Bollywood
-
జూ. ఎన్టీఆర్ 'డ్రాగన్' రూమర్స్కు చెక్ పెడతారా?
జూనియర్ ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న భారీ చిత్రం 'డ్రాగన్'పై ఊహాగానాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. సినిమా టైటిల్ నుంచి మొదలుకొని దాని కథ, షూటింగ్ షెడ్యూల్, నటీనటులు, ఇలా ఏ అంశంపై కూడా స్పష్టత లేకపోవడంతో అభిమానులు, సినీ వర్గాలు చర్చల్లో మునిగిపోయాయి. అసలు ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు జరుగుతుందో, ఎప్పుడు వాయిదా పడుతుందో కూడా చెప్పలేని పరిస్థితి. ఒక దశలో కథనే పూర్తిగా మార్చేశారంటూ వార్తలు వచ్చాయి. ఈ అనిశ్చితి మధ్య ఎన్టీఆర్ బాడీ బిల్డింగ్ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే దానిపై కూడా విమర్శలు చెలరేగాయి.ఇటీవలే మళయాళ నటుడు టొవినో థామస్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్న సంగతి అధికారికంగా బయటపడింది. అతడు ఎన్టీఆర్ సోదరుడి పాత్ర చేయాల్సిందని సమాచారం. అయితే తాజాగా ఆ పాత్ర కోసం బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ను సంప్రదిస్తున్నారనే కథనాలు వస్తున్నాయి. సినిమాలో మరో కీలక పాత్ర కోసం ఆలియా భట్ను కూడా సంప్రదించారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్-ఆలియా మధ్య ఓ పాట కూడా ఉంటుందనే ప్రచారం ఉంది. ఈ సినిమాను 'గోల్డెన్ ట్రయాంగిల్' నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారనే ప్రచారం ఊపందుకుంది. థాయ్లాండ్, మయన్మార్, లావోస్ కలిసే ప్రాంతాన్ని గోల్డెన్ ట్రయాంగిల్ అంటారు. ఒకప్పుడు ఇది మాదకద్రవ్యాల ఉత్పత్తికి అతిపెద్ద కేంద్రం. ఈ నేపథ్యాన్ని ఆధారంగా చేసుకుని 'డ్రాగన్' వస్తోందని అంటున్నారు. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా సినిమా అప్డేట్స్ వస్తాయని ప్రచారం జరుగుతోంది. టీజర్ వస్తుందనే మాటలు వినిపిస్తున్నా, అభిమానులు మాత్రం టీజర్ సంగతి పక్కనపెడితే, కనీసం టైటిల్, రిలీజ్ డేట్ చెప్పండి చాలు అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు. డ్రాగన్ చుట్టూ నడుస్తున్న ఊహాగానాలు, ప్రచారాల్లో కొన్నింటికి వచ్చే నెలలో తెరపడే అవకాశం ఉంది. ఎన్టీఆర్ బర్త్డే కానుకగా సినిమా టైటిల్, రిలీజ్ డేట్ లేదా టీజర్ రూపంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. -
దురంధర్ ఫ్రాంచైజీ.. ఏ ఇండియన్ సినిమాకు సాధ్యం కాని రికార్డ్..!
రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్-2 బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. మార్చి 19న రిలీజైన ఈ సీక్వెల్ వసూళ్ల పరంగా సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. గతేడాది విడుదలైన దురంధర్కు కొనసాగింపుగా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ప్రస్తుతం ఈ సినిమా రిలీజైన 26 రోజుల్లోనే అరుదైన ఘనత సాధించింది. రెండు పార్ట్లు కలిపి రూ.3 వేల కోట్లు సాధించిన మొదటి చిత్రంగా అరుదైన రికార్డ్ సృష్టించింది.ఈ మూవీ ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా రూ.1712 కోట్లకు పైగా వసూళ్లతో ఇంకా రాణిస్తోంది. ఆదిత్య ధర్ డైరెక్షన్లో వచ్చిన దురంధర్ చిత్రాలు కలెక్షన్స్ రికార్డ్ సృష్టించాయి. ఈ రెండు సినిమాలు కలిపి బాహుబలి-2, పుష్ప-2 ఆల్టైమ్ కలెక్షన్స్ను దాటేశాయి. దురంధర్, దురంధర్-2 కలిపి బాక్సాఫీస్ వద్ద రూ.3 వేల కోట్ల మార్క్ సాధించాయి.గతేడాది డిసెంబర్ 5న విడుదలైన దురంధర్ ప్రపంచవ్యాప్తంగా రూ.1,307.35 కోట్లు రాబట్టింది. ఈ ఏడాది మార్చి 19న రిలీజైన దురంధర్ ది రివెంజ్ కేవలం 26 రోజుల్లోనే రూ. 1,712 కోట్లు వసూలు చేసింది. ఈ రెండు చిత్రాల వసూళ్లను కలిపితే రూ. 3,019.35 కోట్లతో అరుదైన రికార్డ్ క్రియేట్ చేశాయి.గతంలో వచ్చిన టాలీవుడ్ బాహుబలి, పుష్ప సిరీస్ చిత్రాల మొత్తం వసూళ్లను దురంధర్ ఫ్రాంచైజీ ఎప్పుడో దాటేసింది. బాహుబలి పార్ట్-1కు రూ.650 కోట్లు రాగా.. బాహుబలి 2: రూ. 1,788 కోట్లు రాగా.. ఈ రెండు సినిమాల కలెక్షన్స్ రూ. 2,438 కోట్లుగా ఉంది. ఇక అల్లు అర్జున్ పుష్ప చిత్రాల విషయానికొస్తే పార్ట్-1 రూ. 350.10 కోట్లు రాబట్టగా.. పుష్ప 2: ది రూల్ మూవీ రూ. 1,742.10 కోట్ల సాధించింది. ఈ రెండు సినిమాల మొత్తం రూ. 2,092.20 కోట్లు వచ్చాయి.ఇప్పటి వరకు ఏ ఇండియన్ సినిమా ఫ్రాంచైజీ ప్రపంచవ్యాప్తంగా రూ. 3,000 కోట్ల మార్క్ దాటలేదు. ఈ విషయంలో దురంధర్ ఫ్రాంచైజీ రికార్డ్ క్రియేట్ చేసింది. అంతేకాకుండా 'ధురంధర్' సిరీస్లోని రెండు చిత్రాలు కూడా రూ. 1,000 కోట్ల క్లబ్లో చేరిన మొట్ట మొదటి ఇండియన్ ఫ్రాంచైజీగా నిలిచింది. మూడు నెలల గ్యాప్లోనే రిలీజైన రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టించాయి. మూడు వేల కోట్ల మార్క్తో సరికొత్త ఒరవడికి నాంది పలికాయి. మార్చి 19న థియేటర్లలోకి వచ్చిన ధురంధర్: ది రివెంజ్' చిత్రం బాక్సాఫీస్ వద్ద అంచనాలకు మించి రాణిస్తోంది. చైనా, గల్ఫ్ దేశాల్లాంటి అంతర్జాతీయ మార్కెట్లలో విడుదల కాకుండానే ఈ గణాంకాలను సాధించడం దురంధర్కే సాధ్యమైంది. ఈ లెక్కన భారతీయ సినిమా ముఖ చిత్రాన్ని దురంధర్ మార్చేసింని చెప్పొచ్చు. సినీ ఇండస్ట్రీని షేక్ చేసిన దురంధర్ పేరు బాక్సాఫీస్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. -
ఆ హీరోయిన్ ఇంటికొస్తే.. నా కొడుకు భయపడేవాడు: అక్షయ్ కుమార్
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఇప్పుడు తన కొత్త సినిమా ‘భూత్ బంగ్లా’ ప్రమోషన్స్లో బిజీగా ఉన్నాడు. మలయాళ దర్శకుడు ప్రియదర్శన్ తెరకెక్కించిన ఈ చిత్రం ఏప్రిల్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాని జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో తన కొడుకు ఆరవ్ కుమార్ గురించి ఓ ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నాడు. భూల్ భులయ్య సినిమా చూసి..ఆరేళ్ల పాటు విద్యాబాలన్కి దూరంగా ఉన్నాడని..ఆమె ఇంటికి వస్తే భయపడిపోయేవాడని చెప్పాడు.మంజులిక అనుకొని.. 2007లో విడుదలైన భూల్ భులయ్య సినిమా నా కొడుకుపై తీవ్ర ప్రభావం చూపింది. ఆ సినిమా చూసిన తర్వాత ఆరేళ్ల పాటు అందులో నటించిన విద్యాబాలన్ని చూసి భయపడిపోయాడు. ఆమె మా ఇంటికి వచ్చినప్పుడల్లా..భయంతో వణికిపోయేవాడు. ఆమె కళ్లల్లోకి చూసేవాడు కాదు. అతను ఆమెలో మంజులిక(భూల్ భులయ్యలో విద్యాబాలన్ పోషించిన పాత్ర పేరు) చూసేవాడు. అందుకే ఆమె వస్తుందంటే భయంతో పారిపోయేవాడు. నేనే అతన్ని ఓదార్చి.. ఆమె మంజులిక కాదని, విద్యాబాలన్ అని..మంచి అమ్మాయి అని చెప్పాల్సి వచ్చింది. అయినా కూడా ఆరేళ్ల పాటు నమ్మలేకపోయాడు’ అని అక్షయ్ అన్నారు.అదే తేడాభూత్ బంగ్లా, భూల్ భులయ్యా చిత్రాల మధ్య తేడాలను వివరిస్తూ.. 'భూత్ బంగ్లా' ఒక హారర్ ఫాంటసీ; ఇది ఒక డిస్నీ సినిమా లాంటిది. 'భూల్ భులయ్యా' ఒక సైకలాజికల్ థ్రిల్లర్. అది మొదలైనప్పుడు, ఆమె దెయ్యం పట్టినట్లు కనిపిస్తుంది, కానీ తర్వాత అది ఒక మానసిక సమస్య అని తెలుస్తుంది. 'భూత్ బంగ్లా'లో , వధుసూర్(రాక్షసుడు) ఎలా వచ్చాడో, అతను ఎందుకు అలా చేస్తున్నాడో మేము వివరించాం. ఈ సినిమా చూసి పిల్లలను కూడా ఎంజాయ్ చేస్తారు’ అని అక్షయ్ చెప్పుకొచ్చాడు. -
మృణాల్ కొత్త సినిమా.. 'ఏఐ'తో ఫస్ట్ లుక్ టీజర్
రీసెంట్ టైంలో భారీ బడ్జెట్ విజువల్ ఎఫెక్ట్స్ సినిమాల నుంచి ప్రమోషనల్ కంటెంట్ ఏమైనా రిలీజ్ అయిందంటే చాలు.. తమ చిత్రంలో ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ)ని ఉపయోగించలేదని హీరోలు చెప్పుకోవాల్సిన పరిస్థితి. అయితే అవసరాన్ని బట్టి ఈ టెక్నాలజీని ఉపయోగించుకోవడంలో తప్పులేదు. ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ తన కొత్త మూవీ కోసం ఏఐని అధికారికంగా వాడేశాడు. తాజాగా ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ చేయగా అందులో ఈ టెక్నాలజీతో చేసిన ఔట్పుట్ దర్శనమిచ్చింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)వరుణ్ ధావన్, పూజా హెగ్డే, మృణాల్ ఠాకుర్ జంటగా నటించిన లేటెస్ట్ హిందీ సినిమా 'హే జవానీ తో ఇష్క్ హోనా హై'. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో ఇద్దరు హీరోయిన్లని ప్రేమించే వ్యక్తిగా హీరో కనిపిస్తాడు. సదరు హీరోయిన్లకు పుట్టిన పిల్లలిద్దరూ మాట్లాడుకునే సీన్స్ అన్ని ఏఐలో సృష్టించారు. వాటినే తాజాగా వదిలిన ఫస్ట్ లుక్ టీజర్ వీడియోలో చూపించారు. ఇది ఆరంభం మాత్రమే. రాబోయే రోజుల్లో మరిన్ని హిందీ, తెలుగు, పాన్ ఇండియా చిత్రాల్లో ఈ టెక్నాలజీని అధికారికంగానే ఉపయోగించేయనున్నారు.(ఇదీ చదవండి: కుమారస్వామి కథతో ఎన్టీఆర్ సినిమా.. టైటిల్ ఫిక్సయిందా?) -
'భర్త పోయాక మొదటి మ్యారేజ్ డే'.. ప్రముఖ నటి ఎమోషనల్ పోస్ట్
ప్రముఖ బాలీవుడ్ నటి ప్రియా కపూర్ తన తొమ్మిదవ వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఎమోషనల్ పోస్ట్ చేసింది. తన భర్త, వ్యాపారవేత్త సంజయ్ కపూర్ను గుర్తు చేసుకుంది. ఆయన మరణించిన తర్వాత వచ్చిన మొదటి వివాహా వార్షికోత్సవం కావడంతో భావోద్వేగానికి గురైంది. ఈ సందర్భంగా తన పెళ్లి ఫోటోలతో పాటు ఓ లేఖను ఆమె పంచుకున్నారు. తమ బంధం ఇప్పటికీ కూడా కొనసాగుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. పంజాబీ సాంప్రదాయంలో జరిగిన తమ వివాహానికి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ ఆ సంతోషకరమైన రోజులను గుర్తు చేసుకున్నారు.ప్రియా కపూర్ తన ఇన్స్టాలో రాస్తూ.. 'హ్యాపీ యానివర్సరీ జే . గతేడాది మన 8వ వార్షికోత్సవాన్ని నీ స్నేహితులతో కలిసి జరుపుకున్నాం. ఆ వేడుక చాలా సందడిగా, ఆత్మీయంగా, నవ్వులతో నిండిపోయింది. నువ్వు నా వైపు చూసి, మనం రాబోయే 7 జన్మల పాటు కలిసి ఉండాలని కోరుకుంటున్నానని చెప్పావు. ఆ మాటకు నేను కట్టుబడి ఉంటా. మన ఏడ వార్షికోత్సవం రోజు నువ్వు నా కోసం అందమైన లేఖ రాశావు. అత్యంత అమూల్యమైన బహుమతి. అందులోని ప్రతి పదాన్ని నేను నా హృదయంలో పదిలపరుచుకున్నా. నువ్వు కేవలం నా భర్తవి మాత్రమే కాదు. నువ్వు నా ఆత్మబంధువువి. నా హృదయ స్పందనవి. నిన్ను ప్రేమించడం అనేది నాకు తెలిసినంతలో అత్యంత సులభమైన విషయం. నువ్వు సాధారణమైనదాన్ని కూడా అద్భుతంగా మార్చావు.' అంటూ రాసుకొచ్చింది.నటి ప్రియా సచ్దేవ్ కపూర్ తన లేఖను అత్యంత భావోద్వేగంగా రాసుకొచ్చారు. సంజయ్ కపూర్ కేవలం తన గతం మాత్రమే కాదని.. తన భవిష్యత్తులో కూడా ఒక భాగమని ఆమె తెలిపారు. మా కథ ఇంకా ముగియలేదని.. మాబంధం శాశ్వతమైనదని కూడా ఆమె పేర్కొన్నారు. మనం అనేక జన్మల పాటు కలిసి ఉంటామని అతను ఇచ్చిన వాగ్దానాన్ని ప్రియా గుర్తుచేసుకున్నారు. ఆ క్షణాలన్నీ తిరిగి తీసుకువస్తే.. మళ్లీ నీతోనే జీవిస్తానని ఎమోషనల్ నోట్ రాసుకొచ్చారు.కాగా.. జూన్ 12, 2025న, ఇంగ్లాండ్లో ఒక పోలో మ్యాచ్ ఆడుతుండగా సంజయ్ కపూర్ మరణించారు. ఆయన 2017లో ప్రియ కపూర్ను వివాహం చేసుకున్నారు. వీరికి అజారియస్ అనే కుమారుడు ఉన్నాడు. అంతకుముందు సంజయ్కు కరిష్మా కపూర్తో గతంలో జరిగిన వివాహం జరిగింది. వీరిద్దరికి సమైరా, కియాన్ అనే పిల్లలు ఉన్నారు. View this post on Instagram A post shared by Priya S Kapur (@priyasunjaykapur) -
అతియా శెట్టి చిన్న మిస్టేక్.. నెటిజన్ల దారుణ ట్రోల్స్..!
బాలీవుడ్ హీరోయిన్ అతియా శెట్టికి చేదు అనుభవం ఎదురైంది. ప్రముఖ సింగర్ ఆశా భోస్లే మృతికి ఆమె సంతాపం ప్రకటించారు. అయితే అతియా చేసిన చిన్న పొరపాటుతో సోషల్ మీడియాలో ట్రోలింగ్కు గురయ్యారు. ఆశా భోస్లే మృతికి సంతాపం తెలుపిన అతియా.. పొరపాటున లతా మంగేష్కర్ ఫోటోను ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో షేర్ చేశారు. అది పోస్ట్ చేసిన కొద్ది క్షణాల్లోనే అతియా శెట్టిపై సోషల్ మీడియాలో పెద్దఎత్తున ట్రోల్స్ వచ్చాయి.ఆ తర్వాత తన పొరపాటును గుర్తించిన అతియాశెట్టి.. వెంటనే ఆ పోస్ట్ను డిలీట్ చేశారు. గాయని ఆశా భోస్లే ఫోటోను మరోసారి సంతాపం ప్రకటిస్తూ షేర్ చేశారు. ఆ పోస్ట్ తొలగించినప్పటికీ అప్పటికే స్క్రీన్షాట్లు సోషల్ మీడియా విపరీతంగా వ్యాపించాయి. దీంతో అతియాపై పలువురు నెటిజన్స్ కామెంట్స్ చేశారు. అతియా శెట్టికి అందం ఉంది.. కానీ తెలివి లేదు అంటూ ఓ నెటిజన్ వ్యంగ్యంగా కామెంట్ చేశాడు.నెపో కిడ్స్ కష్టపడకుండానే ఎలాగోలా ఫేమస్ అవ్వాలని చూస్తారు.. అందుకే వారి సినిమాలు ఫ్లాప్ అవుతాయి.. అందుకే వారు ఇలాంటి ఘోరాలు చేస్తారని కామెంట్ చేశాడు. అతియా శెట్టికి పిచ్చి పట్టింది.. అందుకే ఆశా భోస్లే ఫోటోకు బదులుగా లతా మంగేష్కర్ ఫోటోను అప్లోడ్ చేసిందని మరో నెటిజన్ ట్రోల్ చేశాడు. అయితే తనపై వచ్చిన ట్రోల్స్పై అతియా శెట్టి మాత్రం స్పందించలేదు. చిన్న పొరపాటుపై ఇలా ట్రోల్స్ చేయడమేంటని మరికొందరు అతియాకు మద్దతుగా నిలుస్తున్నారు.కాగా.. ఆదివారం ఏప్రిల్ 12న లెజెండరి సింగర్ ఆశా భోస్లే(92) తుదిశ్వాస విడిచారు. శనివారం ఆమె ఛాతీలో ఇన్ఫెక్షన్ రావడంతో బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేరిన ఆమె కన్నుమూశారు. చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం మరణించారు. ఆమె మరణం పట్ల బాలీవుడ్తో పాటు దక్షిణాది సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. Athiya Shetty gone mad She uploaded a picture of Lata Mangeshkar instead of Asha Bhosle. 😭 pic.twitter.com/bKCZPBAjjG— Mohit (@Warlockmohit) April 12, 2026 Athiya Shetty Is Beauty Without Brains She posted a story with photo of Late Lata Mangeshkar instead of Late Asha Bhosle.Nepo kids just want to be relevant somehow, without hardwork or struggle and that's why their movies flop and they make such blunders. https://t.co/hy3KvJwUUo pic.twitter.com/4TXjZ0SJJ3— Vidhi (@vidhisharmx) April 12, 2026 -
రిషబ్శెట్టికి జోడీగా తెరంగేట్రం : ఆశా వారసురాలి గురించి తెలుసా?
ప్రముఖ గాయని ఆశా భోంస్లే (Asha Bhosle) అనారోగ్య కారణాలతో 92 ఏళ్ల వయసులో (ఏప్రిల్ 12, 2026న) కన్నుమూశారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఆమె అభిమానులు, సంగీతాభిమానులు శోక సంద్రంలో ముగినిపోయారు. ఆమె పార్థివ దేహాన్ని దర్శించి , తుది నివాళులర్పించేందుకు వేలాదిగా అభిమానులు ముంబైలోని లోయర్ పరేల్లో ఉన్న ఆమె నివాసం 'కాసా గ్రాండే'కు తరలి వచ్చారు. వీరితోపాటు, ప్రధాని మోదీ సహా, పలువురు రాజకీయ, సినీ రంగాలప్రతినిధులు, ఇతర సెలబ్రిటీలు ఆశామరణంపై తీవ్ర సంతాపం ప్రకటించారు. ఈ సందర్బంగా ఆమె వారసురాలు, గాయని జానై భోంస్లే (Zanai Bhosle) వార్తల్లోనిలిచారు. భారతీయ సినీ సంగీత దిగ్గజం ఆశా భోంస్లే మనవరాలు జానై భోంస్లే. తన నాన్నమ్మలా ఈమె గాయని మాత్రమే కాదు, శిక్షణ పొందిన కథక్ నర్తకి , రచయిత్రి, నటి కూడా. ఈమె ఆశా భోంస్లే కుమారుడు ఆనంద్ భోంస్లే కుమార్తె. ఆమె లెజెండరీ గాయని లతా మంగేష్కర్ మేనకోడలు కూడా. ముంబైలోని ప్రముఖ విద్యాసంస్థల్లో విద్యనభ్యసించారు. సంగీతం , కళల పట్ల ఆమెకు చిన్నప్పటి నుంచే ఆసక్తి ఉంది. ఇదీ చదవండి: రిక్షా డ్రైవర్ కొడుకు, అమెరికాలో టెకీ, అంతలోనే విషాదంనాయనమ్మ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న జానై శాస్త్రీయ సంగీతంలో శిక్షణ పొందారు. గాయనిగా రాణించారు. వివిధ స్టేజ్ షోలలో తన నాయనమ్మ ఆశా భోంస్లేతో కలిసి ప్రదర్శనలు ఇచ్చారు. ముఖ్యంగా భారతదేశపు మొట్టమొదటి ట్రాన్స్జెండర్ మ్యూజిక్ బ్యాండ్ "6-ప్యాక్ బ్యాండ్" (6-Pack Band) లో పాటలు పాడారు. 2022 సెప్టెంబర్ 8న, ఆశా 89వ పుట్టినరోజు సందర్భంగా జానై భోస్లే, మంచి కవితను పోస్ట్ చేశారు.సినిమా రంగ ప్రవేశంజానై భోంస్లే త్వరలోనే వెండితెరపై మెరవనున్నారు. రిషబ్ శెట్టి సరసన బాలీవుడ్లో అరంగేట్రం చేయనుంది. "ది ప్రైడ్ ఆఫ్ భారత్: ఛత్రపతి శివాజీ మహారాజ్" (The Pride of Bharat: Chhatrapati Shivaji Maharaj) అనే భారీ పీరియడ్ డ్రామాతో సినిమా రంగ ప్రవేశం చేస్తున్నారు. ఈ సినిమాలో ఆమె ఛత్రపతి శివాజీ మహారాజ్ భార్య రాణి సాయి భోంస్లే పాత్రను పోషిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు సందీప్ సింగ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.వ్యాపారవేత్తగాసోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండే జునై గాయనిగా, నటి మాత్రమే కాదు. వ్యాపారవేత్త కూడా. ముంబైలో ఆమెకు సొంతంగా యాపిల్ ఐఫోన్ (Apple iPhone) రిటైల్ స్టోర్ ఉంది, ఆశా భోంస్లే స్వయంగా తన మనవరాలి గురించి చాలా సార్లు ప్రస్తావించేవారు. జునై చాలా ప్రతిభావంతురాలని, కష్టపడే తత్వం ఉన్న అమ్మాయి అని పలు సందర్భాల్లో ప్రశంసించారు.సిరాజ్తో షికార్లు అంటూ పుకార్లు2025 ప్రారంభంలో జానై భోస్లే, క్రికెటర్ మహమ్మద్ సిరాజ్ల మధ్య ఉన్న సంబంధం గురించిన పుకార్లు షికార్లు చేశాయి. అయితే, రక్షాబంధన్ రోజున సిరాజ్కు రాఖీ కట్టిన వీడియోను సోషల్మీడియాలో పోస్ట్ ఈ పుకార్లకు ఇద్దరూ చెక్ పెట్టారు. View this post on Instagram A post shared by Pallav Paliwal (@pallav_paliwal)దివంగత ఆశాకు కడసారి నివాళి అర్పించేందుకు క్రికెటర్ సిరాజ్ ముంబైలోని ఆమె నివాసానికి వచ్చారు. సిరాజ్ను చూడగానే జానై భోస్లే భోరున విలపించింది. సిరాజ్ ఆమెను ఓదారుస్తూ అక్కున చేర్చుకోవడం విశేషం. -
ఆశా భోస్లే మరణం.. ఆమె ఆస్తులు ఎన్ని కోట్లంటే?
లెజెండరి సింగర్ ఆశా భోస్లే(92) తుదిశ్వాస విడిచారు. శనివారం ఆమె ఛాతీలో ఇన్ఫెక్షన్ రావడంతో ఆసుపత్రిలో చేరిన ఆమె ఇవాళ కన్నుమూశారు. ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం మరణించారు. ఈ విషయాన్ని ఆమె మనవరాలు జానై భోస్లే తెలిపారు. ఆమె మరణం పట్ల బాలీవుడ్తో పాటు దక్షిణాది సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.ఆమె మరణం వేళ ఆశా సింగర్గా ఎంత సంపాందించారన్న విషయంపై బాలీవుడ్లో చర్చ నడుస్తోంది. 92 ఏళ్ల వయసులో కన్నుమూసిన దిగ్గజ గాయని ఆశా భోస్లే ఆస్తులు దాదాపు రూ.200 నుంచి రూ.250 కోట్ల వరకు ఉన్నట్లు తెలుస్తోంది. పలు అంతర్జాతీయ వేదికలపై తన గాత్రాన్ని వినిపించిన ఆమె బాగానే సంపాదించారు. అంతే కాకుండా ఆమె సొంత రెస్టారెంట్ను ఆశాస్ పేరుతో ప్రారంభించారు. ఇది దుబాయ్, కువైట్, బహ్రెయిన్ దేశాలతో పాటు యూకేలోని బర్మింగ్హామ్, మాంచెస్టర్ వంటి నగరాల్లో విస్తరించింది. ఆశా భోస్లే తన డబ్బును రియల్ ఎస్టేట్లో కూడా పెట్టుబడులు పెట్టారు. తాజా నివేదికల ప్రకారం కేవలం ముంబై, పూణేలలోని విలాసవంతమైన గృహాలతో పాటు ఆమె ఆస్తుల విలువ రూ.80 -రూ.100 కోట్ల మధ్య ఉన్నట్లు సమాచారం. -
చరణ్ సినిమా.. ఆదిత్య ధర్–భన్సాలీ పేర్ల హడావిడి
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్ లైనప్పై బాలీవుడ్ నుంచి వరుసగా లీకులు వస్తున్నాయి. ఇప్పటివరకు సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేయాల్సి ఉందనే క్లారిటీ ఉండగా, తాజాగా ఆదిత్య ధర్ – సంజయ్ లీలా భన్సాలీ పేర్లు వినిపించడం ఆసక్తికరంగా మారింది. ధురంధర్-2 వంటి సూపర్ హిట్ తర్వాత ఆదిత్య ధర్ ఒక మల్టీస్టారర్ కథను సిద్ధం చేస్తున్నాడని, అందులో రామ్ చరణ్ కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ కథ చాలా కాలంగా పెండింగ్లో ఉంది. అయితే ఇప్పుడు చరణ్ పేరు మరోసారి తెరపైకి రావడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ – చరణ్ కాంబోపై కూడా వార్తలు వస్తున్నాయి. అటవీ నేపథ్యంలో హిస్టారికల్ అడ్వెంచర్ కథను భన్సాలీ తెరకెక్కించే అవకాశం ఉందని కథనాలు వస్తున్నాయి. గతంలో ‘మహారాజా సుహేల్ దేవ్’ అనే ప్రాజెక్ట్పై వీరిద్దరి మధ్య చర్చలు జరిగాయి. అయితే అది ఎందుకో కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు మళ్లీ ఈ కాంబోపై చర్చ మొదలవడంతో అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. అయితే దర్శకుడు సుకుమార్, చరణ్తో చేయాల్సిన సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్ ఇవ్వకపోవడం వల్లే ఈ గాసిప్పులు ఎక్కువయ్యాయి. చరణ్ బర్త్డే సందర్భంగా ఏదైనా ప్రకటన వస్తుందని అభిమానులు ఆశించారు. కానీ అలాంటిదేం జరగలేదు. దాంతో బాలీవుడ్ వైపు నుంచి వరుసగా ఇలాంటి లీకులు వస్తున్నాయి. -
ధురంధర్ నటుడికి రూ.1 కోటి? అసలు నిజమిదే!
గత ఐదు నెలలుగా 'ధురంధర్' సినిమా పేరు మారుమోగిపోతోంది. రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన ఈ చిత్రం ఫస్ట్ పార్ట్ బ్లాక్బస్టర్ కాగా రెండో భాగం అంతకు మించిన ఘన విజయాన్ని అందుకుంది. ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వరద పారిస్తోంది. చిన్న, పెద్ద తేడా లేకుండా ఈ చిత్రంలో నటించిన ఆర్టిస్టులందరికీ మంచి గుర్తింపు లభించింది.రూ.1 కోటి రెమ్యునరేషన్ఈ క్రమంలో 'ధురంధర్'లో హైజాకర్ జహూర్ మిస్త్రీగా యాక్ట్ చేసిన నటుడు వివేక్ సిన్హ గురించి ఓ వార్త వైరలవుతోంది. అతడు ఈ చిత్రానికిగానూ ఏకంగా రూ.1 కోటి పారితోషికం తీసుకున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ రూమర్స్పై తాజాగా వివేక్ సిన్హ స్పందించాడు. 'తమ్ముళ్లూ.. నాకు రూ.60 లక్షలు, రూ.80 లక్షలు, ఏకంగా రూ.1 కోటి ఇచ్చినట్లు ప్రచారం చేస్తున్నారు. ఒట్టేసి చెప్తున్నా, నాకంత డబ్బు ఇవ్వలేదు. అనవసరంగా ఏదేదో ప్రచారం చేయకండి.ఎప్పుడో ఖర్చయిందిఅలా అని నాకు మొత్తానికే డబ్బు ఇవ్వలేదని కాదు. నేను అనుకున్నంత పారితోషికం ఇచ్చారు. కానీ మీరనుకునేంత కాదు. నాకు ఇచ్చినదంతా ఎప్పుడో ఖర్చు పెట్టేశాను కూడా! నేను ముంబైలో ఉంటాను కాబట్టి ఖర్చులు కూడా ఎక్కువే.. కాబట్టి ఎవరికీ సాయం చేసే పరిస్థితిలో నేను లేను. నాకు ఇలాగే మంచి అవకాశాలు రావాలని కోరుకోండి. అప్పుడు నేను బాగా సంపాదించగలను.. మీకు తిరిగి సాయం చేయగలను' అని వివేక్ సిన్హ తెలిపాడు. View this post on Instagram A post shared by vivek sinha (ज़हूर मिस्त्री) (@viveksinhaactor)చదవండి: సబ్స్క్రిప్షన్ తీసుకుంటే బూతు కంటెంట్? క్లారిటీ ఇచ్చిన నటి -
భర్తతో విడాకులు.. అందుకే భరణం వదులుకున్నా: బుల్లితెర నటి
ప్రముఖ బాలీవుడ్ నటి డెల్నాజ్ ఇరానీ తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడారు. హిందీలో పలు సీరియల్స్తో పాటు మూవీస్లో మెప్పించిన నటి వైవాహిక బంధం, విడాకులపై నోరు విప్పారు. తన భర్త రాజీవ్ పాల్తో విడాకుల సమయంలో తాను భరణం కంటే మనశ్శాంతికే ప్రాధాన్యత ఇచ్చానని తెలిపారు. అందుకే తనకు డివోర్స్ తర్వాత ఎలాంటి ఆర్థిక సాయం అందలేదని ఆమె వెల్లడించారు. తాజాగా 'ది మేల్ ఫెమినిస్ట్' కార్యక్రమానికి హాజరైన ఈ విషయాన్ని పంచుకున్నారు.తన విడాకుల వ్యవహారం చాలా కష్టంగా సాగిందని డెల్నాజ్ ఇరానీ తెలిపారు. పార్సీ కుటుంబం నుంచి వచ్చిన తాను మొదట్లో విడిపోవాలని అస్సలు అనుకోలేదని చెప్పింది. ఆ తర్వాత ఒకరినొకరు తేలికగా తీసుకోవడంతోనే మా బంధం విచ్ఛిన్నమైందని పంచుకుంది. వ్యక్తిగత సవాళ్ల వల్ల నా పరిస్థితి మరింత క్లిష్టంగా మారిందన్నారు. అదే సమయంలో నా తండ్రి గుండెపోటుకు గురై మరుసటి ఏడాదే మరణించారని తెలిపింది.మాలో ఒకరు విడాకుల కోసం ఒత్తిడి చేయగా.. మరొకరు పూర్తిగా సిద్ధంగా లేరని ఆమె పేర్కొన్నారు. అయినప్పటికీ నేను ఎలాంటి భరణం కోరకుండా ముందుకు సాగాలని నిర్ణయించుకున్నానని వెల్లడించింది. వివాదాల కంటే శాంతినే కోరుకున్నా.. స్వతంత్రంగా తన జీవితాన్ని మళ్లీ జీవితాన్ని ప్రారంభించాలని అనుకున్నానని ఆమె స్పష్టం చేశారు.కాగా.. డెల్నాజ్, రాజీవ్ 1993లో 'పరివర్తన్' సీరియల్ సెట్స్లో మొదటిసారి కలుసుకున్నారు. ఆ తర్వాత వీరిద్దరు 1998లో ప్రేమ వివాహం చేసుకున్నారు. దశాబ్దానికి పైగా సాగిన తమ వివాహ బంధానికి ముగింపు పలుకుతూ 2010లో వారు విడిపోతున్నట్లు ప్రకటించారు. 2012లో ఈ జంటకు కోర్టు విడాకులు మంజూరు చేసింది. అయితే విడాకులు తీసుకున్న కొద్దికాలానికే ఇద్దరు కలిసి బిగ్ బాస్ షోలో కనిపించారు. ప్రస్తుతం నటి డెల్నాజ్.. డీజే పెర్సీ కర్కారియా అనే వ్యక్తితో రిలేషన్లో ఉన్నారు. ఇటీవలే వీరిద్దరు నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. -
దురంధర్-2 వసూళ్లు.. 22 రోజుల్లో ఎన్ని కోట్లంటే?
రణ్వీర్ సింగ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్-2 హవా ఇంకా కొనసాగుతోంది. మార్చి 19న విడుదలైన ఈ సినిమా మూడు వారాలైనా వసూళ్లపరంగా దూసుకెళ్తోంది. ఇప్పటికే రూ. 1500 కోట్లు మార్క్ దాటేసింది. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని దురంధర్ సీక్వెల్గా తీసుకొచ్చారు. కేవలం మూడు నెలల గ్యాప్లోనే సీక్వెల్ రిలీజ్ చేశారు.ఈ మూవీ విడుదలైన 22 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.1680 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టింది. కేవలం ఇండియాలోనే రూ.1276 కోట్లు రాబట్టగా.. ఓవర్సీస్లో దాదాపు రూ.404 కోట్లు కలెక్ట్ చేసింది. నెట్ వసూళ్ల పరంగా చూస్తే రూ.1081 కోట్లు వసూళ్లు సాధించింది. ఓవరాల్గా చూస్తే ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. అమిర్ ఖాన్ మూవీ దంగల్ రూ.2 వేల కోట్లకు పైగా వసూళ్లతో అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత బాహుబలి-2, పుష్ప-2 చిత్రాలు వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. మరి దురంధర్-2 ఈ చిత్రాల రికార్డులు బద్దలు కొడుతుందో.. లేదో వేచి చూడాల్సిందే. Duniya mein ek ka hi raj - DHU…RAN…DHAR 🔥⁰Day-wise break-up | IndiaWeek 1: ₹690 Cr* Week 2: ₹271 Cr* DAY 16: ₹23 Cr* DAY 17: ₹27 Cr* DAY 18: ₹30 Cr* DAY 19: ₹11 Cr* DAY 20: ₹11 Cr* DAY 21: ₹10 Cr* DAY 22: ₹8 Cr* India: ₹1081 Cr* Worldwide GBOC (3… pic.twitter.com/pw6lPwb4nV— Jio Studios (@jiostudios) April 10, 2026 -
తనను తాను గాయపర్చుకున్న హీరో.. కదల్లేని స్థితిలో ఆస్పత్రికి..
'ధురంధర్' సినిమాతో హీరో రణ్వీర్ సింగ్ పేరు మారుమోగిపోతోంది. అతడికి సినిమా పట్ల ఉన్న అంకితభావం, నటన గురించి బోలెడన్ని ప్రశంసలు వస్తున్నాయి. అయితే అతడు మొదటినుంచి అంతే డెడికేషన్తో పని చేసేవాడంటున్నాడు దర్శకనటుడు అనురాగ్ కశ్యప్. రణ్వీర్ సింగ్ హీరోగా, అనురాగ్ నిర్మాతగా వ్యవహరించిన చిత్రం లూటేరా. ఇది రణ్వీర్ నటించిన మూడో చిత్రం. అనురాగ్ సినిమా నిర్మించడంతో పాటు డైలాగ్స్ అందించాడు.రణ్వీర్ ఎప్పుడూ ఇంతే..ఆ మూవీ విశేషాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నాడు అనురాగ్ కశ్యప్. ఆయన మాట్లాడుతూ.. 'ధురంధర్ మూవీకోసం రణ్వీర్ సింగ్, అర్జున్ రాంపాల్ ఎంత కష్టపడ్డారు? ఎన్ని గాయాలు తగిలించుకున్నారు? అని మనమంతా మాట్లాడుకుంటున్నాం. తమ పాత్రలకు న్యాయం చేయడం కోసం వాళ్లు ఎంతదూరమైనా వెళ్తారు. వారి కష్టానికి ప్రతిఫలంగా సినిమా కూడా అద్భుతంగా ఆడుతోంది, మంచి కలెక్షన్స్ రాబడుతోంది. కానీ రణ్వీర్ సింగ్ ఇప్పుడే కాదు, మొదటినుంచి కూడా ఇలాగే ఉండేవాడు. తన కెరీర్ మొదట్లో చేసిన లూటేరా సినిమా గురించి చెప్తాను. గాయం చేసుకునిఈ మూవీ క్లైమాక్స్లో రణ్వీర్పై కాల్పులు జరుగుతాయి. ఆ నొప్పి అనుభవించడం కోసం అతడు తన పొట్టపై గాయం చేసుకున్నాడు. కనీసం మాకెవరికీ ఒక మాటైనా చెప్పలేదు. సహజత్వం కోసం అంతగా తపించాడు. నొప్పితో బాధపడుతున్నా సరే మాతో పంచుకోలేదు. చివరకు అతడు కదల్లేని స్థితిలో ఉండటంతో ఏమైందని చూడగా పొట్టపై గాయం ఉంది. దాంతో వెంటనే అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లాం. అదీ అతడికి సినిమా పట్ల ఉన్న అంకితభావం! కానీ ఆ మూవీ ధురంధర్లా కలెక్షన్ల వర్షం కురిపించలేకపోయింది' అని చెప్పుకొచ్చాడు. సినిమాధురంధర్ విషయానికి వస్తే.. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రణ్వీర్ సింగ్, సారా అర్జున్ హీరోహీరోయిన్లుగా నటించారు. మొదటి భాగం 2025 డిసెంబర్లో విడుదలవగా రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. రెండో భాగం ఈ ఏడాది మార్చి 19న రిలీజవగా ఇప్పటివరకు రూ.1600 కోట్లు కొల్లగొట్టింది. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ చిత్రంలో ఆర్.మాధవన్, రాకేశ్ బేడీ, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.చదవండి: లావుగా ఉందని నా భార్యపై ట్రోలింగ్.. ఆ వ్యాధి వల్లే: విశ్వ -
మొదటి భార్యతో విడాకులు.. ఎంత దిగజారిపోయానంటే..: ఆమిర్ ఖాన్
బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ ముచ్చటగా మూడోసారి పెళ్లికి సిద్ధమవుతున్నాడు. కొంతకాలం క్రితమే గౌరీ స్ప్రాట్ను తన ప్రియురాలిగా అందరికీ పరిచయం చేశాడు. తనతో కలిసి పలు ఈవెంట్లకు హాజరవుతున్నాడు. అయితే తాజా ఇంటర్వ్యూలో తన మొదటి భార్యతో విడాకుల గురించి ఓపెనయ్యాడు. ఆమిర్ మాట్లాడుతూ.. 'సాధారణంగా నేను మద్యానికి దూరంగా ఉంటాను. కానీ ఎప్పుడైతే నా మొదటి భార్య రీనాతో విడాకులయ్యాయో నేను పూర్తిగా మారిపోయాను. నియంత్రించుకోలేకపోయా..తను పిల్లల్ని తీసుకుని ఇల్లు వదిలేసిన రోజు తీవ్రమైన ఒంటరితనానికి లోనయ్యాను. నా భావోద్వేగాలను నియంత్రించుకోలేకపోయాను. మందు ముట్టని నేను తాగుబోతుగా మారిపోయాను. అతిథుల కోసం ఇంట్లో మద్యం బాటిళ్లు ఉంటే వాటిని ఖాళీ చేయడం మొదలుపెట్టాను. ఏడాదిన్నరపాటు ప్రతిరోజు రాత్రి ఒక బాటిల్ తాగేశాను. మందుకు దూరంగా ఉండే నేను బాటిల్ ఖాళీ చేసే స్థాయికి దిగజారిపోయాను' అని గుర్తు చేసుకున్నాడు.పర్సనల్ లైఫ్కాగా ఆమిర్ ఖాన్.. రీనా దత్తా 1986లో పెళ్లి చేసుకున్నారు. వీరికి కుమారుడు జునైద్, కూతురు ఇరా ఖాన్ సంతానం. 2002లో దంపతులు విడాకులు తీసుకున్నారు. 2005లో ఆమిర్.. దర్శకురాలు కిరణ్రావును పెళ్లి చేసుకున్నాడు. వీరికి సరోగసి ద్వారా కుమారుడు ఆజాద్ జన్మించాడు. ఆమిర్-కిరణ్ దాంపత్యం కూడా ఎంతోకాలం సాగలేదు. 2021లో వీరు విడిపోయారు. ఆ తర్వాత కొంతకాలానికి గౌరీ స్ప్రాట్తో ప్రేమలో పడ్డాడు. ఈ విషయాన్ని 2025లో తన బర్త్డే సందర్భంగా అధికారికంగా వెల్లడించాడు. గౌరీతో ప్రేమలో ఉన్నట్లు తెలిపాడు.చదవండి: డెకాయిట్ మూవీ రివ్యూ -
నన్ను డ్రమ్ములో పెడతారట.. బండబూతులు తిడుతున్నారు!
చిరయ్యా.. ప్రస్తుతం హాట్స్టార్లో ఈ సిరీస్ ట్రెండింగ్లో ఉంది. ఇందులో నటుడు సిద్దార్థ్ షా ప్రధాన పాత్రలో నటించాడు. భార్య వ్యక్తిగత స్వేచ్ఛకు, అభిప్రాయానికి విలువ ఇవ్వని భర్తగా కనిపించాడు. అయితే ఈ సిరీస్ రిలీజయ్యాక తనను ప్రజలు ఎంతగానో ద్వేషిస్తున్నారంటున్నాడు నటుడు సిద్దార్థ్ షా. అతడు మాట్లాడుతూ.. 'జనం నన్ను బ్లూ డ్రమ్లో పెట్టి చంపుదామన్నంత కసితో ఉన్నారు. బండబూతులుముఖ్యంగా మహిళలే ఈరకంగా వయొలెంట్గా ఆలోచిస్తున్నారు. పురుషులేమో బండబూతులు తిడుతున్నారు. చాలాచోట్ల ఇదే జరుగుతోందని, ఇప్పుడు ఈ సిరీస్ చూసి పురుష సమాజం తేలు కుట్టిన దొంగలా మౌనంగా ఉండిపోయిందని పలువురూ రీల్స్, వీడియోలు చేస్తున్నారు. ఈ ద్వేషాన్ని చూస్తుంటే నాకెంతో సంతోషంగా ఉంది. ఆ కోపంలోనూ ప్రేమే కనిపిస్తోంది. బెడ్రూమ్ సీన్స్నాపై పీకలదాకా కోపం ఉందంటే నాకిచ్చిన పాత్రకు పూర్తి స్థాయి న్యాయం చేశానన్నమాట! అయితే ఇంటిమేట్ (బెడ్రూమ్) సన్నివేశాలు షూట్ చేసేటప్పుడు మాత్రం నేను తీవ్రమైన మానసిక సంఘర్షణకు లోనయ్యాను. మొదటిరోజే బెడ్రూమ్ సీన్స్ షూట్ చేశారు. ఫస్ట్ సీన్ తీయడానికి ముందే ఐదునిమిషాల పాటు గట్టిగా ఏడ్చేశాను. దీంతో కాసేపు చిత్రీకరణ నిలిపివేశారు. అందరూ నన్ను ఓదార్చేందుకు ప్రయత్నించారు. అయినా సరే ఆ సీన్స్ షూట్ చేసేటప్పుడు టెన్షన్తో బిగుసుకుపోయాను. తీవ్ర సంఘర్షణనా శరీరం ముందుకు కదల్లేదు. ఇలా చాలాసార్లు జరిగింది. ఆరు నెలలపాటు ఈ సిరీస్ నుంచి నేను బయటకు రాలేకపోయాను. ఎందుకంటే అవి ప్రేమ సన్నివేశాలు కావు, భార్యపై జరిగే అత్యాచార సీన్స్. హనీమూన్ సీన్ తర్వాత అయితే తీవ్ర సంఘర్షణకు లోనయ్యాను. ఇకపోతే ఆ సన్నివేశాలను నా కుటుంబం ధైర్యంగా తెరపై చూడలేకపోయింది' అని సిద్దార్థ్ చెప్పుకొచ్చాడు.చదవండి: అత్తామామకు సర్ప్రైజ్ ఇచ్చిన నయనిక రెడ్డి -
సాయిపల్లవి సినిమా.. క్లైమాక్స్ మార్చేసిన ఆమిర్ ఖాన్
సౌత్ స్టార్ హీరోయిన్ సాయిపల్లవి ఏక్ దిన్ (ఒక రోజు) సినిమాతో హిందీలో ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయింది. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ హీరోగా నటిస్తున్నాడు. సునీల్ పాండే దర్శకత్వం వహించిన ఈ మూవీని ఆమిర్ ఖాన్, మన్సూర్ ఖాన్, అపర్ణ పురోహిత్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్కు మంచి రెస్పాన్స్ వస్తోంది.పట్టు కోల్పోలేదుతాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు ఆమిర్ బంధువు, దర్శకనిర్మాత మన్సూర్ ఖాన్. ఆయన మాట్లాడుతూ.. 'ఈరోజుల్లో నేను పెద్దగా సినిమాలు చూడటం లేదు. కానీ నాలో కళాత్మక దృక్పథం మాత్రం చెక్కు చెదరలేదు. కొన్ని సన్నివేశాలను మరీ ఓవర్గా చూపించడం కంటే కాస్త సున్నితంగా డీల్ చేయడమే మంచిదని భావిస్తాను. అలా కథపై నాకింకా మంచి పట్టుంది. అందుకే ఏదైనా అవసరమైతే సాయం చేస్తానని చిత్రయూనిట్కు మాటిచ్చాను. కథలో ఏదైనా మార్పు చేయాలి అనిపిస్తే ఓపెన్గా చెప్తానన్నాను.మేము ఒప్పుకోలేదుఉదాహరణకు.. ఏక్ దిన్ మూవీ చివర్లోని ఓ పాటను జపాన్లో చిత్రీకరించాం. ఆ పాట షూటింగ్ క్లిప్స్ చూసిన ఆమిర్.. అమ్మాయి ఈపాటికే ఓ పాటలో ఏడ్చేసింది. ఇప్పుడు మళ్లీ ఈ సాంగ్లో ఏడవడం దేనికన్నాడు. అబ్బాయితో ప్రేమలో పడటం గురించి ఒక పాట పాడితే బాగుంటుందన్నాడు. అయితే దర్శకుడు ఏం ఆలోచిస్తున్నాడో నాకు బాగా తెలుసు, కాబట్టి డైరెక్టర్కే సపోర్ట్ చేశాను. అప్పుడు ఆమిర్ సరదాగా.. ఏదైనా తేడా జరిగిందంటే మిమ్మల్ని జపాన్కు పంపించేస్తాను అన్నాడు.క్లైమాక్స్ మార్చేసిన ఆమిర్తర్వాత పూర్తి సాంగ్ చూసినప్పుడు మాత్రం మేము చేసింది సరైనదేనని మాతో ఏకీభవించాడు. అలాగే క్లైమాక్స్ సీన్పైనా కొన్ని అభ్యంతరాలు చెప్పాడు. దాన్ని కాస్త మార్చి రాశాడు. అది చూశాక ఆమిర్ చెప్పేది కరెక్టే అనిపించి మేము అదే ఫాలో అయిపోయాం. ఇలా సినిమా కోసం అందరి కలిసి పని చేశాం' అని తెలిపాడు. ఏక్ దిన్ మూవీ మే 1న విడుదల కానుంది. ఇకపోతే మన్సూర్ ఖాన్ గతంలో ఆమిర్ఖాన్ హీరోగా 'ఖయామత్ సే ఖయామత్ టక్', 'జో జీతా వొహి సికందర్' సినిమాలు తెరకెక్కించాడు. మన్సూర్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్ హిట్గా నిలిచాయి.చదవండి: నీకోసం పిలిచా, అరిచా, ఏడ్చా.. అయినా నువ్వు రాలేదు: నటుడి భావోద్వేగం -
అసలు మీరేం మాట్లాడుతున్నారు?.. గంగూలీకి నటి స్ట్రాంగ్ కౌంటర్..!
మాజీ టీమిండియా సారథి సౌరవ్ గంగూలీ చేసిన కామెంట్స్ వివాదానికి దారితీశాయి. ఇటీవల భోలేబాబా పార్ కరేగా' అనే బెంగాలీ సీరియల్ షూటింగ్లో నటుడు రాహుల్ అరుణోదయ్ బెనర్జీ మరణించడంపై మాజీ క్రికెటర్ గంగూలీ మాట్లాడారు. ఇలాంటి ఘటన దురదృష్టకరమని అన్నారు. ఇదంతా షూటింగ్ కోసమే అయినా.. అతను నీటిలోకి ఎందుకు దిగారని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలపై బెంగాలీ నటి స్వాస్తిక ముఖర్జీ ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాకుండా సౌరవ్ గంగూలీ చేసిన కామెంట్స్పై సోషల్ మీడియాలోనూ తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది.బాధలో ఉన్న ఆ కుటుంబంపై ఇలాంటి కామెంట్స్ చేయడమేంటని సౌరవ్ గంగూలీని స్వాస్తిక బెనర్జీ తప్పుపట్టింది. తాజాగా ఓ ఛానెల్తో మాట్లాడిన ఆమె.. గంగూలీ లాంటి గొప్ప వ్యక్తి మాట్లాడేముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలని హితవు పలికింది. ఆయన మాటలు తమ వృత్తిని కించపరిచేలా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. ఇలాంటి వైఖరి తమ పని విలువను తగ్గిస్తాయని స్వాస్తిక ముఖర్జీ అన్నారు.అంతేకాకుండా ప్రతి ఒక్కరూ ప్రతి రంగాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా లేదని స్వాస్తిక పేర్కొన్నారు. గంగూలీ లాగా.. రాహుల్ లాంటి వాళ్లకు మద్దతు లభించదన్నారు. ఒకవేళ రాహుల్ నీటిలోకి దిగకపోయి ఉంటే.. అతని స్థానంలో మరో నటుడు వచ్చేవారని ఆమె తెలిపారు. ప్రస్తుత ఘటన చూస్తుంటే పరిశ్రమ ఎదుర్కొంటున్న విస్తృత సవాళ్లను వేలేత్తి చూపుతోందన్నారు. కాగా.. బెంగాలీ నటుడు రాహుల్ అరుణోదయ బెనర్జీ మృతితో ఏప్రిల్ 7 నుంచి సినీ పరిశ్రమ అంతా నిరవధిక సమ్మెకు దిగింది. -
'దురంధర్-2 స్క్రిప్ట్ కాపీ కొట్టారు'.. డైరెక్టర్కు బిగ్ రిలీఫ్
రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్. గతేడాది రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. ఈ చిత్రానికి సీక్వెల్గా వచ్చిన దురంధర్ ది రివెంజ్ ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. రిలీజైన వారం రోజుల్లోనే రూ.1000 కోట్లు రాబట్టిన ఈ సినిమా.. రూ.1600 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకెళ్తోంది. ఈ రెండు సినిమాలకు బాలీవుడ్ డైరెక్టర్ ఆదిత్య ధర్ దర్శకత్వం వహించారు.స్క్రిప్ట్ కాపీ కొట్టారు..దురంధర్ చిత్రాలు సూపర్ హిట్ కావడంతో ప్రముఖ డైరెక్టర్ సంతోశ్ కుమార్ తీవ్రమైన ఆరోపణలు చేశారు. దురంధర్ స్క్రిప్ట్ తనదేనని.. ఆదిత్య ధర్ నా స్క్రిప్ట్ను దొంగిలించారంటూ సంచలన కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలపై డైరెక్టర్ ఆదిత్య ధర్ బాంబే హైకోర్టు ఆశ్రయించారు. సంతోశ్ కమార్ తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని.. పరువు నష్టంతో పాటు, తన ప్రతిష్టను దెబ్బతీసేలా మాట్లాడుతున్నారని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఆదిత్య ధర్ పిటిషన్పై విచారణ చేపట్టిన బాంబే హైకోర్టు సంతోశ్ కుమార్ను హెచ్చరించింది. ఇకపై ఆదిత్య ధర్పై ఎలాంటి వ్యాఖ్యలు చేయరాదని చిత్రనిర్మాత సంతోష్ కుమార్కు సూచించింది. ఇలాంటివీ పునరావృతం కాకుండా చూసుకోవాలని బాంబే హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణ ఏప్రిల్ 16న జరగనుంది. దీంతో ఈ కేసులో దర్శకుడు ఆదిత్య ధర్కు ఉపశమనం లభించింది.కాగా.. 'ధురందర్ 2' రిలీజ్ తర్వాత తన రిజిస్టర్డ్ స్క్రిప్ట్ 'డి సాహెబ్' నుండి కాపీ కొట్టారని ఫిల్మ్ మేకర్ సంతోశ్ కుమార్ ఆరోపణలు చేశారు. తన స్క్రిప్ట్ స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (SWA)లో రిజిస్టర్ చేశానని సంతోశ్ తెలిపారు. ఆదిత్య ధర్పై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. దీంతో దర్శకుడు సంతోశ్ కుమార్ వ్యాఖ్యలను ఆదిత్య ధర్ తప్పుబట్టారు. ఇకపై ఇలాంటి ఆరోపణలు చేయవద్దని కోరుతూ కుమార్కు లీగల్ నోటీసులు జారీ చేశారు. వాటికి ఆయన స్పందించకపోవడంతో దురంధర్ డైరెక్టర్ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. పదేపదే తనపై చేస్తున్న ఆరోపణలు.. ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉన్నాయని ఆదిత్య ధర్ తరఫు న్యాయవాది బీరేంద్ర సరఫ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. -
ప్రియుడితో హీరోయిన్ బ్రేకప్.. ఏడాదికే ఎండ్ కార్డ్..!
అమిర్ ఖాన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘దంగల్’ చిత్రంతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి సన్యా మల్హోత్రా. ఈ చిత్రంలో బబితా కుమారి పాత్రలో ఆడియన్స్ను మెప్పించింది. ఆ తర్వాత పలు సినిమాలు, షోలలో కనిపించింది. గతేడాది సన్నీ సంస్కారీ కి తులసి కుమారి, బేబీ జాన్, ది గ్రేట్ ఇండియన్ కిచెన్ లాంటి చిత్రాల్లో కనిపించింది. హిందీలో సినిమాలు చేస్తూ బిజీ ఉంటోన్న ఈ ముద్దుగుమ్మ టోస్టర్, సుందర్ పూనమ్ అనే సినిమాల్లో నటిస్తోంది. ఈ చిత్రాలు డైరెక్ట్గా ఓటీటీల్లోనే రిలీజ్ కానున్నాయి.అయితే తాజాగా సన్యా మల్హోత్రాకు సంబంధించి బాలీవుడ్లో ఓ టాక్ వినిపిస్తోంది. ఏడాదిగా డేటింగ్లో ఉన్న సన్యా తన ప్రియుడు రిషబ్ రిఖిరామ్ శర్మ బ్రేకప్ చేసుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా వీరిద్దరు ఒకరినొకరు సోషల్ మీడియాలో అన్ఫాలో చేసుకోవడంతో బాలీవుడ్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. కాగా.. సన్యా మల్హోత్రా గతేడాది నుంచి ప్రముఖ సితార్ ప్లేయర్ రిషబ్ రిఖిరామ్ శర్మతో డేటింగ్లో ఉన్నారు. ఎక్కడికెళ్లినా జంటగా కనిపించి సందడి చేసేవారు. అయితే వీరిద్దరి రిలేషన్పై ఎక్కడా కూడా అఫీషియల్గా ప్రకటించలేదు. తాజాగా వీరిద్దరు ఏడాదిలోనే తన రిలేషన్కు గుడ్ బై చెప్పేశారు. రిషబ్ వేరొకరితో డేటింగ్లో ఉన్నట్లు సమాచారం. అందుకే సన్యా బ్రేకప్ చెప్పేసినట్లు బీటౌన్లో లేటేస్ట్ టాక్. గతంలోనూ ఓసారి తనకు బ్రేకప్ అయినట్లు సన్యా ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది. నాలుగేళ్ల లాంగ్ రిలేషన్ తర్వాత బ్రేకప్ అయినట్లు తెలిపింది.రిషబ్ రిఖిరామ్ శర్మ ఎవరంటే?రిషబ్ రిఖిరామ్ శర్మ.. రిఖీ రామ్ కుటుంబానికి చెందిన సితార్ ప్లేయర్, సంగీత స్వరకర్త. పురాణ సితార్ వాద్యకారుల కోసం వాయిద్యాలను రూపొందించడంలో ప్రసిద్ధి చెందారు. అతను దిగ్గజ పండిట్ రవిశంకర్ చివరి శిష్యుడు. సితార్ ఫర్ మెంటల్ హెల్త్, ఉచిత మ్యూజిక్ థెరపీ ద్వారా మానసిక ఆరోగ్యం కోసం సెషన్స్ నిర్వహిస్తుంటారు. రిషబ్ తన ప్రదర్శనల ద్వారా ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. 2022లో అమెరికాలోని వైట్ హౌస్లో నిర్వహించిన మొట్టమొదటి దీపావళి వేడుకలో సోలో ప్రదర్శన ఇచ్చాడు. ఆ తర్వాత పారిస్లో జరిగిన 2024 వేసవి ఒలింపిక్స్ ముగింపు వేడుకలో తన ప్రదర్శనతో భారతీయ అథ్లెట్లను అలరించాడు. -
గుండె పగిలింది : హీరోయిన్ ఇంట తీవ్ర విషాదం
బాలీవుడ్ హీరోయిన్, జరీన్ ఖాన్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె తల్లి పర్వీన్ ఖాన్ బుధవారం (ఏప్రిల్ 8) తుదిశ్వాస విడిచారు. దీంతో జరీన్ శోకసంద్రంలో మునిగిపోయింది. సోషల్ మీడియా ద్వారా పలువురు సెలబ్రిటీలు,సహనటులు ఆమెకు సానుభూతి ప్రకటించారు.తన దుంఖాన్ని నటి సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. ఇటీవలే పెంపుడు పిల్లి రాంబోను కోల్పోయిన జరీనా తల్లిని కోల్పోవడంతో తీవ్ర విషాదంలో మునిగిపోయింది. తరచు తన తల్లి ఆరోగ్యానికి సంబంధించిన విషయాలను పంచుకుంటూ ఉంటుంది జరీనా. ముఖ్యంగా 2016లో పర్వీన్ ఖాన్కు గుండె శస్త్రచికిత్స జరిగినప్పటి నుంచి ఆరోగ్యం క్షీణిస్తూ వస్తోంది. పరిస్థితి విషమించడంతో ముంబైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పర్వీన్ ఖాన్ కన్నుమూశారు."మా ప్రియ పర్వీన్ ఖాన్ (జరీన్ ఖాన్, సనా ఖాన్ల తల్లి) ఏప్రిల్ 8న శాంతియుతంగా స్వర్గస్తులయ్యారని తెలియజేయడానికి చింతిస్తున్నాం" అని జరీన్ టీమ్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ముంబైలోని వెర్సోవాలో బుధవారం (ఏప్రిల్ 8) సాయంత్రం పర్వీన్ ఖాన్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. దీంతో ఈ విషాద సమయంలో ఆమెకు సానుభూతిని, అండను తెలియజేస్తూ సందేశాలు పంపుతున్నారు.హిందీ మూవీ 'వీర్' ద్వారా సల్మాన్ ఖాన్ సరసన వెండితెరకు పరిచయమైన జరీన్ ఖాన్ తల్లి పర్వీన్ ఖాన్ మరణం చిత్ర పరిశ్రమలో దిగ్భ్రాంతికి గురిచేసింది. టాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ హీరో గోపీచంద్ సరసన చాణక్య మూవీలో కనిపించింది జరీన్ ఖాన్. అలాగే రామ్గోపాల్ దర్శకత్వంలో 'వీరప్పన్' చిత్రంలోనూ జరీన్ నటించింది. పంజాబీ, తమిళ భాషల్లోనూ తన ముద్ర వేసిన జరీన్ చివరి సినిమా 2020లో వచ్చిన 'హమ్ భీ అకేలే తుమ్ భీ అకేలే'.ఇదీ చదవండి: BMWలో అమ్మడికి జాక్పాట్... ఎలాగో తెలిస్తే షాకవుతారు! -
ఆ హీరో వల్లే ఇండస్ట్రీలో ఉన్నా.. నా సక్సెస్కు అతడే కారణం: మృణాల్
తెరపై అవకాశాలు సంపాదించడం అంత ఈజీ కాదు. ఒక్క ఛాన్స్ రావడానికి కొందరికి ఏళ్లకు యేళ్లు పడుతుంది. మరికొందరికి వెంటనే అవకాశం వచ్చినా దాన్ని సద్వినియోగం చేసుకుని ముందుకు వెళ్లడం కష్టంగా మారుతుంది. అందులోనూ బుల్లితెర నుంచి వెండితెరకు షిఫ్ట్ అయ్యే క్రమంలో ఎన్నో సవాళ్లు ఎదురవుతాయి. ఆ ఛాలెంజెస్ను దాటుకుని బుల్లితెర నటి అన్న ట్యాగ్ నుంచి స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకుంది మృణాల్ ఠాకూర్. సీరియల్ నుంచి సినిమాల్లోకి..2012లో ముజ్సే కుచ్ కేటి.. యే ఖామోషియాన్ సీరియల్లో నటించింది. తర్వాత అర్జున్, కుంకుమ భాగ్య సీరియల్లో యాక్ట్ చేసింది. ఆ తర్వాత మరాఠిలో ఒకే ఏడాది (2014) మూడు సినిమాలు చేసింది. అయినా మృణాల్ ఠాకూర్కు బ్రేక్ రాలేదు. మళ్లీ సినిమా చేయడానికి నాలుగేళ్లు పట్టింది. అయితే ఓ హీరోతో చేసిన యాడ్ వల్ల తన కెరీర్ మలుపు తిరిగిందంటోంది మరాఠి బ్యూటీ.ఆ హీరో వల్లే..మృణాల్ ఠాకూర్ తెలుగులో సీతారామం, హాయ్ నాన్న సినిమాలతో స్టార్ హీరోయిన్గా మారిపోయింది. ప్రస్తుతం ఆమె ప్రధాన పాత్రలో నటించిన చిత్రం డెకాయిట్. ఈ మూవీ ప్రమోషన్స్లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మృణాల్ మాట్లాడుతూ.. హీరో రణ్వీర్ సింగ్ నా లక్కీ చార్మ్. నేను చిత్రపరిశ్రమలో ఉండటానికి ఆయనే కారణం. కెరీర్ తొలినాళ్లలో మోడల్గా ఆయనతో కలిసి ఓ హెయిర్బ్రాండ్ యాడ్లో నటించాను. ఆ వాణిజ్య ప్రకటన రిలీజైన తర్వాతే చాలామంది దర్శకనిర్మాతలు నన్ను గుర్తించడం మొదలుపెట్టారు. అందుకే ఈ సక్సెస్ క్రెడిట్ అంతా ఆయనే ఇస్తాను. ఆయన నాకెంతో సాయం చేశారు. తనెప్పుడూ సానుకూల దృక్పథంలో ఉంటాడు. సినిమాధురంధర్ మూవీలో అయితే నాకు రణ్వీర్ కనిపించలేదు, హంజా మాత్రమే కనిపించాడు. అంత అద్భుతంగా నటించాడు. ఆయన ఇలాంటి బ్లాక్బస్టర్స్ మరెన్నో అందుకోవాలి అని చెప్పుకొచ్చింది. కాగా రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ మూవీ గతేడాది డిసెంబర్లో విడుదలైంది. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బ్లాక్బస్టర్ అవగా.. ఈ ఏడాది మార్చి 19న దానికి సీక్వెల్ వచ్చింది. అదే ధురంధర్: ద రివేంజ్. రూ.1500 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది.చదవండి: అల్లు అర్జున్- అట్లీ సినిమా టైటిల్ ఇదే.. గుండుతో కనిపించిన బన్నీ -
దురంధర్ కలెక్షన్స్.. బాహుబలి-2 రికార్డ్పై గురి..!
రణ్వీర్ సింగ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ దురంధర్-2 ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. దురంధర్ చిత్రానికి సీక్వెల్గా వచ్చిన ఈ సినిమా వసూళ్ల పరంగా దూసుకెళ్తోంది. మార్చి 19న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా.. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా రూ. 1,622.72 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పటికే హిందీలో పలు రికార్డులు తిరగరాసిన ఈ చిత్రం తెలుగు సినిమా రికార్డ్పై కన్నేసింది. తాజా వసూళ్లు చూస్తుంటే రాజమౌళి చిత్రం బాహుబలి-2 వసూళ్ల రికార్డ్ను బద్దలు కొట్టే ఛాన్స్ ఉంది.దురంధర్-2 రిలీజైన 18 రోజుల్లోనే కన్నడలో రూ. 120 కోట్లకు పైగా వసూలు చేసింది. గతంలో రిలీజైన టాలీవుడ్ మూవీ బాహుబలి-2 కన్నడలో రూ. 129 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. దురంధర్-2 ఈ రికార్డ్కు కేవలం రూ.9 కోట్ల దూరంలోనే నిలిచింది. ఇదే జోరు కొనసాగితే కన్నడలో అత్యధిక వసూళ్లు సాధించిన బాహుబలి-2ను దాటేయనుంది. ఇదే జరిగితే కన్నడలో అత్యధిక వసూళ్లు సాధించిన కన్నడేతర చిత్రంగా దురంధర్-2 నిలవనుంది.ఇక కర్ణాటక బాక్సాఫీస్ను పరిశీలిస్తే కన్నడ చిత్రాల ఆధిపత్యమే కొనసాగుతోంది. అయినప్పటికీ తెలుగు చిత్రాలు కూడా కన్నడలో సత్తా చాటుతున్నాయి. శాండల్వుడ్ హీరో రిషబ్ శెట్టి మూవీ 'కాంతార చాప్టర్ 1' రూ. 247.50 కోట్లతో అగ్రస్థానంలో ఉండగా.. ఆ తర్వాతి స్థానంలో యశ్ నటించిన 'కేజీఎఫ్ 2' కొనసాగుతోంది. కన్నడలో టాప్-5 చిత్రాలలో 'బాహుబలి 2' మాత్రమే కన్నడేతర చిత్రంగా నిలిచింది. తాజాగా ఈ రికార్డ్ను దురంధర్-2 అధిగమించే ఛాన్స్ ఉంది. కాగా.. 'ధురందర్ 2' ఇప్పటికే కర్ణాటకలో అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ చిత్రంగా అవతరించింది. కర్ణాటకలో 'బాహుబలి 2' తర్వాత రూ. 100 కోట్ల మార్కును దాటిన రెండో కన్నడేతర చిత్రంగా 'ధురందర్ 2' నిలిచింది.కాగా.. ఆదిత్య ధర్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాలో రణ్వీర్ సింగ్ హీరోగా నటించారు. దురంధర్కు సీక్వెల్గా వచ్చిన ఈ చిత్రంలో సంజయ్ దత్, ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్, రాకేష్ బేడి, డానిష్ పండోర్, సారా అర్జున్ కీలక పాత్రల్లో నటించారు. -
ఓటీటీకి క్రైమ్ థ్రిల్లర్ సిరీస్.. ట్రైలర్ రిలీజ్
తమన్నా మాజీ బాయ్ఫ్రెండ్ విజయ్ వర్మ నటించిన క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ మట్కా కింగ్. ఈ వెబ్ సిరీస్కు సైరత్' లాంటి బ్లాక్బస్టర్ మూవీ తీసిన నాగరాజ్ ముంజలే దర్శకత్వం వహించారు. ఈ సిరీస్లో కృతిక కమ్రా, గుల్షన్ గ్రోవర్ కీలక పాత్రలు పోషించారు. ముంబయికి చెందిన రతన్ ఖత్రీ జీవితం ఆధారంగా ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే టీజర్ రిలీజైన సంగతి తెలిసిందే. తాజాగా మట్కా కింగ్ సిరీస్ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ చూస్తుంటే మట్కా నేపథ్యంలో సాగే క్రైమ్ కథగానే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. 1960ల్లో ఓ సాధారణ పత్తి వ్యాపారి (విజయ్ వర్మ), తన తెలివితేటలతో మట్కా అనే జూద సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించాడనే స్టోరీగా ఈ సిరీస్ తీసినట్లు అర్థమవుతోంది. ఈ క్రైమ్ సిరీస్ ఏప్రిల్ 17 నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఇది స్ట్రీమింగ్ కానుంది. -
అక్షయ్ కుమార్ 'భూత్ బంగ్లా' ట్రైలర్ రిలీజ్
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ గతంలో అద్భుతమైన హిట్స్ అందుకున్నప్పటికీ.. గత కొన్నాళ్లుగా చాలా వెనకబడిపోయాడు. వరస సినిమాలైతే చేస్తున్నాడు గానీ సక్సెస్ అనేది పెద్దగా దక్కట్లేదు. దీంతో తనకు గతంలో 'హేరా ఫేరీ' లాంటి బ్లాక్బస్టర్ ఇచ్చిన మలయాళ దర్శకుడు ప్రియదర్శన్తో కలిసి తీసిన మూవీ 'భూత్ బంగ్లా'. వచ్చే శుక్రవారం థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు.ట్రైలర్ బట్టి చూస్తే ఓ బంగ్లా, అందులో వధాసుర్ అనే రాక్షసుడు, సిట్చూయేషనల్ కామెడీ ఇలా బాగానే ఉందనిపించింది. కాకపోతే ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర 'ధురంధర్ 2' హవా నడుస్తోంది. లెక్క ప్రకారం ఈ శుక్రవారమే 'భూత్ బంగ్లా' థియేటర్లలోకి రావాలి. కానీ ధురంధర్ వల్లే వారం ఆలస్యంగా రిలీజ్ చేస్తున్నారు. కానీ అప్పుడైనా హిట్ అవుతుందా అనేది ఇక్కడ సందేహంగా మారింది. హారర్ మూవీ జనాలని ఏ మేరకు మెప్పిస్తుందనేది చూడాలి? -
ధురంధర్: ది రివెంజ్ @ 1622 కోట్లు
‘ధురంధర్: ది రివెంజ్’ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తూ దూసుకెళ్తోంది. నార్త్ అమెరికాలో అత్యధిక కలెక్షన్స్ సాధించిన భారతీయ చిత్రంగా ‘ధురంధర్: ది రివెంజ్’ నిలిచింది. రణ్వీర్ సింగ్ హీరోగా ఆదిత్యధర్ దర్శకత్వంలో రూపొందిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్ ‘ధురంధర్’. ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, సారా అర్జున్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. జియో స్టూడియోస్, బి62 స్టూడియోస్ పతాకాలపై ఆదిత్యధర్, జ్యోతిదేశ్ పాండే, లోకేష్ థర్ నిర్మించిన ఈ సినిమా రెండు భాగాలుగా (ధురంధర్, ధురంధర్: ది రివెంజ్) విడుదలైంది.గత ఏడాది డిసెంబరు 5న విడుదలైన ‘ధురంధర్’ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.1400 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ను సాధించింది. ఈ ఏడాది మార్చి 19న హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలైన ‘ధురంధర్: ది రివెంజ్’ సినిమా 18 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.1622 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ను కొల్లగొట్టిందని యూనిట్ పేర్కొంది. ఇండియాలో రూ.1228 కోట్లు, ఓవర్సీలో రూ.394 కోట్లు తమ సినిమాకు వచ్చాయని ‘ఎక్స్’ వేదికగా జియో స్టూడియోస్ సంస్థ తెలిపింది.ఇండియాలో రూ.1041 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చాయని, ఇక్కడ వెయ్యికోట్ల రూపాయల నెట్ వసూళ్లు సాధించిన రికార్డును ‘ధురంధర్: ది రివెంజ్’ క్రియేట్ చేసిందని మేకర్స్ చెబుతున్నారు. ఇటీవలే నార్త్ అమెరికాలో ‘బాహుబలి: ది కన్క్లూజన్’ వసూళ్ల రికార్డును అధిగమించిన ‘ధురంధర్: ది రివెంజ్’ సినిమా తాజాగా నార్త్ అమెరికాలో పాతిక మిలియన్ డాలర్లు(దాదాపు 232 కోట్లు) సాధించి, అక్కడ అత్యధిక కలెక్షన్స్ను సాధించిన తొలి ఇండియన్ సినిమాగా నిలిచిందని మేకర్స్ పేర్కొన్నారు. అలాగే జర్మనీ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా వన్ మిలియన్ యూరోలు సాధించి సత్తా చాటింది. -
'అశ్వత్థామ'గా రామ్చరణ్.. ఆదిత్య ధర్తో చర్చలు?
బాలీవుడ్లో రాబోయే భారీ ప్రాజెక్టులపై ఎప్పుడూ ఆసక్తి ఉంటుంది. ‘యూరి: ది సర్జికల్ స్ట్రైక్’తో బిగ్ హిట్ అందుకున్నాడు దర్శకుడు ఆదిత్య ధర్. కొంతకాలం క్రితం ‘ది ఇమ్మోర్టల్ అశ్వత్థామ’ అనే కథను తెరపైకి తీసుకురావాలని ప్రయత్నించాడు. ఆ సమయంలో జియో స్టూడియోస్తో ఒప్పందం కుదుర్చుకుని, ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం జరిగింది. అయితే ఆ సమయంలో కొన్ని అనివార్య కారణాలతో ఆ ప్రాజెక్టు నిలిచిపోయింది. ఆ ప్రాజెక్టుకు రామ్చరణ్ పేరు బలంగా వినిపించింది. అప్పుడే ‘ఆర్ఆర్ఆర్’ విజయంతో ఆయనపై బాలీవుడ్ దృష్టి పడింది. అశ్వత్థామ పాత్రకు చరణ్ సరైన ఎంపిక అవుతాడని అంతా అనుకున్నారు. కానీ ఎందుకో ఆ ప్రాజెక్టు ఆగిపోయింది. అయితే ఇప్పుడు మళ్లీ ఈ కథపై చర్చలు మొదలయ్యాయి. దానికి కారణం.. ఆదిత్య ధర్ రూపొందించిన ‘ధురంధర్’ ఫ్రాంచైజీ. ధురంధర్ చిత్రం రెండు భాగాలతో భారీ విజయాన్ని సాధించిన ఆదిత్య ధర్పై నిర్మాణ సంస్థలు నమ్మకం పెంచుకున్నాయి. కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ‘ఇమ్మోర్టల్ అశ్వత్థామ’ ప్రాజెక్టు మళ్లీ పట్టాలెక్కే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. మెగా ఫ్యాన్స్ మాత్రం అప్పటి పుకారు ఇప్పుడు నిజమవ్వాలని కోరుకుంటున్నారు. రామ్చరణ్ ఈ ప్రాజెక్టులో భాగమైతే, బాలీవుడ్లో మరో భారీ అడుగు వేస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. -
ఓటీటీకి మర్డర్ మిస్టరీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీల్లో క్రైమ్ థ్రిల్లర్స్, మర్డర్ మిస్టరీ చిత్రాలకు ఫుల్ డిమాంట్ ఉంటోంది. ఆడియన్స్ అభిరుచులకు తగ్గట్టుగానే ఇలాంటి కంటెంట్ ఉన్న సినిమాలే ఎక్కువగా వస్తున్నాయి. తాజాగా మరో మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ ఓటీటీ ప్రియులను అలరించేందుకు వచ్చేస్తోంది. గతంలో 2023లో మామి ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ మూవీని ప్రదర్శించారు.తాజాగా ఎవరీబడీ లవ్స్ సోహ్రబ్ హండా అనే మర్డర్ మిస్టరీ మూవీ ఓటీటీలో సందడి చేయనుంది. ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ అధికారికంగా ప్రకటింంచింది. ఈనెల 10 నుంచి జీ5 వేదికగా అందుబాటులోకి రానుంది. '15 మంది స్నేహితులు.. ఒక పార్టీ.. ఒకరి మిస్టరీ హత్య' అంటూ పోస్టర్ను పంచుకున్నారు.ఈ చిత్రంలో వినయ్ పాఠక్, నీల్ భూపాలం ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు రజత్ కపూర్ దర్శకత్వం వహించారు. ఈ మూవీని అప్లాజ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై సమీర్ నాయర్, దీపక్ సెగల్ నిర్మించారు. ఈ సినిమాలో రణవీర్ షోరే, సౌరభ్ శుక్లా, కోయెల్ పూరీ, ఎంకే రైనా, పలోమి ఘోష్, చంద్రచూర్ రాయ్, సాదియా సిద్దిఖీ కీలక పాత్రల్లో నటించారు.ఈ చిత్రానికి సాగర్ దేశాయ్ సంగీతం సమకూర్చారు. కాగా.. రజత్కపూర్ అంతకుముందు క్రౌడ్ఫండింగ్ ద్వారా ఆర్కే అనే మూవీని తెరకెక్కించారు. 15 Friends. 1 Party. 1 Mysterious Murder.But the real question is - who wanted him dead?Watch #EverybodyLovesSohrabHanda premieres 10th April, on #ZEE5#EverybodyLovesSohrabHandaonZEE5@ApplauseSocial @nairsameer @deepaksegal #MithyaTalkies #RajatKapoor @pathakvinay… pic.twitter.com/CUha1btJlU— ZEE5Official (@ZEE5India) April 6, 2026 -
'అశ్లీల సైట్లో నా ఫోటోలు.. బాయ్స్ చూసేవారు'
బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ ప్రస్తుతం పెద్ది మూవీలో నటిస్తున్నారు. రామ్ చరణ్ హీరోగా వస్తోన్న ఈ చిత్రంలో హీరోయిన్గా అభిమానులను మెప్పించనుంది. బుచ్చిబాబు సనా డైరెక్షన్లో రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే పెద్ది గ్లింప్స్ రిలీజ్ చేయగా.. రామ్ చరణ్ రెజ్లర్ లుక్ ఆడియన్స్ను విపరీతంగా ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. అయితే పెద్ది హీరోయిన్ జాన్వీ కపూర్ తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైంది. ఈ సందర్భంగా తన టీనేజ్లో జరిగిన చేదు అనుభవాన్ని పంచుకుంది. తనకు 15 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఓ అశ్లీల సైట్లో తన మార్ఫింగ్ చిత్రాన్ని చూశానని షాకింగ్ విషయాన్ని వెల్లడించింది. తాను పాఠశాలలో ఉన్నప్పుడే ఈ సంఘటన జరిగిందని జాన్వీ కపూర్ గుర్తుచేసుకున్నారు. మా క్లాస్లో కొందరు అబ్బాయిలు సరదా కోసం అలాంటి సైట్స్ చూసేవారని.. ఆ సమయంలో నా ఫోటోలు చూశానని తెలిపింది. నేను చదివే పాఠశాలలోనే ఇలా జరగడంతో చాలా వింత అనుభవాన్ని ఎదురైందని జాన్వీ కపూర్ వివరించింది.ఆ సమయంలో తాను ఆ పరిస్థితిని సర్దుకుపోవడానికి ప్రయత్నించానని జాన్వీ కపూర్ చెప్పుకొచ్చింది. అలా నా ఫోటోలు చూశాక సోషల్ మీడియాకు సంబంధించి ఇలాంటి చాలా విషయాలలో నైతికత లేదని అనిపించిందని జాన్వీ తెలిపింది. అయితే ఇప్పుడు వాటిపై తన దృక్పథం మారిందని.. ఏఐ (AI) రూపొందించిన ఈ చిత్రాలు ఈ రోజుకు తనను ప్రభావితం చేస్తున్నాయని జాన్వీ కపూర్ తన బాధను పంచుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో తనకు సంతోషం అనేది లేదని జాన్వీ వెల్లడించింది. ఏఐ రూపొందించిన తన ఫోటోలు ఆన్లైన్లో ప్రచారంలో ఉన్నాయని.. కొన్నిసార్లు అధికారిక వార్తా పేజీలు కూడా వాటిని షేర్ చేస్తున్నాయని వివరించింది. ఇలాంటి మార్ఫింగ్, ఏఐ ఫోటోల్లో తాను ఎప్పుడూ ధరించని దుస్తులు, పోజులు ఉన్నాయని జాన్వీ కపూర్ ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో ఇలా సినీతారల ఫోటోలను మార్ఫింగ్ చేసేవారిపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలని సినీ ప్రియులు కోరుతున్నారు. -
లైట్స్... కెమెరా... క్రికెట్
బ్యాట్ పట్టుకుని క్రికెట్ గ్రౌండ్లోకి దిగారు బాలీవుడ్ నటుడు రాజ్కుమార్ రావు. గంగూలీలా మారిపోయారు. ప్రముఖ క్రికెటర్, టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ జీవితం ఆధారంగా హిందీలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ‘దాదా: ది సౌరభ్ గంగూలీ స్టోరీ’ టైటిల్తో తెరకెక్కుతున్న ఈ సినిమా చిత్రీకరణ అధికారికంగా ప్రారంభమైంది. ఈ సినిమాలో సౌరభ్ గంగూలీపాత్రలో రాజ్కుమార్ రావు నటిస్తున్నారు.విక్రమాదిత్య మోత్వానీ దర్శకత్వంలో లవ్ రంజన్, అంకుర్ గార్గ్ నిర్మిస్తున్నారు. ‘‘లైట్స్... కెమెరా... క్రికెట్... ‘దాదా’ చిత్రీకరణ మొదలైపోయింది’’ అంటూ మేకర్స్ సోషల్ మీడియా వేదికగా యూనిట్ తెలియజేసింది. షూటింగ్ను వీలైనంత త్వరగా పూర్తి చేసి, ఈ ఏడాది డిసెంబరులోనే రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారనే టాక్ బాలీవుడ్లో వినిపిస్తోంది.గంగూలీ క్రికెట్ లైఫ్నే కాకుండా, ఆయన వ్యక్తిగత జీవితంలోని అంశాలను కూడా ఈ సినిమాలో ప్రస్తావించనున్నారట. ఇక దాదాపు రెండు దశాబ్దాలపాటు క్రికెట్లో ఓ వెలుగు వెలిగిన గంగూలీ, 2008లో క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించారు. బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా, బిసీసీఐ ప్రెసిడెంట్గా సౌరభ్ గంగూలీ బాధ్యతలను నిర్వర్తించిన సంగతి గుర్తుండే ఉంటుంది. -
సోషల్ మీడియాలో ధురంధర్-3.. కథ-స్క్రీన్ ప్లే రెడీ
గత నెల రణ్వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ధురంధర్-2 దేశవ్యాప్తంగా బ్లాక్ బస్టర్ హిట్టయిన విషయం తెలిసిందే. ఈ సినిమా రెండో భాగం (ధురంధర్-2) ఎలా ముగిసిందో సినిమా చూసిన వాళ్లందరికీ తెలిసే ఉంటుంది. భార్య, కొడుకును వదిలి ఇండియా వచ్చేస్తాడు హీరో. ఆ తర్వాత ‘RAW’ కనుసన్నల నుంచి తప్పించుకొని నేరుగా తన ఇంటికి వెళ్తాడు. అయితే దూరం నుంచే తన తల్లిని, చెల్లిని చూసి తిరిగి వెనుదిరుగుతాడు. ఇలా సాగిన ధురంధర్-2 క్లయిమాక్స్ నుంచి ధురంధర్-3 కథను అల్లేస్తున్నారు సోషల్ మీడియాలోని కొంతమంది జనం. అయితే హీరో మరోసారి రా ఏజెంట్గా పాకిస్థాన్లో అడుగుపెడతాడని, కొత్త గెటప్లో పాకిస్టాన్లో మరోసారి అడుగుపెట్టి తన భార్య, కొడుకును కలుస్తాడంటూ ఎవరికివారు కథతో పాటు స్క్రీన్ ప్లే కూడా అల్లేస్తున్నారు. ఇలా ధురంధర్ ఫ్రాంచైజీపై ఓ కొత్త చర్చ జరుగుతోంది. అయితే నిజానికి ధురంధర్-3పై దర్శకుడు ఆదిత్య ధర్ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. కాగా ఇటీవల ఇదే ప్రశ్న ఆదిత్య ధర్కి ఎదురైంది. దానికి 'ఏమో చెప్పలేం' అన్నట్టు మాత్రమే ఆయన స్పందించాడు. అంతేకానీ ధురంధర్-3 తప్పకుండా తీస్తానని ఆదిత్య ధర్ అనలేదు.కానీ సోషల్ మీడియాలో వస్తున్న కథలని నిజానికి ఓసారి పరిశీలిస్తే ఈ దర్శకుడికి కచ్చితంగా పార్ట్-3కి ఓ లైన్ దొరికే అవకాశం ఉందనే అంటున్నారు కొంతమంది సినీ విశ్లేషకులు. -
రాముడిగా రణ్బీర్ సెట్ కాలేదు.. బాలీవుడ్ నటుడు కీలక వ్యాఖ్యలు!
దర్శకుడు నితీశ్ కుమార్ తెరకెక్కిస్తున్న ‘రామాయణ’ సినిమాపై నటుడు సునీల్ లహ్రీ కీలక వ్యాఖ్యలు చేశాడు. రాముడిగా పాత్రకి రణ్బీర్ కపూర్ అంతగా సెట్ అవ్వలేదన్నాడు. రాముడి పాత్రకు ఉండాల్సిన మృదు స్వభావం రణ్బీర్లో కనిపించలేదన్నాడు.తాజాగా ఆయన ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ‘రామాయణ’టీజర్ చూశాను. అందులో నేను ఆశించిన స్థాయిలో భావోద్వేగాలు కనిపంచలేదు. రాముడిగా రణ్బీర్ చూడడానికి బాగానే ఉన్నాడు. కానీ అతనిలో సున్నితం, అమాయకత్వం కనిపించడం లేదు. ఆయన కాస్త కఠినంగా కనిపిస్తున్నారు. తన నటనతో అయినా ఈ పాత్రకు న్యాయం చేస్తాడని నమ్ముతున్నాను’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ..‘రణ్బీర్ రాముడి పాత్ర కాకుండా లక్ష్మణుడు లేదా భరతుడి పాత్రలు పోషిస్తే బాగా సెట్ అయ్యేదని అభిప్రాయపడ్డారు. కోట్లాది మంది మనసులను గెలుచుకున్న ‘రామాయణం’ సీరియల్లో లక్ష్మణుడు పాత్రని సునీల్ లహ్రీ పోషించాడు. ‘రామాయణ’ సినిమా విషయానికొస్తే.. ఈ చిత్రంలో సీతగా సాయిపల్లవి, లక్ష్మణుడిగా రవి దుబే, హనుమంతుడిగా సన్నీ డియోల్, రావణుడిగా యశ్ నటిస్తున్నారు. ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, డీఎన్ఈజీ సంస్థ, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ పతాకాలపై రూ. 4000 భారీ బడ్జెట్తో నమిత్ మల్హోత్రా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ దీపావళికి విడుదల కానుంది. -
టిఫిన్ చేసే అలవాటు లేదు, రోజుకు 10 గంటలు నిద్ర!
రోజులో ఏది మర్చిపోయినా అల్పాహారం తినడం మాత్రం మిస్ అవొద్దని అంటుంటారు. కానీ, తాను అదే స్కిప్ చేస్తానంటున్నాడు బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా. ఛావా, ధురంధర్ సినిమాలతో ఒక్కసారిగా సెన్సేషన్ అయిపోయాడు అక్షయ్. అతడి యాక్టింగ్కు ప్రేక్షక జనం ఫిదా అయింది. చిన్నవయసులోనే బట్టతలతో బాధపడినప్పటికీ, దాన్నుంచి బయటపడి ఆత్మస్థైర్యాన్ని కూడగట్టుకున్నాడు. లుక్స్తో కాకుండా టాలెంట్తో సమాధానం చెప్పాలనుకున్నాడు. ఆచితూచి పాత్రలు ఎంచుకుంటూ పోతూ తన సత్తా చూపించాడు. కెరీర్లో ఫుల్ బిజీగా మారిన ఈ నటుడి లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో ఓసారి చూసేద్దాం.. నో స్నాక్స్అక్షయ్ ఖన్నా కేవలం రెండుపూటలే భోజనం చేస్తాడు. ఉదయం అల్పాహారం జోలికి వెళ్లడు. మధ్యాహ్నం, రాత్రిపూట మాత్రం తనకు నచ్చింది తినేస్తాడు. అలా అని మధ్యలో ఖాళీ దొరికితే బిస్కెట్లు, సాండ్విచ్లు తినే టైపు కాదు, కేవలం ఛాయ్ తాగుతాడంతే! ఎక్కువగా ఇంటి భోజనాన్నే ఇష్టపడతాడు. అన్నం, పప్పు, కూరగాయలు, చికెన్, చేపలు, ఏదైనా నాన్వెజ్.. ఇవే ఆయన మెనూలో తరచూ కనిపిస్తుంటాయి. రాత్రిపూట అన్నానికి బదులుగా చపాతీ ఆరగిస్తాడు.మంచి నిద్ర ముఖ్యంతేలికగా జీర్ణమయ్యే ఆహారానికే మొదటి ప్రాధాన్యతనిస్తాడు. ఇంట్లో ఉన్నా, సెట్లో ఉన్నా ఇవే ఆహారపద్ధతులను కొనసాగిస్తుంటాడు. బెండకాయ, లిచీ పండ్లు, కేక్స్ తనకు చాలా ఇష్టమని గతంలో ఓ ఇంటర్వ్యూలో అతడే స్వయంగా చెప్పాడు. అన్నింటికన్నా మంచి నిద్ర అవసరం అంటుంటాడు. రోజుకు 10 గంటలు నిద్రపోతాడు. అలసిన శరీరం, మనసుకు ఊరటనిచ్చేది నిద్రేనంటాడు. మరీ నోరు కట్టేసుకోకుండా సింపుల్ డైట్తోనే ఐదు పదుల వయసులోనూ శరీరాన్ని ఫిట్గా ఉంచుకుంటున్నాడు అక్షయ్.చదవండి: మతిస్థిమితం కోల్పోయిన భానుప్రియ? స్పందించిన చెల్లెలు -
ధురంధర్లో విలన్గా.. ముగ్గురు రిజెక్ట్ చేశారు: కాస్టింగ్ డైరెక్టర్
కొన్ని సినిమాల్లో హీరోతో పాటు ఇతర పాత్రలు కూడా బాగా ఎలివేట్ అవుతుంటాయి. అలా ధురంధర్ మూవీలో కథానాయకుడు రణ్వీర్ సింగ్తో పాటు మిగతా అన్ని పాత్రలకు మంచి గుర్తింపు వచ్చింది. ముఖ్యంగా విలన్గా అక్షయ్ ఖన్నా పోషించిన రెహ్మాన్ డకైత్ పాత్ర అయితే విపరీతంగా హైలైట్ అయింది. అక్షయ్ హావభావాలు, మేనరిజం, డ్యాన్స్.. ఇలా అన్నీ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అయ్యాయి. అయితే ఈ విలన్ పాత్ర కోసం అక్షయ్ కంటే ముందు పలువురు నటీనటులను సంప్రదించగా నిరభ్యంతరంగా తిరస్కరించారట! ముగ్గురు రిజెక్ట్ఈ విషయాన్ని కాస్టింగ్ డైరెక్టర్ ముకేశ్ చాబ్రా వెల్లడించాడు. బాలీవుడ్ హంగామాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అతడు మాట్లాడుతూ.. డకైత్ పాత్రను ముగ్గురు యాక్టర్స్ రిజెక్ట్ చేశారు. అందులో ఒకరు దక్షిణాదికి చెందిన ప్రముఖ నటుడు కాగా మరో ఇద్దరు బాలీవుడ్ యాక్టర్స్. వాళ్లు చెప్పిన కారణమేంటంటే.. ఇందులో చాలా ఎక్కువమంది యాక్టర్స్ పని చేస్తున్నారు. పైగా ఇది పూర్తిగా రణ్వీర్ సినిమా అని ఆఫర్ను తిరస్కరించారు. ఆయన తప్ప అందరూ..వారి పేర్లు ఇప్పుడు బయటకు చెప్పలేను కానీ ఆ పాత్రను తిరస్కరించినందుకు వాళ్లు కచ్చితంగా బాధపడే ఉంటారు. ధురంధర్లో నటించేందుకు మొదట అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా కూడా కాస్త తటపటాయించారు. ఆర్.మాధవన్ ఒక్కరే వెంటనే ఓకే చెప్పారు, మిగతా అందరూ కాస్త సమయం తీసుకున్నారు. దర్శకుడు ఆదిత్య, నేను.. ఇలా ఎంతోమంది స్టార్స్ను ఈ సినిమాలో భాగం చేయాలని ముందుగానే అనుకోలేదు. కానీ, అలా జరిగిపోయింది అని చెప్పుకొచ్చాడు.సినిమాఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ధురంధర్ చిత్రం గతేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ రూ.1400 కోట్లకు పైగా వసూళ్లు కొల్లగొట్టింది. దీనికి కొనసాగింపుగా వచ్చిన ధురంధర్: ద రివేంజ్ ఇప్పటివరకు రూ.1500 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పటికీ థియేటర్లలో విజయవంతంగా దూసుకుపోతోంది.చదవండి: ఐశ్వర్య ఇంట్లో ఉండాలి.. అంత ఇగో లేదు: అభిషేక్ బచ్చన్ -
ఐశ్వర్య ఇంటికే పరిమితం..నేనలాంటి వ్యక్తిని కాదు: అభిషేక్
హీరోయిన్ ఐశ్వర్య రాయ్ తనకు భార్య అవడానికి ముందు మంచి స్నేహితురాలు అంటున్నాడు హీరో అభిషేక్ బచ్చన్. పెళ్లయ్యాక తను పని చేయకూడదని ఎన్నడూ కోరుకోలేదని చెప్తున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అతడు మాట్లాడుతూ.. అమ్మానాన్న పెళ్లి చేసుకునే సమయానికి నాన్న కంటే అమ్మనే పెద్ద స్టార్. అయినా వాళ్లు చక్కగా కలిసున్నారు. అందులో అసహజంగా ఏదీ కనిపించలేదు. వారి దాంపత్యాన్ని కళ్లారా చూశాను. కెరీర్ ప్రారంభంలోనే..ఆడవారి కన్నా మగవారే ఎక్కువ డామినెంట్గా ఉండాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. నేను కెరీర్ మొదలుపెట్టిన తొలినాళ్లలోనే ఐశ్వర్యతో పరిచయం ఏర్పడింది. నా రెండో సినిమా తనతో కలిసే చేశాను. నాతో కలిసి ఎక్కువసార్లు నటించిన హీరోయిన్ కూడా తనే! ఆ సమయంలో మేము ప్రేమలో లేము. మంచి ఫ్రెండ్స్లా కలిసున్నాం. ఆ తర్వాత ప్రేమలో పడ్డాం, పెళ్లి చేసుకున్నాం. అలాంటి వ్యక్తిని కానునా భార్య తన పనిని వదులుకుంటేనే నేను సురక్షితంగా ఫీల్ అయ్యే వ్యక్తిని కాదు. అలాంటి అభద్రతాభావం మామధ్య లేదు. 'నేను సంపాదిస్తాను, నువ్వు ఇంటిని చూసుకో'వంటి చర్చ మా మధ్య ఎప్పుడూ రాలేదు. అలాగే నా ఎదుగుదల కోసం ఎవరినీ వాడుకోను. ఇండస్ట్రీలో నటుడిగా నన్ను మా నాన్న లాంచ్ చేయలేదు, నాకోసం ఒక్క సినిమా కూడా తీయలేదు. పైగా నేనే నిర్మాతగా మారి ఆయన సినిమా చేశాను, అందుకు నేను చాలా సంతోషిస్తాను. పెళ్లిఈరోజు నేను సాధించిన విజయాలన్నీ నా కష్టం, ప్రయత్నం ద్వారా అందుకున్నవే! అని చెప్పుకొచ్చాడు. కాగా అభిషేక్ బచ్చన్- ఐశ్వర్య రాయ్ 2007లో పెళ్లి చేసుకున్నారు. వీరికి 2011లో కూతురు ఆరాధ్య జన్మించింది. అయితే అభిషేక్- ఐశ్వర్య చాలా అరుదుగా జంటగా కనిపిస్తారు. దీంతో చాలాసార్లు వీళ్లు విడిపోయారంటూ ప్రచారం జరగడం, దాన్ని దంపతులు కొట్టిపారేయడం పరిపాటిగా మారింది.చదవండి: నాలో సీమ ఫీలింగ్ ఉంది: విజయ్ దేవరకొండ -
రూ.4,000 కోట్ల బడ్జెట్.. ఇదెలా మర్చిపోయారు? వీడియో వైరల్
కొన్ని కథలు తెరపై ఎన్నిసార్లు చూపించినా చూడాలనిపిస్తుంది. తెలిసిన కథే అయినా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది. అలాంటి ఇతిహాస కథే రామాయణం. రాముడి కథను మరోసారి సినీప్రేక్షకులకు కళ్లకు కట్టినట్లుగా చూపించేందుకు సినిమా వస్తోంది.. అదే రామాయణ. రణ్బీర్ కపూర్ రాముడిగా, సాయిపల్లవి సీతగా, యశ్ రావణుడిగా నటిస్తున్నారు. రెండు భాగాలుగా రానున్న ఈ మూవీ కోసం దాదాపు రూ.4000 కోట్ల బడ్జెట్ కేటాయించారు.టీజర్లో ఇది గమనించారా?హనుమాన్ జయంతి సందర్భంగా గురువారం (ఏప్రిల్ 2న) టీజర్ కూడా వదిలారు. ఇందులో రాముడు శివధనస్సు విరిచినప్పటినుంచి అరణ్యవాసం వరకు అనేక విషయాలకు సంబంధించిన గ్లింప్స్ను జత చేశారు. అయితే శ్రీరాముడు నగర వీధుల్లో నడుస్తుంటే జనం పూలతో స్వాగతం పలికే చిన్న క్లిప్లో ఓ పొరపాటు దొర్లింది. ఓ వ్యక్తి తలపాగా ఉన్నట్లుండి రంగు మారింది. మొదట నీలిరంగులో, తర్వాత వంకాయ కలర్లో.. ఆ తర్వాత మళ్లీ నీలిరంగులోకి మారింది. అలా వదిలేశారేంటి?34 సెకన్ల నుంచి 38 సెకన్ల నిడివి మధ్యలో ఇది స్పష్టంగా కనిపిస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. రూ.4 వేల కోట్ల భారీ బడ్జెట్ మూవీలో ఈ చిన్న తప్పిదాన్ని అలాగే వదిలేశారేంటి? అని కొందరు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరేమో ఇది వీఎఫ్ఎక్స్ సమస్య కాదని కలర్ గ్రేడింగ్ వల్ల అలా జరిగిందని, దాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదంటున్నారు.సినిమారామాయణ విషయానికి వస్తే.. నితీశ్ తివారి దర్శకత్వం వహించిన ఈ మూవీని నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్నారు. మొదటి భాగం ఈ ఏడాది దీపావళికి, రెండో భాగం వచ్చే ఏడాది దీపావళికి విడుదల కానుంది. 8సార్లు ఆస్కార్ పొందిన డీఎన్ఈజీ సంస్థ ఈ మూవీకి వీఎఫ్ఎక్స్ చేసే బాధ్యతలను చేపట్టింది. హన్మ్ జిమ్మర్, ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. Notice the blue turban guy next to the kid his turban colour changes to purple in between shots 😳😳₹4000 Cr Movie has new technology altogether it seems 🤩🤩#Ramayana pic.twitter.com/Bu48kWPhlq— Pan India Review (@PanIndiaReview) April 3, 2026 చదవండి: యుగానికి ఒక్కడు సీక్వెల్.. నేనైతే అస్సలు చేయను: ఆండ్రియా -
అతడి నుంచి తప్పించుకునేందుకు రెండో ఫ్లోర్ నుంచి దూకేశా..: నటి
లైంగిక వేధింపుల నుంచి తనను తాను కాపాడుకునేందుకు రెండో అంతస్తు నుంచి దూకానంటోంది బుల్లితెర నటి, హిందీ బిగ్బాస్ 13వ కంటెస్టెంట్ ఆర్తి సింగ్. అప్పుడు తన వయసు కేవలం 13 ఏళ్లేనని చెప్తోంది. చిన్న వయసులో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది. ఆర్తి సింగ్ మాట్లాడుతూ.. అప్పుడు నాకు 13 ఏళ్లు. మా ఇంట్లో పనిచేసే వ్యక్తి నాపై అఘాయిత్యం చేసేందుకు ప్రయత్నించాడు. చేతులు జోడించి బతిమాలినా..నేను మంచి నిద్రలో ఉండగా నా గదిలోకి నడుచుకుంటూ వచ్చాడు. నా గదిలోకి ఎందుకు వచ్చావని గొడవపడ్డాను. నాపైకి వస్తుంటే నువ్వు నా అన్నయ్యవి కదా, ప్లీజ్ వెళ్లిపో అని రెండు చేతులు జోడించి వేడుకున్నాను. అతడు నా మాట వినలేదు. నేను బయట వరండా వైపు చూస్తే తలుపులు తాళం వేసి ఉన్నాయి. అమ్మ పొలానికి వెళ్లింది, ఇంట్లో ఒంటరిగా ఉన్నాను.రెండో ఫ్లోర్ నుంచి దూకేశా..అక్కడ వాతావరణం భయానకంగా మారింది. బయటకు వెళ్లే పరిస్థితి కనిపించలేదు. నేను వెంటనే అతడి నుంచి తప్పించుకుని రెండో అంతస్తుకు పరిగెత్తి అక్కడి నుంచి కిందకు దూకేశాను. నేను చాలా స్ట్రాంగ్గా ఉన్నాను కాబట్టే ఆ రోజు నాపై ఏ అఘాయిత్యం జరగకుండా నన్ను నేను కాపాడుకోగలిగాను అంది. ఆర్తి సింగ్.. గృహస్తి, పరిచయ్, ఉత్తరన్, దేవోన్ కే దేవ్.. మహాదేవ్, వారిస్, విక్రమ్ బేతాళ్కీ రహస్య గాథ వంటి పలు హిందీ సీరియల్స్లో నటించింది. హిందీ బిగ్బాస్ 13వ సీజన్లో నాలుగో రన్నరప్గా నిలిచింది.చదవండి: పెళ్లయిన నెలకే ముగ్గురమయ్యాం అంటూ రష్మిక పోస్ట్ -
అప్పుడేమో విరక్తి.. ఇప్పుడేమో ప్రశంసలు కురిపించిన 'సీత'
బాలీవుడ్ స్టార్ హీరో రణ్బీర్ కపూర్ రాముడిగా నటిస్తున్న చిత్రం రామాయణ. నితీశ్ తివారి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను నమిత్ మల్హోత్రా వేల కోట్ల బడ్జెట్తో తెరకెక్కిస్తున్నాడు. నిన్న (ఏప్రిల్ 2న) హనుమాన్ జయంతి సందర్భంగా రామాయణ టీజర్ వదిలారు. టీజర్లో రాముడిని హైలైట్ చేసి చూపించారు. సీత, హనుమంతుడు, రావణాసురులను చూపించలేదు.టీజర్పై సీత ప్రశంసలుఈ టీజర్పై రామాయణ్ టీవీ సీరియల్లో సీతగా నటించిన దీపిక చికిల ప్రశంసలు కురిపించింది. టీజర్ చూశాను, చాలా బాగుంది. ఎంతో రిచ్గా, అద్భుతంగా తీశారు. ఒక అందమైన కావ్యంలా కనిపిస్తోంది, అందులో డౌటే లేదు. ఈ మూవీ కోసం నేను కూడా ఎదురుచూస్తున్నాను అని చెప్పుకొచ్చింది. అయితే దీపిక గతంలో రామాయణ కథపై సినిమాలు తీయడాన్ని విమర్శించింది. అప్పుడేమో విరక్తి'రామాయణాన్ని పదేపదే తెరకెక్కించాలని చూస్తున్నవారిని చూస్తుంటే విరక్తిగా అనిపిస్తోంది. ఎందుకంటే వాళ్లు తెరకెక్కించిన ప్రతిసారి ఏదో ఒక కొత్తదనాన్ని తీసుకురావాలని ప్రయత్నిస్తారు. కొత్త యాంగిల్, కొత్త లుక్.. ఇలా ఏదో ఒకటి డిఫరెంట్గా ఉండాలని ట్రై చేస్తారు. అలా వారు యదార్థ కథను నాశనం చేస్తున్నారు. కాబట్టి రామాయణంపై సినిమాలు తీయకపోవడమే మంచిది' అని దీపిక అభిప్రాయపడింది. ఇప్పుడు ఆమె తన మనసు మార్చుకుని రామాయణపై ప్రశంసలు కురిపించడం విశేషం!సీరియల్- సినిమాఇకపోతే దీపిక.. 1980లో దూరదర్శన్లో ప్రసారమైన రామాయణ సీరియల్లో సీతాదేవిగా నటించింది. ఇందులో అరుణ్ గోవిల్ రాముడిగా అరవింద్ త్రివేది రావణుడిగా, సునీల్ లహ్రి లక్ష్మణుడిగా, దారా సింగ్ హనుమంతుడిగా యాక్ట్ చేశారు. ఇక నితీశ్ తివారి రామాయణ విషయానికి వస్తే.. 8సార్లు ఆస్కార్ పొందిన డీఎన్ఈజీ అనే సంస్థ ఈ చిత్రానికి వీఎఫ్ఎక్స్ అందిస్తోంది. యశ్ రావణుడిగా, సాయిపల్లవి సీతగా కనిపించనున్నారు. ఈ మూవీ మొదటి భాగం ఈ ఏడాది దీపావళికి, రెండో భాగం వచ్చే ఏడాది దీపావళికి విడుదల కానుంది.చదవండి: వెండితెరపై వీరుల పోరాటం -
దురంధర్-2 కోసం స్టార్ హీరో త్యాగం..!
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తాజా చిత్రాన్ని మేకర్స్ వాయిదా వేశారు. ఈనెల 10న రిలీజ్ కావాల్సిన హారర్-కామెడీ చిత్రం భూత్ బంగ్లాను పోస్ట్పోన్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ మూవీ పెయిడ్ ప్రీమియర్స్ ఈ నెల 16 నుంచి ప్రారంభమవుతాయని వెల్లడించారు.ప్రస్తుతం దురంధర్ ది రివెంజ్ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. అందుకే భూత్ బంగ్లాను ఓ వారం రోజుల పాటు వాయిదా వేస్తున్నామని నిర్మాతలు ప్రకటించారు. డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల నుంచి వచ్చిన అభ్యర్థనల వల్లే వారం రోజులు వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నట్లు నిర్మాత ఏక్తా కపూర్ అధికారిక ప్రకటనలో తెలిపారు. ప్రేక్షకులకు మెరుగైన సినిమా అనుభవాన్ని అందించడం.. థియేటర్లలో సినిమా విజయవంతంగా రన్ అయ్యేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆమె అన్నారు. 'ధురందర్: ది రివెంజ్' చిత్రానికి మరింత సమయాన్ని ఇవ్వడం వల్ల పరిశ్రమకు ప్రయోజనం చేకూరుతుందని ఎగ్జిబిటర్లు భావించారు.కాగా.. భూత్ బంగ్లా చిత్రాన్ని బాలాజీ మోషన్ పిక్చర్స్, కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్లపై నిర్మించారు. ఈ చిత్రానికి ప్రియదర్శన్ దర్శకత్వం వహించగా.. అక్షయ్ కుమార్, శోభా కపూర్, ఏక్తా ఆర్ కపూర్ నిర్మించారు. ఈ చిత్రంలో వామికా గబ్బి, పరేష్ రావల్, టబు, రాజ్పాల్ యాదవ్, జిషు సేన్గుప్తా, మిథిలా పాల్కర్ కీలక పాత్రల్లో నటించారు. -
'రామాయణ' టీజర్ రిలీజ్.. అయోధ్య నుంచి అరణ్యం వరకు!
చలనచిత్రపరిశ్రమలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మూవీ 'రామాయణ'. రణ్బీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయిపల్లవిగా సీతగా నటిస్తున్న ఈ చిత్రానికి నితీశ్ తివారి దర్శకత్వం వహిస్తున్నాడు. నేడు (ఏప్రిల్ 2) హనుమాన్ జయంతి సందర్భంగా రామాయణ టీజర్ వదిలారు. అధర్మం వల్ల లోకం అస్తవ్యస్తమైనప్పుడు.. దాన్ని సరిచేసేందుకు ఎల్లప్పుడూ ఆయనే వస్తాడు. 5 వేల ఏళ్లుగా మన హృదయాల్లో కొలువై, మనల్ని రక్షిస్తున్న నాయకుడు, పురాణ పురుషుడు, మర్యాద పురుషోత్తముడు రాముడు అంటూ టీజర్లో పేర్కొన్నారు. టీజర్ రిలీజ్ఈ వీడియోలో గ్రాఫిక్స్ అద్భుతంగా ఉన్నాయి. రాముడు శివధనస్సు విల్లు ఎత్తినట్లుగా, వనవాసం చేసినట్లు, యుద్ధం చేసినట్లుగా.. పలు ఘట్టాలను క్లుప్తంగా చూపించారు. అంటే అయోధ్య నుంచి అరణ్యం వైపు సాగిన ప్రయాణాన్ని, రాక్షసులతో జరిగిన యుద్ధాన్ని కూడా చూపించారు. ఇందులో కేవలం రాముడి పాత్రను మాత్రమే రివీల్ చేశారు. రావణుడు, సీతల పాత్రలను చూపించలేదు. కేవలం 2 నిమిషాల 28 సెకన్ల నిడివితో ఉన్న ఈ వీడియోలో గ్రాఫిక్స్ అద్భుతంగా ఉన్నాయి. సినిమాచివర్లో రావణుడి ఫేస్ రివీల్ కాకుండా ఆయన ఆహార్యాన్ని వెనక నుంచి చూపించారు. అది ఈ గ్లింప్స్కి హైలైట్గా నిలిచింది. మొత్తానికి వీడియో అదిరిందని, తమ ఎదురుచూపులకు తగ్గ ఫలితం లభించిందని సినీప్రేక్షకులు కామెంట్లు చేస్తున్నారు. కాగా యశ్ రావణుడిగా, సన్నీ డియోల్ హనుమంతుడిగా, రవి దూబే లక్ష్మణుడిగా నటిస్తున్న రామాయణ రెండు భాగాలుగా రానుంది. మొదటి భాగం ఈ ఏడాది దీపావళిలో విడుదలవుతుండగా రెండో భాగం వచ్చే ఏడాది దీపావళికి రానుంది. నమిత్ మల్హోత్రా నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు హన్స్ జిమ్మర్, ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. -
ఒకేసారి 20 సినిమాలు.. ఆయన అన్న ఒక్కమాట వల్ల..!
ఐదు పదుల వయసుకి దగ్గర్లో ఉన్న బాలీవుడ్ నటి దివ్య దత్తా పెళ్లికి మాత్రం దూరంగా ఉంది. కరెక్ట్ పర్సన్ దొరికితేనే పెళ్లి.. లేదంటే సింగిల్గానే బతికేస్తానంటోంది. కథానాయికగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా గుర్తింపు పొందిన ఆమె ఆచితూచి సినిమాలు చేస్తోంది. తాజాగా ఆమె తన సినీప్రయాణాన్ని గుర్తు చేసుకుంది. 16 ఏళ్ల వయసులోనే నటిగా కెరీర్ మొదలుపెట్టాను. నా కెరీర్ను మలుపు తిప్పిన చిత్రం వీర్ జారా. ఆ మూవీ బ్లాక్బస్టర్ హిట్ కావడంతో నాకు బోలెడన్ని అవకాశాలు వచ్చాయి. నాలో ఆలోచన2007లో అనుకుంటా.. ఒకేసారి దాదాపు 20 సినిమాలకు సంతకం చేశాను. ఒకరోజు దర్శకనిర్మాత ఆదిత్య చోప్రాను కలవడానికి వెళ్లాను. చాయ్ తాగుతూ మాట్లాడుకున్నాం. నేను 20 సినిమాలకు సంతకం చేశానని సంతోషంగా చెప్పాను. అతడి వైపు నుంచి ఎటువంటి రియాక్షన్ లేదు. ఇంతమంచి వార్త చెప్తే నీలో చలనం లేదేంటి? అని అడిగాను. నీకు డబ్బు అవసరం అంతుందా? ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నావా? అని అడిగాడు. లేదన్నాను. అలాంటప్పుడు ఒకేసారి అన్ని సినిమాలు ఎందుకు చేస్తున్నావని ప్రశ్నించాడు. నువ్వు మంచి నటివి, ఆచితూచి అడుగులు వేయమని సలహా ఇచ్చాడు. అప్పుడు నాకు జ్ఞానోదయం అయింది.సినిమాఆయన మాట వినాలా? వద్దా? అనేది నా ఛాయిస్. నేను ఇంటికెళ్లి ఆలోచించాను. నేను సంతకం చేసిన సినిమాలనుంచి తప్పుకున్నాను. ఇచ్చిన అడ్వాన్సులు వెనక్కిచ్చేశాను. అప్పటినుంచి నాకు నిజంగా నచ్చిన పాత్రలను మాత్రమే చేసుకుంటూ వస్తున్నాను అని చెప్పుకొచ్చింది. కాగా దివ్య దత్త 2017లో వచ్చిన ఇరాడా మూవీకి గానూ ఉత్తమ సహాయ నటిగా జాతీయ అవార్డు అందుకుంది. ఈమె భాగ్ మిల్కా భాగ్, బద్లాపూర్, ఛావా వంటి పలు చిత్రాల్లో నటించింది. చివరగా చిరైయా అనే వెబ్ సిరీస్లో మెరిసింది.చదవండి: ఫిబ్రవరి, మార్చి పాయే.. ఏప్రిల్ ఏమవుతుందో? -
థియేటర్లలోకి ఏడున్నర గంటల 'ధురంధర్'
ప్రస్తుతం దేశవ్యాప్తంగా 'ధురంధర్' హవా నడుస్తోంది. దక్షిణాదిలోని తెలుగు, తమిళంలోనూ ఈ చిత్రానికి మంచి వసూళ్లు దక్కుతున్నాయి. ఇదలా ఉండగానే మూవీ టీమ్ మరో సరికొత్త ప్రయోగం చేసేందుకు సిద్ధమైంది. రెండు భాగాలని కలిపి ఒక్కటిగా చేసి ఆ సినిమాని థియేటర్లలోకి తీసుకొచ్చే ఆలోచనలో ఉంది. ఈ మేరకు ఆ విషయం వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: దురంధర్-2 కలెక్షన్స్.. తెలుగులోనే ఎందుకిలా?)దాదాపు మూడున్నర గంటల నిడివితో 'ధురంధర్' తొలి భాగం గతేడాది డిసెంబరులో రిలీజైంది. రూ.1300 కోట్ల మేర కలెక్షన్ సొంతం చేసుకుంది. అప్పుడే సీక్వెల్ ఎప్పుడొస్తుందో వెల్లడించారు. చెప్పినట్లుగానే రెండు వారాల క్రితం ధురంధర్ 2ని థియేటర్లలోకి తీసుకొచ్చారు. ఇది 3 గంటల 50 నిమిషాల నిడివితో రిలీజ్ చేశారు. దీనికి బీభత్సమైన హైప్ ఉన్నప్పటికీ వాటిని అందుకుని, సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. చూస్తుంటే బాహుబలి 2, పుష్ప 2 నెలకొల్పిన ఘనతలు గల్లంతు అయిపోయేలానే ఉన్నాయి.(ఇదీ చదవండి: ‘ధురంధర్ 2’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్)ఇదలా ఉండగానే ఇప్పుడు డైరెక్టర్స్ కట్ పేరిట 'ధురంధర్' చిత్రాన్ని ఏడున్నర గంటల నిడివితో థియేటర్లలోకి తీసుకురాబోతున్నారనే న్యూస్ బయటకొచ్చింది. మంగళవారం(మార్చి 31)న ఈ మేరకు సదరు భారీ నిడివి మూవీకి సెన్సార్ జరిగినట్లు ఓ ఫొటో వైరల్ అవుతోంది. ఏప్రిల్ 5 నుంచి దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన థియేటర్లలో మాత్రమే ఈ సినిమా అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. ఐమాక్స్, DC, HDR, EPIQ వంటి ప్రీమియం స్క్రీన్లలో మాత్రమే ప్రదర్శించే అవకాశం ఉందని తెలుస్తోంది.సుధీర్ఘ నిడివితో రాబోతున్న ఈ సినిమాలో దర్శకుడు తీసిన ప్రతి సీన్ ఉండనుందని, సెన్సార్లో తొలగించిన కొన్ని అదనపు సన్నివేశాలు కూడా ఉండనున్నట్లు సమాచారం. నేడో రేపో నిర్మాణ సంస్థ నుంచి ఈ మేరకు ప్రకటన వచ్చే అవకాశముందని మాట్లాడుకుంటున్నారు. ఒకవేళ ఏడున్నర గంటల నిడివితో రిలీజైనా కనీసం మూడు ఇంటర్వెల్స్ అయినా ఇవ్వాల్సి ఉంటుంది. ప్రేక్షకులు కూడా అంత ఓపికతో చూస్తారా అనేది అందరినీ తొలిచేస్తున్న ప్రశ్న. ఒకవేళ ఇది నిజమై, థియేటర్లలోకి వస్తే మాత్రం అత్యంత సుధీర్ఘ నిడివితో వచ్చే చిత్రంగా రికార్డ్ సృష్టించడం గ్యారంటీ.(ఇదీ చదవండి: 9 ఏళ్ల ‘బాహుబలి’ రికార్డు బ్రేక్ చేసిన ‘ధురంధర్’) -
కీర్తి ‘శాశ్వత్’ o చేసిన ధురంధర్!
నటీనటులైనా, దర్శకుడైనా, సాంకేతిక నిపుణులైనా... చిత్ర పరిశ్రమలో ఏ కళాకారుడికైనా ఒక పెద్ద విజయం కుదుపుని ఇస్తుంది కెరీర్కు మలుపును అందిస్తుంది. రాత్రికి రాత్రే తలరాతలను మార్చేయగల శక్తి ఒక్క సినిమా విజయానికి ఉంది. అదీ బాలీవుడ్ రికార్డులను బద్దలుకొట్టిన స్వదేశీ స్పై థ్రిల్లర్ ’ధురందర్’ లాంటి సినిమా అయితే ఇక చెప్పేదేముంది? సంచలన విజయం సాధించిన ఈ సినిమా దానితో సంబంధం ఉన్న ప్రతీ ఒక్కరి కెరీర్ను అనూహ్యమైన కుదుపుని అందించింది.వీరందరిలో, ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం రెండు భాగాలలకూ మ్యూజిక్ని ఇచ్చిన సంగీత దర్శకుడు శాశ్వత్ సచ్దేవ్ ముందున్నారు. దర్శకుడి తర్వాత ఆయన పేరే ఇప్పుడు భారతీయ సినిమా రంగంలో అతిపెద్ద చర్చనీయాంశంగా మారింది. ధురందర్ ఇటీవల విడుదలైన దాని సీక్వెల్ విజయాలకు ఎన్నో ముఖ్య కారణాలు ఉన్నప్పటికీ, ఈ వర్ధమాన సంగీతకారుడు అందించిన అద్భుతమైన నేపథ్య సంగీతం రెండు భాగాలకూ ప్రధాన ఆకర్షణగా నిలిచి, వాటిని బ్లాక్బస్టర్లుగా మార్చడంలో కీలక పాత్ర పోషించింది.గతంలో ఆదిత్య ధర్తో కలిసి ’ఉరి: ది సర్జికల్ స్ట్రైక్’ చిత్రానికి కూడా శాశ్వత్ పనిచేశారు తన అద్భుతమైన స్వరకల్పనకు ఎన్నో ప్రశంసలు అందుకున్నారు. ఆయన జాతీయ ఫిల్మ్ఫేర్ అవార్డులు రెండింటినీ గెలుచుకుని బాలీవుడ్కు ఒక బలమైన సందేశాన్ని ఇచ్చారు. ధురందర్ చిత్రంతో, తాను రాబోయే సంవత్సరాల్లో మరిన్ని సంచలనాలు సృష్టిస్తానని ఆయన మరోసారి చాటి చెప్పారు. «అత్యంత ఉత్కంఠ భరిత సన్నివేశాల్లో అనూహ్యంగా పాత బాలీవుడ్ పాటల్ని జోడిస్తూ దురందర్ చిత్రాల్లో.. శాశ్వత్ చేసిన కొత్త ప్రయోగం సూపర్ సక్సెస్ అయింది. సినిమా కథనంతో సజావుగా కలిసిపోయిన ఒకనాటి మ్యూజికల్ హిట్స్ ప్రేక్షకులకు ఫుల్ కిక్ ఇచ్చాయి. ఆయన వ్యూహం అద్భుతంగా ఫలించింది.కేవలం నేపథ్య సంగీతంలోనే కాకుండా, ప్రేక్షకులకు పాత జ్ఞాపకాలను గుర్తుచేసే ఐదు రెట్రో పాటలతో కథనాన్ని మరింత ఉత్కంఠభరితంగా మార్చినప్పుడు, క్లాసిక్ పాటలపై ఆయనకున్న అభిరుచి మరోసారి స్పష్టమైంది. దివంగత నుస్రత్ ఫతే అలీ ఖాన్ పాట దిల్ పే జఖ్మ్ ఖతే హై (1977), దిల్ (1990) నుంచి హమ్ ప్యార్ కర్నే వాలే (1990), తానేదార్ నుంచి తమ్మా తమ్మా (1990), త్రిదేవ్ నుంచి తిర్చీ టోపీవాలే (1989), అంగారే నుంచి ముజే జిందగీ నే మారా (1986) అలాగే బాజీగర్ (1993) నుంచి...పాటల్ని అద్భుతంగా కలగలిపారు.రణ్వీర్ సింగ్ తన అవార్డ్ విన్నింగ్ పెర్ఫార్మె న్స్ కి మెజారిటీ అవార్డులతో దూరంగా ఉండగా, ఆదిత్య ధర్ ఇప్పుడు కేవలం మూడు నెలల్లో రెండు అద్భుతమైన సినిమాలను అందించినందుకు పాన్–ఇండియా సంచలనంగా మారాడు. అదే విధంగా ప్రస్తుతం శాశ్వత్ అందించిన అద్భుతమైన సంగీతంతో చార్ట్స్లో టాప్లో నిలిచాడు. ఉత్సాహపరిచే డ్యాన్స్ నంబర్లు, స్టైలిష్ ఇంట్రో పాటలపై ఆధారపడే ఆధునిక సంగీత దర్శకుల్లా కాకుండా ఆయన సంగీతంలో తనదైన ప్రత్యేక శైలితో భిన్నంగా వెళ్లడం, తన సొంత నియమాల ప్రకారం పనిచేయడం ఆయన్ను బాలీవుడ్లో తదుపరి పెద్ద స్టార్ మ్యూజిక్ డైరెక్టర్గా మార్చింది. ఈ నేపధ్యంలో త్వరలోనే దక్షిణాది చిత్రసీమలో అడుగుపెట్టే అవకాశం కూడా ఆయనకు రానున్నట్టు సమాచారం. -
ధురంధర్ 2 కథ నాది.. కాపీ కొట్టారు: కన్నడ దర్శకుడు
పాన్ ఇండియా స్థాయిలో మార్మోగిపోతున్న పేరు ధురంధర్ 2. ఆదిత్య ధర్ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ధురంధర్ లైఫ్టైమ్ కలెక్షన్స్ను రెండో భాగం ఈపాటికే దాటేసింది. ఒకటీరెండు రోజుల్లో రూ.1500 కోట్ల క్లబ్లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ క్రమంలో ధురంధర్ 2 కథ తనదంటూ మీడియా ముందుకు వచ్చాడు కన్నడ దర్శకుడు సంతోష్ కుమార్ ఆర్ఎస్.కష్టపడి కథ రాసుకున్నా..ఆయన మాట్లాడుతూ.. ధురంధర్ 2 మీరంతా చూసే ఉంటారు. ఈ సినిమాకు అంతటా మంచి స్పందన లభిస్తోంది. అయితే ఆ కథ నాది. సినిమా చూసిన తర్వాత నా కథ కాపీ కొట్టారన్న విషయం అర్థమైంది. 2023లోనే ఎంతో కష్టపడి ఈ కథ రాసుకున్నాను. ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరిగాను. పెద్ద నటీనటులు ఈ మూవీలో భాగం కావాలంటే బడా సంస్థ అండగా ఉండాలన్నారు. 2023లోనే రిజిస్టర్ చేయించా..అందుకే జీ స్టూడియోస్, టీ సిరీస్, ధర్మ ప్రొడక్షన్స్, సోనీ పిక్చర్స్.. ఇలా అనేక పెద్ద నిర్మాణ సంస్థలను సంప్రదించాను. చాలామందికి నా కథ పంపాను. ఆదిత్య రాయ్ కపూర్ని హీరోగా పెట్టి మూవీ తీయాలనుకున్నాను. 2023 నవంబర్లోనే ఈ కథ రిజిస్టర్ కూడా చేయించాను. అందుకు సంబంధించిన సాక్ష్యాలు నా దగ్గరున్నాయి. వీటి ఆధారంగా ధురంధర్ 2 మూవీ యూనిట్పై కేసు వేయాలనుకుంటున్నాను.అదే బాధగా ఉందివాళ్లు నా కథను చెడగొట్టారు. నేను వినోదం కోసం కథ రాస్తే దాన్ని రాజకీయ దుర్వినియోగం చేశారు. అదే నాకు మరింత బాధ కలిగిస్తోంది. నాకు జరిగిన అన్యాయం ఇంకెవరికీ జరగకూడదు అని ఆవేదన వ్యక్తం చేశాడు. సంతోష్ కుమార్.. క్యాంపస్ క్రాంతి అనే కన్నడ చిత్రంతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం యువన్ రాబిన్హుడ్ మూవీ చేస్తున్నాడు.చదవండి: నీ ముఖానికి గోల్డ్ చైన్ వేసుకునేంత సీన్ ఉందా? నటి ఆవేదన -
రామాయణలో శ్రీరాముడి పాత్ర చేయనన్నా..: రణ్బీర్ కపూర్
దేశంలోనే కనీవినీ ఎరుగని రీతిలో భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న చిత్రం రామాయణ. రెండు భాగాలుగా రానున్న ఈ మూవీ కోసం దాదాపు రూ.4 వేల కోట్లు కేటాయించారు. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్బీర్ కపూర్ రాముడిగా, సౌత్ సెన్సేషన్ హీరోయిన్ సాయిపల్లవి సీతగా నటిస్తున్నారు. రాఖీభాయ్ యష్ రావణుడిగా కనిపించనున్నాడు.రిజెక్ట్ చేశా..అయితే ఈ సినిమా ఆఫర్ వచ్చినప్పుడు ఎగిరి గంతేయడానికి బదులుగా రిజెక్ట్ చేసేందుకే మొగ్గు చూపానంటున్నాడు రణ్బీర్ కపూర్. న్యూయార్క్లో రామాయణ దర్శకుడు నితీశ్ తివారి, నిర్మాత నమిత్ మల్హోత్రాతో కలిసి ఓ ఈవెంట్కు హాజరయ్యాడు రణ్బీర్. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. నాలుగేళ్ల క్రితమే నితేశ్ తివారి నాకు రామాయణ సినిమా గురించి చెప్పాడు. ప్రధాన పాత్రలో నటించమని కోరగా నేను క్షణం ఆలోచించకుండా నో చెప్పాను.కీలకమైన మలుపునేను ఆ పాత్రకు సెట్ అవనేమో, బాగోనేమో అని నాపై నాకే అనుమానం వేసింది. రాముడి పాత్రకు నేను పూర్తి న్యాయం చేయలేనని తిరస్కరించాను. కానీ, ఆ భయం చాలా త్వరగానే కనుమరుగవగా అంత మంచి ఛాన్స్ వచ్చినందుకు సంతోషించాను. ఎందుకంటే ఇటువంటి అవకాశాలు నా జీవితానికి చాలా అవసరమయ్యాయి. ఆ సమయంలో నేను తండ్రినయ్యాను. నా పద్ధతుల్ని, జీవితాన్ని మార్చుకోవాల్సిన దశలో ఉన్నాను. శ్రీరాముడి పాత్ర పోషించడం, తొలిసారి తండ్రి కావడం యాదృచ్ఛికమే అయినప్పటికీ నా జీవితాన్ని కీలక మలుపు తిప్పిన అందమైన అనుభూతి అని చెప్పుకొచ్చాడు.సినిమాకాగా రణ్బీర్ కపూర్, ఆలియా భట్ కొంతకాలం పాటు ప్రేమలో మునిగి తేలారు. 2022లో పెళ్లి చేసుకున్నారు. వీరికి అదే ఏడాది నవంబర్లో కూతురు రాహా జన్మించింది. రామాయణ విషయానికి వస్తే.. ఏర్ రెహ్మాన్, హన్స్ జిమ్మర్ సంగీతం అందిస్తున్నారు. మొదటి భాగం ఈ ఏడాది అక్టోబర్లో దీపావళికి విడుదలవుతుండగా రెండో భాగం వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. హనుమాన్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 2న రామాయణ సినిమా గ్లింప్స్ విడుదల కానుంది.చదవండి: గుడిలో గిన్నెలు కడిగిన ప్రియాంక చోప్రా -
పూనమ్ పాండే ప్రెగ్నెంట్? నిజమా.. లేక?
పబ్లిసిటీ స్టంట్స్ చేయడంలో నటి పూనమ్ పాండేను మించినవారు లేరు. 2019లో టీమిండియా వరల్డ్ కప్ గెలిస్తే మైదానంలో దుస్తుల్లేకుండా తిరుగుతానని ప్రకటించింది. తీరా భారత్ కప్పు గెలవగా.. ఆమె అన్నంత పని చేయకుండా బీసీసీఐ పూనమ్ను అడ్డుకుంది. రెండేళ్ల క్రితం గర్భాశయ ముఖద్వార క్యాన్సర్తో మరణించినట్లు తనపై తనే రూమర్ సృష్టించింది. అది నిజమేనని నమ్మిన జనం తీవ్ర విచారం వ్యక్తం చేయడంతో క్షమించండి, కేవలం అవగాహన కోసమే ఇలా చనిపోయినట్లు నాటకమాడానంది. మరో డ్రామా?ఇప్పుడు మరో స్టంట్ చేసినట్లు కనిపిస్తోంది. అదేంటంటే.. తను గర్భవతిని అని ప్రకటించింది. బేబీ బంప్ ఫోటోలను ఇన్స్టాగ్రామ్, ఎక్స్ (ట్విటర్) ఖాతాలో షేర్ చేసింది. ఇది చూసిన నెటిజన్లు.. అదేంటి, భర్తతో విడిపోయిన పూనమ్ ప్రెగ్నెంట్ ఎలా అయింది? అని డౌట్ పడుతున్నారు. అంతలోనే అది ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్) సాయంతో సృష్టించిన ఫోటోలని తేల్చేశారు. ఎక్స్లో షేర్ చేసిన పోస్ట్ కింద ఇది ఏఐతో చేసిన ఫోటో అని స్పష్టంగా రాసుంది. అంటే అందర్నీ ఏప్రిల్ ఫూల్ చేసేందుకు ఇలా తాను ప్రెగ్నెంట్ అని డ్రామా ఆడినట్లు తెలుస్తోంది.సినిమాకాగా పూనమ్ పాండే బాలీవుడ్లో నషా, జీఎస్టీ, ద జర్నీ ఆఫ్ కర్మ, టచ్ ద ఫైర్ వంటి సినిమాలు చేసింది. తెలుగులో మాలిని అండ్ కో చిత్రంలో కథానాయికగా నటించింది. వ్యక్తిగత విషయానికి వస్తే.. 2020 సెప్టెంబర్ 1న ప్రియుడు సామ్ అహ్మద్ బాంబేని పెళ్లి చేసుకుంది. పెళ్లయిన పదిరోజులకే అతడు తనపై అత్యాచారం చేశాడని, వేధింపులకు పాల్పడుతున్నాడంటూ పోలీసులను ఆశ్రయించింది. అలా కొంతకాలానికే దంపతులిద్దరూ విడిపోయారు.🤰🍼👶👼 pic.twitter.com/6UUAAc9rKj— Poonam Pandey (@iPoonampandey) March 31, 2026 చదవండి: గుడిలో గిన్నెలు కడిగిన స్టార్ హీరోయిన్ -
గుడిలో గిన్నెలు శుభ్రం చేసిన 'వారణాసి' హీరోయిన్.. వీడియో వైరల్
గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా.. హాలీవుడ్కు వెళ్లిపోయినా తన మూలాలను మాత్రం అస్సలు మర్చిపోలేదు. అందుకు నెట్టింట వైరల్గా మారిన వీడియోనే ప్రత్యక్ష ఉదాహరణ. మంగళవారం నాడు ఆమె అమృత్సర్లోని గోల్డెన్ టెంపుల్ను సందర్శించింది. సాంప్రదాయ దుస్తుల్లో గుడికి వెళ్లిన ఆమె అక్కడున్నవారిని నవ్వుతూ పలకరించింది. ఆలయ సిబ్బంది సెల్ఫీ అడిగితే కాదనుకుండా ఓపికగా ఫోటోలు దిగింది. అనంతరం ఆలయసేవలో పాల్గొంది.వీడియో వైరల్గుడిలో వాడిన పాత్రలను కొందరు మహిళలు శుభ్రం చేస్తుంటే తను కూడా వారికి సాయం చేసింది. తలపై దుపట్టా కప్పుకుని గిన్నెలు కడిగింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. ఇది చూసిన అభిమానులు ప్రియాంక అమెరికాలో సెటిలైనప్పటికీ తనలో భారతీయత ఉట్టిపడుతోందని కామెంట్లు చేస్తున్నారు. స్టార్ హీరోయిన్ అయినప్పటికినీ.. ఇలా సేవ చేయడాన్ని తను ఏమాత్రం చిన్నతనంగా భావించడం లేదు, నిజంగా గ్రేట్ అని పొగుడుతున్నారు.సినిమాఇకపోతే ప్రియాంక చోప్రా చివరగా 'ద బ్లఫ్' అనే హాలీవుడ్ మూవీ చేసింది. ప్రస్తుతం తెలుగు చిత్రం 'వారణాసి'లో యాక్ట్ చేస్తోంది. మహేశ్బాబు కథానాయకుడిగా నటిస్తున్న ఈ మూవీకి రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ 2027 ఏప్రిల్ 7న విడుదల కానుంది. View this post on Instagram A post shared by Uptodate ਪੰਜਾਬੀ (@uptodatepunjabi) View this post on Instagram A post shared by Amritsar Paparazzi 📸 (@amritsar.paparazzi)చదవండి: అప్పుడే చనిపోవాలనుకున్నా: కోన వెంకట్ -
సినిమాల కంటే పుస్తకాలకే ప్రాధాన్యం: ఆమిర్ ఖాన్
సాధారణంగా నటీనటులు, దర్శక–నిర్మాతలు, సాంకేతిక నిపుణులు... ఇలా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నవారు ఎవరైనా సినిమాలకే మా తొలి ప్రాధాన్యం అంటుంటారు. అయితే బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ మాత్రం ‘నేను సినిమాల కంటే పుస్తకాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను’ అంటున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన తన గురించి ఎవరికీ పెద్దగా తెలియని ఓ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించి, అందరూ ఆశ్చర్యపోయేలా చేశారు. ‘‘నేను చాలా సంప్రదాయ కుటుంబంలో పెరిగాను. మా అమ్మానాన్న ఎంతో క్రమశిక్షణతో పెంచారు.సినిమాలు చూసే విషయంలో కఠినంగా ఉండేవారు. కేవలం దూరదర్శన్ లో వచ్చే పాత బ్లాక్ అండ్ వైట్ చిత్రాలు మాత్రమే చూశాను. ఎప్పుడైనా వారాంతంలో సినిమా చూడాలనుకుంటే మా అమ్మను అనుమతి అడిగేవాడిని. తను సరే అంటే ఓకే... లేదంటే లేదు. అయితే రొమాంటిక్ లేదా కమర్షియల్ సినిమాలు చూడటానికి అనుమతించేవారు కాదు. దీంతో పుస్తకాలు చదువుతూ కాలక్షేపం చేసేవాడిని. ఈ కారణంగా చిన్నతనం నుంచే పుస్తకాలతో విడదీయలేని అనుబంధం ఏర్పడింది. అయితే 18 ఏళ్లకే నేను అసిస్టెంట్గా ఇండస్ట్రీలో కెరీర్ ప్రారంభించాను. ఆ తర్వాత హీరోగా మారాను. కానీ నేను ఇప్పటికీ పెద్దగా సినిమాలు చూడను. కొందరికి ఫుట్బాల్ ఆడటం ఇష్టం.. మరికొందరికి చూడటం ఇష్టం. నేను ఆడే రకం. సినిమాలు చేస్తాను కానీ చూడను’’ అని చెప్పా రు ఆమిర్ ఖాన్. ఇదిలా ఉంటే ఆమిర్ ఖాన్ నిర్మిస్తున్న ‘ఏక్ దిన్’ మే 1న, ‘లాహోర్ 1947’ ఆగస్టు 13న విడుదల కానున్నాయి. -
నయనతార.. ఒరిజినల్ పాన్ ఇండియా స్టార్
పాన్ ఇండియా హీరోయిన్ అనే ట్యాగ్కి నిజమైన అర్హత సాధించిన నటి నయనతార. ఒక్కో భాషలో ఒక్కో సినిమా చేస్తూ, ఐదు భాషల్లో ఒకేసారి సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం నయనతార తెలుగులో ఒక సినిమా షూటింగ్ దశలో ఉంది. మలయాళంలో రెండు సినిమాలు సెట్స్పై కొనసాగుతున్నాయి. తమిళంలో రెండు సినిమాలు రెడీ అయ్యాయి. మరో సినిమా షూటింగ్లో ఉంది. కన్నడలో ఆమె నటించిన టాక్సిక్ సినిమా రిలీజ్కు సిద్ధంగా ఉంది. ఇక హిందీ బాలీవుడ్లో సల్మాన్ ఖాన్ సరసన నటించేందుకు సైన్ చేసింది. ఇంతకుముందు షారూక్ ఖాన్తో కలిసి జవాన్ చిత్రంలో నయనతార నటించింది. ఇప్పుడు సల్మాన్తో కలిసి వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్లో కీలక పాత్ర పోషించనుంది. ఇందులో కూడా ఆమె పాత్రకు యాక్షన్ టచ్ ఉండనుందని సమాచారం. ఇలా ఒకేసారి ఐదు భాషల్లో సినిమాలు చేస్తూ నిజమైన పాన్ ఇండియా హీరోయిన్గా నిలుస్తోంది నయనతార. నయనతార ఈ స్థాయికి రావడానికి గల కారణాల్లో ఆమె సినిమాల ఎంపికలో చూపే వైవిధ్యం ఒకటి. తన నటనతో ఇప్పటికే దక్షిణాది భాషల్లో బలమైన స్థానం సంపాదించుకున్న ఈ నటి ఇప్పుడు బాలీవుడ్లో కూడా తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకునే ప్రయత్నంలో ఉంది. -
దురంధర్-2ను వదలని పైరసీ.. యూట్యూబ్లో ప్రింట్..!
రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్-2 బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. ఈనెల 19న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ ఇప్పటికే దురంధర్ వసూళ్లను క్రాస్ చేసింది. కేవలం 11 రోజుల్లోనే రూ.1300 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. ఈ సీక్వెల్ హిందీతో పాటు దక్షిణాది భాషల్లో రిలీజ్ కావడంతో రెండు వేల కోట్ల మార్క్ చేరుకునేలా కనిపిస్తోంది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా పాకిస్తాన్కు వెళ్లిన ఇండియన్ స్పై జీవితం ఆధారంగా తెరకెక్కించారు.బాక్సాఫీస్ వద్ద సక్సెస్ఫుల్గా దూసుకెళ్తోన్న ఈ చిత్రానికి పైరసీ గండం తప్పింది. అయితే పైరసీ కేటుగాళ్లు ఈ మూవీని యూట్యూబ్లో అప్లోడ్ చేశారు. ఇది గమనించిన దురంధర్ అభిమానులు వెంటనే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దీనిపై వెంటనే అప్రమత్తమై దురంధర్ టీమ్ పైరసీ కంటెంట్ను తొలగించాలని యూట్యూబ్ను కోరింది. దీంతో వెంటనే స్పందించిన యూట్యూబ్ ఆ వీడియోను తొలగించింది. త్వరగా రెస్పాండ్ కావడంతో పైరసీ గండం నుంచి తప్పించుకున్నారు మేకర్స్. లేకపోతే దురంధర్ వసూళ్లపై తీవ్ర ప్రభావం పడేదని నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇలా పైరసీకి పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు సోషల్ మీడియాలో ఆదిత్య ధర్ను ట్యాగ్ చేశారు.కాగా.. రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన ఈ చిత్రంలో సారా అర్జున్ హీరోయిన్గా కనిపించింది. ఈ మూవీలో అర్జున్ రాంపాల్, ఆర్. మాధవన్, సంజయ్ దత్, రాకేష్ బేడీ కీలక పాత్రల్లో నటించారు. -
మా హృదయాలు సంతోషంతో నిండిపోయాయి: సోనమ్కపూర్
బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ ఇంట సంతోషాలు రెట్టింపు అయ్యాయి. ఈ నెల 29న సోనమ్ కపూర్ పండంటి మగ శిశువుకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించి, తన ఆనందాన్ని వ్యక్తం చేశారు సోనమ్. ‘‘ప్రేమతో నిండిన మా హృదయాలతో మా బాబు రాకను మేం ఎంతో సంతోషంగా ప్రకటిస్తున్నాం. మరో బిడ్డ రాకతో మా ఇంట ఆనందం వెల్లివిరిసింది. మా హృదయాలు మరింత సంతోషంతో నిండిపోయాయి.వాయు(పెద్ద కుమారుడు) తన తమ్ముడిని స్వాగతించడానికి ఆసక్తిగా ఉన్నాడు. నలుగురు ఉన్న కుటుంబంగా మా జీవితాల్లో మేం ఓ సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించాం. అందరికీ కృతజ్ఞతలు.. ప్రేమతో సోనమ్, ఆనంద్, వాయు’’ అన్న నోట్ను సోషల్ మీడియాలో షేర్ చేశారు సోనమ్ కపూర్. సోనమ్కపూర్ (నటుడు– నిర్మాత అనిల్ కపూర్ కుమార్తె) వివాహం వ్యాపారవేత్త ఆనంద్ ఆహుజ తో 2018లో జరిగింది. ఈ దంపతులకు 2022లో కుమారుడు ‘వాయు’ జన్మించిన సంగతి తెలిసిందే. -
ప్రభాస్, మహేశ్, తారక్ సినిమాలు చూస్తా.. అవన్నీ కూడా!
స్టార్ హీరోయిన్ రవీనా టండన్ కూతురు రాషా తడానీ అప్పుడే పెద్ద సెలబ్రిటీ అయిపోయింది. చేసింది ఒక్క సినిమా (ఆజాద్)నే అయినా ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇక ఆజాద్ మూవీలో ఉయి అమ్మా పాటలో డ్యాన్స్తో ఇరగదీసి సెన్సేషన్ అయింది. ఈ బ్యూటీ శ్రీనివాస మంగాపురం మూవీతో తెలుగులో ఎంట్రీ ఇవ్వనుంది. సూపర్స్టార్ కృష్ణ నటవారసత్వాన్ని కొనసాగిస్తూ ఘట్టమనేని జయకృష్ణ (రమేశ్బాబు తనయుడు) వెండితెరకు హీరోగా పరిచయం కాబోతున్నాడు.సౌత్ సినిమాలంటే ఇష్టంఈ మూవీలో రాషా తడానీ హీరోయిన్గా నటిస్తోంది. తాజాగా ఆమె మాట్లాడుతూ.. నాకు దక్షిణాది సినిమాలు చూడటమంటే చాలా ఇష్టం. ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, మహేశ్బాబు.. ఇలా అందరి సినిమాలు చూస్తుంటాను. వాళ్ల సినిమాలన్నీ కొత్త అనుభూతినిస్తాయి. ఇప్పుడదే ఇండస్ట్రీలో భాగం కావడం సంతోషంగా ఉంది. దీన్ని నేను ఎంజాయ్ చేస్తున్నాను.హీరోయిన్స్ కూడా..హీరోలే కాదు, అక్కడ హీరోయిన్స్ రష్మిక మందన్నా, శ్రీలీల.. ఇలా అందరూ స్ఫూర్తిదాయకంగా ఉంటారు. అలాంటి సినీ ప్రపంచంలో భాగమయ్యే అవకాశం లభించినందుకు గర్వంగా ఉంది. నా జర్నీ చక్కగా ముందుకు సాగుతుందనుకుంటున్నాను అని చెప్పుకొచ్చింది. శ్రీనివాస మంగాపురం విషయానికి వస్తే.. ఆర్ఎక్స్ 100, మంగళవారం ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ ఈ ఏడాదే విడుదల కానుంది. మరోవైపు రాషా.. లైకే లైకా అని ఓ హిందీ మూవీ కూడా చేస్తోంది.చదవండి: బాలీవుడ్ అంటే భయపడుతున్న నాగచైతన్య? నిజమిదే! -
ఫస్ట్ది అట్టర్ ఫ్లాప్.. అందుకే హిందీలో సినిమా చేయట్లేదా? చై ఆన్సరిదే!
టాలీవుడ్ హీరో నాగచైతన్య చివరగా తండేల్ సినిమాతో భారీ హిట్ కొట్టాడు. ప్రస్తుతం వృషకర్మ మూవీతో బిజీగా ఉన్నాడు. అయితే టాలీవుడ్లో స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్న ఆయన లాల్ సింగ్ చద్దా (2022) మూవీతో బాలీవుడ్లోనూ ఎంట్రీ ఇచ్చాడు. ఆమిర్ ఖాన్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత మళ్లీ హిందీ సినిమా ట్రై చేయలేదు చై.కారణమంటూ ఏం లేదుబాక్సాఫీస్ వైఫల్యం వల్లే అతడు మళ్లీ హిందీ సినిమా చేయడానికి భయపడుతున్నాడని ప్రచారం జరిగింది. దానిపై నాగచైతన్య తాజాగా స్పందించాడు. అతడు మాట్లాడుతూ.. నేను హిందీలో మళ్లీ మూవీ చేయకపోవడానికి ప్రత్యేక కారణమంటూ ఏదీ లేదు. తెలుగులో బిజీ అయిపోయానంతే! మళ్లీ మంచి అవకాశం వస్తే తప్పకుండా బాలీవుడ్లో యాక్ట్ చేస్తాను. లాల్ సింగ్ చద్దా వైఫల్యం వల్ల మాత్రం నేను వెనకడుగు వేయలేదు. చాలా ఎంజాయ్ చేశాఆ మూవీ షూటింగ్ నేను చాలా ఎంజాయ్ చేశాను. అక్కడి జనం దగ్గరినుంచి ఎంతో నేర్చుకున్నాను, వాళ్లు నన్ను చాలా బాగా చూసుకున్నారు. ఆ అనుభవం మాటల్లో చెప్పలేను. ఇక సినిమా రిజల్ట్ అంటారా? బాక్సాఫీస్ వద్ద ఒడిదుడుకులు సహజం అని అర్థం చేసుకునేంత పరిణతి మాకుందని భావిస్తున్నాను. ఈ ఫలితాలు మా లక్ష్యసాధనను ఏమాత్రం అడ్డుకోలేవు. సక్సెస్, ఫెయిల్యూర్ నా మైండ్సెట్ను మార్చలేవు అని నాగచైతన్య పేర్కొన్నాడు.చదవండి: అది నిజం కాదు, ఎవరూ నమ్మకండి: ఖుష్బూ -
విజయ్ దేవరకొండ మూవీలో సారా అర్జున్ తండ్రి.. ఏ సినిమానో తెలుసా?
'నాన్న', 'పొన్నియన్ సెల్వన్' సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా నటించిన సారా అర్జున్. 'ధురంధర్' సినిమాతో ఒక్కసారిగా స్టార్ అయిపోయింది. తన తొలి సినిమాకే ఇండస్ట్రీ హిట్ కొట్టింది. ఇందులో 40 ఏళ్ల హీరో రణ్వీర్ సింగ్కు జంటగా నటించింది. కేవలం 20 ఏళ్ల సారా అర్జున్ తన గ్లామర్తో అభిమానులను మెప్పించింది. ఆ తర్వాత తెలుగులోనూ యూఫోరియా మూవీతో అలరించింది.ప్రస్తుతం సారా నటించిన దురంధర్-2 థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ నేపథ్యంలో సారా అర్జున్ గురించి తెగ చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే సారా అర్జున్కు సంబంధించిన ఆసక్తికర విషయం బయటకొచ్చింది. ఆమె తండ్రి రాజ్ అర్జున్ సైతం తెలుగు సినిమాల్లో నటించడం విశేషం.విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన డియర్ కామ్రేడ్ మూవీలో క్రికెట్ సెలక్టర్ రమేశ్ రావు పాత్రలో మెప్పించారు. అంతేకాకుండా గతేడాది రిలీజైన రజాకార్ చిత్రంలోనూ కీలక పాత్రలో కనిపించారు. ప్రస్తుతం ఆయన కుమార్తె సారా అర్జున్ సైతం తెలుగులో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. కాగా.. 2002లో కంపెనీ అనే మూవీతో అరంగేట్రం రాజ్ అర్జున్ దాదాపు 30కి పైగా సినిమాల్లో నటించారు. సీక్రెట్ సూపర్స్టార్ అనే చిత్రం ద్వారా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయనే ఫేవరేట్ హీరో..గతంలో యూఫోరియా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్కు హాజరైన సారా అర్జున్ తెలుగులో నటించడం చాలా గర్వంగా ఉందని చెప్పింది. టాలీవుడ్లో మీ ఫేవరేట్ హీరో ఎవరని యాంకర్ ప్రశ్నించింది. దీనికి బదులిస్తూ తెలుగులో చాలామంది హీరోలు ఉన్నారని.. కానీ నాకు మాత్రం విజయ్ దేవరకొండ ఫేవరేట్ అని బాలీవుడ్ ముద్దుగుమ్మ చెప్పుకొచ్చింది. ఆమె తండ్రి రాజ్ అర్జున్ డియర్ కామ్రేడ్లో నటించడం వల్లే సారా అర్జున్ తన ఫేవరేట్ హీరో అని చెప్పుకొచ్చింది. -
సినిమాలు చూసే అలవాటు లేదు.. ఇంట్లో ఒప్పుకోరు!: ఆమిర్ ఖాన్
తాను పెద్దగా సినిమాలు చూడనంటున్నాడు బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్. చిన్నప్పుడు చేతికి పుస్తకాలిచ్చేవారే తప్ప సినిమాలు చూసేందుకు అనుమతిచ్చేవారు కాదని, దాంతో అదే అలవాటైపోయిందని చెప్తున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమిర్ ఖాన్ మాట్లాడుతూ.. నేను చాలా సాంప్రదాయ కుటుంబంలో పెరిగాను. మా అమ్మానాన్న చాలా స్ట్రిక్ట్.. సినిమాలు చూసేందుకు అంతగా అనుమతిచ్చేవారు కాదు. అమ్మ అనుమతితోనే..దాంతో పుస్తకాలు చదువుతూ కాలక్షేపం చేసేవాడిని. కేవలం దూరదర్శన్లో వచ్చిన బ్లాక్ అండ్ వైట్ సినిమాలు, మరీ పాత సినిమాలు మాత్రమే చూశాను. ఎప్పుడైనా సినిమా చూడాలనుకుంటే మా అమ్మను అనుమతి అడిగేవాడిని. తను ఓకే చెప్తేనే చూసేదాన్ని, లేదంటే లేదు. అయితే రొమాంటిక్ సినిమాలు చూడటం మాత్రం నిషిద్ధం. కేవలం వారాంతాల్లో మూవీస్ చూసేవాడిని.సినిమాలు చూడనుఅయితే విచిత్రంగా 18 ఏళ్లకే నేను సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టాను. అసిస్టెంట్గా కెరీర్ ప్రారంభించి తర్వాత హీరోగా మారాను. అయితే ఇప్పటికీ నేను పెద్దగా సినిమాలు చూడను. ఫన్నీగా చెప్పాలంటే.. కొందరికి ఫుట్బాల్ ఆడటం ఇష్టం, మరికొందరికి చూడటం ఇష్టం. అలా నేను సినిమాలు చేస్తాను, కానీ చూడను. ఈ మధ్యకాలంలో కొత్తగా వచ్చిన సినిమాలేవీ చూడలేదు. నా ప్రపంచంలో నేను బతికేస్తుంటాను అని చెప్పుకొచ్చాడు.సినిమాఇకపోతే ఆమిర్ చివరగా సితారే జమీన్ పర్ సినిమాలో కనిపించాడు. ప్రస్తుతం నిర్మాతగా ఏక్ దిన్, లాహోర్ 1947 అని రెండు సినిమాలు చేస్తున్నాడు. ఏక్ దిన్లో.. ఆమిర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ హీరోగా నటించగా సాయిపల్లవి కథానాయికగా కనిపించనుంది. ఇది వన్ డే అనే థాయ్ చిత్రానికి రీమేక్గా తెరకెక్కింది. ఏక్ దిన్ మే 1న విడుదల కానుంది.చదవండి: ధురంధర్ రికార్డు బ్రేక్ చేసిన ధురంధర్ 2 -
విషాదం.. సముద్రంలో పడిపోయి హీరో కన్నుమూత
బెంగాలీ చిత్రపరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. హీరో రాహుల్ అరుణోదయ్ బెనర్జీ (42) ప్రమాదవశాత్తూ మరణించారు. సీరియల్ షూటింగ్ కోసం ఆదివారం (మార్చి 29) నాడు పశ్చిమ బెంగాల్లోని డిఘ ప్రాంతానికి వెళ్లిన ఆయన చిత్రీకరణ ముగిశాక కాలక్షేపం కోసం ఒంటరిగా సముద్రంలో విహారానికి వెళ్లారు. అయితే పడవలో ప్రయాణిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తూ నీటిలో పడిపోయారు. బీచ్లో విషాదంఅది గమనించిన రక్షణా సిబ్బంది వెంటనే ఆయన్ను బయటకు తీసి సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఒడిశా- పశ్చిమ బెంగాల్ సరిహద్దుకు సమీపంలోని తల్సారి బీచ్లో ఈ విషాద ఘటన జరిగింది. ఈ ప్రమాదంపై పోలీసులు విచారణ చేపడుతున్నారు. కాగా రాహుల్ బెనర్జీకి భార్య ప్రియాంక సర్కార్, ఒక కుమారుడు ఉన్నారు.ఇండస్ట్రీకి తీరని లోటుహీరో మృతిపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నాకు ఇష్టమైన నటుల్లో రాహుల్ ఒకరు.. ఆయన ఇక లేరనే వార్త నన్ను షాక్కు గురి చేసింది. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. తన మరణం బెంగాలీ చిత్రపరిశ్రమకు తీరని లోటు అని పేర్కొన్నారు.సినిమారాహుల్ అరుణోదయ్ బెనర్జీ (Rahul Arunoday Banerjee) 1983 అక్టోబర్ 16న జన్మించారు. చిరోదిని తుమీ జే అమర్ సినిమాతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. లవ్ సర్కస్, షోనో మోన్ బోలీ తోమయ్, నా హణ్యతే, కగోజెర్ బో వంటి పలు సినిమాలు చేశారు. సీరియల్స్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకూ దగ్గరయ్యారు.చదవండి: ఓపక్క షూటింగ్.. మరోపక్క భార్య కోసం ఆరాటం -
దురంధర్-2 మరో రికార్డ్.. కేవలం 11 రోజుల్లోనే బ్రేక్..!
బాలీవుడ్ మూవీ దురంధర్-2 బాక్సాఫీస్ను షేక్ చేస్తోంది. ఇప్పటికే పలు చిత్రాల రికార్డులు బద్దలు కొట్టిన ఈ మూవీ వసూళ్ల పరంగా దూసుకెళ్తోంది. మార్చి 19న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం 11 రోజుల్లోనే మరో రికార్డ్ క్రియేట్ చేసింది. గతేడాది రిలీజైన దురంధర్ ఆల్ టైమ్ వసూళ్లను అధిగమించింది.ఇప్పటి వరకు దురంధర్-2 ప్రపంచవ్యాప్తంగా రూ. 1,363.15 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. ఇండియావ్యాప్తంగా ఇప్పటి వరకు రూ.1013.15 కోట్లు రాగా.. ఓవర్సీస్లో రూ.350 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఓవరాల్గా నెట్ వసూళ్ల పరంగా చూస్తే రూ. 847.87 కోట్లు వసూలు చేసింది. గతేడాది డిసెంబర్ 5, 2025న విడుదలైన 'ధురందర్' ప్రపంచవ్యాప్తంగా మొత్తం రూ. 1,307.35 కోట్లు వసూలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు మనదేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన నాలుగో భారతీయ చిత్రంగా 'ధురందర్: ది రివెంజ్' నిలిచింది. దీనికంటే ముందు ఆమిర్ ఖాన్ నటించిన దంగల్ (2016) రూ. 2,070 కోట్లతో జాబితాలో అగ్రస్థానంలో ఉండగా.. ఆ తర్వాత ప్రభాస్ బాహుబలి- 2 (2017) రూ. 1,788 కోట్లతో ఉంది. అల్లు అర్జున్ పుష్ప- 2 (2024) రూ. 1,742 కోట్లతో మూడో స్థానంలో కొనసాగుతోంది.కాగా.. రణవీర్ సింగ్ హీరోగా నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్స్ దురంధర్ చిత్రాలకు ఆదిత్య ధర్ దర్శకత్వం వహించారు. ఈ మూవీస్లో సారా అర్జున్ హీరోయిన్గా మెప్పించారు. ఈ చిత్రంలో సంజయ్ దత్, రాకేష్ బేడీ, అర్జున్ రాంపాల్, ఆర్. మాధవన్ కీలక పాత్రల్లో నటించారు. -
నాలుగు పదుల వయస్సులో తల్లైన హీరోయిన్
బాలీవుడ్ భామ సోనమ్ కపూర్ రెండోసారి తల్లిగా ప్రమోషన్ కొట్టేసింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ శుభవార్తను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ రోజు మార్చి 29, 2026న మాకు బాబు పుట్టాడని తెలిపింది. ఈ విషయాన్ని ప్రకటించేందుకు మేము ఎంతో సంతోషిస్తున్నామని రాసుకొచ్చింది. ఇప్పటికే ఆమెకు వాయు అనే కుమారుడు ఉన్నారు. తాజాగా రెండోసారి కూడా సోనమ్ కపూర్కు మగబిడ్డ జన్మించారు. ఈ విషయం తెలుసుకున్న బాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు. సోనమ్ తన ఇన్స్టాలో రాస్తూ..' అపారమైన కృతజ్ఞతతో.. ప్రేమ నిండిన హృదయాలతో మార్చి 29న మా బాబు రాకను ప్రకటించడానికి మేము ఎంతో సంతోషిస్తున్నాం. ఇప్పుడు మా కుటుంబం మరింత పెద్దదైంది. బాబు రాకతో మా హృదయాలు మరింత సంతోషంతో నిండిపోయాయి. వాయు తన తమ్ముడిని స్వాగతించడానికి ఆసక్తిగా ఉన్నాడు. మరో బిడ్డ రాకతో మా ఇంట ఆనందం వెల్లి విరిసింది. ఇప్పుడు నలుగురితో ఈ అందమైన కొత్త అధ్యాయాన్ని ప్రారంభించినందుకు మేము కృతజ్ఞతతో ఉన్నాం. ఇట్లు ప్రేమతో సోనమ్, ఆనంద్ అండ్ వాయు' అంటూ పోస్ట్ చేసింది.వ్యాపారవేత్తతో పెళ్లి..ప్రముఖ నటుడు అనిల్ కపూర్ కుమార్తె సోనమ్ కపూర్, వ్యాపారవేత్త ఆనంద్ అహూజా 2018 మేలో పెళ్లి చేసుకున్నారు. వీరికి 2022లో వాయు అనే కుమారుడు జన్మించాడు. సినిమాల విషయానికి వస్తే.. సంజయ్ లీలా భన్సాలీ డైరెక్షన్లో 'సావరియా' మూవీతో సోనమ్ వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత బాంబే టాకీస్, బ్లైండ్, ప్రేమ రతన్ ధన్పాయో, నీర్జా, సంజు, థాంక్యూ, రాంఝన, ఖుబ్సూరత్ వంటి చిత్రాలు ఆమెకు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. View this post on Instagram A post shared by Sonam A Kapoor (@sonamkapoor) -
ఓపక్క షూటింగ్స్.. మరోపక్క భార్య కోసం హీరో ఆరాటం!
ఒక సినిమా హిట్టయిందంటే.. దానికి సీక్వెల్గా వచ్చేదానిపై భారీ అంచనాలుంటాయి. ప్రేక్షకుల అంచనాలను అందుకోకపోతే మొదటికే మోసం వస్తుంది. అయితే ఈ పరీక్షను ఈజీగా నెగ్గేసింది ధురంధర్ టీమ్. రణ్వీర్ సింగ్ కథానాయకుడిగా నటించిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్ విజయం సాధించింది. ఈ మూవీ వచ్చిన మూడు నెలల్లోపే సీక్వెల్ కూడా రెడీ చేసి వదిలాడు దర్శకుడు ఆదిత్య ధర్.గర్భిణి అయిన భార్య కోసం..రెండో భాగం కూడా ప్రేక్షకుల మనసు గెల్చుకుని బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల రికార్డు తిరగరాస్తోంది. రణ్వీర్ సింగ్ యాక్టింగ్, డెడికేషన్కు సినీప్రియులు ఫిదా అవుతున్నారు. ధురంధర్ మొదటి భాగం చిత్రీకరణ సమయంలో అతడి భార్య, స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె గర్భిణీ అన్న విషయం తెలిసిందే! ఓపక్క బిజీ షెడ్యూల్లో పని చేస్తూనే మరోపక్క భార్య కోసం సమయం కేటాయించాడట! ఈ విషయాన్ని ధురంధర్ మూవీ నటుడు అభయ్ అరోరా వెల్లడించాడు.నిజంగా అద్భుతంరణ్వీర్ షూటింగ్ మధ్యలో మూడు, నాలుగు రోజులు గ్యాప్ దొరికినా సరే.. వెంటనే విమానం ఎక్కి ఇంట్లో వాలిపోయేవాడు. భార్యను, కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకునేవాడు. కాస్తంత సమయం దొరికినా కుటుంబం కోసం సమయం కేటాయించేవాడు. అతడు ఫ్యామిలీని చూసుకునే విధానం నిజంగా అద్భుతం అని పేర్కొన్నాడు. రణ్వీర్ సింగ్, దీపికా పదుకొణె.. రామ్లీలా సినిమా (2013) సెట్లో ప్రేమలో పడ్డారు. 2015లో ఎంగేజ్మెంట్ చేసుకోగా 2018లో పెళ్లి చేసుకున్నారు. వీరికి 2024 సెప్టెంబర్ 8న కూతురు దువా జన్మించింది.చదవండి: ఈవారం ఓటీటీల్లో బోలెడన్ని సినిమాలు.. ఏమేం ఉన్నాయంటే? -
జోడీ కుదిరింది
సల్మాన్ ఖాన్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ సినిమా రానుందని, ఈ చిత్రాన్ని ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించనున్నారనే టాక్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో సల్మాన్ ఖాన్ సరసన నయనతార నటించడం దాదాపు ఖరారైయిందని, కథ నచ్చి ఆమె ఒప్పుకున్నారని సమాచారం.ఈ జోడీ గురించి త్వరలోనే అధికారిక ప్రకటన రానుందట. ఇక ఈ సినిమా చిత్రీకరణను ఏప్రిల్ చివర్లో ప్రారంభించడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారని తెలిసింది. వచ్చే ఏడాది రంజాన్ సందర్భంగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారని భోగట్టా. మరోవైపు ప్రస్తుతం సల్మాన్ ‘మాతృభూమి’ సినిమా చిత్రీకరణతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ఈ ఏడాదే విడుదల కానుంది. -
సినీ ఇండస్ట్రీని షేక్ చేస్తున్న బెస్ట్ ఫ్రెండ్స్
ఇప్పటి హీరోలు క్యారెక్టర్ కోసం ఎంత కష్టపడ్డానికైనా సిద్దంగా ఉంటారు. తమ మేకోవర్ కోసం ఎంత దూరమైనా వెళ్తారు. రీసెంట్గా వచ్చిన ఇద్దరు హీరోల లుక్స్ చూస్తే ఈ విషయాన్ని మరోసారి రుజువు చేస్తుంది. ఆ ఇద్దరు హీరోల్లో ఒకరు మెగా పవర్స్టార్ రామ్ చరణ్, మరొకరు అతడి బెస్ట్ ఫ్రెండ్ శర్వానంద్.వీరిద్దరూ తమ మేకోవర్స్తో టోటల్ ఇండస్ట్రీని ఆకర్షిస్తున్నారు. ముందుగా రామ్ చరణ్ విషయానికొస్తే, తాజాగా తన పుట్టినరోజు నాడు రిలీజైన 'పెద్ది' సినిమా రెండో గ్లింప్స్ లో అందర్నీ ఆకట్టుకున్న అంశం చరణ్ బాడీ. ఆ పహిల్వాన్ లుక్ కోసం చరణ్ ఎంత కష్టపడ్డాడో ఆ లుక్ చూస్తుంటే ఇట్టే అర్థమైపోతుంది.చరణ్ ఈ లుక్ కోసం కొన్ని నెలల పాటు మాంసాహారం మానేశాడని సమాచారం. ఓవైపు అయ్యప్ప దీక్షలో ఉంటూనే, మరోవైపు పహిల్వాన్ లుక్ కోసం కసరత్తులు చేశాడు. పహిల్వాన్ లుక్ కోసం నిజమైన పహిల్వాన్లు చేసే కసరత్తులనే చరణ్ చేశాడు. అలా దాదాపు 8 నెలల పాటు ఎంతో కష్టపడి మరీ ఈ కండలు తిరిగే దేహాన్ని చరణ్ సొంతం చేసుకున్నాడు.అయితే శర్వానంద్ బైకర్ రోల్ కోసం మరింత స్ఫూర్తిదాయకమైన ప్రయాణం చేశాడు. ఆ రోల్ కోసం ఇతడు పడిన కష్టం అంతా ఇంతా కాదనే చెప్పాలి. బైకర్ చిత్ర దర్శకుడు శర్వాను 6-8 కిలోలు తగ్గితే చాలన్నాడట. కానీ శర్వానంద్ మాత్రం అంతకుమించి కష్టపడ్డాడు. అక్షరాలా రోజుకు 32 కిలోమీటర్లు పరుగెత్తేవాడని సమాచారం.42 సంవత్సరాల శర్వానంద్ 18 ఏళ్ల బైక్ రేసర్గా కనిపించేందుకు తన శరీరంలోని ప్రతి అణువునూ కరిగించేలా కసరత్తు చేశాడట. ప్రస్తుతం తన ఒంట్లో ఏమాత్రం కొవ్వు లేనంత బక్కపల్చగా తయారయ్యాడు. ఇలా టీనేజర్ గా కనిపించడం కోసం శర్వానంద్ ఏకంగా రెండేళ్లు కష్టపడ్డాడు. ఇక బైకర్ ట్రయిలర్ ఎంత క్లిక్ అయిందో, అందులో శర్వా లుక్ అంతకంటే ఎక్కువగా అందరి ప్రశంసలు పొందింది. -
ప్రియురాలిని పెళ్లాడిన బిగ్బాస్ కంటెస్టెంట్
ఇప్పుడంతా ఎక్కడ చూసినా పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఇప్పటికే టాలీవుడ్లో విరోష్ జంటతో అల్లు శిరీష్ కూడా ఓ ఇంటివాడయ్యారు. మరో టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా బిగ్బాస్ కంటెస్టెంట్ రజత్ దలాల్ ఓ ఇంటివాడయ్యారు. తన ప్రియురాలిని ఆయన పెళ్లాడారు. సోషల్ మీడియా ఇన్ఫ్లూయన్సర్గా పేరు తెచ్చుకున్న రజత్ దలాల్ పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు. అత్యంత సన్నిహితులు, మిత్రులు, కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. తన వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. జీవితంలో ఒక కొత్త దశ ప్రారంభం అంటూ క్యాప్షన్ రాసుకొచ్చారు. మీ అందరి ఆశీస్సులు కావాలంటూ కోరారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు అభిమానులు నూతన జంటకు అభినందనలు చెబుతున్నారు.రజత్ దలాల్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మాత్రమే కాదు..పలు రియాలిటీ షోల్లో పాల్గొన్నారు. బిగ్బాస్-18 సీజన్లో కంటెస్టెంట్గా పాల్గొన్నారు. ది 50 అనే రియాలిటీ షోతో మరింత గుర్తింపు తెచ్చుకున్నారు. -
దురంధర్-2పై విమర్శలు.. దెబ్బకు సోషల్ మీడియా ఖాతా డిలీట్...!
మార్చి నెల అంతా దురంధర్ పేరే వినిపిస్తోంది. రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన ఈ సినిమా ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద రూ.1000 కోట్లు దాటేసింది. వసూళ్ల పరంగా ఓ రేంజ్లో దూసుకెళ్తోంది. పార్ట్-1 రిలీజైన మూడు నెలల్లోనే సీక్వెల్ కూడా రావడంతో ఆడియన్స్ థియేటర్లకు క్యూ కట్టారు. మొదటి నుంచే భారీ అంచనాలు ఉండడంతో ఫ్యాన్స్ ఎగబడుతున్నారు. ఇప్పటికే సౌత్ స్టార్స్ సైతం ఈ మూవీపై ప్రశంసలు కురిపించారు. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన 'ధురందర్: ది రివెంజ్' మార్చి 19న థియేటర్లలో రిలీజైంది.అయితే ఈ మూవీ ఒకవైపు ప్రశంసలు వస్తుంటే.. విమర్శలు సైతం అదేస్థాయిలో చేస్తున్నారు. ప్రాపగండ అనే ముద్ర వేస్తున్నారు. బాలీవుడ్ నటి అని అనీల్ పడ్డా సోదరి రీత్ పడ్డా దురంధర్ సీక్వెల్పై విమర్శలు చేసింది. ఈ సినిమా 'ది కేరళ స్టోరీ', 'ది కాశ్మీర్ ఫైల్స్' లాంటి చిత్రాల్లాగే ప్రాపగండగా చిత్రీకరించారని కామెంట్స్ చేశారు. దీంతో ఆమెపై సోషల్ మీడియాలో పెద్దఎత్తున వ్యతిరేకత వచ్చింది. ఈ వివాదంతో ఊహించని విధంగా ఆమె ఇన్స్టా ఖాతా డిలీట్ చేసేసింది. మొదట ప్రైవేట్గా ఉంచిన రీత్ పడ్డా.. ఆ తర్వాత ఏకంగా ఖాతానే తొలగించింది. ప్రస్తుతం ఇన్స్టాలో ఆమె ప్రొఫైల్ అందుబాటులో లేదు. ఈ వివాదం తర్వాత ఆమె లింక్డ్ఇన్ ఖాతాను కూడా తొలగించినట్లు తెలుస్తోంది. ధురందర్తో సహా ది కశ్మీర్ ఫైల్స్, ది కేరళ స్టోరీ చిత్రాలను రీత్ విమర్శించడంతో ఈ వివాదం మొదలైంది. దీనిపై నెట్టింట పెద్దఎత్తున ట్రోల్స్ రావడంతో ఏకంగా సోషల్ మీడియా ఖాతానే మూసేయాల్సి వచ్చింది.అంతేకాకుండా రీత్ వ్యక్తిగత జీవితంపై కూడా ఆన్లైన్లో ట్రోల్స్ వచ్చాయి. ఫాజిల్ అహ్మద్ అనే వ్యక్తితో ఆమెకు రిలేషన్ ఉందంటూ కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేశారు. అయితే తమపై వస్తున్న ట్రోల్స్పై రీత్ గానీ, అనీత్ పడ్డా గానీ వాటిపై ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. మరోవైపు నటి అనీత్ పడ్డా మ్యాడాక్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న 'శక్తి శాలిని' చిత్రంలో నటించనున్నారు. ఈ చిత్రం క్రిస్మస్ సందర్భంగా విడుదల కానుంది. -
సినిమాలు మానేయాలని కండీషన్.. అందుకే ఆ హీరోతో పెళ్లి క్యాన్సిల్
ఒకప్పుడు సక్సెస్ఫుల్ హీరోయిన్గా రాణించింది ముంతాజ్. ఖిలోనా, దో రాస్తే, తేరే మేరే సాప్నే, రోటి వంటి పలు చిత్రాలతో మెప్పించింది. కానీ పెళ్లయిన వెంటనే సినిమాలకు దూరమైంది. అందుకు గల కారణాన్ని ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ముంతాజ్ మాట్లాడుతూ.. నేను సాంప్రయదాయక ఇరానీ కుటుంబం నుంచి వచ్చాను. ఫలానా వయసు రాగానే పెళ్లి చేసేయాలని మా నాన్న ఆలోచన. అలాగే 40, 50 ఏళ్లుచ్చేవరకు మహిళలు పని చేయకూడదని అనుకుంటాడు. పెళ్లయ్యాక సినిమాలు చేయకూడదని..మా ఇంట్లో అందరూ నాకు త్వరగా పెళ్లి చేయాలనే అనుకున్నారు. నాకు ఏడెనిమిదేళ్ల వయసున్నప్పుడే నా భర్త కుటుంబం గురించి తెలుసు. వాళ్లు మా పొరిగింట్లోనే ఉండేవారు. అలా వాళ్ల గురించి పూర్తిగా తెలుసు గనకే నన్ను ఆ ఇంటికి పంపించారు. పెళ్లయ్యాక సినిమాలు చేయకూడదని అమ్మ మరీమరీ చెప్పింది. అత్తింట్లో బాగా చూసుకుంటారని ధైర్యం ఇచ్చింది. నేనెప్పుడూ ఇంట్లో వాళ్ల మాట కాదనలేదు. నాకు ఇంకొంతకాలం సినిమాలు చేయాలన్న ఆశయితే ఉండేది. నా భర్త ఓపికగా ఎదురుచూశాడుకానీ, ఇంట్లో వాళ్లను నొప్పించలేక మయూర్ను పెళ్లి చేసుకున్నాను. అతడు భారత్లో ఉండేవాడు కాదు, ఇంగ్లాండ్లో చదువుకునేవాడు. అతడి కుటుంబం ఉగాండాలో బిజినెస్ చేస్తుండేది. వారిది మంచి ఉన్నత కుటుంబం. అయితే పెళ్లయ్యాక వెంటనే సినిమాలు మానేయలేదు. అప్పటికే ఒప్పుకున్న ప్రాజెక్టుల షూటింగ్స్లో పాల్గొన్నాను. దాదాపు రెండేళ్లలో షూటింగ్స్ అన్నీ పూర్తి చేసుకున్నాను. అప్పటివరకు నా భర్త ఎంతో ఓపికగా ఎదురుచూశాడు అంది.చాలా చిన్నదాన్నినటుడు షమ్మీ కపూర్తో పెళ్లి ఎందుకు ఆగిపోయిందన్న ప్రశ్నకు స్పందిస్తూ.. అప్పుడు నేను చాలా చిన్నదాన్ని. నా మనసులో పెళ్లి ఆలోచనే లేదు. పైగా షమ్మీ తండ్రి పృథ్వీరాజ్ కపూర్.. తనకు కాబోయే కోడలు పని చేయకూడదని కండీషన్ పెట్టాడు. నాకంటూ అప్పుడు చాలా కలలు, కోరికలున్నాయి. అందుకే పెళ్లి కన్నా పని ముఖ్యమనుకున్నాను. పర్సనల్ లైఫ్ఆయన పెట్టిన కండీషన్ వల్లే షమ్మీ భార్య గీతా బాలాజీ కూడా పెళ్లవగానే సినిమాలు మానేసింది అని చెప్పుకొచ్చింది. కాగా ముంతాజ్.. షమ్మీ కపూర్ను పెళ్లాడేందుకు రెడీ అయింది. వీరికి ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. కానీ తర్వాత పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నారు. అనంతరం ఉంగాడాలో బిజినెస్ చేసే మయూర్ మాధ్వానిని 1974లో పెళ్లాడింది. వీరికి ఇద్దరు కూతుర్లు సంతానం.చదవండి: నా బిడ్డను ముద్దు పెట్టుకోకూడదు: మెరీనా వార్నింగ్ -
రెండు వారాలుగా బెడ్పైనే స్టార్ హీరో ప్రియురాలు.. అదే కారణం?
క్రిష్, వార్ 2 తదితర సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమున్న బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్.. గత నాలుగేళ్లుగా షబా ఆజాద్ అనే నటి, సింగర్తో రిలేషన్లో ఉన్నాడు. గతంలో సుస్సానే ఖాన్ని పెళ్లి చేసుకున్నప్పటికీ.. ఆమెకు విడాకులు ఇచ్చేసి షబాతో కలిసి ఉంటున్నాడు. ఇప్పుడు ఈమెకు భయంకరమైన అనారోగ్య సమస్య వచ్చింది. స్వయంగా దాని గురించి ఈమె ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది.(ఇదీ చదవండి: చిరంజీవి చనిపోయారని పోస్ట్.. వ్యక్తిపై కేసు)'సైక్లోస్పోరా కయోటానెన్సిస్' అనే పారాసైట్(పరాన్నజీవి) వల్ల కలిగే వ్యాధిని 'సైక్లోస్పోరియాసిస్' అంటారు. ఇది శరీరంలోకి ప్రవేశిస్తే.. జీర్ణవ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తం అవుతుంది. షబా అజాద్ ప్రస్తుతం ఇదే పరిస్థితిని ఎదుర్కొంటోంది. గడిచిన 14 రోజులు తన జీవితంలో అత్యంత దారుణంగా గడిచాయని చెప్పుకొచ్చింది. రోజుకు రెండుసార్లు జిమ్లో వర్కౌట్లు చేసే తాను.. ఇప్పుడు కనీసం టూత్ పిక్ ఎత్తలేకపోతున్నానని రాసుకొచ్చింది. కేవలం రెండు వారాల్లోనే 4 కిలోల బరువు తగ్గిపోయానని, దీన్నిబట్టి ఇన్ఫెక్షన్ ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చని పేర్కొంది.ఈ ఇన్ఫెక్షన్ సోకడం వెనకున్న కారణం తెలిసి షబా షాకయ్యింది. ఎప్పుడూ ఇంటిలో వండిందే తింటానని, బయటకెళ్లినా నీళ్ల బాటిల్ వెంట తీసుకెళ్తానని, ఇంత శుభ్రత పాటించినా ఈ పరాన్నజీవి తన శరీరంలోకి ఎలా వచ్చిందో అర్థం కావట్లేదని చెప్పింది. మనం తినే ఆకుకూరలు, సలాడ్స్, కూరగాయలు విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించింది. కూరగాయలు కేవలం నీటితో కడిగితే సరిపోదని, బేకింగ్ సోడాతో శుభ్రం చేయాలని చెప్పుకొచ్చింది. పచ్చిగా తినే ఆహార పదార్థాల ద్వారానే ఇలాంటి ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదముందని హెచ్చరించింది. ఈ కష్టకాలంలో హృతిక్ రోషన్(ప్రియుడు) తనకు కొండంత అండగా ఉన్నాడని చెప్పుకొచ్చింది. నా మూడ్ ఎంత బాగోలేకపోయినా పక్కనే ఉండి నవ్విస్తున్నాడని, ఆస్పత్రి బెడ్పై ఉన్న ఫొటోని షబా షేర్ చేసింది.(ఇదీ చదవండి: 'ధురంధర్' విలన్ తెలుగు సినిమా.. క్రేజీ అప్డేట్) View this post on Instagram A post shared by Saba Azad (@sabazad) -
హనుమాన్ జయంతికి రామ గ్లింప్స్
భారతీయ ఇతిహాసం ‘రామాయణం’ ఆధారంగా రూపొందుతున్న హిందీ చిత్రం ‘రామాయణ’. నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రాముడిగా రణ్బీర్ కపూర్, సీతగా సాయిపల్లవి, లక్ష్మణుడిగా రవి దుబే, హనుమంతుడిగా సన్నీ డియోల్, రావణుడిగా యశ్ నటిస్తున్నారు. ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, డీఎన్ఈజీ సంస్థ, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ పతాకాలపై భారీ బడ్జెట్తో నమిత్ మల్హోత్రా ఈ సినిమాను రెండు భాగాలుగా నిర్మిస్తున్నారు.తొలి భాగాన్ని ఈ ఏడాది దీపావళికి, రెండో భాగాన్ని వచ్చే ఏడాది దీపావళికి రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ఆల్రెడీ ప్రకటించారు. కాగా శుక్రవారం (మార్చి 27) శ్రీరామ నవమి పండగ సందర్భంగా ఓ అప్డేట్ ఇచ్చారు. ఈ చిత్రం నుంచి ‘రామ’ గ్లింప్స్ను హనుమాన్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 2న విడుదల చేయనున్నట్లుగా నమిత్ మల్హోత్రా తెలిపారు. ‘‘రామాయణం మన అందరికీ చెందిన కథ.‘రామాయణ’ చిత్రాన్ని నిజమైన స్ఫూర్తితో, అత్యంత చిత్తశుద్ధితో తెరపైకి తీసుకురావడానికి మేము వేసే ప్రతి అడుగుకూ అపారమైన బాధ్యత, భక్తి శ్రద్ధలే మార్గదర్శకాలుగా నిలుస్తున్నాయి. కొన్నేళ్లుగా మేం చేసిన కృషిని ఫ్యాన్స్తో కలిసి ప్రపంచవ్యాప్తంగా ఒక గ్రాండ్ ఈవెంట్ ద్వారా ప్రదర్శించనున్నాం. ఆ క్షణాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్నవారందరూ కలిసి సెలబ్రేట్ చేసుకుందాం’’ అని నమిత్ మల్హోత్రా ‘ఎక్స్’లో షేర్ చేశారు. అయితే ‘రామ’ గ్లింప్స్ లాంచ్ ఈవెంట్ అమెరికాలో జరగనుందని బాలీవుడ్ టాక్. ఈ చిత్రానికి సంగీతం: ఏఆర్ రెహమాన్, హాన్స్ జిమ్మర్. -
మోనాలిసా సంచలన ఆరోపణలు.. షాకిచ్చిన దర్శకుడు..!
ప్రయాగ్రాజ్ మహా కుంభమేళాతో పాపులర్ అయిన మోనాలిసా భోంస్లే ఇటీవలే ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. కేరళకు చెందిన ఫర్మాన్ ఖాన్ను పెళ్లి చేసుకుని వార్తల్లో నిలిచింది. తనకు మొదటిసారిగా సినిమా ఛాన్స్ ఇస్తున్నట్లు ప్రకటించిన బాలీవుడ్ దర్శకుడు సనోజ్ మిశ్రాపై సంచలన ఆరోపణలు చేసింది. షూటింగ్ సెట్లో సనోజ్ మిశ్రా తన పట్ల చాలా అసభ్యంగా ప్రవర్తించారని మోనాలిసా వాపోయింది. షూటింగ్ పేరుతో తన శరీరాన్ని పలుమార్లు తాకుతూ చాలా ఇబ్బందిపెట్టేవాడిని చెప్పుకొచ్చింది. ఇదే విషయాన్ని తన కుటుంబ సభ్యులకు చెప్పినా పట్టించుకోలేదని పేర్కొంది. దీంతో ఈ టాపిక్ బాలీవుడ్ చర్చనీయాంశంగా మారింది.ఈ నేపథ్యంలోనే తనపై వస్తున్న ఆరోపణలపై డైరెక్టర్ సనోజ్ మిశ్రా స్పందించారు. దర్శకుడు మోనాలిసా చేసిన ఆరోపణలను ఖండించారు. నేను ఎవరికైతే అండగా నిలబడ్డానో.. ఆమె నన్ను ఇబ్బందుల్లో పడేసిందని అన్నారు. కేవలం నేను ఆమె ఫర్మాన్ ఖాన్తో వెళ్లిపోవడాన్ని వ్యతిరేకించినందుకే మోనాలిసా నాపై ఆరోపణలు చేసిందని అన్నారు. తనకు నటించడం కూడా నేనే నేర్పించా.. తన కుటుంబ సభ్యులు ఇప్పటికీ ఉజ్జయినిలోని నా ఇంట్లోనే నివసిస్తున్నారని సనోజ్ మిశ్రా తెలిపారు. ఆమె పెళ్లిని తాను వద్దన్నందుకే ఇలా చేసిందని వెల్లడించారు. ఆమె తల్లిదండ్రులు కూడా పెళ్లిని వ్యతిరేకించారని.. ఈ వివాహం చెల్లదని ప్రకటించారని పేర్కొన్నారు. పరువు నష్టం దావా వేస్తా..మోనాలిసాపై త్వరలోనే పరువు నష్టం దావా వేస్తానని సనోజ్ మిశ్రా వెల్లడించారు. ఒకటి రెండు రోజుల్లో పరువు నష్టం దావా వేస్తానని తెలిపారు. ఒకవేళ తాను చెప్పేది నిజమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చని తెలిపారు. అలాగే ఈ సినిమా నిర్మాణం ఇక జరగదు.. ఎందుకంటే ఆమె దాని గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. ఇక సినిమా అనేది పూర్తిగా వేరే అంశమని సనోజ్ మిశ్రా అన్నారు. మోనాలిసా లైంగిక ఆరోపణలు చేసిన తర్వాత సనోజ్ మిశ్రా స్పందించారు. ప్రస్తుతం సనోజ్ మిశ్రా దర్శకత్వంలో 'ది డైరీ ఆఫ్ మణిపూర్ అనే మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో మోనాలిసా ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.(ఇది చదవండి: నన్ను తాకేవాడు.. ఇంట్లో వాళ్లకు చెబితే సర్దుకుపొమ్మన్నారు: మోనాలిసా) -
నాపై డేటింగ్ రూమర్స్.. చివరికీ వాడు కూడా నవ్వుతున్నాడు..!
బాలీవుడ్లో ఒకప్పటి స్టార్ హీరోయిన్ మలైకా అరోరా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్పెషల్ సాంగ్స్ స్పెషలిస్ట్గా ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చకుంది. షారుఖ్ ఖాన్ సరసన ఛల్ ఛయ్య ఛయ్య ఛయ్య అనే పాటతో దేశం మొత్తాన్ని ఒక ఊపు ఊపిసిన ముద్దుగుమ్మ.. తెలుగులో 2007లో మహేశ్ బాబు హీరోగా నటించిన అతిథి మూవీలో ప్రత్యేక గీతంతో టాలీవుడ్ను పలకరించింది. అలాగే గబ్బర్ సింగ్లో కెవ్వు కేక పాటకు స్టెప్పులేని కుర్రకారుని ఆకట్టుకుంది. ప్రస్తుతం సినిమాలతో పాటు నిర్మాతగా, టెలివిజన్ హోస్ట్గా రాణిస్తోంది.అయితే మలైకా పర్సనల్ లైప్ ఎప్పుడు ఏదో ఒక రూమర్ వస్తూనే ఉంటుంది. 1998లో సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ని పెళ్లి చేసుకొని.. 20 ఏళ్ల పాటు కలిసి కాపురం చేశారు. వీరికి ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత 2017లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత తనకంటే 12 ఏళ్ల చిన్నవాడైన యంగ్ హీరో అర్జున్ కపూర్తో ప్రేమాయణం కొనసాగించింది. కొన్నాళ్ల పాటు కలిసి సహజీవనం చేసిన ఈ జంట.. కొన్నేళ్ల క్రితమే విడిపోయింది. గత కొన్నేళ్లుగా ఒంటరిగానే ఉంటున్న మలైకా..ఇటీవల మరో వ్యక్తితో డేటింగ్ చేస్తున్నట్లు బాలీవుడ్లో వార్తలొచ్చాయి.తాజాగా తనపై వస్తున్న రూమర్స్పై మలైకా అరోరా స్పందించింది. తనపై వస్తున్న డేటింగ్ రూమర్స్పై తనకు ఎలాంటి ఆందోళన లేదని తెలిపింది. వాటిని చూసి నా కుమారుడు అర్హాన్ ఖాన్, నేను జోకులు వేసుకుంటున్నామని పేర్కొంది. ఓ ఇంటర్వ్యూకు హాజరైన మలైకా.. తన పర్సనల్ లైఫ్పై వస్తున్న వాటిని చూసి నా ఫ్యామిలీ కూడా నవ్వుతూ సరదాగా తీసుకుంటుందని వెల్లడించింది. ప్రస్తుతం తాను ప్రేమ విషయంలో తొందరపడటం లేదని.. నా జీవితాన్ని నాకు నచ్చినట్లుగా జీవించాలని కోరుకుంటున్నట్లు మలైకా చెప్పింది.స్వయంకృషితో ఎదిగా..మలైకా మాట్లాడుతూ.. ' సింగిల్గా ఉండడమే నాకు ప్రేరణ. మొదటి నుంచి అదే నన్ను ముందుకు నడిపిస్తోంది. సహవాసం, భాగస్వామి, అవన్నీ అందమైనవే. కానీ నాకు ఒక భాగస్వామి కావాలి అన్నట్టుగా నేను వాటి కోసం వెతకడం లేదు. నేను స్వయంకృషితో ఎదిగినందుకు ఎంతో గర్వంగా ఉంది. నా వ్యక్తిత్వాన్ని పరిపూర్ణం చేయడానికి నాకు ఏ పురుషుడి అవసరమూ లేదు. ఒకవేళ నేను ఎవరితోనైనా కలిసి ఉండాల్సి వస్తే.. అది నా సొంత రూల్స్ ప్రకారమే ఉంటుంది." తెలిపింది. -
దురంధర్-2 కలెక్షన్స్.. తొలి వారం ఎన్ని కోట్లంటే?
రణ్వీర్ సింగ్- ఆదిత్యధర్ కాంబోలో వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ ధురంధర్ ది రివెంజ్. గతేడాది రిలీజై బ్లాక్బస్టర్గా నిలిచిన దురంధర్కు సీక్వెల్గా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. కేవలం మూడు నెలల గ్యాప్లోనే సీక్వెల్ను రిలీజ్ చేయడం విశేషం. తొలి రోజు నుంచే కాసుల వర్షం కురిపిస్తోన్న ఈ చిత్రం వారం రోజుల్లోనే రికార్డ్ సృష్టించింది.తాజాగా ఈ మూవీ మొదటి వారం రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.1006 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. తొలి వారంలోనే వెయ్యి కోట్లు సాధించిన తొలి హిందీ మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ స్వయంగా వెల్లడించింది. ఓవరాల్గా చూస్తే ఎనిమిది రోజుల్లో రూ.1088 కోట్లతో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. దేశవ్యాప్తంగా రూ.814 కోట్ల గ్రాస్ రాబట్టగా.. ఓవర్సీస్లో రూ.274 కోట్లు వచ్చినట్లు తెలిపింది. దేశవ్యాప్తంగా నెట్ పరంగా చూస్తే రూ.690 కోట్లు వసూలు చేసింది. ఈ మూవీలో సంజయ్ దత్, ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్ కీలక పాత్రల్లో నటించారు. బాలీవుడ్ బ్యూటీ సారా అర్జున్ హీరోయిన్గా మెప్పించింది. ఆదిత్య ధర్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ను షేక్ చేస్తోంది. ఈ మూవీపై దక్షిణాది స్టార్స్ ప్రశంసలు కురిపించారు. Yeh dahaad hai naye Hindustan ki.🔥Day-wise break-up | India NBOCWeekend 1: 466 Cr* DAY 5: ₹64 Cr* DAY 6: ₹58 Cr* DAY 7: ₹49 Cr* DAY 8: ₹53 Cr* India: ₹690 Cr* Week 1 | Worldwide GBOC (8 Days)India: ₹814 Cr* Overseas: ₹274 Cr*Book Your Tickets Now.🔗-… pic.twitter.com/x2iLMxfX6K— B62 Studios (@B62Studios) March 27, 2026 -
ఆపరేషన్ సిందూర్ ఘటన ఆధారంగా సినిమా
కశ్మీర్లోని పహల్గాంలో గత ఏడాది మేలో జరిగిన ఉగ్రదాడికి ప్రతి స్పందనగా భారత ప్రభుత్వం చేపట్టిన సైనిక చర్య ఆధారంగా ఓ సినిమా తెరకెక్కనుంది. హిందీలో ‘ది తాష్కెంట్ ఫైల్స్, ది కశ్మీరీ ఫైల్స్, ది వ్యాక్సిన్ వార్’ వంటి సినిమాలను తెరకెక్కించిన వివేక్ రంజన్ అగ్నిహోత్రి ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్ నిర్మించనున్నారు. రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ కేజేఎస్ టైనీ థిల్లాన్ రాసిన ‘ఆపరేషన్ సిందూర్: ది అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ ఇండియాస్ డీప్ స్ట్రైక్స్ ఇన్సైడ్ పాకిస్తాన్’ పుస్తకం ఆధారంగా ఈ సినిమా రూపొందనుంది. ఈ సినిమా గురించి వివేక్ అగ్నిహోత్రి మాట్లాడుతూ– ‘‘వాస్తవానికి దగ్గరగా ఉండే కథలను ప్రేక్షకులకు అందించడం పట్ల నాకు ఎక్కువ ఆసక్తి.ప్రేక్షకులను ఆకట్టుకునే థ్రిల్లింగ్ అంశాలతో ఈ సినిమా సాగుతుంది. సినిమాటిక్ మ్యాజిక్ కూడా ఉంటుంది. ఈ చిత్రం కోసం ఆర్మ్డ్ ఫోర్సెస్తో కలిసి విస్తృత స్థాయిలో పరిశోధన చేశాను’’ అని పేర్కొన్నారు. ‘‘ఇది కేవలం సినిమా మాత్రమే కాదు. నిజాన్ని ఆవిష్కరించడం వంటిది’’ అని అన్నారు భూషణ్ కుమార్. -
గాయంతో తిరిగి సెట్స్పైకి రామ్ చరణ్
టాలీవుడ్ స్టార్ హీరో, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ షూటింగ్ సమయంలో గాయపడిన విషయం తెలిసిందే. ఆయన ఎడమ కంటికి తగిలిన దెబ్బ కారణంగా చిన్నపాటి సర్జరీ చేయాల్సి వచ్చింది. యూనిట్ ఈ గాయం పెద్దది కాదని ప్రకటించినప్పటికీ, తన అభిమానులు మాత్రం కొంత ఆందోళన చెందారు. అయితే గాయమైన గంటల వ్యవధిలోనే చరణ్ తిరిగి సెట్స్పైకి వచ్చాడు. గురువారం 'పెద్ది' చిత్ర షూటింగ్లో పాల్గొన్నాడు. దాంతో వందల సంఖ్యలో మెగా అభిమానులు సెట్స్కు చేరుకుని ఆయనను కలుసుకున్నారు. చరణ్ వారందరితో మాట్లాడి, సెల్ఫీ వీడియో కూడా దిగాడు. ఆ వీడియోను యూనిట్ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. దీంతో చరణ్ స్వయంగా తన గాయంపై వస్తున్న ఊహాగానాలకు చెక్ పెట్టాడు. చరణ్కు సుధాకర్ ప్రసాద్ అనే వైద్యుడు మైనర్ సర్జరీ చేసినట్లు చిరంజీవి స్వయంగా వెల్లడించారు. డాక్టర్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలిపారు. ఇక మార్చి 27 (శుక్రవారం) రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఉదయం 9.45 గంటలకు పెద్ది నుంచి సర్ప్రైజ్ రాబోతోందని యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్లో ఏప్రిల్ 30న సినిమా రిలీజ్ అవుతుందని మరోసారి ధృవీకరించారు. -
చరణ్కు గాయం.. 'పెద్ది' నుంచి ప్రత్యేక గ్లింప్స్?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్కు ఇటీవల ప్రమాదవశాత్తూ గాయపడ్డారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దాంతో చరణ్ నటిస్తున్న 'పెద్ది' సినిమా నుంచి రాబోయే అప్డేట్ ఆలస్యమవుతుందేమోనని అభిమానుల్లో సందేహాలు మొదలయ్యాయి. అయితే యూనిట్ తాజాగా ఇచ్చిన స్పష్టతతో ఆ అనుమానాలన్నీ తొలగిపోయాయి. చరణ్ ఎడమ కంటికి చిన్నపాటి గాయం మాత్రమే జరిగింది. దానికి వెంటనే ట్రీట్మెంట్ జరిగిందని 'పెద్ది' టీమ్ తెలిపింది. రేపట్నుంచే ఆయన తిరిగి సెట్స్లో పాల్గొనబోతున్నారని కూడా ప్రకటించింది. ఇక అభిమానులకు గుడ్ న్యూస్ ఏమిటంటే.. చరణ్ పుట్టినరోజు కానుకగా 'పెద్ది' నుంచి ప్రత్యేక గ్లింప్స్ రాబోతోంది. మార్చి 27 ఉదయం 11:07 గంటలకు దర్శకుడు బుచ్చిబాబు ఇప్పటికే రెడీ చేసిన టీజర్ విడుదల కానుంది. ఇప్పటికే చరణ్ చేసిన బ్యాట్ విన్యాసం సోషల్ మీడియాలో సూపర్ హిట్ అయింది. అదే తరహాలో ఈ బర్త్డే టీజర్ కూడా భారీ విజయాన్ని సాధిస్తుందనే అంచనాలు ఉన్నాయి. అంటే రామ్ చరణ్ గాయంపై ఎలాంటి ఆందోళన అవసరం లేదు. పెద్ది సినిమాకు సంబంధించిన అప్డేట్స్, సంబరాలు ఎలాంటి ఆటంకం లేకుండా కొనసాగనున్నాయి. ఈ విషయాన్ని తెలియజేస్తూ పెద్ది టీమ్ ఓ పోస్టర్ను కూడా విడుదల చేసింది. -
దురంధర్-2లో చిన్న రోల్.. కానీ మూవీ చూడలేకపోతున్నా..!
రణ్వీర్ సింగ్ దురంధర్-2 బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. గతేడాది రిలీజైన మూవీకి సీక్వెల్గా వచ్చిన ఈ సినిమా.. సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. మార్చి 19న విడుదలైన ఈ చిత్రం రూ.919 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లతో దూసుకెళ్తోంది. ఆదిత్య ధర్ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీని పాకిస్తాన్ నేపథ్యంలో తెరకెక్కించారు. ఇండియన్ స్పై రవీంద్ర కౌశిక్ జీవితం ఆధారంగా రూపొందించారు.అయితే తాజాగా ఈ మూవీలో నటించిన ఓ ఆటో డ్రైవర్ వీడియో సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. ఈ చిత్రంలో చివర్లో రణ్వీర్ సింగ్ ఆటోలో వస్తారు. ఆ ఆటోను నడిపిన బద్రుల్ ఇస్లాం వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. ఆర్థిక సమస్యలతో తాను ఇంకా దురంధర్-2 చూడలేదని అన్నారు. టికెట్స్ రేట్లు తగ్గాక వెళ్లి చూస్తానని చెబుతున్నారు. సినిమా టికెట్ ధర ఎక్కువగా ఉన్నందువల్ల చూడలేకపోతున్నాని తెలిపారు. కుటుంబంతో కలిసి దురంధర్-2 చూసేందుకు తనకు మరింత సమయం పడుతుందన్నారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. దీంతో ఆటో రిక్షా డ్రైవర్ అయిన బద్రుల్ కోసం సినిమాను ఉచితంగా ప్రదర్శించేలా ఏర్పాట్లు చేయాలని అభిమానులు దర్శకుడు ఆదిత్య ధర్కు విజ్ఞప్తి చేస్తున్నారు.కాగా.. రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన ఈ సినిమా ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. హిందీతో పాటు సౌత్ భాషల్లోనూ ఈ మూవీని రిలీజ్ చేశారు. ఈ మూవీ సారా అర్జున్ హీరోయిన్గా కనిపించగా.. అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, ఆర్. మాధవన్ కీలక పాత్రల్లో నటించారు. View this post on Instagram A post shared by Mintu dhotian (@amar.gill.12139862) -
భార్యకు యూజ్డ్ కార్ స్పెషల్ గిప్ట్ ఇచ్చిన దర్శకుడు, ధర?
ప్రముఖ సినీ దర్శకుడు, ఏక్ థా టైగర్ ఫేమ్ కబీర్ ఖాన్ తన భార్య ప్రముఖ యాంకర్ మినీ మాథుర్కు ఒక లగ్జరీ ఎలక్ట్రిక్ కారును బహుమతిగా ఇచ్చారు. పర్యావరణానికి మేలు చేసేలా (EV), స్టైలిష్గా , స్పోర్టీగా ఉండే ఈ కారు ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్గా మారింది. ఈ కారు ఫోటోలను మినీ ఇన్స్టాలో పంచుకున్నారు. దీని ప్రకారం ఆ కారు విశేషాలు, ప్రత్యేకతలు తెలుసుకుందాం.బహుమతిగా యూజ్డ్ లగ్జరీ ఎలక్ట్రిక్ కారుకబీర్ ఖాన్ తన భార్యకు మినీ కూపర్ SE (MINI Cooper SE) ఆల్-ఎలక్ట్రిక్ కారును గిఫ్ట్గా ఇచ్చారు. ఈ కారు డెలివరీ తీసుకుంటున్న ఫోటోలను మినీ మాథుర్ సోషల్ మీడియాలో పంచుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు. ఇది ఒక సెకండ్ హ్యాండ్ (యూజ్డ్) కారు అయినప్పటికీ, కేవలం 2,200 కిలోమీటర్లు మాత్రమే తిరిగిన 2023 మోడల్ కావడం విశేషం.ఫీచర్లుఇందులో 32.6 kWh బ్యాటరీ ప్యాక్ ఉంది. ఒకసారి ఛార్జ్ చేస్తే 275 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు.కేవలం 7.3 సెకన్లలోనే 0 నుండి 100 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 150 కి.మీ. ఇక ఛార్జింగ్ విషయానికి వస్తే 50kW ఫాస్ట్ ఛార్జర్ ద్వారా కేవలం 36 నిమిషాల్లో 80శాతం ఛార్జ్ అవుతుంది. నాలుగు రకాల డ్రైవింగ్ మోడ్స్తో ఇది లభ్యం. 8.8 అంగుళాల టచ్ స్క్రీన్, ఆపిల్ కార్ప్లే (Apple CarPlay) , స్టీరింగ్ వెనుక 5.5 అంగుళాల డిజిటల్ డిస్ప్లేలాంటి ఫీచర్లతో ఈ కారు ఇంటీరియర్ చాలా లగ్జరీగా ఉంటుంది. ప్రీమియం హర్మాన్ కార్డాన్ (Harman Kardon) సౌండ్ సిస్టమ్, పనోరమిక్ గ్లాస్ రూఫ్ (సన్రూఫ్), నాప్పా లెదర్ స్టీరింగ్ వీల్ దీనికి మరింత అందాన్ని ఇస్తాయి. మొత్తానికి పర్యావరణాన్ని కాపాడుతూనే,గో-కార్ట్ హ్యాండ్లింగ్తో ఎలక్ట్రిక్ వెర్షన్లో మినీ కూపర్ కార్ మజాతో స్పోర్ట్స్ కార్ అనుభూతిని ఇచ్చే కారు ఇది.ధర ఎంత?భారతదేశంలో ఈ కారు కొత్తది కొనాలంటే ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ. 47.20 లక్షలు. అయితే, కబీర్ ఖాన్ కొనుగోలు చేసిన ఈ యూజ్డ్ కార్ ధర సుమారు రూ. 32 లక్షలు ఉంటుందని అంచనా. కాగా కబీర్ ఖాన్ , మినీ మాథుర్ 1998, ఫిబ్రవరి 28న వివాహం చేసుకున్నారు. డైరెక్టర్గా కబీర్ 'ఏక్ థా టైగర్' 'బజరంగీ భాయ్జాన్' పాపులర్ అవ్వగా, మినీ ఒక ప్రముఖ టెలివిజన్ హోస్ట్గా నటిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. వీరికి వివాన్ ఖాన్ అనే కుమారుడు , సైరా అనే కుమార్తె ఉన్నారు. -
సంజయ్ దత్ క్రేజీ రికార్డ్.. ఆ విషయంలో తొలి నటుడిగా ఘనత..!
రణ్వీర్ సింగ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్-2 బాక్సాఫీస్ రికార్డుల వేట కొనసాగుతోంది. మార్చి 19న విడుదలైన ఈ సినిమా వెయ్యి కోట్ల మార్క్ చేరుకునేందుకు రెడీగా ఉంది. తొలి రోజు నుంచే వసూళ్లు సునామీ సృష్టిస్తోంది. గతేడాది రిలీజైన దురంధర్కు సీక్వెల్గా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. కేవలం మూడు నెలల్లోనే పార్ట్-2 రిలీజ్ చేశారు. ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద పలు రికార్డులను తిరగరాసింది.ఈ నేపథ్యంలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ గురించి చర్చ మొదలైంది. విలన్ పాత్రలతో అందరినీ దృష్టిస్తోన్న ఏకైక బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్గా మెప్పించిన మూడు సినిమాలు వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధించాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద మూడు సినిమాలు రూ. 1,000 కోట్ల వసూళ్లు సాధించిన ఏకైక బాలీవుడ్ స్టార్గా సంజయ్ దత్ ఘనతను సొంతం చేసుకున్నారు.కన్నడ హీరో యశ్ నటించిన కేజీఎఫ్-2 చిత్రంలో విలన్ అధీర పాత్రలో అభిమానులను ఆకట్టుకున్నారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.1200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. దాదాపు 66 ఏళ్ల వయసులోనూ యువకుడిలా వరుస సినిమాలు చేస్తున్నారు. కేజీఎఎఫ్ తర్వాత షారుఖ్ ఖాన్ కథానాయకుడిగా నటించిన 'జవాన్' చిత్రంలో సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించారు. ఈ యాక్షన్ డ్రామాగా చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 1,160 కోట్ల మార్కును అధిగమించింది.తాజాగా గతేడాది రిలీజైన దురంధర్ మూవీలోనూ సంజయ్ దత్ కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా సైతం బాక్సాఫీస్ను షేక్ చేసింది. ఈ స్పై థ్రిల్లర్ చిత్రంలో విలన్ పాత్రలో మెప్పించారు. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ. 1,300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాతో సంజయ్ దత్ నటించిన మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద వెయ్యి కోట్లకు వసూళ్లు రాబట్టాయి. ఇటీవల రిలీజైన దురంధర్-2 సైతం రూ.1000 కోట్ల మార్క్ దగ్గరలో ఉంది. ఈ చిత్రం కూడా వెయ్యి కోట్లు దాటితే సంజయ్ దత్కు రికార్డ్ మరింత పెరగనుంది. కాగా.. సంజయ్ దత్ 'ధురందర్: ది రివెంజ్'లో ఎస్పీ చౌదరి అస్లాం పాత్ర పోషించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఇప్పటివరకు రూ. 919 కోట్లు వసూలు చేసింది. ఈ రికార్డ్స్ పరిశీలిస్తే.. ఇకపై సంజయ్ దత్ ఉంటే చాలు వెయ్యి కోట్లు పక్కా అనాల్సిందే. కాగా.. ఈ చిత్రంలో ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్, రాకేష్ బేడి, డానిష్ పండోర్, సారా అర్జున్, గౌరవ్ గెరా కీలక పాత్రలు పోషించారు. -
'ఆ అమ్మాయి నా కూతురితో సమానం'.. దురంధర్ నటుడు
దురంధర్లో రణ్వీర్ సింగ్ రోల్ తర్వాత అందరికీ గుర్తుండిపోయే పాత్ర ఆయనదే. అతని వల్లే ఈ సీక్వెల్ రూ.500 కోట్లు ఎక్కువగా సాధిస్తుందని హీరో సైతం అన్నారని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అతను ఎవరో కాదు.. జమీల్ జమాలీ పాత్రలో అలరిస్తోన్న నటుడు రాకేశ్ బేడీ. తన పాత్రలో రాకేశ్ అద్భుతంగా నటించారు. కరాచీకి చెందిన రాజకీయ నాయకుడు జమాలి పాత్రలో రాకేశ్ బేడీ అదరగొట్టేశారు.అయితే తాజాగా దురంధర్ హీరోయిన్ సారా అర్జున్ను ముద్దు పెట్టుకోవడంతో వివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే. గతంలో ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ సందర్భంగా జరిగింది. ఆ వీడియో నెట్టింట వైరల్ కావడంతో పెద్దఎత్తున విమర్శలొచ్చాయి. తనకంటే వయసులో చాలా చిన్నదైన సారా అర్జున్ను రాకేశ్ బేడీ ముద్దుపెట్టుకోవడంతో విపరీతంగా ట్రోల్స్ వచ్చాయి. అయితే కొందరు మాత్రం తనను సమర్థించారని కూడా ఆయన పేర్కొన్నారు.తాజాగా ఈ వివాదంపై రాకేష్ బేడీ మరోసారి స్పందించారు. సారాపై తనకు ఎలాంటి చెడు ఉద్దేశం లేదన్నారు. తాను కేవలం ఆమెపై ఆప్యాయతతోనే అలా చేశానని తెలిపారుు. కానీ మరో కోణంలో చిత్రీకరించారని ఆవేదన వ్యక్తం చేశారు. తన కూతురి పాత్ర పోషించిన సారాతో తండ్రిలాగే ప్రవర్తిస్తానని..సినిమా షూటింగ్ సమయంలో కూడా ఆమెతో అలాగే ప్రవర్తించేవాడినని బేడీ వివరణ ఇచ్చారు. మాది తండ్రీ, కూతుళ్ల బంధమని తెలిపారు. నా ఆప్యాయతను ప్రజలు గుర్తించలేకపోయారని అన్నారు.ఓ పాడ్కాస్ట్లో మాట్లాడుతూ.." తన కూతురి పాత్ర పోషించిన సారాతో తన బంధం ఎప్పుడూ ఆప్యాయంగా.. ఒక తండ్రిలాగే ఉంటుంది. ఈ మూవీ షూటింగ్ సమయంలో కూడా ఆమెతో అలాగే ప్రవర్తించా. ధురందర్ షూటింగ్ సమయంలో ఆమె వచ్చినప్పుడల్లా ఒక కూతురిలా ఆమెను కౌగిలించుకుని నుదుటిపై ముద్దు పెట్టేవాడిని. ఏం పర్వాలేదు.. చింతించకు.. మనిద్దరం కలిసి ఒక గొప్ప సీన్ చేస్తామని తనతో చెప్పేవాడిని. అదృష్టవశాత్తూ, కొందరు నన్ను సమర్థించారు కూడా. కానీ ఈ సినిమాతో దక్కిన విజయం చాలా మందికి రాదు' అని అన్నారు. -
సీక్రెట్గా సింగర్ని పెళ్లి చేసుకున్న నటి.. ఫోటోలు వైరల్
బాలీవుడ్ స్టార్ ర్యాపర్ బాద్షా, నటి ఇషా రిఖీ పెళ్లి చేసుకున్నారనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇషా తల్లి పూనమ్ రిఖీ సోషల్ మీడియా వేదికగా పెళ్లి ఫోటోలను పోస్ట్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అయితే దీనిపై అటు బాద్షా కానీ, ఇటు ఇషా కానీ ఎవరూ అధికారికంగా స్పందించలేదు.ఆరేళ్ల క్రితమే విడాకులు.. ర్యాపర్ బాద్షా అసలు పేరు ఆదిత్య ప్రతీక్ సింగ్ సిసోడియా. హిందీ, పంజాబీ పాటలను రీమిక్స్ చేస్తూ యూత్లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. అలాగే బాలీవుడ్లో పలు బ్లాక్బస్టర్ సినిమాల్లో పాటలు పాడి, మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కెరీర్ పీక్స్లో ఉండగానే.. జాస్మిన్ అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకొన్నాడు. ఈ జంటకి ఓ కూతురు ఉంది. ఇద్దరి మధ్య విభేధాలు రావడంతో ఆరేళ్ల క్రితం విడాకులు తీసుకొన్నారు. ఈషాతో డేటింగ్.. విడాకుల తర్వాత పంజాబీ నటి ఇషా రిఖీతో బాద్షా ప్రేమలో పడ్డాడు. ఇషాను ఓ పార్టీలో కామన్ ఫ్రెండ్ ద్వారా కలుసుకొన్నారు. అక్కడ జరిగిన వారి పరిచయం ఇద్దరిని మరింత దగ్గరకు చేర్చించింది. గతకొంత కాలంగా ఇద్దరు డేటింగ్లో ఉన్నట్లు వార్తలు కూడా బయటకు వచ్చాయి. అయితే వీరిద్దరు మాత్రం తమ ప్రేమ విషయాన్ని ఇప్పటివరకు బహిరంగంగా ప్రకటించలేదు.పెళ్లి ఫోటోలు వైరల్.. తాజాగా ఈ జంట రహస్యంగా పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ పెళ్లి జరిగినట్లు నేషనల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఇషా రిఖీ తల్లి పూనమ్ రిఖీ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా పెళ్లికి సంబంధించిన ఫోటోలను పంచుకుంటూ ‘గాడ్ బ్లెస్ యూ’ అని క్యాప్షన్ ఇచ్చింది. దీంతో నెటిజన్స్ పెద్ద ఎత్తున ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. View this post on Instagram A post shared by POONAM RIKHI (@poonamrikhi6) View this post on Instagram A post shared by POONAM RIKHI (@poonamrikhi6) -
పదేళ్ల తర్వాత ప్రెగ్నెన్సీ.. గ్రాండ్గా బుల్లితెర నటి సీమంతం..!
ప్రముఖ బుల్లితెర జంట దివ్యాంక త్రిపాఠి ఇటీవలే ఫ్యాన్స్కు గుడ్ న్యూస్ చెప్పింది. వివేక్ దహియాను పెళ్లాడిన ముద్దుగుమ్మ దాదాపు పదేళ్లకు శుభవార్త పంచుకుంది. తాము త్వరలోనే పేరెంట్స్గా ప్రమోషన్ పొందనున్నట్లు వెల్లడించింది. ఉగాది పండుగ రోజే ఫ్యాన్స్కు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ దివ్యాంక తన బేబీ బంప్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.తాజాగా ఈ బ్యూటీ సీమంతం వేడుక గ్రాండ్గా జరిగింది. సన్నిహితులు, బంధుమిత్రుల సమక్షంలో ఈ వేడుకను బేబీ షవర్ను సెలబ్రేట్ చేసుకుంది దివ్యాంక త్రిపాఠి. తాజాగా తన సీమంతం వేడుక ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. భర్తతో పాటు కుటుంబ సభ్యుల్లాంటి స్నేహితులతో చేసుకున్న ఈ గోధ్ బరాయి(సీమంతం) వేడుకను ఎప్పటికీ మర్చిపోలేనని ఆనందం వ్యక్తం చేసింది. ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.2016లో ప్రేమ పెళ్లి..కాగా.. దివ్యాంక, వివేక్.. యే హై మొహబ్బతే సీరియల్ సెట్లో కలుసుకున్నారు. ఈ ధారావాహిక చిత్రీకరణ సమయంలోనే ప్రేమలో పడ్డారు. 2016లో భోపాల్లో పెళ్లి చేసుకున్నారు. ఈ జంట నాచ్ బలియే 8వ సీజన్లో పాల్గొని విజేతగా నిలిచింది. ప్రస్తుతం 41 ఏళ్ల వయసులో దివ్యాంక తల్లి కాబోతోంది.సీరియల్ నటిగా రికార్డ్..దివ్యాంక త్రిపాఠి నటి మాత్రమే కాదు మోడల్, యాంకర్ కూడా! 2005లో మిస్ భోపాల్ కిరీటం అందుకుంది. బనూ మే తేరి దుల్హాన్ సీరియల్తో గుర్తింపు పొందింది. అలా వరుస ఛాన్సులు అందుకుంది. మధ్యలో తకనుమరుగైపోయినా యే హై మొహబ్బతే సీరియల్తో ఆమె కెరీర్ మలుపు తిరిగింది. 2017లో ఫోర్బ్స్ సెలబ్రిటీ 100 జాబితాలో చోటు దక్కించుకున్న సీరియల్ నటిగా రికార్డు సృష్టించింది. View this post on Instagram A post shared by Divyanka Tripathi Dahiya (@divyankatripathidahiya) -
దురంధర్-2 క్రేజ్.. పుష్పరాజ్ రికార్డ్ బ్రేక్
రణ్వీర్ సింగ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ రికార్డుల వేట కొనసాగుతోంది. ఇప్పటికే రూ.800 కోట్లకు పైగా వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. మార్చి 19న ప్రారంభమైన వసూళ్ల వేట ఐదు రోజులైనా ఏ మాత్రం తగ్గడం లేదు. ఇదే జోరు కొనసాగితే కేవలం వారం రోజుల్లోనే వెయ్యి కోట్ల మార్క్ చేరుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. దురంధర్కు సీక్వెల్గా వచ్చిన ఈ సినిమాకు ఆదిత్య దర్శకత్వం వహించారు. తాజాగా ఈ మూవీ మరో రికార్డ్ను తన ఖాతాలో వేసుకుంది.ఈ సారి ఏకంగా అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప-2 వసూళ్లను దాటేసింది. పుష్ప-2 సాధించిన హిందీ వసూళ్లు రికార్డ్ను దురంధర్-2 బద్దలు కొట్టింది. పుష్ప-2 మూవీకి నాలుగు రోజుల్లో హిందీ వర్షన్కు రూ. 425.10 కోట్లు రాగా.. దురంధర్-2 ఏకంగా రూ.430 కోట్లు వసూలు చేసింది. ఈ రికార్డుతో పుష్పరాజ్ను వెనక్కి నెట్టేసింది. దురంధర్-2, పుష్ప-2 తర్వాత పఠాన్, జవాన్, స్త్రీ-2 చిత్రాలు ఉన్నాయి. ఓవరాల్గా అన్ని భాషల్లో ఇండియా వ్యాప్తంగా కలెక్షన్స్ పరిశీలిస్తే 'పుష్ప 2: ది రూల్' ఇంకా అగ్రస్థానంలోనే ఉంది. హిందీ వెర్షన్లో 'ధురందర్: ది రివెంజ్' అధిగమించింది.ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా ఐదు రోజుల్లోనే రూ.829 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇక ఐదు రోజుల్లోనే దేశ వ్యాప్తంగా ఈ సినిమా రూ.619.76 కోట్ల గ్రాస్ కలెక్షన్లు నమోదు చేసింది. దేశవ్యాప్తంగా చూస్తే రూ. 519.12 కోట్ల నికర వసూళ్లు సాధించింది. బాక్సాఫీస్ వద్ద ఒక హిందీ చిత్రానికి ఇవే అత్యధిక వసూళ్లు కావడం విశేషం. కాగా.. ఈ చిత్రంలో ఆర్. మాధవన్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, రాకేష్ బేడి, డానిష్ పండోర్, సారా అర్జున్, గౌరవ్ గెరా కీలక పాత్రలు పోషించారు. హిందీలో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్-5 సినిమాలివే.. దురంధర్ ది రివెంట్: రూ. 430 కోట్లు (నాలుగు రోజులు)పుష్ప-2 ది రూల్: రూ. 425.10 కోట్లుపఠాన్: రూ. 351 కోట్లుజవాన్: రూ. 346.98 కోట్లుస్త్రీ-2: రూ. 291.65 కోట్లు -
జస్ట్ నిమిషాల్లో, దోసకాయ పచ్చడి : నటి వీడియో వైరల్
ప్రముఖ బాలీవుడ్ నటిఅశ్విని కల్సేకర్ దోసకాయపచ్చడి తయారు చేసి చూపించారు. అదీ జస్ట్ నిమిషాల్లోనే అంటూ ఆమె చేసిన పోస్ట్ ఫ్యాన్స్ను విపరీతంగా ఆకర్షిస్తోంది. అశ్విని కల్సేకర్ మరెవ్వరో కాదు ప్రముఖ నటుడు మురళి శర్మ భార్య. పదండి మరి కమ్మని దోసకాయ పచ్చడి మేకింగ్ కథ ఏంటో తెలుసుకుందాం.గోల్మాల్ అంధాధున్, జోధా అక్బర్ లాంటి పాపులర్ మూవీలు, టీవీ షోలతో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకున్ నటి అశ్విని కల్సేకర్. తరచుగా సోషల్ మీడియాలో పలు వంటల గురించి ఫ్యాన్స్తో పంచుకుంటూ ఉంటారు. తాజాగా నిమిషాల్లో దోసకాయ పచ్చడి ఎలా తయారు చేయాలో చూపించిన వీడియో వైరల్గా మారింది.దోసకాయ పచ్చడి రెసిపీ ఈ సాంప్రదాయ ఆంధ్ర-శైలి చట్నీ పుల్ల పుల్లగా, పంటి కింద పచ్చదోసకాయ ముక్కలు తగులుతూ ఉండే రుచిని అందరూ ఇష్టపడతారు. దీనిని సాంప్రదాయకంగా పసుపు దోసకాయ (దోసకాయ), కొత్తిమరీ, చింతపండు , వేయించిన దినుసులతో తయారు చేస్తారు.ఇదీ చదవండి: 45 ఏళ్ల తరువాత ఇదే తొలిసారి : గేమ్ ఛేంజర్అశ్విని షేర్ చేసినరెసిపీ : ముందుగా దోసకాయ తొక్క తీసి, గింజలు తొలగించి (కొంతమంది గింజలు వేసుకుంటారు), చిన్న చిన్న ముక్కలుగా కోయాలి. తరువాత, ఒక బాణలిలో కొద్దిగా నూనె వేడి చేసి, 2 టేబుల్ స్పూన్ల మినప పప్పు వేసి, ఎర్రగా వేగాక, కొద్దిగా మెంతులు, 2 టేబుల్ స్పూన్ల ఆవాలు, ఎండు, పచ్చి మిరపకాయల మిశ్రమాన్ని ఇంగువ వేసి వేయించాలి. ఆ తరువాత స్టఫ్ ఆఫ్ చేసి, ఈ పోపులోనే కొద్దిగా చింతపండు గుజ్జు , ఒక చిన్న బెల్లం ముక్క, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు వేసి కలుపుకొని పక్కన పెట్టి చల్లారనివ్వాలి. View this post on Instagram A post shared by Ashwini kalsekar (@ashwinikalsekar)తరువాత కొత్తి మీర, దోసకాయ ముక్కల్ని పూర్తిగా మెత్తగా కాకుండా కచ్చా పచ్చాగా ఉండేలా మిక్సీ పట్టాలి. అంతే ఈ మిశ్రమాన్ని పోపులో వేసి కలుపుకోవడమే. ఈ చట్నీని అన్నం, రోటీతో గానీ ఆస్వాదించవచ్చు అంతకు ముందు కూడా అశ్విని అన్నం లేదా పూరీతో కలిపి తినే,, కొంకణి శైలి బంగాళదుంప కూర అంబట్ బటాటా రెసిపీని ఇన్స్టాగ్రామ్లో పంచుకున్నారు.థఇదీ చదవండి: రూ. 4 కోట్లు : హరీష్ పరిస్థితి వద్దు, దంపతుల కన్నీరు మున్నీరు -
ధురంధర్ 2పై తలైవా రివ్యూ.. సంతోషంలో డైరెక్టర్
గత ఆరునెలలుగా బాక్సాఫీస్ వద్ద ధురంధర్ పేరు మారుమోగిపోతోంది. రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన ధురంధర్ 1 ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే.. మూడు నెలలు కూడా తిరగకముందే దర్శకుడు ఆదిత్య ధర్ దానికి సీక్వెల్ తీసుకొచ్చాడు. మార్చి 19న ధురంధర్: ది రివేంజ్ విడుదలైంది. ఈ సినిమాపై నార్త్ నుంచి సౌత్ వరకు అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. తలైవా రివ్యూతాజాగా సూపర్స్టార్ రజనీకాంత్ ధురంధర్ 2 చూసి రివ్యూ ఇచ్చాడు. ఆదిత్య ధర్ను బాక్సాఫీస్ కా బాప్ అని అభివర్ణించాడు. రణ్వీర్ సహా చిత్రయూనిట్ అందరికీ శుభాకాంక్షలు తెలిపాడు. ప్రతి భారతీయుడు తప్పక చూడాల్సిన చిత్రమని ఎక్స్ (ట్విటర్)లో కితాబిచ్చాడు. తలైవా పోస్ట్పై దర్శకుడు ఆదిత్య ధర్ సంతోషం వ్యక్తం చేశాడు. గర్వంగా ఉందిసర్, వినోదం అనే పదానికి మిమ్మల్నే బెంచ్మార్క్గా చూస్తూ పెరిగాం. ఎన్నో దశాబ్దాలుగా మీరు మమ్మల్ని ఏడిపించారు, నవ్వించారు, విజిల్స్ కొట్టేలా చేశారు. ఇప్పటికీ అదే గ్రేస్, స్వాగ్తో మ్యాజిక్ చేస్తూనే ఉన్నారు. అలాంటి మీరు ధురంధర్ 2 తప్పక చూడాల్సిన మూవీ అని చెప్పడం నా జీవితంలో అతిపెద్ద సూపర్స్టార్ మూమెంట్గా అనిపిస్తోంది. పెద్ద కలలను కనమని ప్రోత్సహించిన వ్యక్తి మమ్మల్ని ఆశీర్వదిస్తున్నట్లుగా ఉంది. ఎంతో గర్వంగా ఉంది సర్. మీ మాటలు నా మనసును తాకాయి అని ఆదిత్య ధర్ రాసుకొచ్చాడు. Sir, we’ve all grown up measuring “entertainment” with just one benchmark, YOU. ❤️⁰Making us whistle, laugh, cry and feel larger than life for decades and still doing it with the same swag and grace, that’s pure magic.So for you to call Dhurandhar 2 a “must watch” feels like…— Aditya Dhar (@AdityaDharFilms) March 23, 2026 చదవండి: బ్యాండ్మేళం కోసం ఆస్తులమ్ముకున్న కోన వెంకట్.. నేనైతే ఆ పనిచేయను: బండ్ల గణేశ్ -
నాకు నత్తి.. ఇప్పటికీ బాధపడుతుంటా: సమీరా రెడ్డి
హీరోయిన్ సమీరారెడ్డి ఏదైనా నిర్మొహమాటంగా చెప్పేస్తుంది. తన కష్టాలు, ప్రెగ్నెన్సీలో బరువు పెరగడం, డెలివరీ తర్వాత ఎదుర్కొన్న సమస్యలు.. వీటన్నింటి గురించి ఓపెన్గా మాట్లడుతూ ఉంటుంది. అయితే చిన్నతనంలో నత్తి వల్ల తనను ఎందరో వెక్కిరించేవారంటోంది.వెక్కిరింతలుతాజాగా ఓ ఇంటర్వ్యూలో సమీరా రెడ్డి మాట్లాడుతూ.. చిన్నప్పుడు నాకు నత్తి ఉండేది. దానివల్ల నన్ను వెక్కిరిస్తూ వేధించేవారు. నాలో ఆత్మవిశ్వాసం పెంచుకోవడానికి సంవత్సరాల తరబడి థెరపీ చేయించుకోవాల్సి వచ్చింది. ఇప్పటికీ నేను నత్తిగా మాట్లాడినప్పుడు ఎవరైనా దానిపై సెటైర్లు వేస్తే బాధగా ఉంటుంది. చిన్ననాడు మనల్ని ఏమేం అంటారో అవన్నీ మనసులో లోతుగా పాతుకుపోయుంటాయి.అదే నిజమనుకుని..ఉదాహరణకు.. ఆమె చాలా స్లో, వీక్ అంటుంటారు. ఇలాంటి పదాలు పదేపదే విన్నప్పుడు మనపై మనకే అనుమానం వేస్తుంటుంది. ఫలితంగా పిల్లలు ఏదైనా సాహసం చేసేందుకు వెనుకాడతారు. పిల్లల్ని పదేపదే బుద్ధిహీనుడు, బలహీనుడు, ముసలివాడు.. అని పిలిస్తే వాళ్లు అదే నిజమనుకుంటారు. వాళ్లను వాళ్లు చూసుకునే విధానమే మారిపోతుంది. ఎవరినీ కించపర్చొద్దుఅదే నిజమని నమ్మి, అందరిలా దూకుడుగా ఉండలేరు. ఏవీ ప్రయత్నించకుండా సైలెంట్ అయిపోయే ప్రమాదం ఉంది. నా పిల్లలు.. వారికి ఏ సమస్య ఎదురైనా నాతో చెప్పమంటాను. ఎవరినీ కించపరచొద్దని చెప్తుంటాను. పిల్లలకు సరైన ప్రోత్సాహం, మార్గదర్శకత్వం చేస్తే మంచి ఆత్మవిశ్వాసంతో ఎదుగుతారు. పర్సనల్ లైఫ్తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, తోటివారంతా సపోర్ట్గా నిలబడితే పిల్లలు వారికెదురయ్యే సవాళ్లను ఒక అడ్డంకిగా కాకుండా.. దాన్నుంచి ఎలా బయటపడాలన్నది నేర్చుకుంటారు అని చెప్పుకొచ్చింది. సమీరా.. 2014లో ఎంటర్ప్రెన్యూర్ అక్షయ్ వార్డేను పెళ్లి చేసుకుంది. ఈ దంపతులకు 2015లో కుమారుడు హన్స్, 2019లో కూతురు నైరా జన్మించారు. బాలీవుడ్ హీరోయిన్ సమీరా రెడ్డి.. తెలుగులో నరసింహుడు, జై చిరంజీవ, అశోక్ సినిమాల్లో నటించింది.చదవండి: హీరోయిన్ భానుప్రియ ఇంట తీవ్ర విషాదం -
హారర్కి గ్రీన్ సిగ్నల్?
బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ జెట్ స్పీడ్తో దూసుకెళ్తున్నారు. ఆయన నటించిన ‘రేంజర్, ధమాల్ 4’ సినిమాలు షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధం అవుతున్నాయి. ప్రస్తుతం ఆయన ‘దృశ్యం 3 (హిందీ వెర్షన్), గోల్మాల్ 5’ సినిమాల చిత్రీకరణలతో బిజీగా ఉంటున్నప్పటికీ ఇటీవల మరో కొత్త సినిమాకు అంగీకారం తెలిపారని బాలీవుడ్ సమాచారం.హిందీలో ‘జేమ్స్’, పంజాబీలో ‘సర్దాజ్ జీ, సర్దార్ జీ 2’ వంటి సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు రోహిత్ జుగ్రాస్ ఇటీవల ఓ హారర్ కథను అజయ్ దేవగన్ కు వినిపించారట. కథ, హారర్ కాన్సెప్ట్ నచ్చడంతో ఈ సినిమాకు అజయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని బాలీవుడ్ టాక్. ప్రస్తుతం ప్రీప్రోడక్షన్ పనులు జరుగుతున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాదే సెట్స్పైకి తీసుకెళ్లాలని రోహిత్ అండ్ టీమ్ సన్నాహాలు చేస్తున్నారట. 2027లో ఈ సినిమా రిలీజ్ కానుంది. -
9 నెలల తర్వాత ఓటీటీకి హిట్ సినిమా.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
గతేడాది బాలీవుడ్ స్టార్ అమిర్ ఖాన్ నటించిన చిత్రం సితారే జమీన్ పర్. ఈ సినిమా 2025 జూన్ 20న థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. ఈ మూవీలో జెనీలియా దేశ్ముఖ్ కూడా ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమాకు ఆర్ఎస్ ప్రసన్న దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని ఆమిర్ ఖాన్, అపర్ణ పురోహిత్ నిర్మించారు.అయితే ఈ సినిమా దాదాపు 9 నెలల తర్వాత ఓటీటీకి వచ్చేస్తోంది. తాజాగా ఈ మూవీ స్ట్రీమింగ్ తేదీని మేకర్స్ ప్రకటించారు. ఏప్రిల్ 03 నుంచి సోనీ లివ్ వేదికగా అందుబాటులోకి రానుంది. కాగా..అమిర్ ఖాన్ గతంలో ఓటీటీలో రిలీజ్ చేయనని ప్రకటించారు. ఆ తర్వాత నేరుగా యూట్యూబ్లోనే విడుదల చేశారు. రెంట్ పద్ధతిలో అందుబాటులోకి తీసుకొచ్చారు. Kisi ke liye alag… kisi ke liye normal.Sabka apna normal hota hai. ❤️A heartwarming story of Hope, heart and healing💫 Watch #SitaareZameenPar #SabkaApnaApnaNormal, streaming from 3rd April on Sony LIV#SitaareZameenParOnSonyLIV pic.twitter.com/YvBbFlOTNS— Sony LIV (@SonyLIV) March 23, 2026 రూ.120 కోట్ల డీల్కు నో..అప్పట్లో ఓటీటీ రైట్స్ కోసం రూ.120 కోట్లు చెల్లించేందుకు అమెజాన్ ప్రైమ్ ముందుకొచ్చింది. కానీ ఈ బిగ్ డీల్ను అమిర్ ఖాన్ తిరస్కరించారు. ఈ సినిమా కేవలం థియేటర్లలోనే ఆడుతుందని.. ఓటీటీలో విడుదల ఉండదని అమిర్ ఖాన్ స్పష్టం చేశారు. కానీ అమిర్ ఖాన్ తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. కాగా.. ఈ చిత్రంలో ఆరోష్ దత్తా, గోపీకృష్ణ వర్మ, సంవిత్ దేశాయ్, వేదాంత్ శర్మ, ఆయుష్ భన్సాలీ, ఆశిష్ పెండ్సే, రిషి షహానీ, రిషబ్జైన్ , నమన్ మిశ్రా, సిమ్రాన్ మంగేష్కర్ వంటి వారు కీలకపాత్రల్లో నటించారు. -
అందరి నోటా దురంధర్.. ఆ రియల్ హీరో స్టోరీ తెలుసా?
దురంధర్.. దురంధర్.. దురంధర్.. ఇప్పుడు ఎవరినీ నోటా విన్నా ఆ ఒక్క పేరే వినిపిస్తోంది. గతేడాది రిలీజైన ఈ మూవీ సీక్వెల్ ప్రస్తుతం థియేటర్లను షేక్ చేస్తోంది. బాక్సాపీస్ వద్ద ఊహకందని రికార్డులు సృష్టిస్తోంది. రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన దురంధర్ ది రివెంజ్ మార్చి 19న రిలీజై ఊచకోత కోస్తోంది. కేవలం మూడు రోజుల్లోనే రూ.500 కోట్ల మార్క్ దాటేసిన ఈ మూవీ బాక్సాఫీస్ను షేక్ చేస్తోంది.ఈ నేపథ్యంలో అసలు దురంధర్ ఎవరు? అనే అంశంపై చర్చ నడుస్తోంది. ఇంతకీ ఆ రియల్ దురంధర్ ఎవరినీ తెగ నెటిజన్స్ తెగ ఆరా తీస్తున్నారు. ఆడియన్స్కు ఇంతలా కనెక్ట్ అయిన ఆ పాత్ర ఎవరిది? అసలు ఆ వ్యక్తి ఎవరు? అసలు అతను బతికే ఉన్నాడా? అనే వివరాల కోసం తెగ వెతికేస్తున్నారు. మరి ఆ వివరాలేంటో మీరు కూడా తెలుసుకోవాలనుకంటున్నారా? అయితే ఈ స్టోరీ చదివేయండి.రియల్ ధురంధర్ ఆయనే..రవీంద్ర కౌశిక్.. ఈ పేరు చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు. ఆర్మీలో మేజర్ స్థాయికి ఎదిగిన రవీంద్ర.. తన ధైర్య సాహసాలతో రాలో(RAW) బ్లాక్ టైగర్గా గుర్తింపు తెచ్చుకున్నారు. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీనే బ్లాక్ టైగర్ అనే బిరుదు ఇవ్వడం విశేషం. అయితే స్పై ఏజెంట్గా పాకిస్తాన్ వెళ్లిన రవీంద్ర కౌశిక్.. పాక్ ఆర్మీలో చేరి మేజర్ స్థాయికి ఎదిగారు. భారతదేశపు అత్యంత ధైర్యవంతులైన రా ఏజెంట్లలో ఒకరిగా నిలిచారు.భారత్కు చెందిన రవీంద్ర కౌశిక్ పాకిస్థాన్లో రహస్యంగా ప్రవేశించి.. పాక్ జాతీయుడిగా మారిపోయి పాకిస్థాన్ సైన్యంలో చేరారు. అక్కడి సైనిక కదలికలు, పాకిస్థాన్ అణు కార్యక్రమం గురించి కీలకమైన సమాచారాన్ని ఇండియాకు అందించారు. అయితే ఊహించని విధంగా 1983లో పాకిస్థాన్ గూఢచార సంస్థ ISIకి దొరికిపోయాడు. ఆ తర్వాత తన మిగిలిన జీవితాన్ని జైలులోనే గడిపారు.23 ఏళ్ల వయసులోనే..రవీంద్ర కౌశిక్ 1975లో అంటే కేవలం 23 ఏళ్ల వయసులోనే నబీ అహ్మద్ షకీర్ అనే పేరుతో పాకిస్తాన్లోకి ప్రవేశించారు. అక్కడే కరాచీ విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రంలో డిగ్రీ సంపాదించి.. పాకిస్తాన్ సైన్యంలో చేరారు. తన టాలెంట్తో ఏకంగా మేజర్ హోదాను పొందారు. 1979 నుండి 1983 మధ్య దాదాపు 4 ఏళ్ల పాటు కౌశిక్ రహస్యంగా భారతదేశానికి కీలకమైన సమాచారాన్ని పంపాడు. అక్కడి పంజాబ్లోని సైనిక కదలికలు.. కహుటాలోని పాకిస్తాన్ అణు కర్మాగారం గురించి సున్నితమైన వివరాలను అందించాడు. అంతేకాకుండా అమానత్ అనే పాకిస్తానీ మహిళను వివాహం చేసుకున్నారు. వీరికి ఓ బిడ్డ కూడా పుట్టారు.అయితే 1983లో రా (RAW) సంస్థ ఇనాయత్ మసీహ్ అనే జూనియర్ స్పైని.. రవీంద్రను కలవడానికి పంపింది. కానీ మసీహ్ వెంటనే అక్కడి ఐఎస్ఐకి దొరికిపోయాడు. మసీహ్ ఇచ్చిన సమాచారం ఆధారంగా కౌశిక్ను కలవాల్సిన ముల్తాన్లోని పార్కును ఐఎస్ఐ గుర్తించింది. దీంతో 1983 సెప్టెంబర్లో రవీంద్ర కౌశిక్ను అరెస్టు చేశారు. ఆ తర్వాత కౌశిక్ను సియాల్కోట్లో విచారించి.. కోట్ లఖ్పత్, మియాన్వాలి లాంటి అత్యంత కట్టుదిట్టమైన భద్రత గల జైళ్లకు తరలించారు. 1985లో పాకిస్తానీ సైనిక న్యాయస్థానం అతనికి మరణశిక్ష విధించింది. కానీ ఆ తరువాత దానిని యావజ్జీవ కారాగార శిక్షగా మార్చారు. అయితే రవీంద్ర కౌశిక్ 2001 నవంబర్ 21న.. మియాన్వాలి సెంట్రల్ జైలులో క్షయవ్యాధి, గుండె జబ్బుతో మరణించాడు.రవీంద్ర కౌశిక్ స్వస్థలం ఎక్కడంటే? రవీంద్ర కౌశిక్ స్వస్థలం రాజస్థాన్లోని శ్రీ గంగానగర్ పట్టణం. 1952 ఏప్రిల్ 11న భారత్-పాకిస్తాన్ సరిహద్దుకు సమీపంలో ఉన్న శ్రీ గంగానగర్లో జన్మించారు. అక్కడే ఆయన పంజాబీతో పాటు స్థానిక భాషలు నేర్చుకున్నారు. గంగానగర్లోని ఎస్.డి. బిహానీ కళాశాలలో కామర్స్ చదువుతున్నప్పుడే నాటకరంగంలో పాల్గొని తన నటన నైపుణ్యాలను ప్రదర్శించారు.అదే సమయంలో 1973లో లక్నోలో జరిగిన ఒక జాతీయ నాటక పోటీలో రవీంద్ర ప్రదర్శన ఇచ్చారు. ఒక భారతీయ సైనికుడి పాత్రలో ఏకపాత్రాభినయం చేశారు. అతని ప్రదర్శన రా అధికారుల దృష్టిని ఆకర్షించింది. ఆ వెంటనే ఢిల్లీలో రహస్య మిషన్ కోసం అతనికి తీవ్రమైన శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణ సమయంలో ఇస్లాం గురించి.. పాకిస్తానీ ఉర్దూ భాష, ఆ దేశ భౌగోళిక స్వరూపం గురించి పూర్తిగా తెలుసుకున్నారు. రెండేళ్ల కఠిన శిక్షణ తర్వాత రా స్పైగా పాకిస్తాన్లో అడుగుపెట్టాడు. -
దురంధర్-2 రిలీజ్.. పాకిస్తాన్ వీడియోలు వైరల్..!
రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్ దురంధర్-2 థియేటర్లలో సందడి చేస్తోంది. మార్చి 19న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ను షేక్ చేస్తోంది. కేవలం మూడు రోజుల్లేనే రూ.500 కోట్ల మార్క్ దాటిన ఈ చిత్రం పలు రికార్డులు తిరగరాస్తోంది. ఇప్పటికే నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.700 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.దురంధర్కు సీక్వెల్గా వచ్చిన ఈ సినిమా హిందీతో పాటు దక్షిణాది భాషల్లోనూ రిలీజైంది. పాకిస్తాన్ నేపథ్యంలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. తాజాగా ఈ మూవీ రిలీజ్ వేళ సోషల్ మీడియాలో పాకిస్తాన్కు సంబంధించిన వీడియోలు వైరలవుతున్నాయి. ఇప్పుడు కరాచీలోని లియారి ప్రాంతంలో పోలీసులు స్పై లాంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారేమోననని సోదాలు చేస్తున్నారు. అక్కడి ప్రాంతంలోని లోకల్ ప్రజలంతా కలిసి ఇండియన్ స్పైల కోసం వెతుకుతున్న వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. అయితే ఈ వీడియో ఇప్పటిదా.. లేదాంటే పాతదా? అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. ధురంధర్ 2 తర్వాత పాకిస్తాన్ అంతటా పానిక్ మొదలైంది!ఇప్పుడు కరాచీలోని లియారి ప్రాంతంలో పోలీసులు, లోకల్ ప్రజలు కలిసి ప్రతి వీధిలో ఇండియన్ స్పైలను వెతుకుతున్నారు.వాళ్ల ఆశ ఏమిటంటే—హమ్జా అలీ మజారిని పట్టుకుంటామని!#Dhurandhar2 #DhurandharTheRevenge #Dhurandhar #Pakistan… pic.twitter.com/7Emn1qkEPc— Tupaki (@tupaki_official) March 23, 2026 -
జూన్లో ధురంధర్ 3? నిజమెంత?
ఏదైనా సినిమా బాగుందంటే చాలు దాని కొనసాగింపు కోసం జనం ఎదురుచూస్తుంటారు. బాహుబలి, పుష్ప, కేజీఎఫ్, కాంతార వంటి చిత్రాలు కూడా అలాంటి బజ్ క్రియేట్ చేసుకుని సీక్వెల్లో కూడా కాసుల వర్షం కురిపించాయి. ఇప్పుడు ధురంధర్ సినిమా విషయంలోనూ అదే జరుగుతోంది.ధురంధర్ బ్లాక్బస్టర్రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ మూవీ 2025 డిసెంబర్లో విడుదలైంది. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం చూసేందుకు జనం థియేటర్ల ఎదుట క్యూ కట్టారు. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా రూ.1350 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి బాక్సాఫీస్ రికార్డులు తిరగరాసింది. దీంతో దీని సీక్వెల్ కోసం జనం వెయిట్ చేశారు.ధురంధర్ 3 రాబోతోందా?అయితే వారిని మరీ ఎక్కువ ఎదురుచూడనివ్వకుండా మూడు నెలల్లో ధురంధర్ 2ని తీసుకొచ్చారు మేకర్స్. మార్చి 19న ధురంధర్: ది రివేంజ్ విడుదలైంది. నాలుగు రోజుల్లోనే రూ.761 కోట్ల కలెక్షన్స్ రాబట్టి అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ క్రమంలో ధురంధర్ 3 రాబోతోందని ప్రచారం మొదలైంది.ఫేక్ ఫోటోఅది కూడా మరో మూడు నెలల్లోనే విడుదల కాబోతుందని రూమర్ సృష్టించారు. జూన్ 14న ధురంధర్: ద ఫైనల్ చాప్టర్ రాబోతుందంటూ ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్) సాయంతో సృష్టించిన ఓ ఫోటోను సోషల్ మీడియాలో వదిలారు. ఇంకేముంది, అది నెట్టింట వైరల్గా మారగా అది నిజమని చాలామంది భ్రమపడుతున్నారు.సినిమాసినిమా చివర్లో పేర్లు పడి ఆగిపోయేంతవరకు మీరు సీటులో నుంచి లేవొద్దు అని ఆదిత్య ధర్ ప్రేక్షకులకు సూచించాడు. ఆ లెక్కన నిజంగానే చివరాఖరులో మూడో భాగం కోసం ప్రకటించారేమోనని పలువురూ భావించారు. కానీ, అందులో ఏమాత్రం నిజం లేదు. ఇప్పటివరకు చిత్రయూనిట్ మూడో భాగం గురించి ఎటువంటి ప్రకటన చేయలేదు. కాబట్టి అదంతా ఫేక్ న్యూస్ అని అర్థమవుతోంది. Is This For Real ? 3 Parts #Dhurandhar The Final Chapter on 14 June 2026 pic.twitter.com/EqAINSzpxN— INDIAN (@hindus47) March 18, 2026 చదవండి: కరుప్పు ఫస్ట్ ఛాయిస్ సూర్య కాదా? -
రికార్డులు బ్రేక్ చేసినా 'పుష్ప2'ని దాటలేకపోయింది
ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర 'ధురంధర్ 2' సినిమా సంచలనాలు సృష్టిస్తోంది. బీభత్సమైన అంచనాలతో బరిలోకి దిగిన ఈ మూవీ ఉత్తరాదితో పాటు దక్షిణాదిలోని బీ,సీ సెంటర్లలోనూ హవా చూపిస్తుండటం ట్రేడ్ వర్గాలని ఆశ్చర్యపరుస్తోంది. మొదటి రోజు నుంచి వందల కోట్ల వసూళ్లు సాధిస్తున్న ఈ చిత్రం ఇప్పుడు తొలి వీకెండ్ పూర్తయ్యేసరికి ఊహించని రికార్డులు సొంతం చేసుకుంది. ఇంతకీ నాలుగు రోజుల కలెక్షన్స్ ఎన్ని కోట్లు వచ్చాయంటే?(ఇదీ చదవండి: ధురంధర్ 2 సక్సెస్: 28 ఏళ్ల నాటి లేఖ వైరల్)తొలి వీకెండ్ పూర్తయ్యేసరికి 'ధురంధర్ 2' చిత్రానికి రూ.750 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. ఆదివారం ఒక్కరోజే కేవలం మన దేశంలోనే రూ.115 కోట్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఇదో రికార్డ్. ఇప్పటివరకు వీకెండ్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా 'పుష్ప 2' రూ.762 కోట్లతో అగ్రస్థానంలో ఉండగా.. దీని తర్వాతి స్థానంలోకి 'ధురంధర్ 2' వెళ్లింది. ఈ క్రమంలోనే బాహుబలి 2 (రూ.591 కోట్లు), ఆర్ఆర్ఆర్ (రూ.470 కోట్లు), కల్కి 2898 ఏడీ (రూ.500 కోట్లు) తదితర రికార్డులు బ్రేక్ చేసింది.మరోవైపు బాలీవుడ్లోనూ ఇప్పటివరకు షారుఖ్ ఖాన్ 'పఠాన్' పేరిట రూ.287 కోట్ల కలెక్షన్స్ రికార్డ్ ఉంది. దీన్ని 'ధురంధర్ 2' అధిగమించడంతో పాటు సరికొత్త ఘనత సాధించింది. చూస్తుంటే ఇప్పుడప్పుడే ఈ చిత్ర రచ్చ ఆగేలా లేదు. తొలి వారం పూర్తయ్యేసరికి రూ.1000 కోట్లు సాధించడం పక్కా అనిపిస్తుంది. అలానే రూ.2000 కోట్ల మార్క్ని కూడా త్వరలోనే అందుకునే అవకాశముందని విశ్లేషకులు మాట్లాడుకుంటున్నారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 19 సినిమాలు) -
ధురంధర్ 2 సక్సెస్: 28 ఏళ్ల నాటి లేఖ వైరల్
బ్లాక్బస్టర్ ధురంధర్కు కొనసాగింపుగా వచ్చిన చిత్రం ధురంధర్: ద రివేంజ్. రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కనక వర్షం కురిపిస్తోంది. అటు సోషల్ మీడియాలో నార్త్ నుంచి సౌత్ వరకు ఎందరో సెలబ్రిటీలు దర్శకుడు ఆదిత్య ధర్ను, అతడి సినిమాను ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారు. ఈ మూవీలో నటించిన అందరికీ మంచి పేరు, గుర్తింపు వచ్చింది. 28 ఏళ్ల నాటి లేఖఈ క్రమంలో ధురంధర్ 2లో మొహమ్మద్ ఆలంగా నటించిన గౌరవ్ గేరా తన కెరీర్ తొలినాళ్లలో ఎదుర్కొన్న ఇబ్బందులను బయటపెట్టాడు. 1998లో ఢిల్లీ నుంచి ముంబైకి వచ్చిన రోజుల్లో పేరెంట్స్కు రాసిన లేఖను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇది నేను 1998 డిసెంబర్ 3న మా అమ్మానాన్నలకు రాసిన లేఖ. ముంబైకి వచ్చి అప్పటికింకా నెల రోజులు కూడా కాలేదు. అప్పట్లో ఈమెయిల్స్ గట్రా ఏవీ లేవు.. ఇదిగో ఇలా ఉత్తరాలు రాసుకునేవాళ్లం. అమ్మానాన్న థాంక్యూఆ తర్వాత టీవీ, సినిమా, యాడ్స్, రేడియో, టిక్టాక్ రీల్స్.. ఇలా ఎన్నో ఒడిదుడుకులతో నా ప్రయాణం సాగింది. భగవంతుడు నాపై ఎంతో దయచూపించాడు. ఇదిగో ఇలా ధురంధర్లో నటించే అవకాశం.. రానున్న రోజుల్లో భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియదు. ఈ జర్నీలో నాకు అండగా నిలిచిన అమ్మానాన్నకు ధన్యవాదాలు అంటూ లేఖను పంచుకున్నాడు.లేఖలో ఏముందంటే?అమ్మానాన్న, ఎలా ఉన్నారు? నేనిక్కడ క్షేమంగానే ఉన్నాను. ప్రస్తుతానికి డబ్బుపరంగా ఏమీ కలిసిరావడం లేదు. కానీ, త్వరలోనే అంతా మంచే జరుగుతుందని ఆశిస్తున్నాను. ఢిల్లీతో పోలిస్తే ఇక్కడ అవకాశాలు ఎక్కువే.. ఖర్చు తగ్గించుకునేందుకు నేను స్నేహితుడితో కలిసి ఓ చిన్న గదిలో ఉంటున్నాను. ఫోన్, కరెంట్, గ్యాస్, వాటర్ బిల్లుతో పాటు భోజన ఖర్చులు కూడా ఇద్దరం పంచుకుంటున్నాం. భవిష్యత్తుపై కొండంత ఆశ ఉంది. కానీ నేను నేర్చుకోవాల్సింది కూడా చాలా ఉంది అని రాసుకొచ్చాడు. ఇది చూసిన నటీనటులు, అభిమానులు మీరు చాలా దూరం వచ్చారు, మీ కథ వింటుంటే కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి అని కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Gaurav Gera (@gauravgera) చదవండి: ద 50 షో.. విన్నర్గా శివ్ ఠాక్రే.. ప్రైజ్మనీ మాత్రం ఎవరికంటే? -
The 50: అరకోటి ప్రైజ్మనీ.. విన్నర్కు కాదు, అతడి అభిమానికి!
ద 50 రియాలిటీ షోకి శుభం కార్డు పడింది. 50 మంది సెలబ్రిటీలు పాల్గొన్న ఈ షో మార్చి 22న విజయవంతంగా ముగిసింది. ఫైజల్ షైక్, కృష్ణ ష్రాఫ్, రజత్ దలాల్లను వెనక్కు నెడుతూ శివ్ ఠాక్రే విజేతగా నిల్చాడు. అతడికి ద 50 ట్రోఫీ అయితే దక్కింది. కానీ ప్రైజ్మనీ మాత్రం కాదు! అదే ఈ షో స్పెషాలిటీ.. కంటెస్టెంట్కు బదులుగా అతడి అభిమాని అరకోటి గెల్చుకునే అవకాశం ఉంటుంది. అలా శివ్ ఠాక్రే టైటిల్ గెలిస్తే అతడి అభిమాని సీతారామ్ ప్రహ్లాద్ అఘవ్ రూ.50 లక్షల ప్రైజ్మనీ సొంతం చేసుకున్నాడు.ఫినాలేలో ఏం జరిగిందంటే.. 50 మంది కంటెస్టెంట్లతో ద 50 షో మొదలైంది. ఫైనల్స్కు వచ్చేసరికి ఐదుగురు మాత్రమే మిగిలారు. వారే రజత్ దలాల్, శివ్ ఠాక్రే, కృష్ణ ష్రాఫ్, కాక (రవీందర్ సింగ్), ఫైజల్ షైక్. మీలో ఒకర్ని మీరే ఎలిమినేట్ చేయాలని ద లయన్(షోలో బాస్) చెప్పగా.. శివ్, కృష్ణ, కాక.. రజత్ను ఎలిమినేట్ చేశారు. మిగిలిన నలుగురికి నాలుగు రకాల టాస్కులు అప్పగించారు. వీటన్నింటిని దాటుకుని శివ్ ఠాక్రే గెలిచి సత్తా చూపించాడు. ఫైజల్ షైక్ ఫస్ట్ రన్నరప్గా నిలిచాడు. అభిమానికి రూ.50 లక్షలునిజానికి ప్రిన్స్ నరూలా త్యాగం చేసిన టికెట్ టు ఫినాలేతోనే శివ్ ఠాక్రే ఫైనల్స్లో చోటు దక్కించుకున్నాడు. ఆ ఒక్క అవకాశాన్ని వాడుకుని ఇప్పుడేకంగా ట్రోఫీ గెలవడం విశేషం. రూ.50 లక్షలు గెలిచిన శివ్ ఠాక్రే అభిమాని సీతారాం మాట్లాడుతూ.. నేను, నా కుటుంబం పొలం పని చేసుకుంటాం. ఈ ప్రైజ్మనీ గెలవడం చాలా సంతోషంగా ఉంది. అయితే ఇదంతా ఒక మోసమేమో అనుకునేవాడిని. జరుగుతుందంతా చూస్తుంటే ఒక కలలా ఉంది. నా తల్లిదండ్రులకు మంచి ఇల్లు, కారు కొనివ్వాలనుకున్నాను, ఈ డబ్బుతో అదే చేస్తాను అని పేర్కొన్నాడు. కాగా శివ్ ఠాక్రే.. గతంలో మరాఠి బిగ్బాస్ రెండో సీజన్ విజేతగా నిలవగా హిందీ బిగ్బాస్ 16వ సీజన్లో ఫస్ట్ రన్నరప్గా నిలిచాడు. View this post on Instagram A post shared by JioHotstar Reality (@jiohotstarreality) చదవండి: మంచు లక్ష్మి ఇంట్లో వేడుక.. మోహన్బాబు ఆశీర్వాదం -
'ధురంధర్ 2'.. ఇంత పొరపాటు ఎలా చేశారు?
ప్రస్తుతం భారతీయ బాక్సాఫీస్ దగ్గర 'ధురంధర్ 2' హవా కనిపిస్తోంది. పేరుకే హిందీ సినిమా అయినప్పటికీ డబ్బింగ్ రూపంలో తెలుగు ప్రేక్షకుల్ని కూడా అలరిస్తోంది. దీని ప్రభావమో ఏమో గానీ పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' కలెక్షన్స్ కూడా పూర్తిగా డౌన్ అయిపోయాయి. అయితే 'ధురంధర్ 2' చూసి చాలామంది ఎంజాయ్ చేస్తుండగా.. మరికొందరు మాత్రం ప్రొపగాండా మూవీ అని విమర్శిస్తున్నారు. వీటి సంగతి కాసేపు పక్కనబెడితే మూవీలో ఓ పొరపాటు మాత్రం అలానే వదిలేశారు. దీన్ని ఇప్పుడు నెటిజన్లు కనిపెట్టారు.(ఇదీ చదవండి: పవన్-హరీశ్ శంకర్ మూడో సినిమా.. అయ్యే పనేనా?)గతేడాది డిసెంబరులో 'ధురంధర్' తొలి భాగం రిలీజ్ కాగా.. ఈ శుక్రవారం(మార్చి 19) సీక్వెల్ విడుదలైంది. ప్రమోషన్స్ ఏం లేకపోయేసరికి వాయిదా పడుతుందేమో అని చాలామంది అనుకున్నారు. కానీ చెప్పిన తేదీకే థియేటర్లలోకి వచ్చారు. కాకపోతే తెలుగు వెర్షన్ మాత్రం రెండు రోజులు ఆలస్యంగా అంటే నిన్నటి(మార్చి 21) నుంచి అందుబాటులోకి తెచ్చారు.అసలు విషయానికొస్తే ఈ మూవీ ఇంటర్వెల్ సీన్లో హీరో, పిండా అనే పాత్రధారి మధ్య బాత్రూమ్లో చిన్నపాటి ఫైట్ సీన్ జరుగుతుంది. మూవీలో ఈ సన్నివేశం చాలామందికి ఆకట్టుకున్నప్పటికీ.. అద్దంలో కెమెరామ్యాన్ కూడా కనిపిస్తాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు ట్విటర్లో వైరల్ అవుతోంది. ఈ పొరపాటు అసలు మేకర్స్ చూసుకోలేదా అని మాట్లాడుకుంటున్నారు. అయితే చెప్పిన తేదీన రిలీజ్ చేయాలనే హడావుడిలో దీన్ని మర్చిపోయింటారేమో అని మాట్లాడుకుంటున్నారు.'ధురంధర్ 2' కలెక్షన్స్ విషయానికొస్తే.. ప్రస్తుతం రూ.500 కోట్ల మార్క్ దాటేసినట్లు తెలుస్తోంది. అలానే ఓవర్సీస్లోనూ 16 మిలియన్ డాలర్లు సాధించినట్లు టాక్. తొలి భాగంలానే ఇది కూడా లాంగ్ రన్లో మరిన్ని వందల కోట్లు సొంతం చేసుకునేలా కనిపిస్తుంది. మరి 'ధురంధర్ 2' రచ్చ.. ఎన్ని వందల కోట్ల దగ్గర ఆగుతుందో చూడాలి?(ఇదీ చదవండి: క్రికెట్ రాజకీయాలకు బలైన 'ధురంధర్' దర్శకుడు)A Cameraman showing in this scene.Peak Detailing by Aditya Dhar Damm 🤣#Dhurandhar2 #DhurandherTheRevenge pic.twitter.com/LDjDG8nReP— Sunil Goriya (@Sunil_Goriya) March 21, 2026 -
హాలీవుడ్ సినిమా కోసం హృతిక్.. ఏలియన్కు డ్యాన్స్ నేర్పిస్తూ..
బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్, హాలీవుడ్ సైన్స్-ఫిక్షన్ చిత్రం 'ప్రాజెక్ట్ హెయిల్ మేరీ' ప్రమోషన్స్ కోసం హాలీవుడ్ దర్శకనిర్మాతలతో చేతులు కలిపారు. భారతీయ ప్రేక్షకులకు ఈ సినిమాను చేరువ చేయడానికి హృతిక్ ఒక స్పెషల్ వీడియోతో ముందుకు వచ్చారు.ఏలియన్కి డ్యాన్స్"జాదూ వర్సెస్ రాకీ" అని టైటిల్ ఇచ్చిన ఈ వీడియోలో హృతిక్ రోషన్ తన సూపర్ హిట్ సాంగ్ 'ఏక్ పల్ కా జీనా' ఐకానిక్ స్టెప్ను ఈ హాలీవుడ్ చిత్రంలోని ఏలియన్ క్యారెక్టర్ 'రాకీ'కి నేర్పిస్తున్నట్లు చూపించారు. హృతిక్, రాకీల మధ్య ఉన్న స్నేహాన్ని చూసి, 'కోయీ.. మిల్ గయా'లోని హృతిక్ పాత ఏలియన్ స్నేహితుడు 'జాదూ' క్యూట్గా రియాక్ట్ అవ్వడం ఈ వీడియోలో ప్రధాన ఆకర్షణ.హాలీవుడ్ స్టార్ హీరో ర్యాన్ గోస్లింగ్ నటించిన ఈ చిత్రం, 'ది మార్షియన్' ఫేమ్ ఆండీ వీర్ రాసిన బెస్ట్ సెల్లింగ్ నవల ఆధారంగా తెరకెక్కింది. 2025 డిసెంబర్లో ఈ నవలపై తనకున్న ఇష్టాన్ని హృతిక్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఇప్పుడు అదే సినిమాను ఇండియాలో ప్రమోట్ చేస్తుండటం విశేషం. హృతిక్ లాంటి స్టార్ తమ సినిమాను ప్రమోట్ చేయడం పట్ల సోనీ పిక్చర్స్ ఇండియా ప్రతినిధి షోనీ పంజీకరణ్ ఆనందం వ్యక్తం చేశారు. ఫిల్ లార్డ్, క్రిస్టోఫర్ మిల్లర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ర్యాన్ గోస్లింగ్, సాండ్రా హుల్లర్, కెన్ లెయుంగ్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఈ మూవీ భారత్లో ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ఐమాక్స్ ఫార్మాట్లో మార్చి 26న విడుదల కానుంది. View this post on Instagram A post shared by Sony Pictures IN (@sonypicturesin) -
50 ఏళ్ల వయసులో తండ్రయిన నిర్మాత
ప్రముఖ బాలీవుడ్ నిర్మాత మధు మంతెన తండ్రిగా ప్రమోషన్ పొందాడు. 50 ఏళ్ల వయసులో తండ్రయ్యాడు. మధు మంతెన - ఐరా త్రివేది దంపతులకు ఆదివారం (మార్చి 22) తెల్లవారుజామున పండంటి మగ బిడ్డ జన్మించింది. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. కాగా మధు మంతెన- ఐరా త్రివేది దంపతులు ప్రెగ్నెన్సీ విషయాన్ని ఈ ఏడాది జనవరి 15న వెల్లడించారు. బిడ్డ కోసం ఎదురుచూపులుభార్య బేబీ బంప్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. మార్చిలో డెలివరీ డేట్ ఇచ్చినప్పటినుంచి బిడ్డ రాక కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు బాబు ఈ ప్రపంచంలో అడుగుపెట్టగానే వారి కుటుంబంలో ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.రెండో పెళ్లిహైదరాబాద్కు చెందిన మధు మంతెన.. 2015లో ఫ్యాషన్ డిజైనర్ మసాబా గుప్తాని పెళ్లి చేసుకున్నాడు. కానీ వీరి వైవాహిక జీవితం ఎంతోకాలం సజావుగా సాగలేదు. దీంతో 2019లో విడాకులు తీసుకున్నారు. తర్వాత యోగా ట్రైనర్ ఐరా త్రివేదిని రెండో పెళ్లి చేసుకున్నాడు. సినిమాల విషయానికి వస్తే.. ఈయన గతంలో తెలుగులో కార్తీక్ మూవీని నిర్మించాడు. ఆ తర్వాత బాలీవుడ్కు షిఫ్ట్ అయ్యాడు. ఆమిర్ ఖాన్ గజిని, క్వీన్, సూపర్ 30, రక్త చరిత్ర వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు నిర్మాతగా వ్యవహరించాడు.చదవండి: ధురంధర్ 2 నుంచి నన్ను తీసేశారనుకున్నా: బాలీవుడ్ నటుడు -
సల్మాన్ ఖాన్ పేరు.. నన్ను ధురంధర్ 2లో తీసేశారనుకున్నా!
రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. ఈ మూవీలో డానిష్ ఇక్బాల్.. బడే సాహెబ్ అలియాస్ దావూద్ ఇబ్రహీంగా నటించాడు. అయితే సినిమాలో తనను ఎక్కడ తీసేస్తారో అని తెగ భయపడిపోయానంటున్నాడు డానిష్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అతడు మాట్లాడుతూ.. ధురంధర్ 1 రిలీజయ్యాక సీక్వెల్లో బడే సాహెబ్గా ఎవరు కనిపించనున్నారని జనాల్లో ఆసక్తి మొదలైంది. నన్ను తీసేశారనుకున్నా..ఈ క్రమంలో ఎంతోమంది పేర్లు తెరపైకి వచ్చాయి. వారిలో సల్మాన్ ఖాన్, ఇమ్రాన హష్మీ పేర్లు కూడా ఉన్నాయి. అది చూసి ఒకరకంగా నేను చాలా భయపడ్డాను. బడే సాహెబ్ కోసం అప్పటికే నేను సెలక్ట్ అయ్యాను. కానీ నన్ను పక్కనపెట్టేశారేమో.. నా స్థానంలో పెద్ద స్టార్స్ను తీసుకుంటున్నారేమో అని కంగారుపడ్డాను. డైరెక్టర్ ఆదిత్య ధర్కు ఫోన్ చేసి కనుక్కుందామా? అని ఆందోళన చెందాను.ఆ రెండు పాత్రలు ఒక్కటే అని తెలీదుకానీ, తర్వాత అలాంటిదేం లేదని తెలిసి ఊపిరి పీల్చుకున్నాను. నిజానికి బడే సాహెబ్, దావూద్ ఇబ్రహీం ఒక్కరేనని నాకూ ముందు తెలీదు. నాది మంచానికే పరిమితమైన దావూద్ ఇబ్రహీం పాత్ర అని మాత్రమే తెలుసు. తర్వాత హీరో బడే సాహెబ్ కోసం వెతుకుతున్నప్పుడు ఆయనెవరని అందరూ ఆలోచించడం మొదలుపెట్టాం. పర్వీజ్ ముషారఫా? ఒసామా బిన్ లాడెనా? అనుకున్నాం. అదే సమయంలో దావూదే బడే సాహెబా? అన్న అనుమానమూ వచ్చింది. చివరకు అదే జరిగింది.మేకప్ కోసం 12 గంటలుముసలి వయసులో ఉన్న దావూద్గా కనిపించడం కోసం దాదాపు ఏడెనిమిది గంటలు శ్రమించాల్సి వచ్చింది. ఆ ప్రోస్తటిక్ మేకప్ను తీసేందుకు కనీసం రెండుమూడు గంటలైనా పెట్టేది. అలా మేకప్కే 12 గంటల సమయం అయిపోయేది అని చెప్పుకొచ్చాడు. ఇకపోతే మార్చి 19న రిలీజైన ధురంధర్ 2 కేవలం మూడు రోజుల్లోనే రూ.500 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. -
మహేశ్బాబుతో యాక్టింగ్.. సెట్లో ఎలా ఉంటారంటే?
కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కితే ఆ కిక్కే వేరంటోంది బాలీవుడ్ నటి నీరూ సెహగల్. ఈమె కీలక పాత్రలో నటించిన కొహ్రా వెబ్స సిరీస్ రెండో సీజన్కు మంచి ఆదరణ లభిస్తోంది. ప్రేక్షకుల రెస్పాన్స్ చూసి సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవుతోంది నీరూ. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. నటులుగా సినిమా, సిరీస్ల కోసం మేం ఎంతో కష్టపడతాం. ఎప్పటికీ మర్చిపోనుఅవి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయని తెలిసినప్పుడు అంతకంటే సంతోషం ఇంకేముంటుంది? నేను అమెరికాలో పెరిగినప్పటికీ పంజాబీ సాంప్రదాయాలకు ఎప్పుడూ కట్టుబడే ఉన్నాను. నా మూలాల్ని ఎప్పటికీ మర్చిపోలేదు. ఆడిషన్ ద్వారానే కొహ్రా సీజన్కు ఎంపికయ్యాను. నా పాత్ర ఎంతో బలంగా ఉంటుంది. ఇలాంటి బలమైన రోల్స్ మరిన్ని చేయాలనుంది. కథ బాగుండి, మంచి పాత్ర ఆఫర్ చేస్తే దక్షిణాదిలోనూ నటించడానికి రెడీ.. మహేశ్బాబుతో యాక్టింగ్రెండేళ్ల క్రితం ఓ యాడ్లో మహేశ్బాబుతో కలిసి పని చేశాను. ఆయన పెద్ద సూపర్స్టార్ అయినప్పటికీ సెట్లో చాలా వినయంగా ఉంటాడు. డెడికేషన్తో పని చేస్తాడు. దానివల్ల షూట్ అంతా చాలా సౌకర్యంగా జరిగింది. ఆయన ఏకాగ్రత, క్రమశిక్షణ.. ఇలా తనను చూసి చాలా నేర్చుకోవచ్చు అని నీరూ సెహగల్ చెప్పుకొచ్చింది.చదవండి: ధురంధర్ 2 విజయం వెనక తెలుగు సినిమా: ఆదిత్య ధర్ -
దురంధర్-2లో టీమిండియా క్రికెటర్స్.. ఈ వీడియో చూశారా?
ఇప్పుడు ఎక్కడ చూసినా దురంధర్ ఫీవర్ కనిపిస్తోంది. మార్చి 19న రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ను షేక్ చేస్తోంది. ప్రీమియర్స్తోనే వసూళ్లు సునామీ మొదలెట్టిన ఈ సినిమా కేవలం మూడు రోజుల్లోనే రూ.500 కోట్ల మార్క్ దాటేసింది. ఆదిత్య ధర డైరెక్షన్లో వచ్చిన ఈ సీక్వెల్ హిందీతో పాటు దక్షిణాది భాషల్లోనూ విడుదలైంది. ఈ మూవీపై టాలీవుడ్ స్టార్స్తో పాటు పలువురు సినీ నటులు ప్రశంసలు కురిపిస్తున్నారు. దర్శకధీరుడు రాజమౌళి సైతం దురంధర్-2 మూవీని పొగిడారు.దురంధర్-2 రిలీజ్ వేళ సోషల్ మీడియాలో ఓ రేంజ్లో హల్చల్ చేస్తోంది. దురంధర్-2 మూవీపై రీల్స్, వీడియోలు పెద్దఎత్తున వైరలవుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఓ వీడియో నెట్టింట అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ సినిమాలో టీమిండియా క్రికెటర్స్ నటిస్తే ఎలా ఉంటుంది? అనే కోణంలో ఓ వీడియోను రూపొందించారు. రణ్వీర్సింగ్ పాత్రలో విరాట్ కోహ్లీ కనిపించగా.. జమీల్ జమాలీ పాత్రలో వీరేంద్ర సెహ్వాగ్ ఉండేలా క్రియేట్ చేశారు. ఈ వీడియో చేసిన ఫన్నీ కోసమే అయినా.. క్రికెటర్స్ ఈ మూవీలో ఎలా కనిపిస్తారో చూస్తే మాత్రం అద్భుతంగా అనిపిస్తోంది. ఇంకెందుకు ఆలస్యం ఆ వీడియో మీరు కూడా చూసేయండి. pic.twitter.com/GalcyV6WIe ఇండియన్ క్రికెటర్లు దురంధర్లో నటిస్తే? 💀🔥— Tupaki (@tupaki_official) March 21, 2026 -
దూసుకెళ్తోన్న దురంధర్-2.. కేవలం మూడు రోజుల్లోనే అన్ని కోట్లా?
రణ్వీర్సింగ్ హీరోగా వచ్చిన దురంధర్-2 హవా కొనసాగుతోంది. దురంధర్కు సీక్వెల్గా వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ను షేక్ చేస్తోంది. ప్రీమియర్స్తోనే రికార్డ్ స్థాయిలో వసూళ్లు సాధించిన ఈ సినిమా కేవలం రెండు రోజుల్లోనే రూ.300 కోట్ల మార్క్ దాటేసింది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మరో రికార్డ్ను తన ఖాతాలో వేసుకుంది. కేవలం మూడు రోజుల్లోనే రూ. 500 కోట్ల క్లబ్లో చేరింది. ప్రపంచవ్యాప్తంగా రూ.501 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఈ కలెక్షన్స్తో ఇండియన్ సినిమా చరిత్రలో సరికొత్త రికార్డ్ సృష్టించింది.నెట్ వసూళ్ల పరంగా చూస్తే మూడు రోజుల్లోనే రూ.రూ. 339.27 కోట్లు వసూలు చేసింది. మూడో రోజు అత్యధికంగా రూ.113 కోట్ల నికర వసూళ్లు రాబట్టింది. కేవలం మూడో రోజు వసూళ్లతోనే హిందీ సినిమా చరిత్రలోనే ఒక కొత్త అధ్యాయాన్ని సృష్టించింది. కేవలం ఇండియాలో మాత్రమే కాదు.. ఓవర్సీస్లోనూ దురంధర్-2 దూసుకెళ్తోంది.ఉత్తర అమెరికాలో 'ధురంధర్ 2' ఏకంగా 4,405 షోలు ప్రదర్శిస్తున్నారు. ఒక ఇండియన్ సినిమా ఇంత భారీ స్థాయిలో విడుదల కావడం ఇదే మొదటిసారి. మూడో రోజు కూడా రెండు లక్షలకు టికెట్లకు పైగా విక్రయించారు. కేవలం అడ్వాన్స్ బుకింగ్ల ద్వారానే సుమారు రూ.23.70 కోట్ల భారీ వసూళ్లను నమోదు చేసింది. ఈ వసూళ్లను చూస్తే ఉత్తర అమెరికా మార్కెట్లో ఒక ఇండియన్ మూవీ ఒక్క రోజులో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా 'ధురంధర్ 2' నిలవనుంది. యూకేలోనూ దురంధర్-2 షోలు హౌస్పుల్గా రన్ అవుతున్నాయి. బెల్ఫాస్ట్ నగరంలో ఏడు షోలు హౌస్పుల్గా ప్రదర్శించారు. ఇదే జోరు కొనసాగితే ప్రపంచవ్యాప్తంగా రూ. 2 వేల కోట్ల క్లబ్లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. -
క్రికెట్ రాజకీయాలకు బలైన 'ధురంధర్' దర్శకుడు
'డాక్టర్ కాబోయే యాక్టర్ అయ్యాను'.. ఇండస్ట్రీలో ఎక్కువగా ఈ మాట వినిపిస్తూ ఉంటుంది. నటుడు లేదా దర్శకుడు అవ్వాలని ఆలోచనతో ఇండస్ట్రీలో అడుగుపెట్టేవాళ్లు కొందరైతే.. అనుకోని విధంగా ఇక్కడొచ్చి అద్భుతమైన గుర్తింపు తెచ్చుకునేవాళ్లు మరికొందరు. అలాంటి వాళ్లలో 'ధురంధర్' డైరెక్టర్ ఆదిత్య ధర్ ఒకడు. క్రికెటర్ కావాల్సిన ఇతడు పాన్ ఇండియా లెవల్లో ఎలాంటి గుర్తింపు తెచ్చుకున్నాడు. అసలు ఆదిత్య బ్యాక్ గ్రౌండ్ ఏంటి?(ఇదీ చదవండి: 'ధురంధర్ 2'.. రెండు రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయంటే?)ఢిల్లీలో పుట్టిన ఆదిత్య ధర్, కశ్మీర్ పండిట్ కుటుంబానికి చెందిన కుర్రాడు. టీమిండియాకి ఎలాగైనా ఆడాలని అనుకునేవాడు. అందుకు తగ్గట్లే ఢిల్లీ అండర్-19 టీమ్ తరఫున కూడా ఆడేవాడు. అయితే 2002లోని భారత అండర్-19 వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కలేదు. క్రికెట్లోని రాజకీయాలే దీనికి కారణమని భావించి తను ఎంతగానే నమ్మిన క్రికెట్ని పక్కనబెట్టేశాడు. రైటర్గా ఇండస్ట్రీలోకి వచ్చాడు. తొలుత 2006లో వచ్చిన కాబుల్ ఎక్స్ప్రెస్ పాటల రచయితగా పనిచేశాడు. తర్వాత హల్ ఏ దిల్, ఆక్రోష్, తేజ్ తదితర చిత్రాలకు కూడా రచయితగా చేశాడు. స్టార్ డైరెక్టర్ ప్రియదర్శన్ దగ్గర సహాయకుడిగానూ వర్క్ చేశాడు. అయితే 2019లో వచ్చిన 'ఉరి' ఇతడిని ఓవర్ నైట్ సెన్సేషన్ చేసిపడేసింది. ఇదే దర్శకుడిగా తొలి చిత్రం. ఇది బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో పాటు దేశవ్యాప్తంగా ఆదిత్య పేరు మార్మోగిపోయేలా చేసింది. ఈ మూవీలో 'హౌ ఈజ్ ద జోష్' డైలాగ్ అయితే తెగ వైరల్ అయిపోయింది. ఇదే చిత్రానికిగానూ ఉత్తమ దర్శకుడిగా జాతీయ అవార్డ్ కూడా తొలి సినిమాకే సొంతం చేసుకున్నాడు.ఇక అదే ఏడాది తన సోదరుడితో కలిసి బీ62 స్టూడియోస్ స్థాపించిన ఆదిత్య ధర్.. తన భార్య, నటి యామీ గౌతమ్ ప్రధాన పాత్రలో నటించిన 'ఆర్టికల్ 370'ని నిర్మించి, రచయితగానూ పనిచేసి హిట్ కొట్టాడు. తొలి మూవీ వచ్చిన దాదాపు ఆరేళ్లకు అంటే గతేడాది డిసెంబరులో 'ధురంధర్'తో వచ్చాడు. సర్ప్రైజింగ్ హిట్ కొట్టాడు. 50 రోజులకు పైనే ఇది థియేటర్లలో ప్రదర్శితమైంది. రెండు రోజుల క్రితం రిలీజైన ధురంధర్ 2 అయితే బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. వందల కోట్ల వసూళ్లు సాధిస్తోంది. క్రికెటర్ కావాల్సిన వాడు ఇప్పుడు బాక్సాఫీస్ మొనగాడు అయిపోయాడు.ఆదిత్య తల్లి సునీత ధర్.. ఢిల్లీ యూనివర్సిటీలో డీన్గా పనిచేయగా, తండ్రి గురించిన సమాచారం అయితే దొరకలేదు. 'ఉరి' తీస్తున్న టైంలోనే అందులో నటించిన యామీ గౌతమ్తో ప్రేమలో పడ్డ ఆదిత్య.. 2021లో ఆమెని పెళ్లి చేసుకున్నాడు. 2024లో వీళ్లకు కొడుకు పుట్టాడు. ప్రస్తుతం 'ధురంధర్ 2' విజయాన్ని ఈ భార్యభర్తలిద్దరూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఏదేమైనా మూడంటే మూడే సినిమాలు తీసి దేశవ్యాప్తంగా అందరూ తన గురించి మాట్లాడుకునేలా చేయడం విశేషం.(ఇదీ చదవండి: డూప్, VFX కాదు.. నిజంగా ధురంధర్ హీరోనే!) -
డూప్, VFX కాదు.. నిజంగా ధురంధర్ హీరోనే!
సినిమాలో కాస్త కఠినమైన సీన్లు, యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయంటే చాలు చాలామంది హీరోలు వారి డూప్లతోనే చేయిస్తారు. దర్శకనిర్మాతలు సైతం ముందుజాగ్రత్త కొద్దీ డూప్లను పెట్టే సీన్లు పూర్తి చేస్తారు. కొన్ని చోట్లేమో హీరోనే పెట్టి సీన్లు చేసినా.. భారీగా వీఎఫ్ఎక్స్ వాడతారు. అతడే సాహసాలు చేసినట్లుగా తెరపై మాయ చేస్తారు.డూప్ కాదుకానీ ధురంధర్ హీరో రణ్వీర్ సింగ్ మాత్రం నిజంగానే సాహసం చేశాడు. డూప్, వీఎఫ్ఎక్స్ జోలికి పోకుండా రియల్ స్టంట్ చేశాడు. సినిమాలో సీక్రెట్ ఏజెంట్గా మారేందుకు హమ్జా (రణ్వీర్ సింగ్) కఠోరమైన శిక్షణ తీసుకుంటాడు. అందులో భాగంగానే నీటిలో ఊపిరి బిగపట్టుకుని ఉండేలా సాధన చేస్తాడు. కదలకుండా కూర్చున్న హీరోఅందుకోసం నీటి అడుగు భాగంలో కదలకుండా కూర్చుంటాడు. ఈ సీన్ను చాలా సహజంగా చిత్రీకరించారు. అందుకు సంబంధించిన మేకింగ్ క్లిప్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇప్పటిదాకా అతడి నటనను మెచ్చుకున్న జనం.. ఈ వీడియో చూశాక అతడి అంకితభావాన్ని ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారు. నీ కష్టం వృథాకాలేదు, నువ్వు చాలా గ్రేట్ యాక్టర్ అని కితాబిస్తున్నారు.సినిమాసినిమా విషయానికి వస్తే.. 2025 డిసెంబర్లో వచ్చిన బ్లాక్బస్టర్ ధురంధర్ మూవీకి సీక్వెల్గా ధురంధర్ 2 తెరకెక్కింది. రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం మార్చి 19న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ మూవీ తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.240 కోట్లు రాబట్టింది. #RanveerSingh performs intense underwater scene with no VFX 🔥Pure dedication & madness by Ranveer 💥#Dhurandhar2 #DhurandharTheRevenge pic.twitter.com/go6iHgSoYb— Milagro Movies (@MilagroMovies) March 21, 2026 చదవండి: త్వరలో పెళ్లి? తేజ సజ్జా రియాక్షన్ ఇదే -
ఐశ్వర్యరాయ్కు సారీ చెప్పిన హీరోయిన్, ఎందుకంటే?
పిల్లి కళ్ల హీరోయిన్ అనగానే అందరికీ మొదట గుర్తొచ్చే పేరు ఐశ్వర్యరాయ్.. ఆ తర్వాత కాస్త అటూఇటుగా ఐష్లాగే కనిపించే స్నేహా ఉల్లాల్ గుర్తొస్తుంది. తను కూడా హీరోయిన్ అయినప్పటికీ తనను ఐశ్వర్యతో పోల్చినందుకు తెగ సంబరపడిపోయింది. అదే సమయంలో ఒకసారి ఆమెను నేరుగా కలిసి క్షమాపణలు కూడా చెప్పింది.. అదెందుకో ఓసారి చూసేద్దాం..సినిమా'ఉల్లాసంగా ఉత్సాహంగా' సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది స్నేహా ఉల్లాల్. అప్పటికే 'లక్కీ: నో టైం ఫర్ లవ్' (2005) చిత్రంతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. అలా ఓపక్క హిందీ సినిమాలు చేస్తూ మరోపక్క తెలుగు చిత్రాల్లో నటించింది. మధ్యలో కొంతకాలం సినిమాలకు గ్యాప్ ఇవ్వగా ఆ తర్వాత అడపడాదడపా సినిమాల్లో కనిపిస్తోంది.సల్మాన్ ఎలాంటివాడంటే?తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్నేహ తన కెరీర్ తొలినాళ్ల గురించి ఓపెన్ అయింది. ఆమె మాట్లాడుతూ.. లక్కీ మూవీతో నా సినీరంగ ప్రవేశం జరిగింది. చిత్రీకరణ సమయంలో హీరో సల్మాన్ ఖాన్ నాకెంతో సపోర్ట్ చేశాడు. ఎప్పుడూ ఓపిక, సహనంతో మెదిలేవాడు. తానో పెద్ద హీరో అని ఎన్నడూ యాటిట్యూడ్ చూపించలేదు.అలా ఫేమస్నిజానికి నేను సినిమాల్లోకి రావాలని ఎప్పుడూ అనుకోలేదు. కాలేజీలో చదువుకుంటున్న రోజుల్లో ఐశ్వర్యరాయ్ మిస్ వరల్డ్ కిరీటం అందుకుంది. చూడటానికి నేను ఐశ్వర్యరాయ్లాగే ఉంటానని చాలామంది అంటుంటారు. అలా ఆమె మిస్ వరల్డ్ కిరీటం ద్వారా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు అందుకుంటే నా చుట్టూ ఉన్న చిన్నప్రపంచంలో నేను సెలబ్రిటీ అయిపోయాను.ఐశ్వర్యకు సారీనేను ఒకే ఒక్కసారి ఐశ్వర్యను కలిశాను. నన్ను చూడగానే ఆమె 'వెల్కమ్ టు ద ఫ్యామిలీ.. బాలీవుడ్కు స్వాగతం' అని సాదరంగా ఆహ్వానించింది. అప్పుడు వెంటనే నేను ఆమెకు సారీ చెప్పాను. మీడియాలో పదేపదే నన్ను ఐష్తో పోలుస్తూనే ఉన్నారు. దాని గురించే చెప్తూ నన్ను క్షమించండి, దయచేసి నన్ను ద్వేషించకండి అన్నాను. మరి ఆమె దాన్ని ఎలా తీసుకుందో నాకు తెలీదు అని స్నేహా ఉల్లాల్ పేర్కొంది.చదవండి: ప్రియుడిని పెళ్లి చేసుకున్న పునర్నవి -
'ధురంధర్ 2'.. రెండు రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయంటే?
చాన్నాళ్ల తర్వాత పాన్ ఇండియా బాక్సాఫీస్ కళకళలాడుతోంది. రీసెంట్గానే థియేటర్లలోకి వచ్చిన 'ధురంధర్ 2'.. నిలకడగా వసూళ్ల సాధిస్తోంది. రిలీజ్కి భారీ హైప్ సొంతం చేసుకోగా.. సాంకేతిక కారణాల వల్ల హిందీ వెర్షన్ మాత్రమే తొలిరోజు విడుదలైంది. శనివారం నుంచి తెలుగు వెర్షన్ కూడా అందుబాటులోకి వచ్చింది. ఇంతకీ రెండు రోజుల పాటు ఈ చిత్రానికి కలెక్షన్స్ ఎంతొచ్చాయి?(ఇదీ చదవండి: దురంధర్-2 చెత్త సినిమా.. థియేటర్కు అస్సలు వెళ్లకండి)రణ్వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన 'ధురంధర్ 2'.. రెండు రోజుల్లో రూ.333 కోట్ల మేర గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్లు తెలుస్తోంది. తొలిరోజు మన దేశంలో రూ.145 కోట్ల నెట్ వసూళ్లు రాగా, శుక్రవారం ఈ నంబర్స్ కాస్త తగ్గి రూ.81 కోట్లు వచ్చినట్లు తెలుస్తోంది. మొత్తంగా రూ.226 కోట్ల నెట్ కాగా రూ.269 కోట్ల గ్రాస్ అని తెలుస్తోంది. మరోవైపు ఓవర్సీస్లోనూ రెండు రోజులకు కలిపి 7 మిలియన్ డాలర్లు వచ్చినట్లు టాక్.అలా ప్రపంచవ్యాప్తంగా 'ధురంధర్ 2' చిత్రానికి రెండు రోజులకు కలిపి రూ.333 కోట్ల గ్రాస్ వచ్చినట్లు తెలుస్తోంది. తెలుగు వెర్షన్ కూడా అందుబాటులోకి వచ్చింది కాబట్టి వీకెండ్ అయ్యేసరికి రూ.500 కోట్ల మార్క్ దాటేయడం గ్యారంటీ అనిపిస్తుంది. గతేడాది డిసెంబరులో ఫస్ట్ పార్ట్ రిలీజైనప్పుడు ఒక్కసారి వసూళ్లు రాలేదు. రోజురోజుకీ పెరుగుతూ వెళ్లాయి. దీనికి కూడా అలానే పునరావృతమయ్యేలా కనిపిస్తుంది. మొదటి భాగానికి రూ.1300 కోట్ల మేర కలెక్షన్స్ రాగా.. ఇప్పుడొచ్చిన సీక్వెల్, ల్యాంగ్ రన్లో ఎన్ని వేలకోట్ల కలెక్షన్స్ సాధిస్తుందో చూడాలి?(ఇదీ చదవండి: ఉస్తాద్ భగత్సింగ్ కలెక్షన్స్.. చెప్పుకోలేని పరిస్థితిలో మేకర్స్) -
కరెక్ట్ పర్సన్ దొరికితేనే పెళ్లి.. లేదంటే జీవితాంతం సింగిల్గానే!
కొందరు పెళ్లంటేనే ముఖం చాటేస్తారు. అలాంటివారిలో బాలీవుడ్ నటి దివ్య దత్తా ఒకరు. 48 ఏళ్ల వయసొచ్చినా ఇంకా పెళ్లి చేసుకోకుండా సింగిల్గానే ఉండిపోయింది. తాజాగా ఆమె ప్రేమ గురించి తన అభిప్రాయాన్ని చెప్పింది. దివ్య దత్తా మాట్లాడుతూ.. గతంలో నేను రిలేషన్షిప్స్లో ఉన్నాను.. కానీ, అవేవీ నాకు సరిపోవని అర్థమైంది. మా ఆలోచనలు భిన్నంగా ఉండేవి. సింగిల్గా ఉన్నానని..దాంతో ప్రేమికులుగా కంటే స్నేహితులుగానే బాగుంటామనిపించింది. అయితే ఇప్పటికీ నేను సింగిల్గా ఉండటం చూసి చాలామంది ఆశ్చర్యపోతుంటారు. జీవితంలో ఓ తోడు లేకుండా ఏం చేస్తున్నావు?, అసలు పెళ్లెందుకు చేసుకోలేదు? అని ప్రశ్నిస్తుంటారు. నా జీవితంలో ఏది ముఖ్యం? ఏది అవసరం అనేది నాకు బాగా తెలుసు.ప్రశాంతంగా ఉంటా..నాకు కరెక్ట్ అనిపించే వ్యక్తి తారసపడ్డప్పుడు కచ్చితంగా ప్రేమలో పడతాను.. కానీ అలాంటి వ్యక్తి దొరక్కపోతే ఇలా ఎప్పటికీ ఒక్కదాన్నే ప్రశాంతంగా ఉంటాను. అంతేతప్ప ఓ తోడుండాలి కదా అని ఎవరో ఒకర్ని పెళ్లి చేసుకోలేను. నాకు ఈ సమాజ ఆమోదం కన్నా మానసిక ప్రశాంతత, సంతోషమే ముఖ్యం.సినిమాపైగా రిలేషన్షిప్లో ఇద్దరూ జీవితాంతం కలిసుంటారన్న గ్యారెంటీ కూడా లేదు. ఎప్పుడు? ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు అని తెలిపింది. దివ్య దత్తా.. వీర్ జార, ఢిల్లీ 6, భాగ్ మిల్కా భాగ్ , హీరోయిన్, బ్లాక్మెయిల్ వంటి పలు సినిమాలతో గుర్తింపు పొందింది. చివరగా ఛావా మూవీలో యాక్ట్ చేసింది.చదవండి: ధురంధర్ 2 ఫ్యాన్స్కి గుడ్న్యూస్.. తెలుగులో కూడా.. -
‘ధురంధర్ 2’ అభిమానులకు గుడ్ న్యూస్.. తెలుగులో కూడా!
‘ధురంధర్ 2’ అభిమానులకు గుడ్ న్యూస్. నేటి నుంచి(మార్చి 21) ఈ మూవీ తెలుగులోనూ విడుదల కానుంది. దీనిపై అధికారిక ప్రకటన రాలేదు కానీ, ఆన్లైన్లో తెలుగు వెర్షన్కి కూడా బుకింగ్స్ ఓపెన్ చేశారు. వాస్తవానికి ఈ సినిమా ప్రీమియర్స్ రోజే అంటే మార్చి 18న తెలుగులోనూ విడుదల కావాల్సింది. కానీ సాంకేతిక కారణాలు, చివరి నిమిషంలో సెన్సార్ బోర్డ సూచించిన మార్పుల వల్ల తెలుగు పాటు తమిళ, కన్నడ, మలయాళ వెర్షన్ల విడుదల వాయిదా పడింది. ప్రీమియర్స్ కోసం ముందే బుక్ చేసుకున్నవారికి థియేటర్ యాజమాన్యాలు రీఫండ్ చేశాయి. దీంతో కొంతమంది భాష తెలియకపోయినా హిందీలోనే ఈ సినిమాను వీక్షించించారు. అయితే శుక్రవారం ఈ మూవీ తెలుగు, తమిళ, మలయాళ వెర్షన్లకు శుక్రవారం సెన్సార్ పూర్తయ్యింది. కన్నడలో ఇంకా సెన్సార్ పూర్తి కాలేదు. దీంతో కన్నడ వెర్షన్ మినహా..మిగతా భాషలన్నింటిలోనూ ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు.ధురంధర్ 2 విషయానికొస్తే..బాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రణవీర్ సింగ్ హీరోగా నటించిన ‘ధురంధర్’ చిత్రానికి సీక్వెల్ ఇది. ఆదిద్యధర్ దర్శకత్వం వహించిన ఈచిత్రంలో సారా అర్జున్ హీరోయిన్గా నటించింది. తొలిరోజే ఈ చిత్రం రూ. 172 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది రికార్డు సృష్టించింది. నేటి నుంచి తెలుగు, తమిళ, మలయాళ వెర్షన్స్ కూడా అందుబాటులో ఉండడంతో కలెక్షన్స్ భారీగా పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. -
దురంధర్-2పై సౌత్ స్టార్స్ ప్రశంసలు.. ప్రకాశ్ రాజ్ రియాక్షన్ ఇదే..!
రణ్వీర్ సింగ్ దురంధర్-2పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇప్పటికే మహేశ్ బాబు, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ, రామ్ చరణ్, రాం గోపాల్ వర్మ సైతం సీక్వెల్ అద్భుతంగా ఉందంటూ ట్వీట్స్ చేశారు. బాలీవుడ్ మేకర్స్ సైలెంట్గా ఉన్నా.. టాలీవుడ్ స్టార్స్ మాత్రం దురంధర్ మూవీని కొనియాడుతున్నారు. ఆదిత్య ధర్ మరో అద్బుతమైన కంటెంట్ అందించారని.. రణ్వీర్ సింగ్ అదరగొట్టేశాడని ఆకాశానికేత్తేస్తున్నారు.ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ నటుడు ప్రకాశ్ రాజ్ రియాక్షన్ కోసం ఎంతోమంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మొదటి నుంచి దురంధర్కు వ్యతిరేకంగా ఉన్న ఆయన.. తాజాగా సౌత్ స్టార్స్ ఈ మూవీ ప్రశంసించడంపై ఎట్టకేలకు స్పందించారు. ఓ నెటిజన్ చేసిన పోస్ట్కు ప్రకాశ్ రాజ్ రిప్లై ఇచ్చారు. దురంధర్-2 మూవీని దక్షిణాది హీరోలు మహేశ్ బాబు, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ ప్రశంసించారు.. బాలీవుడ్ నుంచి ఎవరైనా స్పందించారా? అని నెటిజన్ రాసుకొచ్చాడు. దీనికి ప్రకాశ్ రాజ్ బదులిస్తూ.. 'బాధ్యతల సంకేతాలు దక్షిణాదికి కూడా వ్యాపిస్తున్నాయి' అంటూ ట్విటర్లో పోస్ట్ చేశారు. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్గా మారింది.అంతకుముందు ప్రకాశ్ రాజ్ ఓ పాత సినిమాకు సంబంధించిన పాటలు వింటున్న వీడియోను ట్విటర్లో షేర్ చేశారు. నేను దురంధర్కు చాలా దూరంగా ఉన్నా.. మీరు కూడానా? అంటూ పాట వింటున్న వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియోలో హమ్ దోనో(1961) చిత్రంలోని 'అభీ నా జావో ఛోడ్ కర్' ఐకానిక్ పాటను ప్లే చేశారు. మొదటి నుంచి దురంధర్ను వ్యతిరేకిస్తున్న ప్రకాశ్ రాజ్.. ఈ ట్వీట్స్ చూస్తుంటే మరోసారి తనలోని అక్కసును వెళ్లగక్కినట్లు తెలుస్తోంది.కాగా.. దురంధర్కు సీక్వెల్గా వచ్చిన'ధురందర్: ది రివెంజ్' హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రంలో అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, ఆర్ మాధవన్, సారా అర్జున్, రాకేష్ బేడీ కీలక పాత్రలలో నటించారు. ఈ చిత్రాన్ని జియో స్టూడియోస్, బి62 స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. Signs of Obligations are spreading South too .. #justasking https://t.co/iB01E1sp7K— Prakash Raj (@prakashraaj) March 19, 2026 -
దురంధర్-2 వసూళ్ల ఊచకోత.. ఆ ఒక్కడి వల్లే రూ.500 కోట్లు..!
రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్. గతేడాది డిసెంబర్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల ఊచకోత చూపించింది. 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా నిలిచింది. కేవలం హిందీలో మాత్రమే రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ను షేక్ చేసింది. ఏకంగా రూ.1300 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. తాజాగా ఈ మూవీకి సీక్వెల్గా వచ్చిన చిత్రం దురంధర్ ది రివెంజ్. పార్ట్-2గా వచ్చిన ఈ సినిమా మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. ఈ సారి హిందీతో పాటు దక్షిణాది భాషల్లోనూ రిలీజైంది. కేవలం ప్రీమియర్స్తోనే వసూళ్లు సునామీ ప్రారంభించిన బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో దురంధర్ నటుడు రాకేశ్ బేడీ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. రణ్వీర్ సింగ్ తనతో ఇలా చెప్పారని గుర్తు చేసుకున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన రాకేశ్ బేడీ ఆసక్తికర కామెంట్స్ చేశారు. నా రోల్ షూటింగ్ పూర్తైన రోజు రణ్వీర్ తనకు ఓ మాట చెప్పారని గుర్తు చేసుకున్నారు. ఒకవేళ ఈ మూవీ రూ.1000 కోట్లకు పైగా వసూలుచేస్తే.. అందులో రూ.500 కోట్లు రాకేశ్ వల్లే వస్తాయని అన్నారని తెలిపారు. ఓ నటుడిగా ఇంతకుమించి ఏం కావాలని హర్షం వ్యక్తం చేశారు. నా చివరి రోజు షూటింగ్లో రణ్ వీర్సింగ్ ఏడ్చారని దర్శకుడు ఆదిత్య ధర్ అన్నారు. సెట్లో అంతలా ఎమోషనల్ వాతావరణాన్ని సృష్టించిన మూవీ అని తెలిపారు. కాగా.. ఈ చిత్రంలో రాకేశ్ బేడీ రోల్ ఆడియన్స్ను విపరీతంగా ఆకట్టుకుంది. కరాచీకి చెందిన రాజకీయ నాయకుడు జమాలి పాత్రలో రాకేశ్ బేడీ అదరగొట్టేశారు. రణ్వీర్ సింగ్ ప్రశంసలు..జమాలిగా బేడీ నటన ప్రేక్షకుల నుంచి ప్రశంసలను అందుకుంది. ఓ రాజకీయ నాయకుడి నయవంచక పాత్రలో పాత్రలో ఆయన నటన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. రణ్వీర్ సింగ్ ప్రశంసలు కురిపించడం చూస్తుంటే బేడీ పాత్ర ప్రభావం, అలాగే సెట్లో వారి మధ్య ఏర్పడిన స్నేహబంధం అర్థమవుతోంది. కాగా.. ఈ చిత్రంలో ఆర్. మాధవన్, సారా అర్జున్, డానిష్ పాండోర్, సంజయ్ దత్ లాంటి స్టార్స్ కీలక పాత్రల్లో కనిపించారు. కాగా.. ధురంధర్ 2 ఫస్ట్ డే, ప్రీమియర్స్తో కలిసి ప్రపంచవ్యాప్తంగా రూ. 172.63 కోట్ల గ్రాస్ రాబట్టింది. -
'ధురంధర్ 2'.. బాలీవుడ్ కంటే టాలీవుడే ముందు
ఓ హిందీ సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూసి చాలా కాలమైపోయింది. పదిపదిహేనేళ్ల క్రితం షారుక్ ఖాన్, ఆమిర్ ఖాన్, సల్మాన్ ఖాన్ తదితరుల చిత్రాలకు తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి క్రేజ్ ఉండేది. అందుకు తగ్గట్లే కలెక్షన్స్ వచ్చేవి. కానీ ఇప్పుడు 'ధురంధర్ 2' విషయంలో ఆ జోష్ కనిపిస్తోంది. తెలుగు షోలు పూర్తిస్థాయిలో స్క్రీనింగ్ కానప్పటికీ హిందీ వెర్షన్ అయినా సరే చూసేయాల్సిందే అని ఆలోచనతో ఉన్నారు. హైదరాబాద్ లాంటి నగరాల్లో టికెట్ బుకింగ్స్ చూస్తుంటే ఇదే అనిపిస్తుంది.(ఇదీ చదవండి: ధురంధర్-2 ఫస్ట్ డే కలెక్షన్స్..)ఈ సినిమాలో ఒక్క తెలుగు నటుడు కూడా లేడు. అయినా సరే తొలి పార్ట్ హిట్ అయ్యేసరికి బీభత్సమైన హైప్ ఏర్పడింది. ఈ క్రమంలోనే రెండు రోజుల క్రితమే అంటే బుధవారం సాయంత్రం నుంచి ప్రీమియర్స్ పడ్డాయి. ఈ క్రమంలోనే తెలుగు స్టార్ హీరోలు అయిన అల్లు అర్జున్, మహేశ్ బాబు, ఎన్టీఆర్ తదితరులు ఏకంగా ట్వీట్స్ చేసి మరీ మూవీని ఆకాశానికెత్తేశారు. అదే టైంలో బాలీవుడ్ మాత్రం పూర్తిగా సైలెన్స్ పాటిస్తోంది.'ధురంధర్ 2' ట్రైలర్ రిలీజైనప్పుడు హిందీ ఇండస్ట్రీకి చెందిన హృతిక్ రోషన్, ఆలియా భట్, విక్కీ కౌశల్ లాంటి స్టార్స్ పోస్టులు పెట్టారు గానీ మూవీ వచ్చి రెండు రోజులు కావొస్తున్నా బాలీవుడ్ నుంచి ఒక్కరు కూడా పోస్టుల్లాంటివి పెట్టకపోవడం ఆసక్తికరంగా అనిపిస్తుంది. దీని గురించి సోషల్ మీడియాలోనూ చర్చ నడుస్తోంది. హిందీ సినిమాని సపోర్ట్ చేసే విషయంలోనూ బాలీవుడ్ కంటే టాలీవుడ్ ముందుందిగా అని మాట్లాడుకుంటున్నారు.దీనికి పోటీగా తెలుగు రాష్ట్రాల వరకు పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' రిలీజైంది. కానీ తొలి షో నుంచే నెగిటివ్ టాక్ వస్తోంది. రొటీన్ ఫక్తు కమర్షియల్ మూవీ అని చూసిన ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. పవన్ అభిమానులకు తప్పితే ఇది మరెవరికి నచ్చట్లేదనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి! 'ధురంధర్ 2' తెలుగు వెర్షన్ విడుదలైతే.. 'ఉస్తాద్'కి మరింత కష్టాలు తప్పవు.(ఇదీ చదవండి: ‘ధురంధర్ 2’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్) -
నడిరోడ్డుపై వేధింపులు.. తాగొచ్చి కారు ఆపి..: నటి
బాలీవుడ్ నటి నిమిషా నాయర్కు చేదు అనుభవం ఎదురైంది. ముంబై బాంద్రాలో క్యాబ్లో వెళ్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు తనను ఇబ్బందిపెట్టారంటోంది. ఈ మేరకు ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఉదయం 4.50 గంటల సమయంలో నేను క్యాబ్లో వెళ్తున్నాను. ఆ సమయంలో డ్రైవర్ ఓ బైక్ను ఓవర్టేక్ చేశాడు. ఆ బైక్పై ఉన్నవారు బాగా తాగినట్లున్నారు. వాళ్లను దాటేసినందుకు కోపంతో ఊగిపోయారు. కొట్టడానికి రెడీ..క్యాబ్ డ్రైవర్కు గుణపాఠం చెప్పాలనుకున్నారు. హైవే మధ్యలో మా కారును అడ్డుకున్నారు. కారు ఎదుటే బైక్ నిలిపి ముందుకు వెళ్లనీయకుండా చేశారు. ఆవేశంతో ఎగబడ్డారు, దుర్భాషలాడారు. డోర్స్ తెరిచేందుకు ప్రయత్నించారు. నన్ను విండోస్ కిందకు దించమన్నారు. వాళ్లెంత రెచ్చగొట్టినా సరే మేము ఆ పని చేయలేదు. ఎందుకంటే అతడు డ్రైవర్ను కొట్టడానికే మా కారు ఆపాడని నాకు బాగా తెలుసు.. మా రక్షణ కోసం మేము సైలెంట్గా ఉండిపోయాం. వీడియో తీస్తున్నానని..మమ్మల్ని చాలాసేపు వేధించారు. నేను వీడియో తీస్తున్నానని గ్రహించి కారు ఫోటోలు తీసుకుని వెళ్లిపోయారు అని పేర్కొంది. వీరిపై చర్యలు తీసుకోమని పోలీసులను కోరింది. ఇది చూసిన నెటిజన్లు.. మీరు క్షేమంగా ఉన్నందుకు సంతోషం, ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవడం దురదృష్టకరం.. అని కామెంట్లు చేస్తున్నారు. కాగా నిమిషా నాయర్.. అమర్ కాలనీ, 8 ఏఎమ్ మెట్రో సినిమాల్లో నటించింది. 'ట్రయల్ బై ఫైర్' వెబ్ సిరీస్లోనూ యాక్ట్ చేసింది. View this post on Instagram A post shared by Nimisha Nair 🌸 (@nimnair) చదవండి: యాక్టింగ్ రాదని ట్రోలింగ్ చేశారు: రష్మిక ఎమోషనల్ -
ఫ్రీగా హెయిర్ ట్రాన్స్ప్లాంట్.. రిజెక్ట్ చేశా: అనుపమ్ ఖేర్
టాలెంట్ ఉంటే చాలు ఎలాగైనా రాణించవచ్చనుకున్నాడు నటుడు అనుపమ్ ఖేర్. కానీ, ఆయన బట్టతలను చూసి ఈయనెలా నటుడవతాడని చాలామంది సంశయించారు. వారి అనుమానాలను పటాపంచలు చేస్తూ దిల్వాలే దుల్హానియా లేజాయెంగే, హమ్ ఆప్కే హై కోన్, ద కాశ్మీర్ ఫైల్స్ వంటి బ్లాక్బస్టర్ సినిమాల్లో నటించాడు. రెండుసార్లు జాతీయ అవార్డు అందుకున్నాడు.అంకుల్ అని పిలవద్దుతాజాగా ఓ ఇంటర్వ్యూలో అనుపమ్ ఖేర్ మాట్లాడుతూ.. యువతరం నన్ను సర్, అంకుల్ అని పిలిస్తే నచ్చదు. ఏకే లేదా అనుపమ్ గారు అంటే సరిపోతుంది. అంతేకానీ అంకుల్ అని నన్ను వేరు చేయడం ఇష్టం లేదు. సినిమా దగ్గరినుంచి ఏఐ, సైన్స్.. ఇలా అన్నిరకాల అంశాల గురించి చర్చించడం నాకెంతో ఇష్టం. ఇకపోతే ఎంతోమంది డాక్టర్లు నాకు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తామని ముందుకు వచ్చారు. పేపర్లో యాడ్కానీ, వాళ్లందరినీ సున్నితంగా తిరస్కరించాను. నా తలపై వెంట్రుకలు వచ్చేందుకు డబ్బు ఖర్చుపెట్టేందుకు రెడీ అయినవాళ్లూ ఉన్నారు. కానీ, నేను వారికి ఆ అవకాశాన్ని ఇవ్వలేదు. అలా డబ్బు తీసుకోవడం నాకిష్టం లేదు. ఒకసారి ఏమైందంటే నేను న్యూస్పేపర్ చదువుతున్నాను. అందులో హెయిర్ ఆయిల్ కోసం ఓ వాణిజ్య ప్రకటన వేశారు. అది నేను చూడలేదు. సినిమాకానీ, నా కొడుకు సికందర్ నేను యాడ్నే చూస్తున్నా అనుకుని.. దాని గురించి ఆలోచించకు నాన్న అన్నాడు. ఎన్నో ఏళ్ల కిందట ఈ సంఘటన జరిగింది అని చెప్పుకొచ్చాడు. అనుపమ్ ఖేర్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ఘోస్లా 2. ఇది 2006లో వచ్చిన కల్ట్ క్లాసిక్ ఖోస్లా కా ఘోస్లా సినిమాకు సీక్వెల్గా తెరకెక్కింది. ప్రశాంత్ భాగియా దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ఆగస్టు 28న విడుదల కానుంది.చదవండి: 3 వారాల్లోనే ఓటీటీలో కొత్త సినిమా -
దురంధర్-2 మూవీ.. ప్రీమియర్స్తోనే ఆల్టైమ్ రికార్డ్..!
రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్-2 థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ రోజే ప్రపంచవ్యాప్తంగా రిలీజైన ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. దురంధర్ బ్లాక్బస్టర్ హిట్గా నిలవడంతో ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో ప్రీమియర్స్ షోలకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. టికెట్స్ రిలీజైన కొన్ని నిమిషాల్లోనే హాట్ కేకుల్లా అమ్ముడైపోయాయి.తాజాగా ప్రీమియర్ షోల కలెక్షన్స్లో దురంధర్-2 సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఇండియాలో కేవలం ప్రీమియర్ షోల ద్వారా ఏకంగా రూ.52 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించింది. ఈ మూవీ ప్రీమియర్ షోలను దేశవ్యాప్తంగా దాదాపు 12000 వేలకు పైగా షోలు ప్రదర్శించారు. ఈ కలెక్షన్స్ ప్రీమియర్స్లో అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా ఘనత సాధించింది. ఇప్పటి వరకు నమోదైన అన్ని రికార్డులను దురంధర్-2 అధిగమించింది. ఈ చిత్రంలో ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, సారా అర్జున్, రాకేష్ బేడీ కీలక పాత్రల్లో నటించారు. గతేడాది డిసెంబర్ 5న విడుదలైన దురంధర్ ప్రపంచవ్యాప్తంగా రూ. 1,300 కోట్లు వసూలు చేసిన సంగతి తెలిసిందే. -
రొమాంటిక్ సాంగ్.. దర్శకుడికి కాజోల్ వార్నింగ్!
ఫనా.. ఈ సినిమా వచ్చి 20 ఏళ్లవుతోంది. 2006లో వచ్చిన ఈ చిత్రంలో ఆమిర్ ఖాన్, కాజోల్ హీరోహీరోయిన్లుగా నటించారు. కాజోల్ అంధురాలిగా యాక్ట్ చేసిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్గా నిలిచింది. తాజాగా ఆనాటి సినిమా విశేషాలను దర్శకుడు కునాల్ కోహ్లి పంచుకున్నాడు. హీరోయిన్ వార్నింగ్ఓ ఇంటర్వ్యూలో అతడు మాట్లాడుతూ.. నా సినిమాలో హీరోయిన్కు కళ్లు కనిపించవు. అలా అని తనకు కళ్లజోడు పెట్టలేదు. హీరో, ప్రేక్షకులు ఆమె కళ్లలోకి చూడాలనుకున్నాను. సినిమాలో హీరో, హీరోయిన్లపై దేఖోనా.. అని ఓ వర్షం పాట ఉంటుంది. ఆ సాంగ్ షూటింగ్ మొదటిరోజే కాజోల్ నన్ను హెచ్చరించింది. ఈ పాటను నేను నా అత్తామామలతో కలిసి చూడాల్సి ఉంటుంది, అది మైండ్లో పెట్టుకో అని వార్నింగ్ ఇచ్చింది. అంధురాలు ప్రేమలో పడకూడదా?అయితే నేను వెనక్కు తగ్గాలనుకోలేదు.. ఆమె అంధురాలైతే ఏంటి? అందరిలాగే తను కూడా ప్రేమలో పడింది. తనకెందుకు పరిమితులు విధించాలనుకున్నాను. పాటను విచారంగా చూపించాలనుకోలేదు. నాకు నచ్చినట్లుగానే తీశాను అని చెప్పుకొచ్చాడు. ఈ మూవీలో టబు, సతీశ్ షా, లారా దత్తా కీలక పాత్రలు పోషించారు.చదవండి: రెండు ఫ్లాట్లు అమ్మేసిన ప్రభుదేవా -
బూతు పాట : సంజయ్ దత్, నోరాఫతేహి, టీమ్కు మరో షాక్
సాక్షి, ఢిల్లీ: 'కేడీ: ది డెవిల్'(KD: The Devil) పాట వివాదంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. అశ్లీల సాహిత్యం అంటూ రేగిన వివాదంపై జాతీయ మహిళా కమిషన్ (NCW) మహిళా కమిషన్ సీరియస్గా స్పందించింది.ఎన్సీడబ్ల్యూ సమన్లుఈ పాటలో అశ్లీలత ఉందన్న ఫిర్యాదుల నేపథ్యంలో ఎన్సీడబ్ల్యూ సమన్లు జారీ చేసింది. ఈ చిత్రం బృందంతోపాటు, బాలీవుడ్ నటుడు సంజయ్ దత్, నోరా ఫతేహికి జాతీయ మహిళా కమిషన్ సమన్లు జారీ చేసింది.ఈ పాటలో అభ్యంతరకరమైన ,అశ్లీల సాహిత్యం, అలాగే వీక్షకులను, ముఖ్యంగా పిల్లలకు సంబంధించిన అనుచితమైన అవాంఛనీయ చిత్రాలు ఉన్నాయని ఆరోపిస్తూ వచ్చిన అనేక ఫిర్యాదుల నేపథ్యంలో ఎన్సీడబ్ల్యూ ఈ చర్య తీసుకుంది. పాట రచయితలు, నిర్మాతల నుండి వివరణ కోరింది.ఈ సాంగ్ విడుదల కాగానే అటు పరిశ్రమ వర్గాల నుంచి, ఇటు సోషల్ మీడియాలో తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. ఈ పాటలోని సాహిత్యం, కొరియోగ్రఫీ చాలా అసభ్యకరంగా ఉన్నాయని, మహిళలను కించపరిచేలా ఉన్నాయని పలువురు ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా పిల్లలపై ఇలాంటి కంటెంట్ ప్రతికూల ప్రభావం చూపుతుందని సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. దీంతో ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ పాటను యూట్యూబ్ నుండి తొలగించారు. అటు బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ కూడా స్పందించారు. అశ్లీలతలో బాలీవుడ్ అన్ని హద్దులు దాటేసిందని తీవ్రంగా మండిపడ్డారు.మరోవైపు, చిత్ర దర్శకుడి భార్య రక్షిత ఈ పాటను సమర్థించారు. గతంలో కూడా ఇలాంటి మాస్ సాంగ్స్ వచ్చాయని, ఇది కేవలం సినిమా సృజనాత్మకతలో భాగమేనని దీన్ని సమర్ధించుకున్నారు.ఇదీ చదవండి: చిలుక జ్యోతిష్యుడిని నమ్మి నిండా మునిగిన ఐటీ అధికారిఈ విషయంపై భిన్నాభిప్రాయాలు కొనసాగుతున్నాయి. వినోద రంగంలో సృజనాత్మక స్వేచ్ఛ ,బాధ్యతల పరిమితులపై చర్చను రేకెత్తించింది.ఈ పాటలు భారతీయ సినిమాలో దీర్ఘకాలంగా ఉన్న ధోరణులలో భాగమని కొందరు వాదిస్తుండగా, హానికరమైన లేదా అనుచితమైన కంటెంట్ను నిరోధించడానికి మరింత కఠినమైన నిబంధనలు అవసరమని మరికొందరు భావిస్తున్నారు. మరోవైపు ఎన్సీడబ్ల్యూ (NCW) చర్య వల్ల వినోద రంగంలో కంటెంట్ నియంత్రణపై విస్తృత పరిణామాలు చోటుచేసుకోవచ్చని మరికొందరి అంచనా. -
41 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న నటి
ప్రముఖ బుల్లితెర జంట దివ్యాంక త్రిపాఠి- వివేక్ దహియా గుడ్న్యూస్ చెప్పారు. పెళ్లయిన పదేళ్లకు పేరెంట్స్గా ప్రమోషన్ పొందనున్నట్లు వెల్లడించారు. తెలుగు నూతన సంవత్సరమైన ఉగాది నాడు ఈ శుభవార్తను అభిమానులతో పంచుకున్నారు. ఈ మేరకు దివ్యాంక తన బేబీ బంప్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.అంతా అయిపోయిందనుకునేలోపు..'పదేళ్ల ప్రయాణంలో ట్విస్ట్ అదిరింది కదూ.. కొన్ని ప్రయాణాలు తొందరపెట్టవు.. అవి సిద్ధంగా ఉన్నప్పుడే మొదలవుతాయి. మన కథ పూర్తయిందనుకులోపే జీవితం ఇలాంటి అందమైన అధ్యాయానికి స్వాగతం పలుకుతుంది. ఇంకా ఆ అనుభూతిని ఆస్వాదిస్తూనే ఉన్నా.. కారణం లేకుండానే నవ్వుతున్నా.. మా మనసులు సంతోషంతో నిండిపోయాయి.. అవును, మేము బేబీ కోసం ఎదురుచూస్తున్నాం' అని నటి బ్యూటిఫుల్ క్యాప్షన్ జోడించింది.ఇంకా షాపింగ్ మొదలుకాలేదుఓ ఇంటర్వ్యూలో దివ్యాంక మాట్లాడుతూ.. ప్రెగ్నెన్సీ పాజిటివ్ రాగానే మొదట నా భర్తకే చెప్పాను. ఆ వెంటనే ఇంట్లో వాళ్లందరితోనూ పంచుకున్నాం. అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. దాదాపు ఆరునెలలపాటు ఈ విషయం బయటకు తెలియకుండా జాగ్రత్తపడ్డాం. నేను ఎక్కువగా బయటకు రాకపోవడం వల్ల దీన్ని ఇంతకాలం సీక్రెట్గా ఉంచగలిగాం. బేబీ కోసం ఇంకా షాపింగ్ మొదలుపెట్టలేదు.2016లో పెళ్లిజూన్లో డెలివరీ డేట్ ఇచ్చారు అని పేర్కొంది. దివ్యాంక, వివేక్.. యే హై మొహబ్బతే సీరియల్ సెట్లో కలుసుకున్నారు. ఈ ధారావాహిక చిత్రీకరణ సమయంలోనే ప్రేమలో పడ్డారు. 2016లో భోపాల్లో పెళ్లి చేసుకున్నారు. ఈ జంట నాచ్ బలియే 8వ సీజన్లో పాల్గొని విజేతగా నిలిచింది. ఇప్పుడు 41 ఏళ్ల వయసులో దివ్యాంక తల్లి కాబోతోంది.సీరియల్దివ్యాంక త్రిపాఠి నటి మాత్రమే కాదు మోడల్, యాంకర్ కూడా! 2005లో మిస్ భోపాల్ కిరీటం అందుకుంది. బనూ మే తేరి దుల్హాన్ సీరియల్తో గుర్తింపు పొందింది. అలా వరుస ఛాన్సులు అందుకుంది. మధ్యలో తకనుమరుగైపోయినా యే హై మొహబ్బతే సీరియల్తో ఆమె కెరీర్ మలుపు తిరిగింది. 2017లో ఫోర్బ్స్ సెలబ్రిటీ 100 జాబితాలో చోటు దక్కించుకున్న సీరియల్ నటిగా రికార్డు సృష్టించింది. View this post on Instagram A post shared by Divyanka Tripathi Dahiya (@divyankatripathidahiya) చదవండి: ఓటీటీలో అమరావతికి ఆహ్వానం మూవీ -
వాళ్లు చెప్పిందే నమ్మా.. ఇలా చేస్తారనుకోలేదు
గత కొన్నిరోజులుగా 'సర్కే చునారియా' అనే పాట ఎంతలా వివాదాస్పదమైందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బూతు సాహిత్యం మరీ దారుణంగా ఉండేసరికి కేంద్రం కూడా దీనిపై రియాక్ట్ అయింది. దీంతో పాటని యూట్యూబ్ నుంచి తొలగించారు. సింగర్ మంగ్లీ కూడా క్షమాపణలు చెప్పింది. ఈ గీతంలో డ్యాన్స్ చేసిన నోరా ఫతేహి ఇప్పుడీ వివాదంపై మాట్లాడింది. తన అనుమతి లేకుండానే ఇదంతా చేశారని చెప్పుకొచ్చింది. ఈ మేరకు ఓ వీడియో రిలీజ్ చేసింది.(ఇదీ చదవండి: 'ధురంధర్ 2'కి అల్లు అర్జున్ రివ్యూ.. ఏమన్నాడంటే?)'ఈ పాటని మూడేళ్ల క్రితం కన్నడలో షూటింగ్ చేశారు. తర్వాత ఎలా మార్చారో నాకు తెలియదు. ఓ పెద్ద మూవీ కావడం, సంజయ్ దత్ లాంటి స్టార్ ఉండేసరికి ప్రాజెక్ట్ ఒప్పుకొన్నాను. నిజానికి ఇది 'నాయక్ నహీ ఖల్నాయక్ హో మెయిన్' పాట రీమేక్ అనుకున్నాను. కన్నడ లిరిక్స్ అర్థం కాకపోవడం వల్ల వాళ్లు చెప్పిందే నమ్మాను. అందులో ఏం అసభ్యత అనిపించలేదు. కానీ హిందీలో డబ్ చేయడానికి నా దగ్గర ఎలాంటి అనుమతి తీసుకోలేదు. అసలు ఇది నా దృష్టికే రాలేదు''పాట లాంచ్ ఈవెంట్లోనూ నాకు ఇబ్బందికర అనుభవాలు ఎదురయ్యాయి. లిరికల్ వీడియోలో ఏ మాత్రం బాగోలేని ఫొటోలు, నాతో పాటు సంజయ్ దత్కి సంబంధించిన ఏఐ ఫొటోని ఉపయోగించేసరికి చాలా చిరాకేసింది. అయినా నిగ్రహంగా ఉన్నాను. హిందీ వెర్షన్ చూసిన తర్వాత ఇది కచ్చితంగా విమర్శల పాలవుతుందని ఊహించాను. ఈ విషయం దర్శకుడికి చెప్పి ప్రాజెక్ట్ నుంచి తప్పుకొన్నాను. ప్రజల విమర్శల కారణంగానే మేకర్స్ పాట తొలగించారు. ఇందుకు కృతజ్ఞతలు. ఇకపై నేను మరింత జాగ్రత్తగా ఉంటాను' అని నోరా ఫతేహి చెప్పుకొచ్చింది.కన్నడ హీరో ధ్రువ్ సర్జా హీరోగా నటించిన 'కేడీ' మూవీలోనిది ఈ పాట. దాదాపు మూడేళ్లకు పైగా సెట్స్లో ఉన్న ఈ చిత్రానికి ప్రేమ్ దర్శకుడు. సంజయ్ దత్, శిల్పా శెట్టి లాంటి బాలీవుడ్ స్టార్స్ ఇందులో నటించారు. రీసెంట్గా మొదటి పాటగా దీన్ని రిలీజ్ చేస్తే ఇంతలా వివాదాస్పదమైంది.(ఇదీ చదవండి: 'ఉస్తాద్ భగత్ సింగ్' ట్విటర్ రివ్యూ.. సహనానికి పరీక్ష)Nora Fatehi clarified she had no involvement in the controversial Hindi song, saying it used her image without permission. #NoraFatehi #Bollywood #Dhurandhar2 pic.twitter.com/f7y5LVto9q— Global Affairs 24 (@GlobalAffair24) March 18, 2026 -
టాలీవుడ్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. తెలుగులోనూ ప్రీమియర్స్
సినీ ఇండస్ట్రీలో ఇప్పుడంతా దురంధర్ ఫీవర్ నడుస్తోంది. ఇప్పటికే ప్రీమియర్స్ పడగా.. థియేటర్లు దద్దరిల్లిపోతున్నాయి. ఇవాళ సాయంత్రం కేవలం హిందీలో మాత్రమే ప్రీమియర్స్ ప్రదర్శించారు. అయితే తెలుగు ఆడియన్స్ కూడా ప్రీమియర్స్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో దురంధర్ టీమ్ గుడ్ న్యూస్ చెప్పింది.ఈ రోజు రాత్రి 9 గంటల నుంచే తెలుగుతో పాటు తమిళంలోనూ ప్రీమియర్స్ ప్రారంభం అవుతాయని ప్రకటించింది. ఈ విషయాన్ని డైరెక్టర్ ఆదిత్య ధర్ వెల్లడించారు. దీంతో టాలీవుడ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. అయితే కన్నడ, మలయాళ భాషల్లో మాత్రం రేపటి నుంచి మాత్రమే ప్రదర్శిస్తామని తెలిపారు. సాంకేతిక సమస్యల వల్లే ప్రీమియర్స్ ఆలస్యమైనట్లు పేర్కొన్నారు.గతేడాది రిలీజైన దురంధర్ సూపర్ హిట్ కావడంతో ఈ మూవీ భారీ అంచనాలు నెలకొన్నాయి. డిసెంబర్ 5న విడుదలైన ఈ స్పై థ్రిల్లర్ బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. దీంతో సీక్వెల్పై అభిమానుల్లో మరింత ఆసక్తి పెరిగింది. -
దురంధర్-2 ట్విటర్ రివ్యూ.. ఆడియన్స్ ఏమన్నారంటే?
రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. ఈ చిత్రానికి కొనసాగింపుగా దురంధర్-2 ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. కేవలం మూడు నెలల వ్యవధిలోనే సీక్వెల్ను థియేటర్లలో రిలీజ్ చేశారు. ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ ప్రీమియర్ షోలు ఇప్పటికే ఓవర్సీస్తో పాటు ఇండియాలోనూ ప్రదర్శించారు.ఈ మూవీ చూసిన ఆడియన్స్ సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు. ప్రముఖ సినీ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ సైతం ఈ మూవీపై తన రివ్యూ రాసుకొచ్చారు. దురంధర్-2 ఒక మాస్టర్ పీస్ అని పోస్టులు పెడుతున్నారు. ఇంటర్వెల్ సీక్వెన్స్ స్టన్నింగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దురంధర్-2 ఫస్ట్ హాఫ్ బ్లాక్బస్టర్ అంటూ ఆడియన్స్ ట్వీటిర్ వేదికగా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్ ఖాయమని ప్రేక్షకులు ట్వీట్స్ పోస్ట్ చేస్తున్నారు. It's a stunning interval now✅Finally watched the Bade Saab 🔔Wait here for the complete #Dhurandhar2Review .#Dhurandhar2 #DhurandharTheRevenge . pic.twitter.com/8zk7CEhmkA— Always Bollywood (@AlwaysBollywood) March 18, 2026 BLOCKBUSTER 🔥#Dhurandhar2 #Dhurandhar2Review#DhurandharTheRevenge pic.twitter.com/j14czkhBWh— ◔‿◔ (@KhusshRaho) March 18, 2026 RANVEER SINGH 🫡Radiant-Relentless-Roaring-Resilient-Raw 👑🔥#Dhurandhar2 #DhurandharTheRevenge #Dhurandhar2Review @RanveerOfficial @AdityaDharFilms pic.twitter.com/65jgu2Bmy4— Shikhar Negi (@ImshikharNegi) March 18, 2026 #Dhurandhar2 crushing cringe Bollywood #DhurandharTheRevenge #Dhurandhar2review pic.twitter.com/Hy83od6XCR— Viral (@drviral1123) March 18, 2026 Ohhh mannnBLOCKBUSTER 1ST HALFThis is not going to stop soonThe opening sequence Jassi's back storyAnd many things Don't want to spoil it for u guyzzBut this is a Box office Tsunami#DhurandharTheRevengePremiere#Dhurandhar2Review Bgm is a hit miss because we are spoiled— Aarav jain (@sanidhya_jain18) March 18, 2026 -
విజయాల పాట...వివాదాల బాట
భారతీయ సినిమాల్లో మాత్రమే కనిపించే పాటలు ఓ రకంగా ఇక్కడి సినిమా విజయాలకు అత్యంత కీలకం అని తెలిసిందే. అయితే అవే పాటలు వివాదాలకు కేంద్రబిందువవుతూ ఒక్కోసారి నిషేధాలను కూడా ఎదుర్కుంటున్న పరిస్థితికి కూడా పాటకు ఉన్నంత చరిత్ర ఉంది. ఓ వైపు సినిమా సంగీతం ప్రేక్షకులను అలరించడంలో కీలక పాత్ర పోషిస్తూనే, కొన్ని కొన్ని పాటలు మళ్లీ ఈ అంశాన్ని చర్చనీయాంశంగా మార్చాయి. తాజాగా విడుదలైన సర్కే చునర్ తెరి సర్కే కూడా తీవ్రవివాదంలో ఇరుక్కుంది. ఈ ‘సర్కే చునర్ తెరి సర్కే’ అనే పాటలో నోరా ఫతేహి, సంజయ్దత్లు ప్రధానంగా కనిపిస్తారు. అయితే ఇందులో ఉన్న అసభ్యకర మైన సాహిత్యం నృత్య భంగిమలు ఉన్నట్టుగా ప్రేక్షకుల నుంచి, నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ పాటను ‘‘చీప్’’గా అభివర్ణిస్తూ పలువురు వ్యతిరేకత వ్యక్తం చేయడంతో, చివరికి యూట్యూబ్ నుంచి ఈ పాటను తొలగించడం జరిగింది. అంతేకాకుండా ఈ చిత్ర నిర్మాత, పాట రచయిత తదితరులపై కేసులు కూడా నమోదవడం జరిగింది. ఈ నేపధ్యంలో గత కొంత కాలంగా వివాదాస్పదంగా మారిన పాటలను పరిశీలిస్తే...‘టటేరీ’ పాటతో బాద్షా వివాదాల బాట..ఇదే ఏడాదిలో మ్యూజిక్ ఇండస్ట్రీని కుదిపేసిన మరో వివాదం టటేరీ...ఈ పాటను ప్రముఖ ర్యాపర్ బాద్షా రూపొందించారు. పాటలోని అసభ్యకర కంటెంట్, మహిళలను కించపరిచేలా ఉన్న వ్యాఖ్యల కారణంగా తీవ్ర పాట తీవ్ర విమర్శలకు గురైంది. విమర్శల దాడి తీవ్రతరం కావడంతో చివరకు హర్యానా స్టేట్ కమిషన్ ఫర్ ఉమెన్ కూడా రంగంలోకి దిగాల్సి వచ్చింది. పలు కేసులు నమోదయ్యాయి. చివరికి బాద్షా క్షమాపణలు చెప్పి పాటను డిజిటల్ వేదికల నుంచి తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడింది.నేటి ఖల్ నాయక్ నాటి ఖల్నాయక్...ఇలాంటి వివాదాలు మరీ కొత్తవేమీ కావు. గతంలో అంటే దాదాపు 3దశాబ్ధాల క్రితమే 1993లో విడుదలైన ఖల్నాయక్ సినిమాలోని చోలీకే పీఛే క్యాహై పాట కూడా పెద్ద ఎత్తున వివాదానికి కారణమైంది. ఈ పాటలో ద్వందార్థ పదాలు శృతిమించాయంటూ మహిళా సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఛోళీ కే పీఛే క్యా హై పాట హిట్ అయినప్పటికీ, దూరదర్శన్ ఆల్ ఇండియా రేడియోలో నిషేధించారు. ఈ పాటలో నాటి బాలీవుడ్ గ్లామర్ క్వీన్ మాధురీ దీక్షిత్ నర్తించగా,ఆ పాటలోనూ డాన్గా నటించింది సంజయ్ దత్ కావడం విశేషం. మరో విచిత్రం ఏమిటంటే... సర్కే చునర్ తెరి సర్కే పాటలో కూడా ఖల్ నాయక్ ప్రస్తావన ఉండడం. అదేవిధంగా, 1994లో వచ్చిన సెక్సీ సెక్సీ సెక్సీ ముఝే లోగ్ బోల్తీ పాట కూడా వివాదానికి గురైంది. ఇందులో ‘సెక్సీ’ అనే పదం వాడటం పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీంతో పాట లిరిక్స్ను ‘‘బేబీ బేబీ బేబీ’’గా మార్చాల్సి వచ్చింది.అశ్లీలం ఒకటే కాదు ఇతర కారణాలు కూడా పాటలకుచిక్కులు తెచ్చిపెడుతున్న వైనం కనిపిస్తుంది. గత 2007లో విడుదలైన ఆజా నాచ్లే టైటిల్ ట్రాక్ కూడా వివాదాల్లో చిక్కుకుంది. ఈ పాటలోని ఒక లైన్ కులవివక్షను ప్రోత్సహిస్తోందని ఆరోపణలు రావడంతో ఈ పాటను మన తెలుగులో కూడా తరచుగా పాటలు వివాదస్పదం అవుతున్నాయి. ఇటీవల బాలకృష్ణ నటించిన సినిమాలోని దబిడి దబిడి పాట కూడా నెటిజన్లు మండిపడిన సంగతి తెలిసిందే. కాలం మారినా, వివాదాస్పద పాటల చరిత్ర మాత్రం కొనసాగుతూనే ఉంది. కానీ ఒక స్పష్టమైన మార్పు ఏమిటంటే ఇప్పుడు ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా వెంటనే స్పందిస్తూ కంటెంట్పై ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఫలితంగా, చిత్రసీమ కూడా మరింత బాధ్యతతో వ్యవహరించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇది భవిష్యత్తులో మరింత నాణ్యమైన, బాధ్యతాయుతమైన కంటెంట్కు దారితీయొచ్చునని ఆశించవచ్చు. -
'ధురంధర్' తెలుగు ఫ్యాన్స్కి బ్యాడ్ న్యూస్
'ధురంధర్' సినిమా గతేడాది డిసెంబరులో థియేటర్లలోకి వచ్చింది. దేశవ్యాప్తంగా అద్భుతమైన ఆదరణ దక్కించుకుంది. తర్వాత ఓటీటీలోకి వచ్చిన తర్వాత అదే రేంజ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. తొలి భాగం విడుదలైన మూడు నెలలకు ఇప్పుడు సీక్వెల్ రెడీ అయిపోయింది. ముందే చెప్పినట్లు మార్చి 19నే అంటే రేపటి నుంచే మూవీని రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే తెలుగు సినీ ప్రేక్షకులకు అనుకోని చేదువార్త ఎదురైంది.(ఇదీ చదవండి: నోరు జారా.. క్షమించండి: ఉస్తాద్ భగత్ సింగ్ నటుడు)'ధురంధర్ 2' చిత్రం లెక్క ప్రకారం గురువారం(మార్చి 19) రిలీజ్ అవుతున్నప్పటికీ.. ముందు రోజు సాయంత్రం 5 గంటల నుంచే ప్రీమియర్స్ ప్లాన్ చేశారు. హిందీతో పాటు దక్షిణాది భాషల్లోనూ ఉంటుందని ప్రకటించారు. అందుకు తగ్గట్లే టికెట్స్ కూడా విక్రయించారు. కానీ చివరి నిమిషంలో హడావుడి వల్ల తెలుగు, తమిళ ప్రింట్స్ టైంకి డెలివరీ కాలేదు. దీంతో బుధవారానికి సంబంధించి హిందీ వెర్షన్ మాత్రమే ప్రీమియర్స్ వేస్తున్నారు.తెలుగు, తమిళ వెర్షన్స్.. బుధవారానికి సంబంధించిన షోలు రద్దయ్యాయి. డబ్బులు కూడా రీఫండ్ చేసేశారు. ఇకపోతే గురువారం ఉదయం నుంచి యధావిధిగా తెలుగు వెర్షన్ షోలు పడనున్నాయి. మరోవైపు దర్శకుడు ఆదిత్య ధర్.. మూవీ గురించి ఆసక్తికర పోస్ట్ పెట్టాడు. ట్విస్టులు బయటపెట్టొద్దని చెబుతూనే చివరి వరకు థియేటర్లలోనే ఉండాలని రాసుకొచ్చాడు. దీంతో మూడో భాగం గురించి హింట్ ఇస్తున్నాడా అని మాట్లాడుకుంటున్నారు.'ప్రియమైన 'ధురంధర్' ఫ్యామిలీ.. సినిమాని మీరెంతో ప్రేమించారు. ప్రతి చిన్న అంశాన్ని గుర్తించి మెచ్చుకున్నారు. మళ్లీ మళ్లీ చూసి ఎవరూ గుర్తించలేరనుకునే వాటిని కూడా గుర్తించారు. ఈ ప్రయాణంలో సినిమా మీది అయింది. తర్వాత ప్రపంచానిది కూడా అయింది. 'ధురంధర్: ద రివేంజ్'తో మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాం. భావోద్వేగానికి గురిచేస్తాం. రెడీగా ఉండండి. అందరితో కలిసి ప్రతి ట్విస్ట్, ఎమోషన్ థియేటర్ లోనే అనుభూతి చెందండి. దయచేసి సినిమా చూసిన తర్వాత ట్విస్టులని చెప్పేయకండి. ఎండ్ క్రెడిట్స్ అయ్యేంతవరకు సీట్ల నుంచి లేచి వెళ్లిపోకండి' అని డైరెక్టర్ ఆదిత్య ధర్ చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: 'ధురంధర్' పూర్తి స్టోరీ.. సీక్వెల్ చూడటానికి ముందు మరోసారి)🙏🧿♥️#DhurandharTheRevenge releases worldwide on 19 March, on Gudi Padwa, Ugadi, and Eid.Hindi | Telugu | Tamil | Kannada | Malayalam @ranveersingh @rampal72 @duttsanjay @actormaddy #AkshayeKhanna @saraarjunn @therakeshbedi @adityadharfilms #JyotiDeshpande @dhar_lokesh… pic.twitter.com/wgO61vrUUQ— Aditya Dhar (@AdityaDharFilms) March 18, 2026 -
నాన్న చనిపోయినప్పుడు రూ.30 ఉన్నాయి: ఫరా ఖాన్
బాలీవుడ్ దర్శకురాలు, కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్ తన చేదు బాల్యాన్ని బయటపెట్టింది. తన తండ్రి దర్శకనిర్మాత కమ్రాన్ ఖాన్ నిర్మించిన ఒక్క సినిమాతో ఉన్నదంతా పోగొట్టుకున్నామంటోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఫరా ఖాన్ మాట్లాడుతూ.. ఐసా భీ హోతా హై సినిమాపై నాన్న ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఇంటిని తాకట్టు పెట్టి మరీ సినిమా తీశాడు. కానీ ఆ మూవీ బాక్సాఫీస్ వద్ద ఘోర పరాభవాన్ని చవిచూసింది. కటిక పేదరికంలోకిఆ మూవీ శుక్రవారం రిలీజైతే ఆదివారానికల్లా కటిక పేదరికంలోకి నెట్టివేయబడ్డాం. ఎంతో ధనవంతుడైన నాన్న పేదవాడయిపోయాడు. తన కలలు ఛిద్రం కావడం తట్టుకోలేకపోయాడు. మద్యపానానికి బానిసయ్యాడు. రాత్రి అయిందంటే చాలు మేమంతా వణికిపోయేవాళ్లం. అంతలా తాగేవాడు. ఒకే ఒక్క సినిమా మమ్మల్ని ఐదారేళ్లు వెనక్కు నెట్టేసింది. ఆయన తలెత్తుకోలేకపోయాడు. ఇంటి నుంచి బయటకు వెళ్లలేదు. ఎవరికీ తెలీదు13 ఏళ్లు ఏ పనీ చేయలేదు. అమ్మానాన్న విడిపోయినా కూడా ఎవరికీ ఆ విషయం చెప్పలేదు. నాన్న దర్శకుడిగా విఫలమైనందున నేను డైరెక్టర్ అయి మంచి పేరు తేవాలనుకున్నాను. అలా చిన్నతనంలో ఎప్పుడూ సినిమాల గురించే మాట్లాడుకునేవాళ్లం. ఎక్కువ చిత్రాలు చూసేవాదాన్ని. అయితే నాన్న ఎప్పుడూ కొడుకు గురించి ఆశపడేవాడు. సాజిద్ (ఫరా సోదరుడు) పుట్టాక నన్ను కాస్త పక్కనపెట్టేశాడు. నాన్న చనిపోయినప్పుడునాన్నకు నేనంటే ప్రేమ ఉందని తెలుసు.. కానీ ఫోకస్ అంతా కొడుకుపైనే ఎక్కువ ఉండేది. అప్పుడు సక్సెస్ అవ్వాలన్న సంకల్పం నాలో మరింత బలపడింది. నాన్న చనిపోయినప్పుడు ఆయన జేబులో రూ.30 మాత్రమే ఉన్నాయి అని చెప్పుకొచ్చింది. ఫరా ఖాన్ అన్నట్లుగానే హిందీ ఇండస్ట్రీలో మొదట కొరియోగ్రాఫర్గా పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత దర్శకురాలిగా మై హూనా, ఓం శాంతి ఓం, హ్యాపీ న్యూయర్, తీస్మార్ ఖాన్ వంటి ఎన్నో సినిమాలు తెరకెక్కించింది.చదవండి: నోరు జారా.. క్షమించండి: ఉస్తాద్ భగత్ సింగ్ నటుడు -
నా భార్య రెండు ఇండక్షన్ స్టవ్స్ ఆర్డర్ చేసింది: హీరో
పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం కారణంగా భారత్లో ఎల్పీజీ గ్యాస్ సరఫరాలో జాప్యం జరుగుతోంది. దీంతో ఇప్పటికే అనేక హోటళ్లు ప్రత్యామ్నాయంగా కట్టెల పొయ్యి, కరెంట్ స్టవ్లమీద వంట చేస్తున్నాయి. అటు ప్రజలు సైతం సిలిండర్లు సమయానికి రావకపోవడంతో ఇండక్షన్ స్టవ్లు ఎగబడి మరీ కొంటున్నారు. రెండు ఆర్డర్..బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కూడా అదే పని చేశాడు. ఓ కార్యక్రమంలో అక్షయ్ కుమార్ మాట్లాడుతూ.. నా భార్య (ట్వింకిల్ ఖన్నా) నిన్నగాక మొన్న రెండు ఇండక్షన్ స్టవ్స్ ఆర్డర్ పెట్టింది. అదింకా డెలివరీ అయిందో, లేదో నాకు తెలీదు. ఎందుకైనా మంచిది, మీరు కూడా ఒకటి కొనుక్కుంటే బెటర్ అన్నాడు. సినిమాప్రస్తుతానికి తమ ఇంట్లో వంటగ్యాస్ కొరత లేదని, కాకపోతే బ్యాకప్ కోసం ఇండక్షన్ స్టవ్ రెడీ చేసుకుంటున్నట్లు తెలిపాడు. అక్షయ్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం అతడు ప్రధాన పాత్రలో నటించిన హారర్ కామెడీ చిత్రం భూత్ బంగ్లా ఏప్రిల్ 10న రిలీజ్ కానుంది. ఇది కాకుండా ఆయన చేతిలో మరో నాలుగు సినిమాలున్నాయి.చదవండి: చికిరి చికిరి పట్టించుకోలేదు.. ఈ పాట వల్లే అభాసుపాలు: గేయరచయిత -
ఆ 'చికిరి చికిరి' పట్టించుకోలేదు.. ఈ పాట వల్ల తీవ్ర అవమానం!
తమిళ హీరో ధ్రువ సర్జా ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం "కేడీ: ద డెవిల్". బాలీవుడ్ నటుడు సంజయ్ దత్, శిల్పాశెట్టి కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో నోరా ఫతేహి ఐటం సాంగ్లో మెరిసింది. ఇటీవలే కన్నడతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ఆ ఐటం సాంగ్ను విడుదల చేశారు.బూతు పాటఅయితే హిందీలో ఆ పాట లిరిక్స్ పచ్చిబూతులతో అసభ్యంగా ఉంది. డ్యాన్స్ కూడా అశ్లీలంగా ఉండేసరికి అభ్యంతరాలు వెల్లువెత్తాయి. ఆలిండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ ఫిర్యాదుతో కేంద్రం.. ఈ పాటను తొలగించాలని ఆదేశించింది. అలా హిందీ వర్షన్ను యూట్యూబ్ నుంచి తీసేశారు. తాజాగా ఈ వివాదంపై హిందీలో 'సర్కే చునర్' పాటకు లిరిక్స్ అందించిన గేయరచయిత రఖీబ్ ఆలం స్పందించాడు. నేను సొంతంగా రాయలేదుఆ లిరిక్స్ సొంతంగా తాను రాసినవి కావన్నాడు. కన్నడలో దర్శకుడు ప్రేమ్ రాసిన లిరిక్స్నే యథాతథంగా హిందీలో అనువదించాను. నిజానికి ఈ పాటను హిందీలో రాయమన్నప్పుడే నేను తిరస్కరించాను. ఇలాంటివి సెన్సార్ ఒప్పుకోవు, వర్కవుట్ కాదన్నాను. కన్నడ వర్షన్ను అచ్చుగుద్దినట్లుగా హిందీలో మార్చమని అప్పగించారు. చాలా డబుల్ మీనింగ్ లైన్స్ ఉన్నాయి. కానీ అదంతా ఒక మద్యం సీసా గురించి అని వారు చిట్టచివర్లో బయటపెట్టారు. అవేవీ గుర్తించలేదుఅయితే అది తెలిసేవరకు ఆ లైన్స్ అన్నీ అసభ్యకరంగానే అనిపిస్తాయి. అదే విషయం నేనూ చెప్పాను. అసలు ఇలాంటి పాటలు రాయాల్సిన అవసరం నాకేంటి? నేను మంచి పాటలు రాసినప్పుడు ప్రజలు వాటిని పట్టించుకోరు. రామ్చరణ్ పెద్ది సినిమాలోని చికిరి చికిరి పాటకు హిందీలో నేనే సాహిత్యాన్ని అందించాను. పుష్ప మూవీలోని అన్ని పాటలు హిందీలో నేనే రాశాను. అవేవీ గుర్తించలేదు.. కొత్త వర్షన్ వస్తుందికానీ సర్కే చునర్ సాంగ్ వల్ల అభాసుపాలయ్యాను, ఎంతో అవమానకరంగా ఉంది. నేను చెప్పినట్లే పాటపై అభ్యంతరాలు వచ్చాయి. దాంతో మేకర్స్ ఎటువంటి అసభ్యతకు చోటు లేకుండా కొత్త వర్షన్ రాయమని అడిగారు. అది ఆల్రెడీ రాసి పంపాను. త్వరలోనే చిత్రయూనిట్ క్షమాపణలు చెప్పి కొత్త లిరిక్స్తో ఉన్న పాట రిలీజ్ చేస్తుంది అని రఖీబ్ చెప్పుకొచ్చాడు.చదవండి: సినిమాపై భయం.. అబ్బాస్కు మంచి కమ్బ్యాక్: జీవీ ప్రకాశ్ కుమార్ -
చాంద్ దేఖ్ లేనా..
సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘మాతృభూమి’. ఈ చిత్రంలో చిత్రాంగదా సింగ్ హీరోయిన్గా నటిస్తున్నారు. అపూర్వ లఖియా దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ నిర్మిస్తున్నారు. దేశభక్తి నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో సల్మాన్ సైనికాధికారిగా నటిస్తున్నారు. ఈ చిత్రంలోని ‘చాంద్ దేఖ్ లేనా..’ పాట టీజర్ను రిలీజ్ చేసి, త్వరలోనే పూర్తి పాటను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ పేర్కొన్నారు.హిమేష్ రేష్మియా స్వరపరచిన ఈ పాటకు సమీర్ అంజాన్ సాహిత్యం అందించగా, నిహాల్ టౌరో–అంకోనా ముఖర్జీ పాడారు. ఈ సినిమాకు తొలుత ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్’ అనే టైటిల్ను అనుకుని, ఇటీవల ‘మాతృభూమి’గా మార్చారు. అలాగే ఈ సినిమాను తొలుత ఏప్రిల్ 17న రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. కానీ వాయిదా పడిందని, ఆగస్టు 15న ఈ చిత్రం రిలీజ్ కావొచ్చని బాలీవుడ్ టాక్. -
బూతు పాటపై కేంద్రం సీరియస్
సినిమాల్లో ఈ మధ్య హింస పెరిగిపోతోంది. రక్తపాతం, వయలెన్స్ లాంటి వాటిని కాస్త ఎక్కువగానే చొప్పిస్తున్నారు. ఇది సమాజంపై చూపి ప్రభావం చూపే చాలానే ఉండొచ్చు. ఇప్పుడు దీనికి తోడు పాటలు కూడా హద్దులు దాటేస్తున్నాయి. రీసెంట్గా అలా నోరా ఫతేహి డ్యాన్స్ చేసిన ఓ గీతం ఇప్పుడు వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయింది. సోషల్ మీడియాలో లెక్కకు మించిన విమర్శలు వచ్చాయి. ఇప్పుడు ఈ పాటపై కేంద్రం కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది.(ఇదీ చదవండి: 'ధురంధర్ 2'.. మన దగ్గర ఇలా అక్కడ మరోలా)కన్నడ హీరో ధ్రువ సర్జా లేటెస్ట్ మూవీ 'కేడీ:ది డెవిల్'. ఎప్పటినుంచో సెట్స్ మీదున్న ఈ చిత్రం విడుదలకు నానా తంటాలు పడుతోంది. సంజయ్ దత్, శిల్పా శెట్టి లాంటి స్టార్స్ ఇందులో కీలక పాత్రలు చేశారు. త్వరలో రిలీజ్ చేద్దామనుకుని రీసెంట్గానే 'సర్కే చునర్' అని సాగే మొదటి పాటని రిలీజ్ చేశారు. ఈ పాట సాహిత్యానికి సంబంధించి దక్షిణాదిలో ఓ దశ వరకు రాశారు. హిందీలో మాత్రం డబుల్ మీనింగ్ వచ్చేలా పచ్చిబూతులు రాసేశారు. దీనికి తోడు డ్యాన్స్ కూడా అసభ్యంగా ఉండేసరికి వివిధ వర్గాల నుంచి అభ్యంతరాలు వచ్చాయి.ఈ పాటపై ఆలిండియా సినీ వర్కర్స్ అసోసియేషన్.. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేసింది. స్పందించిన కేంద్రం.. అన్ని చోట్ల నుంచి పాటని తొలగించాలని సెన్సార్ అధికారుల్ని ఆదేశించింది. సినిమాలు, మ్యూజిక్ వీడియోల్లో ఈ తరహా అభ్యంతరకర కంటెంట్ పునరావృతం కాకుండా పర్యవేక్షించాలని సూచించింది. ఇప్పటికే హిందీ వెర్షన్ పాటని యూట్యూబ్ నుంచి తొలగించేశారు.పాన్ ఇండియా మూవీగా తీసిన 'కేడీ ది డెవిల్'ని.. రీసెంట్ టైంలో 'జన నాయగణ్'తో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మించింది. ఇప్పటికే విజయ్ సినిమా రిలీజ్ నిరవధిక వాయిదా పడేసరికి సతమవుతున్న ఈ నిర్మాణ సంస్థకు 'టాక్సిక్' వాయిదా మరో దెబ్బ కాగా.. ఇప్పుడు ఈ పాటపై కూడా సర్వత్రా విమర్శలు, కేంద్రం సీరియస్ కావడం లాంటివి మరింతగా ఇబ్బంది పెడుతున్నాయి.(ఇదీ చదవండి: నాకు నయనతార కావాలి.. ఎంపీ షాకింగ్ కామెంట్స్) -
'ధురంధర్ 2'.. మన దగ్గర ఇలా అక్కడ మరోలా
లెక్క ప్రకారం ఈ నెలలో చాలానే పాన్ ఇండియా సినిమాలు రావాలి. కానీ చాలావరకు అవన్నీ వాయిదా పడటంతో చివరకు 'ధురంధర్ 2' మాత్రమే రేసులో మిగిలింది. ఈ గురువారం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. దేశమంతటా దీనిపై హైప్ బీభత్సంగా ఉంది. ప్రీమియర్, రెగ్యులర్ షోల టికెట్స్ వేగంగా బుక్ అయిపోతున్నాయి. అయితే ఓ విషయం మాత్రం ఆసక్తికరంగా అనిపిస్తోంది.(ఇదీ చదవండి: బ్యాడ్ సెంటిమెంట్.. టెన్షన్లో పవన్ ఫ్యాన్స్!)గతేడాది డిసెంబరులో అంటే మూడు నెలల క్రితం 'ధురంధర్' తొలి పార్ట్ రిలీజైనప్పుడు ఏ మాత్రం హైప్ లేదు. ఎప్పుడైతే థియేటర్లలోకి వచ్చిందో మౌత్ టాక్ వల్ల పాన్ ఇండియా లెవల్లో టాక్ ఆఫ్ ద టౌన్ అయిపోయింది. ఈ మూవీ చివరలో చెప్పినట్లుగానే మార్చి 19నే ఇప్పుడు సీక్వెల్ విడుదల చేస్తున్నారు. తొలి భాగం దాదాపు మూడున్నర గంటల నిడివి కాగా.. ఇప్పుడు మరింత నిడివితో సీక్వెల్ రాబోతుంది.'ధురంధర్: ద రివేంజ్' నిడివి మన దేశంలో మూడు గంటల 49 నిమిషాలు కాగా.. ఓవర్సీస్లో మాత్రం 3 గంటల 55 నిమిషాలు. అంటే మన కంటే విదేశీ ప్రేక్షకులు ఆరు నిమిషాల పాటు అదనంగా ఉండే ఫుటేజ్ చూడనున్నారనమాట. రిలీజ్ 19నే అయినప్పటికీ ముందురోజు సాయంత్రం నుంచి దేశవ్యాప్తంగా ప్రీమియర్లు పడనున్నాయి. ముంబై, బెంగళూరు లాంటి నగరాలతో పోలిస్తే హైదరాబాద్లోనే ప్రీమియర్ల బుకింగ్స్ టాప్ రేంజులో ఉన్నట్లు తెలుస్తోంది.ఇక విడుదలకు ముందే రూ.130 కోట్లకు పైగా ప్రీ సేల్స్తో అదరగొట్టిన 'ధురంధర్ 2'.. తెలుగు, తమిళం లాంటి దక్షిణాది భాషల్లోనూ రిలీజ్ కానుంది. దీంతో ఈసారి ఎన్ని వందల కోట్ల కలెక్షన్స్ వస్తాయోనని మూవీ లవర్స్ మాట్లాడుకుంటున్నారు. మరోవైపు దీనితో పాటు విడుదలవుతున్న తెలుగు సినిమా 'ఉస్తాద్ భగత్ సింగ్'.. 2 గంటల 34 నిమిషాల నిడివితో థియేటర్లలోకి వస్తోంది. మరి 'ధురంధర్ 2' పోటీ తట్టుకుని పవన్ మూవీ నిలబడుతుందా లేదా అనేది చూడాలి?(ఇదీ చదవండి: నాకు నయనతార కావాలి.. ఎంపీ షాకింగ్ కామెంట్స్) -
రిలీజ్కు ముందే దూకుడు.. ఓజీ, బాహుబలి-2 రికార్డ్స్ బ్రేక్..!
రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్. పాకిస్తాన్ బ్యాక్డ్రాప్లో తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ను షేక్ చేసింది. గతేడాది డిసెంబర్ 5న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా రికార్డ్ సృష్టించింది. కాంతార-2, ఛావా సినిమాలను అధిగమించి మొదటిస్థానంలో నిలిచింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.1300 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమాకు సీక్వెల్గా దురంధర్-2 ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు మేకర్స్. దురంధర్ ది రివెంజ్ పేరుతో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది.అడ్వాన్స్ బుకింగ్స్లో దూకుడు..ఇప్పటికే అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్లోనూ దురంధర్-2 దూసుకెళ్తోంది. ప్రీమియర్ షోలు, మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్స్తో కలిసి ఏకంగా రూ.123 కోట్లు వసూలు చేసింది. రిలీజ్కు ముందే సరికొత్త రికార్డులతో అభిమానుల్లో అంచనాలు మరింత పెంచేసింది. మరిన్ని షోల బుకింగ్లు ఇంకా ప్రారంభం కావాల్సి ఉన్నందున.. రాబోయే రెండు రోజుల్లో ఈ వసూళ్ల సంఖ్య భారీగా పెరిగే ఛాన్స్ ఉంది.దేశవ్యాప్తంగా మార్చి 18న 'ధురందర్ 2' ప్రీమియర్ షోలు ప్రదర్శించనున్నారు. ఈ ప్రీమియర్ షో టికెట్స్ ద్వారా రూ.38.50 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఈ కలెక్షన్స్తో ఓజీ, బాహుబలి-2 ప్రీమియర్ షోల రికార్డ్స్ బ్రేక్ చేసింది. ఇండియాలో మొదటి రోజు 13 వేల షోల ద్వారా ఈ చిత్రం రూ. 24.50 కోట్ల దేశీయ వసూళ్లు రాబట్టింది. ప్రీ సేల్స్ ద్వారా అంతర్జాతీయ మార్కెట్లలో సుమారు రూ. 60 కోట్లు బిజినెస్ చేసింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా మొత్తం ప్రీ బిజినెస్ రూ. 123 కోట్లకు చేరుకుంది. -
'అలా చేయడం సిగ్గుచేటు'.. ఆస్కార్ నివాళిపై హేమ మాలిని ఆగ్రహం..!
ఆస్కార్ అవార్డుల వేడుక గ్రాండ్గా జరిగింది. 98వ ఆస్కార్ అవార్డుల వేడుక లాస్ ఏంజెలెస్లోని డాల్బీ థియేటర్లో నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు సినీ దిగ్గజాలకు నివాళులర్పించారు. సినీ రంగంలో విశేషంగా రాణించిన టాలీవుడ్ దివంగత నటుడు కోట శ్రీనివాసరావును స్మరించుకున్నారు. ఆయనతో పాటు బాలీవుడ్ దిగ్గజం ధర్మేంద్ర, మనోజ్ కుమార్, బి.సరోజాదేవి లాంటి నటులకు గుర్తు చేసుకున్నారు. ఈ ప్రతిష్టాత్మక వేడుకలో నివాళులర్పిస్తూ వీడియోను ప్రదర్శించారు. ఈ సినీ దిగ్గజాల పేర్లను అకాడమీ తన అధికారిక వెబ్సైట్లో ప్రత్యేకంగా పొందుపరిచారు.అయితే తాజాగా ధర్మేంద్రకు ఆస్కార్ నివాళి అర్పించడంపై ఆయన భార్య హేమ మాలిని స్పందించారు. ఆస్కార్ వేదికపై ప్రసారం చేసిన మెమోరియంలో ధర్మేంద్ర ఫోటోలు లేకపోవడంపై నిరాశ వ్యక్తం చేశారు. ఇలా ప్రదర్శించడం ఆ అవార్డుల వేడుకకే సిగ్గు చేటని హేమ మాలిని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు గౌరవించకపోయినా ఆయనకు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ప్రేమిస్తున్నారని ఆమె అన్నారు. కేవలం అవార్డులు మాత్రమే ఆయన కెరీర్ను నిర్ణయించలేవని తెలిపారు.హేమ మాలిని మాట్లాడుతూ.. 'ఆయన తన జీవితకాలంలో ఎప్పుడూ ఎక్కువ అవార్డులు పొందలేదు. అలాంటప్పుడు ఆయన ఆస్కార్ల గురించి ఎందుకు పట్టించుకోవాలి? మా ఇద్దరికీ మన దేశంలో లభిస్తున్న ప్రేమ పట్ల చాలా సంతోషంగా ఉన్నాం. లాల్ పత్తర్, మీరా చిత్రాలలో నా ఉత్తమ నటనకు కూడా ఎటువంటి అవార్డు రాలేదు' అని తెలిపింది.అయితే ప్రత్యక్ష ప్రసారం సందర్భంగా డయాన్ కీటన్, కేథరీన్ ఓహారా, రాబర్ట్ రెడ్ఫోర్డ్, ఉడో కీర్, రాబ్ రైనర్, రాబర్ట్ డువాల్, జీన్ హాక్మన్, వాల్ కిల్మర్లతో లాంటి అంతర్జాతీయ సినీ ప్రముఖులకు మాత్రమే అకాడమీ నివాళులర్పించింది. ఆ తర్వాత ధర్మేంద్రతో పాటు మరో నటుడు మనోజ్ కుమార్లను అధికారిక ఆస్కార్ వెబ్సైట్లో ఇన్ మెమోరియం జాబితాలో చేర్చారు. కాగా.. సినీ పరిశ్రమకు ఆయన చేసిన సేవలను గుర్తించిన కేంద్రం.. ధర్మేంద్రను పద్మ విభూషణ్తో సత్కరించింది. టాలీవుడ్ సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావుకు సైతం ఆస్కార్ అకాడమీ నివాళులర్పించింది. -
ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ మృతి.. జాన్వీ కపూర్ ఎమోషనల్ పోస్ట్!
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఎమోషనల్ పోస్ట్ చేసింది. ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ మార్స్ మృతి పట్ల తీవ్ర భావోద్వేగానికి గురైంది. అతనితో ఉన్న స్నేహాన్ని గుర్తు చేసుకుంటూ నివాళులు అర్పించింది. అతనితో ఉన్న ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అతని మరణం పట్ల పలువురు బాలీవుడ్ సినీతారలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.సోషల్ మీడియాలో జాన్వీ కపూర్ రాస్తూ..'సినిమా సెట్లో బిజీగా ఉన్నప్పటికీ ఎప్పుడు నవ్వుతూ ఉండేవాళ్లం. వానిటీ వ్యాన్లో ప్రవేశించిన ప్రతిసారీ కేవలం 20 నిమిషాలు మాత్రమే టైమ్ ఉందని ఆటపట్టించేదాన్ని. నీతో కలిసి పనిచేయడం ఆనందంగా అనిపించేది. నీతో కలిసి పనిచేసిన క్షణాలు ఎప్పటికీ గుర్తుంటాయి. ఇక నుంచి నేను ప్రతిరోజూ నిన్ను మిస్ అవుతాను. గత రెండు సంవత్సరాలుగా నా సృజనాత్మక ప్రయాణం ప్రారంభం నుంచి చివరి వరకు నీ ముఖాన్ని చూడటం నా జీవితంలో గుర్తుండిపోయే క్షణాల్లో ఒకటి. లవ్ యూ.. నేను నిన్ను చాలా మిస్ అవుతున్నా…' అంటూ పోస్ట్ చేసింది.కాగా.. జాన్వీ కపూర్ ప్రస్తుతం పెద్ది మూవీలో నటిస్తోంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్నారు. ఈ మూవీకి బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 30న థియేటర్లలో సందడి చేయనుంది.అసలు మార్స్ పెడ్రోజో ఎవరు?మార్స్ పెడ్రోజో హిందీ చిత్ర పరిశ్రమలో ప్రముఖ హెయిర్స్టైలిస్ట్గా గుర్తింపు తెచ్చుకున్నారు. అనేక మంది స్టార్స్తో కలిసి పనిచేశారు. ఫిల్మ్ షూటింగ్స్, ప్రమోషనల్ ఈవెంట్స్తో గుర్తింపు పొందారు. కొన్నేళ్లుగా ఇండస్ట్రీలోని సృజనాత్మక నిపుణులతో కలిసి పనిచేశాడు, అతని నైపుణ్యాలు, సెట్లో తన వర్క్తో మరింత ఫేమస్ అయ్యాడు. అతని మరణ వార్త విన్న పలువురు బాలీవుడ్ ప్రముఖులు పెడ్రోజోను గుర్తుచేసుకున్నారు. వరుణ్ ధావన్, నోరా ఫతేహి లాంటి స్టార్స్ పరిశ్రమకు చేసిన సహకారాన్ని గుర్తు చేసుకుంటూ సంతాపం వ్యక్తం చేశారు. View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) -
రామాయణలో 'కుంభకర్ణ'గా ఆ నటుడు!
ఇండియన్ బిగ్స్క్రీన్పై అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం రామాయణ. నితీశ్ తివారి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ రెండు భాగాలుగా రానుంది. ఈ రెండు భాగాలకు కలిపి దాదాపు రూ.4000 కోట్ల బడ్జెట్ కేటాయించారు. అంటే సినిమాను ఎంత విజువల్ వండర్గా తెరకెక్కిస్తున్నారో ఇక్కడే అర్థమైపోతోంది.రామాయణ సినిమాఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్బీర్ కపూర్ రాముడిగా, సాయిపల్లవి సీతగా, యష్ రావణుడిగా నటిస్తున్నారు. అలాగే సన్నీడియోల్ హనుమంతుడిగా, రవి దూబే లక్ష్మణుడిగా కనిపించనున్నారు. తాజాగా రావణుడి సోదరుడు, కుంభకర్ణుడి పాత్ర గురించి ఆసక్తికర వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. మొన్నటివరకు బాబీ డియోల్ కుంభకర్ణుడిగా చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు మరో నటుడి పేరు తెరపైకి వచ్చింది.కుంభకర్ణుడిగా..అతడే ఫైజల్ మాలిక్. పంచాయత్ వెబ్ సిరీస్తో గుర్తింపు తెచ్చుకున్న ఇతడిని కుంభకర్ణుడిగా ఎంపిక చేయగా, అతడిపై సీన్స్ చిత్రీకరించారని తెలుస్తోంది. అతడి అవతారం కుంభకర్ణుడి పాత్రకు సరిగ్గా సరిపోయిందని ఇన్సైడ్ వర్గాల టాక్! మరి ఇదెంతవరకు నిజమన్నది తెలియాల్సి ఉంది. ఇకపోతే మార్చి 27న శ్రీరామనవమిని పురస్కరించుకుని రామయణ సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. తొలి భాగం ఈ ఏడాది దీపావళికి విడుదల చేస్తుండగా రెండో భాగాన్ని 2027 దీపావళికి రిలీజ్ చేయనున్నారు.సినిమాలు, సిరీస్లుఫైజల్ మాలిక్.. గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్ సినిమాలో కామెడీ పోలీస్గా నటించాడు. పంచాయత్ వెబ్ సిరీస్లో డిప్యూటీ ప్రధాన్ ప్రహ్లాద్చాగా అలరించాడు. ఆ తర్వాత కూడా పలు సినిమాలు, సిరీస్లు చేశాడు. చివరగా హారర్ కామెడీ మూవీ థామాలో పోలీస్గా కనిపించాడు.చదవండి: నాగార్జున వల్లే నా కూతురు సినిమాల్లోకి..: ప్రియదర్శన్ -
అలాంటి సీన్లు చేయమని బలవంతం..: నటి
సల్మాన ఖాన్ 'వీర్' (2010) సినిమాతో వెండితెరపై కథానాయికగా పరిచయమైంది జరీన్ ఖాన్. ఆ మరుసటి ఏడాది అతడి మూవీలోనే స్పెషల్ సాంగ్లో మెరిసింది. అలా ఓ పక్క సినిమాలు చేస్తూనే మరోపక్క ఐటం సాంగ్స్ చేసింది. అయితే హేట్ స్టోరీ 3 మూవీ చేశాక తనను అందరూ తక్కువ చేసి చూశారంటోంది జరీన్ ఖాన్.ముందో మాట చెప్పి..తాజాగా ఓ ఇంటర్వ్యూలో జరీన్ ఖాన్ మాట్లాడుతూ.. హేట్ స్టోరీ 3లో నటించాక అందరూ నన్ను చులకన చేసి మాట్లాడారు. తనకు యాక్టింగ్ రాదు కాబట్టే అలా దుస్తులు విప్పే సన్నివేశాల్లో నటించిందని కామెంట్స్ చేశారు. ఆ సమయంలో దర్శకుడు అనంత్ మహదేవన్ అక్సర్ 2 సినిమా ఆఫర్ చేశారు. అయితే ఇందులో బోల్డ్ సన్నివేశాలుండవని హామీ ఇచ్చారు. కథంతా చెప్పి ఇది హేట్ స్టోరీ మూవీలా అయితే ఉండదని నొక్కి చెప్పాడు. దాంతో సరేనన్నాను. చెప్పిందొకటి.. చేసిందొకటికానీ, సెట్కు వెళ్లాక అంతా తలకిందులైంది. ముద్దు సన్నివేశం అంటారు.. సడన్ దుస్తులు విప్పేయమంటారు. పొట్టి దుస్తులే ధరించాలంటారు! నా బాధేంటంటే.. స్క్రిప్ట్ ఒకరకంగా చెప్పి షూటింగ్ మరోరకంగా జరిపారు. అదే వాళ్లతోనూ అన్నాను.. ఇలాంటి సన్నివేశాల్లో నటించడం నాకు సమస్య కాదు.. కానీ, మీరు నాకు చెప్పిందేంటని అడిగాను. కేవలం నా గత సినిమా చూసి కావాలని ఇందులో అలాంటి సీన్లు ఇరికిస్తున్నారన్నాను.ఎంత అన్యాయం?నామాట ఎవరూ పట్టించుకోలేదు. నాకు అందరూ వ్యతిరేకంగా మారారు. నిర్మాతలు పూర్తిగా అలా రెచ్చగొట్టే సన్నివేశాలే చేయమని బలవంతపెట్టారు. అదెంత అన్యాయం! అయినా నేను సహించాను. ఇప్పుడు గొడవకు దిగి వెళ్లిపోతే వాళ్ల పెట్టుబడి అంతా వృథా అవుతుందని సినిమా పూర్తి చేశాను. కానీ, చివరకు సినిమా స్క్రీనింగ్కు కూడా నన్ను పిలవలేదు. కానీ నేను సరిగా పని చేయనని నన్ను బద్నాం చేశారు అని జరీనా ఖాన్ చెప్పుకొచ్చింది.చదవండి: నా సినిమాలన్నీ ఫ్లాప్.. నాకు లాభమే లేదు: విజయ్ సేతుపతి -
‘ధురంధర్’తో ఆ విషయం అర్థమైయింది :అక్షయ్ కుమార్
ప్రేక్షకులు అభిరుచి ప్రతి రెండు,మూడేళ్లకు ఓసారి మారుతుందని, అందుకు ‘ధురంధర్’ మంచి ఉదాహరణ అని బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ అన్నాడు. తాజాగా అక్షయ్ కుమార్ ఇండియా టుడే కాంక్లేవ్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలీవుడ్లో మారుతున్న ట్రెండ్ గురించి అక్షయ్ మాట్లాడుతూ.. ‘ధురంధర్’ సినిమాను తీసుకోండి. ఇది పూర్తి స్థాయి యాక్షన్ చిత్రం. సినిమా మొత్తంలో యాక్షన్ సన్నివేశాలే ఉంటాయి. ప్రేక్షకులు వాటిని ఎంజాయ్ చేస్తున్నారు. రణవీర్ సింగ్ చేసిన హై-ఎనర్జీ యాక్షన్ సన్నివేశాలకు చప్పట్లు కొడుకున్నారు. దీన్ని బట్టి ఇప్పుడు ఆడియన్స్ యాక్షన్ సినిమాలను ఇష్టపడుతున్నారనే విషయం అర్థమవుతుంది.ఇలా రెండు, మూడేళ్లకు ఒకసారి ప్రేక్షకుల అభిరుచి మారుతూనే ఉంటుంది. ఐదారేళ్ల క్రితం పరిస్థితి వేరుగా ఉండేది.అప్పుడు సామాజిక సందేశాత్మక చిత్రాలను ఆదరించారు. నేను చేసిన ‘టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథ’, ‘ప్యాడ్ మ్యాన్’ లాంటి సినిమాలు అప్పుడు సూపర్ హిట్గా నిలిచాయి. ఇప్పుడు అలాంటి సినిమాలు తీస్తే.. ఆడుతాయో లేదో తెలియదు. ప్రేక్షకుల కోరికలు ట్రెండ్కు తగ్గట్లుగా మారుతుంటాయి. ప్రస్తుతం హారర్ కామెడీలకూ ఆదరణ లభిస్తోంది. తర్వాత ఆడియన్స్ దేనిని ఇష్టపడతారో మనం ఎప్పటికీ ఊహించలేం’ అని అన్నారు. ధురంధర్ విషయానికొస్తే.. రణ్వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ తెరకెక్కించిన యాక్షన్ థ్రిల్లర్ ఇది. గతేడాది డిసెంబర్లో విడుదలైన ఈ చిత్రం.. బాక్సాఫీస్ని షేక్ చేసింది. దాదాపు రూ. 1300 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఇప్పుడీ చిత్రానికి సీక్వెల్గా ధురంధర్ 2 రాబోతుంది. మార్చి 19న ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. -
ఆస్కారం ఎవరికి?
హాలీవుడ్లో ఆస్కార్ సందడి మొదలైంది. 98వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం అమెరికాలోని లాస్ ఏంజెల్స్లో ఈ నెల 15న జరగనున్న సంగతి తెలిసిందే. భారతీయ కాలమానం ప్రకారం మార్చి 16 ఉదయం జరుగుతుంది. ఎప్పటిలానే ఈ ఏడాది కూడా ఆస్కార్ అవార్డు సాధించే ఆస్కారం ఎవరికి మెండుగా ఉంది? అనే చర్చ జరుగుతోంది. ఆస్కార్ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డు సృష్టించి, అత్యధికంగా 16 నామినేషన్స్ దక్కించుకున్న ‘సిన్నర్స్’ సినిమాకు ఫైనల్గా ఎన్ని అవార్డులు వస్తాయి? అనేది ప్రస్తుతం హాలీవుడ్లో హాట్ టాపిక్.అలాగే 13 నామినేషన్స్ దక్కించుకున్న ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’ సినిమా ‘సిన్నర్స్’ సినిమాను డామినేట్ చేసి, ఎక్కువ అవార్డులు దక్కించుకునే అవకాశం లేకపోలేదని హాలీవుడ్ మీడియా చెబుతోంది. ఇక ‘ఫ్రాకింగ్స్టన్, మార్టీ సుప్రీం, సెంటిమెంటల్ వాల్యూ’ చిత్రాలకు తొమ్మిది నామినేషన్స్ లభించగా, ‘హామ్నెట్’ చిత్రానికి 8 నామినేషన్స్ దక్కాయి. మరి... ఈ చిత్రాల్లో ఏ చిత్రం ఎన్ని అవార్డులు దక్కించుకుంటుంది? అనే చర్చ జరుగుతోంది. ఇక ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ దర్శకుడు... ఈ ప్రధాన విభాగాల్లో హాలీవుడ్ కథనాల ప్రకారం అవార్డు దక్కే ఆస్కారం ఎవరికి ఉందనే విషయం తెలుసుకుందాం...జోస్యం నిజమవుతుందా?ఉత్తమ నటుడు విభాగంలో అవార్డు కోసం తిమోతి చాలమేట్, లియోనార్డ్ డికాప్రియో, ఈథన్ హాక్, మైఖేల్ బి జోర్డాన్, వాగ్నర్ మౌరా పోటీ పడుతున్నారు. అయితే ఈ ఐదుగురిలోనూ తిమోతి చాలమేట్ (‘మార్టీ సుప్రీం’ సినిమాకుగానూ)కే ఉత్తమ నటుడు అవార్డు దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే టాక్ హాలీవుడ్లో వినిపిస్తోంది. కానీ ఈ ఏడాది జరిగిన 83వ గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లో ఉత్తమ నటుడి అవార్డును ‘ది సీక్రెట్ ఏంజెంట్’ చిత్రానికిగానూ వాగ్నర్ మౌరా గెలుచుకున్నారు. ఈ విభాగంలో అవార్డు అందుకున్న తొలి బ్రెజిలియన్ యాక్టర్గా వాగ్నర్ నిలిచారు.అది మాత్రమే కాదు... ఉత్తమ నటుడిగా కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లోనూ వాగ్నర్ మౌరా అవార్డును గెలుచుకున్నారు. మరోవైపు ‘స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్’ అందించే అవార్డ్స్లో ఉత్తమ నటుడిగా అవార్డును గెలుచున్నారు మైఖేల్ బి. జోర్డాన్. పైగా ఆస్కార్లోనే అత్యధిక నామినేషన్స్ను దక్కించుకున్న ‘సిన్నర్స్’ సినిమాలో నటించిన యాక్టర్ కాబట్టి మైఖేల్ బి. జోర్డాన్పై కూడా అంచనాలు ఉన్నాయి. ఇక ‘బ్లూ మూన్’ సినిమాలో ఈథన్ హాక్, ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’ చిత్రంలో లియోనార్డ్ డికాప్రియో సూపర్బ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు.దీంతో ఈ ఏడాది పోటీ కాస్త గట్టిగానే ఉన్నట్లుగా తెలుస్తోంది. కాకపోతే... మెజారిటీ మాత్రం తిమోతి చాలమేట్కే అవార్డు వస్తుందని అంచనా వేస్తున్నారు. పైగా 30 ఏళ్ల వయసులోనే మూడుసార్లు ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయిన అతి పిన్న వయస్కుడిగా తిమోతి పేరిట రికార్డు ఉంది. 97వ ఆస్కార్ అవార్డ్స్లో ఉత్తమ నటుడు విభాగంలో ‘ఏ కంప్లీట్ అన్నోన్’ సినిమాకుగాను తిమోతికి నామినేషన్ దక్కినప్పటికీ అవార్డు రాలేదు. ఈ మూడో ప్రయత్నంలో తిమోతికి అవార్డు ఖాయం అని హాలీవుడ్ జోస్యం చెబుతోంది..పాతికేళ్ల తర్వాత... గత ఏడాది జరిగిన 97వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో మొత్తం 23 విభాగాల్లో ఆస్కార్ అవార్డులను అందించారు. అయితే ఈ ఏడాది జరగనున్న 98వ అవార్డ్స్ ప్రదానోత్సవంలో కొత్తగా ‘బెస్ట్ క్యాస్టింగ్’ అనే విభాగాన్ని ఆస్కార్ అకాడమీ కమిటీ ప్రవేశపెట్టింది. 2001లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ విభాగాన్ని ప్రవేశపెట్టిన తర్వాత మళ్లీ పాతికేళ్లకు ‘బెస్ట్ క్యాస్టింగ్’ పేరుతో మరో విభాగాన్ని చేర్చారు.ఇలా 98వ ఆస్కార్ అవార్డ్స్లో మొత్తం 24 విభాగాల్లో అవార్డులను ప్రదానం చేయనున్నారు. ఉత్తమ క్యాస్టింగ్ విభాగంలో నీనా గోల్డ్ (‘హామ్నెట్’ సినిమా), జెన్నిఫర్ వెండెట్టి (మార్టీ సుప్రీం), వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ (కాసాండ్రా కులుకుండిస్), గాబ్రియేల్ డొమింగ్యూస్ (ది సీక్రెట్ ఏజెంట్), ఫ్రాన్సిన్ మైస్లర్ (సిన్నర్స్) మధ్య పోటీ నెలకొంది. ఉత్తమ చిత్రం విభాగంలో ప్రధాన పోటీ ‘సిన్నర్స్, వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’ చిత్రాల మధ్య ఉన్నట్లే, ఈ కొత్త విభాగంలోనూ ప్రధాన పోటీ ఫ్రాన్సిన్ మైస్లర్ (సిన్నర్స్), వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ (కాసాండ్రా కులుకుండిస్)ల మధ్య ఉన్నట్లుగా తెలుస్తోంది.ఎందుకంటే యాక్టింగ్ విభాగంలో ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’ సినిమాకు నాలుగు నామినేషన్స్ దక్కగా, ‘సిన్నర్స్’కు మూడు నామినేషన్స్ దక్కాయి. అయితే ఈ విభాగంలో ‘సిన్నర్స్’కే అవార్డు రావచ్చనే ఊహాగానాలు ఉన్నాయి. ఎందుకంటే... ఆస్కార్ చరిత్రలోనే అత్యధికంగా నామినేషన్స్ దక్కించుకున్న రికార్డు ‘సిన్నర్స్’కే దక్కింది కాబట్టి ఈ సినిమాకే ఈ విభాగంలో అవార్డు వస్తుందంటున్నారు హాలీవుడ్ సినీ నిపుణులు. అలాగే జెన్నిఫర్ వెండెట్టి (మార్టీ సుప్రీం) అవార్డు అందుకునే చాన్స్ లేకపోలేదంటున్నారు.సిన్నర్స్ వర్సెస్ వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ఉత్తమ చిత్రం విభాగంలో మొత్తం 10 చిత్రాలు నామినేషన్ దక్కించుకున్నాయి. ఆస్కార్ హిస్టరీలోనే అత్యధికంగా 16 నామినేషన్స్ను దక్కించుకుని, చరిత్ర సృష్టించిన ‘సిన్నర్స్’ ఉత్తమ చిత్రం విభాగంలో నామినేషన్ దక్కించుకుంది. అలాగే 13 నామినేషన్స్ దక్కించుకున్న ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’ చిత్రానికి కూడా ఉత్తమ చిత్రం విభాగంలో నామినేషన్ ఉంది. ఉత్తమ చిత్రం విభాగంలో ప్రధానంగా ఈ రెండు చిత్రాల మధ్యనే పోటీ ఉంటుందనే టాక్ హాలీవుడ్లో వినిపిస్తోంది. నామినేషన్స్ పరంగా ‘సిన్నర్స్’దే పై చేయి అయినప్పటికీ ఉత్తమ చిత్రం అవార్డు మాత్రం ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’ సినిమాకు రావచ్చొనే టాక్ హాలీవుడ్లో బలంగా వినిపిస్తోంది.ఈ ఏడాది జరిగిన బ్రిటిష్ అకాడమీ ఫిల్మ్ అండ్ టెలివిజన్ అవార్డు (బాఫ్తా), గోల్డెన్ గ్లోబ్, ్ర΄÷డ్యూసర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికా అవార్డుల ప్రదానోత్సవాల్లో ఉత్తమ చిత్రంగా ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’ సినిమా అవార్డులు సొంతం చేసుకుంది. ఈ కారణంగానే ఆస్కార్లోనూ ఉత్తమ చిత్రం విభాగంలో ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’కు అవార్డు దక్కుతుందనే ఊహాగానాలు ఊపందుకున్నాయి.కానీ ‘సిన్నర్స్, హామ్నెట్’ చిత్రాలను కూడా తేలికగా తీసివేయలేమని హాలీవుడ్ సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ చిత్రాలను దాటుకుని ఈ విభాగంలో బరిలో ఉన్న ‘బగోనియా, ఎఫ్1, ఫ్రాంకిన్స్టన్, మార్టీ సుప్రీం, ది సీక్రెట్ ఏజెంట్, ట్రైన్ డ్రీమ్స్’ వంటి సినిమాల్లో ఏదైనా సర్ప్రైజింగ్గా ఉత్తమ చిత్రంగా నిలుస్తుందా? అనే విషయం కొన్ని గంటల్లో తెలిసిపోతుంది.ఈ ఇద్దరిలో ఎవరు?ఉత్తమ నటి విభాగంలో ‘హ్యామ్నెట్’ చిత్రానికిగాను జస్సీ బక్లీ, ‘బగోనియా’ చిత్రానికిగాను ఎమ్మా స్టోన్, ‘సెంటిమెంటల్ వేల్యూ’ చిత్రానికి రెనాటా రైన్సావా, ‘ఇఫ్ ఐ హ్యాడ్ లెగ్స్ ఐ ఉడ్ కిక్ యు’ చిత్రానికి నురోజ్ బర్న్, ‘సాంగ్ సంగ్ బ్లూ’ మూవీకి గాను కేట్ హడ్సన్లు నామినేషన్స్ దక్కించుకున్నారు. అయితే ‘క్రిటిక్స్ చాయిస్ అవార్డు, గోల్డెన్ గ్లోబ్ అవార్డు, బాఫ్తా అవార్డ్స్’లో నటిగా అవార్డు గెలుచుకుని, ఉత్తమ నటి విభాగంలోని ఆస్కార్ అవార్డు కోసం రేసులో ముందు వరుసలో ఉన్నారు జస్సీ బక్లీ. కాగా రెనాటా రైన్సావా, రోజ్లు తమ కెరీర్లో తొలిసారి ఆస్కార్ అవార్డుకు నామినేషన్ దక్కించుకున్నారు.అలాగే గతంలో ‘ఆల్మోస్ట్ ఫేమస్’ అనే చిత్రంలో సహాయ నటిగానూ ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయ్యారు కేట్ హడ్సన్. ఇప్పుడు దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఆమె మళ్లీ ఆస్కార్ అవార్డుకు నామినేషన్ దక్కించుకున్నారు. కానీ ఈసారి ఉత్తమ నటి విభాగంలో కేట్ హడ్సన్కు నామినేషన్ దక్కింది. కేట్, రెనాటా... ఈ ఇద్దరిలో ఆస్కార్ అదృష్టం ఎవర్ని వరిస్తుంది అనేది చూడాలి.భారత్కు నిరాశ ఈ ఏడాది జరగనున్న 98వ ఆస్కార్ అవార్డ్స్లో మన దేశానికి నిరాశే ఎదురైంది. ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలోని అవార్డు కోసం ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా భారతదేశం తరపున హిందీ చిత్రం ‘హోమ్బౌండ్’ను పంపింది. ఈ సినిమా ఆస్కార్ నామినేషన్ కోసం షార్ట్ లిస్ట్ అయింది కానీ నామినేషన్ దక్కించుకోలేకపోయింది. ఈ విభాగంలో బ్రెజిల్ దర్శకుడు క్లెబర్ మెండోన్సా ఫిల్హో తీసిన ‘ది సీక్రెట్ ఏజెంట్’, ఫ్రాన్స్ దర్శకుడు జాఫర్ పనాహి తెరకెక్కించిన ‘ఇట్ వాజ్ జస్ట్ ఎ యాక్సిడెంట్’, నార్వే డైరెక్టర్ జోచిమ్ ట్రైయర్ తీసిన ‘సెంటిమెంటల్ వేల్యూ’, స్పెయిన్ డైరెక్టర్ ఆలివర్ లాక్సే రూపొందించిన ‘సిరాట్’, ట్యూనిషియా డైరెక్టర్ కౌథర్ బెన్ హనియా దర్శకత్వం వహించిన ‘ది వాయిస్ ఆఫ్ హింద్ రజబ్’ సినిమాలు నామినేషన్ దక్కించుకున్నాయి.ఇంకా ఆస్కార్ కన్సిడరేషన్ విభాగంలో ‘మహావతార్ నరసింహా, కాంతార: ఏ లెజెండ్ చాప్టర్1, తన్వీ: ది గ్రేట్, టూరిస్ట్ ఫ్యామిలీ, సిస్టర్ మిడ్నైట్’ వంటి సినిమాలు పరిశీలన జాబితాలో ఉన్నప్పటికీ నామినేషన్ను దక్కించు కోవడంలో విఫలమయ్యాయి. అయితే ఆస్కార్ అవార్డుల ప్రజెంటర్స్లో భారతీయ నటి ప్రియాంకా చో్రపా కూడా ఉండటం అనేది భారతీయ ప్రేక్షకులను ఆనందపరిచే విషయం.పద్నాలుగో సారైనా అవార్డు వస్తుందా?దర్శకుడు పాల్ థామస్ ఆండర్సన్ ఇప్పటికి 14 సార్లు ఆస్కార్ నామినేషన్ దక్కించుకున్నారు. కానీ ఒక్కటంటే ఒక్క అవార్డు వచ్చింది లేదు. ఈ ఏడాది ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’ చిత్రానికి గాను పాల్ థామస్ ఆండర్సన్ ఉత్తమ దర్శకుడి విభాగంలో నామినేషన్ దక్కించుకున్నారు. పైగా ఈ ఏడాది జరిగిన బాఫ్తా, గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్, డైరెక్టర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికా, క్రిటిక్స్ చాయిస్ అవార్డుల ప్రదానోత్సవాల్లో ఉత్తమ దర్శకుడి అవార్డు పాల్ థామస్కే దక్కింది.దీంతో ఆస్కార్ అవార్డు కూడా ఆయనకే రావొచ్చన్నది హాలీవుడ్ బలమైన నమ్మకం. మరోవైపు రేయాన్ కూగ్లర్ (సిన్నర్స్), ట్రియర్ (సెంటిమెంటల్ వేల్యూ), జాష్ షాఫ్టీ (మార్టీ సుప్రీం), క్లోయి జావ్ (హ్మామ్నెట్) లను తక్కువగా అంచనా వేయడానికి లేదు. ఎందుకంటే...ఈ చిత్రాలకు ప్రధాన విభాగాల్లో నామినేషన్స్ దక్కింది. ఇంకా బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ విభాగంలో సీన్ పెన్ (వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్) అమీ మాడిగన్ (వెపన్స్), బెస్ట్ మ్యూజిక్ (ఒరిజినల్ స్కోర్) విభాగంలో లుడ్విగ్ గోరాన్సన్ వంటి వారు అవార్డులు గెలుచుకునే అవకాశాలు ఉన్నట్లుగా హాలీవుడ్లో వార్తలు వస్తున్నాయి. ఆస్కార్ అవార్డుని ఏ స్టార్ చేజిక్కించుకుంటారు? ఉత్తమ చిత్రం అవార్డు ఏ సినిమాకి దక్కుతుంది? అనే సస్పెన్స్ మరికొన్ని గంటల్లో వీడిపోతుంది. – ముసిమి శివాంజనేయులు -
నీరా ఆర్య బయోపిక్లో?
బాలీవుడ్ హీరోయిన్, భార తీయ జనతా పార్టీ ఎంపీ కంగనా రనౌత్ ప్రస్తుతం నీరా ఆర్యగా ఒదిగిపోవడానికి కసరత్తులు చేస్తున్నారని టాక్. ఎందుకంటే నీరా ఆర్య బయోపిక్లో నటించడానికి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. తన కెరీర్లో ఎన్నో సవాల్తో కూడిన పాత్రలు చేసిన కంగన ప్రస్తుతం ఆచి తూచి పాత్రలు ఎంపిక చేసుకుంటున్నారు. ఇందుకు కారణం ఆమె లోక్సభ సభ్యురాలు కావడమే. బాధ్యతాయుతమైన ఎంపీ పదవిలో ఉన్న ఆమె గతంలోలా కాకుండా పాత్రల ఎంపికలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఇందులో భాగంగానే నీరా ఆర్య బయోపిక్లో నటించడానికి అంగీకరించారట.స్వాతంత్య్ర పోరాటంలో భాగంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ‘ఆజాద్ హింద్ ఫౌజ్’కు అనుబంధంగా రాణీ ఆఫ్ ఝాన్సీ మహిళా రెజిమెంట్ ఉండేది. ఇందులో కీలక సభ్యురాలిగా నీరా ఆర్య వ్యవహరించారు. భారతదేశ తొలి మహిళా గూఢచారిగా ఆమెకు పేరుంది. బ్రిటిష్ అధికారిని పెళ్లాడి, సిద్ధాంత విభేదాలతో విడిపోయిన నీరా ఆర్యని బ్రిటీష్ అధికారులు అరెస్ట్ చేసి, చిత్రహింసలకు గురిచేశారట.1998 జూలై 26న ఆమె మృతి చెందారు. స్వాతంత్య్ర సంగ్రామంలో చూపించిన ధైర్యసాహసాలు, గూఢచారిగా అద్భుతంగా పని చేసిన వైనం... ఇలా ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన జీవితం ఆమెది. అలాంటి నీరా జీవితకథతో శివమ్ నాయర్ దర్శకత్వంలో ఓ సినిమా రానుందని సమాచారం. కంగనాని కలిసి ఆయన ఈ ప్రాజెక్ట్ గురించి వివరించగా ఆమె పచ్చజెండా ఊపారని టాక్. కంగన ప్రస్తుతం ‘భారత భాగ్య విధాత’ అనే సినిమా చేస్తున్నారు. -
అక్షయ్ ఖన్నా బట్టతల ట్రామాతో కుంగిపోయారు: ఫరా ఖాన్
బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా నెగిటివ్ రోల్స్లో వరుసగా హిట్స్ అందుకుంటూ హీరోలకంటే ఎక్కువ క్రేజ్ సంపాదించుకుంటున్నారు. 'ధురంధర్', ‘చావా' వంటి సినిమాలతో ఆయన నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అయితే కొరియోగ్రాఫర్-డైరెక్టర్ ఫరా ఖాన్ ఇటీవల ఓ యూట్యూబ్ పాడ్కాస్ట్లో పాల్గొని అక్షయ్ ఖన్నా గురించి చేసిన పలు వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. 'తీస్ మార్ ఖాన్' చిత్రంలో ‘ఆతిష్ కపూర్’ పాత్ర కోసం మొదట షర్మాన్ జోషిని సంప్రదించానని, ఆయన తిరస్కరించడంతో చివరికి అక్షయ్ ఖన్నానే లాస్ట్ ఛాయిస్గా ఎంపికయ్యారని ఫరా వెల్లడించారు. ఫరా ఖాన్ మాటల్లో 90వ దశకంలో అక్షయ్ ప్రవర్తన అంతగా బాగాలేదు. ఆయన చాలా చిరాకుగా ఉండేవారు. చేతిలో వున్న వస్తువులు విసిరేసేవారు. డైలాగుల విషయంలో గొడవపడేవారు. ఆ సమయంలో బట్టతల సమస్యతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యారు. అదే ఆయన కోపానికి కారణమని తెలిపారు. తాల్ సినిమాలో వర్షం పాటలో కూడా టోపీ ధరించి నటించారని గుర్తుచేశారు. 'దిల్ చాహ్తాహై’ సినిమా తర్వాత అక్షయ్ పూర్తిగా మారిపోయారు. తన లుక్, బట్టతల గురించి స్పష్టత వచ్చి, కొత్త ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగారు. 'కోయి కహే కెహతా రహే' పాటలో ఆయన అద్భుతంగా డ్యాన్స్ చేశారు. ఇటీవల 'ధురంధర్' సినిమాలో అక్షయ్ నటన చూసి ఫిదా అయ్యాను. వెంటనే ఆయనకు ఫోన్ చేసి అలీబాగ్లోని ఇంటికి వెళ్లి అభినందించాను. అక్షయ్కు అనవసర హడావిడి, షో ఆఫ్ చేయడం అంటే నచ్చదు. తన నటనపై మాత్రమే దృష్టి పెడతారని ఆమె అన్నారు. మొత్తానికి గతంలో హీరోగా ఉన్నప్పుడు కూడా రాని క్రేజ్ ఇప్పుడు నెగిటివ్ రోల్స్తో అక్షయ్ ఖన్నా సంపాదించుకోవడం బాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. -
ఇండస్ట్రీకి వద్దామని చివరకు వ్యభిచారకూపంలోకి: నటి
గంపెడాశలతో ఇండస్ట్రీలో అడుగుపెడదామని వస్తున్న ఎంతోమంది తప్పుదారి పడుతున్నారంటోంది బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా. అవకాశాల కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నవారిని కొన్ని అదృష్య శక్తులు నిలువునా ముంచేస్తున్నాయంటోంది. తాజాగా ఓ పాడ్కాస్ట్లో తనుశ్రీ దత్తా మాట్లాడుతూ.. సినీ పరిశ్రమలో మొదట అందానికి ప్రాధాన్యతనిస్తారు. వారికి టాలెంట్ ఉందా? లేదా? అనేది ఆలోచించరు. అందాన్ని చూసి పొగడ్తలు కురిపిస్తారు. కానీ అది విని మీరు బోల్తా కొట్టకూడదు. ముందు పొగడ్తలునా చిన్నతనంలో నా తల్లి అపరిచితులతో మాట్లాడకూడదని, వారిచ్చే చాక్లెట్లు తీసుకోకూడదని చెప్పేది. ఇండస్ట్రీలో అలాంటి అపరిచితులు, వారిచ్చే చాక్లెట్లు చాలా రకాలుగా ఉంటాయి. వారి కోరిక తీర్చుకునేందుకు ముందు మిమ్మల్ని పొగుడుతారు. తర్వాత మీ కలల్ని, ఆశయాల్ని ఆసరా చేసుకుని మిమ్మల్ని వాడుకుంటారు. ఈ క్రమంలో అవకాశాలు అందుకుని ముందడుగు వేసిన కొందరు విజయం సాధిస్తారు, మరికొందరు బాధతో ఇంటికి తిరిగెళ్లిపోతారు. నన్ను నేను అమ్ముకోనుఇంకొంతమందైతే ముందుకు వెళ్లలేక, వెనక్కూ వెళ్లలేక వ్యభిచారంలోకి నెట్టబడతారు. ఇలాంటి రహస్యాలు బయటకు ఎప్పుడూ రావు. ఎందుకంటే సక్సెస్ స్టోరీలు మాత్రమే బయటకు వస్తాయి, వాటి గురించే అందరూ మాట్లాడుకుంటారు. ఇప్పుడిదంతా ఎందుకు చెప్తున్నానంటే నా మాటల వల్ల నలుగురు అలర్ట్ అయి వారిని వారు కాపాడుకున్నా అదే నాకు సంతోషం. ఇండస్ట్రీలో కాంప్రమైజ్ సాధారణమే అని ఓ నటి అన్నందుకు ఆమెతో స్నేహాన్నే తెంచుకున్నాను. నేను ఆర్టిస్ట్ను.. ఒకరికి నా జీవితాన్ని అమ్ముకునేదాన్ని కాదు అని చెప్పుకొచ్చింది.మీటూమీటూ ఉద్యమం సమయంలో తను కూడా బాధితురాలినేనంటూ మీడియా ముందుకు వచ్చింది తనుశ్రీ దత్తా. నానాపటేకర్ లైంగికంగా వేధించాడని సంచలన ఆరోపణలు చేసింది. 2008లో 'హార్న్ ఓకే ప్లీజ్' సినిమాలోని ఓ పాట షూటింగ్లో నానా పటేకర్ సహా మరో ముగ్గురు తనను వేధించారని ఆరోపించింది. అయితే ఘటన జరిగిన మూడేళ్లలోపు ఫిర్యాదు చేస్తేనే విచారిస్తామని, ఇది పదేళ్ల కిందటినాటి ఘటన కావడంతో విచారణ కుదరదని న్యాయస్థానం కేసు కొట్టివేసింది. బాలీవుడ్లో అనేక సినిమాలు చేసిన తనుశ్రీదత్తా.. తెలుగులో వీరభద్ర చిత్రంలో యాక్ట్ చేసింది. చాలాకాలంగా సినిమాలకు దూరంగా ఉంటోంది.చదవండి: తెలుసు కదా.. షూటింగ్లోనే తేడా కొట్టింది: రాశీ ఖన్నా -
ధురంధర్ 2 ఛాన్స్ వస్తే వదిలేసుకున్నా: నటుడు
గతేడాది చివర్లో వచ్చిన ధురంధర్ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ఆదిత్య ధర్ డైరెక్టర్ చేసిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో సారా అర్జున్ కథానాయిక. ఆర్ మాధవన్, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్ కీలక పాత్రలు పోషించారు.ధురంధర్: రివేంజ్లో ఛాన్స్అయితే మూడు నెలలు కూడా తిరగకముందే ధురంధర్ పార్ట్ 2 వచ్చేస్తోంది. మార్చి 19న 'ధురంధర్: రివేంజ్' రిలీజ్ కానుంది. మొదటి భాగం బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్ కాబట్టి ఎవరైనా సరే సీక్వెల్లో ఛాన్స్ వస్తే ఎగిరి గంతేస్తారు. కానీ ఈ బాలీవుడ్ నటుడు మాత్రం తనకు ఛాన్స్ వచ్చినా రిజెక్ట్ చేశాడట!డేట్స్ లేవని..ఆయన మరెవరో కాదు, అనిల్ కపూర్. తాజాగా ఆయన ఓ ఈవెంట్లో మాట్లాడుతూ.. ధురంధర్ 2 సినిమాలో యాక్ట్ చేయమని దర్శకుడు ఆదిత్య నన్ను సంప్రదించాడు. అతిథి పాత్ర ఉంది, చేస్తావా? అని అడిగాడు. కానీ అప్పటికే నా డేట్స్ ఖాళీగా లేవు. వేరే సినిమాలతో బిజీగా ఉన్నాను. నీ సినిమాలో చేయాలనుంది, కానీ నేను ఖాళీగా లేను అని చెప్పి తిరస్కరించాను. ఆ మూవీ కోసం అప్పటికే ఒప్పుకున్న ప్రాజెక్టులను నేను పక్కనపెట్టలేను. కుదర్లేదుఆ నిబద్ధత వల్లే నేను ఇంతకాలం ఇండస్ట్రీలో ఉన్నాను. కేవలం టాలెంట్ ఒక్కటే మన స్థాయిని నిర్ణయించదు. కాకపోతే ధురంధర్ మూవీ అనేది మంచి ఆఫర్.. కానీ, ఏం చేద్దాం.. చేయడం కుదర్లేదు. భవిష్యత్తులో ఆదిత్యతో కలిసి పని చేస్తాననుకుంటున్నాను అని చెప్పుకొచ్చాడు. అనిల్ కపూర్ చివరగా 'సుబేదార్' సినిమాలో కనిపించాడు. ప్రస్తుతం ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. -
అలాంటి సినిమాలు తీస్తే జోకర్లా చూస్తారు: డైరెక్టర్
మలయాళ స్టార్ దర్శకుడు ప్రియదర్శన్ సొంత భాషలోనే సెటిలైపోకుండా బాలీవుడ్లోనూ అనేక సినిమాలు చేశాడు. హీరా ఫెరి, హంగామా, భూల్ భులయ్యా వంటి పలు చిత్రాలతో ప్రేక్షకులకు వినోదాన్ని పంచాడు. ప్రస్తుతం అక్షయ్ కుమార్ హీరోగా హారర్ కామెడీ మూవీ భూత్ బంగ్లా చేస్తున్నాడు. ఇది ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇష్టం లేదుఅయితే తనకు కామెడీ చిత్రాలకంటే సీరియస్ సినిమాలు చేయడమే ఇష్టం అంటున్నాడు తాజాగా పింక్విల్లాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రియదర్శన్ మాట్లాడుతూ.. సీరియస్ చిత్రాలు తెరకెక్కించడమంటే నాకు చాలా ఇష్టం. కామెడీ మూవీస్ చేయడం నాకేమాత్రం ఇష్టం లేదు. కానీ నాకు వేరే ఆప్షన్ లేక కామెడీ జానర్లో సినిమాలు చేయాల్సి వస్తోంది.ఎందుకు చూడరు?సీరియస్ సినిమాలు చేస్తున్నప్పుడు ఇండస్ట్రీలో ప్రత్యేక గౌరవం చూపిస్తారు అదే కామెడీ జానర్లో ఉంటే మాత్రం ఎవరూ పట్టించుకోరు. ఒక మంచి దర్శకుడిగా పరిగణించరు. ఈ విషయంలో నాకు చాలా బాధేస్తుంది. కామెడీ సినిమాలు తీసేవాళ్లను మంచి దర్శకులుగా ఎందుకు చూడరు? మనదగ్గరే కాదు, ప్రపంచమంతటా అలాగే ఉంది. హాస్యభరిత చిత్రాలు చేసేవారిని జోకర్లా చూస్తున్నారు. కామెడీ సినిమాలకు ఆస్కార్ రావడం కూడా చాలా అరుదు. ఇది నిజంగా బాధాకరం.. కానీ ఇదే జరుగుతోంది అని ప్రియదర్శన్ చెప్పుకొచ్చాడు. -
'అవకాశాలు తర్వాత.. బరువు తగ్గు'.. ఏడ్చుకుంటూ వెళ్లా!
నటి సంభావన సేత్.. భోజ్పురి సినిమాల్లో ఎన్నో ఐటం సాంగ్స్ చేసింది. హిందీలోనూ నటిగా ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా స్పెషల్ సాంగ్స్లో స్టెప్పులేసింది. అటు బుల్లితెరపై బిగ్బాస్, రాజ్ పిచ్లే జనం కా, ఫియర్ ఫ్యాక్టర్: ఖత్రోన్కె ఖిలాడీ 4 ఇలా అనేక రియాలిటీ షోలలో పాల్గొంది.రెండో సీజన్లో పార్టిసిపేషన్అయితే తనకు ఓ స్టార్ హీరో అవకాశాలిస్తానని చెప్పి ఆ తర్వాత తన ఆశలపై నీళ్లు చల్లాడంటోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సంభావన సేత్ మాట్లాడుతూ.. నేను హిందీ బిగ్బాస్ రెండో సీజన్లో పాల్గొన్నాను. నాలుగో సీజన్లో స్టేజీపై పర్ఫామెన్స్ చేశాను. అప్పుడు నటుడు రవికిషన్.. నేను భోజ్పురిలో మంచి పేరున్న డ్యాన్సర్ అని సల్మాన్ ఖాన్కు పరిచయం చేశాడు. ఫోన్ నెంబర్ కూడా..అందుకాయన.. ఇప్పుడే చూశాగా.. డ్యాన్స్ చాలా బాగా చేస్తోందని మెచ్చుకున్నాడు. నేను కొంత ధైర్యం తెచ్చుకుని తన సినిమాల్లో ఏదైనా అవకాశం ఉంటే ఇవ్వమని అడిగాను. వెంటనే ఆయన తప్పకుండా ఇస్తానన్నాడు. తన ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాడు. షో అయిపోయిన కొంతకాలానికి నేను ఆయన్ను కలిసేందుకు వెళ్లాను. అప్పుడతడు కాస్త చిరాకుగా ఉన్నాడు. కానీ బానే మాట్లాడాడు. ఏడ్చుకుంటూ వెళ్లా.సినిమా అవకాశం ఇస్తానన్నారు కదా అని గుర్తు చేశాను. అందుకు సల్మాన్.. నాకు గుర్తు లేదు కానీ మీరు కాస్త బరువు తగ్గాలి.. మరో విషయమేంటంటే ఇండస్ట్రీలో నేనెవర్నీ ప్రమోట్ చేయను అని ముక్కుసూటిగా చెప్పాడు. ఆ మాటలు నన్నెంతో బాధపెట్టాయి. ఇంటికి ఏడ్చుకుంటూ వెళ్లిపోయాను. కానీ, ఇప్పటికీ నేను సల్మాన్ ఖాన్ అభిమానినే అని చెప్పుకొచ్చింది.చదవండి: 66 ఏళ్ల వయసులో ప్రెగ్నెంట్? నటి ఏమందంటే? -
66 ఏళ్ల వయసులో ప్రెగ్నెంట్? నటి ఏమందంటే?
సెలబ్రిటీలు ఎలా రెడీ అవుతున్నారు? బరువు పెరిగారా? తగ్గారా? ముఖం కళకళలాడుతోందా? కళ తప్పిందా? హుషారుగా ఉన్నారా? అనారోగ్యంతో బాధపడుతున్నారా? ఇలా ప్రతీది కళ్లతోనే స్కానింగ్ చేస్తున్నారు సోషల్ మీడియా నెటిజన్స్. వారి కంటికి ఏదైనా ఫోటో, వీడియో కనిపిస్తే చాలు.. ఏవేవో ఊహించుకుంటున్నారు. బాలీవుడ్ సీనియర్ నటి నీనా గుప్తా విషయంలోనూ అలాగే అతిగా ఊహించుకున్నారు.విరోష్ రిసెప్షన్లో..ఇటీవల హైదరాబాద్లో జరిగిన విరోష్ (విజయ్ దేవరకండ- రష్మిక మందన్నా) రిసెప్షన్కు నీనా గుప్తా, భర్త వివేక్తో కలిసి హాజరైంది. స్టైలిష్గా తెల్ల చీర కట్టుకున్న ఆమె మెడకు బంగారు నెక్లెస్ ధరించింది. కాకపోతే కాస్త పొట్ట ఉన్నట్లుగా కనిపించింది. ఇంకేముంది సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. 66 ఏళ్ల వయసులో నీనా గర్భం దాల్చిందా? ఇది నిజమేనా? అని ఆరా తీస్తున్నారు.ప్రెగ్నెన్సీ రూమర్స్పై క్లారిటీదీంతో ఈ రూమర్స్పై తాజాగా నీనా గుప్తా స్పందించింది. ఇదేమైనా బదాయి హో సినిమా (ఈ మూవీలో లేటు వయసులో ఓ మహిళ తల్లవుతుంది) అనుకుంటున్నారా? అలాంటిదేం లేదు. నేను గర్భవతిని కాదు. చీర కాస్త బరువుగా ఉంది. అందువల్లే నేను కూడా మీకు లావుగా కనిపించానంతే! ఏదేమైనా ఈ ప్రచారం నన్ను బాధపెట్టడానికి బదులుగా ఆశ్చర్యపరిచింది. ఈ వయసులో ప్రెగ్నెంట్ అనుకున్నారంటే మన దేశం ముందుకు పోతున్నట్లే అని పేర్కొంది. నీనా చివగా వధ్ 2 మూవీలో యాక్ట్ చేసింది.ప్రేమ- పెళ్లినీనా గుప్తా వ్యక్తిగత విషయానికి వస్తే.. ఆమె వెస్టిండీస్ క్రికెటర్ వివియన్ రిచర్డ్స్ను ప్రేమించింది. అయితే అప్పటికే అతడికి భార్యాబిడ్డలున్నారు. అయినప్పటికీ నీనాతో ప్రేమాయణం సాగించాడు. వీరి ప్రేమకు గుర్తుగా 1989లో మసాబా గుప్తా జన్మించింది. కానీ నీనా- రిచర్డ్స్ మాత్రం పెళ్లి బంధం వరకు వెళ్లకుండానే విడిపోయారు. దాంతో నీనా.. సింగిల్ పేరెంట్గా మసాబాను పెంచి పెద్ద చేసింది. 2008లో వివేక్ మెహ్రాను పెళ్లాడింది. Is Neena Gupta pregnant? pic.twitter.com/AlCeWzpvlG— Sapna Madan (@sapnamadan) March 5, 2026 చదవండి: గుండె ముక్కలు.. హీరో బ్రేకప్ పోస్ట్ -
నాలుగు పెళ్లిళ్లు.. మీ కన్నా హిందువులే నయం: ముంతాజ్
చైల్డ్ ఆర్టిస్ట్గా.. ఆ తర్వాత హీరోయిన్గా అనేక సినిమాలు చేసింది సీనియర్ నటి ముంతాజ్. ఖిలోనా, దో రాస్తే, ఆప్కీ కసమ్, తేరే మేరే సాప్నే, రోటి వంటి పలు చిత్రాలతో స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకుంది. 1974లో వ్యాపారవేత్త మయూర్ మద్వానిని పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో రాణించింది. అయితే 1990లో సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించింది.హిందూ దేవుళ్లంటే ఇష్టంతాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మతాంతర వివాహాలు, దేవుళ్ల గురించి మాట్లాడింది. ముంతాజ్ మాట్లాడుతూ.. నేను దేవుళ్లను బాగా నమ్ముతాను. శంకరుడు, కృష్ణుడు అంటే చాలా ఇష్టం. నేను ముస్లిం అయినప్పటికీ ఈ దేవుళ్లపై నాకెంతో విశ్వాసం ఉంది. మా ఇంట్లో మెట్లు దిగి వస్తుంటే బొజ్జ గణపయ్య విగ్రహం కనిపిస్తుంది. ఎప్పుడూ ఆయనకు నమస్కరిస్తూ ఉంటాను.ఎందుకీ గొడవ?నేను అన్నిమతాలను నమ్ముతాను. నా భర్త హిందువు. నా సోదరి కూడా హిందువునే పెళ్లాడింది. మేమంతా సంతోషంగా ఉన్నాం. కానీ జనాలెందుకు ఈ మతాల గురించి కొట్టుకుంటారో అర్థం కాదు. కాకపోతే మా కమ్యూనిటీలో ఉన్న బహుభార్యత్వం నాకు ఏమాత్రం నచ్చదు. చాలామంది మూడు, నాలుగు పెళ్లిళ్లు చేసుకుంటారు. అంతకుముందు ఉన్న భార్యల్ని నడిరోడ్డుమీద వదిలేస్తారు. అలా చేస్తే హిందువుల కన్నా మీరెలా గొప్పవారవుతారు? ఏ ఒక్కరూ కూడా మూడునాలుగు పెళ్లిళ్లు చేసుకోకూడదు. అది చాలా పెద్ద తప్పు.అది చాలా తప్పుభార్య ఉండగా మరొకర్ని పెళ్లి చేసుకోవడమేంటి? ఆ మహిళ మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తుందో ఎప్పుడైనా ఆలోచించారా? అలాంటి ఆమెను వదిలేసి మరొకర్ని షాదీ చేసుకోవడం కరెక్ట్ కాదు. ఇది మహా పాపం. ఈ విషయంలో హిందువులే నయం. కొన్నిసార్లు వాళ్లు కూడా రెండో పెళ్లి చేసుకుంటారు. కానీ కట్టుకున్న భార్యని అర్ధాంతరంగా వదిలేసి మరొకరి దగ్గరకు అంత ఈజీగా వెళ్లిపోవడం మాత్రం చాలా తప్పు అని ముంతాజ్ నొక్కి చెప్పింది.చదవండి: బలవంతంగా ఐటం సాంగ్స్.. చెండాలమైన లిరిక్స్: నటి -
అవసరం లేకపోయినా ఐటం సాంగ్స్.. చిన్నపిల్లలు కూడా!
సినిమాల్లో ఐటం సాంగ్స్ అనేవి సర్వసాధారణమైపోయాయి. కొన్నిసార్లు అవసరం ఉన్నా లేకపోయినా బలవంతంగా చొప్పిస్తున్నారు. అయితే ఆ పాటల్లో మహిళలను చూపించే పద్ధతి మాత్రం అస్సలు బాగోలేదంటోంది సీనియర్ నటి షబానా అజ్మీ. ముంబైలో బుధవారం జరిగిన వి ద వుమెన్ కార్యక్రమంలో షబానా మాట్లాడుతూ.. ఐటం సాంగ్ అనగానే హీరోయిన్ శరీర అవయమవాలను ఎలా చూపించాలనేదానిపైనే ఫోకస్ చేస్తున్నారు. అవసరం లేకపోయినా..పిచ్చిపిచ్చిగా పెట్టే కెమెరా యాంగిల్స్ దర్శకుడి ఉద్దేశాన్ని చెప్పకనే చెప్తున్నాయి. ఈ ఐటం సాంగ్లో స్త్రీ స్వీయనియంత్రణ కోల్పోయి పురుషుల చూపుకు లొంగిపోయినట్లుగా చూపిస్తున్నారు. పైగా సినిమా కథకు అవసరం లేకపోయినా ఈ స్పెషల్ సాంగ్స్ను కావాలని ఇరికిస్తున్నారు.చిన్నపిల్లలు కూడా..ఆడవారిని చూపించే విధానమే కాదు, పాట లిరిక్స్ కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటున్నాయి. ఇటువంటి సాంగ్స్ను సమాజం ఆదరించడం కూడా బాధపెడుతోంది. ఏదైనా ఫంక్షన్కు వెళ్తే అక్కడ చిన్నపిల్లలు కూడా చోలీ కే పీచే క్యా హై (ఓ ఐటం సాంగ్) అంటూ పాడుతున్నారు. అది చూసి అందరూ సరదాగా నవ్వుతున్నారు. సినిమాఎవరూ ఆ లిరిక్స్ అర్థాన్ని పట్టించుకోవట్లేదు, కేవలం ఒక జోష్లో పాడేస్తున్నారు అని ఆవేదన వ్యక్తం చేసింది. కాగా షబానా అజ్మీ.. అంకుల్, అర్థ్, ఖాందార్, పార్, గాడ్ మదర్ సినిమాలకుగగానూ ఐదుసార్లు జాతీయ ఉత్తమ నటి పురస్కారం గెల్చుకుంది. ఈమె చివరగా డబ్బా కార్టెల్ అనే వెబ్ సిరీస్లో మెరిసింది.చదవండి: పవన్ కల్యాణ్ డూప్గా హరీశ్ శంకర్? డైరెక్టర్ ఏమన్నారంటే? -
52 ఏళ్ల మలైకాతో డేటింగ్.. 32 ఏళ్ల కుర్రాడు ఏమన్నాడంటే..
బాలీవుడ్లో ఒకప్పటి స్టార్ హీరోయిన్ మలైకా అరోరా.. వ్యక్తిగత జీవితంపై ఎప్పుడు ఏదో ఒక రూమర్ వస్తూనే ఉంటుంది. 1998లో సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ని పెళ్లి చేసుకొని.. 20 ఏళ్ల పాటు కలిసి కాపురం చేసి.. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత 2017లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత తనకంటే 12 ఏళ్ల చిన్నవాడైన యంగ్ హీరో అర్జున్ కపూర్తో ప్రేమాయణం కొనసాగించింది. కొన్నాళ్ల పాటు కలిసి సహజీవనం చేసిన ఈ జంట.. కొన్నేళ్ల క్రితమే విడిపోయింది. గత కొన్నేళ్లుగా ఒంటరిగానే ఉంటున్న మలైకా..ఇటీవల మరో వ్యక్తితో డేటింగ్ చేస్తున్నట్లు బాలీవుడ్లో వార్తలు వచ్చాయి. ఆ కుర్రాడు మలైకా కంటే 20 ఏళ్లు చిన్నవాడు కావడం గమనార్హం. అతని పేరు సోరబ్ బేడి. మోడల్, టీవీ నటుడు. మలైకా వయసు 52 ఏళ్లు అయితే.. సోరబ్ వయసు కేవలం 32 ఏళ్లు మాత్రమే. ఇటీవల వీరిద్దరు కలిసి ఓ పార్టీలో హగ్ చేసుకొని సెల్ఫీ దిగడంతో డేటింగ్ రూమర్స్ బయటకు వచ్చాయి. అయితే ఈ డేటింగ్ రూమర్స్ని సోరబ్ కొట్టి పడేశాడు. మలైకా, తాము మంచి స్నేహితులం మాత్రమే అని..అంతకు మించి తమ మధ్య ఏమీ లేదన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..మలైకాతో స్నేహం ఎలా ఏర్పడిందో వివరించాడు.అలా పరిచయం.. డెల్నాజ్ దారువాలా, వాహ్బిజ్ మెహతా అనే ఇద్దరు వ్యక్తులు నా మోడలింగ్ రోజుల్లో ర్యాంప్పై నడిచే అవకాశం ఇచ్చారు. నేను వారితో స్నేహం చేశాను. వారితో కలిసి పార్టీలకు వెళ్లడం ప్రారంభించాను. ఒక పార్టీలో, నేను నా గురువుల ద్వారా మలైకాను కలిశాను. ఆమె డెల్నాజ్, వాహ్బిజ్లకు కూడా సన్నిహితురాలు. అందువల్ల, మలైకా, నేను స్నేహితులమయ్యాం. అంతకు మించి మా మధ్య ఏమి లేదు’ అని సోరబ్ చెప్పుకొచ్చాడు.మలైకాతో పార్టీ.. తొలిసారి కాదుఒక అమ్మాయి గురించి మాట్లాడే ముందు వాళ్ళు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. ఇలాంటి రూమర్స్ వల్ల వాళ్లు మానసికంగా ఇబ్బంది పడతారు. ట్రోల్ చేసే ప్రతిఒక్కరు ఇది అర్థం చేసుకోవాలి. అయినా మలైకాతో పార్టీ చేసుకోవడం నాకు ఇదే తొలిసారి కాదు. గత కొన్నేళ్లుగా ఇద్దరం కలిసి పార్టీలకు వెళ్తున్నాం. ఇంతకు ముందు కూడా మలైకాతో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాను. అప్పుడు నేను ఫేమస్ కాదు. ఎవరికీ తెలియకపోవడంతో అవి వైరల్ కాలేదు. ఇప్పుడు నేను కూడా తెలిసిన ముఖం కావడంతో డేటింగ్ రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు. ఒక అమ్మాయి, అబ్బాయి మధ్య స్నేహం కూడా ఉండొచ్చు. మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ మాత్రమే. కానీ కొంతమంది దాన్ని భిన్నంగా చూస్తున్నారు’ అని సోరబ్ మండిపడ్డారు.మలైకా..స్పెషల్ సాంగ్స్ స్పెషలిస్ట్90వ దశకంలో బాలీవుడ్లో మలైకా తన హవాను కొనసాగించింది. ముఖ్యంగా స్పెషల్ సాంగ్స్కి స్పెషలిస్ట్గా పేరు సంపాదించుకుంది. కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ సరసన ఛల్ ఛయ్య ఛయ్య ఛయ్య అనే పాటతో దేశం మొత్తాన్ని ఒక ఊపు ఊపింది.. తెలుగులో 2007లో మహేశ్ బాబు హీరోగా నటించిన అతిథిలో ప్రత్యేక గీతంతో తెలుగువారిని పలకరించింది. అలాగే గబ్బర్ సింగ్లో కెవ్వు కేక పాటకు స్టెప్పులేని కుర్రకారుని ఆకట్టుకుంది. ప్రస్తుతం సినిమాలతో పాటు నిర్మాతగా, టెలివిజన్ హోస్ట్గా రాణిస్తోంది. -
రూ.50 లక్షల ప్రైజ్మనీ.. మూణ్నెళ్లయినా ముట్టలే!
బుల్లితెర నటుడు గౌరవ్ ఖన్నా హిందీ బిగ్బాస్ 19వ సీజన్లో తన ఆటతో ఆకట్టుకున్నాడు. ప్రేక్షకుల మనసు గెల్చుకుని ఏకంగా ట్రోఫీ అందుకున్నాడు. విన్నర్గా రూ.50 లక్షల ప్రైజ్మనీ గెల్చుకున్నాడు. అయితే షో పూర్తయి మూడు నెలలు కావొస్తున్నా ఇంతవరకు ఆ డబ్బు ముట్టలేదట!ఇదెప్పుడూ ఉండేదే..ఈ విషయాన్ని అతడు తాజాగా తన యూట్యూబ్లో వెల్లడించాడు. గౌరవ్ ఖన్నా మాట్లాడుతూ.. షోలో ప్రకటించిన ప్రైజ్మనీ, కారు.. ఇవన్నీ నా చేతికి రావడానికి కొంత సమయం పడుతుంది. అందుకు అవసరమైన ప్రక్రియ కొనసాగుతోంది. టీవీ ఇండస్ట్రీలో ఇలాంటి ఆలస్యాలు ఎప్పుడూ ఉండేవే.. రెండు నెలల్లో..కానీ తప్పకుండా నాకు ఇస్తానన్నవి ఇచ్చి తీరతారు. అందుకు కనీసం రెండు నెలలైనా పడుతుంది అని చెప్పుకొచ్చాడు. కాగా గౌరవ్.. సెలబ్రిటీ మాస్టర్ చెఫ్ ఇండియా షో విజేతగా నిలిచి ఒక్కసారిగా సెన్సేషన్ అయ్యాడు. ఆ వెంటనే బిగ్బాస్లో అడుగుపెట్టి అక్కడ కూడా విజయ దుందుభి మోగించాడు.చదవండి: నా పెళ్లికి ముందు అన్న ఇచ్చిన సలహా: అల్లు శిరీష్ -
ధురందర్ 2 టికెట్ రేటు రూ. 3100
భారీ అంచనాలతో విడుదలకు సిద్ధమైన ధురంధర్-2 సినిమా టికెట్ ధరల విషయంలో కొత్త రికార్డు సృష్టించింది. దేశంలోనే అత్యధిక టికెట్ ధరగా రూ.3100ను ఢిల్లీలోని ఐనాక్స్ మెగాప్లెక్స్లోని ఒక ప్రత్యేక స్క్రీన్లో ఫిక్స్ చేశారు. కేవలం 42 సీట్లు మాత్రమే ఉన్న ఈ స్క్రీన్లో ప్రీమియర్స్ కోసం ఈ రేటు అమలు చేస్తున్నారు. బుక్ మై షో చార్జీలతో కలిపితే ధర రూ.3145కి చేరుతుంది. ప్రస్తుతం అదే స్క్రీన్లో ప్రదర్శితమవుతున్న ది కేరళ స్టోరీ-2 టికెట్ ధర కేవలం రూ.500 మాత్రమే. అయితే ధురంధర్-2 క్రేజ్ కారణంగా ప్రీమియర్ షోలకు టికెట్ ధరను అమాంతం పెంచేశారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఇప్పటికే సగానికి పైగా టికెట్లు అమ్ముడయ్యాయి. దేశవ్యాప్తంగా ఒక రోజు ముందే పెయిడ్ ప్రివ్యూలు ప్లాన్ చేశారు. బెంగళూరులో కొన్ని స్క్రీన్లలో టికెట్ ధరలు రూ.800 వరకు ఉన్నాయి. హైదరాబాద్లో కూడా ఎప్పటిలాగే రేట్లు పెంచారు. సాయంత్రం 5 గంటలకే అన్ని ప్రాంతాల్లో ప్రీమియర్స్ ప్రారంభం కానున్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్ అద్భుతంగా సాగుతున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా 3 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడయ్యాయి. -
Ek Din: సాయి పల్లవి తొలి హిందీ మూవీ ట్రైలర్ వచ్చేసింది
సాయి పల్లవి నటించిన తొలి హిందీ సినిమా ‘ఏక్ దిన్’. ఆమిర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీట్రైలర్ని బుధవారం (మార్చి 11) విడుదల చేశారు. ఒక ఇంటర్నేషన్ టూర్లో ఇద్దరు సహోద్యోగుల మధ్య కలిగిన ఒక రోజు పరిచయం, వారి జీవితాలను ఎలా మార్చిందనే ఆసక్తికరమైన కథాంశంతో ఈ మూవీ రూపుదిద్దుకుంది. ఈ సినిమాలో రోహన్ పాత్రలోజునైద్ ఖాన్, మీరా పాత్రలో సాయిపల్లవి నటించారు. మీరాను ఇష్టపడే రోహన్ తన ప్రేమను వ్యక్తపరచడానికి మాత్రం భయపడుతూ ఉంటాడు. అయితే కనీసం ఒక రోజు అయినా ఆమెతో కలిసి ప్రయాణం చేయాలని అతడు కలలు కంటాడు. ఆ కల నిజమైందా? అనే ఆసక్తికరమైన అంశంతో ఈ సినిమా కథ ముందుకు సాగుతుంది. సరదాగా మొదలైన ట్రైలర్ తర్వాత ఎమోషనల్గా సాగింది. సునీల్ పాండే దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 1న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. -
సర్జరీ ఫెయిల్.. దేవుడి ముందు మోకరిల్లి..: జేమీ లివర్
వెండితెరపై నవ్వులు పూయించే జానీ లివర్ ఒకానొక సమయంలో ఎంతో మానసిక క్షోభను అనుభవించాడు. కన్నకొడుకు జెస్సీ చిన్నవయసులో ట్యూమర్తో బాధపడుతుంటే చూడలేక తల్లడిల్లిపోయాడు. అతడే కాదు అతడి కుటుంబం కూడా మానసిక క్షోభ అనుభవించింది. ఈ విషయాన్ని తాజాగా జానీ లివర్ కూతురు జేమీ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.కవర్ చేసేందుకు..ఆమె మాట్లాడుతూ.. నా తమ్ముడు స్కూల్లో ఉండగా వాడికి ట్యూమర్ ఉన్నట్లు తెలిసింది. మొదట్లో అదేంటో మాకూ అర్థం కాలేదు. కానీ, ఆ ట్యూమర్ సైజు పెరుగుతూ వాడిని ఇబ్బందిపెట్టింది. రానురానూ దాన్ని కవర్ చేయడం కోసం డ్రెస్సింగ్ స్టైల్ కూడా మార్చేశాడు. మేమిద్దరం ఒకటే స్కూల్లో చదువుకునేవాళ్లం. తననెప్పుడూ జాగ్రత్తగా చూసుకునేదాన్ని. ముంబైలో చేసిన మొదటి సర్జరీ విజయవంతం కాలేదు. అప్పుడు చాలా భయపడ్డాం. తన ఆరోగ్యం కుదుటపడాలని, బాగుండాలని నాన్న దేవుడి ముందు మోకాళ్లపై కూర్చుని ప్రార్థించేవాడు.రెండుసార్లు సర్జరీజెస్సీ అడిగినవేవీ కాదనేవాళ్లం కాదు. అతడి కోరిక మేరకే అమెరికా ట్రిప్ వెళ్లాం. అనుకోకుండా అక్కడ సర్జరీకి ప్రయత్నించగా అది విజయవంతమైంది. రెండేళ్లలో రెండు సర్జరీలు జరిగాయి. దేవుడి దయ వల్ల అనారోగ్యం నుంచి కోలుకున్నాడు అని చెప్పుకొచ్చింది. జెస్సీ.. కిస్ కిస్కో ప్యార్ కరూన్, హౌస్ఫుల్ 4, భూత్ పోలీస్ వంటి సినిమాలు చేసింది. ఆ ఒక్కటి అడక్కు చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.చదవండి: సీజీ చేయడం రాక మా మీద తోస్తున్నారు: ఛోటా కె నాయుడు -
ఆ రోజే థియేటర్స్లో ఆల్ఫా
ఆలియా భట్, శార్వరీ ప్రధాన పాత్రల్లో నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ‘ఆల్ఫా’. అనిల్ కపూర్, బాబీ డియోల్ ప్రధాన పాత్రల్లో నటించారు. ‘ది రైల్వేమెన్’ ఫేమ్ శివ్ రైవల్ దర్శకత్వంలో యశ్ రాజ్ ఫిల్మ్స్ పతాకంపై ఆదిత్య చోప్రా నిర్మించారు. వైఆర్ఎఫ్ (యశ్ రాజ్ ఫిల్మ్స్) స్పై యూనివర్స్లో భాగంగా రూపొందిన సినిమా ఇది. ఈ చిత్రంలో ఆలియా, శార్వరీ స్పై రోల్స్లో నటించారు. ‘ఆల్ఫా’ చిత్రాన్ని తొలుత గత ఏడాది డిసెంబరులో రిలీజ్ చేయాలనుకున్నారు మేకర్స్.ఆ తర్వాత ఈ ఏడాది ఏప్రిల్లో రిలీజ్కు ప్లాన్ చేశారు. కానీ ఈ చిత్రం రిలీజ్ను మరోసారి వాయిదా వేస్తున్నట్లుగా వెల్లడించి, ఈ సినిమాను ఈ ఏడాది జూలై 10న రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ కొత్త రిలీజ్ డేట్ను ప్రకటించారు. ‘యశ్రాజ్ ఫిల్మ్స్ సంస్థలో ఆలియా చేసిన తొలి సినిమా ఇది. పూర్తి స్థాయి ఉమెన్ సెంట్రిక్ యాక్షన్ సినిమా. ఆలియా, శార్వరీల యాక్షన్ సీక్వెన్స్లు ఆడియన్స్ను అలరిస్తాయి’’ అని యూనిట్ పేర్కొంది. -
లేటు వయసులో తండ్రైన హీరో.. సోషల్ మీడియాలో పోస్ట్
బాలీవుడ్ హీరో రణ్దీప్ హుడా 50 ఏళ్ల వయసులో తండ్రయ్యారు. ఆయన భార్య లిన్ లైస్రామ్ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయం తెలుసుకున్న పలువురు బాలీవుడ్ తారలు, అభిమానులు అభినందలు చెబుతున్నారు. హిందీ సినిమాల్లో విలన్, సహాయ పాత్రల్లోనూ మెప్పించిన రణ్దీప్ గతేడాది వీర్ సావర్కర్ మూవీలో హీరోగా, జాట్ చిత్రంలో విలన్గా అలరించాడు. ఈరోజు నేను తండ్రి అయినందుకు మా నాన్న పట్ల నా కృతజ్ఞత మరింత పెరిగిందని రణ్దీప్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మరి ముఖ్యంగా నన్ను తండ్రిని చేసినందుకు.. మన చిన్న అమ్మాయిని ఈ ప్రపంచంలోకి తీసుకు వచ్చినందుకు నా భార్య లిన్కు ప్రత్యేక ధన్యవాదాలు అంటూ రాసుకొచ్చారు. ఈ జంటకు మొదటి బిడ్డగా పాప పుట్టడంతో ఆనందం మరింత రెట్టింపైంది.కాగా.. 2001లో వచ్చిన హిందీ మూవీ 'మన్సూన్ వెడ్డింగ్'తో నటుడిగా పరిచయమైన రణ్దీప్ హుడా.. తర్వాత గ్యాంగ్స్టర్, జన్నత్ 2, రిస్క్, కర్మ ఔర్ హోలీ, కాక్టైల్, జిస్మ్ 2, బాంబే టాకీస్, కిక్, భాఘీ 2, రాధే, మర్డర్ 3 తదతర చిత్రాల్లో నటించి మెప్పించాడు. కాగా.. 2023లో ప్రియురాలు లిన్ లైస్రామ్ని మణిపురి సంప్రదాయంలో రణ్దీప్ పెళ్లి చేసుకున్నాడు. View this post on Instagram A post shared by Randeep Hooda (@randeephooda) -
మహేశ్ బాబు మెచ్చిన సినిమా.. 8 నెలల తర్వాత ఓటీటీకి..!
గతేడాది బాలీవుడ్ స్టార్ అమిర్ ఖాన్ నటించిన చిత్రం సితారే జమీన్ పర్. ఈ సినిమా 2025 జూన్ 20న థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. ఈ మూవీలో జెనీలియా దేశ్ముఖ్ కూడా ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమాకు ఆర్ఎస్ ప్రసన్న దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని ఆమిర్ ఖాన్, అపర్ణ పురోహిత్ నిర్మించారు. అయితే ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ చేయనని అమిర్ ఖాన్ అప్పట్లో ప్రకటించారు. ఆ తర్వాత నేరుగా యూట్యూబ్లోనే విడుదల చేశారు. రెంట్ పద్ధతిలో అందుబాటులోకి తీసుకొచ్చారు. అప్పట్లో ఓటీటీ రైట్స్ కోసం రూ.120 కోట్లు చెల్లించేందుకు అమెజాన్ ప్రైమ్ ముందుకొచ్చింది. కానీ ఈ బిగ్ డీల్ను అమిర్ ఖాన్ తిరస్కరించారు. ఈ సినిమా కేవలం థియేటర్లలోనే ఆడుతుందని.. ఓటీటీలో విడుదల ఉండదని అమిర్ ఖాన్ స్పష్టం చేశారు.అయితే తాజాగా అమిర్ ఖాన్ తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఎట్టకేలకు ఈ మూవీ ఓటీటీలో సందడి చేసేందుకు వచ్చేస్తోంది. సోనీ లివ్ వేదికగా అందుబాటులోకి రానుందని మేకర్స్ అనౌన్స్ చేశారు. అయితే స్ట్రీమింగ్ తేదీని మేకర్స్ ఇంకా ప్రకటించలేదు. త్వరలోనే ఓటీటీ రిలీజ్ డేట్ను ప్రకటించనున్నారు. కాగా.. ఈ చిత్రంలో ఆరోష్ దత్తా, గోపీకృష్ణ వర్మ, సంవిత్ దేశాయ్, వేదాంత్ శర్మ, ఆయుష్ భన్సాలీ, ఆశిష్ పెండ్సే, రిషి షహానీ, రిషబ్జైన్ , నమన్ మిశ్రా, సిమ్రాన్ మంగేష్కర్ వంటి వారు కీలకపాత్రల్లో నటించారు.మహేశ్ బాబు ప్రశంసలు...ఈ సినిమాపై సూపర్ స్టార్ మహేశ్బాబు ప్రశంసలు కురిపించాడు. సితారే జమీన్ పర్.. అందరి మనసులు దోచుకుంటోంది. ఈ మూవీ మిమ్మల్ని నవ్విస్తుంది, ఏడిపిస్తుంది. అలాగే చప్పట్లు కొట్టేలా చేస్తుంది. ఈ సినిమా చూశాక కచ్చితంగా చిరునవ్వుతో బయటకు వస్తారు అని సోషల్ మీడియాలో రాసుకొచ్చాడు. View this post on Instagram A post shared by Sony LIV (@sonylivindia) -
48 గంటల్లో 312 మిలియన్స్ వ్యూస్.. ‘ధురంధర్ 2’ రికార్డు
రణ్వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘ధురంధర్ 2’. గతేడాది బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచిన ‘ధురంధర్’ చిత్రానికి సీక్వెల్ ఇది. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్పై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక తాజాగా రిలీజైన ట్రైలర్ ఆ అంచనాలను మరింత పెంచేశాయి. అంతేకాదు రిలీజ్కి ముందే ఈ సినిమా రికార్టులను కొల్లగొడుతోంది. యూట్యూబ్లో ఈ మూవీ ట్రైలర్కి రికార్డు స్థాయిలో వ్యూస్ వచ్చాయి. కేవలం 48 గంటల్లో అంటే రెండో రోజుల్లేనే 312 మిలియన్ల వ్యూస్ సాధించింది. ఈ మధ్యకాలంలో ఒక మూవీ ట్రైలర్కు ఈ స్థాయి వ్యూస్ వచ్చిన దాఖలాలు లేవు.ట్రైలర్లో పవర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, స్ట్రైకింగ్ డైలాగ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ట్రైలర్ ఆడియో ఇన్స్టాగ్రామ్లో ట్రెండ్ అవుతూ, అనేక రీల్స్, ఫ్యాన్ ఎడిట్స్కు ప్రేరణగా మారింది. ఇదే సమయంలో గూగుల్ ట్రెండ్స్లో కూడా ఈ సినిమా, నటీనటులపై సెర్చ్లు భారీగా పెరిగాయి. ఈ చిత్రంలో రణవీర్ సింగ్ ద్విపాత్రాభినయంలో కనిపించనున్నారు. మార్చి 19న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. -
సల్మాన్ తో జోడీ?
సల్మాన్ ఖాన్ , సమంత జోడీగా నటించనున్నారా? అంటే... బాలీవుడ్లో అవుననే సమాధానమే వినిపిస్తోంది. సల్మాన్ ఖాన్ హీరోగా రాజ్ అండ్ డీకే ద్వయం సూపర్హీరో జానర్లో ఓ సినిమా తెరకెక్కనుందని బాలీవుడ్ టాక్. ఈ చిత్రంలో హీరోయిన్ పాత్రకు సమంతను సంప్రదిస్తున్నారట మేకర్స్. ఈ చిత్ర దర్శకుల్లో సమంత భర్త రాజ్ నిడిమోరు కూడా ఉన్నారు కనుక సమంత భాగమయ్యే అవకాశాలు ఉన్నాయని భోగట్టా. అయితే ఈ సినిమాలో సమంత నటించడం లేదని, నిర్మాతగా బాధ్యతలు తీసుకుంటారనే టాక్ కూడా వినిపిస్తోంది. మరి.. సల్మాన్ ఖాన్ కొత్త సినిమాలో సమంత హీరోయిన్ గా స్క్రీన్ పై కనిపిస్తారా? లేక నిర్మాతగా భాగం అవుతారా? అనేది చూడాలి. ఇక సల్మాన్ ఖాన్ ప్రస్తుతం ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్ ’ చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ఈ ఏడాదే రిలీజ్ కానుంది. మరోవైపు సమంత నటించిన ‘మా ఇంటి బంగారం’ చిత్రం మే 15న రిలీజ్ అవుతోంది. -
'ఆర్ఆర్ఆర్'కి నాటునాటు.. 'వారణాసి'కి లాటిన్ స్టయిల్!
ఆర్ఆర్ఆర్ సినిమాలోని 'నాటు-నాటు' పాట అప్పట్లో ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఆస్కార్ వేదికపై కూడా మెరిసింది ఈ పాట. అది తెలుగు సినీ పరిశ్రమకు గర్వకారణమైంది. అయితే ఇప్పుడు దర్శకధీరుడు రాజమౌళి మరోసారి అలాంటి మ్యాజిక్ను రిపీట్ చేయాలని ప్రయత్నిస్తున్నాడట. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న వారణాసిలో ఓ ప్రత్యేకమైన డాన్స్ నంబర్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఈ పాటను లాటిన్ స్టయిల్లో తెరకెక్కించాలని ఆయన భావిస్తున్నారని సీనియర్ కొరియోగ్రాఫర్ శంకర్ వెల్లడించారు. మహేష్ బాబు, ప్రియాంక చోప్రా జంటపై తెరకెక్కనున్న ఈ పాట కోసం వందలమంది లాటిన్ డాన్సర్లను తీసుకురావాలని రాజమౌళి ఆలోచిస్తున్నాడట.నాటు-నాటు తరహాలోనే, వారణాసిలో లాటిన్ స్టయిల్లో సాగే ఈ పాట కూడా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించనుంది. ఇప్పటికే వారణాసి టైటిల్ గ్లింప్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. తాజాగా కొరియోగ్రాఫర్ వ్యాఖ్యలతో అంచనాలు మరింత పెరిగాయి. జార్జియాలోని షెడ్యూల్ను పూర్తి చేసుకొని మహేష్ బాబు హైదరాబాద్కి తిరిగొచ్చాడు. ఎయిర్పోర్టులో ఆయన కొత్త లుక్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. త్వరలోనే అంటార్కిటికాలో కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. హీరోయిన్ ప్రియాంక చోప్రా స్వయంగా ఈ విషయం వెల్లడించింది. వారణాసి అంటార్కిటికాలో షూటింగ్ జరుపుకోనున్న తొలి తెలుగు చిత్రంగా గుర్తింపు పొందనుంది. -
50 ఏళ్ల వయసులో తండ్రి కాబోతున్న నటుడు
హిందీ సినిమాల్లో విలన్, సహాయ పాత్రలు, హీరోగా చేసిన రణ్దీప్ హుడా శుభవార్త చెప్పేశాడు. ఇతడి భార్య లిన్ లైస్రామ్ ప్రస్తుతం ప్రెగ్నెన్సీతో ఉంది. ఈమె బేబీ బంప్తో ఉన్న ఫొటోలని స్వయంగా రణ్దీప్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో కాబోయే తల్లిదండ్రులకు తోటి సెలబ్రిటీలు శుభాకాంక్షలు చెబుతున్నారు.(ఇదీ చదవండి: తల్లికి ఖరీదైన కారు గిఫ్ట్ ఇచ్చిన అల్లు అర్జున్)2001లో వచ్చిన హిందీ మూవీ 'మన్సూన్ వెడ్డింగ్'తో నటుడిగా పరిచయమైన రణ్దీప్ హుడా.. తర్వాత గ్యాంగ్స్టర్, జన్నత్ 2, రిస్క్, కర్మ ఔర్ హోలీ, కాక్టైల్, జిస్మ్ 2, బాంబే టాకీస్, కిక్, భాఘీ 2, రాధే, మర్డర్ 3 తదతర చిత్రాల్లో నటించి మెప్పించాడు. రీసెంట్ టైంలో అయితే వీర్ సావర్కర్ మూవీలో హీరోగా, జాట్ చిత్రంలో విలన్గా అలరించాడు.అసలు విషయానికొస్తే.. 2023లో ప్రియురాలు లిన్ లైస్రామ్ని మణిపురి సంప్రదాయంలో రణ్దీప్ పెళ్లి చేసుకున్నాడు. అప్పుడు ఇతడి వయసు 47 ఏళ్లు. ఇప్పుడు మూడేళ్ల తర్వాత అంటే 50 ఏళ్ల వయసులో తండ్రి కాబోతున్నాడు. గత నెలలోనే లిన్కి సీమంతం జరిగింది. ఆ ఫొటోలని లిన్ తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 15 సినిమాలు.. మూడు డోంట్ మిస్) View this post on Instagram A post shared by Randeep Hooda (@randeephooda)


