breaking news
Bollywood
-
కమల్ హాసన్ కాలి ధూళితో కూడా షారూఖ్ సరిపోడు: నటుడు
బాలీవుడ్ హీరో షారూఖ్ ఖాన్ (Shah Rukh Khan).. తమిళ స్టార్ కమల్ హాసన్ కాలి మట్టితో కూడా సరిపోడంటున్నాడు బాలీవుడ్ నటుడు లిల్లీపుట్. షారూఖ్ మరుగుజ్జుగా నటించిన జీరో మూవీ (2018) బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం పొందింది. దీంతో అతడు కొంతకాలం పాటు యాక్టింగ్కు బ్రేక్ తీసుకున్నాడు. షారూఖ్ కంటే ముందు కమల్ హాసన్ 1989లో అపూర్వ సగోదరర్గల్ (తెలుగులో విచిత్ర సోదరులు) మూవీలో మరుగుజ్జుగా నటించి సూపర్ హిట్టందుకున్నాడు. మరుగుజ్జుగా నటించడం కష్టంఈ రెండు సినిమాలను పోలుస్తూ నటుడు లిల్లీపుట్ (Lilliput) సంచలన వ్యాఖ్యలు చేశాడు. కళ్లున్నా సరే అంధుడిగా నటించవచ్చు. కానీ మంచి ఎత్తు ఉన్నప్పటికీ మరుగుజ్జుగా నటించడమంటే చాలా కష్టం. ఎందుకంటే వాళ్లు అందరిలాగే మామూలుగానే ఉంటారు. అందరిలాగే నవ్వుతారు, అందరిలాగే ఆలోచిస్తారు. కానీ చూడటానికి మాత్రం కాస్త విచిత్రంగా కనిపిస్తుంటారు. దాన్ని తెరపై చూపించాలి. కాబట్టి మరుగుజ్జుగా కనిపించడమనేది కష్టమైన పని.ప్రతీది నిశితంగా గమనించి..కానీ కమల్ హాసన్ ఏం చేశాడు? మరుగుజ్జులు ఎలా ఉంటారు? అనేది ప్రతీది వివరంగా తెలుసుకున్నాడు. వారి చేతి వేళ్లు చిన్నగా, మందంగా ఉంటాయని గమనించాడు. ముఖం, మోచేతులు, పాదాలు కాస్త భిన్నంగా ఉంటాయని తెలుసుకున్నాడు. ఇవన్నీ గమనించకుండా యాక్ట్ చేస్తే అందులో కొత్తదనం ఏముంటుంది? పోషించే పాత్రను ప్రభావవంతంగా చూపించాలిగా! కమల్ అదే చేశాడు. వీఎఫ్ఎక్స్ వాడకుండా రియల్గా కనిపించాడు.కమల్ను కాపీ కొట్టావ్నువ్వు (షారూఖ్) వీఎఫ్ఎక్స్ సాయంతో పొట్టిగా కనిపించావు. కమల్ను కాపీ కొట్టావు. తనలాగే హావభావాలు ప్రదర్శించేందుకు ట్రై చేశావు. అయినప్పటికీ ఆయన కాలికి ఉన్న మట్టితో కూడా నువ్వు సమానం కాదు అని చెప్పుకొచ్చాడు. కాగా షారూఖ్ ఇటీవలే.. జవాన్ సినిమాకుగానూ ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు గెలుచుకున్నాడు. ప్రస్తుతం షారూఖ్.. సిద్దార్థ్ ఆనంద్ డైరెక్షన్లో కింగ్ సినిమా చేస్తున్నాడు. ఇందులో షారూఖ్ కూతురు సుహానా కూడా నటిస్తోంది. అభయ్ వర్మ, అభిషేక్ బ్చన్, జైదీప్ అహ్లావత్, జాకీ ష్రాఫ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.చదవండి: నువ్వు తెలుగేనా? మంచు లక్ష్మిని ఆటాడుకున్న అల్లు అర్హ -
జూ.ఎన్టీయార్...నా ప్రచార ‘యుద్ధం’ నాదే
హీరోలు హీరోయిన్లు సినిమా ప్రచారంలో పాల్గొంటారే తప్ప ప్రచార బాధ్యతల్ని స్వయంగా చేపట్టడం అనేది జరగదు. సాధారణంగా ఆ బాధ్యతను కూడా సినిమా నిర్మాతలు, నిర్మాణ సంస్థలే చూసుకుంటాయి. అయితే గత కొంత కాలంగా జూనియర్ ఎన్టీయార్ దీనికి కొంత విభిన్నంగా ప్రయాణిస్తున్నారు. సినిమా నిర్మాణ సంస్థల ప్రచారపు తీరుతెన్నులు ఎలా ఉన్నప్పటికీ... తాను కూడా వ్యక్తిగతంగా మరోవైపు నుంచి వీటిని నిర్వహిస్తున్నట్టు సమాచారం. గతంలో రాజమౌళి రూపొందించిన ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్ సమయంలో కూడా ఆయన ఇదే పంథాను అనుసరించారు. వ్యక్తిగతంగా అనేక వ్యయ ప్రయాసలకు ఓర్చుకుని అంతర్జాతీయ స్థాయి లో ప్రచార వ్యూహాలు అమలు చేశారట. ఆ సినిమా మల్టీ స్టారర్ అయినప్పటికీ జూ.ఎన్టీయార్(Jr NTR)కు వచ్చిన గుర్తింపు మరెవరికీ రాకపోవడానికి అదే కారణం అంటున్నారు. పలువురు హాలీవుడ్ దర్శకులు సైతం జూ.ఎన్టీయార్తో సినిమా చేయడానికి రెడీ అంటూ ప్రకటనలు గుప్పించిన సంగతి తెలిసిందే.(చదవండి: నువ్వు తెలుగేనా? మంచు లక్ష్మితో అల్లు అర్హ క్యూట్ వీడియో)తాజాగా వార్ 2 సినిమా విషయంలోనూ ఆయన ఇదే తరహా నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్తో తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకుంటున్న టాలీవుడ్ యంగ్ టైగర్... వార్ 2 ని రూపొందించిన యష్ రాజ్ ఫిలింస్ ప్రచార శైలి పట్ల కినుక వహించారో, లేక తను కూడా మరింత బలం చేకూర్చాలనుకున్నారో తెలీదు గానీ ఈ సినిమా ప్రచారం విషయంలో ఎన్టీయార్ తన పిఆర్ టీమ్ను అలర్ట్ చేశారట. మరోవైపు తాజాగా సయ్యారా సినిమా సంచలన విజయం సాధించిన తర్వాత, ఆ సినిమాను కూడా సమర్పించిన యశ్ రాజ్ ఫిలింస్ భవిష్యత్తు ప్రమోషన్ వ్యూహంలో కీలక మార్పులు చేశారని తెలుస్తోంది. (చదవండి: ఆ సీన్ చేయలేనని చెబితే.. సౌత్ స్టార్ హీరో నాపై కేకలు వేశాడు: తమన్నా)సయ్యారా సినిమా మార్కెటింగ్ను ఈ సంస్థ అత్యంత వినూత్నంగా నిర్వహించింది. ప్రధాన జంట ప్రమోషన్ కోసం చాట్ షోలు షాపింగ్ మాల్స్లో డ్యాన్స్ ప్రోగ్రామ్స్ వంటివి చేయడానికి బదులుగా, సినిమా పాటలు విజువల్ ప్రమోషన్ల ద్వారా మాత్రమే సినిమాపై ఆసక్తిని పెంచడం అనే కొత్త వ్యూహాన్ని ఈ సినిమా కోసం అవలంబించి విజయం సాధించారు. ఈ పరిణామాల నేపథ్యంలో వార్ 2 ప్రచార సరళిలో కూడా ఈ సంస్థ కీలక మార్పు చేర్పులు చేసినట్టు సమాచారం. అయితే ఈ మార్పు చేర్పుల పట్ల అంతగా సంతృప్తి చెందని జూనియర్ ఎన్టీఆర్ తన చిత్రం ప్రమోషన్ బాధ్యతలను తానే స్వయంగా చేపట్టారట. యశ్ రాజ్ ఫిలింస్ వారి మార్కెటింగ్ వ్యూహాన్ని వారు అనుసరిస్తున్నారని భావించిన ఎన్టీఆర్, తన వ్యక్తిగత మీడియా వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా మరో టాప్ హీరోతో కలిసి చేసే మల్టీ స్టారర్స్ విషయంలో జూ.ఎన్టీయర్ మరింత జాగ్రత్త పడుతున్నట్టుగా కనిపిస్తోంది.ప్రతిష్టాత్మకంగా రూపొందిన వార్ 2 సినిమా ఆగస్టు 14న విడుదలకు సిద్ధమవుతోంది. ఇందులో హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలు నటించడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అధికారిక ప్రమోషన్ కార్యక్రమాల్లో స్టార్స్ కనిపించకపోవచ్చుననే అంచనాలతో, అభిమానులు సోషల్ మీడియా ఇతర మార్గాల ద్వారా ఈ సినిమా ప్రచారాన్ని ఆసక్తిగా గమనిస్తున్నారు. -
సలాం అనాలి సాంగ్ టీజర్: డ్యాన్స్ ఇరగదీసిన స్టార్స్.. కానీ..!
హృతిక్ రోషన్ (Hrithik Roshan) హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ వార్ 2. ఈ చిత్రంతో జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్కు పరిచయమవుతున్నాడు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఆగస్టు 14న హిందీ, తెలుగు, తమిళ భాషల్లో రిలీజవుతోంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ అభిమానులకు విపరీతంగా నచ్చేసింది. ఇకపోతే చిత్రయూనిట్ ఆన్లైన్ ప్రమోషన్స్ మొదలుపెట్టింది.ఆన్లైన్ ప్రమోషన్స్ఇంటర్వ్యూలు, ప్రెస్మీట్లు అంటూ హంగామా చేయకుండా సోషల్ మీడియాలోనే ప్రమోషన్స్ నిర్వహిస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR).. వార్ 2 మూవీలోని తన పోస్టర్తో ఉన్న బిల్బోర్డ్ను హృతిక్ ఇంటికి పంపించాడు. ఈ యుద్ధాన్ని మాతో గెలవలేరు అంటూ హీరోకు సవాలు విసిరాడు. అందుకు హృతిక్.. తన పోస్టర్ ఉన్న బిల్బోర్డ్ను తారక్ ఇంటికి పంపాడు. మీరు నాటునాటు డ్యాన్స్ ఎంత చేసినా.. ఈ యుద్ధంలో గెలిచేది మాత్రం నేనే అని రిప్లై ఇచ్చాడు. అలా వీరి మధ్య సోషల్ మీడియాలో సరదా వార్ జరుగుతోంది.ఫుల్ సాంగ్ కావాలంటే..తాజాగా ఈ యుద్ధాన్ని పక్కనపెట్టి వీరిద్దరూ ఒకరితో మరొకరు పోటీపడుతూ స్టెప్పులేశారు. జనాబే ఆలి (తెలుగులో సలాం అనాలి) పాటకు స్టైలిష్ స్టెప్పులు వేస్తూ అదరగొట్టారు. అందుకు సంబంధించిన ప్రోమోను తాజాగా రిలీజ్ చేశారు. ఫుల్ సాంగ్ ఎప్పుడనుకుంటున్నారా? ఆగస్టు 14న.. యూట్యూబ్లో కాదు.. ఏకంగా థియేటర్లోనే ఫుల్ సాంగ్ చూసేయండని చెప్తున్నారు. ఏదేమైనా పాట మాత్రం అదిరిపోయిందంటున్నారు. The dance WAR you’ve been waiting for is almost here. Here’s the tease... #JanaabeAali full song in theatres only! pic.twitter.com/iUgdEWZbJ1#War2 releasing in Hindi, Telugu and Tamil in cinemas worldwide on 14th August.@ihrithik | @advani_kiara | #AyanMukerji | @ipritamofficial…— Jr NTR (@tarak9999) August 7, 2025 చదవండి: ఇబ్బందిగా ఉందని చెబితే.. సౌత్ స్టార్ హీరో నాపై కేకలు వేశాడు -
ఇబ్బందిగా ఉందని చెబితే.. సౌత్ స్టార్ హీరో నాపై కేకలు వేశాడు : తమన్నా
సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు స్టార్ హీరోయిన్లుగా కొనసాగుతున్న చాలామంది కెరీర్ ప్రారంభంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నవాళ్లే. అవమానాలను భరించి, అవకాశం వచ్చినప్పుడు తమ టాలెంట్ని నిరూపించుకున్నవాళ్లే ఇప్పుడు స్టార్స్గా కొనసాగుతున్నారు. అలాంటి వారిలో తమన్నా(Tamanna Bhatia ) కూడా ఒకరు. చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి వచ్చిన ఈ మిల్కీ బ్యూటీ.. కెరీర్ ప్రారంభంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వచ్చిదట. చాలామంది తనను అవమానించి, ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నించారట. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తొలినాళ్లలో తనకు ఎదురైన ఓ సంఘటన గురించి చెప్పింది. తనకు అసౌకర్యంగా ఉందని చెప్పినందుకు ఓ స్టార్ హీరో కేకలు వేసి.. తన స్థానంలో మరో నటిని తీసుకోవాలని ఆదేశించారట.(చదవండి: విడాకుల బాటలో మరో సీనియర్ హీరోయిన్!)‘చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి వచ్చాను కాబట్టి నాకేమి తెలియదని చాలా మంది అనుకున్నారు. నా ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నించారు. చాలాసార్లు నన్ను అవమానించేందుకు ప్రయత్నంచారు. కెరీర్ ప్రారంభంలో సౌత్కి చెందిన ఓ పెద్ద హీరోకి జోడిగా నటించే అవకాశం వచ్చింది. ఆయనతో కొన్ని సీన్లలో నటించాల్సి వచ్చినప్పుడు నాకు కాస్త అసౌకర్యంగా అనిపించింది. ఈ విషయాన్ని దర్శకనిర్మాతలకు చెప్పి.. నాకు ఇబ్బందిగా ఉంది చేయలేనన్నాను. వెంటనే ఆ స్టార్ వచ్చి నాపై కేకలు వేశాను. దర్శక నిర్మాతలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ‘హీరోయిన్ని మార్చేయండి’ అన్నారు. అప్పుడు నేను కాస్త బాధ పడ్డాను కానీ తిరిగి ఆ హీరోని ఏమి అనలేదు. మౌనంగా ఉండిపోయాను. మరుసటి రోజు ఆ స్టార్ హీరోనే నా దగ్గరకు వచ్చి క్షమాపణలు చెప్పాడు. కోపంలో అలా అరిచానని, అలా ప్రవర్తించి ఉండకూడదని పశ్చాత్తాపపడ్డాడు’ అని తమన్నా చెప్పుకొచ్చింది. అయితే ఆ హీరో పేరు చెప్పడానికి మాత్రం నిరాకరించింది.(చదవండి: 40 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న నటి.. 'మగవాడ్ని ఇలాంటి ప్రశ్నలు అడగ్గలరా?')తమన్నా సీనీ కెరీర్ విషయానికొస్తే.. 2005లో ‘చాంద్ సా రోష్ చెహ్రా’ మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత మంచు మనోజ్ శ్రీ సినిమాతో టాలీవుడ్లోకి అడుగుపెట్టింది. హ్యాపీడేస్తో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఆ తర్వాత టాలీవుడ్లో వరుస అవకాశాలు వచ్చాయి. చిరంజీవి, వెంకటేశ్ లాంటి సీనియర్ హీరోలతో పాటు మహేశ్ బాబు, ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలతోనూ సినిమాలు చేసింది. ఆ మధ్య ఓదెల 2 మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించారు. ప్రస్తుతం నాలుగు హిందీ సినిమాల్లో నటిస్తున్నారు. -
భార్యకు వండి పెడతా.. పిల్లల కోసమే ఆ పద్ధతి మార్చుకున్నా: తారక్
దేవర సినిమాతో సూపర్ హిట్టందుకున్న జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) వార్ 2తో ప్రేక్షకులను పలకరించనున్నాడు. వచ్చేవారమే (ఆగస్టు 14న) ఈ మూవీ బాక్సాఫీస్లో సందడి చేయనుంది. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కలిసి నటించిన ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. తాజాగా తారక్.. ఈస్క్వైర్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్నో ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు.అది నా ఫేవరెట్ముందుగా బాలీవుడ్లో ఎంట్రీ గురించి మాట్లాడుతూ.. నేను ఏదీ ముందుగా ప్లాన్ చేసుకోను. కుంగ్ఫు పాండా సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది. 'నిన్న ఒక చరిత్ర- రేపు ఓ రహస్యం- నేడు అనేది ఓ బహుమతి'. ఇది నా ఫేవరెట్. నేను గతం గురించి, జరగబోయేదాని గురించి ఆలోచించను. వర్తమానంపైనే ఫోకస్ చేస్తాను. వార్ 2 సినిమా విషయానికి వస్తే.. కథ నాకు బాగా నచ్చింది. అలాగే హృతిక్ సర్తో పని చేయాలన్న ఉత్సుకత వల్లే వార్ 2 మూవీకి ఓకే చెప్పాను.నెలంతా షూటింగ్స్కే..మొదట్లో ఫ్యామిలీని పక్కనపెట్టి మొత్తం సినిమాలకే పరిమితమయ్యాను. వారంలో ఏడురోజులు షూటింగ్కు వెళ్లేవాడిని. అంటే నెలలో 30 రోజులు షూటింగ్స్కే కేటాయించేవాడిని. కానీ, ఇప్పుడు ఆ పద్ధతి మార్చుకుంటున్నాను. ఆదివారం సెలవు తీసుకుంటున్నాను. నా పిల్లలు అభయ్, భార్గవకు సమయం కేటాయిస్తున్నాను. ఎందుకంటే వారితో నేను సరదాగా, ప్రశాంతంగా గడిపేది ఆ ఒక్కరోజే! వాళ్లకు నచ్చింది చేయనిస్తానా పిల్లలు కూడా నాలాగే యాక్టర్స్ కావాలని ఎప్పుడూ చెప్పను. అది చేయాలి, ఇది చేయాలని ఆదేశించడానికి బదులుగా వారు కోరుకున్న స్థాయికి చేరేందుకు వారధిలా నిలబడతాను. ఇకపోతే నాకు వంట చేయడం ఇష్టం. నా భార్య లక్ష్మీ ప్రణతికి ప్రేమగా వండిపెడతాను. తనకే కాదు, నా స్నేహితుల కోసం, నా చుట్టూ ఉన్నవారి కోసం రుచికరంగా వంట చేస్తుంటాను. నాకు బిర్యానీ ఇష్టమైన వంటకం అని తారక్ చెప్పుకొచ్చాడు.చదవండి: నటి సీమంతం వేడుక.. పెళ్లెందుకు చేసుకోలేదా? నా ఇష్టం! -
5 నెలల్లో 28 కిలోలు : అమీర్ ఖాన్ అద్భుత చిట్కాలు
బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ తనదైన నటన, వ్యక్తిత్వంతో మిస్టర్ పర్ఫెక్షనిస్ట్గా పేరు తెచ్చుకున్నారు. కరీయర్లో అనేక బ్లాక్ బస్టర్ మూవీలను అందించడమాత్రమే కాదు, హీరోగా, డైరెక్టర్గా, నిర్మాతగా కూడా తన ప్రత్యేకతను చాటుకున్నారు. తాను పోషించే పాత్ర కోసం ఎలాంటి ప్రయోగానికైనా వెనుకాడని నటుడు. ఫిట్నెస్ విషయంలో కూడా ఎక్కడా తగ్గకుండా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. బాలీవుడ్ సూపర్ స్టార్ తన ఫిట్నెస్ ప్రయాణంతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తారు. గజని మూవీనుంచి దంగల్ దాకా ఆయన చేసిన ప్రతీ ప్రయోగమూ సక్సెస్ను అందుకుంది. 5 నెలల్లో 25 కిలోలకు పైగా బరువు తగ్గినా, కొన్ని నెలల్లో బరువు పెరిగినా అది ఆయనకే చెల్లు.ముఖ్యంగా అమీర్ ఖాన్ 60 ఏళ్ళ వయసులో ఫిట్ అండ్ ఫ్యాబ్గా ఉండటంలో ఆయనకు ఆయనే సాటి. 2016లో వచ్చిన తన బ్లాక్ బస్టర్ సినిమా దంగల్ కోసం అనూహ్యంగా బరువు పెరిగి, పాత్ర పట్ల తన నిబద్ధతను చాటుకున్నారు. భారతీయ రెజ్లింగ్ ఛాంపియన్ మహావీర్ సింగ్ ఫోగట్లా కనిపించేందుకు పెద్ద సాహసమే చేశారు. ఒక ప్రధాన రెజ్లర్ నుండి మధ్య వయస్కుడైన తండ్రిలా కనిపించేందుకు బాడీసూట్ ధరించడం కంటే, ఆ పాత్రకు న్యాయం చేసేందుకు సహజంగానే బరువు పెరిగి, మళ్లీ బరువు తగ్గి అభిమానులను ఆశ్చర్యపరిచారు.. అమీర్ ఖాన్ దంగల్ సినిమా కోసం సుమారు 28 కిలోల బరువు తగ్గారు. కేవలం ఐదు నెలల్లో 97 కిలోల నుండి 68 కిలోలకు చేరుకున్నారు. ఈ సమయంలో తన శరీర కొవ్వు శాతాన్ని 37శాతం నుండి 9.67శాతానికి తగ్గించుకోవడం విశేషం. ఈ మూవీ దర్శకుడు నితేష్ తివారీ అమీర్ అంకితభావాన్ని ప్రశంసించకుండా ఉండలేకపోయాడు."బరువు పెరగడం సరదాగానే ఉంటుంది. కోరుకున్నది తినవచ్చు. కానీ చురుగ్గా కదలలేం. శ్వాస కూడా కష్టంగా మారుతుంది. బాడీ లాంగ్వేజ్, నడక , కూర్చునే విధానం... ప్రతిదీ మారుతుంది. కానీ ఆ తరువాత బరువు తగ్గడం చాలా కష్టం అనిపించింది’’ అంటారు అమీర్. కానీ కఠినమైన ఫిట్నెస్ విధానాన్ని అనుసరించి అనుకున్నది సాధించారు. శరీర బరువులో "ఆహారం నంబర్ వన్" అంటారాయన. మీరెంత వ్యాయామం చేసినా ఫుడ్ సరిగ్గా తీసుకోకపోతే ఫలితం ఉండదు. మొదట్లో నిరాశ అనిపించినా, క్రమశిక్షణతో సాగితే ఫలితం ఉంటుంది అనే ఫిట్నెస్ సీక్రెట్ను అమీర్ వెయిట్ లాస్ జర్నీ ద్వారా తెలుసుకోవచ్చు.యాభై శాతం ఆహారం. 25 శాతం వ్యాయామం, 25 శాతం విశ్రాంతి కావాలంటూ తన అనుభవాన్ని గతంలోనే వివరించారు అమీర్ ఖాన్. ఎనిమిది గంటలు నిద్ర లేనిదే వెయిట్లాస్ జర్నీలేదు అంటారాయన.రాత్రిపూట అన్నం మానేయడం, తక్కువ తినడం లేదా ఆకలితో అలమటించడం లేదా అధిక ప్రోటీన్ భోజనం తీసుకోవడం వంటివి చిట్కాలను చాలామంది పాటిస్తున్నప్పటికీ తాను మాత్రం బరువు తగ్గడానికి పాతకాలపు పద్ధతిని అనుసరించానని చెప్పారు. ‘‘2,000 యూనిట్ల శక్తిని ఖర్చు చేస్తే, అదే మోతాదులో కేలరీలు తింటే, బరువు అలాగే ఉంటుంది. అలా కాకుండా 2,000 యూనిట్ల శక్తిని ఖర్చు చేసి 1,500 కేలరీలు తింటే, ప్రతిరోజు 500 కేలరీలు తగ్గుతాయి. ప్రతిరోజూ 7 కిలోమీటర్లు నడిస్తే వారానికి 7వేల కేలరీలు ఖర్చవుతాయి. ఇది శాస్త్రం. దీంతోపాటు కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్, కొవ్వులు, ఫైబర్, సోడియంతో మన ఆహారాన్ని సమతులం చేసుకోవాలి అని అమీర్తెలిపారు. -
వాస్తవ సంఘటనల ఆధారంగా వస్తోన్న చిత్రం.. టీజర్ రిలీజ్
బాలీవుడ్ హీరో ఫర్హాన్ అక్తర్ కీలక పాత్రలో నటిస్తోన్న పీరియాడికల్ వార్ చిత్రం 120 బహదూర్. ఈ సినిమాను 1962 నాటి ఇండియా- చైనా యుద్ధం ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. మేజర్ షైతాన్ సింగ్ భాటి జీవిత కథగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. యుద్ధం సమయంలో జరిగిన వాస్తవ సంఘటనలతో ఈ మూవీని రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి రజనీశ్ దర్శకత్వం వహిస్తున్నారు.తాజాగా ఈ మూవీ టీజర్ను మేకర్స్ విడుదల చేశారు. ఈ చిత్రంలో ఫర్హాన్ అక్తర్ సోల్జర్గా కనిపించనున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుగుతోన్న ఈ సినిమాను నవంబర్ 21 రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. తాజాగా విడుదలైన టీజర్ చూస్తే అభిమానుల్లో అంచనాలు పెంచేసింది. విజువల్స్, డైలాగ్స్ ఫ్యాన్స్ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. కాగా.. ఈ చిత్రంలో రాశి ఖన్నా హీరోయిన్గా కనిపించనుంది. -
నటుడితో కాఫీ కోసం నాయకురాలు లేఖ.. రిప్లై ఇవ్వలేదట!
రాజకీయ నాయకులు కూడా వినోదం కోసం సినిమా చూస్తుంటారు. వాళ్లకూ అభిమాన హీరోహీరోయిన్లు ఉంటారు. అవకాశం వచ్చినప్పుడు తమ అభిమాన నటీనటులను కలుస్తుంటారు. కొంతమంది అయితే ఏ స్థాయిలో ఉన్నా.. తమ అభిమాన నటీనటులు కనిపిస్తే చాలు తమ హోదాని మరచి సాధారణ అభిమానిలాగే వ్యవహరిస్తారు. తాజాగా పశ్చిమ బెంగాల్ ఎంపీ మహువా మొయిత్రా కూడా అలానే ప్రవర్తించారు. ఇండియా టుడే చానెల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ఫేవరేట్ నటుడి గురించి, అతన్ని కలిసేందుకు చేసిన ప్రయత్నాల గురించి చెబుతూ.. సిగ్గు పడిపోయింది. పార్లమెంట్లో జంకు లేకుంగా గంభీరంగా మాట్లాడుతూ ఫైర్బ్రాండ్గా పేరు తెచ్చుకున్న మహువా మొయిత్రా.. ఇలా సిగ్గు పడుతూ మాట్లాడడం చూసి వీక్షకులు అవాక్కయ్యారు. ఇంతకీ మహువా మనసుకు నచ్చిన నటుడి పేరు చెప్పలేదు కదా.. విలక్షణమైన పాత్రలు పోషిస్తూ బాలీవుడ్తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చకున్న పంకజ్ త్రిపాఠినే ఆమె ఫేవరేట్ యాక్టర్. అతనితో కలిసి కాఫీ తాగేందుకు చాలా ప్రయత్నాలు చేసిందట. చివరకు లేఖ కూడా రాశానని.. కానీ రిప్లై రాలేదని మహువా చెప్పుకొచ్చింది.యాంకర్తో కబురు..పంకజ్ త్రిపాఠి నటన అంటే నాకు చాలా ఇష్టం. బయట కూల్గా కనిపిస్తాడు కానీ తెరపై మాత్రం భయంకరమైన పాత్రల్లో కనిపిస్తాడు. మిర్జాపూర్ వెబ్ సిరీస్లో ఆయన అద్భుతమైన విలనిజం పండించాడు. ఒకసారి అతన్ని కలిసేందుకు ప్రయత్నించాడు. అతనితో కలిసి కాఫీ తాగాలని ఉందని లేఖ రాసి.. అతన్ని ఇంటర్వ్యూ చేయబోయే యాంకర్ ద్వారా ఆ లేఖని అందించాను. కానీ ఆయన నుంచి రిప్లై రాకపోవడంతో నిరాశ చెందాను.సహచర ఎంపీ సహాయంతో..ఎంపీ అయిన తర్వాత సహచర ఎంపీ, నటుడు రవి కిషన్తో నా క్రష్ గురించి చెప్పాను. పంకజ్ త్రిపాఠి నటన అంటే చాలా ఇష్టమని , ఇలా లేఖ కూడా రాశనని చెప్పాను. అతను వెంటనే ఫోన్ చేసి పంకజ్తో మాట్లాడించాడు. అతనితో మాట్లాడే సమయంలో తెలియకుండానే నేను సిగ్గుపడిపోయాను. లేఖ రాసిన విషయాన్ని కూడా గుర్తు చేశాను’ అని ఎంపీ మహువా మొయిత్రా చెప్పుకొచ్చింది.పంకజ్ త్రిపాఠి విషయానికొస్తే.. 2004లో ఆయన బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చాడు. 2012లో వచ్చిన గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్ సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ‘మీర్జాపూర్’ వెబ్ సిరీస్తో అన్ని భాషల్లోనూ అభిమానులను సొంతం చేసుకున్నారు. ఒకవైపు వెబ్ సిరీస్లు మరోవైపు సినిమాలు చేస్తూ బీజీ ఆర్టిస్ట్గా మారిపోయాడు. ఇటీవల ఆయన మైన్ హీరా అనే సినిమాలో ఒక హీరోగా కనిపించాడు. -
నా ఐటమ్ సాంగ్ చూస్తూ పిల్లలు భోంచేస్తున్నారు: తమన్నా
తమన్నా.. ఈ పేరు చెప్పగానే ఒకప్పుడు హీరోయిన్గా చేసిన సినిమాలు గుర్తొచ్చేవి. కానీ గత కొన్నేళ్లలో చూసుకుంటే మాత్రం ఐటమ్ సాంగ్స్ గుర్తొస్తున్నాయి. ఎందుకంటే 'కావాలయ్యా', 'ఆజ్ కీ రాత్' తదితర గీతాలతో తెగ వైరల్ అయిపోయింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సౌత్, నార్త్లో ఈ తరహా సాంగ్స్ చేయడం వల్ల తనకొచ్చిన క్రేజ్ గురించి మాట్లాడింది. ఎంతోమంది పిల్లలు తన పాటలు చూస్తూ అన్నం తింటున్నారని చెప్పుకొచ్చింది.'ఓ పిల్లాడు నా పాట చూస్తూ తింటుంటే అలానే చూడనివ్వండి' అని తమన్నా చెప్పింది. మీరు ఏ సాంగ్ గురించి మాట్లాడుతున్నారని హోస్ట్ అడగ్గా.. 'స్త్రీ 2 మూవీలో ఆజ్ కీ రాత్ గురించి' అని తమన్నా బదులిచ్చింది. అలానే 'ఎందరో తల్లులు నాకు ఫోన్ చేసి, మా బిడ్డ మీ పాట వింటూ, చూస్తే తప్పితే భోజనం చేయట్లేదు అని చెప్పారో లెక్కలేదు. పిల్లలకు నచ్చింది కనిపిస్తే అలానే చేస్తుంటారుగా' అని తన ఆనందాన్ని పంచుకుంది.(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 37 సినిమాలు)తమన్నా కామెంట్స్పై స్పందించిన హోస్ట్.. ఇది తల్లులు చింతించాల్సిన విషయమే అని అన్నాడు. దీనికి కౌంటర్ ఇచ్చిన తమన్నా.. 'తమ పిల్లలు సరిగా తింటున్నారా లేదా అని తల్లులు చింతించాలి. అదే వాళ్లకు ముఖ్యం. అంతే కానీ ఏ సాంగ్ వింటున్నారనేది కాదు. అయినా ఏడాది పిల్లలకు లిరిక్స్ ఏం అర్థమవుతాయి? వాళ్లు సంగీతం మాత్రమే ఎంజాయ్ చేస్తారు. కొన్నిసార్లు మనం కూడా సినిమాల్ని మర్చిపోతాం కానీ పాటలు గుర్తుంచుకుంటాగా. అలానే ఇది' అని చెప్పింది.తమన్నా చెప్పింది నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే యూట్యూబ్లో మంచి బీట్ ఉన్న పాటలంటే ఎక్కువగా స్పెషల్ సాంగ్సే ఉంటాయి. వాటిని చూపిస్తూనే చాలామంది తల్లలు.. పిల్లలకు అన్నం తినిపిస్తున్నారేమో? ఇకపోతే తమన్నా కెరీర్ విషయానికొస్తే.. చివరగా తెలుగులో 'ఓదెల 2' సినిమా చేసింది. ప్రస్తుతం హిందీలో మూడు మూవీస్ చేస్తోంది. గతేడాది వరకు నటుడు విజయ్ వర్మతో చెట్టాపట్టాలు వేసుకుని తిరిగింది. కొన్నాళ్ల క్రితం వీళ్లకు బ్రేకప్ అయింది. ప్రస్తుతానికైతే తమన్నాకు సినిమాలే ప్రపంచం.(ఇదీ చదవండి: ఆటిట్యూడ్ హీరోలపై 'కూలీ' నిర్మాత సెటైర్లు) -
పదేళ్లలో ఆదాయం వందల కోట్లు,ఇదీ ప్రభాస్ హీరోయిన్ సత్తా..
ప్రస్తుతం హిందీ సినిమా పరిశ్రమలో అత్యంత సుపరిచితమైన విమర్శకుల ప్రశంసలు పొందిన పేర్లలో ఒకరిగా కృతిసనన్ ఎదిగింది. అయితే, ఆమె స్టార్డమ్కు మార్గం ఇంజనీరింగ్ క్లాస్రూమ్ల నుంచే మొదలైంది.ఇంజనీరింగ్ టూ సిల్వర్స్క్రీన్..సంప్రదాయ. ఇంజనీరింగ్ నేపథ్యం నుంచి వచ్చిన కృతి బాలీవుడ్ తో ఎటువంటి కుటుంబ సంబంధాలు లేకుండా, వినోద ప్రపంచంలోకి పూర్తిగా బయటి వ్యక్తిగా ప్రవేశించింది. ఆమె మొదట్లో మోడలింగ్ ద్వారా వెలుగులోకి వచ్చింది, క్రమంగా తన విలక్షణమైన శైలి ఆత్మవిశ్వాసంతో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకుంది. 2014లో ప్రముఖ నటుడు జాకీ ష్రో కుమారుడు టైగర్ ష్రోతో కలిసి యాక్షన్ రొమాన్స్ చిత్రం హీరోపంతిలో నటించడంతో ఆమెకు పెద్ద బ్రేక్ వచ్చింది. ఆ అరంగేట్రం విజయవంతమైన ప్రయాణానికి నాంది పలికింది. శరవేగంగా ఆకట్టుకునే అందాల తారగా మారి భారతీయ సినిమాలోని అత్యంత ప్రసిద్ధ వ్యక్తులతో కలిసి పనిచేసే అవకాశాన్ని సంపాదించింది. ఆదిపురుష్లో ప్రభాస్ సరసన సీత పాత్రలోనూ నటించింది.2015లో, రోహిత్ శెట్టి బ్లాక్ బస్టర్ దిల్ వాలేలో షారుఖ్ ఖాన్, కాజోల్ లతో కలిసి స్క్రీన్ స్పేస్ పంచుకుంది. తరువాతి కొన్ని సంవత్సరాలలో కృతి బరేలీ కి బార్, లుకా చుప్పీ, హౌస్ ఫుల్ 4 తదితర చిత్రాల ద్వారా స్థిరమైన విజయాలను దక్కించుకుంటూ వచ్చింది. మిమి (2021)లో పోషించిన సర్రోగేట్ తల్లి పాత్ర ఆమెకు ప్రతిష్టాత్మక జాతీయ చలనచిత్ర అవార్డును కూడా అందించింది. అందంతో పాటు అభినయ ప్రతిభ ఉన్న నటిగా బాలీవుడ్లో ఆమె స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంది.బిజినెస్లో బిజీ బిజీగా...అనంతరం కృతి అభిరుచులు కెమెరాకు మించి విస్తరించాయి. మోడలింగ్ సినిమా సెట్లలో గ్లామర్ సౌందర్య పోషణతో సంవత్సరాల తరబడి పరిచయం ఉండడంతో కృతి సులభంగా స్కిన్ కేర్ స్పేస్ లోకి ప్రవేశించింది. కోవిడ్, లాక్డౌన్ సమయంలో, ఆమె చర్మ సంరక్షణ దినచర్యలు, ఉత్పత్తులను లోతుగా అర్థం చేసుకోవడంలో మునిగిపోయింది. ఈ అభిరుచి 2023లో తన సొంత బ్యూటీ బ్రాండ్ హైఫర్ ను ప్రారంభించడానికి దారితీసింది. హైఫన్ ఇప్పుడు టాప్ సెలబ్రిటీ బ్యూటీ లేబుల్లలో ఒకటిగా నిలిచింది, ఫోర్బ్స్ నివేదిక ప్రకారం, ఈ చర్మ సంరక్షణ లేబుల్ దాని మొదటి సంవత్సరంలోనే రూ. 100 కోట్ల అద్భుతమైన ఆదాయాన్ని ఆర్జించింది, అత్యంత పోటీతత్వ మార్కెట్లో తనను తాను స్థిరపరచుకుంది. కత్రినా కైఫ్ కే బ్యూటీ, మీరా రాజ్పుత్ అకైండ్, ఆష్కా గోరాడియా రెనీ కాస్మెటిక్స్ వంటి వాటితో పోటీ పడుతోంది. కృతికి చర్మ సంరక్షణ పట్ల ఉన్న నిజమైన మక్కువ, ఆమె స్వయంగా అన్నింటినీ పర్యవేక్షించడం ఈ బ్రాండ్ శీఘ్ర విజయానికి మూలస్తంభంగా మారింది.ఫిట్...హిట్...స్కిన్ కేర్ ఉత్పత్తుల కంటే ముందే . 2022లో, ఆమె ఫిట్నెస్ బ్రాండ్ అయిన ది ట్రైబ్ను సహ యజమానురాలిగాస్థాపించింది. దీనికి ఆమె మిమి షూటింగ్ కోసం కృతి తన పాత్రను పండించడం కోసం దాదాపు 15 కిలోగ్రాముల బరువు పెరిగింది. లాక్డౌన్ కారణంగా జిమ్లు మూసేయడంతో అదనపు బరువు తగ్గడం ఆమెకు బాగా కష్టమైంది. దాంతో వర్చువల్ సెషల్ ద్వారా నలుగురు వ్యక్తిగత శిక్షకుల మార్గదర్శకత్వంలో తాను ఇంట్లోనే వ్యాయామం చేశానని కృతి వెల్లడించింది. ఈ లోతైన వ్యక్తిగత సవాలుతో కూడిన దశ ఆమెను ఆ శిక్షకులతో కలిసి ది ట్రైబ్ ఏర్పాటుకు ప్రేరేపించింది. అదే సంవత్సరంలో, ఆమె ముంబైలోని ఉన్నత స్థాయి జుహు ప్రాంతంలో తన మొదటి ఫిట్నెస్ స్టూడియోను ప్రారంభించింది. రెండు సంవత్సరాల తరువాత, 2024లో, ముంబైలోని మరొక ఉన్నత పరిసర ప్రాంతమైన బాంద్రాలో రెండవ స్టూడియో తెరిచింది. -
ఏఐ మాయ.. పాపం బాలీవుడ్ స్టార్స్ను ఇలా చేశారేంటి?
ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(ఏఐ) ఇటీవల ఈ పదం ఎక్కువగా వినిపిస్తోంది. ఎందుకంటే రాబోయే కాలంలో మనుషులకు ప్రత్యామ్నాయంగా మారనుందని టాక్ వినిపించడమే. అయితే ఏఐ వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో.. అంతే నష్టాలు కూడా ఉంటాయి. కృత్రిమ మేధతో ఉద్యోగాలు కూడా పోతాయన్నది ఓ వాదన. అయితే భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఏఐని మన జీవితంలో ఆహ్వానించక తప్పదేమో అనిపిస్తోంది.అయితే ఇటీవల సోషల్ మీడియాలో ఏఐ సాయంతో చేస్తున్న ఫోటోలు, వీడియోలు తెగ వైరలవుతున్నాయి. ఫన్ కోసం సినీతారల ఫోటోలను కోసం తెగ వాడేస్తున్నారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోలు, వారి సతీమణులతో ఉన్నట్లు చేసిన వీడియో నెట్టంట హల్చల్ చేస్తోంది. హీరోలు తమ భార్యలకు ఆహరం తినిపిస్తుండగా.. వాళ్లను మాత్రం బక్క చిక్కినట్లుగా ఇందులో చూపించారు. చివర్లో సల్మాన్ ఖాన్ మాత్రం ఒక్కడే తింటూ నిండుగా కనిపించారు. ఈ లెక్కన పెళ్లి చేసుకుంటే సినీ తారల పరిస్థితి కూడా ఇంతేనా?? అంటూ ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం ఈ ఏఐ ఫన్నీ వీడియో మీరు కూడా చూసేయండి.#SalmanKhan rocked 😅Watch till the end pic.twitter.com/ryhgna8fbQ— Adil Hashmi👁🗨 (@X4SALMAN) August 2, 2025 -
రజనీకాంత్ కాళ్లకు నమస్కరించిన బాలీవుడ్ హీరో
రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ మూవీ కూలీ (Coolie Movie). టాలీవుడ్ కింగ్ నాగార్జున, బాలీవుడ్ సూపర్స్టార్ ఆమిర్ ఖాన్, శాండల్వుడ్ స్టార్ ఉపేంద్ర, మలయాళ నటుడు సౌబిన్ షాహిర్, సత్యరాజ్, హీరోయిన్ శృతి హాసన్ కీలక పాత్రల్లో నటించారు. బుట్టబొమ్మ పూజా హెగ్డే ఐటమ్ సాంగ్లో కనిపించనుంది. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టు 14న విడుదల కానుంది.కూలీ సినిమా లుక్లో ఆమిర్శనివారం ఈ సినిమా ట్రైలర్, ఆడియో లాంచ్ ఈవెంట్ చేశారు. చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ ఈవెంట్కు ఆమిర్ ఖాన్ (Aamir Khan) కూడా హాజరయ్యాడు. కూలీ సినిమాలో చేతి నిండా పచ్చబొట్టుతో ఎలా కనిపించాడో అదే లుక్లో స్టేజీపై దర్శనమిచ్చాడు. భుజంపై జాకెట్ పట్టుకుని దర్జాగా నడుచుకుంటూ వచ్చి అభిమానులను పలకరించాడు. కాళ్లు మొక్కిన హీరోఆ తర్వాత రజనీకాంత్ కాళ్లకు నమస్కరించాడు. దీంతో తలైవా అతడిని వెంటనే పైకి లేపి మనసారా హత్తుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఇది చూసిన అభిమానులు.. ఆమిర్ ఖాన్ను మెచ్చుకుంటున్నారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండటమంటే ఇదేనని కామెంట్లు చేస్తున్నారు. Can’t keep calm when Mr. Perfectionist Aamir Khan walks in with full swag!😎 #CoolieUnleashed ✨@rajinikanth @Dir_Lokesh @anirudhofficial #AamirKhan @iamnagarjuna @nimmaupendra #SathyaRaj #SoubinShahir @shrutihaasan #Coolie #CoolieFromAug14 pic.twitter.com/DFv306PuI9— Sun Pictures (@sunpictures) August 2, 2025For this massive respect, I'll be one of #AmirKhan fan after this .Humble person and knew how to respect legends. pic.twitter.com/swIjQtbbMy— Daemon (@k3_butcher) August 2, 2025చదవండి: 36 ఏళ్ల తర్వాత రజనీ సినిమాకు ‘ఏ’ సర్టిఫికెట్ -
పాతికేళ్ల తర్వాత...!
పాతికేళ్ల క్రితం విడుదలైన ‘లగాన్’ సినిమా లొకేషన్స్కు వెళ్లారు బాలీవుడ్ నటుడు, దర్శక–నిర్మాత ఆమిర్ ఖాన్. ఆయన హీరోగా నటించిన తాజా హిందీ చిత్రం ‘సితారే జమీన్ పర్’. జెనీలియా హీరోయిన్గా నటించిన ఈ సినిమాకు ఆర్ఎస్ ప్రసన్న దర్శకత్వం వహించగా, ఆమిర్ ఖాన్ నిర్మించారు. జూన్ 20న విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 300 కోట్లు సాధించి, సూపర్హిట్గా నిలిచింది.ఈ ఆగస్టు 1 నుంచి ‘ఆమిర్ ఖాన్ టాకీస్–జనతా కా థియేటర్’ యూట్యూబ్ చానల్లో పే పర్ వ్యూ విధానంలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. కాగా ఈ సినిమాను గుజరాత్లోని భుజ్ నగరానికి దగ్గర్లో ఉన్న కునారియా గ్రామ ప్రజలకు ఉచితంగా ప్రదర్శించారు ఆమిర్ ఖాన్. వారితో కలిసి ప్రేక్షకుడిగా ఆమిర్ ఖాన్ ఈ సినిమాను చూసి, స్క్రీనింగ్ అనంతరం మాట్లాడారు. అలాగే అక్కడి లొకేషన్స్లో ‘లగాన్’ సినిమా చిత్రీకరించిన విషయాలను ఆమిర్ ఖాన్ గుర్తు చేసుకున్నారు. అలాపాతికేళ్ల తర్వాత ‘లగాన్’ సినిమాను చిత్రీకరించిన లొకేషన్స్కు వెళ్లి ఆమిర్ ఖాన్ నాటి విశేషాలను అక్కడి ప్రజలతో పంచుకోవడం విశేషం. -
శభాష్ ఖుషీ!
ఇండస్ట్రీలో రాణించాలంటే యాక్టింగ్ ప్రతిభతోపాటు స్క్రీన్పై ఫిట్గా కూడా కనిపించాల్సి ఉంటుంది. ఆ ఫిట్నెస్ కోసం కఠినమైన కసరత్తులు చేస్తుంటారు తారలు. ఇందులో భాగంగా వెయిట్ లిఫ్టింగ్ కూడా చేస్తుంటారు. అయితే ఓ అమ్మాయి ఓ వంద కేజీలు బరువు ఎత్తితేనే హాట్ టాపిక్ అయిపోతుంది. అలాంటిది ఖుషీ కపూర్ జిమ్లో ఏకంగా 290 కేజీల బరువును లిఫ్ట్ చేయడంతో చాలామంది షాక్ అయ్యారు.దివంగత ప్రముఖ తార శ్రీదేవి చిన్న కుమార్తె ఖుషీ కపూర్ హిందీ సినిమాలు చేస్తున్నారు. ఓ హీరోయిన్గా ఫిట్గా ఉండటం కోసం ఆమె వర్కౌట్స్ చేస్తుంటారు. ఈ క్రమంలోనే హిప్ థ్రస్ట్ వర్కౌట్లో భాగంగా 290 కిలోల బరువును ఖుషీ కపూర్ లిఫ్ట్ చేశారు. ఈ వీడియోను ఆమె తన ఇన్స్టా స్టేటస్లో షేర్ చేయగా వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు, ఆమె సోషల్ మీడియా ఫాలోయర్స్ విభిన్నరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.కొందరు శభాష్ ఖుషీ అని మెచ్చుకుంటుంటే, మరికొందరు ఈ ముద్దుగుమ్మకు ఎంత కష్టం వచ్చిందో అన్నట్లుగా కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఖుషీ కపూర్ సినిమాలు ఎంపిక చేసుకునే విషయంలో చాలా పర్టిక్యులర్గా ఉంటున్నారట. మంచి మాస్ కమర్షియల్ సబ్జెక్ట్ లేదా డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయడానికి ఆమె ఇష్టపడుతోందని రెగ్యులర్ లవ్స్టోరీ, గాళ్ నెక్ట్స్ డోర్... వంటివి చేసే ఆలోచన ప్రస్తుతానికి ఖుషీకి లేదని బాలీవుడ్లో ప్రచారం సాగుతోంది. -
గర్భంతో ఉండగా తల్లింట్లో.. విడాకుల వార్తలపై నటి ఏమందంటే?
యువికా చౌదరి (Yuvika Chaudhary).. మొదట్లో హీరోయిన్గా సినిమాలు చేసింది. తర్వాత సహాయనటిగా యాక్ట్ చేసింది. హిందీతో పాటు కన్నడ, పంజాబీ భాషల్లో పలు చిత్రాలు చేసింది. హిందీ బిగ్బాస్ 9వ సీజన్లోనూ పాల్గొంది. ఈ షోలోనే నటుడు ప్రిన్స్ నరూలాతో ప్రేమలో పడింది. షో తర్వాత కూడా వీరిద్దరూ ఆ ప్రేమను కొనసాగించారు. 2018లో పెళ్లి చేసుకున్నారు. ఐవీఎఫ్ ద్వారా 2024లో కూతురికి జన్మనిచ్చారు. అయితే గర్భంతో ఉన్న సమయంలో యువికా తల్లింట్లోనే ఉంది. దీంతో యువికా- ప్రిన్స్ విడిపోయారంటూ ప్రచారం జరిగింది.నా మనసంతా అదేఈ ప్రచారం గురించి ఇన్నాళ్లకు పెదవి విప్పింది యువికా చౌదరి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. నేను గర్భం దాల్చినప్పుడు నా మెదడులో, మనసులో పుట్టబోయే బిడ్డ గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉన్నాను. పనికిరాని రూమర్లకు ప్రాధాన్యత ఇవ్వకూడదనుకున్నాను. అందుకే వాటిని లైట్ తీసుకున్నాను. ఈ పుకార్లు లైఫ్లో వస్తుంటాయి, పోతుంటాయి. కానీ నా ప్రెగ్నెన్సీ ఎప్పుడంటే అప్పుడు రాదుగా.. అందుకే రూమర్స్ను పట్టించుకోలేదు. ఒకవేళ క్లారిటీ ఇచ్చినప్పటికీ పరిస్థితి చక్కబడటం కాదుకదా.. దాన్ని మరింత రచ్చ చేస్తారని భావించాను. మా మధ్య మనస్పర్థలు నిజమేఅయినా మౌనంగా ఉన్నా కూడా దాన్ని ఇంకా సాగదీశారు. ఏదేమైనా నాకు నా బిడ్డే ముఖ్యం. తనను నేను బాగా చూసుకోవాలి. తనకోసం మరింత స్ట్రాంగ్గా నిలబడాలి.. ఇవే నా మనసులో మెదిలేవి. నిజానికి ప్రిన్స్ నాకెంతో సపోర్ట్ చేస్తాడు. కాకపోతే అందరిలాగే మా మధ్య కూడా మనస్పర్థలు వచ్చాయి. లైఫ్లో ఇది కూడా ఓ ఫేజ్ అని, అదెంతో కాలం ఉండదని నాకు బాగా తెలుసు. ప్రెగ్నెన్సీలో సడన్గా సంతోషంగా ఉంటాం. అంతలోనే బాధగా అనిపిస్తుంది. కొన్నిసార్లు జీవిత భాగస్వామి మనపక్కనే ఉంటే బాగుండనిపిస్తుంది. కానీ మా ఇంట్లో ఇంటీరియర్ పనులు జరుగుతుండటంతో ప్రిన్స్ అవన్నీ దగ్గరుండి చూసుకున్నాడు. తల్లికంటే ఎక్కువ ఎవరు చూసుకోగలరు?మరోవైపు షూటింగ్స్తో బిజీగా ఉన్నాడు. అలాంటి సమయంలో నేను మా అమ్మ దగ్గర ఉండటమే మంచిదని భావించాడు. తల్లికంటే బాగా ఎవరూ చూసుకోలేరని పుట్టింటికి పంపించాడు. ప్రెగ్నెన్సీ సమయంలో అమ్మానాన్నతో కలిసి ఉండటం పాపమేమీ కాదు, అదందరూ చేసేదే! అది అర్థం చేసుకోలేనివాళ్లు పిచ్చి పుకార్లు సృష్టించారు. కానీ ప్రిన్స్ మా విడాకుల రూమర్స్ విని బాధపడ్డాడు. నేను పుట్టింట్లో.. తనేమో నాకు దూరంగా ఉండేవాడు. ఏదేమైనా ఆ ఫేజ్ దాటేశాం. హ్యాపీగా ఉన్నాం అని యువికా చౌదరి చెప్పుకొచ్చింది.చదవండి: కొన్నిరోజులే బతుకుతా.. దీనస్థితిలో హీరో.. సాయం చేసిన కమెడియన్ -
చాహల్ గర్ల్ఫ్రెండ్ ఆర్జే మహ్వశ్.. వామ్మో క్రికెట్ టీమ్నే కొనేశారా?
ప్రముఖ ఆర్జే మహ్వశ్ పేరు కొన్ని నెలలుగా తెగ వినిపిస్తోంది. ఎందుకంటే ఈ ముద్దుగుమ్మ టీమిండియా క్రికెటర్ చాహల్తో సన్నిహితంగా కనిపించడమే. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ తర్వాత మహ్వశ్ పేరు మార్మోగిపోయింది. ఆ తర్వాత ఐపీఎల్ మ్యాచ్ల్లోనూ పంజాబ్కు మద్దతుగా మ్యాచ్ల్లో సందడి చేసింది. దీంతో చాహల్తో ఈ ముద్దుగుమ్మ ప్రేమాయణం నడుపుతున్నట్లు చాలాసార్లు వార్తలొచ్చాయి. ఇటీవల వీరిద్దరు లండన్లో జంటగా కనిపించారు. ఇవన్నీ చూస్తుంటే ఈ జంట డేటింగ్లో ఉన్నట్లు అర్థమవుతోంది. అయితే తమపై వస్తున్న రూమర్స్పై ఇప్పటివరకు ఎవరూ కూడా క్లారిటీ ఇవ్వలేదు.అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ క్రికెట్ మ్యాచ్లు వీక్షించడమే కాదు.. ఏకంగా క్రికెట్ టీమ్నే సొంతం చేసుకుంది. ఇవాళ జరిగిన సీఎల్టీ10 లీగ్లో ఆక్షన్లో తళుక్కున మెరిసిన మహ్వశ్..ఆస్ట్రేలియా క్రికెటర్ షాన్ మార్ష్ను కొనుగోలు చేసింది. తన టీమ్కు కెప్టెన్గా షాన్ మార్ష్ను ఎంపిక చేసినట్లు తెలిపింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. ఆర్జే మహ్వశ్ టీమ్ కెప్టెన్..షాన్ మార్ష్ క్యాప్షన్ రాసుకొచ్చింది. ఇది కాస్తా నెట్టింట వైరల్ కావడంతో చాహల్ను కూడా మీ టీమ్లోకి తీసుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Mahvash (@rj.mahvash) -
ఇటీవలే రెండో బిడ్డకు జననం.. ఆస్పత్రిలో చేరిన దృశ్యం నటి..!
బాలీవుడ్ నటి ఇషితా దత్తా తెలుగువారికి కూడా సుపరిచితమే. తెలుగులో చాణక్యుడు సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ.. ఆ తర్వాత బాలీవుడ్లో చాలా సినిమాల్లో కనిపించింది. సినిమాలతోపాటు పలు బాలీవుడ్ సీరియల్స్లో నటించిన ఇషితా దత్తా.. ఆ తర్వాత బాలీవుడ్ నటుడు వత్సల్ సేథ్ను పెళ్లాడింది. ఇప్పటికే వీరిద్దరికీ ఓ కుమారుడు కూడా జన్మించాడు.ఈ ఏడాదిలో రెండో బిడ్డకు స్వాగతం పలికింది ముద్దుగుమ్మ. ఫిబ్రవరిలో అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన ఇషితా జూన్లో రెండో బిడ్డను తన జీవితంలో ఆహ్వానం పలికింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.అయితే తాజాగా ఇషాతా దత్తా ఆస్పత్రిలో చేరింది. తన రెండు నెలల కుమారుడితో కలిసి చికిత్స పొందుతున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఇద్దరి ఆరోగ్యం బాగానే ఉందని ఇషితా తెలిపింది. ఇది నిజంగా కఠినమైన నెల... నేను నా నవజాత శిశువుతో ఇంట్లో ఉండాల్సిన సమయంలో... ఆసుపత్రి చుట్టూ తిరుగుతున్నా అంటూ వివరించింది. మీలో చాలా మంది అనుకుంటున్నట్లు నా బరువు తగ్గడం వల్ల వచ్చిన అనారోగ్యం కాదని తెలిపింది.కాగా.. ఇషిత దత్తా -వత్సల్ సేత్ 2017లో వివాహం చేసుకున్నారు. రిష్టన్ కా సౌదాగర్ - బాజిగర్ అనే టీవీ సీరియల్ సమయంలో ఈ జంట ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత జూలై 19, 2023న, వారిద్దరు తమ మొదటి బిడ్డకు స్వాగతం పలికారు. కాగా.. ఇషిత దత్తా చివరిసారిగా 2022లో విడుదలైన దృశ్యం- 2లో కనిపించింది.ప్రస్తుతం ఆమె మరో ప్రాజెక్ట్లో నటిస్తోంది. మరోవైపు వత్సల్ చివరిగా 'ఆదిపురుష్' చిత్రంలో కనిపించారు. ఝార్ఖండ్లో పుట్టి పెరిగిన ఇషితా దత్తా.. 2004లో ఫెమినా మిస్ ఇండియా టైటిల్ గెలుచుకుంది. 2012లో తెలుగులో వచ్చిన చాణక్యుడు సినిమాలో హీరోయిన్గా నటించింది. హిందీలో దృశ్యం 1, దృశ్యం 2 , ఫిరంగి, బ్లాంక్ వంటి చిత్రాల్లో నటించింది. -
కష్టంగానే ఆ పాటకు ఓకే చెప్పా.. ప్రియాంక చోప్రా
‘రామ్-లీలా’ సినిమాలో ప్రియాంక చోప్రా ఓ స్పెషల్ సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. ‘రామ్ చాహే లీలా’ అంటూ సాగే ఆ పాట అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. సినిమా విజయంలో ఈ పాట కీలక పాత్ర పోషించింది. తాజాగా ఈ పాటకు సంబంధించిన ఓ క్లిప్ని షేర్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. అప్పటి జ్ఞాపకాలను పంచుకుంది.‘ఈ ప్రత్యేక పాట కోసం దర్శకుడు సంజయ్ లీలా నన్ను సంప్రదించినప్పుడు ‘నేను చేయగలనా’ అనుకున్నాను. కష్టంగానే ఆ పాటకు ఓకే చెప్పాను. సెట్లో దర్శకుడు నాకు బాగా ధైర్యం చెప్పాడు. పాటలోని ప్రతి పదానికి అర్థం వివరిస్తూ..హావభావాల దగ్గర నుంచి డ్యాన్స్ మూమెంట్స్ వరకూ సలహాలిచ్చారు. కొరియోగ్రాఫర్ అద్భుతంగా కంపోజ్ చేశాడు. లంచ్ బ్రేక్ టైంలో కూడా డ్యాన్స్ మూమెంట్స్ గురించి వివరించేవాడు. కష్టంగా ఒకే చెప్పినా..నాకు మంచి గుర్తింపుని తెచ్చిపెట్టింది. ఈ జ్ఞాపకాలన్నీ ఎప్పటికీ గుర్తుంటాయి’ అని ప్రియాంక ఇన్స్టాలో రాసుకొచ్చింది.రామ్-లీలా సినిమా విషయానికొస్తే.. 2013లో విడుదలైన ఈ సినిమా అప్పట్లోనే 200 కోట్లకు పైగా వసూళ్లను సాధించి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. రణ్వీర్-దీపికా పదుకొణె జంటగా నటించిన ఈ చిత్రానికి సంజయ్ లీలా భన్సాలీ దర్వకత్వం వహించాడు. గ్యాంగ్స్టర్ కుటుంబాలకు చెందిన ఇద్దరు ప్రేమికుల చుట్టు తిరిగే కథ ఇది. View this post on Instagram A post shared by Priyanka (@priyankachopra) -
యోగి ఆదిత్యనాథ్పై బయోపిక్.. విడుదలకు అడ్డుగా సెన్సార్ బోర్డ్
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆధారంగా రూపొందుతున్న సినిమా 'అజయ్: ది అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ ఎ యోగి'.. దర్వకుడు రవీంద్ర గౌతమ్ తెరకెక్కిస్తున్నారు. అయితే, ఈ సినిమా విడుదలకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) అడ్డుచెప్పింది. దీంతో చిత్ర యూనిట్ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. సర్టిఫికేషన్ దరఖాస్తులను తిరస్కరించడాన్ని సెన్సార్ను తప్పుబడుతూ వారు కోర్టులో సవాలు చేశారు.'అజయ్: ది అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ ఎ యోగి' చిత్రంలో యోగి ఆదిత్యనాథ్ పాత్రలో అనంత్ జోషి నటించారు. ఆయన గురువు మహంత్ పాత్రలో పరేష్ రావల్ నటించారు. అయితే, ఈ సినిమా విడుదలకు సెన్సార్ బోర్డు అడ్డుచెప్పింది. దీంతో చిత్ర నిర్మాతలు ముంబై కోర్టును ఆశ్రయించి తమ వాదనను వినిపించారు. గత ఎనిమిది సంవత్సరాలుగా ప్రజాక్షేత్రంలో ఉన్న నవల ఆధారంగానే ఈ చిత్రాన్ని తెరకెక్కించామని చిత్ర నిర్మాతలు కోర్టుకు తెలిపారు. దీంతో ఇదే విధంగానే న్యాయస్థానం కూడా సెన్సార్ బోర్డును ప్రశ్నించింది. పుస్తకంపై ఎలాంటి సమస్యలు లేనప్పుడు సినిమాకు అభ్యంతరాలు ఎందుకని న్యాయమూర్తులు రేవతి మోహితే డెరే, నీలా గోఖలేలతో కూడిన ధర్మాసనం సెన్సార్ బోర్డును ప్రశ్నించింది. పుస్తకం ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు లేని ఇబ్బంది సినిమా విడుదలకు ఎందుకు వస్తుందని న్యాయస్థానం నిలదీసింది. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని CBFCకి కోర్టు నోటీసు జారీ చేసింది. -
బిగ్బాస్ వచ్చేస్తున్నాడు.. డేట్ రివీల్ చేసిన ఓటీటీ సంస్థ
బుల్లితెర ప్రియులను అలరించే బిగ్బాస్ రియాలిటీ షోకు అంతా సిద్ధమైంది. ఇప్పటికే హోస్ట్గా మరోసారి ఆ స్టార్ హీరోనే అలరించనున్నారు. ఈ బిగ్బాస్ షోకు ఆడియన్స్లో విపరీతమైన క్రేజ్ ఉంది. ఏ భాషలో వచ్చిన ఈ రియాలిటీ షో బుల్లితెర అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. హిందీలో బిగ్బాస్ సీజన్-19కు సమయం ఆసన్నమైంది. ఈ విషయాన్ని ప్రముఖ ఓటీటీ సంస్థ జియో హాట్స్టార్ ప్రకటించింది.ఆగస్టు 24 నుంచి బిగ్బాస్-19 సీజన్ ప్రారంభం కానున్నట్లు ప్రకటించింది. సల్మాన్ ఖాన్ హోస్ట్గా ఈ సీజన్ అభిమానులను అలరించనుంది. ఇప్పటికే కంటెస్టెంట్స్ లిస్ట్ కూడా ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. ఈ రియాలిటీ షో జియో హాట్స్టార్తో పాటు కలర్స్ టీవీలో ప్రసారం కానుంది.రెమ్యునరేషన్ తగ్గించుకున్న సల్మాన్ ఖాన్..అయితే ఈ ఏడాది సీజన్కు సల్మాన్ ఖాన్ భారీగా పారితోషికం తగ్గించుకున్నారు. ఈ ఏడాది వీకెండ్కు రూ.8 - 10 కోట్ల మేర పారితోషికం తీసుకునేందుకు అంగీకరించాడు. ఈ లెక్కన 15 వారాలకుగానూ రూ.120-150 కోట్లు అందుకోనున్నాడు. అయితే ఈ హీరో బిగ్బాస్ 17వ సీజన్కు రూ.200 కోట్లు, 18వ సీజన్కు ఏకంగా రూ.250 కోట్లు పుచ్చుకున్నాడు. అలాంటిదిప్పుడు సగానికి సగం తగ్గించుకోవడం గమనార్హం.Bhai ke saath laut aaya hai Bigg Boss ka naya season!Aur iss baar chalegi - Gharwalon Ki Sarkaar👑Dekhiye #BiggBoss19, 24th August se, sirf #JioHotstar aur @colorstv par.@BeingSalmanKhan @danubeprop #VaselineIndia#BiggBossOnJioHotstar#BB19OnJioHotstar pic.twitter.com/MxqX8s0Cor— JioHotstar (@JioHotstar) July 31, 2025 -
పాపం.. ఊర్వశి.. మ్యాచ్ కోసం వెళ్తే రూ.70 లక్షల నగలు చోరీ!
బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలాకు చేదు అనుభవం ఎదురైంది. ఇటీవల వింబుల్డన్ టోర్నీ చూసేందుకు లండన్ వెళ్లగా తన ఖరీదైన ఆభరణాలు చోరీకి గురైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. లండన్లోని గాట్విక్ విమానాశ్రయంలో ఈ సంఘటన జరిగిందని తెలిపింది. దాదాపు రూ.70 లక్షల విలువైన ఆభరణాలు కలిగిన తన లగ్జరీ బ్యాగ్ పోయిందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. విమానాశ్రయ అధికారులు ఎలాంటి సహాయం చేయలేదని ఊర్వశి నిరాశ వ్యక్తం చేసింది. విమానాశ్రయంలోని బ్యాగేజ్ బెల్ట్ నుంచి నా లగేజీ చోరీకి గురైందని పేర్కొంది.ఈ విషయాన్ని తాజాగా సోషల్ మీడియా ద్వారా పంచుకుంది ముద్దుగుమ్మ. ఈ సంఘటనను వివరిస్తూ విమానాశ్రయంలో భద్రతా లోపాన్ని ప్రస్తావించింది. ప్లాటినం ఎమిరేట్స్ సభ్యురాలిగా వింబుల్డన్కు గ్లోబల్ ఆర్టిస్ట్గా హాజరైనట్లు వెల్లడించింది. ముంబయి నుంచి గాట్విక్ చేరుకోగా.. ఎయిర్పోర్ట్లో తన బ్యాగ్ దొంగిలించారని పోస్ట్ చేసింది. బ్యాగ్తో పాటు టికెట్ వివరాలను సైతం సోషల్ మీడియాలో పంచుకుంది. త్వరగా తన బ్యాగ్ తిరిగొచ్చేలా చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీసులకు విజ్ఞప్తి చేసింది. కానీ అక్కడి అధికారుల నుంచి తనకు ఎలాంటి సహకారం అందలేదని వాపోయింది.కాగా.. ఈ బాలీవుడ్ ముద్దుగమ్మ సినిమాలతో పాటు ప్రత్యేక సాంగ్స్తో అభిమానులను అలరించింది. టాలీవుడ్లోనూ స్టార్ హీరోల చిత్రాల్లో మెప్పించింది. బాలయ్య, మెగాస్టార్ సినిమాల్లోనూ కనిపించింది. -
నా సినిమా టిక్కెట్ రూ.20: అమితాబ్ పోస్ట్ పై చర్చ...
ప్రతి ఆదివారం జుహులో తన ఇంటి ముంగిటకు వచ్చే అభిమానులను పలకరించే దశాబ్దాల సంప్రదాయానికి పేరుగాంచిన అమితాబ్ బచ్చన్ ఇంకా ఈ ఆచారాన్ని కొనసాగిస్తున్నారు. ఈ బాలీవుడ్ మెగాస్టార్ అభిమానులను పలకరించిన తరువాత తన బ్లాగులో ఈ సమావేశానికి సంబంధించిన కొన్ని ఫోటోలను, కొన్ని సందేశాలను కూడా పంచుకుంటారు. ఇది సర్వసాధారణంగా జరిగేదే అదే విధంగా ఆయన తాజాగా కూడా ఓ పోస్ట్ పెట్టారు. అందులో భావోద్వేగ భరిత సందేశాలు కూడా ఉన్నాయి. అయితే వీటన్నింటి కన్నా అందరినీ ఆకట్టుకుంది 1975 నాటి భారతీయ సంచలనం... క్లాసిక్ సినిమా ’షోలే’ సినిమా టిక్కెట్. దాదాపు 50 ఏళ్ల వయసు కలిగిన ఈ టిక్కెట్ను అత్యంత జాగ్రత్తగా భధ్రపరచిన అమితాబ్ సోషల్ మీడియా ద్వారా దానిని అభిమానులతో పంచుకున్నారు. అంతేకాదు ఈ టిక్కెట్ ధర కేవలం రూ. 20 మాత్రమేననే విషయాన్ని ఆయన గుర్తు చేశారు .ఆయన తన పోస్ట్లో ‘‘‘’షోలే’ టికెట్ను జాగ్రత్తగా భద్రపరిచా... ఈ టిక్కెట్ అప్పుడు రూ. 20 !! ధర.. ఈ రోజుల్లో థియేటర్ హాళ్లలో ఎరేటెడ్ డ్రింక్ (సాఫ్ట్ డ్రింక్) ధర అదే నని నాకు చెప్పారు. అది నిజమా?? చెప్పడానికి చాలా ఉంది, కానీ చెప్పడానికి కాదు.. ఆప్యాయత ప్రేమ,‘ అంటూ ఆయన ఆ పోస్ట్లో నర్మగర్భంగా రాశారు.అయితే అమితాబ్ తన దగ్గరున్న ఈ టికెట్ ను పోస్ట్ చేయడం ఎంత ఆసక్తి కలిగించిందో నెటిజన్ల పాజిటివ్ రెస్పాన్స్ అందుకుందో.. అలాగే ఆయన రూ.20కి థియేటర్లో సాఫ్ట్ డ్రింక్ కొనవచ్చునని అనడం కూడా అంత చర్చకు దారి తీసింది. ఎందుకంటే ప్రస్తుతం ధియేటర్లలో రూ.20కి సాఫ్ట్ డ్రింక్ కొనే పరిస్థితి లేదు. రూ.100 ఆ పై ధరల్లో మాత్రమే అవి అందుబాటులో ఉన్నాయి. ఈ నేపధ్యంలో అమితాబ్ రూ.20కే లభిస్తాయనడంతో... సెలబ్రిటీలకు ధరలపై ఉన్న అవగాహన చాటుతోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. అంతేకాకుండా మల్టీ ఫ్లెక్స్ థియేటర్లలో టిక్కెట్ల ధరలు అదే విధంగా తినుబండారాల ధరలకు సంబంధించిన సోషల్ చర్చకు కూడా బిగ్ బి పోస్ట్ దారి తీసింది.మరోవైపు 1975లో విడుదలైన ‘షోలే‘, వచ్చే ఆగస్టు 15తో 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది, ఇందులో అమితాబ్తో పాటు ధర్మేంద్ర కూడా నటించారు ఈ సినిమా ఆ సంవత్సరం భారతదేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. రమేష్ సిప్పీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం, జై వీరు (అమితాబ్ మరియు ధర్మేంద్ర పోషించారు) అనే ఇద్దరు మాజీ ఖైదీల చుట్టూ తిరుగుతుంది, నటులు అమ్జాద్ ఖాన్, సంజీవ్ కుమార్ మరియు హేమ మాలిని మరియు జయ బచ్చన్ ఈ చిత్రంలోని తారాగణాన్ని ముగించారు. -
'ఛావా' రికార్డ్ బ్రేక్ చేసిన చిన్న సినిమా
చిన్న సినిమాలు అప్పుడప్పుడు అద్భుతాలు చేస్తుంటాయి. ఇప్పుడు కూడా 'సయారా' అనే బాలీవుడ్ మూవీ ఎవరూ ఊహించని కలెక్షన్స్ సొంతం చేసుకుంటోంది. అలానే కొన్ని రికార్డ్స్ని కూడా బ్రేక్ చేస్తోంది. ఇప్పుడు అలానే ఏకంగా 'ఛావా'ని దాటేయడం చర్చనీయాంశమైంది. ఇంతకీ ఏంటి విషయం?(ఇదీ చదవండి: బర్త్డే ప్రకటన.. గొప్ప మనసు చాటుకున్న సోనూసూద్)విక్కీ కౌశల్, రష్మిక నటించిన చారిత్రక సినిమా 'ఛావా'. ఛత్రపతి శివాజీ కుమారుడి జీవిత కథతో తెరకెక్కిన ఈ చిత్రం.. ఊహించని వసూళ్లు సాధించింది. ఓవర్సీస్లోనూ మంచి కలెక్షన్ అందుకుంది. ఇప్పుడు ఆ నంబర్లని 'సయారా' అధిగమించినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరిలో థియేటర్లలోకి వచ్చిన 'ఛావా'.. ఓవర్సీస్ బాక్సాఫీస్ దగ్గర రూ.91 కోట్లు సాధించింది. ఇప్పుడు ఆ నంబర్ని సయారా.. కేవలం 13 రోజుల్లోనే అధిగమించిందని బాలీవుడ్ మీడియా చెబుతోంది. ఇప్పటివరకూ సయరా సినిమాకు ఓవర్సీస్లో రూ.94 కోట్లు వచ్చినట్లు తెలుస్తోంది.ఓవరాల్గా చూసుకుంటే యువతని ఆకట్టుకుంటున్న సయారా చిత్రానికి ఇప్పటివరకు రూ.400 కోట్లకు పైనే వసూళ్లు వచ్చినట్లు నిర్మాణ సంస్థ ఈ మధ్యనే చెప్పుకొచ్చింది. కేవలం మన దేశంలోనే రూ.260 కోట్లు వరకు వచ్చాయని సమాచారం. పరిస్థితి చూస్తుంటే రూ.500 కోట్ల మార్క్ కూడా మరికొన్నిరోజుల్లో దాటేయడం గ్యారంటీ. ఇంతకీ సయారా బడ్జెట్ ఎంతనుకున్నారు? కేవలం రూ.30 కోట్లు. ఈ లెక్కన చూసుకుంటే నిర్మాణ సంస్థకు వేరే లెవల్ లాభాలు వచ్చినట్లే.(ఇదీ చదవండి: ఫిష్ వెంకట్ ఘటన మరవకముందే మరో విషాదం) -
నా జీవిత అనుభవాలతో...
‘‘నేను రాసిన పుస్తకాలు నా జీవిత అనుభవాల నుంచి వచ్చాయి. అవి నాకు నేర్పిన పాఠాలనే నా పుస్తకాల్లో పొందుపరిచాను’’ అని బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ అన్నారు. ఆయన విలక్షణమైన నటుడే కాదు.. మంచి రచయిత కూడా అనే సంగతి తెలిసిందే. ఆయన రాసిన పుస్తకాల్లో ఇప్పటికే మూడు బుక్స్ని రిలీజ్ చేశారాయన. తాజాగా ‘డిఫరెంట్ బట్ నో లెస్’ అనే నాలుగో పుస్తకాన్ని ఆవిష్కరించారు అనుపమ్ ఖేర్.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ–‘‘నా నిజ జీవిత ఘటనలతో రాసిన ఈ పుస్తకం నాకు చాలా ప్రత్యేకం. ఇందులో నేను దర్శకత్వం వహించిన ‘తన్వి ది గ్రేట్’ సినిమా కథ, షూటింగ్లో ఎదురైన సవాళ్లు, వాటిని ఎదుర్కొన్న విధానాన్ని ప్రస్తావించాను. నేను బాక్సాఫీస్ వసూళ్ల గురించి పెద్దగా పట్టించుకోను. మా సినిమా ఎప్పటికైనా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది’’ అని చెప్పారు. ఇదిలా ఉంటే.. కరణ్ టాకర్, జాకీ ష్రాఫ్, అరవింద్ స్వామి నటించిన ‘తన్వి ది గ్రేట్’ ఈ నెల 18న విడుదలైన సంగతి తెలిసిందే. -
ప్రేమకథ ఆలస్యం
హీరోయిన్ శ్రీలీల బాలీవుడ్లో నటిస్తున్న తొలి హిందీ చిత్రం రిలీజ్ వాయిదా పడింది. కార్తీక్ ఆర్యన్ , శ్రీలీల హీరో హీరోయిన్లుగా అనురాగ్ బసు దర్శకత్వంలో ఓ ప్రేమకథ రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాను ఈ ఏడాది దీపావళికి రిలీజ్ చేయనున్నట్లు గతంలో మేకర్స్ ప్రకటించారు. అయితే ఈ సినిమా ఈ దీపావళికి విడుదల కావడం లేదని, వచ్చే ఏడాది రిలీజ్ చేస్తామని దర్శకుడు అనురాగ్ బసు వెల్లడించారు.‘‘ఇప్పటి వరకు మా సినిమా చిత్రీకరణ 40 శాతం పూర్తయింది. కార్తీక్ ఆర్యన్ మా సినిమాతోపాటుగా మరో సినిమా కూడా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాల్లో కార్తీక్ డిఫరెంట్ లుక్స్తో కనిపిస్తాడు. ఈ లుక్స్ పరంగా ఇబ్బందులున్నాయి. ఆగస్టు లేదా సెప్టెంబరులో మా సినిమా కొత్త షెడ్యూల్ చిత్రీకరణను ప్రారంభిస్తాం.అయితే ‘సయారా’ సినిమా స్టోరీకి మా కథ దగ్గరగా ఉందని, దీంతో స్క్రిప్ట్లో మార్పులు చేయాల్సి రావడం వల్లే ఈ ఏడాది మా చిత్రం రిలీజ్ కావడం లేదన్న వార్తల్లో నిజం లేదు. ‘సయారా’ కథకు, మా సిని మాకు సంబంధం లేదు’’ అన్నారు అనురాగ్ బసు. ఇలా శ్రీలీల తొలి హిందీ సినిమా రిలీజ్ అనుకున్న సమయానికన్నా కాస్త ఆలస్యంగా కానుంది. ఇక ప్రస్తుతం తెలుగులో ‘ఉస్తాద్ భగత్సింగ్’, తమిళంలో ‘పరాశక్తి’ వంటి చిత్రాలతో శ్రీలీల బిజీగా ఉన్నారు. -
Ekta Kapoor: 17 ఏళ్ల వయసులోనే ఎంట్రీ.. ముచ్చటగా మూడు దశాబ్దాలు
వినోద పరిశ్రమలో మూడు దశాబ్దాల ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసింది ఏక్తా కపూర్. ఈ ప్రయాణంలో ఎన్నో పాఠాలు నేర్చుకుంది. తనను తాను తీర్చిదిద్దుకుంది. పదిహేడు సంవత్సరాల వయసులో కెరీర్ ప్రారంభించిన ఏక్తా కపూర్ హిందీలో ఎన్నో టీవీ సోప్ ఒపెరాలను నిర్మించింది. ‘క్యోంకీ సాస్ భీ కభీ బహూ థీ’ ‘కహాని ఘర్ ఘర్ కీ’... వంటివి వాటిలో బాగా పాపులర్ అయ్యాయి.‘బాలాజీ మోషన్ పిక్చర్స్’ బ్యానర్పై నిర్మాతగా ‘ది డర్టీ పిక్చర్’ ‘డ్రీమ్ గర్ల్’ ‘క్రూ’లాంటి సినిమాలు నిర్మించింది. 2017లో వీడియో ఆన్ డిమాండ్ ప్లాట్ఫామ్ ‘ఆల్ట్ బాలాజీ’ప్రారంభించింది.ఏక్తా కపూర్ది నల్లేరు మీద నడకేమీ కాదు. మొదట్లో కొన్ని ప్రాజెక్ట్లు ఫెయిల్ అయ్యాయి. ఆరు పైలట్ ఎపిసోడ్లు రిజెక్ట్ అయ్యాయి.‘హమ్ పాంచ్’ టీవీ సిరీస్ రూపంలో తొలి సక్సెస్ వచ్చింది. ఇక ఆ తరవాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఆంగ్ల ఆక్షరం ‘కె’ను లక్కీ ఆల్ఫాబెట్గా భావించే ఏక్తా ‘కె’తో ప్రారంభమయ్యే టైటిల్తో ఎన్నో షోలు నిర్మించింది. ఏక్తాకపూర్ అదృష్టాన్ని నమ్ముకుందా, తన కష్టాన్ని నమ్ముకుందా అనే విషయానికి వస్తే... ఒక ప్రసిద్ధ మాటను గుర్తు తెచ్చుకోవడం అవసరం.‘కష్టపడేవారినే అదృష్టం ఇష్టపడుతుంది’‘కింగ్డమ్ ఆఫ్ ది సోప్ క్వీన్: దీ స్టోరీ ఆఫ్ బాలజీ టెలిఫిల్మ్’ పేరుతో ఏక్తా కపూర్ బయోగ్రఫీ వచ్చింది. -
హిట్ అండ్ రన్ కేసులో ప్రముఖ నటి అరెస్ట్
హిట్ అండ్ రన్ కేసులో అస్సాం నటి నందినీ కశ్యప్ని పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం ఉదయం ఉత్తర గౌహతిలోని రాజధాని థియేటర్ రిహార్సల్ వద్ద ఆమెను అరెస్ట్ చేసి దిస్పూర్లోని మహిళా పోలీస్ స్టేషన్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ నెల 25న నందినీ తన కారుతో ఓ స్టూడెంట్ను ఢీ కొట్టి, అక్కడ నుంచి పారిపోయారంటూ వచ్చిన ఫిర్యాదు మేరకు నటిపై పోలీసులు ఇటీవల కేసు నమోదు చేశారు. చికిత్స పొందుతూ విద్యార్థి మంగళవారం రాత్రి మరణించాడు.ఢికొట్టి..ఆపై పారిపోయి..ఈ నెల 25న ఈ ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంతో నందినీ 120 కి.మీ వేగంతో కారును నడుపుతూ ఓ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సమియుల్ హక్ అనే 21 ఏళ్ల పాలిటెక్నిక్ విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదం జరిగిన వెంటనే ఆమె గాయపడిన విద్యార్థికి సాయం చేయకుండా అక్కడ నుంచి పారిపోయింది. నందినీ కశ్యప్ మద్యం మత్తులో ఉందని, ప్రమాదం జరిగిన వెంటనే ఆమె ఆగకుండా అక్కడి నుండి పారిపోయిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. స్థానికులే అతన్ని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు.ఈ ఘటనపై హిట్ అండ్ రన్ సు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారాలతో నందినీని అరెస్టు చేసినట్లు సమాచారం. ఈ ఘటనపై సమియుల్ హక్ తల్లి విలపిస్తూ తన కొడుకుకు న్యాయం జరగాలని కోరుకుంటున్నానని అన్నారు.నందినీ కశ్యప్ అస్సామీ చిత్రసీమలో ప్రముఖ నటి, రంగస్థల ప్రదర్శనల్లో కూడా గుర్తింపు పొందారు. అస్సామీ సాంస్కృతిక నాటకాలు, థియేటర్ ప్రదర్శనల్లో ఆమె పాత్రలు స్థానిక కళా ప్రేమికుల నుండి ప్రశంసలు అందుకున్నాయి. -
వార్ 2 కోసం బ్రహ్మాస్త్ర టీమ్.. హృతిక్, కియారాలతో రొమాంటిక్ సాంగ్!
హృతిక్ రోషన్, ఎన్టీఆర్, కియారా అద్వానీ ప్రధాన పాత్రల్లో నటించిన స్పై యూక్షన్ మూవీ ‘వార్ 2’. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో యశ్ రాజ్ ఫిలింస్ పతాకంపై ఆదిత్యా చోప్రా నిర్మించిన ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఆగస్టు 14న రిలీజ్ కానుంది. కాగా ఈ సినిమా కోసం హృతిక్–కియారాలపై చిత్రీకరించిన ‘ఆవన్ జావన్ ...’ అనే పాటను అతి త్వరలోవిడుదల చేయనున్నట్లు వెల్లడించి, ఈ పాట ఫస్ట్లుక్ రోస్టర్ను విడుదల చేశారు మేకర్స్.‘‘హృతిక్ రోషన్ – కియారా అద్వానీ కెమిస్ట్రీ ‘అవన్ జావన్ ..’ ఈ సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఈ పాట కోసం సంగీత దర్శకుడు ప్రీతమ్, లిరిక్ రైటర్ అమితాబ్ భట్టాచార్య, గాయకుడు అరిజీత్ సింగ్ కలిసి పని చే శారు. గతంలో వీరి ముగ్గురి కాంబినేషన్లో వచ్చిన ‘బ్రహ్మాస్త్ర’ సినిమాలోని ‘కేసరియా...’ పాట ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సాంగ్ తరహాలోనే ‘ఆవన్ జావన్ ..’ కూడా ప్రేక్షకులను తప్పకుండా మెప్పిస్తుందనే నమ్మకం ఉంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది.కాగా... ఈ నెల 31న కియారా అద్వానీ బర్త్ డే. ఈ సందర్భంగా ‘ఆవన్ జావన్ ...’ పాటని రిలీజ్ చేస్తారని సమాచారం. ఇదిలా ఉంటే... హృతిక్ రోషన్ హీరోగా నటించిన ‘వార్’ (2019) సినిమాకు సీక్వెల్గా ‘వార్ 2’ రూపొందిన సంగతి తెలిసిందే. -
దేశంలో సంచలనం సృష్టించిన కేసుపై సినిమా ప్రకటన
మేఘాలయ హనీమూన్ మర్డర్పై సినిమా తీస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. కొద్దిరోజుల క్రితం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ కేసు గురించి త్వరలో వెండితెరపై చూపించనున్నారు. ఈ మేరకు 'హనీమూన్ ఇన్ షిల్లాంగ్' పేరుతో సినిమా తీస్తున్నట్లు బాలీవుడ్ దర్శకుడు ఎస్పీ నింబావత్ ప్రకటించారు. ఇప్పటికే అందుకు కావాల్సిన అనుమతులు కూడా రాజా రఘువంశీ కుటుంబ సభ్యుల నుంచి తీసుకున్నామని ఆయన తెలిపారు.తన సోదరుడి మృతి గురించి సినిమా తీసేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని సచిన్ పేర్కొన్నారు. ఇందులో తప్పు ఎవరది అనేది ప్రపంచం తెలుసుకుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో ఇలాంటి ఘోరాలు చేసేందుకు మరోకరు ముందుకు రాకూడదనే ఆలోచనతోనే ఈ సినిమా తీసేందుకు సిద్ధమయ్యమని దర్శకుడు నింబావత్ తెలిపారు. స్క్రిప్ట్ పనులు పూర్తయ్యాయని కూడా ఆయన అన్నారు. ఇండోర్, మేఘాలయలోనే సినిమా అంతా తెరకెక్కిస్తామన్నారు.మేఘాలయ హనీమూన్ కిల్లింగ్ స్టోరీ ఏంటి..?రాజా రఘువంశీ అనే యువకుడితో మే 11న సోనమ్ పెళ్లి జరిగింది. అదే నెల 20న నవదంపతులు హనీమూన్ (Meghalaya Honeymoon Murder Case) కోసం మేఘాలయ వెళ్లారు. కేవలం వెళ్లడానికే తప్ప తిరిగి రావడానికి టికెట్లు బుక్ చేసుకోలేదు. మే 23న దంపతులు స్కూటీపై ఓ టూరిస్ట్ స్పాట్ చూసేందుకు వెళ్లారు. తర్వాత కనిపించకుండా పోయారు. అదృశ్యమైన 11 రోజుల తర్వాత (జూన్ 2న) రఘువంశీ మృతదేహం లభ్యమైంది. అతడి శరీరంపై తీవ్ర గాయాలున్నాయి. అతడిని దగ్గరుండి చంపించింది మరెవరో కాదు భార్య సోనమ్. సోనమ్కు రాజాతో పెళ్లి ఇష్టం లేదు. కారణం.. అప్పటికే ఆమె రాజ్ కుష్వాహను ప్రేమిస్తోంది. ఇంట్లోవాళ్లు ఈ ప్రేమకు ఒప్పుకోలేదు. ఈ క్రమంలో తన ప్రియుడు రాజ్ కుష్వాహతో కలిసి భర్తను హత్య చేసింది. రఘువంశీ మరణం తర్వాత ఆమె ప్రియుడు ఏమీ తెలియనట్లుగా అంత్యక్రియలకు వెళ్లి మృతుడి తండ్రిని ఓదార్చాడు. -
వంద రూపాయలకే రూ.260 కోట్ల సినిమా.. ఎక్కడ చూడాలంటే?
బాలీవుడ్ స్టార్ హీరో అమిర్ ఖాన్ ఇటీవల సితారే జమీన్ పర్ అంటూ అభిమానులను పలకరించాడు. ఈ సినిమాకు ఆర్ఎస్ ప్రసన్న దర్శకత్వం వహించగా.. అమిర్ ఖాన్ నిర్మించారు. గతనెల 20న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. గతంలో విడుదలైన అమిర్ ఖాన్ చిత్రం తారే జమీన్ పర్ మూవీకి సీక్వెల్గా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.ఓటీటీకి ఇచ్చేది లేదన్న అమిర్..అయితే ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయబోనని అమిర్ ఖాన్ ఇప్పటికే ప్రకటించారు. అయితే తాను ముందుగానే ప్రకటించినట్లు యూట్యూబ్లో స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ విషయాన్ని అమీర్ ఖాన్ అధికారికంగా ప్రకటించారు. ఆగస్టు 1వ తేదీ నుంచి రూ. 100 చెల్లించి ఈ సినిమాను చూడవచ్చని తెలిపారు. ఈ చిత్రం ఆమిర్ ఖాన్ అధికారిక యూట్యూబ్ ఛానల్.. ఆమిర్ ఖాన్ టాకీస్: జనతా కా థియేటర్లో రూ. 100కు అందుబాటులో ఉండనుంది. -
ఓటీటీకి మౌనీ రాయ్ స్పై థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలు వచ్చాక డిఫరెంట్ కంటెంట్తో సినీ ప్రియులను అలరిస్తున్నాయి. క్రైమ్ థ్రిల్లర్తో పాటు క్రేజీ కంటెంట్తో ఓటీటీ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. సరికొత్త జానర్లతో వస్తోన్న వెబ్ సిరీస్లు ఆడియన్స్ ఆదరణ దక్కించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే మరో ఆసక్తికర వెబ్ సిరీస్ మిమ్మల్ని అలరించేందుకు వచ్చేస్తోంది. స్పై జానర్లో వస్తోన్న సలాకార్ అనే ఓటీటీలో సందడి చేయనుంది.దేశ భద్రత కోసం ధైర్యసాహసాల్ని ప్రదర్శించిన స్పై మాస్టర్ కథగా ఈ వెబ్ సిరీస్ను ఫరూక్ కబీర్ దర్శకత్వంలో తెరకెక్కించారు. రియల్ స్టోరీ ఆధారంగా వస్తోన్న ఈ సిరీస్ ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది. ఆగస్టు 8వ తేదీ నుంచి జియో హాట్ స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ సిరీస్ ట్రైలర్ విడుదల చేస్తూ.. ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ అధికారికంగా వెల్లడించింది. సలకార్ వెబ్ సిరీస్ను హిందీతో పాట దక్షిణాది భాషల్లోనూ అందుబాటులో ఉండనుంది. ఈ వెబ్ సిరీస్లో మౌనీ రాయ్, నవీన్ కస్తూరియా ప్రధాన పాత్రల్లో నటించారు. -
షూటింగ్ కోసం వెళ్తే.. ముద్దు పెట్టుకోవాలని ఉందన్నాడు: నటి
సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. స్టార్ హీరోయిన్ల నుంచి క్యారెక్టర్ ఆరిస్టుల వరకు ఎంతోమంది అమ్మాయిలు ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఎదుర్కొంటున్నారు. అవకాశాల పేరుతో వారిని లొంగదీసుకోవడమే కాకుండా లైంగిక వేధింపులకూ గురి చేస్తున్నారు. అయితే ఇప్పుడిప్పుడే చాలా మంది ఈ వేధింపులపై తిరగబడుతున్నారు. తమను వేధించిన వారిపై కేసులు పెట్టడమే కాకుండా మీడియా ముఖంగా వారి బాగోతాలను బటయపెడుతున్నారు. తాజాగా మరో నటి, ‘తారక్ మెహతా కా ఊల్టా చష్మా’ఫేంజెన్నిఫర్ మిస్త్రీ(Jennifer Mistry ) కూడా ఓ నిర్మాతతో తనకు ఎదురైన ఛేదు అనుభవాన్ని మీడియాతో పంచుకుంది. షూటింగ్ కోసం విదేశాలకు వెళ్తే..గదిలోకి రమ్మని వేధించాడని, అంతేకాకుండా తన గురించి పచ్చిగా మాట్లాడని చెప్పింది.తారక్ మెహతా కా ఊల్టా చష్మా’లో మిసెస్ రోషన్ సోధీ పాత్ర పోషించి అందరిని ఆకట్టుకున్న జెన్నిఫర్ మిస్త్రీ. ఆ షో నిర్మాత అసిత్ కుమార్ మోదీ( Asit Kumarr Modi ) వల్ల ఎంతో మానసిక క్షోభను అనుభవించిందట. 2018లో షో ఆపరేషన్స్ హెడ్ సోహైల్ రమణితో గొడవ జరిగింది. అతనిపై ఫిర్యాదు చేద్దామని నిర్మాత అసిత్ కుమార్ మోదీ దగ్గరకు వెళ్లాను. కానీ అక్కడ ఆయన స్పదన చూసి షాకయ్యాను. నా ఫిర్యాదు పట్టించుకోకుండా ‘నువ్వు చాలా సెక్సీగా ఉన్నావ్’ అన్నారు. అలాగే 2019లో షూటింగ్ కోసం సింగపూర్ వెళ్తే.. అసిత్ నన్ను గదిలోకి రమ్మన్నాడు. తనతో గదిలోకి వచ్చి విస్కీ తాగాలని బలవంతం చేశాడు. కానీ నేను పట్టించుకోలేదు. దీంతో అతను మోనికా భడోరియా (బావ్రీ) దగ్గరకు వెళ్లి ఇలాగే మాట్లాడారు. ఆ మరుసటి రోజు మేమంతా కాఫీ తాగుతుంటే..అతను నా దగ్గరకు వచ్చి నీ పెదాలు చాలా సెక్సీగా ఉన్నాయి. నాకు ముద్దు పెట్టుకోవాలని ఉంది’ అని అన్నాడు. ఆయన మాటలను పట్టించుకోకుండా ఉండటానికి ప్రయత్నించినప్పటికీ అవి నాపై తీవ్ర ప్రభావం చూపాయి’ అని ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జెన్నిఫర్ మిస్త్రీ చెప్పుకొచ్చింది. -
మాంచెస్టర్లో ఇంగ్లాండ్ ప్లేయర్ల హైడ్రామా.. బెన్ స్టోక్స్పై అమితాబ్ సెటైర్లు!
టీమిండియా నాలుగో టెస్ట్ మ్యాచ్పై బిగ్ బీ అమితాబ్ బచ్చన్ స్పందించారు. మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రాఫోర్డ్లో చివర్లో జరిగిన హైడ్రామాపై సోషల్ మీడియా వేదికగా అమితాబ్ రియాక్ట్ అయ్యారు. ట్విటర్ వేదికగా చేసిన పోస్ట్కు తనదైన శైలిలో క్యాప్షన్ రాసుకొచ్చారు. అరే.. మనోడు తెల్లోడికి టీకా ఇచ్చిపడేశాడు అంటూ ట్వీట్ చేశారు. ఇది కాస్తా నెట్టంట వైరల్ కావడంతో ఫ్యాన్స్ సైతం ఈ పోస్ట్ రీపోస్ట్ చేస్తున్నారు.అయితే ఫోర్ట్ టెస్ట్లో జడేజా, సుందర్ సెంచరీకి చేరువలో ఉన్న సమయంలో ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ డ్రాకు అంగీకరించాలని జడేజాను కోరాడు. కానీ జడేజా, సుందర్ మ్యాచ్ను ముగించేందుకు నిరాకరించారు. అప్పటికీ ఇంకా 15 ఓవర్ల ఆట మిగిలి ఉండడంతో భారత బ్యాట్స్మెన్ డ్రాకు నిరాకరించారు. బెన్ స్టోక్స్ డ్రా ఆఫర్ను తిరస్కరించాక.. జడేజా, సుందర్ తమ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. ఆ తర్వాత ఇరు జట్ల కెప్టెన్ల అంగీకారంతో టెస్ట్ డ్రాగా ముగించారు. మ్యాచ్ చివర్లో ఇంగ్లాండ్ ప్లేయర్లు చేసిన హంగామాతో సోషల్ మీడియాలో ట్రోల్ పెద్దఎత్తున వైరలయ్యాయి. కాగా.. ఈ మ్యాచ్లో జడేజా 107 పరుగులు సాధించగా.. వాషింగ్టన్ సుందర్ 101 రన్స్తో నాటౌట్గా నిలిచారు.ఇక సినిమాల విషయానికొస్తే అమితాబ్ బచ్చన్ సెక్షన్ 84 అనే చిత్రంలో కనిపించనున్నారు. ఇందులో నిమ్రత్ కౌర్, డయానా పెంటీ, అభిషేక్ బెనర్జీ కీలక పాత్రల్లో నటించారు. ఆ తర్వాత టాలీవుడ్ మూవీ కల్కి 2898 ఏడీ పార్ట్-2లో నటించనున్నారు. Take !?? अरे गोरे को टिका (tika - sorry tayka diya ) दिया रे !!🤣 https://t.co/1ybakYvNFM— Amitabh Bachchan (@SrBachchan) July 27, 2025 -
నీతో పరిచయానికి ఏడేళ్లు.. ఆ బంధాన్ని గుర్తు చేసుకున్న హీరోయిన్ మాజీ ప్రియుడు!
బాలీవుడ్ నటి, ప్రపంచసుందరి సుస్మితాన్ సేన్ పేరు అందరికీ సుపరిచితమే. బాలీవుడ్లో పలు చిత్రాల్లో మెప్పించిన ముద్దుగుమ్మ ప్రస్తుతం సినిమాలేవీ చేయట్లేదు. చాలా ఏళ్ల తర్వాత ఎంట్రీ ఇచ్చిన సుస్మితా ఆర్య అనే వెబ్ సిరీస్లో కనిపించింది. ఆ తర్వాత తాలి అనే వెబ్ సిరీస్తో మరోసారి అభిమానులను ఆకట్టుకుంది. అయితే సినిమాల్లో సక్సెస్ అయిన సుస్మితా సేన్.. వ్యక్తిగత జీవితంలో మాత్రం విఫలమైంది. చాలామందితో డేటింగ్ చేసిన ఆమె.. ఎవరినీ కూడా తన జీవిత భాగస్వామిగా అంగీకరించలేకపోయింది. ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీతో లవ్లో పడ్డప్పటికీ ఈ ప్రేమ ఎంతోకాలం నిలవలేకపోయింది. ఆ తర్వాత మోడల్ రోహ్మన్ షాతో ప్రేమలో పడింది. కానీ వీరిద్దరు ప్రేమ మూడేళ్లు కూడా నిలవలేదు. 2018లో మొదలైన వీరి పరిచయం మూడేళ్లకే బ్రేకప్ అయింది. అయినప్పటికీ వీరిద్దరు ఫ్రెండ్స్గానే కొనసాగుతున్నారు.ఈ సందర్భంగా మాజీ ప్రియుడు రోహ్మన్ షాల్ తమ బంధాన్ని గుర్తు చేసుకున్నారు. నేటికి మన పరిచయానికి ఏడేళ్లు అంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. సుస్మితా సేన్తో సన్నిహితంగా ఉన్న ఫోటోను షేర్ చేశారు. జీవితంలో అనే విషయాలను నీ వద్ద నేర్చుకున్నానని పోస్ట్లో రాసుకొచ్చారు. నీతో పరిచయం తర్వాత నా జీవితం చాలా మారిపోయిందని ఇన్స్టాలో పంచుకున్నారు.రోహ్మన్ తన ఇన్స్టాలో రాస్తూ.. 'మన స్నేహానికి నేటికి 7 సంవత్సరాలు. కొన్ని కథలు వాటి శీర్షికలను మించిపోతాయి. కానీ వాటి అర్థం ఉండదు. నేను మీకు చెస్ నేర్పించాను. కానీ మీరు నన్ను కనికరం లేకుండా ఓడించారు. మీరు నాకు ఈత నేర్పించారు. నా లైఫ్లో బెస్ట్ హెయిర్ కట్స్ చేసినందుకు నేను మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పగలను. మేము మా పాత్రలు, భయాలు, బలాలను కూడా మార్చుకున్నాం. నీ ప్రేమకు, నీ నిశ్శబ్ద స్నేహానికి కృతజ్ఞతలు సుస్మితా సేన్' అంటూ పోస్ట్ చేశారు. కాగా.. సుష్మితా సేన్తో ఉన్న ఫోటోలు ఇద్దరు ఒకే జాకెట్ ధరించి కనిపించారు. View this post on Instagram A post shared by rohman shawl (@rohmanshawl) -
'కోట్ల రూపాయల అభిమానం.. చనిపోయే ముందు రూ.72 కోట్ల ఆస్తి రాసిచ్చింది'
బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ వరుస సినిమాలతో అభిమానులను అలరిస్తున్నాడు. సంజయ్ దత్కు కేవలం బాలీవుడ్లో మాత్రమే కాదు.. దక్షిణాదిలోనూ ఫేమస్ అయ్యారు. ప్రస్తుతం టాలీవుడ్లో ది రాజాసాబ్, అఖండ-2 చిత్రాల్లో నటిస్తున్నారు. వీటితో పాటు బాలీవుడ్లో దురంధర్, కన్నడలో కెడి - ది డెవిల్లో కనిపించనున్నారు. ఈ ఏడాది వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయారు సంజయ్ దత్.అయితే తాజాగా ఓ షాకింగ్ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు సంజయ్ దత్. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆయన.. ఓ అభిమాని తనకు రూ.72 కోట్ల ఆస్తిని రాసిచ్చిందని వెల్లడించారు. ఓ మహిళా అభిమాని తాను చనిపోయేముందు తన ఆస్తినంతా నా పేరుమీద రాసిందని పంచుకున్నారు. అయితే ఆ డబ్బుతో తాను ఏమి చేశాడో కూడా వెల్లడించారు. ఆ ఆస్తి మొత్తాన్ని మహిళ కుటుంబానికి తిరిగి ఇచ్చానని సంజయ్ దత్ తెలిపారు.కాగా..సంజయ్ దత్ 1981లో రాకీ చిత్రంతో బాలీవుడ్లో అడుగుపెట్టారు. ఆ తర్వాత విధాత, నామ్, సాజన్, ఖల్ నాయక్, వాస్తవ్ లాంటి చిత్రాలలో నటించారు. ప్రస్తుతం బాలీవుడ్తో పాటు దక్షిణాదిలోనూ సినిమాల్లో అలరిస్తున్నారు. -
అమిర్ ఖాన్ ఇంటికి 25 మంది ఐపీఎస్ అధికారులు.. ఎందుకు వచ్చారంటే?
బాలీవుడ్ స్టార్ హీరో అమిర్ ఖాన్ ఇటీవలే సితారే జమీన్ పర్ మూవీతో అభిమానులను అలరించారు. గతనెలలో థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ను సొంతం చేసుకుంది. 2018లో రిలీజైన సినిమాకు సీక్వెల్గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రస్తుతం రజినీకాంత్ హీరోగా వస్తోన్న కూలీ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనున్నారు.అయితే సినిమాల సంగతి పక్కనపెడితే.. అమిర్ ఖాన్ ఇంటికి ఐపీఎస్ అధికారులు రావడం బాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. అమిర్ ఇంటికి ఐపీఎస్ అధికారులు వచ్చిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలైంది. ఇది చూసిన ఫ్యాన్స్ అసలు ఎందుకు వచ్చారని ఆరా తీస్తున్నారు. అంతమంది ఐపీఎస్ అధికారులు రావడానికి కారణాలపై చర్చించుకుంటున్నారు.ఈ నేపథ్యంలోనే అమిర్ ఖాన్ టీమ్ స్పందించింది. ఐపీఎస్ అధికారుల ఆకస్మికంగా అమిర్ ఇంటికి రావడంపై కచ్చితమైన వివరాలు తెలియవని అమిర్ టీమ్ తెలిపింది. మేము కూడా అమిర్ ఖాన్ సంప్రదించి పూర్తి వివరాలు తెలియజేస్తామని వెల్లడించారు. అయితే ప్రస్తుతం శిక్షణలో ఉన్న ఐపీఎస్ శిక్షణార్థులు ఆమిర్ ఖాన్తో సమావేశం అయ్యారని సమాచారం. వారందరికీ హీరో తన నివాసంలో ఆతిథ్యం ఇచ్చారని ఆ బృందంలోని ఒక సభ్యుడు వెల్లడించినట్లు తెలుస్తోంది. View this post on Instagram A post shared by Instant Bollywood (@instantbollywood) -
ఆ హీరో నిజంగానే నా పీక కోశాడు: బాలీవుడ్ నటుడు
నెగెటివ్ పాత్రలు చేయడం అంత ఈజీ కాదు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా నటుల ప్రాణాలకే ప్రమాదం.. కొన్ని యాక్షన్ సీన్లలో అయితే వీరు చావు చివరి అంచులవరకు కూడా వెళ్లి వస్తుంటారు. తనకూ అలాంటి పరిస్థితే ఏర్పడిందంటున్నాడు బాలీవుడ్ నటుడు అశోక్ సరఫ్ (Ashok Saraf). ఎక్కువగా కామెడీ పాత్రల్లోనే అలరించిన ఈయన జాగృతి (1992) మూవీలో విలన్గా నటించాడు. ఇందులో సల్మాన్ ఖాన్ హీరోగా నటించాడు. నా మెడపై కత్తిపెట్టి..జాగృతి చిత్రీకరణ సమయంలో జరిగిన ఓ సంఘటనను అశోక్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. హీరో సల్మాన్ (Salman Khan) నా పీకపైన కత్తిపెట్టాల్సిన సన్నివేశం అది! ఆయన నిజమైన కత్తి పట్టుకున్నాడు. ఇద్దరం డైలాగ్స్ చెప్తున్నాం. ఆయన చాలా గట్టిగా కత్తిని అదిమిపట్టుకున్నాడు. అది నా మెడకు గుచ్చుకుంటోంది. అతడి చేతుల్లో నుంచి తప్పించుకోవాలనిపించింది. ఆ కత్తిని కిందపడేయమన్నాను. కానీ సల్మాన్.. కత్తి కిందపడేయకుండా కెమెరా మనవైపే ఉంది. ఏం చేయమంటావని అడిగాడు. ఓపక్క రక్తం కారుతున్నా..కెమెరా నావైపే ఉన్నట్లర్థమై సీన్ కంటిన్యూ చేశాం. ఇద్దరం డైలాగ్స్ చెప్పాం. తర్వాత చూసుకుంటే నా మెడ కట్ అయింది. కాస్త లోతైన గాయం ఏర్పడి రక్తం కారుతోంది. ఏమాత్రం నరాలు కట్ అయినా నా చాప్టర్ అక్కడే క్లోజ్ అయ్యేది. మరి సల్మాన్కు ఈ సంఘటన గుర్తుందో, లేదో? అయినా ఇలాంటివాటిని ఎవరూ గుర్తుపెట్టుకోరు, అక్కడే మర్చిపోతారు అని చెప్పుకొచ్చాడు.సినిమాసల్మాన్, అశోక్.. జాగృతి చిత్రంతో పాటు కరణ్ అర్జున్, ప్యార్ కియా తో డర్నా క్యా, బంధన్ వంటి పలు సినిమాల్లో నటించారు. ఇకపోతే సల్మాన్ చివరగా సికందర్ చిత్రంలో కనిపించాడు. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయింది. ప్రస్తుతం ఇతడు.. కిక్ సీక్వెల్తో పాటు గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణల ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రంలో నటిస్తున్నాడు.చదవండి: నువ్వు లేకపోతే నేను ఏమైపోయేదాన్నో..:కల్యాణి ప్రియదర్శన్ -
విశ్వంభర స్పెషల్ సాంగ్లో బుల్లితెర నటి.. రెమ్యునరేషన్ ఎంతంటే?
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi Konidela) హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ విశ్వంభర (Vishwambhara Movie). బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మధ్యే డైరెక్టర్ సినిమా కథ కూడా బయటపెట్టేశాడు. 'మనకు తెలిసినవి 14 లోకాలే.. ఈ పద్నాలుగు లోకాలకు పైనున్న లోకమే సత్యలోకం. విశ్వంభర కోసం వీటన్నింటినీ దాటుకుని పైకి వెళ్లాం. ఆ లోకంలో ఉండే హీరోయిన్ను హీరో వెతుక్కుంటూ వెళ్లి ఆమెను భూమి మీదకు ఎలా తీసుకొచ్చాడు? అన్నదే సినిమా కథ' అని చెప్పాడు.తెలుగులో తొలిసారి..సినిమా చిత్రీకరణ ఇటీవలే పూర్తయింది. బ్యాలెన్స్ ఉన్న స్పెషల్ సాంగ్ కూడా రెండు రోజుల క్రితమే పూర్తి చేశారు. ఈ పాటలో బుల్లితెర సీరియల్స్లో విలనిజం పండించిన మౌనీ రాయ్ను సెలక్ట్ చేశారు. ఈమె చిరుతో కలిసి తొలిసారి చిందేసింది. అంతేకాదు, టాలీవుడ్లో ఆమె నటించడం కూడా ఇదే మొదటిసారి! ఈ పాటకు గణేశ్ ఆచార్య కొరియోగ్రఫీ అందించాడు. అయితే ఆమె ఈ సినిమాకు ఎంత డబ్బు తీసుకుందన్న చర్చ మొదలైంది. నిమిషానికి లక్షల్లో..సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న కథనాల ప్రకారం.. మౌనీ రాయ్ నాలుగైదు నిమిషాల పాటకుగానూ రూ.50 లక్షలు తీసుకున్నట్లు తెలుస్తోంది. మౌనీ రాయ్.. నాగిణి సీరియల్తోనే చాలామందికి పరిచయం. ఈ పాటలో కూడా ఆమె నాగిణిగా కనిపించనుందన్న ప్రచారం జరుగుతోంది. ఇదెంతవరకు నిజమన్నది క్లారిటీ రావాల్సి ఉంది.విశ్వంభర ఆలస్యం?నిజానికి ఈ పాట కోసం మొదట బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ను సంప్రదించారట! కానీ, ఆమె రూ.8 కోట్లు డిమాండ్ చేయడంతో తనను పక్కన పెట్టేశారని తెలుస్తోంది. విశ్వంభర చిత్రంలో త్రిష కథానాయికగా నటిస్తుండగా ఇషా చావ్లా, ఆషికా రంగనాథ్ కీలక పాత్రలు పోషించారు. కీరవాణి సంగీత దర్శకుడిగా వ్యవహరించారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్లో రిలీజ్ చేయాలనుకున్నారు, కానీ వీఎఫ్ఎక్స్ పనుల వల్ల సినిమా మరింత వాయిదా పడే అవకాశమున్నట్లు కనిపిస్తోంది.చదవండి: 10 ఏళ్లుగా డిప్రెషన్.. చనిపోతానని నాన్న ఎప్పుడో చెప్పాడు -
పెళ్లి-పిల్లలు.. ఈ రెండూ కావాలి: మృణాల్ ఠాకూర్
హిందీ, తెలుగు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur). 32 ఏళ్ల ఈ మహారాష్ట్ర బ్యూటీ సీతారామం చిత్రంతో టాలీవుడ్కు ఎంట్రీ ఇచ్చింది. ఇక్కడ తొలి చిత్రంతోనే సూపర్ హిట్ అందుకున్న ఠాగూర్కు అక్కడ వరుస అవకాశాలు వచ్చాయి. అదేవిధంగా సీతారామం చిత్రం తమిళంలోనూ అనువాదమై అక్కడా మంచి గుర్తింపు లభించింది. దీంతో కోలీవుడ్లోనూ అవకాశాలు తలుపుతట్టాయి. అలా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో మదరాశి చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. అయితే ఏమైందో ఏమోకానీ, ఆ అవకాశాన్ని మృణాల్ ఠాకూర్ చేజార్చుకుంది. అప్పటినుంచి ఇప్పటివరకు తమిళ చిత్రపరిశ్రమ ఆమె వైపు చూడడం లేదు. ప్రస్తుతం హిందీలో మూడు చిత్రాలు చేస్తూ బిజీగా ఉన్న ఈ అమ్మడు తెలుగులో డకాయిట్ మూవీలో యాక్ట్ చేస్తోంది. అదేవిధంగా అల్లు అర్జున్ సరసన నటించే మరో లక్కీఛాన్స్ ఈ బ్యూటీని వరించినట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఈ బ్యూటీ పెళ్లి గురించి తన మనసులోని మాటను బయటపెట్టింది. పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలన్నది తన చిన్న వయసు నుంచే కల అని పేర్కొంది. అయితే ప్రస్తుతం తన దృష్టి అంతా చిత్ర పరిశ్రమపైనే ఉందని, సినిమాల్లో బాగా సక్సెస్ అవ్వాలని తెలిపింది.చదవండి: కెరీర్ పతనంతో డిప్రెషన్.. పిచ్చాసుపత్రిలో ట్రీట్మెంట్? 25 ఏళ్లుగా మిస్సింగ్ -
కుమార్తె గ్రాడ్యుయేషన్... ఏఆర్ రెహమాన్ పోస్ట్ వైరల్!
ఆస్కార్ అవార్డ్ గ్రహీత, మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ తన కూతురు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. తన కుమార్తె పట్టభద్రురాలైందని వెల్లడించారు. స్విట్జర్లాండ్లోని గ్లియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్లో తన విద్య పూర్తి చేసుకుందని తెలిపారు. హాస్పిటాలిటీ, ఎంటర్ప్రెన్యూర్షిప్, ఇన్నోవేషన్ కోర్సులో రహీమా మాస్టర్ ఆఫ్ సైన్స్ పూర్తి చేసింది. ఈ విషయాన్ని ఏఆర్ రెహమాన్ ఆనందంగా వ్యక్తం చేస్తూ అభిమానులతో పంచుకున్నారు.కాగా.. ఏఆర్ రెహమాన్ ప్రస్తుతం నార్త్ అమెరికాలో తన వండర్మెంట్ టూర్లో బిజీగా ఉన్నారు. మరోవైపు రెహమాన్కు సైరా బానుతో 1995లో వివాహం జరిగింది. ఈ జంటకు రహీమాతో పాటు ఖతీజా, అమీన్ అనే మరో ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే దాదాపు మూడు దశాబ్దాల తర్వాత ఏఆర్ రెహమాన్, తన భార్య సైరా బానుతో విడిపోయారు. గతేడాది నవంబర్లో విడిపోతున్నట్లు ప్రకటించారు. View this post on Instagram A post shared by ARR (@arrahman) -
కెరీర్ పతనంతో డిప్రెషన్.. పిచ్చాసుపత్రిలో ట్రీట్మెంట్? 25 ఏళ్లుగా మిస్సింగ్
ఆ రంగు, లుక్స్ చూసి ఫ్యూచర్ హీరో అనుకున్నారు. కొన్ని సినిమాలతోనే చాక్లెట్ బాయ్గా పేరు తెచ్చుకున్నాడు. అంతలోనే నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు చేసి విలనిజం కూడా చేయగలనని హింటిచ్చాడు. సినిమాలకే ఎందుకు పరిమితం కావాలనుకున్నాడో ఏమో కానీ బుల్లితెరపైనా తళుక్కుమని మెరిశాడు. రెండుచోట్లా గుర్తింపు సంపాదించుకున్న ఆయన 25 ఏళ్లుగా కనిపించకుండా పోయాడు. అతడే బాలీవుడ్ నటుడు రాజ్ కిరణ్..అగ్రతారగా ఎదుగుతాడనుకునేలోపే..రాజ్ కిరణ్ (Actor Raj Kiran).. 1975లో 'కాగజ్ కీ నవో' చిత్రంతో కెరీర్ ప్రారంభించాడు. రిషి కపూర్, గోవింద, అనిల్ కపూర్, శ్రీదేవి, రేఖ, హేమమాలిని వంటి పలువురు అగ్రతారలతో కలిసి పనిచేశాడు. బషీర, కర్జ్, అర్థ్, తేరి మెహర్బనియన్, మజ్దూర్, ఘర్ ఏక్ మందిర్.. వంటి ఎన్నో విజయాలను సొంతం చేసుకున్నాడు! వాకిట్లో ఎప్పుడూ విజయాలే సిద్ధంగా ఉంటాయా? మొదట్లో ఎంతో సక్సెస్ చూసిన రాజ్కిరణ్ తర్వాత ఫ్లాపుల్ని కూడా చూశాడు. కొన్ని సినిమాలైతే అర్ధాంతరంగా ఆగిపోయేవి. అంతా ఓకే అయ్యాక, షూటింగ్ కూడా మొదలుపెట్టాక అటకెక్కేవి. ఇలా తన కెరీర్ కిందకుపడిపోవడాన్ని చూసి తట్టుకోలేకపోయాడు. డిప్రెషన్కు వెళ్లిపోయాడు. 25 ఏళ్లుగా మిస్సింగ్దీంతో 2000వ సంవత్సరంలో మానసిక ఆరోగ్య కేంద్రంలో చేరినట్లు తెలుస్తోంది. దర్శకుడు మహేశ్ భట్ కూడా అతడిని చూసేందుకు పలుమార్లు వెళ్లొచ్చాడంటుంటారు. కానీ తర్వాత రాజ్కిరణ్ కనిపించకుండా పోయాడు. అతడి గురించి ఇంటిసభ్యులు వెతకని చోటంటూ లేదు. రిషికపూర్, దీప్తి నావల్.. సిటీ అంతా జల్లెడ పట్టారు. రోజులు నెలలయ్యాయి. నెలలు సంవత్సరాలయయ్యాయి. అయినా అతడి జాడలేదు. 25 ఏళ్లుగా అతడు కనిపించకపోవడం అనేది ఒక మిస్టరీగానే మిగిలిపోయింది.పిచ్చి ఆస్పత్రి నుంచి..నటుడి మిస్సింగ్ గురించి ఎన్నో రకాల ఊహాగానాలు ప్రచారంలో ఉన్నాయి. ముంబైలోని బైకుల్లా పిచ్చి ఆస్పత్రిలో రాజ్కిరణ్ ఉండేవాడని, అక్కడినుంచి సడన్గా మాయమైపోడని అంటుంటారు. కొందరేమో అట్లాంటాలోని పిచ్చాసుపత్రిలో ఉన్నాడంటారు. మరికొందరేమో న్యూయార్క్లో టాక్సీ డ్రైవ్ చేస్తూ కనిపించాడని చెప్తుంటారు. 2000వ సంవత్సరంలో రాజ్ కిరణ్ అదృశ్యమయ్యేనాటికి అతడి భార్య రూప, కూతురు రిషిక ఉన్నారు.ఎప్పటికైనా తిరిగొస్తాడని..తండ్రి ఎక్కడో ఒక చోట క్షేమంగానే ఉండుంటాడని, ఎప్పటికైనా తిరిగి వస్తాడని ఆశగా ఎదురుచూస్తోంది కూతురు రిషిక మహతని. తన తండ్రి అట్లాంటాలో పిచ్చాసుపత్రిలో ఉన్నాడన్న ప్రచారాన్ని సైతం ఖండించింది. పోలీసులు, డిటెక్టివ్ల సాయంతో తండ్రిని వెతికిస్తున్నామంది. అయినా ఇంతవరకు ఎటువంటి క్లూ కూడా దొరకలేదు. ఏళ్లు గడుస్తున్నా భర్త తిరిగిరాకపోవడంతో రూప రెండో పెళ్లి చేసుకుందని సమచారం.మాట నిలబెట్టుకోలేకపోయిన నటిరాజ్కిరణ్ కోసం సల్మాన్ ఖాన్ మాజీ ప్రేయసి, నటి సోమి అలీ కూడా తెగ వెతికింది. నీ క్లోజ్ ఫ్రెండ్ ఎక్కడుతన్నా వెతికి తీసుకొస్తాను అని రిషి కపూర్కు మాటిచ్చింది. 20 ఏళ్లపాటు వెతికినా ఫలితం లేకపోయింది. అసలు రాజ్ కిరణ్ ఎక్కడున్నాడు? ఏం చేస్తున్నాడు? ఎందుకు కనిపించకుండా పోయాడు? ప్రస్తుతం బతికే ఉన్నాడా? లేదా? అన్నది ఇప్పటికీ ఓ మిస్టరీగానే మిగిలిపోయింది.చదవండి: శ్రావణమాస ఉపవాసం.. రాత్రి మటన్ వండుకుని తిన్నా: హీరోయిన్ -
తండ్రైన ఛావా నటుడు.. సోషల్ మీడియాలో పోస్ట్
ఈ ఏడాది ఫిబ్రవరిలో వచ్చి బాక్సాఫీస్ను షేక్ చేసిన చిత్రం ఛావా. విక్కీ కౌశల్, రష్మిక కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాను ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా తెరకెక్కించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ఛావా బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.800 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రానికి లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించారు. అయితే ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు వినీత్ కుమార్ సింగ్ కీలక పాత్రలో మెప్పించారు.తాజాగా ఛావా నటుడు వినీత్ కుమార్ సింగ్ తండ్రైనట్లు ప్రకటించారు. ఈనెల 24న బాబు పుట్టాడని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ ఏడాది మే నెలలో తన భార్య రుచిరా గర్భంతో ఉన్నారని శుభవార్త చెప్పారు. తాజాగా ఈ జంట తమ మొదటి బిడ్డకు స్వాగతం పలికారు. కాగా.. వినీత్ కుమార్ సింగ్ 2021లో నటి రుచిరాను పెళ్లాడారు. ఈ విషయం తెలుసుకున్న 12th ఫెయిల్ నటుడు విక్రాంత్ మాస్సే అభినందనలు తెలిపారు. మీ చిన్నారిని కలిసేందుకు ఆసక్తిగా ఉన్నానంటూ తెలిపారు.కాగా.. వినీత్ కుమార్ సింగ్ ముక్కాబాజ్, గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్ లాంటి చిత్రాలతో బాలీవుడ్లో ఫేమస్ అయ్యారు. ఈ ఏడాది ఛావా మూవీతో బ్లాక్బాస్టర్ హిట్ అందుకున్నారు. ఈ చిత్రంలో చందోగమాత్య కవి కలష్ పాత్రలో కనిపించాడు. అంతేకాకుండా ఈ ఏడాది విడుదలైన జాట్ మూవీతోనూ కనిపించారు. అంతకుముందు 'సూపర్బాయ్స్ ఆఫ్ మాలెగావ్', గుంజన్ సక్సేనా, గుస్పాతియా, మ్యాచ్ ఫిక్సింగ్' లాంటి సినిమాలతో పాటు రంగ్బాజ్ అనే వెబ్ సిరీస్లోనూ నటించారు. View this post on Instagram A post shared by Viineet Kumar Siingh (@vineet_ksofficial) -
శ్రావణమాస ఉపవాసం.. రాత్రి మటన్ వండుకుని తిన్నా: హీరోయిన్
శ్రావణమాసంలో చాలామంది మాంసాహారానికి దూరంగా ఉంటారు. పూజలు, వ్రతాలు, ఉపవాసాలు అంటూ ఎక్కువగా దైవారాధానలోనే మునిగిపోతారు. ఆధ్యాత్మికబాటలో నడుస్తున్నానని చెప్పిన హీరోయిన్ తనుశ్రీ దత్తా (Tanushree Dutta) కూడా శ్రావణ ఉపవాసం చేస్తోంది. కానీ మాంసాహారం తింటోంది. అదేంటో మీరే చదివేయండి..చంపడానికి ప్రయత్నాలుసినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న తనుశ్రీ దత్తా ఇటీవల కన్నీళ్లు పెట్టుకుంటూ ఓ వీడియో షేర్ చేసింది. నటుడు నానాపటేకర్.. తనకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాడంది. తన మనుషులతో రాత్రిపూట ఇంటి బయట శబ్దాలు చేస్తూ భయపెడుతున్నారంది. బాలీవుడ్ మాఫియా చాలా పెద్దదని, సుశాంత్ సింగ్ రాజ్పుత్లాగే తననూ చంపడానికి ప్రయత్నిస్తున్నారని సంచలన ఆరోపణలు చేసింది. ఈ వీడియోలు వైరల్ కావడంతో ఇంటర్వ్యూల కోసం ఆమెను చాలామంది సంప్రదించారు. రోజంతా ఉపవాసం.. రాత్రవగానే..దానికామె కొన్నేళ్లుగా ఆధ్యాత్మిక జీవనశైలికి అలవాటు పడ్డానని, అందుకే మీడియా ముందుకు రావడం లేదని పేర్కొంది. కట్ చేస్తే.. తాజాగా ఇన్స్టాగ్రామ్లో శ్రావణమాసం సందర్భంగా మటన్ తింటున్నట్లు తెలిపింది. కొట్టు నుంచి తెచ్చుకున్న మటన్ను చూపిస్తూ.. రోజంతా తినకుండా ఉన్నానని, రాత్రి 7 గంటలకు మటన్ తిని ఉపవాసం పూర్తి చేశానంది. "ఎవరైనా మీ మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీసేలా టార్చర్ చేస్తుంటే మీరు తినే ఆహారంపై శ్రద్ధ పెట్టండి. మటన్ వండుకుని తిన్నాఎందుకంటే ఆహారమే అసలైన మెడిసిన్. శ్రావణమాసం కావడంతో రాత్రి ఏడు గంటల వరకు ఉపవాసమున్నాను. ఆ తర్వాత అధిక పోషకాలున్న పప్పు, మటన్ వండుకుని డిన్నర్ చేశాను. ఉపవాసాలు మరీ కఠినంగా ఉండాల్సిన అవసరం లేదు. ఎవరి అవసరాలకు తగ్గట్లుగా వారు దాన్ని మార్చుకోవచ్చు. నాకైతే ఇలాంటి ఉపవాసమే బాగా పనిచేస్తుంది" అని చెప్పుఒకచ్చింది. అందుకే లావైపోతున్నావ్శ్రావణంలో మటన్ తినడమేమో కానీ ఏకంగా ఉపవాసం రోజు మటన్ తినడమేంటని నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. ఓ వ్యక్తి అయితే నువ్వు కొవ్వు ఎక్కువగా తింటున్నావు, అందుకే లావవుతున్నావు అని కామెంట్ చేశాడు. దానికి తనుశ్రీ స్పందిస్తూ.. ముందుగా నా శరీరం గురించి కామెంట్ చేసేందుకు నీకు ఎటువంటి అర్హత లేదు. రెండోది.. బక్కపల్చగా లేనేమోకానీ ఫిట్గానే ఉన్నాను. ఎటువంటి డ్రెస్ వేసుకున్నా అందంగానే కనిపిస్తాను. కాబట్టి బొద్దుగా, అందంగా ఉండేవాళ్లను బాడీషేమింగ్ చేయడం ఆపండి. కొవ్వు మంచిదే!ప్రతి ఒక్కరూ సన్నగా ఉండాలని కోరుకోరు. అయినా కాస్త కొవ్వు పదార్థాలు తిన్నంతమాత్రాన శరీరంలో కొవ్వు చేరదు. ఆరోగ్యకరమైన కొవ్వు తీసుకోవడం వల్ల సన్నగా కూడా అవుతారు. మన శరీరం బాగా పనిచేయడానికి హెల్తీ ఫ్యాట్స్ అవసరం అని చెప్పుకొచ్చింది. హిందీలో అనేక సినిమాలు చేసిన తనుశ్రీ దత్తా.. తెలుగులో వీరభద్ర మూవీలో యాక్ట్ చేసింది. View this post on Instagram A post shared by Tanushree Dutta Miss India Universe (@iamtanushreeduttaofficial) చదవండి: పిల్లలు కావాలి.. వాళ్లతో ఎంజాయ్ చేయాలనుంది: నాగచైతన్య -
అది వారి వ్యక్తిగత విషయం.. మనకు అవసరం లేదు: కాజోల్
బాలీవుడ్ హీరోయిన్ కాజోల్ తాజాగా సర్జమీన్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ చిత్రంలో మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్కు జంటగా కనిపించింది. దేశభక్తి నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా నేరుగా ఓటీటీలోనే విడుదలైంది. ఈ మూవీలో ఇబ్రహీం అలీ ఖాన్ కీలక పాత్రలో కనిపించారు. ఈ చిత్రానికి కయోజ్ ఇరానీ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో కాజోల్.. మెహర్ అనే పాత్రలో కనిపించారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన కాజోల్.. అందం, గ్లామర్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. సినీ ఇండస్ట్రీలో కాస్మెటిక్ సర్జరీ, బోటాక్స్ గురించి ప్రస్తావించింది. అందం కోసం ఇలాంటి చేయించుకోవడం అనేది వ్యక్తిగత విషయమని పేర్కొంది. అలాంటి వారిని మనం జడ్జ్ చేయకూడదని తెలిపింది. ఆ విషయాన్ని వారికే వదిలేయాలని హితవు పలికింది. కాస్మోటిక్ సర్జరీలు కేవలం మహిళలకు మాత్రమే పరిమితం కాదని.. ఈ రోజుల్లో పురుషులు కూడా చేయించుకుంటున్నారని వెల్లడించింది.కాజోల్ మాట్లాడుతూ.. 'కత్తి కిందకు వెళ్లాలా, వద్దా అనేది ప్రతి ఒక్కరి వ్యక్తిగత నిర్ణయం. అందుకే ఇలాంటి విషయాలను అది వారికే వదిలివేయాలి. వాటిని మనం ప్రశ్నించకూడదు. ఇది కేవలం జెండర్కు సంబంధించినది కాదు. చాలా మంది పురుషులు కూడా చేయించుకుంటున్నారు. ఇప్పుడున్న రోజుల్లో అందరూ సమానమే.. వృద్ధాప్యం అనేది మనస్సుకు సంబంధించిన విషయం. అయితే వృద్ధాప్యాన్ని చేరుకోవడం అనేది మన చేతుల్లోనే ఉంది. కొంతమంది చిన్న వయస్సులోనే మరణించడంతో అసలు వృద్ధాప్యం పొందే అవకాశమే లేదు. అలాంటి వారు అదృష్టవంతులని కాదు. అంటే వారికి వృద్ధాప్యాన్ని అనుభవించడానికి, జీవితంలో ముందుకు పోయే ఛాన్స్ లేదు. అందుకే నాకు జీవించడానికి ఇంకా చాలా అద్భుతమైన సంవత్సరాలు మిగిలి ఉన్నాయి. వాటి కోసమే ఎదురు చూస్తున్నా' అని అన్నారు. -
సన్నగా అవ్వాలని తిండి మానేశా.. ఆ వ్యాధి వచ్చింది!
ఫేమస్ అవడానికి ఏదైనా చేస్తారు సినీతారలు. ఒక్కసారి పాపులర్ అయ్యాక దాన్ని కాపాడుకునేందుకు కూడా చాలా కష్టపడుతుంటారు. బాలీవుడ్ నటి ఉర్ఫీ జావెద్ (Uorfi Javed) కూడా అదే చేసింది. చిత్రవిచిత్ర వేషధారణతో సోషల్ మీడియాలో నిత్యం కనిపిస్తూ ఉండే ఈ బ్యూటీ.. మరింత అందంగా కనిపించాలని గతంలో లిప్ ఫిల్లర్స్ వేయించుకుంది. ఈ మధ్య వాటిని తీసేయించుకోవడానికి చాలా కష్టపడింది. తిండి మానేశా..ఆ ట్రీట్మెంట్ వల్ల పెదాలు, ముఖం అంతా ఉబ్బిపోయి అందవిహీనంగా మారిపోయింది. ఇప్పుడిప్పుడే మళ్లీ మామూలు స్థితికి వచ్చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సన్నగా కనిపించాలని తిండి మానేశానని చెప్తోంది. ఉర్ఫీ జావెద్ మాట్లాడుతూ.. నేను చాలాసార్లు కడుపుమాడ్చుకునేదాన్ని. తిండి తినకపోయేదాన్ని. చాలా సన్నగా కనిపించాలని నానాతిప్పలు పడ్డాను. దీంతో నాలుగేళ్ల క్రితం నాకు బాడీ డిస్మార్ఫిక్ అనే వ్యాధి వచ్చింది. నాలుగు పీసులు తినేదాన్నంతే!(అందంగా కనిపించడం లేదేమోనని కంగారుపడటం, శరీరంలో ఏదో ఒకటి బాగోలేదని బాధపడటం వంటివి ఈ వ్యాధి లక్షణాలు) మూడు లేదా నాలుగు చికెన్ ముక్కలు తిని రోజంతా ఖాళీ కడుపుతో ఉండేదాన్ని. వర్కవుట్స్ చేయకపోయేదాన్ని కానీ పరిగెత్తేదాన్ని. ఒంట్లో ఎక్కువ శక్తి లేకపోయేసరికి మైండ్ సరిగా పనిచేసేది కాదు. ఎప్పుడూ కోపంగా ఉండేదాన్ని, చిరాకుపడేదాన్ని. ఎవరైనా నన్ను పలకరించినా సరే నాతో ఎందుకు మాట్లాడుతున్నావ్? అనుకునేదాన్ని. .బక్కచిక్కిపోవాల్సిన అవసరం లేదుఅయితే తర్వాత నా పద్ధతి మార్చుకున్నాను. మరీ బక్కచిక్కిపోయి స్లిమ్గా ఉండాల్సిన అవసరం లేదనుకున్నాను. ఈ మధ్యే జిమ్కు వెళ్లడం మొదలుపెట్టాను. బరువులు ఎత్తుతున్నాను. బాగా తింటున్నాను. కచ్చితంగా సన్నగా ఉండాల్సిందేనని ఏమాత్రం ఆలోచించట్లేదు అని చెప్పుకొచ్చింది. ఉర్ఫీ జావెద్.. బుల్లితెరపై పలు సీరియల్స్లో యాక్ట్ చేసింది. హిందీ బిగ్బాస్ ఓటీటీ తొలి సీజన్లో పాల్గొంది. ఫాలో కర్లో యార్ వెబ్ సిరీస్లో నటించింది. ఇటీవల ద ట్రైటర్స్ ఇండియా అనే షోలో పాల్గొని విజేతగా నిలిచింది.చదవండి: డబుల్ ధమాకా: రెండో పెళ్లి చేసుకున్న నటుడు.. భార్య ఆరో నెల గర్భిణీ -
మేరా భారత్ మహాన్.. దేశభక్తి రగిలిస్తున్న స్టార్ హీరోలు
దేశ సరిహద్దుల్లో సైనికుల్లా, దేశంలో గూఢచారులుగా, ప్రభుత్వ నిఘా సంస్థల ప్రతినిధులుగా... ఇలా దేశం కోసం అహర్నిశలూ కష్టపడుతున్నవారు చాలామంది ఉన్నారు. ఇటీవల భారత ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ ఘటన ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ తరుణంలో దేశభక్తిని చాటే కొన్ని సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమౌతున్నాయి. ఇలా ‘మేరా భారత్ మహాన్’ అంటూ దేశభక్తిని చాటి చెప్పేలా కొందరు హీరోలు చేస్తున్న సినిమాలపై ఓ లుక్ వేద్దాం.ప్రభాస్ ఫౌజి వెండితెరపై ప్రభాస్ తొలిసారిగా సైనికుడిగా కనిపించనున్నారు. ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా రానున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘ఫౌజి’ అనే టైటిల్ను అనుకుంటున్నారట. ఈ సినిమా మిలటరీ వార్ బ్యాక్డ్రాప్లో ఉంటుందని, ఇందులో ప్రభాస్ సైనికుడిగా కనిపిస్తారని తెలిసింది. అలాగే కొంత లవ్స్టోరీ కూడా ఉంటుంది. అయితే ఈ సినిమాలోని వార్ సన్నివేశాల్లో ప్రభాస్ ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్లు సూపర్గా ఉంటాయని, ఈ సన్నివేశాల కోసం ప్రభాస్ కొత్తగా మేకోవర్ అయ్యారని సమాచారం. ఇమాన్వీ ఇస్మాయిల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో మిథున్ చక్రవర్తి, జయప్రద, అనుపమ్ ఖేర్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 2026 ద్వితీయార్ధంలో ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.డ్రాగన్లో దేశభక్తి హీరో ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో ‘డ్రాగన్’ అనే చిత్రం రూపొందుతోంది. ఇది ఓ పీరియాడికల్ యాక్షన్ గ్యాంగ్స్టర్ డ్రామా అనే ప్రచారం సాగింది. కానీ ఇటీవల జరిగిన ఈ సినిమా చిత్రీకరణలో వందేమాతరం అంటూ వందలమంది జూనియర్ ఆర్టిస్టులు చెబుతుంటే, ఓ భారీపాటను చిత్రీకరించారట. ‘వందేమాతరం’ అంటూ సాగే ఈపాట స్క్రీన్పై కనిపించే సమయంలో సూపర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారట ఈ చిత్రం మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్. దీంతో ఈ ‘డ్రాగన్’ సినిమాలో కొన్ని దేశభక్తి అంశాలకు చెందిన సన్నివేశాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. రుక్మిణీ వసంత్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో మలయాళ నటుడు టోవినో థామస్ విలన్గా నటిస్తారనే ప్రచారం సాగుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమా 2026 జూన్ 25న విడుదల కానుంది.బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్ ‘టైగర్ జిందా హై, ఏక్తా టైగర్, టైగర్ 3’ వంటి స్పై యాక్షన్ సినిమాల్లో ‘రా’ (రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్) ఆఫీసర్గా నటించి, మెప్పించారు సల్మాన్ ఖాన్. తాజాగా ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్’ సినిమాలో సల్మాన్ ఖాన్ ఆర్మీ ఆఫీసర్పాత్రలో నటించనున్నారు. 2020లో గాల్వాన్ లోయలో భారత్–చైనా సైనికుల మధ్య జరిగిన యుద్ధం, నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ మూవీలో చిత్రాంగదా సింగ్ మరో లీడ్ రోల్ చేయనున్నారు. సల్మాన్ ఖాన్ ఫిలింస్ బ్యానర్పై అపూర్వ లఖియా దర్శకత్వం వహించనున్న ఈ సినిమా చిత్రీకరణ వచ్చే నెల మొదటి వారంలో ప్రారంభం కానుంది.ప్రస్తుతం తాను పోషించే ఆర్మీ ఆఫీసర్పాత్ర కోసం సల్మాన్ ఖాన్ ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారు. డైలీ కసరత్తులు చేస్తున్నారు. ఇక ఈ ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్’ సినిమా కోసం లడఖ్లో ఓ భారీ షూటింగ్ షెడ్యూల్ ప్లాన్ చేశామని, గడ్డకట్టే చలిలో అక్కడ ఏడెనిమిది రోజులు లోయలో షూటింగ్ చేస్తామని, ఈ షెడ్యూల్ను తలచుకుంటే తనకు భయంగా ఉందని, కానీ తాను సిద్ధమౌతున్నానని సల్మాన్ ఖాన్ ఇటీవల ఈ ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్’ సినిమా ప్రయాణం గురించి చె΄్పారు. వీలైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్ను పూర్తి చేసి, వచ్చే గణతంత్ర దినోత్సవం సందర్భంగా రిలీజ్ చేయాలని సల్మాన్ ఖాన్ భావిస్తున్నారట. ఒకవేళ ఇది కుదరకపోతే వచ్చే రంజాన్కు విడుదల చేయాలని సల్మాన్ ఆలోచిస్తున్నారని బాలీవుడ్ సమాచారం. భజరంగీ భాయిజాన్ 2: పది సంవత్సరాల క్రితం సల్మాన్ ఖాన్ నటించిన ‘భజరంగీ భాయిజాన్’ సినిమా మంచి ఎమోషనల్ థ్రిల్లర్గా విజయం సాధించింది. విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమాకు కథ అందించగా, కబీర్ ఖాన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో కొన్ని దేశభక్తి అంశాలు కూడా ఉన్నాయి. కాగా ‘భజరంగీ భాయిజాన్’ సినిమాకు సీక్వెల్ తీసే ఆలోచనలో ఉన్నామని, వచ్చే ఏడాది ఈ సీక్వెల్ సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయని ఇటీవల ఓ సందర్భంలో కబీర్ ఖాన్ పేర్కొన్నారు. కరీనా కపూర్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో హర్షాలీ మల్హోత్రా, నవాజుద్దీన్ సిద్ధిఖీ ఇతర ప్రధానపాత్రల్లో నటించారు.మేజర్ షైతాన్ సింగ్ భారతదేశ సైనికుల వీరత్వాన్ని, ధైర్యాన్ని మరోసారి సిల్వర్ స్క్రీన్పై చూపించేందుకు రెడీ అయ్యారు బాలీవుడ్ దర్శక–నటుడు ఫర్హాన్ అక్తర్. 1962లో ఇండియా–చైనాల మధ్య యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో ‘రెజాంగ్ లా’ పోరాట ఘట్టం ముఖ్యమైనదిగా చెప్పుకుంటారు. ఈ ఘటన ప్రధానాంశంగా బాలీవుడ్లో రూపొందుతున్న చిత్రం ‘120 బహాదుర్’.ఈ సినిమాలో ఇండియా–చైనా యుద్ధానికి నాయకత్వం వహించిన మేజర్ షైతాన్ సింగ్గా ఫర్హాన్ అక్తర్ నటిస్తున్నారు. రజనీష్ ఘాయ్ ఈ సినిమాకు దర్శకుడు. గత ఏడాది సెప్టెంబరులో ఈ సినిమాను ప్రకటించారు. ‘‘1962లో జరిగిన ఇండియా–చైనా వార్లో ముఖ్యమైనదిగా గుర్తింపు పొందిన ‘రెజాంగ్ లా’ యుద్ధాన్ని ఈ ‘120 బహాదుర్’ చిత్రంలో ఆడియన్స్ చూడబోతున్నారు. ఇది మన సైనికుల వీరత్వం, ధైర్యాన్ని చాటి చెప్పే మరో కథ’’ అని పేర్కొన్నారు ఫర్హాన్ అక్తర్. ఈ సినిమాను ఈ ఏడాది నవంబరు 21న రిలీజ్ చేయనున్నట్లుగా గతంలో మేకర్స్ ప్రకటించారు.సైనికుడి వాగ్దానం సన్నీ డియోల్ హీరోగా నటించిన వార్ డ్రామా ‘బోర్డర్ (1997)’. 1971లో జరిగిన ఇండియా– పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాకు సీక్వెల్గా ‘బోర్డర్ 2’ రానుంది. ‘బోర్డర్’ సినిమాలో హీరోగా నటించిన సన్నీ డియోల్ ఈ ‘బోర్డర్ 2’లోనూ హీరోగా నటిస్తున్నారు. వరుణ్ ధావన్, అహాన్ శెట్టి, దిల్జీత్ సింగ్ ఇతర ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు. భారతీయ సైనికుల వీరత్వం, ధైర్య సాహసాల నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోంది.భూషణ్ కుమార్, క్రిషణ్ కుమార్, జేపీ దత్తా, నిధి దత్తా ఈ సినిమాను నిర్మిస్తుండగా, అనురాగ్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. నార్త్ ఇండియాలోని ప్రముఖ లొకేషన్స్తోపాటు కశ్మీర్లోనూ ఈ సినిమాను చిత్రీకరిస్తున్నారు. ‘‘ఒక సైనికుడు తన వాగ్దానాన్ని నెరవేర్చుకోవడం కోసం 27 ఏళ్ల తర్వాత తిరిగి వస్తున్నాడు. ఇండియన్ సినిమా చరిత్రలోనే ఓ పెద్ద వార్ ఫిల్మ్ ఇది’’ అని చిత్రయూనిట్ ఈ ‘బోర్డర్ 2’ సినిమా గురించి ఓ సందర్భంలో పేర్కొంది. వచ్చే గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ సినిమాను జనవరి 23న రిలీజ్ చేయనున్నట్లుగా గతంలో చిత్రయూనిట్ ప్రకటించింది.ఆపరేషన్ ఖుక్రీ పాతిక సంవత్సరాల క్రితం వెస్ట్ ఆఫ్రికాలోని సియోర్రా లియోన్లో జరిగిన ఆపరేషన్ ఖుక్రీ సంఘటన ఆధారంగా ఓ సినిమా రానుంది. యునైటెడ్ నేషన్స్ (ఐక్యరాజ్యసమితి) పీస్ కీపింగ్ మిషన్స్లో భాగంగా వెస్ట్ ఆఫ్రికాకు వెళ్లిన 233 మంది భారత సైనికులు, అక్కడి రెబల్స్ ట్రాప్లో చిక్కుకుని, 75 రోజులపాటు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సైనికుల రెస్క్యూ ఆపరేషన్ను రాజ్ పాల్ పునియా సక్సెస్ఫుల్గా లీడ్ చేశారు. ఈ సంఘటనల నేపథ్యంలో చోటు చేసుకున్న పరిస్థితులు, రాజ్ పాల్ సాహసోపేతమైన నిర్ణయాలు వంటి అంశాల ఆధారంగా ‘ఆపరేషన్ ఖుక్రీ’ అనే సినిమా రానుంది.‘ఆపరేషన్ ఖుక్రీ: ద అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ ది ఇండియన్ ఆర్మీస్ బ్రేవెస్ట్ పీస్ కీపింగ్ మిషన్ అబ్రాడ్’ అనే పుస్తకం ఆధారంగా ఈ సినిమా రానుంది. మేజర్ జనరల్ రాజ్ పాల్ పునియా, దామిని పునియా ఈ పుస్తకాన్ని రాయగా, ఈ బుక్ హక్కులను రాహుల్ మిత్రా ఫిల్మ్స్, రణ్దీప్ హుడా ఫిల్మ్స్ సంస్థలు దక్కించుకున్నాయి. ఈ పుస్తకం ఆధారంగా ‘ఆపరేషన్ ఖుక్రీ’ రానుంది. ఈ సినిమాలో మేజర్ రాజ్ పాల్ పునియాగా రణ్దీప్ హుడా నటిస్తారు. అతి త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది.స్వాతంత్య్రానికి పూర్వం... భారతదేశానికి స్వాతంత్య్రం రాకముందు, లండన్లో ఉన్న భారత మేధావులు కొందరు తరచూ సమావేశం అయ్యేవారు. ఈ సమావేశంలో భారతదేశానికి స్వాతంత్య్రం రావాలంటే ఏం చేయాలి? అనే వ్యూహ రచనలు, ప్రణాళికలను సిద్ధం చేసేవారు. ఈ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న సినిమా ‘ది ఇండియా హౌస్’. 1905 నేపథ్యంలో సాగే ఈ సినిమాలో నిఖిల్ హీరోగా నటిస్తుండగా, సయీ మంజ్రేకర్ హీరోయిన్గా నటిస్తున్నారు. అనుపమ్ ఖేర్ ఓ కీలకపాత్ర చేస్తున్నారు. రామ్చరణ్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, వి మెగా పిక్చర్స్ సంస్థలు ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. ఇటీవల ఈ సినిమా సెట్స్లో చిన్న ప్రమాదం జరగడంతో చిత్రీకరణకు తాత్కాలిక బ్రేక్ పడింది. అతి త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ఊపందుకోనుంది. 2026 చివర్లో ‘ది ఇండియా హౌస్’ సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది.ఆపరేషన్ సిందూర్ పహల్గాం ఉగ్రదాడికి వ్యతిరేకంగా మన దేశం చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ ఘటన దేశవ్యాప్తంగా సంచలనమైంది. ఈ ఘటన ఆధారంగా సినిమాలు తీసేందుకు కొందరు బాలీవుడ్ దర్శక–నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారని, కొంతమంది కొన్ని టైటిల్స్ను రిజిస్టర్ చేయించారనే టాక్ బాలీవుడ్లో వినిపిస్తోంది. ఆల్రెడీ ఉత్తమ్ నితిన్ ఓ సినిమాను ప్రకటించారు. కానీ ‘ఆపరేషన్ సిందూర్’ ఘటన జరుగుతున్నప్పుడే ఆయన సినిమాను ప్రకటించడంతో కాస్త వివాదాస్పదమైంది. మరి... ఉత్తమ్ తాను ప్రకటించిన సినిమాను సెట్స్పైకి తీసుకువెళ్తారా? లేదా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. ఇలా దేశభక్తి నేపథ్యంలో మరికొన్ని సినిమాలు ఉన్నాయి. – ముసిమి శివాంజనేయులు ⇒ గూఢచారుల నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రానున్న సినిమాల సంఖ్య కూడా కాస్త ఎక్కువగానే ఉంది. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ హీరోలుగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందిన స్పై యాక్షన్ డ్రామా సినిమా ‘వార్ 2’. ఈ చిత్రంలో కియారా అద్వానీ మరో కీలకపాత్రలో నటించారు. ఆదిత్యా చోప్రా నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 14న రిలీజ్ కానుంది. ఇక ‘వార్ 2’తోపాటు ‘యశ్ రాజ్ ఫిలింస్ స్పై యూనివర్స్’లో భాగంగా రూపొందిన మరో చిత్రం ‘ఆల్ఫా’. శివ్ రావైల్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా ఆలియా భట్, శర్వారీ ఈ సినిమాలో స్పైపాత్రలు చేశారు. ఈ చిత్రం డిసెంబరులో విడుదల కానుంది. ఇక కార్తీ హీరోగా నటించిన లేటెస్ట్ స్పై డ్రామా ‘సర్దార్ 2’. పీఎస్ మిత్రన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో కార్తీ ద్వి పాత్రాభినయం చేశారు. ఎస్. లక్ష్మణ్కుమార్ నిర్మించిన ఈ సినిమా ఈ ఏడాదే రిలీజ్ కానుంది. అలాగే మన తెలుగులో అడివి శేష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘గూఢచారి 2’. ఎస్. విజయ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటీనటులు వామికా, ఇమ్రాన్ హష్మి ఇతర ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. ఇలా దేశభక్తిని చాటుకునే స్పై బ్యాక్డ్రాప్ నేపథ్యంలో రానున్న సినిమాలు మరికొన్ని ఉన్నాయి. -
టెన్షన్ ఎందుకు? భర్త ఉద్యోగానికి వెళ్తే భార్య పిల్లల్ని చూసుకోవాలి!
భర్త ఉద్యోగానికి వెళ్తే భార్య పిల్లల్ని చూసుకోవాలి అంటున్నాడు బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి. ఆమాత్రం అర్థం చేసుకోకపోతే సంబంధాలు ఎలా నిలుస్తాయని ప్రశ్నిస్తున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సునీల్ శెట్టి (Suniel Shetty) మాట్లాడుతూ.. ఈరోజుల్లో పిల్లలకు బొత్తిగా ఓపిక ఉండట్లేదు. పెళ్లి అంటే కాంప్రమైజ్ అనుకుంటున్నారు. మీరు అర్థం చేసుకోవాల్సిందేంటే.. పెళ్లంటే ఒకరికోసం మరొకరు జీవించడం. భార్య పిల్లల్ని చూసుకోవాలిమీకు పిల్లలు ప్టుటారే అనుకోండి.. భర్త ఉద్యోగానికి వెళ్తే భార్య పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. భర్త కెరీర్ కూడా ముఖ్యమే కదా అని ఆలోచించి పిల్లల బాధ్యత తీసుకోవాలి. భర్త కూడా పిల్లల గురించి ఆలోచిస్తాడు, వారికి అండగా నిలబడతాడు. కానీ ఈరోజుల్లో ప్రతిదానికీ టెన్షన్ పడుతున్నారు. అన్నింటినీ ఒత్తిడిలా ఫీలవుతున్నారు. పైగా ఈ డిజిటల్ యుగంలో ప్రతి ఒక్కరూ సలహా ఇచ్చేవాళ్లే! పెద్దవాళ్లను చూసి నేర్చుకోండితల్లి ఎలా ఉండాలి? తండ్రి ఎలా ఉండాలి? ఏం తినాలి? ఏం చేయాలి? ఇవన్నీ ఆన్లైన్లో కూడా కనిపిస్తాయి. వాటితో ఇంట్లో వాళ్లను పోలుస్తూ.. నా భాగస్వామి ఇలా లేదేంటని బాధపడతారు. ఏదైనా సరే అనుభవాల నుంచి నేర్చుకుంటేనే మంచిది, లేదంటే అమ్మ, నానమ్మ, అమ్మమ్మ, అక్క, వదినలు.. వీరిని చూసి కూడా ఎంతోకొంత నేర్చుకోవచ్చు. వారిలో మీకు పనికొచ్చే లక్షణాలను ఎంపిక చేసి ఆచరించండి. పనికిరానివి వదిలేయండి. కానీ అవన్నీ ఇప్పుడెవరు చేస్తున్నారు. అలా పెళ్లయిందో లేదో ఇలా విడాకులు తీసుకుంటున్నారు అని చెప్పుకొచ్చాడు.ఫస్ట్ సినిమాకు ముందే 40 చిత్రాలుసినీ జర్నీ గురించి మాట్లాడుతూ.. నా తొలి సినిమా రిలీజవ్వడానికి ముందే నా చేతిలో 40 చిత్రాలున్నాయి. అందులో ఏవి ఆడతాయి? ఏవి ఫ్లాప్ అవుతాయి? అని నేను పెద్దగా ఆలోచించలేదు. అప్పట్లో మానసిక ఆరోగ్యం, డిప్రెషన్ అన్న పదాలే మాకు తెలియవు. కాస్త బాధపడుకుంటూ ఉన్నా సరే అమ్మ వచ్చి తిట్టగానే అదెటో వెళ్లిపోయేది. బాధపడుతూ కూర్చునేంత టైం ఇచ్చేవాళ్లు కాదు అని చెప్పుకొచ్చాడు. అయితే ఈ రోజుల్లో మానసిక ఆరోగ్యం దిగజారుతున్న నేపథ్యంలో 2023లో సునీల్ శెట్టి లెట్స్ గెట్ హ్యాపీ అనే హెల్త్ యాప్ రిలీజ్ చేశాడు. సినిమాల విషయానికి వస్తే.. బాలీవుడ్లో అనేక చిత్రాలు సునీల్ శెట్టి తెలుగులో మోసగాళ్లు, గని మూవీస్లో కనిపించాడు. ప్రస్తుతం వెల్కమ్ టు ద జంగిల్ చిత్రంలో నటిస్తున్నాడు.చదవండి: బ్లాంక్ చెక్ ఇచ్చాం.. అయినా అతడు రిజెక్ట్ చేశారు: మురళీ మోహన్ -
రూ.200 కోట్ల క్లబ్లో ‘సైయారా’.. ఖాన్స్ రికార్డ్స్ బద్దలు
బాలీవుడ్ మొత్తం ఇప్పుడు సైయారా జపం చేస్తోంది. ఎక్కడ చూసినా ఈ చిన్న సినిమా గురించే చర్చిస్తున్నారు. విడుదలై వారం రోజులు దాటినా..జనాలు ఈ సినిమాను మర్చిపోవడం లేదు. బాక్సాఫీస్ కలెక్షన్స్ రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. వారం రోజుల్లో ఈ చిత్రం రూ. 200 కోట్లకు పైగా వసూళ్లను సాధించి.. బడా హీరోల పేరిట ఉన్న రికార్డులను కొల్లగొడుతోంది.అహన్ పాండే, అనీత్ పడ్డా హీరోహీరోయిన్లు నటించిన ఈ చిత్రానికి మోహిత్ సూరి దర్శకత్వం వహించాడు. ఈ నెల 18న ఎలాంటి అంచనాలు లేకుండా కేవలం 800 థియేటర్స్లో మాత్రమే విడుదలైంది. తొలి రోజే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సంపాదించుకుంది. ఫలితంగా రెండో రోజు నుంచి ఈ సినిమా వసూళ్లు పుంజుకున్నాయి. ఎనిమిది రోజుల్లో రూ. 200 కోట్ల వరకు వసూళ్లను సాధించింది. ఇటీవల బాలీవుడ్లో విడుదలైన అన్ని చిత్రాల్లో ఇదే అత్యధిక కలెక్షన్స్. ఖాన్ సినిమాలు సైతం ఈ స్థాయిలో కలెక్షన్స్ని రాబట్టడం లేదు.(చదవండి: బాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్.. 'సయారా' రివ్యూ) ఆమిర్ ఖాన్ ‘సితారే జమీన్ పర్ (164 కోట్లు), అజయ్ దేవ్గన్ రైడ్ 2 (173 కోట్ల) చిత్రాలకు మించిన కలెక్షన్స్ని రాబట్టి.. అత్యధిక వసూళ్ల సాధించిన డెబ్యూ ఫిల్మ్గా రికార్డెకెక్కింది. సినిమాకు హిట్ టాక్ రావడంతో థియేటర్స్ సంఖ్య కూడా భారీగా పెరిగింది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 2000 థియేటర్స్లో ఈ సినిమా ప్రదర్శితం అవుతోంది. సైయారా కథ విషయానికొస్తే..వాణి బత్రా(అనీత్ పడ్డా) ఓ రైటర్. కాలేజీలో తన సీనియర్ అయిన మహేశ్ అయ్యర్ని ప్రేమించి, ఇంట్లో వాళ్లకి చెప్పి పెళ్లికి కూడా ఒప్పిస్తుంది. కానీ చివరి నిమిషంలో అతను హ్యాండ్ ఇస్తాడు. ఆరు నెలల వరకు వాణి ఆ డిప్రెషన్లోనే ఉంటుంది. తర్వాత ఓ కంపెనీలో ఉద్యోగంలో చేరుతుంది. అదే రోజు ఆమె జీవితంలోకి క్రిష్ కపూర్ (అహన్ పాండే) వస్తాడు. తానో సింగర్. అవకాశాల కోసం తిరుగుతుంటారు. వాణితో కలిసి ఓ పాట కోసం పని చేస్తారు. ఈ క్రమంలో ఇద్దరు ప్రేమలో పడిపోతారు. అదే సమయంలో వాణి జీవితంలోకి మళ్లీ మహేశ్ అయ్యర్ వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది. ఈ ఇద్దరిలో వాణి ఎవరికి దగ్గరైంది అనేదే మిగతా కథ. -
తరచు బరువు తగ్గి, పెరగడం వెనుక కారణం అదే..: విద్యా బాలన్
నిర్భయమైన వైఖరి స్వీయ వ్యక్తీకరణకు పేరుగాంచిన విద్యాబాలన్, నటన, గ్లామర్ల కలబోతగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నారు. దక్షిణాది నటి సిల్క్ స్మిత జీవిత కధ ఆధారంగా రూపొందిన డర్టీ పిక్చర్ ద్వారా సౌత్ ప్రేక్షకల ప్రశంసలూ దక్కించుకున్న విద్యాబాలన్కు తరచుగా ఎదురయే విమర్శ, లేదా సలహా ఏదైనా ఉందంటే అది ఆమె ఓవర్ వెయిట్ గురించి మాత్రమే. గతంలోనూ కొన్నిసార్లు బరువు పెరిగి తగ్గి, పెరిగి...మార్పులకు గురవుతున్న విద్యాబాలన్... ఇటీవల కొన్ని ఇంటర్వ్యూల సందర్భంగా తన శరీరపు బరువు విషయంలో సంవత్సరాలుగా తనపై వచ్చిన విమర్శల నేపధ్యంలో ఈ సమస్యను అధిగమించడానికి తాను పడిన వ్యయ ప్రయాసల్ని ఆమె వెల్లడించింది.‘ నేనొక సిగ్గుపడని ఆశావాదిని నాకు చాలా ఆత్మవిశ్వాసం ఉంది. బరువు తగ్గడానికి నేను చేయని పోరాటం లేదు. నిజాయితీగా చెప్పాలంటే, ఆ విషయానికి వస్తే నాలో ఏ తప్పు లేదని నేను అనుకుంటున్నాను అంటుందామె. బరువుపై విమర్శలను చూసి బెదిరిపోని ఆమె మనస్తత్వం, విమర్శలను తట్టుకోవడానికి సినీరంగంలో కొనసాగడానికి సహాయపడిందని ఆమె అభిప్రాయపడుతోంది. ‘‘ఆ వైఖరి నాకు సహాయపడింది. నేను ప్రధాన పాత్రలు పోషించడం కొనసాగించాను ఎలాంటి అభద్రతాభావాలు నన్ను ఎప్పుడూ వెనక్కి నెట్టలేదు‘ అంటూ ఓవర్ వెయిట్ అనే సమస్యను జయించడానికి ఆత్మవిశ్వాసం ఎంత అవసరమో చెప్పకనే చెబుతుందామె.‘నా జీవితాంతం, నేను సన్నగా మారడానికి ప్రయత్నించాను. తీవ్రమైన ఆహార నియమాలు పాటించాను. అన్ని రకాల వ్యాయామాలను చేశాను. కొన్నిసార్లు బరువు తగ్గాను, కానీ మళ్లీ తిరిగి బరువు పెరిగిపోయేదాన్ని.‘ అంటూ గుర్తు చేసుకుంది.ఇటీవల బాగా వెయిట్ లాస్ అయి స్లిమ్ గా కనపడుతున్న విద్యాబాలన్...ఈ సంవత్సరం ప్రారంభంలో చెన్నైకి చెందిన పోషకాహార సంస్థ తో కనెక్ట్ అయినప్పుడు తన సమస్య ఏమిటో తనకి అర్ధం అయిందని చెప్పింది. ‘వారు నాకు, ’మీది కొవ్వు కాదు, అది ఇన్ఫ్లమేషన్’ అని చెప్పారు. అది నా విషయంలో గేమ్–ఛేంజర్ గా పనిచేసింది అని ఆమె వివరించింది తాను స్వతహాగా శాఖాహారిని అని కూరగాయలు తింటున్నా కూడా బరువు పెరగడానికి కారణం ఈ సంస్థను కలిసిన తర్వాత తనకు అర్ధమైందని అంటోంది. ‘‘ అన్ని కూరగాయలు ఆరోగ్యకరమైనవని మనం అనుకుంటాము, కానీ అది నిజం కాదు. మీ శరీరానికి ఏది సరైనదో మీరు అర్థం చేసుకోవాలి. మరొకరికి పనికొచ్చేది మీకు పనికి రాకపోవచ్చు. అదే విధంగా పాలకూర సొరకాయ వంటి కొన్ని నాకు సరిపోవని నాకు అంతకు ముందు తెలియదు’’ అంటూ వెల్లడించింది.ఆత్మవిశ్వాసం అద్దం నుంచి రాదు అది లోపలి నుంచి వస్తుంది అని అంటున్న విద్య... దీర్ఘకాలంగా తాను చేస్తున్న బరువుపై పోరాటంలో సరైన సక్సెస్నే సాధించారని చెప్పొచ్చు. ప్రస్తుతం ఆమె తన ఆహారంలో ‘ఇన్ఫ్లమేషన్ను తొలగించే‘ విధానాన్ని అవలంబించింది, శరీర బరువు త్వరగా తగ్గించగలిగింది. అవగాహనతో కూడిన ఈ విజయం ఇకపైనా కొనసాగిస్తుందని ఆమె అభిమానులు ఆశించవచ్చు. -
ఎన్టీఆర్కే ఎక్కువ.. 'వార్ 2'కి రెమ్యునరేషన్ ఎంత?
'ఆర్ఆర్ఆర్' తర్వాత ఎన్టీఆర్కు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చింది. అయితే 'దేవర' సినిమా దీన్ని సరిగా ఉపయోగించుకోలేకపోయిందని చెప్పొచ్చు. ఈ క్రమంలోనే తారక్ చేసిన తొలి బాలీవుడ్ మూవీ 'వార్ 2'. ఆగస్టు 14న థియేటర్లలోకి రాబోతుంది. ఈ క్రమంలోనే శుక్రవారం చిత్ర ట్రైలర్ని రిలీజ్ చేశారు. రెస్పాన్స్ అయితే బాగానే వస్తుంది. మరోవైపు హీరోలు చేసిన హృతిక్, ఎన్టీఆర్ రెమ్యునరేషన్ ఎవరికి ఎక్కువ అనేది కూడా వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: 'హరి హర వీరమల్లు'.. రెండోరోజు భారీగా తగ్గిన కలెక్షన్స్)పాన్ ఇండియా కల్చర్ పెరిగిన తర్వాత మన హీరోలు ఇక్కడే సినిమాలు చేస్తూ హిందీలో డబ్ చేస్తున్నారు. కానీ ఎన్టీఆర్ మాత్రం యష్ రాజ్ స్పై యూనివర్స్లోని 'వార్ 2'లో భాగమయ్యాడు. అయితే తారక్ది విలన్ రోల్ అని టాక్ నడుస్తోంది. ట్రైలర్లోనూ నెగిటివ్ టచ్ ఉన్నట్లే చూపించారు. మరి అందరూ అనుకుంటున్నట్లు ఎన్టీఆర్ విలన్ లేదా మరో హీరోనా అనేది మూవీ వస్తే గానీ తెలియదు. అయితే ప్రస్తుతం తారక్కి ఉన్న ఫేమ్ దృష్ట్యా అందరి కంటే ఇతడికే ఎక్కువగా నిర్మాతలు రెమ్యునరేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది.'వార్ 2'లో నటించినందుకు గానూ ఎన్టీఆర్కు ఏకంగా రూ.60 కోట్ల వరకు పారితోషికం ఇచ్చారట. హృతిక్ రోషన్కి రూ.45 కోట్లు ఇచ్చారని తెలుస్తోంది. హీరోయిన్గా చేసిన కియారా అడ్వాణీకి రూ.15 కోట్లు, దర్శకుడు అయాన్ ముఖర్జీకి రూ.32 కోట్లు అందుకున్నట్లు బాలీవుడ్ వర్గాల సమాచారం. దీనిబట్టి చూస్తుంటే హృతిక్పై అటు ట్రైలర్లోనే కాదు రెమ్యునరేషన్ విషయంలోనూ తారక్ డామినేషన్ చూపించినట్లు అనిపిస్తోంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 26 సినిమాలు) -
సినీ నిర్మాత, హీరోను చెప్పుతో కొట్టిన నటి.. వీడియో వైరల్
బాలీవుడ్ నటుడు, నిర్మాత మాన్ సింగ్ను నటి రుచి గుజ్జర్ చెప్పుతో కొట్టింది. 'సో లాంగ్ వ్యాలీ' అనే హిందీ చిత్రాన్ని మాన్ సింగ్ దర్శత్వం వహించడంతో పాటు ఆయనే నిర్మాతగా ఉన్నారు. ఆపై ఇదే చిత్రంలో కీలక పాత్రలో నటించారు. జులై 25న చిత్ర యూనిట్తో కలిసి ముంబైలోని సినీపోలిస్ థియేటర్కు మాన్ సింగ్ వచ్చారు. ఆ సమయంలో నటి రుచి గుజ్జర్ ఆవేశంతో తనకు చెల్లించాల్సిన డబ్బు ఇవ్వాలంటూ చెప్పుతో కొట్టింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.నిర్మాత, నటుడు మాన్ సింగ్ తనకు రూ. 25 లక్షలు బాకీ ఉన్నాడని రుచి గుజ్జర్ పేర్కొంది. ఆ డబ్బు ఇవ్వాలంటూ అతనిపై చెప్పుతో దాడి చేసింది. ఈ క్రమంలో చెప్పు దాడి నుంచి తప్పించుకునేందుకు ఆయన ప్రయత్నం చేయగా.. ఆమెను నిలువరించేందుకు చిత్ర సహ నిర్మాత కరణ్ అడ్డుపడ్డాడు. ఆ చిత్ర నిర్మాతలు గాడిదలపై కూర్చున్నట్లు చిత్రీకరించబడిని కొన్ని ప్లకార్డులను ఆమె ప్రదర్శించింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. చాలా కాలంగా తనకు ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వకుండా తనను ఇబ్బంది పెడుతున్నాడని మాన్ సింగ్పై పోలీసులకు రుచి గుజ్జర్ ఫిర్యాదు చేసింది. మ్యూజిక్ ఆల్బమ్లకు సంబంధించి తనకు రావాల్సిన రెమ్యునరేషన్ కోసం ఆమె ఇలా చేయాల్సి వచ్చినట్లు తెలుస్తోంది.నటి రుచి గుజ్జర్ ప్రధానంగా మోడలింగ్, మ్యూజిక్ వీడియోల ద్వారా బాలీవుడ్లో గుర్తింపు పొందింది. కొన్ని ప్రైవేట్ వీడియో సాంగ్స్లో నటించిన ఆమెకు పాపులారిటీ వచ్చింది. 2023 మిస్ హర్యానాగా నిలిచిన ఈ బ్యూటీ ఈ ఏడాది మే నెలలో జరిగిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో సందడి చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ ఫొటోతో కూడిన నెక్లెస్ ధరించి అందరినీ ఆకర్షించే ప్రయత్నం చేసింది. View this post on Instagram A post shared by Bollywood News (@bolly_newssss) View this post on Instagram A post shared by SpotlightBollywood (@spotlightbolly) -
ఆ హీరోను చంపినట్లే నన్నూ చంపేస్తారు: హీరోయిన్
ఇంట్లో వేధింపులు తట్టుకోలేకపోతున్నానంటూ కొద్దిరోజుల క్రితం బోరున ఏడ్చేస్తూ హీరోయిన్ 'తనుశ్రీ దత్తా' (Tanushree Dutta) ఒక వీడియో విడుదల చేసింది. తన ఇంట్లోనే తనకు భద్రత లేదంటూ చెప్పింది. అయితే, తాజాగా ఆమె ఒక ఇంటర్వ్యూలో పాల్గొని సంచలన కామెంట్స్ చేసింది. ఇంట్లో వేధింపులపై తాను చేసిన వ్యాఖ్యలు చాలా వైరల్ కావడంతో ఫోన్ కాల్స్ ఎక్కువ అయ్యాయని పేర్కొంది. తన జీవితం ఆధ్యాత్మిక మార్గం వైపు ప్రయాణించడంతో తాను ఎక్కువగా ఎవరినీ కలవడంలేదని చెప్పింది.'కొంత కాలంగా నేను ఆరోగ్యంపరంగా ఇబ్బందులు పడుతున్నాను. నాకు జరిగిన అన్యాయాన్ని అందరికీ చెబుతాను. అయితే, నన్ను కాస్త ప్రశాంతంగా ఉండనీయండి. ఇండియాలో బాలీవుడ్ మాఫియా గ్యాంగ్ చాలా పెద్దది, ప్రమాదమైంది కూడా.. నేను నోరు విప్పితే ముంబైలో నా ప్రాణానికి ప్రమాదం ఉంది. నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మాదిరే నా ప్రాణం కూడా ప్రమాదంలో చిక్కుకుంది. ప్రస్తుతం కొందరు నన్ను కూడా చంపాలని చూస్తున్నారు.' అని ఆమె చెప్పింది.ఇంట్లో వేధింపులు తట్టుకోలేకపోతున్నానంటూ హీరోయిన్ తనుశ్రీదత్తా మొదట ఒక వీడియో విడుల చేసింది. నాలుగైదేళ్లుగా ఈ బాధను భరిస్తున్నా.. 2018లో మీటూ ఉద్యమం అప్పటినుంచి వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. నా ఇంట్లోనే నాకు భద్రత లేకుండా పోయింది అంటూ ఇన్స్టాగ్రామ్ వీడియోలో కన్నీళ్లు పెట్టుకుంది. మీటూ ఉద్యమం తర్వాతే ఈ వేధింపులు ఎక్కువయ్యాయని బయటపెట్టింది. నానాపటేకర్ ఇదంతా చేయిస్తున్నాడని ఆరోపిస్తోంది. ఎన్జీవోలో జరుగుతున్న కార్యకలాపాలను బయటపెడతానన్న భయంతో చుల్మాన్ భాయ్ (సల్మాన్ ఖాన్)కు రూ.5 కోట్లిచ్చి తనకు బ్రేకులు వేయమని చెప్పాడంది. దాంతో చుల్మాన్ ఇలా కొందరు మనుషులను పెట్టించి.. రాత్రిపూట తన ఇంటి ఎదుట ఏవేవో శబ్ధాలు చేయిస్తూ మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడని చెప్పుకొచ్చింది. సినిమాల విషయానికొస్తే 2005లో వీరభద్ర సినిమాలో బాలక్రిష్ణతో తనుశ్రీదత్తా నటించింది. అయితే, 2013లో ఆమె చివరి సినిమా బాలీవుడ్లో నటించి తర్వాత బ్రేక్ ఇచ్చింది. -
చిన్నపిల్లలు.. వాళ్లకేమైందని? మీ పిచ్చి సలహాలు..: నటి ఆగ్రహం
పిల్లల్ని ప్రేమతో చూడాలి కానీ, ఒకరు నల్లగా ఉన్నారు, ఒకరు తెల్లగా ఉన్నారు అంటూ కలర్ గురించి మాట్లాడటమేంటి? అని అసహనానికి లోనైంది బుల్లితెర నటి రుబీనా దిలైక్ (Rubina Dilaik). తనకు ఏడాదిన్నర వయసున్న కవల పిల్లలున్నారు. తమ ఇంటికి వచ్చినవారు పిల్లల రంగు గురించి మాట్లాడటం నటికి ఏమాత్రం నచ్చలేదు. నా కూతుర్లకేమైందని..దీని గురించి రుబీనా మాట్లాడుతూ.. నాకు పుట్టిన అమ్మాయిల్లో ఒకరు ఫెయిర్గా ఉంటే మరొకరు కాస్త డస్కీగా ఉంటారు. మా ఇంటికి వచ్చినవాళ్లు అదే విషయం పదేపదే ప్రస్తావిస్తున్నారు. ఒకరితో మరొకర్ని కంపేర్ చేస్తున్నారు. అది నాకస్సలు నచ్చలేదు. రంగు గురించి మాట్లాడొద్దు, నా కూతుర్లిద్దరూ అందంగా ఉన్నారని వాళ్లకు గట్టిగా ఆన్సరిచ్చేదాన్ని. ఇంకోసారి నా ఇంట్లో.. పిల్లల మధ్య పోలిక తేవొద్దని వార్నింగ్ ఇచ్చాను. మా బంధువులైతే.. పాపకు మంచి రంగు రావడం కోసం శనగపిండితో స్నానం చేయించమనేవారు. అసలు ఆ విషయం గురించి మీరు అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదని బదులిచ్చాను. చిన్నప్పటినుంచే నేర్పిస్తున్నా..నా పిల్లలకేమైందని.. వారెంతో అందంగా ఉన్నారు. అలాగే ఇద్దరికీ ఆత్మస్థైర్యంతో ఉండాలని చిన్నప్పటినుంచే నేర్పిస్తున్నాను. అర్థం చేసుకోవడానికి వారిది చాలా చిన్నవయసు కానీ, ఇప్పటినుంచి నేర్పిస్తేనే విశ్వాసంతో ముందుకు వెళ్తారు అని చెప్పుకొచ్చింది. రుబీనా- అభినవ్ 2018లో పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరూ హిందీ బిగ్బాస్ 14వ సీజన్లో పాల్గొన్నారు. రుబీనా ఈ సీజన్ ట్రోఫీ గెలిచింది. ఇకపోతే పెళ్లయిన ఐదేళ్లకు రుబీనా గర్భం దాల్చింది. 2023లో కవల కూతుర్లు ఏధ, జీవాకు జన్మనిచ్చింది.చదవండి: గుండెలు పిండేసే చిత్రం.. హిట్టయితే బాగుండు: శృతి హాసన్ -
Jamie Lever: వీడియో కాల్ ఆడిషన్.. అలా చేసి ఉంటే బుక్కయ్యేదాన్ని
పాపులర్ కమెడియన్ జానీ లివర్ కుమార్తె జామీ లివర్ బాలీవుడ్లో పలు చిత్రాల్లో నటించింది. అంతేకాకుండా టాలీవుడ్లోనూ ఆ ఒక్కటి అడక్కు అనే చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. హిందీలో 'కిస్ కిస్కో ప్యార్ కరూన్', 'హౌస్ఫుల్ 4' లాంటి చిత్రాల్లో కనిపించిన జామీ లివర్..ప్రస్తుతం స్టాండప్ కామెడీ టూర్లో పాల్గొననుంది. 'ది జామీ లివర్ షో' పేరుతో ఆగస్టు 1న యూఎస్లోని సీటెల్లో ప్రారంభించనుంది. ఆ తర్వాత దాదాపు 15 నగరాల్లో ఈ కామెడీ షో జరగనుంది. ఆగస్టు 31న బోస్టన్లో ముగియనుంది.ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన జామీ లివర్ తనకెదురైన చేదు అనుభవాన్ని పంచుకుంది. ఓ ఆడిషన్ తనకు భయానికి గురి చేసిందని తెలిపింది. తనను ఓ అంతర్జాతీయ ప్రాజెక్ట్ కోసం కొందరు సంప్రదించారని వెల్లడించింది. అయితే ఈ పాత్ర బోల్డ్గా ఉంటుందని ముందే సమాచారం ఇచ్చారని వివరించింది.ఆడిషన్లో భాగంగా తనను వీడియో కాల్ ద్వారా సంప్రదించారని జామీ లివర్ తెలిపింది. 'మీ ముందు ఓ 50 ఏళ్ల వ్యక్తిని ఊహించుకుని.. అతన్ని ఆకట్టుకోవడానికి ప్రయత్నించండి' అని అడిగారని గుర్తు చేసుకుంది. ఆ తర్వాత స్క్రిప్ట్ ప్రకారం న్యూడ్గా కనిపించాలని అవతలి వ్యక్తి తనతో అన్నారు. దీంతో తనకు అసౌకర్యంగా, అనుచితంగా అనిపించిందని జామీ లివర్ పేర్కొంది. అవతలి వ్యక్తి వీడియో ఆన్ చేయలేదని.. అప్పుడే ఆడిషన్పై తనకు డౌట్ వచ్చిందని.. వెంటనే వీడియో కాల్ కట్ చేశానని జామీ లివర్ షాకింగ్ అనుభవాన్ని పంచుకుంది.ఇదంతా ఓ స్కామ్ అని త్వరగా గ్రహించి తాను బయటపడ్డానని జామీ లివర్ భయానక అనుభవాన్ని షేర్ చేసుకుంది. ఒకవేళ నేను అలానే ఆడిషన్ చేసి ఉంటే ఇబ్బంది పడేదాన్ని.. అలాగా జరగనందుకు అదృష్టవంతురాలిగా భావిస్తున్నానని తెలిపింది. కాస్టింగ్ పేరుతో ఇలా చాలామంది మోసపోయారని జామీ లివర్ చెప్పుకొచ్చింది. నా జీవితంలో ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవడం ఇదే మొదటిసారి కావడంతో చాలా భయపడ్డానని ఆమె విచారం వ్యక్తం చేసింది. -
అప్పుడంత డబ్బు లేదు.. చెట్టు వెనకాలే చీర మార్చుకున్న హీరోయిన్
బాలీవుడ్ బడా దర్శకనిర్మాత కరణ్ జోహార్ (Karan Johar) ఒకప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్గా కెరీర్ ఆరంభించాడు. తాజాగా ఓ పాడ్కాస్ట్లో ఆనాటి సంగతులను నెమరేసుకున్నాడు. కరణ్ జోహార్ మాట్లాడుతూ.. "ఆరోజుల్లో షూటింగ్ చేయడం అంత ఈజీగా ఉండేది కాదు. ఇప్పుడున్నన్ని ప్రత్యేక విభాగాలు అప్పుడు లేవు. అసిస్టెంట్ డైరెక్టర్సే అన్నీ చూసుకోవాలి! దిల్వాలే దుల్హనియా లేజాయేంగే సినిమాకు నేను సహాయ దర్శకుడిగా పని చేశాను.అన్ని పనులు ఒక్కరే..డైలాగులు రాసి నటీనటులకు ఇవ్వడం, వారిని చూసేందుకు వచ్చిన జనాల్ని అదుపు చేయడం మా పని. కొన్నిసార్లు హీరోహీరోయిన్లకు మేకప్మ్యాన్ కూడా మేమే అవుతాం. స్విట్జర్లాండ్లో సీన్స్ షూట్ చేసేందుకు మొత్తం 21 మందిమి వెళ్లాం. అందరం ఒకే బస్లో కూర్చునేవాళ్లం. బస్లో వెళ్తుండగా ఎక్కడైనా లొకేషన్ బాగుందనిపించగానే వెంటనే దిగిపోయి షూట్ చేసేవాళ్లం. హీరోహీరోయిన్లు కూడా..సరైన వసతులు లేనిచోట హీరోయిన్ కాజోల్ (Kajol) ఓ చెట్టు వెనక్కు వెళ్లి చీర మార్చుకునేది. షారూఖ్ ఖాన్ ఎక్కడపడితే అక్కడే డ్రెస్ మార్చుకుని రెడీ అయ్యేవాడు. ఎత్తైన కొండలపై షూటింగ్ ఉందంటే అందరూ సామాన్లు పట్టుకుని పైకి నడుచుకుంటూ వెళ్లాల్సిందే! షారూఖ్, కాజోల్ కూడా కొంత సామాను పట్టుకుని నడిచేవారు. అందరం ఒక టీమ్గా ముందుకు కదిలేవాళ్లం. మాకు సాయం చేయడానికి ఎవరూ ఉండేవారు కాదు. హీరోయిన్ డ్రెస్, జ్యువెలరీ కూడా తక్కువ రేటులో తీసుకునేవాళ్లం. హీరోయిన్ జుట్టు సరిచేశాడబ్బు ఎక్కువ లేకపోయేసరికి రైల్వే స్టేషన్ బయట అతి చవకైన ఆభరణాలు కొనుక్కొచ్చేవాడిని. కానీ ఇప్పుడంతా ఎలా మారిపోయిందో చూస్తున్నారుగా.. హీరో వానిటీ వ్యాన్లో కనీసం ఎనిమిది మందైనా ఉంటున్నారు. అప్పట్లో మేనేజర్, పీఆర్ అని ఎవరూ లేరు. హీరోయిన్ వెంట ఆమె తల్లి మాత్రమే ఉండేది. ఒకసారి కాజోల్ మేకప్మ్యాన్ లేకపోయేసరికి నేనే తన జుట్టు సరి చేశా. ఆమె తల్లి ముఖానికి మేకప్ వేసింది. ఆరోజుల్లో అంతా చాలా సరదాగా ఉండేది, ఇప్పుడంతా బోరింగ్గా మారిపోయింది అని కరణ్ జోహార్ చెప్పుకొచ్చాడు.సినిమాదిల్వాలే దుల్హానియా లేజాయేంగే సినిమా విషయానికి వస్తే.. ఈ చిత్రం 1995లో రిలీజైంది. ఆదిత్య చోప్రా దర్శకత్వం వహించగా యష్ చోప్రా నిర్మించారు. షారూఖ్ ఖాన్, కాజోల్ ప్రధాన పాత్రలు పోషించగా అమ్రిష్ పురి, అనుపమ్ ఖేర్ కీలక పాత్రల్లో నటించారు. కరణ్ విషయానికి వస్తే.. ఆయన బ్యానర్లో తెరకెక్కిన ధడక్ 2 మూవీ ఆగస్టు 1న విడుదల కానుంది. ఈ చిత్రంలో సిద్దాంత్ చతుర్వేది, తృప్తి డిమ్రి హీరోహీరోయిన్లుగా నటించారు.చదవండి: సినిమాలు మానేసి క్యాబ్ డ్రైవర్గా పని చేస్తా: పుష్ప విలన్ -
బాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్.. 'సయారా' రివ్యూ
రీసెంట్ టైంలో బాలీవుడ్లో ఓ యూత్ ఫుల్ లవ్ రొమాంటిక్ మూవీ గురించి తెగ మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే ఎలాంటి అంచనాల్లేకుండా రిలీజై సెన్సేషన్ సృష్టిస్తోంది. కేవలం మూడు రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్ సొంతం చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. అదే 'సయారా'. జూలై 18న థియేటర్లలోకి వచ్చింది. పేరుకే హిందీ సినిమా అయినప్పటికీ తెలుగు ప్రేక్షకుల దృష్టిలోనూ పడిన ఈ చిత్రం ఎలా ఉంది? ఏంటనేది రివ్యూలో చూద్దాం.(ఇదీ చదవండి: ఒక రాత్రిలో జరిగే పోలీస్ థ్రిల్లర్.. 'రోంత్' తెలుగు రివ్యూ (ఓటీటీ))కథేంటి?వాణి బత్రా(అనీత్ పడ్డా) ఓ రైటర్. తన కాలేజీ సీనియర్ మహేశ్ అయ్యర్ని ప్రేమించి, ఇంట్లో వాళ్లని ఒప్పించి పెళ్లికి రెడీ అవుతుంది. కానీ చివరి నిమిషంలో అతడు తన స్వార్థం చూసుకుని ఈమెకు హ్యాండ్ ఇస్తాడు. దాదాపు ఆరు నెలల తర్వాత ఈ బాధ నుంచి కోలుకున్న వాణి.. ఓ కంపెనీలో ఉద్యోగంలో చేరుతుంది. అదేరోజు అనుకోకుండా క్రిష్ కపూర్(అహన్ పాండే)ని కలుస్తుంది. ఇతడో యువ సింగర్. గుర్తింపు కోసం ప్రయత్నిస్తుంటాడు. ఊహించని పరిస్థితుల్లో క్రిష్-వాణి కలిసి ఓ పాట కోసం పనిచేయాల్సి వస్తుంది. అలా కొన్నాళ్లకు వీళ్లిద్దరూ ప్రేమలో పడతారు. కానీ వాణి జీవితంలోకి ఆమె పాత ప్రేమికుడు మహేశ్ వస్తాడు. మరి ఇద్దరిలో వాణికి ఎవరు దగ్గరయ్యారు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?రీసెంట్ టైంలో ఏ ఇండస్ట్రీలో చూసినా సరే లవ్ బ్యాక్డ్రాప్ మూవీస్ పెద్దగా రావట్లేదు. అందరూ హారర్, యాక్షన్, పీరియాడికల్ అంటూ పాన్ ఇండియా ట్రెండ్ వెంటపడుతున్నారు. సరిగ్గా ఇలాంటి టైంలో సింపుల్ ప్రేమకథ, మనసుకు హత్తుకునే పాటలతో వచ్చిన హిందీ సినిమానే 'సయారా'. ఇప్పటివరకు చాలా ప్రేమకథలు వచ్చాయి. వాటిలో ఒకలాంటిదే ఇది కూడా. స్టోరీ పరంగా కొత్తగాం ఏం ఉండదు. చాలాసార్లు చూసేశాం అనిపిస్తుంది. కాకపోతే స్టోరీని ప్రెజెంట్ చేసిన విధానం బాగుంది.పెళ్లి బట్టలతో వాణి బత్రా.. రిజిస్టర్ ఆఫీస్కి వెళ్లిన సీన్తో సినిమా మొదలవుతుంది. కానీ బాయ్ ఫ్రెండ్ ఈమెకు హ్యాండ్ ఇస్తాడు. దీంతో కొన్నాళ్ల పాటు బాధతో ఇంటికే పరిమితమవుతుంది. అలా ఆరు నెలల తర్వాత తిరిగి బాహ్య ప్రపంచంలో అడుగుపెడుతుంది. రైటర్గా ఓ చోట జాబ్లో జాయిన్ అవుతుంది. అదే రోజు తన ఆఫీస్కి వచ్చి ఒకడ్ని కొడుతున్న సింగర్ క్రిష్ కపూర్ని ఈమె చూస్తుంది. అలా అక్కడ వీళ్లిద్దరికీ మొదలైన పరిచయం కాస్త ఎక్కడి వరకు వెళ్లింది? చివరకు ఏమైందనేదే సినిమా స్టోరీ.హిందీ ఆడియెన్స్ ఈ సినిమా చూసి తెగ ఎమోషనల్ అయిపోతున్నారు గానీ తెలుగు ప్రేక్షకులకు మాత్రం ఇది ఓకే ఓకే అనిపిస్తుంది. సెకండాఫ్లో కొన్ని సీన్స్ చూస్తుంటే ఎమోషనల్గానే అనిపిస్తాయి. మరీ ముఖ్యంగా గతం మర్చిపోయిన వాణి ముఖంలో అమాయకత్వం చూస్తే అయ్యో అనిపిస్తుంది. అలానే పాటలు కూడా దేనికవే బాగుంటాయి. మరీ సూపర్ అని చెప్పాం గానీ ఓ మంచి మూవీ చూసిన ఫీలింగ్ అయితే కలుగుతుంది.ఎవరెలా చేశారు?క్రిష్ కపూర్గా చేసిన అహన్ పాండే, వాణిగా చేసిన అనీత్ పడ్డాకి ఇదే తొలి సినిమా. కానీ అద్భుతంగా చేశారు. అదిరిపోయే కెమిస్ట్రీ పండించారు. కొన్ని క్లోజప్ షాట్స్లో హీరోయిన్ని చూస్తుంటే మనల్ని కూడా ఇలాంటి అమ్మాయి ప్రేమిస్తే బాగుండు అనిపిస్తుంది. అంతా బాగుంటుంది మరి. మిగిలిన వాళ్లు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. టెక్నికల్ విషయాలకొస్తే డైరెక్టర్ మోహిత్ సూరి.. తనకు అచ్చొచ్చిన లవ్ రొమాంటిక్ జానర్లో మరో మంచి మూవీ తీశాడు. సినిమాటోగ్రఫీ, పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాని మరింత ఎలివేట్ చేశాయి.ప్రస్తుతం ఈ సినిమా థియేటర్లలో, అది కూడా హిందీలో మాత్రమే ఉంది. ప్రేమలో ఉన్నోళ్లు, ప్రేమలో విఫలమైనోళ్లు ఈ సినిమా చూస్తే కచ్చితంగా ఎమోషనల్ అయ్యే అవకాశముంది. ఒకవేళ బిగ్ స్క్రీన్పై చూస్తే ఆసక్తి లేదంటే కొన్నాళ్లు ఆగితే నెట్ఫ్లిక్స్లోకి వస్తుంది.- చందు డొంకాన(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 26 సినిమాలు) -
తెర వెనుక గాయం.. అయినా తగ్గేదే లే
వెండితెరపై హీరోలు కావొచ్చు లేదా హీరోయిన్లు కావొచ్చు... విలన్లను, రౌడీ మూకలను రఫ్ఫాడిస్తుంటే ప్రేక్షకులకు ఆ కిక్కే వేరు. కొన్ని సన్నివేశాల కోసం ఎత్తైన ప్రదేశాల నుంచి దూకడం, వాహనాలపై నుంచి జంప్ చేయడంతో పాటు పలు రిస్కీ సన్నివేశాలకు సై అంటుంటారు కథానాయకులు. అయితేపోరాట సన్నివేశాల్లో కొందరు డూప్స్ని వాడుతుంటారు. మరికొందరైతే రియాలిటీ కోసం డూప్లను కాదని స్వయంగా వారే యాక్షన్ సన్నివేశాల్లో పాల్గొంటుంటారు.అయితే ఆపోరాట సన్నివేశాల చిత్రీకరణ అన్నది ఆషామాషీ కాదు... ఎలాంటి గాయాల బారిన పడకుండా ఫైట్ సీన్స్ పూర్తి చేయడం అనేది నటీనటులతో పాటు స్టంట్మేన్, ఫైటర్స్తో పాటు ఇతర సాంకేతిక నిపుణులందరికీ ఓ సవాల్ లాంటిదే. షూటింగ్ సమయంలో నటీనటులకు గాయాలు సాధారణమే అయినప్పటికీ, కొన్నిసార్లు అవి తీవ్రంగా కూడా ఉంటాయి. ఈ కారణంగా వైద్యుల సూచనల మేరకు కొన్ని నెలల పాటు షూటింగ్లకు దూరంగా ఉండాల్సి వస్తుంది యాక్టర్స్కి. చిన్న బ్రేక్ తర్వాత ‘అయినా తగ్గేదే లే’ అంటూ... మళ్లీ లొకేషన్లో ఫైట్స్లో విజృంభిస్తుంటారు. ఇక ఈ మధ్య కాలంలో ఇలాంటి గాయాల బారిన పడిన నటీనటుల గురించి ఓ లుక్కేద్దాం.కాలికి గాయంహీరో ప్రభాస్ వరుస పాన్ ఇండియా సినిమాలతో దూసుకెళుతున్నారు. ఆయన చేతిలో ప్రస్తుతం ‘ది రాజా సాబ్’, ‘ఫౌజి’ (ప్రచారంలో ఉన్న టైటిల్), ‘స్పిరిట్’ వంటి చిత్రాలున్నాయి. ‘సీతారామం’ మూవీ ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఫౌజి’. ఈ సినిమాలో ప్రభాస్కు జోడీగా ఇమాన్వీ ఇస్మాయిల్ నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్లో ప్రభాస్ కాలికి గాయం అయినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. 1945 నాటి బ్రిటిష్ పాలన నేపథ్యంలో సాగే ఈ చిత్రకథలో ప్రభాస్ బ్రిటిష్ ఆర్మీ సైనికుడిగా కనిపించనున్నారట.దేశభక్తి, త్యాగం ఇతివృత్తాలుగా భారతదేశ స్వాతంత్య్రపోరాటం నేపథ్యంలో ఈ స్క్రిప్ట్ని తీర్చిదిద్దారట హను. మిలటరీ ఆఫీసర్ రోల్ కావడంతో ఇందులో యాక్షన్ సీక్వెన్స్ ఎక్కువగా ఉన్నాయట. అందులో భాగంగానే డూప్ లేకుండాపోరాట సన్నివేశాలు తెరకెక్కిస్తున్న సమయంలో గత డిసెంబరులో ప్రభాస్ కాలికి గాయమైనట్లు వార్తలు వచ్చాయి. దీంతో ఆయన ఇటలీకి వెళ్లి అక్కడే వైద్య పరీక్షలు చేయించుకుని, వైద్యుల సలహా మేరకు అక్కడే విశ్రాంతి తీసుకుని, ఇండియా తిరిగొచ్చారని టాక్. ఈ చిత్రంలో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేస్తున్నారనే వార్తలు వచ్చాయి. ఇదిలా ఉంటే... ప్రభాస్ నటిస్తోన్న ‘ది రాజా సాబ్’ డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.నో డూప్...బాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన షారుక్ ఖాన్ నటిస్తున్న తాజా చిత్రం ‘కింగ్’. ఈ సినిమాకి సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. ‘పఠాన్ ’ (2023) వంటి భారీ హిట్ తర్వాత షారుక్, సిద్ధార్థ్ కాంబినేషన్లో రూపొందుతోన్న సినిమా ‘కింగ్’. ఈ మూవీలో దీపికా పదుకోన్, రాణీ ముఖర్జీ, అనిల్ కపూర్, జాకీ ష్రాఫ్లతో పాటు షారుక్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్ కీలక పాత్రలుపోషిస్తున్నారు. సిద్ధార్థ్ ఆనంద్, మమతా ఆనంద్, షారుక్ ఖాన్, గౌరీ ఖాన్ నిర్మిస్తున్నారు. ‘కింగ్’ సినిమా కోసం ముంబైలోని గోల్డెన్ టొబాకో స్టూడియోలో వేసిన అతి పెద్ద సెట్లో భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు మేకర్స్.అందులో భాగంగా ఓ యాక్షన్ సీన్ లో షారుక్ ఖాన్ గాయపడ్డారని సమాచారం. రియాలిటీ కోసం ఆ సన్నివేశంలో డూప్ లేకుండా పాల్గొన్నారట షారుఖ్. ఆ సమయంలోనే గాయపడ్డారనే వార్తలు బాలీవుడ్లో హల్చల్ చేశాయి. అంతేకాదు... కండరాల నొప్పికి సంబంధించిన అత్యవసర వైద్యం కోసం ఆయన అమెరికా వెళ్లారనే వార్తలు కూడా ఆన్ లైన్ వేదికగా చక్కర్లు కొట్టాయి. అయితే షారుక్ ఖాన్ కి గాయాలయ్యాయనే విషయంపై ఇటు ఆయన టీమ్ నుంచి కానీ, అటు ‘కింగ్’ చిత్రయూనిట్ నుంచి కానీ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇక ‘పఠాన్ ’ వంటి బ్లాక్బస్టర్ తర్వాత షారుక్, సిద్ధార్థ్ కాంబినేషన్ లో రూపొందుతోన్న ‘కింగ్’పై ఇండస్ట్రీ వర్గాల్లో భారీ అంచనాలు, ప్రేక్షకుల్లో ఫుల్ క్రేజ్ నెలకొంది.కుడిచేతికి గాయంచేతినిండా వరుస సినిమాలతో దూసుకెళుతుంటారు హీరో రవితేజ. ఆయన నటిస్తున్న 75వ చిత్రం ‘మాస్ జాతర’. భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నారు. ‘ధమాకా’ వంటి బ్లాక్బస్టర్ మూవీ తర్వాత రవితేజ–శ్రీలీల ‘మాస్ జాతర’లో రెండోసారి జోడీగా నటిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్ మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్లో కీలకమైన ఓ యాక్షన్ సన్నివేశం చిత్రీకరిస్తుండగా గత ఏడాది ఆగస్టులో రవితేజ కుడి చేతికి గాయమైంది.అయితే తన గాయం కారణంగా షూటింగ్కి బ్రేక్ పడకూడదని చిత్రీకరణలో పాల్గొన్నారట రవితేజ. కానీ, నొప్పి తీవ్రం కావడంతో హైదరాబాద్లోని ఓ ప్రముఖ ఆస్పత్రికి వెళ్లారాయన. చిన్నపాటి శస్త్ర చికిత్స చేసిన వైద్యులు ఆరు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని చె΄్పారు. ఈ గాయం నుంచి కోలుకున్నాక ఆయన తిరిగి షూటింగ్లో పాల్గొన్నారు. ‘మాస్ జాతర’ని మే 9న విడుదల చేయనున్నట్లు యూనిట్ తొలుత ప్రకటించింది. అయితే వాయిదా వేసి ఆగస్టు 27న రిలీజ్ చేయనున్నట్లు కొత్త తేదీని ప్రకటించారు మేకర్స్.వారం విశ్రాంతివైవిధ్యమైన పాత్రలు, చిత్రాలతో తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు హీరో కార్తీ. ‘ఆవారా, యుగానికి ఒక్కడు, ఊపిరి, ఖైదీ, సర్దార్’ వంటి చిత్రాలతో తెలుగులోనూ అభిమానుల్ని సంపాదించుకున్నారాయన. ‘సర్దార్ 2’ చిత్రం షూటింగ్లో ఆయన ఓ ఫైట్ సీన్ చిత్రీకరణలో గాయపడ్డారు. హీరో కార్తీ, దర్శకుడు పీఎస్ మిత్రన్ కాంబినేషన్ లో రూపొందిన ‘సర్దార్’ చిత్రం 2022లో విడుదలై బ్లాక్బస్టర్గా నిలిచింది. ఈ మూవీకి సీక్వెల్గా వీరి కాంబినేషన్ లోనే ‘సర్దార్ 2’ తెరకెక్కుతోంది.ఈ మూవీలో మాళవికా మోహనన్ , ఆషికా రంగనాథ్, రజీషా విజయన్ హీరోయిన్లుగా, ఎస్జే సూర్య విలన్ గా నటిస్తున్నారు. ఎస్. లక్ష్మణ్ కుమార్, ఇషాన్ సక్సేనా నిర్మాతలు. మైసూరులో ‘సర్దార్ 2’ షూటింగ్లో భాగంగా ఈ ఏడాది మార్చిలో కీలకమైన ఓ యాక్షన్ సీన్ తీస్తుండగా కార్తీ కాలికి గాయమైంది. దీంతో ఆయన్ని సమీపంలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లగా... పెద్ద ప్రమాదం ఏమీ లేదని.. జస్ట్ వారంపాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. దీంతో ఆ మూవీ షూటింగ్ ఆపేసి చెన్నై వెళ్లి΄ోయారు కార్తీ. విశ్రాంతి తర్వాత ‘సర్దార్ 2’ షూటింగ్ పూర్తి చేశారు.మెడకు గాయం...‘మర్డర్, ఆషిక్ బనాయా ఆప్నే, మర్డర్ 2’ వంటి చిత్రాలతో తెలుగులోనూ తనకంటూ యూత్లో మంచి ఫాలోయింగ్ని సొంతం చేసుకున్నారు బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ. హిందీలో వరుస సినిమాలు చేసిన ఆయన పవన్కల్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ‘ఓజీ’ చిత్రం ద్వారా తెలుగుకి పరిచయమవుతున్నారు. ఈ సినిమాలో ఆయన విలన్ పాత్ర చేస్తున్నారు. మరోవైపు అడివి శేష్ హీరోగా తెరకెక్కుతోన్న ‘జీ2’ (గూఢచారి 2’) చిత్రంలోనూ ఇమ్రాన్ హష్మీ ప్రధాన పాత్రపోషిస్తున్నారు. వినయ్ కుమార్ సిరిగినీడి దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్, అనీల్ సుంకర నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కోసం గత ఏడాది అక్టోబరులో హైదరాబాద్ వచ్చారు ఇమ్రాన్ . ఓ యాక్షన్ సీన్ లో భాగంగా పై నుంచి దూకుతున్న క్రమంలో ఆయన మెడకు గాయమైంది. అయితే షూటింగ్ ఆగకూడదని ప్రథమ చికిత్స అనంతరం చిత్రీకరణలో పాల్గొన్నారు ఇమ్రాన్ .ముఖానికి గాయాలుబాలీవుడ్లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగారు ప్రియాంకా చోప్రా. 2018లో అమెరికన్ సింగర్ నిక్ జోనాస్ను పెళ్లి చేసుకొని తన మకాంను హాలీవుడ్కి మార్చేశారామె. హాలీవుడ్లో సినిమాలు, వెబ్ సిరీస్లలో నటిస్తూ బిజీగా ఉన్నారు. కాగా ‘ది బ్లఫ్’ అనే హాలీవుడ్ చిత్రం షూటింగ్లో ఆమె గాయపడ్డారు. ఫ్రాంక్ ఇ. ఫ్లవర్స్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాలో ఆమె కీలక పాత్రపోషిస్తున్నారు. ఈ సినిమా కోసం గత ఏడాది జూన్ లో ఆస్ట్రేలియాలో ప్రియాంకా చోప్రాపై ఓ యాక్షన్ సన్నివేశం చిత్రీకరిస్తుండగా ప్రమాదం జరిగింది.ముఖ్యంగా ముఖంపై గాయాలు అయ్యాయి. ఆమె పెదవి, ముక్కు, మెడకు దెబ్బలు తగిలాయి. ఆ ఫొటోలను ఆమె స్వయంగా ఇన్ స్టాగ్రామ్లో షేర్ చేసి, ప్రోఫెషనల్ లైఫ్లో జరిగే ప్రమాదాలు’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఇక ప్రియాంక గాయపడటంతో వెంటనే చిత్రయూనిట్ షూటింగ్ ఆపేసి.. ఆమెను సిడ్నీలోని ఆస్పత్రికి తీసుకెళ్లింది. ఆ తర్వాత కొద్ది రోజులు విశ్రాంతి తీసుకుని తిరిగి ‘ది బ్లఫ్’ షూటింగ్లో పాల్గొన్నారు ప్రియాంక. ఇదిలా ఉంటే.. మహేశ్బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ‘ఎస్ఎస్ఎమ్బీ 29’ సినిమాలో ప్రియాంక ఓ కీలక పాత్రపోషిస్తున్న సంగతి తెలిసిందే.చేతులకు, కాళ్లకు గాయాలు... అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న చిత్రం ‘డెకాయిట్’. షానియల్ డియో దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అనురాగ్ కశ్యప్ కీలక పాత్రపోషిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ తెలుగు, హిందీ భాషల్లో ఈ సినిమా నిర్మిస్తున్నారు. పాన్ ఇండియన్ థ్రిల్లర్ మూవీగా రూపొందుతోన్న ‘డెకాయిట్’ చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా చిత్రీకరణలో భాగంగా ఒక యాక్షన్ సీక్వెన్స్ తీస్తున్న సమయంలో చిన్న ప్రమాదం చోటు చేసుకుందట. ఈ ఘటనలో అడవి శేష్, మృణాల్ ఠాకూర్ ప్రమాదవశాత్తు కింద పడటంతో చేతులకు, కాళ్లకు గాయాలయ్యాయట.అయితే చిత్రీకరణకు ఇబ్బందులు రాకూడదనే ఆలోచనతో సెట్స్లోనే ప్రథమ చికిత్స అనంతరం వారిద్దరూ షూటింగ్ను కొనసాగించి తమ సన్నివేశాలను పూర్తి చేశారని టాక్. అయితే ఈ ప్రమాదంపై చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇదిలా ఉంటే... ఈ సినిమా కోసం మదనపల్లె యాసలో డైలాగులు చెబుతున్నారు అడివి శేష్. ‘డెకాయిట్’ క్రిస్మస్ సందర్భంగా డిసెంబరు 25న విడుదల కానుంది. గాయాలను లెక్క చేయకూడదు ‘ఊహలు గుసగుసలాడే, బెంగాల్ టైగర్, సుప్రీమ్, ప్రతిరోజూ పండగే, తొలి ప్రేమ’ వంటి పలు హిట్ చిత్రాలతో ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు రాశీ ఖన్నా. ఆమె నటిస్తున్న తాజా వెబ్ సిరీస్ ‘ఫర్జీ 2’. విజయ్ సేతుపతి, షాహిద్ కపూర్ ప్రధాన పాత్రలు చేస్తున్నారు. రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహిస్తున్నారు. ‘ఫర్జీ 2’ షూటింగ్లో భాగంగా ఈ ఏడాది మేలో రాశీ ఖన్నా గాయపడ్డారు. కథ డిమాండ్ మేరకు రిస్కీ యాక్షన్ సీన్స్లో ఆమె పాల్గొనగా ప్రమాదవశాత్తు స్వల్పంగా గాయపడ్డారు.అందుకు సంబంధించిన ఫొటోలను ఆమె తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ‘‘కథ డిమాండ్ చేస్తే గాయాలను కూడా లెక్క చేయకూడదు. మన గాయాలు కూడా ఒక్కోసారి మన శరీరం, శ్వాస మీద ప్రభావం చూపవచ్చు. మనమే ఒక తుపాను అయినప్పుడు మనల్ని ఏ పిడుగు ఆపలేదు’’ అంటూపోస్ట్ చేశారు రాశీ ఖన్నా. ‘ఫర్జీ’ తొలి సిరీస్కి మంచి స్పందన రావడంతో ‘ఫర్జీ 2’ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రాశీ ఖన్నా ప్రస్తుతం తెలుగులో పవన్ కల్యాణ్తో ‘ఉస్తాద్ భగత్సింగ్’, సిద్ధు జొన్నలగడ్డతో ‘తెలుసు కదా’ వంటి సినిమాల్లో నటిస్తున్నారు. -
ఆజ్ కీ రాత్ రీమిక్స్లో..?
షారుక్ ఖాన్తో ‘డాన్: ది చేజ్ బిగిన్స్ ఎగైన్ (2006), డాన్ 2: ది కింగ్ ఈజ్ బ్యాక్’ సినిమాలను తెరకెక్కించి, హిట్స్ అందుకున్నారు దర్శకుడు ఫర్హాన్ అక్తర్. తాజాగా ఫర్హాన్ డైరెక్షన్లోనే ‘డాన్ 3’ రానుంది. అయితే ‘డాన్ 3’ చిత్రంలో షారుక్ ఖాన్ హీరోగా చేయడం లేదు. రణ్వీర్ సింగ్ హీరోగా నటించనున్నారు. హీరోయిన్గా కియారా అద్వానీని ప్రకటించారు. కానీ ఈ సినిమా ఇంకా సెట్స్పైకి రాలేదు. కాగా ఇటీవల ఓ పాపకు జన్మనిచ్చారు కియారా. దీంతో కియారా సెట్స్కు రావడం కుదరదని, ఆమె ప్లేస్లో మేకర్స్ కృతీ సనన్ను హీరోయిన్గా తీసుకున్నారనే టాక్ తెరపైకి వచ్చింది.ఓ దశలో ‘డాన్: ది చేజ్ బిగిన్స్ ఎగైన్ (2006), డాన్ 2: ది కింగ్ ఈజ్ బ్యాక్’ చిత్రాల్లో హీరోయిన్గా నటించిన ప్రియాంకా చోప్రా ‘డాన్ 3’లోనూ నటిస్తారనే టాక్ తెరపైకి వచ్చింది. కాగా ప్రస్తుతం ‘ధురంధర్’ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు రణ్వీర్ సింగ్. డిసెంబరు 5న ఈ చిత్రం రిలీజ్ డేట్ను ప్రకటించారు. దీంతో ముందుగా ఈ సినిమా షూటింగ్ను పూర్తి చేయాలనుకుంటున్నారు రణ్వీర్.ఆ విధంగా ‘డాన్ 3’ చిత్రీకరణ వాయిదా పడింది. జనవరిలో షూటింగ్ ఆరంభించాలనుకుంటున్నారు మేకర్స్. ఎలాగూ ‘డాన్ 3’ సినిమా స్టార్ట్ కావడానికి ఇంకా సమయం ఉంది కాబట్టి, ముందుగా ప్రకటించినట్లుగానే హీరోయిన్గా కియారా అద్వానీనే నటింపజేయాలనుకుంటున్నారట. ఇక ‘డాన్: ది చేజ్ బిగిన్స్ ఎగైన్’ (2006) సినిమాలో ‘ఆజ్ కీ రాత్’ పాట ఉన్న విషయం తెలిసిందే. ఈ పాపులర్ సాంగ్ను ‘డాన్ 3’లో రీమిక్స్ చేసి, ఈ స్పెషల్ సాంగ్లో కృతీ సనన్తో డ్యాన్స్ చేయిస్తే బాగుంటుందని, ఈ సాంగ్లో ప్రియాంకా చోప్రా గెస్ట్గా కనిపిస్తే బాగుంటుందని ఫర్హాన్ భావిస్తున్నారట. ఆ దిశగా కృతీతో చర్చలు జరుపుతోందట ‘డాన్ 3’ టీమ్. మరి... ‘ఆజ్ కీ రాత్’ సాంగ్లో రణ్వీర్తో కలిసి కృతీ సనన్ స్టెప్పులేస్తారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. ‘డాన్, డాన్ 2’ చిత్రాలకు సంగీతం అందించిన శంకర్–ఇషాన్–లాయ్ త్రయమే ‘డాన్ 3’కీ సంగీతం అందించనున్నారు. -
నీళ్ల కిచిడీయే ఆహారం.. మా పేదరికాన్ని చూసి వెక్కిరించేవాళ్లు
రేసుగర్రం విలన్ రవికిషన్ బాల్యంలో కటిక పేదరికం అనుభవించారు. సినిమాల మీద ఆసక్తితో రూ.500 నోటుతో ఇంటి నుంచి పారిపోయి ముంబై వచ్చారు. కెరీర్ తొలినాళ్లలో ఎన్నో కష్టాలు పడ్డ ఆయన రానురానూ తన టాలెంట్తో గుర్తింపు సంపాదించారు. భోజ్పురి, హిందీ చిత్రపరిశ్రమలో టాప్ నటుడిగా పేరు తెచ్చుకున్నారు.కటిక పేదరికంతాజాగా రవికిషన్ (Ravi Kishan) ఓ పాడ్కాస్ట్లో తన బాల్యంలోని బాధల్ని చెప్పుకొచ్చారు. నేను కటిక పేదరికం అనుభవించాను. చాలాసార్లు నా జీవితాన్ని అసహ్యించుకునేవాడిని. మా ఇంట్లో 12 మంది ఉండేవాళ్లం. కొద్దిపాటి బియ్యంతో నీళ్లలా చేసే కిచిడీని కుటుంబమంతా తినేవాళ్లం. చిన్నగదిలోనే మేమందరం పడుకునేవాళ్లం. ఒక్కోసారి ఒకరిపై మరొకరం నిద్రించేవాళ్లం.ఆరోజే అనుకున్నాపేదరికంలో ఉన్న మమ్మల్ని చూసి చాలామంది వెక్కిరించారు. నా తండ్రిని ఎవరూ హేళన చేయకూడదని, ఆ స్థాయికి నేను చేరుకోవాలని చిన్నతనంలోనే బలంగా నిశ్చయించుకున్నాను. ఈ భూమి మీదకు వచ్చామంటే ఏదో ఒకటి చేసి పోవాల్సిందే! అంతేకానీ పక్కింటివాళ్లకు కూడా తెలియకుండా అనామకులుగా చనిపోతే ఏం లాభం? కేవలం పిల్లల్ని కనడానికో, బంగ్లాలు కట్టడానికో ఈ భూమిపైకి రాలేదు కదా! మనకంటూ ఓ గుర్తింపు ఉండాలి. ఒక్కసారి మనకు పేరు వచ్చిందంటే డబ్బు దానంతటదే వస్తుందని బలంగా నమ్మాను అని చెప్పుకొచ్చారు.డబ్బు లేకపోతే..ఫిట్నెస్ గురించి మాట్లాడుతూ.. ప్రతిరోజు జిమ్కు వెళ్లండి, అంత డబ్బు లేదంటే రోడ్డుపై పరిగెత్తండి. కనీసం 3-5 కి.మీ అయినా పరిగెత్తండి, 200 పుషప్స్ చేయండి. శనగలను రాత్రంతా నానబెట్టి తెల్లారి ఆ నీళ్లను తాగండి, శనగలను తినండి. మీరు పేదవాళ్లయినప్పటికీ ఇవన్నీ చేయొచ్చు. ప్రభుత్వం ఫ్రీగా ఇచ్చే నిత్యావసర సరుకులను ఇలా వాడుకోవచ్చు. కనీసం సూర్యోదయానికి ముందు లేవడమైనా అలవాటు చేసుకోండి అని సూచించారు.సినిమాపీతాంబర్ (1992) సినిమాతో రవికిషన్ సినీప్రయాణం ఆరంభమైంది. తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో అనేక సినిమాలు చేశారు. తెలుగులో రేసుగుర్రం, కిక్ 2, హీరో, 90 ఎమ్ఎల్, డాకు మహారాజ్ చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం ఆయన నటించిన సన్ ఆఫ్ సర్దార్ 2 మూవీ వచ్చే నెలలో విడుదల కానుంది.చదవండి: మహేశ్ ఎన్నో కష్టాలు చూశాడు, అయినా పైకి మాత్రం..! -
చాహల్కు ప్రియురాలి బర్త్ డే విషెస్.. అవీ ఇంకా దారుణమంటూ ఆర్జే మహ్వశ్ పోస్ట్!
ప్రముఖ ఆర్జే మహ్వశ్ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్గా ఉంటోంది. ఎక్కడికెళ్లినా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులతో టచ్లో ఉంటోంది. ఇటీవల లండన్ వెకేషన్లో ఉన్న చిత్రాలను తన ఇన్స్టాలో పోస్ట్ చేసింది. లండన్ వీధుల్లో చక్కర్లు కొడుతూ కనిపించింది. అయితే ఈ ముద్దుగుమ్మ క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్తో డేటింగ్లో ఉందంటూ గతంలోనే వార్తలొచ్చిన సంగతి తెలిసిందే.లండన్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చాహల్తో డేటింగ్పై చర్చ మొదలైంది. అదే లోకేషన్లో చాహల్ కూడా ఫోటోలు పోస్ట్ చేయడం ఈ జంట డేటింగ్ నిజమేనని అందరూ ఫిక్సయిపోయారు. తరచుగా వీరిద్దరు పార్టీల్లో కనిపించడం ప్రేమలో మునిగి తేలుతున్నారని అర్థమవుతోంది. చాహల్ విడాకుల తర్వాత మహ్వశ్ మరింత దగ్గరవుతున్నట్లు తెలుస్తోంది. అందుకే ఐపీఎల్లోనూ పంజాబ్ మ్యాచ్ల్లో సందడి చేసింది.తాజాగా చాహల్ బర్త్ డే కావడంతో సోషల్ మీడియాలో విషెస్ తెలిపింది. జూలై 23న చాహల్ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపింది. లండన్లోని ఓ రెస్టారెంట్లో చాహల్ కూర్చున్న ఫోటోను షేర్ చేస్తూ క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది.మహ్వశ్ తన క్యాప్షన్లో.. "పుట్టినరోజు శుభాకాంక్షలు యుజీ! వయసు పెరగడం అనేది మన జీవితంలో ఒక భాగం. అలాగే జీవితంలో మిగిలిన భాగాలు మరింత దారుణంగా ఉంటాయి. అందుకే ఆల్ ది బెస్ట్" అంటూ ఫన్నీ ఎమోజీతో పోస్ట్ చేసింది. ఇప్పటికే వీరిద్దరి డేటింగ్లో ఉన్నారని టాక్ వినిపిస్తున్నప్పటికీ.. ఈ పోస్ట్తో మరింత క్లారిటీ వచ్చేసింది. ఇటీవల కపిల్ శర్మ షోకు హాజరైన చాహల్ డేటింగ్పై ఇన్డైరెక్ట్గా హింట్ ఇచ్చేశాడు. అయితే జీవితంలో మిగతావన్నీ కూడా దారుణంగా ఉంటాయని రాయడం చర్చనీయాంశంగా మారింది. చాహల్- ధనశ్రీ వర్మ విడాకులను ఉద్దేశించి చేసినట్లు అర్థమవుతోంది. కాగా.. చాహల్ ఈ ఏడాది మార్చిలో విడాకులు తీసుకున్నారు. -
మహేశ్ ఎన్నో కష్టాలు చూశాడు, అయినా పైకి మాత్రం..!
మనసుకు నచ్చినవారు దూరమైతే తట్టుకోలేం. అందులోనూ కన్నవారు ఒకరివెంట మరొకరు మనల్ని వీడి వదిలి వెళ్లిపోతే ఆ బాధను భరించలేము. కానీ, అంతకు మించిన బాధనే భరించాల్సి వచ్చింది సూపర్ స్టార్ మహేశ్బాబు (Mahesh Babu)కు! 2022 జనవరిలో మహేశ్ సోదరుడు రమేశ్ బాబు అనారోగ్యంతో కన్నుమూశారు. అదే ఏడాది సెప్టెంబర్లో తల్లి ఇందిరా దేవి, నవంబర్లో తండ్రి కృష్ణ చనిపోయారు. ఒక్క ఏడాదిలోనే ముగ్గురిని కోల్పోయి తీవ్ర బాధలో కూరుకుపోయాడు.ఎన్నో కష్టాలుఆ విషయాన్ని మహేశ్ మరదలు, ఒకప్పటి హీరోయిన్ శిల్ప శిరోద్కర్ గుర్తు చేసుకుంది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఈ ప్రపంచంలో నాకు తెలిసిన అత్యుత్తమ మానవుల్లో మహేశ్ బావ ఒకరు. ఫ్యామిలీ కోసం ధృడంగా నిలబడతాడు. కానీ, తను చాలా కష్టాలు చూశాడు. కుటుంబాన్ని (తల్లిదండ్రులు, సోదరుడు)ని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్నప్పటికీ తనను అభిమానించేవారికోసం చిరునవ్వుతో కనిపించేవాడు. మా పేరెంట్స్ను కోల్పోయినప్పుడు అక్కకు మహేశ్, నాకు నా భర్త అండగా నిలబడి ఓదార్చారు. వీళ్లిద్దరూ మాకోసం ఎంతో చేశారు అని చెప్పుకొచ్చింది.తనకు చంటిబిడ్డనయ్యానమ్రత గురించి మాట్లాడుతూ.. నమ్రత నాకంటే పెద్దది. కానీ సినిమాల్లోకి నేనే ముందు వచ్చాను, నాకే ఫస్ట్ పెళ్లయింది, నాకే ముందు పాప పుట్టింది. దీంతో అందరూ నన్నే పెద్దదాన్ని అనుకుంటారు. నాకు పెళ్లయ్యాకే నమ్రతకు మరింత క్లోజయ్యాను. మా పేరెంట్స్ చనిపోయాక నేను తనకు చంటిబిడ్డగా మారిపోయాను. తన కన్నబిడ్డల కంటే నా గురించే ఎక్కువ టెన్షన్ పడుతూ ఉంటుంది. అక్క నాపై అంత ప్రేమ చూపిస్తుంది అని శిల్ప శిరోద్కర్ చెప్పుకొచ్చింది.చదవండి: కాస్టింగ్ కౌచ్.. అసహ్యంతో ఇండస్ట్రీని వదిలేద్దామనుకున్నా -
తొలి సినిమాకే రూ.150 కోట్ల కలెక్షన్స్.. అయినా సింపుల్గా..
ఒక్క సినిమాతో సెన్సేషన్ అయింది యంగ్ బ్యూటీ అనీత్ పడ్డా (Aneet Padda). తను కథానాయికగా నటించిన తొలి చిత్రం సైయారా (Saiyaara Movie). అహాన్ పాండే (అనన్య పాండే కజిన్) హీరోగా నటించిన ఈ చిత్రానికి ప్రశంసలతో పాటు భారీ కలెక్షన్స్ కూడా వస్తున్నాయి. మోహిత్ సూరి దర్శకత్వం వహించిన ఈ మూవీ జూలై 18న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హీరోహీరోయిన్లు కొత్తవారైనప్పటికీ జనం ఈ చిత్రాన్ని అక్కున చేర్చుకున్నారు. కేవలం మౌత్టాక్తోనే ఈ మూవీ ఇప్పటివరకు రూ.153 కోట్లు రాబట్టడం విశేషం. ఈ దూకుడు చూస్తుంటే ఈ వారాంతంలో సైయారా రూ.200 కోట్ల మార్కును చేరడం ఖాయంగా కనిపిస్తోంది.వీడియో వైరల్ఇదిలా ఉంటే తాజాగా అనీత్ పడ్డా ముంబైలోని ఓ సెలూన్కు వెళ్లింది. అక్కడినుంచి బయటకు వస్తుండగా ఫోటోగ్రాఫర్లు ఆమెను కెమెరాల్లో బంధించేందుకు ప్రయత్నించారు. ఓ అభిమాని ఆమెతో సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించాడు. అయితే ముఖానికి మాస్క్ ధరించిన అనీత్.. సున్నితంగా అతడి అభ్యర్థనను తిరస్కరించింది. సైలెంట్గా తన కారెక్కి వెళ్లిపోయింది. ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది. కాగా అనీత్ పడ్డా.. గతేడాది అమెజాన్ ప్రైమ్లో రిలీజైన బిగ్ గర్ల్స్ డోంట్ క్రై వెబ్ సిరీస్లో యాక్ట్ చేసింది. సలాం వెంకీ చిత్రంలోనూ ఓ పాత్రలో మెరిసింది. View this post on Instagram A post shared by Snehkumar Zala (@sneyhzala)చదవండి: కాస్టింగ్ కౌచ్.. అసహ్యంతో ఇండస్ట్రీని వదిలేద్దామనుకున్న హీరోయిన్ -
కాస్టింగ్ కౌచ్.. అసహ్యంతో ఇండస్ట్రీని వదిలేద్దామనుకున్నా: హీరోయిన్
అవకాశాలిస్తాం.. మరి మాకేంటి? ఒకానొక దశలో ఈ మాటలు వినీవినీ విసిగిపోయానంటోంది హీరోయిన్ సుర్వీన్ చావ్లా (Surveen Chawla). కాస్టింగ్ కౌచ్ వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయానంది. అయినప్పటికీ ఇండస్ట్రీలో ధైర్యంగా నిలబడ్డానంది. సుర్వీన్ చావ్లా ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ వెబ్ సిరీస్ మండల మర్డర్స్. ఈ సిరీస్ నెట్ఫ్లిక్స్లో జూలై 25 నుంచి ప్రసారం కానుంది.అసహ్యంగా అనిపించిందిఈ సిరీస్ ప్రమోషన్స్లో సుర్వీన్ చావ్లా మాట్లాడుతూ.. ఒకానొక సమయంలో కాస్టింగ్ కౌచ్ చాలా ఎక్కువగా ఉండేది. ఏం చేయాలన్నా మాకేంటి? అని చెండాలంగా మాట్లాడేవారు. ఆ పరిస్థితుల్లో నాకు బయటకు వెళ్లాలంటే కూడా అసహ్యంగా అనిపించేది. అసలు ఇవన్నీ నాకు అవసరమా? అని తిట్టుకునేదాన్ని. యాక్టింగ్ మానేయాలన్నంత కోపం వచ్చేది. వాళ్లు అడిగినదానికి ఒప్పుకోకపోవడం వల్ల ఎన్నో అవకాశాలు చేజారాయి. చివరకు రోడ్డుమీద పడ్డట్లు అనిపించింది. వెబ్ సిరీస్లతో టాప్..ఆ రోజులు చాలా కష్టంగా గడిచాయి. నేను ఈ ఇండస్ట్రీకి వచ్చింది దీనికోసమేనా? అని నిరాశచెందేదాన్ని. నా వల్ల కాదు, సినిమాలు మానేద్దాం అనుకున్న రోజులు కూడా ఉన్నాయి అని చెప్పుకొచ్చింది. సుర్వీన్ చావ్లా.. రాజు మహారాజు అనే తెలుగు మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేసింది. హిందీలో అగ్లీ, హేట్ స్టోరీ 2 వంటి మూవీస్ చేసింది. ఓటీటీలో సేక్ర్డ్ గేమ్స్, రానా నాయుడు, క్రిమినల్ జస్టిస్: ఎ ఫ్యామిలీ మ్యాటర్ వెబ్ సిరీస్లు చేసింది.చదవండి: ధనుష్ సంచలన నిర్ణయం.. రాజకీయాల్లోకి రానున్నారా..? -
హీరోలతో సమాన అవకాశాలు మాకెక్కడివి? ఆఖరికి వాష్రూమ్కు వెళ్లాలన్నా..
హీరోలతో సమానంగా తమకు ప్రాధాన్యత దక్కడం లేదని ఎంతోమంది హీరోయిన్లు బాహాటంగానే అసంతృప్తి వెళ్లగక్కారు. తాజగా బాలీవుడ్ బ్యూటీ నుష్రత్ బరుచ (Nushrratt Bharuccha) కూడా అదే మాట అంటోంది. హీరోలను ఒకలా.. తమను మాత్రం మరోలా ట్రీట్ చేస్తారని వాపోయింది. కొన్నిసార్లు తమకు కనీస వసతులు కూడా ఉండవని పేర్కొంది.హీరోలతో సమానంగా..తాజాగా ఓ ఇంటర్వ్యూలో నుష్రత్ బరుచ మాట్లాడుతూ.. ఒక హీరో హిట్టు కొట్టగానే అతడికి కనీసం ఐదు సినిమా ఆఫర్లయినా వస్తాయి. కానీ, హీరోయిన్ పరిస్థితి అలా ఉండదు. ఎప్పుడూ పోరాటం చేస్తూనే ఉండాలి. ప్యార్ కా పంచనామా (2011) సినిమా టైం నుంచి నేను ఇదే మాట చెప్తున్నా..! ఎవరైనా సినిమాతో సక్సెస్ అందుకున్నాక ఇంకేం కోరుకుంటారు? మరిన్ని మంచి ప్రాజెక్టులు రావాలని ఎదురుచూస్తారు. హీరోలు అలా వచ్చినవాటిలో బెస్ట్ ఎంపిక చేసుకుని ముందుకు వెళ్తారు. మాకంత అదృష్టం లేదు. వారికి వచ్చినన్ని అవకాశాలు మాకు రావు.వాష్రూమ్కు వెళ్లేందుకు కూడా..అంతెందుకు? సెట్లో కూడా ఏదైనా అత్యవసరమైతే హీరో వానిటీ వ్యాన్ను ఐదు నిమిషాలు వాడుకోవచ్చా? అని అడగాల్సిన పరిస్థితి కూడా ఫేస్ చేశాను. అది కూడా సెట్లో సరైన సౌకర్యాలు లేకపోవడం వల్లే.. వాష్రూమ్ కోసం ఆ వ్యాన్లోకి వెళ్తానని అడిగేదాన్ని. అప్పుడు హీరోకు ఉన్నన్ని వసతులు, సౌకర్యాలు నాకు అందించలేదేంటని గొడవ చేయలేదు. నేను కూడా ఆ స్థాయికి వెళ్లాలని మాత్రమే బలంగా కోరుకున్నాను అని చెప్పుకొచ్చింది. నుష్రత్ చివరగా చోరీ 2 అనే హారర్ సినిమాలో నటించింది. ప్రస్తుతం ఈ మూవీ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. హిందీలో అనేక సినిమాలు చేసిన ఈ హీరోయిన్ తెలుగులో శివాజీ తాజ్మహల్ మూవీలో యాక్ట్ చేసింది.చదవండి: HHVM Review: ‘హరి హర వీరమల్లు’ మూవీ రివ్యూ -
బాల్కనీలో బుల్లెట్ ఫ్రూఫ్ కవచం.. తన కోసం కాదన్న సల్మాన్ ఖాన్!
బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ఈ ఏడాది సికందర్ మూవీతో అభిమానులను అలరించాడు. ఈ చిత్రంలో రష్మిక హీరోయిన్గా నటించగా.. బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయింది. ఇక సినిమాల సంగతి పక్కనపెడితే త్వరలోనే ప్రారంభం కానున్న బిగ్బాస్ సీజన్కు హోస్ట్గా చేయనున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం గాల్వాన్ లోయలో 2020లో భారత్–చైనా సైనికుల మధ్య జరిగిన యుద్ధం, ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంతో వస్తోన్న ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్ చిత్రంలో సల్మాన్ నటిస్తున్నారు. ఇందులో ఆర్మీ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు.అయితే సల్మాన్ ఖాన్కు పలుసార్లు బెదిరింపులు వచ్చిన సంగతి తెలిసిందే. కృష్ణ జింకను వేటాడిన కేసు తర్వాత సల్మాన్ను చంపేస్తామంటూ చాలాసార్లు బెదిరించారు. దీంతో ముంబయిలోని తన ఇంటివద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసుకున్నారు. ఇందులో భాగంగానే తాను నివాసముండే గెలాక్సీ అపార్ట్మెంట్లోని బాల్కనీలో బుల్లెట్ ఫ్రూఫ్ గాజును ఏర్పాటు చేశారు. అక్కడి నుంచే ప్రతి ఏటా రంజాన్ సందర్భంగా అభిమానులకు విషెస్ చెబుతూ ఉంటారు.అయితే తాజా ఇంటర్వ్యూలో ఆ బుల్లెట్ ఫ్రూఫ్ గాజును ఏర్పాటు చేయడంపై సల్మాన్ ఖాన్ స్పందించారు. అయితే ఇది తన వ్యక్తిగత రక్షణ కోసం కాదని.. నా అభిమానులు కొందరు బాల్కనీ పైకి ఎక్కకుండా.. వారిని తన ఇంట్లోకి రాకుండా నివారించేందుకేనని తెలిపారు. అయినప్పటికీ కొందరు ఫ్యాన్స్ బాల్కనీ పైకి ఎక్కి నిద్రిస్తున్నారని సల్మాన్ ఖాన్ వివరించారు.అయితే ఇటీవల సల్మాన్ నివాసం వెలుపల ప్రత్యక్షంగా కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వాట్సాప్ ద్వారా బెదిరింపులు కూడా వచ్చాయి. ఈ సంఘటన తర్వాత సల్మాన్ ఖాన్ బుల్లెట్ ఫ్రూఫ్ గాజును ఏర్పాటు చేయించారు. అంతే కాకుండా కారులో బాంబు పెడతామని కూడా బెదిరించారు. కొంతకాలంగా సల్మాన్ఖాన్కు గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపులు వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వారు పలుమార్లు సల్మాన్ ఇంట్లోకి చొరబడే ప్రయత్నం చేశారు. దీంతో ముంబై పోలీసులు సల్మాన్కు భద్రత కల్పించారు. -
నాది దొంగ ఏడుపు కాదు, నేనేం పిచ్చిదాన్ని కాదు.. కాపాడండి: హీరోయిన్
ఇంట్లో వేధింపులు తట్టుకోలేకపోతున్నానంటూ బోరున ఏడ్చేసింది హీరోయిన్ తనుశ్రీదత్తా. నాలుగైదేళ్లుగా ఈ బాధను భరిస్తున్నా.. 2018లో మీటూ ఉద్యమం అప్పటినుంచి వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. నా ఇంట్లోనే నాకు భద్రత లేకుండా పోయింది అంటూ ఇన్స్టాగ్రామ్ వీడియోలో కన్నీళ్లు పెట్టుకుంది. అది చూసిన అభిమానులు, నెటిజన్లు.. హీరోయిన్కు ఏమైందని కంగారుపడ్డారు. తను క్షేమంగా ఉండాలని కోరుకున్నారు.పబ్లిసిటీ స్టంటా?అయితే ఆ తర్వాత కొన్ని గంటలకే తనుశ్రీ దత్తా.. తను మామూలుగా ఉన్న వీడియోలు షేర్ చేసింది. ఇది చాలామందికి మింగుడుపడలేదు. అప్పుడే ఏడ్చింది, ఇంతలోనే మళ్లీ నార్మల్గా వీడియోలు పెడుతోంది.. తన బాధ నిజమా? లేక పబ్లిసిటీ స్టంటా? అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఒక వ్యక్తి అయితే.. నేను తనుశ్రీ మేడమ్కు అభిమానిని. కానీ, ఈసారి తననిలా చూస్తుంటే లైమ్లైట్లోకి రావడానికి ప్రయత్నిస్తున్నట్లుగా అనిపిస్తోంది. బహుశా నా ఆలోచన తప్పు కావచ్చు, కానీ చూడటానికి మాత్రం అలాగే ఉంది. మీ వీడియో చూస్తే అలాంటి అభిప్రాయమే కలుగుతోంది. నా మాటలు మిమ్మల్ని బాధపెట్టి ఉంటే క్షమించండి అని రాసుకొచ్చాడు. నాటకాలు ఆపేయ్అందుకు తనుశ్రీ స్పందిస్తూ.. అవునా? ఇప్పుడే నీ ప్రొఫైల్ చెక్ చేశా! ఈ రోజే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేశావ్.. ఈ కామెంట్ పెట్టడానికేనా? అని కౌంటర్ ఇచ్చింది. పనికిమాలిన వ్యక్తుల కోసం ఎన్నిరోజులు ఏడుస్తూ కూర్చోవాలని ప్రశ్నించింది. మరో వ్యక్తి.. మీ నాటకాలు ఆపండి. మీ డ్రామా చూసీచూసీ విసిగిపోయాం. నిజంగా మీరన్నట్లు ముంబై మీకు సురక్షితం కాకపోతే అమెరికాకు వెళ్లిపోవచ్చుగా.. తెలిసి తెలిసి ప్రాణాలను ఎందుకు ప్రమాదంలో పెట్టడం? నానా పటేకర్ మంచి మనిషి, బాలీవుడ్లో బెస్ట్ యాక్టర్. అతడి పరువు తీయడానికి ప్రయత్నించకండి. ఇకనైనా డ్రామాలు ఆపేయండి, మాకు నిజమేంటో తెలుసు. మీరెంత చేసినా బాలీవుడ్లో మీకు సినిమాలు రావు అని కామెంట్ పెట్టాడు.నానా పటేకర్, తనుశ్రీ దత్తాహీరో, నటుడు కలిసే..నెగెటివ్ కామెంట్లతో విసిగిపోయిన తనుశ్రీ దత్తా (Tanushree Dutta).. మీటూ ఉద్యమం తర్వాతే ఈ వేధింపులు ఎక్కువయ్యాయని బయటపెట్టింది. నానాపటేకర్ ఇదంతా చేయిస్తున్నాడని ఆరోపిస్తోంది. ఎన్జీవోలో జరుగుతున్న కార్యకలాపాలను బయటపెడతానన్న భయంతో చుల్మాన్ భాయ్ (సల్మాన్ ఖాన్)కు రూ.5 కోట్లిచ్చి తనకు బ్రేకులు వేయమని చెప్పాడంది. దాంతో చుల్మాన్ ఇలా కొందరు మనుషులను పెట్టించి.. రాత్రిపూట తన ఇంటి ఎదుట ఏవేవో శబ్ధాలు చేయిస్తూ మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడని చెప్పుకొచ్చింది.పిచ్చిదాన్ని కాదుమధ్యలో సల్మాన్ ఎందుకు వచ్చాడో అర్థం కాక తలపట్టుకున్న నెటిజన్లు.. ఆమెను మంచి సైకియాట్రిస్ట్ను కలవమని సలహా ఇచ్చారు. అందుకు తనుశ్రీ.. నేనేమీ పిచ్చిదాన్ని కాదు. వాళ్ల బండారం బయటపెట్టినందుకు పిచ్చిదాన్ని చేస్తారా? నాలాగా టార్చర్ ఫేస్ చేస్తున్న అందరూ ఇలాగే ఆడియో, వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెట్టండి. అప్పుడుకానీ వారి ఆటలు సాగవు అని ఘాటుగా రిప్లై ఇచ్చింది. అంతలోనే తనను వారి నుంచి కాపాడమంటూ అభ్యర్థించింది.అసలేం జరిగింది?మీటూ ఉద్యమంలో ఇండస్ట్రీలో తనకు ఎదురైన వేధింపులను బయటపెడుతూ సంచలనాలకు తెరలేపింది హీరోయిన్ తనుశ్రీ దత్తా. నానా పటేకర్ (Nana Patekar) తనను లైంగికంగా వేధించాడంటూ 2018లో మీడియా ముందుకు వచ్చింది. 2008లో 'హార్న్ ఓకే ప్లీజ్' సినిమా కోసం ఓ పాట షూట్ చేస్తున్న సమయంలో నానా పటేకర్ సహా మరో ముగ్గురు తనను వేధించారని ఆరోపించింది. చట్ట ప్రకారం మూడేళ్ల లోపు ఫిర్యాదు చేస్తేనే విచారణకు అర్హత ఉందని, పదేళ్ల నాటి ఘటనని విచారించడం కుదరదని న్యాయమూర్తి కేసు కొట్టివేశారు. కాగా హిందీలోనే ఎక్కువ సినిమాలు చేసిన తనుశ్రీ.. తెలుగులో 'వీరభద్ర' మూవీలో యాక్ట్ చేసింది. View this post on Instagram A post shared by Tanushree Dutta Miss India Universe (@iamtanushreeduttaofficial) View this post on Instagram A post shared by Tanushree Dutta Miss India Universe (@iamtanushreeduttaofficial) View this post on Instagram A post shared by Tanushree Dutta Miss India Universe (@iamtanushreeduttaofficial)చదవండి: ఛత్రపతి శివాజీ బయోపిక్ లేనట్లే.. ఇండస్ట్రీలో ఇంత దారుణమా? -
ఛత్రపతి శివాజీ బయోపిక్ లేనట్లే.. ఇండస్ట్రీలో ఇంత దారుణమా?
బయోపిక్లకు ఎప్పుడూ క్రేజ్ ఉంటుంది. అందుకు ఛావా సినిమానే నిదర్శనం. ఛత్రపతి శివాజీ తనయుడు శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు సృష్టించింది. దాదాపు రూ.140 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఛావా ప్రపంచవ్యాప్తంగా రూ.800 కోట్లకు పైగా వసూలు చేసింది. విక్కీ కౌశల్ నటప్రభంజనానికి ఫుల్ మార్కులు పడ్డాయి.బయోపిక్ లేనట్లే?అయితే ఛత్రపతి శివాజీరాజా బయోపిక్ (Chhatrapati Shivaji Biopic) కూడా వస్తోందంటూ అప్పట్లో ఓ ప్రకటన వచ్చింది. ప్రముఖ దర్శకుడు అమిత్ రాయ్.. షాహిద్ కపూర్ను శివాజీగా చూపించనున్నాడని ప్రచారం జరిగింది. ఏమైందో ఏమో కానీ ఈ మూవీ అటకెక్కిందట! ఈ విషయాన్ని దర్శకుడే స్వయంగా వెల్లడించాడు. అమిత్ రాయ్ మాట్లాడుతూ.. సిస్టమ్ చాలా దారుణంగా ఉంది. నేను డైరెక్ట్ చేసిన ఓమైగాడ్ 2 మూవీ రూ.180 కోట్లు సాధించింది. ఎలా పనిచేస్తా?అయినప్పటికీ.. నా పనితనం నిరూపించుకోవడానికి ఇది సరిపోదట! నటీనటుల ఎంపిక, ప్రొడక్షన్, మేనేజ్మెంట్.. ఇలాంటి వ్యవస్థల కింద నలుగుతూ ఒక దర్శకుడు ఎలా పని చేయగలడు? ఐదేళ్ల జీవితాన్ని ఒక కథకు అంకితం చేస్తే.. కొందరు సడన్గా వచ్చి అందులో ఇది తప్పు, అది తప్పు అని ప్రతిదానికి వంకపెడితే ఎంత బాధగా అనిపిస్తుంది అంటూ ఆ ప్రాజెక్టును పక్కనపెట్టేసినట్లు చెప్పకనే చెప్పారు. ఆయన ఇంకా మాట్లాడుతూ.. కొందరు హీరోలు కేవలం బాక్సాఫీస్ లెక్కల్నే చూస్తారు. హీరోలకు లవ్స్టోరీలే కావాలిమరికొందరు మాత్రం నిజాయితీగా కథల్ని మాత్రమే నమ్ముతారు. కానీ, చాలామంది సమాజంలోని చేదు నిజాలను కళ్లకు కట్టినట్లు చూపించే సినిమాల్లో భాగమవడానికి బదులుగా ప్రేమకథా చిత్రాలు చేయడానికే ఎక్కువ ఆసక్తి చూపిస్తారు అని చెప్పుకొచ్చాడు. అమిత్ రాయ్ ప్రస్తుతం అక్షయ్ కుమార్, పంకజ్ త్రిపాఠితో కలిసి ఓ సినిమా చేస్తున్నట్లు తెలుస్తోంది. షాహిద్ కపూర్ విషయానికి వస్తే.. ఈయన చివరగా దేవా చిత్రంతో డిజాస్టర్ అందుకున్నాడు. పూజా హెగ్డే కథానాయికగా యాక్ట్ చేసిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రాణించలేకపోయింది.చదవండి: మంచు లక్ష్మి గొప్ప మనసు.. అన్నింటికంటే ఆ దానమే -
బిగ్బాస్ కొత్త సీజన్.. సగానికి సగం పారితోషికం తగ్గించేసిన స్టార్ హీరో!
బిగ్బాస్ షో (Bigg Boss Reality Show)ను విజయవంతంగా ముందుకు నడిపించడంలో హోస్ట్దే ప్రధాన పాత్ర! కంటెస్టెంట్లను వాయించడానికి, తప్పొప్పులు చెప్పడానికి, సరిదిద్దడానికి హోస్ట్ వీకెండ్లో రెండుసార్లు వస్తూ ఉంటాడు. షో చప్పగా ఉంటే దాన్ని రంజుగా మారుస్తాడు, ఊపు మీదంటే మరింత క్రేజ్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాడు. ఎటొచ్చీ గేమ్ను ఎప్పటికప్పుడు కొత్తగా కనిపించేలా ట్రై చేస్తాడు.15 ఏళ్లుగా హోస్టింగ్అయితే సినిమాలు చేసే స్టార్లు టీవీ షోలలో హోస్ట్గా కనిపించాలంటే అంత ఈజీ కాదు. వారు అడిగిన రేంజులో డబ్బు ఇచ్చుకుంటేనే బుల్లితెరపై కనిపించడానికి సిద్ధమవుతారు. తెలుగులో మొదట జూనియర్ ఎన్టీఆర్, తర్వాత నాని బిగ్బాస్ షోకి హోస్టింగ్ చేశారు. ఆ తర్వాత అంటే మూడో సీజన్ నుంచి నాగార్జునే హోస్ట్గా వ్యవహరిస్తున్నారు. హిందీలో మొదట అర్షద్ వార్సీ, శిల్పా శెట్టి, అమితాబ్ బచ్చన్ వంటి పలువురు సెలబ్రిటీలు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. వచ్చే నెలలోనే ప్రారంభంనాలుగో సీజన్ నుంచి సల్మాన్ ఖాన్ (Salman Khan) ఈ షోను తన భుజాలపై ఎత్తుకుని నడిపిస్తున్నాడు. ఆగస్టు 30న హిందీ బిగ్బాస్ 19వ సీజన్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో సల్మాన్.. ఎంత పారితోషికం తీసుకుంటున్నాడన్న చర్చ మొదలైంది. అయితే హీరో ఈసారి తన రెమ్యునరేషన్ను భారీగా తగ్గించుకున్నాడట! కారణం గత సీజన్లతో పోలిస్తే బిగ్బాస్ 19వ సీజన్కు పెద్దగా బడ్జెట్ కేటాయించలేదని తెలుస్తోంది. పారితోషికంలో రూ.100 కోట్ల కోత!సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న కథనాల ప్రకారం సల్లూ భాయ్ వీకెండ్కు రూ.8 - 10 కోట్ల మేర పారితోషికం తీసుకునేందుకు అంగీకరించాడు. ఈ లెక్కన 15 వారాలకుగానూ రూ.120-150 కోట్లు అందుకోనున్నాడు. అయితే ఈ హీరో బిగ్బాస్ 17వ సీజన్కు రూ.200 కోట్లు, 18వ సీజన్కు ఏకంగా రూ.250 కోట్లు పుచ్చుకున్నాడు. అలాంటిదిప్పుడు సగానికి సగం అందుకోవడం కొంత ఆశ్చర్యకరమనే చెప్పుకోవాలి!ఓటీటీకే ప్రాధాన్యతబిగ్బాస్ 19వ సీజన్లో ఓటీటీకే ప్రాధాన్యతనిస్తున్నారు. హాట్స్టార్లో ఎపిసోడ్ రిలీజ్ చేసిన గంట- గంటన్నర తర్వాతే టీవీలో ప్రసారం కానుందట! అలాగే ఈ సీజన్ ఐదు నెలలు కొనసాగుతుందని, మొదటి మూడు నెలలు సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తే తర్వాత ఫరా ఖాన్, కరణ్ జోహార్, అనిల్ కపూర్ వంటి వారు చివరి రెండు నెలలు షో బాధ్యతలు అందుకోనున్నారని భోగట్టా! మరి ఇందులో ఎంతవరకు నిజముందన్నది తెలియాల్సి ఉంది.చదవండి: ఒక రాత్రిలో జరిగే పోలీస్ థ్రిల్లర్.. తెలుగు రివ్యూ (ఓటీటీ) -
నా ఇంట్లోనే నన్ను వేధిస్తున్నారు.. హీరోయిన్ ఆవేదన
ఒకప్పటి హీరోయిన్ తనుశ్రీ దత్తా మరోసారి వార్తల్లో నిలిచింది. కన్నీరుమున్నీరుగా విలపిస్తూ చాలా ఆవేదనతో ఓ వీడియోని పోస్ట్ చేసింది. తన ఇంట్లోనే తనని వేధిస్తున్నారని.. ఈ బాధ తట్టుకోలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేసింది. ప్లీజ్ ఎవరైనా వచ్చి సాయం చేయండి అంటూ అభ్యర్థించింది. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.'నా ఇంట్లోనే నన్ను వేధిస్తున్నారు. పోలీసులకు ఫోన్ చేస్తే.. స్టేషన్ కి వచ్చి కంప్లైంట్ ఇవ్వమని చెప్పారు. రేపో, ఎల్లుండో పోలీసుల దగ్గరకు వెళ్తాను. గత నాలుగైదేళ్ల నుంచి ఈ బాధ తట్టుకోలేకపోతున్నాను. నా ఇల్లంతా చిందరవందరగా అయిపోయింది. పనివాళ్లని పెట్టుకుంటే వాళ్లొచ్చి నా వస్తువుల్ని దొంగలిస్తున్నారు. నా ఇంట్లోనే నాకు భద్రత లేకుండా పోయింది. ఎవరైనా వచ్చి కాస్త నాకు సాయం చేయండి' అని ఏడుస్తూ తనుశ్రీ దత్తా వీడియో పోస్ట్ చేసింది.(ఇదీ చదవండి: పవన్ వ్యాఖ్యలు.. ట్రెండింగ్లో #BoycottHHVM)బిహార్కి చెందిన తనుశ్రీ దత్తా.. 2004లో ఫెమినా మిస్ ఇండియా యూనివర్స్ విజేతగా నిలిచింది. కానీ 'ఆషిక్ బనాయా అప్నే' పాటతో ఈమెకు చాలా గుర్తింపు వచ్చింది. తెలుగులోనూ 2005లో 'వీరభద్ర' అనే మూవీ చేసింది. తమిళంలోనూ 2010లో తీరదు విలాయాట్టు పిళ్లై అనే చిత్రంలో నటించింది. ఇవి తప్పితే 2013 వరకు హిందీలోనే పలు చిత్రాలు చేసింది. తర్వాత పూర్తిగా సినిమాలకు దూరమైంది.అయితే 2018లో మీటూ(#Metoo) ఉద్యమంలో భాగంగా ప్రముఖ నటుడు నానా పటేకర్పై సంచలన ఆరోపణలు చేసింది. తనని లైంగికంగా వేధించాడని చెప్పుకొచ్చింది. ఈ కేసులో పటేకర్కి క్లీన్ చిట్ దక్కింది. మరోవైపు దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి సైతం తనని ఓ సినిమా కోసం నగ్నంగా డ్యాన్స్ చేయమని అడిగాడని గతంలో ఆరోపణలు చేసింది. ఇప్పుడు మాత్రం తన ఇంట్లోనే తనకు వేధింపులు ఎక్కువయ్యాయని చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: మహేశ్, సుకుమార్ని ఫిదా చేసిన హిందీ సినిమా.. ఏంటి దీని స్పెషల్?) View this post on Instagram A post shared by Tanushree Dutta Miss India Universe (@iamtanushreeduttaofficial) -
టీఐఎఫ్ఎఫ్ ప్రదర్శనకి షోలే
ఈ ఏడాది సెప్టెంబరు 4 నుంచి సెప్టెంబరు 14 వరకు 50వ టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (టీఐఎఫ్ ఎఫ్) జరగనుంది. ఈ వేడుకలో ఇండియన్ కల్ట్ బ్లాక్బస్టర్ సినిమా ‘షోలే’, ‘బందర్’, ‘హోమ్ బౌండ్’ సినిమాలు ప్రదర్శితం కానున్నాయి. ధర్మేంద్ర, సంజీవ్కుమార్, అమితాబ్ బచ్చన్ , హేమ మాలిని, జయబాదురి, అమ్జాద్ ఖాన్ ప్రధాన పాత్రల్లో రమేష్ సిప్పి దర్శకత్వం వహించిన ‘షోలే’ 1975 ఆగస్టు 15న విడుదలైంది. కాగా 50వ టీఐఎఫ్ఎఫ్ ప్రారంభమయ్యే సమయానికి ‘షోలే’ విడుదలై 50 ఏళ్లు పూర్తవుతాయి. ఈ సందర్భంగా ఈ సినిమా లేటెస్ట్ 4కే వెర్షన్ ఇక్కడ ప్రదర్శితం కానుంది.అలాగే బాబీ డియోల్ హీరోగా అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘బందర్’. ‘మంకీ ఇన్ ఏ కేజ్’ అనేది క్యాప్షన్ . ఈ చిత్రంలో సాన్య మల్హోత్రా ఓ లీడ్ రోల్లో నటించారు. కొన్ని వాస్తవ ఘటనలతో రూపొందిన తమ సినిమా ఈ ఫెస్టివల్లో ప్రదర్శితం కానుందని అనురాగ్ కశ్యప్ పేర్కొన్నారు. ఇంకా ఈ ఏడాది ఫ్రాన్్సలో జరిగిన 78వ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించబడిన ‘హోమ్బౌండ్’ టీఐఎఫ్ఎఫ్లో స్క్రీనింగ్ కానుంది. ఇషాన్ కట్టర్, విశాల్ జెత్వా, జాన్వీ కపూర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాని హైదరాబాదీ దర్శకుడు నీరజ్ ఘైవాన్ తెరకెక్కించగా, కరణ్ జోహార్ నిర్మించారు. ఈ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రారంభానికి ఇంకా సమయం ఉంది కనుక.. ఈ ఫెస్టివల్లో స్క్రీనింగ్ లేదా ప్రీమియర్ కానున్న భారతీయ సినిమాల సంఖ్య పెరిగే అవకాశాలున్నాయి. -
అద్భుత పోరాటం
హృతిక్ రోషన్, కియారా అద్వానీ జంటగా నటించిన చిత్రం ‘వార్ 2’. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమా ద్వారా హీరో ఎన్టీఆర్ హిందీ చిత్ర పరిశ్రమకి పరిచయమవుతున్నారు. యశ్ రాజ్ ఫిల్మ్స్పై ఆదిత్యా చోప్రా పాన్ ఇండియా స్థాయిలో నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 14న హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదలవుతోంది. యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ ఫ్రాంచైజీలో ‘వార్ 2’ ఆరవ చిత్రంగా రాబోతోంది.ఈ సినిమా ట్రైలర్ని ఈ నెల 25న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించి, ఎన్టీఆర్–హృతిక్ రోషన్ల పోస్టర్ రిలీజ్ చేశారు. ‘‘ఇండియన్ సినీ ఇండస్ట్రీకి చెందిన ఇద్దరు గొప్ప స్టార్స్ అయిన ఎన్టీఆర్–హృతిక్ రోషన్ తమ సినీ ప్రయాణంలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నారు.ఇదొక లైఫ్ టైమ్ మూమెంట్. ఈ అరుదైన క్షణాలను మరింత గొప్పగా సెలబ్రేట్ చేసుకోవటానికి ఈ నెల 25న ‘వార్ 2’ ట్రైలర్ విడుదల చేస్తున్నాం. ఇద్దరు గొప్ప స్టార్స్ మధ్య జరిగే అద్భుత పోరాటమే ఈ సినిమా. జూలై 25ని మీ క్యాలెండర్లో ప్రత్యేకంగా మార్క్ చేసుకోండి’’ అని యశ్ రాజ్ ఫిల్మ్స్ సంస్థ పేర్కొంది. -
ఎవరైనా నన్ను పెళ్లి చేసుకుంటారా?.. చాహల్ ప్రియురాలి పోస్ట్ వైరల్!
గత కొన్ని నెలలుగా వార్తల్లో నిలుస్తోన్న బాలీవుడ్ ముద్దుగుమ్మ, ఆర్జే మహ్వశ్. ఆమె టీమిండియా క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్తో కనిపించడంతో ఒక్కసారిగా పేరు మార్మోగిపోయింది. వీరిద్దరు డేటింగ్లో ఉన్నారంటూ పలు సందర్భాల్లో వార్తలొచ్చాయి. వాటిని నిజం చేస్తూ చాహల్ ప్రాతినిధ్యం వహిస్తోన్న పంజాబ్ ఐపీఎల్ మ్యాచ్ల్లోనూ సందడి చేసింది. దీంతో వీరిద్దరు డేటింగ్లో ఉన్నది నిజమేనంటూ మరిన్ని కథనాలు వెలువడ్డాయి.తాజాగా ఇంగ్లాండ్లో ఈ జంట సందడి చేశారు. ఓకే లోకేషన్లో దిగిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. దీంతో మరోసారి మహ్వశ్-చాహల్ డేటింగ్పై వార్తలొచ్చాయి. ఇటీవల కపిల్ శర్మ షోకు హాజరైన చాహల్ సైతం ఇన్డైరెక్ట్గా హింట్ ఇచ్చేశాడు. ప్రస్తుతం లండన్లో ఉన్న ఈ ప్రేమజంట వేకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు.ఈ నేపథ్యంలోనే ఆర్జే మహ్వశ్ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్గా మారింది. ఈ నెల అంటే జూలై 31 తన పెళ్లి జరగనుందని ఓ ఛానెల్లో వార్తలొచ్చాయి. ఈ ఫోటోలు కూడా నా పెళ్లికి సంబంధించినవే. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే పెళ్లి కొడుకు పారిపోయాడు.. మరి ఇప్పుడు నన్ను ఎవరైనా పెళ్లి చేసుకుంటారా? అంటూ ఫన్నీగా పోస్ట్ చేసింది. తాజాగా తీసుకున్న ఫోటోషూట్ పిక్స్ను ఇన్స్టాలో పోస్ట్ చేస్తూ ఈ విధంగా రాసుకొచ్చింది. అయితే తన క్యాప్షన్లో జూలై 31 బదులు జూన్ 31 అని రాయడం మరింత నవ్వులు తెప్పిస్తోంది. View this post on Instagram A post shared by Mahvash (@rj.mahvash) -
గ్రాండ్గా హీరోయిన్ సీమంతం వేడుక.. వీడియో షేర్ చేసిన ముద్దుగుమ్మ!
బాలీవుడ్లో 'కభీ ఖుషీ కభీ ఘమ్' చిత్రంలో పాత్రతో గుర్తింపు తెచ్చుకున్న నటి మాల్వికా రాజ్. ఈ ముద్దుగుమ్మ ఈ ఏడాది మే నెలలో అభిమానులకు శుభవార్త చెప్పింది. తాను ప్రెగ్నెన్సీతో ఉన్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఈ విషయాన్ని తన ఇన్స్టాలో పోస్ట్ చేసింది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలిపారు.తాజాగా మాల్వికా రాజ్ సీమంతం వేడుకను గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది. తన భర్త ప్రణవ్ బగ్గాతో కలిసి ఆనందం వ్యక్తం చేసింది. తన సీమంతానికి విచ్చేసి మీ ప్రేమను పంచిన అందరికీ ధన్యవాదాలు అంటూ పోస్ట్ చేసింది హీరోయిన్. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మారిందికాగా.. 'కభీ ఖుషీ కభీ ఘమ్' చిత్రంతో ఫేమ్ తెచ్చుకున్న మాల్వికా రాజ్.. రింజిన్ డెంజోంగ్పాతో కలిసి 'స్క్వాడ్' అనే యాక్షన్ చిత్రంలో కూడా నటించింది. ఆ తర్వాత కరణ్ జోహార్ తెరకెక్కించిన 'K3G' అనే చిత్రంలో కరీనా కపూర్ ఖాన్ పాత్రను మాళవిక పోషించింది. అంతే కాకుండా ఆమె 2017లో వచ్చిన టాలీవుడ్ చిత్రం జయదేవ్లో కూడా కనిపించింది.మాల్వికా రాజ్ ప్రముఖ బాలీవుడ్ నటుడు జగదీశ్ రాజ్ మనవరాలు, బాబీ రాజ్ కుమార్తె. అంతేకాకుండా ప్రముఖ నటి అనితా రాజ్ మేనకోడలు కూడా. కాగా.. 2023లో ప్రణవ్ బగ్గాతో ప్రేమలో పడింది. కొన్నేళ్ల డేటింగ్ తర్వాత పెళ్లి బంధంలోకి అడుగుపెట్టింది. బీచ్లో జరిగిన వీరిద్దరి పెళ్లి వేడుకలో పలువురు సినీతారలు హాజరయ్యారు. View this post on Instagram A post shared by Malvika Raaj Bagga (@malvikaraaj) -
మేఘాలయ హనీమూన్ ఎపిసోడ్పై సినిమా.. అమిర్ ఖాన్ ఏమన్నారంటే?
బాలీవుడ్ హీరో అమిర్ ఖాన్ ఇటీవలే సితారే జమీన్ పర్ మూవీతో ప్రేక్షకులను అలరించారు. గతనెలలో థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. గతంలో విడుదలై హిట్గా నిలిచిన సినిమాకు సీక్వెల్గా ఈ చిత్రాన్ని రూపొందించారు. ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్ను ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పటివరకు మరో ఎలాంటి కొత్త ప్రాజెక్ట్ను అమిర్ ఖాన్ ప్రకటించలేదు.అయితే ఇటీవల మేఘాలయలో సోనమ్ హనీమూన్ ఎపిసోడ్ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఉదంతంపై అమిర్ ఖాన్ సినిమా చేయనున్నారని బాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. ఎప్పటికప్పుడు ఈ కేసు గురించి అన్ని వివరాలు అమిర్ సేకరిస్తున్నారని బీటౌన్లో వైరలవుతోంది. ఈ సినిమాపై తన సన్నిహితులతో చర్చిస్తున్నారని.. తన ప్రొడక్షన్లోనే ఈ కేసుపై సినిమా తీసే అవకాశం ఉందన్న వార్త హాట్టాపిక్గా మారింది.అమిర్ ఖాన్ రియాక్షన్..ఈ నేపథ్యంలోనే తనపై వస్తున్న వార్తలపై అమిర్ ఖాన్ స్పందించారు. మేఘాలయ హనీమూన్ హత్య కేసుపై సినిమాను రూపొందిస్తున్నట్లు వస్తున్న వార్తలను అమీర్ ఖాన్ కొట్టిపారేశారు. తనపై వస్తున్న కథనాల్లో ఎలాంటి వాస్తవం లేదన్నారు. ఇలాంటి రూమర్స్ ఎలాంటి వాస్తవ ఆధారం లేకుండానే వస్తాయని.. దీనివల్ల అభిమానులు అనవసరమైన గందరగోళానికి గురవుతారని అమిర్ ఖాన్ అన్నారు. ఇలాంటి ప్రాజెక్ట్లో తాను నటించబోనని స్పష్టం చేశారు. ఈ కథనాలు ఎక్కడ, ఎలా మొదలవుతాయే నిజంగా తనకు తెలియదన్నారు.మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసురాజా రఘువంశీ అనే యువకుడితో మే 11న సోనమ్ పెళ్లి జరిగింది. అదే నెల 20న నవదంపతులు హనీమూన్ (Meghalaya Honeymoon Murder Case) కోసం మేఘాలయ వెళ్లారు. కేవలం వెళ్లడానికే తప్ప తిరిగి రావడానికి టికెట్లు బుక్ చేసుకోలేదు. మే 23న దంపతులు స్కూటీపై ఓ టూరిస్ట్ స్పాట్ చూసేందుకు వెళ్లారు. తర్వాత కనిపించకుండా పోయారు. అదృశ్యమైన 11 రోజుల తర్వాత (జూన్ 2న) రఘువంశీ మృతదేహం లభ్యమైంది. అతడి శరీరంపై తీవ్ర గాయాలున్నాయి. అతడిని దగ్గరుండి చంపించింది మరెవరో కాదు భార్య సోనమ్. సోనమ్కు రాజాతో పెళ్లి ఇష్టం లేదు. కారణం.. అప్పటికే ఆమె రాజ్ కుష్వాహను ప్రేమిస్తోంది. ఇంట్లోవాళ్లు ఈ ప్రేమకు ఒప్పుకోలేదు. -
సన్నగా ఉన్నావు.. ఆ పాత్రకు పనికిరావు అనేవారు: బాలీవుడ్ నటి
బాలీవుడ్ నటి వాణికపూర్ ప్రస్తుతం క్రేజీ వెబ్ సిరీస్తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన థ్రిల్లర్ వెబ్ సిరీస్ మండల మర్డర్స్. ఈ సిరీస్ నెట్ఫ్లిక్స్ వేదికగా ఈనెల 25 నుంచి సందడి చేయనుంది. ఈ సిరీస్లో వాణీకపూర్ పోలీస్ ఆఫీసర్గా కనిపించనుంది. వైభవ్ రాజ్ గుప్తా, సుర్వీన్ చావ్లా కీలక పాత్రలు పోషిస్తున్నారు. కొన్ని శతాబ్దాల కిందట చరణ్దాస్పూర్లో జరిగిన హత్యల నేపథ్యంలో ఈ సిరీస్ను తెరకెక్కించారు. ఈ వెబ్ సిరీస్కు గోపి పుత్రన్ దర్శకత్వం వహించగా.. యశ్రాజ్ ఫిల్మ్స్ బ్యానర్లో నిర్మించారు.తాజాగా ఈ సిరీస్ ప్రమోషన్లతో బిజీగా వాణి కపూర్ కెరీర్ ప్రారంభంలో తనకెదురైన చేదు అనుభవాన్ని పంచుకుంది. కెరీర్ తొలినాళ్లలో ఎదురైన సవాళ్లను ప్రస్తావించింది. తాను కూడా బాడీ షేమింగ్కు గురైనట్లు వెల్లడించింది. తన స్కిన్ టోన్ కారణంగా ఓ సినిమాలో పాత్రకు రిజెక్ట్ చేశారని తెలిపింది. తాను చాలా సన్నగా ఉండటం వల్ల తరచుగా బాడీ షేమింగ్కు గురయ్యానని పేర్కొంది.తాజా ఇంటర్వ్యూలో వాణి కపూర్ మాట్లాడుతూ.. 'కెరీర్ మొదట్లో తనను రిజెక్ట్ చేయడం.. తన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసింది. ఒక చిత్రనిర్మాత ఒకసారి నేను పాత్రకు న్యాయం చేయలేదని అన్నారు. తనను 'మిల్కీ వైట్'ని కాదని అన్నారు. ఆ విషయాన్ని తాను నేరుగా కాకపోయినా.. ఇతరుల ద్వారా తెలుసుకున్నా. తనపై ఎలాంటి కామెంట్స్ చేసినా తన గుర్తింపు, సామర్థ్యాలపై తనకు పూర్తిగా నమ్మకముంది. తాను సన్నగా ఉన్నానని.. బరువు పెరగాలని కొందరు సలహాలు ఇచ్చారు. కానీ నేనేంటో నాకు తెలుసు. నాలా ఉండటమే నాకిష్టం' అంటూ బాలీవుడ్ భామ చెప్పుకొచ్చింది. కాగా.. మండల మర్డర్స్ సిరీస్లో సుర్వీన్ చావ్లా, వైభవ్ రాజ్ గుప్తా, శ్రియా పిల్గావ్కర్, జమీల్ ఖాన్ కూడా కీలక పాత్రల్లో నటించారు. -
మహేశ్, సుకుమార్ని ఫిదా చేసిన సినిమా.. ఏంటి దీని స్పెషల్?
బాలీవుడ్ అనగానే చాలామందికి రొమాంటిక్ ఫీల్ గుడ్ మూవీస్ గుర్తొచ్చేవి. కానీ గత కొన్నేళ్లలో చూసుకుంటే ఆ తరహా సినిమాలు తగ్గిపోయాయని చెప్పొచ్చు. అప్పట్ల 'ఆషికి 2' ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇన్నాళ్లకు మళ్లీ అదే మూవీ తీసిన డైరెక్టర్ మోహిత్ సూరి నుంచి 'సయారా' అనే మూవీ వచ్చింది. గత వీకెండ్లో థియేటర్లలో రిలీజైంది. నార్త్ యువత అంతా తెగ ఫీలైపోతున్నారు.(ఇదీ చదవండి: వృత్తిపరంగా ఇబ్బందుల్లో ఉన్నా.. యాంకర్ రష్మీ పోస్ట్)అంతెందుకు మన స్టార్ హీరో మహేశ్ బాబు, 'పుష్ప 2' డైరెక్టర్ సుకుమార్ కూడా ఈ సినిమా చూసి ఫిదా అయిపోయారు. ఎంత నచ్చిందో ఏమోగానీ మహేశ్ ట్వీట్ చేయగా.. సుక్కు తన ఇన్ స్టా స్టోరీలో సినిమా అదిరిపోయిందని పోస్ట్ చేశాడు. మరి సినిమా అంత బాగుందా? ఇంతకీ మూవీ కథేంటి? అనేది ఇప్పుడు చూద్దాం.'సయారా' విషయానికొస్తే.. ప్రేమలో విఫలమైన హీరోయిన్(అనీత్ పడ్డా) ఓ రైటర్. అయితే ఓ అప్ కమింగ్ సింగర్(అహన్ పాండే)ని ప్రేమిస్తుంది. వీళ్లిద్దరి ప్రేమకు దేవుడు పెద్ద అవాంతరం కలిగిస్తాడు. హీరోయిన్కి అల్జీమర్స్ వ్యాధి వచ్చి ప్రతిదీ మర్చిపోతూ ఉంటుంది. అలాంటి టైంలో హీరోయిన్ పాత ప్రేమికుడు తిరిగొచ్చి ఆమెని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. మరోవైపు కెరీర్లో ఎదగడానికి ఎంతో ప్రయత్నిస్తున్న హీరో.. కెరీర్ని కావాలనుకున్నాడా? ప్రేమని కోరుకున్నాడా? అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: వరలక్ష్మికి ఖరీదైన కారు గిఫ్ట్ ఇచ్చిన భర్త.. రేటు ఎంతంటే?)అరే ఈ స్టోరీ లైన్ చూడగానే ఏదో తెలుగు సినిమా గుర్తొస్తుందే అనిపించిందా? అవును మీరు అనుకున్నది నిజమే. స్వయానా ఈ మూవీ తీసిన మోహిత్ సూరి 'ఆషికి 2' ఛాయలతో పాటు తెలుగు సినిమాలైన 'పడిపడి లేచే మనసు', 'అర్జున్ రెడ్డి' ఛాయలు కూడా గట్టిగానే కనిపిస్తాయి. మన ఆడియెన్స్ 'బేబి' రిలీజైనప్పుడు ఎంతలా ఫీలయ్యారో.. ఇప్పుడు నార్త్ ఆడియెన్స్ కూడా అలానే తెగ ఎమోషనల్ అయిపోతున్నారని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది.ప్రస్తుతానికైతే బాలీవుడ్లో 'సయారా' కాస్త గట్టిగానే సౌండ్ చేస్తోంది. ఇక్కడ చెప్పుకోదగ్గ విశేషం ఏంటంటే హీరోహీరోయిన్ ఇద్దరు కొత్తోళ్లే. అహన్ పాండే.. హీరోయిన్ అనన్య పాండేకి అన్నయ్య. అంటే పెదనాన్న కొడుకు. ఇతడు చూడటానికి అందంగా, ఫ్రెష్గా ఉన్నాడు. యాక్టింగ్ కూడా బాగానే చేశాడు. హీరోయిన్ అనీత్ పడ్డా కూడా గ్లామరస్గా భలే ఉంది. మోహిత్ సూరి ఎప్పటిలానే తనకు అచ్చొచ్చిన లవ్ రొమాంటిక్ జానర్ కథతో అదరగొట్టేశాడు. దానికి తోడు హిందీ ఇండస్ట్రీలోని డ్రై పీరియడ్ కూడా దీనికి కాస్త గట్టిగానే కలిసొచ్చిందని చెప్పొచ్చు. ఈ మూవీకి ఐదుగురు మ్యూజిక్ డైరెక్టర్స్ ఐదు పాటలు ఇచ్చారు. అవన్నీ కూడా సూపర్ హిట్ అయ్యాయి. అది ఇంకో ప్లస్. అలా అన్ని ప్లస్సులు కలిసి 'సయారా'ని సూపర్ హిట్ చేసినట్లు కనిపిస్తోంది.(ఇదీ చదవండి: తల్లి సమాధి దగ్గర మంచు లక్ష్మి.. వీడియో) -
ప్రతి రోజు రాత్రి నా భార్య కాళ్లు మొక్కిన తర్వాతే నిద్రపోతా: నటుడు
పేరుకే ఆడమగ సమానం అని చెప్పినప్పటికీ, సమాజంలో చాలా చోట్ల ఇప్పటికీ పురుషాధిక్యత కొనసాగుతోంది. కొన్ని పనులు, ముఖ్యంగా గృహసంబంధిత బాధ్యతలు, సంతాన సంరక్షణ వంటివి స్త్రీలు మాత్రమే చేయాలనే సాంప్రదాయ ఆలోచనలు ఇంకా బలంగా ఉన్నాయి. సంప్రదాయం పేరుతో వారిని అణచివేసే కార్యక్రమాలు చాలా జరుగుతూనే ఉన్నాయి. కానీ ఒక నటుడు మాత్రం స్త్రీలను గౌరవించాలని మాటలు మాత్రమే చెప్పకుండా చేతల్లో చేసి చూపిస్తున్నాడు. ప్రతి రోజు రాత్రి తన సతీమణి పాదాలకు నమస్కరించిన తర్వాతే నిద్ర పోతాడట. తన కష్టసమయాల్లో తోడుగా నిలిచిన సతీమణికి ఇలా పాదాభివందనం చేసి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని గర్వంగా చెబుతున్నాడు. ఆ నటుడు మరెవరో కాదు..‘రేసుగుర్రం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన రవి కిషన్(Ravi Kishan). తాజాగా ఆయన ఓ సినిమా ప్రమోషన్ కోసం ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా హోస్ట్ కపిల్ శర్మ ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు. ‘రవి ప్రతి రోజు రాత్రి నిద్రపోయే ముందు భార్య ప్రీతి కిషన్ పాదాలను నమస్కారం చేస్తాడు’ అని చెప్పగా.. దీనికి రవి నవ్వుతూ అంగీకరించాడు.‘మీరు చెప్పింది నిజమే. ప్రతి రోజు రాత్రి నా భార్య పాదాలకు నమస్కారం చేస్తా. ఆమెకు ఇలా చేయడం నచ్చదు. అందుకే నిద్రపోయిన తర్వాత ఆమె పాదాలను తాకుతా. నా జీవితం అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు నా భార్య ఎంతగానే అండగా నిలిచింది. డబ్బు, పలుకుబడి లేనప్పుడు కూడా నా పక్కనే నిలబడింది. ఇప్పుడు నేను ఈ స్థానంలో ఉన్నానంటే కారణం నా భార్య మాత్రమే. అంత చేసిన ఆమెకు నేను ఏం ఇచ్చి రుణం తీర్చుకోగలను. అందుకే కనీసం పాదాలను తాయి అయినా కృతజ్ఞతతలు తెలపాలనుకున్నా’ అని రవి కిషన్ ఎమోషనల్ అయ్యాడు. రవి కిషన్ ఈ విషయాన్ని బహిరంగంగా చెప్పడం, ఆమె పట్ల చూపే గౌరవాన్ని చాటడం అందరినీ ఆకట్టుకుంది.కాగా, రవి, ప్రీతిల వివాహం 1993లో జరిగింది. వీరికి నలుగురు సంతానం. ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు రాజకీయంగానే దూసుకెళ్తున్నాడు. గతేడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లో గోరఖ్పూర్ నుంచి ఎంపీగా గెలుపొందారు. రేసుగుర్రం సినిమాలో విలన్గా నటించి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయయ్యాడు. బాలకృష్ణ నటించిన డాకు మహరాజ్ సినిమాలోనూ కీలక పాత్ర పోషించాడు. -
OTT: ‘ది హంట్: రాజీవ్ గాంధీ అసాసినేషన్ కేస్’ రివ్యూ
వెబ్సిరీస్: ది హంట్: రాజీవ్ గాంధీ అసాసినేషన్ కేస్నటీనటులు: అమిత్ సియాల్, షాహిల్ వేద్, భగవతి పెరుమాళ్, గిరిష్ శర్మ, దానిష్ ఇక్బాల్, విద్యుత్ గార్గి తదితరులుదర్శకత్వం: నగేష్ కుకునూర్ఓటీటీ వేదిక: సోనీలివ్(7 ఎపిసోడ్స్)ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో ‘ది హంట్–ది రాజీవ్ గాంధీ అసాసినేషన్ కేస్’ ఒకటి. ఈ సిరీస్ గురించి తెలుసుకుందాం. ఎన్నో సంచలన ఘటనలకు సజీవ సాక్ష్యం చరిత్ర. కానీ సామాన్యులకు చరిత్ర ద్వారా ఆ ఘటనల గురించి తెలిసేది గోరంతే... తెలియాల్సింది కొండంత. అయితే ఇప్పుడు జరిగిపోయిన సంచలన ఘటనలను విశ్లేషించి వాటికో సజీవ రూపాన్ని అందించే ప్రయత్నం ఓటీటీ సిరీస్ రూపంలో జరుగుతోంది. సాధారణంగా ఏదైనా ఘటన అంటే అది ఎలా జరిగింది? ఎప్పుడు జరిగింది? అన్న ఉత్సుకత ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అటువంటి ఉత్సుకతను దృష్టిలో పెట్టుకునే ఓటీటీ నిర్మాతలు జరిగిపోయిన సంచలనాత్మక ఘటనలపై దృష్టి సారిస్తున్నారు. ఆ నేపథ్యంలోనే ఇటీవల సోనీ లివ్ ఓటీటీ వేదికగా స్ట్రీమ్ అవుతున్న సిరీస్ ‘ది హంట్–ది రాజీవ్ గాంధీ అసాసినేషన్ కేస్’ బాగా ప్రేక్షకాదరణ పొందుతోంది. మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీని చెన్నై నగరంలోని పెరుంబుదూర్ ప్రాంతంలోని ఓ మీటింగ్లో ఎల్టీటీఈ తీవ్రవాదులు మానవబాంబుతో అతి కిరాతకంగా చంపడం మనందరికీ తెలుసు. అయితే ఆ చంపిన తీవ్రవాదులను సరిగ్గా 90 రోజుల్లోనే మన ఇంటెలిజెన్స్ బృందం మట్టుబెట్టింది. ఈ ఆపరేషన్ ఇంత త్వరగా ఆ సంస్థ ఎలా చేసింది? అనేది 7 ఎపిసోడ్లలో అద్భుతంగా చిత్రీకరించారు. మొదటి ఎపిసోడ్లో జరిగిన ఘటనను చూపించి ఆ తదనంతర విచారణను చాలా స్పష్టంగా తీశారు దర్శకుడు. ఇటువంటి ఘటనలను తెరకెక్కించడంలో సిద్ధహస్తుడైన నగేశ్ కుకునూర్ ఈ సిరీస్కు దర్శకత్వం వహించారు. ఇంట్లో ఏదైనా రహస్యం ఉంటేనే మనం దానిని కనుక్కోవాలని విపరీతంగా ఉబలాటపడతాం. అలాంటిది మన దేశ ప్రధాని హత్య వెనుక రహస్యాన్ని చూడడం ఇంకెంత ఆసక్తి రేపుతుందో చెప్పనక్కరలేదు. ఈ 7 ఎపిసోడ్ల సిరీస్ తెలుగు భాషలో కూడా లభ్యమవుతోంది. మస్ట్ వాచ్ సిరీస్. – హరికృష్ణ ఇంటూరు -
మేఘాలయ హనీమూన్ కేసుపై సినిమా ప్లాన్ చేస్తున్న హీరో!
పెళ్లంటే ఆషామాషీయా? బోలెడంత ఖర్చు, కట్నకానుకలు, విందుభోజనాలు.. అబ్బో ఇలా చాలానే ఉంటాయి. భాగస్వామితో భవిష్యత్తును ఊహించుకుంటూ గాల్లో తేలిపోతుంటారు వధూవరులు. కానీ ఈ మధ్య పెళ్లి పేరెత్తితే సంతోషం కన్నా భయం, అనుమానాలే ఎక్కువవుతున్నాయి. నిండు నూరేళ్లు కాదు కదా నెల తిరిగేలోపే జీవిత భాగస్వామి ప్రాణాలను గాల్లో కలిపేస్తున్నారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్ మర్డర్ అందుకు నిలువెత్తు ఉదాహరణ! హత్యోదంతంపై సినిమాఈ హత్య ఉదంతంపై సినిమా రానుందని తెలుస్తోంది. బీటౌన్లో చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం.. ఆమిర్ ఖాన్ (Aamir Khan).. మేఘాలయ హనీమూన్ కేసుపై ప్రత్యేక దృష్టి సారించాడట! ఎప్పటికప్పుడు ఈ కేసు గురించి అన్ని వివరాలు అడిగి తెలుసుకుంటున్నాడట! తన సన్నిహితులతో చర్చిస్తున్నాడట! తన ప్రొడక్షన్లోనే ఈ కేసుపై సినిమా తీసే అవకాశం ఉందని తెలుస్తోంది. మరి ఇదెంతవరకు నిజమన్నది తెలియాల్సి ఉంది.మేఘాలయ హనీమూన్ మర్డర్ కథేంటి?రాజా రఘువంశీ అనే యువకుడితో మే 11న సోనమ్ పెళ్లి జరిగింది. అదే నెల 20న నవదంపతులు హనీమూన్ (Meghalaya Honeymoon Murder Case) కోసం మేఘాలయ వెళ్లారు. కేవలం వెళ్లడానికే తప్ప తిరిగి రావడానికి టికెట్లు బుక్ చేసుకోలేదు. మే 23న దంపతులు స్కూటీపై ఓ టూరిస్ట్ స్పాట్ చూసేందుకు వెళ్లారు. తర్వాత కనిపించకుండా పోయారు. అదృశ్యమైన 11 రోజుల తర్వాత (జూన్ 2న) రఘువంశీ మృతదేహం లభ్యమైంది. అతడి శరీరంపై తీవ్ర గాయాలున్నాయి. అతడిని దగ్గరుండి చంపించింది మరెవరో కాదు భార్య సోనమ్. సోనమ్కు రాజాతో పెళ్లి ఇష్టం లేదు. కారణం.. అప్పటికే ఆమె రాజ్ కుష్వాహను ప్రేమిస్తోంది. ఇంట్లోవాళ్లు ఈ ప్రేమకు ఒప్పుకోలేదు. బలవంతంగా పెళ్లితమ వర్గానికి చెందిన వ్యక్తినే పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చారు. బలవంతంగా పెళ్లి చేస్తే తర్వాత దారుణ పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుందని సోనమ్ బెదిరించినా పేరెంట్స్ లెక్కచేయలేదు. రాజా రఘువంశీతో ఘనంగా పెళ్లి జరిపించారు. వివాహమైన మూడు రోజులకే సోనమ్.. ప్రియుడితో కలిసి భర్త హత్యకు స్కెచ్ వేసింది. మేఘాలయలో దాన్ని ఆచరణలో పెట్టింది. కాంట్రాక్ట్ కిల్లర్స్ను మాట్లాడి భర్తను చంపించి, దొంగతనం జరిగినట్లుగా చిత్రీకరించింది. అనుమానం రాకుండా ఉండటం కోసం.. ఏడు జన్మలవరకు మనం ఇలాగే కలిసుండాలి అంటూ రాజా ఫేస్బుక్ అకౌంట్లో తనే స్వయంగా పోస్ట్ పెట్టింది.భర్త అంత్యక్రియల్లో ప్రియుడుఅక్కడి నుంచి ఇండోర్కు పారిపోయింది. తనను కిడ్నాప్ చేసినట్లు నాటకం ఆడాలనుకుంది. కానీ పోలీసులు సోనమ్ను అనుమానించడంతో ఆమె లొంగిపోయింది. ఆమె చాట్స్ చూడగా ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిందని తేలిపోయింది. అయితే రాజ్ కుష్వాహ ఏమీ తెలియనట్లుగా రాజా రఘువంశీ అంత్యక్రియలకు వెళ్లి అతడి తండ్రిని ఓదార్చాడు. హత్యలో తన ప్రమేయం ఉందన్న విషయం బయటపడకుండా ఉండేందుకే అలా నటించాడు. పోలీసులు సోనమ్, రాజ్ కుష్వాహతో పాటు సుపారీ గ్యాంగ్ను సైతం అరెస్టు చేశారు.చదవండి: షాపింగ్మాల్లో ఈ నటి గుర్తుందా? ఇప్పుడేం చేస్తోందంటే? -
అంద విహీనంగా మారిపోయిన నటి ముఖం
తెరపై కనిపించే నటీనటులు చాలామంది చిన్న చిన్న సర్జరీలు చేయించుకుంటారు. కాకపోతే ఆ విషయాన్ని చెప్పుకొనేందుకు పెద్దగా ఇష్టపడరు. కొన్ని సందర్భాల్లో మాత్రం వాటి గురించి చెబుతుంటారు. తాజాగా బాలీవుడ్కి చెందిన ఉర్ఫి జావేద్ ముఖం కూడా ఇంతలా ఉబ్బిపోయింది. పెదాలు ఎర్రగా కందిపోయి కనిపించింది. దీంతో ఈమెకి ఏమైంది? ఎందుకిలా మారిపోయిందా అని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు.దాదాపు తొమ్మిదేళ్ల క్రితం ఉర్ఫి జావేద్ లిప్ ఫిల్లర్స్ కోసం ప్రయత్నించింది. అయితే అప్పుడు అది వికటించడంతో పెదవుల రూపు మారిపోయి కాస్త ఉబ్బిపోయి కనిపించాయి. ఇప్పటికి అవి సెట్ అయ్యాయని ఉర్ఫి చెప్పుకొచ్చింది. లిప్ ఫిల్లర్స్ విషయంలో తాను కృత్రిమ పద్ధతిని ఉపయోగించి తప్పు చేశానని, అప్పుడు తన రూపు చూసుకుని తాను ఎంతగానో నవ్వుకున్నానని చివరకు తన పరిస్థితి చాలా దారుణంగా తయారైందని చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: కొందరు హీరోల కంటే నేను చాలా తక్కువ: పవన్ కల్యాణ్)ఇన్నాళ్లకు సదరు లిప్ ఫిల్లర్లని కరిగించుకున్నానని ఉర్ఫి చెప్పింది. అయితే ఎవరూ కూడా తనలా ఈ తప్పు చేయొద్దని, ఒకవేళ లిప్ ఫిల్లింగ్ చేయాలనుకుంటే కచ్చితంగా అనుభవం ఉండే డాక్టర్ దగ్గరకు మాత్రమే వెళ్లాలని చెబుతూ సలహా ఇచ్చింది. ప్రస్తుతం ఉర్ఫికి సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిలో పెదలు ఉబ్బిపోయి, ముఖంతా ఎర్రగా మారిపోయి కనిపించింది.ఉర్ఫి కెరీర్ విషయానికొస్తే.. హిందీ బిగ్బాస్ షోలో పాల్గొని గుర్తింపు తెచ్చుకుంది. ఇది కాకుండా ఎప్పటికప్పుడు విచిత్రమైన కాస్ట్యూమ్స్ ధరిస్తూ, ఆ వీడియోలతో సోషల్ మీడియాలో హల్చల్ చేసేది. రీసెంట్ టైంలో ఒకటి రెండు ఓటీటీ రియాలిటీ షోల్లోనూ కనిపించింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 26 సినిమాలు)Uorfi Javed dissolves lip fillers after years, shares painful, swollen aftermath in new video😱😳📸: @urf7i #urfijaved #lipfillersdissolving #painful #buzzzookascrolls pic.twitter.com/0H6QYsdP0l— Buzzzooka Scrolls (@Buzzz_scrolls) July 21, 2025 -
ఏయ్ బాబూ, ఫోన్ తీయ్.. హీరో వార్నింగ్.. వీడియో వైరల్
బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ (Akshay Kumar)కు కోపమొచ్చింది. అభిమాని చేసిన ఓ దుందుడుకు చర్యకు తిక్కరేగింది. కోపం అణుచుకోలేక వెంటనే తన అభిమానికి వార్నింగ్ కూడా ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది. ఇంతకీ ఏం జరిగిందంటే అక్షయ్ కుమార్ లండన్ వీధుల్లో హాయిగా నడుచుకుంటూ వెళ్తున్నాడు. తనపాటికి తను ప్రశాంతంగా వెళ్తుంటే ఓ అభిమాని అతడిని వెంబడించాడు. అక్షయ్కు కోపమొచ్చిందిహీరో అనుమతి తీసుకోకుండా అక్షయ్ను వీడియో తీశాడు. ఇది గమనించిన అక్షయ్ కుమార్కు కోపమొచ్చింది. వెంటనే అభిమానివైపు నడుచుకుంటూ వచ్చి వీడియో ఎందుకు తీస్తున్నావని తిట్టాడు. వెంటనే కెమెరా ఆఫ్ చేయమంటూ బెదిరించాడు. అభిమాని ఫోన్ లాక్కునేందుకు ప్రయత్నించాడు. ఇదంతా వీడియో తీసిన ఫ్యాన్.. దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ప్రశాంతంగా బతకనివ్వరా?అయితే ఇందులో మొదట కోప్పడ్డ అక్షయ్.. చివరకు అభిమానికి నవ్వుతూ సెల్ఫీ ఇచ్చాడు. నా ఫోన్ తీసుకునేందుకు ప్రయత్నించే క్రమంలో అక్షయ్ నన్ను తాకాడు. అద్భుతమైన అనుభవం అని సదరు అభిమాని రాసుకొచ్చాడు. ఇది చూసిన నెటిజన్లు.. వాళ్ల బతుకేదో వాళ్లను బతకనివ్వండి. ప్రశాంతంగా బయటకు వెళ్లే స్వేచ్ఛ కూడా వాళ్లకు లేదా? అని కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by 𝙃𝙖𝙧𝙧𝙮𝙮🚀✨ (@iamharryy24) చదవండి: బతికుండగానే చంపేశారు.. అమ్మానాన్న ఒకటే కంగారు: శిల్ప -
బతికుండగానే చంపేశారు.. అమ్మానాన్న ఒకటే కంగారు: శిల్ప
సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడూ ఏదో ఒక పుకారు వినిపిస్తూనే ఉంటుంది. సెలబ్రిటీల పర్సనల్ లైఫ్ గురించి, ప్రాజెక్టుల గురించి ఎన్నో ఊహాగానాలు వస్తుంటాయి. అయితే కొందరు మరీ హద్దు మీరుతూ.. తారలు బతికుండగానే చనిపోయారనే గాసిప్స్ కూడా సృష్టిస్తుంటారు. అయితే ఇలాంటి గాసిప్ తనమీద కూడా వచ్చిందని చెప్తోంది బాలీవుడ్ నటి శిల్ప శిరోద్కర్ (Shilpa Shirodkar).చనిపోయానని పుకారుతాజాగా ఓ ఇంటర్వ్యూలో శిల్ప శిరోద్కర్ మాట్లాడుతూ.. 1995లో నేను రఘువీర్ సినిమా చేశాను. ఆ మూవీ షూటింగ్ కోసం టీమ్ అంతా కులుమనాలీ వెళ్లాం. ఓ పత్రికలో నేను చనిపోయానని వార్త వచ్చిందట! ఆ విషయం నాకు తెలిదు. అప్పుడు మా దగ్గర సెల్ఫోన్స్ లేవు. నేను షూటింగ్ లొకేషన్లో ఉండగా మా నాన్న హోటల్కు పలుమార్లు ఫోన్ చేశాడు. సునీల్ శెట్టితో కలిసి ఓ సీన్లో నటిస్తుంటే అక్కడున్న అందరూ కూడా నేను శిల్పాశెట్టియేనా? లేదా మరో వ్యక్తినా? అన్నట్లు కాస్త విచిత్రంగా చూస్తున్నారు. 25 మిస్డ్ కాల్స్అప్పటికే అందరూ పత్రికలో నా మరణ వార్త చదివేశారు. నేను హోటల్ గదికి వెళ్లేసరికి దాదాపు 25 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. పేపర్లో నేను చనిపోయానన్న వార్త చూసి అమ్మానాన్న చాలా కంగారుపడిపోయారు. అయితే ఈ గాసిప్ను సృష్టించింది బయటవాళ్లు కాదు, సినీ నిర్మాత గుల్షన్ కుమార్ (Gulshan Kumar). అప్పట్లో పీఆర్ స్టంట్లు ఏవీ లేవు. మా మూవీ బజ్ కోసం ఇలా నేను చనిపోయానని కథలు అల్లేశారు. కనీసం అందుకు నా అనుమతి కూడా తీసుకోలేదు. నాకు చెప్పకుండా..అంతా అయిపోయాక అసలు విషయం బయటపెట్టారు. సినిమా వర్కవుట్ అయింది కాబట్టి వాళ్లపై కోపం రాలేదు అని శిల్ప శిరోద్కర్ చెప్పుకొచ్చింది. బాలీవుడ్లో హీరోయిన్గా అనేక సినిమాలు చేసిన శిల్ప శిరోద్కర్ తెలుగులో బ్రహ్మ అనే ఏకైక సినిమాలో నటించింది. ప్రస్తుతం తెలుగులో సుధీర్బాబు 'జటాధర' మూవీలో కీలక పాత్రలో యాక్ట్ చేస్తోంది.చదవండి: జర్నీ మొదలైంది.. 'వరల్డ్ ఆఫ్ కాంతార' వీడియో రిలీజ్ -
ఇండస్ట్రీలో మరో విషాదం.. స్టార్ డైరెక్టర్ ఇక లేరు
ఇండస్ట్రీలో మరో విషాదం. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ చంద్ర బరోట్(86) కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా శ్వాసకోస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఈయన.. ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఈ విషయమై బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కూడా స్పందించారు. దర్శకుడికి నివాళి అర్పించారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.(ఇదీ చదవండి: యంగ్ హీరో నిఖిల్కి ఝలక్.. ట్వీట్ వైరల్)అమితాబ్ హీరోగా వచ్చిన 'డాన్' ఎంత సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ సినిమా తీసింది ఈయనే. అలా 'డాన్' దర్శకుడిగా చాలా ఫేమస్ అయిపోయారు. దీని తర్వాత ప్యార్ బరా దిల్, హాంకాంగ్ వాలీ స్క్రిప్ట్, నీల్ కో పకడ్నా తదితర చిత్రాల్ని తెరకెక్కించారు. కానీ, ఆయనకు అత్యంత గుర్తింపు తెచ్చింది మాత్రం డాన్. దర్శకత్వం వహించడానికి ముందు పురబ్ ఔర్ పచ్చిమ్, యాద్గార్, రోటీ కపడా ఔర్ మకాన్ తదితర మూవీస్కి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు. ఇప్పుడు ఈయన మృతి చెందడంతో పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.(ఇదీ చదవండి: నిజజీవిత కథ.. 'గరివిడి లక్ష్మి' గ్లింప్స్ రిలీజ్) -
బాలీవుడ్ని వణికించిన మాఫియా డాన్ లవర్..ఎవరా హీరోయిన్?
బాలీవుడ్లో 80–90లలో హిందీ సినిమా ప్రపంచం, అండర్ వరల్డ్ గ్యాంగ్ల మధ్య సంబంధాలపై ఎన్నో రకాల వార్తలు, కధనాలు, విశ్లేషణలు, చర్చలు సాగాయి. మరీ ముఖ్యంగా ఆ సమయంలో సినీ కథానాయికలు, మాఫియా డాన్లతో సంబంధాలు పెట్టుకున్నట్టు పలు రహస్యాలు సైతం బయటికి వచ్చాయి. అందులో చాలా మందికి తెలిసిన ఒక బహిరంగ రహస్యం దావూద్–మందాకినిల ఎఫైర్ అయితే, అతి కొద్ది మందికే తెలిసిన మరో కథలో అనితా అయూబ్ అనే హీరోయిన్ ప్రధాన పాత్రధారిణి.అనితా ఎవరు?పాకిస్థాన్లో పుట్టిన కరాచీ కు చెందిన అనితా అయూబ్ ఆంగ్ల భాషలో మాస్టర్స్ చేసింది. ఆ తర్వాత మన దేశంలో అడుగుపెట్టి రోషన్ తనేజా యాక్టింగ్ స్కూల్లో శిక్షణ తీసుకుంది. చిన్న చిన్నగా అవకాశాలు అందిపుచ్చుకుంటూ మొదట మోడల్గా, ప్రకటనల్లో నటించి, 1993లో హిందీ చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టారు. ఆమె దేవ్ ఆనంద్ దర్శకత్వంలో వచ్చిన ప్యార్ కా తరానా చిత్రంలో హీరోయిన్గా పరిచయమయ్యారు. ఆ తరువాత 1994లో వచ్చిన గ్యాంగ్ స్టర్ చిత్రంలో కూడా నటించింది. బహుశా అందరు హీరోయిన్లలాగే అయితే ఆమె మరిన్ని చిత్రాల్లో నటించి ఇప్పటికీ కొనసాగుతూనే ఉండేదేమో.. కానీ ఆమె ఒకటి తలిస్తే..అప్పటి బాలీవుడ్ని శాసించిన నేర సామ్రాజ్య చక్రవర్తి మరొకటి తలచాడు.మాఫియా పడగ నీడలో...అందం, అభినయం ఉన్న అనితాపై నాటి మాఫియా డాన్ దావూద్ ఇబ్రాహీమ్(Dawood Ibrahim) మనసు పడ్డాడు. దాంతో ఆమె జీవితం మారిపోయింది. తరచుగా దావూద్తో ఆయన సహచరులతో కలిసి అనితా కనిపిస్తుండడంతో వీరిద్దరి మధ్య సంబంధాలు ఏర్పడాయంటూ వార్తలు హల్చల్ చేశాయి. అయితే ఆమె ఎప్పుడూ ఈ వివాదాన్ని బహిరంగంగా ఒప్పుకోలేదు, కానీ సినీ పరిశ్రమ మాత్రం పూర్తిగా నమ్మింది. దానికి బలమైన కారణాలు కూడా లేకపోలేదు. అందులో ఒక ప్రధాన కారణం అప్పట్లో జరిగిన ఓ బాలీవుడ్ నిర్మాత హత్య. 1995లో నిర్మాత జావేద్ సిద్ధీక్ ఓ చిత్రాన్ని నిర్మించ తలపెట్టారు. అయితే ఆ సినిమాలో అనితాను హీరోయిన్గా తీసుకోవాలని మాఫియా నుంచి ఒత్తిడి వచ్చింది. అయితే ఈ ఒత్తిడికి ఆయన తలొగ్గలేదు. దీనితో దావూద్ గ్యాంగ్ తన సత్తా చూపిందనీ, నిర్మాత సిద్ధీక్ను హత్య చేయించడం ద్వారా దావూద్ అనితా పై తనకున్న గాఢమైన ఇష్టాన్ని చూపించాడంటూ వార్తలు వచ్చాయి. అప్పట్లో సంచలనం సృష్టించిన ఈ సంఘటన మీడియాలో దావూద్ అనితల ప్రేమాయణంపై రకరకాల చర్చలకు కారణమైంది.అయితే దావూద్తో అనుబంధంతో పాటు అనితా కష్టాలు కూడా పెరుగుతూ వచ్చాయని అంటారు. ఆ తర్వాత ఒక పాకిస్థానీ పత్రిక కధనం ప్రకారం అనితా అయూబ్ భారతదేశంలో పాక్ గూఢచారిణిగా అనుమానించడం మొదలైంది. అంతే ఇక తర్వాత బాలీవుడ్ ఆమెను పూర్తిగా పక్కన బెట్టేసింది.దాంతో అనితా నటనకు గుడ్బై చెప్పి స్వదేశానికి మూటా ముళ్లె సర్ధుకుని పీఛేముఢ్ అనక తప్పలేదు. పాకిస్తాన్లో ఉంటూనే తర్వాత కొన్నాళ్లకు భారత వ్యాపారి సంయమిల్ పటేల్ను వివాహం చేసుకొన్న అనితా..ఆ తర్వాత కొన్నాళ్లకే ఆ బంధం ముక్కలవడంతో, విడాకులు తీసుకుంది. అనంతరం పునః వివాహం పాకిస్థాన్ వ్యాపారి సుబాక్ మజీద్ను పెళ్లాడింది. ప్రస్తుతం ఆమె అమెరికాలోని న్యూయార్క్లో స్థిరపడింది. -
క్యాన్సర్.. బతకడం కష్టమన్నారు.. ఆస్పత్రిపై నుంచి దూకి..
నాకు క్యాన్సర్ అని తెలియగానే నిశ్చేష్టుడినయ్యాను. బతికే అవకాశాలు తక్కువ అని చెప్పడంతో ప్రాణాలు తీసుకోవాలనుకున్నాను అని చెప్తున్నాడు బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ తండ్రి, యాక్షన్ డైరెక్టర్ శామ్ కౌశల్ (Sham Kaushal). తాజాగా ఓ పాడ్కాస్ట్లో శామ్ కౌశల్ మాట్లాడుతూ.. 2003లో ఓ సర్జరీ చేయించుకున్నాను. ఆ సమయంలో నాకు క్యాన్సర్ ఉందన్న విషయం బయటపడింది. బతకడం కష్టమే అని డాక్టర్స్ చెప్పగానే నాతో ఉన్నవారి ముఖాలు వాడిపోయాయి.చావంటే భయం లేదుహాస్పిటల్లోని మూడో అంతస్తు నుంచి దూకి చనిపోవాలనుకున్నాను. ఎలాగో చావు తప్పదన్నాక ఇంకా దేనికి బతికుండటం? అని భావించాను. కానీ అప్పటికే సర్జరీ జరగడం వల్ల నొప్పితో కదల్లేకయ్యాను. లేచి నడిచేందుకు ఒంట్లో సత్తువ లేకపోవడంతో ఆ ఆలోచన విరమించుకున్నాను. క్యాన్సర్ వల్ల మరణిస్తానని తెలిశాక చావంటే భయం లేకుండా పోయింది. జీవితాన్ని చూసే విధానమే మారిపోయింది. ఏడాది పాటు పలు టెస్టులు, సర్జరీలు చేశారు. ఏదైతే అదయిందని నేను ధైర్యంగా నిలబడ్డాను. పదేళ్ల ఆయుష్షు కోరితే..అదృష్టవశాత్తూ క్యాన్సర్ నా శరీరమంతా వ్యాపించలేదు. అప్పుడు ఆ భగవంతుడిని మరో పదేళ్ల జీవితం ప్రసాదించమని వేడుకున్నాను. కానీ క్యానర్ను జయించి 22 ఏళ్లవుతోంది. ఇన్నేళ్లలో ఎంతోమంది మంచివాళ్లను కలిశాను, నా పిల్లలు కెరీర్లో రాణిస్తున్నారు. నేనూ జీవితంలో మంచి స్థాయికి చేరుకున్నాను అని చెప్పుకొచ్చాడు. శామ్ మొదట్లో స్టంట్మ్యాన్గా పని చేశాడు. 1990లో ఇంద్రజలం అనే మలయాళ చిత్రంతో యాక్షన్ డైరెక్టర్గా మారాడు. సినిమాలునాలుగు దశాబ్దాలుగా సినిమా ఇండస్ట్రీలో పని చేస్తున్నాడు. గ్యాంగ్స్ ఆఫ్ వాసీపూర్, భాగ్ మిల్కా భాగ్, పీకే, పద్మావత్, సంజు, సింబా వంటి పలు చిత్రాలకు యాక్షన్ డైరెక్టర్గా వ్యవహరించాడు. ఆస్కార్ విన్నింగ్ మూవీ స్లమ్ డాగ్ మిలియనీర్కు సైతం పని చేశాడు. ఆయన కుమారులు విక్కీ కౌశల్, సన్నీ కౌశల్.. ఇద్దరూ బాలీవుడ్లో హీరోలుగా రాణిస్తున్నారు.చదవండి: పారితోషికం భారీగా పెంచేసిన జాన్వీ.. ‘పెద్ది’కి ఎంతంటే.. -
చేతులతో పాముని పట్టుకున్న సోనూ సూద్.. వీడియో వైరల్
పాము ఉందని తెలిస్తేనే ఆమడ దూరం పరుగెడతాం. కళ్లకు కనిపిస్తే.. భయంతో వణికిపోతాం. ఇక సినిమా వాళ్లకు పాము అంటే భయం ఇంకాస్త ఎక్కువనే చెప్పాలి. వాళ్లు రియల్ లైఫ్లో పాములను రేర్గా చూస్తుంటారు. చిన్న బల్లికే భయపడే స్టార్స్ చాలా మందే ఉన్నారు. కానీ ‘రియల్ హీరో’, నటుడు సోనూ సూద్(Sonu Sood ) మాత్రం పెద్ద పాముని తన చేతులతో పట్టుకున్నాడు. ఆ పాముని చూసి తన సిబ్బంది అంతా భయంతో దూరం జరిగితే.. ఆయన మాత్రం చాకచక్యంగా దాన్ని పట్టుకొని..అడవిలో విడిపెట్టాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.ముంబైలో సోనూ సూద్ నివాసం ఉండే సొసైటీలోకి ఈ పాము దారితప్పి వచ్చింది. పాముని చూసి అంతా భయంతో దూరంగా వెళ్లిపోయారు. సోనూ సూద్ మాత్రం ఉత్త చేతులతో దాన్ని పట్టుకొని సంచిలో బంధించాడు. అనంతరం దాన్ని సురక్షిత ప్రాంతంలో వదిలి పెట్టాలని తన సిబ్బందికి సూచించారు. అయితే తనలాగా ఇలాంటి స్టంట్లు చేయకుండా.. ఇళ్లలోకి పాములు ప్రవేశిస్తే నిపుణులను పిలించి మాత్రమే పట్టుకోవాలన్నారు. తన ఇంట్లోకి వచ్చిన పాము ర్యాట్ స్నేక్ (జెర్రిపోతు) అని, అది విషపూరితమైనది కాదని ఆయన స్పష్టం చేశారు. అదే సమయంలో పాముల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.हर हर महादेव 🔱❤️#harharmahadev🙏🌿🕉️ pic.twitter.com/u500AcrlxS— sonu sood (@SonuSood) July 19, 2025 -
ప్రపంచంలోనే ఎత్తయిన చోట ఆ సినిమా ప్రదర్శన.. థియేటర్ స్పెషల్ ఏంటంటే?
సందేశాత్మక సినిమాను తీయడం ఒకెత్తయితే... ఆ సినిమాను సకల జనులకు చేరువగా తీసుకువెళ్లడం మరొకెత్తు. ఇలాంటి ఎత్తులను అధిరోహించినప్పుడే ఆ చిత్రం సంపూర్ణ శిఖరాగ్రం చేరుకున్టట్టు అర్ధం. ప్రస్తుతం అతి తక్కువ సినిమాలు మాత్రమే అలా శిఖరారోహణ చేయగలుగుతున్నాయి. ఓ వైపు కలెక్షన్ల వర్షం కురిపిస్తూ మరోవైపు విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంటున్న.... బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ స్వీయ ప్రొడక్షన్స్ సమర్పణలో రూపొందిన సితారె జమీన్ పర్ చిత్రం మరో అరుదైన ఘనత సాధించింది. ఈ సినిమాని ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన చోట ఉన్న థియేటర్ లో ప్రదర్శించారు. గత 13న భారతదేశంలో ఉన్న అత్యధిక ఎతైన థియేటర్ లో ఈ చిత్ర ప్రదర్శన జరిగింది. ఆ థియేటర్ పేరు పిక్చర్టైమ్. ఈ 11,562 అడుగుల ఎత్తున ఉన్న లడఖ్లోని మొబైల్ డిజిటల్ థియేటర్లో అమీర్ ఖాన్ నటించిన కామెడీ–డ్రామా చిత్రం’ ప్రత్యేక ప్రదర్శన జరిగింది. ఈ ప్రదర్శనలో పలువురు ఆటిజం చిన్నారులు, వారి తల్లిదండ్రులు ప్రేక్షకులుగా హాజరవగా, స్థానిక డా.దాయ్చిన్స్ హోప్ఫుల్ స్టెప్స్ క్లినిక్ కు చెందిన సిబ్బంది పాల్గొన్నారు. థియేటర్ బయట, అందమైన లడఖ్ నేపధ్యంలో చిన్నారులు సినిమాలోని హాస్యానికి, ఉత్తేజానికి అనర్గళంగా నవ్వుతూ ఆనందించగా, వారి తల్లిదండ్రులు పిల్లల ముఖాల్లో కనిపించిన సంతోషం చూసి మురిసిపోతూ కనిపించారు. అమీర్ ఇటీవల ‘‘భారతీయ సినిమాలు అన్ని ప్రాంతాలకు, ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండాలి’’ అని వేవ్స్సమ్మిట్లో అభిప్రాయపడ్డారు. అచ్చంగా దీన్నే పిక్చర్ టైమ్ సంస్థ అనుసరించింది. ఈ సందర్భంగా పిక్చర్ టైమ్ నిర్వాహకులు సుశీల్ చౌదరి మాట్లాడుతూ ఈ ప్రదర్శన పిల్లలకు వారి తల్లిదండ్రులకు ఒక అమూల్యమైన వీక్షణ అనుభవం అన్నారు. ధియేటర్ విశేషాలివే... భారతదేశంలో, బహుశా ప్రపంచంలోనే అత్యంత ఎతైన సినిమా థియేటర్, లడఖ్లోని లేహ్లో ఉన్న పిక్చర్టైమ్ డిజిప్లెక్స్ ఇన్ఫ్లేటేబుల్ థియేటర్, దీనిని లేహ్లోని ఎన్ఎస్డీ గ్రౌండ్స్లో ఏర్పాటు చేశారు. సరసమైన ధరలోనే టిక్కెట్లు, మంచి సీటింగ్ ఏర్పాట్లతో కూడిన ఈ మొబైల్, ఇన్ప్లేటేబుల్ థియేటర్ను మారుమూల ప్రాంతాలకు కూడా సినిమా వీక్షణ అనుభవాన్ని అందించడం లక్ష్యంగా పెట్టుకుంది నాలుగేళ్ల క్రితం విమర్శకుల ప్రశంసలు పొందిన షార్ట్ ఫిల్మ్తో థియేటర్ ప్రారంభం కాగా అదే రోజున బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ నటించిన ‘బెల్బాటమ్‘ చిత్ర ప్రదర్శన కూడా జరిగింది.చలికాలంలో దేశంలోని మిగిలిన ప్రాంతాల నుంచి తరచుగా దూరమయ్యే ప్రాంతం లడఖ్కు ఈ మొబైల్ థియేటర్ స్థాపన చాలా ముఖ్యమైనది. వినోదానికి మూలాన్ని స్థానిక చిత్రనిర్మాతలు కళాకారులకు వేదికను ఈ థియేటర్ అందిస్తుంది ఈ మొట్టమొదటి మొబైల్ డిజిటల్ మూవీ థియేటర్ –28 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రతలలో సైతం పనిచేసేలా ప్రత్యేక సాంకేతికతతో ఏర్పాటైంది. -
వారం రోజులు ఆలస్యంగా...
కాస్త ఆలస్యంగా థియేటర్స్కు వస్తానంటున్నారు నార్త్ సర్దార్. అజయ్ దేవగన్ హీరోగా నటించిన తాజా హిందీ చిత్రం ‘సన్నాఫ్ సర్దార్ 2’. ఈ చిత్రంలో పంజాబీ అమ్మాయిగా హీరోయిన్ మృణాల్ ఠాకూర్ నటించారు. రవికిషన్, సంజయ్ మిశ్రా కీలక పాత్రల్లో నటించారు. అజయ్ దేవగన్, జ్యోతిదేశ్ పాండే, ఎన్ఆర్ పచిసియా, ప్రవీణ్ తల్రేజా నిర్మించారు. కాగా ఈ సినిమాను జూలై 25న రిలీజ్ చేయాలనుకున్నారు.కానీ వాయిదా వేశారు. ‘సన్నాఫ్ సర్దార్ 2’ సినిమా ఈ నెల 25న విడుదల కావడం లేదని, ఆగస్టు 1న రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. ఈ వాయిదాకి కారణం ‘సయారా’ సినిమా. అహన్ పాండే, అనీత్ పద్దా హీరో హీరోయిన్లుగా నటించిన ‘సయారా’ సినిమాకు ఆడియన్స్ నుంచి మంచి స్పందన లభిస్తోంది. దీంతో ఈ సినిమాతో పోటీ ఎందుకని అజయ్ దేవగన్ తన సినిమాను ఆగస్టు 1కి వాయిదా వేసుకున్నారు.ఈ సంగతి ఇలా ఉంచితే... రాజమౌళి దర్శకత్వంలో సునీల్ లీడ్ రోల్లో నటించిన హిట్ ఫిల్మ్ ‘మర్యాద రామన్న’కు హిందీ రీమేక్గా రూపొందిన అజయ్ దేవగన్ ‘సన్నాఫ్ సర్దార్’ సినిమా 2012లో విడుదలై, సూపర్హిట్గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సీక్వెల్గా ‘సన్నాఫ్ సర్దార్ 2’ రూపొందింది. -
గర్భంతో ఉన్నా యాక్షన్ సీన్స్.. మొదటిసారే మిస్క్యారేజ్
పిల్లల కోసం ఉద్యోగాలను త్యాగం చేస్తున్నారు కొందరు మహిళలు. ఏడాది నిండని కూతురు ఉన్నందున సెట్లో ఎనిమిది గంటల కంటే ఎక్కువ పనిచేయలేనంది దీపికా పదుకొణె. ఈ విషయంలో భేదాభిప్రాయలు రావడంతోనేగా.. స్పిరిట్ నుంచి తప్పుకుంది. అయితే తాను మాత్రం పిల్లల కోసం ఉద్యోగాల్ని పక్కన పెట్టలేనంటోంది బాలీవుడ్ నటి గౌహర్ ఖాన్.ఊహించలేదుతాజాగా ఓ పాడ్కాస్ట్లో గౌహర్ ఖాన్ (Gauhar Khan) మాట్లాడుతూ.. 36 ఏళ్ల వయసులో నేను పెళ్లి చేసుకున్నాను. ఏడాదికే పిల్లల కోసం ప్లానింగ్ మొదలుపెట్టాం. తల్లినవడానికి ఇదే సరైన సమయం అనిపించింది. ఒకసారి గర్భస్రావం కూడా జరిగింది. దాన్నుంచి కోలుకోవడానికి ఏడాదిన్నర పట్టింది. ఎందుకంటే అంతా మంచే జరుగుతుంది, నా చేతుల్లోకి చిన్ని బాబు/పాప రానుందన్న సంతోషంతోనే గడిపాను. ఇలా ఓ బిడ్డను కోల్పోవాల్సి వస్తుందని ఊహించం కదా! ఆ బాధ నుంచి అంత సులువుగా బయటకు రాలేకపోయాను.ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు?ఆ తర్వాతే నాకు కొడుకు జెహాన్ పుట్టాడు. ఇప్పుడు నేను 40 దాటేశాను. ఇప్పుడు రెండో బేబీ కోసం ప్లాన్ చేసుకోకపోతే ఇంకెప్పటికీ కనలేను. నా ఫస్ట్ , సెకండ్ ప్రెగ్నెన్సీల సమయంలో నేను షూటింగ్కు వెళ్లేదాన్ని. యాక్షన్ రోల్లో నటించాను. ఇప్పుడు మూడో ప్రెగ్నెన్సీ సమయంలో ఫౌజీ 2 సీరియల్లో బాంబ్ బ్లాస్టింగ్ సీన్లో యాక్ట్ చేశాను. ప్రాజెక్టు ఒప్పుకున్నాక దాన్ని అర్ధాంతరంగా వదిలేయలేను. నటిగా దాన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత నాపై ఉంది. అదేంటో కానీ, గర్భం దాల్చినప్పుడే క్లిష్టమైన సన్నివేశాల్లో నటించాల్సి వస్తోంది అని గౌహర్ చెప్పుకొచ్చింది. ఆ పాటతో టాలీవుడ్లో ఫేమస్గౌహర్.. తనకంటే 12 ఏళ్లు చిన్నవాడైన జైద్ దర్బార్ను 2020లో పెళ్లి చేసుకుంది. 2023లో వీరికి బాబు పుట్టాడు. త్వరలోనే మరోసారి తల్లి కాబోతోంది. శంకర్ దాదా ఎంబీబీఎస్లో నా పేరే కాంచనమాల అనే స్పెషల్ సాంగ్లో స్టెప్పులేసింది. బాలీవుడ్లో గేమ్, రాకెట్ సింగ్, ఫీవర్, బేగం జాన్ వంటి చిత్రాల్లో నటించింది. తాండవ్ వెబ్ సిరీస్లోనూ యాక్ట్ చేసింది. హిందీ బిగ్బాస్ ఏడో సీజన్ విజేతగానూ నిలిచింది.చదవండి: పుష్ప 2 తొక్కిసలాట.. అల్లు అర్జున్ చేసిన తప్పు అదే!: విష్ణు -
హీరోయిన్ ఫామ్హౌస్లో దొంగతనం.. సీసీటీవీలు ధ్వంసం!
బాలీవుడ్ హీరోయిన్ సంగీత బిజ్లానీ (Sangeeta Bijlani) ఫామ్హౌస్లో దొంగతనం జరిగింది. మహారాష్ట్ర.. పుణెలోని మావల్లో ఉన్న ఫామ్ హౌస్కు నాలుగు నెలల తర్వాత వెళ్లిన సంగీత.. అక్కడి పరిస్థితి చూసి షాకైంది. తన ఇంటి తలుపులు, కిటికీలు ధ్వంసమవడాన్ని చూసి దొంగతనం జరిగిందని నిర్ధారించుకుంది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది.వస్తువులు ధ్వంసంతన ఫామ్హౌస్లోకి ఎవరో అక్రమంగా చొరబడి కొన్ని వస్తువులను ఎత్తుకెళ్లారని, మరికొన్నింటిని ధ్వంసం చేశారని ఫిర్యాదులో పేర్కొంది. పై అంతస్తులో బెడ్స్, ఫ్రిజ్ నాశనం చేశారని, విలువైన వస్తువులు కనిపించడం లేదని తెలిపింది. సీసీటీవీని కూడా ధ్వంసం చేశారని వాపోయింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో కొంతకాలంగా ఫామ్హౌస్కు రాలేదని తెలిపింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.పర్సనల్ లైఫ్సంగీత.. త్రిదేవ్, ఇన్స్పెక్టర్ ధనుష్, యోధ, ఇజ్జత్, శివరామ్, లక్ష్మణరేఖ, విష్ణుదేవ.. ఇలా అనేక సినిమాలు చేసింది. ఇటీవలే ఆమె 65వ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంది. బాంద్రాలోని తన నివాసంలో జరిగిన ఈ బర్త్డే పార్టీకి సంగీత మాజీ ప్రియుడు, ప్రస్తుత స్నేహితుడు సల్మాన్ ఖాన్ కూడా హాజరయ్యాడు. నిజానికి సంగీత, సల్మాన్ పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. మంచి ముహూర్తం చూసుకుని పత్రికలు కూడా అచ్చువేయించుకున్నారు. కానీ పెళ్లి పీటలు ఎక్కకముందే ఆ వివాహం రద్దయింది. అనంతరం సంగీత 1996లో మహ్మద్ అజారుద్దీన్ను పెళ్లి చేసుకుంది. 2019లో వీరు విడాకులు తీసుకున్నారు. చదవండి: గుడి ముందు భిక్షాటన చేసిన ప్రముఖ నటి నళిని -
హీరోయిన్లు ఎక్కువసేపు కనిపించొద్దట, ఐటం సాంగ్ చాలట! హీరోలపై ఫైర్
హీరోలు వారి స్వార్థం కోసం సంగీతాన్ని చంపేస్తున్నారు అంటున్నాడు బాలీవుడ్ దర్శకుడు కునాల్ కోహ్లి (Kunal Kohli). ఐటం సాంగ్స్ ఉంటే చాలని ఫీలవుతున్నారంటూ సోషల్ మీడియా వేదికగా కథానాయకుల తీరును ఎండగట్టాడు. అదే సమయంలో అహాన్ పాండే, అనీత్ పడ్డా డెబ్యూ సినిమా 'సైయారా'కి పాటల వల్లే మంచి బజ్ వస్తుండటంపై ప్రశంసలు కురిపించాడు.ఐటం సాంగ్స్ మాత్రమే హిట్టా?'ఈ రోజుల్లో హీరోయిన్ల పాత్రలను తగ్గించడం కోసం హీరోలు సంగీతాన్ని చంపేస్తున్నారు. కేవలం ఐటం సాంగ్స్ మాత్రమే హిట్టు పాటలని ఫీలవుతున్నారు. ఇలాంటి తరుణంలో మార్పు మొదలైనట్లు కనిపిస్తోంది. నేడు (జూలై 18న సైయారా మూవీ రిలీజ్) ఇండియన్ సినీ చరిత్రలోనే ఒక గొప్ప రోజు. మంచి సినిమాలు, వినసొందపైన సంగీతం తిరిగి పట్టాలెక్కనున్నాయి. ఆల్బమ్స్కు మంచి రోజులు రానున్నాయ్.హీరోలకు హక్కు లేదుసినిమా గురించి, అందులోని పాటల గురించి నిర్ణయాలు తీసుకోవాల్సింది హీరోలు, వారి మేనేజర్లు కాదు.. కేవలం దర్శకనిర్మాతలకు మాత్రమే ఆ హక్కు ఉంది! సరికొత్త మార్పునకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. అందుకు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను' అన్నాడు. బాలీవుడ్లో అనేక సినిమాలు డైరెక్ట్ చేసిన కునాల్ తెలుగులో నెక్స్ట్ ఏంటి? మూవీ తీశాడు.పాటలతోనే మంచి బజ్సైయారా మూవీ విషయానికి వస్తే ఈ చిత్రానికి మోహిత్ సూరి దర్శకత్వం వహించాడు. తనిష్క్ బగ్చి, అర్స్లన్ అబ్దుల్లా, ఫహీం నిజామి అద్భుతమైన సంగీతం అందించారు. ముఖ్యంగా టైటిల్ సాంగ్ ఈ మూవీకి విపరీతమైన బజ్ తీసుకొచ్చింది. సంగీతంతోనే ప్రేక్షకులను తనవైపు తిప్పుకునేలా చేసిన ఈ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ లభిస్తోంది. All have had HIT music. Today’s heroes have killed music by wanting to reduce the role of heroines and thinking that item songs are hit songs. Tmrw is a legendary day in indian cinema. The change has begun. Good films. Good music are back. Albums. Complete albums. Filmmakers not… https://t.co/vyPNqyioZ2— kunal kohli (@kunalkohli) July 17, 2025 చదవండి: 'కూలీ'ని రిజెక్ట్ చేసిన పుష్ప విలన్.. ఎందుకంటే? -
హీరామండి నటికి అరుదైన గౌరవం.. అదేంటంటే?
చాలా ఏళ్ల తర్వాత లస్ట్ స్టోరీస్తో గ్రాండ్గా రీ ఎంట్రీ సీనియర్ హీరోయిన్ మనీషా కొయిరాలాకు అరుదైన గౌరవం దక్కింది. యూకేకు చెందిన ప్రముఖ యూనివర్సిటీ ఆమెకు డాక్టరేట్ను అందించింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది మనీషా కొయిరాలా. తాను డాక్టరేట్ స్వీకరించిన వీడియోను షేర్ చేసింది. తన జీవితంలో సాంప్రదాయ విద్యా మార్గం ద్వారా ఈ స్థానానికి చేరుకోలేదని చెప్పింది.కాగా.. నటి మనీషా కొయిరాలా ఇంగ్లాండ్లోని బ్రాడ్ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ను అందుకుంది. ఈ గుర్తింపు తనకు చాలా సంతోషంగా ఉందని చెప్పుకొచ్చింది. ఈ గౌరవం నేను మాటల్లో చెప్పలేనంత ఎక్కువ అని తెలిపింది. నా కృషి, వైఫల్యాలను ఎదుర్కొని ఈ రోజు ఈ స్థాయిలో నిలబడ్డానని పేర్కొంది. మన ప్రయాణం ఎక్కడ మొదలైనా.. చివరికీ ఎక్కడికి చేరుకున్నామనేది ముఖ్యమని మనీషా తన పోస్ట్లో ప్రస్తావించింది. తనను గుర్తించిన బ్రాడ్ఫోర్డ్ విశ్వవిద్యాలయానికి ధన్యవాదాలు అంటూ పోస్టే చేసింది.మనీషా తన ఇన్స్టాలో రాస్తూ.. 'బ్రాడ్ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ను అందుకోవడం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా యూకే సిటీ ఆఫ్ కల్చర్-2025 ఏడాదిలో అందుకోవడం మరో విశేషం. క్రియేటివ్ డైరెక్టర్, ప్రతిభావంతులైన డేనియల్ లీతో కలిసి ఈ గుర్తింపును పంచుకోవడం మరింత సంతోషాన్నిచ్చింది. 2025కు అభినందనలు.. నా ప్రయాణం ఇప్పుడే ప్రారంభమైంది'పోస్ట్ చేసింది.ఇక సినిమాల విషయానికొస్తే మనీషా కొయిరాలా సౌదాగర్ (1991) మూవీతో బాలీవుడ్లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత 1942: ఎ లవ్ స్టోరీ , బాంబే , అగ్ని సాక్షి , గుప్త్: ది హిడెన్ ట్రూత్ , దిల్ సే, కంపెనీ లాంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత సినిమాలకు దూరమైన మనీషా చాలా కాలం తర్వాత లస్ట్ స్టోరీస్ (2018) తో రీ ఎంట్రీ ఇచ్చింది. ఆమె చివరిసారిగా సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో వచ్చిన వెబ్ సిరీస్ హీరామండి: ది డైమండ్ బజార్ (2024) లో నటించింది. ఇందులో మల్లికాజాన్ అనే వేశ్య పాత్రను పోషించింది. విభజనకు ముందు కాలంలో లాహోర్లోని హీరా మండిలో నవాబులు, బ్రిటిష్ అధికారులతో వేశ్యల జీవితాలు ఎలా ఉన్నాయనే కోణంలో ఈ సిరీస్ను తెరకెక్కించారు. View this post on Instagram A post shared by Manisha Koirala (@m_koirala) -
ఫొటోలు వద్దు.. దీవెనలు చాలు
హీరోయిన్ కియారా అడ్వాణీకి ఈ మధ్యే కూతురు పుట్టింది. ఈ క్రమంలోనే సెలబ్రిటీల నుంచి ఆమె అభిమానుల వరకు చాలామంది శుభాకాంక్షలు చెప్పారు. మన దగ్గర తక్కువ కానీ బాలీవుడ్లో ఫొటోగ్రాఫర్స్ కల్చర్ చాలా ఎక్కువ. నటీనటులు ఎక్కడికెళ్లినా సరే 10-15 మంది ఫొటోలు తీస్తూ కనిపిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే తన కుమార్తె ఫొటోలు కూడా ఎవరైనా లీక్ చేస్తారేమోనని కియారా-సిద్ధార్థ్ దంపతులు ఓ స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. ఈ మేరకు దాన్ని ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ చేశారు.'మీ అందరి ప్రేమ, శుభాకాంక్షలతో మేం చాలా సంతోషపడుతున్నాం. తల్లిదండ్రులుగా మేం మొదటి అడుగులు వేస్తున్నాం. ఈ సమయాన్ని పూర్తిగా ఆస్వాదించాలని కోరుకుంటున్నాం. ఇలాంటి సమయంలో గోప్యత పాటించాలనుకున్నాం. అందుకే ఫొటోలు షేర్ చేయడం లేదు. మీరు కూడా దయచేసి మా పాప ఫొటోలు తీయొద్దు. మీ ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని అనుకుంటున్నాం. మీ అందరి సపోర్ట్కి థ్యాంక్స్' అని కియారా దంపతులు పేర్కొన్నారు.(ఇదీ చదవండి: 5 నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా)కియారా-సిద్ధార్థ్ మల్హోత్రానే కాదు బాలీవుడ్ జంటలైన అనుష్క-విరాట్, దీపిక-రణ్వీర్ దంపతులు కూడా ఇప్పటివరకు తమ కూతురు ఫొటోలని ఎక్కడా పోస్ట్ చేయలేదు. ఎవరికీ పిక్స్ తీయనివ్వలేదు. ఆలియా-రణ్బీర్ దంపతులు కూడా తమ కూతురు పుట్టిన కొన్నాళ్ల వరకు బయటకు చూపించలేదు. తెలుగులోనూ చరణ్-ఉపాసన కూడా తమ కుమార్తె ఫేస్ రివీల్ కాకుండా జాగ్రత్త పడుతున్నారు.బాలీవుడ్లో వేర్వేరుగా కెరీర్ మొదలుపెట్టిన కియారా, సిద్దార్థ్ మల్హోత్రా.. 2021లో రిలీజైన 'షేర్షా' సినిమాలో కలిసి నటించారు. అప్పుడు మొదలైన స్నేహం కాస్త ప్రేమగా మారింది. 2023లో పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు వీళ్లకు పాప పుట్టింది. కియారా అడ్వాణీ నటించిన 'వార్ 2' విడుదలకు సిద్ధమైంది. ఆగస్టు 14న థియేటర్లలోకి రానుంది.(ఇదీ చదవండి: బాలీవుడ్ న్యూసెన్స్కి నో ఎంట్రీ.. వేలకోట్లున్నా సరే అక్కడికి..) -
కరీనా మోడ్రన్ స్టైల్ ‘‘గళ్ల లుంగీ స్కర్ట్.. నల్ల కళ్లద్దాలు’’!
బాలీవుడ్ నటి కరీనా కపూర్ ఖాన్ (Kareena Kapoor Khan) ప్రస్తుతం గ్రీస్లో వెకేషన్ను ఎంజాయ్ చేస్తోంది. ఈ సందర్భంగా ఇన్స్టాలో కొన్ని ఫోటోలను షేర్ చేసి అభిమానులను మెస్మరైజ్ చేసింది.తన మోడ్రన్ లుక్స్కు దేశీ ట్విస్ట్ ఇవ్వడం కరీనా ఫ్యాషన్ స్టైల్కు నిదర్శనంగా నిలుస్తోంది. పసుపు రంగు హాల్టర్-నెక్ బ్రాలెట్తో పాటు గళ్ల లుంగీ-స్టైల్ స్కర్ట్లో అల్ట్రా-హిప్గా కనిపిస్తున్న కొత్త చిత్రాలను పోస్ట్ చేసింది కరీనా. నల్ల సన్ గ్లాసెస్ , బ్రౌన్ టోపీతో తన లుక్ను మరింత ఎలివేట్ చేసింది.తన ఫోటోలకు “గ్రీస్లో లుంగీ డ్యాన్స్ ..భలే మజా వచ్చింది. తప్పకుండా తప్పక ప్రయత్నించండి’’ అనే క్యాప్షన్ ఇవ్వడం విశేషం. దీనికి వెరైటీ లుంగీ అంటూ ఫ్యాన్స్ కమెంట్స్ చేశారు. ఫ్యాన్స్తో పాటు, కరీనా స్నేహితులు మనీష్ మల్హోత్రా, సావ్లీన్ మంచాంద, పూనమ్ దమానియా ఫైర్ ఎమోజీలను పోస్ట్ చేశారు. View this post on Instagram A post shared by Kareena Kapoor Khan (@kareenakapoorkhan) ఇటీవల వివాదం రేపిన ప్రాడా కొల్హాపురి చెప్పులపై కూడా ఎమోజీలతో సెటైర్ వేసింది కరీనా. కొల్హాపురి మెటాలిక్ సిల్వర్ స్లిప్పర్లలో ఒక చిత్రాన్ని షేర్ చేస్తూ.. "సారీ...ఇది ప్రాడా కాదు... నా OG కొల్హాపురి" అని క్యాప్షన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. కొల్హాపురి చెప్పులనుంచి భారతీయ లుంగీ వరకు కరీనా స్టైలింగ్, ఫ్యాన్స్ ప్రశంసలు లభిస్తున్నాయి. -
పుట్టెడు దుఃఖం, డిప్రెషన్.. అక్క కోసం ఇండియాకు వచ్చేశా: శిల్ప శిరోద్కర్
నమ్రత- శిల్ప శిరోద్కర్.. అక్కాచెల్లెళ్లు ఇద్దరూ ఒకప్పుడు వెండితెరపై హీరోయిన్గా రాణించినవారే! హిందీలో ఎక్కువ సినిమాలు చేసిన నమ్రత 'వంశీ', 'అంజి' చిత్రాలతో తెలుగులో హీరోయిన్గా అలరించింది. సూపర్స్టార్ మహేశ్బాబును పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకు గుడ్బై చెప్పేసింది. శిల్ప శిరోద్కర్ కూడా అంతే! బాలీవుడ్లో అనేక సినిమాలు చేసిన ఈమె తెలుగులో 'బ్రహ్మ' అనే ఏకైక చిత్రంలో యాక్ట్ చేసింది. పెళ్లి తర్వాత వెండితెరకు టాటా చెప్పేసి న్యూజిలాండ్లో సెటిలైంది. 2010 తర్వాత మళ్లీ ఇండియాకు వచ్చి ఇక్కడే స్థిరపడింది.ఆ ఆలోచనే లేదుఅందుకు గల కారణాన్ని తాజా ఇంటర్వ్యూలో వెల్లడించింది. శిల్ప శిరోద్కర్ (Shilpa Shirodkar) మాట్లాడుతూ.. సినిమా అవకాశాల కోసం నేను భారత్కు తిరిగిరాలేదు. అప్పుడు నా మానసిక స్థితి సరిగా లేదు. తల్లిదండ్రులను కోల్పోయి పుట్టెడు శోకంలో ఉన్నాను. డిప్రెషన్లోకి వెళ్లిపోయాను. కనీసం అక్క (నమ్రత)కు దగ్గరగానైనా ఉండొచ్చనే న్యూజిలాండ్ నుంచి వచ్చేశాను. మళ్లీ సినిమాల్లోకి వెళ్లాలన్న ఆలోచన కూడా నాకు రాలేదు. 2010లో ఇక్కడికి వచ్చిన నేను ఎవరినీ పని కోసం అర్థించలేదు, ఎటువంటి ఫోటోషూట్లూ చేయలేదు. పైగా ఈ పీఆర్ (పబ్లిక్ రిలేషన్స్) స్టంట్ల గురించి ఏమాత్రం అవగాహన లేదు. తట్టుకోలేకపోయా..నా మనసులో ఉన్నదల్లా ఒక్కటే.. నేను ఎక్కడికీ వెళ్లను, మా అక్కకు వీలైనంత దగ్గరగా ఉండాలని ధృడంగా నిశ్చయించుకున్నాను. నిజానికి అప్పుడు అపరేశ్ (శిల్ప భర్త) ఉద్యోగంలో ఉన్నత స్థాయిలో ఉన్నాడు. అనుష్క (కూతురు) స్కూలుకు వెళ్తోంది, తనకంటూ స్నేహితులను సంపాదించుకుంది. అంతా సంతోషంగా సాగుతున్న సమయంలో అమ్మానాన్న ఒకరితర్వాత ఒకరు తక్కువ కాల వ్యవధిలోనే చనిపోయారు. నేను తట్టుకోలేకపోయాను. ఎప్పుడూ ఏడుస్తూనే..ఎప్పుడూ ఏడుస్తూ ఉండేదాన్ని. ఎంత ప్రయత్నించినా కన్నీళ్లు ఆగేవి కాదు. దేనిపైనా ఆసక్తి ఉండేది కాదు. ఒక రోబోలా తయారయ్యాను. బరువు పెరిగాను, కళ్ల కింద నల్లటి వలయాలు వచ్చాయి. ఎక్కడికీ వెళ్లేదాన్ని కాదు, ఏం చేసేదాన్నీ కాదు. కేవలం నా కూతుర్ని స్కూల్లో దింపిరావడం, స్కూల్ అయిపోగానే ఇంటికి తీసుకురావడం.. ఈ ఒక్కటే చేసేదాన్ని. ఇంట్లో ఎవరితోనూ సరిగా మాట్లాడేదాన్ని కాదు. ఒక్కోసారి నా తలను గోడకేసి బాదుకోవాలనిపించేది. జీవితంపై విరక్తి వచ్చింది.కూతుర్ని కొట్టా..డాక్టర్ను కలిశా.. యాంటీ డిప్రెసంట్స్ మందులు వాడాను. భర్తపై, కూతురిపై అరిచేదాన్ని.. ఒక్కోసారి ఆవేశంతో కూతుర్ని కొట్టేదాన్ని కూడా! కానీ, మా అక్కతో మాత్రం బాగా మాట్లాడేదాన్ని. తను మాత్రమే నన్ను బాగా అర్థం చేసుకునేది. తనకు దగ్గరగా ఉండాలనుకున్నాను. ఏదేమైనా ఇండియాకు వచ్చేయాలనుకున్నాను, వచ్చేశాను. నాకోసం నా భర్త న్యూజిలాండ్లో మంచి ఉద్యోగాన్ని కూడా వదిలేసి వచ్చాడు అని శిల్ప శిరోద్కర్ చెప్పుకొచ్చింది.చదవండి: 'కూలీ'ని రిజెక్ట్ చేసిన పుష్ప విలన్.. ఎందుకంటే? -
బాలీవుడ్ న్యూసెన్స్కి నో ఎంట్రీ.. వేలకోట్లున్నా సరే అక్కడికి అనుమతి ఉండదు
డబ్బుoటే కొండ మీద కోతి దిగొస్తుంది అంటారు అదేమో గానీ ఒక్కోసారి మనకు కావాల్సిన చోట, కోరుకున్నవారి మధ్య నివాసం కూడా పొందలేమని నిరూపితమవుతోంది. భారతదేశపు వాణిజ్య రాజధాని నగరమైన ముంబైలో సంపద ఉండడం అనేది వారి స్థాయిని నిర్దేశించే ఒక ప్రధాన అంశం, అయితే ఆ నగరంలోని కొన్ని ప్రాంతాలలో విస్తుపోయేలా దీనికి అతీతమైన ధోరణి కనిపిస్తుంది. అటువంటి ఒక ప్రాంతం, పెడ్డర్ రోడ్, ఈ రోడ్ సంపదకు మాత్రమే కాకుండా దానికే స్వంతమైన ఆలోచనల ద్వారా కూడా ప్రత్యేకంగా నిలుస్తుంది, ఇక్కడ నివాసాలకు అపారమైన సంపద లేదా ప్రముఖ హోదా కూడా అనుమతి, అంగీకారం పొందుతామనే హామీ ఇవ్వదు. ఈ విచిత్రమైన ఈ వాస్తవికతను ఇటీవల సీనియర్ జర్నలిస్ట్ విశాల్ భార్గవ వెలుగులోకి తెచ్చారు. ఈ ప్రాంతంలో ఇళ్ళు కొనడానికి ప్రయత్నించినప్పుడు బాలీవుడ్ సెలబ్రిటీలు తరచుగా అనధికారిక అడ్డంకులను ఎదుర్కొంటారని ఆయన చెప్పడం సంచలనంగా మారింది. అంతేకాదు దివంగత బిలియనీర్, బాలీవుడ్ సినిమాలకు పెట్టుబడిదారు రాకేష్ జున్ జున్ వాలా కూడా ఈ ప్రాంతంలోని ఒక ఎలైట్ క్లబ్ నుంచి తిరస్కరణను ఎదుర్కొన్నారని ఆయన వెల్లడించారు.‘ముంబై, మంచ్ అండ్ మార్కెట్ విత్ చింతన్ వాసని‘ పేరిట ఇన్స్ట్రాగామ్ ఎపిసోడ్లో ఆయన మాట్లాడుతూ, టాటా చైర్మన్ ముఖేష్ అంబానీ వంటి ప్రముఖులకు నిలయంగా, ‘ధనవంతులు, అంతకు మించిన సూపర్ రిచ్ల‘ డొమైన్గా పెడ్డర్ రోడ్ను అభివర్ణించారు. కానీ, సెలబ్రిటీలను ఎదురేగి ఆహ్వానించే, స్వీకరించే బాంద్రా మాదిరిగా కాకుండా, పెడ్డర్ రోడ్ సొసైటీలు తరచుగా బాలీవుడ్ నటులను తమకు పెద్ద న్యూసెన్స్లా చూస్తాయి, అక్కడ ఆస్తిని కొనుగోలు చేసే వారికి అనధికారిక పరిమితులను విధిస్తాయి అంటూ ఆశ్చర్యపరిచే నిజాలను ఆయన వెల్లడించారు.ఈ ప్రత్యేకత నివాస సొసైటీలతో పాటు విందు వినోద కేంద్రాలకు సైతం విస్తరించింది. దీనికి ఈ రోడ్లోని ఒక ప్రముఖ సంస్థ అయిన విల్లింగ్డన్ క్లబ్ను భార్గవ దీనికి ఉదహరించారు. ‘వారు బాలీవుడ్ నటులను ఇష్టపడరు, అంతేకాదు వారు అత్యున్నత విద్యావంతులు తప్ప ఇతరత్రా తమను తాము ఉన్నతంగా భావించే ఎవరినీ ఇష్టపడరు‘ అని ఆయన వివరించారు. భారత స్టాక్ మార్కెట్లో పేరొందిన ‘బిగ్ బుల్‘ అయిన జున్ జున్ వాలా ఆ ప్రాంతంలోని విల్లింగ్డన్ క్లబ్లో సభ్యత్వం పొందడానికి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని ఆయన అభ్యర్ధనను క్లబ్ ఏకంగా మూడుసార్లు తిరస్కరించడం జరిగిందని కూడా భార్గవ వెల్లడించారు.‘మీ దగ్గర డబ్బు ఉందడం ప్రాధాన్యత కాదు, పెద్దర్ రోడ్లో నివసించాలంటే డబ్బు కు మించిన విలువ ఏదైనా ఉండాలి‘ అని భార్గవ నొక్కిచెప్పారు. ‘ధనవంతులు సూపర్ రిచ్‘ గా ఉండటం చాలా సార్లు అర్హతగా మారుతుందని అయితే, ‘ధనవంతులు. ప్రముఖులు‘ గా ఉండటం అక్కడ అనర్హత అని ఆయన వివరించారు. బదులుగా, ‘ధనవంతులు అత్యంత ఆధునిక భావాలు కలిగిన వ్యక్తులు ఈ అల్ట్రా–ఎక్స్క్లూజివ్ ఆవరణలో ప్రవేశం పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అన్నారాయన.గత 2022లో ఆగస్టు 14 వ తేదీన తన 62 సంవత్సరాల వయసులో మరణించిన జున్ జున్ వాలా తన సామ్రాజ్యాన్ని రూ.5,000 పెట్టుబడి నుంచి 5.5 బిలియన్ల సంపదకు నిర్మించుకున్నారు. చురుకైన పెట్టుబడి వ్యూహాలతో ‘వారెన్ బఫెట్ ఆఫ్ ఇండియా‘ గా ప్రసిద్ధి చెందారు. అంతటి ప్రముఖ వ్యక్తి సైతం ఒక క్లబ్ సభ్యత్వం పొందలేకపోయారనే వాస్తవం వెల్లడి కావడం ముంబైలోని పెడ్డర్ రోడ్ పట్ల ఆసక్తిని రేకెత్తిస్తోంది. View this post on Instagram A post shared by Chintan Vasani️ (@chintanvasani) -
సీతగా 'సాయిపల్లవి'నే ఎందుకు.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్
భారత సినీ పరిశ్రమలోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమా 'రామాయణ'.. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం ఏకంగా రూ. 4 వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మూవీకి నితేశ్ తివారీ దర్శకుడు. ఇందులో రాముడిగా బాలీవుడ్ స్టార్ రణ్బీర్ కపూర్, సీత పాత్రలో సాయి పల్లవి నటిస్తున్నారు. రాకింగ్ స్టార్ యశ్ నిర్మాణ సంస్థ మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్, అలాగే నమిత్ మల్హోత్రా నిర్మాణ సంస్థ ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్ సంయుక్తంగా కలిసి ఈ మూవీని నిర్మిస్తున్నాయి. తాజాగా ఈ మూవీ టీమ్ మాట్లాడుతూ సీతగా సాయిపల్లవిని ఎందుకు ఎంపిక చేశారో పేర్కొంది.సీతా దేవి పాత్ర కోసం చాలామందిని అనుకున్నాం. కానీ, సాయిపల్లవిని ఫైనల్ చేయడానికి తమకు చాలా కారణాలు ఉన్నాయిని రామాయణ చిత్ర యూనిట్ పేర్కొంది. ఆమె గ్లామర్ పాత్రలకు దూరంగా ఉండటమే కాకుండా తన అందం కోసం ఆమె ఎలాంటి సర్జరీలు చేయించుకోలేదని తెలిపింది. సహజ అందమే తమ సినిమాకు బాగుంటుందని అనుకున్నామని, అలా ఒక సందేశం ఇచ్చినట్లు ఉంటుందని టీమ్ రామాయణ ప్రకటించింది. సాయి పల్లవి మంచి నటి కూడా.. ఎలాంటి పాత్రనైనా సులువుగా చేయగలదు. సీత పాత్ర తనకు ఎంతో పేరు తప్పకుండా తెస్తుందని వారు తెలిపారు. రాముడిగా రణ్బీర్ను తీసుకోవడానికి కారణం ఆయన మొఖంలో చాలా ప్రశాంతత కనిపిస్తుందని చెప్పారు. తనలోని వ్యక్తిత్వమే కాకుండా గొప్పగా నటించే నైపుణ్యం తనలో ఉందని మేకర్స్ చెప్పారు. ఈ మూవీ మొదటి పార్ట్ 2026 దీపావళికి, రెండోది 2027 దీపావళికి విడుదల కానున్న విషయం తెలిసిందే. హాలీవుడ్ హిట్ సినిమా'లార్డ్ ఆఫ్ ది రింగ్స్'కు పనిచేసిన స్టంట్ డైరెక్టర్ టెర్రీ ‘రామాయణ’ ప్రాజెక్ట్లో భాగమయ్యారని మేకర్స్ ప్రకటించారు. వానరసేన, హనుమాన్లతో కనిపించే సన్నివేశాలకు సంబంధించి ఆయన క్రియేట్ చేసిన ప్రపంచానికి అందరూ ఫిదా అవుతారని తెలిపారు. 'ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్'లో ఏ విధంగానైతే వీఎఫ్ఎక్స్ పనితీరు ఉంటుందో అదే విధంగా రామాయణ చిత్రంలోని వానరసేన అంతే సహజంగా ఉంటుందని టీమ్ తెలిపింది. -
థగ్ లైఫ్.. ఈ సినిమా ఎందుకు చేశావని తిట్టారు: బాలీవుడ్ నటుడు
భారీ అంచనాల మధ్య వచ్చి బోల్తా కొట్టిన సినిమాలెన్నో.. ఇటీవల వచ్చిన కమల్ హాసన్ థగ్ లైఫ్ మూవీ కూడా అదే కోవలోకి వస్తుంది. మణిరత్నం దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా నిలిచింది. అయితే ఈ సినిమాలో నటించినందుకు తనను నానామాటలు అన్నారని చెప్తున్నాడు బాలీవుడ్ నటుడు అలీ ఫజల్ (Ali Fazal).ఎందుకీ సినిమా చేశావ్?తాజాగా అలీ ఫజల్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. థగ్ లైఫ్ సినిమా (Thug Life Movie) నేనింతవరకు చూడలేదు. కానీ చాలామంది ఈ మూవీ ఎందుకు చేశావని తిట్టారు. దానికి ఒకే ఒక్క కారణం మణిరత్నం సర్. ఆయనపై ఉన్న అభిమానంతోనే ఈ మూవీలో నటించాను. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సరిగా ఆడలేదు. దాంతో నా స్నేహితులు, అభిమానులు ఎందుకీ సినిమా చేశావ్? అవసరమా నీకిది? అని కోప్పడ్డారు. వారందరికీ మరేం పర్వాలేదని బదులిచ్చాను.అది ముగిసిన చాప్టర్మణిరత్నం సర్ విజన్ను ప్రశ్నించేంత పెద్దవాడిని కాదు. వారు సినిమా కోసం కష్టపడ్డారు. కానీ షూటింగ్ జరిగేకొద్దీ కథలో చాలా మార్పులు జరిగాయని తెలుస్తోంది. అయినా థగ్ లైఫ్ చాప్టర్ ముగిసిపోయింది. భవిష్యత్తులో అవకాశం వస్తే మళ్లీ తప్పకుండా మణిరత్నం డైరెక్షన్లో నటిస్తాను అని అలీ ఫజల్ చెప్పుకొచ్చాడు.థగ్ లైఫ్మణిరత్నం- కమల్ హాసన్ కాంబినేషన్లో వచ్చిన రెండో చిత్రం థగ్ లైఫ్. గతంలో వీరి కాంబినేషన్లో నాయకుడు మూవీ వచ్చింది. బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది. ఆ తరహాలోనే థగ్ లైఫ్ కూడా ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఈ మూవీ విజయాన్ని అందుకోలేకపోయింది. జూన్ 5న విడుదలైన ఈ చిత్రం ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లో అందుబాటులో ఉంది.చదవండి: జబర్దస్త్ పవిత్రకు ప్రపోజ్ చేసిన ప్రిన్స్ యావర్.. అబ్బో! -
మళ్లీ వచ్చేస్తున్న 'కౌన్ బనేగా కరోడ్పతి'.. అమితాబ్ పారితోషికం ఎంతంటే?
ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) మరోసారి బుల్లితెరపై సందడి చేసేందుకు రెడీ అయ్యాడు. కౌన్ బనేగా కరోడ్పతి 17వ సీజన్తో అలరించనున్నాడు. ఈ షో ఆగస్టు 11 నుంచి ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని సోనీ టీవీ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఓ ప్రోమో రిలీజ్ చేసింది. అందులో ఈసారి కూడా అమితాబ్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నట్లు చూపించారు.25 ఏళ్ల క్రితం మొదలు..ఈ క్రమంలో బిగ్బీ పారితోషికం ఎంత ఉండొచ్చు? అని నెటిన్లు చర్చించుకుంటున్నారు. బీటౌన్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం అమితాబ్.. ఒక్క ఎపిసోడ్కు రూ.5 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడట! 25 ఏళ్ల క్రితం కౌన్ బనేగా కరోడ్పతి షో (Kaun Banega Crorepati Show) మొదలైంది. బిగ్బీ అడిగే ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పినవారు రూ.1 కోటి గెల్చుకునే అవకాశం ఉంటుంది. దీనికి సెలబ్రిటీలను కాకుండా సామాన్యులనే పార్టిసిపెంట్లుగా ఎంపిక చేసుకుంటారు. అందుకే ఈ షోకు ఎక్కువ క్రేజ్!తెలుగులోనూ..బిగ్బీ హోస్టింగ్, కోటి రూపాయల ప్రైజ్మనీతో.. రియాలిటీ షోలలోనే కేబీసీ సరికొత్త సంచలనంగా నిలిచింది. ఇదే షో తెలుగులో మీలో ఎవరు కోటీశ్వరుడు పేరిట ప్రారంభమైంది. మొదటి మూడు సీజన్లు నాగార్జున, నాలుగో సీజన్ చిరంజీవి, ఐదో సీజన్ జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేశారు. తర్వాతేమైందో కానీ తెలుగులో ఈ షోను కొనసాగించలేదు. అమితాబ్ సినిమాల విషయానికి వస్తే ఆయన ప్రస్తుతం సెక్షన్ 84 మూవీ చేస్తున్నాడు. దీనితో పాటు బిగ్బీ చేతిలో.. బ్రహ్మాస్త్ర 2, కల్కి 2898 ఏడీ సీక్వెల్ సినిమాలున్నాయి. View this post on Instagram A post shared by Sony Entertainment Television (@sonytvofficial) చదవండి: నా భార్య గర్భం దాల్చినా.. అందుకే పిల్లలు లేరు: అనుపమ్ ఖేర్ -
నా భార్య గర్భం దాల్చింది.. అయినా పిల్లలు లేరు: అనుపమ్ ఖేర్
కెరీర్ పీక్లో ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలని ఆరాటపడ్డాడు అనుపమ్ ఖేర్ (Anupam Kher). విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించాలని తాపత్రయపడ్డాడు. మంచి కథలను ఎంపిక చేసుకుని నటించేవాడు. గొప్ప నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. అయితే వృత్తి కోసం వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేశాడు. అనుపమ్ ఖేర్.. 1979లో నటి మధుమాలతిని పెళ్లి చేసుకోగా కొంతకాలానికే విడిపోయారు. 1985లో నటి కిరణ్ ఖేర్ (Kirron Kher)ను పెళ్లాడాడు. కిరణ్కు కూడా ఇది రెండో పెళ్లి! కొడుకున్న నటితో రెండో పెళ్లిగతంలో ఆమె వ్యాపారవేత్త గౌతమ్ను పెళ్లాడగా వీరికి సికిందర్ అనే కుమారుడు జన్మించాడు. దంపతుల మధ్య పొరపచ్చాలు రావడంతో అతడికి విడాకులిచ్చేసి 1985లో అనుపమ్ను పెళ్లాడింది. అయితే అనుపమ్- కిరణ్ జంటకు సంతానం లేదు. గతంలో ఈ విషయాన్ని తలుచుకుని బాధపడ్డాడు నటుడు. ఎంతైనా ఓ కొడుకు ఉంటే, వాడు కళ్ల ముందు పెరుగుతూ ఉంటే ఆ సంతోషమే వేరేలా ఉండేదని ఫీలయ్యాడు. గర్భం దాల్చినా..తాజాగా ఓ ఇంటర్వ్యూలో మరోసారి గుండెలోని వెలితిని వెల్లడించాడు. నేను స్థాపించిన స్వచ్ఛంద సంస్థలో ఎంతోమంది పిల్లలతో కలిసి పని చేస్తుంటాను. పిల్లలంటే నాకు చాలా ఇష్టం. సే నా సమ్థింగ్ టు అనుపమ్ అంకుల్ అని వారితో ఓ షో చేసేవాడిని. ఇది చిన్నారుల షో! కన్నకొడుకు లేనందుకు ఒక్కోసారి బాధగా అనిపిస్తుంది. మా పెళ్లయిన మొదట్లో కిరణ్ ప్రెగ్నెంట్ అవలేదు. తీరా గర్భం దాల్చినప్పుడు లోపల శిశువు ఎదుగుదల సరిగా లేదు. అప్పుడేదీ మిస్ అవలేదునేను కెరీర్లో బిజీగా ఉండటంతో పట్టించుకోలేదు. అయినా నాకు సికిందర్ చాలు. కిరణ్ను పెళ్లి చేసుకున్నప్పుడు అతడికి నాలుగేళ్లు. తను నా జీవితంలోకి వచ్చాక నేనేదీ మిస్ అవుతున్నట్లు అనుకోలేదు. 60 దాటాక మాత్రమే నాకంటూ కన్న కొడుకుంటే బాగుండని కొన్నిసార్లు అనిపించింది అని చెప్పుకొచ్చాడు. అనుపమ్ కీలక పాత్రలో నటించిన తన్వి ద గ్రేట్ మూవీ జూలై 18న విడుదల కానుంది. అలాగే హరిహర వీరమల్లు చిత్రం జూలై 24న రిలీజ్ అవుతోంది.చదవండి: బాహుబలి, ఆర్ఆర్ఆర్ కాదు.. రాజమౌళి బెస్ట్ ఫిల్మ్ ఇదేనట! -
కౌంట్ డౌన్ స్టార్ట్
‘‘వెండితెరపై యుద్ధానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. 30 రోజుల్లో బాక్సాఫీస్ విధ్వంసానికి ‘వార్ 2’’ సిద్ధం అంటూ చిత్రయూనిట్ పేర్కొంది. హృతిక్ రోషన్, కియారా అద్వానీ జంటగా నటించిన చిత్రం ‘వార్ 2’. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమా ద్వారా హీరో ఎన్టీఆర్ హిందీ చిత్ర పరిశ్రమకి పరిచయమవుతున్నారు. యశ్ రాజ్ ఫిల్మ్స్పై ఆదిత్యా చోప్రా నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 14న హిందీ, తెలుగు, తమిళ భాషల్లో పాన్ ఇండియా ఫిల్మ్గా విడుదల కానుంది.‘వార్ 2’ ముప్పై రోజుల్లో రానుందని తెలిసేలా తాజాగా ఓపోస్టర్ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పోస్టర్లో హృతిక్ రోషన్, ఎన్టీఆర్, కియారా అద్వానీపాత్రల్ని చూపించేలా డిజైన్ చేశారు. ‘‘యాక్షన్ ఓరియంటెడ్ స్పై డ్రామాగా రూపొందిన చిత్రం ‘వార్ 2’’ అని చిత్రబృందం పేర్కొంది. -
రోడ్డుపై చిత్తు కాగితాలతో నటి.. తనలో తనే మాట్లాడుకుంటూ..
బుల్లితెరపై, వెండితెరపై వెలుగు వెలిగిన నటి సడన్గా రోడ్డుపై ప్రత్యక్షమైంది. తనలో తనే మాట్లాడుకుంటూ, చిత్తు కాగితంపై ఏదో రాస్తూ కనిపించింది. ఆమెను గుర్తుపట్టని జనాలు ఎవరు నువ్వు? అని ఆరా తీయగా తాను నటినని, తన పేరు సుమి హర్ చౌదరి అని వెల్లడించింది. నడిరోడ్డుపై ఒంటరిగా..సుమి హర్ చౌదరి (Sumi Har Chowdhury).. బెంగాలీ నటి. పలు సీరియల్స్తో పాటు సినిమాలు కూడా చేసింది. ద్వితియో పురుష్, కాశీ కథ: ఎ గోట్ సాగా వంటి చిత్రాలతో ఎక్కువ గుర్తింపు తెచ్చుకుంది. కొంతకాలంగా వెండితెర, బుల్లితెరకు దూరంగా ఉంటున్న ఆమె మంగళవారం నాడు రోడ్లపై తిరుగుతూ కనిపించింది. పశ్చిమ బెంగాల్లోని పర్ప బార్దమాన్ జిల్లా అమిలా బజార్లోని దిక్కు తోచని స్థితిలో ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తోంది. హైవేపై నడుచుకుంటూ కొంతదూరం వెళ్లిన ఆమె ఒకచోట ఆగి పక్కన కూర్చుని చిత్తుకాగితంపై ఏదో రాసుకుంటూ ఉందట! నమ్మలేకపోయిన జనాలుతనలో తనే సగం బెంగాలీ, సగం ఇంగ్లీష్లో ఏదేదో మాట్లాడుకుంటూ ఉండటాన్ని అక్కడే ఉన్న స్థానికులు గమనించారు. ఎవరు నువ్వు? అని వారు పలకరించగా.. తన పేరు సుమి హర్ చౌదరి అని, తాను నటిని అని చెప్పింది. మొదట నమ్మలేకపోయిన స్థానికులు గూగుల్లో వెతికి చూడగా తను చెప్పింది నిజమేనని గ్రహించారు. వెంటనే పోలీసులకు సమాచారమివ్వగా.. వారు అక్కడికి చేరుకుని నటిని షెల్టర్కు తరలించారు. ఆమె కుటుంబ సభ్యులను సంప్రదించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.చదవండి: శూర్పణఖగా 10th క్లాస్ అమ్మాయి.. ఆమె ఎవరంటే? -
శూర్పణఖగా 10th క్లాస్ అమ్మాయి.. ఆమె ఎవరంటే?
సినిమాను విజువల్ వండర్లా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ఎంత ఖర్చయినా వెనక్కు తగ్గడం లేదు నిర్మాతలు. మామూలు సినిమాకు కూడా రూ.100 కోట్ల బడ్జెట్ అనేది సాధారణమైపోయింది. ఆర్ఆర్ఆర్, కల్కి 2898ఏడీ, ఆదిపురుష్.. ఇవన్నీ అయితే రూ.500 కోట్లపైనే పెట్టి తీశారు. అయితే భారతీయ సినీచరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా రామాయణ చిత్రం (Ramayana Movie) తెరకెక్కుతోంది. నితీశ్ తివారీ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో రణ్బీర్ కపూర్ రాముడిగా, సాయిపల్లవి సీతాదేవిగా నటిస్తున్నారు. బాల శూర్పణఖగా..రాకింగ్ స్టార్ యశ్ రావణుడిగా, సన్నీ డియోల్ హనుమంతుడిగా, రవి దూబే లక్ష్మణుడిగా కనిపించనున్నారు. శూర్పణఖ పాత్ర కోసం ప్రియాంక చోప్రాను సంప్రదించగా ఆమె బిజీగా ఉండటంతో అవకాశాన్ని వదిలేసుకుందట. దీంతో ఈ రోల్ రకుల్కు వెళ్లిందని ప్రచారం జరిగింది. లేటెస్ట్ టాక్ ప్రకారం.. పదిహేనేళ్ల దిశిత సెగల్ను బాల శూర్పణఖగా వెండితెరపై చూపించాలని ప్రయత్నిస్తున్నారట! ఆడిషన్తో పాటు లుక్ టెస్ట్ కూడా అయిపోందని, తనపై కొన్ని సీన్లు కూడా చిత్రీకరించారని బీటౌన్లో ప్రచారం జరుగుతోంది. మరి ఇదెంతవరకు నిజమన్నది తెలియాల్సి ఉంది.ఎవరీ దిశిత సెగల్?నాలుగేళ్లే వయసులోనే వాణిజ్య ప్రకటనల్లో కనిపించింది దిశిత. బేబీ సినిమాలో అక్షయ్ కుమార్ కూతురిగా, డియర్ జిందగీలో చిన్నారి ఆలియా భట్లా యాక్ట్ చేసింది. వార్, హిందీ మీడియం చిత్రాల్లోనూ నటించింది. ఇటీవలే బెహాన్ డర్గయినా అనే ఓటీటీ షోలోనూ మెరిసింది. View this post on Instagram A post shared by Dishita Sehgal🧿 (@cutiepiedishita) చదవండి: జీవితంలో తొలిసారి పిడకలు చేశా.. ఆ మరునాడే..: నిత్యామీనన్ -
స్టూడెంట్స్ ముగ్గురికీ ఆడపిల్లలే పుట్టారు
బాలీవుడ్లో మరో జంట గుడ్ న్యూస్ చెప్పేశారు. తెలుగులో 'భరత్ అను నేను', 'వినయ విధేయ రామ', 'గేమ్ ఛేంజర్' సినిమాల్లో హీరోయిన్గా చేసిన కియారా అడ్వాణీకి ఆడపిల్ల పుట్టింది. మంగళవారం రాత్రి బిడ్డకు జన్మనివ్వగా.. బుధవారం కియారా-సిద్ధార్థ్ జంట తమకు ఆడపిల్ల పుట్టిన విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ క్రమంలోనే నెటిజన్లు ఓ ఆసక్తికర విషయాన్ని కనిపెట్టారు. ఇప్పుడు అదికాస్త వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: హీరోతో 'బ్రహ్మముడి' సీరియల్ నటి నిశ్చితార్థం)2012లో 'స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్' సినిమాతో ఆలియా భట్, సిద్ధార్థ్ మల్హోత్రా, వరుణ్ ధావన్ పరిచయమయ్యారు. వీళ్లు ముగ్గురు ప్రస్తుతం పలు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఆలియా భట్ ఇప్పటికే స్టార్ హీరోయిన్ అయిపోయింది. 2022లో హీరో రణ్బీర్ కపూర్ని పెళ్లి చేసుకోగా అదే ఏడాది కూతురు రహాకి జన్మనిచ్చింది. కూతురితో ఆలియా ఎప్పటికప్పుడు మీడియా కంట పడుతూనే ఉంటుంది. ఈమె కూతురికి సోషల్ మీడియాలోనూ మంచి ఫాలోయింగ్ ఉంది.వరుణ్ ధావన్ విషయానికొస్తే నటాషా దలాల్ అనే అమ్మాయిని 2021లో పెళ్లి చేసుకున్నాడు. గతేడాది జూన్లో ఇతడికి కూడా కూతురు పుట్టింది. ఇప్పుడు సిద్ధార్థ్ మల్హోత్రాకు కూడా కూతురే పుట్టంది. దీంతో 'స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్'లో హీరోహీరోయిన్లు అయిన ముగ్గురికీ ఆడపిల్లనే పుట్టిందని నెటిజన్లు అంటున్నారు.(ఇదీ చదవండి: ఆ హాలీవుడ్ మూవీ చూస్తుంటే 'జెర్సీ' గుర్తొచ్చింది: నాగవంశీ) View this post on Instagram A post shared by Sidharth Malhotra (@sidmalhotra) -
ఆస్పత్రిలో పంచాయత్ వెబ్ సిరీస్ నటుడు.. జీవితం చాలా చిన్నదంటూ పోస్ట్!
పంచాయత్ వెబ్ సిరీస్తో ఫేమ్ తెచ్చుకున్న నటుడు ఆసిఫ్ ఖాన్ ఆస్పత్రిలో చేరారు. గుండె పోటు రావడంతో ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. జీవితం చాలా చిన్నది అంటూ ఆస్పత్రి పైకప్పు ఫోటోను షేర్ చేశారు. ఇది చూసిన అభిమానులు త్వరగా కోలుకోవాలంటూ పోస్టులు పెడుతున్నారు.‘మీర్జాపూర్ వెబ్సిరీస్తో ఓటీటీకి ఎంట్రీ ఇచ్చిన ఆసిఫ్ ఖాన్ మంచి గుర్తింపు పొందారు. ఆ తర్వాత పంచాయత్, పాతాళ్ లోక్ వంటి వెబ్ సిరీస్ల్లోనూ కీలక పాత్రలు పోషించారు. అంతేకాకుండా రెడీ, టాయిలెట్, అగ్నిపథ్, పాగ్లైట్, కాకుడా హిందీ సినిమాల్లో నటించారు. అయితే ఆసిఫ్ ఖాన్ రెండు రోజుల క్రితం అయితే గుండెపోటుతో ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం. ప్రస్తుతం బాగానే ఉన్నారని.. రెండు రోజుల్లో డిశ్చార్జ్ అవుతాడని తెలుస్తోంది.ఆసిఫ్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో ఆస్పత్రి పైకప్పు ఫోటోను షేర్ చేస్తూ.. "గత 36 గంటలుగా దీన్ని చూసిన తర్వాత జీవితం చిన్నది. ఏ రోజును తేలికగా తీసుకోకండి, ప్రతిదీ ఒక్క క్షణంలో మారవచ్చు., మీ దగ్గర ఉన్నదాని పట్ల కృతజ్ఞతతో ఉండండి. మీకు ఎవరు ఎక్కువ ముఖ్యమైనవారో గుర్తుంచుకోండి. ఎల్లప్పుడూ వారిని గౌరవించండి. జీవితం ఒక బహుమతి' అని రాసుకొచ్చారు. కాగా.. పంచాయత్' వెబ్ సిరీస్లో ఆసిఫ్ ఖాన్.. గణేష్ పాత్రను పోషించాడు. -
సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. సీనియర్ నటుడు కన్నుమూత
ఇటీవల సినీ పరిశ్రమలో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. టాలీవుడ్లో కోట శ్రీనివాసరావు మరణించగా.. ఆ తర్వాత మరో సీనియర్ నటి సరోజా దేవి కూడా కన్నుమూశారు. ఇవాళ మరో ప్రముఖ నటుడు మృతి చెందారు. బాలీవుడ్ నిర్మాత అయిన ధీరజ్ కుమార్ ముంబయిలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆయన న్యుమోనియాతో బాధపడుతూ ఆస్పత్రిలో చేరగా.. కోలుకోలేక తుదిశ్వాస విడిచారు.కాగా.. ధీరజ్ కుమార్ 1965లో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ఆయన తన కెరీర్లో సినిమాలతో పాటు సీరియల్స్లోనూ నటించారు. 1970- 1984 మధ్య దాదాపు 21 పంజాబీ చిత్రాలలో నటించాడు. 'ఓం నమః శివాయ్' వంటి ఆధ్యాత్మిక, పౌరాణిక కార్యక్రమాలకు ప్రసిద్ధి చెందిన క్రియేటివ్ ఐ అనే నిర్మాణ సంస్థను స్థాపించాడు. అంతేకాకుండా 'స్వామి', 'హీరా పన్నా' 'రాతోన్ కా రాజా' వంటి లాంటి హిందీ చిత్రాలలో కూడా నటించాడు. ఆ తర్వాత రోటీ కపడా ఔర్ మకాన్ (1974), సర్గం (1979), క్రాంతి (1981) వంటి చిత్రాలలో సహాయక పాత్రలు పోషించారు. దాదాపు ఐదు దశాబ్దాలకు పైగా సినిమాల్లో ధీరజ్ కుమార్ కొనసాగారు. ధీరజ్ కుమార్ మరణ వార్తను ధృవీకరించిన ఆయన కుటుంబం.. అభిమానులు, శ్రేయోభిలాషుల ప్రార్థనలకు కృతజ్ఞతలు తెలిపింది. రేపు ఉదయం 10 గంటల వరకు అభిమానుల సందర్శనార్థం భౌతికకాయాన్ని ఇంటివద్దకు తరలించనున్నారు. అనంతరం ఉదయం 11 గంటలకు విలే పార్లే వెస్ట్లోని పవన్ హన్స్ శ్మశానవాటికలో అంత్యక్రియలు జరుగుతాయి. -
నటిపై దారుణ ట్రోల్స్.. మహిళలంటే ఎందుకంత ద్వేషం.. ఉర్ఫీ జావెద్ ఆగ్రహం!
బిగ్బాస్ బ్యూటీ ఉర్ఫీ జావెద్ మరోసారి వార్తల్లో నిలిచింది. ఇటీవలే ది ట్రైటర్స్ టైటిల్ గెలిచిన ముద్దుగుమ్మ నెటిజన్స్ ట్రోల్స్పై తీవ్రస్థాయిలో మండిపడింది. ఇలాంటివీ నా జీవితంలో చాలా చూశానని ఉర్ఫీ చెప్పుకొచ్చింది. ఒక మహిళ ఎదుగుతుంటే ఓర్వలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజాగా ఇటీవల ప్రముఖ యూట్యూబర్ ఆశిష్ చంచలానీతో ప్రేమలో ఉన్నట్లు నటి ఎల్లీ అవ్రామ్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే ఇది చూసిన నెటిజన్స్ ఈ జంటపై ట్రోల్స్ చేయడం ప్రారంభించారు.ఈ ప్రేమజంటను చూసి ట్రోల్స్ చేయడంపై నటి ఉర్ఫీ జావెద్ మండిపడింది. ఎల్లి అవ్రామ్ను లక్ష్యంగా చేసుకుని ట్రోల్స్ చేసినందుకు ఉర్ఫీ జావేద్ విమర్శించింది. ఈ రోజుల్లో స్త్రీలపై విద్వేషం చూపించడం ఫ్యాషన్ అయిపోయిందన్నారు. ఇది చూస్తుంటే మహిళల పట్ల ఈ ప్రపంచం ఎంత క్రూరంగా ఉందో అర్థమవుతోందని చెప్పింది. కేవలం ఒక అమ్మాయి వయసును ఉద్దేశించి కామెంట్స్ చేయడమేంటని ఉర్ఫీ ప్రశ్నించింది. ఇక్కడ మహిళలను విలన్గా చూపించడానికి, ద్వేషించడానికే ఎక్కువ ఇష్టపడతారని.. అదే వారు ఉన్నతంగా భావిస్తారని ఉర్ఫీ ఆవేదన వ్యక్తం చేసింది. సమాజం ఎల్లప్పుడూ మహిళలను విమర్శించడానికి ఏదో ఒక మార్గాన్ని ఎంచుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేసింది.కాగా.. జూలై 12న, ఆశిశ్, ఎల్లీ ఇన్స్టాగ్రామ్లో ఇద్దరు కలిసి ఉన్న ఫోటోను పోస్ట్ చేశారు. ఆశిష్ ఎల్లీని తన చేతుల్లోకి ఎత్తుకుని కనిపించారు. తామిద్దరం ప్రేమలో ఉన్నట్లు ఫైనల్లీ అంటూ క్యాప్షన్ రాసుకొచ్చారు. ఇది చూసిన నెటిజన్స్ వీరిద్దరి వయస్సును ఉద్దేశిస్తూ ట్రోల్స్ చేశారు. అయితే వీరిద్దరి మధ్య మూడేళ్ల ఏజ్ గ్యాప్ ఉంది.యూట్యూబ్లో ఫన్నీ వీడియోలతో అశిష్ చంచ్లానీ చాలా పాపులారిటీ సొంతం చేసుకున్నాడు. ఒకటి రెండు సినిమాల్లోనూ నటించాడు. రీసెంట్ టైంలో ఇతడు బాలీవుడ్ నటి ఎల్లీ అవ్రామ్తో తరచుగా కనిపిస్తూ వచ్చాడు. దీంతో వీరిద్దరి మధ్య సమ్థింగ్ సమ్థింగ్ అని నెటిజన్లు మాట్లాడుకున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు 'ఫైనల్లీ' అని ఆశిష్ ఓ ఫొటో పోస్ట్ చేశాడు. ఇందులో ఎల్లీని ఎత్తుకుని, ఇద్దరు నవ్వుతూ కనిపించారు. దీంతో పలువురు నటులు వీళ్లకు కంగ్రాట్స్ చెబుతున్నారు.మరోవైపు ఎల్లీ అవ్రామ్ విషయానికొస్తే ఈమెది మన దేశం కాదు స్వీడన్. కాకపోతే మోడలింగ్ చేస్తూ బాలీవుడ్ దర్శకుల దృష్టిలో పడింది. అలా 2013 నుంచి హిందీతో పాటు తమిళ, కన్నడ, మరాఠీ భాషల్లో పలు సినిమాల్లో నటించింది. బిగ్బాస్ 7, జలక్ ధిక్లా జా 7, బాక్స్ క్రికెట్ లీగ్ 2 తదితర రియాలిటీ షోల్లోనూ పాల్గొంది. -
ఓటీటీకి సరికొత్త క్రైమ్ థ్రిల్లర్.. ట్రైలర్ చూశారా?
ఓటీటీలో కంటెంట్కు డిమాండ్ విపరీతంగా పెరిగిపోతోంది. దీంతో మేకర్స్ సైతం సరికొత్త మిస్టరీ థ్రిల్లర్స్తో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. తాజాగా ఓటీటీ ప్రియులను అలరించేందుకు మరో మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ వచ్చేస్తోంది. బాలీవుడ్ నటి వాణీ కపూర్ లీడ్రోల్ పోషించిన సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ మండల మర్డర్స్. ఈ సిరీస్ నెట్ఫ్లిక్స్ వేదికగా సందడి చేయనుంది.ఈ నేపథ్యంలోనే ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్. ఈ సిరీస్లో వాణీకపూర్ పోలీస్ ఆఫీసర్గా కనిపించనుంది. వైభవ్ రాజ్ గుప్తా, సుర్వీన్ చావ్లా కీలక పాత్రలు పోషిస్తున్నారు. కొన్ని శతాబ్దాల కిందట చరణ్దాస్పూర్లో జరిగిన హత్యల నేపథ్యంలో ఈ సిరీస్ను తెరకెక్కించారు. ఈ వెబ్ సిరీస్కు గోపి పుత్రన్ దర్శకత్వం వహించగా.. యశ్రాజ్ ఫిల్మ్స్ బ్యానర్లో నిర్మించారు. ఈ సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ఈనెల 25 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. -
విడాకుల తర్వాత కొత్త ప్రయాణం.. మళ్లీ పెళ్లి చేసుకోని తారలు వీళ్లే!
బాలీవుడ్ నటీనటులకు ప్రేమ, పెళ్లి, విడాకులు సర్వసాధారణం అనే టాక్ బయట ఉంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఎంతో మంది స్టార్స్ కొన్నాళ్లకే విడిపోయారు. పలువురు విడాకులు తీసుకొని మరోపెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని గడుపుతున్నారు. అయితే రూపాయికి ఇంకో వైపు ఉన్నట్లుగా.. బాలీవుడ్ తారల్లో మరో కోణం కూడా ఉంది. విడాకులు తీసుకున్న తర్వాత..మరో పెళ్లి చేసుకొని తారలు కూడా ఉన్నారు. పెళ్లి బంధానికి స్వస్తి చెప్పి.. సింగిల్గానే ఉంటూ కెరీర్పై దృష్టిసారించిన కొంతమంది బాలీవుడ్ స్టార్స్పై ఓ లుక్కేద్దాం. మనీషా కొయిరాలామనీషా కొయిరాలా, 1990లలో తన అందం, నటనతో బాలీవుడ్ను ఓ ఊపు ఊపిన నటి. 'దిల్ సే', 'ఒకే ఒక్కడు' వంటి చిత్రాలతో స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందిన ఆమె, 2010లో నేపాలీ వ్యాపారవేత్త సామ్రాట్ దహల్ను వివాహం చేసుకుంది. అయితే, వివాహం జరిగిన ఆరు నెలలకే వారి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తాయి. దీంతో 2012లో విడాకులు తీసుకుంది. ఆ తర్వాత మనీషా మరో పెళ్లి చేసుకోకుకండా ఒంటరిగానే ఉంటుంది. ప్రస్తుతం ఆమె సినిమాల్లో కొనసాగుతూ, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్నారు. పూజా భట్పూజా భట్, 'దిల్ హై కి మాంతా నహీ', 'సడక్' వంటి చిత్రాలతో పాపులర్ అయిన నటి మరియు నిర్మాత. ఆమె 2003లో వ్యాపారవేత్త మనీష్ మఖీజాను వివాహం చేసుకుంది, కానీ 2014లో వారు విడిపోయారు. ఆ తర్వాత మరో పెళ్లి చేసుకోకుండా.. ఒంటరిగానే ఉంటున్నారు. ప్రస్తుతం ఆమె సినిమా నిర్మాణం, దర్శకత్వంలో బిజీగా ఉన్నారు. చిత్రాంగద సింగ్చిత్రాంగద సింగ్, 'హజారోం ఖ్వాహిషే ఐసీ', 'దేశీ బాయ్జ్' వంటి చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న నటి. ఆమె 2001లో గోల్ఫర్ జ్యోతి రంధావాను వివాహం చేసుకుంది. వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. అయితే, 2013లో వారు విడిపోయారు, 2014లో విడాకులు ఖరారయ్యాయి. చిత్రాంగద తన కెరీర్పై దృష్టి సారించి, సినిమాల్లో నటిస్తూ, సింగిల్ మదర్గా తన కుమారుడిని పెంచుతోంది. ప్రస్తుతం వరకు ఆమె మళ్లీ వివాహం చేసుకోలేదు, తన వృత్తి, కుటుంబంపై దృష్టి పెట్టింది.కరిష్మా కపూర్'రాజా హిందుస్థానీ', 'దిల్ తో పాగల్ హై' వంటి చిత్రాలతో 90లలో స్టార్డమ్ సంపాదింకున్న నటి కరిష్మా కపూర్. ఆమె 2003లో వ్యాపారవేత్త సంజయ్ కపూర్ను వివాహం చేసుకుంది, వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే, వైవాహిక సమస్యల కారణంగా 2014లో విడిపోయి, 2016లో విడాకులు తీసుకుంది. కరిష్మా ప్రస్తుతం సినిమా నిర్మాణంలో నిమగ్నమై, తన పిల్లల సంరక్షణపై దృష్టి సారిస్తూ సింగిల్గా జీవిస్తోంది. ఆమె మళ్లీ వివాహం చేసుకోలేదు.రేఖాబాలీవుడ్ దిగ్గజ నటి రేఖా, తన అద్భుతమైన నటనతో దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తోంది. ఆమె 1990లో వ్యాపారవేత్త ముఖేష్ అగర్వాల్ను వివాహం చేసుకుంది, కానీ ఈ వివాహం కేవలం ఒక సంవత్సరం మాత్రమే కొనసాగింది. ముఖేష్ 1991లో ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. ఆ తర్వాత రేఖ మళ్లీ వివాహం చేసుకోలేదు. వీరితో పాటు పలువురు బాలీవుడ్ తారలు విడాకుల తర్వాత ఒంటరి జీవితాన్నే గడుపుతున్నారు. -
ప్రీ-మెటర్నిటీ షూట్ కూడా చేశా.. కానీ ఒక్కరోజు ముందే..!
ప్రముఖ బిగ్బాస్ బ్యూటీ, బుల్లితెర నటి సంభావన సేత్ బాలీవుడ్లో పలు సీరియల్స్లో నటించింది. సీరియల్స్తో పాటు కొన్ని సినిమాల్లో కూడా కనిపించింది. 2016లో అవినాశ్ ద్వివేదిని పెళ్లాడిన ఈ ముద్దుగుమ్మ.. తాజాగా తనకెదురైన చేదు అనుభవాన్ని పంచుకుంది. గతేడాది ఐవీఎఫ్ ద్వారా గర్భం దాల్చగా.. ఆ తర్వాత జరిగిన షాకింగ్ ఘటనను వివరించింది.గతేడాది డిసెంబర్లో జరిగిన తనకు గర్భస్రావమైందని సంభావన సేత్ వెల్లడించింది. మొదటి త్రైమాసికంలో అంతా బాగానే ఉందని వైద్యుడు మాకు హామీ ఇస్తూనే ఉన్నాడని తెలిపింది. కానీ ఆ తర్వాత గర్భంలో తన బిడ్డ హృదయ స్పందన 15 రోజుల ముందే ఆగిపోయిందని తాను గుర్తించానని వెల్లడించింది. మూడు నెలల గర్భవతిగా ఉన్నప్పుడు ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించాలని ప్రీ-మెటర్నిటీ షూట్ కూడా నిర్వహించామని సంభావన పేర్కొంది. ఈ సంతోషకర విషయాన్ని చెప్పేందుకు ఒక రోజు ముందే తనకు బ్లీడింగ్ మొదలైందని షాకింగ్ విషయాన్ని రివీల్ చేసింది.అయితే దాదాపు 15 రోజుల ముందే అనారోగ్యంతో ఉన్నానని వైద్యుడికి సమాచారం ఇచ్చా.. కానీ నాకు ఆర్థరైటిస్ సమస్య అని తేలిగ్గా తీసుకున్నారు. ఆ తర్వాత ఆర్థరైటిస్ స్పెషలిస్ట్ వద్దకు వెళ్లగా అలాంటిదేం లేదని చెప్పారు.. ఇది గర్భస్రావానికి సంకేతమని డాక్టర్ అన్నారు. కానీ మేము సంప్రదించిన డాక్టర్ మాత్రం ఎలాంటి టెస్టులు చేయకుండా అంతా నార్మల్గానే ఉందని చెప్పారని గుర్తు చేసుకుంది. డాక్టర్ నిర్లక్ష్యం వల్లే తనకు గర్భస్రావం అయిందని తెలుసొచ్చిందని సంభావన వివరించింది. అంతేకాకుండా మీకు చాలా ఆరోగ్య సమస్యలు ఉన్నాయంటూ తనదే తప్పు అన్నట్లుగా మాట్లాడిందని తన బాధను వ్యక్తం చేసింది -
'రామాయణ' బడ్జెట్ రివీల్ చేసిన నిర్మాత.. మీ ఊహకు కూడా అందదు
రామాయణం మానవ జీవితానికి అవసరమైన విలువలను, మార్గదర్శకత్వాన్ని అందించే ఒక గొప్ప గ్రంథం. మన రాముడి గురించి 'రామాయణ' సినిమా ద్వారా ప్రపంచానికి బాలీవుడ్ చూపనుంది. తాజాగా విడుదలైన గ్లింప్స్ విజువల్స్ అద్బుతంగా ఉన్నాయంటూ గ్రాఫిక్స్ వర్క్పై ప్రశంసలు అందుతున్నాయి. దర్శకుడు నితేశ్ తివారీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రాముడి పాత్రలో బాలీవుడ్ స్టార్ రణ్బీర్ కపూర్, సీత పాత్రలో సాయి పల్లవి నటిస్తున్నారు. రాకింగ్ స్టార్ యశ్ నిర్మాణ సంస్థ మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్, అలాగే నమిత్ మల్హోత్రా నిర్మాణ సంస్థ ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్ సంయుక్తంగా కలిసి ఈ మూవీని నిర్మిస్తున్నాయి. రెండు భాగాలుగా రానున్న ఈ చిత్రాల బడ్జెట్ గురించి నమిత్ మల్హోత్రా సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.రూ. 4 వేల కోట్ల బడ్జెట్ఇటీవల జరిగిన పాడ్కాస్ట్లో, నమిత్ మల్హోత్రా మాట్లాడుతూ.. రామాయణంలోని రెండు భాగాలకు దాదాపు $500 మిలియన్లు, అంటే దాదాపు రూ. 4000 కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. దీంతో రామాయణం అత్యంత ఖరీదైన భారతీయ చిత్రంగా నిలిచింది. ఇప్పటివరకు విడుదలైన భారతీయ చిత్రాల బడ్జెట్లు ఏవీ 1000 కోట్లు దాటలేదు. ఈ బడ్జెట్తో రామాయణం ప్రపంచ సినిమాల్లో అత్యంత ఖరీదైన ఫ్రాంచైజీలలో ఒకటిగా కూడా మారనుంది. ఇప్పటివరకు ఈ చిత్రాల బడ్జెట్ రూ. 1500 కోట్ల వరకు ఉంటుందని మీడియాలో కథనాలు వచ్చాయి. ఇప్పుడు నిర్మాత చెప్పిన లెక్కలు చూస్తుంటే కళ్లు చెదిరేలా ఈ మూవీ ఉండబోతుందని అర్థం అవుతుంది."పార్ట్ 1, పార్ట్ 2 రెండు సినిమాలు కలిపి పూర్తయ్యే సమయానికి ఇది దాదాపు $500 మిలియన్లు అవుతుంది, అంటే దాదాపు రూ. 4000 కోట్లు. ప్రపంచం చూడవలసిన గొప్ప కథ రామాయణం. మేము ప్రపంచంలోనే అతిపెద్ద చిత్రాన్ని నిర్మిస్తున్నాము. అయితే, ఇది ఇప్పటికీ కొన్ని హాలీవుడ్ చిత్రాల బడ్జెట్ల కంటే తక్కువేనని నేను భావిస్తున్నాను. తక్కువ ఖర్చుతో పెద్ద చిత్రాన్ని నిర్మిస్తున్నామని నేను భావిస్తున్నాను. ఈ చిత్రం కేవలం డబ్బు కోసమే చేస్తుంది కాదు. ప్రపంచానికి మన రాముడి గురించి చెప్పాలని అనుకున్నాను.' అని నమిత్ అన్నారు. 20కి పైగా భాషలుహాలీవుడ్లోని ఇతర సినిమాల మాదిరిగానే రామాయణం కూడా ప్రపంచవ్యాప్తంగా సుమారు 20కి పైగా భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రాన్ని DC కామిక్స్ హిట్ చిత్రాలు బ్యాట్మన్, సూపర్ మెన్, వండర్ వుమన్ వంటి వాటితో పాటు మార్వెల్ సినిమాలకు తగ్గకుండా రామాయణ ప్రాజెక్ట్ రూపొందించాలని మేకర్స్ యోచిస్తున్నారు. మొదటి భాగం 2026 దీపావళి సందర్భంగా విడుదల కానుంది. రెండవ భాగం 2027 దీపావళి సందర్భంగా తెరపైకి రానుంది. -
లార్డ్స్లో లవ్ బర్డ్స్.. బాయ్ఫ్రెండ్తో ఆదిపురుష్ భామ సందడి!
ఆదిపురుష్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బాలీవుడ్ ముద్దుగుమ్మ కృతి సనన్. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన మెప్పించింది. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న భామ ప్రస్తుతం లండన్లో వాలిపోయింది. ఇంగ్లాండ్లో జరుగుతున్న టీమిండియా మ్యాచ్లో తళుక్కున మెరిసింది. అయితే ఆమెతో పాటు బాయ్ఫ్రెండ్గా భావిస్తోన్న కబీర్ బహియా కూడా కనిపించారు. ఇద్దరు జంటగా కనిపించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దీంతో మరోసారి ఈ ముద్దుగుమ్మపై డేటింగ్ రూమర్స్ వినిపిస్తున్నాయి.కృతి-కబీర్ డేటింగ్ రూమర్స్అయితే ఈ జంట ఇలా కనిపించడం ఇదేం మొదటిసారి కాదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో బెంగళూరులో జరిగిన స్నేహితుడి వివాహానికి హాజరయ్యారు. అప్పట్లో వీరిద్దరు కలిసి వచ్చిన ఓ వీడియో నెట్టంట వైరలైంది. ఈ పెళ్లిలో కృతి సనన్- కబీర్ చాలా సన్నిహితంగా కనిపించారు. లండన్కు చెందిన వ్యాపారవేత్త అయినా కబీర్తో కలిసి చాలాసార్లు విహారయాత్రల్లోనూ కృతి కనిపించింది. అయితే వీరిద్దరికీ దాదాపు ఎనిమిదేళ్ల ఏజ్ గ్యాప్ ఉంది. ఈ జంట ప్రస్తుతం ప్రేమలో ఉన్నారని.. ఈ ఏడాదిలోనే వివాహం చేసుకోవాలని కూడా ప్లాన్ చేస్తున్నారని బాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది.అయితే ఇదే మ్యాచ్లో పలువురు బాలీవుడ్ తారలు కూడా హాజరై సందడి చేశారు. హీరో అక్షయ్ కుమార్, ట్వింకిల్ ఖన్నా సైతం లార్డ్స్ టెస్ట్ మ్యాచ్కు హాజరయ్యారు. భారత క్రికెట్ జట్టు మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రితో కలిసి మ్యాచ్ను వీక్షించారు.Kriti Sanon at the Lord's. #AkshayKumar sabke sb pauch gye 😐 waha lanka lagi hui hai Jadeja 🥳 khel jao #INDvsENG #JHOPE #TestCricket #INDVsENGLive pic.twitter.com/umWT58y0DG— Karan Visible (@Visibleindustry) July 14, 2025 -
22 ఏళ్ల బంధానికి గుడ్ బై.. డైెరెక్టర్తో బుల్లితెర నటి విడాకులు!
ప్రముఖ బుల్లితెర నటి వివాహా బంధానికి గుడ్ బై చెప్పేసింది. బాలీవుడ్లో అనే సీరియల్స్లో నటించిన నటి పల్లవిరావు తన భర్తతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించింది. పెళ్లైన దాదాపు 22 ఏళ్ల తర్వాత తన భర్త, దర్శకుడు సూరజ్ రావుతో బంధానికి ముగింపు పలకనున్నట్లు వెల్లడించింది. ప్రశాంతమైన జీవితాన్ని కొనసాగించడానికే తామిద్దరం విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ విషయాన్ని రెండు వారాల క్రితమే పోస్ట్ చేసింది.పాండ్యా స్టోర్తో అనే సీరియల్లో పల్లవిరావు బాలీవుడ్లో గుర్తింపు తెచ్చుకుంది. పల్లవి 2009లో హిందీ సీరియల్ యహాన్ మే ఘర్ ఘర్ ఖేలీతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పునర్ వివాహ ఏక్ నయీ ఉమీద్, మెయిన్ లక్ష్మీ తేరే అంగన్ కీ, బిట్టో, పాండ్యా స్టోర్, కహానీ హుమారే మహాభారత్ కీ వంటి సీరియల్స్లో మెప్పించింది. అంతేకాకుండా పల్లవి ఫియర్ ఫైల్స్, సావధాన్ లాంటి వాటిలో కొన్ని ఎపిసోడ్లలో కూడా కనిపించింది. పల్లవి బుల్లితెర నటిగానే కాకుండా యాడ్స్లోనూ నటించింది. అనేక టీవీ సీరియల్స్లో అతిథి పాత్రలో అలరించింది.కాగా.. వీరిద్దరికీ ఇద్దరు పిల్లలు 21 ఏళ్ల కుమార్తె, 18 ఏళ్ల కుమారుడు ఉన్నారు. ఈ జంట 2003లో వివాహం చేసుకున్నారు. అయితే విడాకులపై నటి భర్త సూరజ్ రావు ఇంకా ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు. -
లండన్లో లవ్ బర్డ్స్.. ఆ ఫోటోలతో దొరికిపోయిన మహ్వశ్- చాహల్!
ప్రముఖ ఆర్జే మహ్వశ్ గత కొన్ని నెలలుగా వార్తల్లో నిలుస్తోంది. టీమిండియా క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్తో కనిపించడంతో ఆమె పేరు ఒక్కసారిగా మార్మోగిపోయింది. వీరిద్దరు డేటింగ్లో ఉన్నారంటూ పలు సందర్భాల్లో వార్తలొచ్చాయి. కానీ తమపై వస్తున్న కథనాలపై ఇప్పటి వరకు ఎవరూ కూడా క్లారిటీ ఇవ్వలేదు. ఇటీవల కపిల్ శర్మ షోలో పాల్గొన్న చాహల్ ఇన్డైరెక్ట్గా హింట్ ఇచ్చేశాడు. తను ఎవరో మీ అందరికీ ఇప్పటికే తెలుసుగా అంటూ చాహల్ తన మనసులో మాట చెప్పేశాడు. దీంతో ఈ జంట డేటింగ్ నిజమేనంటూ నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేశారు.ఈ నేపథ్యంలోనే చాహల్, ఆర్జే మహ్వశ్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు వైరల్గా మారాయి. లండన్లో ఈ ప్రేమజంట చక్కర్లు కొడుతున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరు తమ ఇన్స్టా వేదికగా షేర్ చేసిన ఫోటోల్లో బ్యాక్గ్రౌండ్లో లోకేషన్ ఓకేలా కనిపిస్తోంది. దీంతో ఈ లవ్ బర్డ్స్ తాజాగా లండన్లోనే వేకేషన్ ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఫోటోలు కాస్తా నెట్టింట వైరల్ కావడంతో ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. చాహల్ ఫోటోలు చూసిన ఓ నెటిజన్ మహ్వశ్ బాబీ తీశారా అంటూ కామెంట్ చేశాడు. వారిద్దరు డేటింగ్ చేస్తున్నారని నాకు తెలుసు అంటూ మరో నెటిజన్ రాసుకొచ్చాడు.చాహల్, మహ్వశ్పై డేటింగ్ రూమర్స్క్రికెటర్ చాహల్ తన భార్య ధనశ్రీ వర్మతో విడాకులు తీసుకున్నారు. అంతకుముందే మహ్వశ్, చాహల్ డేటింగ్లో ఉన్నట్లు రూమర్స్ మొదలయ్యాయి. ఎందుకంటే ఛాంపియన్ ట్రోఫీ మ్యాచ్లో జంటగా కనిపించడం.. ఆ తర్వాత ఐపీఎల్ మ్యాచ్ల్లోనూ పంజాబ్ కింగ్స్ టీమ్కు మద్దతుగా మ్యాచ్ల్లో సందడి చేసింది. View this post on Instagram A post shared by Mahvash (@rj.mahvash) View this post on Instagram A post shared by Yuzvendra Chahal (@yuzi_chahal23) -
పాకిస్థాన్లో 'రామాయణం' నాటకం.. ఫొటోలు వైరల్
అవును మీరు విన్నది నిజమే. దాయాది దేశం పాకిస్థాన్లోని కరాచీలో 'రామాయణ' గాథని నాటకంగా ప్రదర్శించారు. ఈ స్టేజీ షోకు అద్భుతమైన ఆదరణ కూడా వచ్చినట్లు తెలుస్తోంది. దాదాపు మూడు రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమానికి జనాలు కూడా బాగానే వచ్చారండోయ్. ఇంతకీ అసలెలా ఇది సాధ్యమైంది? నాటకం వేసింది ఎవరు?పాకిస్థాన్ పేరు చెప్పగానే ఉగ్రదాడులు, మత కల్లోలాలు లాంటివే గుర్తొస్తాయి. కానీ ఆ దేశంలోనూ ఇప్పుడు రామాయణ గాథని నాటకం వేయడం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. కరాచీ నగరానికి చెందిన యోగేశ్వర్ కరేరా, రాణా కజ్మాలతో పాటు మరికొందరు నాటక రంగంపై ఉన్న ఇష్టంతో థియేటర్ ఆర్ట్స్తో పాటు వివిధ విభాగాల్లో శిక్షణ తీసుకున్నారు. వీళ్లంతా తన బృందానికి 'మౌజ్' అని పేరు పెట్టుకున్నారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 15 సినిమాలు రిలీజ్)గతేడాది నవంబరులో తొలిసారి ఓ ఆర్ట్ గ్యాలరీలో రామాయణ నాటకాన్ని ప్రదర్శించారు. దీనికి మంచి స్పందన వచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా మరిన్ని హంగులు జోడించి, ఏఐ టెక్నాలజీని కూడా కాస్త ఉపయోగించి తాజాగా మూడు రోజుల పాటు నాటకాన్ని కరాచీలోని ఆర్ట్స్ కౌన్సిల్లో మరోసారి ప్రదర్శించారు. దీనికి కూడా విశేష స్పందన వచ్చింది.రామాయణ నాటకాన్ని ప్రదర్శించినందుకు తమకు ఎలాంటి విమర్శలు, బెదిరింపులు రాలేదని దర్శకుడు యోగేశ్వర్ కరేరా చెప్పుకొచ్చారు. ఈ పురాణ గాథకు విశేషాదరణ దక్కిందని అన్నారు. ఏదైతేనేం పాక్ దేశంలో రామాయణ నాటకం ప్రదర్శించడం ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయింది.(ఇదీ చదవండి: ప్రముఖ నటి సరోజా దేవి కన్నుమూత) -
పోలీసులకు ఫిర్యాదు చేసిన బిగ్బాస్ బ్యూటీ.. ఎందుకంటే!
ప్రముఖ బిగ్బాస్ కంటెస్టెంట్ కశిష్ కపూర్ (24) పోలీసులను ఆశ్రయించింది. తన ఇంట్లో దొంగతనం జరిగినట్లు పీఎస్లో ఫిర్యాదు చేసింది. తన ఇంటి పనిమనిషి సచిన్ కుమార్ చౌదరి ఈ చోరీకి పాల్పడ్డారని ఆరోపిస్తూ ముంబయిలోని అంబోలి స్టేషన్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. తన బీరువాలోని రూ.4 లక్షల నగదు చోరీ చేశాడని జూలై 9న ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు. కాగా.. సచిన్ కుమార్ మార్ చౌదరి గత ఐదు నెలలుగా ఆమె ఇంటి పనిమనిషిగా పనిచేస్తున్నారని పోలీసులకు తెలిపింది. కాగా.. బిగ్బాస్ బ్యూటీ కశిశ్ కపూర్ బీహార్ స్వస్థలం కాగా.. ప్రస్తుతం ముంబయి అంధేరి వెస్ట్లోని ఆజాద్నగర్ వీర దేశాయ్ రోడ్లోని సొసైటీలో నివసిస్తోంది. ఆమె సినిమాలతో పాటు పలు టీవీ సీరియల్స్లో నటించింది. బిగ్ బాస్లో కంటెస్టెంట్గా పాల్గొని మరింత ఫేమ్ తెచ్చుకుంది. -
బాలీవుడ్కు వస్తానంటున్న స్క్విడ్ గేమ్ హీరో
ఛాన్స్ ఇస్తే ఇండియన్ సినిమాలో నటిస్తానంటున్నాడు స్క్విడ్ గేమ్ హీరో లీ జంగ్ జే (Lee Jung Jae). నెట్ఫ్లిక్స్ బ్లాక్బస్టర్ సిరీస్ స్క్విడ్ గేమ్ (Squid Game) మూడు సీజన్లలో కథానాయకుడిగా యాక్ట్ చేశాడు లీ జంగ్ జే. ప్లేయర్ 456గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నాడు. తాజాగా అతడు భారతీయ సినిమాలో నటించాలనుందన్న కోరికను బయటపెట్టాడు. ఛాన్సిస్తే బాలీవుడ్ సినిమాలో నటించడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పుకొచ్చాడు. మరి లీ జంగ్ జే భవిష్యత్తులో బాలీవుడ్ సినిమాలో కనిపిస్తాడేమో చూడాలి!సినిమా- సిరీస్దక్షిణ కొరియాకు చెందిన లీ జంగ్ జే.. ఎన్ ఎఫైర్, సిటీ ఆఫ్ ద రైజింగ్ సన్, ఓ బ్రదర్స్, ఓవర్ ద రైన్బో, లాస్ట్ ప్రజెంట్, బిగ్ మ్యాచ్, ద ఫేస్ రీడర్, డెలివర్ అజ్ ఫ్రమ్ ఈవిల్ ఇలా అనేక సినిమాలు చేశాడు. స్క్విడ్ గేమ్ మొదటి సీజన్తో ఇంటర్నేషనల్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సిరీస్లో తన నటనకుగానూ ఆసియా ఆర్టిస్ట్, హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ టీవీ అవార్డు అందుకున్నాడు హంట్ సినిమాతో దర్శకుడిగానూ మారాడు.చదవండి: 'బిగ్బాస్'లో టాలీవుడ్ సెలబ్రిటీలు, సన్యాసం తీసుకున్న ఆ హీరోయిన్ కూడా! -
ముద్ద సీన్ని తొలగిస్తారా?.. సెన్సార్ టీమ్పై నటి ఫైర్!
సినిమాలో ముద్దు సీన్ తొలగించిన సెన్సార్ బోర్డ్పై బాలీవుడ్ నటి శ్రేయా ధన్వంతరి(Shreya Dhanwanthary) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి చర్యల వల్ల ప్రేక్షకులు థియేటర్స్ రాకుండా వెళ్తారని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రేక్షకులను చిన్నపిల్లల భావించి, థియేటర్ని అనుభూతిని పూర్తిగా ఆస్వాదించకుండా చేస్తున్నారంటూ సెన్సార్ బోర్డ్పై మండిపడింది. వివరాల్లోకి వెళితే..డేవిడ్ కొరెన్స్వెట్, రెచెల్ ప్రధాన పాత్రల్లో నటించిన హాలీవుడ్ సినిమా ‘సూపర్ మ్యాన్’(Superman) ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఇండియన్ వెర్షన్లో 33 సెకన్ల ముద్దు సన్నివేశంతో పాటు హీరోకి సంబంధించిన కొన్ని డైలాగ్స్ని తొలగించారు. సెన్సార్ టీమ్ అభ్యంతరం చెప్పడం వల్లే ఆయా సన్నివేశాలు తొలగించాల్సి వచ్చిందని చిత్రబృందం పేర్కొంది. దీనిని నటి శ్రేయా ధన్వంతరి తప్పుపట్టింది. ఇదొక అర్థంపర్థం లేని చర్య అని సోషల్ మీడియా వేదికగా తన అసంతృప్తిని వెల్లడించింది. ‘సూపర్ మ్యాన్లో 33 సెకన్ల ముద్దు సీన్ని తొలగించడం ఏంటి? ప్రేక్షకులు థియేటర్స్కి వచ్చి సినిమా చూడాలని సెన్సార్ వాళ్లే చెబుతుంటారు. పైరసీని ప్రొత్సహించొద్దని అంటారు. కానీ వాళ్లు మాత్రం ఇలాంటి అర్థంపర్థం లేని పనులు చేస్తారు. వాళ్ల లక్ష్యం ఏంటో నాకు అర్థం కాదు. ఇలాంటి చిన్న చిన్న సీన్లను కూడా కట్ చేసి.. థియేటర్ అనుభూతిని దారుణంగా దెబ్బతీస్తున్నారు. మేమే డబ్బులు పెడుతున్నాం..మేమే సమయం కేటాయిస్తున్నాం కదా.. మరి మాకు నచ్చింది చూడకుండా ఆపుతారెందుకు? మేం ఏం చూడాలనుకుంటున్నామో మమ్మల్నే నిర్ణయించుకోనివ్వండి. సినిమా చూడడానికి థియేటర్ ఉత్తమ మార్గం. ప్రేక్షకులను చిన్న పిల్లలా భావించి.. థియేటర్స్ అనుభూతిని ఆస్వాదించకుండా చేస్తున్నారు’ అని సెన్సార్ బోర్డుపై ఫైర్ అయింది.శ్రేయా ధన్వంతరి ప్రస్తుతం బాలీవుడ్లో వరుస సినిమాలు, వెబ్ సిరీస్లతో బిజీగా ఉంది. ‘ఫ్యామిలీ మ్యాన్’, ‘చుప్: రివెంజ్ ఆఫ్ ది ఆర్టిస్ట్’, ‘స్కామ్ 1992’ వంటి వెబ్ సిరీస్లతో ప్రేక్షకుల ఆదరణ పొందింది. తెలుగులో ‘జోష్’, ‘స్నేహగీతం’ చిత్రాల్లో నటించింది. త్వరలో విడుదల కానున్న ‘ఫ్యామిలీ మ్యాన్ 3’ వెబ్ సిరీస్లో కూడా ఆమె కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. -
'బిగ్బాస్'లో టాలీవుడ్ సెలబ్రిటీలు, సన్యాసం తీసుకున్న ఆ హీరోయిన్ కూడా!
బిగ్బాస్ (Bigg Boss Reality Show) మొదలవడానికి రెండు నెలల ముందు నుంచే హంగామా మొదలైపోతుంది. తెలుగు బిగ్బాస్ తొమ్మిదో సీజన్ సెప్టెంబర్ మొదటివారంలో ప్రారంభమయ్యేట్లు కనిపిస్తోంది. ఇప్పటికే పలువురి పేర్లు తెరపైకి వచ్చాయి. ఇమ్మాన్యుయేల్, అలేఖ్య పికిల్స్ చెల్లెలు రమ్య, దెబ్జానీ, రీతూ చౌదరి, శివకుమార్, సాయికిరణ్, ముకేశ్ గౌడ సహా పలువురిని సంప్రదించినట్లు తెలుస్తోంది. అలాగే కామన్ మ్యాన్ కేటగిరీలో ఇద్దరుముగ్గురిని హౌస్లోకి పంపించనున్నారు.బిగ్బాస్లో టాలీవుడ్ సెలబ్రిటీలుతాజాగా పోకిరి విలన్ ఆశిష్ విద్యార్థి, నువ్వునేను హీరోయిన్ అనిత హస్సానందని కూడా బిగ్బాస్ షోలో అడుగుపెట్టనున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాకపోతే వీరిద్దరితో సంప్రదింపులు జరుపుతోంది తెలుగు బిగ్బాస్ టీమ్ కాదట! హిందీ బిగ్బాస్ టీమ్! హిందీ బిగ్బాస్ 19వ సీజన్ ఆగస్టు నెలాఖరులో ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఈసారి హౌస్లోకి వెళ్లేది వీరేనంటూ పలువురి పేర్లు తెరపైకి వచ్చాయి. కంటెస్టెంట్లు వీళ్లేనా?ఆ జాబితా ఓసారి చూసేద్దాం.. నటి మున్మున్ దత్తా, ఆలిషా పన్వర్, కనిక మన్, అరిష్ఫా ఖాన్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అపూర్వ ముఖిజ, మిస్టర్ ఫైజు, యూట్యూబర్ గౌరవ్ తనేజా, పురవ్ జా, వ్యాపారవేత్త రాజ్ కుంద్రా (హీరోయిన్ శిల్పా శెట్టి భర్త), నటుడు ధీరజ్ ధూపర్, పరాస్ కల్నవత్, కృష్ణ ష్రాఫ్ (జాకీ ష్రాఫ్ కూతురు), సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్ట్ మిక్కీ, కవలలు చింకీ-మింకీ ఉన్నారట!సన్యాసం తీసుకున్న ఆమె కూడా!వీరే కాకుండా లతా సబర్వాల్ (ఈమె తెలుగులో కొంచెం కొత్తగా మూవీలో నటించింది), తనుశ్రీ దత్తా (వీరభద్ర సినిమాలో హీరోయిన్గా యాక్ట్ చేసింది), ఆశిష్ విద్యార్థి (టాలీవుడ్ విలన్), హీరోయిన్ అనిత కూడా ఉన్నారంటూ ఈ జాబితా నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇటీవల జరిగిన మహాకుంభమేళాలో సన్యాసం తీసుకున్న మమతా కులకర్ణి సైతం బిగ్బాస్కు వెళ్లనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈమె తెలుగులో ప్రేమ శిఖరం, దొంగాపోలీస్ సినిమాల్లో కథానాయికగా నటించింది. మరి ఫైనల్ జాబితాలో వీరిలో ఎంతమంది ఉంటారనేది చూడాలి!చదవండి: హీరోను తిట్టా, కొట్టా.. సారీ మాత్రం చెప్పను: దర్శకురాలు -
అఫీషియల్.. ఫేమస్ యూట్యూబర్తో నటి డేటింగ్
ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు డేటింగ్, పెళ్లి విషయంలో యువత ఆలోచనలో మార్పు కనిపిస్తుంది. కొందరు అసలు పెళ్లి చేసుకోవడానికే భయపడుతుంటే.. మరికొందరు అబ్బాయిలు మాత్రం తన కంటే ఎక్కువ వయసున్న అమ్మాయిలతో ప్రేమలో పడుతున్నారు. పెళ్లి వరకు వెళ్తున్నారు. కొన్నిరోజుల క్రితం ఇలానే అఖిల్.. తన కంటే పెద్దదైన జైనబ్ని పెళ్లి చేసుకున్నాడు! ఇప్పుడు ప్రముఖ నటి కూడా తన కంటే చిన్నవాడైన ఓ యూట్యూబర్తో ప్రేమలో పడింది. ఆ విషయాన్ని ఇప్పుడు ఇద్దరూ ప్రకటించారు కూడా!(ఇదీ చదవండి: బన్నీ కోసం రిస్క్ చేయబోతున్న రష్మిక?) యూట్యూబ్లో ఫన్నీ వీడియోలతో అశిష్ చంచ్లానీ చాలా పాపులారిటీ సొంతం చేసుకున్నాడు. ఒకటి రెండు సినిమాల్లోనూ నటించాడు. రీసెంట్ టైంలో ఇతడు బాలీవుడ్ నటి ఎల్లీ అవ్రామ్తో తరచుగా కనిపిస్తూ వచ్చాడు. దీంతో వీరిద్దరి మధ్య సమ్థింగ్ సమ్థింగ్ అని నెటిజన్లు మాట్లాడుకున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు 'ఫైనల్లీ' అని ఆశిష్ ఓ ఫొటో పోస్ట్ చేశాడు. ఇందులో ఎల్లీని ఎత్తుకుని, ఇద్దరు నవ్వుతూ కనిపించారు. దీంతో పలువురు నటులు వీళ్లకు కంగ్రాట్స్ చెబుతున్నారు.ఎక్కడా కూడా తన బంధం గురించి చెప్పలేదు కానీ ఆశిష్-ఎల్లీ డేటింగ్లో ఉన్నారని నెటిజన్లు కన్ఫర్మ్ చేసేస్తున్నారు. ఎల్లీ అవ్రామ్ విషయానికొస్తే ఈమెది మన దేశం కాదు స్వీడన్. కాకపోతే మోడలింగ్ చేస్తూ బాలీవుడ్ దర్శకుల దృష్టిలో పడింది. అలా 2013 నుంచి హిందీతో పాటు తమిళ, కన్నడ, మరాఠీ భాషల్లో పలు సినిమాల్లో నటించింది. బిగ్బాస్ 7, జలక్ ధిక్లా జా 7, బాక్స్ క్రికెట్ లీగ్ 2 తదితర రియాలిటీ షోల్లోనూ పాల్గొంది. ఈమె వయసు 34 ఏళ్లు కాగా, ఆశిక్కి 31 ఏళ్లు. మరి వీళ్లు ఎప్పుడు పెళ్లి పీటలు ఎక్కుతారో చూడాలి?(ఇదీ చదవండి: రేణు దేశాయ్కు సర్జరీ.. అసలేమైంది?) View this post on Instagram A post shared by Ashish Chanchlani (@ashishchanchlani) -
రాజా సాబ్ సెట్లో తెలుగు నేర్చుకుంటున్నాను : సంజయ్ దత్
‘‘వెంకీ సార్, సుప్రీత్లకు సినిమా పట్ల ఎంతో ప్యాషన్ ఉంది. అందుకే ‘కేడీ: ది డెవిల్’ని గొప్పగా నిర్మించారు. ధృవ నా తమ్ముడులాంటివారు. శిల్పా శెట్టితో ఎప్పుడు పని చేసినా అదే ఎనర్జీ ఉంటుంది. మా ‘కేడీ: ది డెవిల్’ సినిమాకి విజయం అందించాలి’’ అని సంజయ్ దత్ పేర్కొన్నారు. ధృవ సర్జా హీరోగా, రీష్మా నానయ్య హీరోయిన్గా ప్రేమ్ దర్శకత్వం వహించిన చిత్రం ‘కేడీ: ది డెవిల్’. సంజయ్ దత్, శిల్పా శెట్టి, నోరా ఫతేహి ముఖ్య పాత్రలు పోషించారు. వెంకట్ కె. నారాయణ నిర్మించిన ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్లో జరిగింది. సంజయ్ దత్ మాట్లాడుతూ– ‘‘హైదరాబాద్తో నాకెంతో అనుబంధం ఉంది. ఎంతో మందితో కలిసి పని చేశాను. ప్రస్తుతం ప్రభాస్ ‘రాజా సాబ్’ సినిమా చేస్తున్నాను. ఆ సెట్లో తెలుగు నేర్చుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు. ధృవ సర్జా మాట్లాడుతూ–‘‘సంజయ్ దత్, శిల్పా శెట్టి వంటి వారితో పని చేయడం సంతోషంగానే ఉంటుంది. త్వరలో విడుదల కానున్న మా సినిమాని ఆదరించాలని కోరు కుంటున్నాను’’ అన్నారు. ‘‘మా సినిమా అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాను’’ అని నమ్మకం వ్యక్తం చేశారు ప్రేమ్. శిల్పా శెట్టి మాట్లాడుతూ– ‘‘నేను నా తొలి చిత్రం హిందీలో కాకుండా తెలుగులో (సాహసవీరుడు సాగరకన్య) చేశాను. ఇప్పుడు చేసిన ఈ ‘కేడీ: ది డెవిల్’లో అన్ని వాణిజ్య అంశాలున్నాయి.. ప్రేక్షకులు ఆదరించాలి’’ అన్నారు. హీరోయిన్ రీష్మా నానయ్య, కేవీఎన్ ్ర΄÷డక్షన్ బిజినెస్ హెడ్ సుప్రీత్ మాట్లాడారు. -
పిరియడ్స్లోనూ ‘హాఫ్ ఐరన్మ్యాన్’.. రికార్డు సృష్టించిన నటి
కొంతమంది తారలు నటనతో ఆకట్టకుంటూనే అప్పుడప్పుడు తమలోని అసాధరణమైన నైపుణ్యాన్ని బయటిప్రపంచానికి చూపించి.. ఆశ్చర్యపరుస్తుంటారు. కేవలం సినిమా రంగంలోనే కాకుండా..ఇతర రంగాలలోనూ తన టాలెంట్ని నిరూపించుకొని ప్రత్యేక గుర్తింపుని సంపాదించుకుంటారు. అలాంటి వారిలో నటి సయామీ ఖేర్(Saiyami Kher ) ఒకరు. తనదైన నటనతో అటు బాలీవుడ్, ఇటు తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న ఈ బ్యూటీ.. క్రీడల్లోనూ రాణిస్తోంది. ఇటీవల ‘ఐరన్మ్యాన్ 70.3’ అనే ట్రయాథ్లాన్ను పూర్తిచేసి..ఒకే ఏడాదిలో రెండు సార్లు ఈ రేసుని పూర్తి చేసిన తొలి భారతీయ నటిగా రికార్డు సృష్టించింది. అయితే ఈ సారి ఆమె పిరియడ్స్లో ఉన్నప్పుడు ఈ ఘనత సాధించడం గమనార్హం.ఏమిటీ ‘ఐరన్ మ్యాన్70.3’ ‘ఐరన్మ్యాన్ 70.3’ అనేది ఒక ప్రముఖ ట్రయాథ్లాన్ రేసు, ఇది ఐరన్మ్యాన్ సిరీస్లో భాగం. దీనిని "హాఫ్ ఐరన్మ్యాన్" అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇది పూర్తి ఐరన్మ్యాన్ రేస్ దూరంలో సగం ఉంటుంది. ఈ రేస్ మూడు ఈవెంట్లను కలిగి ఉంటుంది. తొలుత 1.9 కిలోమీటర్లు (1.2 మైళ్లు) ఈత కొట్టాలి. తర్వాత 90 కిలో మీటర్లు(56 మైళ్లు) సైక్లింగ్ చేయాలి. ఆ తర్వాత 21.1(13.1 మైళ్లు) కిలోమీటర్లు పరుగెత్తాలి. మొత్తం దూరం 113 కిలోమీటర్లు(70.3 మైళ్లు). అందుకే దీన్నీ ఐరన్ మ్యాన్ 70.3 అని పిలుస్తారు. ఇది ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రదేశాలలో నిర్వహించబడుతుంది. జులై 6న స్వీడన్లోని జోంకోపింగ్లో నిర్వహించిన ఈ రేస్లో సయామీ ఖేర్ పాల్గొని పతాకాన్ని సాధించిది. గతేడాది సెప్టెంబర్లో తొలిసారిగా మెడల్ అందుకున్న సయామీ.. ఇప్పుడు స్వీడన్లో నిర్వహించిన రేస్లో సత్తా చాటి మరో పతకం అందుకుంది.నెలసరి సమస్యను అధిగమించి.. నాకు పీసీఓఎస్(పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్) ఉంది. దీని వల్ల రుతుక్రమం సరిగ్గా కాదు. రేసులో పాల్గొనే వారంలోనే నాకు పిరియడ్స్ మొదలయ్యాయి. అదృష్టవశాత్తు నా పీరియడ్స్ చివరి రోజు రేసులో పాల్గొన్న కాబట్టి నొప్పి అంతగా లేదు. కానీ సాధారణ రోజుల కంటే ఆ సమయంలోనే నాకు కాస్త అసౌకర్యంగానే అనిపించింది. మానసికంగా కొంత కలవరపెట్టింది. చాలా మంది మహిళలు పీరియడ్స్ ఉన్నప్పుడు కూడా ఉద్యోగానికి, ఇతర పనులకు హాజరవుతుంటారు. అసౌకర్యంలోనూ మనం ఎలా ముందుకు సాగాలో వారి నుంచి నేర్చుకోవచ్చు. నేను కూడా నెలసరి సమస్యను అధిగమించి గత పోటీ కంటే ఈ సారి 32 నిమిషాల ముందే రేసుని పూర్తి చేశాను’ అని సయామీ ఓ నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పింది.సయామీ సీనీ నేపథ్యంనాసిక్కి చెందిన సయామీ.. ‘రేయ్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఆ తర్వాత బాలీవుడ్కి వెళ్లి.. అక్కడ వరుస సినిమాలతో స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందింది. చాలా కాలం తర్వాత ‘వైల్డ్ డాగ్’ సినిమాతో మళ్లీ టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది. ఇటీవల వచ్చిన హిందీ చిత్రం ‘జాబ్’లో కీలక పాత్ర పోషించింది. ప్రస్తుతం హిందీ, మరాఠీ చిత్రాలతో బీజీగా అయింది. -
'తన్వి ది గ్రేట్' సినిమా వీక్షించిన రాష్ట్రపతి
తన్వి ది గ్రేట్ (Tanvi The Great) అనే చిత్రాన్ని భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము(Droupadi Murmu) వీక్షించారు. చిత్ర యూనిట్తో కలిసి రాష్ట్రపతి భవన్లో ఈ సినిమాను ఆమె చూశారు. అనంతరం వారిని అభినందించారు. భారత సాయుధ దళాల ధైర్యం, త్యాగాలకు నివాళిగా ‘తన్వి ది గ్రేట్’ చిత్రాన్ని అనుపమ్ ఖేర్ (Anupam Kher) తెరకెక్కించారు. శుభాంగి దత్ టైటిల్ పాత్రలో నటించింది. ట్రైలర్లోనే ఆమె నటనతో అందరినీ మెప్పించింది. జులై 18న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రం ఇప్పటికే ఈ సినిమా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్, న్యూయార్క్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్స్లో ప్రదర్శించబడింది. ఒక ఆర్మీ కుటుంబంలో పుట్టిన అమ్మాయి ఆటిజం అనే అడ్డంకిని అధిగమించి ఆర్మీలో చేరాలనే కలను ఎలా నెరవేర్చిందన్నదే ఈ కథ ప్రధాన కథాంశం. 2002లో వచ్చిన 'ఓం జై జగదీష్' సినిమా తర్వాత మళ్లీ ‘తన్వి ది గ్రేట్’ చిత్రానికి అనుపమ్ ఖేర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో జాకీ ష్రాఫ్, అరవింద స్వామి, బొమన్ ఇరానీ, పల్లవి జోషి, నాజర్ వంటి స్టార్ నటులు ఉన్నారు. ఈ చిత్రాన్ని ఎన్ఎఫ్డీసీతో కలిసి అనుపమ్ స్టూడియోస్ నిర్మించింది. -
గదాధారి...
‘‘గదాధారి హనుమాన్’ సినిమా కథ చాలా బలమైనది. అందుకే ఈ చిత్రాన్ని తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చేస్తున్నాం. చిన్న వాళ్ల నుంచి పెద్ద వాళ్ల వరకు మా సినిమా ఆకట్టుకుంటుంది’’ అని రవికిరణ్ తెలిపారు. ఆయన హీరోగా రోహిత్ కొల్లి దర్శకత్వం వహించిన చిత్రం ‘గదాధారి హనుమాన్’. రేణుకా ప్రసాద్, బసవరాజ్ హురకడ్లి నిర్మించారు.హైదరాబాద్లో నిర్వహించిన ఈ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్కి నిర్మాతలు సి. కల్యాణ్, రాజ్ కందుకూరి, దర్శకుడు సముద్ర ముఖ్య అతిథులుగా హాజరై, సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు. రోహిత్ కొల్లి మాట్లాడుతూ– ‘‘గదాధారి హనుమాన్’తో మూడేళ్లు ప్రయాణం చేశాను. గద ఎంత పవర్ఫుల్ అనేదానిపై మా చిత్రంలో ఓ సీక్వెన్స్ అద్భుతంగా ఉంటుంది’’ అని తెలిపారు. ‘‘మా దర్శకుడు రోహిత్ ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు’’ అన్నారు రేణుకా ప్రసాద్. ‘‘కుటుంబ కథా చిత్రంగా ఈ ప్రాజెక్ట్ ఉంటుంది. సినిమాని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’’ అని బసవరాజ్ హురకడ్లి చెప్పారు. -
వింబుల్డన్ మ్యాచ్లో దేవర భామ.. బాయ్ఫ్రెండ్తో కలిసి!
దేవర బ్యూటీ జాన్వీ కపూర్ వింబుల్డన్ మ్యాచ్లో సందడి చేసింది. తన బాయ్ఫ్రెండ్ శిఖర్ పహారియాతో కలిసి మ్యాచ్కు హాజరైంది. లండన్లో జరుగుతున్న టోర్నీలో మెరిసింది. ఇది చూసిన నెటిజన్స్ జాన్వీ కపూర్ను ఉద్దేశించి క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కొందరు నెటిజన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే జాన్వీ కపూర్- శిఖర్ చాలాసార్లు ఇలా విదేశాల్లో చిల్ అవుతూ కనిపించారు.ఇక సినిమాల విషయానికొస్తే జాన్వీ కపూర్ ప్రస్తుతం పెద్ది చిత్రంలో కనిపించనుంది. రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమాకు బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో పాటు హోమ్బౌండ్, సన్నీ సంస్కారి కి తులసి కుమారి, పరమ్ సుందరి లాంటి బాలీవుడ్ సినిమాల్లో కనిపించనుంది. పరం సుందరి జూలై 24, 2025న విడుదల కావాల్సి ఉండగా.. ఈ చిత్రం వాయిదా పడినట్లు తెలుస్తోంది.Spotting Janhvi Kapoor with Shikhar Pahariya at Wimbledon was not on my list today😭— Preet (@preekaaaa) July 11, 2025Janhvi and Shiku at #Wimbledon pic.twitter.com/a5ejBasqmx— Radha (@JanhviSupremacy) July 11, 2025 -
చాలా ఏళ్లు బతకాలని ఉంది.. అప్పుడే నన్ను చంపేయొద్దు: నెటిజన్లకు కరణ్ జోహార్ కౌంటర్
ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ ఇటీవలే ట్రైటర్స్ పేరుతో ఓ రియాలిటీ షోకు హోస్ట్గా వ్యవహరించారు. అమెజాన్ ప్రైమ్లో ప్రసారమైన ఈ షోలో బిగ్బాస్ నటి ఉర్ఫీ జావెద్తో నికితా లూథర్ విజేతగా నిలిచారు. అయితే కొద్ది రోజుల క్రితం కరణ్ లుక్ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. మరి బక్కచిక్కపోయి కనిపించడంతో అసలు ఏమైందని తెగ ఆరా తీశారు. ఇంత త్వరగా బరువు తగ్గడం ఎలా సాధ్యమంటూ నెటిజన్స్ ప్రశ్నించారు. కేవలం ఇంజక్షన్స్ ద్వారానే ఇలాంటివి సాధ్యమని కొందరు ఆరోపించారు.ఈ నేపథ్యంలో తన వెయిట్ లాస్కు సంబంధించి వచ్చిన రూమర్స్పై మరోసారి స్పందించాడు. ధడక్ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్కు హాజరైన కరణ్ జోహార్ తాను బరువు తగ్గడంపై మాట్లాడారు. నెటిజన్స్ తనను ఏకంగా చంపేశారని అన్నారు. నేను చాలా ఆరోగ్యంతో సంతోషంగా ఉన్నానని తెలిపారు.కరణ్ మాట్లాడుతూ..'నేను బరువు తగ్గడానికి ఒకే ఒక కారణం ఉంది. నేను జీవితంలో ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి చాలా సవాళ్లను స్వీకరించా. నెటిజన్స్కు నేను చెప్పేది ఏంటంటే.. నా పిల్లల కోసం చాలా ఏళ్ల పాటు బతకాలనుకుంటున్నా. నేను ఇంకా చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. వాటిని మీ అందరికీ పరిచయం చేస్తా' అని అన్నారు.నెటిజన్స్ ట్రోల్స్కాగా.. గతంలో కరణ్ జోహార్ ఓజెంపిక్ను ఉపయోగించడం లేదని చేసిన వాదనలపై నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. ‘ఓజెంపిక్తో మీరు బరువు తగ్గారని అంగీకరించడంలో తప్పు లేదు. బరువు తగ్గడానికి చాలా సమయం పడుతుంది. బరువు మీ జీవితాన్ని అనేక విధాలుగా ప్రభావితం చేస్తుంది, మీరు బరువు తగ్గిన తర్వాత బాగానే ఉంటే, మీరు దానిని ఎలా కోల్పోయారన్నది ముఖ్యం కాదు. మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో గర్వపడండి మీ డ్రీమ్ అదే కదా .. ఉన్నది ఒక్కటే జీవితం. మన శరీరంతో సంతోషంగా ఉండాలనుకోవడంలో తప్పులేదు. ఆల్ ది బెస్ట్..’ అంటూ ఒక నెటిజన్ కామెంట్ చేశాడు. ‘‘అది ఓజెంపిక్ ముఖమే.. దానిని అంగీకరించడంలో సిగ్గు లేదు. ప్రపంచం మొత్తం ఇప్పుడు దీనిని ఉపయోగిస్తోంది .దాని గురించి బహిరంగంగా చెప్పే వ్యక్తులు గతంలో కంటే ఎక్కువ ప్రశంసలు దక్కించుకుంటున్నారు. సార్ నిజం నిర్భయంగా చెప్పడి" అంటూ మరో నెటిజన్ ప్రశ్నించాడు. దీంతో తాజాగా తనపై హెల్త్పై వచ్చిన రూమర్స్పై రిప్లై ఇచ్చారు కరణ్ జోహార్. -
ఆ హీరో నా కొడుకే.. తనతో గొడవపడ్తూ ఉంటా: సవతి తల్లి
బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ (Shahid Kapoor) చిన్నవయసులోనే అతడి తల్లిదండ్రులు నీలిమ అజీమ్- పంకజ్ కపూర్ విడిపోయారు. తర్వాత పంకజ్.. నటి సుప్రియ పాఠక్ను 1988లో రెండో పెళ్లి చేసుకున్నాడు. వీరికి కుమారుడు రుహాన్, కూతురు సనా సంతానం. తాజాగా ఓ ఇంటర్వ్యూలో షాహిద్తో ఉన్న అనుబంధాన్ని చెప్పుకొచ్చింది సుప్రియ పాఠక్ (Supriya Pathak). ఆమె మాట్లాడుతూ.. అతడు నా కొడుకు. తల్లీకొడుకుల మధ్య ఎలాంటి అనుబంధం ఉంటుందో మా మధ్య కూడా అదే ఆత్మీయత ఉంటుంది.నటి సుప్రియ పాఠక్ ఫ్యామిలీతో షాహిద్షాహిద్ నా కొడుకే..షాహిద్కు ఆరేళ్లున్నప్పుడు అతడిని కలిశాను. కన్నతల్లిని కాకపోయినా అతడు నా కొడుకే అనిపిస్తుంది. రుహాన్, సనాతో పాటు షాహిద్ కూడా నా పిల్లలే అని భావిస్తాను. ఈ ముగ్గురితోనూ ప్రేమగా ఉంటాను, పోట్లాడతాను, ఫ్రెండ్లా ఉంటాను అని చెప్పుకొచ్చింది. షాహిద్ కపూర్ సినిమాల విషయానికి వస్తే.. ఇష్క్ విష్క్ చిత్రంతో హీరోగా మారాడు. సినిమా36 చైనా టౌన్, చుప్చుప్కే, జబ్ వి మెట్, ఆర్.. రాజ్కుమార్, హైదర్, ఉడ్తా పంజాబ్, పద్మావత్ వంటి చిత్రాలతో అలరించాడు. అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్లో యాక్ట్ చేసి సాలిడ్ హిట్ అందుకున్నాడు. ఫర్జి వెబ్ సిరీస్లోనూ మెప్పించాడు. తేరీ బాతో మే ఐసా ఉల్జా జియా చిత్రంతో మరోసారి హిట్టందుకున్నాడు. చివరగా షాహిద్ నటించిన దేవా మూవీ బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది.చదవండి: మా కన్నడ భాష జోలికొస్తే ఊరుకోం: హీరో ధృవ సర్జా -
'దానికి మీరు అమ్మాయి అయితే చాలు'.. కింద పడేసి కొట్టాడన్న దంగల్ నటి!
దంగల్ సినిమాతో ఫేమ్ తెచ్చుకున్న నటి ఫాతిమా సనా షేక్. అమిర్ ఖాన్ కూతురిగా మెప్పించిన ఫాతిమా బాలీవుడ్లో వరుస సినిమాలతో బిజీగా ఉంది. ప్రస్తుతం అనురాగ్ బసు దర్శకత్వం వహించిన మెట్రో ఇన్ డినో చిత్రంలో కనిపించింది. ఈ మూవీలో అలీ ఫజల్ సరసన నటించింది. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీ సక్సెస్ ఎంజాయ్ చేస్తోన్న నటి.. ఇటీవల ఇంటర్వ్యూలో తనకెదురైన చేదు అనుభవాన్ని వివరించింది. ఇంతకీ అదేంటో తెలుసుకుందాం.ఇటీవల ఓ వ్యక్తి తనతో అనుచితంగా ప్రవర్తించాడని తెలిపింది. ఆ సమయంలో అతన్ని తాను కొట్టానని ఫాతిమా వెల్లడించింది. అయితే తను కూడా తిరిగి తనను గట్టిగా కింద పడేంతలా కొట్టాడని వివరించింది. దీంతో తాను తీవ్ర నిరాశకు గురయ్యానని తెలిపింది. ఆ సంఘటన తర్వాత తాను చాలా జాగ్రత్తగా ఉన్నానని ఫాతిమా సనా షేక్ చెప్పుకొచ్చింది. అటువంటి పరిస్థితులలో ఎలా స్పందించాలో ఇప్పుడు తెలిసొచ్చిందని పేర్కొంది. మనలో ఏదో తప్పు జరుగుతోంది.. దానికి మనం ఎలా స్పందించాలో మాత్రమే ఆలోచించాలని చెబుతోంది ఫాతిమా.అంతేకాకుండా ముంబయిలో ఓ టెంపో డ్రైవర్ నన్ను ఫాలో అయ్యేవాడని ఫాతిమా సనా షేక్ తెలిపింది. కొవిడ్ టైమ్లో ముసుగు ధరించి సైకిల్ తొక్కుతుంటే.. నన్ను చూసిన టెంపో డ్రైవర్ హారన్ మ్రోగించేవాడని.. నేను నా లైన్లో వెళ్తంటే నా వెంటే వచ్చేవాడని వివరించింది. సెలబ్రిటీ అయినా.. సామాన్యులైనా ఇటువంటి సంఘటనలు సర్వసాధారణమని తెలిపింది. దీనికి మీరు కేవలం అమ్మాయి అయి ఉంటే చాలని అన్నారు.ఇక సినిమాల విషయానికొస్తే ఫాతిమా సనా షేక్ నటించిన ఆప్ జైసా కోయి ఈ రోజే నెట్ఫ్లిక్స్లో విడుదలైంది. ఇందులో ఆర్ మాధవన్ కూడా నటించారు. ఈ చిత్రం ఇద్దరు మధ్య వయస్కుల మధ్య జరిగే ప్రేమకథగా తెరకెక్కించారు. ఒక స్త్రీ సంప్రదాయ కుటుంబంలో తన ప్రేమ కోసం ఎలా పోరాడుతుందో ఈ మూవీలో చూపించనున్నారు. -
మరో రీమేక్.. 'దఢక్ 2' ట్రైలర్ రిలీజ్
బాలీవుడ్లో మరో రీమేక్ రాబోతుంది. జాన్వీ కపూర్ హీరోయిన్గా పరిచయమైన 'దఢక్' చిత్రానికి ఇప్పుడు సీక్వెల్ వస్తోంది. కాకపోతే ఇందులో హీరోహీరోయిన్లతో పాటు స్టోరీ కూడా పూర్తిగా మారిపోయింది. కాకపోతే మెయిన్ పాయింట్ మాత్రం దాదాపు అదే ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇంతకీ ఇది ఏ మూవీకి రీమేక్? ట్రైలర్ ఉందనేది ఇప్పుడు చూద్దాం.మరాఠీలో వచ్చిన 'సైరాత్' సినిమా అదిరిపోయే హిట్. దాన్ని హిందీలో 'దఢక్' పేరుతో రీమేక్ చేశారు. తక్కువ కులానికి చెందిన ఓ అబ్బాయి.. పై కులానికి చెందిన అమ్మాయితో ప్రేమలో పడతాడు. తర్వాత వీళ్లిద్దరూ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారనేదే ప్లాట్ పాయింట్. ఆ మూవీ హిందీలోనూ హిట్ అయింది. ఇప్పుడు దీనికి సీక్వెల్ 'దఢక్ 2' తీశారు. ఆగస్టు 1న థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: బాలీవుడ్ పరువు తీసిన సంజయ్ దత్!)ట్రైలర్ చూడగానే అరె ఈ స్టోరీ ఎక్కడో చూసినట్లు ఉందే అనిపించింది. తమిళంలో 2018లో 'పరియరుమ్ పెరుమాళ్' అనే మూవీ వచ్చింది. ఇప్పుడు దీన్నే హిందీలో 'దఢక్ 2' పేరుతో రీమేక్ చేశారు. ఒరిజినల్ ఆర్ట్ ఫిల్మ్ తరహాలో ఉంటుంది. రీమేక్కి వచ్చేసరికి మాత్రం కాస్త కమర్షియల్ టచ్ ఇచ్చారనిపిస్తోంది. ఇందులో సిద్ధాంత్ చతుర్వేది తక్కువ కులానికి చెందిన కుర్రాడిగా, 'యానిమల్' ఫేమ్ తృప్తి దిమ్రి పై కులానికి చెందిన అమ్మాయిగా నటించారు.ట్రైలర్ అయితే చూడటానికి బాగానే ఉంది. హీరోహీరోయిన్లుగా చేసిన సిద్ధాంత్, తృప్తి జంట మధ్య కెమిస్ట్రీ బాగానే వర్కౌట్ అయినట్లు కనిపిస్తుంది. మరి సినిమా ఏ మేరకు క్లిక్ అవుతుందో చూడాలి?(ఇదీ చదవండి: 56 ఏళ్ల హీరోతో మృణాల్ రొమాన్స్.. ట్రైలర్ రిలీజ్) -
బాలీవుడ్ పరువు తీసిన సంజయ్ దత్!
'బాహుబలి' రిలీజ్ తర్వాత పాన్ ఇండియా ట్రెండ్ బాగా పెరిగింది. ఈ క్రమంలో ఆర్ఆర్ఆర్, పుష్ప లాంటి తెలుగు సినిమాలతో పాటు కేజీఎఫ్ తదితర చిత్రాలు ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర కళ్లు చెదిరే వసూళ్లు సాధించాయి. హిందీ ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకుంటున్నాయి. మరోవైపు బాలీవుడ్లో పరిస్థితి దారుణంగా తయారైంది. స్టార్ హీరోలు తీసిన సినిమాలు సరిగా ఆడట్లేదు. కొందరు సౌత్ దర్శకులు.. హిందీ హీరోలతో తీసిన జవాన్, యానిమల్ లాంటివి బ్లాక్ బస్టర్స్ అయ్యాయి.ఈ క్రమంలోనే గత కొన్నాళ్లలో హిందీ నటీనటులు.. బాహాటంగానే సొంత ఇండస్ట్రీపై సెటైర్లు వేస్తున్నారు. ఇప్పుడు సీనియర్ నటుడు సంజయ్ దత్ కూడా అలాంటి కామెంట్స్ చేశాడు. 'కేజీఎఫ్' చిత్రంలో విలన్గా అలరించిన ఇతడు.. ఇప్పుడు 'కేడీ ది డెవిల్' అనే మరో కన్నడ మూవీలో కీలక పాత్ర పోషించాడు. తాజాగా ఈ చిత్ర టీజర్ రిలీజ్ చేశారు. హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టారు. ఇందులోనే సంజయ్ దత్.. బాలీవుడ్ పరిస్థితి ఏంటో చెప్పేశాడు.(ఇదీ చదవండి: 56 ఏళ్ల హీరోతో మృణాల్ రొమాన్స్.. ట్రైలర్ రిలీజ్)ప్రస్తుతం మీరు దక్షిణాది సినిమాల్లో నటిస్తున్నారు కదా.. ఇక్కడి నుంచి మీ ఇంటికి ఏం తీసుకెళ్తారు? అని ఓ రిపోర్టర్ అడిగాడు. దీనికి బదులిచ్చిన సంజయ్ దత్.. 'మంచి సినిమాలు తీయాలనే ప్యాషన్ని బాలీవుడ్కి తీసుకెళ్తా. గతంలో మా దగ్గర మంచి సినిమాలు వచ్చేవి. అయితే ఇప్పుడు మా వాళ్లు.. కలెక్షన్, నంబర్లపై మాత్రమే దృష్టి పెడుతున్నారు. కానీ సౌత్లో అలా కాదు. ముఖ్యంగా తెలుగులో మూవీస్పై మంచి ప్యాషన్ కనిపిస్తోంది. అందుకే నాకు ఇక్కడ పనిచేయడం సంతోషంగా ఉంది' అని చెప్పుకొచ్చాడు.ప్రభాస్ 'రాజాసాబ్' మూవీలోనూ సంజయ్ దత్ కీలక పాత్రలో నటించాడు. ఆ చిత్రంతో పాటు తెలుగు సినీ పరిశ్రమతో తనకున్న అనుబంధాన్ని బయటపెట్టాడు. 'తెలుగులో చాలామంది నిర్మాతలు నాకు తెలుసు. వాళ్లతో కలిసి నేను పనిచేశాను. 1980ల నుంచి హైదరాబాద్ వస్తున్నాను. ఇక్కడి వాతావరణం, ఫుడ్ బాగుంటాయి. తెలుగులో ప్రభాస్తో సినిమా చేస్తున్నా. తెలుగు కూడా నేర్చుకుంటున్నాను. ప్రభాస్ నాకు ఫుడ్ ఎక్కువగా పెట్టేస్తున్నాడు' అని సంజూ చెప్పాడు. ఇతడు చెప్పిన దానిబట్టి చూస్తే బాలీవుడ్లో ఇప్పుడు ఎవరూ సరైన సినిమాలు తీయట్లేదని, ఈ విషయంలో టాలీవుడ్ చాలా బెటర్ అని అర్థం. ఓ రకంగా చూస్తే పరోక్షంగా సొంత ఇండస్ట్రీ పరువునే తీసేశాడు!(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'కుబేర'.. అధికారిక ప్రకటన) -
'మర్యాద రామన్న'కు రీమేక్.. ఇప్పుడు పార్ట్ 2 కూడా
తెలుగులో కొన్నే సినిమాలు చేసినప్పటికీ మృణాల్ ఠాకుర్ అభిమానుల్ని బాగానే సంపాదించుకుంది. కొన్నిరోజుల క్రితం ఓ విషయమై ఈమె తెగ ట్రెండ్ అయింది. సరే ఇవన్నీ పక్కనబెడితే తాజాగా ఓ హిందీ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించేందుకు సిద్ధమైంది. తాజాగా చిత్ర ట్రైలర్ని రిలీజ్ చేశారు. 56 ఏళ్ల హీరోతో ఈ మూవీలో రొమాన్స్ చేసినట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: 'బాహుబలి' రీ యూనియన్.. అనుష్క అందుకే కనిపించలేదా?)2010లో తెలుగులో 'మర్యాద రామన్న' సినిమా రిలీజైంది. రాజమౌళి దర్శకత్వం వహించగా కమెడియన్ సునీల్.. ఇందులో హీరోగా నటించాడు. పలు భాషల్లో ఇది రీమేక్ అయింది. హిందీలో అజయ్ దేవగణ్ 'సన్ ఆఫ్ సర్దార్' పేరుతో రీమేక్ చేశాడు. 2012లో ఇది విడుదలైంది. హిట్ అయింది. ఇప్పుడు దీనికి సీక్వెల్ సిద్ధం చేశారు. 'సన్ ఆఫ్ సర్దార్ 2' పేరుతో జూలై 25న రిలీజ్ చేయబోతున్నారు. తొలి పార్ట్లో సోనాక్షి సిన్హా హీరోయిన్ కాగా.. ఇప్పుడు మృణాల్ ఠాకుర్ హీరోయిన్.ట్రైలర్ విషయానికొస్తే.. పంజాబ్ నుంచి సర్దార్, స్కాట్లండ్ వెళ్తాడు. అక్కడ హీరోయిన్ కుటుంబానికి సాయం చేసే క్రమంలో ఓ సమస్యలో ఇరుక్కుంటాడు. తర్వాత ఏమైంది? ఆ ప్రాబ్లమ్ నుంచి ఎలా బయటపడ్డాడు అనేదే స్టోరీలా అనిపిస్తోంది. తొలి భాగంలానే దీన్ని కూడా కామెడీ ఎంటర్టైనర్గా తీశారు. ట్రైలర్ ఓకే ఓకే ఉంది. పెద్దగా మెరుపులేం లేవు. మరి థియేటర్లలో మూవీ ఏ మేరకు వర్కౌట్ అవుతుందో చూడాలి?(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'కుబేర'.. అధికారిక ప్రకటన) -
ఒక్క సినిమాకు 150 కట్స్.. విడుదలకు ముందే కోర్టు స్టే
'ఉదయపూర్ ఫైల్స్' నిర్మాతలకు ఎదురుదెబ్బ తగిలింది. నేడు (జులై 11)న విడుదల కావాల్సిన ఈ సినిమా ప్రదర్శనపై స్టే విధిస్తూ ఢిల్లీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. రాజస్థాన్లోని ఉదయపూర్లో జరిగిన 'టైలర్ కన్హయ్య లాల్' హత్య ఆధారంగా తెరకెక్కిన చిత్రం 'ఉదయపూర్ ఫైల్ ' ( Udaipur Files )... ఈ మూవీ విషయంలో ఇప్పటికే పలు అభ్యంతరాలు వచ్చాయి. ఏకంగా 150 సీన్స్కు సెన్సార్ బోర్ట్ కూడా అభ్యంతరం చెప్పినట్లు తెలుస్తోంది. ఈ చిత్రం విడుదలైతే.. ద్వేషపూరిత ప్రసంగాన్ని ప్రోత్సహిస్తుందని, ఒక సమాజాన్ని లక్ష్యంగా చేసుకుని ఉండటమే కాకుండా మతపరమైన ఉద్రిక్తతను రేకెత్తించగలదని వాదిస్తూ.. పిటిషనర్లు - జమియత్ ఉలామా-ఎ-హింద్ అధ్యక్షుడు మౌలానా అర్షద్ మదానీ, పాత్రికేయుడు ప్రశాంత్ టండన్ దీని విడుదలపై శాశ్వత నిషేధం కోరుతూ పిటిషన్ వేశారు. ఈమేరకు సినిమా విడుదలపై ఢిల్లీ కోర్టు స్టే ఇచ్చింది. సినిమా విడుదల చేయాలా వద్దా అని నిర్ణయించుకోవడానికి కోర్టు కేంద్రానికి వారం సమయం ఇచ్చింది.టైలర్ కన్హయ్య లాల్ హత్య స్టోరీ ఏంటి..2022 ఉదయపూర్లో జరిగిన టైలర్ కన్హయ్య లాల్ హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మహ్మద్ ప్రవక్తపై బీజేపీ నేత నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినందుకు గాను టైలర్ కన్హయ్య లాల్ను దారుణంగా చంపేశారు. ఇద్దరు వ్యక్తులు పట్టపగలే అతని దుకాణంలోనే ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. అచ్చం ఉగ్ర సంస్థ ఐసిస్ దుండగులను తలపించేలా గొంతు కోసి క్రూరంగా పొట్టన పెట్టుకున్నారు. 26 సార్లు కత్తితో నరికినట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. పైగా దాన్ని రికార్డు చేసి వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దాంతో దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. బీజేపీ సస్పెండ్ నేత నూపుర్ శర్మ వ్యాఖ్యలను సమర్థించినందుకే హత్య చేశామంటూ హంతకులు మరో వీడియో పోస్టు చేశారు. పైగా ప్రధాని నరేంద్ర మోదీని కూడా ఇలాగే చంపుతామని హెచ్చరించారు. ప్రవక్త వివాదం తాలూకు జ్వాలను రగిలించింది ఆయనేనని ఆరోపించారు. హత్యకు వాడిన కత్తిని చూపిస్తూ, ‘ఇది మోదీ(ప్రధానిని ఉద్దేశిస్తూ) మెడ దాకా కూడా చేరుతుంది’ అంటూ బెదిరించారు. నిందితులను రియాజ్ అక్తర్, గౌస్ మొహమ్మద్గా గుర్తించారు. రియాజ్ గొంతు కోయగా.. గౌస్ ఆ ఉదంతం అంతా రికార్డు చేశాడు. ఈ ఇద్దరినీ పోలీసులు గంటల వ్యవధిలోనే అరెస్టు చేశారు. హత్యకు పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాద సంస్థల సంబంధం ఉందని అనుమానాలు వ్యక్తమయ్యాయి. హైదరాబాద్ నగరంతో కూడా నిందితులకు సంబంధాలు ఉన్నట్లు NIA విచారణలో తేలింది.నుపుర్ శర్మ ఎవరు..?న్యూఢిల్లీకి చెందిన నుపుర్ శర్మ విద్యార్థి దశ నుండి బీజేపీ విద్యార్థి విభాగం ఏబీవీపీలో కీలకంగా వ్యవహరించింది. 2008లో ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షురాలిగా పనిచేశారు. వృత్తి రీత్యా న్యాయవాది . 2015 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధిగా న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి అరవింద్ కేజ్రీవాల్పై పోటీ చేశారు. 31 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయితే, మహ్మద్ ప్రవక్తపై ఆమె చేసిన వ్యాఖ్యలతో పార్టీ నుంచి బీజేపీ తొలగించింది. మహ్మద్ ప్రవక్త గురించి వారి వివాహం సమయంలో అతని మూడవ భార్య ఆయిషా వయస్సు గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరానికి గురిచేశాయి. ఆ సమయంలో ఖతర్, సౌదీ అరేబియా వంటి గల్ఫ్ దేశాలు భారత్ను క్షమాపణ కోరాయి.దర్శకుడు ఏమన్నారు..?ఉదయపూర్ ఫైల్స్ సినిమా విడుదల నేపథ్యంలో దర్శకుడు భరత్ ఎస్ శ్రీనేట్ వివరణ ఇచ్చారు. ఈ మూవీ ఒక మతానికో..? విశ్వాసాకో సంబంధించినది కాదని చెప్పారు. భావజాలం, సత్యం గురించి మాత్రమే సినిమాలో ఉంటుందని పేర్కొన్నారు. ఇందులో ఎవరి మనో భావాలను దెబ్బ తీసే కంటెంట్ ఎంత మాత్రం ఉండదని క్లారిటీ ఇచ్చారు. ఇందులో కన్హయ్య లాల్ పాత్రలో విజయ్ రాజ నటిస్తున్నారు. దుగ్గల్, రజనీష్, ప్రీతి ఘుంగియానీ, కమలేష్, సావంత్, కంచి సింగ్, ముస్తాక్ ఖాన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అమీత్ జానీ ఈ చిత్రాన్ని నిర్మి స్తున్నారు. -
కమెడియన్ కపిల్శర్మ కేఫ్పై కాల్పులు.. వీడియో వైరల్!
బాలీవుడ్ స్టార్ కమెడియన్ కపిల్ శర్మ కేఫ్పై కాల్పులు జరిపారు. కెనడాలోని ఆయన కేఫ్పై గుర్తు తెలియని వ్యక్తి గన్తో కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. అయితే ఈ కేఫ్ను కపిల్ శర్మ ఇటీవలే ప్రారంభించినట్లు తెలుస్తోంది. కారులో వచ్చిన గుర్తు తెలియిని వ్యక్తి కాల్పులు జరపినట్లు సమాచారం. అయితే ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని తెలుస్తోంది. స్థానికంగా ఈ ఘటన కలకలం సృష్టించింది. కపిల్ శర్మను లక్ష్యంగా చేసుకుని దాడి జరిగిందా? కేఫ్ టార్గెట్గా చేశారా? అన్న వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.కాల్పులకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియోను రితేష్ లఖి అనే జర్నలిస్ట్ ట్విటర్ వేదికగా షేర్ చేశారు. కాగా.. కపిల్ శర్మ ఇటీవల కెనడాలోని సర్రేలో మూడు రోజుల క్రితమే కాప్స్ అనే పేరుతో కేఫ్ను ప్రారంభించారు. ఈ కాల్పుల ఘటనపై ఘటనపై నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు. ఈ సంఘటన దిగ్భ్రాంతికి గురిచేసిందని చాలా మంది నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.World Famous comedian Kapil Sharma's newly inaugurated restaurant KAP'S CAFE shot at in Surrey, BC, Canada last night.Harjit Singh Laddi, a BKI operative, NIA's (INDIA ) most wanted terrorist has claimed this shoot out citing some remarks by Kapil@SurreyPolice pic.twitter.com/p51zlxXbOf— Ritesh Lakhi CA (@RiteshLakhiCA) July 10, 2025 -
ఫ్లాట్లో విగత జీవిగా యువ నటి.. అంత్యక్రియలకు తండ్రి నిరాకరణ!
పాకిస్తాన్లో ఇటీవల నటీనటుల మరణవార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే ఊహించని విధంగా నటీమణలు సూసైడ్ చేసుకోవడం పాక్ సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. గతనెల 20న పాకిస్తాన్ నటి ఆయేషా ఖాన్ (76) అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్.. కరాచీలోని తన ఫ్లాట్లో విగతజీవిగా కనిపించింది. ఇలా హఠాత్తుగా ఆమె మరణించడం పాక్ సినీ ఇండస్ట్రీని షాక్కు గురిచేసింది.తాజాగా మరోసారి అలాంటి విషాద ఘటనే చోటు చేసుకుంది. పాకిస్థాన్కు చెందిన నటి, మోడల్ హుమైరా అస్గర్ అలీ (Humaira Asghar Ali) అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. ప్రస్తుతం ఆమె వయసు 32 ఏళ్లు కాగా.. కరాచీలోని తన ఫ్లాట్లో శవమై కనిపించింది. అయితే ఆమె మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో కనిపించడంతో చనిపోయి దాదాపు మూడు వారాలకు పైగానే అయినట్లు తెలుస్తోంది.కరాచీలోని డిఫెన్స్ ఏరియాలో హుమైరా అస్గర్ అలీ గత కొన్ని సంవత్సరాలుగా ఒంటరిగానే నివసిస్తోంది. గత మూడు వారాలుగా ఆమె స్థానికులకు కనిపించకపోవడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు ఫ్లాట్ లోపలికి వెళ్లి చూడగా.. నటి శవమై కనిపించింది. పోలీసులు ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అమె మృతిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.లాహోర్కు చెందిన హుమైరా హుమైరా అస్గర్ ప్రముఖ రియాలిటీ షో తమాషా ఘర్లో నటించింది. ఆ తర్వాత 2015లో యాక్షన్-థ్రిల్లర్ చిత్రం జలైబీలో కూడా కనిపించింది. జలైబీ చిత్రంతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాకుండా హుమైరా జస్ట్ మ్యారీడ్, చల్ దిల్ మేరే, ఎహ్సాన్ ఫరామోష్, గురు లాంటి పాకిస్తాన్ సీరియల్స్లో నటించింది. ఆమె చివరిసారిగా ఫర్హాన్ సయీద్, సోన్యా హుస్సిన్ ప్రధాన పాత్రల్లో నటించిన లవ్ వ్యాక్సిన్ చిత్రంలో కనిపించింది. ఈ సినిమా 2021లో విడుదలైంది.అంత్యక్రియలకు నిరాకరించిన తండ్రి..అయితే హుమైరా మృతదేహాన్ని ఖననం చేసేందుకు ఆమె తండ్రి, రిటైర్డ్ ఆర్మీ వైద్యుడు డాక్టర్ అస్గర్ అలీ నిరాకరించారు. తమతో ఆమెకు ఎలాంటి సంబంధం లేదని పోలీసులకు తెలిపారు. చాలా ఏళ్ల క్రితమే మాతో సంబంధాలు తెంచుకుందని చెప్పారు. మృతదేహాన్ని మీరే ఏదైనా చేసుకోండని అధికారులతో అన్నారు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు ఎవరూ కూడా ముందుకు రాకపోవడంతో సింధ్ సాంస్కృతిక విభాగం ఆమె అంత్యక్రియలు నిర్వహించడానికి ముందుకొచ్చింది. ఈ కార్యక్రమానికి నటులు యష్మా గిల్, సోన్యా హుస్సేన్ కూడా ముందుకొచ్చారు. -
'రాజాసాబ్' విలన్ నటించిన హారర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
హారర్ సినిమా 'ద భూతిని' ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయింది. సంజయ్ దత్ (Sanjay Dutt) ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో మౌనీ రాయ్, సన్నీ సింగ్, పాలక్ తివారి కీలక పాత్రలు పోషించారు. సిద్దాంత్ కుమార్ సచ్దేవ్ దర్శకత్వం వహించాడు. సంజయ్ దత్తో పాటు దీపక్ ముకుత్ నిర్మించారు.నెలన్నర తర్వాతే ఓటీటీలో రిలీజ్మే 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మెప్పించలేకపోయింది. తాజాగా జీ5 ద భూతిని ఓటీటీ రిలీజ్ డేట్ ప్రకటించింది. జూలై 18న జీ5లో అందుబాటులోకి రానున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ఓ వీడియో క్లిప్ ఎక్స్ (ట్విటర్) ఖాతాలో షేర్ చేసింది. సినిమా బాలేదంటే నెల తిరిగేలోపే ఓటీటీలో రిలీజ్ చేస్తారు. కానీ ఈ చిత్రాన్ని మాత్రం నెలన్నర గ్యాప్ తర్వాతే డిజిటల్ ప్లాట్ఫామ్లో అందుబాటులోకి తెస్తున్నారు.సినిమాలుసంజయ్ దత్ విషయానికి వస్తే.. బాలీవుడ్లో హీరోగా, విలన్గా అనేక సినిమాలు చేశాడు. డబుల్ ఇస్మార్ట్ చిత్రంతో తెలుగులోనూ గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం అఖండ 2 మూవీ చేస్తున్నాడు. ఈయన కీలక పాత్రలో నటించిన ది రాజా సాబ్ డిసెంబర్ 5న విడుదల కానుంది. ఈయన హిందీలో యాక్ట్ చేసిన ధురంధర్ మూవీ కూడా అదే రోజు (డిసెంబర్ 5నే) రిలీజ్ చేస్తున్నట్లు వెల్లడించారు. దీంతో తన రెండు సినిమాలు ఒకేరోజు విడుదల కాకూడదని కోరుకుంటున్నాడు సంజయ్. Pyaar, panic, aur ek possessive bhootnii — jab bhootnii takrayegi baba se, shuru hoga full-on madness! #TheBhootnii premieres on 18th July, 8 pm, on #ZEE5 & #ZEECinema#TheBhootniiOnZEE5 pic.twitter.com/SmzceTDH6j— ZEE5Official (@ZEE5India) July 10, 2025 చదవండి: యాంకరింగ్లో సిండికేట్.. ఈవెంట్లు చేస్తానో, లేదో?: ఉదయభాను -
ప్రముఖ నటి షోలో చనిపోయేందుకు ట్రై చేసింది: బిగ్బాస్ టీమ్
చాలామంది బిగ్బాస్ షో (Bigg Boss Reality Show)కు పాపులారిటీ, డబ్బు కోసమే వెళ్తుంటారు. బిగ్బాస్ హౌస్లో అడుగుపెట్టాక పూర్తిగా అందులోనే లీనమవుతారు. కొన్నిసార్లు ప్రేమలో పడి బయట ప్రపంచాన్నే మర్చిపోతారు. అలా ఓ నటి నిజంగానే లవ్లో పడింది. కానీ అవతలి వ్యక్తి ఫుటేజీకోసం, పాపులారిటీ కోసం ఆమెను ప్రేమిస్తున్నట్లు నటించాడు. ఈ విషయం తెలిసి సదరు నటి ప్రాణాలు తీసుకునేందుకు ప్రయత్నించింది.బ్రేకప్ అయ్యాక హౌస్లోకి..ఈ విషయాన్ని ఎండమోల్ షైన్ ఇండియాలో బిగ్బాస్ ప్రాజెక్ట్ హెడ్గా పనిచేసే అభిషేక్ ముఖర్జీ వెల్లడించాడు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ప్రియుడితో బ్రేకప్ అయి విపరీతమైన బాధలో ఉన్న ఓ ప్రముఖ నటి బిగ్బాస్ షోలో పాల్గొంది. ఆ బ్రేకప్ బాధ నుంచి బయటపడొచ్చన్న ఉద్దేశ్యంతో రియాలిటీ షోకి వచ్చింది. కానీ రోజులు గడిచేకొద్దీ హౌస్లోని ఓ వ్యక్తితో ప్రేమలో పడింది. అతడు కూడా ప్రేమిస్తున్నట్లు నటించాడు. అది ఆమె గుర్తించలేకపోయింది. అతడు మోసం చేస్తున్నాడని గ్రహించిన రోజు బాధ తట్టుకోలేకపోయింది.అదే వారం ఎలిమినేట్తను షోలో ఉన్న విషయం కూడా మర్చిపోయి తెల్లవారుజామున మూడుగంటలకు బాత్రూమ్కి వెళ్లి చనిపోయేందుకు ప్రయత్నించింది. ఆమె చేస్తున్న పనిని గ్రహించి మేమంతా సెట్లోకి పరిగెత్తి తనను అడ్డుకున్నాం. మా లక్ ఏంటంటే సైకియాట్రిస్ట్ ఎప్పుడూ అందుబాటులో ఉంటారు. ఆయన ముంబై నుంచి వచ్చేవరకు తనతో మాట్లాడుతూ కూర్చున్నాం. పొద్దున ఏడింటివరకు తనతోనే ఉన్నాం. అదే వారం ఆమెను ఎలిమినేట్ చేసి పంపించేశాం అని చెప్పుకొచ్చాడు. ఆ నటి పేరు మాత్రం వెల్లడించలేదు.బిగ్బాస్ ఎన్ని భాషల్లో?డచ్ రియాలిటీ షో బిగ్బ్రదర్ నుంచి పుట్టిందే బిగ్బాస్. ఇండియాలో బిగ్బాస్.. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, మరాఠీ, బెంగాలీ భాషల్లో ప్రసారమవుతోంది. తెలుగులో బిగ్బాస్ 8 సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకుంది. త్వరలోనే తొమ్మిదో సీజన్ ప్రారంభం కానుంది. మూడో సీజన్ నుంచి నాగార్జునే ఈ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.చదవండి: యాంకరింగ్లో సిండికేట్.. ఈవెంట్లు చేస్తానో, లేదో?: ఉదయభానుముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
ప్రభాస్ ది రాజాసాబ్తో బాక్సాఫీస్ క్లాష్.. ఆ పని చేయరనుకుంటున్నా: కేజీఎఫ్ నటుడు
ప్రభాస్ నటిస్తోన్న రొమాంటిక్ హారర్ కామెడీ చిత్రం ది రాజాసాబ్. ఈ మూవీకి మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, రిద్ధి కుమార్, మాళవిక మోహన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సలార్, కల్కి వస్తోన్న సినిమా కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ డేట్ను కూడా మేకర్స్ ప్రకటించారు. డిసెంబర్ 5న థియేటర్లలో సందడి చేయనుందని వెల్లడించారు.అయితే తాజాగా రణ్వీర్ సింగ్ నటిస్తోన్న యాక్షన్ థ్రిల్లర్ దురంధర్ మూవీ ఫస్ట్ లుక్ రివీల్ చేశారు. ఈ సినిమాను కూడా ది రాజాసాబ్ రిలీజ్ రోజునే రానుందని మేకర్స్ ప్రకటించారు. ఫస్ట్ లుక్ వీడియోతో పాటు విడుదల తేదీని కూడా వెల్లడించారు. దీంతో బాక్సాఫీస్ వద్ద ది రాజాసాబ్తో రణ్వీర్ సింగ్ పోటీపడడం ఖాయంగా కనిపిస్తోంది.ఈ నేపథ్యంలో ఈ రెండు చిత్రాల బాక్సాఫీస్ క్లాష్పై కేజీఎఫ్ నటుడు సంజయ్ దత్ స్పందించారు. తాజాగా తాను నటించిన కేడీ ది ముంబయి డెవిల్ మూవీ టీజర్ లాంఛ్ ఈవెంట్లో ఎదురైన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. దురంధర్, ది రాజాసాబ్ అదే రోజు రిలీజ్ కావడంపై సంజయ్ దత్ మాట్లాడారు.సంజయ్ దత్ మాట్లాడుతూ..' ఈ రెండు సినిమాలు చాలా డిఫరెంట్. ది రాజాసాబ్, దురంధర్ చిత్రాల్లో నా రోల్స్ చాలా భిన్నమైనవి. ఈ రెండు సినిమాలు ఓకే రోజు విడుదల అవ్వడం నాకు ఇష్టం లేదు. వాళ్లు కూడా ఈ పని చేయరని అనుకుంటున్నా' అని పంచుకున్నారు. -
బర్త్ డే గిఫ్ట్.. లగ్జరీ కారు కొన్న రణ్వీర్ సింగ్
బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్ ప్రస్తుతం బిగ్ ప్రాజెక్ట్తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ధురంధర్ అనే యాక్షన్ థ్రిల్లర్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు ఆదిత్య ధార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే జూలై 6న రణ్వీర్ సింగ్ బర్త్ డే సందర్భంగా ఫస్ట్ లుక్ వీడియోను విడుదల చేయగా ఆడియన్స్ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ యాక్షన్ చిత్రం డిసెంబర్ 5, 2025న థియేటర్లలో విడుదల కానుంది. ఇందులో ఆర్ మాధవన్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్ కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీలో రణ్వీర్ సరసన సారా అర్జున్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ సినిమా తర్వాత ఫర్హాన్ అక్తర్ దర్శకత్వం వహిస్తోన్న డాన్ -3లో నటించనున్నారు.ఇక సినిమాల సంగతి పక్కనపెడితే తాజాగా మన స్టార్ హీరో ఖరీదైన కారును కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. సినీ తారలు ఇలాంటి లగ్జరీ కార్లు కొనడం సాధారణమే అయినప్పటికీ దీని విలువ దాదాపు రూ.4.57 కోట్ల వరకు ఉన్నట్లు సమాచారం. సరికొత్త హై ఎండ్ ఈవీని రణ్వీర్ సింగ్ తన గ్యారేజీకి మరో కారును తీసుకొచ్చారు. ఈ విలాసవంతమైన కారును తన పుట్టిన రోజు కానుకగా జూలై 6న కొన్నట్లు టాక్ వినిపిస్తోంది. కొత్తకారులో తన సతీమణి దీపికా పదుకొణెతో కలిసి ముంబయి వీధుల్లో చక్కర్లు కొట్టారు. View this post on Instagram A post shared by Instant Bollywood (@instantbollywood) -
పొద్దున్నేమో డైట్ ఫుడ్.., రాత్రికి డ్రగ్స్ : సినీతారలపై టాప్ డైరెక్టర్ వ్యాఖ్యలు
ఇటీవల సినీ తారల వ్యక్తిగత అలవాట్ల గురించి మీడియా కన్నా సినీ రంగంలోని వాళ్లే ఎక్కువగా మాట్లాడుతున్నారు. అంతేకాదు మీడియా నుంచి వచ్చే విమర్శల కన్నా ఇవి చాలా వాడిగా వేడిగా పదనుగా ఉంటున్నాయి. సహజంగానే సినీతారల గురించి అందరి కన్నా ఎక్కువగా తెలిసేది అదే రంగంలో ఉన్న దర్శకులు, నిర్మాతలు, ఇతర సాంకేతిక నిపుణులకు కాబట్టి..వీరి విమర్శల్లో నిజం ఉంటుందని అనేక మంది భావిస్తుండడంతో ఇవి సంచలనంగా మారుతున్నాయి. ఇప్పుడు తారలపై విమర్శలు గుప్పించే సినీ ప్రముఖుల జాబితాలో మరో అగ్రదర్శక నిర్మాత కూడా జేరారు. ఆయన పేరు పహ్లాజ్ నిహలానీ.భారతీయ చలనచిత్ర నిర్మాత పహ్లాజ్ నిహలానీ సాదా సీదా వ్యక్తి కాదు. ఆయన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సిబిఎఫ్సి) మాజీ ఛైర్మన్ కూడా. ఆయన గత 2009 వరకు 29 సంవత్సరాల పాటు సినిమాలు, టీవీ ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. నిహలానీ 1982లో హాత్కడితో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు నాటి టాప్ హీరో గోవింద (ఇల్జామ్, 1986) చంకీ పాండే (ఆగ్ హి ఆగ్, 1987) వంటి పలువురు నటులను పరిచయం చేశారు. షోలా ఔర్ షబ్నం ఆంఖేన్ తో సహా అనేక ప్రసిద్ధ చిత్రాలను నిర్మించారు. ఆయన 2012లో అవతార్ సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేశారు.ఆ ప్రముఖ నిర్మాత మాజీ సిబిఎఫ్సి చీఫ్ పహ్లాజ్ నిహలానీ ప్రస్తుతం బాలీవుడ్లో విపరీతంగా పెరుగుతున్న విషపూరిత సంస్కృతిని విమర్శించడం సంచలనంగా మారింది. ఇటీవల లెర్న్ ఫ్రమ్ ది లెజెండ్ పాడ్కాస్ట్లో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కొత్త తరం సెలబ్రిటీ జీవనశైలిని ఆకర్షణీయమైన ముఖభాగాల వెనుక దాగి ఉన్న నిరంతర మాదకద్రవ్య సేవనాన్ని తూర్పారబట్టారు.గతంలో ఒక నటుడు మాత్రమే కనిపిస్తే, నేడు నటులు పది మంది బృందాలతో కనిపిస్తారని ఆయన ఎద్దేవా చేశారు. నిన్న కాక మొన్న వచ్చిన కొత్తవారు కూడా తమ సొంత మేకప్ ఆర్టిస్ట్, హెయిర్డ్రెస్సర్ల నుంచి తమ అద్దం పట్టుకోవడానికి కూడా పర్సనల్ అసిస్టెంట్ కావాలంటున్నారని, అలాగే వ్యక్తిగత ఫిట్నెస్ ట్రైనర్ను కలిగి ఉండాలని పట్టుబడుతున్నారన్నాని వెల్లడించారు. చివరికి వీటన్నింటికీ ఖర్చులు నిర్మాత జేబుల నుంచే చెల్లిస్తారని ఆయన గుర్తు చేశారు. వ్యాయామం చేయడం, వంట చేయడం సమావేశాలు నిర్వహించడం వంటి వాటి కోసం ఏకంగా ఆరు వేర్వేరు వానిటీ వ్యాన్ల డిమాండ్ కూడా చేస్తున్నారని ఇది చాలా ఓవర్గా ఉందన్నారు. .చాలా మంది నటులు ద్వంద్వ జీవితాలను గడుపుతున్నారని ఆయన తీవ్రంగా ఆరోపించారు.. పగటిపూట శుభ్రమైన,ఆరోగ్యకర ఆహారం డిమాండ్ చేస్తూ, రాత్రిపూట మత్తుపదార్ధాల వినియోగంలో మునిగిపోతున్నారన్నారు. తారలు తరచుగా ప్రాథమిక సేవల కోసం పెంచిన బిల్లులను సమర్పిస్తారని, మేకప్ ఖర్చులే లక్షల్లో ఉంటాయని ఆయన పేర్కొన్నారు. చిత్ర పరిశ్రమలో మాదకద్రవ్యాల సంస్కృతి ఇప్పటికీ కొనసాగుతోందా అని అడిగినప్పుడు స్పందిస్తూ, ఇప్పుడు చాలా ఎక్కువగా ఉందని కొన్ని సందర్భాల్లో, కొంతమంది నటుల ప్రవర్తనలో కూడా అది స్పష్టంగా కనిపిస్తుందని స్పష్టం చేశారు.అంతేకాదు...తాను తీసిన తలాష్: ది హంట్ బిగిన్స్... చిత్రం సందర్భంగా జరిగిన విషయాల్ని గుర్తు చేసుకుంటూ, హీరో అక్షయ్ కుమార్ తన పక్కన కరీనా కపూర్ను ప్రధాన పాత్రగా తీసుకోవాలని పట్టుబట్టారని కూడా ఆయన వెల్లడించారు. తన కెరీర్లో ఒక నటుడు ఇలాంటి డిమాండ్ చేయడం ఇదే మొదటిసారి అని, ఇది సాంప్రదాయ నిర్మాత–దర్శకుడు కాస్టింగ్ విధానాన్ని అధిగమించిందని నిహలానీ పేర్కొన్నారు. ఇప్పుడు అది సాధారణంగా మారిపోయిందన్నారు. నేడు, నటులు తరచుగా తారాగణం నుంచి దర్శకుడు సిబ్బంది వరకు ప్రధాన నిర్ణయాలను అన్నింటినీ నియంత్రిస్తున్నారని ఆయన వెల్లడించారు. హీరో, హీరోయిన్స్ మధ్య వయసు తేడా ల గురించి మాట్లాడుతూ వృద్ధ నటులు తాము యంగ్గా కనిపించడానికి యువ తారల్ని ఇష్టపడతారని ఆయన ఎద్దేవా చేశారు. -
కన్నప్ప సినిమా.. చీటింగ్ చేసిన అక్షయ్ కుమార్?!
మంచు విష్ణు కన్నప్ప సినిమా (Kannappa Movie)లో నార్త్ నుంచి సౌత్ వరకు పెద్ద పెద్ద స్టార్స్ భాగమయ్యారు. ప్రభాస్, మోహన్లాల్, శరత్కుమార్, అక్షయ్కుమార్.. ఇలా పలువురు కన్నప్ప చిత్రంలో నటించారు. అక్షయ్కుమార్ శివుడిగా, కాజల్ అగర్వాల్ పార్వతిగా యాక్ట్ చేశారు. మొదట ఈ మూవీ చేసేందుకు అక్షయ్ అసలు ఒప్పుకోనేలేదు. రెండుసార్లు రిజెక్ట్ చేశాడు. అయినా విష్ణు పట్టు వదలకుండా ప్రయత్నించి ఆయన్ను ఎలాగోలా ఒప్పించాడు. డైలాగ్స్ చెప్పేందుకు అక్షయ్ కుమార్ తిప్పలుఅలా అక్షయ్ కుమార్ వెండితెరపై మహాశివుడిగా కనిపించాడు. జూన్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీకి పాజిటివ్ రెస్పాన్స్ లభించింది, కానీ కలెక్షన్లు మాత్రం రాలేదు. తాజాగా ఈ సినిమాలోని ఓ క్లిప్ నెట్టింట విపరీతంగా వైరలవుతోంది. అందులో అక్షయ్ కుమార్ డైలాగులు నేర్చుకుని సొంతంగా చెప్పినట్లు కనిపించడం లేదు. టెలిప్రాంప్టర్ను చూస్తూ అక్కడ రాసున్న డైలాగ్స్ చదువుతున్నట్లుగా ఉంది. అది అతడి కళ్లు తిప్పడం చూస్తేనే అర్థమైపోతుంది.ఇది చీటింగ్ కాదా?ఇది చూసిన నెటిజన్లు అక్షయ్పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. దశాబ్దాలుగా ఇండస్ట్రీలో ఉన్నా ఇప్పటికీ డైలాగ్స్ గర్తుపెట్టుకుని చెప్పలేడా? ఎందుకిలా సగం సగం యాక్టింగ్ చేయడం? శివుడి వేషం కట్టుకుని చిన్న డైలాగ్స్ కూడా చెప్పడం రాకపోతే ఎలా? ఇది జనాల్ని చీటింగ్ చేయడమే అవుతుంది అని కామెంట్లు చేస్తున్నారు. అయితే సదరు వీడియోను సోషల్ మీడియా నుంచి తొలగించినట్లు తెలుస్తోంది. కాగా అక్షయ్ కుమార్.. ఇలా ప్రాంప్టర్ చూసుకుంటూ డైలాగ్స్ చెప్పడం కొత్తేమీ కాదు. సర్ఫిరా సినిమాలోనూ ఓ సీన్లో ఇలాగే డైలాగ్స్ చూసుకుంటూ చదివాడు. అక్షయ్ ప్రస్తుతం జాలీ ఎల్ఎల్బీ 3, వెల్కమ్ టు ద జంగిల్ సినిమాలు చేస్తున్నాడు.చదవండి: ప్రియుడితో శ్రద్ధా.. సీక్రెట్ వీడియో వైరల్.. ఇంత పని చేస్తారనుకోలేదు -
ప్రియుడితో శ్రద్ధా.. సీక్రెట్ వీడియో వైరల్.. ఇంత పని చేస్తారనుకోలేదన్న రవీనా
సెలబ్రిటీలకు కనీస ప్రైవసీ లేకుండా పోతోంది. వాళ్లు ఎక్కడికి వెళ్లినా, ఏం చేసినా ఎవరో ఒకరు వారిని వెంబడిస్తూనే ఉన్నారు. కెమెరాల కళ్లు గప్పి ఫ్రెండ్స్తో లేదా బాయ్ఫ్రెండ్తో ఎక్కడికైనా వెళ్దామా? అంటే అక్కడ కూడా ఎవరో ఒకరు ఈ జంటను కనిపెట్టి ఫోన్లో ఫోటోలు, వీడియోలు రికార్డ్ చేస్తున్నారు. బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ (Shraddha Kapoor) విషయంలో ఇదే జరిగింది.సీక్రెట్గా వీడియోశ్రద్ధా, ప్రియుడు రాహుల్ మోదీతో కలిసి విమానంలో ప్రయాణించింది. వీరిద్దరూ ఎకానమీ క్లాసులో కూర్చోగా శ్రద్ధా తన ఫోన్లో ఏదో రాహుల్కు చూపిస్తోంది. దీన్నంతటినీ విమాన సిబ్బంది ఒకరు సీక్రెట్గా వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో వదిలారు. ఐదు నెలల క్రితం జరిగిన సంఘటన ఇది. ఏమైందో, ఏమో కానీ తాజాగా మరోసారి ఈ వీడియో నెట్టింట వైరలవుతోంది. రవీనా టండన్ ఫైర్ఇండియా ఫోరమ్స్ ఇన్స్టాగ్రామ్ పేజీలో ప్రత్యక్షమైన ఈ వీడియో హీరోయిన్ రవీనా టండన్ (Raveena Tandon) కంటపడింది. అంతే విమాన సిబ్బందిని ఏకిపారేస్తూ సదరు పోస్ట్ కింద కామెంట్ పెట్టింది. ఇలా రహస్యంగా వీడియో రికార్డ్ చేయడమనేది వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడమే అవుతుంది. ఈ విషయం సిబ్బందికి తెలిసే ఉంటుంది. ముందు వారి అనుమతి తీసుకుని ఆ తర్వాత వీడియో రికార్డ్ చేసుకోవాల్సింది. ఇంట్లోకి చొరబడి తీసిందా?ఎయిర్లైన్ స్టాఫ్ కూడా ఇలా చేస్తారని అస్సలు ఊహించలేదు అని మండిపడింది. కొందరు ఆమె మాటలతో ఏకీభవిస్తూ.. సెలబ్రిటీలు కూడా మనుషులేనని, వారికి కొంత ప్రైవసీ ఇవ్వాలని కామెంట్లు చేస్తున్నారు. మరికొందరేమో.. వాళ్లకు లేని ఇబ్బంది మీకెందుకు? ఆమె సెలబ్రిటీ ఇంట్లోకి చొరబడి వీడియో తీయలేదు కదా.. విమాన సిబ్బందిని తిట్టాల్సిన అవసరం లేదు, వారు కూడా మనుషులే అంటూ ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు. View this post on Instagram A post shared by India Forums (@indiaforums) చదవండి: 'ఐ లవ్ యూ' చెబితే ఓకే చెప్పేశాను: అనుష్క -
ఆ ఒక్క కారణంతో రాత్రికి రాత్రే 9 ప్రాజెక్టుల నుంచి తీసేశారు.. : విద్యా బాలన్
చిత్ర పరిశ్రమలో రాణించడం చాలా కష్టం. ఇప్పుడు స్టార్ హోదాలో ఉన్నవారంతా ఒకప్పుడు ఎన్నో కష్టాలను అనుభవించే ఈ స్థాయికి వచ్చారు. ముఖ్యంగా హీరోయిన్లకు కెరీర్ ప్రారంభంలో ఎన్నో సమస్యలు వస్తుంటాయి. ఫస్ట్ చాన్స్ కోసం చాలా ఏళ్లుగా ఎదురు చూసినవాళ్లు కూడా ఉన్నారు. వచ్చిన ఆ ఒక్క చాన్స్ని సరిగ్గా వాడుకున్న వాళ్లే ఇప్పుడు స్టార్ హీరోయిన్లుగా మారారు. అలా అందరిలాకే కెరీర్ ప్రారంభంలో తాను కూడా చాలా ఇబ్బందులు పడ్డానని చెబుతోంది బాలీవుడ్ హీరోయిన్ విద్యా బాలన్(Vidya Balan). ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్గా రాణిస్తున్న ఈ టాలెంటెడ్ నటిపై మొదట్లో ‘ఐరెన్ లెగ్’ అనే ముద్ర వేసి రాత్రికి రాత్రే 9 ప్రాజెక్టుల నుంచి తీసేశారట. ఈ విషయాన్ని తాజాగా ఓ యూట్యూబ్ చానెల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్వయంగా విద్యా బాలనే చెప్పింది.‘కెరీర్ ప్రారంభంలో నాకు మోహన్లాల్తో కలిసి ‘చక్రం’ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. షూటింగ్ ప్రారంభం అయిన కొన్నాళ్లకు అనూహ్యంగా అది ఆగిపోయింది. దానికి కారణం నేనే అని ప్రచారం జరిగింది. నాపై ‘ఐరెన్ లెగ్’ అనే ముద్ర వేసి ఘోరంగా విమర్శించారు. చక్రం సినిమా ఆగిపోయిందనే విషయం తెలియగానే రాత్రికి రాత్రే నేను ఒప్పుకున్న 9 ప్రాజెక్టుల నుంచి నన్ను తొలగించారు. అసలు ఆ సినిమా ఆగిపోవడానికి కారణం నేను కానే కాదు. ఆ మూవీ డైరెక్టర్, మోహన్లాల్ మధ్య బేధాభిప్రాయాలు రావడంతో సగంలోనే ఆపేశారు. అది నా కెరీర్పై చాలా ప్రభావం చూపింది. అయినా నేను ధైర్యం కోల్పోలేదు. విశ్వాసంతో ముందుకు సాగాను. నాపై నాకు ఉన్న నమ్మకే ఈ రోజు ఈ స్థాయిలో నిలబడేలా చేసింది. విశ్వాసంతో ముందుకుసాగితే ఏదోఒకరోజు కచ్చితంగా మనది అవుతుంది’ అని విద్యా చెప్పుకొచ్చింది. కాగా, 2005లో పరిణిత మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన విద్యా.. ‘ది డర్టీ పిక్చర్’తో భారీ హిట్ని తన ఖాతాలో వేసుకుంది. సిల్క్ స్మిత జీవిత కథ ఆధారంగా వచ్చిన ఈ చిత్రంలో విద్యా లీడ్ రోల్ చేసింది. ఆమె నటనపై విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించారు. ఆ తర్వాత వరుసగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ.. బాలీవుడ్లోనే కాదు దేశమంతటా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపుని సంపాదించుకుంది. ఇటీవల భూల్ భూలయ్య 3 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి.. మరో భారీ హిట్ని తన ఖాతాలో వేసుకుంది. -
ఒకప్పటి స్టార్ హీరో.. హెయిర్ కట్కు బ్రాండ్ అంబాసిడర్.. ఎవరో గుర్తుపట్టారా?
చిన్నపిల్లలు, టీనేజ్ యువకులు ఎవరైనా హెయిర్ కట్ చేసుకోవాలంటే ఎక్కువగా హీరోల స్టైల్స్నే ఫాలో అవుతుంటారు. ఆ హీరో స్టైల్లో కటింగ్ చేయమని సెలూన్ వాళ్లను అడిగి మరీ తమ అభిమాన హీరోలా తయారవుతారు. అందుకే ఏ సెలూన్ షాప్ల ముందైనా హీరోల హెయిర్ కట్స్తోనే పోస్టర్స్ పెడతారు. అలా ఓ హీరోను చూసి ఎంతో యూత్ అచ్చం అలానే ఉండాలని ఒకప్పుడు ఫుల్ క్రేజ్ ఉండేది. ఆ హీరో ఎవరో మీకు గుర్తున్నారా? 1990ల్లో ఓ యూత్ ఫ్యాన్స్లో ఓ రేంజ్లో క్రేజ్ తెచ్చుకున్న హీరో ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే షాకవుతారు. ఒకప్పుడు హెయిర్ కట్ స్టెల్కు బ్రాండ్గా మారిన ఆయన ఇప్పుడు గుర్తుపట్టలేరేమోనని అనిపిస్తోంది. ఇంతకీ అతనెవరో తెలుసుకోవాలనుందా?అయితే ఈ స్టోరీ చదివేయండి.ఆయనే మరెవరో కాదు.. ప్రేమదేశం హీరో అబ్బాస్.. ఈ పేరు ఇప్పటి జనరేషన్కి పెద్దగా తెలిసి ఉండకపోవచ్చు. 1990ల్లో పుట్టిన కుర్రాళ్లను అడిగితే మాత్రం టక్కున గుర్తుపట్టేస్తారు. ఎందుకంటే అప్పట్లో ఆయన నటించిన సూపర్ హిట్ లవ్స్టోరీ మూవీ 'ప్రేమదేశం' చూసి అచ్చం అబ్బాస్ లాగే హెయిర్ స్టైల్ చేయించుకున్నారు యూత్ ఆడియన్స్. అతడిలా ఉండటానికి ఎంతోమంది ట్రై చేశారు. అప్పట్లో రజనీకాంత్, కమల్ హాసన్, మమ్ముట్టి లాంటి స్టార్ హీరోలతో కలిసి సినిమాలు చేసిన అబ్బాస్.. ఆ తర్వాత కొన్నాళ్లకు ఇండస్ట్రీకి దూరమైపోయాడు.తాజాగా ఆయనకు సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇది చూసిన వాళ్లు అసలు అబ్బాసేనా అని డౌటానుమానం వ్యక్తం చేస్తున్నారు. అంతలా మారిపోయింది మరి ఆయన కటౌట్. తెల్లటి గడ్డం, స్టైలిష్ హెయిర్ లుక్లో అచ్చం అప్పటిలాగే ఉన్నప్పటికీ గుర్తుపట్టడానికి కాస్తా టైమ్ తీసుకోవాల్సిందే. ఎందుకంటే అప్పటి అబ్బాస్ లవర్ బాయ్లా ఉంటే.. ఇప్పటి అబ్బాస్ కాస్తా సీరియస్ లుక్లో కనిపిస్తున్నాడు. ఏదేమైనా యూత్ హెయిర్ కట్కు బ్రాండ్ అంబాసిడర్ అబ్బాస్ అనడంలో ఎలాంటి సందేహం లేదు.రీ ఎంట్రీ కోసం ప్రయత్నాలు..అయితే సినిమాల్లో అవకాశాలు తగ్గిపోవడంతో న్యూజిలాండ్లోని కుటుంబం దగ్గరికి వెళ్లిపోయిన అబ్బాస్.. పెట్రోల్ బంక్ లో పనిచేయడం లాంటి జాబ్స్ చేశాడు. ప్రస్తుతం కార్పొరేట్ ఫీల్డ్లో సెటిలయ్యాడు. అయితే సినిమాల్లో రీ ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నానిని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. న్యూజిలాండ్లో మధ్యతరగతి జీవితాన్ని గడపిన ఆబ్బాస్ మళ్లీ చెన్నై వచ్చాడు. అతను చివరిసారిగా మలయాళ చిత్రం పచ్చకల్లం (2015)లో కనిపించాడు. తమిళంలో రామానుజన్ బయోపిక్లో భారతీయ శాస్త్రవేత్త ప్రశాంత్ చంద్ర మహలనోబిస్ పాత్రను పోషించాడు. తెలుగులో నీ ప్రేమకై, రాజా, శ్వేతనాగు, రాజహంస, ప్రియా ఓ ప్రియా లాంటి సూపర్ హిట్ చిత్రాల్లో అబ్బాస్ నటించారు. -
దీపిక, ప్రియాంక కాదు.. దీవిని కొన్న అందాల నటి తెలుసా.. అక్కడ ఏం చేస్తోందో..!
ఇంపోర్టెడ్ కార్లు, ఇంద్ర భవనాలు,నుంచి కళాఖండాలను దాటి క్రికెట్ టీమ్స్ దాకా కాదేదీ అనర్హం. తారల దర్పానికి, స్టార్ డమ్ ప్రదర్శనకి అన్నట్టుగా సాగుతోంది. ఇప్పుడిప్పుడే కార్ల ట్రెండ్ పాతబడుతూ వాటి స్థానంలో ప్రైవేట్ జెట్స్ సైతం సూపర్ స్టార్లకు అలంకారంగా మారుతున్నాయి. ఈ నేపధ్యంలో బాలీవుడ్కి చెందిన ఓ అందాల నటి ఏకంగా ఐలాండ్నే కొనుగోలు చేసిందని తెలుస్తోంది. ఈ వార్త వినగానే మన కళ్ల ముందు మెదిలే బాలీవుడ్ టాప్ హీరోయిన్స్లో దీపికా పదుకోన్, ప్రియాంకా చోప్రా, అలియా భట్, ఐశ్వర్యా రాయ్ వంటివారు ముందుండడం సహజమే.అయితే వీరందరూ కాకుండా.. నిజం చెప్పాలంటే విజయాల్లో వీరి సరసన నిలబడే స్థాయి లేని నటి ఐలండ్ క్వీన్గా మారిందనేది తెలుసుకోదగ్గ విశేషమే. ఆమె పేరు గ్లామర్ స్టార్ జాక్వలిన్ ఫెర్నాండెజ్. విదేశాల నుంచి మన దేశానికి వచ్చి సక్సెస్ అయిన తారల్లో ఒకరు శ్రీలంకకు చెందిన జాక్వలిన్. దాదాపు పాతికేళ్ల క్రితం 2006లో మిస్ యూనివర్స్ పోటీల్లో శ్రీలంకకు సారధ్యం వహించిన ఈ బ్యూటీకి కిరీటం దక్కకపోయినా బాలీవుడ్ ఛాన్సులు దండిగానే దక్కాయి. అలా 2009 నుంచి వరుస సినిమాలు చేసుకుంటూ అదే పనితో ఆగిపోకుండా రకరకాల వ్యాపారాల్లోనూ ఆమె తనదైన ముద్ర వేసింది. ఇప్పటికే ముంబైలో, శ్రీలంకలో విలాసవంతమైన అపార్ట్మెంట్, లగ్జరీ కార్లు, బ్రాండెడ్ వస్తువులు సైతం ఆమె స్వంతం. స్టార్ డమ్లో దిగువన ఉన్నా ఇన్ కమ్లో ముందున్న ఈ భామ ఆస్తులు దాదాపుగా రూ.100కోట్ల పైమాటే అని సమాచారం.ఈ నేపధ్యంలోనే ఆమె స్వదేశంలో, అంటే శ్రీలంక తీర ప్రాంతంలో ఒక ప్రైవేట్ దీవిని కూడా ఆమె కొనుగోలు చేసినట్టు తెలిసింది. ఇది బహిరంగంగా ఆమె ప్రకటించని విషయమే అయినా, తాజాగా వెలుగులోకి వచ్చింది. జాక్వలిన్ ఈ ప్రైవేట్ దీవిని కుటుంబం కోసం కొనుగోలు చేసినట్టు విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి. అక్కడ ఎటువంటి నిర్మాణాలు జరిగాయో కానీ, అది పూర్తి స్థాయిలో పర్యాటకుల నుంచి దూరంగా, నిశ్శబ్దత నడుమ ఆమె తన కోసం విశ్రాంతి కోసం ఏర్పాటు చేసుకున్న ప్రదేశమని అంటున్నారు. ఈ వార్త వెలుగులోకి రావడం వల్ల బాలీవుడ్లో జాక్వలిన్ స్థానం, ఆమె సంపద, జీవనశైలి పై కొత్త చర్చ మొదలైంది. ఎందుకంటే బాలీవుడ్లో ఇది అరుదైన విషయమే మరి. నటుల్లో స్వంత దీవిని కలిగిన నటి అనే ఘనతను జాక్వలిన్ ఒక్కరే దక్కించుకుంది.ఎక్కడ? ఎప్పుడు?శ్రీలంక దక్షిణ తీరానికి సమీపంగా 2012లో సుమారు 4 ఎకరాల ప్రైవేట్ దీవిని సుమారుగా రూ.3కోట్లకు జాక్వలిన్ ఫెర్నాండెజ్ కొనుగోలు చేసినట్టు సమాచారం. ఈ దీవి ఖరీదు చేసినప్పుడు, ‘విలాసవంతమైన విల్లా నిర్మాణం‘ ఉండొచ్చని అంచనా వేశారట, అయితే అక్కడ అలాంటి నిర్మాణం జరిగిందా లేదా అనేది స్పష్టంగా వెలుగు చూడలేదు. ఈ దీవి, మాజీ శ్రీలంక క్రికెట్ కెప్టెన్ కుమార్ సంగక్కరా కి చెందిన సొంత దీవి దగ్గరనే ఉందని కూడా తెలుస్తోంది.కొసమెరుపు ఏమిటంటే... ఓ నాలుగేళ్ల క్రితం ఈ జాక్వెలిన్ పై మనీ లాండరింగ్ కేసులు దాఖలయ్యాయి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందు కూడా విచారణకు హాజరైంది. ఈ కారణం వల్లనే ఆమెకు ఘోస్ట్ సినిమాలో మన కింగ్ అక్కినేని నాగార్జున సరసన తెలుగులో నటించడానికి వచ్చిన ఛాన్స్ చేజారినట్టు సమాచారం. -
తండ్రి కాబోతున్న స్త్రీ-2 నటుడు.. సోషల్ మీడియాలో పోస్ట్
హిందీలో వరుస సినిమాలతో దూసుకెళ్తున్న బాలీవుడ్ హీరో రాజ్ కుమార్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. తాను త్వరలోనే తండ్రి కాబోతున్నట్లు తెలిపారు. పెళ్లయిన మూడున్నర్ర సంవత్సరాల తర్వాత శుభవార్తను ప్రకటించారు. కాగా.. బాలీవుడ్ నటి పాత్రలేఖను నవంబర్ 15, 2021న రాజ్కుమార్ వివాహం చేసుకున్నారు. ఈ శుభవార్తను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. 'బేబీ ఆన్ ది వే' అంటూ ఇన్స్టాలో పోస్ట్ చేశారు బాలీవుడ్ దంపతులు. ఈ విషయం తెలుసుకున్న పలువురు బాలీవుడ్ తారలు ఈ జంటకు అభినందనలు చెబుతున్నారు.కాగా.. రాజ్కుమార్ రావు గతేడాది సూపర్ హిట్ మూవీ స్త్రీ-2 చిత్రంలో నటించారు. శ్రద్ధాకపూర్ కీలక పాత్రలో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఈ ఏడాది బుల్ చుక్ మాఫ్ అనే రొమాంటిక్ కామెడీ మూవీతో ప్రేక్షకులను అలరించారు. మే నెలలో థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం పెద్దగా రాణించలేకపోయింది. మరోవైపు ఆయన భార్య పాత్రలేఖ గతేడాది వెల్డ్ వైల్డ్ పంజాబ్ అనే మూవీలో నటించింది. ఈ ఏడాదిలో పూలే సినిమాతో అభిమానులను అలరించింది. View this post on Instagram A post shared by RajKummar Rao (@rajkummar_rao) -
2025లో టాప్ సినిమా ఏదో తెలుసా? 500% లాభాలు తెచ్చిపెట్టిన మూవీ
కొత్త సంవత్సరం మొదలై ఆరు నెలలు గడిచిపోయాయి. ఈ ఫస్టాఫ్లో ఎన్నో సినిమాలు రిలీజయ్యాయి. బాక్సాఫీస్ మీద కనక వర్షం కురిపించిన సినిమాలు కొన్నయితే నిర్మాతల నెత్తిన గుదిబండ వేసిన చిత్రాలు మరికొన్ని. అయితే వీటన్నింటినీ జల్లెడపట్టిన ఐఎమ్డీబీ (IMDB).. 2025 ఫస్టాఫ్- మోస్ట్ పాపులర్ ఇండియన్ చిత్రాల జాబితాను రిలీజ్ చేసింది.ఫస్టాఫ్లో టాప్ 102025లో జనవరి 1 నుంచి జూలై 1 మధ్య విడుదలైన సినిమాలను పరిగణనలోకి తీసుకుంది. ఆరు, అంత కంటే ఎక్కువ రేటింగ్ వచ్చిన చిత్రాలను తన జాబితాలో పొందుపరిచింది. టాప్ 10లో అత్యధికంగా బాలీవుడ్ నుంచే ఆరు సినిమాలున్నాయి. అందరూ ఊహించినట్లుగానే విక్కీ కౌశల్ ఛావా సినిమా మొట్టమొదటి స్థానంలో ఉంది. రూ.130 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం రూ.809 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. టాప్ 5లో ఏమున్నాయ్?మరాఠా యోధుడు శివాజీ మహారాజ్ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం దాదాపు 500% లాభాలను తెచ్చిపెట్టింది. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రష్మిక మందన్నా, దివ్య దత్తా, వినీత్ కుమార్ సింగ్ కీలక పాత్రలు పోషించారు. 2025లో ఇప్పటివరకు అత్యధిక వసూళ్లు రాబట్టిన ఇండియన్ మూవీగా ఛావా రికార్డు సృష్టించింది. తమిళ సినిమా డ్రాగన్ రెండో స్థానంలో ఉంది. కోలీవుడ్ నుంచి 3 సినిమాలుబాక్సాఫీస్ వద్ద నిరాశపరిచిన షాహిద్ కపూర్ దేవా మూడో స్థానంలో ఉండటం గమనార్హం. అజయ్ దేవ్గణ్ రైడ్ 2 నాలుగో స్థానంలో, సూర్య రెట్రో ఐదో స్థానంలో ఉన్నాయి. ద డిప్లొమాట్, ఎల్ 2: ఎంపురాన్, సితారే జమీన్ పర్, కేసరి చాప్టర్ 2, విడాముయర్చి టాప్ 6 నుంచి 10 స్థానాల్లో నిలిచాయి. టాప్ 10లో తమిళం నుంచి మూడు, మలయాళం నుంచి ఒక మూవీ జాబితాలో ఉంది. టాలీవుడ్ నుంచి ఏ సినిమా కూడా ఈ లిస్ట్లో చోటు దక్కించుకోలేకపోయింది. View this post on Instagram A post shared by IMDb India (@imdb_in) చదవండి: సినిమాలు మానేసి సెలూన్లో పని చేశా.. 10th ఫెయిలైనా.. -
బేబీ బంప్పై ‘అమృతస్వరం’ పాట పాడితే.. వీడియో వైరల్
బాలీవుడ్ సూపర్ గాయని శ్రేయ ఘోషల్ (Shreya Ghoshal) తన మధురమైన గాత్రంతో ప్రపంచ వ్యాప్తంగా అనేకమంది అభిమానులను సంపాదించుకుంది. అనేక భాషల్లో తన స్వరంతో సంగీతాభిమానులు ఉర్రూతలూగించింది. తాజాగా తన గానంతో కడుపులో ఉన్న బిడ్డను కూడా కదిలించింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట్ వైరల్గా మారింది.ఆమ్స్టర్డామ్ లోని ‘‘ఆల్ హార్ట్స్ టూర్’’ సందర్భంగా తన వీరాభిమానిని కలిసింది శ్రేయా ఘోషల్. గర్భిణి అయిన అభిమాని ముందు మోకాళ్లపై కూర్చుని, ఆమె గర్భంపై తన చేతిని సున్నితంగా ఉంచి, పుట్టబోయే బిడ్డ కోసం జోలపాట పాడటం విశేషం. పరిణీత చిత్రంలోని "పియు బోలే సాంగ్ను మంద్రంగా ఆలపించింది. అంతే గర్భస్థ శిశువు పరవశంతో కదిలిందిట. ఆ సమయంలో అభిమానితో పాటు శ్రేయ కూడా ఆనందంలో మునిగిపోయింది. ఈ వీడియో నెట్టింట అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. View this post on Instagram A post shared by Varinder Chawla (@varindertchawla)లక్కీ బేబీ అంటూ ఫ్యాన్స్ కమెంట్ చేశారు. ‘డివైన్ వాయిస్ ఆ బిడ్డను ఆశీర్వదించింది’ అని ఒకరు, ‘ఓహ్..ఆ పుట్టబోయే బిడ్డకు ఎంత అదృష్టం’ అని మరో అభిమాని వ్యాఖ్యానించడం విశేషం."శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం ఫణిః" అని ఇదేనేమో!ఇదీ చదవండి: ట్విన్స్కు జన్మనివ్వబోతున్నా.. నా బిడ్డలకు తండ్రి లేడు : నటి భావోద్వేగ పోస్ట్