Bollywood
-
తెరపైకి తెలంగాణ అమర జవాన్ బయోపిక్!
దేశభక్తి ప్రధానంగా ఉండే సినిమాలు కొన్ని ఇదివరకే తెరపై సందడి చేశాయి. ప్రేక్షకుల నుంచి అద్భుతమైన ఆదరణ కూడా దక్కించుకున్నాయి. ఇప్పుడు ఈ లిస్టులోకి తెలంగాణకు చెందిన అమర జవాన్ బయోపిక్ కూడా చేరనున్నట్లు తెలుస్తోంది. ఇందులో హీరోగా సల్మాన్ ఖాన్ నటిస్తాడని బాలీవుడ్ వర్గాల సమాచారం. ఇంతకీ ఎవరా జవాన్? ఏంటి సంగతి?తెలంగాణ సూర్యాపేట జిల్లాకు చెందిన కల్నల్ సంతోష్ బాబు.. 2020లో గల్వాన్ లోయలో చైనాతో జరిగిన యుద్ధంలో వీరమరణం చెందారు. అప్పట్లో ఈయన ధైర్య సాహసాల గురించి మన ప్రజలు చాలా మాట్లాడుకున్నారు. అనంతరం ఈయన జీవితంలోని కొన్ని అంశాల ఆధారంగా 'ఇండియాస్ మోస్ట్ ఫియర్ లెస్ 3' అనే నవల కూడా రాశారు.(ఇదీ చదవండి: నటుడు మాస్టర్ భరత్ ఇంట్లో విషాదం)ఇప్పుడు ఈ నవల ఆధారంగానే సినిమా తీయబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో సల్మాన్ హీరోగా నటించనున్నారట. ఈ ఏడాది జూలైలో షూటింగ్ మొదలుకానుండగా.. ముంబై, లద్దాఖ్ లో దాదాపు 70 రోజుల పాటు ఏకధాటిగా చిత్రీకరణ చేయనున్నారని సమాచారం. అపూర్వ లఖియా దర్శకత్వం వహించనున్నారని తెలుస్తోంది.గతంలో హీరోస్, టైగర్ జిందా హై, ఏక్ థా టైగర్ తదితర దేశభక్తి ప్రధానంగా నడిచే సినిమాల్లో సల్మాన్ నటించాడు. కాకపోతే గత కొన్నాళ్లుగా ఇతడు మూవీస్ అయితే చేస్తున్నాడు గానీ హిట్ పడట్లేదు. గతేడాది 'సికిందర్' చిత్రంతో వచ్చి ఘోరమైన ఫలితం అందుకున్నాడు. మరి ఈసారి జవాన్ బయోపిక్ మూవీతో సల్మాన్ ఏం చేస్తారో చూడాలి?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 31 సినిమాలు) -
ఫోర్బ్స్లో అనన్య పాండే, బాయ్ ఫ్రెండ్ రియాక్షన్ వైరల్
బాలీవుడ్ యువనటి నటి అనన్య పాండే) (Ananya Panday) తన కరియర్ ఒక కీలకమైన మైలురాయిని సాధించింది. 2025 ఫోర్బ్స్ 30 అండర్ 30 జాబితాలో స్థానం సంపాదించి అందర దృష్టిని ఆకర్షించింది. నటుడు ఇషాన్ ఖట్టర్ కూడా ఈ జాబితాలో చోటు సంపాదించుకున్నాడు. దీనికి సంబంధించి ఫో ర్బ్స్ ఆసియా పోస్ట్ను అనన్య ఇన్స్టాలో షేర్ చేసింది. అయితే అనన్య బాయ్ ఫ్రెండ్గా భావిస్తున్నవాకర్ బ్లాంకో ఈ వార్తలపై స్పందించడం విశేషంగా నిలిచింది. అనన్యను అభినందిస్తూ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో, క్లాప్స్ ఎమోజీతో స్పెషల్ వార్తను తన అభిమానులకు షేర్ చేశాడు. దీంతో ఇది సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.ఫోర్బ్స్ తన 30 అండర్ 30 ఆసియా జాబితా 10వ ఎడిషన్ను ప్రకటించింది. ఇందులో ఆసియాలో అత్యంత ఆశాజనకమైన 300 మంది వ్యవస్థాపకులు, ఆవిష్కర్తలు , 30 ఏళ్లలోపు యంగస్టర్లను ఎంపిక చేసింది. 2025కి గాను ఫోర్బ్స్ 30 అండర్ 30 ఆసియా జాబితాలో చోటు దక్కించుకున్నందుకు అనన్యపాండే, ఇషాన్ ఖట్టర్ ప్లేస్ దక్కించుకున్నారు.. ఈ సంవత్సరం బాలీవుడ్ నుండి ఎంపిక చేయబడిన కొద్దిమందిలో వీరిద్దరూ ఈ ఘనతను సాధించారు. దీంతో ఇద్దరిపై అభినందనలు వెల్లువెత్తాయి.2019లో స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 తో అరంగేట్రం చేసిన అనన్య పాండే, విభిన్నమైన సినిమా పాత్రలు, నటనతోపాటు, తనదైన ష్యాషన్స్టైల్తో తన ప్రత్యేకతను చాటుకుంది. అనేకమది యువ అభిమానులను సొంతం చేసుకుంది. ఇటీవల జలియన్ వాలాబాగ్ మారణకాండ ఆధారంగా తెరకెక్కిన ‘కేసరి చాప్టర్ 2’ లోని నటనకు ప్రశంసలు దక్కిచంఉకుంది. అలాగే ఈ సంవత్సరం ప్రారంభంలో లగ్జరీ ఫ్యాషన్ హౌస్ ఛానల్కు తొలి భారతీయ రాయబారిగా మారింది. స్టైల్ ఐకాన్గా ఆమె హోదాను మరింత సుస్థిరం చేసుకుంది. యువతలో సైబర్ బెదిరింపులను ఎదుర్కోవడంపై దృష్టి సారించిన ఆమె ప్రచారమైన సో పాజిటివ్ను కూడా ప్రచారం చేస్తోంది. మరోవైపు, బియాండ్ ది క్లౌడ్స్తో తన ప్రయాణాన్ని ప్రారంభించి, ధడక్తో ప్రధాన స్రవంతి దృష్టిని ఆకర్షించిన ఇషాన్ ఖట్టర్కి 2025లో ఒక కీలకమైన ఏడాదిగా మారింది. గ్లోబల్ సినిమాలు ప్రాజెక్టులతో పాటు, హోమ్బౌండ్ చిత్రంతో కాన్స్ అరంగేట్రం కోసం సిద్ధమవుతున్నాడు. ఇషాన్ ఇటీవలి మూవీలలో నెట్ఫ్లిక్స్ రొమాంటిక్ కామెడీ సిరీస్ ‘ది రాయల్స్’, అంతర్జాతీయ నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ ‘ది పర్ఫెక్ట్ కపుల్’ ఉన్నాయి, View this post on Instagram A post shared by Ananya 🌙 (@ananyapanday)అనన్య పాండే వాకర్ బ్లాంకోల డేటింగ్ సందడిఅనన్య , వాకర్ మధ్య డేటింగ్ సందడి గత ఏడాదిలో(2024)నే ప్రారంభమైంది. ముఖ్యంగాఅనంత్ అంబానీ ,రాధిక మర్చంట్ వివాహంలో ఇద్దరూ కలిసి కనిపించినప్పుడు,వాకర్ను తన భాగస్వామిగా పరిచయం చేసిందని బాంబే టైమ్స్ నివేదిక వెల్లడించింది. అలాగే అనన్య 26వ పుట్టినరోజు (అక్టోబర్ 30, 2024న వాకర్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో అనన్యకు పుట్టిన రోజు విషెస్ తెలుపుతూ నువ్వు చాలా స్పెషల్.. ఐ లవ్ యూ అన్నీ.. అంటూ ఒక సందేశాన్ని, బ్యూటిఫుల్ ఫోటోను షేర్ చేయడంతో ఈ పుకార్ల జోరు మరింత పెరిగింది. 2018లో మనీష్ మల్హోత్రా కార్యక్రమంలో ఆదిత్య కపూర్ కలిసిన అనన్య అతనితో ప్రేమలో పడింది. కొన్నాళ్ల డేటింగ్ తరువాత వీరిద్దరూ ప్రస్తుతం విడిపోయినట్టు తెలుస్తోంది.వివిధ పరిశ్రమలలో 30 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న 30 మంది ప్రభావవంతమైన యువతీయువకుల జాబాతాను ప్రకటిస్తుంది. ఫోర్బ్స్. 2011 నుండి 30 అండర్ 30 జాబితాను ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రచురిస్తున్న సంగతి తెలిసిందే. -
విరాట్ కోహ్లీకి ధన్యవాదాలు తెలిపిన సింగర్.. ఎందుకంటే?
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి ప్రముఖ సింగర్ రాహుల్ వైద్య కృతజ్ఞతలు తెలిపారు. తనను సోషల్ మీడియాలో అన్బ్లాక్ చేసినందుకు ధన్యవాదాలు చెబుతూ ఇన్స్టాలో పోస్ట్ చేశాడు. కాగా.. గతంలో కోహ్లీ, అతని అభిమానులను ఉద్దేశించి జోకర్ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచాడు. ఆ సమయంలో సింగర్ రాహుల్ను సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో కోహ్లీ బ్లాక్ చేశాడు. ఈ విషయాన్ని సింగర్ కూడా వెల్లడించాడు.తాజాగా అన్బ్లాక్ చేయడంతో కోహ్లీపై ప్రశంసలు కురిపించారు సింగర్ రాహుల్ వైద్య. భారత క్రికెట్కు ఆయన చేసిన కృషిని ప్రశంసిస్తూ వరుస పోస్టులు పెట్టారు. నన్ను అన్బ్లాక్ చేసినందుకు మీకు ధన్యవాదాలు.. ప్రపంచ క్రికెట్లో ఇప్పటివరకు చూసిన అత్యుత్తమ బ్యాట్స్మెన్లలో మీరు ఒకరని కోహ్లీని కొనియాడారు. మీరు భారతదేశానికి గర్వకారణమని.. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆ దేవుడు ఎప్పుడు దీవించాలని కోరుకుంటున్నట్లు సింగర్ రాసుకొచ్చాడు.గతంలో తలెత్తిన వివాదాన్ని ప్రస్తావిస్తూ..'నా భార్య, సోదరిని ఉద్దేశించి చాలా అసభ్యంగా కామెంట్స్ చేశారు. నా చిన్నకూతురు చిత్రాలను మార్ఫింగ్ చేశారు. నా కుటుంబానికి ద్వేషపూరిత సందేశాలను పంపిన వ్యక్తులకు ఆ దేవుడు కొంత జ్ఞానం ప్రసాదించుగాక. నేను కూడా అంతకంటే దారుణంగా స్పందించగలను. కానీ నేను అలా చేయను. ఎందుకంటే అది మరింత ప్రతికూలతకు కారణమవుతుంది. వికాస్ కోహ్లీ (విరాట్ సోదరుడు) మీరు నాకు ఏమి చెప్పినా నాకు చెడుగా అనిపించలేదు. ఎందుకంటే మీరు మంచివారని నాకు తెలుసు. మాంచెస్టర్ స్టేడియం వెలుపల మిమ్మల్ని కలవడం, నా పాట గురించి మీరు చెప్పిన మాటలు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. అందరు ప్రేమ, శాంతి ఉండాలని కోరుకుంటున్నా' అంటూ తన పోస్ట్లో వివరణ ఇచ్చారు. కాగా.. గతంలో విరాట్ కోహ్లీ అభిమానులు విరాట్ కంటే పెద్ద జోకర్లు అంటూ సింగర్ కామెంట్ చేశాడు. దీనిపై కోహ్లీ ఫ్యాన్స్ అతనిపై ఓ రేంజ్లో ఫైరయ్యారు. View this post on Instagram A post shared by RAHUL VAIDYA (@rahulvaidyarkv) -
నటుడు మిథున్ చక్రవర్తికి నోటీసులు
సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తి (Mithun Chakraborty)కి మహారాష్ట్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. మలాడ్లో ఉండే ఎరంగేల్ ప్రాంతంలో తన సొంత స్థలంలో ఎలాంటి అనుమతి లేకుండా మిథున్ ఒక గ్రౌండ్ ఫ్లోర్, మూడు తాత్కాలిక నిర్మాణాలు చేపట్టారు. దీంతో బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) షోకాజ్ నోటీసులు జారీ చేసింది. వాటి నిర్మాణ పనులు తక్షణమే ఆపాలని అందులో పేర్కొంది. అయితే, తాను ఎలాంటి అక్రమమైన నిర్మాణాలు చేయలేదని ఆయన తెలిపారు. అందుకు సంబంధించిన పూర్తి వివరాలు బీఎంసీకి అందిస్తానని మిథున్ చక్రవర్తి తెలిపారు.గత వారం రోజులుగా అదే ప్రాంతంలో అక్రమ భవన నిర్మాణాలను, బంగ్లాలను బీఎంసీ తొలగిస్తుంది. ఇప్పటికే దాదాపు 130 అనధికార నిర్మాణాలను గుర్తించి వాటిని తొలగింపు కార్యక్రమాన్ని ప్రారంభించింది. మే 31లోపు ఆ ప్రాంతంలో ఉన్న అక్రమ కట్టడాలను తొలగిస్తామని అధికారులు తెలిపారు. -
హీరో తప్పుకొన్నాడు.. హిందీ 'బేబి'కి బ్రేకులు?
తెలుగు సినిమా 'బేబి'.. రిలీజైన టైంలో ఏ రేంజ్ సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇదేం సినిమా అని చాలామంది అన్నారు కానీ యూత్ మాత్రం ఈ మూవీని హిట్ చేశారు. ఇకపోతే ఈ చిత్రాన్ని హిందీలోనూ రీమేక్ చేయాలని దర్శకుడు సాయి రాజేశ్ ఫిక్స్ అయ్యాడు. కాకపోతే అధికారికంగా ప్రకటించలేదు.(ఇదీ చదవండి: జయం రవిని ఎప్పుడూ అల్లుడిలా చూడలేదు.. సీన్ లోకి ఎంటరైన అత్త)ప్రస్తుతానికైతే ఇంకా చర్చల దశలోనే ఉంది. అలాంటిది ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకొన్నట్లు నటుడు బాబిల్ ఖాన్ ప్రకటించాడు. లెక్క ప్రకారం హీరోల్లో ఒకరిగా ఇతడిని తీసుకోవాలని సాయి రాజేశ్ అనుకున్నాడు. కానీ రీసెంట్ గా బాబిల్.. బాలీవుడ్ ని పరోక్షంగా తిడుతూ వీడియో పెట్టడం చర్చనీయాంశమైంది. ప్రస్తుతం బ్రేక్ తీసుకుంటున్నట్లు పేర్కొన్న బాబిల్ ఖాన్.. ఆ దర్శకుడితో కలిసి మ్యాజిక్ క్రియేట్ చేయాలనుకున్నానని, దురదృష్టవశాత్తూ అది సాధ్యపడటం లేదని రాసుకొచ్చాడు. సాయి రాజేశ్, టీమ్ కి ఆల్ ది బెస్ట్ చెప్పాడు. తమ మధ్య అపారమైన ప్రేమ ఉందని, భవిష్యత్తులో కలిసి పనిచేస్తామనే నమ్మకం ఉందని అన్నాడు.బాబిల్ పోస్ట్ పై స్పందించిన సాయి రాజేశ్.. 'నేను కలిసిన టాలెంటెడ్, కష్టపడే నటుల్లో బాబిల్ ఒకడు. కొంతకాలం ఆయనతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది. నేను నా హీరోని మిస్ అవుతున్నాను. అతడి నిర్ణయాన్ని గౌరవిస్తున్నాను. మేం తప్పకుండా మ్యాజిక్ సృష్టిస్తాం' అని చెప్పుకొచ్చాడు.ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే రీమేక్ నుంచి ఓ హీరో తప్పుకొన్నాడు. ఇప్పటికిప్పుడు మరో హీరోని వెతికి పట్టుకుని అతడికి ట్రైనింగ్ ఇప్పించి సినిమా చేయడానికి మరికొన్నాళ్లు పట్టొచ్చు. అంటే 'బేబి' హిందీ రీమేక్ కి బ్రేకులు పడ్డట్లే.(ఇదీ చదవండి: ఓటీటీలోకి కన్నడ మిస్టరీ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్) View this post on Instagram A post shared by Babil (@babil.i.k) View this post on Instagram A post shared by Sai Rajesh (@sairazesh) -
'చుట్టమల్లే' సాంగ్.. నాకు గుర్తింపు దక్కలేదు: కొరియోగ్రాఫర్
వేల మంది కష్టపడితేనే ఓ సినిమా తీయడం సాధ్యమవుతుంది. అదే మూవీ హిట్ అయితే గనక హీరో హీరోయిన్ లేదా దర్శకుడికే ఎక్కువ క్రెడిట్ వస్తుంది. కానీ ఇదే మూవీ కోసం పనిచేసిన చాలామందికి పెద్దగా గుర్తింపే దక్కదు. సరిగ్గా ఇలాంటి అనుభవమే తనకు ఎదురైందని నేషనల్ అవార్డ్ విన్నింగ్ కొరియోగ్రాఫర్ బాస్కో మార్టిస్ అంటున్నాడు.బాస్కో మార్టిస్ గురించి ప్రేక్షకులకు పెద్దగా తెలియదు. ఎందుకంటే ఇతడు తెర వెనక మాత్రమే ఉంటాడు. తెలుగు, హిందీలో సూపర్ హిట్ అనిపించుకున్న చాలా పాటలకు ఇతడు కొరియోగ్రఫీ చేశాడు. కానీ తనకు దక్కాల్సిన గుర్తింపు దక్కట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. గతేడాది రిలీజైన 'దేవర'లో చుట్టమల్లే పాటని కొరియోగ్రఫీ చేసింది కూడా ఇతడే.(ఇదీ చదవండి: మరో ఓటీటీలోకి కల్యాణ్ రాణ్ కొత్త సినిమా)తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చుట్టమల్లే పాటకు తనకు గుర్తింపు దక్కకపోవడంపై తన బాధని బయటపెట్టాడు. 'దేవర ప్రమోషన్స్ లో జాన్వీ నా గురించి మాట్లాడి ఉండాల్సింది. కానీ పర్వాలేదులే. మన పని మనం చేసుకుంటే చాలు' అని బాస్కో మార్టిస్ చెప్పుకొచ్చాడు.బాస్కో మాట్లాడిన దానిబట్టి చూస్తుంటే జాన్వీ తన పేరు చెప్పకపోవడంపై బాధ పడుతున్నట్లు అనిపించింది. అలానే ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్స్ కి సరైన గుర్తింపు దక్కకపోవడం గురించి మరీ నేరుగా కాకపోయినా పరోక్షంగా తన అసంతృప్తిని బయటపెట్టినట్లు అనిపించింది. ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యాన చిన్న చిన్న టెక్నీషియన్స్ కి కూడా ఫేమ్ తెచ్చుకుంటున్నారు. ఆ లెక్కన బాస్కో చాలా బెటర్!(ఇదీ చదవండి: రక్తం పంచుకుని పుట్టినోళ్లే నా పతనాన్ని.. ప్రభాస్ మాత్రం: మంచు విష్ణు) -
చికెన్ లెగ్స్.. అగ్గిపుల్ల అని బాడీ షేమింగ్ చేశారు : హీరోయిన్
సినిమా తారలు కూడా మనషులే. వాళ్లకి మనసు ఉంటుంది. వాళ్లపై ఇష్టం వచ్చినట్లుగా కామెంట్ చేస్తే ఆ మనసు బాధపడుతుంది. కానీ కొంతమంది మాత్రం ఇవేవి పట్టించుకోకుండా.. హీరోయిన్లపై ఇష్ట వచ్చినట్లుగా కామెంట్ చేస్తుంటారు. ముఖ్యంగా వాళ్ల శరీర సౌష్ఠవంపై రకరకాలుగా మాట్లాడుతుంటారు. ఇవన్ని తట్టుకొని నిలబడితేనే మనం మన కెరీర్లో విజయం సాధిస్తాం అని చెబుతోంది బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే(Ananya Panday). 2019లో విడుదలైన 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2' చిత్రం ద్వారా వెండితెర ఏంట్రీ ఇచ్చిన ఈ భామ..తొలి చిత్రంతోనే తనదైన నటనతో ఆకట్టుకుంది. రాకీ ఔర్ రాణి కియీ ప్రేమ్ కహానీ, పతి పత్నీ ఔర్ వో, ఖాలీ పీలీ, గెహ్రైయాన్, డ్రీమ్ గర్ల్ 2, ఖో గయే హమ్ కహాన్, బాడ్ న్యూజ్, ఖేల్ ఖేల్ మే, సీటీఆర్ఎల్ చిత్రాలలో స్టార్ హీరోయిన్గా మారింది. అయితే తన కెరీర్ తొలినాళ్లలో చాలా మంది హీరోయిన్లలానే తాను కూడా బాడీ షేమింగ్కు గురయ్యాయని చెబుతోంది అనన్య.తాజాగా ఆమె ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘నేను 18-19 ఏళ్ల వయసులో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాను. ఆ సమయంలో నేను చాలా సన్నగా ఉన్నాను. దీంతో చాలా మంది నా శరీరంపై కామెంట్స్ చేశారు. కోడీ కాళ్లు.. అగ్గిపుల్లలా ఉన్నావంటూ నా బాడీపై విమర్శలు చేసేవారు. నీ శరీరం సరైన ఆకారంలో లేదనే కామెంట్స్ కూడా చేశారు. ఇప్పుడు నా శరీరం సహజంగానే మారుతుంటే.. ‘ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది’ అంటున్నారు. మనం(మహిళలు) ఏ విధంగా ఉన్నా ఈ విమర్శలు తప్పవు. వాటిని పట్టించుకోకుండా మన పని మనం చేసూకుంటూ పోతేనే విజయం సాధిస్తాం’అని అనన్య చెప్పుకొచ్చింది. -
సోదరి కోసం ప్రీమియం ఇల్లు కొన్న తాప్సీ.. ధర ఎన్ని కోట్లంటే..
బాలీవుడ నటి తాప్సీ పన్ను ముంబైలో ఒక లగ్జరీ ఫ్లాట్ను కొనుగోలు చేసింది. తన సోదరి సోదరి షగున్తో కలిసి తాజాగా రిజిస్ట్రేషన్ కూడా పూర్తి చేశారని స్క్వేర్ యార్డ్స్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ (IGR) పోర్టల్ ద్వారా సమాచారం వెలువడింది. ఇప్పటికే ఆమెకు ముంబైలో ఒక ఇల్లు ఉంది. అది ప్రాచీన పంజాబీ కళతో ఆకట్టుకుంటుంది. తన సోదరి వెడ్డింగ్ ప్లానర్ కావడంతో ఆ ఇంటిని చాలా అందంగా డెకరేషన్ చేసింది. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి.తాప్సీ పన్ను, ఆమె సోదరి షగున్ పన్నుతో కలిసి ముంబైలోని గోరేగావ్ వెస్ట్లో రూ.4.33 కోట్లతో ప్రీమియం అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ణు కొనుగోలు చేశారు. స్క్వేర్ యార్డ్స్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ (IGR) పోర్టల్లో ఈ సమాచారం ఉంది. అందుకు సంబంధించిన ఆస్తి రిజిస్ట్రేషన్ పత్రాలు కూడా పోర్టల్లో ఉన్నాయి. రెడీ-టు-మూవ్-ఇన్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ కావడంతో వారు త్వరలోనే కొత్త ఇంట్లోకి వెళ్లనున్నారు. రిజిస్ట్రేషన్ కోసం రూ.21.65 లక్షల స్టాంప్ డ్యూటీతో పాటు అదనంగా రూ.30,000 ఛార్జీలను చెల్లించారు. ముంబైలోని ఇంపీరియల్ హైట్స్ ఇటీవలి కాలంలో రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు జోరుగా సాగుతున్నాయి. ప్రస్తుతం అక్కడ చదరపు అడుగుకు రూ.32,170గా ఉంది. ఇది ఈ ప్రాంతంలో అత్యంత డిమాండ్ ఉన్న లగ్జరీ ప్రాంతాల్లో ఒకటిగా గుర్తింపు ఉంది.కొత్త ఇల్లు తన సోదరి షగున్ కోసం తాప్సీ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. గతేడాది పెళ్లిబంధంలోకి అడుగుపెట్టిన తాప్సీ తన భర్త మథియాస్ బోతో పాత ఇంట్లోనే ఉంటుంది. అతను డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ అని తెలిసిందే. కొన్నేళ్లుగా వారిద్దరూ అదే ఇంట్లో ఉంటున్నారు. పెళ్లి తర్వాత తన సోదరికి ఒక సొంత ఇల్లు ఉండాలని తాప్సీ కొన్నట్లు సమాచారం. -
స్టార్ హీరోతో వాన పాట చేశాక, గదిలోకెళ్లి భోరుమన్న నటి...
ఇప్పుడంటే పెద్ద విషయం కాదు కానీ.. అంత ఆసక్తి కూడా లేదు కానీ ఒకప్పుడు సినిమాల్లో రెయిన్ సాంగ్స్ అంటే ఫుల్ క్రేజ్. అప్పట్లో ఓ దశాబ్ధం పాటు వానపాటలు లేకుండా మాస్ హీరోల సినిమాలు రాలేదంటే అతిశయోక్తి కాదేమో... ఎన్టీయార్ తరం నుంచి చిరంజీవి తరం దాకా కొన్నేళ్ల పాటు ఈ వానపాటల్తో ప్రేక్షకుల్ని తడిపి ముద్దచేసేశారు. కేవలం టాలీవుడ్లో మాత్రమే కాదు అటు బాలీవుడ్లోనూ వీటి సందడి ఎక్కువే కనపడేది.ఇప్పుడు లిప్లాక్, మితిమీరిన రొమాంటిక్ సన్నివేశాల్లో చేయడం గురించి ఎలాగైతే హీరోయిన్లు కొందరు తమ ఇబ్బందులు బయటపెడుతున్నారో...అప్పుడు వానపాటల గురించి అలాగే చెప్పుకునేవారు. తడిసి ముద్దయిన చీరలో హీరోయిన్ హీరోతో డ్యాన్సు చేస్తుంటే ప్రేక్షకులు కళ్లప్పగించేసేవారు కానీ అలా తెరకు ఒళ్లప్పగించేసినందుకు అందరూ కాకపోయినా కొందరు హీరోయిన్లు మాత్రం తెగ బాధపడేవారు. అప్పట్లో బాలీవుడ్ సినిమా వానపాటల్లో సూపర్ హిట్ సాంగ్లో నటించిన ఓ హీరోయిన్ అదే విధంగా విపరీతంగా బాధపడింది. ఇటీవలే వెలుగులోకి వచ్చిందీ విషయం.కళ్లు తిప్పుకోనివ్వనంత అందం ఉన్నా, గ్లామర్తో కాకుండా బాలీవుడ్లో తక్కువ సమయంలోనే తనదైన ముద్ర వేసుకున్న అతి కొద్ది మంది తారల్లో ఒకరు స్మితా పాటిల్(Smita Patil), గ్లామర్కు కాకుండా, గంభీరతకు గుర్తుపెట్టుకునే పాత్రలతో ప్రేక్షకుల మనసుల్లో ఆమె తిరుగులేని స్థానం సంపాదించారు. స్వతంత్ర భావజాలంతో ఉండే స్మితాపాటిల్ కు సామాజిక విలువలపై ఉన్న నమ్మకం ఆమె నటనలో పాత్రల ఎంపికలో స్పష్టంగా కనిపించేది.సినిమా ప్రపంచంలోకి అడుగుపెట్టి, నిజాయితీతో నిండిన పాత్రలు పోషించిన స్మితా పాటిల్కు, మొదటి నుంచీ వాణిజ్య చిత్రాల మీద ఆసక్తి పెద్దగా లేదు. అందుకేనేమో ఆమె మొదటి మాస్టర్హిట్ కమర్షియల్ సినిమా ‘‘నమక్ హలాల్’’(Namak Halaal) విజయం గురించి ఆమె ఎప్పుడూ సంతృప్తి చెందలేదు. మరీ ముఖ్యంగా ఆ సినిమా అద్భుత విజయంలో ప్రధాన పాత్ర పోషించిన ‘ఆజ్ రఫత్ జాయేతో...‘ పాట ఆమెకు ఏ మాత్రం నచ్చలేదు. కుండపోత వర్షంలో తెల్ల చీరలో తడిసి ముద్దవుతూ అందాలన్నీ బహిర్గత పరుస్తూ.. నాటి సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్( Amitabh Bachchan)తో చేసిన ఆ పాట ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించిందేమో కానీ..స్మితా పాటిల్ను మాత్రం ఉస్సురుమనిపించింది. తను ఎప్పుడూ ఊహించని రీతిలో కనిపించాల్సి రావడం ఆమె మనస్సుకు తీవ్రమైన బాధ కలిగించింది. ఆ రోజు వాన పాట షూటింగ్ పూర్తయిన తరువాత ఆమె తిన్నగా తన గదిలోకి వెళ్లిపోయిందని, భోరుమంటూ ఏడ్చిందని సాక్షాత్తూ ఆ పాటలో ఆమె సహనటుడు, బాలీవుడ్ బిగ్బి అమితాబ్ బచ్చన్ ఇటీవలే వెల్లడించారు. మరి అలాంటి పాటకు ఆమె ఎందుకు అంగీకరించింది? ఈ ప్రశ్నకు సమాధానం కూడా ఉంది.ఇది అంతా జరిగినదానికి మూలం సిల్సిలా అనే సినిమా. ఆ సినిమాలో మొదట స్మితా పాటిల్ పర్వీన్ బాబీ ఉండాల్సింది. కానీ వారికి బదులుగా చివరికి జయ బచ్చన్ రేఖ ఎంపికయ్యారు. ఈ విషయం దర్శకుడు యశ్ చోప్రా నుంచి కాకుండా, శశికపూర్ ద్వారా తెలియడం స్మితా పాటిల్ మనోభావాలను తీవ్రంగా గాయపరచిందని సమాచారం. ఆ గాయం పచ్చిగా ఉండగానే నమక్ హలాల్ సినిమాలో అవకాశం వచ్చిందట. ఆవేదనలోనో, ఒక నిర్వేదంలోనో నమక్ హలాల్కి ఓకే చెప్పేసిందట. అయితే ఈ సినిమా ఘనవిజయం సాధించినా, తనకు మరిన్ని సినిమా అవకాశాలు అందించానా... సినిమా రంగంలో తన విలువలకు భిన్నంగా చేశాననే భావన ఆమెను వెంటాడింది.విమర్శకుల ప్రశంసలు, ప్రేక్షకుల ఆదరణ పొందినా.. తనను ఆ పాటలో హీరోయిన్గా ప్రేక్షకులు గుర్తు పెట్టుకోవడం ఆమెకు ఎప్పటికీ ముళ్లులా గుచ్చుకుంటూనే ఉంది. ఆ తర్వాత స్మితా పాటిల్ ఎన్నో మంచి చిత్రాల్లో నటించారు. అయితే చాలా చిన్న వయసులోనే ఆమె ఈ లోకం నుంచి నిష్క్రమించడంతో బాలీవుడ్ ఉన్నంత కాలం గుర్తుంచుకోదగ్గ గొప్ప నటిని కోల్పోయింది. సదరు నమక్ హలాల్ సినిమాను భలేరాముడు పేరుతో మోహన్బాబు హీరోగా తెలుగులోనూ తీశారు. ఆ సినిమాలోనూ వానపాట ఉంది అంతే స్థాయిలో ఇంకా చెప్పాలంటే మరింత ఘాటుగా తెలుగు పాటను చిత్రీకరించారు. ఆ వానపాటలో ఒకనాటి హీరోయిన్ మాధవి మోహన్బాబుకు జోడీగా నర్తించింది. -
'కేసరి చాప్టర్ 2' తెలుగు ట్రైలర్
‘కేసరి చాప్టర్ 2’ (Kesari Chapter 2) తెలుగు ట్రైలర్ వచ్చేసింది. జలియన్ వాలాబాగ్ విషాదం నేపథ్యంలో అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 18న బాలీవుడ్లో విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్న ఈ మూవీ మే 23న తెలుగులో విడుదల కానుంది. ఏషియన్, సురేష్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ మూవీని రిలీజ్ చేస్తున్నాయి. కరణ్ సింగ్ త్యాగి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ జలియన్ వాలాబాగ్ అనే ట్యాగ్లైన్ను చేర్చారు. మాధవన్, అనన్యపాండే, రెజీనా కీలక పాత్రలు పోషించారు. కరణ్ జోహార్ నిర్మించారు. 1919 ఏప్రిల్ 13న అమృత్సర్లోని జలియన్వాలా బాగ్లో జరిగిన కాల్పులు, తొక్కిసలాటలో ఎంతో మందిప్రాణాలు కోల్పోయారు. ఆ నేపథ్యంలో ఈ చిత్రం రూపొందింది. -
'దాదాసాహెబ్ ఫాల్కే' బయోపిక్లో ఎవరు.. క్లారిటీ వచ్చేసింది
భారతీయ సినీ పితామహుడు దాదా సాహెబ్ ఫాల్కే (అసలు పేరు ధుండీరాజ్ గోవింద్ ఫాల్కే) బయోపిక్ ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. దాదా సాహెబ్ ఫాల్కే బయోపిక్ చేసేందుకు ఇటు రాజమౌళి అటు ఆమిర్ ఖాన్ ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారు. దీంతో ముందుగా ఎవరు ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్తారనే చర్చ ఇండస్ట్రీలో జోరుగా సాగుతోంది. ఇలాంటి సమయంలో దాదాసాహెబ్ ఫాల్కే మనవడు చంద్రశేఖర్ అసలు విషయం చెప్పారు. ఈ ప్రాజెక్ట్పై ఆసక్తి చూపుతుంది ఎవరో ఆయన పంచుకున్నారు.దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్పై ఇండస్ట్రీలో చర్చ జరుగుతుందని ఆయన మనవడు చంద్రశేఖర్ అన్నారు. ఈ ప్రాజెక్ట్ రాజమౌళి తెరకెక్కిస్తున్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆయన అన్నారు. 'దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ విషయంలో రాజమౌళి టీమ్ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా మమ్మల్ని సంప్రదించలేదు. కానీ, ఆమిర్ టీమ్ నన్ను సంప్రదించింది. ఈ బయోపిక్ కోసం ఆమిర్ మూడేళ్ల నుంచి పరిశోధనలు చేస్తున్నారు. దర్శకుడు రాజ్కుమార్ హీరాణీ ‘దాదాసాహెబ్ ఫాల్కే’ బయోపిక్ సినిమా కోసం వర్క్ చేస్తున్నట్లు నాకు కూడా సమాచారం ఉంది. రాజ్కుమార్ హీరాణీ అసిస్టెంట్ ప్రొడ్యూసర్ హిందూకుష్ భరద్వాజ్ నాతో మూడేళ్లుగా టచ్లో ఉన్నారు. మా తాతగారి గురించి ఎన్నో విషయాలు అడిగి తెలుసుకున్నారు. అతను నన్ను మళ్ళీ మళ్ళీ కలవడానికి, పరిశోధన చేయడానికి, వివరాలు అడగడానికి వచ్చేవాడు. దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్లో ఆమిర్ ఖాన్ బాగా సెట్ అవుతాడు.' అంటూ ఆయన చెప్పుకొచ్చాడు.దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్లో ఎన్టీఆర్ నటించడం లేదని దీంతో క్లారిటీ వచ్చేసింది. తారక్ నటిస్తున్నారని వార్తలు వచ్చిన 24 గంటల్లోపే ఈ ప్రాజెక్ట్లో ఆమిర్ ఖాన్ చేస్తున్నట్లుగా ప్రకటన వచ్చింది. అయితే, మేడ్ ఇన్ ఇండియా... ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా బయోపిక్ ‘మేడ్ ఇన్ ఇండియా’కు సమర్పకుడిగా వ్యవహరించనున్నట్లుగా 2023లో దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. వరుణ్ గుప్తా, ఎస్ఎస్ కార్తికేయ ఈ సినిమాను నిర్మించనున్నట్లు, నితిన్ కక్కడ్ (హిందీ చిత్రం ‘నోట్బుక్’ ఫేమ్) ఈ బయోపిక్కు దర్శకత్వం వహించనున్నట్లుగా ఆ వీడియోలో ఉంది. ఆ తర్వాత ఈ సినిమా గురించి అప్డేట్ ఏదీ బయటకు రాలేదు. తాజాగా దాదాసాహెబ్ ఫాల్కే మనవుడి ప్రకటనతో క్లారిటీ వచ్చేసింది. -
బిగ్ బాస్ విన్నర్ లివర్లో టెన్నిస్ బాల్ అంత కణితి : వైరల్ పోస్ట్
ప్రముఖ టీవీ నటి,బాగ్ బాస్ 12 విన్నర్ దీపిక కాకర్ (Dipika Kakar), తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోంది. ఈ విషయాన్ని ఆమె భర్త సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తన భార్య ఆరోగ్యం కోసం ప్రార్థించాల్సిందిగా అభిమానులకు విజ్ఞప్తి చేశాడు. అసలు దీపిక కాకర్కు ఏమైంది?దీపిక కాకర్ టెలివిజన్ పరిశ్రమలో అత్యంత ప్రియమైన నటీమణులలో ఒకరు.ససురాల్ సిమర్ కా , కహాం హమ్ కహాం తుమ్లాంటి షోల పాత్రల్లోని నటనతో పాపులర్ అయింది. ఒకప్పుడు అత్యధిక పారితోషికం తీసుకునే టెలివిజన్ నటిగా నిలిచింది. టీవీ నటిగా వచ్చిన పాపులారిటీతోనే 2018లో హిందీ బిగ్ బాస్ 12 రియాలిటీ షోలో విన్నర్గా నిలిచింది. తాజాగా దీపిక కాకర్ను లివర్లో పెద్ద ట్యూమర్ ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. దీన్ని తొలగించేందుకు వైద్యులు త్వరలోనే ఆపరేషన్ చేయనున్నారు. ఈ విషయాన్ని నటుడు, దీపిక భర్త షోయబ్ ఇబ్రహీం ఒక వ్లాగ్ పోస్ట్ ద్వారా వెల్లడించారు. అయితే అదృష్టవశాత్తూ అది ట్యూమర్ కాదని తెలిపాడు. దీపిక ఇటీవల కడుపునొప్పితో బాధపడిందని, మొదట్లో అది మామూలు కడుపు నొప్పే అనుకున్నారు. యాంటీబయాటిక్స్ తీసుకున్న తర్వాత అది తగ్గింది. కానీ మళ్లీ నొప్పి రావడంతో వైద్య పరీక్షలు చేయించగా ట్యూమర్ ఉన్నట్టు తేలింది. కాలేయంలోని ఎడమ లోబ్లో చాలా దాదాపు టెన్నిస్ బంతి అంత కణిడి తున్నట్టు సీటీ స్కాన్ ద్వారా గుర్తించారు షోయబ్ పోస్ట్లో అభిమానులతో షేర్ చేశారు. దీంతో ఆమె త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు. కెరీర్కు దూరంగా కెరీర్ పీక్లో ఉండగానే భర్త, ఫ్యామిలీకోసం పరిశ్రమకు దూరమైంది. పెళ్లికి ముందు చదువు పూర్తికాగానే, దీపిక కాకర్ మూడు సంవత్సరాలు విమాన సహాయకురాలిగా పనిచేసింది. 2010లో, నీర్ భరే తేరే నైనా అనే షోతో టెలివిజన్లోకి అడుగుపెట్టింది. అలా దాదాపు ఆరేళ్లు టీవీలో ప్రదర్శితమైన ససురల్ సిమర్ కాలో ఆమె 'సిమర్' పాత్ర ఆమెకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. టెలివిజన్ ప్రపంచంలో అత్యంత డిమాండ్ ఉన్న నటిగా మారింది. దీపిక ఎపిసోడ్కు రూ. 70వేలు వసూలు చేసేదంటే ఆమె క్రేజ్ను అర్థం చేసుకోవచ్చు.మొదటి భర్తకు విడాకులు, రెండో పెళ్లి2011లో దీపికా కాకర్ రౌనక్ సామ్సన్ను వివాహం అయింది. విభేదాల కారణంగా 2015లో ఈ జంట విడాకులు తీసుకున్నారు. ససురాల్ సిమర్ కా సమయంలో, దీపిక షోయబ్ ఇబ్రహీంతో పరిచయం ప్రేమగా మారింది. తెరపై అందరినీ ఆశ్చర్యపరిచిన వీరి కెమిస్ట్రీ నిజజీవితంలోనూ బాగా పండింది. ముఖ్యంగా మొదటి భర్తతో విడాకుల సమయంలో షోయబ్ దీపికకు సపోర్ట్గా నిలిచాడు. 2018లో మాతం మారి, తన పేరును ఫైజాగా మార్చుకుని మరీ షోయబ్ ఇబ్రహీని వివాహం చేసుకుంది. 2023లో, ఈ జంట తమ మగబిడ్డ ( రుహాన్ )కు జన్మనిచ్చింది.2019లో, దీపిక ‘కహాం హమ్ కహాం తుమ్’ అనే షోలో నటించింది, కానీ ఆ షో ఎక్కువ కాలం కొనసాగలేదు. ఇక కుమారుడు రుహాన్ పుట్టిన తర్వాత దీపిక తన కెరీర్ను విడిచిపెట్టి, కొడుకు శ్రద్ధ పెట్టాలని నిర్ణయించుకుంది. మాస్టర్ చెఫ్ ఇండియాలో పాల్గొంది కానీ భుజం గాయం కారణంగా షోను మధ్యలోనే వదిలేసింది. 2011 - 2018 వరకు అత్యధిక పారితోషికం తీసుకున్న దీపిక నికర విలువ రూ. 40 - రూ. 45 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. -
హాయ్.. తారక్, మే 20న నువ్వు ఊహించలేని గిఫ్ట్ ఉంది: హృతిక్
జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటిస్తున్న 'వార్2' సినిమా కోసం దేశవ్యాప్తంగా సినీ అభిమానులు ఎదురుచూస్తున్నారు. వారందరి కోసం తాజాగా హృతిక్ ఒక శుభవార్త చెప్పారు. టీజర్ ఎప్పుడు విడుదలౌతుందో ప్రకటించారు. పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. భారీ బడ్జెట్తో ఆదిత్యా చోప్రా ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్గా కియారా అద్వానీ నటిస్తున్నారు. తన పాత్రకూ కొన్ని యాక్షన్ సీక్వెన్స్లు ఉన్నాయని తెలిసింది.హృతిక్ రోషన్(Hrithik Roshan) తాజాగా తారక్ను ట్యాగ్ చేస్తూ సోషల్మీడియాలో ఒక పోస్ట్ షేర్ చేశారు. 'హాయ్.. తారక్ ఈ సంవత్సరం మే 20న ప్రత్యేకత ఏంటో మీకు తెలుసా..? సిద్ధంగా ఉండు నువ్వు ఊహించలేని గిఫ్ట్ ఉంటుంది' అని ఆయన పంచుకున్నారు. ఈ సారాంశాన్ని చూస్తే వార్2 టీజర్ ఆరోజున విడుదల కావచ్చని తెలుస్తోంది. మే 20 ఎన్టీఆర్ పుట్టినరోజు ఉంది. కాబట్టి ఆరోజు ఈ సినిమా నుంచి తప్పకుండా టీజర్ విడుదల కా 2019లో హిట్గా నిలిచిన హిందీ చిత్రం ‘వార్’కు సీక్వెల్గా ‘వార్ 2’ తెరకెక్కుతుంది. ఈ సినిమాపై టాలీవుడ్తో పాటు బాలీవుడ్ అభిమానులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు.దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఆగష్టు 14న విడుదల కానుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ రా ఏజెంట్గా నటించనున్నారని బాలీవుడ్ మీడియా పేర్కొంది. గతంలో షారుక్ఖాన్, సల్మాన్ఖాన్, హృతిక్ రోషన్లు రా ఏజెంట్ పాత్రలలో నటించి అక్కడ మంచి గుర్తింపుతో పాటు విజయాన్ని అందుకున్నారు. అయితే, వార్2లో వీటన్నింటికంటే భిన్నంగా ఎన్టీఆర్ పాత్ర ఉందని తెలుస్తోంది. ఆపై ఈ మూవీలో హృతిక్ - ఎన్టీఆర్లపై అదిరిపోయే సాంగ్ను ప్లాన్ చేశారట . దాదాపు 500మంది డ్యాన్సర్లుతో వారు స్టెప్పులేశారట.Hey @tarak9999, think you know what to expect on the 20th of May this year? Trust me you have NO idea what’s in store. Ready?#War2— Hrithik Roshan (@iHrithik) May 16, 2025 -
బాలీవుడ్లో ప్రభాస్ని కొట్టేదెవరు?
ఇప్పుడు బాలీవుడ్కి టాలీవుడ్ సత్తా తెలిసివచ్చింది. ఒకనాటి హీరోల్లా ఏదో వచ్చాం అంటే వచ్చాం చేశాం అంటే చేశాం అన్నట్టు ఒకటీ అరా చేసి పోయే రకం కాదని, ఒకసారి కాలు పెడితే కార్చిచ్చులా వ్యాపించే నేటి తరం తెలుగు హీరోలను ఆపడం తమ తరం కాదని హిందీ బెల్ట్కి ఇప్పుడు బాగా అర్ధమవుతోంది. నిజానికి బాలీవుడ్ కి ఒకప్పుడు తెలుగు సినిమా అంటే శతకోటి ఇండస్ట్రీల్లో అదొకటి. తెలుగు ఫిలిం మేకర్స్ ను చాలా తక్కువ చేసి చూసేవారు. దీన్ని మార్చాలని తామూ తక్కువేం కాదని నాటి సీనియర్ హీరోలు చాలా ప్రయత్నించారు. ఒకానొక దశలో అమితాబ్ను కూడా దాటేసి చిరంజీవి దేశంలోనే హైపెయిడ్ ఆర్టిస్ట్గా నిలిచి తన సత్తా చాటారు. అయినా ఇవేవీ బాలీవుడ్ బుర్రకెక్కలేదు. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ వంటి స్టార్లు డైరెక్ట్ హిందీ చిత్రాల్లో నటించి అప్పుడప్పుడు అక్కడ మెరుపులు మెరిపించినా పెద్దగా ఒరిగింది అంటూ ఏమీ లేదు. (చదవండి: సమంత డేటింగ్ రూమర్స్.. డైరెక్టర్ రాజ్ సతీమణి పోస్ట్ వైరల్!)అదంతా ఒకెత్తయితే ‘బాహుబలి’ఒక్కటీ ఒకెత్తయింది. బాలీవుడ్ మాత్రమే కాదు అన్ని వుడ్లూ తనవైపు తలెత్తి చూసే రేంజ్ కు మన తెలుగు సినిమా ఎదిగింది. ఓ వైపు బాలీవుడ్లో ప్రభాస్(Prabhas) ప్రభంజనం కొనసాగుతుండగానే దూసుకొచ్చిన ‘ఆర్.ఆర్.ఆర్’ తో ఎన్టీఆర్(Jr NTR), రామ్ చరణ్(Ram Charan)లు, ‘పుష్ప’, ‘పుష్ప 2’ల తో అల్లు అర్జున్(Allu Arjun) కూడా నార్త్ లో బాలీవుడ్ హీరోలకు థీటుగా కలెక్షన్లు, ఫాలోయింగ్ను అందుకుంటూ ఇండియన్ సినిమాపై బాలీవుడ్ ఆధిపత్యాన్ని కుప్పకూల్చారు. ఈ నేపధ్యంలో టాలీవుడ్ నుంచి బాలీవుడ్కి ఎదిగిన మన హీరోల్లో అక్కడ అగ్రపీఠం కోసం ఇంటర్నల్ వార్ మొదలైంది. ప్రస్తుతం వీరిలో ఎవరికి వారే సాటి అన్నట్టుగా కనిపిస్తున్నప్పటికీ... అందరిలో ప్రభాస్ కాస్త ముందున్నాడని చెప్పక తప్పదు. ముఖ్యంగా హైట్, వెయిట్ సహా కటౌట్లో బాలీవుడ్ హీరోలకు ఏ మాత్రం తీసిపోని ప్రభాస్ను నార్త్ జనాలు బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. బాహుబలి తర్వాత విడుదలైన ప్రభాస్ సినిమాలు కూడా బాలీవుడ్లో మంచి ఓపెనింగ్స్ సాధించడానికి అదే కారణం. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ చేసిన ‘సాహో’ టాలీవుడ్లో ఫ్లాప్ కాగా, అక్కడ సూపర్ హిట్ గా ‘ఆదిపురుష్’ కి కూడా భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. ఇక ‘సలార్’ ‘కల్కి’ లు బాక్సాఫీస్ను షేక్ చేసేశాయి. మరోవైపు ‘ఆర్.ఆర్.ఆర్’ తర్వాత దేశవ్యాప్తంగా విడుదలై ఎన్టీఆర్ , రాంచరణ్..ల సినిమాలకు నార్త్లో అంతగా కలెక్షన్స్ రాలేదు. హైప్ కూడా క్రియేట్ కాలేదు. ఇక అల్లు అర్జున్ క్రేజ్ విపరీతంగా కనపడింది కానీ.. అది తర్వాతి సినిమా వరకు ఎంత వరకూ కొనసాగుతుందనేది అప్పుడే ఏమీ చెప్పలేము. పుష్ప రాజ్ పాత్ర ఉత్తరాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న స్థాయిలో అల్లు అర్జున్ ఆకట్టుకున్నాడా? అంటే అవునని అప్పుడే చెప్పడం సరికాదు. ఈ నేపధ్యంలోనే ప్రభాస్ని ఢీ కొట్టడానికి మిగిలిన హీరోలు నార్త్ ఆడియన్స్ కి బాగా రీచ్ అవ్వాలని డిసైడ్ అయ్యారు. అందుకే ఇక్కడి సినిమాల ద్వారా అక్కడకు వెళ్లడం కాకుండా..నేరుగా బాలీవుడ్ సినిమాలు చేయడం మీద దృష్టి పెట్టారు. ‘వార్ 2’ లో హృతిక్ రోషన్తో పాటు ఎన్టీఆర్ చేస్తున్న సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. మరోవైపు అల్లు అర్జున్ కూడా ఆమిర్ ఖాన్ తీస్తున్న‘ ‘మహాభారతం’లో అర్జునుడి పాత్రలో నటించడానికి ఓకే చెప్పినట్టు వార్తలొస్తున్నాయి. అలాగే రాంచరణ్ కూడా సల్మాన్ ఖాన్ తో కలిసి ఒక సినిమా చేయడానికి రెడీ అంటున్నాడు. మరి ఈ మల్టీస్టారర్ సినిమాల ద్వారా ప్రభాస్ను ఎంత వరకూ దాటగలరో...బాలీవుడ్లో సౌతిండియా సూపర్స్టార్ ఎవరు కానున్నారో.. -
పాకిస్తాన్కు స్పాటిఫై ఝలక్.. ఆ పాటలన్నీ డిలీట్
ప్రముఖ మ్యూజిక్ ఫ్లాట్ఫామ్ సంస్థ స్పాటిఫై కీలక నిర్ణయం తీసుకుంది. ఇండియా- పాకిస్తాన్ మధ్య ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఆ దేశానికి చెందిన పాటలను తొలగించింది. భారత ప్రభుత్వం ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఇప్పటికే అన్ని ఓటీటీ ఫ్లాట్ఫామ్స్, మీడియా స్ట్రీమింగ్ సేవలు, డిజిటల్ మాధ్యమాల్లో పాకిస్తాన్కు సంబంధించిన వెబ్ సిరీస్లు, సినిమాలు, పాటలు, పాడ్కాస్ట్లు, ఇతర కంటెంట్ సైతం తొలగించాలని కేంద్రం ఆదేశించిన సంగతి తెలిసిందే. దీంతో స్పాటిఫై సైతం పాక్ పాటలను తన ఫ్లాట్ఫామ్ నుంచి డిలీట్ చేసింది.దీంతో పాకిస్తాన్కు చెందిన ఫేమస్ 'జోల్', 'మాండ్' అనే పాటలను స్పాటిఫై నుంచి తొలగించారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్ నటుడు ఫవాద్ ఖాన్ సినిమాపై నిషేధం విధించారు. ఆయన హీరోగా నటించిన అబీర్ గులాల్ సినిమాను కూడా భారత్లో బ్యాన్ చేశారు. అంతేకాకుండా ఆయనతో పాటు పలువురు పాక్ నటీనటులను నిషేధించారు. అంతకుముందు పాకిస్తానీ నటులు మావ్రా హోకేన్, మహిరా ఖాన్ సినిమాలైన 'సనమ్ తేరి కసమ్', 'రయీస్' చిత్రాల పోస్టర్లను సైతం తొలగించారు. కాగా.. భారతదేశ సార్వభౌమాధికారం, సమగ్రత, జాతీయ భద్రత కోసమే కేంద్రం చర్యలు చేపట్టినట్లు వెల్లడించింది. -
దేశభక్తిని రగిలించే సినిమా.. తెలుగులో విడుదల
జలియన్ వాలాబాగ్ విషాదం నేపథ్యంలో అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘కేసరి చాప్టర్ 2’ (Kesari Chapter 2). ఏప్రిల్ 18న బాలీవుడ్లో విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు తెలుగులో కూడా విడుదల కానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన వచ్చేసింది. మే 23న టాలీవుడ్లో విడుదల కానున్నట్లు ఒక పోస్టర్ను మేకర్స్ విడుదల చేశారు. కరణ్ సింగ్ త్యాగి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ జలియన్ వాలాబాగ్ అనే ట్యాగ్లైన్ను చేర్చారు. మాధవన్, అనన్యపాండే, రెజీనా కీలక పాత్రలు పోషించారు. కరణ్ జోహార్ నిర్మించారు. అక్షయ్ కుమార్ నటించిన దేశభక్తి చిత్రాల్లో ‘కేసరి’ భారీ విజయాన్ని అందుకుంది. ఆ సినిమాకి కొనసాగింపుగా ‘కేసరి: ఛాప్టర్ 2’ను మేకర్స్ రూపొందించారు. ప్రముఖ రచయితలు రఘు, పుష్ప పలాట్ రచించిన ‘ది కేస్ దట్ షుక్ ది ఎంపైర్’ ఆధారంగా కరణ్ సింగ్ దీన్ని తెరకెక్కించారు. కేసరి చాప్టర్2 సినిమాకు కూడా బాలీవుడ్లో మంచి ఆదరణ లభించింది. భారత స్వాతంత్య్ర సంగ్రామంలో అత్యంత దురదృష్టకర, హేయమైన సంఘటనగా నిలిచిపోయిన ఘటనల్లో జలియన్వాలా బాగ్ ఉదంతం ఒకటి. 1919 ఏప్రిల్ 13న అమృత్సర్లోని జలియన్వాలా బాగ్లో జరిగిన కాల్పులు, తొక్కిసలాటలో ఎంతో మందిప్రాణాలు కోల్పోయారు. ఆ నేపథ్యంలో ఈ చిత్రం రూపొందింది. హిందీ ప్రేక్షకులకు మాత్రమే పరిమితం అయిన ఈ చిత్రం మే 23న తెలుగులో కూడా విడుదల కానుంది. గంతంలో ఛావా సినిమా కూడా మొదట హిందీలో విడుదలై ఆ తర్వాత తెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే.దేశభక్తిని రగిలించే కోర్టు రూం డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాను బ్రిటీష్ ప్రభుత్వం కచ్చితంగా చూడాలని అక్షయ్ కుమార్ గతంలో కోరారు. ఆ ప్రభుత్వంతో పాటు కింగ్ చార్లెస్ కూడా ఈ చిత్రాన్ని చూసి వారి తప్పులను ఇప్పటికైనా తెలుసుకోవాలని సూచించారు. ఈ సినిమా చూశాక వారు కచ్చితంగా క్షమాపణలు చెబుతారని ఆయన అన్నారు. -
'ఇలియానాను ఎందుకు తీసుకోలేదంటే'.. రైడ్-2 డైరెక్టర్ క్లారిటీ!
బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్ ఇటీవలే రైడ్-2 మూవీతో ప్రేక్షకులను పలకరించారు. రాజ్ కుమార్ గుప్తా దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇటీవలే థియేటర్లలో విడుదలైంది. ఈ మూవీలో అజయ్ దేవగణ్ సరసన వాణి కపూర్ హీరోయిన్గా నటించింది. 2018లో వచ్చిన రైడ్ చిత్రానికి కొనసాగింపుగా ఈ సినిమాను తెరకెక్కించారు.అయితే పార్ట్-1లో హీరోయిన్గా ఇలియానా సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రైడ్-2లో ఇలియానాను ఎంపిక చేయకపోవడంపై డైరెక్టర్ రాజ్ కుమార్ గుప్తా స్పందించారు. ఇలియానాను కాదని.. వాణి కపూర్ను ఎందుకు ఎంపిక చేశారన్న దానిపై క్లారిటీ ఇచ్చాడు. ఆమె జీవితం పెళ్లి తర్వాత పూర్తిగా మారిపోయిందని ఆయన అన్నారు. తాను ప్రస్తుతం ఓ బిడ్డతో పాటు మంచి కుటుంబం కలిగి ఉంది.. అంతేకాకుండా విదేశాలకు వెళ్లిపోయిందని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల వల్లే హీరోయిన్ను మార్చాల్సి వచ్చిందని రాజ్ కుమార్ గుప్తా వెల్లడించారు.కానీ ఇలియానాతో రైడ్ మూవీలో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉందని తెలిపాకు. ఆమె ఎల్లప్పుడూ రైడ్ ప్రపంచంలో భాగమేనని రాజ్ కుమార్ గుప్తా అన్నారు. రైడ్- 2లో వాణి కపూర్ నటించడంపై ఎలాంటి వ్యతిరేకత లేదని దర్శకుడు పేర్కొన్నారు. అనివార్య పరిస్థితుల్లోనే నటీనటుల మార్పులు తప్పనిసరని ఆయన వివరించారు. అంతకుముందు రైడ్ -2 ట్రైలర్ లాంచ్ సందర్భంగా ఇలియానా స్థానంలో నటించే అంశాన్ని ప్రస్తావించగా.. మా మధ్య ఎటువంటి పోటీ లేదని వాణి కపూర్ స్పష్టం చేశారు. -
బాలీవుడ్ బ్యూటీ ఆశలపై నీళ్లు.. కేన్స్ ఫెస్టివల్ ఛాన్స్ మిస్!
బాలీవుడ్లో పరిచయం అక్కర్లేని పేరు ఉర్ఫీ జావెద్. వింత వింత దస్తులు ధరించి సోషల్ మీడియాలో ఓ రేంజ్లో ఫేమ్ తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. అంతలా ఫాలోయింగ్ ఉన్న బాలీవుడ్ బ్యూటీకి తాజాగా చేదు అనుభవం ఎదురైంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. మన జీవితంలో ఇలాంటి వాటికి కుంగి పోవాల్సిన అవసరం లేదని తెలిపింది. మీ లైఫ్లో కూడా ఇలాంటి సంఘటనలు జరిగి ఉంటే షేర్ చేయండి అంటూ ఇన్స్టాలో పోస్ట్ చేసింది. ఇంతకీ అదేంటో మనం కూడా తెలుసుకుందాం పదండి.ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మ ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శన ఇచ్చేందుకు రెడీ అయిపోయింది. అందులో భాగంగానే వీసాకు కూడా దరఖాస్తు చేసింది. కానీ ఊహించని విధంగా ఉర్ఫీ జావెద్ వీసాను అధికారులు తిరస్కరించారు. ఈ విషయం తెలుసుకున్న బ్యూటీ తాను, తన టీమ్ చాలా నిరాశకు గురయ్యామని సోషల్ మీడియా వేదికగా పేర్కొంది. నా లైఫ్తో వ్యాపారంలోనూ ఇప్పటికే చాలాసార్లు ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నట్లు ఉర్ఫీ తెలిపింది. ఇలాంటి వాటితో బాధపడకుండా మరింత స్ట్రాంగ్గా ముందడుగు వేయాలని చెబుతోంది. మీలో ఎవరికైనా ఇలాంటి పరిస్థితులు ఎదురైతే షేర్ చేసుకుని ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలవాలని అంటోంది.(ఇది చదవండి: కాపీ కొట్టావ్.. చిలుక బ్యాగ్, ఊర్వశీ రౌతేలా లుక్పై ట్రోలింగ్!)ఉర్ఫీ తన పోస్ట్లో రాస్తూ..'నాకు కేన్స్కు వెళ్లే అవకాశం వచ్చింది. కానీ విధిరాతతో నా వీసా తిరస్కరణకు గురైంది. కొన్ని డిఫరెంట్ దుస్తులను ప్రదర్శించాలని ఆలోచించాం. వీసా రిజెక్ట్ కావడంతో నేను, నా బృందం చాలా నిరుత్సాహపడ్డాము. మీలో చాలా మంది తిరస్కరణలను స్వయంగా ఎదుర్కొని ఉంటారు. అలాంటి వారి స్టోరీలను కూడా నేను తెలుసుకోవాలనుకుంటున్నా. తిరస్కరణల తర్వాత దాని గురించి నిరాశ చెందడం, ఏడవడం సాధారణం. నిజానికి మనకు ఆరోగ్యకరమైంది కూడా. నేను కూడా ఏడుస్తాను.. కానీ తర్వాత ఏం జరుగుతుంది? మీరు జాగ్రత్తగా చూస్తే ప్రతి తిరస్కరణ మనకు ఒక అవకాశం. జీవితంలో చాలా రిజెక్షన్స్ తర్వాత కూడా నేను ఎక్కడా ఆగిపోలేదు. మీరు కూడా అలాగే ఉండండి' అంటూ మోటివేషనల్ పోస్ట్ చేసింది. కాగా.. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ మే 24 వరకు జరగనుంది. View this post on Instagram A post shared by Uorfi (@urf7i) -
కాపీ కొట్టావ్.. చిలుక బ్యాగ్, ఊర్వశీ రౌతేలా లుక్పై ట్రోలింగ్!
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్కి క్రమం తప్పకుండా హాజరయ్యే హీరోయిన్లలో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా(Urvashi Rautela) ఒకరు. ప్రతి ఏడాది మాదిరే ఈసారి కూడా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్(Cannes 2025) ప్రారంభమైన తొలి రోజే సందడి చేసింది ఈ అందాల తార. మల్టీ కలర్ పొడవాటి గౌనుతో పాటు జుడిత్ లీబర్ డిజైన్ చేసిన చిలుక ఆకారంలోని క్రిస్టల్ ఎంబెడెడ్ క్లచ్ బ్యాగ్ను ధరించి..రెడ్ కార్పెట్పై హొలలొలికించింది. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. కొంతమంది నెటిజన్స్ ఊర్వశీ లుక్పై విమర్శలు చేస్తున్నారు. ఐశ్వర్యరాయ్ లుక్ని కాపీ కొట్టిందంటూ ఆమె లుక్ని ట్రోల్ చేస్తున్నారు. 2018లో ఐశ్వర్యరాయ్ కూడా ఇలాంటి డ్రెస్నే ధరించి కేన్స్ ఫెస్టివల్కు హాజరైయిందని, అంత కరిష్మా లేకున్నా ఊర్శశీ కూడా ఆమెను అనుకరించిందని కామెంట్ చేస్తున్నారు. మరికొందరు ఆమె ధరించిన డ్రెస్ అతిగా, విచిత్రంగా ఉందని, మేకప్ ఎక్కువైందని ట్రోల్ చేస్తున్నారు.కేన్స్ ఫెస్టివల్ కోసం నిర్వాహకులు ప్రవేశపెట్టిన డ్రెస్ కోడ్ రూల్స్లో అతిగా బహిర్గతమయ్యే దుస్తులను ధరించరాదని చెప్పినప్పటికీ, ఊర్వశీ లుక్ ఈ సరిహద్దులను పరీక్షించినట్లు కనిపించింది. ఆమె ధరించిన డ్రెస్ కంటే.. చేతిలో ఉన్న చిలుక బ్యాగ్ అందరిని ఆకట్టుకుంది. దీని ధర సుమారు రూ.4 లక్షలు ఉంటుందట. గతంలో కూడా ఊర్వశీ ఇలా ఖరీదైన వస్తువులను, అభరణాలను ఫిల్మ్ పెస్టివల్లో ప్రదర్శించింది. 2023లో జరిగిన ఫిల్మ్ ఫెస్టివల్కి రూ. 276 కోట్ల విలువ చేసే మొసలి నెక్లెస్ని ధరించింది. అప్పట్లో ఈ నెక్లెస్పై కూడా విమర్శలు వచ్చాయి. -
వారికి ఆ ధైర్యం లేదు.. అందుకే సందీప్ రెడ్డి వంగాను టార్గెట్ చేశారు: వివేక్ అగ్నిహోత్రి
ది కశ్మీర్ ఫైల్స్ మూవీతో పాన్ ఇండియాలో క్రేజ్ తెచ్చుకున్న డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి. కశ్మీర్ పండిట్ల నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా బ్లాక్బస్టర్ హిట్గా నిలిచింది. ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్ కీలక పాత్రలో నటించారు. ఈ సినిమాతో వివేక్ దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన వివేక్ అగ్నిహోత్రి బాలీవుడ్ దర్శకులను ఉద్దేశించి కామెంట్స్ చేశారు. ముఖ్యంగా యానిమల్ మూవీ దర్శకుడిపై విమర్శలు చేయడాన్ని ఆయన ప్రస్తావించారు. సినిమా విషయంలో సందీప్ రెడ్డి వంగాను మాత్రమే టార్గెట్ చేశారని.. రణ్బీర్ కపూర్ను విమర్శించే ధైర్యం బాలీవుడ్లో ఏ డైరెక్టర్కు లేదని అన్నారు.వివేక్ అగ్నిహోత్రి మాట్లాడుతూ..'యానిమల్ విషయంలో సందీప్ రెడ్డి వంగాను మాత్రమే టార్గెట్ చేశారు. ఎందుకంటే రణ్బీర్ కపూర్ను విమర్శించే ధైర్యం ఎవరికీ లేదు. ఇండస్ట్రీలో అతను చాలా పవర్ఫుల్. అందుకే అతన్ని విమర్శించడానికి ఎవరూ లేరు. వారికి అంత ధైర్యం ఉంటే ప్రయత్నించి చూడమనండి.బాలీవుడ్లో చాలా మంది దర్శకులు హీరోల గురించి కేవలం వారి వెనుక మాత్రమే మాట్లాడుతారు. వారికి బహిరంగంగా ఏదైనా చెప్పే ధైర్యం కూడా వారు చేయరు. కాబట్టి వారు ఇబ్బంది పడక తప్పదు. అలాంటి ఎంత నీచంగా నటించినా రూ.150 కోట్లు ఇస్తారు. 51 ఏళ్ల నటులు తమంతట తాము నిజమైన స్టార్లు అయితే ఎంత సంపాదించినా తనకు అభ్యంతరం లేదు.నా సమస్య ఏమిటంటే స్టార్డమ్ లేకున్నా స్టార్లలా ప్రవర్తించే వ్యక్తులతోనే. అలా చలామణి అయ్యే వారంటే నాకు నచ్చదు' అని అన్నారు.కాగా.. అంతకుముందు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా 'యానిమల్పై విమర్శలపై స్పందించారు. అందరు విమర్శకులు తననే టార్గెట్ చేశారని అన్నారు. మరోవైపు రణ్బీర్ కపూర్ ప్రశంసలు అందుకున్నారని తెలిపారు. ఎందుకంటే వారంతా రణ్బీర్తో కలిసి పనిచేయాలనుకుంటున్నారని నాకు అర్థమైందని సందీప్ వంగా వెల్లడించారు. నేను బాలీవుడ్ కొత్త కావడం నాపై విమర్శలు చేయడం వారికి సులభమని అన్నారు. -
మోనాలిసాకు మరో ఛాన్స్.. ఈసారి స్పెషల్ సాంగ్
ఇప్పుడంతా సోషల్ మీడియా జమానా. ఎవరు ఎందుకు ఎప్పుడు ఫేమస్ అవుతారో అస్సలు చెప్పలేం. ఊరగాయలు అమ్మినా ఫేమస్ అవ్వొచ్చు. పూసలు అమ్మినా సరే ఫేమస్ అయిపోవచ్చు. అలానే కొన్నాళ్లక్రితం జరిగిన కుంభమేళాలో పూసలమ్ముతూ వైరల్ అయిపోయిన మోనాలిసా ఇప్పుడు మరో అవకాశం అందుకుంది.(ఇదీ చదవండి: 'పెద్ది'... ఈసారి రాసి పెట్టుకోండి: రామ్ చరణ్) మోనాలిసాకు ఇదివరకే ఓ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ దక్కింది. ఆ ప్రాజెక్ట్ ఎంతవరకు వచ్చిందో తెలీదు గానీ ఇప్పుడు మరో ఛాన్స్ పట్టేసింది. ఉత్కర్ష్ సింగ్ అనే నటుడు తీసిన ఓ స్పెషల్ సాంగ్ కోసం మోనాలిసాని తీసుకున్నాడు. తాజాగా షూటింగ్ కూడా పూర్తయింది. త్వరలోనే ఈ పాటని యూట్యూబ్ లో రిలీజ్ చేయనున్నారు.సినిమా ఛాన్సుల మాటేమో గానీ కుంభమేళాలో పూసలమ్మే టైంకి.. ఇప్పటికీ చాలా మారిపోయింది. మోనాలిసా ఎప్పుడు కనిపించినా మేకప్ తోనే కనిపిస్తోంది. త్వరలో ఈమె నటించిన సాంగ్ రిలీజ్ అవుతుంది. అప్పుడు ఈమె సంగతేంటో జనాలకు ఓ క్లారిటీ వచ్చేస్తుంది. (ఇదీ చదవండి: 6 నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా) View this post on Instagram A post shared by Utkarsh Singh (@utkarshsinghofficial_) -
జా.ఎన్టీయార్, హృతిక్ల వార్2 వసూళ్లు.. రూ.100కోట్లు..
బాలీవుడ్ సూపర్స్టార్ హృతిక్ రోషన్(Hrithik Roshan), టాలీవుడ్ యంగ్ టైగర్, స్టార్ హీరో ఎన్టీఆర్(Jr NTR) జంటగా నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘వార్ 2‘(War 2) విడుదల కాకముందే సంచలనాలు నమోదు చేయడం మొదలైంది. హృతిక్, ఎన్టీయార్ ల అనూహ్య కాంబినేషన్తో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ మొదలైన నాటి నుంచే సంచలనంగా మారింది. ఈ చిత్రం ద్వారా హృతిక్ రోషన్ మళ్లీ తన స్పై క్యారెక్టర్ ’కబీర్’గానే స్క్రీన్ మీదకి రానుండగా, మొదటి సారిగా ఎన్టీఆర్ విలన్ పాత్రలో కనిపించనున్నాడని తెలియడం మరింత ఆసక్తిని పెంచింది. ఉత్తరాది, దక్షిణాదికి చెందిన ఇద్దరు అగ్రహీరోలు పరస్పరం తెరపై తలపడడం గురించి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కియారా అడ్వానీ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా, దేశవ్యాప్తంగా మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగానూ బాలీవుడ్, టాలీవుడ్ సినీ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, ‘వార్ 2‘ పాన్ ఇండియా స్థాయిలో భారీ హైప్ను సొంతం చేసుకుంది. ప్రస్తుతానికి దక్షిణాది వ్యాప్తంగా ఈ సినిమా హైప్కి ప్రధాన కారణం జూ.ఎన్టీఆర్ కి ఇటీవలి కాలంలో అమాంతం పెరిగిన క్రేజ్ అనేది నిస్సందేహం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎన్టీఆర్ హవా ఇటీవల రెట్టింపైంది. ఆర్ఆర్ఆర్, దేవర...ఇలా వరుసగా బాక్సాఫీస్ దగ్గర వరుస విజయాలను తన ఖాతాలో వేసుకుంటూ వస్తున్న ఎన్టీఆర్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తుండడమే సినిమా రైట్స్ కోసం టాలీవుడ్ నిర్మాతలు ఎగబడడానికి కారణంగా చెప్పొచ్చు. ఈ నేపధ్యంలో విడుదలకి ముందే ప్రాంతీయ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ అమ్ముడైపోవడం ఓ రికార్డ్గా చెప్పాలి. తద్వారా ఈ సినిమా భారత మూవీ మార్కెట్లో ఓ కొత్త ట్రెండ్కి కొబ్బరికాయ కొట్టినట్టయింది. భాషా అంతరాలను దాటి స్టార్ హిరోల క్రేజ్, మల్టీ లాంగ్వేజ్ సినిమాలకి పెరిగిన ఆదరణ కారణంగా ఇటువంటి డీల్స్ ముందుగానే ఖరారవడం ఇక షురూ కావచ్చు. ఈ సినిమా ప్రాంతీయ హక్కుల కోసం ఎదురైన గట్టి పోటీని తట్టుకుని చివరికి ప్రముఖ నిర్మాతలు నాగా వంశీ, సునీల్ నారంగ్ ఈ లాభదాయకమైన డీల్ను చేజిక్కించుకున్నారు. విడుదలకి మూడేళ్లు ముందే ఈ చిత్రం తెలుగు థియేట్రికల్ హక్కులు రూ. 85–100 కోట్ల మధ్య ధరల్లో అమ్ముడైపోయాయని వార్తలు వస్తున్నాయి. వీటన్నింటి నేపధ్యంలో ఆగస్టు 14, 2025న విడుదల కానున్న ఈ సినిమాపై తెలుగు రాష్ట్రాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. -
మళ్లీ రీమేక్ నే నమ్ముకున్న ఆమిర్.. మక్కీకి మక్కీ.. ట్రైలర్ రిలీజ్
బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ ని మిస్టర్ ఫెర్ఫక్షనిస్ట్ అంటారు. కానీ 'దంగల్' వరకు ఓకే కానీ ఆ తర్వాత ఇతడికి దురదృష్టం మొదలైంది. ఏ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర నిలబడలేదు. ఘోరమైన డిజాస్టర్స్ అయ్యాయి. దీంతో దాదాపు మూడేళ్ల పాటు సినిమాలే చేయని ఆమిర్.. కొత్త మూవీతో ప్రేక్షకుల్ని పలకరించేందుకు సిద్ధమయ్యాడు. ఈ మేరకు ట్రైలర్ రిలీజ్ చేశారు.'సితారే జమీన్ పర్' టైటిల్ తో తీసిన ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే.. ఇది 2023లో రిలీజైన 'ఛాంపియన్స్' అనే మూవీకి రీమేక్ అని క్లారిటీ వచ్చేసింది. కొన్ని సీన్లయితే మక్కీకి మక్కీ దింపేశారు. ఇదే విషయాన్ని కొందరు నెటిజన్లు వీడియోలు పోస్ట్ చేసి మరీ చెబుతున్నారు. మరోవైపు ఎప్పటిలానే ఆమిర్ సినిమాపై ట్రోలింగ్ షురూ అయింది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి మరింత లేటుగా రీసెంట్ హిట్ సినిమా) 'సితారే జమీన్ పర్' విషయానికొస్తే.. షార్ట్ టెంపర్ ఉండే ఓ కోచ్ అనుకోని కారణాల వల్ల కోర్ట్ మెట్లు ఎక్కాల్సి వస్తుంది. దీంతో సదరు జడ్జి ఊహించని తీర్పు ఇస్తారు. మతిస్థిమితం లేని కొందరిని టీమ్ గా చేసి బాస్కెట్ బాల్ నేర్పించమని చెబుతారు. తర్వాత సదరు కోచ్ ఏం తెలుసుకున్నాడు? చివరకు ఏమైందనేదే స్టోరీ.మంగళవారం రాత్రి ట్రైలర్ రిలీజ్.. అప్పుడే ఆమిర్ ఖాన్ పై ట్రోలింగ్ మొదలైంది. టర్కీ ఫస్ట్ లేడీని గతంలో ఇతడి కలిశాడని, అందుకే సినిమాని బహిష్కరించాలని కొందరు నెటిజన్లు అంటున్నారు. మరి ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏం చేస్తుందో చూడాలి?(ఇదీ చదవండి: శుభవార్త చెప్పిన సుడిగాలి సుధీర్ తమ్ముడు) #SitareZameenPartrailer देखो मिस्टर परफेक्ट ने कैसे पर्फेक्ट्ली फ्रेम टू फ्रेम कॉपी मारी है 😃😃😃🕋🕋🕋I can’t imagine how much they have made a fool of Bollywood lovers in the Past #AmirKhan #Champions pic.twitter.com/ZeKtJoLQve— Ex Shia Muslim News (@ExShiaMuslim) May 13, 2025 -
ధైర్యమే కాదు... అంతులేని త్యాగం కూడా...
కశ్మీర్లోని పహల్గాంలో ఇటీవల జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో ఇండియన్ ఆర్మీ.. పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై దాడులు చేసింది. ఈ దాడుల్లో పలువురు ఉగ్రవాదులు హతమయ్యారు. అయితే ఆ తర్వాత ఇరు దేశాలు కాల్పుల విరమణ ఒప్పందం చేసుకోవడం తెలిసిందే. కాగాపాక్ కుట్రలను దీటుగా ఎదుర్కొన్న ఇండియన్ ఆర్మీపై ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు ప్రశంసలు కురిపించారు.తాజాగా హీరోయిన్ ఆలియా భట్ కూడా ఇండియన్ ఆర్మీపై, సైనికుల మాతృమూర్తులపై ప్రశంసలు కురిపించారు. ఈ మేరకు ఆమె తన ఇన్స్టాగ్రామ్లో ఓ భావోద్వేగమైనపోస్ట్ పెట్టారు. ‘‘గత కొన్ని రాత్రులు భిన్నంగా అనిపించాయి. ఒక దేశం ఊపిరి బిగబట్టినప్పుడు గాలిలో ఒక విధమైన నిశ్శబ్దం ఉంటుంది. కొద్ది రోజులుగా మనం ఆ నిశ్శబ్దాన్ని అనుభవించాం. మనం ఇళ్లలో హాయిగా నిద్రపోతున్నామంటే బోర్డర్లో ఉన్న సైనికులు చీకటిలో నిలబడి, తమ ప్రాణాలను అడ్డుగా పెట్టి మన నిద్రను కాపాడుతున్నారు.ఆదివారం మనమంతా మదర్స్ డేను సంతోషంగా చేసుకున్నాం. ఆ సమయంలో దేశ రక్షణ కోసం హీరోలను పెంచిన తల్లుల గురించి ఆలోచించకుండా ఉండలేకపోయా. వారిది కేవలం ధైర్యం మాత్రమే కాదు... అంతులేని త్యాగం కూడా. ఈ ప్రతి యూనిఫామ్ వెనుక నిద్రపోని ఒక తల్లి కూడా ఉంటుంది. తన బిడ్డకు ఏ రాత్రీ జోలపాటలా ఉండదని ఆ తల్లికి తెలుసు. ప్రాణాలు కోల్పోయిన సైనికులను తలచుకుని మనం దుఃఖిస్తున్నాము.అనిశ్చితి... ఒత్తిడితో కూడిన ఆ నిశ్శబ్దం ఏ క్షణమైనా బద్దలు కావొచ్చు. కానీ... ప్రతి రాత్రి ఉద్రిక్తతలు లేని ప్రశాంతతను కోరుకుంటున్నాం. ప్రార్థనలు చేస్తూ, కన్నీళ్లు దిగమింగుకుంటున్న ప్రతి తల్లిదండ్రులకు ప్రేమను పంపుతున్నాం... ఎందుకంటే మీ బలం ఈ దేశాన్ని మీరు ఊహించినదానికంటే ఎక్కువగా కదిలిస్తుంది. మన రక్షకుల కోసం, భారతదేశం కోసం కలిసి నిలబడదాం.. ‘జైహింద్’’ అంటూపోస్ట్ చేశారు ఆలియా భట్. -
'కరాటే కిడ్' కోసం తండ్రికొడుకు సాయం
హాలీవుడ్ క్లాసిక్ సిరీస్కు చెందిన 'కరాటే కిడ్: లెజెండ్స్' ఇప్పుడు సరికొత్తగా భారతీయ ప్రేక్షకులని పలకరించబోతోంది. బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్, కొడుకు యుగ్ కలిసి ఈ చిత్ర హిందీ డబ్బింగ్ వెర్షన్ కోసం పనిచేశారు.(ఇదీ చదవండి: తిరుమల శ్రీవారికి అవమానం? వివాదంపై స్పందించిన హీరో) జాకీ చాన్ మిస్టర్ హాన్ పాత్రకు అజయ్ దేవగన్ గొంతు అందించగా, బెన్ వాంగ్ పోషించిన లీ ఫాంగ్ పాత్రకు యుగ్ డబ్బింగ్ చెప్పాడు. తొలిసారి ఇంటర్నేషనల్ సినిమాకు వాయిస్ ఇవ్వడం అజయ్ దేవగన్కి ఇదే తొలిసారి.సినిమా కథలో గురువు-శిష్య బంధం ప్రధానాంశంగా ఉండగా, ఆ బంధం వెనుక నిజ జీవిత తండ్రీ-కొడుకుల కెమిస్ట్రీ ఉండడం ఈ వెర్షన్కు స్పెషల్ టచ్ ఇస్తోంది. 'కరాటే కిడ్: లెజెండ్స్' సినిమా మే 30న రిలీజ్ అవుతోంది. దేశవ్యాప్తంగా ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి తమిళ కామెడీ థ్రిల్లర్.. తెలుగులో నేరుగా రిలీజ్) View this post on Instagram A post shared by Sony Pictures IN (@sonypicturesin) -
76 ఏళ్ల వయసులో 56 ఏళ్ల తరువాత కేన్స్లో అరంగేట్రం..అస్సలు ఊహించలేదు
2025 లో కేన్స్ ఫిలిం ఫెస్టివల్ (2025 Cannes Film Festival)లో అరంగేట్రం చేసేందుకు అలనాటి అందాల సుందరి సిద్ధమవుతోంది. ఆమె మరెవ్వరో కాదు ప్రఖ్యాత నటి, దర్శకురాలు, నిర్మాత, టాక్ షో హోస్ట్ సిమీ గరేవాల్ (Simi Garewal). అద్భుతమైన నటనతో బాలీవుడ్లో పాపులర్ నటిగా కొనసాగింది. దో బదన్, రాజ్ కపూర్తో మేరా నామ్ జోకర్, అరణ్యర్ దిన్ రాత్రి, పదాతిక్ వంటి చిత్రాలలో తన నటనా నైపుణ్యానికి ప్రశంసలందుకుంది. అంతేకాదు రెండెజౌస్ విత్ సిమి గరేవాల్, సిమి సెలెక్ట్స్ ఇండియాస్ మోస్ట్ డిజైరబుల్, ఇట్స్ ఎ ఉమెన్స్ వరల్డ్ వంటి కార్యక్రమాలకు హోస్ట్గా కూడా తన ప్రత్యేకతను చాటుకుంది.తాజాగా ఈ అందాల సుందరి సిమీ గరేవాల్ తనకెంతో ఇష్టమైనతెల్లని దుస్తుల్లో మెరిసేందుకు సిద్ధమవుతోంది. 2025 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో అరంగేట్రం చేయనుంది. ఈ విషయాన్ని ఇన్స్టాలో సిమీ ప్రకటించింది. దీంతో ఫ్యాన్స్ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో సిమీ సందడినిచూసేందుకు ఎదురు చూస్తున్నారు.‘‘56 సంవత్సరాల తరువాత ఈ సినిమా నన్ను కేన్స్లో రెడ్ కార్పెట్పైకి తీసుకెళ్తుందని నేను ఎప్పుడూ ఊహించలేదు. నేను చాలా ధన్యురాల్ని’’ అంటూ ఇన్స్టా పోస్ట్లో సంతోషం వెలిబుచ్చారు.ఇక్కడ సిమి నటించిన, లెజెండరీ ఫిల్మ్ మేకర్ సత్యజిత్ రే 'అరణ్యర్ దిన్ రాత్రి' అప్డేటెడ్ వెర్షన్ ప్రదర్శించనున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆమె రెడ్ కార్పెట్ పై నడవనుంది. తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో, సిమీ గరేవాల్ రెడ్ కార్పెట్పై తాను ధరించబోయే దుస్తుల వీడియోను పోస్ట్ చేసింది. కార్లియో ఫ్యాషన్ బ్రాండ్ నుండి దుస్తులను పరిశీలిస్తున్న క్లిప్ను షేర్ చేసింది. నటి తెల్లటి టోన్డ్ షర్ట్ , ప్యాంటులో చాలా అందంగా, సింపుల్ మృదువైన మేకప్, కళ్ళజోడు, ఓపెన్ హెయిర్ ఆమె లుక్కు మరింత సొబగులద్దాయి. ఈ లుక్ చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఈ డ్రెస్లో అద్భుతంగా కనిపిస్తారని తెలుసు.", "ఆ అందమైన తెల్లని గౌనుకు మరెవరూ న్యాయం చేయలేరు." "మీరు గ్రేస్ బ్యూటీ & డిగ్నిటీకి నిదర్వనం. అంటూ ఫ్యాన్స్ ఆమెకు శుభాకాంక్షలు అందించారు.చదవండి: తల్లిని పోగొట్టుకున్న రెండేళ్ల చిన్నారితో..ఎంత కష్టం : డెలివరీ ఏజెంట్ స్టోరీ1970 నాటి బాలీవుడ్ 'అరణ్యర్ దిన్ రాత్రి’ చిత్రాన్ని వెస్ ఆండర్సన్ , మార్టిన్ స్కోర్సెస్ అప్డేట్ వెర్షన్గా తీసుకొచ్చారు. ఈ 4K వెర్షన్ను కేన్స్ 2025 ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించనున్నట్లు ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్ గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. సునీల్ గంగోపాధ్యాయ రాసిన నవల ఆధారంగా సత్యజిత్ రే 1970లో నిర్మించిన అడ్వెంచర్ డ్రామా చిత్రం. ఈ చిత్రం 20వ బెర్లిన్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ఉత్తమ చిత్రంగా గోల్డెన్ బేర్కు నామినేట్ అయింది.ఈ చిత్రంలో సిమీగరేవాల్, సౌమిత్ర ఛటర్జీ, షర్మిలా ఠాగూర్ , రబీ ఘోష్ కీలక పాత్రల్లో నటించారు.చదవండి: కదులుతున్న కారుపై కొత్త జంట విన్యాసాలు, వైరల్ వీడియో -
కంఫర్ట్గానే అనిపించింది.. అందుకే ఆ సీన్స్లో నటించా: హీరోయిన్
ఈ మధ్య సినిమాల్లో రొమాన్స్ ఎక్కువైపోయింది. ముద్దు సీన్స్ లేని సినిమాలు చాలా అరుదుగా వస్తున్నాయి. ఇక వెబ్ సిరీస్లలో అయితే మోతాదుకు మించిన రొమాన్స్ చూపిస్తున్నారు. హీరోయిన్లు కూడా అలాంటి సన్నివేశాలకు నో చెప్పడం లేదు. కథ డిమాండ్ చేస్తే ఎలాంటి సన్నివేశాలు అయినా చేయడానికి రెడీ అంటూ ఓపెన్గానే చెప్పేస్తున్నారు. అంతేకాదు అలాంటి సన్నివేశాలు వివాదస్పదంగా మారితే..వాటిని సమర్థిస్తూ చిత్రబృందానికి సపోర్ట్గా నిలుస్తున్నారు.తాజాగా బాలీవుడ్ బ్యూటీ భూమి పెడ్నేకర్(Bhumi Pednekar) కూడా అదే పని చేశారు. ఆమె నటించిన ‘ది రాయల్స్’(The Royals ) వెబ్ సిరీస్ ఇటీవల నెట్ఫ్లిక్స్లో విడుదలైన సంగతి తెలిసిందే. అందులో హీరో ఇషాన్(Ishaan Khatter), భూమిల మధ్య పలు రొమాంటిక్ సన్నివేశాలు ఉన్నాయి. ఇషాన్ వయసులో తనకంటే ఆరేళ్లు చిన్నవాడైనా.. ఇంటిమేట్ సీన్స్ చేసింది. దీంతో పలువురు నెటిజన్స్ భూమి పెడ్నేకర్ని విమర్శిస్తూ నెగెటివ్ కామెంట్ చేశారు. ఆ సన్నివేశాలకు సంబంధించిన క్లిప్పులను పోస్ట్ చేస్తూ ఆమెను ట్రోల్ చేశారు.తాజాగా ఈ సన్నివేశాలపై భూమి ఫెడ్నేకర్ స్పందించింది. ‘వయసులో చిన్నవాడు అయితే ఏంటి? తనతో కంఫర్ట్గా అనిపించింది కాబట్టే..ఆన్స్క్రీన్ రొమాన్స్ చేశాను’ అని చెప్పుకొచ్చింది. ‘ఇంటిమేట్ సీన్స్ చేయడం అంత ఈజీ కాదు. అలాంటి సన్నివేశాల్లో ఇమిడిపోయి నటించాలి. ఇద్దరికి కంఫర్ట్గా లేకపోతే ఆ సీన్ ఫేక్గా ఉంటుంది. అందుకే షూటింగ్కి ముందే మేం వర్క్షాప్ చేశాం. ఒకరి గురించి ఒకరం తెసుకున్నాం. ఇద్దరం బాగా క్లోజ్ అయిన తర్వాతే ఆ సీన్స్లో నటించాం. నాకు కంఫర్ట్గా అనిపించింది కాబట్టే అతనితో ఆన్స్క్రీన్ రొమాన్స్ చేశా’ అని భూమి చెప్పుకొచ్చింది. ఆమె వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.ది రాయల్స్ వెబ్ సిరీస్ విషయానికొస్తే.. ఇదొక రొమాంటిక్ కామెడీ వెబ్సిరీస్. ఇషాన్ ఖట్టర్, భూమి పెడ్నేకర్, జీనత్ అమన్, నోరా ఫతేహి కీలక పాత్రల్లో నటించారు. మోర్పూర్ రాయల్ కుటుంబం చుట్టే తిరిగే కథ ఇది. మే 9 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. -
'మీ త్యాగం మరువలేనిది'.. ఆలియా భట్ ఎమోషనల్ పోస్ట్!
బాలీవుడ్ భామ ఆలియా భట్ మన సైన్యం సేవలను గుర్తు చేసుకుంది. మదర్స్ డే సందర్భంగా దేశానికి సేవ చేస్తున్న సైనికుల మాతృమూర్తులపై ప్రశంసలు కురిపించింది. తమ హీరోలను దేశానికి అందించి.. ప్రతి క్షణ నిశ్శబ్దంగా తమ బిడ్డకోసం కలవరపడుతూనే ఉంటారని సోషల్ మీడియాలో షేర్ చేసింది. సైనికులు, వారి మాతృమూర్తుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. మాతృ దినోత్సవం సందర్భంగా సైనికుల తల్లులను తలచుకుని భావోద్వేగానికి గురైంది.ఆలియా భట్ తన నోట్లో రాస్తూ.. "గత కొన్ని రాత్రులు భిన్నంగా అనిపించాయి. ఎక్కడా చూసినా నిశ్శబ్దమే వినిపించింది. గత కొన్ని రోజులుగా మేము ఆ నిశ్శబ్దాన్ని అనుభవించాం. ఆ నిశ్శబ్దం, ఆందోళన చుట్టూ మోగుతున్న ఉద్రిక్తత.. ఎక్కడో, పర్వతాలలో మన సైనికులు మేల్కొని అప్రమత్తంగా ఉంటూ ప్రమాదంలో ఉన్నారనే బాధను మేము అనుభవించాం. ఆదివారం మనమంతా మదర్స్ డేను సంతోషంగా జరుపుకున్నాం. అందుకే ఈ రోజు మన దేశ రక్షణ కోసం హీరోలను పెంచిన తల్లుల గురించి ఆలోచించకుండా ఉండలేకపోయా. అంతులేని త్యాగం, ప్రతి సైనికుడి యూనిఫామ్ వెనక నిద్ర లేని రాత్రులు గడిపే ఆ వీరుడి తల్లి ఉంటుంది. తన బిడ్డకు ఏ రాత్రి కూడా ప్రశాంతంగా ఉండదని ఆ అమ్మకు తెలుసు. ఒత్తిడితో కూడిన ఆ నిశ్శబ్దం ఏ క్షణమైనా బద్దలవ్వొచ్చు. కానీ సైనికుల తల్లిదండ్రుల ధైర్యం ఈ దేశాన్ని ఎంతగానో కదిలిస్తోంది. కన్నీళ్లను ఆపుకుంటూ అక్కడ ఉన్న ప్రతి తల్లిదండ్రులకు మన ప్రేమను పంపండి. మీ బాధను పంటి బిగువున నొక్కిపెట్టిన వారికి ప్రతిక్షణం అండగా ఉంటాం. మీ కోసం మేమంతా కలిసి నిలబడతాము. మన రక్షకుల కోసం.. భారతదేశం కోసం.. జై హింద్' అంటూ పోస్ట్ చేసింది.కాగా.. ఇటీవల పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఇండియా సైతం పాకిస్తాన్పై దాడులు చేసింది. దాదాపు వందమందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టింది. ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్లో ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేసింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆపరేషన్ సిందూర్కు ప్రముఖులు సైతం తమ మద్దతును ప్రకటించారు. View this post on Instagram A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt) -
కేంద్రం అంటే బాలీవుడ్కు భయం.. అందుకే నోరెత్తరు: రచయిత
హిందీ చిత్ర పరిశ్రమ గురించి బాలీవుడ్ ప్రముఖ గేయ రచయిత జావేద్ అఖ్తర్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం అంటే బాలీవుడ్కు భయం అని ఆయన అన్నారు. అందుకే ఎవరు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడేందుకు సాహసం చేయరని ఆయన తెలిపారు. ఒకవేళ ఎవరైన తెగించి విమర్శలు చేస్తే.. దర్యాప్తు సంస్థల నుంచి వేధింపులు ఎదుర్కోవాల్సి ఉంటుందనే అభద్రతాభావం బాలీవుడ్ హీరోలలో ఉందని అభిప్రాయపడ్డారు. ఈడీ, సీబీఐ దాడుల భయమే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడకుండా నిరోధిస్తుందని ఆయన అన్నారు. ఒక యూట్యూబ్ ఛానల్ వేదికగా సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్తో జరిగిన చర్చ సందర్భంగా జావేద్ అఖ్తర్ ఈ వ్యాఖ్యలు చేశారు.'బాలీవుడ్ తారలు గొప్ప పేరు ప్రఖ్యాతులతో విలాసవంతమైన జీవితాల్ని గడుపుతారు. కానీ, ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకునే విషయాల్లో వారు కూడా సామాన్యుల తరహాలోనే ఆలోచిస్తారు. ఈ బడా హీరోలను వెనక నుంచి నడిపించేది మొత్తం పారిశ్రామికవేత్తలే. ఎట్టిపరిస్థితిల్లోనూ వారితో పోరాడేంత పెద్దవారు కాదు ఈ సినీ తారలు. ఈ క్రమంలోనే వారి వైఖరిపై పలుమార్లు విమర్శలు వచ్చాయి. అదే హాలీవుడ్ నటులు అమెరికా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్భయంగా తమ భావాల్ని వ్యక్తం చేస్తారు. తాజాగా అమెరికన్ నటి మెర్లీ స్ట్రీప్ అక్కడి ప్రభుత్వాన్ని విమర్శించినా ఆమెకు ఎలాంటి వేధింపులు ఎదురుకాలేదు. అలాంటి వ్యాఖ్యలు ఇక్కడి ప్రభుత్వంపై చేస్తే ఈడీ, సీబీఐ దాడుల పేరుతో రంగంలోకి దిగుతారు. ఆ భయంతోనే బాలీవుడ్ చిత్రపరిశ్రమ ప్రభుత్వాన్ని ప్రశ్నించదు.' అని ఆయన జావేద్ అఖ్తర్ వ్యాఖ్యనించారు. అయితే, ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు తాను నిరంతరం సోషల్మీడియాలో ట్రోలింగ్ను ఎదుర్కొంటున్నానని జావేద్ అన్నారు. ఓ పౌరుడిగా సమస్యలపై స్పందించడం తన ధర్మమని ఆయన పేర్కొన్నారు.జావేద్ అఖ్తర్ ప్రతిభా వంతమయిన కవి, వక్త, స్క్రీన్ ప్లే రచయిత. సూటిగా తన భావాల్ని ఎలాంటి వెరపూ, బెదురూ లేకుండా ప్రకటిస్తున్న సామాజిక గొంతుక ఆయనది. ఇవ్వాళ మన దేశంలో అత్యంత ప్రభావవంతమైన స్వతంత్ర లౌకిక స్వరం, జావేద్ అఖ్తర్. భావుకుడు, ప్రగతిశీల వాది అయిన జావేద్ అఖ్తర్ ఏడు తరాల సాహిత్య చైతన్యమున్న కుటుంబంలో జన్మించారు. తన కవిత్వం మత తత్వానికి, సామాజిక అన్యాయాలకు వ్యతిరేకంగా రాశారు. జాతీయ సమైక్యత, స్త్రీల హక్కుల కోసం మాట్లా డారు, రాశారు. తప్పు దోవ పట్టిన యువతను ద్దేశించి జావేద్ రాసిన గీతాన్ని 1995లో కేంద్ర మానవ వనరుల శాఖ యువతకోసం ‘జాతీయ గీతం’గా ప్రకటించింది. -
ఓటీటీల్లో వెబ్ సిరీస్లు.. మోస్ట్ అవైటేడ్ ఇవే!
ఓటీటీలు వచ్చాక సినిమాలు, వెబ్ సిరీస్లకు కొదవే లేదు. థియేటర్లలో రిలీజైన నెలలోపే కొత్త సినిమాలు సందడి చేస్తున్నాయి. ఇకపోతే వెబ్ సిరీస్లు సైతం ఓటీటీ ప్రియులను అలరిస్తూనే ఉన్నాయి. మిస్టరీ, క్రైమ్ సిరీస్లతో పాటు కామెడీ వెబ్ సిరీస్లు సైతం వచ్చేస్తున్నాయి. ముఖ్యంగా బాలీవుడ్లో వెబ్ సిరీస్లకు ఫుల్ డిమాండ్ ఉంది. అందుకే వరుస సీజన్లతో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. గతేడాది మెప్పించిన సిరీస్లు.. కొత్త ఏడాదిలోనూ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. వాటిలో ప్రేక్షకుల ఆదరణ దక్కించుకున్న వాటిపై మనం ఓ లుక్కేద్దాం పదండి.రానా నాయుడు సీజన్-2..విక్టరీ వెంకటేశ్, రానా దగ్గుబాటి నటించిన డార్క్ కామెడీ వెబ్ సిరీస్ రానా నాయుడు. గతంలో విడుదలైన ఈ సిరీస్ సూపర్ హిట్గా నిలిచింది. ఈ వెబ్ సిరీస్కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ వెబ్ సిరీస్కు కరణ్ అన్షుమాన్, సుపర్ణ్ ఎస్.వర్మ దర్శకత్వం వహించారు. ఇందులో వెంకటేశ్ నాగ నాయుడు (తండ్రి), రానా.. రానా నాయుడు (కొడుకు) పాత్రలు పోషించారు. సుందర్ ఆరోన్, లోకోమోటివ్ గ్లోబల్ నిర్మించిన ఈ వెబ్ సిరీస్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అయిన సంగతి తెలిసిందే. రానా నాయుడు సీజన్-2 త్వరలోనే నెట్ఫ్లిక్స్లో ప్రసారం కానుంది.పంచాయత్ సీజన్-4..పంచాయత్ వెబ్ సిరీస్కు ఆడియన్స్లో విపరీతమైన క్రేజ్ను సొంతం చేసుకుంది. జితేంద్ర కుమార్, నీనా గుప్తా ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ సిరీస్ ఇప్పటికే మూడూ సీజన్స్ పూర్తి చేసుకుంది. తాజాగా ఈ ఏడాది పంచాయత్ సీజన్ 4 కూడా స్ట్రీమింగ్కు వస్తోంది. జూలై 2వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్లో అందుబాటులోకి రానుంది.ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్-3బాలీవుడ్లో అభిమానుల క్రేజ్ దక్కించుకున్న మరో వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్. మనోజ్ భాజ్పేయి కీలక పాత్రలో వచ్చిన ఈ సిరీస్ ఇప్పటికే రెండు సీజన్స్ సూపర్ హిట్గా నిలిచాయి. ఈ నేపథ్యంలోనే మూడో సీజన్ కూడా అలరించేందుకు వస్తోంది. ఈ సంవత్సరం నవంబర్లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.అసుర్ సీజన్-3..మరో బాలీవుడ్ క్రైమ్ థ్రిల్లర్ అసుర్ మూడవ సీజన్ కూడా వస్తోంది. అర్షద్ వార్సీ, బరున్ సోబ్తి, అనుప్రియ గోయెంకా నటించిన ఈ సిరీస్ ఈ ఏడాది చివర్లో ప్రముఖ ఓటీటీ జియో హాట్స్టార్లో ప్రసారం కానుంది.మిర్జాపూర్ సీజన్- 4..మరో సూపర్ హిట్ వెబ్ సిరీస్ మీర్జాపూర్. ఇప్పటికే మూడు సీజన్స్ హిట్కాగా.. మీర్జాపూర్ సీజన్-4 కోసం ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే కొత్త సీజన్ రిలీజ్ ఎప్పడనేది ఇప్పటివరకు ప్రకటించలేదు.ఫర్జీ సీజన్-2..విజయ్ సేతుపతి, షాహిద్ కపూర్ కీలక పాత్రల్లో వచ్చిన సూపర్ హిట్ సిరీస్ ఫర్జీ. సీజన్ -1 హిట్ కావడంతో అభిమానులు రెండవ సీజన్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సిరీస్ సీజన్ 2 డిసెంబర్ ప్రారంభంలో అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అయ్యే ఛాన్సుంది. -
సిందూరం ఎక్కడ అని ప్రపంచం అడుగుతోంది
కశ్మీర్లోని పహల్గాం ఉగ్రదాడి ఘటన యావత్ భారతదేశాన్ని కలచివేసింది. ఈ ఘటనకు ప్రతీకారంగా పాకిస్తాన్పై భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ పహల్గాం ఘటన, ఆపరేషన్ సిందూర్లపై ఇప్పటికే పలువురు ప్రముఖ నటీనటులు స్పందించారు. తాజాగా ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ‘‘భార్యతో కలిసి వేసవి సెలవుల కోసం పహల్గాం వెళ్లిన భర్తను ఉగ్రమూక కాల్చి చంపింది.తన భర్తను చంపవద్దని ఆ భార్య ఎంతగానో ఏడుస్తూ, ప్రాధేయపడినా ఆ ఉగ్ర ఉన్మాది వినలేదు. ఆమె కళ్ల ముందే భర్తను అతి కిరాతకంగా కాల్చి చంపాడు. ఆమెను విధవరాలని చేశాడు. భర్త మరణాన్ని తట్టుకోలేని ఆ భార్య... తనను కూడా చంపేయమని అడిగినా... ‘నిన్ను చంపను... వెళ్లి చెప్పుకో..’ అని ఆ రాక్షసుడు అన్నాడు. నా కుమార్తెలాంటి ఆమె మానసిక స్థితి చూస్తుంటే .. ‘ఆమె వద్ద చితాభస్మం ఉన్నా... సిందూరం ఎక్కడ అని ప్రపంచం అడుగుతోంది’ అని మా నాన్న (హరివంశ్ రాయ్ బచ్చన్) రాసిన ఓ పద్యంలోని వాక్యం నాకు గుర్తొచ్చింది. అందుకే నేను నీకు సిందూరం ఇస్తున్నా... అపరేషన్ సిందూర్... జై హింద్... భారత సైన్యమా... ఎప్పటికీ ఆగకు... వెనకడుగు వేయకు’’ అంటూ భావోద్వేగమైన ΄పోస్ట్ను షేర్ చేశారు అమితాబ్ బచ్చన్. -
స్టార్ జంటపై విడాకుల రూమర్స్.. తన భర్తపై పూర్తిగా నమ్మకముందన్న భార్య!
బాలీవుడ్ స్టార్ నటుడు గోవిందపై గత కొన్ని నెలలుగా విడాకులు రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. చాలా సార్లు ఆయన భార్య సునీతా అహుజా ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. తామిద్దరం కలిసే ఉన్నామని.. ఎవరూ కూడా తమను విడదీయలేరని పేర్కొంది. గోవింద రాజకీయాల్లోకి ఉండడం వల్లే తాము దూరంగా ఉంటున్నట్లు తెలిపింది.తాజాగా మరోసారి తమపై వస్తున్న విడాకుల వార్తలపై ఆయన భార్య సునీతా అహుజా స్పందించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆమె తన భర్తపై అపారమైన నమ్మకం ఉందని తెలిపింది. ఎలాంటి తెలివితక్కువ మహిళ మమ్మల్ని వేరు చేయలేదని స్పష్టం చేసింది. గోవింద నేను లేకుండా జీవిస్తాడని అనుకోవడం లేదు.. తన కుటుంబాన్ని ఎలాంటి తెలివితక్కువ మహిళ కోసం వదిలి వెళ్లడని సునీతా వెల్లడించింది.ఇప్పటికైనా రూమర్స్ను వ్యాప్తి చేయవద్దని ఆమె మీడియాను కోరింది. గోవిందతో తన వివాహం గురించి చర్చించడానికి ఏదైనా ఉంటే నేరుగా తన వద్దకు వచ్చి అడగాలని అహుజా అన్నారు. ఇలాంటి వాటిని ఎప్పటికీ అంగీకరించనని,.. ఎవరికైనా ధైర్యం ఉంటే నన్ను నేరుగా అడగాలని తెలిపింది. ఇలాంటివి ఎప్పుడైనా జరిగితే, మీడియాతో మొదట మాట్లాడే వ్యక్తిని నేనే.. ఆ దేవుడు నా కుటుంబాన్ని ఎప్పటికీ విచ్ఛిన్నం చేయడని నమ్మకముందని పేర్కొంది. కాగా.. గోవింద, సునీత 1986లో వివాహం చేసుకున్నారు. వీరికి యశ్వర్ధన్ అహుజా, టీనా అహుజా అనే ఇద్దరు పిల్లలు సంతానం ఉన్నారు. -
ఆ హీరోయిన్ తో అస్సలు నటించను: టాలీవుడ్ హీరో
తెలుగు సినిమాలతో నటుడిగా మారిన హర్షవర్దన్ రాణే.. ఇక్కడ సరైన పాత్రలు, గుర్తింపు రాకపోయేసరికి బాలీవుడ్ కి వెళ్లిపోయాడు. అక్కడ హీరోగా పలు చిత్రాలతో సూపర్ హిట్స్ అందుకున్నాడు. అందులో ఒకటి 'సనమ్ తేరీ కసమ్'. ఈ మూవీకి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. రీసెంట్ గా రీ రిలీజ్ చేస్తే అద్భుతమైన వసూళ్లు దక్కించుకుంది. దీంతో చిత్రనిర్మాతలు సీక్వెల్ ని ప్రకటించారు. కానీ ఇప్పుడా ప్రాజెక్ట్ సందిగ్ధంలో పడింది.(ఇదీ చదవండి: దర్శకుడి డ్రీమ్ కార్.. గిఫ్ట్ ఇచ్చిన సూర్య-కార్తీ) నిన్నటివరకు భారత్-పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత మన దేశం 'ఆపరేషన్ సిందూర్' పేరుతో పాక్ లోని పలు ఉగ్రస్థావరాల్ని మట్టుబెట్టింది. ఈ క్రమంలో పలువురు పాక్ నటీనటులు.. ఆపరేషన్ సిందూర్ పై నోటికొచ్చిన కామెంట్స్ చేశారు. వాళ్లలో నటి మావ్రా హోకెన్ ఒకరు. ఈమెనే గతంలో 'సనమ్ తేరీ కసమ్'లో హీరోయిన్ గా నటించింది.తాజాగా ఈమె.. 'ఆపరేషన్ సిందూర్'పై చేసిన వ్యాఖ్యలపై స్పందించిన హర్షవర్ధన్, సీక్వెల్ లో ఈమెతో నటించేది లేదని స్టేట్ మెంట్ ఇచ్చాడు. ఈ మేరకు తన ఇన్ స్టాలో పోస్ట్ పెట్టాడు.'ప్రస్తుత పరిస్థితులని నేను గౌరవిస్తున్నాను. నా దేశాన్ని ఉద్దేశించి కొందరు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో నేనొక నిర్ణయానికి వచ్చాను. గతంలో నటించిన వాళ్లే ఇప్పుడు 'సనమ్ తేరీ కసమ్ 2'లోనూ నటిస్తానంటే.. నేను అందులో నటించాలని అనుకోవట్లేదు' అని హర్షవర్ధన్ చెప్పుకొచ్చాడు.అలానే మావ్రా హోకెన్ పోస్ట్ ని కూడా షేర్ చేసిన హర్షవర్ధన్.. ఏ దేశానికి చెందిన నటీనటుల్ని అయినా నేను గౌరవిస్తాను. కానీ నా దేశం గురించి ఎవరైనా చులకనగా మాట్లాడితే మాత్రం సహించేది లేదు అని స్పందించాడు. ఇప్పుడు ఇది కాస్త హాట్ టాపిక్ అయింది.(ఇదీ చదవండి: రూ.60 కోట్ల దావా.. ఓటీటీ రిలీజ్ పై హైకోర్ట్ జోక్యం) -
రూ.60 కోట్ల దావా.. ఓటీటీ రిలీజ్ పై హైకోర్ట్ జోక్యం
ఇప్పుడంతా ఓటీటీ ట్రెండ్ నడుస్తోంది. థియేటర్లలో రిలీజైన చాలా సినిమాలు.. తక్కువ రోజుల్లోనే ఓటీటీల్లోకి వచ్చేస్తున్నాయి. మరికొన్ని నేరుగా డిజిటల్ స్ట్రీమింగ్ అయిపోతున్నాయి. కానీ రీసెంట్ గా 'భోల్ చుక్ మాఫ్' అనే హిందీ చిత్రం మాత్రం విడుదలకు మరోరోజు ఉందనగా.. ఓటీటీలోకి వచ్చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఈ వ్యవహారం ఇప్పుడు కోర్టుకెక్కింది.లెక్క ప్రకారం 'భోల్ చుక్ మాఫ్' సినిమా మే 09న థియేటర్లలో రిలీజ్ అవ్వాలి. అందుకు తగ్గట్లే ప్రమోషన్స్ చేశారు. థియేటర్లలో బుకింగ్స్ ఓపెన్ చేశారు. చాలామంది టికెట్స్ కూడా కొనుకున్నారు. కానీ రిలీజ్ కి ఒకరోజు ముందు నిర్మాతలు అందరికీ షాకిచ్చారు. మే 16 నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో మూవీ స్ట్రీమింగ్ అవుతుందని ప్రకటించారు.(ఇదీ చదవండి: ఒక్క ఫ్రేమ్ లో 19 మంది తెలుగు యంగ్ డైరెక్టర్స్.. ఏంటి విశేషం?) దీంతో ప్రముఖ మల్టీప్లెక్స్ సంస్థ పీవీఆర్.. బాంబే హైకోర్టుని ఆశ్రయించింది. ఈ సినిమా కోసం తాము చాలా ఖర్చు చేశామని, ఇప్పుడు ఇలా ఓటీటీలో రిలీజ్ చేయడం సరికాదని రూ.60 కోట్ల దావా వేసింది. కట్ చేస్తే ఇప్పుడు ఓటీటీ రిలీజ్ పై హైకోర్ట్ స్టే ఇచ్చింది. అంటే తదుపరి ఆర్డర్ వచ్చేంతవరకు మూవీని ఎక్కడా విడుదల చేయడానికి వీల్లేదనమాట. రాజ్ కుమార్ రావ్, వామికా గబ్బి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సినిమాలో భారత క్రికెటర్ చాహల్ మాజీ భార్య ధనశ్రీ వర్మ ఐటమ్ సాంగ్ చేయడం విశేషం. ప్రస్తుతం కోర్టులో ఉన్న ఈ వ్యవహారంలో తర్వాత ఏం జరుగుతుందో చూడాలి?(ఇదీ చదవండి: దర్శకుడి డ్రీమ్ కార్.. గిఫ్ట్ ఇచ్చిన సూర్య-కార్తీ) -
ఉగ్రవాదులు భూమ్మీద ఉండకూడదు: జాన్వీ కపూర్
‘‘ఇన్ని రోజులు మనం యుద్ధం రాకూడదనే కోరుకున్నాం. కానీ, ఉగ్రవాదులు మన ప్రజలను చంపుతుంటే సహించేది లేదు. భారత్ ఎప్పుడూ కయ్యానికి కాలు దువ్వలేదు. ఇన్ని రోజులు మన మీద జరిగిన దాడుల తర్వాత ఆ బాధను తీర్చుకోవడానికే ఇప్పుడు మన ఇండియన్ ఆర్మీ రంగంలోకి దిగింది. వారి దుశ్చర్యలను తిప్పి కొడుతున్నాం. మనది దూకుడు కాదు... దశాబ్దాల బాధకు సమాధానం. అసలు ఉగ్రవాదులు భూమ్మీద ఉండకూడదు’’ అని హీరోయిన్ జాన్వీ కపూర్ పేర్కొన్నారు.కశ్మీర్లోని పహల్గాంలో ఇటీవల జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ లోని ఉగ్ర స్థావరాలపై దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పలువురు సినీ ప్రముఖులు ఇండియన్ ఆర్మీపై ప్రశంసలు కురుపిస్తూ, వారికి మద్దతుగా సోషల్ మీడియాలోపోస్టులు పెడుతున్నారు. జాన్వీ కపూర్ కూడా ఇప్పటికే పలుపోస్టులు పెట్టినప్పటికీ, తాజాగా తన ఇన్ స్టా్రగామ్లో సుదీర్ఘమైనపోస్ట్ పెట్టారు. ‘‘ఇండియా– పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో జమ్మూపై దాడుల విజువల్స్ చూసి దిగ్భ్రాంతికి గురయ్యాను.పాకిస్తాన్ చేసిన డ్రోన్ దాడులు నన్ను ఎంతో బాధించాయి. ఇది నేను ఇప్పటివరకూ ఎప్పుడూ అనుభవించని బాధ. ఇన్ని రోజులు విదేశాల్లో ఇలాంటి దాడులు జరుగుతుంటే శాంతిని పాటించాలని కోరుకున్నాం. కానీ ఇప్పుడు అదే పరిస్థితి మనవరకు వచ్చింది. మన సైనికులు సరిహద్దు దగ్గరపోరాడుతూ మనల్ని కా పాడుతున్నారు. మన దేశ సార్వభౌమత్వాన్ని రక్షిస్తున్న సైనికులకు ఎప్పటికీ రుణపడి ఉండాలి.వాళ్ల వల్లే మనం సురక్షితంగా ఉంటున్నాం. ఇలాంటి సమయంలో దేశం మొత్తం మన భారతీయ జవానులకు మద్దతుగా నిలవాలి. ఈ యుద్ధంలో అమాయకులుప్రాణాలు కోల్పోవడం నన్ను బాధిస్తోంది. త్వరలోనే ఈ సమస్యకు శాశ్విత పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నాను. మన సైనికుల కోసంప్రార్థిస్తుంటాను. ప్రస్తుత పరిస్థితుల్లో ఎలాంటి పుకార్లను ఇతరులతో పంచుకోవద్దు’’ అంటూ జాన్వీ కపూర్పోస్ట్ చేశారు. ఆమెపోస్ట్పై పలువురు నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
మా జోలికి వస్తే వదిలిపెట్టం: రణ్వీర్ సింగ్
‘ఆపరేషన్ సిందూర్’ పై హీరో రణ్వీర్ సింగ్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన ఓపోస్ట్ షేర్ చేశారు. ‘‘ఎవరి పనులు వాళ్లు చేసుకునే వారిని మేం(భారతీయులు) ఇబ్బంది పెట్టం. ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టాలని మా జోలికి వస్తే మాత్రం వదిలిపెట్టం.మన సాయుధ దళాల ధైర్యానికి సెల్యూట్. ఈ ఆపరేషన్లో వ్యూహత్మకంగా వ్యవహరిస్తున్నందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీగారికి ధన్యవాదాలు’’ అంటూ రాసుకొచ్చారు. -
జాతీయ అవార్డ్ గ్రహీత విక్రమ్ కన్నుమూత
జాతీయ అవార్డ్ గ్రహీత, ప్రముఖ బాలీవుడ్ మేకప్ ఆర్టిస్ట్ విక్రమ్ గైక్వాడ్(51) కన్నుమూశారు. తొలుత మరాఠీ సినిమాల్లో పనిచేసిన ఈయన తర్వాత పలు హిందీలో చిత్రాల్లో నటించారు. 2013లో ఓ బెంగాలీ చిత్రానికి ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్గా జాతీయ అవార్డు అందుకున్నారు. విక్రమ్ గైక్వాడ్ మరణవార్త తెలుసుకున్న మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నివాళులర్పించారు. ఈయన మరణం చాలా బాధాకరమైన విషయమని అన్నారు. భారతీయ సినిమా, నాటక రంగానికి విక్రమ్ చేసిన కృషి ఎనలేనిదని పేర్కొన్నారు. (ఇదీ చదవండి: శ్రీవిష్ణు ‘సింగిల్’కి రికార్డు ఓపెనింగ్స్... తొలి రోజు కలెక్షన్స్ ఎంతంటే?)విక్రమ్ గైక్వాడ్ మేకప్ ఆర్టిస్ట్ గా చేసిన వాటిలో.. బెల్ బాటమ్, ఉరి: ది సర్జికల్ స్ట్రైక్, బ్లాక్ మెయిల్, దంగల్, పీకే, సూపర్ 30, కేదార్నాథ్, థగ్స్ ఆఫ్ హిందూస్థాన్, ది లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్ తదితర హిందీ సినిమాలున్నాయి.మరాఠీ సినిమాల్లో ఈయన్ని బాలగంధర్వ అని కూడా అంటారు. విక్రమ్ మరణంపై చిత్రపరిశ్రమలోని ప్రముఖులు నివాళులర్పించారు. ఈరోజు సాయంత్రం 4.30 గంటలకు ముంబైలోని దాదర్లోని శివాజీ పార్క్ శ్మశానవాటికలో అంత్యక్రియలు జరుగనున్నాయి. అయితే విక్రమ్ మృతికి కారణం ఇంకా తెలియరాలేదు.(ఇదీ చదవండి: ‘ఆపరేషన్ సిందూర్’పై సినిమా.. క్షమాపణలు చెప్పిన డైరెక్టర్!) -
‘ఆపరేషన్ సిందూర్’పై సినిమా.. క్షమాపణలు చెప్పిన డైరెక్టర్!
పహల్గాం ఉగ్రదాడి ఘటనకు ప్రతీకారంగా భారత్ ‘ఆపరేషన్ సిందూర్’(Operation Sindoor ) చేపట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇదే పేరుతో ఓ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు బాలీవుడ్ దర్శకుడు ఉత్తమ్ మహేశ్వరీ(Uttam Maheshwari) ప్రకటిస్తూ ఓ పోస్టర్ని రిలీజ్ చేశారు. దీనిపై నెటిజన్స్ మండిపడ్డారు. ఒకవైపు దేశ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటే..ఈ సమయంలో పోస్టర్ రిలీజ్ చేయడం అవసరమా అంటూ దర్శకుడిని ట్రోల్ చేశారు. పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో చిరవకు దర్శకుడు ఉత్తమ్ దేశ ప్రజలకు క్షమాపణలు చెబుతూ ఇన్స్టాలో ఓ పోస్ట్ పెట్టాడు. ఎదుటి వ్యక్తుల మనోభావాలను దెబ్బతీసే ఉద్దేశం తనకు లేదని అందులో పేర్కొన్నాడు. (చదవండి: భారత్పై ప్రశంసలు.. హీరోయిన్కి బెదిరింపులు!)‘ఈ సమయంలో ‘ఆపరేషన్ సిందూర్’పై సినిమా చేస్తున్నట్లు ప్రకటించినందుకు క్షమాపణలు చెబుతున్నాను. డబ్బు కోసం లేదా ఫేమస్ అవ్వడం కోసమే ఇలాంటి పని చేయలేదు. మన సైనికుల ధైర్య సాహసాలను, త్యాగాలను ప్రపంచానికి తెలియజేసేలా ఓ పవర్ఫుల్ కథగా వెండితెరపై తీసుకురావాలనుకున్నాను. దేశంపట్ల గౌరవంతో నేను ఈ సినిమా చేయాలనుకున్నాడు. అంతేకాని డబ్బుకి ఆశపడి సినిమా ప్రకటన చేయలేదు. ఇతరుల మనోభావాలను దెబ్బతీసే ఉద్దేశం నాకు లేదు. నా ప్రకటన వల్ల ఎవరైనా బాధపడి ఉంటే వారికి నా క్షమాపణలు చెబుతున్నాను. ఇది సినిమా మాత్రమే కాదు దేశ ప్రజల ఎమోషన్’ అని ఉత్తమ్ మహేశ్వరీ తన ఇన్స్టా స్టోరీలో రాసుకొచ్చాడు.కాగా, ఏప్రిల్ 22న జమ్ము కశ్మీర్లోని పహల్గాంలో పర్యాటకులపై పాక్ ఉగ్రవాదులు విచక్షణ రహితంగా దాడులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలను పోగొట్టుకున్నారు. పహల్గాం ఘటనకు ప్రతీకారంగా ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో పాక్లోని 9 ఉగ్రస్థావరాలపై భారత్ దాడి చేసింది. 26 మంది భారత మహిళల నుదుటిన సిందూరం తుడిచేసిన ఉగ్రవాదుల గడ్డపై రక్త సిందూరం పారించేందుకే ఈ పేరు పెట్టారు. ‘ఆపరేషన్ సిందూర్’పై దేశ ప్రజలు ప్రశంసలు కురిపించారు. ఈ నేపథ్యంలో ఇదే పేరుతో సినిమాను నిర్మించడానికి పలు నిర్మాణ సంస్థలు పోటీ పడ్డాయి. టైటిల్ కోసం విఫల ప్రయత్నాలు చేశాయి. చివరకు నిక్కీవిక్కీ భగ్నానీ ఫిల్మ్స్ పతాకంపై ఉత్తమ్ మహేశ్వరీ దర్శకత్వంలో ‘ఆపరేషన్ సిందూర్’ తెరకెక్కిస్తున్నట్లు శుక్రవారం సాయంత్రం ప్రకటన చేశారు. నెటిజన్ల ఆగ్రహంతో డైరెక్టర్ పై విధంగా స్పందించాడు. -
‘ఆపరేషన్ సిందూర్’పై ప్రశంసలు.. హీరోయిన్కి బెదిరింపులు!
భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’(Operation Sindoor )ని ప్రశంసిస్తూ పోస్ట్ పెట్టినందుకు హీరోయిన్ సెలీనా జైట్లీ(Celina Jaitly )కి బెదిరింపులు వచ్చాయి. భారత్ని ప్రశంసిస్తే అన్ఫాలో చేస్తామంటూ కొంతమంది నెటిజన్లు ఆమెను బెదిరించారు. అలాగే ఆమెను ట్రోల్స్ చేయడం ప్రారంభించారు. తాజాగా సెలినా ఈ ట్రోల్స్,బెదిరింపులపై స్పందించారు. ఉగ్రవాదానికి తాను ఎప్పుడూ వ్యతిరేకమేనని.. నచ్చని వాళ్లు తనను అన్ఫాలో చేసుకోవచ్చని చెప్పారు. ‘నా దేశం(భారత్) గురించి మాట్లాడితే అన్ఫాలో చేస్తామని కొంతమంది బెదిరిస్తున్నారు. క్షమాపణలు చెప్పాలంటూ కామెంట్స్ పెడుతున్నారు. వారందరిని నేను ఒకటే చెబుతున్నా.. క్షమాపణలు చేప్పే ప్రసక్తే లేదు. నా దేశం కోసం నేను నిలబడాతాను. ఉగ్రవారదం పేరుతో అమాయకులను బలి తీసుకుంటే స్పందించకుండా మౌనంగా ఉండలేను. హింసను ప్రోత్సహించే వారివైపు నేను ఉండను. భారత్పై నాకున్న ప్రేమ మిమ్మల్ని బాధపెడితే నన్ను అన్ఫాలో చేయండి. నేను శాంతి కోసం, సత్యం కోసం నిలబడతాను. నా దేశ సైనికుల వెంటే నేనుంటాను. నా దేశ సైనికులు కులం, మతం అడగకుండా మమ్మల్ని రక్షిస్తున్నారు. మీ ట్రోల్స్ని గమనిస్తున్నాను. ఇలాంటి వారిని క్షమించను. జైహింద్’అని ఇన్స్టాలో రాసుకొచ్చింది.కాగా, ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉన్న సెలీనా జైట్లీ.. ఆపరేషన్ సిందూర్ని ప్రారంభించినప్పుడు మన దేశాన్ని ప్రశంసిస్తూ పోస్ట్ చేశారు. తాను ఆస్ట్రేలియాలో ఉన్నప్పటికీ..మనసంతా భారత్ గురించే ఆలోచిస్తుందని, దేశ రక్షణ కోసం సైనికులు చేస్తున్న పోరాటాలను, త్యాగాలను మరిచిపోలేమని ఇన్స్టాలో ఓ పోస్ట్ పెట్టింది. దీనిపై కొంతమంది నెటిజన్స్ నెగెటివ్ కామెంట్స్ చేస్తూ ఆమెను ట్రోల్ చేయడంపై పైవిధంగా స్పదించింది.మిస్ యూనివర్స్ 2003 రన్నరప్గా నిలిచిన సెలీనా జైట్లీ ఆస్ట్రేలియాకు చెందిన ఎంటర్ప్రెన్యూర్ పీటర్ను పెళ్లాడింది. వీరికి 13 ఏళ్ల కవలలు విన్స్టన్, విరాజ్తో పాటు ఏడేళ్ల ఆర్థూర్ సంతానం. ఇకపోతే మోడల్గా సత్తా చాటిన సెలీనా 2003లో 'జనాషీన్' సినిమాతో వెండితెరపై తన లక్ పరీక్షించుకుంది. నో ఎంట్రీ, అప్నా సప్నా మనీ మనీ, గోల్మాల్ రిటర్న్స్ సినిమాల్లో మెరిసింది. View this post on Instagram A post shared by Celina Jaitly (@celinajaitlyofficial) -
సైఫ్ అలీఖాన్ కత్తిపోటు కేసు.. బెయిల్ వద్దంటూ పోలీసులపై నిందితుడి ఆరోపణలు
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్పై (Saif Ali Khan) ఈ ఏడాది ప్రారంభంలో దాడి జరిగిన విషయం తెలిసిందే. కేసు నమోదు చేసిన ముంబై పోలీసులు బంగ్లాదేశ్కు చెందిన మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్ను(30) అరెస్ట్ చేశారు. ఇప్పటికే అతనిపై కోర్టులో చార్జ్షీట్ను కూడా దాఖలు చేశారు. అయితే, తన అరెస్ట్ చట్టవిరుద్ధమని ప్రకటించాలని, తనను జైలు నుంచి వడుదల చేయాలని మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టును నిందితుడు ఆశ్రయించాడు. ఆపై ఏప్రిల్ నెలలో సెషన్స్ కోర్టులో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను కూడా అతను ఉపసంహరించుకున్నాడు.ప్రస్తుతం ఆర్థర్ రోడ్ జైలులో ఉన్న నిందితుడు మొహమ్మద్ తన న్యాయవాది అజయ్ గావ్లి ద్వారా, తన అరెస్టును చట్టవిరుద్ధమని ప్రకటించాలని కోరుతూ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ (బాంద్రా) ముందు దరఖాస్తు చేసుకున్నాడు. ఆపై తనను జైలు నుండి విడుదల చేయాలని కోరాడు. ఆ పిటిషన్లో, పోలీసులు తనను అరెస్టు చేసేటప్పుడు చట్ట నిబంధనలను పాటించలేదన్నాడు. వారిపై మరికొన్ని ఆరోపణలు చేశాడు. దీంతో వాటికి సమాధానం చెప్పాలని పోలీసులను కోర్టు కోరింది. విచారణను మే 13కి వాయిదా వేసింది.జనవరి 16వ తేదీ తెల్లవారుజామున 2 గంటలకు సైఫ్ అలీఖాన్పై దాడి జరిగింది. అతని మెడపై కత్తిపోట్లు కూడా పడ్డాయి. దీంతో ఆసుపత్రిలో అత్యవసర శస్త్రచికిత్స తీసుకున్న ఆయన సుమారు ఐదు రోజుల తర్వాత డిశ్చార్జ్ అయ్యారు. సంఘటన జరిగిన రెండు రోజుల తర్వాత నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. దొంగతనం చేయాలనే ఉద్దేశంతోనే అతడు సైఫ్ నివాసంలోకి వెళ్లాడని పోలీసులు గుర్తించారు. -
'ఆపరేషన్ సిందూర్' సినిమా పోస్టర్ విడుదల.. వెనక్కి తగ్గిన రిలయన్స్
'ఆపరేషన్ సిందూర్' (Operation Sindhoor) పేరుతో సినిమా పోస్టర్ వచ్చేసింది. ఈ టైటిల్ కోసం బాలీవుడ్ బడా దర్శకనిర్మాతలు కూడా పోటీ పడ్డారు. అయితే, ఒక నిర్మాణ సంస్థ తమ బ్యానర్ పేరుతో ఫోటోను షేర్ చేసింది. ప్రస్తుతం సోషల్మీడియాలో వైరల్ అవుతుంది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్లోని వారి స్థావరాలపై ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత్ దాడులు చేసింది. దీంతో ఈ పేరు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఇప్పుడు ఇదే బ్యాక్డ్రాప్తో బాలీవుడ్లో సినిమా రానుంది.‘ఆపరేషన్ సిందూర్’ టైటిల్ కోసం సినీ దర్శక నిర్మాతలు పోటీపడ్డారు. కేవలం రెండు రోజుల్లోనే 30కి పైగా దరఖాస్తులు వచ్చాయి. అందులో జీ స్టూడియోస్, టీ-సిరీస్ లాంటి కొన్ని బాలీవుడ్ బడా నిర్మాణసంస్థలు కూడా ఈ పేరు కోసం పోటీపడ్డాయి. అయితే, నిక్కీ విక్కీ భగ్నానీ ఫిల్మ్స్ పతాకం, ది కంటెంట్ ఇంజనీర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కనుందని ఒక పోస్టర్ను విడుదల చేశారు. పోస్టర్లో యూనిఫాం ధరించి.. రైఫిల్ పట్టుకొని నుదుటన సిందూరం పెట్టుకుంటోన్న మహిళను చూపారు. ఉత్తమ్, నితిన్ దర్శకత్వంలో ఈ సినిమా రానుందని ప్రకటించారు. ఇందులో నటిస్తున్న నటీనటులను వారు ప్రకటించలేదు.ఆపరేషన్ సిందూర్, మిషన్ సిందూర్, సిందూర్ : ది రివెంజ్అంటూ ఆపరేషన్ కోడ్నేమ్ స్ఫూర్తితో సినిమా టైటిల్స్ రిజిస్టర్ చేసుకునేందుకు పోటీ పడుతున్నారు. ఆపరేషన్ తరువాత ఇండియన్ మోషన్ పిక్చర్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (ఐఎంపీపీఏ), ఇండియన్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ (ఐఎఫ్టీపీసీ), వెస్ట్రన్ ఇండియా ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (డబ్ల్యూఐఎఫ్పీఏ)లకు సినిమా టైటిల్స్ రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తులు పెరిగాయి. ఈ మెయిల్ ద్వారా ఇప్పటికే 30కి పైగా టైటిల్ అప్లికేషన్లు అందగా, ఈ సంఖ్య 50–60 వరకు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఒక్కసారి టైటిల్ వచ్చిన తరువాత సినిమా తీసేందుకు మూడేళ్ల కాలపరిమితి ఉంటుంది. మూడేళ్లలో సినిమా రెడీ కాకపోతే టైటిల్ తీసేసుకుంటారు.టైటిల్ విషయంలో వెనక్కి తగ్గిన రిలయన్స్ఈ పేరుతో ట్రేడ్మార్క్ రిజిస్ట్రేషన్ కోసం రిలయన్స్ ఇండస్ట్రీస్తోపాటు మరో ఐదు సంస్థలు కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్ అండ్ ట్రేడ్మార్క్ను సంప్రదించాయి. అయితే దేశానికి గర్వకారణమైన విషయంతో తాము వ్యాపారం చేయబోమని, తమ ఉద్యోగి పొరపాటున చేశారని చెప్పిన రిలయన్స్.. దరఖాస్తును వెనక్కి తీసుకుంది. ఆపరేషన్ సిందూర్ టైటిల్ కోసం బాలీవుడ్ బడా నిర్మాతలు పోటీ పడటం చూసి నెటిజన్లు ఫైర్ అయ్యారు. సెన్సిటివ్ విషయాన్ని ఇలా వ్యాపారంగా మలుచుకుంటారా అంటూ విమర్శలు చేస్తున్నారు. అలాంటి వారందూరు కూడా రాబందులతో సమానమని చెబుతున్నారు. -
చూసింది ఫస్ట్ పార్టే! ఇంకా చాలా ఉంది: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
‘వరల్డ్ ఆడియో – విజువల్, ఎంటర్టైన్మెంట్ సమిట్ (వేవ్స్)ను రెండేళ్ళకు ఓసారి చేయాలని అనుకున్నాం. కానీ, జనం నుంచి వస్తున్న స్పందన, వినోద రంగ వర్గాల నుంచి వస్తున్న డిమాండ్ ను బట్టి చూస్తే, బహుశా ఇకపై ఏటా ‘వేవ్స్’ను నిర్వహించే అవకాశం ఉంది’‘ అన్నారు కేంద్ర సమాచార – ప్రసార శాఖ, రైల్వే శాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్. ముంబయ్లో ఈ మే 1 నుంచి 4 దాకా జరిగిన ‘వేవ్స్ – 2025’లో భాగంగా దేశం నలుమూలల నుంచి ప్రత్యేకంగా వచ్చిన పత్రికా విలేఖరులతో ఆయన ఇష్టాగోష్ఠి జరిపారు. ‘సాక్షి’ సహా పలువురు సంధించిన ప్రశ్నలకు సమాధానమిస్తూ, ‘వేవ్స్’ మొదలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సవాళ్ళు, తాను నిర్వహిస్తున్న వివిధ మంత్రిత్వ శాఖల విషయాల మీదుగా సామాజిక దృక్పథం దాకా అనేక అంశాలను కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఉత్సాహంగా పంచుకున్నారు. దాదాపు ముప్పావుగంట పైగా సాగిన ఆ భేటీ నుంచి ముఖ్యాంశాలు...ప్రధాని మోదీ ఆలోచన ఫలితంగా...ప్రపంచంలో ఆర్థిక రంగం, వ్యవసాయం... ఇలా వివిధ రంగాలకు అంటూ ఒక శిఖరాగ్ర సదస్సు ఉంది. కానీ, వివిధ రకాల మీడియా – వినోద రంగాలను అనుసంధానిస్తూ భాగస్వాములను అందరినీ ఒక వేదిక మీదకు తెచ్చే ఒక సదస్సు అంటూ ఏదీ లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొనే ప్రపంచంలోనే ఎక్కడా, ఎన్నడూ లేని విధంగా ఈ ‘వరల్డ్ ఆడియో – విజువల్, ఎంటర్టైన్మెంట్ సమిట్’ (‘వేవ్స్’) ఆలోచన చేశారు ప్రధాని మోదీ. ఇటీవల మీరు చూసింది ఆ ఆలోచన ఫలితమే! మీడియా, వినోదరంగంలో ప్రపంచస్థాయిలో భారత్ ముందంజలో నిలవాలన్నది ప్రధానమైన ఆశయం.‘వేవ్స్’లో భాగంగా వివిధ దేశాల విధాన రూపకర్తలు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ (వైపో) డైరెక్టర్ జనరల్ లాంటివారు దీనిలో పాలు పంచుకున్నారు. మే 2వ తేదీన ‘గ్లోబల్ మీడియా డైలాగ్’ డిక్లరేషన్ కూడా చేశాం. అక్కడ ఆస్కార్, కాన్... ఇక్కడ ‘వేవ్స్’‘వేవ్స్’ ప్రధాన ఉద్దేశాలు, లక్ష్యాలు మూడు. ఒకటి – దావోస్లోని ‘వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్’ (డబ్ల్యుఈఎఫ్) లాగా మీడియా, వినోద రంగానికి దీన్ని వేదికగా తీర్చిదిద్దడం. నిజానికి, దావోస్లో డబ్ల్యుఈఎఫ్ ఓ చిన్న హోటల్లో ఇప్పుడు మనం వేవ్స్ చేస్తున్న ఈ సెంటర్లో దాదాపు పదోవంతు ప్రదేశంలో మాత్రమే ప్రారంభమైంది. అలాంటిది ఇప్పుడు ప్రపంచ ఆర్థిక నేతలందరూ ఒకచోట చేరే వేదికగా దావోస్ సదస్సు ఎంతగా పాపులరైందో చూడండి. తొలిసారే ఇంత స్పందన వస్తున్న ‘వేవ్స్’ రానున్న రోజుల్లో మరింత పాపులరవడం ఖాయం. ఇక, రెండో లక్ష్యం – ఆస్కార్, కాన్ చలనచిత్రోత్సవాల పద్ధతిలో మన ‘వేవ్స్’ను సైతం ప్రపంచ పటంపై ప్రత్యేకంగా నిలపడం! మూడో లక్ష్యం – ‘ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీ’ (ఐఐసీటీ) అనే శిక్షణ సంస్థను స్థాపించడం! ప్రణాళికాబద్ధంగా ఈ మూడు లక్ష్యాలను వీలైనంత త్వరలోనే చేరుకుంటాం.ఇవాళ వినోద రంగం, సృజనాత్మకతను చూపించే విధానం శరవేగంగా మారిపోతున్నాయి. వాటితో ముడిపడిన ఆర్థిక వ్యవస్థ కూడా మారిపోతుంది. ఆ మార్పులకు తగ్గట్టు మనమూ మారాలి. సమాయత్తం కావాలి. అలా సమాయత్తమయ్యే ప్రయత్నంలో భాగమే... ‘ఐఐసీటీ’. ఈ రంగంలోని అవసరాలకు తగ్గట్టు శిక్షణ నిచ్చే వేదిక కావాలని పలువురు దర్శక, నిర్మాతలు అభిప్రాయపడ్డారు. అందుకు తగ్గట్టే, మన దేశంలో ‘యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్ అండ్ ఎక్స్టెండెడ్ రియాలిటీ’ (ఏవీజీసీ – ఎక్స్ఆర్) విభాగంలో అత్యుత్తమ ప్రతిభా ప్రమాణాలకు జాతీయ స్థాయి కేంద్రంగా దాన్ని స్థాపిస్తాం. ఆ విభాగంలో వృత్తినిపుణులుగా తయారవ్వాలని కోరుకొనే విద్యార్థులకు ప్రపంచ శ్రేణి విద్య, శిక్షణ అందించే భారీ హబ్గా తీర్చిదిద్దుతాం. ఐఐటీ, ఐఐఎంల పంథాలో... మీడియాలో శిక్షణకు ఐఐసీటీ!మహారాష్ట్రలోని ముంబయ్లోనే ‘ఐఐసీటీ’ని నెలకొల్పనున్నాం. దీనికి దాదాపు రూ. 400 కోట్లు అవసరం. నిజానికి, అది సీడ్ మనీ మాత్రమే. ఈ ప్రీమియర్ ఇన్స్టిట్యూట్ మన దేశంలోని ప్రతిష్ఠాత్మక ఐఐటీ, ఐఐఎంల పంథాలో ఉంటుంది. టెక్నాలజీ విద్యలో ఐఐటీ, మేనేజ్మెంట్ విద్యలో ఐఐఎం ఎలా నిలిచాయో, అలా ఇది మీడియా, వినోదరంగ విద్యలో ఓ బెంచ్మార్క్గా నిలుస్తుంది. అలాగని ఇది కోడింగ్, ప్రోగ్రామింగ్ నేర్పించే సంస్థ కాదు. సృజనాత్మకత 80 శాతం, సాంకేతికతను అనువర్తింపజేయడం 20 శాతం... రెంటినీ కలగలిపే శిక్షణ సంస్థ ఇది. వినూత్నమైన ఈ ప్రయత్నంలో కలిసి నడిచేందుకు ఎన్ విడా, మైక్రోసాఫ్ట్, గూగుల్, యూట్యూబ్, స్పాటిఫై, మెటా, వాకామ్, ఎడోబ్, జియో స్టార్ సహా పలు అంతర్జాతీయ సంస్థలు ఇప్పటికే ముందుకొచ్చాయి. ‘ఐఐసీటీ’లో కోర్సుల విద్యాప్రణాళిక రూపకల్పన, ఇంటర్న్షిప్లు, స్కాలర్షిప్లు, స్టార్టప్ నిధులు అందించడం, ఉద్యోగాలు ఇవ్వడం... వీటన్నిటిలో సహాయ సహకారాలు అందించడానికి అవి ఒప్పుకున్నాయి. దీర్ఘకాలిక ప్రగతి సాధ్యమయ్యేలా తోడు నిలుస్తాయి. ఈ భాగస్వామ్యాల వల్ల యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్, సినిమా, ఎక్స్టెండెడ్ రియాలిటీలు అన్నింటిలో విద్య, రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్, నూతన ఆవిష్కరణలకు కొత్త ఊపు వస్తుంది. ఐటీ రంగంలో భారత ఘన విజయం సాధించాం కదా. ఆ నమూనానే ఇలా సృజనాత్మక, డిజిటల్ మీడియా రంగంలోనూ అనుసరించి, భవిష్యత్ పురోగతికి తగ్గ వ్యవస్థీకృత ఏర్పాటు చేయడం మా ప్రధాన ఉద్దేశం.అన్నీ వాళ్ళే చూస్తారు! జాబ్ గ్యారెంటీ!!మూడేళ్ళ క్రితం ‘గతిశక్తి యోజన’ కింద ఏవియేషన్ రంగంలో ఒక బీటెక్ కోర్స్ లాంటిది ఎలా ఉండాలని ప్రపంచ ప్రఖ్యాత ‘ఎయిర్ బస్’ సంస్థ వాళ్ళను అడిగాం. వాళ్ళూ మొదట ఇదేదో నోటిమాట వ్యవహారం అనుకున్నారు. ‘మీ నుంచి మాకు డబ్బు అక్కర్లేదు, నాలెడ్జ్ మాత్రమే కోరుతున్నాం’ అని చెప్పాం. మా ఆలోచన, పట్టుదల గ్రహించి, వాళ్ళు ఏవియేషన్ ఇంజనీరింగ్ కోర్సును సిద్ధం చేశారు. ఇవాళ గతిశక్తి యోజన, ఎయిర్బస్ భాగస్వామ్యంతో వడోదరలోని ‘గతిశక్తి విశ్వవిద్యాలయ’లో 6 సెమిస్టర్లలో విద్యార్థుల చదువు, బస, స్కాలర్షిప్లు, ఇంటర్న్షిప్, మెంటార్షిప్ అన్నీ వాళ్ళే చూసుకుంటారు. శిక్షణ అవుతూనే పెద్ద ఉద్యోగం గ్యారెంటీ అనే పరిస్థితి వచ్చింది. ఆ రంగంలో ఇప్పటికి సుమారు 15 వేల మంది ఉద్యోగులు కావాలి. అందుకే, సీమె¯Œ ్స, జాకబ్స్, ఇండిగో లాంటి అనేక సంస్థలు ఆ కోర్సులో చేరీ చేరగానే యువతకు ఉద్యోగాలు ఆఫర్ చేస్తున్నాయి. విద్యార్థి ఎదుట బోలెడన్ని అవకాశాలు, ప్రత్యామ్నాయాలు ఉంటాయన్న మాట. త్వరలో ప్రారంభమయ్యే ‘ఐఐసీటీ’ విజన్ కూడా ఇలాంటిదే.రైల్వేపై వాళ్ళు నిర్లక్ష్యం చూపారు!చేపట్టే ఏ పనిలో అయినా... చిత్తశుద్ధి ఉంటే అదే విజయతీరాలకు చేరుస్తుంది. ఉదాహరణకు – మన రైల్వేస్. నిజానికి, మన రైల్వేల ప్రస్థానం, వాటి సేవలు అపారం. యూరప్ లాంటిచోట్ల 20 – 22 ఏళ్ళలో రైలు బోగీని వినియోగంలో నుంచి తొలగిస్తే, మన దగ్గర 35 ఏళ్ళ దాకా వాడతాం. మన రైల్వేల బలం, బలగం ఎక్కువ. అయితే, దురదృష్టవశాత్తూ గత పాలకులు రైల్వేపై నిర్లక్ష్యం వహించారు. శ్రద్ధ చూపలేదు. 1970ల నాటి దగ్గరే రైల్వే నిన్న మొన్నటిదాకా ఆగిపోయింది. అప్పట్లో చేసివుండాల్సిన పని ఇప్పుడు చేయాల్సి వస్తోంది. చివరకు ఫ్యాన్ పాడైపోయినా, బాగు చేయించడానికి నిధులు, శ్రద్ధ కరవైన పరిస్థితి. అలాంటిది పదేళ్ళ క్రితం మా ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పరిస్థితి మారింది. సామాన్య ప్రజల రవాణా అయిన రైల్వేల ప్రాధాన్యం, స్థితిగతులు ప్రధాని మోదీకి బాగా తెలుసు. అందుకే, రైల్వేల పట్ల ప్రత్యేక దృష్టి పెట్టారు.చమురు మీద ఆధారపడడం తగ్గించి, విద్యుత్ మీద దృష్టి పెట్టాం. నూరుశాతం రైల్వేల విద్యుదీకరణ చేశాం. కాలుష్యం తగ్గించాం. స్విట్జర్లాండ్, జపాన్ లాంటివి రైల్వేలను నడుపుతున్న తీరు, ఏటా భారీగా పెడుతున్న పెట్టుబడులు మనకు ఓ ఆదర్శం. హిరోషిమా, నాగసాకీలపై అణుబాంబు దాడితో విధ్వంసమైన జపాన్ ధైర్యం కోల్పోకపోగా, అదే అణువిద్యుత్ తయారీ, రైల్వేల వినియోగంతో పురోగమించాలని లక్షించుకొని, ఇంత ప్రగతి సాధించింది. మనకూ అలాంటి విజన్ కావాలి. మన ప్రధాని మోదీకి అలాంటి విజన్ ఉంది. ఇవాళ వేల కిలోమీటర్ల మేర కొత్త రైల్వే ట్రాక్ లాంటివన్నీ దాని ఫలితమే. ‘వందే భారత్’ ఎక్స్ప్రెస్లు తేవడం, రైల్వేస్టేషన్ల ఆధునికీకరణ వగైరా అలా జరుగుతున్నవే. ఇకపై దృష్టి అంతా షిప్పింగ్పై!చిరకాలంగా పాతుకుపోయిన అభిప్రాయాలలో, వైఖరుల్లో మార్పు తెచ్చి, రైల్వే వ్యవస్థను పునర్వ్యవస్థీకరించి, మళ్ళీ పట్టాలెక్కించడానికి చాలా శ్రమించాల్సి వచ్చింది. శ్రమ పడితేనేం, దాని ప్రయోజనం ఇప్పుడిప్పుడే కనిపిస్తోంది. హిమాలయాలు, ఈశాన్య ప్రాంతంలో రైల్వే లైన్ల గురించి కొందరు అడుగుతున్నారు. అది చాలా సంక్లిష్టమైన వ్యవహారం. హిమాలయాలు ఏటా 2 సెంటీమీటర్ల మేర స్థానచలనమవుతాయి. మైదాన ప్రాంతమే లేకుండా వరుసగా సొరంగం, బ్రిడ్జి... మళ్ళీ సొరంగం, బ్రిడ్జి... పద్ధతిలో నిర్మించాలంటే ఎంత కష్టమో ఆలోచించండి. అయినా మునుపటితో పోలిస్తే, మా హయాంలో చురుకుగా పనులు చేస్తున్నాం. విమానయాన రంగం, రైల్వేల తర్వాత మా ప్రభుత్వం దృష్టి అంతా నౌకాయాన రంగం (షిప్పింగ్)పై ఉండనుంది.రెండు నెలల్లో ఏఐ ఫేక్కు జవాబు!కృత్రిమ మేధ (ఏఐ) వచ్చాక సాంకేతిక యుగంలో ఎన్నో ముప్పులున్నాయి. ‘ఏఐ’ని సరైన రీతిలో ఉపయోగించుకోకుంటే అనర్థదాయకం. ఆ ముప్పుల నుంచి ఎలా రక్షణ పొందాలన్నది ముఖ్యం. చట్టం చేసి, తద్వారా ‘ఏఐ’ వ్యాప్తికి అడ్డుకట్ట వేయడం ఒక పద్ధతి. కానీ, దాని వల్ల ఉపయోగం లేదు. రకరకాల వైఖరుల ద్వారా వాటి నుంచి మనల్ని మనం రక్షించుకోవచ్చు. సాంకేతికతకు ‘నో’ చెప్పడమా, చట్టం చేయడమా, మరేదన్నానా... ఇలా ఏ వైఖరిని అవలంబిస్తామన్నది కీలకం. అయితే, అవేవీ కాకుండా టెక్నాలజీతో ఎదురయ్యే సవాళ్ళను టెక్నాలజీతోనే దీటుగా ఎదుర్కోవాలన్నది మన భారతదేశ వైఖరి. ఐఐటీ తదితర సంస్థల సహాయం కోరాం. ‘ఏఐ’ వాడి కల్పించిన ఫేక్ సమాచారమా, కాదా అన్నది కనిపెట్టే టెక్నాలజీ సాధనాలను సిద్ధం చేస్తున్నాం. అది రెండు, మూడు నెలల్లో సిద్ధమై, అందుబాటులోకి రానుంది. జాతి, మతం, ప్రాంతం, భాష... ఇలా వివిధ రకాల పక్షపాత వైఖరులను పసిగట్టి, తొలగిస్తుంది. కేవలం చట్టాలు చేయడం వల్ల ఉపయోగం లేదు. ఇలా టెక్నాలజీతోనే ముప్పును దీటుగా ఎదుర్కోవడమనేది ఆచరణాత్మక పరిష్కారం. మన ఈ వైఖరిని దావోస్లో చెబితే, అందరూ హర్షధ్వానాలు చేశారు. మన ఆలోచనను ప్రపంచమంతా ఇవాళ ప్రశంసిస్తోంది.అవన్నీ లేనిపోని ఆరోపణలు! అడిగితే అన్నిటికీ జవాబిస్తా!!మా ప్రభుత్వం తెచ్చిన ‘డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్’ (డీపీడీపీ) చట్టంలోని నిబంధనలపై కొందరు ఉద్దేశపూర్వకంగా లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. ఎవరికి ఏ సందేహమున్నా వివరంగా జవాబివ్వడానికి నేను సిద్ధం. ఆ చట్టంలోని ప్రతి సెక్షన్ నాకు తెలుసు. అపార్ గుప్తా లాంటి కొందరు ఈ చట్టంపై గగ్గోలు పెడుతున్నారు. దీని కింద జర్నలిస్టుల్ని జైలులో వేయవచ్చని ప్రచారం చేస్తున్నారు. ‘రైట్ టు ప్రైవసీ’ (గోప్యత హక్కు) అనేది ప్రాథమిక హక్కుల్లో భాగమని పుట్టస్వామి కేసులో సుప్రీమ్ కోర్ట్ చెప్పింది. కానీ, ‘రైట్ టు ప్రైవసీ’ కూడా ఇతర చట్టాలకు లోబడే ఉంటుంది. అలాగని ఇన్వెస్టిగేటివ్ జర్నలిజమ్ చేసే జర్నలిస్టుల హక్కును ఎవరూ కాదనలేరు. పుట్టస్వామి కేసులో కోర్టు ఇచ్చిన తీర్పు సహా భారీ సంపుటాలన్నీ నేను క్షుణ్ణగా చదివాను. అలాగే, ఈ డేటా ప్రొటెక్షన్ చట్టం ద్వారా సమాచార హక్కు చట్టాన్ని (ఆర్టీఐ) నీరు గారుస్తున్నారని మరో ఆరోపణ. ఆ ఆరోపణలోనూ పస లేదు.రెండు చేతులతో... మూడు శాఖలు!నాకు సుదీర్ఘ రాజకీయ అనుభవం లేదు. చాలామందితో పోలిస్తే, కొత్తవాణ్ణి. అయినా, నా మీద నమ్మకం ఉంచి, రైల్వే శాఖ, సమాచార – ప్రసార మంత్రిత్వ శాఖ... రెండూ ఇచ్చారు. వాటిని నిర్వహించడం నాకేమీ కష్టంగా అనిపించడం లేదు. పైగా రెండూ నాకు నచ్చిన పనులే. చేతి నిండా ఉన్న ఈ పనుల్ని నేనెంతో ఆస్వాదిస్తున్నా. అదే సమయంలో ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) శాఖ పనులు కూడా నాకెంతో సంతృప్తినిస్తున్నాయి. (నవ్వుతూ...) రెండు చేతులతో మూడు శాఖల పనులూ... అన్నీ ఇష్టంగా, ఆసక్తిగా చేస్తుంటా. ముఖ్యంగా సెమీ కండక్టర్ల రంగంలో చాలా చేస్తున్నాం. ఈ ఏడాది చివరికల్లా దేశీయంగా సెమీ కండక్టర్ల ఉత్పత్తి చేయనున్నాం. ఈ ఏడాది డిసెంబర్ కల్లా తొలి ‘మేడిన్ ఇండియా’ చిప్ చేసే విధంగా ముందుకు దూసుకుపోతున్నాం. (నవ్వుతూ...) ఢిల్లీలో నా ఆ ఆఫీసు గదిలో స్వదేశీ చిప్ వాడకం కోసం సర్వం సిద్ధం చేసి ఉంచా. హైదరాబాద్లో ఆ సంగతి నాకు తెలీదు!హైదరాబాద్లో అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవం సుదీర్ఘ కాలంగా జరగకపోవడానికి కారణం నాకూ తెలియదు. అన్నింటికీ నా దగ్గర జవాబులు లేవు. (నవ్వుతూ...) నేను మనిషినే కదా... నాకు సర్వస్వం తెలియాలని ఏమీ లేదుగా. ఎందుకు జరగడం లేదో... మీరు ఛాట్ జీపీటీని అడగండి. అదేమి చెబుతుందో చూద్దాం. చేసేందుకు చేతుల నిండా పని ఉంది!ప్రధాని మోదీ మాకు ఎప్పుడూ ఒక మాట చెబుతుంటారు... ‘మనం మన కర్తవ్యాన్నీ, బాధ్యతలనూ సమయానికి, సరైన రీతిలో బాగా చేస్తే చాలు. ఇతరుల హక్కులు ఆటోమేటిగ్గా అమలవుతాయి’. మనమే సరైన నిర్ణీత సమయానికి రాకపోతే, రేపు నా దగ్గర పనిచేసే మిగతా వాళ్ళు సరైన సమయానికి రావాలని ఎలా ఆశించగలం? మనం ఆదర్శప్రాయంగా నిలబడితేనే, మన టీమ్ నుంచి కూడా అలాంటిది ఆశించవచ్చు. టెక్నాలజీ వినియోగదారులమైన మనందరం కూడా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తేనే, సమాజానికి హితం జరుగుతుంది. నేనేదో జ్ఞానబోధ చేయడం లేదు... మనస్ఫూర్తిగా నమ్మిన మాట చెబుతున్నా. సమాజం, సర్కార్... రెండూ బాధ్యతతో కలసికట్టుగా నడిస్తేనే ఉపయోగం. రాబోయే తరాలకు మెరుగైన భారతావనిని అందించి వెళ్ళడమే మా పార్టీ, ప్రభుత్వాల ఆలోచన.చదవండి: హద్దులు చెరిపేసిన ఆ రెండు సినిమాలుఇప్పటి దాకా మీరు చూసింది ఒకటో భాగమే. మన దేశాన్ని సర్వసమాయత్తం చేయడంలో భాగంగా పోనుపోనూ మా ప్రభుత్వం చేసేవి, మీరు చూసేవి... ఇంకా చాలా ఉన్నాయి. నిజం చెప్పాలంటే, చేయాలన్న చిత్తశుద్ధి, సంకల్పం ఉండాలే కానీ, ఇక్కడ చేయడానికి చేతుల నిండా పని ఉంది. అయితే, ‘దేశ్ బనానా, సమాజ్ బనానా’ (దేశాన్నీ, సమాజాన్నీ సరైన పద్ధతిలో తీర్చిదిద్దడం) అంత తేలిక కాదు... చాలా కష్టం. – రెంటాల జయదేవ -
పాక్ నటుడు చేసిన వ్యాఖ్యలపై బాలీవుడ్ నటి ఫైర్
పాక్ నటుడు ఫవాద్ ఖాన్పై బాలీవుడ్ నటి రూపాలీ గంగూలీ (Rupali Ganguly) మండిపడ్డారు. పహల్గాం ఘటనతో భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’పై పాక్ నటుడు చేసిన వ్యాఖ్యలను తప్పుబడుతూ ఆమె ఒక పోస్ట్ పెట్టింది. పాకిస్థాన్లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ చేసిన దాడులను ఫవాద్ ఖండించాడు. ఈ సిగ్గుచేటైన దాడిలో గాయపడిన, మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి అంటూ పాక్కు పూర్తి మద్ధతుగా వ్యాఖ్యలు చేశాడు. ఆపై భారత్ను తక్కవ చేస్తూ కామెంట్లు చేశాడు. దీంతో బాలీవుడ్ నటి రూపాలీ గంగూలీ ఫైర్ అయింది.సోషల్ మీడియా వేదికగా ఫవాద్ గురించి ఆమె ఒక పోస్ట్ పెట్టింది. ' మీలాంటి వాళ్లు ఇండియన్ సినిమాల్లో నటించడం మాకు సిగ్గుచేటు' అని అతని ఫోటోను షేర్ చేసింది. దానికి ఆపరేషన్ సిందూర్, ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ఫోర్స్ హ్యాష్ ట్యాగ్లను ఇచ్చింది. దీంతో నెటిజన్లు ఫవాద్ను దుమ్మెత్తిపోస్తున్నారు. భారతీయ సినిమాల మీద ఆధారపడి బతికిన నువ్వు మా గురించి మాట్లాడటం ఏంటి అంటూ విరుచుకుపడుతున్నారు. అయితే, ఇప్పటి వరకు బాలీవుడ్ ప్రముఖులు ఎవరూ కూడా అతన్ని విమర్శించకపోవడం గమనార్హం. ఆపరేషన్ సిందూర్పై వ్యాఖ్యలు చేసిన పాక్ నటీనటులు ఫవాద్ ఖాన్, మహిరా ఖాన్లను ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ ఖండించింది. వారిని వెంటనే పరిశ్రమ నుంచి బహిష్కరించాలని కోరింది. సినిమాల పేరుతో కాస్త గుర్తింపు తెచ్చుకున్న ఇలాంటివారికి గుడ్డిగా ఎవరూ మద్దతు ఇవ్వొద్దని చిత్ర పరిశ్రమను అసోసియేషన్ కోరింది. ఫహల్గామ్ దాడి తర్వాత వెంటనే ఫవాద్ ఖాన్ హీరోగా నటించిన ‘అబీర్ గులాల్’ సినిమాను భారత్లో బ్యాన్ చేశారు. ఆపై పాక్ యూట్యూబ్, ఓటీటీ సంస్థల కంటెంట్ను ఇండియాలో స్ట్రీమింగ్ కాకుండా పూర్తిగా బ్యాన్ చేశారు. You working in Indian films was also 'shameful' for us.#OperationSindoor #IndianArmy #IndianAirForce pic.twitter.com/B7CeuQcb2t— Rupali Ganguly (@TheRupali) May 7, 2025 -
కాన్స్కు బెంగాలీ ఫిల్మ్అరణ్యేర్ దిన్ రాత్రి
భారతీయ ప్రముఖ దివంగత దర్శకులు సత్యజిత్ రే ఐకానిక్ బెంగాలీ ఫిల్మ్ ‘అరణ్యేర్ దిన్ రాత్రి’ (1970) కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శితం కానుంది. ఫ్రాన్స్లో ఈ నెల 13 నుంచి 24 వరకు 78వ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రోత్సవాల తొలి రోజున ‘కాన్స్ క్లాసికల్ సెక్షన్’ విభాగంలో ‘అరణ్యేర్ దిన్ రాత్రి’ సినిమా స్క్రీనింగ్ కానుంది. సునీల్ గంగోపాధ్యాయ రాసిన ‘అరణ్యేర్ దిన్ రాత్రి’ నవలను అదే పేరుతో సత్యజిత్ రే సినిమాగా తెరకెక్కించారు. ఈ అడ్వెంచరస్ యాక్షన్ డ్రామా చిత్రం 1970 జనవరి 16న ఇండియాలో విడుదల కాగా, 1973 మార్చి 14న యూఎస్లో (ఇంగ్లిష్లో ‘డేస్ అండ్ నైట్స్ ఇన్ ది ఫారెస్ట్’) విడుదలైంది.సౌమిత్రా ఛటర్జీ, సుభాష్ ఛటర్జీ, సమిత్ భంజా, రబీ ఘోష్, షర్మిలా ఠాగూర్, కబీర్ బోస్, అపర్ణ సేన్ ఈ సినిమాలోని ప్రధాన పాత్రలుపోషించారు. ఈ సినిమా కాన్స్ చిత్రోత్సవాల్లో ప్రదర్శనకు ఎంపికైనట్లుగా కాన్స్ ప్రతినిధులు అధికారికంగా వెల్లడించారు. ఇందుకోసం ఈ చిత్రాన్ని 4కే రెజల్యూషన్లో రీస్టోర్ చేశారు. ది ఫిల్మ్ ఫౌండేషన్స్ వరల్డ్ సినిమా ప్రాజెక్ట్, ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్, ది క్రైటీరియన్ కలెక్షన్స్ జానస్ ఫిల్మ్స్ల ఆధ్వర్యంలో ‘అరణ్యేర్ దిన్ రాత్రి’ సినిమా 4కే రెజల్యూషన్లో రీ స్టోర్ చేయడం జరిగింది. ఈ చిత్రనిర్మాత పూర్ణిమా దత్తా దగ్గర ఉన్న ఈ సినిమా ఒరిజినల్ కెమెరా, సౌండ్ నెగటివ్ల సాయంతో ఈ సినిమా 4కే రెజల్యూషన్ వీలుపడింది. గోల్డెన్ గ్లోబ్ ఫౌండేషన్ ఫండింగ్ చేసింది. దర్శకులు మార్టిన్ స్కోర్సెస్, వెస్అండర్సన్ ‘అరణ్యేర్ దిన్ రాత్రి’ సినిమాను 4కే రెజల్యూషన్లో రూపొందించడానికి కీలక పాత్రలుపోషించారు.సంతోషం... బాధ: సందీప్ రే ‘అరణ్యేర్ దిన్ రాత్రి’ సినిమా కాన్స్లో ప్రదర్శితం కానున్న సందర్భంగా సత్యజిత్ రే తనయుడు, దర్శకుడు–సంగీత దర్శకుడు సందీప్ రే స్పందించారు. ‘‘ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే బాధగా కూడా ఉంది. ‘కాన్స్’లో సినిమా ప్రదర్శితం కానున్నందుకు సంతోషంగా ఉంది. ఈ సినిమాలోని నటీనటుల్లో చాలా మంది ఇప్పుడు జీవించి లేకపోవడం బాధగా ఉంది. అంతర్జాతీయ స్థాయిలో ఈ సినిమా తీయాలని నాన్నగారు అనుకోలేదు. అంతర్జాతీయ స్థాయిలో ఆయన సినిమాలు ఉన్నాయని వారు తెలుసుకున్నారు. ‘పథేర్ పాంచాలి’ సినిమా విషయంలోనూ ఇదే జరిగింది’’ అని పేర్కొన్నారు. కాన్స్ ఫెస్టివల్కు పూర్ణిమ... షర్మిల ఇక ఈ సినిమా కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శన కానున్న సందర్భంగా ఈ చిత్ర నిర్మాత పూర్ణిమా దత్తా, ఈ చిత్రంలో నటించిన షర్మిలా ఠాగూర్ హాజరు కానున్నారు. ఈ చిత్రంలో నటించిన మరో నటి సిమీ గరేవాల్కు ఆహ్వానం అందినప్పటికీ అనారోగ్యం కారణంగా ఆమె హాజరు కాలేకపోతున్నారట. ఇక ఈ 78వ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్కు భారతదేశం తరఫున ఎంపికైన ఏకైక చిత్రం ‘హోమ్బౌండ్’. జాన్వీ కపూర్, ఇషాన్ కట్టర్ లీడ్ రోల్లో నటించిన ఈ సినిమాకు హైదరాబాదీ వ్యక్తి నీరజ్ దర్శకత్వం వహించారు. ‘అన్సరై్టన్ రిగార్డ్’ విభాగంలో ‘హోమ్బౌండ్’ చిత్రంపోటీ పడుతోంది. -
బిడ్డకు జన్మనిచ్చి మరణించిన స్టార్ హీరోయిన్.. అతనే 'హిట్-3' విలన్
బాలీవుడ్ నటుడు ప్రతీక్ బాబర్ హిట్-3 సినిమాతో టాలీవుడ్లో బాగా పాపులర్ అయ్యాడు. హిందీలో ఆయన సుమారు 30కి పైగా సినిమాల్లో నటించారు. అయితే, హిట్-3లో విలన్గా ఆల్ఫా పాత్రలో మంచి గుర్తింపు పొందాడు. సికందర్, దర్భార్, భాగీ2 వంటి చిత్రాల్లో కూడా ప్రతీక్ మెప్పించాడు. అయితే, ప్రతీక్ బాబర్ ఒకప్పటి స్టార్ హీరోయిన్ కుమారుడు అని చాలామందికి తెలియదు. మహానటి అనే పేరుకు అసలైన ఐకాన్గా ఒకప్పుడు ఆమె పేరు పొందింది.పద్మశ్రీతో పాటు రెండు నేషనల్ అవార్డ్స్ఉత్తమ నటిగా రెండు జాతీయ అవార్డ్స్ అందుకున్న స్మితా పాటిల్ ఏకైక కుమారుడే ప్రతీక్ బాబర్.. 80కి పైగా సినిమాల్లో హీరోయిన్గా నటించిన ఆమె కేవలం 31 ఏళ్ల వయస్సులోనే కన్నుమూసింది. స్టార్ హీరోయిన్ కాకముందే ఆమె డైరెక్టర్స్కు కండీషన్స్ పెట్టేది. అగ్లీ డ్రెస్సులు అంటే నో చెప్పేది. తన పాత్రకు ప్రాధాన్యం లేకపోతే ఎంత పెద్ద హీరో అయినా సరే.. డబ్బు ఎంత ఇచ్చినా సరే డోన్ట్ కేర్ అనేది. ఆమె చిత్రపరిశ్రమలో ఉన్నదే పదేళ్లు.. అయినా సరే భారీగా ఫ్యాన్స్ను సంపాదించుకుంది. ఇండియన్ సినిమా తెరపై మళ్లీ ఇలాంటి నటిని చూడలేమేమో అనేంతలా సినీ అభిమానులను మెప్పించింది. కేతన్ మెహతా 1987లో తీసిన "మిర్చ్ మసాలా" చిత్రంలో ఈమె నటనను ఫోర్బ్స్ పత్రిక "భారత సినిమాలలో 25 అత్యున్నత నట ప్రదర్శనల" జాబితాలో చేర్చింది. ఇదొక మచ్చుతునక మాత్రమేనని చెప్పవచ్చు.1955లో జన్మించిన ఆమె దశాబ్దకాలంలోనే 80కి పైగా సినిమాల్లో నటించింది. భారత ప్రభుత్వం ఈమెను 1985లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. 2013లో ఆమె పేరుతో పోస్టల్ స్టాంప్ కూడా విడుదలైంది. సినీ నటుడు రాజ్ బబ్బర్ను ప్రేమించి పెళ్లి చేసుకున్న స్మితా పాటిల్ ప్రతీక్ బబ్బర్ను కన్న తరువాత రెండు వారాలకు చనిపోయింది. కాన్పు వల్ల కలిగిన అనారోగ్య సమస్యల కారణంగా 1986, డిసెంబర్ 13న మరణించింది. తల్లి మీద ప్రేమతో హిట్-3 నటుడు తన పేరును 'ప్రతీక్ స్మితా పాటిల్'గా మార్చుకున్నాడు. -
'ఆపరేషన్ సిందూర్' ఎఫెక్ట్.. పాక్ నటులపై నిషేధం
మన దేశం చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్' వల్ల 80 మంది పాక్ ఉగ్రవాదులు హతమయ్యారు. మరోవైపు ఆపరేషన్ సింధూర్ పై పాక్ నటులు ఫవాద్ ఖాన్, మహిరా ఖాన్ కామెంట్స్ చేయడంపై ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ ఖండించింది. వీరిని తక్షణమే బాలీవుడ్ నుంచి నిషేధిస్తున్నట్లు లేఖ విడుదల చేసింది. ఇలాంటి వారికి గుడ్డిగా మద్దతు ఇవ్వొద్దని కోరింది.'వారి (ఫవాద్-మహిరా) కామెంట్స్ మన దేశాన్ని అగౌవరపరిచేలా ఉన్నాయి. అలానే ఉగ్రవాదం కారణంగా ప్రాణాలు కోల్పోయిన అమాయకులని, దేశం కోసం ప్రాణత్యాగం చేసిన సైనికులని కూడా అవమానించేలా ఉన్నాయి. మన ఇండస్ట్రీలో పనిచేసే పాక్ నటీనటులు, చిత్రనిర్మాతలపై పూర్తిగా నిషేధం విధించాలి. భారతీయులెవరూ వీరిని అభిమానించొద్దు'(ఇదీ చదవండి: 'ఆపరేషన్ సిందూర్' టైటిల్ కోసం క్యూ కట్టిన నిర్మాతలు)'కళ పేరుతో ఇలాంటి నటీనటుల్ని గుడ్డిగా మద్దతు ఇవ్వడం జాతీయ గౌరవాన్ని అగౌవరపరచం లాంటిదే. చిత్రపరిశ్రమ దీన్ని అర్థం చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో దేశం కోసం ఐక్యంగా నిలబడదాం' అని ఆల్ ఇండియా సినీ వర్కర్క్ అసోసియేషన్ పేర్కొంది.గత నెలలో పహల్గామ్ లో జరిగిన దాడికి ప్రతీకార చర్యగా.. మంగళవారం అర్థరాత్రి పాక్ ఆక్రమిత కశ్మీర్ పై 'ఆపరేషన్ సిందూర్' పేరుతో దాడి చేసింది. 9 స్థావరాలపై దాడి చేయగా 80 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. ఇకపోతే ఫవాద్ ఖాన్ నటించిన హిందీ సినిమా 'అబిర్ గులాల్'. మే 9న రిలీజ్ అనుకున్నారు కానీ ఇప్పుడా సినిమా అటకెక్కిపోయినట్లే.(ఇదీ చదవండి: 'ఆపరేషన్ సిందూర్' ఎఫెక్ట్.. డైరెక్ట్గా ఓటీటీలోకి రానున్న భారీ సినిమా) -
రజనీ,నాగార్జున... ఎన్టీయార్ , హృతిక్ ‘వార్’ తప్పదా?
భారీ తారాగణం, సాంకేతిక నిపుణులు, భారీబడ్జెట్తో రూపొందే సినిమాలు ఎప్పుడూ ఆసక్తిని రేకెత్తిస్తూనే ఉంటాయి. అలాంటి సినిమాలు రెండు ఒకే సమయంలో విడుదలయే పరిస్థితి ఏర్పడితే అది మరింత ఉత్కంఠ కలిగించేదే. ఒకప్పుడు బాలీవుడ్ సినిమాలకూ, దక్షిణాది సినిమాలకు నడుమ ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు. కానీ ఎప్పుడైతే సౌత్ సినిమాలు పాన్ ఇండియా మూవీస్గా జాతీయస్థాయిలో సత్తా చాటడం మొదలుపెట్టాయో... అప్పటి నుంచి వీటి మధ్య పోటీ కూడా సినీ అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. ప్రస్తుతం ఓ బాలీవుడ్ సినిమాతో మరో దక్షిణాది సినిమా విడుదల తేదీల మధ్య అలాంటి ఉత్కంఠే నెలకొంది.తమిళ టాప్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ సూపర్ స్టార్ రజినీకాంత్తో కూలీ(Coolie) పేరుతో ఓ మాస్ ఎంటర్టైనర్ ను రెడీ చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా చివరి దశకు వచ్చింది ఈ సినిమాలో నాగార్జున, ఉపేంద్రలు కూడా నటిస్తూండడంతో, ఇది మల్టీ స్టారర్ హోదా తెచ్చుకుంది. ఈ భారీ పాన్ ఇండియా మూవీ ఆగస్ట్ 14న విడుదల చేస్తారని అంచనాలు ఉన్నాయి. నిజానికి కూలీ సినిమా సమ్మర్లో రిలీజ్ అనుకున్నారు కానీ అది తర్వాత ఆగస్ట్కు మారింది. లోకేష్ గత సినిమాల కంటే ఈ సినిమాకు ఎక్కువ కేర్ తీసుకుంటున్నాడని అందుకే ఈ ఆలస్యం అంటున్నారు.మరోవైపు బాలీవుడ్ టాప్ హీరో హృతిక్ రోషన్, టాలీవుడ్ అగ్రనటుడు జూ.ఎన్టీఆర్ల సెన్సేషనల్ కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ చిత్రం వార్ 2(War 2) కూడా అదే సమయంలో రిలీజ్ అవనుంది. దీనితో కూలీ అనుకున్న టైమ్ కి వస్తాడా రాడా అనే సందేహాలు రజనీకాంత్ అభిమానుల్లో మొదలయ్యాయి. అన్ని హంగులతో వార్ 2 భారీ స్థాయిలో తెరకెక్కుతోంది. ప్రతిష్టాత్మక సంస్థ యష్ రాజ్ ఫిలింస్ రూపొందిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ జోడీ కట్టడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయ్. మేకర్స్ ఈ సినిమా విడుదల తేదీ ఆగస్టు 14గా ఇప్పటికే ప్రకటించేశారు. అనుకోని అవాంతరం ఏర్పడితే తప్ప అది మారే అవకాశం కనిపించడం లేదు, సో అదేన రోజు కూలీ వస్తే నేరుగా క్లాష్ తప్పదు. రెండు సినిమాల జోనర్ వేరువేరు..అయినప్పటికీ... ఒకవేళ కూలీ నిజంగానే ఆగస్ట్ 14న వస్తే, బాక్సాఫీస్ వద్ద సీనియర్స్ వర్సెస్ జూనియర్స్ యుద్ధం జరుగుతుందని అనొచ్చు. ఒకవైపు రజినీకాంత్, నాగార్జున, ఉపేంద్ర వంటి సీనియర్ హీరోలు మరోవైపు ఎన్టీఆర్, హృతిక్ల వంటి ఆ తర్వాతి తరం హీరోల మధ్య ఈ పోటీ ఫ్యాన్స్ కు సినీ పండితులకు ఖచ్చితంగా సెంట్రాఫ్ టాపిక్స్ అవుతుంది అంతేకాదు, పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకునేలా రెండు సినిమాలు ఒకేసారి విడుదల అయ్యి కలెక్షన్ల వేట మొదలుపెడితే అది కొత్త రికార్డ్స్ క్రియేట్ చేసే అవకాశాలూ లేకపోలేదు. -
'ఆపరేషన్ సిందూర్' టైటిల్ కోసం క్యూ కట్టిన నిర్మాతలు
'ఆపరేషన్ సిందూర్' టైటిల్ హక్కుల కోసం బాలీవుడ్లోని టాప్ సినీ నిర్మాణ సంస్థలు పోటీ పడుతున్నాయి. ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై భారత్ దాడి చేసిన విషయం తెలిసిందే. క్షిపణులు, డ్రోన్లతో పాకిస్థాన్తోపాటు పాక్ ఆక్రమిత కశ్మీర్పై ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో భారత్ విరుచుకుపడింది. ఈ పేరు చాలా శక్తివంతంగా ఉందని గుర్తించిన సినీ మేకర్స్ టైటిల్ హక్కుల కోసం క్యూ కడుతున్నాయి.ఇప్పటికే అనేక మంది నిర్మాతలు ఆపరేషన్ సిందూర్ టైటిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారని ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ (FWICE) అధ్యక్షుడు BN తివారీ ఇండియా టుడేతో ధృవీకరించారు. ఇండియన్ మోషన్ పిక్చర్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (సినిమా టైటిల్స్ రిజిస్ట్రేషన్ కోసం పనిచేసే సంఘాలలో ఒకటి)లో దాదాపు 15 మంది చిత్రనిర్మాతలు, స్టూడియోలు కూడా ఇదే టైటిల్ కోసం దరఖాస్తు చేసుకున్నాయన్నారు.హిందీ చిత్ర పరిశ్రమ నిర్మాతలు నిన్నటి నుంచి "ఆపరేషన్ సిందూర్" అనే టైటిల్ రేసులో మహావీర్ జైన్ ఫిల్మ్స్ ముందంజలో ఉందని, ఈ టైటిల్ను రిజిస్టర్ చేసిన మొదటి బ్యానర్ అని సమాచారం. ప్రముఖ దర్శకుడు మధుర్ భండార్కర్ కూడా ఈ టైటిల్ను రిజిస్టర్ చేశారని తెలుస్తోంది. ఆపై ప్రముఖ బ్యానర్లు జీ స్టూడియోస్, టి-సిరీస్ ఈ టైటిల్ను రిజిస్టర్ చేసిన తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఈ బ్యానర్లన్నీ కూడా ఇటీవలనే పహల్గామ్ దాడిని ప్రపంచానికి చూపాలని పహల్గామ్ పేరుతో టైటిల్ను రిజిస్టర్ చేసుకున్నాయి. అయితే, "ఆపరేషన్ సిందూర్" అనేది ఒక శక్తివంతమైన టైటిల్ కావడంతో చాలామంది పోటీపడుతున్నారు. -
ఆమిర్ని కలిసిన అల్లు అర్జున్.. భారీ ప్రాజెక్ట్ కోసమేనా?
బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్(Aamir Khan)తో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) భేటీ అయ్యారు. ముంబైలోని ఆమిర్ నివాసానికి వెళ్లిన బన్నీ..ఆయనతో కాసేపు ముచ్చటించారు. ఇలా ఉన్నపళంగా ఆమిర్తో బన్నీ బేటీ కావడంపై రకరకాల పుకార్లు వెల్లువడుతున్నాయి. వీరిద్దరి కాంబినేషన్లో ఓ భారీ ప్రాజెక్ట్ రాబోతుందని, దాని కోసమే ఆమిర్ని కలిశాడని బాలీవుడ్లో వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆమిర్ తన తదుపరి చిత్రం సితారే జమీన్ పర్ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత ఆయన భారీ బడ్జెట్తో ‘మహా భారతం’ తీయాలని చూస్తున్నాడు. ఈ సినిమాలో స్టార్ హీరోలు నటిస్తారని ఇటీవల ఆయన ప్రకటించారు. తాజాగా బన్నీ వెళ్లి కలవడంతో..‘మహా భారతం’కోసమే ఈ భేటీ జరిగిందనే ప్రచారం మొదలైంది. దీనిపై అధికారిక ప్రకటనలు ఏవీ రాకపోయినా, అటు బాలీవుడ్తో పాటు ఇటు టాలీవుడ్లోనూ ఇప్పుడు బన్నీ-ఆమిర్ భేటీనే హాట్ టాపిక్గా మారింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం బన్నీ అట్లీ సినిమాతో బీజీగా ఉన్నారు. ఇందులో ఆయన డ్యూయల్ రోల్ ప్లే చేయబోతున్నారు. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే బన్నీ షూటింగ్లో పాల్గొంటారు. ఇందులో హాలీవుడ్ తరహాలో విజువల్స్ ఉండబోతున్నాయట. ఈ సినిమాలో ముగ్గురు కథానాయికలు నటించనున్నారని, జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్లను ఇప్పటికే ఖరారు చేసినట్లు తెలుస్తోంది. మూడో కథానాయికగా ‘లైగర్’ ఫేమ్ అనన్యా పాండేను ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. సన్ పిక్చర్స్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించనున్నారని సమాచారం. -
మొన్ననే విడాకులు .. ఇప్పుడు ఐటమ్ సాంగ్
టీమిండియా క్రికెటర్, ప్రస్తుతం ఐపీఎల్ లో పంజాబ్ జట్టుకు ఆడుతున్న యజువేంద్ర చాహల్.. కొన్నాళ్ల క్రితం విడాకులు తీసుకున్నాడు. 2020లో యూట్యూబర్, డ్యాన్సర్ ధనశ్రీ వర్మతో చాహల్ పెళ్లి జరిగింది. అయితే వీళ్ల బంధం చాలావరకు బాగానే ఉండేది. మరి ఏమైందో ఏమో గానీ గత కొన్నాళ్లుగా వేర్వేరుగా ఉన్నారు. ఈ ఏడాది అధికారికంగా విడాకులు తీసేసుకున్నారు.అయితే భర్త నుంచి విడిపోయిన తర్వాత ధనశ్రీ.. సినిమాల్లో బిజీ అయిపోతోంది. మొన్నీమధ్యే తెలుగులో 'ఆకాశం దాటివస్తావా' మూవీలో హీరోయిన్ గా చేసింది. ఇప్పుడు ఓ హిందీ చిత్రంలో ఐటమ్ సాంగ్ చేసింది. ఇప్పుడీ ఈ విషయాన్ని ఈమెనే స్వయంగా వెల్లడించింది.(ఇదీ చదవండి: మహేశ్ ఇంట్లో మరో హీరో రెడీ.. అన్నీ ఫిక్స్!)రాజ్ కుమార్ రావ్, వామికా గబ్బీ హీరోహీరోయిన్లుగా నటించిన 'భూల్ చుక్ మాఫ్' చిత్రం మే 09న థియేటర్లలోకి రానుంది. ఇందులోని ప్రత్యేక గీతంలో ధనశ్రీ నర్తించింది. ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే సినిమాల్లో నటించే విషయమై చాహల్-ధనశ్రీ మధ్య విభేదాలు వచ్చి విడాకులు తీసుకున్నారా అనే సందేహం వస్తోంది.ఎందుకంటే విడాకులు తీసుకున్న కొన్నిరోజుల తర్వాత తెలుగు, హిందీలో తాను చేస్తున్న సినిమాల గురించి ధనశ్రీ పోస్ట్ పెట్టింది. ఈ సినిమాలు సక్సెస్ అయితే గనక ఈమె పూర్తిస్థాయిలో హీరోయిన్ గా మారిపోతుందేమో చూడాలి?(ఇదీ చదవండి: హీరో కిరణ్ అబ్బవరం ఇంట్లో సీమంతం వేడుక) View this post on Instagram A post shared by Dhanashree Verma (@dhanashree9) -
Operation Sindoor: వెండితెరపై భారత్-పాక్ యుద్ధ గాథలు
ఆపరేషన్ సిందూర్..ఇప్పుడు భారత్లో ఎక్కడ చూసినా దీని గురించే చర్చిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్ర దాడికి ప్రతిస్పందనగా పాకిస్తాన్ ఉగ్రవాదులపై భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ ఇది. ఈ ఆపరేషన్లో భారత సైన్యం పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలపై ఆత్మాహుతి డ్రోన్లు.. స్కాల్ప్ క్షిపణులు.. హ్యామర్ బాంబులతో విరుచుపడింది. ఆ దేశ పౌరులకు నష్టం కలిగించకుండా..కేవలం ఉగ్రవాదులను టార్గెట్గా చేసుకొని ఈ ఆపరేషన్ చేపట్టారు.భారత్-పాకిస్తాన్ మధ్య గతంలో జరిగిన యుద్ధాలు, మెరుపు దాడులు భారత సైన్యం యొక్క ధైర్యసాహసాలను ప్రపంచానికి చాటాయి. ఈ యుద్ధ గాథలు వెండితెరపై దేశభక్తి ఉట్టిపడే సినిమాలుగా మలిచాయి. ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో, భారత్-పాక్ యుద్ధాల ఆధారంగా తెరకెక్కిన ఆర్మీ సినిమాలపై ఓ లుక్కేద్దాం.బోర్డర్ (1997)ఈ చిత్రం 1971 యుద్ధంలో లాంగేవాలా సరిహద్దు పోస్ట్ను రక్షించిన 120 మంది భారతీయ సైనికుల ధైర్యసాహసాలను తెలియజేస్తుంది . వారు పాకిస్తాన్ యొక్క భారీ ట్యాంక్ రెజిమెంట్ను ఎదుర్కొని, రాత్రంతా పోరాడి, ఉదయం భారత వైమానిక దళ సహాయంతో విజయం సాధించారు. ఈ సినిమా దేశభక్తి గీతాలు, ఉద్వేగభరిత సన్నివేశాలు మరియు యుద్ధ దృశ్యాలతో బాక్సాఫీస్ విజయం సాధించింది. “సందేశే ఆతే హై” గీతం ఇప్పటికీ దేశభక్తి గీతాలలో ఒక ఐకాన్గా నిలిచింది. సన్నీ డియోల్, సునీల్ శెట్టి, అక్షయ్ ఖన్నా, జాకీ ష్రాఫ్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి జేపీ దత్తా దర్శకత్వం వహించారు.లక్ష్య (2004)ఈ చిత్రం కార్గిల్ యుద్ధంలో భారత సైనికులు టైగర్ హిల్ను తిరిగి స్వాధీనం చేసుకున్న సంఘటనలను చిత్రీకరిస్తుంది. హృతిక్ రోషన్ పోషించిన కరణ్ షెర్గిల్ అనే లక్ష్యం లేని యువకుడు సైన్యంలో చేరి, యుద్ధంలో హీరోగా మారే ప్రయాణం ఈ సినిమా కథాంశం. ఈ సినిమా యువతను సైన్యంలో చేరేందుకు ప్రేరేపించింది మరియు దేశభక్తితో పాటు వ్యక్తిగత పరివర్తనను కూడా చూపించింది. హృతిక్ రోషన్, ప్రీతి జింటా, అమితాబ్ బచ్చన్ నటించిన ఈ చిత్రానికి ఫర్హాన్ అక్తర్ దర్శకత్వం వహించారు.1971 (2007)ఈ చిత్రం 1971 యుద్ధంలో పాకిస్తాన్ సైన్యం చేతిలో ఖైదీలుగా ఉన్న ఆరుగురు భారతీయ సైనికుల కథను చెబుతుంది. వారు తమ దేశానికి తిరిగి రావడానికి చేసిన ప్రయత్నాలు, త్యాగాలను ఈ సినిమా చిత్రీకరిస్తుంది. ఈ చిత్రం యుద్ధ ఖైదీల జీవితాలలోని కష్టాలను మరియు వారి ధైర్యాన్ని వాస్తవికంగా చూపించింది. దర్శకుడు: అమృత్ సాగర్ ; నటీనటులు: మనోజ్ బాజ్పాయ్, రవి కిషన్, దీపక్ దోబ్రియాల్ది గాజీ అటాక్ (2017)ఈ చిత్రం 1971 యుద్ధంలో భారత నావికాదళ సబ్మెరైన్ INS కరంజ్, పాకిస్తాన్ సబ్మెరైన్ PNS గాజీ మధ్య జరిగిన జల యుద్ధాన్ని చిత్రీకరిస్తుంది. భారత నావికాదళం విశాఖపట్నం ఓడరేవును రక్షించడానికి చేసిన ప్రయత్నాలను ఈ సినిమా ఉత్కంఠభరితంగా చూపిస్తుంది. ఈ చిత్రం హిందీ, తెలుగు భాషల్లో విడుదలై, విమర్శకుల ప్రశంసలు అందుకుంది. దర్శకుడు: సంకల్ప్ రెడ్డి; నటీనటులు: రానా దగ్గుబాటి, కే కే మీనన్, అతుల్ కులకర్ణి.ఉరి: ది సర్జికల్ స్ట్రైక్ (2019)ఈ చిత్రం 2016లో జమ్మూ కాశ్మీర్లోని ఉరి సైనిక శిబిరంపై జరిగిన ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా భారత సైన్యం పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్ నేపథ్యంలో తెరకెక్కింది. “హౌస్ ది జోష్?” అనే డైలాగ్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ సినిమా ఆధునిక యుద్ధ వ్యూహాలు, సైనిక సామర్థ్యం మరియు దేశభక్తిని చూపించడంలో విజయవంతమైంది. దర్శకుడు: ఆదిత్య ధర్; నటీనటులు: విక్కీ కౌశల్, యామి గౌతమ్, పరేష్ రావల్షేర్షా (2021)ఈ చిత్రం కార్గిల్ యుద్ధంలో పరమవీర చక్ర గ్రహీత కెప్టెన్ విక్రమ్ బత్రా జీవితం ఆధారంగా రూపొందింది. విక్రమ్ బత్రా యొక్క ధైర్యం, నాయకత్వం , త్యాగాన్ని ఈ సినిమాలో కళ్లకు కట్టినట్లు చూపించారు. “యే దిల్ మాంగే మోర్” అనే విక్రమ్ బత్రా యొక్క ప్రసిద్ధ నినాదం ఈ సినిమాతో మళ్లీ ప్రాచుర్యంలోకి వచ్చింది. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్లో విడుదలై, విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రానికి విష్ణువర్దన్ దర్శకత్వం వహించగా.. సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అడ్వాణీ కీలక పాత్రలు పోషించారు.‘ఆపరేషన్ వాలెంటైన్’(2024)పుల్వామా ఉగ్రవాద దాడి, ఆ తర్వాత భారత వైమానిక దళం చేపట్టిన బాలాకోట్ వైమానిక దాడి నేపథ్యంలో ‘ఆపరేషన్ వాలెంటైన్’ (Operation Valentine) సినిమా తెరకెక్కింది. శక్తి ప్రతాప్ సింగ్ హుడా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వరుణ్ తేజ్ (Varun Tej), మానుషి చిల్లర్ (Manushi Chhillar) ప్రధాన పాత్రల్లో నటించారు. -
చాలా భయపడ్డా.. పారిపోవాలనిపించింది: షారుక్ ఖాన్
సెలబ్రిటీల ఫ్యాషన్ షో ‘మెట్ గాలా’(Met Gala 2025) వేడుక వైభవంగా ప్రారంభమైంది. న్యూయార్క్లోని మెట్రోపాలిటిన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్స్ వేదికగా ఈ ఫ్యాషన్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. ఈ ఏడాది ‘మెట్ గాలా’ డ్రెస్కోడ్ ‘టైలర్డ్ ఫర్ యు’ కాగా, ‘సూపర్ఫైన్: టైలరింగ్ బ్లాక్స్టైల్’ను థీమ్గా నిర్ణయించారు నిర్వాహకులు. ఈ థీమ్కు తగ్గట్లుగా ఈ వేడుకలో నలుపు రంగు దుస్తుల్లో పాల్గొన్నారు ప్రముఖులు. ఇక ఈ వేడుకలకు హాజరైన తొలి భారతీయ నటుడిగా షారుక్ ఖాన్( Shah Rukh Khan) చరిత్ర సృష్టించారు. సబ్యసాచి డిజైన్ చేసిన దుస్తుల్లో అల్ట్రా స్టైలిష్గా కనపడి, ఈ వేడుకలో సెంటరాఫ్ ఎట్రాక్షన్గా నిలిచారు షారుక్ ఖాన్. ‘‘ఈ ఏడాది మెట్ గాలాకి ఆహ్వానం అందగానే నా కుమారుడు ఆర్యన్, కుమార్తె సుహానా ఎంతగానో సంతోషించారు. ఈ వేడుకలో నేను పాల్గొంటే అది చరిత్ర అవుతుందని కూడా నాకు తెలియదు. నేను ఇప్పటివరకు రెడ్ కార్పెట్పై నడవలేదు. నాకు ఫ్యాషన్పై ఆసక్తి కూడా తక్కువ. దీంతో ఈ వేడుకకు రావడానికి నేను చాలా భయపడ్డాను. కాస్త బిడియంగా అనిపించింది. ఓ దశలో పారిపోవాలనిపించింది’’ అని పేర్కొన్నారు షారుక్ ఖాన్. ఇంకా ఈ వేడుకలో నటి–నిర్మాత ప్రియాంకా చోప్రా, ఆమె భర్త–నటుడు నిక్ జోనస్, హీరోయిన్ కియారా అద్వానీ, సింగర్–నటుడు–నిర్మాత దిల్జీత్ సింగ్ తదితర ప్రముఖులు పాల్గొని సందడి చేశారు. ఇక త్వరలో తల్లి కాబోతున్న కియారా అద్వానీ ఈ వేడుకలో ‘బేబీ బంప్’తో మెరిశారు. -
బాలీవుడ్ అమ్ముడు పోయింది.. ప్రకాశ్ రాజ్ సంచలన వ్యాఖ్యలు!
ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్(Prakash Raj ) బాలీవుడ్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందీ చిత్ర పరిశ్రమలో సగం మంది నటీనటులు ప్రభుత్వానికి అమ్ముడుపోయారని, అందుకే వారు ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేయడానికి వెనుకాడుతున్నారని ఆరోపించారు. రాజకీయ అంశాలపై తన అభిప్రాయాలను బహిరంగంగా వెల్లడించే ప్రకాశ్ రాజ్, తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, బాలీవుడ్లో తనకు అవకాశాలు తగ్గడానికి కారణాలను వివరించారు.“నేను సూటిగా మాట్లాడతాను. రాజకీయ పరిణామాలపై నా అభిప్రాయాన్ని బహిరంగంగా చెబుతుంటాను. దీని వల్ల భవిష్యత్తులో తమకు ఇబ్బందులు వస్తాయని భావించి, నాకు అవకాశాలు ఇవ్వడం లేదు. ఇలాంటి పరిస్థితులు వస్తాయని తెలిసిన తర్వాతే నేను గళం విప్పాలని నిర్ణయించుకున్నాను,” అని ప్రకాశ్ రాజ్ తెలిపారు. ప్రభుత్వం చేసే తప్పిదాలను ప్రశ్నించాలనే ఆలోచన చాలా మందిలో ఉన్నప్పటికీ, ధైర్యంతో ముందుకు రావడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.“సినిమా పరిశ్రమలో సగం మంది అమ్ముడుపోయినవారే. కొంతమంది మంచివారు ఉన్నప్పటికీ, ప్రశ్నించే ధైర్యం లేదు. నా సన్నిహిత మిత్రుడు ఒకరు, ‘ప్రకాశ్, నీకు ధైర్యం ఉంది కాబట్టి మాట్లాడగలుగుతున్నావ్, మాకు అంత ధైర్యం లేదు’ అని చెప్పారు. వారి పరస్థితిని నేను అర్థం చేసుకోగలను. కానీ, చరిత్ర నేరాలు చేసిన వారిని క్షమించినా, మౌనంగా ఉండేవారిని మాత్రం క్షమించదు. ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలి,” అని ఆయన స్పష్టం చేశారు.ప్రకాశ్ రాజ్ ఈ వ్యాఖ్యలు సినీ, రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఆయన తాజాగా సూర్య నటించిన ‘రెట్రో’ చిత్రంలో కనిపించారు. పవన్ కల్యాణ్ నటిస్తున్న ‘ఓజీ’, విజయ్ నటిస్తున్న ‘జన నాయగన్’ చిత్రాల్లో కూడా ఆయన కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
పోలీసులకు నటి ఫిర్యాదు.. పరారీలో నటుడు అజాజ్ ఖాన్!
ఇటీవల హౌస్ అరెస్ట్ షో వివాదం తర్వాత అజాజ్ ఖాన్ పేరు ఒక్కసారిగా హాట్ టాపిక్గా మారింది. ఈ షోలో అసభ్యకరమైన కంటెంట్ ప్రసారం చేయడం వివాదంగా మారింది. దీంతో ఆ షోను ప్రసారం చేస్తున్న ఓటీటీ సంస్థ కూడా బ్యాన్ విధించింది. ఆ తర్వాత ఓ నటి తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని అజాజ్ ఖాన్పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అజాజ్ ఖాన్ తన ఫోన్ స్విచ్ఛాప్ చేసి పరారైనట్లు తెలుస్తోంది.తనపై అత్యాచారం చేశాడని ఆరోపిస్తూ ఒక నటి ముంబయిలోని చార్కోప్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అజాజ్ ఖాన్ను సంప్రదించేందుకు పోలీసులు యత్నించగా.. ఇంటి వద్ద అందుబాటులో లేడని తెలిపారు. అంతేకాకుండా ఫోన్ నంబర్ కూడా స్విచ్ఛాఫ్ రావడంతో పరారైనట్లు సమాచారం. కాగా.. ప్రస్తుతం పోలీసులు అతని కోసం వెతుకుతున్నారు. 'హౌస్ అరెస్ట్' షోలో పాత్రను ఆఫర్ చేశాడని.. ఆ తర్వాత పెళ్లి చేసుకుంటానని చెప్పి అత్యాచారం చేశాడని నటి ఆరోపించిన సంగతి తెలిసిందే.ఇప్పటికే 'హౌస్ అరెస్ట్' అనే షోలో అనుచిత కంటెంట్ను ప్రసారం చేసినందుకు మరో కేసులో కూడా పోలీసులు అతనికి సమన్లు జారీ చేశారు. అభ్యంతరకరమైన కంటెంట్ను ప్రోత్సహించినందుకు అతనితో పాటు, ఉల్లు ఓటీటీ యజమానులపై ప్రత్యేక ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ షోను వెంటనే నిషేధించాలని పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
మెట్ గాలాలో మెరిసిన గేమ్ ఛేంజర్ హీరోయిన్.. బేబీ బంప్తో ఎంట్రీ!
ప్రతిష్టాత్మక ఈవెంట్లో గేమ్ ఛేంజర్ హీరోయిన్ కియారా అద్వానీ మెరిసింది. న్యూయార్క్లోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్స్లో జరిగిన మెట్గాలాలో బాలీవుడ్ సినీ తారలంత సందడి చేశారు. ఇందులో బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ స్పెషల్ అట్రాక్షన్ నిలిచింది. తన బేబీ బంప్తో వేదికపై ఎంట్రీ ఇచ్చింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ప్రముఖ భారతీయ డిజైనర్ గౌరవ్ గుప్తా రూపొందించిన దుస్తులను కియారా ధరించి ఈవెంట్లో మెరిసింది.కాగా..'సూపర్ఫైన్: టైలరింగ్ బ్లాక్ స్టైల్' అనే థీమ్తో మెట్ గాలా- 2025 ఈవెంట్ నిర్వహిస్తున్నారు. బేబీ బంప్తో మెట్ గాలా కార్పెట్పై ఎంట్రీ ఇచ్చిన మొదటి భారతీయ నటిగా నిలిచింది. ఈ సందర్భంగా నా జీవితంలో ఒక నటిగా, కాబోయే తల్లిగా మెట్ గాలా అరంగేట్రం చేయడం చాలా ప్రత్యేకమైన అనుభూతిని కలిగిస్తోందని కియారా పేర్కొంది. నా స్టైలిస్ట్ లుక్ను డిజైన్ చేయడానికి గౌరవ్ సృష్టించిన డ్రెస్ కోడ్ చాలా అందంగా ఉందని తెలిపింది.సినిమాల విషయానికొస్తే కియారా అద్వానీ చివరిసారిగా రామ్ చరణ్ సరసన కనిపించింది. శంకర్ డైరెక్షన్లో వచ్చిన గేమ్ ఛేంజర్ చిత్రంలో నటించింది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్లు రాబట్టడంలో సక్సెస్ కాలేకపోయింది. కాగా.. బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాను పెళ్లాడిన ఈ ముద్దుగుమ్మ కొత్త ఏడాదిలోనే అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే కియారా దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నారు. -
అడవిలో థామా
‘థామా’ సినిమా కోసం దాదాపు నెలపాటు అడవిలో జరిగే షూటింగ్లో పాల్గొంటున్నారట హీరోయిన్ రష్మికా మందన్నా. ఆయుష్మాన్ ఖురానా, రష్మికా మందన్నా జంటగా నటిస్తున్న హిందీ చిత్రం ‘థామా’. ఆదిత్య సర్పోత్దార్ దర్శకత్వంలో దినేష్ విజన్ నిర్మిస్తున్న ఈ హారర్ కామెడీ ఫిల్మ్ ఈ దీపావళికి రిలీజ్ కానుంది. కాగా ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ ఊటీతోపాటు అక్కడి ఫారెస్ట్లో జరుగుతోందట.ఆయుష్మాన్, రష్మికలపై కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ఈ సన్నివేశాల తర్వాత ఆయుష్– రష్మిక– నవాజుద్దీన్ సిద్ధిఖీలపై క్లైమాక్స్ సన్నివేశాలను కూడా ఇదే షెడ్యూల్లో చిత్రీకరిస్తారని బాలీవుడ్ టాక్. ఈ షెడ్యూల్తో ‘థామా’ షూటింగ్ టాకీపార్ట్ దాదాపు పూర్తవుతుందని,పాటలు మాత్రమే బ్యాలెన్స్ ఉంటాయని సమాచారం. ఇక మడాక్ ఫిల్మ్స్(నిర్మాత దినేష్ విజన్) హారర్ కామెడీ యూనివర్స్లో భాగంగా ‘థామా’ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. -
'ఆదిపురుష్'-కొడుక్కి క్షమాపణ.. మాట మార్చేసిన సైఫ్
ప్రభాస్ నటించిన 'ఆదిపురుష్'.. థియేటర్లలో రిలీజై ఓటీటీలోకి వచ్చినప్పుడు తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. ఇదంతా రెండేళ్ల కిందటి ముచ్చట. మళ్లీ కొన్నిరోజుల క్రితం నుంచి ఈ సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు. తన సినిమా ఫ్లాప్ కాదని దర్శకుడు ఓం రౌత్ వాదించడం, ఈ మూవీలో నటించినందుకు కొడుక్కి సారీ చెప్పానని సైఫ్ అలీ ఖాన్ అనడం పెద్ద చర్చకు దారితీసింది.కొడుకు తైమూర్కు 'ఆదిపురుష్' సినిమా చూపించానని, అతడిలో ఏ స్పందన లేకపోయేసరికి సారీ చెప్పానని సైఫ్ అన్నాడు. ఆల్రెడీ ఫ్లాప్ అయిన సినిమా గురించి మళ్లీ మళ్లీ ఎందుకు ఇలా అంటున్నారని ప్రభాస్ ఫ్యాన్స్ రెచ్చిపోయారు. నటుడు సైఫ్ అలీ ఖాన్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఇప్పుడీ నటుడు మాట మార్చేశాడు. (ఇదీ చదవండి: స్నానం కూడా చేయలేదు.. అమ్మ జీవితాంతం నన్ను..: రష్మీ) 'నేను ఆదిపురుష్ మూవీలో విలన్ గా నటించాను. అందులో కేకలు వేస్తూ అందరితో యుద్ధం చేస్తుంటాను. అది చూసి ఈసారి ఇలాంటి సినిమాలో హీరోగా చేయమని అన్నాడు. దీంతో ఓకే చెప్పాను. విలన్ గా నటించినందుకు సారీ చెప్పాను. నేను పనిచేసిన అన్ని చిత్రాల్ని గౌరవిస్తాను. ఆదిపురుష్ ని కూడా అలానే చూస్తాను' అని సైఫ్ కవరింగ్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు.ఆదిపురుష్ లో సైఫ్ రావణుడి పాత్ర చేశాడు. అయితే ఇతడి పాత్ర వేషధారణ నుంచి ట్రోలింగ్ మొదలైంది. తర్వాత లంకని గ్రాఫిక్స్ లో దారుణంగా చూపించడం, గబ్బిలాల్లాంటి పక్షులతో ఫైటింగ్.. ఇవన్నీ కూడా సగటు ప్రేక్షకుడికి చిరాకు తెప్పించాయి. దీంతో ఆదిపురుష్.. ఫెయిలైంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 15 సినిమాలు.. ఆ మూడు స్పెషల్) -
ముద్దు సీన్ కోసం అదనంగా కోటి చెల్లించిన హీరో
ఈ కాలం సినిమాల్లో రొమాంటిక్ సీన్లు చాలా కామన్.. అదే 40 ఏళ్ల క్రితం అలాంటి సీన్లు థియేటర్స్లో రన్ అయితే పెద్ద చర్చనీయాంశం అని చెప్పవచ్చు. 1988లో బాలీవుడ్లో విడుదలైన 'దయావన్' సినిమా పెద్ద సన్సేషన్ అని చెప్పవచ్చు. ఆ కాలం నాటి సినిమాలను ఫాలో అయ్యే వారికి దాని ప్రభావం ఏంటో బాగా తెలుసు. వినోద్ ఖన్నా, మాధురీ దీక్షిత్ నటించిన 'దయావన్' మూవీ విడుదలైన సమయంలో ఎన్నో సంచలనాలను క్రియేట్ చేసింది. ఈ సినిమాలో వారిద్దరి మధ్య తెరకెక్కించిన మోస్ట్ రొమాంటిక్ సీన్ ఉండటంతో అప్పట్లో పెద్ద దుమారమే రేగింది. ఈ చిత్రం విడుదల సమయానికి మాధురీ దీక్షిత్ వయస్సు కేవలం 20 సంవత్సరాలు. ఆపై ఆమె ఇండస్ట్రీలోకి కొత్తగా అడుగులేస్తుంది. ఈ క్రమంలో తనేంటో నిరూపించుకోవడానికి ఆమె గట్టిగానే ప్రయత్నాలు చేసింది. కానీ, వినోద్ ఖన్నా అప్పటికే బాలీవుడ్లో పాపులర్ హీరోగా ఉన్నారు. వీరి కాంబినేషన్లో అలాంటి సీన్ రావడంతో అందరూ షాక్ అయ్యారు.'దయావన్' సినిమా గురించి ఆ రోజుల్లో చాలా కథనాలు వెలువడ్డాయి. అప్పట్లో వచ్చిన నివేదికల ప్రకారం.. రొమాంటిక్ సీన్ తీస్తున్న సమయంలో వినోద్ ఖన్నా పరిది దాటిపోయాడట. స్క్రీప్ట్ ప్రకారం కాకుండా తనకు నచ్చినట్లు చేయడం ఏంటి అంటూ దర్శకుడు కూడా పలుమార్లు కట్ అని చెప్పాడట. అయినప్పటికీ మాధురితో రొమాంటిక్ సీన్ ఆపలేదట. ఆ సమయంలో ముద్దు పెడుతున్న క్రమంలో ఆమె పెదవిని కూడా ఖన్నా కొరికేశాడని దాంతో ఆమె చాలా ఇబ్బందులకు గురైందని చెప్పుకొచ్చారు. ఈ సీన్ తర్వాత మాధురి చాలా ఇబ్బంది పడిందట. విషయం తెలుసుకున్న వినోద్ ఖన్నా క్షమాపణలు కూడా చెప్పారట.సినిమా విడుదల తర్వాత అసలు రచ్చ మొదలైంది. ఆ సీన్ను తొలగించాలంటూ కోర్టు నుంచి నోటీసులు కూడా ఇచ్చారు. ఆ సీన్ను తెరపై చూసిన తర్వాత మాధురికి కూడా నచ్చలేదట. దీంతో దానిని తొలగించాలని ఆమె కూడా కోరారట. కానీ, దర్శకుడు ఫిరోజ్ ఖాన్ మాత్రం అందుకు ఒప్పుకోలేదు. అందుకు గాను డైరెక్టర్, హీరో కలిసి రూ.1 కోటి అదనంగా చెల్లించారు. ఆ సీన్ తర్వాత వచ్చే సాంగ్కు ఇప్పటికీ చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. డింపుల్ కపాడియాతో కూడా మరో సినిమాలో వినోద్ ఖన్నా ఇలాంటి పనే చేశాడని చాలామంది చెబుతుంటారు.ఓషో ఆశ్రమంలో నిరాడంబర జీవితంపేరు, డబ్బు, ప్రేమించి, పెళ్లి చేసుకున్న గీతాంజలి, ఇద్దరు కుమారులు (రాహుల్ ఖన్నా, అక్షయ్ ఖన్నా).. వినోద్ ఖన్నా జీవితం బ్రహ్మాండంగా ఉంది. అయితే జీవితం అంటే ఇదేనా? అనిపించిందాయనకు. అప్పటికే ఆధ్యాత్మిక గురువు ‘ఓషో’ బోధనలకు ఆకర్షితుడయ్యారాయన. చివరికి 1982లో సినిమాలకు ‘రిటైర్మెంట్’ ప్రకటించి, అమెరికాలోని రజనీష్ పురంలో గల ఓషో ఆశ్రమానికి వెళ్లిపోయారాయన. అక్కడ నిరాడంబర జీవితం గడిపారు. టాయ్లెట్స్ శుభ్రం చేసేవారు. గిన్నెలు కడిగేవారు. తోటమాలిగా చేసేవారు. అయితే వినోద్ ఖన్నా ఇంటికి దూరం కావడం ఆయన భార్యా, పిల్లలకు ఇబ్బందిగా మారింది. అదే ఆయన్ను వాళ్లకు దూరం చేసింది. వినోద్, గీతాంజలి విడాకులు తీసుకున్నారు. ఓషో ఆశ్రమంలో నాలుగేళ్లు ఉండి, ఇండియాకి వచ్చేసరికి వినోద్ ఖన్నా ఒంటరిగా మిగిలిపోయారు. మళ్లీ ‘ఇన్సాఫ్’ (1987)తో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి, వరుసగా సినిమాలు చేశారు. మొదటి భార్య నుంచి విడిపోయిన ఐదేళ్లకు కవితను పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ఒక కొడుకు (సాక్షి), కూతురు (శ్రద్ధ) ఉన్నారు. మూత్రాశయ క్యాన్సర్తో బాధపడుతూ 2017 ఏప్రిల్ 27న ఆయన మరణించారు. -
‘సినిమా’ చూపించిన ట్రంప్.. అమెరికాలో కష్టమే!
‘అమెరికా ఫస్ట్’అనే విధానంతో ప్రపంచ దేశాలపై ‘సుంకాల యుద్ధం’ ప్రకటించాడు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్. ఇప్పటికే వివిధ రంగాలపై భారీగా టారీఫ్ విధించిన ట్రంప్..ఇప్పుడు సినిమా రంగంపై విరుచుపడ్డాడు. అమెరికాలో కాకుండా ఇతర దేశాలలో నిర్మించిన చిత్రాలపై 100 శాతం సుంకం విధిస్తున్నట్లు ప్రకటించి సినిమా రంగానికి షాకిచ్చాడు. ట్రంప్ నిర్ణయం భారత సినీ పరిశ్రమపై ముఖ్యంగా టాలీవుడ్పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని సినీ పండితులు చెబుతున్నారు.గతకొన్నేళ్లుగా అమెరికాలో బాలీవుడ్, టాలీవుడ్ సినిమాకు మంచి డిమాండ్ ఉంది. అక్కడ భారీగా కలెక్షన్స్ రాబట్టే చిత్రాలలో టాలీవుడ్, బాలీవుడ్ చిత్రాలు అగ్రస్థానంలో ఉంటాయి. పటాన్, ఆర్ఆర్ఆర్, డంకీ, పుష్ప, జవాన్ లాంటి చిత్రాలు అక్కడ రికార్డు స్థాయిలో వసూళ్లను రాబట్టాయి. (చదవండి: దయలేని ట్రంప్.. ఈసారి సినిమాపై 100% సుంకం)ముఖ్యంగా తెలుగు సినిమాలకు ఉత్తర అమెరికాలో భారీ క్రేజీ ఉంది. ఇండియా కంటే ఒక్క రోజు ముందుగానే అక్కడ సినిమాను రిలీజ్ చేస్తారు. అక్కడ హిట్ టాక్ వస్తే.. ఇక్కడ కలెక్షన్స్ భారీగా పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ట్రంప్ వేసిన టారీఫ్ బాంబుకి అక్కడి డిస్ట్రిబ్యూషన్ వర్గాలు కుదేలు అవ్వడం ఖాయం అని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.ట్రంప్ చెప్పినట్లుగా విదేశీ చిత్రాలకు 100 శాతం సుంకం విధిస్తే.. ఒక మిలియన్ డాలర్కు సినిమాను కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్ మరో మిలియన్ డాలర్ని టాక్సీగా చెల్లించాల్సి ఉంటుంది. అంటే డిస్ట్రిబ్యూటర్ రెట్టింపు ధరను చెల్లించి ఇండియన్ సినిమాలను కొనుగోలు చేయాలన్నమాట. ఈ భారం ప్రేక్షకుడిపై వేయాల్సి ఉంటుంది. లాభాల కోసం టికెట్ ధరను పెంచాల్సి వస్తుంది. ఇప్పుడున్న ధరకే ప్రేక్షకులు థియేటర్స్కి వెళ్లడం లేదు. ఇక ధరలు పెంచితే.. అమెరికాలో కూడా థియేటర్స్ ఖాలీ అవ్వడం ఖాయమని సినీ పండితులు అభిప్రాయపడుతున్నారు. ఇండియన్ సినిమాలను కొనుగోలు చేయాలంటే ఇప్పుడున్న రేటుకి రెట్టింపు చెల్లించాలి కాబట్టి..అక్కడి డిస్ట్రిబ్యూటర్స్ వెనుకడుగు వేస్తారు. అలాగే ఓటీటీలకు కూడా ట్రంప్ నిర్ణయం వర్తిసుందని చెబితే మాత్రం.. అమెజాన్, నెట్ఫ్లిక్స్ లాంటి సంస్థలు ఇండియన్ సినిమాలకు తక్కువ డబ్బులు చెల్లించే అవకాశం ఉంది. మొత్తంగా అమెరికా మార్కెట్ దృష్టిలో పెట్టుకొని భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న సినిమాలకు ట్రంప్ భారీ షాకిచ్చాడనే చెప్పాలి.పాన్ ఇండియా సినిమాపై ట్రంప్ ఎఫెక్ట్అమెరికా మార్కెట్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే భారీ బడ్జెట్తో కొన్ని చిత్రాలు తెరకెక్కుతున్నాయి. ప్రభాస్ ‘ది రాజా సాబ్’, ధనుష్ ‘కుబేర’, పవన్ కల్యాణ్ ‘హరిహర వీరమల్లు’, చిరంజీవి ‘విశ్వంభర’ తదితర చిత్రాలన్ని త్వరలోనే విడుదల కావాల్సి ఉంది. ఓవర్సిస్ బిజినెస్ని దృష్టిలో పెట్టుకొని ఈ చిత్రాలకు భారీగానే ఖర్చు పెడుతున్నారు. ఇప్పుడు ట్రంప్ విధించిన 100 శాతం సుంకం కారణంగా ఈ చిత్రాలకు జరిగే బిజినెస్లో తేడాలు వస్తాయి. ఓవర్సీస్లో తక్కువ ధరకు అమ్మాల్సి వస్తుంది. అలాగే ఓటీటీలో కూడా కొనుగోలు విషయంలో వెనకడుకు వేసే అవకాశం ఉంది. అయితే ట్రంప్ నిర్ణయాలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. సినిమా రంగంపై విధించిన వందశాతం టారీఫ్ విషయంలో ఆయన మరోసారి ఆలోచన చేస్తాడా? మనసు మార్చుకొని టారిఫ్ తగ్గిస్తాడా లేదా చూడాలి. -
నా వయసు 12 ఏళ్లు.. బస్సులో భయానక సంఘటన: బుల్లితెర నటి
బాలీవుడ్ భామ, బుల్లితెర నటి గౌతమి కపూర్ బీ టౌన్లో పరిచయం చేయాల్సిన పనిలేదు. సీరియల్స్తో పాటు పలు సినిమాల్లోనూ కీలక పాత్రలు పోషించింది. గౌతమి చివరిసారిగా కొరియన్ డ్రామా రీమేక్ అయినా గ్యారహ్.. గ్యారహ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్లో కనిపించింది. ప్రస్తుతం వెబ్ సిరీస్లతో పాటు సినిమాలతో బిజీగా ఉన్న గౌతమి తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైంది. ఈ సందర్భంగా తన చిన్నతనంలో ఎదురైన ఓ షాకింగ్ అనుభవాన్ని పంచుకుంది.ముంబయిలో పాఠశాల ఇంటికి వస్తుండగా ఓ అపరిచిత వ్యక్తి తనతో అసభ్యంగా ప్రవర్తించాడని తెలిపింది. తాను ఆరో తరగతిలో ఉండగా ఈ సంఘటన జరిగిందని గుర్తు చేసుకుంది. ఓ వ్యక్తి ఏకంగా తన ప్యాంట్ లోపలికి చేయి పెట్టాడని ఆ భయానక అనుభవాన్ని పంచుకుంది. అప్పుడు నా వయసు 12 ఏళ్లు కావడంతో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి కొంత సమయం పట్టిందని తెలిపింది. ఆ తర్వాత భయంతో వెంటనే బస్సుదిగి వెళ్లిపోయానని గౌతమి కపూర్ ఆ చేదు సంఘటనను వివరించింది. ఆ వ్యక్తి నన్ను అనుసరిస్తున్నాడా అని నేను ఆలోచిస్తూనే ఉన్నానని వెల్లడించింది. ఈ విషయాన్ని అమ్మతో చెప్పడానికి భయపడ్డానని గౌతమి చెప్పింది.ఈ సంఘటన జరిగినప్పుడు తాను తన స్కూల్ యూనిఫాంలోనే ఉన్నానని గౌతమి పంచుకుంది. ఇంటికి వచ్చి నా తల్లికి జరిగిందంతా వివరించానని తెలిపింది. వెంటనే 'నీకు పిచ్చి పట్టిందా? నువ్వు వెనక్కి తిరిగి ఆ వ్యక్తిని చెంపదెబ్బ కొట్టి కాలర్ పట్టుకుని ఉండాల్సిందని.. ఎప్పుడూ భయపడవద్దని అమ్మ నాకు ధైర్యం చెప్పిందని తెలిపింది. ఎవరైనా అలా చేస్తే.. వారి చేతిని గట్టిగా పట్టుకుని బిగ్గరగా అరవండి.. భయపడకుండా పెప్పర్ స్ప్రే వారి ముఖంపై కొట్టండి అని సలహా ఇస్తోంది బాలీవుడ్ భామ. -
భారతీయ తొలి ఐటమ్ గాళ్ ఓ పాకిస్తానీ..
భారతీయ సినిమా చరిత్రలో ఐటమ్ సాంగ్స్ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాయి. ఇటీవలి కాలంలో అయితే బాలీవుడ్ చిత్రాలు ఐటమ్ సాంగ్ లేకుండా పూర్తి కాదన్న అభిప్రాయం స్థిరపడిపోయింది. మలైకా అరోరా ‘హోత్ రసిలే’, కరీనా కపూర్ ‘ఫేవికోల్ సే’, సమంతా ‘ఊ అంటావా’, నోరా ఫతేహి ‘దిల్బర్ దిల్బర్’ వంటి పాటలు విపరీతంగా ప్రాచుర్యం పొందాయి. తాజాగా తమన్నా భాటియా ఆజ్కీ రాత్ ద్వారా ఐటమ్ క్వీన్గా మారిపోయిన సంగతీ తెలిసిందే. ఇంతగా భారతీయ సినిమా చరిత్రలో మమేకం అయిపోయిన ఈ ఐటమ్ నంబర్ల చరిత్ర ఎక్కడి నుంచి మొదలైందో తెలుసా?సినిమా పరిజ్ఞానం బాగా ఉన్నవారు కూడా ఈ ఐటమ్ నంబర్ల ట్రెండ్ను హెలెన్, బిందు లేదా జీనత్ అమెన్ మొదలుపెట్టారని అనుకుంటారు. కానీ నిజానికి వీళ్లందరి కన్నా ముందుగానే శృంగార నర్తకిగా తెరపై చిందేసిన ఇండియా ఫస్ట్ ఐటమ్ గర్ల్ ఎవరో తెలుసా? ఆ గౌరవం ‘మేడమ్ అజురీ‘(Madame Azurie)కి దక్కింది.అన్నా మేరీ గ్వీజెలర్...ఉరఫ్ మేడమ్ అజురీ... బాలీవుడ్లో తొలి ఐటమ్ డాన్సర్ ఎలా అయింది? అనే ప్రశ్నలు కలిగితే... ఒకసారి చరిత్ర తవ్వి తీయాలి. దాదాపు వందేళ్ల క్రితం... అంటే 1930లలో హీరోయిన్లకు భిన్నంగా ప్రత్యేక డాన్సర్ పాత్రలను సినీ పరిశ్రమలో ప్రవేశపెట్టిన పేరే మేడమ్ అజురీ అని చెప్పాలి. బెంగళూరులో జన్మించిన ఆమె తల్లి హిందూ బ్రాహ్మణ నర్స్ కాగా, తండ్రి జర్మన్ జ్యూయిష్ డాక్టర్. తల్లిదండ్రులు విడిపోయిన తర్వాత ఆమె తండ్రితో నివసించింది. ఆ సమయంలో ఆమె తండ్రి ఆమెను బాలే నృత్యం నేర్చుకోవడానికి ప్రోత్సహించారు, కానీ భారతీయ నృత్యాలను అభ్యసించేందుకు మాత్రం అంగీకరించలేదు. అజురీ యుక్తవయస్సులో ఉన్నప్పుడు ఆమె కుటుంబం బొంబాయికి తరలివెళ్లింది. ఆమె తండ్రి త్రీ ఆర్ట్స్ సర్కిల్లో సభ్యుడయ్యాడు, ఆ సమయంలో అజురీకి త్రీ ఆర్ట్స్ సర్కిల్ నిర్వాహకురాలు బేగం అతియా ఫైజీ–రహమిన్తో సంభాషించడానికి వీలు కలిగింది.అలా అజురీ అతియా సహకారంతో మరికొన్ని మనవైన కళలు నృత్యాలనుు అభ్యసించగలిగింది. అలా అజురీ పలు నృత్య శైలులను నేర్చుకుని నదిరా సినిమా తో హిందీ సినీ పరిశ్రమలో అడుగుపెట్టింది. ఆ తర్వాత ‘పర్దేసీ సయ్యాన్’, ‘క్వత్ల్–ఎ–ఆమ్’, ‘ది బాంబే టాకీస్’, ‘నయా సంసార్’ వంటి చిత్రాలతో సహా 700కి పైగా సినిమాల్లో నటించి, తన డాన్సులతో ఎంతో పాప్యులర్ అయ్యింది.తమ ప్యాలెస్లో నృత్యం చేయాలంటూ మేడమ్ అజురీకి బ్రిటన్ లోని బకింగ్ హ్యామ్ ప్యాలెస్ నుంచి ఆహ్వానం అందింది అంటేనే ఆమె పాప్యులారిటీ ఏ స్థాయిలో వెలిగేదో తెలుస్తుంది. దేశ విభజన అనంతరం అజూరీ ఓ ముస్లింను నిఖా చేసుకుని పాకిస్తాన్ లోని రావల్పిండీలో స్థిరపడి, పాకిస్తాన్లో కూడా కొన్ని స్థానిక చిత్రాల్లో నటించిన తర్వాత ఎందుకనో గానీ నటనకు గుడ్బై చెప్పేసింది. ఆ తర్వాత అక్కడ ఒక క్లాసికల్ డాన్స్ అకాడమీని ప్రారంభించి, ఏళ్ల తరబడి నృత్యాన్ని బోధించింది. అలా భారతీయ చిత్రాల్లో ఐటమ్ డ్యాన్సులకు ఊపిరిపోసిన అజురీ ఆగస్టు 1998లో మరణించింది. -
'పెళ్లి చేసుకుంటానని వాడుకున్నాడు'.. అజాజ్ ఖాన్పై నటి తీవ్ర ఆరోపణలు!
బాలీవుడ్ నటుడు అజాజ్ ఖాన్ వివాదానికి కేరాఫ్ అడ్రస్గా మారిపోయాడు. అతను హోస్ట్గా వ్యవహరిస్తోన్న హౌస్ అరెస్ట్ అనే షోలో విపరీతమైన, అసభ్యకరమైన కంటెంట్తో ఒక్కసారిగా వార్తల్లో నిలిచాడు. ఈ షోపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతోన్న ఈ షోను ఇప్పటికే సదరు ఓటీటీ సంస్థ బ్యాన్ చేసింది. ఈ అసభ్యకరమైన కంటెంట్ ప్రసారం చేస్తోన్న అజాజ్ ఖాన్పై సినీ, రాజకీయ ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ వివాదంలో నడుస్తుండగానే అజాజ్ ఖాన్పై ఓ నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను వివాహం చేసుకుంటానని లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ అజాజ్ ఖాన్పై చార్కోప్ పీఎస్లో కంప్లైంట్ ఇచ్చింది. దీంతో అతనిపై ముంబయి పోలీసులు కేసు నమోదు చేశారు.అజాజ్ ఖాన్ తన ఓటీటీ షో 'హౌస్ అరెస్ట్'లో తనకు ఓ పాత్ర ఆఫర్ చేశాడని ఆమె తెలిపింది. ఆ తరువాత పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి తనకు లవ్ ప్రపోజ్ చేశాడని నటి ఆరోపించింది. మార్చి 25న తన నివాసంలోనే నాపై అత్యాచారం చేశాడని.. రెండు సార్లు తనను పెళ్లి చేసుకుంటానని హామీ కూడా ఇచ్చాడని చార్కోప్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. మాకు నాలుగు వివాహాలకు అనుమతి ఉందని తనకు చెప్పాడని నటి ప్రస్తావించింది. ఆమె ఆరోపణలతో కేసు నమోదు చేసిన చార్కోప్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ఓటీటీ షో 'హౌస్ అరెస్ట్'లో మహిళలను అసభ్యకరంగా చూపించినందుకు అజాజ్ ఖాన్పై అంబోలి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. -
పాక్ నటుడి సినిమాపై బ్యాన్ వద్దు.. రిలీజ్ చేయాలి: ప్రకాశ్ రాజ్
కశ్మీర్లో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకునేందుకు భారత్ అన్నిరకాలుగా సిద్ధమైంది. ఇప్పటికే దేశంలో ఉన్న పాక్ ప్రజలను వారి స్వదేశానికి వెళ్లగొట్టింది. సింధూ జలాల నీటిని ఆపేసింది. పాక్ సెలబ్రిటీల ఖాతాలను భారత్లో డీయాక్టివేట్ చేసింది. వారి యూట్యూబ్ ఛానళ్లను సైతం నిలిపివేసింది. పాక్ నటులను, వారి సినిమాలను బ్యాన్ చేసింది.సినిమాలను నిషేధించకూడదుదీంతో పాకిస్తాన్ నటుడు ఫవాద్ ఖాన్ (Fawad Khan) నటించిన అబీర్ గులాల్ సినిమా రిలీజ్ ఆగిపోయింది. సినిమాలను బ్యాన్ చేయడాన్ని నటుడు ప్రకాశ్ రాజ్ తప్పుపట్టాడు. ద లాలంటాప్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రకాశ్ రాజ్ (Prakash Raj) మాట్లాడుతూ.. సినిమాలను నిషేధించడాన్ని నేను సమర్థించను. అది ఎటువంటి సినిమాలు అయినా సరే.. వాటిని జనాల నిర్ణయానికి వదిలేయాలి. శృతిమించిన అశ్లీలత, పిల్లలపై వేధింపులు ఉన్న చిత్రాలను మినహా వేటినీ నిషేధించకూడదు అని పేర్కొన్నాడు. అయితే పాక్ నటుడి సినిమాను సపోర్ట్ చేసినందుకు ప్రకాశ్ రాజ్పై విమర్శలు వస్తున్నాయి.అబీర్ గులాల్..పాక్ నటుడు ఫవాద్ ఖాన్ హీరోగా నటించిన చిత్రం అబీర్ గులాల్ (Abir Gulaal Movie). వాణీ కపూర్ కథానాయికగా యాక్ట్ చేసింది. ఆర్తి ఎస్.బగ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాను వివేక్ అగర్వాల్ నిర్మించారు. మే 9న ఈ మూవీ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ అంతలోనే జమ్మూకశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రదాడి జరగ్గా.. కేంద్రం పాకిస్తాన్పై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే పాక్ నటుడు ఫవాద్ నటించిన అబీర్ గులాల్ సినిమాపై బ్యాన్ ప్రకటించింది.చదవండి: సారీ చెప్పమన్న బేబీ డైరెక్టర్.. రెండేళ్ల జీవితం వృథా అన్న బాలీవుడ్ హీరో -
సారీ చెప్పమన్న 'బేబీ' డైరెక్టర్.. రెండేళ్ల జీవితం ధారపోశానన్న హీరో
బాలీవుడ్లో కనీస మర్యాద ఇవ్వరు.. ఇంత నకిలీ ఇండస్ట్రీ మరొకటి ఉండదు అంటూ హిందీ చిత్రపరిశ్రమపై ఫైర్ అయ్యాడు ఇర్ఫాన్ ఖాన్ తనయుడు, హీరో బాబిల్ ఖాన్ (Babil Khan). అర్జున్ కపూర్, అనన్య పాండే, షనయా కపూర్, అర్జిత్ సింగ్.. ఇలా ఇండస్ట్రీతో సంబంధం లేని చాలామంది ఉన్నారని, బాలీవుడ్ పని చేయడానికి మంచి ప్రదేశం కాదంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు.అసలు ఏమనుకుంటున్నావ్?కొన్ని గంటల తర్వాత తన మాటల్ని తప్పుగా అర్థం చేసుకున్నారని వివరణ ఇచ్చాడు. అర్జున్, అనన్య, షనయా, అర్జిత్లను తాను విమర్శించలేదని, సపోర్ట్ చేశానని పేర్కొన్నాడు. దీనిపై తెలుగు డైరెక్టర్ సాయి రాజేశ్ (Sai Rajesh) స్పందించాడు. అంటే ఇప్పటివరకు నీకు సపోర్ట్ చేసిన మేము ఇప్పుడు సైలెంట్గా ఈ టాపిక్ను వదిలేయాలంటావ్.. అసలు మా గురించి ఏం అనుకుంటున్నావ్? అంటే.. నువ్వు వీడియోలో పేర్కొన్న వారికి మాత్రం గౌరవం ఇస్తే సరిపోతుందా? సారీ చెప్పాల్సిందే!నీకు సపోర్ట్ చేసిన మేమంతా పిచ్చివాళ్లమా? నీకు నిజంగా వాళ్లను పొగడాలి, గౌరవం ఇవ్వాలి.. అనిపిస్తే ఇచ్చుకో.. కానీ నీకోసం నిల్చున్న మా అందరినీ లైట్ తీసుకోవడం కరెక్ట్ కాదు. నువ్వు మాకు క్షమాపణలు చెప్పాల్సిందే అని పోస్ట్ పెట్టాడు. ఇది చూసిన బాబిల్.. నువ్వు నా మనసు ముక్కలు చేశావ్.. నీకోసం నేను చేయాల్సిందంతా చేశాను. రెండేళ్ల జీవితాన్ని నీ ముందు ధారపోశాను.మణికట్టు కోసుకున్నాఒళ్లు హూనం చేసుకుని నా శరీరాన్ని పాత్రకు తగ్గట్లుగా మలుచుకున్నాను. కానీ ఏం చేసినా అన్నీ తిరస్కరించావ్. ఎంత బాధున్నా దిగమింగుకుని నవ్వుతూ కనిపించాను. మురికిగుంటలో బొర్లాను. నీకోసం నా చేయి కోసుకున్నాను అని కామెంట్స్ చేశాడు. తర్వాత ఈ కామెంట్స్ డిలీట్ చేశాడు.బేబీ రీమేక్లో బాబిల్?బేబీ సినిమా (Baby Movie)తో రూ.100 కోట్ల హిట్ అందుకున్నాడు దర్శకుడు సాయి రాజేశ్. ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయాలనుకున్నాడు. ఇందుకోసం నటుడు బాబిల్ ఖాన్ను ఎంపిక చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే రెండేళ్లగా అతడిని తిప్పించుకున్న సాయి రాజేశ్ చివరకు అతడిని రిజెక్ట్ చేశాడని తెలుస్తోంది. Babil reacts to filmmaker Sai Rajesh’s criticism: “I slit my wrist for him”byu/Normal_Weather8827 inBollyBlindsNGossip చదవండి: బాలీవుడ్ అంతా కాపీనే: నవాజుద్దీన్ సిద్దిఖీ -
బాలీవుడ్ అంతా కాపీనే.. ఆ సంస్కృతి ఇప్పటిదీ కాదు: నవాజుద్దీన్ తీవ్ర విమర్శలు
బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ ప్రస్తుతం కోస్టావో అనే మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. దేశ చరిత్రలోనే అతిపెద్ద గోల్డ్ స్మగ్లింగ్ను అడ్డుకున్న కస్టమ్స్ ఆఫీసర్ కోస్టావో ఫెర్నాండెజ్ జీవితం ఆధారంగా దర్శకుడు సేజల్ షా రూపొందించారు. ఇటీవలే ఈ మూవీ నేరుగా ఓటీటీలో రిలీజైంది. తన మూవీ రిలీజ్ తర్వాత నవాజుద్దీన్ వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్ కోసం ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలీవుడ్పై షాకింగ్ కామెంట్స్ చేశారు. బాలీవుడ్ ప్రస్తుత స్థితి గురించి మాట్లాడారు. హిందీలో ఇతరుల సినిమాలను కాపీ కొట్టడం అలవాటుగా మారిందని ఎద్దేవా చేశారు.బాలీవుడ్ గురించి నవాజ్ మాట్లాడుతూ, "మన పరిశ్రమలో ఐదేళ్లుగా ఇదే పునరావృతం అవుతోంది. అందుకే ప్రేక్షకులు విసుగు చెంది చివరకు విడిచిపెట్టారు. వాస్తవానికి బాలీవుడ్లో అభద్రత చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ అంతా ఓకే ఫార్ములా ఫాలో అవుతున్నారు. ఒకటి హిట్ అయితే చాలు. ఇక దానికే 2,3,4 అంటూ సీక్వెల్స్ తీసుకుంటూ పోతారు. బ్యాంకుల్లో జరిగే ఆర్థిక దివాలా లాగే.. ఇది కూడా క్రియేటివ్ దివాలా. బాలీవుడ్లో క్రియేటివిటీ లోపించింది. ఇప్పుడే కాదు.. ప్రారంభం నుంచి ఇండస్ట్రీలో కాపీ కొడుతూనే ఉన్నారు. కథలు , పాటలు ఇతర ఇండస్ట్రీల నుంచి దొంగతనం చేస్తూనే ఉన్నారు' అని కాస్తా ఘాటుగానే విమర్శించారు.సౌత్ నుంచి కాపీ చేయడంపై మాట్లాడుతూ..'ఇక్కడ ఉండే దొంగలు ఎలా సృజనాత్మకంగా ఉంటారు? మనం దక్షిణాది నుంచి, కొన్నిసార్లు ఇతర ఇండస్ట్రీల నుంచి కథలు దొంగిలించాం. హిట్లుగా మారిన కొన్ని కల్ట్ సినిమాల్లో కూడా కాపీ చేసిన సన్నివేశాలు ఉంటాయి. గతంలో వారు ఒక వీడియోను అందజేసి ఇది మేము తీయాలనుకుంటున్న సినిమా అని చెప్పేవారు. దానిని చూసి ఇక్కడ దానిని రిపీట్ చేసేవారు. ఇలాంటి పరిశ్రమ నుంచి మనం ఏమి ఆశించవచ్చు? ఎలాంటి నటులు వస్తారు? అంతా ఓకే రకమైనవారు అవుతారు. అందుకే నటులు, దర్శకులు తప్పుకోవడం ప్రారంభించారు - అనురాగ్ కశ్యప్ లాంటి మంచి కథలు అందించేవారు కూడా తప్పుకుంటున్నారు' అని తెలిపారు. -
బాలీవుడ్ లో మర్యాద ఇవ్వరు.. యంగ్ హీరో కన్నీళ్లు
సినిమా ఇండస్ట్రీ అంటేనే నెపోటిజం, ఒకరిని ఒకరు తొక్కేయడాలు లాంటివి చాలా ఉంటాయి. ఇది అందరికీ తెలుసు. కాకపోతే వీటి గురించి పెద్దగా బయటకు రాదు, రానివ్వరు. అప్పుడప్పుడు కొందరు నటీనటులు మాత్రం తమ బాధని వెళ్లగక్కుతుంటారు. అవి వీడియోల రూపంలో వైరల్ అవుతుంటాయి.(ఇదీ చదవండి: తెలుగు డైరెక్టర్ అని తొక్కేశారు.. లేదంటే విజయ్ తో సినిమా!) తాజాగా హిందీ సినిమాలు చేస్తున్న ఓ యంగ్ హీరో బాబిల్ ఖాన్.. ఏడుస్తూ బాధపడుతూ ఓ వీడియోని ఇన్ స్టాలో షేర్ చేశాడు. బాలీవుడ్ లో అస్సలు మర్యాద ఇవ్వరు అని నోటికొచ్చింది మాట్లాడాడు. ఇది జరిగిన కాసేపటికే వీడియోని డిలీడ్ చేయడంతో పాటు అకౌంట్ ని డీయాక్టివేట్ చేసేశాడు.'ఈ రోజు మీ అందరితో ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను. ఈ ఇండస్ట్రీలో(బాలీవుడ్) అర్జున్, అనన్య, షనయాతో పాటు సంబంధం లేని అర్జిత్ సింగ్ లాంటివాళ్లు చాలామంది ఉన్నారు. ఇక్కడ అస్సలు మర్యాద ఇవ్వడం లేదు. ఇప్పటివరకు నేను చూసినవాటిలో ఇదే అత్యంత నకిలీ ఇండస్ట్రీ. ఇది బాగుండాలని కోరుకునేది కొందరే. నేను మీకు చాలా విషయాలు చెప్పాలనుకుంటున్నాను' అని బాబిల్ ఏడుస్తూ సదరు వీడియోలో చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: తెలుగు హీరోతో మృణాల్ ప్రేమ? నిజమేంటి?) గతంలో లంచ్ బాక్స్, పీకూ, పాన్ సింగ్ తోమార్ తదితర సినిమాలతో అద్భుతమైన నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఇర్ఫాన్ ఖాన్ కొడుకే ఈ బాబిల్ ఖాన్. 2020లో తండ్రి చనిపోయిన తర్వాత నటుడిగా ఇండస్ట్రీలోకి వచ్చాడు. పలు సినిమాల్లో సహాయ నటుడిగా చేశాడు. మొన్నీమధ్యే లాగౌట్ అనే ఓటీటీ మూవీలో హీరోగానూ చేశాడు.ఇప్పుడు చేసిన ఈ వీడియో పీఆర్ స్టంట్ లేదంటే నిజంగా బాధతో చెప్పాడా తెలియాల్సి ఉంది. ఎందుకంటే అర్జున్, అనన్య, షనయా నెపోటిజం అని అన్నాడు. అదే టైంలో తన తండ్రి వల్లే ఇండస్ట్రీలోకి వచ్చాననే విషయాన్ని బాబిల్ మర్చిపోయినట్లున్నాడు. మరి దీని వెనుక ఏం మతలబు ఉందో?(ఇదీ చదవండి: భార్య, సవతి కలిసి భర్తని మాయం చేస్తే.. ఓటీటీ రివ్యూ) -
బాలీవుడ్ స్టార్లు... ఇష్టమైన టూర్లు... ఎందుకు ఇష్టమంటే..!
బాలీవుడ్ సెలబ్రిటీల జీవితాలు మనలో చాలా మందికి చాలా ఆసక్తికరంగా ఉంటాయి. మనకు స్ఫూర్తినిచ్చేది ఆకర్షణీయమైన జీవనశైలి మాత్రమే కాదు, వారి ప్రయాణ గమ్యస్థానాల ఎంపిక కూడా. మరీ ముఖ్యంగా అందరం సమ్మర్ సీజన్ సందర్భంగా ఇలా టూర్ల వేటలో పడినప్పుడు...స్టార్లు ఎంచుకునే ప్రాంతాల వివరాలు తెలుసుకోవడం అంటే మన అభిరుచులను కలుసుకోవడం కూడా. కలలు కనే బీచ్ అయినా లేదా సందడిగా ఉండే నగరమైనా, బిజీ షెడ్యూల్ నుండి తప్పించుకోవడానికి విశ్రాంతి తీసుకోవడానికి తగిన ప్రదేశాలను కనుగొనే నైపుణ్యాన్ని లేదా వారి ఉత్తమమైన కలిగి ఉంటారు.– నేహా ధూపియా, జైపూర్ పాత–ప్రపంచ ఆకర్షణ ఆధునిక సౌకర్యాల కలయికను ఇష్టడుతుంది. కరీనా కపూర్ ఖాన్ తరచుగా నూతన సంవత్సర కాలంలో కుటుంబ సెలవుల కోసం స్విట్జర్లాండ్ను, ముఖ్యంగా గ్సా్టడ్ను సందర్శిస్తుంది.–షాహిద్ కపూర్ మీరా రాజ్పుత్ కపూర్: గ్రీస్, స్పెయిన్ స్విట్జర్లాండ్ వంటి యూరోపియన్ గమ్యస్థానాలను తమ పిల్లలతో సేదతీరుతుంటారు.–కర్ణాటకలోని కూర్గ్ను తనకు అత్యంత ఇష్టమైన ప్రదేశంగా బోమన్ ఇరానీ చెబుతారు.–సోను సూద్: షాపింగ్ కుటుంబ సందర్శనల కోసం వాషింగ్టన్, డి.సి.ని ఇష్టపడతాడు. –పారిస్కు తరచుగా వచ్చే సందర్శకురాలు ఫరా ఖాన్ కళ, చరిత్ర ఫ్యాషన్ మిశ్రమాన్ని :ఇష్టపడుతుంది.– తన కుటుంబంతో కలిసి దుబాయ్లో న్యూ ఇయర్కి నయనతార స్వాగతం పలికింది. –శ్రీలంకలో ప్రశాంతమైన బీచ్ స్నాప్షాట్లను దియా మీర్జా ఆస్వాదిస్తుంది. –బాలీవుడ్ సెలబ్రిటీలు ఎక్కువగా సందర్శించే గమ్యస్థానాలలో లండన్ ఒకటిగా నిలిచింది. సోనమ్ కపూర్, రియా కపూర్, సారా టెండూల్కర్ పరిణీతి చోప్రా వంటి తారలకు ఈ నగరం ఒక రొటీన్ ఎంపిక. ఐకానిక్ హైడ్ పార్క్ మీదుగా షికారు చేయడం నుంచి నగరంలోని ట్రెండీ రెస్టారెంట్లు ఆక్స్ఫర్డ్ స్ట్రీట్ను అన్వేషించడం వరకు లండన్ సరదాలను సాహసాలను వారు తరచుగా అభిమానులతో పంచుకుంటారు.–పారిస్ అనేది బాలీవుడ్ సెలబ్రిటీలు వదల్లేని మరొక హాట్స్పాట్. ఈ ’సిటీ ఆఫ్ లైట్స్’ దిల్జిత్ దోసాంజ్, మలైకా అరోరా వంటి తారలను తరచు రారమ్మంటుంది. ఫ్రెంచ్ వంటకాలను ఆస్వాదించడం నుంచి రిటైల్ థెరపీలో పాల్గొనడం వరకు భిన్న రకాలుగా స్టార్లు ఇక్కడ ఎంజాయ్ చేస్తుంటారు.–బాలీవుడ్ సెలబ్రిటీల ఎంపికలో మాల్దీవులు సైతం అగ్రస్థానంలో నిలుస్తుంటాయి. ప్రశాంతమైన బీచ్లు, అందమైన వాతావరణం అద్భుతమైన సూర్యాస్తమయాలతో, తమ బిజీ జీవితాల నుంచి తప్పించుకోవాలనుకునే తారలకు ఇది తరచుగా విహారయాత్రగా మారుతుంది. రకుల్ ప్రీత్ సింగ్, నేహా ధూపియా పరిణీతి చోప్రా ఇలా ఈ ద్వీప స్వర్గంలో కనిపించిన ప్రముఖులు ఎందరో.–న్యూయార్క్ నగరం కూడా సెలబ్రిటీలకు తప్పక సందర్శించాల్సిన ప్రదేశంగా మారింది. మీరా కపూర్, కరిష్మా కపూర్, ప్రియాంక చోప్రా అమీర్ ఖాన్ సోషల్ మీడియా పోస్ట్ల ద్వారా న్యూయార్క్పై తమ ఇష్టాన్ని ప్రదర్శించారు, . సెంట్రల్ పార్క్ , టైమ్స్ స్క్వేర్ వంటి ఐకానిక్ ల్యాండ్మార్క్ల స్నాప్షాట్లను పంచుకున్నారు.–స్వదేశానికి దగ్గరగా ఉండాలి అలాగే రిలాక్స్డ్గా ఉండాలి అనుకునే స్టార్స్ను గోవా ఆకర్షించడం కొనసాగుతూనే ఉంది. భూమి పెడ్నేకర్, సారా అలీ ఖాన్ శిల్పా శెట్టి అక్కడి ప్రశాంతమైన బీచ్లను ఆస్వాదిస్తుంటారు. . గోవా లో ఉన్నప్పుడు వారు షేర్ చేసుకునే ఫోటోలు ఆ ప్రదేశం పట్ల వారి అభిమానాన్ని మనకు చూపిస్తాయి.–స్టార్ క్రికెటర్ను పెళ్లాడిన బాలీవుడ్ స్టార్ అనుష్క శర్మ విరాట్ కోహ్లీ ... ఇష్టమైన గమ్యస్థానాలలో కరేబియన్ దీవులను పేర్కొంటారు. ఈ దీవులపై వారు పంచుకునే సోషల్ మీడియా పోస్ట్లు వారి ఇష్టాన్ని మనకు పట్టిస్తాయి. =తన బైక్పై రోడ్ ట్రిప్లకు వెళ్లడాన్ని ఇష్టపడే అమిత్ సాద్ ఇటీవల ముంబై నుంచి లేహ్–లడఖ్కు 5,288 కి.మీ. ప్రయాణించి నెలరోజుల పర్యటన చేపట్టారు. ‘‘రోడ్డులోని ప్రతి మలుపు వ్యక్తిగత పరివర్తనకు అవకాశం. తెలియని వాటిని తెలుసుకోవడం’’ అంటారాయన.–హిమాలయ శ్రేణి పట్ల సారా అలీఖాన్ ప్రేమ అంతులేనిది. కొన్ని నెలల క్రితం, ఆమె కాశ్మీర్కు కూడా ఆధ్యాత్మిక ప్రయాణం చేసింది. ఓ ఇంటర్వ్యూలో, సారా‘‘నాకు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లకు వెళ్లి అక్కడ ట్రెక్కింగ్ చేయడం చాలా ఇష్టం. అలాఏ కాశ్మీర్ అంటే కూడా చాలా ఇష్టమని షేర్ చేసింది. మసాయి మారాలో అలియా భట్కు ప్రపోజ్ చేశాడు. రణ్బీర్ కపూర్ అప్పటి నుంచి ఈ జంటకు కెన్యా నేషనల్ రిజర్వ్ ఇష్టమైన గమ్యస్థానాలలో ఒకటిగా మారింది. -
హైదరాబాద్లో మిస్వరల్డ్ పోటీలు.. బ్యూటీక్వీన్స్పై టాలీవుడ్ ప్రముఖుల కన్ను
మూడవసారి మన భారతదేశం అతిపెద్ద అందాల పోటీకి ఆతిధ్యం ఇవ్వనుంది. అది కూడా తెలుగు రాష్ట్రాలకు తలమానికమైన హైదరాబాద్ నగరంలో ఈ ప్రపంచ స్థాయి బ్యూటీ కాంటెస్ట్ జరుగనుంది. ప్రస్తుతం ఈ కార్యక్రమంపైనే విశ్వవ్యాప్త గ్లామర్ రంగం దృష్టి పెట్టింది. ఇప్పటికే ఈ గ్లోబల్ ఈవెంట్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ రూపురేఖలే మార్చే స్థాయిలో ఏర్పాట్లు షురూ చేసింది. మరో 3 రోజుల్లో ప్రపంచవ్యాప్త అందాలన్నీ రాశులు పోసినట్లుగా హైదరాబాద్ నగరంలో కొలువుదీరనున్నాయి. ఒకటీ రెండు రోజులు కాదు ఏకంగా నెల రోజుల పాటు నగరంలోనే తిష్టవేయనున్నాయి. దాదాపుగా 120 దేశాలకు చెందిన అందగత్తెలు ఈ పోటీలో తమ దేశాల తరపున బ్యూటీ ఫైట్కి సై అంటున్నారు. ఈ నేపధ్యంలో హాలీవుడ్, బాలీవుడ్ సహా అన్ని వుడ్లూ తమ కెమెరాకు తగ్గ ఫుడ్ కోసం వేటను షురూ చేసేశాయి. బాలీవుడ్కు చెందిన పలు ప్రముఖ నిర్మాణ సంస్థలు ఈ పోటీల్లో పాల్గొంటున్న సుందరీ మణుల గ్లామర్, ఇతరత్రా టాలెంట్స్ను సమీక్షించి వారిపై నివేదికలు అందించేందుకు తగినంత మందీ మార్బలాన్ని పురమాయించినట్టు సమాచారం. తద్వారా వారిలో తమ భవిష్యత్తు తారలను ఎంచుకునే అవకాశాలను అన్వేషిస్తున్నారట. అదే విధంగా అంతర్జాతీయ చిత్రాలను అందించడంలో బాలీవుడ్ సినిమాలతో పోటీపడుతున్న టాలీవుడ్ సైతం ఇదే బాట పట్టినట్టు తెలుస్తోంది. తెలుగునాట రూ.వందల కోట్లతో సినిమాలు తీయడం ప్రస్తుతం సర్వసాధారణమైపోయింది. కొత్త కొత్త మార్కెట్లను పసిగట్టడం వాటిలోకి దూసుకువెళ్లడం కూడా కనిపిస్తోంది. ఏతావాతా తెలుగు సినిమాలు ఇప్పుడు దక్షిణాదిని దాటేసి ఉత్తరాదిని చుట్టేసి, అమెరికా. చైనాలను కూడా కలిపేసుకుని... జపాన్, జర్మీనీ, బంగ్లాదేశ్ అంటూ హద్దులన్నీ చెరిపేసి.. కాదేదేశమూ కలెక్షన్లకు అనర్హం అన్నట్టుగా దూసుకెళ్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. అందుకే ఈ మిస్ వరల్డ్ పోటీలు టాలీవుడ్కి కూడా ముఖ్యమైన టాపిక్గా మారాయి. టైటిల్ విన్నర్ని అలా ఉంచితే... వీరిలో విభిన్న రకాల టైటిల్స్ను గెలుచుకునే అందగత్తెలు కూడా ఉంటారు. అలాగే అత్యంత అందమైన అమ్మాయి మాత్రమే మిస్ వరల్డ్ కావాలి అని రూలేం లేదు. టైటిల్ గెలుపులో అందంతో పాటు మరెన్నో అంశాలు ప్రాధాన్యత దక్కించుకుంటాయి. కాబట్టి టైటిల్ వేటలో వెనుకబడినా అందంలో అద్భుతం అనిపించే వారూ మరికొందరు కనిపిస్తారు. అలాంటి గ్లామరస్ బ్యూటీస్తో ఒప్పందాలు కుదుర్చుకుంటే తమ ఇంటర్నేషనల్ మూవీస్కి ప్లస్ అవుతారని కొందరు టాలీవుడ్ పెద్దలు భావిస్తున్నారట. మరోవైపు ఇప్పటికే టాలీవుడ్ టాక్ ఆఫ్ ది వరల్డ్ అయిపోయింది దాంతో... పలువురు విదేశీ గ్లామర్ క్వీన్స్ సైతం సినిమా ఆకాంక్షల్ని వెంటబెట్టుకుని మన దేశానికి రావడంలో వింతేమీ ఉండదు. కాబట్టి... వారూ తమ టీమ్తో కలిసి తమ వంతు ప్రయత్నాలు చేయరని చెప్పలేం. మొత్తం మీద... తొలిసారి తెలుగు నాట జరుగుతున్న ఈ మిస్ వరల్డ్ పోటీలో టైటిల్ విజేతలు మాత్రమే కాదు వెండి తెరపై టైటిల్స్లో చోటు చేసుకునే విన్నర్స్ కూడా తేలనున్నారు. ఎవరో తెలియాలంటే.. మరో నెల రోజులు ఆగాల్సిందే. -
మూడేళ్లుగా డేటింగ్.. ప్రియుడితో ఎంగేజ్మెంట్ చేసుకున్న సింగర్!
ప్రముఖ బాలీవుడ్ సింగర్ ప్రకృతి కకర్ ఎంగేజ్మెంట్ చేసుకుంది. తన ప్రియుడు, వ్యాపారవేత్త అయిన వినయ్ ఆనంద్తో నిశ్చితార్థం చేసుకుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. నా జీవితంలో ఏ విషయమైనా సరే జరిగే వరకు సీక్రెట్గానే ఉంచుతానని సింగర్ ప్రకృతి చెప్పుకొచ్చింది.వచ్చే ఏడాదిలో తామిద్దరు వివాహం చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నామని ప్రకృతి కాకర్ వెల్లడించింది. తన కాబోయే భర్త ఇండస్ట్రీకి చెందినవారు కాదు.. అందువల్ల ప్రశాంతమైన జీవితాన్నే ఇష్టపడతాడని తెలిపింది. ఇదంతా రాత్రికి రాత్రే జరిగిన విషయం కాదని.. అతనితో మూడు సంవత్సరాలుగా డేటింగ్ చేస్తున్నానని పేర్కొంది. తమ రిలేషన్ను పెళ్లి బంధంగా మార్చుకుంటున్నట్లు సింగర్ వివరించింది.తన ప్రేమ, డేటింగ్ గురించి మాట్లాడుతూ.. "మేము ఒక కుటుంబ వివాహానికి హాజరు కావడానికి లండన్ వెళ్లాం. అక్కడే వినయ్ అద్భుతంగా ప్లాన్ చేసిన వేడుకలో నాకు ప్రపోజ్ చేశారు. మా బంధువుల వివాహంలో అందరం కలిసి ఎంజాయ్ చేస్తున్నాం. అదే సమయంలో వినయ్ తనకు ప్రపోజ్ చేశాడు. ఈ విషయాన్ని నా సిస్టర్స్తో పాటు అందరూ రహస్యంగా ఉంచారు. నాకు ఇప్పుడు కృతజ్ఞత తప్ప మరేలాంటి అనుభూతి చెందడం లేదు.. ఎందుకంటే నేను ఎప్పుడూ కలలు కనే విషయం.. చాలా అద్భుతంగా జరిగింది,' అని తెలిపింది. -
ప్రియురాలితో కలిసి బోనీకపూర్ ఇంటికి అమిర్ ఖాన్!
బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ ముంబయి చేరుకున్నారు. ప్రముఖ నిర్మాత, శ్రీదేవి భర్త బోనీ కపూర్ను పరామర్శించారు. రెండు రోజుల క్రితమే బోనీ కపూర్ తల్లి నిర్మల్ కపూర్ కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బోనీ కపూర్ను కలిసి పరామర్శించారు. అమిర్తో పాటు ఆయన ప్రియురాలు గౌరీ స్ప్రాట్ కూడా ఉన్నారు. వీరిద్దరూ కలిసి బోనీ కపూర్ నివాసానికి చేరుకుని ఆమెకు నివాళులర్పించారు.కాగా.. బోనీ కపూర్ మాతృమూర్తి నిర్మల్ కపూర్ మే 2న అనారోగ్యంతో మరణించారు. కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆ తర్వాత ఎస్వీ రోడ్లోని విలే పార్లే శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. బోనీ కపూర్ కుటుంబంతో సాన్నిహిత్య కారణంతో ఆమిర్ ఖాన్ ప్రత్యేకంగా ఇంటికి వెళ్లి పరామర్శించారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. వీరితో పాటు కరీనా కపూర్ ఖాన్, కరిష్మా కపూర్, రాణి ముఖర్జీ లాంటి ప్రముఖులు కూడా బోనీ నివాసంలో కనిపించారు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
సంకెళ్ళ నుంచి స్వేచ్ఛ వచ్చింది!
ఓటీటీ వేదికలు వచ్చాక వినోద రంగంలో అనూహ్యమైన మార్పులు వచ్చాయి. నటుడు సైఫ్ అలీ ఖాన్ ఆ మాటే అంగీకరించారు. ముంబైలో జరుగుతున్న ‘వరల్డ్ ఆడియో – విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్’ (వేవ్స్)లో మూడో రోజైన శనివారం సైఫ్ మెరిశారు. స్ట్రీమింగ్ వేదికలతో ఆవిర్భవించిన నవభారతం గురించి జరిగిన చర్చావేదికలో ఆయన పాల్గొన్నారు. ‘‘సినీ రంగానికి చెందిన మేము గతంలో గిరి గీసుకొని నిర్ణీత విధానాలకే కట్టుబడాల్సి వచ్చేది. కానీ, స్ట్రీమింగ్ వేదికలు అందుబాటులోకి వచ్చాక నటీనటులకూ, సినీ రూపకర్తలకూ మునుపటి సంకెళ్ళ నుంచి స్వేచ్ఛ లభించింది. మా కథలను ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా జనం చూసే వీలు చిక్కింది. సాంప్రదాయిక సినిమా మీడియమ్లో అయితే ఆ వీలుండేది కాదు’’ అని సైఫ్ అభి్రపాయపడ్డారు. నెట్ఫ్లిక్స్ కో–సీఈఓ టెడ్ సరండోస్ సైతం, ‘‘స్ట్రీమింగ్ వేదికల వల్ల భారత్లో సినీ రూపకల్పనలో ప్రజాస్వామ్యం సాధ్యమైంది’’ అన్నారు. డిజిటల్ యుగంలో కథాకథనంలో వస్తున్న మార్పులు, సృజనాత్మక స్వేచ్ఛపై స్ట్రీమింగ్ ప్రభావం, ప్రపంచ వినోదపటంలో పెరుగుతున్న భారత్ స్థానం లాంటి పలు అంశాలపై ఈ గోష్ఠిలో దృష్టి సారించారు.‘‘ఇప్పుడు ప్రేక్షకులు చూసేందుకు విభిన్నమైన కథలు అనేకం ఏకకాలంలో అందుబాటులో ఉన్నాయి. అంతటి వైవిధ్యమైన కథలను తెరపై చెప్పే స్వేచ్ఛ సృజనశీలురకు దక్కింది. సినిమా రూపకల్పనలో ప్రజాస్వామ్యమంటే ఇదే’’ అని సైఫ్ అన్నారు. ‘‘ఎన్ని మార్పులు వచ్చినా, సినిమాలకు కాలం చెల్లదు. ఇంకా చె΄్పాలంటే, స్ట్రీమింగ్, థియేటర్లు... రెండూ పరస్పరం పోటీదారులు కావు. ముందున్న మార్కెట్ పెద్దది గనక, రెండూ ఏకకాలంలో కొనసాగుతాయి’’ అని టెడ్ విశ్లేషించారు. కోవిడ్ అనంతరం భారతదేశ వ్యాప్తంగా వందకు పైగా పట్టణాలు, నగరాల్లో, దాదాపు పాతిక వేల మంది స్థానిక నటీనటులు, సాంకేతిక వర్గంతో నెట్ఫ్లిక్స్ చిత్రీకరణ సాగించిందనీ, తద్వారా ఎందరికో ఉపాధి కల్పించిందనీ ఆయన వివరించారు.నటించే ముందు ఊహించుకోవాలి! – హీరో ఆమిర్ ఖాన్ ‘‘పాత్రను పూర్తిగా అవగాహన చేసుకొని, దానిలోకి పరకాయ ప్రవేశం చేయాలి. నా వరకు నేను స్క్రిప్టుతో చాలా సమయం గడుపుతాను. పదే పదే స్క్రిప్టు చదువుతాను. స్క్రిప్టు బాగుంటే, ఆ పాత్ర, దాని రూపురేఖలు, మానసిక వైఖరి అన్నీ దాని నుంచే అర్థమైపోతాయి. పాత్ర, కథ గురించి దర్శకుడితో చర్చల వల్ల కూడా ఓ అవగాహన వస్తుంది’’ అన్నారు ఆమిర్ ఖాన్. ‘వేవ్స్’లో భాగంగా శనివారం ఆయన తన సుదీర్ఘ నటనా జీవితం నుంచి కొత్తవాళ్ళకు పనికొచ్చే పలు సూచనలు చె΄్పారు. ‘‘నాకు జ్ఞాపకశక్తి తక్కువ. అందుకే, చేతితో డైలాగులు రాసుకుంటా.కష్టమైన సీన్లు ముందుగా చేస్తా. డైలాగులు కంఠస్థం చేస్తా. డైలాగులు నోటికి వచ్చాక, వాటిని నాదైన పద్ధతిలో సొంతం చేసుకుంటా. అదే డైలాగును వల్లె వేస్తున్నప్పుడు దాన్ని అనేక విధాలుగా ఎలా చేయవచ్చో మనకే అర్థమవుతుంది’’ అని ఆమిర్ వివరించారు. ‘‘చేస్తున్న పనిలో ఎంత నిజాయతీగా ఉంటే, అంత బాగా నటించగలుగుతాం. సీన్లుప్రాక్టీస్ చేసేటప్పుడు నేను అద్దంలో చూస్తూ చేయను. నటించే ముందు ఆ సన్నివేశాన్ని మనసులో ఊహించుకుంటా’’ అని చె΄్పారు. ‘‘సన్నివేశం డిమాండ్ చేసింది చేయాలే తప్ప, అందులో నా వంతు ఏమిటి, నాకెంత పేరొస్తుందని చూస్తే దెబ్బతింటాం’’ అని విశ్లేషించారు.70 కోట్ల మంది చూస్తున్నారు!గత పాతిక ఏళ్ళ పైచిలుకు కాలంలో భారత మీడియా సాధించిన పురోగతి, మరీ ముఖ్యంగా వీడియో కంటెంట్ సృష్టి, ఆ కంటెంట్ను జనం చూడడం పెరిగిన తీరు అనూహ్యమని మీడియా నిపుణుడు, జియో స్టార్ వైస్ఛైర్మన్ ఉదయ్ శంకర్ విశ్లేషించారు. ఒకప్పుడు టీవీకే పరిమితమైతే... ఇప్పుడు 4జీ విప్లవం, హాట్స్టార్ సహా వివిధ వేదికల ఆవిర్భావంతో దాదాపు 70 కోట్ల మంది స్ట్రీమింగ్ కంటెంట్ చూస్తున్నారని అంచనా వేశారు.‘వేవ్స్’లో ఆయన మాట్లాడుతూ, ‘‘హిందీ సినిమా ఇప్పటికీ పాతకాలంలోనే ఆగిపోవడం వల్ల థియేటర్లలో వసూళ్ళు తగ్గాయనీ, తమిళ – తెలుగు సహా దక్షిణాది సినీ పరిశ్రమల్లో సృజనాత్మక ప్రయోగాలు, వాటితో పాటు వసూళ్ళు పెరిగాయనీ గుర్తు చేశారు. ‘‘అన్ని తెరలూ ఒకటే కావు. వెండితెర, బుల్లితెర, డిజిటల్ ... దేనికవే భిన్నమైనవి. ఒక్కోటీ ఒక్కో పరిణామ దశలో ఉన్నాయి. దేని ప్రయోజనం దానిదే. అది తెలుసుకోకుండా అన్నిటితో ఒకేలా వ్యవహరిస్తే వ్యాపారంలో దెబ్బ తింటాం’’ అని ఆయన వివరించారు.నాగపూర్లో ప్రపంచపు అతి పెద్ద స్క్రీన్‘‘ఇండియన్ ఎంటర్టైన్మెంట్ని ప్రపంచ స్థాయిలోకి తీసుకెళ్లాలన్నది ప్రధాని మోదీగారి లక్ష్యం. ఈ దిశలో వరల్డ్స్ బిగ్గెస్ట్ సినిమా స్క్రీన్ నిర్మించే అవకాశం మాకు దక్కడం గర్వకారణం. మా విజన్ని అర్థం చేసుకుని, నమ్మిన ముఖ్యమంత్రి ఫడ్నవీస్గారికి కృతజ్ఞతలు’’ అని అభిషేక్ అగర్వాల్ అన్నారు. నాగపూర్లో వరల్డ్స్ బిగ్గెస్ట్ సినిమా స్క్రీన్ప్రాజెక్ట్ను రూపకల్పన చేయనున్నట్లు ‘వేవ్స్–2025’ వేదికగా నిర్మాతలు అభిషేక్ అగర్వాల్, విక్రమ్ రెడ్డి పేర్కొన్నారు. ‘‘గొప్ప సినిమాలు తీయడమే కాదు, అద్భుతమైన థియేటర్లు నిర్మించాలన్నది మా ధ్యేయం. సినిమాను మరింత గొప్పగా మార్చడమే మా యూవీ క్రియేషన్స్ లక్ష్యం. ప్రపంచపు అతిపెద్ద స్క్రీన్ ని నాగపూర్లో నిర్మించ నున్నాం. మా సామర్థ్యాలపై నమ్మకం ఉంచిన మోదీగారికి కృతజ్ఞతలు’’ అన్నారు విక్రమ్ రెడ్డి. – సాక్షి ప్రత్యేక ప్రతినిధి -
సచిన్ కూతురితో హీరో డేటింగ్..!
బాలీవుడ్ నటుడు సిద్ధాంత్ చతుర్వేది గతేడాది యుధ్రా మూవీలో కనిపించారు. అయితే ఈ మూవీ బాక్సాఫీస్ బోల్తా కొట్టింది. ప్రస్తుతం సిద్ధాంత్ ధడక్-2 మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇందులో యానిమల్ బ్యూటీ త్రిప్తి దిమ్రీ కూడా హీరోయిన్గా నటించారు. ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడింది. త్వరలోనే రిలీజ్ తేదీని ప్రకటించనున్నారు మేకర్స్. ఆ తర్వాత సిద్ధాంత్ చతుర్వేది దిల్ కా దర్వాజా ఖోల్ నా డార్లింగ్ మూవీలో కనిపించనున్నారు.అయితే ఇదంతా పక్కనపెడితే సిద్ధాంత్ గతంలో అమితాబ్ బచ్చన్ మనవరాలు నవ్య నవేలితో డేటింగ్లో ఉన్నట్లు వార్తలొచ్చాయి. ఈ విషయంలో ఎవరూ క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా హీరో సిద్ధాంత్ చతుర్వేది టీమిండియా మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కూతురు సారాతో డేటింగ్లో ఉన్నారంటూ బాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. వీరిద్దరు పీకల్లోతు ప్రేమలో ఉన్నారని ఓ నివేదిక వెల్లడించింది. అయితే ఈ విషయంపై సిద్ధాంత్ కానీ.. సారా టెండూల్కర్ కానీ స్పందించలేదు. రిలేషన్పై ఎవరో ఒకరు క్లారిటీ ఇస్తే కానీ ఈ రూమర్స్ ఆగేలా కనిపించడం లేదు. కాగా.. సారా టెండూల్కర్ ప్రస్తుతం ఆస్ట్రేలియా వేకేషన్లో ఉన్నారు. అక్కడ ట్రిప్ ఎంజాయ్ చేస్తోన్న ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు.కాగా.. గతంలో సిద్ధాంత్ చతుర్వేది.. అమితాబ్ బచ్చన్ మనవరాలు నవ్య నవేలితో ప్రేమలో ఉన్నారని రూమర్స్ వినిపించాయి. అంతే కాకుండా సారా టెండూల్కర్ సైతం క్రికెటర్ శుభ్మాన్ గిల్తో రిలేషన్లో ఉన్నారంటూ వార్తల్లో నిలిచింది. కానీ వీరిద్దరు కూడా తమ రిలేషన్ను ధృవీకరించలేదు. మరోవైపు శుభ్ మన్ గిల్.. సైఫ్ కూతురు సారా అలీ ఖాన్తో ప్రేమలో ఉన్నట్లు వార్తలొచ్చాయి. గతంలో కాఫీ విత్ కరణ్ ఎపిసోడ్ సందర్భంగా సారా అలీ ఖాన్ ఈ విషయంపై ప్రశ్నించగా.. అలాంటిదేం లేదని చెప్పుకొచ్చింది. View this post on Instagram A post shared by Sara Tendulkar (@saratendulkar) -
యానిమల్ మూవీ.. సందీప్ కాన్ఫిడెన్స్ వల్లే సాధ్యమైంది: నిర్మాత భూషణ్ కుమార్
టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ చిత్రం యానిమల్. రణ్బీర్ కపూర్, రష్మిక మందన్నా హీరో, హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ను షేక్ చేసింది. మోస్ట్ వయొలెంట్ మూవీగా విమర్శలు వచ్చినప్పటికీ కమర్షియల్గా సక్సెస్ సాధించింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.900 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అప్పట్లో ఈ మూవీపై కొందరు సినీ ప్రముఖులు సైతం విమర్శలు చేశారు. తాజాగా ఈ మూవీ సక్సెస్ కావడంపై నిర్మాత భూషణ్ కుమార్ తాజా ఇంటర్వ్యూలో మాట్లాడారు. యానిమల్ మూవీ ఓపెనింగ్ రోజు ఆ స్థాయిలో కలెక్షన్స్ రావడానికి కారణం సందీప్ రెడ్డి వంగానే అన్నారు. ఈ మూవీ విజయానికి క్రెడిట్ అంతా సందీప్కే దక్కుతుందని తెలిపారు.భూషణ్ కుమార్ మాట్లాడుతూ..' యానిమల్ సినిమాపై సందీప్ నమ్మకం వేరే స్థాయిలో ఉండేది. అందుకే అతనికే ఎక్కువ క్రెడిట్ ఇస్తాను. ఇది ఒక డిఫరెంట్ సినిమా. రణ్బీర్ కపూర్ ఈ చిత్రంలో నటించడానికి చాలా ఆసక్తి చూపించాడు. ఎందుకంటే అంతకుముందు ఇలాంటి పాత్రను చేయలేదు. ఈ సినిమా ఎంత బాగా వర్కవుట్ అవుతుందో అప్పుడు మాకెవరికీ తెలియదు. ఈ మూవీపై భారీగానే విమర్శలు వచ్చినప్పటికీ వసూళ్లను సాధించింది. ఏ సర్వేలో చూసినా మోస్ట్ అవైటేడ్ చిత్రం యానిమల్ అనే వచ్చింది. ఈ సినిమా దర్శకుడిపై పూర్తి నమ్మకముంది. అందుకే సందీప్కే క్రెడిట్ ఇస్తాను. మొదటి కాపీ చూసినప్పుడు నిడివి చాలా ఎక్కువగా ఉందని అతనితో చెప్పా. కానీ సందీప్ నాతో.. సర్, నన్ను ఏమీ కట్ చేయమని అడగకండి. ఈ మూవీ అద్భుతమైన బిజినెస్ చేస్తుందని నాకు నమ్మకం ఉంది. మొదటి రోజే రూ.50 కోట్లకు పైగా సాధిస్తుందని సందీప్ నాతో అన్నారని' వివరించారు.సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో రణబీర్ కపూర్, అనిల్ కపూర్, బాబీ డియోల్, రష్మిక మందన్న, త్రిప్తి దిమ్రి కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీ సూపర్ హిట్ కావడంతో యానిమల్ పార్క్ పేరుతో సీక్వెల్ తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఇంకా రివీల్ చేయలేదు. -
రూ.4.5 కోట్లు, రూ.75లక్షలు.. బాలీవుడ్ తారల వస్త్రధారణ ఖరీదు
బాలీవుడ్ సినిమాలు అంటేనే రిచ్నెస్కి కేరాఫ్ అన్నట్టుగా ఉంటాయి. ప్రేక్షకుల్ని మెప్పించడానికి ఎన్ని వ్యయ ప్రయాసలకైనా సరే రెడీ అన్నట్టుగా ఉండే బాలీవుడ్ నిర్మాతలు, కేవలం హీరో, హీరోయిన్ల దుస్తుల కోసం రూ.లక్షల నుంచి రూ.కోట్ల దాకా ఖర్చు చేస్తున్నారు. గత కొంత కాలంగా పలు బాలీవుడ్ చిత్రాల్లో తారలు ధరించిన అత్యంత ఖరీదైన దుస్తుల వివరాలివే...–షారూఖ్ ఖాన్ నటించిన వన్ సినిమాలో ఆయన ధరించిన రోబో పాత్రకు తగినట్టుగా రోబోటిక్ వస్త్రధారణలో కనిపిస్తారు. సినిమాలో ఈ గెటప్ చాలా కీలకం కావడంతో దీని కోసం రూ.4.5 కోట్లను నిర్మాతలు ఖర్చు పెట్టారట. ఇప్పటి దాకా అత్యధిక వ్యయం చేసిన కాస్ట్యూమ్ ఇదేనని చెప్పొచ్చు. ఈ కాస్ట్యూమ్ డిజైనింగ్లో టాప్ డిజైనర్ మనీష్ మల్హోత్రాతో పాటు విదేశీ డిజైనర్లు రాబర్ట్ లీవర్ వంటివాళ్లు కూడా పాలు పంచుకున్నారు.–రాధా నాచేగీ అనే పాట కోసం నటి సోనాక్షి సిన్హా అత్యంత ఖరీదైన దుస్తులు ధరించిన ఘనత దక్కించుకుంది. తేవార్ సినిమాలోని ఓ పాట కోసం రూపొందించిన డ్రెస్ విలువ ఏకంగా రూ.75లక్షలని సమాచారం.–సింగ్ ఈజ్ బ్లింగ్లో హీరో అక్షయ్ కుమార్ ధరించిన టర్బాన్ పూర్తిగా స్వఛ్చమైన ప్లెయిన్ గోల్డ్తో తయారు చేశారు. దీని ఖరీదు రూ.65లక్షలు పైనే ఉంటుందట. టర్బాన్ ధరించడాన్ని బాలీవుడ్లో ట్రెండ్గా మార్చింది ఈ సినిమా.–బాజీరావ్ మస్తానీ సినిమాలో చారిత్రక వస్త్ర వైభవాన్ని తెరపై ఆవిష్కరించడానికి డిజైనర్ అంజుమోన్ స్వయంగా చేతితో డిజైన్ చేయగా, దీపిక పదుకునే ధరించిన దుస్తులకు రూ.50లక్షలకు పైనే ఖర్చు అయినట్టు తెలుస్తోంది. ఈ డ్రెస్ ఎంబ్రాయిడరీ వర్క్ మొత్తం అచ్చంగా బంగారంతో చేయడం విశేషం.–కంబక్త్ ఇష్క్ సినిమాలో కరీనా కపూర్ ధరించిన సెక్విన్ మినీ డ్రెస్ ను పారిస్ నుంచి తెప్పించారట. అందుకోసం రూ.8లక్షలు ఖర్చు పెట్టారు. టైటిల్ సాంగ్లో ఈ డ్రెస్ ధరించి మెరిసిన కరీనా..కొత్త ఫ్యాషన్ ట్రెండ్స్ను సృష్టించింది.–జోథా అక్బర్లో మొఘల్ దర్పాన్ని ఒలికించేలా హృతిక్ రోషన్ దుస్తుల్ని డిజైన్ చేయడం కోసం దాదాపుగా 18నెలల పాటు డిజైనర్ నీతాలుల్లా శ్రమించారు. అందులో ఒక కాస్ట్యూమ్ కోసం అత్యధికంగా రూ.12లక్షలు ఖర్చు పెట్టారు. ఇదే సినిమాలో ఐశ్వర్యారాయ్ అందంతో పాటు ఆమె వస్త్ర సోయగం కూడా ఇమిడిపోయేలా రూపొందిన ఐశ్వర్య దుస్తుల కోసం రూ.2లక్షలపైనే ఖర్చు చేశారు.–మార్ డాలా అనే పాట దేవదాస్ సినిమాలో సూపర్హిట్. ఆ పాట లో జీవించిన బాలీవుడ్ స్టార్ మాధురీదీక్షిత్ ధరించిన రెడ్ కలర్ దుస్తులు కూడా అంతే హిట్. వీటి ఖరీదు రూ.15లక్షల పైమాటే.–పద్మావతి సినిమా కోసం దీపిక పదుకునే ధరించిన లెహంగా ఏకంగా 30 కిలోల బరువు ఉంటుందట. పూర్తిగా కళాకృతులను ఇముడ్చుకున్న ఈ డ్రెస్... తయారీలో 200 మంది కళాకారులు పాలుపంచుకున్నారట. కిలోల కొద్దీ బంగారాన్ని వినియోగించిన ఈ దుస్తుల కోసం రూ.30లక్షలు ఖర్చు పెట్టారట.–క్రిష్ 3 సినిమా లో కంగనా రనౌత్ ధరించిన దుస్తుల ఖరీదు రూ. కోటి రూపాయలట.. పారిస్ నుంచి ఒక్కోటి రూ.10లక్షల ఖరీదు లాటెక్స్ సూట్స్ ను తెప్పించారు. అలాంటివి 10 సూట్స్ ఈ సినిమాలో ఆమె ధరించింది.–చారిత్రక యుద్ధాల నేపధ్యంలో తీసిన వీర్ సినిమాలో సల్మాన్ ఖాన్ వారియర్గా చూపించే డ్రెస్ ఖరీదు రూ.20లక్షలు. ఈ సినిమాలో యుద్ధవీరునిగా కనిపించే సమయంలో సల్మాన్ ధరించిన దుస్తుల్ని రాజస్థాన్కు చెందిన లెదర్ వర్క్ నిపుణులు తయారు చేశారు. ఒక్కోటి రూ.20లక్షల విలువైన అలాంటి 6 వారియర్ కాస్ట్యూమ్స్ను ఈ సినిమాలో సల్మాన్ ధరించాడు. -
'ఆదిపురుష్' రిజల్ట్ పై దర్శకుడి తెలివితక్కువ వాదన
'కాకి పిల్ల కాకికి ముద్దు' అని తెలుగులో ఓ సామెత ఉంది. దీన్ని చాలామంది దర్శకులకు అన్వయించి చెప్పొచ్చు. ఎందుకంటే తాము తీసిన సినిమా పెద్ద కళాఖండం అనుకుంటారు. ప్రేక్షకులు అడ్డంగా తిరస్కరించినా ఫ్లాప్ అని ఒప్పుకోవడానికి మనసు రాదు. 'ఆదిపురుష్' దర్శకుడి మాటలు చూస్తుంటే అదే అనిపిస్తుంది.(ఇదీ చదవండి: రెండో పెళ్లి చేసుకుంటా.. అందరికీ సమాధానమిస్తా: జాను లిరి) తాజాగా ముంబైలో జరిగిన వేవ్ సమ్మిట్ లో పాల్గొన్న దర్శకుడు ఓం రౌత్.. 'ఆదిపురుష్' గురించి చిత్రవిచిత్రమైన కామెంట్స్ చేశారు. ఇది విని ప్రభాస్ ఫ్యాన్స్ మైండ్ బ్లాక్ అయిందనే చెప్పాలి. ఈ వ్యాఖ్యలపై అదే స్థాయిలో ట్రోలింగ్ జరుగుతుండటం ఇక్కడ కొసమెరుపు.వేవ్స్ సమ్మిట్ లో పాల్గొన్న ఓం రౌత్.. ఆదిపురుష్ తెలుగు హక్కుల్ని రూ.120 కోట్లకు కొన్నారని, అంటే ఎక్కువ మంది ప్రేక్షకులు చూసినట్లే కదా అని చెప్పుకొచ్చాడు. ఈ లాజిక్ దెబ్బకు అందరికీ నోట మాట రావట్లేదు. ఎందుకంటే రూ.120 కోట్లు పెట్టి కొనడం కాదు, అంతకు మించిన వసూళ్లు వస్తే అప్పుడు ఎక్కువ మంది ప్రేక్షకులు సినిమాను చూసినట్లు. ఈ లాజిక్ ఓం రౌత్ కి ఎప్పుడు అర్థమవుతుందోనని ఓ నెటిజన్ కామెంట్స్ చేశాడు.(ఇదీ చదవండి: ఓటీటీల్లోకి వచ్చేసిన 30 సినిమాలు.. ఈ రెండు రోజుల్లోనే) ఓం రౌత్.. ఆదిపురుష్ గనుక సరిగా తీసి ఉంటే ఈ పాటికే మరో సినిమా లైన్ లో పెట్టేవాడు. దాని రిజల్ట్ తేడా కొట్టడం వల్లే రెండేళ్లయినా కొత్త ప్రాజెక్ట్ సెట్ చేసుకోలేకపోతున్నాడు. మరోవైపు ఇదే బాలీవుడ్ లో రణ్ బీర్ కపూర్, సాయిపల్లవిలతో రామాయణాన్ని సినిమాగా తీస్తున్నారు.ఆదిపురుష్ చిత్రంలో రావణుడిగా చేసిన సైఫ్ అలీఖాన్ కూడా మొన్నీమధ్య సినిమాపై షాకింగ్ కామెంట్స్ చేశారు. తన కొడుకుతో సినిమా చూసిన తర్వాత అతడికి సారీ కూడా చెప్పానని అన్నాడు. అంటే మూవీ ఫ్లాప్ అయిందని స్వయంగా సైఫ్ ఒప్పుకొన్నట్లే. కానీ ఓం రౌత్ మాత్రం 'ఆదిపురుష్' హిట్ అనే భ్రమల్లో ఇంకా బతికేస్తున్నాడేమో?(ఇదీ చదవండి: కొత్త రికార్డ్.. మహేశ్ బాబు తర్వాత నానినే) #Adipurush was sold for Rs. 120cr in Telugu. Which means so many people watched it - #OmRaut pic.twitter.com/WuWs6gNHqf— $@M (@SAMTHEBESTEST_) May 2, 2025 -
నానమ్మ అంత్యక్రియల్లో పాల్గొన్న జాన్వీ కపూర్..!
బాలీవుడ్ భామ జాన్వీ కపూర్.. తన నానమ్మ నిర్మల్ కపూర్ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. తన చెల్లి ఖుషీ కపూర్, బాయ్ఫ్రెండ్ శిఖర్ పహారియాతో కలిసి గ్రాండ్ మదర్ అంత్యక్రియలకు హాజరయ్యారు. బోనీ కపూర్ తల్లి అయిన నిర్మల్ కపూర్ వృద్ధాప్య సమస్యలతో అనారోగ్యంతో బాధపడుతూ 90 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఆమె మృతి పట్ల సంతాపం తెలిపారు.(ఇది చదవండి: శ్రీదేవి భర్త బోనీ కపూర్ ఇంట తీవ్ర విషాదం)కాగా.. జాన్వీ కపూర్ విషయానికొస్తే శ్రీదేవి ముద్దుల కూతురు టాలీవుడ్ సినిమాతో బిజీగా ఉంది. దేవరతో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ రామ్ చరణ్ సరసన కనిపించనుంది. బుచ్చి బాబు సనా డైరెక్షన్లో వస్తోన్న పెద్ది సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోన్న సంగతి తెలిసిందే.#TFNExclusive: Visuals of #JanhviKapoor at her grand mother's last rites in Mumbai!#Janhvi #TeluguFilmNagar pic.twitter.com/3skROCvRXV— Telugu FilmNagar (@telugufilmnagar) May 3, 2025 -
ఆసక్తి గొలిపే చర్చలతో వేవ్స్
‘వేవ్స్’లో హీరో నాగార్జున మాట్లాడుతూ– ‘‘పుష్ప’ సిరీస్ సినిమాలు తెలుగు కంటే వేరే భాషల్లో ఎక్కువగా వసూళ్లు సాధించాయి. వందలో దాదాపు తొంభై మంది తమ ఒత్తిడి పొంగొట్టుకునేందుకు తెరపై జరిగే మ్యాజిక్ (సినిమాలు) చూసేందుకు ఇష్టపడుతుంటారు. నేటితరం ప్రేక్షకులు కథానాయకులను పుష్పరాజ్ (‘పుష్ప’లో అల్లు అర్జున్), రాఖీ భాయ్ (‘కేజీయఫ్’లో యశ్), బాహుబలి (‘బాహుబలి’లో ప్రభాస్) లాంటి లార్జర్ దేన్ లైఫ్ రోల్స్లో చూడాలనుకుంటున్నారు. నేనూ దాన్నే ఇష్టపడతాను. కేవలం హీరోల ఎలివేషన్ ఒక్కటే కాదు.. బలమైన కథలతోనే ఆయా చిత్రాలు బ్లాక్బస్టర్ అయ్యాయి. రాజమౌళి ‘బాహుబలి’ సినిమాని తెలుగులోనే తెరకెక్కించినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు ఆదరించారు’’ అన్నారు.భారత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న నాలుగు రోజుల వరల్డ్ ఆడియో, విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ (వేవ్స్) – 2025 రెండో రోజు సైతం అట్టహాసంగా సాగింది. ముంబైలోని జియో వరల్డ్ సెంటర్ వేదికగా జాతీయ, అంతర్జాతీయ సినీ ప్రముఖులు, దర్శక, నిర్మాతలు, ఔత్సాహిక సినీ రూపకర్తలు శుక్రవారం పెద్ద ఎత్తున సమ్మిట్కు హాజరయ్యారు. వివిధ వేదికలపై చర్చాగోష్ఠులు, ముఖాముఖీలు కొనసాగాయి.మీడియా – వినోద రంగంలో వివిధ దేశాల్లో అనుసరిస్తున్న విధానాలనూ, వ్యూహాలనూ పరస్పరం పంచుకొనేందుకు వీలుగా గ్లోబల్ మీడియా డైలాగ్ అలాగే, క్రియేట్ ఇండియా ఛాలెంజ్ పొంటీలోని విజేతలకు అవార్డులు ప్రదానం చేశారు. వేవ్స్ బజార్ వేదికగా వివిధ చిత్ర నిర్మాణ సంస్థలు, వ్యక్తుల మధ్య కంటెంట్ మార్కెటింగ్ అవకాశాల అన్వేషణ నడిచింది.భవిష్యత్తులో స్టూడియోలు, సాఫ్ట్ పవర్గా సినిమా, డిజిటల్ యుగంలో మారుతున్న కథాకథన రీతులు, మారుతున్న భారతీయ సినిమా ముఖచిత్రం తదితర అంశాలపై చర్చాగోష్ఠులు జరిగాయి. దక్షిణాది సినీ ప్రముఖులు నాగార్జున, విజయ్ దేవరకొండ, అమల అక్కినేని, సుప్రియ యార్లగడ్డ, ఖుష్బూ, కార్తి, రవి మోహన్, హిందీ చిత్ర సీమ నుంచి అనుపమ్ ఖేర్, ఆమిర్ ఖాన్, కరణ్ జోహార్, కరీనా కపూర్, సోనాలీ కులకర్ణి, ‘ఆదిపురుష్’ చిత్రదర్శకుడు ఓం రౌత్, ఆస్కార్ అవార్డు గెల్చిన మహిళా నిర్మాత గునీత్ మోంగా సదస్సుప్రాంగణంలో ఉత్సాహంగా చర్చల్లో పాల్గొన్నారు.కృత్రిమ మేధ (ఏఐ) రాకపై ఆసిడెంట్ రిచర్డ్ జి. కెర్రీస్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో ఆసక్తికరంగా వివరించారు. హాలు మొత్తం ప్రేక్షకులతో కిక్కిరిసి పొంగా, మీడియా దిగ్గజం అరుణ్ పురీ సహా పలువురు కెర్రీస్ తెరపై చూపిన ఏఐ ఆధారిత సినిమా వీడియోలను చూశారు. ఫుగటో లాంటి సాఫ్ట్ వేర్లతో ఆడియోలో సౌండ్ ఎఫెక్ట్ల మొదలు సంగీత బాణీల దాకా ఎలా మార్చుకోవచ్చో సమావేశంలో వివరించిన తీరు హర్షధ్వానాలు అందుకుంది. భారతీయ సంస్కృతిని ప్రపంచానికి చేరువ చేయడమనే అంశంపై నీతా అంబానీ ఇచ్చిన కీలకోపన్యాసం ఓ ప్రధాన ఆకర్షణగా నిలిచింది.‘‘ఇవాళ మన దేశానికి అతి పెద్ద మార్కెటింగ్ సాధనం... సినిమా. నేను కశ్మీర్లో షూటింగ్ చేస్తున్నా, నన్ను జనం గుర్తు పడుతున్నారంటే దానికి సినిమాయే కారణం! మనం మన (సినీ) సామ్రాజ్యాన్ని మరింత విస్తరించుకోవాల్సి ఉంది. దేశం సరిహద్దులు దాటి మన సినిమా ముందుకు వెళ్ళాలంటే, అక్కడా మన సినిమాల డిస్ట్రిబ్యూషన్ను పెంచుకోవడమే మార్గం. అలాగే, బాక్సాఫీస్ వద్ద మన సినిమాల జోరు పెరగాలంటే, వివిధ భాషల నటులు కలసి సినిమాలు చేయాలి’’. – హీరో విజయ్ దేవరకొండహీరో ఆమిర్ ఖాన్ మాట్లాడుతూ– ‘‘ఇండియాలోనే కాదు... ప్రపంచవ్యాప్తంగా మంచి డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఉండాలి. విదేశాల్లో డిస్ట్రిబ్యూషన్ గురించి మన నిర్మాతలు ఆలోచిస్తే మార్పు మొదలవుతుంది. దేశవ్యాప్తంగా మరిన్ని స్క్రీన్ ్స పెంచేందుకు ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం చాలా ఉంది’’ అన్నారు.‘‘లార్జర్ దేన్ లైఫ్ పాత్రలతో పాటు కుటుంబాన్ని ప్రేమిస్తూ, కుటుంబ సభ్యుల కోసం ఏమైనా చేసే పాత్రలనూ ప్రేక్షకులు ఇవాళ ప్రేమిస్తున్నారు. ఇవాళ ప్యాన్ ఇండియా అనేది ఫ్యాషన్ అయిపొంయింది. అసలు ఈ కంగాళీ పదం రాక ముందే మన మణిరత్నం తీసిన ‘రోజా, బొంబాయి’ లాంటివి అఖిల భారత చిత్రాలే కదా. అవన్నీ భాష,ప్రాంతాలకు అతీతంగా దేశవ్యాప్తంగా అందరినీ ఆకట్టుకున్నాయి’’. – నటి ఖుష్బూ‘‘ఇవాళ ఓటీటీ సహా అనేక రకాల కంటెంట్ అందుబాటులో ఉన్నప్పటికీ, ప్రేక్షకులు హీరో వీరోచిత విన్యాసాలు, ఊహల్లో విహరింపజేసే భారీ పాటలు, డ్యాన్సులు చూసేందుకు సినిమా హాళ్ళకు వస్తున్నారు. అయితే, ప్రతిదీ భారీ, ప్యాన్ ఇండియా సినిమా కావాల్సిన పని లేదు. మంచి కథతో, చిన్న సినిమాలూ రావాలి’’. – హీరో కార్తి‘‘ఏ తెరపై ఏ కథ చెప్పినా... నిజాయతీగా, భావోద్వేగభరితంగా చెప్పడం కీలకం. ప్రేక్షకులు తెరపై ఎంత భారీతనాన్ని ఇష్టపడినప్పటికీ, సినిమా రూపకర్తలోని ఆ నిజాయతీ, నిబద్ధతను ఇట్టే గమనిస్తారు. ఆస్వాదిస్తారు, అభినందిస్తారు. సినిమా విజయానికి అదే ప్రధాన సూత్రం’’. – నటుడు అనుపమ్ ఖేర్‘‘స్టోరీ టెల్లింగ్, కంటెంట్ క్రియేషన్ లాంటి పెద్ద పెద్ద మాటలు చెబుతాం కానీ, ప్రేక్షకులకు నచ్చిందా, లేదా అన్నదే ఆఖరికి మిగిలే అసలు పాయింట్. అంతే. ఎంచుకున్న ఆలోచనను బలంగా నమ్మాలి. అలా నమ్మిన ఆలోచనతో ముందుకు వెళ్ళాలి’’. – సుప్రియ యార్లగడ్డ, నిర్మాత, అన్నపూర్ణా స్టూడియోస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‘‘ఉత్తరాది, దక్షిణాది లాంటి చీలికలు, భేదాల చుట్టూ తిరగకుండా, ఏది గొప్ప, ఏది తక్కువ అనే వాదన కన్నా, మనది భారతీయ సినిమా అనే భావన చాలా ముఖ్యం. భారతీయ సినిమా అంటే ఇదీ అని చూపాలంటే, నేను గురుదత్ తీసిన ‘కాగజ్ కే ఫూల్, ప్యాసా’ లాంటి సినిమాలు ప్రపంచానికి చూపాలంటాను’’. – దర్శక – నిర్మాత కరణ్ జోహార్‘‘కరోనా తర్వాత తమిళ సినిమాను తీసే విధానం, జనం చూసే విధానం కూడా మారాయి. రకరకాల వేదికలపై ఇప్పుడు కంటెంట్ అందుబాటులో ఉంది. మొబైల్తో కూడా సినిమా తీసేయచ్చు. అందులోనే రిలీజ్ చేయవచ్చు. చూడవచ్చు. అది ఒక మార్గం, అదనపు చేర్పు. అంతే తప్ప భారీ వెండితెర వినోదం మాత్రం ఎన్నటికీ చెరిగిపొందు, కరిగిపొందు’’. – తమిళ హీరో ‘జయం’ రవి -
శ్రీదేవి భర్త బోనీ కపూర్ ఇంట తీవ్ర విషాదం
బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన మాతృమూర్తి నిర్మల్ కపూర్(90) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో ముంబయిలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో చేరిన ఆమె ఇవాళ సాయంత్రం తుదిశ్వాస విడిచారు. కాగా.. ఆమెకు ప్రముఖ నిర్మాత, శ్రీదేవి భర్త బోనీ కపూర్, నటుడు సంజయ్ కపూర్ కూడా సంతానం. వీరితో పాటు రీనా కపూర్ ఆమె ఓ కుమార్తె కూడా ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఆమె మరణం పట్ల సంతాపం తెలియజేస్తున్నారు.ఈ విషయం తెలుసుకున్న వెంటనే శ్రీదేవి భర్త బోనీ కపూర్, ఆయన కుమార్తెలు జాన్వీ కపూర్, ఖుషీ కపూర్తో పాటు శిఖర్ పహరియా, షనాయా కపూర్ల ముంబయి లోఖండ్వాలాలోని అనిల్ కపూర్ ఇంటికి చేరుకున్నారు. కాగా.. గతేడాది సెప్టెంబర్లో నిర్మల్ కపూర్ 90వ పుట్టినరోజు వేడుకను అందరూ కలిసి గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నారు.కాగా.. నిర్మల్ కపూర్ ప్రముఖ నిర్మాత సురీందర్ కపూర్ను వివాహం చేసుకున్నారు. వీరిద్దరికీ అనిల్ కపూర్, బోనీ కపూర్, సంజయ్ కపూర్, రీనా కపూర్ అనే నలుగురు జన్మించారు. అంతే కాకుండా ఆమెకు అర్జున్ కపూర్, సోనమ్ కపూర్, రియా కపూర్, హర్ష్ వర్ధన్ కపూర్, జాన్వీ కపూర్, అన్షులా కపూర్, ఖుషీ కపూర్, మోహిత్ మార్వా అనే మనవలు, మనవరాళ్లు ఉన్నారు. -
ఓటీటీలో మరో క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలు వచ్చాక ఏడాపెడా వెబ్ సిరీస్లు వచ్చేస్తున్నాయి. ముఖ్యంగా ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్ సిరీస్లకు విపరీతమైన డిమాండ్ ఉంటోంది. ఈ నేపథ్యంలో వెబ్ సిరీస్లు ఎక్కువగా ఆ జోనర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ జోనర్ ఇష్టపడే వారికోసం మరో క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ త్వరలోనే అలరించనుంది.రోషన్ మాథ్యూ , మోహిత్ రైనా, త్రినేత్ర ప్రధాన పాత్రల్లో నటించిన తాజా క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ 'కంకాజుర'. ఈ సిరీస్కు చందన్ అరోరా దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సిరీస్ టీజర్ను మేకర్స్ విడుదల చేశారు. ఈ థ్రిల్లర్ సిరీస్ సోనీలివ్లో ఈనెల 30 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇజ్రాయెల్ సిరీస్ మ్యాగ్పీ ఆధారంగా ఈ సిరీస్నును హిందీలో తెరకెక్కించారు. టీజర్ చూస్తే తనను అవమానించిన వారిపై పగతీర్చుకునే ఓ యువకుడి కథ ఆధారంగా ఈ సిరీస్ తెరకెక్కించినట్లు తెలుస్తోంది. It’s fragile. It’s fatal. It’s coming.Kankhajura — Streaming on 30th May on Sony LIV.#KanKhajura #SoFragileYetSoFatal#MohitRaina @roshanmathew22 @sarahjanedias03 #TrinetraHaldarGummaraju #NinadKamat #MaheshShetty #HeebaShah pic.twitter.com/FxUDjHUsaW— Sony LIV (@SonyLIV) May 2, 2025 -
నా డ్రీమ్స్.. కరియర్ : ఇపుడు కొత్తగా, ప్రతీక్షణం ఆస్వాదిస్తున్నా
మాతృత్వం ఒక వరమే.కానీ అంతకుమించిన బాధ్యతల భారం కూడా. కుటుంబ సభ్యులు, భర్త సహకారం ఉన్నపుడు నిజంగా ఏ మహిళకైనా గర్భం దాల్చడం, బిడ్డకు జన్మనివ్వడం, పాలిచ్చి పోషించడం లాంటి వన్నీ జీవితాంతం పదిలపర్చుకునే మధుర జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. ఇంత ముఖ్యమైన విషయాన్ని అటు కుటుంబ సభ్యులు, ఇటు సమాజమూ గుర్తించాలన్న స్పృహ ఇటీవలి కాలంలో బాగా పెరుగుతోంది. దీనికి తోడు చాలా మంది సెలబ్రిటీలు కూడా ఈ అంశంపై బహిరంగంగా చర్చిస్తుండటం మంచి పరిణామం. ఈ కోవలోకి తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణే చేరింది.హిందీ చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిభావంతులైన నటీమణులలో ఒకరు దీపికా పదుకొణే (Deepika Padukone). అందానికి తగ్గ అభినయం, అభిమానుల హృదయాలను దోచుకుంది. బాలీవుడ్లో అనేక బ్లాక్ బస్టర్ మూవీలను తన సొంతం చేసుకుంది. తనదైన నటనతో దర్శక నిర్మాతల ఫ్యావరేట్గా మారింది. హీరోయిన్గా కరియర్ కొనసాగిస్తూనే, బాలీవుడ్ హీరో,ప్రేమికుడు రణవీర్ సింగ్ను 2018లో వివాహం చేసుకుంది. 2024లో తొలి బిడ్డ దువాకు జన్మనిచ్చింది. వేవ్స్ సమ్మిట్ 2025లో దీపిక తన కూతురు దువాకుతో తనకున్న అనుబంధం, చిన్నారి వచ్చిన తరువాత తన జీవితంలో వచ్చిన మార్పుల గురించి మాట్లాడింది.ముంబైలోని జియో వరల్డ్ సెంటర్లో జరిగిన WAVES 2025 సమ్మిట్లో మాతృత్వం, బిడ్డ పెంపకం గురించి మాట్లాడినపుడు. దీపికా పదుకొనే మాతృత్వాన్ని స్వీకరించడం గురించి, దువా రాక తన జీవితాన్ని ఎలా ప్రభావితం చేసింది స్పష్టంగా,చాలా ఉత్సాహంగా చెప్పుకొచ్చింది. పాపాయి రక్షణ కోసం ఎలాంటి ఆయాను (నానీ)ని నియమించుకోలేదు దీపిక. స్వయంగా తానే ఆ బాధ్యతను తానే తీసుకుంది. తల్లినయ్యాక కొత్త జీవితాన్ని అనుభవిస్తున్నానని చెప్పింది. తల్లికాక ముందు, తన కలలు తన ఆశయాలు మాత్రమే ఉండేవి, కానీ ఇపుడంతా ఆమె గురించే. ఇదీ చదవండి: నిశ్చితార్థం రద్దు, ప్రేమ వివాహం, డైమండ్స్ షూస్ : ఎవరీ అందాల రాణి?"అమ్మ అయిన తర్వాత కొత్త జీవితాన్ని చూస్తున్నాను. బిడ్డను కన్న క్షణంనుంచి మరో ప్రాణిని పోషించే బాధ్యత వహించాలి. ముఖ్యంగా నాలాంటి జీవనశైలి ఉన్నవారికి, ముఖ్యంగా ఇల్లు వదిలి వెళ్ళడం, నా ఆశయం, నా కెరీర్ ఇలా ప్రతిదీ నా జీవితం, ఇలా ప్రతిదాని గురించి ఆలోచించాను. ఇప్పుడు, అకస్మాత్తుగా, పాపాయి మీద శ్రద్ద వహించాలి. తల్లి కావాలని కోరుకున్నాను కనుక, ప్రతి అంశాన్ని ఆస్వాదిస్తున్నాను, " అని దీపికా పేర్కొన్నారు.మరోవైపు షారుఖ్ ఖాన్ దీపికా పదుకొణేను ప్రశంసల్లో ముంచెత్తారు. దువాకు తల్లి అయినందుకు షారుఖ్ దీపికను అభినందించారు. నటి పోషించగల ఉత్తమ పాత్ర నిజ జీవితంలోనే అని, ఇప్పుడు ఆమె తన పాప దువాకు తల్లి అని అన్నారు.చదవండి: హల్దీ వేడుకలో వధువు చేసిన పనికి దెబ్బకి అందరూ షాక్! -
జాక్పాట్ కొట్టేసిన ప్రముఖ సింగర్.. ఏకంగా మూడున్నర్ర కోట్ల లాభం!
ప్రముఖ సింగర్, బిగ్ బాస్ రన్నరప్ రాహుల్ వైద్య తన ఖరీదైన అపార్ట్మెంట్లను విక్రయించారు. ముంబయిలోని ఓషివారాలో ఉన్న తన రెండు విల్లాలను దాదాపు రూ.5 కోట్లకు విక్రయించినట్లు తెలుస్తోంది. గతంలో అంటే 2008లో రాహుల్ వైద్య ఈ అపార్ట్మెంట్లను రూ.1.70 కోట్ల రూపాయలకు కొనుగోలు చేశారు. తాజాగా వీటిని విక్రయించడంతో దాదాపు రూ.3.50 కోట్ల మేర ఆదాయం వచ్చింది. కాగా.. ఈ ప్రాంతంలో పలువురు సినీతారలు నివాసం ఉండడంతో ధరలు కూడా అంతేస్థాయిలో ఉన్నాయి. ఇక్కడ అమితాబ్ బచ్చన్, అజయ్ దేవ్గన్, సన్నీ లియోన్, సారా అలీ ఖాన్ వంటి అనేక మంది బాలీవుడ్ ప్రముఖులు కూడా ఆస్తులు కలిగి ఉన్నారు.కాగా.. సింగర్ రాహుల్ వైద్య ఇండియన్ ఐడల్ సీజన్ 1లో రెండో రన్నరప్గా నిలిచారు. అప్పటి నుంచి బాలీవుడ్లో రాణిస్తున్నారు. అతని కెరీర్లో తొలి మ్యూజిక్ ఆల్బమ్ తేరా ఇంతేజార్ సూపర్ హిట్గా నిలిచింది. ఆ తర్వాత అనేక బాలీవుడ్ పాటలు పాడి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాకుండా జో జీతా వోహి సూపర్ స్టార్,మ్యూజిక్ కా మహా ముఖాబ్లా వంటి రియాలిటీ షోలలో విజేతగా నిలిచారు. హిందీ బిగ్బాస్ సీజన్ -14 రన్నరప్గా నిలిచి మరింత ఫేమస్ అయ్యారు. అతను ప్రస్తుతం సెలబ్రిటీ కుకింగ్ రియాలిటీ షో లాఫ్టర్ చెఫ్స్లో నటిస్తున్నారు. View this post on Instagram A post shared by RAHUL VAIDYA (@rahulvaidyarkv) -
21 రోజుల్లో 15 కిలోలు తగ్గా.. ఆ సీక్రెట్ మాత్రం చెప్పను: రకుల్ భర్త
హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ భర్త.. జాకీ భగ్నానీ (Jackky Bhagnani) నిర్మాత మాత్రమే కాదు నటుడు కూడా! సినిమాల్లో నటుడిగా కనిపించడానికి ముందు ఏకంగా 60 కిలోలు తగ్గి అందర్నీ సర్ప్రైజ్ చేశాడు. ఆ తర్వాత 2009లో కల్ కిస్నే దేఖా చిత్రంతో వెండితెరకు నటుడిగా పరిచయమయ్యాడు. 2017లో ఓ సినిమా కోసం 15 కిలోలు తగ్గాడు. కేవలం 21 రోజుల వ్యవధిలోనే అంత బరువు ఎలా తగ్గాడని అందరూ ఆశ్చర్యపోయారు. అయితే ఆ సీక్రెట్ మాత్రం ఎవరికీ చెప్పనంటున్నాడు జాకీ భగ్నానీ.అది ఆరోగ్యకరం కాదుతాజాగా జాకీ భగ్నానీ ఇండియన్ ఎక్స్ప్రెస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తక్కువ సమయంలోనే ఎక్కువ బరువు తగ్గాను. కానీ అదంత ఆరోగ్యకరం కాదు. ఈ విషయంలో నేనెవరికీ సలహాలు, సూచనలు ఇవ్వను. ఒక షూట్ కోసం సడన్గా బరువు తగ్గాల్సి వచ్చింది. నా చేతిలో ఆప్షన్స్ లేవు. పైగా సమయం తక్కువే ఉంది. అప్పుడు నేను ఏం చేశానన్నది ఎవరికీ చెప్పదలుచుకోవడం లేదు. కానీ, దానివల్ల చాలా దుష్ప్రభావాలు ఎదురయ్యాయి.సైడ్ ఎఫెక్ట్స్ఒకేసారి ఎక్కువ బరువు కోల్పోయినప్పుడు యాసిడిటీ, జుట్టు కోల్పోవడం, జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయి. శరీరం కూడా నీరసించిపోతుంది. ఎందుకంటే సడన్గా సన్నబడటం అనేది సహజమైన ప్రక్రియ కాదు కదా.. అయితే రోజంతా కడుపు మాడ్చుకోవాలి.. లేదంటే ఒంట్లో కొవ్వు తగ్గించేందుకు వేరే విధానాలు ఎంచుకోవాలి. ఈ రెండూ మంచివి కావు.శరీరాన్ని కంట్రోల్లో ఉంచుకుంటా..సినిమాల్లో ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి నేను నా బరువును కంట్రోల్లో ఉండేలా చూసుకుంటున్నాను. ఇందుకోసం ప్రతిరోజూ కష్టపడాల్సిందే! ఏదైనా వెకేషన్కు వెళ్లానంటే నోరు కట్టేసుకోకపోతే సహజంగానే లావెక్కుతాను. అప్పుడు మళ్లీ కష్టపడాల్సి ఉంటుంది. అందుకే ఫిట్నెస్ విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉంటాను అని జాకీ భగ్నానీ చెప్పుకొచ్చాడు. గతంలో ఓ ఇంటర్వ్యూలో జాకీ బరువు తగ్గడం గురించి మాట్లాడుతూ.. రోజుకు 10-15 కి.మీ. పరిగెత్తేవాడినని చెప్పాడు. కేవలం ఐదు గ్రాముల కార్బోహైడ్రేట్లను కూరగాయల రూపంలో ఆరగించేవాడినని తెలిపాడు.చదవండి: చికిత్సకు డబ్బుల్లేవ్.. నటుడు కన్నుమూత -
నా కొడుక్కి 'ఆదిపురుష్' చూపించి సారీ చెప్పా: దేవర విలన్
ప్రభాస్ తీవ్ర విమర్శలు మూటగట్టుకున్న చిత్రం ఆదిపురుష్ (Adipurush Movie). ఈ సినిమాలో ప్రభాస్ లుక్ నుంచి వానరాలను చూపించిన విధానం వరకు ప్రతిదానిపైనా ట్రోలింగ్ జరిగింది. వీఎఫ్ఎక్స్ బాలేవని, రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan)కు ముందు ఐదు తలలు, దానిపైన ఐదు తలలు పెట్టడమేంటన్న కామెంట్లు వినిపించాయి. మొత్తంగా ఓంరౌత్ దర్శకత్వం వహించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతోపాటు ట్రోలింగ్ మెటీరియల్గా మారిపోయింది.సినిమా చూపించా.. రియాక్షనే లేదుమూడు గంటల నిడివి ఉన్న ఈ సినిమాను తన కుమారుడిని కూర్చోబెట్టి చూపించానంటున్నాడు ఆదిపురుష్ రావణ్ అలియాస్ సైఫ్ అలీ ఖాన్. తాజా నెట్ఫ్లిక్స్ ఇండియా యూట్యూబ్ ఛానల్లో సైఫ్ మాట్లాడుతూ.. నేను సినిమాల్లో విభిన్న పాత్రలు చేస్తూ ఉంటాను. అవి చూసి నా 9 ఏళ్ల కుమారుడు తైమూర్.. నువ్వసలు మంచివాడివా? చెడ్డవాడివా? అని అడుగుతుంటాడు. ఈ మధ్యే వాడికి ఆదిపురుష్ చూయించాను. వాడి నుంచి నాకు ఎటువంటి ఆహ్లాదకరమైన స్పందన రాలేదు. కాసేపటికి నన్నో చూపు చూశాడు. నాకు తన ఫీలింగ్ అర్థమై సారీ చెప్పా.. ఇట్స్ ఓకేలే అని నన్ను క్షమించేశాడు అని చెప్పుకొచ్చాడు.పర్సనల్ లైఫ్సైఫ్ అలీ ఖాన్.. నటి అమృత సింగ్ను 1991లో పెళ్లి చేసుకున్నాడు. వీరికి కూతురు సారా, కుమారుడు ఇబ్రహీమ్ సంతానం. దశాబ్దానికి పైగా అన్యోన్యంగా ఉన్న దంపతులు 2004లో విడిపోయారు. తర్వాత హీరోయిన్ కరీనా కపూర్తో ప్రేమలో పడ్డాడు. దాదాపు ఐదేళ్లపాటు జంటగా కలిసున్న వీరు 2012లో వివాహం చేసుకున్నారు. ఈ జంటకు 2016లో తైమూర్, 2021లో జెహ్ జన్మించారు. సైఫ్.. దేవర: పార్ట్ 1 సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు.చదవండి: 'క' చిత్రానికి దక్కిన 'దాదా సాహెబ్ ఫాల్కే' అవార్డ్ -
అనుష్క శర్మ బర్త్ డే.. విరాట్ కోహ్లీ స్పెషల్ విషెస్!
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ తన భార్య అనుష్క శర్మకు బర్త్ డే విషెస్ తెలిపారు. తన భార్య అనుష్క శర్మ 37వ పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్ట్ చేశారు. నా ప్రాణ స్నేహితుడు, నా జీవిత భాగస్వామికి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ క్యాప్షన్ రాసుకొచ్చారు. నిన్ను ప్రతి రోజు ప్రేమిస్తూనే ఉంటాము అంటూ అనుష్కపై తన ప్రేమను వ్యక్తం చేశారు. ఇది చూసిన అభిమానులు సైతం అనుష్క శర్మకు బర్త్ డే విషెస్ చెబుతూ పోస్టులు పెడుతున్నారు.కాగా.. అనుష్క శర్మ పలు బాలీవుడ్ సినిమాల్లో నటించింది. స్టార్ హీరోల సరసన పలు సూపర్ హిట్ చిత్రాల్లో కనిపించింది. ఆ తర్వాత క్రికెటర్ కోహ్లీతో డేటింగ్ చేసిన ముద్దుగుమ్మ డిసెంబర్ 2017లో వివాహాబంధంలోకి అడుగుపెట్టింది. వీరిద్దరూ ఇటలీలోని టస్కానీలో గ్రాండ్గా పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత జనవరి 2021లో తమ కుమార్తె వామిక జన్మించింది. గతేడాది ఫిబ్రవరి 2024లో బాబు పుట్టగా అకాయ్ అని పేరు పెట్టారు. ఇక పెళ్లి తర్వాత అనుష్క శర్మ సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. ప్రస్తుతం విరాట్ కోహ్లీ ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ తరఫున ప్రాతినిథ్యం వహిస్తున్నారు. View this post on Instagram A post shared by Virat Kohli (@virat.kohli) -
సొంతంగా ఖరీదైన ప్రైవేట్ జెట్.. అజయ్ దేవగణ్ ఏమన్నారంటే?
బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ రైడ్-2 మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. రాజ్ కుమార్ గుప్తా దర్శకత్వం వహించిన క్రైమ్ థ్రిల్లర్ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ఇవాళ విడుదలైంది. ఈ సినిమాను 2018లో వచ్చి రైడ్ మూవీకి సీక్వెల్గా తెరకెక్కించారు. ఈ మూవీలో హీరోయిన్గా వాణి కపూర్ నటించింది.ఈ నేపథ్యంలో అజయ్ దేవగణ్ ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. తనపై వస్తున్న రూమర్స్పై కూడా స్పందించారు. బాలీవుడ్లో మీరు తొలి ప్రైవేట్ జెట్ను కొనుగోలు చేశారన్న దానిపై అజయ్ క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతానికి అదేం లేదని.. కానీ దానిని కొనాలని ప్లాన్ చేస్తున్నా.. ఒక ఒప్పందం కూడా చేసుకున్నా. కానీ చివరికీ అది జరగలేదంటూ అజయ్ క్లారిటీ ఇచ్చారు. అజయ్ దేవగణ్ సొంతం ప్రైవేట్ జెట్ కొనుగోలు చేశారని బాలీవుడ్లో చాలా కాలంగా టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన స్పందించారు.తాజాగా విడుదలైన రైడ్-2 రైమ్ థ్రిల్లర్లో అజయ్ దేవగణ్ ఐఆర్ఎస్ అధికారి పాత్రలో కనిపించారు. ఈ చిత్రంలో రితేష్ దేశ్ముఖ్ ప్రతినాయకుడిగా నటించారు. ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, కుమార్ మంగత్ పాఠక్ అభిషేక్ పాఠక్ సంయుక్తంగా నిర్మించారు. -
అభిమానులకు గుడ్ న్యూస్.. తండ్రి కాబోతున్న ఛావా నటుడు
బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్, రష్మిక మందన్నా జంటగా నటించిన సూపర్ హిట్ మూవీ ఛావా. ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ఛావా బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.800 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రానికి లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో బాలీవుడ్ నటుడు వినీత్ కుమార్ సింగ్ కీలక పాత్రలో మెప్పించారు.తాజాగా ఛావా నటుడు వినీత్ కుమార్ సింగ్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. తాను త్వరలోనే తండ్రి కాబోతున్నట్లు వెల్లడించాడు. ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆయన ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. కాగా.. వినీత్ కుమార్ సింగ్ 2021లో నటి రుచిరాను పెళ్లాడారు.వినీత్ కుమార్ సింగ్ మాట్లాడుతూ.. "ఈ సమయంలో తన భార్య రుచిరాను జాగ్రత్తగా చూసుకోవడానికి నేను నా శాయశక్తులా ప్రయత్నిస్తాను. వీలైనంత త్వరగా పని ముగించుకుని ఇంటికి వెళ్తా. నా షెడ్యూల్ నేను నిర్ణయించుకున్నా. ఆమెతో పాటు నేను కూడా డాక్టర్ వద్దకు వెళ్తాను. రాబోయే జూలైలో బిడ్డ పుట్టిన తర్వాత పితృత్వ సెలవు తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నా'అని పంచుకున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే వినీత్ కుమార్ సింగ్.. ఛావాతో పాటు ఇటీవల విడుదలైన జాట్ మూవీతోనూ కనిపించారు. అంతకుముందు 'సూపర్బాయ్స్ ఆఫ్ మాలెగావ్', గుంజన్ సక్సేనా, గుస్పాతియా, మ్యాచ్ ఫిక్సింగ్' లాంటి సినిమాలతో పాటు రంగ్బాజ్ అనే వెబ్ సిరీస్లోనూ నటించారు. -
తొమ్మిది గజాల చీరలో మహారాష్ట్ర అమ్మాయిలా స్టార్ హీరోయిన్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ తన సింపుల్, ట్రెడిషనల్ ఫ్యాషన్తో అభిమానుల హృదయాలను గెల్చుకుంది. వేవ్స్ సమ్మిట్ 2025 ( WAVES Summit 2025) లో ఉత్సాహభరితమైన మహారాష్ట్ర రాష్ట్రంలో మహిళలు ధరించే ఒక ప్రత్యేకమైన నౌవారీ చీరలో అద్భుతంగా కనిపించింది. దీనికి సంబంధించిన ఫోటోలను ఇన్స్టాలో పోస్ట్ చేసింది.అలియా వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్కు హాజరైంది. ఈ సందర్భంగా తనదైన మినిమలిస్టిక్ ఫ్యాషన్, స్టేట్మెంట్ లుక్తో 'వావ్' అనిపించిందిముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో మే 1న జరిగిన ఈవెంట్లో మహారాష్ట్ర అమ్మాయిగా మారిపోయింది. తొమ్మిది గజాల నౌవారీ చీరలో ట్రెడిషనల్గా చాలా అందంగా కనిపించింది. "నౌ" అంటే తొమ్మిది, తొమ్మిది గజాల నౌవారీ చీర స్టైల్ మహారాష్ట్రలో ప్రసిద్ధి. పీచ్, నారింజ రంగుల కలయితో గులాబీ రంగు అంచుతో వచ్చిన ఈ చీరకు, పూల డిజైన్తో హైలైట్ చేశారు. హిందీ చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిభావంతులైన నటీమణులలో ఒకరైన అలియా భట్, తన నటనా నైపుణ్యాలు, అందం, ఫ్యాషన్ స్టేట్మెంట్లు, అది సాంప్రదాయమైనా లేదా పాశ్చాత్యమైనా ఫ్యాన్స్ను ఫిదా చేయాల్సిందే.కాగా 2024లో మెట్ గాలాలో అరంగేట్రం చేసిన ఆలియా భట్, తన లుక్ తో అందరినీ ఆశ్చర్యపరిచింది. సబ్యసాచి ముఖర్జీ నుండి అందమైన చీరలో బ్యూటిఫుల్గా కనిపించింది. నటిగాస్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ చిత్రంతో తన కెరీర్ను ప్రారంభించి బాలీవుడ్ స్టార్ హీరోయిన్గా ఎదిగింది. బాలీవుడ్లో విలక్షణమైన పాత్రలు పోషించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. 2022 ఆర్.ఆర్.ఆర్ చిత్రంతో టాలీవుడ్లోకి ఎంట్రి ఇచ్చింది. బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ని పెళ్లాడినా అలియా ఒక ఆడబిడ్డకు తల్లి కూడా. View this post on Instagram A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt) -
ఆస్తులు తాకట్టు పెట్టి సినిమా తీశాం.. మా బాధ మీకేం తెలుసు?
కొన్నేళ్లుగా బాలీవుడ్ సినిమాల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. ఏవో కొన్ని చిత్రాలు మినహా ఏవీ పెద్దగా కలెక్షన్స్ రాబట్టడం లేదు. భారీ బడ్జెట్ సినిమాలకు పెట్టిన పెట్టుబడి కూడా వెనక్కు రావడం లేదు. అలా ఓ సినిమాను తన కుటుంబ ఆస్తులు తాకట్టు పెట్టి తీశానంటున్నాడు బాలీవుడ్ నిర్మాత, హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ భర్త జాకీ భగ్నానీ (Jackky Bhagnani).సగం కూడా వెనక్కు రాలేదా?ఇతడు గతేడాది అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్తో కలిసి 'బడే మియా చోటే మియా' సినిమా (Bade Miyan Chote Miyan) చేశాడు. ఇది దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిందని బీటౌన్లో గుసగుసలు వినిపించాయి. కానీ బాక్సాఫీస్ వద్ద కనీసం బ్రేక్ ఈవెన్ కూడా అవలేదు. టోటల్ రన్లో కేవలం రూ.111.49 కోట్లు మాత్రమే రాబట్టినట్లు తెలుస్తోంది. భారీ నష్టంతో పూజా ఎంటర్టైన్మెంట్ (Pooja Entertainment) సంస్థ నిర్మాత వాసు భగ్నానీ కుదేలయ్యాడు. ముంబైలోని ఆఫీస్ను అమ్మేసి రూ.250 కోట్ల అప్పు తేర్చేసినట్లు ప్రచారం జరిగింది.అనుమానమే నిజమైందితాజాగా వాసు భగ్నానీ కుమారుడు జాకీ భగ్నానీ సదరు సినిమా నష్టంపై స్పందించాడు. ఆ మూవీ కోసం మేము చాలా డబ్బు ఖర్చు చేశామన్నది వాస్తవం. భారీ బడ్జెట్తో సినిమా తీశాం కానీ కంటెంట్ ఎక్కడో ప్రేక్షకులకు కనెక్ట్ అవదన్న అనుమానం వచ్చింది. మా అనుమానమే నిజమైంది. జనాలు సినిమాను తిప్పికొట్టారు. వారికి ఎందుకు నచ్చలేదన్నది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను. ఎందుకంటే భవిష్యత్తులో మరోసారి ఆ తప్పును పునరావృతం చేయకూడదుగా.ఇప్పుడు చెప్పి ఏం లాభం?ఆస్తులు తాకట్టు పెట్టి ఈ సినిమా తీశాం. మా బాధ ఎవరికీ అర్థం కాదు. అయినా ఇప్పుడిదంతా చెప్పాల్సిన అవసరమే లేదు. కానీ, ఈ ఒక్క సంఘటనతో నేను చాలా నేర్చుకున్నాను అని చెప్పుకొచ్చాడు. జాకీ భగ్నానీ.. కల్ కిస్నే దేఖా, రంగ్రేజ్, అజబ్ గజబ్ లవ్, వెల్కమ్ టు కరాచీ, మిత్రాన్ వంటి చిత్రాల్లో నటించాడు. కూలీ నెం.1, కట్పుత్లి, మిషన్ రాణిగంజ్, గణ్పథ్, బడే మియా చోటే మియా చిత్రాలు నిర్మించాడు. హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ను 2024లో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.చదవండి: చదివింది 'లా'.. ఫాలోవర్లు తగ్గారని విషాదం.. 'ఇలాంటి రోజు వస్తుందని తెలుసు -
వినోదరంగంలో ‘వేవ్స్’.. ప్రారంభించనున్న మోదీ
‘వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్’ (వేవ్స్) – 2025 గురువారం ముంబైలో ప్రారంభం కానుంది. ప్రపంచ మీడియా పవర్ హౌస్గా భారత దేశాన్ని సమున్నతంగా నిలిపేందుకు ప్రభుత్వం నాలుగు రోజులపాటు ప్రతిష్ఠాత్మకంగా ఈ సదస్సును నిర్వహిస్తోంది. ఈ సదస్సును ప్రధాని మోదీయే స్వయంగా ప్రారంభించనున్నారు.వేవ్స్ సమ్మిట్- ఉద్దేశంసినిమాలు, ఓటీటీ, గేమింగ్, కామిక్స్, డిజిటల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మొదలైన అన్నింటిని ఒకే వేదికపై అనుసంధానిస్తూ మీడియా – వినోద రంగంలో మన దేశ సత్తాను చాటడం ఈ సదస్సు ప్రధాన ఉద్దేశం. ‘కనెక్టింగ్ క్రియేటర్స్... కనెక్టింగ్ కంట్రీస్’ అన్న ట్యాగ్ లైన్తో ఈ ‘వేవ్స్’ (WAVES Summit 2025) ను నిర్వహిస్తున్నారు. ప్రపంచం నలుమూలల నుంచి సృజనాత్మక కళాకారులు, స్టార్ట్ అప్లు, సినీవినోద రంగ ప్రముఖులు, విధాన నిర్ణేతలు ఇందులో పాల్గొంటున్నారు. 1100 మందికి పైగా అంతర్జాతీయ ప్రతినిధులు90కి పైగా దేశాల నుంచి పదివేల మందికి పైగా ప్రతినిధులు, 300కి పైగా కంపెనీలు, 350కి పైగా స్టార్ట్ అప్లు ఈ భారీ సదస్సులో పాలు పంచుకుంటున్నాయి. ఇప్పటికే లక్ష మందికి పైగా రిజిస్ట్రేషన్లు చేసుకున్న ఈ ‘వేవ్స్ 2025’లో 1100 మందికి పైగా అంతర్జాతీయ ప్రతినిధులు హాజరవుతున్నారు. వివిధ సమావేశాలు, ప్రదర్శనలు, చర్చా గోష్ఠులు సాగే ఈ సదస్సుకు నటులు చిరంజీవి, నాగార్జున, రజనీకాంత్, దర్శకుడు రాజమౌళి, ఆస్కార్ అవార్డు గ్రహీతలైన సంగీత దర్శకులు ఏఆర్ రెహమాన్, కీరవాణి తదితరులు ప్రత్యేక ఆకర్షణ కానున్నారు.తొలిసారి ఆతిథ్యంసినిమాలు, డిజిటల్ మీడియా, బ్రాడ్ కాస్టింగ్ తదితర విభిన్న రంగాలపై లోతుగా చర్చలు జరగనున్నాయి. ఈ ‘వేవ్స్’లో భాగంగా దాదాపు 25 దేశాలకు చెందిన మంత్రిత్వ శాఖ ప్రతినిధులు పాల్గొనే ‘గ్లోబల్ మీడియా డైలాగ్’ (జి ఎం డి) కి మన దేశం తొలిసారిగా ఆతిథ్యం ఇస్తుండడం మరో పెద్ద విశేషం. చదవండి: రెట్రో మూవీ ట్విటర్ రివ్యూ.. సందడి లేదేంటి? -
నా కష్టానికి ప్రతిరూపం ఈ కారు.. బిగ్బాస్ బ్యూటీ కల సాకారం..
నటి, సింగర్ షెహనాజ్ గిల్ (Shehnaaz Kaur Gill) హిందీ బిగ్బాస్ 13వ సీజన్తో ఎక్కువ పాపులరైంది. ఒక్కో మెట్టు ఎదుగుతూ వచ్చిన షెహనాజ్ తాజాగా కొత్త కారు కొనుగోలు చేసింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. కలలు కనడం దగ్గరి నుంచి కారు నడిపేవరకు.. నా కష్టానికి ప్రతిఫలంగా ఈ నాలుగు చక్రాల కారు తీసుకున్నాను. చాలా సంతోషంగా ఉంది అని ఓ పోస్ట్ పెట్టింది. ఇది చూసిన అభిమానులు నటికి శుభాకాంక్షలు చెప్తున్నారు. నిన్ను చూస్తుంటే గర్వంగా ఉందని కామెంట్లు చేస్తున్నారు.ధర ఎంతంటే?షెహనాజ్.. మెర్సిడిస్ బెంజ్ కారు కొనుగోలు చేసింది. దీని ధర దాదాపు రూ.1.35 కోట్లుగా ఉంది. మ్యూజిక్ వీడియోలో, సాంగ్స్లో ఎక్కువగా కనిపించే షెహనాజ్ పంజాబ్లో పలు సినిమాలు చేసింది. 2019లో హిందీ బిగ్బాస్ 13వ సీజన్లో పాల్గొంది. ఈ సీజన్లో సెకండ్ రన్నరప్గా నిలిచింది. 2023లో సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన కిసీ కా భాయ్ కిసీ కా జాన్ సినిమాలో యాక్ట్ చేసింది. థాంక్యూ ఫర్ కమింగ్ మూవీలోనూ నటించింది. విక్కీ విద్యాకా వో వాలా వీడియో సినిమాలో సజ్నా వె సజ్నా అనే స్పెషల్ సాంగ్ చేసింది. ప్రస్తుతం హిందీలో సబ్ ఫస్ట్ క్లాస్, పంజాబీలో ఇక్క్ కుడి చిత్రాలు చేస్తోంది. View this post on Instagram A post shared by Shehnaaz Gill (@shehnaazgill) చదవండి: ముమైత్ బ్రెయిన్లో ఏడు వైర్లు.. షూ లేస్ కట్టుకున్నా ప్రమాదమే! -
ప్రముఖ బుల్లితెర నటికి ప్రెగ్నెన్సీ.. వీడియో షేర్ చేసిన బ్యూటీ!
ప్రముఖ బుల్లితెర నటి షీనా బజాజ్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే పండంటి బిడ్డకు జన్మనివ్వనున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. తన భర్త, నటుడు రోహిత్ పురోహిత్తో కలిసి ఈ శుభవార్తను షేర్ చేసింది. ఈ మేరకు ఇన్స్టా వేదికగా ఓ వీడియోను పంచుకుంది. ఇలాంటి సమయంలో మీ అందరి ప్రార్థన, ఆశీస్సులు కావాలి. దయచేసి మమ్మల్ని ఆశీర్వదించండి అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు, సినీతారలు ఈ బుల్లితెర భామకు విషెస్ చెబుతున్నారు.కాగా.. బెస్ట్ ఆఫ్ లక్ నిక్కీ అనే సీరియల్తో షీనా బజాజ్ ఫేమ్ తెచ్చుకుంది. ఆ తర్వాత పలు సీరియల్స్తో పాటు ఒకట్రెండు సినిమాల్లోనూ నటించింది. 2019లో రోహిత్ పురోహిత్ను షీనా బజాజ్ పెళ్లాడింది. దాదాపు నాలుగేళ్ల పాటు డేటింగ్లో ఉన్న వీరిద్దరు కుటుంబ సభ్యుల సమక్షంలో జైపూర్లో వివాహాబంధంలోకి అడుగుపెట్టారు. కాగా.. ఆమె భర్త రోహిత్ ప్రస్తుతం యే రిష్తా క్యా కెహ్లతా హై సీరియల్లో నటిస్తున్నారు. మరోవైపు షీనా బజాజ్ చివరిసారిగా వంశజ్ అనే వెబ్ సిరీస్లో కనిపించింది. View this post on Instagram A post shared by sheena (@imsheenabajaj) -
ట్రెడిషన్ విత్ ట్రెండ్..51 ఏళ్ల వయసులో ట్రెండీ లుక్
నటి ఊర్మిళ మతోండ్కర్ (Urmila Matondkar) సరికొత్త ఫ్యాషన్తో అభిమానుల దృష్టిని ఒక్కసారిగా తనవైపు తిప్పుకుంది. ప్రముఖ డిజైనర్ మనీహ్ మల్హోత్రా (Manish Malhotra) డిజైన్ చేసిన చీరలో అద్భుతంగా కనిపించింది. దీనికి సంబంధించిన ఫోటోలను ఇన్స్టాలో పోస్ట్ చేసింది. దీంతో అద్భుతం అంటూ ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు.ట్రెడిషన్ విత్ ట్రెండ్ అనేలా ఊర్మిళ మతోండ్కర్ మనీష్ మల్హోత్రా రోజ్ గోల్డ్ చీరలో ట్రెండీ లుక్లో అదిరిపోయింది. ఇందులో అనేక సీక్విన్లు ఉండటం విశేషంగా నిలిచింది. ఆరు గజాల చీర, అందమైన జాకెట్లు మాత్రమే కాదు, అంతకంటే భిన్నంగా అలంకరించుకుని ఆధునిక పద్ధతిలో స్టైలిష్గా కనిపించవచ్చు అని ఊర్మిళ రుజువు చేస్తోంది. మనీష్ మల్హోత్రా సిగ్నేచర్ స్టైల్లో ఊర్మిళ, చీరకు జతగా సాధారణ బ్లౌజ్ను వదిలివేసి, దానికి బదులుగా సమకాలీన కార్సెట్ టాప్ను ఎంచుకుంది. శరీరానికి సరిగ్గా అతుక్కునేలా శిల్పంలాటి ఆకృతిలో, నడుము ఒంపులను ప్రదర్శిస్తూ స్ట్రాప్లెస్ నంబర్ ఫిట్తో వచ్చింది. పల్లూను దుపట్టా లాగా వెరైటీగా చేతిపై కప్పుకుని ఫ్యాషన్కి కొత్త అర్థం చెప్పింది. నడుము దగ్గర 3D పూల అప్లిక్ వర్క్ మొత్తం లుక్కు రొమాంటిక్ ఫ్లెయిర్ను జోడించింది. View this post on Instagram A post shared by Urmila Matondkar (@urmilamatondkarofficial) షీర్ ఫాబ్రిక్ తో తయారు చేసిన చీరను అంచుల చుట్టూ మల్టీ సీక్విన్స్ తో షైనీగా ఉంది. అల్టిమేట్ కాక్టెయిల్ ఎంసెంబుల్ కోసం ప్రేరణ కోరుకునే ఫ్యాషన్ ఔత్సాహికులందరూ వావ్ అంటున్నారు. డైమండ్ ఆభరణాలు,తన జుట్టును వా లుగా వెనక్కి వదిలేసి10 ఏళ్ల నాటి క్లాసిక్ చీరతో సరికొత్త స్టైల్ను జోడించినట్టు తెలిపారు. రంగీలానుంచి చీరలపై అభిమానం కొనసాగుతూనే ఉంది అని పేర్కొన్నారు. స్లిక్ లుక్లో స్టైల్ చేసింది. అటు మనీష్ మల్హోత్రా కూడా ఊర్మిళ ఫోటోలను ఇన్స్టాలో పోస్ట్ చేశారు. 10 ఏళ్ల నాటి క్లాసిక్ చీరతో సరికొత్త స్టైల్ను జోడించినట్టు తెలిపారు. రంగీలానుంచి ఇప్పటిదాకా చీరలపై తమ అభిమానం కొనసాగుతూనే ఉంది అని పేర్కొన్నారు.కాగా బాలీవుడ్లో కర్మ్ సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది ఊర్మిళ. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో అంతం సినిమాతో టాలీవుడ్కు పరిచయం అయ్యింది. కుర్రకారు మనసును ఇట్టే దోచేసింది. ఆ తరువాత అనగనగా ఒకరోజు, రంగీలా, సత్య చిత్రాలతో బ్లాక్ బస్టర్లు అందుకుంది.తనకంటే వయసులో 10 ఏండ్లు చిన్నవాడు అయిన మోడల్ మోసిన్ అక్తార్ను ప్రేమ వివాహం చేసుకుంది. కానీ గత ఏడాది ఆమె భర్త మోహ్సిన్ అక్తర్ మీర్ నుండి విడాకులకు దరఖాస్తు చేసినట్లు నేషనల్ మీడియాలో కథనాలు వెలువడిన సంగతి తెలిసిందే. -
పిల్లలు పుట్టరని మధుబాలను వదిలేసిన స్టార్ హీరో.. చివరికేమైంది?
మొఘల్ ఇ ఆజామ్.. 1960లో వచ్చిన అద్భుతమైన సినిమా ఇది. సలీం, అనార్కలిగా దిలీప్ కుమార్ (Dilip Kumar), మధుబాల (Madhubala) నటించారు. ఆన్స్క్రీన్పై సూపర్ హిట్ జోడీగా పేరు తెచ్చుకున్న వీళ్లు నిజ జీవితంలో కూడా ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుని జీవితాంతం కలిసుండాలనుకున్నారు. దంపతులుగా కనిపిస్తారనుకుంటే విడిపోయిన ప్రేమ పక్షులుగా మారారు. అసలు ఈ జంట ఎందుకు విడిపోయిందన్న విషయాన్ని ప్రముఖ నటి ముంతాజ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది.పిల్లలు పుట్టరని..ముంతాజ్ మాట్లాడుతూ.. మధుబాల దిలీప్కు బ్రేకప్ చెప్పలేదు. అతడే ఆమెతో ప్రేమబంధాన్ని తెంచేసుకున్నాడు. తనకు పిల్లలు పుట్టరని వదిలేసి.. సైరా భానును పెళ్లి చేసుకున్నాడు. సైరా ఎంతో మంచి మనిషి. దిలీప్ అంటే ఆమెకు ఎంతో అభిమానం, ప్రేమ. అతడి చివరి శ్వాస వరకు ఎంతో జాగ్రత్తగా చూసుకుంది. వీళ్లిద్దరి మధ్య వయసు వ్యత్యాసం ఎక్కువ. కానీ ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ వల్లే జీవితాంతం కలిసి కొనసాగారు.మొఘల్ ఇ ఆజామ్ సినిమాలో ఓ దృశ్యంఅందుకే వదిలేశాడుదిలీప్కు పిల్లలంటే ఇష్టం. పిల్లలు కావాలన్న కోరికతోనే సైరాను పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం నాకు స్వయంగా మధుబాల చెప్పింది. అప్పుడప్పుడు తనను కలుస్తూ ఉండేదాన్ని. తను సంతోషంగా కనిపించేది కాదు. నాతో ఏమనేదంటే.. జీవితంలో నేను ప్రేమించిన ఏకైక వ్యక్తి యూసఫ్ (దిలీప్ కుమార్ను యూసఫ్ అని పిల్చుకునేది). నేను ఎప్పటికీ తల్లిని కానని తెలిసి నన్ను ఒంటరిగా వదిలేశాడు. నాకున్న గుండె సమస్య వల్ల పిల్లల్ని కంటే నేను బతకనని చెప్పారు.ఏనాడూ నిందించలేదుఅందుకే ఇలాంటి పరిస్థితి వచ్చింది. అయినా ఏ మగవాడికైనా పిల్లలు కావాలని ఉంటుంది కదా.. ఇందులో అతడి తప్పేముందిలే అనుకునేదే తప్ప దిలీప్ను నిందించేది కాదు. కానీ విషాదమేంటంటే.. దిలీప్- సైరా భానులకు సంతానమే లేదు. ఈ విషయంలో సైరాను చూస్తుంటే బాధగా అనిపించేది. కనీసం ఒక్కరైనా పుట్టుంటే వాళ్లెంతో మురిపెంగా చూసుకునేవాళ్లు అని ముంతాజ్ చెప్పుకొచ్చింది.వేర్వేరు దారుల్లో ప్రేమజంటదిలీప్ కుమార్ - మధుబాల దాదాపు దశాబ్దంపాటు కలిసున్నారు. వీరి బ్రేకప్ అనంతరం మధుబాల.. 1960లో కిషోర్ కుమార్ను పెళ్లి చేసుకుంది. 1969లో గుండెపోటుతో మరణించింది. దిలీప్ కుమార్ 1966లో తనకంటే 22 ఏళ్లు చిన్నదైన సైరా భానును పెళ్లి చేసుకున్నాడు. 1981లో రెహ్మాన్ను రెండో పెళ్లి చేసుకోగా 1983లో ఈమెకు విడాకులిచ్చేశాడు. తర్వాత సైరా భానుతోనే కలిసున్న దిలీప్ కుమార్ 2021లో మరణించాడు.చదవండి: అమ్మ చనిపోయి 5 నెలలు.. వీడియో డిలీట్ చేయమని అడుక్కున్నా: సోహైల్ -
OTT: రాధికా ఆప్టే బోల్డ్ మూవీ ‘ది వెడ్డింగ్ గెస్ట్’ రివ్యూ
రాధికా ఆప్టే.. అందం, నటనతో ఆకట్టుకునే నటి. తెలుగు, తమిళం, హిందీ చిత్రాల్లో తన ప్రతిభను చాటుతూ, 'ది వెడ్డింగ్ గెస్ట్' సినిమాతో హాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా 2019లో విడుదలైంది. ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా కథేంటి? ఎలా ఉంది? రివ్యూలో చూద్దాం. ఫ్రెండ్ కోసం పెళ్లికూతుర్ని కిడ్నాప్ చేసి తీసుకొచ్చే హీరోలు తెలుగు తెర మీద చాలా మందినే చూశాం. ఈ సినిమాలో హీరో మాత్రం పెళ్లికూతురిని కిడ్నాప్ చేసేది ఫ్రెండ్ కోసం కాదు డబ్బు కోసం. జై (దేవ్ పటేల్) అనే లండన్ వాసి పాకిస్తాన్ లోని లాహోర్ సమీపంలో ఉన్న యోంగానాబాద్ అనే గ్రామానికి చేరుకుంటాడు. అంతకు ముందే తనను ఎవరూ గుర్తించకుండా, సిమ్ కార్డులు, కార్లు మార్చుకుంటూ అక్కడ దాకా వస్తాడు. ఆ తర్వాత రెండు గన్స్ ను కొనుగోలు చేస్తాడు. ఆ గ్రామానికి వచ్చాక పెళ్లికి రెడీ అవుతున్న సమీరా (రాధికా ఆప్టే) అనే యువతిని కిడ్నాప్ చేస్తాడు. ఆ క్రమంలో అడ్డొచ్చిన సెక్యూరిటీ గార్డ్ని హత్య చేయాల్సి వస్తుంది. ఆమెను దేశం దాటించి తీసుకువెళ్లడానికి ముందు...ఆమె ప్రేమికుడు దీపేశ్ (జిమ్ సర్భ్) తనతో కాంట్రాక్ట్ కుదుర్చుకుని ఈ పనిచేయించాడనే విషయం జై బయటపెడతాడు.ఆ తర్వాత ఇద్దరూ కలిసి మారుపేర్లతో , దొంగ పాస్పోర్ట్లతో ఇండియాకు వస్తారు. అయితే సెక్యూరిటీ గార్డ్ హత్య కారణంగా ఈ కిడ్నాప్ రెండు దేశాల మీడియాలో వైరల్ అవుతుంది, దాంతో సమీరా ప్రేమికుడు దీపేశ్ భయపడతాడు, సమీరాను తిరిగి పాకిస్తాన్ కు పంపేయమని దేవ్ని కోరతాడు. ఈ క్రమంలో కొన్ని రోజుల పాటు సన్నిహితంగా గడిపిన జై, సమీరా మధ్య అనుబంధం పెరుగుతుంది. ముఖ్యంగా సమీరా అతనిపై మోజుపడుతుంది. వారిద్దరూ శారీరకంగా ఒకటవుతారు. అదే సమయంలో దీపేశ్ దగ్గర ఖరీదైన వజ్రాలు ఉన్నాయని తెలుసుకున్న జై, వాటిని పొందేందుకు ప్రయత్నిస్తాడు. రకరకాల మలుపుల మధ్య సాగే ఈ లవ్–క్రైమ్–రొమాంటిక్ కథ చివరికి ఏ మలుపు తిరుగుతుందనేది ఆసక్తికరంగా ఉంటుంది.జై పాత్రలో మిస్టీరియస్ ప్రొఫెషనల్ కిల్లర్గా జై పూర్తి గా మెప్పిస్తాడు. బోల్డ్ సీన్లకు పెట్టింది పేరైన రాధికా ఆప్టే(తెలుగులో లెజెండ్లో బాలకృష్ణ సరసన హీరోయిన్) ఈ సినిమా హాలీవుడ్ రూపకర్తల సమర్పణలో రావడంతో...పూర్తి స్థాయి హాలీవుడ్ హీరోయిన్లా రెచ్చిపోయిందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇంటిమేట్ సీన్లలో ఆమె దాదాపు పూర్తి న్యూడ్గా కనిపించడం విశేషం.హాలీవుడ్ చిత్రం చేసినప్పటికీ మన ఇండియన్ హీరోయిన్లు మరెవ్వరూ ఈ స్థాయిలో బోల్డ్ సీన్స్ చేసి ఉండరు... సమీరా పాత్ర భావోద్వేగాలను కూడా బాగా ప్రదర్శించింది. ఆకట్టుకునే సినిమాటోగ్రఫీ మరో ఆకర్షణ. పాకిస్తాన్, ఇండియా మధ్య ప్రయాణం, మారుమూల ప్రాంతాల చిత్రీకరణ బాగా చూపించారు. సంగీత పరంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ థ్రిల్లింగ్ మూమెంట్లను ఎలివేట్ చేస్తుంది. అక్కడక్కడా సాగదీసినట్టు అనిపించినా.. ఆ ఫీలింగ్ ముదరకముందే ఆసక్తికరమైన మలుపులు పేర్చుకుంటూ రావడం వల్ల ఎక్కడా బోర్ కొట్టదు. ఐఎమ్డిబి 6.0 రేటింగ్ ఇచ్చిన ఈ సినిమా ఓ కాలక్షేపం యాక్షన్, థ్రిల్లర్, లవ్, రొమాంటిక్ సీన్లను ఇష్టపడే వారికి తప్పకుండా నచ్చుతుంది. చూడాలనుకున్నవారు నెట్ఫ్లిక్స్లో చూడవచ్చు. -
బుల్లితెర నటి ఏఐ వీడియోలు.. ఇంత చెత్తగా ఆలోచిస్తారా?
బాలీవుడ్ బ్యూటీ మౌనీ రాయ్ నాగిని సీరియల్తో సౌత్లో ఫేమస్ అయింది. బాలీవుడ్లో పలు సూపర్ హిట్ సీరియల్స్లో నటించిన ముద్దుగుమ్మ.. ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ది భూత్నీ అనే హారర్ మూవీలో కనిపించనుంది. ఈ చిత్రంలో సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ మే 1వ తేదీన థియేటర్లలో సందడి చేయనుంది.ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే మౌనీ రాయ్.. ఎక్కడికెళ్లినా తన ఫోటోలు, వీడియోలను అభిమానులతో షేర్ చేస్తూ ఉంటుంది. అయితే ఈ ముద్దుగుమ్మపై ఎప్పుడు ఏదో ఒక రూమర్స్ వినిపిస్తూనే ఉంటాయి. గ్లామర్ కోసం చాలాసార్లు సర్జరీ చేయించుకుందని సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ వచ్చాయి. ఆమె కాస్మెటిక్ సర్జరీ చేయించుకుందని.. దాన్ని కవర్ చేసేందుకు తన హెయిర్స్టైల్ను మార్చుకుందని నెటిజన్స్ విమర్శించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తనపై వస్తున్న ట్రోల్స్పై బాలీవుడ్ భామ స్పందించింది. ఇలాంటి వారిని చూసినప్పుడు తనకు జాలేస్తుందని చెప్పుకొచ్చింది.మౌనీ రాయ్ మాట్లాడుతూ.. 'నేను అలాంటి వ్యాఖ్యలను చదివినప్పుడు.. కొన్నిసార్లు ఏఐ వీడియోలను చూసినప్పుడు చాలా భయంకరంగా అనిపిస్తుంది. మీరు ఇతరులను అలా చూడటం ఎలా అనిపిస్తుందో ఒక్కసారి ఊహించుకోండి. నా ముఖాన్ని ఇతరుల శరీర ఆకృతిపకి జత చేసి వక్రీకరించడం చూస్తే అది చాలా అసహ్యంగా అనిపించింది. ఈ రకమైన వ్యక్తులు ఎక్కడికి వెళ్తున్నారు? దీంతో ఏమి సాధించాలనుకుంటున్నారు? వారి లక్ష్యం ఏమిటి? ఎందుకంటే మీరు చేస్తున్న దానితో ఎవరికీ ఉపయోగం లేదు. అలా చేస్తున్న వ్యక్తుల మంచిని ఎవరూ కోరుకోరు' అని తెలిపింది."మొదట సోషల్ మీడయాలోకి వచ్చినప్పుడు నా పట్ల చాలామందిలో ద్వేషం కలిగింది. అలాంటి వారి ప్రొఫైల్స్ను బ్లాక్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఆ సమయంలో నాకు చాలా జాలిగా అనిపిస్తుంది. అలాంటి వారితి సరైన బుద్ధిని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నా. ఇలాంటి వ్యక్తులు లైక్ల కోసం ఏమైనా చేస్తారు. ఇతరుల గురించి చెత్తగా రాస్తూ ప్రచారం చేస్తారు. కానీ నా అభిమానుల నుంచి లభించే ప్రేమను ఎప్పటికీ తిరస్కరించలేను' అని చెబుతోంది బాలీవుడ్ బ్యూటీ మౌనీ రాయ్. -
విడాకుల తర్వాత కొత్తిల్లు కొన్న నటి.. 'నేను పేదదాన్ని అని మీకు చెప్పానా?'
విడాకులు తీసుకున్న మగవాడిని ఈ సమాజం పట్టించుకోదేమో కానీ ఆడవారిని మాత్రం చులకనగా చూస్తుంది. అందుకు నేనే ప్రత్యక్ష ఉదాహరణ అంటోంది బుల్లితెర నటి చారు అసోపా (Charu Asopa). హీరోయిన్ సుష్మితా సేన్ సోదరుడు రాజీవ్ సేన్ను 2019లో గోవాలో పెళ్లి చేసుకుంది. వీరి అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా జియానా అనే పాప కూడా పుట్టింది. కానీ తర్వాత వీరి మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. అవి పెద్దవి కావడంతో విడిపోవడానికే నిర్ణయించుకున్నారు. అలా 2023లో వీరికి విడాకులు మంజూరయ్యాయి.నెలకు రూ.1 లక్ష పైనే..ఆ తర్వాత ఆమెకు ముంబైలో ఇల్లు దొరకడం కూడా కష్టమైంది. సింగిల్ పేరెంట్ అని కొందరు, సెలబ్రిటీ అని మరికొందరు ఇల్లు ఇవ్వడానికే ఇష్టపడలేదు. చివరకు ఎలాగోలా సిటీ అంతా జల్లెడపట్టి అద్దెల్లు సంపాదించింది. కానీ చేతిలో సంపాదన లేనప్పుడు నగరంలో జీవించడం అంత ఈజీ కాదు. నెలవారీ ఖర్చులు లక్ష రూపాయల పైనే అవుతుండటంతో సొంతూరుకు వెళ్లిపోయింది. రాజస్థాన్లోని బికనీర్లో తన పుట్టింట్లో ఉంటోంది. డబ్బెలా వస్తోంది?అక్కడే బట్టల వ్యాపారం ప్రారంభించింది. అలాగే తను కొన్న కొత్తింటిని కూడా వీడియో తీసి చూపించింది. ఆ ఇంటికి ఆమె నెలనెలా ఈఎమ్ఐ కడుతోంది. ఇది చూసిన జనాలు తనకు డబ్బులెలా వస్తున్నాయి? ఈ ఇల్లు ఎలా కొనగలిగింది? అంటూ రకరకాల కామెంట్లు చేశారు. వాటిపై చారు అసోపా తాజాగా తన యూట్యూబ్ ఛానల్ వేదికగా స్పందించింది. నేను రైల్లో వెళ్లకుండా విమానంలో ఎందుకు ప్రయాణిస్తున్నాను? అని కొందరడిగారు. సింపతీ అక్కర్లేదుఆ ఎయిర్లైన్స్ వాళ్లు నన్ను ఆహ్వానించడం వల్లే విమానయానాన్ని ఎంచుకున్నాను. నేను షాపింగ్ చేస్తుంటే కూడా విమర్శిస్తున్నారు. కొత్తింటి విషయానికి వస్తే.. నెలనెలా అద్దె కట్టే బదులు అదే ఈఎమ్ఐ కడుతున్నాను. నన్ను విమర్శించడం ఆపండి.. మీ అందరికీ నేను చెప్పదలుచుకుందేంటంటే.. నేను పేదదాన్ని కాదు. దేవుడి దయ వల్ల నా ఖర్చులు నేను భరించగలను. నాకు ఎవరి సింపతీ అక్కర్లేదు. టీవీ ఇండస్ట్రీ నుంచి బ్రేక్ తీసుకోవాలనుకున్నాను. అందుకే ముంబై వదిలి వచ్చేశాను తప్ప పని లేక కాదు అని నటి వివరణ ఇచ్చింది.సీరియల్స్.. సినిమాచారు అసోపా.. అగ్లే జనం మోహే బిటియా హీ కిజో, యే రిష్తా క్యా కెహ్లాతా హై, బాల్వీర్, దేవోంక్ కె దేవ్.. మహాదేవ్, లవ్ బై ఛాన్స్, ఫిర్ జీనే కీ తమన్నా హై, లాడూ 2, జిజీ మా, కర్ణ్ సంగిని, విక్రమ్ బేతాల్ కీ రహస్య గాథ, కైసా హై యే రిష్తా అజంనా వంటి సీరియల్స్ చేసింది. ఇంపేషెంట్ వివేక్, కాల్ ఫర్ ఫన్, యోక్, జోహ్రి అనే సినిమాల్లోనూ నటించింది.చదవండి: సడన్ గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమాలు -
'కశ్మీర్ అభివృద్ధిని చూసి ఓర్వలేకపోతున్నారు'.. ట్రైలర్ ఈవెంట్లో సునీల్ శెట్టి
బాలీవుడ్ నటుడు సూరజ్ పంచోలీ ప్రధాన పాత్రలో వస్తోన్న పీరియాడికల్ చిత్రం 'కేసరి వీర్..లెజెండ్స్ ఆఫ్ సోమనాథ్'. ఈ సినిమాలో సునీల్ శెట్టి, వివేక్ ఒబెరాయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సోమనాథ్ ఆలయాన్ని విధ్వంసానికి వ్యతిరేకంగా పోరాడిన రాజ్పుత్ యోధుడు హమీర్జి గోహిల్ జీవితం ఆధారంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమాకు ప్రిన్స్ ధీమాన్ దర్శకత్వం వహించారు. ఈ ట్రైలర్ ఈవెంట్కు హాజరైన సునీల్ శెట్టి ఆసక్తికర కామెంట్స్ చేశారు. పహల్గామ్ ఉగ్రదాడిని ఉద్దేశించి మరోసారి మాట్లాడారు.కశ్మీర్లో అభివృద్ధిని చూసి ఓర్వలేని వారే ఉగ్రవాదులని సునీల్ శెట్టి ఉన్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్ అభివృద్ధికి భారత ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని తెలిపారు. కానీ కొందరు ఈ పురోగతిని చూసి ఓర్వలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సమయంలోనే మనమంతా కలిసి నిలబడాలి.. భారత్ మాతా కీ జై అని అన్నారు. అంతకుముందే తాను త్వరలోనే వేకేషన్ కోసం కశ్మీర్లో పర్యటిస్తానని సునీల్ శెట్టి చెప్పారు. అక్కడి ప్రజలు భయంతో జీవించకూడదని ఆయన ఆకాంక్షించారు.కాగా.. ఈ చిత్రంలో సునీల్ శెట్టి యోధుడు వేగదా జీ పాత్రను పోషిస్తుండగా.. వివేక్ ఒబెరాయ్ విలన్ పాత్రలో జాఫర్ ఖాన్గా కనిపించనున్నారు. ఆకాంక్ష శర్మ రాజల్ అనే మహిళా యోధురాలిగా తొలిసారిగా నటించింది. ఈ ట్రైలర్ లాంఛ్కు హాజరైన సూరజ్ పంచోలి ఎమోషనలయ్యారు. ఈ సినిమా కోసం చాలా కష్టపడి పనిచేశామని వెల్లడించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న కేసరి వీర్ మే 16న 2025న థియేటర్లలోకి రానుంది. -
రాజకీయాల్లో ఎంట్రీపై హీరోయిన్కు ప్రశ్న.. నెటిజన్కు క్షమాపణలు చెప్పిన బ్యూటీ!
బాలీవుడ్ భామ ప్రీతి జింటా ప్రస్తుతం ఐపీఎల్తో బిజీగా ఉన్నారు. పంజాబ్ కింగ్స్ యజమానిగా ఉన్న ప్రీతి బాలీవుడ్లో పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. తెలుగులోనూ వెంకటేశ్ సరసన ప్రేమంటే ఇదేరా మూవీలో మెప్పించింది. ప్రస్తుతం లాహోర్1947 అనే మూవీతో బాలీవుడ్లో రీ ఎంట్రీ ఇస్తోంది.అయితే సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్గా ఉండే ప్రీతి జింటా తాజాగా ఎక్స్తో అభిమానులతో ఓ సెషన్ నిర్వహించింది. ఈ సందర్భంగా అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చింది. ఈ క్రమంలోనే ఓ నెటిజన్ ఆసక్తికర ప్రశ్న వేశారు. మీరు బీజేపీలో చేరుతున్నారా? అంటూ ప్రీతి జింటాను ప్రశ్నించారు. అయితే ఈ ప్రశ్నకు ఆమె కాస్తా ఘాటుగానే స్పందించారు. దీంతో ప్రీతిపై పలువురు నెటిజన్స్ మండిపడ్డారు. ఈ నేపథ్యంలోనే ఆమెకు అతనికి క్షమాపణలు చెప్పింది. ఇంతకీ ప్రీతి జింటా ఏమని సమాధానం ఇచ్చిందో తెలుసుకుందాం.ప్రీతి జింటా మాట్లాడుతూ.. 'నా సమాధానం మీకు కఠినంగా అనిపిస్తే నన్ను క్షమించండి. సోషల్ మీడియాతో వచ్చే ఇబ్బంది ఇదే. ప్రతి ఒక్కరూ మనల్ని జడ్జ్ చేస్తారు. నేను దేవాలయాలకు, కుంభమేళాలకు వెళ్తే భాజపాలో చేరతానని కాదు. విదేశాల్లో ఉన్న సమయంలో దేశం విలువ ఏంటో నాకు తెలిసింది. అందరి కంటే నేను ఇప్పుడు భారత్ను, భారతీయ సంస్కృతిని ఎక్కువగా గౌరవిస్తున్నా. విదేశాల్లో నివసించినా కూడా నా పిల్లలు సగం భారతీయులేనని మర్చిపోకుండా పెంచుతున్నా. అంతేకాదు మా పిల్లలను హిందువులుగానే పెంచుతున్నా. దురదృష్టవశాత్తూ నాపై విమర్శలు వస్తున్నాయి. నేను ఎవరో.. నా పిల్లలకు వారి మూలాలు, మతం గురించి బోధిస్తున్నందుకు గర్వపడుతున్నా' అని అన్నారు. అయితే ఇంత ఈ చిన్న ప్రశ్నకు ఇంతలా స్పందించాలా అంటూ కొందరు నెటిజన్స్ ప్రీతి జింటాను విమర్శిస్తున్నారు. I’m sorry if I sounded abrupt ! I have PTSD from this question. Appreciate your clarification 🙏After becoming a mom & living in a foreign country I wanna make sure my kids don’t forgot they are half Indian. Since my husband is agnostic we are bringing up our kids as Hindus.… https://t.co/ce0pHFKj8H— Preity G Zinta (@realpreityzinta) April 28, 2025 -
అర్థరాత్రి నా హోటల్ రూంలోకి రావాలని చూశాడు: హీరోయిన్
నాగిని పాత్రలో నటించి యమ క్రేజ్ తెచ్చుకున్న బ్యూటీ మౌనీ రాయ్. తొలుత టీవీ సీరియల్స్ చేసినప్పటికీ.. ప్రస్తుతం సినిమాలు చేస్తూ గుర్తింపు తెచ్చుకుంటోంది. ఈమె చేసిన లేటెస్ట్ మూవీ 'భూత్ని'. మే 1న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ చిత్ర ప్రమోషన్లలో బిజీగా ఉన్న మౌనీ.. తనకెదురైన భయంకరమైన అనుభవాన్ని బయటపెట్టింది.'సరిగా గుర్తులేదు. ఓసారి ఒక ఊరికి వెళ్లాం. ఎవరో వ్యక్తి నా హోటల్ రూం తాళం దొంగింలించాడు. అర్థరాత్రి తాళం ఉపయోగించి నా రూంలోకి రావాలని తెగ ప్రయత్నించాడు. అదే టైంలో నా మేనేజర్ తో కలిసి నేను గదిలోనే ఉన్నాను. తొలుత షాకయ్యాం గానీ తర్వాత గట్టిగా అరిచాం'(ఇదీ చదవండి: యువ నటి ఇంట్లో భారీ దొంగతనం) 'ఈ సంఘటన గురించి హోటల్ రిసెప్షనిస్ట్ ని అడిగితే.. హౌస్ కీపింగ్ వాళ్లు అయ్యింటారని సమాధానమిచ్చారు. అర్థరాత్రి 12:30 గంటలకు హౌస్ కీపింగ్ ఏంటి? అని గట్టిగా అడిగా. అదే చాలా భయంకరమైన అనుభవం' అని మౌనీ రాయ్ చెప్పుకొచ్చింది.మౌనీ రాయ్ వ్యక్తిగత విషయానికొస్తే.. 2022లో సూరజ్ నంబియార్ అనే కేరళకు చెందిన బిజినెస్ మ్యాన్ ని పెళ్లి చేసుకుంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ ఎప్పటికప్పుడు హాట్ ఫొటోలు పోస్ట్ చేస్తూ ఫాలోవర్స్ ని అలరిస్తూ ఉంటుంది.(ఇదీ చదవండి: 'కోర్ట్'ని మించిపోయేలా ఉంటుంది.. ఓటీటీ డేట్ ఫిక్స్) -
13ఏళ్లకే హీరో, 15ఏళ్లకే టాలీవుడ్ స్టార్..ఒక్క యాక్సిడెంట్తో తెరమరుగు..
కెరీర్ను అందుకునే క్రమంలో బహుశా అతను సాధించినన్న రికార్డ్స్ మరే హీరో సాధించి ఉండడు. అత్యంత పిన్న వయసులో నటుడు, అత్యంత పిన్న వయసు హీరో, అత్యంత పిన్న వయసు స్టార్, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ తొలి సినిమా హీరో... హిందీ, తెలుగు, తమిళ, మళయాళం, కన్నడ..అన్ని భాషల్లోనూ స్వల్ప వ్యవధిలోనే 280 చిత్రాలు చేసిన హీరో...పాతికేళ్ల వయసులోనే ఇన్ని సాధించాడంటే ఇప్పుడెలా ఉండాలి? ఏభై ఏళ్ల వయసులో ఎంత గొప్ప స్థాయిలో ఉండాలి? ఎంత ఉన్నత స్థాయిలో ఉండాలి? కానీ అడ్రెస్ కూడా లేకుండా పోవడం ఏమిటి?అది 90వ దశకం.. భారతీయ సినీ పరిశ్రమకు ఒక మార్పు కాలం. ప్రధాన సినిమాలల్లో స్థిరపడిన తారల వయసు ముదిరిపోతుండగా, వారి స్థానాన్ని భర్తీ చేయడానికి యువ నటీనటులను పెద్ద సంఖ్యలో పరిచయం చేసిన కాలం. అలా తెరపైకి వచ్చిన యువతలో, అప్పుడే 15ఏళ్ల వయసులో హీరోగా అడుగుపెట్టిన ఒక యువ నటుడు ప్రత్యేకంగా నిలిచాడు అతడే హరీష్ కుమార్ (Harish Kumar), తెలుగు ప్రేక్షకులకు చిరపరిచితమైన హరీష్. బాలనటుడిగా తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించి ప్రధానంగా తెలుగు సినిమాల్లో నటించిన హరీష్, కొన్ని హిందీ, కన్నడ చిత్రాల్లోనూ నటించాడు. ఆ తర్వాత 1988లో, కేవలం 13ఏళ్ల వయసులోనే హీరో పాత్రలు పోషించడం మొదలుపెట్టాడు. దివంగత నిర్మాత రామానాయుడు 1990లో తీసిన ‘ప్రేమ ఖైదీ‘ తెలుగు సినిమాతో అప్పటి యూత్ని ఒక ఊపు ఊపాడు. తరువాతి ఏడాది, ఈ సినిమా హిందీ రీమేక్ లో కూడా నటించాడు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరిష్మా కపూర్ తొలి సినిమా విజయం సాధించింది. హరీష్–కరిష్మా కపూర్ (అప్పుడు ఇద్దరికీ 16ఏళ్లు) జోడీ ప్రేక్షకులకు ఎంతో నచ్చింది.తర్వాతి కాలంలో, ‘తిరంగా‘, ‘కాలేజ్ బుల్లోడు‘ వంటి విజయవంతమైన చిత్రాల్లో హరీష్ నటించాడు. ఆ సమయానికి, హరీష్ను హిందీ తెలుగు సినిమాల్లో ఉన్న అత్యుత్తమ యువ నటుల్లో ఒకరిగా గుర్తించారు. కొందరు ఆయనను షారుఖ్ ఖాన్, అక్షయ్ కుమార్ తదనంతర స్టార్గా కూడా భావించారు. కానీ తర్వాత తర్వాత హరీష్కు పూర్తిస్థాయి హీరోగా అవకాశాలు రాకున్నా మంచి పాత్రలే వచ్చాయి. టాప్ స్టార్స్ అయిన రజనీకాంత్, చిరంజీవి, నందమూరి బాలకృష్ణ నానా పాటేకర్, గోవిందా ల చిత్రాల్లో హరీష్ రెండవ హీరో, చిన్న పాత్రలకే పరిమితం అయ్యాడు.‘ద జెంటిల్మన్‘, ‘కూలీ నం.1‘, ‘హీరో నం.1‘ వంటి హిట్ చిత్రాల్లో నటించాక, 2001 ప్రాంతంలో అకస్మాత్తుగా తెరమరుగైన హరీష్... తిరిగి పదేళ్ల తర్వాత తెరపై కనిపించాడు. ఓ పుష్కర కాలం క్రితం ‘నాటీ ః 40‘, ‘చార్ దిన్ కి చాంద్ని‘ వంటి ఫ్లాప్ చిత్రాలతో తిరిగి సినిమాల్లో ప్రయత్నించాడు.ఆ తర్వాత ఏడేళ్ల క్రితం‘ఆ గయా హీరో‘ అనే చిత్రంలో గోవిందాతో కలిసి చివరిసారి తెరపై కనిపించాడు. ఏమైందో తెలీదు గానీ హరీష్ సినిమా జర్నీ ఎంత ఉధృతంగా మొదలైందో అంతే అకస్మాత్తుగా ముగిసింది.అందగాడని, ఎంతో భవిష్యత్తు ఉన్న నటుడు అని, డ్యాన్సులు, ఫైట్స్ బాగా చేస్తాడని మంచి పేరు తెచ్చుకున్న హరీష్..సినిమా కెరీర్ను వ్యక్తిగత జీవితంలోని ఒడిదుడుకులే నాశనం చేశాయని అంటారు. ఆయన ప్రేమ, పెళ్లి కూడా ఆయన సమస్యలకు కారణం అని కూడా కొందరు చెబుతారు.అయితే కొంత కాలం క్రితం ఆయన ఓ ఇంటర్వ్యూలో తన సినీ రంగం విడిచిపెట్టడానికి గల అసలు కారణం గురించి మాట్లాడాడు. చిన్నప్పుడు జరిగిన ఒక ప్రమాదంలో గాయపడిన తాను సంవత్సరాల తరబడి చికిత్స చేయించుకోకపోవడం వల్ల, సీరియస్ బ్యాక్ ప్రాబ్లెమ్కి గురయ్యాడని చెప్పారు. ‘ లంబార్ వెరిబ్రా ఎల్3 ఎల్5 ప్రాంతాల్లో స్లిప్డ్ డిస్క్ ఏర్పడింది. దీనివల్ల నడక కూడా కష్టమైంది. ఆ సమయంలో నేను చాలా నిర్లక్ష్యంగా ఉండి, గాయాన్ని గుర్తించలేకపోయాను. ఆపరేషన్ కూడా చేయించుకోవాలనుకోలేదు,‘ అని హరీష్ చెప్పాడు.చివరికి చికిత్స తీసుకున్న తరువాత, నెలల తరబడి మంచం మీద ఉండాల్సి వచ్చిందని, ఆ లోపు పరిశ్రమ తనను దాటి వెళ్లిపోయిందని హరీష్ తెలిపారు. ‘డాక్టర్ మొదట రెండేళ్ల పాటు పని చేయకూడదని చెప్పాడు. ఆ తర్వాత అలా అలా తెలియకుండానే పరిశ్రమ నుంచి మాయం అయ్యాను,‘ అని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం హరీష్ ప్రశాంత జీవితం గడుపుతున్నాడు. ‘నేను ఇంకా భారత్లోనే ఉన్నాను – చెన్నై, హైదరాబాద్, ముంబైలలో ఎక్కువగా ఉంటాను. సినిమా రంగం విడిచిన విషయం చాలా వ్యక్తిగతమైనది. దీనిపై ఎక్కువగా మాట్లాడాలని ఇష్టం లేదు,‘ అని హరీష్ స్పష్టం చేశాడు. -
యువ నటి ఇంట్లో భారీ దొంగతనం
ప్రమఖ నటి నేహా మాలిక్ ఇంట్లో భారీ దొంగతనం జరిగింది. దాదాపు రూ.34 లక్షలు విలువ చేసే నగలు మాయమయ్యాయని సదరు నటి, ముంబైలోని అంబోలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. తన పనిమనిషి ఈ పని చేసి ఉంటుందని ఫిర్యాదులో పేర్కొంది.(ఇదీ చదవండి: కుర్రాళ్ల సినిమా.. మనోళ్లకు ఎక్కేసింది!) ఎఫ్ఐఆర్ ప్రకారం.. నేహా మాలిక్ తల్లి మంజు పలు వేడుకలకు నగలు ధరించుకుని వెళ్లేది. తర్వాత తన రూంలోని చెక్క డ్రాయర్ లో వాటిని పెట్టేది. నేహా ఇంటి పనిమనిషి షహనాజ్ ముస్తాఫా ముందే చాలాసార్లు మంజు నగలు మార్చుకునేది. ఏప్రిల్ 25న ఉదయం నేహా మాలిక్ షూటింగ్ కి వెళ్లిపోగా.. ఈమె తల్లి మంజు గురుద్వార వెళ్లింది. దీంతో ఇంటిని శుభ్రం చేసేందుకు వచ్చిన పనిమనిషి తన దగ్గరున్న తాళంతో ఇంటిని క్లీన్ చేసి వెళ్లిపోయింది. తర్వాత రోజు పనికిరాలేదు. ఈ క్రమంలోనే నేహా మాలిక్ ఇంట్లో ఓసారి వెతకగా నగలు కనిపించలేదు. వీటి విలువ దాదాపు రూ.34 లక్షలకు పైనే.(ఇదీ చదవండి: 'కోర్ట్'ని మించిపోయేలా ఉంటుంది.. ఓటీటీ డేట్ ఫిక్స్) దీంతో నేహా మాలిక్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. పని మనిషిపై అనుమానం వ్యక్తం చేసింది. అందుకు తగ్గట్లే దర్యాప్తు చేసిన పోలీసులు సదరు పనిమనిషిని అరెస్ట్ కూడా చేశారు.నేహా మాలిక్ విషయానికొస్తే.. 2012 నుంచి ఇండస్ట్రీలో ఉంది. గాంధీ ఫేర్ ఆగయా, ముసాఫిర్ 2020, పింకీ మోగే వాలి 2 తదితర చిత్రాల్లో నటించింది. ఇన్ స్టాలో మాత్రం ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫొటోలు పెడుతూ హల్ చల్ చేస్తూ ఉంటుంది.(ఇదీ చదవండి: నెలలోపే ఓటీటీలోకి వచ్చేసిన థ్రిల్లర్ సినిమా) -
షారుఖ్ ఖాన్ న్యూ జెన్ జెడ్ లుక్ అదిరిపోయిందిగా..
ఫ్యాషన్కి స్టైల్కి పెట్టింది పేరు బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan). డైలాగ్ చెప్పినా, స్టెప్ వేసినా, బట్ట కట్టినా తనకంటూ ఒక స్టైల్ ఉంటుంది. తాజాగా షారుఖ్ ఖాన్ కూల్ న్యూ జెన్ జెడ్(Gen-z) లుక్లో అదిరిపోయాడు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియో ఫ్యాన్స్ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.సూపర్ స్టార్ ఇటీవల ముంబైలో అడుగుపెట్టినపుడు తన క్యాజువల్ వేర్లో వావ్ అనిపించాడు. ఎయిర్పోర్ట్ స్టైల్లో తెల్లటి టీ-షర్ట్, నీలిరంగు హూడీ జాకెట్, కార్గో ప్యాంటుకి జతగా కూల్ యాక్సెసరీస్ ధరించాడు. ఎప్పటిలాగానే మోచేతులపైకి స్లీవ్లను మడిచి, జెన్-జెడ్ స్టేపుల్స్ ధరించి అదరహో అనిపించాడు. ఫ్యాషన్కు వయస్సు లేదని ఒకసారి నిరూపించాడు. ప్రస్తుతం Gen-Z ఫాలో అవుతున్న బ్లూ కార్గో ప్యాంట్ ధరించి తగ్గేదే లే అన్నట్టు కనిపించాడు. యాక్సెసరీల విషయానికి వస్తే, బ్లాక్ సన్ గ్లాసెస్, క్రాస్బాడీ బ్యాగ్, వాచ్ , క్రిస్పీ వైట్ స్నీకర్లతో లుక్ను ఎలివేట్ చేశాడు. మెడలో సిల్వర్ చెయిన్తో మరింత కూల్గా ప్రతి అంగుళం సూపర్స్టార్గా కనిపించాడు. దీంతో ఫ్యాన్స్ కింగ్ ఖాన్ ఫ్యాషన్కి, స్టైల్కి ఫిదా అయిపోతున్నారు. ఇన్స్టాలో షేర్ అయిన షారూఖ్ వీడియో నెటిజనులను ఆకట్టుకుంటోంది. View this post on Instagram A post shared by Manav Manglani (@manav.manglani)కాగా సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ యాక్షన్-థ్రిల్లర్ ‘కింగ్’ షూటింగ్ ఈ ఏడాది జూన్లో షూటింగ్ ప్రారంభం కానుంది. కింగ్ తో పాటు, అమర్ కౌశిక్తో కలిసి నటించిన అడ్వెంచర్ చిత్రం టైగర్ vs పఠాన్ ,రాజ్ & డికె లాంటి ప్రాజెక్టులు షారూఖ్ చేతిలో ఉన్నాయి. ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీలతో బాలీవుడ్లో తిరుగులేని హీరోగాఎదిగాడు షారుఖ్ ఖాన్. ముఖ్యంగా అతని కరియర్లో బాజిగర్ ఒక మైలురాయి. ఈ సినిమాకు సండంధించి ఒక ఆసక్తికర విషయం ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. అసలు ఈ మూవీకి ఫస్ట్ చాయిస్ షారుఖ్కాదట. సల్మాన్ ఖాన్ , అక్షయ్ కుమార్ ఇద్దరూ ఆ పాత్రను తిరస్కరించిన తర్వాత మాత్రమే ఈ అవకాశం ఎస్ఆర్కేకి దక్కిందట. ఈ విషయాన్ని స్క్రీన్ రైటర్ రాబిన్ భట్ ఇటీవల వెల్లడించాడు.ఇదీ చదవండి: Pahalgam గడువు లోపు వెళ్లకపోతే...తప్పదు భారీ మూల్యం! -
దుస్తులు తీసేయమన్నాడు.. చేదు అనుభవం బయటపెట్టిన నటి
బాలీవుడ్ దర్శకుడు సాజిద్ ఖాన్ (Sajid Khan) తనతో అసభ్యంగా ప్రవర్తించాడంటోంది బుల్లితెర నటి నవీనా బోలె (Navina Bole). గతంలో అతడి వల్ల ఎదురైన ఓ ఇబ్బందిని తాజాగా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది. నవీనా బోలె మాట్లాడుతూ.. ఓ ప్రాజెక్ట్ గురించి మాట్లాడాలని సాజిద్ పిలిస్తే అతడి ఆఫీసుకు వెళ్లాను. అతడు చేసిన పనికి.. జీవితంలో అతడిని కలవకూడదని ఫిక్సయ్యాను.ఇదేం పరీక్ష?ఇంతకీ ఏం జరిగిందంటే.. ఆఫీసుకు వెళ్లాక ప్రాజెక్ట్ గురించి చెప్తాడేమో అని నేను చాలా ఆసక్తిగా ఎదురుచూశాను. కానీ అతడు.. నీ దుస్తులు తీసేసి కూర్చోవచ్చుగా అని అడిగాడు. నీ శరీరంపై నీకెంత నమ్మకం ఉంది? దుస్తులు లేకున్నా సౌకర్యంగా కూర్చోగలవా? లేదా? అని టెస్ట్ చేస్తున్నాను అన్నాడు. ఇది 2004 లేదా 2006లో జరిగిందనుకుంటాను. అతడి మాటలకు నా నోరు మూగబోయింది. నేనేం సమాధానమివ్వలేదు. ఏమైంది? నువ్వు బికినీ వేసుకుంటావుగా.. అలాంటప్పుడు ఇదేం పెద్ద సమస్య కాదు.. నువ్వు నీలా ఉండు అంతే అన్నాడు. ఇంటికెళ్లి వస్తానని తప్పించుకున్నా..అలాగైతే నేను ఇంటికెళ్లి బికినీ తెచ్చుకుంటాను. అంతే తప్ప నీ ముందు దుస్తులు తీసేసి కూర్చోలేను అని చెప్పాను. తర్వాత ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకున్నాను. అప్పటికీ ఆయన వదల్లేదు. ఇంటికి చేరుకున్నావా? ఆఫీసుకు తిరిగొస్తానన్నావ్, ఇంకా రావడం లేదేంటి? అంటూ దాదాపు 50 సార్లు ఫోన్ చేశాడు అని చెప్పుకొచ్చింది.సాజిద్ ఖాన్పై గతంలోనూ ఆరోపణలుఇకపోతే 2018లో మీటూ ఉద్యమం ఉధృతమైన సమయంలో సాజిద్ ఖాన్పై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. నటి రాచెల్ వైట్, అసిస్టెంట్ డైరెక్టర్ సలోని చోప్రా, జర్నలిస్ట్ కరిష్మా ఉపాధ్యాయ.. సాజిద్ ఖాన్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపించారు. ఇదిలా ఉంటే నవీనా బోలె.. మిలే జబ్ హమ్ తుమ్, జెన్నీ ఔర్ జుజు, సప్నా బబుల్ కా, బిడాయి, ఇష్క్బాజ్ వంటి హిందీ సీరియల్స్తో పాపులారిటీ సంపాదించుకుంది.చదవండి: ఆ హీరో తండ్రి సలహాతో 15 రోజులు నా యూరిన్ తాగా: నటుడు -
ఆ హీరో తండ్రి సలహాతో 15 రోజులు నా యూరిన్ తాగా: నటుడు
బాలీవుడ్ నటుడు పరేశ్ రావల్ (Paresh Rawal) ఓ ఆసక్తికర విషయం వెల్లడించాడు. తన యూరిన్ తాగి ఓ గాయం నుంచి త్వరగా కోలుకున్నట్లు తెలిపాడు. 'లాలంటాప్'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పరేశ్ రావల్ మాట్లాడుతూ.. ఓసారి నేను మోకాలి గాయంతో ముంబైలోని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో చేరాను. అప్పుడు అజయ్ దేవ్గణ్ (Ajay Devgn) తండ్రి వీరు దేవ్గణ్ (Veeru Devgan) నన్ను చూసేందుకు వచ్చాడు.దానివల్లే కోలుకున్నా..త్వరగా కోలుకునేందుకు ఓ సలహా ఇచ్చాడు. ఉదయం నిద్ర లేచిన వెంటనే నా యూరిన్ తాగమని చెప్పాడు. అలాగే మందు, మాంసం, సిగరెట్ తాగడం వంటి అలవాట్లు మానేయమన్నాడు. ఆయన సలహాను పాటించాలనుకున్నాను. పదిహేను రోజులపాటు నా యూరిన్ను బీర్లా తాగాను. ఆ తర్వాత డాక్టర్ ఎక్స్రే తీసి చూసినప్పుడు షాకయ్యాడు. ఇంత త్వరగా గాయం ఎలా నయమవుతోంది అని ఆశ్చర్యపోయాడు. రెండున్నర నెలల తర్వాత డిశ్చార్జ్ అవ్వాల్సిన నేను వీరు దేవ్గణ్ చెప్పిన సలహా వల్ల నెలన్నరకే డిశ్చార్జ్ అయ్యాను. ఆయన సలహా నాకొక మ్యాజిక్లా పని చేసింది అని చెప్పుకొచ్చాడు.సినిమాపరేశ్ రావల్.. క్షణక్షణం, రిక్షావోడు, బావగారు బాగున్నారా?, శంకర్దాదా ఎంబీబీఎస్, తీన్మార్, ఆకాశమే హద్దుగా వంటి తెలుగు చిత్రాల్లో నటించాడు. హిందీలో సర్, వో చోక్రీ, మోహ్రా, రాజా, బందిష్, హీరో నెం.1, చాచీ 420, హీరా ఫెరి, ఆంఖెన్, యే తెరా ఘర్ యే మేరా ఘర్, హంగామా, హల్చల్, ఫిర్ హీరా ఫేరి, కూలీ నెం.1 ఇలా అనేక సినిమాలు చేశాడు. చివరగా 'ద స్టోరీటెల్లర్' సినిమాలో కనిపించాడు. ప్రస్తుతం ఇతడి చేతిలో కిట్టీ, భూత్ బంగ్లా, థామా, హీరా ఫేరి 3తో కలుపుకుని ఏడెనిమిది సినిమాలున్నాయి.గమనిక: ఇది కేవలం నటుడి అభిప్రాయం/ అనుభవం మాత్రమే. ఆరోగ్యపరమైన విషయాల్లో వైద్య నిపుణుల సలహాలు తీసుకోవడం ఉత్తమం.చదవండి: హిట్ 3 నచ్చకపోతే SSMB29 సినిమా చూడొద్దు.. నాని -
మొన్నే పహల్గామ్ దాడి.. ధైర్యంగా అక్కడికెళ్లిన నటుడు
ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్ లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడిలో మన దేశానికి చెందిన 26 మంది ప్రాణాలు కోల్పోయారు. పర్యాటకాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా ఉగ్రవాదులు ఈ దాడి చేసినట్లు తెలుస్తోంది. దీంతో అప్పటికే ఇక్కడికి టూర్ కోసం వచ్చినవాళ్లు, త్వరలో వెళ్దామని అనుకున్నవాళ్లు వెనకడుగు వేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ ప్రముఖ నటుడు పహల్గామ్ వెళ్లారు.బాలీవుడ్ సీనియర్ నటుడు అతుల్ కులకర్ణి.. ఆదివారం పహల్గామ్ వెళ్లారు. అందరూ కశ్మీర్ తిరిగి రావాలని విజ్ఞప్తి చేశారు. తాను ధైర్యంగా వచ్చానని చెప్పుకొచ్చారు. ఈ మేరకు ఇన్ స్టాలో ఫొటో పోస్ట్ చేశారు.(ఇదీ చదవండి: 'బాహుబలి' టైంకి నాకు 27 ఏళ్లే.. కానీ అలా చూపించేసరికి) 'ఇది హిందుస్థాన్ గడ్డ. ఇక్కడ భయం కంటే ధైర్యం ఎక్కువ. ఇది హిందుస్థాన్ గడ్డ. ఇక్కడ ద్వేషాన్ని ప్రేమ ఓడిస్తుంది. కశ్మీర్ పోదాం పదండి. సింధు, జీలం నదుల్ని సందర్శిద్దాం పదండి. నేను వచ్చాను. మీరు కూడా రండి' అని అతుల్ కులకర్ణి చెప్పుకొచ్చారు.జయం మనదేరా, ఆంధ్రావాలా, చంటి, గౌరీ, లీలా మహల్ సెంటర్, పంజా, ద ఘాజీ, మజిలీ, వైల్డ్ డాగ్ తదితర తెలుగు సినిమాల్లో ఈయన నటించారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, ఇంగ్లీష్, ఒరియా, మరాఠీ భాషల్లో తీసిన పలు చిత్రాల్లోనూ ఈయన నటించడం విశేషం.(ఇదీ చదవండి: సమంత పెట్ డాగ్ తో శోభిత.. చైతూ పోస్ట్ వైరల్) View this post on Instagram A post shared by Atul Kulkarni (@atulkulkarni_official) -
ప్రెగ్నెన్సీ ప్రకటించిన ప్రముఖ బుల్లితెర నటి.. వీడియో వైరల్!
ప్రముఖ బుల్లితెర నటి షిరీన్ మీర్జా తన ఫ్యాన్స్కు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రస్తుతం తాను గర్భంతో ఉన్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఈ విషయాన్ని తన భర్తతో కలిసి ఓ వీడియో ద్వారా పంచుకుంది. తల్లిదండ్రులుగా కొత్త అధ్యాయాన్ని ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపింది. కాగా.. ఈ బుల్లితెర భామ యే హై మొహబ్బతీన్ బాలీవుడ్లో ఫేమ్ తెచ్చుకుంది. ఆ తర్వాత పలు సీరియల్స్లో నటించింది.తాజాగా షేర్ చేసిన వీడియోలో బేబీ బంప్తో కనిపించింది. కాగా.. ఆమె హసన్ సర్తాజ్ అనే వ్యక్తిని పెళ్లాడింది. 2021లో ఆమె స్వస్థలమైన జైపూర్లో వివాహం చేసుకుంది. షిరీన్ మీర్జా ప్రెగ్నెన్సీ ప్రకటనతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ జంటకు శ్రేయోభిలాషులు, సన్నిహితులు అభినందనలు తెలుపుతున్నారు. కాగా.. బాలీవుడ్లో యే హై చాహతీన్, బహుత్ ప్యార్ కర్తే హై, యే కహా ఆగయా హమ్, ధర్మక్షేత్ర్ లాంటి సీరియల్స్లో నటించింది. View this post on Instagram A post shared by Mirzashireen (@shireenmirza) -
తాగుడు అలవాటు.. ఎంత చెప్పినా మానలేదు.. అందుకే విడాకులు: నటి
బంధాన్ని తెంచుకోవడం అంత ఈజీ కాదు.. కానీ కొన్ని సందర్భాల్లో పరిస్థితులు తలకిందులైనప్పుడు చాలామంది ఆ బంధాన్ని కష్టంగా కొనసాగించడానికి బదులు తెంపుకోవడానికే ప్రయత్నిస్తారు. బుల్లితెర నటి శుభంగి ఆత్రే (Shubhangi Atre) కూడా అదే పని చేసింది. పరిస్థితి చేయిదాటిపోయిందని అర్థమయ్యాక భర్త పీయూశ్ పూరే (Piyush Poorey)తో విడాకులు ఇచ్చేసింది. ఇంతలోనే పీయూశ్ పూరే (ఏప్రిల్ 19న ) తీవ్ర అనారోగ్యంతో కన్నుమూశాడు.విడాకులకు కారణం..ఈ క్రమంలో శుభంగి.. తమ అన్యోన్య దాంపత్యం చెల్లాచెదురవడానికి గల కారణాన్ని వెల్లడించింది. నేను టీవీ ఇండస్ట్రీలో సక్సెస్ అయ్యాను కాబట్టి భర్తను వదిలేశాను అని చాలామంది అనుకుంటారు. అది నిజం కాదు. అతడికున్న తాగుడు వ్యసనం వల్లే విడిపోవాల్సి వచ్చింది. మందుకు బానిసవడం వల్ల అది కుటుంబంపై తీవ్ర ప్రభావాన్ని చూపించింది.ఎంతో ప్రయత్నించా..మా బంధాన్ని కాపాడుకోవాలని చాలారకాలుగా ప్రయత్నించాను. కానీ పరిస్థితులు చేయిదాటిపోయాయి. అతడితో మందు మాన్పించేందుకు రిహాబిలిటేషన్ సెంటర్కు కూడా పంపించాను. అయినా తనలో మార్పు రాలేదు. ఇరు కుటుంబాలు తనను మార్చాలని ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఆ వ్యసనం.. అతడిని నాశనం చేసింది. మాపై కూడా ప్రభావం చూపింది.ఒక్కరోజులో తీసుకున్న నిర్ణయం కాదువిడాకులు ఒక్కరోజులో తీసుకున్న నిర్ణయం కాదు. 2018-2019 సమయంలో ఆ ఆలోచన మొదలైంది. చివరకు ఈ ఏడాది విడాకులు తీసుకున్నాం. డివోర్స్ అయ్యాక కూడా నేను అతడితో టచ్లోనే ఉన్నాను. ఇంతలోనే అతడు కాలం చేశాడు. త్వరలోనే నేను, నా కూతురు.. ఇండోర్లో ఉన్న పీయూశ్ కుటుంబాన్ని కలుస్తాం అని చెప్పుకొచ్చింది.సీరియల్స్తో ఫేమస్శుభంగి ఆత్రే- పీయూశ్ 2003లో పెళ్లి చేసుకున్నారు. వీరికి 2005లో కూతురు పుట్టింది. 2022 నుంచి దంపతులిద్దరూ విడివిడిగా జీవిస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో అధికారికంగా విడాకులు మంజూరయ్యాయి. కాగా శుభంగి ఆత్రే 2006లో కసౌజీ జిందగీకే సీరియల్తో నటప్రయాణం ఆరంభించింది. కస్తూరి, బాబ్జీ ఘర్ పర్ హైర్, హవన్ వంటి పలు సీరియల్స్ చేసింది. చదవండి: పాకిస్తాన్కు ఎప్పుడు వస్తున్నావ్? దద్దమ్మ అంటూ సింగర్ కౌంటర్ -
పాక్ ‘నటన’కు షాక్, నిషేధానికి గురైన నటీనటులెవరంటే,..
కళలకు హద్దుల్లేవు అంటారు. కానీ సహనానికి మాత్రం ఓ హద్దు ఉంటుంది కదా. ఓ వైపు మన దేశ వాసుల ప్రాణాలను తీస్తూ మరోవైపు అదే ప్రజల కష్టార్జితంతో తమ కళాకారులకు ప్రాణాలను పోయాలనే దుర్భుధ్దులున్న చోట... కళలకు హద్దులు ఉండాల్సిందే. అందుకే పాకిస్తానీ కళాకారులు ఇప్పుడు నిషేధాన్ని ఎదుర్కుంటున్నారు. తమ దేశం విచక్షణ మరచి ఏళ్లుగా తీవ్రవాదమూకలకు అడ్డాగా మారిన వైనానికి తమను ప్రేమతో ఆదరించిన సమాజం ముందు సిగ్గుతో తలదించుకుంటున్నారు. వాస్తవానికి ఇంకా ముందే.. అంటే గత 2016లో ఉరిలో భారత ఆర్మీపై పాక్ తీవ్రవాద సంస్థ జైషే మహ్మద్ ఉగ్ర దాడి తర్వాత, మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన పాకిస్తానీ కళాకారులను భారత్ విడిచిపెట్టి వెళ్ళాలని డిమాండ్ చేసింది. అప్పటి నుంచీ పాకిస్తానీ నటులు భారతీయ చిత్రాల్లో పాల్గొనడం తగ్గినా మళ్లీ ఇటీవలే కొంచెం పుంజుకుంది. అయితే దేశాన్ని తీవ్రమైన ఆవేదనకు, అదే సమయంలో తీవ్రాగ్రహావేశాలకు గురిచేసిన తాజా తీవ్రవాద దాడి నేపథ్యంలో, భారతదేశంలో పాకిస్తానీ నటులపై ఈ సారి ఏకంగా అధికారిక నిషేధం విధించారు. ఈ నిషేధం ఇప్పట్లో ఎత్తేసే పరిస్థితి కనిపించడం లేదు. భవిష్యత్తులో మళ్లీ పాక్ నటులు మన సినిమాల్లో కనిపిస్తారో లేదో... తెలీదు. ఈ నేపధ్యంలో గత కొంత కాలంగా బాలీవుడ్లో పనిచేసిన పాకిస్తానీ నటుల జాబితాను ఒకసారి పరిశీలిస్తే... ఫవాద్ ఖాన్ అనే పాకిస్తానీ నటుడు ’ఖూబ్ సూరత్’, ’కపూర్ అండ్ సన్స్, ’ఏ దిల్ హై ముష్కిల్’ వంటి బాలీవుడ్ చిత్రాల్లో నటించాడు. అలాగే అత్యంత పాప్యులర్ పాకిస్తానీ నటి మహీరా ఖాన్ ’రైస్’ చిత్రంలో షారుఖ్ ఖాన్ సరసన నటించింది. ’తేరే బిన్ లాడెన్’, ’మేర్ బ్రదర్ కి దుల్హన్’, ’చష్మే బద్దూర్’, ’డియర్ జిందగీ’ వంటి చిత్రాల్లో నటించిన అలీ జఫర్ కూడా పాకిస్తానీయుడే. ’హిందీ మీడియం’ చిత్రంలో ఇర్ఫాన్ ఖాన్ సరసన మరో పాకిస్తానీ..సబా ఖామర్ నటించింది. ’క్రియేచర్ 3ఇ’చిత్రంలో ఇమ్రాన్ అబ్బాస్ అనే పాకిస్తానీ నటుడు నటించాడు. ’సనం తేరీ కసమ్’ చిత్రంలో మరో పాకిస్తానీ నటుడు మావ్రా హోకేన్ కనిపించగా, ’మామ్’ చిత్రంలో శ్రీదేవి సరసన సజల్ అలీ నటించాడు. అంతేకాకుండా కొందరు పంజాబీ చిత్రాల్లో కూడా నటించారు. అలా భారతీయ పంజాబీ చిత్రాల్లో పనిచేసిన పాకిస్తానీ నటుల్లో ఇమ్రాన్ అబ్బాస్ ఉన్నాడు. ఆయన ’జీవే సోనేయా జీవే’ చిత్రంలో నటించాడు. ’లక్ లాగ్ గయి’ అనే చిత్రంలో ప్రస్తుతం నటిస్తున్న ఫిరోజ్ ఖాన్ కూడా పాకిస్తానీయే. ‘బేబే భంగ్రా పౌండే నె’ చిత్రంలో సోహైల్ అహ్మద్ నటించాడు. నసీం వికీ – ’మా దా లడ్లా’ చిత్రంలో కనిపిస్తాడు. ఏదేమైనా వీరందరూ కోట్లాది మంది ఆదరాభిమానాలకు, ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందుతున్న భారతీయ సినిమాలో అవకాశాలకు దూరమయ్యారు. హద్దులెరుగని ప్రేమతో ఆదరించిన భారతీయ ప్రేక్షకులను బలితీసుకునే తమ దేశపు నీచబుద్ధికి వీరు నిరసన తెలపాల్సిన అవసరం కనీస మానవ ధర్మం. -
పాకిస్తాన్కు ఎప్పుడు వస్తున్నావ్? దద్దమ్మ అంటూ సింగర్ కౌంటర్
పాకిస్తానీయులు భారత్ను తక్షణమే వదిలి వెళ్లిపోవాలని కేంద్రం రెండు రోజుల క్రితమే హెచ్చరికలు జారీ చేసింది. జమ్మూకశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి నిరసనగా భారత్ ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పలువురూ తట్టాబుట్టా సర్దుకుని పాకిస్తాన్కు పయనమైపోయారు. అది సరే.. మరి బాలీవుడ్ సింగర్ అద్నాన్ సమీ (Adnan Sami) వంతు ఎప్పుడంటూ పాకిస్తాన్ మాజీ మంత్రి ఫవాద్ చౌదరి సోషల్ మీడియాలో సెటైర్లు వేశాడు.ఈ దద్దమ్మకెలా అర్థమవుతుంది?దశాబ్దం క్రితమే భారతీయ పౌరసత్వం తీసుకున్న అద్నాన్ సమీ దీనిపై ఘాటుగా స్పందించాడు. ఈ చదువురాని దద్దమ్మకు ఎవరు చెప్తే అర్థమవుతుంది? అని కౌంటర్ ఇచ్చాడు. అద్నాన్ సమీ పేరెంట్స్ పాకిస్తానీయులు. వీరు ఇంగ్లాండ్లో సెటిలయ్యారు. అద్నాన్ సమీ అక్కడే పుట్టి పెరిగాడు. తర్వాత భారత్కు వచ్చి ఇక్కడ స్థిరపడ్డాడు. 2015 డిసెంబర్లో భారత పౌరసత్వం తీసుకున్నాడు. ఈ విషయంలో తనను చాలామంది ట్రోల్ చేశారంటూ.. ఆ విషయాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నాడు.మతం మార్చేస్తారు!అద్నాన్ సమీ మాట్లాడుతూ.. నువ్వు భారతీయుడివి అయిపోయావా? అయితే నీ మతం కూడా మార్చేస్తారు. ఇక నువ్వు ఏ స్వామివో అయిపోవాల్సిందే అంటూ నానారకాలుగా కామెంట్లు చేసేవారు. వాళ్లన్న మాటలే నిజమైతే.. అమెరికాలో ఉన్న పాక్ ప్రజలందరూ క్రిస్టియన్లు అయిపోవాలి లేదా ఇంగ్లాండ్లో ఉన్నవాళ్లందరూ నిరసనకారులుగా మారిపోవాలి. నేను మతం మారాలని చెప్పడానికి వాళ్లెవరు? దేశం మారితే మతం మారాలన్న రూల్ ఏం లేదు' అని చెప్పుకొచ్చాడు.సినిమాఅద్నాన్ సమీ.. ఎన్నో హిట్ సాంగ్స్ ఆలపించాడు. పలు చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించాడు. లక్కీ: నో టైమ్ ఫర్ లవ్, ఏ రాస్తే హై ప్యార్ కే, ఢమాల్, 1920, ఛాన్స్ పె డ్యాన్స్, ముంబై సాల్సా, ఖుబ్సూరత్, శౌర్య చిత్రాలకు మ్యూజిక్ డైరెక్టర్గా పని చేశాడు. Who’s going to tell this illiterate idiot!!😂 https://t.co/OoH4w5iPQ3— Adnan Sami (@AdnanSamiLive) April 25, 2025 చదవండి: 30 సార్లు ఫోన్ చేసినా హిమాన్షి లిఫ్ట్ చేయలేదు.. బిగ్బాస్ విన్నర్ -
ప్రెగ్నెన్సీతో స్టార్ హీరోయిన్.. కోటి రూపాయల గిఫ్ట్!
తెలుగులో పలు సినిమాల్లో హీరోయిన్ గా చేసిన కియారా అడ్వాణీ(Kiara Advani) ప్రస్తుతం ప్రెగ్నెన్సీతో ఉంది. చివరగా రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్'లో కనిపించింది. ఈమె చేసిన రెండు సినిమాలు త్వరలో రిలీజ్ కాబోతున్నాయి. సరే ఈ విషయాలన్నీ పక్కనబెడితే ఈమెకు ఇప్పుడు భర్త ఖరీదైన కారుని బహుమతిగా ఇచ్చాడు. 2014 నుంచి ఇండస్ట్రీలో ఉన్న కియారా.. బాలీవుడ్ కే చెందిన సిద్ధార్థ్ మల్హోత్రాని(Sidharth Malhotra) ప్రేమించింది. కలిసి సినిమాలు కూడా చేసిన వీళ్లిద్దరూ 2023లో గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి చివరలో శుభవార్త చెప్పింది. తాను గర్భంతో(Pregnancy) ఉన్నానని బయటపెట్టింది. ఈ మేరకు ఇన్ స్టాలో పోస్ట్ కూడా పెట్టింది.(ఇదీ చదవండి: 70 ఏళ్లకు ప్రేమలో పడితే.. ఓటీటీ సినిమా రివ్యూ) తాజాగా నెలవారీ చెకప్స్ కోసం భర్త సిద్దార్థ్ తో కలిసి ముంబైలోని ఓ ఆస్పత్రికి కియారా వెళ్లింది. వీళ్లిద్దరూ కూడా ఓ లగ్జరీ కారులో వచ్చారు. టొయాటో కంపెనీకి చెందిన వెల్ ఫైర్(Toyota Vellfire) అనే మోడల్ కారు ఇది. దీని ధర మార్కెట్ లో రూ.1.22 కోట్లకు పైనే ఉందని తెలుస్తోంది.కియారా ప్రెగ్నెంట్ అని తెలిసిన వెంటనే భర్త సిద్ధార్థ్ మల్హోత్రా ఈమెకు ఈ కారుని బహుమతిగా ఇచ్చాడట. మిగతా వాటితో పోలిస్తే లోపల స్పేస్, కూర్చోవడానికి చాలా సౌకర్యంగా ఉండటమే దీనికి కారణమని తెలుస్తోంది. ఈ విషయం గురించి బాలీవుడ్ లో మాట్లాడుకుంటున్నారు.(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 24 సినిమాలు) -
30 సార్లు ఫోన్ చేసినా హిమాన్షి లిఫ్ట్ చేయలేదు.. బిగ్బాస్ విన్నర్
జమ్మూకశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి (Pahalgam Terror Attack)లో 26 మంది కన్నుమూశారు. వారిలో ఇండియన్ నేవీ లెఫ్టినెంట్ కల్నల్ వినయ్ నర్వాల్ ఒకరు. ఏప్రిల్ 16న వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన ఈ నేవీ అధికారి.. హనీమూన్ కోసం ఏప్రిల్ 21న కశ్మీర్ వెళ్లారు. భార్యతో కలిసి కొత్త లైఫ్ను ప్రారంభించాలనుకున్నారు. కానీ, ఆ మరుసటి రోజు పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో వినయ్ నర్వాల్ నేలకొరిగారు.పెళ్లయిన ఆరు రోజులకే..కళ్ల ముందే భర్త ప్రాణాలు కోల్పోవడం చూసి గుండెలు పగిలేలా రోదించింది భార్య హిమాన్షి. అందుకు సంబంధించిన ఫోటో, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారగా ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించాయి. బిగ్బాస్ విన్నర్ ఎల్విష్ యాదవ్ (Elvish Yadav) అయితే ఆ వీడియోలు చూసి మరింత షాక్కు గురయ్యాడు. హిమాన్షి కాలేజీలో రోజుల్లో తన క్లాస్మేట్ అని గుర్తు చేసుకున్నాడు. ఇంకా షాక్లోనే ఉన్నా..ఎల్విష్ మాట్లాడుతూ.. నేను హన్సరాజ్ కాలేజీలో చదువుకున్నాను. 2018లో నా చదువు పూర్తయింది. హిమాన్షిది కూడా అదే కాలేజ్.. ఆ రోజుల్లో మేము చాలా ఎంజాయ్ చేసేవాళ్లం. మెట్రో స్టేషన్కు కూడా కలిసి వెళ్లేవాళ్లం. కాలేజ్ అయిపోయాక మళ్లీ మేము మాట్లాడుకోలేదు. కాకపోతే తన నెంబర్ నా దగ్గర ఇప్పటికీ ఉంది. కానీ, ఇప్పుడామె ఫోన్ ఎత్తి మాట్లాడే పరిస్థితిలో లేదనుకుంటున్నాను. పైగా నేనే ఇంకా షాక్లో ఉన్నా.. అలాంటిది తన పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉండి ఉంటుంది!31వ సారి ఫోన్ ఎత్తిందిఅందుకే ఇది సరైన సమయం కాదేమో అనిపించి తనకు ఫోన్ చేసి మాట్లాడలేదు. నా ఫ్రెండ్ ఒకరు తనకు 30 సార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయలేదు. 31వ సారి ఫోన్ ఎత్తింది. మీడియాలో వస్తున్నట్లుగానే మతం అడిగి తెలుసుకుని మరీ హిందువులను చంపేశారన్నది నిజం అని చెప్పుకొచ్చాడు. కాగా ఎల్విష్ యాదవ్.. హిందీ బిగ్బాస్ ఓటీటీ రెండో సీజన్ విజేతగా నిలిచాడు.చదవండి: పారితోషికంగా నోట్ల కట్టలు.. హైదరాబాద్ కింగ్ నేనే: నాని -
'నెక్ట్స్ వేకేషన్ జమ్మూ కశ్మీర్లోనే'.. కేఎల్ రాహుల్ మామ సంచలన కామెంట్స్!
బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి సంచలన కామెంట్స్ చేశారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత తన వేకేషన్ను జమ్మూ కశ్మీర్లోనే ప్లాన్ చేస్తున్నట్లు వెల్లడించారు. కాశ్మీర్ లోయలో పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి.. ఉగ్రవాదంపై పోరాటానికి భారతీయులంతా ఏకం కావాలని ఆయన కోరారు. ముంబయిలో జరిగిన లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డు- 2025 వేడుకకు హాజరైన ఆయన పహల్గామ్ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు. కాశ్మీర్ ఎల్లప్పుడూ భారతదేశంలో అంతర్భాగమని.. ఇలాంటి సమయంలోనే మనం ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఎవరూ కూడా భయానికి కానీ.. ద్వేషానికి కానీ లోనుకావద్దని దేశ ప్రజలను సునీల్ శెట్టి కోరారు.సునీల్ శెట్టి మాట్లాడుతూ.. "మనం మానవాళికి చేసే సేవే భగవంతుని సేవ. సర్వశక్తిమంతుడు అన్నీ చూసి ప్రతిస్పందిస్తాడు. ప్రస్తుతం మనం భారతీయులుగా ఐక్యంగా ఉండాల్సిన అవసరం చాలా ఉంది. భయం, ద్వేషాన్ని వ్యాప్తి చేయడానికి ప్రయత్నిస్తున్న వారి వలలో మనం పడకూడదు. ఇలాంటి సమయంలోనే మనమంతా ఐక్యంగా ఉండాలి. కశ్మీర్ మనదే.. ఎల్లప్పుడూ మనదే అని వాళ్లకి మనం చూపించాలి. అందుకే కాశ్మీర్లో తన విహారయాత్రను ప్లాన్ చేసుకుంటున్నా. మీరు కూడా కశ్మీర్లో పర్యటించాలని భారతీయ పౌరులను కోరుతున్నా. ఒక పౌరుడిగా మనం ఈ పని చేయాలి. మన తదుపరి వేకేషన్ కశ్మీర్లోనే ఉండాలి. ఎందుకంటే మనం భయపడలేదని.. మనకు భయం లేదని వారికి చూపించాలి' అని పిలుపునిచ్చారు.ఇప్పటికే తాను అధికారులను సంప్రదించానని.. అవసరమైతే కశ్మీర్లో పర్యటించేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు సునీల్ పేర్కొన్నాడు. తమ సినిమాలను సైతం అక్కడే షూటింగ్ నిర్వహిస్తామని అధికారులకు వివరించినట్లు వెల్లడించారు. ఎందుకంటే మన కశ్మీరీలు ఎప్పటికీ మనకు తోడుగా నిలుస్తారని సునీల్ శెట్టి అన్నారు. ఉగ్రదాడి తర్వాత కశ్మీర్ ప్రాంతం నుంచి పర్యాటకులు తరలివెళ్లడంతో అక్కడి స్థానికుల ఉపాధిపై తీవ్ర ప్రభావం పడనుంది. ఈ నేపథ్యంలోనే సునీల్ శెట్టి చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లోని బైసారన్ లోయ వద్ద పర్యాటకులను లక్ష్యంగా చేసుకున్న ఉగ్రవాదులు.. 26 మందిని హతమార్చారు. ఈ ఘటనతో యావత్ భారతదేశం షాకింగ్కు గురైంది. View this post on Instagram A post shared by Visitkashmirtravel In (@visitkashmirtravel.in) -
పహల్గామ్ ఉగ్రదాడిపై స్పందించిన పాక్ నటి.. నెటిజన్ల ఆగ్రహం!
2017లో రాయిస్ సినిమాతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన పాక్ నటి మహీరా ఖాన్. జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిపై స్పందించింది. ఈ దారుణ ఘటనలో బాధిత కుటుంబాలకు తన సానుభూతి తెలియజేస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది. ప్రపంచంలో ఎక్కడైనా, ఏ రూపంలోనైనా హింస అనేది పిరికిపంద చర్యగా ఆమె అభివర్ణించింది. ఇప్పటికే ఈ దాడిని పాకిస్తాన్కు చెందిన నటులు ఫవాద్ ఖాన్తో పాటు హనియా అమీర్, ఫర్హాన్ సయీద్, మావ్రా హోకానే, ఉసామా ఖాన్ లాంటి ప్రముఖులు ఖండించారు.అయితే మహీరా ఖాన్ తన పోస్ట్ను కొద్ది క్షణాల్లో డీలీట్ చేసింది. పహల్గామ్ మారణహోమంపై సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కొద్ది సేపటికే నటి తొలగించడంపై అభిమానులు మండిపడుతున్నారు. ఇంత మాత్రానికి మీరు సానుభూతి ప్రకటించడం ఎందుకని మహీరాను నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. కాగా.. అంతకుముందే ప్రముఖ పాక్ నటుడు ఫవాద్ ఖాన్ ఈ ఉగ్రదాడిపై విచారం వ్యక్తం చేశారు. ఈ కష్ట సమయంలో బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.ఫవాద్ ఖాన్ సినిమాపై బ్యాన్..పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ కీలక నిర్ణయాలు తీసుకుంది. పాకిస్తాన్తో అన్ని సంబంధాలను తెంచేసుకున్నట్లు ప్రకటించింది. గతంలో 2016లో యూరీ ఉగ్ర దాడి తర్వాత పాకిస్తాన్ ఆరిస్టులను ఇండియాలో పని చేయకుండా నిషేధించారు. తాజాగా పహల్గామ్ ఘటన తర్వాత మరోసారి పాక్ నటీనటులపై కేంద్ర నిషేధం విధించింది. అంతేకాకుడా ఫవాద్ ఖాన్ నటించిన సినిమాను విడుదలను బ్యాన్ చేసింది.పాకిస్తాన్ నటుడు ఫవాద్ ఖాన్ హీరోగా నటించిన హిందీ సినిమా 'అబీర్ గులాల్' (Abir Gulaal Movie)ను భారత్లో విడుదల చేయకూడదని కేంద్ర సమాచార శాఖ నిర్ణయం తీసుకుంది. ఇందులో పాక్ నటుడు ఫవాద్ ఖాన్ హీరోగా నటించగా.. బాలీవుడ్ హీరోయిన్ వాణీ కపూర్ అతడికి జంటగా నటించింది. రిద్ధి డోగ్రా, లీసా హైడన్, ఫరీదా జలాల్, పర్మీత్ సేతి, సోనీ రజ్దాన్ కీలక ప్రాతలు పోషించారు. ఆర్తి ఎస్. బగ్దీ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను వివేక్ అగర్వాల్, అవంతిక హారి, రాకేశ్ సిప్పీ, ఫిరూజీ ఖాన్ నిర్మించారు. -
ఏఆర్ రెహమాన్కు షాక్.. రూ. 2 కోట్లు చెల్లించాల్సిందే!
స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్కు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. ఆయన సంగీతం అందించిన పొన్నియిన్ సెల్వన్ చిత్రంలోని ఓ పాటపై కాపీ రైట్ కేసులో బిగ్ షాక్ తగిలింది. ఈ కేసుపై విచారణ చేపట్టిన ఢిల్లీ ఉన్నత న్యాయస్థానం.. పిటిషన్దారుడికి రూ.2 కోట్లు చెల్లించాలని ఏఆర్ రెహమాన్తో పాటు చిత్ర నిర్మాణ సంస్థను ఆదేశించింది. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా 2023లో విడుదలై సూపర్ హిట్గా నిలిచింది.పొన్నియిన్ సెల్వన్ సిరీస్లో భాగంగా తెరకెక్కించిన రెండో చిత్రం. ఈ మూవీలో విక్రమ్, రవి మోహన్, కార్తి, త్రిష ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ రెండు సినిమాలకు ఏఆర్ రెహమాన్ సంగీతమందించారు. కాగా.. పొన్నియిన్ సెల్వన్ -2 చిత్రంలోని వీరా రాజ వీరా అనే పాట సంగీతాన్ని తన తండ్రి ఫయాజుదీన్ డగర్, మామ జాహిరుదీన్ డగర్ సంగీతం అందించిన శివస్తుతి పాట నుంచి కాపీ చేసినట్లు సింగర్ ఉస్తాద్ ఫయాజ్ వసిఫుదీన్ డగర్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో శుక్రవారం ఢిల్లీ హైకోర్టు మధ్యంతర తీర్పు వెలువడింది. సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్, చిత్ర నిర్మాణ సంస్థ మద్రాస్ టాకీస్ రూ.2 కోట్లను పిటిషన్దారుడికి అందించాలని ఆదేశించింది. -
ఆధ్యాత్మిక గురువు రవిశంకర్గా విక్రాంత్
ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు, ఆధ్యాత్మిక గురువు రవిశంకర్ జీవితం వెండితెరపైకి రానుంది. రవిశంకర్ జీవితంతో సినిమా రానుందని ఎప్పట్నుంచో ఓ వార్త ప్రచారంలో ఉంది. బాలీవుడ్ దర్శక–నిర్మాతలు సిద్ధార్థ్ ఆనంద్, మహావీర్ జైన్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు కూడా టాక్ వినిపించింది. ఈ చిత్రంలో రవిశంకర్ పాత్రను విక్రాంత్ మాస్సీ చేయనున్నారనే ఊహాగానాలూ నెలకొన్నాయి. అందుకు తగ్గట్టు గత ఏడాది రవిశంకర్ని కలిశారు విక్రాంత్.ఆయనపాత్రలో ఒదిగిపోవడానికి కావాల్సిన సలహాలు, సూచనలు తీసుకున్నారట. ఈ చిత్రం రెగ్యులర్ షూట్ని జూలైలో ఆరంభించాలనుకుంటున్నారన్నది తాజా సమాచారం. ‘వైట్’ టైటిల్తో రూపొందనున్న ఈ చిత్రానికి యాడ్ ఫిల్మ్ మేకర్ మౌంటూ బస్సీ దర్శకత్వం వహించనున్నారు.కొలంబియాలో జరిగిన అంతర్యుద్ధాన్ని పరిష్కరించడంలో రవిశంకర్ ఏ విధంగా కీలకపాత్ర పోషించారనేది ఈ చిత్రం ప్రధానాంశమని సమాచారం. అంతర్జాతీయ స్థాయిలో రూపొందనున్న ఈ చిత్రంలో రవిశంకర్పాత్రలో ఒదిగిపోవడానికి విక్రాంత్ మాస్సీ మేకోవర్ అవుతున్నారు. హిందీ, ఇంగ్లిష్, స్పానిష్ భాషల్లో ఈ చిత్రాన్ని రూపొందించి, పలు భాషల్లో అనువదించి, రిలీజ్ చేయాలనుకుంటున్నారు. వచ్చే ఏడాది ‘వైట్’ విడుదల కానుంది. -
భర్తతో కలిసి కాస్ట్ లీ కారు కొన్న హీరోయిన్
హిందీలో అడపాదడపా సినిమాలు చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ సోనాక్షి సిన్హా(Sonakshi Sinha). ప్రముఖ నటుడు శత్రుఘ్ని సిన్హా వారసురాలిగా ఇండస్ట్రీలోకి వచ్చింది. సల్మాన్ ఖాన్ 'దబంగ్' మూవీతో పరిచయమైన అద్భుతమైన హిట్ సొంతం చేసుకుంది.మంచి హిట్ సినిమాతో కెరీర్ మొదలుపెట్టినప్పటికీ తర్వాత సరిగా ప్లాన్ చేసుకోలేకపోయింది. మధ్యలో రజనీకాంత్ తో కలిసి 'లింగా' అనే మూవీ చేసింది కానీ బ్యాడ్ లక్. దీనికి తోడు బొద్దుగా ఉండటం కూడా ఈమెకు మైనస్ అయిందని చెప్పొచ్చు. అలా అప్పుడో ఇప్పుడో అన్నట్లు సినిమాలు చేస్తూ వచ్చింది.(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 24 సినిమాలు) ఇకపోతే ఈమె తనతో పాటు నటించిన జహీర్ ఇక్బాల్(Zaheer Iqbal) అనే నటుడితో గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉంది. కానీ ఎక్కడా బయటపడకుండా జాగ్రత్త పడింది. గతేడాది జూలైలో పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత నుంచి ఎప్పటికప్పుడు వీళ్లిద్దరూ టూర్స్ వేస్తూనే ఉన్నారు.తాజాగా ఈ భార్యభర్తలిద్దరూ కొత్త బీఎండబ్ల్యూ కారు(BMW Car) కొనుగోలు చేశారు. ఈ విషయాన్ని జహీర్ తన ఇన్ స్టాలో పోస్ట్ పెట్టాడు. ఇకపోతే ఈ కారు ఖరీదు రూ.కోటి 30 లక్షలకు పైనే ఉంటుందని సమాచారం. సినిమాల విషయానికొస్తే సోనాక్షి నటించిన 'నికితా రాయ్' మే 30న విడుదల కానుంది. జహీర్ మాత్రం ప్రస్తుతానికి కొత్త ప్రాజెక్టులేం చేయట్లేదు.(ఇదీ చదవండి: ప్రియదర్శి 'సారంగపాణి జాతకం' రివ్యూ) View this post on Instagram A post shared by Zaheer Iqbal (@iamzahero) -
పాక్ నటుడికి బాలీవుడ్ బ్యూటీ సపోర్ట్.. వారిపై బ్యాన్ సరికాదంటూ!
పాకిస్తాన్ నటుడు ఫవాద్ ఖాన్ (Fawad Khan) బాలీవుడ్లో కమ్బ్యాక్ ఇచ్చేందుకు రెడీ అయ్యాడు. అతడు హీరోగా నటించిన అబీర్ గులాల్ మూవీ (Abir Gulal Movie) మే నెలలో విడుదల చేయాలనుకున్నారు. ఇంతలో జమ్మూకశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రదాడి జరగడంతో పాక్పై భారత్ తీవ్ర చర్యలకు పూనుకుంది. పాకిస్తాన్ సింధూనదీ జలాలు ఇచ్చేది లేదని నిర్ణయించుకుంది. అలాగే పాక్ నటులపై, వారి సినిమాలపై నిషేధం విధించింది.పాక్ నటులపై ద్వేషం వద్దుఅబీర్ గులాల్ మూవీని భారత్లో బ్యాన్ చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఫవాద్ ఖాన్ రీఎంట్రీ పట్ల బాలీవుడ్ బ్యూటీ దియా మీర్జా (Dia Mirza) సంతోషం వ్యక్తం చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అందులో దియా మాట్లాడుతూ.. నటులపై బ్యాన్ విధించడం సరి కాదు. సినిమా, స్పోర్ట్స్ను ద్వేషంతో చూడకూడదు. ఫవాద్ తిరిగి రావడం సంతోషకరం. త్వరలోనే మనమంతా అతడిని వెండితెరపై చూడబోతున్నాం. తర్వాత అతడికి మరిన్ని మంచి అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను అని చెప్పుకొచ్చింది. ఈ వీడియోపై నెట్టింట ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి.ఇక చాలు ఆపండిపాక్ నటుడికి సపోర్ట్ చేయడమేంటని పలువురూ దిశాను ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో ఆమె సోషల్ మీడియా వేదికగా తన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చింది. వాస్తవాలను తప్పుగా చూపించడం ఆపండి. ఏప్రిల్ 10న నా సినిమా కోసం ఈ ఇంటర్వ్యూ చేశాను. అంటే ఉగ్రదాడి జరగడానికి చాలా కాలం ముందు మాట్లాడిన వ్యాఖ్యలివి. వాటిని ఇప్పుడు తీసుకొచ్చి, అసందర్భంగా ప్రచారం చేయడం ఆపండి. ఇది అనైతికం.. అలాగే తీవ్ర అభ్యంతరకరం కూడా! అని రాసుకొచ్చింది. బాలీవుడ్లో అనేక సినిమాలు చేసిన ఈ బ్యూటీ తెలుగులో వైల్డ్ డాగ్ చిత్రంలో యాక్ట్ చేసింది. ఇకపోతే ఏప్రిల్ 22న జరిగిన పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది చనిపోయారు. పలువురు గాయపడ్డారు.చదవండి: ప్రభాస్ ది రాజాసాబ్.. టీజర్ రిలీజ్పై హింట్ ఇచ్చిన డైరెక్టర్! -
రామాయణ.. సాయిపల్లవి కంటే ముందు నాకే ఛాన్స్..: శ్రీనిధి
రామాయణ సినిమాలో సాయిపల్లవి కంటే ముందు కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty)కే సీతగా నటించే ఛాన్స్ వచ్చిందని అప్పట్లో రూమర్స్ వచ్చాయి. తాజాగా ఈ పుకార్లపై స్పందించిన శ్రీనిధి అవి నిజమేనంటోంది. హిట్ 3 సినిమా ప్రమోషన్స్లో శ్రీనిధి శెట్టి మాట్లాడుతూ.. రామాయణ సినిమా షూటింగ్ ఆల్రెడీ మొదలైంది కాబట్టి ఇప్పుడీ విషయం చెప్పొచ్చనే అనుకుంటున్నాను.స్క్రీన్ టెస్ట్ పూర్తిరామాయణ సినిమా (Ramayana Movie)లో మొదట నన్నే సీతగా అనుకున్నారు. స్క్రీన్ టెస్ట్ కూడా చేశారు. మూడు సన్నివేశాల కోసం నేను ప్రాక్టీస్ కూడా చేశాను. నా యాక్టింగ్కు మంచి స్పందనే వచ్చింది. అందరూ నా నటనను చూసి మెచ్చుకున్నారు. యష్ కూడా ఈ సినిమాలో భాగమవుతున్నాడని తెలిసింది. సరిగ్గా అప్పుడే కేజీఎఫ్ 2 రిలీజైంది. మా జోడీ జనాలకు బాగా నచ్చేసింది. అలాంటప్పుడు ఈ మూవీలో యష్ రావణుడిగా.. నేను సీతగా నటిస్తే జనాలు ఎలా స్వీకరిస్తారని ఆలోచించాను. అవకాశం చేజారిందంటే..కచ్చితంగా వాళ్లు మమ్మల్నిలా చూసి జీర్ణించుకోలేరేమో అనిపించింది. ఈ సినిమా మాకు వర్కవుట్ అవొచ్చు, కాకపోవచ్చు అనుకున్నాను. ఏదేమైనా సీత పాత్రకు సాయిపల్లవి (Sai Pallavi) పూర్తి న్యాయం చేయగలదు. తనను సీతగా చూసేందుకు ఎదురుచూస్తున్నాను. మనకు ఏదైనా కలిసొచ్చిందంటే (అవకాశం వచ్చిందంటే) సంతోషపడాలి.. అది చేజారిందంటే.. ఇంకోచోట మనకోసం ఏదో అవకాశం వేచి ఉందని అనుకోవాలి. ఈ సిద్ధాంతాన్ని నేను బాగా నమ్ముతాను అని చెప్పుకొచ్చింది.సినిమాశ్రీనిధి శెట్టి.. కేజీఎఫ్ 1, కేజీఎఫ్ 2 సినిమాలతో బ్లాక్బస్టర్ విజయాల్ని అందుకుంది. ఈ బ్యూటీ హిట్: ద థర్డ్ కేస్తో టాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వనుంది. నాని హీరోగా, శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ మూవీ మే 1న విడుదల కానుంది.చదవండి: బిగ్బాస్ షో హోస్ట్గా మళ్లీ..? నాని ఆన్సర్ ఇదే! -
కేంద్రం మరో సంచలన నిర్ణయం.. పాక్ నటులు, సినిమాలపై నిషేధం
న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి (Pahalgam Terror Attack) నేపథ్యంలో పాకిస్తాన్కు భారత్ వరుస కౌంటర్లు ఇస్తోంది. ఇప్పటికే సింధూనదీ జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. తాజాగా పాక్ సినిమాలు, నటులపైనా నిషేధం విధించింది. పాకిస్తాన్ నటుడు ఫవాద్ ఖాన్ హీరోగా నటించిన 'అబీర్ గులాల్' (Abir Gulaal Movie) అనే హిందీ సినిమా భారత్లో విడుదల చేయకూడదని కేంద్ర సమాచార శాఖ నిర్ణయం తీసుకుంది.పాక్ హీరో.. బాలీవుడ్ సినిమాఅబీర్ గులాల్ సినిమా విషయానికి వస్తే.. ఇందులో పాక్ నటుడు ఫవాద్ ఖాన్ హీరోగా నటించాడు. బాలీవుడ్ హీరోయిన్ వాణీ కపూర్ అతడికి జంటగా నటించింది. రిద్ధి డోగ్రా, లీసా హైడన్, ఫరీదా జలాల్, పర్మీత్ సేతి, సోనీ రజ్దాన్ కీలక ప్రాతలు పోషించారు. ఆర్తి ఎస్. బగ్దీ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను వివేక్ అగర్వాల్, అవంతిక హారి, రాకేశ్ సిప్పీ, ఫిరూజీ ఖాన్ నిర్మించారు. అమిత్ త్రివేది సంగీతం అందించాడు. ఈ చిత్రాన్ని మే 9న విడుదల చేయాలనుకున్నారు. కానీ ఇంతలో పహల్గాంలో ఉగ్రదాడి జరగడంతో యావత్ దేశం పాక్పై ఆగ్రహంతో ఊగిపోతోంది. ఈ నేపథ్యంలో పాక్ నటుడు యాక్ట్ చేసిన అబీర్ గులాల్ సినిమాపై కేంద్ర ప్రభుత్వం బ్యాన్ విధించింది. ఫవాద్ ఖాన్.. ఏ దిల్ హై ముష్కిల్ (2016) అనే ఇండియన్ సినిమాలో చివరిసారిగా కనిపించాడు.చదవండి: పాకిస్తాన్ సైన్యంలో ఫౌజీ హీరోయిన్ తండ్రి? క్లారిటీ ఇచ్చిన ఇమాన్వి -
పాకిస్తాన్ సైన్యంలో ఫౌజీ హీరోయిన్ తండ్రి? క్లారిటీ ఇచ్చిన ఇమాన్వి
ప్రభాస్ ఫౌజీ సినిమా హీరోయిన్ ఇమాన్వి (Imanvi)పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జమ్మూ కశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రదాడి (Pahalgam Terror attack) జరిగిన నేపథ్యంలో.. పాకిస్తాన్పై జనం ఆక్రోశంతో ఉన్నారు. ఈ క్రమంలో హీరోయిన్ ఇమాన్వి కుటుంబానిది పాకిస్తాన్ నేపథ్యం అని ఓ వార్త వైరలవుతోంది. ఇమాన్వి తండ్రి గతంలో పాకిస్తాన్ మిలటరీలో పని చేశాడని.. వీళ్లది కరాచీ అని సదరు వార్త సారాంశం. చాలా మంది ఇదే నిజమని భ్రమపడి.. పాక్ అమ్మాయి అయిన ఇమాన్వీని ఫౌజీ నుంచి తీసేయాలని డిమాండ్ చేశారు.తీవ్రంగా ఖండిస్తున్నా..ఈ క్రమంలో సదరు వార్తలపై ఇమాన్వి క్లారిటీ ఇచ్చింది. "పహల్గామ్లో జరిగిన విషాద సంఘటన పట్ల నేను హృదయపూర్వక సంతాపాన్ని తెలియజేస్తున్నాను. ఈ ఉగ్రదాడిలో అమాయకులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. ఈ హింసాత్మక చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. అదే సమయంలో నా గురించి, నా కుటుంబం గురించి జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఖండించాలనుకుంటున్నాను. నా కుటుంబంలో ఎవరికీ పాకిస్తానీ మిలిటరీతో ఎటువంటి సంబంధం లేదు. కేవలం ద్వేషాన్ని రగిలించడం కోసమే ఇలా అబద్ధాలు పుట్టించారు.దుష్ప్రచారందీన్ని క్రాస్ చెక్ చేసుకోకుండా కొన్ని మీడియా సంస్థలు ఆ అబద్ధాలను వ్యాప్తి చేయడం బాధాకరం. నా పై దుష్ప్రచారం చేశారు. నేను భారతీయ మూలాలున్న అమెరికన్ వాసిని. హిందీ, తెలుగు, గుజరాతీ, ఇంగ్లీష్ మాట్లాడగలను. నా తల్లిదండ్రులు యువతగా ఉన్నప్పుడు అమెరికాకు వలస వచ్చారు. తర్వాత అమెరికా పౌరులుగా మారారు. నేను లాస్ ఏంజిల్స్.. కాలిఫోర్నియాలో జన్మించాను.నా రక్తంలోనూ..USAలో నా యూనివర్సిటీ విద్య పూర్తి చేసిన తర్వాత నటిగా, కొరియోగ్రాఫర్గా, డ్యాన్సర్గా కళారంగంలో వృత్తిని కొనసాగించాను. అనంతరం భారతీయ చలనచిత్ర పరిశ్రమలో పని చేసే అవకాశాలను అందుకోవడం గర్వంగా భావిస్తున్నాను. సినిమా నా జీవితంలో గొప్ప ప్రభావాన్ని చూపింది. భారతదేశంపై ప్రేమ, భక్తి నా రక్తంలోనూ ప్రవహిస్తోంది" అని ఇమాన్వి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టింది. View this post on Instagram A post shared by Imanvi (@imanvi1013) చదవండి: ఉగ్రదాడిపై సాయి పల్లవి ట్వీట్.. మండిపడ్డ నెటిజన్స్! -
సినిమా హిట్.. కలెక్షన్స్ మాత్రం దారుణం
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్(Akshay Kumar).. ఏడాదికి కచ్చితంగా మూడు నాలుగు సినిమాలైనా రిలీజ్ చేస్తుంటాడు. అలాంటిది ఇతడికి గత నాలుగేళ్లుగా సరైన హిట్ అన్నది లేకుండా పోయింది. 20కి పైగా చిత్రాల్లో నటిస్తే మధ్యలో ఒకటి కాస్త పర్వాలేదనిపించుకోగా.. ఇన్నాళ్లకు 'కేసరి 2'(Kesari 2) రూపంలో అద్భుతమైన హిట్ దక్కింది. కానీ వసూళ్లే దారుణంగా ఉన్నాయి.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు మిస్టరీ థ్రిల్లర్)చిన్నాచితకా హీరోలైతే కాస్త నిదానంగా వసూళ్లు వస్తాయి. కానీ స్టార్ హీరోల సినిమాలకు హిట్ టాక్ వస్తే మంచి నంబర్స్ నమోదు అవుతుంటాయి. కానీ అక్షయ్ కుమార్ 'కేసరి 2' పరిస్థితి మాత్రం చాలా విచిత్రంగా ఉంది. ఎందుకంటే రిలీజైన రోజే పాజిటివ్ టాక్ వచ్చింది. ఉత్తరాది సైట్లన్నీ 3కి పైగా రేటింగ్ కూడా ఇచ్చాయి. కానీ జనాలు ఎందుకో దీన్ని చూసేందుకు ఆసక్తి చూపించట్లేదు.ఇప్పుడు దీనికి నిదర్శనం అన్నట్లు ఐదు రోజుల్లో రూ.39.16 కోట్ల నెట్ కలెక్షన్స్(Movie Collection) మాత్రమే వచ్చాయి. ఈ విషయాన్ని సదరు నిర్మాణ సంస్థనే అధికారికంగా ప్రకటించింది. మాస్ ప్రేక్షకుల్ని ఆకట్టుకునే అంశాలు లేకపోవడం ఈ చిత్రానికి ఓ రకంగా మైనస్ అని చెప్పొచ్చు. కోర్ట్ రూమ్ డ్రామా కావడంతో ఓటీటీలోకి వచ్చాక చూద్దాంలే అనే ఆలోచనతో చాలామంది ప్రేక్షకులు భావిస్తున్నట్లు అనిపిస్తుంది.(ఇదీ చదవండి: ఇంతకీ ప్రవస్తి ఆరాధ్య ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి?)బహుశా ఇలాంటి కారణాల వల్లే సినిమా హిట్ అయినా కలెక్షన్స్ మాత్రం రోజురోజుకీ డ్రాప్ అవుతూ వస్తున్నాయి. అక్షయ్ గత చిత్రాల ఫ్లాప్ ప్రభావం దీనిపై పడిందా అనే సందేహం కూడా వస్తోంది. ఇకపోతే ఈ మూవీ ఓటీటీ హక్కుల్ని జియో హాట్ స్టార్ సొంతం చేసుకుంది. రెండు నెలల తర్వాతే స్ట్రీమింగ్ ఉండే అవకాశాలున్నాయి. ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే రూ.100 కోట్ల మార్క్ అందుకోవడానికి ఇంకెన్ని రోజులు పడుతుందో ఏంటో?(ఇదీ చదవండి: సునీత మేడం.. వీటికి సమాధానం చెప్పండి: ప్రవస్తి) -
ఆడవారికి ముద్దులు.. ఆయనది వంకరబుద్ధి.. నేనైతే చితకబాదేవాడిని!
అభిమానులతో సెల్ఫీలు దిగుతారు, ఆటోగ్రాఫ్లు ఇస్తారు.. కానీ ఈ సింగర్ మాత్రం ఏకంగా వారికి ముద్దులు పెట్టేశాడు. అతడే ప్రముఖ బాలీవుడ్ గాయకుడు ఉదిత్ నారాయణ్. ఆ మధ్య ఈయన ఓ షోలో.. సెల్ఫీ తీసుకోవడానికి వచ్చిన మహిళా అభిమానులకు ముద్దులు పెట్టడం వివాదంగా మారింది. తాజాగా ఈ వివాదంపై సింగర్ అమిత్ టండన్ (Amit Tandon) స్పందిస్తూ.. ఉదిత్కు వయసుతో పాటు వంకర బుద్ధి కూడా పెరిగిందని వ్యాఖ్యానించాడు.ఆయనది వక్రబుద్ధిఅమిత్ మాట్లాడుతూ.. ఉదిత్ నారాయణ్ (Udit Narayan) పాటలంటే నాకు చాలా ఇష్టం. కానీ ఆయనకు వంకర బుద్ధి ఉంది. ఇలా చెప్పొచ్చే, లేదో నాకు తెలీదు కానీ, ఏ పరిస్థితినైనా ఆయన అడ్వాంటేజ్గా తీసుకుంటాడు. నేను కూడా చాలా షోలు చేశాను. అభిమానులు నాకు దగ్గరగా వచ్చేందుకు ప్రయత్నించేవారు. వారిని మనం ఎంత దగ్గరకు రానివ్వాలి? ఎక్కడ ఉంచాలన్నది మన చేతుల్లోనే ఉంటుంది. ఏదైనా సరే లిమిట్లోనే ఉండాలి.హద్దుల్లో ఉంటే బెటర్ఒకవేళ నేనే గనక నా ప్రియురాలు లేదా భార్యతో అతడి షోకు వెళ్లాననుకోండి. నా పార్ట్నర్ ఆయనతో ఫోటో తీసుకుంటుంటే దాన్ని ఆయన అడ్వాంటేజ్గా తీసుకుని ముద్దు పెడితే మాత్రం ఊరుకునేవాడిని కాదు. కచ్చితంగా అతడిని చితకబాదేవాడిని. అయితే గాయకుడిగా మాత్రం నాకు ఆయనపై విపరీతమైన గౌరవం ఉంది. కాకపోతే మనకంటూ కొన్ని పరిమితులు గీసుకుంటే మంచిది. హద్దులు దాటకుండా ఉంటేనే అందరికీ ఉత్తమం.తండ్రి అలా.. కొడుక్కేమో యాటిట్యూడ్ఉదిత్ కుమారుడు అదిత్ నారాయణ్ ఓ షోలో జనాలపైకి మైక్ విసరడం చూశాను. ఏదేమైనా సరే హుందాగా ప్రవర్తించాలే తప్ప ఇలా యాటిట్యూడ్ చూపించకూడదు. అదిత్ నాకు వ్యక్తిగతంగా తెలియదు.. బహుశా అతడు మంచివాడు కావచ్చు. కానీ సోషల్ మీడియాలో చూస్తున్న విజువల్స్లో మాత్రం తనకు యాటిట్యూడ్ ఉందని ఇట్టే అర్థమవుతోంది అని అమిత్ చెప్పుకొచ్చాడు.చదవండి: పహల్గాంలోనే ఉన్నా.. పరిస్థితి ఇప్పుడెలా ఉందంటే: ఆర్జే కాజల్ -
ఆలయాల్లో పూజలు అందుకుంటున్న సినీతారలు వీరే...
దేశవ్యాప్తంగా తన అందం, నృత్యాల ద్వారా పేరు తెచ్చుకున్న ఊర్వశి రౌతాలా తన పేరును జనం మర్చిపోకుండా చేయడాన్ని కూడా తన దినచర్యలో భాగం చేసుకుంది. ‘ఢిల్లీ యూనివర్శిటీలోని విద్యార్థులు తన ఫోటోలపై దండలు వేసి ‘‘దమ్దమమై’’ అని పిలుస్తారని ఆమె చెప్పింది. అంతేనా...నా పేరు మీద ఒక ఆలయం ఉంది భక్తులు నా ఆలయంలో పూజలు చేస్తున్నారు’’అంటూ ప్రకటించడంతో ఆమె తనను తాను వార్తల్లో వ్యక్తిగా మరోసారి దిగ్విజయంగా నిలబెట్టుకున్నారు. భక్తులు నిజంగా ఆమె ఆశీర్వాదాలు కోరుకుంటున్నారా? అని అడిగినప్పుడు, ఊర్వశి, ‘అబ్ మందిర్ హై తో వో హాయ్ తో కరేంగే (ఇది దేవాలయం, వారు మాత్రమే చేస్తారు)‘ అని చెప్పింది. అంతేకాదు దక్షిణాదిలో కూడా నా పేరిట ఓ ఆలయం రావాలి, చిరంజీవితో, బాలకృష్ణతో కూడా పనిచేశా.విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న వారితో కలిసి పనిచేశాను కాబట్టి దక్షిణాదిలో కూడా, నా ఆలయం త్వరలో వస్తుంది, అంటూ ఊహాలోకాల్లో తేలిపోయింది.ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాల్ని ప్రస్తావించిన ఊర్వశి ఉత్తరాఖండ్లోని ప్రసిద్ధ బద్రీనాథ్ ఆలయం సమీపంలో తన పేరు మీద ఒక ఆలయాన్ని నిర్మించారని, బద్రీనాథ్ని సందర్శిస్తే, దాని పక్కనే ’ఊర్వశి ఆలయం’ ఉంది అని చెప్పడం తీవ్ర వివాదాస్పదంగా మారింది. దీంతో అక్కడి ఆలయ అర్చకులు ఆమెపై మండిపడుతున్నారు. ఆమెపై న్యాయ పోరాటం చేస్తామంటున్నారు. ఈ నేపధ్యంలోనే మరోసారి దేశవ్యాప్తంగా తారల ఆలయాలు చర్చనీయాంశంగా మారాయి. హిందూ మతంలో అసంఖ్యాకమైన దేవతలను పూజిస్తారు. అలాగే తమకు నచ్చిన మనిషిని కూడా దేవుడు/దేవతగా పూజిస్తారు. అంతేకాదు తమ ప్రేమ అభిమానాన్ని చూపించడానికి వారికి గుడులు కూడా నిర్మిస్తారు. ఆ క్రమంలో దేశం నలుమూలల ఆలయాలున్న వేలకొద్దీ దేవతలే కాకుండా, సినీ తారలు, క్రీడాకారులు, రాజకీయ నాయకులు మొదలైన ప్రముఖుల కోసం కూడా ఆలయాలను వారి అభిమానులు నిర్మించి నిర్వహిస్తున్నారు. అలాంటి ఆలయాలలో కొన్నింటి గురించి...అమితాబ్ ఆలయం– ‘షాహెన్షా ఆఫ్ బాలీవుడ్‘ అని పిలుచుకునే అమితాబ్కు, కోల్కతాలో ఒక ఆలయం నిర్మించారు. భారతీయ సినిమాకు ఆయన చేసిన ప్రభావవంతమైన సేవలను కీర్తిస్తూ భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు.–తమిళ లెజెండరీ సూపర్స్టార్ రజనీకాంత్కు తమిళనాడులోనే కాకుండా భారతదేశం అంతటా భారీ సంఖ్యలో అభిమానులున్నారు. కర్నాటకలోని కోలార్ లో రజనీకాంత్ ఆలయం ఉంది.–ఖుష్బూ సుందర్ తమిళనాడులో అభిమానులు తన పేరు మీద దేవాలయాన్ని నిర్మించిన మొదటి భారతీయ నటిగా గుర్తింపు పొందింది, అయితే. వివాహానికి ముందు సాన్నిహిత్యంపై ఆమె వివాదాస్పద ప్రకటన తర్వాత ఈ ఆలయం తొలగించారు.–దివంగత నటి శ్రీదేవి, తరచుగా భారతీయ సినిమా మొదటి మహిళా సూపర్స్టార్, ఆమె జ్ఞాపకార్థం ముంబైలో ఒక ఆలయం ఉంది.–ఆంధ్రప్రదేశ్కు చెందిన ప్రముఖ నటుడు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావుకు ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో ఒక దేవాలయం ఉంది.–భారతదేశం వెలుపల, ప్రత్యేకించి సోవియట్ యూనియన్ ఇతర తూర్పు యూరోపియన్ రాష్ట్రాల్లో భారతీయ సినిమాని తీసుకెళ్లిన దివంగత నటశిఖరం రాజ్ కపూర్కి జైపూర్లో దేవాలయం ఉంది.–అందం, తెలివితేటలతో పాటు నటనా ప్రతిభకు ప్రసిద్ధి చెందిన ఐశ్వర్య రాయ్ కు కూడా ఆలయం ఉంది. కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరులో దీనిని నిర్మించారు.–‘కింగ్ ఖాన్‘ లేదా ‘ది లాస్ట్ సూపర్ స్టార్ ఆఫ్ ఇండియన్ సినిమా‘ అని పేర్కొనే ‘కింగ్ ఆఫ్ బాలీవుడ్‘ షారుఖ్ ఖాన్ కు కోల్కతాలో ఆలయం ఉంది.–కోవిడ్ సమయంలో అత్యంత ఉదారంగా సేవా కార్యక్రమాలు నిర్వహించాడు నటుడు సోనూసూద్. దాంతో ఆయన పేరిట తెలంగాణలోని సిద్ధిపేటలో ఒక ఆలయాన్ని నిర్మించారు. ప్రదర్శించిన నటనకు కాకుండా చూపించిన మంచితనానికి బదులుగా ఆలయం కట్టించుకున్న ఏకైక నటుడు సోనూసూద్ మాత్రమే. అలాగే సినిమాల్లో ప్రతినాయక పాత్రధారుల్లో కూడా మరెవరికీ ఆ ఘనత దక్కలేదు.–తాజా అందాల బ్యూటీ నిధి అగర్వాల్ రెండేళ్ల క్రితమే తమిళ సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అయితే స్వల్పకాలంలోనే అపారమైన క్రేజ్ అందుకుంది. చెన్నైలోని ఆమె అభిమానులు ఆమెకు ఆలయాన్ని నిర్మించి, ఫిబ్రవరి 14న, ప్రత్యేక పూజలు చేశారు.– ఆమె 36వ పుట్టినరోజున, నటి సమంతా రుత్ ప్రభు కు ఆంధ్రప్రదేశ్లో ఆలయం నిర్మించారు. సందీప్ అనే ఆమె అభిమాని ఆంధ్రప్రదేశ్లోని బాపట్లలోని తన ఇంట్లోనే ఆమెకు గుడి కట్టించాడు.– ఒకప్పటి అగ్రనటి నమిత పాపులారిటీ ఎంతలా ఉండేదంటే...ఆమె అభిమానులు తమిళనాడు అంతటా ఆమె గౌరవార్థం ఒకటి కాదు ఏకంగా మూడు ఆలయాలను నిర్మించారు.– ఉత్తరాఖండ్లోని ప్రసిద్ధ బద్రీనాథ్ ఆలయం సమీపంలో తన పేరు మీద ఒక ఆలయాన్ని నిర్మించారని ఇటీవల ఊర్వశి రౌతాలా వెల్లడించింది.అంతేకాదు దక్షిణాదిలో కూడా నా పేరిట ఓ ఆలయం రావాలి, చిరంజీవితో, బాలకృష్ణతో కూడా పనిచేశా.విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న వారితో కలిసి పనిచేశాను కాబట్టి దక్షిణాదిలో కూడా, నా ఆలయం త్వరలో వస్తుంది, అంటూ ఊహాలోకాల్లో తేలిపోయింది.వద్దన్నవారూ ఉన్నారు...గత పదేళ్లుగా, హన్సిక మోత్వానికి సినీ పరిశ్రమతో అనుబంధం ఉంది. పడికథవన్ సినిమాతో కోలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తర్వాత హన్సికను నటి ఖుష్బు సుందర్తో పోల్చడం మొదలుపెట్టారు. ఆ సమయంలో ఆమె మద్దతుదారులు మదురైలో ఆలయాన్ని నిర్మించాలని భావించారు. ఖుష్భూ, నమిత తర్వాత గుడిలో దేవతగా మారే అవకాశం ఈ ఆలోచనను హన్సిక తిరస్కరించినందున కోల్పోయింది. అలాగే లేడీ సూపర్స్టార్ నయనతార గౌరవార్థం ఆమెకు గుడి కట్టడానికి అనుమతి కోసం నటిని అభిమానులు సంప్రదించినప్పుడు. ఆమె ఆఫర్ను ఉదారంగా తిరస్కరించింది. ఆమె గత సంవత్సరం తమిళ చిత్రం మూకుతి అమ్మన్లో దేవతగా నటించడం విశేషం.సచిన్ టెండూల్కర్ టెంపుల్, పూణేభారతదేశంలో క్రికెట్ ఒక మతం, మరియు సచిన్ టెండూల్కర్ దాని అత్యంత గౌరవనీయమైన దేవుళ్ళలో ఒకరు. ఇది భారతదేశంలోని భావోద్వేగ క్రికెట్ అభిమానులచే మరొక నినాదంగా కొట్టివేయబడి ఉండవచ్చు, అయితే పూణేలోని ఒక దేవాలయం ఈ క్రికెట్ లెజెండ్కు అంకితం చేయబడింది, ఇక్కడ అభిమానులు ‘మాస్టర్ బ్లాస్టర్‘కి నివాళులర్పించడానికి గుమిగూడారు, భారత క్రికెట్ అభిమానులు తమ క్రికెట్ విగ్రహాన్ని తమ దష్టిలో ఎంత ఉన్నతంగా ఉంచుకుంటారో చెప్పడానికి ఇది నిదర్శనం.ఎం.ఎస్. ధోని టెంపుల్, రాంచీభారత క్రికెట్ మాజీ కెప్టెన్ ఎం.ఎస్. ధోని భారతదేశం యొక్క అత్యంత విజయవంతమైన మరియు ఆకర్షణీయమైన క్రికెటర్లలో ఒకడు మాత్రమే కాదు, ముఖ్యంగా ఒత్తిడిలో ఉన్నప్పుడు దేశం యొక్క చక్కని కెప్టెన్ కూడా. అందువల్ల, భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా భారీ ఫాలోయింగ్ కలిగి ఉండటంలో ఆశ్చర్యం లేదు. అతను జార్ఖండ్ నుండి మొదటి మరియు అత్యంత విజయవంతమైన క్రికెటర్లలో ఒకడు, మరియు అతని అభిమానులు M. . అతని స్వస్థలమైన రాంచీలో ధోనీ ఆలయం. అతని నాయకత్వం మరియు క్రికెట్ విజయాల పట్ల అతని అభిమానులు కలిగి ఉన్న ఆరాధనకు ఈ ఆలయం ఒక అభివ్యక్తి. -
RRRలో నటించా.. జెప్టో యాడ్లో కూడా నేనే.. : ఎన్టీఆర్ డూప్
ఓపక్క సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూనే మరోపక్క నటుడిగా ప్రయత్నిస్తున్నాడు ఈశ్వర్ హారిస్. అంతేకాదు.. టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్కు బాడీ డబుల్ (డూప్)గా కూడా చేస్తున్నాడు. అంటే కొన్ని సీన్లలో తారక్ స్థానంలో ఈయనే నటిస్తాడన్నమాట! తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈశ్వర్ (Eshwar Harris).. పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.అలా ఆర్ఆర్ఆర్లో అవకాశంఅతడు మాట్లాడుతూ.. జార్జ్ రెడ్డి సినిమాలో విలన్గా చిన్న పాత్రలో నటించాను. కొత్తపోరడు, పులిమేక వంటి వెబ్సిరీస్లు చేసుకుంటూ వచ్చాను. ఆచార్యలో రామ్చరణ్ ఫ్రెండ్గా నటించాను. అయితే ఎడిటింగ్లో నా సీన్లు పోయాయనుకోండి. కానీ ఆ సినిమా షూటింగ్ సమయంలో ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చి నువ్వు జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) లాగే ఉన్నావ్ అన్నాడు. రాజమౌళి టీమ్ నీ గురించి నెల రోజుల నుంచి వెతుకుతున్నారు అని చెప్పాడు. అలా ఆర్ఆర్ఆర్ మూవీలో భాగమయ్యాను.కొమురం భీముడో పాటలో..ఉదయం 6 గంటలకల్లా సెట్స్లో ఉండాలనేవారు. ఓరోజు నేను రావడం ఐదు నిమిషాలు ఆలస్యమయ్యేసరికి వందల ఫోన్ కాల్స్ వచ్చాయి. రాజమౌళి ఆరింటికే షూటింగ్ మొదలుపెట్టేస్తాడు. చాలా పక్కాగా ఉంటాడు. కొమురం భీముడో పాటలో మూడు, నాలుగు షాట్స్ నావే ఉంటాయి. తారక్ అన్న స్థానంలో నన్ను వేలాడదీశారు.. నా కాళ్లు, చేతులకు రక్తం కారే సన్నివేశాలు షూట్ చేశారు. ఆ పాటలో కాళ్లు, చేతులు నావే కనిపిస్తాయి. ఫైటింగ్స్లాంటివైతే నేనేం చేయలేదు.వార్ 2 కోసం అడిగారుమొన్న వార్ 2 సినిమా (War 2 Movie) కోసం అడిగారు. అర్జంట్గా ముంబై వచ్చేయాలన్నారు. కానీ విమానయాన ఛార్జీలకు కూడా డబ్బులివ్వనన్నారు. మనకన్నా బాలీవుడ్ దారుణంగా ఉందనిపించింది. రెమ్యునరేషన్ నచ్చకపోవడంతో రానని చెప్పేశాను. ఈ మధ్యే జూనియర్ ఎన్టీఆర్.. జెప్టో యాడ్ కూడా చేశాను. జూనియర్ ఎన్టీఆర్ అన్నను చూడగానే నాకు ఒక పాజిటివ్ వైబ్ వస్తుంది. సింగిల్ టేక్లో చాలా సింపుల్గా నటిస్తాడు.జెప్టో యాడ్ చేశా..అయితే యాడ్ షూటింగ్ అప్పుడు ఆయనకు కాస్త జ్వరం వచ్చింది. పైగా డైట్లో ఉన్నాడు. అసలే వార్ 2లో హృతిక్ రోషన్ను మ్యాచ్ చేయాలి కదా మరి! హృతిక్ను మ్యాచ్ చేయడమంటే మామూలు విషయం కాదు. జెప్టో యాడ్లో క్యారవాన్ ఇచ్చి మంచి భోజనం పెట్టి తారక్ అన్నతో సమానమైన గౌరవం ఇచ్చారు. బాడీ డబుల్గా చేసినప్పుడు సినిమాను బట్టి లక్షల్లో పారితోషికం ఇస్తారు అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈశ్వర్.. భీమా, స్వయంభూ వంటి పలు చిత్రాలు చేస్తున్నాడు. View this post on Instagram A post shared by Eshwar Harris (@eshwar_harris) చదవండి: సునీత మేడం.. వీటికి సమాధానం చెప్పండి: ప్రవస్తి -
పహల్గాం ఉగ్రదాడి.. తృటిలో తప్పించుకున్న నటి..నెటిజన్స్ ఫైర్!
జమ్ముకశ్మీర్లోని పహల్గాంలో మంగళవారం(ఏప్రిల్ 22)జరిగిన ఉగ్రదాడి (Pahalgam terror attack) నుంచి ప్రముఖ టెలివిజన్ నటి దీపికా కాకర్, ఆమె భర్త షోయబ్ ఇబ్రహీం తృటిలో తప్పించుకున్నారు. ‘ససురల్ సిమర్ కా’ సీరియల్తో పాపులర్ అయిన నటి దీపికా తన భర్త షోయబ్, కుమారుడు రుహాన్తో కలిసి కశ్మీర్లో విహార యాత్రకు వెళ్లారు. పర్యటనలో భాగంగా పహల్గాంకు కూడా వెళ్లారు. ఈ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకోవడంతో..దాడి సమయంలో వారు కూడా అక్కడే ఉన్నారేమోనని అభిమానులు ఆందోళన చెందారు. అయితే దాడి కంటే ముందే ఈ జంట కశ్మిర్ నుంచి ఢిల్లీకి చేరుకుంది.ఈ విషయాన్ని షోయబ్ ఇబ్రహీం తన ఇన్స్టాగ్రామ్ స్టోరీ ద్వారా అభిమానులకు తెలియజేశారు. ‘అందరికి హాయ్, మా గురించి మీరంతా ఆందోళన చెందుతున్నారు. మేము సురక్షితంగా ఉన్నాం. మంగళవారం ఉదయమే మేము కశ్మీర్ నుంచి బయల్దేరి సురక్షితంగా ఢిల్లీకి చేరుకున్నాం. ఎవరూ ఆందోళన పడకండి’ అని ఆయన పేర్కొనడంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. అయితే షోయబ్ పోస్ట్పై కొంతమంది నెటిజన్స్ విమర్శలు చేస్తున్నారు. సురక్షితంగా ఢిల్లీకి చేరామని చెబుతూనే.. ఈ పర్యటనపై వ్లాగ్ చేశామని, అది త్వరలోనే విడుదల చేస్తామని తెలిపారు. ఒకవైపు ఉగ్రదాడితో దేశమంతా బాధపడుతుంటే.. వ్లాగ్ గురించి ప్రచారం చేసుకోవడం ఏంటని నెటిజన్స్ మండిపడుతున్నారు. ఈ విషాద సమయంలో వ్లాగ్ గురించి చెప్పాల్సిన అవసరం ఏముందని కామెంట్స్ చేస్తున్నారు.కాగా, మినీ స్విట్జర్లాండ్గా పేరొందిన పహల్గాంలో మంగళవారం మధ్యాహ్నం ఉగ్రవాదులు అత్యంత ఘోరంగా దాడి చేశారు. మ్మూకశ్మీర్లోని పహల్గాంలో మంగళవారం ఉగ్రవాదులు తెగబడ్డారు. ప్రకృతి అందాలను తిలకించేందుకు వచ్చిన పర్యటకులపై పాశవికంగా దాడి చేసి 28 మందిని పొట్టన పెట్టకున్నారు. ఈ దాడి చేసింది తామేనంటూ లష్కరే ముసుగు సంస్థ టీఆర్ఎఫ్ ప్రకటించింది. View this post on Instagram A post shared by Dipika (@ms.dipika) -
మార్పులు... చేర్పులు
ప్రతి ఏడాది ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం గురించి ఆసక్తికరంగా ఎదురు చూస్తుంటారు. ఈ ఏడాది మార్చి 2న 97వ ఆస్కార్ అవార్డుల వేడుక లాస్ ఏంజిల్స్లో ఘనంగా జరిగింది. కాగా 98వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవానికి సంబంధించిన కీలక తేదీలు, కొన్ని కొత్త నియమ–నిబంధనలను అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ సంస్థ ప్రకటించింది. 98వ ఆస్కార్ అవార్డుల వేడుక 2026 మార్చి 15 (ఆదివారం)న నిర్వహించనున్నట్లు అకాడమీ ప్రతినిధులు వెల్లడించారు (భారతీయ కాలమానం ప్రకారం మార్చి 16 ఉదయం). ఇంకా ఆస్కార్ గవర్నర్ అవార్డ్స్ ప్రదానోత్సవాన్ని ఈ ఏడాది నవంబరు 16న నిర్వహించనున్నామని, డిసెంబరు 16న షార్ట్ లిస్ట్ జాబితాను వెల్లడిస్తామని, 2026 జనవరి 22న నామినేషన్స్ను ప్రకటిస్తామని అకాడమీ ప్రతినిధులు తెలిపారు. 2026 ఫిబ్రవరి 26న మొదలయ్యే ఫైనల్ ఓటింగ్ మార్చి 5న ముగుస్తుందని, ‘అచీవ్మెంట్ ఇన్ క్యాస్టింగ్’ అనే కొత్త విభాగాన్ని చేర్చామనీ, ఇంకా పలు విషయాలను అకాడమీ ప్రతినిధులు ఈ విధంగా పేర్కొన్నారు.అన్ని సినిమాలు చూడాల్సిందే! ఆస్కార్ అవార్డ్స్ కోసం ఫైనల్ ఓటింగ్లో పాల్గొనే సభ్యులు ఏ విభాగానికి అయితే ఓటింగ్ చేస్తున్నారో ఆ విభాగంలోని అన్ని చిత్రాలను చూసినట్లుగా అధికారికంగా ధ్రువీకరించేలా ఆస్కార్ కమిటీకి ఆధారాలు చూపాలి. అన్ని విభాగాలకు ఓటింగ్ చేయాలనుకుంటే, అన్ని విభాగాల్లోని చిత్రాలను ఫైనల్ రౌండ్లో పాల్గొనే ఆస్కార్ ఓటర్స్ కచ్చితంగా చూడాలి. ఫైనల్ రౌండ్లో ఓటింగ్ చేసే ఓటర్స్ సినిమాలను చూస్తున్నారో? లేదో ఆస్కార్ అకాడమీ స్క్రీనింగ్ రూమ్ ప్రతినిధులు గమనిస్తారు. ఒకవేళ ఓటర్స్ ఫిల్మ్ ఫెస్టివల్స్ లేదా మరేదైనా సందర్భంలో ఆస్కార్ నామినేషన్ చిత్రాలను చూసినట్లయితే ఆ ఆధారాలను కమిటీకి అందజేయాలి. ఆస్కార్ ఓటర్స్ దాదాపు పదివేల మంది ఉన్న విషయం తెలిసిందే. ఏఐ చిత్రాలకూ అవార్డ్స్ ‘ఏఐ’ (కృత్రిమ మేధ), డిజిటల్ సాధనాలతో రూపోందించబడిన చిత్రాలను కూడా ఆస్కార్ అర్హతకు పరిగణిస్తామని, అయితే మానవ నిర్మిత చిత్రాలకుప్రాముఖ్యత ఇస్తామని నిర్వాహకులు పేర్కొన్నారు. 2025లో జనవరి 1 నుంచి డిసెంబరు 30 వరకూ విడుదలైన సినిమాలు ఆస్కార్ అవార్డుల కోసం పరిగణిస్తారు. కాకపోతే మ్యూజిక్ విభాగంలో మాత్రం ఈసారి నామినేషన్ల సమయాన్ని కాస్త తగ్గించారు. ఇక దేశ పౌరుడు ఏ కారాణాల చేతనైనా మరో దేశానికి వలస వెళ్లినా లేదా శరణార్థిగా వెళ్లినా ప్రస్తుతం అతను నివసిస్తున్న దేశం తరఫున ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీకి అవార్డు కోసం దరఖాస్తు చేయవచ్చు. సినిమాటోగ్రఫీ విభాగంలో గత ఏడాది వరకూ డైరెక్ట్గా నామినేషన్స్ ప్రకటించేవారు. అయితే తొలిసారిగా షార్ట్ లిస్ట్ విధానాన్ని తీసుకువచ్చారు. ఇంకా యానిమేటేడ్ షార్ట్ ఫిల్మ్ విభాగంలోనూ చిన్నపాటి మార్పు జరిగింది. -
పహెల్ గామ్ దుర్ఘటన పై స్పందించిన రామ్ చరణ్
పహెల్ గామ్ దుర్ఘటనపై నటుడు రామ్ చరణ్ స్పందించాడు. పహెల్ గామ్లో జరిగిన ఉగ్రవాద దాడితో నేను దిగ్భ్రాంతికి గురయ్యాను, చాలా బాధపడ్డాను. ఇటువంటి సంఘటనలకు మన సమాజంలో స్థానం లేదు వాటిని తీవ్రంగా ఖండించాలి. బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను అంటూ హీరో రామ్ చరణ్ తన సానుభూతిని తెలిపాడు. Shocked and saddened by the terror attack in Pahalgam. Such incidents have no place in our society and should be strongly condemned.My prayers are with the families of those affected.— Ram Charan (@AlwaysRamCharan) April 22, 2025 -
ఖరీదైన కారు కొనుగోలు చేసిన నటి.. ధర ఎంతంటే?
సెక్రెడ్ గేమ్స్ వెబ్ సిరీస్తో ఫేమ్ తెచ్చుకున్న బాలీవుడ్ బ్యూటీ కుబ్రా సైత్. ఇటీవలే విడుదలైన షాహిద్ కపూర్ మూవీ దేవాలో కీలక పాత్రలో కనిపించింది. పూజా హేగ్డే హీరోయిన్గా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయింది. ఈ సినిమాలో కుబ్రా ఎస్సై పాత్రలో అభిమానులను ఆకట్టుకుంది. బెంగళూరుకు చెందిన ఈ బ్యూటీ బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. అంతకుముందు హిందీలో పలు చిత్రాలతో పాటు వెబ్ సిరీస్ల్లో నటించింది.తాజాగా ఈ ముద్దుగుమ్మ ఖరీదైన కారును కొనుగోలు చేసింది. ప్రముఖ కార్ల బ్రాండ్ అయిన మహీంద్రా ఈవీని సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. ఈ ఈవీ కారు ధర దాదాపు రూ.31 లక్షలకు పైగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపై తాను పెట్రోల్ బంకుల్లో వెయిట్ చేయాల్సిన అవసరం లేదని క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది కుబ్రా సైత్. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు బాలీవుడ్ భామకు అభినందనలు చెబుతున్నారు. View this post on Instagram A post shared by Kubbra Sait (@kubbrasait) -
ప్రియాంక చోప్రాకు అరుదైన గౌరవం.. ప్రపంచస్థాయి అవార్డ్కు ఎంపిక
బాలీవుడ్ హీరోయిన ప్రియాంక చోప్రా ప్రస్తుతం ఎస్ఎస్ఎంబీ29 సినిమాలో కనిపించనుంది. రాజమౌళి- మహేశ్ బాబు కాంబోలో వస్తోన్న తొలి చిత్రంలో ఈ ముద్దుగుమ్మ కీలక పాత్ర పోషించనుంది. ఇటీవలే ఒడిశాలో జరిగిన షూటింగ్ షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పంచుకుంది.అయితే తాజాగా ప్రియాంక చోప్రాకు అరుదైన ఘనతను దక్కించుకుంది. ప్రముఖ గోల్డ్ హౌస్ గాలా సంస్థ అందించే గ్లోబల్ వాన్గార్డ్ హానర్ అవార్డ్కు ఎంపికైంది. ఈ బాలీవుడ్ స్టార్తో పాటు హాలీవుడ్ రాపర్ మేగాన్ థీ స్టాలియన్, అకాడమీ అవార్డు దర్శకుడు ఆంగ్ లీ, చిత్రనిర్మాత జాన్ ఎంచు కూడా ఈ అవార్డ్కు ఎంపికయ్యారు. ఈ అవార్డ్ను ప్రపంచస్థాయిలో గుర్తింపు పొందిన లీడర్లకు అందించనున్నారు. ఈ అవార్డ్ను మే 10న లాస్ ఏంజిల్స్లోని మ్యూజిక్ సెంటర్లో జరిగే గోల్డ్ హౌస్ గాలా నాల్గవ వార్షిక సమావేశంలో ప్రియాంక చోప్రాను సత్కరించనున్నారు.గోల్డ్ హౌస్ గాలా- ఏ100 జాబితాను వెల్లడించనుంది. సంస్కృతి, వ్యాపారంలో అత్యంత ప్రభావవంతమైన 100 ఆసియా పసిఫిక్ లీజర్లను ప్రతి ఏటా ఎంపిక చేస్తారు. ఈ సంవత్సరం ఏ100 జాబితా మే 1న వెల్లడించనున్నాురు. ఈ వేడుకకు ముందు సినిమా, సాంకేతికత, మీడియాతో సహా వివిధ పరిశ్రమలకు చెందిన 600 మందికి పైగా అతిథులను ఆహ్వనించనున్నారు.కాగా.. 2000లో మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకున్న ప్రియాంక చోప్రా.. ఆ తర్వాత హిందీ సినిమాలో దాదాపు 25 ఏళ్ల తన కెరీర్లో రాణించింది. ఆ తర్వాత ప్రియాంక చోప్రా హాలీవుడ్లోనూ నటించింది. ప్రస్తుతం ఆమె ఆమె జాన్ సెనా, ఇద్రిస్ ఎల్బాతో కలిసి హాలీవుడ్ చిత్రం 'హెడ్స్ ఆఫ్ స్టేట్'లో కూడా కనిపించనుంది. -
ప్రాణ భయం.. వేరే దేశంలో ఇల్లు కొన్న 'దేవర' విలన్
ఆదిపురుష్, దేవర సినిమాల్లో విలన్ పాత్రలు చేసి తెలుగు ప్రేక్షకులకు కాస్త దగ్గరైన నటుడు నటుడు సైఫ్ అలీ ఖాన్(Saif Ali Khan). ఇకపోతే మూడు నెలల క్రితం ఇతడు తన ఇంట్లో ఉన్నప్పుడు ఓ దుండగుడు ఇతడిపై దాడి చేశాడు. తక్షణమే స్పందించడంతో తృటిలో ప్రాణాపాయం తప్పింది. ప్రస్తుతానికైతే అంతా సెట్ అయింది. కానీ సైఫ్ మనసులో మాత్రం భయం అలానే ఉండిపోయింది.దుండగుడి దాడి వల్ల బాగా భయపడిపోయిన సైఫ్ అలీఖాన్.. ఇంకెప్పుడైనా తనపై దాడి జరగొచ్చేమో అనుకుని ఖతార్ దేశంలో ఇల్లు(New House) కొనుక్కున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా ఇతడే బయటపెట్టాడు. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న సైఫ్.. ఇల్లు కొనడానికి గల కారణాన్ని కూడా బయటపెట్టాడు.(ఇదీ చదవండి: నా వీడియో చూపించడం కరెక్ట్ కాదు: సింగర్ హారిక)'అది నా హాలీడే హోమ్. అక్కడ ఇల్లు కొనుక్కోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఇక్కడి నుంచి జర్నీ సులభమవుతుంది. అక్కడ చాలా సేఫ్టీగా అనిపించింది. ఖతార్ అందమైన దేశం. అక్కడున్నప్పుడు చాలా రిలాక్స్ డ్ గా అనిపిస్తుంది. ఆ దేశంలో ఓ ఇంటికి మరో ఇంటికి చాలా దూరం ఉంటుంది. రీసెంట్ గా షూటింగ్ కోసం అక్కడికి వెళ్లినప్పుడు వాతావరణం కూడా అద్భుతంగా అనిపించింది. దీంతో అక్కడ ఇల్లు కొనేశాను. త్వరలో నా కుటుంబాన్ని కూడా అక్కడికి షిఫ్ట్ చేసేస్తా' అని సైఫ్ చెప్పుకొచ్చాడు.సైఫ్ విషయానికొస్తే.. చాలా ఏళ్ల నుంచి సినిమాలు చేస్తున్నాడు. కొన్నేళ్ల ముందు వరకు హీరోగా చేశాడు. ఇప్పుడు మాత్రం విలన్, సహాయ పాత్రలు చేస్తూ బిజీ అయిపోయాడు. ఇతడికి తొలి భార్య వల్ల సారా అలీఖాన్, ఇబ్రహీం సంతానం కలిగారు. కరీనా కపూర్(Kareena Kapoor)ని రెండో పెళ్లి చేసుకోగా.. ఇద్దరు కొడుకులు పుట్టారు. ఇకపోతే సైఫ్ నటించిన జ్యూయెల్ థీప్ మూవీ.. ఏప్రిల్ 25న నెట్ ఫ్లిక్స్ లో నేరుగా రిలీజ్ కానుంది.(ఇదీ చదవండి: తల్లిదండ్రులయిన నటుడు విష్ణు విశాల్, జ్వాలా గుత్తా) -
హృతిక్తో ఎన్టీయార్, హృతిక్ మాజీ భార్యతో రామ్చరణ్...
ఇటీవలి కాలంలో బాలీవుడ్, టాలీవుడ్ల మధ్య సంబంధాలు ఇంతింతై వటుడింతై అన్నట్టు అల్లుకుపోతున్నాయి.గతంలో ఎన్నడూ లేనంతగా బాలీవుడ్ తెలుగు సినిమా పరిశ్రమపై ప్రేమను కురిపిస్తోంది. రెండు చిత్ర పరిశ్రమలకు చెందిన ప్రముఖులు నిర్మాణం నుంచి నటన దాకా భాగం పంచుకుంటున్నారు. అదే క్రమంలో తాజాగా హృతిక్ రోషన్ జూనియర్ ఎన్టీయార్లు కలిసి వార్ 2లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఓ రకంగా ఆర్ఆర్ఆర్ చిత్రమే దీనికి కారణంగా చెప్పొచ్చు. తన నటన ద్వారా జాతీయంగా, అంతర్జాతీయంగానూ పేరు సాధించిన జూనియర్ ఎన్టీయార్..క్రేజ్ను వాడుకోవడానికే వార్ 2 చిత్ర నిర్మాతలు హృతిక్తో ఎన్టీయార్ ని కలిపి అరుదైన కాంబోని ప్లాన్ చేశారనుకోవచ్చు. ఈ నేపధ్యంలో బాలీవుడ్లో ఎన్టీయార్ హవా మొదలయే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు ఆర్ఆర్ఆర్ మల్టీస్టారర్లో నటించిన రామ్ చరణ్ గతంలోనే స్ట్రెయిట్ హిందీ చిత్రం ద్వారా బాలీవుడ్లో తన ముద్ర వేద్దామని ప్రయత్నించాడు. అయితే ఆ ప్రయత్నం బెడిసికొట్టి.. ఇక ఆపై ఎప్పుడూ బాలీవుడ్లో కాలు మోపలేదు. అయితే ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్చరణ్ కు కూడా జాతీయ స్థాయి గుర్తింపు రావడంతో.. బాలీవుడ్కు ఆప్తుడిగా మారాడు.ఈ నేపధ్యంలో హృతిక్ రోషన్ మాజీ భార్య ఇంటీరియర్ డిజైనర్ అయిన సుస్సానే ఖాన్ ఫిబ్రవరిలో హైదరాబాద్లో చార్కోల్ పేరిట ఓ ప్రాజెక్ట్ను ప్రారంభించారు. తాజాగా టాలీవుడ్ హీరో రామ్ చరణ్ ఆ స్టోర్ని సతీ సమేతంగా సందర్శించారు. దీంతో సుస్సానే ఖాన్ సంతోషాన్ని పట్టలేకపోయారు. రామ్చరణ్, ఉపాసన తమ స్టోర్కి వచ్చి మాకు అత్యంత అపురూపమైన ప్రత్యేకమైన అనుభూతిని అందించినందుకు ధన్యవాదాలు అంటూ ఆమె పోస్ట్ చేశారు. ఆమె సోదరుడు జాయెద్ ఖాన్ కూడా తమ సోదరి స్టోర్ను గ్లోబల్ సూపర్ స్టార్ అంతేకాక అద్భుతమైన వ్యక్తి అయిన రామ్చరణ్ సందర్శించడం ఎంతో సంతోషం కలిగిస్తోందంటూ తన స్పందన వ్యక్తం చేశాడు.హృతిక్ రోషన్తో పెళ్లి బంధం విఛ్చిన్నమైనప్పటికీ సుస్సానే ఖాన్ వ్యక్తిగతంగా ఎంచుకున్న కెరీర్లో రాణిస్తోంది. అంతేకాకుండా ఆమె తన మాజీ భర్తతో ఇప్పటికీ సత్సంబంధాలు కొనసాగిస్తోంది. ఆమె హైదరాబాద్లో ఏర్పాటు చేసిన స్టోర్ను హృతిక్ సైతం సందర్శించడం ఆమె బిజినెస్కు మద్ధతుగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం కూడా జరిగింది. వార్2లో హృతిక్ సహనటుడైన ఎన్టీయార్ ఇప్పటికీ తమ సిటీలోనే ఉన్న సుస్సానే స్టోర్ను సందర్శించనప్పటికీ, రామ్ చరణ్ మాత్రం ఈ విషయంలో ముందుండడం ఆసక్తి కలిగిస్తోంది. View this post on Instagram A post shared by Sussanne Khan (@suzkr) -
బిచ్చగాళ్లకు ఫోన్ నంబర్ ఇచ్చి ఏటీఎం లా మారిన హీరో!
ప్రస్తుత స్టార్ హీరోల్లో ఎందరో అట్టడుగు స్థాయి నుంచి పైకి వచ్చినవారే అయి ఉంటారు. కానీ అప్పటి తమ పరిస్థితులు ఇప్పటికీ గుర్తుంచుకుని అలాంటి పరిస్థితుల్లో ఉన్న ఆపన్నులను ఆదుకునే మనసున్నవాళ్లు మాత్రం కొందరే ఉంటారు. అలాంటివారిలో బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్(Jackie Shroff) ముందున్నాడు. తన మానవతా సేవలతో నిరుపేదల మనసులను గెలుచుకుంటున్నాడు. ఇటీవల, జాకీ ష్రాఫ్ తన చిన్ననాటి కష్టాలను గుర్తు చేసుకుంటూ, ముంబైలోని చవల్లో 33 సంవత్సరాలు గడిపిన అనుభవాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నాడు ఏడు భవనాలకు మూడే బాత్రూమ్స్ ఉన్న ఓ కాంప్లెక్స్లోని ఒకటే గదిలో తమ కుటుంబం మొత్తం నివసించిన రోజుల్ని తలచుకుంటూ...రాత్రుళ్లు ఎలకలు తమ వేళ్లనే ఆహారంగా మార్చుకునేవన్నారు. అలాంటి దుర్భర పరిస్థితుల్లో చదువుకోవాలనే కోరిక ఉన్నా పరిస్థితులు అనుకూలించక తన చదువు కొనసాగించలేకపోయానని చెప్పారు. అర్ధాకలితో గడిపిన రోజులు మర్చిపోలేనంటున్న ఆయన అలాంటి పరిస్థితుల్లో ఎవరున్నా వారికి నేనున్నా అంటున్నారు. ఏదో ఇంటర్వ్యూ కోసం మాత్రమే ఆయన మాట్లాడడం లేదు. ఇప్పటికే ముంబైలోని దాదాపు 100 కుటుంబాల బాగోగులు చూస్తున్నారు. అది కూడా కొన్నేళ్లుగా. అంతేకాకుండా, వీధుల్లో ఉన్న ప్రతి బిచ్చగాడికి ఆయన తన ఫోన్ నంబర్ అందుబాటులో ఉంచారు, తద్వారా వారు అవసరమైనప్పుడు ఎంత అర్ధరాత్రయినా, అపరాత్రయినా సాయం పొందగలుగుతారు.తిండికి లేని స్థితి నుంచి వందలాది మందికి తిండి పెట్టగలిగే పరిస్థితి వరకూ సాగిన ప్రయాణంలో పల్లీలు అమ్ముకోవడంతో మొదలై ఎన్నో చిరుద్యోగాలు, చిరు వ్యాపారాలు... అయిపోయాయి. చివరకు ఒక బస్టాండ్లో నిలబడి ఉండగా తనని గమనించిన సుభాష్ ఘయ్ కి జాకీలో తన కొత్త చిత్రంలో కధానాయకుడు కనిపించడంతో ఆయన జీవితం మారిపోయింది. హీరో పేరుతో రూపొందిన ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. దానిని తెలుగులో నాగార్జున ఆరంగేట్రంగా కూడా రీమేక్ చేసి విక్రమ్ తీశారు.అలా బస్టాండ్ బతుకు నుంచి బాలీవుడ్ హీరోగా మారిన జాకీ ష్రాఫ్ అక్కడ నుంచి అంచలంచెలుగా టాప్ స్టార్గా ఎదిగాడు. అయితే ఎప్పుడూ తన గతాన్ని మర్చిపోలేదు. ఇపుడేదో స్థితి మంతుడయ్యాడు కాబట్టి చేయడం కాకుండా...తాను ఆర్ధికంగా లేని పరిస్థితుల నుంచే ఆయన సేవను ఒక దినచర్యగా మార్చుకున్నాడు. ప్రతీ యాచకునికీ , ఫుట్పాత్పై నివసించే ప్రతీ చిన్నారికీ తన కాంటాక్ట్నెంబర్ అందేలా ఏర్పాటు చేశాడు. తన పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరాలు, సామూహిక భోజనాలు, పేద పిల్లలకు పుస్తకాలు, దుప్పట్లు పంపిణీ వంటి సేవా కార్యక్రమాలను నిర్వహిస్తుంటాడు. తనకు ఇష్టమైన వ్యక్తుల పుట్టినరోజుల సందర్భాలలో కూడా ఆయన ఇదే విధమైన సేవా కార్యక్రమాలను చేస్తాడు. వయసు పై బడిన జాకీష్రాఫ్ ఇప్పడు తెరపై హీరో కాకపోవచ్చు కానీ వందలాది మంది మనసుల్లో ఆయన ఎప్పటికీ హీరోనే... -
జలియన్ వాలాబాగ్ నేపథ్యంగా కేసరి-2.. బాక్సాఫీస్ వద్ద ఎన్ని కోట్లంటే?
బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ నటించిన తాజా చిత్రం కేసరి చాప్టర్-2. ఈ మూవీలో లైగర్ భామ అనన్య పాండే హీరోయిన్గా నటించింది. ఇటీవల గుడ్ ఫ్రైడే సందర్భంగా ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. ఏప్రిల్ 18న బిగ్ స్క్రీన్పైకి వచ్చిన కేసరి-2.. వసూళ్లపరంగా రాణించలేకపోతోంది. తొలి రోజు ఇండియా వ్యాప్తంగా కేవలం రూ.7.84 కోట్ల నికర వసూళ్లు మాత్రమే సాధించింది. శని, ఆదివారాల్లో బాగానే కలెక్షన్స్ రాబట్టిన ఈ సినిమా.. సోమవారం వచ్చేసరికి కలెక్షన్లపై తీవ్ర ప్రభావం చూపింది. దీంతో కేవలం రూ.4.50 కోట్లకే పరిమితమైంది.ఈ లెక్కన కేసరి-2 విడుదలైన నాలుగు రోజుల్లో ఇండియా వ్యాప్తంగా రూ.34.12 కోట్ల నికర వసూళ్లు సాధించింది. ఈ విషయాన్ని నిర్మాణసంస్థ ధర్మ ప్రొడక్షన్స్ ట్వీట్ చేసింది. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్.. బ్రిటిష్ సామ్రాజ్యాన్ని సవాలు చేసిన ధైర్యవంతుడైన భారతీయ న్యాయవాది సి శంకరన్ నాయర్ పాత్రలో నటించారు. ఈ సినిమాపై పెద్దగా అంచనాలు లేకపోయినా.. కేవలం మౌత్ టాక్తోనే ఈ వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి సన్నీ డియోల్ 'జాట్' నుంచి బాక్సాఫీస్ వద్ద తీవ్రమైన పోటీ ఎదురవుతోంది. థ్రిల్లర్ సినిమా కావడంతో వసూళ్ల పరంగా నిలకడగా రాణిస్తోంది. కాగా.. ఈ సినిమాలో ఆర్ మాధవన్ కీలక పాత్రలో మెప్పించారు.కాగా..'కేసరి చాప్టర్ 2' చిత్రాన్ని కరణ్ సింగ్ త్యాగి దర్శకత్వం వహించారు. ఈ సినిమాను ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్లో కరణ్ జోహార్ నిర్మించారు. ఏప్రిల్ 13, 1919న జరిగిన జలియన్ వాలాబాగ్ ఊచకోత తర్వాత.. బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా న్యాయవాది సి శంకరన్ నాయర్ చూపించిన ధైర్యసాహసాల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. Truth spoke. Theatres roared. Numbers soared. Book your tickets NOW.🔗 - https://t.co/YSydXCA78f#KesariChapter2 in cinemas now, worldwide pic.twitter.com/MaCWzgncsU— Dharma Productions (@DharmaMovies) April 22, 2025 -
మరో లగ్జరీ ఇల్లు కొనుగోలు చేసిన సైఫ్ అలీఖాన్, కారణం ఏంటో తెలుసా?
విలక్షణ నటుడు సైఫ్ అలీ ఖాన్ తనపై కత్తి దాడి జరిగిన కొన్ని నెలల తరువాత ఖతార్లో మరో ఇల్లు కొనుగోలు చేశాడు. ఖతార్లోని దోహాలోని ది పెర్ల్లోని ది సెయింట్ రెగిస్ మార్సా అరేబియా ద్వీపంలో తాను పెట్టుబడి పెట్టానని సైఫ్ అలీ ఖాన్ ఇటీవల వెల్లడించాడు. ఇండియాకి దగ్గరగా ఉండటంతోపాటు, ఇది చాలా సేఫ్ అని కూడా తెలిపారు. ఖతార్లో ఇల్లు కొనాలనే తన నిర్ణయం గురించి సైఫ్ అలీ ఖాన్ ఏమన్నాడో ఒకసారి చూద్దాం.భద్రత, బ్యూటీతో పాటు భారతదేశానికి దగ్గర ఉన్నందు వల్ల ఖతార్లోని దోహాను ఎంచుకున్నట్టు అల్ఫర్డాన్ గ్రూప్ నిర్వహించిన విలేకరుల సమావేశంలో సైఫ్ తెలిపాడు. అందమైన ప్రదేశాలతో, పరిపూర్ణమైన హాలిడే హోమ్ అని కూడా దోహాపై ప్రశంసలు కురిపించాడు. అందుకే ఆ దేశం తనను సురక్షితంగా ఇంట్లో ఉన్న ఫీలింగ్ కలిగేలా చేసిందన్నాడు. ఒకటి రెండు రోజులు సెలవులు దొరికితే తనకు గుర్తొచ్చేది దోహా. పైగా అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే అది చాలా సురక్షితంగా ఉంటుందనీ, ఒక ద్వీపం లోపల ద్వీపం అనే భావన ఇంకా లగ్జరీగా ఉంటుంది, నిజంగా ఉండటానికి దానికి మించిన ప్రదేశం అందుకే అక్కడ ఉండటం తనకు చాలా సంతోషాన్నిస్తుందని చెప్పుకొచ్చాడు. సేఫ్టీ, ప్రైవసీ, లగ్జరీ అద్భుతమైన కలయిక దోహా, ‘ఇల్లు తరువాత మరో ఇల్లు’ (హోం అవే ఫ్రం హోం) అని పేర్కొన్నాడు. షూటింగ్లో భాగంగా అక్కడ కొన్ని రోజులు ఉన్నాను. అప్పడు బాగా నచ్చేసింది, మరో విధంగా చెప్పాలంటే అక్షరాలా ఇంటి నుండి దూరంగా ఉన్న మరో ఇల్లులా అనిపించింది, ప్రశాంతంగా .ఏకాంతంగా ఉంటుందని, త్వరలోనే పిల్లల్నీ,ఫ్యామిలీని అక్కడికి తీసుకెళతానని పేర్కొన్నాడు.లగ్జరీ జీవన శైలి, ఆస్తులు హైప్రొఫైల్ నేపథ్యం, రాజ కుటుంబ వారసత్వం, విలావసవంతమైన కార్లు, వాచెస్.. లగ్జరీ ఇల్లు ఇదీ జీవన శైలి. సైఫ్ తన భార్య, సినీ నటి కరీనాకపూర్తో కలిసి ముంబైలోని సద్గురుశరణ్లోని విలాసవంతమైన ఇంట్లో నివసిస్తున్నాడు. దీనిక విలువ రూ.55 కోట్లు. ఇది కాకుండా సైప్, కరీనా జంటకు స్విట్జర్లాండ్లోని గస్టాడ్ ప్రాంతంలో రూ.33 కోట్ల విలువ చేసే మరో ఇల్లు కూడా ఉంది. పూర్వీకుల పటౌడీ ప్యాలెస్, లండన్ కూడా ఆస్తులు ఉన్నాయి. తాజా లెక్కల ప్రకారం వారసత్వంగా వచ్చిన సంపదతోపాటు సైఫ్ ఆస్తుల విలువ రూ.1,200 కోట్లకు పైమాటే. అంచనా. బెంజ్ ఎస్ క్లాస్కు చెందిన ఎస్350డీ, ల్యాండ్ రోవర్ డిఫెండర్ 110, ఆడీ క్యూ7, జీప్ రాంగ్లర్ వింటికి సైఫ్ కార్లు. పర్ఫ్యూమ్స్, ఫుట్వేర్, హోమ్ డెకార్ రంగాల్లో వ్యాపారాన్ని కూడా విస్తరించాడు. ఒక్కో సినిమాకు సైఫ్ రెమ్యూనరేషన్ సినిమాకు రూ.10-15 కోట్లు ద ఎండార్స్మెంట్ల ద్వారా కోట్ల సంపాదన. దీనికి తోడు బాలీవుడ్లో టాప్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన సతీమణి కరీనా సంపాదన కూడా తక్కువేమీ కాదు.కత్తిపోట్లు ఘటనకత్తిపోట్టు ఈ ఏడాది జనవరిలో తన సొంత ఇంట్లో సైఫ్ అలీ ఖాన్ కత్తి పోట్లుకు గురి కావడం కలకలం రేపింది. ముంబైలోని లీలావతి ఐదు రోజులు చికిత్స పొందిన అనతరం డిశ్చార్జ్ అయ్యాడు. ప్రస్తుతం తన ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు.'జువెల్ థీఫ్' తన రాబోయే థ్రిల్లర్ 'జువెల్ థీఫ్: ది హీస్ట్ బిగిన్స్' లో సైఫ్ అలీ ఖాన్ కనిపించనున్నారు. ఏప్రిల్ 25న నెట్ఫ్లిక్స్లో విడుదల కానుంది. సైఫ్ ఈ మూవీలో జైదీప్ అహ్లవత్, కునాల్ కపూర్ , నికితా దత్తా కూడా నటించారు. కూకీ గులాటి , రాబీ గ్రేవాల్ దీనికి దర్శకత్వం వహించారు. -
భారత్లో జరిగిన బిగ్గెస్ట్ స్కామ్.. సినిమాగా తెరపైకి
భారతదేశంలో అతిపెద్ద స్కామ్ చేసి లండన్ పారిపోయిన ఆర్థిక నేరగాడు వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ (Nirav Modi) జీవితాన్ని సినిమా రూపంలో ఈ ప్రపంచానికి చూపనున్నారు. ఈమేరకు చర్చలు కూడా జరిగాయని తెలుస్తోంది. నెట్ఫ్లిక్స్ ఒరిజినల్గా ఈ సినిమా రానుందని, దీనిని బాలీవుడ్ దర్శకుడు పలాష్ వాస్వానీ తెరకెక్కించబోతున్నారని నేషనల్ మీడియాలో కథనాలు వచ్చాయి. ఇప్పటికే నటీనటుల ఎంపిక కూడా పూర్తి అయినట్లు తెలుస్తోంది.దేశంలోని బ్యాంకింగ్ రంగంలో భారీ స్కామ్స్కు పాల్పడిన నీరవ్ మోదీ జీవితాన్ని ఆధారంగా చేసుకుని పవన్ సి.లాల్ ఒక పుస్తకం రచించారు. 'ఫ్లాల్డ్: ది రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ ఇండియాస్ డైమండ్ మొఘల్ నీరవ్ మోదీ' పేరుతో మార్కెట్లో కూడా ఈ బుక్ అందుబాటులో ఉంది. దీనిని ఆధారంగా చేసుకునే దర్శకుడు పలాష్ వాస్వానీ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారని సమాచారం.అసలేమిటి ఈ స్కామ్..? నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీతోపాటు మరికొందరు లెటర్స్ ఆఫ్ అండర్టేకింగ్ను (ఎల్ఓయూ) దుర్వినియోగం చేశారని పంజాబ్ నేషనల్ బ్యాంకు అధికారులు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన సీబీఐ 2018 జనవరి 31న నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీతోపాటు ఇతరులపై కేసు నమోదు చేసింది. ఎల్ఓయూ అంటే తమ ఖాతాదారులకు విదేశాల్లోని తమ బ్యాంకుశాఖల నుంచి రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు జారీ చేసే గ్యారంటీ పత్రం. పంజాబ్ నేషనల్ బ్యాంకు ఇచ్చిన ఎల్ఓయూతో నీరవ్ మోదీ ముఠా వివిధ కంపెనీల పేరిట విదేశాల్లోని పీఎన్బీ బ్యాంక్ శాఖల నుంచి రూ.13,000 కోట్లకుపైగా రుణాలుగా తీసుకొని, తిరిగి చెల్లించకుండా ఎగ్గొట్టింది. ఈ కేసులో సీబీఐ 2018 మే 14న నీరవ్తోసహా మొత్తం 25 మంది నిందితులపై మొదటి చార్జిసీట్ కోర్టులో దాఖలు చేసింది.2019 డిసెంబర్ 20న 30 మందిపై రెండో చార్జిషీట్ దాఖలు చేసింది. మొదటి చార్జిషీట్లో ఉన్నవారంతా రెండో చార్జిషీట్లోనూ ఉన్నారు. బ్యాంకుల నుంచి కొల్లగొట్టిన సొమ్మును నీరవ్ మోదీ ముఠా దుబాయ్, హాంకాంగ్లోని తమ డొల్ల కంపెనీలకు మళ్లించినట్లు ఆరోపణలున్నాయి. ముత్యాల ఎగుమతి, దిగుమతుల పేరిట ఈ సొమ్మును దారిమళ్లించారు. నీరవ్ మోదీ 2018 జనవరి 1న ఇండియా నుంచి తప్పించుకున్నాడు. ట్రయల్ కోర్టు అతడిపై నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేసింది. 2018 జూన్లో ఇంటర్పోల్ రెడ్కార్నర్ నోటీసు జారీ చేసింది. 2019 మార్చిలో యూకే పోలీసులు నీరవ్ మోదీని లండన్లో అరెస్టు చేశారు. తనకు బెయిల్ ఇవ్వాలంటూ అతడు పలుమార్లు దాఖలు చేసిన పిటిషన్లను వెస్ట్మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టు, లండన్ హైకోర్టు కొట్టివేశాయి. నీరవ్ మోదీని తమకు అప్పగించాలంటూ భారత ప్రభుత్వం యూకేను అభ్యర్థించింది. ఆయన ప్రస్తుతం లండన్లోని వాండ్స్వర్త్ జైలులో ఉన్నారు. -
ఛావా మరో క్రేజీ రికార్డ్.. పుష్ప-2 సరసన చేరిన బాలీవుడ్ మూవీ!
విక్కీ కౌశల్,రష్మిక మందన్నా ప్రధాన పాత్రల్లో నటించిన సూపర్ హిట్ సినిమా ఛావా(Chhaava Movie). ఈ ఏడాది ఫిబ్రవరి 14న హిందీలో రిలీజై బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 800 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టింది. ఛావా సినిమాకు బాలీవుడ్లో హిట్ టాక్ రావడంతో.. మార్చి 7న ఈ చిత్రాన్ని తెలుగులో గీతా ఆర్ట్స్ విడుదల చేసింది. టాలీవుడ్లోనూ అదిరిపోయే వసూళ్లు రాబట్టింది. ప్రస్తుతం ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా తీసిన 'ఛావా' దేశవ్యాప్తంగా టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా నిలిచింది.తాజాగా ఈ చిత్రం మరో ఘనతను సాధించింది. కేవలం హిందీలో దేశవ్యాప్తంగా రూ.600 కోట్లకు పైగా నెట్ వసూళ్లు సాధించిన చిత్రాల సరసన నిలిచింది. పుష్ప-2, స్త్రీ-2 తర్వాత ఈ అరుదైన ఘనత సాధించిన మూడో చిత్రంగా ఛావా చోటు దక్కించుకుంది. స్త్రీ-2 తర్వాత ఈ రికార్డ్ కొల్లగొట్టిన రెండో బాలీవుడ్ మూవీగా అవతరించింది. ఈ విషయాన్ని విక్కీ కౌశల్ తండ్రి, బాలీవుడ్లో దర్శకుడైన శామ్ కౌశల్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. 600 నాట్అవుట్ అంటూ పోస్టర్ను షేర్ చేశారు. ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ఈ గణాంకాలను వెల్లడించారు. ఈ చిత్రాన్ని బ్లాక్బస్టర్గా మార్చడంలో మద్దతు ఇచ్చిన అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. కాగా.. ఈ సినిమాకు లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతమందించారు. ఈ చిత్రంలో అక్షయ్ ఖన్నా, అశుతోష్ రానా, దివ్య దత్తా కూడా కీలక పాత్రల్లో నటించారు. మడాక్ ఫిల్మ్స్ పతాకంపై దినేష్ విజన్ ఈ చిత్రాన్ని నిర్మించారు.హిందీలో టాప్- 10 నెట్ వసూళ్లు సాధించిన చిత్రాలు..1 పుష్ప: ది రూల్ - పార్ట్ 2- రూ.812.14 కోట్లు2 స్ట్రీ- 2 - రూ.597.99 కోట్లు3 ఛావా- రూ.585.43 కోట్లు4 జవాన్ -రూ.582.31 కోట్లు5 గదర్ 2- రూ.525.7 కోట్లు6 పఠాన్ -రూ.524.53 కోట్లు7 బాహుబలి 2 ది కన్క్లూజన్- రూ.510.99 కోట్లు8 యానిమల్- రూ.502.98 కోట్లు9 కేజీఎఫ్ చాప్టర్ 2- రూ.435.33 కోట్లు10 దంగల్ - రూ.374.43 కోట్లు View this post on Instagram A post shared by Sham Kaushal (@shamkaushal09) -
కాజల్ సీన్లు లేపేశారు.. అందుకే సినిమా డిజాస్టర్!
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ (Salman Khan)కు బ్యాడ్ టైమ్ నడుస్తోంది. తన ఖాతాలో వరుసగా డిజాస్టర్లు పడుతున్నాయి. అతడు నటించిన లేటెస్ట్ మూవీ సికందర్ (Sikandar Movie) కూడా బాక్సాఫీస్ వద్ద అట్టర్ఫ్లాప్గా నిలిచింది. ఏఆర్ మురుగదాస్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో రష్మిక మందన్నా హీరోయిన్గా నటించింది. కాజల్ అగర్వాల్ ముఖ్య పాత్ర పోషించింది.కాజల్ సీన్ డిలీట్అయితే సినిమాలో కాజల్ (Kajal Aggarwal) సీన్ డిలీట్ చేశారంటూ నెట్టింట గగ్గోలు వినిపిస్తోంది. ఈ మేరకు ఓ సన్నివేశం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అందులో ఏముందంటే.. అత్తింట్లో కాజల్ చనిపోవడానికి ప్రయత్నిస్తుంది. ఆమెను ఎలాగోలా కాపాడతారు. అయితే ఆమె మామ మాత్రం.. చనిపోవడానికి మా ఇల్లే దొరికిందా? అని నిందిస్తారు. ఈ చావేదో పుట్టింట్లో చావు అని శాపనార్థాలు పెడతారు. అప్పుడే అటుగా వెళ్తున్న సల్మాన్ ఇదంతా చూస్తాడు. పెద్ద డైలాగ్ చెప్తాడు. ఆడవారికి కావాల్సింది డబ్బు కాదని, మనమిచ్చే సపోర్ట్ అని చెప్పుకుంటూ పోతాడు.ఇంత చెత్త ఎడిటింగా?ఈ సీన్ను ఎక్స్ (ట్విటర్)లో చూసిన అభిమానులు.. 'అదేంటి? ఈ సన్నివేశం సినిమాలో లేదా? అందుకే డిజాస్టర్ అయింది, ఇది ఉండుంటే సినిమాకు ప్లస్సయ్యేది..', 'ఫస్ట్ డే సినిమా చూసినప్పుడు ఈ సన్నివేశాన్ని అలాగే ఉంచినట్లు గుర్తు.. ఇప్పుడు దాన్ని లేపేశారా?', 'జనాలు కచ్చితంగా చూడాల్సిన ఓ ముఖ్యమైన సన్నివేశాన్ని కట్ చేసి పడేస్తే ఎలా? ఇంత చెత్త ఎడిటింగ్ ఎందుకు?' అని పలువురు ప్రశ్నిస్తున్నారు. సికందర్ సినిమా విషయానికి వస్తే.. భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ మూవీ మార్చి 30న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 21 రోజుల్లో రూ.110 కోట్ల మేర కలెక్షన్లు రాబట్టింది. Why was this scene cut from the Film by Editing??@BeingSalmanKhan that was a great and important scene for people to see... WHY THIS BAD EDITING??#Sikandar pic.twitter.com/FpV6zdRwR6— Ldpe414 (@ldpe414) April 20, 2025 చదవండి: బ్రెయిన్ సర్జరీ.. అరగుండుతో కష్టాలు.. కన్నీళ్లు పెట్టుకున్న అషూ రెడ్డి -
నీ భార్య క్షమాపణ చెప్పాలి.. మరో హీరోకు బిష్ణోయ్ గ్యాంగ్ హెచ్చరిక
లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్(Lawrence Bishnoi) నుంచి బాలీవుడ్కు చెందిన మరో హీరోకు హత్య బెదిరింపులు వచ్చాయి. సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు జరిపినట్లే నటుడు అభినవ్ శుక్లా( Abhinav Shukla)ఇంటిపై కూడా దాడులు జరుపుతామంటూ బెదిరింపులకు దిగారు. త్వరలో చంపేస్తామంటూ ఒక హెచ్చరికతో మెసేజ్ పంపారు. అయితే, ఈ మెసేజ్ను సోషల్మీడియా యూజర్ పంపినట్లు తెలుస్తోంది. తాను లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కోసం పనిచేస్తున్నాని ఈ హెచ్చరికలు వారికి జారీ చేశాడు.కారణం ఇదే..నటుడు అభినవ్ శుక్లా సతీమణి రుబీనా వల్లే ఈ వార్నింగ్స్ వచ్చినట్లు తెలుస్తోంది. ప్రముఖ టీవీలో ప్రసారం అయ్యే 'బాటిల్గ్రౌండ్' షోలో ఆమె పాల్గొంది. అయితే, ఆ షో కొనసాగుతున్న మధ్యలో రాపర్ ఆసిమ్ రియాజ్తో ఆమెకు గొడవ అయింది. ఇద్దరి మధ్య మాటల యుద్ధమే జరిగింది. అది జరిగిన కొన్ని గంటల్లోనే ఈ బెదిరింపుల మెసేజ్ వచ్చింది. ఎపిసోడ్ ప్రసారం అయిన వెంటనే.. ఆమెతో పాటు అభినవ్ను ఆన్లైన్లో లక్ష్యంగా చేసుకుని భారీగా వార్నింగ్స్ వచ్చాయి. వారికి వచ్చిన మెసేజ్లను శుక్లా తన సోషల్మీడియా హ్యాండిల్లో వరుస స్క్రీన్షాట్లు, వీడియోలను పంచుకున్నారు, అందులో అంకుష్ గుప్తా అనే వ్యక్తి ఈ బెదిరింపు మెసేజ్ పంపినట్లు కనిపిస్తోంది.అభినవ్ శుక్లా దంపతులకు పంపిన ఆ మెసేజ్ ఇలా ఉంది. 'నేను లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుండి వచ్చాను. మీ చిరునామా నాకు తెలుసు. నేను రావాలా..? సల్మాన్ ఖాన్పై కాల్పులు జరిపినట్లే, నేను మీ ఇంటికి వచ్చి AK-47తో మిమ్మల్ని కాల్చివేస్తాను. ఇది మీ చివరి హెచ్చరికగా భావించండి. ఆసిమ్కు వెంటనే క్షమాపణలు చెప్పండి. అలా జరగలేదంటే మిమ్మల్ని ఎవరూ కాపాడలేరు. లారెన్స్ బిష్ణోయ్ ఆసిమ్కు అండగా నిలుస్తాడు. ఆసిమ్ మా గ్యాంగ్ మనిషి' అని ఉంది. వార్నింగ్ ఇచ్చిన వ్యక్తిది చండీగఢ్లా ఉందని అభినవ్ తెలిపాడు. పోలీసులకు ఫిర్యాదు చేస్తామని చెప్పుకొచ్చాడు. -
డేటింగ్లో స్టార్ హీరోయిన్ సోదరి.. ప్రియుడికి బర్త్ డే విషెస్ చెబుతూ పోస్ట్!
బాలీవుడ్ భామ ఆలియా భట్ తెలుగువారికి సుపరిచితమైన పేరు. ఆర్ఆర్ఆర్ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైంది. బాలీవుడ్ హీరో రణ్బీర్ కపూర్ను పెళ్లాడిన ఈ ముద్దుగుమ్మకు ఓ కూతురు కూడా జన్మించింది. గతేడాది జిగ్రా మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చిన బాలీవుడ్ బ్యూటీ ఈ ఏడాది ఆల్ఫా అనే మూవీలో కనిపించనుంది.అయితే ఆలియా భట్కు పూజా భట్, షాహీన్ భట్ అనే ఇద్దరు సిస్టర్స్ ఉన్న సంగతి తెలిసిందే. వారిలో ఒకరైన షాహీన్ భట్ ప్రముఖ ఫిట్నెస్ కోచ్ ఇషాన్ మెహ్రాతో డేటింగ్లో ఉన్నారు. ఇవాళ అతని బర్త్ డే కావడంతో షాహీన్ భట్ విషెస్ చెబుతూ అతనితో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. దీంతో అతనితో రిలేషన్లో ఉన్నట్లు అఫీషియల్గా ప్రకటించింది.ఇది చూసిన అలియా భట్ తన సిస్టర్ షాహీన్ భట్కు మద్దతుగా నిలిచింది. ఇషాన్ మెహ్రా పుట్టినరోజు సందర్భంగా అలియా భట్ శుభాకాంక్షలు తెలిపింది. అంతే కాకుండా షాహీన్ చేసిన పోస్ట్ను అలియా భట్ షేర్ చేసింది. ఈ పోస్ట్పై నీతూ కపూర్, పూజా భట్, వరుణ్ ధావన్, అర్జున్ కపూర్, అనన్య పాండే, పరిణీతి చోప్రా, బాద్షా,మసాబా గుప్తా సైతం స్పందించారు. షాహీన్ భట్ భాయ్ఫ్రెండ్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కాగా.. షాహీన్ భట్ గతంలో హాస్యనటుడు రోహన్ జోషితో రిలేషన్ షిప్లో ఉన్నారు. రెండేళ్ల క్రితమే వీరిద్దరు విడిపోయారు.కాగా.. ఈ ఏడాది ప్రారంభంలో షాహీన్ భట్.. ఇషాన్తో ఉన్న ఫోటోలను ఇన్స్టాగ్రామ్లో పంచుకున్నారు. కానీ అతని ఎవరు అనేది వెల్లడించలేదు. ఈ ఏడాది కపూర్, భట్ కుటుంబాలు న్యూ ఇయర్ సందర్భంగా థాయ్లాండ్ పర్యటనకు వెళ్లాయి. ఇన్స్టాగ్రామ్లోకి షాహీన్ తన ట్రిప్కు సంబంధించిన కొన్ని ఫోటోలు పంచుకున్నారు. ఒక ఫోటోలో ఆమె ఇషాన్ పక్కన నిలబడి పోజులిచ్చింది. మరో చిత్రంలో క్రూయిజ్లో ఉన్నప్పుడు వారిద్దరు కౌగిలించుకున్నారు. అప్పటి నుంచే ఈ జంట డేటింగ్లో ఉన్నట్లు తెలుస్తోంది. -
ఆ వయస్సు దాటితే హీరోయిన్గా కష్టమే: దియా మీర్జా ఆసక్తికర కామెంట్స్
బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ దియా మీర్జా ఆసక్తికర కామెంట్స్ చేసింది. సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ల అవకాశాలపై ఆమె మాట్లాడింది. పెళ్లి తర్వాత సినిమాల్లో అవకాశాలు రావడం తగ్గిపోతాయని వెల్లడించింది. పెళ్లి తర్వాత తన కెరీర్ ఎలా ప్రభావితం అయిందో వివరించింది. దాదాపు 25 ఏళ్లపాటు ఇండస్ట్రీలో కొనసాగిన దియా మీర్జా ఇటీవల నాదానియాన్ మూవీలో ఓ పాత్రలో కనిపించింది. ఈ చిత్రంలో ఇబ్రహీమ్ అలీ ఖాన్కు తల్లిపాత్రలో నటించింది. అయితే ప్రస్తుతం ఓటీటీల వల్ల కొత్తగా అవకాశాలు వస్తున్నాయని పేర్కొంది. తాను నటించిన 2019 వెబ్ సిరీస్ను మూవీగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె హీరోయిన్ల అవకాశాలపై స్పందించారు.దియా మీర్జా మాట్లాడుతూ..' నిజ జీవితంలో మాతృత్వాన్ని స్వీకరించిన తర్వాత సినిమాల్లో ఎంపిక చేసే విధానం మారింది. గత ఐదేళ్లలో నేను నా కొడుకు పుట్టడానికి ముందు.. పుట్టిన తరువాత నేను చేసిన ప్రతి క్యారెక్టర్ అతను చూడాలని కోరుకునే ప్రాజెక్ట్లు. కథలను ఎంచుకోవడంలో నా ప్రాధాన్యత అలానే ఉంటుంది. హీరోయిన్లకు వయస్సు, పెళ్లి, మాతృత్వం తర్వాత అవకాశాలపై ప్రభావం ఉంటుంది. నా వయస్సు కారణంగా ఛాన్సులు రావడం లేదని నమ్మడం ప్రారంభించా. చాలా సినీ ఇండస్ట్రీల్లోనూ ఇదే జరుగుతుంది. దాదాపు 35 నుంచి 48 వయస్సు మధ్యలో హీరోయిన్గా అవకాశాలు కష్టమే. ఆ తర్వాత మీరు తల్లి, సోదరి పాత్రలు చేయడం ప్రారంభిస్తారు. కానీ ఓటీటీ వల్ల మహిళలకు అవకాశాలను పెంచిందని' తెలిపింది.దియా మాట్లాడుతూ..' ఈ రోజుల్లో సోషల్ మీడియా ఫాలోయింగ్పై విచారం వ్యక్తం చేసింది. సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఒక సరికొత్త అర్ధంలేని పని జరుగుతోంది. సోషల్ మీడియాలో వ్యక్తులకున్న పాపులారిటీ ఆధారంగా చాలా మంది నటీనటుల ఎంపిక జరుగుతోంది. ఇది చాలా అన్యాయం. కొందరు అత్యద్భుతమైన ప్రతిభావంతులు సోషల్ మీడియాలో తమ వాయిస్ని బయటపెట్టడానికి ఇష్టపడరు. కానీ దాని అర్థం వారికి అర్హత లేదని కాదు. ప్రస్తుతం ఇది ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న కొత్త సంస్కృతి" అని ఆమె అన్నారు. -
50 ఏళ్ల 'సింగిల్' హీరోయిన్.. కానీ ప్రెగ్నెన్సీ రూమర్స్
అప్పుడెప్పుడో వచ్చిన 'బద్రి' సినిమా గుర్తుందా? అందులో హీరోయిన్ గా చేసిన అమీషా పటేల్.. తర్వాత తెలుగులో పెద్దగా నటించలేదు. పూర్తిగా బాలీవుడ్ కి షిఫ్ట్ అయిపోయింది. ఇప్పుడు చాలావరకు అవకాశాలు తగ్గిపోయాయి. అలాంటిది ఇప్పుడు ఈమెపై ప్రెగ్నెన్సీ రూమర్స్ వస్తున్నాయి. కానీ ఇక్కడ చిన్న మెలిక ఉంది.49 ఏళ్ల అమీషా పటేల్ చివరగా గతేడాది 'తౌబా తేరా చల్వా' సినిమాలో కనిపించింది. అంతకు ముందు గదర్ 2 చిత్రంతో హిట్ అందుకుంది. మూవీస్ పెద్దగా చేయనప్పటికీ ఇన్ స్టాలో మాత్రం ఎప్పుడూ గ్లామరస్ ఫొటోలు పోస్ట్ చేస్తూ ఉంటుంది. అలాంటిది రీసెంట్ గా గ్రీన్ కలర్ బికినీతో ఫొటో పోస్ట్ చేసింది.(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న 'బిగ్ బాస్' జంట.. మూడేళ్ల ప్రేమ)ఇందులో ఈమె పొట్ట కాస్త ఎత్తుగా ఉండటంతో అమీషా పటేల్ ప్రెగ్నెన్సీతో ఉందా అని మాట్లాడుకుంటున్నారు. ఇప్పటివరకు పెళ్లి చేసుకోకుండా ఉండిపోయిన ఈమె.. ప్రస్తుతం ఎవరితోనైనా రిలేషన్ లో ఉందా అని అనుకుంటున్నారు. అయితే ఇదంతా కూడా పబ్లిసిటీ స్టంట్ ఏమో అనిపిస్తుంది.ఎందుకంటే ఈ ఫొటో పోస్ట్ చేయడానికి ముందు కూడా కొన్ని ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేసింది. అందులో లేని బేబీ బంప్.. బికినీ ఫొటోలో కనిపించడం చూస్తుంటే సోషల్ మీడియాలో తన గురించి మాట్లాడుకోవాలని అమీషా చేసిన పనిలా అనిపిస్తుంది. మరి నిజమేంటనేది ఆమె చెబితే తప్ప తెలియదు.(ఇదీ చదవండి: చాలా అసహ్యంగా నటించా.. ఇప్పుడు చూస్తే సిగ్గేస్తుంది: సమంత) -
పాడుబడ్డ ఇంట్లో అనాథగా చిన్నారి.. కాపాడిన హీరోయిన్ సోదరి
బాలీవుడ్ హీరోయిన్ దిశా పటానీ (Disha Patani) సోదరి ఖుష్బూ (Khushboo Patani) ఆర్మీలో మేజర్గా సేవలందించారు. 12 ఏళ్లపాటు దేశానికి సేవ చేసిన ఆమె రెండేళ్ల క్రితం స్వచ్ఛందంగా రిటైర్మెంట్ తీసుకున్నారు. ప్రస్తుతం ఆమె ఫిట్నెస్ కోచ్గా పని చేస్తున్నారు. తాజాగా ఆమె షేర్ చేసిన వీడియో జనాల హృదయాలను కదిలిస్తోంది.పాడుబడ్డ ఇంట్లో చిన్నారిఉత్తరప్రదేశ్ బరేలీలో నివసిస్తున్న ఖుష్బూ.. ఆదివారం ఉదయం అలా బయటకు నడుచుకుంటూ వెళ్లారు. పాడుబడ్డ ఇంట్లో ఏవో శబ్దాలు వినిపించడంతో లోనికి వెళ్లి చూడగా అక్కడ ఓ చిన్నారి కనిపించింది. నేలపై ఒళ్లంతా మట్టితో ఉన్న ఆ చిన్నారిని చూడగానే ఖుష్బూ మనసు తరుక్కుపోయింది. పసిపాపను ఇలా అనాథను చేసి వదిలేశారేంటని ఆమె బాధపడ్డారు. మీరేం తల్లిదండ్రులు?ఆ పాపాయిని జాగ్రత్తగా తన ఒడిలోకి తీసుకున్నారు. చిన్నారి గుక్కపెట్టి ఏడుస్తుంటే ఆమెను లాలించారు. చివర్లో పాప ముఖాన్ని దగ్గరి నుంచి చూపిస్తూ.. ఈ చిన్నారి గురించి తెలిసినవారు తనను సంప్రదించమని కోరారు. ఈ పసిపాపను పాడుబడ్డ ఇంట్లో వదిలేసిన తల్లిదండ్రులపై ఖుష్బూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరేం తల్లిదండ్రులు? పాప భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసినందుకు సిగ్గుపడండి అని మండిపడ్డారు.ఇంకా ఎన్నాళ్లీ దారుణాలు..'దేవుడే రక్షణగా నిలబడే వ్యక్తికి ఎవరూ హాని తలపెట్టలేరు. ఈ చిన్నారిని అధికారులకు అప్పగించాం. తను మంచి చేతుల్లోకి వెళ్లేలా చూసుకుంటాను. కచ్చితంగా తన భవిష్యత్తు బాగుంటుంది. మన దేశంలో ఇలాంటి దారుణాలు ఇంకా ఎన్నాళ్లు కొనసాగుతాయి? దయచేసి ఆడపిల్లల్ని కాపాడండి' అని ఖుష్బూ కోరారు.ప్రభాస్తో నటించిన దిశా..ఖుష్బూ చెల్లెలు దిశా పటానీ విషయానికి వస్తే.. ఉత్తర ప్రదేశ్లోని బరేలీలో జన్మించిన ఈ బ్యూటీ 'లోఫర్' సినిమాతో వెండితెరకు పరిచయమైంది. గతేడాది వచ్చిన ప్రభాస్ 'కల్కి 2898 ఏడీ' మూవీలోనూ యాక్ట్ చేసింది. ఎక్కువగా హిందీ సినిమాలే చేసింది. 'ఎంఎస్ ధోని: ద అన్టోల్డ్ స్టోరీ', 'భాగీ 2', 'భరత్', 'మలంగ్', 'రాధే', 'ఏక్ విలన్ రిటర్న్స్', 'యోధ' సినిమాలతో పాపులర్ అయింది. ప్రస్తుతం 'వెల్కమ్ టు ద జంగిల్' మూవీలో నటిస్తోంది. View this post on Instagram A post shared by Major Khushboo Patani(KP) (@khushboo_patani) చదవండి: నేను తీసుకున్న చెత్త నిర్ణయం.. ఆ సినిమా చేయడమే: ప్రియదర్శి -
స్టార్ హీరోకి ఐదేళ్ల తర్వాత హిట్.. కలెక్షన్ ఎంతొచ్చాయంటే?
బాలీవుడ్ లో గత కొన్నాళ్లుగా పరిస్థితి అస్సలేం బాగోలేదు. మరీ ముఖ్యంగా కొందరు స్టార్ హీరోలు హిట్ ముఖం చూసి చాలారోజులైంది. అలాంటి వారిలో అక్షయ్ కుమార్(Akshay Kumar) ఏడాదికి నాలుగైదు సినిమాలు చేసే ఇతడికి గత ఐదేళ్లలో సరైన హిట్ అన్నదే పడలేదు. ఇన్నాళ్లకు సాలిడ్ సక్సెస్ అందుకున్నట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: చాలా అసహ్యంగా నటించా.. ఇప్పుడు చూస్తే సిగ్గేస్తుంది: సమంత)అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'కేసరి చాప్టర్ 2'(Kesari Chapter 2). గతంలో వచ్చిన దేశభక్తి నేపథ్యంగా వచ్చిన 'కేసరి'కి దీన్ని కొనసాగింపుగా తెరకెక్కించారు. జలియన్ వాలాబాగ్ మారణకాండ నేపథ్య కథతో రెండో భాగాన్ని తీశారు. ఇందులో అక్షయ్ తో పాటు మాధవన్, అనన్య పాండే తదితరులు కీలక పాత్రలు పోషించారు.ప్రీమియర్స్ నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం తొలిరోజు రూ.7.84 కోట్లు సొంతం చేసుకోగా.. రెండో రోజుకి రూ.10.08 కోట్లు వచ్చాయి. మొత్తంగా రెండు రోజుల్లో రూ.17.92 కోట్ల వసూళ్లు వచ్చినట్లు అధికారికంగా ప్రకటించారు. అక్షయ్ కుమార్ లాంటి స్టార్ హీరోకి ఈ కలెక్షన్స్ తక్కువగానే స్టడీగా ఉన్న ఈ వసూళ్లు రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశముందని తెలుస్తోంది.(ఇదీ చదవండి: ఆ సినిమా ఆడలేదని చనిపోదామనుకున్నా..: రాజేంద్రప్రసాద్)కేసరి 2 విషయానికొస్తే.. 19191లో జలియన్ వాలా బాగ్ మరణకాండ జరిగింది. దీనికి కారకుడు అప్పటి పంజాబ్ జనరల్ మైకేల్ డయ్యర్. తన అధికారం ఉపయోగించి ఈ సంఘటన గురించి వార్తాపత్రికల్లో ఎక్కడా రాకుండా మేనేజ్ చేస్తాడు. అలానే బ్రిటీష్ వైస్రాయ్ కౌన్సిల్ లో సభ్యుడిగా ఉన్న భారత న్యాయవాది శంకరన్ నాయర్ (అక్షయ్ కుమార్)తో ఓ కమిషన్ ఏర్పాటు చేసి, తమకు అనుకూలంగా రిపోర్ట్ ఇవ్వాలని జనరల్ డయ్యర్ కోరతాడు.కానీ జలియన్ వాలా బాగ్ ఘటన గురించి అర్థం చేసుకున్న శంకరన్.. తన ఉద్యోగానికి రాజీనామా చేసి.. జనరల్ డయ్యర్ పై కేసు వేస్తాడు. దీంతో మైకేల్ డయ్యర్ తనని తాను కాపాడుకునేందుకు నెవిల్లే మెక్ కిన్లే (మాధవన్)ని అపాయింట్ చేసుకుంటాడు. మరి జలియన్ వాలా బాగ్ కేసులో శంకరన్ ఎలాంటి వాదనలు వినిపించాడు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: భరించలేని నొప్పితో ఆస్పత్రిలో చేరిన రష్మీ గౌతమ్..) -
బాలీవుడ్లో బిజీ బిజీ
జాన్ అబ్రహాం సరసన నటించనున్నారట తమన్నా. జాన్ అబ్రహాం హీరోగా రోహిత్ శెట్టి దర్శకత్వంలో ఓ బయోగ్రాఫికల్ డ్రామా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలోని హీరోయిన్ పాత్రకు మేకర్స్ తమన్నాను సంప్రదించగా, ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని బాలీవుడ్ సమాచారం. దివంగత ముంబై పోలీస్ కమిషనర్ రాజేశ్ మారియా జీవితం ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో రాకేశ్గా జాన్ అబ్రహాం నటిస్తున్నారు.ఆయన భార్య ప్రీతి మారియాగా తమన్నా కనిపిస్తారట. ఈ ఏడాదే ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాల నుకుంటున్నారు మేకర్స్. ఇక ఇప్పటికే అజయ్ దేవగన్ ‘రేంజర్’ చిత్రంలో హీరోయిన్గా నటిస్తున్నారు తమన్నా. అర్జున్ కపూర్–వరుణ్ధావన్ కలిసి నటించనున్న హిందీ చిత్రం ‘నో ఎంట్రీ 2’లో తమన్నాకు చాన్స్ లభించిందనే టాక్ వినిపిస్తోంది.ఇప్పుడు రాజేశ్ మారియా బయోగ్రాఫికల్ డ్రామాలో చాన్స్ వచ్చిందని టాక్. ఇంకా అజయ్ దేవగన్ ‘రైడ్ 2’లో తమన్నా ‘నిషా’ అనే స్పెషల్ సాంగ్ చేశారు. చూస్తుంటే... ఇలా వరుస అవకాశాలతో తమన్నా హిందీలో బిజీ బిజీగా ఉంటున్నట్లుగా తెలుస్తోంది. ఇక తెలుగులో తమన్నా లీడ్ రోల్లో నటించిన ‘ఓదెల 2’ ఈ నెల 17న విడుదలైంది. -
మరో శ్రీదేవి కావాలంటే తమన్నా ఇంకో జన్మ ఎత్తాలి: ఖుషి కపూర్
దక్షిణాది నుంచి ఉత్తరాదికి వెళ్లి ఒక ఊపు ఊపిన కధానాయికల్లో నెం.1 స్థానంలో ఉంటారు శ్రీదేవి (Sridevi). భారతీయ సినిమాకు ‘మొదటి మహిళా సూపర్ స్టార్‘గా శ్రీదేవి మూస పద్ధతులను బద్దలు కొట్టారు. కామెడీ నుంచి ట్రాజెడీ వరకు వైవిధ్యమైన శైలిలో విస్తృతమైన పాత్రలను పోషించారు. దాదాపు 50 సంవత్సరాలకు పైగా తెలుగు, తమిళం, హిందీ, మలయాళం కన్నడ భాషా చిత్రాలతో ఆమె కెరీర్ నలుదిశలా విస్తరించింది.సౌత్.. నార్త్.. అన్నింటా తనదే హవాదక్షిణాదిలో అన్ని భాషా చిత్రాల్లో విజయాలు ఒకెత్తయితే బాలీవుడ్లో మరో ఎత్తు. ‘మిస్టర్ ఇండియా,‘ ‘సద్మా,‘ ‘హిమ్మత్వాలా,‘ ‘ఖుదా గవా,‘ ‘‘లాడ్లా,‘ ‘జుదాయి,‘ ‘ఇంగ్లీష్ వింగ్లీష్‘ వంటి సూపర్ హిట్స్తో ఆమె బాలీవుడ్ ప్రేక్షకుల కలలరాణిగా కళకళలాడారు. ఆమె చివరి చిత్రం క్రైమ్ థ్రిల్లర్ ‘మామ్' 2017లో విడుదలైంది. ఇది అందరికీ తెలిసిన శ్రీదేవి.. అయితే తెలియని శ్రీదేవి గురించి ఎలా తెలుస్తుంది?శ్రీదేవి బయోపిక్లో నటించాలనుంది: తమన్నాఇప్పుడు బయోపిక్ల శకం నడుస్తోంది. సిల్క్ స్మిత నుంచి శ్రీదేవి దాకా తారల జీవితాలను తెరకెక్కించాలని సినిమా పరిశ్రమ ఉవ్విళ్లూరుతోంది. గత కొంత కాలంగా శ్రీదేవి జీవిత కథను సినిమాగా రూపొందించాలన్న చర్చలు నడుస్తున్నాయి. అదే సమయంలో ఆ పాత్రను ఎవరు పోషిస్తే బాగుంటుంది? అనే చర్చ కూడా వస్తోంది. ఈ నేపధ్యంలో దివంగత తార శ్రీదేవి ‘‘సూపర్ ఐకానిక్’’ కాబట్టి తెరపై ఆమె పాత్రను పోషించాలనుకుంటున్నట్లు నటి తమన్నా భాటియా (Tamannaah Bhatia) ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ‘శ్రీదేవి, మేడమ్. సూపర్ ఐకానిక్ ఆమె నాకు ఇన్స్పిరేషన్. చిన్నప్పటి నుంచీ ఆమె సినిమాలు చూస్తూ పెరిగాను.. నేను ఎప్పుడూ మెచ్చుకునే వ్యక్తి ఆమె‘ అని తమన్నా భాటియా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.ఆమె స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరుమరి నిజంగా తమన్నాకు శ్రీదేవి పాత్ర పోషించి మెప్పించే స్థాయి ఉందా? ఈ ప్రశ్నకు సినీ పండితుల నుంచి ఇంకా సరైన సమాధానం రాలేదు కానీ.. శ్రీదేవి చిన్న కుమార్తె నుంచి పదునైన సమాధానమే వచ్చింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఖుషి కపూర్ (Kushi Kapoor)... తన తల్లిలా మరెవరూ కాలేరని, ఆమె స్థానాన్ని మరొకరు ఎప్పటికీ భర్తీ చేయలేరని కుండ బద్ధలు కొట్టారు. ఆమెలా చిన్నప్పటి నుంచి నటనపై అంతటి అంకితభావం. అద్వితీయమైన ప్రతిభను ఎవరూ ప్రతిబింబించలేరని ఆమె స్పష్టం చేశారు.తను ప్రత్యేకమైన సృష్టిఇతరులకే కాదు తమకి కూడా అమ్మ స్థానం అసాధ్యమని ఆమె పరోక్షంగా తేల్చేశారు. తనపై ఆమె సోదరి జాన్వీపై శ్రీదేవి చూపిన ప్రభావం సాధారణమైనది కాదన్నారు. అయినప్పటికీ ‘రాబోయే 100 ఏళ్లలో కూడా నేను మా అమ్మలా కాలేను. ఆమె వేరే... ప్రత్యేకమైన సృష్టి‘ అంటూ తన తల్లిలా కావాలంటే మరో జన్మ ఎత్తాల్సిందే అంటూ ఓ ఇంటర్వ్యూ లో పరోక్షంగా స్పష్టం చేశారు.చదవండి: నెలసరి నొప్పులు.. అబ్బాయిలు అస్సలు భరించలేరు: జాన్వీ కపూర్ -
ఫ్యాషన్లో తండ్రికి తగ్గట్టే : రూ 1.4 కోట్ల వాచ్తో మెరిసిన బ్యూటీ
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కమార్తె సుహానా ఖానా మరో సారి తన ఫ్యాషన్ స్టైల్ను చాటుకుంది. అక్షయ్ కుమార్, ఆర్ మాధవన్, అనన్య పాండే నటించిన తాజా చిత్రం కేసరి చాప్టర్ 2, ఏప్రిల్ 18న థియేటర్లలోకి వచ్చింది.అంతకుముందు (ఏప్రిల్ 17న) ఈ చిత్ర నిర్మాతలు ప్రత్యేక ప్రదర్శనను నిర్వహించారు. ఈ సందర్భంగా తన స్నేహితురాలు నటి అనన్య పాండేకు సపోర్ట్గా ఈవెంట్కు విచ్చేసింది సుహానా. ఆఫ్-షోల్డర్ ఫ్లోవీ బ్లాక్ డ్రెస్, బ్లాక్ హీల్స్తో దృష్టిని ఆకర్షించింది, అంతేకాదు కోట్ల విలువైన వాచ్ను కూడా ధరించడం హాట్ టాపిక్గా నిలిచింది.తండ్రిలాగే సుహానాకు కూడా ప్రీమియం వాచీలంటే చాలా ఇష్టమట. జోయా అక్తర్ 2023 చిత్రం ది ఆర్చీస్తో అరంగేట్రం చేసిన సుహానా ఖాన్ ఇటీవల కేసరి 2 ప్రీమియర్లో రూ. 1.4 కోట్ల విలువైన అల్ట్రా లగ్జరీ వాచ్ ధరించి కనిపించింది. రెవర్సో ట్రిబ్యూట్ డ్యూఫేస్ టూర్బిలియన్ ( Jaeger-LeCoultre Reverso Tribute Duoface Tourbillon) దీంతో ఇది ఫ్యాన్స్ను బాగా ఆకట్టుకుంది. సస్టైనబుల్ ఫ్యాషన్ను సమర్ధించే సుహానా ఈ వాచ్ ధరించి కనిపించడం ఇదే మొదటిసారి కాదు. గతంలో ఖుషీ కపూర్ , ఇబ్రహీం అలీ ఖాన్నాదానియన్ ప్రీమియర్లో కూడా ఇదే వాచ్ను ధరించింది. దుస్తులను పునరావృతం చేయడానికి అభ్యంతరం చెప్పదు. అనంత్ అంబానీ వివాహానికి కూడా అదే చేసింది. మనీష్ మల్హోత్రా దీపావళి వేడుకకు తాను గతంలో ధరించిన దుస్తులనే ధరించింది. ముఖ్యంగా జాతీయ అవార్డును అందుకోవడానికి అలియా తన పెళ్లి చీరను మళ్లీ ధరించిడం తనన ఆకట్టుకుందని చెప్పుకొచ్చిందీ స్టార్కిడ్.ఇక సుహానా కరియర్ విషయానికి వస్తే ఆర్చీస్ తర్వాత తండ్రి మూవీ కింగ్లో నటిస్తోంది. 20 ఏళ్ళ తరువాత సిద్ధార్థ్ ఆనంద్ షారూక్తో మూవీ ప్రకటించాడు. జవాన్ , పఠాన్ చిత్రాల అద్భుతమైన విజయం తర్వాత షారుఖ్ ఖాన్ తదుపరి పెద్ద ప్రాజెక్ట్ కింగ్. ఈ యాక్షన్ డ్రామాలో సుహానా ఖాన్, అభిషేక్ బచ్చన్ , దీపికా పదుకొనే అతిధి పాత్రలో నటిస్తున్నారు.కాగా సుహానా తండ్రి షారుఖ్ ఖాన్ దగ్గర విలాసవంతమైన గడియారాల కలెక్షన్ ఉంది. 2024లో, అతను రూ.4.2 కోట్ల విలువైన ఆడెమర్స్ పిగ్యుట్ వాచ్ ధరించి ఫ్యాన్స్ను ఆకర్షించాడు. అతను రూ.1.1 కోట్లకు పైగా విలువైన పటేక్ ఫిలిప్ ,రూ.6 కోట్ల విలువైన రిచర్డ్ మిల్లె టూర్బిలియన్ కూడావాచ్ కూడా ఉంది.