Bollywood
-
కృతీ... నువ్వు సూపర్
అభిమాన తారలను చూడగానే ఫ్యాన్స్కి ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేస్తుంది. ఒక్కోసారి ఆ అభిమానమే స్టార్స్ని ఇబ్బందులపాలు చేస్తుంది. షాహిద్ కపూర్, కృతీ సనన్, రష్మికా మందన్నా అలానే ఇబ్బందిపడ్డారు. ఈ ముగ్గురి కాంబినేషన్లో రూపొందిన హిందీ చిత్రం ‘కాక్టెయిల్ 2’ ఈ నెల 19న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో కొన్నాళ్లుగా ఈ ముగ్గురూ జోరుగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇందులో భాగంగానే పుణెలోని ఓ మాల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్లా జరిగిన మ్యూజికల్ ఫెస్టివల్లో పాల్గొన్నారు. వేదికపై ముగ్గురూ డ్యాన్స్ చేశారు.అలాగే అక్కడి లోకల్ స్నాక్ అయిన ‘వడ పావ్’ తిన్నారు. అంతా బాగానే జరిగింది. అయితే ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున హాజరైన వీక్షకుల్లో కొందరు కనబర్చిన అత్యుత్సాహంతో అనుకున్న సమయానికన్నా నిర్వాహకులు కాస్త ముందుగానే వేడుకను ముగించాల్సి వచ్చింది. షాహిద్, కృతి, రష్మికలను అక్కణ్ణుంచి పంపించే క్రమంలో అభిమానులు బారికేడ్లను దాటుకుని ముందుకు దూసుకు రావడంతో కంట్రోల్ చేయడానికి సెక్యూర్టీ చాలా ఇబ్బందిపడ్డారు.ఎలాగైతేనేం ముగ్గుర్నీ క్షేమంగా అక్కణ్ణుంచి పంపించారు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ముఖ్యంగా ఆకట్టుకున్న విషయం ఏంటంటే... రష్మిక చుట్టూ తన చేతులు వేసి, కృతి ఆమెకు హెల్ప్ చేయడం. నిజానికి కృతీకి కూడా బోలెడంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఒక వ్యక్తి ఆమెను తాకడానికి కూడా ట్రై చేశాడట.అయితే రష్మిక భయపడినట్లు కనిపించడంతో ఆమెకు రక్షణగా కృతి తన చేతులను ఆమె చుట్టూ వేశారని వీడియో స్పష్టం చేస్తోంది. ఇలా సహ నటికి సహాయం చేయడం పట్ల ‘కృతీ... నువ్వు సూపర్’ అంటూ కృతీ సనన్ని అందరూ అభినందిస్తున్నారు. ఇదిలా ఉంటే... దూసుకొచ్చినవారిని షాహిద్ నెట్టేయడం వీడి యోలో కనిపించింది. ఆయన దుస్తులు కూడా చిరిగాయని సమాచారం. -
బిడ్డకు జన్మనిచ్చిన ప్రముఖ బుల్లితెర నటి.. పోస్ట్ వైరల్
ప్రముఖ బుల్లితెర నటి సురభి జ్యోతి అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. తనకు పాప పుట్టిన విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. జూన్ 13న తనకు కుమార్తె జన్మించినట్లు సోషల్ మీడియాలో ప్రకటించింది. మా ఇంటికి కుమార్తె వచ్చేసింది.. ఈ సమయంలో మా హృదయాలు ప్రేమ, కృతజ్ఞతతో నిండిపోయాయని పోస్ట్ చేసింది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు, సినీతారలు, స్నేహితులు సురభికి అభినందనలు చెబుతున్నారు.కాగా.. సురభి జ్యోతి బాలీవుడ్లో 'ఖుబూల్ హై' అనే సీరియల్తో బాగా ఫేమస్ అయ్యారు. ఆ తర్వాత నాగిని-3 సీరియల్స్తో మరింత గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో తాను గర్భవతి అని ప్రకటించిన బుల్లితెర భామ తాజాగా బిడ్డకు వెల్కమ్ చెప్పింది. ఆమె తన ప్రియుడు సుమిత్ సూరిని అక్టోబర్ 27, 2024న వివాహం చేసుకుంది. వీరి వివాహం ఉత్తరాఖండ్లోని ఆహానా రిసార్ట్లో గ్రాండ్గా జరిగింది.కాగా.. ఆమె భర్త సుమిత్ రిషికేశ్ నటుడిగా మాత్రమే కాదు.. నిర్మాత కూడా రాణిస్తున్నారు. పలు వాణిజ్య ప్రకటనలలో నటించాడు. అంతేకాకుడా గుర్మీత్ సింగ్ దర్శకత్వం వహించిన 'వార్నింగ్' చిత్రంతో బాలీవుడ్లో నటుడిగా అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత 'ఖత్రోన్ కే ఖిలాడి' 4వ సీజన్లో కూడా కంటెస్టెంట్గా పాల్గొన్నారు. -
ఓటీటీకి కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. డైరెక్ట్గా స్ట్రీమింగ్
ఓటీటీకి వచ్చేందుకు మరో సినిమా రెడీ అయిపోయింది. సన్నీ డియోల్, అక్షయే ఖన్నా ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ ఇక్కా. ఈ చిత్రాన్ని సస్పెన్స్ కోర్ట్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సినిమాను నేరుగా ఓటీటీలోనే స్ట్రీమింగ్ చేయనున్నారు. తాజాగా ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్ను మేకర్స్ ఫిక్స్ చేశారు. జూలై 10 నుంచి ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించారు. నెట్ఫ్లిక్స్ వేదికగా ఈ మూవీ సందడి చేయనుంది.దాదాపు 29 ఏళ్ల తర్వాత ఇద్దరు దిగ్గజ నటులు సన్నీ డియోల్, అక్షయే ఖన్నా స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. ఈ చిత్రాన్ని ఫుల్ సస్పెన్స్ అండ్ ఎమోషనల్ కోర్టు రూమ్ డ్రామాగా తెరకెక్కించారు. ఈ చిత్రంలో సన్నీ డియోల్ పవర్ఫుల్ లాయర్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాకు సిద్ధార్థ్ మల్హోత్రా దర్శకత్వం వహించారు. ఈ మూవీలో దియా మీర్జా, తిలోత్తమా శోమే, సంజీదా షేక్, ఆకాంక్ష రంజన్ కపూర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. #Bollywood doesn't make enough courtroom thrillers.#Ikka already has my attention. The poster feels tense, the tagline is intriguing, and #SunnyDeol looks completely locked in. 🔥⚖️Also, you can never count out #AkshayeKhanna in a film like this when it comes to intense,… pic.twitter.com/9SuJeH0vWN— Siddharth R Kannan (@sidkannan) June 13, 2026 -
'రాముడి పాత్రకు సుశాంత్ను మించినవారు లేరు'.. సోదరి ఎమోషనల్
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ను ఆయన సోదరి శ్వేతా సింగ్ కీర్తి గుర్తు చేసుకుంది. ఇవాళ సుశాంత్ వర్ధంతి కావడంతో సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తన సోదరుడిని గుర్తు చేసుకుని ఎమోషనలైంది. కాలం గడిచినా తన సోదరుడి ఉనికి ఇంకా తమతోనే ఉందని శ్వేత రాసుకొచ్చింది. నువ్వు లేకుండా ఆరేళ్లయినా నువ్వు జీవించిన విధానం ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలిచిందన్నారు. ఈ సందర్భంగా సుశాంత్ శ్రీరాముడిలా ఉన్న ఏఐ ఫోటోను షేర్ చేసింది.శ్వేత తన ఇన్స్టాలో రాస్తూ.. "ఆరేళ్ల కాలం గడిచిపోయింది.. అయినా కొన్ని ఆత్మలు కాలానికి అతీతంగా ఎదుగుతూనే ఉంటాయి. ఇప్పుడు అతను ఎలా మరణించాడో కాకుండా.. ఎలా జీవించాడో గుర్తుంచుకోవాలనుకన్నా.. అతను జిజ్ఞాస, కరుణ, గౌరవంతో నిండిన వ్యక్తి' అని అభివర్ణించారు. ఎవరైనా సరే చాలా గౌరవించేవాడని శ్వేత తెలిపింది. కరుణ, దయ లేకపోతే విజయానికి అర్థం లేదని తన చుట్టూ ఉన్నవారికి నేర్పించాడని ఆమె రాసుకొచ్చారు. అందుకే తన సోదరుడు జీవితమే తనకు ఆదర్శమని ఆమె అన్నారు. రాముడిలా సుశాంత్ సింగ్ రాజ్పుత్..నితేష్ తివారీ రామాయణం టీజర్ విడుదలైన తర్వాత.. సుశాంత్ను శ్రీరాముడిగా ఊహించకున్నానని తెలిపింది. రాముడు కేవలం వ్యక్తి మాత్రమే కాదని.. ఆయన అమూల్యంగా భావించే విలువలకు ప్రతీక అని పేర్కొంది. మర్యాద, కరుణ, గౌరవం, ధైర్యం, సత్యం సీతామాతపై ఆయనకున్న స్వచ్ఛమైన ప్రేమ రాముడి పాత్రకు సంబంధించిన అమాయకత్వం, స్వచ్ఛత, ఔన్నత్యం సుశాంత్ కనిపించాయని అన్నారు. ఈ రోజుల్లో భాయ్ పోషించినంత అద్భుతంగా రాముడి పాత్రను ఎవరూ పోషించలేరని కూడా శ్వేత అభిప్రాయం వ్యక్తం చేశారు.కాగా.. సుశాంత్ సింగ్ రాజ్పుత్ జూన్ 14, 2020న ముంబయిలోని తన అపార్ట్మెంట్లో విగతజీవిగా కనిపించారు. View this post on Instagram A post shared by ♾️Shweta Singh Kirti (@shwetasinghkirti) -
నేపాలీ గ్యాంగ్స్పై ఆర్జీవీ కన్ను?
హైదరాబాద్తో పాటు కొన్ని ఇతర ప్రాంతాల్లో ఇటీవల కాలంలో నేపాలీ గ్యాంగ్స్ సృష్టించిన హత్యలు, దోపిడీలు ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఓ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్యను హత్య చేసిన ఘటనతో ఈ నేపాలీ ముఠాల ఆగడాలు మరింతగా వెలుగులోకి వచ్చాయి. దాంతో ఈ పరిణామాలపై దర్శకుడు రామ్గోపాల్ వర్మ దృష్టి పడింది. ఎప్పుడూ రియల్ లైఫ్ కథలను తనదైన శైలిలో సినిమాగా మలచడంలో ఆసక్తి చూపుతుంటాడు వర్మ. తాజాగా ఈ దర్శకుడు నేపాలీ ముఠాల కథను తెరపైకి తీసుకురావాలని ఆలోచిస్తున్నాడని సమాచారం. దీనికి సంబంధించి సరైన పాయింట్ కోసం ఆయన వెతుకుతున్నాడని తెలుస్తోంది. గతేడాది తన సూపర్ హిట్ చిత్రం 'సత్య' సినిమాను మళ్లీ చూశాడు వర్మ. అనంతరం ఎందుకు దానిని బెంచ్మార్క్గా పెట్టుకోలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇకపై తన ప్రతిభకు తగ్గ గొప్ప సినిమాలు తీస్తానని ప్రతిజ్ఞ కూడా చేశాడు. అయితే ఆ తర్వాత తాను ప్రకటించిన 'సిండికేట్' సహా పలు ఇతర ప్రాజెక్టులు సైతం కార్యరూపం దాల్చలేదు. -
రైల్లో న్యూస్ పేపర్ పరచుకుని పడుకున్నా: సోనూసూద్
బాలీవుడ్ నటుడు సోనూసూద్ భారతీయ రైల్వేపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. వందేభారత్ రైల్లో ప్రయాణించిన ఆయన ఇండియన్ రైల్వేస్ అభివృద్ధిని ప్రశంసించారు. ఇంత నాణ్యమైన ప్రయాణాన్ని అందిస్తున్నందుకు భారతీయ రైల్వేకు ధన్యవాదాలు తెలిపారు. నాణ్యమైన ఆహారం అద్భుతమైన సిబ్బంది సేవలు ఉన్నాయని కొనియాడారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.గతంలో తాను టికెట్ బుక్ చేసుకోవడానికే ఇబ్బందులు పడేవాడినని సోనూ సూద్ వెల్లడించారు. నాగ్పూర్ నుంచి ముంబయి వెళ్లేటప్పుడు ఈ పరిస్థితి ఎదురైందని తెలిపారు. తాను న్యూస్ పేపర్ కింద పరచుకుని రైళ్లలో ప్రయాణించిన రోజులు కూడా ఉన్నాయని సోనూసూద్ అన్నారు. భారతీయుల ప్రయాణంలో క్వాలిటీ చూసి గర్వంగా ఉందన్నారు. ఈ సందర్భంగా రైల్వేశాఖను ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సోనూసూద్ మాటలతో రైల్వే ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. अभिनेता Sonu Sood ने Vande Bharat Express में यात्रा का अपना अनुभव साझा करते हुए ट्रेन की आधुनिक सुविधाओं, स्वच्छता और आरामदायक सफर की सराहना की। 🚆A heartfelt thanks to @SonuSood for sharing this experience and highlighting the positive changes #SonuSood #IndianRailways pic.twitter.com/x24QbaFki6— BHARAT SAMVAD (@Bhaaratsamvad) June 13, 2026 -
'నాపై గే అంటూ ట్రోల్స్'.. బాలీవుడ్ నటి ఆవేదన
బాలీవుడ్ భామ మౌనీ రాయ్ బాలీవుడ్లో సుపరిచమైన పేరు. ఇటీవలే ఆమె తన భర్త సూరజ్ నంబియార్తో విడిపోతున్నట్లు ప్రకటించింది. తామిద్దరం పరస్పర అంగీకారంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించింది. కానీ ఆ తర్వాత మౌనీ రాయ్పై పెద్దఎత్తన ట్రోల్స్, విమర్శలు వచ్చాయి. చాలా దారుణంగా కొందరు కామెంట్స్ చేశారు. ఆమెను గే అంటూ రూమర్స్ సృష్టించారు.తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన మౌనీ రాయ్ తనపై వచ్చిన రూమర్స్, ట్రోల్స్పై స్పందించింది. ఓ యూట్యూబ్ ఛానెల్తో మాట్లాడిన ఆమె.. తనపై గే అన్న రూమర్పై రియాక్ట్ అయింది. తాను విన్న వాటిలో అత్యంత అసంబద్ధమైన రూమర్ ఇదేనని మౌనీ రాయ్ వెల్లడించింది.విడాకుల ప్రకటన తర్వాత తన చుట్టూ బలమైన మద్దతుగా నిలబడే వాళ్లు ఉండడం తన అదృష్టమని మౌనీ రాయ్ చెప్పింది. నాకు ఎల్లప్పుడూ ఒక కొండంత అండగా నిలిచే స్నేహితులు, కుటుంబం ఉండటం నా అదృష్టంగా భావిస్తున్నానని తెలిపింది. కష్ట సమయాల్లో నాకు సహాయం చేయడంలో నా స్నేహితులు ముఖ్యమైన పాత్ర పోషించారని మౌని చెప్పుకొచ్చింది. నా ఫ్రెండ్స్ మంచి, చెడు సందర్భాల్లోనూ నాకు తోడుగా నిలిచారని మౌనీ రాయ్ పంచుకున్నారు.కాగా.. నాలుగేళ్ల డేటింగ్ తర్వాత 2022లో సూరజ్ను వివాహం చేసుకున్నారు. ఇటీవలే 2026లో అతనితో విడిపోయారు. మౌని, సూరజ్ ఇద్దరూ ఈ విషయాన్ని ప్రకటించారు. ఇక సినిమాల విషయానికొస్తే 'హై జవానీ తో ఇష్క్ హోనా హై' (2026) చిత్రంలో కనిపించారు. -
ఆ సినిమాను ఇంత లేట్గా చూడడం నా తప్పే!
మూడున్నర గంటల నిడివి.. బ్రిటిష్ పాలన నేపథ్యంలో సాగే ఓ ఊరి కథ. యాక్షన్ మాస్ మసాలా ఐటెం సాంగుల్లాంటి హంగులేమీ లేవు. పైగా సస్పెన్స్ థ్రిల్లరో, హారర్ జానరో కూడా కాదు. ఇవన్నీ తెలిసిన తర్వాత చాలామంది “అబ్బో” అంటూ ఆ సినిమాను పక్కన పెట్టేయడం సహజమే. కానీ ఒక్కసారి చూడడం మొదలుపెట్టాక ప్రతి సన్నివేశం మనల్ని లోపలికి లాగేస్తుంది. తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్న కుతూహలం పెరిగిపోతుంది. మధ్యలో ఆపేయాలన్న ఆలోచనే రానీయకుండా చివరి వరకు కూర్చోబెడుతుంది. 1893లోని చంపానేర్ గ్రామం, వర్షం కోసం ఎదురుచూస్తున్న రైతులు, బ్రిటిష్ అధికారుల అహంకారం.. ఇవన్నీ మొదటి నుంచే కథలోకి లాగేస్తాయి. ఘనన్ ఘనన్ పాట వినిపించిన క్షణం నుంచి ప్రేక్షకుడు కూడా ఆ గ్రామస్థులతో కలిసి ఆకాశం వైపు చూస్తూ వర్షం కోసం ఎదురుచూస్తాడు. రాధా కైసే నా జలే, ఓ పాలన్ హారే వంటి పాటలు కథను ముందుకు తీసుకెళ్లడమే కాకుండా పాత్రల భావోద్వేగాలను మనసుకు హత్తుకునేలా చేస్తాయి.క్రికెట్ చుట్టూ తిరిగే స్క్రీన్ప్లే.. లగాన్ సినిమా గొప్పతనం కేవలం క్రికెట్లో లేదు. కులవివక్ష, మత సామరస్యం, ఐక్యత, ఆత్మగౌరవం వంటి అంశాలను ఎంతో సహజంగా కథలో కలిపేసింది. ముఖ్యంగా దళితుడైన కచ్రాను జట్టులో చేర్చే సన్నివేశం ఇప్పటికీ గుండెను తాకుతుంది. కాలం మారినా.. సమాజంలోని కొన్ని వాస్తవాలు మాత్రం మారలేదనే ఆలోచన కలిగిస్తుంది.క్రికెట్ మ్యాచ్కు ముందు గ్రామస్తులు ప్రాక్టీస్ చేసే సన్నివేశాలు నవ్విస్తాయి.. ఆలోచింపజేస్తాయి. మొదట ఒకరిపై ఒకరికి అనుమానాలు ఉన్న వాళ్లు.. చివరకు ఒక లక్ష్యం కోసం ఒక్కటిగా నిలబడటం ప్రేక్షకుడిలోనూ ఓ అనుబంధాన్ని కలిగిస్తుంది. మ్యాచ్ మొదలయ్యాక ప్రతి బంతి ఉత్కంఠను పెంచుతుంది. ప్రతి వికెట్తో గుండె వేగం పెరుగుతుంది. చివరి ఓవర్లలో ప్రేక్షకుడు కూడా చంపానేర్ జట్టులో భాగమైనట్టే ఫీలవుతాడు.వర్షం కురిసే క్లైమాక్స్ కేవలం ఒక విజయానికి గుర్తు కాదు. అవమానాన్ని, ఆకలిని, అన్యాయాన్ని ఎదుర్కొన్న ప్రజల ఆశలకు దక్కిన ప్రతిఫలం. అందుకే లగాన్ దేశభక్తి సినిమా కంటే చాలా పెద్దది. అది మనుషుల గురించి, వారి కలల గురించి, కలిసి పోరాడితే అసాధ్యం కూడా సాధ్యమేనని చెప్పే కథ.ఓ కల నుంచి ఆస్కార్ దాకా!దర్శకుడు అశుతోష్ గోవారికర్ Ashutosh Gowariker మనసులో పుట్టిన ఓ విభిన్న ఆలోచనే ఈ చిత్రానికి బీజం. బ్రిటిష్ పాలనలో ఉన్న ఓ గ్రామం.. కరువు, పన్నుల భారం, ఆ దౌర్జన్యానికి వ్యతిరేకంగా క్రికెట్ మ్యాచ్ ద్వారా పోరాడే రైతులు.. ఈ కథను మొదట వినగానే చాలామంది నిర్మాతలు రిస్క్గా భావించారు. పీరియడ్ డ్రామా, గ్రామీణ నేపథ్యం, క్రికెట్, మూడున్నర గంటల నిడివి.. ఇవన్నీ కలిసి కమర్షియల్గా పనిచేయవని అనుకున్నారు.అలాంటి సమయంలో హీరో అమీర్ ఖాన్ Aamir Khan కథపై నమ్మకం ఉంచారు. నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా ముందుకొచ్చి అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ బ్యానర్పై సినిమాను నిర్మించారు. భువన్ పాత్రను అమీర్ పోషించగా, గౌరి పాత్రకు గ్రేసీ సింగ్ను తీసుకున్నారు. చంపానేర్కు సాయం చేసే బ్రిటిష్ యువతి ఎలిజబెత్ పాత్రలో రాచెల్ షెల్లీ నటించారు. గ్రామస్థుల పాత్రల కోసం దేశవ్యాప్తంగా ఆడిషన్లు నిర్వహించి నటులను ఎంపిక చేశారు.రఘుబీర్ యాదవ్ (భూరా), ఆదిత్య లఖియా (కచ్రా), యశ్పాల్ శర్మ (లఖా), అఖిలేంద్ర మిశ్రా (అర్జున్), దయాశంకర్ పాండే (గోలి), రాజ్ జుత్షి (ఇస్మాయిల్), ప్రదీప్ రావత్ (దేవా సింగ్ సోధి), అమీన్ హాజీ (బఘా), రాజేష్ వివేక్ (గురన్) గా వీరు అందరూ కలిసి చంపానేర్ గ్రామ జట్టుకు ప్రాణం పోశారు. లగాన్ సమయంలో మాత్రం వీరిలో చాలామంది మధ్యస్థాయి లేదా కొత్త నటులే. అందుకే ఆ ఊరు నిజంగా మన కళ్ల ముందున్నట్టుగా అనిపించింది. ఇదే సినిమా సహజత్వానికి పెద్ద కారణంగా చెప్పొచ్చు.చిత్రీకరణ ప్రధానంగా గుజరాత్లోని భుజ్ పరిసర ప్రాంతాల్లో జరిగింది. మండే ఎండల్లో నెలల తరబడి షూటింగ్ సాగింది. గ్రామం మొత్తం ప్రత్యేకంగా నిర్మించారు. సినిమాలో కనిపించే క్రికెట్ మ్యాచ్ కోసం నటులకు ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చారు. సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ అందించిన పాటలు సినిమాకు ప్రాణంగా నిలిచాయి.. ఇప్పటికీ అవి చిరస్మరణీయంగా నిలిచాయి.2001 జూన్ 15న విడుదలైంది లగాన్. మొదట్లో ఒక ప్రయోగాత్మక చిత్రంలా కనిపించినా.. కొద్ది రోజుల్లోనే ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. విమర్శకుల ప్రశంసలతో పాటు భారీ వసూళ్లు సాధించింది. దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా విదేశాల్లోనూ మంచి ఆదరణ పొందింది. బ్రిటిష్ పాలన, కుల వివక్ష, మత సామరస్యం, గ్రామీణ ఐక్యత వంటి అంశాలను వినోదాత్మకంగా చూపించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ విజయంతో లగాన్ అంతర్జాతీయ వేదికల దృష్టిని ఆకర్షించింది. 2002లో జరిగిన 74వ అకాడమీ అవార్డ్స్లో (ఆస్కార్) ఉత్తమ విదేశీ భాషా చిత్రం విభాగంలో నామినేషన్ పొందింది. ఆస్కార్కు నామినేట్ అయిన మూడో భారతీయ చిత్రంగా చరిత్ర సృష్టించింది. చివరకు అవార్డు దక్కకపోయినా.. ప్రపంచవ్యాప్తంగా భారతీయ సినిమాకు కొత్త గుర్తింపు తీసుకొచ్చింది. ఆస్కార్ వేదికపై లగాన్ పేరు వినిపించడం అప్పట్లో దేశవ్యాప్తంగా గర్వకారణంగా మారింది.లగాన్.. కేవలం క్రికెట్ కథ కాదు.. ఆత్మగౌరవం కోసం మట్టిమనుషులు చేసిన పోరాటం. సినిమా వచ్చి పాతికేళ్లు అవుతున్నా.. ఆ సినిమాలోని మేజిక్ తగ్గలేదు. మూడు గంటలకుపైగా నిడివి ఉన్నా.. నేటి రీల్ జనరేషన్ను కూడా స్క్రీన్కు అతుక్కుపోయేలా చేస్తోందా కథాకథనం. భారతీయ సినీ చరిత్రలో అత్యుత్తమ చిత్రాల జాబితాలో ఈ చిత్రం ఇప్పటికీ ప్రత్యేక స్థానం ఉండటానికి అదే కారణం కూడా. అందుకే లగాన్ ఒక సినిమా కాదు.. తరాలు మారినా నిలిచే క్లాసిక్. (భాషతో అక్కర్లేదు అనుకుంటే నెట్ఫ్లిక్స్లో ఉంది):::ఓ సినీ ప్రేమికుడు -
‘ధమాల్ 4’ ట్రైలర్.. నవ్వులే నవ్వులు
బాలీవుడ్ సక్సెస్ఫుల్ ఫ్రాంచైజీలో ‘ధమాల్’ ఒకటి. ఈ ఫ్రాంచైజీ నుంచి రానున్న తాజా సినిమా ‘ధమాల్ 4’. అజయ్ దేవగన్ హీరోగా నటించిన ఈ అడ్వెంచరస్ కామెడీ ఎంటర్టైనర్కి ఇంద్రకుమార్ దర్శకుడు. అజయ్ దేవగన్, భూషణ్ కుమార్, క్రిషణ్ కుమార్, అశోక్ థాకేరియా, ఇంద్రకుమార్, ఆనంద్ పండిట్, కుమార్ మంగత్ పాఠక్ నిర్మించిన ఈ మూవీ జూలై 10న విడుదల కానుంది. శుక్రవారం ఈ సినిమా ట్రైలర్ను రిలీజ్ చేశారు. ‘హెల్ప్ చేయండి’..., ‘సైతాన్ సింగ్ నిధికి చెందిన చిరునామాను కాస్త గట్టిగా చెప్పండి’, ‘అరె.., నిధికి సంబంధించిన మ్యాప్ దొరికింది’ అని తెలుగు అర్థం వచ్చే హిందీ డైలాగ్స్ ‘ధమాల్ 4’ ట్రైలర్లో ఉన్నాయి. ‘ధమాల్ 4’లో నాలుగింతల వినోదం ఉంటుందని ఇటీవల అజయ్ దేవగన్ పేర్కొన్నారు. ఇందుకు తగ్గట్లుగానే ట్రైలర్లో కామెడీ సీన్స్ కనిపిస్తున్నాయి. -
స్పెషల్ గెస్ట్..?
ముత్తువేల్ పాండియన్తో చేతులు కలపనున్నారట హృతిక్ రోషన్. రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ ముత్తువేల్ పాండియన్ పాత్రలో రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్కుమార్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘జైలర్’. 2023లో విడుదలైన ఈ సినిమా సూపర్హిట్గా నిలిచింది. ప్రస్తుతం రజనీ, నెల్సన్ల కాంబినేషన్లోనే ‘జైలర్’కు సీక్వెల్గా ‘జైలర్ 2’ తెరకెక్కుతోంది.ఈ సినిమాలోని ఓ స్పెషల్ గెస్ట్ రోల్ను హృతిక్ రోషన్ చేయనున్నారని తెలిసింది. ఈ నెల 22, 23 తేదీల్లో ఈ సినిమా చిత్రీకరణ కోసం హృతిక్ రోషన్ చెన్నై చేరుకుంటారని, రజనీ–హృతిక్ కాంబినేషన్లోని కీలక సన్నివేశాలను నెల్సన్ చిత్రీకరిస్తారని సమాచారం. -
సినిమాల్లోకి కత్రినా కైఫ్ రీఎంట్రీ..?
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ మళ్లీ సినిమాల్లోకి అడుగుపెడుతున్నారనే వార్తలు ఇటీవల సోషల్ మీడియాలో, కొన్ని మీడియా సంస్థల్లో చక్కర్లు కొట్టాయి. అయితే ఈ ప్రచారాన్ని ఆమె టీమ్ పూర్తిగా ఖండించింది. ఆ వార్తలు నిజం కాదని తేల్చేసింది.కొడుకు విహాన్ కౌశల్ జననం తర్వాత కత్రినా పూర్తిగా తన కుటుంబానికే ప్రాధాన్యం ఇచ్చింది. గత రెండేళ్లుగా కత్రినా పూర్తిగా సినిమాలకు దూరంగా ఉన్నారు. ప్రస్తుతం ఆమె మాతృత్వాన్ని ఆస్వాదిస్తోంది. తన భర్త విక్కీ కౌశల్, కొడుకు విహాన్తో విహార యాత్రలు చేస్తూ ఆ ఫొటోలు, వీడియోలను అభిమానులతో పంచుకుంటూ ఆనందిస్తోంది.తాజాగా 2027 ద్వితీయార్థంలో వెండితెరపైకి తిరిగి వస్తారనే ఊహాగానాలు నెట్టింట వైరల్ అయ్యాయి. అలాగే ఓటీటీ ప్రాజెక్ట్తో అడుగుపెడతారనే వార్తలు వినిపించాయి. అయితే ఇవన్నీ పుకార్లేనని ఆమె టీమ్ స్పష్టం చేసింది. ఆ వార్తలు నిజం కాదని తేల్చేసింది. దాంతో రీఎంట్రీ లేదని తేలిపోయింది. ఇక తన నటనతో పాటు వ్యాపార రంగంలో కూడా కత్రినా విజయవంతంగా రాణిస్తున్నారు. ఆమె సొంత కాస్మోటిక్స్ బ్రాండ్ ‘కే బ్యూటీ’ భారతీయ మార్కెట్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ, వ్యాపార రంగంతో పాటు తన వ్యక్తిగత జీవితంలో కూడా కత్రినా బిజీగా ఉన్నారు. -
పాన్ ఇండియా మూవీ.. భయపడిపోతున్న హీరోయిన్లు!
ప్రస్తుతం టాలీవుడ్తో పాటు సౌత్ సినిమా అంతా ‘పాన్ ఇండియా’ మంత్రం జపిస్తోంది. వందల కోట్ల బడ్జెట్, భారీ క్యాస్టింగ్, కళ్ళు చెదిరే విజువల్స్తో ఈ సినిమాలు బాక్సాఫీస్ను షేక్ చేస్తున్నాయి. అయితే, ఈ పాన్ ఇండియా జోరు టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో మాత్రం ఒక కొత్త భయాన్ని పుట్టిస్తోంది. సినిమా స్కేల్ ఎంత పెద్దదైనా, అందులో తమ పాత్రల నిడివి చాలా తక్కువగా ఉండడం, ప్రాధాన్యత లోపించడం, పైగా ఆ చిన్న పాత్రల వల్ల అనవసర వివాదాలు చుట్టుముట్టడంతో... ఇప్పుడు పాన్ ఇండియా ఆఫర్ వస్తేనే హీరోయిన్లు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారు.రామ్ చరణ్ హీరోగా నటించిన పాన్ ఇండియా సినిమా పెద్ది ఇటీవల ప్రేక్షకుల ముందుకురాగా, అందులో జాన్వీ కపూర్ పాత్రపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. తెరపై ఆమెను చూపించిన తీరుపై సినీ తారలు సైతం అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో దర్శకుడు బుచ్చిబాబు క్షమాపణలు చెప్పి, ఆ సీన్లను తొలగించాడు. అయినా కూడా ఈ వివాదం సాగుతూనే ఉంది.జాన్వీ పాత్రపై ఇలా విమర్శలు రావడం రెండోసారి. అంతకు ముందు ఎన్టీఆర్తో కలిసి నటించిన ‘దేవర’లోనూ ఆమె పాత్ర నిడివి తక్కువే ఉంది. అంతేకాదు నటన కంటే అందాల ప్రదర్శనకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు విమర్శలు వచ్చాయి.ఇక ఆర్ఆర్ఆర్ రిలీజ్ సమయంలో అలియా భట్ పాత్రపై కూడా ఇలాంటి విమర్శలే వచ్చాయి. సినిమా అనౌన్స్ చేసినప్పుడు అలియా రేంజ్ పెర్ఫార్మెన్స్ ఉంటుందని ఫ్యాన్స్ ఆశించారు. కానీ, సినిమాలో ఆమె పాత్ర నిడివి చాలా తక్కువ. కేవలం కొన్ని నిమిషాలకే పరిమితం కావడంతో అలియా ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. చివరకు ఈ పాత్ర నిడివి విషయంలో సోషల్ మీడియాలో పెద్ద వివాదమే నడిచింది.రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్లో వచ్చిన ‘గేమ్ ఛేంజర్’ పొలిటికల్ థ్రిల్లర్. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్. శంకర్ సినిమాల్లో హీరోయిన్ల పాటలు రిచ్గా ఉంటాయి కానీ, కథ పరంగా చూస్తే హీరో డామినేషన్ ఎక్కువ. ఈ సినిమాలోనూ కియారా పాత్రకు కథను మలుపు తిప్పేంత ప్రాధాన్యత లేకపోవడం, కేవలం కమర్షియల్ హంగులకే పరిమితం కావడంతో బాలీవుడ్ మీడియాలోనూ దీనిపై చర్చ జరిగింది. 'కల్కి'లో దీపికా పాత్ర కథకు కీలకమే అయినప్పటికీ, యాక్షన్ అంతా హీరోల చుట్టూనే తిరిగింది.ఇక భారీ అంచనాలతో వచ్చిన డిజాస్టర్గా నిలిచిన ప్రభాస్ ‘ది రాజాసాబ్’లోనూ హీరోయిన్ల పాత్రకు అంత ప్రాధాన్యత లేదు. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ ఈ సినిమా కోసం చాలా రోజులు కేటాయించారు. చివరకు ‘గ్లామర్ షో’కే పరిమితం అయ్యారంటూ విమర్శల పాలయ్యారు.పాన్ ఇండియా సినిమాలు భారీ విజయం సాధించినా హీరోయిన్లకు క్రెడిట్ రావడం లేదు, ఒకవేళ క్యారెక్టర్ బాలేకపోతే మాత్రం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. అందుకే ఇప్పుడు బాలీవుడ్, టాలీవుడ్ భామలు కేవలం 'పాన్ ఇండియా' ట్యాగ్ చూసి మోసపోకుండా, క్యారెక్టర్ గ్రాఫ్ ఎలా ఉందో చూసుకున్నాకే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. -
‘పెద్ది’ వివాదం.. కంగనా ఇచ్చే సలహా ఇదే!
రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటించిన పెద్ది సినిమా వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఒకవైపు ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ రాబడుతుంటే..మరోవైపు జాన్వీ కపూర్ పాత్రపై విమర్శలు వస్తూనే ఉన్నాయి. సాధారణ ప్రేక్షకులే కాదు సినీ తారలు కూడా పెద్దిలో జాన్వీ కపూర్ని చూపించిన తీరును తప్పుపడుతున్నారు. (చదవండి: 'మీ రాకా కోసం ఎదురు చూస్తున్నా..' బన్నీకి పెద్ది రిప్లై)ఇప్పటికే జయాబచ్చన్, నిత్యామీనన్, అదా శర్మ లాంటి వాళ్లు దీనిపై రియాక్ట్ అయ్యారు. తాజాగా బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ కూడా పెద్ది వివాదంపై స్పందించింది. తన కొత్త సినిమా ‘భారత్ భాగ్య విధాత’సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కంగనా మాట్లాడుతూ.. ‘సెట్లో ఏదైనా సీన్ హీరోయిన్లకు ఇబ్బందిగా అనిపిస్తే, వెంటనే చెప్పాల్సిన బాధ్యత వాళ్లపై ఉంది' అని ఆమె అభిప్రాయపడింది. ‘నేను చూసినంతవరకు సినిమాల్లో హీరోయిన్లను ఒక వస్తువుగా చూపించాలని ఏ డైరెక్టర్ అనుకోడు. కొన్నిసార్లు వాళ్లకు తెలియకుండానే అలా జరిగిపోతుంది. కొంతమంది మగాళ్లు నాలుగు గోడల మధ్యే కూర్చొని కథను రాసుకుంటారు. వాళ్లకు ఆడవాళ్ల కోణం అర్థం కాదు. రాసిన సీన్ అసభ్యకరంగా ఉంటుందని వాళ్లు గ్రహించలేరు. కాబట్టి, ఒక మహిళగా మీరు మీ దృక్కోణాన్ని పంచుకుంటూ, 'అవును, మాకు ఇలాగే అనిపిస్తోంది,' లేదా 'ఇది చూడటానికి బాగోలేదు' అని చెప్పవచ్చు. చాలా వరకు, వారు మీతో ఏకీభవిస్తారు. అంతేకానీ దర్శకుడు చెప్పింది చేసుకుంటూ పోతే.. మనం కూడా దానికి అంగీకరించినట్లే అవుతుంది’ అని హీరోయిన్లకు కంగనా సలహా ఇచ్చింది. -
ప్రభాస్తో ధురంధర్ దర్శకుడు ఆదిత్య ధర్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పాన్ ఇండియా దర్శకుడు ఆదిత్య ధర్ కలయికపై వార్తలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. సోషల్ మీడియాలో ఈ కాంబినేషన్ గురించి ప్రచారం జోరుగా సాగుతోంది. కానీ ఇందులో ఎలాంటి వాస్తవం లేదు. వాళ్లిద్దరూ కలిశారనేది నిజం. కొన్ని ఐడియాస్ షేర్ చేసుకున్నారనేది కూడా నిజం. కానీ ఈ కాంబినేషన్ పై ఎలాంటి కన్ ఫర్మేషన్ లేదు. ఇదే విషయాన్ని పరిశ్రమ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రభాస్ ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఓవైపు దర్శకుడు సందీప్ వంగాతో స్పిరిట్ షూటింగ్ జరుగుతోంది. మరోవైపు ఫౌజీ సెట్స్ పై ఉంది. వాటితో పాటు కల్కి-2 సినిమా పనులు కూడా కొనసాగుతున్నాయి. అనంతరం సలార్-2 కూడా లైన్లో ఉంది. ఇలాంటి బిజీ షెడ్యూల్ మధ్య ప్రభాస్ మరో కొత్త ప్రాజెక్ట్కు కాల్షీట్లు కేటాయించే పరిస్థితి లేదు. ఇక ఆదిత్య ధర్ విషయానికి వస్తే.. ఆయనకు ఇప్పటికే జియోతో మరో చిత్రానికి కమిట్మెంట్ ఉంది. జీ స్టూడియోస్ కూడా ఆయనతో కొత్త ప్రాజెక్ట్ కోసం ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా ఓటీటీలో విడుదలైన ధురంధర్-2 (ది రివెంజ్) రికార్డ్ వ్యూస్ తో దూసుకుపోతోంది. రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన ఈ ఫ్రాంచైజీ ఆల్ టైమ్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. అందువల్ల ప్రభాస్ – ఆదిత్య ధర్ కాంబినేషన్ పై ప్రస్తుతానికి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. వీళ్ల మధ్య ఎలాంటి కథా చర్చలు జరగలేదు. కానీ కొన్ని నిర్మాణ సంస్థలు మాత్రం వీళ్లను కలిపే ప్రయత్నం చేస్తున్నాయన్నది మాత్రం నిజం. -
ఆలియా భట్ స్పై యాక్షన్ థ్రిల్లర్.. టీజర్ రిలీజ్
బాలీవుడ్ భామ ఆలియా భట్ నటిస్తోన్న లేటేస్ట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ఆల్ఫా. లేడీ ఓరియంటెడ్గా వస్తోన్న ఈ మూవీకి శివ్ రావేల్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ఆలియా భట్ తన యాక్షన్తో అదరగొట్టనుంది. తాజాగా ఈ మూవీ టీజర్ను మేకర్స్ రిలీజ్ చేశారు.తాజాగా రిలీజైన టీజర్లో ఆలియా భట్ యాక్షన్ సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రంలో బాబీ డియోల్ పాత్ర హైలెట్గా ఉండనుంది. స్పై యూనివర్స్లో ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన యశ్రాజ్ ఫిల్మ్స్ ఈ మూవీని నిర్మిస్తోంది. యశ్రాజ్ ఫిల్మ్స్ నిర్మించిన మొదటి మహిళా గూఢచారి సినిమా ఇదే కావడం ఆడియన్స్లో మరింత ఆసక్తిని పెంచుతోంది. ఈ చిత్రంలో శార్వరీ వాఘ్ కీలక పాత్ర పోషించారు. -
హాట్ టాపిక్గా 'మా బెహన్' నటి రూ. 14 కోట్ల బంగ్లా
ఓటీటీలో దూసుకుపోతున్న లేటెస్ట్ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ 'మా బెహన్' బాలీవుడ్ స్టార్ హీరోయిన్ మాధురి దీక్షిత్తో పాటు మరో కీలక పాత్రలో నటించిన హీరోయిన్ తృప్తి దిమ్రి ప్రస్తుతం వార్తల్లో నిలుస్తోంది. తన తాజా చిత్రంతో క్రేజ్ సంపాదించుకుకున్న ఈ నటి కొన్నేళ్ల క్రితం కొనుగోలు చేసిన ప్రాపర్టీ ఇపుడు నెట్టింట విశేష చర్చగా మారింది. ముంబైలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన బాంద్రా వెస్ట్ ప్రాంతంలో సుమారు రూ. 14 కోట్లతో ఒక బంగ్లాను కొనుగోలు చేసినట్లు సమాచారం.IndexTap.com ద్వారా అందించిన ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ పత్రాల ప్రకారం, ఈ గ్రౌండ్-ప్లస్-టూ (G+2) అంతస్తుల ఇల్లు నగరంలోని అత్యంత డిమాండ్ ఉన్న కార్టర్ రోడ్ పరిసరాల్లో ఉంది.ప్రీమియం ఏరియాలోని ఈ ప్రాపర్టీ 2,226 చదరపు అడుగుల్లో , 2,194 చదరపు అడుగుల బిల్ట్-అప్ ఏరియాతో ఈ బంగ్లా స్పెషల్గా ఉంటుంది. ఈ బంగ్లా కెరీర్లో ఒక ముఖ్యమైన మైలురాయి. హంగూ ఆర్భాటాల కంటే సరళత, సౌకర్యానికే ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ ఈ ఇల్లును తీర్చిదిద్దుకుందిట. సాఫ్ట్ టోన్స్ (మృదువైన రంగులు), డెకర్ ఎలిమెంట్స్తో కూడిన 'మినిమలిస్ట్' లుక్తో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. అలాగే లివింగ్ రూమ్ కూడా ఎలాంటి గందరగోళం లేకుండా, చాలా ప్రశాంతంగా డిజైన్ చేశారు. మ్యూటెడ్ వాల్స్ (లైట్ కలర్ గోడలు) మధ్యలో ఉన్న ఒక 'పిస్తా గ్రీన్' కలర్ సోఫా గదికి ప్రత్యేకమైన అందాన్ని ఇస్తుంది. ఓవరాల్ కలర్ ప్యాలెట్ న్యూట్రల్గా ఉంటూ, ప్రతీ వస్తువు ప్రత్యేక ఆకర్షణీయంగా రూపొందించారు. గ్లాస్ ఎలిమెంట్స్ స్పెషల్ ఎట్రాక్షన్ ఇంట్లోకి సహజమైన వెలుతురు వచ్చేలా, ఇండోర్, అవుట్డోర్ ప్రదేశాలను కలుపుతూ విశాలంగా కనిపించేలా పెద్ద పెద్ద గ్లాస్ ప్యానెళ్లు, పార్టిషన్లను ఉపయోగించారు. పచ్చదనాన్ని జోడిస్తూ మొక్కలు, సాధారణ డెకర్ వస్తువులతో బాల్కనీని అలంకరించారు. ఇంకా 'డెకరేటివ్ షాడో ల్యాంప్స్' మరో ప్రత్యేక ఆకర్షణ. ఈ సాఫ్ట్ లైటింగ్ గదికి మరింత వెచ్చదనాన్ని, ఆధునిక రూపాన్ని సంతరించుకుంది. కాగా 'కాలా', 'యానిమల్' లాంటి బ్లాక్ బస్టర్ మూవీల్లో నటించిన తృప్తి దిమ్రి ఈ నెల ప్రారంభంలో నెట్ఫ్లిక్స్లో విడుదలైన తాజా చిత్రం 'మా బెహన్' నటనతో మంచి మార్కులు కొట్టేసింది. View this post on Instagram A post shared by Triptii Dimri (@tripti_dimri) -
పనివాళ్లు మనుషులు కారా?: నటి ఆగ్రహం
పనివాళ్లు మనుషులు కారా? వాళ్లకు హెయిర్ కట్ చేస్తే సొమ్మేమైనా అరిగిపోతుందా? అని మండిపడుతోంది బాలీవుడ్ నటి సంధ్య మృదుల్. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ వీడియో రిలీజ్ చేసింది. నటి తల్లి తన ఇంట్లో పని చేసే ఓ యువతిని సెలూన్కు తీసుకెళ్లి జుట్టు కట్ చేయించాలనుకుంది. కానీ అందుకు ఒకటీరెండు సెలూన్లు అసలు అంగీకరించనేలేదట! డబ్బులు ఎక్కువిస్తామన్నా సరే ససేమీరా కుదరదని తేల్చి చెప్పేశాయట!బెదిరించినా, బతిమాలినా..ఈ విషయం విని సంధ్యకు ఒళ్లు మండిపోయింది. ఆ ఆక్రోశాన్నే తను సామాజిక మాధ్యమాల్లో వెళ్లగక్కింది. 'అమ్మ.. తన ఇంట్లో పనిమనిషికి మంచి హెయిర్ కట్ చేయించాలనుకుంది. దగ్గర్లో ఒక సెలూన్కు తీసుకెళ్లింది. కానీ వాళ్లు చేయమన్నారు. మరో సెలూన్కు వెళ్లగా వాళ్ల దగ్గరా అదే సమాధానం. ఎందుకు చేయరని ప్రశ్నించింది. కావాలంటే ఎక్కువ డబ్బులిస్తానని అభ్యర్థించింది. అయినప్పటికీ వాళ్లు కుదరదని వెనక్కు పంపించేశారు. ఇంకా ఏ కాలంలో ఉన్నాం?ఇదంతా చూసి ఆ పనిమనిషి మనసు నొచ్చుకుంది. చివరకు ఒక సెలూన్ వాళ్లు ఒప్పుకోవడంతో ఆమెకు హెయిర్ కట్ చేయించి తనను అమ్మ లంచ్కు తీసుకెళ్లింది. అసలు మనం ఇంకా ఏ కాలంలో ఉన్నాం? ఎందుకిలా ప్రవర్తిస్తున్నారు? పనివాళ్లు సెలూన్స్కు రాకూడదా? వాళ్లేమైనా అంటరానివాళ్లా? వాళ్లను లోపలకు రానివ్వకపోవడానికి వీరికేం హక్కుంది? నిజంగా ఇది చాలా బాధ కలిగిస్తోంది. ఇక్కడ తప్పు కేవలం సెలూన్లది, అందులో పనిచేసేవారిదే కాదు.. మనది కూడా! ఇకనైనా మారండిమనలో చాలామంది పనివాళ్లను అన్నిచోట్లా అడుగుపెట్టనివ్వరు, కనీసం లిఫ్ట్ కూడా ఎక్కనివ్వరు. ఇలాంటి నీచమైన కండీషన్స్ పెట్టే మనుషులు మారాల్సిన సమయం ఆసన్నమైందని నా అభిప్రాయం' అని ఆవేదన వ్యక్తం చేసింది. 'పనివాళ్లు మన ఇంటిని, మన కుటుంబాలను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటారు. అలాంటివారికి మనమిచ్చే గౌరవం ఇదా? హెయిర్ కట్ చేయించుకోవాలనుకున్న 26 ఏళ్ల అమ్మాయిని ఇంత బాధపెట్టాలా? అని క్యాప్షన్ ఇచ్చింది. సంధ్య చివరగా తమిళంలో 'పరాశక్తి' సినిమాలో ఇందిరా గాంధీగా నటించింది. View this post on Instagram A post shared by Sandhya Mridul (@sandymridul) చదవండి: విషాదం.. దిగ్గజ దర్శకుడు భారతీరాజా కన్నుమూత -
సెట్స్లోనే నో చెప్పండి
సినిమాల్లో మహిళల పాత్రలను వెండితెరపై చూపించే విధానంపై సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం జోరుగా చర్చ జరుగుతోంది. ఇటీవలే విడుదలైన ‘పెద్ది’ సినిమాలో హీరోయిన్ జాన్వీ కపూర్ పోషించిన పా త్రను సిల్వర్ స్క్రీన్పై దర్శకుడు బుచ్చిబాబు కాస్త అభ్యంతరకరంగా చూపించారనే విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ అంశంపై ఇప్పటికే దర్శకుడు బుచ్చిబాబు క్షమాపణలు చెప్పారు. అయితే ఈ విషయం ఇండస్ట్రీలో ఇంకా హాట్ టాపిక్గానే ఉంది. తాజాగా బాలీవుడ్ సీనియర్ నటి జయా బచ్చన్ వెండితెరపై కథానాయికలను చూపించే విధానంపై స్పందించారు.సినిమాల్లో మహిళల పా త్రలను కేవలం గ్లామర్ కోణంలోనే చూపించడం సరైనది కాదని ఆమె పేర్కొన్నారు. ఈ అంశం గురించి ఓ ఆంగ్ల మీడియాతో జయా బచ్చన్ మాట్లాడుతూ– ‘‘హీరోయిన్లు తమకు ఏమైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురైనప్పుడు వెంటనే సెట్స్లోనే స్పందించాలి... తిరగబడాలి. ఫలానా సన్నివేశం చేయడం ఇష్టం లేకపోతే సూటిగా చెప్పాలి’’ అని పేర్కొన్నారు. హిందీ చిత్రం ‘షోర్’ చిత్రీకరణలో భాగంగా ఆ చిత్రదర్శకుడు (మనోజ్కుమార్) జయా బచ్చన్ను గాగ్రా చోళీలోనే సినిమా అంతా కనిపించాలని చెప్పారట. అయితే దుపట్టా ధరిస్తానని ఆ దర్శకుడితో జయా బచ్చన్ అన్నారట.ఈ విషయమై జయా బచ్చన్కు, ఆ దర్శకుడికి పెద్ద గొడవ జరిగిందట. ఆ తర్వాత ఓ సన్నివేశం ఇబ్బందికరంగా అనిపించడంతో నటించనని జయా బచ్చన్ తేల్చి చెప్పారట. ‘‘నా కెరీర్లో నన్ను అలా చూపించడానికి ప్రయత్నించిన చేదు అనుభవం అదొక్కటే. ఆ తర్వాత సెట్స్లో నాతో హద్దులు దాటి ప్రవర్తించేందుకు, సినిమాలో ఎలా పడితే అలా చూపించేందుకు ఎవరూ సాహసించలేదు. అలాగే ఆ దర్శకుడితో నేను మళ్లీ కలిసి పని చేయలేదు’’ అని పేర్కొన్నారు జయా బచ్చన్.అందుకు మా అత్తగారు ఓ ఉదాహరణ: కరీనా కపూర్ జయా బచ్చన్ మాటలకు మద్దతు ఇస్తూ కరీనా పూర్ తన అభిప్రాయాన్ని కూడా పంచుకున్నారు. ‘‘కభీ ఖుషీ కభీ గమ్’ చిత్రంలోని ‘సూరజ్ హువా..’ పా టలో కాజోల్గారిని లేదా ‘చాందినీ’ సినిమాలోని ‘తేరే మేరే..’ పా టలో శ్రీదేవిగారిని చూడండి. సిల్వర్ స్క్రీన్పై ఎలాంటి స్కిన్ షో చేయకుండానే ఎంతో ఆకర్షణీయంగా కనిపించారు. అలాగే ‘ఆరాధన’ చిత్రంలో ‘రూప్ తెరా మస్తానా’ పా టలో మా అత్తగారు (షర్మిలా ఠాగూర్) నిండైన వస్త్రధారణతో కనిపిస్తారు.అయినప్పటికీ వెండితెరపై అందంగా కనిపించారు. తక్కువ దుస్తులతో కాకుండా హుందాగా కనిపించి, ప్రేక్షకుల మనసులను గెలుచుకోవచ్చనడానికి ఆమె ఓ ఉదాహరణ. తెరపై ఆకర్షణీయంగా కనిపించడం అంటే ఒళ్లు కనిపించేలా దుస్తులు ధరించడం కాదు.. నిండైన వస్త్రధారణలోనూ ఆకర్షణీయంగా కనిపించవచ్చు. అలాగే హీరోయిన్ను కేవలం ఒక వస్తువులా చూపించడం సరికాదని నా అభిప్రాయం’’ అని కరీనా కపూర్ పేర్కొన్నారు. -
ఓటీటీలో దురంధర్-2.. మూడు రోజుల్లోనే రికార్డ్..!
రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్-2. దురంధర్కు సీక్వెల్గా వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ను షేక్ చేసింది. ఆదిత్య ధర్ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఈ సినిమా ఏకంగా రూ.1790 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప-2 రికార్డ్ను సైతం అధిగమించింది. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలో సందడి చేస్తోంది. జూన్ 5న స్ట్రీమింగ్కు వచ్చేసిన దురంధర్-2 వ్యూస్ పరంగా అదరగొడుతోంది. స్ట్రీమింగ్కు వచ్చిన మూడు రోజుల్లోనే ఏకంగా 5 కోట్ల మందికిపైగా వీక్షించారు. కేవలం వీకెండ్లోనే 5 కోట్ల మందిపైగా వీక్షించినట్లు ఓటీటీ సంస్థ జియో హాట్స్టార్ ప్రకటించింది. ఈ మూవీ ప్రస్తుతం హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రంలో సారా అర్జున్ హీరోయిన్గా నటించింది. ఈ చిత్రంలో అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, ఆర్. మాధవన్, రాకేశ్ బేడీ, గౌరవ్ గేరా, డానిష్ పాండోర్ కీలక పాత్రలు పోషించారు. -
'నా భార్యను మోసం చేయలేదు'.. దురంధర్ నటుడు కామెంట్స్
రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్, బ్లాక్బస్టర్ మూవీ దురంధర్. ఈ మూవీకి సీక్వెల్గా వచ్చిన ది రివెంజ్ సైతం బాక్సాఫీస్ను షేర్ చేసింది. ఈ చిత్రాలకు ఆదిత్య ధర్ దర్శకత్వం వహించగా.. ఆర్ మాధవన్ కీలక పాత్రలో మెప్పించారు. ఈ సినిమాతో సూపర్ హిట్ను తన ఖాతాలో వేసుకున్నారు.తాజాగా ఇవాళ తన పెళ్లి రోజు కావడంతో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఓ ఛానెల్ ఇంటర్వ్యుకు హాజరైన మాధవన్ తన వ్యక్తిగత జీవితంపై మాట్లాడారు. ఎంతోమంది అందమైన హీరోయిన్లతో తాను పనిచేశానని వెల్లడించారు. అయితే ఎప్పుడు తాను ఎవరితో రిలేషన్ పెట్టుకోలేదన్నారు. ఈ విషయంలో తన వైఫ్ను ఎప్పుడు మోసం చేయలేదని తెలిపారు. ఎందుకంటే తన జీవితంలో వైవాహిక బంధానికి ఎక్కువ విలువ ఇస్తానని మాధవన్ వెల్లడించారు.కుటుంబంతో సంతోషంగా ఉండాలనేదే తనకిష్టమని ఆర్ మాధవన్ తెలిపారు. ఇదంతా తాను పాత తరం నుంచే నేర్చుకున్నానని.. సతీమణితో విధేయతగా ఉండడం మా బ్లడ్లోనే ఉందన్నారు. షూటింగ్ పూర్తికాగానే ఇంటికి వెళ్లి నా భార్యను హత్తుకున్నప్పుడే నాకు ప్రశాంతంగా ఉంటుందని వెల్లడించారు. ఎందుకంటే నేను భార్యకు భయపడే మధ్యతరగతి వ్యక్తినన సరదాగా మాట్లాడారు. తన భార్య సరితనే ఇంట్లో ఆర్థిక వ్యవహారాలన్నీ చూసుకుంటారని వెల్లడించారు. తన ఫోన్, బ్యాంక్ లావాదేవీలు కూడా ఆమెనే చూస్తుంటారని పంచుకున్నారు. కాగా.. 1993లో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆర్ మాధవన్.. 1999లో సరితను వివాహం చేసుకున్నారు. -
'సాంగ్ షూట్.. హీరో ముద్దులు పెట్టడమే పనిగా పెట్టుకున్నాడు'
సినిమా అంటేనే గ్లామర్ ప్రపంచం. ఇందులో గ్లామర్తో పాటు ఇంటిమేట్ సీన్స్ కూడా ఉంటాయి. కథకు తగ్గట్టుగా కొన్ని సీన్స్ తప్పకుండా చేయాల్సి వస్తుంది. ముఖ్యంగా ముద్దు సీన్స్ చేయడమంటే మామూలు విషయం కాదు. ముఖ్యంగా నటీనటులు ఇద్దరి మధ్య కెమిస్ట్రీ వర్కవుట్ అయితేనే ముద్దు సీన్ అంత బాగా ఆడియన్స్కు కనెక్ట్ అవుతుంది. అలాంటి ఈ సీన్స్లో ఒక్కోసారి అభ్యంతరం రావడం కూడా సహజమే. తాజాగా ఓ నటి ముద్దు సీన్లో తనకెదురైన అనుభవాన్ని షేర్ చేసుకుంది.ప్రముఖ బాలీవుడ్ నటి ప్రియా బాపత్.. తన కెరీర్ ప్రారంభంలో ఎదురైన అనుభవాన్ని పంచుకుంది. ఓ సాంగ్ షూట్లో హీరో తనను పదేపదే ముద్దు పెట్టుకున్న విషయాన్ని గుర్తు చేసుకుంది. ఆ సమయంలో తాను చాలా అసౌకర్యానికి గురైనట్లు వెల్లడించింది. ఆ టైమ్లో తాను ఎలా స్పందించాలో.. ఎలా సమర్థించుకోవాలో తెలియలేదని అన్నారు. షూటింగ్ తర్వాత కూడా ఆ సీన్ తన మైండ్లో నుంచి పోలేదని చెప్పారు. అయితే ఆ ముద్దు సన్నివేశంపై తాను మొదటి నుంచే అభ్యంతరాలు వ్యక్తం చేశానని ప్రియా తెలిపారు. స్క్రిప్ట్ రీడింగ్ సెషన్లలో దాని అవసరం గురించి దర్శకుడిని ప్రశ్నించానని ప్రియా బాపత్ వెల్లడించారు. ఆ సన్నివేశం కంటే సహనటుడి ప్రవర్తన హద్దులు దాటిందని ఆమె ఆరోపించారు.అంతేకాకుండా చిత్రీకరణ సమయంలో తామిద్దరూ ఒకే హోటల్లో బస చేశామని వెల్లడించింది. తాను చాలాసార్లు వద్దని చెప్పినప్పటికీ నా సహనటుడు అల్పాహారం, రాత్రి భోజనానికి తనతో కలిసి చేయాలని పదేపదే అడిగాడని ఆమె గుర్తు చేసుకున్నారు. ఆ అనుభవం తనను తీవ్రంగా కుంగదీసిందని తెలిపింది. తన పరిస్థితి గురించి ప్రతి రాత్రి తన భర్త ఉమేష్ కామత్కు ఫోన్ చేసేదాన్నని చెప్పింది. దీంతో ఆందోళనకు గురైన ఆమె భర్త కామత్ ముంబయి నుంచి సినిమా షూటింగ్ జరుగుతున్న భోపాల్కు వచ్చి మూడు రోజుల పాటు ఆమెతో పాటే ఉన్నారని వెల్లడించింది.కాగా.. ప్రియా బాపత్ మరాఠీ చిత్రసీమలో ఫేమ్ తెచ్చుకుంది. గత కొన్నేళ్లుగా ఓటీటీ రంగంలో కూడా తనదైన ముద్ర వేసింది. 'కాక్స్పర్శ్', 'సిటీ ఆఫ్ డ్రీమ్స్' అనే వెబ్ సిరీస్లో నటనకు ఆమె బాగా ఫేమస్ అయ్యారు. అంతేకాకుండా హ్యాపీ జర్నీ (2014), ఆమ్హీ దోగీ (2018), అంధేరా, రాత్ జవాన్ హై లాంటి ప్రాజెక్ట్ల్లో కనిపించింది. మున్నాభాయ్ ఎంబీబీఎస్ చిత్రంలో ఓ పాత్రలో మెరిసింది. -
నన్ను లాగిపెట్టి కొట్టారు.. నేనూ ఆయన చెంప చెళ్లుమనిపించా
సినిమాల్లో జరిగిదేంతా నిజం కాదని అనుకుంటూ ఉంటాం. అయితే అప్పుడప్పుడు షూటింగ్ సందర్భంగా అనుకోని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. వాటి గురించి సదరు హీరో లేదా హీరోయిన్ చెబితే తప్పితే తెలియదు. ఒకప్పటి హీరోయిన్ మధుబాల కూడా గతంలో తను ఓ హిందీ మూవీ సందర్భంగా ఎదుర్కొన్న షాకింగ్ అనుభవాన్ని బయటపెట్టింది. తన చెంపపై నటుడు లాగిపెట్టిన విషయం గురించి చెబుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.(ఇదీ చదవండి: 30 ఏళ్ల నాటి కేసు.. నటికి రూ.10 లక్షలు ఇవ్వాల్సిందే)'యశ్వంత్ సినిమా షూటింగ్లో నానా పటేకర్(హీరో)కి నాకు గొడవ జరిగే సీన్ అది. ఆయన ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ అయినా తేలిగ్గా పండిస్తారు. నేను అంత సహజంగా నటించలేను. మా ఇద్దరి మధ్య గొడవ జరిగేటప్పుడు నేను ఏడవాలి. కానీ కన్నీళ్లు రావట్లేదు. బాధగానూ అనిపించలేదు. అప్పుడు గ్లిజరిన్తో ప్రయత్నిద్దామనుకుంటే.. నానా పటేకర్ నా చెంపపై లాగిపెట్టి కొట్టారు. విపరీతమైన బాధతో పాటు ఆయనపై చాలా కోపం వచ్చింది. వెంటనే నేను కూడా ఆయన చెంప చెళ్లుమనిపించాను. అంతే మా డైరెక్టర్ కట్ చెప్పారు. ఒక్కదెబ్బతో అనుకున్నట్లుగా వచ్చిందని అనిల్ హ్యాపీగా ఫీలయ్యారు. నానా పటేకర్ ఎందుకు కొట్టారో అప్పుడు అర్థమైంది. ఆయన మంచి మనిషి. సహనటులతో గౌరవంగా ఉండేవారు. కానీ యాక్టింగ్ విషయంలో మాత్రం చాలా సీరియస్గా ఉంటారు' అని మధుబాల తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.1997లో వచ్చిన ఈ సినిమాలో నానా పటేకర్, మధుబాలు హీరోహీరోయిన్లుగా నటించారు. ఇకపోతే ఈమె..'రోజా' సినిమాలో దక్షిణాదిలో ఫేమస్ అయింది. ప్రస్తుతం అడపాదడపా తల్లి పాత్రలు చేస్తోంది. గత కొన్నేళ్లలో అయితే తెలుగులో సూర్య వర్సెస్ సూర్య, నాన్నకు ప్రేమతో, శాకుంతలం, కన్నప్ప తదితర మూవీస్లో నటించింది.(ఇదీ చదవండి: టీవీకే పార్టీలోకి మరో హీరో? పోస్టుతో క్లారిటీ)Actress Madhu claims that during the shooting of Yeshwant, Nana Patekar slapped her for real so that genuine tears would come on screenMadhu says she was shocked because it wasn't done during rehearsals, and she ended up slapping him back in the next takeAccording to her,… pic.twitter.com/TcQleeluuM— Amit Kumar Sindhi (@AMIT_GUJJU) June 6, 2026 -
కల్కి 2పై ప్రభాస్ ఫోకస్.. నాగ్ అశ్విన్ ఆసక్తికర అప్డేట్
ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదలైన రాజాసాబ్ ఆశించిన స్థాయిలో ప్రేక్షకాదరణ పొందకపోవడంతో ప్రభాస్ ప్రస్తుతం తన చేతిలో ఉన్న ప్రాజెక్టులపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాడు. ఇప్పటికే సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్, హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ చిత్రాలను సమాంతరంగా పూర్తి చేసే పనిలో ప్రభాస్ ఉన్నాడు. అయితే ఇప్పుడు ప్రభాస్ కల్కి 2పై కూడా ఫోకస్ పెట్టాడు. తాజాగా సింగ్ గీతం సినిమా ప్రమోషన్లలో దర్శకుడు నాగ్ అశ్విన్ పాల్గొన్నాడు. ఆ ఈవెంట్లో కల్కి 2 గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఇప్పటికే కల్కి 2 చిత్రీకరణ ప్రారంభమైంది. జూలై నుంచి నిరంతరాయంగా షూటింగ్ నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేశాం. ఈ ప్రాజెక్టును వీలైనంత వేగంగా పూర్తి చేయడానికి అవసరమైన ఏర్పాట్లు జరుగుతున్నాయని నాగ్ అశ్విన్ చెప్పడంతో ప్రభాస్ అభిమానుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది.ప్రస్తుతం ఉన్న షెడ్యూల్ ప్రకారం అన్నీ అనుకున్నట్టు జరిగితే కల్కి 2 చిత్రం 2027 చివర్లో విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే నాగ్ అశ్విన్ మాత్రం దీనిపై ఎలాంటి డెడ్లైన్ పెట్టుకోలేదని స్పష్టం చేశారు. ఇక ఫౌజీ సినిమా ఈ ఏడాది చివర్లో విడుదలయ్యే అవకాశం ఉంది. స్పిరిట్ చిత్రాన్ని 2027 మార్చి 5న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే సందీప్ రెడ్డి వంగా టీమ్ ప్రకటించారు. ఈ రెండు థియేటర్లలోకి వచ్చిన తర్వాతే కల్కి 2 ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తర్వాతే సలార్ 2 రానుంది. -
'అంత మాట అనేశారేంటి?'.. వారణాసి, రామాయణపై మనోజ్ షాకింగ్ కామెంట్స్
బాలీవుడ్ నటుడు మనోజ్ భాజ్పేయి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విలక్షణమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. టాలీవుడ్లో అల్లు అర్జున్ నటించిన హ్యాపీ మూవీతో తెలుగు ఫ్యాన్స్ను ఆకట్టుకున్నారు. ఈ చిత్రంలో తన హావాభావాలు, నటనతో మెప్పించారు. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న మనోజ్ భారీ బడ్జెట్ చిత్రాలపై షాకింగ్ కామెంట్స్ చేశారు.రాజమౌళి- మహేశ్ బాబు కాంబోలో వస్తోన్న వారణాసి, రణబీర్ కపూర్-నితీష్ తివారీల 'రామాయణం చిత్రాలపై మనోజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రెండు సినిమాలపై వస్తున్న బడ్జెట్ వార్తలను ఆయన కొట్టిపారేశారు. వీటిని భారీ బడ్జెట్ చిత్రాలు అనడం కేవలం పీఆర్ స్టంట్లో భాగమేననని మనోజ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. గత 15 ఏళ్లుగా ఇలాంటి మాటలే వినిపిస్తున్నాయని అన్నారు. సినిమా అనేది వ్యాపారమని.. బడ్జెట్ విషయం కేవలం నిర్మాతపైనే ఆధారపడి ఉంటుందని తెలిపారు. ప్రేక్షకుడికి బడ్జెట్తో పనిలేదని.. సినిమా నచ్చిందా? లేదా? అన్నదే ముఖ్యమన్నారు. ఈ రెండు భారీ బడ్జెట్ చిత్రాలను ఉద్దేశించి మనోజ్ భాజ్పేయి చేసిన కామెంట్స్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. అయితే మనోజ్ ప్రస్తుతం ‘గవర్నర్’ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్కు హాజరైన సందర్భంగా ఈ కామెంట్స్ చేశారు. అయితే ఈ మూవీకి బజ్ లేకపోవడంతో కేవలం ఆడియన్స్లో క్రేజ్ కోసమే ఇలాంటి కామెంట్స్ చేశారని మరికొందరు అంటున్నారు. ఏది ఏమైనా మనోజ్ చేసిన వ్యాఖ్యలు భారీ బడ్జెట్ చిత్రాలపై చర్చకు దారితీశాయి. కాగా.. రాజమౌళి వారణాసి రూ. 1400 కోట్లు, రణ్బీర్ కపూర్ రామాయణ రూ. 4000 కోట్ల భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారని వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. మనోజ్ మాట్లాడుతూ..'అదంతా ఒక పీఆర్ ఎత్తుగడ. ఎందుకంటే గత 15 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఇలాంటి మాటలే వినిపిస్తున్నాయి. ఇది ఎంతగా వ్యాపించిందంటే కొన్నిసార్లు విమానాశ్రయంలో నన్ను కలిసే ప్రేక్షకులు కూడా సినిమా వసూళ్ల గురించి మాట్లాడతారు. ఈ డబ్బు మీ సొంత ఖాతాల్లోకి వెళ్లడం లేదు. ఒకవేళ ఇది మీ ఖాతాలోకి వెళ్తుంటే అప్పుడు సినిమా బాక్సాఫీస్ వసూళ్ల గురించి మాట్లాడండి. ప్రేక్షకుడిగా మీకు ఆ సినిమా నచ్చిందా లేదా అనే దాని గురించి మాత్రమే మాట్లాడండి అని చెప్తా. రూ.500-600 కోట్ల బడ్జెట్ చిత్రాల్లో ఒక్క రూపాయి కూడా మీకు అందడం లేదు. ఇదే విషయం ప్రేక్షకులు అర్థం చేసుకోవాలి. మీకు సినిమా నచ్చిందా లేదా అన్నదే ఇంపార్టెంట్. ఇతర విషయాలు ఆడియన్స్కు ముఖ్యం కాదు. సినిమా వ్యాపారం అనేది కేవలం నిర్మాతకు సంబంధించింది మాత్రమే' అని అన్నారు. -
‘పెద్ది’లో జాన్వీ కపూర్.. శ్రీదేవి ఒప్పుకునేదే కాదు!
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటించిన ‘పెద్ది’ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. తొలి రోజు ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చినా.. కలెక్షన్స్ మాత్రం భారీగానే వచ్చాయి. మొదటి రోజు రూ. 135 కోట్ల వసూలు సాధించినట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక సినిమా చూసిన ప్రతి ఒక్కరు రామ్ చరణ్ నటనపై ప్రశంసలు కురిపిస్తున్నాయి. అదే సమయంలో జాన్వీ కపూర్ పాత్రపై పెద్ది ఎత్తున విమర్శలు చేస్తున్నారు. పెద్దిలో జాన్వీ పోషించిన అచ్చియమ్మ పాత్రకు పెద్ద ప్రాధాన్యత లేదని, కేవలం గ్లామర్ షో కోసమే ఆమెను తీసుకున్నారని చెబుతున్నారు. కథతో సంబంధం లేకుండా కేవలం పాటలు, రొమాంటిక్ సీన్లకే ఆమెను పరిమితం చేశారని విమర్శిస్తున్నాయి. అంతేకాదు దేవరతో పోలిస్తే.. ఇందులో ఆమె నటన మరింత దారణంగా ఉందని చెబుతున్నారు. రామ్ చరణ్, జాన్వీల మధ్య వచ్చే కొన్ని సీన్లు, సంభాషణలు, నడక..ఇవన్నీ బీగ్రేడ్ సినిమాలను గుర్తు చేస్తున్నాయంటూ ఆమెను ట్రోల్ చేస్తున్నారు. శ్రీదేవి బతికి ఉంటే జాన్విని ఇలాంటి సినిమాల్లో నటించడానికి జాన్వీని అనుమతించేది కాదు అని నెటిజన్లు పోస్ట్ చేశారు.ఇక మరికొంతమంది నెటిజన్స్ అయితే జాన్వీ నటనను తప్పుపట్టాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. కొన్ని సన్నివేశాల్లో, పాటల్లో చాలా బాగా నటిందని ప్రశంసిస్తున్నారు. సెకండాఫ్లో వచ్చి ఎమోషనల్ సన్నివేశంలోనూ జాన్వీ నటన బాగుందని చెబుతున్నారు. After watching Peddi, you can't help but feel pity for Janhvi Kapoor. Sridevi would have never allowed her to act in such B-grade films in the South.#Peddi #PeddiReview #JanhviKapoor pic.twitter.com/F2beJEGaYl— 𝐳𝐚𝐲𝐝 (@MaheshFallout) June 4, 2026There is no need to blacklash her role in #Peddi She did great her part more over some scenes & one song trimed in Movie. And 2nd Half One Emotional is Enough her potentiaI of acting & i accept but for section audience response. But there is no need to negative her #JanhviKappor pic.twitter.com/6MkV7qfuia— 𝐀kh!L Kesana (@AlwaysAkhilK) June 4, 2026 -
కవలలకు జన్మనిచ్చిన బుల్లితెర నటి.. ఎమోషనల్ పోస్ట్
ప్రముఖ బుల్లితెర నటి సంభావనా సేథ్ అభిమానులకు గుడ్న్యూస్ చెప్పింది. ఆమె తాజాగా కవల బిడ్డలకు జన్మనిచ్చింది. ఆమెకు ఓ పాప, బాబు పుట్టారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. తల్లిదండ్రులుగా మారే ఈ సుదీర్ఘ ప్రయాణం ఎంతో ఆనందాన్నిచ్చిందని తెలిపింది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు, సినీ ప్రముఖులు సంభావనకు శుభాకాంక్షల చెబుతున్నారు.నటి తన ఇన్స్టాలో రాస్తూ.. 'ఈ సంవత్సరం మహా దీపావళి ముందుగానే వచ్చింది. లక్ష్మీదేవి, గణేశుడు ఇద్దరూ మా ఇంటికి వచ్చేశారు. ఈ సమయంలో మా హృదయాలు కృతజ్ఞతతో నిండిపోయాయి. హర హర మహాదేవ్' అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది. కాగా.. నటి సంభావన సేథ్.. నటుడు-రచయిత అవినాష్ ద్వివేదిని పెళ్లాడారు.కాగా.. గతంలో సంభావనా సరోగసీ ద్వారా బిడ్డను ఆశిస్తున్నట్లు ఇన్స్టాగ్రామ్లో పంచుకున్నారు. ఆ సమయంలో తాను ఎదుర్కొన్న శారీరక, మానసిక ఒత్తిడి గురించి సంభావన మాట్లాడింది. ఈ ప్రక్రియలో భాగంగా మూడు నెలల పాటు 65 ఇంజెక్షన్లు తీసుకున్నట్లు తెలిపింది. మరోవైపు సంభావన, అవినాష్ల వివాహం జూలై 14, 2016న జరిగింది. View this post on Instagram A post shared by Sambhavna Seth (@sambhavnasethofficial) -
ఓటీటీలో దురంధర్-2 ప్రీమియర్ షో.. స్ట్రీమింగ్ టైమ్ ఇదే...!
సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న దురంధర్-2 ఓటీటీ రిలీజ్ డేట్ ఇప్పటికే ప్రకటించారు. ప్రస్తుతం ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఓవర్సీస్లో మాత్రమే స్ట్రీమింగ్ అవుతోంది. నెట్ఫ్లిక్స్ వేదికగా విదేశాల్లోని ప్రేక్షకులను అలరిస్తోంది. మే 14వ తేదీ నుంచే ఓవర్సీస్లో అందుబాటులోకి వచ్చేసింది.దీంతో ఇండియా ఫ్యాన్స్ సైతం దురంధర్-2 ఓటీటీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దురంధర్ ఫ్యాన్స్ ఎదురు చూస్తోన్న రోజు రానే వచ్చేసింది. ఈ రోజు సాయంత్రం 7 గంటల నుంచే జియో హాట్స్టార్ వేదికగా ప్రీమియర్ షో స్ట్రీమింగ్ కానుంది. ఈ మూవీ హిందీతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, తమిళ భాషల్లో అందుబాటులో ఉండనుంది. ఈ నెల 5వ తేదీ నుంచి పూర్తిస్థాయిలో స్ట్రీమింగ్ కానుంది. ఇంకెందుకు ఆలస్యం ఈ మూవీని థియేటర్లలో మిస్సయినవారు ఎంచక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి. దురంధర్-2 కథేంటంటే?రెహమాన్ డెకాయిట్ (అక్షయ్ ఖన్నా) మరణంతో ధురంధర్ పార్ట్ 1 ముగుస్తుంది. ఆ తర్వాత ల్యారీకి తానే నాయకుడినని అర్షద్ పప్పు (అశ్విన్ ధర్)ప్రకటించుకుంటాడు. అన్నచావుకు కారణమైన అర్షద్ పప్పుపై రెహమాన్ సోదరుడు ఉజెయిర్ బలోచ్(డానిష్) కోపంతో రగిలిపోతుంటాడు. వీరిద్దరిని కాదని, ల్యారీని భారత సీక్రెట్ ఏజెంట్ హమ్జా(రణ్వీర్ సింగ్) తన గుప్పింట్లోకి తెచ్చుకొని, భారత ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ అజయ్ సన్యాల్(మాధవన్) అప్పజెప్పిన పనులన్నీ పూర్తి చేసుకొస్తుంటాడు. పాకిస్తాన్ మేజర్ ఇక్బాల్ (అర్జున్ రాంపాల్), ఎంపీ జమీల్ (రాకేష్ బేడీ) కూడా హమ్జాని గుడ్డిగా నమ్ముతారు. ఇలా పాక్ ఉగ్రవాద నాయకులందరిని నమ్మించి.. ఇండియాపై వాళ్లు చేసే కుట్రలన్నింటిని హమ్జా తిప్పికొడతాడు. అసలు భారత్పై పాన్ ఉగ్రవాద సంస్థలు చేసిన కుట్రలు ఏంటి? వాటిని తిప్పికొట్టే క్రమంలో హమ్జాకు ఎదురైన సమస్యలు ఏంటి? హమ్జా ఇండియన్ ఏజెంట్ అనే విషయం ఎలా బయటకు వచ్చింది? ఆ విషయం తెలిసిన తర్వాత మేజర్ ఇక్బాల్ (అర్జున్ రాంపాల్) ఏం చేశాడు?. పాకిస్తాన్లోని ఉగ్రవాద ముఠాలందరికి మార్గనిర్దేశం చేస్తున్న ‘బడే సాహెబ్ ’ ఎవరు? ఆపరేషన్ ధురంధర్ కోసం ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ అజయ్ సన్యాల్.. పంజాబ్లో జైలు జీవితం గడుపుతున్న జస్కరిత్ సింగ్ రంగీ(రణ్వీర్)నే ఎందుకు ఎంచుకున్నాడు? అతని నేపథ్యం ఏంటి? ఇతని కుటుంబానికి ఎమ్మెల్యే సుఖ్వెంధర్ చేసిన అన్యాయం ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
పెళ్లి తేదీ ఫిక్స్?
బాలీవుడ్లో ప్రస్తుతం జోరుగా ప్రచారం అవుతున్న వార్తల్లో ఆమిర్ ఖాన్–గౌరీ స్ప్రాట్కి సంబంధించిన పెళ్లి వార్త ఒకటి. చెప్పాలంటే ఇదే హాట్ టాపిక్. గత ఏడాది తన 60వ పుట్టినరోజు సందర్భంగా ముంబైలో జరిగిన ప్రీ–బర్త్డే వేడుకలో ఆమిర్ ఖాన్ మొదటిసారిగా గౌరీని మీడియాకు పరిచయం చేశారు. దాంతో 47 ఏళ్ల గౌరీ స్ప్రాట్, ఆమిర్ ప్రేమలో ఉన్నారన్న విషయం స్పష్టమైంది. ఇప్పుడు తమ ప్రేమను వివాహ బంధం వరకూ తీసుకెళ్లాలని ఈ ఇద్దరూ నిర్ణయించుకున్నారట. జూన్ 5న ఈ ఇద్దరూ పెళ్లి చేసుకోనున్నట్లు సమాచారం. ఈ వేడుక చాలా నిరాడంబరంగా జరగనుందని టాక్. రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారట. ముంబైలోని ఆమిర్ నివాసంలో ఇరు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మ«ధ్య ఈ వివాహం జరగనుందని భోగట్టా. ఆమిర్ ఖాన్ స్నేహితులు, బాలీవుడ్ సూపర్ స్టార్స్ సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్ ఈ వేడుకకు హాజరయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఇక ఆమిర్కి ఇది మూడో వివాహం అని తెలిసిందే. గతంలో రీనా దత్తాతో వివాహం జరగ్గా, వారికి జునైద్, ఐరా అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆ తర్వాత కిరణ్ రావును పెళ్లి చేసుకున్నారు ఆమిర్. ఈ దంపతులకు ఆజాద్ అనే కుమారుడు ఉన్నాడు. ఆమిర్, కిరణ్ రావు 2021లో తమ విడాకులను ప్రకటించారు. ఇక గౌరీ స్ప్రాట్కు ఇది రెండో వివాహం. గత వివాహం ద్వారా క్విన్ అనే ఏడేళ్ల కుమారుడు ఆమెకు ఉన్నాడు. ఇదిలా ఉంటే... ఇటీవల (మార్చి 14) తన 61వ పుట్టినరోజు వేడుకను గౌరీ స్ప్రాట్తో కలిసి చేసుకున్నారు ఆమిర్. ఈ వేడుకకు ఆయన మాజీ భార్యలు రీనా, కిరణ్ కూడా హాజరు కావడం విశేషం. -
ముచ్చటగా మూడోసారి.. ప్రియురాలితో అమిర్ ఖాన్ పెళ్లి..!
బాలీవుడ్ స్టార్ హీరో అమిర్ ఖాన్ అభిమానులకు గుడ్ న్యూస్. ఆయన ముచ్చటగా మూడోసారి పెళ్లి పీటలెక్కబోతున్నారు. ఆరు పదుల వయసులో తన ప్రియురాలు గౌరీ స్ప్రాట్ను పెళ్లాడనున్నారు. అయితే ఈ పెళ్లిని చాలా సింపుల్గా చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో రిజిస్టర్డ్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నట్లు తెలుస్తోంది.ఈనెల జూన్ 5న వీరిద్దరు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోనున్నట్లు తెలుస్తోంది. అమిర్ ఖాన్ సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం ఈ జంట ఇటీవలే తమ బంధాన్ని అఫీషియల్గా చేసుకోవాలని నిర్ణయించుకున్నారట. వీరిద్దరు ఇప్పటికే తమ పెళ్లికి ఏర్పాట్లు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈ పెళ్లికి కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే హాజరు కానున్నారు. వీరి పెళ్లికి షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ హాజరయ్యే అవకాశముందని ఇండస్ట్రీలో వార్తలొస్తున్నాయి. ఈ జంట ఇరు కుటుంబాల మద్దతుతోనే పెళ్లిబంధంలోకి అడుగుపెడుతున్నారని సన్నిహితులు చెబుతున్నారు.కాగా.. ఆమిర్ ఖాన్ గతంలో రీనా దత్తాను వివాహం చేసుకున్నారు. వీరికి జునైద్, ఐరా అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆ తర్వాత ఆయన చిత్రనిర్మాత కిరణ్ రావును వివాహం చేసుకున్నారు. వీరిద్దరికి ఆజాద్ అనే కుమారుడు ఉన్నాడు. ఆ తర్వాత కిరణ్ రావుతో 2021లో విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం చిన్ననాటి స్నేహితురాలు గౌరీ స్ప్రాట్తో డేటింగ్లో ఉన్న అమిర్ ఖాన్.. పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యారు. జూలై 5న జరిగిన రిజిస్టర్డ్ మ్యారేజ్ చేసుకోనున్నారు. గతేడాది ముంబయిలో జరిగిన ఒక బర్త్డే వేడుకల్లో తన ప్రియురాలు గౌరీని పరిచయం చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు గౌరీ స్ప్రాట్కు ఇప్పటికే క్విన్ అనే ఏడేళ్ల కుమారుడు ఉన్నాడు. -
రణ్వీర్ సింగ్కు బిగ్ రిలీఫ్
బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్కు బిగ్ రిలీఫ్ దక్కింది. ఆయనపై విధించిన నాన్ కో ఆపరేషన్(సహాయ నిరాకరణ) ఆదేశాలను ఉపసంహరించుకున్నట్లు ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రర్న్ సినీ ఎంప్లాయిస్ యూనియన్(ఎఫ్డబ్ల్యూఐసీఈ) ప్రకటించింది. ఈ విషయాన్ని ఎఫ్డబ్ల్యూఐసీఈ అధ్యక్షుడు బీఎన్ తివారీ ప్రకటించారు. సినీ కార్మికుల సంఘాలు, నిర్మాతల మండలి అభ్యర్థన మేరకు రణవీర్ సింగ్పై విధించిన ఆంక్షలను తక్షణమే ఎత్తివేస్తున్నట్లు తెలిపారు. రణ్వీర్ లీగల్ నోటీసులు పంపిన అనంతరం అతనిపై నిషేధం తొలగించారు.మొదట డాన్-3 మూవీ విషయంలో తలెత్తిన వివాదంతో రణ్వీర్ సింగ్పై నిషేధం విధించారు. ఫర్హాన్ అక్తర్ 'డాన్ 3' ప్రాజెక్ట్ నుంచి రణ్వీర్ సింగ్ అర్ధాంతరంగా తప్పుకోవడంతో వివాదం మొదలైంది. తనపై నిషేధాన్ని తొలగించాలని రణ్వీర్ కోరాడని ఫెడరేషన్ ముఖ్య సలహాదారు, ఫిల్మ్ మేకర్ అశోక్ పండిట్ వెల్లడించారు. ఈ వివాదంపై డాన్-3 మేకర్స్తోనే చర్చించుకోవాలని రణ్వీర్కు చెప్పామని తెలిపారు. ఈ విషయంలో అతని నుంచి సానుకూల స్పందన వస్తుందని ఆశిస్తున్నామని పేర్కొన్నారు. అయితే రణ్వీర్ సింగ్ పంపిన లీగల్ నోటీసుకు చట్టపరమైన మార్గాల ద్వారానే స్పందిస్తామని కూడా ఫెడరేషన్ తెలిపింది.మరోవైపు ఏ కళాకారుడిపైనా నిషేధం విధించే అధికారం ఫెడరేషన్కు లేదని ఎఫ్డబ్ల్యూఐసీఈ ముఖ్య సలహాదారు అశోక్ పండిట్ అన్నారు. దయచేసి నిషేధం అనే పదాన్ని ఉపయోగించవద్దని ఆయన మీడియాను కోరారు. ఒక వ్యక్తితో కలిసి పనిచేయవద్దని తన సభ్యులకు కేవలం సలహా మాత్రమే ఇవ్వగలదని తెలిపారు. ఎవరినీ వారి వృత్తిని కొనసాగించకుండా నిరోధించలేదని స్పష్టం చేశారు. రణ్వీర్ సింగ్ పంపిన నోటీసును ఫెడరేషన్ న్యాయ బృందం పరిశీలిస్తోందని.. దీనికి న్యాయ మార్గాల ద్వారా స్పందిస్తామని పండిట్ వెల్లడించారు. ఎఫ్డబ్ల్యూఐసీఈ చర్చలకు సిద్ధంగా ఉందని.. ఈ వివాదాన్ని పరిష్కరించుకోవడానికి రణ్వీర్ సింగ్ కూడా చర్చలో పాల్గొంటారని ఆశిస్తున్నామని తెలిపారు. ఇకనైనా ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడుతుందేమో వేచి చూడాల్సిందే.The Federation of Western India Cine Employees (FWICE) announces withdrawal of non-cooperation directive against Actor Ranveer Singh pic.twitter.com/aYsVPCQq0B— ANI (@ANI) June 3, 2026 -
హోమియో Vs అల్లోపతి : అగ్గి రాజేసిన అనుష్క శర్మ పోస్ట్
బాలీవుడ్ హీరోయిన్,స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ తాజా సోషల్ మీడియా పోస్ట్ దుమారం రేపుతోంది. హోమియోపతి వైద్యాన్ని సమర్ధిస్తూ, ఒక వైద్యుడి వీడియోను ఆమె పంచుకున్నారు. తన జీవితంలో హోమియోపతి ముఖ్యమైన పాత్ర పోషించిందంటూ ఈ వీడియోను షేర్ చేయడంతో నెట్టింట అగ్గి రాజుకుంది. అనుష్కకు సపోర్ట్గా కొందరు, వ్యతిరేకంగా కొందరు నెటిజన్లు రెండుగా విడిపోయారు.నమిత థాపర్తో డాక్టర్ రాజన్ శంకరన్ జరిపిన సంభాషణ క్లిప్ను అనుష్క ఇన్స్టాలో షేర్ చేశాడు. ఆరోగ్యం , హెల్దీ జీవనవిధానానికి తాను ప్రాధానత్య ఇస్తానని, డా. రాజన్ సూచనలు, సలహాలకు ఎంతో విలువ ఇస్తానని తెలిపింది. తన జీవితంలో హోమియోపతి ఒక ముఖ్యమైన పాత్ర పోషించిందనీ, అందులో డాక్టర్ రాజన్ శంకరన్ ఒక కీలకమైన భాగమని పేర్కొంది. దీంతో నెట్టింట సందడి మొదలైంది.Virat Kohli’s wife, Anushka Sharma is recommending homeopathy to Indians.Fraud babas are not enough, she is now promoting unscientific fraud medicine to IndiansGive them enough money and they might one day tell people, “Just visit Premanand Maharaj to cure all your diseases.” pic.twitter.com/5L6y8Wcxa6— Mohit Chauhan (@mohitlaws) June 2, 2026దుమ్మెత్తిపోసిన నెటిజన్లుఇక్కడ ఉన్న దొంగ బాబాలు చాలదన్నట్టు, విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ అశాస్త్రీయమైన నకిలీ వైద్య విధానాన్ని ప్రమోట్ చేస్తోందంటూ అనుష్క శర్మ వైఖరిని తప్పుబడుతూ కొందరు నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. అంతేకాదు డబ్బులిస్తే ఏదైనా చెబుతారంటూ మండిపడ్డారు. 60 మిలియన్ల కంటే ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్న నటి హోమియోపతిని ప్రమోట్ చేయడం మరికొందరు విమర్శలు గుప్పించారు. నమ్మకం పేరుతో సరైన అల్లోపతి వైద్యం తీసుకోకుండా, చనిపోయిన చాలా మందిని చూశాను. ఇకపై తాను అనుష్క ఫ్యాన్గా ఉండదలుచుకోలేదని ఒకరు వ్యాఖ్యానించారు.అంతేకాదు అనుష్క స్టోరీ చూస్తే రక్తం మరుగుతోంది. ఇంత పెద్ద ఫాలోయింగ్ ఉండి హోమియోపతిని ఎలా ప్రమోట్ చేస్తారు? వీరికి ఏదైనా పెద్ద జబ్బు వస్తే హోమియోపతి లేదా ఆయుర్వేదం దగ్గరికి వెళ్తారా? ఇలాంటి ప్రచారాల వల్లే ప్రజలు ప్రాణాంతక వ్యాధులు ముదిరిపోయే వరకు హోమియోపతి వాడుతూ, చివరి దశలో అల్లోపతి ఆసుపత్రులకు వస్తున్నారని ఒక నెటిజన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇదీ చదవండి: 7 సార్లు TEDX స్పీకర్ ఈ ‘ఆటో అన్న’ నెట్టింట సందడిఅనుష్కకు మద్దతుగా మరికొందరు మరోవైపు, అనుష్క శర్మ వ్యక్తిగత అభిప్రాయాన్ని గౌరవించాలంటూ . హోమియోపతి వల్ల తమకు జరిగిన మేలును వివరిస్తూ చాలా మంది ఆమెకు, హోమియో వైద్య విధానానికి మద్దతుగా నిలిచారు అందరూ ఆ డాక్టర్ లేదా బాబా దగ్గరికే వెళ్లాలని ఆమె ఎక్కడా చెప్పలేదు ఒకరు, కొన్నిసార్లు అల్లోపతి కూడా నయం చేయలేని వ్యాధులను హోమియోపతి నయం చేస్తుందని ఒకరు తెలిపారు. తల్లిదండ్రులు ఇద్దరూ అల్లోపతి వైద్యులే. కానీ నాకున్న దీర్ఘకాలిక చర్మ సమస్య కోసం రెండేళ్లు మోడరన్ మెడిసిన్ వాడినా ఫలితం లేకపోయింది. ఇప్పుడు గత రెండున్నర నెలలుగా హోమియోపతి వాడుతున్నాను, నాలో చాలా మార్పు కనిపిస్తోంది" అని ఒకరు తన అనుభవాన్ని పంచుకున్నారు. నన్ను ట్రోల్ చేశారుదీనికి హోమియోపతి వైద్యులు కూడా స్పందించడం గమనార్హం. హోమియోపతి డాక్టర్ని అని చెప్తేనే ఎక్స్లో తనను చాలా ట్రోల్ చేశారంటూ ఒక హోమియోపతి వైద్యుడు కూడా అనుష్కకు మద్దతుగా సుదీర్ఘమైన నోట్ రాసుకొచ్చారు. ఇదీ చదవండి: కజిన్ భార్యపై కన్ను : బాలుడ్ని నేలకేసి బాది.. బాబోయ్.. చూడలేం! -
వారసులు వస్తున్నారు
తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ... ఇలా ఇండస్ట్రీ ఏదైనా వారసులు వస్తుండటం సాధారణం. తమ కుమారులను, కుమార్తెలను హీరోలుగా, హీరోయిన్లుగా పరిచయం చేస్తున్నారు పలువురు హీరో, హీరోయిన్లు. తమ అభిమాన హీరో, హీరోయిన్ల వారసులు వెండితెరపై అరంగేట్రం చేస్తున్నారంటే వారి అభిమానులకు పండగే అని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. పైగా ఇటు సగటు సినీ ప్రేమికుల్లోనూ వారు నటిస్తున్న సినిమాలపై ఎంతో ఆసక్తి ఉంటుంది. ఈ కారణంగా నటీనటుల వారసులను పరిచయం చేసేందుకు చాలామంది దర్శక–నిర్మాతలు కూడా ప్రయత్నాలు చేస్తుంటారు.నూతన నటీనటులు పరిచయం అయ్యే చిత్రాలకంటే వారసులు అరంగేట్రం ఇచ్చే సినిమాలపై ట్రేడ్ వర్గాల్లోనూ ఫుల్ క్యూరియాసిటీ ఉంటుంది. ఈ కోవలోనే ప్రస్తుతం అరడజను మందికి పైగా వారసులు వెండితెరపై సందడి చేసేందుకు వస్తున్నారు. హీరో–హీరోయిన్ల వారసులే కాదు. నిర్మాతల వారసులు కూడా నటీనటులుగా ఎంట్రీకి సిద్ధం అవుతున్నారు. అయితే.. తన తండ్రి విజయ్ స్టార్ హీరో అయినప్పటికీ తాను మాత్రం తెరపై కాకుండా తెరవెనక ఉంటానని దర్శకుడిగా మారారు హీరో విజయ్ తనయుడు జేసన్ సంజయ్. ప్రస్తుతం హీరోలుగా, హీరోయిన్లుగా, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా వెండితెరపై ఎంట్రీ ఇస్తున్న వారసులు ఎవరు? వారి వివరాలేంటి? ఆ సినిమాలేంటి? వంటి విషయాలపై ఓ లుక్ వేద్దాం...ఘట్టమనేని జయకృష్ణ ఘట్టమనేని కుటుంబంలో సూపర్ స్టార్ కృష్ణ తొలి తరం కథానాయకుడు. తనదైన నటన, డ్యాన్స్, ఫైట్స్, డైలాగ్ డెలివరీతో ప్రేక్షకులను అలరించారాయన. ఆయన నట వారసులుగా రమేశ్బాబు, మహేశ్బాబు, మంజుల తెలుగు తెరకు పరిచయం అయిన సంగతి తెలిసిందే. ఘట్టమనేని కుటుంబంలో మూడో తరంగా మహేశ్బాబు తనయుడు ఘట్టమనేని గౌతమ్ ‘1 నేనొక్కడినే’ సినిమా ద్వారా బాలనటుడిగా పరిచయం అయ్యాడు. అయితే తాజాగా సూపర్స్టార్ కృష్ణ మనవడు, దివంగత నటుడు రమేష్బాబు (మహేశ్బాబు సోదరుడు) కుమారుడు ఘట్టమనేని జయకృష్ణ ‘శ్రీనివాస మంగాపురం’ చిత్రం ద్వారా హీరోగా పరిచయం అవుతున్నారు. ‘ఆర్ఎక్స్ 100, మంగళవారం’ చిత్రాల ఫేమ్ అజయ్ భూపతి ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. అశ్వినీదత్ సమర్పణలో చందమామ కథలు బ్యానర్పై పి. కిరణ్ ఈ సినిమా నిర్మించారు. ఈ మూవీ నుంచి తన అన్న కొడుకు జయకృష్ణ పవర్ఫుల్ ఫస్ట్ లుక్ను హీరో మహేశ్బాబు లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. దుమ్ము, ధూళి ఎగసే రగ్డ్ బ్యాక్డ్రాప్లో హై స్పీడ్లో బైక్ నడుపుతూ కనిపించారు జయకృష్ణ. ఓ చేత్తో బైక్ను పట్టుకుని, మరో చేత్తో గన్ టార్గెట్గా పెట్టిన విధానం, చుట్టూ మోషన్ బ్లర్, అతని కళ్లలో కనిపించే ఫోకస్... ఇలాంటివి ఉన్న ఈ ఫస్ట్ లుక్కి అద్భుతమైన స్పందన వచ్చింది. సూపర్స్టార్ కృష్ణ జయంతి (మే 31) సందర్భంగా ఈ మూవీ నుంచి విడుదలైన యాక్షన్ టీజర్ సినిమాపై అంచనాలు పెంచింది. ‘‘శ్రీనివాస మంగాపురం’ సినిమాలో అద్భుతమైన ప్రేమకథతో పాటు యాక్షన్, రొమాన్స్ వంటి అంశాలు కూడా ఉన్నాయి. తన పాత్ర కోసం జయకృష్ణ చాలా ఎఫర్ట్ పెట్టారు’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. నందమూరి తారక రామారావు చిత్ర పరిశ్రమలో నందమూరి కుటుంబంలో నందమూరి తారక రామారావు తొలి తరం హీరో. ఆయన తర్వాత రెండో తరంగా హరికృష్ణ, బాలకృష్ణ వంటి వారు నటులుగా ఎంట్రీ ఇచ్చారు. మూడో తరంలో ఎన్టీఆర్, తారక రత్న, కల్యాణ్ రామ్ తదితరులు చిత్రసీమలో రంగప్రవేశం చేశారు. తాజాగా నందమూరి కుటుంబం నుంచి నాలుగో తరం వెండితెరకు పరిచయం అవుతోంది. నందమూరి తారక రామారావు ముని మనవడు, హరికృష్ణ మనవడు, నిర్మాత జానకిరామ్ (హీరో కల్యాణ్ రామ్ సోదరుడు) తనయుడు నందమూరి తారక రామారావు టాలీవుడ్కి హీరోగా పరిచయం అవుతున్నారు.‘సీతారామరాజు, లాహిరి లాహిరి లాహిరిలో, సీతయ్య, దేవదాస్’ లాంటి పలు సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన వైవీఎస్ చౌదరి.. నందమూరి తారక రామారావుని హీరోగా పరిచయం చేస్తున్నారు. ఆయన స్వీయ రచన, దర్శకత్వంలో ‘న్యూ టాలెంట్ రోర్స్’ బ్యానర్పై యలమంచిలి గీత ఈ మూవీ నిర్మిస్తున్నారు. 2025 మే 12న ఈ సినిమా ప్రారంభమైన సంగతి తెలిసిందే.ఈ సినిమా ప్రారంభోత్సవం రోజున నందమూరి తారక రామారావు మాట్లాడుతూ– ‘‘మా ముత్తాత ఎన్టీఆర్, మా తాత హరికృష్ణ, మా నాన్న జానకిరామ్గార్ల ఆశీస్సులు ఎప్పుడూ నాకు ఉంటాయి. ప్రేక్షకుల ప్రేమాభిమానాలే నన్ను ముందుకు నడిపిస్తాయని నమ్ముతున్నాను’’ అని పేర్కొన్నారు. ‘‘1980ల నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుంది. తెలుగు సాహిత్యం, తెలుగు సంప్రదాయం, తెలుగు భాష, హైందవ సంస్కృతి గొప్పతనాన్ని ప్రతిబింబించే కథతో ఈ మూవీ రూపొందుతోంది’’ అన్నారు వైవీఎస్ చౌదరి.తెలుగమ్మాయి వీణా రావు అరంగేట్రం... ఎంతోమంది హీరోలను, హీరోయిన్లను టాలీవుడ్కు పరిచయం చేసిన వైవీఎస్ చౌదరి ఇప్పుడు నందమూరి తారక రామారావుని హీరోగా పరిచయం చేస్తున్న చిత్రం ద్వారా తెలుగమ్మాయి వీణా రావుని హీరోయిన్గా పరిచయం చేస్తున్నారు. తెలుగమ్మాయిని హీరోయిన్గా పరిచయం చేయాలనే సంకల్పంతో ఆడిషన్స్ నిర్వహించారు వైవీఎస్. ఈ అవకాశం ఫైనల్గా వీణా రావుని వరించింది. ఆమెకు చిత్ర పరిశ్రమలో ఎలాంటి నేపథ్యం లేకపోవడం విశేషం. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ జరుపుకుంటోంది. రాషా తడాని... హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, బెంగాలీ భాషల్లో హీరోయిన్గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని, అభిమానులను సొంతం చేసుకున్నారు హీరోయిన్ రవీనా టాండన్. తెలుగులో వినోద్ కుమార్తో ‘రథసారధి’, బాలకృష్ణతో ‘బంగారు బుల్లోడు’, నాగార్జునతో ‘ఆకాశ వీధిలో’, మోహన్బాబుతో ‘ పాండవులు పాండవులు తుమ్మెద’ వంటి సినిమాల్లో నటించారు రవీనా టాండన్. యశ్ హీరోగా రూపొందిన కన్నడ ఫిల్మ్ ‘కేజీఎఫ్: చాప్టర్ 2’లో ప్రధాన మంత్రిగా తనదైన నటనతో పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు ఆమె.రవీనా కుమార్తె రాషా తడాని తెలుగులో ‘శ్రీనివాస మంగాపురం’ చిత్రం ద్వారా హీరోయిన్గా పరిచయమవుతున్నారు. ఈ మూవీ నుంచి విడుదలైన ఆమె ఫస్ట్ లుక్స్ పోస్టర్స్ ఆకట్టుకున్నాయి. టీజర్, సాంగ్స్లోనూ తనదైన అందం, అభినయంతో కనిపించారు రాషా తడాని. ‘‘శ్రీనివాస మంగాపురం’ మూవీ తెలుగులో నాకు బెస్ట్ ఎంట్రీ అవుతుంది’’ అనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు రాషా తడాని.జోవిక విజయ్ కుమార్... తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో నటీనటులుగా తమకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు మంజుల, విజయ్ కుమార్. వారి కుమార్తెలు వనిత, ప్రీత, శ్రీదేవి చిత్ర పరిశ్రమలో అరంగేట్రం చేసి, ఇటు ఇండస్ట్రీలో అటు ప్రేక్షకుల్లో తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు. కాగా ‘దేవి’ సినిమా ద్వారా వనితను తెలుగులో పరిచయం చేశారు దర్శక–నిర్మాత ఎంఎస్ రాజు. కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సుశీల పాత్రలో నటించారు వనిత. 1999 మార్చి 12న విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్గా నిలవడంతో వనితకి తెలుగులోనూ మంచి గుర్తింపు వచ్చింది. ‘దేవి’ చిత్రం ద్వారా ఆమెను తెలుగులో పరిచయం చేసిన ఎంఎస్ రాజు ఇప్పుడు ఆమె కుమార్తె జోవికా విజయ్ కుమార్ని ‘అగధ’ చిత్రం ద్వారా తెలుగుకి పరిచయం చేస్తుండటం విశేషం.కామాక్షి భాస్కర్ల, శ్రవణ్ రెడ్డి కీలక పాత్రలు పోషించిన చిత్రం ‘అగధ’. ఎం.ఎస్. రాజు దర్శకత్వంలో శ్రీ ఆది వరాహ ప్రోడక్షన్స్ బ్యానర్పై కాశీ విశాలాక్షి బలుసు నిర్మించారు. ఈ మూవీలో హరిణి పాత్రలో జోవిక విజయ్కుమార్ నటించారు. ఇటీవల ఆమె క్యారెక్టర్ పోస్టర్ విడుదల చేశారు. జోరున కురుస్తోన్న వర్షంలో చేతిలో కత్తి పట్టుకుని కోపంగా చూస్తున్న ఆమె లుక్కి మంచి స్పందన వచ్చింది. అదే విధంగా ఇటీవల విడుదలైన ఈ మూవీ టీజర్కి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. ైదరాబాద్లో నిర్వహించిన టీజర్ లాంచ్ ఈవెంట్లో జోవికా విజయ్ కుమార్ మాట్లాడుతూ– ‘‘అగధ’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెడుతున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఎం.ఎస్. రాజుగారికి ఎప్పుడూ రుణపడి ఉంటాను. ఈ మూవీలో నా ఫస్ట్ లుక్ చూసిన అందరూ మా అమ్మమ్మ మంజులగారిలా ఉన్నానని ప్రశంసలు కురిపించారు. ఈ సినిమా, అందులో నా నటన అందరికీ నచ్చుతుందని నమ్మకంగా చెబుతున్నాను’’ అని తెలి పారు. ‘అగధ’ మూవీ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో త్వరలో విడుదల కానుంది. ఈ చిత్రానికి రాకేష్ వెంకటాపురం సంగీతం అందించారు.ప్రియాంక రాజకుమార్... దేవయాని... ఈ పేరు చెప్పగానే తెలుగు ప్రేక్షకులకు ‘సుస్వాగతం’ మూవీ గుర్తుకొస్తుంది. ఈ సినిమా ద్వారా టాలీవుడ్కి పరిచయం అయ్యారు దేవయాని. 1998 జనవరి 1న విడుదలైన ఈ మూవీ మంచి మ్యూజికల్ హిట్గా నిలిచింది. తెలుగుతో పాటు హిందీ, బెంగాలీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో పలు సినిమాల్లో నటించి, అందం, అభినయంతో చక్కని గుర్తింపు తెచ్చుకున్నారు దేవయాని. ‘శ్రీమతీ వెళ్లొస్తా, చెన్నకేశవ రెడ్డి, నాని, జనతా గ్యారేజ్, అరవింద సమేత వీరరాఘవ’ వంటి పలు తెలుగు సినిమాల్లో నటించారామె. దర్శకుడు రాజకుమార్ను ప్రేమించి, పెళ్లి చేసుకున్నారు దేవయాని.వీరికి ఇద్దరు కూతుళ్లు. పెద్ద కూతురు పేరు ఇనియ, చిన్న కూతురు పేరు ప్రియాంక. ప్రస్తుతం తన చిన్న కుమార్తె ప్రియాంకని ‘రంజన్: ది అడ్వకేట్’ మూవీ ద్వారా తమిళ ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నారు దేవయాని. ‘జీన్స్’ మూవీ ఫేమ్ ప్రశాంత్ టైటిల్ పాత్రను పోషిస్తున్నారు. ఆయన తండ్రి త్యాగరాజన్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగులో సూపర్ హిట్గా నిలిచిన ‘కోర్ట్’ మూవీకి రీమేక్గా రూపొందుతోన్న చిత్రమిది. పోక్సో చట్టం గురించి అవగాహన కల్పించేలా దర్శకుడు రామ్ జగదీశ్ తెరకెక్కించిన ‘కోర్ట్’ సినిమా తెలుగులో మంచి విజయం అందుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల చెన్నైలో ‘రంజన్: ది అడ్వకేట్’ చిత్రం ప్రారంభోత్సవం సందడిగా జరిగింది. ‘కోర్ట్’ మూవీలో శ్రీదేవి పోషించిన పాత్రలో ప్రియాంక నటిస్తున్నారు. హరి ఎంట్రీ... ‘రంజన్: ది అడ్వకేట్’ మూవీ ద్వారా నిర్మాత ఎస్. కథిరేశన్ తనయుడు హరి కోలీవుడ్లో ఎంట్రీ ఇస్తున్నారు. ‘కోర్ట్’ సినిమాలో హర్‡్ష రోషన్ పోషించిన పాత్రను తమిళంలో హరి చేస్తున్నారు. సుహానా ఖాన్ ఆగయా...బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ నటిస్తున్న చిత్రం ‘కింగ్’. షారుక్తో ‘పఠాన్, ఫైటర్’లాంటి చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ ‘కింగ్’కి దర్శకత్వం వహిస్తున్నారు. షారుక్ ఖాన్ సొంత బ్యానర్ అయిన రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్పై ఆయన భార్య గౌరీ ఖాన్, సిద్ధార్థ్ ఆనంద్, మమత ఆనంద్ ఈ మూవీ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ద్వారా షారుక్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్ బాలీవుడ్ సిల్వర్ స్క్రీన్కి ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమాలో అభిషేక్ బచ్చన్, దీపికా పదుకోన్, అనిల్ కపూర్, జాకీ ష్రాఫ్, అర్షద్ వార్సి, రాణీ ముఖర్జీ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు.యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో సుహానా ఖాన్ కూడా పలు యాక్షన్ సన్నివేశాల్లో పాల్గొంటున్నారు. ఇందుకోసం ఆమె ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నారు. తండ్రి షారుక్, తనయ సుహానా స్క్రీన్ షేర్ చేసుకుంటున్న తొలి చిత్రం ‘కింగ్’ కావడం విశేషం. ఈ సినిమాపై బాలీవుడ్లో మంచి క్రేజ్ నెలకొంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమా డిసెంబరు 24న విడుదల కానుంది. డైరెక్టర్గా ఎంట్రీ...తమిళ చిత్ర పరిశ్రమలోని స్టార్ హీరోల్లో విజయ్ ఒకరు. హీరోగా కోట్లాది మంది అభిమానం సొంతం చేసుకున్నారాయన. ఆ తర్వాత సినిమాలకు స్వస్తి పలికి, రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. తన తండ్రి స్టార్ హీరో అయినప్పటికీ ప్రస్తుతానికి నటన వైపు మొగ్గు చూపకుండా... దర్శకుడిగా మారారు జేసన్ సంజయ్. ఆయన దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం ‘సిగ్మా’.ఈ సినిమాలో సందీప్ కిషన్ హీరోగా, ఫరియా అబ్దుల్లా హీరోయిన్గా నటిస్తున్నారు. జేసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రం ప్రకటన నాటి నుంచే సినీ వర్గాల్లో, ప్రేక్షకుల్లో భారీ ఆసక్తిని రేకెత్తించింది. పైగా ఇటీవల విడుదలైన టీజర్కు అద్భుతమైన స్పందన రావడంతో ఈ మూవీ మరింత హైప్ను సొంతం చేసుకుంది. ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ ‘సిగ్మా స్టయిల్...’ అంటూ సాగే పాటని ఈ నెల 4న రిలీజ్ చేయనున్నారు. లైకా ప్రోడక్షన్స్ పై సుభాస్కరన్ నిర్మిస్తున్న ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా జూలై 31న విడుదల కానుంది. జేసన్ సంజయ్ మాట్లాడుతూ– ‘‘సిగ్మా’ నా జీవితంలో ఎంతో ప్రత్యేకమైన ప్రయాణం. నా విజన్ను నమ్మి ప్రతి దశలోనూ అండగా నిలిచిన సుభాస్కరన్గారికి కృతజ్ఞతలు. ఈ చిత్రం కోసం ఎంతో నిబద్ధతతో పని చేస్తూ, నాకు పూర్తి సహకారం అందిస్తున్న నటీ నటులు, సాంకేతిక నిపుణులకు ధన్యవాదాలు’’ అని చెప్పారు. పైన పేర్కొన్నవారే కాదు.. మరికొంత మంది వారసులు కూడా ఇండస్ట్రీకి పరిచయం కానున్నారు. – డేరంగుల జగన్ మోహన్ -
తెలంగాణలో 'పెద్ది' టికెట్ ధరల పెంపు.. ఒక్కో టికెట్ ఎంతంటే?
మెగా అభిమానులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. పెద్ది సినిమా టికెట్ ధరల పెంపునకు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. జూన్ 4 నుంచి 10 రోజుల పాటు సింగిల్ స్క్రీన్లలో రూ.100, మల్టీఫ్లెక్స్లలో రూ.125 పెంచుకునేందుకు అనుమతిలిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అదే విధంగా జూన్ 3న రాత్రి 8 గంటలకు స్పెషల్ ప్రీమియర్ షోకి అనుమతిచ్చింది. స్పెషల్ ప్రీమియర్ షో టికెట్ ధర గరిష్ఠంగా రూ.600 వరకూ ఉండవచ్చని పేర్కొంది. ఈ మూవీకి ఇప్పటికే ఏపీ ప్రభుత్వం టికెట్ ధరల పెంపునకు అనుమతులిచ్చిన విషయం తెలిసిందే. దాంతో ఏపీలో ఇప్పటికే టికెట్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. అడ్వాన్స్ బుకింగ్స్ ఆంధ్రప్రదేశ్లో జోరుగా సాగుతున్నాయి. అక్కడ సింగిల్ స్క్రీన్స్లో రూ.100, మల్టీప్లెక్స్ల్లో రూ.125 పెంచుకునేలా ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ ధరలు రిలీజైన రోజు నుంచి పది రోజుల పాటు అమల్లో ఉండనున్నాయి. మరోవైపు ప్రీయమిర్స్ టికెట్ ధరను ఏకంగా రూ.600గా నిర్ణయించారు. రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'పెద్ది' సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా జూన్ 4న థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే ట్రైలర్, సాంగ్స్ రిలీజ్ కాగా.. మెగా ఫ్యాన్స్ ఈ సినిమాపై ఫుల్ కాన్ఫిడెన్స్తో ఉన్నారు. సూపర్ హిట్ కాదు.. ఏకంగా బ్లాక్బస్టర్ కానుందని ఇప్పటికే ఫిక్సయిపోయారు. ఈ చిత్రంలో చెర్రీ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపించనున్న విషమం తెలిసిందే.ఇక “పెద్ది” సినిమాలో ఓ రీమిక్స్ సాంగ్ ఉందంటూ ప్రచారం జోరుగా సాగింది. అదే మెగాస్టార్ చిరంజీవి, శ్రీదేవి జంటగా నటించిన జగదేకవీరుడు అతిలోక సుందరిలోని 'అబ్బనీ తియ్యనీ దెబ్బ' పాట ఈ సినిమాలో ఉందంటూ వస్తున్న వార్తలపై దర్శకుడు బుచ్చిబాబు స్పష్టత ఇచ్చారు. ఆ పాటను సినిమాలో రీమిక్స్ చేయలేదు. ఒక సన్నివేశంలో రేడియోలో వినిపించేలా ప్లాన్ చేశాం. కానీ ప్రేక్షకులు కథ నుంచి బయటకు వచ్చే ప్రమాదం ఉండటంతో దాన్ని మ్యూట్ చేసేశామని బుచ్చిబాబు తెలిపారు. -
నర్సుగా కంగనా రనౌత్.. భారత్ భాగ్య విధాత ట్రైలర్ చూశారా?
బాలీవుడ్ లేడీ స్టార్ కంగనా రనౌత్ నటిస్తోన్న లేటేస్ట్ మూవీ భారత్ భాగ్య విధాత(ది అన్సీన్ హీరోస్). ఈ సినిమాకు మనోజ్ తపాడియా దర్శకత్వం వహించారు. ఈ మూవీని మణికర్ణిక ఫిల్మ్స్, పరమాన్స్ క్రియేషన్స్, యునోయా ఫిల్మ్స్, ఫ్లోటింగ్ రాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా రిలీజ్కు సిద్ధమైంది.ఈ నేపథ్యంలో భారత్ భాగ్య విధాత ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ చూస్తుంటే ఈ కథ నర్సుల జీవితం ఆధారంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో కంగనా నర్సు పాత్రలో కనిపించనుంది. 26/11 టెర్రరిస్ట్ ఎటాక్ జరిగిన సమయంలో నర్సుల పోరాటం గురించే ఈ మూవీలో చూపించనున్నట్లు ట్రైలర్లోనే అర్థమవుతోంది. కాగా.. ఈ చిత్రంలో గిరిజా ఓక్ గాడ్బోలే, స్మితా తాంబే, సుహిత తట్టే, ఆశా షెలార్, ప్రియా బెర్డే, ఈషా డే, రసిక అఘాసే, అమృత నామ్దేవ్, ఆదిత్య మిశ్రా, జాహిద్ ఖాన్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా జూన్ 12న థియేటర్లలో సందడి చేయనుంది. -
'అకౌంట్లో 84 రూపాయలు.. ఆటో ఛార్జీకి కూడా డబ్బుల్లేవ్'
రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై థ్రిల్లర్ దురంధర్. ఈ సిరీస్లో వచ్చిన రెండు సినిమాలు బాక్సాఫీస్ను షేక్ చేశాయి. ఈ మూవీస్ ఏకంగా రూ.3 వేల కోట్లకు పైగా వసూళ్లు రాబట్టాయి. ఈ స్పై థ్రిల్లర్ చిత్రాల ద్వారా ఎంతోమంది నటులు ఫేమస్ అయ్యారు. ఇప్పటి వరకు ఎవరికీ తెలియని వారు కూడా దురంధర్ మూవీతో ఒక్కసారిగా గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా ఈ మూవీతో ఫేమస్ అయిన నటుడు గౌరవ్ గెరా తన లైఫ్ గురించి ఆసక్తిర విషయాలు పంచుకున్నారు.ముంబయిలో తాను చాలా ఇబ్బందులు పడ్డానని గౌరవ్ గెరా వెల్లడించారు. కెరీర్ ప్రారంభ రోజుల్లో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల ఎదురైనట్లు వివరించారు. తన బ్యాంక్ ఖాతాలో కేవలం రూ. 84 మాత్రమే ఉన్న రోజులను గుర్తుచేసుకున్నారు. ఆటో ఛార్జీకి కూడా డబ్బులు చెల్లించలేక రోజు చాలా దూరం నడిచి వెళ్లేవాడినని తెలిపారు. 'ధురందర్: ది రివెంజ్ సూపర్ హిట్ కొట్టినా.. ఆ కష్టకాలం తనను ఎలా ఒదిగి ఉండేలా చేసిందన్నారు.తన తండ్రి మద్దతుగా నిలిచారని గౌరవ్ గెరా గుర్తు చేసుకున్నారు. మా నాన్న జీతం తీసుకునే ఉద్యోగి.. ఆయన ఉత్తరాలు ఇప్పటికీ నా దగ్గర ఉన్నాయని.. వాటిలో రూ. 2,000 పంపిస్తున్నాను.. ఇంతకంటే ఎక్కువ ఇవ్వలేనని రాసి ఉండేదని గెరా తెలిపారు. కష్టాలను ఎదుర్కొంటున్నప్పుడు అవి తనకు ఎప్పుడూ పెద్ద భారంలా అనిపించలేదన్నారు. ఆటోకు డబ్బులు లేనప్పుడు.. తాను నడిచి వెళ్లడానికే ఇష్టపడేవాడినని తెలిపారు. తాను ఎప్పుడు తీసుకునేవాడిగా కాకుండా.. ఇచ్చేవాడిగా ఉండాలనుకున్నానని పేర్కొన్నారు.కాగా.. ధురంధర్ ఫిల్మ్ సిరీస్లో గౌరవ్ గేరా.. మహమ్మద్ ఆలం (ఆలం భాయ్)గా నటించారు. ఈ చిత్రంలో అర్జున్ రాంపాల్, ఆర్ మాధవన్, సారా అర్జున్, రాకేష్ బేడీ, సంజయ్ దత్, మానవ్ గోహిల్, డానిష్ పండోర్ కీలక పాత్రల్లో నటించారు. ఈ స్పై థ్రిల్లర్ సిరీస్ సినిమాలకు ఆదిత్య ధర్ దర్శకత్వం వహించారు. -
పెళ్లి వేడుకలో దీపిక- రణ్వీర్ సింగ్ జంట.. పిక్స్ వైరల్
బాలీవుడ్ స్టార్ జంట దీపికా పదుకొణె, రణ్వీర్ సింగ్ ఓ పెళ్లి వేడుకలో సందడి చేశారు. తమ బంధువుల పెళ్లి వేడుకలో వీరిద్దరు స్పెషల్ అట్రాక్షన్గా నిలిచారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఈ ఫోటోల్లో దీపికా భావోద్వేగానికి గురైనట్లు కనిపిస్తోంది. రణవీర్ ఎరుపు రంగు కుర్తా పైజామాలో కనిపించగా.. దీపిక కలర్ఫుల్ సంప్రదాయ చీరలో మెరిసింది. ఇది రణ్వీర్ సింగ్ కజిన్ వెడ్డింగ్ అని తెలుస్తోంది. దీపిక- రణ్వీర్ వ్యక్తిగత జీవితం విషయానికొస్తే వీరిద్దరు తమ రెండో బిడ్డకు స్వాగతం పలకబోతున్నారు. ఇటీవలే తమ కుమార్తె దువాతో కలిసి ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ జంట నవంబర్ 2018లో ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. ఆ తర్వాత దాదాపు ఆరేళ్లకు 2024లో దువాకు స్వాగతం పలికారు. ఇక సినిమాల విషయానికొస్తే దీపిక అట్లీ దర్శకత్వం వహిస్తోన్న 'రాకా' చిత్రంలో హీరోయిన్గా నటిస్తోంది. మరోవైపు, రణ్వీర్ సింగ్ సైతం కల్యాణి ప్రియదర్శన్తో కలిసి జాంబీ అడ్వెంచర్ చిత్రం 'ప్రళయ్'లో నటించనున్నారు. అయితే 'డాన్ 3' నుంచి రణ్వీర్ తప్పుకుంటున్నారనే వార్తలొచ్చాయి. ఇటీవలే దురంధర్ చిత్రాలతో బ్లాక్బస్టర్స్ తన ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. Glimpses of #DeepVeer at Ranveer's cousins wedding 😍✨️🧿Emo babies 🥹 pic.twitter.com/CjmGcKy1n2— Versatile Fan (@versatilefan) June 2, 2026 -
ఇద్దరు హీరోయిన్లతో రొమాన్స్.. కాక్టెయిల్-2 ట్రైలర్ చూశారా?
రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోన్న లేటేస్ట్ బాలీవుడ్ మూవీ కాక్టెయిల్-2. ఈ చిత్రంలో షాహిద్ కపూర్ హీరోగా నటిస్తున్నారు. ఈ మూవీలో బాలీవుడ్ భామ కృతి సనన్ మరో హీరోయిన్గా మెప్పించనుంది. ఈ సినిమాకు హోమీ అదజానియా దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా థియేటర్లలో సందడి చేయనుంది.ఈ నేపథ్యంలోనే తాజాగా కాక్టెయిల్-2 ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ చూస్తుంటే ఈ మూవీని ఇద్దరమ్మాయిలతో ఓ అబ్బాయి రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ట్రైలర్లో సీన్స్ ఫుల్ రొమాంటిక్గా కనిపిస్తున్నాయి. ఇద్దరితో షాహిద్ కపూర్ కెమిస్ట్రీ బాగానే వర్కవుట్ అయినట్లు కనిపిస్తోంది. కాగా.. ఈ మూవీ జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కానుంది. దీపికా పడుకోన్, డయానా పెంటీ, సైఫ్ అలీ ఖాన్ ప్రధాన పాత్రలలో నటించిన 'కాక్టెయిల్' (2012) చిత్రానికి సీక్వెల్గా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. -
ప్రముఖ హీరోయిన్ ఫ్యామిలీకే టోకరా వేసిన పనిమనిషి
బాలీవుడ్ నటి రవీనా టండన్ సోదరుడి ఇంట్లో గతేడాది అక్టోబరులో దొంగతనం జరిగింది. దాదాపు రూ.25 లక్షలు విలువైన బంగారం, వజ్రాల ఆభరణాలు, ఖరీదైన చేతి వాచీలు చోరీ చేసిన కేసులో 47 ఏళ్ల మహిళని ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేశారు. సదరు మహిళని రాశి ఛాబ్రియాగా గుర్తించారు. గత కొన్నేళ్లుగా ఈమె.. రవీనా తల్లి సంరక్షణ బాధ్యతలు చూసుకుంటోంది.(ఇదీ చదవండి: 'బ్లాస్ట్' సినిమా ఊహించని సక్సెస్.. అలానే కలెక్షన్స్ కూడా)ముంబై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గతేడాది అక్టోబరులో రవీనా కుటుంబ సభ్యులు, ఇంట్లోని లాకర్ పరిశీలించగా అది తెరిచి ఉంది. అలానే బంగారం, వజ్రాల ఆభరణాలు, రెండు కాస్ట్ లీ చేతి వాచీలు కనిపించలేదు. వీటి మొత్తం విలువ రూ.25 లక్షలు అని అంచనా వేశారు. దీంతో రాజీవ్ టండన్ ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేశారు. తొలుత రాశి ఛాబ్రియాని ప్రశ్నించగా.. దొంగతనం ఆరోపణలని ఖండించింది. తర్వాత నేరాన్ని ఒప్పుకొందని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు.అయితే రెండు చేతి గడియారాలని తిరిగి ఇచ్చేసినప్పటికీ.. ఆభరణాలని మాత్రం జగదీష్ అనే వ్యక్తి దగ్గరున్నాయని చెప్పింది. ఎన్నిసార్లు అడిగినా అవి ఇవ్వకపోయేసరికి పోలీసులు లోతుగా దర్యాప్తు చేశారు. 2020 నుంచి రవీనా టండన్ సోదరుడి కుటుంబానికి బాగా దగ్గరైన రాశి.. ఇంట్లోని రెండో అంతస్తులో విలువైన ఆభరణాలు ఉంచే చోటుకి కూడా స్వేచ్ఛగా వెళ్లగలిగేంత నమ్మకం సంపాదించింది. తర్వాత అదును చూసి వాటిని దొంగిలించింది.అయితే పోలీసులకు దొరికిపోయిన తర్వాత తన సహచరుడిని పోలీస్ ఇన్ఫార్మర్గా టండన్ కుటుంబానికి పరిచయం చేసిన రాశి.. ఆభరణాల సంగతి వదిలేయకపోతే ఫేక్ డ్రగ్స్ కేసులో ఇరికిస్తామని కూడా బెదిరించింది. ఇదే విషయాన్ని రాజీవ్ టండన్ తన ఫిర్యాదులోనూ పేర్కొన్నారు. గత నెల 21న రాశి ఛాబ్రియాని అరెస్ట్ చేసిన జుహు పోలీసులు, ఆమెని కోర్టులో హాజరుపరచగా గత నెల 29వ తేదీ వరకు రిమాండ్ విధించారు. ప్రస్తుతం ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది.రవీనా టండన్ గతంలో తెలుగులో హీరోయిన్గా పలు సినిమాలు చేసింది. ఈమె కూతురు రషా తడానీ.. మహేశ్ బాబు అన్న కొడుకు జయకృష్ణ హీరోగా నటిస్తున్న 'శ్రీనివాస మంగాపురం' మూవీతో టాలీవుడ్లో హీరోయిన్గా ఎంట్రీ ఇస్తోంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి తెలుగు సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా) -
సుస్మిత దగ్గరే ఎక్కువ వజ్రాలు.. నా ఖర్చులు ఆమెనే భరించేది
ఐపీఎల్ ముగిసింది. ఈ లీగ్ వ్యవస్థాపకుడు, వ్యాపారవేత్త అయిన లలిత్ మోడీ మాత్రం ఇప్పుడు పలు ఇంటర్వ్యూలు ఇచ్చాడు. సూర్యవంశీ గురించి మాట్లాడాడు. గతంలో ఇతడు బాలీవుడ్ నటి సుస్మితా సేన్తో డేటింగ్ చేస్తున్నట్లు ప్రకటించుకున్నాడు. అయితే డబ్బు కోసమే లలిత్కి ఈమె దగ్గరైందనే ఆరోపణలు వచ్చాయి. తాజాగా వాటిని ఖండించాడు. ఈ క్రమంలోనే సుస్మితా గురించి ఇతడు చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా అనిపించాయి.(ఇదీ చదవండి: బరువు తగ్గాలా? అలా అస్సలు చేయొద్దు: రాశీఖన్నా)'సుస్మితా సేన్ కష్టపడి ఎదిగిన మహిళ. నాకు తెలిసిన చాలామంది కంటే ఆమె దగ్గరే ఎక్కువ వజ్రాలున్నాయి. వాటన్నింటినీ ఆమెనే స్వయంగా సంపాదించుకుంది. మేం కలిసున్న సమయంలో బయటకు వెళ్లినప్పుడు ఆమెనే ఖర్చులన్నీ చెల్లించేది. నేనే ఆమె డబ్బులపై ఆధారపడ్డాను. ఎవరి దగ్గర నుంచి ఏం ఆశించడానికి ఇష్టపడదు. ఆమె గురించి తెలియని వాళ్లు మాత్రమే అలాంటి ఆరోపణలు చేస్తారు' అని లలిత్ మోడీ క్లారిటీ ఇచ్చాడు.సుస్మితాతో బంధం గురించి మాట్లాడిన లలిత్ మోడీ.. 'సుస్మితా నాకు చాలా ప్రత్యేకమైన వ్యక్తి. నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉండటానికి ఆమె ఎంతో సాయపడింది. మాది చాలా ప్రత్యేకమైన బంధం' అని చెప్పుకొచ్చాడు. 2022లో సుస్మితాతో డేటింగ్లో ఉన్నట్లు తనకు తానుగా ప్రకటించుకున్న లలిత్ మోడీ.. తర్వాత బ్రేకప్ అయినట్లు కూడా చెప్పాడు. గతేడాది మరో మహిళతో డేటింగ్ చేస్తున్నట్లు లలిత్ పోస్ట్ పెట్టాడు. పన్ను ఎగవేత, మనీలాండరింగ్లో కేసులో దేశం వదలి పారిపోయిన ఇతడు 2010 నుంచి లండన్లో ఉంటున్నాడు. (ఇదీ చదవండి: తెలుగు యంగ్ హీరోయిన్ శివానీ నాగారంకి బంపరాఫర్) -
అభిమానుల కోసం రక్తమైనా చిందిస్తా : రామ్చరణ్
పెద్ది సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ విజయవాడ ఇందిరాగాంధీ మునిసిపల్ కార్పొరేషన్ స్టేడియంలో సోమవారం సాయంత్రం జరిగింది. ఈ సందర్భంగా రామ్చరణ్ మాట్లాడుతూ.. విజయవాడ నా అదృష్టమైన నగరం. ఇక్కడే ‘ఇంద్ర’, ‘ఖైదీ నంబర్ 150’ సెలబ్రేషన్స్ చేశాం. ఆర్టిస్ట్గా నేను ఎన్నో కథలు వింటాను. అందులో కొన్ని నచ్చుతాయి. ఇంకొన్ని ఆశ్చర్యపరుస్తాయి. కానీ ఈ కథ విన్నప్పుడు హృదయానికి హత్తుకుంది. ఈ కథ విన్నప్పుడు హృదయానికి హత్తుకుంది. నాన్నగారు చెప్పినట్లు ఇలాంటి కథ పదేళ్లకు ఒకసారి మాత్రమే వస్తుంది. ఇంతమంచి కథను నా దగ్గరకు తీసుకొచ్చిన సుకుమార్గారికి ధన్యవాదాలు. బుచ్చిబాబు దీనిని ఒక సినిమా కథలా చెప్పలేదు. ఒక వ్యక్తి ప్రయాణంలా చెప్పారు. నా సినిమాల లైబ్రరీలో ఈ చిత్రం టాప్లో నిలుస్తుంది. ఈ సినిమాని చాలా ఇష్టం, ప్రేమతో చేశాను. ఇలాంటి కథ కోసం కాకపోతే ఇంకెప్పుడు కష్టపడతాం? ఇది పడి లేచిన మనిషి ప్రయాణం. ఈ చిత్రంతో బుచ్చిబాబు ఇండియాలో టాప్ డైరెక్టర్స్ జాబితాలో నిలుస్తారు. అభిమానుల కోసం చేతులు విరగొట్టుకుని పనిచేయడమే కాదు. రక్తమైనా చిందిస్తా. నాకు తెలిసిందల్లా సినిమాయే. నేను చనిపోయే వరకూ మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తా అంటూ చరణ్ తన అభిమానులపై ప్రేమను వ్యక్తం చేశారు. హీరోయిన్ జాన్వీకపూర్ తెలుగులో మాట్లాడి ఆకట్టుకున్నారు. ప్రేక్షకులే దేవుళ్లు అని అమ్మ శ్రీదేవి తనకు చెప్పేదని గుర్తుచేసుకున్నారు. జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాలోని డైలాగ్ను యాంకర్ సుమ జాన్వీతో చెప్పించారు. హిందీ నటుడు దివ్వేందు కూడా తెలుగులో మాట్లాడి అబ్బురపరిచారు. నిర్మాత కిలారు వెంకట సతీష్ మాట్లాడుతూ తన సొంతూరు పెనమలూరు అని, ఇక్కడ ఈ వేడుక జరగడం ఆనందంగా ఉందన్నారు. ఏఆర్ రెహమాన్ నిర్వహించిన లైవ్ మ్యూజికల్ నైట్ సంగీత ప్రియులను అలరించింది. పెద్ది సినిమాలోని పాటలను ఆయన స్వయంగా పాడటమే కాకుండా స్టెప్పులు కూడా వేశారు. చికిరి చికిరి పాటకు ప్రేక్షకులతో నృత్యాలు చేయించారు. కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్, దర్శకుడు బుచ్చిబాబు పాల్గొన్నారు. అనంతరం ఈనెల 9వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఆంధ్రా ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) పోస్టర్ను ఈవెంట్ వేదికపై ఆవిష్కరించారు. ఎంపీ కేశినేని శివనాథ్, ఏపీఎల్లో ఆడే జట్ల కెప్టెన్లు పాల్గొన్నారు. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా జూన్ 4న పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. -
మీరు మాత్రం ఆ పని చేయొద్దు: తాప్సీ వార్నింగ్
సౌత్లో స్టార్ స్టేటస్ అందుకుని నార్త్లో సెటిలైపోయిన హీరోయిన్లలో తాప్సీ పన్ను ఒకరు. తెలుగు, తమిళ భాషల్లో అనేక సినిమాలు చేసిన ఈ బ్యూటీ కొన్నేళ్లుగా తన ఫోకస్ అంతా బాలీవుడ్పైనే పెట్టింది. వరుసగా హిందీ సినిమాలే చేస్తోంది. తాజాగా తాప్సీ తాను గతంలో ఓ తప్పు చేశానని, అలాంటి తప్పు ఇంకెవరూ చేయకూడదని సుతిమెత్తగా హెచ్చరిస్తోంది.ఫ్లాట్గా ఉండే నడుము కోసం..ఈమేరకు ఇన్స్టాగ్రామ్ స్టోరీలో తాప్సీ ఓ పోస్ట్ పెట్టింది. 'నాకు నాజూకైన నడుము కావాలని చిన్నప్పటినుంచే అనుకునేదాన్ని. కొంచెం కూడా పొట్ట పైకి కనిపించకూడదని కోరుకునేదాన్ని. అంతా ఓకే కానీ, నడుము కింది భాగంలో కొవ్వు పేరుకుపోయి ఉండేది. ఈ లోయర్ బెల్లీ ఫ్యాట్ ఎందుకు వచ్చిందనేది అస్సలు అర్థమయ్యేది కాదు. దాన్ని తగ్గించుకోవడం కోసం ఎక్కువ వ్యాయామాలు చేశాను. సామర్థ్యానికి మించి వ్యాయామం చేసినప్పుడు నా శరీరం మెదడుకు హెచ్చరికలు పంపేది.అది కొవ్వు మాత్రమే కాదుశరీరం నుంచి నీరు బయటకు వచ్చేయడానికి బదులు దాన్ని నిల్వ ఉంచుకోవడం మొదలుపెడుతుంది. బెల్లీ ఫ్యాట్ అంటే అక్కడ కొవ్వు పేరుకుపోవడం మాత్రమే కాదు, కొందరిలో కొవ్వుకు బదులుగా నీళ్లు నిల్వ ఉంటాయి. వర్కవుట్స్ ఎక్కువ చేస్తే ఆ బెల్లీ ఫ్యాట్ తగ్గడం కాదు కదా.. మరింత పెరుగుతుంది. కాబట్టి నేను చేసిన తప్పు ఇంకెవరూ చేయొద్దని చెప్తున్నాను.శరీరాన్ని హింసించకండిప్రతి మహిళకు భిన్నమైన శరీరం ఉంటుంది. హార్మోన్ల మార్పుల వల్ల మన శరీరం ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటుంది. దాన్ని మీరు ఒప్పుకునే తీరాలి. నన్ను నేను చాలా టార్చర్ పెట్టుకున్న తర్వాత ఆలస్యంగా ఈ విషయం అర్థం చేసుకున్నాను. మా డాక్టర్ ఏం చెప్పిందంటే.. పొట్ట కింద కొద్దిగా కొవ్వు, నీరు నిల్వ ఉండటం అవసరమని తెలిపింది. ఆరోగ్యానికి మంచిదేఅక్కడున్న అవయవాలకు అవి రక్షణగా పని చేస్తాయంది. కాబట్టి ప్రతి మహిళకు లోయర్ బెల్లీ ఫ్యాట్ ఉండటం మంచిదే! సోషల్ మీడియాలో దిగే ఫోటోల కోసం మీ శరీరాన్ని మీరు హింసించుకోకండి. కొంచెం కొవ్వు ఆరోగ్యానికి మంచిదేనని భావించండి' అని రాసుకొచ్చింది. తాప్సీ చివరగా 'అస్సి' సినిమాలో నటించింది. ప్రస్తుతం హిందీలో రెండు మూవీస్ చేస్తోంది.చదవండి: నా గర్భస్రావానికి సీఎం విజయ్నే కారణం: బుల్లితెర నటి -
డోలారే.. సాంగ్ షూటింగ్లో మాధురి ప్రెగ్నెంట్?
కొన్ని పాటలు ఎవర్గ్రీన్గా నిలిచిపోతాయి. అలాంటిదే డోలారే డోలారే సాంగ్. 'దేవదాసు' సినిమాలోని ఈ పాట అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ బ్లాక్బస్టర్ హిట్టే.. ఇందులో హీరోయిన్లు ఐశ్వర్యరాయ్, మాధురీ దీక్షిత్ పోటీపడుతున్నట్లుగా డ్యాన్స్ చేశారు. ఒకరిని మించి మరొకరు తమ ఎనర్జీ, స్వాగ్తో అబ్బుపరిచారు. అయితే ఈ పాట షూటింగ్ చేసే సమయానికి మాధురీ దీక్షిత్ ప్రెగ్నెంట్ అని కొన్ని రోజులుగా పలు కథనాలు తెరపైకి వస్తున్నాయి. డోలారే సాంగ్..అందుకు కారణం లేకపోలేదు. దివంగత కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ వద్ద పని చేసిన డ్యాన్సర్ రుబీనా ఖాన్ ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. డోలారే సాంగ్ షూటింగ్ చేసేటప్పుడు మాధురి దీక్షిత్ నాలుగు నెలల గర్భవతి అని పేర్కొంది. దాంతో సోషల్ మీడియాలో నటి ప్రెగ్నెన్సీ గురించి చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో వాటిపై తాజాగా మాధురి దీక్షిత్ స్పందించింది. నేను ప్రెగ్నెంట్ కాదుమాధురి మాట్లాడుతూ.. ''దేవదాసు' సినిమా 2002 జూలై 12న విడుదలైంది. అదే ఏడాది మే నెలలో కేన్స్ ఫిలిం ఫెస్టివల్లోనూ ప్రదర్శితమైంది. ఆ మరుసటి ఏడాది అంటే 2003 మార్చి 17న నాకు కొడుకు అరిన్ జన్మించాడు. కాబట్టి మీరే లెక్కేయండి.. షూటింగ్ టైంలో నేను ప్రెగ్నెంట్ ఏంటి? ఇకపోతే ఆ సమయంలో నేను భారత్కు, అమెరికాకు తరచూ ప్రయాణాలు చేయాల్సి వచ్చింది. పెళ్లయ్యాక అమెరికాకు..అందులోనూ ఇక్కడన్నీ నైట్ షూట్సే ఉన్నాయి. దానివల్ల నా ఆరోగ్యం కాస్త దెబ్బ తింది, అలసటకు లోనయ్యాను. అంతే తప్ప ఇంకేం లేదు' అని చెప్పుకొచ్చింది. కాగా మాధురీ దీక్షిత్.. డాక్టర్ శ్రీరామ్ నేనేను 1999లో పెళ్లి చేసుకుంది. వివాహం తర్వాత అమెరికాకు మకాం మార్చింది. అయితే అప్పటికే సంతకం చేసిన సినిమాల కోసం తరచూ భారత్కు వచ్చి షూటింగ్ పూర్తి చేసేది. సినిమాఅలా చివరగా దేవదాసు చేసి సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. మాధురి- శ్రీరామ్ దంపతులకు కుమారులు అరిన్, ర్యాన్ సంతానం. కొంతకాలం ఫ్యామిలీ లైఫ్ను ఆస్వాదించాక తిరిగి సినిమాల్లో అడుగుపెట్టింది మాధురి. చివరగా భూల్ భులయ్యా 3లో కనిపించింది. ప్రస్తుతం ఆమె నటించిన 'మా బెహన్' ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్లో జూన్ 4న నేరుగా విడుదల కానుంది.చదవండి: నా కలలు ఛిద్రం.. ఈ ముగింపు ఊహించలేదు: విఘ్నేశ్ శివన్ -
ప్రముఖ గాయని సుమన్ ఇక లేరు
ప్రముఖ గాయని సుమన్ కల్యాణ్పూర్ (89) ఇక లేరు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె ఆదివారం (మే 31న) సాయంత్రం ముంబైలోని తన నివాసంలో కన్నుమూశారు. చివరి రోజుల్లో ఆమె తన పాటలు వింటూ కాలం గడిపారు. గాయని మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు, సినీతారలు సంతాపం ప్రకటిస్తున్నారు.ఎవరీ గాయని?సుమన్ కళ్యాణ్పూర్ 1937 జనవరి 28న ఢాకాలో జన్మించారు. 1950ల ప్రారంభంలో సంగీత ప్రస్థానాన్ని ప్రారంభించారు. మరాఠి, హిందీతో పాటు పలు భాషల్లోనూ పాటలు ఆలపించారు. నా నా కర్తే ప్యార్ తుమ్హీసే కర్ బైఠే.. (బాత్ ఏక్ రాత్ కీ మూవీ), ఆజ్ కల్ తేరే మేరె ప్యార్కే చర్చే హర్ జబాన్ పర్ (బ్రహ్మచారి), తుమ్నే పుకారా ఔర్ హమ్ చలే ఆయే (రాజ్కుమార్) వంటి ఎన్నో గీతాలకు ఆమె ప్రాణం పోశారు. ఆమె గొంతు లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ను పోలి ఉండటంతో అభిమానులు ఆమెను మరో లత అని పిల్చుకునేవారు. ఆరు దశాబ్దాలుగా సంగీత ప్రపంచానికి సేవలందించిన సుమన్ను భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది. -
సరదా సరదాగా...
సరదాగా ఆటపట్టించడం అంటాం కదా... షాహిద్ కపూర్–రష్మికా మందన్నా మధ్య అలాంటి సంఘటనే జరిగింది. షాహిద్ కపూర్ హీరోగా రష్మికా మందన్నా, కృతి సనన్ హీరోయిన్లుగా నటించిన హిందీ చిత్రం ‘కాక్టెయిల్ 2’. ఈ నెల 19న ఈ చిత్రం విడుదల కానున్న నేపథ్యంలో ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటోంది ఈ టీమ్. ఆ మధ్య ఒక కార్యక్రమంలో ఫొటోలకు పోజులిస్తున్న సమయంలో షాహిద్ కపూర్ అనుకోకుండా రష్మిక భుజంపై చేయి వేశారు.అయితే రష్మిక కాస్త ఇబ్బందిగా ఫీల్ అయినట్లు వెనక్కి జరిగి, అతని చేతిని తప్పించారు. ఆ వీడియో వైరల్గా మారింది. తాజాగా ముంబైలో జరిగిన ఒక ప్రమోషనల్ ఈవెంట్లో షాహిద్, రష్మిక, కృతి పాల్గొన్నారు. ముగ్గురూ కలిసి ఫొటోలకు పోజులిస్తున్నప్పుడు రష్మికను సరదాగా ఆట పట్టిస్తూ షాహిద్ కావాలని కాస్త దూరంగా జరిగారు. గత ఈవెంట్లో రష్మిక ఎలా అయితే చేశారో షాహిద్ అచ్చంగా అలానే అనుకరించడం చాలా ఫన్నీగా కనిపించింది. అయితే షాహిద్ దూరం జరగ్గానే అతనితో పాటు రష్మిక, కృతి సరదాగా నవ్వేశారు. ఆ వీడియో వైరల్గా మారింది. -
‘పెద్ది’ ప్రచారం కోసం ఆపరేషన్ వాయిదా
మెగా పవర్స్టార్ రామ్చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘పెద్ది’. ఈ సినిమా ప్రచారం మధ్యలో ఆయన చేతికి కట్టుతో కనిపించడం అభిమానుల్లో ఆందోళన కలిగించింది. దాంతో చాలామంది ఇది సర్జరీ జరిగిన తర్వాతి పరిస్థితి అనుకున్నారు. అయితే ఈ విషయంపై చరణ్ స్వయంగా క్లారిటీ ఇచ్చారు. తాను ఇప్పటివరకు ఎలాంటి ఆపరేషన్ చేయించుకోలేదని, తాత్కాలికంగా నొప్పి తగ్గించుకునేందుకు మాత్రమే కట్టు కట్టారని తెలిపారు. పెద్ది సినిమా రిలీజ్ తర్వాతే సర్జరీ చేయించుకుంటానని చరణ్ స్పష్టం చేశారు. కాగా ‘పెద్ది’లో పహిల్వాన్ పాత్రలో చరణ్ కనిపిస్తునన్నాడు. దానికోసం నిజమైన మల్లయోధులను తెప్పించి పెద్ది’లో కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. ఆ సీన్ షూటింగ్లో ఒక పట్టుపట్టినప్పుడు ఆయన చేతికి చిన్నపాటి గాయం అయ్యింది. ప్రస్తుతం ఆ నొప్పిని భరిస్తూనే, చరణ్ ప్రమోషన్లలో పాల్గొంటున్నారు. ఇక ఈ సినిమా రిలీజ్ ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. ఓవర్సీస్కి కంటెంట్ను కూడా పంపించేశారు. ఆంధ్రప్రదేశ్లో టికెట్ రేట్ల పెంపు కోసం ప్రత్యేక జీవో కూడా విడుదలైంది. ప్రీమియర్ షోకు రూ.600 అదనంగా వసూలు చేసేందుకు అనుమతి ఇచ్చారు. రిలీజ్ రోజు నుంచి 10 రోజుల పాటు సింగిల్ స్క్రీన్లో రూ.100, మల్టీప్లెక్సులో రూ.125 పెంపు అనుమతించారు. దాంతో ప్రస్తుతం అందరి దృష్టి తెలంగాణ ప్రభుత్వంపై ఉంది. టికెట్ రేట్ల పెంపుపై వివాదాలు కొనసాగుతున్న వేళ, ప్రభుత్వం నుంచి ఎలాంటి జీవో వస్తుందనే అంశంపై ఆసక్తి నెలకొంది. -
ఐపీఎల్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీకి సినిమా ఛాన్స్
ఈసారి ఐపీఎల్ ప్రస్తావన వస్తే అందులో కచ్చితంగా వైభవ్ సూర్యవంశీ పేరు ఉంటుంది. ఎందుకంటే తనదైన హిట్టింగ్ బ్యాటింగ్తో ఆకట్టుకున్నాడు. తనకోసమే చాలామంది మ్యాచులు చూసేలా చేశాడు. ఈ ఏడాది 776 పరుగులతో ఆరెంజ్ క్యాప్ విజేతగానూ నిలిచాడు. అందరూ సూర్యవంశీలో క్రికెట్ స్కిల్స్ చూస్తుంటే బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ మాత్రం ఇతడిలో నటుడిని చూశాడు. సినిమా ఆఫర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.(ఇదీ చదవండి: 'జన నాయగణ్' రిలీజ్ నా చేతుల్లో లేదు)బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు శేఖర్ కపూర్.. ప్రస్తుతం 'మసూమ్: ద న్యూ జనరేషన్' సినిమాని తీస్తున్నారు. 1983లో వచ్చిన 'మసూమ్'ని ఇప్పటి పరిస్థితులకు తగ్గట్లు కుటుంబ బంధాలు, ప్రేమ, గుర్తింపు తదితర అంశాలతో తీస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. త్వరలో షూటింగ్ మొదలుపెట్టనున్నారు.అయితే వైభవ్ సూర్యవంశీ గురించి ట్వీట్ చేసిన శేఖర్ కపూర్.. 'సూర్యవంశీ ఇంత సంచలన క్రికెటర్ కాకపోయింటే 'మసూమ్'లో అతడికి నటింపజేసేవాడిని' అని చెప్పుకొచ్చారు. వైభవ్ అమాయక రూపం, సహజ వ్యక్తిత్వం తనని ఆకట్టుకున్నాయని.. మసూమ్ లాంటి భావోద్వేగ సినిమాకు వైభవ్ సరిపోతాడని అభిప్రాయపడ్డారు.బిహార్కి చెందిన సూర్యవంశీ వయసు 15 ఏళ్లే. రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్నాడు. ఈ ఏడాది అద్భుతమైన బ్యాటింగ్ చేసి అదరగొట్టేసిన ఇతడు.. చిన్న వయసులోనే ఐపీఎల్ సెంచరీ చేసిన ఆటగాడిగా ఇప్పటికే రికార్డ్ సృష్టించాడు. భారత బ్యాటర్ల వరకు వేగవంతమైన ఐపీఎల్ శతకం చేసింది కూడా ఇతడే కావడం విశేషం. అలాంటి వైభవ్లో శేఖర్ కపూర్ లాంటి దర్శకుడు.. నటుడిని చూడటం ఆసక్తికరం.(ఇదీ చదవండి: పెళ్లి తర్వాత శోభిత సినిమా.. పవర్ఫుల్ ఫస్ట్ లుక్)If sooryavanshi wasn’t such a sensational cricketer.. I could have cast him in Masoom the film z.. pic.twitter.com/p8vaLzq1e2— Shekhar Kapur (@shekharkapur) May 31, 2026 -
చాలామందితో ఫిజికల్ రిలేషన్.. నా పార్ట్నర్స్కు ముందే తెలుసు: నటి షాకింగ్ కామెంట్స్
ప్రముఖ నటి షహానా గోస్వామి తెలుగువారికి పెద్దగా తెలియకపోవచ్చు. కానీ బాలీవుడ్ ప్రేక్షకులు మాత్రం ఆమె గుర్తు పట్టేస్తారు. హిందీలో పలు సూపర్ హిట్ చిత్రాల్లో కనిపించింది. 2008లో 'రాక్ ఆన్!' చిత్రంతో గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత 'ఫిరాక్', 'మిడ్నైట్స్ చిల్డ్రన్', 'డెస్పాచ్' వంటి చిత్రాలలో కూడా నటించారు. ఆమె చివరిసారి 'సంతోష్' అనే చిత్రంలో కనిపించారు. ఈ మూవీని 2024 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించారు.ఇక సినిమాల సంగతి పక్కనపెడితే.. తాజాగా ఆమె తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడింది. ఓ ఇంటర్వ్యుకు హాజరైన 40 ఏళ్ల ముద్దుగుమ్మ రిలేషన్, ప్రేమ గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. తాను రిలేషన్షిప్లో ఎల్లప్పుడు ఓపెన్గానే ఉన్నానని షహానా వెల్లడించారు. తాను ఇతరులతో కూడా శారీరకంగా సన్నిహితంగా ఉంటాననే విషయం.. తనతో రిలేషన్లో ఉన్న వ్యక్తులకు పూర్తిగా తెలుసని షాకింగ్ కామెంట్స్ చేశారు. తనకు సంబంధాలను కొనసాగించే విధానంలో పారదర్శకత చాలా ముఖ్యమని.. అందుకే నా రిలేషన్స్లో ఎలాంటి రహస్యాలు ఉండవని ఆమె కుండబద్దలు కొట్టారు.ప్రస్తుతం తనకు భాగస్వామి ఎవరు లేరని కూడా గోస్వామి వెల్లడించారు. తన జీవితంలోని సంబంధాలు సాంప్రదాయమనే ముద్ర కాకుండా.. ప్రేమ, స్నేహం మీద నిర్మించబడ్డాయని తెలిపారు. తన రిలేషన్స్ సంప్రదాయాలను అనుసరించకపోయినా.. అవి సాధారణమైనవి కావని అన్నారు.ప్రేమ అనేది నిర్బంధంగా ఉండకూడదనేది తన నమ్మకమని గోస్వామి అన్నారు. తాను భావోద్వేగ స్వేచ్ఛకు ఎంతో విలువ ఇస్తానని తెలిపారు. సంబంధాలు అనేవి కట్టుబాట్లలోకి బలవంతంగా నెట్టబడకుండా సహజంగా అభివృద్ధి చెందాలని తాను నమ్ముతున్నానని ఆమె అన్నారు. ప్రేమ స్వేచ్ఛగా ఉండాలని నేను ఎప్పుడూ భావిస్తానని వెల్లడించారు. ఈ ఆలోచన తాను ఎంచుకునే సంబంధాలను.. అలాగే కాలక్రమేణా అవి అభివృద్ధి చెందే విధానాన్ని కూడా ప్రభావితం చేసిందని షహానా అభిప్రాయం వ్యక్తం చేశారు.మిలింద్ సోమన్తో డేటింగ్..బ్రేకప్గతంలో మిలింద్ సోమన్తో రిలేషన్, విడిపోవడంపై కూడా షహానా గోస్వామి స్పందించారు. మోడల్ మిలింద్ సోమన్తో తన సంబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తాను టీనేజర్గా ఉన్నప్పుడు అతన్ని సినిమాల్లో చూసి ఆకర్షితురాలినయ్యానని తెలిపింది. చివరికి ఆన్లైన్లో అతని కాంటాక్ట్ వివరాలను కనుగొన్నానని వెల్లడించింది. కాగా.. వీరిద్దరు డేటింగ్ ప్రారంభించడానికి ముందు, దాదాపు ఆరు సంవత్సరాల పాటు టెక్స్ట్ మెసేజ్ల ద్వారా ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారని తెలిసింది. అయితే మిలింద్, షహానాల రిలేషన్కు 2013లో ఎండ్ కార్డ్ పడింది. -
చెల్లి ఇంటి కోసం డబ్బు సాయం చేసిన కాజోల్
దర్శకురాలు, కొరియోగ్రాఫర్ ఫరాఖాన్ కొంతకాలంగా యూట్యూబ్పైనే ఎక్కువ ఫోకస్ పెట్టింది. తన వంటమనిషి దిలీప్తో కలిసి రకరకాల వీడియోలు చేస్తోంది. అతడిని వెంటేసుకుని సెలబ్రిటీల హోంటూర్స్ కూడా చేస్తోంది. ఈ క్రమంలోనే బాలీవుడ్ నటి తనీషా ముఖర్జీ ఇంటిని సందర్శించింది ఫరా. ముంబైలో ఉన్న ఈ ఇంట్లో అడుగుపెడితే కోల్కతాకు వెళ్లినట్లుగానే ఉందని అబ్బురపడిపోయింది.14 ఏళ్లుగా ముంబైలో..ఇలాంటి ఇల్లు ముంబైలో ఎక్కడా ఉండదని కితాబిచ్చింది. ఇక తనీషా మాట్లాడుతూ.. ఈ ఇంట్లోని సామాను చాలామటుకు తన తల్లి ఇంటి నుంచి వచ్చినవే అని పేర్కొంది. 14 ఏళ్ల క్రితం ముంబైలో అడుగుపెట్టానని, తర్వాత ఇక్కడే సెటిలైపోయానంది. ఈ ఇంటి కోసం మీ అక్క, హీరోయిన్ కాజోల్ ఏమైనా సాయం చేసిందా? అని ఫరా ఆతృతగా అడిగింది. అందుకు తనీషా అవునని బదులిచ్చింది. తను చెక్లపై సంతకం చేసి ఇచ్చేదని, అలా డబ్బు సాయం చేసిందని పేర్కొంది.తెలుగులోనూ..బాలీవుడ్ సెలబ్రిటీలు తనూజ- షోము ముఖర్జీల సంతానమే కాజోల్, తనీషా. తక్కువ కాలంలోనే కాజోల్ స్టార్ హీరోయిన్గా రాణించింది. కానీ, తనీషా ఆ స్టార్డమ్ అందుకోలేకపోయింది. ష్, సర్కార్, వన్ టూ త్రీ, సర్కార్ రాజ్, కోడ్ నేమ్ అబ్దుల్ వంటి పలు హిందీ చిత్రాల్లో నటించింది. తెలుగులో కంత్రి మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేసింది. హిందీ బిగ్బాస్ ఏడో సీజన్లో పాల్గొని ఫస్ట్ రన్నరప్గా నిలిచింది.చదవండి: బోల్డ్ వీడియో.. తప్పయిపోయింది, క్షమించండి: నటుడి కూతురు -
ఓటీటీలో క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీల్లో ప్రతి వారం కొత్త సినిమాలు, వెబ్ సిరీస్లు సందడి చేస్తుంటాయి. వీటిలో ఆడియన్స్ ఎక్కువగా సస్పెన్స్ థ్రిల్లర్, క్రైమ్, ఇన్వెస్టిగేటివ్ లాంటి మూవీస్ను ఎక్కువగా ఆదరిస్తున్నారు. ప్రేక్షకుల అభిరుచి తగ్గట్టుగానే ప్రతివారం బోలెడ్ చిత్రాలు, సిరీస్లు రానే వస్తున్నాయి. తాజాగా మరో ఆసక్తికర క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ సిరీస్ స్ట్రీమింగ్కు సిద్ధమైంది.అలీ ఫజల్, సోనాలి బింద్రే, ఆమిర్ బషీర్ కీలక పాత్రల్లో నటించిన లేటేస్ట్ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ 'రాఖ్'. ఈ వెబ్ సిరీస్కు ప్రోసిత్ రాయ్ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సిరీస్ స్ట్రీమింగ్ తేదీని మేకర్స్ రివీల్ చేశారు. అమెజాన్ ప్రైమ్ వేదికగా జూన్ 12 నుంచి స్ట్రీమింగ్ కానుందని ప్రకటించారు. ఈ మేరకు ఓ పోస్టర్ను పంచుకున్నారు. ఇందులో ఫజల్ పోలీస్ యూనిఫాంలో కనిపించగా.. అతనిముందు ఓ శవం ఉన్న కొత్త పోస్టర్ను ఈ సిరీస్పై ఆసక్తిని మరింత పెంచేసింది. పాతిపెట్టిన నిజాలు ఎప్పుడూ తిరిగి బయటపడతాయి అంటూ క్యాప్షన్ కూడా రాసుకొచ్చారు.'రాఖ్' అనేది ఒక ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ సిరీస్. ఇద్దరు టీనేజర్లు అదృశ్యం కావడంతో ఈ కథ ప్రారంభమవుతుంది. ఈ సంఘటన ఒక అన్యోన్యమైన కుటుంబాన్ని తీవ్రంగా, మానసిక వేదనకు గురిచేస్తుంది. అంతేకాకుండా మొత్తం నగరాన్ని ఆందోళనకు గురవుతుంది. ఈ కేసును చేధనే లక్ష్యంగా దర్యాప్తు కోణంలో ఈ సిరీస్ సాగనున్నట్లు తెలుస్తోంది. ఈ సిరీస్కు ఆయుష్ త్రివేది డైలాగ్స్ అందించగా.. ఎండెమోల్ షైన్ ఇండియా బ్యానర్పై దీపక్ ధర్, రిషి నేగి, మృణాలిని జైన్, శ్యామ్ రాఠీ నిర్మించారు. View this post on Instagram A post shared by prime video IN (@primevideoin) -
నాన్న కొడతాడేమోనని అబద్ధం చెప్పా: రామ్చరణ్
పెద్ది సినిమా కోసం మెగా పవర్ స్టార్ రామ్చరణ్ చాలానే కష్టపడ్డాడు. మొన్నటివరకు సెట్స్లో కష్టపడితే ఇప్పుడు ప్రమోషన్స్ కోసం పరుగులు పెడుతున్నాడు. వరుసగా ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నాడు. ఈ సందర్భంగా తన తండ్రి మెగాస్టార్ చిరంజీవికి తాను అబద్ధం చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకున్నాడు. రామ్చరణ్ మాట్లాడుతూ.. నాకు చిన్నప్పటి నుంచి బయటి ప్రపంచం గురించి పెద్దగా తెలియదు. లోకజ్ఞానం లేకుండానే పెరిగాను. నాన్నతో సెట్కు వెళ్లాలంటే భయంఅజ్ఞానంతో ఉండటం కూడా ఒక అదృష్టమైతే అందుకు నేనే ఉదాహరణ. మా ఇంట్లో సినిమా వాతావరణం ఉండేదే కాదు. సినిమా మ్యాగజైన్లు, అవార్డులు అన్నీ నాన్న ఆఫీసులోనే ఉండేవి. ఎప్పుడైనా ఆ మ్యాగజైన్లు కనిపిస్తే.. వాటిని ముట్టుకోవాలన్నా సరే భయమేసేది. నాన్న ఎంత గొప్ప నటుడు అనేది నాకు తెలిసేది కాదు. నాన్నతో షూటింగ్ సెట్కు వెళ్లాలన్నా భయంగానే ఉండేది. ఆయన పిలిస్తే తప్ప తన వెంట వెళ్లేవాడిని కాదు.అబద్ధం చెప్పా..నాకు యాక్టింగ్ అంటే ఆసక్తి ఉన్నప్పటికినీ దాన్ని పైకి చెప్పేంత ధైర్యం లేదు. నాకు 17 ఏళ్ల వయసున్నప్పుడు అనుకుంటా.. ఏమవ్వాలనుకుంటున్నావు? అని నాన్న అడిగాడు. ఆయన మెప్పు పొందేందుకు మెకానికల్ ఇంజనీర్ అవుతానని అబద్ధం చెప్పాను. నటుడిని అవుతానంటే బుద్ధిగా చదువుకోక హీరో అవుతావా? అని ఎక్కడ కొడతారో అని భయపడ్డాను. కానీ, కరెక్ట్ సమయం వచ్చిందని ఆయనకు అనిపించినప్పుడు తనే పిలిచి మరీ సినిమాలు చేయమన్నాడు అని రామ్చరణ్ చెప్పుకొచ్చాడు. రామ్చరణ్- జాన్వీ కపూర్ జంటగా నటించిన పెద్ది జూన్ 4న విడుదలవుతోంది.చదవండి: హీరో అజిత్ తల్లి కన్నుమూత -
సెలబ్రిటీలను అన్ఫాలో చేసిన కరణ్.. కారణమేంటో తెలుసా?
బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్ చేసిన ఓ అనూహ్యమైన పని ఒకటి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఆయన తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో షారూఖ్ ఖాన్, ఆలియా భట్, కరీనా కపూర్, అనన్య పాండే.. ఇలా పలువురు తారలను అన్ఫాలో అయ్యారు. దీంతో సోషల్ మీడియాలో అనేక రకాల ఊహాగానాలు తెరపైకి వచ్చాయి.టైం వేస్ట్దీనిపై కరణ్ జోహార్ స్పందిస్తూ.. ఇన్స్టాగ్రామ్లో నేను ఎక్కువ సమయం గడుపుతున్నాను. ఈ కారణంగా నా విలువైన సమయం వృథా అవుతోంది. దీన్ని తగ్గించుకునేందుకే అన్ఫాలో అయ్యాను. ఇది జాతీయస్థాయి వార్త కాదు, కేవలం డిజిటల్ డీటాక్స్ మాత్రమే.. మీ వ్యూస్, క్లిక్స్ కోసం మరేదైనా విషయాన్ని చూసుకోండి అని పేర్కొన్నారు. ఆయనకు ఇన్స్టాగ్రామ్లో 1.75 కోట్ల మంది ఫాలోవర్స్ ఉండగా ఆయన మాత్రం 49 మందినే ఫాలో అవుతున్నారు.చదవండి: జూన్లో రిలీజయ్యే సినిమాల జాబితా -
జూన్ బాక్సాఫీస్: పెద్దితో పాటు ఆ సినిమాలదే హవా!
ఈసారి బాక్సాఫీస్ వద్ద సమ్మర్ హవా పెద్దగా కనిపించలేదు. పెద్ద సినిమాలన్నీ అటు షూటింగ్స్ పూర్తి కాక, ఇటు ఐపీఎల్ రావడంతో వాయిదాలు ప్రకటించాయి. దీంతో వేసవిలో చిన్న, డబ్బింగ్ సినిమాల జోరే ఎక్కువగా కనిపించింది. అయినప్పటికీ టాలీవుడ్ బాక్సాఫీస్ ఎక్కువగా బోసిపోయే కనిపించింది. ఇప్పుడు రామ్చరణ్ 'పెద్ది'తో మరోసారి బాక్సాఫీస్ కళకళలాడేందుకు సిద్ధమైంది. మరి పెద్దితోపాటు జూన్లో థియేటర్లలో విడుదలయ్యే సినిమాలేంటో చూసేద్దాం..⇒ జూన్ 4- పెద్దిరామ్చరణ్ ప్రధాన పాత్రలో నటించిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా 'పెద్ది'. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయిక. బుచ్చిబాబు దర్శకత్వం వహించిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.⇒ జూన్ 5 - హై జవానీ తో ఇష్క్ హోనా హై (హిందీ మూవీ)బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం 'హై జవానీతో ఇష్క్ హోనా హై'. మృణాల్ ఠాకూర్, పూజా హెగ్డే హీరోయిన్లుగా నటించారు. హీరో వరుణ్ ధావన్ తండ్రి డేవిడ్ ధావన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ జూన్ 5న రిలీజవుతోంది.⇒ జూన్ 11- సింగ్ గీతంలెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో రూపొందిన లేటెస్ట్ సినిమా 'సింగ్ గీతం'. అయాన్, అహల్యా బమ్రూ, శాలిని కొండెపూడి ప్రధాన పాత్రల్లో నటించారు. నాగ్ అశ్విన్ నిర్మించిన ఈ మూవీ జూన్ 11న విడుదలవుతోంది.⇒ జూన్ 19 - మా ఇంటి బంగారండైరెక్టర్ రాజ్ నిడిమోరుతో పెళ్లి తర్వాత సమంత ప్రధాన పాత్రలో నటించిన తొలి చిత్రం 'మా ఇంటి బంగారం'. సామ్ భర్త రాజ్ ఈ చిత్రానికి కథ అందించగా, ఓ బేబీ ఫేమ్ నందిని రెడ్డి డైరెక్ట్ చేసింది. ఈ సినిమా నుంచి రిలీజైన ట్రైలర్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. జూన్ 19న బంగారం థియేటర్లలోకి వస్తోంది.⇒ జూన్ 19 - ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు'కోరుకున్న ప్రియుడు', 'పెళ్లి' వంటి సినిమాలతో హీరోగా అప్పట్లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు వడ్డే నవీన్. కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఆయన 'ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు' మూవీతో రీఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమా ద్వారా కమల్ తేజ నార్ల దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. వడ్డే నవీన్ హీరోగా నటించడంతో పాటు నిర్మాతగా వ్యవహరించిన ఈ మూవీ జూన్ 19న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.⇒ జూన్ 19- దీవానాశుభం ఫేమ్ హర్షిత్ రెడ్డి హీరోగా నటించిన చిత్రం 'దీవానా'. స్మేహ మణిమేగలై కథానాయిక. శ్రీకాంత్ సంగిశెట్టి దర్శకత్వం వహించిన ఈ మూవీ 'మా ఇంటి బంగారం'తో పోటీపడుతూ జూన్ 19న రిలీజవుతోంది.⇒ జూన్ 19 - కాక్టైల్ 2 (హిందీ మూవీ)షాహిద్ కపూర్ హీరోగా, కృతి సనన్, రష్మిక మందన్నా హీరోయిన్లుగా నటించిన చిత్రం కాక్టైల్ 2. ఇది 2012లో వచ్చిన కాక్టైల్ సినిమాకు సీక్వెల్గా తెరకెక్కింది. జూన్ 19న విడుదలవుతోంది.⇒ జూన్ 26- లెనిన్నాగార్జున చిన్న కుమారుడు, హీరో అఖిల్ అక్కినేని ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం లెనిన్. భాగ్యశ్రీ బోర్సే కథానాయిక. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించిన ఈ మూవీ రాయలసీమ నేపథ్యంలో సాగుతుంది. ఈ సినిమాతోనైనా అఖిల్ హిట్ కొడతాడని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అన్నట్లు ఈ చిత్రం నెలాఖరులో జూన్ 26న రిలీజవుతోంది.⇒ జూన్ 26- వెల్కమ్ టు ద జంగిల్ (హిందీ చిత్రం)ఇది వెల్కమ్ సినిమా ఫ్రాంచైజీలో వస్తున్న మూడో భాగం. ఇందులో అక్షయ్ కుమార్, సంజయ్ దత్, బాబీ డియోల్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అహ్మద్ ఖాన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ జూన్ 26న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.ఇకపోతే జూన్ 22న స్టార్ హీరో, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ పుట్టినరోజు ఉంది. ఈ క్రమంలో జూన్ 19న ఆయన చివరి మూవీ జన నాయకన్ను రిలీజ్ చేయాలని చిత్రయూనిట్ భావిస్తోంది. మరి ఈసారైనా సెన్సార్ ఆటంకాలు దాటుకుని జన నాయకన్ విడుదలవుతుందో, లేదో చూడాలి! -
ప్రముఖ సినీ జంట గుడ్ న్యూస్.. పెళ్లైన నాలుగేళ్లకు..!
ప్రముఖ బాలీవుడ్ జంట అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. బుల్లితెరతో పాటు సినిమాల్లో రాణిస్తోన్న ఆదిత్య సీల్- అనుష్క రంజన్ మొదటి బిడ్డ కోసం ఎదురుచూస్తున్నట్లు ప్రకటించారు. పెళ్లైన నాలుగేళ్ల తర్వాత ఈ దంపతులు ప్రగ్నెన్సీని ప్రకటించారు. ఈ జంట తమ ప్రెగ్నెన్సీకి సంబంధించిన అందమైన ఫోటోలను పంచుకున్నారు. ఈ ప్రత్యేక క్షణం కోసం వందేళ్లుగా వేచి ఉన్నామని ఎమోషనల్ నోట్ రాసుకొచ్చారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు సినీతారలు ఈ జంటకు అభినందనలు చెబుతున్నారు.ఆదిత్య, అనుష్క జంట ప్రెగ్నెన్సీకి సంబంధించిన సోషల్ మీడియాలో ఫోటోలను పంచుకున్నారు. ఈ ఫోటోలలో నటి బేబీ బంప్ ప్రదర్శిస్తూ కనిపించారు. ఈ జంటకు అనన్య పాండే, మౌనీ రాయ్, సోనాక్షి సిన్హా, వాణి కపూర్, మనీష్ మల్హోత్రా, నీల్ నితిన్ ముఖేష్, సోనాల్ చౌహాన్, రాకుల్ ప్రీత్ సింగ్, కుశాల్ టాండన్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు.కాగా.. ఆదిత్య, అనుష్క మొదటిసారి వారి కుటుంబం నిర్వహించిన ఒక కార్యక్రమంలో కలుసుకున్నారు. ఆ తర్లాత వీరి మొదటి పరిచయం కాస్తా ప్రేమగా మారింది. దాదాపు నాలుగేళ్ల పాటు డేటింగ్ చేసిన తర్వాత.. అనుష్క పుట్టినరోజున పారిస్లో ఆదిత్య ప్రపోజ్ చేశాడు. ఆ తర్వాత పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. ఇక సినిమాల విషయానికొస్తే, ఆదిత్య చివరిగా అక్షయ్ కుమార్, తాప్సీ పన్ను నటించిన 'ఖేల్ ఖేల్ మే' చిత్రంలో కనిపించాడు. View this post on Instagram A post shared by Aditya Seal (@adityaseal) -
ఐఎండీబీ టాప్లో ఊహించని పేరు.. విజయ్, ఎన్టీఆర్, షారూక్ కూడా అతని వెనకే..!
ప్రముఖ ఎంటర్టైన్మెంట్ పోర్టల్ ఐఎండీబీ సెలబ్రిటీల ర్యాంకులను ప్రకటిస్తుంది. ప్రతి నెల, వారానికి సంబంధించి ఎప్పటికప్పుడు ర్యాంకులను ప్రకటిస్తుంది. ఈ వారంలో పాపులర్ సెలబ్రిటీల జాబితాను ఐఎండీబీ వెల్లడించింది. అయితే ఈసారి ఎవరు ఊహించని నటుడు నంబర్ స్థానంలో నిలిచారు. దళపతి విజయ్, జూనియర్ ఎన్టీఆర్, షారూక్ ఖాన్ను సైతం వెనక్కి నెట్టిన ఫస్ట్ ప్లేస్ దక్కించుకున్నారు. అతను ఎవరో మీరు కూడా ఓ లుక్కేయండి.ఈ వారంలో టాప్లో నిలిచిన నటుడు యుధ్వీర్ అహ్లావత్. అతను ఇటీవలే కర్తవ్య అనే మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. సైఫ్ అలీ ఖాన్ నటించిన ఈ బాలీవుడ్ మూవీ నేరుగా నెట్ఫ్లిక్స్లో రిలీజైంది. ఈ లిస్ట్లో ఐశ్వర్య రాయ్ బచ్చన్, తలపతి విజయ్, షారుఖ్ ఖాన్, జూనియర్ ఎన్టీఆర్, మోహన్లాల్ లాంటి స్టార్లను అధిగమించి ఏకంగా నంబర్వన్ ప్లేస్ కొట్టేశాడు. ఇప్పటి వరకు ఎవరికీ తెలియని పేరు యుధ్వీర్ అహ్లావత్.. ఐఎండీబీ ర్యాంక్తో ఒక్కసారిగా మార్మోగిపోతోంది. యుధ్వీర్ కర్తవ్య మూవీలో 16 ఏళ్ల హర్యానా బాలుడు హర్పాల్ పాత్ర పోషించారు.బాలుడి పాత్రలో కనిపించడంతో యుధ్వీర్ అంతా చిన్నపిల్లాడని భావించారు. కర్తవ్యను చూస్తున్న ప్రేక్షకులు యుధ్వీర్ను ఒక బాలనటుడిగా గుర్తించారు. కానీ అతని వయసు అక్షరాలా 33 సంవత్సరాలు. అతను దాదాపు దశాబ్ద కాలంగా సినిమాలలో నటిస్తున్నారు. ఇప్పుడు ఐఎండీబీ టాప్ ర్యాంక్తో ఒక్కసారిగా ఫేమస్ అయ్యాడు. Catch who is trending on IMDb’s Popular Indian Celebrities list of the week! 🌟 See the complete list on the IMDb app, available on iOS and Android. 🍿This list is powered by ‘Popular Indian Celebrities’: a weekly IMDb feature that showcases the Indian stars trending… pic.twitter.com/DHQRD5dVed— IMDb India (@IMDb_in) May 27, 2026 -
వాస్తవ ఘటనలతో...
బాలీవుడ్ నటి, ఎంపీ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘భారత్ భాగ్యవిధాత’. మనోజ్ తపాడియా దర్శకత్వం వహించారు. పెన్ స్టూడియోస్ సమర్పణలో మణికర్ణిక ఫిల్మ్స్– పరమహంస్ క్రియేషన్స్ పై రూపొందిన ఈ మూవీ జూన్ 12న విడుదల కానుంది. కాగా ఈ సినిమా నుంచి తాజాగా మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. మంటల్లో చిక్కుకున్న వారిని కంగనా కాపాడుతున్నట్లు ఈ పోస్టర్లో ఉంది. భారతదేశ చరిత్రలో 2008లో జరిగిన విషాదకరమైన 26/11 ముంబై ఉగ్రదాడుల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. కామా అండ్ ఆల్బ్లెస్ హాస్పిటల్లో జరిగిన వాస్తవ ఘటన ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో హెడ్ నర్స్ పాత్రలో కంగనా రనౌత్ నటించారు. ఉగ్రదాడుల సమయంలో ఆసుపత్రిలోని సిబ్బంది తమ ప్రాణాలను పణంగా పెట్టి రోగులను ఎలా రక్షించారు... అనేది ఆమె పాత్ర ద్వారా చూపించబోతున్నారు మనోజ్ తపాడియా. -
Ram Charan: ప్రధాని మోదీ నాతో ఓ స్ఫూర్తి నింపే స్టోరీ చెప్పారు
పాన్ ఇండియా స్థాయిలో జూన్ 4న విడుదల కానున్న పెద్ది సినిమాకు ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. భోపాల్, బెంగళూరులో ఇప్పటికే ప్రచారం చేసిన చిత్ర బృందం గురువారం ఢిల్లీలో సందడి చేసింది. అక్కడ నిర్వహించిన ప్రెస్మీట్లో ఈ చిత్ర హీరో మెగాపవర్ స్టార్ రామ్చరణ్, జాన్వీ కపూర్, దివ్యేందు శర్మ, బొమన్ ఇరానీ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా రామ్చరణ్ మాట్లాడుతూ.. ప్రధాని మోదీతో గతంలో జరిగిన భేటీని గుర్తుచేసుకున్నారు. ఢిల్లీలో ప్రధాని మోదీని కలిసినప్పుడు ఆయన ‘పెద్ది’ సినిమా కథ దేని గురించి అని అడిగారు. దానికి నేను వికసిత్ భారత్ గురించి చెప్పే కథ అని వివరించాను. అప్పుడు ఆయన నాతో ఓ స్ఫూర్తినింపే కథను పంచుకున్నారు. ‘పశ్చిమ బెంగాల్లోని ఓ చిన్న గ్రామంలో మహ్మద్ అనే ఓ ఫుట్బాల్ క్రీడాకారుడు ఉండేవాడు. అతను భారత్ తరఫున ఆడి తన ఊరికి గుర్తింపు తెచ్చాడు. ఆ గ్రామం నుంచి ఇప్పుడు 85 మంది ప్లేయర్స్ ఉన్నారని చెప్పారు. ఒక వ్యక్తి తలుచుకుంటే ఎంతటి మార్పు తీసుకురాగలడో దానికి ఇది ఓ ఉదాహరణ. పెద్ది పాత్ర కూడా అలాంటిదే’ అని చరణ్ వివరించారు.ఇక భోపాల్లో హిందీ మాట్లాడి ఇబ్బందులు ఎదుర్కొన్న రామ్ చరణ్ ఈసారి జాగ్రత్త పడ్డారు. తాజాగా ఢిల్లీలో జరిగిన పెద్ది సినిమా ప్రచార కార్యక్రమంలో చరణ్ పూర్తిగా ఇంగ్లిష్లోనే మాట్లాడాడు. ఒక దశలో ఎవరి పేరైనా మరిచిపోతే, తన టీమ్ను అడిగి నిర్ధారించుకొని మరీ చెప్పాడు. ఇక పెద్ది సినిమాను చిన్నారులందరికీ చూపించాలని తల్లిదండ్రులను చరణ్ కోరాడు. 'పిల్లలపై ఈ సినిమా ఎంత ప్రభావం చూపుతుందో నేను చెప్పలేను. కానీ ఈ సినిమా చూపించిన తల్లిదండ్రులు మాత్రం అసంతృప్తి చెందరు" అని హామీ ఇచ్చాడు. గతంలో భోపాల్లో జరిగిన ఈవెంట్లో హిందీ మాట్లాడే ప్రయత్నంలో చరణ్ గందరగోళానికి గురయ్యాడు. ఒక దశలో భోపాల్ అనడానికి బదులు బిహార్ అన్నాడు. చివర్లో క్రికెటర్ బుమ్రాను ఫుట్బాల్ ప్లేయర్గా పేర్కొనడంతో సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఎదుర్కొన్నాడు. బుమ్రాకు సంబంధించి వివరణ ఇచ్చినా, ట్రోలింగ్ మాత్రం ఆగలేదు. అందుకే ఈసారి ఇంగ్లిష్లోనే మాట్లాడాడు. మరోవైపు, పెద్ది సినిమాకు మద్రాస్ హైకోర్టు యాంటీ పైరసీ ఇంజెక్షన్ ఆర్డర్ మంజూరు చేసింది. సినిమా రిలీజ్ తర్వాత ఏదైనా క్లిప్స్ లీక్ చేయడం లేదా అక్రమంగా షేర్ చేయడం వంటివి జరిగితే, చిత్ర యూనిట్ చట్టరీత్యా చర్యలు తీసుకోవడానికి పూర్తి స్వేచ్చ ఉంటుంది. కోర్టు మధ్యంతర ఉత్తర్వుల ప్రకారం సినిమా కంటెంట్ను అనధికారికంగా అప్లోడ్, స్ట్రీమింగ్ లేదా షేర్ చేయరాదు. భారీ బడ్జెట్ చిత్రాలకు ఇలాంటి లీగల్ రక్షణ చర్యలు చాలా కీలకమనే చెప్పాలి. -
రోడ్డు ప్రమాదంలొ ప్రముఖ టీవీ నటుడు దుర్మరణం, సీఎం సంతాపం
ఒకరు ప్రముఖ మరాఠీ టీవీ నటుడు ఏళ్ల నటుడు మహేష్ పవార్ (25) ఒక ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. మహారాష్ట్రలోని రాయ్గఢ్ జిల్లాలో వారు ప్రయాణిస్తున్న ఎస్యూవీ (SUV) వాహనం దాదాపు 1,000 అడుగుల లోతునున్న లోయలోకి దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మహేష్ పవార్తో పాటు ప్రయాణిస్తున్న మరో ఏడుగురు కూడా అక్కడికక్కడే మరణించినట్లు అధికారులు సోమవారం వెల్లడించారు. దీంతో పరిశ్రమ తీవ్ర విషాదంలో మునిగిపోయింది.ముంబైకి సుమారు 180 కిలోమీటర్ల దూరంలో ఉన్న పోలాడ్పూర్-మహాబలేశ్వర్ రోడ్డులోని అంబెనాలి ఘాట్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగిందని పీటీఐ (PTI) నివేదించింది. కొండల మధ్య ఉన్న ఈ ప్రమాదకరమైన ఘాట్ రోడ్డులో వాహనం అదుపు తప్పి లోయలో పడిపోయింది. బాధితుల చివరి మొబైల్ లొకేషన్ ఆధారంగా, అంబెనాలి ఘాట్ విభాగంలో పోలీసులు శోధించగా, లోయలో పడి ఉన్న వాహనాన్ని గుర్తించారు. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమిక విచారణలో తేలింది.బాధితులు ఎవరు?పోలీసుల సమాచారం ప్రకారం.. మరణించిన వారంతా 19 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు గల యువకులు. వీరంతా ఆదివారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో దాపోలిలోని హర్నే నుండి బయలుదేరారు. అయితే వారు గమ్యస్థానమైన సతారాకు చేరుకోకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు.మృతులను సతారాకు చెందిన రితేష్ లోఖండే (22), సుహాస్ లోఖండే (20), ఉత్కర్ష్ షింగ్తే (21), నిఖిల్ షింగ్తే (25), మహేష్ పవార్ (25), ఆదిత్య సాలుంఖే (21), రాజేష్ కట్కర్ (35) రత్నగిరికి చెందిన అన్ష్ చవాన్ (19)లుగా అధికారులు గుర్తించారు.ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సంతాపంఈ ఘోర ప్రమాదంపై ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సహాయక చర్యలను "యుద్ధప్రాతిపదికన" నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎనిమిది మంది స్నేహితులు విహారయాత్రకు వెళ్లిన సమయంలో ఈ ప్రమాదం జరిగిందని, మృతదేహాలను వెలికితీసేందుకు జిల్లా యంత్రాంగం వెంటనే ఐదు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించిందని సీఎం పేర్కొన్నారు. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF) , స్వచ్ఛంద రెస్క్యూ టీమ్ల సహాయంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు. మహేష్ పవార్ ప్రముఖ మరాఠీ టెలివిజన్ షో 'అప్పి ఆమ్చీ కలెక్టర్' లో తన నటన ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన అకాల మరణం మరాఠీ చిత్ర పరిశ్రమను ,ఆ సీరియల్ ప్రేక్షకులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. -
ఆ హీరోయిన్ల కాళ్లు పట్టుకున్న ఊర్వశి.. ఇక చాలు!
సెలబ్రిటీలకు ప్రత్యేకమైన ఫ్యాన్బేస్ ఉంటుంది. ఎవరి హీరో/ హీరోయిన్ వారికి గొప్ప! అయినా మా అభిమాన తారయే గ్రేట్ అంటూ సోషల్ మీడియాలో ఎప్పుడూ ఫ్యాన్ వార్స్ జరుగుతూనే ఉంటాయి. ఈ క్రమంలో రకరకాల పోస్టులు, ఫోటోలు, వీడియోలు పెడుతూ ఉంటారు. అలా ఏఐ (కృత్రిమ మేధ) సాయంతో సృష్టించిన ఫోటో ఒకటి బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా కంటపడింది.ఆ హీరోయిన్ల కాళ్లకు నమస్కరిస్తూ..అందులో ఐశ్వర్యరాయ్ను గ్లోబల్ బ్యూటీగా పేర్కొనగా ఆ తర్వాతి కేటగిరీలో దీపిక పదుకొణె, ప్రియాంక చోప్రా, మాధురీ దీక్షిత్ ఉన్నారు. చివరగా ఆలియా భట్, కరీనా కపూర్, కత్రినా కైఫ్, ఊర్వశి రౌతేలా ఉన్నారు. చిట్టచివరి కేటగిరీలో ఉన్న వీళ్లందరూ తమపై ఉన్న హీరోయిన్ల ముందు మోకరిల్లి వారి పాదాలు నమస్కరిస్తున్నట్లుగా ఫోటో సృష్టించారు. ఈ ఫోటోపై ఊర్వశి సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేసింది. విషం చిమ్మడం ఆపండి'ప్రతి నటికి తనకంటూ సొంత జర్నీ ఉంటుంది. ఆ జర్నీలో ఎంతో కష్టపడుతుంది. అలాంటి మహిళల్ని పోలుస్తూ ఫ్యాన్ వార్ సృష్టించడం వల్ల ఒరిగేదేం ఉండదు. అది కేవలం నెగెటివిటీని మాత్రమే వ్యాపింపజేస్తుంది. దానికి బదులుగా టాలెంట్ను గుర్తించండి, ఎదుగుదలను ప్రోత్సహించండి, దయతో ప్రవర్తించడం నేర్చుకోండి. ఇలా విషం చిమ్మడం ఆపేయండి' అని ఊర్వశి కోరింది. ఇది చూసిన అభిమానులు.. నటీనటులకు ఇలా ర్యాంకింగ్ ఇస్తూ ఒకర్ని తక్కువ, మరొకర్ని ఎక్కువ చూడం కరెక్ట్ కాదని హితవు పలుకుతున్నారు. ఐటం సాంగ్స్తో పాపులర్ఎవరి ప్రతిభ వారిదేనని, ఇలా పోల్చడం మంచిది కాదని కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే ఊర్వశి రౌతేలా.. నటిగా కన్నా ఐటం సాంగ్స్తోనే ఎక్కువ ఫేమస్ అయింది. ఈమె తెలుగులో 'వాల్తేరు వీరయ్య' మూవీలో 'బాసూ.. వేర్ ఈజ్ ద పార్టీ', ఏజెంట్లో 'వైల్డ్ సాలా', 'బ్రో'లో 'మై డియర్ మార్కండేయ', 'స్కంద'లో 'కల్ట్ మామా' సాంగ్స్లో హుషారుగా స్టెప్పులేసింది. చివరగా జాట్ మూవీలోనూ 'టచ్ కియా' పాటలో అదరగొట్టింది.చదవండి: పాతిక వేల సాయం.. దాని విలువ ఇప్పుడు రూ.5 కోట్లు: దర్శకుడు -
ఏజ్బార్ అయ్యావంటూ ట్రోల్.. ఏదీ శాశ్వతం కాదన్న నటి
పెళ్లి కచ్చితంగా చేసుకోవాలా? అంటే ఎవరిష్టం వారిది! అందులోనూ కొందరు సెలబ్రిటీలు వయసు దాటిపోతున్నా లెక్క చేయకుండా తమకు నచ్చినప్పుడే మ్యారేజ్ లైఫ్లో అడుగుపెడుతుంటారు. మరికొందరేమో పెళ్లి చేసుకోకపోతే జరిగే నష్టమేం లేదంటూ సింగిల్గానే బతికేస్తుంటారు. బాలీవుడ్ హీరోయిన్ శిల్పా శెట్టి చెల్లెలు, నటి షమితా శెట్టి కూడా 47 ఏళ్లొచ్చినా సింగిల్ లైఫ్యే బిందాస్ అంటూ బతికేస్తోంది.ఏజ్ షేమింగ్వారి మానాన వాళ్లు బతుకుంటే కొందరు అనవసరంగా ట్రోల్ చేస్తూ ఉంటారు. అలా ఓ వ్యక్తి షమిత వయసును ఉద్దేశిస్తూ కించపరిచేలా మాట్లాడాడు. నువ్వు ముసలిదానివైపోతున్నావ్.. ఒకప్పటిలా లేవని హేళన చేశాడు. ఆ కామెంట్కు సోషల్ మీడియా వేదికగా కౌంటరిచ్చింది షమిత. అవును, కాలంతో పాటు అన్నీ మారుతుంటాయి. అందుకు నేను కూడా అతీతురాలిని కాదు. పెళ్లయ్యుంటే ఈపాటికి..జీవితంలో వయసు పెరిగేకొద్దీ మార్పులు జరగడం అనేది చాలా సహజసిద్ధమైన ప్రక్రియ. అందంతోపాటు ఏదీ శాశ్వతంగా ఉండదు. కానీ ఈ వయసులోనూ నేను చాలా ఫిట్గా, సంతోషంగా ఉన్నాను. అది ఆ దేవుడు ఇచ్చిన వరం.. నాకదే చాలు అని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చింది. మరో నెటిజన్ ఆమె పెళ్లి గురించి ట్రోల్ చేశాడు. నువ్వు సరైన సమయంలో పెళ్లి చేసుకుని ఉండుంటే ఈపాటికి నీకు పిల్లలు పుట్టి నీ అంత అయ్యేవారు అని సెటైర్ వేశాడు. అన్ఫాలో చేయ్అందుకు షమిత స్పందిస్తూ.. అసలు మీరు పెళ్లి చేసుకుని ఏం సాధించారు? అయినా మీలాంటివారు మాలాంటి ఒంటరి మహిళల్ని ఎందుకు ఫాలో అవుతారు? మీ పురుషాధిక్య ఆలోచనల్ని మాపై రుద్దడానికా? మమ్మల్ని అవమానించడానికా? దయచేసి నాకో సాయం చేయు.. వెంటనే నన్ను అన్ఫాలో చేయు అని కోరింది. షమితా శెట్టి.. మొహబ్బతే, క్యాష్ వంటి పలు హిందీ చిత్రాల్లో నటించింది. తెలుగులో 'పిలిస్తే పలుకుతా' మూవీలో కథానాయికగా నటించింది. హిందీ బిగ్బాస్ 3, 15వ సీజన్లలో పాల్గొంది. ద టెనంట్ (2023) సినిమాతో వెండితెరపై రీఎంట్రీ ఇచ్చింది.చదవండి: ఆ ఆరు సినిమాల్లో పెద్ది ఫస్ట్ ప్లేస్: జగపతిబాబు -
ఫైట్కి సై
లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో కథానాయికలు పవర్ఫుల్ రోల్ చేయడం అనేది తెలిసిందే. అయితే అప్పుడప్పుడూ హీరో ఓరియంటెడ్ సినిమాల్లోనూ అలాంటి పాత్రలు హీరోయిన్లకు వస్తుంటాయి. అయితే అది అరుదుగా జరుగుతుంటుంది. ప్రస్తుతం నయనతారకు అలాంటి ఒక అవకాశం దక్కిందని సమాచారం. సల్మాన్ ఖాన్ సరసన నయనతార ఓ హిందీ–తెలుగు ద్విభాషా చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ఆమె పాత్ర కొన్ని సంభాషణలకు, పాటలకు మాత్రమే పరిమితం కాదన్నది తాజా టాక్. నయనతార పాత్రకు యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయట. ఆమెది పవర్ఫుల్ యాక్షన్ క్యారెక్టర్ అని తెలుస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం కోసం కొన్ని భారీ ఫైట్ సీక్వెన్స్కి సంబంధించిన చిత్రీకరణలో నయనతార పాల్గొన్నారట. ఈ సీన్స్ తీసే ముందు బాగా రిహార్సల్స్ చేసి కెమెరా ముందుకొచ్చారట ఈ బ్యూటీ. ఇప్పటివరకూ ఈ చిత్రం షూటింగ్ ముంబై, హైదరాబాద్ ప్రాంతాల్లో జరిగింది. ఈ షూటింగ్ చూసినవారు సల్మాన్–నయనతారల కెమిస్ట్రీ బాగుందని అంటున్నారు. అలాగే సల్మాన్–నయనతార పాల్గొన్న యాక్షన్ సీన్స్ కూడా అదిరిపోయేలా ఉన్నాయట. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ‘దిల్’ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం 2027 ఈద్కి రిలీజ్ కానుంది. -
మత్తు మందు ఇచ్చి లైంగిక దాడి...‘ధురంధర్’ ప్రొడక్షన్ డిజైనర్పై కేసు
చిత్రపరిశ్రమలో లైంగిక వేధింపులు ఇంకా కొనసాగుతున్నాయి. ఆడిషన్ల పేరుతో, షూటింగ్ లొకేషన్స్లో, వర్కింగ్ కండిషన్స్లో మహిళా నటీనటులు మాత్రమే కాదు టెక్నీషియన్లు కూడా నిరంతరం వేధింపులను ఎదుర్కొంటున్నారు. తాజాగా బాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘ధురంధర్’మూవీకి అసిస్టెంట్ ఆర్ట్ డైరెక్టర్గా పని చేసిన ఓ యువతిని ఆ సినిమా ప్రొడక్షన్ డిజైనర్ సైనీ జోహ్రే లైంగిక వేధింపులకు గురి చేశాడు. పని పేరుతో హోటల్కి పిలిపించుకొని అసభ్యకరంగా ప్రవర్తించాడు. తాజాగా ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.మత్తుమందు ఇచ్చి.. యువతి ఫిర్యాదు ప్రకారం.. గతేడాది సెప్టెంబర్ 10న సినిమాకు సంబంధించిన చర్చల కోసం సైనీ ఆమెను ఛండీగడ్లోని హోటల్కి రమ్మని చెప్పాడు. టీమ్ మీటింగ్ అనుకొని రాత్రి 8.30 గంటల సమయంలో ఆమె అక్కడకు వెళ్లింది. గదిలోకి వెళ్లేసరికి అక్కడ ఎవరూ లేరు. ప్లాన్ ప్రకారం సైనీ జోహ్రే ఆమెను మాత్రమే ఆహ్వానించాడు. ఆమె రాగానే వైన్లో మత్తుమందు కలిపి తాగమని బలవంతం చేశాడు. ఆమె అది సేవించగానే తలతిరిగినట్లుగా అనిపించింది. అదే సమయంలో ఆమెతో అసభ్యకరంగా ప్రవరించాడు.(చదవండి: చిరంజీవి ఆరోగ్యంపై తప్పుడు ప్రచారం.. కేసు నమోదు)కెరీర్ నాశనం చేస్తానని బెదిరింపులుతనకు అనారోగ్యంగా ఉందని చెప్పినా వినిపించుకోలేదు. బాత్రూంకి వెళ్లి వాంతులు చేసుకున్నా. అక్కడ కూడా అసభ్యకరంగా ప్రవర్తించాడు. బయటకు వెళ్లనీయకుండా బలవంతం చేశాడు. రాత్రంతా అక్కడే ఉన్నా. మరసటి రోజు ఉదయమే క్యాబ్ బుక్ చేసుకొని ఇంటికి వెళ్లిపోయా. ఆ తర్వాత ఈ విషయం బయటకు చెప్తే కెరీర్ నాశనం చేస్తానని బెదిరించాడు. ఈ బెదిరింపులు రోజు రోజుకి ఎక్కువైపోయాయి. అందుకే ఇప్పుడు ఫిర్యాదు చేస్తున్నా’ అని సదరు యువతి పేర్కొంది. యువతి ఫిర్యాదు మేరకు చండీగఢ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆడపులులం మేము
ఆడపిల్ల కదా... సిల్వర్ స్క్రీన్పై ఆడుతూపాడుతూ గ్లామరస్గా కనిపిస్తే చాలు అనే రోజులు పోయాయి. గ్లామర్ని పక్కన పెట్టి, సిల్వర్ స్క్రీన్పై డిష్యుం డిష్యుంకి సై అంటున్న రోజులు వచ్చాయి. మెరుపు తీగలా కనిపించే కథానాయికలు సినిమాలో విలన్లపై మెరుపు దాడి చేయడానికి ట్రైనింగ్ తీసుకుని మరీ సెట్లోకి ఎంటరవుతున్నారు. దీపికా పదుకోన్ వంటి సీనియర్ హీరోయిన్ మాత్రమే కాదు... రష్మికా మందన్నా, సంయుక్త, ఆలియా భట్, కృతీ సనన్... ఇలా పలువురు యంగ్ హీరోయిన్స్ పవర్ఫుల్ రోల్స్ చేస్తున్నారు. ఆ క్యారెక్టర్స్ కోసం గుర్రపు స్వారీ, కత్తి సాము, గన్ షూట్ వంటి వాటిలో కఠినమైన శిక్షణ తీసుకున్నారు. ‘ఆడపులులం మేము’ అంటూ ఈ హీరోయిన్లు ఏయే చిత్రాల్లో పవర్ఫుల్గా కనిపించనున్నారో తెలుసుకుందాం...‘మైసా’ కోసం మార్షల్ ఆర్ట్స్ఒకపాత్ర ఒప్పుకుంటే ఆపాత్రలానే మారిపోవాలనుకుంటారు రష్మికా మందన్నా. ఆ క్యారెక్టర్కి న్యాయం చేయడానికి ఎంత రిస్క్ అయినా తీసుకుంటారు. ‘మైసా’ సినిమాలోని మైసాపాత్ర కోసం ఈ బ్యూటీ తీసుకున్న ఓ రిస్క్ 80 అడుగుల ఎత్తు నుంచి దూకడం. నిజానికి ఈ సన్నివేశాన్ని డూప్తో చేయిద్దామని యూనిట్ అన్నప్పటికీ ‘నో నో’ అంటూ, తానే చేశారు. ఇంకా ఈ సినిమా కోసం బోలెడన్ని రిస్కీ ఫైట్స్ చేస్తున్నారామె. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ కోసం రష్మిక థాయ్లాండ్లోని బ్యాంకాక్లో ప్రత్యేకంగా స్టంట్స్, మార్షల్ ఆర్ట్స్లో కఠోర శిక్షణ తీసుకున్నారు.రోజుకు దాదాపు 8 గంటలపాటు అంతర్జాతీయ నిపుణుల పర్యవేక్షణలో ఈ శిక్షణ సాగింది. హ్యాండ్ టు హ్యాండ్ ఫైట్స్, అధునాతన స్టంట్ టెక్నిక్స్ వంటివి నేర్చుకున్నారు. ఆ ట్రైనింగ్ పూర్తయ్యాక కేరళలో తీసిన యాక్షన్ సీక్వెన్స్లో భాగంగా 80 అడుగుల ఎత్తు నుంచి దూకారు. రవీంద్ర పుల్లె దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మైసా అనే గిరిజన గోండు యువతిపాత్రలో కనిపించనున్నారు రష్మిక. ఈ షెడ్యూల్ కోసమే రష్మిక బ్యాంకాక్లో ప్రత్యేక శిక్షణ పొందారు. అంతర్జాతీయ యాక్షన్ డైరెక్టర్ ఆండీ లాంగ్ ఈ చిత్రానికి స్టంట్స్ పర్యవేక్షిస్తున్నారు. ఈ యాక్షన్ ఎమోషనల్ థ్రిల్లర్ ఈ ఏడాదే విడుదల కానుంది.కత్తి సాముకి సైక్యారెక్టర్ డిమాండ్ మేరకు నటించడానికి కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చేస్తా అంటున్నారు సంయుక్త. అనడమే కాదు... ఆ పని చేశారు కూడా. ‘స్వయంభు’ సినిమాలో చేసిన యోధురాలిపాత్ర కోసం ఆమె గుర్రపు స్వారీ నేర్చుకున్నారు, కత్తి సాములో శిక్షణ తీసుకున్నారు. ప్రముఖ స్టంట్ మాస్టర్ కింగ్ సాల్మన్ పర్యవేక్షణలో ఆమె ఈ యుద్ధ విద్యలు నేర్చుకున్నారు. అంతే కాదు... ఈ పోరాట సన్నివేశాలు చిత్రీకరించే రోజు షూటింగ్కు దాదాపు నాలుగైదు గంటల ముందు ప్రాక్టీస్ సెషన్స్లోపాల్గొన్నారు. ఈ చిత్రంలోని యాక్షన్ సన్నివేశాలను దట్టమైన అడవుల నేపథ్యంలో చిత్రీకరించారు. అందువల్ల శిక్షణను కూడా అదే తరహా వాతావరణంలో, కొండలు గుట్టలు వంటి కఠినమైన భూభాగాలకు అలవాటు పడేలా నిర్వహించారు. ఇక ఈ భారీపాన్ ఇండియన్ మూవీలోనిపాత్ర కోసం హీరో నిఖిల్ సిద్ధార్థ్ కఠినమైన యుద్ధ విద్యలు నేర్చుకున్నారు. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది.ఎనిమిది మంది ఫైటర్స్తో దీపిక ఫైట్ఇరవై ఏళ్లయింది దీపికా పదుకోన్ సినిమాల్లోకి వచ్చి. ఇన్నేళ్లల్లో గ్లామరస్ క్యారెక్టర్స్తోపాటు పూర్తిగా పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్స్ కూడా చేశారు. అలాగే ‘పఠాన్, జవాన్, ఫైటర్’ వంటి సినిమాల్లో యాక్షన్ రోల్స్ చేశారు. ‘ఫైటర్’ సినిమా కోసం ఆమె మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్చుకున్నారు. తాజాగా చేస్తున్న ‘కింగ్’ సినిమా కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకోలేదు కానీ... స్టంట్ రిహార్శల్స్ చేశారట. ఈ చిత్రంలో ఒకేసారి ఎనిమిది మంది ఫైటర్స్తో దీపిక ఫైట్ చేసే యాక్షన్ సీన్ ఉందని సమాచారం. అలాగే ఈ సినిమా క్లైమాక్స్లో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ని సౌత్ ఆఫ్రికాలో చిత్రీకరించారని టాక్. ఈ భారీ ఫైట్లో షారుక్, దీపిక, సుహానాపాల్గొన్నారట. ఒక నటి 20 ఏళ్ల తర్వాత కూడా ఉత్సాహంగా యాక్షన్ రోల్స్ ఒప్పుకోవడం, రిహార్సల్స్ చేసి మరీ చేయడం అనేది అభినందించదగ్గ విషయం. ఇదిలా ఉంటే... అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘రాకా’ సినిమాలోనూ దీపికా పదుకోన్ ఓ పవర్ఫుల్ రోల్లో కనిపించనున్నారు. ప్రస్తుతం ఆమె గర్భవతి. ‘కింగ్’ సినిమాకి ముందే ట్రైనింగ్ తీసుకుని, యాక్షన్ సీన్స్ చేశారు దీపికా పదుకోన్. అయితే గర్భవతి కావడంతో ‘రాకా’లోని యాక్షన్ సీన్స్ని ఆమెకు బదులు డూప్తో చేయించాలనుకుంటున్నారట. కాగా ‘కింగ్’ సినిమా కోసం యువ నటి సుహానా కూడా ప్రత్యేకమైన ట్రైనింగ్ తీసుకున్నారు. ఆ విశేషాల్లోకి వస్తే...సుహానా... షూట్కి రెడీ‘రెడీ టు షూట్’ అంటూ సిల్వర్ స్క్రీన్ పైకి రావడం రావడమే సుహానా ఖాన్ ‘కింగ్’ చిత్రంతో తుపాకీతో ఎంట్రీ ఇస్తున్నారు. మామూలుగా ‘స్టార్ కిడ్స్’పై ఎన్ని అంచనాలు ఉంటాయో షారుక్ ఖాన్ తనయగా సుహానా మీద అన్నీ ఉన్నాయి. 2023లో చేసిన ‘ది ఆర్చీస్’ సుహానాకి తొలి సినిమా. అయితే ఆ సినిమా నేరుగా ఓటీటీ ప్లాట్ఫామ్లో విడుదలైంది. సో... ‘కింగ్’ వంటి భారీ యాక్షన్ సినిమాతో సుహానా వెండితెరపైకి వస్తున్నారు. ఈ చిత్రంలో షారుక్ ఒక క్రూరమైన, అసలు ఏమాత్రం పశ్చాత్తాపం లేని హంతకుడిపాత్రలో కనిపిస్తారట. ఆయనపాత్ర రెండు టైమ్లైన్స్లో ఉంటుందని సమాచారం.ఒకటి గ్యాంగ్స్టర్ క్యారెక్టర్ అని టాక్. ఈ చిత్రంలో షారుక్ శిష్యురాలిపాత్రను సుహానా చేస్తున్నారు. షారుక్ దగ్గర యాక్షన్ ట్రైనింగ్ తీసుకునేలా ఈపాత్ర ఉంటుందని తెలిసింది. ఇక ఇది పూర్తిగా యాక్షన్ క్యారెక్టర్ కావడంతో ‘కింగ్’ షూటింగ్ ఆరంభించే ముందు దాదాపు ఆరు నెలలపాటు అంతర్జాతీయ శిక్షకుల వద్ద మార్షల్ ఆర్ట్స్, గన్ షూట్ వంటి వాటిలో శిక్షణ తీసుకున్నారు సుహానా. ఈ షూటింగ్ లొకేషన్లో కుమార్తెకు షారుక్ కూడా కొన్ని యాక్షన్ మెళకువలు నేర్పిస్తున్నారట. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో అభిషేక్ బచ్చన్, అనిల్ కపూర్, రాణీ ముఖర్జీ, దీపికా పదుకోన్ తదితరులు నటిస్తున్నారు. ఈ ఏడాది క్రిస్మస్కి ‘కింగ్’ని విడుదల చేయాలనుకుంటున్నారు.ఫైట్కే కాదు... పాటకూ ట్రైనింగ్స్పై ఏజెంట్ క్యారెక్టర్ చేయడం అంటే మామూలు విషయం కాదు... బ్రెయిన్తో ఆలోచించి, ప్రత్యర్థిని ట్రాప్ చేయాలి, బాడీ పవర్ని ఉపయోగించి రఫ్ఫాడించాలి. సిల్వర్ స్క్రీన్పై మెరుపు తీగల్లా కనిపించే ఆలియా భట్, శార్వరి ఈ స్పై క్యారెక్టర్ చేశారు. ఆ సినిమానే యశ్ రాజ్ ఫిలింస్ నిర్మించిన ‘ఆల్ఫా’. బాలీవుడ్లో అగ్ర నిర్మాణ సంస్థ అయిన యశ్ రాజ్ ఫిలింస్ నుంచి స్పై సినిమాలు చాలా వచ్చాయి. కానీ అవన్నీ హీరో ఓరియంటెడ్ సినిమాలు. ఈ సంస్థలో స్పై యూనివర్స్లో రూపొందిన తొలి మహిళా ప్రధాన చిత్రం ‘ఆల్ఫా’. ఈ సినిమాలో పవర్ఫుల్ స్పై ఏజెంట్లుగా ఒదిగిపోవడానికి ఆలియా, శార్వరి ఫిట్నెస్తోపాటు మార్షల్ ఆర్ట్స్లో కూడా ట్రైనింగ్ తీసుకున్నారు.జిమ్లో ఫంక్షనల్ ట్రైనింగ్, స్ట్రెంగ్త్ ఎక్సర్సైజెస్ చేస్తూ, పూర్తిగా యాక్షన్ మోడ్లో ఉన్న వీడియోలను ఆలియా షేర్ చేయగా, అవి వైరల్ అయ్యాయి. విశేషం ఏంటంటే... ఫైట్స్కి మాత్రమే కాదు... ఈ సినిమాలోని ఓ స్పెషల్ సాంగ్ కోసం కూడా ఆలియా, శార్వరి కఠినమైన వర్కౌట్స్ చేశారట. ఈపాట డ్యాన్స్ మూమెంట్స్ ఎక్కువ స్టామినాని డిమాండ్ చేయడంతో ఈ వర్కౌట్స్ చేశారని తెలిసింది. ఇద్దరూపాల్గొన్న ఫైట్స్, ఈ స్పెషల్ సాంగ్ సినిమాకే హైలైట్గా ఉంటాయని బాలీవుడ్ టాక్. శివ్ రావైల్ దర్శకత్వంలో రూపొందిన ‘ఆల్ఫా’ జూలై 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.ఏజెంట్గా ఫైట్ఆలియా, శార్వరిలానే వామికా గబ్బి కూడా స్పై క్యారెక్టర్ చేస్తున్నారు. ప్రత్యర్థులపై తుపాకీ ఎక్కు పెట్టి, ఏజెంట్గా సిల్వర్ స్క్రీన్పై విజృంభించడానికి వామికా శిక్షణ తీసుకున్నారు. ‘జీ 2’ సినిమా కోçసమే వామికా గబ్బి ట్రైనింగ్ తీసుకుని మరీ సెట్స్లోకి ఎంటరయ్యారు. అడివి శేష్ హీరోగా నటించిన ‘గూఢచారి’కి (2018) సీక్వెల్గా ‘జీ 2’ రూపొందుతోంది. ఈ చిత్రంలో ఏజెంట్ గోపి 116పాత్ర చేశారు శేష్. సీక్వెల్లోనూ ఈపాత్ర చేస్తున్నారు. ఏజెంట్ మహాలక్ష్మి నాగిన్గా వామికా గబ్బి నటిస్తున్నారు. ఈ సినిమాకి వినయ్ కుమార్ సిరిగినీడి దర్శకత్వం వహిస్తున్నారు.ఇందులోని యాక్షన్ సీన్స్, స్పై మిషన్స్, ఫిట్నెస్కి సంబంధించి వామికా గబ్బి ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నారు. కాగా ఈ సినిమా కోసం యూరప్లో చిత్రీకరించిన ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ హైలైట్గా ఉంటుందని తెలిసింది. ఇక 2015లో ‘భలే మంచి రోజు’ చిత్రం ద్వారా వామికా తెలుగు పరిశ్రమకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత పంజాబీ, హిందీ మలయాళం వంటి భాషల్లో నటించిన వామికా ‘జీ 2’తో మళ్లీ తెలుగు తెరపై కనిపించనున్నారు. ‘భలే మంచి రోజు’లో ట్రెడిషనల్ క్యారెక్టర్లో కనిపించిన వామిక ‘జీ 2’లో పూర్తి భిన్నంగా చాలా పవర్ఫుల్గా కనిపించనున్నారు. ఈపాన్ ఇండియన్ స్పై యాక్షన్ మూవీ పలు భాషల్లో ఈ ఏడాది చివర్లో విడుదల కానుంది.ఇంటర్పోల్ ఆఫీసర్గా ట్రైనింగ్గ్లామరస్, డీ గ్లామరస్, ట్రెడిషనల్... ఏ క్యారెక్టర్ అయినా చేయడానికి రెడీ అంటారు కృతీ సనన్. ‘ఆది పురుష్’లో సీతగా కనిపించిన ఈ బ్యూటీ ‘మిమీ’లో సరోగేట్ మదర్ క్యారెక్టర్లో ఒదిగిపోయారు. త్వరలో విడుదల కానున్న ‘కాక్టెయిల్ 2’లో గ్లామరస్గా కనిపించనున్నారు. ఇప్పుడు తనలోని పూర్తి స్థాయి యాక్షన్ నటిని ఆవిష్కరించుకోవడానికి కృతి కసరత్తులు చేస్తున్నారట. మరి... ఈ బ్యూటీకి వచ్చిన ఆఫర్ అలాంటిది. బాలీవుడ్ భారీ మాస్ సినిమాల్లో ఒకటైన ‘డాన్’ సిరీస్లో నటించే చాన్స్ కృతీకి దక్కిందని సమాచారం. ‘డాన్, డాన్ 2’ చిత్రాల తర్వాత దర్శకుడు ఫర్హాన్ అక్తర్ ‘డాన్ 3’ చేయనున్న విషయం తెలిసిందే.రెండు భాగాల్లో డాన్గా షారుక్ ఖాన్, ఇంటర్పోల్ ఆఫీసర్ రోమాగా ప్రియాంకా చోప్రా నటించారు. అయితే మూడో భాగంలో రణ్వీర్ సింగ్ని డాన్పాత్రకు తీసుకున్నారు ఫర్హాన్ అక్తర్. కానీ, ఈ సినిమా నుంచి రణ్వీర్ తప్పుకున్నారు. ఇక షూటింగ్ ఆరంభించడమే ఆలస్యం అనే తరుణంలో సరిగ్గా మూడు వారాల ముందు రణ్వీర్ తప్పుకున్నారట. ఈ విషయంలో రణ్వీర్–ఫర్హాన్ మధ్య వివాదం నెలకొంది. ముందు నటిస్తానని చెప్పి, తర్వాత తప్పుకోవడంతో రణ్వీర్కి సహాయ సహకారాలు అందించకూడదని ముంబైకి చెందిన ‘ఫిల్మ్ బాడీ’ నిర్ణయించుకుంది.అలాగే నష్టపరిహారం కింద రణ్వీర్ తనకు రూ. 45 కోట్లు ఇవ్వాలని ఫర్హాన్ డిమాండ్ చేస్తున్నారు. మరి... ఈ వివాదం ఎప్పుడు సద్దుమణుగుతుందనేది కాలమే చెప్పాలి. ఇదిలా ఉంటే... ఈ సినిమాలో ఇంటర్పోల్ ఆఫీసర్ రోమాపాత్రకు కృతీ సనన్ని ఎంపిక చేశారని భోగట్టా. ‘డాన్’ సిరీస్లో ఈపాత్రకు యాక్షన్ సీన్స్ ఉన్నట్లే మూడో భాగంలోనూ ఉంటాయి. దాంతో కృతీ సనన్ మార్షల్ ఆర్ట్స్లో ట్రైనింగ్ తీసుకుంటున్నారనే వార్త వినిపిస్తోంది.అయితే కృతీ సనన్ని ఈ చిత్రానికి ఎంపిక చేసినట్లు యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రాలేదు. కానీ, ఫర్హాన్ అక్తర్ ఆఫీస్ వద్ద కృతి పలుమార్లు కనిపించడంతో ‘డాన్ 3’ చర్చల్లోపాల్గొనడానికే అని ప్రచారంలో ఉన్న వార్తకు బలం చేకూరినట్లయింది. ఇక ఈ సినిమాని 2023లోనే ప్రకటించారు ఫర్హాన్. అయితే ఇప్పటివరకూ షూటింగ్ ఆరంభించలేదు. త్వరలోనే ఈ చిత్రం షూటింగ్ ఆరంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు.ఈ తారలే కాదు... మరికొంత మంది కూడా క్యారెక్టర్ డిమాండ్ మేరకు కసరత్తులు చేసి, సెట్స్లోకి అడుగుపెడుతున్నారు. రిస్క్ తీసుకోవడానికి ఏమాత్రం వెనకాడకుండాపాత్రల్లో ఒదిగిపోతున్న ఈ కథానాయికలను అభినందించాల్సిందే. – డి.జి. భవాని -
అనన్య పాండే వింత డ్యాన్స్.. ట్రోలింగ్పై స్పందించిన చంకీ పాండే
బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే డ్యాన్స్ వీడియో ఒకటి గత రెండు రోజులుగా నెట్టింట్ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఆమె నటించిన కొత్త మూవీ ‘చాంద్ మేరా దిల్’సినిమాలోని వీడియో అది. అందులో అనన్య సంప్రదాయ దుస్తుల్లో నాట్యం చేస్తూ కనిపిస్తుంది. అయితే ఆ డ్యాన్స్ చూస్తే భరతనాట్యంలా అనిపించినప్పటికీ.. స్టెప్పులు మాత్రం ఇబ్బందికరంగా,వింతగా ఉండడంతో నెటిజన్స్ ఆమెను ట్రోల్ చేయడం ప్రారంభించారు. అలా స్టెప్పులేని భరతనాట్యాన్ని అవమానపరిచిందంటూ అనన్యపై ఫైర్ అవుతున్నారు.‘ట్రెడిషనల్ భరతనాట్యం వర్సెస్ బాలీవుడ్ నాట్యం’ అంటూ మీమ్స్ కూడా క్రియేట్ చేసి.. అనన్యను విమర్శిస్తూ కామెంట్స్ పెడుతున్నారు. తాజాగా ఈ ట్రోలింగ్ వీడియోపై అనన్య పాండే తండ్రి, ప్రముఖ నటుడు చంకీ పాండే స్పందించాడు. చిన్న క్లిప్పు చూసి జడ్జ్ చేయడం కరెక్ట్ కాదని, సినిమా చూసి అసలు విషయాన్ని అర్థం చేసుకున్నాక స్పందిస్తే బాగుంటుందని ఆయన అన్నారు. సినిమాలో భరతనాట్యాన్ని ప్రదర్శించలేదని, అది కల్చరర్ ఈవెంట్లలో విద్యార్థులు ప్రదర్శించే ఫ్యూజన్ డ్యాన్స్ పెర్ఫామెన్స్ లాంటిదని చంకీ పాండే వివరణ ఇచ్చారు. చాలా మంది అపార్థం చేసుకొని తన కూతురిని విమర్శిస్తున్నారని ఆయన .పేర్కొన్నారు.‘చాంద్ మేరా దిల్’ విషయానికొస్తే.. లక్ష్య్, అనన్య జంటగా నటించిన ఈ చిత్రానికి వివేక్ సోనీ దర్శకత్వం వహించారు. ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కాలేజీలోనే ప్రేమించుకున్న ఒక అమ్మాయి అబ్బాయి రిలేషన్ షిప్ లోకి వెళ్ళాక వచ్చిన సమస్యలు ఏంటి? వాటిని ఎలా ఎదుర్కొన్నారు? అనేది ఈ సినిమా కథ. హైదరాబాద్ నేపథ్యంలోనే కథనం సాగుతుంది. Bollywood rarely creates originals these days, but somehow always finds a way to ruin the originals that already exist.#BharatNatayam #AnanyaPandey pic.twitter.com/fwukikOkhi— MK Sharma ✍️ (@EmediaManoj) May 25, 2026 -
66 హార్డ్ డిస్క్లు, లక్షల విలువైన డేటా మాయం : షాక్లో డైరెక్టర్లు
ప్రముఖ చలనచిత్ర దర్శకులు జోయా అక్తర్, రీమా కాగ్తీలకు భారీ షాక్ తగిలింది. వీరి నిర్మాణ సంస్థ ‘టైగర్ బేబీ’ (Tiger Baby)లో విలువైన డేటాను తస్కరించిన వైనం దిగ్భ్రాంతి రేపింది. ముంబైలోని బాంద్రాలో ఉన్న ఆ సంస్థ కార్యాలయం నుండి, ముఖ్యమైన సినిమా , OTT సంబంధిత డేటా నిక్షిప్తమై ఉన్న 66 హార్డ్ డిస్క్లు దొంగతనం ఆరోపణలపై బాంద్రా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించగా షాకింగ్ నిజాలు తెలిశాయి. ఈ డిస్క్ల మార్కెట్ విలువ సుమారు రూ. 13 లక్షలు ఉంటుందని అంచనా. ఇంకా విడుదల కాని సినిమాలు, వెబ్ సిరీస్లకు సంబంధించిన 2026 మే నెలలో 66 హార్డ్ డిస్క్లు దొంగతనానికి గురయ్యాయి. ఈ డిస్క్లలో 16TB నుండి 72TB వరకు నిల్వ సామర్థ్యం ఉంటుందని వారి ఫిర్యాదు ద్వారా తెలుస్తోంది. ఈ ఫుటేజ్తోఆటు, రఫ్ ఎడిట్స్, యాడ్ ప్రాజెక్ట్లు, పోస్ట్-ప్రొడక్షన్ మెటీరియల్స్ , ముగిసిన సినిమాల బ్యాకప్ డేటా ఉన్నాయి.ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో వచ్చిన ‘మేడ్ ఇన్ హెవెన్’ (Made in Heaven) సిరీస్, అలాగే 2020లో నెట్ఫ్లిక్స్లో విడుదలైన ‘ఘోస్ట్ స్టోరీస్’ (Ghost Stories) ప్రాజెక్ట్లకు సంబంధించిన డేటా కూడా ఇందులో ఉన్నట్లు సమాచారం.వీటిల్లో కొన్ని డిస్క్లు గ్రే మార్కెట్లో విక్రయించగా, గోప్యమైన డేటా లీక్ అయ్యే అవకాశాలపై నిపుణుల విచారణ చేపట్టారు.ఇంటిదొంగల పనే మే 21న ఆఫీస్ సిబ్బంది పని కోసం హార్డ్ డిస్క్లను వెతకగా అవి కనిపించలేదు. కంపెనీలో ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ , హెచ్ఆర్ అడ్మినిస్ట్రేటర్గా పనిచేస్తున్న మెహజబీన్ ముస్తాక్ షేక్ అంతర్గతంగా తనిఖీ చేయగా అసలు విషయం బయటపడింది. స్టోరేజ్ క్యాబినెట్లో ఉన్న అసలైన హార్డ్ డిస్క్లను దొంగిలించి, వాటి స్థానంలో ఖాళీ లేదా పాడైపోయిన డబ్బాలను ఉంచినట్లు గుర్తించారు. దీనిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈకేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మొదటివాడు ఆ స్టోరేజ్ క్యాబినెట్ను పర్యవేక్షించే ఆఫీస్ ఉద్యోగే ఈ దొంగతనానికి పాల్పడినట్లు ఒప్పుకున్నాడు. గ్రే మార్కెట్ (Grey Market)లో ఒక్కో హార్డ్ డిస్క్ను రూ. 15,000 నుండి రూ. 20,000 లకు విక్రయించినట్లు తెలిపాడు. ఇక రెండో నిందితుడు బోరివలికి చెందిన ఒక వ్యక్తి ఈ డిస్క్లను కొనుగోలు చేయగా, పోలీసులు అతన్ని కూడా అరెస్ట్ చేశారు. కోర్టు వీరికి మే 29 వరకు పోలీస్ కస్టడీ విధించింది.సైబర్ నిపుణుల దర్యాప్తుదొంగిలించబడిన వాటిలో 24 హార్డ్ డిస్క్లను నిందితుడు అమ్మేయగా, మిగిలిన వాటి కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే, హార్డ్వేర్ దొరకడం కంటే కూడా అందులోని రహస్య డేటాను ఎవరైనా కాపీ చేశారా? లేదా ఆన్లైన్లో ఎక్కడైనా లీక్ చేశారా? అనే కోణంలో సైబర్ క్రైమ్ నిపుణులు నిశితంగా పరిశీలిస్తున్నారు. వినోద పరిశ్రమలో డేటా సెక్యూరిటీ (సమాచార భద్రత) ఎంత ముఖ్యమనే దానికి ఈ ఘటన ఒక ఉదాహరణగా నిలిచింది. -
కవలలకు జన్మనిచ్చిన సీరియల్ హీరోయిన్
ప్రముఖ సీరియల్ నటి దివ్యాంక త్రిపాఠి, వివేక్ దహియా దంపతులు శుభవార్త చెప్పేశారు. తమకు మంగళవారం కవల మగబిడ్డలు జన్మించినట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. మేము ఆనందాన్ని కోరుకున్నాం. దేవుడు 'డబుల్గా తీసుకోండి' అన్నాడు. మా జీవితంలోకి కవల మగబిడ్డలు వచ్చారు' అని చెప్పుకొచ్చారు.(ఇదీ చదవండి: 'ధురంధర్' హీరోపై బాలీవుడ్లో నిషేధం)కొన్ని నెలల క్రితం దివ్యాంక తాను ప్రెగ్నెన్సీతో ఉన్న సంగతి బయటపెట్టింది. దాదాపు ఆరు నెలల పాటు ఈ విషయాన్ని రహస్యంగా ఉంచామని ఆమె చెప్పుకొచ్చింది. మాకు ఇప్పుడు బిడ్డ కావాలని అనిపించింది. ప్రయత్నించాం… దేవుడు ఆశీర్వదించాడు అని అప్పట్లో ఆమె చెప్పింది. ఇప్పుడు ఇద్దరబ్బాయిలకు తల్లయింది. 'యే హై మొహబ్బతేన్' సీరియల్ షూటింగ్ టైంలో దివ్యాంక, వివేక్ ఒకరికి ఒకరు పరిచయమయ్యారు. 2016 జూలై 8న పెళ్లి చేసుకున్నారు. (ఇదీ చదవండి: ముమైత్ ఖాన్ ఇప్పుడేం చేస్తోంది? పాక్తో ఈమెకు సంబంధమేంటి?) View this post on Instagram A post shared by Vivek Dahiya (@vivekdahiya) -
'ధురంధర్' హీరోపై బాలీవుడ్లో నిషేధం
'ధురంధర్' రెండు సినిమాలతో బ్లాక్బస్టర్ హిట్స్ కొట్టిన హీరో రణ్వీర్ సింగ్పై నిషేధం. బాలీవుడ్లో ఇకపై ఇతడు సినిమాలు చేయడం కష్టమే అనే మాట ఇప్పుడు వినిపిస్తోంది. దీనికి కారణం 'డాన్ 3' అనే మూవీ. సడన్గా తప్పుకోవడంతో ఆ చిత్ర దర్శకనిర్మాత.. రణ్వీర్పై ఫిర్యాదు చేయడమే దీనికి కారణం. మరి ఈ నిషేధం వల్ల రణ్వీర్కి నష్టమేంటి?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 19 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్) హిందీ హీరోల్లో రణ్వీర్ సింగ్ పేరున్న హీరోనే. పద్మావత్, రామ్ లీల్ లాంటి సినిమాల్లో అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు. కానీ ఇతడికి గత కొన్నేళ్ల నుంచి సరైన హిట్ అనేది లేదు. సరిగ్గా ఈ టైంలో 'ధురంధర్' మూవీస్ సక్సెస్ కావడం ఇతడి గ్లోబల్ వైడ్ గుర్తింపు తీసుకొచ్చింది. అయితే ఈ చిత్రాల్లో నటించడానికి ముందే 'డాన్ 3' అనే ప్రాజెక్ట్ ఒప్పుకొన్నాడు.2023 ఆగస్టులోనే 'డాన్ 3'కి సంబంధించిన ప్రకటన వచ్చింది. ఫర్హాన్ అక్తర్ దర్శకత్వంలో రణ్వీర్, కియారా అడ్వాణీ హీరోహీరోయిన్లు అని అనౌన్స్ చేశారు. అయితే పలు కారణాల వల్ల ఈ చిత్రం ఆలస్యమవుతూ వచ్చింది. 'ధురంధర్' రావడానికి ముందు కూడా ఫర్హాన్, రణ్వీర్ మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయనే టాక్ వినిపించింది. తర్వాత కొన్నాళ్లకు రణ్వీర్ ఈ మూవీ నుంచి తప్పుకొన్నాడు. అయిత షూటింగ్ మొదలవడానికి కొన్నివారాల ముందు ఇలా చేయడంతో తమకు రూ.40-45 కోట్ల నష్టం వాటిల్లిందని ఫర్హాన్.. ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయిస్(FWICE)ని ఆశ్రయించాడు.ఈ క్రమంలోనే సినీ ఎంప్లాయిస్ ఫెడరేషన్.. రణ్వీర్ సింగ్పై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించడంతో అంతా షాకయ్యారు. అయితే ఈ ఆదేశం చట్టపరమైన నిషేధం కాదు. కాకపోతే ఈ ఫెడరేషన్కి అనుబంధంగా ఉన్న కార్మికులు, టెక్నీషియన్లు, ఇతర సినీ ఉద్యోగులు రణవీర్ సింగ్తో కలిసి పని చేయడానికి కుదరదు. బాలీవుడ్ చాలావరకు ఈ వర్గాలపై ఎక్కువగా ఆధారపడటం వల్ల, ఇది సదరు హీరో భవిష్యత్ ప్రాజెక్టులపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది.ఈ వివాదంపై స్పందించిన రణవీర్ సింగ్ తరఫు ప్రతినిధి మాత్రం పబ్లిక్గా దీని గురించి స్పందించడం ఇష్టం లేదని.. వృత్తిపరమైన విభేదాలను వ్యక్తిగతంగా పరిష్కరించుకోవాలని రణవీర్ భావిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే దీనంతటికి 'ధురంధర్' సక్సెస్ కారణమా అని సందేహం కలుగుతోంది. ఎందుకంటే ఈ మూవీ హిట్ అయినా సరే బాలీవుడ్ టాప్ హీరోలు, దర్శకనిర్మాతలు కనీసం స్పందించలేదు. బహుశా ఈ కారణంతోనే రణ్వీర్పై ప్రతీకారం తీర్చుకుంటున్నారా అని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు.(ఇదీ చదవండి: పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో.. డాక్టర్తో నిశ్చితార్థం) -
వివాదంలో రణ్వీర్ సింగ్
రణ్వీర్ సింగ్ వివాదంలో చిక్కుకున్నారు. దానికి కారణం ‘డాన్ 3’ సినిమా. ఫర్హాన్ అక్తర్ దర్శకత్వంలో రణ్వీర్ సింగ్ హీరోగా 2023లో ‘డాన్ 3’ సినిమా ప్రకటన వచ్చింది. రితేష్ సిధ్వాని, ఫర్హాన్ అక్తర్ ఈ చిత్రానికి నిర్మాతలు. ఇప్పటివరకూ ఈ సినిమా సెట్స్కు వెళ్లలేదు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి రణ్వీర్ సింగ్ సడన్గా తప్పుకోవడం వివాదమైంది. దీంతో దాదాపు రూ. 45 కోట్ల నష్టం వాటిల్లిందని ఫర్హాన్ అక్తర్ ఆరోపించి, ‘ది ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎం΄్లాయిస్’ (ఎఫ్డబ్ల్యూఐసీఈ)కి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఎఫ్డబ్ల్యూఐసీఈ చీఫ్ అడ్వైజర్ అశోక్ పండిట్ మాట్లాడుతూ– ‘‘రణ్వీర్ సింగ్ వల్ల కలిగిన నష్టాన్ని భర్తీ చేయాలని ఏప్రిల్ 10న ఫర్హాన్ అక్తర్ ఫిర్యాదు చేశారు.మరో మూడు వారాల్లో ‘డాన్ 3’ప్రారంభమవ్వాల్సిన సమయంలో రణ్వీర్ ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. దాదాపు 200మంది వర్కర్స్కు హోటల్ బుకింగ్స్, ట్రావెల్ ప్లాన్, లొకేషన్ బుకింగ్ వంటివాటికి ఫర్హాన్, రితేష్ ఖర్చు చేశారు. అలాగే ఫర్హాన్ నిర్మాణ సంస్థ అయిన ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్తో మూడు సినిమాలు చేసేందుకు రణ్వీర్ కాంట్రాక్ట్ చేసుకున్నారు. స్క్రిప్ట్ వర్క్ ఆయన సమక్షంలోనే జరిగింది. రణ్వీర్ సింగ్ను తన తరఫు వాదనలు వినిపించాలని మూడు నోటీసులు పంపాం. కానీ స్పందన లేదు’’ అని తెలిపారు. ‘‘ఎంతటి సూపర్ స్టార్ హీరో అయినా చట్టం ముందు గొప్ప కాదని మేం ఇండస్ట్రీకి చెప్పాలనుకుంటున్నాం. రణ్వీర్ సింగ్ వచ్చి, మమ్మల్ని కలిసేంత వరకు ఆయనపై సహాయ నిరాకరణ కొనసాగుతుంది’’ అని ఎఫ్డబ్ల్యూఐసీఈ అధ్యక్షుడు బీఎన్ తివారి తెలిపారు. హుందాగా పరిష్కరించుకోవాలి: రణ్వీర్ఈ నేపథ్యంలో ‘‘ఈ తరహా విషయాలను పరిణతితో, పరస్పర గౌరవంతో పరిష్కరించుకుంటే బాగుంటుంది. ‘డాన్’ ఫ్రాంచైజీతో సంబంధం ఉన్నవారితో సహా, చిత్ర పరిశ్రమలోని అందరి పట్ల మా నటుడికి అత్యంత గౌరవం ఉంది’’ అంటూ రణ్వీర్ సింగ్ తరపున ఆయన అధికార ప్రతినిధి ఓ లేఖ విడుదల చేశారు. అందులోని సారాంశం ఈ విధంగా... ‘‘డాన్ 3’కి సంబంధించి ఈ మధ్యకాలంలో జరిగిన సంఘటనల దృష్ట్యా ఆయన (రణ్వీర్) మౌనంగా ఉండాలనుకున్నారు. వృత్తికి సంబంధించిన చర్చలు, వ్యక్తిగత అనుబంధాలకు సంబంధించిన విషయాలను హుందాగా, పరిణతితో పరిష్కరించుకోవాలి.అయితే ఈ మధ్య పలు ఊహాగానాలు నెలకొనడంతో రణ్వీర్ స్పందించాలనుకున్నారు. ఆయన ఫోకస్ మొత్తం ప్రస్తుత కమిట్మెంట్స్, చేసే పని మీద మాత్రమే ఉన్నాయి’’ అన్నది ఆ లేఖ సారాంశం. అలాగే ‘‘ఈ చిత్రంతో అసోసియేట్ అయిన అందరి మీదా ప్రగాఢమైన గౌరవం, సానుకూలత ఉన్నాయి. ఈ ‘డాన్’ ఫ్రాంచైజీ తన విజయాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నాను’’ అని కూడా రణ్వీర్ పేర్కొన్నారు. -
30 ఏళ్ల తర్వాత ఆపద్బాంధవుడు హీరోయిన్ రీఎంట్రీ
ఒకప్పుడు తన అందంతో, హావభావాలతో, అద్భుతమైన డ్యాన్స్తో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసింది మీనాక్షి శేషాద్రి. బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా వెలుగొందిన ఈమె తెలుగులో చిరంజీవి సరసన 'ఆపద్బాంధవుడు' చిత్రంలో నటించింది. అవురా అమ్మకు చెల్ల పాటలో ఆమె చేసిన డ్యాన్స్ ఇప్పటికీ ఎవరూ మర్చిపోలేరు. అయితే మీనాక్షి పెళ్లి తర్వాత సినిమాలకు ఫుల్స్టాప్ పెట్టేసి అమెరికా వెళ్లిపోయింది. 30 ఏళ్ల తర్వాత స్వదేశానికి..అక్కడ డ్యాన్స్ స్కూల్ ఓపెన్ చేసి ఎంతోమందికి నాట్యం నేర్పించింది. దాదాపు 30 ఏళ్లపాటు అమెరికాలో ఉన్న ఈ నటి కొన్ని నెలల క్రితమే భారత్కు తిరిగి వచ్చేసింది. తనకు సినిమాల్లో రీఎంట్రీ ఇవ్వాలనుందన్న కోరికను మీనాక్షి శేషాద్రి ఆమె సోషల్ మీడియా వేదికగా బయటపెట్టింది. 'నన్ను అభిమానిస్తున్న అందరికీ నమస్కారం.. మీ ప్రేమానురాగాలకు, మీరు అందిస్తున్న మద్దతుకు కృతజ్ఞతలు. 30 ఏళ్ల తర్వాత నా కర్మభూమికి తిరిగొచ్చేశాను.అలాంటి పాత్రలు చేయాలనుందిఇప్పుడు ముంబైలో ఉంటున్నాను. సానుకూల దృక్పథం, ఆశ, ప్యాషన్తో మరోసారి చలనచిత్రపరిశ్రమలో అడుగుపెడుతున్నాను. చిన్న, పెద్ద, ప్రధాన పాత్ర అని తేడా లేకుండా మంచి అవకాశాల కోసం ఎదురుచూస్తున్నాను. సినిమాలతో పాటు ఓటీటీ షోలు, వెబ్సిరీస్లైనా చేసేందుకు రెడీగా ఉన్నాను. చాలెంజింగ్ రోల్స్ చేయాలనుంది. నేను భారత్ తిరిగి వచ్చాక అనేక ఆఫర్లు వచ్చాయి. ఏదో నిరూపించుకోవాలని కాదుకానీ అందులో కొన్ని ఏమంత ఎగ్జయిటింగ్గా లేవు. మరికొన్నేమో ముందుకు కదల్లేవు. అయినా సరే ఎటువంటి టీమ్, ఏజెన్సీ లేకుండా నేనే అంతా మేనేజ్ చేసుకుంటున్నాను. నేను ఏదో నిరూపించుకోవడానికి రీఎంట్రీ ఇవ్వడం లేదు. నా కుటుంబసభ్యుల ఎంకరేజ్మెంట్ వల్లే ఇక్కడున్నాను. నాకు సంతోషాన్నిచ్చేదే సినిమా.. అందుకే మళ్లీ ఇండస్ట్రీలో భాగం అవాలని కోరుకుంటున్నాను' అని నటి చెప్పుకొచ్చింది.కెరీర్మీనాక్షి శేషాద్రి హిందీలో.. హీరో, పైసా యే పైసా, దిల్వాలా, స్వాతి, జుర్మ్, దామిని, గంగా జమున సరస్వతి వంటి అనేక చిత్రాల్లో నటించింది. చివరగా స్వామి వివేకానంద (1998) బయోపిక్లో కనిపించింది. ఆ తర్వాత ఘాయల్: వన్స్ ఎగైన్ మూవీలో ఫ్లాష్బ్యాక్లో తళుక్కుమని మెరిసింది. మరి మీనాక్షి ఇప్పుడెలాంటి సినిమాలు ఎంపిక చేసుకుంటుందో చూడాలి!చదవండి: కదిలే రైలుపై నేను, విజయ్.. ఆరోజు చనిపోయేవాళ్లం: విలన్ -
అందుకే ఆ హీరోకు తల్లిగా నటించా: భాగ్యశ్రీ
హీరోలకు ఎంత వయసొచ్చినా హీరో పాత్రలు చేస్తూనే ఉంటారు. కానీ, హీరోయిన్ల పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంటుంది. ఒక వయసొచ్చాక లేదా పెళ్లయ్యాక వారికి వచ్చే ఆఫర్లు, పాత్రలు కాస్త భిన్నంగానే ఉంటాయి. అలా ఒకప్పటి హీరోయిన్ భాగ్యశ్రీ తాజాగా మరాఠి చిత్రంలో తనకంటే కాస్త చిన్నవాడైన హీరోకి తల్లిగా నటించింది.హీరోకు తల్లిగా..రితేశ్ దేశ్ ముఖ్.. మరాఠా కింగ్ శివాజీగా నటించిన తాజా చిత్రం 'రాజా శివాజీ'. ఇందులో శివాజీ తల్లి జీజాబాయిగా భాగ్యశ్రీ యాక్ట్ చేసింది. ఈ సినిమా రూ.100 కోట్లపైనే కలెక్షన్స్ రాబట్టింది. అయితే వయసులో తనకంటే కేవలం 10 ఏళ్ల చిన్నవాడైన హీరోకు తల్లిగా నటించడంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దీని గురించి భాగ్యశ్రీ స్పందిస్తూ.. 'శివాజీ వంటి మహాయోధుల కథలను చిన్నప్పటి నుంచి వింటూ పెరిగాం. ఆ ప్రశంస మర్చిపోలేనుఅలాంటి సినిమాలో నటించే ఛాన్స్ వస్తే తిరస్కరించగలమా? పైగా జీజాబాయి కూడా యంగ్ మదరే! ఈ మూవీ సినిమాటోగ్రాఫర్ సంతోశ్ శివన్ సర్ నన్ను పిలిచి.. సారీ, మీరు చాలా యంగ్గా కనిపిస్తున్నారు. అందుకని నా కెమెరాతో మిమ్మల్ని కాస్త వయసుపైబడినదానిలా చూపిస్తాను అన్నారు. ఆ ప్రశంస నా మనసును తాకింది' అని చెప్పుకొచ్చింది.సినిమారాజా శివాజీ సినిమా విషయానికి వస్తే.. రితేశ్ దేశ్ముఖ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఆయన భార్య జెనీలియాతో పాటు నిర్మాత జ్యోతి దేశ్పాండే నిర్మించారు. ఈ మూవీలో సంజయ్దత్, అభిషేక్ బచ్చన్, మహేశ్ మంజ్రేకర్, సచిన్ ఖేడ్కర్, ఫర్దీన్ ఖాన్, జెనీలియా తదితరులు కీలక పాత్రలు పోషించారు. భాగ్యశ్రీ విషయానికి వస్తే.. 1989లో మైనే ప్యార్ కియా సినిమాతో వెండితెరపై కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది. హిందీలో అనేక సినిమాలు చేసింది.చదవండి: కేన్స్ సంబరాలకు వీడ్కోలు -
90% మార్కులతో పాసైనా పొడిచేదేం లేదు: పూరీ జగన్నాథ్
టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తన ‘పూరీ మ్యూజింగ్స్’ తాజా ఎపిసోడ్లో ప్రస్తుత విద్యా విధానం పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'ఫ్యూచర్ ఎడ్యుకేషన్' అనే అంశంపై మాట్లాడుతూ.. నేటి స్కూళ్లు పిల్లలపై అధిక ఒత్తిడి పెంచి వారిని డిప్రెషన్లోకి నెడుతున్నాయి. ప్రస్తుత విద్యావిధానం కేవలం మార్కులు, ఎగ్జామ్స్, కాంపిటీషన్ మీద దృష్టి పెట్టి విద్యార్థుల మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోంది. పిల్లలకు చిన్న వయసులోనే నైతిక విలువలు,సమయపాలన, సర్వైవల్ స్కిల్స్ నేర్పాలి. అలాగే డిజిటల్ డిసిప్లిన్, మెడిటేషన్, కమ్యూనికేషన్ స్కిల్స్ వంటి అంశాలు తప్పనిసరిగా ఉండాలి. ప్రస్తుత విద్యా విధానంలో 90% మార్కులు తెచ్చుకున్నా ఆ విద్యార్థికి జీవితంలో దాని ఉపయోగం ఉండకపోవచ్చు. కానీ క్యారెక్టర్, మనోస్థైర్యం, సంస్కారం నేర్పితే వారు మంచి పౌరులుగా తయారవుతారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో గణాంకాలను ప్రస్తావిస్తూ.. ప్రతి సంవత్సరం 13,000–15,000 మంది విద్యార్థులు అకాడమిక్ ఒత్తిడి కారణంగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. చదువు కంటే సంస్కారం ముఖ్యం. భవిష్యత్ విద్యావ్యవస్థ పిల్లలకు మనోస్థైర్యం, నైతిక విలువలు, స్వీయ నియంత్రణ నేర్పేలా ఉండాలని పూరీ జగన్నాథ్ కోరుకున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. పూరి-విజయ్ సేతుపతితో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా చాలా కాలం క్రితమే మొదలు పెట్టారు. దానికి ‘స్లమ్ డాగ్ ’(Slum Dog) అనే టైటిల్ని కూడా ఖరారు చేశారు. కానీ దానికి సంబంధించిన ఎలాంటి గ్లింప్స్ లేదా ప్రమోషనల్ మెటీరియల్ ఇప్పటివరకు విడుదల కాలేదు. దాని తరువాత సూర్య – పూరి జగన్నాధ్ కాంబినేషన్ ఫైనల్ కావడం సినీ అభిమానుల్లో ఆసక్తి రేపుతోంది. పూరి స్టైల్ లో సూర్యను ఎలా చూపిస్తారో, ఎలాంటి మాస్ ఎంటర్టైనర్ వస్తుందో చూడాలి. -
హీరోయిన్ పనివాళ్ల కోసం రూ.51 కోట్ల విలువైన ఫ్లాట్స్?
బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తూ బిజీగా ఉంది. భర్త ఆనంద్ అహుజాతో కలిసి లండన్లో ఉంటోంది. అయితే ఈమె తన పనివాళ్ల కోసం రూ.51 కోట్లు విలువ చేసే ఐదు ఫ్లాట్స్ కొనుగోలు చేసిందనే వార్త నిన్నటి నుంచి తెగ వైరల్ అవుతోంది. ఇవి కొన్నందుకే స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత కూడా ఎదురైందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇంతకీ అసలేం జరిగింది? ఏంటి గొడవ?(ఇదీ చదవండి: ఆస్కార్లో 9 నామినేషన్స్.. ఓటీటీలో తెలుగులోనూ స్ట్రీమింగ్.. మూవీ రివ్యూ)వ్యాపారవేత్త ఆనంద్ అహుజాని పెళ్లి చేసుకున్న తర్వాత హీరోయిన్ సోనమ్ కపూర్.. లండన్లో ఉంటోంది. అక్కడ నాటింగ్హిల్లో మూడేళ్ల క్రితం రూ.270 కోట్ల విలువైన మ్యాన్షన్ని కొనుగోలు చేసిన ఈ జంట.. ఇంటి లోపల భారీ మార్పులు చేసుకున్నారని, స్మిమ్మింగ్ పూల్, బాస్కెట్ బాల్ కోర్టు లాంటి వాటి కోసం రూ.50 కోట్ల మేర ఖర్చు చేశారని టాక్.ఇకపోతే ఈ మ్యాన్షన్కి సమీపంలోనే మరో ఐదు ఫ్లాట్స్ని సోనమ్ కపూర్ దంపతులు కొన్నారని, ఇవి వాళ్ల పనివాళ్ల కోసమే ఉపయోగించుకుంటారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ కొనుగోళ్ల ద్వారా భవన నిర్వహణ కమిటీపై పట్టు సాధించి, తమకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటారేమోనని స్థానికులు భయపడుతున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో సోనమ్ దంపతులపై పోస్టులు పెడుతున్నారు.ఇలా వ్యవహారం కాస్త బయటకు రావడంతో సోనమ్ కపూర్ ప్రతినిధి దీనిపై స్పందించారు. ఆ ఫ్లాట్లని పెట్టుబడిలో భాగంగానే కొనుగోలు చేశారని.. దీనికి సోనమ్కి ఎలాంటి సంబంధం లేదని వివరణ ఇచ్చారు. అయితే లండన్ లో స్థానికుల కంటే భారతీయులే ఎక్కువగా ఆస్తులు కొనుగోలు చేస్తున్నట్లు కొన్నాళ్ల క్రితం వార్తలొచ్చాయి.(ఇదీ చదవండి: సీఎం విజయ్ చివరి సినిమాకు ఎట్టకేలకు మోక్షం?) -
ఎవరూ గుర్తుపట్టట్లేదు, ఇంకెందుకు బతికున్నా?: నటి ఆవేదన
ఒకప్పుడు చేతినిండా అవకాశాలతో బిజీగా ఉండి ఇప్పుడు ఒక్క ఛాన్స్ కోసం చెప్పులరిగేలా తిరుగుతోంది బుల్లితెర అనిత కన్వాల్. ఒకప్పుడు సక్సెస్ను ఎంజాయ్ చేసిన నటి ఇప్పుడీ సైలెన్స్ను భరించలేకపోతోంది. బనేగి ఆప్నీ బాత్, సోన్పరి, సాసురాల్ జెండా పూల్ వంటి సీరియల్స్ ద్వారా మంచి పేరు తెచ్చుకుంది. దాదాపు నాలుగు దశాబ్దాలపాటు బుల్లితెర ఇండస్ట్రీలో రాణించింది. అదే బాధతాజాగా ఆమె తన కష్టాలను ఓ ఇంటర్వ్యూలో ఏకరువు పెట్టింది. అనిత కన్వాల్ మాట్లాడుతూ.. 'నలభై ఏళ్లు ఇక్కడ పని చేశానన్నమాటే కానీ నన్నెవరూ గుర్తుపట్టడం లేదు. అదే బాధగా అనిపిస్తూ ఉంటుంది. అయినా ఆడిషన్లకు వెళ్తున్నాను. నా పేరు అనిత కన్వాల్.. మీరెవరూ పుట్టకముందు నుంచే నేను ఈ ఇండస్ట్రీలో యాక్ట్ చేస్తున్నాను అని నా గురించి పరిచయం చేసుకోగానే అందరూ సైలెంట్ అయిపోతున్నారు. నా ఇగో పక్కనపెట్టి మరీ ఆడిషన్స్ ఇస్తున్నాను. నా టైం బాగోలేదేమో!కానీ ఎవరూ నన్ను సెలక్ట్ చేసుకునేందుకు ఇష్టపడటం లేదు. గతంలో టీవీలో ఎక్కువ కనిపించావు అన్న సాకు చెప్పేవారు. కానీ ఇప్పుడు టీవీలోనూ కనిపించక ఎనిమిదేళ్లవుతోంది. అయినా ఇప్పుడు బుల్లితెరపై పనిచేసేవాళ్లంతా ఓటీటీ ప్రాజెక్టుల్లోనూ భాగమవుతున్నారుగా! బహుశా నా టైమ్ బాగోలేనట్లుంది. ఒకేసారి 13 సీరియల్స్ చేసిన రోజులున్నాయి. అలాంటి నన్ను అందరూ మర్చిపోయారు. ఎందుకు బతికున్నా?అసలు నేనెందుకు బతికున్నాను? అని కూతురితో చెప్పుకుంటూ బాధపడ్డాను. టీవీలో ఎన్నో రకాల పాత్రలు చేశాను, ఎన్నో అవార్డులు పొందాను. కానీ, ఇప్పుడు ఖాళీ చేతులతో నిలబడ్డాను. నాపై నాకే అసహ్యం వేస్తోంది. నాకు వయసు పెరిగింది, ఒప్పుకుంటాను. కానీ నాకేమీ పడుచు పిల్ల పాత్ర ఇవ్వమని అడగడం లేదుగా.. 70 ఏళ్ల వృద్ధురాలి పాత్రలే ఇవ్వమంటున్నాను. నా వయసులో ఉన్నవాళ్లందరికీ పని దొరుకుతున్నప్పుడు నాకెందుకివ్వరు?దేవుడిని తీసుకెళ్లిపోమంటున్నా..నేను దేనికీ పనికారానా? అన్న ఆత్మనూన్యతా భావం నాలో ఎక్కువవుతోంది. అప్పుడప్పుడు ఆ దేవుడిని నన్ను తీసుకెళ్లిపోమని వేడుకుంటున్నాను. నేను చాలా ప్రొఫెషనల్. 40 ఏళ్ల కెరీర్లో ఎన్నడూ సెట్కు లేట్గా వెళ్లలేదు. మా అమ్మ చావుబతుకుల మధ్య ఉంటే కూడా నేను షూటింగ్ చేశాను. నా సీన్ పూర్తి చేసుకుని హాస్పిటల్ వెళ్లాను. అలాంటి నాకు ఇలాంటి దుస్థితి వచ్చింది' అని అనిత చెప్పుకొచ్చింది. ఈ నటి.. గీతాంజలి, కబీ హా కబీ నా, ముజ్సే దోస్తీ కరోగే, ద హ్యాంగ్మ్యాన్ వంటి చిత్రాల్లోనూ నటించింది.చదవండి: ఇద్దరు భామలతో రామ్చరణ్ ఐటం సాంగ్ -
అందుకే ఛావా రిజెక్ట్ చేశా: బాలీవుడ్ నటుడు
గతేడాది వచ్చిన "ఛావా" సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం నమోదు చేసుకుంది. బాలీవుడ్ స్టార్ విక్కీ కౌశల్ ఛత్రపతి శంబాజీ మహారాజ్గా, రష్మిక ఏసుబాయిగా ప్రధాన పాత్రల్లో నటించారు. అక్షయ్ ఖన్నా ఔరంగజేబు పాత్రలో మెప్పించాడు. అయితే ఔరంగజేబు రోల్కు అక్షయ్ మొదటి ఛాయిస్ కాదు, అతడి కంటే ముందు నటుడు రణ్దీప్ హుడాను సంప్రదించారు.అందుకే నో చెప్పా..ఈ విషయం గురించి రణ్దీప్ హుడా మాట్లాడుతూ.. అప్పటికే నేను స్వతంత్ర్య వీర్ సావర్కర్ సినిమా కోసం చాలా సన్నబడ్డాను. ఆ సమయంలో ఔరంగజేబు పాత్ర కోసం సరిపోతాననిపించలేదు. పైగా వీర్ సావర్కర్ సినిమాకు సంబంధించి ఓ కోర్టు కేసు కూడా ఎదుర్కొంటున్నాను. ఛావాలో హిందూ-ముస్లింకి సంబంధించిన అంశాలు ఎక్కువగా ఉన్నాయి. దాంతో ఈ కథలో ఇరుక్కుని ఇబ్బందులు పడాలనుకోలేదు, ఆ దారిలో అసలు నడవాలనుకోలేదు అని చెప్పాడు. ఇకపోతే లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన ఛావా చిత్రం రూ.800 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.చదవండి: క్షమాపణలు చెప్పిన రామ్చరణ్ -
చరణ్ డాన్స్తో వాటి అందం రెట్టింపు అయింది: ఏఆర్ రెహమాన్
మెగా పవర్స్టార్ రామ్చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పాటలు ప్రేక్షకులను ఊర్రూతలూగిస్తున్నాయి. మొదట విడుదలైన “చికిరి.. చికిరి” పాట దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించంది. “రయ్.. రయ్.. రారా” పాట కూడా భారీ హిట్ అయింది. తాజాగా విడుదలైన స్పెషల్ మాస్ సాంగ్ కూడా అభిమానులను ఆకట్టుకుంటోంది. అయితే ఈ పాటల్లో ఏదీ తన ఫేవరెట్ సాంగ్ కాదని ఈ చిత్ర సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ స్పష్టం చేశారు. ఎందుకంటే ఆయన అభిప్రాయం ప్రకారం, తనకు అత్యంత ఇష్టమైనవి ఈ చిత్రంలోని ఇంకా విడుదల కాని బ్యాక్గ్రౌండ్ స్కోర్లోని సాంగ్స్ అని తెలిపారు. ఈ సినిమాలో కీలకమైన రెండు మాంటేజ్ సాంగ్స్ ఉన్నాయట. వాటిలో ఒకటి అత్యంత ఎమోషనల్గా ఉంటుందని దర్శకుడు బుచ్చిబాబు కూడా ఓ ఇంటర్వూలో ధృవీకరించారు.రామ్చరణ్ గురించి రెహమాన్ మాట్లాడుతూ.. నేను పాటలు కంపోజ్ చేసినప్పుడు అవి బాగానే ఉన్నాయి. కానీ ఆ పాటలకు చరణ్ డాన్స్ చేసిన తర్వాత వాటి అందం రెట్టింపు అయింది. రీ-రికార్డింగ్ సమయంలో చరణ్ పెర్ఫామెన్స్ చూసి ఆశ్చర్యపోయాను. సినిమాలో బెస్ట్ పార్ట్ చరణ్ యాక్టింగ్ అని అన్నారు. కాగా స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన 'పెద్ది'లో జాన్వీ కపూర్ హీరోయిన్. కన్నడ హీరో శివరాజ్ కుమార్ కీలక పాత్ర చేశారు. జగపతిబాబు, దివ్యేందు ఇతర కీలక పాత్రలు చేశారు. ఈ చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంచి. -
వయసు తేడా ఏడాది.. తల్లీకొడుకుగా చేసిన హీరోహీరోయిన్
రీసెంట్ టైంలో విడాకుల విషయంతో వార్తల్లో నిలిచిన బాలీవుడ్ నటి మౌనీరాయ్.. ఇప్పుడు ఎవరూ ఊహించని పాత్రలో నటించింది. బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్కి తల్లిగా చేసింది. వచ్చే నెల 5వ తేదీన ఈ మూవీ థియేటర్లలోకి రానుండగా తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇందులో ట్రెండింగ్ బ్యూటీస్ మృణాల్ ఠాకుర్, పూజా హెగ్డే హీరోయిన్లు కావడం విశేషం.(ఇదీ చదవండి: ఓటీటీలోకి ధనుష్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా.. అధికారిక ప్రకటన)వరుణ్ ధావన్, మృణాల్ ఠాకుర్, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా 'హై జవానీ తో ఇష్క్ హోనా హై'. డేవిడ్ ధావన్ దర్శకుడు. వదిలిన ట్రైలర్ బట్టి చూస్తే హీరో.. ఒకరికి తెలియకుండా మరొకరిని ప్రేమిస్తాడు. పెళ్లికి ముందే వాళ్లిద్దరినీ గర్భవతుల్ని కూడా చేస్తాడు. మరి వీళ్లిద్దరిలో ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? సదరు అమ్మాయిలు ఒకరికి ఒకరు ఎదురుపడ్డారా? లేదా? అనే కన్ఫ్యూజన్ కామెడీనే స్టోరీ అని తెలుస్తోంది.ఈ మూవీలోనే వరుణ్ ధావన్ పాత్రకు అద్దె తల్లిగా మౌనీరాయ్ కనిపించనుంది. నిజజీవితంలో వీళ్లిద్దరికీ వయసు వ్యత్యాసం ఏడాదే. కానీ తల్లికొడుకులుగా నటించడం విశేషం. ఇకపోతే ఈ మూవీ టైపు స్టోరీలు హిందీలో ఇదివరకే బోలెడన్ని వచ్చాయి. మరి ఈ చిత్రం ఏ మేరకు వర్కౌట్ అవుతుందనేది చూడాలి? జూన్ 5న రిలీజ్ పెట్టుకున్నారు. అయితే దీని కంటే ఒకరోజు ముందు 'పెద్ది' వస్తోంది.(ఇదీ చదవండి: బికినీ ఫొటోలపై క్లారిటీ ఇచ్చిన రుక్మిణి వసంత్) -
ప్రామిస్.. అలా పెళ్లి చేసుకోను : కంగనా
బాలీవుడ్ నటి కంగానా రనౌత్కు సంబంధించిన ఓ వీడియో గత రెండు రోజులుగా నెట్టింట చక్కర్లు కొడుతోంది. అందులో కంగనా మెడలో నల్ల పూజల దండా, చేతికి మట్టిగాజులు ఉన్నాయి. దీంతో ఆమె రహస్యంగా పెళ్లి చేసుకుందంటూ కొంతమంది ఆ వీడియోని షేర్ చేస్తున్నారు. తాజాగా దీనిపై కంగనా స్పందించింది. తనకు సీక్రెట్ పెళ్లి చేసుకునే అవసరం లేదని, ఒకవేళ పెళ్లి చేసుకునే ఆలోచన ఉంటే కచ్చితంగా అందరికి చెప్పే చేసుకుంటానని తనదైన శైలీలో ఇన్స్టా స్టోరీలో బదులిచ్చింది.‘నేను ఓ సినిమా షూటింగ్లో ఉన్నప్పుడు ఆ వీడియో,ఫోటో తీశారు. అది సినిమాలో నా క్యారెక్టర్. అది చూసి చాలా మంది నాకు కాల్స్ చేస్తున్నారు. పెళ్లి చేసుకున్న మహిళగా నటించాను. అందులో తప్పేముంది? నటీనటులు అన్నాక అన్ని పాత్రలు చేయాలి. రహస్యంగా పెళ్లి చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఒకవేళ పెళ్లి చేసుకుంటే అందరికి చెప్పే చేసుకుంటా. ఇది నా ప్రామిస్’ అని కంగనా చెప్పుకొచ్చింది. కంగనా ప్రస్తుతం క్వీన్ మూవీ సీక్వెల్లో నటిస్తోంది. ‘క్వీన్’లో వివాహం రద్దయి విదేశాలకు వెళ్లిన మహిళగా కనిపించిన కంగనా.. సీక్వెల్లో పెళ్లైన మహిళగా కనిపించబోతున్నట్లు వీడియో చూస్తే అర్థమవుతుంది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
అమ్మకు క్యాన్సర్.. సినిమాల వల్ల చాలా కోల్పోయా: హీరోయిన్
ఉల్లాసంగా ఉత్సాహంగా, కరెంట్ వంటి చిత్రాలతో తెలుగులో మంచి పేరు, గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్ స్నేహ ఉల్లాల్. అయితే ఆమె కెరీర్ మొదలైంది మాత్రం హిందీ సినిమాతోనే.. లక్కీ: నో టైమ్ ఫర్ లవ్ (2005) చిత్రంతో వెండితెరపై తన ప్రయాణం ఆరంభించింది. ఒక్క సినిమాతోనే తన దశ తిరిగిపోయింది. తెలుగు, హిందీలో వరుస ఆఫర్లు అందుకుంది. మధ్యలో సినిమాలు వదిలేసింది. 16 ఏళ్లకే ఎంట్రీరెండేళ్ల క్రితమే మళ్లీ రీఎంట్రీ ఇచ్చింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్నేహా ఉల్లాల్ ఆసక్తికర విషయాలు పంచుకుంది. 'నేను సినిమాల్లో అడుగుపెట్టే సమయానికి నా వయసు 16 ఏళ్లే! అప్పుడే పదో తరగతి పూర్తి చేసి కాలేజీలో చేరాను. అక్కడ సల్మాన్ సోదరి అర్పిత ఖాన్ ఫ్రెండ్స్ నన్ను చూశారు. వారు లక్కీ సినిమా ఆడిషన్స్కు వెళ్లారు. బహుశా ఆ సమయంలోనే నా గురించి చెప్పి ఉంటారు. అమ్మకు క్యాన్సర్అలా ఆ మూవీ టీమ్ నన్ను కలిసింది. ఆ సమయంలో మా ఇంట్లో పరిస్థితి బాగోలేదు. అమ్మ క్యాన్సర్కు చికిత్స తీసుకుంటోంది. అందరి ముఖంలోనూ విషాదమే ఉంది. ఈ సినిమా ఛాన్స్ ద్వారా అందరికీ కాస్త ఉపశమనం కలిగించాలనుకున్నాను. పైగా అమ్మకు ప్రయాణాలంటే భలే ఇష్టం. షూటింగ్స్ కోసం తనను వెంట తీసుకుని వెళ్లొచ్చని సినిమా ఒప్పుకున్నాను.చాలా కోల్పోయా..ఈ మూవీ రిలీజయ్యాక నాపై బోలెడంత ప్రేమ కురిపించారు. ఈ ఇండస్ట్రీ నాకెంతిచ్చిందో అంతకంటే ఎక్కువే తీసుకుంది. నా కాలేజీ లైఫ్, స్వేచ్ఛను హరించేసింది. 16 ఏళ్ల నుంచి సడన్గా పెద్దదాన్నయిపోయాను. టీనేజ్ను మిస్ అయ్యాను. అయితే చిన్నప్పటి నుంచే నాకు చాలా ఆఫర్లు చవ్చాయి. ఒమన్ నుంచి భారత్కు వచ్చిన ప్రతిసారి ఏదో ఒక వాణిజ్య ప్రకటనలో నటించమని అడిగారు. ఆ భయంతో దూరంకానీ ఇండస్ట్రీపై ఉన్న భయంతో వాటిని దూరం పెట్టాను. ఇంట్లోవాళ్లు కూడా ఇండస్ట్రీ అసభ్యకరంగా ఉంటుందని భయపెట్టారు. పైగా నేనంత గ్లామర్గా కూడా ఉండనని నా అభిప్రాయం. అందుకే ఎక్కువ సినిమాలు చేయలేదు. ఇప్పుడు మంచి పాత్రలు ఎంచుకుని మళ్లీ బాలీవుడ్లో బిజీ అవాలని ఉంది' అని స్నేహ ఉల్లాల్ చెప్పుకొచ్చింది.చదవండి: అమ్మ సలహాతో పెళ్లికి ముందు సహజీవనం: నటి -
పెళ్లికి ముందు సహజీవనం.. అమ్మ సలహానే..: నటి
ప్రేమను ఒప్పుకునే పెద్దలు చాలా అరుదు.. కానీ ఈ తల్లి మాత్రం నటి ప్రేమను ఒప్పుకోవడమే కాదు, సహజీవనం చేయమని సలహా ఇచ్చిందట! లివ్- ఇన్ రిలేషన్లోనూ ఇద్దరి మధ్య ప్రేమ అలాగే ఉంటే అప్పుడు పెళ్లి చేసుకోమని సెలవిచ్చిందట! ఈ విషయాన్ని బుల్లితెర నటి తేజస్వి ప్రకాశ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.బిగ్బాస్ షోలో లవ్ షురూహిందీ బిగ్బాస్ 15వ సీజన్లో కరణ్ కుంద్రా- తేజస్వి ప్రకాశ్ ప్రేమలో పడ్డారు. అప్పటినుంచి ఇప్పటివరకు జంటగానే కొనసాగుతున్నారు. నెట్ఫ్లిక్స్లో ప్రసారమవుతున్న దేశి బ్లింగ్ అనే రియాలిటీ షోలో కరణ్- తేజస్వి ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ జంట ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. కరణ్ మాట్లాడుతూ.. తేజస్వి- నేను ప్రేమించుకునే విషయంలో ఆమె తండ్రికి ఎటువంటి అభ్యంతరం లేదు. అయితే ఆమె తల్లి మాత్రం కాస్త డౌట్ పడింది. తేజస్విని తాను నమ్మలేనంది. నన్ను ఒకసారి ఆలోచించుకోమని చెప్పింది అన్నాడు.తల్లి ఐడియానే..ఇంతలో తేజస్వి మాట్లాడుతూ.. మా ఇద్దరి మధ్య విడదీయరాని అనుబంధం ఉందని తలిస్తేనే ముందడుగు వేయమంది. నాతో కరణ్ జీవితాంతం కలిసుండగలడో, లేదో చెక్ చేసుకోమంది. అందుకే పెళ్లి చేసుకోవడానికి ముందు కలిసుండమని అమ్మ సలహా ఇచ్చింది. నిజానికి ఇలాంటి ఐడియాను ఎవరూ ఒప్పుకోరు. కానీ, మా అమ్మ మాత్రం కలిసి జీవించమని, అప్పుడు కూడా ఇద్దరం బాగానే ఉంటే పెళ్లి చేసుకోమని చెప్పింది అని గుర్తు చేసుకుంది. మరి ఐదేళ్లుగా ప్రేమాయణం సాగిస్తున్న ఈ జోడీ ఎప్పుడు పెళ్లిపీటలెక్కుతుందో చూడాలి!చదవండి: కేన్స్ ముగింపు వేడుకల్లో ఐష్ -
మెడలో నల్లపూసల దండ.. చేతికి మట్టిగాజులు.. కంగనా షాకివ్వనుందా?
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్గా పేరు తెచ్చుకున్న బ్యూటీ కంగనా రనౌత్. కేవలం సినిమాలే కాదు.. రాజకీయాల్లోనూ రాణిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఎప్పుడు వివాదాలకు కేరాఫ్ అడ్రస్గా ఉన్న ఈ బాలీవుడ్ భామకు సంబంధించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతోంది. ఆమె మెడలో నల్లపూసలు, చేతులకు మట్టిగాజులు ఉండడంతో అందరూ ఒక్కసారిగా షాకవుతున్నారు. కంగనా ఎవరికీ చెప్పకుండానే సీక్రెట్గా పెళ్లి చేసుకుందా? అని తెగ కన్ఫ్యూజ్ అవుతున్నారు.ఈ వీడియో చూసిన నెటిజన్స్ భిన్నంగా స్పందిస్తున్నారు. కంగన సీక్రెట్గా పెళ్లి చేసుకున్నారా? అని ఒకరు కామెంట్ చేయగా.. ఒకవేళ ఆమె పెళ్లి చేసుకుంటే గ్రాండ్గానే చేసుకుంటారని మరొకరు రాసుకొచ్చారు. అయితే ఏదైనా సినిమా షూటింగ్ కోసం అలా వేసుకున్నారా? మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా కంగనా నల్లపూసల దండ, మట్టిగాజులతో కనిపించడంతో ఫ్యాన్స్ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఆమె క్లారిటీ ఇస్తే కానీ పెళ్లి గురించి చర్చ ఆగేలా కనిపించడం లేదు.ఇక కంగనా సినిమాల విషయానికొస్తే తన సూపర్ హిట్ చిత్రం ‘క్వీన్’ సీక్వెల్లో నటిస్తున్నారు. ‘క్వీన్ 2’ అనే టైటిల్తో ఈ మూవీని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలోని క్యారెక్టర్ లుక్ కోసమే ఆమె ఇలా తయారైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే పాలిటిక్స్తో బిజీగా ఉన్న కంగనా.. మళ్లీ బాలీవుడ్లోకి కమ్బ్యాక్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. Kangana Ranaut was seen wearing a mangalsutra today.Has Kangana secretly got married? pic.twitter.com/wBCoNCZVLL— Mr SP (@Lonely_prabh) May 21, 2026 -
ఓటీటీలో దురంధర్.. అభిమానులకు బిగ్ సర్ప్రైజ్..!
బాక్సాఫీస్ను షేక్ చేసిన స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ దురంధర్. రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన ఈ సినిమా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. పాకిస్తాన్ బ్యాక్డ్రాప్లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ చిత్రానికి ఆదిత్య ధర్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ ప్రస్తుతం ఓటీటీలో సందడి చేస్తోంది.ఈ నేపథ్యంలోనే ఓటీటీ స్ట్రీమింగ్పై మరో సర్ప్రైజ్ ఇచ్చారు. ఈ నెల 22 నుంచి ఓటీటీలో అన్కట్ వర్షన్ స్ట్రీమింగ్ చేయనున్నట్లు వెల్లడించారు. రెండు ఓటీటీల్లోనూ ఒకేరోజు ఇది స్ట్రీమింగ్ కానున్నట్లు తెలిపారు. నెట్ఫ్లిక్స్తో జియోహాట్స్టార్లోనూ ఈ మూవీ అందుబాటులోకి రానుందని ప్రకటించారు. ఈ అన్కట్ వర్షన్ దాదాపు 3 గంటల 25 నిమిషాల పాటు ఉండనుందని మేకర్స్ రివీల్ చేశారు. దీంతో ధురంధర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. View this post on Instagram A post shared by Netflix India (@netflix_in) -
ఒకే ఒక్క ఫ్లాప్.. జ్యోతిక ముఖంపైనే తలుపేసిన బాలీవుడ్
జ్యోతిక సౌత్లో స్టార్ హీరోయిన్ అవడానికి ముందు బాలీవుడ్లో ట్రై చేసింది. డోలి సజాకే రఖ్నా (1998) చిత్రంతో వెండితెరపై కథానాయికగా పరిచయమైంది. అక్షయ్ ఖన్నా హీరోగా నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మెప్పించలేకపోయింది. తొలి సినిమాయే కలిసిరాకపోవడంతో బాలీవుడ్ తనకు మరో అవకాశమివ్వకుండా తలుపులు మూసేసింది. దాంతో తమిళంలో ట్రై చేసింది. తమిళ, కన్నడ, తెలుగు భాషల్లో వరుస సినిమాలు చేస్తూ తక్కువకాలంలోనే స్టార్ హీరోయిన్గా రాణించింది.ప్రేమ- పెళ్లిఅయితే కెరీర్ ప్రారంభంలోనే ప్రేమలో పడింది జ్యోతిక. 'పూవెల్లం కెట్టుప్పార్' సినిమాలో సూర్యతో కలిసి నటించగా.. ఆ పరిచయం ప్రేమకు దారి తీసింది. ఆ తర్వాత వీరు జంటగా నాలుగు సినిమాల్లో యాక్ట్ చేయగా ఆ ప్రేమబంధం మరింత బలపడింది. 2006 సెప్టెంబర్ 11న తమ ప్రేమను వైవాహిక బంధంతో పదిలపర్చుకున్నారు. ఈ జంటకు కూతురు దియా, కుమారుడు దేవ్ సంతానం.ఆదరించని బాలీవుడ్పెళ్లయ్యాక కొంత గ్యాప్ తీసుకున్న ఈ హీరోయిన్ తర్వాత సినిమాల్లో రీఎంట్రీ ఇచ్చింది. కానీ, ఈసారి బాలీవుడ్ నుంచే ఎక్కువ అవకాశాలు వస్తున్నాయి. అప్పుడు పొమ్మన్న బాలీవుడే ఈసారి రారమ్మని ఎర్ర తివాచీ పరుస్తోంది. దీని గురించి జ్యోతిక మాట్లాడుతూ.. నా ఫస్ట్ హిందీ చిత్రం ఆడనందుకు బాలీవుడ్ నా ముఖంపైనే తలుపేసింది. తమిళంలో కూడా నా మొదటి సినిమా ఆడలేదు. కానీ ఇక్కడ నా పనితనాన్ని మెచ్చి వరుస అవకాశాలిచ్చారు. అదే అక్కడికీ, ఇక్కడికీ తేడా!అదే ప్లస్, మైనస్అయితే అప్పటికీ, ఇప్పటికీ బాలీవుడ్లో చాలా మార్పు వచ్చింది. మహిళల కోసం ప్రత్యేకంగా కథలు రాస్తున్నారు. దక్షిణాదిలో ఇంకా ఆ దిశగా పెద్దగా ప్రయత్నాలు చేయడం లేదు. ఈ లెక్కన ప్రతి ఇండస్ట్రీలో ప్లస్సులు, మైనస్సులు ఉన్నాయి అంది. కాగా జ్యోతిక నటించిన సిస్టమ్ సినిమా మే 22న అమెజాన్ ప్రైమ్లో విడుదల కానుంది.చదవండి: డ్రాగన్ గ్లింప్స్ ఆల్టైమ్ రికార్డ్ -
ఆ ఇద్దరికీ పొగరు.. ఆ ఒక్క హీరోయిన్ మాత్రం!
సెలబ్రిటీలు సెట్లో ఎలా ఉంటారనేది వారితో కలిసి పనిచేసినవారికే ఎక్కువ తెలుస్తుంది. ఎంతోమంది తారలతో కలిసి పని చేసిన బ్యాక్గ్రౌండ్ డ్యాన్సర్ రుబీనా ఖాన్.. ఆ అనుభవాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది. కొందరు గొప్ప స్టార్స్ అయినా ఎంతో ఆప్యాయంగా పలకరించేవారని, మరికొందరు మాత్రం పొగరు, అహంకారం చూపించేవారంటోంది.నేలపై కూర్చుని కబుర్లుఆమె మాట్లాడుతూ.. 'సంజయ్ దత్, అజయ్ దేవ్గణ్, జాకీ ష్రాఫ్, మిథున్ చక్రవర్తి వంటి పలువురు సెలబ్రిటీలు ఎన్నడూ తాము పెద్ద స్టార్స్ అని అహంకారం చూపించలేదు. డ్యాన్సర్లను ఫ్రెండ్స్లా చూసేవారు. మాధురి దీక్షిత్ అయితే మాలాంటి డ్యాన్సర్లతో నేలపై కూర్చుని ఎన్నో కబుర్లు చెప్పేది, జోక్స్ వేస్తుండేది. తాను పెద్ద సూపర్ స్టార్, మేము కేవలం డ్యాన్సర్స్ మాత్రమే అని ఎన్నడూ అనుకోలేదు.డ్యాన్సర్ రుబీనా ఖాన్మొదట్లో గర్వం..అయితే హీరోయిన్లు మమతా కులకర్ణి, దివ్య భారతి మాత్రం కెరీర్ ప్రారంభంలో కొంత గర్వం చూపించేవారు. అలా అని వారిని నేను తప్పుపట్టడం లేదు. డ్యాన్స్ చేసేటప్పుడు తోపులాటకు గురవకుండా ఉండేందుకు డ్యాన్సర్లను కాస్త దూరంగా నిలబడమని అడిగేవారు. అదే సమయంలో వాళ్లను కాస్త విసిగించాలని మేము కావాలనే తప్పులు చేస్తూ టేక్స్ తీసుకునేవాళ్లం. అలా కొన్నిసార్లు కావాలనే తుంటరి పని చేసేవాళ్లం.అరికాళ్లకు బొబ్బలుప్రేమ్ సినిమా షూటింగ్ మాత్రం ఎప్పటికీ మర్చిపోలేను. అందులోని ఓ పాటను తీవ్రమైన ఎండలో చిత్రీకరించారు. కాళ్లకు చెప్పులు లేకుండా డ్యాన్స్ చేయాలి. ఆ సాంగ్ పూర్తయ్యే సమయానికి మా డ్యాన్సర్లందరికీ కాళ్లకు బొబ్బలు వచ్చాయి. అప్పట్లో మా పారితోషికం ఎలా ఉండేదంటే.. సాధారణ దుస్తులకు ఒక రేటు, పొట్టి బట్టలకు మరో రేటు ఉండేది. ఏం మారలేదుదుస్తుల సైజు చిన్నవైనప్పుడు కొన్నిసార్లు డబుల్ పారితోషికం ఇచ్చేవారు. నేను ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మొదట్లో రోజుకు రూ.175 ఇచ్చేవారు. ఈ రేటు ఏమంత మారలేదు. 25 ఏళ్ల క్రితం ఏదైనా వాణిజ్య ప్రకటనలో డ్యాన్స్ చేస్తే రూ.3500 ఇచ్చేవారు. ఇప్పటికీ కొన్ని నిర్మాణ సంస్థలు పైసా పెంచకుండా అంతే మొత్తాన్నిస్తున్నాయి' అని రుబీనా చెప్పుకొచ్చింది.చదవండి: ధనుష్ కంటే అతడు 100 రెట్లు నయం: మిస్కిన్ -
రిలేషన్లో వన్ టైం చీటింగ్ తప్పేం కాదు: రకుల్
తెలిసో తెలియకో ఏదో ఒకసారి చీటింగ్ చేస్తే తప్పేం కాదంటోంది హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. అలా అని మోసం చేయడాన్ని తాను సమర్థించడం లేదని చెప్తోంది. రకుల్ కథానాయికగా నటించిన తాజా చిత్రం 'పతీ పత్నీ ఔర్ వో దో'. ఇటీవల రిలీజైన ఈ హిందీ సినిమా ఇప్పటివరకు రూ.30 కోట్లకు పైగా రాబట్టింది. పాజిటివ్ టాక్తో థియేటర్లలో విజయవంతంగా ఆడుతోంది. మోసం చేస్తే?ఈ మూవీ ప్రమోషన్స్లో భాగంగా హీరో ఆయుష్మాన్ ఖురానా, హీరోయిన్లు సారా అలీ ఖాన్, రకుల్ ప్రీత్ ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. రిలేషన్షిప్లో ఉన్నప్పుడు పార్ట్నర్ మోసం చేస్తే ఒప్పుకుంటారా? అన్న ప్రశ్నకు ముగ్గురూ విభిన్నంగా స్పందించారు. మొదటగా సారా అలీ ఖాన్.. మోసం చేయడం సరికాదు, కానీ మోసం జరిగితే మాత్రం కచ్చితంగా సారీ చెప్పాలి అంది. దానికి రకుల్ కూడా అవునని వంత పాడింది. అయితే ఆయుష్మాన్ ఖురానా మాత్రం పెళ్లయ్యాక ప్రత్యేక షరతులుంటాయి. మానవ సహజంఒకవేళ ఏదైనా పొరపాటు జరిగి, దానికి బాధపడుతూ నిజాయితీగా సారీ చెప్పినప్పుడు క్షమించేయడమే ఉత్తమం. మనిషన్నాక చిన్నపాటి పొరపాట్లు చేస్తూనే ఉంటాడు. వాటిని పెద్దగా చూడకూడదు. అయితే పొరపాట్లు చేయడమే పనిగా పెట్టుకోవడం మాత్రం సరికాదు అన్నాడు. అలాగైతే ఒకసారి చీట్ చేస్తే క్షమించేయొచ్చా? అని సారా అడగ్గా కుదరదని రకుల్ బదులిచ్చింది.అది సరికాదుకానీ, అంతలోనే మళ్లీ మాట మార్చేసింది. 'ఎవరైనా అనుకోకుండా పొరపాటు చేస్తే మాత్రం క్షమించేయొచ్చు. ఎందుకంటే జీవితం చాలా పెద్దది. ఒక్క పొరపాటు చేసినందుకు జీవితాంతం అవతలి వ్యక్తిని క్షమించకుండా ఉండటం కరెక్ట్ కాదు. అలా అని ఇది నా జీవితానికి, నా భర్తకు వర్తించదు' అని రకుల్ పేర్కొంది.చదవండి: జైలులో పెళ్లిరోజు.. ఏదేమైనా నీ చేయి వదలను: దర్శన్ భార్య -
ఆస్పత్రిలో అమితాబ్? మౌనంగా ఉంటే ఇలాగే రెచ్చిపోతారు!
లెజెండరీ నటుడు అమితాబ్ బచ్చన్ ఆస్పత్రిపాలయ్యాడంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. శనివారం సాయంత్రం కడుపునొప్పితో బాధపడుతున్న బిగ్బీ ముంబైలోని నానావతి ఆస్పత్రిలో చేరాడని, అప్పటినుంచి అక్కడే చికిత్స తీసుకుంటున్నాడని సదరు వార్తల సారాశం. దీంతో అభిమానులు బిగ్బీకి ఏమైందని ఆందోళన చెందుతున్నారు.అసలేమైంది?కాగా బిగ్బీకి కూలీ సినిమా (1983) చిత్రీకరణ సమయంలోనే కడుపు నొప్పి సమస్యలు మొదలయ్యాయి. దీంతో ఆయన నిజంగానే ఆస్పత్రిలో ఉన్నాడా? అని ఫ్యాన్స్ కంగారుపడుతున్నారు. అయితే ఈ ప్రచారం అంతా ఉట్టిదేనని తెలుస్తోంది. ఎందుకంటే ఆయన ప్రతి ఆదివారంలాగే మొన్నటి ఆదివారం కూడా తన నివాసం బయటకు వచ్చి అభిమానులకు ఆప్యాయంగా నమస్కరించాడు. భయం మటుమాయంఅందుకు సంబంధించిన ఫోటోలను సైతం షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. ఎప్పటిలాగే నా శ్రేయోభిలాషలను కలిసేందుకు నేను ఇంటి నుంచి బయటకు వస్తాను. ఆ సమయంలో నాలో ఒక ప్రశ్న తలెత్తింది. వారు నిజంగానే బయట ఉన్నారా? ఒకవేళ ఉన్నా నన్ను కలవడానికి వచ్చారా? లేదా హేళన చేసేందుకు వచ్చారా? అని ఒకింత భయం వేసింది. కానీ బయటకు వస్తుండగానే వారి కేరింతలు నాలోని భయాన్ని మటుమాయం చేశాయి. నాలో సంతోషాన్ని రెట్టింపు చేశాయి. పిల్లలు, పెద్దలు.. ఇలా అందర్నీ చూసేసరికి మనసుకు తేలిక. నిజంగా నేనెంత అదృష్టవంతుడిని అని రాసుకొచ్చాడు.మౌనంగా ఉంటేనే..ఇక రొటీన్ చెకప్లో భాగంగానే అమితాబ్ ఆస్పత్రికి వెళ్లి వచ్చాడని తెలుస్తోంది. ఇదిలా ఉంటే బిగ్బీ.. బుధవారం నాడు తన బ్లాగ్లో హిందీలో ఓ పద్యం రాసుకొచ్చాడు. 'గద్ద మౌనంగా ఉన్నప్పుడే రామచిలకలు మాట్లాడటం మొదలుపెడతాయి. నచ్చిన విందు ఆరగిస్తాయి. బ్రెడ్డు, ధాన్యపు గింజలు నోట్లో పడగానే కాకుల్లా అరవడం మొదలుపెడతాయి' అని దాని సారాంశం. బహుశా తన ఆరోగ్యం గురించి వస్తున్న రూమర్స్పై బిగ్బీ ఇలా కౌంటరిచ్చాడేమో! ప్రస్తుతం బిగ్బీ కల్కి 2898 ఏడీ సీక్వెల్లో కనిపించనున్నాడు.చదవండి: జైల్లోనే దర్శన్ పెళ్లిరోజు.. భార్య ఎమోషనల్ పోస్ట్ -
నేను ఒంటరివాడిని కాను: సల్మాన్ ఖాన్
‘‘కోట్లాది మంది అభిమానులు, స్నేహితులు, ఇంత పెద్ద కుటుంబం నాకు ఉన్నప్పుడు నేనెలా ఒంటరివాడిని అవుతాను?’’ అంటున్నారు సల్మాన్ ఖాన్. ఓ షర్ట్లెస్ ఫొటోని ఆయన తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసి, ‘‘ఒంటరిగా ఉండటానికి రెండు మార్గాలున్నాయి. ఒకటి అలోన్... రెండోది లోన్లీ. అలోన్గా ఉండటం మన నిర్ణయం. కానీ, ఎవరూ మనతో ఉండటానికి ఇష్టపడనప్పుడు వచ్చేది లోన్లీనెస్.దీని తర్వాత ఏం చేయాలో మీరే ఆలోచించుకోండి’’ అంటూ సల్మాన్ ఖాన్ షేర్ చేసిన పోస్ట్ వైరల్ అయింది. ‘మీరు (సల్మాన్) ఒంటరిగా ఉన్నానని ఎందుకు బాధపడుతున్నారు?’ అంటూ ఆయన ఫ్యాన్స్ ఆందోళనకు గురై పోస్ట్లు పెట్టడంపై సల్మాన్ మరోసారి స్పందించారు. ‘‘నా వ్యక్తిగత జీవితం గురించి ఆ పోస్ట్ చేయలేదు. అయినా... ఇంత పెద్ద కుటుంబం, కోట్లాది మంది స్నేహితులు, అభిమానులు ఉన్నప్పుడు నేను ఒంటరివాడిని ఎలా అవుతాను.మీరంతా నాతో ఉంటున్నప్పటికీ నేను ఒంటరిగా ఉన్నాననుకుంటే కృతజ్ఞత లేనివాడిని అవుతాను. షూటింగ్స్ నుండి నా కోసం కొంచెం సమయం కేటాయించుకోవాలనిపించింది. అంతే... దాన్ని అందరూ హైలైట్ చేసి హెడ్లైన్స్గా మార్చేశారు. ఆ వార్తలు చూసి మా అమ్మ నన్ను ‘ఏమైంది?’ అని కంగారుగా అడుగుతోంది. రిలాక్స్ అవ్వండి ఫ్రెండ్స్... నాకేం కాలేదు’’ అని సల్మాన్ స్పష్టం చేశారు. -
‘డ్రాగన్’ గ్లింప్స్ రిలీజ్.. ఎన్టీఆర్ ఫ్యాన్స్కి పవర్ఫుల్ ట్రీట్
మ్యాన్ ఆఫ్ మాసెస్ జూ.ఎన్టీఆర్ హీరోగా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న డ్రాగన్ సినిమా గ్లింప్స్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. మే 20వ తేదీ జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ మొత్తం సినిమా కంటెంట్ ఎలా ఉండబోతోందనే క్లారిటీ ఇచ్చేసినట్లు అయింది. ‘సలార్’, ‘కేజీఎఫ్’ లాంటి భారీ సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ నీల్, తన మార్క్ ఏమాత్రం తగ్గకుండానే ఈ గ్లింప్స్ కట్ చేశాడు.ఇక తారక్ పుట్టినరోజు సందర్భంగా మంగళవారం రాత్రి 11.30 గంటల తర్వాత డ్రాగన్ సినిమా గ్లింప్స్ వచ్చింది. 4.28 నిమిషాల నిడివి గల ఈ గ్లింప్స్లో ఎన్టీఆర్ స్లిమ్ లుక్ ఆకట్టుకుంది. సింపుల్గా సినిమా కథ, ఆ ప్రపంచంలోని పాత్రలను పరిచయం చేశారు. ఈ గ్లింప్స్లో తారక్ చెప్పిన డైలాగ్స్ అభిమానులను అలరించేలా ఉన్నాయి. విజువల్స్ చాలా రిచ్గా ఉన్నాయి. రవి బస్రూర్ అందించిన నేపథ్య సంగీతం ఫ్యాన్స్ అంచనాలను మరింత పెంచేలా ఉన్నాయి. పవర్ఫుల్గా సాగిన ఈ గ్లింప్స్ సినిమా మీద భారీ అంచనాలను రేపుతోంది.కాగా డ్రాగన్ సినిమా ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ షూటింగ్ షెడ్యూల్లు వరుసగా వాయిదాలు పడటంతో సినిమా రిలీజ్ కూడా వాయిదా పడ్డ విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానున్నట్టు డ్రాగన్ టీమ్ అధికారికంగా ప్రకటించింది. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ప్రాజెక్ట్పై అంచనాలు మరింత పెరిగాయి. ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఓ కీలకమైన పాత్రలో అనిల్ కపూర్ నటిస్తున్నారు. కథను మలుపు తిప్పే మరో లీడ్ రోల్లో నటించనున్నారంటూ శ్రుతీహాసన్, రష్మికా మందన్నా, కాజోల్... వంటి వార్ల పేర్లు వినిపించాయి. తాజాగా ఆలియా భట్ పేరు తెరపైకి వచ్చింది. కాగా.. ఈ చిత్రాన్ని నందమూరి కల్యాణ్రామ్, నవీన్ యేర్నెని, వై. రవిశంకర్, కొసరాజు హరికృష్ణ నిర్మిస్తున్నారు. తాజాగా విడుదల చేసిన వీడియో గ్లింప్స్ను మీరు కూడా చూసేయండి. -
ప్రేమ ఒప్పుకోలేదని.. కెనడా నుంచి వచ్చి కిడ్నాప్- హత్య
పంజాబ్లో లేడీ సింగర్ హత్య ఉదంతం సంచలనం సృష్టించింది. యశిందర్ కౌర్ అలియాస్ ఇందర్ కౌర్ (29) మృతదేహాన్ని ఆరు రోజుల తర్వాత పోలీసులు నీటి కాలువలో గుర్తించారు. మే 13న రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఇందర్ కౌర్.. ఎంతకీ తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పుడు మృతదేహం లభించడంతో అసలేం జరిగిందనే విషయాలు బయటకొచ్చాయి.(ఇదీ చదవండి: మీ నాన్నతో గొడవ క్లియర్ అయిందా? మనోజ్ సమాధానమిదే)హత్యకు గురైన ఇందర్ కౌర్ సోదరుడు జోటిందర్ సింగ్ ఫిర్యాదు ప్రకారం.. ఇందర్ మే 13న రాత్రి 8:30 గంటలకు కారులో సరుకులు కొనుగులు చేసేందుకు వెళ్లింది. కాసేపటి తర్వాత నుంచి ఆమె ఆచూకీ లభించలేదు. అయితే ఈమె కనిపించకపోవడం వెనక మోగా జిల్లాకు చెందిన సుఖ్విందర్ సింగ్ అలియాస్ సుఖా హస్తం ఉందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. మూడేళ్ల క్రితం ఇందర్ కౌర్కి ఇన్ స్టా ద్వారా సుఖ్విందర్ సింగ్ పరిచయమయ్యాడు. ప్రేమ పేరిట పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చాడు. కానీ అప్పటికే అతడికి పెళ్లయిందని తెలుసుకున్న ఇందర్ కౌర్, సుఖ్విందర్ని దూరం పెట్టింది. దీంతో కక్ష పెంచుకున్న అతడు.. ఈ దారుణానికి పాల్పడ్డాడని పోలీసులు అనుమానిస్తున్నారు.పోలీసుల దర్యాప్తు ప్రకారం.. కెనడాలో ఉంటున్న సుఖ్విందర్, నేపాల్ గుండా పంజాబ్కి చేరుకున్నాడు. 13వ తేదీన తన సహచరులతో కలిసి ఇందర్ కౌర్ కారుని అడ్డగించి తుపాకీతో బెదిరించి ఆమెని కిడ్నాప్ చేశాడు. తర్వాత ఆమెని హత్య చేసి నీటి కాలువలో పడేశాడు. నేరం చేసిన వెంటనే నేపాల్ ద్వారానే తిరిగి కెనడాకి పారిపోయాడని తెలుస్తోంది.అయితే ఈ కేసులో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఇందర్ కౌర్ కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 15వ తేదీనే జమాల్పూర్ పోలీస్ స్టేషన్లో సుఖ్విందర్ సింగ్, కరమ్జిత్ సింగ్లపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పటికీ, వెంటనే చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తున్నారు. ఇందర్ కౌర్ మృతదేహాన్ని కాలువ నుంచి బయటకు తీసిన పోలీసులు.. కేసు నమోదు చేశారు. నిందితులని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.(ఇదీ చదవండి: గర్ల్ఫ్రెండ్ బానిస కాదు.. కొత్త తెలుగు సినిమా) -
నా పోస్ట్ని బ్రేకింగ్ న్యూస్ చేశారు.. అమ్మ కంగారుపడుతోంది : సల్మాన్ ఖాన్
నిన్నంటి నుంచి సల్మాన్ ఖాన్కు సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఆయన షర్ట్లెస్ ఫోటోని ఇన్స్టాలో షేర్ చేస్తూ.. ఒంటరితనం గురించి రాసుకొచ్చాడు. ‘ఒంటరిగా ఉండటానికి రెండు మార్గాలున్నాయి. ఒకటి 'అలోన్', రెండోది 'లోన్లీ'. 'అలోన్'గా ఉండటం అనేది మన ఇష్టపూర్వక ఎంపిక. కానీ, ఎవరూ మనతో ఉండటానికి ఇష్టపడనప్పుడు వచ్చేది 'లోన్లీ'నెస్... ఇక దీని తర్వాత ఏం చేయాలో మీరే ఆలోచించుకోండి’ అని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడంతో అది క్షణాల్లో వైరల్ అయిపోయింది. ‘సల్మాన్ ఖాన్కి ఏమైంది?’, ఒంటరిగా ఉన్నానని ఎందుకు ఫీల్ అవుతున్నాడంటూ ఆయన అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో ఈ వైరల్ న్యూస్పై సల్మాన్ ఖాన్ స్పందించాడు. సోషల్ మీడియాలో తాను పెట్టిన పోస్ట్.. వైరల్ అయిన న్యూస్ చూసి తన తల్లి కంగారు పడిందని, అయితే తాను మాత్రం చాలా హ్యాపీగానే ఉన్నానని చెప్పాడు.‘అరే యార్.. నేను నా గురించి మాట్లాడలేదు. అయినా.. ఇంత పెద్ద కుటుంబం, ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నప్పుడు నేను ఎలా ఒంటరివాడిని అవుతాను? మీ అందరి ప్రేమాభిమానాలు నాకు తోడుగా ఉంటే నేను ఒక్కడినే అనే భావన నాలో ఎందుకు వస్తుంది? కొన్నిసార్లు చుట్టూ జనాలు ఉండటం వల్ల విసుగ్గా అనిపిస్తుంది. అందుకే నా కోసం కొంచెం సమయం కేటాయించుకోవాలనిపించిందంతే. దాన్ని మీరంతా హైలైట్ చేశారు. కనీసం ఫొటో కూడా పెట్టకుండానే మీరు దీన్ని బ్రేకింగ్ న్యూస్ చేసేశారు. మా అమ్మ కూడా నన్ను ‘ఏమైంది నాన్న?’ అని అడుగుతోంది. రిలాక్స్ అవ్వండి ఫ్రెండ్స్’ అని ఆయన ఇన్స్టాలో రాసుకొచ్చాడు. దీంతో సల్మాన్ ఖాన్కి ఏం కాలేదనే విషయం తెలిసి.. ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సల్మాన్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఆయన నటించిన ‘మాతృభూమి’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. దీంతో పాటు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. -
ఈ సినిమా ప్రేక్షకుల ఊహకు అందదు : రష్మిక మందన్నా
షాహిద్ కపూర్, రష్మికా మందన్నా, కృతీసనన్ ప్రధాన తారాగణంగా నటించిన హిందీ చిత్రం ‘కాక్ టెయిల్ 2’. హోమి అదజానియా దర్శకత్వంలో దినేష్ విజన్, లవ్ రంజన్ , అంకుర్ గార్గ్ నిర్మించారు. ఇందులో కునాల్ పాత్రలో షాహిద్ కపూర్, దియాగా రష్మికా మందన్నా, అల్లీగా కృతీసనన్ నటించారు. ఈ చిత్రం జూన్ 19న థియేటర్స్లో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ముంబైలో ఈ సినిమా మ్యూజికల్ ఈవెంట్ను నిర్వహించారు. ఈ ఈవెంట్లో రష్మికా మందన్నా మాట్లాడుతూ–‘‘డిఫరెంట్ లవ్స్టోరీ సినిమా ఇది. ఈ సినిమా కథ ప్రేక్షకుల ఊహకు అందదు. షాహిద్తో ఆన్ స్క్రీన్ పై మంచి కెమిస్ట్రీ కుదిరింది. ఈ సినిమాలో కృతీసనన్ మరింత అందంగా కనిపిస్తారు’’ అని అన్నారు. ‘‘ఈ సినిమాలో నేను కునాల్ రోల్ చేశాను. కథలో ఇద్దరు హీరోయిన్ల మధ్యలో కునాల్ ఎవరివైపు వెళ్లాలో తెలియక సతమతం అవుతుంటాడు. రష్మిక, కృతీసనన్ సూపర్స్టార్స్. ఎంతో ప్రొఫెషనల్గా ఉంటారు’’ అని చెప్పారు. ఇక హోమి అదజానియా దర్శకత్వంలో సైఫ్ అలీఖాన్ , దీపికా పదుకొనె, డయానా పెంటీ లీడ్ రోల్స్ చేసిన హిందీ హిట్ ఫిల్మ్ ‘కాక్టెయిల్’. ఈ ‘కాక్టెయిల్’ ఫ్రాంచైజీ నుంచి రాబోతున్న రెండో సినిమా ‘కాక్ టెయిల్ 2’ అని తెలుస్తోంది. -
భరణం? విడాకుల్లో మూడో వ్యక్తి ప్రమేయం? నటి భర్త క్లారిటీ
బాలీవుడ్ నటి మౌనీరాయ్ కొన్నిరోజుల క్రితమే విడాకులు తీసుకుంది. ఈ విషయాన్ని ఆమె తన భర్త సూరజ్ నంబియార్తో కలిసి అధికారికంగానే వెల్లడించింది. అయితే వీళ్లిద్దరూ విడిపోవడానికి బాలీవుడ్ హీరోయిన్ దిశా పటానీనే కారణమని తెగ రూమర్స్ వస్తున్నాయి. అలానే భరణం గురించి కూడా మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు వీటన్నింటికి చెక్ పెట్టిన సూరజ్.. ఇన్స్టా స్టోరీలో మొత్తం క్లారిటీ ఇచ్చాడు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమాలు)'మా విడాకుల విషయంలో వస్తున్న పుకార్లకు పుల్స్టాప్ పెట్టాలనుకుంటున్నా. ఎలాంటి భరణం లేదు. మా మధ్య వివాదాలు ఏం లేవు. మూడ వ్యక్తి ప్రమేయం అసలు లేదు. మేం చర్చించుకున్న తర్వాతే నిర్ణయం తీసుకున్నాం. పరస్పర అంగీకారంతోనే విడిపోతున్నాం. ఇది మాత్రమే నిజం. మిగతావన్నీ అవాస్తవాలు. రూమర్స్ గురించి స్పందించకపోవడం తప్పే అవుతుంది. అందుకే క్లారిటీ ఇస్తున్నా' అని సూరజ్ చెప్పుకొచ్చాడు.ప్రేమించుకుని 2022లో సూరజ్-మౌనీ రాయ్ పెళ్లి చేసుకున్నారు. సూరజ్ దుబాయికి చెందిన బిజినెస్మ్యాన్. మలయాళీ, బెంగాలీ సంప్రదాయల్లో వీళ్ల వివాహం జరిగింది. కానీ నాలుగేళ్లకే విడిపోయారు.(ఇదీ చదవండి: చేతికైన గాయం గురించి క్లారిటీ ఇచ్చిన చరణ్) -
'బూతు'ని కంట్రోల్ చేసుకోలేకపోయిన రష్మిక
సాధారణంగా నటీనటులు ఎవరైనా సరే ఆచితూచి మాట్లాడుతుంటారు. స్టార్స్ అయితే ఇంకా జాగ్రత్తగా ఉంటారు. కొన్నిసార్లు మాత్రం పొరపాటులో నోరు జారుతుంటారు. హీరోయిన్ రష్మిక కూడా ఇప్పుడు అలానే చేసింది. తోటి హీరోయిన్ని పొగుడుతూ టంగ్ స్లిప్ అయింది. వెంటనే నాలిక్కరుచుకుంది. ఇంతకీ ఏమైంది?(ఇదీ చదవండి: ఓటీటీలోకి మెగా కోడలి కొత్త సినిమా.. అధికారిక ప్రకటన)స్వతహాగా కన్నడ అమ్మాయి అయినప్పటికీ రష్మిక.. తెలుగు సినిమాలతోనే బోలెడంత గుర్తింపు తెచ్చుకుంది. హీరో విజయ్ దేవరకొండని ప్రేమించి పెళ్లి చేసుకుని తెలుగింటి కోడలు అయిపోయింది. హిందీలోనూ మూవీస్ చేస్తున్న ఈమె నటించిన 'కాక్టెయిల్ 2' వచ్చే నెల 19న థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే తాజాగా ముంబైలో ప్రమోషనల్ ఈవెంట్ జరిగింది.ఈ కార్యక్రమంలోనే తోటి హీరోయిన్ కృతి సనన్ గురించి చెబుతూ '****' అనే బూతుని పొరపాటున ఉపయోగించింది. వెంటనే క్షమాపణ కూడా చెప్పేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. రష్మిక, కృతిసనన్ హీరోయిన్లుగా కాగా షాహిద్ కపూర్ హీరో. అయితే ఈ మూవీలో రష్మిక-కృతి సనన్.. స్వలింగ సంపర్క పాత్రల్లో కనిపించనున్నారనే రూమర్స్ గతంలో వచ్చాయి. (ఇదీ చదవండి: తెలుగు క్రికెటర్తో శ్రీలీల డేటింగ్.. స్పందించిన హీరోయిన్ తల్లి)#RashmikaMandanna just couldn’t stop praising #KritiSanon 🤯🔥pic.twitter.com/bf76j1cVYd— Filmyscoops (@Filmyscoopss) May 18, 2026 -
నిజ జీవిత స్ఫూర్తితో పుట్టిన ‘పెద్ది’
మెగా పవర్స్టార్ రామ్చరణ్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్గా వస్తోన్న రూరల్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది. తాజాగా ఈ చిత్ర దర్శకుడు బుచ్చిబాబు ‘పెద్ది’ సినిమా టైటిల్ వెనక ఉన్న ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన పెద్దిరాజు అనే వ్యక్తి నుంచి ఈ టైటిల్ పుట్టిందని ఆయన తెలిపారు. పెద్దిరాజు తాపీ పని చేస్తూనే క్రికెట్, బాస్కెట్బాల్ బాగా ఆడేవారు. తనది పేద కుటుంబం కావడంతో ఎవరు డబ్బు ఇస్తే వాళ్ల తరఫున ఆడేవాడట. ఆయన జీవితం నుంచి స్ఫూర్తి పొంది కథను రాసుకున్నానని బుచ్చిబాబు చెప్పారు. అయితే ఈ సినిమా బయోపిక్ కాదు. నిజజీవితం నుంచి స్ఫూర్తిపొంది, దానికి కొంత ఫిక్షన్ కూడా జోడించి కథను రూపొందించానని ఆయన స్పష్టం చేశారు. అలా టైటిల్ కోసం పెద్దిరాజు పేరులోని ‘పెద్ది’ అనే పదాన్ని ఎంచుకున్నాను.ఇది కోడి రామ్మూర్తి బయోపిక్ అని, జూ.ఎన్టీఆర్ కోసం రాసిన కథ అని వస్తున్న పుకార్లను బుచ్చిబాబు ఖండించారు. ఉప్పెన రిలీజ్కు ముందే ఈ కథ రాసుకున్నానని ఆయన క్లారిటీ ఇచ్చారు. మొదట ఈ సినిమాను గోదావరి యాసలో తీద్దామనుకున్నాను. అయితే ఇప్పటికే రామ్ చరణ్ తన గురువు సుకుమార్ దర్శకత్వంలో చేసిన 'రంగస్థలం' ఆ నేపథ్యమే కావడంతో తన సినిమా ‘పెద్ది’ కోసం విజయనగరం బ్యాక్డ్రాప్ను ఎంచుకున్నానని దర్శకుడు వెల్లడించారు. మెగా ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తోన్న రూరల్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది. బుచ్చిబాబు డైరెక్షన్లో వస్తోన్న ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ మూవీలో స్పెషల్ సాంగ్లో శృతిహాసన్ స్పెషల్ అట్రాక్షన్గా నిలవనుంది. ఇక ఈ చిత్రంలో జగపతిబాబు, శివరాజ్ కుమార్ కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ సంగీతమందించారు. ‘పెద్ది’ సినిమా ట్రైలర్ను ఈ నెల 18న గ్రాండ్ రిలీజ్ చేయనున్నారు. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ఈ చిత్రం సందడి చేయనుంది. -
సాహిత్యం ఒక థెరపీ.. తెలుగు సినిమాల్లో పాడాలనుంది
ఏది మనసును ఇబ్బంది పెడితే, దాన్ని కాగితంపై రాయండి. రాయడం అనేది ఒక ఆటోమేటిక్ రిలీజ్, అదొక థెరపీ కూడా.. అంటూ బ్రేకప్ టిప్స్ పంచుకుంది ప్రముఖ బాలివుడ్ సింగర్ కం యాక్టర్ సంజీతా భట్టాచార్య. మొదట్లో అలా రాసిన పాటను పాడేటప్పుడు గొంతు ఆగిపోతుందని, భావోద్వేగాలు అడ్డొస్తాయని.. కానీ కాలక్రమంలో ఆ వ్యక్తి కన్నా పాటే మిగిలిందని, అదే సంగీతంలోని అందమని ఆమె తెలిపారు. “మనిషి వెళ్లిపోతాడు… కానీ పాట మాత్రం ఉండిపోతుంది” అనే తన మాటలతో ఈ జనరేషన్లో బ్రేకప్లను బలహీనతగా కాకుండా, భావాలను అర్థం చేసుకునే ఒక దశగా చూడాలని సంజీతా సూచించారు. బాధను దాచుకోకుండా, దాన్ని ఆర్ట్గా, పాటగా, రాతగా మార్చితే అదే మన శక్తిగా మారుతుందన్నారు.షారుఖ్ కోసం స్పానిష్ సాంగ్..నగరంలోని ఇనార్బిట్ మాల్ లో షాపర్ష స్టాప్, హైబ్ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలోని ఫస్ట్ గ్లోబల్ గర్ల్ గ్రూప్ ఆడిషన్స్లో ప్రత్యేక అతిథిగా పాల్గొన్న సంజీతా భట్టాచార్య ‘సాక్షి’తో ముచ్చటించారు. గ్లామరస్ పర్ఫార్మెన్స్ మాత్రమే కాదు, ప్రతిష్టాత్మక బెర్క్లీ కళాశాలలో మ్యూజిక్ డిగ్రీ పొందిన సంజీతా భట్టాచార్య.. సంగీతమే తనకు మొదటి ప్రేమ అని తెలిపింది. షారుక్ ఖాన్ జవాన్ సినిమాలో తాను నటించడంతో పాటు స్పానిష్ సాంగ్ పాడటం తనకెంతో పేరు తెచ్చిపెట్టిందని అన్నారు. షారుక్ అంటే తనకూ ఎంతో ఇష్టమని, షూటింగ్ సమయంలో అలా చూస్తూ ఉండిపోయానని సంతోషాన్ని వ్యక్తం చేశారు. ‘‘మా నాన్న నాకు మొదటి ప్రేరణ.. తానొక పెయింటింగ్ ఆర్టిస్ట్, ఆర్టిస్ట్గా సృజనాత్మకతతో జీవిస్తూ అందులోని ప్రేమను ఆస్వాదిస్తున్న వ్యక్తిగా పేర్కొన్నారు. ఫ్రాంక్లిన్, క్రిస్టినా, సెలిన్ డియాన్తో పాటు ఏ.ఆర్.రహ్మాన్ తన ఫేవరెట్స్ అని చెప్పారు. తదుపరి ప్రాజెక్ట్ కొత్త ఆల్బమ్ బీటీఎస్ అరిరంగ్ అందుబాటులో ఉందని, మరిన్ని కొత్త ప్రాజెక్టులతో రానుననాని, ఈ సంవత్సరం విడుదలకానున్న అల్బమ్ లో హిందీ, ఇంగ్లీష్, స్పానిష్, బెంగాలీ పాటలు ఉంటాయని అన్నారు.మ్యూజిక్, కల్చర్, ఇన్స్పిరేషన్..హైదరాబాద్ ప్రజలు, ఇక్కడి సంస్కృతి ముఖ్యంగా బిర్యానీ అంటే నాకెంతో ఇష్టం. ఇక్కడికి 5 సార్లు వచ్చాను.. ప్రతి పర్ఫార్మెన్స్ తర్వాత ఇక్కడి నుంచి కొత్త ఫ్రెండ్స్తో వెళుతున్నాను.. అని హైదరాబాద్ ఆత్మీయ విశేషాలను పంచుకున్నారు. తెలుగు సినిమాల్లో కూడా పాడాలని ఉంది.. ఆ కోరిక త్వరలో నిజం కావాలని ఆశించారు. ఈ సందర్భంగా అభిమానుల కే-పాప్ సాంగ్ కావాలనే కోరిక మేరకు.. స్మూత్ లైక్ బెటర్ బీటీఎస్ సాంగ్ పాడి అలరించారు. ఈ తరం అమ్మాయిలు సోషల్ మీడియా వాడటంలో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ ఈవెంట్ లైఫ్స్టైల్, మేకోవర్, కలర్ అనాలిసిస్, ఫోటోబూత్ ఫన్ వంటి విశేషాలతో ఒక ట్రెండీ యూత్ క్యాంపస్ వాతావరణాన్ని సృష్టించింది. ఫ్యాన్స్కు ఓపికగా సెల్ఫీలు ఇస్తూ సందడి చేశారు. -
విడాకులపై ట్విస్ట్ ఇచ్చిన హీరోయిన్..!
ఇటీవలే విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన బాలీవుడ్ హీరోయిన్ మౌనీ రాయ్. తామిద్దరం పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా అనౌన్స్ చేసింది. ఈ సమయంలో మా ప్రైవసీని గౌరవించాలని అభిమానులను కోరింది. నాలుగేళ్ల పాటు బంధంలో ఉన్న ఈ జంట సంయుక్త ప్రకటన రిలీజ్ చేసి అందరికీ షాకిచ్చారు.అయితే అంతలోనే మరో ట్విస్ట్ ఇచ్చారు. వీరిద్దరు ఇప్పటికే సోషల్ మీడియాలో అన్ఫాలో చేసుకున్నారు. కానీ తాజాగా ఈ జంట మళ్లీ ఒకరినొకరు అనుసరిస్తున్నారు. దీంతో ఈ జంట తమ విడాకుల విషయంలో వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. మళ్లీ ఫాలో కావడంతో ఈ జంట కలవబోతున్నారని బాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. ఏదేమైనా వీరిద్దరు కలవాలని అభిమానులు కోరుకుంటున్నారు. కాగా.. మౌనీరాయ్ సీరియల్స్తో పాటు పలు చిత్రాల్లో హీరోయిన్గా చేసింది. -
స్పెషల్ ఎంట్రీ
టాలీవుడ్కి స్పెషల్ ఎంట్రీ ఇచ్చారు బాలీవుడ్ నటి నర్గీస్ ఫక్రీ. హవీష్ హీరోగా నటించిన ‘నేను రెడీ’ సినిమాలో నర్గీస్ ఫక్రీ స్పెషల్ సాంగ్ చేశారు. తెలుగులో ఆమె నటించిన తొలి చిత్రం ఇదే. కావ్య థాపర్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో బ్రహ్మానందం, శ్రీలక్ష్మి, ‘వెన్నెల’ కిశోర్, మురళీ శర్మ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు.త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో కోనేరు సత్యనారాయణ, నిఖిల కోనేరు నిర్మించారు. ‘‘నేను రెడీ’ సినిమా రీ–రికార్డింగ్ పనులతో సహా ఇటీవలే షూటింగ్ పూర్తయింది. జూన్ రెండో వారంలో ఈ సినిమాను విడుదల చేయడానికి సిద్ధం చేస్తున్నాం. హవీష్కు క్లీన్ కమర్షియల్ విజయాన్ని అందిస్తుందన్న నమ్మకం ఉంది’’ అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జే మేయర్. -
చిరు లీక్స్.. 'పెద్ది' ట్రయిలర్కి ముందే పెంచేసిన హైప్
టాలీవుడ్లో మెగాస్టార్ చిరంజీవి చేసే లీక్స్కి ప్రత్యేక స్థానం ఉంది. ఆయన తన సినిమాలే కాదు, ఇతర సినిమాల సంగతుల్ని కూడా అప్పుడప్పుడూ బయటపెడుతుంటారు. ఈసారి రామ్చరణ్ హీరోగా నటించిన ‘పెద్ది’ సినిమా ట్రయిలర్ విషయాలు ముందుగానే చెప్పేశారు. తాజాగా పెద్ది ట్రయిలర్ను చిరంజీవితో పాటు కొంతమంది మీడియా వ్యక్తులకు చూపించారు. ఆ విషయం అందరూ గోప్యంగానే ఉంచారు. అయితే మెగాస్టార్ మాత్రం ట్రయిలర్లోని ఓ కీలక డైలాగ్ను లీక్ చేశారు. “మీరందరూ నేను ఆడానని అనుకుంటున్నారు, నేను పోరాడాను సార్” అనే డైలాగ్ ట్రయిలర్లో ఉంటుందని వెల్లడించారు. “సారీ బుచ్చి.. ట్రయిలర్ చూశాక కంట్రోల్ తప్పింది” అంటూ హాస్యంగా కొనసాగించారు. అంతేకాదు పెద్ది సినిమా ట్రయిలర్ 3 నిమిషాల నిడివి కలిగి ఉందని కూడా చిరంజీవి బయటపెట్టారు. చరణ్, దర్శకుడు బుచ్చిబాబు, సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ ముగ్గురూ తమ బెస్ట్ ఇచ్చారని ఆయన ప్రశంసించారు. ఆడియన్స్ ఊహించిన దానికంటే ఎక్కువగానే ట్రయిలర్ ఉంటుంది. అంతా కలిసి రఫ్ఫాడించారని మెగాస్టార్ ట్రయిలర్పై ఉన్న హైప్ను అమాంతం పెంచేశారు. ఈ నెల 18న రిలీజ్ కానున్న పెద్ది ట్రయిలర్పై చిరంజీవి చేసిన ఈ లీక్స్ ఫ్యాన్స్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేశాయి. ఆయన రివ్యూ వల్ల ట్రయిలర్పై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. -
శత్రుదేశంలో ఓటీటీ నం.1 ట్రెండింగ్లో 'ధురంధర్ 2'
విదేశాల్లో 'ధురంధర్ 2' సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. మన దేశంలో మాత్రం జూన్ 4వ తేదీ సాయంత్రం నుంచి హాట్స్టార్లో అందుబాటులోకి రానుందని అధికారికంగానే ప్రకటించారు. అయితే ఈ మూవీ అంతా పాక్లోని లయరీ ప్రాంతంలో జరిగే గ్యాంగ్ వార్స్, రాజకీయాలు, ఉగ్రవాద చర్యలు తదితర అంశాల ఆధారంగా తీశారు. దీంతో పాక్తో పాటు అరబ్ దేశాల్లో దీనిపై నిషేధం విధించారు. దీంతో అక్కడి ప్రేక్షకులు ఎవరూ ఈ చిత్రాన్ని చూడలేకపోయారు.(ఇదీ చదవండి: నాపై చేతబడి.. రక్తం వాంతులు, నరకం చూశా : జయం రవి)అయితే 'ధురంధర్ 2' థియేటర్లలో రిలీజైన తర్వాత పైరసీని పాక్లో విపరీతంగా చూశారు. అక్కడి కరెన్సీలో రూ.50కే ప్రింట్ అమ్మారు. ఇప్పుడు అధికారికంగా దాయాది దేశంలో ఓటీటీలోకి వచ్చేసింది. వచ్చిన మరుక్షణం నుంచే ఓటీటీ సర్వర్ క్రాష్ అయిందని, అలానే గడిచిన 24 గంటల నుంచి తమ దేశంలో నం.1 ట్రెండింగ్లో ఉందని పాక్ ఇన్ఫ్లూయెన్సర్ చెప్పిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.'ధురంధర్ 2 పాకిస్తాన్లో ఇప్పుడే రిలీజైంది. సర్వర్స్ క్రాష్ అయ్యాయి. పాకిస్థానీలు అర్థరాత్రి ఎప్పుడవుతుందా? నెట్ఫ్లిక్స్లోకి ఎప్పుడొస్తుందా అని చూశారు. రాగానే క్లిక్ చేశారు. అందుకే మూవీ ప్లే కావడానికి టైమ్ పడుతోంది. అంతలా క్రేజ్ సంపాదించుకుంది. అయితే సినిమాలో చూపించింది నిజమా అబద్దమా అనేది వేరే విషయం. కానీ పాకిస్థానీలు మాత్రం మూవీ ఎలా తీసుంటారా అని చూసేందుకు ఎగబడుతున్నారు. రణ్వీర్ సింగ్ పాత్ర ఏంటనేది అందరికీ తెలుసు. లయరీలో అలా జరిగింది లేదా అనేది తర్వాత మాట్లాడుదాం' అని సదరు ఇన్ఫ్లూయెన్సర్ చెప్పుకొచ్చాడు.'ధురంధర్' రెండు భాగాలుగా రిలీజైంది. తొలి పార్ట్ గతేడాది డిసెంబరులో, సీక్వెల్ ఈ ఏడాది మార్చిలో థియేటర్లలోక వచ్చింది. మొత్తంగా రూ.3000 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. జస్కీరాత్ సింగ్ అనే వ్యక్తి.. హంజా అలీ మజారీ అనే మారుపేరుతో పాకిస్తాన్లోకి గూఢచారిగా వెళ్లి.. అక్కడ మాఫియాని, భారత్కి చేటు చేసిన పలువురు ఉగ్రవాదుల్ని ఎలా అంతం చేశాడనే స్టోరీతో ఈ సినిమా తీశారు. రణ్వీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, మాధవన్, సారా అర్జున్ కీలక పాత్రలు చేశారు. ఆదిత్య ధర్ దర్శకుడు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సినిమా) View this post on Instagram A post shared by maviya umer farooqui (@kaam_wali_baat) View this post on Instagram A post shared by maviya umer farooqui (@kaam_wali_baat) -
అబ్బే.. స్క్రిప్ట్ చదివే అలవాటు నాకెక్కడిది?: సల్మాన్ ఖాన్
బాలీవుడ్ భాయ్జాన్ సల్మాన్ ఖాన్ చిత్రపరిశ్రమకు ఎన్నో ఇండస్ట్రీ హిట్లు, బ్లాక్బస్టర్లు అందించాడు. తన కెరీర్లో ఎన్నో విజయాలు చూసిన ఈ స్టార్ హీరోకు అసలు స్క్రిప్ట్ చదివే అలవాటే లేదట! ఈ విషయాన్ని తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. వెరైటీ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సల్మాన్ మాట్లాడుతూ.. నా జీవితం మొత్తంలో ఒక్కసారి కూడా స్క్రిప్ట్ చదివిందే లేదు. కొన్నిసార్లు నేనే స్క్రిప్ట్ రాశాను కానీ ఎన్నడూ చదివిన పాపాన పోలేదు అని నవ్వుతూ చెప్పాడు. అదన్నమాట సంగతి!గతంలోనూ సల్మాన్ ఈ విషయాన్ని చూచాయగా చెప్పాడు. తనకు కథ కన్నా దాని స్వభావం, అందులోని కమర్షియల్ అంశాలే ముఖ్యమన్నాడు. ఇక ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు కొందరు అతడి నిజాయితీని మెచ్చుకుంటున్నారు. మరికొందరేమో అందుకే సల్మాన్ వరుస వైఫల్యాలు అందుకుంటున్నారని, ఇకనైనా ఈ ధోరణి మార్చుకుని మంచి కథలు ఎంచుకుంటే తిరిగి ట్రాక్ ఎక్కుతాడని హితవు పలుకుతున్నారు.సినిమాప్రస్తుతం సల్మాన్ ఖాన్ మాతృభూమి సినిమా చేస్తున్నాడు. దేశభక్తి నేపథ్యంలో సాగే ఈ మూవీలో సైనికాధికారిగా నటిస్తున్నాడు. అపూర్వ లఖియా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సల్మాన్ ఖాన్ నిర్మిస్తున్నాడు. దీనికి మొదట బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. పలు కారణాల వల్ల దాన్ని మాతృభూమిగా మార్చారు. అలాగే సల్మాన్.. తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లితో ఓ మూవీ చేస్తున్నాడు. నయనతార కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఈద్కు విడుదల కానుంది. -
ఎంతమందితోనైనా డేటింగ్.. నాకు అలానే జరిగింది
భరత్ అనే నేను, గేమ్ ఛేంజర్ లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమున్న హీరోయిన్ కియారా అడ్వాణీ.. త్వరలోనే 'టాక్సిక్'తో రాబోతుంది. ప్రస్తుతం గ్లామరస్ ఫొటోషూట్స్ చేస్తూ దర్శకనిర్మాతలని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్న ఈమె.. ఇప్పుడు ఏడాది కూడా నిండని తన కూతురి భవిష్యత్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. వాటిపై ఇప్పుడు సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.(ఇదీ చదవండి: మహేశ్ బాబుకి హిందీ రాదు.. అందుకే)తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కియారా అడ్వాణీ.. కూతురు గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. 'ఆమె (సరయూ) పూర్తి జీవితం చూడాలని అనుకుంటున్నాను. ఒక్కరితో డేటింగ్ చేయాలని రూలేం లేదు. ఈ విషయంలో ఆమెకు ఎలాంటి ఆంక్షలు విధించను. పెళ్లి చేసుకోవాలనుకుంటే ఓకే లేదంటే లేదు. డేట్ చేసిన ప్రతి ఒక్కరినీ పెళ్లి చేసుకోవాలని లేదు. నాకు అలానే జరిగింది. చివరకు సరైన వ్యక్తి దొరికాడు. ఎదిగే క్రమంలో ఈ బంధాలు.. అన్ని పాఠాలు నేర్పిస్తాయి. మనల్ని మనిషిగా మారుస్తాయి. జీవితాన్ని పూర్తిగా అనుభవించాలి. పొరపాట్లు అందరూ చేస్తారు. కానీ వాటి నుంచే నేర్చుకుంటారు' అని కియారా స్టేట్మెంట్ ఇచ్చింది.కియారా చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కనీసం ఏడాది పూర్తి కాని కూతురి గురించి మాట్లాల్సిన మాటలేనా ఇవి అని పలువురు నెటిజన్లు మండిపడుతున్నారు. ఇదేం ఫెమినిజం అని ప్రశ్నిస్తున్నారు. ఇదే సంస్కృతి అని ఫైర్ అవుతున్నారు. కియారా మాట్లాడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాని కియారా ప్రేమించి 2023లో పెళ్లి చేసుకుంది. గతేడాది జూలైలో వీళ్లకు కూతురు పుట్టింది.(ఇదీ చదవండి: ఎట్టకేలకు మన దేశంలో ఓటీటీకి 'ధురంధర్ 2'.. అధికారిక ప్రకటన)#KiaraAdvani Bold STATEMENT about her Daughter left Everyone SHOCKED 😳 She Said , - I will let My Daughter to DATE as many MAN she Wants . No Need to Marry a Guy You Date . EXPLORE Yourself with them . Earlier #RamKapoor Wife Giving SE*X and VIB*R*A*T*OR to her Daughter as… pic.twitter.com/uMqeOgxFOm— Manoz Kumar (@ManozTalks) May 15, 2026 -
దేశవ్యాప్తంగా రయ్ రయ్మంటూ ‘పెద్ది’ ప్రచారం!
రామ్ చరణ్- బుచ్చిబాబు సాన కాంబోలో వస్తోన్న మోస్ట్ అవైటేడ్ మూవీ ‘పెద్ది’. ఈ సినిమాకు సంబంధించిన ప్రచారం రయ్ రయ్ మంటూ మొదలుకానుంది. ఇప్పటివరకు నిశ్శబ్దంగా సాగిన ప్రమోషన్లు మే 18 నుంచి వేగం అందుకోనున్నాయి. జూన్ 2 వరకు దశలవారీగా భారీ ఈవెంట్లు ప్లాన్ చేసినట్లు యూనిట్ ప్రకటించింది. ముందుగా మే 18న ముంబయిలో ట్రైలర్ లాంచ్ జరగనుంది. ఈ కార్యక్రమానికి చరణ్ హాజరవుతాడు. ఆ తర్వాత మే 22న హైదరాబాద్ ఉప్పల్లో మరో భారీ ప్రచార కార్యక్రమం షెడ్యూల్ చేశారు. దీనికి కూడా చరణ్ హాజరవుతాడు. ఆ మరుసటి రోజు, అంటే మే 23న భోపాల్లో స్పెషల్ సాంగ్ రిలీజ్ జరగనుంది. మొదట భోపాల్లోనే ట్రైలర్ లాంచ్ చేయాలని అనుకున్నారు కానీ ప్లాన్ మార్చి అక్కడ పాట విడుదలకు నిర్ణయించారు. శృతిహాసన్, చరణ్పై చిత్రీకరించిన స్పెషల్ సాంగ్ను భోపాల్లో రిలీజ్ చేయనున్నారు. అయితే ఆ ఈవెంట్కు చరణ్ హాజరవ్వడం లేదట. శృతిహాసన్ మాత్రమే పాల్గొననుందని సమాచారం. ఇక తదుపరి ప్రచార కార్యక్రమాల విషయానికి వస్తే.. మే 24న బెంగళూరులో, మే 28న ఢిల్లీలో, మే 30న చెన్నైలో ఈవెంట్లు జరుగుతాయని సమాచారం. జూన్ 1న ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లాలో ఓ ప్రత్యేక కార్యక్రమం ప్లాన్ చేస్తున్నారట. అలాగే జూన్ 2న హైదరాబాద్లో గ్రాండ్గా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ జరగనుంది. జూన్ 3న ప్రీమియర్స్తో ‘పెద్ది’ సందడి థియేటర్లలో మొదలవనుంది. ప్రస్తుతానికి యూనిట్ అనుకుంటున్న ప్రమోషనల్ ప్లాన్ ఇదే. అయితే రాబోయే రోజుల్లో ఈ షెడ్యూల్లో కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉంది. ఇందులో చరణ్ ఎన్ని ఈవెంట్లకు హాజరవుతాడనే అంశంపై కూడా త్వరలోనే స్పష్టత రానుంది. మొత్తంగా, మే 18 నుంచి జూన్ 2 వరకు దేశవ్యాప్తంగా ‘పెద్ది’ ప్రచారం రయ్ రయ్మంటూ సాగనుంది. అభిమానుల్లో ఆసక్తి పెంచేలా యూనిట్ వ్యూహాత్మకంగా కార్యక్రమాలను అమలు చేస్తోంది. చరణ్-జాన్వి కపూర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో శృతిహాసన్ ఓ ప్రత్యేక గీతంలో కనిపించనున్న విషయం తెలిసిందే. ఏఆర్ రెహ్మాన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. గేమ్ ఛేంజర్ తర్వాత రామ్ చరణ్ నుంచి వస్తున్న సినిమా ఇదే కావడంతో మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. -
ఎట్టకేలకు మౌనం వీడిన మౌనీ రాయ్.. నాలుగేళ్లకే గుడ్ బై
అనుకున్నదే జరిగింది. గత రెండు రోజులుగా వస్తోన్న రూమర్సే నిజమయ్యాయి. బాలీవుడ్ హీరోయిన్, నాగిని ఫేమ్ మౌనీ రాయ్ తన వివాహ బంధానికి గుడ్ బై చెప్పేసింది. ఈ విషయాన్ని అఫీషియల్గా ప్రకటించింది. ఈ సమయంలో తమ వ్యక్తిగత గోప్యతను గౌరవించాలని అభిమానులను కోరింది. విడాకుల విషయాన్ని మౌనీరాయ్తో పాటు ఆమె భర్త సూరజ్ నంబియార్ సంయుక్తంగా ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. పెళ్లైనా నాలుగేళ్లకే తమ బంధానికి ముగింపు పలికారు.తమ వ్యక్తిగత ప్రాధాన్యతలు మారిన నేపథ్యంలో, పరస్పర గౌరవంతో విడిపోయి వేర్వేరు మార్గాల్లో ప్రయాణించాలని నిర్ణయించుకున్నట్లు సోషల్ మీడియాలో వెల్లడించారు. పరస్పర అంగీకారంతోనే విడిపోతున్నామని.. స్నేహపూర్వకంగా ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. అయితే విడిపోయినప్పటికీ భవిష్యత్తులో స్నేహితులుగా కొనసాగుతామని స్పష్టం చేశారు.తమ వ్యక్తగత జీవితాలపై మీడియా అత్యుత్సాహంపై మౌనీ రాయ్ దంపతులు మండిపడ్డారు. తమ ప్రైవేట్ లైఫ్కు సంబంధించి వస్తున్న తప్పుడు వార్తలను, కల్పిత కథనాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ రిలేషన్ గురించి బయట జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని కొట్టిపారేశారు. ప్రస్తుతానికి ఈ కష్ట కాలంలో తమ నిర్ణయాన్ని అర్థం చేసుకుని తమ గోప్యతను గౌరవించాలని అభిమానులను విజ్ఞప్తి చేశారు.కాగా.. మౌని రాయ్, సూరజ్ నంబియార్ జనవరి 2022లో పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. గోవాలో సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. ఇటీవలే ఇన్స్టాలో ఒకరినొకరు అన్ఫాలో చేసుకోవడంతో డివోర్స్ రూమర్స్ మొదలయ్యాయి. మౌని ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లో సూరజ్తో ఉన్న ఫోటోలు, పెళ్లి ఫోటోలు కనిపించడం లేదని అభిమానులు విడాకుల చర్చకు దారితీసింది.ఇక మౌనీ రాయ్ సినీ కెరీర్ విషయానికొస్తే 'కస్తూరి', 'దేవోం కే దేవ్...మహాదేవ్', 'నాగిన్' వంటి సీరియల్స్తో బాలీవుడ్లో గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాకుండా 'నాచ్ బలియే 6', 'ఝలక్ దిఖ్లా జా 7', 'జరా నాచ్కే దిఖా' వంటి రియాలిటీ షోలలో కూడా కనిపించింది. ఇటీవలే 'టెంప్టేషన్ ఐలాండ్ ఇండియా'కు హోస్ట్గా వ్యవహరించింది. 'బ్రహ్మాస్త్ర: పార్ట్ వన్ – శివ', గోల్డ్, మేడ్ ఇన్ చైనా లాంటి చిత్రాల్లో కూడా నటించింది. View this post on Instagram A post shared by mon (@imouniroy) -
విడాకుల వార్తలు.. స్పందించిన హీరోయిన్
బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ మౌనీరాయ్ విడాకులు తీసుకోందని వార్తలు వినిపిస్తున్నాయి. భర్త సూరజ్ నంబియార్ని ఇన్ స్టాలో అన్ ఫాలో చేయడమే దీనికి కారణం. ఇప్పటికీ వీళ్లిద్దరూ విడివిడిగా ఉంటున్నారని, విడాకుల తతంగం కూడా పూర్తయిందని టాక్ వినిపిస్తుంది. ఈ క్రమంలోనే తనపై వస్తున్న పుకార్లపై మౌనీ స్పందించింది. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.(ఇదీ చదవండి: పాపం పాకిస్తాన్.. 'ధురంధర్'పై ప్రతీకారంతో సినిమా తీసి)'మీడియా వాళ్లకు విజ్ఞప్తి. అవాస్తవాలని ప్రచారం చేయొద్దు. మాకు కాస్త ప్రైవసీ ఇవ్వండి ప్లీజ్' అని మౌనీరాయ్.. తన ఇన్ స్టా స్టోరీలో రాసుకొచ్చింది. మరి విడాకుల వార్తల్లో నిజానిజాలేంటి అనేది త్వరలో స్పష్టత వచ్చే అవకాశముంది.2018లో దుబాయిలో కలుసుకున్న సూరజ్-మౌనీరాయ్ నాలుగేళ్ల పాటు ప్రేమించుకున్నారు. పెద్దల్ని ఒప్పించి 2022లో గోవా వేదికగా పెళ్లి చేసుకున్నారు. మలయాళీ-బెంగాలీ సంప్రదాయ పద్ధతుల్లో ఈ వేడుక జరిగింది. సూరజ్, దుబాయికి చెందిన బిజినెస్మ్యాన్ కాగా మౌనీ, హిందీ-దక్షిణాది చిత్రాల్లో హీరోయిన్, నటిగా కనిపిస్తూనే స్పెషల్ సాంగ్స్ కూడా చేసింది. లేటెస్ట్గా అయితే చిరు 'విశ్వంభర'లోనూ ఐటమ్ సాంగ్ చేసింది.(ఇదీ చదవండి: తమిళనాడు అసెంబ్లీలో 'పుష్ప' గురించి చర్చ) -
పాపం పాకిస్తాన్.. 'ధురంధర్'పై ప్రతీకారంతో సినిమా తీసి
'ధురంధర్' సినిమాలు ఏ రేంజ్ సెన్సేషన్ సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గతేడాది డిసెంబరులో తొలి పార్ట్ రూ.1300 కోట్లు వసూలు చేయగా.. ఈ మార్చిలో రిలీజైన సీక్వెల్ అంతకు మించిన బీభత్సం చేసింది. ఇప్పటివరకు బాక్సాఫీస్ దగ్గరున్న అన్ని రికార్డులు కొల్లగొట్టింది. పుష్ప, బాహుబలి.. దేన్ని వదల్లేదు. చాలామంది ఈ మూవీస్ నచ్చాయి గానీ కొందరు మాత్రం ప్రొపగాండా అని విమర్శించారు. ఇందులో పాకిస్థాన్ కూడా ఉంది.(ఇదీ చదవండి: సీఎం విజయ్ కొత్త నిర్ణయం.. త్రిష సినిమాతోనే మొదలు)గతేడాది డిసెంబరులో 'ధురంధర్' తొలి పార్ట్ రిలీజైనప్పుడే పాక్ నాయకుల్లో అలజడి రేగింది. తన దేశంలోని లయరీ ప్రాంతం గురించి తప్పుతప్పుగా చూపించారని మండిపడ్డారు. అసలు లయరీ ఎలా ఉంటుందో చూపిస్తామని చెబుతూ 'మేరీ లయరీ' అనే సినిమాని కూడా ప్రకటించారు. గత వీకెండ్ అంటే మే 08న థియేటర్లలోకి వచ్చింది. విడుదలకు ముందు కాస్తోకూస్తో బజ్ ఉన్నప్పటికీ థియేటర్లలోకి వచ్చిన ఘోరాతీ ఘోరంగా పరిస్థితి తయారైంది.ఆజ్ తక్ కథనం ప్రకారం.. 'మేరీ లయరీ' సినిమాకు పాక్లోని కొన్ని థియేటర్లలో మరీ 22 టికెట్లే అమ్ముడుపోయాయట. ప్రేక్షకులు కూడా చూసేందుకు పెద్దగా ఆసక్తి చూపించకపోవడంతో తొలిరోజే చాలా థియేటర్లలో నుంచి సినిమాని తీసేశారట. అబూ అలీహా దర్శకత్వం వహించిన 'మేరీ లయరీ' మూవీలో ఆయేషా ఒమర్, దననీర్ మొబీన్, సామియా ముంతాజ్ ప్రధాన పాత్రలు చేశారు.'ధురంధర్' రెండు భాగాలు కూడా గూఢచర్యం, పాక్ ఉగ్రవాదం నేపథ్యంగా తీశారు. 'మేరీ లయరీ' మాత్రం లయరీ ప్రాంతంలో ఫుట్బాల్, సమాజ జీవనం, మహిళల ఆత్మవిశ్వాసం బ్యాక్డ్రాప్ స్టోరీతో తెరకెక్కించారు. గతంలోనే ఓ సందర్భంలో మాట్లాడిన సింధ్ సమాచార శాఖ మంత్రి షర్జీల్ ఇనామ్.. భారతీయ సినిమాల్లో లయరీ ప్రాంతాన్ని తప్పుగా చూపిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇప్పుడు వాళ్లే మూవీ తీస్తే సొంత ప్రేక్షకుల నుంచే తిరస్కరణ ఎదురైంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన తమిళ క్రైమ్ థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ) -
కాన్స్లో సందడి
‘ఎంట్రీ సూపర్... ప్రిన్సెస్లా ఉంది’ అంటూ ప్రస్తుతం కాన్స్ చిత్రోత్సవాల్లో సందడి చేస్తున్న ఆలియా భట్ని ఉద్దేశించి నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఫ్రాన్స్లోని కాన్స్ నగరంలో 79వ కాన్స్ చలన చిత్రోత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. మంగళవారం ఆరంభమైన ఈ ఫిల్మ్ ఫెస్టివల్ 23 వరకూ జరుగుతుంది. ఈ చిత్రోత్సవాల్లో భారతీయ తారలు ఐశ్వర్యా రాయ్, ఆలియా భట్, తారా సుతారియా తదితరులు పాల్గొననున్నారు.ఇప్పటికే ఆలియా ఫ్రాన్స్ చేరుకున్నారు. ఓ బ్యూటీ ప్రాడెక్ట్కి ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న ఆమె ఇందులో భాగంగానే అక్కడికి వెళ్లారు. తొలి రోజు రెడ్ కార్పెట్పై నడిచే ముందు ఆలియా ఫ్రెంచ్ రివెరా దగ్గర దిగిన ఫొటోలు వైరల్గా మారాయి. ఫ్లోరల్ ప్రింట్ ఫ్రాక్లో ఆమె మెరిసిపోయారు. ఇలా తొలి రోజే ఫొటోషూట్తో ఆకట్టుకున్న ఆలియా... మరి రెడ్ కార్పెట్పై ఏ స్థాయిలో సందడి చేస్తారో చూడాలి. -
డియర్ విజయ్ హ్యాట్సాఫ్ : హీరో విశాల్ ప్రశంసలు
తమిళనాట సంచలన విజయాన్ని నమోదు చేసి, రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విజయ్ తీసుకున్న తాజా నిర్ణయంపై హీరో విశాల్ స్పందించారు. తన తొలి సంతకంతోనే మరో సంచలనం క్రియేట్ చేసిన సీఎం విజయ్ నిర్ణయంపై విజయ్ చిరకాల మిత్రుడు, విశాల్ సోషల్ మీడియా వేదికగా హర్షం వ్యక్తం చేశారు. విజయ్ ప్రభుత్వ ఏర్పాటులో జాప్యంపై కూడా విశాల్ స్పందించారు. రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాలు, పాఠశాలలు మరియు బస్టాండ్లకు 500 మీటర్ల లోపు ఉన్న 717 మద్యం దుకాణాలను (TASMAC) మూసివేస్తూ ఆయన ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై మరోవైపు సినిమా రంగం నుండి రాజకీయాల్లోకి వచ్చి, అధికారాన్ని చేపట్టడం, తొలి నిర్ణయంతోనే తనదైన ముద్ర వేయడంతో విజయ్ అభిమానులు, తమిళ ప్రజలు సోషల్ మీడియాలో ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు."ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ హ్యాట్సాఫ్. పాఠశాలల సమీపంలోని 717 మద్యం దుకాణాలను మూసివేయడం గొప్ప నిర్ణయం. స్కూళ్ల దగ్గర మద్యం దుకాణాల వల్ల ఎంతోమంది ఆడపిల్లలు వేధింపులకు గురవుతున్నారు. ఈ చర్యతో వారికి ఊరట లభిస్తుంది. వాటిని మూసివేస్తున్నట్లు ప్రకటించినందుకు ధన్యవాదాలు. ఎంత గొప్ప చర్య," అని విజయ్కు పంపిన వీడియో సందేశంలో విశాల్ పేర్కొన్నారు. అంతేకాదు "ప్రియమైన విజయ్, దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఈ రోజు మీకు, మీ ప్రభుత్వానికి నేను సెల్యూట్ చేస్తున్నాను," అంటూ మరో పోస్ట్లో తన సంతోషాన్ని ప్రకటించారు.చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రెండు రోజులకే విజయ్ ఈ కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. విద్యాసంస్థలు, ప్రార్థనా స్థలాల వద్ద మద్యం షాపుల కారణంగా సామాన్య ప్రజలు, ముఖ్యంగా విద్యార్థినులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.Kudos to you ,whistles to u. Hats off to u. Dear CM josephvijay avargal. Thank u for the announcement to close 717 wine shops especially the ones near schools. Wat a move. So many girl children hav been facing harassment especially the one I know in rk nagar where a girl… pic.twitter.com/vYria0MIaB— Vishal (@VishalKOfficial) May 12, 2026 కాగా విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK) పార్టీ మొత్తం 234 స్థానాల్లో 108 స్థానాలను గెలుచుకుంది. అయితే పూర్తి మెజారిటీకి (118) పది సీట్లు తక్కువ కావడంతో, వారం రోజుల హైడ్రామా తర్వాత కాంగ్రెస్, వామపక్షాలు,వీసీకే మద్దతుతో విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. సీఎంగా ప్రమాణం చేసిన తరవాత మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్, ఇతర కీలక నేతలను గౌరవప్రదంగా కలుసుకోవడం కూడా నెట్టింట ఆకర్షణీయంగా మారింది. -
ఎక్కువ సినిమాలు చేసింది ఎవరు? బ్రహ్మీ స్థానమెంత?
ఒకప్పటితో పోలిస్తే మన దేశానికి సంబంధించిన వివిధ భాషల సినిమాలు, నటీనటులు.. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. అదే టైంలో యాక్టర్స్ ఎక్కువైపోవడం వల్ల కెరీర్ మొత్తంలో మహా అయితే పదుల సంఖ్యలో లేదంటే వందల్లో మాత్రమే మూవీస్ చేస్తున్నారు. కానీ కొందరు నటీనటులు మాత్రం వేల చిత్రాల్లో నటించి ఎవరికీ సాధ్యం కాని రికార్డ్ సృష్టించారు. ఇంతకీ ఎక్కువ చిత్రాల్లో కనిపించిన నటి/నటుడు ఎవరంటే?(ఇదీ చదవండి: ఓటీటీలో కోర్ట్ రూమ్ థ్రిల్లర్ సినిమా.. ట్రైలర్ రిలీజ్)సుకుమారిమలయాళ చిత్రసీమకు చెందిన ఈమె.. 1940లో పుట్టి 2013లో చనిపోయారు. దక్షిణాది భాషలతో పాటు హిందీ, సింహళ, ఫ్రెంచ్, ఇటాలియన్, బెంగాలీ, తుళు, ఇంగ్లీష్ భాషల్లో కలిపి మొత్తంగా 2500కి పైగా సినిమాల్లో కనిపించారు. ఈమెనే ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉంది.మనోరమగోపిశాంత అలియాస్ మనోరమ స్వతహాగా తమిళ నటి. 1500కి పైగా సినిమాల్లో కనిపించిన ఈమె 5000కి పైగా నాటకాల్లోనూ వివిధ పాత్రలు పోషించారు. అలానే అన్నాదురై, కరుణానిధి, జయలలిత, ఎమ్జీఆర్, స్టాలిన్, ఎన్టీఆర్, విజయ్ లాంటి ఏడుగురు ముఖ్యమంత్రులతో కలిసి నటించిన ఘనత ఈమె సొంతం.జగతి శ్రీకుమార్మలయాళ ఇండస్ట్రీకి చెందిన నటుడు, దర్శకుడు, సింగర్ అయిన శ్రీకుమార్ ఆచారి అలియాస్ జగతి శ్రీకుమార్ నాలుగు దశాబ్దాల కెరీర్లో 1500కి పైగా మూవీస్లో కనిపించారు.బ్రహ్మానందంతెలుగు హాస్యనటుడు బ్రహ్మానందం తన కెరీర్ మొత్తంలో 1100కి పైగా మూవీస్ చేశారు. 1000కి చిత్రాల్లో కమెడియన్ గా చేసిన గిన్నిస్ రికార్డ్ కూడా సొంతం చేసుకున్నారు. కమెడియన్లలో అత్యధిక రెమ్యునరేషన్ అందుకున్న రికార్డ్ కూడా ఈయన పేరిట ఉంది.శక్తి కపూర్బాలీవుడ్కి చెందిన శక్తి కపూర్.. 1975 నుంచి ఇప్పటికీ నటిస్తూనే ఉన్నారు. రీసెంట్ టైంలో యానిమల్, ఎల్ 2 ఎంపురాన్ లాంటి పాన్ ఇండియా చిత్రాల్లో కనిపించారు. 1980-90 మధ్య కాలంలో 100కి పైగా సినిమాలు చేసిన ఈయన.. మొత్తంగా చూసుకుంటే ఇప్పటివరకు 700కిపైగా మూవీస్లో కనిపించారు. ఈయన కూతురు శ్రద్ధా కపూర్ ప్రస్తుతం హీరోయిన్గా చేస్తోంది.అనుపమ్ ఖేర్హిందీ నటుడు అనుపమ్ ఖేర్. 1982 నుంచి ఇప్పటికీ నటిస్తూనే ఉన్నారు. రీసెంట్ టైంలో పలు పాన్ ఇండియా చిత్రాల్లో కీలక పాత్రలు చేస్తున్నారు. నాలుగు దశాబ్దాల కెరీర్లో 540కి పైగా సినిమాల్లో కనిపించారు. నటుడిగానే కాకుండా దర్శకుడు, నిర్మాతగానూ పలు చిత్రాల్ని తెరకెక్కించడం విశేషం.మమ్ముట్టిమహమ్మద్ కుట్టి పనపరంబిల్ ఇస్మాయిల్ అలియాస్ మమ్ముట్టి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. 74 ఏళ్ల వయసులోనూ ఇప్పటికీ హీరోగా మూవీస్ చేస్తున్న ఈయన కెరీర్ మొత్తంలో 450కి పైగా చిత్రాల్లో కనిపించారు. ఇందులో 400కి పైగా సినిమాల్లో హీరోగా నటించడం విశేషం. ఈయన కొడుకు దుల్కర్ సల్మాన్ ప్రస్తుతం పాన్ ఇండియాలోని ప్రధాన భాషల్లో హీరోగా సినిమాలు చేస్తున్నాడు.(ఇదీ చదవండి: ప్రభాస్ రీల్ మదర్.. ఒకప్పటి హీరోయిన్.. చాక్లెట్ ఫ్యాక్టరీ ఓనర్) -
మరో ప్రముఖ హీరోయిన్ విడాకులు?
సినిమా ఇండస్ట్రీలో పెళ్లి అనేది ఎంత సాధారణమో.. విడాకులు అంతే కామన్గా కనిపిస్తుంటాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్న కొందరు హీరో లేదా హీరోయిన్లు.. పట్టుమని కొన్నేళ్లయినా సంసార బంధాన్ని నిలుపుకోలేకపోతున్నారు. ఇప్పుడు అలానే బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ విడాకులు తీసుకునేందుకు సిద్ధమైనట్లు కనిపిస్తోంది. సోషల్ మీడియాలో ఈ విషయమే ఇప్పుడు హాట్ టాపిక్గా మారిపోయింది.(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటుడు)'నాగిని' సీరియల్తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న మౌనీరాయ్.. హిందీ, పంజాబీ భాషల్లో హీరోయిన్, విలనీ పాత్రలు చేస్తూ వస్తోంది. లేటెస్ట్గా అయితే చిరంజీవి 'విశ్వంభర'లోనూ ఐటమ్ సాంగ్ చేసింది. ఓ హిందీ మూవీ కూడా రిలీజ్కి రెడీగా ఉంది. కెరీర్ పరంగా కాస్తోకూస్తో బిజీగా ఉన్న ఈమెనే ఇప్పుడు విడాకులు తీసుకోబోతుందని మాట్లాడుకుంటున్నారు. భర్తని ఇన్ స్టాలో అన్ ఫాలో చేయడమే ఈ రూమర్స్కి కారణం.సూరజ్ నంబియార్ అనే దుబాయికి చెందిన బిజినెస్మ్యాన్ని 2022 జనవరిలో మౌనీరాయ్ పెళ్లి చేసుకుంది. మలయాళీ, బెంగాలీ సంప్రదాయ పద్ధతుల్లో వీరి వివాహం జరిగింది. మరి ఏమైందో ఏమో ఇప్పుడు ఒకరిని ఒకరు ఇన్ స్టాలో అన్ ఫాలో చేసుకున్నారు. మౌనీ రాయ్ స్నేహితురాలు, హీరోయిన్ దిశా పటానీ కూడా సూరజ్ని అన్ ఫాలో చేసింది. పెళ్లి ఫొటోలని సూరజ్ తన అకౌంట్ నుంచి తీసేసినప్పటికీ.. మౌనీ రాయ్ మాత్రం అలానే ఉంచింది. ఈ విషయంపై మౌనీ క్లారిటీ ఇస్తే నిజాలు బయటకు రావు.(ఇదీ చదవండి: 'లవ్ టుడే' నటి ప్రేమ వివాహం.. దర్శకుడితో ఏడడుగులు) -
నిబంధనలన్నీ హీరోయిన్లకే!
‘‘బాలీవుడ్లో వివక్ష ఎక్కువ. ఒక సినిమా బడ్జెట్ తగ్గించాలంటే ముందు హీరోయిన్ల పారితోషికం తగ్గిస్తారు. అలాగే లొకేషన్కి హీరో రాక ముందే హీరోయిన్ మేకప్ వేసుకుని రెడీగా ఉండాలంటారు. సెట్స్లో హీరో ఏది అడిగినా కాదనకుండా సమకూర్చుతారు. గౌరవ మర్యాదల విషయంలోనూ తేడా చూపించేస్తారు. నిబంధనలన్నీ హీరోయిన్లకే ఉంటాయి’’ అని కృతీ సనన్ చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి. ఆమె నటించిన ‘కాక్టెయిల్ 2’ చిత్రం జూన్ 19న విడుదల కానుంది.ఈ చిత్రానికి సంబంధించిన ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్న కృతీ సనన్... ‘‘బాలీవుడ్లో నేను నెపోటిజమ్ బాధితురాలిని’’ అని పేర్కొన్నారు. ఈ విషయం గురించి ఇంకా మాట్లాడుతూ – ‘‘స్టార్ కిడ్స్ వల్ల బాలీవుడ్లో చాలా అవకాశాలు కోల్పోయాను. ముందు నన్ను హీరోయిన్గా తీసుకుని, ఆ తర్వాత స్టార్ కిడ్స్ కోసం నన్ను పక్కన పెట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి.వారసులతో పోటీ పడి అవకాశాలు తెచ్చుకోవడానికి చాలా కష్టపడ్డాను. ‘మిమి’ సినిమాకి ముందు ఐదేళ్లు నా కెరీర్ ఎంతో కష్టంగా సాగింది. టాలెంట్ ఉండి కూడా అవకాశాల కోసం చాలా ఎదురు చూడాల్సి వచ్చేది. దాంతో కొంత ఒత్తిడికి లోనై, సినిమాల ఎంపిక విషయంలో తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాను. కొన్ని చేదు అనుభవాలు, పరాజయాలు, కష్టాలు అనుభవ పాఠాలుగా ఉపయోగపడ్డాయి. కెరీర్లో ధైర్యంగా ఎలా ముందుకు సాగాలో నేర్పించాయి’’ అని పేర్కొన్నారు కృతీ సనన్. -
బోల్డ్ హారర్లో...
ఇప్పటివరకూ ఏ సినిమాలోనూ కనిపించనంత బోల్డ్గా తమన్నా కనిపిస్తారని ఆమె కమిట్ అయిన తాజా చిత్రం స్పష్టం చేస్తోంది. ఇంతకీ అది ఏ సినిమా అంటే... బాలీవుడ్లో బోల్డ్ హారర్ మూవీగా పాపులర్ అయిన ‘రాగిణి ఎంఎంఎస్’లోని మూడో భాగం. ఏక్తా కపూర్ నిర్మించిన ‘రాగిణి ఎంఎంఎస్’, ఆ చిత్రం సీక్వెల్ ‘రాగిణి ఎంఎంఎస్ 2’ ఘనవిజయాన్ని సొంతం చేసుకున్నాయి.తొలి భాగంలో కైనాజ్ మోతీవాలా, రెండో భాగంలో సన్నీ లియోన్ లీడ్ రోల్స్ చేశారు. మూడో భాగంలో తమన్నా నటించనున్నారు. ఈ పాత్ర చాలా గ్లామరస్గా ఉంటుంది. అలాగే ఈ సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్లో రొమాన్స్ మోతాదు కూడా ఎక్కువగానే ఉన్న విషయం రెండు భాగాలు చూసినవాళ్లకు తెలిసే ఉంటుంది. మూడో భాగంలో కూడా అలానే ఉంటుందని, మోడ్రన్ అమ్మాయిగా, ఆత్మగా తమన్నా రెండు షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తారని ప్రచారం జరుగుతోంది.ఈ చిత్రంలో ఆయుష్ శర్మ సరసన ఆమె నటిస్తారు. తమన్నాకన్నా ఆయుష్ ఏడాది చిన్న. ఇంకా ఆమిర్ ఖాన్ తనయుడు జునైద్ ఓ కీలక పాత్రలో కనిపిస్తారట. శశాంక్ ఘోష్ దర్శకత్వంలో ఏక్తా కపూర్ నిర్మించనున్న ఈ చిత్రం షూటింగ్ త్వరలో ఆరంభం కానుంది. -
ప్రభాస్ vs వివేక్ ఒబెరాయ్.. 'స్పిరిట్'కి సందీప్ వంగా వైలెంట్ ట్రీట్
ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'స్పిరిట్'. ఈ సినిమా నుంచి ఒక క్రేజీ అప్డేట్ బయటకొచ్చింది. త్వరలోనే ఒక కీలకమైన షూటింగ్ షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్లో ప్రభాస్, విలన్ పాత్రధారి వివేక్ ఒబెరాయ్ మధ్య జరిగే యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. అయితే కేవలం ఈ యాక్షన్ సీక్వెన్స్ల కోసమే సుమారు రెండు నెలల పాటు సుదీర్ఘంగా షూటింగ్ జరగనుందని సమాచారం. సందీప్ వంగా గతంలో 'యానిమల్'లో హీరో-విలన్ పోరాట సన్నివేశాలను ఎంత పవర్ఫుల్గా చూపించాడో అందరికీ తెలిసిందే. అదే తరహాలో 'స్పిరిట్'లో కూడా యాక్షన్ సన్నివేశాలకు ప్రత్యేకంగా రెండు నెలల సమయం కేటాయించారు. దాంతో ఈ సినిమా ఎంత భారీ స్థాయిలో తెరకెక్కుతుందో తెలుస్తోంది. ఈ చిత్రంలో ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఆయన సరసన త్రిప్తి దిమ్రి హీరోయిన్గా నటిస్తోంది. కాగా ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ను టీ-సిరీస్, భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సంగీతాన్ని హర్షవర్ధన్ రామేశ్వర్ అందిస్తున్నారు. -
రెండో కుమారుడి నామకరణం.. పేరు రివీల్ చేసిన హీరోయిన్
బాలీవుడ్ భామ సోనమ్ కపూర్ ఇటీవలే రెండో బిడ్డకు జన్మినిచ్చింది. ఏప్రిల్ 29న ఫ్యాన్స్కు గుడ్ న్యూస్ చెప్పింది. తనకు రెండోసారి కుమారుడు పుట్టాడని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఇప్పటికే ఆమెకు వాయి కపూర్ అహుజా అనే బాబు ఉన్నారు. తాజాగా తన రెండో కుమారుడి నామకరణ వేడుక నిర్వహించింది. ఈ సందర్భంగా తన కుమారుడి పేరు రివీల్ చేసింది.తన రెండో కుమారుడికి రుద్రలోఖ్ కపూర్ అహుజా అని పేరు పెట్టారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ పేరుకు తన అన్నయ్య వాయుతో కలిసి వేదపరమైన రిలేషన్ ఉందని పేర్కొంది. ఈ పేరు వెనుక లోతైన, ఆధ్యాత్మిక అర్థం ఉందని తెలిపారు. రుద్ర అంటే మెరుపు, శ్వాస, స్వస్థత, పునరుద్ధరణతో ముడిపడి ఉన్న ఒక శక్తివంతమైన, పరివర్తన శక్తికి ప్రతీక అని సోనమ్ అన్నారు.. వాయువు జీవశక్తికి ప్రతీక కాగా.. రుద్ర శక్తికి, పరివర్తనకు ప్రతిరూపం అని పేర్కొన్నారు. కాగా.. 2018లో వివాహం చేసుకున్న ఆనంద్ ఆహుజాను సోనమ్ కపూర్ పెళ్లాడింది. వీరిలో 2022లో మొదటి బిడ్డ జన్మించాడు. View this post on Instagram A post shared by Sonam A Kapoor (@sonamkapoor) -
Avika Gor: ఇండియా వదిలి వెళ్లిపోతున్న మరో హీరోయిన్
తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయమైన నటి అవికా గోర్. తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. భర్త మిలింద్ చంద్వానీ వృత్తిపరమైన అవకాశాల కారణంగా ఈ జంట భారతదేశాన్ని విడిచి బ్యాంకాక్లో శాశ్వతంగా స్థిరపడనుంది. దాదాపు ఏడేళ్ల ప్రేమ తర్వాత 2025 సెప్టెంబర్లో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. ఇప్పుడు తమ వైవాహిక జీవితాన్ని మరింత ప్రశాంతంగా, కొత్త వాతావరణంలో గడపాలని నిర్ణయించుకున్నారు. తాజాగా అవికా గోర్ ఓ బాలీవుడ్ మీడియాతో మాట్లాడుతూ తన భర్త మిలింద్ చంద్వానీతో కలిసి బ్యాంకాక్కు శాశ్వతంగా మారిన విషయాన్ని వెల్లడించింది. మేము బ్యాంకాక్కు మారిపోయాం. అక్కడే ఒక ఇల్లు కూడా కొనుగోలు చేశాం. దాన్ని నా అభిరుచులకు అనుగుణంగా సెట్ చేసుకుంటున్నానను. ఈ మార్పు వెనుక ప్రధాన కారణం మిలింద్కు అక్కడ లభిస్తున్న మెరుగైన వృత్తి అవకాశాలే. ఇద్దరం పరస్పరం చర్చించి, ఒకరి కెరీర్ను మరొకరు గౌరవిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నామని ఆమె వివరించింది. మేము చాలా కాలంగా కలిసి ఉన్నాం. ఎప్పుడూ ఒకరి కెరీర్ ఎంపికలకు మరొకరు అండగా నిలుస్తామని అవికా స్పష్టం చేసింది.అయితే దేశం విడిచి వెళ్లినంత మాత్రాన అవికా తన సినీ కెరీర్ను వదులుకోవడం లేదు. షూటింగ్స్ ఉన్నప్పుడు బ్యాంకాక్ నుండి ముంబై లేదా హైదరాబాద్కు రావడం పెద్ద సమస్య కాదని ఆమె స్పష్టం చేసింది. గతంలోనూ తరచూ ప్రయాణాలు చేసిన అనుభవం ఉండటంతో ఈ మార్పు తన కెరీర్పై కూడా ప్రభావం చూపదని అవికా నమ్మకం. హీరోయిన్లు ఇండియా వదిలి వెళ్లిపోవడం కొత్తేం కాదు. ఇప్పటికే చాలామంది విదేశాల్లో సెటిల్ అయ్యారు. కొన్నేళ్ల కిందట ఇలియానా కూడా ఇండియా నుంచి అమెరికా వెళ్లి సెటిలైపోయింది. ఇప్పుడు అవికా గోర్ వంతు. -
విజయ్-త్రిష పెళ్లి చేసుకుంటే చూడాలని ఉంది: నటి
ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో రోజుకో ట్విస్ట్ అన్నట్లు తయారైంది. లేటెస్ట్ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టీవీకే పార్టీ 107 సీట్లు గెలుచుకున్నప్పటికీ ప్రభుత్వ ఏర్పాటుకు మరో 11 సీట్లు అవసరమున్న నేపథ్యంలో రోజుకో పరిణామం చోటుచేసుకుంటుంది. విజయ్ పలుమార్లు గవర్నర్ని కలుస్తున్నా ప్రమాణ స్వీకారంపై సస్పెన్స్ మాత్రం పోవట్లేదు. మరోవైపు విజయ్-త్రిష బంధం గురించి సోషల్ మీడియాలోనూ రూమర్స్ గట్టిగానే వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే నటి రాఖీ సావంత్ ఆశ్చర్యకర వ్యాఖ్యలు చేసింది.(ఇదీ చదవండి: రష్మికని పెళ్లి చేసుకున్న యంగ్ డైరెక్టర్)'నా కెరీర్ మొదలుపెట్టినప్పటి నుంచి త్రిష నాకు తెలుసు. ఎంతో కష్టపడి ఆమె ఈ స్థాయికి వచ్చింది. విజయ్తో కలిసి పనిచేయాలని చాలాసార్లు అనుకున్నాను. కానీ నాకు ఆ అవకాశం రాలేదు. విజయ్ అంటే నాకు చాలా ఇష్టం. అతడితో ఒక్క పాటైనా చేయాలని కలలుకన్నాను. కానీ ఛాన్స్ రాలేదు. కనీసం విజయ్-త్రిష మెహందీ వేడుకలో అయినా డ్యాన్స్ చేస్తాను. పెళ్లి చేసుకుంటే ఇద్దరినీ ఒకేసారి కలిసి ఫొటో దిగుతాను' అని రాఖీ సావంత్ చెప్పుకొచ్చింది.ముఖ్యమంత్రి అయ్యే పనిలో విజయ్ కిందామీద పడుతుంటే రాఖీ సావంత్ మాత్రం త్రిషని అతడు పెళ్లి చేసుకుంటే చూడాలని ఉందంటూ షాకింగ్ కామెంట్స్ చేస్తూ వైరల్ అయ్యే పనిలో ఉంది. ఇప్పుడే కాదు గతంలో బిగ్బాస్ షోలో పాల్గొన్నప్పటి నుంచి ఇండస్ట్రీలో ఏం జరిగినా సరే దానిపై కామెంట్ చేస్తూ ట్రెండ్ అవ్వాలని చూస్తూ ఉంటుంది. ఇప్పుడు కూడా విజయ్-త్రిషపై అలానే ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వడం ఆశ్చర్యపరిచింది.(ఇదీ చదవండి: నిశ్చితార్థ ఫొటోలపై క్లారిటీ ఇచ్చిన అషురెడ్డి) -
నేను ఆరోగ్యంగానే ఉన్నాను
‘‘నేను పూర్తి ఆరోగ్యంగా, క్షేమంగా ఉన్నాను. నా గురించి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవం... వాటిని నమ్మకండి’’ అని సీనియర్ బాలీవుడ్ నటుడు శక్తి కపూర్ తెలిపారు. శక్తి కపూర్ మృతి చెందారంటూ వస్తున్న వార్తలపై ఆయన ఫ్యాన్స్ ఆందోళన చెందారు. ఈ వార్తలపై ఆయన స్పందించి, ఓ వీడియో రిలీజ్ చేశారు. ‘‘నేను ఆరోగ్యంగా, సంతోషంగా ఉన్నాను. నా మృతి గురించి వస్తున్న వార్తలు అబద్ధం. ఇలాంటి పుకార్లను నమ్మకండి. ఇలాంటి తప్పుడు వార్తలను అందరం ఖండించాలి. ఇలాంటి పుకార్లు సృష్టించే వారిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తాను’’ అని పేర్కొన్నారాయన. విలన్గా, కమెడియన్గా దాదాపు 700 చిత్రాల్లో తనదైన ముద్ర వేశారు శక్తి కపూర్. ఆయన కుమార్తె శ్రద్ధా కపూర్ బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రభాస్ హీరోగా నటించిన ‘సాహో’ ద్వారా ఆమె తెలుగులో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. -
రెండోసారి తల్లైన బుల్లితెర నటి.. పోస్ట్ వైరల్
ప్రముఖ బుల్లితెర నటి, బాలీవుడ్ భామ ఆస్కా గోరాడియా పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. గతేడాడి డిసెంబర్లో ప్రెగ్నెన్సీ ప్రకటించిన ముద్దుగుమ్మ బాబు పుట్టాడని సోషల్ మీడియాలో పంచుకుంది. ఇప్పటికే ఆమెకు ఓ కుమారుడు పుట్టగా.. తాజాగా రెండోసారి అమ్మగా ప్రమోషన్ పొందారు. మే 1న తేదీన బిడ్డకు జన్మనివ్వగా.. వారం రోజుల తర్వాత సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.ఈ బాలీవుడ్ బ్యూటీ అమెరికాకు చెందిన యోగా టీచర్, వ్యాపారవేత్త అయిన బ్రెంట్ గోబుల్ 2017లో పెళ్లాడింది. 2017లో హిందూ, క్రైస్తవ సంప్రదాయాల ప్రకారం వివాహం చేసుకున్నారు. ఈ జంట అక్టోబర్ 2023లో కుమారుడికి జన్మనిచ్చారు. అతనికి విలియం అలెగ్జాండర్ అని పేరు పెట్టారు. గతేడాది ఈ జంట తమ ఎనిమిదవ వివాహ వార్షికోత్సవం సందర్భంగా రెండోసారి ప్రెగ్నెన్సీని ప్రకటించారు.ఇక సినీ కెరీర్ విషయానికొస్తే.. ఆస్కా గోరాడియా హిందీలో 'కుసుమ్', 'లాగీ తుఝ్సే లగన్', 'నాగిన్' వంటి సీరియల్స్తో మంచి పేరు సంపాదించుకున్నారు. అంతేకాకుండా బిగ్బాస్ సీజన్-6లో కంటెస్టెంట్గా పాల్గొన్నారు. View this post on Instagram A post shared by Aashka Goradia Goble (@aashkagoradia) -
దురంధర్-2 ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న దురంధర్-2 ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది. ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ అఫీషియల్గా ప్రకటించింది. ఈ సినిమా విడుదలై 50 రోజులు పూర్తి కావడంతో డేట్ రివీల్ చేసింది. మే 14వ తేదీ నుంచి ఓవర్సీస్లో మాత్రమే స్ట్రీమింగ్ కానున్నట్లు తెలిపింది. అయితే ఓటీటీలో అన్కట్ వర్షన్ ఉంటుందని నెట్ఫ్లిక్స్ వెల్లడించింది. దాదాపు 3 గంటల 52 నిమిషాల నిడివితో దురంధర్-2 ఉండనుందని పేర్కొంది.అయితే ఇండియాలోని ప్రేక్షకులకు స్ట్రీమింగ్ తేదీ ఇంకా రాలేదు. మనదేశంలో జియో హాట్స్టార్ ఈ మూవీ రైట్స్ దక్కించుకుంది. త్వరలోనే స్ట్రీమింగ్ తేదీని ఓటీటీ సంస్థ ప్రకటించనుంది. తాజా సమాచారం ప్రకారం మే 15 నుంచే ఇండియాలో దురంధర్-2 స్ట్రీమింగ్ అయ్యే అవకాశమున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన కోసం దురంధర్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.దురంధర్-2 కథేంటంటే?రెహమాన్ డెకాయిట్ (అక్షయ్ ఖన్నా) మరణంతో ధురంధర్ పార్ట్ 1 ముగుస్తుంది. ఆ తర్వాత ల్యారీకి తానే నాయకుడినని అర్షద్ పప్పు (అశ్విన్ ధర్)ప్రకటించుకుంటాడు. అన్నచావుకు కారణమైన అర్షద్ పప్పుపై రెహమాన్ సోదరుడు ఉజెయిర్ బలోచ్(డానిష్) కోపంతో రగిలిపోతుంటాడు. వీరిద్దరిని కాదని, ల్యారీని భారత సీక్రెట్ ఏజెంట్ హమ్జా(రణ్వీర్ సింగ్) తన గుప్పింట్లోకి తెచ్చుకొని, భారత ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ అజయ్ సన్యాల్(మాధవన్) అప్పజెప్పిన పనులన్నీ పూర్తి చేసుకొస్తుంటాడు. పాకిస్తాన్ మేజర్ ఇక్బాల్ (అర్జున్ రాంపాల్), ఎంపీ జమీల్ (రాకేష్ బేడీ) కూడా హమ్జాని గుడ్డిగా నమ్ముతారు. ఇలా పాక్ ఉగ్రవాద నాయకులందరిని నమ్మించి.. ఇండియాపై వాళ్లు చేసే కుట్రలన్నింటిని హమ్జా తిప్పికొడతాడు. అసలు భారత్పై పాన్ ఉగ్రవాద సంస్థలు చేసిన కుట్రలు ఏంటి? వాటిని తిప్పికొట్టే క్రమంలో హమ్జాకు ఎదురైన సమస్యలు ఏంటి? హమ్జా ఇండియన్ ఏజెంట్ అనే విషయం ఎలా బయటకు వచ్చింది? ఆ విషయం తెలిసిన తర్వాత మేజర్ ఇక్బాల్ (అర్జున్ రాంపాల్) ఏం చేశాడు?. పాకిస్తాన్లోని ఉగ్రవాద ముఠాలందరికి మార్గనిర్దేశం చేస్తున్న ‘బడే సాహెబ్ ’ ఎవరు? ఆపరేషన్ ధురంధర్ కోసం ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ అజయ్ సన్యాల్.. పంజాబ్లో జైలు జీవితం గడుపుతున్న జస్కరిత్ సింగ్ రంగీ(రణ్వీర్)నే ఎందుకు ఎంచుకున్నాడు? అతని నేపథ్యం ఏంటి? ఇతని కుటుంబానికి ఎమ్మెల్యే సుఖ్వెంధర్ చేసిన అన్యాయం ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
'బాలీవుడ్లో మర్యాద ఇవ్వరు'.. సిమ్రాన్ షాకింగ్ కామెంట్స్..!
గతేడాది టూరిస్ట్ ఫ్యామిలీతో రీ ఎంట్రీ ఇచ్చిన సీనియర్ హీరోయిన్ సిమ్రాన్. ఈ మూవీతో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. శ్రీలంక నుంచి ఇండియాకు వచ్చిన ఓ ఫ్యామిలీ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అప్పట్లో తెలుగులో స్టార్ హీరోల సినిమాలు చేసింది. హర్జై అనే హిందీ చిత్రంతో 1995లో కెరీర్ ప్రారంభించింది సిమ్రాన్.. బాలీవుడ్లో కన్నా సౌత్లోనే ఎక్కువ స్టార్డమ్ తెచ్చుకుంది. తెలుగు, తమిళ భాషల్లో అనేక సినిమాలు చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆమె బాలీవుడ్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది.బాలీవుడ్ దక్షిణ నటులకు గౌరవం ఇవ్వరని సిమ్రాన్ అన్నారు. సౌత్ నటీనటులకు కేటాయించే హోటళ్లు, టికెట్లు, స్టాఫ్ విషయంలో కూడా బేరసారాలు చేస్తారని కామెంట్స్ చేశారు. ఇదే విషయాన్ని గతంలో హీరో దుల్కర్ సల్మాన్ కూడా ప్రస్తావించారని ఆమె గుర్తు చేశారు. హిందీ చిత్ర పరిశ్రమలో దక్షిణాది నటులకు సరైన గౌరవం ఇవ్వరని ఆవేదన వ్యక్తం చేశారు. దక్షిణాదిలో మాకు ఎంత గుర్తింపు వచ్చినా బాలీవుడ్లో పట్టించుకోరని అన్నారు. తాను హిందీ సినిమాలకు దూరంగా ఉండటానికి ఇదే ప్రధాన కారణమని వెల్లడించారు. తాజాగా సిమ్రాన్ చేసిన ఈ కామెంట్స్ బాలీవుడ్లో హాట్ టాపిక్గా మారాయి. -
షాకింగ్ ట్వీట్.. దురంధర్పై కాంగ్రెస్ లీడర్ ప్రశంసలు.!
రణ్వీర్సింగ్ దురంధర్ చిత్రంపై ప్రముఖ కాంగ్రెస్ నాయకురాలు షామా మహమ్మద్ ప్రశంసలు కురిపించారు. దురంధర్ పార్ట్-1 నిన్ననే చేశానని తెలిపారు. ఈ సినిమా చాలా అద్భుతంగా ఉందని కొనియాడారు. ఆదిత్య ధర్ దర్శకత్వం అంటే చాలా ఇష్టమని ట్వీట్ చేశారు. ఈ మూవీలో రణ్వీర్ సింగ్ అద్బుతంగా నటించారని రాసుకొచ్చారు. ఈ మూవీని తెరకెక్కించిన చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. ఈ సినిమాలో ఎలాంటి ప్రాపగండ లేదని ఆమె స్పష్టం చేశారు.ఈ మూవీలో ఏ వర్గం వారిని చెడుగా చూపించలేదని షామా ట్విటర్లో తెలిపారు. కేవలం పాకిస్తాన్లోని పరిస్థితులను.. అక్కడున్న స్థానికుల గురించి మాత్రమే ఈ చిత్రంలో చూపించారని ఆమె అన్నారు. అక్కడి వాటిని మన ఇండియాలో ఉన్నవారితో పోల్చి తప్పుదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు. ఇది చూసిన కొందరు నెటిజన్స్ షామా మహమ్మద్పై ఒక్కసారిగా ట్రోల్స్ చేస్తున్నారు. అలాంటి వారికి కూడా ఇచ్చిపడేసింది. ఓ నెటిజన్ దీనిపై ప్రశ్నించగా సరైన సమాధానమిచ్చింది.ఎవరైనా ఈ మూవీలో ప్రాపగండ ఉందనుకుంటే అలాంటి వాళ్లు పాకిస్తాన్ వెళ్లిపోవచ్చని షామా మహమ్మద్ సలహా ఇచ్చింది. వెంటనే ఆ దేశ పౌరసత్వానికి అప్లై చేసుకోవాలని సూచించింది. ఎక్కడా కూడా ముస్లిం వర్గాన్ని చెడుగా చూపించలేదని.. పాకిస్తానీలను మాత్రమే చూపించిందని తెలిపింది. ఇక్కడివాళ్లంతా కలిసి ఇండియన్ ముస్లింలను తప్పుదోవ పట్టిస్తున్నారని నెటిజన్కు ఇచ్చిపడేసింది. ఓ కాంగ్రెస్ లీడర్ దురంధర్ సినిమాను ప్రశంసించడంతో ఈ టాపిక్ చర్చనీయాంశంగా మారింది. కాగా.. రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన దురంధర్ గతేడాది డిసెంబర్లో రిలీజైంది. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ బాక్సాఫీస్ను షేర్ చేస్తూ రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ మూవీకి సీక్వెల్గా దురంధర్-2 మార్చిలో రిలీజైంది. ఈ సినిమా ఏకంగా రూ.1700 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఈ రెండు సినిమాలు కలిసి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ.3 వేల కోట్లకు పైగా వసూళ్లతో సరికొత్త రికార్డ్ సృష్టించాయి. ఇందులో రణ్వీర్ సింగ్.. హంజా అలీ మజారీ అనే అండర్కవర్ ఇంటెలిజెన్స్ ఏజెంట్ పాత్రలో కనిపించారు. ఈ చిత్రంలో అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్, సారా అర్జున్, సంజయ్ దత్, రాకేష్ బేడీ కీలక పాత్రలలో నటించారు. It did not show Muslims in bad light but Pakistanis in bad light ! Shame on you for confusing the two. People like you spoil the name of Muslims in India. You are most welcome to leave India & take the citizenship of Pakistan https://t.co/dpNypFQ9VM— Dr. Shama Mohamed (@drshamamohd) May 7, 2026 -
రామ్ చరణ్ 'పెద్ది' గాయాల కథ
పెద్ది సినిమా షూటింగ్ సమయంలో రామ్ చరణ్ ఊహించని విధంగా గాయపడిన విషయం అప్పట్లో పెద్ద చర్చగా మారింది. కంటికి దెబ్బ తగిలిన వెంటనే అతడ్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చిన్నపాటి సర్జరీ చేసి ఇంటికి పంపించారు. ఒక్క రోజు విశ్రాంతి తీసుకుని చరణ్ మళ్లీ వెంటనే సెట్స్లో జాయిన్ కావడం అతడి ప్రొఫెషనలిజాన్ని చూపించింది. కంటిపైన ప్లాస్టర్తో చరణ్ కనిపించిన ఫొటోలు అప్పట్లో వైరల్ అయ్యాయి. అభిమానులు ఎంతో బాధపడ్డారు. అయితే తాజాగా ఆ గాయానికి సంబంధించిన పూర్తి వివరాలు బయటకొచ్చాయి. చాలామంది అది క్రికెట్ సన్నివేశం చిత్రీకరణ సమయంలో చరణ్కి బాల్ తగిలి గాయమైందని అనుకున్నారు. కానీ నిజానికి పహిల్వాన్ గెటప్లో కొన్ని సన్నివేశాలు చిత్రీకరిస్తున్నప్పుడు ఏదో బరువైన వస్తువు కంటికి తగిలి గాయం జరిగింది. ఆ గాయం ఇప్పటికీ చరణ్ కంటి పైభాగంలో స్పష్టంగా కనిపిస్తోంది. ఇటీవల ఓ సినిమా ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు అది బయటపడింది. చరణ్కి ఇది మాత్రమే కాదు, జిమ్లో వర్కవుట్ చేస్తున్నప్పుడు, 'చికిరి చికిరి' పాట షూటింగ్ సమయంలో కూడా గాయాల పాలయ్యాడని సమాచారం. ఇక పెద్ది విషయానికి వస్తే.. రామ్ చరణ్ గత చిత్రం ‘గేమ్ ఛేంజర్’ ఆశించిన స్థాయిలో రాణించకపోయినా, ‘పెద్ది’పై అంచనాలు మాత్రం తగ్గలేదు. ఇప్పటికే విడుదలైన పాటలు, గ్లింప్స్ మంచి స్పందన తెచ్చుకోవడంతో సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ భారీ చిత్రాన్ని వచ్చే నెల 4న విడుదల చేయబోతున్నారు. త్వరలోనే ట్రయిలర్ రిలీజ్కానుంది. దాంతో ఇప్పుడు అందరి దృష్టి ట్రయిలర్పైనే ఉంది. ముఖ్యంగా చరణ్ మూడో లుక్ ఉంటుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. -
స్టార్ హీరో క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్.. ట్రైలర్ రిలీజ్
బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ నటించిన లేటేస్ట్ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ కర్తవ్య. ఈ సినిమా నేరుగా ఓటీటీలోనే రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి పుల్కిత్ దర్శకత్వం వహించారు. ఈ మూవీని రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో షారూఖ్ ఖాన్ సతీమణి గౌరీ ఖాన్ నిర్మించారు. తాజాగా సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.ఇవాళ ట్రైలర్ చూస్తుంటే క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీగానే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇందులో సైఫ్ నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. ట్రైలర్లో క్రైమ్ సీన్స్ ఈ మూవీపై ఆసక్తి పెంచుతున్నాయి. ఈ చిత్రం మే 15 నుంచి నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాలో రసిక, సంజయ్, సౌరభ్ కీలక పాత్రల్లో నటించారు. -
నటి మాజీ భర్త ఆస్తుల కేసులో ఇంట్రస్టింగ్ ట్విస్ట్
న్యూఢిల్లీ: బాలీవుడ్ నటి కరిష్మా కపూర్ మాజీ భర్త, సంజయ్ కపూర్ మరణం తరువాత అతని భార్య ప్రియా కపూర్, తల్లి రాణీ కపూర్ మధ్య వివాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. సోనా గ్రూప్ (Sona Group) వారసత్వ వివాదంపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. కుటుంబ సభ్యుల మధ్య నెలకొన్న ఈ ఆస్తి వివాదాన్ని పరిష్కరించేందుకు కోర్టు మధ్యవర్తిత్వాన్ని (Mediation) ఆశ్రయించాలని సూచించింది.మధ్యవర్తిగా మాజీ సీజేఐసోనా గ్రూప్ వ్యవస్థాపక కుటుంబానికి చెందిన రాణి కపూర్- ఆమె కోడలు ప్రియా కపూర్ (దివంగత సంజయ్ కపూర్ భార్య) మధ్య నడుస్తోంది. ఈ కేసులో విచారణలో సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి (CJI) డి.వై. చంద్రచూడ్ గారిని ఈ మధ్యవర్తిత్వ ప్రక్రియను పర్యవేక్షించేందుకు నియమించారు. ఇరు పక్షాలు సామరస్యపూర్వక పరిష్కారానికి అంగీకరించడంతో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.వివాదం ఏమిటి?2017లో తనకు స్ట్రోక్ వచ్చినప్పుడు,తన అనారోగ్యాన్ని ఆసరాగా చేసుకుని తన కుమారుడు సంజయ్ కపూర్, కోడలు ప్రియా కపూర్ తన ఆస్తులను ఫ్యామిలీ ట్రస్ట్కు బదిలీ చేశారని తల్లి రాణి కపూర్ ఆరోపించారు. పరిపాలనాపరమైన ఫార్మాలిటీస్ అని చెప్పి ఖాళీ కాగితాలపై సంతకాలు తీసుకున్నారని ఆమె పేర్కొన్నారు. గతేడాది జూన్లో సంజయ్ కపూర్ మరణించిన తర్వాత ఈ పోరాటం మరింత తీవ్రమైంది. ప్రియా కపూర్ సోనా గ్రూప్ సంస్థలపై పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్నారని, తనకు ఆస్తిలో ఎటువంటి వాటా లేకుండా చేస్తున్నారని రాణి కపూర్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ జె.బి. పార్దివాలాలతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారిస్తోంది. ఇది కుటుంబ వివాదం కనుక కుటుంబానికే పరిమితం చేచాలని ఇది ఇతరులకు వినోదంగా మారకూడదని హితవు పలికింది. అలాగే . 80 ఏళ్ల వయస్సులో ఉన్న పిటిషనర్ కోర్టుల చుట్టూ తిరగడం కంటే, మధ్యవర్తిత్వం ద్వారా అన్ని సమస్యలను (A to Z) ఒకేసారి పరిష్కరించు కోవడం శ్రేయస్కరం అంటూ పెద్దావిడ రాణి కపూర్కి సూచించింది.కాగా సంజయ్ కపూర్ ఆకస్మిక మరణం తరువాత, ఆయన తొలి, మాజీ భార్య, బాలీవుడ్ నటి కరిష్మా కపూర్ పిల్లలలు ఆస్తులు, వారసత్వ హక్కులపై కోర్టును ఆశ్రయించారు. వీరి పిటిషన్పై అంగీకరించిన ఢిల్లీ హైకోర్టు. సంజయ్ కపూర్ ఆస్తులపై ప్రియా కపూర్ ఎటువంటి థర్డ్-పార్టీ హక్కులను సృష్టించకుండా కోర్టు ఇప్పటికే స్టే ఇచ్చింది మరోవైపు ఈ వివాదం వార్తల్లోకి రావడంతో గురువారం ట్రేడింగ్లో సోనా బీఎల్ డబ్ల్యూ (Sona BLW) షేర్లు సుమారు 0.96శాతం బనష్టపోయాయి. ఇదీ చదవండి: సెకండ్ ర్యాంక్ వచ్చిందని ఎగతాళి : 9 ఏళ్ల కూతుర్నే ..! -
రామ్ చరణ్ 'పెద్ది' ట్రయిలర్ రెడీ.. మూడో లుక్పై సస్పెన్స్
రామ్ చరణ్- బుచ్చిబాబు సాన కాంబోలో వస్తోన్న మోస్ట్ అవైటేడ్ మూవీ పెద్ది. ఈ చిత్రం నుంచి ఇప్పటికే రెండు లుక్స్ విడుదలయ్యాయి. మొదట పల్లెటూరి క్రికెటర్గా, ఆ తర్వాత పహిల్వాన్ గెటప్లో కనిపించిన చరణ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అయితే ఈ రెండింటికీ అదనంగా మూడో లుక్ కూడా ఉందన్న విషయం ఇటీవలే ప్రచారంలోకి వచ్చింది. కానీ దాన్ని మాత్రం చిత్రబృందం రహస్యంగా ఉంచుతోంది. తాజా సమాచారం ఏంటంటే పెద్ది సినిమా ట్రయిలర్ కట్ ఇప్పటికే రెడీ అయింది. దాన్ని ఈ నెల మూడో వారంలో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ట్రయిలర్లో మూడో లుక్ను చూపిస్తారా లేక సినిమా విడుదలయ్యాక థియేటర్లోనే చూడాలా అనేది ప్రస్తుతానికి మాత్రం సస్పెన్స్. దర్శకుడు బుచ్చిబాబు ఇప్పటివరకు ఈ సినిమా కథాంశంపై స్పష్టత ఇవ్వలేదు. కానీ ట్రయిలర్లో మాత్రం కథను కొంతవరకు టచ్ చేసే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం పెద్ది సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఏఆర్ రెహమాన్ రీ-రికార్డింగ్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రంలో జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా, శృతిహాసన్ ఓ ఐటెం సాంగ్ చేసింది. ‘గేమ్ ఛేంజర్’ ఆశించిన స్థాయిలో రాణించకపోయినా, ‘పెద్ది’పై అంచనాలు మాత్రం తగ్గలేదు. ఇప్పటికే విడుదలైన పాటలు, గ్లింప్స్ మంచి స్పందన తెచ్చుకోవడంతో సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ భారీ చిత్రాన్ని వచ్చే నెల 4న విడుదల చేయబోతున్నారు. ఇప్పుడు అందరి దృష్టి ట్రయిలర్పైనే ఉంది. ముఖ్యంగా చరణ్ మూడో లుక్ ఉంటుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. -
బాలీవుడ్లో సీక్వెల్స్ ట్రెండ్.. స్పెషలిస్ట్ ఎవరు?
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీస్లో ఫ్రాంచైజీ సినిమాలు రూపొందుతున్నాయి. కానీ ఈ ట్రెండ్ బాలీవుడ్లో కాస్త ఎక్కువగా కనిపిస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరోలు ఈ ఫ్రాంచైజీ సినిమాల సీక్వెల్స్తో బిజీగా ఉంటున్నారు. ప్రస్తుతం సీక్వెల్ సినిమాలు చేస్తున్న బాలీవుడ్ సీక్వెల్ స్టార్స్ ఎవరు? ఆ సినిమాల ప్రజెంట్ స్టేటస్ ఏంటి? అనే అంశాలపై ఓ లుక్ వేయండి.. ముగ్గురు కాదు... నలుగురు ఇడియట్స్ హిందీ చిత్రం ‘త్రీ ఇడియట్స్’ ఎంతటి బ్లాక్బస్టర్ విజయం సాధించిందో తెలిసిందే. ఆమిర్ ఖాన్ హీరోగా ఆర్. మాధవన్, శర్మాన్ జోషి కీలక పాత్రల్లో రాజ్కుమార్ హిరాణి దర్శకత్వంలో రూపొందిన సెటైరికల్ కామెడీ అండ్ మెసేజ్ ఓరియంటెడ్ సినిమా ‘త్రీ ఇడియట్స్’. విధు వినోద్ చోప్రా నిర్మించిన ఈ సినిమా 2009లో విడుదలై, బ్లాక్బస్టర్గా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ రానుంది. ఈ విషయాన్ని ఇటీవల ఆమిర్ ఖాన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, అధికారికంగా ప్రకటించారు. ‘త్రీ ఇడియట్స్’ సినిమా కథ సిద్ధమైందని, రాజ్కుమార్ హిరాణి ప్రజెంట్ స్క్రీన్ ప్లే కోసం వర్క్ చేస్తున్నారని, ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ పూర్తయిన తర్వాత ఈ సినిమాను సెట్స్కు తీసుకువెళ్తామని ఆమిర్ ఖాన్ తెలిపారు. అలాగే ‘త్రీ ఇడియట్స్’ సినిమాలో ఉన్న కామెడీ ఈ సినిమా సీక్వెల్లోనూ ఉంటుందని, ప్రధాన పాత్రధారులందరూ ఆల్మోస్ట్ ఉంటారని ఆమిర్ పేర్కొన్నారు. అలాగే ‘త్రీ ఇడియట్స్’ కథ ముగిసిన పది సంవత్సరాల తర్వాత నుంచి సీక్వెల్ కథ ప్రారంభం అవుతుందని ఆమిర్ తెలిపారు. కాగా, ‘త్రీ ఇడియట్స్’ సినిమా సీక్వెల్కు ‘ఫోర్ ఇడియట్స్’ అనే టైటిల్ను మేకర్స్ పరిశీలిస్తున్నారట. ఈ సినిమాలోని నాలుగో ప్రధాన పాత్రధారిగా విక్కీ కౌశల్ను ఎంపిక చేసుకున్నారట మేకర్స్. రాజ్కుమార్ హిరాణి డైరెక్షన్లో వచ్చిన గత చిత్రాలు ‘సంజు, డంకీ’ల్లో విక్కీ కౌశల్ కీ రోల్స్ చేశారు. తాజాగా ‘ఫోర్ ఇడియట్స్’ సినిమాలోనూ విక్కీ కౌశల్ నటించనున్నారని, ఆల్రెడీ కథ వినిపించగా, విక్కీ ఈ సినిమా చేసేందుకు సుముఖత వ్యక్తం చేశారనే టాక్ బాలీవుడ్లో వినిపిస్తోంది. 2027 చివర్లో ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది. పఠాన్ మళ్లీ వస్తున్నాడు! షారుక్ ఖాన్ కెరీర్లో రూ. 1000 కోట్ల కలెక్షన్స్ సాధించిన చిత్రాల్లో ‘పఠాన్’ చిత్రం కూడా ఒకటి. షారుక్ ఖాన్ హీరోగా నటించిన ఈ సినిమాకు సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించగా, దీపికా పదుకోన్, జాన్ అబ్రహాం, డింపుల్ క΄ాడియా, అశుతోష్ రాణా ఇతర ప్రధాన ΄ాత్రల్లో నటించారు. యశ్రాజ్ ఫిల్మ్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమా 2023లో రిలీజై, బ్లాక్బస్టర్గా నిలిచింది. దీంతో అప్పట్నుంచే ఈ సినిమా సీక్వెల్ గురించిన వార్తలు వచ్చాయి. అయితే ఇటీవల దుబాయ్లో జరిగిన ఓ ఈవెంట్లో ‘పఠాన్’ సినిమాకు సీక్వెల్గా ‘పఠాన్ 2’ రాబోతున్నట్లు షారుక్ ఖాన్ పరోక్షంగా పేర్కొన్నారు. ప్రస్తుతం దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్తోనే ‘కింగ్’ సినిమా చేస్తున్నారు షారుక్. ఈ సినిమా పూర్తయిన తర్వాతనే ‘పఠాన్’ సినిమాను సెట్స్కు తీసుకుని వెళ్తారా? లేక మరో సినిమా తర్వాత, ‘పఠాన్ 2’ను టేకప్ చేస్తారా? అనేది చూడాలి. త్రిపాత్రాభినయం? బాలీవుడ్లో ‘క్రిష్’ ఫ్రాంచైజీ ఎంతటి సక్సెస్ఫుల్ సినిమానో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ ఫ్రాంచైజీ నుంచి ‘క్రిష్ 4’ సినిమా రాబోతోంది. ఈ సినిమా ప్రత్యేకత ఏంటంటే... ఈ చిత్రంతో తొలిసారి దర్శకుడిగా మెగాఫోన్ పట్టనున్నారు హృతిక్ రోషన్ ‘క్రిష్ 4’ సినిమాకు హృతిక్ రోషన్ దర్శకత్వం వహించనున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చేసింది. అయితే స్క్రిప్ట్ విషయంలో మాత్రం ఆయన తండ్రి రాకేష్ రోషన్ పర్యవేక్షణ ఉంటుందట. ఇదిలా ఉంటే... హృతిక్ రోషన్ నటించిన గత చిత్రం ‘వార్ 2’ బాక్సాఫీస్ అంచనాలు తారుమారు అయ్యాయి. దీంతో ‘క్రిష్ 4’ సినిమా సెట్స్కు వెళ్లడానికి కొంత సమయం పట్టేలా ఉంది. మరో ఆసక్తికరమైన విశేషం ఏంటంటే... ఈ ‘క్రిష్ 4’లో హృతిక్ రోషన్ త్రి΄ాత్రాభినయం చేయనున్నారట. ప్రియాంకా చో్ర΄ా మరో లీడ్ రోల్లో నటించనున్నారని బాలీవుడ్ సమాచారం. 2006లో వచ్చిన ‘క్రిష్’, 2013లో వచ్చిన ‘క్రిష్ 3’ సినిమాల్లో ప్రియాంకా చో్ర΄ా భాగమయ్యారు. మరి... ‘క్రిష్ 4’లో ప్రియాంక నటిస్తారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. మరోవైపు కన్నడ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్తో హృతిక్ రోషన్ ఓ సినిమా కమిట్ అయ్యారు. ఈ సినిమా చేసిన తర్వాత ‘క్రిష్ 4’ చిత్రాన్ని సెట్స్కు తీసుకుని వెళ్తారా? లేక, ముందే మెగాఫోన్ పడతారా? అనేది తెలియాల్సి ఉంది. ఖల్ నాయక్ రిటర్న్స్ బలరామ్ భల్లు ప్రసాద్ అంటే వెంటనే గుర్తుకు రాకపోవచ్చు. కానీ ‘ఖల్ నాయక్’ అంటే మాత్రం టక్కున గుర్తుకు వస్తారు సంజయ్ దత్. ఇప్పుడు ఈ ‘ఖల్ నాయక్’ ప్రస్తావన ఎందుకు అంటే... బలరామ్ భల్లుగా మళ్లీ సిల్వర్ స్క్రీన్పై కనిపించనున్నారు సంజయ్ దత్. అవును... మీరు ఊహించినది నిజమే. ‘ఖల్ నాయక్’ సినిమాకి సీక్వెల్ రానుంది. ఈ సీక్వెల్కు ‘ఖల్ నాయక్ రిటర్న్స్’ అనే టైటిల్ను ఖరారు చేశారు. ‘ఖల్ నాయక్’ సినిమాకు సుభాస్ ఘాయ్ దర్శకత్వం వహించగా, ‘ఖల్ నాయక్ రిటర్న్స్’ చిత్రానికి మాత్రం మరో దర్శకుడు దర్శకత్వం వహించనున్నారు. ఆ దర్శకుడు ఎవరు? అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. అయితే ఈ సీక్వెల్ కి మాత్రం సుభాష్ ఘాయ్ దర్శకత్వ పర్యవేక్షణ చేయనున్నారట అలాగే ‘ఖల్ నాయక్’ సినిమాలో లీడ్ రోల్స్ చేసిన జాకీ ష్రాఫ్, మాధురి దీక్షిత్ సీక్వెల్లో మాత్రం గెస్ట్ రోల్స్ చేయనున్నారని బాలీవుడ్ సమాచారం. జియో స్టూడియోస్, అక్షా కాంబోజ్, సంజయ్ దత్ నిర్మించనున్న ‘ఖల్ నాయక్ రిటర్న్స్’ చిత్రం వచ్చే ఏడాది చివర్లో రిలీజ్ కానున్నట్లుగా తెలుస్తోంది. కొత్త డాన్ ఎవరు? బాలీవుడ్ సిల్వర్ స్క్రీన్పై డాన్స్ అంటే అమితాబ్ బచ్చన్, షారుక్ ఖాన్లు గుర్తొస్తారు. 1978లో వచ్చిన ‘డాన్’ చిత్రంలో అమితాబ్ బచ్చన్ హీరోగా నటించగా, ఆ తర్వాత వచ్చిన ‘డాన్: ది చేజ్ బిగిన్స్ ఎగైన్’ (2006), ‘డాన్ 2’ (2011) చిత్రాల్లో షారుక్ ఖాన్ హీరోగా నటించారు. ఇవన్నీ సూపర్ హిట్గా నిలిచాయి. కాగా ‘డాన్: ది చేజ్ బిగిన్స్ ఎగైన్’ (2006), ‘డాన్ 2 (2011)’ చిత్రాలకు దర్శకత్వం వహించిన ఫర్హాన్ అక్తర్ 2023లో ‘డాన్ 3’ సినిమాను ప్రకటించారు. రణ్వీర్ సింగ్ హీరోగా, కియారా అద్వానీ హీరోయిన్గా అధికారిక అనౌన్స్మెంట్స్ వచ్చింది. కానీ ఇప్పటివరకు ఈ సినిమా సెట్స్కు వెళ్లలేదు. ఈ సినిమా విషయంలో రణ్వీర్ సింగ్, ఫర్హాన్ అక్తర్ల మధ్య అభి్ర΄ాయభేదాలు వచ్చాయనే టాక్ బాలీవుడ్లో బలంగా వినిపిస్తోంది. ఈ డిఫరెన్సెస్ సమసి΄ోయి, కొత్త డాన్గా రణ్వీర్సింగ్నే నటిస్తారా? లేక ఈ ప్లేస్ను మరో హీరో భర్తీ చేస్తారా? అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. కాస్త ఆలస్యమైనా ‘డాన్ 3’ సినిమా ఉంటుందని, ఇటీవల ఓ సందర్భంలో ఫర్హాన్ అక్తర్ పేర్కొన్నారన్న వార్తలు ఉన్నాయి. ట్రెండీ లవ్స్టోరీ ‘కాక్టెయిల్’ సీక్వెల్ ‘కాక్టెయిల్ 2’ సిద్ధమైంది. ‘కాక్టెయిల్’ సినిమాకు దర్శకత్వం వహించిన హోమి అడజానియానే, ‘కాక్ టెయిల్ 2’ సినిమాకూ దర్శకత్వం వహించారు. కానీ నటీనటులు మారారు. సైఫ్ అలీఖాన్, దీపికా పదుకోన్, డయానా పెంటీ ‘కాక్టెయిల్’ సినిమాలో లీడ్ రోల్స్ చేయగా, సీక్వెల్లో మాత్రం షాహిద్ కపూర్, రష్మికా మందన్నా, కృతీ సనన్ మెయిన్ లీడ్ రోల్స్ చేశారు. మోడ్రన్ లైఫ్స్టైల్, ట్రెండీ లవ్ రిలేషన్షిప్స్, యూత్ఫుల్ ఎలిమెంట్స్తో ఈ సినిమా కథనం సాగుతుందని బాలీవుడ్ సమాచారం. ‘కాక్టెయిల్ 2’ సినిమా మేజర్ షూటింగ్ను విదేశాల్లో చేశారు. ఇటలీలో ఎక్కవ చిత్రీకణ జరగింది. దినేష్ విజన్, లవ్రంజన్, అంకుర్ గార్గ్ నిర్మించిన ఈ సినిమా ఈ ఏడాది జూన్లో రిలీజ్ కానుంది. ప్రేమ... పెళ్లి... వినోదం వైవాహిక జీవితం సాఫీగా సాగినంతవరకూ అంతా బాగానే ఉంటుంది. అనివార్యమైన సమస్యలు వచ్చినప్పుడు అప్పటివరకూ సంతోషంగా ఉన్న దంపతుల జీవితాలు ఎలాంటి ఇరుకుల్లో పడతాయి? అనే కథాంశంతో రూ΄÷ందిన చిత్రం ‘పతీ పత్నీ ఔర్ వో దో’. ఆయుష్మాన్ ఖురానా, సారా అలీ ఖాన్, వామికా గబ్బి, రకుల్ ప్రీత్ సింగ్ నటించారు. కార్తీక్ ఆర్యన్, అనన్య ΄ాండే, భూమి పెడ్నేకర్ నటించిన తొలి భాగం ‘పతీ పత్నీ ఔర్ వో’ (2019)కి దర్శకత్వం వహించిన ముదస్సర్ అజీజ్ సీక్వెల్ని కూడా తెరకెక్కించారు. నిజానికి 1978లో బీఆర్ చోప్రా దర్శకత్వంలో సంజీవ్ కుమార్, విద్యా సిన్హా, రంజితా కౌర్ ముఖ్య తారలుగా రూపొందిన రొమాంటిక్ కామెడీ మూవీ ‘పతీ పత్నీ ఔర్ దో’కి ఈ తొలి భాగం రీమేక్. ఇక... తాజాగా రూపొందిన సీక్వెల్ మార్చి 4న విడుదల కావాల్సి ఉంది. అయితే నిర్మాణంలో కాస్త జాప్యం జరగడంతో వాయిదా వేశారు. ప్రేమ, పెళ్లి, వినోదం నేపథ్యంలో రూ΄÷ందిన ‘పతీ పత్నీ ఔర్ వో దో’ని ఫైనల్లీ మే 15న విడుదల చేయాలనుకుంటున్నారు. సీక్వెల్ స్పెషలిస్ట్ బాలీవుడ్లో సీక్వెల్స్ అంటే అజయ్ దేవగన్ ప్రస్తావన ఉండకుండా ఉండదు. ఎందుకంటే... అజయ్దేవగన్ హీరోగా ఏదో ఒక సీక్వెల్ సినిమా సెట్స్పై ఉంటూనే ఉంటుంది. ‘సింగమ్, గోల్మాల్, ధమాల్, దృశ్యం’... ఈ నాలుగు ఫ్రాంచైజీ సినిమాల్లో అజయ్ దేవగన్ హీరోగా చేస్తున్నారు. ‘సింగమ్’ ఫ్రాంచైజీ నుంచి వచ్చిన తాజా సినిమా ‘సింగమ్ ఎగైన్’ 2024లో రిలీజైంది. ప్రస్తుతం ‘గోల్ మాల్, దృశ్యం 3’ సినిమాలు సెట్స్పై ఉండగా, ‘ధమాల్ 4’ సినిమా జూలైలో రిలీజ్కు సిద్ధమైంది. ఫుల్ నవ్వుల్తో నాలుగో ధమాల్ 2007లో ఆరంభమైంది నవ్వుల ధమాల్. ఇప్పటివరకూ మూడు దఫాలుగా నవ్వుల ధమాల్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పుడు నాలుగోసారి ఫుల్ నవ్వుల్తో సిద్ధమైంది. ‘ధమాల్’ (2007) ఫస్ట్ పార్ట్ని స్వీయదర్శకత్వంలో రూపొందించారు ఇంద్రకుమార్. ఆ ఫస్ట్ పార్ట్లో సంజయ్ దత్, రితేష్, దేశ్ముఖ్, అర్షద్ వార్సీ, ఆశిష్ చౌదరి, జావేద్ జాఫ్రీ, సంజయ్ మిశ్రా తదితరులు నటించారు. ఈ చిత్రానికి సీక్వెల్గా వచ్చిన ‘డబుల్ ధమాల్’ (2011)లోనూ సంజయ్ దత్, రితేష్, దేశ్ముఖ్, అర్షద్ వార్సీ, ఆశిష్ చౌదరి, జావేద్ జాఫ్రీ నటించారు. అలాగే మల్లికా శెరావత్, కంగనా రనౌత్ వంటి తారలు కూడా సీక్వెల్లో యాడ్ అయ్యారు. ఈ చిత్రం కూడా ఇంద్రకుమార్ దర్శకత్వంలోనే రూ΄÷ంది, నవ్వులు పంచింది. ఆ తర్వాత ఇంకా నవ్విస్తా అంటూ మూడో భాగంగా ‘టోటల్ ధమాల్’ (2019)ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు ఇంద్రకుమార్. ఈ సీక్వెల్లోనూ రితేష్ దేశ్ముఖ్, అర్షద్ వార్సీ, జావేద్ జాఫ్రీ నటించారు. కానీ సంజయ్ దత్ నటించలేదు. అజయ్ దేవగణ్, అనిల్ కపూర్, మాధురీ దీక్షిత్ మూడో భాగం తారాగణంలో యాడ్ అయ్యారు. ఈ సినిమాకి అజయ్ దేవగన్ ఓ నిర్మాత కూడా. ఇక ఇప్పుడు ‘ధమాల్ 4’ అంటూ నాలుగో ధమాల్ సిద్ధమైంది. జూలై 3న ఈ చిత్రం విడుదల కానుంది. సంజయ్ దత్, అజయ్ దేవగన్, మాధవన్, రితేష్ దేశ్ముఖ్, సంజయ్ మిశ్రా, జావేద్ జాఫ్రీ, రవి కిషన్ తదితరులు నటించారు. నిధి అన్వేషణ నేపథ్యంలో సాగే ఈ ఫుల్ కామెడీ మూవీని కూడా ఇంద్రకుమారే తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని వాస్తవానికి మార్చిలో విడుదల చేయాలనుకున్నారు. అయితే రణ్వీర్ సింగ్ ‘ధురంధర్ 2’ భారీ అంచనాల నడుమ విడుదలకు (మార్చి 19) సిద్ధమైన నేపథ్యంలో జూన్కి వాయిదా వేశారు. అయితే మరో భారీ సినిమా యశ్ ‘టాక్సిక్’ జూన్ 4న విడుదలకు సిద్ధం కావడంతో మరోసారి వాయిదా వేశారు. ఇప్పుడు ‘టాక్సిక్’ కూడా వాయిదా పడింది. ఫైనల్లీ ‘ధమాల్ 4’ని జూలై 3న రిలీజ్ చేయడానికి నిర్ణయించుకున్నారు.ఊటీలో గోల్మాల్ ప్రస్తుతం ‘గోల్మాల్ 5’ సినిమా చిత్రీకరణ కోసం అజయ్ దేవగన్ అండ్ గ్యాంగ్ ఊటీలో ఉన్నారు. రోహిత్ శెట్టి డైరెక్షన్లోని ఈ సినిమాలో అజయ్ దేవగన్ హీరోగా నటిస్తుండగా, అర్షద్ వార్షి, తుషార్ కపూర్, శ్రేయాస్ తల్పాడే, కునాల్ కేము ఈ సినిమాలోని ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే... ‘గోల్మాల్’ తొలి భాగంలో నటించిన శర్మాన్ జోషి, దాదాపు ఇరవై సంవత్సరాల తర్వాత ‘గోల్మాల్ 5’లో భాగం అయ్యారు. ప్రస్తుతం ఊటీలో జరుగుతున్న షూటింగ్లో ΄ాల్గొంటున్నారు. వచ్చే ఏడాది ఈ ‘గోల్మాల్ 5’ సినిమా రిలీజ్ కానుంది.అక్టోబరులో దృశ్యం 3 ‘దృశ్యం’ అనగానే మనకు మలయాళంలో మోహన్లాల్ గుర్తొస్తారు. కానీ బాలీవుడ్ సినిమా లవర్స్కి అజయ్ దేవగన్ గుర్తుకు రావొచ్చు. ఎందుకంటే.. మలయాళ ‘దృశ్యం’ సినిమా ఫ్రాంచైజీ హిందీ రీమేక్స్లో అజయ్ దేవగన్ హీరోగా చేస్తున్నారు. ఇప్పటికే రెండు భాగాలు వచ్చాయి. మూడో భాగాన్ని అధికారికంగా ప్రకటించి, ఈ సినిమాను ఈ ఏడాది అక్టోబరు 2న రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. అభిషేక్ ΄ాతక్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే హిందీ ‘దృశ్యం 2’లో నటించిన అక్షయ్ ఖన్నా ΄ాత్రలో మూడో భాగంలో జయదీప్ కనిపిస్తారట. టబు, శ్రియ శరణ్, రజత్ కపూర్ ఇతర ప్రధాన ΄ాత్రల్లో నటిస్తున్నారు. అన్నట్లు మరోమాట... మలయాళ ‘దృశ్యం 3’ సినిమా మే 21న రిలీజ్ కానుంది. తెలుగు ‘దృశ్యం 3’ మూవీలో వెంకటేశ్, మీనా నటిస్తారు. కానీ తెలుగు వెర్షన్ ఎప్పుడు సెట్స్కు వెళ్తుందనే విషయంపై క్లారిటీ రాలేదు. ఇంకా హారర్ మూవీ ‘సైతాన్’కు సీక్వెల్గా ‘సైతాన్ 2’ సినిమా చేయనున్నట్లుగా అజయ్ దేవగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇలా వరుస సీక్వెల్ సినిమాలు చేస్తున్నారు కనుక అజయ్ దేవగన్ను సీక్వెల్ స్పెషలిస్ట్ అని సరదాగా చెప్పుకోవచ్చు. ఈ చిత్రాలతో పాటు కంగనా రనౌత్ ‘క్వీన్ 2’, ‘తుంబాడ్ 2’ వంటి మరికొన్ని హిందీ చిత్రాల సీక్వెల్స్ సెట్స్కు వెళ్తున్నాయి. ఇంకొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. -
స్మృతి మంధాన మాజీ ప్రియుడిపై అట్రాసిటీ కేసు
టీమిండియా మహిళా క్రికెటర్ స్మృతి మంధాన మాజీ ప్రియుడు పలాష్ ముచ్చల్ మరోసారి వార్తల్లో నిలిచాడు. స్మృతి ఫ్రెండ్ విజ్ఞాన్ ప్రకాశ్ ఫిర్యాదుతో సంగ్లీ పోలీసులు.. పలాష్పై ఎస్సీ-ఎస్టీ కేసు నమోదు చేశారు. దీంతో ఈ విషయం కాస్త సినీ, క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది.(ఇదీ చదవండి: ఒకప్పుడు సల్మాన్ హీరోయిన్.. ఇప్పుడేమో టిఫిన్ సెంటర్ నడుపుతూ)ఏం జరిగింది?పోలీసులు చెప్పిన దాని ప్రకారం.. ఓ సినిమా కోసం పలాష్, తన దగ్గర రూ.25 లక్షలు తీసుకున్నాడని విజ్ఞాన్ ఫిర్యాదు చేశాడు. ఆరు నెలలో ఈ ప్రాజెక్ట్ పూర్తి చేస్తానని చెప్పి తనని మోసం చేశారని విజ్ఞాన్ ఆరోపించాడు. గతేడాది నవంబరులో మహరాష్ట్రలోని సంగ్లీ-అష్టా రహదారిపై ఉన్న టోల్ ప్లాజ్ దగ్గర డబ్బుల విషయమై ఇద్దరి మధ్య గొడవ జరిగింది. అప్పుడే పలాష్.. తన కులాన్ని ఉద్దేశించి తిట్టాడని, బూతులతో అవమానించాడని విజ్ఞాన్ పేర్కొన్నాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.గతేడాది నవంబరులోనే క్రికెటర్ స్మృతి మంధానతో పలాష్ పెళ్లి జరగాలి. కానీ అనుహ్యంగా రద్దయింది. పలాష్కి మరో అమ్మాయితో సంబంధం ఉండటం వల్ల ఇది రద్దయిందని రకరకాల రూమర్స్ వినిపించాయి. దీని గురించి అంతా మర్చిపోయారు అనుకుంటున్న తరుణంలో ఇప్పుడు పలాష్పై స్మృతి స్నేహితుడు కేసు పెట్టడం హాట్ టాపిక్ అయిపోయింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 10 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్) -
ఆ వార్తల్లో నిజం లేదు: కియారా అద్వానీ
‘‘టాక్సిక్’ సినిమాలో నా పాత్రకు సంబంధించి వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. అవన్నీ పుకార్లు మాత్రమే’’ అంటున్నారు హీరోయిన్ కియారా అద్వానీ. ‘కేజీఎఫ్, కేజీఎఫ్ 2’ వంటి బ్లాక్బస్టర్స్ తర్వాత యశ్ హీరోగా నటించిన తాజా పాన్ ఇండియా చిత్రం ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’. గీతూ మోహన్దాస్ దర్శకత్వంలో కన్నడ, ఇంగ్లిష్ భాషల్లో ఈ మూవీ తెరకెక్కింది. కియారా అద్వానీ, హ్యుమా ఖురేషి, నయనతార, తారా సుతారియా, రుక్మిణీ వసంత్ హీరోయిన్లుగా నటించారు.కేవీఎన్ ప్రోడక్షన్స్, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ పతాకంపై వెంకట్ కె. నారాయణ, యశ్ నిర్మించిన ఈ మూవీ ఇంగ్లిష్, కన్నడ భాషల్లో నేరుగా, తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో డబ్బింగ్ వెర్షన్లో రిలీజ్ కానుంది. ఇదిలా ఉంటే... ఈ సినిమాలో కథకి అవసరం మేరకు యశ్, కియారాల మధ్య కొన్ని బోల్డ్ సీన్స్ చిత్రీకరించారట గీతూ మోహన్దాస్. అయితే ఫైనల్ కట్ చూసిన తర్వాత ఆ సన్నివేశాలను తొలగించాలని కియారా కోరారనే వార్తలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. ఈ వార్తలపై ఇన్స్టాగ్రామ్ వేదికగా స్పందించారు కియారా అద్వానీ.‘‘టాక్సిక్’ మూవీలో నా పాత్రకు సంబంధించి వైరల్ అవుతున్న వార్తల్లో నిజం లేదు. ఈ మూవీ స్క్రిప్ట్ విషయంలో నేను ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు. అదే విధంగా నాపై ఉన్న కొన్ని సీన్స్ తొలగించమని యూనిట్ని కోరాననే వార్తలు కూడా అవాస్తవం. అవన్నీ కేవలం నిరాధారమైన పుకార్లు మాత్రమే’’ అని స్పష్టం చేశారు కియారా. ఇదిలా ఉంటే.. మార్చి 19న రిలీజ్ కావాల్సిన ‘టాక్సిక్’ జూన్ 4కి వాయిదా పడింది. అయితే ఆ తేదీకి కూడా రిలీజ్ కావడం లేదంటూ యశ్ పేర్కొన్న సంగతి తెలిసిందే. కొత్త విడుదల తేదీని త్వరలోనే ప్రకటించనున్నారు. -
కాన్స్ సందడి షురూ
కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ సందడి మొదలైంది. ఈ నెల 12 నుంచి 23 వరకు ఫ్రాన్స్ వేదికగా 79వ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ జరగనుంది. ప్రస్తుతం ఈ ఫెస్టివల్ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఏడాది ప్రధాన పోటీ విభాగాలకు దక్షిణ కొరియా సినీ దర్శకుడు పార్క్ చాన్–వూక్ జ్యూరీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. ఇక రెండు దశాబ్దాలుగా క్రమం తప్పకుండా ఈ చిత్రోత్సవాలకు హాజరవుతున్న ఐశ్వర్యా రాయ్ ఈ ఏడాది కూడా హాజరు కానున్నారని తెలిసింది. అలాగే గత ఏడాది తొలిసారి ఈ ఫెస్టివల్కు హాజరైన ఆలియా భట్ ఈ ఏడాది కూడా వెళ్తారని బాలీవుడ్ సమాచారం.‘ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా’ ప్రస్తుత డైరెక్టర్ అశుతోష్ గోవారీకర్, బాలీవుడ్ దర్శక–నిర్మాత కరణ్ జోహార్ వెళ్లనున్నారని తెలిసింది. పంజాబీ సినిమా ‘చర్దికలా’, మలయాళం సినిమా ‘బాలన్: ది బాయ్’ వంటి భారతీయ సినిమాలు ఈ చిత్రోత్సవాల్లో ప్రదర్శితం కానున్న నేపథ్యంలో ఈ సినిమా యూనిట్ సభ్యులు ఈ ఫెస్టివల్కు హాజరవుతారు.ఇక కాన్స్ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శితం కానున్న తొలి పంజాబీ సినిమాగా ‘చర్దికలా’ నిలిచింది. అమ్మీ విర్క్, రూపి గిల్, హిమ్మత్ సంధు లీడ్ రోల్స్లో ఈ సినిమాను అమర్జిత్ సింగ్ సరోన్ దర్శకత్వంలో పింకీ ధాలివాల్ నిర్మించారు. ఈ చిత్రం ఈ నెల 29న థియేటర్స్లో రిలీజ్ కానుంది. అంటే... కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శన అనంతరం ఈ సినిమా థియేటర్స్లో విడుదల అవుతుంది. -
అతనితోనే జాన్వీ కపూర్ పెళ్లి.. బోనీ కపూర్ ఏమన్నారంటే?
దేవర మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ జాన్వీ కపూర్. ప్రస్తుతం రామ్ చరణ్ సరసన పెద్ది మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది. బుచ్చిబాబు సనా డైరెక్షన్లో వస్తోన్న ఈ సినిమా జూన్ 4వ తేదీన థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడిన ఈ సినిమా జూన్లో రిలీజ్ కానుంది. అయితే బాలీవుడ్ భామ జాన్వీ కపూర్పై గత కొద్ది రోజులుగా రూమర్స్ వస్తున్నాయి. ఈ ఏడాది జాన్వీ పెళ్లి చేసుకోనుందని బాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. తన బాయ్ఫ్రెండ్ శిఖర్ పహారియాను పెళ్లాడనుందని ఊహాగానాలొస్తున్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్లో జాన్వీ కపూర్ పెళ్లి పీటలెక్కనుందని లేటేస్ట్ టాక్. ఈ నేపథ్యంలో జాన్వీ కపూర్ తండ్రి బోనీ కపూర్ స్పందించారు.తన కూతురు ఈ ఏడాదిలో పెళ్లి చేసుకోబోతోందన్న వార్తలను బోనీ కపూర్ ఖండించారు. జాన్వీ పెళ్లిపై వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదన్నారు. దీంతో పెద్ది బ్యూటీపై వస్తున్న పెళ్లి వార్తలకు చెక్ పడింది. అయితే గతంలో కాఫీ విత్ కరణ్ షోకు హాజరైన జాన్వీ కపూర్.. శిఖర్తో తన రిలేషన్ గురించి మాట్లాడింది. తామిద్దరం డేటింగ్లో ఉన్నామని తెలిపింది. అంతేకాకుండా వీరిద్దరు ఎక్కడికెళ్లినా జంటగా కనిపించడంతో వీరిద్దరు రిలేషన్లో ఉన్నట్లు అర్థమైపోయింది. గతంలో శిఖర్ గురించి జాన్వీ కపూర్ పాజిటివ్ కామెంట్స్ చేసింది. అతను నాతో ఉంటే సేఫ్గా ఉంటాననే ఫీలింగ్ వస్తుందని జాన్వీ తెలిపింది. అతనికో నేను ఒక చిన్నపిల్లలా ఉండగలనని చెప్పింది. శిఖర్తో తప్ప మరెవరితోనూ నేను ఇంత సరదాగా గడపలేనని పేర్కొంది. -
ఒకప్పుడు సల్మాన్ హీరోయిన్.. ఇప్పుడేమో టిఫిన్ సెంటర్ నడుపుతూ
సినిమా తారల తళుకుబెళుకుల వెనక చీకటి, కన్నీటి గాధలు ఉంటాయి. అప్పుడప్పుడు ఇలాంటివి బయటకొస్తుంటాయి. ఇప్పుడు కూడా అలానే ఓ హీరోయిన్ దీనస్థితి విషయం వైరల్ అవుతోంది. సల్మాన్ ఖాన్ లాంటి గుర్తింపు ఉన్న హీరో సరసన నటించినప్పటికీ అదృష్టం కలిసి రాలేదు. ఇప్పుడేమో టిఫిన్ బండి నడుపుతూ చాలా సాధారణంగా బతికేస్తోంది. ఇంతకీ ఎవరీమె? ఏంటి స్టోరీ?(ఇదీ చదవండి: మహేశ్ 'వారణాసి'కి నీటి కష్టాలు!)పూజా దద్వాల్. ఈ పేరు ఇప్పటి జనరేషన్కి పెద్దగా తెలియకపోవచ్చు. ఎందుకంటే అప్పుడెప్పుడో 1995లో వచ్చిన వీర్గతి సినిమాలో సల్మాన్ ఖాన్ పక్కన హీరోయిన్గా చేసింది. కానీ మూవీ అట్టర్ ఫ్లాప్ అయింది. కానీ ఈమె యాక్టింగ్తో మెప్పించింది. దీనికంటే ముందు 'జీనే నహీ దూంగీ' చిత్రంలోనూ నటించింది. అయితే వెండితెరపై సక్సెస్ రాకపోయేసరికి టీవీల్లో ప్రయత్నించింది. ఇక్కడా సేమ్ సీన్ రిపీటైంది. ఇక యాక్టింగ్ వల్ల కాదనుకుని పెళ్లి చేసుకుని భర్తతో కలిసి గోవాలో సెటిలైంది.భర్తతో కలిసి సంతోషంగా ఉన్న టైంలో టీబీ మహమ్మారి ఈమె జీవితాన్ని అతలాకుతలం చేసింది. ఓ రోజు వీక్నెస్తో కిందపడిపోవడంతో ఆస్పత్రికి తీసుకెళ్లగా టీబీ అని తేలింది. దీంతో కట్టుకున్న భర్త, అత్తమామ ఈమెని వదిలించుకోవాలని చూశారు. ముంబైలో వదిలేశారు. ఆఖరికి కన్నవాళ్లు, స్నేహితులు కూడా పట్టించుకోలేదు. దీంతో అనాథ అయిపోయిన ఈమె.. చేతిలో డబ్బుల్లేక అల్లాడిపోయింది. సరిగ్గా ఆ టైంలో దర్శకుడు రాజేంద్ర సింగ్ ఈమెని ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించాడు. అయితే తనతో పాటు నటించిన సల్మాన్ని సాయం అడుగుదామనుకుని ఓ వీడియో చేసింది.(ఇదీ చదవండి: సమంత 'బంగారం'.. ఇలా అయిందేంటి?)పూజా చేసిన వీడియో సల్మాన్ వరకు చేరగా.. ఈమెకు సాయం చేసేందుకు అతడు ముందుకొచ్చాడు. పరిస్థితి చూసి చలించిపోయాడు. చికిత్స, ఆహారం, బట్టలు.. ఇలా అవసరమైన ప్రతిదీ ఈమెకు అందేలా చూశాడు. దీంతో చనిపోతుందనుకున్న పూజా.. ఐదు నెలల్లో కోలుకుంది. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయింది. ఇలా ఉన్నానంటే సల్మాన్ ఖానే కారణమని, ఆయన మేలు మరవలేను అని ఎమోషనల్ అయింది.కోలుకుని సాధారణ స్థితికి వచ్చిన తర్వాత ముంబైలో చిన్న అపార్ట్మెంట్ అద్దెకు తీసుకుంది. పొట్టకూటి కోసం చాలా పనులు చేస్తూ వచ్చింది. 2020లో 'షుక్రానా' అనే పంజాబీ మూవీలో నటించింది. ఇదేమైనా తన తలరాత మారుస్తుందని అనుకుంటే.. ఇదీ నిరాశపరిచింది. ఈమె పరిస్థితి చూడలేకపోయిన దర్శకుడు రాజేంద్ర సింగ్.. టిఫిన్ బండి పెట్టుకోమని సలహా ఇచ్చాడు. అవసరమైన సామాగ్రి కొనిచ్చి సాయం చేశాడు. అప్పటినుంచి టిఫిన్ బండి నడుపుతూ జీవనం సాగిస్తోంది. గతంలోనే ఈమె స్టోరీ బయటకొచ్చినప్పటికీ ఇప్పుడు మరోసారి వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: విజయ్కి మరో షాక్.. రూ.70 కోట్ల నష్టం?) -
తమన్నా మళ్లీ ప్రేమలో పడిందా?
సినిమా సెలబ్రిటీల ప్రేమ అనేది చాలా సాధారణమైన విషయం. ప్రేమలో పడటం, డేటింగ్ చేయడం లాంటివి వింటూనే ఉంటాం. హీరోయిన్ తమన్నా కూడా నటుడు విజయ్ వర్మతో గతంలో డేటింగ్ చేసింది. మరి ఏమైందో ఏమో వీళ్లిద్దరూ విడిపోయారు. అలాంటిది తాజాగా తమన్నా చేసిన కామెంట్స్.. మళ్లీ ఈమె ప్రేమలో పడిందా అనే సందేహాలు రేకెత్తిస్తున్నాయి.(ఇదీ చదవండి: సమంత 'బంగారం'.. ఇలా అయిందేంటి?)'ప్రేమ అనేది ఓ లావాదేవి కాదు. మనం ఎదుటి వ్యక్తికి ప్రేమ ఇస్తున్నప్పుడు తిరిగి దాన్ని ఆశించడం కరెక్ట్ కాదు. జీవితంలో ఎన్ని సార్లయినా ప్రేమలో పడే అవకాశముంది. అది కేవలం ఒక్కరితే పరిమితం కావాల్సిన అవసరం లేదు. ఒక్కసారి డిసైడ్ అయితే ఎన్నిసార్లయినా ప్రేమ పుడుతుంది. బంధాలు మనల్ని బంధించేవిగా ఉండకూడదు. మన ఎదుగుదలకు తోడ్పడేలా ఉండాలి' అని తమన్నా చెప్పడం ఆసక్తికరంగా అనిపించింది.'లస్ట్ స్టోరీస్ 2' షూటింగ్ టైంలో తమన్నా, విజయ్ వర్మ డేటింగ్ చేసినట్లు రూమర్స్ వచ్చాయి. అందుకు తగ్గట్లే బయట చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న ఫొటోలు, వీడియోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. కానీ వీళ్లిద్దరూ విడిపోయారు. తమన్నా ఇలా డౌట్ వచ్చే కామెంట్స్ చేస్తుండగా.. విజయ్ వర్మ కూడా మరో అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. రీసెంట్గానే ఒకటి రెండు ఫొటోలు వైరల్ అయ్యాయి.(ఇదీ చదవండి: మహేశ్ 'వారణాసి'కి నీటి కష్టాలు!) -
ప్రియుడితో బ్రేకప్.. హీరోతో డేటింగ్..!
సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు ఏదో ఒక రూమర్స్ వినిపిస్తూనే ఉంటాయి. ముఖ్యంగా డేటింగ్, రిలేషన్ అనే పదాలు ఎక్కువగా వింటుంటాం. తాజాగా బాలీవుడ్ బ్యూటీ తారా సుతారియాకు సంబంధించిన ఓ న్యూస్ బాలీవుడ్లో హల్చల్ చేస్తోంది. ఆమెకు తన బాయ్ఫ్రెండ్ వీర్ పహారియాతో బ్రేకప్ అయిందని టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై ఇప్పటి వరకు తారా కానీ.. పహారియా కానీ స్పందించలేదు. విడిపోవడంపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదుఅయితే అంతలోనే తారా సుతారియాపై మరో రూమర్ వైరల్గా మారింది. బాలీవుడ్ హీరో ఆదిత్య రాయ్ కపూర్తో ఆమె డేటింగ్లో ఉందంటూ ఊహాగానాలు మొదలయ్యాయి. తాజా నివేదిక ప్రకారం అవుననే సమాధానం వినిపిస్తోంది. ప్రస్తుతం వీరిద్దరు ఒకరినొకరు కలుసుకుంటున్నారని బాలీవుడ్లో టాక్ నడుస్తోంది. దీంతో ఇప్పుడిది బీటౌన్లో హాట్టాపిక్గా మారింది. కాగా.. గతంలో ఆదిత్య రాయ్ కపూర్.. హీరోయిన్ అనన్య పాండేతో రిలేషన్ కొనసాగించారు. అయితే గతేడాది చివర్లో ముంబైలో జరిగిన కచేరీ వివాదం తర్వాత తారా, వీర్ పహారియాపై బ్రేకర్ రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇక సినిమాల విషయానికొస్తే ఈ బాలీవుడ్ భామ యశ్ చిత్రం టాక్సిక్లో కనిపించనుంది. -
ముగ్గురితో రొమాన్స్.. ఫుల్ కామెడీగా ట్రైలర్
రకుల్ ప్రీత్ సింగ్, ఆయుష్మాన్ ఖురానా ప్రధాన పాత్రల్లో వస్తోన్న రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ పతి పత్నీ ఔర్ వో దో. ఈ సినిమాకు ముదస్సర్ అజీజ్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో సారా అలీ ఖాన్, వామికా గబ్బీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.ట్రైలర్ చూస్తుంటే పెళ్లి తర్వాత మరో ఇద్దరు అమ్మాయిలతో రిలేషన్ నేపథ్యంలో కథ తెరకెక్కించినట్లు తెలుస్తోంది. భార్య, ఇద్దరు అమ్మాయిలను ఎలా డీల్ చేశాడన్నదే పతి పత్నీ ఔర్ వో దో. ట్రైలర్లో సన్నివేశాలు చూస్తుంటే ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గా కథ ఉండనుందని అర్థమవుతోంది. ఈ చిత్రంలో ఫారెస్ట్ ఆఫీసర్ ప్రజాపతి పాండే పాత్రలో ఆయుష్మాన్ కనిపించనున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ మూవీ మే 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
ఆడవాళ్ల శరీరం లైంగిక ఆకర్షణ కోసమే కాదు.. ట్రోలర్స్పై నటి ఫైర్!
మహిళలపై బాడీ షేమింగ్ చేసేవాళ్లపై బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ స్వరా భాస్కర్ మరోసారి ఫైర్ అయింది. ఆడవాళ్ల శరీరం కేవలం గ్లామర్ ప్రదర్శించడానికి, లైంగిక ఆకర్షణ కోసమే కాదని.. ఒకరికి ప్రాణం పోయడం వంటి గొప్ప పని కూడా చేస్తుందని, అలాంటప్పుడు శరీరంలో మార్పులు రావడం చాలా సహజమని, వాటిని స్వీకరించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.తను వెడ్స్ మను’, ‘రాంజనా’ వంటి సినిమాలతో బాలీవుడ్లో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న స్వరా భాస్కర్..2023లో ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. డెలివరీ తర్వాత ఆమె శరీరంలో భారీ మార్పులు వచ్చాయి. బరువు పెరిగి కాస్త లావుగా మారింది. అయితే తాజాగా తన పాత ఫోటోని, ప్రస్తుత ఫోటోని కలిపి ఒక కొలాజ్ని ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. ఈ ఫోటో కాస్త వైరల్ కావడం.. కొంతమంది నెటిజన్స్ ‘గుర్తుపట్టలేనంత మారిపోయింది’. ‘ఇక ఆమె కెరీర్ క్లోజ్’ అంటూ బాడీ షేమింగ్ చేస్తూ కామెంట్స్ పెట్టారు.వీటిపై ఆమె తీవ్రంగా స్పందించారు. ‘ఒక ప్రాణానికి జన్మనివ్వడం సాధారణ విషయం కాదు. ఆ సమయంలో బాడీ ఎన్నో మార్పులకు గురవడం చాలా సహజం. బిడ్డ పుట్టిన తర్వాత కూడా మళ్లీ ఇంతకుముందులానే ఉండాలని ఒత్తిడి చేయడం సరికాదు. ఆడాళ్లు షోకేస్లో పెట్టే అందాల బొమ్మలు అసలే కాదు’ అంటూ ఇన్స్టాలో ఓ సుధీర్ఘమైన పోస్ట్ పెట్టింది.‘నేను ఈ మాటను పదే పదే ప్పాలనుకుంటున్నాను. మహిళల శరీరం కేవలం ఆకర్షణ కోసం లేదా గ్లామర్ కోసం కాదు. నాకు బిడ్డ పుట్టిన తర్వాత మునపటిలా మారాలని అనుకోలేదు. ఎందుకంటే మీకు బిడ్డ పుట్టాక, మళ్లీ వెనక్కి వెళ్లే అవకాశం ఉండదు. మీరు జీవితాంతం తల్లిదండ్రులుగానే ఉంటారు. జీవితం పూర్తిగా మారిపోతుంది. అందులో ఎలాంటి తప్పు లేదు. నిజమే.. మనం మన పాత జీవితాన్ని, చిన్ననాటి స్వేచ్ఛా లైఫ్ ను, సన్నగా ఉన్న శరీరాన్ని మిస్ అవుతాం. కానీ మన చిన్ననాటిలాగే ఉండాలని అనుకోవడం, మన శరీరాన్ని గతంలోకి బలవంతంగా నెట్టడం ఒకరకమైన క్రూరత్వం.మన శరీరం మరో మనిషికి జన్మనిచ్చింది. కనుక శరీరం మారడం సహజం. కెమెరాల కోసం, అపరిచితుల కోసం ఆకర్షణీయంగా కనిపించాలని ఒత్తిడి పెంచుకోవడం తెలివి తక్కువ పని. డెలీవరీ తర్వాత బరువు పెరిగిన మహిళలపై బాడీ షేమింగ్ చేయడం నీచమైన పని.ఒక మహిళ..తన జీవితాన్ని తనకు నచ్చినట్లుగా బతకాలి. అలా అని నేను ఫిట్నెస్గా ఉండకూడదని చెప్పడం లేదు. మన శరీరాలను గౌరవించుకోవడానికి, మనకు సరిపోని పరిమితుల్లో మనల్ని మనం బంధించుకోవడం ఆపడానికి చేసే వాదన. జీవితం అనేది మన అంతరాత్మలోకి, ముందుకు సాగే ఒక ప్రయాణం. మన శరీరాలకు కూడా ఆ గౌరవాన్ని ఇవ్వడంలో తప్పులేదు’ అని స్వరా భాస్కర్ ఇన్స్టాలో రాసుకొచ్చింది.ఇక నటీనటులు గ్లామర్గా ఉండాలని చెప్పేవాళ్లకు కూడా ఆమె కౌంటర్ ఇచ్చింది.‘నటన అనేది టాలెంట్కు సంబంధించిన విషయం. దానికి మనిషి బరువుతోనో, గ్లామర్తోనో అస్సలు సంబంధం లేదు’ అని స్వరా భాస్కర్ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె పోస్ట్ నెట్టింట వైరల్గా మారగా.. పలువురు ఆమెకు మద్దతు తెలుపుతూ కామెంట్స్ పెడుతున్నారు. View this post on Instagram A post shared by Swara Bhasker (@reallyswara) -
కేప్ టౌన్లో కింగ్
దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్లో ల్యాండ్ అయ్యారు కింగ్. ‘పఠాన్’ వంటి బ్లాక్బస్టర్ సినిమా తర్వాత హీరో షారుక్ ఖాన్, దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా ‘కింగ్’. ఈ చిత్రంలో దీపికా పదుకోన్ హీరోయిన్. షారుక్ ఖాన్ తనయ సుహానా ఖాన్, అభిషేక్ బచ్చన్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్లో జరుగుతోంది. షారుక్ – దీపిక పాల్గొంటుండగా కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్లో కొంత టాకీ పార్టుతో పాటు ఓ పాట, ఓ యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరించేందుకు సన్నాహాలు చేస్తున్నారని బాలీవుడ్ సమాచారం.కాగా కేప్ టౌన్లో షారుక్–దీపికల మధ్య చిత్రీకరిస్తున్న కొన్ని విజువల్స్, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఈ విషయంపై దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ స్పందించారు. ‘‘కింగ్’ సినిమా సెట్స్ నుంచి లీకైన ఫొటోలను సోషల్ మీడియా మాధ్యమాల్లో షేర్ చేయకండి. ప్రేక్షకులకు మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ను అందించేందుకు మా టీమ్ అంతా ఎంతో కష్టపడి పని చేస్తున్నారు. థియేటర్స్లో బిగ్ స్క్రీన్పై సర్ప్రైజెస్ కోసం వేచి చూద్దాం’’ అని ‘ఎక్స్’లో పేర్కొన్నారు సిద్ధార్థ్ ఆనంద్. గౌరీ ఖాన్, సిద్ధార్థ్ ఆనంద్, మమతా ఆనంద్ నిర్మిస్తున్న ‘కింగ్’ సినిమా ఈ ఏడాది డిసెంబరు 24న రిలీజ్ కానుంది. -
సాయిపల్లవి సినిమాని పట్టించుకోవట్లేదు.. దారుణమైన కలెక్షన్స్!
సాయిపల్లవి పేరు చెప్పగానే తెలుగులో చాలామంది ప్రేక్షకులు ఎగ్జైట్ అయిపోతారు. ఎందుకంటే ఆయా సినిమాలు ఫెయిలైనా సరే ఈమె యాక్టింగ్ మాత్రం అదరగొట్టేస్తుంది. ఇప్పటివరకు ఈమె చేసిన చిత్రాలు ఫెయిలైనా సరే కాస్తంత డబ్బులు రాబట్టాయి. కానీ హిందీలో చేసిన తొలి చిత్రం 'ఏక్ దిన్' మాత్రం తొలిరోజే దారుణమైన కలెక్షన్స్తో ఈమెకు పెద్ద షాక్ ఇచ్చిందని చెప్పొచ్చు. ఇంతకీ ఏంటి విషయం? ఈ మూవీ సంగతేంటి?(ఇదీ చదవండి: విడాకులవుతాయని కలలో కూడా ఊహించలేదు.. కానీ రెండో పెళ్లి: 'కార్తీకదీపం' నటి)బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ హీరోగా నటించిన సినిమా ఇది. సాయిపల్లవి హీరోయిన్. కొన్నిరోజుల క్రితం ప్రీమియర్స్ వేయగా.. సినిమా చూస్తూ ఆమిర్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. తర్వాత సాయిపల్లవిని ప్రశంసలతో ముంచెత్తాడు. అయినా సరే ఈ మూవీని జనాలు పట్టించుకోవట్లేదు. చెప్పాలంటే రిలీజ్కి ముందే బజ్ లేదు. పెద్దగా బుకింగ్స్ కూడా జరగలేదు. సరే థియేటర్లలోకి వచ్చిన తర్వాత బాగుంటే హిట్ అవ్వొచ్చని అనుకున్నారు. కానీ టాక్ కూడా ఏమంత ఆశాజనకంగా లేదు.సినిమాలో సాయిపల్లవి యాక్టింగ్ బాగానే చేసిందని అంటున్నారు గానీ మిగతా విషయాల గురించి పెద్దగా మాట్లాడట్లేదు. చాలామంది మిడ్ రేంజ్ హీరోల కంటే సాయిపల్లవికి బాగానే గుర్తింపు ఉంది. ఇది కూడా 'ఏక్ దిన్' విషయంలో పనిచేసినట్లు లేదు. తెలుగులోనూ 'ఒక రోజు' పేరుతో తీసుకొచ్చారు గానీ ఇదొచ్చిన సంగతి కూడా జనాలకు తెలీదు. షోలు కూడా పదికి మించి లేవంటేనే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.థాయ్ సినిమా 'వన్ డే' రీమేక్గా దీన్ని తెరకెక్కించారు. ఆమిర్ ఖాన్ నిర్మించగా సునీల్ పాండే దర్శకత్వం వహించారు. కలెక్షన్స్ విషయానికొస్తే తొలిరోజు రూ.కోటి అటుఇటుగా నెట్ కలెక్షన్స్ వచ్చాయి. టాక్ పాజిటివ్గా లేదు, కలెక్షన్సే పెద్దగా రావట్లేదు. ఈ అంశాలన్నీ చూస్తుంటే సాయిపల్లవికి బాలీవుడ్లో ఫస్ట్ స్ట్రోక్ తగిలినట్లే కనిపిస్తుంది. వీకెండ్ పూర్తయితే అప్పుడు వచ్చే వసూళ్ల బట్టి ఫలితంపై క్లారిటీ వచ్చేస్తుంది.(ఇదీ చదవండి: అమిత్ షాని కలిసిన రిషభ్ శెట్టి.. సినిమాల గురించి డిస్కషన్) -
నటి ఎగ్ ఫ్రీజింగ్ ఇంజెక్షన్స్: రెండు రోజులు నరకం
న్యూఢిల్లీ : నటి ఆకాంక్ష రంజన్ కపూర్ (32) తాను తన అండాలను ఫ్రీజ్ చేయించుకున్న విషయాన్ని సోషల్మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఆ సమయంలో తాను ఎదుర్కొన్న శారీరక ఇబ్బందుల గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అలాగే తన ఎగ్ ఫ్రీజింగ్ నిర్ణయం వెనుక గల కారణాన్ని ఆమె మరింత వివరంగా తెలియజేశారు.సోహాఅలీ ఖాన్ పాడ్కాస్ట్ 'ఆల్ అబౌట్ హర్' తాజా ఎపిసోడ్లో, ఆకాంక్ష కపూర్ తాను తన అండాలను ఎందుకు ఫ్రీజ్ చేయించుకోవాలనుకున్నదీ వెల్లడించారు. ఈ ఏడాది మార్చిలో, ఆకాంక్ష తన అండాలను ఫ్రీజ్ చేయించుకున్నారు. కడుపులో పెద్ద బెలూన్ ఉన్నట్టేఎగ్ ఫ్రీజింగ్ ప్రక్రియలో భాగంగా ఇచ్చే ఇంజెక్షన్ల వల్ల తాను చాలా నొప్పిని అనుభవించానని ఆకాంక్ష తెలిపారు. శారీరకంగా తాను చాలా ఇబ్బంది పడ్డానని తెలిపారు. అయితే ఇది అందరికీ ఇలాగే జరుగుతుందనుకోను, కానీ తన విషయంలో మాత్రం విపరీతమైన నొప్పి ని భరించాల్సి వచ్చిందని గుర్తు చేసుకున్నారు. 2-3 రోజుల పాటు నేను సరిగ్గా నడవలేకపోయాను. కడుపులో ఏదో పెద్ద బెలూన్ ఉన్నట్లుగా అనిపించేది, కనీసం నిటారుగా నిలబడలేకపోయేదాన్ని. తాను చాలా సన్నగా ఉండటం వల్ల అలా అనిపించి ఉండవచ్చని డాక్టర్ చెప్పారని వివరించింది.ఎగ్ ఫ్రీజింగ్ వెనుక రెండు ప్రధాన కారణాలుతన స్నేహితులు గర్భం దాల్చుతున్న సమయంలో అందరూ పలకరిస్తుండటంతో, ఆమె కూడా AMH (Anti-Mullerian Hormone) టెస్ట్ చేయించుకున్నారు. తన వయస్సుతో పోలిస్తే ఆమెలో ఈ హార్మోన్ స్థాయి చాలా తక్కువగా ఉందని తేలింది. (AMH టెస్ట్ ద్వారా ఒక మహిళలో అండాల నిల్వ ఎంత ఉందో తెలుసుకోవచ్చు). తన చుట్టూ ఉన్న చాలా మంది మహిళలు గర్భం దాల్చడానికి ఇబ్బంది పడుతుండటం, సంతానలేమి సమస్యలు ఎదుర్కోవడం చూసి ఆమె ముందస్తు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆకాంక్ష తెలిపారు.ఇది భయం కాదు..ఇన్సూరెన్స్ భయంతో తీసుకున్న నిర్ణయం కాదని, తన భవిష్యత్తు కోసం చేసిన అని స్పష్టం చేసిన ఆకాంక్ష, పునరుత్పత్తి ఆరోగ్యానికి సంబంధించి ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేమన్నారు. ఇదొక బీమా లాంటిదని పేర్కొన్నారు.ముందే చేసి ఉండాల్సింది..ప్రస్తుతం తనకు 32 ఏళ్లని, అసలైతే 20 ఏళ్ల వయస్సులోనే లేదా 20ల మధ్యలో ఈ ప్రక్రియ చేసి ఉంటే అండాలు మరింత ఆరోగ్యంగా ఉండేవని ఆమె అభిప్రాయపడ్డారు. తాను ఇప్పటికే ఆలస్యం చేశానని ఇది ఎగ్ ఫ్రీజింగ్ గురించి ముందే తెలిసి ఉంటే బాగుండేదని చెప్పుకొచ్చారు. కాగా ఆకాంక్ష రంజన్ కపూర్, దర్శకుడు శరణ్ శర్మ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త బీ-టౌన్లో హాట్ టాపిక్గా మారింది. ఆకాంక్ష రంజన్ కపూర్ 'గిల్టీ' (Guilty) వంటి సినిమాలతో గుర్తింపు పొందారు. ఇదీ చదవండి: షాకింగ్ : పక్కా ప్లాన్తో మలయాళీ సిస్టర్స్ సూసైడ్! -
ఆ డైరెక్టర్ 10 సార్లు లైంగికంగా వేధించాడు.. మోనాలిసా సంచలన ఆరోపణలు!
కుంభమేళాలో పూసలు అమ్ముతూ సోషల్ మీడియాలో స్టార్గా మారిన యువతి మోనాలిసా ఇప్పుడు తరచు వార్తల్లో నిలుస్తోంది. సోషల్ మీడియా పుణ్యమా అని హీరోయిన్గా మారిన మోనాలిసా.. ఒకవైపు సినిమాల్లోనే నటిస్తూనే.. ప్రియుడు ఫర్మాన్ ఖాన్ని పెళ్లి చేసుకుంది. అప్పటి నుంచి ఆమె వ్యక్తిగత జీవితంపై తరచూ ఏదో ఒక వార్త బయటకు వస్తూనే ఉంది. కుటుంబ సభ్యులకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకోవడం..వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేయడం..విచారణలో ఆమె మైనర్ అని తేలడంతో భర్తపై పోక్సో కేసు నమోదు అవ్వడం..అంతలోనే ఆమె ప్రెగ్నెంట్ అని ప్రకటించడం..ఇలా గత కొద్ది రోజులుగా మోనాలిసా పర్సనల్ లైఫ్ నెట్టింట హాట్ టాపిక్గా మారింది. ఈ వివాదం ముగియకముందే మరో ఈ వైరల్ భామ మరో బాంబ్ పేల్చింది. తనను హీరోయిన్ గా మార్చి, ‘ది డైరీ ఆఫ్ మణిపూర్’ మూవీతో ఇండస్ట్రీకి పరిచయం చేసిన డైరెక్టర్ సనోజ్ మిశ్రాపై సంచలన ఆరోపణలు చేసింది. అతను తనను లైంగికంగా వేధించాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మిశ్రాతో పాటు మరో ముగ్గురిపై కూడా ఆమె పోక్సో చట్టం కింద ఎర్నాకులం పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలన సృష్టించింది.ఫిర్యాదులో ఏముంది?‘ది డైరీ ఆఫ్ మణిపూర్’ మూవీ షూటింగ్ సమయంలో దర్శకుడు తనను లైంగికంగా వేధించాడని మోనాలిసా ఫిర్యాదు పేర్కొంది.‘షూటింగ్ సమయంలో దర్శకుడు నాతో పదే పదే అసభ్యకరంగా ప్రవర్తించేవాడు. ఈ విషయాన్ని ఇంట్లోవాళ్లకు చెప్పినా.. పట్టించుకోలేదు. షూటింగ్ మొత్తంలో అతను నన్ను దాదాపు 10 సార్లు లైంగికంగా వేధించాడు. మరిన్ని అవకాశాలు ఇప్పిస్తానంటూ అనుచితంగా ప్రవర్తించాడు’ అని ఫిర్యాదులో పేర్కొంది.న్యాయవాదిపై కూడా ఫిర్యాదుమోనాలిసా దాఖలు చేసిన ఎఫ్ఐఆర్లో విశ్వ హిందూ పరిషత్ నాయకుడు, న్యాయవాది అనిల్ విలయిల్ పేరు కూడా ఉంది.అనిల్ సోషల్ మీడియాలో తన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా పోస్టులు పెట్టారని ఆమె పేర్కొన్నారు. గురువారం కోర్టుకు హాజరైన మోనాలిసా, తన వాంగ్మూలాన్ని రికార్డ్ చేశారు. అయితే ఈ ఘటనలు మధ్యప్రదేశ్లో జరిగినట్లు తెలుస్తుండటంతో, కేసును అక్కడి పోలీసులకు బదిలీ చేసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. -
సాహో నటి విడాకులు.. పెళ్లైన ఐదేళ్లకే బంధానికి గుడ్ బై
ప్రముఖ నటి ఎవలీన్ శర్మ తన భర్తతో విడిపోతున్నట్లు ప్రకటించింది. తమ ఐదేళ్ల వివాహా బంధానికి గుడ్ బై చెప్పనుంది. ఈ విషయాన్ని తాజా ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఈ విషయంపై ఓ ఛానెల్లో మాట్లాడిన ఆమె.. అవును మేమిద్దరం పరస్పరం అంగీకారంతోనే విడిపోవాలని నిర్ణయించుకున్నామని తెలిపింది. పిల్లల విషయంలో ఇద్దరం బాధ్యత తీసుకుంటామని పేర్కొంది. ఇలాంటి మేము గోప్యతను కోరుకుంటున్నామని అన్నారు. కాగా.. నటి ఎవలిన్ శర్మ 2021 మే 15న డెంటల్ సర్జన్ అయిన తుషాన్ బిందీని పెళ్లాడారు. వీరికి కుమార్తె ఆవా, కుమారుడు ఆర్డెన్ అనే ఇద్దరు పిల్లలు జన్మించారు. పెళ్లైన ఐదేళ్లకే ఈ జంట విడాకులు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. స్నేహపూర్వకంగా తమ బంధానికి ముగింపు పలుకుతున్నామని ఎవలీన్ తెలిపారు. తమ పిల్లలను మాత్రం కలిసే పెంచుతామని కూడా స్పష్టం చేశారు. కాగా.. ఎవలీన్ శర్మ 2012లో హిందీ సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చారు. 2019 వరకు పలు హిందీ చిత్రాలలో కనిపించారు. ఆమె 2013లో విడుదలైన 'యే జవానీ హై దీవానీ' మూవీలో మెప్పించింది. అంతేకాకుండా 2014లో విడుదలైన 'యారియాన్', 'మై తేరా హీరో' చిత్రాల్లో కూడా నటించింది. తెలుగులో ప్రభాస్ మూవీ సాహోలో ఐషా పాత్రలో ఆకట్టుకుంది. -
షారూక్ ఖాన్కు ఈగో ఎక్కువ.. అందుకే నచ్చలేదు: సింగర్ అభిజిత్
ప్రముఖ బాలీవుడ్ సింగర్ అభిజీత్ భట్టాచార్య ఆసక్తికర కామెంట్స్ చేశారు. బాలీవుడ్ హీరో షారూక్ ఖాన్ గురించి ఆయన మాట్లాడారు. షారూక్తో వచ్చిన విభేదాలపై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆ సూపర్స్టార్ క్షమాపణ చెప్పకపోవడం వల్లే మా ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయని తెలిపారు. షారూక్ ఖాన్కు ఉన్న అహం వల్లే వృత్తిపరంగా ఆయన సినిమాలకు పనిచేయడం లేదని అన్నారు. తాజాగా ఓ పాడ్కాస్ట్కు హాజరైన ఆయన షారూక్తో విభేదాలపై స్పందించారు. విభేదాలకు అదే కారణం..పాడ్కాస్ట్లో అభిజీత్ మాట్లాడుతూ.. 'షారుఖ్ ఖాన్కు అహం ఎక్కువ. నాకు ఆత్మగౌరవమే ముఖ్యం. అందే మా మధ్య విభేదాలకు కారణమైంది. షారుఖ్ నా కంటే చిన్నవాడు.. అయినా ఫరా ఖాన్ భర్త అతన్ని అంతగా దూషించినప్పుడు కూడా షారుఖ్ అతన్ని కౌగిలించుకున్నాడు. ఆమిర్ ఖాన్ ఒక కుక్కకు షారూఖ్ అని పేరు కూడా పెట్టాడు.. అయినా వారిద్దరూ స్నేహితులుగా ఉన్నారు. అయినా మీరు ఒక్కసారి కూడా క్షమాపణ చెప్పలేకపోవడం నన్ను బాధించింది. మీరు అంత గొప్ప వ్యక్తి అయినప్పటికీ నాకు క్షమాపణ చెప్పలేదు” అని అన్నారు. ఇదే తనపై భావోద్వేగమైన ప్రభావం చూపిందని పేర్కొన్నారు.షారూఖ్ తాను చేసిన తప్పును అంగీకరించకపోవడమే తనను ఎక్కువగా బాధించిందని అభిజిత్ అన్నారు. అందుకే షారూక్ ప్రాజెక్టులకు దూరంగా ఉండాలనే నిర్ణయం తీసుకున్నానని వెల్లడించారు. అయితే తన నిర్ణయం అహంకారంతో కాదని.. వ్యక్తిగత నిరాశతోనే తీసుకున్నానని సింగర్ స్పష్టం చేశారు. ఒకానొక సమయంలో షారూక్ కోసం తాను ఇతర నటుల కోసం కూడా పాడటం మానేశానని అన్నారు. షారుక్ ఖాన్తో సన్నిహితంగా ఉన్నప్పటికీ తనను పట్టించుకోవడం లేదని అనిపించేదని అభిజీత్ భట్టాచార్య అన్నారు. నాకు సరైన గుర్తింపు, క్రెడిట్ లేకపోవడం వల్లే షారూక్తో విభేదాలు తలెత్తాయని గతంలో అభిజీత్ చాలాసార్లు వెల్లడించారు. కాగా.. సింగర్ అభిజిత్ 'బాద్షా', 'మై హూ నా' వంటి చిత్రాలలోని పాటలకు తన గాత్రం అందించారు. మై హూ నా మూవీ టైమ్లో తన ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారని అన్నారు. అభిజిత్ చివరిసారిగా షారూక్ బిల్లు చిత్రానికి పనిచేశారు. -
మైక్ కిందపడేసి వెళ్లిపోయాడు.. అవమానంగా అనిపించింది: ప్రియాంక
చాలా మంది తారల మాదిరే తాను కూడా కెరీర్ తొలినాళ్లలో చాలా అవమానాలు ఎదుర్కొన్నాను అంటోంది గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా. ప్రస్తుతం మహేశ్ బాబు-రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వారణాసి’ షూటింగ్లో బిజీగా ఉన్న ప్రియాంక..తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న సమస్యల గురించి వివరించింది. ‘కెరీర్ ప్రారంభంలో డ్యాన్స్ విషయంలో చాలా ఇబ్బంది పడ్డా. నటన పరంగా ఓకే కానీ..డ్యాన్స్ వచ్చేది కాదు. కొరియోగ్రాఫర్ చెప్పిన మూమెంట్స్ మరిచిపోయేదాన్ని. నా పక్కన ఉన్న కోస్టార్ ఆ స్టెప్పులు అద్భుతంగా చేసేవారు. నేనేమో వారికి సరిపోయేలా స్టెప్పులు వేయలేక ఇబ్బంది పడేదాన్ని. ఓసారి దక్షిణాఫ్రికాలో ఓ పాట షూటింగ్ జరుగుతున్నప్పుడు కొరియోగ్రాఫర్ రాజు ఖాన్ నాపై సీరియస్ అయ్యాడు. నువ్వు అందాల పోటీ నుంచి వచ్చిండొచ్చు, అందంగా ఉండొచ్చ.. కానీ నటి కావాలంటే ముందు డ్యాన్స్ నేర్చుకో అంటూ మైక్ కిందపడేసి సెట్ నుంచి వెళ్లిపోయాడు. అది నాకు చాలా అవమానంగా అనిపించింది. దీన్ని సవాలుగా తీసుకొని డ్యాన్స్ నేర్చుకున్నా. అప్పట్లో ప్రతి రోజు దాదాపు ఆరు గంటల పాటు కత్రినా కైఫ్తో కలిసి ప్రాక్టీస్ చేశా’ అని ప్రియాంక చెప్పుకొచ్చింది.ఇక హాలీవుడ్ గురించి మాట్లాడుతూ.. ‘బాలీవుడ్లో స్టార్ అయినంత మాత్రాన అక్కడి వాళ్లు ఆదరిస్తారని అనుకోవడం పొరపాటే అవుతుంది. ఒక దేశంలో మీకు పేరు ప్రఖాత్యులు ఉన్నంత మాత్రాన మరో దేశంలో కూడా అదే విధంగా గౌరవం పొందాలని ఆశించకూడదు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా ప్రేక్షకులను సంపాదించుకోవాలి. ప్రజల నుంచి గౌరవం పొందాలంటే బాగా కష్టపడాలి. ఇప్పుడు నేను అక్కడ సూపర్ స్టార్ కాదు. కానీ నటిగా మాత్రం మంచి గుర్తింపు సంపాదించుకున్నా’ అని ప్రియాంక పేర్కొంది. -
'పెద్ది'లో చరణ్ మూడో లుక్..? మెగా అభిమానులకు సర్ ప్రైజ్!
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో వస్తున్న భారీ చిత్రం పెద్ది. పెద్దిపై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రెండు లుక్స్ వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ సినిమాలో చరణ్కు మూడో లుక్ కూడా ఉందని తెలుస్తోంది. కానీ దాన్ని సీక్రెట్గా ఉంచుతున్నారట. ఈ విషయాన్ని రామ్ చరణ్ ఫిట్నెస్ ట్రయినర్ వెల్లడించినట్టు వార్తలు వస్తున్నాయి.పెద్ది సినిమా తొలి టీజర్లో చరణ్ పల్లెటూరి క్రికెటర్గా కనిపించాడు. ఇటీవల పెద్ది పహిల్వాన్ లుక్ ను కూడా విడుదల చేశారు. ఈ రెండూ మాత్రమే కాకుండా చరణ్కు ఈ చిత్రంలో మరో లుక్ కూడా ఉందనేది తాజా సమాచారం. ఈ మూడో లుక్ మెగా అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులందరికీ పెద్ద సర్ప్రైజ్ అవుతుందని టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రాలేదు.ఇక ఇదిలా ఉంటే.. మరోవైపు పెద్ది విడుదల తేదీపై సస్పెన్స్ మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇటీవల స్వయంగా దర్శకుడు బుచ్చిబాబు జూన్ చివరి వారం రిలీజ్ అని ప్రకటించాడు. కానీ ఇప్పుడు కొత్త ఊహాగానం చెలరేగుతోంది. టాక్సిక్ విడుదల వాయిదా పడటంతో ఆ తేదీకి, అంటే జూన్ 4వ తేదీకి పెద్ది వస్తుందనే ప్రచారం మొదలైంది.చరణ్-జాన్వి కపూర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో శృతిహాసన్ ఓ ప్రత్యేక గీతంలో కనిపించనుంది. ఏఆర్ రెహ్మాన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. గేమ్ ఛేంజర్ తర్వాత రామ్ చరణ్ నుంచి వస్తున్న సినిమా ఇదే కావడంతో మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. -
నేరుగా ఓటీటీకి క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ నటించిన లేటేస్ట్ మూవీ కర్తవ్య. ఈ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీకి పులకిత్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని షారుక్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ నిర్మించారు. తాజాగా ఈ మూవీ అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమాను నేరుగా ఓటీటీలోనే రిలీజ్ చేస్తున్నారు. ఇటీవల రిలీజ్ డేట్పై రూమర్స్ రాగా.. అధికారిక ప్రకటన వచ్చేసింది. ఈ చిత్రాన్ని మే 15 నుంచి ఓటీటీలో డైరెక్ట్ స్ట్రీమింగ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. నెట్ఫ్లిక్స్ వేదికగా ఈ మూవీ సందడి చేయనుంది. ఈ సినిమాని విధి వర్సెస్ కర్మ కాన్సెప్ట్తో తెరకెక్కించారు. ఈ మూవీలో పోలీసు అధికారి పాత్రలో సైఫ్ అలీ ఖాన్ కనిపించనున్నారు. #Kartavya 🔥#SaifAliKhan in a gripping tale of duty vs conscience ⚖️Directed by Pulkit 🎬Streaming on Netflix from May 15 ✅ pic.twitter.com/wSQiOCnuss— Sugumar Srinivasan (@Sugumar_Tweetz) April 30, 2026 -
రూ. 30 వేల కోట్ల ఆస్తి : సీనియర్ నటి పిల్లలకు భారీ ఊరట
సాక్షి, న్యూఢిల్లీ: వ్యాపారవేత్త, నటి కరిష్మా కపూర్ మాజీ భర్త సంజయ్ కపూర్ ఆస్తులకు సంబంధించి ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. గత ఏడాది జూన్లో లండన్లో మరణించిన సంజయ్ కపూర్ వదిలి వెళ్లిన రూ. 30,000 కోట్ల ఆస్తులను పరిరక్షించాలని హైకోర్టు ఆదేశించింది. సంజీవ్ భార్య ప్రియా కపూర్ వాటిని అమ్మకుండా నిరోధిస్తూ మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. అతని బ్యాంకు ఖాతాల కార్యకలాపాలను కూడా కోర్టు పరిమితం చేసింది.వారసత్వంపై ఆయన కుటుంబ సభ్యుల మధ్య తలెత్తిన వివాదం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.సంజయ్ కపూర్, కరిష్మా పిల్లలైన కియాన్, సమైరా కపూర్లకు, ఆయన మూడో భార్య ప్రియా సచ్దేవా కపూర్కు మధ్య నెలకొన్న తీవ్రమైన, కుటుంబ వివాదం నేపథ్యంలో ఈ ఆదేశాలు జారీ అయ్యాయి. వసంజయ్ కపూర్ విదేశాల్లో ఉన్నప్పుడు ఫోర్జరీ చేసిన వీలునామాను ప్రియా కపూర్ సృష్టించారని కరిష్మా పిల్లలు కోర్టును ఆశ్రయించారు. అంతేకాకుండా, కోర్టుకు సమర్పించిన ఆస్తుల జాబితాలో ఖరీదైన పోలో గుర్రాలు, రోలెక్స్ వంటి లగ్జరీ వాచీలు, విలువైన పెయింటింగ్స్ మరియు స్థిరాస్తులను కావాలనే దాచి పెట్టారని వారు వాదించారు.వీరి పిటిషన్ను విచారించిన కోర్టు సంజయ్ కపూర్ ఆస్తులను విక్రయించకుండా ప్రియా కపూర్పై కోర్టు మధ్యంతర స్టే విధించింది. ఆస్తులు కరిగిపోకుండా కాపాడాల్సిన అవసరం ఉందని కోర్టు పేర్కొంది.ఆయనకు సంబంధించిన బ్యాంకు ఖాతాల లావాదేవీలను కూడా కోర్టు నిలిపివేసింది.వీలునామాపై ఉన్న అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రియా కపూర్పైనే ఉందని కోర్టు స్పష్టం చేసింది. ఒకవేళ వీలునామా నకిలీదని తేలితే, అప్పటికే ఆస్తులు చేతులు మారి ఉంటే అది అన్యాయం అవుతుందని కోర్టు అభిప్రాయపడింది. కేవలం పిల్లలతోనే కాకుండా, సంజయ్ కపూర్ తల్లి రాణి కపూర్, సోదరి మందిరా కపూర్ కూడా ప్రియా కపూర్తో వివాదంలో ఉన్నారు. గతంలో ఈ వివాదాన్ని ఉద్దేశించి "మురికి బట్టలను బహిరంగంగా ఉతకవద్దు" అని కోర్టు వ్యాఖ్యానించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇదీ చదవండి: 34 ఏళ్ల మిస్టరీ : క్షుద్ర పూజలు, భూత్ బంగ్లాలో ఎముకలుకాగా 53 ఏళ్ల వయసులోనే సంజయ్ కపూర్ గత ఏడాది జూన్ 12న లండన్లో పోలో ఆడుతూ అకస్మాత్తుగా కన్నుమూయడం దిగ్భ్రాంతి రేపింది. ఆయన మరణానికి కారణం గుండెపోటు అని తొలుత భావించారు. తన కొడుకు మరణంలో ఏదో అతని తల్లి అంతర్జాతీయ కుట్ర ఉందంటూ తల్లి అనుమానం వ్యక్తం చేయడంతో వివాదం రేగింది. అయితే, ఆగస్టులో బ్రిటీష్ వైద్య అధికారులు ఆయన సహజ కారణాల వల్లే (గుండె సంబంధిత వ్యాధి) మరణించారని ధృవీకరించారు.ఇదీ చదవండి: వారెవ్వా..ఆమ్లెట్లు అమ్ముతూ, ఆట కట్టించారు! -
సరోగసీ ప్రెగ్నెన్సీ ప్రకటించిన బుల్లితెర నటి.. పోస్ట్ వైరల్
బాలీవుడ్ బ్యూటీ, నటి సంభావన సేథ్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. తాను సరోగసీ (అద్దె గర్భం) ద్వారా మొదటి బిడ్డకు జన్మనివ్వనున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. సరోగసీ ద్వారా తమ బిడ్డను ఆహ్వానించడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నామని సంభావన సేథ్, ఆమె భర్త అవినాష్ ద్వివేది తెలిపారు.కాగా.. ఈ జంట చాలాసార్లు ఐవీఎఫ్ ప్రయత్నించారు. కానీ సక్సెస్ కాకపోవడంతో సరోగసీ ద్వారా తమ మొదటి బిడ్డకు జన్మనివ్వనున్నట్లు తాజాగా ప్రకటించారు. ఈ విషయం తెలుసుకున్న బాలీవుడ్ ప్రముఖులు ఈ జంటకు అభినందనలు చెబుతున్నారు. కాగా.. 2024లో సంభావనకు మొదటి త్రైమాసికంలోనే ఓసారి గర్భస్రావం జరిగింది. ఆ టైమ్లో తాను శారీరక, మానసిక ఒత్తిడికి గురైనట్లు వెల్లడించింది. అప్పుడు మూడు నెలల వ్యవధిలో తాను 65 ఇంజెక్షన్లు తీసుకున్నట్లు ఆమె తెలిపారు. అది చాలా బాధాకరంగా అనిపించిందన్నారు. సినీ కెరీర్ పరంగా చూస్తే సంభావన సేత్ 2025లో వచ్చిన 'మండల మర్డర్స్' చిత్రంలో చివరిసారిగా కనిపించింది. View this post on Instagram A post shared by Sambhavna Seth (@sambhavnasethofficial) -
ధురంధర్-3 కాదు.. కొత్త కాన్సెప్ట్తో రణ్వీర్–ఆదిత్య ధర్ ?
దురంధర్ నుంచి వచ్చిన రెండు భాగాలూ ఇండియాలోనే బిగ్గెస్ట్ హిట్ చిత్రాలుగా నిలిచాయి. అయితే దానికి కొనసాగింపుగా దురంధర్-3 వుందా లేదా అనేది ఇంకా క్లారిటీ రాలేదు. కానీ రణ్వీర్ సింగ్, దర్శకుడు ధర్ ఇద్ధరూ మాత్రం కలుస్తున్నారు.అవును.. ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణ్వీర్ వెంటనే మరో చిత్నాన్ని చేయబోతున్నాడని సమాచారం. ఈ మేరకు చర్చలు కూడా జరుగుతున్నాయి. అయితే ఇది దురంధర్-3 మాత్రం కాదట. మరో కొత్త సబ్జెక్ట్తో వీరిద్దరూ మరోసారి మన ముందుకు రాబోతున్నారు. ప్రస్తుతం ఆ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభమైయ్యాయి. వచ్చే ఏడాది మార్చి నెలలో సెట్స్పైకి వెల్లే అవకాశాలు ఉన్నాయని సమాచారం.ఇటీవల ఆదిత్య ధర్, రణ్వీర్ సింగ్ ఇద్దరూ కలిశారు. ఆదిత్య తన దగ్గర ఉన్న కథను రణ్వీర్కు చెప్పాడట. కథ నచ్చడంతో రణ్వీర్ వెంటనే ఓకే చెప్పాడని తెలుస్తోంది. దీంతో దర్శకుడు ఈ పాయింట్ను ఫుల్ లెంగ్త్ స్క్రిప్ట్గా తయారు చేసే పనిలో ఉన్నాడు. ఆదిత్య ధర్ దగ్గర ఇప్పటికే ‘ది ఇమ్మోర్టల్ అశ్వద్ధామ’, ఒక స్పోర్ట్స్ డ్రామా కథలు రెడీగా ఉన్నాయి. కానీ వీటిని పక్కన పెట్టి మరో కొత్త కథతో రణ్వీర్తో సినిమా చేయాలని నిర్ణయించారు. -
లక్ష రూపాయల పందెం.. హై హీల్స్తో స్టార్ హీరో డ్యాన్స్..!
బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ తన డ్యాన్స్తో అదరగొట్టేశారు. హౌస్ఫుల్ 5 చిత్రంలోని 'లాల్ పరి' పాటకు తన డ్యాన్స్తో మెప్పించారు. అక్షయ్ కుమార్ హోస్ట్ చేస్తోన్న వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఫినాలే ఎపిసోడ్లో స్టెప్పులతో వేదికపై అలరించారు. అయితే ఈ వేడుకలో హై హీల్స్తో అక్షయ్ డ్యాన్స్ చేయడం ఫ్యాన్స్ విపరీతంగా ఆకట్టుకుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ సందర్భంగా అక్షయ్ కుమార్ చిన్న పరీక్ష పెట్టింది నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్. హైహీల్స్ వేసుకుని ఒక నిమిషం పాటు డ్యాన్స్ చేయాలని ఛాలెంజ్ విసిరింది. ఒకవేళ అక్షయ్ డ్యాన్స్ మధ్యలో ఆగిపోతే.. ఆమెకు లక్ష రూపాయలు చెల్లించాలని చిన్న పందెం కాసింది. దీంతో అక్షయ్ హై హీల్స్తో డ్యాన్స్ చేసి ఆకట్టుకున్నారు. ఈ వేడుకలో అక్షయ్తో పాటు ఫరా ఖాన్, భూమి పెడ్నేకర్ సైతం కాలు కదిపారు. ఒక నిమిషం డ్యాన్స్ ఛాలెంజ్ను విజయవంతంగా పూర్తి చేసిన అక్షయ్ను ఫరా ఖాన్ అభినందించారు.కాగా.. ఈ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్కు ఫరా ఖాన్, భూమి అతిథులుగా హాజరయ్యారు. హైహీల్స్లో అక్షయ్ కుమార్ డ్యాన్స్ చేయడం హైలెట్గా నిలిచింది. ఇది అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఆ తర్వాత అక్షయ్ సరదాగా మహిళలకు సెల్యూట్ చేశారు. హైహీల్స్లో నడవడం, డ్యాన్స్ చేయడం ఎంత కష్టమో ఇప్పుడు తనకు అర్థమైందన్నారు.బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ఇటీవలే భూత్ బంగ్లా మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. ఇప్పటి వరకు రూ. 180 కోట్లకు పైగా వసూలు చేసింది. అంతేకాకుండా అక్షయ్ కుమార్ 'వెల్కమ్ టు ది జంగిల్' అనే మూవీతో నటిస్తున్నారు. ఈ సినిమా జూన్ 26న విడుదల కానుంది. Akshay dancing in heels wasn’t on my 2026 bingo card… probably not in Akshay Kumar’s plan either 😭 https://t.co/AL7S5ck2s9 pic.twitter.com/6rCnNQOVrm— PintuX (@pintya_348) April 28, 2026 -
గుడ్ న్యూస్ చెప్పిన ఆమిర్ ఖాన్
బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ గుడ్ న్యూస్ చెప్పాడు. సూపర్ హిట్ ఫిల్మ్ ‘3 ఇడియట్స్’కు సీక్వెల్ రాబోతున్నట్లు ప్రకటించాడు. ఆమిర్ ఖాన్ హీరోగా, ఆర్. మాధవన్, శర్మాన్ జోషి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘3 ఇడియట్స్’. రాజ్కుమార్ హిరాణి దర్శకత్వంలో విధు వినోద్ చోప్రా నిర్మించిన ఈ సినిమా 2009లో విడుదలైంది. తాజాగా ‘3 ఇడియట్స్’ సినిమా సీక్వెల్ పనులు మొదలయ్యాయని ఆమిర్ ఖాన్ తెలిపారు. ఈ సీక్వెల్ గురించి ఓ ఆంగ్ల మీడియాతో ఆమిర్ ఖాన్ మాట్లాడుతూ– ‘‘3 ఇడియట్స్’కి సీక్వెల్ చేయనున్నాం... కథ విన్నాను. నాకు నచ్చింది. మొదటి భాగంలో ఉన్న ప్రధాన పాత్రధారుల జీవితాల్లో పదేళ్లు గడిచిన తర్వాత ఏం జరుగుతుంది? అనే అంశంతో సీక్వెల్ కథ ఉంటుంది. అలాగే తొలి భాగంలోని కామెడీ కంటిన్యూ అవుతుంది. దర్శకుడు రాజ్ ప్రస్తుతం స్క్రిప్ట్కు మెరుగులు దిద్దుతూ, స్క్రీన్ప్లేను సెట్ చేసే పనిలో ఉన్నారు’’ అని పేర్కొన్నారు. -
20 వంద కోట్ల హిట్స్.. అక్షయ్ కుమార్ అరుదైన ఘనత
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ భారతీయ సినిమా చరిత్రలో ఒక అరుదైన మైలురాయిని చేరుకున్నారు. అక్షయ్ తన కెరీర్లో ఏకంగా 20 సినిమాలతో 100 కోట్ల నెట్ వసూళ్లు సాధించాడు. దాంతో ఈ ఘనత సాధించిన తొలి నటుడిగా నిలిచారు. ఖాన్ త్రయం అయిన షారూక్, సల్మాన్, అమీర్లను ఈ విషయంలో మించి అక్షయ్ ముందంజలో నిలిచాడు. ఇక ఈ వరుసలో అక్షయ్ తర్వాత స్ధానంలో సల్మాన్ ఖాన్ 18 సినిమాలతో ఉన్నాడు. ఇలా అజయ్ దేవగన్ 16 సినిమాలతో మూడో స్థానంలో, షారూక్ ఖాన్ 10 సినిమాలతో నాలుగో స్థానంలో, రణ్వీర్ సింగ్ 9 సినిమాలతో ఐదో స్థానంలో కొనసాగుతున్నారు. 2012లో హౌస్ఫుల్ 2తో తొలిసారిగా 100 కోట్ల క్లబ్లో అక్షయ్ అడుగుపెట్టాడు. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూడలేదు. కరోనా తర్వాత కూడా ఆయన నటించిన ఆరు సినిమాలు వంద కోట్ల మార్కును దాటాయి. తాజాగా విడుదలైన బూత్ బంగ్లాతో ఈ సంఖ్య 20కి చేరింది. రజనీకాంత్, విజయ్, ప్రభాస్ వంటి స్టార్లు కూడా 100 కోట్ల క్లబ్లో ఉన్నారు. కానీ అక్షయ్ స్థాయిలో వరుసగా ఇంత పెద్ద సంఖ్యలో సినిమాలు డెలివర్ చేయలేదు. ఎందుకంటే, హీరోలంతా ఏడాదికి లేదా రెండేళ్లకు ఒక సినిమా మాత్రమే చేస్తున్నారు. అక్షయ్ మాత్రమే ఏడాదికి రెండు సినిమాలు విడుదల చేస్తూ ఇలా రికార్డులు సృష్టిస్తున్నాడు. -
దీప్వీర్ కుమార్తె దువా తొలి లైవ్ మ్యూజికల్ షో వైరల్
బాలీవుడ్ నటుడు, రణవీర్, దీపికా పడుకోన్ దంపతుల కమార్తె దువా ఇంత చిన్న వయసులోనే లైవ్ షో ఇచ్చి అదరగొట్టింది. నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ (NMACC)లో తన పెర్ఫామెన్స్తో దీప్వీర్ అభిమానులను ఆకట్టుకుంది. ధురందర్ సినిమా భారీ హిట్ కావడంతో సంతోషంలో మునిగితేలుతున్న రణవీర్కు దువా తన టాలెంట్తో మరింత ఆనందాన్ని ఇచ్చింది అంటున్నారు ఫ్యాన్స్. 'ధురందర్' స్టార్ రణ్వీర్ సింగ్, తన కుమార్తె దువా మొదటి కోకో మిలన్ (చిన్న పిల్లల కార్టూన్ షో) లైవ్ మ్యూజికల్ షో వీడియో నెట్టింట వైరల్గా మారింది. రణవీర్ సింగ్ , దీపికా పడుకోన్ తమ బిడ్డ దువా మొదటి లైవ్ షోను ఎంజాయ్ చేశారు. షో అనంతరం, రణవీర్ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. "ఇది మా దువా పాపకి తొలిప్రదర్శన కాబట్టి మాకు చాలా ప్రత్యేకమైనది. జీవితాంతం నిలిచిపోయే జ్ఞాపకాలను మిగుల్చుకునే అవకాశవ కల్పించిన NMACC బృందానికి చాలా కృతజ్ఞుడను’’, అంటూ NMACC బృందానికి ధన్యవాదాలు తెలిపారు.తాను, దీపిక, ఇంకా తాతయ్య, నానమ్మలతో కలిసి ఈ మ్యూజికల్కు హాజరైందని రణ్వీర్ వెల్లడించారు. ఎంతో సరదా, సంతోషం, అదొక రంగులమయం నిజంగా ఒక అద్భుతమైన అనుభవం అని తెగ సంతోష పడిపోయాడు.Ranveer talks about watching Cocomelon Live at the NMACC with Dua and Deepika 🥰🥰♥️♥️ #deepveer #RanveerSingh #DeepikaPadukone Ranveer: It is extra special for us because this is our Dua baby's first show 💖 pic.twitter.com/9REtUmny44— DeepVeer Fanclub (@DeepVeer_FC) April 26, 2026 కాగా దీపికా, రణవీర్లు 2018 నవంబర్ 14న పెళ్లి చేసుకోగా, 2024లో వారికి కుమార్తె జన్మించింది. మరో బిడ్డకు జన్మనివ్వబోతున్నామంటూ ఇటీవల వీరు ప్రకటించారు. -
"సర్కే చునార్" వివాదం : సంజయ్ దత్ క్షమాపణలు, దిద్దుబాటు చర్య
ఢిల్లీ, సాక్షి: "సర్కే చునార్ తేరీ సర్కే"పాటలో అశ్లీలత, మహిళలను అసభ్యంగా చిత్రీకరించారనే ఆరోపణలపై వచ్చిన ఆందోళనలకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. సోమవారం నటుడు సంజయ్ దత్ జాతీయ మహిళా కమిషన్ ముందు హాజరయ్యారు. జాతీయ మహిళా కమిషన్ అధ్యక్షురాలు జయ రహత్కర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కమిషన్కు లిఖితపూర్వక క్షమాపణను సమర్పించారు. ఈ విషంయంపై విచారం వ్యక్తం చేస్తూ, సృజనాత్మక కంటెంట్లో మహిళలకు బాధ్యతా యుతమైన ప్రాతినిధ్యం కల్పించాల్సిన ఆవశ్యకతను అంగీకరిస్తానని హామీ ఇచ్చారని మహిళా కమిషన్ ఒక ప్రకటనలో తెలిపింది.50 మంది గిరిజన బాలికల విద్యకు ఆర్థిక సహాయంఒక దిద్దుబాటు చర్యగా, సామాజిక సంక్షేమానికి , మహిళా సాధికారతకు సానుకూలంగా దోహదపడే దిశగా, సంజయ్ దత్ 50 మంది గిరిజన బాలికల విద్యకు ఆర్థిక సహాయం చేయడానికి అంగీకరించారు. ఇకపై, సినిమాలు మరియు సంబంధిత సృజనాత్మక ప్రాజెక్టులలో మహిళలు ,పిల్లలకు గౌరవప్రదమైన మరియు సముచితమైన ప్రాతినిధ్యం ఉండేలా చూసేందుకు, తప్పనిసరి చట్టపరమైన నిబంధనలను చేర్చుతానని సంజయ్ దత్ కమిషన్కు హామీ ఇచ్చారు.ఈ విచారణ సందర్భంగా ఎన్సీడబ్ల్యూ అనేక అంశాలపై ప్రశ్నల్ని లేవనెత్తింది. ఈ వివాదానికి సంబంధించి ఏప్రిల్ 6న దర్శకుడు, కిరణ్ కుమార్ అలియాస్ ప్రేమ్, రచయిత రకీబ్ ఆలం , గౌతమ్ కె.ఎం. కెవిఎన్ ప్రొడక్షన్ ప్రతినిధులు కూడా ఎన్సీడబ్ల్యూ ముందు హాజరై క్షమాపణలు తెలిపారు. మరోవైపు నటి నోరా ఫతేహిని కూడా ఈరోజు కమిషన్ ముందు హాజరు కావాలని ఆదేశించారు. అయితే, ఆమె ప్రస్తుతం దేశం వెలుపల ఉన్నందున హాజరు కాలేకపోయారు. ఆమె మరో తేదీని కేటాయించమని కమిషన్ను కోరారు.కాగా బాలీవుడ్ నటి నోరా ఫతేహి, నటుడు సంజయ్ దత్ నటించిన సినిమాలోని ‘సర్కే చునార్ తేరి సర్కే’ పాట పెద్ద వివాదానికి దారితీసింది.ఈ పాటలోని సాహిత్యం, దృశ్యాలు మహిళలను కించపరిచేలా ఉన్నాయంటూ దుమారం చెలరేగడంతో జాతీయ మహిళా కమిషన్ సీరియస్గా స్పందించింది. దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా సినిమా యూనిట్ను ఆదేశించింది. మరోవైపు ఈ వివాదం నేపథ్యంలో యూట్యూబ్ తో పాటు ఇతర సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ నుంచి ఈ సాంగ్ను తొలగించారు. అర్జున్ జన్య స్వరకల్పనలో, మంగ్లి పాడిన ఈ పాట తీవ్ర విమర్శలకు గురైన సంగతి తెలిసిందే. -
దురంధర్-2 ఓటీటీ డేట్.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ దురంధర్-2. మార్చి 19న థియేటర్లలోకి వచ్చిన సరికొత్త రికార్డ్స్ సృష్టించింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.1700 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ క్రమంలోనే టాలీవుడ్ మూవీ పుష్ప-2 కలెక్షన్స్ను దాటేసింది. ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో మూడోస్థానంలో నిలిచింది. ఈ సినిమాకు ఆదిత్య ధర్ దర్శకత్వం వహించారు. గతేడాది డిసెంబర్లో రిలీజైన దురంధర్కు సీక్వెల్గా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.బాక్సాఫీస్ను షేక్ చేసిన ఈ మూవీ కోసం ఓటీటీ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా ఓటీటీ డేట్పై సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. మే 14 వ తేదీ నుంచి ఓటీటీకి రానుందన్న వార్త వైరల్గా మారింది. ఇప్పటికే ఈ మూవీ రిలీజై నెల పైగా కావడంతో ఓటీటీ విడుదలపై త్వరలోనే ప్రకటన వచ్చే ఛాన్సుంది. ఈ మూవీని జియో హాట్ స్టార్ వేదికగా స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా.. ఈ చిత్రంలో రణ్వీర్ సరసన సారా అర్జున్ హీరోయిన్గా మెప్పించింది. ఈ మూవీలో సంజయ్దత్, అర్జున్ రాంపాల్, మాధవన్ కీలక పాత్రల్లో నటించారు. #Dhurandhar2TheRevenge — MAY 14th On Jio HOTSTAR 🧨💥 pic.twitter.com/RIe0vDQ190— OTT STREAM UPDATES (@newottupdates) April 26, 2026


