breaking news
Bollywood
-
కత్రినాపై బాడీ షేమింగ్.. చొక్కా విప్పిన షారుక్ఖాన్
సోషల్ మీడియాలో సెలబ్రిటీలపై బాడీ షేమింగ్, ఏజ్ షేమింగ్, వ్యక్తిగత విమర్శలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా హీరోయిన్ల శరీరాకృతిపై నెటిజన్లు చేసే కామెంట్స్ తరచూ చర్చనీయాంశంగా మారుతున్నాయి. తాజాగా ఈ ధోరణిపై బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తీవ్రంగా స్పందించారు. ఇటీవల తన బాడీపై వచ్చి ట్రోల్స్కు హిందీ బిగ్బాస్ షోలో కౌంటరిచ్చారు.నేను ముసలివాణ్ని అయిపోయానా..‘నేను ముసలివాణ్ని అయిపోయాను అంటున్నారు’ అని షర్ట్ విప్పి బాడీ చూపించారు. మొఖానికి ఉన్న మేకప్ సైతం చెరిపేశారు.‘దమ్ముంటే ఇప్పుడు నన్ను ట్రోల్ చేయండి’ అన్నట్టుగా సవాల్ విసిరారు. తనను విమర్శించే ముందు ఎవరికి వాళ్లు వారి మొఖాలు, బాడీ చూసుకోవాలని తెలిపారు. సల్మాన్ ఖాన్ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.ఇదీ చదవండి: ఒకేసారి రెండు ఓటీటీల్లోకి హారర్ థ్రిల్లర్.. డోంట్ మిస్కత్రినాపై బాడీ షేమింగ్..కత్రినా కైఫ్ బాడీ షేమింగ్కు గురైన విషయాన్ని ట్రోలర్స్కు తనదైన శైలిలో గట్టి కౌంటర్ ఇచ్చారు. మహిళల శరీరంలో గర్భధారణ సమయంలో అనేక మార్పులు రావడం సహజమేనని, బిడ్డకు జన్మనిచ్చిన వెంటనే వారు మునుపటి శరీరాకృతికి తిరిగి రావాలని ఆశించడం సరికాదని స్పష్టం చేశారు. సెలబ్రిటీలను వారి శరీరాకృతి, వయసు లేదా వ్యక్తిగత విషయాల ఆధారంగా విమర్శించడం సరికాదనే సందేశాన్ని సల్మాన్ తన వ్యాఖ్యల ద్వారా ఇచ్చారు. ముఖ్యంగా తల్లులుగా మారిన హీరోయిన్ల విషయంలో శరీరంలో వచ్చే మార్పులను అర్థం చేసుకోవాలని సూచించారు. సినిమాల్లోకి తిరిగి వచ్చినప్పుడు వారు తమకు అనుకూలమైన సమయంలో ఫిట్నెస్పై దృష్టి పెడతారని చెప్పారు.ఇదీ చదవండి: కొత్త బిజినెస్లోకి చిరంజీవి.. ప్రపంచ రికార్డ్ బద్దలయ్యేలా ప్లాన్! STANDING OVATION!#SalmanKhan took off his T-shirt, showed his body and challenged if you want to troll, go ahead and do it.He just shut the haters up again. He doesn’t care about trolling #BiggBoss20 pic.twitter.com/YGbVM8X9om— Devil V!SHAL (@VishalRC007) September 19, 2026 -
బోల్డ్ సీన్స్ చేశానని.. చాలా సింపుల్గా అడుగుతున్నారు: రాధికా ఆప్టే
తెలుగులో బాలయ్య సరసన మెప్పించిన బ్యూటీ రాధికా ఆప్టే. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్లో సినిమాలు చేస్తోంది. ఇటీవలే లస్ట్ స్టోరీస్-3 వెబ్ సిరీస్తో ప్రేక్షకులను పలకరించింది. గతంలో బోల్డ్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచిన ఈ బ్యూటీ.. ప్రస్తుతం అలాంటి పాత్రలు చేయడం లేదని అంటోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఈ నటి.. బోల్డ్ సీన్స్ ఎంపిక, కథకు అవసరాలపై మాట్లాడింది. కొందరు కథకు అవసరం లేకపోయినా తనతో ముద్దు సీన్లు చేయించేందుకు యత్నించారని రాధికా ఆప్టే షాకింగ్ కామెంట్స్ చేసింది. గతంలో తాను చేసిన బోల్డ్ పాత్రల వల్ల అలానే చేస్తానని అడిగారని గుర్తు చేసుకుంది. తనను కేవలం లోదుస్తులతో ఓ యాక్షన్ సన్నివేశంలో నటించాలని కూడా కోరారని రాధికా తెలిపింది. కొందరైతే ఓ 15 సెకన్లు ఏదో అలా ముద్దు సీన్ కవర్ చేసేయండి చాలా సింపుల్గా అడుగుతున్నారని చెప్పుకొచ్చింది. ఆ సీన్ చేయడానికి అంగీకరించలేదని వెల్లడించింది. అయితే ఆ సీన్ నన్ను చేయమని అడిగిన వ్యక్తి పేరు చెబితే మీరంతా ఆశ్చర్యపోతారని పేర్కొంది.రాధికా మాట్లాడుతూ..' నా కెరీర్ ప్రారంభంలో కొన్ని సినిమాల్లో నగ్నంగా నటించా. కానీ అదంతా అప్పుడు చేశా. అది చూసే నన్ను సులభంగా ఓకే చెబుతుందిలే అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు నేను పూర్తిగా మారిపోయా. అలాంటి సీన్స్ చేయడం లేదు. తానే చేసే మూవీలో బోల్డ్ సీన్స్ చేయడానికి కారణం చెప్పాలని అడుగుతున్నానని' పేర్కొంది. కాగా.. రాధికా ఆప్టే నటించిన లస్ట్ స్టోరీస్-3 ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. -
రెండో బిడ్డకు జన్మనిచ్చిన దీపికా పదుకొణె.. సోషల్ మీడియాలో పోస్ట్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. తనకు కూతురు పుట్టిన విషయాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. రణ్వీర్ సింగ్ను పెళ్లాడిన ఈ భామకు ఇప్పటికే ఓ దువా అనే కూతురు ఉన్నారు. రెండో సారి కూడా కూతురే పుట్టడంతో ఈ జంట ఆనందం మరింత రెట్టింపైంది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు తమ స్టార్ జంటకు అభినందనలు చెబుతున్నారు. కాగా.. ఈ బాలీవుడ్ జంట 2018లో పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. వీరిద్దరి పెళ్లి వేడుక ఇటలీలో గ్రాండ్గా జరిగింది. వీరికి 2024లో మొదటిసారి కూతురు జన్మించగా.. దువా అనే పేరు పెట్టారు. తాజాగా మరోసారి ఈ దంపతులకు కూతురు జన్మించడంతో ఆనందంలో మునిగిపోయారు. ఇక సినిమాల విషయానికొస్తే రణ్వీర్ సింగ్ దురంధర్ చిత్రాలతో బ్లాక్బస్టర్స్ అందుకున్నారు. View this post on Instagram A post shared by दीपिका पादुकोण (@deepikapadukone) -
ఏడు వారాలైనా అదే జోరు.. హనుమాన్ అంశ్కి ఎన్ని కోట్లంటే?
కేవలం రూ.2 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించిన మూవీ 'హనుమాన్ అన్ష్'. ఈ సినిమా మౌత్ టాక్తోనే కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమా రిలీజై ఏడు వారాలైనప్పటికీ వసూళ్లపరంగా ఇంకా రాణిస్తోంది. ఈ చిత్రం ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.316 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. కేవలం ఇండియాలో రూ. 293 కోట్లకు పైగా గ్రాస్ సాధించిన ఈ మూవీ.. రూ.248 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ రాబట్టింది. ఈ మూవీ 43వ రోజున సైతం 18 శాతం ఆక్యుపెన్సీని నమోదు చేసింది. సెప్టెంబర్ 18న రూ. 6.25 కోట్ల వసూళ్లు రాబట్టింది.ఈ సినిమాకు విశాల్ చతుర్వేది దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని తెలుగులోనూ రిలీజ్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ చిత్రంలో శోభినవ్ సత్య, చందన్ ఆనంద్ ప్రధాన పాత్రల్లో నటించారు. అనిల్ రస్తోగి, సుగంధ మల్హోత్రా, భగవందాస్ పటేల్, నేహా పరంజపే, విహాన్ షెడ్గే ముఖ్య పాత్రలు పోషించారు. స్వాతంత్ర్యానికి పూర్వం తల్లి మరణానంతరం ఆధ్యాత్మిక యాత్రకు బయలుదేరిన లక్ష్మీ నారాయణ్ అనే యువకుడి జీవితం ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు. దేవుడి అన్వేషణలో ఉత్తర భారతదేశమంతటా పర్యటించిన అతడు.. చివరికి నీమ్ కరోలి బాబాగా మారుతాడు. -
గంటలో 106 పుల్-అప్స్ : చీరకట్టుతో నటి ఫిట్నెస్ ఫీట్
ప్రముఖ నటి సంయుక్త హెగ్డే (Samyuktha Hegde) తన ఫిట్నెస్తో మరోసారి అభిమానులకు ఆకట్టుకున్నారు. సాంప్రదాయ కేరళ కసవు చీరకట్టులో కేవలం ఒక గంటలోనే 106 పుల్-అప్స్ తీసి ఇంటర్నెట్లో సంచలనం సృష్టించారు. 'వరల్డ్ పుల్ అప్ డే' (World Pull Up Day) సందర్భంగా ఆమె ఈ అద్భుతమైన ఫీట్ను చేసి ఫ్యాన్స్ను మెస్మరైజ్ చేశారు.జిమ్లోని పుల్-అప్ బార్ కింద చీరలో కసరత్తులు చేయడం సంయుక్తకు కొత్తేమీ కాదు. కానీ చీరకట్టులో గంటలో ఏకంగా 106 పుల్-అప్స్ తీయడం విశేషం. ఫిట్నెస్ , జిమ్ కేవలం పురుషులు మాత్రమే కాదు, మహిళలు కూడా తమ శారీరక సామర్థ్యాన్ని నిరూపించుకోగలరని చాటిచెప్పడమే తన ఉద్దేశమని సంయుక్త పేర్కొన్నారు.తొలి పుల్-అప్ నేర్చుకోవడానికే తనకు దాదాపు రెండేళ్ల సమయం పట్టిందని, నిరంతర పట్టుదల ఉంటే మహిళలు ఏదైనా సాధించగలరనే ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు. View this post on Instagram A post shared by Samyuktha Hegde (@samyuktha_hegde) అంతేకాదు ‘‘మహిళలు పురుషులను అధిగమించాలనో, ఓడించాలనో జిమ్కు వెళ్లరు; తమ సొంత భయాలను జయించడానికే వెళ్తారు. అందుకే, ఒక మహిళ 'పుల్-అప్' (pull-up) చేయడం చూసినప్పుడు, నాకది కేవలం ఒక వ్యాయామంలా మాత్రమే కనిపించదు. దాన్ని చూస్తూ, 'బహుశా నేను కూడా అలా చేయగలనేమో' అని ఆలోచిస్తున్న వేలాది మంది మహిళలు నాకు కనిపిస్తారు." అంటూ మహిళలకు స్ఫూర్తినివ్వడం విశేషం. ఈ వీడియోపై నెటిజన్లు ఆమెను "విమెన్ - జిమ్ ఎడిషన్" అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.పుల్-అప్స్ అత్యంత కష్టమైన బాడీవెయిట్ వ్యాయామాలలో ఒకటి అంటారు నిపుణులు. ఇది భుజాలు, వెన్నెముక, చేతులు, కోర్, గ్రిప్ స్ట్రెంత్ వంటి అనేక భాగాలపై ఒకేసారి పనిచేస్తుంది. అయితే సోషల్ మీడియా ట్రెండ్స్ చూసిన బిగినర్స్ సరైన బలం పెంచుకోకుండా నేరుగా ఫుల్ పుల్-అప్స్ ప్రయత్నిస్తే టెండాన్ స్ట్రెయిన్, భుజాల నొప్పులు వచ్చే అవకాశం ఉంది. అందువల్ల రెసిస్టెన్స్ బ్యాండ్స్, అసిస్టెడ్ పుల్-అప్స్ లేదా ఇన్క్లైన్ పుల్-అప్స్తో క్రమంగా ప్రాక్టీస్ మొదలుపెట్టాల్సి ఉంటుందని గమనించాలి. ఇదీ చదవండి: ప్రాణం తీసిన చాట్జీపీటీ : ఐఐటీ బొంబాయి బెదిరింపులు? -
తెలుగులో ఫ్లాఫ్.. అక్కడ మాత్రం హిట్.. అందుకేనా?
సినీ ప్రేక్షకుల గుండెల్లో సూపర్ హిట్గా నిలిచిపోయిన సిరీస్ మీర్జాపూర్. ఈ సిరీస్ మూడు సీజన్లు ఆడియన్స్ను ఆకట్టుకున్నాయి. బాలీవుడ్లో తెరకెక్కించినప్పటికీ ఇతర భాషల్లో సత్తా చాటింది. దీంతో ఈ వెబ్ సిరీస్లను మూవీ రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. మీర్జాపూర్ ది మూవీ పేరుతో రిలీజ్ చేశారు.అయితే వెబ్ సిరీస్కు లభించినంత ఆదరణ ఈ సినిమాకు లభిస్తుందని మేకర్స్ భావించారు. కానీ బాక్సాఫీస్ వద్ద అందుకు భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. పంకజ్ త్రిపాఠి, దివ్యెందు శర్మ, అలీ ఫజల్ ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోతోంది. తెలుగులో అయితే ఈ సినిమాకు ఆదరణ కరువైంది. ప్రమోషన్స్ పెద్దగా చేయకపోవడంతో తెలుగులో కొద్దిపాటి వసూళ్లకే పరిమితమైంది.హిందీలో మాత్రం..దక్షిణాది భాషల్లో లభించని ఆదరణ బాలీవుడ్లో మాత్రం దక్కుతోంది. హిందీ మార్కెట్లో ఈ మూవీకి రూ.150 కోట్లకి పైగా నెట్ వసూళ్లు వచ్చాయి. హనుమాన్ అంశ్ లాంటి మూవీ పోటీ ఉన్నప్పటికీ మీర్జాపూర్ మాత్రం కలెక్షన్స్తో అదరగొడుతోంది. హిందీలో వసూళ్లు ఫర్వాలేదనిపిస్తోంది. ఇదే జోరు కొనసాగితే రూ.200 కోట్ల వసూళ్లు సాధించేలా కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో ఈ ఫీట్ అందుకుంటుందేమో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. -
సినిమాల్లో బోల్డ్ సీన్లు ఎలా షూట్ చేస్తారో తెలుసా?
సినిమాల్లో నవరసాలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. యాక్షన్, ఎమోషన్, కామెడీతో పాటు రొమాంటిక్ సన్నివేశాలు కూడా కథలో భాగంగా ఉంటాయి. కొన్ని చిత్రాల్లో కథను బట్టి ఇంటిమేట్ సీన్లు కూడా కనిపిస్తుంటాయి. అయితే తెరపై ఎంతో సహజంగా కనిపించే ఇలాంటి సన్నివేశాలను నిజానికి ఎలా చిత్రీకరిస్తారనే ఆసక్తి ప్రేక్షకుల్లో చాలామందికి ఉంటుంది. నటీనటులు ఇబ్బందికి గురికాకుండా, వారి వ్యక్తిగత పరిమితులను గౌరవిస్తూ ఈ సీన్లను చిత్రీకరించేందుకు ప్రత్యేక పద్ధతులను పాటిస్తుంటారు. తాజాగా హాలీవుడ్ నటి సారా షాహి అలాంటి ఓ ఆసక్తికరమైన ట్రిక్ గురించి వెల్లడించారు. నెట్ఫ్లిక్స్ సిరీస్ ‘సెక్స్/లైఫ్’లో బోల్డ్ సన్నివేశాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న సారా షాహి.. ఇంటిమేట్ సీన్ల చిత్రీకరణపై మాట్లాడారు. ఇలాంటి సన్నివేశాల్లో నటీనటులు సౌకర్యంగా ఉండేందుకు చిత్రబృందాలు కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటాయని తెలిపారు.ఓ ఇంటర్వ్యూలో సారా షాహి చెప్పిన వివరాల ప్రకారం.. ఇంటిమేట్ సన్నివేశాలను చిత్రీకరించే సమయంలో ఇద్దరు నటీనటుల మధ్య గాలి తీసేసిన చిన్న యోగా బాల్ను ఉంచుతారు. సన్నివేశంలో కదలికలు ఉన్నప్పటికీ.. ఎదుటి నటుడు వాస్తవానికి ఆ బాల్ను మాత్రమే తాకేలా ఈ ఏర్పాటు చేస్తారు.ఈ పద్ధతి వల్ల సన్నివేశంలో నటిస్తున్న సమయంలో ప్రత్యక్ష శారీరక స్పర్శను తగ్గించవచ్చని సారా షాహి వివరించారు. తాను ఆ సమయంలో ఎదుటి నటుడి స్పర్శకు బదులుగా యోగా బాల్ తాకిడినే అనుభవిస్తానని చెప్పారు. దీంతో నటీనటులు తమకు అసౌకర్యంగా అనిపించే శారీరక స్పర్శలను ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదని తెలిపారు.ఇంటిమేట్ సన్నివేశాలను చిత్రీకరించేటప్పుడు నటీనటుల వ్యక్తిగత పరిమితులు, సౌకర్యాన్ని పరిగణనలోకి తీసుకోవడం ముఖ్యమని సారా షాహి చెప్పిన విషయాలు స్పష్టం చేస్తున్నాయి. తెరపై సహజంగా కనిపించే సన్నివేశాల వెనుక.. నటీనటుల సౌకర్యం, భద్రత కోసం ఇలాంటి ప్రత్యేక పద్ధతులు కూడా ఉపయోగిస్తుంటారని ఆమె వెల్లడించారు. -
కేంద్ర సెన్సార్ బోర్డులో సుప్రియ, ప్రీతి జింటా.. CBFCలో కీలక మార్పులు
ప్రముఖ నిర్మాత, వ్యాపారవేత్త, అక్కినేని నాగార్జున మేనకోడలు సుప్రియ యార్లగడ్డకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC)లో చోటు దక్కింది. CBFCని పునర్వ్యవస్థీకరిస్తూ కేంద్ర సమాచార, ప్రసారాల మంత్రిత్వ శాఖ 18 మంది సభ్యులతో కొత్త బోర్డును ప్రకటించింది.ఛైర్మన్గా శశి శేఖర్ వేంపటి కొనసాగనుండగా, సుప్రియతో పాటు బాలీవుడ్ నటి ప్రీతి జింటా, పల్లవి జోషి, రూపాలీ గంగూలీ, బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి, పంకజ్ త్రిపాఠి, ప్రియదర్శన్, రిక్కీ కేజ్ తదితర సినీ, కళారంగ ప్రముఖులకు సభ్యులుగా అవకాశం కల్పించారు. -
తమన్నా థ్రిల్లర్ మూవీ.. ఆసక్తిగా ట్రైలర్
బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా, మిల్కీ బ్యూటీ తమన్నా జంటగా వస్తోన్న లేటేస్ట్ థ్రిల్లర్ మూవీ ది వాన్. ఈ చిత్రానికి దీపక్ కుమార్ మిశ్రా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని బాలాజీ టెలిఫిల్మ్స్ బ్యానర్పై శోభా కపూర్, ఏక్తా కపూర్ నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం సెప్టెంబర్ 25న రిలీజ్ కానుంది.ఈ నేపథ్యంలోనే ది వాన్ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ చూస్తుంటే గ్రామీణ నేపథ్యంలోనే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఓ గ్రామ సమీపంలోని ఫారెస్ట్లో ఈ కథను రూపొందించారు. ట్రైలర్లో అడవిలోని సన్నివేశాలు ఈ మూవీపై ఆసక్తిని పెంచేస్తున్నాయి. ఈ చిత్రంలో సునీల్ గ్రోవర్, మనీష్ పాల్, శ్వేతా తివారీ, అనూప్ సోని కీలక పాత్రల్లో నటించారు. -
సింగర్తో పెళ్లి.. అన్ని విధాల మోసపోయా: ప్రముఖ నటి
బాలీవుడ్ స్టార్ ర్యాపర్ బాద్ షా ఈ ఏడాది మార్చిలో నటి ఇషా రిఖీని పెళ్లాడారు. అంతకుముందే జాస్మిన్ అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్న ర్యాపర్.. ఆమెతో విభేధాలు రావడంతో ఆరేళ్ల క్రితం విడాకులు తీసుకొన్నారు. ఈ జంటకి ఓ కూతురు కూడా ఉంది. ఆ తర్వాత నటి ఇషా రిఖితో డేటింగ్ చేసిన బాద్షా ఈ ఏడాది పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు.అయితే నటి ఇషా రిఖితో రెండో పెళ్లి కూడా ఆర్నెళ్లకే పెటాకులైంది. ఇటీవలే ఈ జంట విడిపోతున్నట్లు అఫీషియల్గా ప్రకటించారు. ఈ సందర్భంగా నటి ఇషా రిఖి.. తన పెళ్లి జీవితానికి సంబంధించి పలు షాకింగ్ విషయాలు పంచుకుంది. బాద్షాతో పెళ్లయ్యాక తీవ్రమైన వేధింపులకు గురయ్యానని వెల్లడించింది. తాను శారీరకంగా, మానసికంగా, సామాజిక పరంగా మోసపోయానని తెలిపింది. బాద్షా తనను అన్ని రకాలుగా మోసం చేశాడని ఆరోపించింది. ప్రస్తుతం బిగ్బాస్ షోలో ఉన్న ఇషా తన వైవాహిక జీవితం గురించి మాట్లాడింది.ఒక వ్యక్తి గురించి ఇతరులు చెప్పేది తాను నమ్మనని స్పష్టం చేసింది. తాను స్వయంగా చూసేంత వరకు నమ్మనని పేర్కొంది. కానీ కొన్ని నెలలకే తనను మోసం చేశారని గ్రహించానని చెప్పింది. బాద్షా తనను కేవలం కొద్దిమందికి మాత్రమే పరిచయం చేశారని..వాస్తవానికి దూరంగా తనలోని వికృత రూపాన్నిచూపించారని వాపోయింది. ఈ రిలేషన్లో తనకు అనుమానాలు కలిగినప్పటికీ.. అన్ని విషయాలను స్వయంగా చూసేంత వరకు నమ్మకూడదని నిర్ణయించుకున్నట్లు ఇషా వెల్లడించింది. -
కంగనా రనౌత్ vs రాఖీ సావంత్
బాలీవుడ్ హీరోయిన్లు కంగనా రనౌత్–రాఖీ సావంత్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా మాటల యుద్ధం జరుగుతోంది. ఇటీవల ఢిల్లీలో జరిగిన జెన్ జీ విద్యార్థుల నిరసనలు, యూత్ వ్యవహారశైలిపై బీజేపీ ఎంపీ, హీరోయిన్ కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. దీనిపై రాఖీ సావంత్ తన ఇన్స్టాగ్రామ్ వేదికగా కంగనాపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ ఓ వీడియోను షేర్ చేశారు. అదే విధంగా గతంలో కంగనా రనౌత్ ఎదుర్కొన్న పలు వివాదాలను కూడా ప్రస్తావిస్తూ రాఖీ తనదైన స్టైల్లో మండిపడ్డారు. యూట్యూబర్ సమయ్ రైనా నిర్వహించిన ‘ఇండియాస్ గాట్ లేటెంట్’ కార్యక్రమంలో పాల్గొన్న రాఖీ సావంత్... ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, ఎంపీ కంగనా రనౌత్పై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపై కంగనా రనౌత్ ఇటీవల స్పందించి, ‘‘విజయవంతమైన మహిళలను టార్గెట్ చేయడం వెనుక అసూయ, అహం, వ్యక్తిగత వైఫల్యాలు ఉండొచ్చు. తరచుగా నాపై జరిగే వ్యక్తిగత విమర్శలకు ప్రతిసారీ వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు’’ అని పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా మరోసారి రాఖీ సావంత్ లక్ష్యంగా కంగనా చేసిన ఘాటు వ్యాఖ్యలు ఇప్పుడు మరింత వైరల్ అవుతున్నాయి. ‘‘స్వీపర్ ఉద్యోగం చేయడానికి కూడా ప్రతిభ ఉండాలి. నీకు అది కూడా రాదు. నా రీల్స్ చూస్తూ ఏడవడం తప్ప నువ్వు ఏమీ చేయలేవు’’ అంటూ కంగనా రనౌత్ పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది. అయితే పై విషయాల్లో కొందరు నెటిజన్లు కంగనాకు సపోర్ట్ చేస్తుంటే... మరికొందరు రాఖీకి మద్దతుగా నిలుస్తున్నారు. -
‘5వేలు పోతే.. 500 కోట్లు వస్తాయి..!’
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. నేడు ఆయన దేశంలోనే అత్యంత పాపులర్ హీరోల్లో ఒకరు. అయితే ఈ స్థాయికి చేరుకోకముందు ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. సినిమాల్లో నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో తన తల్లితో కలిసి అజ్మీర్ షరీఫ్ దర్గాను సందర్శించారు. అప్పుడే జరిగిన ఓ ఆసక్తికర ఘటనను షారుఖ్ ఖాన్ గతంలో స్వయంగా వెల్లడించారు. ఇప్పుడీ వీడియో వైరల్ అవుతోంది. రూ.500 కోట్లు సంపాదిస్తావని..2014లో ‘హ్యాపీ న్యూ ఇయర్’ సినిమా ప్రమోషన్స్లో భాగంగా మాట్లాడిన షారుఖ్.. తన తల్లితో కలిసి అజ్మీర్ షరీఫ్కు వెళ్లిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. అప్పట్లో తన తల్లి దర్గాకు వెళ్లారట. చాదర్ సమర్పించేందుకు వెళ్తున్న సమయంలో తన తల్లి రూ.5 వేల నగదును షారుఖ్కు ఇచ్చారట. అయితే కొంతసేపటి తర్వాత ఆ డబ్బు కనిపించకుండా పోయిందట. షారుఖ్ దానిని వెతుకుతుండగా అక్కడే ఉన్న ఓ ఫకీర్ ఆయనను పిలిచి ఏదైనా పోగొట్టుకున్నావా? అని అడిగారట. షారుఖ్ అవునని చెప్పడంతో.. ఎంత డబ్బు పోయిందని కూడా ఆ ఫకీర్ చెప్పడంతో ఆయన ఆశ్చర్యపోయారట. ఆ తర్వాత ఆ ఫకీర్ చెప్పిన మాటలు షారుఖ్ జీవితంలో నిజమైనట్టే అనిపించాయట. ‘నువ్వు ఇక్కడికి వచ్చావు. ఖాళీ చేతులతో వెళ్లవు. రూ.5 వేలు పోగొట్టుకున్నావు.. కానీ రూ.500 కోట్లు సంపాదిస్తావు’ అని ఫకీర్ చెప్పారట. (ఇదీ చదవండి: ఇరుముడి సక్సెస్.. చిన్నారి నక్షత్రకు సర్ప్రైజ్) షారుఖ్ పెద్దగా నమ్మలేదట..అప్పట్లో ఈ మాటలను షారుఖ్ పెద్దగా నమ్మలేదట. కానీ ఆ ఘటన మాత్రం ఆయన మనసులో నిలిచిపోయింది. తర్వాత బాలీవుడ్లో అగ్ర హీరోగా ఎదిగి కోట్లాది అభిమానులను సంపాదించుకున్నారు. భారీ స్థాయిలో సంపద కూడా కూడబెట్టారు. అయితే ఈ ఘటనను కేవలం డబ్బుతో ముడిపెట్టడం సరికాదని షారుఖ్ తెలిపారు. (ఇదీ చదవండి: షాలినీపై నరేశ్ తీవ్ర వ్యాఖ్యలు.. బిగ్బాస్ బ్యూటీ స్ట్రాంగ్ కౌంటర్)షారుఖ్ తల్లి లతీఫ్ ఫాతిమా ఖాన్..షారుఖ్ తల్లి లతీఫ్ ఫాతిమా ఖాన్ 1991లో కన్నుమూశారు. ఆ తర్వాత ఏడాదికే ‘దీవానా’ సినిమాతో షారుఖ్ బాలీవుడ్లో హీరోగా అడుగుపెట్టారు. తన తల్లి తన విజయాన్ని చూడాలని ఎంతో కోరుకున్నానని ఆయన పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. తల్లి అనారోగ్యంతో ఉన్న సమయంలోనే తొలిసారి ప్రార్థించానని షారుఖ్ గతంలో గుర్తుచేసుకున్నారు. ఆమె చివరి క్షణాల్లో ఆసుపత్రిలో ఉన్నప్పుడు తాను ఎంతో భావోద్వేగానికి గురయ్యానని తెలిపారు.అజ్మీర్ షరీఫ్ దర్గా సూఫీ సాధువు ఖ్వాజా మొయినుద్దీన్ చిష్తీకి అంకితం చేసిన ప్రముఖ పుణ్యక్షేత్రం. అన్ని మతాలకు చెందిన భక్తులు ఇక్కడికి వచ్చి ప్రార్థనలు చేస్తుంటారు. షారుఖ్ కూడా తన జీవితంలో పలుమార్లు ఈ దర్గాను సందర్శించారు. -
అంబానీ ఇంట గణపతి పూజ.. సినీ తారల సందడి
అంబానీ ఇంట గణపతి పూజోత్సవరం అంగరంగ వైభవంగా జరిగింది. వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఈ వేడుకకు బాలీవుడ్కు చెందిన పలువురు సినీ ప్రముఖులు హాజరై సందడి చేశారు. సంప్రదాయ దుస్తుల్లో తారలు మెరిసిపోవడంతో వేడుకకకు మరింత కళ వచ్చింది. ప్రస్తుతం ఈ వేడుకకకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ముఖ్యంగా సెటబ్రిటీల లక్స్, వారి సందడి నెటిజన్లును ఆకట్టుకుంటున్నాయి. మరి ఎవరెవరు హాజరయ్యారో ఒకసారి చూద్దాం రండి. View this post on Instagram A post shared by Pallav Paliwal (@pallav_paliwal) View this post on Instagram A post shared by Pallav Paliwal (@pallav_paliwal) -
గణపయ్య వేడుకల్లో మళ్లీ ‘గోవిందా’.. కనిపించని సునీత!
బాలీవుడ్ నటుడు గోవిందా అమెరికా నుంచి తిరిగి వచ్చిన అనంతరం అర్ధరాత్రి సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి వినాయక చవితి వేడుకల్లో పాల్గొన్నారు. కుమార్తె టీనా అహూజా, కుమారుడు యశ్వర్ధన్ అహూజాలతో కలిసి గణపతి దర్శనం చేసుకున్న ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయితే కుటుంబంతో కలిసి ఫొటోలకు పోజిచ్చిన సమయంలో ఆయన భార్య సునీతా అహూజా ఎక్కడా కనిపించలేదు.పిల్లల భవిష్యత్తు కోసం ప్రార్థనలుగణపతి ఆశీస్సులు తీసుకున్న గోవిందా.. తన కుమారుడు యశ్వర్ధన్కు మంచి భవిష్యత్తు రావాలిని కోరుకున్నారు. కుటుంబంలో గణపతి వేడుకల సంప్రదాయం తన తల్లి నుంచే ప్రారంభమైందని ఆయన తెలిపారు. కొన్నేళ్లుగా తాను ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నానని, ఇప్పుడు యశ్వర్ధన్ కూడా దానిని ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పారు. కుమారుడికి విజయాలు, సిరిసంపదలు కలగాలని గణపతిని ప్రార్థించినట్లు పేర్కొన్నారు.మీడియాతో మాట్లాడిన అనంతరం గోవిందా తన పిల్లలు టీనా, యశ్వర్ధన్లతో కలిసి ఫొటోలకు పోజిచ్చారు. అయితే ఆ సమయంలో సునీతా అహూజా ఫొటోలో కనిపించలేదు. అంతకుముందు సునీతా అహూజా తన పిల్లలతో కలిసి ఉత్సాహంగా గణపతి వేడుకలను ప్రారంభించారు. సాధారణంగా గోవిందా లేదా యశ్వర్ధన్ గణపతిని ఇంటికి తీసుకొస్తారని, ఈసారి తానే పాటలు, నృత్యాలతో గణపతిని ఇంటికి తీసుకొచ్చానని ఆమె తెలిపారు. గత ఏడాది వినాయకుడు తనకు ఎంతో పేరు, విజయాన్ని అందించారని చెప్పారు. అందుకే ఈసారి స్వయంగా గణపతిని తీసుకురావాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. కాగా వేడుకల ఫొటోల్లో సునీత కనిపించకపోవడంతో మరోమారు గోవిందా వార్తల్లో నిలిచారు. ఇదీ చదవండి: అంబానీ గణేశ్ పూజకు.. ‘డీప్ నెక్’లో హీరోయిన్.. ఏకిపారేస్తున్న నెటిజన్లు! -
అంబానీ గణేశ్ పూజకు.. ‘డీప్ నెక్’లో హీరోయిన్.. ఏకిపారేస్తున్న నెటిజన్లు!
ముంబై: గణేశ్ చతుర్థి సందర్భంగా ముకేశ్ అంబానీ నివాసం ‘యాంటీలియా’లో సెప్టెంబర్ 14న నిర్వహించిన ప్రత్యేక పూజకు పలువురు బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. నటి దిశా పటానీ కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. అయితే ఆమె ధరించిన దుస్తులపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వెల్లువెత్తాయి. ఆమె ఎరుపు రంగు లెహంగా చోళీలో హాజరయ్యారు. లెహంగాతో పాటు డీప్ నెక్ బ్రాలెట్ తరహా బ్లౌజ్ ధరించారు. ఈ దుస్తుల డిజైన్ ఎక్కువగా రివీలింగ్గా ఉందంటూ పలువురు నెటిజన్లు ఆమెను ట్రోల్ చేశారు. పండుగ పూట, అదికూడా పూజ లాంటి సంప్రదాయ కార్యక్రమాలకు ఇలాంటి దుస్తులతో వస్తారా అంటూ పలువురు ఆమెను ఎద్దేవా చేస్తున్నారు.ఈ వేడుకకు హాజరైన పలువురు సెలబ్రిటీలు సంప్రదాయ దుస్తుల్లో కనిపించడంతో దిశా పటానీ లుక్ మరింత చర్చనీయాంశమైంది. సామాజిక మాధ్యమాల్లో కొందరు ఆమె వస్త్రధారణను ఇతర నటీమణుల దుస్తులతో పోల్చారు. రివీలింగ్ దుస్తుల విషయంలో దిశా పటానీ గతంలోనూ సామాజిక మాధ్యమాల్లో విమర్శలు ఎదుర్కొన్నారు. గత ఏడాది గణపతి పూజకు కూడా ఇలాంటి దుస్తులతో హాజరైనప్పుడు ట్రోలింగ్ జరిగింది.అంబానీ ఇంట జరిగిన గణేశ్ చతుర్థి వేడుకలో సల్మాన్ ఖాన్, కరీనా కపూర్-సైఫ్ అలీ ఖాన్, ఆలియా భట్-రణ్బీర్ కపూర్, కత్రినా కైఫ్-విక్కీ కౌశల్, సిద్ధార్థ్ మల్హోత్రా-కియారా అద్వాణీ, రేఖ, కాజోల్, రణ్వీర్ సింగ్, కరణ్ జోహార్ తదితరులు పాల్గొన్నారు. పండుగలు, ప్రత్యేక కార్యక్రమాల్లో సినీ ప్రముఖులు ధరించే దుస్తులపై సామాజిక మాధ్యమాల్లో తరచూ చర్చ జరుగుతోంది. సంప్రదాయ వేడుకల్లో ఆధునిక లేదా బోల్డ్ లుక్ విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు ఫ్యాషన్ స్వేచ్ఛకు మద్దతు లభిస్తుండగా, మరోవైపు సంస్కృతి, సంప్రదాయాలను ప్రస్తావిస్తూ విమర్శలు వస్తున్నాయి. ఇదీ చదవండి: మేయర్ ఇంట్లో.. రెండో తరగతి పిల్లాడి వినాయకుడు! View this post on Instagram A post shared by Manav Manglani (@manav.manglani) -
నాకింకా 21 ఏళ్ల మాత్రమే.. ఆ డబ్బంతా ఏం చేయాలో అర్థం కావట్లేదు: ‘హనుమాన్ అంశ్’ నిర్మాత
చిత్ర పరిశ్రమలో కొన్ని సార్లు అద్భుతాలు జరుగుతుంటాయి. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్గా నిలుస్తుంటాయి. రూ. కోట్లల్లో కలెక్షన్స్ రాబట్టి నిర్మాతలకు భారీ లాభాలు తెచ్చిపెడతాయి. హనుమాన్ అంశ్ అనే చిత్రం కూడా ఆ కోవలోకి చెందినదే. రూ. 2 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం ఇటీవల థియేటర్స్లోకి వచ్చి, రూ. 200 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. తొలి రోజు కేవలం రూ. 10 లక్షల కలెక్షన్స్ మాత్రమే వచ్చాయి. రెండు వారాల తర్వాతే ఈసినిమాకు భారీ కలెక్షన్స్ రావడం ప్రారంభమైంది. ఇప్పటి వరకు రూ. 235 కోట్లకు పైగా వసూళ్లను సాధించి రికార్డు సృష్టించింది. ఈ చిత్రం ఇంకా ఓవర్సీస్లో విడుదల కాలేదు. అయినప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్లను రాబట్టింది. ఇక తెలుగులో ఈ నెల 18న విడుదల కానుంది.(ఇదీ చదవండి: ఇది 'సీఎం విజయ్' వినాయకుడు.. ఫొటోలు వైరల్)ఇలాంటి తరుణంలో ఈ చిత్రానికి సంబంధించిన ఓ క్రేజీ రూమర్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. త్వరలోనే ఈ చిత్రం ఓటీటీలోకి రానుందని.. ఈ మేరకు రూ. 100 కోట్లతో ప్రముఖ ఓటీటీ సంస్థ ఒప్పందం కూడా చేసుకున్నట్లు సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుంది. తాజాగా దీనిపై చిత్ర నిర్మాత అనుప్రియ నాగర్ స్పందిస్తూ ఆ వార్తలు అవాస్తవం అని ఖండించారు. ‘సినిమా తెరకెక్కించేటప్పుడు బాక్సాఫీస్ కలెక్షన్ల గురించి నేను కలలో కూడా ఆలోచించలేదు. నీమ్ కరోలి బాబా దివ్య సందేశాన్ని నేటి యువతరానికి అందించాలనేదే నా ఏకైక లక్ష్యం. నాకింకా 21 ఏళ్లే.. ఇంత భారీ మొత్తంలో డబ్బు వస్తుందని ఊహించలేదు, అసలు ఈ డబ్బును ఏం చేసుకోవాలో కూడా నాకు అర్థం కావడం లేదు’ అని అనుప్రియ నాగర్ చెప్పుకొచ్చింది. అంతేకాదు ఈ చిత్రం నిర్మాణంలో తాను ఒక్కదానినే పాల్గొనలేదని..పూర్తి బడ్జెట్తో మూడో వంతు మాత్రమే నేను పెట్టానని..మిగతాది ఇతరులు షేర్ చేసుకున్నారని చెప్పింది.హనుమాన్ అంశ్ సినిమా విషయానికొస్తే.. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు నీమ్ కరోలి బాబా జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన చిత్రమిది. విశాల్ చతుర్వేది దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శోభినవ్ సత్య ప్రధాన పాత్ర పోషించాడు. -
వినసొంపుగా 'రామాయణ' తొలి పాట.. వీడియో రిలీజ్
రణ్బీర్ కపూర్, సాయిపల్లవి జంటగా నటించిన భారీ బడ్జెట్ డివోషనల్ సినిమా 'రామాయణ'. దీపావళి సందర్భంగా థియేటర్లలో రిలీజ్ కానుంది. దాదాపు నెల క్రితం ట్రైలర్ వదిలారు. దానికి మిశ్రమ స్పందన వచ్చింది. కానీ ఇప్పుడు వినాయక చవితి సందర్భంగా 'జై జై రామ్' అంటూ సాగే తొలి పాటని విడుదల చేశారు. ఇది వినసొంపుగా ఉంటూ అలరిస్తోంది.సీత కోసం స్వయంవరంలో పాల్గొనడం, ఇద్దరి పరిణయం తదితర సన్నివేశాలు ఈ గీతంలో చూపించారు. ఏఆర్ రెహమాన్ సంగీతమందించిన ఈ పాటని శ్రేయా ఘోషల్, ఆర్జిత్ సింగ్ పాడారు. నితీష్ తివారీ ఈ చిత్రానికి దర్శకుడు. రాముడిగా రణ్బీర్, సీతగా సాయిపల్లవి చేయగా.. రావణుడిగా యష్ కనిపించబోతున్నాడు. ఇతర పాత్రల్లో వివేక్ ఒబెరాయ్, కాజల్ అగర్వాల్, సన్నీ డియోల్ లాంటి స్టార్ దర్శనమివ్వబోతున్నారు. -
67 ఏళ్ల వయసులో గర్భవతి.. నిజమే అని చెప్పమన్నా : నటి
ట్రోల్స్కి కాదేది అనర్హం అన్నట్లుగా మారిపోయింది నేటి సోషల్ మీడియా పరిస్థితి. ముఖ్యంగా సినీ తారల విషయంలో ఈ ట్రోలింగ్ మరింత ఎక్కువగా కనిపిస్తోంది. వారి సినిమాలు, నటన మాత్రమే కాదు.. నడక, మాట తీరు, శరీరాకృతి, దుస్తులు ఇలా ప్రతీ విషయాన్నీ టార్గెట్ చేస్తూ బాడీ షేమింగ్కు దిగుతున్నారు. తాజాగా బాలీవుడ్ నటి నీనా గుప్తా కూడా ఇలాంటి ట్రోలింగ్కు గురయ్యారు. చీర కట్టుకున్న సమయంలో ఆమె పొట్ట కాస్త ఎక్కువ కనిపించడంతో గర్భవతి అంటూ కొందరు నెటిజన్లు ట్రోల్ చేశారు. ఈ ఘటనపై తాజాగా స్పందించిన నీనా గుప్తా.. ట్రోలర్స్కు తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు.గర్భవతి అనే చెప్పమన్నా.. తాజాగా జాతీయ మీడియా సంస్థ సీఎన్ఎన్ న్యూస్ 18తో నీనా గుప్తా మాట్లాడుతూ.. బాడీ షేమింగ్పై స్పందించారు. ‘ట్రోలింగ్ చేయడం ఇప్పుడు కామన్ అయిపోయింది. ఎలా ఉన్నా ట్రోలింగ్ చేస్తున్నారు. బాడీ షేమింగ్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు. ఆ మధ్య నేను చీరకట్టుకొని ఓ ఫంక్షన్కి వెళ్లా. చీర కాస్త బరువుగా ఉండడంతో సర్దుకునే క్రమంలో నా పొట్ట కాస్త లావుగా కనిపించింది. దాంతో 67 ఏళ్ల వయసులో గర్భవతి అయ్యారని ట్రోల్ చేశారు. (ఇదీ చదవండి: రోజుకి రెండే చపాతీలు తింటా.. ఇదే నా డైట్)బాడీ షేమింగ్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఇవన్నీ నా టీమ్ నా దగ్గరకు తీసుకోచ్చారు. చూసి నవ్వుకొని.. ‘నేను నిజంగానే ప్రెగ్నెంట్ అని చెప్పండి’ అని నా టీమ్కి చెప్పా. బాడీ షేమింగ్ ఎదుర్కొంటున్నవాళ్లకు నేను ఇచ్చే సలహా ఏంటంటే.. ‘లావుగా అయిందని అంటే.. ప్రెగ్నెంట్ అయ్యానని చెప్పండి’ అని ఆమె అన్నారు. అలాగే ‘పెళ్లి ఎప్పుడు?’ అని వ్యక్తిగత ప్రశ్నలు అడిగే వారిని ఎలా ఎదుర్కొంటారని అడగ్గా.. ‘నేను మీపై ఆధారపడి బతకడం లేదు కదా? మీ సమస్య ఏంటి? ఇంతకీ మీకు పెళ్లి అయిందా? అని తిరిగి ప్రశ్నిస్తానని నీనా చెప్పుకొచ్చింది.వెండితెర పైనే కాకుండా బుల్లితెర వేదిక గానూ ప్రేక్షకులను అలరించారు నటి నీనా గుప్తా. ‘ఇష్క్’, ‘ఎలోన్’, ‘ముల్క్’, ‘83’, ‘డయల్ 100’, ‘గుడ్బై’ వంటి చిత్రాల్లో నీనా కీలక పాత్రలు పోషించారు. సినిమాల్లో రాణిస్తోన్న తరుణంలోనే ఆమె ధారావాహికల్లోనూ నటించి ప్రేక్షకులను మెప్పించారు. ‘లస్ట్ స్టోరీస్ 2’ వెబ్సిరీస్లోనూ నటించారు. ఆమె నటించిన కామెడీ-డ్రామా సిరీస్ ' చుంబక్' సెప్టెంబర్ 11న విడుదలైంది. -
నటి అమీషా తల్లి డైమండ్ నగలు చోరీ : పనిమనిషి అరెస్ట్
సాక్షి,ముంబై : బాలీవుడ్ నటి అమీషా పటేల్ కుటుంబానికి భారీ ఎదురు దెబ్బ తగిలింది. అమీషా పటేల్ తల్లిదండ్రుల చర్చిగేట్ (ముంబై) నివాసం నుండి , బంగారు, వజ్రాల ఆభరణాలు చోరీకి గురయ్యాయి. ఇంటి పనిమనిషే ఈ చోరీకి పాల్పడినట్టు ప్రాథమికంగా పోలీసులు అనుమానిస్తున్నారు. నటి తల్లి ఆశా పటేల్ ఫిర్యాదు మేరకు నిందితురాలు సీమా ఘాటేను అరెస్ట్ చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.పోలీసుల కథనం ప్రకారం జనవరి 2026లో ఒక గాజు చోరీకి గురైంది. దీనిపై సీమాను అనుమానించిన ఆశా పటేల్, తప్పు ఒప్పుకుని, పోయిన ఆభరణాన్ని తిరిగి ఇచ్చేయాలని ఆమె కోరారు.అయితే, ఆ గాజును తిరిగి ఇవ్వకపోవడంతో, ఆశా పోలీసులను ఆశ్రయించి అధికారికంగా ఫిర్యాదు చేశారు.దీంతో పాలఘర్కు చెందిన 40 ఏళ్ల సీమా ఘాటే అనే ఇంటి పనిమనిషిని మెరైన్ డ్రైవ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చోరీకి గురైన ఆభరణాల విలువ రూ 5 లక్షలకు పైమాటే. వీటిల్లో డైమండ్గాజులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. గత ఒకటిన్నర సంవత్సరాలుగా ఆ ఇంట్లో గృహ కార్మికురాలిగా పని చేస్తోంది.ఇదీ చదవండి: కలకలం : భార్య, ముగ్గురు కుమార్తెల్ని హత్య చేసి పరార్దీనిపై అమీషా పటేల్ తల్లి ఆశా పటేల్, పనిమనిషి ఘాటేపై అనుమానం వ్యక్తం చేస్తూ మెరైన్ డ్రైవ్ పోలీసులను ఆశ్రయించారు. విచారణ చేపట్టిన పోలీసులు విరార్లో ఘాటేను అదుపులోకి తీసుకున్నారు. ఆమె వద్ద నుంచి ఎలాంటి రికవరీ చేయలేదు.నిందితురాలు సీమ నేర చరిత్ర, సహచరులు ప్రాతను పోలీసులు ఎంక్వయిరీ చేస్తున్నారు. మరోవైపు ఆమెకు సెప్టెంబర్ 15 వరకు మూడు రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది కోర్టు.ఇదీ చదవండి: కాబోయే భార్యని ఇంప్రెస్ చేద్దామని, ఏఐతో ఏకంగా..! -
మేరీకోమ్పై బిగ్ బాస్ అభిమానుల ఆగ్రహం
బిగ్ బాస్ హౌస్లోకి బాక్సింగ్ ఛాంపియన్ మేరీకోమ్ ప్రవేశించిన నాలుగు రోజులకే ఆమె మాటతీరు, వైఖరిపై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. తన కష్టం, తన విజయాలు, తన బలం గురించి మేరీకోమ్ తరచూ ప్రస్తావించడం కొంతమంది ప్రేక్షకులకు అసహనం కలిగిస్తోందనే మాట వినిపిస్తోంది. ఆమె సంభాషణల్లో ‘నేను’ అనే భావన ఎక్కువగా కనిపిస్తోందంటూ పలువురు యూజర్లు వ్యాఖ్యానిస్తున్నారు.రీతి తివారితో జరిగిన సంభాషణలో మేరీకోమ్ ‘ప్రపంచమంతా నన్ను గుర్తుపడుతుంది. మీరు ఎవరో నాకు తెలియదు’ అని వ్యాఖ్యానించడంపై చర్చ చెలరేగుతోంది. ఈ వ్యాఖ్య సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఒకరి గుర్తింపును ప్రశ్నించడం కంటే, ఆ మాట చెప్పిన తీరు కొంతమంది ప్రేక్షకులకు అహంకారంగా అనిపించింది. షోలో మేరీకోమ్ తన ఫిట్నెస్, శారీరక బలం గురించి కూడా మాట్లాడింది. రింగ్లో తనతో పోటీ పడటం అంత సులభం కాదని, తనతో ఎవరూ సరిపోలరని ఆమె చెప్పింది. తన విజయాలకు కఠోర శ్రమే కారణమని, ఎవరినైనా ఎత్తి విసిరేయగల శక్తి తనకు ఉందని ఆమె చెప్పినట్లు తెలిపింది.తన పిల్లలు కూడా తనలా మారడం అంత సులభం కాదని మేరీకోమ్ వ్యాఖ్యానించింది. దీంతో ‘నా లాంటి వారు ఎవరూ లేరు’ అనే భావన ఆమె మాటల్లో కనిపిస్తోందంటూ కొంతమంది ప్రేక్షకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మేరీకోమ్ దేశానికి ఎన్నో టైటిళ్లు సాధించిన బాక్సింగ్ ఛాంపియన్. ఆమె విజయాలు, కృషిపై దేశవ్యాప్తంగా గౌరవం ఉంది. అయితే బిగ్ బాస్ వేదికపై విజయాలతో పాటు ప్రవర్తన కూడా ముఖ్యమేనని పలువురు అంటున్నారు. ప్రస్తుతం ఆమె వైఖరిని కొంతమంది యూజర్లు ‘అహంకార భావన’తో ముడిపెడుతున్నారు. రానున్న ‘వీకెండ్ కా వార్’లో ఈ అంశంపై ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.ఇదీ చదవండి: ‘ఫస్ట్లుక్’లో లాల్బాగ్చా రాజా.. జనం క్యూ.. -
రూ. 100 కోట్ల బ్లాక్ బ్లస్టర్ : వారికి లగ్జరీ కార్లు, వామికాకు మొండి చేయి?
సన్ పిక్చర్స్ అధినేత, 'DC' చిత్ర నిర్మాత కళానిధి మారన్ తన ఉదారతతో అందరి మనసులను గెలుచు కున్నారు. రూ. 100 కోట్లకు పైగా వసూళ్లను సాధించిన ఘనవిజయాన్ని పురస్కరించుకుని స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ టర్న్డ్ నటుడు లోకేష్ కనగరాజ్, దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్, సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్లకు ఖరీదైన 'BMW iX1 LWB' కార్లను బహుమతిగా అందించారు. నిర్మాత్ ఇచ్చిన ఈ సర్ప్రైజ్కు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. మరోవైపు సినిమా విజయంలో కీలకమైన తన పాత్రకు 100 శాతం న్యాయం చేసిన వామికా గబ్బికి గిప్ట్ ఇవ్వకపోవడంపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ నడుస్తోంది.సుమారు రూ. 25 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ తమిళ యాక్షన్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి బ్లాక్బస్టర్గా నిలిచింది. దీంతో నిర్మాత కళానిధి మారన్ ఈ ముగ్గురికీ అందించిన BMW కార్ల మొత్తం విలువ రూ. 1.5 కోట్లకు పైగానే ఉంటుంది. ఒక్కో కారు ఆన్-రోడ్ ధర సుమారు రూ. 49 లక్షల నుండి రూ. 55.81 లక్షల వరకు ఉంది.మరి వామికా గబ్బికి ఏది?ఒకవైపు నెటిజన్లు కళానిధి మారన్ చేసిన ఈ పనిని ప్రశంసిస్తుంటే, మరొకవైపు సోషల్ మీడియాలో ఒక వర్గం ప్రశ్నలు గుప్పిస్తోంది. సినిమాలో కథానాయికగా 'చంద్ర' పాత్రలో అద్భుతంగా నటించిన వామికా గబ్బికి ఎందుకు కారు బహుమతిగా ఇవ్వలేదని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. "వామికా గబ్బికి న్యాయం చేయాలి", "చంద్ర పాత్రకు కూడా ఈ బహుమతి దక్కాల్సిందే" అంటూ పలువురు కామెంట్లు చేశారు. నటులతో సమానంగా, అంతకంటే మెరుగ్గా నటించి ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో కీలక పాత్ర పోషించిన మహిళా నటీమణుల గుర్తించి, వామికాకు కూడా కారును గిఫ్ట్గా ఇవ్వాలని ఎక్స్ (ట్విటర్) లో ఒక యూజర్ కోరారు. View this post on Instagram A post shared by Citifox Media (@citifoxmedia) కాగా అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో దర్శకుడు లోకేష్ కనగరాజ్ నటుడిగా అరంగేట్రం చేసిన ఈ చిత్రంలో వామికా గబ్బి, సంజనా కృష్ణమూర్తి, ముఖ్య పాత్రల్లో నటించారు. ఇదీ చదవండి: కాబోయే భార్యని ఇంప్రెస్ చేద్దామని, ఏఐతో ఏకంగా..! -
ఇక రిటైర్ కావాలనుకుంటున్నా: అమితాబ్ బచ్చన్
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ అభిమానులకు షాకింగ్ న్యూస్ చెప్పినట్లు తెలుస్తోంది. ఎంతోకాలంగా తనను బుల్లితెర ప్రేక్షకులకు మరింత చేరువ చేసిన ‘కౌన్ బనేగా కరోడ్పతి’ (KBC) కార్యక్రమానికి గుడ్బై చెప్పే ఆలోచనలో ఉన్నట్లు పరోక్షంగా వెల్లడించారు. ప్రస్తుతం ఈ షో 18వ సీజన్కు హోస్ట్గా వ్యవహరిస్తున్న ఆయన.. తాజాగా రాసిన బ్లాగ్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఇదీ చదవండి: బిగ్బాస్లో రాంప్రసాద్, చరణ్లకు షాక్! ఎలిమినేట్ అవుతారా? కొనసాగించడం కష్టంగా మారుతోందికార్యక్రమానికి వచ్చే కొందరు కంటెస్టెంట్ల వ్యక్తిగత జీవితాల్లోని విషాదకర ఘటనలు తనను తీవ్రంగా కలచివేస్తున్నాయని అమితాబ్ పేర్కొన్నారు. వాళ్లు పడిన బాధలను పంచుకుంటున్నప్పుడు నా భావోద్వేగాలను అదుపు చేసుకోవడం నాకు కష్టంగా ఉంటోంది. హోస్ట్గానూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించడం కష్టంగా మారుతోంది. ఇక నేను రిటైర్ కావాలనుకుంటున్నా.. ఇప్పటికే ఆలస్యమైంది.’ అంటూ తన బ్లాగ్లో రాసుకొచ్చారు. దీంతో అమితాబ్ ఇక KBC నుంచి తప్పుకోనున్నారా? అనే చర్చ మొదలైంది.ఇదీ చదవండి: మీ దగ్గర టాలెంట్ ఉంటే.. నాదగ్గరికి రండి: ఉదయభాను2000లో ప్రారంభమైన KBCకి తొలి సీజన్ నుంచి అమితాబ్ బచ్చనే హోస్ట్గా వ్యవహరిస్తున్నారు. మూడో సీజన్కు మాత్రం షారుక్ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. గతంలోనూ అమితాబ్ KBC నుంచి తప్పుకోనున్నారనే వార్తలు వచ్చినప్పటికీ.. అవి నిజం కాలేదు. ఇప్పుడు కూడా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ( విజయ్ దేవరకొండ ‘రణబాలి’ టీజర్ చూశారా..) -
రంగ్–ఎ–సినిమా ప్రారంభం
జమ్ము కశ్మీర్లో తొలి అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రారంభమైంది. సెప్టెంబరు 7 నుంచి సెప్టెంబరు 10 వరకు నాలుగు రోజుల పాటు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ జమ్ము కశ్మీర్ (ఐఎఫ్ఎఫ్జేకే) వేడుక జరుగుతుంది. సెప్టెంబరు 7న జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఈ చిత్రోత్సవాలను శ్రీనగర్లో ప్రారంభించారు. నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎఫ్డీసీ) సహకారంతో జమ్ము కాశ్మీర్ ప్రభుత్వానికి చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ (డీఐపీఆర్) విభాగం ఈ ఫిల్మ్ ఫెస్టివల్ను నిర్వహిస్తోంది. ‘రంగ్–ఎ–సినిమా’ అనేది ఈ ఫిల్మ్ ఫెస్టివల్ థీమ్. ఉత్తమ చిత్రానికి రూ. 25లక్షల రివార్డు ఈ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రధానంగా తొమ్మిది అవార్డులను అందించనున్నారు. ఈ అవార్డుల కోసం రూ. 96 లక్షల ప్రైజ్ మనీని కేటాయించగా, ఉత్తమ చిత్రానికి రూ. 25 లక్షల నగదును అందించనున్నారు నిర్వాహకులు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్–డైరెక్టర్ సంతోష్ శివన్ జ్యూరీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ‘‘దాదాపు 80కి పైగా దేశాలకు చెందిన 1100 సినిమాలను పరిశీలించి, 41 దేశాలకు సంబంధించిన 135 చిత్రాలను ఈ ఫిల్మ్ ఫెస్టివల్కు షార్ట్ లిస్ట్ చేశాం. భారతదేశం నుంచి 64 సినిమాలు షార్ట్ లిస్ట్ అయ్యాయి. టర్కీ, జర్మనీ, రష్యా, సౌత్ కొరియా, తైవాన్ వంటి విదేశీ చిత్రాలను కూడా ఈ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శిస్తాం’’ అని ఫిల్మ్ఫెస్టివల్ నిర్వాహక ప్రతినిధుల్లో ఒకరు పేర్కొన్నారు. ఇంటర్నేషనల్ పనోరమా, భారత్ పనోరమా, సినిమా ఆఫ్ ది వరల్డ్... ఇలా ఏడు విభాగాల్లో ఈ 135 సినిమాలను ప్రదర్శించనున్నారు. జమ్ము కశ్మీర్లోని అద్భుతమైన ప్రకృతి సౌందర్యాన్ని, పర్యాటక రంగ ప్రాధాన్యతను ప్రపంచ దేశాల చలనచిత్ర నిర్మాతలకు ఈ ఫిల్మ్ ఫెస్టివల్తో పరిచయం చేయడం ద్వారా ఫిల్మ్ టూరిజంను ప్రోత్సహించడం అనేది ఈ ఫిల్మ్ఫెస్టివల్ ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. డెడ్ డాగ్తో ప్రారంభం లెబనాన్ దేశానికి చెందిన ‘డెడ్ డాగ్’ సినిమాతో ఈ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రారంభమైంది. లేడీ డైరెక్టర్ సారా ఫ్రాన్సిస్ తెరకెక్కించిన ఎమోషనల్ డ్రామా నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుంది. ఐదా, వాలిద్ భార్యాభర్తలు. వృత్తి రీత్యా వాలిద్ విదేశాల్లో ఉంటాడు. భార్య తన సొంతూరులో ఉంటుంది. అయితే వాలిద్ ఎవరికీ చెప్పకుండా స్వదేశంలోని తన పాత ఇంటికి వస్తాడు. కానీ అక్కడికి వెళ్లి తన భర్త వాలిద్కు ఐదా సర్ప్రైజ్ ఇస్తుంది. ఆ తర్వాత ఈ దంపతులు ఆ ఇంట్లోనే నాలుగు రోజులు ఉండాల్సి వస్తుంది. కానీ సుదీర్ఘకాలం దూరంగా ఉండటం వల్ల ఈ దంపతుల మధ్య ఏర్పడిన భావోద్వేగ దూరం, ఒకరిపై ఒకరికి ఉన్న అపనమ్మకాలు ఈ నాలుగు రోజుల్లో ఒక్కొక్కటిగా బయటపడుతుంటాయి. తాను ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న విషయాన్ని వాలిద్ తన భార్యకు చెప్పడు. తాము ఎంతో ప్రేమగా పెంచుకున్న ‘పెట్ డాగ్’ చని΄ోయిందనే నిజాన్ని ఐదా తన భర్తకు చెప్పకుండా దాచడానికి ప్రయత్నిస్తుంది. మరి... ఆ తర్వాత ఏం జరిగింది? అన్న అంశాల నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుంది. ఇక తొలి రోజు ప్రారంభ వేడుకల్లో బాలీవుడ్ నటి ఫాతిమా సనా షేక్, నటుడు తహా షా బదు షా, దర్శకుడు విధు వినోద్ చోప్రా తదితర ప్రముఖులు చిత్రోత్సవాలకు హాజరయ్యారు. -
బేబీ బంప్తో దీపికా
బాలీవుడ్ స్టార్ జంట రణ్వీర్ సింగ్, దీపికా పదుకొణె మరోసారి తమ కుమార్తె దువాను సోషల్ మీడియా వేదికగా పరిచయం చేశారు. దువా రెండో పుట్టినరోజు సందర్భంగా ఆమె ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా తమ కుటుంబంలోకి మరో కొత్త సభ్యుడు రాబోతున్న విషయాన్ని కూడా వెల్లడించారు.ఇదీ చదవండి: దీపావళి బరిలో నయనతార కొత్త సినిమా!‘మా చిన్నారి దువా.. నిన్ను ఇలా చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్యూ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్’ అంటూ రణ్వీర్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. దీంతో ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దువాను చూసిన అభిమానులు, సినీ ప్రముఖులు ఈ స్టార్ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.ఇదీ చదవండి: ‘నాతో పెట్టుకోవద్దు!’.. ఆటో రాంప్రసాద్ వార్నింగ్కాగా.. రణ్వీర్, దీపికా 2024లో తల్లిదండ్రులయ్యారు. తమ కుమార్తెకు ‘దువా’ అనే పేరు పెట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి తల్లిదండ్రులు కాబోతున్న నేపథ్యంలో దువా త్వరలో అక్క కానుంది. -
దారులు ఏవైనా.. వసూళ్లు మాత్రం అదుర్స్.. ఎంతంటే?
బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ప్రస్తుతం రెండు సినిమాల గురించి ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఒకటి ఇప్పటికే ఓటీటీలో భారీ ఆదరణ పొందిన ‘మిర్జాపూర్’ ఫ్రాంచైజీకి కొనసాగింపుగా వచ్చిన ‘మిర్జాపూర్: ది మూవీ’ కాగా.. మరొకటి పెద్దగా అంచనాలు లేకుండా థియేటర్లలోకి వచ్చి క్రమంగా ప్రేక్షకాదరణ సొంతం చేసుకున్న ‘హనుమాన్ అంశ్’. ఈ రెండు సినిమాలు విజయవంతమైనప్పటికీ వాటి బాక్సాఫీస్ వద్ద మాత్రం పూర్తి భిన్నంగా ఉన్నాయి. ఒక సినిమా ఫ్రాంచైజీ క్రేజ్తో తొలి రోజుల్లోనే దుమ్మురేపితే.. మరో సినిమా ప్రేక్షకుల మౌత్ టాక్తో నెమ్మదిగా పుంజుకుని భారీ విజయాన్ని అందుకుంది. మూడు రోజుల్లోనే రూ.90 కోట్లకు..గుర్మీత్ సింగ్ దర్శకత్వంలో పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్, దివ్యేందు, రవికిషన్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘మిర్జాపూర్: ది మూవీ’ సెప్టెంబర్ 4న ప్రేక్షకుల ముందుకొచ్చింది. సాక్నిల్క్ గణాంకాల ప్రకారం తొలి రోజే ఈ చిత్రం సుమారు రూ.25.75 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. రెండో రోజు రూ.32 కోట్లు, మూడో రోజు రూ.36 కోట్లు రాబట్టింది. దీంతో మూడు రోజుల్లోనే భారత్లో రూ.93.75 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించింది. ప్రపంచవ్యాప్తంగా రూ.132 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టినట్లు సమాచారం.నెమ్మదిగా మొదలై.. భారీ వసూళ్లు‘హనుమాన్ అంశ్’ పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నం. విశాల్ చతుర్వేది దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భక్తిరస ప్రధాన చిత్రం ఆగస్టు 7న విడుదలైంది. తొలివారం కేవలం రూ.1.08 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. రెండో వారంలోనూ రూ.0.40 కోట్లకే పరిమితమైంది. అయితే మూడో వారం నుంచి సినిమా వసూళ్లు జోరు అందుకున్నాయి.ఇదీ చదవండి: చైనాలో విరిసిన ‘పౌర్ణమి’.. వీడియో వైరల్మూడో వారంలో రూ.10.40 కోట్లు సాధించిన ఈ చిత్రం.. ఆ తర్వాతి వారాల్లోనూ జోరు కొనసాగించింది. 29వ రోజుకు భారత్లో రూ.82.88 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టింది. ఐదో శనివారం ఏకంగా రూ.16.50 కోట్లు, 31వ రోజు రూ.22.75 కోట్లు వసూలు చేసింది. దీంతో 31 రోజుల్లోనే రూ.122.13 కోట్ల నెట్ కలెక్షన్లను అందుకుంది. 32వ రోజు నాటికి ఈ మొత్తం సుమారు రూ.122.53 కోట్లకు చేరినట్లు సాక్నిల్క్ తాజా గణాంకాలు చెబుతున్నాయి. ( వినాయకుడు ఫైర్.. దద్దరిల్లిన బిగ్బాస్ హౌస్)ప్రేక్షకుల ఆదరణతో..‘మిర్జాపూర్: ది మూవీ’ ఫ్రాంచైజీ క్రేజ్తో విడుదలైన వెంటనే భారీ ఓపెనింగ్ సాధించింది. మరోవైపు ‘హనుమాన్ అంశ్’ మొదట్లో తక్కువ వసూళ్లు సాధించినప్పటికీ.. ప్రేక్షకుల ఆదరణతో క్రమంగా మంచి వసూళ్లు సాధించింది. ఒక సినిమా ఫ్రాంచైజీ క్రేజ్తో తొలి రోజుల్లోనే దుమ్మురేపితే.. మరో సినిమా ప్రేక్షకుల మౌత్ టాక్తో నెమ్మదిగా పుంజుకుని భారీ విజయాన్ని అందుకుంది. బాక్సాఫీస్ వద్ద విజయానికి ఒక్కో సినిమాది ఒక్కో దారి అని ఈ రెండు చిత్రాలు నిరూపిస్తున్నాయి. -
ఢిల్లీ విషాదంపై స్పందించిన సోనూ సూద్, కీలక వ్యాఖ్యలు
Delhi building collapse ఢిల్లీలోని సత్యనికేతన్ ప్రాంతంలో ఐదంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనపై బాలీవుడ్ నటుడు సోనూ సూద్ (Sonu Sood)స్పందించారు. ఏడుగురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడంపై తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలనుండి చదువుకోవడానికి వచ్చే విద్యార్థులకు సురక్షితమైన వసతి సౌకర్యాలను కల్పించాలని ఈ సందర్భంగా సోనూ సూద్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.Every year, lakhs of students leave their homes to chase a dream in another city. But are we giving them a safe place to live?In Delhi, around 7 lakh students are enrolled, while hostel capacity is barely 30,000 — just 1 in 31 gets a hostel.Why not identify vacant government…— sonu sood (@SonuSood) September 8, 2026ఢిల్లీ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్ సమీపంలోని భవనంలో సరైన నిబంధనలు పాటించకుండా ఇరుకైన స్థలాల్లో నిర్మించిన ప్రైవేట్ హాస్టల్స్ విద్యార్థుల ప్రాణాలకు ముప్పుగా పరిణమిస్తున్న తీరుకు ఈ ఘటన నిదర్శనంగా నిలుస్తోంది. ఈ సందర్భంగా హాస్టళ్ల కొరత, విద్యార్థుల వసతి సౌకర్యాలపై సోనూ సూద్ ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన గణాంకాలతో ఎక్స్లో ఒక పోస్ట్ పెట్టారు. ప్రతీ ఏడాది లక్షల మంది విద్యార్థులు తమ కలల సాకారం కోసం ఇళ్లను వదిలి వేరే నగరానికి తరలిపోతున్నారు. కానీ మనం వారికి భద్రమైన జీవితాన్నికల్పించలేకపోతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు.ఢిల్లీలో సుమారు 7 లక్షల మంది విద్యార్థులు చదువుతుంటే, అందుబాటులో ఉన్న హాస్టల్ సీట్లు కేవలం 30,000 మాత్రమే. అంటే ప్రతి 31 మంది విద్యార్థులలో ఒక్కరికి మాత్రమే హాస్టల్ సౌకర్యం లభిస్తోంది. విశ్వవిద్యాలయాల సమీపంలో ఉన్న ఖాళీ ప్రభుత్వ భూములను గుర్తించి విద్యార్థులకు సురక్షితమైన, తక్కువ ధరలోని హాస్టళ్లను నిర్మించాలని ఆయన సూచించారు. క్యాంపస్ పరిధిలోనే మరిన్ని వసతి గృహాలు కట్టడానికి విశ్వవిద్యాలయాలకు ప్రత్యేక అనుమతులు ఇవ్వాలన్నారు.ఇదీ చదవండి: Delhi building collapse జస్ట్ 15 నిమిషాలు.. నల్లా నీళ్లే కాపాడాయ్!విద్యార్థులకు భద్రత, తల్లిదండ్రులకు మనశ్శాంతి లభిస్తుంది. విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వాలు ఆదాయాన్ని పొందుతాయి. అన్నింటికన్నా ముఖ్యంగా, మనం బిడ్డల ప్రాణాలు భద్రంగా ఉంటాయని ట్వీట్ చేశారు. చిన్న విధానపరమైన మార్పులు అనేకమంది విద్యార్థుల ప్రాణాలను, వారి కలలను కాపాడగలవని ఆయన పేర్కొన్నారు.ఇదీ చదవండి: సౌండ్ వద్దు అన్నందుకు మ్యుజీషియన్ను కొట్టి చంపేశారుకాగా ఈ ఘటన దేశ వ్యాప్తంగా తీవ్రదిగ్భ్రాంతిరేపింది. ప్రమాదానికి కారణమైన భవన యజమాని హరిరామ్ గుప్తా, ఆయన భార్య ఊర్మిళ గుప్తాకు కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. వారి కుమారుడు మహేష్ గుప్తాను రెండు రోజుల పోలీసు కస్టడీకి పంపారు. ప్రమాదం జరిగిన భవనానికి ఆనుకుని ఉన్న మరొక భవనం కూడా ప్రమాదకరంగా మారిందని, దానిని కూల్చివేయనున్నామని ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా వెల్లడించారు.ఇదీ చదవండి: నో జిమ్, సోషల్ మీడియాను ఊపేస్తున్న కొత్త ఫిట్నెస్ ట్రెండ్? -
Bigg Boss: సింగిల్ బెడ్ కోసం తౌకీర్ తోలు తీసిన మేరీ కోమ్
బిగ్బాస్(హిందీ) 20వ సీజన్ ప్రారంభమైంది. సల్మాన్ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ సీజన్లో నటులు, గాయకులు, ఇన్ఫ్లుయెన్సర్లు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొంటున్నారు. బాక్సింగ్ ఛాంపియన్ మేరీ కోమ్, గాయకుడు ఖాజీ తౌకీర్ కూడా పోటీదారులుగా ఉన్నారు. తొలి రోజే ఇంట్లో వాదోపవాదాలు మొదలయ్యాయి.సింగిల్ బెడ్ కోసం పోటీరియాలిటీ టీవీలోకి తొలిసారి అడుగుపెట్టిన మేరీ కోమ్.. మొదటి రోజే తన ఉనికిని చాటుకున్నారు. బిగ్బాస్ ఇంట్లో సింగిల్, డబుల్ బెడ్లు ఉన్నాయి. ఒక సింగిల్ బెడ్ విషయంలో మేరీ కోమ్, ఖాజీ తౌకీర్ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. వయసు, క్రీడా రంగంలో తనకున్న గుర్తింపు దృష్ట్యా సింగిల్ బెడ్ తనకే ఇవ్వాలని మేరీ వాదించినట్లు సమాచారం. వెన్నునొప్పి ఉందని, ఒంటరిగా పడుకుంటే సౌకర్యంగా ఉంటుందని ఆమె పేర్కొన్నట్లు తెలుస్తోంది.ఖాజీ మాత్రం వెనక్కి తగ్గలేదుఅయితే ఖాజీ తౌకీర్ ఆ బెడ్ను వదులుకోవడానికి నిరాకరించారు. మరో బెడ్ను ఎంచుకోవాలని మేరీకి సూచించినట్లు సమాచారం. డబుల్ బెడ్ను మరో పోటీదారుతో పంచుకోవడం తనకు ఇబ్బందిగా ఉంటుందని ఆయన వివరించినట్లు తెలుస్తోంది.చర్చలోకి అరిష్ఫా ఖాన్వీరి మధ్య జరిగిన వాగ్వాదం ఇతర హౌస్మేట్స్ దృష్టిని ఆకర్షించింది. ఈ సందర్భంగా తనను తాను లెజెండ్గా పేర్కొంటూ సింగిల్ బెడ్ ఎందుకు కావాలో మేరీ వివరించినట్లు సమాచారం. అందరికీ సమానంగా వ్యవహరించాల్సిందేనని అరిష్ఫా ఖాన్ స్పందించారు. ఈ చర్చ ప్రీమియర్ ఎపిసోడ్లో ప్రధాన అంశంగా మారింది.‘నువ్వు నా శత్రువు’చివరకు ఖాజీ సింగిల్ బెడ్ను వదులుకోలేదు. దీంతో మేరీ అక్కడి నుంచి వెళ్లిపోయారు. వెళ్తూ.. ‘నాకు నువ్వంటే ఇష్టం లేదు.. నువ్వు నా శత్రువు’ అని ఖాజీతో చెప్పినట్లు సమాచారం. సరదాగా సాగిన ఈ వాగ్వాదం తొలి ఎపిసోడ్లో మరింత ఆసక్తిని పెంచింది.తొలి రోజే మొదలైన రచ్చబిగ్బాస్ ఇంట్లో క్రమశిక్షణ, పోటీ తత్వాన్ని తీసుకురావాలని మేరీ గతంలో చెప్పిన నేపథ్యంలో తొలి రోజే జరిగిన ఈ ఘటన ఆసక్తి రేపుతోంది. సెప్టెంబరు 6, 2026న ప్రారంభమైన బిగ్బాస్ 20లో మేరీ కోమ్, ఖాజీ తౌకీర్, అమ్రపాలి దూబే, మహి విజ్, అరిష్ఫా ఖాన్, ఆసిఫ్ ఖాన్, కనికా మాన్ తదితరులు పాల్గొన్నారు. మరి ఈ బెడ్ వివాదం శాశ్వత వైరంగా మారుతుందా? లేక సీజన్ ఆరంభంలో చోటుచేసుకున్న ఓ గుర్తుండిపోయే ఘటనగానే మిగిలిపోతుందా అనేది చూడాలి. ఇది కూడా చదవండి: పేరులో తేడా.. పద్మశ్రీకి గ్రహీతకూ ‘సర్’ నోటీసు! -
RC17: సుకుమార్ కథ లాక్ చేశారా? ఇక చరణ్కు ఫైనల్ నెరేషన్!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కనున్న ‘RC17’పై ఆసక్తికరమైన అప్డేట్ వినిపిస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. సుకుమార్ సినిమా ఫైనల్ స్క్రిప్ట్ను పూర్తి చేసి కథను లాక్ చేసినట్లు తెలుస్తోంది.త్వరలోనే రామ్ చరణ్కు ఫైనల్ నెరేషన్ ఇవ్వనున్నారట. నెరేషన్ పూర్తయిన తర్వాత ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగం పుంజుకోనున్నాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే 2026 డిసెంబర్లో ‘RC17’ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ‘రంగస్థలం’ లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న సినిమా ఇదే కావడం విశేషం. ఈ క్రేజీ ప్రాజెక్ట్పై అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచే అభిమానుల్లో, సినీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. చాలా కాలంగా స్క్రిప్టింగ్ దశలోనే ఉన్న ఈ ప్రాజెక్ట్, ఇప్పుడు ప్రీ-ప్రొడక్షన్ పనుల దిశగా వేగంగా అడుగులు వేస్తోంది.ఇక ఈ సినిమాలో హీరోయిన్గా రష్మికని అనుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. సుకుమార్ ఇప్పటివరకు చాలానే సినిమాలు చేశాడు గానీ ఒకసారి పనిచేసిన హీరోయిన్తో మళ్లీ పనిచేయలేదు. 'పుష్ప' రెండు భాగాలు అయినప్పటికీ అది ఒక ప్రాజెక్ట్ కిందనే వస్తుంది. ఒకవేళ ఇప్పుడు చరణ్ సరసన రష్మికని తీసుకుంటే సుక్కు సెంటిమెంట్ బ్రేక్ అవుతుంది. అయితే చరణ్-రష్మికది ఫ్రెష్ కాంబో కాబట్టి ప్రేక్షకుల్లోనూ కాస్త ఆసక్తి పెరిగే అవకాశముంటుంది. ఇందులో భాగంగానే హీరోయిన్గా రష్మికని అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. సుకుమార్ ఇప్పటివరకు చాలానే సినిమాలు చేశాడు గానీ ఒకసారి పనిచేసిన హీరోయిన్తో మళ్లీ పనిచేయలేదు. 'పుష్ప' రెండు భాగాలు అయినప్పటికీ అది ఒక ప్రాజెక్ట్ కిందకే వస్తుంది. ఒకవేళ ఇప్పుడు చరణ్ సరసన రష్మికని తీసుకుంటే సుక్కు సెంటిమెంట్ బ్రేక్ అవుతుంది. అదే టైంల చరణ్-రష్మికది కూడా ఫ్రెష్ కాంబో కాబట్టి. ప్రేక్షకుల్లోనూ కాస్త ఆసక్తి పెరిగే అవకాశముంటుంది.సుకుమార్ ఇప్పటివరకు చాలానే సినిమాలు చేశాడు గానీ ఒకసారి పనిచేసిన హీరోయిన్తో మళ్లీ పనిచేయలేదు. 'పుష్ప' రెండు భాగాలు అయినప్పటికీ అది ఒక ప్రాజెక్ట్ కిందకే వస్తుంది. ఒకవేళ ఇప్పుడు చరణ్ సరసన రష్మికని తీసుకుంటే సుక్కు సెంటిమెంట్ బ్రేక్ అవుతుంది. అదే టైంల చరణ్-రష్మికది కూడా ఫ్రెష్ కాంబో కాబట్టి. ప్రేక్షకుల్లోనూ కాస్త ఆసక్తి పెరిగే అవకాశముంటుంది. -
విషాదం : మరికొన్ని గంటల్లో లైవ్, దుబాయ్లో సింగర్ హఠాన్మరణం
దుబాయ్: ప్రముఖ మలయాళీ గాయకుడు నిసార్ వయనాడ్ (Nisar Wayanad) దుబాయ్లోని ఒక ఆసుపత్రిలో అకస్మాత్తుగా కన్నుమూశారు. అజ్మాన్లో జరగాల్సిన ఒక సంగీత విభావరి (షో)కి కొన్ని గంటల ముందే ఆయన తుదిశ్వాస విడవడం యూఏఈలోని మలయాళీ కమ్యూనిటీని, ఆయన అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. లైవ్ కన్సర్ట్ కాస్తా సంతాప సభగా మారిపోయింది.ఆయన గత నెలలో ఒక సంగీత కార్యక్రమం కోసం దుబాయ్కి వచ్చారు. జ్వరం రావడంతో వైద్య చికిత్స తీసుకున్నారు. రాబోయే రోజుల్లో దుబాయ్, సౌదీ అరేబియాలో పలు కార్యక్రమాల్లో ఆయన ప్రదర్శన ఇవ్వాల్సి ఉంది. మలయాళ సినిమాల్లో పాటలు పాడేందుకు ఒప్పందాలు చేసుకున్నారు. ఇంతలోనే ఆయన ఆకస్మిక మరణం కుటుంబ సభ్యులను, స్నేహితులను, అభిమానులను దిగ్భ్రాంతికి గురి చేసింది. నిసార్ గొంతు ప్రముఖ బాలీవుడ్ గాయకుడు ఉదిత్ నారాయణ్ గాత్రాన్ని పోలి ఉండటంతో సంగీత కార్యక్రమాల వేదికలపై ఆయనకు విశేష ప్రజాదరణ ఉండేది.గత కొన్ని రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్న నిసార్, సాధారణ పారాసిటమాల్ మాత్రలు వాడుతున్నారు. శనివారం మధ్యాహ్నంపరిస్థితి విషమించడంతో దుబాయ్ ఆసుపత్రిలో చేర్పించగా, చికిత్స పొందుతూ సాయంత్రం మరణించారు. సెప్టిసీమియా (రక్తంలో తీవ్రమైన ఇన్ఫెక్షన్) వల్ల అవయవాలు విఫలమై, బాడీలో అసిడోసిస్ పెరగడం వల్ల మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.శనివారం అర్ధరాత్రి వేళ ఆయన మరణవార్త తెలిసిన వెంటనే సుమారు 300 మందికి పైగా అభిమానులు, మిత్రులు తుది వీడ్కోలు పలికేందుకు తరలివచ్చారు. రికార్డు స్థాయిలో కేవలం 4 గంటల్లోనే రాత్రి 3 గంటల ప్రాంతంలో జనాజా ప్రార్థనలు పూర్తి చేసి, పార్థివ దేహాన్ని కేరళలోని ఆయన స్వగ్రామానికి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు.దుబాయ్లోని కల్చరల్ ఈవెంట్లలో తన గాత్రంతో అభిమానులను సంపాదించుకున్న నిసార్ కేరళలోని వయనాడ్ జిల్లాకు చెందిన వారు. నిసార్ అసలు పేరు నిస్సార్ అరోత్ ఇబ్రహీం. హిందీ, మలయాళ పాటలతో పాటు ఉదిత్ నారాయణ్, అర్జిత్ సింగ్, అతీఫ్ అస్లామ్ పాటలను అద్భుతంగా పాడేవారు. ఆయనకు భార్య షహానా నిసార్, ఇద్దరు కుమార్తెలు (సింబ్రీనా, అంబ్రీనా) ఉన్నారు.ఇదీ చదవండి: రూ. 1,470 కోట్ల లాటరీ, సగం దానమిచ్చేసిన టీచరమ్మ!ప్రముఖుల సంతాపంఆయన అకాల మరణం పట్ల ఆర్జే మిథున్ రమేష్, ప్లేబ్యాక్ సింగర్ అఫ్సల్, ఇతర యూఏఈ ఈవెంట్ నిర్వాహకులు తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు.ఇదీ చదవండి : పవిత్ర గంగలో మూడు మునకలు: అనుభూతిని పంచుకున్న జపాన్ రాయబారి -
‘హనుమాన్ అంశ్’ కి తగ్గని క్రేజ్.. పంచెకట్టుతో విద్యార్థులు
బాలీవుడ్లో ఇటీవల విడుదలై అనూహ్య విజయాన్ని అందుకున్న చిత్రాల్లో ‘హనుమాన్ అంశ్’ ఒకటి. పెద్దగా అంచనాలు లేకుండా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా.. ప్రేక్షకుల ఆదరణతో క్రమంగా వసూళ్లను పెంచుకుంటూ దూసుకెళ్లింది. ప్రస్తుతం రూ.100 కోట్లకు పైగా వసూళ్లను రాబెట్టింది. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, హనుమాన్ భక్తుడు నీమ్ కరోలి బాబా జీవితం, ఆయన బోధనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు విశాల్ చతుర్వేది.ఎక్కువమంది చదివింది: స్నేహితులుగా ఎంట్రీ.. బిగ్బాస్లో ప్రత్యర్థులవుతారా..?సంప్రదాయ వస్త్రధారణలో అయితే ఈ చిత్రాన్ని చూసేందుకు ప్రేక్షకులు థియేటర్ల వద్ద క్యూ కడుతున్నారు. తాజాగా ఈ సినిమాని చేసేందుకు ఓ పాఠశాల విద్యార్థులు ఢిల్లీలోని పీవీఆర్కు వెళ్లారు. సంప్రదాయ వస్త్రధారణలో పంచెకట్టుతో థియేటర్కు వెళ్లారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.కాగా ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఇటీవలే ఈ సినిమా కోసం పడిన కష్టాలను డైరెక్టర్ విశాల్ వివరించారు. సినిమా విడుదలైన సమయంలో షోలు, థియేటర్ల సంఖ్య భారీగా తగ్గిపోయిందని.. ఆ సమయంలో బాలీవుడ్ నుంచి ఆశించిన స్థాయిలో మద్దతు లభించలేదని ఆయన పేర్కొన్నారు.ఇదీ చదవండి: ‘సినిమా హిట్ అయ్యాకే బాలీవుడ్ నన్ను గుర్తించింది’ हनुमान अंश ने सिनेमाघरों को सच में मंदिर बना दिया ❤️🚩PVR में गुरुकुल के युवा ब्रह्मचारियों ने जब #HanumanAnsh देखी, तो उनके चेहरों की चमक देखने लायक थी। 🙏यह सिर्फ फिल्म नहीं, हमारी संस्कृति, संस्कार और प्रभु हनुमान की भक्ति से जुड़ने का अनुभव है। 🇮🇳🚩#आ_गया_है_अवतार pic.twitter.com/fNVGglsGrh— Divya Singh (@DivyaSi51590883) September 7, 2026 -
నీట్ నిరసనలతో వైరల్.. ‘బిగ్బాస్’లో రియాకు చుక్కెదురు
నీట్ నిరసనల సందర్భంగా వైరల్గా మారిన ఇన్ఫ్లుయెన్సర్, నటి రియా అహిర్కు ‘బిగ్బాస్ 20’లో నిరాశ ఎదురైంది. ముంబైలోని శివాజీ పార్క్లో జరిగిన విద్యార్థుల ఆందోళన సమయంలో విద్యార్థులతో కూడిన పోలీసు వ్యాన్ను ఆపేందుకు రియా ఒంటరిగా దాని ముందు నిలబడ్డారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో పలువురు ఆమె ధైర్యాన్ని ప్రశంసించారు.ఈ నేపథ్యంలో రియాకు ‘బిగ్బాస్ 20’లో పాల్గొనే అవకాశం లభించింది. అయితే ఆమెను షోలోకి పంపాలా? వద్దా? అనే నిర్ణయాన్ని నిర్వాహకులు ప్రేక్షకులకే అప్పగించారు. రియాతో పాటు పంజాబీ నటి లవ్ గిల్ పోటీలో నిలిచారు. వీరిద్దరిలో ఒకరిని షోలోకి పంపేందుకు ప్రేక్షకులు ఓటు వేయాల్సి వచ్చింది. ప్రజాభిప్రాయంలో లవ్ గిల్ విజయం సాధించారు. అధిక ఓట్లు రావడంతో ఆమె సల్మాన్ ఖాన్ షోలోకి ప్రవేశించారు. రియా మాత్రం నిరాశతో స్టేజ్ నుంచే తిరిగి వెళ్లాల్సి వచ్చింది.అయితే ఫలితం వెల్లడికాకముందే రియా, లవ్ గిల్ మధ్య వేదికపైనే వాగ్వాదం చోటుచేసుకుంది. సల్మాన్ ఖాన్ సమక్షంలో ఇద్దరూ పరస్పరం సవాళ్లు విసురుకున్నారు. బస్సును ఆపేంత ధైర్యం ఉందా అంటూ లవ్ చేసిన వ్యాఖ్యపై రియా స్పందిస్తూ.. తాను ఆపింది బస్సు కాదని, వ్యాన్ అని స్పష్టం చేశారు. డ్రైవర్ ఆపకపోతే రియా పరిస్థితి మరోలా ఉండేదని లవ్ వ్యాఖ్యానించారు. తన జీవిత ఉద్దేశం అక్కడే నెరవేరేదని రియా బదులిచ్చారు. ఇద్దరి మధ్య వాగ్వాదాన్ని సల్మాన్ ఖాన్ చూస్తూ ఉండిపోయారు. ఎవరికీ మద్దతు ఇవ్వకుండా తటస్థంగా ఉన్నారు. చివరకు రియాకు ప్రేక్షకుల మద్దతు లభించలేదు. రెండు నిమిషాల్లోనే ఆమె షో నుంచి బయటకు వెళ్లాల్సి వచ్చింది.ఇది కూడా చదవండి: బిగ్బాస్ హౌస్లోకి బాక్సింగ్ దిగ్గజం.. వణికిపోతున్న పోటీదారులు! -
బిగ్బాస్ హౌస్లోకి బాక్సింగ్ దిగ్గజం.. వణికిపోతున్న పోటీదారులు!
బాక్సింగ్ దిగ్గజం మేరీ కోమ్ ‘బిగ్బాస్ 20’(హిందీ)లోకి అడుగుపెట్టారు. సల్మాన్ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ రియాలిటీ షో కొత్త సీజన్లో ఆమె పాల్గొనడం అత్యంత ఆసక్తికరంగా మారింది. మేరీ కోమ్ బిగ్బాస్ ప్రయాణం ప్రారంభించిన అనంతరం నటి ప్రియాంక చోప్రా ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. షోలో మేరీ కోమ్ తన ఆటను ఎలా కొనసాగిస్తారో చూసేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని ఆమె అన్నారు.మేరీ కోమ్, ప్రియాంక చోప్రాల మధ్య ప్రత్యేక అనుబంధం ఉంది. 2014లో తెరకెక్కిన చిత్రం ‘మేరీ కోమ్’లో ప్రియాంక చోప్రా.. మేరీ కోమ్ పాత్రను పోషించారు. ఆమె క్రీడా ప్రయాణంలోని కీలక ఘట్టాలను ఈ చిత్రం అందరికీ తెలియజెప్పింది. మేరీ కోమ్ కథను వెండితెరపై ఆవిష్కరించిన కొన్నేళ్ల తర్వాత.. ఇప్పుడు ఆమె బిగ్బాస్ హౌస్లోకి అడుగుపెడుతున్నారు. దీనిలో ఆమె విభిన్న టాస్క్లను ఎదుర్కొనబోతున్నారు.బాక్సింగ్ రింగ్లో ప్రత్యర్థులను ఎదుర్కొనేందుకు అలవాటుపడిన మేరీకి బిగ్బాస్ హౌస్ పూర్తిగా భిన్నమైన పరీక్షలను పెట్టనుంది. కెమెరాల నిరంతర నిఘాలో ఇతర కంటెస్టెంట్లతో కలిసి జీవిస్తూ, టాస్కులు, నామినేషన్లు, స్నేహాలు, విభేదాలు మొదలైనవాటిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఒత్తిడిని ఎదుర్కొంటూ క్రమశిక్షణతో పోటీపడిన మేరీ కోమ్ క్రీడా నేపథ్యం ఆమె బిగ్బాస్ ప్రయాణాన్ని మరింత ఆసక్తికరంగా మార్చనుంది. బిగ్బాస్ 20 ప్రారంభానికి ముందు నుంచే మేరీ కోమ్ పాల్గొంటారనే ఊహాగానాలు సాగాయి. పలువురు కంటెస్టెంట్ల పేర్లతో పాటు ఆమె పేరు కూడా వినిపించింది.పలుమార్లు ప్రపంచ ఛాంపియన్గా నిలిచి, ఒలింపిక్ పతక విజేత అయిన మేరీ కోమ్.. బిగ్బాస్ కంటెస్టెంట్ల జాబితాలో భిన్నమైన నేపథ్యంతో నిలిచారు. రింగ్లో సాధించిన విజయాలకు అతీతంగా ఆమె వ్యక్తిగత కోణాన్ని తెలుసుకునే అవకాశం ఇప్పుడు ప్రేక్షకులకు లభించనుంది. మేరీ ఆటను చూసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు ప్రియాంక వెల్లడించడంతో.. బిగ్బాస్ ఇంట్లో ఆమె ఎలా కలిసిపోతారన్నదానిపై ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది.ఇది కూడా చదవండి: చెరకు తోటల్లోనే పుట్టి, చెరుకు తోటల్లోనే పెరిగి.. -
ఆల్ఫా ఫలితం.. అలాంటి సినిమాలకు శాపం: తాప్సీ పన్ను
హీరోయిన్ తాప్సీ పన్ను ఇటీవలే గాంధారి మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా నేరుగా నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్కు వచ్చేసింది. ఈ చిత్రానికి దేవాశిష్ మఖీజా దర్శకత్వం వహించారు. ఫీమేల్ ఓరియంటెడ్ జానర్లో ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. జాయ్పుర్రా అనే కల్పిత పట్టణం నేపథ్యంలో సాగే కథగా రూపొందించారు.అయితే ఈ మూవీ రిలీజ్ తర్వాత తాప్సీ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆలియా భట్ ఫీమేల్ ఓరియంటెడ్ మూవీ ఆల్ఫా డిజాస్టర్ కావడంతో ఆ ప్రభావం మాపై కూడా పడుతుందని తెలిపింది. ఇలా జరిగితే మహిళ నేపథ్యంలో వచ్చే సినిమాలకు నిర్మాతలు ముందుకు రారంటూ మాట్లాడింది. మా సినిమాలన్నీ నిలిచిపోయే పరిస్థితి వస్తుందని తెలిపింది. దీంతో తాప్సీ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.జాయ్పుర్రా అనే కల్పిత పట్టణం నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో.. తన కుమార్తె అదృశ్యమైన తర్వాత ఓ అంధ తల్లి సాగించే పోరాటం ఆధారంగా తీర్చిదిద్దారు. ఈ మూవీలో ఇష్వాక్ సింగ్, జతిన్ సర్నా, స్వస్తికా ముఖర్జీ, మితా వశిష్ఠ్, ఛాయా కదమ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. -
మీర్జాపూర్ సిరీస్ మాత్రమే కాదు.. సినిమా కూడా..!
మీర్జాపూర్ సిరీస్ సినీ ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంది. అన్ని సీజన్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అలా సూపర్ హిట్ అయిన ఈ సిరీస్లను సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. మీర్జాపూర్: ది మూవీ పేరుతో రిలీజ్ చేశారు. ఈ మూవీ సైతం బాక్సాఫీస్ వద్ద రాణిస్తోంది. ఈ చిత్రం రిలీజైన రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.78 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. ఇండియా వ్యాప్తంగా చూస్తే రూ. 68.20 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. రెండు రోజుల్లోనే రూ. 56.75 నెట్ వసూళ్లు సాధించింది. ఈ సినిమాకు గుర్మీత్ సింగ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్, దివ్యేందు కీలక పాత్రల్లో నటించారు. అభిషేక్ బెనర్జీ, రసిక దుగల్, షీబా చద్దా, రాజేష్ తైలాంగ్, శ్రియా పిల్గావ్కర్, హర్షిత శేఖర్ గౌర్ ముఖ్యపాత్రల్లో కనిపించారు. ఈ మూవీ సెప్టెంబర్ 4, 2026న సినిమా థియేటర్లలో విడుదలైంది. -
అనుష్క సినిమాలకు గుడ్బై చెప్పినట్టేనా?
దశాబ్దానికి పైగా టాలీవుడ్లో తన నటన, సౌందర్యంతో లేడీ సూపర్ స్టార్గా ఏకచక్రాధిపత్యం వహించింది నటి అనుష్క శెట్టి. ఆమె కథానాయిక ప్రాధాన్యమున్న సినిమాలతో బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాసిన విషయం తెలిసిందే. అయితే గత కొంతకాలంగా వెండితెరకు దూరంగా ఉండటం అనుష్క అభిమానుల్లో తీవ్ర నిరాశను నింపుతోంది. 'బాహుబలి'తో అనుష్క పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ స్థానాన్ని సంపాదించుకుంది. అనుష్క శెట్టి సినిమాలకు దూరమవుతున్నారా? ప్రస్తుతం టాలీవుడ్లో ఇదే చర్చ నడుస్తోంది. ఆమె చివరి చిత్రం ఘాటీ విడుదలై ఇప్పటికే 365 రోజులు పూర్తయ్యాయి. ఇప్పటివరకు మరో తెలుగు సినిమాను అనుష్క ప్రకటించలేదు. క్రేజ్ ఉన్నప్పటికీ వరుస సినిమాలు చేయకుండా.. నచ్చిన కథ, పాత్ర కోసం మాత్రమే ఎదురుచూడటం అనుష్క స్టైల్. అయితే ఇంత సుదీర్ఘ గ్యాప్ రావడంతో ఆమె ఇక సినిమాలు చేయరనే ప్రచారం మొదలైంది. అయితే అనుష్కపై ఇలాంటి ఊహాగానాలు ఇప్పటివి కావు. కొన్నేళ్లుగా ఆమె వ్యక్తిగత జీవితంపై, సినిమాలపై రకరకాల పుకార్లు వస్తూనే ఉన్నాయి. పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్తో లింక్ చేస్తూ అప్పట్లో ఆమెపై వచ్చిన కథనాలకు కొదవ లేదు. ఆ తర్వాత కొన్నాళ్ల పాటు, ఆమె సినిమాలకు దూరమైందనే ప్రచారం కూడా నడిచింది.అయితే దీనిపై అనుష్క నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. దీంతో ఆమె నిజంగానే సినిమాలకు గుడ్బై చెప్పారా? లేక మరో క్రేజీ ప్రాజెక్ట్తో సర్ప్రైజ్ చేస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది. సాధారణంగా ఓ హీరో ఏడాది గ్యాప్ తీసుకున్నా పర్వాలేదు. కానీ అదే హీరోయిన్ తీసుకుంటే అంతే సంగతులు. ఇక అనుష్క లాంటి నటిని ఇలాంటి గ్యాప్స్ ఏం చేయలేవు. మరో క్రేజీ ప్రాజెక్ట్తో వచ్చి మరో సూపర్ హిట్ కొడితే ఈ రూమర్స్ అన్నీ రూమర్స్గానే మిగిలిపోతాయి. అయితే ఇండస్ట్రీలో చాలామంది నుంచి మాత్రం ఇక ఆమె సినిమాలు చేయదనే టాక్ నడుస్తోంది. దీనిపై అనుష్క టీమ్ నుంచి ఏదైనా స్పందన వస్తుందేమో చూడాలి. -
మళ్లీ భగ్గుమన్న కంగనా రనౌత్.. దిమ్మతిరిగిపోయేలా కౌంటర్
సినీనటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో తన ఇంటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను పంచుకుంటారు. జన్మాష్టమి సందర్భంగా కంగనా ఆన్లైన్లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. తాను మనాలీలోని తన ఇంట్లో ఉన్నానని, పండుగ సందర్భంగా ప్రత్యేక భోగ్ తయారు చేస్తున్నానని ఆ వీడియోలో వెల్లడించారు. ఈ వీడియో ఆన్లైన్లో వైరల్ అయింది. దీనిపై ఎక్స్లో ఓ వ్యక్తి స్పందిస్తూ.. కంగనా వంట చేస్తున్న పాత్ర నల్లగా ఉన్నప్పటికీ, ఆమె గ్యాస్ వెలిగించలేదని వ్యాఖ్యానించారు. దీనిని గమనించిన కంగనా వెంటనే ఆ వ్యక్తికి కామెంట్లోనే ఘాటుగా సమాధానం ఇచ్చారు.కంగనా ఏమన్నారు?కంగనా వంట చేస్తున్న పాత్ర అప్పటికే నల్లగా ఉన్నప్పటికీ, గ్యాస్ స్టవ్ వెలిగించడం మర్చిపోయారని ఎక్స్లో ఓ వ్యక్తి వ్యాఖ్యానించారు. దీనికి కంగనా స్పందిస్తూ.. “ఇది హల్వా కాదు, భోగ్. ఇందులో చాలా పదార్థాలను విడివిడిగా తయారు చేసి, ఈ దశలో అన్నింటినీ కలుపుతారు. ఆ తర్వాత దాన్ని సెట్ చేసి ముక్కలుగా కోస్తారు. తల్లిదండ్రులకు, ఈ గ్రహానికి భారంగా ఉన్న వ్యక్తుల నుంచి వంట నైపుణ్యాలను ఆశించలేం. మీరు తినడంపైనే దృష్టి పెట్టండి. వంట గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు” అని పేర్కొన్నారు. Gas तो जला लो टंगना ड्रामेबाज़ 😁ओर कड़ाई देखो कितना काला है 😂🤣🤣 pic.twitter.com/OOWzM7lvjs— Queen 👸 (@Queen510619151) September 4, 2026కంగనా ఇటీవల చేసిన వ్యాఖ్యలు వైరల్కంగనా ఇటీవల ఏసిన వ్యాఖ్యలు కొంతమంది యువ హిందూ మహిళలు బాధ్యత లేకుండా స్వేచ్ఛను ప్రదర్శిస్తున్నారని కంగనా వ్యాఖ్యానించారు. వారిని ‘జనరేషన్ గట్టర్’ అని పేర్కొనడం వివాదానికి దారితీసింది. ఈ వ్యాఖ్యలపై యోగా గురువు స్వామి రామ్దేవ్ విమర్శలు చేశారు. ఇది ‘చెడిపోయిన మనస్తత్వానికి’ నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించినట్లు సమాచారం. దీనిని కంగనా తీవ్రంగా తప్పుబట్టారు. తనపై ఉన్న ఎస్సీ కేసును గమనించాలని రామ్దేవ్కు సూచించారు.రాఖీ సందర్భంగా వీరిద్దరి మధ్య బహిరంగ వివాదం ముగిసింది. ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో కంగనా రామ్దేవ్ విలేకరులతో మాట్లాడుతున్న వీడియోను పంచుకున్నారు. తనతో ఉన్న వివాదాన్ని ముగించి, దాన్ని సంభాషణగా మార్చుకోవాలని కోరుకుంటున్నట్లు రామ్దేవ్ అందులో చెప్పారు. రాఖీ సందర్భంగా తనకు వద్ద ఓ బహుమతి ఉందని, శుభదినాన ఫోన్ చేసి శుభాకాంక్షలు చెబుతానని కూడా ఆయన తెలిపారు.కంగనా పోస్ట్ చేస్తూ.. “పండుగ రోజు.. తప్పులు, పొరపాట్లన్నింటినీ క్షమించేందుకు ఉద్దేశించినది. నా సోదరుడు బాబా రామ్దేవ్ జీ వివాదం కాదు, సంభాషణ ఉండాలని చెప్పడం చాలా మంచిగా అనిపించింది” అని చెప్పారు. ఆమె రామ్దేవ్ ఆప్యాయతను స్వీకరిస్తూ.. “ఈ రక్షాబంధన్ రోజున ఆయన పంపిన స్వీట్లు, పెద్ద సోదరుడి ప్రేమ రెండింటినీ స్వీకరిస్తున్నాను. చాలా ధన్యవాదాలు. భగవంతుడు మీకు దీర్ఘాయువు ప్రసాదించాలి” అని పేర్కొన్నారు.కంగనా గతంలో కృతి సనన్, ఆమె వైరల్ అయిన ప్రకటనపై కూడా విమర్శలు చేశారు. ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ.. “మహిళగా ఉండటానికి ఇది అద్భుతమైన సమయం. మన అలమారాల్లో అనేక రకాల దుస్తులు ఉన్నాయి. నేటి మహిళ ప్రపంచ మహిళ. కాక్టెయిల్ డ్రెస్ల నుంచి లెహంగా చోళీల వరకు, జీన్స్ నుంచి చీరల వరకు, బికినీల నుంచి సల్వార్ కమీజ్ వరకు.. ఈ రోజు మనకు అందుబాటులో ఉన్న ఇన్ని ఆప్షన్లలో మీ సోదరుడికి బికినీ లేదా లోదుస్తులతో రాఖీ ఎందుకు కట్టాలి? మీకు ఉన్న అన్ని స్టైలింగ్ ఆప్షన్లు ఏమయ్యాయి? హా హా.. ఆ ప్రకటన ఉద్దేశపూర్వకంగానే అసహజంగా కనిపిస్తోంది” అని విమర్శించారు. -
పాఠాలు చెబుతాం... నిలదీస్తాం
టీచర్ అంటే క్లాస్ రూమ్లో పాఠాలు చెప్పడం, స్ట్రిక్ట్గా ఉండటం మాత్రమే కాదు... విద్యను వ్యాపారంగా మార్చాలనుకుంటే నిలదీస్తాం అంటున్నారు సిల్వర్ స్క్రీన్ టీచర్స్. నేడు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా త్వరలో తెరకు రానున్న కొన్ని టీచర్ క్యారెక్టర్స్ గురించి తెలుసుకుందాం.ప్రొఫెసర్ పాఠాలు యాక్షన్ మోడ్లో స్క్రీన్ పై ప్రభాస్ ఎలా కనిపిస్తారో చాలా సినిమాల్లో చూశాం. కానీ ‘మిర్చి, మిస్టర్ పర్ఫెక్ట్’ వంటి సినిమాల్లో ప్రభాస్ క్లాస్గానూ కనిపించారు. తాజా సినిమా ‘స్పిరిట్’లో కూడా కొన్ని సీన్స్లో క్లాస్గా కనిపిస్తారట. ఈ చిత్రంలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్, డాన్, కాలేజీ ప్రొఫెసర్... ఇలా మూడు డిఫరెంట్ షేడ్స్లో కనిపిస్తారట. ఆ మధ్య హైదరాబాద్లోని ఓ ప్రముఖ కాలేజీలో ప్రభాస్ పాల్గొనగా కీలక సన్నివేశాలను తీశారు. ప్రొఫెసర్గా ప్రభాస్ నటించిన సన్నివేశాలనే ఆ షెడ్యూల్లో చిత్రీకరించారనే ప్రచారం జరుగుతోంది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 5న రిలీజ్ కానుంది. త్రిప్తి దిమ్రి హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో వివేక్ ఓబెరాయ్, ఐశ్వర్యా దేశాయ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తండ్రి గురువు... కుమార్తె శిష్యురాలు నిజ జీవితంలో తండ్రీ కూతుళ్ళు అయిన షారుక్ ఖాన్ –సుహానా ఖాన్లు ‘కింగ్’ సినిమాలో గురు–శిష్యులుగా కనిపించనున్నారని తెలిసింది. కాకపోతే ఈ చిత్రంలో గురువుగా సుహానాకు షారుక్ కాలేజీ పాఠాలు చెప్పరు. జీవిత పాఠాలు నేర్పుతారు. తనకు అన్యాయం చేసిన వారి భరతం పట్టే పాత్రలో సుహానా నటిస్తున్నారని తెలిసింది. ఈ చిత్రంలో ఆమె కొన్ని రిస్కీ యాక్షన్ సీక్వెన్స్లు చేయాల్సి ఉంది. ఆన్సెట్స్లో ఈ రిస్కీ ఫైట్స్ చేయడానికి షారుక్ సహాయం చేస్తున్నారట. అలాగే సినిమాలోనూ యాక్షన్ గురువుగా కనిపిస్తారని టాక్. ఈ సినిమా డిసెంబరు 24న విడుదల కానుంది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అభిషేక్ బచ్చన్, దీపికా పదుకోన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. చాక్పీస్... తుపాకీ ‘హిస్టరీ లెసన్స్ మరింత ఉత్కంఠభరితంగా ఉండబోతున్నాయి’ అంటూ ఆ మధ్య ‘టీచర్’ చిత్రాన్ని ప్రకటించారు దర్శకుడు బాలు శర్మ. ఈ సినిమా టైటిల్ లోగోలో చాక్పీస్ మాత్రమే కాదు... తుపాకీ కూడా కనిపించడం చర్చనీయాంశమైంది. యాక్షన్ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని ఊహించవచ్చు. టీచర్గా ప్రముఖ నటి సిమ్రాన్ నటిస్తున్నారు. క్లాస్ రూమ్లో పాఠాలు చెప్పడంతో పాటు దుష్టుల పని పట్టే టీచర్గా ఆమె కనిపించనున్నారని కోలీవుడ్ టాక్. ఈ ఏడాదే ఈ చిత్రం విడుదల కానుంది. దబాంగ్ టీచర్ ఆమె కోటీశ్వరురాలు... కానీ ఆ విషయాన్ని దాచిపెట్టి, టీచర్గా చేరుతుందట. అది కూడా ట్రైనీ టీచర్గా... ‘దబాంగ్ టీచర్’ పేరుతో రూపొందుతున్న సిరీస్లో కనికా కపూర్ ఈ పాత్రను చేస్తున్నారు. ఆత్మవిశ్వాసం, న్యాయం కోసం పోరాటం, విలక్షణమైన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే టీచర్ నైనా పాత్ర కోసం తాను సుష్మితా సేన్, ఆలియా భట్లను స్ఫూర్తిగా తీసుకున్నానని, వారి బాడీ లాంగ్వేజ్ టీచర్ క్యారెక్టర్కి తగ్గట్టుగా ఉంటుందని కనికా పేర్కొన్నారు. షకేబ్ సయ్యద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సిరీస్ డిజిటల్ వేదికగా త్వరలో వీక్షకుల ముందుకు రానుంది. -
జూ. ఎన్టీఆర్ కోసం క్యూ కడుతున్న బాలీవుడ్ స్టార్స్
యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘డ్రాగన్’ సినిమాపై రోజురోజుకూ ఆసక్తి పెరుగుతోంది. ఇప్పటికే అనీల్ కపూర్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలోకి మరో బాలీవుడ్ స్టార్ ఎంట్రీ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది.తాజా సమాచారం ప్రకారం.. బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ ‘డ్రాగన్’లో పవర్ఫుల్ విలన్గా కనిపించనున్నాడట. అలాగే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ కూడా సినిమాలో కీలక పాత్ర పోషించనున్నట్లు వార్తలు జోరందుకున్నాయి. నిజానికి డ్రాగన్ సినిమాలోకి అలియాను తీసుకుంటారనే ప్రచారం ఏడాది కిందటే నడిచింది. అయితే ఈ విషయంపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.ఇక ఈ సినిమా షూటింగ్ మరో రెండు వారాల్లో కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఎలాంటి బ్రేకులు లేకుండా షూటింగ్ పూర్తి చేసి, వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి చిత్రీకరణను ముగించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది జూన్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుత సమాచారం ప్రకారం ‘డ్రాగన్’ను రెండు భాగాలుగా కాకుండా ఒకే సినిమాగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో కాంతార బ్యూటీ రుక్మిణి వసంత్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. నందమూరి కల్యాణ్రామ్, నవీన్ యేర్నెని, వై. రవిశంకర్, కొసరాజు హరికృష్ణ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. -
సుశాంత్ సింగ్ మాజీ మేనేజర్ దిశ కేసు : సీబీఐకి బాంబే హైకోర్టు ఆదేశాలు
సాక్షి, ముంబై: Disha Salian's Death Case దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మాజీ మేనేజర్ దిశా సాలియాన్ అనుమానాస్పద మరణం కేసు మరోసారి వార్తల్లో నిలిచింది. ఎఫ్ఐఆర్ నమోదు చేసి, సమగ్ర దర్యాప్తు చేపట్టాలని బాంబే హైకోర్టు బుధవారం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI)ని ఆదేశించింది. దర్యాప్తు అధికారికి ఎవరిపైనైనా తగిన ఆధారాలు లభిస్తే తప్ప, వారిని నిందితులుగా పరిగణించ కూడదని కోర్టు స్పష్టం చేసింది. కుటుంబ సభ్యులు హత్య అనుమానాలు వ్యక్తం చేసినప్పటికీ ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేయకుండా కేవలం ప్రమాదవశాత్తు మృతి (ADR) గా మాత్రమే ఎందుకు పరిగణించారని న్యాయస్థానం ప్రశ్నించింది. అలాగే, ఐదేళ్లు గడుస్తున్నా పోస్టుమార్టం నివేదికను కుటుంబానికి అందజేయక పోవడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.ఈ కేసులో బీఎన్ఎస్ కింద కేసు నమోదు చేయాలని కూడా బాంబే హైకోర్టు ఆదేశించింది.దిశ తండ్రి సతీష్ సాలియాన్ తన పిటిషన్లో తీవ్రమైన ఆరోపణలు చేశారు. తన కుమార్తె దిశపై అత్యాచారం చేసి హత్య చేశారని ఆయన పేర్కొన్నారు. ఈ ఆధారంగా, కేసు నమోదు చేసి, నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ పిటిషన్ను విచారించిన బాంబే హైకోర్టు తాజా ఆదేశాలిచ్చింది. ఈ కేసు విచారణ సందర్భంగా, ధర్మాసనం పోలీసుల ప్రవర్తనపై దృష్టి సారిస్తూ ఈ క్రింది ముఖ్యమైన అంశాలను లేవనెత్తింది.రాజకీయ నాయకులపై వచ్చిన ఫిర్యాదులు లేదా రాజకీయ ఆరోపణలతో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. నిస్సహాయుడైన ఒక తండ్రి మనోభావాలను, న్యాయాన్ని పరిగణనలోకి తీసుకుని, ఈ విషయంపై చట్టబద్ధమైన, శాసనబద్ధమైన, పారదర్శకమైన విచారణ జరిపి, సరైన ముగింపు ఇవ్వడం అవసరమని పేర్కొంది. ఇదీ చదవండి : లక్షల్లో జీతం, హెచ్1 బీ వీసా : తిరిగి ఇండియాకు, ఎందుకు?మాల్వాణి పోలీసు స్టేషన్ పరిధిలోని సంబంధిత కేసు రికార్డులన్నింటినీ సీబీఐకి అప్పగించాలని కోర్టు స్పష్టం చేసింది. సరిపడా ఆధారాలు లభించే వరకు ఎవరినీ నిందితులుగా పరిగణించవద్దని, ఆధారాలు లభించిన వారిపైనే చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఒకవేళ సీబీఐ నెగెటివ్ రిపోస్ట్ ఇస్తే, దానిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ 'ప్రోటెస్ట్ పిటిషన్' దాఖలు చేసే హక్కు పిటిషనర్కు ఉంటుందని తెలిపింది.కాగా నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ వద్ద మేనేజర్గా పనిచేసిన సెలబ్రిటీ మేనేజర్ దిశ సాలియాన్, 2020 జూన్ 8న అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ముంబైలోని మలాడ్ ప్రాంతంలోని నివాస భవనం 14వ అంతస్తు నుండి కిందపడి కన్నుమూసింది. ఆమె మరణించిన ఆరు రోజులకే (2020, జూన్14న) సుశాంత్ సింగ్ రాజ్పుత్ కూడా తన నివాసనంలో అనుమానాస్పదంగా మరణించడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ అంశం 2022 నాటి మహారాష్ట్ర శాసనసభలో ప్రకంపనలు రేపింది. ఈ కేసులో, నితేష్ రాణే ఆదిత్య థాకరేకు నార్కో పరీక్ష చేయాలని కూడా షిండే వర్గం డిమాండ్ చేసింది. -
అప్పుడు డిజాస్టర్.. ఇప్పుడు బ్లాక్బస్టర్.. ఇదేం విచిత్రం..!
ఇటీవల బాక్సాఫీస్ వద్ద విచిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. కంటెంట్ ఉన్న చిన్న సినిమాలు సత్తా చాటుతున్నాయి. ఇటీవల రిలీజైన టాక్సిక్ ఒక్క రోజుకే బాక్సాఫీస్ వద్ద కనిపించకుండా పోయింది. భారీ బడ్జెట్, తారాగణం ఉన్నప్పటికీ కంటెంట్ పరంగా మెప్పించలేకపోయింది. అలాంటి ఈ టైమ్లో ఇరుముడి సూపర్ టాక్తో దూసుకెళ్తోంది. అంతేకాకుండా మలయాళ చిన్న సినిమా బెత్లెహమ్ ఫ్యామిలీ యూనిట్ సైతం అదరగొడుతోంది.ఇదిలా ఉంటే ఎప్పుడో 19 ఏళ్ల క్రితం వచ్చిన మూవీకి సీక్వెల్గా ఆవారాపన్-2 ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. 2007లో ఇమ్రాన్ హష్మి, శ్రియా శరణ్ జంటగా ఆవారాపన్ డిజాస్టర్గా నిలిచింది. అయితే ఈ మూవీకి సీక్వెల్గా వచ్చిన ఈ సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద అదరగొడుతోంది. ఏకంగా రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలో ఇమ్రాన్ హష్మి, దిశా పటానీ జంటగా కనిపించారు. ఈ చిత్రాన్ని నితిన్ కక్కర్ దర్శకత్వంలో తెరకెక్కించారు.అప్పట్లో ఫ్లాప్ అయిన సినిమా సీక్వెల్కు ఇప్పుడు వసూళ్లు రావడంపై బాలీవుడ్లో చర్చ మొదలైంది. ఆగస్టు 14న విడుదలై ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా రూ.210 కోట్లు సాధించింది. ఈ మూవీ సూపర్హిట్గా నిలవడంపై ఇమ్రాన్ హష్మి ఎమోషనల్ అయ్యారు. -
నేపాల్ వరదలు : మరోసారి సోనూసూద్ ఔదార్యం
ఆపదలోఉన్నవారిని ఆదుకునేందుకు ఎప్పుడూ ముందుండే బాలీవుడ్ నటుడు సోనూ సూద్. తాజాగా నేపల్ విలయం సమయంలో కూడా మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. నేపాల్ వరద బాధితులను ఆదుకునేందుకు ముందడుగు వేశారు. కష్టకాలంలో ఉన్న నేపాల్ ప్రజలకు సాయం అందించేందుకు రానున్న కాలంలో కూడా పనిచేస్తానని చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.నేపాల్ వరద బాధితులకు సహాయం అందించేందుకు సోనూ సూద్ ఖాఠ్మండు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరద బాధితులను కలిసి, వారికి సహాయక సామగ్రిని పంపిణీ చేయడానికి ఇక్కడి వచ్చామన్నారు. వారు తిరిగి సామాన్య జీవితాన్ని గడిపేలా తమ వంతు సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. పెద్ద మొత్తంలో దుప్పట్లు, ఆహారాన్ని బాధితులకు అందించేందుకు తీసుకొచ్చామని చెప్పారు. రాబోయే నెలల్లో కూడా నేపాల్కు సహాయం అందేలా చూసేందుకు కృషి చేస్తామని హామీ ఇవ్వడం విశేషం.Nepal, you are not alone. We are coming with food, shelter and the strength to help you rebuild. 🇳🇵❤️— sonu sood (@SonuSood) August 26, 2026నేపాల్లో ప్రకృతి విపత్తు గురించి తెలిసిన వెంటనే సోషల్ మీడియా ద్వారా తన విచారాన్ని వ్యక్తం చేసిన సోనూ సూద్ సాయం చేస్తానని అప్పుడే మాట ఇచ్చారు. "నేపాల్, నీవు ఒంటరివి కావు.. మీకు అండగా నిలిచి, తిరిగి కోలుకోవడంలో సహాయపడేందుకు ఆహారం, ఆశ్రయం మరియు ధైర్యంతో వస్తున్నాం అంటూ ట్విట్ చేయడం గమనార్హం. #WATCH | Bollywood actor Sonu Sood arrives in Kathmandu to distribute relief to Nepali flood victimsHe says, "We are here to meet flood victims and to distribute relief material to them. We will try to build their lives again. We have brought a lot of blankets and food… pic.twitter.com/6rONSZfxjD— ANI (@ANI) September 1, 2026 > ఇదీ చదవండి: లక్షల్లో జీతం, హెచ్1 బీ వీసా : తిరిగి ఇండియాకు, ఎందుకు? కాగా భారతదేశంలో కోవిడ్ మహమ్మారి పంజా విసిరిన సమయంలో సోనూసూద్ ఎంతోమందికి అండగా నిలబడ్డారు. లాక్డౌన్ కాలంలో విదేశాల్లో చిక్కుకుపోయిన వారిని సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చేలా కృషి చేశారు. ఇదే కాలంలో స్మార్ట్ఫోన్ లేక ఆన్లైన్ తరగతులకు హాజరు కాలేని పేద విద్యార్థులకు నేను ఉన్నానంటూ భరోసా ఇచ్చారు. అంతేకాదు సాయం చేయాలని సోషల్ మీడియా ద్వారా అర్థించిన ఎంతోమందికి సాయం చేసిన కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఇదీ చదవండి : 6 రోజుల్లొ 100 రెస్క్యూ ఆపరేషన్లు: ఎవరీ ప్రియా అధికారి? -
పెళ్లయిన 5 నెలలకే 'సాహో' సింగర్ విడాకులు
సినిమా ఇండస్ట్రీలో డేటింగ్, పెళ్లి, విడాకులు అనే మాటలు తరచుగా వినిపిస్తూనే ఉంటాయి. అందుకు తగ్గట్లే సెలబ్రిటీలు ఒకటికి మించి వివాహాలు చేసుకుని వార్తల్లో నిలుస్తుంటారు. అదే టైంలో సడన్గా విడిపోయి షాకులిస్తుంటారు. ఇప్పుడు అలానే ప్రముఖ సింగర్, ర్యాపర్ బాద్షా.. పెళ్లయిన ఐదు నెలలకే రెండో భార్యకు కూడా విడాకులు ఇచ్చేశాడు. ఈ మేరకు అధికారికంగా ఈ విషయాన్ని ఇద్దరూ ప్రకటించారు.(ఇదీ చదవండి: ఆమెకు ప్రశాంతత ఇవ్వలేదు..విడాకులకు కారణం నేనే: 'జైలర్' విలన్)ఆదిత్య ప్రతీక్ సింగ్ సిసోడియా అలియాస్ బాద్షా స్వతహాగా పంజాబీ. హిందీ, పంజాబీ భాషల్లో ఎక్కువగా పాటలు పాడుతుంటాడు. సొంత ఆల్బమ్ సాంగ్స్తో పాటు సినిమాల్లోనూ పాటలు పాడుతుంటాడు. ప్రభాస్ 'సాహో'లో బ్యాడ్ బాయ్, అజిత్ 'వేదాళం'లో అలుమా డోలుమా గీతాల్ని ఆలపించి దక్షిణాది ప్రేక్షకులకు ఇతడు సుపరిచతమే.అసలు విషయానికొస్తే గతంలో జాస్మిన్ మాసి అనే మహిళని 2012లో పెళ్లి చేసుకున్నాడు. వీళ్లకు ఓ కూతురు కూడా ఉంది. కానీ 2020లో ఈమె నుంచి విడిపోయాడు. తర్వాత సింగిల్గానే ఉన్నాడు. ఈ ఏడాది మార్చిలో పంజాబీ నటి ఇషా రిఖీని పెళ్లి చేసుకున్నాడు. ఈ తంతు రహస్యంగా జరిగింది. కానీ వివాహం విషయాన్ని జూన్లో ఇషా ధ్రువీకరించింది. మరి ఏమైందో ఏమో గత నెలరోజులుగా వీరిద్దరూ విడిపోనున్నారనే రూమర్స్ వినిపించాయి. వాటిని నిజం చేస్తూ బాద్షా-ఇషా సంయుక్తంగా ఇప్పుడు విడాకులు ప్రకటించారు. సోమవారం రాత్రి ఇన్స్టా ఖాతాల్లో స్టోరీలు పోస్ట్ చేశారు.'నేను, ఇషా రిఖీ పరస్పర అంగీకారంతో విడిపోవాలని నిర్ణయించుకున్నాం. ఇకపై మా జీవితాలు వేర్వేరు మార్గాల్లో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాం. ఇది పరస్పర గౌరవంతో తీసుకున్నదే. ఈ టైంలో మా ప్రైవసీని గౌరవించాలని అందరినీ కోరుతున్నాం. మా బంధం గురించి ఇకపై ఎలాంటి రూమర్స్ వ్యాప్తి చేయొద్దని మనస్పూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇదే మా ప్రకటన' అని బాద్షా పేర్కొన్నాడు.(ఇదీ చదవండి: మేం విడాకులు తీసుకున్నాం.. కానీ పాప విషయంలో:జీవీ ప్రకాశ్) View this post on Instagram A post shared by Isha Rikhi (@isharikhi) -
ఆమిర్ నిజంగానే 'గజిని'.. అందుకే మర్చిపోయాడు: సోనమ్ వాంగ్ చుక్
ప్రముఖ పర్యావరణవేత్త, శాస్త్రవేత్త సోనమ్ వాంగ్ చుక్ గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. 'త్రీ ఇడియట్స్' సినిమాని ఈయన జీవితాన్ని ఆధారంగా చేసుకుని తీశారని కొందరు, లేదు లేదు అని మరికొందరు వాదిస్తూ ఉంటారు. ఈ సంగతి పక్కనబెడితే కొన్నిరోజుల క్రితం ఢిల్లీలో 'జంతర్ మంతర్' దగ్గర జరిగిన విద్యార్థుల నిరసన కార్యక్రమంలోనూ ఆమరణ నిరాహార దీక్ష చేసి వార్తల్లో నిలిచారు. తాజాగా ఓ పాడ్కాస్ట్లో పాల్గొన్న ఈయన చాలా విషయాలు మాట్లాడారు. హీరో ఆమిర్ ఖాన్పై గట్టిగానే సెటైర్లు వేశారు. తనని కలిసి సంగతి అతడు 'గజిని'లా నిజంగానే మర్చిపోయాడని దెప్పిపొడిచారు.(ఇదీ చదవండి: ట్రెండింగ్లో 'ఏష నాగుల'... టాలీవుడ్ను ఏలుతున్న తెలంగాణ ఫోక్!)'ఆమిర్ ఖాన్ 'గజిని' లుక్లో ఉన్నప్పుడు నా ప్రసంగాన్ని చూస్తున్న వీడియోలు ఈ మధ్య మళ్లీ బయటకొచ్చాయి. బహుశా ఆ పాత్రలో ఎక్కువ లీనమైపోవడం వల్ల ఆయనకు ఆ పాత్రలా షార్ట్ టర్మ్ మెమొరీ లాస్ వచ్చి, 15 నిమిషాల తర్వాత నన్ను కలిసిన విషయాన్ని మర్చిపోయి ఉండొచ్చు. అందుకే ఆయన అలా చెప్పడం నాకు ఆశ్చర్యం అనిపించలేదు. మా మధ్య జరిగిన భేటీ కేవలం పలకరింపులకే పరిమితం కాలేదు. చాలాసేపు వివిధ అంశాల గురించి మాట్లాడుకున్నాం' అని సోనమ్ చెప్పుకొచ్చారు.త్రీ ఇడియట్స్ సినిమాలోని పున్సుఖ్ వాంగ్డూ పాత్ర పూర్తిగా తనని ఆధారంగా చేసుకుని తీశారని తాను చెప్పడం లేదని వాంగ్ చుక్ స్పష్టం చేశారు. 'దానిని స్పూర్తి అనొచ్చు కదా. నేను చెప్పిన ఆలోచనలని ఆయన(ఆమిర్) రచయితలతో పంచుకుని ఉండొచ్చు. తర్వాత వాళ్లు స్టోరీకి అనుగుణంగా వాటిని మార్చి ఉండొచ్చు. అది ఆయనకు తెలియకుండానే జరిగుండొచ్చు. లేదంటే రచయితలకు ఈ ఆలోచనల ఎవరివి అనేది తెలిసి ఉండకపోవచ్చు. ఏది జరిగినా నాకు ఎలాంటి అభ్యంతరం లేదు' అని సోనమ్ అన్నారు.గతంలో ఆమిర్ ఏమన్నాడు?గతంలో ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆమిర్.. 'త్రీ ఇడియట్స్' సినిమాలోని పాత్రకు సోనమ్కి ఎలాంటి సంబంధం లేదని చెప్పాడు. అవన్నీ రూమర్స్ అని కొట్టిపారేశాడు. అదే టైంలో వాంగ్ చుక్ చేస్తున్న సేవలని ప్రశంసించాడు. అయితే తనతో మాట్లాడినప్పటికీ ఆమిర్.. ఈ స్టోరీకి తనకు సంబంధం లేదని అనేసరికి సోనమ్కి ఆగ్రహం వచ్చింది. అదే విషయాన్ని ఇప్పుడు పాడ్కాస్ట్లో వ్యంగ్యంగా వ్యక్తపరిచారు.ఇక తన నిరహార దీక్ష టైంలో హీరో సల్మాన్ ఖాన్ చేసిన 'సోనం ఇట్స్ డన్ బ్రో' అనే ట్వీట్ పైన వాంగ్ చుక్ సరదాగా స్పందించారు. అందరికీ వారి వారి పరిస్థితులు, పరిమితులు ఉండుంటాయి. కాబట్టి వాటి గురించి నేను మాట్లాడాలనుకోవట్లేదు అని అన్నారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'కొరియన్ కనకరాజు'.. అధికారిక ప్రకటన) -
ఇమ్రాన్ హష్మీకి స్వైన్ ఫ్లూ.. ఫ్యాన్స్కి క్షమాపణలు చెప్పిన హీరో
బాలీవుడ్ స్టార్ హీరో ఇమ్రాన్ హష్మీ అనారోగ్యానికి గురయ్యారు. ఆయనకు స్వైన్ ఫ్లూ సోకినట్లు వైద్య పరీక్షల్లో నిర్ధారణ అయినట్లు సమాచారం. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఇమ్రాన్.. ఇటీవల ముంబైకి తిరిగి వచ్చిన అనంతరం వైద్య పరీక్షలు చేయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ పరీక్షల్లో ఇన్ఫ్లూయెంజా ఏ, స్వైన్ ఫ్లూ తేలినట్లు సమాచారం. ప్రస్తుతం వైద్యుల సూచన మేరకు ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు.ఇమ్రాన్ హష్మీ అనారోగ్యానికి గురయ్యారనే విషయం తెలియడంతో ఆయన అభిమానుల్లో ఆందోళన నెలకొంది. అయితే తన ఆరోగ్య పరిస్థితిపై ఇమ్రాన్ ఇప్పటివరకు ప్రత్యేకంగా స్పందించలేదు. మరోవైపు బెంగళూరులో శనివారం జరగాల్సిన తన లైవ్ ఈవెంట్కు హాజరు కాలేకపోతున్నట్లు ఆయన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. అనారోగ్యం కారణంగానే కార్యక్రమానికి దూరంగా ఉండాల్సి వచ్చిందని అభిమానులకు తెలిపారు.అయితే ఈ కార్యక్రమాన్ని పూర్తిగా రద్దు చేయకుండా సెప్టెంబర్ 12కు వాయిదా వేసినట్లు ఇమ్రాన్ ప్రకటించారు. ఇప్పటికే టికెట్లు కొనుగోలు చేసినవారు వాటిని భద్రంగా ఉంచుకోవచ్చని.. కొత్త తేదీన అవే టికెట్లు చెల్లుబాటు అవుతాయని నిర్వాహకులు వెల్లడించినట్లు సమాచారం. కార్యక్రమానికి హాజరు కాలేకపోతున్నందుకు అభిమానులకు ఇమ్రాన్ క్షమాపణలు చెప్పారు.ఇదిలా ఉంటే.. ఇమ్రాన్ హష్మీ ప్రస్తుతం వరుస సినిమాలతో కెరీర్లో జోష్ మీదున్నారు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన ‘ఆవారాపన్ 2’ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నితిన్ కక్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 2007లో విడుదలైన ‘ఆవారాపన్’కు సీక్వెల్గా రూపొందింది. దిశా పటానీ, షబానా అజ్మీ తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషించారు.విడుదలైన తొలిరోజు నుంచే ‘ఆవారాపన్ 2’కు మంచి స్పందన వచ్చింది. రెండో రోజునే ఈ చిత్రం రూ.33.75 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. ఇప్పటి వరకు మొత్తంగా ఈ చిత్రం రూ.200 కోట్లకు పైగా కలెక్షన్స్ని రాబట్టింది. -
తారాపథంలో కాసుల వేట
సినిమా స్టార్స్కి ఆదాయం ఎలా వస్తుంది? అంటే వెంటనే రెమ్యూనరేషన్ ద్వారా అని ఠక్కున చెప్పేసే రోజులు కావివి. యాడ్స్, ప్రమోషన్స్, ఈవెంట్స్... అంటూ వరుసపెట్టి లెక్కించే రోజులు. ‘ఇందుగల దందు లేదను సందేహంబు వలదు ఎందెందు చూసినా అందందే కలదు’ అన్నట్టుగా తారలకు ఆదాయ మార్గాలు ఇబ్బడిముబ్బడిగా విస్తరిస్తున్నాయి. ప్రస్తుత డిజిటల్ ప్రపంచంలోనైతే కాదేదీ కాసుల వేటకు అనర్హం అన్నట్టుగా అది తారా స్థాయికి చేరుకుంది. వరుసగా ‘యాడ్’ చేసుకుంటూ... ఒకప్పుడు హీరో, హీరోయిన్కి సినిమా ఒప్పందం కుదిరితే అందులోనే పారితోషికం ప్రధానంగా ఉండేది. ఏడాదికి కొన్ని సినిమాలు.. వాటి ద్వారా వచ్చే రెమ్యూనరేషన్ను మాత్రమే ప్రధాన ఆదాయంగా భావించేవారు. కానీ తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం బాలీవుడ్ స్టార్స్ షారుక్ఖాన్, సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్, దీపికా పదుకోన్ వంటి వారు రూ. 5 కోట్ల నుంచి రూ. 20 కోట్ల వరకూ వసూలు చేస్తున్నారు. ఇలా సినిమాలు దాటి అడ్వర్టయిజ్మెంట్లలోకి తారలు రావడంతో సినిమాలకు ఆవల తారలకు ఆదాయం మొదలైంది. అక్కడ నుంచి ఒక్కొక్కటిగా ఆదాయ మార్గాలు పెరుగుతూ పోయాయి. ఈవెంట్... స్టార్ వెంటే... ‘‘ఐదేళ్ల పాటు ఒక సినిమాకు సైన్ చేయడం వల్ల అవకాశాలు లేక ఖాళీగా ఉండాల్సి వచ్చింది. ఆ సమయంలో ఈవెంట్లు నాకు బాగా ఉపయోగపడ్డాయి’’ అంటూ ఇటీవల ఒక టాలీవుడ్ నటి మీడియా ఇంటర్వ్యూలో చెప్పారు. అంటే... ఇప్పుడు స్టార్స్ జీవితంలో ఈవెంట్స్ ఎంత ప్రధాన పాత్ర పోషిస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఓ మోస్తరు స్థాయి కలిగిన నటి/నటుడికైనా సరే షోరూమ్స్ ఓపెనింగ్స్ అనేవి రూ.లక్షల్లో ఆదాయాన్ని అందిస్తున్నాయి. ఇక బాలీవుడ్ స్టార్స్ ఆలియా భట్ వంటి వారైతే రూ .3 కోట్లకు తక్కువ కాకుండా వసూలు చేస్తున్నారట. స్టార్... అంబాసిడర్... సాధారణ ప్రకటనలతో పాటు ఇప్పుడు బ్రాండ్ అంబాసిడర్ ఒప్పందాలు కూడా తారలకు పెద్ద ఆదాయ మార్గంగా మారాయి. దుస్తులు, నగలు, వాచీలు, కార్లు, మొబైల్ ఫోన్లు, రియల్ ఎస్టేట్, ఫుడ్ బ్రాండ్లు.. ప్రతీ ఉత్పత్తీ స్టార్ ఇమేజ్ను ఉపయోగించుకోవాలని ఆరాటపడడం తారలకు పైసా వసూల్గా మారింది. కేవలం ప్రకటనలో నటించడం మాత్రమే కాదు. కంపెనీ కార్యక్రమానికి హాజరవడం, కొత్త షోరూమ్ ప్రారంభించడం, ఉత్పత్తిని సోషల్ మీడియాలో చూపించడం, బ్రాండ్ ఈవెంట్లో మాట్లాడటం... ఇలా ఒప్పందం ఆధారంగా అంబాసిడర్ సేవలకు తగ్గట్టుగా స్టార్స్కు పారితోషికం అందుతోంది. ఇది ఓ రకంగా ఏడాదికోసారి అందే జీతం లాంటిదని చెప్పోచ్చు. ఈ తరహా ఒప్పందాల కోసం బిగ్ బి అమితాబ్ బచ్చన్ రూ. 15 కోట్ల వరకూ వసూలు చేస్తారని సమాచారం. హోస్ట్... ఆదాయానికి బెస్ట్... సినిమా కాకుండా టెలివిజన్, ఓటీటీ కూడా తారలకు మరో ఆదాయ వేదికగా అమరిపోయింది. కౌన్ బనేగా కరోర్ పతి అంటూ అమితాబ్ అరంగేట్రం చేయించిన స్టార్ ఆధారిత గేమ్ షోలు ఇప్పుడు స్టార్స్ని కోటీశ్వరుల్ని చేస్తున్నాయి. టాక్ షోలు, రియాలిటీ షోలకు జడ్జిగా వ్యవహరించడం, వెబ్ సిరీస్లకు హోస్టింగ్ చేయడం... ఒక్కో కార్యక్రమానికి వేర్వేరుగా ప్రత్యేక పారితోషికం అందుతోంది. ప్రస్తుతం అన్ని భాషల్లో హల్ చల్ చేస్తున్న బిగ్ బాస్ రియాలిటీ షో ఈ తరహా స్టార్ ఆధారిత కార్యక్రమాలకు బెస్ట్ ఎగ్జాంపుల్. హిందీ బిగ్ బాస్కు హోస్ట్గా వ్యవహరిస్తున్న సల్మాన్ ఖాన్ ఒక్క ఎపిసోడ్కే రూ. 10 నుంచి 15 కోట్ల వరకూ అందుకుంటున్నారని అంచనా. స్టార్ కనిపిస్తే చాలు సినిమా షూటింగ్లో కాకుండా ఒక వివాహ వేడుకలో, కార్పొరేట్ ఈవెంట్లో, షోరూమ్ ప్రారంభోత్సవంలో లేదా అవార్డు కార్యక్రమంలో కనిపించడం కూడా ఇప్పుడు స్టార్లకు పెద్ద ఆదాయమే. టాప్ బాలీవుడ్ స్టార్స్ ప్రైవేట్ ఈవెంట్లలో కనిపించడానికి భారీ మొత్తాలు వసూలు చేస్తున్నారు. అక్కడ ఆ స్టార్ ఉండటం వల్ల ఆ కార్యక్రమానికి వచ్చే ప్రచారం, సోషల్ మీడియా రీచ్, ఫొటోలు, వీడియోలు, బ్రాండ్కు లభించే గుర్తింపు కూడా ΄్యాకేజీలో భాగమే. పలువురు సంపన్నుల వివాహ వేడుకల్లో కనిపించడానికి ఇంత, నర్తించడానికి ఇంత, గెస్ట్లతో పిచ్చాపాటీకి ఇంత... చొప్పున కూడా స్టార్స్ అందుకుంటున్నారు. సోషల్ మీడియా... సెలబ్రిటీకి వేరయా... అనేక మందిని సెలబ్రిటీలుగా మార్చిన ఘనత సోషల్ మీడియాదే అనడం నిస్సందేహం. అలాగే సెలబ్రిటీలను మరింత ధనవంతులుగా మారుస్తోన్న పుణ్యం కూడా దానిదే అని చెప్పాలి. తారలకు అందే ఆదాయ అవకాశాలకు ఆకాశమే హద్దు అన్నట్టుగా అన్ని రకాల బం«ధనాల్ని తెంచేసింది డిజిటల్ ప్రపంచం. సోషల్ మీడియా విప్లవంతో స్టార్కి ఉన్న ఫాలోయింగ్ ఒక ఆస్తిగా మారింది. ఒక ప్రముఖ సెలబ్రిటీ ఇన్స్టాగ్రామ్లో ఒక బ్రాండ్ను ప్రస్తావిస్తే లక్షలాది మంది కళ్లముందు ఆ ఉత్పత్తి కనిపిస్తుంది. స్టార్కి ఉన్న ‘రీచ్’ను కంపెనీలు భారీగా కొనుగోలు చేస్తున్నాయి.కొన్ని మార్కెట్ అంచనాల ప్రకారం టాప్ సెలబ్రిటీల ఒక్కో స్పాన్సర్డ్ ఇన్స్టాగ్రామ్ పోస్టుకు కోట్ల రూపాయల వరకు చెల్లింపులు జరుగుతున్నాయి. తన ఇన్స్టాగ్రామ్ పేజీలో ఒక ఫొటో, రీల్ లేదా బ్రాండ్ ప్రస్తావన చేయడం ద్వారా స్టార్ కొన్ని కోట్లు సంపాదించవచ్చు. స్టాటిక్ పోస్టు, స్టోరీ, రీల్, బ్రాండ్తో కొలాబరేషన్... ఒక్కో ఫార్మాట్కి ఒక్కో రేటు ఉంటుంది.పెద్ద ఫాలోయింగ్తో పాటు ఎంగేజ్మెంట్ ఎక్కువగా ఉన్న సెలబ్రిటీకి మరింత విలువ ఉంటుంది. కేవలం ఒక్క ఇన్స్టా పోస్ట్ ద్వారానే ప్రియాంక చో ప్రా రూ .3 నుంచి 4 కోట్ల వరకూ అందుకుంటుందని సమాచారం. ఒక స్టార్కి 5 కోట్ల మంది ఫాలోవర్లు ఉంటే, ఆ సంఖ్యను కంపెనీ తన ఉత్పత్తిని ప్రచారం చేయడానికి ఉపయోగించుకోవచ్చు. ఈ నేపథ్యంలో సినిమా జయాపజయాలకు సంబంధం లేకుండా డిజిటల్ రీచ్, ఎంగేజ్మెంట్, అభిమానుల ఆదరణ కూడా స్టార్ పారితోషికాన్ని నిర్ణయించే అంశాలుగా మారాయి.ఎడ్వర్టయిజ్మెంట్ నుంచి ఎమోషన్ దాకా... ‘‘మీ అభిమాన హీరో/హీరోయిన్తో మీ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పించుకోవాలనుకుంటున్నారా?’’ అనే కాన్సెప్ట్ కూడా ఇప్పుడు వ్యాపారంగా మారింది. ట్రూ ఫ్యాన్, సెలెవిష్, ఫ్యాన్ బజ్ వంటి ΄్లాట్ఫామ్ల ద్వారా సెలబ్రిటీల నుంచి వ్యక్తిగత వీడియో సందేశాలు, బర్త్డే విషెస్, యానివర్సరీ విషెస్, షౌట్ఔట్స్ వంటివి బుక్ చేసుకునే అవకాశం వచ్చేసింది. అంటే... కూర్చున్న చోట్నుంచి కదలకుండా స్టార్ అభిమానికి నేరుగా కనిపించడమే ఒక మోనిటైజేషన్ మోడల్గా మారింది. దీంతో ‘ఫ్యాన్ ఫాలోయింగ్’ అనే పదానికి కొత్త అర్థం వచ్చింది. ఒకప్పుడు అభిమానులు స్టార్ ఫొటోను కొనేవారు. ఇప్పుడు స్టార్ తమ పేరు చెప్పే వీడియోను కొనుగోలు చేస్తున్నారన్నమాట. ఆట చూడడం కూడా ఆదాయమే... తాజా ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా విరాట్ కోహ్లీకి మద్దతుగా మ్యాచ్కి వెళ్లిన బాలీవుడ్ స్టార్ అనుష్క శర్మ... ఆమె సాధారణంగా కనిపించే దుస్తులతో ఉన్నప్పటికీ ఆమె వైరల్ అయింది. దానికి కారణం ఆమె చేతికి పెట్టుకున్న అంతర్జాతీయ బ్రాండ్ కార్టియర్ పాంథేర్ వాచ్. ఆమె పెట్టుకున్న వాచ్కి సోషల్ మీడియాలో, ఫ్యాషన్ మీడియాలో విపరీతమైన ఆసక్తి వచ్చింది. ఆ వాచ్ విలువను కొన్ని నివేదికలు సుమారు రూ. 28 లక్షలుగా పేర్కొన్నాయి. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే... అనుష్క ఈ వాచీ గురించి ఏ ప్రకటన కూడా చేయలేదు. కానీ ఆమె ధరించిన వస్తువు వార్తగా మారింది. ఇదే స్టార్ పవర్. ఒక సెలబ్రిటీ ఏం ధరిస్తే అది ఫ్యాషన్ స్టేట్మెంట్గా మారుతుంది. అందుకే బ్రాండ్లు సెలబ్రిటీల ‘ఆర్గానిక్ విజిబిలిటీ’ కోసం కూడా పోటీ పడుతున్నాయి.పెళ్లి వీడియోలకూ ‘రేట్’ ఉంది... సెలబ్రిటీల పెళ్లిళ్లు, ఎంగేజ్మెంట్లు, హనీమూన్లు, కుటుంబ వేడుకలు ఇప్పుడు కేవలం వ్యక్తిగత వ్యవహారాలు మాత్రమే కావు. వాటికి భారీ ప్రేక్షక విలువ ఏర్పడింది. నయనతార–విఘ్నేష్ శివన్ పెళ్లికి సంబంధించిన చిత్రీకరణ హక్కులను ఓ ఓటీటీ సంస్థ భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. ఈ మొత్తం సుమారు రూ. 25 కోట్లుగా ఉండొచ్చట. అదే క్రమంలో అనేకమంది సెలబ్రిటీలు తమ వివాహ వేడుకల ప్రసార హక్కుల్ని విక్రయిస్తున్నారు. అంటే ఒకప్పుడు ‘ఇది మా వ్యక్తిగత జీవితం’ అంటూ మీడియాకు దూరంగా ఉంచే విషయాలు కూడా ఇప్పుడు డాక్యుమెంటరీ, వెబ్ సిరీస్ లేదా ప్రత్యేక కంటెంట్గా మారి కోట్ల రూపాయల విలువను సంతరించుకుంటున్నాయి. స్టార్ అంటే... ఒక బ్రాండ్ ఇప్పటి స్టార్ కేవలం నటుడు కాదు. యాక్టర్ + ఇన్ఫ్లుయెన్సర్ + బ్రాండ్ అంబాసిడర్ + ఈవెంట్ గెస్ట్ + కంటెంట్ క్రియేటర్ + బిజినెస్ బ్రాండ్. సినిమా నుంచి వచ్చే పారితోషికం ఇప్పటికీ ప్రధాన ఆదాయమే. కానీ దాని చుట్టూ ఏర్పడిన ఈ కొత్త ఆదాయ మార్గాలు స్టార్ సంపాదనను మరింత విస్తరించాయి. అందుకే నేటి సినిమా మార్కెట్లో ఒక ఆసక్తికరమైన ప్రశ్న మారిపోయింది. ‘ఈ స్టార్ ఒక్క సినిమాకు ఎంత తీసుకుంటారు?’ అనేది మాత్రమే కాదు... ‘ఈ స్టార్ పేరు, ఇమేజ్, ఫాలోయింగ్, వ్యక్తిగత జీవితానికి మార్కెట్లో ఎంత విలువ ఉంది?’ అనేదే అసలు ప్రశ్న. నిన్నటి వరకు స్టార్ తెరపై కనిపిస్తే నిర్మాత డబ్బు చెల్లించేవాడు. నేడు స్టార్ ఎక్కడ కనిపించినా.. ఆ కనిపించడానికే ఒక ధర చెల్లించడానికి నిర్మాతల్ని మించి ఎందరో ఉన్నారు..స్టార్... స్టార్టప్స్... సినిమా తారలు కేవలం నటులుగా కాకుండా తెలివైన పెట్టుబడిదారులుగా కూడా కనిపించాలని కోరుకుంటున్నారని పరిశ్రమ పరిశీలకులు చెబుతున్నారు. భారత్ ప్రపంచంలోనే మూడో అతి పెద్ద స్టార్టప్ ఎకోసిస్టమ్గా ఎదగడంతో బాలీవుడ్ తారలు స్టార్టప్లలో పెట్టుబడులు పెట్టే ధోరణి మరింత ఊపందుకుంది. ఈ ట్రెండ్ కొత్తది కాదు. 2010ల ప్రారంభంలోనే ఇది మొదలైంది. అప్పట్లో భారత స్టార్టప్ రంగం వేగంగా ఎదగడం ప్రారంభించింది.బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ తొలి తరం సెలబ్రిటీ ఇన్వెస్టర్లలో ఒకరు. 2012లో ఆయన ట్రావెల్ పోర్టల్ యాత్రాలో మైనారిటీ వాటాను కొనుగోలు చేశారు. ఆ తర్వాత పలువురు తారలు ఈ మార్గాన్ని అనుసరించారు. 2022లో ఒక్క ఏడాదిలోనే 14 మంది భారతీయ నటులు 18 స్టార్టప్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టారు. వీటిలో ఎక్కువ భాగం డైరెక్ట్–టు–కన్సూ్యమర్ (డి2సి) బ్రాండ్లే. మిగిలిన పెట్టుబడులు ఎడ్టెక్, ఈ–కామర్స్, ఫుడ్టెక్ వంటి రంగాల్లోకి వెళ్లాయి.సినిమాల్లో పెట్టుబడుల కన్నా... గతంలో చాలామంది నటులు తమ సంపాదనను ప్రధానంగా సినిమాలు, సినిమా నిర్మాణం వంటి రంగాల్లోనే పెట్టేవారు. అయితే సినిమా నిర్మాణం అధిక రిస్క్తో కూడిన వ్యాపారం కావడంతో కొందరు తారలు ఆర్థికంగా నష్టపోయిన సందర్భాలూ ఉన్నాయి. ఈ చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకుంటున్న ఇప్పటి తరం సెలబ్రిటీలు మాత్రం తమ సంపదను ఒకే రంగంలో పెట్టకుండా విభజిస్తున్నారు. స్టాక్ మార్కెట్, రియల్ ఎస్టేట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి సంప్రదాయ పెట్టుబడులతో పాటు స్టార్టప్ల్లోనూ డబ్బు పెడుతున్నారు. పెట్టుబడి నిపుణుల అభి ప్రాయం ప్రకారం, స్టార్టప్ల్లో పెట్టుబడి పెట్టడం అనేది సెలబ్రిటీలకు తమ మొత్తం ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియోను విభిన్నంగా ఉంచుకునే ఒక మార్గంగా మారింది.ఇందులో రెండు వైపులా ప్రయోజనం ఉంది.. స్టార్కు: కొత్త వ్యాపారాల్లో వాటా లభిస్తుంది. కంపెనీ విజయవంతమైతే పెట్టుబడి విలువ పెరుగుతుంది. తన సినిమాలపై మాత్రమే ఆధారపడాల్సిన అవసరం తగ్గుతుంది. స్టార్టప్కు: డబ్బుతో పాటు సెలబ్రిటీ పేరు, సోషల్ మీడియా ఫాలోయింగ్, ప్రచారం, బ్రాండ్ గుర్తింపు లభిస్తాయి. అందుకే నేటి సెలబ్రిటీ ఎకానమీలో ‘స్టార్ పెట్టుబడి పెట్టాడు’ అనేది కేవలం పెట్టుబడి వార్త కాదు.. ఆ స్టార్టప్కు మార్కెటింగ్ వ్యూహం కూడాఉపసంహారం... రాస్తే ఆకాశమంత కొలిస్తే కొండంత అన్నట్టుగా ప్రస్తుతం స్టార్స్కి ఉన్న ఆదాయావకాశాల జాబితా సాగిపోతూనే ఉంటుంది. రోజుకొకటిగా పుట్టుకొస్తున్న డిజిటల్ వ్యూహాలు తారలకు కాసుల పంట పండిస్తున్నాయి. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవడం తప్పుకాదనడం ఎంత నిజమో... అలాగే ఆ ఇంటికి పునాది లాంటి సమాజాన్ని చక్కదిద్దడంలోనూ తమ వంతు పాత్ర పోషించాలి అన్నదీ అంతే నిజం. సొంత బ్రాండ్... సొంత వ్యాపారంఇతర కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడంతో పాటు తమ సొంత బ్రాండ్లను కూడా సెలబ్రిటీలు నిర్మిస్తున్నారు. బాలీవుడ్ తార ఆలియా భట్ పర్యావరణహిత, స్వదేశీ బ్రాండ్ను విజయవంతమైన వ్యాపారంగా తీర్చిదిద్దిన వైనం దీనికో ఉదాహరణగా చెప్పవచ్చు. ఇక దీపికా పదుకోన్ స్వయంగా 82నిఇ పేరుతో స్కిన్కేర్ బ్రాండ్ను ప్రారంభించారు. ఆమె భర్త రణ్వీర్ సింగ్ బ్యూటీ బ్రాండ్ షుగర్ కాస్మొటిక్స్లో వాటా కొనుగోలు చేశారు. నటి అనుష్కా శర్మ తన భర్త టాప్ క్రికెటర్ విరాట్ కోహ్లీతో కలిసి ప్లాంట్–బేస్డ్ మీట్ కంపెనీ బ్లూ ట్రైబ్ ఫుడ్జ్లో పెట్టుబడి పెట్టారు.ఈ పెట్టుబడి ద్వారా ఆ కంపెనీకి కేవలం ఆర్థిక మద్దతే కాకుండా భారీ స్థాయిలో ప్రచారం కూడా లభించింది. కంపెనీ వర్గాల ప్రకారం, వారి మద్దతుతో ప్లాంట్–బేస్డ్ మీట్ గురించి దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ప్రజలకు అవగాహన ఏర్పడింది. ఈ వైవిధ్యం సెలబ్రిటీల సంపాదన, పెట్టుబడి వ్యూహాల్లో వచ్చిన గణనీయమైన మార్పును సూచిస్తోంది. ఇప్పటి తారలు తమ స్టార్డమ్, సోషల్ మీడియా ఫాలోయింగ్ను కేవలం సినిమా ప్రచారానికి మాత్రమే ఉపయోగించుకోవడం లేదు. స్టార్టప్లకు పెట్టుబడి పెట్టడంతో పాటు తమకున్న భారీ మీడియా ప్రెజెన్స్ను ఆ బ్రాండ్ల ప్రచారానికి ఉపయోగిస్తున్నారు. ఒక సెలబ్రిటీకి ఉన్న ప్రజాదరణ కొత్త బ్రాండ్కు తక్షణ గుర్తింపును తీసుకురావడమే కాకుండా, వినియోగదారుల్లో ఆ బ్రాండ్పై నమ్మకాన్ని కూడా పెంచుతుంది. అందుకే స్టార్టప్లకు సెలబ్రిటీ పెట్టుబడులు కేవలం డబ్బు సమకూర్చుకోవడానికి మాత్రమే ఉపయోగపడవు. ఆ స్టార్ ఇమేజ్, సోషల్ మీడియా రీచ్, అభిమానుల నమ్మకం కూడా కంపెనీకి అదనపు ఆస్తులుగా మారతాయి. – సత్యబాబు -
కంగనా నోట అన్నయ్య..! రాఖీతో ముగిసిన మాటల యుద్ధం
వారం రోజులుగా మాటల తూటాలతో హోరెత్తిన యోగా గురువు రామ్దేవ్, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ మధ్య వివాదానికి రక్షాబంధన్ సందర్భంగా తెరపడింది. ఒకరిపై ఒకరు తీవ్ర వ్యాఖ్యలు చేసుకున్న ఈ ఇద్దరూ.. పండగ వేళ విభేదాలను పక్కనపెట్టారు. రామ్దేవ్ స్వీట్లు, బహుమతిని .. కంగనా ‘అన్నయ్య’గా అనుకుంటూ తనకు పంపిన స్వీట్లను స్వీకరించారు.ద్వేషానికి చోటుండకూడదంటూ..‘దేశంలో కారణం ఏదైనా ద్వేషం ఉండకూడదు. అందరితో స్నేహంగా ఉండాలి. అందకే మా మధ్య ఉన్న విభేదాలను పూర్తిగా పక్కనపెట్టా. ఏ గోడవైనా మాట్లాడుకుంటే పరిష్కారమవుతుంది’ అని రామ్దేవ్ అన్నారు. రక్షాబంధన్ సందర్భంగా కంగనకు ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పానని తెలిపారు. అంతేకాకుండా ఓ బహుమతి, స్వీట్లను పంపించినట్లు తెలిపారు.(ఇదీ చదవండి: రుక్మిణి తండ్రి వెనుక ఇంత చరిత్ర ఉందా..?)అన్నయ్యగా అంగీకరించిన కంగనారామ్దేవ్ పంపిన స్వీట్లు,బహుమతిని స్వీకరించి దీనిపై కంగనా సానుకూలంగా స్పందించారు. ‘పండగలు తప్పులను మర్చిపోవడానికి నా ‘అన్నయ్య’ రామ్దేవ్ పంపిన స్వీట్లను స్వీకరిస్తున్నాను. అన్నయ్యగా ఆయన చూపించిన ప్రేమను, పంపిన బహుమతిని తీసుకుంటున్నాను’ అని కంగనా ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పేర్కొన్నారు.రాజకీయ పార్టీలకూ సూచనరాజకీయ పార్టీలకు రామ్దేవ్ ఓ సలహా ఇచ్చారు. అధికార, ప్రతిపక్ష పార్టీలు పరస్పరం రాఖీలు కట్టుకోవాలన్నారు. అలా చేస్తే సమాజానికి మంచి సందేశం వెళ్తుందని, ఎలాంటి వివక్ష ఉండకూడదనే భావన ప్రజల్లో బలపడుతుందని పేర్కొన్నారు.అసలు గొడవ ఏంటి? జెన్జీల నిరసనకారులను కంగనా ‘గట్టర్ జనరేషన్’గా అభివర్ణించడంపై రామ్దేవ్ స్పందించడంతో వివాదం మొదలైంది. ఓ టీవీ కార్యక్రమంలో ఆమె వ్యాఖ్యలను తప్పుబట్టిన ఆయన.. కంగనా అర్హతలు, వ్యక్తిగత జీవితంపై పలు వ్యాఖ్యలు చేశారు. దీంతో వీరిద్దరికి మాటల యుద్ధం మొదలైంది. రామ్దేవ్ వ్యాఖ్యలపై కంగనా సోషల్ మీడియాలో ఘాటుగా సమాధానం ఇచ్చారు. తన వ్యక్తిత్వంపై వ్యాఖ్యలు చేయొద్దని , రామ్దేవ్ హద్దులు దాటుతున్నారని తీవ్రంగా హెచ్చరించారు. ఇదీ చదవండి: 'ఇరుముడి' నాగులు మొత్తం రెమ్యునరేషన్ ఎంతంటే? -
దీపిక సంచలన వ్యాఖ్యలు.. ప్రభాస్ 'స్పిరిట్'ని ఉద్దేశించా?
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె.. కల్కి 2898 ఏడీ సీక్వెల్, స్పిరిట్ సినిమాల నుంచి తప్పుకొంది. గత కొన్నాళ్ల నుంచి ఈ విషయమై ఎప్పటికప్పుడు చర్చ జరుగుతూనే ఉంది. కొన్నిరోజుల క్రితమే 'స్పిరిట్' నిర్మాత, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా సోదరుడు ప్రణయ్ రెడ్డి మాట్లాడుతూ.. దీపికని తప్పించడానికి గల కారణాలు చెప్పాడు. మరోవైపు దీపిక సంచలన కామెంట్స్ చేసిన ఓ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా)'ఈ మధ్యే నేను ఓ సినిమా నుంచి తప్పుకొన్నాను. అందులో హీరో, ఆయన రెమ్యునరేషన్ ఎంత తీసుకుంటున్నానారో నాకు తెలుసు. నా దృష్టిలో ఆ హీరో కంటే నా సక్సెస్ రేటే ఎక్కువ. దీంతో నా పారితోషికం ఇంత అని చెప్పగానే మా దగ్గర అంత బడ్జెట్ లేదని నిర్మాతలు చెప్పారు. దీంతో ఆ చిత్రాన్ని నేను వదులుకున్నాను' అని సదరు వీడియోలో దీపికా చెబుతోంది.ఈ వీడియో చూసిన చాలామంది ప్రభాస్, స్పిరిట్ సినిమాని ఉద్దేశించి దీపికా పదుకొణె ఇలా మాట్లాడిందని అంతా అనుకుంటున్నారు. కానీ అసలు నిజం ఇది కాదు. ఆరేడేళ్ల క్రితం అంటే 2019లో ఓ పుస్తకావిష్కరణ సందర్భంగా దీపిక ఈ కామెంట్స్ చేసింది. అప్పటికి కల్కి, స్పిరిట్ చిత్రాలు గానీ ఒప్పుకోలేదు. అయితే ఇది తెలియని చాలామంది నెటిజన్లు.. ప్రభాస్, స్పిరిట్ గురించి ఇలా అంటోందా అని మాట్లాడుకుంటున్నారు. (ఇదీ చదవండి: కొత్త సీన్లతో మళ్లీ అర్జున్రెడ్డి.. ఈసారి ఎలా ఉంటుందంటే?)I recently walked out of a #film , where the male star was already locked. I know how much he is getting paid, and I believe I am more successful than him, When I said, ‘This is my #price , they told me they didn’t have the budget, so I walked out.- #DeepikaPadukone pic.twitter.com/8iFSHQjlG3— Filmyscoops (@Filmyscoopss) August 28, 2026 -
'మొదటి భర్త టార్చర్.. గాయాలకు మేకప్ వేసుకునేదాన్ని': బుల్లితెర నటి
సినీరంగంలో వారి జీవితాలు ఫుల్ కలర్పుల్గా ఉంటాయని అనుకుంటాం. కానీ అదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే.. రెండో వైపు కూడా చూస్తేనే అసలు జీవితం గురించి తెలుస్తుంది. వర్క్ లైఫ్ బాగానే ఉన్నా.. పర్సనల్ విషయానికి వచ్చేసరికి అదంతా మారిపోయే అవకాశముంది. అలా బాలీవుడ్ బుల్లితెరతో పాటు సినిమాల్లోనూ మెప్పించిన నటి కామ్యా పంజాబీ జీవితమే ఇందుకు ఉదాహరణ. హిందీలో పలు సీరియల్స్తో మెప్పించిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత సినిమాల్లోనూ తన నటనతో ఆకట్టుకుంది.అయితే సినిమాల్లో ఆకట్టుకున్న ఈమె.. పర్సనల్ లైఫ్లో మాత్రం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. తన మొదటి భర్తతో తాను పడిన ఇబ్బందులను పంచుకుంది. గృహ హింసతో పాటు మానసిక క్షోభ అనుభవించానని తెలిపింది. గాయాలను మేకప్తో దాచుకోవడం అలవాటు చేసుకున్నానని కామ్యా వెల్లడించింది. ఆ టాక్సిక్ బంధం నుంచి బయటపడటానికి పడిన ఇబ్బందిని ఆమె గుర్తుచేసుకున్నారు. మా ఇద్దరి గొడవను కుమార్తె ఆరా చూడటంతో.. ఇకపై అతనితో జీవించలేనని డిసైడ్ అయ్యానని కామ్యా వెల్లడించారు.కామ్యా పంజాబీ మాట్లాడుతూ..'మేమిద్దరం పెళ్లికి ముందే మేము గొడవపడేవాళ్లం. అతను నాకు సరైనవాడు కాదని నిర్ణయించుకోవాల్సిన స్థాయికి పరిస్థితులు వచ్చాయి. కానీ మాది తొలిప్రేమ కావడంతో ఇతనే సరైన వ్యక్తి అనిపించింది. మా ఇద్దరికీ సెట్ కాదని మా తల్లిదండ్రులు కూడా చెప్పారు. కానీ నేను వారి మాట వినలేదు. పెళ్లి తర్వాత ఆయన నన్ను పని మానేయమన్నారు. కానీ నేను వినిపించుకోలేదు. నేను నా తల్లిదండ్రులను, నా కుటుంబాన్ని పోషించాలని చెప్పా. అప్పుడు అతని ఆలోచనా విధానం ఏమిటో నాకు తెలియదు, కానీ అతను ప్రతి విషయాన్ని అనుమానించేవాడు. అతను ప్రతి 10 నిమిషాలకు ఫోన్ చేసి ఎందుకు ఫోన్ ఎత్తలేదు?' అని ప్రశ్నలు వేసేవాడు. ఏంటి సంగతి? ఎవరితో ఉన్నావు? అని కూడా ప్రశ్నలు అడిగేవాడు. బాత్రూంలో నన్ను నేను బంధించుకుని గంటల తరబడి బాధపడ్డా. కొన్నిసార్లు రాత్రంతా ఏడ్చేదాన్ని" అని తన బాధను వ్యక్తం చేసింది.కాగా.. కామ్యా మొదట వ్యాపారవేత్త బంటీ నేగీని వివాహం చేసుకున్నారు. వీరికి ఆరా అనే కుమార్తె జన్మించారు. దాదాపు 13 ఏళ్ల వివాహ బంధం తర్వాత విడిపోయారు. 2020లో కామ్యా.. శలభ్ డాంగ్ను వివాహం చేసుకున్నారు. -
కియారాకు సౌత్ కలిసిరావట్లేదా?
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీకి సౌత్ సినిమా పెద్దగా కలిసి రావడం లేదనే టాక్ వినిపిస్తోంది. అప్పట్లో కొరటాల శివ దర్శకత్వంలో సూపర్స్టార్ మహేశ్బాబు సరసన నటించిన ‘భరత్ అనే నేను’ చిత్రం మాత్రమే దక్షిణాదిలో ఆమెకు మంచి విజయాన్ని అందించింది. ఆ తరువాత దక్షిణాదిన ఆమె సినిమా చేసిన ప్రతిసారి ఏదో తేడా కొడుతోంది.అప్పట్లో మెగాపవర్ స్టార్ రామ్చరణ్తో చేసిన ‘వినయ విధేయ రామ’, తరువాత అదే హీరోతో చేసిన ‘గేమ్ ఛేంజర్’ చిత్రాలు బాక్సాఫిస్ వద్ద నిరాశపరిచాయి. తాజాగా పాన్ ఇండియా రాకింగ్ స్టార్ యశ్ సరసన నటించిన ‘టాక్సిక్’ కూడా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదనే టాక్ వస్తోంది. దీంతో ‘భరత్ అనే నేను’ మినహా సౌత్లో కియారా సినిమాలు అన్నీ వరుసగా నిరాశపరుస్తున్నాయి.ఇక త్వరలోనే కోలీవుడ్లోకి అడుగుపెట్టనుంది ఈ భామ. ఓ తమిళ సినిమాకు ఓకే చెప్పాను. త్వరలోనే దాని గురించిన పూర్తి వివరాలు వెల్లడిస్తానని ఇటీవల టాక్సిక్ సినిమా ప్రచారంలో తెలిపింది. ఇక మరోవైపు ముంబైలో సముద్రానికి ఎదురుగా ఓ కొత్త ఫ్లాట్ను కియారా కొనుగోలు చేసింది. దాని ఇంటీరియర్ పనుల కోసం కొంతకాలం సినిమాలకు విరామం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. -
LCUని పక్కన పెట్టి.. అల్లు అర్జున్తో లోకేష్ ప్రయోగం ఎందుకు?
లోకేష్ కనగరాజ్ పేరు వినగానే LCU గుర్తుకు వస్తుంది. ఈ దర్శకుడు తీసిన ఖైదీ 2, విక్రమ్ 2, రోలెక్స్ వంటి సినిమాల కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇలాంటి సమయంలో ఆయన ఆ సినిమాలను పక్కన పెట్టి మరీ ముందుగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్తో సినిమా చేయడం ఆసక్తికరంగా మారింది. దానికి కారణం.. దాదాపు ఆరేళ్ల క్రితమే మైత్రీ మూవీ మేకర్స్ లోకేష్కు అడ్వాన్స్ ఇచ్చిందట. మరోవైపు అల్లు అర్జున్తో సినిమా చేయాలనే ఆలోచన కూడా కొంతకాలంగా ఉందని లోకేష్ ఓ సందర్భంలో వెల్లడించాడు. ఈ రెండు కమిట్మెంట్లు ఇప్పుడు కలవడంతో AA23 పట్టాలెక్కింది.ఇక ఖైదీ 2 ఆలస్యానికి ఆ సినిమా హీరో కార్తి షెడ్యూల్స్ కూడా కారణమయ్యాయి. రజినీకాంత్–కమల్ హాసన్ కాంబినేషన్ కోసం లోకేష్ కొంతకాలం పనిచేశారు. కానీ ఎందుకో ఆ ప్రాజెక్ట్ కుదరలేదు. అదే సమయానికి కార్తి కూడా మరో సినిమాకు డేట్స్ ఇచ్చేశాడు. దీంతో లోకేష్కు వచ్చిన గ్యాప్లో అల్లు అర్జున్ ప్రాజెక్ట్ ముందుకు వచ్చింది. మైత్రీ నిర్మిస్తున్న AA23 సినిమాని పాన్ ఇండియా రేంజ్లో రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే వచ్చిన అనౌన్స్మెంట్ వీడియోలో అడవి, గుర్రం, జంతువుల నేపథ్యంలో ఆసక్తికరమైన ప్రపంచాన్ని హింట్ చేశారు. అయితే ఆ సినిమా కథపై మాత్రం ఎలాంటి ఇంకా క్లారిటీ లేదు.LCUతో కనెక్షన్లు లేకుండా లోకేష్ చేస్తున్న ఈ కొత్త ప్రయోగం ఎలా ఉండబోతుందన్నదే ఇప్పుడు ఆసక్తికరం. అల్లు అర్జున్ సినిమా తర్వాత తన తదుపరి సినిమా ఖైదీ 2నే అని లోకేష్ ఇప్పటికే స్పష్టం చేశాడు. అంటే ఇది LCUకి బ్రేక్ మాత్రమే.. ముగింపు కాదు! -
కృతి సనన్ యాడ్ వివాదం.. ప్రకటన సంస్థ కీలక నిర్ణయం
ఆదిపురుష్ భామ కృతి సనన్ చేసిన యాడ్ వివాదానికి కారణమైంది. ఓ జ్యువెలరీ సంస్థ రూపొందించిన ఈ ప్రకటనలో కృతి ధరించిన దుస్తులపై కూడా దుమారం చెలరేగింది. అంతేకాకుండా రాఖీని ఓ కుక్కకు కట్టడంతో ఇది కాస్తా ముదిరింది. హిందూ సంప్రదాయాలను కృతి అవమానించారంటూ నెటిజన్స్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. హిందూ పండుగలంటే అంటే అంత చులకన అంటూ బాలీవుడ్ బ్యూటీని నిలదీశారు.ఆ తర్వాత తనపై వస్తున్న వివాదంపై కూడా కృతి సనన్ స్పందించింది. మన సంప్రదాయాలను గౌరవించే విధానం మన దుస్తులపై ఆధారపడి ఉందని తెలిపింది. భక్తి అనేది మహిళ ధరించే దుస్తుల్లో ఉండదని.. అది ఆమె మనసుకు సంబంధించిన విషయమని పోస్ట్ చేసింది. మహిళల దుస్తులను టార్గెట్ చేయడం ఇంకెప్పుడు ఆపుతారని ప్రశ్నించింది. కుక్క కూడా మా ఫ్యామిలీ మెంబర్ అని.. అందుకే రాఖీ కూడా కట్టానని కృతి వెల్లడించింది.తాజాగా ఈ వివాదం పెద్దఎత్తున వైరల్ కావడంతో యాడ్ రూపొందించిన సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ప్రకటనను పూర్తిగా తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఇండియన్ కల్చర్, సంప్రదాయాలు, పండుగల పట్ల తమకు పూర్తి గౌరవముందని తెలిపింది. కుటుంబంతో పాటు పెంపుడు జంతువులపై ప్రేమను చూపించాలనే ఉద్దేశంతోనే ఈ యాడ్ రూపొందించామని ఆ సంస్థ వివరణ ఇచ్చింది. అయితే కొందరి మనోభావాలు దెబ్బతిన్నందుకు యాడ్ను తొలగిస్తున్నట్లు అధికారికంగా వెల్లడించింది. -
స్పిరిట్ Vs వారణాసి.. సందీప్ రెడ్డి వంగ సంచలన వ్యాఖ్యలు!
వచ్చే ఏడాది వేసవిలో నెల రోజుల గ్యాప్లో సందీప్ రెడ్డి దర్శకత్వంలో రెబల్స్టార్ ప్రభాస్ నటిస్తున్న స్పిరిట్, దర్శకధీరుడు రాజమౌళి, సూపర్స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ వారణాసి సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈ రెండు భారీ చిత్రాలు కావడంతో ఈ గ్యాప్ సరిపోతుందా? అనే చర్చ ప్రస్తుతం ఇండస్ట్రీలో జరుగుతోంది.ఈ విషయంపై దర్శకుడు సందీప్ రెడ్డి వంగ సరదాగా స్పందించారు. స్పిరిట్ కంటే వారణాసి చాలా పెద్ద సినిమా అని చెప్పిన ఆయన.. అవసరమైతే వారణాసి చిత్రం కోసం కాస్త జరగడానికి తమకేం అభ్యంతరం లేదన్నాడు. ఈ రెండు సినిమాల విడుదల తేదీల మధ్య నెల రోజుల పైనే తేడా ఉండటంతో సాద్యమైనంతవరుకు ఎలాంటి సమస్య ఉండదన్నారు. అయితే అదే టైమ్లో స్పిరిట్ మాత్రం చెప్పిన తేదీకి కచ్చితంగా వస్తుందని కూడా మరోసారి క్లారిటీ ఇచ్చాడు.రెబల్స్టార్ ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం స్పిరిట్కు ఇంకా 65 రోజుల షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్కు ఎక్కువ సమయం కేటాయిస్తానని సందీప్ వంగ తెలిపారు. అలాగే తన గత చిత్రాలకు వచ్చినట్టే ఈ సినిమాకు కూడా ‘A’ సర్టిఫికేట్ ఖాయమని చెప్పారు.యానిమల్ ఫేమ్ త్రిప్తి దిమ్రి హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు. -
అక్షయ్-సైఫ్ యాక్షన్ మూవీ.. ఫుల్ వయొలెంట్గా ట్రైలర్
అక్షయ్ కుమార్, సైఫ్ అలీ ఖాన్ లీడ్ రోల్లో వస్తోన్న లేటేస్ట్ మూవీ హైవాన్. ఈ మూవీని ప్రియదర్శన్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని వెంకట్ నారాయణ, శైలజ దేశాయ్ ఫెన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా వచ్చే నెల 11న థియేటర్లలో సందడి చేయనుంది.ఈ నేపథ్యంలోనే హైవాన్ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ చూస్తుంటే మర్డర్స్ నేపథ్యంలోనే ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇందులో సన్నివేశాలు చూస్తుంటే ఫుల్ వయొలెంట్గా ఉండనుందని అర్థమవుతోంది. అక్షయ్- సైఫ్ మధ్య ఫైట్ సీన్స్ ఈ చిత్రంపై మరింత ఆసక్తి పెంచుతున్నాయి. కాగా.. ఈ చిత్రంలో బోమన్ ఇరానీ, సయామీ ఖేర్, శ్రియా పిల్గాంకర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
ఇంకెప్పుడు మారుతారు?.. వివాదంపై కృతి సనన్ రియాక్షన్
ఆదిపురుష్ భామ కృతి సనన్ ఊహించని విధంగా వివాదంలో చిక్కుకుంది. తాను నటించిన రక్షాబంధన్ యాడ్తో విమర్శల పాలైంది. ఓ కుక్కకు రాఖీ కడుతూ.. సంప్రదాయ దుస్తులు కాకుండా వెస్టర్న్ డ్రెస్లో కనిపించింది. ఇదే వివాదానికి కారణమైంది. హిందూ పండుగను అవమానించేలా కృతి సనన్ వ్యవహరించారంటూ నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోదరుడికి ప్రేమతో కట్టే రాఖీని కుక్కకు కట్టడంపై కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు.తాజాగా తనపై వస్తున్న విమర్శలపై బాలీవుడ్ భామ స్పందించారు. పండుగ అనేది భావోద్వేగాలు, సంప్రదాయాలతో కూడుకున్నదని తెలిపింది. అంతేకానీ ఒక మహిళ ధరించే దుస్తులపై ప్రభావం ఉండదని రాసుకొచ్చింది. ఈ వేడుకల్లో తన పెంపుడు జంతువును చేర్చాలనే ఆలోచన సరైందేనని.. కుక్కలు కూడా కుటుంబంలో భాగమేనని వెల్లడించింది. ఈ వివాదంపై ఇన్స్టా స్టోరీస్లో పోస్ట్ చేసింది.కృతి తన ఇన్స్టాలో రాస్తూ..' మన పండుగల సారం మనం ధరించే దుస్తుల్లో ఉండదు. అది సంప్రదాయాల పట్ల మీకు ఉండే భావోద్వేగాలతో ముడిపడి ఉంటుంది. రక్షాబంధన్ అనేది ఒక రక్షణ బంధం. నేను, నా సోదరి ఒకరికొకరం రాఖీ కట్టుకుంటాం. ఒక సోదరుడు ఎలాగైతే రక్షణగా ఉంటారో.. మేము కూడా అలాగే రక్షించుకోగలమని మాకు తెలుసు. తాను, తన సోదరి ఒకరి ఆరోగ్యం, సంతోషం, దీర్ఘాయువు కోసం ప్రార్థించుకుంటాం. ఇది మా ఇంట్లో కుక్కలకు కూడా వర్తిస్తుంది. ఎందుకంటే అవీ కూడా మా కుటుంబంలో సభ్యులే కదా " అని పోస్ట్ చేసింది.అంతేకాకుండా మనం మహిళలు ఏమి ధరించాలో చెప్పడం ఎప్పుడు ఆపుతామని కృతి సనన్ ప్రశ్నించింది. ఒక మహిళ తన సంస్కృతి పట్ల చూపే గౌరవాన్ని ఆమె దుస్తులను బట్టి అంచనా వేసే పద్ధతిని కృతి తప్పుపట్టింది. ఎథ్నిక్ ఫ్యాషన్ సంవత్సరాలుగా అభివృద్ధి చెందింది.. కానీ ఇప్పటికీ ఒక మహిళ తన సంస్కృతి పట్ల చూపే గౌరవాన్ని కేవలం ఆమె దుస్తులతోనే కొలుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. మన సంస్కృతి, సంప్రదాయాలు అనే మహిళ హృదయంలో ఉంటాయి.. అంతే కానీ ఆమె మెడలో కాదంటూ ఇన్స్టాలో రాసుకొచ్చింది. ఇక సినిమాల విషయానికొస్తే కృతి ఇటీవల షాహిద్ కపూర్, రష్మిక మందన్నలతో కలిసి రొమాంటిక్ కామెడీ-డ్రామా కాక్టెయిల్ -2లో కనిపించింది. గతేడాది 'తేరే ఇష్క్ మే'లో ధనుష్ సరసన కూడా హీరోయిన్గా మెప్పించింది. -
యాక్షన్ థ్రిల్లర్
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటిస్తున్న కొత్త సినిమాకు ‘సముక్’ అనే టైటిల్ని ఖరారు చేశారు మేకర్స్. సర్వైవల్ యాక్షన్ థ్రిల్లర్గా రూపొందుతోన్న ఈ చిత్రానికి కనిష్క్ వర్మ దర్శకుడు. విపుల్ అమృత్లాల్ షా నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ సోమవారం లండన్లో ప్రారంభమైంది. ‘‘సముక్’ సినిమా చిత్రీకరణ మొదలైంది. కొత్త జానర్లో కొత్త సవాల్ను స్వీకరించాను. వివాన్ అహుజాగా డ్యూటీ మొదలుపెట్టాను’’ అని ‘ఎక్స్’లో పేర్కొంటూ వీడియోను షేర్ చేశారు అక్షయ్ కుమార్. కాగా, ఈ సినిమా మేజర్ షూటింగ్ లండన్ లో జరుగుతుందని, కొద్దిపాటి షూటింగ్ ముంబైలో జరుగుతుందని బాలీవుడ్ సమాచారం. అంతర్జాతీయ సంబంధాలు, సర్వైవల్ హారర్, గ్రహాంతరవాసులు వంటి అంశాల నేపథ్యంతో ఈ సినిమా కథనం సాగుతుందని బాలీవుడ్ సమాచారం. హాలీవుడ్ విజువల్ ఎఫెక్ట్స్ నిపుణుడు అలెక్ గిల్లిస్, స్టంట్ డైరెక్టర్ ల్యూక్ టంబర్ వంటి సాంకేతిక నిపుణులు ఈ సినిమాకు వర్క్ చేస్తున్నారు. -
నయనతార ఫస్ట్ రెమ్యూనరేషన్ రూ.2,000..? మరి 'టాక్సిక్'కి ఎంతో తెలుసా?
సౌత్ ఇండియన్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా నయనతార తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా తన కెరీర్ తొలినాళ్లకు సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకుంది. తన మొదటి జీతం గురించి వెల్లడించింది. తాజాగా నయనతారను ఆమె తొలి ఉద్యోగం గురించి అడిగారు. దీనికి స్పందించిన నయనతార.. తన మొదటి పని ఓ మ్యాగజైన్ కవర్ షూట్ అని గుర్తుచేసుకుంది. ఓ ఫ్యాషన్ కార్యక్రమం కోసం తనను పిలిచారని తెలిపింది. ఆ సమయంలో తనకు వచ్చిన పారితోషికం కేవలం రూ.2,000 నుంచి రూ.3,000 వరకు మాత్రమే అని నయనతార చెప్పింది. ఆ చిన్న మొత్తంతో ప్రారంభమైన తన కెరీర్.. ఆ తర్వాత దక్షిణాది చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయికగా ఎదిగే స్థాయికి చేరుకోవడం విశేషం.నయనతార చాలా కాలంగా సౌత్లో లేడీ సూపర్స్టార్గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. మోడలింగ్ ద్వారా సినీరంగం దృష్టిని ఆకర్షించిన ఆమె 2003లో ‘మనస్సినక్కరే’ సినిమాతో నటిగా సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. మ్యాగజైన్లో నయనతార ఫొటోలు చూసిన దర్శకుడు సత్యన్ ఆమెకు తొలి సినిమా అవకాశం ఇచ్చాడు. ఆ తర్వాత ‘అయ్యా’, ‘చంద్రముఖి’ చిత్రాలతో తమిళంలో గుర్తింపు తెచ్చుకుంది.రజనీకాంత్తో చేసిన చంద్రముఖి సినిమా నయనతార కెరీర్ను మలుపుతిప్పింది. ఆ తర్వాత తెలుగులో కూడా ఆమె పాపులర్ అయింది. అదే టైమ్లో ఫిమేల్ ఓరియంటెడ్ సినిమాల వైపు ఫోకస్ పెట్టింది. అవి సక్సెస్ కావడంతో తిరుగులేని లేడీ సూపర్స్టార్గా క్రేజ్ సంపాదించుకుంది. వరుస విజయాలతో లేడీ సూపర్స్టార్గా ఎదిగిన నయనతార 2023లో షారుఖ్ హీరోగా నటించిన ‘జవాన్’తో బాలీవుడ్లోకి కూడా అడుగుపెట్టింది. నయనతార ప్రస్తుతం ఒక్కో సినిమాకు దాదాపు రూ.10 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్లు సమాచారం. అంటే.. కేవలం రూ.3 వేలతో మొదలైన ఆమె సినీ ప్రయాణం ప్రస్తుతం కోట్ల రూపాయల పారితోషికం అందుకునే స్థాయికి చేరింది. ఇక పాన్ ఇండియా స్టార్ హీరో యశ్తో ఆమె నటించిన టాక్సిక్ సినిమా విడుదలకు సిద్ధమైంది. -
ఒకవైపు వివాదం.. బాయ్ఫ్రెండ్తో ఆదిపురుష్ భామ చిల్..!
ఆదిపురుష్ భామ కృతిసనన్ ఊహించని విధంగా వివాదంలో చిక్కుకుంది. రక్షాబంధన్ ప్రకటనలో ధరించిన డ్రెస్తో పాటు కుక్కకి రాఖీ కట్టడంపై పెద్దఎత్తున విమర్శలొస్తున్నాయి. హిందూ సంప్రదాయాలను ఎందుకిలా అప్రతిష్ట పాలు చేస్తున్నారని నెటిజన్స్ మండిపడుతున్నారు. రక్షాబంధన్ వేడుకపై ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్ గివా రూపొందించిన యాడ్ ఈ వివాదానికి కారణమైంది. దీంతో కృతిపై సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు.అయితే ఈ ముద్దుగుమ్మ అవేమీ తనకు పట్టవు అన్నట్లు వ్యవహరిస్తోంది. తన ప్రకటనపై వివాదం తలెత్తినప్పటికీ జాలీగా ఎంజాయ్ చేస్తోంది. అంతలోనే తన బాయ్ఫ్రెండ్తో కలిసి ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఒకవైపు వివాదం నడుస్తుంటే.. తన ప్రియుడితో కబిర్ బహియాతో ఉన్న పిక్స్ షేర్ చేయడంతో నెటిజన్స్ మండిపడుతున్నారు. తనపై వస్తున్న విమర్శలు పట్టించుకోకుండా తన పనిలో తాను పుల్ బిజీగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. హిందూ సంప్రదాయాలపై గౌరవం లేని ఇలాంటి వారిని తగిన బుద్ధి చెప్పాలంటున్నారు. View this post on Instagram A post shared by Kriti Sanon 🦋 (@kritisanon) -
‘కుక్కకు రాఖీనా?’.. కృతిపై ఫ్యాన్స్ ఆగ్రహం
రక్షాబంధన్ ప్రకటనలో బాలీవుడ్ నటి కృతి సనన్ లుక్ నెటిజన్లకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. పండుగ సంప్రదాయాన్ని అపహాస్యం చేశారంటూ పలువురు అసంతృప్తి వ్యక్తం చేయగా, శునకానికి రాఖీ కట్టే సన్నివేశంపైనా నెటిజన్లు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అక్కాచెల్లెళ్లు, అన్నాదమ్ముల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రక్షాబంధన్ వేడుకపై ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్ ‘గివా’ రూపొందించిన సరికొత్త ప్రకటన సామాజిక మాధ్యమాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.ఈ యాడ్లో కృతి సనన్ ధరించిన దుస్తులు, ప్రదర్శించిన సన్నివేశాల కాన్సెప్ట్పై పలువురు నెటిజన్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే భారతీయ పండుగను ఆధునిక కోణంలో చూపించే ప్రయత్నమే ఇదని మరికొందరు పేర్కొంటున్నారు. ఈ ప్రకటనలో కృతి సనన్ ఆఫ్-వైట్ రంగు బ్రాలెట్ స్టైల్ బ్లౌజ్, కేప్, డ్రేప్డ్ స్కర్ట్ ధరించి కనిపించారు. సంప్రదాయ పండుగ వేళ ఇలాంటి ఆధునిక వస్త్రధారణ ఎంపిక చేయడంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు.అంతేకాకుండా, పెంపుడు శునకాన్ని కుటుంబ సభ్యుడిగా చూపిస్తూ, మొరుగుతున్న శునకానికి కృతి రాఖీ కట్టే సన్నివేశం కూడా విమర్శలకు దారితీసింది. పండుగ నేపథ్యాన్ని ఆవిష్కరించేందుకు ఇతర మార్గాలున్నాయని పలువురు విమర్శించారు. సోషల్ మీడియా వేదికగా పలువురు స్పందిస్తూ, హిందూ పండుగల సమయంలోనే ఇలాంటి ప్రయోగాలు ఎందుకు చేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.కొందరు దీనిని కేవలం ఒక క్రియేటివ్ క్యాంపెయిన్ మాత్రమేనని అనగా, వివాదం చేయాల్సిన అవసరం లేదని మరికొందరు అభిప్రాయపడ్డారు. ఈ వివాదంపై ఇప్పటివరకు అటు కృతి సనన్ గానీ, ఇటు ప్రకటన సంస్థ గానీ ఎలాంటి స్పందన తెలియజేయలేదు. కృతి సనన్ ఇటీవల ‘కాక్టెయిల్ 2’ చిత్రంలో షాహిద్ కపూర్, రష్మిక మందన్నలతో కలిసి కనిపించగా, గతంలో ధనుష్తో ‘తేరే ఇష్క్ మే’ చిత్రంలో నటించారు.ఇది కూడా చదవండి: గణేశ్ ఆగమన యాత్రలో గుడ్లతో దాడి -
మల్లికా షెరావత్ చెయ్యి పట్టుకున్న లాలూ తనయుడు తేజ్
ముంబై: ‘భోజ్పురి బవాల్’ రియాలిటీ షో వేదికగా ఆర్జేడీ నేత తేజ్ ప్రతాప్ యాదవ్ (తేజూ భయ్యా), ప్రముఖ సినీ నటి మల్లికా షెరావత్ మధ్య జరిగిన సరదా సంభాషణ ప్రస్తుతం నెట్టింట అందరినీ విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన మల్లికా షెరావత్తో తేజ్ ప్రతాప్ సరదాగా సంభాషిస్తూ ఆమె హస్తసాముద్రికం చూసి భవిష్యత్తు చెప్పారు. షో ప్రోమోలో తేజ్ ప్రతాప్ యాదవ్ మల్లిక చేతిని చూస్తూ.. ‘మీ భవిష్యత్తు చాలా ఉజ్వలంగా ఉంది. కానీ ఇతరుల వల్ల మీరు ఎక్కువగా బాధపడతారు’ అని పేర్కొనగా, ఆమె దానికి ఏకీభవించారు. Teju bhaiyya can do it all!#BhojpuriBawaal streaming everyday on #JioHotstar at 9pm and on #ColorsTV at 10:30pm.#BhojpuriBawaalOnJioHotstar pic.twitter.com/x2wT5DlFXr— JioHotstar Reality (@HotstarReality) August 23, 2026అనంతరం రాశి వివరాలు అడగ్గా మల్లిక ‘తులా రాశి’ అని సమాధానమిచ్చారు. వెంటనే తేజ్ ప్రతాప్ తనది కూడా అదే రాశి అని తెలపడంతో ఇద్దరూ నవ్వులు చిందించారు. ఆపై తన రాశి ప్రకారం ఏ రత్నం ధరించాలని మల్లిక అడగ్గా, తాను ధరించిన పుష్యరాగాన్ని చూపిస్తూ.. ‘ఇది మీ సూర్య బలాన్ని మరింత తేజోవంతం చేస్తుంది’ అని చెప్పారు. దీనికి మల్లిక స్పందిస్తూ.. ‘ఇంకా ఎంత తేజ్ (తేజస్సు) కావాలి తేజ్ గారు?’ అంటూ చమత్కరించడంతో తేజూ భయ్యా గట్టిగా నవ్వేశారు. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. మల్లికా షెరావత్ ప్రస్తుతం ‘ట్రైటర్స్ 2’ రియాలిటీ షోలో కూడా పాల్గొంటున్నారు. ‘భోజ్పురి బవాల్’ షో కలర్స్ ఛానల్తో పాటు జియో హాట్స్టార్ ఓటీటీ వేదికపై ప్రసారమవుతోంది.ఇది కూడా చదవండి: కటకటాల్లో ‘ఆ పాత మధురాలు’.. భావోద్వేగంలో ఖైదీలు! -
కంగనా vs తాప్సీ..ఈసారి తల్లిదండ్రుల వరకు వెళ్లిన వివాదం!
మనసులో మాటను నిర్మొహమాటంగా చెప్పే హీరోయిన్లలో కంగనా రనౌత్, తాప్సీ పన్ను ముందు వరుసలో ఉంటారు. సినిమాల ఎంపిక దగ్గరి నుంచి వ్యక్తిగత అభిప్రాయాల వరకు ఏ విషయంలోనైనా ఓపెన్గా మాట్లాడే ఈ ఇద్దరి మధ్య గతంలో పలుమార్లు మాటల యుద్ధం జరిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ పాత వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ఇటీవల తాప్సీ చేసిన వ్యాఖ్యలకు కంగనా ఘాటుగా స్పందించడంతో వీరి మధ్య వార్ మళ్లీ హాట్ టాపిక్గా మారింది.ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తాప్సీ.. కంగనాతో తనకున్న విభేదాలపై మాట్లాడారు. వివాదం మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు తాను కంగనాను వ్యక్తిగతంగా కలవలేదని చెప్పారు. కంగనాపై తన అభిప్రాయం తన పెంపకం, మాట్లాడే విధానం, ఆలోచనా తీరును ప్రతిబింబిస్తుందని వ్యాఖ్యానించారు. అదే సమయంలో కంగనా ఎలా స్పందిస్తారనేది ఆమె పెరిగిన వాతావరణం, ఆమె విధానానికి సంబంధించిన విషయమని తాప్సీ పేర్కొన్నారు.తాప్సీ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కంగనా రనౌత్ స్పందించారు. తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో తాప్సీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. తన సినిమా ప్రమోషన్ల కోసం, మీడియా హెడ్లైన్స్లో నిలిచేందుకు తాప్సీ తన పేరును ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు. అంతేకాదు.. ఈసారి తాప్సీ తన పెంపకం, తల్లిదండ్రుల గురించి ప్రస్తావించడంతో కంగనా కూడా వ్యక్తిగత వ్యాఖ్యలు చేశారు.తాప్సీని ఉద్దేశించి కంగనా ‘చౌకబారు కాపీ’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తన తల్లిదండ్రుల గురించి మాట్లాడటం ద్వారా తాప్సీ హద్దులు దాటారని పేర్కొంటూ.. తాను మాత్రం ఎలాంటి వాదనలోనూ ఎదుటివారి తల్లిదండ్రుల గురించి మాట్లాడనని అన్నారు. అనంతరం తాప్సీ తల్లిదండ్రులను ఉద్దేశించి కూడా తీవ్ర వ్యాఖ్యలు చేయడం వివాదానికి మరింత ఆజ్యం పోసింది.అయితే కంగనా–తాప్సీ మధ్య ఈ వివాదం ఇప్పటిది కాదు. 2019లో ‘జడ్జిమెంటల్ హై క్యా’ సినిమా సమయంలో కంగనా సోదరి రంగోలి చందేల్.. తాప్సీని ఉద్దేశించి ‘సస్తీ కాపీ’ (చౌకబారు కాపీ) అనే పదాన్ని ఉపయోగించడంతో తొలిసారి వీరి మధ్య వివాదం వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత 2020లో బాలీవుడ్లో నెపోటిజంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న సమయంలో కంగనా.. తాప్సీతో పాటు స్వరా భాస్కర్ను ‘బి-గ్రేడ్ నటీమణులు’గా అభివర్ణించడం కూడా అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమైంది.ఆ తర్వాత కూడా ఇద్దరూ ఒకరిపై ఒకరు ప్రత్యక్షంగా, పరోక్షంగా వ్యాఖ్యలు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. తాజాగా తాప్సీ చేసిన వ్యాఖ్యలతో పాత వివాదం మరోసారి తెరపైకి రావడం, దానికి కంగనా మరింత ఘాటైన పదజాలంతో స్పందించడం బాలీవుడ్ వర్గాల్లో చర్చకు దారితీసింది.ప్రస్తుతం తాప్సీ నటించిన ప్రతీకార నేపథ్య డ్రామా ‘గాంధారి’ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రం సెప్టెంబర్ 3న నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. సినిమా ప్రమోషన్ల సమయంలో తాప్సీ చేసిన వ్యాఖ్యలు, వాటికి కంగనా ఇచ్చిన కౌంటర్తో మరోసారి ఈ ఇద్దరు నటీమణుల మధ్య వివాదం వార్తల్లో నిలిచింది. మరి ఈ మాటల యుద్ధం ఇక్కడితో ఆగుతుందా? లేక మరోసారి ఇద్దరి నుంచి కౌంటర్లు వస్తాయా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. -
నిజంగా ‘టాక్సిక్’ రూ.2,000 కోట్లు కొల్లగొడుతుందా?
పాన్ ఇండియా రాకింగ్ స్టార్ యశ్ నటించిన ‘టాక్సిక్’ సినిమాపై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమా ఏకంగా రూ.2,000 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధిస్తుందని మ్యూజిక్ డైరెక్టర్ ప్రకటించగా, నిర్మాత దిల్ రాజు కూడా ఇదే మాటను రిపీట్ చేయడం హాట్ టాపిక్గా మారింది. ఈ చిత్రం నిజంగా రూ.2,000 కోట్లు సాధించాలంటే ‘పుష్ప 2’, ‘ధురంధర్ 2’ వంటి భారీ పాన్ ఇండియా హిట్ చిత్రాలను మించి సినిమా ఆడాల్సి ఉంటుంది. అయితే ‘టాక్సిక్’పై ఉన్న క్రేజ్ కేవలం సోషల్ మీడియా హైప్ మాత్రమే కాదని అడ్వాన్స్ బుకింగ్స్ ట్రెండ్ స్పష్టం చేస్తోంది. ముఖ్యంగా నార్త్ బెల్ట్లో యశ్కు ఉన్న క్రేజ్ ఈ సినిమాకు భారీ ప్లస్గా మారుతోంది.అయితే ఈ రూ.2,000 కోట్ల స్టేట్మెంట్తో టాక్సిక్ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. మరోవైపు హీరో యశ్ మాత్రం ఇలాంటి అతిశయోక్తి వ్యాఖ్యలకు దూరంగా ఉన్నాడు. అయితే ‘టాక్సిక్’తో తన టార్గెట్ ఏంటో మాత్రమే స్పష్టంగా చెబుతున్నాడు. ఇక ఈ భారీ అంచనాలను ‘టాక్సిక్’ నిజం చేస్తుందా? లేక రూ.2,000 కోట్లు కేవలం ప్రచార మాటగానే మిగిలిపోతుందా? అన్నది ఈ చిత్రం బాక్సాఫీస్ రిజల్ట్తోనే తేలనుంది. -
ముచ్చటగా మూడోసారి ప్రెగ్నెన్సీ.. కరీనా కపూర్ పోస్ట్ వైరల్..!
బాలీవుడ్ ఫేమస్ జంటల్లో కరీనా కపూర్- సైఫ్ అలీ ఖాన్ ఒకరు. వీరిద్దరి ప్రేమ పెళ్లి చేసుకుని ప్రస్తుతం లైఫ్లో బిజీగా ఉన్నారు. వీరిద్దరికీ ఇప్పటికే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. తమ కెరీర్లో బిజీగా ఉన్న ఈ జంట అప్పుడప్పుడు వార్తల్లో నిలుస్తూ ఉంటోంది. తాజాగా మరోసారి కరీనా కపూర్ హాట్ టాపిక్గా మారింది. ఆమె త్వరలోనే మూడో బిడ్డకు జన్మనివ్వనుందని సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.ప్రస్తుతం 45 ఏళ్ల వయసులో ఉన్న బాలీవుడ్ భామ జిమ్ వీడియో ఇటీవలే నెట్టింట వైరలైంది. ఈ వీడియోలో ఆమెకు బేబీ బంప్తో ఉన్నట్లు కనిపించడంతో రూమర్స్ మొదలయ్యాయి. ఆమె మరోసారి గర్భం దాల్చిందంటూ బాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. అయితే ఈ రూమర్స్పై కరీనా కపూర్ ఆడపడచు సబా పటౌడీ స్పందించారు. ఆమె గర్భవతి అన్న ఊహాగానాలను నవ్వుతూ కొట్టిపారేశారు. కొంతమంది సోషల్ మీడియా యూజర్లు ప్రెగ్నెన్సీతో కనిపిస్తోందని పేర్కొన్నారు, కానీ అలాంటిదేం లేదని సబా స్పష్టం చేశారు.(ఇది చదవండి: స్పిరిట్ వివాదం.. దీపికా పదుకొణె స్ట్రాంగ్ రియాక్షన్)తాజాగా తనపై వస్తున్న ప్రెగ్నెన్సీ రూమర్లపై కరీనా కపూర్ సైతం స్పందించింది. ఈ మేరకు తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది. కడుపు ఉబ్బినట్లుగా ఉన్న ఓ ఫోటోను పంచుకుంది. నవ్వుతున్న ఎమోజీలతో పాటు పిజ్జా ఎమోజీలు పోస్ట్ చేసింది. అంటే ఇది కేవలం ఫుడ్ ఎక్కువగా తినడం వల్లే వచ్చిన బేబీ బంప్ అంటూ పరోక్షంగా క్లారిటీ ఇచ్చేసింది. -
నటుడిగా ఎదిగి.. చిరంజీవిగా నిలిచి
చిరంజీవి.. ఈ పేరు వింటేనే ఓ మాస్ ఇమేజ్ కళ్లముందు కదులుతుంది. తెరపై ఆయన వేసే ఒక్క స్టెప్కు థియేటర్ ఊగిపోతుంది. ఆయన చెప్పే ఒక్క డైలాగ్కు అభిమానులు పండగ చేసుకుంటారు. నాలుగు దశాబ్దాలకు పైగా సాగుతున్న సినీ ప్రస్థానంలో ఎన్నో రికార్డులు, అవార్డులు, అరుదైన ఘనతలు ఆయన ఖాతాలో చేరాయి. నటుడిగా మొదలైన ప్రయాణం మెగాస్టార్గా మారింది. తెరపై స్టార్డమ్తో పాటు సేవా కార్యక్రమాలతోనూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆగస్టు 22న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయన జీవిత ప్రయాణంపై ఓ ప్రత్యేక కథనం.పోలీసు కుటుంబంలో పుట్టి..చిరంజీవి అసలు పేరు కొణిదెల శివశంకర వరప్రసాద్. 1955 ఆగస్టు 22న పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో కొణిదెల వెంకట్రావు, అంజనాదేవి దంపతులకు జన్మించారు. పవన్ కల్యాణ్, నాగబాబు అన్నదమ్ములు. తండ్రి వెంకట్రావు పోలీసు శాఖలో పనిచేసేవారు. ఉద్యోగరీత్యా కుటుంబం పలు ప్రాంతాల్లో నివసించడంతో చిరంజీవి విద్యాభ్యాసం కూడా వివిధ ప్రాంతాల్లో సాగింది. చిన్నతనం నుంచే నటనపై ఆసక్తి పెంచుకున్న చిరంజీవి.. కాలేజీ రోజుల్లో నాటకాల్లో నటించేవారు. నటుడిగా మారాలన్న లక్ష్యంతో మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో 1976లో శిక్షణ పొందారు. అక్కడే తన నటనా ప్రతిభకు మరింత పదును పెట్టుకున్నారు.‘పునాదిరాళ్లు’తో తొలి అడుగు..సినిమా రంగంలో చిరంజీవి తొలి అడుగు ‘పునాదిరాళ్లు’తో పడింది. అయితే ఈ సినిమా కంటే ముందే ఆయన నటించిన ‘ప్రాణం ఖరీదు’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 1978లో విడుదలైన ఈ సినిమాతో చిరంజీవి సినీ ప్రస్థానం ప్రారంభమైంది. తొలి రోజుల్లో విలన్, క్యారెక్టర్ తరహా పాత్రలు చేసేవారు. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.హీరోగా గుర్తింపు..1982లో వచ్చిన ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’ చిరంజీవి కెరీర్లో కీలక మలుపుగా నిలిచింది. ఈ సినిమాతో ఆయన పూర్తి స్థాయి హీరోగా ప్రేక్షకుల్లో బలమైన గుర్తింపు సంపాదించారు. అదే ఏడాది వచ్చిన ‘శుభలేఖ’ ఆయనలోని నటుడికి మరో కోణాన్ని చూపించింది.అయితే 1983లో వచ్చిన ‘ఖైదీ’ చిరంజీవి కెరీర్ను పూర్తిగా మార్చేసింది. ఈ సినిమా ఘన విజయం సాధించడంతో ఆయన మాస్ ఇమేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఆ తర్వాత వరుస విజయాలతో అగ్ర కథానాయకుడిగా ఎదిగి ‘మెగాస్టార్’గా అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారు.జాతీయ స్థాయిలో గుర్తింపు..చిరంజీవి తన నటనకు ఎన్నో ప్రతిష్ఠాత్మక పురస్కారాలు అందుకున్నారు. పద్మభూషణ్, పద్మవిభూషణ్ వంటి దేశ అత్యున్నత పౌర పురస్కారాలతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి పలు నంది అవార్డులు అందుకున్నారు. భారతీయ సినిమా రంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డు కూడా అందుకున్నారు.రాజకీయాల్లోకి ఎంట్రీసినిమాల్లో అగ్రస్థానంలో ఉన్న సమయంలో చిరంజీవి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2008లో ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు. ప్రజా సమస్యలపై తనదైన ఆలోచనలతో రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. అనంతరం ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు. కేంద్ర మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించారు.మళ్లీ వెండితెరపైకి..రాజకీయ ప్రస్థానం తర్వాత కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్న చిరంజీవి.. ‘ఖైదీ నంబర్ 150’ తో ఘనంగా రీఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ‘సైరా నరసింహారెడ్డి’, ‘ఆచార్య’, ‘గాడ్ఫాదర్’, ‘వాల్తేరు వీరయ్య’, ‘భోళా శంకర్’, ‘విశ్వంభర’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించి ప్రస్తుతం యువ హీరోలతో పోటీ పడుతున్నారు.చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్..చిరంజీవి పేరు చెప్పగానే గుర్తొచ్చే మరో ముఖ్యమైన అంశం ఆయన సేవా కార్యక్రమాలు. 1998లో చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ను ఏర్పాటు చేసి రక్తదానం, నేత్రదానం వంటి కార్యక్రమాలను ప్రోత్సహించారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా అవసరమైన వారికి రక్తాన్ని అందించడంతో పాటు.. నేత్రదానంపై అవగాహన కల్పించారు. 2006లో అప్పటి రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం కూడా ఈ ట్రస్ట్ను సందర్శించారు.కరోనా సమయంలోనూ చిరంజీవి తన వంతు సాయం చేశారు. సినీ కార్మికులకు నిత్యావసర సరుకులు, ఆర్థిక సహాయం అందించడంతో పాటు కరోనా క్రైసిస్ ఛారిటీ (CCC) ద్వారా సినీ కార్మికులకు అండగా నిలిచారు. -
53 ఏళ్ల వయసులో రెండో పెళ్లి చేసుకున్న 'ధురంధర్' విలన్
ధురంధర్, భగవంత్ కేసరి సినిమాలతో దక్షిణాది ప్రేక్షకులకు పరిచయమైన హిందీ నటుడు అర్జున్ రాంపాల్ మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. గత ఎనిమిదేళ్లుగా దక్షిణాఫ్రికా మోడల్, ఫ్యాషన్ డిజైనర్ గాబ్రియెల్లా డెమెట్రియాడెస్తో సహజీవనం చేస్తున్నారు. వీళ్లకు ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు. ఈ శుక్రవారం గోవాలోని బార్డెజ్ సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో తమ వివాహాన్ని అర్జున్ అధికారికంగా నమోదు చేశాడు.మధ్యప్రదేశ్కి చెందిన అర్జున్ రాంపాల్.. 2001 నుంచి సినిమాలు చేస్తున్నాడు. దాదాపుగా హిందీలోనే నటించాడు. బాలకృష్ణ 'భగవంత్ కేసరి'తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చాడు. రీసెంట్ టైంలో అయితే 'ధురంధర్' రెండు భాగాల్లో విలన్గా నటించి మెప్పించాడు.ఇక పెళ్లి విషయానికొస్తే.. 1998లో మోడల్, వ్యాపారవేత్త మెహర్ జెసియాని వివాహం చేసుకున్నాడు. వీళ్లకు ఇద్దరు కూతుళ్లు కూడా పుట్టారు. కానీ 2019లో పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. ఇది జరగడానికి ఏడాది ముందు నుంచి మోడల్ గాబ్రియెల్లాతో డేటింగ్ మొదలుపెట్టాడు. గత ఎనిమిదేళ్లగా సహజీవనం చేస్తున్న వీళ్లు కొన్నాళ్ల క్రితం అధికారికంగా నిశ్చితార్థం చేసుకున్నారు. ఇప్పుడు 53 ఏళ్ల వయసులో అర్జున్ రాంపాల్ తమ పెళ్లిని రిజిస్టర్ చేయించాడు. దీంతో అధికారికంగా భార్యభర్తలయ్యారు. -
విడాకులు వెనక్కి.. అయినా సీక్రెట్ మ్యారేజ్ ప్లాన్?
బాలీవుడ్ నటుడు గోవింద, ఆయన భార్య సునీత అహుజా మధ్య వివాహ వివాదం మరో మలుపు తిరిగింది. 2024లో దాఖలు చేసిన విడాకుల పిటిషన్ను ఇటీవలే సునీత వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే తన సహనటి కోమల్ రాణి స్వర్ణకర్ను రహస్యంగా వివాహం చేసుకోబోతున్నారంటూ ఓ వార్త బాంబ్లా పేలింది. ఈ బాంబ్ పేల్చింది ఎవరో కాదు.. గోవింద సతీమణి సునీతనే!.ముంబైలో నటి రాఖీ సావంత్ మీడియాతో మాట్లాడుతున్న గోవిందా భార్య సునీతతో ఫోన్ కలిపారు. ఈ సంభాషణలో తనపై సోషల్ మీడియాలో వస్తున్న విమర్శల గురించి సునీత ప్రస్తావించారు. ఇదే సమయంలో గోవింద, కోమల్ రాణి పెళ్లి చేసుకునేందుకు ప్రణాళికలు వేసుకున్నారని ఆమె చెప్పారు. “నేను నిన్నే విడాకుల కేసును వెనక్కి తీసుకున్నాను. అయితే వాళ్లిద్దరూ పెళ్లి చేసుకునే ప్లాన్లో ఉన్నారు” అని సునీత వ్యాఖ్యానించించారు. అదే సమయంలో కోమల్ రాణిని సునీత ‘చికెన్ టిక్కా’ అంటూ సంబోధించడం కూడా చర్చనీయాంశంగా మారింది.సునీతకు రాఖీ సలహాఈ సందర్భంగా రాఖీ సావంత్ సునీతకు మద్దతుగా మాట్లాడారు. గోవిందకు సంబంధించినట్లు చెబుతున్న రూ.200 కోట్ల ఆస్తిపై దృష్టి పెట్టాలని, ఇతర విషయాలను పక్కన పెట్టి ఆస్తులను తన పేరుపై భద్రపరుచుకోవాలని సూచించారు. ఈ వ్యాఖ్యలకు సునీత స్పందించగా.. విడాకుల పిటిషన్ను వెనక్కి తీసుకున్న నేపథ్యంలో గోవింద, కోమల్ పెళ్లి చేసుకునే ప్రయత్నంలో ఉన్నారని బాంబ్ పేల్చారు.కింగ్ ఆఫ్ కామెడీగా..బాలీవుడ్ నటుడు గోవిందా 90వ దశకంలో తన అద్భుతమైన కామెడీ టైమింగ్, ప్రత్యేకమైన డ్యాన్స్ స్టైల్తో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. ‘కూలీ నంబర్ 1’, ‘హీరో నంబర్ 1’, ‘రాజా బాబు’, ‘దుల్హే రాజా’ వంటి హిందీ చిత్రాల రీమేక్ వెర్షన్ల ద్వారా తెలుగు ప్రేక్షకులకు ఆయన సుపరిచితుడు. 1963 డిసెంబర్ 21న జన్మించిన ఆయన అసలు పేరు గోవింద్ అరుణ్ అహూజా. ప్రస్తుతం ఆయన వయసు 62 ఏళ్లు. గోవిందా, సునీతా అహూజాలను 1987 మార్చి 11న వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు.. కుమార్తె టీనా అహూజా, కుమారుడు యశ్వర్ధన్ అహూజా. 90లలో ‘కింగ్ ఆఫ్ కామెడీ’గా గుర్తింపు పొందిన గోవిందా.. ఇప్పటికీ బాలీవుడ్లో ప్రముఖ నటుడిగానే కొనసాగుతున్నారు.ఎయిర్పోర్టులో కనిపించిన తర్వాతే..గోవింద, కోమల్ రాణి మధ్య సంబంధంపై ఇటీవలే ఊహాగానాలు మొదలయ్యాయి. ఇద్దరూ కలిసి ఎయిర్పోర్టులో కనిపించిన ఫొటోలు బయటకు రావడంతో ఈ ప్రచారం మరింత పెరిగింది. ఆ తర్వాత సునీత.. గోవింద, కోమల్ మధ్య సంబంధంపై బహిరంగంగా ఆరోపణలు చేశారు. కూతురి వయసున్న అమ్మాయితో ఎఫైర్ నడుపుతున్నాడని.. కోమల్ను గోవిందకు ‘షుగర్ డాడీ’ అంటూ వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది.కోమల్ రాణి స్వర్ణకర్ ఎవరంటే.. ఉత్తరప్రదేశ్కు చెందిన కోమల్ వ్యక్తిగత జీవితం, కుటుంబ నేపథ్యానికి సంబంధించిన వివరాలు పెద్దగా బయటకు రాలేదు. అయితే ఆమె బాలీవుడ్లో ఇప్పుడిప్పుడే గుర్తింపు తెచ్చుకుంటున్న నటి. గోవిందా నటిస్తున్న రూపా చిత్రంలో ఆమె హీరోయిన్. అలాగే ఆయన నటిస్తున్న మరో ప్రాజెక్టు దునియాదారిలోనూ నటించబోతున్నట్లు సమాచారం. ఇటీవల గోవిందాతో కలిసి ముంబై ఎయిర్పోర్ట్లో కనిపించడంతో వీరిద్దరి మధ్య సంబంధంపై ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే గోవిందా గానీ, కోమల్ గానీ తమ మధ్య ప్రేమ సంబంధం ఉందని అధికారికంగా ధృవీకరించలేదు.సునీతకు గోవింద కౌంటర్మరోవైపు సునీత చేస్తున్న బహిరంగ వ్యాఖ్యలపై గోవింద కూడా స్పందించారు. సునీత తనను ఉద్దేశించి అసభ్య పదజాలం ఉపయోగించడాన్ని ఆపాలని ఆయన కోరారు. యువత ఆమెను ఆదర్శంగా చూస్తుందని, అందువల్ల బహిరంగంగా మాట్లాడేటప్పుడు సంయమనం పాటించాలని సూచించారు. తల్లులు, అక్కాచెల్లెళ్ల పేర్లను అసభ్యంగా ఉపయోగించడం సరికాదని.. ఆమె నుంచి అలాంటి ప్రవర్తనను తాను ఆశించలేదని గోవింద వ్యాఖ్యానించారు.మొన్నే విడాకుల పిటిషన్ వెనక్కిగోవింద, సునీత దంపతుల వివాహ బంధంపై కొంతకాలంగా వివిధ రకాల వార్తలు వస్తున్నాయి. సునీత 2024లో విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేశారు. అయితే మొన్నీమధ్యే ఆగస్టు 19న దాన్ని వెనక్కి తీసుకున్నారు. దీంతో వీరిద్దరి మధ్య వివాహ బంధం కొనసాగుతుందనే సంకేతాలు కనిపించాయి.కానీ పిటిషన్ ఉపసంహరణ జరిగిన వెంటనే సునీత చేసిన తాజా వ్యాఖ్యలు మరోసారి గోవింద వ్యక్తిగత జీవితంపై చర్చకు దారితీశాయి. మరోవైపు నటి పూనమ్ పాండే, సోమీ అలీ కూడా ఈ వివాదంలో గోవిందకు మద్దతుగా మాట్లాడారు. ప్రస్తుతం గోవింద–సునీత మధ్యలో కోమల్ రాణి పేరు తెరపైకి రావడంతో బాలీవుడ్లో ఈ వ్యవహారం మరింత ఆసక్తికరంగా మారింది. -
స్పిరిట్ నుంచి దీపిక తప్పుకోవడానికి అసలు కారణం ఇదేనా?
రెబల్స్టార్ ప్రభాస్ హీరోగా, సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న 'స్పిరిట్' సినిమా నుంచి దీపిక పదుకోన్ తప్పుకోవడం అప్పట్లో పెద్ద చర్చగా మారింది. పని గంటల విషయం కారణంగానే ఆమె ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారనే ప్రచారం కూడా జరిగింది. అయితే తాజాగా అసలు కారణం మరొకటంటూ ఆ చిత్ర నిర్మాత, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సోదరుడు ప్రణయ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి.దీపిక రెమ్యూనరేషన్తో పాటు సినిమా నెట్ ప్రాఫిట్లో 10 శాతం వాటా కోరినట్లు ప్రణయ్ రెడ్డి వెల్లడించారు. ఈ డీల్ వర్కవుట్ కాదని భావించిన 'స్పిరిట్' చిత్రబృందం మరో హీరోయిన్ కోసం చూడాలని నిర్ణయించిందట. అదే సమయంలో కథ, పాత్రలకు సంబంధించిన వివరాలు కూడా ఆమె పీఆర్ టీమ్ ద్వారా మీడియాలోకి లీక్ కావడంపై సందీప్ తీవ్రంగా అసంతృప్తికి గురయ్యాడు. దీంతో దీపికను ప్రాజెక్ట్ నుంచి తప్పించారని ప్రణయ్ పేర్కొన్నారు.ఇక స్పిరిట్లో సౌత్ కొరియా స్టార్ హీరో డాన్ లీ నటిస్తున్నారన్న వార్తలకు కూడా చెక్ పడినట్లు తెలుస్తోంది. నిజానికి ఫ్యాన్స్ హంగామా చూసి ఒక దశలో డాన్ లీ కోసం కాస్త గట్టిగానే ఆలోచించాడట. అయితే హైదరాబాద్ నేపథ్యంలో సాగే కథలో ఆయన పాత్ర సెట్ కాకపోవడంతో ఆ ఆలోచనను సందీప్ రెడ్డి విరమించుకున్నారట. అలాగే చిరంజీవి స్పిరిట్లో నటిస్తున్నారన్న ప్రచారం కూడా కేవలం పుకారేనని ప్రణయ్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రకాశ్ రాజ్ మాత్రం ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారని తెలుస్తోంది. వాయిస్ టీజర్లో ఆయన స్వరం వినిపించినా సినిమాలో కనిపించరట. -
ఇన్స్టామార్ట్లో బొద్దింక : ఎఫ్డీఏ తుకారాంకు హీరోయిన్ విజ్ఞప్తి
సాక్షి, ముంబై: మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) కమిషనర్ తుకారాం ముండే (FDA Commissioner Tukaram) రాష్ట్రంలో ఆహార భద్రత, నాణ్యతా ప్రమాణాలు మరియు మందుల నియంత్రణపై భారీ చర్యలు చేపడుతున్నారు. రెస్టారెంట్లు హోటళ్లు, ప్రముఖ ఫార్మా కంపెనీలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, పెద్ద ఎత్తున లైసెన్సులు సస్పెండ్ చేయడం , అమ్మకాలను నిలిపివేయడం, నోటీసులు జారీ లాంటి చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో పలువురు సెలబ్రిటీలు తుకారం ముండే చర్యలపై ప్రశంసలు కురిపించారు.మరోవైపు ముండే వ్యవహారశైలిపై బాంబై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ముందస్తు నోటీసులివ్వకుండా తనిఖీల పేరుతో ఎఫ్డీఏ చేపడుతున్న దూకుడు చర్యలపై కోర్టు అభ్యంతరం వ్యక్తం చేస్తూ కీలక వ్యాఖ్యలు చేసిన తరుణంగా తాజాగా తుకారాం ముండేకి ట్యాగా చేస్తూ నటి శ్వేతా తివారీ Shweta Tiwari) చేసిన విజ్ఞప్తి ఆసక్తికరంగా మారింది. ఇదీ చదవండి: రూ. 5వేలతో ముంబైకి, పూటగడవని స్థితి..ఇపుడు సూపర్ స్టార్డమ్అసలు ఏమైంది? శ్వేతా తివారీ ఒక క్విక్-కామర్స్ యాప్ ద్వారా ఇన్స్టామార్ట్ ద్వారా ఆర్డర్ చేసిన సరుకులతో పాటు ఇంట్లోకి బొద్దింక వచ్చిందని ఆరోపించిది. ఈ యాప్ ద్వారా కూల్ డ్రింక్స్ ఆర్డర్ చేసిన తర్వాత ఈ ఘటన జరిగినట్లు శ్వేతా తివారీ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో ఒక వీడియోను పంచుకున్నారు. దీనికి మహారాష్ట్ర ఎఫ్డీఏ మిషనర్ తుకారాం ముండేను ట్యాగ్ చేశారు. ఆ వీడియోలో తన ఇంట్లో తిరుగుతున్న బొద్దింకను చూపిస్తూ, ఆహార భద్రతా నిబంధనలపై చర్యలు తీసుకుంటున్న ముండేను ఈ విషయంపై దృష్టి సారించాలని కోరారు.కాగా ఆహార భద్రతా నిబంధనలను ఉల్లంఘిస్తున్న రెస్టారెంట్లు, క్యాంటీన్లపై కఠిన చర్యలు తీసుకుంటూ ముండే ఇటీవల సోషల్ మీడియాలో "అసలి సింగం"గా ప్రశంసలు అందుకుంటున్నారు. సదరు ఆర్డర్ లేదా డెలివరీ ప్లాట్ఫామ్కు సంబంధించిన పూర్తి వివరాలను నటి ఇంకా వెల్లడించలేదు. అలాగే ఈ ఫిర్యాదుపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నారో ఇంకా స్పష్టత రాలేదు. ఇదీ చదవండి: 14 ఏళ్ల ఐటీ జాబ్ వదిలి వ్యాపారం : ఇపుడు కోట్లలో ఆదాయం -
దసరాకి వస్తున్న వదినమ్మ
కోడలు కొత్త ఇంట్లోకి అడుగుపెట్టగానే ఆ ఇల్లంతా ఆనందంతో నిండిపోతుంది. అప్పటివరకూ అస్తవ్యస్తంగా ఉన్న ఆ ఇంటి వాతావరణం ప్రశాంతంగా మారిపోతుంది. అయితే ఆ అమ్మాయి ప్రవర్తన చూసి, ఆమె ఓ మంత్రగత్తె అని ఆమె బావ అనుమానిస్తాడు. అక్కణ్ణుంచి మిగతా కథేంటో తెలియాలంటే హిందీ చిత్రం ‘నయీ నవేలీ’ చూడాల్సిందే.కోడలి పాత్రలో యామీ గౌతమ్ నటిస్తున్న ఈ చిత్రానికి బాలాజీ మోహన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆనంద్ ఎల్. రాయ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని దసరా పండగ సందర్భంగా అక్టోబరు 16న విడుదల చేయనున్నట్లు బుధవారం చిత్రబృందం ప్రకటించింది. కామెడీ, హారర్, ఫాంటసీ ఇలా పలు షేడ్స్ ఉన్న బాబీ (వదిన) క్యారెక్టర్కి యామీ గౌతమ్ పర్ఫెక్ట్ అని ఆనంద్ ఎల్.రాయ్ పేర్కొన్నారు.Yami Gautam's Nayyi Navelli set for Dussehra Festive Release#YamiGautam #NayyiNaveli #Dussehra @yamigautam@aanandlrai @directormbalaji @divynidhisharma@gvprakash @amzmgmstudiosin @colouryellow_in pic.twitter.com/KzDmXLbG5i— Jayaraman (@JournoJRaman) August 19, 2026 -
రూ. 5వేలతో ముంబైకి, పూటగడవని స్థితి..ఇపుడు సూపర్ స్టార్డమ్
సాక్షి, ముంబై: బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తున్న 'ఆవారాపన్ 2' మూవీతో ఒక్కసారిగా వార్తల్లో నిలుస్తున్న నటుడు సువిందర్ విక్కీ( Suvinder Vicky). బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ ప్రధాన పాత్రలో నితిన్ కక్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం 'ఆవారాపన్ 2' లో అద్భుత నటనతో గుర్తింపు పొంది, అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. పదండి ఆయన బాలీవుడ్ జర్నీ ఎలాసాగింది, ఇంత సక్సెస్ ఎలా వచ్చింది ఆ వివరాలు తెలుసుకుందాం.సినీ రంగంలో రాణించాలంటే నటన మీద ఆసక్తి ఉన్నంతనే సరిపోదు. ఎన్నో కష్ట నష్టాలు, అవమానాలు భరించాల్సి ఉంటుంది. అలా ఎంతోమంది నటులు ఏళ్ల తరబడి పోరాటం తరువాత రాణించినవారే. సువిందర్ విక్కీ సక్సెస్ స్టోరీ కూడా అలాంటిదే. ఆయన వెండితెర ఎంట్రీ అంత ఆషామాషీగా జరగలేదు. ఆరంభంలో పొట్టనింపుకోవడానికి చాలా కష్టపడ్డారు. ఇదీ చదవండి : టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాకు బెంగాల్ కోర్టు షాక్పంజాబ్కు చెందిన సువిందర్ విక్కీ సినీ నేపథ్యం లేని కుటుంబం నుండి వచ్చిన ప్పటికీ చిన్న వయసులోనే సినిమాలపై ఆసక్తి కలిగింది.పంజాబీ విశ్వవిద్యాలయం (పాటియాలా)నుంచి థియేటర్ మరియు టెలివిజన్లో ఎంఏ పూర్తి చేశారు. నటనపై ఉన్న ఆసక్తితో కేవలం రూ.5,000 చేతిలో పెట్టుకుని ముంబైకి వచ్చారు. అయితే నెల రోజుల్లోనే ఆ డబ్బులు అయిపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొని తిరిగి పంజాబ్ వెళ్లాల్సి వచ్చింది. ముంబైలో ఉన్నప్పుడు కనీసం ఒక పూట భోజనానికి కూడా డబ్బు లేని క్లిష్ట పరిస్థితులను కూడా ఆయన గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా వచ్చే డబ్బులు సరిపోకపోవడంతో, పొట్టకూటి కోసం ఆయన కొంతకాలం ఇన్సూరెన్స్ ఏజెంట్గా కూడా పాలసీలు విక్రయించారు. తిరిగి చాలాకాలానికి 50 ఏళ్ల వయసులో స్టార్డమ్ను సాధించారు.నటనలో అరంగేట్రంపంజాబ్కు తిరిగి వచ్చిన తర్వాత, సువిందర్ సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేయడం ప్రారంభించారు. 2004లో 'దేస్ హోయా పర్దేస్' అనే పంజాబీ చిత్రంతో అరంగేట్రం చేశారు. తర్వాత 'ఉడ్తా పంజాబ్', అక్షయ్ కుమార్ నటించిన 'కేసరి' వంటి చిత్రాల్లో చిన్న పాత్రలు పోషించారు. 50 ఏళ్ల వయస్సులో నెట్ఫ్లిక్స్ లో వచ్చిన 'కోహ్రా' (Kohrra) వెబ్ సిరీస్తో ఆయనకు నటుడిగా గుర్తింపు లభించింది. ఇందులో ఆయన నటనను సినీ ప్రముఖులు ఎంతగానో ప్రశంసించారు. ఇదీ చదవండి: 14 మిలియన్ల ఫాలోవర్లు : కానీ యష్ ఫాలో అయ్యేది ఆమె ఒక్కర్నే!ఆ తర్వాత ఆయన రణ్వీర్ సింగ్ చిత్రం 'ధురంధర్: ది రివేంజ్', దిల్జీత్ దోసాంజ్ చిత్రం 'సట్లజ్', మూవీల్లో నటించారు. ముఘ్యంగా 'ధురందర్: ది రివెంజ్'లో చిన్నదైనా ముఖ్యమైన పాత్రను పోషించారు. ఇందులో ఆయన అర్జున్ రాంపాల్ పోషించిన మేజర్ ఇక్బాల్ పాత్ర తండ్రిగా నటించారు. తెరపై తక్కువ సమయం కనిపించినప్పటికీ, ఎంతో మంది సూపర్స్టార్స్ కనిపించిన ఈ చిత్రంలో తనదైన ముద్ర వేయగలిగారు. ప్రస్తుతం 'అవారపన్ 2' బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించడం సువిందర్ విక్కీ జీవితంలో మరో ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తోంది. ఇదీ చదవండి: 14 ఏళ్ల ఐటీ జాబ్ వదిలి వ్యాపారం : ఇపుడు కోట్లలో ఆదాయం -
జైల్లో ఒకరిపై ఒకరు పడుకోవాల్సిందే: శిల్పా శెట్టి భర్త
ముంబై: 2021 నాటి పోర్నోగ్రఫీ కేసులో అరెస్టయిన ప్రముఖ వ్యాపారవేత్త, సినీ నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలులో తన అనుభవాలను వెల్లడించారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని స్పష్టం చేస్తూనే, దాదాపు రెండు నెలల పాటు జైలులో గడిపిన భయానక పరిస్థితులపై ఆయన మాట్లాడారు.ఇటీవల ‘ఏబీపీ న్యూస్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజ్ కుంద్రా మాట్లాడుతూ.. విచారణ కోసమే పోలీస్ స్టేషన్కు వెళ్లినట్లు భావించానని, అయితే అక్కడికి వెళ్లాకే తన అరెస్టు వార్తను ఆన్లైన్లో చూసి తెలుసుకున్నానని చెప్పారు. ఈ విషయమై అధికారులను ప్రశ్నించగా, ఇది కోర్టు ఆదేశమని వారు తెలిపారని గుర్తుచేసుకున్నారు.తన అరెస్టు విషయం శిల్పా శెట్టికి వార్తల ద్వారానే తెలిసిందని కుంద్రా పేర్కొన్నారు. ‘ఆమె న్యాయవాదులను సంప్రదించినప్పటికీ ఏమి చేయాలో తోచని స్థితిలో పడిపోయింది. ఆ సమయంలో భారతదేశంలో మా వ్యాపారాల్లో దాదాపు 4,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. 'వీటన్నింటినీ నేనెలా నిర్వహించాలి?’ అని శిల్ప ఆందోళన చెందింది. 63 రోజుల పాటు జైలులో ఉండాల్సి వస్తుందని నాతో చెప్పారు కానీ, అసలు ఎంత సమయం పడుతుందో నాకప్పుడు తెలియదు’ అని ఆయన తెలిపారు.జైలులోని వసతుల లేమిపై స్పందిస్తూ.. ‘50 మంది మాత్రమే పడుకోవడానికి సరిపోయే ఒక చిన్న గదిలో ఏకంగా 250 మందిని ఉంచారు. ఒకరిపై ఒకరు పడుకోవాల్సిన పరిస్థితి ఉండేది. కనీసం కాలు కింద పెట్టడానికి కూడా స్థలం ఉండేది కాదు. అక్కడ ఆహారం కూడా అత్యంత దారుణంగా ఉండేది’ అని రాజ్ కుంద్రా వివరించారు.ఇది కూడా చదవండి: ఫిట్నెస్ ఈవెంట్లో కుప్పకూలిన ప్రముఖ కోచ్ -
నెలకు రూ.33 లక్షలు.. బిగ్బీ కొత్త లీజు ఒప్పదం!
బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ మరో భారీ రియల్ ఎస్టేట్ ఒప్పందంతో వార్తల్లో నిలిచారు. ముంబైలోని అంధేరీ వెస్ట్లో ఉన్న ఓ వాణిజ్య భవనంలోని మూడు అంతస్తులను ప్రముఖ పోషకాహార సంస్థకు లీజుకు ఇచ్చారు. లింక్ రోడ్డులోని సిగ్నేచర్ భవనంలో ఉన్న సుమారు 8,428 చదరపు అడుగుల విస్తీర్ణంలోని కార్యాలయ స్థలాన్ని అమితాబ్ బచ్చన్ లీజుకు ఇచ్చినట్లు సమాచారం.అద్దె రూపంలో రూ.21.88 కోట్లు..ఈ ఒప్పందం ప్రకారం ఆయనకు నెలకు రూ.33 లక్షల అద్దె రానుందట. 2026 ఆగస్టు 15 నుంచి ఐదేళ్ల పాటు ఈ ఒప్పందం కొనసాగనుందట. మొత్తం కాలానికి అద్దె రూపంలో సుమారు రూ.21.88 కోట్లు వచ్చే అవకాశం ఉందని టాక్. ప్రతి ఏడాది అద్దెను 5 శాతం పెంచేలా ఒప్పందంలో నిబంధనను చేర్చినట్లు తెలుస్తోంది.మరోసారి చర్చ..అద్దెకు తీసుకున్న సంస్థకు కార్యాలయ స్థలంతో పాటు తొమ్మిది పార్కింగ్ స్థలాలను కూడా వినియోగించుకునే హక్కు కల్పించారట. ఈ లావాదేవీలో భాగంగా రూ.1.98 కోట్ల భద్రతా డిపాజిట్ను చెల్లించినట్లు సమాచారం.ఇప్పటికే ముంబైలో పలు విలాసవంతమైన నివాసాలు, వాణిజ్య భవనాలను కలిగి ఉన్న అమితాబ్ బచ్చన్.. ఇటీవల అయోధ్యలోనూ భారీగా పెట్టుబడులు పెట్టారు. దీంతో ఆయన రియల్ ఎస్టేట్ సామ్రాజ్యంపై మరోసారి చర్చ మొదలైంది.ఇదీ చదవండి: 15ఏళ్ల తరువాత ‘జిందగీ’ సీక్వెల్పై అప్డేట్ -
షారుక్ ఇంటి వద్ద 2 పాముల కలకలం.. ఒకటి చిక్కి, మరొకటేమో..
ముంబై: బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ ఇంటి వద్ద పాము కలకలం రేపింది. ఇంటి ప్రాంగణంలో పాము కనిపించడంతో అక్కడున్నవారు ఆందోళనకు గురయ్యారు. దీంతో పామును సురక్షితంగా పట్టుకునేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. షారుక్ ఖాన్ ముంబై నివాసంలోని పచ్చిక ప్రదేశంలో పాము కనిపించడంతో దానిని పట్టుకునేందుకు సంబంధిత సిబ్బంది శ్రమించారు. బాంద్రా వెస్ట్లోని మన్నత్లో 2 పాములు చుట్టుకుని తిరుగుతున్నట్లు రాత్రి 8 గంటల సమయంలో స్నేక్ క్యాచర్ విక్కీ దూబేకు ఫోన్ ద్వారా సమాచారం అందింది. సమాచారం అందుకున్న వెంటనే దూబే అటవీ శాఖ రౌండ్ అధికారి దీపక్ దాదా గైక్వాడ్కు, ముంబై రేంజ్ కార్యాలయం, థానేకు కంట్రోల్ రూమ్ ద్వారా ఫోన్ చేసి ఘటన గురించి తెలియజేశారు.విషపూరిత పాము కాదుఅధికారులు అక్కడికి చేరుకున్నప్పుడు మన్నత్ బంగ్లా ప్రాంగణంలోని మెట్ల కింద విషపూరితంకాని ధామన్ పాము కనిపించింది. దీనిని ఇండియన్ ర్యాట్ స్నేక్ అని కూడా పిలుస్తారు. పాము చుట్టుకుని ఉండి భయపడినట్లు కనిపించింది.పామును సురక్షితంగా పట్టుకుని అటవీ శాఖ మార్గదర్శకాల ప్రకారం తిరిగి సహజ ఆవాసంలోకి వదిలేశారు. విషపూరితంకాని ధామన్ పాము సుమారు 8 అడుగుల పొడవు ఉంది. పామును పట్టుకున్న తర్వాత దూబే అక్కడ ఉన్న వారికి పాము గురించి వివరించి, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. అయితే, చుట్టుపక్కల ప్రజలు తిరుగుతున్నట్లు గమనించిన రెండో పాము బంగ్లా ప్రాంగణం నుంచి తప్పించుకుంది. -
కూతురి కంటే చిన్నమ్మాయితో డేటింగ్.. కానీ చివరకు
సామాన్యుల సంగతేమో గానీ సెలబ్రిటీల జీవితాల్లో పెళ్లి, విడాకులు అనేది ఎప్పటికప్పుడు వినిపిస్తున్నట్లే ఉంటాయి. హిందీ ప్రముఖ నటుడు, రచయిత, నిర్మాత అయిన రాజా చౌదరి కూడా రెండుసార్లు పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్నాడు. అయితే ఒకానొక సందర్భంలో తన కూతురి కంటే చిన్న వయసున్న అమ్మాయితో డేటింగ్ చేశాడు. కానీ చివరకు ఆమెతోనూ విడిపోవాల్సి వచ్చింది. ఆ సందర్భాన్ని ఓ ఇంటర్వ్యూలో గుర్తుచేసుకున్నాడు. ఇంతకీ అసలేమైందంటే?(ఇదీ చదవండి: అనిరుధ్-కావ్య మారన్ పెళ్లి.. ఎప్పుడు ఎక్కడంటే?)భోజ్పురి సినిమాలు, హిందీ సీరియల్స్తో గుర్తింపు తెచ్చుకున్న రాజా చౌదరి.. బాలీవుడ్లో పలు చిత్రాల్లో చిన్న, సహాయక పాత్రల్లో చేశాడు. 'బిగ్ బాస్ 2'లో ఫస్ట్ రన్నరప్గానూ నిలిచాడు. తన తోటి నటి శ్వేతా తివారిని 1998లో పెళ్లి చేసుకున్నాడు. వీళ్లకు పాలక్ అనే కూతురు కూడా పుట్టింది. కొన్నేళ్లకే వైవాహిక జీవితంలో విభేదాలు తలెత్తడంతో 2007లో ఇద్దరూ విడిపోయారు. ఆ టైంలోనే రాజాపై శ్వేతా తివారి గృహహింస కేసు పెట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇది జరిగిన ఐదేళ్లకు అంటే 2012లో అధికారికంగా విడాకులు తీసుకున్నారు.నాలుగేళ్ల క్రితం ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రాజా చౌదరి.. తన వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 2015లో శిల్పి అనే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అనుకున్నట్లు, కొంతకాలం ఆమెతో డేటింగ్ చేసినట్లు చెప్పాడు. కానీ తమ మధ్య వయసు వ్యత్యాసం కారణంగా శిల్పి తన ఆలోచన మార్చుకోవడంతో విడిపోయామని వెల్లడించాడు. తన కూతురు పాలక్ కంటే తాను చిన్నదాన్నిఅని శిల్పి తరచూ ప్రస్తావించేదని తెలిపాడు.ఇక శిల్పితో విడిపోయిన కొన్నాళ్లకు రాజా చౌదరి జీవితంలోకి శ్వేతా సూద్ వచ్చింది. కార్పొరేట్ రంగంలో హెచ్ఆర్గా పనిచేసే శ్వేతని 2015లో వివాహం చేసుకోగా.. తర్వాత ఈమె నుంచి కూడా విడిపోయాడు. గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలోనే తన రెండో భార్య శ్వేతా సూద్, భరణం కోసం డిమాండ్ చేసిందని రాజా వెల్లడించాడు. రీసెంట్ టైంలో మళ్లీ ఇంటర్వ్యూలు ఇస్తూ తన మాజీ భార్య శ్వేతా తివారి గురించి సంచలన వ్యాఖ్యలు చేస్తూ రాజా చౌదరి వార్తల్లో నిలుస్తున్నాడు.(ఇదీ చదవండి: రష్మిక.. నా గురించి అందుకే అలా మాట్లాడిందేమో: హీరో యష్) -
తండ్రి కుల వ్యవస్థకు వ్యతిరేకం.. అందుకే నా ఇంటిపేరు ‘బచ్చన్’
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ‘కౌన్ బనేగా కరోడ్పతి సీజన్-18’ కార్యక్రమంలో అమితాబ్ ఇంటి పేరు వెనుక ఉన్న ఆసక్తికరమైన విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. తన తండ్రి ప్రముఖ హిందీ కవి హరివంశ్రాయ్ బచ్చన్ చిన్నప్పటి నుంచే కుల వ్యవస్థను వ్యతిరేకించేవారని అందుకే కుటుంబ ఇంటిపేరుగా బచ్చన్ ఎంచుకున్నారని తెలిపారు.పాఠశాల అడ్మిషన్ సమయంలో దరఖాస్తు ఫారంలో కులానికి సంబంధించిన కోలమ్ ఉండేదని చెప్పారు. అక్కడ నింపినప్పుడు తన తండ్రి హరివంశ్రాయ్ బచ్చన్ కుల వ్యవస్థను అంగీకరించకుండా మా కులం బచ్చన్ అని నమోదు చేశారని తెలిపారు. అప్పటి నుంచి తమ కుటుంబ ఇంటిపేరుగా బచ్చన్ కొనసాగుతోందని పేర్కొన్నారు.కాగా, అమితాబ్ బచ్చన్ అసలు పేరు అమితాబ్ శ్రీవాస్తవ. 1942లో అక్టోబర్ 11న ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్(ప్రస్తుతం ప్రయాగ్రాజ్)లో జన్మించారు. ఆయన తండ్రి హరివంశ్రాయ్ బచ్చన్ ఆధునిక హిందీ సాహిత్యంలో ప్రముఖ కవిగా గుర్తింపు సాధించారు.ఇక అమితాబ్ సినీ ప్రయాణం ‘సాత్ హిందుస్తానీ’ చిత్రంతో ప్రారంభమైంది. కెరీర్ ప్రారంభంలో ఎన్నో వైఫల్యాలను ఎదుర్కొన్న ఆయన.. ‘జంజీర్’, ‘దీవార్’, వంటి చిత్రాలతో బాలీవుడ్లో అగ్ర నటుడిగా ఎదిగారు. ప్రస్తుతం వరుస సినిమాలతో అభిమానులను అలరిస్తున్నారు. -
14 మిలియన్ల ఫాలోవర్లు : కానీ యష్ ఫాలో అయ్యేది ఆమె ఒక్కర్నే!
మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘రామాయణం’లో రావణుడి పాత్రలో నటిస్తున్న కేజీఎఫ్ (KGF) స్టార్, యష్ (Yash)కి సంబంధించి ఒక ఆసక్తికర విషయం నెట్టింట సందడిగా మారింది. నితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్ విడుదల తరువాత యష్పై క్రేజ్ మరింత పెరిగింది. సోషల్ మీడియాలో సౌత్ సూపర్ స్టార్ యష్కున్న ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా భారీగానే. ఇన్స్టాగ్రామ్లో 14 మిలియన్లకు (1.4 కోట్ల) పైగా ఫాలోవర్లు ఉన్నారు. అయితే యష్ కేవలం ఒక్కరిని మాత్రమే ఫాలో అవుతారని మీకు తెలుసా?అవును ఈ కన్నడ హీరో తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఫాలో అయ్యేది కేవలం ఒకే ఒక్కరిని. ఇటీవల ఒకటీవీ షోలో యష్ తన రాబోయే చిత్రాలతో పాటు వ్యక్తిగత జీవిత విశేషాలను కూడా పంచుకున్నారు. ఆ సమయంలో, ప్రేక్షకుల మధ్య కూర్చున్న ఒక అమ్మాయి యష్ను ఒక ప్రశ్న అడిగింది. “మీకు ఇన్స్టాగ్రామ్లో 14 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు, కానీ మీరు కేవలం ఒక్క వ్యక్తిని మాత్రమే ఫాలో అవుతారు. ఎవరా వ్యక్తి, మీ జీవితంలో వారి విలువ ఏమిటి?” అన్న ప్రశ్నకు యశ్ ఇచ్చిన సమాధానం అతని లక్షలాది అభిమానుల హృదయాలను గెలుచుకుంది.దీనికి సమాధానంగాయష్ నవ్వుతూ, “ఆమె నా భార్య” ఎంతో ప్రేమగా బదులిచ్చారు. ఇది విన్న స్టూడియో మొత్తం చప్పట్లతో మారుమోగింది. "ఆమె నా భార్య మాత్రమే కాదు, నా జీవితంలో ఉన్న ఏకైక బెస్ట్ ఫ్రెండ్ కూడా. ఒకవేళ నేను తనని కూడా ఫాలో అవ్వకుండా జీరో పెడితే నాకు ఇబ్బందులు తప్పవు" అని సరదాగా వ్యాఖ్యానించారు. "నిజం చెప్పాలంటే, ఆమె నా జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తి. మేమిద్దరం కలిసి ఎదిగాము. ఆమె నాకు భార్యగా దొరకడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆమె నా జీవితానికి బలమైన ఆధారం." అంటూ చెప్పారు.ఇదీ చదవండి: 24 గంటల్లో 1.6 లక్షల ఫాలోవర్స్ : సీజేపీ తరహాలో డీజేపీ సంచలనంరెండు భాగాలుగా రూపొందుతున్న ఈ భారీ బడ్జెట్ చిత్రంలో రణబీర్ కపూర్ శ్రీరాముని పాత్రలో, సాయి పల్లవి సీతగా, రవి దూబే లక్ష్మణునిగా, యశ్ రావణునిగా కనిపించనున్నారు. ఇక సన్నీ డియోల్ హనుమంతుని పాత్రను పోషిస్తున్నారు. 'రామాయణం మొదటి భాగం' విదేశాలలో నవంబర్ 6, 2026న, భారతదేశంలో నవంబర్ 8, 2026న విడుదల కానుంది. 'రామాయణం: రెండవ భాగం' 2027 దీపావళికి థియేటర్లలోకి రానుంది. 'రామాయణం'తో పాటు, ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మరో మూవీ 'టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్'. ఈ చిత్రంలో యష్ ద్విపాత్రాభినయం చేయనున్నారు. యష్తో పాటు, కియారా అద్వానీ, తారా సుతారియా, హుమా ఖురేషి, నయనతార మరియు రుక్మిణి వంటి కథానాయికలు కూడా ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. ప్రేక్షకులు ఈ చిత్రం కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. చివరకు, ఈ చిత్రం ఆగస్టు 26న థియేటర్లలో విడుదల కానుంది.ఇదీ చదవండి: ఎగ్జామ్ స్కాంలపై మోదీ సర్కార్కు బాబా రామ్దేవ్ హెచ్చరికకాగా యష్ రాధికా పండిట్ 2007లో 'నంద గోకుల' అనే కన్నడ సీరియల్ సెట్స్లో మొదటిసారి కలుసుకున్నారు. ఈ పరిచయం ప్రేమగా మారి, 2016 డిసెంబరులో వివాహం చేసుకున్నారు. వీరికి ఐరా, యథర్వ్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. View this post on Instagram A post shared by Coreculture (@coreculture.inn) -
ప్రళయ్ ప్రారంభం
‘ధురంధర్, ధురంధర్: ది రివెంజ్’ వంటి బ్లాక్బస్టర్ చిత్రాల తర్వాత రణ్వీర్ సింగ్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా షూటింగ్ ముంబైలో ప్రారంభమైంది. ఈ సినిమాకి రణ్వీర్ సింగ్ ఓ నిర్మాత కూడా. ‘స్కామ్ 1992: ది హర్షద్ మెహతా స్టోరీ’ సిరీస్ ఫేమ్ దర్శకుడు జై మెహతా ఈ సినిమాకు దర్శకుడు.ఈ చిత్రానికి ‘ప్రళయ్’ అనే టైటిల్ అనుకుంటున్నారని టాక్. అలాగే ఇందులోని ఓ ప్రధాన పాత్రలో కళ్యాణీ ప్రియదర్శన్ నటిస్తున్నారని తెలిసింది. -
మళ్లీ ప్రేమకథ షురూ
కార్తీక్ ఆర్యన్, శ్రీలీల వెండితెర ప్రేమకథ మళ్లీ షురూ అయింది. ఈ ఇద్దరూ జంటగా అనురాగ్ బసు దర్శకత్వంలో ఓ ప్రేమకథా చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. పాటలకు మంచి ప్రాధాన్యం ఉన్న ఈ చిత్రానికి ‘తూ మేరీ జిందగీ హై’ టైటిల్ని అనుకుంటున్నారని సమాచారం. ఈ సినిమా ఇప్పటికే పూర్తి కావాల్సింది. కానీ అనివార్య కారణాల వల్ల షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది.తాజాగా ముంబైలో మళ్లీ ఈ ప్రేమకథా చిత్రం షూటింగ్ని షురూ చేశారు. శ్రీలీల పాల్గొంటుండగా కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోందట. ఇక ఎలాంటి వాయిదాలు లేకుండా సినిమాని పూర్తి చేసేలా అనురాగ్ బసు ప్లాన్ చేశారని సమాచారం. వచ్చే ఏడాది జనవరి 26న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకుంటున్నారని టాక్. హిందీలో శ్రీలీలకి ఇదే తొలి చిత్రం. సౌత్లో స్టార్గా ఎదిగిన శ్రీలీల ఈ చిత్రంతో హిందీలోనూ దూసుకెళతారనే అంచనాలు ఉన్నాయి. -
పాన్మసాలా ప్రచారాలు ఆపాలంటూ స్టార్ హీరోలకు నోటీసులు
పాన్మసాలా ప్రకటనల్లో నటించిన బాలీవుడ్ నటులు షారుక్ ఖాన్, అజయ్ దేవ్గన్, టైగర్ ష్రాఫ్లకు మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్డీఏ) షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ‘విమల్’ పాన్మసాలా ప్రకటనలకు సంబంధించిన ప్రచార కంటెంట్ను 15రోజుల్లో తొలగించాలని వీరికి ఆదేశించింది.ఈ నోటీసులు ఆగస్టు 11న మహారాష్ట్ర ఆహార భద్రతా విభాగం అధిపతి తుకారాయ్ జారీ చేశారు. విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఆదేశాలను పాటించకపోతే 2006 ఆహార భద్రత, ప్రమాణాల చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎఫ్డీఏ హెచ్చరించింది. తప్పుడు ప్రకటనలు, ఆహార ఉత్పత్తుల ప్రచారంపై ఉన్న నిబంధనలను ఉల్లంఘించినందుకే ఈ నోటీసులు పంపించినట్లు పేర్కొంది.కాగా నిషేధిత ఉత్పత్తి అయిన పాన్ మసాలను ఇప్పటికీ సోషల్ మీడియాతో పాటు ఇతర వేదికల్లో ప్రచారంలో ఉన్నాయి. పాన్మసాలా ఉత్పత్తుల ప్రకటనల్లో ప్రముఖుల భాగస్వామ్యంపై గత కొంతకాలంగా విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. -
ఇండస్ట్రీలో విషాదం.. 27 ఏళ్లకే చనిపోయిన నటి
7 అవర్స్ టు గో, ది ఫైనల్ ఎగ్జిట్, ఘోస్ట్ లాంటి హిందీ సినిమాలతో పాటు 'తగ్గేదే లే' అనే తెలుగు మూవీలోనూ నటించిన అనన్య రాజ్(27) చనిపోయింది. గత నెల 15న ఆమె నిద్రలోనే ప్రశాంతంగా తుదిశ్వాస విడిచినట్లు ఈమె కుటుంబ సభ్యులు వెల్లడించారు. అనన్య ఇన్ స్టాలో ఈ మేరకు పోస్ట్ పెట్టారు. దీంతో తోటి నటీనటులు సంతాపం తెలియజేస్తున్నారు.(ఇదీ చదవండి: విశ్వనాథ్ అండ్ సన్స్.. రెండో రోజుల్లోనే ఎన్ని కోట్లంటే?)అనన్య రాజ్ గత ఏడాది కాలంగా శారీరక, మానసిక సమస్యలతో బాధపడిందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆ ఇబ్బందులని అధిగమించేందుకు ఎంతో ధైర్యంగా పోరాడినట్లు రాసుకొచ్చారు. కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో ఉన్నందున తమ వ్యక్తిగత గోప్యతని గౌరవించాలని అభిమానులు, మీడియాని కోరారు.'ఈ వార్తని ఎంతో బాధతో తెలియజేస్తున్నాం. జూలై 15న తెల్లవారుజామున అనన్య కన్నుమూసింది. నిద్రలోనే ప్రశాంతంగా తుదిశ్వాస విడిచింది. గత ఏడాది కాలంగా ఆమె శారీరక, మానసిక అసౌకర్యాలతో పోరాడింది. వాటిని అధిగమించేందుకు యోధురాలిలా పోరాడింది' అని అనన్య ఇన్ స్టాలో కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.(ఇదీ చదవండి: ఓటీటీకి మలయాళ థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్) View this post on Instagram A post shared by Ananya ✨ (@ananyaraj.official) -
అవసరమైతే కండోమ్ యాడ్ కూడా చేస్తా : యష్
కన్నడ స్టార్ హీరో యష్, బాలీవుడ్ నటి కియారా అద్వానీ జంటగా నటించిన చిత్రం ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’. గీతూ మోహన్దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా ఇటీవల విడుదలైన ‘తబాహీ’ పాట సోషల్ మీడియాలో విపరీతంగా చర్చనీయాంశమైంది. పాటలో యష్, కియారా అద్వానీ మధ్య కనిపించిన బోల్డ్ సన్నివేశాలపై కొందరు నెటిజన్లు విమర్శలు గుప్పించారు. మరికొందరు ఈ పాటను ఏకంగా కండోమ్ ప్రకటనతో పోల్చుతూ ట్రోల్ చేశారు. తాజాగా ఈ విమర్శలపై యష్ స్పందించారు.ఓ టీవీ షోలో పాల్గొన్న యష్కు ‘తబాహీ’ పాటపై వచ్చిన విమర్శల గురించి ప్రశ్న ఎదురైంది. దీనిపై ఆయన తనదైన శైలిలో సరదాగా స్పందించారు. ‘అవసరమైతే కండోమ్ ప్రకటన కూడా చేస్తాను. కానీ అందుకు డబ్బులు తీసుకుని చేస్తాను. అలా ఉచితంగా చేయను’ అని యష్ వ్యాఖ్యానించారు. ఆయన సమాధానంతో కార్యక్రమంలో ఉన్న ప్రేక్షకులంతా గట్టిగా నవ్వారు. విమర్శలను సీరియస్గా తీసుకోకుండా హాస్యభరితంగా స్పందించడం ద్వారా యష్ ట్రోల్స్కు కౌంటర్ ఇచ్చారు.ఇక టాక్సిక్ చిత్రంలోని బోల్డ్ కంటెంట్ గురించి మాట్లాడుతూ.. ఈ సినిమా సాధారణంగా అందరికీ ఉద్దేశించిన కథ కాదని, పెద్దలను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఫెయిరీ టేల్ అని ఆయన స్పష్టం చేశారు. ‘పిల్లలు ఇంట్లో ఉండాలి. ఈ చిత్రాన్ని చూడకూడదు’ అని ఆయన అన్నారు. దీంతో సినిమాలోని కంటెంట్ ఏ వర్గం ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకుని రూపొందించారనే దానిపై మరింత స్పష్టత వచ్చింది.గీతూ మోహన్దాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నయనతార, హుమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ‘కేజీఎఫ్: చాప్టర్ 2’ తర్వాత యష్ నటిస్తున్న చిత్రం కావడంతో దీనిపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. -
భారత సైన్యమే మనల్ని కాపాడుతోంది
భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ భారత సైనికులతో కలిసి సందడి చేశారు. జమ్మూకాశ్మీర్లోని ఉరీ ప్రాంతాన్ని సందర్శించిన ఆయన సైనికులతో ముచ్చటించారు.‘ప్రపంచవ్యాపంగా జరుగుతున్న యుద్ధాల కోసం నా పిల్లలు తైమూర్, జెహ్ తరుచూ నన్ను అడుగుతుంటారు. ఆ యుద్ధాలను చూసి పిల్లలు భయపడుతుంటారు. మమ్మల్ని ఎవరు కాపాడతారు? పరిస్థితులు మరింత దిగజారుతాయా? అని అడుగుతుంటారు. అప్పుడు నేను భారత సైన్యం మనల్ని రక్షిస్తోందని చెబుతుంటాను’ అని సైఫ్ తెలిపారు.కాశ్మీర్ దేశంలోనే అత్యంత అందమైన ప్రాంతాల్లో ఒకటన్నారు. తన తల్లి, ప్రముఖ నటి షర్మిలా ఠాగుర్ నటించిన తొలి చిత్రం ‘కశ్మీర్ కీ కలి’ తో పాటు అనేక చిత్రాల పాటలు కశ్మీర్లోనే చిత్రీకరణ జరిగిందని తెలిపారు.ఇక సినిమాల విషయానికి వస్తే.. సైఫ్ ప్రస్తుతం ప్రియదర్శన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘హైవాన్’ చిత్రంలో నటిస్తున్నారు. దాదాపు 18 ఏళ్ల తరువాత అక్షయ్కుమార్తో కలిసి ఆయన నటిస్తున్న ఈ చిత్రం సెప్టెబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
'హద్దుల్లో ఉంటే మీకే మంచిది'.. గోవిందా స్ట్రాంగ్ కౌంటర్..!
బాలీవుడ్ ఇప్పుడు గోవిందా పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఆయన భార్య సునీత ఆరోపణలతో బీటౌన్ అంతా ఆయన వైపే చూస్తోంది. ఇటీవల సహ నటి కోమల్ రాణి స్వర్ణకర్తో గోవిందా ముంబయి ఎయిర్పోర్ట్లో కనిపించడంతో ఈ వివాదం మొదలైంది. కూతురు వయసున్న అమ్మాయితో తిరుగుతున్నాడని ఆయన సతీమణి సునీత అహుజా విమర్శించింది. ఇలాంటి పనులు చేయడానికి కొంచెమైనా సిగ్గుండాలని కాస్తా ఘాటుగానే కామెంట్స్ చేసింది. తాజాగా తన భార్య చేస్తున్న కామెంట్స్పై నటుడు గోవిందా రియాక్ట్ అయ్యారు. మీ హద్దుల్లో మీరు ఉంటే ఇద్దరికీ మంచిదని అన్నారు. సునీత అనవసరంగా తన పనిలో జోక్యం చేసుకుంటోందని.. తనకు ప్రజల మద్దతు కోల్పోయేలా చేయడానికి ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. నన్ను అపఖ్యాతి పాలు చేయాలని చూస్తున్నారని అన్నారు.సాధారణ కుటుంబాల నుంచి చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించే వారిని అవమానించకూడదని గోవిందా అభిప్రాయపడ్డారు. సునీతకు పలుకుబడి, అధికారం, కీర్తి, గౌరవం, సంపద అన్ని ఉన్నాయని.. కానీ అంతమాత్రాన తక్కువ ఉన్నవారిని అవమానించడం సరికాదన్నారు. దేశంలో చాలామంది స్టార్ నటులు తమకంటే తక్కువ వయస్సు ఉన్నవారితో నటించారని గోవిందా గుర్తు చేశారు. అభిమానులు నన్ను యవ్వనంగా చూడడం మీకు ఇష్టం లేనట్లుందని అన్నారు.కొందరు కావాలనే తన ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారని గోవిందా ఆరోపించారు. మీకు మళ్లీ నా మద్దతు అవసరమయ్యే సమయం వస్తుందని నేను నమ్ముతున్నానని తెలిపారు. అందుకే దయచేసి నాపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం.. నన్ను బహిరంగంగా అవమానించడం ఆపాలని కోరుతున్నా.. దయచేసి మీరు మీ హద్దులు పాటించండంటూ సునీతకు స్పష్టం చేశారు. మీ నుంచి ఇలాంటి దుర్భాష తాను ఆశించడం లేదన్నారు. ప్రజలు మిమ్మల్ని స్పూర్తిగా తీసుకునేలా వ్యవహరించాలని ఆయన హితవు పలికారు. This is going worse between Govinda and her ex-Wife Sunita AhujaEarlier Sunita called out Govinda for trapping young girls of his daughter's ageNow Govinda hit out by saying:"Many superstars worked with young girls""Sunita You remain in ur limits"This Is Going UGLY🤡 pic.twitter.com/p9JTlBFLVw— Dear Men (@Dear_Men_Life) August 15, 2026 Govinda gets emotional over his wife Sunita Ahuja’s statement. 😭💔 pic.twitter.com/aMIW8Vfg5x— T-Celebs (@t_celebs) August 15, 2026 -
20 ఏళ్ల వయసు గ్యాప్.. ఆమెని దూరం పెట్టాలని ట్రై చేశా కానీ
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్.. దక్షిణాది ప్రేక్షకులకు కూడా తన సినిమాలతో సుపరిచతమే. రీసెంట్ టైంలో మహారాజా, డెకాయిట్ లాంటి తమిళ, తెలుగు చిత్రాల్లో నటిస్తూ కాస్త గుర్తింపు తెచ్చుకున్నాడు. కెరీర్ పరంగా ఈయన ఎలాంటి మూవీస్ తీశారు, తీస్తున్నారు అనేది పక్కనబెడితే వ్యక్తిగతంగా ఎప్పటికప్పుడు ఏదోలా వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తనకంటే 20 ఏళ్ల చిన్నదైన అమ్మాయితో డేటింగ్ చేస్తుండటం గురించి మాట్లాడారు. ఈ మేరకు తమ బంధం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.(ఇదీ చదవండి: విశాల్ సినిమాకు దారుణ పరిస్థితి.. రూ.కోటి కూడా రాలేదు!)అనురాగ్ కశ్యప్ గతంలో ఆర్తి బజాజ్ అనే ఎడిటర్ని పెళ్లి చేసుకున్నాడు. 12 ఏళ్ల పాటు సాగిన వీరి వైవాహిక జీవితం 2009లో ముగిసింది. తర్వాత నటి కల్కి కొచ్లిన్ని పెళ్లాడాడు. నాలుగేళ్లు అయ్యేసరికి వీళ్లు విడిపోయారు. అనంతరం కర్ణాటకకు చెందిన శుభ్రా శెట్టి అనే అమ్మాయితో అనురాగ్ ప్రేమలో పడ్డాడు. అలా గత 11 ఏళ్లుగా వీరిద్దరూ రిలేషన్షిప్లో ఉన్నారు. దాదాపు పదేళ్ల క్రితం అనురాగ్ తన ఇన్ స్టాలో శుభ్రాతో కలిసి ఉన్న ఫొటోలని షేర్ చేయడంతో వీరి బంధం బహిరంగమైంది. తర్వాత కాలంలో వీళ్లు మీడియాకు దూరంగానే ఉంటూ వచ్చారు. తాజా ఇంటర్వ్యూలో తమ ప్రేమ, వయసు తేడా, రిలేషన్షిప్లో ఎదురైన సవాళ్ల గురించి ఇద్దరూ మాట్లాడారు.'తొలి రోజుల్లో మా బంధాన్ని మీడియాకు దూరంగా ఉంచేందుకు ప్రయత్నించాం. మా వ్యక్తిగత జీవితంపై చర్చ జరగకూడదని అనుకున్నాం. కానీ ఓ జర్నలిస్ట్ మా రిలేషన్ గురించి ఆర్టికల్ రాయడంతో అది బయటపడింది. నాకు 20 ఏళ్ల వయసున్నప్పుడు అనురాగ్తో డేటింగ్ ప్రారంభించాను. అప్పటికే అనురాగ్కు పెళ్లయి ఓ కూతురు ఉంది. దీంతో మా సంబంధంపై నా తల్లిదండ్రులు మొదట్లో కంగారుపడ్డారు. చివరకు మా నిర్ణయాన్ని అంగీకరించారు. నా కంటే అనురాగ్కు జీవితానుభవం ఎక్కువ. దీంతో ఆయన నాకు స్వేచ్ఛ ఇచ్చారు. మొదట్లోనే అనురాగ్ నాపై ప్రేమ బయటపెట్టేశారు. కానీ నిర్ణయం తీసుకోవాలని ఒత్తిడి చేయకుండా, జీవితంపై నాకంటూ ఓ క్లారిటీ తెచ్చుకునేందుకు టైమ్ ఇచ్చారు' అని శుభ్రా చెప్పింది.'మా జీవితంలో కొన్ని సమస్యలు వచ్చాయి. నాకు సిగ్గుగా అనిపించలేదు కానీ ఓ దశలో వయసు తేడా కారణంగా నేను చాలా అసౌకర్యంగా ఫీలయ్యాను. ఆమెని నా నుంచి దూరం పెట్టాలని ప్రయత్నించాను. ఆమె ముఖంలో వయసు పెద్దగా కనిపించదు. నేను వయసు పెరుగుతున్నా ఆమె మాత్రం అలాగే కనిపిస్తుండటంతో నాకు మరింత ఇబ్బందిగా అనిపించేది. ఓ దశలో శుభ్రా నాతో కలిసి షూటింగ్లో పాల్గొంది. ఆ అనుభవం మా బంధంపై నాకు మరింత క్లారిటీ వచ్చేలా చేసింది. చివరకు నాకు కావాల్సిన వ్యక్తి ఈమె అని నిర్ణయించుకున్నాను' అని అనురాగ్ చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: వంటల ప్రోగ్రామ్లో సమంత.. ప్రెగ్నెన్సీతో చేస్తుందా?) -
డేటింగ్ యాప్లో హృతిక్ ప్రొఫైల్..!
బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్, నటి సబా ఆజాద్ల బ్రేకప్పై ఊహాగనాలు సోషల్ మీడియాలో ఊపందుకున్నాయి. ప్రముఖుల కోసం రూపొందించిన డేటింగ్ యాప్ ‘రాయా’లో హృతిక్ పేరుతో కనిపించిన ప్రొఫైల్ స్క్రీన్షాట్లు సోషల్ మీడియాలో వైరల్ కావడమే దీనికి కారణం. గతంలో పలుమార్లు వార్తలు..2022లో హృతిక్, సబా తమ రిలేషన్ను అధికారికంగా ప్రకటించారు. అయితే గతంలో అనంత్ అంబానీ వివాహ వేడుకలకు హృతిక్ ఒంటరిగా హాజరుకావడం, మరికొన్ని కార్యక్రమాల్లో సబా కనిపిచకపోవడంతో వీరు విడిపోతున్నారనే ప్రచారం జరిగింది. తరువాత వీరి బ్రేకప్పై పలుమార్లు వార్తలు వచ్చినప్పటికీ.. బయట వీరిద్దరూ ముచ్చటగా కనిపిస్తూ ఆ వార్తలకు చెక్ పెట్టారు.అయితే ప్రస్తుతం ‘రాయా యాప్’లో హృతిక్కు సంబంధించినట్లు ఉన్న ఓ ప్రొఫైల్ ఇప్పుడు చర్చకు దారితీస్తోంది. అయితే ఈ ఖాతా నిజంగా హృతిక్దేనా? కాదా అనే విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈ నేపథ్యంలో నటి ఊర్వశి రౌతేలా 2024లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలోని వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్గా మారాయి. తాను ‘రియా యాప్’లో హృతిక్తో పాటు ఆదిత్య రాయ్ కపూర్ ప్రొఫైల్నూ చూసినట్లు ఆమె పేర్కొన్నారు. అయితే తాను మాత్రం ఆ యాప్ను స్నేహితుల కోసమే ఉపయోగించానిని స్పష్టం చేశారు.కాగా హృతిక్ త్వరలో ‘క్రిష్4’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమాతోనే ఆయన దర్శకుడిగా కూడా పరిచయం కానున్నాడు. అయితే తన తండ్రి రాకేశ్ రోషన్తో కూడా ఓ సినిమాని చేయనున్నట్లు సమాచారం. -
'కొంచెమైనా సిగ్గుండాలి.. కూతురి వయసున్న అమ్మాయితో'
బాలీవుడ్ నటుడు గోవిందా వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఇన్నాళ్లు గోవిందాను వెనకేసుకొచ్చిన సునీత.. ఈ సారి మాత్రం గట్టిగానే కడిగేస్తోంది. ఇటీవల గోవిందా నటి కోమల్ రాణి స్వర్ణకర్తో కనిపించడంతో సునీత ఫైరవుతోంది. తన కూతురు వయసున్న అమ్మాయితో తిరుగుతున్నాడు.. గోవిందాకు కొంచెమైనా సిగ్గుండాలని ప్రశ్నించింది.ఇటీవల ముంబయి విమానాశ్రయంలో గోవిందాతో పాటు నటి కోమల్ రాణి స్వర్ణకర్ జంటగా కనిపించింది. ఆ తర్వాత వీరిద్దరిపై సోషల్ మీడియాలో రూమర్స్ మొదలయ్యాయి. వీరిద్దరు డేటింగ్లో ఉన్నారా? అంటూ నెట్టింట చర్చ మొదలైంది. ఇది చూసిన కొందరు గోవిందా భార్య సునీత అహుజాను ప్రశ్నించారు. దీంతో ఆమె తనదైన శైలిలో స్పందించింది. అసలు వీళ్లిద్దరు సినిమా తీయకుండానే ప్రమోషన్స్ చేస్తున్నారా? అంటూ మండిపడింది. అతను తన కూతురి వయస్సులో ఉన్న అమ్మాయితో తిరుగుతున్నాడు... కనీసం కొంచెమైన సిగ్గుండాలి కదా సునీత నిలదీసింది.కోమల్ రాణి స్వర్ణకర్ ఎవరు?కోమల్ రాణి స్వర్ణకర్ బాలీవుడ్లో ఎంట్రీకి సిద్ధమైంది. గోవింద ఇటీవలే 'రూపా', 'దునియాదారి' చిత్రాలను ప్రకటించారు. వీటిలో 'రూపా' చిత్రంలో రాణి స్వర్ణకర్ను కథానాయికగా పరిచయం చేశారు. ఈ ప్రాజెక్టులను గోవిందానే నిర్మిస్తున్నారు. దీంతో గోవింద రాబోయే రెండు ప్రాజెక్టులలోనూ ఆమె భాగమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. -
ఆరాధ్య బచ్చన్ కేసు: ‘ఇంటి పేరు ప్రతిష్ఠ తరతరాలకు సంక్రమిస్తుందా’
ఆన్లైన్లో తనపై తప్పుడు వార్తలు, అసత్య ప్రచారం జరుగుతోందంటూ బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్ కుమార్తె ఆరాధ్య బచ్చన్ దాఖలు చేసిన పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఒక ప్రముఖ కుటుంబానికి చెందిన ఇంటి పేరు ప్రతిష్ఠను ట్రేడ్మార్క్తో పోల్చవచ్చా? ఆ ప్రతిష్ఠ తరతరాలకు సంక్రమిస్తుందా? అనే అంశాలపై న్యాయస్థానం ప్రశ్నలు లేవనెత్తింది.2023లో ఆరాధ్య బచ్చన్, తన తండ్రి అభిషేక్ బచ్చన్తో కలిసి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన ఆరోగ్యంపై యూట్యూబ్లో తప్పుడు వీడియోలు ప్రచారం చేస్తున్నారని ఆమె పిటిషన్లో పేర్కొన్నారు. కొన్ని వీడియోల్లో తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిందని, మరికొన్నింటిలో ఆరాధ్య మరణించిందని కూడా ప్రచారం చేసినట్లు ఆరోపించారు.ఈ కేసును విచారిస్తున్న జస్టిస్ అనూప్ జైరామ్ భంభానీ.. ఒక వ్యక్తి తన ప్రతిభ, కృషి, విజయాల ద్వారా సంపాదించుకున్న పేరు, ప్రతిష్ఠను ట్రేడ్మార్క్తో పోల్చవచ్చా? అలాంటప్పుడు ఆ పేరు ప్రతిష్ఠ తదుపరి తరాలకు బదిలీ అవుతుందా? అనే ప్రశ్నను అడిగారు.తప్పుడు ప్రచారం చేశారంటూ..ఆరాధ్య తరఫున వాదించిన న్యాయవాది ప్రవీణ్ ఆనంద్ మాట్లాడుతూ.. ఈ వివాదం కేవలం ఆరాధ్య వ్యక్తిగత ప్రతిష్ఠకు మాత్రమే సంబంధించినది కాదన్నారు. బచ్చన్ కుటుంబానికి చెందిన పేరు, ఫొటోలను ఉపయోగించి ఆమెకు క్యాన్సర్ వచ్చిందని, ఆమె మరణించిందని తప్పుడు ప్రచారం చేశారని తెలిపారు.ఈ కేసులో మూడు ప్రధాన అంశాలను పరిశీలించాలని హైకోర్టు నిర్ణయించింది. కుటుంబ పేరుకు సంబంధించిన ప్రతిష్ఠ తరతరాలకు వర్తిస్తుందా? తప్పుడు వార్తలు హక్కుల ఉల్లంఘనగా పరిగణించవచ్చా? పరువునష్టం మేధో సంపత్తి హక్కుల పరిధిలోకి వస్తుందా? అనే అంశాలపై విచారణ చేపట్టనుంది. -
రైల్వేశాఖ నిధులతో తీసిన ఏకైక సీరియల్ చూశారా?
భారత టెలివిజన్ చరిత్రలో 1980వ దశకం ఒక సువర్ణ అధ్యాయం. ఆ కాలంలో దూరదర్శన్లో ప్రసారమైన పలు కార్యక్రమాలు ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నాయి. అప్పట్లో కేవలం వినోదం మాత్రమే కాకుండా, దేశ సంస్కృతిని, వైవిధ్యాన్ని ప్రతిబింబించే అద్భుతమైన కార్యక్రమాలు టీవీ స్క్రీన్లపై కనిపించేవి. నాటి సమయంలో అంటే 40 ఏళ్ల క్రితం రైల్వే శాఖ స్పాన్సర్షిప్తో తెరకెక్కిన ఒక అరుదైన సీరియల్ ‘యాత్ర’. ఆ సీరియల్ దేశప్రజలను అమితంగా ఆకట్టుకుంది.రైలు ప్రయాణాల మధుర జ్ఞాపకాలురైలు ప్రయాణం అంటేనే ఒక ప్రత్యేకమైన అనుభూతి. దేశంలోని నలుమూలలకు చెందిన వ్యక్తులు ఒకే చోట కలుసుకోవడం కొత్త అనుభూతినిస్తుంది. సినిమాల్లోని ఐకానిక్ రైలు సన్నివేశాలు మొదలు దేశ విభజన నాటి కదిలించే ఘట్టాల వరకు రైళ్లు ఎన్నో భావోద్వేగాలకు ప్రతీకగా నిలిచాయి. రైలు ప్రయాణాల నేపథ్యంలో రైల్వేశాఖ స్వయంగా స్పాన్సర్ చేసిన ఒక అద్భుతమైన టెలివిజన్ సీరియల్ గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.శ్యామ్ బెనెగల్ అద్భుత సృష్టి 'యాత్ర'ప్రముఖ దిగ్గజ దర్శకుడు శ్యామ్ బెనెగల్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఆ 15 ఎపిసోడ్ల సీరియల్ ‘యాత్ర’. 1986లో సంచలనం సృష్టించింది. రైలు ప్రయాణాలలో ప్రజల దైనందిన జీవితాలు, వారిలోని ప్రత్యేక క్షణాలు, భావోద్వేగాల కథాంశంతో ఈ సీరియల్ను అత్యంత సహజంగా తెరకెక్కించారు. నాటి కాలంలో ప్రేక్షకులను టీవీల ముందు కట్టిపడేసిన అరుదైన ప్రయోగాత్మక సీరియల్ అది.ఓం పురి, నీనా గుప్తా ప్రధాన పాత్రల్లో ..ఈ 15 ఎపిసోడ్ల ప్రయాణంలో భారతీయ చలనచిత్ర రంగానికి చెందిన ఎంతోమంది ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషించారు. ఓం పురి, నీనా గుప్తా ప్రధాన పాత్రల్లో నటించగా.. ఎలా అరుణ్, మోహన్ గోఖలే, రవి ఝాంకల్, రాజేంద్ర గుప్తా, నిఖిల్ భగత్, ఇషితా అరుణ్, హరీష్ పటేల్ వంటి ప్రతిభావంతులైన తారలు ఇందులో తమ అద్భుత నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు.దేశాన్ని చుట్టబెట్టిన హిమ్సాగర్ ఎక్స్ప్రెస్ ప్రయాణం హిందుస్థాన్ టైమ్స్ నివేదిక ప్రకారం, 1986లో వచ్చిన ‘యాత్ర’ సీరియల్లోని ఎపిసోడ్లను హిమ్సాగర్ ఎక్స్ప్రెస్, త్రిపుర ఎక్స్ప్రెస్ రైళ్లలో చిత్రీకరించారు. కన్యాకుమారి నుండి జమ్ము తావి వరకు, అలాగే జైసల్మేర్ నుండి డూమ్ డూమా వరకు ఉన్న దూర ప్రాంతాలను, అక్కడి అద్భుతమైన ప్రకృతి దృశ్యాలను ఈ సీరియల్ ద్వారా ప్రజలకు కళ్ళకు కట్టినట్లు చూపించారు.భారతీయ రైల్వేల సహకారందర్శకుడు శ్యామ్ బెనెగల్ స్వయంగా వెల్లడించిన వివరాల ప్రకారం ఈ బృహత్ ప్రాజెక్టుకు భారతీయ రైల్వే శాఖ పూర్తి నిధులు సమకూర్చడమే కాకుండా అడుగడుగునా సహకరించింది. దేశంలోని సాధ్యమైనంత సుదీర్ఘమైన రెండు రైలు ప్రయాణాలను ఎంచుకుని ఈ షూటింగ్ పూర్తి చేశారు. అనేక రైల్వే స్టేషన్లలో యూనిట్ కోసం ప్రత్యేకంగా రైళ్లను నడిపించడం, మార్గం సుగమం చేయడం వంటి ఏర్పాట్లు రైల్వే శాఖ చేయడం విశేషం.రాజస్థాన్ వెన్నెల రాత్రులు.. సాహసాలుఈ సీరియల్ షూటింగ్ సమయంలో చిత్ర బృందం ఎన్నో అద్భుతమైన అనుభవాలను చవిచూసింది. రాజస్థాన్ లోని జైసల్మేర్లో రాత్రి సమయంలో అద్భుతమైన వెన్నెల దృశ్యాలను చిత్రీకరించారు. అక్కడ కల్బేలియా జానపద నృత్య బృందం ప్రదర్శన ఇవ్వడం యూనిట్కు మరువలేని అనుభూతిని మిగిల్చింది. మధ్యప్రదేశ్లోని అడవుల్లో పౌర్ణమి రాత్రి బస చేసినప్పుడు ఎదురైన చిన్నపాటి ఉత్కంఠభరిత క్షణాలు ఊహించడం కూడా కష్టమే అంటారు అలనాటి నటులు. ఇది కూడా చదవండి: హీరోయిన్లతో ‘గోవిందా’ లీలలు.. బజారుకీడుస్తున్న సునీత! -
పదిహేడేళ్ల తర్వాత కలిసి నటిస్తున్న స్టార్ హీరోలు!
బాలీవుడ్ హీరోలు అక్షయ్ కుమార్, సైఫ్ అలీఖాన్ పదిహేడేళ్ల తర్వాత కలిసి నటించిన చిత్రం ‘హైవాన్’. ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ తెరకెక్కించిన ఈ చిత్రంలో బొమన్ ఇరానీ, సయామీ ఖేర్, శ్రియ పిల్గాంకర్ ఇతర పాత్రలు పోషించారు. కేవీఎన్ ప్రొడక్షన్స్, తెస్పియన్ ఫిలింస్ బ్యానర్స్పై వెంకట్ కె. నారాయణ, శైలజా దేశాయ్ ఫెన్ నిర్మించిన ఈ మూవీ సెప్టెంబరు 11న రిలీజ్ కానుంది. బుధవారం ఈ మూవీ టీజర్ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ టీజర్లో సైఫ్ అలీఖాన్ని దివ్యాంగుడి పాత్రలో చూపించారు. అక్షయ్ కుమార్ ఇంటెన్స్ క్యారెక్టర్లో కనిపించారు. ‘‘సరికొత్త థ్రిల్లర్గా రూపొందిన చిత్రం ‘హైవాన్’. ప్రియదర్శన్ తన మార్క్ థ్రిల్లర్ మూవీని ప్రేక్షకులకు చూపించబోతున్నారు. వెంకట్ కె. నారాయణ, శైలజా దేశాయ్ హై క్వాలిటీ ప్రొడక్షన్ వేల్యూస్తో నిర్మించారు. ఈ ప్రెస్టీజియస్ మూవీలో ఫస్ట్ టైమ్ నెగిటివ్ క్యారెక్టర్లో నటించారు అక్షయ్ కుమార్. ఇప్పటికే రిలీజ్ చేసిన ఈ మూవీ ఫస్ట్ లుక్ ΄ోస్టర్కి ΄ాన్ ఇండియా స్థాయిలో మంచి స్పందన లభించింది. ఇప్పుడు టీజర్కి కూడా మంచి స్పందన వస్తోంది’’ అని చిత్రయూనిట్ తెలిపింది. ఈ చిత్రానికి కెమెరా: దివాకర్ మణి, సంగీతం: ప్రీతమ్ చక్రవర్తి. -
హీరోయిన్లతో ‘గోవిందా’ లీలలు.. బజారుకీడుస్తున్న సునీత!
ప్రముఖ బాలీవుడ్ నటుడు గోవిందా వ్యక్తిగత జీవితం మరోసారి సోషల్ మీడియాలోనూ, సినీ వర్గాలలోనూ హాట్ టాపిక్గా మారింది. భార్య సునీతా అహుజాతో బెడిసికొడుతున్న సంబంధం, రూమర్డ్ గర్ల్ ఫ్రెండ్ కోమల్ రాణితో నడుస్తున్న ప్రచారం నేపథ్యంలో, గోవిందా గతంలో పలువురు హీరోయిన్లతో నడిపిన రిలేషన్ షిప్ వార్తలు వైరల్ అవుతున్నాయి. గోవిందా ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన ఆసక్తికరమైన చిట్టా ఇదే..నీలం కోఠారితో పెళ్లిపీటల దాకా వెళ్లిన వైనం90వ దశకంలో బాలీవుడ్లో టాప్ హీరోయిన్గా వెలుగొందిన నీలం కోఠారితో గోవిందా ప్రేమాయణం అప్పట్లో పెద్ద సంచలనం సృష్టించింది. ఆమెతో పెళ్లి కోసం అప్పటికే జరిగిన సునీతా అహుజాతో నిశ్చితార్థాన్ని కూడా రద్దు చేసుకోవాలని గోవిందా నిర్ణయించుకున్నట్లు బహిరంగంగానే వార్తలు వచ్చాయి. అయితే విధి మరోలా ఉండటంతో వీరిద్దరి దారులు వేరయ్యాయి.దివ్య భారతిపై మనసు పారేసుకున్న హీరో80వ దశకంలో అత్యంత అందమైన నటిగా పేరొందిన దివ్య భారతి పక్కన కూడా గోవిందా పేరు గట్టిగానే వినిపించింది. ‘షోరాలా ఔర్ షబ్నమ్’ చిత్రంలో వీరిద్దరూ కలిసి నటించారు. అప్పటికే గోవిందా వివాహితుడైనప్పటికీ, దివ్య భారతి అందానికి ఆకర్షితుడైనట్లు ఆయనే ఒక సందర్భంలో తెలిపారు. అయితే వీరిద్దరి మధ్య రిలేషన్ షిప్కు సంబంధించి వచ్చిన వార్తలు కేవలం రూమర్లుగానే మిగిలిపోయాయి.రాణీ ముఖర్జీతో తీవ్ర వివాదాలు2000 ప్రారంభంలో రాణీ ముఖర్జీ, గోవిందా మధ్య సాన్నిహిత్యం బాగా పెరిగింది. ‘హద్ కర్ ది ఆప్నే’ సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. ఆన్ స్క్రీన్తో పాటు ఆఫ్ స్క్రీన్లో కూడా వీరిద్దరి ప్రేమ వ్యవహారం బాలీవుడ్లో హాట్ టాపిక్ అయింది. ఈ విషయం సునీతా అహుజాకు తెలియడంతో వారి కాపురం దాదాపు విడాకుల అంచుదాకా వెళ్లినట్లు వార్తలు వచ్చాయి.మాధురి దీక్షిత్పై ఆసక్తికరమైన వ్యాఖ్యలుమాధురి దీక్షిత్తో గోవిందాకు ఎలాంటి ప్రేమ సంబంధం లేనప్పటికీ, వీరిద్దరి జంట గురించిన చర్చలు మాత్రం తరచూ జరిగేవి. ఒక ఇంటర్వ్యూలో గోవిందా మాట్లాడుతూ, తన జీవితంలో సునీతా గనుక లేకపోతే కచ్చితంగా మాధురి దీక్షిత్ వెంటపడేవాడినని సరదాగా వ్యాఖ్యానించారు. అయితే నిజ జీవితంలో వీరి మధ్య కేవలం వృత్తిపరమైన సంబంధం మాత్రమే ఉంది.రవీనా టండన్తో సరదా జోకులుఅక్షయ్ కుమార్, రవీనా టండన్ల ప్రేమకథ బాలీవుడ్ లో ఎంత పాపులరో అందరికీ తెలిసిందే. అయితే రవీనా పేరు గోవిందాతో కూడా ముడిపడింది. వీరిద్దరూ స్వల్పకాలం పాటు డేటింగ్ చేసినట్లు గుసగుసలు వినిపించాయి. అంతేకాకుండా, ‘ఒకవేళ నువ్వు పెళ్లి చేసుకోకపోతే నిన్నే పెళ్లి చేసుకునేదాన్ని’ అని రవీనా తనతో సరదాగా అనేదని సునీతా అహుజా స్వయంగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.ప్రస్తుత వివాదానికి అసలు కారణంప్రస్తుతం 63 ఏళ్ల వయసులో ఉన్న గోవిందా, తన భార్య సునీతా అహుజాతో విభేదాలు, కోమల్ రాణి స్వర్ణకార్తో విమానాశ్రయంలో కనిపించడం ద్వారా మరోసారి వార్తల్లో నిలిచారు. గోవిందా లవ్ లైఫ్పై వస్తున్న ఈ తాజా ప్రచారాలు ఆయన అభిమానులను విస్మయానికి గురి చేస్తున్నాయి. ఇండస్ట్రీలో ఆయన గత ప్రేమాయణాల చరిత్రను మరోసారి తెరపైకి తెచ్చాయి.భార్య సునీతాతో బహిరంగ విమర్శలుకొద్దికాలంగా గోవిందా, ఆయన భార్య సునీతా అహుజాల మధ్య మనస్పర్థలు బహిరంగంగానే చర్చకు వస్తున్నాయి. భార్య తనను తరచూ కోపగించుకుంటుందని, మాటల తూటాలు పేలుస్తున్నదని గోవిందా ఇటీవలి కాలంలో పలు ఇంటర్వ్యూలలో పేర్కొనడం గమనార్హం. అయినప్పటికీ వీరిద్దరి సంసార జీవితం ఇప్పటికీ కొనసాగుతుండటం విశేషం.నిత్యం వార్తల్లో నిలిచే హీరో నంబర్ వన్గోవిందా తన అద్భుతమైన డాన్స్, కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను ఎంతగా అలరించారో, వ్యక్తిగత వివాదాలతోనూ అంతే స్థాయిలో వార్తల్లో నిలిచారు. ఎనభై, తొంబై దశకాల్లో ట్రెండ్ సెట్టర్గా నిలిచిన ఈ హీరో లవ్ లైఫ్ ఎప్పుడూ ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. నేటికీ ఆయన వ్యక్తిగత జీవితం మీడియాలో టాప్లో నిలుస్తుండటం గమనార్హం. -
టాలీవుడ్కు శ్రీలీల దూరమవుతోందా? అసలు కారణం ఇదేనా!
ఒకప్పుడు వరుస సినిమాలతో టాలీవుడ్లో బిజీగా ఉన్న శ్రీలీల ప్రస్తుతం తెలుగు ప్రాజెక్టుల విషయంలో కాస్త నెమ్మదించినట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం ఆమె చేతిలో కొత్త తెలుగు సినిమా ఏదీ లేకపోవడంతో, టాలీవుడ్లో అవకాశాలు తగ్గాయా అనే చర్చ మొదలైంది.దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ‘పెళ్లి సందD’తో గుర్తింపు తెచ్చుకున్న శ్రీలీల, ఆ తర్వాత చాలా మంది అగ్ర హీరోల సరసన వరుస అవకాశాలు అందుకుంది. అయితే ‘రాబిన్హుడ్’, ‘మాస్ జాతర’, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ వంటి సినిమాల ఫలితాలు ఆశించిన స్థాయిలో లేకపోవడం ఆమె కెరీర్పై తీవ్ర ప్రభావం చూపినట్లు ప్రచారం జరుగుతోంది.అయితే శ్రీలీల పూర్తిగా టాలీవుడ్కు దూరమవుతున్నారని చెప్పడం తొందరపాటే. ప్రస్తుతం ఆమె తమిళం, హిందీ చిత్రాలపై ఎక్కువగా దృష్టి పెడుతోంది. తమిళ నటుడు ధనుష్తో ఓ తమిళ సినిమాలో నటిస్తుండగా, బాలీవుడ్లోనూ కార్తీక్ ఆర్యన్, ఇబ్రహీం అలీ ఖాన్ వంటి హీరోలతో ప్రాజెక్టులు చేస్తోంది.తెలుగులో వరుసగా సినిమాలు చేసిన తర్వాత శ్రీలీల ప్రస్తుతం ప్రాజెక్టుల సంఖ్య కంటే విభిన్నమైన కథలు, మంచి పాత్రల కోసం ఇతర భాషల్లో అవకాశాలపై దృష్టి పెడుతున్నట్లు కనిపిస్తోంది. చాలా కాలంగా వరుసగా కమర్షియల్ చిత్రాల్లో హీరోయిన్గా శ్రీలీల కనిపించింది. ఇప్పుడు ఇతర పరిశ్రమల్లో తన పరిధిని విస్తరించుకోవడం ద్వారా కొత్త ఇమేజ్ను సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. -
ఓటీటీకి రష్మిక మందన్నా లేటేస్ట్ మూవీ.. అఫీషియల్ ప్రకటన
రష్మిక మందన్నా హీరోయిన్గా నటించిన లేటేస్ట్ బాలీవుడ్ మూవీ కాక్టెయిల్-2. ఈ చిత్రంలో షాహిద్ కపూర్ హీరోగా నటించారు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ కృతి సనన్ మరో హీరోయిన్గా మెప్పించింది. ఈ సినిమాకు హోమీ అదజానియా దర్శకత్వం వహించారు. ఈ మూవీ జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజైంది.అయితే బాక్సాఫీస్ వద్ద అంతగా అభిమానులను మెప్పించలేకపోయింది. తాజాగా ఈ మూవీ ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. దీనిపై అఫీషియల్గా ప్రకటన వచ్చేసింది. ఈ మూవీని ఇద్దరమ్మాయిలతో ఓ అబ్బాయి రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కించారు. గతంలో దీపికా పడుకోన్, డయానా పెంటీ, సైఫ్ అలీ ఖాన్ ప్రధాన పాత్రలలో నటించిన 'కాక్టెయిల్' (2012) చిత్రానికి సీక్వెల్గా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. 📢 Official Announcement ▶️#CockTail2 (Hindi) Streaming from August 14 on Netflix 🍿!!#OTT_Trackers pic.twitter.com/jpeSMvWDvR— OTT Trackers (@OTT_Trackers) August 12, 2026 -
నిషేధం ఓకే.. మరి అభిమానులు వద్దా? : జాన్వీని ప్రశ్నించిన హైకోర్టు
బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ తన వ్యక్తిత్వ హక్కుల పరిరక్షణ కోసం దాఖలు చేసిన పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆమె పేరుతో ఆన్లైన్లో చక్కర్లు కొడుతున్న అశ్లీల, అభ్యంతరకర, డీప్ఫేక్, ఏఐ ఆధారిత కంటెంట్పై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కోర్టు స్పష్టం చేసినప్పటికీ.. సోషల్ మీడియాలోని అన్ని ఫ్యాన్ క్లబ్లు, అభిమానుల పేజీలను ఒకేసారి తొలగించాలన్న అభ్యర్థనకు మాత్రం అంగీకరించలేదు.ప్రతి ఫ్యాన్ పేజీని నిషేధించలేంజాన్వీ కపూర్ తరఫు న్యాయవాదులు కోర్టుకు సమర్పించిన వివరాల ప్రకారం.. ఆమె పేరు, ఫొటోలు, రూపాన్ని ఉపయోగించి అభ్యంతరకర వ్యాఖ్యలు, ఆన్లైన్ దూషణలు, మార్ఫింగ్ చేసిన చిత్రాలు, డీప్ఫేక్ వీడియోలు, ఏఐ ద్వారా రూపొందించిన అశ్లీల కంటెంట్ వివిధ వెబ్సైట్లు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో ప్రచారం అవుతున్నట్లు ఆరోపించారు. ఈ వ్యవహారానికి సంబంధించి వేలాది వెబ్ లింకులను కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దాదాపు 5,000 ఆన్లైన్ పేజీలకు సంబంధించిన అశ్లీల, అభ్యంతరకర కంటెంట్ను తొలగించే దిశగా కోర్టు ఆదేశాలు ఇచ్చింది.అయితే ఇదే సమయంలో జాన్వీ కపూర్కు సంబంధించిన ప్రతి ఫ్యాన్ పేజీని చట్టవిరుద్ధమైనదిగా పరిగణించడం సాధ్యం కాదని ఢిల్లీ హైకోర్టు అభిప్రాయపడింది. అభిమానుల కోసం, వారి అభిమానం వ్యక్తం చేయడానికి మాత్రమే కొన్ని పేజీలు నిర్వహిస్తుండొచ్చని పేర్కొంది. అందువల్ల అన్ని ఫ్యాన్ క్లబ్లు, అభిమానుల పేజీలపై నిషేధం విధించడం సరికాదని స్పష్టం చేసింది.అభిమానులు వద్దా?విచారణ సందర్భంగా కోర్టు.. ‘మీకు అభిమానులు వద్దా?’ అని ప్రశ్నించింది. ఒక వ్యక్తిపై విమర్శలు చేయడం, అభిప్రాయాలు వ్యక్తం చేయడం, అభిమానంతో ఫ్యాన్ పేజీ నిర్వహించడం వంటి అంశాలను నేరుగా వ్యక్తిత్వ హక్కుల ఉల్లంఘనగా చూడలేమని కోర్టు అభిప్రాయపడింది. అయితే అదే పేరుతో అశ్లీల లేదా తీవ్రంగా అభ్యంతరకరమైన కంటెంట్ను రూపొందించి ప్రచారం చేస్తే మాత్రం దానిపై చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చని స్పష్టం చేసింది.ఈ సందర్భంగా ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తులు ఎదుర్కొనే విమర్శలు, ఆన్లైన్ వ్యాఖ్యల విషయంలోనూ కోర్టు విస్తృత దృక్పథాన్ని ప్రస్తావించింది. వ్యక్తిత్వ హక్కుల పేరుతో ఇంటర్నెట్లోని ప్రతి విమర్శనాత్మక పోస్టును తొలగించడం సాధ్యం కాదనే అంశాన్ని కోర్టు స్పష్టం చేసింది. -
పెదాలపై అభిమాని ముద్దు.. స్పందించిన నటి
అవార్డు షోలో జరిగిన అనుకోని సంఘటనపై బాలీవుడ్ నటి నిఖితా రావల్ స్పందించింది. ఇటీవల జరిగిన రెడ్ కార్పెట్ కార్యక్రమంలో నిఖితా రావల్ను ఒక మహిళా అభిమాని ఆకస్మికంగా పెదవులపై ముద్దు పెట్టిన సంగతి తెలిసిందే. అనుకోకుండా జరిగిన ఆ సంఘటనతో నిఖిత కొంతమేర అసౌకర్యానికి గురైంది. ఈ ముద్దు వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా, దీనిపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేశారు.తాజాగా నిఖిత ఈ సంఘటనపై స్పందించారు.సోషల్ మీడియాలో తనకు మద్దతుగా పంపిన అభిమానుల సందేశాలకు సంబంధించిన స్క్రీన్షాట్స్ని ఇన్స్టా స్టోరీలో షేర్ చేస్తూ.. మీ అందరి ప్రేమకు, మద్దతుకు ధన్యవాదాలు. నేను ఎలాంటి తప్పు చేయలేదు, నాకు దాచుకోవాల్సినదేమీ లేదు. నేను ఎల్లప్పుడూ సత్యం పక్షాన ఉంటాను’ అని రాసుకొచ్చింది.నిఖితా రావల్ బాలీవుడ్తో పాటు దక్షిణ భారతీయ చిత్రాల్లోనూ నటించారు. ఆమె నటించిన 'బ్లాక్ అండ్ వైట్', 'మిస్టర్ హాట్ మిస్టర్ కూల్', 'ది హీరో – అభిమన్యు', 'అమ్మా కి బోలి', 'గరం మసాలా', 'క్యూట్ కమీనా' చిత్రాలు మంచి విజయం సాధించాయి. ప్రస్తుతం అర్షద్ వార్సీ, చంకీ పాండేలతో కలిసి 'రోటి కప్డా అండ్ రొమాన్స్' అనే చిత్రంలో నటిస్తున్నారు.SHOCKING 😲 😱😭😲#NikitaRawal Forcefully Kissesd by her Female FAN . Or just a PR Gimmick ? pic.twitter.com/WJF8uuC4y5— Manoz Kumar (@ManozTalks) August 9, 2026 -
విలన్గా స్టార్ హీరో.. టీజర్ రిలీజ్
బాలీవుడ్ స్టార్ హీరో విలన్గా నటిస్తోన్న లేటేస్ట్ ముూవీ హైవాన్. ఈ చిత్రానికి ప్రియదర్శన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో సైఫ్ అలీ ఖాన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా వచ్చేనెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ నేపథ్యంలో హైవాన్ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ చిత్రంలో బోమన్ ఇరానీ, సయామీ ఖేర్, రాజ్పాల్ యాదవ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీని కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్లో వెంకట్ కె నారాయణ, శైలజ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రీతమ్ సంగీతమందిస్తున్నారు. ఈ మూవీ సెప్టెంబర్ 11న థియేటర్లలో సందడి చేయనుంది. -
ఆ స్టార్ హీరోకు నాపై క్రష్ ఉంది: బాలీవుడ్ నటి
బాలీవుడ్ నటి మల్లికా శెరావత్ హాలీవుడ్ స్టార్ టామ్ క్రూజ్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కరణ్ జోహర్ హోస్టుగా వ్యవహరిస్తున్న ‘ది ట్రైటర్స్ సీజన్ 2’లో పాల్గొన్న ఆమె.. టామ్ క్రూజ్కు తనపై క్రష్ ఉందని, తనకు వీడియోలు కూడా పంపిస్తుంటారని తెలిపారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ‘మీకు ఎప్పుడైనా ఎవరిపైనైనా క్రష్ కలిగిందా..?లేక మీపై ఎవరికైనా క్రష్ ఉందా..?’ అని కామెడీయన్ ఆదిత్య కులశ్రేష్ఠ(కుల్లు) మల్లికను అడిగారు. ‘అందరికీ నాపైనే క్రష్ కలుగుతుంది. ప్రస్తుతం టామ్ క్రూజ్కు కూడా నాపై క్రష్ ఉంది. మేమిద్దరం కలిసి పార్టీ చేసుకున్న సమయంలో తీసిన వీడియోలు క్రూజ్ నాకు పంపించినప్పుడు ఇతర కంటెస్టెంట్లకూ వాటిని చూపించేదానిని’ అని పేర్కొన్నారు. పెళ్లిపై మల్లికా ఏమన్నారం..మల్లికా గతంలో ఫ్రెంచ్ వ్యాపారవేత్త సిరిల్ ఆక్సెన్ఫ్యాన్స్తో రిలేషన్లో ఉండేవారట. 2024 నుంచి తాను సింగిల్గా ఉన్నట్లు వెల్లడించారు. పెళ్లికోసం మాట్లాడుతూ.. ‘పెళ్లికి అనుకూలంగా లేను. అలా అని దానికి వ్యతిరేకం కూడా కాదు. ఇద్దరు వ్యక్తులు ఏం కోరుకుంటున్నారనేదానిపై ఆధారపడి ఉంటుంది. అని తెలిపారు. కాగా కరణ్ జోహర్ హోస్టుగా వ్యవహరిస్తున్న ‘ది ట్రైటర్స్ సీజన్ 2’ షో ఆగస్టు 13 నుంచి ప్రైమ్లో స్ట్రీమింగ్ కానుంది. శ్వేతా తివారీ, మునావర్ ఫారూఖీ, క్రిస్టల్ డిసౌజా, రణ్వీర్ బ్రార్, ఇక్కా, పారుల్ గులాటి, అభిషేక్, తదితరులు ఇందులో పాల్గొన్నారు. -
మాజీ భర్త రెండో పెళ్లి.. హీరోయిన్ ఊర్మిళా కౌంటర్ పోస్ట్
రంగీలా, గాయం, సత్య, భూత్ లాంటి సినిమాలతో అప్పట్లో పాన్ ఇండియా స్టార్డమ్ సొంతం చేసుకున్న హీరోయిన్ ఊర్మిళా మతోండ్కర్.. ప్రస్తుతం నటనకు పూర్తిగా దూరమైంది. ఎనిమిదేళ్ల క్రితం ఓ మూవీ చేయగా, నాలుగేళ్ల క్రితం ఓ షోలో కనిపించింది. కొన్నాళ్ల క్రితం రాజకీయాల్లోకి కూడా వచ్చింది గానీ ఇందులోనూ ఎక్కువనాళ్లు ఉండలేదు. అలాంటి ఈమె ఉన్నఫలంగా వార్తల్లో నిలిచింది. దీనికి కారణం ఈమె మాజీ భర్త మళ్లీ పెళ్లి చేసుకున్నాడు.(ఇదీ చదవండి: అక్కకు పక్షవాతం.. కానీ ఆమె వల్లే డ్యాన్స్ నేర్చుకున్నా: హీరోయిన్)ఊర్మిళా..2018లో నటుడు మొహ్సిన్ అక్తర్ మీర్ని పెళ్లి చేసుకుంది. కానీ వీళ్లిద్దరూ 2024లో విడాకులు తీసుకున్నారు. రీసెంట్గా మొహ్సిన్ మరో వివాహం చేసుకున్నాడు. ఆ ఫొటోలని సోషల్ మీడియాలో పంచుకున్నాడు. అయితే ఇవి బయటకు రావడానికి కొన్ని గంటల ముందే ఉర్మిళ తన ఇన్ స్టాలో పెట్టిన ఓ పోస్ట్ వైరల్ అయింది.'ప్రేమ, సమయం, విధేయత లాంటి ఖరీదైన విషయాలే నాకు నచ్చుతాయి' అని ఊర్మిళా ఓ కోట్ షేర్ చేసింది. అయితే ఈమె తన మాజీ భర్తని ఉద్దేశించే పెట్టిందా అని పలువురు నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. మొహ్సిన్ పేరు ప్రస్తావించనప్పటికీ అతడికి కౌంటర్ ఇచ్చేలా ఊర్మిళ తన భావాన్ని బయటపెట్టిందని అనుకుంటున్నారు.(ఇదీ చదవండి: 'డిసి' హీరోయిన్ వామికా ఖరీదైన 'ఐఫోన్' గిఫ్ట్) -
నసీరుద్దీన్ షా ఒక గుంటనక్క: కంగనా ఫైర్
న్యూఢిల్లీ: బాలీవుడ్ నటుడు నసీరుద్దీన్ షా చేసిన వ్యాఖ్యలపై నటి, రాజకీయ నాయకురాలు కంగనా రనౌత్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. న్యూఢిల్లీలో జరిగిన ‘కాక్రోచ్ జనతా పార్టీ’ నిరసనలపై బాలీవుడ్ నటీనటులు మౌనంగా ఉండటంపై షా ఇటీవల విమర్శలు చేశారు. ‘నోటిలో ఎముక ఉన్న కుక్క మొరగలేదు’ అని వ్యాఖ్యానిస్తూ, సెలబ్రిటీల మౌనాన్ని ఆయన ఎద్దేవా చేశారు.ఈ వ్యాఖ్యలకు కంగనా రనౌత్ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. జార్ఖండ్లో జరుగుతున్న నిరసనల గురించి నసీరుద్దీన్ షా ఎందుకు స్పందించడం లేదని ఆమె ప్రశ్నించారు. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్లో స్పందిస్తూ, సీనియర్ నటుడిని ‘లొమ్డి’ (నక్క) అని అభివర్ణించారు. ‘ఇక్కడ నిజం ఏమిటంటే, ప్రతి ఒక్కరూ ఎవరో ఒకరి వద్ద పని చేస్తున్నారు. కానీ, ఏ దేశపు రొట్టె తింటున్నానో, ఆ దేశాన్ని రక్షించడం, దాని కోసం పోరాడటం నాకు గర్వకారణం. నసీరుద్దీన్ షా తిన్నది ఈ దేశపు అన్నమే అయినా, పక్క దేశం కోసం వాదిస్తున్నారు’ అని కంగనా ఘాటుగా విమర్శించారు.కుక్కను ‘లొమ్డి’తో పోలుస్తూ, ‘నేటి కాలంలో విశ్వసనీయత చాలా అరుదు. అందుకే నసీరుద్దీన్ షా లాంటివారు నక్కగా ఉండటం కంటే, కుక్కగా ఉండటమే మేలు’ అని ఆమె పేర్కొన్నారు. గతంలో నసీరుద్దీన్ షా .. బాలీవుడ్ నటుల మౌనంపై అసహనం వ్యక్తం చేశారు. వారి మనస్సాక్షికి తగిన సమయం వచ్చినప్పుడు వారు ఖచ్చితంగా స్పందిస్తారని, అయితే ప్రస్తుతం వారు ఎముక నోట్లో పెట్టుకున్న కుక్కల్లా ఉన్నారని చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్లో పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి.ఇది కూడా చదవండి: Time Travel: 1977 నుంచి 4413కు వెళ్లాక .. ఏం జరిగిదంటే.. -
డిసెంబరులో ఈఠా
మహారాష్ట్రకు చెందిన జానపద కళాకారిణి విఠాబాయి నారాయణ్ గావ్కర్ జీవితం ఆధారంగా రూపొందిన హిందీ చిత్రం ‘ఈఠా’. మహారాష్ట్రకు చెందిన సంప్రదాయ కళలు ‘లవానీ’, ‘తమాషా’లో అత్యంత ప్రావీణ్యురాలైన విఠాబాయిగా వెండితెరపై శ్రద్ధాకపూర్ నటిస్తున్నారు. రణదీప్ హూడా ఓ లీడ్ రోల్లో నటిస్తున్నారు. ‘ఛావా’ ఫేమ్ లక్ష్మణ్ ఉటేకర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. దినేష్ విజన్, లక్ష్మణ్ ఉటేకర్, కరిష్మా శర్మ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఈ నెల 28న రిలీజ్ చేయనున్నట్లు ఇటీవల వెల్లడించారు మేకర్స్. అయితే ఆ తేదీకి విడుదల చేయడం లేదని, ఈ ఏడాది డిసెంబరు 4న రిలీజ్ చేయనున్నామని మంగళవారం నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. -
సినిమాగా మీర్జాపూర్ సిరీస్.. తెలుగు ట్రైలర్ వచ్చేసింది
ఓటీటీలో ఆడియన్స్ క్రేజ్ దక్కించుకున్న సూపర్ సిరీస్ ‘మీర్జాపూర్’. ఇప్పుడు ఇగే వెబ్ సిరీస్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీలో కాలీన్ భయ్యాగా పంకజ్ త్రిపాఠి, గుడ్డూ పండిట్గా అలీ ఫజల్, మున్నా భయ్యాగా దివ్యేందు తమ ఐకానిక్ రోల్స్తో రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఇక జితేంద్ర కుమార్ ఎంట్రీ ఇచ్చి 'బబ్లూ పండిట్' పాత్రను పోషించడం కథలో అతిపెద్ద ట్విస్ట్గా మారబోతోంది. వీరితో పాటు భోజ్పురి స్టార్ రవి కిషన్ ఒక పవర్ఫుల్ రోల్లో మెరవనున్నారు.తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. తెలుగులో ట్రైలర్ విడుదల చేశారు. ఈ ట్రైలర్లో యాక్షన్ సీన్స్, డైలాగ్స్ చూస్తుంటే హిట్ ఖాయమని తెలుస్తోంది. ఈ సినిమా వెబ్ సిరీస్లకు ప్రీక్వెల్గా సినిమా ఉంటుందని గతంలోనే టీమ్ తెలిపింది. సిరీస్ మూడు పార్ట్లలో చనిపోయినవారంతా తెరపై కనిపిస్తారని వెల్లడించింది. ఈ చిత్రాన్ని అమెజాన్ ఎంజిఎం స్టూడియోస్, ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి గుర్మీట్ సింగ్ దర్శకత్వం వహించగా.. సెప్టెంబర్ 4న థియేటర్లలో రిలీజ్ కానుంది. -
అగ్నివీర్గా స్టార్ నటుడి కుమార్తె.. ఎవరో తెలుసా?
సినిమా ఇండస్ట్రీలోకి సినీ స్టార్స్ ఫ్యామిలీ నుంచి చాలామంది ఎంట్రీ ఇవ్వడం మనం చూస్తుంటాం. మన పిల్లలు కూడా తల్లిదండ్రులను ఫాలో అవుతుంటారు. ముఖ్యంగా సినిమాల్లోకి వచ్చేవారు దాదాపు సినీ నేపథ్యం ఉన్న కుటుంబాల నుంచే వస్తుంటారు. అది మన టాలీవుడ్లో కాస్తా ఎక్కువగానే ఉంటుంది.కానీ అందుకు భిన్నంగా ఓ షాకింగ్ డెసిషన్ తీసుకుంది స్టార్ నటుడి కుమార్తె. ఆమె మరెవరో కాదు.. రేసుగుర్రంలో విలన్గా మెప్పించిన రవికిషన్ కూతురు. బాలీవుడ్ నటుడు రవి కిషన్ కుమార్తె ఇషితా శుక్లా ఇండస్ట్రీని కాదని విభిన్నమైన కెరీర్ ఎంచుకుంది. అగ్నివీర్గా రక్షణ దళంలో చేరారు. తండ్రిలా కాకుండా డిఫరెంట్ కెరీర్ను ఎంచుకుంది.రవి కిషన్ కుమార్తె అయిన ఇషితా శుక్లాకు చిన్న వయసులోనే ఆర్మీలో పని చేయాలన్న ఆసక్తి పెరిగింది. బాలీవుడ్కు వెళ్లకుండా.. నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (ఎన్సీసీ)లో చేరారు. ఆ తర్వాత సైనిక శిక్షణ పొంది రక్షణ రంగంలో పనిచేసేందుకు సిద్ధమైంది. ఇషిత ఢిల్లీ డైరెక్టరేట్కు చెందిన 7 గర్ల్స్ బెటాలియన్లో పనిచేశారు. కర్తవ్య పథ్లో గణతంత్ర దినోత్సవ పరేడ్ కోసం కూడా శిక్షణ తీసుకున్నారు. కాగా.. ఇషిత శుక్లా 2023లో అగ్నివీర్గా చేరినట్లు తెలుస్తోంది. దీంతో దేశానికి సేవ చేయాలన్న ఇషిత నిర్ణయాన్ని అనుపమ్ ఖేర్తో సహా పలువురు ప్రముఖులు ప్రశంసించారు. -
ముక్కుపుడక మింగేసిన హీరోయిన్.. వీడియో వైరల్
షూటింగ్ సెట్లో చిన్న చిన్న ప్రమాదాలు జరగడం సినీ పరిశ్రమలో కొత్తేమీ కాదు. నటీనటులు సన్నివేశాలను సహజంగా చూపించేందుకు చేసే ప్రయత్నాల్లో అనుకోని ఘటనలు చోటుచేసుకుంటుంటాయి. తాజాగా ప్రముఖ నటి, గాయని షెహ్నాజ్ గిల్కు కూడా ఇలాంటి ఊహించని అనుభవమే ఎదురైంది. ఓ సన్నివేశం కోసం వేగంగా పరుగెత్తుతున్న సమయంలో ఆమె ముక్కుపుడక అనుకోకుండా ఊడి నోట్లోకి వెళ్లిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.షెహ్నాజ్ గిల్ నటిస్తున్న తాజా పంజాబీ చిత్రం ‘ఇష్క్నామా’. అరవింద్ ఖైర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా చిత్రీకరణ సమయంలో ఓ సీన్ కోసం ఆమె వేగంగా పరుగెత్తుతుండగా.. ముక్కుకు ఉన్న పుడక అనుకోకుండా ఊడి నోట్లోకి జారిపోయింది.ఈ ఘటనతో షెహ్నాజ్ ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరయ్యారు. తీవ్రంగా దగ్గుతూ ఇబ్బంది పడుతున్న ఆమెకు పక్కనే ఉన్న సహనటుడు సౌరభ్ సచ్దేవా వెంటనే స్పందించారు. ఆమె వీపుపై తడుతూ సహాయం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను షెహ్నాజ్ గిల్ ఇటీవల తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేయడంతో ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది.వీడియో చూసిన అభిమానులు షెహ్నాజ్ ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. నటన పట్ల ఆమె చూపిస్తున్న అంకితభావాన్ని ప్రశంసిస్తూనే.. షూటింగ్ సమయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సన్నివేశాలను పర్ఫెక్ట్గా చేయాలనే ప్రయత్నంలో నటీనటులు ఎదుర్కొనే ఇలాంటి అనుకోని ప్రమాదాలు అభిమానులను కలవరపెడుతున్నాయి.ఇక ‘ఇష్క్నామా’ విషయానికి వస్తే.. భారత్లోని పంజాబ్కు చెందిన నిమ్మ అనే సిక్కు కవి, పాకిస్తాన్ పంజాబ్కు చెందిన నసీమ్ అనే ముస్లిం యువతి మధ్య సాగే సరిహద్దుల అతీతమైన ప్రేమకథగా ఈ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రంలో షెహ్నాజ్ గిల్, జై రంధావా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సౌరభ్ సచ్దేవా, అంజుమ్ బత్రా, మహన్బీర్ భుల్లర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. View this post on Instagram A post shared by Shehnaaz Gill (@shehnaazgill) -
మాతృత్వం ఓవైపు.. సినిమా మరోవైపు
సినీ తారలు అనుకున్నది సాధించేందుకు ఎంతటి కష్టాన్నైనా లెక్కచేయరు అనడానికి ఈ బాలీవుడ్ బ్యూటీ చక్కటి ఉదాహరణ. మాతృత్వం వంటి కీలక దశలోనూ తన వృత్తిపట్ల నిబద్ధతను చాటుకుంటోంది బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె. ప్రస్తుతం ఎనిమిదో నెల గర్భంతో ఉంది. అయినప్పటికీ షూటింగ్కు బ్రేక్ ఇవ్వకుండా ‘రాకా’లో తన పాత్రకు సంబంధించిన సన్నివేశాలను పూర్తి చేసేందుకు కష్టపడుతోందట. సంబంధించిన విషయాలు వైరల్ కావడంతో ఆమెపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.షూటింగ్లో మళ్లీ బన్నీ..అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న భారీ సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ చిత్రం ‘రాకా’. ఇందులో దీపికా పదుకొణె కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇటీవల కాస్త విరామం తీసుకున్న బన్నీ.. మళ్లీ షూటింగ్లో పాల్గొన్నట్లు సమాచారం. మరోవైపు దీపికాకు సెప్టెంబర్లో డెలివరీ ఉండటంతో.. అంతకంటే ముందే తనకు సంబంధించిన షూటింగ్ను పూర్తి చేసేందుకు ఆమె పట్టుదలతో పనిచేస్తోందట. షూటింగ్ షెడ్యూల్ రాత్రివేళ వరకు కొనసాగుతున్నా సెట్లోనే ఉంటూ తన సన్నివేశాలను పూర్తి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆమె అంకితభావాన్ని చూసి చిత్రబృందం సైతం ఆశ్చర్యపోతున్నట్లు సమాచారం.గతంలోనూ వైరల్..దీపికా దాదాపు ఏడు నెలల గర్భంతో ఉన్న సమయంలోనూ ‘రాకా’ కోసం రోజూ షూటింగ్లో పాల్గొన్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. సినిమాలో యాక్షన్ సన్నివేశాలు కూడా ఉండటంతో ఆమె పాత్ర సవాల్తో కూడుకున్నదని తెలుస్తోంది. అయితే ఆమె పరిస్థితికి అనుగుణంగా చిత్రబృందం షూటింగ్ షెడ్యూల్ను ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ‘రాకా’పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అట్లీ మాస్ టేకింగ్కు అల్లు అర్జున్ క్రేజ్ తోడవడంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. 2027లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు టాక్. -
విడుదల తేదీ ఖరారు
బాలీవుడ్ హీరోలు సల్మాన్ ఖాన్ , సంజయ్దత్ నటించిన అంతర్జాతీయ చిత్రం ‘7 డాగ్స్’ ఇండియాలో రిలీజ్ కానుంది. ఈజిప్ట్ సూపర్స్టార్స్ అహ్మద్ ఎజ్, కరీమ్ అబ్దెల్ అజీజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఇంటర్నేషనల్ మూవీ ‘7 డాగ్స్’. ‘బ్యాడ్ బాయ్స్ ఫర్ లైఫ్’, ‘బ్యాడ్ బాయ్స్: రైడ్ ఆర్ డై’ చిత్రాల ఫేమ్ దర్శక–ద్వయం ఆదిల్ ఎల్ అర్బీ, బిలాల్ ఫల్లా తెరకెక్కించారు. ఇటాలియన్ నటి మోనికా బెల్లూసి, అమెరికన్ యాక్టర్ గియాన్ కర్లో అలెశ్శాండ్రో కీలక పాత్రల్లో నటించారు. సెలా స్టూడియోస్, జనరల్ ఎంటర్టైన్ మెంట్ అథారిటీ, రియాద్ సీజన్ నిర్మించిన ఈ చిత్రం మిడిల్ ఈస్ట్లో ఈ ఏడాది మే 27న అరబిక్, ఇంగ్లిష్ భాషల్లో విడుదలై హిట్గా నిలిచింది. తాజాగా ఈ సినిమాను ఇంగ్లిష్, హిందీ భాషల్లో ఈ నెల 21న భారత్లో రిలీజ్ చేయనున్నట్లు సోమవారం ప్రకటించి, ఓ వీడియో విడుదల చేశారు. -
‘వారణాసి’లో హనుమంతుడిగా రామ్ చరణ్?
దర్శకధీరుడు రాజమౌళి, సూపర్స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘వారణాసి’పై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్న విషయం తెలిసిందే.ఇక ఈ సినిమా కథ త్రేతాయుగం నేపథ్యంలో జరిగే సన్నివేశాల కోసం మహేశ్ బాబును శ్రీరాముడిగా చూపించనున్నట్లు ఇప్పటికే రాజమౌళి వెల్లడించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఘట్టానికి సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటంటే ఇందులో హనుమంతుడి పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కనిపించనున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.మొదట్లో ఈ పాత్ర కోసం ప్రముఖ నటుడు మాధవన్ పేరు వినిపించింది. అయితే ఆ పాత్రకు అవసరమైన ఇంటెన్స్, స్క్రీన్ ప్రెజెన్స్ దృష్ట్యా రామ్ చరణ్ అయితే హనుమాన్ పాత్ర తెరపై మరింత ప్రభావవంతంగా ఉంటుందని రాజమౌళి భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే జక్కన్న 'మగధీర' ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాలను చరణ్తో చేశాడు. ఆ చిత్రాల అనుభవం కూడా ఈ కాంబినేషన్పై ఆసక్తిని మరింత పెంచుతోంది. అయితే రామ్ చరణ్ ‘వారణాసి’లో హనుమంతుడిగా నటిస్తున్నారనే వార్తపై 'వారణాసి' చిత్రబృందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ నిజంగా ఈ కాంబినేషన్ సెట్ అయితే మాత్రం సినిమాపై అంచనాలు మరో స్థాయికి చేరడం ఖాయం. -
అమితాబ్తో నటించాలనే కోరిక.. కోమాలో పాత్ర
బాలీవుడ్ నటి ప్రీతి జింటా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన అందం, నటనలతో అప్పట్లో ఓ స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగింది. అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేస్తున్న ‘కౌన్ బనేగా కరోడ్పతి’ 18వ సీజన్ తొలి ఎపిసోడ్లో అమిర్ఖాన్, సన్నీడియోల్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బచ్చన్ కుటుంబంతో కలిసి పనిచేసిన జ్ఞాపకాల్లో తనకు అత్యంత ఇష్టమైనది ఏంటని ప్రీతిని అడగ్గా.. ఓ సరదా సంఘటన గుర్తుచేసుకుంది.‘బచ్చన్ కుటుంబాన్ని ఎంతో ప్రేమిస్తా, గౌరవిస్తా. అమిత్జీతో కలిసి నటించాలని చాలా రోజులుగా ఎదురుచూశాను. అందుకోసం చాలా ప్రయత్నించాను. చివరకు 2003లో వచ్చిన ‘అర్మాన్’లో ఆయనతో నటించే అవకాశం వచ్చింది. దర్శకురాలు హనీ ఇరానీతో ఈ సినిమాలో అమిత్జీతో నాకు ఒక్క సీన్ అయినా ఉండాలని అడిగాను. అందుకు హనీ ఇరానీ సరదాగా.. ‘‘అమిత్జీతో నటించాలని అంతగా కోరుకుంటున్నావా? అయితే ఆ సీన్లో నువ్వు చనిపోవాల్సిందే’’ అన్నారు. దీంతో మూవీ నా పాత్రని కోమాలో ఉండేలా పెట్టారు. నేను కోమాలో ఉన్నట్లు నటించాలి. అమిత్జీ నా దగ్గరకు వచ్చారు. ఆయన ఎదురుగా ఉండటంతో తెగ భయపడిపోయాను. చనిపోయినట్లు నటించడం ఎంత కష్టమో అప్పుడే తెలిసింది. నేను కదులుతుండటంతో.. ‘ప్రీతి సీన్ పాడుచేస్తున్నారు.. మీరు కదులుతున్నారు’ అని టీమ్ వాళ్లు నాపై కోపంగా అరిచేవాళ్లు’ అని ప్రీతి జింటా చెప్పుకొచ్చింది.2003లో రిలీజైన ‘అర్మాన్’లో అమితాబ్ బచ్చన్, అనిల్ కపూర్, ప్రీతి జింటా ప్రధాన పాత్రలు చేశారు. ప్రీతి తెలుగు ప్రేక్షకులకూ సుపరిచితమే. వెంకటేశ్ సరసన ‘ ప్రేమంటే ఇదేరా’, మహేశ్ రాజకుమారుడు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. -
బాలీవుడ్ నుండి సౌత్ సినిమా వరకు.. ‘ప్లాగరిజం’ వివాదాలు!
సాహిత్యంలో నవలలు, నాన్-ఫిక్షన్, వ్యాసాలు, పీహెచ్డీ థీసిస్ల విషయంలో ‘ప్లాగరిజం’ (సాహిత్య చోరీ లేదా భావజాల దొంగతనం) అనే పదం సాధారణంగా వినిపిస్తూ ఉంటుంది. అయితే నాటకాలు, లలిత కళలు, సినిమా వంటి ఇతర సాంస్కృతిక, సృజనాత్మక రంగాలకు కూడా ఇది వర్తిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ‘ప్లాగరిజం’ నిబంధనలను అత్యధికంగా ఉల్లంఘిస్తున్న రంగం బహుశా సినిమానే అనే మాట వినిపిస్తోంది. ఎందుకంటే 1970లలో లేదా మరెప్పుడో ప్రపంచంలో ఎక్కడో తీసిన ఒక సినిమాను కాపీ కొట్టడం లేదా దాదాపుగా దానినే పోలిన చిత్రాన్ని రూపొందిండం, దానికి ఆధునిక పాత్రలను అద్దడం, కథలో చిన్న మార్పులు చేయడం, కథనంలో మాత్రం స్వల్ప పోలికలను ఉంచుకుని దానిని తమ సొంత సృష్టిగా ప్రచారం చేసుకోవడం చిత్రనిర్మాతలకు సులభం కావడంతో ఇది అత్యంత సాధారణంగా జరుగుతుంటుంది.‘ప్లాగరిజం’ అంటే..ఒకరి ఆలోచనలు, సమాచారం, భాష లేదా రచనను అసలు మూలాన్ని తగిన విధంగా గుర్తించకుండా (క్రెడిట్స్ ఇవ్వకుండా) ఉపయోగించడాన్ని ‘ప్లాగరిజం’ అంటారు. అసలైనదిగా నమ్మించే ప్రయత్నంలో ఒక రకమైన అనైతికత ఉండటం దీనిలోని ప్రధానాంశం. కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘించినప్పుడు జరిగే కాపీరైట్ ఉల్లంఘనకు, ‘ప్లాగరిజం’నకు ఎప్పుడూ ఒకే అర్థం ఉండదు. బౌద్ధిక ఆస్తి (ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ) రంగానికి చెందిన చాలా పదాల మాదిరిగానే, ‘ప్లాగరిజం’ కూడా ఆధునిక యుగానికి చెందిన భావనగా పరిణమించింది. భారతీయ లేదా అంతర్జాతీయ చలనచిత్రాల నుంచి కథలు, పాత్రలు, థీమ్లు, కథనాలను ‘అరువు తెచ్చుకోవడం’, ‘స్ఫూర్తి పొందడం’, ‘ప్రేరణ పొందడం’ లేదా ‘అడాప్ట్ చేసుకోవడం’ వంటివి హిందీ చలనచిత్ర పరిశ్రమలో కోకొల్లలుగా ఉన్నాయి.చార్లీ చాప్లిన్ సినిమా సినిమాతో..ఈ కోవలో ముందుగా గుర్తుకు వచ్చే చిత్రం రాజ్ కపూర్ నిర్మించిన ‘శ్రీ 420’. చార్లీ చాప్లిన్ సినిమా ‘ట్రాంప్’ (అవసరాల కోసం తిరిగే వ్యక్తి) ఇమేజ్ను స్ఫూర్తిగా తీసుకున్నారనే విమర్శలను ఈ చిత్రం ఎదుర్కొంది. రాజ్ కపూర్, నర్గిస్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘చోరీ చోరీ’ (1956) చిత్రం, క్లార్క్ గేబుల్, క్లాడియా కోల్బర్ట్ నటించిన హాలీవుడ్ హిట్ చిత్రం ‘ఇట్ హ్యాపెండ్ వన్ నైట్’ (1934)కి కాపీయే. ‘ఫిర్ సుభా హోగి’ (1958) చిత్రంలో రాజ్ కపూర్ ప్రధాన పాత్ర పోషించారు. ఇది దోస్తోవ్స్కీ రాసిన సామాజిక దృక్పథం కలిగిన ‘క్రైమ్ అండ్ పనిష్మెంట్’ నవల ఆధారంగా రూపుదిద్దుకుంది. క్వెంటిన్ టరాంటినో చిత్రం ‘రిజర్వాయర్ డాగ్స్’కి రీమేక్గా వచ్చిన ‘కాంటే’ చిత్రంలో బ్యాంక్ దొంగతనం నేపథ్యంలో బాలీవుడ్ పాటలు, నృత్యాలను జోడించారు.నైతికపరమైన ఉల్లంఘన 1991లో మహేష్ భట్ దర్శకత్వంలో, ఆయన కూతురు పూజా భట్, అమీర్ ఖాన్ ప్రధాన పాత్రల్లో అదే (కాంటే) సినిమాకు ఆధునికత, గ్లామరస్ జోడించి ‘దిల్ హై కి మాన్తా నహీ’ వచ్చింది. కాపీకి మూలమైన చిత్రం లేదా దర్శకుడి పేరును టైటిల్స్లో పేర్కొంటే ‘ప్లాగరిజం’ చేసినట్లు కాదు. కానీ చాలా సందర్భాలలో ఇది జరగదు. అయినా వారు నైతికపరమైన నిజాయితీని ఉల్లంఘించినవారవుతారు (చట్టపరంగా కాకపోయినా). జాన్ అబ్రహాం, నానా పటేకర్ నటించిన ‘టాక్సీ నంబర్ 9211’ (2006) చిత్రం, బెన్ అఫ్లెక్, శామ్యూల్ జాక్సన్ నటించిన ‘చేంజింగ్ లేన్స్’ (2002) ఆధారంగా తెరకెక్కిందని చెబుతారు.మోహన్లాల్.. ‘నేరు’పెద్ద దర్శకులు, భారీ బడ్జెట్ సినిమాలు ‘ప్లాగరిజం’ చట్టపరమైన సవాళ్లను ఎదుర్కొంటుంటాయి. స్క్రిప్ట్లు, సన్నివేశాలు లేదా పాటలను కాపీ చేశారనే ఆరోపణలపై అనేక చిత్రాలు సవాళ్లను ఎదుర్కొన్నాయి. అయితే విదేశీ నిర్మాతలు, బ్యానర్లు వీటిని పట్టించుకోరు. దక్షిణాది రాష్ట్రాల సినిమాలు దీనికి మినహాయింపు కాదు. మలయాళ చిత్రం ‘నేరు’ (2023) విషయంలో, పిటిషనర్ దీపక్ ఉన్ని కేరళ హైకోర్టును ఆశ్రయించారు. జీతూ జోసఫ్, మోహన్లాల్ తెరకెక్కించిన ఈ కోర్టు రూమ్ డ్రామాలో తాను ఇదివరకే వారికి చెప్పిన స్క్రిప్ట్ లోని ఆలోచనలను ఉపయోగించారని ఆయన ఆరోపించారు. జీతూ జోసఫ్ దర్శకత్వం వహించిన ‘నేరు’ విడుదలపై కేరళ హైకోర్టు స్టే నిరాకరించింది. ఇక్కడ చిత్రంలో మోహన్లాల్ పెద్ద స్టార్గా ఉండటమే కారణం కావచ్చని అంటారు.కమల్ హాసన్.. ‘పాపనాశం’కమల్ హాసన్ కూడా తన కొన్ని సినిమాల్లో ‘ప్లాగరిజం’ ఆరోపణలను ఎదుర్కొన్నారు. దీనికి ఒక ఉదాహరణ ‘పాపనాశం’. ‘ఒరు మజక్కాలతు’ నవల కాపీరైట్లను ఉల్లంఘించారంటూ సతీష్ పాల్ నిర్మాతలు, దర్శకుడు జీతూ జోసఫ్పై దావా వేశారు. అయితే చిత్ర నిర్మాతలు, కమల్ హాసన్ మద్దతుతో దర్శకుడు జీతూ జోసఫ్ ఆ కేసును విజయవంతంగా ఎదుర్కొన్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్, సోనాక్షి సిన్హా నటించిన తమిళ చిత్రం ‘లింగా’పై మధురైకి చెందిన చిత్రనిర్మాత కె.వి. రవి రత్నం ఇది తన అసలు కథ అని ఆరోపించారు. అయితే ‘లింగా’ దర్శకుడు కె.ఎస్. రవికుమార్, రజనీకాంత్ స్వయంగా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేస్తూ, ‘లింగా’ పొన్కుమరన్ రాసిన కథ ఆధారంగా తెరకెక్కిందని తెలిపారు.ముంబై ఫిలింమేకర్స్ మాట ఇదే..జాతీయ అవార్డు గెలుచుకున్న కన్నడ చిత్రం ‘బ్యారి’ చట్టపరమైన పోరాటాన్ని ఎదుర్కొంది. చివరకు రచయిత్రి సారా అబూబక్కర్ నవలను అనధికారికంగా అడాప్ట్ చేసుకున్నందుకు ఆమెకు పరిహారం చెల్లించాల్సి వచ్చింది. అలాగే మ్యూజికల్ సిమిలారిటీకి సంబంధించి కాపీరైట్ క్లెయిమ్ల కారణంగా ‘కాంతారా’ చిత్రం హిట్ ట్రాక్ ‘వరాహ రూపం’ చట్టపరమైన ఆంక్షలు ఎదుర్కొంది. లక్ష్మణ్ దర్శకత్వం వహించి జయం రవి, అరవింద్ స్వామి నటించిన ‘బోగన్’ చిత్రం 2017లో ‘ప్లాగరిజం’ వివాదంలో చిక్కుకుంది. ప్రముఖ భారతీయ చలనచిత్ర విశ్లేషకుడు ఎంకే రాఘవేంద్ర రాసిన ‘ప్లాగిరిజంగ్ ఫర్ బాలీవుడ్’ అనే పత్రం ప్రకారం ‘పాపులర్ ఇండియన్ సినిమా హాలీవుడ్ను అనుకరిస్తుందని భావిస్తుంటారు. అయితే ఇటీవల కాలంలో పశ్చిమ దేశాల సినిమాలతో పోలిస్తే తమ చిత్రాల కంటెంట్, ఫార్మాట్ భిన్నంగా ఉంటాయని ముంబై ఫిలింమేకర్స్ చెబుతున్నారు. భారతీయ ప్రేక్షకుల కోసం సినిమాలు తీయడంలో నిర్దిష్టమైన పద్ధతి ఉంటుందని వారు చెబుతున్నారు. అయితే హాలీవుడ్ ‘కాపీ’ చిత్రాలు విజయవంతం కావాలంటే ఆ చిత్రాల్లో భారతీయుల తీరు తెన్నులను, ఇక్కడి సంస్కృతిని సమన్వయం చేసుకోవాల్సి ఉంటుంది’ అని పేర్కొన్నారు. అయితే ఇతరుల భావాలు, కాన్సెప్ట్ల ద్వారా ‘స్ఫూర్తి’ పొందడాన్ని, వాటికి భాష, సాంస్కృతిక కోణాలు, భారతీయతను జోడించి సినిమాలు తీయడాన్ని రాఘవేంద్ర సైద్ధాంతికంగా వ్యతిరేకించ లేదు. ఇది కూడా చదవండి: రష్యా నుంచి భారత్కు రైలు.. కొత్త కారిడార్ ప్లాన్? -
బ్రో... రిలాక్స్!
తిట్టకుండా తిట్టినట్లు కౌంటర్ ఇచ్చారు మృణాల్ ఠాకూర్. అసలేం జరిగిందంటే... తన కన్నా వయసులో పదేళ్లు చిన్న అయిన స్టార్ క్రికెటర్ యశస్వి జైస్వాల్తో మృణాల్ డేటింగ్ అంటూ ప్రచారం జరుగుతోంది. ఈ వార్త గురించి ఆమె కాస్త ఘాటుగానే స్పందించారు. ‘‘బ్రో... రిలాక్స్. మేమిద్దరం ఎక్కడైనా జంటగా కనిపించామా? మీరు చూపించండి. చదువుకున్న మీలాంటివాళ్లు ఇలాంటి వదంతులు నిజం అని ఎలా నమ్ముతారు? దేశంలో ఎంతో జరుగుతోంది. జెన్ జీ నుంచి నేర్చుకుని, సరైన టాపిక్స్ మీద వీడియోలు చేయండి... అప్పుడు మీకు కావల్సినన్ని వ్యూస్ వస్తాయి’’ అని సోషల్ మీడియా వేదికగా మృణాల్ ఠాకూర్ స్పందించారు. ఇక ముంబైలోని ఓ కేఫ్ నుంచి మృణాల్, యశస్వి జైస్వాల్ విడి విడిగా వచ్చిన ఓ వీడియోను ఉద్దేశించి... ఈ ఇద్దరూ డేటింగ్ అనే వార్తను ప్రచారం చేయడం మొదలుపెట్టారు. తాజాగా మృణాల్ చేసిన కామెంట్కి నెటిజన్లు ఆమెకు మద్దతుగా ‘అబద్ధపు వార్తను ఎలా ప్రచారం చేస్తున్నారో? అసలు ఇద్దరు వ్యక్తులు ఒకే రోజు ఒకే రెస్టారెంట్కి వెళ్లకూడదా?’ అంటూ వదంతులు ప్రచారం చేస్తున్నవారిని ఉద్దేశించి కామెంట్ చేశారు. -
ఆమిర్తో అట్లీ?
ఆమిర్ ఖాన్ హీరోగా నటించనున్న కొత్త చిత్రంపై పూర్తి స్థాయిలో ఇంకా సరైన స్పష్టత రావడం లేదు. ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్, ‘త్రీ ఇడియట్స్’ సీక్వెల్, దర్శకుడు లోకేష్ కనగరాజ్తో ఓ సూపర్ హీరో మూవీ, అశుతోష్ గోవారీకర్ దర్శకత్వంలో ఓ స్పోర్ట్స్ మూవీ అంటూ ఆమిర్ నెక్ట్స్ చిత్రాలపై వార్తలు వినిపిం చాయి. కానీ ఇప్పటివరకు ఏ సినిమా సెట్స్కు వెళ్లలేదు.తమిళ దర్శకుడు అట్లీ ఇటీవల ఆమిర్ ఖాన్కు ఓ స్టోరీ లైన్ చె ప్పారట. ఈ కథ నచ్చి, ఈ సినిమా చేసేందుకు ఒప్పుకున్నారట ఆమిర్. అయితే ఫైనల్ నరేషన్ జరగాల్సి ఉందట. ప్రస్తుతం అల్లు అర్జున్తో చేస్తున్న ‘రాకా’ చిత్రీకరణతో అట్లీ బిజీగా ఉన్నారు. ఈ సినిమా పూర్తయ్యాక ఆమిర్–అట్లీ కాంబినేషన్ సినిమా గురించి మరింత సమాచారం వెల్లడయ్యే అవకాశం ఉంది. మరి... వీరి కాంబినేషన్ సెట్ అవుతుందా? వేచి చూడాల్సిందే. -
హాలీవుడ్లో యానిమేషన్ మూవీ
బాలీవుడ్ దర్శకురాలు నిత్య మెహ్రా ఓ యానిమేషన్ సినిమా చేసేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ హాలీవుడ్ యానిమేషన్ సినిమాను పారామౌంట్ పిక్చర్స్, జొనాథన్ గోల్డ్స్టైన్, జాన్ ఫ్రాన్సిస్ డేలీ, కునాల్ నయ్యర్ కలిసి నిర్మించనున్నారట. న్యూజెర్సీకి చెందిన ఇండో–అమెరికన్ టీనేజ్ అమ్మాయి అనుకోకుండా బాలీవుడ్ మ్యూజికల్ ప్రపంచంలోకి వెళ్లినప్పుడు, ఈ యంగ్ అమ్మాయికి ఎదరైన సవాళ్లు? పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని హాలీవుడ్ టాక్.‘బార్ బార్ దేఖో’ చిత్రంతో దర్శకురాలిగా పరిచయం అయిన నిత్య ఆ తర్వాత ‘మేడ్ ఇన్ హెవెన్’ సిరీస్తో పాపులర్ అయ్యారు. ఇప్పుడు హాలీవుడ్లో చేయనున్న యానిమేషన్ మూవీపై ఫోకస్ పెట్టారు. -
నటికి చేదు అనుభవం.. లేడీ ఫ్యాన్ అత్యుత్సాహం
హిందీలో మూడు నాలుగు సినిమాలు చేసిన నటి నిఖితా రావల్కి ఊహించని అనుభవం ఎదురైంది. తాజాగా ఓ కార్యక్రమంలోనే ఈమె ఫొటోలకు పోజులిస్తుండగా ఓ మహిళా అభిమాని వచ్చి సెల్ఫీ అడిగింది. ఈ క్రమంలోనే అత్యుత్సాహం ప్రదర్శించింది. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: ఇప్పుడు వైజాగ్ రోడ్డుపై నడవలేకపోతున్నా: అల్లు అర్జున్)మిస్టర్ హాట్ మిస్టర్ కూల్, బ్లాక్ అండ్ వైట్, హీరో తదితర సినిమాల్లో నటించిన నిఖితా రావల్ మంచి డ్యాన్సర్గానూ గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం అయితే కొత్త ప్రాజెక్టులేం చేయట్లేదు. ఇప్పుడు అభిమాని ఈమెకు లిప్ కిస్ ఇవ్వడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.అయితే బాలీవుడ్లో ఇలాంటివి నిజంగా జరగడం కంటే ఎక్కువగా పీఆర్ స్టంట్స్గా చేస్తుంటారు. తమ గురించి ఎవరూ పట్టించుకోవట్లేదు. ఎలాంటి మూవీ ఛాన్సులు రాకపోతే ఏదో ఒకలా వైరల్ అవ్వాలని ప్రయత్నిస్తుంటారు. మరి నిఖితా రావల్ కూడా ఇలాంటి స్టంట్ ఏమైనా చేసిందా? లేదంటే నిజంగా జరిగిందా అనేది తెలియాల్సి ఉంది.(ఇదీ చదవండి: మూడు నెలల తర్వాత ఓటీటీలోకి తెలుగు సినిమా)SHOCKING 😲 😱😭😲#NikitaRawal Forcefully Kissesd by her Female FAN . Or just a PR Gimmick ? pic.twitter.com/WJF8uuC4y5— Manoz Kumar (@ManozTalks) August 9, 2026 -
ముందుగా విదేశాల్లోనే...
‘రామాయణ’ సినిమా విడుదల విషయంలో చిన్న మార్పు ఉన్నట్లు ఈ చిత్రనిర్మాత నమిత్ మల్హోత్రా తెలిపారు. భారతీయ ఇతిహాసం రామాయణం ఆధారంగా తెరకెక్కిన సినిమా ‘రామాయణ’. నితీష్ తివారి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో రాముడిగా రణ్బీర్ కపూర్, సీతగా సాయిపల్లవి, లక్ష్మణుడిగా రవి దుబె, హనుమంతుడిగా సన్నీ డియోల్, రావణుడిగా యశ్ నటిస్తున్నారు. ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్ పతాకంపై నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది.కాగా, ‘రామాయణ పార్ట్ 1’ ఈ ఏడాది దీపావళికి, ‘రామాయణ పార్ట్ 2’ వచ్చే ఏడాది దీపావళికి విడుదల కానున్నాయి. అయితే తొలి భాగం ఇండియాలో కంటే ముందుగా విదేశాల్లోనే విడుదల కానుంది. ‘‘విదేశీ మార్కెట్లలో సినిమాల విడుదల సాధారణంగా శుక్రవారం నుంచే ప్రారంభం అవుతుంది. అందుకే అక్కడ నవంబరు 6న ‘రామాయణ పార్ట్ 1’ని రిలీజ్ చేస్తాం. ఇండియాలో మాత్రం దీపావళి పండగ రోజునే అంటే... నవంబరు 8నే రిలీజ్ చేస్తాం’’ అని ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు నమిత్ మల్హోత్రా. -
భారత క్రికెటర్ జైస్వాల్తో డేటింగ్? క్లాస్ పీకిన మృణాల్
సినిమా సెలబ్రిటీలకు సంబంధించి ఎప్పటికప్పుడు రూమర్స్ వినిపిస్తూనే ఉంటాయి. అలా రీసెంట్ టైంలో హీరోయిన్ మృణాల్ ఠాకుర్ గురించి ఒకటి బయటకొచ్చింది. భారత యంగ్ క్రికెటర్ యశస్వి జైస్వాల్తో డేటింగ్లో ఉందని అన్నారు. ముంబైలోని ఓ కాఫీ షాప్లో జంటగా కనిపించారని పుకార్లు తెగ అల్లేశారు. ఇప్పుడు దీనిపై స్వయంగా మృణాల్ స్పందించింది. కామెంట్ పెట్టి క్లాస్ పీకింది.(ఇదీ చదవండి: సినిమా మీద మేం చేసే ఆ ఖర్చంతా వేస్ట్: నిర్మాత నాగవంశీ)తను-జైస్వాల్ వైరల్ వీడియోకు సంబంధించి ఓ ఇన్స్టా ఖాతాలో పోస్ట్ కనిపించగా.. దానికి మృణాల్ కామెంట్ పెట్టింది. ఒకేచోట కనిపించినంత మాత్రాన ఇద్దరి మధ్య సంబంధం ఉందని ఎలా భావిస్తారు? అలా ఎలా అనుకుంటారు? అని ప్రశ్నించింది.'బ్రో రిలాక్స్.. మేమిద్దరం కలిసి ఎక్కడ కనిపించాం? మీరు ఇంత చదువుకున్నవాళ్లు కానీ ఇలాంటి పుకార్లను నిజమని ఎలా నమ్ముతున్నారు? దేశంలో ఎన్నో విషయాలు జరుగుతున్నాయి. జెన్-జీ నుంచి కొంత నేర్చుకోండి. సరైన సమస్యలపై వీడియోలు చేయండి. అప్పుడు మరిన్ని వ్యూస్ వస్తాయి' అని మృణాల్ కామెంట్ చేసినట్లు ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇది రూమర్కి స్పందించినట్లు లేదు. చిన్నపాటి క్లాస్ పీకినట్లు ఉంది.అయితే మృణాల్పై డేటింగ్ రూమర్స్ ఇదేం కొత్త కాదు. తమిళ హీరో ధనుష్తో డేటింగ్లో ఉందని, వాలంటైన్స్ డే నాడు పెళ్లి కూడా చేసుకోబోతున్నారని తెగ మాట్లాడుకున్నారు. తీరా చూస్తే అవన్నీ ఒట్టి పుకార్లు మాత్రమేనని తేలిపోయింది. ఈ బ్యూటీ కెరీర్ విషయానికొస్తే.. ఈ ఏడాది ఈమె నుంచి మూడు సినిమాలొచ్చాయి. వాటిలో 'డెకాయిట్' అనే తెలుగు మూవీ ఉంది. త్వరలో 'పూజా మేరీ జాన్' అనే ఓటీటీ చిత్రంలో కనిపించనుంది.(ఇదీ చదవండి: లోకేశ్ 'డిసి'.. విజయ్ దేవరకొండే చేయాలి కానీ) -
శ్రీదేవితో రహస్య వివాహం నుంచి భార్య బెదిరింపుల వరకు..
బాలీవుడ్ లెజెండరీ నటుడు, ‘డిస్కో కింగ్’, బీజేపీ నేత మిథున్ చక్రవర్తి అనారోగ్యంతో కోల్కతాలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, త్వరలోనే డిశ్చార్జ్ కానున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో ఆయన జీవితంలోని పలు అంశాలు మరోమారు చర్చల్లోకి వచ్చాయి. మిథున్ చక్రవర్తి సినీ ప్రయాణం అద్భుతంగా సాగినా, ఆయన వ్యక్తిగత జీవితం మాత్రం అనేక వివాదాలు, విషాదాలు, నాటకీయ పరిణామాలతో నిండిపోయింది. పరిశ్రమలోని పలువురు ప్రముఖ నటీమణులతో ఆయన సాగించిన ప్రేమాయణాలు, రహస్య వివాహాలు నాడు సంచలనం సృష్టించాయి.కమల్ హాసన్ మాజీ భార్యతో..1970లలో మిథున్ చక్రవర్తి వరుస హిట్లతో సినిమా రంగంలో దూసుకుపోతున్నారు. ఆ సమయంలో ‘హమారా సంసార్’ చిత్రంలో కమల్ హాసన్ మాజీ భార్య సారికతో ఆయన కలిసి నటించారు. అప్పుడు ఇద్దరి మధ్య ఏర్పడిన సాన్నిహిత్యం ప్రేమగా మారింది. అయితే కొద్ది నెలలకే ఈ బంధం అర్ధాంతరంగా ముగిసిపోయిందంటారు. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల సారికనే స్వయంగా మిథున్కు దూరమైనట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.మోడల్,నటి హెలెనా లూక్తో వివాహంసారికతో బ్రేకప్ తర్వాత మానసికంగా కుంగిపోయిన మిథున్, మోడల్ కమ్ నటి హెలెనా లూక్కు దగ్గరయ్యారు. జావేద్ ఖాన్తో ఐదేళ్ల రిలేషన్షిప్ ముగిసిన హెలెనా కూడా ఆ సమయంలో ఒంటరిగానే ఉన్నారు. ఇద్దరి పరిస్థితులు ఒకేలా ఉండటంతో 1979లో వారు వివాహం చేసుకున్నారు. కానీ ఈ బంధం కేవలం నాలుగు నెలలు మాత్రమే నిలిచింది. మిథున్ ప్రవర్తన కారణంగా హెలెనా విడాకులు తీసుకున్నారని అంటారు.హెలెనా బయటపెట్టిన మిథున్ టాక్సిక్ నేచర్విడాకుల తర్వాత ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన హెలెనా లూక్, మిథున్తో తన అనుభవాన్ని ఒక పీడకలగా అభివర్ణించారు. మిథున్ తనను మానసికంగా ఎంతో వేధించారని, తన మాజీ ప్రియుడితో సంబంధం ఉందని నిత్యం అనుమానించే వారని ఆమె వెల్లడించారు. మిథున్కు అప్పట్లోనే వేరే మహిళలతో సంబంధాలు ఉండటం వల్లే, తనపై లేనిపోని అభూతకల్పనలు ఆపాదించేవారని ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. విడాకుల అనంతరం హెలెనా బాలీవుడ్కు పూర్తిగా దూరమై న్యూయార్క్లో స్థిరపడ్డారు.కిశోర్ కుమార్ మాజీ భార్య యోగితా బాలితో పెళ్లిహెలెనాతో విడాకుల అనంతరం మిథున్ జీవితంలోకి సింగర్ కిశోర్ కుమార్ మాజీ భార్య యోగితా బాలి ప్రవేశించారు. కిశోర్ కుమార్కు విడాకులు ఇచ్చిన తర్వాత, యోగితా 1979లో మిథున్ను వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత తన సినిమా కెరీర్ను పూర్తిగా పక్కన పెట్టి, సంసారమే సర్వస్వంగా బతుకుతానని ఆమె ప్రకటించారు. ఈ దంపతులకు మహాక్షయ్ (మిమోహ్), ఉష్మే, నామాషి అనే ముగ్గురు కుమారులు జన్మించడంతో పాటు దిశాని అనే అమ్మాయిని దత్తత తీసుకున్నారు.శ్రీదేవి ఎంట్రీతో వైవాహిక జీవితంలో తుఫాన్అంతా సజావుగా సాగుతున్న సమయంలో 1985లో మిథున్ జీవితంలోకి దివంగత నటి శ్రీదేవి అడుగుపెట్టారు. ‘జాగ్ ఉతా ఇన్సాన్’ సినిమా షూటింగ్ సమయంలో ఇద్దరూ ఒకరికొకరు దగ్గరయ్యారు. అప్పటికే పెళ్లయినప్పటికీ మిథున్.. శ్రీదేవితో ప్రేమలో పడిపోయారు. మీడియా కథనాల ప్రకారం, వీరిద్దరూ 1985లో అత్యంత రహస్యంగా వివాహం కూడా చేసుకున్నారు. ఈ సీక్రెట్ మ్యారేజ్ బాలీవుడ్ వర్గాల్లో పెద్ద సంచలనంగా మారింది.భార్య యోగితా బాలి ఆత్మహత్యాయత్నంమిథున్, శ్రీదేవిల రహస్య వివాహం, వివాహేతర సంబంధం గురించి తెలుసుకున్న యోగితా బాలి తీవ్రంగా కుంగిపోయారు. భర్త మోసాన్ని తట్టుకోలేక ఆమె ఆత్మహత్యకు యత్నించినట్లు అప్పట్లో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. తరువాత ఆమె, తన పిల్లలతో కలిసి మిథున్ నుంచి దూరంగా వెళ్లిపోయారు. ఈ పరిణామం మిథున్, నిర్మాత బోనీ కపూర్ మధ్య ఉన్న స్నేహ బంధాన్ని కూడా శాశ్వతంగా దెబ్బతీసింది.శ్రీదేవితో పెళ్లి రద్దు.. యోగితా బాలితో తిరిగి..మిథున్ తన మొదటి భార్య యోగితాకు విడాకులు ఇవ్వలేడని, ఆమెను పూర్తిగా వదిలించుకోలేడని గ్రహించిన శ్రీదేవి కీలక నిర్ణయం తీసుకున్నారు. 1988లో మిథున్తో జరిగిన వివాహాన్ని ఆమె చట్టబద్ధంగా రద్దు చేసుకున్నారు. ఆ తర్వాత శ్రీదేవి బోనీ కపూర్ను వివాహం చేసుకోగా, మిథున్ తిరిగి తన మొదటి భార్య యోగితా బాలి వద్దకు చేరారు. యోగితను ఒప్పించి ఆమెను ఇంటికి రప్పించుకున్న మిథున్, ఆ తర్వాత తమ మూడో సంతానాన్ని స్వాగతించారు. ఎన్నో వివాదాలు, కష్టాలను ఎదుర్కొన్న మిథున్ చక్రవర్తి ప్రస్తుతం తన భార్య యోగితా బాలి, పిల్లలతో కలిసి ఉంటున్నారు. వారి కుమారులు మిమోహ్, ఉష్మే, నామాషి, కూతురు దిశాని కూడా సినీరంగంలో రాణిస్తున్నారు. ఇది కూడా చదవండి: ‘రక్త సంబంధం’.. ఇది సీరియల్ కాదు.. సినిమా కానే కాదు! -
ఆస్పత్రిలో సీనియర్ నటుడు.. సీఎం పోస్ట్తో వెలుగులోకి..
కోల్కతా: సీనియర్ నటుడు, బీజేపీ నేత మిథున్ చక్రవర్తి ఆస్పత్రిలో చేరారు. కోల్కతాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొంతున్నారు. గురువారం ఆయనకు వైద్యులు శస్త్రచికిత్స చేశారని తెలుస్తోంది. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని త్వరలోనే ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అవుతారని భావిస్తున్నారు. మిథున్ చక్రవర్తిని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి శుక్రవారం పరామర్శించారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఫేస్బుక్లో షేర్ చేయడంతో మిథున్ అనారోగ్యం గురించి బయట ప్రపంచానికి తెలిసింది.''ప్రముఖ సినీ నటుడు, బీజేపీ కేంద్ర కమిటీ సభ్యులలో ఒకరైన మిథున్ చక్రవర్తి అనారోగ్య కారణాలతో కోల్కతాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. నేను ఈరోజు ఆయన్ను పరామర్శించడానికి ఆసుపత్రికి వెళ్లాను. ఆయనతో మాట్లాడి, ఆరోగ్య పరిస్థితి గురించి వివరాలు తెలుసుకున్నాను. ఆయన త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను'' అని సువేందు అధికారి ఫేస్బుక్లో పేర్కొన్నారు.మిథున్ను పరామర్శించిన తర్వాత ఆస్పత్రి వెలుపల సీఎం సువేందు మీడియాతోనూ మాట్లాడారు. గురువారం రాత్రి ఆయనకు చిన్న శస్త్రచికిత్స జరిగిందని వెల్లడించారు. తాను ఆస్పత్రిలో చేరిన విషయం బహిరంగపరచకూడదని మిథున్ అనుకున్నారని చెప్పారు. కాగా, మిథున్ చక్రవర్తి ఆస్పత్రిలో చేరారన్న విషయం తెలుసుకుని ఆయన అభిమానులు, శ్రేయాభిలాషులు ఆందోళన చెందుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుతూ సోషల్ మీడియాలో పోస్ట్లు పెడుతున్నారు. మిథున్ చక్రవర్తి త్వరగా కోలుకోవాలి: శత్రుఘ్న సిన్హా పట్నా: మిథున్ చక్రవర్తి అనారోగ్యం నుంచి త్వరగా కోలుకోవాలని టీఎంసీ ఎంపీ, సీనియర్ నటుడు శత్రుఘ్న సిన్హా ఆకాంక్షించారు. పట్నాలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మిథున్ చక్రవర్తి ఆస్పత్రిలో చేరిన విషయం తనకు ఇప్పుడే తెలిసిందని చెప్పారు. మిథున్ తనకు మంచి మిత్రుడని, ఆయనతో సత్సంబంధాలు ఉన్నాయని తెలిపారు.చదవండి: ఫడ్నవీస్ ప్రభుత్వంపై మరాఠా ఉద్యమ నేత ఫైర్''మిథున్ ఆసుపత్రిలో ఉన్నారని నాకు ఇప్పుడే తెలిసింది. ఈ విషయం విని చాలా బాధపడ్డాను. మిథున్ చక్రవర్తి నాకు మంచి స్నేహితుడు.. చాలా మంచి కళాకారుడు, గొప్ప స్టార్. ఆయన ఒక అద్భుతమైన మానవతావాది కూడా. ఆయనకు జంతువులంటే చాలా ఇష్టం. తన వద్ద ఉన్న పెంపుడు కుక్కలు, పిల్లులను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటారు. ఆయనకు ప్రజల పట్ల, ముఖ్యంగా పేదల పట్ల కూడా ప్రగాఢమైన శ్రద్ధ ఉంది. నాకు మిథున్ పట్ల ఎంతో గౌరవం ఉంది. ఆయన నాకు చాలా ప్రియమైన , ప్రత్యేకమైన వ్యక్తి. ఆయన త్వరగా కోలుకోవాలని నేను కోరుకుంటున్నాను. మా ముఖ్యమంత్రి సువేందు అధికారి ఆయన్ను పరామర్శించడానికి వెళ్లారు, ఆయన సరైన పనే చేశారు. మిథున్కు ప్రజలందరి ప్రేమ, మద్దతు, ఆశీస్సులు దక్కాల''ని శత్రుఘ్న సిన్హా అన్నారు. -
'చిన్న వయసులోనే పెళ్లిచూపులు.. నేను తప్పించుకున్నా'
ప్రముఖ బాలీవుడ్ నటి షెహనాజ్ గిల్ బీటౌన్లో సుపరిచితమైన పేరు. ఇటీవలే ఆమె ఇష్క్నామా అనే మూవీతో ప్రేక్షకులను పలకరించింంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ప్రేమ, పెళ్లి గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన షెహనాజ్.. ప్రేమ అంటే ముఖ్యమైన వ్యక్తులకు సమయం, స్వేచ్ఛ ఇవ్వడమేనని అన్నారు. అయితే పెళ్లిళ్లకు తాను దూరంగా ఉండేదాన్ని అని వెల్లడించారు.ప్రేమ, పెళ్లి సంబంధాలపై తన అభిప్రాయాలను షెహనాజ్ గిల్ వెల్లడించారు. మా కుటుంబంలో పెళ్లి చూపులు చిన్న వయసులోనే చూసేవారని తెలిపింది. అమ్మాయిలకు చాలా చిన్న వయసు నుంచే త్వరలో పెళ్లి అవుతుందని చెప్పేవారని గుర్తు చేసుకుంది. అలా వరుడి కోసం అన్వేషణ చాలా ముందుగానే మొదలవుతుందని పేర్కొంది. మా బంధువుల్లో ఒకరు నాకు పెళ్లి చేయాలని చూసింది.. కానీ నేను మాత్రం అస్సలు ఒప్పుకోలేదని తెలిపింది. పెళ్లిళ్లకు వెళ్తే సంబంధాలు కుదర్చడానికి ప్రయత్నిస్తారని షెహనాజ్ వెల్లడించింది. అందుకే నేను ఎక్కువగా పెళ్లిళ్లకు వెళ్లడం కూడా మానేసేదాన్ని అని తన అనుభవాన్ని పంచుకుంది. ఇప్పుడు నా కెరీర్ పరంగా సక్సెస్ అయ్యానని.. ఇప్పుడు అందరూ నా వెంట పడుతున్నారని నవ్వుతూ చెప్పుకొచ్చింది. కాగా.. షెహనాజ్ గిల్ నటించిన 'ఇష్క్నామా' చిత్రం జూలై 24న థియేటర్లలో విడుదలైంది. -
ఓటీటీలో రికార్డ్.. ఆ జాబితాలో మొదటి చిత్రంగా దురంధర్
ఇండియన్ బాక్సాఫీస్ను షేక్ చేసిన చిత్రాల్లో దురంధర్ ముందు వరుసలో ఉంటుంది. దంగల్, బాహుబలి, ఆర్ఆర్ఆర్, పుష్ప చిత్రాల సరసన చేరింది. రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీ.. బాక్సాఫీస్ వద్ద రూ.3 వేల కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్లో రణ్వీర్ సింగ్ హీరోగా మెప్పించారు. సారా అర్జున్ హీరోయిన్గా కనిపించింది.తాజాగా ఈ మూవీ మరో రికార్డ్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఓటీటీలో సందడి చేస్తోన్న దురంధర్ అరుదైన రికార్డ్ సాధించింది. ఈ ఏడాది ప్రపంచంలో అత్యధికంగా వీక్షించిన ఆంగ్లేతర చిత్రాల జాబితాలో మొదటిస్థానంలో నిలిచింది. కాగా.. ఈ మూవీకి ఆదిత్య ధర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్, సారా అర్జున్, రాకేష్ బేడీ, సంజయ్ దత్ కీలక పాత్రల్లో నటించారు. ధురందర్ పార్ట్-1 డిసెంబర్ 2025లో థియేటర్లలో విడుదలైంది. ఆ తర్వాత ఈ ఏడాది మార్చిలో సీక్వెల్ దురంధర్ ది రివెంజ్ రిలీజైంది. -
ఆయన నన్ను ఆటపట్టిస్తున్నారని అనుకున్నా: ఐశ్వర్యరాయ్
సినిమాల్లోకి రాకముందే ఐశ్వర్యరాయ్ యాడ్ ఫిల్మ్స్తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమాటోగ్రాఫర్ రాజీవ్ మీనన్తో కలిసి పలు ప్రకటనల్లో పనిచేశారు. ఆ సమయంలోనే దర్శకుడు మణిరత్నం తన సినిమాలో ఐశ్వర్యని హీరోయిన్గా తీసుకోవాలని అనుకున్నారు. అదే సంగతి రాజీవ్ మీనన్ ఐష్కి చెప్పారు. దీంతో తనని ఆటపట్టిస్తున్నారని ఈమె అనుకుంది. అదే విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.'రాజీవ్ మీనన్తో నేను ఎన్నో యాడ్ ఫిల్మ్స్లో పనిచేశా. అప్పటికే నేను మణిరత్నంకు అభిమానిని అనే విషయం ఆయనకు తెలుసు. షూటింగ్ టైంలో మణిరత్నం సినిమాల్లోని పాటలని రోజూ వినిపించేవారు. ఓ రోజు మణిరత్నం తన సినిమాలో నన్ను తీసుకోవాలని భావిస్తున్నట్లు రాజీవ్ చెప్పారు. కానీ ఆయన నన్ను ఆటపట్టిస్తున్నారని అనుకున్నాను. ఆ తర్వాత మణిరత్నంను కలిసినప్పుడు.. ‘ఇరువర్’( తెలుగులో ఇద్దరు )నటించడానికి ఆసక్తి ఉందా? అని ఎంతో సున్నితంగా అడిగారు' అని ఐశ్వర్యరాయ్ చెప్పుకొచ్చారు.ప్రస్తుతం మణిరత్నం.. విజయ్ సేతుపతి, సాయిపల్లవి జంటగా ఓ సినిమా తీస్తున్నారు. రొమాంటిక్ డ్రామా కాన్సెప్ట్. కాగా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇక ఐశ్వర్య విషయానికొస్తే.. ‘ఇరువర్,( తెలుగులో ఇద్దరు) తర్వాత ‘గురు’, ‘రావణ్’ చిత్రాల్లోనూ మణిరత్నంతో కలిసి పనిచేశారు. వీరి కాంబినేషన్లో వచ్చిన చివరి చిత్రం 'పొన్నియిన్ సెల్వన్'. ప్రస్తుతం ఐష్ కొత్తగా మూవీస్ చేయట్లేదు. -
హీరోయిన్తో తెలుగు హీరో డేటింగ్?
రాజమండ్రిలో పుట్టి తెలుగులోనే వరస సినిమాలు చేసినప్పటికీ పెద్దగా ఫేమ్ తెచ్చుకోలేకపోయిన హర్షవర్ధన్ రాణే.. తర్వాత హిందీలోనే హీరోగా మంచి గుర్తింపు అందుకున్నాడు. ఫిదా, అవును, అవును 2, ప్రేమ ఇష్క్ కాదల్ తదితర చిత్రాల్లో నటించాడు. గత కొన్నాళ్ల నుంచి మాత్రం బాలీవుడ్లోనే వరస ప్రాజెక్టులు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇకపోతే ఓ హీరోయిన్తో డేటింగ్లో ఉన్నాడనే రూమర్స్ మళ్లీ వినిపించాయి. సోషల్ మీడియాలో వీళ్లిద్దరూ పోస్ట్ చేసిన ఫొటోలే దీనికి కారణం.(ఇదీ చదవండి: కీర్తి సురేశ్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ)హర్షవర్ధన్ రాణే, హీరోయిన్ సంజీదా షేక్ కలిసి పుణె సమీపంలోని పాన్షెట్లో వెకేషన్ ఎంజాయ్ చేసినట్లు కొన్ని ఫొటోలు వైరల్ అవుతున్నాయి. దీంతో వీళ్లిద్దరూ డేటింగ్లో ఉన్నారంటూ బాలీవుడ్లో ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు. ఇద్దరూ ఒకే చోట ఉన్నప్పటికీ ఫొటోలను వేర్వేరు యాంగిల్స్లో పోస్ట్ చేశారు. దీంతో వీరిద్దరూ కలిసే ట్రిప్కు వెళ్లారని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.వీళ్లిద్దరి గురించి డేటింగ్ వార్తలు రావడం ఇదేం మొదటిసారి కాదు. 2023లో గిర్ అటవీ ప్రాంతంలో ఇద్దరూ ఒకేచోట ఉన్నట్లుగా అనిపించే ఫొటోలను షేర్ చేయడంతో ఇదంతా మొదలైంది. 2020లో రిలీజైన 'తైష్' మూవీలో కలిసి నటించారు. 2021లో వచ్చిన థ్రిల్లర్ మూవీ 'కున్ ఫయా కున్'లో మరోసారి జంటగా కనిపించారు. హర్షవర్ధన్ ఇప్పటికే సింగిలే కానీ సంజీదా షేక్ మాత్రం ఆమిర్ అలీని పెళ్లి చేసుకుని 2021లో విడాకులు తీసుకుంది. ఓ కూతురు ఉండగా.. ఆమె ఇప్పుడు సంజీదా దగ్గరే ఉంటున్నట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: రూ.కోటి అప్పు తీర్చేందుకు బూతు సినిమాల్లో నటించా) View this post on Instagram A post shared by Sanjeeda Shaikh (@iamsanjeeda) View this post on Instagram A post shared by Harshvardhan Rane (@harshvardhanrane) -
రూ.కోటి అప్పు తీర్చేందుకు బూతు సినిమాల్లో నటించా
1987 నుంచి హిందీ సినిమాల్లో నటిస్తున్న సుస్మితా ముఖర్జీ తన జీవితంలోని చాలా కష్టమైన కాలం గురించి చెబుతూ ఎమోషనల్ అయింది. రూ.కోటి అప్పు తీర్చడం కోసం తప్పనిసరి పరిస్థితుల్లో మహిళలని అవమానించే సి-గ్రేడ్ చిత్రాలు చేయాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది. ఇందుకు సంబంధించి ఇన్ స్టాలో ఓ వీడియోని పోస్ట్ చేసింది.(ఇదీ చదవండి: బిడ్డకు జన్మనిచ్చిన తెలుగు సీరియల్ హీరోయిన్)గోల్ మాల్, రక్తచరిత్ర, జర హట్కే జర భచ్కే తదితర సినిమాలతో పాటు పలు సీరియల్స్లోనూ నటించిన ఈమె.. చివరగా గతేడాది వచ్చిన 'డబ్బా కార్టెల్' వెబ్ సిరీస్లో నటించింది. అయితే తనని 'మేడమ్.. మీరు ఎందుకు అలాంటి చెత్త సినిమాల్లో నటించారు?' అని ఒకరు ప్రశ్నించారని, ఆ ప్రశ్న తన జీవితంలోని బాధాకరమైన రోజుల్ని గుర్తు చేసిందని సుస్మితా చెప్పింది.'అవి మహిళలని అవమానించే సి-గ్రేడ్ సినిమాలు. అవి పూర్తిగా నేను తీసుకున్న తప్పుడు నిర్ణయాలే. నేను నా మనసుని అమ్ముకున్నానా? అవును.. అమ్ముకున్నాను. అప్పట్లో నాకు ఆ పని నచ్చలేదు ఇప్పటికీ నచ్చదు. కానీ ఏం చేయలేని పరిస్థితి. 2002లో నా భర్తతో కలిసి ప్రారంభించిన ప్రయాస్ ప్రొడక్షన్ సంస్థ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో పడిపోయింది. రూ.కోటి అప్పు మిగిలింది. అదే టైంలో టెక్నాలజీ కారణంగా మా సంస్థతో పాటు మరికొన్ని నిర్మాణ సంస్థలు దివాలా తీశాయి''అప్పు ఇచ్చినవాళ్లు తరచూ మా ఇంటికి వచ్చి డబ్బులు డిమాండ్ చేసేవారు. దీంతో మళ్లీ నటిగా పనిచేయడం ప్రారంభించాల్సి వచ్చింది. నేను సంపాదించిన ప్రతి రూపాయి అప్పు తీర్చడానికే వెళ్లేది. ఆ రూ.కోటి తీర్చేందుకు నేను, నా భర్త ఎన్నో సంవత్సరాలు చాలా కష్టపడ్డాం. నా కెరీర్లో విమర్శలు ఎదుర్కొన్న ఆ సినిమాల వెనుక ఉన్న అసలు కారణం ఇదే. ఆ నిర్ణయాలు వ్యక్తిగత ఇష్టంతో కాదు. పరిస్థితుల ఒత్తిడిలో తీసుకోవాల్సి వచ్చింది' అని సుస్మితా ముఖర్జీ స్పష్టం చేసింది.(ఇదీ చదవండి: కీర్తి సురేశ్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ) View this post on Instagram A post shared by Susmita Mukherjee (@susmita_mukherjeeofficial) -
‘రామాయణ’ డేట్ ఫిక్స్
రామాయణం ఆధారంగా హిందీలో రూపొందిన చిత్రం ‘రామాయణ’. నితీష్ తివారి దర్శకత్వంలో ఈ సినిమా రెండు భాగాలుగా రూపొందుతోంది. కాగా, ‘రామాయణ: పార్ట్ 1’ చిత్రాన్ని ఈ ఏడాది నవంబరు 6న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రంలో రాముడిగా రణ్బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, లక్ష్మణుడిగా రవి దుబే, హనుమంతుడిగా సన్నీ డియోల్, రావణుడిగా యశ్ నటిస్తున్నారు.ఇప్పటికే ‘రామాయణ’ తొలి భాగం ట్రైలర్ను తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చేశారు. తాజాగా ఇంగ్లిష్ ట్రైలర్ను రిలీజ్ చేసి, ‘రామాయణ పార్ట్ 1’ను నవంబరు 6న రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు మేకర్స్. ‘రామాయణ’ ఇంగ్లిష్ ట్రైలర్లో సంభాషణలు ‘బ్రహ్మ ఏఐ’ అనే కృత్రిమ మేధ సాయంతో పాత్రల లిప్ సింక్కు తగ్గట్లు రెడీ చేశారనే టాక్ వినిపిస్తోంది.ఇక ఈ చిత్రాన్ని ఇండియాలో ధర్మా ప్రోడక్షన్స్ రిలీజ్ చేస్తుండగా, ఓవర్సీస్లో సోనీ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ రిలీజ్ చేయనుంది. నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్న ఈ సినిమాకు యశ్ సహ–నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇక ‘రామాయణ పార్ట్ 2’ని వచ్చే ఏడాది దీపావళి సందర్భంగా రిలీజ్ చేయనున్నట్లు ఆల్రెడీ మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. -
100 కోట్ల వ్యూస్.. భారతీయ సినీ చరిత్రలో అరుదైన ఘనత
నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'రామాయణ: పార్ట్-1' ట్రైలర్ అన్ని భాషలు, డిజిటల్ వేదికలు కలిపి 100 కోట్ల (1 బిలియన్) వ్యూస్ సాధించి భారతీయ సినీ చరిత్రలో అరుదైన రికార్డు నెలకొల్పింది. ఇప్పటివరకు ఏ భారతీయ సినిమా ట్రైలర్ ఈ ఘనత సాధించలేదు. హిందీ ట్రైలర్ ఒక్కటే 'వరల్డ్ ఆఫ్ రామాయణ' ఇన్స్టాగ్రామ్ ఖాతాలో 588 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. యూట్యూబ్, ఫేస్బుక్, ఎక్స్ తదితర వేదికల్లో కూడా భారీ స్పందన లభించింది.ఈ చిత్రంలో రణ్బీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతాదేవిగా, యశ్ రావణుడిగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్ర ట్రైలర్ అద్భుతమైన విజువల్స్, విజువల్ ఎఫెక్ట్స్, హాన్స్ జిమ్మర్–ఏ.ఆర్. రెహమాన్ సంగీతంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా దీపావళి కానుకగా నవంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఇటీవల ఈ చిత్రబృందం ఇంగ్లిష్ ట్రైలర్ను కూడా విడుదల చేసింది. అంతర్జాతీయ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని ఏఐ ఆధారిత సరికొత్త లిప్-సింక్ టెక్నాలజీని ఉపయోగించి ఈ వెర్షన్ను రూపొందించారు. అంతేకాకుండా, ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా సోనీ పిక్చర్స్ విడుదల చేయనుండటం విశేషం. -
19 ఏళ్ల తర్వాత సీక్వెల్.. ట్రైలర్ రిలీజ్
ఒక సినిమాకు సీక్వెల్ తీయాలంటే రెండు నుంచి మూడేళ్లు టైమ్ పడుతుంది. అలా పుష్ప రిలీజైన మూడేళ్లకు సీక్వెల్గా పుష్ప-2 కూడా వచ్చేసింది. కానీ ఓ మూవీ సీక్వెల్ దాదాపు రెండు దశాబ్దాల వస్తే ఎలా ఉంటుంది. సరిగ్గా అదే చేశారు మేకర్స్. ఎప్పుడో 2007లో వచ్చిన చిత్రానికి ఇప్పుడు సీక్వెల్ తెరకెక్కించారు.2007లో విడుదలైన క్లాసిక్ యాక్షన్ డ్రామా ఆవారపన్. ఇమ్రాన్ హష్మీ, దిశాపటానీ నటించారు. ఈ సినిమాకు దాదాపు 19 ఏళ్ల తర్వాత సీక్వెల్గా ఆవారపన్ - 2 తెరకెక్కించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా ఆగస్టు 14న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ మూవీలో శివమ్ పండిట్ పాత్రలో ఇమ్రాన్ తిరిగి వస్తున్నాడంటూ వీడియోను పంచుకున్నారు. ఈ మూవీకి నితిన్ కక్కర్ దర్శకత్వం వహించారు. -
రామాయణలో రియా కపూర్ ఎవరో తెలుసా..?
నితీశ్ తివారీ తెరకెక్కిస్తున్న భారీ పౌరాణిక చిత్రం ‘రామాయణ’. ఇప్పటికే విడుదలైన ట్రైలర్తో ఈ సినిమాపై ఉన్న అంచనాలు ఆకాశాన్నంటాయి.. ట్రైలర్లో తమ తమ పాత్రలతో హత్తుకున్న రణ్బీర్ కపూర్, సాయిపల్లవి, యశ్తో పాటుగా మరో ముఖం కూడా ప్రేక్షకుల దుష్టిని ఆకర్షించింది. ఆమెనే రియా కపూర్ . సీత పక్కన సాంప్రదాయ దుస్తుల్లో కనిపించిన ఈ నటి ఎవరని తెలుసుకోడానికి సోషల్ మీడియాకు పనిచెప్తున్నారు సినీ ప్రియులు. మరి ఆమె ఎవరో ఒకసారి చూద్దామా..?రియా కపూర్ ఎవరంటే..టెలివిజన్, ప్రాంతీయ సినిమాలు, మ్యూజిక్ విడియోల ద్వారా నటిగా గుర్తింపు పొందింది రియా కపూర్. ఈమె గతంలో సంపూర్ణ అనే సీరియల్లో నటించి బుల్లితెరలో, మిస్టేరియస్ అనే తెలుగు చిత్రంలో కనువిందు చేసింది. ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడంతో పలు మార్లు ఆడిషన్స్ ,లుక్ టెస్ట్లను పూర్తి చేసిన తర్వాత ఈ భారీ బడ్జేట్ సినిమాలో మాండవి పాత్రకు ఎంపిక చేశారట. హిందూ పురాణాల ప్రకారం.. మాండవి కుశధ్వజ మహారాజు, చంద్రభాగ రాణిల కుమార్తె. సీతకు మేనకోడలు ( కజిన్) అవుతుంది. అనంతరం శ్రీరాముడి తమ్ముడు భరతుడిని వివాహం చేసుకుని అయెధ్య లో కీలక సభ్యురాలిగా మారుతుందట. ఇటీవల రిలీజైన రామాయణ ట్రైలర్లో రెప్పపాటు కాలం పాటు కనిపించినప్పటికీ రెండు భాగాల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆమె పాత్రకు ప్రాధాన్యం ఉండనుందని తెలుస్తోంది. కాగా చిత్రంలో రణ్బీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతగా, యశ్ రావణుడిగా వెండి తెరను పలకరించనున్నారు. సన్నీ డియోల్, రవి దూబే, అరుణ్ గోవిల్ , రకుల్ ప్రీత్ సింగ్ వంటి నటులు కూడా ఉన్నారు. -
‘బిగ్ బీ’ రికార్డు: 83 ఏళ్ల వయసులో 24 గంటల షిఫ్ట్!
న్యూఢిల్లీ: ‘కౌన్ బనేగా కరోడ్పతి’(కేబీసీ) 18వ సీజన్ కోసం బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తన అంకితభావం మరోసారి చాటుకున్నారు. షో ప్రసార తేదీ సమీపిస్తున్న తరుణంలో ఆయన ఏకంగా 24 గంటల పాటు నిర్విరామంగా పనిచేశారు. ఈ విషయాన్ని ఆయన తన బ్లాగ్ ద్వారా వెల్లడించారు. గడువులోగా పని పూర్తి చేయకపోతే తన ఉద్యోగమే పోయేదని ఆయన సరదాగా వ్యాఖ్యానించారు.83 ఏళ్ల వయసులోనూ అమితాబ్ బచ్చన్ కనబరుస్తున్న ఈ వృత్తిపరమైన నిబద్ధత అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. మొదటి రోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఆయన పని, మరుసటి రోజు ఉదయం 7 గంటల వరకు నిర్విరామంగా సాగింది. ఆ సమయానికి ఆ ప్రాజెక్టును పూర్తి చేయడం ఎంతో కీలకమని, అందుకే దానిని విజయవంతంగా పూర్తి చేశానని ఆయన తన బ్లాగ్లో రాసుకొచ్చారు.కేబీసీ మొదటి ప్రసార తేదీ ఇప్పటికే ఖరారైందని, ఆ గడువును కోల్పోతే తన స్థానంలో మరొకరిని తీసుకునేవారని పేర్కొన్నారు. 2000 సంవత్సరంలో ఈ క్విజ్ షో ప్రారంభమైనప్పటి నుంచి మూడో సీజన్ మినహా ప్రతి సీజన్కు ఆయనే హోస్ట్గా వ్యవహరిస్తున్నారు. వయసురీత్యా వస్తున్న ఆరోగ్య సవాళ్లను లెక్కచేయకుండా ఆయన ప్రతి పనిని అత్యంత బాధ్యతతో నిర్వర్తిస్తున్నారు.ఇది కూడా చదవండి: నిర్లక్ష్యం వీడని ‘ఎన్టీఏ’.. ఈసారి ‘కీ’లో జాప్యం! -
'రామాయణ'లో మహేశ్ బాబునే అనుకున్నారా?.. అసలు నిజం ఇదే..
'రామాయణ'.. ప్రస్తుతం భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రమిది. ఈ సినిమాలో శ్రీరాముడి పాత్రలో రణ్బీర్ కపూర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే సినిమా ప్రకటన వచ్చిన తొలి రోజుల్లో ఇందులో హీరోగా ఎవరు నటిస్తారనే అంశంపై ఎన్నో ఊహాగానాలు వినిపించాయి. ముఖ్యంగా టాలీవుడ్ సూపర్స్టార్ మహేశ్ బాబు పేరు బలంగా ప్రచారంలోకి వచ్చింది. అయితే ఆ ప్రచారానికి ఎట్టకేలకు చిత్ర నిర్మాత నమిత్ మల్హోత్రా, దర్శకుడు నితేశ్ తివారీ ఫుల్స్టాప్ పెట్టారు. మొదటి నుంచి తమ మనసులో ఉన్న ఏకైక పేరు రణ్బీర్ కపూర్ మాత్రమేనని స్పష్టం చేశారు.ఓ మీడియా సమావేశంలో నమిత్ మల్హోత్రా మాట్లాడుతూ.. ‘స్క్రిప్ట్ పూర్తయ్యాక శ్రీరాముడి పాత్రకు రణ్బీర్ కపూర్నే ఊహించుకున్నాం . ఆప్షన్-ఏ, ఆప్షన్-బీ, ఆప్షన్-సీ అంటూ ఏమీ లేదు. రణ్బీర్ మాత్రమే మా తొలి ఎంపిక. ముందుగా ఆయనను సంప్రదించాలని నిర్ణయించుకున్నాం. ఒకవేళ ఆయన తిరస్కరిస్తేనే మరో హీరో గురించి ఆలోచించేవాళ్లం" అని వెల్లడించారు.ఈ సందర్భంగా దర్శకుడు నితేశ్ తివారీ కూడా ఇదే విషయాన్ని స్పష్టంచేశారు. రణ్బీర్కు ప్రత్యామ్నాయంగా మరో హీరో పేరును అసలు పరిశీలించలేదన్నారు. దీనిపై స్పందించిన రణ్బీర్ కపూర్.. ‘అంటే ఇప్పుడు వీళ్లకు ఇంకో ఆప్షన్ కూడా లేదు కదా!’ అంటూ సరదాగా వ్యాఖ్యానించి నవ్వులు పూయించారు.ఇక రావణుడి పాత్రకు యశ్ ఎలా ఎంపికయ్యారనే విషయంపైనా నమిత్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. 'కేజీఎఫ్: ఛాప్టర్-2' తర్వాత యశ్ క్రేజ్ దేశవ్యాప్తంగా పెరిగిందని, ఆ సమయంలో లాస్ ఏంజెల్స్లో ఆయనను కలిసి 'రామాయణ' విజన్ను వివరించామని చెప్పారు. కథ, పాత్ర నచ్చడంతో యశ్ రావణుడిగా నటించడమే కాకుండా నిర్మాతగానూ ఈ ప్రాజెక్టులో భాగమయ్యారని తెలిపారు.భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ చిత్రంలో రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయిపల్లవి సీతగా, యశ్ రావణుడిగా కనిపించనున్నారు. అలాగే రవీ దూబే, సన్నీ డియోల్, వివేక్ ఒబెరాయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం కోసం దేశవ్యాప్తంగా సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. -
యాక్షన్కి సై
యాక్షన్ సీక్వెన్స్కు సిద్ధం అవుతున్నారట సల్మాన్ ఖాన్. ఆయన హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్గా నటిస్తున్నారు. ఓ కీలక పాత్రలో మాధవన్ నటిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. కాగా, ఈ చిత్రం కొత్త షెడ్యూల్ ఈ వారంలో ముంబైలో ప్రారంభం కానుందని సమాచారం. ఈ సినిమా చిత్రీకరణ కోసం ముంబైలోని ఓ ప్రముఖ స్టూడియోలో భారీ సెట్ రెడీ చేయిస్తున్నారని, ఈ సెట్లోనే సల్మాన్ ఖాన్–నయనతార పాల్గొనగా ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ను తీసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారని తెలిసింది. యాక్షన్తో పాటు కొన్ని కీలక సన్నివేశాలనూ తెరకెక్కించనున్నారట. ఇక ఈ చిత్రం కోసం దాదాపు 16 కేజీల బరువు తగ్గారట సల్మాన్ ఖాన్. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ‘దిల్’ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది రంజాన్ సందర్భంగా రిలీజ్ కానుందనే టాక్ ఫిల్మ్నగర్ సర్కిల్స్లో వినిపిస్తోంది. మరోవైపు సల్మాన్ హీరోగా నటించిన తాజా హిందీ చిత్రం ‘మాతృభూమి’ విడుదలకు సిద్ధం అవుతోంది. -
ప్రియుడితో హీరోయిన్ ఎంగేజ్మెంట్.. పోస్ట్ వైరల్
ప్రముఖ నటి అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చింది. బాలీవుడ్ భామ జియా శంకర్ తన కాబోయే భర్తను పరిచయం చేసింది. ప్రియుడితో ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయాన్ని అఫీషియల్గా ప్రకటించింది. ప్రియుడు కరణ్తో నిశ్చితార్థం చేసుకున్న ఫోటోలను ఇన్స్టాలో షేర్ చేసింది. ఈ శుభవార్త విన్న అభిమానులు సోషల్ మీడియాలో విషెస్ చెబుతున్నారు.కాగా.. అభిషేక్ మల్హన్తో డేటింగ్ రూమర్స్ ఖండించిన కొన్ని నెలలకే ఎంగేజ్మెంట్ చేసుకోవడం విశేషం. జియా, అభిషేక్లు గతంలో బిగ్ బాస్ ఓటీటీ -2 సీజన్లో కంటెస్టెంట్గా పాల్గొన్నారు. ఆ తర్వాత ఒక మ్యూజిక్ వీడియోలో కలిసి పనిచేశారు. దీంతో వీరిద్దరిపై డేటింగ్ రూమర్స్ మొదలయ్యాయి. ఆ తర్వాత ఈ వార్తలను జియా కొట్టిపారేసింది.జియా శంకర్ బాలీవుడ్లో పలు సీరియల్స్లో నటించింది. అంతేకాకుండా బిగ్బాస్తో పాటు చాలా రియాలిటీ షోలలో మెరిసింది. తెలుగులోనూ రెండు సినిమాలు చేసింది. ఎంత అందంగా ఉన్నావే మూవీలో హీరోయిన్గా చేసింది. ఆ తర్వాత రాహుల్ రవీంద్రన్ నటించిన హైదరాబాద్ లవ్ స్టోరీ చిత్రంలో కీలక పాత్రలో కనిపించింది. ఇప్పుడు ఈ భామ పెళ్లి బంధంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. View this post on Instagram A post shared by Jiyaa Shankar (@jiyaashankarofficial) -
మళ్లీ లవ్ అండ్ వార్
కొంత విరామం తర్వాత ముంబైలో మళ్లీ ‘లవ్ అండ్ వార్’ మొదలు పెట్టారట రణ్బీర్ కపూర్. సంజయ్లీలా భన్సాలీ దర్శకత్వంలో రణ్బీర్ కపూర్, ఆలియా భట్, విక్కీ కౌశల్ నటిస్తున్న సినిమా ‘లవ్ అండ్ వార్’. ఈ పీరియాడికల్ ట్రయాంగిల్ యాక్షన్ లవ్స్టోరీ చిత్రంలో రణ్బీర్, విక్కీ భారత సైనికుల పాత్రలు చేస్తున్నారని సమాచారం. కాగా, ఈ సినిమా కొత్త షెడ్యూల్ ముంబైలోని రాయల్ పామ్స్ లొకేషన్స్లో ప్రారంభమైందని తెలిసింది.ఈ సినిమాకు ఇదే ఫైనల్ షెడ్యూల్ అని, ఈ షూట్లో రెండు భారీ యుద్ధ సన్నివేశాలతో పాటు రెండు పాటలను కూడా చిత్రీకరించేలా భన్సాలీ ప్లాన్ చేశారని టాక్. వార్ సీక్వెన్స్ చిత్రీకరణలో దాదాపు 50 మంది ఫైటర్స్, దాదాపు 300 మంది జూనియర్ ఆర్టిస్టులు పాల్గొంటారట.ఈ సినిమాను ఆగస్టు కల్లా పూర్తి చేయాలని భన్సాలీ టార్గెట్గా పెట్టుకున్నారట. నిజానికి ఈ చిత్రాన్ని గత ఏడాది డిసెంబరులో రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ షూటింగ్ సజావుగా సాగక పోవడం, మరోవైపు ‘రామాయణ’ చిత్రంతో రణ్బీర్ బిజీగా ఉండటంతో ‘లవ్ అండ్ వార్’ ఆలస్యమైందని తెలుస్తోంది. కాగా, ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 21న రిలీజ్ చేయనున్నట్లు ఇటీవల మేకర్స్ ప్రకటించారు. -
బిగ్బాస్ రియాలిటీ షో.. ముహుర్తం ఫిక్స్
బుల్లితెరపై ఫుల్ క్రేజ్ ఉన్న రియాలిటీ షో బిగ్బాస్. ఏ భాషలోనైనా ఈ షోకు ఆడియన్స్ ఆదరణ ఏమాత్రం తగ్గడం లేదు. మరోసారి బుల్లితెర ప్రియులను అలరించేందుకు రియాలిటీ షో వచ్చేస్తోంది. హిందీలో ఇప్పటికే సక్సెస్ఫుల్గా ఈ షో 19 సీజన్స్ పూర్తి చేసుకుంది. ఈ ఏడాది బిగ్ బాస్ సీజన్- 20కి కౌంట్డౌన్ మొదలైంది. రాబోయే సీజన్కు సంబంధించి తాజాగా టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సారి కూడాహోస్ట్గా సల్మాన్ ఖాన్ హోస్ట్గా వ్యవహరించనున్నారు.ఈ తాజా సీజన్ సెప్టెంబర్ 6 నుంచి మొదలు కానుందని మేకర్స్ రివీల్ చేశారు. ఈ టీజర్లో గుర్రంతో పాటు సల్మాన్ ఖాన్ ఎంట్రీ ఇచ్చారు. టీజర్ చూస్తుంటే ఈ సారి సరికొత్తగా సీజన్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ టీజర్లో కంటెస్టెంట్ల వివరాలు మాత్రం రివీల్ చేయలేదు. ఈ సీజన్లో కొత్త ట్విస్ట్లను ప్రేక్షకులను పరిచయం చేస్తుందని..అంతే కాకుండా సీజన్-20 మధ్యలో ఒక మిస్టరీ ఉంటుందని సల్మాన్ ఖాన్ టీజర్లో ప్రస్తావించారు. ఈ టీజర్ కేవలం ఆరంభం మాత్రమేనన్నారు.బిగ్ బాస్-20 స్ట్రీమింగ్ ఎక్కడంటే?ఈ ఏడాది బిగ్ బాస్ సీజన్- 20 సెప్టెంబర్ 6న ప్రారంభం కానుందని వెల్లడించారు. ఈ రియాలిటీ షో జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్ కానుంది. అంతేకాకుండా కలర్స్ టీవీలో ప్రత్యక్ష ప్రసారం కానుంది. అయితే ఈ ఏడాది అన్ని భాషల్లోనూ ఓకేసారి ఈ షో ప్రారంభమవుతుందని ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో మరింత క్లారిటీ రావాల్సి ఉంది. అదే జరిగితే తెలుగుతో పాటు మిగతా భాషల్లోనూ అదో రోజు నుంచే షో మొదలు కానుంది. View this post on Instagram A post shared by JioHotstar (@jiohotstar) -
స్టార్ హీరోయిన్తో ఆర్జీవీ సీక్రెట్ పెళ్లి.. చిరంజీవినే చెప్పాడు
ప్రముఖ సీనీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(ఆర్జీవీ) పర్సనల్ గురించి గత మూడు, నాలుగు రోజులుగా ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ స్టార్ హీరోయిన్ని ఆయన సీక్రెట్గా పెళ్లి చేసుకున్నాడట. ఈ విషయాన్ని అప్పట్లో చిరంజీవినే మీడియాకు లీకు చేశాడని బాలీవుడ్ సీనియర్ జర్నలిస్ట్ జ్యోతి వెంకటేశ్ చెప్పారు. తాజాగా ఆయన ఓ పాడ్కాస్ట్లో మాట్లాడుతూ.. ఆర్జీవీ సీక్రెట్ పెళ్లి గురించి చిరంజీవినే తనతో చెప్పాడని అన్నారు.‘ఓ రోజు చిరంజీవి దగ్గరకు వెళ్తే.. 'హేయ్ జ్యోతి... ఊర్మిళను రామ్ గోపాల్ వర్మ పెళ్లి చేసుకుంది రాయలేదని చిరంజీవి నాతో అన్నారు. వారికి పెళ్లి ఎప్పుడు జరిగింది? అని నేను ఆయన్ను అడిగాను. ఆంధ్రప్రదేశ్ో ఓ ప్రముఖ ఆలయంలో ఊర్మిళను తీసుకెళ్లి ఆర్జీవీ పెళ్లి చేసుకున్నారని చెప్పారు. మీ దగ్గర ప్రూఫ్ ఏంటని అడిగాను. వారి పెళ్లి చేసిన పూజారి ఫోన్ నెంబర్ నాకు ఇచ్చారు. నేను ఆర్టికల్ రాయడానికి ముందే ఊర్మిళకు ఫోన్ చేశా. ఆమె ఏడుస్తూ.. ‘ నా గురించి మీరు అలా ఎలా రాస్తారు. నేను ఇండస్ట్రీలోకి వచ్చినప్పటి నుంచి నా గురించి మీకు తెలుసు కదా’ అని అన్నారు. ఇదే విషయం ఆర్జీవీకి కాల్ చేస్తే 'నో కామెంట్' అని అన్నారు. దీంతో ఇద్దరి సైడ్ నుంచి స్టోరీ రాశాను’ అని జ్యోతి వెంకటేశ్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ సీనియర్ జర్నలిస్ట్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అయితే సీక్రెట్ పెళ్లిపై అటు ఊర్మిళా కనీ, ఇటు ఆర్జీవి కానీ ఇప్పటివరకు స్పందించకపోవడం గమనార్హం.ఆర్జీవీతో పెళ్లి జరిగిందో లేదో తెలియదు కానీ.. 2016 లో మోహ్సిన్ అక్తర్ మీర్ ని ఊర్మిళ వివాహం చేసుకుంది. కొన్నాళ్ల తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో.. 2024లో విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం ఊర్మిళ సింగిల్ గానే ఉంటుంది. అప్పట్లో ఆర్జీవీ, ఊర్మిళ కాంబో ఓ సంచలనం. వీరిద్దరి కాంబోలో వచ్చిన గాయం, రంగీలా, సత్య, అంతం, దౌడ్ వంటి మూవీస్ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించాయి. Jyothi Venkatesh spills tea on SECRET marriage of Ramgopal verma with urmila mamdodkat🤯They married in Temple, Chiranjevii leaked temple priest's direct phone number to expose the secret wedding👀When asked Urmila, she started crying & Ram Gopal Varma replied "no comments" pic.twitter.com/xxeGrfMudP— Chota Don (@choga_don) July 30, 2026 -
డిలీట్ చేయకపోతే కేసు పెడతా: మృణాల్ ఠాకుర్
ఏఐ కల్చర్ పెరిగిపోయిన తర్వాత దానిని మంచి కోసం ఎంతమంది ఉపయోగిస్తున్నారో అనే సంగతి పక్కనబెడితే సెలబ్రిటీలని ఇబ్బంది పెట్టేందుకు విరివిగా వినియోగిస్తున్నారు. మరీ ముఖ్యంగా హీరోయిన్ డీప్ ఫేక్ ఫొటోలు, వీడియోలు తయారు చేసి అవన్నీ నిజమనే భ్రమ కల్పిస్తున్నారు. తాజాగా ఇలాంటి పరిస్థితుల బారిన స్టార్ హీరోయిన్ మృణాల్ ఠాకుర్ పడింది. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.(ఇదీ చదవండి: త్రిష.. రాజకీయాల్లోకి రావాలి)'నా డీప్ ఫేక్ ఫొటోలని సృష్టించి వాటిని సోషల్ మీడియాలో షేర్ చేయడం చట్టవిరుద్ధం. ఇలాంటి పనులు ఏ మాత్రం కరెక్ట్ కాదు. వెంటనే డిలీట్ చేయండి లేదంటే న్యాయపరంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది' అని మృణాల్ హెచ్చరించింది.మృణాల్ ఇప్పుడు కోప్పడటం కాదు గానీ గతంలో రష్మిక తదితర హీరోయిన్లు డీప్ ఫేక్ బారిన పడ్డారు. పలువురు నిందితుల్ని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అయినా సరే ఇలాంటి ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుండటం హీరోయిన్లని ఇబ్బందులకు గురిచేస్తోంది. మృణాల్ కెరీర్ విషయానికొస్తే..రీసెంట్గా ఓ హిందీ మూవీ చేసింది గానీ సరిగా ఆడలేదు.(ఇదీ చదవండి: 200 రోజులు కష్టపడితే ఫ్లాప్.. 45 రోజుల్లో తీస్తే బ్లాక్బస్టర్: హీరో సూర్య) -
బాంబే హైకోర్టును ఆశ్రయించిన హీరోయిన్ శృతిహాసన్
విశ్వనటుడు కమల్ హాసన్ తనయ, ప్రముఖ నటి శృతిహాసన్ తన వ్యక్తిత్వ హక్కులు (Personality Rights), ప్రచార హక్కుల (Publicity Rights) పరిరక్షణ కోసం బాంబే హైకోర్టును ఆశ్రయించారు. తన అనుమతి లేకుండా కృత్రిమ మేధ (AI) సాంకేతికతతో రూపొందించిన కంటెంట్, మార్ఫింగ్ చిత్రాలు, డీప్ఫేక్ వీడియోలు, నకిలీ ప్రకటనలతో తన పేరు, ఫొటోలను ఉపయోగించి అనధికారికంగా వస్తువుల విక్రయాలను నిలిపివేయాలని కోరుతూ ఆమె పిటిషన్ దాఖలు చేశారు.ఈ వ్యాజ్యంలో పలు భారతీయ, విదేశీ సంస్థలు ఉన్నాయి. అంతే కాకుండా ప్రముఖ సోషల్ మీడియా వేదికలతో పాటు కొందరు గుర్తుతెలియని వ్యక్తులను కూడా ఈ పిటిషన్లో ప్రతివాదులుగా చేర్చారు. ప్రతివాదుల్లో ఒకటైన ఓ క్రాఫ్ట్ వర్క్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ వేదికలో శృతిహాసన్ పేరు, ఫొటోలతో కూడిన పోస్టర్లను ఆమె అనుమతి లేకుండానే విక్రయిస్తున్నట్లు పిటిషన్లో ఆరోపించారు.అదేవిధంగా గూగుల్, మెటా, ఎక్స్, పింట్రెస్ట్ వంటి డిజిటల్ వేదికల్లో తనను ఇతర నటులతో అనుచితంగా అనుసంధానించే ఏఐ వీడియోలు, అసభ్యకరమైన డీప్ఫేక్ చిత్రాలు ప్రసారం చేస్తున్నారు. ఈ కంటెంట్ తన ప్రతిష్ఠకు తీవ్ర నష్టం కలిగిస్తోందని ఆమె కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.తన పేరు, ఫొటోలు, వ్యక్తిత్వాన్ని ఎవరూ అనుమతి లేకుండా వాణిజ్యపరంగా వినియోగించకుండా శాశ్వత ఇంజెక్షన్ ఆర్డర్ జారీ చేయాలని ఆమె తరఫు న్యాయవాదులు కోర్టును కోరారు. అలాగే నిబంధనలకు విరుద్ధంగా ఉన్న కంటెంట్ను తొలగించాలని, జరిగిన నష్టానికి తగిన నష్టపరిహారం కూడా చెల్లించాలని వారు కోర్టును విజ్ఞప్తి చేశారు. శృతిహాసన్ దక్షిణాది చిత్ర పరిశ్రమతో పాటు బాలీవుడ్లోనూ మంచి గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. -
గృహహింస.. సీరియల్ నటికి అత్తారింట్లో వేధింపులు
హిందీ సీరియల్స్తో పాటు రియాలిటీ షోల్లో పాల్గొని గుర్తింపు తెచ్చుకున్న నటి అదితి శర్మ.. భర్త అభినీత్ కౌశిక్, అత్తింటి వారిపై గృహహింస కేసు పెట్టింది. ముంబైలోని గోరేగావ్ పోలీస్ స్టేషన్లో మూడు రోజుల క్రితం ఫిర్యాదు చేసింది. భర్త తనని శారీరకంగా మానసికంగా వేధించాడని, వ్యక్తిత్వంపై అనుమానాలు వ్యక్తం చేసేవాడని, తన నగలు కూడా ఇవ్వట్లేదని ఆరోపించింది.(ఇదీ చదవండి: ఓటీటీలో భార్యభర్తల కామెడీ సినిమా 'గట్ట కుస్తీ 2' తెలుగు రివ్యూ)అదితి శర్మ చెప్పినదాని ప్రకారం.. 2021 జూన్లో ఆన్లైన్ యాక్టింగ్ క్లాసుల ద్వారా అభినీత్ కౌశిక్తో పరిచయం ఏర్పడింది. 2024 సెప్టెంబర్ నుంచి ఇద్దరూ కలిసి బతకడం మొదలుపెట్టారు. అదే ఏడాది నవంబర్లో పెళ్లి చేసుకున్నారు. అయితే వివాహం జరిగిన కొద్దిరోజులకే భర్త ప్రవర్తనలో మార్పు వచ్చిందని చిన్న చిన్న విషయాలకే తమ మధ్య తరచూ గొడవలు జరిగేవని, నా డ్రస్సింగ్పై అభ్యంతరాలు వ్యక్తం చేసేవాడని, తన దగ్గర నుంచే డబ్బులు తీసుకునేవాడని ఆరోపించింది.2025 జనవరిలో కాఫీ విషయంలో జరిగిన ఓ గొడవ పెద్దది కావడంతో తనను దారుణంగా తిట్టారని, వివాహేతర సంబంధం కూడా అంటగట్టారని అదితీ తన ఫిర్యాదులో రాసుకొచ్చింది. తన మొబైల్ తరచూ చెక్ చేయడం, తల్లిదండ్రులతో మాట్లాడకుండా అడ్డుకోవడం లాంటివి కూడా అత్తింటివాళ్లు చేశారని తెలిపింది. తన మంగళసూత్రం, బంగారు గొలుసులు, ఉంగరాలు, డైమండ్ రింగ్, గాజులు తదితర వివాహ ఆభరణాలని అడిగినా తనకు ఇవ్వట్లేదని చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: భార్యతో విడాకులు.. తల్లితండ్రులని కలిసిన హీరో)ఈ ఏడాది మార్చిలో అదితీ భర్త అభినీత్, అతడి తరఫు న్యాయవాది ఈమెపై పలు ఆరోపణలు చేశారు.'అపోల్లెనా' సీరియల్ సహనటుడు సమర్థ్య గుప్తాతో ఆమెకు సన్నిహిత సంబంధం ఉందని ఆరోపించారు. ఈ విషయాన్ని తాను గుర్తించడంతోనే ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిందని చెప్పాడు. అదితి తనని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చిందని, ఇండస్ట్రీలో ఇది బయటపడకూడదనే ఉద్దేశంతో తమ పెళ్లిని రహస్యంగా ఉంచాలని కోరిందని అభినీత్ పేర్కొన్నాడు. కుటుంబాల మధ్య రాజీ చర్చల సందర్భంగా రూ.25 లక్షలు, విడాకులు కోరినట్లు కూడా ఆయన ఆరోపించాడు.భర్త ఆరోపణలపై స్పందించిన అదితి.. పెళ్లైన నెల రోజుల నుంచే తనని చాలా ఇబ్బందులు పెడుతున్నారని, ఈ విషయాలు ప్రస్తుతం కోర్టులో ఉన్నందున పూర్తి వివరాలు మాట్లాడలేనని చెప్పింది. గృహహింస తన వైపు నుంచి జరగలేదని స్పష్టం చేసిన ఈమె.. తన భర్త తనని, తన కుటుంబాన్ని పలుమార్లు అవమానించారని, అందుకే విడాకులు కోరినట్లు పేర్కొంది. తమ పెళ్లిని రహస్యంగా ఉంచాలనే నిర్ణయం ఇద్దరూ కలిసి తీసుకున్న నిర్ణయమని వివరణ ఇచ్చింది. ప్రస్తుతం ఈ కేసులో విచారణ జరుగుతోంది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 23 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్) -
ఓటీటీలోకి రష్మిక కొత్త సినిమా...స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
షాహిద్ కపూర్, రష్మిక, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘కాక్టెయిల్ 2’.హోమీ అదజానియా దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూన్ 19న థియేటర్స్లో విడుదలై..మంచి విజయం సొంతం చేసుకుంది. ఇప్పుడీ చిత్రం ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయింది. ఆగస్ట్ 14 నుంచి ప్రముఖ ఓటీటీ నెట్ఫ్లిక్స్లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది.కాక్ టెయిల్ 2 కథేంటంటే..కునాల్ (షాహిద్ కపూర్), దియా (రష్మిక మందన్న) ఇద్దరు లివ్ ఇన్ రిలేషన్లో ఉంటారు. ఓ సారి కునాల్, దియా ఫారిన్లో వెకేషన్కు వెళ్లినప్పుడు అక్కడ దియా బెస్ట్ఫ్రెండ్ యాలీతో కునాల్కి పరిచయం ఏర్పడుతుంది. అయితే కునాల్పై యాలీ క్రష్ పెంచుకోవడమే కాకుండా ఓ సమయంలో అతడితో శారీరకంగా కలుస్తారు. ఈ విషయం దియాకు తెలిసిన తర్వాత ఏం జరిగింది? కునాల్, దియా మధ్యకు యాలీ ఎలా వచ్చింది? దియాతో డేటింగ్ చేస్తున్నప్పటికీ.. యాలీ ఎలా దగ్గరైంది? చివరకు కునాల్ ఎవరినీ పెళ్లి చేసుకొన్నాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
రోడ్డుపై, కాలేజీ గోడలపై అలా రాశాడు.. భయపడిపోయా: నటి
కాలేజీ రోజుల్లో తనకు ఎదురైన ఓ భయంకరమైన సంఘటన గురించి బుల్లితెర నటి శుభాంగి ఆత్రే తాజాగా ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు. ఆమె ఇంటర్ చదవుతున్న రోజుల్లో ఓ వ్యక్తి రోజు బైక్పై ఫాలో అయ్యేవాడని.. అతని చర్యలు చూసి భయపడిపోయానని శుభాంగి చెప్పింది.‘నేను ఇండోర్లో 10-11వ తరగతి చదవుతున్నప్పుడు ఓ వ్యక్తి రోజు బైక్పై మమ్మల్ని ఫాలో అయ్యేవాడు. కాలేజీ గోడలపై, రోడ్డుపై నా పేరు, తన పేరు కలిపి రాసేశాడు. మా ఇంటికి ఎదురుగా ఉన్న గోడపై కూడా అలానే రాశాడు. నేను అతనితో ఒక్కసారి కూడా మాట్లాడలేదు. కానీ మా వెనకే తిరిగేవాడు. ఓ సారి మా అక్క అతనితో మాట్లాడింది. ‘ఇలా తిరడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని.. ఏదైనా సాధించి రా.. అప్పుడు మనం మాట్లాడుకుందాం’అని చెప్పింది. కొన్నాళ్ల తర్వాత అతను కనిపించకుండా పోయాడు. ఇలాంటి వేధింపులు ఆడపిల్లలను చాలా భయానికి గురి చేస్తాయి. బయటకు కూడా రాలేరు. ఇంట్లో వాళ్లు కూడా భయపడతారు. వేధింపులపై మహిళలు, యువతులు మౌనంగా ఉండకూడదు. ధైర్యంగా ఎదురు తిరగాలి. నేటి తరం అమ్మాయిలు తమ రక్షణ విషయంలో మరింత జాగ్రత్తతో వ్యవహరించడం మంచి పరిణామం’ అని శుభాంగి అన్నారు.‘కసౌతీ జిందగీ కే' అనే సిరియల్తో సీనీ కెరీర్ని ప్రారంభించిన శుభాంగి ఆత్రే.. 2007లో వచ్చిన 'కస్తూరి' అనే ధారవాహికతో మంచి గుర్తింపు పొందింది. ఆ తర్వాత 'భాబీజీ ఘర్ పర్ హై!'లో అంగూరి భాభీ పాత్ర పోషించి బాగా పేరు సంపాదించింది. చిడియా ఘర్, అధురి కహానీ హుమారీ, హవన్, దో హాన్సన్ కా జోడా వంటి షోలలో కూడా నటించింది. -
‘రేసుగుర్రం’ విలన్ చేతికి ఖరీదైన వాచ్.. ధర ఎంతో తెలుసా?
తెలుగులో ‘రేసుగుర్రం’ సినిమాలో ‘మద్దాలి శివారెడ్డి’ పాత్రతో ప్రేక్షకులను మెప్పించిన ప్రముఖ నటుడు, బీజేపీ ఎంపీ రవి కిషన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారారు. ఇటీవల ఆయన ‘హర్ హర్ భోళే నమహ శివాయ’ అనే భక్తి గీతాన్ని ఎంతో భక్తిశ్రద్ధలతో పాడుతున్న వీడియో ఒకటి నెట్టింట తీవ్రంగా వైరల్ అయ్యింది. ఆయన భక్తి పారవశ్యానికి అభిమానులు ఫిదా అవ్వడమే కాకుండా, ఆ వీడియోలో రవి కిషన్ చేతికి మెరుస్తున్న ఒక లగ్జరీ గడియారం ప్రతి ఒక్కరి దృష్టిని విశేషంగా ఆకర్షించింది. ఆ గడియారం ప్రత్యేకం ఏమిటంటే?సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం రవి కిషన్ ధరించిన ఆ గడియారం ప్రముఖ స్విస్ లగ్జరీ వాచ్ బ్రాండ్ ‘హ్యూబ్లో’ (Hublot) కి చెందిన ‘బిగ్ బ్యాంగ్ మెకా-10’ మోడల్. ఈ వాచ్ ఓపెన్-వర్క్డ్ (స్కెలిటన్) డయల్ను కలిగి ఉంటుంది. అంటే వాచ్ లోపల మెకానికల్ మూవ్మెంట్ ఎలా పనిచేస్తుందో బయటికే స్పష్టంగా కనిపిస్తుంది. ఇది మాన్యువల్-వైండింగ్ వాచ్. ఒక్కసారి వైండింగ్ చేస్తే ఏకంగా 10 రోజుల పాటు నిరంతరాయంగా పనిచేస్తుంది. గ్లాస్పై కాంతి పడి పరావర్తనం చెందకుండా ఉండేలా యాంటీ-రెఫ్లెక్టివ్ ట్రీట్మెంట్తో కూడిన సఫైర్ క్రిస్టల్ను ఇందులో ఉపయోగించారు. ధర ఎంతంటే..ఈ లగ్జరీ వాచ్ మార్కెట్ విలువ దాదాపు రూ. 35 లక్షలు ఉంటుందని అంచనా. గతంలో కూడా రవి కిషన్ దాదాపు రూ. 2.7 కోట్ల విలువైన లగ్జరీ వాచ్తో కనిపించి వార్తల్లో నిలిచారు. తాజాగా మరోసారి రూ. 35 లక్షల ఖరీదైన గడియారంతో మెరవడంతో ఆయన వాచ్ కలెక్షన్స్ గురించి సోషల్ మీడియాలో నెటిజన్లు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. View this post on Instagram A post shared by Urban NXT | Luxury Platform (@urban.nxt) -
రూ.50 కోట్ల రెమ్యునరేషన్ తగ్గించుకున్న స్టార్ హీరో!
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ప్రస్తుతం తెలుగు దర్శకుడ వంశీ పైడిపల్లి, నిర్మాత దిల్ రాజుతో కలిసి ఓ సినిమా చేస్తున్నాడు. SVC63 పేరుతో తీస్తున్న ఈ ప్రాజెక్ట్ షూటింగ్ జరుగుతోంది. అయితే ఒక్కో మూవీకి రూ.120 కోట్ల వరకు రెమ్యనరేషన్ తీసుకుంటాడనే టాక్ ఉన్న సల్మాన్.. దీని కోసం మాత్రం రూ.70 కోట్లే తీసుకుంటున్నాడని బాలీవుడ్లో టాక్ నడుస్తోంది. ఇంతకీ ఏంటి కారణం?(ఇదీ చదవండి: సీక్రెట్గా నిశ్చితార్థం చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్)వచ్చే ఈద్ టార్గెట్గా తీస్తున్న ఈ సినిమా కోసం సల్మాన్ ఖాన్ పారితోషికం తగ్గింపు నిర్ణయం తీసుకోవడం వెనక ఆయన సన్నిహిత మిత్రుడు రఫీ కాజీ అనే కారణం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ సెట్ కావడంలో ఈయన కీలక పాత్ర పోషించాడని, నిర్మాతల్లో ఒకరిగా కూడా ఉన్నాడని సమాచారం. స్నేహితుడి కోసమే సల్మాన్ తన సాధారణ పారితోషికంతో పోలిస్తే భారీగా తగ్గించాడని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.అయితే అడ్వాన్స్ మొత్తంతో పాటు సినిమా లాభాల్లోనూ వాటాని సల్మాన్ తీసుకుంటున్నారా లేదా అనే విషయపై ప్రస్తుతానికైతే స్పష్టత లేదు. గత కొన్నేళ్లుగా చూసుకుంటే సల్మాన్ ఖాన్ తన సినిమాల్లో లాభాల భాగస్వామ్యానికి ప్రాధాన్యం ఇస్తూ వస్తున్నారు. ముఖ్యంగా 2010లో రిలీజైన 'దబాంగ్' తర్వాత ఆయన కుటుంబ సభ్యులు లేదా సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్ (SKF) బ్యానర్ ఎక్కువ శాతం చిత్రాలని నిర్మించింది. 'బాడీగార్డ్'ని ఆయన సోదరి అల్విరా ఖాన్ నిర్మించగా, 'దబాంగ్'ని సోదరుడు అర్బాజ్ ఖాన్ నిర్మించాడు.ఇకపోతే సల్మాన్ ఖాన్ మరోవైపు 'మాతృభూమి' అనే వార్బ్యాక్ డ్రాప్ మూవీ చేశాడు. గాల్వాన్ లోయ ఘర్షణ నేపథ్యం కావడంతో ప్రస్తుతానికి దీన్ని హోల్డ్లో పెట్టేసినట్లు తెలుస్తోంది. దీంతో ఇదెప్పుడు థియేటర్లలోకి వస్తుందో చెప్పలేని పరిస్థితి.(ఇదీ చదవండి: ఓటీటీలో ఇంటెన్స్ హిందీ ప్రేమకథా సినిమా.. అధికారిక ప్రకటన) -
ముఖేశ్ ఖన్నాకు ఇచ్చిపడేసిన సీజేపీ
న్యూఢిల్లీ: బాలీవుడ్ సీనియర్ నటుడు ముఖేశ్ ఖన్నా తమపై చేసిన వ్యాఖ్యలకు కాక్రోజ్ జనతా పార్టీ (సీజేపీ) కౌంటర్ ఇచ్చింది. నీట్ పేపర్ లీకేజీ బాధ్యులపై చర్యలకు నిరసన తెలిపిన వారికి మద్దతు ఇచ్చిన యువతపై బెదిరింపులకు దిగడాన్ని తిప్పికొట్టింది. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనల్లో పాల్గొన్న యువతకు ఉద్యోగాలు రావని, ప్రభుత్వం సాయం అందని ముకేశ్ ఖన్నా హెచ్చరించారు. అంతేకాదు వారిని మురికి కాలువలోని పురుగులుగా ఆయన వర్ణించారు. సీజేపీ ట్రాప్లో పడొద్దని పిల్లలకు సూచించారు. ఈ మేరకు ఎక్స్లో పోస్ట్ పెట్టడంతో పాటు ఇన్స్టాగ్రామ్లో వీడియో కూడా షేర్ చేశారు.''ఇంట్లోకి బొద్దింకలు వస్తే, మనం ఏం చేస్తాం?? వాటిని వెతికి పట్టుకుంటాం, పైకి ఎత్తి బయట పడేస్తాం. వీరితో కూడా అలాగే చేయండి. కొంత మంది పిల్లలు ప్రలోభాలకు లొంగిపోయి, ఆవేశంలో అన్ని రకాల తప్పుడు, నీచమైన మాటలు మాట్లాడుతున్నారు. వారికి ఇదే నా హెచ్చరిక.. మీ మాటలు చరిత్రలో లిఖించబడ్డాయి. వారితో తిరగడం ద్వారా, మీరు మిమ్మల్ని మీరే ఒక మురికి కాలువలోని పురుగులుగా మార్చుకున్నారు. దీనికి మీరు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది!!ఏ పోలీసులూ మీకు సహాయం చేయరు. చాలామంది మీకు ఉద్యోగాలు ఇవ్వడానికి సంకోచిస్తారు. ప్రభుత్వ సహాయం నిలిపివేయబడుతుంది. మీకు కొన్ని వీసాలు కూడా రాకపోవచ్చు!! మీరు ఇప్పటికే మీ కుటుంబం దృష్టిలో పడిపోయారు! అందుకే, మీరు వారి బారి నుండి ఎంత త్వరగా తప్పించుకుంటే అంత మంచిది. నాకు మీ గురించి ఆందోళనగా ఉంద''ని ఎక్స్లో పేర్కొన్నారు.మాకు మీరు తెలియదుముఖేశ్ ఖన్నా వ్యాఖ్యలను సీజేపీ తిప్పికొట్టింది. తాము జెనజీ తరానికి చెందిన వాళ్లమని మీ గురించి మాకు తెలియదు అనే అర్ధం వచ్చేలా కౌంటర్ ఇచ్చింది. ''క్షమించండి, మేము జెన్జీ. మేము స్పైడర్మాన్, బాట్మాన్, మార్వెల్స్ చూశాం. మీ గురించి మాకు తెలియదు. కాబట్టి మీ జ్ఞానాన్ని మీ జేబులోనే ఉంచుకోవాల''ని ఎక్స్లో సీజేపీ జవాబిచ్చింది. కాగా, శక్తిమాన్ పాత్రతో ముఖేశ్ ఖన్నా సినిమా రంగంలో పాపులర్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయనకు అదే తరహాలో సీజేపీ కౌంటర్ ఇచ్చింది.Sorry , but we are Gen-z हम spiderman, batman, Marvels देखते हैं Animes देखते हैं ! हम आपको नहीं जानते ! So please keep your knowledge in your pocket. https://t.co/OdQp0Pe25M— Cockroach Janta Party (@shah34516) August 1, 2026చదవండి: ఈ20 ఇథనాల్ పెట్రోల్ స్కామ్ను బయటపెడతా -
అభిమానులకు క్షమాపణలు చెప్పిన ప్రియాంక.. నెటిజన్స్ ప్రశంసలు
సాధారణంగా సినిమా తారలు కనిపిస్తే వాళ్లతో ఫోటోలు దిగడానికి జనాలు ఎగబడతారు. అయితే కొంతమంది హీరోహీరోయిన్లు మాత్రం.. సెల్ఫీలు అడిగితే చిరాకుగా వెళ్లిపోతుంటారు. మరికొంతమంది అయితే దగ్గరకు వచ్చిన అభిమానులను తోసేస్తారు. సెల్ఫీలు ఇవ్వడం ఇష్టంలేకుంటే..ఫ్యాన్స్ వైపు చూడకుండా సైలెంట్గా వెళ్లిపోతారు. కానీ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా మాత్రం.. సెల్ఫీలు ఇవ్వలేకపోయినందుకు అభిమానులకు క్షమాపణలు చెప్పింది. తన పరిస్థితిని మర్యాదగా వివరించి.. సెల్ఫీలు ఇవ్వకుండా వెళ్లిపోయింది.అసలేం జరిగింది?ఎక్కడి వెళ్తుందో తెలియదు కానీ.. తాజాగా ప్రియాంక చోప్రా ముంబై ఎయిర్పోర్ట్కి వెళ్లింది. కూతురుని చేతుల్లో ఎత్తుకొని.. ఎయిర్పోర్ట్లోపలికి వెళ్తుండగా.. ఆమెను గుర్తుపట్టి కొంతమంది సెల్ఫీలు అడిగారు. అయితే ప్రియాంక చేతిలో పాప ఉండడంతో సెల్ఫీలు ఇవ్వలేకపోయింది. అలా అని వారిని పట్టించుకోకుండా వెళ్లలేదు. ఒక క్షణం ఆగి.. ‘క్షమించండి..నేను పాపతో ఉన్నాను’ అని చెప్పింది. ఆమె అలా చిరునవ్వుతో మర్యాదగా చెప్పడం అభిమానులను విపరీతంగా హత్తుకుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మారగా.. అంతర్జాతీయంగా కీర్తి గడించినప్పటికీ ఒదిగి ఉండడమే కాదు..గౌరవంగా ప్రవర్తించారని నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.మహేశ్కి జోడీగా.. ప్రియాంక ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న వారణాసి చిత్రంలో మహేశ్కు జోడీగా నటిస్తోంది. ఇందులో అద్భుతమైన స్లో మోషన్ జంప్స్ చేసినట్లు ఆమె చెప్పారు. ఇక ఈ చిత్రంలో రుద్ర, శ్రీరాముడిగా మహేశ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. భారీ బడ్జెట్తో పాన్ ఇండియా స్థాయిలో రానున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 7న విడుదల కానుంది. View this post on Instagram A post shared by Bollywood Society (@bollywoodsocietyy) -
సన్గ్లాసెస్తో గుడిలో హీరోయిన్ పూజలు.. నెటిజన్స్ ఫైర్
సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే బాలీవుడ్ నటి భూమి పెడ్నేకర్..తన ఇన్స్టా ఖాతాలో తాజాగా పోస్ట్ చేసిన వీడియో ఒకటి ఇప్పుడు వైరల్గా మారింది. ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరు..ఆమెపై ఫైర్ అవుతున్నారు. ఎంత పెద్ద హీరోయిన్ అయినా సరే ఇలా చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ భూమి పెడ్నేకర్ పోస్ట్ చేసిన వీడియో ఏంటి? అసలు ఏం జరిగింది?విభిన్నమైన పాత్రలతో ఆకట్టుకునే బాలీవుడ్ నటి భూమి..తాజాగా శివాలయానికి వెళ్లింది. పవిత్రమైన శ్రావణ మాసం ప్రారంభం కావడంతో శివలింగానికి ప్రత్యేక పూజలు చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలను, వీడియాలను ఇన్స్టాలో షేర్ చేస్తూ.. ‘ఈ శ్రావణ మాసంలో నా జీవితం సులభంగా మారిపోవాలని కోరుకోవడం లేదు. ఎలాంటి కష్టాలు, సవాళ్లు ఎదురైనా చిరునవ్వుతో ఎదుర్కొనే ధైర్యాన్ని, శక్తిని ప్రసాదించమని ఆ మహాదేవుడిని ప్రార్థిస్తున్నాను. హర్ హర్ మహాదేవ్’అంటూ ఎమోషనల్గా రాసుకొచ్చింది.అయితే ఈ వీడియోలో భూమి కనిపించిన విధానంపై నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. బ్లాక్ టీషర్ట్, జీన్స్ ధరించి ఆమె గుడిలోకి వెళ్లారు. అంతేకాదు కళ్లకు సన్ గ్లాసెస్ పెట్టుకొని శివలింగానికి అభిషేకం చేసింది. పవిత్రమైన ఆలయంలోకి వెళ్లినప్పుడు కనీసం కళ్లజోడు అయినా తీసేయాలనే సంస్కారం లేదా అని నెటిజన్స్ విమర్శిస్తున్నారు. ‘పూజ చేస్తున్నారా లేదా ఫోటో షూట్కి పోజులు ఇస్తున్నారా?’, ‘సన్ గ్లాసెస్ పెట్టుకొని పూజ చేసినవాళ్లను ఇంతవరకు చూడలేదు’, ‘దయచేసి ఆ కళ్లజోడులో నుంచి దేవుడివైపు చూడకండి.. సంప్రదాయాలకు కనీస గౌరవం ఇవ్వండి’ అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Bhumi Satish Pednekkar (@bhumisatishpednekkar) -
‘రాకా’లో షారుక్.. రూ. 1000 కోట్ల బడ్జెట్.. అట్లీ ప్లాన్ అదుర్స్!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ దర్శకుడు అట్లీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ సైన్స్ ఫిక్షన్ చిత్రం ‘రాకా’పై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులలో ఒకటిగా భావిస్తున్న ఈ సినిమా గురించి తాజాగా మరో ఆసక్తికర సమాచారం వెలుగులోకి వచ్చింది. ఈ చిత్రాన్ని దాదాపు రూ.1,000 కోట్ల భారీ బడ్జెట్తో రూపొందిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్స్ కోసం అంతర్జాతీయ స్టూడియోలతో కలిసి చిత్ర బృందం పనిచేస్తోందని సమాచారం.షారుక్ ఖాన్ కామియో?ఈ చిత్రంలో బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారనే వార్తలు సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఆయన కామియోకు సంబంధించిన చిత్రీకరణ ఇంకా ప్రారంభం కాలేదని తెలుస్తోంది. విదేశాల్లో నిర్వహించే ప్రత్యేక షూటింగ్ షెడ్యూల్లో షారుక్కు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించే అవకాశం ఉందట. అయితే ఈ విషయంపై చిత్ర నిర్మాణ సంస్థ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.రెండు కాలాల్లో సాగే కథ'రాకా' కథ రెండు విభిన్న కాలాల్లో సాగనున్నట్లు సమాచారం. ఒక భాగం పురాణ–వేద కాలంలోని గిరిజన నేపథ్యంలో ఉండగా, మరో భాగం ఆధునిక కాలంలో కొనసాగుతుందని తెలుస్తోంది. ఈ ప్రత్యేక కథన నిర్మాణమే సినిమాపై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని పెంచుతోంది. ఆధునిక కాలానికి సంబంధించిన కథలో మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటిస్తున్నట్లు సమాచారం. మరోవైపు చారిత్రక భాగంలో దీపికా పదుకొణె కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అలాగే జాన్వీ కపూర్, రష్మిక మందన్న కూడా అదే టైమ్లైన్లో ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇతర నటీనటుల్లో చెంబన్ వినోద్ జోస్, యోగి బాబు, ఫెమినా జార్జ్ కీలక పాత్రల్లో నటించనున్నట్లు తెలుస్తోంది. విజయ్ సేతుపతి కూడా ఈ ప్రాజెక్టులో భాగమవుతారనే ప్రచారం ఉన్నప్పటికీ, అల్లు అర్జున్, దీపికా పదుకొణె పేర్లను మినహాయించి పూర్తి తారాగణాన్ని చిత్ర బృందం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఈ చిత్రానికి సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నారు.రిలీజ్ ఎప్పుడంటే..?'రాకా' విడుదల తేదీని మేకర్స్ ఇంకా ప్రకటించలేదు. అయితే ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు సమాచారం. భారీ బడ్జెట్ కావడంతో.. ఒకే సినిమాగా రిలీజ్ చేస్తే బ్రేక్ ఈవెన్లో ఇబ్బందులొస్తాయని.. అట్లీ భావిస్తున్నాడట. పార్ట్ 1, పార్ట్ 2 రిలీజ్ చేస్తే కేజీయఫ్, పుష్ప, బాహుబలిలా ఈ చిత్రం కూడా ఎక్కువ వసూళ్లను సాధిస్తుందని నిర్మాతలు భావిస్తున్నారట. వచ్చే ఏడాది సమ్మర్లో పార్ట్ 1 రిలీజ్ చేసి.. మరుసటి ఏడాదిలో పార్ట్ 2ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకుంటున్నారట. అయితే దీనిపై అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. -
బాబుషాన్ బర్త్డే స్పెషల్..ఆకట్టుకుంటున్న‘అంతర్యామి' పోస్టర్
ఒడియా సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సూపర్స్టార్ బాబుషాన్ మొహంతి నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన నటిస్తున్న తాజా చిత్రం 'అంతర్యామి' చిత్రబృందం సోషల్ మీడియా వేదికగా ఆయనకు ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసింది. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని చిత్రయూనిట్ విడుదల చేసిన బర్త్డే పోస్టర్ ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. అమ్రిత్ ప్రెజెంట్స్, శివ సత్యం ప్రొడక్షన్స్ బ్యానర్లపై ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాలో బాబుషాన్ మొహంతి కథానాయకుడిగా నటిస్తుండగా, వేద్విక సోని హీరోయిన్గా కనిపించనుంది. సీనియర్ నటీమణులు ఆమని, కస్తూరి, శ్రీతం దాస్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. శివ సత్యం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ప్రొడ్యూసర్స్ అమ్రిత్ నిషాద్ జ్ఞానరంజన్ సాహు, నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని విశేషాలను చిత్రబృందం వెల్లడించనుంది. -
రణ్బీర్ కపూర్ రామాయణ.. విజువల్ వండర్లా ట్రైలర్
రణ్బీర్ కపూర్, సాయిపల్లవి, యష్.. రాముడు, సీత, రావణుడిగా నటించిన చిత్రం 'రామాయణ'. ఈ ఏడాది దీపావళికి థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు. ఇటీవల ట్రైలర్ రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. మొదట ఈనెల 24న యూట్యూబ్లోనే విడుదల చేస్తామని తెలిపారు. కానీ అలా కుదరలేదు. ముందుగా ప్రకటించినట్లుగానే తాజాగా రామాయణ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇవాళ ఉదయం 4 గంటల 15 నిమిషాలకు ట్రైలర్ విడుదల చేశారు. ట్రైలర్ చూస్తుంటే రామాయణ మరో రేంజ్లో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ నితీశ్ తివారీ రామాయణం విజువల్ వండర్లా కనిపిస్తోంది. రణ్బీర్ కపూర్, సాయిపల్లవి సీతారాముల పాత్రల్లో సరికొత్తగా కనిపించారు. రావణుడితో యుద్ధం సీన్స్ ట్రైలర్లో ఆకట్టుకుంటున్నాయి. ఈ ఏడాది దీపావళికి ప్రపంచవ్యాప్తంగా రామాయణ రిలీజ్ కానుంది. ఈ చిత్రాన్ని దాదాపు రూ.4 వేల కోట్ల బడ్జెట్తో తెరకెక్కిస్తున్నారు. విజువల్ వండర్లా ఉన్న ట్రైలర్ మీరు కూడా చూసేయండి. -
గురుపౌర్ణమి నాడు బిడ్డకు జన్మనిచ్చిన సీరియల్ నటి
హిందీ ప్రముఖ సీరియల్ నటి కరిష్మా తన్నా శుభవార్త చెప్పేసింది. గురుపౌర్ణమి రోజున తనకు పండంటి మగబిడ్డ జన్మించినట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఈ క్రమంలోనే తోటి నటీనటులు.. కరిష్మా దంపతులకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ ఏడాది ఏప్రిల్లో ప్రెగ్నెన్సీ విషయాన్ని ఈమె బయటపెట్టగా.. ఇప్పుడు బిడ్డ పుట్టాడు.(ఇదీ చదవండి: అల్లు అర్జున్లా మిగతా హీరోలు ఎందుకు చేయలేకపోతున్నారు?)కరిష్మా తన్నా.. 2022లో ముంబైకి చెందిన బిజినెస్మ్యాన్ వరుణ్ బంగేరాని పెళ్లి చేసుకుంది. అంతకు ముందు కొన్నేళ్ల పాటు ప్రేమలో ఉన్న ఈ జంట అనంతరం వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. కరిష్మా.. 2001 నుంచి హిందీలో సీరియల్స్ చేస్తూ గుర్తింపు తెచ్చుకుంది. ఈమె 'క్యుంకీ సాస్ భీ కభీ బహు థీ', 'కుసుమ్' తదితర సీరియల్స్తో పాటు 'బిగ్ బాస్', 'నచ్ బలియే', 'జరా నచ్కే దిఖా' లాంటి రియాలిటీ షోల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. గత ఐదారేళ్లలో అయితే 'స్కూప్' లాంటి ఓటీటీ సిరీస్లతో ప్రశంసలు అందుకుంది. ఈమె 'సంజు', 'సూరజ్ పే మంగళ్ భారి' లాంటి సినిమాలు కూడా చేసింది.(ఇదీ చదవండి: ఓటీటీలో ఫీల్ గుడ్ సినిమా 'చిన్న చిన్న ఆశై' తెలుగు రివ్యూ) View this post on Instagram A post shared by Karishma K Tanna (@karishmaktanna) -
సొంత మేనమామే బలవంతం చేశాడు.. నటి సంచలన వ్యాఖ్యలు
బుల్లితెర నటి, ‘బాలికా వధు 2’ సీరియల్ ఫేం శివాంగి జోషి చిన్నప్పుడు తనకు ఎదురైన లైంగిక వేధింపుల గురించి వివరిస్తూ ఎమోషనల్ అయింది. తాజాగా ‘లాకప్ 2’ రియాల్టీ షోలో పాల్గొన్న ఆమె.. చిన్నప్పుడు సొంత మేనమామనే తనతో అసభ్యంగా ప్రవర్తించారని తెలిపారు.‘మా అమ్మకు సోదరుడైన ఓ వ్యక్తిని నేను చాలా నమ్మేదాన్ని. ముద్దుగా మామాజీ అని పిలిచేదాన్ని. నన్ను రోజు స్కూల్ నుంచి తీసుకొచ్చేవాడు. మా అమ్మ అతన్ని ఎంతగానో నమ్మేది. అదే ఆసరాగా చేసుకొని నాతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. నేను సినిమాల్లోకి వెళ్లాలంటే ముందుగా డ్రైవింగ్ నేర్చుకోవాలని చెబుతూ..ఒల్లో కూర్చోబెట్టుకొని ఏదోదో చెప్పేవాడు. ఆయన ఏం చెబుతున్నాడో.. ఆయన ఉద్దేశాలు ఏంటో అర్థం కాలేదు. కానీ నాకు నచ్చలేదు. నేను డ్రైవింగ్ నేర్చుకోనని చెప్పి.. పక్కకు వచ్చేశా. ఓ రోజు మా అమ్మనాన్నలు బయటకు వెళ్లారని తెలుసుకొని.. ఇంట్లోకి వచ్చాడు. హీరోయిన్వి కావాలంటే రకరకాల సీన్లలో నటించాలంటూ.. నా నుదుటిపై, చెంపలపై ముద్దు పెట్టాడు. నా పెదాలపై ముద్దు పెట్టేందుకు ప్రయత్నించగా..తోసేశాను. దీంతో అతనికి కోపం వచ్చి నన్ను కింద పడేశాడు. అదృష్టంకొద్ది అప్పుడే అమ్మనాన్నలు ఇంట్లోకి వచ్చారు. నా అరుపులు విని గదిలోకి వచ్చి చూశారు. ఏం జరిగిందో తెలుసకొని..అతన్ని కొట్టి ఇంటి నుంచి బయటకు గెంటేశారు’ అని చెబుతూ శివాంగీ ఎమోషనల్ అయింది. -
‘దమ్ముంటే ఒంటరిగా రా’.. కంగనాపై రాఖీ తిరుగుబాటు
జంతర్మంతర్ వద్ద జరిగిన జెన్ జెడ్ విద్యార్థుల నిరసనలపై ఎంపీ, నటి కంగనా రనౌత్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై నటి రాఖీ సావంత్ తీవ్రంగా మండిపడ్డారు. విద్యార్థులకు, దేశ యువతకు మద్దతుగా నిలిచిన ఆమె, కంగనా వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. ఇటీవల కంగనా రనౌత్ జెన్ జెడ్ వారిని ‘జనరేషన్ గట్టర్’ అని అభివర్ణించడంతో పాటు, నిరసనల్లో పాల్గొన్న యువతులపై వివాదాస్పద కామెంట్లు చేశారు.దీనిపై రాఖీ సావంత్ తీవ్రంగా స్పందిస్తూ, దేశంలోని యువతులు, విద్యార్థినుల గురించి ఇలా మాట్లాడటం సరికాదన్నారు. ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియోను షేర్ చేసిన రాఖీ సావంత్, కంగనా రాజకీయ ప్రయాణాన్ని ప్రస్తావిస్తూ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎంపీగా ఎలా ఎదిగారని ప్రశ్నించారు. ‘మీకు ధైర్యం ఉంటే సెక్యూరిటీ లేకుండా ఒంటరిగా బయటకు తిరగండి. అప్పుడే దేశంలోని యువత శక్తి ఏంటో మీకు తెలుస్తుంది’ అని సవాలు విసిరారు.పార్లమెంట్లో కూర్చుని ఇలాంటి అనవసర వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. బాలీవుడ్లో కంగనా గత వివాదాలను గుర్తుచేస్తూ, ఆమె భాషపై తీవ్ర ఆక్షేపణ తెలిపారు. మరోవైపు, కంగనా రనౌత్ తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో జెన్ జెడ్ నిరసనల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ నిరసనల్లోని రీల్స్ చూసి తాను దిగ్భ్రాంతి చెందానని, కొద్దిరోజులు డిజిటల్ డిటాక్స్లోకి వెళ్తున్నట్లు వెల్లడించారు. సాంప్రదాయ విలువలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారంటూ కొందరిపై ఆమె మండిపడ్డారు. ఈ పరిణామాలు ప్రస్తుతం సినీ, రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. -
దిగ్గజ నటి రేఖ సినిమాకు మరో అరుదైన గౌరవం
బాలీవుడ్ దిగ్గజ నటి రేఖ నటించిన అద్భుత చలనచిత్రం ‘ఉమ్రావ్ జాన్’. 1981లో విడుదలైన ఈ చిత్రం నాలుగు జాతీయ చలనచిత్ర పురస్కారాలను కైవసం చేసుకుంది. ఇందులో అద్భుత అభినయం ప్రదర్శించిన రేఖ 'ఉత్తమ నటి'గా జాతీయ అవార్డును అందుకున్నారు. బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ రేఖ కెరీర్లో మైలురాయిగా నిలిచిన ‘ఉమ్రావ్ జాన్’ చిత్రం త్వరలో మరో అరుదైన గౌరవాన్ని అందుకోనుంది.వచ్చే నెలలో జరుగనున్న ‘ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్’ (ఐఎఫ్ఎఫ్ఎం) వేదికపై ఈ క్లాసిక్ మూవీ ప్రదర్శితం కానుంది. ఈ నేపథ్యంలో ఉమ్రావ్ జాన్ పాత్ర దశాబ్దాలుగా తనతోపాటే సజీవంగా ఉందంటూ రేఖ భావోద్వేగానికి లోనయ్యారు. ఈ సందర్భంగా రేఖ మాట్లాడుతూ.. ‘ఉమ్రావ్ జాన్ నా జ్ఞాపకాల్లో, నా నిశ్శబ్దంలో, దశాబ్దాలుగా ఈ చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకుల హృదయాల్లో సజీవంగా ఉంది. ప్రపంచ వేదికపై ఈ చిత్రానికి దక్కుతున్న గౌరవం చూసి నా మనస్సు ఆనందంతో నిండిపోతోంది’ అని పేర్కొన్నారు.ఆగస్టు 13 నుండి 23 వరకు జరుగనున్న ఈ చలనచిత్రోత్సవంలో రేఖ ప్రత్యేక అతిథిగా పాల్గొననున్నారు. భారతీయ సినిమాకు ఆమె అందించిన అసమాన సేవలకు గుర్తింపుగా ఈ వేదికపై ప్రతిష్టాత్మక ‘ఎక్స్లెన్స్ ఇన్ సినిమా అవార్డు’తో ఆమెను సత్కరించనున్నారు. ఈ పురస్కారాన్ని కృతజ్ఞతా భావంతో స్వీకరించనున్నట్లు రేఖ తెలిపారు. ఇది కేవలం తన నటనకు దక్కిన గుర్తింపు మాత్రమే కాదని, తన జీవితాన్ని, నటనను తీర్చిదిద్దిన చిత్రనిర్మాతలు, రచయితలు, సంగీత దర్శకులు, కళాకారులందరికీ అంకితమని ఆమె పేర్కొన్నారు. -
కంగనాకు గట్టిగా ఇచ్చిపడేసిన ప్రముఖ సింగర్!
న్యూఢిల్లీ: బాలీవుడ్ నటి, ఎంపీ కంగనా రనౌత్ ఇటీవల ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసనలపై, నేటి యువతపై తీవ్ర విమర్శలు గుప్పించారు. జెన్ జీ వర్గం అనుచిత భాషను వాడిందని, వారి ప్రవర్తన బాగోలేదని ఆమె ఆరోపించారు. కాగా కంగనా వ్యాఖ్యలపై ప్రముఖ మ్యూజిక్ కంపోజర్, సింగర్ విశాల్ దద్లానీ తీవ్ర స్థాయిలో స్పందించారు.ఇన్స్టాగ్రామ్ వేదికగా ఆయన ఒక పోస్ట్ షేర్ చేస్తూ.. ఆందోళనకారులపై జరిగిన లాఠీచార్జీలు, హింసాత్మక ఘటనలను ఆయన గుర్తు చేశారు. ‘చెడు భాష గురించా? మీరు రోడ్లపై పిల్లలను కొట్టారు, వారిపై రాళ్లు రువ్వారు, పైగా వారినే నిందిస్తున్నారు! వారిపై కాల్పులు జరుపుతున్నారు, బాష్పవాయువు ప్రయోగిస్తున్నారు. వారి ముఖాలపై పెల్లెట్ గన్లు వాడుతున్నారు. మీ పెయిడ్ గూండాలు ఇప్పటికీ తిరుగుతూ, వారిని బెదిరిస్తున్నారు, కొడుతున్నారు! ఈ తిట్లను మీరే స్వయంగా సంపాదించుకున్నారు.. మై ఫ్రెండ్’ అంటూ విశాల్ దద్లానీ మండిపడ్డారు.ఈ పోస్ట్ క్యాప్షన్లో.. ‘పెయిడ్ స్టోరీలు, ఇన్ఫ్లూయెన్సర్ క్యాంపెయిన్లు నిర్వహించడం వల్ల మీ దిగజారుడుతనం మరింత స్పష్టంగా కనిపిస్తోంది’ అని ఆయన పేర్కొన్నారు. మరోవైపు, విశాల్ దద్లానీ చేసిన ఈ వ్యాఖ్యలకు సోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి విశేష మద్దతు లభిస్తోంది. మరోవైపు, కంగనా రనౌత్ తన సోషల్ మీడియా ఖాతాలో నిరసనలకు సంబంధించిన ఒక పోస్ట్ను షేర్ చేస్తూ తీవ్ర పదజాలం వాడారు. ‘నా జీవితంలో ఇంతటి అసహ్యకరమైన దృశ్యాన్ని ఎప్పుడూ చూడలేదు. జెన్ జీ నిరసనల రీల్స్ చూస్తే వాంతి వస్తోంది. వారు మాట్లాడే తీరు, వాడే భాష అత్యంత హేయంగా ఉన్నాయి’ అని ఆమె పేర్కొన్నారు. ఈ నిరసనకారులను ‘జనరేషన్ గటర్’ అంటూ కంగనా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చదువుసంధ్యలు లేని వీరు వ్యవస్థకు ఏమాత్రం ఉపయోగపడరని, కనీసం ఇంటిని కూడా చక్కదిద్దలేరని ఆమె విమర్శించారు. కాగా, ఈ వివాదం బాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. -
సినీ ఇండస్ట్రీలో విషాదం.. గుండెపోటుతో ప్రముఖ నటుడు మృతి
సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ బాలీవుడ్ సునీల్ ఆనంద్ మరణించారు. లండన్లో ఉన్న ఆయనకు గుండెపోటు రావడంతో హఠాన్మరణం చెందారు. ఈ విషయాన్ని సునీల్ ఆనంద్ మేనకోడలు గీనా నారంగ్ ధృవీకరించారు. ఈ విషాద సమయంలో తమ కుటుంబానికి ప్రైవసీ కల్పించాలని ఆమె కోరారు.కాగా.. స్విట్జర్లాండ్లోని జ్యూరిచ్లో దేవ్ ఆనంద్, నటి కల్పనా కార్తీక్లకు సునీల్ ఆనంద్ జన్మించారు. ఆ తర్వాత అమెరికాలో తన చదువు పూర్తి చేసుకున్నారు. 1984లో తన తండ్రితో కలిసి 'ఆనంద్ ఔర్ ఆనంద్' చిత్రంతో బాలీవుడ్లో అరంగేట్రం చేశారు. దేవ్ ఆనంద్ కూడా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విఫలమైంది. ఆ తర్వాత సునీల్ 'కార్ థీఫ్', 'మై తేరే లియే' అనే మరో రెండు చిత్రాల్లో నటించారు. రెండో చిత్రంలో ఆయన మీనాక్షి శేషాద్రి సరసన నటించారు. అయితే ఈ రెండు చిత్రాలు కూడా అంతగా మెప్పించలేకపోయాయి. -
రణ్బీర్ కపూర్ రామాయణ.. ట్రైలర్ రిలీజ్ ఎప్పుడంటే?
రణ్బీర్ కపూర్, సాయిపల్లవి జంటగా నటిస్తోన్న మోస్ట్ అవైటేడ్ మూవీ రామాయణ. ఈ సినిమాకు నితీశ్ తివారీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో రావణుడిగా కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్నారు. రవి దూబే (లక్ష్మణుడు), సన్నీ డియోల్ (ఆంజనేయుడు)గా కనిపించనున్నారు. ఈ మూవీకి హాలీవుడ్ సంగీత దర్శకుడు హన్స్ జిమ్మెర్ పనిచేస్తున్నారు. ఆయన గ్లాడియేటర్, ఇంటర్ స్టెల్లర్, ది లయన్ కింగ్, డ్యూన్ వంటి టాప్ చిత్రాలకు సంగీతం అందించారు.అయితే ఈ మూవీ ట్రైలర్కు సంబంధించిన క్రేజీ అప్డేట్ వచ్చేసింది. రామాయణ ట్రైలర్ టైమ్ అండ్ డేట్ ఫిక్స్ చేశారు మేకర్స్. ఈనెల 24 రిలీజ్ చేస్తామని వాయిదా వేసిన మేకర్స్ తాజాగా డేట్తో టైమ్ ప్రకటించారు. ఈ నెల 30 తెల్లవారుజామున 4 గంటల 15 నిమిషాలకు విడుదల చేస్తామని వెల్లడించారు. ఎంతో పవిత్రమైన బ్రహ్మ ముహూర్తంలో ఈ ట్రైలర్ను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్లు మేకర్స్ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. కాగా.. ఈ చిత్రంలో రణ్బీర్ కపూర్ రాముడిగా.. సాయి పల్లవి సీతగా కనిపించనున్నారు.🕉️...Reposted from @malhotra_namit 's Instagram 🕉️ pic.twitter.com/PpnlFJKD32— The World Of Ramayana (@WorldOfRamayana) July 28, 2026


