనా గుప్తా, రఘుబీర్ యాదవ్, చందన్ రాయ్, సాన్వికా, ఫైసల్ మాలిక్, దుర్గేష్ కుమార్, సునీతా రాజ్వార్, పంకజ్ ఝా కీలక పాత్రల్లో నటించారు. ఈ కామెడీ-డ్రామా సిరీస్ను ఉత్తరప్రదేశ్లోని ఫూలేరా గ్రామంలో పంచాయతీ కార్యదర్శిగా చేరిన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ కథగా తెరకెక్కించారు. ఈ సిరీస్కు దీపక్ కుమార్ మిశ్రా, అక్షత్ విజయవర్గీయ దర్శకత్వం వహించారు. shuru ho chuka hai election🗳 Manju Devi ya Kranti Devi, kiski hogi selection 👀#PanchayatOnPrime, New Season, June 24@TheViralFever @StephenPoppins #ChandanKumar @Akshatspyro @uncle_sherry @vijaykoshy@Farjigulzar #RaghubirYadav @Neenagupta001 @malikfeb @chandanroy77… pic.twitter.com/dflHA71wbe— prime video IN (@PrimeVideoIN) June 11, 2025 -
సింగిల్గా అన్న.. రెండోపెళ్లితో రెండోసారి తండ్రయిన తమ్ముడు
ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలంటుంటారు. కానీ ఈ జనరేషన్కు అది వర్తించదు. కెరీర్ వేటలో పడి ఆలస్యంగా పెళ్లి చేసుకుని లేటుగా సంసారసాగరాన్ని ఈదుతున్నారు. కొందరైతే మనవళ్లను ఎత్తుకోవాల్సిన వయసులో మళ్లీ పెళ్లి చేసుకుంటున్నారు. మరికొందరే పెళ్లి అనే జంఝాటమే వద్దని సింగిల్గా బతికేస్తున్నారు.57 ఏళ్ల వయసులో మరోసారి తండ్రిగా..బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ (Salman Khan) విషయంలో ఇదే జరిగింది. ఎంతోమంది హీరోయిన్లతో ప్రేమాయణం నడిపినా పెళ్లికి మాత్రం సిద్ధపడలేదీ హీరో. 59 ఏళ్లు వచ్చినా సింగిల్గానే బతికేస్తున్నాడు. కానీ, ఇతడి సోదరుడు, నటుడు అర్బాజ్ ఖాన్ (Arbaaz Khan) మాత్రం 57 ఏళ్ల వయసులో మరోసారి తండ్రి కాబోతున్నాడు.పట్టలేనంత సంతోషంఅర్బాజ్ భార్య షురా ఖాన్ గర్భం దాల్చిందన్న విషయాన్ని నటుడు మీడియాకు వెల్లడించాడు. మేము బయటకు వెళ్లినప్పుడు జనాలు ఆ విషయాన్ని ఇట్టే పసిగట్టారు. దాన్ని ఎంతోకాలం దాచలేమనుకోండి. ప్రస్తుతం మేమెంతో సంతోషంగా ఉన్నాం. మా జీవితాల్లో మరింత వెలుగు నింపేందుకు వస్తున్న బిడ్డ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నాం అన్నాడు.రెండో పెళ్లిఅర్బాజ్ గతంలో మలైకా అరోరాను పెళ్లి చేసుకున్నాడు. వీరికి కుమారుడు అర్హాన్ ఖాన్ సంతానం. 2017లో అర్బాజ్-మలైకా విడాకులు తీసుకున్నారు. 2023 చివర్లో మేకప్ ఆర్టిస్ట్ షురా ఖాన్ను నిఖా చేసుకున్నాడు. సినిమాల విషయానికి వస్తే.. బాలీవుడ్లో ఎన్నో మూవీస్ చేసిన అర్బాజ్ తెలుగులో 'జై చిరంజీవ', 'కిట్టు ఉన్నాడు జాగ్రత్త', 'శివం భజే' వంటి చిత్రాల్లో నటించాడు.చదవండి: ప్రముఖ సింగర్ బర్త్డే పార్టీలో గంజాయి కలకలం -
భారీ బడ్జెట్తో షారుక్- సల్మాన్ సినిమా.. గెస్ట్ రోల్స్లో ఎన్టీఆర్, హృతిక్!
వైఆర్ఎఫ్ (యశ్ రాజ్ ఫిల్మ్స్) స్పై యూని వర్స్లో భాగంగా ఇప్పటివరకు సల్మాన్ ఖాన్ హీరోగా చేసిన ‘ఏక్తా టైగర్’ (2012), ‘టైగర్ జిందా హై’ (2017), ‘టైగర్ 3’ (2023), హృతిక్ రోషన్ ‘వార్’ (2019), షారుక్ ఖాన్ ‘పఠాన్’ (2023) వంటి సినిమాలు సూపర్ హిట్స్గా నిలిచాయి. ఈ యూనివర్స్లోనే హృతిక్ రోషన్ – ఎన్టీఆర్ హీరోలుగా చేసిన ‘వార్ 2’, ఆలియా భట్ – శర్వారీ లీడ్ రోల్స్ చేసిన ‘ఆల్ఫా’ చిత్రం రిలీజ్కు సిద్ధమౌతున్నాయి. ‘వార్ 2’ సినిమా ఆగస్టు 14న విడుదల కానుంది. ‘ఆల్ఫా’ చిత్రం ఈ ఏడాది డిసెంబరు 25న విడుదల కానుంది. కాగా... రెండు సంవత్సరాలుగా ఈ ‘వైఆర్ఎఫ్’ స్పై యూనివర్స్లో భాగంగానే ‘పఠాన్ వర్సెస్ టైగర్’(Pathaan Vs Tiger)చిత్రం రానుందని, ఈ మూవీలో షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్ హీరోలుగా చేస్తారని, అలాగే ‘పఠాన్ వర్సెస్ టైగర్’ సినిమాలో ఈ యూనివర్స్లో భాగమైన హృతిక్ రోషన్, జాన్ అబ్రహాం, ఆలియా భట్, ఎన్టీఆర్ గెస్ట్ రోల్స్లో కనిపిస్తారనే ప్రచారం జరుగుతోంది. భారీ బడ్జెట్తో రూపొందనున్న ఈ సినిమాని ‘వార్, పఠాన్’ సినిమాలకు దర్శకత్వం వహించిన సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కిస్తారనే టాక్ బాలీవుడ్లో వినిపిస్తోంది. దీంతో ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. కానీ హఠాత్తుగా ‘పఠాన్ వర్సెస్ టైగర్’ చిత్రం ఆగిపోయిందనే టాక్ తెరపైకి వచ్చింది. కానీ అలాంటిది ఏమీ లేదని, ‘వార్ 2’, ‘ఆల్ఫా’ చిత్రాలు విడుదలైన తర్వాత ‘పఠాన్ వర్సెస్ టైగర్’ సినిమా గురించి ఓ స్పష్టత వస్తుందని జాతీయ ఆంగ్ల మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీంతో సిల్వర్ స్క్రీన్పై ‘పఠాన్–టైగర్’ల పోరు ఉంటుందని, కాకపోతే కొంత సమయం పడుతుందని తెలుస్తోంది. -
ఆమిర్ కొత్త సినిమా.. తెలుగు ట్రైలర్ రిలీజ్
'లాల్ సింగ్ చద్దా' లాంటి డిజాస్టర్ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్.. కొత్త సినిమాని రెడీ చేశాడు. 'సితారే జమీన్ పర్' పేరుతో తీసిన ఈ చిత్రం జూన్ 20న థియేటర్లలోకి రానుంది. హిందీతో పాటు దక్షిణాది భాషల్లోనూ రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలోనే తాజాగా తెలుగు ట్రైలర్ విడుదల చేశారు. ఇది ఆసక్తికరంగా ఉంది.(ఇదీ చదవండి: బన్నీతో చేయాల్సిన సినిమా ఎన్టీఆర్తో?)హాలీవుడ్ మూవీ 'ఛాంపియన్స్'కి అనధికారిక రీమేక్గా దీన్ని తెరకెక్కించారు. కోపం ఎక్కువగా ఉండే ఓ బాస్కెట్ బాల్ కోచ్.. అనుకోని పరిస్థితుల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఇరుక్కుంటాడు. దీంతో మూడు నెలల పాటు మతిస్థిమితం సరిగా లేని వాళ్లకు కోచింగ్ ఇవ్వాలని జడ్జి ఆర్డర్ వేస్తారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో దానికి ఒప్పుకొంటాడు. కొన్నాళ్లకు ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుని వాళ్లతోనే టోర్నీలో విజయాలు సాధిస్తాడు. ఇదే స్టోరీలా అనిపిస్తుంది.ఆమిర్ స్వయంగా కోచ్గా నటించడంతో పాటు నిర్మాతగానూ వ్యవహరించాడు. ఈ సినిమాని ఓటీటీకి అమ్మకుండా.. 8 వారాల తర్వాత యూట్యూబ్లో పే పర్ వ్యూ విధానంలో రిలీజ్ చేస్తానని కొన్నిరోజుల క్రితమే ప్రకటించాడు. అలానే రీసెంట్గా పలువురు సెలబ్రిటీల కోసం 'సితారే జమీన్ పర్' ప్రీమియర్ వేశారు. దీనికి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అయితే ఆమిర్ మూవీ అంటే నెటిజన్ల నుంచి విమర్శలు సాధారణం. మరి ఈ చిత్రం విషయంలో ఏం జరుగుతుందో చూడాలి?(ఇదీ చదవండి: లక్కీ ఛాన్స్ కొట్టేసిన లారెన్స్.. ముగ్గురు బ్యూటీస్!) -
బుల్లితెరపై రీ ఎంట్రీ ఇస్తోన్న కేంద్ర మాజీ మంత్రి.. మరోసారి అలరించనుందా?
సినీ ఇండస్ట్రీ నుంచి రాజకీయాల్లోకి వచ్చినవారు చాలామందే ఉన్నారు. అలా వచ్చినవారు చాలామంది పొలిటికల్గా సక్సెస్ కూడా అయ్యారు. అలాంటి వారిలో ఆమె పేరు కచ్చితంగా ఉంటుంది. ఇంతకీ ఎవరామె అనుకుంటున్నారా? బుల్లితెరపై తన అందంతో అలరించిన మాజీ కేంద్రమంత్రి స్మృతి ఇరానీ. బుల్లితెర నటిగా కెరీర్ ప్రారంభించిన ఆమె.. భాజపాలో కీలకనేతగా ఎదిగారు. ఎంపీగా గెలిచి కేంద్రమంత్రిగా సేవలదించారు.బుల్లితెరపై రీ ఎంట్రీ?అయితే గతంలో బాలీవుడ్లో ఆమె నటించిన సూపర్ హిట్ సీరియల్ 'క్యుంకీ సాస్ భీ కభీ బహు థి'. ఈ సీరియల్కు మేకర్స్ సీక్వెల్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సీక్వెల్ కోసం నటి స్మృతి ఇరానీ ఇప్పటికే ఒప్పందంపై సంతకం చేసినట్లు సమాచారం. దాదాపు 150 ఎపిసోడ్లు ఉన్న ఈ షోలో ఆమె మరోసారి తులసి విరానీగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజా నివేదిక ప్రకారం స్మృతి ఇరానీ జూన్ 8న 'క్యుంకీ సాస్ భీ కభీ బహు థి 2' కోసం ఒప్పందంపై సంతకం చేసినట్లు తెలిసింది. రెండో వారం ప్రారంభంలోనే ఏక్తా కపూర్కో ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు సమాచారం.కాగా.. ఇటీవల స్మృతి కపూర్ ఈ సీరియల్లో మిహిర్ విరానీ (మొదటి సీజన్) పాత్ర పోషించిన అమర్ ఉపాధ్యాయ్తో పాటు ఏక్తా కపూర్ పుట్టినరోజు వేడుకలో కనిపించారు. కరిష్మా తన్నా, అనితా హసానందనీ కూడా పార్టీకి హాజరయ్యారు. 'క్యుంకి సాస్ భీ కభీ బహు థి' అనే సీరియల్ హిందీ బుల్లితెర చరిత్రలో అత్యంత ఆదరణ దక్కించుకున్న వాటిలో ఒకటిగా నిలిచింది. ఈ సీరియల్లో నటించిన వారి కెరీర్ కూడా మలుపు తిరిగింది. గతంలో ఈ షో 2000 నుంచి 2008 వరకు ప్రసారమైంది. ఆ తర్వాత స్మృతి ఇరానీకి ఇండియన్ టెలివిజన్ అకాడమీ అవార్డుల్లో ఉత్తమ నటిగా వరుసగా ఐదు అవార్డులను గెలుచుకుంది. అంతే కాకుండా రెండు భారతీయ టెలీ అవార్డులు కూడా దక్కించుకుంది. -
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన చాణక్యుడు మూవీ హీరోయిన్.. పోస్ట్ వైరల్
బాలీవుడ్ ఫేమస్ జంటల్లో ఇషితా దత్తా- వత్సల్ సేత్ ఒకరు. తెలుగులో చాణక్యుడు సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ.. ఆ తర్వాత బాలీవుడ్లో చాలా సినిమాల్లో కనిపించింది. సినిమాలతోపాటు పలు బాలీవుడ్ సీరియల్స్లో నటించిన ఇషితా దత్తా.. ఆ తర్వాత బాలీవుడ్ నటుడు వత్సల్ సేథ్ను పెళ్లాడింది. ఇప్పటికే వీరిద్దరికీ ఓ కుమారుడు కూడా జన్మించాడు.తాజాగా ఈ ఈ ముద్దుగుమ్మకు రెండోసారి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ద్వారా పంచుకుంది. ఇద్దరి నుంచి నలుగురిగా మారిపోయాం.. ఇప్పుడు మా ఫ్యామిలీ సంపూర్ణమైంది.. నాకు కూతురు పుట్టింది అంటూ సోషల్ మీడియా వేదికగా ఆనందాన్ని పంచుకుంది బాలీవుడ్ బ్యూటీ.కాగా.. ఈ ఏడాది వాలెంటైన్స్ డే సందర్భంగా ఆమె భర్త వత్సల్ సేత్ గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే మరో బిడ్డను తమ ఇంటికి ఆహ్వానించబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. '9 ఏళ్ల పరిచయం.. ఎనిమిదేళ్ల ప్రేమ.. గుర్తుగా ఓ చిన్న ప్రేమ.. త్వరలోనే మా హృదయాలు మళ్లీ కలవబోతున్నాయి' అంటూ వాలైంటైన్ డే రోజున పోస్ట్ చేశాడు. కాగా.. ఇషితా దత్తా, వత్సల్ సేత్ 2017లో పెళ్లి చేసుకున్నారు. 'రిష్టన్ కా సౌదాగర్ - బాజీగర్' అనే టీవీ సీరియల్ షూటింగ్ సమయంలో ప్రేమలో పడ్డారు. జూలై 19 2023న తమ మొదటి బిడ్డకు స్వాగతం పలికారు.సినిమాల విషయానికొస్తే ఇషిత దత్తా చివరిసారిగా థ్రిల్లర్ చిత్రం 'దృశ్యం -2'లో కనిపించింది. ప్రస్తుతం ఆమె మరో ప్రాజెక్ట్లో నటిస్తోంది. మరోవైపు వత్సల్ సేత్ చివరిసారిగా ప్రభాస్ 'ఆదిపురుష్' చిత్రంలో కనిపించారు. ఝార్ఖండ్లో పుట్టి పెరిగిన ఇషితా దత్తా.. 2004లో ఫెమినా మిస్ ఇండియా టైటిల్ గెలుచుకుంది. 2012లో తెలుగులో వచ్చిన చాణక్యుడు సినిమాలో హీరోయిన్గా నటించింది. హిందీలో దృశ్యం -1, దృశ్యం- 2 , ఫిరంగి, బ్లాంక్ వంటి చిత్రాల్లో నటించింది. View this post on Instagram A post shared by Ishita Dutta Sheth (@ishidutta) -
'నా చావు గురించి మాట్లాడినందుకు ధన్యవాదాలు'.. అమితాబ్ ఘాటు రిప్లై!
బిగ్బీ అమితాబ్కు ఆసక్తికర అనుభవం ఎదురైంది. అమితాబ్ బచ్చన్ సోషల్ మీడియాలో నెటిజన్లతో ఓ సెషన్ నిర్వహించారు. ఇందులో భాగంగా ఆరోగ్యానికి సంబంధించిన సలహాలు ఇచ్చారు బిగ్ బీ. మీ గాడ్జెట్స్ను బ్రేక్ చేయండి.. మీకు దీర్ఘాయుస్సు ఉంటుందని అమితాబ్ పోస్ట్ పెట్టారు.ఇది చూసిన ఓ నెటిజన్ అమితాబ్కు షాకింగ్ రిప్లై ఇచ్చాడు. 'మీరు సమయానికి నిద్రించడానికి ప్రయత్నించండి..లేకపోతే ఎక్కువ కాలం జీవించలేరు' అంటూ కామెంట్ చేశాడు. అయితే ఈ పోస్ట్కు బిగ్బీ అమితాబ్ తనదైన స్టైల్లోనే నెటిజన్కు ఇచ్చిపడేశాడు. నా మరణం గురించి మాట్లాడినందుకు మీకు ధన్యవాదాలు.. అంతా ఆ ఈశ్వరుని దయ' అంటూ చేతులెత్తి నమస్కరించే ఎమోజీ జతచేశాడు.ఆ తర్వాత అమితాబ్ ఆరోగ్యం, జీవితం గురించి వరుసగా పోస్టులు పెట్టారు. మన జీవితాన్ని గడపడానికి ఉత్తమ మార్గానికి సంబంధించిన సూత్రాలను అభిమానులు, నెటిజన్లతో పంచుకున్నారాయన. ఇక సినిమాల విషయానికొస్తే గతేడాది కల్కి మూవీతో అభిమానులను అలలరించాడు. ప్రస్తుతం కల్కి-2లో నటించేందుకు సిద్ధమవుతున్నారు. అంతేకాకుండా 'కౌన్ బనేగా కరోడ్పతి' నెక్ట్స్ సీజన్ హోస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు.मेरे मरण की बात करने के लिए धन्यवाद ; ईश्वर की कृपा 🙏— Amitabh Bachchan (@SrBachchan) June 9, 2025 -
తండ్రి బర్త్ డే.. ఆయన ఆశయం దిశగా దీపికా పదుకొణె!
బాలీవుడ్ భామ దీపికా పదుకొణె తన తండ్రికి సర్ప్రైజ్ ఇచ్చింది. ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్ అయిన తన తండ్రి బర్త్ డే సందర్భంగా గొప్ప కార్యక్రమం చేపట్టింది. ప్రకాశ్ పదుకొణె 70వ పుట్టినరోజు సందర్భంగా పదుకొణె స్కూల్ ఆఫ్ బ్యాడ్మింటన్ను ప్రారంభించింది. ఈ విషయాన్ని తన ఇన్స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది. తన తండ్రి, బ్యాడ్మింటన్ దిగ్గజ క్రీడాకారుడు ప్రకాశ్ పదుకొనేకు అంకితమిస్తున్నట్లు వెల్లడించింది.దీపికా తన ఇన్స్టాలో రాస్తూ.. "బ్యాడ్మింటన్ ఆడుతూ పెరిగిన వ్యక్తిగా.. ఈ క్రీడ ఒకరి జీవితాన్ని శారీరకంగా, మానసికంగా, భావోద్వేగపరంగా ఎంతగా మారుస్తుందో నేను ప్రత్యక్షంగా అనుభవించా. పదుకొణె స్కూల్ ఆఫ్ బ్యాడ్మింటన్ (PSB) ద్వారా అన్ని వర్గాల ప్రజలకు బ్యాడ్మింటన్ ఆడితే కలిగే ఆనందం, క్రమశిక్షణ అందించాలని అనుకుంటున్నా. ఆరోగ్యకరమైన క్రీడ ద్వారా ప్రేరణ పొందిన తరాన్ని నిర్మించాలని మేము ఆశిస్తున్నాం. డాడీ, మీ గురించి బాగా తెలిసిన వారికి.. ఈ క్రీడ పట్ల మీకెంత మక్కువో తెలుసు. 70 ఏళ్ల వయసులో కూడా తినడం, నిద్రపోవడం, బ్యాడ్మింటన్ ఆడడమే మీ ప్రపచం. అందుకే మీ ఇష్టాన్ని నిజం చేయడానికి మేమంతా కట్టుబడి ఉన్నాం. బ్యాడ్మింటన్ ఫర్ ఆల్! మీకు 70వ పుట్టినరోజు శుభాకాంక్షలు పప్పా" అంటూ పోస్ట్ చేసింది. కాగా.. పదుకొణె స్కూల్ ఆఫ్ బ్యాడ్మింటన్ ఇప్పటికే పలు నగరాల్లో స్థాపించారు. దాదాపు ఇప్పటికే 75 కేంద్రాల్లో నెలకొల్పారు. కాగా.. ఆమె తండ్రి ప్రకాశ్ పదుకొణె మాజీ ప్రపంచ నంబర్ వన్ మాత్రమే కాదు.. బ్యాడ్మింటన్లో ఆల్-ఇంగ్లాండ్ ఛాంపియన్గా నిలిచారు. ఇక సినిమాల విషయానికొస్తే గతేడాది కల్కి మూవీలో మెప్పించిన దీపికా.. ప్రస్తుతం అల్లు అర్జున్- అట్లీ కాంబోలో రానున్న చిత్రంలో ఛాన్స్ కొట్టేసింది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. View this post on Instagram A post shared by दीपिका पादुकोण (@deepikapadukone) -
కత్రినా కైఫ్కు క్రేజీ ఛాన్స్.. ఆ దేశానికి బ్రాండ్ అంబాసిడర్గా!
బాలీవుడ్ భామ కత్రినా కైఫ్కు అరుదైన ఛాన్స్ దక్కింది. ఆమె పర్యాటక అభివృద్ధికి అంబాసిడర్గా ఎంపికైంది. అయితే కత్రినాను ఎంపిక చేసింది మాత్రం మన దేశానికి కాదు. గతేడాది మనదేశంతో దౌత్యపరమైన వివాదానికి తెరలేపిన దేశానికి ఆమె గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్గా నియమించారు. ఆ దేశం మరెదో కాదు.. మన దగ్గర్లోనే ఉన్న మాల్దీవుస్. కత్రినా కైఫ్ను మాల్దీవులకు ప్రపంచ పర్యాటక రాయబారిగా నియమించినట్లు మాల్దీవుల మార్కెటింగ్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ కార్పొరేషన్ వెల్లడించింది. భారత చిత్ర పరిశ్రమలో ప్రముఖ వ్యక్తి అయిన కత్రినా కైఫ్ను మాల్దీవులకు గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్గా నియమించడం పట్ల తాము సంతోషంగా ఉన్నామని ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షించేందుకు బాలీవుడ్ హీరోయిన్ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ అవకాశం రావడంపై బాలీవుడ్ భామ కత్రినా కైఫ్ స్పందించింది. గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్గా నియమించడంపై సంతోషం వ్యక్తం చేసింది. మాల్దీవులు అందించే లగ్జరీ, అందాలను సూచించడానికి ఉత్సాహంగా ఉన్నట్లు పేర్కొంది.గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్గా తన కొత్త రోల్ గురించి కత్రినా మాట్లాడుతూ.. 'మాల్దీవులు లగ్జరీ, సహజ సౌందర్యానికి కేరాఫ్ అడ్రస్. చక్కని ప్రశాంతంగా ఉండే ప్రదేశం. సన్నీ సైడ్ ఆఫ్ లైఫ్గా ఎంపికైనందుకు నేను గౌరవంగా భావిస్తున్నా. ఈ సహకారం ప్రపంచ పర్యాటక ప్రేక్షకులకు అత్యుత్తమ ప్రయాణ అనుభవాలను తీసుకురావడం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు ఈ అద్భుతమైన గమ్యస్థానం, ప్రత్యేకమైన ఆకర్షణ, ప్రపంచ స్థాయిలో పేరు పొందేలా సహాయపడటానికి ఉత్సాహంగా ఉన్నానని" తెలిపింది. అయితే ప్రధాని మోదీ పర్యటనకు ముందు ఈ ప్రకటన రావడం విశేషం. వచ్చే నెలలో మాల్దీవుస్లో ప్రధాని పర్యటించనున్నారు. View this post on Instagram A post shared by Visit Maldives (@visitmaldives) -
'ది ఢిల్లీ ఫైల్స్' టైటిల్ను మార్చేసిన దర్శకుడు
‘ది కశ్మీర్ ఫైల్స్’(2022) సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు సొంతం చేసుకున్నారు దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి(Vivek Agnihotri). ఈ సినిమా తర్వాత ఆయన ‘ది ఢిల్లీ ఫైల్స్’ నిర్మిస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే పలు పోస్టర్స్తో పాటు టీజర్ కూడా విడుదల చేశారు. అయితే, తాజాగా టైటిల్ను మార్పు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. అందుకు కారణాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు. కానీ, చాలామంది కోరికమేరకే టైటిల్ను మార్పు చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు.అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకంపై అభిషేక్ అగర్వాల్(Abhishek Agarwal) నిర్మిస్తున్న 'ది ఢిల్లీ ఫైల్స్'(The Delhi Files) చిత్రాన్ని 'ది బెంగాల్ ఫైల్స్'(The Bengal Files)గా మార్పు చేస్తున్నట్లు దర్శకుడు వివేక్ అగ్ని హోత్రి ప్రకటించారు. సెప్టెంబర్ 15న పాన్ ఇండియా రేంజ్లో ఈ మూవీ విడుదల కానుంది. ఈ మూవీలో మిథున్ చక్రవర్తితో పాటు పల్లవి జోషి, అనుపమ్ ఖేర్, దర్శన్ కుమార్ కీలక పాత్రల్లో నటించారు. తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్– ఐ యామ్ బుద్ధ ప్రొడక్షన్స్పై అభిషేక్ అగర్వాల్, అర్చన అగర్వాల్, వివేక్ రంజన్ అగ్నిహోత్రి, పల్లవి జోషి నిర్మించనున్నారు.BIG ANNOUNCEMENT: The Delhi Files is now The Bengal Files. Teaser coming this Thursday, 12 June 2025 at 12 PM. In cinemas on 05 September 2025.দ্য দিল্লি ফাইলস এখন দ্য বেঙ্গল ফাইলস। টিজার আসছে আগামী বৃহস্পতিবার, ১২ই জুন ২০২৫, দুপুর ১২টায়।ছবিটি প্রেক্ষাগৃহে মুক্তি… pic.twitter.com/tzXEEYdS28— Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) June 10, 2025 -
లక్ష్యం కోసం...
హృతిక్ రోషన్, ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న స్పై యాక్షన్ డ్రామా చిత్రం ‘వార్ 2’. కియారా అద్వానీ హీరోయిన్. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ఆదిత్య చోప్రా నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 14న హిందీ, తమిళ్, తెలుగు భాషల్లో రిలీజ్ కానుంది. కాగా ఇటీవల ‘వార్ 2’ సినిమా టీజర్ను విడుదల చేశారు.ఈ టీజర్లో కనిపించిన ఎన్టీఆర్ లుక్స్, స్టైలింగ్ బాగున్నాయనే చర్చ జరిగింది. ఈ విషయంపై ‘వార్ 2’ సినిమాకు కాస్ట్యూమ్ డిజైనర్గా పనిచేసిన అనైతా ష్రాఫ్ అడజానియా తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ‘‘వార్ 2’ సినిమా కోసం ఎన్టీఆర్తో కలిసి పనిచేయడం ఎంతో ఆనందంగా ఉంది. ఆయనలో ఏదో ఆకర్షణ శక్తి ఉంది. సెట్స్కి ఎంట్రీ ఇవ్వగానే ఆ ఎనర్జీ టీమ్ అందరిలోకి వచ్చేస్తుంటుంది. ‘వార్ 2’ లో ఎన్టీఆర్ పోషించినపాత్రలో ఎన్నో లేయర్స్ ఉన్నాయి. అందుకే చాలా లుక్స్ని డిజైన్ చేశాం. ఆయనపాత్ర స్వభావాన్ని ప్రతిబింబించేలా కాస్ట్యూమ్స్ని డిజైన్ చేశాం. ఓ ఉద్దేశంతో ఓ లక్ష్యం కోసం పనిచేసే మానవ యంత్రంలా చూపించే ప్రయత్నం చేశాం’’ అని అనైతా ష్రాఫ్ అడజానియా చెప్పారు. -
షారుక్ఖాన్ తో సుకుమార్?
బాలీవుడ్ హీరో షారుక్ఖాన్ , దర్శకుడు సుకుమార్ కాంబినేషన్ లో ఓ సినిమా రూపుదిద్దుకోనుందనే టాక్ ప్రచారంలోకి వచ్చింది. షారుక్తో ఓ సినిమా చేసేందుకు టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ప్రయత్నాలు చేస్తోందని, ఈ దిశగా చర్చలుప్రారంభమయ్యాయని ఫిల్మ్నగర్ సమాచారం. ఈ సినిమాకు షారుక్ ఓకే చెబితే, దర్శకుడిగా సుకుమార్తో ఈ చిత్రాన్ని ముందుకు తీసుకువెళ్లాలని మైత్రీమూవీ మేకర్స్ అనుకుంటున్నారని టాక్. మరి.. సుకుమార్, షారుక్ఖాన్ కాంబినేషన్ లో సినిమా సెట్ అవుతుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ. ఇదిలా ఉంటే.. ఇటీవల షారుక్ఖాన్ ను కలిశారట తమిళ దర్శకుడు వెట్రిమారన్ . ఈ నేపథ్యంలో షారుక్ఖాన్ సినిమా ఏ దర్శకుడితో ఉండబోతుందనే చర్చ జరుగుతోంది. ఇక ప్రస్తుతం హిందీ చిత్రం ‘కింగ్’ (ప్రచారంలో ఉన్న టైటిల్) సినిమా ప్రీ ప్రోడక్షన్ వర్క్స్లో బిజీగా ఉన్నారు షారుక్ఖాన్ . ఈ ఏడాదిలోనే ఈ సినిమా చిత్రీకరణ ఆరంభం కానుంది. -
ప్రముఖ రాజకీయ నాయకుడితో రిలేషన్.. సోనాలి బింద్రే క్లారిటీ!
మురారి సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను మురిపించిన ముద్దుగుమ్మ సోనాలి బింద్రే. ఇటీవల ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన సోనాలి తన కెరీర్లో ఎదుర్కొన్న అనుభవాలను అభిమానులతో పంచుకుంటోంది. సల్మాన్ ఖాన్తో ఓ మూవీ సెట్లో ఎదురైన సంఘటనను ఇటీవలే వెల్లడించింది. ఆ సమయంలో అతనిపై విపరీతమైన కోపం వచ్చేదని తెలిపింది. అయితే తన క్యాన్సర్ చికిత్స సమయంలో అమెరికా వచ్చి తన ఆరోగ్యం గురించి ఆరా తీశాడని కూడా చెప్పుకొచ్చింది.తాజాగా ప్రముఖ రాజకీయ నాయకుడు రాజ్ థాకరే 20 ఏళ్ల క్రితం తనను ఇష్టపడ్డారన్న రూమర్స్పై బాలీవుడ్ నటి సోనాలి బింద్రే స్పందించారు. ఈ వార్తలపై సోనాలి అసంతృప్తి వ్యక్తం చేసింది. అందులో ఎలాంటి నిజం లేదన్నారు. తాను ఎప్పుడూ అలాంటి వార్తలను పట్టించుకోలేదని సోనాలి తెలిపింది. సోనాలి మాట్లాడుతూ.. 'నాపై ఇలాంటి ప్రచారం జరిగినట్లు నాకే తెలియదు. కొందరు సోషల్ మీడియాలో ఇలా మాట్లాడుకుంటున్నారని ఇప్పుడే తెలిసింది. నిజంగా ఇది చాలా బాధాకరం. మా రెండు కుటుంబాల మధ్య ఎన్నో ఏళ్ల అనుబంధం ఉంది. రాజ్ థాకరే భార్య షర్మిలా, ఆమె తల్లికి మా పిన్ని మంచి స్నేహితురాలు. ఆ విధంగా ఇరు కుటుంబాల మధ్య మా చిన్నతనం నుంచే మంచి స్నేహం ఏర్పడింది. అలా ఇరు కుటుంబాల మధ్య నా చిన్నప్పటి నుంచే మంచి అనుబంధం ఉంది. ఇప్పటికీ ఆ రిలేషన్ అలాగే ఉందని' తెలిపింది. కాగా.. సోనాలి బింద్రే చివరిసారిగా 'ది బ్రోకెన్ న్యూస్ సీజన్ 2'లో కనిపించింది. ఈ సిరీస్ జీ5లో స్ట్రీమింగ్ కానుంది. -
సుష్మిత సంపాదిస్తుంటే తేరగా తింటున్నావ్.. ఇల్లు కూడా నీది కాదు!
ఈ మధ్య కాలంలో సెలబ్రిటీలకు ప్రశంసల కన్నా విమర్శలే ఎక్కువగా వస్తున్నాయి. సుష్మితా సేన్ (Sushmita Sen) సోదరుడు, బాలీవుడ్ నటుడు రాజీవ్ సేన్ (Rajeev Sen) కూడా అందుకు అతీతుడు కాదు. అక్క ఎలాగో పెళ్లి చేసుకోలేదు.. ఆమె బాగా సంపాదిస్తుంటే తేరగా వచ్చిందని పుష్టిగా తింటున్నావ్.. ఎంజాయ్ చేస్తున్నావ్ అని కొందరు అతడిపై నోరు పారేసుకున్నారు.అక్క సంపాదనతోనే..ఈ నెగెటివ్ కామెంట్లు రాజీవ్ కంటపడ్డాయి. అతడి కష్టాన్ని గుర్తించకపోగా ఇలా తక్కువ చేసి మాట్లాడటంతో నటుడి మనసు చివుక్కుమంది. దీంతో తన యూట్యూబ్ ఛానల్లో ఈ ట్రోలింగ్పై స్పందించాడు. రాజీవ్ సేన్ మాట్లాడుతూ.. నా ఫ్యామిలీ వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నాను. అయితే మా అక్క సంపాదించే డబ్బుతోనే బతుకుతున్నానని, మా అమ్మానాన్న వల్లే ఇంత విలాసవంతమైన ఇంట్లో నివసిస్తున్నానని చాలామంది అనేక రకాలుగా విమర్శలు గుప్పిస్తున్నారు. మీ అందరికీ ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను.అలాగైతేనే సక్సెస్ అయినట్లా?నేనేంటో చూపించుకోవడానికి నేనేమీ సూపర్స్టార్ అయిపోవాల్సిన అవసరం లేదు. ఉదాహరణకు.. నేను పది సినిమాలు చేశాను, ఎన్నో యాడ్స్లో నటించాను.. ఇంకా నా చేతిలో ఫలానా ప్రాజెక్టులున్నాయి. వాటితో మరింత సక్సెస్ అవుతా.. ఇలాంటివి చెప్తేనే, చేస్తేనే సక్సెస్ అయినట్లు కాదు. చాలామంది బిజినెస్ పెట్టి సక్సెస్ అవుతున్నారు. రకరకాల విభాగాల్లో ఇన్వెస్ట్ చేసి డబ్బు సంపాదిస్తున్నారు. అవన్నీ కెమెరా ముందుకు వచ్చి చెప్పుకుంటారా? లేదు కదా! నగల బిజినెస్నాకు జ్యువెలరీ బిజినెస్ ఉంది. అమ్మానాన్నల సహకారంతో అది విజయవంతంగా రన్ చేస్తున్నాను. నేను కాస్త ఉన్నత కుటుంబంలోనే పుట్టాను. అయినా నన్ను నేను నిరూపించుకోవాలనుకున్నాను. అందుకే నగల వ్యాపారం ప్రారంభించాను. ఈ పని చాలాకాలంగా చేస్తున్నాను. ఇదే కాకుండా నటనవైపు వెళ్లాను, నిర్మాతగా కూడా ప్రాజెక్టులు చేస్తున్నా.. యూట్యూబ్ ఈ మధ్యే మొదలుపెట్టాను. ఇవన్నీ ప్యాషన్తో చేస్తున్నవే తప్ప డబ్బు సంపాదించడానికి చేయట్లేదు. ఎందుకంటే నేను ఇప్పటికే సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్ను. నా సొంత పెట్టుబడితో చాలానే సంపాదించా.. అది ఎంత మొత్తమనేది మీకు చూపించాల్సిన అవసరం లేదు.గెంటేస్తే పోతా..నేను ఉండే ఇల్లు మా అమ్మదే.. ఈ ఇల్లు నాదే అని ఎన్నడూ చెప్పలేదే! రేప్పొద్దున అమ్మ.. వెళ్లిపో అని గెంటేస్తే తప్పకుండా ఇంట్లో నుంచి బయటకు వచ్చేస్తా! ఎందుకంటే నేను సంపాదించినవి మాత్రమే నా ఆస్తులు. ఇది నాది కాదు. అయినా మీరన్నట్లు మా అమ్మ సంపాదించిన విలాసవంతమైన ఇంట్లో ఉండి.. ప్రతి ఖర్చులు తనే భరిస్తూ.. మా అక్క కూడా తనే డబ్బిచ్చి ఎంజాయ్ చేయమంటే మీకేంటి సమస్య? నేనేం మీ జేబులోని డబ్బు తీయట్లేదుగా? మీరేమనుకున్నా నాకు ఫరఖ్ పడదు అని రాజీవ్ సేన్ ట్రోలర్స్కు కౌంటర్ ఇచ్చాడు.చదవండి: అఖిల్ అక్కినేని రిసెప్షన్.. కొత్త జంట చేసిన పని చూశారా? -
ఆస్పత్రి బెడ్పై టాలీవుడ్ బ్యూటీ.. అదే కారణమా?
బిగ్బాస్ విన్నర్, టాలీవుడ్ నటి సనా మక్బుల్ (Sana Makbul) ఆస్పత్రిపాలైంది. ఆటోఇమ్యూన్ వ్యాధితో బాధపడుతున్న ఆమె ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. డాక్టర్ ఆశ్నా కంచ్వాలా.. సనా హాస్పిటల్ బెడ్పై ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. మై స్ట్రాంగ్ లేడీ.. ఇలాంటి దారుణమైన పరిస్థితిని ఎంతో ధైర్యంగా ఎదుర్కొంటున్నావు. నిన్ను చూసి గర్విస్తున్నాను. నీ ధైర్యం కోల్పోకుండా అలాగే పోరాడు. ఈ పరిస్థితి నుంచి బయటపడాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. నేను ఎల్లప్పుడూ నీవెంటే ఉన్నాను అని రాసుకొచ్చింది.సినిమాసనా మక్బుల్.. దిక్కులు చూడకు రామయ్య, మామ ఓ చందమామ వంటి తెలుగు చిత్రాల్లో హీరోయిన్గా నటించింది. హిందీ బిగ్బాస్ ఓటీటీ మూడో సీజన్ విజేతగా నిలిచింది. ఇటీవల ఆమె తన కాలేయ వ్యాధి గురించి బయటపెట్టింది. 2020 నుంచి ఆటో ఇమ్యూన్ హెపటైటిస్ అనే వ్యాధితో పోరాడుతున్నట్లు తెలిపింది. ఈ వ్యాధి వల్ల తన శరీరంలోని కణాలు కాలేయంపై దాడి చేస్తాయి. దీని కారణంగా తను ఆస్పత్రిపాలైనట్లు కనిపిస్తోంది. చదవండి: రెండుసార్లు విడాకులు.. ఏడుస్తూ కూర్చుంటే ఏం లాభం?: హీరో -
రెండుసార్లు విడాకులు.. ఏడుస్తూ కూర్చుంటే ఏం లాభం?: హీరో
పెళ్లైన దంపతులను నిండునూరేళ్లు కలిసి జీవించమని పెద్దలు ఆశీర్వదిస్తుంటారు. కానీ, ఈ కాలంలో నూరేళ్లు బతకడం కష్టమే అయితే, అంతవరకు కలిసి జీవించడం పెద్ద సవాల్గా మారింది. ఎన్నో జంటలు ఆడంబరంగా వివాహం చేసుకోవడం తర్వాత విడాకులు తీసుకోవడం పరిపాటిగా మారింది. సినీ ఇండస్ట్రీలో ఈ ధోరణి కాస్త ఎక్కువే కనిపిస్తుంది.నిందలు- బాధలుఅయితే విడాకులు తీసుకోవడం ఈజీ అయినా, ఆ బాధను మర్చిపోవడం అంత తేలిక కాదంటున్నాడు హీరో ప్రోసెంజిత్ చటర్జీ (Prosenjit Chatterjee). ఇతడు సహనటి దెబశ్రీ రాయ్ (Debashree Roy)ను పెళ్లాడాడు. వివాహమైన కొంతకాలానికే విడిపోయారు. ఈ విషయం గురించి ప్రొసెంజిత్ తాజాగా టైమ్స్ నౌకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడాడు. అప్పుడు మా వయసు పెద్దదేం కాదు. విడిపోయినప్పుడు ఒకరినొకరు నిందించుకున్నాం.టాప్ 10 నటుల్లో నేను లేనుకానీ ఆ బాధ నుంచి బయటపడలేకపోయాను. పనిపై దృష్టి సారించలేకపోయాను. కొంత డిప్రెషన్లోకి వెళ్లిపోయాను. సరిగ్గా అదే సమయంలో బెంగాల్లో టాప్ 10 నటుల గురించి ఓ వార్త రాశారు. టాప్ 10 జాబితాలో ఎక్కడా నా పేరు లేదు. అది నన్ను మరింత బాధలోకి నెట్టేసింది. నాకు నేనే సర్ది చెప్పుకున్నాను. తిరిగి ఆఫీస్కు వెళ్లి ఒకేసారి తొమ్మిది సినిమాలు సంతకం చేశాను. ఏడుస్తూ ఇంట్లో కూర్చుంటే ఒరిగేదేం లేదు.ప్రొసెంజిత్ చటర్జీ- దెబశ్రీ రాయ్మూడు పెళ్లిళ్లుబాధగా అనిపించినప్పుడల్లా నా తోటకి వెళ్లేవాడిని. ఎవరితోనూ మాట్లాడకుండా కాసేపు ప్రశాంతంగా కూర్చునేవాడిని అని చెప్పుకొచ్చాడు. దెబశ్రీకి విడాకులు ఇచ్చాక ప్రొసెంజిత్ మరోసారి ప్రేమలో పడ్డాడు. అపర్ణ గుహ తకుర్తను పెళ్లాడాడు. వీరికి ప్రేరణ అనే కూతురు పుట్టింది. తర్వాత ఈ జంట మధ్య కూడా విభేదాలు తలెత్తడంతో విడాకులు తీసుకున్నారు. నటి అర్పితా పాల్ను మూడో పెళ్లి చేసుకున్నాడు. కెరీర్బాలీవుడ్ నటుడు బిస్వజిత్ చటర్జీ కుమారుడే ప్రొసెంజిత్. చైల్డ్ ఆర్టిస్ట్గా కెరీర్ మొదలుపెట్టిన ప్రొసెంజిత్ హీరోగా, విలన్గా అనేక సినిమాలు చేశాడు. బెంగాలీ, హిందీలో అనేక చిత్రాల్లో నటించాడు. దోసర్ మూవీకి గానూ ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్నాడు. చివరగా ఖాకీ: ద బెంగాల్ చాప్టర్ అనే వెబ్ సిరీస్లో కనిపించాడు. ప్రస్తుతం మాలిక్ అనే మూవీ చేస్తున్నాడు. పులకిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో రాజ్ కుమార్ రావు, మానుషి చిల్లరి, మేధా శంకర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీ జూలై 11న విడుదల కానుంది. చదవండి: అఖిల్ అక్కినేని రిసెప్షన్.. ఈ విషయం గమనించారా? -
కూతురికి రూ. 250 కోట్లు గిఫ్ట్గా ఇచ్చిన స్టార్ హీరో దంపతులు
తల్లిదండ్రులు తమ బిడ్డల కోసం కోట్ల ఆస్తిని కూడబెడుతుంటారు. ఇందుకు సెలబ్రిటీలు ఏమీ అతీతులు కాదని చెప్పవచ్చు. బాలీవుడ్ జంట రణబీర్ కపూర్, అలియా భట్ల (Ranbir Kapoor, Alia Bhatt) ఇల్లు ఎట్టకేలకు పూర్తి అయింది. సుమారు మూడేళ్లుగా ఈ ఇంటి నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ముంబైలోని బాంద్రా నడిబొడ్డున ఉన్న ఈ కొత్త ఇంట్లోకి వారు త్వరలో షిఫ్ట్ కానున్నారు. సుమారు రూ. 250 కోట్ల విలువ చేసే ఈ ఆస్తిని తన కూతురు రాహా కపూర్ పేరుతో ఈ దంపతులు రాశారు. ఆ ఆస్తికి సంరక్షకురాలిగా రణబీర్ కపూర్ అమ్మగారు నటి నీతూ కపూర్ పేరుతో రిజిస్టర్ చేయించారు. అంత ఆస్తిని తమ పేర్లతో రిజిస్ట్రేషన్ చేపించుకోకుండా కూతురు, అమ్మకు గిఫ్ట్గా ఇవ్వాలని వారు నిర్ణయించుకున్నారు.ఆ ఇంటితో రణబీర్ అనుబంధంవాస్తవంగా ఆ ఇల్లు రణబీర్ కపూర్కు వారసత్వంగా వచ్చింది. రాజ్ కపూర్ ఇండస్ట్రీలో పీక్లో ఉన్నప్పుడు దానిని కొనుగోలు చేశారు. ఆ తర్వాత రిషీ కపూర్ అందులోనే ఉన్నారు. అలా వారసత్వంగా ప్రస్తుతం రణబీర్ కపూర్ చేతికి ఆ ఆస్తి వచ్చింది. అయితే, దానిని రీమోడలింగ్ చేయించారు. పాత కట్టడాలకు ఎలాంటి డ్యామేజ్ జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటూనే ఆరు అంతస్తుల విలాసవంతమైన ఇల్లు నిర్మించారు. మరో రెండు నెలల్లో గృహప్రవేశం చేయనున్నారు.రణబీర్కు ఆ ఇల్లు వారసత్వానికి గుర్తు.. దానిని చాలా సెంటిమెంట్గా ఫీల్ అవుతాడు. అయితే, తనకు కూతురు పుట్టిన తర్వాత కెరీర్ పరంగా ఆయనకు బాగా కలిసొచ్చింది. దీంతో దాదాపు రూ. 250 కోట్లకు పైగా ఉన్న ఆ భవనాన్ని కూతురు రాహా పేరుతో రిజిస్ట్రేషన్ చేపించాడు. దాంతో బాలీవుడ్ కూడా ఆశ్చర్యపోయింది. భవిష్యత్లో తన కూతురు ఆ ఇంట్లో ఎలా ఉండాలో అందుకు అనుగుణంగానే ఆయన నిర్మించుకున్నారట. వచ్చే దీపావళిని తన కూతురుతో అక్కడ సెలబ్రేట్ చేసుకోవాలని వారు ప్లాన్ చేస్తున్నారట. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
వీధిలోకొచ్చారు... థియేటర్కి వెళ్లారు... గోడ దూకారు!
ఒక హీరో తన సినిమా ప్రమోషన్ కోసం జనాల్లోకి వచ్చారు... ఇంకో హీరో విడుదలైన తన సినిమా ఎలా ఉందో తెలుసుకోవడానికి థియేటర్కి వెళ్లారు... మరో నటుడు షూటింగ్కి లేట్ అవుతుందని గోడ దూకేశారు... వీరు ఏం చేసినా సినిమా కోసమే. బాలీవుడ్ నటులు ఆమిర్ ఖాన్, అక్షయ్ కుమార్, అనుపమ్ ఖేర్ తాజాగా ఇలా హాట్ టాపిక్ అయ్యారు. ఇక ఆ విశేషాలు తెలుసుకుందాం. వడపావ్ చేస్తూ... సినిమా ప్రమోషన్ కోసం ఏ అవతారం ఎత్తడానికైనా రెడీ అయిపోతారు ఆమిర్ ఖాన్. అందుకు ఓ ఉదాహరణ ‘3 ఇడియట్స్’ (2009) సినిమా. ఈ చిత్రం విడుదల సమయంలో పంజాబ్లో జరిగిన పెళ్లి వేడుకలకు ఫారినర్లా డ్రెస్ చేసుకుని హాజరయ్యారు ఆమిర్. ఆ తర్వాత అసలు గెటప్లోకి మారి, అందర్నీ ఆశ్చర్యపరిచారు. తాజాగా తాను హీరోగా నటిం చిన ‘సితారే జమీన్ పర్’ ప్రచారం కోసం జనాల్లోకి వచ్చి, ‘వడపావ్’ తయారు చేశారు ఆమిర్. ఈ నెల 20న ఈ చిత్రం విడుదల కానుంది. ఆమిర్ ఖాన్ దర్శకత్వం వహించి, నటించిన ‘తారే జమీన్ పర్’ (2007)కి సీక్వెల్గా ‘సితారే జమీన్ పర్’ రూపొందింది. ఆర్ఎస్. ప్రసన్న దర్శకత్వం వహించిన ఈ స్పోర్ట్స్ డ్రామా మూవీకి ఆమిర్ ఖాన్ ఓ నిర్మాత. రివ్యూ కోసం మాస్క్తో!మామూలుగా సినిమా రిలీజ్ అయ్యాక ఎలా ఉందో తెలుసుకోవడానికి నిర్మాతలు, పంపిణీదారులు, సన్నిహితులను అడుగు తుంటారు స్టార్స్. అయితే ‘హౌస్ఫుల్ 5’ సినిమా ఎలా ఉందో స్వయంగా ప్రేక్షకులను అడిగి తెలుసుకోవాలనుకున్నారు ఈ చిత్రంలో ఓ లీడ్ రోల్ చేసిన అక్షయ్ కుమార్. ముఖానికి మాస్క్ తొడుక్కుని ముంబైలోని ఓ థియేటర్కి వెళ్లి, మైక్ పట్టుకుని ‘సినిమా ఎలా ఉంది’ అని థియేటర్ నుంచి బయటికొస్తున్న ప్రేక్షకులను అడిగారు. ఆ వీడియో వైరల్గా మారింది. ‘హౌస్ఫుల్’ ఫ్రాంచైజీలో భాగంగా రూపొందిన ‘హౌస్ఫుల్ 5’లో సంజయ్ దత్, అభిషేక్ బచ్చన్, రితేష్ దేశ్ముఖ్ ఇతర లీడ్ రోల్స్ చేశారు. తరుణ్ మన్సుఖానీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 6న విడుదలైంది. ఏడు పదుల వయసులో గోడ దూకి...షూటింగ్కి ఆలస్యం అవుతోంది... డ్రైవర్ని కారు వేగం పెంచమన్నారు అనుపమ్ ఖేర్. కట్ చేస్తే... షూటింగ్ లొకేషన్కి చేరుకోలేదు. ఎందుకంటే కారు డెడ్ ఎండ్కి చేరుకుంది. రివర్స్ చేసుకుని, వెనక్కి వెళదామంటే వీలు పడలేదట. ఓ గోడ దూకితే అటు పక్క లొకేషన్ ఉంది. సాహసం చేసేద్దాం అని అనుపమ్, ఆయన టీమ్ నిర్ణయించుకున్నారు. నిచ్చెన తెచ్చారు. అనుపమ్ ఖేర్ ఆ నిచ్చెన ఎక్కి, గోడ దూకి లొకేషన్లోకి అడుగుపెట్టారు. ఇంతకీ ఈయన వయసు ఎంతో తెలుసా? 70. ఏడు పదుల వయసులో అనుపమ్ ఖేర్ ఇలా జోష్గా, జోరుగా గోడ దూకడం హాట్ టాపిక్ అయింది.ఆయన ఏ షూటింగ్లోపాల్గొనడానికి హైదరాబాద్ చేరుకున్నారంటే ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఫౌజీ’ (ప్రచారంలో ఉన్న టైటిల్) కోసం. ఈ చిత్రంలో ఈ బాలీవుడ్ నటుడు కీలకపాత్ర చేస్తున్నారు. ఇక తాను ఇలా గోడ దూకిన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వివరించి, ఆ వీడియోను షేర్ చేశారు అనుపమ్ ఖేర్. ‘‘నా 40 ఏళ్ల సినిమా ప్రయాణంలో పలు రకాలుగా షూటింగ్ లొకేషన్స్కి వెళ్లాను. కానీ, ఇలా వెళ్లడం చాలా ప్రత్యేకంగా, కామెడీగా అనిపించింది’’ అని రాసుకొచ్చారీ సీనియర్ నటుడు. -
'చిన్ననాటి కల నెరవేరింది.. అత్తారింటికి దారేది నటుడు పోస్ట్'!
అత్తారింటికి దారేది సినిమాతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో స్థానం దక్కించుకున్న స్టార్ నటుడు బోమన్ ఇరానీ. ప్రస్తుతం ఆయన బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్నారు. కొత్త ఏడాదిలో ది మెహతా బాయ్స్ సినిమాతో డైరెక్టర్గా మారిన ఆయన.. తాజాగా నటిస్తోన్న చిత్రం 'తన్వి ది గ్రేట్'. అనుపమ్ ఖేర్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంలో ఆయన కీ రోల్ ప్లే చేస్తున్నారు. ఈ చిత్రంలో నటి శుభంగి దత్ టైటిల్ రోల్లో నటించింది. ఈ చిత్రాన్ని ఇటీవలే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చేనెల 18న థియేటర్లో సందడి చేయనుంది.ఇక బోమన్ ఇరానీ సినిమాల సంగతి పక్కనపడితే.. ఆయన వ్యక్తిగతంగానూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. తాజాగా తన చిన్ననాటి కల నేరిందని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ ప్రత్యేక పుట్టినరోజున నా కలను సాకారం చేసిన తన కుటుంబానికి కృతజ్ఞతలు తెలిపారు. ఫ్రెంచ్ ఓపెన్ చూడాలనుకున్న తన కలను నేరవేర్చినందుకు తన భార్య జెనోబియా, కుమారులు దనేశ్, కయోజ్ ఇరానీకి ధన్యవాదాలు తెలిపారు. ఈ సర్ప్రైజ్ను వారంతా కలిసి తన పుట్టినరోజుకు ప్లాన్ చేసి మరి బహుమతిగా ఇచ్చారని ఆనందం వ్యక్తం చేశారు. View this post on Instagram A post shared by Boman Irani (@boman_irani) -
క్యాన్సర్తో పోరాటం.. ఆ స్టార్ హీరో సపోర్ట్ మరిచిపోలేను: సోనాలి బింద్రే
మురారి సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను మురిపించిన బాలీవుడ్ బ్యూటీ సోనాలి బింద్రే. ఆ సినిమాతో ఒక్కసారిగా అభిమానుల గుండెల్లో తన పేరును లిఖించుకుంది. ఆ తర్వాత కూడా తెలుగులో పలు సూపర్ హిట్ సినిమాల్లో చేసింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన బాలీవుడ్ భామ తాను క్యాన్సర్ చికిత్స తీసుకున్న అనుభవాలను పంచుకుంది. ఆ సమయంలో తనకు ఓ స్టార్ హీరో పూర్తి మద్దతుగా నిలిచారని చెప్పుకొచ్చింది. ఇంతకీ ఎవరు ఆ స్టార్ హీరో తెలుసుకుందామా?2018లో సోనాలి బింద్రేకు క్యాన్సర్ రావడంతో అమెరికాలోని న్యూయార్క్ వెళ్లి చికిత్స తీసుకుంది. ఆ సమయంలో తన చికిత్స గురించి పదే పదే ఆరా తీశారని తెలిపింది. నేను చికిత్స పొందుతున్నప్పుడు ఒకటి కాదు.. ఏకంగా రెండుసార్లు న్యూయార్క్ వచ్చాడని సోనాలి వెల్లడించింది. తనకు అత్యంత అవసరమైన సమయంలో హీరో సల్మాన్ ఖాన్ అండగా నిలిచారని గుర్తు చేసుకుంది. ఆ సమయంలో తన భర్తకు ఫోన్ చేసి అక్కడ సరైన వైద్యులు ఉన్నారో లేదో తెలుసుకోవాలి.. అంతేకాదు వారితో కూడా మాట్లాడాలని సల్మాన్ అడిగారని తెలిపింది.అయితే ఇటీవల 'హమ్ సాత్ సాత్ హై' చిత్రీకరణ సమయంలో సల్మాన్ ఖాన్ తీరుపై సోనాలి విమర్శలు చేసింది. తనను కొట్టాలన్నంత కోపం వచ్చిందని తెలిపింది. 1999లో వచ్చిన హమ్ సాత్ హై సినిమా షూటింగ్లో సల్మాన్ నన్ను చూసి ముఖం చిట్లించేవాడు. అది చూసి నాకు చాలా కోపమొచ్చేది. తను నచ్చేవాడే కాదు. ఎప్పుడూ పోట్లాడుతూనే ఉండేవాళ్లమని వెల్లడించింది. ఇక సినిమాల విషయానికొస్తే సోనాలి బింద్రే 'ది బ్రోకెన్ న్యూస్' రెండో సీజన్లో కనిపించింది. -
ప్రేక్షకుల వెంట పరిగెత్తిన స్టార్ హీరో.. ఎవరూ గుర్తుపట్టలేదు!
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఇటీవలే హౌస్ఫుల్-5 మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. హౌస్ఫుల్ సూపర్ హిట్ సిరీస్లో వచ్చిన ఐదో చిత్రం ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. ఈ కామెడీ ఎంటర్టైనర్ జూన్ 6న థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రంలో నటించిన అక్షయ్ కుమార్ ఫ్యాన్స్కు అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చారు. తన మూవీకి రెస్పాన్స్ ఎలా ఉందో తెలుసుకోవడానికి తానే స్వయంగా రంగంలోకి దిగారు. అయితే ఎవరూ గుర్తు పట్టకుండా ముఖానికి మాస్క్ ధరించి థియేటర్ వద్దకు వెళ్లాడు.ఈ విషయాన్ని తానే స్వయంగా ఇన్స్టాలో పంచుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను షేర్ చేశారు. ఈ రోజు నేను కిల్లర్ మాస్క్ ధరించి బాంద్రాలో హౌస్ఫుల్ 5 థియేటర్ నుంచి బయటికి వస్తున్న వారిని ఇంటర్వ్యూ చేశా. ఈ అనుభవం చాలా హ్యాపీగా అనిపించిందని క్యాప్షన్ రాసుకొచ్చారు. అయితే అక్షయ్ కుమార్ను ఏ ఒక్క అభిమాని కూడా గుర్తు పట్టకపోవడం విశేషం. ఇది చూసిన నెటిజన్స్ ఇలా చేయడం అక్షయ్కి మాత్రమే సాధ్యమని అంటున్నారు.కాగా.. జూన్ 6న విడుదలైన హౌస్ఫుల్-5 మూవీ దేశీయ బాక్సాఫీస్ అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమా విడుదలైన కేవలం రెండు రోజుల్లోనే రూ. 50 కోట్ల మార్కును దాటేసింది. తొలిరోజు రూ. 24 కోట్లు రాబట్టిన ఈ మూవీ..రెండో రోజున దాదాపు రూ. 30 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమాకు తరుణ్ మన్సుఖాని దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో రితేష్ దేశ్ముఖ్, అభిషేక్ బచ్చన్, ఫర్దీన్ ఖాన్, నానా పటేకర్, జాకీ ష్రాఫ్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కీలక పాత్రల్లో నటించారు. View this post on Instagram A post shared by Akshay Kumar (@akshaykumar) Whaaat this is so funny. He is so cute and funny 😍How could the people there not notice? I knew @akshaykumar sir by his walk, voice, physical structure, clothes, bracelet on his wrist and even his smell. I wish the people there knew how lucky they were 😱🥹#AkshayKumar : "… pic.twitter.com/tkkiPAE9Ej— Emine Gelinci ʰᵒᵘˢᵉᶠᵘˡˡ⁵ 🧡🔥 Forever Akkian (@Akkian_Emine87) June 8, 2025 #AkshayKumar instagram post lmao. Akki sir asking how's his movie to public. Unka chhodo me bata deta hu mast movie me must watch just go for it.😂🔥or @akshaykumar sir aapki team badlo jinko kesa mike use karna chahiye wo bhi nahi pata.#Housefull5 #Housefull5Review pic.twitter.com/mKUU9NYX1F— axay patel 🔥🔥 (@akkiDhoni2) June 8, 2025 -
బీ గ్రేడ్ చిత్రాలతో కెరీర్ నాశనం.. పెద్ద సినిమాలు చేజార్చుకున్నా!
దీప్శిఖ నగ్పాల్ (Deepshikha Nagpal).. కోయిల, బాద్షా, దిల్లగీ, పార్ట్నర్ వంటి బాలీవుడ్ (Bollywood) హిట్ సినిమాల్లో నటించింది. హిందీ బిగ్బాస్ 8వ సీజన్లోనూ పాల్గొంది. బుల్లితెరపైనా పలు సీరియల్స్లో తళుక్కుమని మెరిసింది. అయితే కొన్ని చెత్త సినిమాలను సెలక్ట్ చేసుకోవడం వల్ల అవకాశాలు తగ్గడంతో బుల్లితెరకు షిఫ్ట్ కావాల్సి వచ్చిందంటోంది.తప్పుడు నిర్ణయాలతో కెరీర్ తలకిందులుఇన్స్టంట్ బాలీవుడ్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దీప్శిఖ మాట్లాడుతూ.. నేను తీసుకున్న కొన్ని తప్పుడు నిర్ణయాలు కెరీర్ను దెబ్బకొట్టాయి. అప్పట్లో ఎలా ఉండేదంటే.. యశ్ రాజ్, సుభాష్ వంటివారు నిర్మించేవి మాత్రమే ఏ గ్రేడ్ సినిమాలుగా పరిగణించేవారు. కొత్త నిర్మాణ సంస్థ ఏదైనా ప్రాజెక్ట్ చేస్తుందంటే అది బీ గ్రేడ్ సినిమాలకిందే లెక్కేసేవారు. నాకు ఏవి సెలక్ట్ చేసుకోవాలనేది అర్థం కాలేదు.ఏదైనా పనే అనుకున్నా..పైగా నా ఫ్యామిలీలో ఎవరికీ సినీరంగంతో పరిచయమే లేదు. కానీ సినీరంగంలో మనకు సలహాలిచ్చే వ్యక్తి ఉంటే బాగుంటుందని నాకిప్పుడనిపిస్తుంది. సినిమాల ఎంపికలో చాలా తప్పులు చేశాను. మా తాతయ్య ఏమనేవారంటే.. ఏ పనీ చిన్నది, పెద్దది అని వ్యత్యాసం చూపించకూడదనేవారు. ఏదైనా పనే అనేవారు. దాన్ని నేను సీరియస్గా తీసుకున్నాను. అందుకనే నాకు ఏ అవకాశం వచ్చినా ముందూవెనకా ఆలోచించకుండా చేసుకుంటూ పోయాను. ఈ క్రమంలో ఎన్నో చెత్త సినిమాలు చేశా.. అవి ఇప్పటికీ రిలీజ్ కాకుండా ఆగిపోయాయి.(చదవండి: అరటిపండ్లు అమ్మా, నెంబర్ ప్లేట్లు తయారు చేశా.. మారుతి)ఆ పోస్టర్ దెబ్బ కొట్టిందికొన్ని విడుదలయ్యాయి.. కానీ, అవి నా కెరీర్ను దెబ్బకొట్టాయి. ఉదాహరణకు ట్రేడ్ గైడ్ అనే సినిమా చేసినప్పుడు ఓ పోస్టర్ వదిలారు. అప్పటికే నేను చాలా పెద్ద సినిమాలకు సంతకం చేశాను. కానీ ఆ పోస్టర్ చూశాక నేను బీ గ్రేడ్ సినిమాలు చేస్తున్నానని పక్కన పెట్టేశారు. నాకు విషయం అర్థమయ్యేసరికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆ సినిమాల గురించి మర్చిపోదాం అని కోరినా కూడా వాళ్లు వినలేదు. నిన్ను తీసుకుంటే మేము నష్టపోవాల్సి వస్తుంది అని రిజెక్ట్ చేశారు. చెత్త సినిమాలు చేసినందున జనాలు నన్ను నమ్మడం మానేశారు.ఆ కోపంతో బుల్లితెరకు షిఫ్ట్పెద్ద సినిమాల్లో పని చేసే అర్హత లేదని భావించారు. నాకు పట్టరానంత కోపం వచ్చింది. అందుకే బుల్లితెరపై ఫోకస్ పెట్టాను. ఇక్కడ సీరియల్స్, షోలు చేయడం స్టార్ట్ చేశాను. శాశ్వతంగా కనుమరుగైపోకుండా నటిగా నిలబడ్డాను అని చెప్పుకొచ్చింది. దీప్శిక.. సన్ పరి, రామాయణ్, కరిష్మా- ద మిరాకిల్స్ ఆఫ్ డెస్టినీ, బల్వీర్, మధుబాలా- ఏక్ ఇష్క్ ఏక్ జునూన్, సంతోషి మా వంటి పలు సీరియల్స్లో నెగెటివ్ పాత్రలు చేసింది.చదవండి: రెండో బిడ్డకు జన్మనిచ్చిన కుంకుమ భాగ్య సీరియల్ నటి -
సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం.. మా ఇద్దరి కెరీర్ ముగిసింది: రియా చక్రవర్తి
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం తీవ్ర విషాదం మిగిల్చిన సంగతి తెలిసిందే. సుశాంత్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం బాలీవుడ్ను కుదిపేసింది. అతని మరణం తర్వాత ప్రియురాలైన రియా చక్రవర్తిపై పలు ఆరోపణలు వచ్చాయి. అంతేకాకుండా ఆమెను పోలీసులు సైతం అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ఆమెతో తమ్ముడైన షోయిక్ చక్రవర్తిపై కూడా కేసు నమోదు చేశారు. దీంతో వారిద్దరి జీవితం అనేక మలుపులు తిరిగింది.తాజాగా ఓ ఇంటర్వూకు హాజరైన రియా చక్రవర్తి..సుశాంత్ మరణం తర్వాత తాను, తన తమ్ముడు అనుభవించిన బాధను పంచుకుంది. సుశాంత్ మృతి తర్వాత మాపై ఆరోపణలు రావడంతో మా ఇద్దరి కెరీర్ ఒక్కసారిగా తలకిందులైందని వెల్లడించింది. ఆ సంఘటనతో మా ఇద్దరి కెరీర్లు ముగిశాయని తెలిపింది.రియా మాట్లాడుతూ.. "సుశాంత్ మరణం తర్వాత మేము ఎదుర్కొన్న పరిస్థితులు చాలా దారుణం. ఆ సంఘటనతో మా ఇద్దరి కెరీర్లు ముగిశాయి. నాకు నటనాపరంగా ఎలాంటి ఆఫర్స్ రాలేదు. అంతేకాకుండా నా తమ్ముడు షోయిక్ క్యాట్ పరీక్షలో 96 పర్సంటైల్ పొందాడు. కానీ అదే సమయంలో నాతో పాటు అతను అరెస్టు అయ్యాడు. జైలు నుంచి నా తమ్ముడు తిరిగి వచ్చాక మొదటి త్రైమాసిక పరీక్షలు మిస్సయ్యాడు. దీంతో అతని ఎంబీఏ కెరీర్ భవిష్యత్తును కూడా కోల్పోయాడు. ఆ తర్వాత ఏదైనా కార్పొరేట్లో ఉద్యోగం పొందడం చాలా కష్టమైంది. ఎందుకంటే నా తమ్ముడిని నియమించుకోవడానికి ఎవరూ ఇష్టపడలేదు. కొద్దిరోజులు మా జీవితాలు ఎటువైపు వెళ్తున్నాయో అర్థం కాలేదు. ఆ తర్వాత ఛాప్టర్-2 డ్రిప్ అనే దుస్తుల బ్రాండ్ను ప్రారంభించాలనే ఆలోచన తనకు, షోయిక్కు వచ్చిందని.. దాన్నే కెరీర్గా ఎంచుకున్నామని " అని తాము ఎదుర్కొన్న బాధలను వివరించింది.అయితే సుశాంత్ సింగ్ రాజ్పుత్ కేసులో రియా చక్రవర్తితో పాటు ఆమె తమ్ముడు షోయిక్లకు చివరికి క్లీన్ చిట్ లభించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రియా తిరిగి తన కెరీర్ నటనలో మళ్లీ అడుగుపెట్టింది. ఆమె ఇటీవలే రోడీస్లో కనిపించింది. ఆమె తన సొంత పాడ్కాస్ట్ను కూడా ప్రారంభించింది. ఇందులో అమీర్ ఖాన్, సుష్మితా సేన్, ఫర్హాన్ అక్తర్, హనీ సింగ్ లాంటి ప్రముఖులను ఇంటర్వ్యూ చేసింది. -
రెండో బిడ్డకు జన్మనిచ్చిన కుంకుమ భాగ్య సీరియల్ నటి
కుంకుమ్ భాగ్య సీరియల్ ఫేమ్ పూజా బెనర్జీ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా తాను రెండో బిడ్డకు జన్మనిచ్చింది. పలు సీరియల్స్తో తనదైన నటనతో గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ భామకు ఇప్పటికే సనా అనే మూడేళ్ల కూతురు ఉన్నారు. తాజాగా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ వార్తను అందరితో పంచుకోవడానికి మేము చాలా సంతోషంగా ఉన్నాం.. ఇప్పుడు నలుగురు కుటుంబ సభ్యులం అయ్యామంటూ శనివారం తన జీవితంలోకి మరో బిడ్డకు ఆహ్వానం పలికింది బాలీవుడ్ బ్యూటీ.అనేక టీవీ సీరియల్స్తో తన నటనకు పేరుగాంచిన పూజా బెనర్జీ ప్రముఖ స్విమ్మర్, ఒలింపియన్ సందీప్ సెజ్వాల్ను వివాహం చేసుకుంది. పూజ ఈ రోజు ఉదయం మగబిడ్డను ప్రసవించింది.. మేమందరం చాలా సంతోషంగా ఉన్నామని ఆమె భర్త సందీప్ తెలిపారు. కాగా.. కొత్త ఏడాది ప్రారంభంలో తాను గర్భం ధరించినట్లు అభిమానులతో పంచుకుంది. ఆ తర్వాత తన బేబీ బంప్ ఫోటోషూట్ను షేర్ చేసింది.పూజా బెనర్జీ బాలీవుడ్లో చంద్ర నందిని, దిల్ హి తో హై, కసౌతి జిందగీ కే 2, కుంకుమ్ భాగ్య, బడే అచ్చే లగ్తే హై 2 లాంటి ప్రముఖ సీరియల్స్లో నటించింది. అంతేకాకుండా పూజా కొన్ని వెబ్ సిరీసుల్లో కూడా భాగమైంది. కెహ్నే కో హమ్సఫర్ హై అనే షోలో నటనతో పూజా అందరి దృష్టిని ఆకర్షించింది. ఆమె చివరిసారిగా 2023లో వచ్చిన బడే అచ్చే లగ్తే హై -2 సీరియల్లో కనిపించింది. ఆ తర్వాత పూజ నటనకు దూరంగా ఉంది. తాజాగా ఆమె రెండవ బిడ్డకు జన్మనివ్వడంతో నటనకు కొద్ది రోజులు విరామం తీసుకోనుంది. -
ప్రభాస్ సినిమా.. 70 ఏళ్ల వయసులో గోడ దూకిన నటుడు
సినిమా కోసం కొన్నిసార్లు విన్యాసాలు చేయక తప్పదంటున్నాడు బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ (Anupam Kher). అదేదో సినిమాలో స్టంటనుకునేరు, కానే కాదు సినిమా సెట్కు వెళ్లేందుకు స్టంట్ చేయాల్సి వచ్చింది. అనుపమ్ ఖేర్.. ప్రభాస్ ఫౌజీ (ప్రచారంలో ఉన్న టైటిల్) సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. హైదరాబాద్లో ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. అయితే సెట్లోకి వెళ్లేందుకు అనుపమ్ గోడ దూకాడు. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.ఇదే తొలిసారినా 40 ఏళ్ల జర్నీలో ఎన్నో రకాలుగా షూటింగ్ లొకేషన్కు వెళ్లాను. కానీ ఈరోజు ఇలా సెట్కు వెళ్లడం మాత్రం ఇదే తొలిసారి, ప్రత్యేకం కూడా! హైదరాబాద్లో ప్రభాస్ సినిమా షూటింగ్ సెట్కు బయలుదేరాం. మా డ్రైవర్ దాన్ని సాహసోపేతంగా మార్చాలనుకున్నాడేమో బహుశా.. ఏకంగా అడవిలాంటి ప్రదేశంలోకి తీసుకొచ్చాడు. తీరా డెడ్ ఎండ్కు చేరుకున్నాం. ఏం చేయాలో అర్థం కాలేదు. గోడ దూకి సెట్లోకి..కారు రివర్స్ తీద్దామని ప్రయత్నించినా వీలు కాలేదు. మా పక్కనే సినిమా షూటింగ్ జరుగుతోంది. దీంతో గోడ దూకి సెట్లోకి అడుగుపెట్టాను అని చెప్పుకొచ్చాడు. ఇది చూసిన జనాలు.. కెరీర్ తొలినాళ్లలో ముసలి వ్యక్తిగా నటించారు. ఇప్పుడు 70 ఏళ్ల వయసులో అడవిలో ఈ స్టంట్లు చేస్తున్నారు అని కామెంట్లు చేస్తున్నారు. ఫౌజీ సినిమా విషయానికి వస్తే.. హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్కు జంటగా సోషల్ మీడియా సెన్సేషన్ ఇమాన్వి కథానాయికగా నటిస్తోంది. View this post on Instagram A post shared by Anupam Kher (@anupampkher) చదవండి: చెట్టు వెనక్కెళ్లి దుస్తులు మార్చుకోమన్నారు.. అప్పుడు బిగ్బీ.. -
చెట్టు వెనక్కెళ్లి దుస్తులు మార్చుకోమన్నారు.. అప్పుడు బిగ్బీ..
మలయాళ సీనియర్ హీరోయిన్ శోభన (Shobana) 'కల్కి 2898 ఏడీ' సినిమా (Kalki 2898 AD Movie)తో వెండితెరపై రీఎంట్రీ ఇచ్చింది. ఈ మధ్యే వచ్చిన తుడరుమ్ సినిమాలోనూ యాక్ట్ చేసింది. తాజాగా ఆమె ఇన్స్టాగ్రామ్ లైవ్లో ఫ్యాన్స్తో ముచ్చటించింది. ఈ సందర్భంగా అమితాబ్ బచ్చన్తో కలిసి పని చేసిన అనుభవాలను గుర్తు చేసుకుంది.అమితాబ్తో పాట షూటింగ్బచ్చన్ సర్ అప్పుడెలా ఉన్నాడో ఇప్పుడూ అలానే ఉన్నాడు. నాతో కలిసి పనిచేసినవారిలో ఎంతో వినయ విధేయతలతో నడుచుకునే ఆర్టిస్ట్ ఆయన. గొప్ప ఆర్టిస్టుల్లో సాధారణంగా కనిపించే అంశం విధేయత. బచ్చన్ (Amitabh Bachchan) సర్ గురించి మీకో విషయం చెప్తాను. కొన్నేళ్ల క్రితం అహ్మదాబాద్లో ఆయనతో కలిసి ఓ పాట షూటింగ్లో పాల్గొన్నాను. నేను ఎన్నో దుస్తులు ఒకదానిపై ఒకటి వేసుకుని ఉన్నాను. బచ్చన్ సర్ దగ్గర కారవాన్ ఉంది. కానీ చాలామంది షూట్ చూసేందుకు రావడంతో ఆ ప్రాంతమంతా స్థంభించిపోయింది.చెట్టు వెనకాల..నా దుస్తులు మార్చుకునేందుకు నా కారవాన్ ఎక్కడుందని అడిగాను. ఇంతలో ఒకరు.. తను మలయాళ సినిమా నుంచే కదా వచ్చింది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా సర్దుకుపోతారు. చెట్టు వెనకాల దుస్తులు మార్చుకుంటుందిలే అని కామెంట్ చేశారు. బచ్చన్ సర్ దగ్గరున్న వాకీటాకీలో ఆ మాటలు వినిపించాయి. వెంటనే ఆయన నేనున్న చోటుకు వచ్చి ఎవరా మాట అంది? అని ఆగ్రహించాడు. నన్ను ఆయన కారవాన్లోకి తీసుకెళ్లాడు. నన్ను దుస్తులు మార్చుకోమని చెప్పి బయటకు వెళ్లిపోయాడు.కల్కి 2898 ఏడీలో..కల్కి సినిమాలో కూడా ఆయన ఎక్కువ బరువున్న దుస్తులు వేసుకున్నాడు. భారీ ప్రోస్తటిక్స్ (హెవీ మేకప్) వాడాడు. అంత బరువు మోస్తున్నా కూడా ఎవరైనా వస్తే లేచి నిల్చుని పలకరించేవాడు అని చెప్పుకొచ్చింది. కల్కి 2898 ఏడీ సినిమా విషయానికి వస్తే నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రభాస్ హీరోగా నటించాడు. అమితాబ్ బచ్చన్ అశ్వత్థామగా, శోభన మరియంగా, దీపికా పదుకొణె సుమతిగా, కమల్ హాసన్ యాస్కిన్గా నటించారు. ఈ చిత్రం గతేడాది జూన్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దాదాపు రూ.600 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం వెయ్యికోట్లపైనే వసూళ్లు రాబట్టింది. కల్కి సీక్వెల్ ఈ ఏడాది డిసెంబర్లో పట్టాలెక్కనుంది. చదవండి: ఈ జర్నీ అంత ఈజీ కాదు.. కలిసి ముందుకెళ్దాం.. నటి పెళ్లి ప్రపోజల్ -
చిన్నతనంలో చేదు అనుభవాలు.. అబ్బాయిల్ని నమ్మాలంటేనే భయం!
పాపులర్ కమెడియన్ జానీ లివర్ (Johny Lever) కూతురు జామీ లివర్ (Jamie Lever) హిందీలో అనేక సినిమాలు చేసింది. గతేడాది ఆ ఒక్కటి అడక్కు చిత్రంతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. తాజాగా ఆమె తన బాల్యంలో ఎదురైన చేదు అనుభవాలను గుర్తు చేసుకుంది. నాకు పదేళ్లుంటాయనుకుంటా. స్కూల్ అయిపోగానే వెళ్లి కారులో కూర్చున్నాను. మా డ్రైవర్ నా సోదరుడు జెస్సీ కోసం బయట ఎదురుచూస్తున్నాడు. ఇంతలో ఓ వ్యక్తి మా కారు దగ్గరకు వచ్చి నన్ను చూస్తూ అసభ్యంగా ప్రవర్తించాడు. కారు డోర్ తీసి లోపలకు వస్తే నా పరిస్థితి ఏంటని భయంతో వణికిపోయాను.మమ్మల్ని కాపాడాల్సిన వ్యక్తే..డోర్ లాక్ చేసి తనను చూడనట్లే ఉన్నాను. దాంతో అతడు కాసేపటికి వెళ్లిపోయాడు. బస్ కండక్టర్ కూడా మాతో పద్ధతిగా ప్రవర్తించేవాడు కాదు. ఎప్పుడూ ఏదో ఒకరకంగా తాకాలని చూసేవాడు. ఇదంతా ఒక పీడకలలా మర్చిపోవాలనుకునేదాన్ని. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన వ్యక్తే ఇలా నీచంగా ఆలోచిస్తే ఏమనాలి? ఇవన్నీ చూశాక అబ్బాయిలను నా జీవితంలోకి ఆహ్వానించాలంటేనే భయమేసింది. 20'sలో కేవలం ఒక్కరిని మాత్రమే డేటింగ్ చేశాను. నాకు జరిగిన అనుభవాలను అమ్మ సుజాతకు, నాన్న జానీ లివర్కు కూడా చెప్పుకోలేదు అని తెలిపింది.చదవండి: పవన్ కల్యాణ్ సినిమాను ఎందుకు ఆపుతారు?: సునీల్ నారంగ్ -
సూపర్ హీరోలు వస్తున్నారోచ్
ఐరన్ మ్యాన్, బ్యాట్ మ్యాన్, హల్క్... ఇలా హాలీవుడ్ సూపర్ హీరో కథలను భారతీయ ప్రేక్షకులు వీక్షించారు. అబ్బురపరచే వారి సాహసాలను శభాష్ అన్నారు. అయితే ఇప్పుడు మన ఇండియన్ సినిమా సూపర్ హీరోస్ కూడా వస్తున్నారోచ్. వెండితెరపై ఆడియన్స్ను ఆశ్చర్యపరచే అద్భుత విన్యాసాలు, సాహసాలతో ఆడియన్స్ వావ్ అనేలా కష్టపడటానికి రెడీ అవుతున్నారు. ఇక మన సూపర్ హీరో వివరాలపై ఓ లుక్ వేయండి.విశ్వంభర ప్రపంచంలో... ‘విశ్వంభర’ సినిమాలో సూపర్ హీరో మాదిరి యాక్షన్ చేయనున్నాడట దొరబాబు. చిరంజీవి హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న మైథలాజికల్ అడ్వెంచరస్ అండ్ యాక్షన్ మూవీ ‘విశ్వంభర’. కాగా ఈ చిత్రంలో ఆంజనేయస్వామి భక్తుడు దొరబాబుపాత్రలో చిరంజీవి కనిపిస్తారని, దొరబాబుగా విశ్వంభర ప్రపంచంలో సాగే కొన్ని సన్నివేశాల్లో సూపర్ హీరోలా యాక్షన్ సన్నివేశాలు చేస్తారని ఫిల్మ్నగర్ సమాచారం. పంచభూతాల (గాలి, నీరు, భూమి, ఆకాశం, నిప్పు) నేపథ్యం, విశ్వంభర అనే బుక్, సిస్టర్స్ సెంటిమెంట్తో ఈ సినిమా కథనం సాగుతుందని సమాచారం.యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్, విక్రమ్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తయింది. కాక΄ోతే వీఎఫ్ఎక్స్ వర్క్ కారణంగా సినిమా విడుదల ఆలస్యమౌతోందని తెలుస్తోంది. ఈ వీఎఫ్ఎక్స్ వర్క్స్ ఓ కొలిక్కి వచ్చిన తర్వాత ‘విశ్వంభర’ సినిమా విడుదల తేదీపై ఓ క్లారిటీ రానుంది. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్గా నటిస్తుండగా, ఇతర ప్రధానపాత్రల్లో ఆషికా రంగనాథ్, బాలీవుడ్ యాక్టర్ కునాల్ కపూర్ కనిపిస్తారు. కీలకపాత్రల్లో సురభి, ఇషా చావ్లా, ప్రవీణ్ కనిపిస్తారని తెలిసింది.వచ్చే ఏడాది స్టార్ట్ ‘ఖైదీ, విక్రమ్, లియో’ వంటి మాస్ సినిమాలు తీసిన తమిళ దర్శకుడు లోకేశ్ కనగరాజ్ ఓ సూపర్ హీరో కథను రెడీ చేశారు. లోకేశ్ కనగరాజ్ కథలోని సూపర్ హీరోగా బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ కనిపించనున్నారు. ఈ సూపర్ హీరో సినిమాను ఇటీవల ఆమిర్ ఖాన్ ఓ సందర్భంలో కన్ఫార్మ్ చేశారు. దర్శకుడు లోకేశ్ కనగరాజ్ తనకు ఓ సూపర్ హీరో కథ చెప్పారని, లోకేశ్తో తాను ఈ సూపర్ హీరో మూవీ చేయనున్నానని, వచ్చే ఏడాది షూటింగ్ ప్రారంభిస్తామని ఆమిర్ ఖాన్ చెప్పారు.ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనుందనే టాక్ తెరపైకి వచ్చింది. ప్రస్తుతం తాను హీరోగా నటించిన ‘సితారే జమీన్ పర్’ సినిమా ప్రమోషన్స్లో బిజీగా ఉన్నారు ఆమిర్ ఖాన్. ఈ సినిమా తర్వాత దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్లో ఆమిర్ ఖాన్ నటిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈలోపు కార్తీతో ‘ఖైదీ 2’ సినిమా చేసేస్తారు లోకేశ్ కనగరాజ్. ఇలా... ఆమిర్–లోకేశ్ల ఇతర కమిట్మెంట్స్ పూర్తయిన తర్వాత వీరిద్దరి కాంబినేషన్లోని సినిమా సెట్స్కు వెళ్తుందని ఊహించవచ్చు. అలాగే లోకేశ్ దర్శకత్వంలోని తాజా చిత్రం ‘కూలీ’లో ఆమిర్ ఖాన్ ఓ గెస్ట్ రోల్ చేసిన సంగతి తెలిసిందే. రజనీకాంత్ హీరోగా, నాగార్జున, శ్రుతీహాసన్, సత్యరాజ్, ఉపేంద్ర ఇతర కీలకపాత్రల్లో నటించిన ఈ సినిమా ఆగస్టు 14న విడుదల కానుంది.ఆన్ ద వే! సిల్వర్ స్క్రీన్పై రవితేజను ఓ సూపర్ హీరోగా చూపించనున్నారు ‘మ్యాడ్’ డైరెక్టర్ కల్యాణ్ శంకర్. ‘మ్యాడ్, మ్యాడ్ 2’ చిత్రాలతో వరుస విజయాలు అందుకున్న ఈ దర్శకుడు కొన్ని రోజుల క్రితమే ఓ సూపర్ హీరో స్క్రిప్ట్ను రెడీ చేసుకున్నారు. ఈ కథను రవితేజకు వినిపించగా, ఈ హీరో ప్రాథమికంగా అంగీకారం తెలిపారట. దీంతో ఈ సినిమా స్క్రిప్ట్కు మరింత మెరుగులు దిద్దే పనిలో పడ్డారట కల్యాణ్ శంకర్. ఈ స్క్రిప్ట్, ప్రీ ప్రోడక్షన్ వర్క్స్ ఓ కొలిక్కి వచ్చి, రవితేజకు కల్యాణ్ శంకర్ ఫైనల్ నరేషన్ ఇచ్చి, రవితేజ ఈ సినిమాకు ఓకే చెబితే, మూవీ సెట్స్పైకి వెళ్లినట్లే. అయితే ఈ సినిమా సెట్స్పైకి వెళ్లడానికి మాత్రం కాస్త సమయం పట్టవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం నూతన దర్శకుడు భాను భోగవరపుతో ‘మాస్ జాతర’ అనే మూవీ చేస్తున్నారు రవితేజ.ఆగస్టు 27న ఈ చిత్రం రిలీజ్ కానుంది. అలాగే కిశోర్ తిరుమల దర్శకత్వంలో ‘అనార్కలి’ (ప్రచారంలో ఉన్న టైటిల్) అనే మూవీ కూడా చేస్తున్నారు రవితేజ. ‘మాస్ జాతర’ చిత్రీకరణ దాదాపు పూర్తయింది. ‘అనార్కలి’ సినిమా షూటింగ్ మొదలు కావాల్సి ఉంది. పైగా ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేస్తామని ఆల్రెడీ రవితేజ ప్రకటించారు. సో... ఈ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాతే కల్యాణ్ శంకర్తో సూపర్ హీరో తరహా సినిమా చేసే ఆలోచన చేయవచ్చు రవితేజ. ఇక ఈ కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘మ్యాడ్, మ్యాడ్ 2’ చిత్రాలు, రవితేజ ‘మాస్ జాతర’ సినిమాలను నిర్మించిన సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థనే కల్యాణ్ శంకర్–రవితేజల సూపర్ హీరో సినిమాను నిర్మించనుందనే టాక్ ఫిల్మ్నగర్ సర్కిల్స్లో వినిపిస్తోంది. సో... సూపర్ హీరో ఆన్ ద వే అన్నమాట.సరికొత్త ప్రపంచంలోకి... ఆడియన్స్ను ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లనున్నారు హీరో అల్లు అర్జున్. అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా ఓ అంతర్జాతీయ స్థాయి సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ఓ సరికొత్త ప్రపంచాన్నే సృష్టిస్తున్నారట దర్శకుడు అట్లీ. ఈ సినిమాలో ఊహకందని లొకేషన్స్, వినూత్నమైన జీవరాసులు ఉంటాయట. పైగా ఈ చిత్రంలో అల్లు అర్జన్ త్రిపాత్రాభినయం చేయనున్నారనే టాక్ తెరపైకి వచ్చింది. అయితే ఈ మూడుపాత్రల్లో ఒకపాత్ర సూపర్ హీరో తరహాలో ఉంటుందని ఫిల్మ్నగర్ సమాచారం. ఆల్రెడీ ఈపాత్రకు సంబంధించి విదేశీ సాంకేతిక నిపుణులు, ఫైటర్స్ నేతృత్వంలో అల్లు అర్జున్ ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటున్నారని తెలిసింది.ఇక ఈ చిత్రంలో కథ రీత్యా ఐదుగురు హీరోయిన్స్ ఉంటారనే టాక్ వినిపిస్తోంది. ఓ హీరోయిన్గా దీపికా పదుకోన్ నటించనున్నారు. దీపికపాత్రకు యాక్షన్ సీక్వెన్స్లు కూడా ఉన్నాయి. ఈ చిత్రంలో ఓ వారియర్ తరహాపాత్రలో కనిపిస్తారామె. ఇంకా ఈ చిత్రంలో జాన్వీ కపూర్, మృణాల్ ఠాగూర్ భాగమయ్యారని, ఈ విషయంపై త్వరలోనే ఓ అధికారిక ప్రకటన రానుందని సమాచారం. ఈ ఏడాదిలోనే ఈ సినిమా చిత్రీకరణను ప్రారంభించాలనుకుంటున్నారు. భారీ బడ్జెట్తో సన్ పిక్చర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించనుంది. వీలైనంత తొందరగా ఈ సినిమా చిత్రీకరణను పూర్తి చేసి, 2027 ప్రారంభంలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలన్నది చిత్రయూనిట్ ΄్లాన్ అని భోగట్టా.ఇటు అధీర... అటు మహాకాళి! ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్లో భాగంగా కొన్ని సూపర్ హీరో తరహా సినిమాలు రూపొందుతున్న సంగతి తెలిసిందే. తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘హను–మాన్’ బ్లాక్బస్టర్గా నిలిచింది. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాల్లో తేజ సజ్జా సూపర్ హీరో పవర్స్ ఉన్న యువకుడు హనుమంతుపాత్రలో కనిపించి, ఆడియన్స్ను మెప్పించారు. ఈ సినిమాకు సీక్వెల్గా ‘జై హనుమాన్’ చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ‘కాంతార’ ఫేమ్ రిషబ్ శెట్టి మెయిన్ లీడ్ రోల్ చేస్తారు. అయితే ఈ చిత్రంలోనూ హనుమంతుపాత్ర ఉంటుందట. ఇంకా ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్లో భాగంగానే ‘అధీర’ అనే సినిమా అనౌన్స్మెంట్ వచ్చింది.ఈ సూపర్ హీరో సినిమాలో నిర్మాత డీవీవీ దానయ్య తనయుడు కల్యాణ్ దాసరి హీరోగా నటిస్తారు. ఇంకా ప్రశాంత్ వర్మ యూనివర్స్లో భాగంగానే ‘మహాకాళి’ అనే మూవీ రానుంది. విశేషం ఏంటంటే... ఇది ఫీమేల్ సూపర్ హీరో మూవీ అన్నమాట. పూజ అపర్ణ కొల్లూరు దర్శకత్వంలో ఆర్కేడీ స్టూడియోస్ పతాకంపై ఆర్కే దుగ్గల్ సమర్పణలో రివాజ్ రమేశ్ దుగ్గల్ ఈ సినిమాను నిర్మించనున్నారు. అయితే ఈ సినిమాలో ఎవరు మెయిన్ లీడ్ చేస్తారన్నది ఇంకా అధికారికంగా వెల్లడి కాలేదు. కాగా ప్రశాంత్ వర్మ షో రన్నర్గా ఉన్న ‘మహాకాళి’ సినిమాలో బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా ఓ కీలకపాత్రలో నటిస్తారు. గత ఏడాది దసరా పండగ సందర్భంగా ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు ప్రశాంత్వర్మ. ఈపోస్టర్పై మోస్ట్ ఫెరోషియస్ సూపర్ హీరో ఇన్ ది యూనివర్స్ అని ఉండటం విశేషం.పీపుల్స్ సూపర్ హీరో పీపుల్స్ సూపర్ హీరోగా చెప్పుకునే శక్తిమాన్ సరికొత్త పవర్స్తో వెండితెరపైకి రానున్నాడు. మూడు సంవత్సరాల క్రితమే ఈ ‘శక్తి మాన్’ సినిమా అధికారిక ప్రకటన వచ్చింది. ఈ సినిమాలో శక్తి మాన్గా రణ్వీర్ సింగ్ నటిస్తారని, మలయాళ దర్శకుడు బాసిల్ జోసెఫ్ దర్శకత్వం వహిస్తారని, హీరోయిన్గా వామికా గబ్బి కనిపిస్తారనే ప్రచారం తెరపైకి వచ్చింది. అయితే ‘శక్తి మాన్’ సినిమాలోని నటీనటులపై ఇంకా పూర్తి స్థాయి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా ఈ సిని మాలో రణ్వీర్ సింగ్ నటించడం లేదని, ఈ సినిమాకు ఓ నిర్మాతగానే ఆయన ఉంటారనే ప్రచారం కూడా బాలీవుడ్లో వినిపించింది. మరి... శక్తి మాన్గా ఎవరు కనిపిస్తారనే విషయంపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు.సూపర్ యోధ ‘హను–మాన్’ ఫేమ్ తేజ సజ్జా హీరోగా రూపొందుతున్న అడ్వెంచరస్ యాక్షన్ డ్రామా మూవీ ‘మిరాయ్’. రితికా నాయక్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో మంచు మనోజ్ విలన్ రోల్లో నటిస్తున్నారు. ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాల్లో తేజ సజ్జా సూపర్ హీరో తరహాలో కనిపిస్తారు. ఇటీవల విడుదలైన, ఈ ‘మిరాయ్’ గ్లింప్స్ వీడియోతో ఈ విషయం స్పష్టమౌతోంది. అడ్వెంచరస్తోపాటు కొన్ని మైథలాజికల్ అంశాలను ఈ సినిమాలో చూపించనున్నారు ఈ చిత్రదర్శకుడు కార్తీక్ ఘట్టమనేని. ఇటీవలే ఈ సినిమా కొత్త షెడ్యూల్ ముంబైలోని చారిత్రక గుహల్లో ప్రారంభమైంది. ప్రధాన తారాగణంపాల్గొంటుండగా కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ ‘మిరాయ్’ చిత్రం సెప్టెంబరు 5న విడుదల కానుంది. అలాగే ఈ సినిమా రెండు భాగాలుగా విడుదలవుతుందనే ప్రచారం కూడా జరుగుతోంది.మల్టీవర్స్ మన్మథన్ మలయాళ నటుడు నివిన్ పౌలీ ఓ సూపర్ హీరో ఫిల్మ్ చేస్తున్నారు. ‘మల్టీవర్స్ మన్మథన్’ పేరుతో తెరకెక్కనున్న ఈ సినిమాకు ఆదిత్యన్ చంద్ర శేఖర్ దర్శకత్వం వహించనున్నారు. ఆనంద్, నితీరాజ్ ఈ సినిమాకు కో రైటర్స్గా పని చేస్తున్నారు. ఈ సినిమాను ఈ ఏడాది ఫిబ్రవరిలో అధికారికంగా ప్రక టించారు. ‘‘ఇండియాస్ ఫస్ట్ మల్టీవర్స్ సూపర్ హీరో సినిమా ఇది’’ అని ఈ సినిమా అనౌన్స్మెంట్ సమయంలో నివిన్ పౌలీ ‘ఎక్స్’పోస్ట్లో పేర్కొన్నారు. అయితే ఈ సూపర్ హీరో ఫిల్మ్ మూడు నాలుగు భాగాలుగా రానుందని, తొలి భాగంగా ‘మన్మథన్ రైజింగ్’ ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రం మలయాళ, తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో విడుదల కానుంది.కల నిజమైంది నటుడిగా ఉన్ని ముకుందన్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. ‘భాగమతి, కిలాడి, యశోద’ వంటి సినిమాల్లో ఉన్ని ముకుందన్ నటన తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. ఈ మలయాళ నటుడు ఓ సూపర్ హీరో సినిమాతో దర్శకుడిగా మారనున్నారు. ఆ మధ్య ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు ఉన్ని ముకుందన్. తాను చిన్నప్పట్నుంచి సూపర్ హీరో కథలు, వీరోచితపోరాటాలు చూస్తూ పెరిగానని, తన కలలో కొందరు సూపర్ హీరోస్ ఉన్నారని, వారిని వెండి తెరపైకి తీసుకువచ్చేందుకు తొలిసారి దర్శకత్వం వహించనున్నానని ఉన్ని ముకుందన్ పేర్కొన్నారు. మిథున్ మాన్యువేల్ థామస్ కథ అందిస్తున్న ఈ సినిమాను గోకులమ్ గోపాలన్ నిర్మించనున్నారు. ఈ ఏడాదే ఈ సినిమా చిత్రీకరణను ప్రారంభించాలనుకుంటున్నారు ఉన్ని ముకుందన్. ఈ కోవలో మరికొంతమంది సూపర్ హీరోలు వెండితెరపైకి రానున్నారు. – ముసిమి శివాంజనేయులు -
నువ్వు లేకుండా జీవితాన్ని ఊహించుకోలేకపోతున్నా: అతియా ఎమోషనల్
మనకెంతో ఇష్టమైనవారిని కోల్పోతే ఆ బాధ తట్టుకోలేం. వాళ్లిక మనముందుకు ఎప్పటికీ రాలేరన్న నిజాన్ని జీర్ణించుకోలేం. ప్రస్తుతం అలాంటి బాధనే అనుభవిస్తోంది హీరోయిన్ అతియా శెట్టి (Athiya Shetty). తను ఎంతో ప్రేమగా చూసుకునే పెంపుడు కుక్క బ్రోడీ కన్నుమూసింది. దీంతో భావోద్వేగానికి లోనైన అతియా ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో ఓ పోస్ట్ పెట్టింది. మై బ్రోడీ.. నువ్వు లేకుండా ఇంటిని, ఈ జీవితాన్ని ఊహించలేకపోతున్నాను. నా చిన్నతనంలో నాకు తోడుగా ఉన్నందుకు థాంక్యూ.. అని రాసుకొచ్చింది.మాటల్లో చెప్పలేకపోతున్నా..అతియా సోదరుడు, నటుడు అహాన్ (Ahan Shetty) సైతం బ్రోడీ మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు. నీకు వీడ్కోలు పలకాలంటే మనసు భారంగా ఉంది. నా జీవితంలో అతి ముఖ్యమైన సమయాల్లో నువ్వు నావెంటే ఉన్నావు. నువ్వు నాకెంత ఇష్టమనేది మాటల్లో చెప్పలేకపోతున్నాను. నువ్వు నాకు తోడుగా ఉన్నావ్.. ఒక తమ్ముడిలా నిలబడ్డావ్.. యు వర్ మై హార్ట్. నీకు గుడ్బై చెప్పడం ఎంతో కష్టంగా ఉంది. ఎంతగానో మిస్ అవుతాను బ్రోడీ అని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టాడు. అటు సునీల్ శెట్టి సైతం.. రిప్ మై బేబీ అని బాధపడ్డాడు.సినిమా..బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి (Suniel Shetty)కి కూతురు అతియా శెట్టి, కుమారుడు అహాన్ సంతానం. హీరో, ముబాకరన్, మోతీచూర్ చక్నాచూర్ సినిమాలతో మెప్పించిన అతియా.. 2023లో క్రికెటర్ కేఎల్ రాహుల్ను పెళ్లాడింది. వీరికి ఈ మధ్యే పాప పుట్టింది. అహాన్.. తడప్ సినిమాతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం బోర్డర్ 2, సంకి చిత్రాల్లో నటిస్తున్నాడు. View this post on Instagram A post shared by Ahan Shetty (@ahan.shetty) చదవండి: 'ఢీ'.. దిల్రాజు సహా ఎవరూ కొనలేదు: మంచు విష్ణు -
90 ఏళ్ల వయసులో సినిమాలో ఎంట్రీ ఇస్తున్న స్టార్ హీరో తల్లి!
90 ఏళ్ల వయసులో ఎవరైనా ఏం చేస్తారు? హాయిగా విశ్రాంతి తీసుకుంటారు. కానీ ఈ స్టార్ హీరో తల్లి మాత్రం వృద్ధాప్యంలో సినిమాల్లో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది. బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ (Aamir Khan) తల్లి జీనత్ ఖాన్ (Zeenat Khan) ఓ సూపర్ హిట్ సినిమా సీక్వెల్లో నటించేందుకు సిద్ధమైంది. ఈ విషయాన్ని ఆమిర్ స్వయంగా వెల్లడించాడు. బ్లాక్బస్టర్ సినిమా సీక్వెల్లో..'2007లో వచ్చిన తారే జమీన్ పర్ ఎంత పెద్ద హిట్టయిందో అందరికీ తెలిసిందే! దానికి సీక్వెల్గా సితారే జమీన్ పర్ (Sitaare Zameen Par Movie) రాబోతోంది. ఈ మూవీలో అమ్మ ఓ చిన్న పాత్రలో కనిపించనుంది. నిజానికి తనకు సినిమాలంటే పెద్దగా ఇష్టముండదు. నాతో సెట్స్కు ఎప్పుడూ వచ్చేది కాదు. కానీ, సడన్గా ఓ రోజు నా మూవీ షూటింగ్ ఏ ప్రదేశంలో జరుగుతోంది? అని ఆరా తీసింది. అది విని నేను ఆశ్చర్యపోయాను. తనకు సెట్కు రావాలనుందని చెప్పింది.మొట్టమొదటిసారి కెమెరాముందుకు..దాంతో నా సోదరి అమ్మను వీల్చైర్లో నేనున్న లొకేషన్కు తీసుకొచ్చింది. ఆ రోజు పెళ్లి సెలబ్రేషన్స్పై పాట షూట్ చేస్తున్నాం. దర్శకుడు ఆర్ఎస్ ప్రసన్నకు అప్పుడే ఓ అద్భుతమైన ఐడియా తట్టింది. మీ అమ్మను కూడా పాటలో కనిపించేలా చేస్తే ఎలా ఉంటుంది? అని అడిగాడు. కానీ, తను ఒప్పుకుంటుందా? అని ఆలోచించాను. ఏదైతే అది అయిందని అమ్మను అడిగితే ఆమె వెంటనే ఓకే చెప్పి నాకే సర్ప్రైజ్ ఇచ్చింది. ఫ్యామిలీతో కలిసి..కొన్ని షాట్స్లో ఆమె కనిపిస్తుంది. తను నటించిన ఏకైక సినిమా ఇదే కావడంతో ఈ మూవీ నాకెప్పుడూ ఓ అద్భుత జ్ఞాపకంగా మిగిలిపోనుంది. నా సోదరి కూడా తొలిసారి నాతో కలిసి నటించింది. భవిష్యత్తులో కూడా తనతో మరోసారి కలిసి యాక్ట్ చేస్తానేమో.. అని ఆమిర్ చెప్పుకొచ్చాడు. సితారే జమీన్ పర్ సినిమాలో అరోష్ దత్త, గోపీ కృష్ణ వర్మ, వేదాంత్ శర్మ, రిషబ్ జైన్, ఆశిష్ పెండ్సే.. తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీ జూన్ 20న విడుదల కానుంది.చదవండి: నన్ను దూరం పెట్టాడు.. ఎందుకు వదిలేస్తున్నావని నిలదీశా! -
నన్ను దూరం పెట్టాడు.. ఎందుకు వదిలేస్తున్నావని నిలదీశా!
పెళ్లికి ముందు ప్రేమలు ఇప్పుడు కామన్ అయిపోయాయి. అయితే ఎన్ని లవ్స్టోరీలు ఉన్నా సరే పెళ్లి దగ్గరపడేసరికి వాటిన్నింటికీ ముగింపు పలికేసి కొత్త జీవితం మొదలుపెడుతున్నారు. బాలీవుడ్లో ఈ ట్రెండ్ ఎప్పటినుంచో ఉంది! ఎంతోమంది హీరో, హీరోయిన్లు అనేక లవ్వాయణాల తర్వాతే వైవాహిక బంధంలో అడుగుపెట్టారు.పెళ్లికి ముందు ప్రేమాయణంస్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా (Priyanka Chopra).. నటుడు హర్మాన్ బవేజా, షాహిద్ కపూర్, షారూఖ్ కపూర్ను ప్రేమించినట్లు భోగట్టా! ఆ తర్వాతే అమెరికన్ సింగర్, నటుడు నిక్ జోనస్ (Nick Jonas)తో ప్రేమలో పడగా ఈసారి దాన్ని పెళ్లిదాకా తీసుకెళ్లింది. అయితే నిక్ కూడా గతంలో అమెరికన్ సింగర్, నటి మిలే సైరస్ను ప్రేమించాడు. వీరిద్దరూ 2006- 2009 వరకు డేటింగ్లో ఉన్నారు. ఆ తర్వాత ఆమెకు బ్రేకప్ చెప్పి ప్రియాంకను పెళ్లి చేసుకుని జీవితంలో సెటిలయ్యాడు.నన్ను దూరం పెట్టాడుతాజాగా తన ప్రేమపురాణం గురించి సైరస్ (Miley Cyrus) ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది. నాకు నిక్ అంటే చాలా ఇష్టం. నన్ను తన మ్యూజిక్ టూర్లో జాయిన్ చేసుకోనప్పుడు ఎంతో బాధపడ్డాను. ఏడ్చాను. తను నన్ను నెమ్మదిగా దూరం పెడుతున్నాడని అర్థమైంది. ఎందుకు నన్ను వదిలేస్తున్నావ్? అని నిలదీశాను. కలిసుందామని వేడుకున్నాను. కానీ ఫలితం లేకపోయింది.వెధవ.. నన్ను వదిలేశాడునా బయోగ్రఫీలో కూడా నిక్ మంచివాడు కాదు, వెధవ.. నన్ను వదిలేశాడని బూతులు రాయాలనుకున్నాను. కానీ నా టీమ్ అతడ్ని తిడుతూ రాసేందుకు ఒప్పుకోలేదు. అయితే నిక్ ఇప్పటికీ దారితప్పిన పిల్లాడిలాగే కనిపిస్తాడు అని నవ్వేసింది. ఇకపోతే సైరస్ 2021 నుంచి మాక్స్ మొరండోతో డేటింగ్లో ఉంది. నిక్ విషయానికి వస్తే.. ప్రియాంకను పెళ్లి చేసుకోగా వీరికి సరోగసి ద్వారా మూడేళ్ల కూతురు మాల్తీ మారీ జన్మించింది.చదవండి: మెడ భాగంపై ఉన్న టాటూ తొలగించిన సమంత.. వీడియో వైరల్! -
ప్రభాస్కి నో-బన్నీతో ఫిక్స్.. దీపిక ప్లాన్ ఏంటి?
అల్లు అర్జున్ కొత్త సినిమాలో హీరోయిన్గా బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణెని ఎంపిక చేశారు. గ్రాండ్ ఇంట్రడక్షన్ వీడియోతో అధికారికంగా ప్రకటించారు. ఇందులో సూపర్ ఉమన్ వారియర్ తరహా పాత్రలో దీపిక కనిపించనున్నట్లు క్లారిటీ వచ్చేసింది. సరే ఇదంతా పక్కనబెడితే కొన్నిరోజుల క్రితం ప్రభాస్ చిత్రానికి నో చెప్పిన ఈమె.. ఇప్పుడు బన్నీ సినిమాకు ఓకే చెప్పింది. ఈ మధ్యలో ఏం జరిగింది? సోషల్ మీడియాలో అసలేం వినిపిస్తోంది.'యానిమల్' తర్వాత డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా.. ప్రభాస్తో 'స్పిరిట్' సినిమా చేస్తున్నాడు. ఇప్పటికీ స్క్రిప్ట్ వర్క్ అంతా పూర్తి కాగా హీరోయిన్ పాత్ర కోసం దీపికని సంప్రదించాడు. దాదాపు ఓకే అనుకున్నారు. అఫీషియల్ అనౌన్స్మెంట్ రాకముందే దీపిక పీఆర్ టీమ్.. ఈ విషయాన్ని పలు వెబ్సైట్లకు లీక్ చేసింది. దీపిక పాత్ర ఆహా ఓహో అనే రేంజులో ఉండబోతుందని హైప్ ఇచ్చారు. కొన్నిరోజుల తర్వాత దీపిక తన కండీషన్స్ గురించి సందీప్తో చెప్పిందని వార్తలొచ్చాయి. రోజుకి 8 గంటల మాత్రమే పనిచేస్తానని, రూ.40 కోట్ల రెమ్యునరేషన్తో పాటు లాభాల్లో వాటా కావాలని దీపిక డిమాండ్ చేసినట్లు టాక్ వినిపించింది.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 33 సినిమాలు)అలా దీపిక పెట్టిన కండీషన్స్తో పాటు ఆమె పీఆర్ టీమ్ చేసే హడావుడి వల్ల సందీప్కి చిరాకొచ్చింది. దీంతో దీపికకు నో చెప్పేశాడు. ఇది జరిగిన వెంటనే బాలీవుడ్లో 'స్పిరిట్' గురించి నెగిటివ్ ఆర్టికల్స్ వచ్చాయి. స్టోరీని కూడా లీక్ చేశారు. ఇదో 'ఏ' రేటెడ్ సినిమా అని, హీరోహీరోయిన్ మధ్య రొమాన్స్ గట్టిగానే ఉందని పలు సైట్లలో వార్తలొచ్చాయి. దీంతో సందీప్ రెడ్డి వంగాకు మండింది. వెంటనే తృప్తి దిమ్రిని హీరోయిన్గా ప్రకటించాడు. దీపిక పేరు ప్రస్తావించకుండా పెద్ద ట్వీట్ పెట్టాడు. ఆమెకు ఇచ్చిపడేశాడు. ఏం చేసుకుంటావో చేస్కో అని అనేశాడు.ఇది జరిగి కొన్నిరోజుల కూడా కాలేదు ఇప్పుడు అల్లు అర్జున్ సినిమాలో దీపికని హీరోయిన్గా ఎంపిక చేసినట్లు ప్రకటించారు. దీనిపై కూడా కొన్ని రూమర్స్ వినిపిస్తున్నాయి. లెక్క ప్రకారం మృణాల్ ఠాకుర్ని హీరోయిన్గా తొలుత అనౌన్స్ చేయాలనుకున్నారట. కానీ దీపిక నుంచి ఒత్తిడి రావడంతో ఈమెని హీరోయిన్గా అనౌన్స్ చేశారని వినిపిస్తోంది. మరి దీపిక చెప్పిన కండీషన్స్కి దర్శకుడు అట్లీ ఒప్పేసుకున్నట్లే కనిపిస్తుంది. ఈ సినిమాలో బన్నీ మూడు పాత్రల్లో కనిపించనున్నాడు. ప్రతి పాత్రకు ఓ హీరోయిన్ ఉంటుంది. దీపిక కాకుండా మృణాల్ ఠాకుర్, జాన్వీ కపూర్ని హీరోయిన్లుగా తీసుకోవాలని ఫిక్సయ్యారట.(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న అఖిల్.. అమ్మాయి బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే?) -
షూటింగ్లో రచ్చ చేసిన బాయ్ ఫ్రెండ్, సినిమా నుంచి హీరోయిన్ ఔట్!
సినిమా రంగం అంటే విశేషాలకే కాదు వివాదాలకూ చిరునామా. అయితే చాలా వరకూ వివాదాలు ఎంత వేగంగా వ్యాప్తి చెందుతాయో అంతే వేగంగా మరుగునపడిపోతుంటాయి. అయితే కలకాలం నిలిచే కొన్ని సినిమాల్లాగా కొన్ని వివాదాలు కూడా ఎప్పుడూ కళకళలాడుతూనే ఉంటాయి. దానికి కారణం ఆయా వివాదాలకి లేదా ఆ సంఘటనలకి ఉన్న శక్తి, లేదా ప్రత్యేకతలే అని చెప్పొచ్చు. అలాంటిదే ఒక సంఘటన దాదాపు రెండు దశాబ్ధాల క్రితం జరిగింది. ఈ వివాదానికి కేంద్ర బిందువులుగా నిలిచిన వారు అందరూ భారతీయ సినీరంగంలో అత్యంత ప్రముఖులు కావడం మాత్రమే కాదు... ఎన్నో రకాల మనస్ఫర్ధలకు కాలాలకు స్నేహల విఛ్చిన్నానికి దారి తీయడం కూడా ఆ ఒకే సంఘటనను చిరస్మరణీయంగా మార్చింది. ఆ సంఘటనకు ఉన్న గాఢత వల్ల దానికి సంబంధించిన నటీనటులు కూడా తరచుగా దాన్ని పలు ఇంటర్వ్యూల్లో గుర్తు చేసుకుంటూ ఉండడం కూడా కనిపిస్తుంటుంది. ఆ సంఘటనకు ప్రస్తుత బాలీవుడ్ అగ్రగామి నటుడు సల్మాన్ఖాన్ ప్రధాన కారణమైతే, ప్రస్తుత అభిషేక్ బచ్చన్ భార్య, బాలీవుడ్ ప్రముఖురాలు ఐశ్వర్యరాయ్ ప్రధాన బాధితురాలుగా చెప్పొచ్చు.వివరాల్లోకి వెళితే...గత 2003లో విడుదలైన చళ్తే చళ్తే సినిమాలో షారుఖ్ ఖాన్( Shah Rukh Khan) సరసన ఐశ్వర్య రాయ్ ( Aishwarya Rai Bachchan) ప్రధాన పాత్రకు ఎంపికయ్యారు. అయితే ఒక పాట (‘ప్రేమ నగరియా‘) చిత్రీకరణ సమయంలో, అప్పటి ఆమె తాజా మాజీ బాయ్ ఫ్రెండ్ టాప్ హీరో సల్మాన్ ఖాన్ షూటింగ్ స్పాట్కు వచ్చాడు. అక్కడ నానా రభసా సృష్టించాడు. నాలుగున్నర గంటల పాటు కలకలం సృష్టించాడు. దాంతో దర్శకుడు అజీజ్ మిర్జా షూటింగ్ను నిలిపివేశారు. ఆ తర్వాత ఐశ్వర్య, సల్మాన్ ఇద్దరూ షారుఖ్కు క్షమాపణలు చెప్పినా, నిర్మాతలు ప్రాజెక్ట్ భద్రత కోసం ఆమెను చిత్రంలో నుంచి తప్పించారు.ఇది తనను ఎంతగానో బాధించిందని ఇప్పటికీ ఐశ్వర్య పలుమార్లు ఇంటర్వ్యూల్లో గుర్తు చేసుకుంటుంటారు. తన తప్పేం లేకపోయినా ఆ సినిమా నుంచి తనను తప్పించడం అనేది ఆమెను ఎంతో కాలం వేదనకు గురి చేసింది. ఆ తర్వాత షారుఖ్ ఖాన్ కూడా ఆ నిర్ణయంపై విచారం వ్యక్తం చేశాడు. ‘ఐశ్వర్య నా సన్నిహిత స్నేహితురాలు. ఆమెను నా సినిమా నుంచి తప్పించాల్సి రావడం చాలా బాధాకరం. కానీ ఆ సినిమాకు నేను ఒక్కడినే నిర్మాత కాదు. మా కంపెనీ ప్రతిష్ట పణంగా పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడడంతో, ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది’’ అంటూ షారూఖ్ అన్నాడు.అయితే ఆ తర్వాత కూడా షారుఖ్ ఖాన్తో కలిసి నటించాల్సిన ఐదు సినిమాల నుంచి కూడా ఐశ్వర్య రాయ్ను తప్పించారని, కానీ ఎందుకు అనే వివరణ కూడా ఇవ్వలేదని ఐశ్వర్య సన్నిహితుల దగ్గర వాపోయింది. ఈ అనూహ్య పరిణామం ఆమెను బాధించింది. అప్పటి నుంచీ షారూఖ్ ఐశ్వర్య, సల్మాన్, షారూఖ్ల మధ్య సంబంధాలు బెడిసి కొట్టాయి. అలాగే అంతకు ముందు రాణి ముఖర్జీ, ఐశ్వర్య రాయ్ ఇద్దరూ మంచి స్నేహితులు అయితే ఐశ్వర్యరాయ్ను తొలగించిన తర్వాత ఆ స్థానంలో చళ్తే చళ్తే సినిమాలో రాణి ముఖర్జీ నటించడం జరిగింది. ఈ పరిణామం తర్వాత, వారిద్దరి మధ్య స్నేహ బంధం కూడా ముక్కలైంది. ఇన్ని నాటకీయ పరిణామాల మధ్య పూర్తయిన చళ్తే చళ్తే సినిమా మాత్రం ప్రేక్షకుల మన్ననలు పొందింది. అయితే, అంతకు ముందు ఎప్పుడూ లేనట్టుగా ఈ సినిమా వెనుక జరిగిన సంఘటన చిరకాల మిత్రులను శతృవులుగా, స్నేహాలను విడగొట్టి బాలీవుడ్ చరిత్రలో తనదైన చరిత్రను స్వంతం చేసుకుంది. -
భాయ్... బాబా... ఓ అంతర్జాతీయ చిత్రం
‘‘అదిరింది టీజర్... సల్మాన్ భాయ్ భలే ఉన్నాడు... సంజూ బాబా కూడా బాగున్నాడు’’ అంటూ సల్మాన్ ఖాన్, సంజయ్ దత్ల అభిమానులు ఆనందపడిపోతున్నారు. శుక్రవారం విడుదలైన సౌదీ అరేబియన్ మూవీ ‘7 డాగ్స్’ టీజర్లో సల్మాన్, సంజయ్ల లుక్స్ని ఇలా ప్రశంసించారు. ఈ బాలీవుడ్ స్టార్స్ ఇద్దరూ కలిసి నటిస్తున్న తొలి అంతర్జాతీయ చిత్రం ఇది.ఈ చిత్రానికి అదిల్ ఎల్ అరబీ, బిలాల్ ఫల్లాహ్ దర్శకత్వం వహిస్తున్నారు. అరబ్ స్టార్స్ కరీం అబ్దెల్ అజీజ్, అహ్మద్ ఎజ్ లీడ్ రోల్స్ చేస్తున్నారు. ఇంటర్నేషనల్ క్రైమ్ బ్యాక్డ్రాప్లో సాగే ఈ చిత్రంలో సల్మాన్, సంజయ్ ప్రత్యేక పాత్రల్లో కనిపిస్తారు. టీజర్లో ఇద్దరి పాత్రల గురించిన విశేషాలను బయటపెట్టలేదు. సల్మాన్ విచిత్రమైన చూపులు చూస్తుండగా, తుపాకీ గురి పెట్టి, కోపంగా కనిపించారు సంజయ్ దత్.కథేంటంటే... వార్తల్లో ఉన్న ప్రకారం... ఇంటర్పోల్ ఆఫీసర్ ఖలీద్ అల్ అజ్జాజీ చుట్టూ ఈ చిత్రం తిరుగుతుంది. రహస్య ప్రపంచ నేరాల సిండికేట్ అయిన ‘7 డాగ్స్’లోని ఉన్నత స్థాయి సభ్యుడు ఘాలీ అబు దావూద్ను ఈ అధికారి పట్టుకుంటాడు. ఓ ఏడాది తర్వాత ఆ సంస్థ తిరిగి పుంజుకుంటుంది. పింక్ లేడీ అనే కొత్త డ్రగ్ను రవాణా చేయడం ప్రారంభిస్తుంది. ఈ ముఠా గుట్టుని రట్టు చేయడానికి ఖలీద్ అయిష్టంగానే ఘాలీతో చేతులు కలుపుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నదే కథ అని సమాచారం. ఈ ఏడాదే ఈ చిత్రం విడుదల కానుంది. -
మళ్లీ అవే డిమాండ్లు! కల్కి 2898 ఏడీ సీక్వెల్లో దీపిక లేనట్లేనా?
స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె (Deepika Padukone) పేరు కొన్నాళ్లుగా మార్మోగిపోతోంది. టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో అడ్డంగా వాదించడంతో ఆమెను ప్రభాస్ 'స్పిరిట్' నుంచి తీసేశారు. అత్యధిక రెమ్యునరేషన్ వంటి డిమాండ్లకు తలొగ్గినప్పటికీ వరుస డిమాండ్లు చేస్తుండటంతో సందీప్రెడ్డికి విసుగొచ్చింది. పైగా ఈ మధ్యే తల్లయ్యాను కాబట్టి.. రోజులో ఎనిమిది గంటలే షూటింగ్లో పాల్గొంటానని, సినిమా లాభాల్లో వాటా ఇవ్వాలని అనడంతో డైరెక్టర్కు కోపమొచ్చి ఆమెను తీసేశాడు. డిమాండ్లపై వెనక్కు తగ్గని దీపిక?దీపికా స్థానంలో యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రి (Tripti Dimri)ని తీసుకున్నాడు. ఆ సమయంలో దీపిక కథ లీక్ చేసిందంటూనే పరోక్షంగా తనపై విమర్శలు గుప్పించాడు వంగా. ఇదిలా ఉంటే తాజాగా కల్కి 2898 ఏడీ సీక్వెల్లో కూడా పని గంటల గురించి, పారితోషికం గురించి డిమాండ్ చేసిందట! దీంతో ఆమె పాత్ర నిడివి తగ్గించాలని లేదా తనను తీసేసి ఆమె స్థానంలో త్రిప్తిని తీసుకోవాలని చిత్రయూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు ఫిల్మీదునియాలో ఓ వార్త వైరల్గా మారింది. మరి ఇందులో ఎంతవరకు నిజముందన్నది తెలియాల్సి ఉంది.బ్లాక్బస్టర్ కల్కిస్పిరిట్, కల్కి 2898 ఏడీ సీక్వెల్.. ఇవి రెండూ ప్రభాస్ పాన్ ఇండియా సినిమాలే! ఈ రెండిట్లోనూ త్రిప్తికి నటించే ఛాన్స్ వచ్చిందంటే మాత్రం తన క్రేజ్ రెట్టింపు కావడం ఖాయం. కాగా కల్కి 2898 ఏడీ సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించాడు. అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె, దిశా పటానీ, కమల్ హాసన్ కీలక పాత్రలు పోషించారు. సాయి మాధవ్ బుర్రా సంభాషణలు రాశాడు. సంతోష్ నారాయణన్ సంగీతం అందించాడు. వైజయంతి మూవీస్ బ్యానర్పై అశ్వినిదత్ నిర్మించాడు. గతేడాది జూన్లో విడుదలైన ఈ చిత్రం వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.చదవండి: కొట్టుకోవడం కాదు.. పెద్ద హీరోలు ఆలోచించాలి: బన్నీ వాసు -
వ్యాపారవేత్తతో నటి పెళ్లి, ఐవరీ కలర్ లెహంగాలో బ్రైడల్ లుక్!
బాలీవుడ్ నటి, మోడల్ షాజాన్ పదమ్సీ (Shazahn Padamsee) తన ప్రియుడు, వ్యాపారవేత్త ఆశిష్ కనకియాని (Ashish Kanakia) పెళ్లాడింది. గత కొన్నేళ్లుగా డేటింగ్లో ఉన్న ఈ లవ్ బర్డ్స్ ఇప్పటికే ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. ముంబైలోని కోర్ట్ యార్డ్ బి మారియట్లో జరిగిన ఒక ప్రైవేట్ వివాహ వేడుకలో వ్యాపారవేత్త ఆశిష్ కనకియాతో షాజాన్ పదమ్సీ వివాహం జరిగింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు ఇంటర్నెట్లో సందడి చేస్తున్నాయి. షాజాన్ - ఆశిష్ పెళ్లి ఫోటోలను షాజన్ స్నేహితులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇది వైరల్గా మారింది. కొత్త జీవితానికి శుభాకాంక్షలు అంటూ అభిమానులంతా ఈ కొత్త జంటకు విషెస్ అందిస్తున్నారు.37 ఏళ్ల షాజాన్ పదమ్సీ - ఆశిష్ కనకియా ఎప్పటినుంచో డేటింగ్లో ఉన్నారు. గత ఏడాది నవంబరులో నిశితార్థం చేసుకున్నారు. తాజాగా అత్యంత గోప్యంగా మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టారు. షాజన్ స్నేహితులు పెళ్లి వీడియోలను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. అలాగే ఇన్స్టాస్టోరీలో ఒక వీడియోను షాజన్ కూడా పోస్ట్ చేసింది. కనకియా గ్రూప్ యాజమాన్యంలోని ముంబైలోని కోర్ట్ యార్డ్ బై మారియట్లో రెండు రోజుల పాటు జరిగిన ప్రీ వెడ్డింగ్ వేడుకలకు సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారట. రేపు (జూన్ 7న) గ్రాండ్గా పార్టీ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.సొగసైన ఐవరీ లెహెంగా, ఆఫ్వైట్ షేర్వానీషాజాన్ పాస్టెల్ , బ్లష్ పింక్ కలర్ ఐవరీ లెహంగాలో పెళ్లికూతురి ముస్తాబైంది. దానికి మ్యాచింగ్ స్లీవ్లెస్ బ్లౌజ్తో జత చేసింది, తలపైనుంచి మ్యాచింగ్ దుపట్టాను అందంగా అలంకరించుకుంది. డైమండ్, నెక్లెస్, మాంగ్ టీకా, చెవిపోగులు, హెయిర్ స్టైల్, సింపుల్ మేకప్తో తన బ్రైడల్ లుక్ను పూర్తి చేసింది. మరోవైపు, ఆశిష్ సాంప్రదాయ ఆఫ్-వైట్ టెక్స్చర్డ్ ఎంబ్రాయిడరీ షేర్వానీ ధరించాడు.హౌస్ఫుల్ 2', 'ఆరెంజ్', 'కనిమోలి', 'మసాలా', 'పాగల్పన్ నెక్స్ట్ లెవల్', 'డిస్కో వ్యాలీ' తదితర బాలీవుడ్ మూవీల్లో నటించింది. బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్తో కలిసి రాకెట్ సింగ్ , హౌస్ఫుల్ 2 సినిమాలతో బాగా పాపులర్ అయింది. ఈమె మంచి గాయని కూడా. 2010లో రిలీజైన టాలీవుడ్ మూవీ ఆరెంజ్ సినిమాలో కూడా నటించింది. బాలీవుడ్ ప్రముఖ గాయని షారన్ ప్రభాకర్, గాంధీ సినిమాలో జిన్నా పాత్రలో మెప్పించిన నటుడు దివంగత అలిక్ పదమ్సీల కుమార్తె షాజన్. షాజాన్ భర్త ఆశిష్ కనకియా గ్రూప్ డైరెక్టర్ , మూవీ మాక్స్ సినిమా సీఈఓ. ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా జరిగిన వీరి పరిచయం ప్రేమ,పెళ్లికి దారి తీసాయి.ఇదీ చదవండి: రూ. 5 కోట్ల ఎఫ్డీలు కొట్టేసింది..మునిగింది : ఐసీఐసీఐ అధికారి నిర్వాకం -
'దీపికాతో రెండేళ్ల ప్రేమ..' కుక్కలా హీనంగా చూసేది.. బతికుంటే చాలనుకున్నా!
కెరీర్ ప్రారంభంలో అవమానాలు, చీవాట్లు ఎదుర్కొన్న సెలబ్రిటీలు ఎందరో! తొలి సినిమాకు తను కూడా అలాంటి బాధే అనుభవించానంటున్నాడు నటుడు ముజమ్మిల్ ఇబ్రహీం (Muzammil Ibrahim). ఈ సూపర్ మోడల్ ఢోకా సినిమాతో హీరోగా మారాడు. ఆ సమయంలో డైరెక్టర్ పూజా భట్ తనను చులకనగా చూసేదని, తల కొట్టేసినట్లుగా ఉండేదని చెప్తున్నాడు.తొలి సినిమా.. దారుణ అనుభవాలుతాజాగా ఓ ఇంటర్వ్యూలో ముజమ్మిల్ ఇబ్రహీం మాట్లాడుతూ.. పూజా భట్ (Pooja Bhatt) నన్ను అన్ప్రొఫెషనల్ అని పిలిచేది. తనకు కోపమెక్కువ. అందుకుతోడు యాటిట్యూడ్.. నటులను చులకనగా చూసేది. నిర్మాత మహేశ్ భట్కు మాత్రం నేనంటే చాలా ఇష్టం. మంచి నటుడినని అంటుండేవారు. ఢోకా సినిమా సమయానికి నా వయసు దాదాపు 20 ఉంటుందనుకుంటా.. అంతే! సెట్లో నన్ను దారుణంగా చూసేవారు. నేను అందరితోనూ గౌరవంగా నడుచుకునేవాడిని.. నాకంటూ కొన్ని అంచనాలుండేవి. కానీ అవన్నీ తలకిందులు చేశారు. నటులంటే శునకాలు!నాతో దుర్భాషలాడిన తీరు చూశాక మరెలాంటి అంచనాలు పెట్టుకోలేదు. ఆ రేంజ్లో ఆమె నన్ను తిట్టేది. ఈ వాతావరణం చూశాక నాకు చాలా భయమేసింది. సూపర్ మోడల్గా ఇండియాలో నాకంటూ గుర్తింపు, గౌరవం ఉండేది. నేను పడుతున్న అవమానాలు చూసి మహేశ్ భట్ సర్.. నాతో అలా ప్రవర్తించవద్దని పూజా భట్ను కోరేవాడు. కానీ ఆయన సెట్లో లేనప్పుడు పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చేది. అంతేకాదు.. నటులు కుక్కల్లాంటివారని.. తాము కూర్చోమంటే కూర్చోవాలి, నిల్చోమంటే నిల్చోవాలని ఆమె అంటూ ఉండేదట. (చదవండి: ‘థగ్ లైఫ్’ మూవీ రివ్యూ)పీడకలలు వెంటాడేవిచిన్న కుటుంబం నుంచి వచ్చిన నేను ఇవన్నీ విని భరించలేకపోయాను. నాపై వచ్చిన వార్తలు చూసి మరింత కలత చెందాను. నిద్రలో కూడా పీడకలలు వచ్చేవి. ఎలాగోలా ఆ రోజు బతికితే చాలని ప్రతిరోజూ దేవుడిని ప్రార్థిస్తుండేవాడిని. అలా కష్టాలు అనుభవించాను. అందుకే తర్వాత రాజ్ 2 ఆఫర్ వచ్చినా చేయలేదు అని చెప్పుకొచ్చాడు. దీపికాతో రిలేషన్దీపికా పదుకొణె (Deepika Padukone)తో రిలేషన్ గురించి మాట్లాడుతూ.. ముంబైకి వచ్చిన కొత్తలో దీపిక పదుకొణె మోడల్గా పని చేసింది. అప్పుడు మా పరిచయం ప్రేమగా మారింది. రెండేళ్లపాటు ప్రేమించుకున్నాం. మా దగ్గర డబ్బు లేక రిక్షాలోనే తిరిగేవాళ్లం. తర్వాత కొన్ని కారణాలతో బ్రేకప్ చెప్పుకున్నాం. అప్పుడప్పుడు మాట్లాడుకునేవాళ్లం. ఆమెకు పెళ్లయ్యాక మాట్లాడుకోవడమే మానేశాం అని తెలిపాడు. దీపికా.. హీరో రణ్వీర్ సింగ్ను 2019లో పెళ్లాడింది. వీరికి గతేడాది దువా అనే కూతురు జన్మించింది.సినిమాఢోకా మూవీ (Dhokha Movie) విషయానికి వస్తే.. 2007లో వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందనే వచ్చింది. ముజమ్మిల్ నటనకు ప్రశంసలు దక్కాయి. తులిప్ జోషి హీరోయిన్గా నటించగా అనుపమ్ ఖేర్, గుల్షన్ గ్రోవర్ కీలక పాత్రలు పోషించారు.చదవండి: అమితాబ్ వల్లే చిరంజీవి, రజనీకాంత్లకు స్టార్డమ్: ఆర్జీవీ -
అమితాబ్ వల్లే చిరంజీవి, రజనీకాంత్లకు స్టార్డమ్: ఆర్జీవీ
గత కొన్నేళ్లుగా సౌత్ సినిమాలు దేశవ్యాప్తంగా ఆదరణ సొంతం చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో దక్షిణాది చిత్రాలను రీమేక్ చేయడానికి బాలీవుడ్ తహతహలాడటమే కాక ఆయా సినిమాల కథలను కాపీ కొడుతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ ఇప్పుడు మనల్ని కాపీ కొడుతుంది కానీ ఒకప్పుడు సౌత్ సినిమాకు హిందీ ఇండస్ట్రీయే ఆధారం అంటున్నాడు టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్గోపాల్ వర్మ. హిందీ సినిమాలను రీమేక్ చేసే సౌత్ హీరోలు స్టార్ స్టేటస్ అందుకున్నారంటున్నాడు.సౌత్లో హిందీ సినిమాల రీమేక్స్తాజాగా ఇండియా టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆర్జీవీ (Ram Gopal Varma) మాట్లాడుతూ.. మొదట్లో దక్షిణాదిన ఉన్న నాలుగు భాషల్లోనూ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) సినిమాలు రీమేక్ అయ్యేవి. 70's, 80's కాలంలో రజనీకాంత్ (Rajinikanth), చిరంజీవి (Chiranjeevi), ఎన్టీ రామారావు, రాజ్కుమార్.. వీళ్లంతా కూడా బిగ్బీ సినిమాల రీమేక్స్లో నటించేవారు. అయితే 1990 తర్వాత బచ్చన్ ఐదేళ్లు బ్రేక్ తీసుకున్నాడు.మసాలా సినిమాలుసరిగ్గా అప్పుడే మ్యూజిక్ కంపెనీలు రంగంలోకి దిగాయి. కేవలం వారి పాటల్ని, సంగీతాన్ని అమ్ముకోవడం కోసం సినిమాలు తీసేవి. మైనే ప్యార్ కియా వంటి సినిమాలు అలా వచ్చినవే.. కానీ సౌత్లో మసాలా సినిమాలు తీయడం మాత్రం ఆగలేదు. వాటిక్కూడా బిగ్బీ చిత్రాలే మూలం. దానివల్లే ఇక్కడున్న హీరోలు అభిమానులకు దేవుడిలా మారిపోయారు. అలా ఆ హీరోల స్టార్డమ్ ఇప్పటికీ ఇక్కడ కొనసాగుతోంది అని వర్మ చెప్పుకొచ్చాడు.చదవండి: కమల్ హాసన్ అంటే ఎంత ప్రేమో.. 42 కి.మీ ప్రయాణించి మరీ.. -
చిరకాల ప్రియుడితో నటి పెళ్లి, వీణా ‘హెన్నా’ స్పెషల్ ఎట్రాక్షన్
ప్రముఖ నటి హీనా ఖాన్ తన ప్రియుడితో కలిసి వివాహ బంధంలోకి అడుగు పెట్టింది.ఇటీవల కేన్సర్బారిన పడి కోలుకుంటున్న హీనా తన 11 ఏళ్ల బోయ్ ఫ్రెండ్ రాకీ జైస్వాల్ను పెళ్లాడింది. వీరి పెళ్లి మెహిందీ ఫోటోలు నెట్టింట సందడిగా మారాయి. బ్రైడల్ లుక్లో తన అభిమానులకు సరప్రెజ్ ఇచ్చింది. దీంతో అభిమానులతోపాటు, పలువురు సెలబ్రిటీలు ఈ లవ్బర్డ్స్కు అభినందనలు తెలిపారు.హీనా తన డ్రీమీ వెడ్డింగ్ గురించి ఇన్స్టాలో అభిమానులతో పంచుకుంది. పాస్టెల్-రంగు చీరలోవధువు హీనా , చికెన్ కుర్తాలో వరుడు రాకీ అందంగా కనిపించారు. తన అభిమానులకు హాయ్ చెబుతూ ఒక వీడియోను కూడా రిలీజ్ చేసింది.అలాగే సెలబ్రిటీ మెహిందీ డిజైనర్ వీణా నాగ్డా మెహిందీ స్పెషల్ ఎట్రాక్షన్గా నిలిచింది. హీనాకు మెహిందీ సొబగులు చూసి ఫ్యాన్స్ వావ్ అంటున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీణా హీనా, రాకీ దంపతులకు వివాహ శుభాకాంక్షలు తెలిపారు. కలకాలం చిరువ్వుతో సంతోషంగా జీవించాలంటూ కొత్త దంపతులను ఆశీర్వదించారు. చక్కటి మెహందీ డిజైన్స్ వేసిన వీణాకు హీనా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది ఇంత అందమైన మెహిందీ పెట్టినందుకు ధన్యవాదాలు, ముఖ్యంగా నా పాదాలపై మీరు అద్భుతం చేశారు అంటూ ప్రేమగా కృతజ్ఞతలు తెలిపింది. సాంప్రదాయం, ఆధునికత కలగలిసన వీణా మెహిందీని ఫ్యాన్స్ ప్రశంసించారు. ముఖ్యంగా చేతులపై లోటస్ డిజైన్సహా ఆమె డిజైన్స్ ట్రెండ్గా మారతాయన్నారు.సెలబ్రిటీ మెహిందీ ఆర్టిస్ట్ అనిపించుకున్నారు అంటూ కొనియాడారు. View this post on Instagram A post shared by Veena Bollywood Mehendi (@veenanagda)p; -
ఓటీటీకి వచ్చేసిన రూ.120 కోట్ల సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్!
తెలుగు దర్శకుడు గోపీచంద్ మలినేని బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన సినిమా జాట్. ఈ సినిమాలో సన్నీ డియోల్ హీరోగా టాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించారు. ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ 'జాట్' ఏప్రిల్ 10న విడుదలై అద్భుతమైన రెస్పాన్స్ను సొంతం చేసుకుంది. ఈ భారీ యాక్షన్ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. రూ. 100 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన జాట్.. బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.120 కోట్ల వరకు రాబట్టింది.తాజాగా ఈ చిత్రం ఓటీటీకి వచ్చేసింది. హిందీతో పాటు తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రంలో రణదీప్ హుడా విలన్గా మెప్పించగా.. వినీత్ కుమార్ సింగ్, సయామీ ఖేర్, రెజీనా కీలకపాత్రల్లో నటించారు. ఈ సినిమాకు తమన్ సంగీతం అందించారు.జాట్ అసలు కథేంటంటే..?ఆంధ్రప్రదేశ్లోని మోటుపల్లి గ్రామానికి దాదా రణతుంగ (రణ్దీప్ హుడా) శ్రీలంక నుంచి వస్తాడు. తన తమ్ముడితో కలిసి ఆ గ్రామంలో చేసే అరాచకాలు చాలా దారుణంగా ఉంటాయి. అయితే, అనుకోకుండా అదే ఊరి మీదుగా వెళ్తున్న రైలు సాంకేతిక లోపం కారణంగా అక్కడ ఆగిపోతుంది. అందులో ప్రయాణిస్తున్న జాట్ (సన్నీ డియోల్)కు ఆకలి వేయడంతో దగ్గరలో ఉన్న హోటల్కు వెళ్లి ఇడ్లీ తింటున్న సమయంలో కొందరు రౌడీ మూకలు అక్కడికి చేరుకుని హల్చల్ చేస్తారు. ఆ సమయంలో తన ప్లేటు నుంచి ఇండ్లీ కిందపడిపోతుంది. ఈ క్రమంలో వారిని సారీ చెప్పమని కోరుతాడు జాట్. కానీ, వారు మాత్రం గొడవకు దిగుతారు. అలా ఒక భారీ ఫైట్తో జాట్ రెచ్చిపోతాడు. ఈ విషయం కాస్త రణతుంగ వద్దకు చేరడంతో జాట్ గురించి ఆరా తీస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది..? రణతుంగను చూశాక జాట్కు తెలిసిన నిజం ఏంటి..? వారిద్దరి మధ్య గతంలో ఉన్న లింకేంటి..? రణతుంగపై ఎందుకు పోరుకు దిగుతాడు? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.Don't fear, Jaat is finally here 💥 Iske jaisa na kabhi hua hai, na kabhi hoga 🔥💪Watch Jaat, out now in Hindi and Telugu on Netflix.#JaatOnNetflix pic.twitter.com/3IBxy7QNhi— Netflix India (@NetflixIndia) June 5, 2025 -
సినిమా ఒకటి... క్లైమాక్స్లు రెండు
ఒకప్పుడు ప్రేక్షకులకు వినోదం అంటే థియేటర్స్లో సినిమాయే. కానీ అభివృద్ధి చెందిన సాంకేతికత వల్ల ప్రేక్షకులకు పలు రకాల వినోద మాధ్యమాలు (ఇన్స్టాగ్రామ్ రీల్స్, ఓటీటీ వంటివి) ప్రస్తుతం అందుబాటులోకి వచ్చాయి. దీంతో ప్రేక్షకులను థియేటర్స్కు తీసుకురావడం హీరోలు–దర్శక–నిర్మాతలకు పెద్ద సవాల్గా మారింది. కథలో కొత్తదనం ఉంటే తప్ప స్టార్ హీరోల సినిమాలూ ఎక్కువ రోజులు థియేటర్స్లో ఆడే పరిస్థితులు లేవు ఇప్పుడు. ఇక రిపీట్ ఆడియన్స్ అన్నమాట దాదాపుగా కనుమరుగైపోతోంది. స్టార్ హీరోల సినిమాలకు సైతం రిపీట్ ఆడియన్స్ ఉండటం లేదు. ఎలాగూ నెల రోజులు తిరిగే లోపు ఓటీటీ ప్లాట్ఫామ్స్లో సినిమా స్ట్రీమింగ్ ఉంటుందనేమో ప్రేక్షకులు నచ్చిన సినిమాను మరోసారి థియేటర్స్లో చూసేందుకు ఏమాత్రం సిద్ధపడటంలేదు. స్టార్ హీరోల ఫ్యాన్స్ అయితే రెండోసారి ప్రయత్నిస్తుండవచ్చు కానీ సగటు ప్రేక్షకుడు ఒకే సినిమాను థియేటర్స్లో రెండోసారి చూస్తున్న సందర్భాలు చాలా తక్కువైపోయాయన్నది మాత్రం వాస్తవం. ఇలాంటి పరిస్థితుల్లో సినిమా హీరోలు–దర్శక–నిర్మాతలు ఎప్పటికప్పుడు ఆడియన్స్ని ఆకర్షించే సరికొత్త వ్యూహాలను రచిస్తూనే ఉన్నారు. తాజాగా హిందీ చిత్రం ‘హౌస్ఫుల్ 5’ యూనిట్ ప్రేక్షకులను ఆకర్షించే ఓ సరికొత్త వ్యూహానికి ప్రణాళిక సిద్ధం చేసింది. 5ఏ అండ్ 5బీ హిందీ చిత్రపరిశ్రమలో ఉన్న సక్సెస్ఫుల్ ఫ్రాంచైజీస్లో ‘హౌస్ఫుల్’ ఒకటి. ఈ ఫ్రాంచైజీ నుంచి ఇప్పటివరకు నాలుగు సినిమాలొచ్చాయి. ఐదో సినిమా ‘హౌస్ఫుల్ 5’ ఈ నెల 6న విడుదలకు సిద్ధమైంది. అక్షయ్ కుమార్, రితేష్ దేశ్ముఖ్, అభిషేక్ బచ్చన్, సంజయ్ దత్, ఫర్దీన్ ఖాన్, శ్రేయాస్ తల్పాడే, జాకీ ష్రాఫ్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్... ఇలా ప్రముఖ తారలు ‘హౌస్ఫుల్ 5’ సినిమాలో నటించారు. తరుణ్ మన్సుఖాని దర్శకత్వంలో సాజిద్ నడియాద్ వాలా ఈ సినిమాను నిర్మించారు. కాగా ఈ సినిమాని ‘హౌస్ఫుల్ 5ఏ, హౌస్ఫుల్ 5బీ’ అంటూ రిలీజ్ చేస్తున్నారు. కానీ... ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కావడం లేదు. ఒకే సినిమాకు రెండు డిఫరెంట్ క్లైమాక్స్లు ఉంటాయన్నమాట. అంటే... ‘హౌస్ఫుల్ 5ఏ’ సినిమాలో ఒక క్లైమాక్స్ ఉంటే, ‘హౌస్ఫుల్ 5బీ’లో మరో డిఫరెంట్ క్లైమాక్స్ ఉంటుంది. అలాగే ‘హౌస్ఫుల్ 5ఏ, హౌస్ఫుల్ 5బీ’... ఈ రెండు సినిమాలూ ఒకే రోజున విడుదలవుతున్నాయి. ఈ విషయాన్ని ఈ చిత్రంలో హీరోలుగా నటించిన అక్షయ్ కుమార్, రితేష్ దేశ్ముఖ్ ఇన్స్టాలో ఓ వీడియోతో అధికారికంగా ధ్రువీకరించారు. ‘‘పదిహేను సంవత్సరాలుగా ‘హౌస్ఫుల్ 5’ సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. ‘హౌస్ఫుల్ 5’ కూడా సిద్ధమైంది. ‘హౌస్ఫుల్ 5’ సినిమా రెండు డిఫరెంట్ క్లైమాక్స్లతో రాబోతోంది. మరి... మీరు ‘హౌస్ఫుల్ 5ఏ’ చూస్తారా? లేక ‘హౌస్ఫుల్ 5బీ’ చూస్తారా? లేదా రెండూ చూస్తారా?’’ అంటూ ఓ ఫన్నీ వీడియోను రిలీజ్ చేశారు అక్షయ్ అండ్ రితేష్. ఇదిలా ఉంటే... ‘హౌస్ఫుల్ 5’ సినిమా కథాంశం ఓ కిల్లర్ను కనుక్కునే నేపథ్యంలో సాగుతుంది. దీంతో ‘హౌస్ఫుల్ 5ఏ’లో కిల్లర్ ఒకరైతే, ‘హౌస్ఫుల్ 5బీ’లో కిల్లర్ మరొకరు ఉంటారట. తొలి ఇండియన్ సినిమా! కొన్ని సినిమాలు స్టార్టింగ్ నుంచి ఆకట్టుకున్నా క్లైమాక్స్లో మాత్రం ఆడియన్స్ను నిరాశపరుస్తాయి. కానీ ‘హౌస్ఫుల్ 5’ టీమ్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల వారికి ఈ సమస్య ఉండకపోవచ్చు. ‘హౌస్ఫుల్ 5ఏ’ సినిమా చూసిన ఆడియన్స్ ‘హౌస్ఫుల్ 5బీ’ సినిమా క్లైమాక్స్ కోసం మళ్లీ ఆ సినిమాను చూసేందుకు థియేటర్స్కు వెళ్లొచ్చు. అలాగే ‘5బీ’ చూసినవాళ్లు ‘5ఏ’ క్లైమాక్స్ ఇంకా బాగుందని వింటే... ఆ వెర్షన్ చూడ్డానికి వెళ్లే అవకాశం ఉంది. ఇలా ప్రేక్షకుల్లో ‘హౌస్ఫుల్ 5’ సినిమా గురించి ఓ రకమైన చర్చ మొదలవుతుంది. ఈ చర్చ సినిమాకు మౌత్టాక్గా మారి, ప్రమోషన్కు ఉపయోగపడుతుంది. ఇదే జరిగితే థియేటర్స్కు వచ్చే ఆడియన్స్ సంఖ్య మెల్లిగా పెరుగుతుంది. వసూళ్లకు ఇదో కొత్త మార్గం అవుతుంది. రిపీట్ ఆడియన్స్తో థియేటర్లు హౌస్ఫుల్ అయితే... హౌస్ఫుల్ టీమ్ వ్యూహం సక్సెస్ అయినట్లే లెక్క. మరి... ఈ ‘హౌస్ఫుల్ 5’ టీమ్ స్ట్రాటజీ ఏ మేరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. ఇదిలా ఉంటే... రెండు డిఫరెంట్ క్లైమాక్స్లతో ఒకేసారి విడుదలవుతున్న తొలి భారతీయ చిత్రం ‘హౌస్ఫుల్ 5’ అంటూ బాలీవుడ్లో వార్తలు వస్తున్నాయి. -
Wedding: క్యాన్సర్తో నటి.. కంటికి రెప్పలా చూసుకునే ప్రియుడు..
బుల్లితెర సెలబ్రిటీ జంట హీనా ఖాన్ (Hina Khan)- రాకీ జైస్వాల్ (Rocky Jaiswal) వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. 11 ఏళ్ల ప్రేమాయణానికి శుభం పలుకుతూ బుధవారం నాడు రిజిస్ట్రేషన్ మ్యారేజ్ చేసుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలను హీనా ఖాన్ సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. ఇద్దరి ప్రపంచాలు వేరైనా ప్రేమ అనే బంధంతో ఒక్క గూటికి చేరాం. రెండు మనసులు ఒక్కటయ్యాయి. ఎవరూ విడదీయలేనంతగా మా బంధం బలపడింది. పెళ్లి ఫోటోలు షేర్ చేసిన నటిదాన్ని పెళ్లితో మరింత ముందుకు తీసుకెళ్లాం. మమ్మల్ని ఆశీర్వదించండి అంటూ వైవాహిక ఫోటోలను షేర్ చేసింది. ఇది చూసిన అభిమానులు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇకపోతే హీనా ఖాన్, రాకీ జైస్వాల్ 2014 నుంచి డేటింగ్ చేస్తున్నారు. తన విజయాల్లోనే కాకుండా కష్టాల్లోనూ ఆమెకు రాకీ అండగా ఉన్నాడు. రొమ్ము క్యాన్సర్తో బాధపడుతున్న ఆమెకు సపోర్ట్గా నిలబడ్డాడు. సీరియల్స్..కీమోథెరపీ వల్ల ఆమె జుట్టు తీసేయాల్సి వస్తే అతడు సైతం గుండు గీయించుకుని తనకు మద్దతుగా ఉన్నాడు. తల్లిలా దగ్గరుండి సేవ చేశాడు. ఇలాంటి పార్ట్నర్ దొరకడం తన అదృష్టమని హీనా ఖాన్ పలుమార్లు సంతోషంతో కన్నీళ్లు పెట్టుకుంది. హీనా ఖాన్.. యే రిష్తా క్యా కెహ్లాతా హై సీరియల్తో పాపులారిటీ సంపాదించుకుంది. కసౌటి జిందగీ కే, నాగిన్ (5వ సీజన్) సీరియల్స్లో ప్రధాన పాత్ర పోషించింది. హిందీ బిగ్బాస్ 11వ సీజన్లోనూ అలరించింది. సినిమాలు, వెబ్ సిరీస్లలోనూ యాక్ట్ చేసింది. View this post on Instagram A post shared by 𝑯𝒊𝒏𝒂 𝑲𝒉𝒂𝒏 (@realhinakhan) చదవండి: తీవ్ర దుఃఖంలో శోభన.. మాటలు రావడం లేదంటూ.. -
‘మిస్ వరల్డ్’ స్పాన్సర్లకు సహకరించాల్సిందే: బాలీవుడ్ నటి
మిస్ వరల్డ్ ఇండియా పోటీల్లో పాల్గొన్న వారు స్పాన్సర్ల కార్యక్రమాల్లో బలవంతంగా పాల్గొనాల్సి వచ్చిందని, నిర్దిష్ట దుస్తులు ధరించమని ఒత్తిడి చేయడం జరిగిందని మిస్ ఇంగ్లాండ్ మిల్లా ఆరోపించడం మిస్ వరల్డ్ పోటీల నుంచి నిష్క్రమించడం తెలిసిందే. ఈ నేపధ్యంలో బాలీవుడ్ నటి, మాజీ మిస్ ఇండియా, మిస్ యూనివర్స్ రన్నరప్, ఐక్యరాజ్యసమితి గుడ్విల్ అంబాసిడర్ దుబాయ్ నివాసి సెలీనా జైట్లీ(Celina Jaitly), మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగీ చేసిన ఆరోపణలపై ఘాటుగా స్పందించారు.‘సౌందర్య వేదికల విలువను తక్కువగా అంచనా వేయడం బాధాకరం అన్నారామె. ‘అంతర్జాతీయ వేదిక అంటే ప్రొఫెషనలిజం, ఆత్మవిశ్వాసంతో ముందుకు రావడం’’ అంటూ పేర్కొన్నారు. తాజాగా గల్ఫ్ న్యూస్కు ప్రత్యేకంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో సెలీనా జైట్లీ మాట్లాడుతూ గతంలో మిస్ యూనివర్స్ పోటీల్లో భారతదేశం తరపున పోటీపడిన తన అనుభవం గుర్తు చేసుకున్నారు.‘ప్రపంచ మీడియా ముందు మీరు మీ దేశ ప్రతినిధిగా గౌరవంగా ఉండడం ఆవేదన చెందాల్సిన విషయం కాదు, గర్వించదగ్గ విషయం’’ అన్నారు. మిల్లా సిపిఆర్ శిక్షణ వంటి అంశాలను ముందుకు తెచ్చి పోటీకి సంబంధించిన మౌలిక అంశాలపై మార్పులు కోరడం సరికాదని సెలీనా అభిప్రాయపడ్డారు.వచ్చే 2025 చివరి నాటికి సౌందర్య పరిశ్రమ 667 బిలియన్ల డాలర్ల ఆదాయం, ఫ్యాషన్ రంగం 1.7 ట్రిలియన్ల విలువను సాధించబోతున్నాయని, ఈ రంగాలు కేవలం అందం గురించి కాక, కోటి మందికి ఉపాధిని అందిస్తున్నాయన్నారు. అంతేకాక సంప్రదాయ సాంస్కృతిక విలువల వ్యక్తీకరణకు వేదికలుగా కూడా నిలుస్తున్నాయనీ చెప్పారామె. భారతదేశ సౌందర్య రాణుల జాబితాలో ఉండడం గర్వంగా ఉందంటూ చెప్పిన జైట్లీ, సుష్మితా సేన్, ఐశ్వర్య రాయ్, లారా దత్తా, ప్రియాంక చోప్రా లాంటి ప్రముఖుల పేర్లు ప్రస్తావించారు. ‘అందాల వేదికలపై వారి విజయాల వల్లే అంతర్జాతీయ బ్రాండ్లు భారతీయ ఆర్ధికవ్యవస్థలోకి అడుగుపెట్టాయి. ఈ వేదికలను తక్కువ చేసి చూడడం బాధాకరం’’ అన్నారు.మిల్లా చేసిన ఆరోపణల్లో స్పాన్సర్లతో పాల్గొనడం ‘దుర్వినియోగం‘గా వర్ణించడాన్ని సెలీనా ఖండించారు. ‘స్పాన్సర్లతో సహకరించడం సందర్భానుసారంగా దుస్తులు ధరించడం వంటివి ఈ వేదికలో సహజమేనని చెప్పారు. ‘‘ ఇది హెచ్ఆర్ సెమినార్ కాదు, ఇది బ్యూటీ కాంటెస్ట్ అని గుర్తుంచుకోవాలి’’ అన్నారామె మిల్లా చేసిన ప్రసంగాల్లో స్పాన్సర్ల కార్యక్రమాలను వ్యభిచారంతో పోల్చడాన్ని తీవ్రంగా తప్పుపట్టిన జైట్లీ, ‘ఇలాంటి భాష వాడటం వృత్తి పరంగా ఆమోదయోగ్యం కాదు. ఇది సాటి మహిళలను తక్కువ చేయడంతో పాటు కోటి మందికి ఉపాధి ఇచ్చే పరిశ్రమలను అవమానించడం కూడా’’ అంటూ మండిపడ్డారు.‘ఒక సైనికుడి కూతురిగా సుదూర ప్రాంతాల్లో పెరిగాను. బ్యూటీ కాంటెస్ట్ వేదికలు నా జీవితాన్నే మార్చాయి. అందాల కిరీటం వల్లనే నేను ఐక్యరాజ్యసమితి, బాలీవుడ్ వేదికల వరకూ వెళ్లగలిగాను’’ అంటూ కృతజ్ఞతా పూర్వకంగా మాట్లాడారు. వివాదాలు, తప్పుదోవ పట్టించే విమర్శల నడుమ, సెలీనా జైట్లీ చివరగా ఓ విషయం స్పష్టంగా చెప్పారు. ‘‘ బ్యూటీ కాంటెస్ట్లు కేవలం గ్లామర్ కోసమే కాకుండా, కట్టుబాటు, అంకితభావం, దేశ గౌరవం కోసం నిలబడే వేదికలు’’ -
ఆ మందులు వాడమన్న సమంత.. భగ్గుమన్న డాక్టర్
ఏదైనా ప్రమోషన్ చేసేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకుంటుంది హీరోయిన్ సమంత (Samantha Ruth Prabhu). ఏవైనా ఉత్పత్తులు మంచివి కావనిపిస్తే సదరు యాడ్స్ చేయడం లేదని చెప్పింది. అలా గతేడాది 15 వాణిజ్య ప్రకటలను రిజెక్ట్ చేసినట్లు ఇటీవలే వెల్లడించింది. ఏదైనా యాడ్ చేయడానికి ముందు ఆ ప్రోడక్ట్ను తన దగ్గరున్న ముగ్గురు డాక్టర్లు పరిశీలిస్తారని.. వారి నిర్ణయాన్ని బట్టే ముందుకు వెళ్తున్నట్లు తెలిపింది.పూర్తిగా నమ్ముతున్నా..అయితే ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న సమంత కొన్ని రోజులుగా ఎన్ఎమ్ఎన్ (నికోటినమైడ్ మోనోన్యూక్లియోటైడ్) అనే సప్లిమెంట్ను ప్రమోట్ చేసింది. ఇది డీఎన్ఏను రిపేర్ చేసి మన వయసు పెరగనీయకుండా చేస్తుందని చెప్తోంది. అంతేకాదు ఈ ఎన్ఎమ్ఎన్ ట్యాబ్లెట్స్ తయారు చేస్తున్న గటాకా సంస్థ సహ వ్యవస్థాపకురాలిగా ఉంది. తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో.. ఈ ట్యాబ్లెట్స్ గురించి వాటి ఫలితాలే చెప్తున్నాయి. నేను కేవలం వీటిని తీసుకోవడమే కాదు గటాకా సంస్థ కోఫౌండర్గానూ మారాను. ఎందుకంటే నేను ఈ సప్లిమెంట్లను పూర్తిగా నమ్ముతున్నాను. ఇది షార్ట్కట్స్ కోసం కాదు మీ భవిష్యత్తు కోసం అని రాసుకొచ్చింది.ఫ్రాడ్.. నమ్మొద్దు: డాక్టర్ఇది చూసిన ద లివర్ డాక్టర్.. సామ్పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. సైన్సు తెలియని నటి అని తిట్టిపోశాడు. వృద్ధాప్యాన్ని తగ్గించే ఔషధం అంటూ నకిలీ సప్లిమెంట్లను ప్రమోట్ చేస్తోందని ఆరోపించాడు. పని చేయని మందులు వాడమంటూ లక్షలాది అభిమానులను ఈ సైన్సు తెలియని సెలబ్రిటీలు ఎందుకు మోసం చేస్తున్నారు? అని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఎలుకలపై నెలలపాటు ప్రయోగాలు జరిపినప్పుడు అవి వయసు పెరుగుతున్నప్పటికీ కాస్తంత యాక్టివ్గా ఉన్నట్లు తేలింది.. అంతేకానీ వాటి జీవితకాలం పెరిగిందనో.. లేదా వృద్ధాప్యంలో వచ్చే వ్యాధులు దూరమయ్యాయనో నిరూపితం కాలేదన్నాడు. పైగా ఈ మందులు శరీరంలోని కీలకమైన కణాల వరకు చేరి వాటిని రిపేర్ చేసినట్లు ఎక్కడా రుజువు కాలేదని విమర్శించాడు.నిజమైన వైద్యుల్ని నమ్మండిమీకు నిజంగా వయసు కనిపించకుండా మరింత యంగ్గా కనిపించాలనుంటే ఆహారశైలి, వ్యాయామం, నిద్రపై ఫోకస్ పెట్టమని సూచించాడు. సిగరెట్, మద్యపానం వంటివాటికి దూరంగా ఉండమని సలహా ఇచ్చాడు. పాములాంటి ప్రచారకర్తలు చెప్పే మాటల్ని నమ్మవద్దని.. నిజమైన సైన్సును, సాక్ష్యాలను మాత్రమే విశ్వసించమని కోరాడు. అసలైన వైద్యులు చెప్పేదే వినండంటూ క్యాప్షన్ ఇచ్చాడు. కాగా గతంలోనూ సమంత పెట్టిన పలు పోస్టులపై లివర్ డాక్టర్ విమర్శలు గుప్పించాడు. View this post on Instagram A post shared by The Liver Doc (Cyriac Abby Philips) (@theliverdr) చదవండి: టాలీవుడ్ నటి ఇంట చోరీ.. అందరూ ఇంట్లో ఉన్నప్పుడే! -
టాలీవుడ్ నటి ఇంట చోరీ.. అందరూ ఇంట్లో ఉన్నప్పుడే!
బుల్లితెర జంట గుర్మీత్ చౌదరి (Gurmeet Choudhary) - దెబీనా బెనర్జీ (Debinna Bonnerjee) ఇంట దొంగతనం జరిగింది. అది కూడా గుర్మీత్ ఇంట్లో ఉన్న సమయంలోనే కావడం గమనార్హం. ఈ చోరీ విషయాన్ని నటుడు సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. అలర్ట్: కొత్తగా చేరిన ఓ పనిమనిషి మా ఇంట్లో కొన్ని వస్తువులు దొంగిలించి పారిపోయాడు. అయితే మా ఇంట్లో ఎవరు పనిలో చేరుతున్నా వారి వివరాలను ఒకటికి రెండుసార్లు చెక్ చేస్తాను. దానివల్ల పోయిన వస్తువులు తిరిగి రాబట్టుకోవడం సులువైంది. చోరీ సమయంలో ఇంట్లోనే..దొంగతనం జరిగినప్పుడు నేను ఇంట్లోనే ఉన్నాను. నా పిల్లలు వారి రూమ్లో సురక్షితంగా ఉన్నారు. ఇలా జరగడం మా దురదృష్టం. కానీ ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని నేర్చుకున్నాను. మీ ఇంట్లో ఎవరు పనికి చేరుతున్నా వారి గురించి ముందే అన్నీ తెలుసుకోండి. వారి వివరాలు సరిగా ఉన్నాయో, లేదో చెక్ చేసుకోండి అని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చాడు.డేటింగ్.. పెళ్లిటీవీ సెలబ్రిటీలు దెబీనా బెనర్జీ- గుర్మీత్ చౌదరి రామాయణ్ సీరియల్లో సీతారాముడిగా నటించారు. ఈ సీరియల్ కంటే ముందే వీరు సీక్రెట్గా పెళ్లి చేసుకున్నారు. సీతారాముడిగా పాపులారిటీ పొందడంతో పాటు పెద్దల ఆశీర్వాదాలు అందడంతో 2011 ఫిబ్రవరి 15న పెద్దల సమక్షంలో మళ్లీ పెళ్లి చేసుకున్నారు. వీరికి ఐవీఎఫ్ ద్వారా లియానా జన్మించింది. తర్వాత దివిషా పుట్టింది. త్వరలోనే గుర్మీత్, దెబీనా.. పతీ పత్ని ఔర్ పంగా- జోడియాన్ కా రియాలిటీ అనే షోలో కనిపించనున్నారు. ఇకపోతే దెబీనా.. అమ్మాయిలు అబ్బాయిలు అనే తెలుగు సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది. పేరరసు అనే తమిళ మూవీలో హీరోయిన్గా చేసింది. విజయ్కాంత్ హీరోగా నటించిన ఈ మూవీ తెలుగులో కాశీ విశ్వనాథ్గా డబ్ అయింది.చదవండి: మురళీమోహన్, అలీని తిట్టిన రాజేంద్రప్రసాద్.. అసలేం జరిగిందంటే -
బిగ్ బాస్లోకి యూట్యూబర్లు,ఇన్ఫ్లుయన్సెర్లకు ఇక నో ఎంట్రీ...
ఎక్కడో ఇంగ్లండ్లో పుట్టి ఓ హీరోయిన్ ద్వారా ఇండియాలో అడుగు పెట్టి అన్ని ప్రధాన భాషల్లోనూ వీర విహారం చేస్తోంది ఆ షో. ఇంగ్లండ్ మూలాలు కలిగిన బిగ్బాస్(Bigg Boss 19) గురించి తెలియనివారు ఉండరు. గత కొన్నేళ్లుగా తెలుగు నాట అనేక రకాల వివాదాలకు విమర్శలకు విజయాలకు చిరునామాగా మారింది ఈ బిగ్ బాస్.ఈ షో కొత్త కొత్త సెలబ్రిటీలను తెరమీదకు తెచ్చింది. మరీ ముఖ్యంగా యూ ట్యూబ్, ఇన్స్టా గ్రామ్ వంటి వేదికల ద్వారా పేరొందిన సోషల్ మీడియా సెలబ్రిటీలకు సరికొత్త పాప్యులరారిటీని అందించింది.డ్యాన్స్, పాటల వీడియోలతో తొలినాళ్లలో సోషల్ సెలబ్రిటీగా పేరొందిన దీప్తి సునయన, మై విలేజ్ షో ద్వారా వెలుగులోకి వచ్చిన గంగవ్వ, టిక్ టాక్ వీడియోలతో జూనియర్ సమంతగా పాప్యులరైన అషూరెడ్డి, యూట్యూబ్, ఇన్స్టా స్టార్ షణ్ముఖ్ జస్వంత్, ఇన్స్టా గ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్గా పేరొందిన గీతూరాయల్, కామెడీ కంటెంట్తో ఇన్ఫ్లుయెన్సర్గా మారిన బెజవాడ బేబక్క,7 ఆర్ట్స్ యూ ట్యూబ్ చానెల్ ద్వారా ప్రసిద్ధి పొందిన కిర్రాక్ సీత, రేడియో జాకీగా పేరొందిన ఆర్జె కాజల్, ఇంకా అలాంటి అనేక మంది ఇప్పటికే తమ సోషల్ స్టేటస్కు బిగ్ బాస్ ద్వారా మరింత గ్లామర్ను జత చేసుకున్నారు అనేది తెలిసిందే.ఈ నేపధ్యంలో బిగ్ బాస్ కొత్త సీజన్ ప్రారంభం అవుతోందనగానే సోషల్ మీడియా సెలబ్రిటీలు అప్రమత్తం అయిపోవడం, హౌస్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు తమ వంతు ప్రయత్నాలు మొదలు పెట్టడం సర్వ సాధారణంగా మారిపోయింది. అదే విధంగా బిగ్ బాస్ హౌస్లోకి వీరు వెళతారు వారు వెళ్లనున్నారు అంటూ సీజన్ మొదలయ్యే దాకా పుకార్లు షికార్లు చేయడమూ రివాజుగా మారింది.అయితే భవిష్యత్తులో వీరి ఆశలు నీరుగారనున్నాయా? ఇకపై బిగ్ బాస్ హౌస్లోకి సోషల్ మీడియా సెలబ్రిటీలకు నో ఎంట్రీ బోర్డు దర్శనమివ్వనుందా? ఇలాంటి సందేహాలు వచ్చేలా చేస్తున్నాయి కొన్ని తాజా నిర్ణయాలు, తాజా పరిణామాలు. ప్రస్తుతానికి తెలుగు బిగ్ బాస్కు సంబంధించినవి కాకపోయినా... ప్రాంతీయ బిగ్బాస్లు అన్నింటికీ పెద్దన్న లాంటి హిందీ బిగ్ బాస్ కు సంబంధించి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం జరిగిందని సమాచారం.హిందీలో బాలీవుడ్ దిగ్గజం సల్మాన్ఖాన్ సమర్పిస్తున్న బిగ్ బాస్ 19 గురించి వినిపిస్తోన్న విశ్వసనీయ సమాచారం ప్రకారం, ఈ సీజన్ కోసం మేకర్స్ గణనీయమైన ఫార్మాట్ మార్పును ప్లాన్ చేస్తున్నారు. గత సంవత్సరాలకు భిన్నంగా, రాబోయే రియాలిటీ షోలో యూ ట్యూబర్లు లేదా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఇక ఉండరని సమాచారం. బదులుగా, పోటీదారుల్లో పేరొందిన, స్థిరపడిన బాలీవుడ్ టీవీ రంగ ప్రముఖులు మాత్రమే ఉంటారు.టెల్లీ రిపోర్టర్ నివేదిక ప్రకారం, బిగ్ బాస్ 19 నిర్మాతలు సాంప్రదాయ వినోద పరిశ్రమల నుంచి ప్రసిద్ధి చెందిన పేర్లపై మాత్రమే దృష్టి సారించి, షోను దాని మూలాల వైపునకు నడిపించాలని నిర్ణయించుకున్నారు. ఈ షోకు మరింత సాంప్రదాయ గ్లామర్ అప్పీల్ ఇవ్వడం ద్వారా ప్రారంభకాలం నాటి సెలబ్రిటీ–కేంద్రీకృత ఫార్మాట్కు తిరిగి రావడమే లక్ష్యం గా పెట్టుకున్నారని, అందుకే ప్రధాన స్రవంతి నటుల మీదే దృష్టి సారించి బిగ్ బాస్ అసలు సారాన్ని పునరుద్ధరించడానికి ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది.డిజిటల్ కంటెంట్ క్రియేటర్లు, విస్త్రుత అభిమానుల స్థాయితో వ్యూహాత్మక గేమ్ప్లేతో కొత్త యువ ప్రేక్షకులపై బలమైన ప్రభావాన్ని చూపగలిగారనేది నిజం. సోషల్ మీడియా సెలబ్రిటీల వల్ల వీక్షకుల సంఖ్య పెరిగారనేది నివేదికలు వెల్లడిస్తున్నాయి. అయితే వీరి వల్ల షో తన అసలు స్వరూపాన్ని కోల్పోతుందనే విమర్శలు కూడా ఉన్నాయి. ఏదేమైనా సల్మాన్ బిగ్బాస్ ఈ కొత్త నిర్ణయాన్ని ఖచ్చితంగా అమలు చేసిన పక్షంలో అదే బాటను తెలుగు బిగ్ బాస్ కూడా అనుసరించే అవకాశాల్ని కొట్టి పారేయలేం. అదే జరిగితే ఈ సీజన్కు కాకపోయినా వచ్చే సీజన్పై సోషల్ మీడియా సెలబ్రిటీలు ఆశలు వదిలేసుకోవాల్సి రావచ్చు. -
బెంగళూరు విజయం.. కోహ్లీ సతీమణి అనుష్క శర్మ సెలబ్రేషన్స్ చూశారా?
ఆర్సీబీ ఐపీఎల్ టైటిల్ గెలవడంతో సంబురాలు మిన్నంటాయి. కర్ణాటకతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ కోహ్లీ ఫ్యాన్స్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. దాదాపు 18 ఏళ్ల తర్వాత విజయం సాధించడంతో కోహ్లీ సతీమణి అనుష్క శర్మ ఆనందం పట్టలేకపోయింది. ఒక్కసారిగా మైదానంలోకి పరుగెత్తుకుంటూ వచ్చింది. అనంతరం కోహ్లీని కౌగిలించుకుని ఎమోషనలైంది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. అనుష్క శర్మ వెంటనే పరుగెత్తుకుంటూ వచ్చి కోహ్లీని హత్తుకుని ఓదార్చింది.(ఇది చదవండి: ఆర్సీబీ విజయం.. అత్తారింటికి దారేది సీన్తో లింక్!)అనుష్క గురించి కోహ్లీ మాట్లాడుతూ.. "అనుష్క నాకు అన్ని కష్టాల్లోనూ అండగా నిలిచింది. వందశాతం ఆర్సీబీకి మద్దతుగా ప్రతి మ్యాచ్కు వస్తోంది. ఈ విజయం అనుష్క శర్మ గర్వంగా భావిస్తుందని కోహ్లీ అన్నారు. తను నాతో అన్ని ఒడిదుడుకులను ఎదుర్కొంది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా అండగా నిలిచింది. ఆమెకు బెంగళూరుతో చాలా అనుబంధం కలిగి ఉంది. ఎందుకంటే తను కూడా బెంగళూరు అమ్మాయి. అందుకే ఈ గెలుపు ఆమెకు కూడా చాలా ప్రత్యేకమైనది. ఈ విజయంతో తను చాలా గర్వంగా ఉంది.' అని అన్నారు.After IPL win, Virat posed with Anushka, whom he always credits for his success.🔥🔥🔥🔥#iplfinal2025 #RCBvsPBKSfinal #ViratKohli #AnushkaSharma#RCBChampion #ABdeVilliers pic.twitter.com/NGubvamHav— Gagan Meena (@GaganMeena47) June 4, 2025Thank you Anushka Sharma for taking care of this Kid for us 😭❤️ thank you so being there every time he needed someone so strong who can control that storm in him Thank you for being our Lady luck ❤️RCB RCB RCB #AnushkaSharma #EeSalaCupNamde pic.twitter.com/MZpZ9glX6c— Rahul | 🇮🇳 (@TheGoatNDevil) June 3, 2025 -
పెద్దితో పాట
పెద్దితో స్టెప్పులేశారు జాన్వీ కపూర్. రామ్చరణ్ టైటిల్ రోల్లో నటిస్తున్న పీరియాడికల్ అండ్ మల్టీస్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’. ఈ విలేజ్ బ్యాక్డ్రాప్ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్లో జరిగిన ఈ సినిమా కొత్త షెడ్యూల్లో జాన్వీ కపూర్ పాల్గొన్నారు. ఈ షెడ్యూల్లో రామ్చరణ్, జాన్వీతో పాటు ముఖ్య తారాణంగా పాల్గొనగా ఓ పాటను చిత్రీకరించారు. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ పతాకాలపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి 27న విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం: ఏఆర్ రెహమాన్. -
రాజ్కుమార్ రావు యాక్షన్ థ్రిల్లర్.. మోస్ట్ వయొలెంట్గా టీజర్!
బాలీవుడ్ హీరో రాజ్కుమార్ రావు వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. గతేడాది స్త్రీ-2తో సూపర్ హిట్ కొట్టిన నటుడు.. ఇటీవల భూల్ చుక్ మాఫ్ అనే మూవీతో ప్రేక్షకులను పలరించారు. తాజాగా మరో క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్తో రెడీ అయిపోయారు. ఆయన హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం మాలిక్. తాజాగా ఈ మూవీ ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు.టీజర్ చూస్తే మోస్ట్ వయోలెంట్ గ్యాంగ్స్టర్ పాత్రలో రాజ్ కుమార్ రావు నటిస్తున్నట్లు తెలుస్తోంది. టీజర్లో యాక్షన్ సీన్స్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. 1988లో అలహాబాద్లో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. రాజ్కుమార్ రావు గ్యాంగ్స్టర్గా కనిపించనున్నారు. కాగా.. ఈ చిత్రానికి పుల్కిత్ దర్శకత్వం వహించారు. టిప్స్ ఫిల్మ్స్, నార్తర్న్ లైట్స్ ఫిల్మ్స్ బ్యానర్లపై కుమార్ తౌరానీ, జే షెవాక్రమణి నిర్మించారు. ఈ సినిమా జూలై 11, 2025న థియేటర్లలో విడుదల కానుంది. -
జనవరిలో నిశ్చితార్థం.. పెళ్లి కూతురు కాబోతున్న ఆరెంజ్ నటి..!
ప్రముఖ బాలీవుడ్ నటి షాజన్ పెళ్లి బంధంలోకి అడుగుపెట్టనుంది. ప్రముఖ వ్యాపారవేత్తతో ఏడడుగులు వేయనుంది. వీరిద్దరి గ్రాండ్ వెడ్డింగ్ ఈనెల 5న జరగనుంది. ఈనెల 3న హల్దీ వేడుకతో షాజన్ పదమ్సీ పెళ్లి సందడి మొదలు కానుంది. ఈ ఏడాది జనవరి 20న ఆశిశ్ కనకియాతో ఎంగేజ్మెంట్ చేసుకున్న ముద్దుగుమ్మ.. తాజాగా పెళ్లి చేసుకోనుంది. ఇవాళ సాయంత్రం హల్దీ వేడుకలో పెళ్లి సందడి షూరూ కానుంది.జూన్ 5న పెళ్లి వేడుక తర్వాత స్నేహితుల, సన్నిహితుల కోసం ముంబయిలో గ్రాండ్గా సంగీత్తో పాటు రిసెప్షన్ కూడా నిర్వహించనున్నారు. కాగా.. షాజన్ పదమ్సీ, ఆశిశ్ కొన్నేళ్ల పాటు డేటింగ్లో ఉన్నారు. ఆ తర్వాత జనవరి 2025లో నిశ్చితార్థం చేసుకున్నారు. ఆమెకు కాబోయే భర్త ఆశిశ్ మూవీమాక్స్ సినిమాస్ సీఈవోగా పనిచేస్తున్నారు.(ఇది చదవండి: ఐపీఎల్ ఫైనల్.. వార్-2 టీమ్ స్పెషల్ సర్ప్రైజ్!)ఇక షాజన్ సినీ కెరీర్ విషయానికొస్తే హౌస్ఫుల్-2 చిత్రంతో బాలీవుడ్లో గుర్తింపు తెచ్చుకుంది. అంతకుముందు రాకెట్ సింగ్: సేల్స్మ్యాన్ ఆఫ్ ది ఇయర్, దిల్ తో బచ్చా హై జీ లాంటి చిత్రాల్లో నటించింది. అంతే కాకుండా తెలుగులో రామ్ చరణ్ నటించిన ఆరెంజ్, వెంకటేశ్ సినిమా మసాలాలోనూ కీలక పాత్రల్లో మెప్పించింది. ఆ తర్వాత తమిళంలోనూ కనిమొజి అనే సినిమాలో కనిపించింది. ఇటీవల జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నటించిన వెబ్ సిరీస్ హై జునూన్లో నటించింది. ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ పెళ్లి చేసుకుని కొత్త జీవితం ప్రారంభించనుంది.