Bollywood
-
ధురంధర్ 2పై తలైవా రివ్యూ.. సంతోషంలో డైరెక్టర్
గత ఆరునెలలుగా బాక్సాఫీస్ వద్ద ధురంధర్ పేరు మారుమోగిపోతోంది. రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన ధురంధర్ 1 ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే.. మూడు నెలలు కూడా తిరగకముందే దర్శకుడు ఆదిత్య ధర్ దానికి సీక్వెల్ తీసుకొచ్చాడు. మార్చి 19న ధురంధర్: ది రివేంజ్ విడుదలైంది. ఈ సినిమాపై నార్త్ నుంచి సౌత్ వరకు అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. తలైవా రివ్యూతాజాగా సూపర్స్టార్ రజనీకాంత్ ధురంధర్ 2 చూసి రివ్యూ ఇచ్చాడు. ఆదిత్య ధర్ను బాక్సాఫీస్ కా బాప్ అని అభివర్ణించాడు. రణ్వీర్ సహా చిత్రయూనిట్ అందరికీ శుభాకాంక్షలు తెలిపాడు. ప్రతి భారతీయుడు తప్పక చూడాల్సిన చిత్రమని ఎక్స్ (ట్విటర్)లో కితాబిచ్చాడు. తలైవా పోస్ట్పై దర్శకుడు ఆదిత్య ధర్ సంతోషం వ్యక్తం చేశాడు. గర్వంగా ఉందిసర్, వినోదం అనే పదానికి మిమ్మల్నే బెంచ్మార్క్గా చూస్తూ పెరిగాం. ఎన్నో దశాబ్దాలుగా మీరు మమ్మల్ని ఏడిపించారు, నవ్వించారు, విజిల్స్ కొట్టేలా చేశారు. ఇప్పటికీ అదే గ్రేస్, స్వాగ్తో మ్యాజిక్ చేస్తూనే ఉన్నారు. అలాంటి మీరు ధురంధర్ 2 తప్పక చూడాల్సిన మూవీ అని చెప్పడం నా జీవితంలో అతిపెద్ద సూపర్స్టార్ మూమెంట్గా అనిపిస్తోంది. పెద్ద కలలను కనమని ప్రోత్సహించిన వ్యక్తి మమ్మల్ని ఆశీర్వదిస్తున్నట్లుగా ఉంది. ఎంతో గర్వంగా ఉంది సర్. మీ మాటలు నా మనసును తాకాయి అని ఆదిత్య ధర్ రాసుకొచ్చాడు. Sir, we’ve all grown up measuring “entertainment” with just one benchmark, YOU. ❤️⁰Making us whistle, laugh, cry and feel larger than life for decades and still doing it with the same swag and grace, that’s pure magic.So for you to call Dhurandhar 2 a “must watch” feels like…— Aditya Dhar (@AdityaDharFilms) March 23, 2026 చదవండి: బ్యాండ్మేళం కోసం ఆస్తులమ్ముకున్న కోన వెంకట్.. నేనైతే ఆ పనిచేయను: బండ్ల గణేశ్ -
నాకు నత్తి.. ఇప్పటికీ బాధపడుతుంటా: సమీరా రెడ్డి
హీరోయిన్ సమీరారెడ్డి ఏదైనా నిర్మొహమాటంగా చెప్పేస్తుంది. తన కష్టాలు, ప్రెగ్నెన్సీలో బరువు పెరగడం, డెలివరీ తర్వాత ఎదుర్కొన్న సమస్యలు.. వీటన్నింటి గురించి ఓపెన్గా మాట్లడుతూ ఉంటుంది. అయితే చిన్నతనంలో నత్తి వల్ల తనను ఎందరో వెక్కిరించేవారంటోంది.వెక్కిరింతలుతాజాగా ఓ ఇంటర్వ్యూలో సమీరా రెడ్డి మాట్లాడుతూ.. చిన్నప్పుడు నాకు నత్తి ఉండేది. దానివల్ల నన్ను వెక్కిరిస్తూ వేధించేవారు. నాలో ఆత్మవిశ్వాసం పెంచుకోవడానికి సంవత్సరాల తరబడి థెరపీ చేయించుకోవాల్సి వచ్చింది. ఇప్పటికీ నేను నత్తిగా మాట్లాడినప్పుడు ఎవరైనా దానిపై సెటైర్లు వేస్తే బాధగా ఉంటుంది. చిన్ననాడు మనల్ని ఏమేం అంటారో అవన్నీ మనసులో లోతుగా పాతుకుపోయుంటాయి.అదే నిజమనుకుని..ఉదాహరణకు.. ఆమె చాలా స్లో, వీక్ అంటుంటారు. ఇలాంటి పదాలు పదేపదే విన్నప్పుడు మనపై మనకే అనుమానం వేస్తుంటుంది. ఫలితంగా పిల్లలు ఏదైనా సాహసం చేసేందుకు వెనుకాడతారు. పిల్లల్ని పదేపదే బుద్ధిహీనుడు, బలహీనుడు, ముసలివాడు.. అని పిలిస్తే వాళ్లు అదే నిజమనుకుంటారు. వాళ్లను వాళ్లు చూసుకునే విధానమే మారిపోతుంది. ఎవరినీ కించపర్చొద్దుఅదే నిజమని నమ్మి, అందరిలా దూకుడుగా ఉండలేరు. ఏవీ ప్రయత్నించకుండా సైలెంట్ అయిపోయే ప్రమాదం ఉంది. నా పిల్లలు.. వారికి ఏ సమస్య ఎదురైనా నాతో చెప్పమంటాను. ఎవరినీ కించపరచొద్దని చెప్తుంటాను. పిల్లలకు సరైన ప్రోత్సాహం, మార్గదర్శకత్వం చేస్తే మంచి ఆత్మవిశ్వాసంతో ఎదుగుతారు. పర్సనల్ లైఫ్తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, తోటివారంతా సపోర్ట్గా నిలబడితే పిల్లలు వారికెదురయ్యే సవాళ్లను ఒక అడ్డంకిగా కాకుండా.. దాన్నుంచి ఎలా బయటపడాలన్నది నేర్చుకుంటారు అని చెప్పుకొచ్చింది. సమీరా.. 2014లో ఎంటర్ప్రెన్యూర్ అక్షయ్ వార్డేను పెళ్లి చేసుకుంది. ఈ దంపతులకు 2015లో కుమారుడు హన్స్, 2019లో కూతురు నైరా జన్మించారు. బాలీవుడ్ హీరోయిన్ సమీరా రెడ్డి.. తెలుగులో నరసింహుడు, జై చిరంజీవ, అశోక్ సినిమాల్లో నటించింది.చదవండి: హీరోయిన్ భానుప్రియ ఇంట తీవ్ర విషాదం -
హారర్కి గ్రీన్ సిగ్నల్?
బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ జెట్ స్పీడ్తో దూసుకెళ్తున్నారు. ఆయన నటించిన ‘రేంజర్, ధమాల్ 4’ సినిమాలు షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధం అవుతున్నాయి. ప్రస్తుతం ఆయన ‘దృశ్యం 3 (హిందీ వెర్షన్), గోల్మాల్ 5’ సినిమాల చిత్రీకరణలతో బిజీగా ఉంటున్నప్పటికీ ఇటీవల మరో కొత్త సినిమాకు అంగీకారం తెలిపారని బాలీవుడ్ సమాచారం.హిందీలో ‘జేమ్స్’, పంజాబీలో ‘సర్దాజ్ జీ, సర్దార్ జీ 2’ వంటి సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు రోహిత్ జుగ్రాస్ ఇటీవల ఓ హారర్ కథను అజయ్ దేవగన్ కు వినిపించారట. కథ, హారర్ కాన్సెప్ట్ నచ్చడంతో ఈ సినిమాకు అజయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని బాలీవుడ్ టాక్. ప్రస్తుతం ప్రీప్రోడక్షన్ పనులు జరుగుతున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాదే సెట్స్పైకి తీసుకెళ్లాలని రోహిత్ అండ్ టీమ్ సన్నాహాలు చేస్తున్నారట. 2027లో ఈ సినిమా రిలీజ్ కానుంది. -
9 నెలల తర్వాత ఓటీటీకి హిట్ సినిమా.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
గతేడాది బాలీవుడ్ స్టార్ అమిర్ ఖాన్ నటించిన చిత్రం సితారే జమీన్ పర్. ఈ సినిమా 2025 జూన్ 20న థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. ఈ మూవీలో జెనీలియా దేశ్ముఖ్ కూడా ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమాకు ఆర్ఎస్ ప్రసన్న దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని ఆమిర్ ఖాన్, అపర్ణ పురోహిత్ నిర్మించారు.అయితే ఈ సినిమా దాదాపు 9 నెలల తర్వాత ఓటీటీకి వచ్చేస్తోంది. తాజాగా ఈ మూవీ స్ట్రీమింగ్ తేదీని మేకర్స్ ప్రకటించారు. ఏప్రిల్ 03 నుంచి సోనీ లివ్ వేదికగా అందుబాటులోకి రానుంది. కాగా..అమిర్ ఖాన్ గతంలో ఓటీటీలో రిలీజ్ చేయనని ప్రకటించారు. ఆ తర్వాత నేరుగా యూట్యూబ్లోనే విడుదల చేశారు. రెంట్ పద్ధతిలో అందుబాటులోకి తీసుకొచ్చారు. Kisi ke liye alag… kisi ke liye normal.Sabka apna normal hota hai. ❤️A heartwarming story of Hope, heart and healing💫 Watch #SitaareZameenPar #SabkaApnaApnaNormal, streaming from 3rd April on Sony LIV#SitaareZameenParOnSonyLIV pic.twitter.com/YvBbFlOTNS— Sony LIV (@SonyLIV) March 23, 2026 రూ.120 కోట్ల డీల్కు నో..అప్పట్లో ఓటీటీ రైట్స్ కోసం రూ.120 కోట్లు చెల్లించేందుకు అమెజాన్ ప్రైమ్ ముందుకొచ్చింది. కానీ ఈ బిగ్ డీల్ను అమిర్ ఖాన్ తిరస్కరించారు. ఈ సినిమా కేవలం థియేటర్లలోనే ఆడుతుందని.. ఓటీటీలో విడుదల ఉండదని అమిర్ ఖాన్ స్పష్టం చేశారు. కానీ అమిర్ ఖాన్ తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. కాగా.. ఈ చిత్రంలో ఆరోష్ దత్తా, గోపీకృష్ణ వర్మ, సంవిత్ దేశాయ్, వేదాంత్ శర్మ, ఆయుష్ భన్సాలీ, ఆశిష్ పెండ్సే, రిషి షహానీ, రిషబ్జైన్ , నమన్ మిశ్రా, సిమ్రాన్ మంగేష్కర్ వంటి వారు కీలకపాత్రల్లో నటించారు. -
అందరి నోటా దురంధర్.. ఆ రియల్ హీరో స్టోరీ తెలుసా?
దురంధర్.. దురంధర్.. దురంధర్.. ఇప్పుడు ఎవరినీ నోటా విన్నా ఆ ఒక్క పేరే వినిపిస్తోంది. గతేడాది రిలీజైన ఈ మూవీ సీక్వెల్ ప్రస్తుతం థియేటర్లను షేక్ చేస్తోంది. బాక్సాపీస్ వద్ద ఊహకందని రికార్డులు సృష్టిస్తోంది. రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన దురంధర్ ది రివెంజ్ మార్చి 19న రిలీజై ఊచకోత కోస్తోంది. కేవలం మూడు రోజుల్లోనే రూ.500 కోట్ల మార్క్ దాటేసిన ఈ మూవీ బాక్సాఫీస్ను షేక్ చేస్తోంది.ఈ నేపథ్యంలో అసలు దురంధర్ ఎవరు? అనే అంశంపై చర్చ నడుస్తోంది. ఇంతకీ ఆ రియల్ దురంధర్ ఎవరినీ తెగ నెటిజన్స్ తెగ ఆరా తీస్తున్నారు. ఆడియన్స్కు ఇంతలా కనెక్ట్ అయిన ఆ పాత్ర ఎవరిది? అసలు ఆ వ్యక్తి ఎవరు? అసలు అతను బతికే ఉన్నాడా? అనే వివరాల కోసం తెగ వెతికేస్తున్నారు. మరి ఆ వివరాలేంటో మీరు కూడా తెలుసుకోవాలనుకంటున్నారా? అయితే ఈ స్టోరీ చదివేయండి.రియల్ ధురంధర్ ఆయనే..రవీంద్ర కౌశిక్.. ఈ పేరు చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు. ఆర్మీలో మేజర్ స్థాయికి ఎదిగిన రవీంద్ర.. తన ధైర్య సాహసాలతో రాలో(RAW) బ్లాక్ టైగర్గా గుర్తింపు తెచ్చుకున్నారు. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీనే బ్లాక్ టైగర్ అనే బిరుదు ఇవ్వడం విశేషం. అయితే స్పై ఏజెంట్గా పాకిస్తాన్ వెళ్లిన రవీంద్ర కౌశిక్.. పాక్ ఆర్మీలో చేరి మేజర్ స్థాయికి ఎదిగారు. భారతదేశపు అత్యంత ధైర్యవంతులైన రా ఏజెంట్లలో ఒకరిగా నిలిచారు.భారత్కు చెందిన రవీంద్ర కౌశిక్ పాకిస్థాన్లో రహస్యంగా ప్రవేశించి.. పాక్ జాతీయుడిగా మారిపోయి పాకిస్థాన్ సైన్యంలో చేరారు. అక్కడి సైనిక కదలికలు, పాకిస్థాన్ అణు కార్యక్రమం గురించి కీలకమైన సమాచారాన్ని ఇండియాకు అందించారు. అయితే ఊహించని విధంగా 1983లో పాకిస్థాన్ గూఢచార సంస్థ ISIకి దొరికిపోయాడు. ఆ తర్వాత తన మిగిలిన జీవితాన్ని జైలులోనే గడిపారు.23 ఏళ్ల వయసులోనే..రవీంద్ర కౌశిక్ 1975లో అంటే కేవలం 23 ఏళ్ల వయసులోనే నబీ అహ్మద్ షకీర్ అనే పేరుతో పాకిస్తాన్లోకి ప్రవేశించారు. అక్కడే కరాచీ విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రంలో డిగ్రీ సంపాదించి.. పాకిస్తాన్ సైన్యంలో చేరారు. తన టాలెంట్తో ఏకంగా మేజర్ హోదాను పొందారు. 1979 నుండి 1983 మధ్య దాదాపు 4 ఏళ్ల పాటు కౌశిక్ రహస్యంగా భారతదేశానికి కీలకమైన సమాచారాన్ని పంపాడు. అక్కడి పంజాబ్లోని సైనిక కదలికలు.. కహుటాలోని పాకిస్తాన్ అణు కర్మాగారం గురించి సున్నితమైన వివరాలను అందించాడు. అంతేకాకుండా అమానత్ అనే పాకిస్తానీ మహిళను వివాహం చేసుకున్నారు. వీరికి ఓ బిడ్డ కూడా పుట్టారు.అయితే 1983లో రా (RAW) సంస్థ ఇనాయత్ మసీహ్ అనే జూనియర్ స్పైని.. రవీంద్రను కలవడానికి పంపింది. కానీ మసీహ్ వెంటనే అక్కడి ఐఎస్ఐకి దొరికిపోయాడు. మసీహ్ ఇచ్చిన సమాచారం ఆధారంగా కౌశిక్ను కలవాల్సిన ముల్తాన్లోని పార్కును ఐఎస్ఐ గుర్తించింది. దీంతో 1983 సెప్టెంబర్లో రవీంద్ర కౌశిక్ను అరెస్టు చేశారు. ఆ తర్వాత కౌశిక్ను సియాల్కోట్లో విచారించి.. కోట్ లఖ్పత్, మియాన్వాలి లాంటి అత్యంత కట్టుదిట్టమైన భద్రత గల జైళ్లకు తరలించారు. 1985లో పాకిస్తానీ సైనిక న్యాయస్థానం అతనికి మరణశిక్ష విధించింది. కానీ ఆ తరువాత దానిని యావజ్జీవ కారాగార శిక్షగా మార్చారు. అయితే రవీంద్ర కౌశిక్ 2001 నవంబర్ 21న.. మియాన్వాలి సెంట్రల్ జైలులో క్షయవ్యాధి, గుండె జబ్బుతో మరణించాడు.రవీంద్ర కౌశిక్ స్వస్థలం ఎక్కడంటే? రవీంద్ర కౌశిక్ స్వస్థలం రాజస్థాన్లోని శ్రీ గంగానగర్ పట్టణం. 1952 ఏప్రిల్ 11న భారత్-పాకిస్తాన్ సరిహద్దుకు సమీపంలో ఉన్న శ్రీ గంగానగర్లో జన్మించారు. అక్కడే ఆయన పంజాబీతో పాటు స్థానిక భాషలు నేర్చుకున్నారు. గంగానగర్లోని ఎస్.డి. బిహానీ కళాశాలలో కామర్స్ చదువుతున్నప్పుడే నాటకరంగంలో పాల్గొని తన నటన నైపుణ్యాలను ప్రదర్శించారు.అదే సమయంలో 1973లో లక్నోలో జరిగిన ఒక జాతీయ నాటక పోటీలో రవీంద్ర ప్రదర్శన ఇచ్చారు. ఒక భారతీయ సైనికుడి పాత్రలో ఏకపాత్రాభినయం చేశారు. అతని ప్రదర్శన రా అధికారుల దృష్టిని ఆకర్షించింది. ఆ వెంటనే ఢిల్లీలో రహస్య మిషన్ కోసం అతనికి తీవ్రమైన శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణ సమయంలో ఇస్లాం గురించి.. పాకిస్తానీ ఉర్దూ భాష, ఆ దేశ భౌగోళిక స్వరూపం గురించి పూర్తిగా తెలుసుకున్నారు. రెండేళ్ల కఠిన శిక్షణ తర్వాత రా స్పైగా పాకిస్తాన్లో అడుగుపెట్టాడు. -
దురంధర్-2 రిలీజ్.. పాకిస్తాన్ వీడియోలు వైరల్..!
రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్ దురంధర్-2 థియేటర్లలో సందడి చేస్తోంది. మార్చి 19న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ను షేక్ చేస్తోంది. కేవలం మూడు రోజుల్లేనే రూ.500 కోట్ల మార్క్ దాటిన ఈ చిత్రం పలు రికార్డులు తిరగరాస్తోంది. ఇప్పటికే నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.700 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.దురంధర్కు సీక్వెల్గా వచ్చిన ఈ సినిమా హిందీతో పాటు దక్షిణాది భాషల్లోనూ రిలీజైంది. పాకిస్తాన్ నేపథ్యంలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. తాజాగా ఈ మూవీ రిలీజ్ వేళ సోషల్ మీడియాలో పాకిస్తాన్కు సంబంధించిన వీడియోలు వైరలవుతున్నాయి. ఇప్పుడు కరాచీలోని లియారి ప్రాంతంలో పోలీసులు స్పై లాంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారేమోననని సోదాలు చేస్తున్నారు. అక్కడి ప్రాంతంలోని లోకల్ ప్రజలంతా కలిసి ఇండియన్ స్పైల కోసం వెతుకుతున్న వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. అయితే ఈ వీడియో ఇప్పటిదా.. లేదాంటే పాతదా? అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. ధురంధర్ 2 తర్వాత పాకిస్తాన్ అంతటా పానిక్ మొదలైంది!ఇప్పుడు కరాచీలోని లియారి ప్రాంతంలో పోలీసులు, లోకల్ ప్రజలు కలిసి ప్రతి వీధిలో ఇండియన్ స్పైలను వెతుకుతున్నారు.వాళ్ల ఆశ ఏమిటంటే—హమ్జా అలీ మజారిని పట్టుకుంటామని!#Dhurandhar2 #DhurandharTheRevenge #Dhurandhar #Pakistan… pic.twitter.com/7Emn1qkEPc— Tupaki (@tupaki_official) March 23, 2026 -
జూన్లో ధురంధర్ 3? నిజమెంత?
ఏదైనా సినిమా బాగుందంటే చాలు దాని కొనసాగింపు కోసం జనం ఎదురుచూస్తుంటారు. బాహుబలి, పుష్ప, కేజీఎఫ్, కాంతార వంటి చిత్రాలు కూడా అలాంటి బజ్ క్రియేట్ చేసుకుని సీక్వెల్లో కూడా కాసుల వర్షం కురిపించాయి. ఇప్పుడు ధురంధర్ సినిమా విషయంలోనూ అదే జరుగుతోంది.ధురంధర్ బ్లాక్బస్టర్రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ మూవీ 2025 డిసెంబర్లో విడుదలైంది. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం చూసేందుకు జనం థియేటర్ల ఎదుట క్యూ కట్టారు. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా రూ.1350 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి బాక్సాఫీస్ రికార్డులు తిరగరాసింది. దీంతో దీని సీక్వెల్ కోసం జనం వెయిట్ చేశారు.ధురంధర్ 3 రాబోతోందా?అయితే వారిని మరీ ఎక్కువ ఎదురుచూడనివ్వకుండా మూడు నెలల్లో ధురంధర్ 2ని తీసుకొచ్చారు మేకర్స్. మార్చి 19న ధురంధర్: ది రివేంజ్ విడుదలైంది. నాలుగు రోజుల్లోనే రూ.761 కోట్ల కలెక్షన్స్ రాబట్టి అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ క్రమంలో ధురంధర్ 3 రాబోతోందని ప్రచారం మొదలైంది.ఫేక్ ఫోటోఅది కూడా మరో మూడు నెలల్లోనే విడుదల కాబోతుందని రూమర్ సృష్టించారు. జూన్ 14న ధురంధర్: ద ఫైనల్ చాప్టర్ రాబోతుందంటూ ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్) సాయంతో సృష్టించిన ఓ ఫోటోను సోషల్ మీడియాలో వదిలారు. ఇంకేముంది, అది నెట్టింట వైరల్గా మారగా అది నిజమని చాలామంది భ్రమపడుతున్నారు.సినిమాసినిమా చివర్లో పేర్లు పడి ఆగిపోయేంతవరకు మీరు సీటులో నుంచి లేవొద్దు అని ఆదిత్య ధర్ ప్రేక్షకులకు సూచించాడు. ఆ లెక్కన నిజంగానే చివరాఖరులో మూడో భాగం కోసం ప్రకటించారేమోనని పలువురూ భావించారు. కానీ, అందులో ఏమాత్రం నిజం లేదు. ఇప్పటివరకు చిత్రయూనిట్ మూడో భాగం గురించి ఎటువంటి ప్రకటన చేయలేదు. కాబట్టి అదంతా ఫేక్ న్యూస్ అని అర్థమవుతోంది. Is This For Real ? 3 Parts #Dhurandhar The Final Chapter on 14 June 2026 pic.twitter.com/EqAINSzpxN— INDIAN (@hindus47) March 18, 2026 చదవండి: కరుప్పు ఫస్ట్ ఛాయిస్ సూర్య కాదా? -
రికార్డులు బ్రేక్ చేసినా 'పుష్ప2'ని దాటలేకపోయింది
ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర 'ధురంధర్ 2' సినిమా సంచలనాలు సృష్టిస్తోంది. బీభత్సమైన అంచనాలతో బరిలోకి దిగిన ఈ మూవీ ఉత్తరాదితో పాటు దక్షిణాదిలోని బీ,సీ సెంటర్లలోనూ హవా చూపిస్తుండటం ట్రేడ్ వర్గాలని ఆశ్చర్యపరుస్తోంది. మొదటి రోజు నుంచి వందల కోట్ల వసూళ్లు సాధిస్తున్న ఈ చిత్రం ఇప్పుడు తొలి వీకెండ్ పూర్తయ్యేసరికి ఊహించని రికార్డులు సొంతం చేసుకుంది. ఇంతకీ నాలుగు రోజుల కలెక్షన్స్ ఎన్ని కోట్లు వచ్చాయంటే?(ఇదీ చదవండి: ధురంధర్ 2 సక్సెస్: 28 ఏళ్ల నాటి లేఖ వైరల్)తొలి వీకెండ్ పూర్తయ్యేసరికి 'ధురంధర్ 2' చిత్రానికి రూ.750 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. ఆదివారం ఒక్కరోజే కేవలం మన దేశంలోనే రూ.115 కోట్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఇదో రికార్డ్. ఇప్పటివరకు వీకెండ్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా 'పుష్ప 2' రూ.762 కోట్లతో అగ్రస్థానంలో ఉండగా.. దీని తర్వాతి స్థానంలోకి 'ధురంధర్ 2' వెళ్లింది. ఈ క్రమంలోనే బాహుబలి 2 (రూ.591 కోట్లు), ఆర్ఆర్ఆర్ (రూ.470 కోట్లు), కల్కి 2898 ఏడీ (రూ.500 కోట్లు) తదితర రికార్డులు బ్రేక్ చేసింది.మరోవైపు బాలీవుడ్లోనూ ఇప్పటివరకు షారుఖ్ ఖాన్ 'పఠాన్' పేరిట రూ.287 కోట్ల కలెక్షన్స్ రికార్డ్ ఉంది. దీన్ని 'ధురంధర్ 2' అధిగమించడంతో పాటు సరికొత్త ఘనత సాధించింది. చూస్తుంటే ఇప్పుడప్పుడే ఈ చిత్ర రచ్చ ఆగేలా లేదు. తొలి వారం పూర్తయ్యేసరికి రూ.1000 కోట్లు సాధించడం పక్కా అనిపిస్తుంది. అలానే రూ.2000 కోట్ల మార్క్ని కూడా త్వరలోనే అందుకునే అవకాశముందని విశ్లేషకులు మాట్లాడుకుంటున్నారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 19 సినిమాలు) -
ధురంధర్ 2 సక్సెస్: 28 ఏళ్ల నాటి లేఖ వైరల్
బ్లాక్బస్టర్ ధురంధర్కు కొనసాగింపుగా వచ్చిన చిత్రం ధురంధర్: ద రివేంజ్. రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కనక వర్షం కురిపిస్తోంది. అటు సోషల్ మీడియాలో నార్త్ నుంచి సౌత్ వరకు ఎందరో సెలబ్రిటీలు దర్శకుడు ఆదిత్య ధర్ను, అతడి సినిమాను ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారు. ఈ మూవీలో నటించిన అందరికీ మంచి పేరు, గుర్తింపు వచ్చింది. 28 ఏళ్ల నాటి లేఖఈ క్రమంలో ధురంధర్ 2లో మొహమ్మద్ ఆలంగా నటించిన గౌరవ్ గేరా తన కెరీర్ తొలినాళ్లలో ఎదుర్కొన్న ఇబ్బందులను బయటపెట్టాడు. 1998లో ఢిల్లీ నుంచి ముంబైకి వచ్చిన రోజుల్లో పేరెంట్స్కు రాసిన లేఖను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇది నేను 1998 డిసెంబర్ 3న మా అమ్మానాన్నలకు రాసిన లేఖ. ముంబైకి వచ్చి అప్పటికింకా నెల రోజులు కూడా కాలేదు. అప్పట్లో ఈమెయిల్స్ గట్రా ఏవీ లేవు.. ఇదిగో ఇలా ఉత్తరాలు రాసుకునేవాళ్లం. అమ్మానాన్న థాంక్యూఆ తర్వాత టీవీ, సినిమా, యాడ్స్, రేడియో, టిక్టాక్ రీల్స్.. ఇలా ఎన్నో ఒడిదుడుకులతో నా ప్రయాణం సాగింది. భగవంతుడు నాపై ఎంతో దయచూపించాడు. ఇదిగో ఇలా ధురంధర్లో నటించే అవకాశం.. రానున్న రోజుల్లో భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియదు. ఈ జర్నీలో నాకు అండగా నిలిచిన అమ్మానాన్నకు ధన్యవాదాలు అంటూ లేఖను పంచుకున్నాడు.లేఖలో ఏముందంటే?అమ్మానాన్న, ఎలా ఉన్నారు? నేనిక్కడ క్షేమంగానే ఉన్నాను. ప్రస్తుతానికి డబ్బుపరంగా ఏమీ కలిసిరావడం లేదు. కానీ, త్వరలోనే అంతా మంచే జరుగుతుందని ఆశిస్తున్నాను. ఢిల్లీతో పోలిస్తే ఇక్కడ అవకాశాలు ఎక్కువే.. ఖర్చు తగ్గించుకునేందుకు నేను స్నేహితుడితో కలిసి ఓ చిన్న గదిలో ఉంటున్నాను. ఫోన్, కరెంట్, గ్యాస్, వాటర్ బిల్లుతో పాటు భోజన ఖర్చులు కూడా ఇద్దరం పంచుకుంటున్నాం. భవిష్యత్తుపై కొండంత ఆశ ఉంది. కానీ నేను నేర్చుకోవాల్సింది కూడా చాలా ఉంది అని రాసుకొచ్చాడు. ఇది చూసిన నటీనటులు, అభిమానులు మీరు చాలా దూరం వచ్చారు, మీ కథ వింటుంటే కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి అని కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Gaurav Gera (@gauravgera) చదవండి: ద 50 షో.. విన్నర్గా శివ్ ఠాక్రే.. ప్రైజ్మనీ మాత్రం ఎవరికంటే? -
The 50: అరకోటి ప్రైజ్మనీ.. విన్నర్కు కాదు, అతడి అభిమానికి!
ద 50 రియాలిటీ షోకి శుభం కార్డు పడింది. 50 మంది సెలబ్రిటీలు పాల్గొన్న ఈ షో మార్చి 22న విజయవంతంగా ముగిసింది. ఫైజల్ షైక్, కృష్ణ ష్రాఫ్, రజత్ దలాల్లను వెనక్కు నెడుతూ శివ్ ఠాక్రే విజేతగా నిల్చాడు. అతడికి ద 50 ట్రోఫీ అయితే దక్కింది. కానీ ప్రైజ్మనీ మాత్రం కాదు! అదే ఈ షో స్పెషాలిటీ.. కంటెస్టెంట్కు బదులుగా అతడి అభిమాని అరకోటి గెల్చుకునే అవకాశం ఉంటుంది. అలా శివ్ ఠాక్రే టైటిల్ గెలిస్తే అతడి అభిమాని సీతారామ్ ప్రహ్లాద్ అఘవ్ రూ.50 లక్షల ప్రైజ్మనీ సొంతం చేసుకున్నాడు.ఫినాలేలో ఏం జరిగిందంటే.. 50 మంది కంటెస్టెంట్లతో ద 50 షో మొదలైంది. ఫైనల్స్కు వచ్చేసరికి ఐదుగురు మాత్రమే మిగిలారు. వారే రజత్ దలాల్, శివ్ ఠాక్రే, కృష్ణ ష్రాఫ్, కాక (రవీందర్ సింగ్), ఫైజల్ షైక్. మీలో ఒకర్ని మీరే ఎలిమినేట్ చేయాలని ద లయన్(షోలో బాస్) చెప్పగా.. శివ్, కృష్ణ, కాక.. రజత్ను ఎలిమినేట్ చేశారు. మిగిలిన నలుగురికి నాలుగు రకాల టాస్కులు అప్పగించారు. వీటన్నింటిని దాటుకుని శివ్ ఠాక్రే గెలిచి సత్తా చూపించాడు. ఫైజల్ షైక్ ఫస్ట్ రన్నరప్గా నిలిచాడు. అభిమానికి రూ.50 లక్షలునిజానికి ప్రిన్స్ నరూలా త్యాగం చేసిన టికెట్ టు ఫినాలేతోనే శివ్ ఠాక్రే ఫైనల్స్లో చోటు దక్కించుకున్నాడు. ఆ ఒక్క అవకాశాన్ని వాడుకుని ఇప్పుడేకంగా ట్రోఫీ గెలవడం విశేషం. రూ.50 లక్షలు గెలిచిన శివ్ ఠాక్రే అభిమాని సీతారాం మాట్లాడుతూ.. నేను, నా కుటుంబం పొలం పని చేసుకుంటాం. ఈ ప్రైజ్మనీ గెలవడం చాలా సంతోషంగా ఉంది. అయితే ఇదంతా ఒక మోసమేమో అనుకునేవాడిని. జరుగుతుందంతా చూస్తుంటే ఒక కలలా ఉంది. నా తల్లిదండ్రులకు మంచి ఇల్లు, కారు కొనివ్వాలనుకున్నాను, ఈ డబ్బుతో అదే చేస్తాను అని పేర్కొన్నాడు. కాగా శివ్ ఠాక్రే.. గతంలో మరాఠి బిగ్బాస్ రెండో సీజన్ విజేతగా నిలవగా హిందీ బిగ్బాస్ 16వ సీజన్లో ఫస్ట్ రన్నరప్గా నిలిచాడు. View this post on Instagram A post shared by JioHotstar Reality (@jiohotstarreality) చదవండి: మంచు లక్ష్మి ఇంట్లో వేడుక.. మోహన్బాబు ఆశీర్వాదం -
'ధురంధర్ 2'.. ఇంత పొరపాటు ఎలా చేశారు?
ప్రస్తుతం భారతీయ బాక్సాఫీస్ దగ్గర 'ధురంధర్ 2' హవా కనిపిస్తోంది. పేరుకే హిందీ సినిమా అయినప్పటికీ డబ్బింగ్ రూపంలో తెలుగు ప్రేక్షకుల్ని కూడా అలరిస్తోంది. దీని ప్రభావమో ఏమో గానీ పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' కలెక్షన్స్ కూడా పూర్తిగా డౌన్ అయిపోయాయి. అయితే 'ధురంధర్ 2' చూసి చాలామంది ఎంజాయ్ చేస్తుండగా.. మరికొందరు మాత్రం ప్రొపగాండా మూవీ అని విమర్శిస్తున్నారు. వీటి సంగతి కాసేపు పక్కనబెడితే మూవీలో ఓ పొరపాటు మాత్రం అలానే వదిలేశారు. దీన్ని ఇప్పుడు నెటిజన్లు కనిపెట్టారు.(ఇదీ చదవండి: పవన్-హరీశ్ శంకర్ మూడో సినిమా.. అయ్యే పనేనా?)గతేడాది డిసెంబరులో 'ధురంధర్' తొలి భాగం రిలీజ్ కాగా.. ఈ శుక్రవారం(మార్చి 19) సీక్వెల్ విడుదలైంది. ప్రమోషన్స్ ఏం లేకపోయేసరికి వాయిదా పడుతుందేమో అని చాలామంది అనుకున్నారు. కానీ చెప్పిన తేదీకే థియేటర్లలోకి వచ్చారు. కాకపోతే తెలుగు వెర్షన్ మాత్రం రెండు రోజులు ఆలస్యంగా అంటే నిన్నటి(మార్చి 21) నుంచి అందుబాటులోకి తెచ్చారు.అసలు విషయానికొస్తే ఈ మూవీ ఇంటర్వెల్ సీన్లో హీరో, పిండా అనే పాత్రధారి మధ్య బాత్రూమ్లో చిన్నపాటి ఫైట్ సీన్ జరుగుతుంది. మూవీలో ఈ సన్నివేశం చాలామందికి ఆకట్టుకున్నప్పటికీ.. అద్దంలో కెమెరామ్యాన్ కూడా కనిపిస్తాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు ట్విటర్లో వైరల్ అవుతోంది. ఈ పొరపాటు అసలు మేకర్స్ చూసుకోలేదా అని మాట్లాడుకుంటున్నారు. అయితే చెప్పిన తేదీన రిలీజ్ చేయాలనే హడావుడిలో దీన్ని మర్చిపోయింటారేమో అని మాట్లాడుకుంటున్నారు.'ధురంధర్ 2' కలెక్షన్స్ విషయానికొస్తే.. ప్రస్తుతం రూ.500 కోట్ల మార్క్ దాటేసినట్లు తెలుస్తోంది. అలానే ఓవర్సీస్లోనూ 16 మిలియన్ డాలర్లు సాధించినట్లు టాక్. తొలి భాగంలానే ఇది కూడా లాంగ్ రన్లో మరిన్ని వందల కోట్లు సొంతం చేసుకునేలా కనిపిస్తుంది. మరి 'ధురంధర్ 2' రచ్చ.. ఎన్ని వందల కోట్ల దగ్గర ఆగుతుందో చూడాలి?(ఇదీ చదవండి: క్రికెట్ రాజకీయాలకు బలైన 'ధురంధర్' దర్శకుడు)A Cameraman showing in this scene.Peak Detailing by Aditya Dhar Damm 🤣#Dhurandhar2 #DhurandherTheRevenge pic.twitter.com/LDjDG8nReP— Sunil Goriya (@Sunil_Goriya) March 21, 2026 -
హాలీవుడ్ సినిమా కోసం హృతిక్.. ఏలియన్కు డ్యాన్స్ నేర్పిస్తూ..
బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్, హాలీవుడ్ సైన్స్-ఫిక్షన్ చిత్రం 'ప్రాజెక్ట్ హెయిల్ మేరీ' ప్రమోషన్స్ కోసం హాలీవుడ్ దర్శకనిర్మాతలతో చేతులు కలిపారు. భారతీయ ప్రేక్షకులకు ఈ సినిమాను చేరువ చేయడానికి హృతిక్ ఒక స్పెషల్ వీడియోతో ముందుకు వచ్చారు.ఏలియన్కి డ్యాన్స్"జాదూ వర్సెస్ రాకీ" అని టైటిల్ ఇచ్చిన ఈ వీడియోలో హృతిక్ రోషన్ తన సూపర్ హిట్ సాంగ్ 'ఏక్ పల్ కా జీనా' ఐకానిక్ స్టెప్ను ఈ హాలీవుడ్ చిత్రంలోని ఏలియన్ క్యారెక్టర్ 'రాకీ'కి నేర్పిస్తున్నట్లు చూపించారు. హృతిక్, రాకీల మధ్య ఉన్న స్నేహాన్ని చూసి, 'కోయీ.. మిల్ గయా'లోని హృతిక్ పాత ఏలియన్ స్నేహితుడు 'జాదూ' క్యూట్గా రియాక్ట్ అవ్వడం ఈ వీడియోలో ప్రధాన ఆకర్షణ.హాలీవుడ్ స్టార్ హీరో ర్యాన్ గోస్లింగ్ నటించిన ఈ చిత్రం, 'ది మార్షియన్' ఫేమ్ ఆండీ వీర్ రాసిన బెస్ట్ సెల్లింగ్ నవల ఆధారంగా తెరకెక్కింది. 2025 డిసెంబర్లో ఈ నవలపై తనకున్న ఇష్టాన్ని హృతిక్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఇప్పుడు అదే సినిమాను ఇండియాలో ప్రమోట్ చేస్తుండటం విశేషం. హృతిక్ లాంటి స్టార్ తమ సినిమాను ప్రమోట్ చేయడం పట్ల సోనీ పిక్చర్స్ ఇండియా ప్రతినిధి షోనీ పంజీకరణ్ ఆనందం వ్యక్తం చేశారు. ఫిల్ లార్డ్, క్రిస్టోఫర్ మిల్లర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ర్యాన్ గోస్లింగ్, సాండ్రా హుల్లర్, కెన్ లెయుంగ్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఈ మూవీ భారత్లో ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ఐమాక్స్ ఫార్మాట్లో మార్చి 26న విడుదల కానుంది. View this post on Instagram A post shared by Sony Pictures IN (@sonypicturesin) -
50 ఏళ్ల వయసులో తండ్రయిన నిర్మాత
ప్రముఖ బాలీవుడ్ నిర్మాత మధు మంతెన తండ్రిగా ప్రమోషన్ పొందాడు. 50 ఏళ్ల వయసులో తండ్రయ్యాడు. మధు మంతెన - ఐరా త్రివేది దంపతులకు ఆదివారం (మార్చి 22) తెల్లవారుజామున పండంటి మగ బిడ్డ జన్మించింది. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. కాగా మధు మంతెన- ఐరా త్రివేది దంపతులు ప్రెగ్నెన్సీ విషయాన్ని ఈ ఏడాది జనవరి 15న వెల్లడించారు. బిడ్డ కోసం ఎదురుచూపులుభార్య బేబీ బంప్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. మార్చిలో డెలివరీ డేట్ ఇచ్చినప్పటినుంచి బిడ్డ రాక కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు బాబు ఈ ప్రపంచంలో అడుగుపెట్టగానే వారి కుటుంబంలో ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.రెండో పెళ్లిహైదరాబాద్కు చెందిన మధు మంతెన.. 2015లో ఫ్యాషన్ డిజైనర్ మసాబా గుప్తాని పెళ్లి చేసుకున్నాడు. కానీ వీరి వైవాహిక జీవితం ఎంతోకాలం సజావుగా సాగలేదు. దీంతో 2019లో విడాకులు తీసుకున్నారు. తర్వాత యోగా ట్రైనర్ ఐరా త్రివేదిని రెండో పెళ్లి చేసుకున్నాడు. సినిమాల విషయానికి వస్తే.. ఈయన గతంలో తెలుగులో కార్తీక్ మూవీని నిర్మించాడు. ఆ తర్వాత బాలీవుడ్కు షిఫ్ట్ అయ్యాడు. ఆమిర్ ఖాన్ గజిని, క్వీన్, సూపర్ 30, రక్త చరిత్ర వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు నిర్మాతగా వ్యవహరించాడు.చదవండి: ధురంధర్ 2 నుంచి నన్ను తీసేశారనుకున్నా: బాలీవుడ్ నటుడు -
సల్మాన్ ఖాన్ పేరు.. నన్ను ధురంధర్ 2లో తీసేశారనుకున్నా!
రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. ఈ మూవీలో డానిష్ ఇక్బాల్.. బడే సాహెబ్ అలియాస్ దావూద్ ఇబ్రహీంగా నటించాడు. అయితే సినిమాలో తనను ఎక్కడ తీసేస్తారో అని తెగ భయపడిపోయానంటున్నాడు డానిష్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అతడు మాట్లాడుతూ.. ధురంధర్ 1 రిలీజయ్యాక సీక్వెల్లో బడే సాహెబ్గా ఎవరు కనిపించనున్నారని జనాల్లో ఆసక్తి మొదలైంది. నన్ను తీసేశారనుకున్నా..ఈ క్రమంలో ఎంతోమంది పేర్లు తెరపైకి వచ్చాయి. వారిలో సల్మాన్ ఖాన్, ఇమ్రాన హష్మీ పేర్లు కూడా ఉన్నాయి. అది చూసి ఒకరకంగా నేను చాలా భయపడ్డాను. బడే సాహెబ్ కోసం అప్పటికే నేను సెలక్ట్ అయ్యాను. కానీ నన్ను పక్కనపెట్టేశారేమో.. నా స్థానంలో పెద్ద స్టార్స్ను తీసుకుంటున్నారేమో అని కంగారుపడ్డాను. డైరెక్టర్ ఆదిత్య ధర్కు ఫోన్ చేసి కనుక్కుందామా? అని ఆందోళన చెందాను.ఆ రెండు పాత్రలు ఒక్కటే అని తెలీదుకానీ, తర్వాత అలాంటిదేం లేదని తెలిసి ఊపిరి పీల్చుకున్నాను. నిజానికి బడే సాహెబ్, దావూద్ ఇబ్రహీం ఒక్కరేనని నాకూ ముందు తెలీదు. నాది మంచానికే పరిమితమైన దావూద్ ఇబ్రహీం పాత్ర అని మాత్రమే తెలుసు. తర్వాత హీరో బడే సాహెబ్ కోసం వెతుకుతున్నప్పుడు ఆయనెవరని అందరూ ఆలోచించడం మొదలుపెట్టాం. పర్వీజ్ ముషారఫా? ఒసామా బిన్ లాడెనా? అనుకున్నాం. అదే సమయంలో దావూదే బడే సాహెబా? అన్న అనుమానమూ వచ్చింది. చివరకు అదే జరిగింది.మేకప్ కోసం 12 గంటలుముసలి వయసులో ఉన్న దావూద్గా కనిపించడం కోసం దాదాపు ఏడెనిమిది గంటలు శ్రమించాల్సి వచ్చింది. ఆ ప్రోస్తటిక్ మేకప్ను తీసేందుకు కనీసం రెండుమూడు గంటలైనా పెట్టేది. అలా మేకప్కే 12 గంటల సమయం అయిపోయేది అని చెప్పుకొచ్చాడు. ఇకపోతే మార్చి 19న రిలీజైన ధురంధర్ 2 కేవలం మూడు రోజుల్లోనే రూ.500 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. -
మహేశ్బాబుతో యాక్టింగ్.. సెట్లో ఎలా ఉంటారంటే?
కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కితే ఆ కిక్కే వేరంటోంది బాలీవుడ్ నటి నీరూ సెహగల్. ఈమె కీలక పాత్రలో నటించిన కొహ్రా వెబ్స సిరీస్ రెండో సీజన్కు మంచి ఆదరణ లభిస్తోంది. ప్రేక్షకుల రెస్పాన్స్ చూసి సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవుతోంది నీరూ. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. నటులుగా సినిమా, సిరీస్ల కోసం మేం ఎంతో కష్టపడతాం. ఎప్పటికీ మర్చిపోనుఅవి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయని తెలిసినప్పుడు అంతకంటే సంతోషం ఇంకేముంటుంది? నేను అమెరికాలో పెరిగినప్పటికీ పంజాబీ సాంప్రదాయాలకు ఎప్పుడూ కట్టుబడే ఉన్నాను. నా మూలాల్ని ఎప్పటికీ మర్చిపోలేదు. ఆడిషన్ ద్వారానే కొహ్రా సీజన్కు ఎంపికయ్యాను. నా పాత్ర ఎంతో బలంగా ఉంటుంది. ఇలాంటి బలమైన రోల్స్ మరిన్ని చేయాలనుంది. కథ బాగుండి, మంచి పాత్ర ఆఫర్ చేస్తే దక్షిణాదిలోనూ నటించడానికి రెడీ.. మహేశ్బాబుతో యాక్టింగ్రెండేళ్ల క్రితం ఓ యాడ్లో మహేశ్బాబుతో కలిసి పని చేశాను. ఆయన పెద్ద సూపర్స్టార్ అయినప్పటికీ సెట్లో చాలా వినయంగా ఉంటాడు. డెడికేషన్తో పని చేస్తాడు. దానివల్ల షూట్ అంతా చాలా సౌకర్యంగా జరిగింది. ఆయన ఏకాగ్రత, క్రమశిక్షణ.. ఇలా తనను చూసి చాలా నేర్చుకోవచ్చు అని నీరూ సెహగల్ చెప్పుకొచ్చింది.చదవండి: ధురంధర్ 2 విజయం వెనక తెలుగు సినిమా: ఆదిత్య ధర్ -
దురంధర్-2లో టీమిండియా క్రికెటర్స్.. ఈ వీడియో చూశారా?
ఇప్పుడు ఎక్కడ చూసినా దురంధర్ ఫీవర్ కనిపిస్తోంది. మార్చి 19న రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ను షేక్ చేస్తోంది. ప్రీమియర్స్తోనే వసూళ్లు సునామీ మొదలెట్టిన ఈ సినిమా కేవలం మూడు రోజుల్లోనే రూ.500 కోట్ల మార్క్ దాటేసింది. ఆదిత్య ధర డైరెక్షన్లో వచ్చిన ఈ సీక్వెల్ హిందీతో పాటు దక్షిణాది భాషల్లోనూ విడుదలైంది. ఈ మూవీపై టాలీవుడ్ స్టార్స్తో పాటు పలువురు సినీ నటులు ప్రశంసలు కురిపిస్తున్నారు. దర్శకధీరుడు రాజమౌళి సైతం దురంధర్-2 మూవీని పొగిడారు.దురంధర్-2 రిలీజ్ వేళ సోషల్ మీడియాలో ఓ రేంజ్లో హల్చల్ చేస్తోంది. దురంధర్-2 మూవీపై రీల్స్, వీడియోలు పెద్దఎత్తున వైరలవుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఓ వీడియో నెట్టింట అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ సినిమాలో టీమిండియా క్రికెటర్స్ నటిస్తే ఎలా ఉంటుంది? అనే కోణంలో ఓ వీడియోను రూపొందించారు. రణ్వీర్సింగ్ పాత్రలో విరాట్ కోహ్లీ కనిపించగా.. జమీల్ జమాలీ పాత్రలో వీరేంద్ర సెహ్వాగ్ ఉండేలా క్రియేట్ చేశారు. ఈ వీడియో చేసిన ఫన్నీ కోసమే అయినా.. క్రికెటర్స్ ఈ మూవీలో ఎలా కనిపిస్తారో చూస్తే మాత్రం అద్భుతంగా అనిపిస్తోంది. ఇంకెందుకు ఆలస్యం ఆ వీడియో మీరు కూడా చూసేయండి. pic.twitter.com/GalcyV6WIe ఇండియన్ క్రికెటర్లు దురంధర్లో నటిస్తే? 💀🔥— Tupaki (@tupaki_official) March 21, 2026 -
దూసుకెళ్తోన్న దురంధర్-2.. కేవలం మూడు రోజుల్లోనే అన్ని కోట్లా?
రణ్వీర్సింగ్ హీరోగా వచ్చిన దురంధర్-2 హవా కొనసాగుతోంది. దురంధర్కు సీక్వెల్గా వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ను షేక్ చేస్తోంది. ప్రీమియర్స్తోనే రికార్డ్ స్థాయిలో వసూళ్లు సాధించిన ఈ సినిమా కేవలం రెండు రోజుల్లోనే రూ.300 కోట్ల మార్క్ దాటేసింది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మరో రికార్డ్ను తన ఖాతాలో వేసుకుంది. కేవలం మూడు రోజుల్లోనే రూ. 500 కోట్ల క్లబ్లో చేరింది. ప్రపంచవ్యాప్తంగా రూ.501 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఈ కలెక్షన్స్తో ఇండియన్ సినిమా చరిత్రలో సరికొత్త రికార్డ్ సృష్టించింది.నెట్ వసూళ్ల పరంగా చూస్తే మూడు రోజుల్లోనే రూ.రూ. 339.27 కోట్లు వసూలు చేసింది. మూడో రోజు అత్యధికంగా రూ.113 కోట్ల నికర వసూళ్లు రాబట్టింది. కేవలం మూడో రోజు వసూళ్లతోనే హిందీ సినిమా చరిత్రలోనే ఒక కొత్త అధ్యాయాన్ని సృష్టించింది. కేవలం ఇండియాలో మాత్రమే కాదు.. ఓవర్సీస్లోనూ దురంధర్-2 దూసుకెళ్తోంది.ఉత్తర అమెరికాలో 'ధురంధర్ 2' ఏకంగా 4,405 షోలు ప్రదర్శిస్తున్నారు. ఒక ఇండియన్ సినిమా ఇంత భారీ స్థాయిలో విడుదల కావడం ఇదే మొదటిసారి. మూడో రోజు కూడా రెండు లక్షలకు టికెట్లకు పైగా విక్రయించారు. కేవలం అడ్వాన్స్ బుకింగ్ల ద్వారానే సుమారు రూ.23.70 కోట్ల భారీ వసూళ్లను నమోదు చేసింది. ఈ వసూళ్లను చూస్తే ఉత్తర అమెరికా మార్కెట్లో ఒక ఇండియన్ మూవీ ఒక్క రోజులో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా 'ధురంధర్ 2' నిలవనుంది. యూకేలోనూ దురంధర్-2 షోలు హౌస్పుల్గా రన్ అవుతున్నాయి. బెల్ఫాస్ట్ నగరంలో ఏడు షోలు హౌస్పుల్గా ప్రదర్శించారు. ఇదే జోరు కొనసాగితే ప్రపంచవ్యాప్తంగా రూ. 2 వేల కోట్ల క్లబ్లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. -
క్రికెట్ రాజకీయాలకు బలైన 'ధురంధర్' దర్శకుడు
'డాక్టర్ కాబోయే యాక్టర్ అయ్యాను'.. ఇండస్ట్రీలో ఎక్కువగా ఈ మాట వినిపిస్తూ ఉంటుంది. నటుడు లేదా దర్శకుడు అవ్వాలని ఆలోచనతో ఇండస్ట్రీలో అడుగుపెట్టేవాళ్లు కొందరైతే.. అనుకోని విధంగా ఇక్కడొచ్చి అద్భుతమైన గుర్తింపు తెచ్చుకునేవాళ్లు మరికొందరు. అలాంటి వాళ్లలో 'ధురంధర్' డైరెక్టర్ ఆదిత్య ధర్ ఒకడు. క్రికెటర్ కావాల్సిన ఇతడు పాన్ ఇండియా లెవల్లో ఎలాంటి గుర్తింపు తెచ్చుకున్నాడు. అసలు ఆదిత్య బ్యాక్ గ్రౌండ్ ఏంటి?(ఇదీ చదవండి: 'ధురంధర్ 2'.. రెండు రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయంటే?)ఢిల్లీలో పుట్టిన ఆదిత్య ధర్, కశ్మీర్ పండిట్ కుటుంబానికి చెందిన కుర్రాడు. టీమిండియాకి ఎలాగైనా ఆడాలని అనుకునేవాడు. అందుకు తగ్గట్లే ఢిల్లీ అండర్-19 టీమ్ తరఫున కూడా ఆడేవాడు. అయితే 2002లోని భారత అండర్-19 వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కలేదు. క్రికెట్లోని రాజకీయాలే దీనికి కారణమని భావించి తను ఎంతగానే నమ్మిన క్రికెట్ని పక్కనబెట్టేశాడు. రైటర్గా ఇండస్ట్రీలోకి వచ్చాడు. తొలుత 2006లో వచ్చిన కాబుల్ ఎక్స్ప్రెస్ పాటల రచయితగా పనిచేశాడు. తర్వాత హల్ ఏ దిల్, ఆక్రోష్, తేజ్ తదితర చిత్రాలకు కూడా రచయితగా చేశాడు. స్టార్ డైరెక్టర్ ప్రియదర్శన్ దగ్గర సహాయకుడిగానూ వర్క్ చేశాడు. అయితే 2019లో వచ్చిన 'ఉరి' ఇతడిని ఓవర్ నైట్ సెన్సేషన్ చేసిపడేసింది. ఇదే దర్శకుడిగా తొలి చిత్రం. ఇది బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో పాటు దేశవ్యాప్తంగా ఆదిత్య పేరు మార్మోగిపోయేలా చేసింది. ఈ మూవీలో 'హౌ ఈజ్ ద జోష్' డైలాగ్ అయితే తెగ వైరల్ అయిపోయింది. ఇదే చిత్రానికిగానూ ఉత్తమ దర్శకుడిగా జాతీయ అవార్డ్ కూడా తొలి సినిమాకే సొంతం చేసుకున్నాడు.ఇక అదే ఏడాది తన సోదరుడితో కలిసి బీ62 స్టూడియోస్ స్థాపించిన ఆదిత్య ధర్.. తన భార్య, నటి యామీ గౌతమ్ ప్రధాన పాత్రలో నటించిన 'ఆర్టికల్ 370'ని నిర్మించి, రచయితగానూ పనిచేసి హిట్ కొట్టాడు. తొలి మూవీ వచ్చిన దాదాపు ఆరేళ్లకు అంటే గతేడాది డిసెంబరులో 'ధురంధర్'తో వచ్చాడు. సర్ప్రైజింగ్ హిట్ కొట్టాడు. 50 రోజులకు పైనే ఇది థియేటర్లలో ప్రదర్శితమైంది. రెండు రోజుల క్రితం రిలీజైన ధురంధర్ 2 అయితే బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. వందల కోట్ల వసూళ్లు సాధిస్తోంది. క్రికెటర్ కావాల్సిన వాడు ఇప్పుడు బాక్సాఫీస్ మొనగాడు అయిపోయాడు.ఆదిత్య తల్లి సునీత ధర్.. ఢిల్లీ యూనివర్సిటీలో డీన్గా పనిచేయగా, తండ్రి గురించిన సమాచారం అయితే దొరకలేదు. 'ఉరి' తీస్తున్న టైంలోనే అందులో నటించిన యామీ గౌతమ్తో ప్రేమలో పడ్డ ఆదిత్య.. 2021లో ఆమెని పెళ్లి చేసుకున్నాడు. 2024లో వీళ్లకు కొడుకు పుట్టాడు. ప్రస్తుతం 'ధురంధర్ 2' విజయాన్ని ఈ భార్యభర్తలిద్దరూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఏదేమైనా మూడంటే మూడే సినిమాలు తీసి దేశవ్యాప్తంగా అందరూ తన గురించి మాట్లాడుకునేలా చేయడం విశేషం.(ఇదీ చదవండి: డూప్, VFX కాదు.. నిజంగా ధురంధర్ హీరోనే!) -
డూప్, VFX కాదు.. నిజంగా ధురంధర్ హీరోనే!
సినిమాలో కాస్త కఠినమైన సీన్లు, యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయంటే చాలు చాలామంది హీరోలు వారి డూప్లతోనే చేయిస్తారు. దర్శకనిర్మాతలు సైతం ముందుజాగ్రత్త కొద్దీ డూప్లను పెట్టే సీన్లు పూర్తి చేస్తారు. కొన్ని చోట్లేమో హీరోనే పెట్టి సీన్లు చేసినా.. భారీగా వీఎఫ్ఎక్స్ వాడతారు. అతడే సాహసాలు చేసినట్లుగా తెరపై మాయ చేస్తారు.డూప్ కాదుకానీ ధురంధర్ హీరో రణ్వీర్ సింగ్ మాత్రం నిజంగానే సాహసం చేశాడు. డూప్, వీఎఫ్ఎక్స్ జోలికి పోకుండా రియల్ స్టంట్ చేశాడు. సినిమాలో సీక్రెట్ ఏజెంట్గా మారేందుకు హమ్జా (రణ్వీర్ సింగ్) కఠోరమైన శిక్షణ తీసుకుంటాడు. అందులో భాగంగానే నీటిలో ఊపిరి బిగపట్టుకుని ఉండేలా సాధన చేస్తాడు. కదలకుండా కూర్చున్న హీరోఅందుకోసం నీటి అడుగు భాగంలో కదలకుండా కూర్చుంటాడు. ఈ సీన్ను చాలా సహజంగా చిత్రీకరించారు. అందుకు సంబంధించిన మేకింగ్ క్లిప్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇప్పటిదాకా అతడి నటనను మెచ్చుకున్న జనం.. ఈ వీడియో చూశాక అతడి అంకితభావాన్ని ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారు. నీ కష్టం వృథాకాలేదు, నువ్వు చాలా గ్రేట్ యాక్టర్ అని కితాబిస్తున్నారు.సినిమాసినిమా విషయానికి వస్తే.. 2025 డిసెంబర్లో వచ్చిన బ్లాక్బస్టర్ ధురంధర్ మూవీకి సీక్వెల్గా ధురంధర్ 2 తెరకెక్కింది. రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం మార్చి 19న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ మూవీ తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.240 కోట్లు రాబట్టింది. #RanveerSingh performs intense underwater scene with no VFX 🔥Pure dedication & madness by Ranveer 💥#Dhurandhar2 #DhurandharTheRevenge pic.twitter.com/go6iHgSoYb— Milagro Movies (@MilagroMovies) March 21, 2026 చదవండి: త్వరలో పెళ్లి? తేజ సజ్జా రియాక్షన్ ఇదే -
ఐశ్వర్యరాయ్కు సారీ చెప్పిన హీరోయిన్, ఎందుకంటే?
పిల్లి కళ్ల హీరోయిన్ అనగానే అందరికీ మొదట గుర్తొచ్చే పేరు ఐశ్వర్యరాయ్.. ఆ తర్వాత కాస్త అటూఇటుగా ఐష్లాగే కనిపించే స్నేహా ఉల్లాల్ గుర్తొస్తుంది. తను కూడా హీరోయిన్ అయినప్పటికీ తనను ఐశ్వర్యతో పోల్చినందుకు తెగ సంబరపడిపోయింది. అదే సమయంలో ఒకసారి ఆమెను నేరుగా కలిసి క్షమాపణలు కూడా చెప్పింది.. అదెందుకో ఓసారి చూసేద్దాం..సినిమా'ఉల్లాసంగా ఉత్సాహంగా' సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది స్నేహా ఉల్లాల్. అప్పటికే 'లక్కీ: నో టైం ఫర్ లవ్' (2005) చిత్రంతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. అలా ఓపక్క హిందీ సినిమాలు చేస్తూ మరోపక్క తెలుగు చిత్రాల్లో నటించింది. మధ్యలో కొంతకాలం సినిమాలకు గ్యాప్ ఇవ్వగా ఆ తర్వాత అడపడాదడపా సినిమాల్లో కనిపిస్తోంది.సల్మాన్ ఎలాంటివాడంటే?తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్నేహ తన కెరీర్ తొలినాళ్ల గురించి ఓపెన్ అయింది. ఆమె మాట్లాడుతూ.. లక్కీ మూవీతో నా సినీరంగ ప్రవేశం జరిగింది. చిత్రీకరణ సమయంలో హీరో సల్మాన్ ఖాన్ నాకెంతో సపోర్ట్ చేశాడు. ఎప్పుడూ ఓపిక, సహనంతో మెదిలేవాడు. తానో పెద్ద హీరో అని ఎన్నడూ యాటిట్యూడ్ చూపించలేదు.అలా ఫేమస్నిజానికి నేను సినిమాల్లోకి రావాలని ఎప్పుడూ అనుకోలేదు. కాలేజీలో చదువుకుంటున్న రోజుల్లో ఐశ్వర్యరాయ్ మిస్ వరల్డ్ కిరీటం అందుకుంది. చూడటానికి నేను ఐశ్వర్యరాయ్లాగే ఉంటానని చాలామంది అంటుంటారు. అలా ఆమె మిస్ వరల్డ్ కిరీటం ద్వారా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు అందుకుంటే నా చుట్టూ ఉన్న చిన్నప్రపంచంలో నేను సెలబ్రిటీ అయిపోయాను.ఐశ్వర్యకు సారీనేను ఒకే ఒక్కసారి ఐశ్వర్యను కలిశాను. నన్ను చూడగానే ఆమె 'వెల్కమ్ టు ద ఫ్యామిలీ.. బాలీవుడ్కు స్వాగతం' అని సాదరంగా ఆహ్వానించింది. అప్పుడు వెంటనే నేను ఆమెకు సారీ చెప్పాను. మీడియాలో పదేపదే నన్ను ఐష్తో పోలుస్తూనే ఉన్నారు. దాని గురించే చెప్తూ నన్ను క్షమించండి, దయచేసి నన్ను ద్వేషించకండి అన్నాను. మరి ఆమె దాన్ని ఎలా తీసుకుందో నాకు తెలీదు అని స్నేహా ఉల్లాల్ పేర్కొంది.చదవండి: ప్రియుడిని పెళ్లి చేసుకున్న పునర్నవి -
'ధురంధర్ 2'.. రెండు రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయంటే?
చాన్నాళ్ల తర్వాత పాన్ ఇండియా బాక్సాఫీస్ కళకళలాడుతోంది. రీసెంట్గానే థియేటర్లలోకి వచ్చిన 'ధురంధర్ 2'.. నిలకడగా వసూళ్ల సాధిస్తోంది. రిలీజ్కి భారీ హైప్ సొంతం చేసుకోగా.. సాంకేతిక కారణాల వల్ల హిందీ వెర్షన్ మాత్రమే తొలిరోజు విడుదలైంది. శనివారం నుంచి తెలుగు వెర్షన్ కూడా అందుబాటులోకి వచ్చింది. ఇంతకీ రెండు రోజుల పాటు ఈ చిత్రానికి కలెక్షన్స్ ఎంతొచ్చాయి?(ఇదీ చదవండి: దురంధర్-2 చెత్త సినిమా.. థియేటర్కు అస్సలు వెళ్లకండి)రణ్వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన 'ధురంధర్ 2'.. రెండు రోజుల్లో రూ.333 కోట్ల మేర గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్లు తెలుస్తోంది. తొలిరోజు మన దేశంలో రూ.145 కోట్ల నెట్ వసూళ్లు రాగా, శుక్రవారం ఈ నంబర్స్ కాస్త తగ్గి రూ.81 కోట్లు వచ్చినట్లు తెలుస్తోంది. మొత్తంగా రూ.226 కోట్ల నెట్ కాగా రూ.269 కోట్ల గ్రాస్ అని తెలుస్తోంది. మరోవైపు ఓవర్సీస్లోనూ రెండు రోజులకు కలిపి 7 మిలియన్ డాలర్లు వచ్చినట్లు టాక్.అలా ప్రపంచవ్యాప్తంగా 'ధురంధర్ 2' చిత్రానికి రెండు రోజులకు కలిపి రూ.333 కోట్ల గ్రాస్ వచ్చినట్లు తెలుస్తోంది. తెలుగు వెర్షన్ కూడా అందుబాటులోకి వచ్చింది కాబట్టి వీకెండ్ అయ్యేసరికి రూ.500 కోట్ల మార్క్ దాటేయడం గ్యారంటీ అనిపిస్తుంది. గతేడాది డిసెంబరులో ఫస్ట్ పార్ట్ రిలీజైనప్పుడు ఒక్కసారి వసూళ్లు రాలేదు. రోజురోజుకీ పెరుగుతూ వెళ్లాయి. దీనికి కూడా అలానే పునరావృతమయ్యేలా కనిపిస్తుంది. మొదటి భాగానికి రూ.1300 కోట్ల మేర కలెక్షన్స్ రాగా.. ఇప్పుడొచ్చిన సీక్వెల్, ల్యాంగ్ రన్లో ఎన్ని వేలకోట్ల కలెక్షన్స్ సాధిస్తుందో చూడాలి?(ఇదీ చదవండి: ఉస్తాద్ భగత్సింగ్ కలెక్షన్స్.. చెప్పుకోలేని పరిస్థితిలో మేకర్స్) -
కరెక్ట్ పర్సన్ దొరికితేనే పెళ్లి.. లేదంటే జీవితాంతం సింగిల్గానే!
కొందరు పెళ్లంటేనే ముఖం చాటేస్తారు. అలాంటివారిలో బాలీవుడ్ నటి దివ్య దత్తా ఒకరు. 48 ఏళ్ల వయసొచ్చినా ఇంకా పెళ్లి చేసుకోకుండా సింగిల్గానే ఉండిపోయింది. తాజాగా ఆమె ప్రేమ గురించి తన అభిప్రాయాన్ని చెప్పింది. దివ్య దత్తా మాట్లాడుతూ.. గతంలో నేను రిలేషన్షిప్స్లో ఉన్నాను.. కానీ, అవేవీ నాకు సరిపోవని అర్థమైంది. మా ఆలోచనలు భిన్నంగా ఉండేవి. సింగిల్గా ఉన్నానని..దాంతో ప్రేమికులుగా కంటే స్నేహితులుగానే బాగుంటామనిపించింది. అయితే ఇప్పటికీ నేను సింగిల్గా ఉండటం చూసి చాలామంది ఆశ్చర్యపోతుంటారు. జీవితంలో ఓ తోడు లేకుండా ఏం చేస్తున్నావు?, అసలు పెళ్లెందుకు చేసుకోలేదు? అని ప్రశ్నిస్తుంటారు. నా జీవితంలో ఏది ముఖ్యం? ఏది అవసరం అనేది నాకు బాగా తెలుసు.ప్రశాంతంగా ఉంటా..నాకు కరెక్ట్ అనిపించే వ్యక్తి తారసపడ్డప్పుడు కచ్చితంగా ప్రేమలో పడతాను.. కానీ అలాంటి వ్యక్తి దొరక్కపోతే ఇలా ఎప్పటికీ ఒక్కదాన్నే ప్రశాంతంగా ఉంటాను. అంతేతప్ప ఓ తోడుండాలి కదా అని ఎవరో ఒకర్ని పెళ్లి చేసుకోలేను. నాకు ఈ సమాజ ఆమోదం కన్నా మానసిక ప్రశాంతత, సంతోషమే ముఖ్యం.సినిమాపైగా రిలేషన్షిప్లో ఇద్దరూ జీవితాంతం కలిసుంటారన్న గ్యారెంటీ కూడా లేదు. ఎప్పుడు? ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు అని తెలిపింది. దివ్య దత్తా.. వీర్ జార, ఢిల్లీ 6, భాగ్ మిల్కా భాగ్ , హీరోయిన్, బ్లాక్మెయిల్ వంటి పలు సినిమాలతో గుర్తింపు పొందింది. చివరగా ఛావా మూవీలో యాక్ట్ చేసింది.చదవండి: ధురంధర్ 2 ఫ్యాన్స్కి గుడ్న్యూస్.. తెలుగులో కూడా.. -
‘ధురంధర్ 2’ అభిమానులకు గుడ్ న్యూస్.. తెలుగులో కూడా!
‘ధురంధర్ 2’ అభిమానులకు గుడ్ న్యూస్. నేటి నుంచి(మార్చి 21) ఈ మూవీ తెలుగులోనూ విడుదల కానుంది. దీనిపై అధికారిక ప్రకటన రాలేదు కానీ, ఆన్లైన్లో తెలుగు వెర్షన్కి కూడా బుకింగ్స్ ఓపెన్ చేశారు. వాస్తవానికి ఈ సినిమా ప్రీమియర్స్ రోజే అంటే మార్చి 18న తెలుగులోనూ విడుదల కావాల్సింది. కానీ సాంకేతిక కారణాలు, చివరి నిమిషంలో సెన్సార్ బోర్డ సూచించిన మార్పుల వల్ల తెలుగు పాటు తమిళ, కన్నడ, మలయాళ వెర్షన్ల విడుదల వాయిదా పడింది. ప్రీమియర్స్ కోసం ముందే బుక్ చేసుకున్నవారికి థియేటర్ యాజమాన్యాలు రీఫండ్ చేశాయి. దీంతో కొంతమంది భాష తెలియకపోయినా హిందీలోనే ఈ సినిమాను వీక్షించించారు. అయితే శుక్రవారం ఈ మూవీ తెలుగు, తమిళ, మలయాళ వెర్షన్లకు శుక్రవారం సెన్సార్ పూర్తయ్యింది. కన్నడలో ఇంకా సెన్సార్ పూర్తి కాలేదు. దీంతో కన్నడ వెర్షన్ మినహా..మిగతా భాషలన్నింటిలోనూ ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు.ధురంధర్ 2 విషయానికొస్తే..బాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రణవీర్ సింగ్ హీరోగా నటించిన ‘ధురంధర్’ చిత్రానికి సీక్వెల్ ఇది. ఆదిద్యధర్ దర్శకత్వం వహించిన ఈచిత్రంలో సారా అర్జున్ హీరోయిన్గా నటించింది. తొలిరోజే ఈ చిత్రం రూ. 172 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది రికార్డు సృష్టించింది. నేటి నుంచి తెలుగు, తమిళ, మలయాళ వెర్షన్స్ కూడా అందుబాటులో ఉండడంతో కలెక్షన్స్ భారీగా పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. -
దురంధర్-2పై సౌత్ స్టార్స్ ప్రశంసలు.. ప్రకాశ్ రాజ్ రియాక్షన్ ఇదే..!
రణ్వీర్ సింగ్ దురంధర్-2పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇప్పటికే మహేశ్ బాబు, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ, రామ్ చరణ్, రాం గోపాల్ వర్మ సైతం సీక్వెల్ అద్భుతంగా ఉందంటూ ట్వీట్స్ చేశారు. బాలీవుడ్ మేకర్స్ సైలెంట్గా ఉన్నా.. టాలీవుడ్ స్టార్స్ మాత్రం దురంధర్ మూవీని కొనియాడుతున్నారు. ఆదిత్య ధర్ మరో అద్బుతమైన కంటెంట్ అందించారని.. రణ్వీర్ సింగ్ అదరగొట్టేశాడని ఆకాశానికేత్తేస్తున్నారు.ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ నటుడు ప్రకాశ్ రాజ్ రియాక్షన్ కోసం ఎంతోమంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మొదటి నుంచి దురంధర్కు వ్యతిరేకంగా ఉన్న ఆయన.. తాజాగా సౌత్ స్టార్స్ ఈ మూవీ ప్రశంసించడంపై ఎట్టకేలకు స్పందించారు. ఓ నెటిజన్ చేసిన పోస్ట్కు ప్రకాశ్ రాజ్ రిప్లై ఇచ్చారు. దురంధర్-2 మూవీని దక్షిణాది హీరోలు మహేశ్ బాబు, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ ప్రశంసించారు.. బాలీవుడ్ నుంచి ఎవరైనా స్పందించారా? అని నెటిజన్ రాసుకొచ్చాడు. దీనికి ప్రకాశ్ రాజ్ బదులిస్తూ.. 'బాధ్యతల సంకేతాలు దక్షిణాదికి కూడా వ్యాపిస్తున్నాయి' అంటూ ట్విటర్లో పోస్ట్ చేశారు. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్గా మారింది.అంతకుముందు ప్రకాశ్ రాజ్ ఓ పాత సినిమాకు సంబంధించిన పాటలు వింటున్న వీడియోను ట్విటర్లో షేర్ చేశారు. నేను దురంధర్కు చాలా దూరంగా ఉన్నా.. మీరు కూడానా? అంటూ పాట వింటున్న వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియోలో హమ్ దోనో(1961) చిత్రంలోని 'అభీ నా జావో ఛోడ్ కర్' ఐకానిక్ పాటను ప్లే చేశారు. మొదటి నుంచి దురంధర్ను వ్యతిరేకిస్తున్న ప్రకాశ్ రాజ్.. ఈ ట్వీట్స్ చూస్తుంటే మరోసారి తనలోని అక్కసును వెళ్లగక్కినట్లు తెలుస్తోంది.కాగా.. దురంధర్కు సీక్వెల్గా వచ్చిన'ధురందర్: ది రివెంజ్' హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రంలో అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, ఆర్ మాధవన్, సారా అర్జున్, రాకేష్ బేడీ కీలక పాత్రలలో నటించారు. ఈ చిత్రాన్ని జియో స్టూడియోస్, బి62 స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. Signs of Obligations are spreading South too .. #justasking https://t.co/iB01E1sp7K— Prakash Raj (@prakashraaj) March 19, 2026 -
దురంధర్-2 వసూళ్ల ఊచకోత.. ఆ ఒక్కడి వల్లే రూ.500 కోట్లు..!
రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్. గతేడాది డిసెంబర్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల ఊచకోత చూపించింది. 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా నిలిచింది. కేవలం హిందీలో మాత్రమే రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ను షేక్ చేసింది. ఏకంగా రూ.1300 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. తాజాగా ఈ మూవీకి సీక్వెల్గా వచ్చిన చిత్రం దురంధర్ ది రివెంజ్. పార్ట్-2గా వచ్చిన ఈ సినిమా మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. ఈ సారి హిందీతో పాటు దక్షిణాది భాషల్లోనూ రిలీజైంది. కేవలం ప్రీమియర్స్తోనే వసూళ్లు సునామీ ప్రారంభించిన బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో దురంధర్ నటుడు రాకేశ్ బేడీ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. రణ్వీర్ సింగ్ తనతో ఇలా చెప్పారని గుర్తు చేసుకున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన రాకేశ్ బేడీ ఆసక్తికర కామెంట్స్ చేశారు. నా రోల్ షూటింగ్ పూర్తైన రోజు రణ్వీర్ తనకు ఓ మాట చెప్పారని గుర్తు చేసుకున్నారు. ఒకవేళ ఈ మూవీ రూ.1000 కోట్లకు పైగా వసూలుచేస్తే.. అందులో రూ.500 కోట్లు రాకేశ్ వల్లే వస్తాయని అన్నారని తెలిపారు. ఓ నటుడిగా ఇంతకుమించి ఏం కావాలని హర్షం వ్యక్తం చేశారు. నా చివరి రోజు షూటింగ్లో రణ్ వీర్సింగ్ ఏడ్చారని దర్శకుడు ఆదిత్య ధర్ అన్నారు. సెట్లో అంతలా ఎమోషనల్ వాతావరణాన్ని సృష్టించిన మూవీ అని తెలిపారు. కాగా.. ఈ చిత్రంలో రాకేశ్ బేడీ రోల్ ఆడియన్స్ను విపరీతంగా ఆకట్టుకుంది. కరాచీకి చెందిన రాజకీయ నాయకుడు జమాలి పాత్రలో రాకేశ్ బేడీ అదరగొట్టేశారు. రణ్వీర్ సింగ్ ప్రశంసలు..జమాలిగా బేడీ నటన ప్రేక్షకుల నుంచి ప్రశంసలను అందుకుంది. ఓ రాజకీయ నాయకుడి నయవంచక పాత్రలో పాత్రలో ఆయన నటన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. రణ్వీర్ సింగ్ ప్రశంసలు కురిపించడం చూస్తుంటే బేడీ పాత్ర ప్రభావం, అలాగే సెట్లో వారి మధ్య ఏర్పడిన స్నేహబంధం అర్థమవుతోంది. కాగా.. ఈ చిత్రంలో ఆర్. మాధవన్, సారా అర్జున్, డానిష్ పాండోర్, సంజయ్ దత్ లాంటి స్టార్స్ కీలక పాత్రల్లో కనిపించారు. కాగా.. ధురంధర్ 2 ఫస్ట్ డే, ప్రీమియర్స్తో కలిసి ప్రపంచవ్యాప్తంగా రూ. 172.63 కోట్ల గ్రాస్ రాబట్టింది. -
'ధురంధర్ 2'.. బాలీవుడ్ కంటే టాలీవుడే ముందు
ఓ హిందీ సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూసి చాలా కాలమైపోయింది. పదిపదిహేనేళ్ల క్రితం షారుక్ ఖాన్, ఆమిర్ ఖాన్, సల్మాన్ ఖాన్ తదితరుల చిత్రాలకు తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి క్రేజ్ ఉండేది. అందుకు తగ్గట్లే కలెక్షన్స్ వచ్చేవి. కానీ ఇప్పుడు 'ధురంధర్ 2' విషయంలో ఆ జోష్ కనిపిస్తోంది. తెలుగు షోలు పూర్తిస్థాయిలో స్క్రీనింగ్ కానప్పటికీ హిందీ వెర్షన్ అయినా సరే చూసేయాల్సిందే అని ఆలోచనతో ఉన్నారు. హైదరాబాద్ లాంటి నగరాల్లో టికెట్ బుకింగ్స్ చూస్తుంటే ఇదే అనిపిస్తుంది.(ఇదీ చదవండి: ధురంధర్-2 ఫస్ట్ డే కలెక్షన్స్..)ఈ సినిమాలో ఒక్క తెలుగు నటుడు కూడా లేడు. అయినా సరే తొలి పార్ట్ హిట్ అయ్యేసరికి బీభత్సమైన హైప్ ఏర్పడింది. ఈ క్రమంలోనే రెండు రోజుల క్రితమే అంటే బుధవారం సాయంత్రం నుంచి ప్రీమియర్స్ పడ్డాయి. ఈ క్రమంలోనే తెలుగు స్టార్ హీరోలు అయిన అల్లు అర్జున్, మహేశ్ బాబు, ఎన్టీఆర్ తదితరులు ఏకంగా ట్వీట్స్ చేసి మరీ మూవీని ఆకాశానికెత్తేశారు. అదే టైంలో బాలీవుడ్ మాత్రం పూర్తిగా సైలెన్స్ పాటిస్తోంది.'ధురంధర్ 2' ట్రైలర్ రిలీజైనప్పుడు హిందీ ఇండస్ట్రీకి చెందిన హృతిక్ రోషన్, ఆలియా భట్, విక్కీ కౌశల్ లాంటి స్టార్స్ పోస్టులు పెట్టారు గానీ మూవీ వచ్చి రెండు రోజులు కావొస్తున్నా బాలీవుడ్ నుంచి ఒక్కరు కూడా పోస్టుల్లాంటివి పెట్టకపోవడం ఆసక్తికరంగా అనిపిస్తుంది. దీని గురించి సోషల్ మీడియాలోనూ చర్చ నడుస్తోంది. హిందీ సినిమాని సపోర్ట్ చేసే విషయంలోనూ బాలీవుడ్ కంటే టాలీవుడ్ ముందుందిగా అని మాట్లాడుకుంటున్నారు.దీనికి పోటీగా తెలుగు రాష్ట్రాల వరకు పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' రిలీజైంది. కానీ తొలి షో నుంచే నెగిటివ్ టాక్ వస్తోంది. రొటీన్ ఫక్తు కమర్షియల్ మూవీ అని చూసిన ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. పవన్ అభిమానులకు తప్పితే ఇది మరెవరికి నచ్చట్లేదనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి! 'ధురంధర్ 2' తెలుగు వెర్షన్ విడుదలైతే.. 'ఉస్తాద్'కి మరింత కష్టాలు తప్పవు.(ఇదీ చదవండి: ‘ధురంధర్ 2’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్) -
నడిరోడ్డుపై వేధింపులు.. తాగొచ్చి కారు ఆపి..: నటి
బాలీవుడ్ నటి నిమిషా నాయర్కు చేదు అనుభవం ఎదురైంది. ముంబై బాంద్రాలో క్యాబ్లో వెళ్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు తనను ఇబ్బందిపెట్టారంటోంది. ఈ మేరకు ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఉదయం 4.50 గంటల సమయంలో నేను క్యాబ్లో వెళ్తున్నాను. ఆ సమయంలో డ్రైవర్ ఓ బైక్ను ఓవర్టేక్ చేశాడు. ఆ బైక్పై ఉన్నవారు బాగా తాగినట్లున్నారు. వాళ్లను దాటేసినందుకు కోపంతో ఊగిపోయారు. కొట్టడానికి రెడీ..క్యాబ్ డ్రైవర్కు గుణపాఠం చెప్పాలనుకున్నారు. హైవే మధ్యలో మా కారును అడ్డుకున్నారు. కారు ఎదుటే బైక్ నిలిపి ముందుకు వెళ్లనీయకుండా చేశారు. ఆవేశంతో ఎగబడ్డారు, దుర్భాషలాడారు. డోర్స్ తెరిచేందుకు ప్రయత్నించారు. నన్ను విండోస్ కిందకు దించమన్నారు. వాళ్లెంత రెచ్చగొట్టినా సరే మేము ఆ పని చేయలేదు. ఎందుకంటే అతడు డ్రైవర్ను కొట్టడానికే మా కారు ఆపాడని నాకు బాగా తెలుసు.. మా రక్షణ కోసం మేము సైలెంట్గా ఉండిపోయాం. వీడియో తీస్తున్నానని..మమ్మల్ని చాలాసేపు వేధించారు. నేను వీడియో తీస్తున్నానని గ్రహించి కారు ఫోటోలు తీసుకుని వెళ్లిపోయారు అని పేర్కొంది. వీరిపై చర్యలు తీసుకోమని పోలీసులను కోరింది. ఇది చూసిన నెటిజన్లు.. మీరు క్షేమంగా ఉన్నందుకు సంతోషం, ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవడం దురదృష్టకరం.. అని కామెంట్లు చేస్తున్నారు. కాగా నిమిషా నాయర్.. అమర్ కాలనీ, 8 ఏఎమ్ మెట్రో సినిమాల్లో నటించింది. 'ట్రయల్ బై ఫైర్' వెబ్ సిరీస్లోనూ యాక్ట్ చేసింది. View this post on Instagram A post shared by Nimisha Nair 🌸 (@nimnair) చదవండి: యాక్టింగ్ రాదని ట్రోలింగ్ చేశారు: రష్మిక ఎమోషనల్ -
ఫ్రీగా హెయిర్ ట్రాన్స్ప్లాంట్.. రిజెక్ట్ చేశా: అనుపమ్ ఖేర్
టాలెంట్ ఉంటే చాలు ఎలాగైనా రాణించవచ్చనుకున్నాడు నటుడు అనుపమ్ ఖేర్. కానీ, ఆయన బట్టతలను చూసి ఈయనెలా నటుడవతాడని చాలామంది సంశయించారు. వారి అనుమానాలను పటాపంచలు చేస్తూ దిల్వాలే దుల్హానియా లేజాయెంగే, హమ్ ఆప్కే హై కోన్, ద కాశ్మీర్ ఫైల్స్ వంటి బ్లాక్బస్టర్ సినిమాల్లో నటించాడు. రెండుసార్లు జాతీయ అవార్డు అందుకున్నాడు.అంకుల్ అని పిలవద్దుతాజాగా ఓ ఇంటర్వ్యూలో అనుపమ్ ఖేర్ మాట్లాడుతూ.. యువతరం నన్ను సర్, అంకుల్ అని పిలిస్తే నచ్చదు. ఏకే లేదా అనుపమ్ గారు అంటే సరిపోతుంది. అంతేకానీ అంకుల్ అని నన్ను వేరు చేయడం ఇష్టం లేదు. సినిమా దగ్గరినుంచి ఏఐ, సైన్స్.. ఇలా అన్నిరకాల అంశాల గురించి చర్చించడం నాకెంతో ఇష్టం. ఇకపోతే ఎంతోమంది డాక్టర్లు నాకు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తామని ముందుకు వచ్చారు. పేపర్లో యాడ్కానీ, వాళ్లందరినీ సున్నితంగా తిరస్కరించాను. నా తలపై వెంట్రుకలు వచ్చేందుకు డబ్బు ఖర్చుపెట్టేందుకు రెడీ అయినవాళ్లూ ఉన్నారు. కానీ, నేను వారికి ఆ అవకాశాన్ని ఇవ్వలేదు. అలా డబ్బు తీసుకోవడం నాకిష్టం లేదు. ఒకసారి ఏమైందంటే నేను న్యూస్పేపర్ చదువుతున్నాను. అందులో హెయిర్ ఆయిల్ కోసం ఓ వాణిజ్య ప్రకటన వేశారు. అది నేను చూడలేదు. సినిమాకానీ, నా కొడుకు సికందర్ నేను యాడ్నే చూస్తున్నా అనుకుని.. దాని గురించి ఆలోచించకు నాన్న అన్నాడు. ఎన్నో ఏళ్ల కిందట ఈ సంఘటన జరిగింది అని చెప్పుకొచ్చాడు. అనుపమ్ ఖేర్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ఘోస్లా 2. ఇది 2006లో వచ్చిన కల్ట్ క్లాసిక్ ఖోస్లా కా ఘోస్లా సినిమాకు సీక్వెల్గా తెరకెక్కింది. ప్రశాంత్ భాగియా దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ఆగస్టు 28న విడుదల కానుంది.చదవండి: 3 వారాల్లోనే ఓటీటీలో కొత్త సినిమా -
దురంధర్-2 మూవీ.. ప్రీమియర్స్తోనే ఆల్టైమ్ రికార్డ్..!
రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్-2 థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ రోజే ప్రపంచవ్యాప్తంగా రిలీజైన ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. దురంధర్ బ్లాక్బస్టర్ హిట్గా నిలవడంతో ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో ప్రీమియర్స్ షోలకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. టికెట్స్ రిలీజైన కొన్ని నిమిషాల్లోనే హాట్ కేకుల్లా అమ్ముడైపోయాయి.తాజాగా ప్రీమియర్ షోల కలెక్షన్స్లో దురంధర్-2 సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఇండియాలో కేవలం ప్రీమియర్ షోల ద్వారా ఏకంగా రూ.52 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించింది. ఈ మూవీ ప్రీమియర్ షోలను దేశవ్యాప్తంగా దాదాపు 12000 వేలకు పైగా షోలు ప్రదర్శించారు. ఈ కలెక్షన్స్ ప్రీమియర్స్లో అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా ఘనత సాధించింది. ఇప్పటి వరకు నమోదైన అన్ని రికార్డులను దురంధర్-2 అధిగమించింది. ఈ చిత్రంలో ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, సారా అర్జున్, రాకేష్ బేడీ కీలక పాత్రల్లో నటించారు. గతేడాది డిసెంబర్ 5న విడుదలైన దురంధర్ ప్రపంచవ్యాప్తంగా రూ. 1,300 కోట్లు వసూలు చేసిన సంగతి తెలిసిందే. -
రొమాంటిక్ సాంగ్.. దర్శకుడికి కాజోల్ వార్నింగ్!
ఫనా.. ఈ సినిమా వచ్చి 20 ఏళ్లవుతోంది. 2006లో వచ్చిన ఈ చిత్రంలో ఆమిర్ ఖాన్, కాజోల్ హీరోహీరోయిన్లుగా నటించారు. కాజోల్ అంధురాలిగా యాక్ట్ చేసిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్గా నిలిచింది. తాజాగా ఆనాటి సినిమా విశేషాలను దర్శకుడు కునాల్ కోహ్లి పంచుకున్నాడు. హీరోయిన్ వార్నింగ్ఓ ఇంటర్వ్యూలో అతడు మాట్లాడుతూ.. నా సినిమాలో హీరోయిన్కు కళ్లు కనిపించవు. అలా అని తనకు కళ్లజోడు పెట్టలేదు. హీరో, ప్రేక్షకులు ఆమె కళ్లలోకి చూడాలనుకున్నాను. సినిమాలో హీరో, హీరోయిన్లపై దేఖోనా.. అని ఓ వర్షం పాట ఉంటుంది. ఆ సాంగ్ షూటింగ్ మొదటిరోజే కాజోల్ నన్ను హెచ్చరించింది. ఈ పాటను నేను నా అత్తామామలతో కలిసి చూడాల్సి ఉంటుంది, అది మైండ్లో పెట్టుకో అని వార్నింగ్ ఇచ్చింది. అంధురాలు ప్రేమలో పడకూడదా?అయితే నేను వెనక్కు తగ్గాలనుకోలేదు.. ఆమె అంధురాలైతే ఏంటి? అందరిలాగే తను కూడా ప్రేమలో పడింది. తనకెందుకు పరిమితులు విధించాలనుకున్నాను. పాటను విచారంగా చూపించాలనుకోలేదు. నాకు నచ్చినట్లుగానే తీశాను అని చెప్పుకొచ్చాడు. ఈ మూవీలో టబు, సతీశ్ షా, లారా దత్తా కీలక పాత్రలు పోషించారు.చదవండి: రెండు ఫ్లాట్లు అమ్మేసిన ప్రభుదేవా -
బూతు పాట : సంజయ్ దత్, నోరాఫతేహి, టీమ్కు మరో షాక్
సాక్షి, ఢిల్లీ: 'కేడీ: ది డెవిల్'(KD: The Devil) పాట వివాదంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. అశ్లీల సాహిత్యం అంటూ రేగిన వివాదంపై జాతీయ మహిళా కమిషన్ (NCW) మహిళా కమిషన్ సీరియస్గా స్పందించింది.ఎన్సీడబ్ల్యూ సమన్లుఈ పాటలో అశ్లీలత ఉందన్న ఫిర్యాదుల నేపథ్యంలో ఎన్సీడబ్ల్యూ సమన్లు జారీ చేసింది. ఈ చిత్రం బృందంతోపాటు, బాలీవుడ్ నటుడు సంజయ్ దత్, నోరా ఫతేహికి జాతీయ మహిళా కమిషన్ సమన్లు జారీ చేసింది.ఈ పాటలో అభ్యంతరకరమైన ,అశ్లీల సాహిత్యం, అలాగే వీక్షకులను, ముఖ్యంగా పిల్లలకు సంబంధించిన అనుచితమైన అవాంఛనీయ చిత్రాలు ఉన్నాయని ఆరోపిస్తూ వచ్చిన అనేక ఫిర్యాదుల నేపథ్యంలో ఎన్సీడబ్ల్యూ ఈ చర్య తీసుకుంది. పాట రచయితలు, నిర్మాతల నుండి వివరణ కోరింది.ఈ సాంగ్ విడుదల కాగానే అటు పరిశ్రమ వర్గాల నుంచి, ఇటు సోషల్ మీడియాలో తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. ఈ పాటలోని సాహిత్యం, కొరియోగ్రఫీ చాలా అసభ్యకరంగా ఉన్నాయని, మహిళలను కించపరిచేలా ఉన్నాయని పలువురు ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా పిల్లలపై ఇలాంటి కంటెంట్ ప్రతికూల ప్రభావం చూపుతుందని సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. దీంతో ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ పాటను యూట్యూబ్ నుండి తొలగించారు. అటు బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ కూడా స్పందించారు. అశ్లీలతలో బాలీవుడ్ అన్ని హద్దులు దాటేసిందని తీవ్రంగా మండిపడ్డారు.మరోవైపు, చిత్ర దర్శకుడి భార్య రక్షిత ఈ పాటను సమర్థించారు. గతంలో కూడా ఇలాంటి మాస్ సాంగ్స్ వచ్చాయని, ఇది కేవలం సినిమా సృజనాత్మకతలో భాగమేనని దీన్ని సమర్ధించుకున్నారు.ఇదీ చదవండి: చిలుక జ్యోతిష్యుడిని నమ్మి నిండా మునిగిన ఐటీ అధికారిఈ విషయంపై భిన్నాభిప్రాయాలు కొనసాగుతున్నాయి. వినోద రంగంలో సృజనాత్మక స్వేచ్ఛ ,బాధ్యతల పరిమితులపై చర్చను రేకెత్తించింది.ఈ పాటలు భారతీయ సినిమాలో దీర్ఘకాలంగా ఉన్న ధోరణులలో భాగమని కొందరు వాదిస్తుండగా, హానికరమైన లేదా అనుచితమైన కంటెంట్ను నిరోధించడానికి మరింత కఠినమైన నిబంధనలు అవసరమని మరికొందరు భావిస్తున్నారు. మరోవైపు ఎన్సీడబ్ల్యూ (NCW) చర్య వల్ల వినోద రంగంలో కంటెంట్ నియంత్రణపై విస్తృత పరిణామాలు చోటుచేసుకోవచ్చని మరికొందరి అంచనా. -
41 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న నటి
ప్రముఖ బుల్లితెర జంట దివ్యాంక త్రిపాఠి- వివేక్ దహియా గుడ్న్యూస్ చెప్పారు. పెళ్లయిన పదేళ్లకు పేరెంట్స్గా ప్రమోషన్ పొందనున్నట్లు వెల్లడించారు. తెలుగు నూతన సంవత్సరమైన ఉగాది నాడు ఈ శుభవార్తను అభిమానులతో పంచుకున్నారు. ఈ మేరకు దివ్యాంక తన బేబీ బంప్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.అంతా అయిపోయిందనుకునేలోపు..'పదేళ్ల ప్రయాణంలో ట్విస్ట్ అదిరింది కదూ.. కొన్ని ప్రయాణాలు తొందరపెట్టవు.. అవి సిద్ధంగా ఉన్నప్పుడే మొదలవుతాయి. మన కథ పూర్తయిందనుకులోపే జీవితం ఇలాంటి అందమైన అధ్యాయానికి స్వాగతం పలుకుతుంది. ఇంకా ఆ అనుభూతిని ఆస్వాదిస్తూనే ఉన్నా.. కారణం లేకుండానే నవ్వుతున్నా.. మా మనసులు సంతోషంతో నిండిపోయాయి.. అవును, మేము బేబీ కోసం ఎదురుచూస్తున్నాం' అని నటి బ్యూటిఫుల్ క్యాప్షన్ జోడించింది.ఇంకా షాపింగ్ మొదలుకాలేదుఓ ఇంటర్వ్యూలో దివ్యాంక మాట్లాడుతూ.. ప్రెగ్నెన్సీ పాజిటివ్ రాగానే మొదట నా భర్తకే చెప్పాను. ఆ వెంటనే ఇంట్లో వాళ్లందరితోనూ పంచుకున్నాం. అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. దాదాపు ఆరునెలలపాటు ఈ విషయం బయటకు తెలియకుండా జాగ్రత్తపడ్డాం. నేను ఎక్కువగా బయటకు రాకపోవడం వల్ల దీన్ని ఇంతకాలం సీక్రెట్గా ఉంచగలిగాం. బేబీ కోసం ఇంకా షాపింగ్ మొదలుపెట్టలేదు.2016లో పెళ్లిజూన్లో డెలివరీ డేట్ ఇచ్చారు అని పేర్కొంది. దివ్యాంక, వివేక్.. యే హై మొహబ్బతే సీరియల్ సెట్లో కలుసుకున్నారు. ఈ ధారావాహిక చిత్రీకరణ సమయంలోనే ప్రేమలో పడ్డారు. 2016లో భోపాల్లో పెళ్లి చేసుకున్నారు. ఈ జంట నాచ్ బలియే 8వ సీజన్లో పాల్గొని విజేతగా నిలిచింది. ఇప్పుడు 41 ఏళ్ల వయసులో దివ్యాంక తల్లి కాబోతోంది.సీరియల్దివ్యాంక త్రిపాఠి నటి మాత్రమే కాదు మోడల్, యాంకర్ కూడా! 2005లో మిస్ భోపాల్ కిరీటం అందుకుంది. బనూ మే తేరి దుల్హాన్ సీరియల్తో గుర్తింపు పొందింది. అలా వరుస ఛాన్సులు అందుకుంది. మధ్యలో తకనుమరుగైపోయినా యే హై మొహబ్బతే సీరియల్తో ఆమె కెరీర్ మలుపు తిరిగింది. 2017లో ఫోర్బ్స్ సెలబ్రిటీ 100 జాబితాలో చోటు దక్కించుకున్న సీరియల్ నటిగా రికార్డు సృష్టించింది. View this post on Instagram A post shared by Divyanka Tripathi Dahiya (@divyankatripathidahiya) చదవండి: ఓటీటీలో అమరావతికి ఆహ్వానం మూవీ -
వాళ్లు చెప్పిందే నమ్మా.. ఇలా చేస్తారనుకోలేదు
గత కొన్నిరోజులుగా 'సర్కే చునారియా' అనే పాట ఎంతలా వివాదాస్పదమైందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బూతు సాహిత్యం మరీ దారుణంగా ఉండేసరికి కేంద్రం కూడా దీనిపై రియాక్ట్ అయింది. దీంతో పాటని యూట్యూబ్ నుంచి తొలగించారు. సింగర్ మంగ్లీ కూడా క్షమాపణలు చెప్పింది. ఈ గీతంలో డ్యాన్స్ చేసిన నోరా ఫతేహి ఇప్పుడీ వివాదంపై మాట్లాడింది. తన అనుమతి లేకుండానే ఇదంతా చేశారని చెప్పుకొచ్చింది. ఈ మేరకు ఓ వీడియో రిలీజ్ చేసింది.(ఇదీ చదవండి: 'ధురంధర్ 2'కి అల్లు అర్జున్ రివ్యూ.. ఏమన్నాడంటే?)'ఈ పాటని మూడేళ్ల క్రితం కన్నడలో షూటింగ్ చేశారు. తర్వాత ఎలా మార్చారో నాకు తెలియదు. ఓ పెద్ద మూవీ కావడం, సంజయ్ దత్ లాంటి స్టార్ ఉండేసరికి ప్రాజెక్ట్ ఒప్పుకొన్నాను. నిజానికి ఇది 'నాయక్ నహీ ఖల్నాయక్ హో మెయిన్' పాట రీమేక్ అనుకున్నాను. కన్నడ లిరిక్స్ అర్థం కాకపోవడం వల్ల వాళ్లు చెప్పిందే నమ్మాను. అందులో ఏం అసభ్యత అనిపించలేదు. కానీ హిందీలో డబ్ చేయడానికి నా దగ్గర ఎలాంటి అనుమతి తీసుకోలేదు. అసలు ఇది నా దృష్టికే రాలేదు''పాట లాంచ్ ఈవెంట్లోనూ నాకు ఇబ్బందికర అనుభవాలు ఎదురయ్యాయి. లిరికల్ వీడియోలో ఏ మాత్రం బాగోలేని ఫొటోలు, నాతో పాటు సంజయ్ దత్కి సంబంధించిన ఏఐ ఫొటోని ఉపయోగించేసరికి చాలా చిరాకేసింది. అయినా నిగ్రహంగా ఉన్నాను. హిందీ వెర్షన్ చూసిన తర్వాత ఇది కచ్చితంగా విమర్శల పాలవుతుందని ఊహించాను. ఈ విషయం దర్శకుడికి చెప్పి ప్రాజెక్ట్ నుంచి తప్పుకొన్నాను. ప్రజల విమర్శల కారణంగానే మేకర్స్ పాట తొలగించారు. ఇందుకు కృతజ్ఞతలు. ఇకపై నేను మరింత జాగ్రత్తగా ఉంటాను' అని నోరా ఫతేహి చెప్పుకొచ్చింది.కన్నడ హీరో ధ్రువ్ సర్జా హీరోగా నటించిన 'కేడీ' మూవీలోనిది ఈ పాట. దాదాపు మూడేళ్లకు పైగా సెట్స్లో ఉన్న ఈ చిత్రానికి ప్రేమ్ దర్శకుడు. సంజయ్ దత్, శిల్పా శెట్టి లాంటి బాలీవుడ్ స్టార్స్ ఇందులో నటించారు. రీసెంట్గా మొదటి పాటగా దీన్ని రిలీజ్ చేస్తే ఇంతలా వివాదాస్పదమైంది.(ఇదీ చదవండి: 'ఉస్తాద్ భగత్ సింగ్' ట్విటర్ రివ్యూ.. సహనానికి పరీక్ష)Nora Fatehi clarified she had no involvement in the controversial Hindi song, saying it used her image without permission. #NoraFatehi #Bollywood #Dhurandhar2 pic.twitter.com/f7y5LVto9q— Global Affairs 24 (@GlobalAffair24) March 18, 2026 -
టాలీవుడ్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. తెలుగులోనూ ప్రీమియర్స్
సినీ ఇండస్ట్రీలో ఇప్పుడంతా దురంధర్ ఫీవర్ నడుస్తోంది. ఇప్పటికే ప్రీమియర్స్ పడగా.. థియేటర్లు దద్దరిల్లిపోతున్నాయి. ఇవాళ సాయంత్రం కేవలం హిందీలో మాత్రమే ప్రీమియర్స్ ప్రదర్శించారు. అయితే తెలుగు ఆడియన్స్ కూడా ప్రీమియర్స్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో దురంధర్ టీమ్ గుడ్ న్యూస్ చెప్పింది.ఈ రోజు రాత్రి 9 గంటల నుంచే తెలుగుతో పాటు తమిళంలోనూ ప్రీమియర్స్ ప్రారంభం అవుతాయని ప్రకటించింది. ఈ విషయాన్ని డైరెక్టర్ ఆదిత్య ధర్ వెల్లడించారు. దీంతో టాలీవుడ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. అయితే కన్నడ, మలయాళ భాషల్లో మాత్రం రేపటి నుంచి మాత్రమే ప్రదర్శిస్తామని తెలిపారు. సాంకేతిక సమస్యల వల్లే ప్రీమియర్స్ ఆలస్యమైనట్లు పేర్కొన్నారు.గతేడాది రిలీజైన దురంధర్ సూపర్ హిట్ కావడంతో ఈ మూవీ భారీ అంచనాలు నెలకొన్నాయి. డిసెంబర్ 5న విడుదలైన ఈ స్పై థ్రిల్లర్ బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. దీంతో సీక్వెల్పై అభిమానుల్లో మరింత ఆసక్తి పెరిగింది. -
దురంధర్-2 ట్విటర్ రివ్యూ.. ఆడియన్స్ ఏమన్నారంటే?
రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. ఈ చిత్రానికి కొనసాగింపుగా దురంధర్-2 ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. కేవలం మూడు నెలల వ్యవధిలోనే సీక్వెల్ను థియేటర్లలో రిలీజ్ చేశారు. ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ ప్రీమియర్ షోలు ఇప్పటికే ఓవర్సీస్తో పాటు ఇండియాలోనూ ప్రదర్శించారు.ఈ మూవీ చూసిన ఆడియన్స్ సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు. ప్రముఖ సినీ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ సైతం ఈ మూవీపై తన రివ్యూ రాసుకొచ్చారు. దురంధర్-2 ఒక మాస్టర్ పీస్ అని పోస్టులు పెడుతున్నారు. ఇంటర్వెల్ సీక్వెన్స్ స్టన్నింగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దురంధర్-2 ఫస్ట్ హాఫ్ బ్లాక్బస్టర్ అంటూ ఆడియన్స్ ట్వీటిర్ వేదికగా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్ ఖాయమని ప్రేక్షకులు ట్వీట్స్ పోస్ట్ చేస్తున్నారు. It's a stunning interval now✅Finally watched the Bade Saab 🔔Wait here for the complete #Dhurandhar2Review .#Dhurandhar2 #DhurandharTheRevenge . pic.twitter.com/8zk7CEhmkA— Always Bollywood (@AlwaysBollywood) March 18, 2026 BLOCKBUSTER 🔥#Dhurandhar2 #Dhurandhar2Review#DhurandharTheRevenge pic.twitter.com/j14czkhBWh— ◔‿◔ (@KhusshRaho) March 18, 2026 RANVEER SINGH 🫡Radiant-Relentless-Roaring-Resilient-Raw 👑🔥#Dhurandhar2 #DhurandharTheRevenge #Dhurandhar2Review @RanveerOfficial @AdityaDharFilms pic.twitter.com/65jgu2Bmy4— Shikhar Negi (@ImshikharNegi) March 18, 2026 #Dhurandhar2 crushing cringe Bollywood #DhurandharTheRevenge #Dhurandhar2review pic.twitter.com/Hy83od6XCR— Viral (@drviral1123) March 18, 2026 Ohhh mannnBLOCKBUSTER 1ST HALFThis is not going to stop soonThe opening sequence Jassi's back storyAnd many things Don't want to spoil it for u guyzzBut this is a Box office Tsunami#DhurandharTheRevengePremiere#Dhurandhar2Review Bgm is a hit miss because we are spoiled— Aarav jain (@sanidhya_jain18) March 18, 2026 -
విజయాల పాట...వివాదాల బాట
భారతీయ సినిమాల్లో మాత్రమే కనిపించే పాటలు ఓ రకంగా ఇక్కడి సినిమా విజయాలకు అత్యంత కీలకం అని తెలిసిందే. అయితే అవే పాటలు వివాదాలకు కేంద్రబిందువవుతూ ఒక్కోసారి నిషేధాలను కూడా ఎదుర్కుంటున్న పరిస్థితికి కూడా పాటకు ఉన్నంత చరిత్ర ఉంది. ఓ వైపు సినిమా సంగీతం ప్రేక్షకులను అలరించడంలో కీలక పాత్ర పోషిస్తూనే, కొన్ని కొన్ని పాటలు మళ్లీ ఈ అంశాన్ని చర్చనీయాంశంగా మార్చాయి. తాజాగా విడుదలైన సర్కే చునర్ తెరి సర్కే కూడా తీవ్రవివాదంలో ఇరుక్కుంది. ఈ ‘సర్కే చునర్ తెరి సర్కే’ అనే పాటలో నోరా ఫతేహి, సంజయ్దత్లు ప్రధానంగా కనిపిస్తారు. అయితే ఇందులో ఉన్న అసభ్యకర మైన సాహిత్యం నృత్య భంగిమలు ఉన్నట్టుగా ప్రేక్షకుల నుంచి, నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ పాటను ‘‘చీప్’’గా అభివర్ణిస్తూ పలువురు వ్యతిరేకత వ్యక్తం చేయడంతో, చివరికి యూట్యూబ్ నుంచి ఈ పాటను తొలగించడం జరిగింది. అంతేకాకుండా ఈ చిత్ర నిర్మాత, పాట రచయిత తదితరులపై కేసులు కూడా నమోదవడం జరిగింది. ఈ నేపధ్యంలో గత కొంత కాలంగా వివాదాస్పదంగా మారిన పాటలను పరిశీలిస్తే...‘టటేరీ’ పాటతో బాద్షా వివాదాల బాట..ఇదే ఏడాదిలో మ్యూజిక్ ఇండస్ట్రీని కుదిపేసిన మరో వివాదం టటేరీ...ఈ పాటను ప్రముఖ ర్యాపర్ బాద్షా రూపొందించారు. పాటలోని అసభ్యకర కంటెంట్, మహిళలను కించపరిచేలా ఉన్న వ్యాఖ్యల కారణంగా తీవ్ర పాట తీవ్ర విమర్శలకు గురైంది. విమర్శల దాడి తీవ్రతరం కావడంతో చివరకు హర్యానా స్టేట్ కమిషన్ ఫర్ ఉమెన్ కూడా రంగంలోకి దిగాల్సి వచ్చింది. పలు కేసులు నమోదయ్యాయి. చివరికి బాద్షా క్షమాపణలు చెప్పి పాటను డిజిటల్ వేదికల నుంచి తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడింది.నేటి ఖల్ నాయక్ నాటి ఖల్నాయక్...ఇలాంటి వివాదాలు మరీ కొత్తవేమీ కావు. గతంలో అంటే దాదాపు 3దశాబ్ధాల క్రితమే 1993లో విడుదలైన ఖల్నాయక్ సినిమాలోని చోలీకే పీఛే క్యాహై పాట కూడా పెద్ద ఎత్తున వివాదానికి కారణమైంది. ఈ పాటలో ద్వందార్థ పదాలు శృతిమించాయంటూ మహిళా సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఛోళీ కే పీఛే క్యా హై పాట హిట్ అయినప్పటికీ, దూరదర్శన్ ఆల్ ఇండియా రేడియోలో నిషేధించారు. ఈ పాటలో నాటి బాలీవుడ్ గ్లామర్ క్వీన్ మాధురీ దీక్షిత్ నర్తించగా,ఆ పాటలోనూ డాన్గా నటించింది సంజయ్ దత్ కావడం విశేషం. మరో విచిత్రం ఏమిటంటే... సర్కే చునర్ తెరి సర్కే పాటలో కూడా ఖల్ నాయక్ ప్రస్తావన ఉండడం. అదేవిధంగా, 1994లో వచ్చిన సెక్సీ సెక్సీ సెక్సీ ముఝే లోగ్ బోల్తీ పాట కూడా వివాదానికి గురైంది. ఇందులో ‘సెక్సీ’ అనే పదం వాడటం పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీంతో పాట లిరిక్స్ను ‘‘బేబీ బేబీ బేబీ’’గా మార్చాల్సి వచ్చింది.అశ్లీలం ఒకటే కాదు ఇతర కారణాలు కూడా పాటలకుచిక్కులు తెచ్చిపెడుతున్న వైనం కనిపిస్తుంది. గత 2007లో విడుదలైన ఆజా నాచ్లే టైటిల్ ట్రాక్ కూడా వివాదాల్లో చిక్కుకుంది. ఈ పాటలోని ఒక లైన్ కులవివక్షను ప్రోత్సహిస్తోందని ఆరోపణలు రావడంతో ఈ పాటను మన తెలుగులో కూడా తరచుగా పాటలు వివాదస్పదం అవుతున్నాయి. ఇటీవల బాలకృష్ణ నటించిన సినిమాలోని దబిడి దబిడి పాట కూడా నెటిజన్లు మండిపడిన సంగతి తెలిసిందే. కాలం మారినా, వివాదాస్పద పాటల చరిత్ర మాత్రం కొనసాగుతూనే ఉంది. కానీ ఒక స్పష్టమైన మార్పు ఏమిటంటే ఇప్పుడు ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా వెంటనే స్పందిస్తూ కంటెంట్పై ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఫలితంగా, చిత్రసీమ కూడా మరింత బాధ్యతతో వ్యవహరించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇది భవిష్యత్తులో మరింత నాణ్యమైన, బాధ్యతాయుతమైన కంటెంట్కు దారితీయొచ్చునని ఆశించవచ్చు. -
'ధురంధర్' తెలుగు ఫ్యాన్స్కి బ్యాడ్ న్యూస్
'ధురంధర్' సినిమా గతేడాది డిసెంబరులో థియేటర్లలోకి వచ్చింది. దేశవ్యాప్తంగా అద్భుతమైన ఆదరణ దక్కించుకుంది. తర్వాత ఓటీటీలోకి వచ్చిన తర్వాత అదే రేంజ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. తొలి భాగం విడుదలైన మూడు నెలలకు ఇప్పుడు సీక్వెల్ రెడీ అయిపోయింది. ముందే చెప్పినట్లు మార్చి 19నే అంటే రేపటి నుంచే మూవీని రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే తెలుగు సినీ ప్రేక్షకులకు అనుకోని చేదువార్త ఎదురైంది.(ఇదీ చదవండి: నోరు జారా.. క్షమించండి: ఉస్తాద్ భగత్ సింగ్ నటుడు)'ధురంధర్ 2' చిత్రం లెక్క ప్రకారం గురువారం(మార్చి 19) రిలీజ్ అవుతున్నప్పటికీ.. ముందు రోజు సాయంత్రం 5 గంటల నుంచే ప్రీమియర్స్ ప్లాన్ చేశారు. హిందీతో పాటు దక్షిణాది భాషల్లోనూ ఉంటుందని ప్రకటించారు. అందుకు తగ్గట్లే టికెట్స్ కూడా విక్రయించారు. కానీ చివరి నిమిషంలో హడావుడి వల్ల తెలుగు, తమిళ ప్రింట్స్ టైంకి డెలివరీ కాలేదు. దీంతో బుధవారానికి సంబంధించి హిందీ వెర్షన్ మాత్రమే ప్రీమియర్స్ వేస్తున్నారు.తెలుగు, తమిళ వెర్షన్స్.. బుధవారానికి సంబంధించిన షోలు రద్దయ్యాయి. డబ్బులు కూడా రీఫండ్ చేసేశారు. ఇకపోతే గురువారం ఉదయం నుంచి యధావిధిగా తెలుగు వెర్షన్ షోలు పడనున్నాయి. మరోవైపు దర్శకుడు ఆదిత్య ధర్.. మూవీ గురించి ఆసక్తికర పోస్ట్ పెట్టాడు. ట్విస్టులు బయటపెట్టొద్దని చెబుతూనే చివరి వరకు థియేటర్లలోనే ఉండాలని రాసుకొచ్చాడు. దీంతో మూడో భాగం గురించి హింట్ ఇస్తున్నాడా అని మాట్లాడుకుంటున్నారు.'ప్రియమైన 'ధురంధర్' ఫ్యామిలీ.. సినిమాని మీరెంతో ప్రేమించారు. ప్రతి చిన్న అంశాన్ని గుర్తించి మెచ్చుకున్నారు. మళ్లీ మళ్లీ చూసి ఎవరూ గుర్తించలేరనుకునే వాటిని కూడా గుర్తించారు. ఈ ప్రయాణంలో సినిమా మీది అయింది. తర్వాత ప్రపంచానిది కూడా అయింది. 'ధురంధర్: ద రివేంజ్'తో మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాం. భావోద్వేగానికి గురిచేస్తాం. రెడీగా ఉండండి. అందరితో కలిసి ప్రతి ట్విస్ట్, ఎమోషన్ థియేటర్ లోనే అనుభూతి చెందండి. దయచేసి సినిమా చూసిన తర్వాత ట్విస్టులని చెప్పేయకండి. ఎండ్ క్రెడిట్స్ అయ్యేంతవరకు సీట్ల నుంచి లేచి వెళ్లిపోకండి' అని డైరెక్టర్ ఆదిత్య ధర్ చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: 'ధురంధర్' పూర్తి స్టోరీ.. సీక్వెల్ చూడటానికి ముందు మరోసారి)🙏🧿♥️#DhurandharTheRevenge releases worldwide on 19 March, on Gudi Padwa, Ugadi, and Eid.Hindi | Telugu | Tamil | Kannada | Malayalam @ranveersingh @rampal72 @duttsanjay @actormaddy #AkshayeKhanna @saraarjunn @therakeshbedi @adityadharfilms #JyotiDeshpande @dhar_lokesh… pic.twitter.com/wgO61vrUUQ— Aditya Dhar (@AdityaDharFilms) March 18, 2026 -
నాన్న చనిపోయినప్పుడు రూ.30 ఉన్నాయి: ఫరా ఖాన్
బాలీవుడ్ దర్శకురాలు, కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్ తన చేదు బాల్యాన్ని బయటపెట్టింది. తన తండ్రి దర్శకనిర్మాత కమ్రాన్ ఖాన్ నిర్మించిన ఒక్క సినిమాతో ఉన్నదంతా పోగొట్టుకున్నామంటోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఫరా ఖాన్ మాట్లాడుతూ.. ఐసా భీ హోతా హై సినిమాపై నాన్న ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఇంటిని తాకట్టు పెట్టి మరీ సినిమా తీశాడు. కానీ ఆ మూవీ బాక్సాఫీస్ వద్ద ఘోర పరాభవాన్ని చవిచూసింది. కటిక పేదరికంలోకిఆ మూవీ శుక్రవారం రిలీజైతే ఆదివారానికల్లా కటిక పేదరికంలోకి నెట్టివేయబడ్డాం. ఎంతో ధనవంతుడైన నాన్న పేదవాడయిపోయాడు. తన కలలు ఛిద్రం కావడం తట్టుకోలేకపోయాడు. మద్యపానానికి బానిసయ్యాడు. రాత్రి అయిందంటే చాలు మేమంతా వణికిపోయేవాళ్లం. అంతలా తాగేవాడు. ఒకే ఒక్క సినిమా మమ్మల్ని ఐదారేళ్లు వెనక్కు నెట్టేసింది. ఆయన తలెత్తుకోలేకపోయాడు. ఇంటి నుంచి బయటకు వెళ్లలేదు. ఎవరికీ తెలీదు13 ఏళ్లు ఏ పనీ చేయలేదు. అమ్మానాన్న విడిపోయినా కూడా ఎవరికీ ఆ విషయం చెప్పలేదు. నాన్న దర్శకుడిగా విఫలమైనందున నేను డైరెక్టర్ అయి మంచి పేరు తేవాలనుకున్నాను. అలా చిన్నతనంలో ఎప్పుడూ సినిమాల గురించే మాట్లాడుకునేవాళ్లం. ఎక్కువ చిత్రాలు చూసేవాదాన్ని. అయితే నాన్న ఎప్పుడూ కొడుకు గురించి ఆశపడేవాడు. సాజిద్ (ఫరా సోదరుడు) పుట్టాక నన్ను కాస్త పక్కనపెట్టేశాడు. నాన్న చనిపోయినప్పుడునాన్నకు నేనంటే ప్రేమ ఉందని తెలుసు.. కానీ ఫోకస్ అంతా కొడుకుపైనే ఎక్కువ ఉండేది. అప్పుడు సక్సెస్ అవ్వాలన్న సంకల్పం నాలో మరింత బలపడింది. నాన్న చనిపోయినప్పుడు ఆయన జేబులో రూ.30 మాత్రమే ఉన్నాయి అని చెప్పుకొచ్చింది. ఫరా ఖాన్ అన్నట్లుగానే హిందీ ఇండస్ట్రీలో మొదట కొరియోగ్రాఫర్గా పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత దర్శకురాలిగా మై హూనా, ఓం శాంతి ఓం, హ్యాపీ న్యూయర్, తీస్మార్ ఖాన్ వంటి ఎన్నో సినిమాలు తెరకెక్కించింది.చదవండి: నోరు జారా.. క్షమించండి: ఉస్తాద్ భగత్ సింగ్ నటుడు -
నా భార్య రెండు ఇండక్షన్ స్టవ్స్ ఆర్డర్ చేసింది: హీరో
పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం కారణంగా భారత్లో ఎల్పీజీ గ్యాస్ సరఫరాలో జాప్యం జరుగుతోంది. దీంతో ఇప్పటికే అనేక హోటళ్లు ప్రత్యామ్నాయంగా కట్టెల పొయ్యి, కరెంట్ స్టవ్లమీద వంట చేస్తున్నాయి. అటు ప్రజలు సైతం సిలిండర్లు సమయానికి రావకపోవడంతో ఇండక్షన్ స్టవ్లు ఎగబడి మరీ కొంటున్నారు. రెండు ఆర్డర్..బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కూడా అదే పని చేశాడు. ఓ కార్యక్రమంలో అక్షయ్ కుమార్ మాట్లాడుతూ.. నా భార్య (ట్వింకిల్ ఖన్నా) నిన్నగాక మొన్న రెండు ఇండక్షన్ స్టవ్స్ ఆర్డర్ పెట్టింది. అదింకా డెలివరీ అయిందో, లేదో నాకు తెలీదు. ఎందుకైనా మంచిది, మీరు కూడా ఒకటి కొనుక్కుంటే బెటర్ అన్నాడు. సినిమాప్రస్తుతానికి తమ ఇంట్లో వంటగ్యాస్ కొరత లేదని, కాకపోతే బ్యాకప్ కోసం ఇండక్షన్ స్టవ్ రెడీ చేసుకుంటున్నట్లు తెలిపాడు. అక్షయ్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం అతడు ప్రధాన పాత్రలో నటించిన హారర్ కామెడీ చిత్రం భూత్ బంగ్లా ఏప్రిల్ 10న రిలీజ్ కానుంది. ఇది కాకుండా ఆయన చేతిలో మరో నాలుగు సినిమాలున్నాయి.చదవండి: చికిరి చికిరి పట్టించుకోలేదు.. ఈ పాట వల్లే అభాసుపాలు: గేయరచయిత -
ఆ 'చికిరి చికిరి' పట్టించుకోలేదు.. ఈ పాట వల్ల తీవ్ర అవమానం!
తమిళ హీరో ధ్రువ సర్జా ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం "కేడీ: ద డెవిల్". బాలీవుడ్ నటుడు సంజయ్ దత్, శిల్పాశెట్టి కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో నోరా ఫతేహి ఐటం సాంగ్లో మెరిసింది. ఇటీవలే కన్నడతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ఆ ఐటం సాంగ్ను విడుదల చేశారు.బూతు పాటఅయితే హిందీలో ఆ పాట లిరిక్స్ పచ్చిబూతులతో అసభ్యంగా ఉంది. డ్యాన్స్ కూడా అశ్లీలంగా ఉండేసరికి అభ్యంతరాలు వెల్లువెత్తాయి. ఆలిండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ ఫిర్యాదుతో కేంద్రం.. ఈ పాటను తొలగించాలని ఆదేశించింది. అలా హిందీ వర్షన్ను యూట్యూబ్ నుంచి తీసేశారు. తాజాగా ఈ వివాదంపై హిందీలో 'సర్కే చునర్' పాటకు లిరిక్స్ అందించిన గేయరచయిత రఖీబ్ ఆలం స్పందించాడు. నేను సొంతంగా రాయలేదుఆ లిరిక్స్ సొంతంగా తాను రాసినవి కావన్నాడు. కన్నడలో దర్శకుడు ప్రేమ్ రాసిన లిరిక్స్నే యథాతథంగా హిందీలో అనువదించాను. నిజానికి ఈ పాటను హిందీలో రాయమన్నప్పుడే నేను తిరస్కరించాను. ఇలాంటివి సెన్సార్ ఒప్పుకోవు, వర్కవుట్ కాదన్నాను. కన్నడ వర్షన్ను అచ్చుగుద్దినట్లుగా హిందీలో మార్చమని అప్పగించారు. చాలా డబుల్ మీనింగ్ లైన్స్ ఉన్నాయి. కానీ అదంతా ఒక మద్యం సీసా గురించి అని వారు చిట్టచివర్లో బయటపెట్టారు. అవేవీ గుర్తించలేదుఅయితే అది తెలిసేవరకు ఆ లైన్స్ అన్నీ అసభ్యకరంగానే అనిపిస్తాయి. అదే విషయం నేనూ చెప్పాను. అసలు ఇలాంటి పాటలు రాయాల్సిన అవసరం నాకేంటి? నేను మంచి పాటలు రాసినప్పుడు ప్రజలు వాటిని పట్టించుకోరు. రామ్చరణ్ పెద్ది సినిమాలోని చికిరి చికిరి పాటకు హిందీలో నేనే సాహిత్యాన్ని అందించాను. పుష్ప మూవీలోని అన్ని పాటలు హిందీలో నేనే రాశాను. అవేవీ గుర్తించలేదు.. కొత్త వర్షన్ వస్తుందికానీ సర్కే చునర్ సాంగ్ వల్ల అభాసుపాలయ్యాను, ఎంతో అవమానకరంగా ఉంది. నేను చెప్పినట్లే పాటపై అభ్యంతరాలు వచ్చాయి. దాంతో మేకర్స్ ఎటువంటి అసభ్యతకు చోటు లేకుండా కొత్త వర్షన్ రాయమని అడిగారు. అది ఆల్రెడీ రాసి పంపాను. త్వరలోనే చిత్రయూనిట్ క్షమాపణలు చెప్పి కొత్త లిరిక్స్తో ఉన్న పాట రిలీజ్ చేస్తుంది అని రఖీబ్ చెప్పుకొచ్చాడు.చదవండి: సినిమాపై భయం.. అబ్బాస్కు మంచి కమ్బ్యాక్: జీవీ ప్రకాశ్ కుమార్ -
చాంద్ దేఖ్ లేనా..
సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘మాతృభూమి’. ఈ చిత్రంలో చిత్రాంగదా సింగ్ హీరోయిన్గా నటిస్తున్నారు. అపూర్వ లఖియా దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ నిర్మిస్తున్నారు. దేశభక్తి నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో సల్మాన్ సైనికాధికారిగా నటిస్తున్నారు. ఈ చిత్రంలోని ‘చాంద్ దేఖ్ లేనా..’ పాట టీజర్ను రిలీజ్ చేసి, త్వరలోనే పూర్తి పాటను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ పేర్కొన్నారు.హిమేష్ రేష్మియా స్వరపరచిన ఈ పాటకు సమీర్ అంజాన్ సాహిత్యం అందించగా, నిహాల్ టౌరో–అంకోనా ముఖర్జీ పాడారు. ఈ సినిమాకు తొలుత ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్’ అనే టైటిల్ను అనుకుని, ఇటీవల ‘మాతృభూమి’గా మార్చారు. అలాగే ఈ సినిమాను తొలుత ఏప్రిల్ 17న రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. కానీ వాయిదా పడిందని, ఆగస్టు 15న ఈ చిత్రం రిలీజ్ కావొచ్చని బాలీవుడ్ టాక్. -
బూతు పాటపై కేంద్రం సీరియస్
సినిమాల్లో ఈ మధ్య హింస పెరిగిపోతోంది. రక్తపాతం, వయలెన్స్ లాంటి వాటిని కాస్త ఎక్కువగానే చొప్పిస్తున్నారు. ఇది సమాజంపై చూపి ప్రభావం చూపే చాలానే ఉండొచ్చు. ఇప్పుడు దీనికి తోడు పాటలు కూడా హద్దులు దాటేస్తున్నాయి. రీసెంట్గా అలా నోరా ఫతేహి డ్యాన్స్ చేసిన ఓ గీతం ఇప్పుడు వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయింది. సోషల్ మీడియాలో లెక్కకు మించిన విమర్శలు వచ్చాయి. ఇప్పుడు ఈ పాటపై కేంద్రం కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది.(ఇదీ చదవండి: 'ధురంధర్ 2'.. మన దగ్గర ఇలా అక్కడ మరోలా)కన్నడ హీరో ధ్రువ సర్జా లేటెస్ట్ మూవీ 'కేడీ:ది డెవిల్'. ఎప్పటినుంచో సెట్స్ మీదున్న ఈ చిత్రం విడుదలకు నానా తంటాలు పడుతోంది. సంజయ్ దత్, శిల్పా శెట్టి లాంటి స్టార్స్ ఇందులో కీలక పాత్రలు చేశారు. త్వరలో రిలీజ్ చేద్దామనుకుని రీసెంట్గానే 'సర్కే చునర్' అని సాగే మొదటి పాటని రిలీజ్ చేశారు. ఈ పాట సాహిత్యానికి సంబంధించి దక్షిణాదిలో ఓ దశ వరకు రాశారు. హిందీలో మాత్రం డబుల్ మీనింగ్ వచ్చేలా పచ్చిబూతులు రాసేశారు. దీనికి తోడు డ్యాన్స్ కూడా అసభ్యంగా ఉండేసరికి వివిధ వర్గాల నుంచి అభ్యంతరాలు వచ్చాయి.ఈ పాటపై ఆలిండియా సినీ వర్కర్స్ అసోసియేషన్.. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేసింది. స్పందించిన కేంద్రం.. అన్ని చోట్ల నుంచి పాటని తొలగించాలని సెన్సార్ అధికారుల్ని ఆదేశించింది. సినిమాలు, మ్యూజిక్ వీడియోల్లో ఈ తరహా అభ్యంతరకర కంటెంట్ పునరావృతం కాకుండా పర్యవేక్షించాలని సూచించింది. ఇప్పటికే హిందీ వెర్షన్ పాటని యూట్యూబ్ నుంచి తొలగించేశారు.పాన్ ఇండియా మూవీగా తీసిన 'కేడీ ది డెవిల్'ని.. రీసెంట్ టైంలో 'జన నాయగణ్'తో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మించింది. ఇప్పటికే విజయ్ సినిమా రిలీజ్ నిరవధిక వాయిదా పడేసరికి సతమవుతున్న ఈ నిర్మాణ సంస్థకు 'టాక్సిక్' వాయిదా మరో దెబ్బ కాగా.. ఇప్పుడు ఈ పాటపై కూడా సర్వత్రా విమర్శలు, కేంద్రం సీరియస్ కావడం లాంటివి మరింతగా ఇబ్బంది పెడుతున్నాయి.(ఇదీ చదవండి: నాకు నయనతార కావాలి.. ఎంపీ షాకింగ్ కామెంట్స్) -
'ధురంధర్ 2'.. మన దగ్గర ఇలా అక్కడ మరోలా
లెక్క ప్రకారం ఈ నెలలో చాలానే పాన్ ఇండియా సినిమాలు రావాలి. కానీ చాలావరకు అవన్నీ వాయిదా పడటంతో చివరకు 'ధురంధర్ 2' మాత్రమే రేసులో మిగిలింది. ఈ గురువారం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. దేశమంతటా దీనిపై హైప్ బీభత్సంగా ఉంది. ప్రీమియర్, రెగ్యులర్ షోల టికెట్స్ వేగంగా బుక్ అయిపోతున్నాయి. అయితే ఓ విషయం మాత్రం ఆసక్తికరంగా అనిపిస్తోంది.(ఇదీ చదవండి: బ్యాడ్ సెంటిమెంట్.. టెన్షన్లో పవన్ ఫ్యాన్స్!)గతేడాది డిసెంబరులో అంటే మూడు నెలల క్రితం 'ధురంధర్' తొలి పార్ట్ రిలీజైనప్పుడు ఏ మాత్రం హైప్ లేదు. ఎప్పుడైతే థియేటర్లలోకి వచ్చిందో మౌత్ టాక్ వల్ల పాన్ ఇండియా లెవల్లో టాక్ ఆఫ్ ద టౌన్ అయిపోయింది. ఈ మూవీ చివరలో చెప్పినట్లుగానే మార్చి 19నే ఇప్పుడు సీక్వెల్ విడుదల చేస్తున్నారు. తొలి భాగం దాదాపు మూడున్నర గంటల నిడివి కాగా.. ఇప్పుడు మరింత నిడివితో సీక్వెల్ రాబోతుంది.'ధురంధర్: ద రివేంజ్' నిడివి మన దేశంలో మూడు గంటల 49 నిమిషాలు కాగా.. ఓవర్సీస్లో మాత్రం 3 గంటల 55 నిమిషాలు. అంటే మన కంటే విదేశీ ప్రేక్షకులు ఆరు నిమిషాల పాటు అదనంగా ఉండే ఫుటేజ్ చూడనున్నారనమాట. రిలీజ్ 19నే అయినప్పటికీ ముందురోజు సాయంత్రం నుంచి దేశవ్యాప్తంగా ప్రీమియర్లు పడనున్నాయి. ముంబై, బెంగళూరు లాంటి నగరాలతో పోలిస్తే హైదరాబాద్లోనే ప్రీమియర్ల బుకింగ్స్ టాప్ రేంజులో ఉన్నట్లు తెలుస్తోంది.ఇక విడుదలకు ముందే రూ.130 కోట్లకు పైగా ప్రీ సేల్స్తో అదరగొట్టిన 'ధురంధర్ 2'.. తెలుగు, తమిళం లాంటి దక్షిణాది భాషల్లోనూ రిలీజ్ కానుంది. దీంతో ఈసారి ఎన్ని వందల కోట్ల కలెక్షన్స్ వస్తాయోనని మూవీ లవర్స్ మాట్లాడుకుంటున్నారు. మరోవైపు దీనితో పాటు విడుదలవుతున్న తెలుగు సినిమా 'ఉస్తాద్ భగత్ సింగ్'.. 2 గంటల 34 నిమిషాల నిడివితో థియేటర్లలోకి వస్తోంది. మరి 'ధురంధర్ 2' పోటీ తట్టుకుని పవన్ మూవీ నిలబడుతుందా లేదా అనేది చూడాలి?(ఇదీ చదవండి: నాకు నయనతార కావాలి.. ఎంపీ షాకింగ్ కామెంట్స్) -
రిలీజ్కు ముందే దూకుడు.. ఓజీ, బాహుబలి-2 రికార్డ్స్ బ్రేక్..!
రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్. పాకిస్తాన్ బ్యాక్డ్రాప్లో తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ను షేక్ చేసింది. గతేడాది డిసెంబర్ 5న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా రికార్డ్ సృష్టించింది. కాంతార-2, ఛావా సినిమాలను అధిగమించి మొదటిస్థానంలో నిలిచింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.1300 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమాకు సీక్వెల్గా దురంధర్-2 ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు మేకర్స్. దురంధర్ ది రివెంజ్ పేరుతో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది.అడ్వాన్స్ బుకింగ్స్లో దూకుడు..ఇప్పటికే అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్లోనూ దురంధర్-2 దూసుకెళ్తోంది. ప్రీమియర్ షోలు, మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్స్తో కలిసి ఏకంగా రూ.123 కోట్లు వసూలు చేసింది. రిలీజ్కు ముందే సరికొత్త రికార్డులతో అభిమానుల్లో అంచనాలు మరింత పెంచేసింది. మరిన్ని షోల బుకింగ్లు ఇంకా ప్రారంభం కావాల్సి ఉన్నందున.. రాబోయే రెండు రోజుల్లో ఈ వసూళ్ల సంఖ్య భారీగా పెరిగే ఛాన్స్ ఉంది.దేశవ్యాప్తంగా మార్చి 18న 'ధురందర్ 2' ప్రీమియర్ షోలు ప్రదర్శించనున్నారు. ఈ ప్రీమియర్ షో టికెట్స్ ద్వారా రూ.38.50 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఈ కలెక్షన్స్తో ఓజీ, బాహుబలి-2 ప్రీమియర్ షోల రికార్డ్స్ బ్రేక్ చేసింది. ఇండియాలో మొదటి రోజు 13 వేల షోల ద్వారా ఈ చిత్రం రూ. 24.50 కోట్ల దేశీయ వసూళ్లు రాబట్టింది. ప్రీ సేల్స్ ద్వారా అంతర్జాతీయ మార్కెట్లలో సుమారు రూ. 60 కోట్లు బిజినెస్ చేసింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా మొత్తం ప్రీ బిజినెస్ రూ. 123 కోట్లకు చేరుకుంది. -
'అలా చేయడం సిగ్గుచేటు'.. ఆస్కార్ నివాళిపై హేమ మాలిని ఆగ్రహం..!
ఆస్కార్ అవార్డుల వేడుక గ్రాండ్గా జరిగింది. 98వ ఆస్కార్ అవార్డుల వేడుక లాస్ ఏంజెలెస్లోని డాల్బీ థియేటర్లో నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు సినీ దిగ్గజాలకు నివాళులర్పించారు. సినీ రంగంలో విశేషంగా రాణించిన టాలీవుడ్ దివంగత నటుడు కోట శ్రీనివాసరావును స్మరించుకున్నారు. ఆయనతో పాటు బాలీవుడ్ దిగ్గజం ధర్మేంద్ర, మనోజ్ కుమార్, బి.సరోజాదేవి లాంటి నటులకు గుర్తు చేసుకున్నారు. ఈ ప్రతిష్టాత్మక వేడుకలో నివాళులర్పిస్తూ వీడియోను ప్రదర్శించారు. ఈ సినీ దిగ్గజాల పేర్లను అకాడమీ తన అధికారిక వెబ్సైట్లో ప్రత్యేకంగా పొందుపరిచారు.అయితే తాజాగా ధర్మేంద్రకు ఆస్కార్ నివాళి అర్పించడంపై ఆయన భార్య హేమ మాలిని స్పందించారు. ఆస్కార్ వేదికపై ప్రసారం చేసిన మెమోరియంలో ధర్మేంద్ర ఫోటోలు లేకపోవడంపై నిరాశ వ్యక్తం చేశారు. ఇలా ప్రదర్శించడం ఆ అవార్డుల వేడుకకే సిగ్గు చేటని హేమ మాలిని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు గౌరవించకపోయినా ఆయనకు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ప్రేమిస్తున్నారని ఆమె అన్నారు. కేవలం అవార్డులు మాత్రమే ఆయన కెరీర్ను నిర్ణయించలేవని తెలిపారు.హేమ మాలిని మాట్లాడుతూ.. 'ఆయన తన జీవితకాలంలో ఎప్పుడూ ఎక్కువ అవార్డులు పొందలేదు. అలాంటప్పుడు ఆయన ఆస్కార్ల గురించి ఎందుకు పట్టించుకోవాలి? మా ఇద్దరికీ మన దేశంలో లభిస్తున్న ప్రేమ పట్ల చాలా సంతోషంగా ఉన్నాం. లాల్ పత్తర్, మీరా చిత్రాలలో నా ఉత్తమ నటనకు కూడా ఎటువంటి అవార్డు రాలేదు' అని తెలిపింది.అయితే ప్రత్యక్ష ప్రసారం సందర్భంగా డయాన్ కీటన్, కేథరీన్ ఓహారా, రాబర్ట్ రెడ్ఫోర్డ్, ఉడో కీర్, రాబ్ రైనర్, రాబర్ట్ డువాల్, జీన్ హాక్మన్, వాల్ కిల్మర్లతో లాంటి అంతర్జాతీయ సినీ ప్రముఖులకు మాత్రమే అకాడమీ నివాళులర్పించింది. ఆ తర్వాత ధర్మేంద్రతో పాటు మరో నటుడు మనోజ్ కుమార్లను అధికారిక ఆస్కార్ వెబ్సైట్లో ఇన్ మెమోరియం జాబితాలో చేర్చారు. కాగా.. సినీ పరిశ్రమకు ఆయన చేసిన సేవలను గుర్తించిన కేంద్రం.. ధర్మేంద్రను పద్మ విభూషణ్తో సత్కరించింది. టాలీవుడ్ సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావుకు సైతం ఆస్కార్ అకాడమీ నివాళులర్పించింది. -
ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ మృతి.. జాన్వీ కపూర్ ఎమోషనల్ పోస్ట్!
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఎమోషనల్ పోస్ట్ చేసింది. ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ మార్స్ మృతి పట్ల తీవ్ర భావోద్వేగానికి గురైంది. అతనితో ఉన్న స్నేహాన్ని గుర్తు చేసుకుంటూ నివాళులు అర్పించింది. అతనితో ఉన్న ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అతని మరణం పట్ల పలువురు బాలీవుడ్ సినీతారలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.సోషల్ మీడియాలో జాన్వీ కపూర్ రాస్తూ..'సినిమా సెట్లో బిజీగా ఉన్నప్పటికీ ఎప్పుడు నవ్వుతూ ఉండేవాళ్లం. వానిటీ వ్యాన్లో ప్రవేశించిన ప్రతిసారీ కేవలం 20 నిమిషాలు మాత్రమే టైమ్ ఉందని ఆటపట్టించేదాన్ని. నీతో కలిసి పనిచేయడం ఆనందంగా అనిపించేది. నీతో కలిసి పనిచేసిన క్షణాలు ఎప్పటికీ గుర్తుంటాయి. ఇక నుంచి నేను ప్రతిరోజూ నిన్ను మిస్ అవుతాను. గత రెండు సంవత్సరాలుగా నా సృజనాత్మక ప్రయాణం ప్రారంభం నుంచి చివరి వరకు నీ ముఖాన్ని చూడటం నా జీవితంలో గుర్తుండిపోయే క్షణాల్లో ఒకటి. లవ్ యూ.. నేను నిన్ను చాలా మిస్ అవుతున్నా…' అంటూ పోస్ట్ చేసింది.కాగా.. జాన్వీ కపూర్ ప్రస్తుతం పెద్ది మూవీలో నటిస్తోంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్నారు. ఈ మూవీకి బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 30న థియేటర్లలో సందడి చేయనుంది.అసలు మార్స్ పెడ్రోజో ఎవరు?మార్స్ పెడ్రోజో హిందీ చిత్ర పరిశ్రమలో ప్రముఖ హెయిర్స్టైలిస్ట్గా గుర్తింపు తెచ్చుకున్నారు. అనేక మంది స్టార్స్తో కలిసి పనిచేశారు. ఫిల్మ్ షూటింగ్స్, ప్రమోషనల్ ఈవెంట్స్తో గుర్తింపు పొందారు. కొన్నేళ్లుగా ఇండస్ట్రీలోని సృజనాత్మక నిపుణులతో కలిసి పనిచేశాడు, అతని నైపుణ్యాలు, సెట్లో తన వర్క్తో మరింత ఫేమస్ అయ్యాడు. అతని మరణ వార్త విన్న పలువురు బాలీవుడ్ ప్రముఖులు పెడ్రోజోను గుర్తుచేసుకున్నారు. వరుణ్ ధావన్, నోరా ఫతేహి లాంటి స్టార్స్ పరిశ్రమకు చేసిన సహకారాన్ని గుర్తు చేసుకుంటూ సంతాపం వ్యక్తం చేశారు. View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) -
రామాయణలో 'కుంభకర్ణ'గా ఆ నటుడు!
ఇండియన్ బిగ్స్క్రీన్పై అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం రామాయణ. నితీశ్ తివారి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ రెండు భాగాలుగా రానుంది. ఈ రెండు భాగాలకు కలిపి దాదాపు రూ.4000 కోట్ల బడ్జెట్ కేటాయించారు. అంటే సినిమాను ఎంత విజువల్ వండర్గా తెరకెక్కిస్తున్నారో ఇక్కడే అర్థమైపోతోంది.రామాయణ సినిమాఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్బీర్ కపూర్ రాముడిగా, సాయిపల్లవి సీతగా, యష్ రావణుడిగా నటిస్తున్నారు. అలాగే సన్నీడియోల్ హనుమంతుడిగా, రవి దూబే లక్ష్మణుడిగా కనిపించనున్నారు. తాజాగా రావణుడి సోదరుడు, కుంభకర్ణుడి పాత్ర గురించి ఆసక్తికర వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. మొన్నటివరకు బాబీ డియోల్ కుంభకర్ణుడిగా చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు మరో నటుడి పేరు తెరపైకి వచ్చింది.కుంభకర్ణుడిగా..అతడే ఫైజల్ మాలిక్. పంచాయత్ వెబ్ సిరీస్తో గుర్తింపు తెచ్చుకున్న ఇతడిని కుంభకర్ణుడిగా ఎంపిక చేయగా, అతడిపై సీన్స్ చిత్రీకరించారని తెలుస్తోంది. అతడి అవతారం కుంభకర్ణుడి పాత్రకు సరిగ్గా సరిపోయిందని ఇన్సైడ్ వర్గాల టాక్! మరి ఇదెంతవరకు నిజమన్నది తెలియాల్సి ఉంది. ఇకపోతే మార్చి 27న శ్రీరామనవమిని పురస్కరించుకుని రామయణ సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. తొలి భాగం ఈ ఏడాది దీపావళికి విడుదల చేస్తుండగా రెండో భాగాన్ని 2027 దీపావళికి రిలీజ్ చేయనున్నారు.సినిమాలు, సిరీస్లుఫైజల్ మాలిక్.. గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్ సినిమాలో కామెడీ పోలీస్గా నటించాడు. పంచాయత్ వెబ్ సిరీస్లో డిప్యూటీ ప్రధాన్ ప్రహ్లాద్చాగా అలరించాడు. ఆ తర్వాత కూడా పలు సినిమాలు, సిరీస్లు చేశాడు. చివరగా హారర్ కామెడీ మూవీ థామాలో పోలీస్గా కనిపించాడు.చదవండి: నాగార్జున వల్లే నా కూతురు సినిమాల్లోకి..: ప్రియదర్శన్ -
అలాంటి సీన్లు చేయమని బలవంతం..: నటి
సల్మాన ఖాన్ 'వీర్' (2010) సినిమాతో వెండితెరపై కథానాయికగా పరిచయమైంది జరీన్ ఖాన్. ఆ మరుసటి ఏడాది అతడి మూవీలోనే స్పెషల్ సాంగ్లో మెరిసింది. అలా ఓ పక్క సినిమాలు చేస్తూనే మరోపక్క ఐటం సాంగ్స్ చేసింది. అయితే హేట్ స్టోరీ 3 మూవీ చేశాక తనను అందరూ తక్కువ చేసి చూశారంటోంది జరీన్ ఖాన్.ముందో మాట చెప్పి..తాజాగా ఓ ఇంటర్వ్యూలో జరీన్ ఖాన్ మాట్లాడుతూ.. హేట్ స్టోరీ 3లో నటించాక అందరూ నన్ను చులకన చేసి మాట్లాడారు. తనకు యాక్టింగ్ రాదు కాబట్టే అలా దుస్తులు విప్పే సన్నివేశాల్లో నటించిందని కామెంట్స్ చేశారు. ఆ సమయంలో దర్శకుడు అనంత్ మహదేవన్ అక్సర్ 2 సినిమా ఆఫర్ చేశారు. అయితే ఇందులో బోల్డ్ సన్నివేశాలుండవని హామీ ఇచ్చారు. కథంతా చెప్పి ఇది హేట్ స్టోరీ మూవీలా అయితే ఉండదని నొక్కి చెప్పాడు. దాంతో సరేనన్నాను. చెప్పిందొకటి.. చేసిందొకటికానీ, సెట్కు వెళ్లాక అంతా తలకిందులైంది. ముద్దు సన్నివేశం అంటారు.. సడన్ దుస్తులు విప్పేయమంటారు. పొట్టి దుస్తులే ధరించాలంటారు! నా బాధేంటంటే.. స్క్రిప్ట్ ఒకరకంగా చెప్పి షూటింగ్ మరోరకంగా జరిపారు. అదే వాళ్లతోనూ అన్నాను.. ఇలాంటి సన్నివేశాల్లో నటించడం నాకు సమస్య కాదు.. కానీ, మీరు నాకు చెప్పిందేంటని అడిగాను. కేవలం నా గత సినిమా చూసి కావాలని ఇందులో అలాంటి సీన్లు ఇరికిస్తున్నారన్నాను.ఎంత అన్యాయం?నామాట ఎవరూ పట్టించుకోలేదు. నాకు అందరూ వ్యతిరేకంగా మారారు. నిర్మాతలు పూర్తిగా అలా రెచ్చగొట్టే సన్నివేశాలే చేయమని బలవంతపెట్టారు. అదెంత అన్యాయం! అయినా నేను సహించాను. ఇప్పుడు గొడవకు దిగి వెళ్లిపోతే వాళ్ల పెట్టుబడి అంతా వృథా అవుతుందని సినిమా పూర్తి చేశాను. కానీ, చివరకు సినిమా స్క్రీనింగ్కు కూడా నన్ను పిలవలేదు. కానీ నేను సరిగా పని చేయనని నన్ను బద్నాం చేశారు అని జరీనా ఖాన్ చెప్పుకొచ్చింది.చదవండి: నా సినిమాలన్నీ ఫ్లాప్.. నాకు లాభమే లేదు: విజయ్ సేతుపతి -
‘ధురంధర్’తో ఆ విషయం అర్థమైయింది :అక్షయ్ కుమార్
ప్రేక్షకులు అభిరుచి ప్రతి రెండు,మూడేళ్లకు ఓసారి మారుతుందని, అందుకు ‘ధురంధర్’ మంచి ఉదాహరణ అని బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ అన్నాడు. తాజాగా అక్షయ్ కుమార్ ఇండియా టుడే కాంక్లేవ్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలీవుడ్లో మారుతున్న ట్రెండ్ గురించి అక్షయ్ మాట్లాడుతూ.. ‘ధురంధర్’ సినిమాను తీసుకోండి. ఇది పూర్తి స్థాయి యాక్షన్ చిత్రం. సినిమా మొత్తంలో యాక్షన్ సన్నివేశాలే ఉంటాయి. ప్రేక్షకులు వాటిని ఎంజాయ్ చేస్తున్నారు. రణవీర్ సింగ్ చేసిన హై-ఎనర్జీ యాక్షన్ సన్నివేశాలకు చప్పట్లు కొడుకున్నారు. దీన్ని బట్టి ఇప్పుడు ఆడియన్స్ యాక్షన్ సినిమాలను ఇష్టపడుతున్నారనే విషయం అర్థమవుతుంది.ఇలా రెండు, మూడేళ్లకు ఒకసారి ప్రేక్షకుల అభిరుచి మారుతూనే ఉంటుంది. ఐదారేళ్ల క్రితం పరిస్థితి వేరుగా ఉండేది.అప్పుడు సామాజిక సందేశాత్మక చిత్రాలను ఆదరించారు. నేను చేసిన ‘టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథ’, ‘ప్యాడ్ మ్యాన్’ లాంటి సినిమాలు అప్పుడు సూపర్ హిట్గా నిలిచాయి. ఇప్పుడు అలాంటి సినిమాలు తీస్తే.. ఆడుతాయో లేదో తెలియదు. ప్రేక్షకుల కోరికలు ట్రెండ్కు తగ్గట్లుగా మారుతుంటాయి. ప్రస్తుతం హారర్ కామెడీలకూ ఆదరణ లభిస్తోంది. తర్వాత ఆడియన్స్ దేనిని ఇష్టపడతారో మనం ఎప్పటికీ ఊహించలేం’ అని అన్నారు. ధురంధర్ విషయానికొస్తే.. రణ్వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ తెరకెక్కించిన యాక్షన్ థ్రిల్లర్ ఇది. గతేడాది డిసెంబర్లో విడుదలైన ఈ చిత్రం.. బాక్సాఫీస్ని షేక్ చేసింది. దాదాపు రూ. 1300 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఇప్పుడీ చిత్రానికి సీక్వెల్గా ధురంధర్ 2 రాబోతుంది. మార్చి 19న ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. -
ఆస్కారం ఎవరికి?
హాలీవుడ్లో ఆస్కార్ సందడి మొదలైంది. 98వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం అమెరికాలోని లాస్ ఏంజెల్స్లో ఈ నెల 15న జరగనున్న సంగతి తెలిసిందే. భారతీయ కాలమానం ప్రకారం మార్చి 16 ఉదయం జరుగుతుంది. ఎప్పటిలానే ఈ ఏడాది కూడా ఆస్కార్ అవార్డు సాధించే ఆస్కారం ఎవరికి మెండుగా ఉంది? అనే చర్చ జరుగుతోంది. ఆస్కార్ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డు సృష్టించి, అత్యధికంగా 16 నామినేషన్స్ దక్కించుకున్న ‘సిన్నర్స్’ సినిమాకు ఫైనల్గా ఎన్ని అవార్డులు వస్తాయి? అనేది ప్రస్తుతం హాలీవుడ్లో హాట్ టాపిక్.అలాగే 13 నామినేషన్స్ దక్కించుకున్న ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’ సినిమా ‘సిన్నర్స్’ సినిమాను డామినేట్ చేసి, ఎక్కువ అవార్డులు దక్కించుకునే అవకాశం లేకపోలేదని హాలీవుడ్ మీడియా చెబుతోంది. ఇక ‘ఫ్రాకింగ్స్టన్, మార్టీ సుప్రీం, సెంటిమెంటల్ వాల్యూ’ చిత్రాలకు తొమ్మిది నామినేషన్స్ లభించగా, ‘హామ్నెట్’ చిత్రానికి 8 నామినేషన్స్ దక్కాయి. మరి... ఈ చిత్రాల్లో ఏ చిత్రం ఎన్ని అవార్డులు దక్కించుకుంటుంది? అనే చర్చ జరుగుతోంది. ఇక ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ దర్శకుడు... ఈ ప్రధాన విభాగాల్లో హాలీవుడ్ కథనాల ప్రకారం అవార్డు దక్కే ఆస్కారం ఎవరికి ఉందనే విషయం తెలుసుకుందాం...జోస్యం నిజమవుతుందా?ఉత్తమ నటుడు విభాగంలో అవార్డు కోసం తిమోతి చాలమేట్, లియోనార్డ్ డికాప్రియో, ఈథన్ హాక్, మైఖేల్ బి జోర్డాన్, వాగ్నర్ మౌరా పోటీ పడుతున్నారు. అయితే ఈ ఐదుగురిలోనూ తిమోతి చాలమేట్ (‘మార్టీ సుప్రీం’ సినిమాకుగానూ)కే ఉత్తమ నటుడు అవార్డు దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే టాక్ హాలీవుడ్లో వినిపిస్తోంది. కానీ ఈ ఏడాది జరిగిన 83వ గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లో ఉత్తమ నటుడి అవార్డును ‘ది సీక్రెట్ ఏంజెంట్’ చిత్రానికిగానూ వాగ్నర్ మౌరా గెలుచుకున్నారు. ఈ విభాగంలో అవార్డు అందుకున్న తొలి బ్రెజిలియన్ యాక్టర్గా వాగ్నర్ నిలిచారు.అది మాత్రమే కాదు... ఉత్తమ నటుడిగా కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లోనూ వాగ్నర్ మౌరా అవార్డును గెలుచుకున్నారు. మరోవైపు ‘స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్’ అందించే అవార్డ్స్లో ఉత్తమ నటుడిగా అవార్డును గెలుచున్నారు మైఖేల్ బి. జోర్డాన్. పైగా ఆస్కార్లోనే అత్యధిక నామినేషన్స్ను దక్కించుకున్న ‘సిన్నర్స్’ సినిమాలో నటించిన యాక్టర్ కాబట్టి మైఖేల్ బి. జోర్డాన్పై కూడా అంచనాలు ఉన్నాయి. ఇక ‘బ్లూ మూన్’ సినిమాలో ఈథన్ హాక్, ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’ చిత్రంలో లియోనార్డ్ డికాప్రియో సూపర్బ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు.దీంతో ఈ ఏడాది పోటీ కాస్త గట్టిగానే ఉన్నట్లుగా తెలుస్తోంది. కాకపోతే... మెజారిటీ మాత్రం తిమోతి చాలమేట్కే అవార్డు వస్తుందని అంచనా వేస్తున్నారు. పైగా 30 ఏళ్ల వయసులోనే మూడుసార్లు ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయిన అతి పిన్న వయస్కుడిగా తిమోతి పేరిట రికార్డు ఉంది. 97వ ఆస్కార్ అవార్డ్స్లో ఉత్తమ నటుడు విభాగంలో ‘ఏ కంప్లీట్ అన్నోన్’ సినిమాకుగాను తిమోతికి నామినేషన్ దక్కినప్పటికీ అవార్డు రాలేదు. ఈ మూడో ప్రయత్నంలో తిమోతికి అవార్డు ఖాయం అని హాలీవుడ్ జోస్యం చెబుతోంది..పాతికేళ్ల తర్వాత... గత ఏడాది జరిగిన 97వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో మొత్తం 23 విభాగాల్లో ఆస్కార్ అవార్డులను అందించారు. అయితే ఈ ఏడాది జరగనున్న 98వ అవార్డ్స్ ప్రదానోత్సవంలో కొత్తగా ‘బెస్ట్ క్యాస్టింగ్’ అనే విభాగాన్ని ఆస్కార్ అకాడమీ కమిటీ ప్రవేశపెట్టింది. 2001లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ విభాగాన్ని ప్రవేశపెట్టిన తర్వాత మళ్లీ పాతికేళ్లకు ‘బెస్ట్ క్యాస్టింగ్’ పేరుతో మరో విభాగాన్ని చేర్చారు.ఇలా 98వ ఆస్కార్ అవార్డ్స్లో మొత్తం 24 విభాగాల్లో అవార్డులను ప్రదానం చేయనున్నారు. ఉత్తమ క్యాస్టింగ్ విభాగంలో నీనా గోల్డ్ (‘హామ్నెట్’ సినిమా), జెన్నిఫర్ వెండెట్టి (మార్టీ సుప్రీం), వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ (కాసాండ్రా కులుకుండిస్), గాబ్రియేల్ డొమింగ్యూస్ (ది సీక్రెట్ ఏజెంట్), ఫ్రాన్సిన్ మైస్లర్ (సిన్నర్స్) మధ్య పోటీ నెలకొంది. ఉత్తమ చిత్రం విభాగంలో ప్రధాన పోటీ ‘సిన్నర్స్, వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’ చిత్రాల మధ్య ఉన్నట్లే, ఈ కొత్త విభాగంలోనూ ప్రధాన పోటీ ఫ్రాన్సిన్ మైస్లర్ (సిన్నర్స్), వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ (కాసాండ్రా కులుకుండిస్)ల మధ్య ఉన్నట్లుగా తెలుస్తోంది.ఎందుకంటే యాక్టింగ్ విభాగంలో ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’ సినిమాకు నాలుగు నామినేషన్స్ దక్కగా, ‘సిన్నర్స్’కు మూడు నామినేషన్స్ దక్కాయి. అయితే ఈ విభాగంలో ‘సిన్నర్స్’కే అవార్డు రావచ్చనే ఊహాగానాలు ఉన్నాయి. ఎందుకంటే... ఆస్కార్ చరిత్రలోనే అత్యధికంగా నామినేషన్స్ దక్కించుకున్న రికార్డు ‘సిన్నర్స్’కే దక్కింది కాబట్టి ఈ సినిమాకే ఈ విభాగంలో అవార్డు వస్తుందంటున్నారు హాలీవుడ్ సినీ నిపుణులు. అలాగే జెన్నిఫర్ వెండెట్టి (మార్టీ సుప్రీం) అవార్డు అందుకునే చాన్స్ లేకపోలేదంటున్నారు.సిన్నర్స్ వర్సెస్ వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ఉత్తమ చిత్రం విభాగంలో మొత్తం 10 చిత్రాలు నామినేషన్ దక్కించుకున్నాయి. ఆస్కార్ హిస్టరీలోనే అత్యధికంగా 16 నామినేషన్స్ను దక్కించుకుని, చరిత్ర సృష్టించిన ‘సిన్నర్స్’ ఉత్తమ చిత్రం విభాగంలో నామినేషన్ దక్కించుకుంది. అలాగే 13 నామినేషన్స్ దక్కించుకున్న ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’ చిత్రానికి కూడా ఉత్తమ చిత్రం విభాగంలో నామినేషన్ ఉంది. ఉత్తమ చిత్రం విభాగంలో ప్రధానంగా ఈ రెండు చిత్రాల మధ్యనే పోటీ ఉంటుందనే టాక్ హాలీవుడ్లో వినిపిస్తోంది. నామినేషన్స్ పరంగా ‘సిన్నర్స్’దే పై చేయి అయినప్పటికీ ఉత్తమ చిత్రం అవార్డు మాత్రం ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’ సినిమాకు రావచ్చొనే టాక్ హాలీవుడ్లో బలంగా వినిపిస్తోంది.ఈ ఏడాది జరిగిన బ్రిటిష్ అకాడమీ ఫిల్మ్ అండ్ టెలివిజన్ అవార్డు (బాఫ్తా), గోల్డెన్ గ్లోబ్, ్ర΄÷డ్యూసర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికా అవార్డుల ప్రదానోత్సవాల్లో ఉత్తమ చిత్రంగా ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’ సినిమా అవార్డులు సొంతం చేసుకుంది. ఈ కారణంగానే ఆస్కార్లోనూ ఉత్తమ చిత్రం విభాగంలో ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’కు అవార్డు దక్కుతుందనే ఊహాగానాలు ఊపందుకున్నాయి.కానీ ‘సిన్నర్స్, హామ్నెట్’ చిత్రాలను కూడా తేలికగా తీసివేయలేమని హాలీవుడ్ సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ చిత్రాలను దాటుకుని ఈ విభాగంలో బరిలో ఉన్న ‘బగోనియా, ఎఫ్1, ఫ్రాంకిన్స్టన్, మార్టీ సుప్రీం, ది సీక్రెట్ ఏజెంట్, ట్రైన్ డ్రీమ్స్’ వంటి సినిమాల్లో ఏదైనా సర్ప్రైజింగ్గా ఉత్తమ చిత్రంగా నిలుస్తుందా? అనే విషయం కొన్ని గంటల్లో తెలిసిపోతుంది.ఈ ఇద్దరిలో ఎవరు?ఉత్తమ నటి విభాగంలో ‘హ్యామ్నెట్’ చిత్రానికిగాను జస్సీ బక్లీ, ‘బగోనియా’ చిత్రానికిగాను ఎమ్మా స్టోన్, ‘సెంటిమెంటల్ వేల్యూ’ చిత్రానికి రెనాటా రైన్సావా, ‘ఇఫ్ ఐ హ్యాడ్ లెగ్స్ ఐ ఉడ్ కిక్ యు’ చిత్రానికి నురోజ్ బర్న్, ‘సాంగ్ సంగ్ బ్లూ’ మూవీకి గాను కేట్ హడ్సన్లు నామినేషన్స్ దక్కించుకున్నారు. అయితే ‘క్రిటిక్స్ చాయిస్ అవార్డు, గోల్డెన్ గ్లోబ్ అవార్డు, బాఫ్తా అవార్డ్స్’లో నటిగా అవార్డు గెలుచుకుని, ఉత్తమ నటి విభాగంలోని ఆస్కార్ అవార్డు కోసం రేసులో ముందు వరుసలో ఉన్నారు జస్సీ బక్లీ. కాగా రెనాటా రైన్సావా, రోజ్లు తమ కెరీర్లో తొలిసారి ఆస్కార్ అవార్డుకు నామినేషన్ దక్కించుకున్నారు.అలాగే గతంలో ‘ఆల్మోస్ట్ ఫేమస్’ అనే చిత్రంలో సహాయ నటిగానూ ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయ్యారు కేట్ హడ్సన్. ఇప్పుడు దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఆమె మళ్లీ ఆస్కార్ అవార్డుకు నామినేషన్ దక్కించుకున్నారు. కానీ ఈసారి ఉత్తమ నటి విభాగంలో కేట్ హడ్సన్కు నామినేషన్ దక్కింది. కేట్, రెనాటా... ఈ ఇద్దరిలో ఆస్కార్ అదృష్టం ఎవర్ని వరిస్తుంది అనేది చూడాలి.భారత్కు నిరాశ ఈ ఏడాది జరగనున్న 98వ ఆస్కార్ అవార్డ్స్లో మన దేశానికి నిరాశే ఎదురైంది. ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలోని అవార్డు కోసం ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా భారతదేశం తరపున హిందీ చిత్రం ‘హోమ్బౌండ్’ను పంపింది. ఈ సినిమా ఆస్కార్ నామినేషన్ కోసం షార్ట్ లిస్ట్ అయింది కానీ నామినేషన్ దక్కించుకోలేకపోయింది. ఈ విభాగంలో బ్రెజిల్ దర్శకుడు క్లెబర్ మెండోన్సా ఫిల్హో తీసిన ‘ది సీక్రెట్ ఏజెంట్’, ఫ్రాన్స్ దర్శకుడు జాఫర్ పనాహి తెరకెక్కించిన ‘ఇట్ వాజ్ జస్ట్ ఎ యాక్సిడెంట్’, నార్వే డైరెక్టర్ జోచిమ్ ట్రైయర్ తీసిన ‘సెంటిమెంటల్ వేల్యూ’, స్పెయిన్ డైరెక్టర్ ఆలివర్ లాక్సే రూపొందించిన ‘సిరాట్’, ట్యూనిషియా డైరెక్టర్ కౌథర్ బెన్ హనియా దర్శకత్వం వహించిన ‘ది వాయిస్ ఆఫ్ హింద్ రజబ్’ సినిమాలు నామినేషన్ దక్కించుకున్నాయి.ఇంకా ఆస్కార్ కన్సిడరేషన్ విభాగంలో ‘మహావతార్ నరసింహా, కాంతార: ఏ లెజెండ్ చాప్టర్1, తన్వీ: ది గ్రేట్, టూరిస్ట్ ఫ్యామిలీ, సిస్టర్ మిడ్నైట్’ వంటి సినిమాలు పరిశీలన జాబితాలో ఉన్నప్పటికీ నామినేషన్ను దక్కించు కోవడంలో విఫలమయ్యాయి. అయితే ఆస్కార్ అవార్డుల ప్రజెంటర్స్లో భారతీయ నటి ప్రియాంకా చో్రపా కూడా ఉండటం అనేది భారతీయ ప్రేక్షకులను ఆనందపరిచే విషయం.పద్నాలుగో సారైనా అవార్డు వస్తుందా?దర్శకుడు పాల్ థామస్ ఆండర్సన్ ఇప్పటికి 14 సార్లు ఆస్కార్ నామినేషన్ దక్కించుకున్నారు. కానీ ఒక్కటంటే ఒక్క అవార్డు వచ్చింది లేదు. ఈ ఏడాది ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’ చిత్రానికి గాను పాల్ థామస్ ఆండర్సన్ ఉత్తమ దర్శకుడి విభాగంలో నామినేషన్ దక్కించుకున్నారు. పైగా ఈ ఏడాది జరిగిన బాఫ్తా, గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్, డైరెక్టర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికా, క్రిటిక్స్ చాయిస్ అవార్డుల ప్రదానోత్సవాల్లో ఉత్తమ దర్శకుడి అవార్డు పాల్ థామస్కే దక్కింది.దీంతో ఆస్కార్ అవార్డు కూడా ఆయనకే రావొచ్చన్నది హాలీవుడ్ బలమైన నమ్మకం. మరోవైపు రేయాన్ కూగ్లర్ (సిన్నర్స్), ట్రియర్ (సెంటిమెంటల్ వేల్యూ), జాష్ షాఫ్టీ (మార్టీ సుప్రీం), క్లోయి జావ్ (హ్మామ్నెట్) లను తక్కువగా అంచనా వేయడానికి లేదు. ఎందుకంటే...ఈ చిత్రాలకు ప్రధాన విభాగాల్లో నామినేషన్స్ దక్కింది. ఇంకా బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ విభాగంలో సీన్ పెన్ (వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్) అమీ మాడిగన్ (వెపన్స్), బెస్ట్ మ్యూజిక్ (ఒరిజినల్ స్కోర్) విభాగంలో లుడ్విగ్ గోరాన్సన్ వంటి వారు అవార్డులు గెలుచుకునే అవకాశాలు ఉన్నట్లుగా హాలీవుడ్లో వార్తలు వస్తున్నాయి. ఆస్కార్ అవార్డుని ఏ స్టార్ చేజిక్కించుకుంటారు? ఉత్తమ చిత్రం అవార్డు ఏ సినిమాకి దక్కుతుంది? అనే సస్పెన్స్ మరికొన్ని గంటల్లో వీడిపోతుంది. – ముసిమి శివాంజనేయులు -
నీరా ఆర్య బయోపిక్లో?
బాలీవుడ్ హీరోయిన్, భార తీయ జనతా పార్టీ ఎంపీ కంగనా రనౌత్ ప్రస్తుతం నీరా ఆర్యగా ఒదిగిపోవడానికి కసరత్తులు చేస్తున్నారని టాక్. ఎందుకంటే నీరా ఆర్య బయోపిక్లో నటించడానికి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. తన కెరీర్లో ఎన్నో సవాల్తో కూడిన పాత్రలు చేసిన కంగన ప్రస్తుతం ఆచి తూచి పాత్రలు ఎంపిక చేసుకుంటున్నారు. ఇందుకు కారణం ఆమె లోక్సభ సభ్యురాలు కావడమే. బాధ్యతాయుతమైన ఎంపీ పదవిలో ఉన్న ఆమె గతంలోలా కాకుండా పాత్రల ఎంపికలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఇందులో భాగంగానే నీరా ఆర్య బయోపిక్లో నటించడానికి అంగీకరించారట.స్వాతంత్య్ర పోరాటంలో భాగంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ‘ఆజాద్ హింద్ ఫౌజ్’కు అనుబంధంగా రాణీ ఆఫ్ ఝాన్సీ మహిళా రెజిమెంట్ ఉండేది. ఇందులో కీలక సభ్యురాలిగా నీరా ఆర్య వ్యవహరించారు. భారతదేశ తొలి మహిళా గూఢచారిగా ఆమెకు పేరుంది. బ్రిటిష్ అధికారిని పెళ్లాడి, సిద్ధాంత విభేదాలతో విడిపోయిన నీరా ఆర్యని బ్రిటీష్ అధికారులు అరెస్ట్ చేసి, చిత్రహింసలకు గురిచేశారట.1998 జూలై 26న ఆమె మృతి చెందారు. స్వాతంత్య్ర సంగ్రామంలో చూపించిన ధైర్యసాహసాలు, గూఢచారిగా అద్భుతంగా పని చేసిన వైనం... ఇలా ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన జీవితం ఆమెది. అలాంటి నీరా జీవితకథతో శివమ్ నాయర్ దర్శకత్వంలో ఓ సినిమా రానుందని సమాచారం. కంగనాని కలిసి ఆయన ఈ ప్రాజెక్ట్ గురించి వివరించగా ఆమె పచ్చజెండా ఊపారని టాక్. కంగన ప్రస్తుతం ‘భారత భాగ్య విధాత’ అనే సినిమా చేస్తున్నారు. -
అక్షయ్ ఖన్నా బట్టతల ట్రామాతో కుంగిపోయారు: ఫరా ఖాన్
బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా నెగిటివ్ రోల్స్లో వరుసగా హిట్స్ అందుకుంటూ హీరోలకంటే ఎక్కువ క్రేజ్ సంపాదించుకుంటున్నారు. 'ధురంధర్', ‘చావా' వంటి సినిమాలతో ఆయన నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అయితే కొరియోగ్రాఫర్-డైరెక్టర్ ఫరా ఖాన్ ఇటీవల ఓ యూట్యూబ్ పాడ్కాస్ట్లో పాల్గొని అక్షయ్ ఖన్నా గురించి చేసిన పలు వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. 'తీస్ మార్ ఖాన్' చిత్రంలో ‘ఆతిష్ కపూర్’ పాత్ర కోసం మొదట షర్మాన్ జోషిని సంప్రదించానని, ఆయన తిరస్కరించడంతో చివరికి అక్షయ్ ఖన్నానే లాస్ట్ ఛాయిస్గా ఎంపికయ్యారని ఫరా వెల్లడించారు. ఫరా ఖాన్ మాటల్లో 90వ దశకంలో అక్షయ్ ప్రవర్తన అంతగా బాగాలేదు. ఆయన చాలా చిరాకుగా ఉండేవారు. చేతిలో వున్న వస్తువులు విసిరేసేవారు. డైలాగుల విషయంలో గొడవపడేవారు. ఆ సమయంలో బట్టతల సమస్యతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యారు. అదే ఆయన కోపానికి కారణమని తెలిపారు. తాల్ సినిమాలో వర్షం పాటలో కూడా టోపీ ధరించి నటించారని గుర్తుచేశారు. 'దిల్ చాహ్తాహై’ సినిమా తర్వాత అక్షయ్ పూర్తిగా మారిపోయారు. తన లుక్, బట్టతల గురించి స్పష్టత వచ్చి, కొత్త ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగారు. 'కోయి కహే కెహతా రహే' పాటలో ఆయన అద్భుతంగా డ్యాన్స్ చేశారు. ఇటీవల 'ధురంధర్' సినిమాలో అక్షయ్ నటన చూసి ఫిదా అయ్యాను. వెంటనే ఆయనకు ఫోన్ చేసి అలీబాగ్లోని ఇంటికి వెళ్లి అభినందించాను. అక్షయ్కు అనవసర హడావిడి, షో ఆఫ్ చేయడం అంటే నచ్చదు. తన నటనపై మాత్రమే దృష్టి పెడతారని ఆమె అన్నారు. మొత్తానికి గతంలో హీరోగా ఉన్నప్పుడు కూడా రాని క్రేజ్ ఇప్పుడు నెగిటివ్ రోల్స్తో అక్షయ్ ఖన్నా సంపాదించుకోవడం బాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. -
ఇండస్ట్రీకి వద్దామని చివరకు వ్యభిచారకూపంలోకి: నటి
గంపెడాశలతో ఇండస్ట్రీలో అడుగుపెడదామని వస్తున్న ఎంతోమంది తప్పుదారి పడుతున్నారంటోంది బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా. అవకాశాల కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నవారిని కొన్ని అదృష్య శక్తులు నిలువునా ముంచేస్తున్నాయంటోంది. తాజాగా ఓ పాడ్కాస్ట్లో తనుశ్రీ దత్తా మాట్లాడుతూ.. సినీ పరిశ్రమలో మొదట అందానికి ప్రాధాన్యతనిస్తారు. వారికి టాలెంట్ ఉందా? లేదా? అనేది ఆలోచించరు. అందాన్ని చూసి పొగడ్తలు కురిపిస్తారు. కానీ అది విని మీరు బోల్తా కొట్టకూడదు. ముందు పొగడ్తలునా చిన్నతనంలో నా తల్లి అపరిచితులతో మాట్లాడకూడదని, వారిచ్చే చాక్లెట్లు తీసుకోకూడదని చెప్పేది. ఇండస్ట్రీలో అలాంటి అపరిచితులు, వారిచ్చే చాక్లెట్లు చాలా రకాలుగా ఉంటాయి. వారి కోరిక తీర్చుకునేందుకు ముందు మిమ్మల్ని పొగుడుతారు. తర్వాత మీ కలల్ని, ఆశయాల్ని ఆసరా చేసుకుని మిమ్మల్ని వాడుకుంటారు. ఈ క్రమంలో అవకాశాలు అందుకుని ముందడుగు వేసిన కొందరు విజయం సాధిస్తారు, మరికొందరు బాధతో ఇంటికి తిరిగెళ్లిపోతారు. నన్ను నేను అమ్ముకోనుఇంకొంతమందైతే ముందుకు వెళ్లలేక, వెనక్కూ వెళ్లలేక వ్యభిచారంలోకి నెట్టబడతారు. ఇలాంటి రహస్యాలు బయటకు ఎప్పుడూ రావు. ఎందుకంటే సక్సెస్ స్టోరీలు మాత్రమే బయటకు వస్తాయి, వాటి గురించే అందరూ మాట్లాడుకుంటారు. ఇప్పుడిదంతా ఎందుకు చెప్తున్నానంటే నా మాటల వల్ల నలుగురు అలర్ట్ అయి వారిని వారు కాపాడుకున్నా అదే నాకు సంతోషం. ఇండస్ట్రీలో కాంప్రమైజ్ సాధారణమే అని ఓ నటి అన్నందుకు ఆమెతో స్నేహాన్నే తెంచుకున్నాను. నేను ఆర్టిస్ట్ను.. ఒకరికి నా జీవితాన్ని అమ్ముకునేదాన్ని కాదు అని చెప్పుకొచ్చింది.మీటూమీటూ ఉద్యమం సమయంలో తను కూడా బాధితురాలినేనంటూ మీడియా ముందుకు వచ్చింది తనుశ్రీ దత్తా. నానాపటేకర్ లైంగికంగా వేధించాడని సంచలన ఆరోపణలు చేసింది. 2008లో 'హార్న్ ఓకే ప్లీజ్' సినిమాలోని ఓ పాట షూటింగ్లో నానా పటేకర్ సహా మరో ముగ్గురు తనను వేధించారని ఆరోపించింది. అయితే ఘటన జరిగిన మూడేళ్లలోపు ఫిర్యాదు చేస్తేనే విచారిస్తామని, ఇది పదేళ్ల కిందటినాటి ఘటన కావడంతో విచారణ కుదరదని న్యాయస్థానం కేసు కొట్టివేసింది. బాలీవుడ్లో అనేక సినిమాలు చేసిన తనుశ్రీదత్తా.. తెలుగులో వీరభద్ర చిత్రంలో యాక్ట్ చేసింది. చాలాకాలంగా సినిమాలకు దూరంగా ఉంటోంది.చదవండి: తెలుసు కదా.. షూటింగ్లోనే తేడా కొట్టింది: రాశీ ఖన్నా -
ధురంధర్ 2 ఛాన్స్ వస్తే వదిలేసుకున్నా: నటుడు
గతేడాది చివర్లో వచ్చిన ధురంధర్ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ఆదిత్య ధర్ డైరెక్టర్ చేసిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో సారా అర్జున్ కథానాయిక. ఆర్ మాధవన్, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్ కీలక పాత్రలు పోషించారు.ధురంధర్: రివేంజ్లో ఛాన్స్అయితే మూడు నెలలు కూడా తిరగకముందే ధురంధర్ పార్ట్ 2 వచ్చేస్తోంది. మార్చి 19న 'ధురంధర్: రివేంజ్' రిలీజ్ కానుంది. మొదటి భాగం బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్ కాబట్టి ఎవరైనా సరే సీక్వెల్లో ఛాన్స్ వస్తే ఎగిరి గంతేస్తారు. కానీ ఈ బాలీవుడ్ నటుడు మాత్రం తనకు ఛాన్స్ వచ్చినా రిజెక్ట్ చేశాడట!డేట్స్ లేవని..ఆయన మరెవరో కాదు, అనిల్ కపూర్. తాజాగా ఆయన ఓ ఈవెంట్లో మాట్లాడుతూ.. ధురంధర్ 2 సినిమాలో యాక్ట్ చేయమని దర్శకుడు ఆదిత్య నన్ను సంప్రదించాడు. అతిథి పాత్ర ఉంది, చేస్తావా? అని అడిగాడు. కానీ అప్పటికే నా డేట్స్ ఖాళీగా లేవు. వేరే సినిమాలతో బిజీగా ఉన్నాను. నీ సినిమాలో చేయాలనుంది, కానీ నేను ఖాళీగా లేను అని చెప్పి తిరస్కరించాను. ఆ మూవీ కోసం అప్పటికే ఒప్పుకున్న ప్రాజెక్టులను నేను పక్కనపెట్టలేను. కుదర్లేదుఆ నిబద్ధత వల్లే నేను ఇంతకాలం ఇండస్ట్రీలో ఉన్నాను. కేవలం టాలెంట్ ఒక్కటే మన స్థాయిని నిర్ణయించదు. కాకపోతే ధురంధర్ మూవీ అనేది మంచి ఆఫర్.. కానీ, ఏం చేద్దాం.. చేయడం కుదర్లేదు. భవిష్యత్తులో ఆదిత్యతో కలిసి పని చేస్తాననుకుంటున్నాను అని చెప్పుకొచ్చాడు. అనిల్ కపూర్ చివరగా 'సుబేదార్' సినిమాలో కనిపించాడు. ప్రస్తుతం ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. -
అలాంటి సినిమాలు తీస్తే జోకర్లా చూస్తారు: డైరెక్టర్
మలయాళ స్టార్ దర్శకుడు ప్రియదర్శన్ సొంత భాషలోనే సెటిలైపోకుండా బాలీవుడ్లోనూ అనేక సినిమాలు చేశాడు. హీరా ఫెరి, హంగామా, భూల్ భులయ్యా వంటి పలు చిత్రాలతో ప్రేక్షకులకు వినోదాన్ని పంచాడు. ప్రస్తుతం అక్షయ్ కుమార్ హీరోగా హారర్ కామెడీ మూవీ భూత్ బంగ్లా చేస్తున్నాడు. ఇది ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇష్టం లేదుఅయితే తనకు కామెడీ చిత్రాలకంటే సీరియస్ సినిమాలు చేయడమే ఇష్టం అంటున్నాడు తాజాగా పింక్విల్లాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రియదర్శన్ మాట్లాడుతూ.. సీరియస్ చిత్రాలు తెరకెక్కించడమంటే నాకు చాలా ఇష్టం. కామెడీ మూవీస్ చేయడం నాకేమాత్రం ఇష్టం లేదు. కానీ నాకు వేరే ఆప్షన్ లేక కామెడీ జానర్లో సినిమాలు చేయాల్సి వస్తోంది.ఎందుకు చూడరు?సీరియస్ సినిమాలు చేస్తున్నప్పుడు ఇండస్ట్రీలో ప్రత్యేక గౌరవం చూపిస్తారు అదే కామెడీ జానర్లో ఉంటే మాత్రం ఎవరూ పట్టించుకోరు. ఒక మంచి దర్శకుడిగా పరిగణించరు. ఈ విషయంలో నాకు చాలా బాధేస్తుంది. కామెడీ సినిమాలు తీసేవాళ్లను మంచి దర్శకులుగా ఎందుకు చూడరు? మనదగ్గరే కాదు, ప్రపంచమంతటా అలాగే ఉంది. హాస్యభరిత చిత్రాలు చేసేవారిని జోకర్లా చూస్తున్నారు. కామెడీ సినిమాలకు ఆస్కార్ రావడం కూడా చాలా అరుదు. ఇది నిజంగా బాధాకరం.. కానీ ఇదే జరుగుతోంది అని ప్రియదర్శన్ చెప్పుకొచ్చాడు. -
'అవకాశాలు తర్వాత.. బరువు తగ్గు'.. ఏడ్చుకుంటూ వెళ్లా!
నటి సంభావన సేత్.. భోజ్పురి సినిమాల్లో ఎన్నో ఐటం సాంగ్స్ చేసింది. హిందీలోనూ నటిగా ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా స్పెషల్ సాంగ్స్లో స్టెప్పులేసింది. అటు బుల్లితెరపై బిగ్బాస్, రాజ్ పిచ్లే జనం కా, ఫియర్ ఫ్యాక్టర్: ఖత్రోన్కె ఖిలాడీ 4 ఇలా అనేక రియాలిటీ షోలలో పాల్గొంది.రెండో సీజన్లో పార్టిసిపేషన్అయితే తనకు ఓ స్టార్ హీరో అవకాశాలిస్తానని చెప్పి ఆ తర్వాత తన ఆశలపై నీళ్లు చల్లాడంటోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సంభావన సేత్ మాట్లాడుతూ.. నేను హిందీ బిగ్బాస్ రెండో సీజన్లో పాల్గొన్నాను. నాలుగో సీజన్లో స్టేజీపై పర్ఫామెన్స్ చేశాను. అప్పుడు నటుడు రవికిషన్.. నేను భోజ్పురిలో మంచి పేరున్న డ్యాన్సర్ అని సల్మాన్ ఖాన్కు పరిచయం చేశాడు. ఫోన్ నెంబర్ కూడా..అందుకాయన.. ఇప్పుడే చూశాగా.. డ్యాన్స్ చాలా బాగా చేస్తోందని మెచ్చుకున్నాడు. నేను కొంత ధైర్యం తెచ్చుకుని తన సినిమాల్లో ఏదైనా అవకాశం ఉంటే ఇవ్వమని అడిగాను. వెంటనే ఆయన తప్పకుండా ఇస్తానన్నాడు. తన ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాడు. షో అయిపోయిన కొంతకాలానికి నేను ఆయన్ను కలిసేందుకు వెళ్లాను. అప్పుడతడు కాస్త చిరాకుగా ఉన్నాడు. కానీ బానే మాట్లాడాడు. ఏడ్చుకుంటూ వెళ్లా.సినిమా అవకాశం ఇస్తానన్నారు కదా అని గుర్తు చేశాను. అందుకు సల్మాన్.. నాకు గుర్తు లేదు కానీ మీరు కాస్త బరువు తగ్గాలి.. మరో విషయమేంటంటే ఇండస్ట్రీలో నేనెవర్నీ ప్రమోట్ చేయను అని ముక్కుసూటిగా చెప్పాడు. ఆ మాటలు నన్నెంతో బాధపెట్టాయి. ఇంటికి ఏడ్చుకుంటూ వెళ్లిపోయాను. కానీ, ఇప్పటికీ నేను సల్మాన్ ఖాన్ అభిమానినే అని చెప్పుకొచ్చింది.చదవండి: 66 ఏళ్ల వయసులో ప్రెగ్నెంట్? నటి ఏమందంటే? -
66 ఏళ్ల వయసులో ప్రెగ్నెంట్? నటి ఏమందంటే?
సెలబ్రిటీలు ఎలా రెడీ అవుతున్నారు? బరువు పెరిగారా? తగ్గారా? ముఖం కళకళలాడుతోందా? కళ తప్పిందా? హుషారుగా ఉన్నారా? అనారోగ్యంతో బాధపడుతున్నారా? ఇలా ప్రతీది కళ్లతోనే స్కానింగ్ చేస్తున్నారు సోషల్ మీడియా నెటిజన్స్. వారి కంటికి ఏదైనా ఫోటో, వీడియో కనిపిస్తే చాలు.. ఏవేవో ఊహించుకుంటున్నారు. బాలీవుడ్ సీనియర్ నటి నీనా గుప్తా విషయంలోనూ అలాగే అతిగా ఊహించుకున్నారు.విరోష్ రిసెప్షన్లో..ఇటీవల హైదరాబాద్లో జరిగిన విరోష్ (విజయ్ దేవరకండ- రష్మిక మందన్నా) రిసెప్షన్కు నీనా గుప్తా, భర్త వివేక్తో కలిసి హాజరైంది. స్టైలిష్గా తెల్ల చీర కట్టుకున్న ఆమె మెడకు బంగారు నెక్లెస్ ధరించింది. కాకపోతే కాస్త పొట్ట ఉన్నట్లుగా కనిపించింది. ఇంకేముంది సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. 66 ఏళ్ల వయసులో నీనా గర్భం దాల్చిందా? ఇది నిజమేనా? అని ఆరా తీస్తున్నారు.ప్రెగ్నెన్సీ రూమర్స్పై క్లారిటీదీంతో ఈ రూమర్స్పై తాజాగా నీనా గుప్తా స్పందించింది. ఇదేమైనా బదాయి హో సినిమా (ఈ మూవీలో లేటు వయసులో ఓ మహిళ తల్లవుతుంది) అనుకుంటున్నారా? అలాంటిదేం లేదు. నేను గర్భవతిని కాదు. చీర కాస్త బరువుగా ఉంది. అందువల్లే నేను కూడా మీకు లావుగా కనిపించానంతే! ఏదేమైనా ఈ ప్రచారం నన్ను బాధపెట్టడానికి బదులుగా ఆశ్చర్యపరిచింది. ఈ వయసులో ప్రెగ్నెంట్ అనుకున్నారంటే మన దేశం ముందుకు పోతున్నట్లే అని పేర్కొంది. నీనా చివగా వధ్ 2 మూవీలో యాక్ట్ చేసింది.ప్రేమ- పెళ్లినీనా గుప్తా వ్యక్తిగత విషయానికి వస్తే.. ఆమె వెస్టిండీస్ క్రికెటర్ వివియన్ రిచర్డ్స్ను ప్రేమించింది. అయితే అప్పటికే అతడికి భార్యాబిడ్డలున్నారు. అయినప్పటికీ నీనాతో ప్రేమాయణం సాగించాడు. వీరి ప్రేమకు గుర్తుగా 1989లో మసాబా గుప్తా జన్మించింది. కానీ నీనా- రిచర్డ్స్ మాత్రం పెళ్లి బంధం వరకు వెళ్లకుండానే విడిపోయారు. దాంతో నీనా.. సింగిల్ పేరెంట్గా మసాబాను పెంచి పెద్ద చేసింది. 2008లో వివేక్ మెహ్రాను పెళ్లాడింది. Is Neena Gupta pregnant? pic.twitter.com/AlCeWzpvlG— Sapna Madan (@sapnamadan) March 5, 2026 చదవండి: గుండె ముక్కలు.. హీరో బ్రేకప్ పోస్ట్ -
నాలుగు పెళ్లిళ్లు.. మీ కన్నా హిందువులే నయం: ముంతాజ్
చైల్డ్ ఆర్టిస్ట్గా.. ఆ తర్వాత హీరోయిన్గా అనేక సినిమాలు చేసింది సీనియర్ నటి ముంతాజ్. ఖిలోనా, దో రాస్తే, ఆప్కీ కసమ్, తేరే మేరే సాప్నే, రోటి వంటి పలు చిత్రాలతో స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకుంది. 1974లో వ్యాపారవేత్త మయూర్ మద్వానిని పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో రాణించింది. అయితే 1990లో సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించింది.హిందూ దేవుళ్లంటే ఇష్టంతాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మతాంతర వివాహాలు, దేవుళ్ల గురించి మాట్లాడింది. ముంతాజ్ మాట్లాడుతూ.. నేను దేవుళ్లను బాగా నమ్ముతాను. శంకరుడు, కృష్ణుడు అంటే చాలా ఇష్టం. నేను ముస్లిం అయినప్పటికీ ఈ దేవుళ్లపై నాకెంతో విశ్వాసం ఉంది. మా ఇంట్లో మెట్లు దిగి వస్తుంటే బొజ్జ గణపయ్య విగ్రహం కనిపిస్తుంది. ఎప్పుడూ ఆయనకు నమస్కరిస్తూ ఉంటాను.ఎందుకీ గొడవ?నేను అన్నిమతాలను నమ్ముతాను. నా భర్త హిందువు. నా సోదరి కూడా హిందువునే పెళ్లాడింది. మేమంతా సంతోషంగా ఉన్నాం. కానీ జనాలెందుకు ఈ మతాల గురించి కొట్టుకుంటారో అర్థం కాదు. కాకపోతే మా కమ్యూనిటీలో ఉన్న బహుభార్యత్వం నాకు ఏమాత్రం నచ్చదు. చాలామంది మూడు, నాలుగు పెళ్లిళ్లు చేసుకుంటారు. అంతకుముందు ఉన్న భార్యల్ని నడిరోడ్డుమీద వదిలేస్తారు. అలా చేస్తే హిందువుల కన్నా మీరెలా గొప్పవారవుతారు? ఏ ఒక్కరూ కూడా మూడునాలుగు పెళ్లిళ్లు చేసుకోకూడదు. అది చాలా పెద్ద తప్పు.అది చాలా తప్పుభార్య ఉండగా మరొకర్ని పెళ్లి చేసుకోవడమేంటి? ఆ మహిళ మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తుందో ఎప్పుడైనా ఆలోచించారా? అలాంటి ఆమెను వదిలేసి మరొకర్ని షాదీ చేసుకోవడం కరెక్ట్ కాదు. ఇది మహా పాపం. ఈ విషయంలో హిందువులే నయం. కొన్నిసార్లు వాళ్లు కూడా రెండో పెళ్లి చేసుకుంటారు. కానీ కట్టుకున్న భార్యని అర్ధాంతరంగా వదిలేసి మరొకరి దగ్గరకు అంత ఈజీగా వెళ్లిపోవడం మాత్రం చాలా తప్పు అని ముంతాజ్ నొక్కి చెప్పింది.చదవండి: బలవంతంగా ఐటం సాంగ్స్.. చెండాలమైన లిరిక్స్: నటి -
అవసరం లేకపోయినా ఐటం సాంగ్స్.. చిన్నపిల్లలు కూడా!
సినిమాల్లో ఐటం సాంగ్స్ అనేవి సర్వసాధారణమైపోయాయి. కొన్నిసార్లు అవసరం ఉన్నా లేకపోయినా బలవంతంగా చొప్పిస్తున్నారు. అయితే ఆ పాటల్లో మహిళలను చూపించే పద్ధతి మాత్రం అస్సలు బాగోలేదంటోంది సీనియర్ నటి షబానా అజ్మీ. ముంబైలో బుధవారం జరిగిన వి ద వుమెన్ కార్యక్రమంలో షబానా మాట్లాడుతూ.. ఐటం సాంగ్ అనగానే హీరోయిన్ శరీర అవయమవాలను ఎలా చూపించాలనేదానిపైనే ఫోకస్ చేస్తున్నారు. అవసరం లేకపోయినా..పిచ్చిపిచ్చిగా పెట్టే కెమెరా యాంగిల్స్ దర్శకుడి ఉద్దేశాన్ని చెప్పకనే చెప్తున్నాయి. ఈ ఐటం సాంగ్లో స్త్రీ స్వీయనియంత్రణ కోల్పోయి పురుషుల చూపుకు లొంగిపోయినట్లుగా చూపిస్తున్నారు. పైగా సినిమా కథకు అవసరం లేకపోయినా ఈ స్పెషల్ సాంగ్స్ను కావాలని ఇరికిస్తున్నారు.చిన్నపిల్లలు కూడా..ఆడవారిని చూపించే విధానమే కాదు, పాట లిరిక్స్ కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటున్నాయి. ఇటువంటి సాంగ్స్ను సమాజం ఆదరించడం కూడా బాధపెడుతోంది. ఏదైనా ఫంక్షన్కు వెళ్తే అక్కడ చిన్నపిల్లలు కూడా చోలీ కే పీచే క్యా హై (ఓ ఐటం సాంగ్) అంటూ పాడుతున్నారు. అది చూసి అందరూ సరదాగా నవ్వుతున్నారు. సినిమాఎవరూ ఆ లిరిక్స్ అర్థాన్ని పట్టించుకోవట్లేదు, కేవలం ఒక జోష్లో పాడేస్తున్నారు అని ఆవేదన వ్యక్తం చేసింది. కాగా షబానా అజ్మీ.. అంకుల్, అర్థ్, ఖాందార్, పార్, గాడ్ మదర్ సినిమాలకుగగానూ ఐదుసార్లు జాతీయ ఉత్తమ నటి పురస్కారం గెల్చుకుంది. ఈమె చివరగా డబ్బా కార్టెల్ అనే వెబ్ సిరీస్లో మెరిసింది.చదవండి: పవన్ కల్యాణ్ డూప్గా హరీశ్ శంకర్? డైరెక్టర్ ఏమన్నారంటే? -
52 ఏళ్ల మలైకాతో డేటింగ్.. 32 ఏళ్ల కుర్రాడు ఏమన్నాడంటే..
బాలీవుడ్లో ఒకప్పటి స్టార్ హీరోయిన్ మలైకా అరోరా.. వ్యక్తిగత జీవితంపై ఎప్పుడు ఏదో ఒక రూమర్ వస్తూనే ఉంటుంది. 1998లో సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ని పెళ్లి చేసుకొని.. 20 ఏళ్ల పాటు కలిసి కాపురం చేసి.. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత 2017లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత తనకంటే 12 ఏళ్ల చిన్నవాడైన యంగ్ హీరో అర్జున్ కపూర్తో ప్రేమాయణం కొనసాగించింది. కొన్నాళ్ల పాటు కలిసి సహజీవనం చేసిన ఈ జంట.. కొన్నేళ్ల క్రితమే విడిపోయింది. గత కొన్నేళ్లుగా ఒంటరిగానే ఉంటున్న మలైకా..ఇటీవల మరో వ్యక్తితో డేటింగ్ చేస్తున్నట్లు బాలీవుడ్లో వార్తలు వచ్చాయి. ఆ కుర్రాడు మలైకా కంటే 20 ఏళ్లు చిన్నవాడు కావడం గమనార్హం. అతని పేరు సోరబ్ బేడి. మోడల్, టీవీ నటుడు. మలైకా వయసు 52 ఏళ్లు అయితే.. సోరబ్ వయసు కేవలం 32 ఏళ్లు మాత్రమే. ఇటీవల వీరిద్దరు కలిసి ఓ పార్టీలో హగ్ చేసుకొని సెల్ఫీ దిగడంతో డేటింగ్ రూమర్స్ బయటకు వచ్చాయి. అయితే ఈ డేటింగ్ రూమర్స్ని సోరబ్ కొట్టి పడేశాడు. మలైకా, తాము మంచి స్నేహితులం మాత్రమే అని..అంతకు మించి తమ మధ్య ఏమీ లేదన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..మలైకాతో స్నేహం ఎలా ఏర్పడిందో వివరించాడు.అలా పరిచయం.. డెల్నాజ్ దారువాలా, వాహ్బిజ్ మెహతా అనే ఇద్దరు వ్యక్తులు నా మోడలింగ్ రోజుల్లో ర్యాంప్పై నడిచే అవకాశం ఇచ్చారు. నేను వారితో స్నేహం చేశాను. వారితో కలిసి పార్టీలకు వెళ్లడం ప్రారంభించాను. ఒక పార్టీలో, నేను నా గురువుల ద్వారా మలైకాను కలిశాను. ఆమె డెల్నాజ్, వాహ్బిజ్లకు కూడా సన్నిహితురాలు. అందువల్ల, మలైకా, నేను స్నేహితులమయ్యాం. అంతకు మించి మా మధ్య ఏమి లేదు’ అని సోరబ్ చెప్పుకొచ్చాడు.మలైకాతో పార్టీ.. తొలిసారి కాదుఒక అమ్మాయి గురించి మాట్లాడే ముందు వాళ్ళు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. ఇలాంటి రూమర్స్ వల్ల వాళ్లు మానసికంగా ఇబ్బంది పడతారు. ట్రోల్ చేసే ప్రతిఒక్కరు ఇది అర్థం చేసుకోవాలి. అయినా మలైకాతో పార్టీ చేసుకోవడం నాకు ఇదే తొలిసారి కాదు. గత కొన్నేళ్లుగా ఇద్దరం కలిసి పార్టీలకు వెళ్తున్నాం. ఇంతకు ముందు కూడా మలైకాతో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాను. అప్పుడు నేను ఫేమస్ కాదు. ఎవరికీ తెలియకపోవడంతో అవి వైరల్ కాలేదు. ఇప్పుడు నేను కూడా తెలిసిన ముఖం కావడంతో డేటింగ్ రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు. ఒక అమ్మాయి, అబ్బాయి మధ్య స్నేహం కూడా ఉండొచ్చు. మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ మాత్రమే. కానీ కొంతమంది దాన్ని భిన్నంగా చూస్తున్నారు’ అని సోరబ్ మండిపడ్డారు.మలైకా..స్పెషల్ సాంగ్స్ స్పెషలిస్ట్90వ దశకంలో బాలీవుడ్లో మలైకా తన హవాను కొనసాగించింది. ముఖ్యంగా స్పెషల్ సాంగ్స్కి స్పెషలిస్ట్గా పేరు సంపాదించుకుంది. కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ సరసన ఛల్ ఛయ్య ఛయ్య ఛయ్య అనే పాటతో దేశం మొత్తాన్ని ఒక ఊపు ఊపింది.. తెలుగులో 2007లో మహేశ్ బాబు హీరోగా నటించిన అతిథిలో ప్రత్యేక గీతంతో తెలుగువారిని పలకరించింది. అలాగే గబ్బర్ సింగ్లో కెవ్వు కేక పాటకు స్టెప్పులేని కుర్రకారుని ఆకట్టుకుంది. ప్రస్తుతం సినిమాలతో పాటు నిర్మాతగా, టెలివిజన్ హోస్ట్గా రాణిస్తోంది. -
రూ.50 లక్షల ప్రైజ్మనీ.. మూణ్నెళ్లయినా ముట్టలే!
బుల్లితెర నటుడు గౌరవ్ ఖన్నా హిందీ బిగ్బాస్ 19వ సీజన్లో తన ఆటతో ఆకట్టుకున్నాడు. ప్రేక్షకుల మనసు గెల్చుకుని ఏకంగా ట్రోఫీ అందుకున్నాడు. విన్నర్గా రూ.50 లక్షల ప్రైజ్మనీ గెల్చుకున్నాడు. అయితే షో పూర్తయి మూడు నెలలు కావొస్తున్నా ఇంతవరకు ఆ డబ్బు ముట్టలేదట!ఇదెప్పుడూ ఉండేదే..ఈ విషయాన్ని అతడు తాజాగా తన యూట్యూబ్లో వెల్లడించాడు. గౌరవ్ ఖన్నా మాట్లాడుతూ.. షోలో ప్రకటించిన ప్రైజ్మనీ, కారు.. ఇవన్నీ నా చేతికి రావడానికి కొంత సమయం పడుతుంది. అందుకు అవసరమైన ప్రక్రియ కొనసాగుతోంది. టీవీ ఇండస్ట్రీలో ఇలాంటి ఆలస్యాలు ఎప్పుడూ ఉండేవే.. రెండు నెలల్లో..కానీ తప్పకుండా నాకు ఇస్తానన్నవి ఇచ్చి తీరతారు. అందుకు కనీసం రెండు నెలలైనా పడుతుంది అని చెప్పుకొచ్చాడు. కాగా గౌరవ్.. సెలబ్రిటీ మాస్టర్ చెఫ్ ఇండియా షో విజేతగా నిలిచి ఒక్కసారిగా సెన్సేషన్ అయ్యాడు. ఆ వెంటనే బిగ్బాస్లో అడుగుపెట్టి అక్కడ కూడా విజయ దుందుభి మోగించాడు.చదవండి: నా పెళ్లికి ముందు అన్న ఇచ్చిన సలహా: అల్లు శిరీష్ -
ధురందర్ 2 టికెట్ రేటు రూ. 3100
భారీ అంచనాలతో విడుదలకు సిద్ధమైన ధురంధర్-2 సినిమా టికెట్ ధరల విషయంలో కొత్త రికార్డు సృష్టించింది. దేశంలోనే అత్యధిక టికెట్ ధరగా రూ.3100ను ఢిల్లీలోని ఐనాక్స్ మెగాప్లెక్స్లోని ఒక ప్రత్యేక స్క్రీన్లో ఫిక్స్ చేశారు. కేవలం 42 సీట్లు మాత్రమే ఉన్న ఈ స్క్రీన్లో ప్రీమియర్స్ కోసం ఈ రేటు అమలు చేస్తున్నారు. బుక్ మై షో చార్జీలతో కలిపితే ధర రూ.3145కి చేరుతుంది. ప్రస్తుతం అదే స్క్రీన్లో ప్రదర్శితమవుతున్న ది కేరళ స్టోరీ-2 టికెట్ ధర కేవలం రూ.500 మాత్రమే. అయితే ధురంధర్-2 క్రేజ్ కారణంగా ప్రీమియర్ షోలకు టికెట్ ధరను అమాంతం పెంచేశారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఇప్పటికే సగానికి పైగా టికెట్లు అమ్ముడయ్యాయి. దేశవ్యాప్తంగా ఒక రోజు ముందే పెయిడ్ ప్రివ్యూలు ప్లాన్ చేశారు. బెంగళూరులో కొన్ని స్క్రీన్లలో టికెట్ ధరలు రూ.800 వరకు ఉన్నాయి. హైదరాబాద్లో కూడా ఎప్పటిలాగే రేట్లు పెంచారు. సాయంత్రం 5 గంటలకే అన్ని ప్రాంతాల్లో ప్రీమియర్స్ ప్రారంభం కానున్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్ అద్భుతంగా సాగుతున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా 3 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడయ్యాయి. -
Ek Din: సాయి పల్లవి తొలి హిందీ మూవీ ట్రైలర్ వచ్చేసింది
సాయి పల్లవి నటించిన తొలి హిందీ సినిమా ‘ఏక్ దిన్’. ఆమిర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీట్రైలర్ని బుధవారం (మార్చి 11) విడుదల చేశారు. ఒక ఇంటర్నేషన్ టూర్లో ఇద్దరు సహోద్యోగుల మధ్య కలిగిన ఒక రోజు పరిచయం, వారి జీవితాలను ఎలా మార్చిందనే ఆసక్తికరమైన కథాంశంతో ఈ మూవీ రూపుదిద్దుకుంది. ఈ సినిమాలో రోహన్ పాత్రలోజునైద్ ఖాన్, మీరా పాత్రలో సాయిపల్లవి నటించారు. మీరాను ఇష్టపడే రోహన్ తన ప్రేమను వ్యక్తపరచడానికి మాత్రం భయపడుతూ ఉంటాడు. అయితే కనీసం ఒక రోజు అయినా ఆమెతో కలిసి ప్రయాణం చేయాలని అతడు కలలు కంటాడు. ఆ కల నిజమైందా? అనే ఆసక్తికరమైన అంశంతో ఈ సినిమా కథ ముందుకు సాగుతుంది. సరదాగా మొదలైన ట్రైలర్ తర్వాత ఎమోషనల్గా సాగింది. సునీల్ పాండే దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 1న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. -
సర్జరీ ఫెయిల్.. దేవుడి ముందు మోకరిల్లి..: జేమీ లివర్
వెండితెరపై నవ్వులు పూయించే జానీ లివర్ ఒకానొక సమయంలో ఎంతో మానసిక క్షోభను అనుభవించాడు. కన్నకొడుకు జెస్సీ చిన్నవయసులో ట్యూమర్తో బాధపడుతుంటే చూడలేక తల్లడిల్లిపోయాడు. అతడే కాదు అతడి కుటుంబం కూడా మానసిక క్షోభ అనుభవించింది. ఈ విషయాన్ని తాజాగా జానీ లివర్ కూతురు జేమీ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.కవర్ చేసేందుకు..ఆమె మాట్లాడుతూ.. నా తమ్ముడు స్కూల్లో ఉండగా వాడికి ట్యూమర్ ఉన్నట్లు తెలిసింది. మొదట్లో అదేంటో మాకూ అర్థం కాలేదు. కానీ, ఆ ట్యూమర్ సైజు పెరుగుతూ వాడిని ఇబ్బందిపెట్టింది. రానురానూ దాన్ని కవర్ చేయడం కోసం డ్రెస్సింగ్ స్టైల్ కూడా మార్చేశాడు. మేమిద్దరం ఒకటే స్కూల్లో చదువుకునేవాళ్లం. తననెప్పుడూ జాగ్రత్తగా చూసుకునేదాన్ని. ముంబైలో చేసిన మొదటి సర్జరీ విజయవంతం కాలేదు. అప్పుడు చాలా భయపడ్డాం. తన ఆరోగ్యం కుదుటపడాలని, బాగుండాలని నాన్న దేవుడి ముందు మోకాళ్లపై కూర్చుని ప్రార్థించేవాడు.రెండుసార్లు సర్జరీజెస్సీ అడిగినవేవీ కాదనేవాళ్లం కాదు. అతడి కోరిక మేరకే అమెరికా ట్రిప్ వెళ్లాం. అనుకోకుండా అక్కడ సర్జరీకి ప్రయత్నించగా అది విజయవంతమైంది. రెండేళ్లలో రెండు సర్జరీలు జరిగాయి. దేవుడి దయ వల్ల అనారోగ్యం నుంచి కోలుకున్నాడు అని చెప్పుకొచ్చింది. జెస్సీ.. కిస్ కిస్కో ప్యార్ కరూన్, హౌస్ఫుల్ 4, భూత్ పోలీస్ వంటి సినిమాలు చేసింది. ఆ ఒక్కటి అడక్కు చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.చదవండి: సీజీ చేయడం రాక మా మీద తోస్తున్నారు: ఛోటా కె నాయుడు -
ఆ రోజే థియేటర్స్లో ఆల్ఫా
ఆలియా భట్, శార్వరీ ప్రధాన పాత్రల్లో నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ‘ఆల్ఫా’. అనిల్ కపూర్, బాబీ డియోల్ ప్రధాన పాత్రల్లో నటించారు. ‘ది రైల్వేమెన్’ ఫేమ్ శివ్ రైవల్ దర్శకత్వంలో యశ్ రాజ్ ఫిల్మ్స్ పతాకంపై ఆదిత్య చోప్రా నిర్మించారు. వైఆర్ఎఫ్ (యశ్ రాజ్ ఫిల్మ్స్) స్పై యూనివర్స్లో భాగంగా రూపొందిన సినిమా ఇది. ఈ చిత్రంలో ఆలియా, శార్వరీ స్పై రోల్స్లో నటించారు. ‘ఆల్ఫా’ చిత్రాన్ని తొలుత గత ఏడాది డిసెంబరులో రిలీజ్ చేయాలనుకున్నారు మేకర్స్.ఆ తర్వాత ఈ ఏడాది ఏప్రిల్లో రిలీజ్కు ప్లాన్ చేశారు. కానీ ఈ చిత్రం రిలీజ్ను మరోసారి వాయిదా వేస్తున్నట్లుగా వెల్లడించి, ఈ సినిమాను ఈ ఏడాది జూలై 10న రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ కొత్త రిలీజ్ డేట్ను ప్రకటించారు. ‘యశ్రాజ్ ఫిల్మ్స్ సంస్థలో ఆలియా చేసిన తొలి సినిమా ఇది. పూర్తి స్థాయి ఉమెన్ సెంట్రిక్ యాక్షన్ సినిమా. ఆలియా, శార్వరీల యాక్షన్ సీక్వెన్స్లు ఆడియన్స్ను అలరిస్తాయి’’ అని యూనిట్ పేర్కొంది. -
లేటు వయసులో తండ్రైన హీరో.. సోషల్ మీడియాలో పోస్ట్
బాలీవుడ్ హీరో రణ్దీప్ హుడా 50 ఏళ్ల వయసులో తండ్రయ్యారు. ఆయన భార్య లిన్ లైస్రామ్ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయం తెలుసుకున్న పలువురు బాలీవుడ్ తారలు, అభిమానులు అభినందలు చెబుతున్నారు. హిందీ సినిమాల్లో విలన్, సహాయ పాత్రల్లోనూ మెప్పించిన రణ్దీప్ గతేడాది వీర్ సావర్కర్ మూవీలో హీరోగా, జాట్ చిత్రంలో విలన్గా అలరించాడు. ఈరోజు నేను తండ్రి అయినందుకు మా నాన్న పట్ల నా కృతజ్ఞత మరింత పెరిగిందని రణ్దీప్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మరి ముఖ్యంగా నన్ను తండ్రిని చేసినందుకు.. మన చిన్న అమ్మాయిని ఈ ప్రపంచంలోకి తీసుకు వచ్చినందుకు నా భార్య లిన్కు ప్రత్యేక ధన్యవాదాలు అంటూ రాసుకొచ్చారు. ఈ జంటకు మొదటి బిడ్డగా పాప పుట్టడంతో ఆనందం మరింత రెట్టింపైంది.కాగా.. 2001లో వచ్చిన హిందీ మూవీ 'మన్సూన్ వెడ్డింగ్'తో నటుడిగా పరిచయమైన రణ్దీప్ హుడా.. తర్వాత గ్యాంగ్స్టర్, జన్నత్ 2, రిస్క్, కర్మ ఔర్ హోలీ, కాక్టైల్, జిస్మ్ 2, బాంబే టాకీస్, కిక్, భాఘీ 2, రాధే, మర్డర్ 3 తదతర చిత్రాల్లో నటించి మెప్పించాడు. కాగా.. 2023లో ప్రియురాలు లిన్ లైస్రామ్ని మణిపురి సంప్రదాయంలో రణ్దీప్ పెళ్లి చేసుకున్నాడు. View this post on Instagram A post shared by Randeep Hooda (@randeephooda) -
మహేశ్ బాబు మెచ్చిన సినిమా.. 8 నెలల తర్వాత ఓటీటీకి..!
గతేడాది బాలీవుడ్ స్టార్ అమిర్ ఖాన్ నటించిన చిత్రం సితారే జమీన్ పర్. ఈ సినిమా 2025 జూన్ 20న థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. ఈ మూవీలో జెనీలియా దేశ్ముఖ్ కూడా ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమాకు ఆర్ఎస్ ప్రసన్న దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని ఆమిర్ ఖాన్, అపర్ణ పురోహిత్ నిర్మించారు. అయితే ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ చేయనని అమిర్ ఖాన్ అప్పట్లో ప్రకటించారు. ఆ తర్వాత నేరుగా యూట్యూబ్లోనే విడుదల చేశారు. రెంట్ పద్ధతిలో అందుబాటులోకి తీసుకొచ్చారు. అప్పట్లో ఓటీటీ రైట్స్ కోసం రూ.120 కోట్లు చెల్లించేందుకు అమెజాన్ ప్రైమ్ ముందుకొచ్చింది. కానీ ఈ బిగ్ డీల్ను అమిర్ ఖాన్ తిరస్కరించారు. ఈ సినిమా కేవలం థియేటర్లలోనే ఆడుతుందని.. ఓటీటీలో విడుదల ఉండదని అమిర్ ఖాన్ స్పష్టం చేశారు.అయితే తాజాగా అమిర్ ఖాన్ తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఎట్టకేలకు ఈ మూవీ ఓటీటీలో సందడి చేసేందుకు వచ్చేస్తోంది. సోనీ లివ్ వేదికగా అందుబాటులోకి రానుందని మేకర్స్ అనౌన్స్ చేశారు. అయితే స్ట్రీమింగ్ తేదీని మేకర్స్ ఇంకా ప్రకటించలేదు. త్వరలోనే ఓటీటీ రిలీజ్ డేట్ను ప్రకటించనున్నారు. కాగా.. ఈ చిత్రంలో ఆరోష్ దత్తా, గోపీకృష్ణ వర్మ, సంవిత్ దేశాయ్, వేదాంత్ శర్మ, ఆయుష్ భన్సాలీ, ఆశిష్ పెండ్సే, రిషి షహానీ, రిషబ్జైన్ , నమన్ మిశ్రా, సిమ్రాన్ మంగేష్కర్ వంటి వారు కీలకపాత్రల్లో నటించారు.మహేశ్ బాబు ప్రశంసలు...ఈ సినిమాపై సూపర్ స్టార్ మహేశ్బాబు ప్రశంసలు కురిపించాడు. సితారే జమీన్ పర్.. అందరి మనసులు దోచుకుంటోంది. ఈ మూవీ మిమ్మల్ని నవ్విస్తుంది, ఏడిపిస్తుంది. అలాగే చప్పట్లు కొట్టేలా చేస్తుంది. ఈ సినిమా చూశాక కచ్చితంగా చిరునవ్వుతో బయటకు వస్తారు అని సోషల్ మీడియాలో రాసుకొచ్చాడు. View this post on Instagram A post shared by Sony LIV (@sonylivindia) -
48 గంటల్లో 312 మిలియన్స్ వ్యూస్.. ‘ధురంధర్ 2’ రికార్డు
రణ్వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘ధురంధర్ 2’. గతేడాది బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచిన ‘ధురంధర్’ చిత్రానికి సీక్వెల్ ఇది. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్పై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక తాజాగా రిలీజైన ట్రైలర్ ఆ అంచనాలను మరింత పెంచేశాయి. అంతేకాదు రిలీజ్కి ముందే ఈ సినిమా రికార్టులను కొల్లగొడుతోంది. యూట్యూబ్లో ఈ మూవీ ట్రైలర్కి రికార్డు స్థాయిలో వ్యూస్ వచ్చాయి. కేవలం 48 గంటల్లో అంటే రెండో రోజుల్లేనే 312 మిలియన్ల వ్యూస్ సాధించింది. ఈ మధ్యకాలంలో ఒక మూవీ ట్రైలర్కు ఈ స్థాయి వ్యూస్ వచ్చిన దాఖలాలు లేవు.ట్రైలర్లో పవర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, స్ట్రైకింగ్ డైలాగ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ట్రైలర్ ఆడియో ఇన్స్టాగ్రామ్లో ట్రెండ్ అవుతూ, అనేక రీల్స్, ఫ్యాన్ ఎడిట్స్కు ప్రేరణగా మారింది. ఇదే సమయంలో గూగుల్ ట్రెండ్స్లో కూడా ఈ సినిమా, నటీనటులపై సెర్చ్లు భారీగా పెరిగాయి. ఈ చిత్రంలో రణవీర్ సింగ్ ద్విపాత్రాభినయంలో కనిపించనున్నారు. మార్చి 19న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. -
సల్మాన్ తో జోడీ?
సల్మాన్ ఖాన్ , సమంత జోడీగా నటించనున్నారా? అంటే... బాలీవుడ్లో అవుననే సమాధానమే వినిపిస్తోంది. సల్మాన్ ఖాన్ హీరోగా రాజ్ అండ్ డీకే ద్వయం సూపర్హీరో జానర్లో ఓ సినిమా తెరకెక్కనుందని బాలీవుడ్ టాక్. ఈ చిత్రంలో హీరోయిన్ పాత్రకు సమంతను సంప్రదిస్తున్నారట మేకర్స్. ఈ చిత్ర దర్శకుల్లో సమంత భర్త రాజ్ నిడిమోరు కూడా ఉన్నారు కనుక సమంత భాగమయ్యే అవకాశాలు ఉన్నాయని భోగట్టా. అయితే ఈ సినిమాలో సమంత నటించడం లేదని, నిర్మాతగా బాధ్యతలు తీసుకుంటారనే టాక్ కూడా వినిపిస్తోంది. మరి.. సల్మాన్ ఖాన్ కొత్త సినిమాలో సమంత హీరోయిన్ గా స్క్రీన్ పై కనిపిస్తారా? లేక నిర్మాతగా భాగం అవుతారా? అనేది చూడాలి. ఇక సల్మాన్ ఖాన్ ప్రస్తుతం ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్ ’ చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ఈ ఏడాదే రిలీజ్ కానుంది. మరోవైపు సమంత నటించిన ‘మా ఇంటి బంగారం’ చిత్రం మే 15న రిలీజ్ అవుతోంది. -
'ఆర్ఆర్ఆర్'కి నాటునాటు.. 'వారణాసి'కి లాటిన్ స్టయిల్!
ఆర్ఆర్ఆర్ సినిమాలోని 'నాటు-నాటు' పాట అప్పట్లో ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఆస్కార్ వేదికపై కూడా మెరిసింది ఈ పాట. అది తెలుగు సినీ పరిశ్రమకు గర్వకారణమైంది. అయితే ఇప్పుడు దర్శకధీరుడు రాజమౌళి మరోసారి అలాంటి మ్యాజిక్ను రిపీట్ చేయాలని ప్రయత్నిస్తున్నాడట. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న వారణాసిలో ఓ ప్రత్యేకమైన డాన్స్ నంబర్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఈ పాటను లాటిన్ స్టయిల్లో తెరకెక్కించాలని ఆయన భావిస్తున్నారని సీనియర్ కొరియోగ్రాఫర్ శంకర్ వెల్లడించారు. మహేష్ బాబు, ప్రియాంక చోప్రా జంటపై తెరకెక్కనున్న ఈ పాట కోసం వందలమంది లాటిన్ డాన్సర్లను తీసుకురావాలని రాజమౌళి ఆలోచిస్తున్నాడట.నాటు-నాటు తరహాలోనే, వారణాసిలో లాటిన్ స్టయిల్లో సాగే ఈ పాట కూడా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించనుంది. ఇప్పటికే వారణాసి టైటిల్ గ్లింప్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. తాజాగా కొరియోగ్రాఫర్ వ్యాఖ్యలతో అంచనాలు మరింత పెరిగాయి. జార్జియాలోని షెడ్యూల్ను పూర్తి చేసుకొని మహేష్ బాబు హైదరాబాద్కి తిరిగొచ్చాడు. ఎయిర్పోర్టులో ఆయన కొత్త లుక్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. త్వరలోనే అంటార్కిటికాలో కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. హీరోయిన్ ప్రియాంక చోప్రా స్వయంగా ఈ విషయం వెల్లడించింది. వారణాసి అంటార్కిటికాలో షూటింగ్ జరుపుకోనున్న తొలి తెలుగు చిత్రంగా గుర్తింపు పొందనుంది. -
50 ఏళ్ల వయసులో తండ్రి కాబోతున్న నటుడు
హిందీ సినిమాల్లో విలన్, సహాయ పాత్రలు, హీరోగా చేసిన రణ్దీప్ హుడా శుభవార్త చెప్పేశాడు. ఇతడి భార్య లిన్ లైస్రామ్ ప్రస్తుతం ప్రెగ్నెన్సీతో ఉంది. ఈమె బేబీ బంప్తో ఉన్న ఫొటోలని స్వయంగా రణ్దీప్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో కాబోయే తల్లిదండ్రులకు తోటి సెలబ్రిటీలు శుభాకాంక్షలు చెబుతున్నారు.(ఇదీ చదవండి: తల్లికి ఖరీదైన కారు గిఫ్ట్ ఇచ్చిన అల్లు అర్జున్)2001లో వచ్చిన హిందీ మూవీ 'మన్సూన్ వెడ్డింగ్'తో నటుడిగా పరిచయమైన రణ్దీప్ హుడా.. తర్వాత గ్యాంగ్స్టర్, జన్నత్ 2, రిస్క్, కర్మ ఔర్ హోలీ, కాక్టైల్, జిస్మ్ 2, బాంబే టాకీస్, కిక్, భాఘీ 2, రాధే, మర్డర్ 3 తదతర చిత్రాల్లో నటించి మెప్పించాడు. రీసెంట్ టైంలో అయితే వీర్ సావర్కర్ మూవీలో హీరోగా, జాట్ చిత్రంలో విలన్గా అలరించాడు.అసలు విషయానికొస్తే.. 2023లో ప్రియురాలు లిన్ లైస్రామ్ని మణిపురి సంప్రదాయంలో రణ్దీప్ పెళ్లి చేసుకున్నాడు. అప్పుడు ఇతడి వయసు 47 ఏళ్లు. ఇప్పుడు మూడేళ్ల తర్వాత అంటే 50 ఏళ్ల వయసులో తండ్రి కాబోతున్నాడు. గత నెలలోనే లిన్కి సీమంతం జరిగింది. ఆ ఫొటోలని లిన్ తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 15 సినిమాలు.. మూడు డోంట్ మిస్) View this post on Instagram A post shared by Randeep Hooda (@randeephooda) -
వానిటీ వ్యాన్స్, వాష్రూమ్స్ కూడా లేవు: బాలీవుడ్ నటి
ఇప్పుడంటే సకల సౌకర్యాలు ఉన్నాయి కానీ ఒకప్పుడు వానిటీ వ్యాన్స్, వాష్రూమ్స్ లేనేలేవంటోంది సీనియర్ నటి సుప్రియ పాఠక్. 1980వ దశకంలో సెట్లో కనీస వసతులు లేకపోయినా పెద్దగా లెక్కచేయలేదని చెప్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సుప్రియ పాఠక్ మాట్లాడుతూ.. మేము ప్యాషన్తో యాక్ట్ చేసేవాళ్లం. మాకిచ్చిన పాత్రలను తప్ప మిగతా వేటినీ మేము పట్టించుకునేవాళ్లం కాదు. కానీ రానురానూ కొన్ని విషయాలు పట్టించుకోవాలని అర్థమైంది. బాత్రూమ్స్ తప్పనిసరిషూటింగ్ గ్యాప్లో కూర్చోవడానికి కొంత ప్లేస్ కావాలి. మహిళలకు ముఖ్యంగా బాత్రూమ్స్ ఉండాలి. ఇవి కనీస అవసరాలు అని తెలుసుకున్నాం. సెట్లో అందరూ నిలబడి ఉన్నప్పుడు నిర్మాతలకు కూడా అర్థమైంది. కనీసం కూర్చోవడానికి ఏదైనా వసతి కల్పించాలని వాళ్లూ రియలైజ్ అయ్యారు. అయితే ఇప్పటికీ కొన్ని ప్రదేశాల్లో షూటింగ్కు వెళ్లినప్పుడు వాష్రూమ్స్ వసతి అనేది ఉండదు.కనీస వసతి అవసరంచలిలో లేదా ఎండలో షూటింగ్ చేస్తూ ఉన్నప్పుడు ఆహారం, నీళ్లు, టీ అనేవి అందించడం కూడా ముఖ్యమే! ఇప్పుడు షూటింగ్స్ చాలా సౌకర్యవంతంగా ఉంటున్నాయి. ఒకప్పుడు పరిస్థితి అలా లేదు. ఉదాహరణకు 'మిర్చి మసాలా' సినిమా షూటింగ్ ఒక పల్లెలోని మిర్చి ఫ్యాక్టరీలో జరిగింది. నాతోపాటు పది మంది మహిళలు ఫ్యాక్టరీలో షూటింగ్లో పాల్గొన్నారు. రోజంతా మిర్చి ఫ్యాక్టరీలో..అసలే ఎండలు మండిపోతుంటే ఆ ఘాటు తట్టుకుని రోజంతా అక్కడే ఉండేవాళ్లం. వెనకాల ఉన్న గడ్డికుప్పలపై సేదతీరేవాళ్లం. అది పెద్ద సమస్యలా ఎప్పుడూ భావించలేదు. ఎందుకంటే మేమంతా ప్యాషన్తో పని చేస్తున్నాం. కానీ ఇప్పుడు అంత కష్టపడాల్సిన అవసరం లేదు. అనేక సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి అని చెప్పుకొచ్చింది.సినిమాసుప్రియ పాఠక్.. గుజరాతీ, హిందీ భాషల్లో అనేక సినిమాలు చేసింది. కలియుగ్, బజార్, రామ్లీలా, మాసూమ్, మిర్చి మసాలా వంటి పలు చిత్రాల్లో నటించింది. తెలుగులో అరవింద సమేత వీర రాఘవలో జేజిగా, గద్దలకొండ గణేశ్లో హీరో తల్లిగా యాక్ట్ చేసింది. చివరగా అస్సి అనే హిందీ చిత్రంలో కనిపించింది. కిచిడి సీరియల్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకూ సుపరిచితురాలైంది. -
రణ్వీర్ సింగ్ దురంధర్-2.. ఓటీటీ ఫ్లాట్ఫామ్ ఫిక్స్
రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్. పాకిస్తాన్ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ను షేక్ చేసింది. గతేడాది డిసెంబర్ 5న రిలీజైన ఈ సినిమా ఏకంగా రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ సినిమాకు ఆదిత్య ధర్ దర్శకత్వం వహించారు. కేవలం హిందీలోనే రిలీజైనప్పటికీ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది.అయితే కొన్ని నెలల వ్యవధిలోనే ఈ మూవీకి సీక్వెల్గా దురంధర్ ది రివెంజ్ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇటీవల ట్రైలర్ రిలీజ్ చేయగా.. అంచనాలు మరింత పెంచేసింది. తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓటీటీ స్ట్రీమింగ్ ఫ్లాట్ఫామ్ ఖరారైంది. ఈ చిత్రం థియేట్రికల్ రిలీజ్ తర్వాత జియో హాట్స్టార్ వేదికగా అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని ట్రైలర్లోనే వెల్లడించారు. థియేటర్లలో రిలీజైన తర్వాత ఈ మూవీ స్ట్రీమింగ్ తేదీని మేకర్స్ ప్రకటించనున్నారు. కాగా.. ధురంధర్: ది రివెంజ్ మార్చి 19న థియేటర్లలో విడుదల కానుంది.పోటీ నుంచి తప్పుకున్న టాక్సిక్..ఈ మూవీతో మార్చి 19న యశ్ హీరోగా వస్తోన్న టాక్సిస్ రిలీజ్ కావాల్సి ఉంది. అయితే బాక్సాఫీస్ పోటీ నుంచి యశ్ తప్పుకున్నారు. గీతు మోహన్దాస్ దర్శకత్వం వహించిన గ్యాంగ్స్టర్ మూవీ జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
మరో సినిమా ఒప్పుకున్న ధురంధర్ హీరోయిన్?!
ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్గా అలరించిన సారా అర్జున్ ఇప్పుడు హీరోయిన్గా అదరగొడుతోంది. తను కథానాయికగా నటించిన తొలి చిత్రం ధురంధర్ బాక్సాఫీస్ వద్ద ఎంతటి సంచలనాలు సృష్టించిందో అందరికీ తెలిసిందే! అనంతరం యుఫోరియా చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ప్రస్తుతం ధురంధర్ 2తో ముందుకు రాబోతోంది.రూమర్స్పై క్లారిటీఅయితే ఈ 20 ఏళ్ల బ్యూటీ "హీర్ రాంఝా" (పంజాబీ జానపద విషాద కథ) అనే మూవీ చేస్తున్నట్లు బీటౌన్లో ప్రచారం జరుగుతోంది. ఏక్తా కపూర్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్లో సారా.. హీర్ పాత్రలో నటించనుందని సదరు వార్తల సారాంశం. ఈ రూమర్స్పై కాస్టింగ్ డైరెక్టర్ ముకేశ్ చాబ్రా స్పందించాడు. సారా అర్జున్ ఏ సినిమాకి సంతకం చేయలేదు. నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి ఎవరితోనూ చర్చలు జరపలేదు, ఎవర్నీ కలవలేదు. నేనే చెప్తా..ప్రస్తుతం మేమంతా ధురంధర్ 2 కోసం ఎదురుచూస్తున్నాం. కాబట్టి అందరూ ప్రశాంతంగా ఉండండి. తను నెక్స్ట్ ఏదైనా సినిమా ఒప్పుకుంటే నేనే స్వయంగా మీకు వెల్లడిస్తాను. అప్పటివరకు వచ్చే ఏ వార్తనూ మీరు నమ్మకండి అని ఎక్స్ (ట్విటర్)లో రాసుకొచ్చాడు. అంటే ధురంధర్ 2 తర్వాతే సారా తన నెక్స్ట్ సినిమాపై దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది. సినిమాధురంధర్ విషయానికి వస్తే.. ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించాడు. గతేడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు సీక్వెల్గా ధురంధర్ 2 వస్తోంది. అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, ఆర్.మాధవన్, రాకేశ్ బేడీ, సారా అర్జున్ కీలక పాత్రలు పోషించిన ఈ మూవీ మార్చి 19న పాన్ ఇండియావైడ్గా విడుదల కానుంది. Sara Arjun has not signed any other film. We are just waiting for D 2. She has not signed any film and has not met anyone regarding any project. So please relax, guys. I will personally update you about her next project. Just wait all the other news is only rumours🥰🧿❤️ pic.twitter.com/njCE7MsKIR— Mukesh Chhabra CSA (@CastingChhabra) March 7, 2026 చదవండి: విడాకులు, తాగుడుకు బానిసయ్యా: మలయాళ నటుడు -
రిలీజ్కు ముందే రికార్డులు.. దురంధర్-2 ప్రభంజనం..!
రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్. పాకిస్తాన్ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ను షేక్ చేసింది. గతేడాది డిసెంబర్ 5న రిలీజైన ఈ సినిమా ఏకంగా రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ సినిమాకు ఆదిత్య ధర్ దర్శకత్వం వహించారు. అయితే కొన్ని నెలల వ్యవధిలోనే ఈ మూవీకి సీక్వెల్గా దురంధర్ ది రివెంజ్ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇటీవల ట్రైలర్ రిలీజ్ చేయగా.. అంచనాలు మరింత పెంచేసింది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ప్రీ టికెట్ బుకింగ్స్ ఓపెన్ చేయగా.. సరికొత్త రికార్డులతో దూసుకెళ్తోంది. కేవలం రెండు రోజుల్లో రెండు లక్షలకు పైగా టిక్కెట్లు అమ్ముడు కావడం చూస్తుంటే ఏ రేంజ్లో క్రేజ్ ఉందో అర్థమవుతోంది. అడ్వాన్స్ టికెట్స్ బుకింగ్స్ ద్వారా ఇప్పటికే రూ. 18.11 కోట్ల గ్రాస్ వసూలు చేసిందని ట్రేడ్ వెబ్సైట్ సాక్నిల్క్ తెలిపింది.ఈనెల 19న దురంధర్ ది రివెంజ్ థియేటర్లలోనే సందడి చేయనుంది. అంతకుముందు రోజే ఈ సినిమా ప్రీమియర్ షోలను ప్రదర్శించనున్నారు. ఈ షోల కోసం మేకర్స్ ముందుగానే బుకింగ్లు ప్రారంభించడంతో చాలా థియేటర్లలో టిక్కెట్లు హాట్కేకుల్లా అమ్ముడవుతున్నాయి. హిందీలో మొదటి రోజే టికెట్ ధర ప్రస్తుతం రూ. 450-500 మధ్య ఉంది. ఈ మూవీ రిలీజ్కు ముందే రికార్డులు సృష్టిస్తోంది. ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో కూడా విడుదల కానుంది. -
సెకండ్ హ్యాండ్ బట్టలు కొంటాను: బిగ్బాస్ కంటెస్టెంట్
సెలబ్రిటీలు ఏం చేసినా, చేయకపోయినా విమర్శలపాలవుతూనే ఉంటారు. హిందీ బిగ్బాస్ ఓటీటీ సీజన్ 1 విన్నర్ దివ్య అగర్వాల్ పరిస్థితి కూడా ఇంతే! తరచూ ట్రోలింగ్ బారిన పడుతూనే ఉంటుంది. ఆస్తి చూసే అపూర్వ పడగోయంకర్ను పెళ్లి చేసుకుందని కొందరు నెటిజన్లు ఆమెను ట్రోల్ చేస్తూనే ఉన్నారు. ఈ విమర్శలపై తాజా ఇంటర్వ్యూలో నటి స్పందించింది.ఏమైనా అనుకోండిదివ్య అగర్వాల్ మాట్లాడుతూ.. నన్ను గోల్డ్ డిగ్గర్ (డబ్బు కోసమే సంబంధం పెట్టుకోవడం) అని పిలవాలనుకుంటే పిలుచుకోండి.. అవసరమైతే డైమండ్ డిగ్గర్ అని కూడా పిలవండి. నాకు మాత్రం నా జీవితంలో సరైన భాగస్వామి దొరికాడు. ఆ విషయంలో నేను చాలా సంతోషంగా ఉన్నాను. నా జీవితంలో నాకు దొరికిన అత్యంత విలువైన బంగారం ఆయనే!అవేం లేవుగాఅయినా జనం కాస్తయినా బుర్ర లేకుండా మాట్లాడుతున్నారు. నేనేమైనా లంబోర్గినిలో తిరుగుతున్నానా? జుహు బీచ్ దగ్గర బంగ్లాలో ఉంటున్నానా? నాకంటూ ఓ ప్రైవేట్ జెట్ ఉందా? ఇవన్నీ లేవే.. నేను ఎకానమీ క్లాస్లోనే ప్రయాణిస్తాను. మరెందుకు నాపై అంత కోపం, ద్వేషం? ఆడవాళ్లు కేవలం డబ్బు చూసే పెళ్లి చేసుకుంటారని ఎందుకు తప్పుగా అనుకుంటారు?పెళ్లిఆ పెళ్లికి కారణమైన ప్రేమను చూడరా? నేనెప్పుడూ సింపుల్గానే ఉండాలనుకుంటాను, ఎంత ఎదిగినా ఒదిగే ఉంటాను. అంతెందుకు.. నేను సెకండ్ హ్యాండ్ బట్టలు కూడా కొంటుంటాను అని చెప్పుకొచ్చింది. దివ్య- అపూర్వ 2024 ఫిబ్రవరిలో పెళ్లి చేసుకున్నారు.చదవండి: ఓటీటీలో ఫంకీ మూవీ.. రిలీజ్ ఎప్పుడంటే? -
ఆ రోజు రాత్రే ప్రియాంకకు ‘ఫ్రెంచ్ కిస్’.. సీక్రెట్స్ బయటపెట్టిన నిక్ జోనాస్
ప్రియాంక చోప్రా-నిక్ జోనాస్ జంటకు ప్రపంచ వ్యాప్తంగా భారీ ఫాలోయింగ్ ఉంది. ఏ విషయంలో అయినా వీరిద్దరు చాలా ఓపెన్గా మాట్లాడతారు. పర్సనల్ విషయాలను కూడా షేర్ చేసుకుంటారు. అందుకే ఈ జంటపై నిత్యం ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. తాజాగా నిక్ జోనాస్ ఒక ఇంటర్వ్యూలో తమ మొదటి డేటింగ్కు సంబంధించిన కొన్ని మధుర జ్ఞాపకాలను అభిమానులతో పంచుకున్నారు. ఆ విశేషాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.నిక్ జోనాస్ తన మొదటి డేటింగ్ అనుభవం గురించి చెబుతూ.. ‘మా మొదటి డేటింగ్ చాలా విచిత్రంగా జరిగింది. అందరిలాగా మేం ఒంటరిగా డేటింగ్కి వెళ్లలేదు. ప్రియాంక తన స్నేహితురాలితో వస్తే..నేను మా సోదరుడిని తీసుకొని వెళ్లాను. ఈ డేట్ ప్లాన్ చేసింది ప్రియాంకనే. మొదట ఓ మ్యూజిక్ లైవ్ కాన్సర్ట్కి వెళ్లాం. అయితే అది ప్రియాంకకు నచ్చలేదు. దీంతో బయటకు వెళ్లాలనుకున్నాం. మాతో పాటు ఇంకో జంట కూడా వచ్చింది. ఆ రోజు సాయంత్రం చాలా ఆనందంగా గడిపాం. ఇద్దరం కలిసి డ్రింక్ చేయడానికి ఎక్కడికో వెళ్లాం. మేము ఎంత దూరంలో ఉన్న సోదరుడు మా కోసం డ్రింక్స్ పంపించి.. దూరంగా వెళ్లిపోయాడు. అంతేకాదు ఆ రోజు టైమ్ దొరికినప్పుడల్లా ప్రియాంకకు నా గురించి గొప్పగా చెప్పేందుకు ట్రై చేశాడు. అది ఆమెకు అర్థమై ‘మీ బ్రదర్ నీకు బాగానే గ్యాస్ కొడుతున్నాడు కదా’ అని నవ్వేసింది. ఇలా ఆ ఈవినింగ్ చాలా ఎంజాయ్ చేశాం. ఇక ఆ రోజు రాత్రి ఎలా గడిపారనే విషయాన్ని చెబుతూ.. ‘ఆ రోజు నైట్ మీమిద్దరం 'ఫ్రెంచ్ కిస్' చేసుకున్నామని నిక్ చెప్పాడు. ఆ క్షణం తమ ఇద్దరికీ ఎంతో ప్రత్యేకం అని, అప్పుడే తమ మధ్య ప్రేమ చిగురించిందని ఆయన చెప్పుకొచ్చారు. ఈ విషయాన్ని ఆయన ఎంతో నిజాయితీగా పంచుకోవడం అభిమానులను ఆకట్టుకుంటోంది.కాగా, ప్రియాంక, నిక్ల వివాహం 2018లో జరిగింది. ప్రస్తుతం ఈ జంటకి 'మాలతీ మేరీ' అనే కుమార్తె ఉంది. తమ కెరీర్లతో బిజీగా ఉంటూనే, కుటుంబానికి కూడా సమాన ప్రాధాన్యత ఇస్తూ ఈ జంట అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. -
‘ధురంధర్2’కి పెయిడ్ ప్రీమియర్స్.. రన్టైమ్ ఎంతంటే?
రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్2: ది రివెంజ్’పై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ ఆ అంచనాలు డబుల్ చేసింది. యాక్షన్తో పాటు ఎమోషనల్ డ్రామాకు కూడా పెద్ద పీట వేసినట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. మార్చి 19న బాక్సాఫీస్ బద్దలు అవ్వడం ఖాయమని రణ్వీర్ ఫ్యాన్స్ అంటున్నారు. అయితే చిత్రబృందం మాత్రం ఒక రోజు ముందే బాక్సాఫీస్ని షేక్ చేసేందుకు రెడీ అవుతోంది. మార్చి 18న పెయిడ్ ప్రీమియర్స్ వేయబోతున్నారు. ఆ రోజు సాయంత్రం ఫస్ట్ షో నుంచే ‘ధురంధర్2: ది రివెంజ్’ మూవీని ప్రదర్శించబోతున్నారు. ఇప్పటికే బుక్మై షో, డిస్ట్రిక్ట్ యాప్ల ద్వారా టికెట్ బుకింగ్స్ను అందుబాటులోకి తెచ్చారు. అయితే ఈ పెయిడ్ ప్రీమియర్స్కి మాత్రం కేవలం హిందీ భాషలో మాత్రమే బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. హైదరాబాద్లోని వివిధ మల్టీప్లెక్స్లలో ఇప్పటికే టికెట్స్ అందుబాటులోకి వచ్చాయి. మామలుగా అయితే పెయిడ్ ప్రీమియర్స్కి టికెట్ ధరలను పెంచుతారు. కానీ ధురంధర్ 2కి మాత్రం ప్రీమియర్స్కి కూడా నార్మల్ ధరలే ఉండడం గమనార్హం. ఎక్కువ మంది ప్రేక్షకులు థియేటర్స్కి రావడం కోసమే మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.భారీ రన్టైమ్..ధురంధర్ 2 మూవీ రన్టైమ్పై మొన్నటి వరకు సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు వచ్చాయి. తాజాగా దీనిపై స్పష్టత వచ్చింది. ఈ మూవీ నిడివి 3 గంటల 55 నిమిషాలు. మొదటి భాగం 3 గంటలా 34 నిమిషాలతో పోలిస్తే ఇది చాలా ఎక్కువే. బ్రేక్ టైమ్తో కలిపితే నాలుగు గంటలకు పైనే ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఇంత నిడివితో ఏ చిత్రం రాలేదు. ప్రేక్షకుడిని ఎంగేజ్ చేసే కంటెంట్ ఉంది కాబట్టే.. రన్టైమ్ విషయంలో మేకర్స్ భయపడడం లేదట. మరి ధురంధర్ 2 ఎన్ని రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి. -
భార్యాభర్తలిద్దరం పని చేస్తామంటే కుదరదు: కరీనా
రోజుకు 8 గంటలు మాత్రమే పని చేస్తానని వాదించి వార్తల్లోకెక్కింది బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె. తల్లయ్యాక అటు కెరీర్ను, ఇటు పిల్లల బాధ్యతను చూసుకోవడం కష్టమైన పని అని.. కొత్తగా తల్లయిన వారికి అందరూ మద్దతుగా నిలవాలని కోరింది. ఈ విషయంలో కొందరు ఆమెకు మద్దతుగా నిలవగా, మరికొందరు అన్ని సినిమాలకు అది వర్కవుట్ కాదని విమర్శించారు. తల్లయ్యాక ఎలా?అటు దీపికా... పనిగంటలతో పాటు ఇతరత్రా డిమాండ్స్ కారణంగా కల్కి 2898 ఏడీ సీక్వెల్, స్పిరిట్ సినిమాల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో తల్లయ్యాక సినిమాలు ఎలా మేనేజ్ చేస్తున్నారన్న ప్రశ్నపై బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ స్పందించింది. ఆమె మాట్లాడుతూ.. ద బకింగ్హామ్ మర్డర్స్ మూవీ షూట్ కోసం లండన్లో 35 రోజులు ఉండాల్సి వచ్చింది. ముందుగానే ప్లాన్ఎప్పుడు వెళ్లాలి? మళ్లీ ఎప్పుడు తిరిగి రావాలి? అనేది ముందుగానే ప్లాన్ చేసుకున్నాను. అన్నీ ముందుగానే ప్లాన్ చేసుకుంటే ఎటువంటి సమస్య ఉండదు. నాకు ఇద్దరు పిల్లలున్నారు. కొన్ని రోజులు షూటింగ్ అయ్యాక మధ్యలో ఇండియా తిరిగొచ్చాను. పిల్లలతో గడిపాను. ఆ సమయంలో మిగతావారిపై చిత్రీకరణ జరిపారు. నేను తిరిగి వెళ్లగానే నా పాత్ర షూటింగ్ పూర్తిచేశారు. నేను అదృష్టవంతురాలినిచిత్రయూనిట్ నన్ను అర్థం చేసుకుని సహకరించింది. ఈ విషయంలో నేను చాలా అదృష్టవంతురాలిని. పైగా ఆ సమయంలో సైఫ్ ఇంట్లో పిల్లలతోనే ఉన్నాడు. మేమిద్దరం పని కోసం పరిగెడుతూ ఇంట్లో పిల్లల్ని ఒంటరిగా వదిలేయలేము. ఒకరు పని చేస్తున్నప్పుడు మరొకరు ఇంటిపట్టున ఉండి పిల్లల్ని చూసుకోవాలి. అలా అర్థం చేసుకునే భాగస్వామి ఉండాలి అని కరీనా కపూర్ చెప్పుకొచ్చింది.చదవండి: రణ్బీర్ కపూర్ ప్లేటు నిండా చిప్స్.. అంతా ఒక్కడే తింటాడా? -
రణ్బీర్ కపూర్ ప్లేటు నిండా చిప్స్, బిస్కెట్స్, చాక్లెట్స్..
మూడేళ్ల క్రితం వచ్చిన యానిమల్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు తిరగరాసిందో అందరం చూశాం. సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో రణ్బీర్ కపూర్ హీరోగా నటించిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.915 కోట్లకు పైగా రాబట్టింది. ఈ సినిమాలో హీరోయిన్ రష్మిక మందన్నా సోదరుడిగా నటించాడు శ్రీనాథ్ మాగంటి.మర్చిపోలేని అనుభవంఈయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో రణ్బీర్పై ప్రశంసలు కురిపించాడు. యానిమల్ సినిమాలో నటించడం అస్సలు మర్చిపోలేను. రణ్బీర్ తాత రాజ్కపూర్ పెద్ద స్టార్, తండ్రి రిషి కపూర్ గొప్ప స్టార్,.. రణ్బీర్ కూడా స్టార్ హీరోగా రాణిస్తున్నాడు. ఆయన అంకిత భావంతో పని చేస్తాడు. సెట్కు భారీ సిబ్బందిని వెంటేసుకుని రాడు. ఒక ప్లేటు నిండా చాక్లెట్స్, చిప్స్తను వచ్చినప్పుడల్లా ప్లేటు నిండా ఆరోగ్యకరమైన చిప్స్, బిస్కెట్లు, చాక్లెట్లు వెంటపట్టుకుని వస్తాడు. అవన్నీ కేవలం తనకోసమే కాదు, తన చుట్టుపక్కల ఉన్నవారి కోసం కూడా! ఎవరికి ఆకలైతే వారు తీసుకుని తినవచ్చు. కసారి నేను ఆ ప్లేటులోని స్నాక్ తీసుకుని తిన్నాను. ఇంతలో ఓ వ్యక్తి అది సార్ది అన్నాడు. సర్, ఈ ప్లేటంతా తింటాడా? అని అడిగాను. మా మాటలు విన్న రణ్బీర్.. నన్ను వారించిన వ్యక్తిని మూర్ఖుడా.. అతడిని తిననివ్వు అని చెప్పాడు.సినిమాఅతడిని ఏదో కోపంతో తిట్టలేదు, ప్రేమ, చనువుతోనే అతడిని వారించి నన్ను తినమమన్నాడు అని గుర్తు చేసుకున్నాడు. ప్రస్తుతం రణ్బీర్ రామాయణ సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీ మొదటి భాగం ఈ ఏడాది దీపావళిలో, రెండో భాగం వచ్చే ఏడాదిలో విడుదల కానుంది. దీని తర్వాత యానిమల్కు సీక్వెల్గా తెరకెక్కనున్న యానిమల్ పార్క్లో భాగం కానున్నాడు.చదవండి: ఆస్కార్ నుంచి ఆహ్వానం -
ఆస్కార్ నుంచి ఆహ్వానం
ప్రియాంకా చోప్రాకు మరోసారి ఆస్కార్ నుంచి ఆహ్వానం అందింది. అమెరికాలోని లాస్ ఏంజెల్స్ వేదికగా ఈ నెల మార్చి 15న (భారతీయ కాలమానం ప్రకారం మార్చి 16) జరగనున్న 98వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో ఓ ప్రెజంటర్గా పాల్గొననున్నారు ప్రియాంకా చోప్రా. ఆమెతో పాటు హాలీవుడ్ యాక్టర్స్ అన్నే జాక్వెలిన్ హతావే, గ్వినేత్ పాల్ట్రో, రాబర్ట్ డౌనీ జూనియర్, ఆర్నేట్, పాల్ మెస్కల్ ప్రజెంటర్స్గా పాల్గొననున్నట్లు ఆస్కార్ అకాడమీ కమిటీ ప్రకటించింది.ఇక ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవానికి ప్రియాంకా చోప్రా ప్రజెంటర్గా పాల్గొనడం ఇది తొలిసారి కాదు. 2016లో జరిగిన 88వ ఆస్కార్ అవార్డుల వేడుకకు ప్రియాంక తొలిసారి ప్రజెంటర్గా వ్యవహరించారు. ఇప్పుడు పదేళ్లకు ఈ వేదికపై ఆమె మరోసారి విజేతలకు ఆవార్డులను ప్రదానం చేయనున్నారు.వారణాసి సినిమా ఓ గొప్ప అనుభవం: ప్రియాంకా చోప్రా మహేశ్బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘వారణాసి’. ఈ చిత్రంలో ప్రియాంకా చో ప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ నిర్మిస్తున్న ఈ సినిమా 2027 ఏప్రిల్ 7న రిలీజ్ కానుంది. ఇటీవల ఈ సినిమా చిత్రీకరణ జార్జియాలో ప్రారంభమైంది. నెక్ట్స్ షెడ్యూల్ను అంటార్కిటికాలో ప్లాన్ చేశారని సమాచారం. కాగా, గత ఏడాది సెప్టెంబరులో ఈ సినిమా చిత్రీకరణ కెన్యాలోని ఫారెస్ట్ లొకేషన్స్లో జరిగిన విషయం గుర్తుండే ఉంటుంది.ఆ షూటింగ్ అనుభవాలను ప్రియాంకా షేర్ చేసుకున్నారు. ‘‘కెన్యాలోని అడవుల్లో షూటింగ్ చేయడం గొప్ప అనుభూతి. వేల సంఖ్యలో అడవి జీవులు వలస వెళ్తున్న సమయంలో వాటి మధ్య మేం ఉన్నప్పుడు షూటింగ్ జరిగింది. ఆ జంతువుల ముఖాలను అంత దగ్గరగా చూస్తుంటే ఈ భూమ్మీద అవి ఎన్నో ఏళ్లుగా మనుగడ సాగిస్తున్నాయని అర్థమైంది. ప్రకృతి ఎంత శక్తిమంతమైనదో, జీవపరిణామ క్రమం ఎంత గొప్పదో వాటిని చూస్తే తెలిసింది’’ అని ఓ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో చె΄్పారు ప్రియాంకా చోప్రా. -
మూడెకరాలు, రూ. 35 కోట్లు : అయోధ్యలో ప్లాట్ కొన్న బిగ్బీ
బిగ్బీ అమితాబ్ బచ్చన్ విలువైన ప్లాట్ను కొనుగోలు చేశారు. అమితాబ్ బచ్చన్ అయోధ్యలో 2.67 ఎకరాల భూమిని రూ. 35 కోట్లకు దక్కించుకున్నారు. అయోధ్యలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రామ జన్మ భూమి ఆలయాన్ని నిర్మించిన తరువాత ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరందుకుంది. భవిష్యత్తులో ధరలు మరింత పెరుగుతాయనే అంచనాలు భారీగా ఉన్నాయి.ఈ ప్లాట్ ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలోని HoABL హౌస్ ఆఫ్ అభినందన్లో ఉంది. ఇక్కడే బచ్చన్ మరో రెండు ప్లాట్లను కలిగి ఉండటం విశేషం. HoABL ప్రకటన ప్రకారం, ఈ అమ్మకాన్ని బచ్చన్ కుటుంబ యాజమాన్యంలోని సంస్థ AB Corp ప్రతినిధి నిర్వహించారు. HoABL తో బచ్చన్ చేసిన నాల్గవ కొనుగోలు ఇది, మహారాష్ట్రలోని అలీబాగ్ సముద్ర రిసార్ట్లో సోల్ దే అలీబాగ్ ప్రాజెక్ట్లో అమితాబ్కు ఒక స్థలం ఉంది. భూమిపై పెట్టుబడుల తరతరాల విశ్వాసాన్ని బచ్చన్ పెట్టుబడి ప్రతిబింబిస్తుందనీ, అయోధ్యపై విశ్వాసం అనేది తరతరాలుగా పంచుకున్న వారసత్వం అన్నారు. HoABLలో, భూమిని కేవలం సంపదగా కాకుండా వారసత్వంగా చూస్తామని HoABL చైర్మన్ అభినందన్ లోధా వ్యాఖ్యానించారు. ఇదీ చదవండి: బాతు పొట్టలో గ్రా. 10 గోల్డ్ , ఉబ్బితబ్బిబ్బైన యజమానికాగా ఆయోల్య ఆలయ నిర్మాణం, అలాగే విశాలమైన రోడ్లు, మెరుగైన రైల్వే స్టేషన్లు మరియు కనెక్షన్లు మరియు నగరానికి ప్రత్యేక విమానాశ్రయం వంటి అనుబంధ మౌలిక సదుపాయాల అభివృద్ధి తర్వాత అయోధ్యలో భూమి ధరలు గణనీయంగా పెరిగాయి. HoABL, తదితర స్థానిక డెవలపర్లు, ప్రాజెక్టులతో పాటు రానున్న రోజుల్లో టూరిజం అభివృద్ధిపై భారీ ఆశలే పెట్టుకున్నారు. అందుకే పర్యాటకుల రద్దీని క్యాష్ చేసుకునేందుకు కల్పించడానికి హోటళ్ళు,రిసార్ట్లను కూడా నిర్మిస్తున్నారు. HoABL ప్రస్తుత ప్రాజెక్ట్, సరయులో, బ్రూక్ఫీల్డ్ యాజమాన్యంలోని హోటల్ చైన్ ది లీలా ప్యాలెస్లు, హోటల్స్ , రిసార్ట్స్ నిర్వహించే హోటల్ కూడా ఉంది.ఇదీ చదవండి: పెట్రోల్ , డీజిల్ ధరల షాక్ తప్పదా? వైరల్ వీడియో(రూ. 250 కోట్ల భరణం ఆఫర్ : జోరుగా మంతనాలు చేస్తున్న విజయ్) -
వాయిదా రూమర్స్కి చెక్.. ట్రైలర్ రిలీజ్ ఎప్పుడంటే?
'ధురంధర్ 2' సినిమా విడుదలకు ఇంకా రెండు వారాలు కూడా లేదు. టీమ్ నుంచి ఎలాంటి అప్డేట్ లేకపోయేసరికి వాయిదా పడుతుందనే రూమర్స్ వినిపించాయి. యష్ 'టాక్సిక్' తప్పుకోవడంతో.. ధురంధర్ సీక్వెల్ కూడా అలానే చేస్తుందేమోనని మాట్లాడుకున్నారు. కానీ ట్రైలర్ రిలీజ్ అప్డేట్ గురించి అధికారికంగా ప్రకటించి సదరు పుకార్లకు చెక్ పెట్టేశారు.రణ్వీర్ సింగ్ పాన్ ఇండియా మూవీ 'ధురంధర్:ది రివెంజ్' ట్రైలర్ని శనివారం(మార్చి 07) ఉదయం 11:01 గంటలకు విడుదల చేయనున్నట్లు అధికారికంగా అనౌన్స్ చేశారు. దీనిబట్టి మూవీపై ఓ అంచనాకు వచ్చేస్తారు. ఇందులో రణవీర్.. జస్కిరత్ సింగ్, హమ్జా అనే రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నాడు.(ఇదీ చదవండి: తిరుమలలో రుక్మిణి వసంత్.. ఈమె చెల్లిని చూశారా?)'ధురంధర్' తొలి భాగం.. భారత్తో పాటు అంతర్జాతీయంగానూ హిట్ అయింది. రూ.1300 కోట్లకుపైనే కలెక్షన్ సాధించి రికార్డులు సృష్టించింది. ముఖ్యంగా నార్త్ అమెరికా, కెనడా, యుకే, ఆస్ట్రేలియా లాంటి చోట్ల భారీ విజయాన్ని అందుకుంది. తొలి పార్ట్ కేవలం హిందీలోనే రాగా ఇప్పుడు దక్షిణాది భాషల్లోనూ రిలీజ్ కానుండటం మరింతగా కలిసి రానుంది.జియో స్టూడియోస్ సమర్పణలో, బి62 స్టూడియోస్ నిర్మాణంలో దర్శకుడు ఆదిత్య ధార్ తీసిన ఈ చిత్రం.. పాకిస్థాన్ బ్యాక్డ్రాప్లో తీసిన స్పై యాక్షన్ థ్రిల్లర్. హిందీ, తమిళ, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో ఈ నెల 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. గుడి పాడ్వా, ఉగాది పండుగల సందర్భంలో ఈద్కు ముందుగా విడుదలవుతూ భారీ ఓపెనింగ్ సాధించేందుకు సిద్ధమవుతోంది.(ఇదీ చదవండి: టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ప్రేమ పెళ్లి.. అమ్మాయి ఎవరంటే?) -
కృతీని అవమానించిందా? చిల్లర పనులు చేయనన్న హీరోయిన్
హీరోయిన్ కృతిసనన్పై యామీ గౌతమ్ అసూయతో రగిలిపోతుందని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల జరిగిన జీ సినీ అవార్డ్స్ ఈవెంట్లో కృతి సనన్ 'తేరే ఇష్క్ మే' సినిమాకుగానూ ఉత్తమ నటి పురస్కారం అందుకుంది. అయితే ఈ విజయాన్ని విమర్శిస్తూ సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు పుట్టుకొచ్చాయి. లైక్ కొట్టడంతో వివాదంకృతీ సనన్కు బదులుగా హక్ సినిమాకుగానూ యామీ గౌతమ్కు ఉత్తమ నటి అవార్డు రావాల్సిందని ఓ వీడియో క్రియేట్ చేశారు. అయినా అవార్డు గెలిస్తే మాత్రమే ఉత్తమ నటి అన్న అభిప్రాయాన్ని తాను ఏకీభవించను. ఈ అవార్డులను పట్టించుకోను అంటూ యామీ గతంలో అన్న మాటల్ని ఆ వీడియోలో పొందుపరిచారు. కృతిని విమర్శిస్తున్న ఆ పోస్టుకు యామీ లైక్ కొట్టడంతో వివాదం మొదలైంది. అవమానించనుతాజాగా ఈ వ్యవహారంపై యామీ గౌతమ్ సోషల్ మీడియా వేదికగా వివరణ ఇచ్చింది. ఒక నటిని అవమానించేలా ఉన్న వీడియోను నేను లైక్ చేసినట్లు నా దృష్టికి వచ్చింది. ప్రతిరోజు ఎంతోమంది మమ్మల్ని ట్యాగ్ చేస్తూ ఉంటారు. అలా వాటిని చూసే క్రమంలో పొరపాటున లైక్ పడి ఉండవచ్చు. అంతేతప్ప ఉద్దేశపూర్వకంగా నేను లైక్ చేయలేదు.క్లారిటీనా జీవితంలో ఎప్పుడూ ఇలాంటి చిల్లర పబ్లిసిటీ స్టంట్లు చేయలేదు. నా పనేంటో నేను చూసుకుని ముందుకు కదిలాను. క్లిక్బైట్ వార్తల కోసం ఇలాంటి చిన్న విషయాల్ని పెద్దది చేయకండి. నాకంటూ మంచి పేరు, గౌరవం ఉందని ఆశిస్తున్నాను. నాకెటువంటి పీఆర్ టీమ్ లేదు. అలాగే అవార్డులపై నా అభిప్రాయాన్ని గతంలోనే వెల్లడించాను. నేను కేవలం నా పనిపైనే దృష్టి పెడతాను అని యామీ గౌతమ్ చెప్పుకొచ్చింది. The reel Yami is referring to - pic.twitter.com/phE5GTvjUp— Pan India Review (@PanIndiaReview) March 5, 2026చదవండి: క్యూటీ.. నీవల్లే ఇదంతా: అల్లు అర్జున్ పోస్ట -
పెద్ది హీరోయిన్ బర్త్ డే.. కాలి నడకన తిరుమలకు..!
బాలీవుడ్ భామ, పెద్ది మూవీ హీరోయిన్ జాన్వీ కపూర్ తిరుమల చేరుకున్నారు. ఈ శుక్రవారం ఆమె బర్త్ డే కావడంతో తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. అలిపిరి నడకదారిలో నడుచుకుంటూ బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ తిరుమల కొండపైకి చేరుకున్నారు. జాన్వీ కపూర్తో పాటు నటి మహేశ్వరి రేపు స్వామివారిని దర్శించుకోనున్నారుబాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ ప్రస్తుతం రామ్ చరణ్ సరసన నటిస్తోంది. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు డైరెక్షన్లో వస్తోన్న పెద్ది మూవీలో హీరోయిన్గా కనిపిచంనుంది. ఈ సినిమా కోసం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) -
ప్రెగ్నెన్సీ కష్టాలు చూశా.. తనే నా మిరాకిల్ బేబీ: ప్రియాంక
గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా 2018లో సింగర్ నిక్ జోనస్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి 2022లో సరోగసి ద్వారా కూతురు మాల్తీ మేరీ జన్మించింది. అయితే పుట్టినప్పుడు బిడ్డ ఆరోగ్యంగా లేకపోగా ఆమెకు రక్తమార్పిడి చేయాల్సి వచ్చింది. పొత్తిళ్లలో ఎత్తుకుని నవ్వులు పంచాల్సిన చిన్నారి ఆపరేషన్ థియేటర్లో పోరాడుతుంటే ప్రియాంక దంపతుల మనసు తల్లడిల్లిపోయింది. కానీ, వీరి ప్రార్థనలు ఫలించి మాల్తీ సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగొచ్చింది. మిరాకిల్ బేబీఆనాటి సంగతులను తాజాగా ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకుంది ప్రియాంక చోప్రా. ప్రియాంక మాట్లాడుతూ.. నాకు ప్రెగ్నెన్సీలు కలిసిరాలేదు. చాలా కష్టాలు చూశాను. అప్పుడు నాకు (సరోగసి ద్వారా) మిరాకిల్ బేబీ పుట్టింది. తను ఈ ప్రపంచంలో అడుగుపెట్టిన మరుక్షణం నాకింక ఏమీ కనిపించలేదు. సమస్తం ఆగిపోయినట్లే అనిపించింది. మాల్తీ ఏం చేస్తుందో? కాకపోతే తనగురించి ఎప్పటికీ భయపడుతూనే ఉంటాను. తను స్కూల్లో ఉన్నా.. నేను వేరే దేశంలో ఉన్నా.. మాల్తీ ఏం చేస్తుందో? ఎలా ఉందో? అని నా గుండె తనకోసమే కొట్టుకుంటూ ఉంటుంది. తను జోక్స్ చెప్తుంది, గొంతెత్తి పాడుతుంది. నన్ను, నా భర్తను, మా కుటుంబం మొత్తాన్ని ఎప్పటికప్పుడు సర్ప్రైజ్ చేస్తూనే ఉంటుంది. నా జీవితంలో తనే గొప్ప బహుమతి. నా ఆలోచనంతా తన చుట్టూనే..తను వచ్చాకే నా ప్రాధాన్యతలన్నీ మారిపోయాయి. మొదటి, చివరి ఆలోచన తన గురించే ఉంటుంది అని చెప్పుకొచ్చింది. ప్రియాంక ఇటీవలే ద బ్లఫ్ అనే హాలీవుడ్ సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. ప్రస్తుతం వారణాసి అనే సినిమా చేస్తోంది. రాజమౌళి దర్శకత్వం మహేశ్బాబు హీరోగా నటిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవిలో విడుదల కానుంది.చదవండి: కాళ్లు పట్టుకుని బతిమాలా.. నేను చనిపోయాక అయినా! -
కాళ్లు పట్టుకుని బతిమాలా.. నేను చనిపోయాక అయినా!
ప్రేమించి పెళ్లి చేసుకోవడం తప్పా? అంతమాత్రానికే ఇలా నాకు నరకం చూపించాలా? అని ఆగ్రహం వ్యక్తం చేశాడు యూట్యూబర్, హిందీ బిగ్బాస్ 17 ఫేమ్ అనురాగ్ దోభల్. కులాంతర వివాహం చేసుకున్న కారణంతో తన కుటుంబం తనను వెలేసిందని, ఇక తనకు చావే దిక్కని వాపోయాడు. ఈ మేరకు యూట్యూబ్లో కన్నీళ్లు పెట్టుకుంటూ ఓ వీడియో రిలీజ్ చేశాడు.చిన్నప్పటినుంచి కష్టాలు'గత కొన్నినెలలుగా నా జీవితంలో అనూహ్యమైన మార్పులు చోటుచేసుకున్నాయి. జీవితం ఇంత దుర్భరంగా మారుతుందని నేను ఎన్నడూ అనుకోలేదు. 14 ఏళ్ల వయసులోనే నాకు బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది. ఆ తర్వాత నా పేరెంట్స్ వారికి నచ్చిందే చదవాలని నాపై బలవంతం చేశారు. నేనేమో నా కలల్ని నిజం చేసుకోవడం కోసం డబ్బు కూడబెట్టేందుకు కష్టపడ్డాను. ట్యూషన్స్ చెప్పాను. నాకన్నా నా పేరెంట్స్ అవసరాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాను.పెళ్లి ఇష్టం లేదుసోషల్ మీడియా ద్వారా రితిక అనే అమ్మాయిని కలిశాను. తను నా అభిమాని అని పేర్కొంటూ రెండుమూడేళ్లపాటు మెసేజ్లు చేసింది. అలా ఒకరోజు ఆమె మెసేజ్కు రిప్లై ఇచ్చాను. అలా తనతో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసింది. ఇద్దరం రెండేళ్లపాటు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నాం. మా పెళ్లి మా పెద్దలకు ఇష్టం లేదు. వారం రోజుల్లో పెళ్లి అనగా వేడుకకు రామని చెప్పేశారు. ఎంతగానో బతిమాలాను. బంధువులందరి ముందు చేతులెత్తి వేడుకున్నాను. వార్నింగ్కాళ్లు పట్టుకుని క్షమించమని అడిగాను. అయినా వారి మనసు కరగలేదు. మేము సంతోషంగా లేము, మిమ్మల్నీ సంతోషంగా ఉంచము అని వార్నింగ్ ఇచ్చారు. మమ్మల్ని టార్చర్ పెట్టారు. నా దగ్గరున్నదంతా లాక్కున్నారు. పెళ్లయ్యాక ఇంట్లో కూడా అడుగుపెట్టనివ్వలేదు. చచ్చిపోవాలనుకున్నాను. నాకేదైనా అయితే అందుకు నా ఇంట్లోవాళ్లే కారణం.బోరుమని ఏడ్చిన బిగ్బాస్ కంటెస్టెంట్ఇప్పుడు రితిక కూడా నన్ను వదిలేసింది. నేను తీవ్రమైన డిప్రెషన్లో ఉన్నాను. ఈ బాధను ఎలా పోగొట్టుకోవాలో అర్థం కావట్లేదు. బహుశా ఈ వీడియో తర్వాత నేను కనిపించనేమో! ఐదు రోజులుగా ఏమీ తినలేదు. ప్రశాంతంగా నిద్రపోవాలనుంది. నేను మిమ్మల్ని ఎంతగానో ప్రేమించాను. కానీ బయటవాళ్లు చెప్పిందే నమ్మారు. నన్ను దూరం పెట్టారు. నేను చనిపోయాక అయినా నా బిడ్డను ఆదరించండి అని బోరుమని ఏడ్చాడు. ఇదే తన చివరి వ్లాగ్ అని అనురాగ్ ఇన్స్టాగ్రామ్లో రాసుకొచ్చాడు. అనురాగ్ భార్య గతేడాది సెప్టెంబర్లో గర్భం దాల్చింది.చదవండి: చిరంజీవి సినిమాలో యాక్ట్ చేస్తున్నా: బండ్ల గణేశ్ -
రొమ్ము క్యాన్సర్ బారిన పడ్డ 'సేక్రెడ్ గేమ్స్' నటి
బాలీవుడ్ నటి రాజశ్రీ దేశ్పాండే రొమ్ము క్యాన్సర్ బారిన పడింది. క్యాన్సర్ ప్రారంభదశలోనే దాన్ని గుర్తించడంతో పాటు ఆపరేషన్ కూడా చేయించుకున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. నేను ఇన్ఫిల్టరేటింగ్ డక్టల్ కార్సినోమా అనే రొమ్ము క్యాన్సర్ బారిన పడ్డాను. ప్రస్తుతం ఇది స్టేజ్ 1లో ఉంది. రొమ్ము క్యాన్సర్ఇప్పుడు మీరిది చదువుతున్నారంటే ఈ వ్యాధి గురించి నేను నా తల్లిదండ్రులకు చెప్పేందుకు ధైర్యం కూడదీసుకున్నట్లే లెక్క! నేను రొటీన్ చెకప్కు వెళ్లినప్పుడు రొమ్ము క్యాన్సర్ ఉన్నట్లు తేలింది. అదృష్టవశాత్తూ ప్రారంభం దశలోనే గుర్తించగలిగాం. లెక్కలేనన్ని టెస్టులు, శస్త్రచికిత్సలు.. ఇదంతా రోలర్ కోస్టర్ రైడ్లా అనిపిస్తోంది. కానీ మీ ప్రేమాభిమానాలే నన్ను ధైర్యంగా ముందుకు నడిపించాయి. భయం పటాపంచలుసర్జరీ తర్వాత అమ్మానాన్న ముఖం చూడగానే నాలో భయం పటాపంచలై కొత్త శక్తి ప్రవహించింది. ప్రస్తుతం నేను కోలుకుంటున్నాను. త్వరలోనే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్తాను అని రాసుకొచ్చింది. ఇది చూసిన సెలబ్రిటీలు, అభిమానులు.. నువ్వు స్ట్రాంగ్ లేడీవి.. త్వరగా కోలుకోవాలి అంటూ కామెంట్లు చేస్తున్నారు.కెరీర్రాజశ్రీ దేశ్పాండే తలాష్ (2012) చిత్రంతో బాలీవుడ్లో తన కెరీర్ ఆరంభించింది. కిక్, మామ్, ద స్కై ఈజ్ పింక్, జోరం వంటి చిత్రాల్లో నటించింది. బుల్లితెరపై కుచ్ తో లోగ్ కహేంగే, 24: ఇండియా సీరియల్స్లోనూ యాక్ట్ చేసింది. సేక్రెడ్ గేమ్స్ అనే నెట్ఫ్లిక్స్ సిరీస్తో విశేషమైన పాపులారిటీ దక్కించుకుంది. View this post on Instagram A post shared by Rajshri (@rajshri_deshpande) చదవండి: నిత్యం అత్యాచార బెదిరింపులు: ధురంధర్ నటి -
నిత్యం అత్యాచార బెదిరింపులు: ధురంధర్ నటి
ధురంధర్ సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరూ ప్రశంసలు అందుకుంటున్నారు. ఈ చిత్రంలో షరారత్ అంటూ సాగే ఐటం సాంగ్లోనూ అదిరిపోయే స్టెప్పులతో అలరించి ఫేమ్ తెచ్చుకుంది ఆయేషా ఖాన్. అయితే గతంలోనూ ఓ సాంగ్లో కనిపించాల్సిందని, కానీ లావుగా ఉన్న కారణంతో తనను రిజెక్ట్ చేశారని చెప్తోంది. సడన్గా తీసేశారుతాజాగా ఓ ఈవెంట్లో ఆయేషా ఖాన్ మాట్లాడుతూ.. టీ సిరీస్ బ్యానర్ నుంచి వచ్చిన ఓ పాటలో నేను సెకండ్ హీరోయిన్గా చేయాల్సింది. అప్పుడు నేను పన్నెండో తరగతి చదువుతున్నాను. తెల్లారితే షూటింగ్ అనగా రాత్రికి రాత్రే నన్ను తీసేశారు. నేను లావుగా ఉన్నానని సాకు చూపించారు. నిజంగా బాధాకరంఇప్పటికీ ఇన్స్టాగ్రామ్లో నా శరీరం గురించి రకరకాలుగా కామెంట్లు చేస్తూనే ఉంటారు. నేను స్కర్ట్ వేసుకున్నా, కుర్తా ధరించినా.. ఎలాంటి దుస్తులు ధరించినా తప్పుపడుతూనే ఉంటారు. ఏది పోస్ట్ చేయాలన్నా ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సి వస్తుంది. ఇది నిజంగా బాధాకరం. ఎవరేమనుకుంటే నాకేంటి? నాకు నచ్చింది పోస్ట్ చేయాలనిపిస్తుంది. కానీ వాళ్లు హద్దులు దాటి మరీ కామెంట్స్ చేస్తారు.ఫేమస్ కాకపోయుంటే..అత్యాచారం చేస్తామని బెదిరిస్తారు. ఈ బెదిరింపులు నాకు రోజూ వస్తాయి. ఇలాంటి మనుషుల మధ్య ఉన్నందుకు భయంగా ఉంది. ఇలాంటివాళ్లకు ఏదో ఒక రకంగా బుద్ధి చెప్పాలన్నంత కోపం వస్తుంది. వాళ్లనే మాటలు కొన్నిసార్లు నా గాయాలను గుర్తు చేస్తాయి. నేను ఇంత ఫేమస్ కాకపోయుంటే నిజంగానే అన్నంత పని చేసేవారేమో అని భయమేస్తుంది అని ఆయేషా చెప్పుకొచ్చింది.సినిమాసీరియల్స్లో చిన్నాచితకా పాత్రలు చేసింది ఆయేషా ఖాన్. హిందీ బిగ్బాస్ 17వ సీజన్తో గుర్తింపు తెచ్చుకుంది. ముఖచిత్రం మూవీతో తెలుగు వెండితెరకు పరిచయమైంది. ఓం భీమ్ బుష్, మనమే సినిమాల్లోనూ చిన్న పాత్రలు పోషించింది. హిందీలో జాట్, కిస్ కిస్కో ప్యార్ కరూన్ 2 సినిమాలు చేసింది.చదవండి: విజయ్- రష్మిక.. ఎవరు ప్రపోజ్ చేశారంటే? -
మూడేళ్లకు రూ. 74 లక్షలు : నటి లగ్జరీ ఫ్లాట్ డీల్ హాట్ టాపిక్
ముంబైలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో గోరేగావ్ ఒకటి. ఆధునిక హై-రైజ్అపార్ట్మెంట్స్, గేటెడ్ కమ్యూనిటీలు ఎక్కువగా ఉండటంతో ఐటీ నిపుణులు, వ్యాపారవేత్తలు ఇక్కడ నివసించడానికి ఆసక్తి చూపుతుంటారు. ఈ క్రమంలో బాలీవుడ్ నటి సుష్మితా సేన్ (Sushmita Sen), ఆమె తల్లి సుబ్రా సేన్ ముంబైలో తమ అపార్ట్మెంట్ను అద్దెకు ఇవ్వడం వార్తల్లో నిలిచింది. దీని నెలవారీ అద్దె రూ. 1.95 లక్షలతో 36 నెలల (3 ఏళ్లు) లీజ్ కిచ్చారు. అంటే ఈ ప్రాపర్టీ ద్వారా మొత్తం మూడేళ్లకు గాను సుమారు 74 లక్షలు (73.76 లక్షలు) ఆదాయం సమకూరనుందిఈ లగ్జరీ ఫ్లాట్ గోరేగావ్లోని ప్రముఖ 'ఓబెరాయ్ ఎక్స్క్విజిట్' (Oberoi Exquisite) ప్రాజెక్ట్లో ఉంది. లీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ (IGR) వెబ్సైట్లో స్క్వేర్ యార్డ్స్ సమీక్షించిన ఆస్తి రిజిస్ట్రేషన్ పత్రాల ప్రకారం. ఈ ఒప్పందం అధికారికంగా ఫిబ్రవరి 2026లో నమోదు చేయబడింది. దీని ప్రకాం సెక్యూరిటీ డిపాజిట్ కింద 6 లక్షలు కాగా, స్టాంప్ డ్యూటీ కింద రూ.18,900, రిజిస్ట్రేషన్ ఛార్జీల కింద 1,000 చెల్లించారు. ప్రతి ఏటా 5శాతం మేర అద్దె పెరుగుతుంది.ఈ ప్రాపర్టీ ప్రత్యేకతలు విషయానికి వస్తే కార్పెట్ ఏరియా 996 చదరపు అడుగులతో కలిపి మొత్తం ఏరియా 1,241 చదరపు అడుగులు. ఇందులో రెండు కార్ పార్కింగ్ స్థలాలు కూడా ఉన్నాయి.ఇదీ చదవండి: సీమంతం వేడుకలో భార్యకు సర్ప్రైజ్, వైరల్ వీడియోసుస్మితా సేన్ గుర్తించి సంక్షిప్తంగా1994లో మిస్ యూనివర్స్ కిరీటాన్ని గెలుచుకున్న తొలి భారతీయ మహిళగా సుస్మితా సేన్ చరిత్ర సృష్టించారు. 'బీవీ నంబర్ 1', 'మై హూ నా' వంటి సినిమాలతో మెప్పించిన సుస్మితా సేన్ ఇటీవల 'ఆర్య', 'తాళి' వంటి వెబ్ సిరీస్లతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న సంగతి తెలిసిందే.(విజయ్ దేవరకొండ నయా ట్రెండ్ : డైమండ్ ఎమరాల్డ్ నెక్లెస్ స్పెషల్ ఎట్రాక్షన్) -
టాలీవుడ్పై ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం ఎంత?
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరుగుతోంది. అరబ్ దేశాలపై కూడా ఇరాన్ విరుచుకుపడుతోంది. దీని వల్ల పెట్రోలు, బంగారం ధరలు ఎక్కడ పెరిగిపోతాయోనని భారతీయులు కంగారు పడుతున్నారు. మరోవైపు ఇదే యుద్ధాన్ని చూసి టాలీవుడ్ కూడా భయపడుతోంది. దానికి చాలానే కారణాలున్నాయి. ఇంతకీ అవేంటి? రాబోయే పాన్ ఇండియా మూవీస్పై ఈ యుద్ధం ప్రభావం ఎంత ఉండొచ్చు?(ఇదీ చదవండి: తొమ్మిదేళ్లకే సంపాదిస్తున్న సన్నీ లియోన్ కూతురు)బలమైన మార్కెట్ఒకప్పుడు అంటే తెలుగు సినిమా కేవలం తెలుగు రాష్ట్రాల వరకే పరిమితమయ్యేది. కానీ ఇప్పుడు చాలా మారిపోయింది. పాన్ ఇండియా ట్రెండ్తో విదేశాల్లోనూ భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. భారతీయ చిత్రాలకు అమెరికన్ మార్కెట్ ఎంత కీలకమో.. అరబ్ దేశాల్లోని మార్కెట్ కూడా అంతే కీలకం. అరబ్ దేశాల్లో పనుల కోసం వెళ్లే చాలామంది భారతీయులు.. అక్కడ మూవీస్ బాగానే చూస్తుంటారు. ఇప్పుడు జరుగుతున్న యుద్ధం కారణంగా అటు థియేటర్లలో మూవీస్ రిలీజులు కష్టమే. ఒకవేళ విడుదల చేసినా జనాలు.. వచ్చి చూడటం కూడా కొంతవరకు అనుమానమే. రాబోయే కొన్నినెలల పాటు అరబ్ దేశాల్లో మన సినిమాలకు మార్కెట్ కాస్త తగ్గొచ్చు.షూటింగ్స్ బంద్మన దేశంలో తీసే చాలా సినిమాలని విదేశాల్లోనూ తెరకెక్కిస్తుంటారు. మరీ ముఖ్యంగా దుబాయితో పాటు మిగతా అరబ్ కంట్రీస్లో పాటల షూటింగ్స్ లాంటివి చేస్తుంటారు. ఇప్పుడు ఆయా దేశాల్లో యుద్ధ వాతావరణం వల్ల చాలావరకు చిత్రీకరణలు నిలిచిపోయాయి. కొన్నింటిని వేరే ప్రాంతాలకు మారుస్తున్నారు. అయితే అరబ్ దేశాల్లో చాలావరకు షూటింగ్స్కి సంబంధించిన సామాగ్రి అందుబాటులో ఉంటుంది. ఇప్పుడు మరో చోటకు వెళ్లాలి అంటే ఆయా పరికరాల్ని అన్నింటినీ మరోచోటకు తీసుకెళ్లడం లాంటివి కాస్త కష్టతరమైన విషయమే అని చెప్పొచ్చు.ప్రయాణ ఆంక్షలుఇదే యుద్ధం వల్ల చాలావరకు విమాన సర్వీసులు నిలిచిపోయాయి. మరికొన్నింటిని వేరే వైపునకు మళ్లిస్తున్నారు. దీంతో నటీనటులు, సాంకేతిక సిబ్బంది, నిపుణులు ప్రయాణాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మన పాన్ ఇండియా సినిమాలకు చాలావరకు విదేశాల్లోనే విజువల్ ఎఫెక్ట్స్ చేయిస్తుంటారు. యాక్షన్ సీన్స్ లాంటి వాటికోసం విదేశాల నుంచి సంబంధిత టెక్నీషియన్స్ని తీసుకొస్తుంటారు. ఇప్పుడు యుద్ధం ఆగేంతవరకు ఈ విషయాల్లో సినిమా బృందాలకు ఇబ్బందులు తప్పవు.విడుదల వాయిదాఇదే యుద్ధ ప్రభావం.. రాజమౌళి తీస్తున్న 'వారణాసి', అల్లు అర్జున్-అట్లీ చేస్తున్న సినిమాలతో పాటు పలు చిత్రాల విడుదల తేదీలపై కచ్చితంగా పడే అవకాశమైతే ఉండొచ్చు. ఇరాన్-ఇజ్రాయెల్ ఎప్పుడు యుద్ధాన్ని విరమిస్తాయనేది తెలియట్లేదు. ఒకవేళ రాబోయే కొన్నిరోజుల్లో విరమించినా సరే మన పాన్ ఇండియా సినిమాలకు అవసరమయ్యే విదేశీ సాంకేతికత, నిపుణుల విషయంలో కాస్త ఆలస్యం లేదా ఇబ్బందులు తలెత్తొచ్చు. అది పరోక్షంగా విడుదల తేదీలపై పడటం గ్యారంటీ.ఆర్థిక భారంయుద్ధం వల్ల రాబోయే రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశముందని అంటున్నారు. ఒకవేళ అదే జరిగితే సినిమా షూటింగ్ రవాణా ఖర్చులు పెరుగుతాయి. ప్రొడక్షన్ బడ్జెట్ కూడా గణనీయంగా పెరిగొచ్చు. అదే జరిగితే బడ్జెట్ సమస్యలతో సినిమాల ఇంకాస్త లేటుగా ప్రేక్షకులు ముందుకు వచ్చే ఛాన్స్ ఉంటుంది.ఇదే యుద్ధం కారణంగా చాలామంది బాలీవుడ్ నటీనటులు గల్ఫ్ దేశాల్లో చిక్కుకుపోయారు. ఇప్పుడు వాళ్లందరూ స్వదేశానికి వచ్చేసినా సరే భయమనేది కొన్నాళ్ల పాటు ఉండిపోతుంది. దీంతో షెడ్యూల్స్, షూటింగ్స్ ఆలస్యం కావొచ్చేమో అనిపిస్తుంది. ఏదేమైనా ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం అనేది ఆయా దేశాలపైనే కాకుండా భారతీయ సినీ పరిశ్రమపైనా పరోక్షంగా పడింది. రూ.10 వేల కోట్లకు పైనే నష్టం ఉండొచ్చని విశ్లేషకులు మాట్లాడుకుంటున్నారు. (ఇదీ చదవండి: మా బాడీ పార్ట్స్ జూమ్ చేసి ఫొటోలు.. 'కాంతార' హీరోయిన్ ఫైర్) -
తొమ్మిదేళ్లకే సంపాదిస్తున్న సన్నీ లియోన్ కూతురు
ఒకప్పుడు శృంగార తారగా గుర్తింపు తెచ్చుకున్న సన్నీ లియోన్.. చాన్నాళ్ల క్రితమే వాటిని పక్కనబెట్టేసింది. ఓ వైపు ఫ్యామిలీ, మరోవైపు సినిమాలు చేస్తూ బతికేస్తోంది. రీసెంట్ టైంలో అయితే సన్నీ పెద్దగా సోషల్ మీడియాలో కనిపించట్లేదు. తాజాగా బాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్ యూట్యూబ్ వీడియోలో కనిపించింది. సన్నీ ఇంటికి వెళ్లిన ఫరా ఖాన్.. చాలాసేపు ముచ్చటించింది. మిగతా వాటి సంగతేమో గానీ తన కూతురు గురించి సన్నీ లియోన్ చెప్పిన ఓ విషయం మాత్రం నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది.(ఇదీ చదవండి: యాంకర్ సుమ కూతురిని చూశారా? ఇప్పుడెలా ఉందంటే)డేనియల్ వెబర్ని పెళ్లి చేసుకున్న తర్వాత సన్నీ లియోన్.. లాతుర్కి చెందిన నిషా అనే పాపని దత్తత తీసుకుంది. తర్వాత సన్నీ దంపతులకు కవల అబ్బాయిలు పుట్టారు. నిషాకి ఇప్పుడు తొమ్మిదేళ్లు. అయితే ఈ వయసులోనే తన కూతురు.. బూ బాక్స్ అనేదాన్ని కనిపెట్టిందని సన్నీ బయటపెట్టింది. దీనికి అధికారికంగా పేటెంట్ హక్కులు కూడా తీసుకున్నామని స్పష్టం చేసింది.సన్నీ లియోన్ మాట్లాడుతూ.. 'బూ బాక్స్' అనేది టూ ఇన్ వన్ టిష్యూ హోల్డర్. సాధారణంగా టిష్యూని ఉపయోగించిన తర్వాత ఓ డస్ట్ బిన్లో పడేస్తాం. లేదంటే ఎక్కడ పడితే అక్కడ వేస్తాం. ఇది గమనించిన నిషా.. టిష్యూ బాక్స్ పక్కనే చిన్న చెత్త బుట్ట కలిపి ఉండేలా దీన్న డిజైన్ చేసింది. అంటే టిష్యూ వాడుకున్న తర్వాత పక్కనే ఉన్న బిన్లో పడేయొచ్చు. దీంతో శ్రమ తగ్గుతుంది. ఇల్లు శుభ్రంగా ఉంటుంది.అయితే దీన్ని తయారు చేయడం వెనక ఓ కారణముంది. ముంబైలోని దుమ్ము వల్ల నిషాకు ఎప్పటికప్పుడు అలర్జీ వచ్చేది. దానికోసం టిష్యూలు వాడి ఇంట్లో ఎక్కడపడితే అక్కడ పడేసేసరికి తిట్టేదాన్ని. అప్పుడు నిషాకు ఈ ఆలోచన వచ్చింది. ఓ టిష్యూ బాక్స్కు ప్లాస్టర్తో డిస్పోజబుల్ కప్ అతికించి నాకు చూపించింది. అదే ఇప్పుడు ఓ కమర్షియల్ ప్రొడక్ట్గా మారి నిషాకు డబ్బులు కూడా తెచ్చిపెడుతోంది. చిన్న వయసులోనే స్వశక్తి డబ్బు సంపాదిస్తోంది అని సన్నీ లియోన్ గర్వంగా చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: మా బాడీ పార్ట్స్ జూమ్ చేసి ఫొటోలు.. 'కాంతార' హీరోయిన్ ఫైర్) -
బాలీవుడ్తోనే మొదలైన కెరీర్.. ఫైనలియర్లో ఉన్నప్పుడు!
మరో నాలుగు రోజుల్లో అల్లు శిరీష్ బ్యాచిలర్ లైఫ్కు ఫుల్స్టాప్ పడనుంది. మార్చి 6న నయనిక మెడలో శిరీష్ మూడు ముళ్లు వేయనున్నాడు. ఇప్పటికే పెళ్లి పనులు, వేడుకలు జోరందుకున్నాయి. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్నాయి. ఈ క్రమంలో అల్లు శిరీష్ కెరీర్ గురించి ఓ సారి చూసేద్దాం..బాలీవుడ్ మూవీతో కెరీర్ మొదలుప్రముఖ నిర్మాత, గీతా ఆర్ట్స్ సంస్థాపకుడు అల్లు అరవింద్ చిన్న కుమారుడే అల్లు శిరీష్. అరవింద్ పెద్ద కుమారుడు అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోగా క్రేజ్ తెచ్చుకున్నాడు. అయితే శిరీష్ మాత్రం కొంతకాలంగా సినిమాల సంఖ్య తగ్గించేశాడు. శిరీష్ మూడేళ్ల వయసులో చిరంజీవి 'ప్రతిబంధ్' అనే హిందీ చిత్రంలో బాలనటుడిగా యాక్ట్ చేశాడు. ఆ తర్వాత 2013లో వచ్చిన గౌరవం సినిమాతో హీరోగా వెండితెరపై ఎంట్రీ ఇచ్చాడు. హీరోగా కంటే ముందుకొత్త జంట చిత్రంతో క్రేజ్ అందుకున్నాడు. శ్రీరస్తు శుభమస్తు, ఒక్క క్షణం, ఏబీసీడీ: అమెరికన్ బర్న్ కన్ఫ్యూజ్డ్ దేశీ, ఊర్వశివో రాక్షసివో సినిమాలు చేశాడు. 2024లో వచ్చిన బడ్డీ చిత్రంలో చివరిసారి కనిపించాడు. రెండేళ్లుగా వెండితెరకు దూరంగా ఉన్నాడు. అయితే 2013లో హీరోగా తన కెరీర్ మొదలవడానికే ముందే బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన విషయం చాలా తక్కువమందికే తెలుసు! కాకపోతే హీరోగా కాదు, నిర్మాతగా! హిందీ గజిని సినిమాకు సహనిర్మాతగా వ్యవహరించాడు. ఆమిర్ ఖాన్కు అభిమానిఈ విషయాన్ని అల్లు శిరీష్ స్వయంగా వెల్లడించాడు. గతంలో ఓ ఇంటర్వ్యూలో శిరీష్ మాట్లాడుతూ.. లగాన్, గులాం సినిమాలు చూశాక ఆమిర్ ఖాన్కు నేను పెద్ద అభిమాని అయిపోయాను. ఆయనతో కలిసి పని చేయాలని ఎన్నోసార్లు అనుకున్నాను. అలాంటిది గజిని హిందీ రీమేక్ నా చేతుల్లోకి వచ్చేసరికి నమ్మలేకపోయాను. అప్పుడు నేను కాలేజీలో ఫైనలియర్ చదువుతున్నాను. నాన్న నిర్మాతగా, నేను సహ నిర్మాతగా గజిని తెరకెక్కించాం.అదే ఎక్కువ ఇష్టంతమిళంలో తెరకెక్కిన గజిని సినిమా అంటే నాకు చాలా ఇష్టం. దాని హిందీ రీమేక్ మరింత బాగుండేలా జాగ్రత్తపడ్డాం. ఈ సినిమా కోసం పని చేసిన అనుభవాన్ని ఎన్నటికీ మర్చిపోలేను. కాబట్టి నాకు హిందీ వర్షన్ అంటేన ఎక్కువ ఇష్టం అని పేర్కొన్నాడు. 2008లో వచ్చిన గజిని ఆ ఏడాది అత్యధిక వసూళ్లు రాబట్టిన హిందీ చిత్రంగా రికార్డుకెక్కింది. అలాగే భారతేశంలో రూ.100 కోట్ల నెట్ కలెక్షన్స్ వసూలు చేసిన తొలి హిందీ మూవీగానూ చరిత్ర సృష్టించింది.చదవండి: చదువుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి.. స్పందించిన కమెడియన్ -
చదువుకోకపోవడం వల్లే ఈ దుస్థితి! స్పందించిన కమెడియన్
చెక్ బౌన్స్ కేసు కారణంగా కమెడియన్ రాజ్పాల్ యాదవ్ పేరు కొంతకాలంగా వార్తల్లో నానుతూ వస్తోంది. ఇటీవలే తీహార్ జైలు నుంచి బెయిల్ మీద బయటకు వచ్చిన అతడు తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ ప్రారంభించాడు. అందులో వ్లాగ్స్, కామెడీ, మినీ సిరీస్.. ఇలా ఏదో ఒకటి చేస్తూ అందరికీ వినోదాన్ని పంచుతానన్నాడు. విద్య కారణం కాదుఇకపోతే అతడికి చదువు రాకపోవడం వల్లే ఇలా కేసులో చికుక్కున్నాడని మలయాళ దర్శకుడు ప్రియదర్శన్ ఇటీవల వ్యాఖ్యానించాడు. అతడు మంచివాడే కానీ, పెద్దగా చదువుకోకపోవడం వల్లే ఇలా ఇబ్బందులు పడాల్సి వస్తుందని సానుభూతి చూపించాడు. ఈ వ్యాఖ్యలపై రాజ్పాల్ యాదవ్ తాజాగా స్పందించాడు. తనకు చదువు రాదని ఎవరు చెప్పారని ప్రశ్నించాడు. కొన్ని సమస్యలకు చదువు సంద్య కారణం కాదు. నేను చదువుకోకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితి వచ్చిందనడం కరెక్ట్ కాదు.కొన్నిసార్లు తప్పవునేను బాగానే చదువుకున్నాను. ఇప్పుడు నాకు 55 ఏళ్లు. 11 ఏళ్ల వయసులోనే పని చేయడం మొదలుపెట్టాను. నేను చదువురాని వాడినైతే ఇండస్ట్రీలో 30 ఏళ్లుగా కొనసాగేవాడినే కాదు. ఇక్కడ పెద్ద పెద్ద స్టార్స్ కూడా ఒకానొక సందర్భంలో సమస్యల్లో చిక్కుకుంటారు. దానికి చదువుతో సంబంధమే లేదు అని చెప్పాడు. అదే సమయంలో ప్రియదర్శన్ అలా అన్నందుకు తనపై ఎటువంటి కోపం లేదన్నాడు. నీ కొడుకులాంటివాడినిఇంకా మాట్లాడుతూ.. నా జీవితంలో ముగ్గురు దర్శకులకు ప్రత్యేక స్థానం. రామ్ గోపాల్ వర్మ, డేవిడ్ ధావన్, ప్రియదర్శన్.. వీరిపై నాకు అపారమైన గౌరవం. కేవలం ఈ ముగ్గురి డైరెక్షన్లోనే దాదాపు 50 సినిమాలు చేసుంటాను. ప్రియదర్శన్కైతే నేనొక కొడుకులాంటివాడిని. కాకపోతే ఆయనకు పూర్తి విషయం తెలీదు.సినిమాకాబట్టి ఆయన వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన పని లేదు అని వివరణ ఇచ్చాడు. ఇకపోతే రాజ్పాల్ యాదవ్ ప్రస్తుతం భూత్ బంగ్లా సినిమా చేస్తున్నాడు. ప్రియదర్శన్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాతో పాటు రాజ్పాల్ యాదవ్.. వెల్కమ్ టు ద జంగిల్, హైవాన్, మరో రెండు సినిమాలు, రెండు వెబ్ సిరీస్లు చేస్తున్నాడు.చదవండి: వారణాసి అప్డేట్ ఇచ్చిన ప్రియాంక -
‘ది బ్లఫ్’పై మహేశ్ బాబు ట్వీట్.. రిప్లైలో ‘వారణాసి’ అప్డేట్ ఇచ్చిన ప్రియాంక!
ప్రియాంక చోప్రా నటించిన తాజా హాలీవుడ్ మూవీ ‘ది బ్లఫ్’. ఈ యాక్షన్ థ్రిల్లర్ ఇటీవల అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలై, మంచి టాక్ని సంపాదించుకుంది. ఇప్పటికే రాజమౌళితో సహా పలువురు సినీ ప్రముఖులు ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. తాజాగా సూపర్ స్టార్ మహేశ్బాబు కూడా ఈస ఇనిమాపై రివ్యూ ఇచ్చాడు. ‘‘ది బ్లఫ్.. యాక్షన్, ఎమోషన్స్కు అన్నీ ఉన్న సినిమా. ప్రియాంక యాక్టింగ్ అదిరిపోయింది. అన్ని సన్నివేశాల్లో బాగా నటించింది. ఈ చిత్రంలో భాగమైన వారందరికీ నా అభినందనలు’ అని మహేశ్ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్కి ప్రియాంక చోప్రా రిప్లై ఇచ్చింది.దీనికి ప్రియాంక స్పందిస్తూ పెట్టిన రిప్లై అందరినీ ఆకట్టుకుంటోంది. ‘థాంక్యూ మై ఫ్రెండ్.. .. త్వరలోనే అంటార్కిటికాలో కలుద్దాం’ అని ఆమె కామెంట్ చేసింది. దీంతో ‘వారణాసి’ తర్వాత షెడ్యూల్ అక్కడ జరగనుందని అభిమానులు పోస్ట్లు పెడుతున్నారు.రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అందులో మందాకిని అనే పాత్రని ప్రియాంక పోషిస్తోంది. Thank you my friend 🙏🏽 🏴☠️See you soon in Antarctica. ⭐️ @urstrulyMahesh https://t.co/HpBfRPbMEg— PRIYANKA (@priyankachopra) March 1, 2026 -
తల్లి జీవితం ఇలాగే ఉంటుంది: బాలీవుడ్ నటి
తెలుగు చిత్రం చాణక్యుడుతో వెండితెరకు హీరోయిన్గా పరిచయమైంది ఇషితా దత్తా. తర్వాత మాత్రం బాలీవుడ్లోనే సెటిలైంది. దృశ్యం, దృశ్యం 2, దేదే ప్యార్ దే 2 వంటి హిందీ చిత్రాల్లో తళుక్కుమని మెరిసింది. రిష్తాన్ కా సౌధాగర్: బాజీగర్ సీరియల్ చేసే సమయంలో నటుడు వస్తల్ సేత్తో ప్రేమలో పడింది. 2017లో అతడిని పెళ్లి చేసుకుంది. వీరికి 2023లో బాబు జన్మించగా 2025లో పాప పుట్టింది.తల్లి జీవితం ఇంతే..తల్లయ్యాక తన జీవితమే మారిపోయిందంటోంది ఇషితా దత్తా. ఈమేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. చిక్కుల జుట్టు, ఇంట్లో ఎక్కడపడితే అక్కడ బొమ్మలు.. ఎప్పటికీ పూర్తవని పనులు.. అవి కాకుండా సంబంధం లేని ప్రదేశాల్లో కూడా స్టిక్కర్లు.. తల్లి జీవితం ఇలాగే ఉంటుంది. కానీ ఇందులో స్వచ్ఛమైన ఆనందం దాగి ఉంది అని రాసుకొచ్చింది. ఇకపోతే ఇషిత తన పిల్లల ఆటలు, అలకలకు సంబంధించిన వీడియోలను అప్పుడప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది.చదవండి: సన్యాసం తీసుకున్న హీరోయిన్.. 25 ఏళ్ల తర్వాత రీఎంట్రీ -
సన్యాసం పుచ్చుకున్న హీరోయిన్.. 25 ఏళ్ల తర్వాత రీఎంట్రీ!
ఒకప్పుడు హీరోయిన్గా అలరించిన మమతా కులకర్ణి 2003 తర్వాత సినిమాలకు గుడ్బై చెప్పి విదేశాలకు వెళ్లిపోయింది. ఈ క్రమంలోనే డ్రగ్స్ రాకెట్లో పేరు వినిపించడంతో వార్తల్లోకెక్కింది. ఆ తర్వాత కుంభమేళా సందర్భంగా భారత్కు వచ్చిన ఆమె సన్యాసిగా మారింది. కిన్నెర అఖాడాలో చేరి మహా మండలేశ్వర్ పదవి అందుకుంది. బుల్లితెరపై రీఎంట్రీఅయితే కొన్ని వారాల క్రితమే ఆ హోదా నుంచి తప్పుకుంది. తాజాగా ఆమె బుల్లితెరపై కనిపించనుంది. హిందీలో ప్రసారమవుతున్న లాఫ్టర్ చెఫ్ మూడో సీజన్లో అతిథిగా అలరించనుంది. ఈ రియాలిటీ షో సెట్ బయట ఆమె మీడియాతో మాట్లాడుతూ.. మీరు గమించారో, లేదో కానీ టీవీలో కనిపించక 25 ఏళ్లవుతోంది. అది కూడా ముఖ్యమేరెండున్నర దశాబ్దాల తర్వాత బుల్లితెరపై మళ్లీ కనిపించబోతున్నాను. చాలా ఎగ్జయిట్ అవుతున్నాను. అందరూ లైఫ్లో బిజీ అవడంతో పాటు సీరియస్గా ముందుకు వెళ్తున్నారు. మధ్యమధ్యలో హాయిగా నవ్వుకోవడం కూడా ముఖ్యమే.. ఇలాంటి షోలు అందుకు బాగా ఉపయోగపడతాయి అని చెప్పుకొచ్చింది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) చదవండి: తీహార్ జైల్లో నాలుగు నెలలు.. శత్రువుకు కూడా ఇలాంటి పరిస్థితి రావొద్దు: నటి -
తీహార్ జైల్లో 4 నెలలు.. చావు కోసం ఎదురుచూశా: నటి
మనీలాండరింగ్ కేసులో నాలుగు నెలలపాటు తీహార్ జైలులో శిక్ష అనుభవించింది నటి, ఇన్ఫ్లుయెన్సర్ సందీప విర్క్. తాజాగా తన జైలు జీవితం గురించి చెప్తూ భావోద్వేగానికి లోనైంది. సందీప మాట్లాడుతూ.. నా శత్రువు కూడా అలాంటి ప్రదేశంలో ఉండకూడదని కోరుకుంటున్నాను. తొలిసారి తీహార్ జైలులో అడుగుపెట్టినప్పుడు దేవుడెందుకింత శిక్ష విధించాడని ఎంతో బాధపడ్డాను. ఏ జన్మలో ఏ పాపం చేశానో..అక్కడి వాతావరణం కూడా భయానకంగా ఉంది. గత జన్మలో తెలిసో తెలియకో ఏదో పాపం చేసుంటాను, ఆ కర్మ నన్ను ఇలా వెంటాడుతోందని భావించాను. దేవుడా, నన్ను త్వరగా తీసుకెళ్లు అని ఎన్నోసార్లు వేడుకున్నాను. జైల్లో ఉన్నప్పుడు పేరెంట్స్ వచ్చి మనల్ని కలుస్తుంటే మరింత బాధేసేది. నా వల్ల వారు జైలుకు రావాల్సి వచ్చినందుకు క్షమాపణలు చెప్పాను. కానీ నేనేంటో తెలిసిన నా పేరెంట్స్, కుటుంబం నాకు అండగా నిలబడ్డారు.కన్నీళ్లు ఆగవుతీహార్ జైల్లో ఉన్నప్పుడు శారీరకంగా, మానసికంగా కుంగిపోయాను. తీవ్రమైన ఒత్తిడికి లోనయ్యాను. ఇప్పటికీ ఆ జైలు జీవితం గుర్తొస్తుంటే కన్నీళ్లు ఆగవు. వాష్రూమ్స్ ఎంతో మురికిగా ఉంటాయి. నేలపై పడుకోవాలి. తిండి దారుణంగా ఉంటుంది. నాలుగు రోటీలు, అన్నం, పప్పు.. రోజూ ఇదే ఉంటుంది. ఏమీ తినాలనిపించదు. కొందరు పోలీసులు జాలి చూపిస్తారు. మరికొందరు వారి ఫ్రస్టేషన్, కోపాన్నంతా ఖైదీలపై చూపిస్తారు. ఇద్దరు మహిళలకు సాయంకానీ జైల్లో డబ్బు లేకుండా ఏ పనీ జరగదు. పైసా లేదం,న టే వాళ్లను ఎవరూ పట్టించుకోరు. ఒక మహిళ రూ.3000 దొంగతనం చేసిన కేసులో నాలుగునెలలుగా జైల్లో ఉంటోంది. తనకు అంధురాలైన తల్లి ఉంది, తండ్రి మంచానికే పరిమితమయ్యాడు. నేను బయటకు వచ్చాక తనకు సాయం చేస్తానని మాటిచ్చాను, ఆ మాట నిలబెట్టుకున్నాను. మరో మహిళ.. భర్త చేసిన ఆర్థిక మోసానికిగానూ ఆరునెలలుగా శిక్ష అనుభవిస్తోంది. తనకు కూడా మధ్యంతర బెయిల్ వచ్చేందుకు సహకరించాను అని చెప్పుకొచ్చింది.చదవండి: లక్కీ మూవీ.. ఓటీటీ రివ్యూ -
ఖరీదైన హీల్స్ ధరించిన హీరోయిన్.. చెప్పుల ధర వేలల్లో కాదు!
'చీకటి గదిలో చితక్కొట్టుడు' సినిమాతో హీరోయిన్గా పరిచయమైంది నిక్కీ తంబోలి. కాంచన 3, తిప్పరా మీసం వంటి చిత్రాల్లో నటించినా తనకు పెద్ద గుర్తింపు రాలేదు. దాంతో ఐటం సాంగ్స్పై ఫోకస్ చేసింది. హిందీ బిగ్బాస్ 14వ సీజన్లో కంటెస్టెంట్గా పాల్గొని సెకండ్ రన్నరప్గా నిలిచింది. లేటెస్ట్ రియాలిటీ షో ద 50లో కంటెస్టెంట్గా పార్టిసిపేట్ చేసి మరోసారి లైమ్లైట్లోకి వచ్చింది.గోవా ట్రిప్తాజాగా ఆమె ద 50 షోలోని సహకంటెస్టెంట్లతో వెకేషన్కు వెళ్లింది. ఈ గోవా ట్రిప్కు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అందులో నిక్కీ బ్లూ కలర్ పొట్టి డ్రెస్లో తళుక్కుమని మెరిసింది. అయితే అందరి దృష్టి మాత్రం తను ధరించిన హీల్స్పైనే పడింది. కారణం ఏంటో తెలుసా? ఆ హీల్స్ డాల్స్ అండ్ గబ్బానా అనే లగ్జరీ బ్రాండ్కు చెందిన చెప్పులు.చెప్పుల ధర ఎంతంటే?ఆ హీల్స్ ధర అక్షరాలా లక్ష 46 వేలని తెలుస్తోంది. నిక్కీ తంబోలికి మేకప్ దగ్గరినుంచి అలంకరణ వరకు అన్నీ ఖరీదైనవి వాడటం బాగా అలవాటు. ఈ విషయాన్ని ఆమె ప్రియుడు అర్బాజ్ పటేల్ కూడా ధ్రువీకరించాడు. తను వాడే మాయిశ్చరైజర్ ధర రూ.75 వేలు, సీరమ్ రూ.50 వేలు అని తెలిపాడు. View this post on Instagram A post shared by Nikki Tamboli (@nikki_tamboli) చదవండి: అప్పటిదాకా నా కొడుకు సినిమా చూడను: సునీల్ శెట్టి -
అప్పటివరకు నా కొడుకు సినిమా చూడను: సునీల్ శెట్టి
బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కుమారుడు అహాన్ శెట్టి నటించిన తాజా చిత్రం "బోర్డర్ 2". అనురాగ్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ జనవరి 23న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్తో దూసుకుపోతున్న ఈ చిత్రం కొద్దిరోజుల క్రితమే రూ.400 కోట్ల క్లబ్లో చేరింది. ఇంతటి ఘన విజయం అందుకున్న ఈ సినిమాను ఇంతవరకు చూడలేదంటున్నాడు సునీల్ శెట్టి.మాట మీదే ఉన్నా..రూ.500 కోట్ల క్లబ్లో చేరిన తర్వాతే బోర్డర్ 2 చూస్తానంటున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సునీల్ శెట్టి మాట్లాడుతూ.. ఇది దేశభక్తి సినిమా.. కచ్చితంగా ఇది రూ.500 కోట్లు దాటాలని ఆశగా ఎదురుచూస్తున్నాను. రూ.500 కోట్ల క్లబ్లో చేరేవరకు నేను వేచి చూస్తానని నాకు నేను ప్రతిజ్ఞ చేసుకున్నాను. ఇప్పుడీ సినిమా రూ.489 కోట్ల కలెక్షన్స్ వరకు చేరుకుంది. మరో రూ.11 కోట్లు వస్తే నేను అనుకున్న నెంబర్ దాటేస్తుంది. సినిమాఅప్పుడే ఈ మూవీ చూస్తాను. చాలాసార్లు సినిమా చూడాలనుకున్నాను, థియేటర్ వరకు వెళ్లాను. అహాన్ ఇంట్లో ప్రాక్టీస్ చేసిన డైలాగులను థియేటర్లో చెవులారా వినాలనుకున్నాను. కానీ నన్ను నేను తమాయించుకున్నాను అని చెప్పుకొచ్చాడు. ఇకపోతే 1997లో వచ్చిన బోర్డర్ సినిమాకు సీక్వెల్గా బోర్డర్ 2 తెరకెక్కింది. ఇందులో సన్నీడియోల్, వరుణ్ ధావన్, దిల్జిత్ దోసాంజ్, మోనా సింగ్, సోనమ్ బజ్వా, అన్య సింగ్, ప్రణవ్ వశిష్ట్, మేధ రానా తదితరులు కీలక పాత్రలు పోషించారు.చదవండి: ప్రేయసికి బ్రేకప్ చెప్పలేదని హీరోని మార్చేశారా? -
ప్రేయసికి బ్రేకప్ చెప్పలేదని హీరోని మార్చేశారా?
బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ కెరీర్ పరంపర (1993) సినిమాతో మొదలైంది. అయితే దీనికంటే ముందు సైఫ్ బేకుడి చిత్రంతో పరిచయం కావాల్సి ఉంది. కానీ గర్ల్ఫ్రెండ్కు బ్రేకప్ చెప్తేనే సినిమా ఛాన్స్ అని డైరెక్టర్ కండీషన్ పెట్టాడని, దానికి సైఫ్ నిరాకరించాడని, దాంతో ఈ సినిమా అతడి చేజారిందని ప్రచారం జరిగింది.అసలేం జరిగిందంటే?దాదాపు మూడు దశాబ్దాల తర్వాత ఈ విషయంపై బేకుడి దర్శకుడు రాహుల్ రవాలి స్పందించాడు. ఆనాడు అసలేం జరిగిందనే విషయాలను గుర్తు చేసుకున్నాడు. అతడు మాట్లాడుతూ.. గర్ల్ ఫ్రెండ్ ఉందన్న కారణంతో సైఫ్ అలీఖాన్ను రిజెక్ట్ చేశానన్న వార్తలో ఏమాత్రం నిజం లేదు. అది పూర్తిగా అవాస్తవం. అతడు బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించాడు. అప్పుడలా...షూటింగ్కు సరిగా వచ్చేవాడే కాదు. దానివల్ల నేను ఒత్తిడికి లోనయ్యాను. యాక్టింగ్ బాగా చేస్తాడు, కానీ షూటింగ్కు రాకుండా చిరాకు తెప్పించేవాడు. సంవత్సరాలు గడిచేకొద్దీ తనలో చాలా మార్పు వచ్చింది అని చెప్పుకొచ్చాడు. సైఫ్ అలీ ఖాన్ విషయానికి వస్తే.. ఆషిక్ ఆవారా చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్నాడు. సినిమామై ఖిలాడీ తు అనారి, ఏక్తా రాజా, హమేశా, కీమత్: దే ఆర్ బ్యాక్, కచ్చే ఢాగే, దిల్ చహతా హై, డర్నా మానా హై, హమ్ తుమ్, ఓంకార, లవ్ ఆజ్ కల్, తానాజీ ఇలా అనేక సినిమాలు చేశాడు. దేవర: పార్ట్ 1 చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. ప్రస్తుతం హైవాన్, హమ్ హిందుస్తానీ సినిమాలు చేస్తున్నాడు.చదవండి: ఎవరెంత రెచ్చగొట్టినా అలాగే ఉంటా: దీపికా పదుకొణె -
ఎవరెంత రెచ్చగొట్టినా అలాగే ఉంటా: దీపికా పదుకొణె
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె వరుసగా పెద్ద సినిమాల నుంచి తప్పుకుంటూనే ఉంది. స్పిరిట్, కల్కి 2 నుంచి దీపికా సైడ్ అయిన విషయం తెలిసిందే! తాజాగా ప్రముఖ హాలీవుడ్ వెబ్ సిరీస్ ది వైట్ లోటస్లో యాక్ట్ చేసే అవకాశాన్ని కూడా వదిలేసుకున్నట్లు ఓ వార్త వైరలవుతోంది.హాలీవుడ్ ప్రాజెక్ట్ నుంచి అవుట్ది వైట్ లోటస్ నాలుగో సీజన్ కోసం మేకర్స్ దీపికను సంప్రదించారట! అయితే ఈ ప్రాజెక్ట్లో నటించాలంటే ఆడిషన్ తప్పనిసరి అని టీమ్ చెప్పిందట. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న తనకు ఆడిషన్ ఏంటన్న భావనతో దీపికా ఈ ఛాన్స్ను వదిలేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో దీపిక తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఓ పోస్ట్ పెట్టింది. అరవడం పెద్ద విషయం కాదుప్రశాంతంగా ఉండటమే అన్నింటికంటే గొప్ప వరం. సహనాన్ని కోల్పోయి గట్టిగా అరిచి మాట్లాడటం పెద్ద విషయం కాదు. దానికి ఎటువంటి శక్తి, బలం అవసరం లేదు. కానీ ఎన్ని గందరగోళ పరిస్థితులు తలెత్తినా ఏమాత్రం చలించకుండా ఉండటంలోనే అసలైన బలం దాగి ఉంది. మన చుట్టూ ఎంత డ్రామా జరుగుతున్నా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కావాలని మనల్ని రెచ్చగొడుతున్నా స్థబ్ధుగా, ప్రశాంతంగా ఉండాలి, భావోద్వేగాలను బయటకు కనిపించనివ్వకూడదు. ఎప్పుడూ ఏదో ఒక గొడవఎంతో కృషి చేస్తే తప్ప ఇదంతా సాధ్యం కాదు. ప్రశాంతంగా ఉండటం అనేది బలహీనత కాదు. అదొక శక్తి. మనమేంటనేది ఎవరికీ నిరూపించాల్సిన అవసరం లేదు. ప్రతిదానికి స్పందించాల్సిన పని అంతకన్నా లేదు. ఎప్పుడూ ఏదో ఒక గొడవలు, వివాదాలు, అర్థంపర్థం లేని విషయాలతో నిండిపోయిన ఈ ప్రపంచంలో మనం వాటికి చలించకుండా కూల్గా ఉండటమే అన్నింటికంటే పెద్ద సూపర్ పవర్ అని దీపికా పదుకొణె రాసుకొచ్చింది.చదవండి: హీరోలు రిజెక్ట్ చేశారు.. వాళ్ల వల్లే: తాప్సీ -
హీరోలు నన్ను రిజెక్ట్ చేశారు.. వాళ్ల వల్లే..: తాప్సీ
'ఝుమ్మంది నాదం' సినిమాతో వెండితెరపై కథానాయికగా పరిచయమైంది తాప్సీ పన్ను. మిస్టర్ పర్ఫెక్ట్, వీర, మొగుడు, దరువు, సాహసం, గేమ్ ఓవర్, మిషన్ ఇంపాజిబుల్ ఇలా తెలుగులో అనేక సినిమాలు చేసింది. తమిళ చిత్రాల్లోనూ తళుక్కుమని మెరిసింది. సౌత్లో స్టార్ హీరోయిన్గా రాణిస్తున్న సమయంలోనే బాలీవుడ్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటూ అక్కడే పాగా వేసింది.హీరోల వెనకడుగుతాజాగా ఈ బ్యూటీ అస్సి అనే హిందీ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించింది. ఈ మూవీ ప్రమోషన్స్లో భాగంగా వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్న తాప్సీ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. నాతో సినిమాలు చేసేందుకు చాలామంది హీరోలు వెనకడుగు వేశారు. కారణాలు తెలీదు కానీ నాతో చేయననేవారు. అలా కొన్ని అవకాశాలు చేజారిపోయాయి.చాలామందికి పెద్ద షాక్చాలామటుకు సినిమాల్లో హీరోయిన్ ఎవరనేది ఫైనల్గా హీరోనే నిర్ణయిస్తాడు. అయితే కొందరు దర్శకులు మాత్రం ఫలానా హీరోయినే కావాలని పట్టుబడతారు. వారు కోరుకున్న హీరోయిన్తోనే సినిమా మొదలుపెడతారు. ఉదాహరణకు డండీ సినిమానే తీసుకుందాం. డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ సర్ నన్నే తీసుకోవాలని డిసైడయ్యారు. నిజానికి షారూఖ్తో తరచూ జత కట్టే హీరోయిన్స్ వేరు. కానీ, అది బ్రేక్ చేస్తూ నన్ను ఎంపిక చేయడంతో చాలామంది షాకయ్యారు. ఇకపోతే నాతో పనిచేయడం కష్టమని ఓ రూమర్ ఉంది. అదెలా వచ్చిందో నాకర్థం కాదు.అదే నిజమైతే..ఎందుకంటే నా కెరీర్లో చాలామంది దర్శకుడు నాతో మళ్లీ మళ్లీ పని చేశారు. నాతో పని చేయడం కష్టమైతే సెకండ్ టైమ్ నన్నెందుకు తీసుకుంటారు? నాతో పని చేయనివారు, నా గురించి తెలియనివారే నాపై అనవసరమైన రూమర్ పుట్టించారు. దానికోసం ఆలోచించి నేనేంటో బయటకు వచ్చి చెప్పాల్సిన పనిలేదు. నేను పనితోనే సమాధానం చెప్తాను అంది తాప్సీ.చదవండి: నీకు ఉసురు తగులుతుంది.. హేటర్స్కు ఇచ్చిపడేసిన తనూజ -
‘ధురంధర్ 2’ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఒక్క మాటతో అంచనాలు రెట్టింపు
రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్’ క్రియేట్ చేసిన రికార్డుల గురించి అందరికి తెలిసిందే. గతేడాది డిసెంబర్ 5న విడుదలైన ఈ చిత్రం.. ప్రపంచ వ్యాప్తంగా రూ. 1300 కోట్లకు పైగా వసూళ్లను సాధించి, బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టించింది. ఈ చిత్రానికి సీక్వెల్గా రాబోతున్న ధురంధర్ 2 చిత్రం కోసం యావత్ సినీ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్ సినిమాపై మరింత హైప్ని క్రియేట్ చేసింది. మార్చి 19న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈనేపథ్యంలో ఈ సినిమా దర్శకుడు ఆదిత్యధర్ సతీమణి యామీ గౌతమ్ ధురంధర్ 2పై తన రివ్యూని ఇచ్చేసింది.భారత్ సమ్మిట్ 2026లో పాల్గొన్న యామీ గౌతమ్.. తాను ఇప్పటికే ‘ధురంధర్ 2’ చూశానని చెబుతూ..భర్తపై ప్రశంసల వర్షం కురిపించింది. ‘ధురంధర్ 2 నేను చూసేశాను. నా భర్త గొప్ప సినిమాలను తీస్తున్నారు. ధురంధర్ 2 చాలా అసాధరణమైన సినిమా. ఆడియన్స్ ఎప్పటికీ మర్చిపోలేని ఓ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. మూవీ చూసి నేను చాలా ఎమోషనల్ అయ్యాను.ఆ రోజు నేను విమానంలో ప్రయాణం చేయాల్సి వచ్చింది. దీంతో ఆదిత్య ధర్తో ఏమీ చెప్పలేకపోయాను. ఆ తర్వాత నేను దేనిపైనా దృష్టి పెట్టలేకపోయాను. విమానం దిగిన తర్వాత ఆదిత్యకు ఏం చెప్పాలా? అని ఆలోచిస్తున్నాను. సినిమాపై నా ఒపీనియన్ చాలా చెప్పాలనుకున్నా. ఆదిత్య తన ఆడియన్స్, దేశాన్ని ఎప్పటికీ ప్రేమిస్తాడు. ఈ మూవీ తెరకెక్కించేందుకు ఆయన ఎంతో శ్రమించారు. ధురంధర్ 2 ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేని ఓ అద్భుతం. ప్రతి భారతీయుడు గర్వపడే సినిమా ఇది. ఈ విషయాన్ని నేను కచ్చితంగా చెప్పగలను’ అని యామీ గౌతమ్ అన్నారు.ఇక ధురంధర్ విజయం గురించి మాట్లాడుతూ.. ‘‘ఆర్టికల్ 370’ షూటింగ్లో ఉన్నప్పుడే ‘ధురంధర్’ స్క్రిప్ట్ చదివాను. అది కేవలం 40 పేజీలు మాత్రమే ఉంది. కానీ చదువుతున్నంత సేపు నా కళ్లు చెమర్చాయి. అప్పుడు కూడా ఆదిత్యకు ఏం చెప్పాల్లో అర్థం కాలేదు. కానీ నా స్పందన ఏంటో ఆయను అర్థమైపోయింది. ఈ సినిమా కోసం ఆయన ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు. హిస్టరీ క్రియేట్ చేసే సినిమా అవుతుందని ముందే ఊహించా. ధురంధర్ 2 అంతకు మించి ఉంటుంది’ అంటూ అంచనాలను రెట్టింపు చేసింది. మరి ధురంధర్ 2 ఎన్ని రికార్డులకు బద్దలు కొడుతుందో చూడాలి. -
4 రోజులు ఇంటికెళ్లకుండా షూటింగ్.. 5వ రోజు ఆస్పత్రిలో!
సాధారణంగా ఉద్యోగులు 8-9 గంటలపాటు పని చేస్తారు. కానీ సినిమా, బుల్లితెర ఆర్టిస్టులు మాత్రం కొన్నిసార్లు గ్యాప్ లేకుండా రోజంతా షూటింగ్ చేస్తూనే ఉంటారు. దీనివల్ల తాను చాలా ఇబ్బందిపడ్డానంటోంది బాలీవుడ్ నటి ఇషా కొప్పికర్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇషా కొప్పికర్ మాట్లాడుతూ.. కొన్నిసార్లు కాళ్లు నొప్పి పుట్టి ఇక నిలబడటం నా వల్ల కాదు అనేవరకు పని చేయించుకుంటూనే ఉంటారు. ఇంటికి వెళ్లేంత తీరిక ఎక్కడిది?నా కెరీర్ మొదట్లో వెంటవెంటనే సినిమాలు చేశాను. షూటింగ్స్కు గ్యాప్ ఉండేది కాదు. కనీసం ఫిలిం సిటీ నుంచి నా ఇంటికి వెళ్లే తీరిక కూడా దొరికేది కాదు. దాంతో నిర్మాతలను షూటింగ్ లొకేషన్లోనే నాకంటూ ఒక రూమ్ వసతి కల్పించమని అడిగేదాన్ని. పొద్దున ఐదింటికి షూట్ స్టార్ట్ చేస్తే ఐదు గంటల వరకు కొనసాగేది. ఆ తర్వాత మళ్లీ రాత్రి ఏడింటి నుంచి మరుసటి రోజు ఉదయం ఏడు గంటల వరకు షూటింగ్ అయ్యేది. సినిమాఅలా వరుసగా ఐదు రోజులు జరిగింది. దాంతో ఆరో రోజు నేను సెట్లో కాకుండా హాస్పిటల్లో పడున్నాను అని గుర్తు చేసుకుంది. దీపికా పదుకొణె అడిగినట్లుగా 8 గంటల పని డిమాండ్ సబబే అని వత్తాసు పలికింది. కాగా ఇషా కొప్పికర్.. చంద్రలేఖ అనే తెలుగు చిత్రంతో కథానాయికగా పరిచయమైంది. తెలుగులో ప్రేమతో రా, కేశవ సినిమాల్లో నటించింది. హిందీ, తమిళంలో అనేక సినిమాలు చేసింది. చివరగా అయలాన్ మూవీలో తళుక్కుమని మెరిసింది.చదవండి: తల్లినవుతా.. కానీ పెళ్లి అవసరం లేదు: హీరోయిన్ -
పెళ్లంటేనే భయమేస్తోంది.. ఎగ్స్ భద్రపర్చుకున్నా!
ప్రస్తుత సమాజంలో చాలామంది పెళ్లంటేనే భయపడుతున్నారు. హీరోయిన్ డైసీ షా కూడా పెళ్లంటే వెనకడుగు వేస్తోంది. 41 ఏళ్ల వయసులోనూ సింగిల్గా ఉన్న ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ప్రేమ, డబ్బు.. ఈ రెండింటిలో దేన్ని ఎంచుకుంటారు? అన్న ప్రశ్నకు తెలివిగా రెండూ అని బదులిచ్చింది. రోజుకో వార్త..పెళ్లి గురించి మాట్లాడుతూ.. ప్రేమలు, పెళ్లిళ్ల గురించి రోజుకో రకమైన వార్తలు వింటూనే ఉన్నాం. బ్లూ డ్రమ్ కేస్, బ్రేకప్ కేసులు ఎక్కువైపోతున్నాయి. అవన్నీ చూస్తుంటే భయమేస్తోంది. అయితే పిల్లలు కనేందుకు పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. ఇప్పటికే నేను నా అండాలను భద్రపరుచుకున్నాను. నేనెప్పుడు ఓకే అనుకుంటే అప్పుడు పిల్లల్ని కంటాను అని చెప్పుకొచ్చింది.సినిమాడైసీ షా.. ప్రముఖ కొరియోగ్రాఫర్ గణేశ్ ఆచార్యకు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా కెరీర్ ప్రారంభించింది. భద్ర అనే కన్నడ మూవీతో హీరోయిన్గా మారా జైహో అనే హిందీ చిత్రంతో పేరు తెచ్చుకుంది. చివరగా రెడ్ రూమ్ వెబ్ సిరీస్తో అలరించింది. ప్రస్తుతం పలాష్ ముచ్చల్ డైరెక్షన్లో ఓ సినిమా చేస్తోంది. -
రొమాంటిక్ సీన్స్ చిరాకు తెప్పిస్తాయి: భాగ్యశ్రీ
కెరీర్ ఎంత స్పీడులో ఉన్నా సరే పెళ్లవగానే సినిమాలు తగ్గించేస్తుంటారు హీరోయిన్స్. కానీ కథానాయిక భాగ్యశ్రీ మాత్రం పెళ్లయ్యాకే వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. సల్మాన్ ఖాన్ మైనే ప్యార్ కియా చిత్రంతో కథానాయికగా పరిచయమైంది. తక్కువకాలంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకుంది. ప్రస్తుతం సహాయక పాత్రలు పోషిస్తోంది.కాలక్షేపం కోసం..తాజాగా ఓ ఇంటర్వ్యూలో సినిమాల పరిస్థితిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. భాగ్యశ్రీ మాట్లాడుతూ... సమాజాన్ని ప్రతిబింబించేవే సినిమాలు. 90'sలో జనాలకు వినోదం అంటే సినిమానే గుర్తొచ్చేది. కుటుంబంతో కలిసి సమయం కేటాయించడానికి, కాలక్షేపం చేయడానికి సినిమాకు వెళ్లేవారు. ఇప్పుడన్నీ మారిపోయాయి. చిన్న కుటుంబాలే ఎక్కువయ్యాయి. వినోదం కోసం అనేక మాధ్యమాలు వచ్చాయి. జనాలకు ఆప్షన్స్ ఎక్కువయ్యాయి.బలవంతంగా ఇరికించొద్దుఅదే సమయంలో అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించడం అసాధ్యంగా మారింది. సినిమాల్లోనూ జానర్స్ వచ్చాయి. వాస్తవికతకు పెద్ద పీట వేశారు. అయితే మోడ్రన్ సినిమాల్లో సహజత్వం కోసం రొమాంటిక్ సన్నివేశాలను బలవంతంగా చొప్పించాల్సిన అవసరం లేదు. తల్లిదండ్రులు లేదా పిల్లలతో కూర్చుని సినిమా చూస్తున్నప్పుడు అలాంటి క్లోజప్ సీన్స్ చిరాకు తెప్పిస్తాయి అని చెప్పుకొచ్చింది.సినిమాఒకప్పుడు హీరోయిన్గా సినిమాలు చేసిన భాగ్యశ్రీ.. ప్రభాస్ 'రాధేశ్యామ్'లోనూ కీలక పాత్రలో కనిపించింది. ఆ తర్వాత మూడు, నాలుగు హిందీ సినిమాల్లో నటించి వెండితెరపై చిన్న బ్రేక్ తీసుకుంది. దాదాపు మూడేళ్ల తర్వాత రాజా శివాజీ అనే చిత్రం చేస్తోంది. ఈ మూవీ మే1న విడుదల కానుంది.చదవండి: అదో చెత్త సినిమా.. ఇంత వెక్కిరించాలా?: నటుడు -
అదో చెత్త మూవీ.. ఇంత అపహాస్యం చేస్తారా?: నటుడు
ప్రముఖ మలయాళ స్టార్ జయరామ్ కుమారుడు, నటుడు కాళిదాస్ జయరామ్ ఓ బాలీవుడ్ సినిమాపై తీవ్ర విమర్శలు గుప్పించాడు. కేరళ సాంప్రదాయాన్ని ఖూనీ చేశారంటూ 'పరమ్ సుందరి'ని చెత్త సినిమాగా అభివర్ణించాడు. అతడు ప్రధాన పాత్రలో నటించిన ఆశాకల్ ఆయిరం అనే మలయాళ మూవీ ప్రమోషన్స్లో భాగంగా ఓ ఇంటర్వ్యూకి హాజరయ్యాడు.చెత్త మూవీఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. ఇటీవలి కాలంలో నేను చూసిన చెత్త సినిమా పరమ్ సుందరి. ఈ మాట చెప్పడానికి కూడా నేను ఏమాత్రం సంకోచించడం లేదు. ఈ మూవీలో కేరళను చాలా చెత్తగా చిత్రీకరించారు. మన సంస్కృతిని అపహాస్యం చేయడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. సినిమా చూసి చాలా అసంతృప్తికి లోనయ్యాను. పరమ్ సుందరి ఒక చెడ్డ అనుభవాన్ని ఇచ్చింది అని పేర్కొన్నాడు.సినిమాపరమ్ సుందరి విషయానికి వస్తే.. సిద్దార్థ్ మల్హోత్రా కథానాయకుడిగా నటించిన ఈ సినిమాలో హీరోయిన్ జాన్వీ కపూర్ కేరళ కుట్టిగా యాక్ట్ చేసింది. తుషార్ జలోటా దర్శకత్వం వహించిన ఈ మూవీ 2025 ఆగస్టు 29న విడుదలైంది. రిలీజైన నాటి నుంచి విమర్శలు ఎదుర్కొన్న ఈ చిత్రం వసూళ్లు మాత్రం పర్వాలేదనిపించింది.చదవండి: విరోష్ పెళ్లి.. ఇది చూడటం నా అదృష్టం: కల్యాణి -
ఓటరును పడగొట్టే 'సినిమా'..ఇదో కొత్త రాజకీయం!
సాధారణంగా రాజకీయ నాయకులు బయట చూడడానికి కాస్త గంభీరంగా ఉంటారు. వారి ప్రసంగాలు, నిర్ణయాలు అన్నీ సీరియస్గానే ఉంటాయి. నిత్యం జనాల్లో ఉన్నప్పటికీ ‘మనవాడు’ అనే హోదా మాత్రం కొంతమందికే లభిస్తుంది. ఆ కొంతమందిలో తాము కూడా ఉండాలని చాలామంది నేతలు కోరుకుంటారు. అందుకే సామాన్య ప్రజలకు చేరువ కావడానికి 'సినిమా గ్లామర్'ను ఒక శక్తివంతమైన ఆయుధంగా వాడుకుంటున్నారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, సూపర్ స్టార్ మోహన్ లాల్ మధ్య జరిగిన తాజా ఇంటర్వ్యూ దీనికి తాజా ఉదాహరణ మాత్రమే. అయితే, ఈ వ్యూహం వెనుక దశాబ్దాల చరిత్ర, అంతర్జాతీయ రాజకీయ తంత్రం దాగి ఉంది.ఎన్నికల సమయంలో రాజకీయనాయకులు చేసే హడావుడి అంతా ఇంత కాదు. ఓటరుకు దగ్గరవ్వడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు. రోడ్డు మీద బజ్జీలు వేస్తారు? పిల్లలతో కలిసి ఆటలు ఆడతారు, సెల్ఫీలు, ఇంట్లోకి వెళ్లి భోజనాలు.. ఇలా విచిత్రమైన పనులతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. అయితే కానీ, ఓటరుకు మరింత దగ్గరవ్వాలంటే 'తమలోనూ ఒక సామాన్యుడు ఉన్నాడు' అని నిరూపించుకోవాలి. ఇందుకోసం సెలబ్రిటీలతో ఇంటర్వ్యూలు నిర్వహించడం ఒక గ్లోబల్ ట్రెండ్గా మారింది.పినరయిలోని మరో కోణంకేరళ రాజకీయాల్లో పినరయి విజయన్ అంటే అత్యంత కఠినమైన నాయకుడనే పేరుంది. సిపిఎం రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న సమయంలో పినరయి విజయన్ కు ఉన్న ఆ గంభీరమైన ముద్రను మార్చి, ఆయనలోని నవ్వు ముఖాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ ఛానల్ ఒక ఇంటర్వ్యూను ప్లాన్ చేసింది. మొదట మమ్ముట్టిని అనుకున్నప్పటికీ, ఇద్దరూ గంభీర స్వభావులే కావడంతో ఆ బాధ్యతను శ్రీనివాసన్ కు అప్పగించారు. శ్రీనివాసన్ అయితేనే పినరయిని నవ్వించగలరని భావించి చేసిన ఇంటర్వ్యూ సూపర్ హిట్ అయింది. తన చిన్నప్పటి దెయ్యాల భయం గురించి పినరయి సరదాగా చెప్పడం ప్రజల్లో ఆయనపై ఉన్న భయాన్ని పోగొట్టింది.నటి నవ్య నాయర్ కూడా గతంలో పినరయి కుటుంబాన్ని ఇంటర్వ్యూ చేసింది. అక్కడ ఆమె పినరయిని ‘విజయన్ అంకుల్’ అని పిలిచారు. గంభీరమైన నాయకుడి వెనుక ఉన్న తండ్రిని, భర్తను ప్రజలకు పరిచయం చేయడమే ఆ కార్యక్రమ ఉద్దేశం.కలిసొచ్చిన మోదీ ‘మామిడి పండ్ల’ ముచ్చట్లు2019 లోక్సభ ఎన్నికల సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ, బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ సంచలనం సృష్టించింది. ఇది పూర్తిగా రాజకీయేతర సంభాషణ. మోదీకి మామిడి పండ్లు అంటే ఇష్టమా? ఆయన రోజుకు ఎన్ని గంటలు నిద్రపోతారు? వంటి వ్యక్తిగత విషయాల గురించి ఇందులో చర్చించారు.మమతా బెనర్జీ తనకు కుర్తాలు పంపిస్తారని చెప్పడం ద్వారా, రాజకీయ వైరం ఉన్నా వ్యక్తిగత సంబంధాలు బాగుంటాయని సందేశం ఇచ్చారు. ఇది సామాన్య ఓటర్లలో మోదీ పట్ల సానుకూలతను పెంచింది. ఇది ఎన్నికల గిమ్మిక్కు అని విపక్షాలు విమర్శించినా, ఫలితం మాత్రం మోదీకి అనుకూలంగానే వచ్చింది. ఇదే పంథాలో ప్రపంచ నాయకులుభారతదేశంలోనే కాదు, ప్రపంచ దేశాధినేతలు కూడా ఇదే పంథాను అనుసరిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడిగా పోటీ చేసినప్పుడు బరాక్ ఒబామా ‘బిట్వీన్ టూ ఫెర్న్స్’ వంటి హాస్య ప్రధాన్యత ఉన్న షోలలో పాల్గొన్నారు. తన ‘ఒబామా కేర్’ పథకం గురించి యువతకు చేరవేయడానికి సినీ తారల సహాయం తీసుకున్నారు. 2024లో జరిగిన అమెరికా ఎన్నికల సమయంలో డోనాల్డ్ ట్రంప్ జో రోగన్ వంటి పాపులర్ పాడ్కాస్టర్లతో గంటల తరబడి మాట్లాడారు. తన సోదరుడి మరణం గురించి భావోద్వేగంగా మాట్లాడుతూ ఓటర్లకు చేరువయ్యారు.ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ స్వతహాగా నటుడు కావడంతో, ఆయన తన ప్రతిష్టను పెంచుకోవడంలో సినిమా మాధ్యమాన్ని చక్కగా వాడారు. హాలీవుడ్ నటుడు షాన్ పెన్ ఆయనపై ‘సూపర్ పవర్’ అనే డాక్యుమెంటరీ కూడా తీశారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ తనను ఒక శక్తివంతమైన నాయకుడిగా ప్రపంచానికి చూపించుకోవడానికి హాలీవుడ్ దర్శకుడు ఆలివర్ స్టోన్ తో వరుస ఇంటర్వ్యూలు చేయించుకున్నారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కూడా అమెరికన్ టాక్ షో హోస్ట్లు స్టీఫెన్ కోల్బెర్ట్, కోనన్ ఓబ్రియన్ వంటి వారితో సరదాగా ముచ్చటిస్తూ తన ‘కూల్ ఇమేజ్’ను ప్రదర్శించారు.కలిసొస్తున్న ‘గ్లామర్’ పాలిటిక్స్రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ఇవి కేవలం ఎన్నికల గిమ్మిక్కులు మాత్రమే కాదు. డిజిటల్ యుగంలో ప్రజలు నాయకుడిలోని 'మానవీయ కోణాన్ని' చూడాలని కోరుకుంటున్నారు.కఠినమైన విధాన నిర్ణయాల కంటే, ఇలాంటి సరదా సంభాషణలే ప్రజల మెదళ్లలో ఎక్కువ కాలం గుర్తిండిపోతాయి.దీంతో పాటు సెలబ్రిటీల ఫాలోయింగ్ను వాడుకోవడం ద్వారా యువ ఓటర్లను సులువుగా ఆకర్షించవచ్చు. కేరళలో పినరయి-మోహన్ లాల్ ఇంటర్వ్యూ అయినా, ఢిల్లీలో మోదీ-అక్షయ్ ముచ్చట్లయినా.. అంతిమ లక్ష్యం ఒక్కటే: "నేను మీలో ఒకడిని" అని చాటిచెప్పడం. గ్లామర్,పొలిటికల్ పవర్ కలిసినప్పుడు పుట్టే ఈ 'కొత్త రాజకీయం' భవిష్యత్తులో మరిన్ని వింత పోకడలకు దారితీస్తుందనడంలో సందేహం లేదు. -
ప్రేయసి ముఖం పచ్చబొట్టు! నటుడు ఏమన్నాడంటే?
బాలీవుడ్ నటుడు కరణ్ కుంద్రా గుండె నిండా తేజస్వి ప్రకాశ్ నిండి ఉంది. ఆమె అంటే కరణ్కు పంచప్రాణాలు. అందుకే తాజాగా అతడి ఛాతీపై తేజస్వి ముఖాన్ని పచ్చబొట్టు వేయించుకున్నాడు. ఇది చూసిన అభిమానులు ప్రియురాలిపై అతడు చూపిస్తున్న ప్రేమకు ఫిదా అయ్యారు.టాటూ నిజమైనదా?ఈ క్రమంలో కరణ్ ఇది శాశ్వత పచ్చబొట్టు కాదని వెల్లడించాడు. తేజస్వి నటించిన సైకో సయ్యా.. వెబ్ సిరీస్ ప్రమోషన్స్లో భాగంగా ఈ తాత్కాలిక టాటూ వేయించుకున్నానని వివరణ ఇచ్చాడు. తనకు సపోర్ట్గా నిలబడేందుకు ఇలా టాటూతో కనిపించానన్నాడు.బిగ్బాస్ షోలో మొదలైన లవ్హిందీ బిగ్బాస్ 15వ సీజన్లో కరణ్- తేజస్వి ప్రకాశ్ పాల్గొన్నారు. ఆ సమయంలోనే ఇద్దరూ ప్రేమలో పడ్డారు. బిగ్బాస్ నుంచి బయటకు వచ్చిన ఏడాదికే అంటే 2022లోనే పెళ్లి చేసుకుందామనుకున్నారు. కానీ, అనుకోని కారణాల వల్ల అది వాయిదా పడింది. అప్పటినుంచి పెళ్లిని దాటవేస్తూనే ఉన్నారు. మధ్యలో ఈ జంట విడిపోయినట్లు వార్తలు వచ్చినా అదంతా ఉత్త ప్రచారమే అని తేలిపోయింది. ఇలాంటి రూమర్స్ వచ్చినప్పుడల్లా.. మాది ఫెవికాల్ బంధమని కరణ్-తేజస్వి ఎన్నోసార్లు రుజువు చేశారు.చదవండి: ప్రేయసితో బిగ్బాస్ షణ్ను ఎంగేజ్మెంట్ -
ఇందులో ప్రాపగండా ఎక్కడుంది..? దురంధర్పై సీనియర్ నటుడు రివ్యూ
దురంధర్ మూవీతో రణ్వీర్ సింగ్ బాక్ బస్టర్ హిట్ కొట్టేశారు. గతేడాది డిసెంబర్ 5న రిలీజైన ఈ సినిమా 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా ఘనతను సొంతం చేసుకుంది. ఛావా, కాంతార-2 చిత్రాల వసూళ్లను అధిగమించింది. ఈ మూవీకి ఆదిత్య ధర్ దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమాపై కొందరు విమర్శలు చేశారు. దీనిపై ప్రాపగండా చిత్రమని ముద్రవేశారు.తాజాగా ఈ మూవీపై బాలీవుడ్ నటుడు శతృఘ్న సిన్హా మాట్లాడారు. దురంధర్ ఓ మాస్టర్ పీస్ అంటూ ప్రశంసలు కురిపించారు. చాలా అద్భుతంగా ఈ సినిమాను రూపొందించారని కొనియాడారు. సాంకేతికత పరంగానూ ప్రేక్షకులను మెప్పించిందన్నారు. బ్యాంకాక్, థాయిలాండ్లో చాలా వాస్తవిక పద్ధతిలో రూపొందించారని అన్నారు. అద్భుతమైన టాలెంట్ ఉన్న ఏకైక వ్యక్తి రణ్వీర్ సింగ్ అని అభివర్ణించారు. ఈ సినిమాను ఒక సంపూర్ణ కళాఖండమని అభివర్ణించారు. ఇందులో ఎలా ప్రాపగండా లేదని.. సినిమాను సినిమాగానే చూడాలని శతృఘ్న సిన్హా సూచించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.కాగా.. ధురంధర్ మూవీలో రణ్వీర్ సింగ్ హంజా అలీ మజారి పాత్ర పోషించారు. ఈ చిత్రంలో ఆర్ మాధవన్, సంజయ్ దత్, అక్షయ్ అర్జున్ రాంపాల్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలో రణవీర్ సరసన సారా అర్జున్ తొలిసారి హీరోయిన్గా మెప్పించారు. ప్రస్తుతం ధురంధర్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. Wow! Just happened to see the most talked about film an absolute masterpiece 'Dhurandhar'. What 'propaganda' film??? A film is a film is a film. It's a great film, gripping interesting & full of entertainment, made with sincerity. The sets too have been created beautifully in…— Shatrughan Sinha (@ShatruganSinha) February 25, 2026 -
పదేళ్ల తర్వాత దొరికిన అరుదైన గిఫ్ట్ ఆ సినిమానే: తాప్సీ
హీరోయిన్ తాప్సీ పన్ను ఇటీవలే అస్సీ మూవీతో ప్రేక్షకులను పలకరించింది. కోర్టు రూమ్ డ్రామాగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. ఈ సినిమాకు అనుభవ్ సిన్హా దర్శకత్వం వహించగా.. మలయాళ నటి కని కుస్రుతి కీలక పాత్రలో మెప్పించింది. ఈ మూవీ రిలీజ్ తర్వాత తాప్సీ వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతోంది. ఇటీవల ఓ ఛానెల్తో మాట్లాడిన ఆమె.. సౌత్ ఇండస్ట్రీపై వివాదాస్పద కామెంట్స్ చేసింది.తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన తాప్సీ తన కెరీర్ గురించి మాట్లాడింది. షారూఖ్ ఖాన్ నటించిన డంకీ సినిమాలో ఆఫర్ రావడంపై స్పందించింది. డంకీ లాంటి భారీ కమర్షియల్ చిత్రంలో అవకాశం రావడం మంది నటులకు కష్టమని తెలిపింది. రాజ్కుమార్ హిరానీ దర్శకత్వంలో నటించడం తన కెరీర్లో అరుదైన క్షణమని వెల్లడించింది. సెన్సిబిలిటీ ఉన్న వ్యక్తి ఆ పాత్ర అవసరమని.. అందుకే తనకు వచ్చిందని ఆమె అన్నారు.తాప్సీ పన్ను మాట్లాడుతూ..'డంకీ లాంటి అవకాశాలు తనకు మాత్రమే కాదు. పరిశ్రమలోని చాలా మంది నటులకు కూడా కష్టమే. రాజ్కుమార్ హిరానీ దర్శకత్వంలో నటించడం నా కెరీర్లో అరుదైన క్షణం. చాలా సంవత్సరాల నాకు లభించిన సినిమా డంకీ. దశాబ్దానికి పైగా సినిమాల్లో నటించిన తర్వాత అందుకున్న బహుమతి డంకీ. నాలాంటి వారికి డంకీ లాంటి సినిమా దొరకడం కష్టం. అస్సీ, గాంధారి లాంటి సినిమాలు చేయడం వల్లే డంకీ సినిమాలో ఛాన్స్ వచ్చింది. ఈ సినిమాలు నాకు పరిశ్రమలో గుర్తింపు తీసుకొచ్చాయని' పంచుకుంది. తన కెరీర్ను మాస్ ఎంటర్టైనర్లతో ప్రారంభించానని తెలిపింది. దక్షిణాదిలో నా కెరీర్ను మాస్ చిత్రాలతో ప్రారంభించా.. ఆ తర్వాత నా హిందీ సినిమా అరంగేట్రం డేవిడ్ ధావన్తో జరిగిందని పేర్కొంది.కాగా.. రాజ్కుమార్ హిరానీ దర్శకత్వం వహించిన డంకీ చిత్రంలో షారుఖ్ ఖాన్ హీరోగా నటించారు. ఈ కామెడీ ఎంటర్టైనర్లో తాప్సీ పన్ను, బోమన్ ఇరానీ, అనిల్ గ్రోవర్, విక్రమ్ కొచ్చర్ కీలక పాత్రల్లో నటించారు. విక్కీ కౌశల్ ప్రత్యేక పాత్రలో కనిపించారు. -
రణవీర్సింగ్.. ఇది తగునా?
కాంతారా చాప్టర్–1 సినిమా గురించి మాట్లాడుతూ దేవుళ్లను కించపరిచేలా ప్రవర్తించారని ప్రముఖ బాలీవుడు నటుడు రణవీర్సింగ్పై బెంగళూరు హైగ్రౌండ్స్ పోలీసు స్టేషన్లో కేసు నమోదు కాగా, దానిని కొట్టివేయాలని ఆయన న్యాయవాదులు హైకోర్టులో కేసు దాఖలు చేశారు. మంగళవారం న్యాయమూర్తి జస్టిస్ ఎం.నాగప్రసన్న విచారణ చేపట్టారు. రణవీర్సింగ్ జరిగిన పొరపాటును సరిదిద్దడానికి సిద్ధమని, క్షమాపణ కూడా చెప్పారని ఆయన తరఫు న్యాయవాది తెలిపారు. జడ్జి స్పందిస్తూ, దేవత చావుండి పాత్రలో రిషబ్శెట్టి నటించారు. ప్రజల భక్తి భావాల గురించి రణవీర్సింగ్ కు తెలియకపోవచ్చు. మహిళా దెయ్యం అని మిమిక్రీ చేశారు. ఇది ప్రజల మనోభావాలకు భంగం కలిగే విషయం. రణవీర్సింగ్ కానీ, ఇతరులు కానీ అలా వ్యవహరించరాదు అని స్పష్టంచేశారు. కేసు విచారణకు ఆయన సహకరించాలి, అలాగే రణవీర్సింగ్ పై పోలీసులు బలవంతపు చర్యలు తీసుకోవద్దు అని ఆదేశిస్తూ మార్చి 2కు విచారణను వాయిదా వేశారు. -
డ్రైవింగ్ చేస్తూ నిద్ర పోతున్నాడు: హీరోయిన్
హీరోయిన్ మీరా చోప్రాకు చేదు అనుభవం ఎదురైంది. క్షేమంగా, వేగంగా వెళ్లేందుకు క్యాబ్ బుక్ చేసుకుంటే డ్రైవర్ ప్రవర్తనతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్నానని చెప్తోంది. ఈ చేదు అనుభవాన్ని సోషల్ మీడియాలో రాసుకొచ్చింది. ఉబర్ క్యాబ్ వల్ల నేను భయానక అనుభవాన్ని ఎదుర్కొన్నాను. మంగళవారం ఉదయం ఆరుగంటల కోసం కారు బుక్ చేసుకున్నాను. తీరా దుమ్ము, మురికి పట్టిన కారు వచ్చింది. డ్రైవర్ కూడా అంతే డర్టీగా ఉన్నాడు. కారు ఎందుకింత మురికిగా ఉందని డ్రైవర్ను అడిగాను. నిద్రపోతూ డ్రైవింగ్కానీ, అతడు సమాధానం చెప్పే స్థితిలో లేడు. కారు నడుపుతూనే నిద్రపోతున్నాడు. 20 నిమిషాల్లో ఆ క్యాబ్ దిగిపోయి మరొకటి బుక్ చేసుకున్నాను. కానీ ఉబర్ మాత్రం నా నుంచి 6 గంటల ఫీజు వసూలు చేసింది. ప్రయాణికుల భద్రతను మాత్రం గాలికొదిలేసింది. కేవలం డబ్బులు సంపాదించడం మాత్రమే వారి పని.. ఇదెంత అసహ్యకరం అని ట్వీట్ చేసింది. దీంతో చాలామంది నెటిజన్లు తమకూ ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యాయంటూ వారి అనుభవాలు షేర్ చేసుకున్నారు.సినిమామీరా చోప్రా విషయానికి వస్తే బంగారం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. వాన, గ్రీకువీరుడు, మారో వంటి చిత్రాల్లో నటించింది. గ్యాంగ్ ఆఫ్ ఘోస్ట్స్ మూవీ ద్వారా బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. ద టాటూ మర్డర్స్ అనే వెబ్ సిరీస్లోనూ నటించింది. Had a massively scary unfortunate experience with @Uber @Uber_India. Booked a cab fr 6 hrs early morning. Driver came dirty with a stinking and dusty car. When i asked him why the car is stinking i realised hes not able to talk also coz he was almost sleeping while driving. I…— Meerra Chopraa (@MeerraChopra) February 24, 2026 చదవండి: ఎంత సంపాదించినా ఇప్పుడే.. లేదంటే: తమన్నా -
విషాదం.. 37 ఏళ్ల యువ నటుడు మృతి!
ఫిట్నెస్ ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యువ నటుడు, బాడీ బిల్డర్ మయాంక్ పవార్ (37) అకాల మరణం సినీ, క్రీడా రంగాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో పోరాడుతున్న ఆయన, ఈ నెల 23న తుదిశ్వాస విడిచారు. అయితే, ఈ విషాద వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.మయాంక్ పవార్ కేవలం నటుడిగానే కాకుండా, బాడీ బిల్డింగ్ రంగంలోనూ మంచి గుర్తింపు సంపాదించాడు. ఏడుసార్లు మిస్టర్ ఇండియా టైటిల్ను గెలుచుకుని రికార్డు సృష్టించారు.ప్రముఖ రియాలిటీ షో 'MTV Splitsvilla' సీజన్ 7లో కంటెస్టెంట్గా పాల్గొని యువతలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు. ఇటీవలే తన 37వ పుట్టినరోజును జరుపుకున్న మయాంక్, ఇంతలోనే తిరిగిరాని లోకాలకు వెళ్లడంపై అభిమానులు సోషల్ మీడియా వేదికగా కన్నీటి నివాళులు అర్పిస్తున్నారు. "ఒక గొప్ప ఫిట్నెస్ ఐకాన్ను కోల్పోయాం" అంటూ పోస్ట్లు పెడుతున్నారు. మోడల్గా, నటుడిగా ఎదుగుతున్న తరుణంలోనే ఈ విషాదం జరగడం దురదృష్టకరం. View this post on Instagram A post shared by Mayank Pawar™ (@pawarmayank) -
చరిత్ర సృష్టించిన బూంగ్
భారతీయ చిత్రం ‘బూంగ్’ చరిత్ర సృష్టించింది. లండన్ లో జరిగిన 79వ ‘బాఫ్టా’ (బ్రిటిష్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్ట్స్) అవార్డుల ప్రదానోత్సవంలో ‘బెస్ట్ చిల్డ్రన్స్ అండ్ ఫ్యామిలీ ఫిల్మ్’ విభాగంలో అవార్డు అందుకున్న తొలి భారతీయ చిత్రంగా నిలిచింది. అలాగే ‘బాఫ్టా’లో తొలి అవార్డు సాధించిన మణిపుర్ సినిమా కూడా ఇదే. ఈ విభాగంలో ‘జూటోపియా 2’, ‘లిలో – స్టిచ్’, ‘ఆర్కో’ వంటి హాలీవుడ్ చిత్రాలు నామినేషన్ దక్కించుకున్నప్పటికీ ‘బూంగ్’ అవార్డును గెలుచుకోవడం విశేషం.బూంగ్ కథ ఏంటంటే...గుగున్ కిప్జెన్ టైటిల్ రోల్లో, బాలా హిజామ్ కీలక పాత్రలో నటించిన మణిçపుర్ చిత్రం ‘బూంగ్’. లక్ష్మీ ప్రియా దేవి దర్శకత్వం వహించిన తొలి ఫీచర్ ఫిలిం ఇది. ఫర్హాన్ అక్తర్, వికేష్ భూతాని, అలాన్ మెక్ అలెక్స్, రితేష్ సిధ్వాని, షుజాత్ వ్యాపారి నిర్మించారు. ఈ సినిమాని 2024లో కెనడాలో జరిగిన 49వ టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో తొలిసారి ప్రదర్శించారు. 2025 సెప్టెంబరు 19న ఈ చిత్రాన్ని ఇండియాలో రిలీజ్ చేశారు. తన తల్లిదండ్రులు మందాకిని, జాయ్కుమార్లను కలిపేందుకు బూంగ్ అనే పాఠశాల విద్యార్థి తన స్వస్థలం నుంచి మయన్మార్ సరిహద్దు వరకు చేసిన సాహసోపేతమైన భావోద్వేగ ప్రయాణంతో ఈ మూవీ సాగుతుంది. మణిపుర్లో శాంతి నెలకొనాలి: లక్ష్మీప్రియా దేవి ‘బాఫ్టా’ అవార్డు స్వీకరించిన అనంతరం భావోద్వేగంతో మాట్లాడారు లక్ష్మీప్రియా. ‘‘మేం ఎంతో కష్టపడుతూ ఓ పర్వతం ఎక్కుతున్నది ఫస్ట్ ప్లేస్ కోసమని మేం ఈ వేదికపైకి వచ్చాక అర్థం అయింది. మా చిన్న సినిమాపై ఇంతటి ప్రేమను వ్యక్తం చేసిన జ్యూరీ సభ్యులకు, బాఫ్టాకు థ్యాంక్స్. భారతదేశంలోని మణిçపుర్ నా మాతృభూమి. అక్కడ తిరిగి శాంతి నెలకొనాలని దేవుణ్ణిప్రార్థిస్తున్నానని చెప్పేందుకు ఈ వేదికను వినియోగించుకోవాలనుకుంటున్నాను. సినిమాలోని బాల నటులతో సహా, మణిపూర్లోని పిల్లలందరూ వారి ఆనందాన్ని, వారి కలలను తిరిగి పొందాలని కోరుకుంటున్నాను’’ అని చెప్పారు. ప్రధాని మోదీ ప్రశంస‘‘బూంగ్’ సినిమాతో అసోసియేట్ అయిన అందరికీ శుభాకాంక్షలు. నిజంగా ఆనందమైన క్షణాలు ఇవి. ముఖ్యంగా మణిపూర్కు. అలాగే దేశంలోని అపారమైన సృజనాత్మక ప్రతిభ హైలైట్ అవుతుంది’’ అంటూ భారత ప్రధాని నరేంద్ర మోది ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. అలాగే పలువురు భారత సినీ ప్రముఖులు కూడా శుభాకాంక్షలు చెప్పారు. ఆలియా సందడి‘బాఫ్టా’ అవార్డ్స్లో బాలీవుడ్ నటి ఆలియా భట్ సందడి చేశారు. ‘బెస్ట్ ఫిల్మ్ నాట్ ఇన్ ది ఇంగ్లీష్ లాంగ్వేజ్’ విభాగంలో ‘సెంటిమెంటల్ వేల్యూ’ యూనిట్కు అవార్డు అందించారు. ఈ అవార్డ్స్లో ‘వన్ బాటిల్ ఆఫ్టర్ అనదర్’ సినిమా బెస్ట్ ఫిల్మ్గా నిలవడంతో పాటు అత్యధికంగా ఆరు అవార్డులను సొంతం చేసుకుంది. చిత్ర దర్శకుడు పాల్థామస్ ఉత్తమ దర్శకుడిగా అవార్డు అందుకున్నారు. రాబర్ట్ అరమాయో (ఐ స్వయిర్ సినిమాకు) ఉత్తమ నటుడిగా నిలవగా, జెస్సీ బక్లీ ఉత్తమ నటిగా నిలిచి (‘హామ్నెట్’ చిత్రానికిగాను).. బాఫ్టా లీడ్ యాక్ట్రస్ అవార్డు గెలుచుకున్న తొలి ఐరిస్ మహిళగా రికార్డు సాధించారు. -
రోడ్డుపై అందరూ కలిసి చితకబాదారు: అక్షయ్ కుమార్
కాలేజీ డేస్లో చాలామంది ప్రేమలో పడతారు. కొందరిది వన్సైడ్ లవ్ అయితే మరికొందరిది టూసైడ్ లవ్. అలా బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ కూడా కాలేజీలో చదువుకునే రోజుల్లో ఓ అమ్మాయిని చూసి మనసు పారేసుకున్నాడట! ఈ విషయాన్ని 'ద వీల్ ఆఫ్ ఫార్చ్యూన్' షోలో వెల్లడించాడు. తాజాగా ఈ షోలోని లేటెస్ట్ ఎపిసోడ్లో ఈ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు.అమ్మాయి ఇంటి ముందుతన కాలేజీ డేస్లోని లవ్ స్టోరీని గుర్తు చేసుకున్నాడు. 'ఇది 40 ఏళ్ల కిందట ముచ్చట. అప్పుడు నేను కాలేజీకి వెళ్తున్నాను. ఒక అమ్మాయిని చూసి ముచ్చటపడ్డాను. తనకోసం ప్రత్యేకంగా ఒక పాట నేర్చుకున్నాను. నా ఫ్రెండ్ ఒకరికి గిటార్ వాయించడం తెలుసు. కాబట్టి వాడిని వెంటేసుకుని నేరుగా అమ్మాయి ఇంటి ముందు నిలబడ్డాను. తన్నులు తిన్నాంఅతడు గిటార్ వాయిస్తుంటే నేను పాట పాడటం మొదలుపెట్టాను. నా పాట విని అమ్మాయి వస్తుందనుకుంటే చుట్టుపక్కలవాళ్లు వచ్చి మమ్మల్ని చితక్కొట్టారు. వారి చేతిలో చచ్చామనుకున్నాం. ఎవరినో ఇంప్రెస్ చేద్దామని వెళ్లి మేమే తన్నులు తిని వచ్చాం' అని గుర్తు చేసుకున్నాడు.పర్సనల్ లైఫ్కాగా సినిమాల్లో స్టార్ హీరోగా క్రేజ్ తెచ్చుకున్న అక్షయ్ ఫిలింఫేర్ మ్యాగజైన్ ఫోటోషూట్లో హీరోయిన్ ట్వింకిల్ ఖన్నాను కలిశాడు. అలా వాళ్లిద్దరి మధ్య పరిచయం తర్వాత ప్రేమకు దారి తీసింది. 2001లో అక్షయ్, ట్వింకిల్ పెళ్లి చేసుకున్నారు. వీరికి 2002లో కుమారుడు ఆరవ్ జన్మించాడు. 2012లో కూతురు నితారా పుట్టింది.చదవండి: విడాకుల తర్వాత బాధలో.. ఎవర్నీ నమ్మొద్దనుకున్నా..: సమంత -
'అతన్ని పట్టించుకోవడం ఎప్పుడో మానేశారు'.. డైరెక్టర్కు స్ట్రాంగ్ కౌంటర్
సుదీప్తో సేన్ దర్శకత్వంలో తెరకెక్కించిన ది కేరళ స్టోరీ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. రెండేళ్ల క్రితం వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్గా నిలిచింది. తాజాగా ఈ మూవీకి సీక్వెల్గా ది కేరళ స్టోరీ-2 ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ చిత్రాన్ని దర్శకుడు కామాఖ్య నారాయణ్ తెరకెక్కించారు. ఇటీవల ట్రైలర్ రిలీజ్ చేయగా పెద్దఎత్తున విమర్శలొచ్చాయి.తాజాగా బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ సైతం ఈ మూవీపై విమర్శలు చేశారు. కేవలం డబ్బుల కోసమే ఇలాంటి సినిమాలు చేస్తున్నారని ఆరోపించారు. ఫిల్మ్ఫేర్ అవార్డుల సందర్భంగా కొచ్చిలో ఆయన మాట్లాడారు. దీంతో ఆయన కామెంట్స్ కాస్తా బాలీవుడ్లో హాట్ టాపిక్గా మారాయి. ఈ నేపథ్యంలో ది కేరళ స్టోరీ-2 డైరెక్టర్ కామాఖ్య నారాయణ్ స్పందించారు. అనురాగ్కు అన్నింటితో సమస్యలేనని కామాఖ్య నారాయణ ఎద్దేవా చేశారు. ఆయన మానసిక పరిస్థితి బాగాలేదేమోనని అన్నారు.కామాఖ్య నారాయణ్ మాట్లాడుతూ..'బహుశా అనురాగ్ మానసిక పరిస్థితి బాగాలేదనుకుంటున్నా. ఆయనకు అన్నింటితో సమస్యే. సమాజంలో ఒక వర్గం ప్రజలతో.. నెట్ఫ్లిక్స్తో పాటు ఫిల్మ్ ఇండస్ట్రీతోనూ ఆయనకు ఇబ్బందులే. అనురాగ్ తాను తీసిన సినిమాల్లో ఇంతకు మించిన సన్నివేశాలను చూపించారు. ఈ ఆధునిక సమాజంలో ఊహకు కూడా అందని వాటిని కూడా చిత్రీకరించారు. ప్రేక్షకులు ఆయన మాటలు పట్టించుకోవడం ఎప్పుడో మానేశారని' అన్నారు. కాగా.. ఈ చిత్రం ఫిబ్రవరి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
జీవితంలో ఎవర్నీ నమ్మననుకున్నా.. అలాంటిది రాజ్ వచ్చాక!
'ఏమాయ చేసావె' సినిమాతో కథానాయికగా ప్రయాణం మొదలుపెట్టింది సమంత. తొలి సినిమా హీరో నాగచైతన్యతో ప్రేమలో పడి పెళ్లి కూడా చేసుకుంది. కానీ తర్వాత విభేదాలు రావడంతో 2021లో విడాకులు తీసుకున్నారు. దాదాపు నాలుగేళ్ల గ్యాప్ తర్వాత 2025 డిసెంబర్ 1న బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరును ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే జీవితంలో మరో వ్యక్తిని నమ్ముతానని అనుకోలేదంటోంది సామ్.అతడి వల్లే ఇలా ఉన్నాతాజాగా వోగ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సమంత మాట్లాడుతూ.. నేను విడాకులు తీసుకున్నప్పుడు పూర్తిగా సైలెంట్ అయిపోయాను. భవిష్యత్తులో మరో వ్యక్తిని నమ్ముతానని కలలో కూడా అనుకోలేదు. ఎందుకంటే అప్పుడు నేను మానసికంగా చాలా బలహీనంగా ఉన్నాను. ఎవరి ప్రేమ, స్నేహాన్ని స్వీకరించే పరిస్థితిలో లేను. అలాంటిది నా జీవితంలోకి రాజ్ రావడం సంతోషంగా ఉంది. అతడు వచ్చాకే నాలో తెలియని శక్తి వచ్చింది. రాజ్ వల్లే నేనిప్పుడు బెటర్ పర్సన్గా మారాను. ఈ మధ్యే ఫ్రెండ్ను కలిశా..ఇటీవలే నా పాత ఫ్రెండ్ను కలిశాను. ఆమె నాతో మాట్లాడి వెళ్లిపోయాక నాకు వాయిస్ మెసేజ్ పెట్టింది. ఒకప్పుడు నువ్వు శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బందిపడేదానివి. చాలాకాలం తర్వాత మళ్లీ మామూలుగా కనిపిస్తున్నావ్ అని మెసేజ్ పెట్టింది (నవ్వుతూ) అని చెప్పుకొచ్చింది. మొత్తానికి రాజ్ వచ్చాక తన జీవితం సంతోషకరంగా మారిందంటోంది సామ్. ఈ ఆనందం తనకు జీవితాంతం వెన్నంటే ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు. View this post on Instagram A post shared by VOGUE India (@vogueindia) చదవండి: చేతిలో చిల్లిగవ్వ లేక.. ప్రతిరోజూ కన్నీళ్లే: బాలీవుడ్ నటుడు -
చిల్లిగవ్వ లేక తిండి లేక.. ప్రతిరోజూ ఏడ్చేవాడిని: నటుడు
ఒకప్పుడు తినడానికి తిండి లేక ఎన్నో కష్టాలు చూశానంటున్నాడు బాలీవుడ్ నటుడు ఆమిర్ అలీ. ఎఫ్ఐఆర్ అనే టీవీ సీరియల్ ద్వారా బుల్లితెరపై గుర్తింపు తెచ్చుకున్న అతడు నాలుగైదు హిందీ సినిమాల్లోనూ తళుక్కుమని మెరిశాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కెరీర్లో ఎదుర్కొన్న ఇబ్బందులను ఏకరువు పెట్టాడు.నా పని అయిపోయిందనుకున్నాఅతడు మాట్లాడుతూ.. నేను టీవీలో ఫస్ట్ సీరియల్ చేసినప్పుడు అంత సీరియస్గా తీసుకోలేదు. ఎందుకంటే నాకు బుల్లితెరపై కనిపించాలని లేదు. టీవీలో కనిపిస్తే సినిమా యాక్టర్గా నా పనైపోయినట్లేనని నా అభిప్రాయం. టీవీ ఇండస్ట్రీలో అడుగుపెట్టే సమయానికే కొన్ని సినిమాలు చేశాను.. కానీ, అవి రిలీజ్ కాకుండానే ఆగిపోయాయి. దాంతో నాకివ్వాల్సిన డబ్బులు కూడా పూర్తిగా రాలేవు. చేతిలో చిల్లిగవ్వ లేక..ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. తినడానికి తిండి లేక, ఫుడ్ కొనుక్కోవడానికి సరిగా డబ్బు కూడా ఉండేది కాదు. ఇంటి బాధ్యత మొత్తం నాపైనే ఉంది. అప్పటికే నేను రెండు మూడు సినిమాలు చేయడంతో ఇక్కడ కెరీర్ సెట్టయిందన్న భావనతో ఉన్న ఉద్యోగం కూడా వదిలేశాను. చివరకు చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో అయిష్టంగా టీవీ ఇండస్ట్రీకి వెళ్లాల్సి వచ్చింది. సీరియల్స్ ఎందుకు అనగానే..అప్పుడు ప్రతిరోజు నేను నా వ్యాన్లో కూర్చుని ఏడ్చేవాడిని. నాతో సినిమాలు చేసినవారందరూ ఎందుకు సీరియల్స్ చేస్తున్నావని అడగ్గానే దుఃఖం తన్నుకొచ్చేది. అరగంటపాటు ఆపకుండా ఏడ్చేవాడిని. 2019లో చాలామంది దర్శకనిర్మాతలను కలిశాను. నువ్వు హీరోవి, నిన్ను సైడ్ క్యారెక్టర్స్లో ఎలా చూస్తారు? ఇప్పటికీ ఇబ్బందులే..ఒకవేళ అలాంటి పాత్ర ఏదైనా ఉంటే చెప్తాం అంటూ మాట దాటేసేవారు. 2017లో టీవీ ఇండస్ట్రీని వదిలేసినప్పటికీ నాపై బుల్లితెర నటుడు అనే ముద్ర అలాగే ఉండిపోయింది. అంత ఈజీగా నాకెవరూ అవకాశాలివ్వరు అని ఆమిర్ అలీ చెప్పుకొచ్చాడు. ఆమిర్ అలీ.. ఐ హేట్ లవ్ స్టోరీస్, ఫరాజ్ వంటి చిత్రాల్లో నటించాడు.చదవండి: బుల్బుల్ తర్వాతే క్రేజ్.. యానిమల్తో సెన్సేషన్ -
లైఫే టర్నయ్యిందిలే బుల్బుల్ పిట్ట!
టాలెంట్ ఉంటే సరిపోదు, ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలి. కొందరికి ఫస్ట్ సినిమాతోనే విపరీతమైన పాపులారిటీ వస్తుంది. మరికొందరికి ఏళ్లు గడిచాక గుర్తింపు దక్కుతుంది. హీరోయిన్ తృప్తి డిమ్రి రెండో కోవకు చెందుతుంది. నేడు (ఫిబ్రవరి 23న) ఈ బ్యూటీ బర్త్డే. ఈ సందర్భంగా ఆమె గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం..అనుకోకుండా సినిమాల్లోకి..హీరోయిన్ తృప్తి డిమ్రి ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగ్లో 1995 ఫిబ్రవరి 23న జన్మించింది. తండ్రి దినేష్ డిమ్రి ఎయిరిండియా ఉద్యోగి. తల్లి గృహణి. తృప్తి అనుకోకుండా సినిమాల్లోకి వచ్చింది. ఆమె సోదరుడి స్నేహితుడు ఫోటోగ్రాఫర్. ఒకరోజు ఈమె ఫోటోలు తీసి ఢిల్లీలోని ఇమేజెస్ బజార్కు పంపించాడు. ఆ ఫోటోలు వారికి నచ్చడంతో ఫోటోషూట్కు పిలిపించారు. అలా తృప్తి జర్నీ మొదలైంది. తండ్రి కోరిక నెరవేర్చేందుకుమొదట్లో యూట్యూబ్ ఛానల్లో పని చేసింది. అక్కడే కెమెరాకు అలవాటు పడటం నేర్చుకుంది. నిజానికి తృప్తి తండ్రికి యాక్టర్ అవ్వాలని కోరికట.. దీంతో తండ్రి కోరికను తాను నెరవేర్చాలనుకుంది. బుల్లితెరపై అయినా నటిస్తే చాలనుకుని మొదట్లో మోడలింగ్ చేసింది. అక్కడ మంచి పేరు రావడంతో నటి అవ్వాలన్న ఆశతో ముంబైలో అడుగుపెట్టింది. అయితే నటిని అవుతా అని ఇంట్లో చెప్పగానే కుటుంబంసభ్యులు కొంచెం కంగారుపడ్డారట. అవకాశాలు లేనప్పుడు..పైగా బంధువులు కూడా.. ఆమె ఇండస్ట్రీకి వెళ్తే చెడు అలవాట్లకు బానిసవుతుంది. ఆమెను ఎవరూ పెళ్లి చేసుకోరు అని భయపెట్టారు. అయినా ఇంట్లో వాళ్ల ప్రోత్సాహంతో ముందడుగు వేసింది. ఇండస్ట్రీలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొంది. అవకాశాలు రాని సమయంలో బాధపడింది. కానీ, వెనకడుగు మాత్రం వేయలేదు. అలా మామ్ సినిమాలో చిన్న పాత్రలో కనిపించినప్పటికీ 2017లో పోస్టర్ బాయ్స్ సినిమాతో కథానాయికగా పరిచయమైంది. ఆ మరుసటి ఏడాది వచ్చిన లైలా మజ్నులోని లైలా పాత్రలో ప్రేక్షకులకు దగ్గరైంది. యూత్ క్రష్2020లో వచ్చిన హారర్ మూవీ బుల్బుల్తో ఓటీటీ స్టార్గా మారింది. ఆ మూవీ తర్వాత తన దశ తిరిగిపోయింది. 2023లో వచ్చిన సందీప్రెడ్డి వంగా యానిమల్ సినిమాతో నేషనల్ వైడ్ గుర్తింపు తెచ్చుకుంది. యూత్ అందరికీ క్రష్గా మారిపోయింది. బ్లాక్బస్టర్ మూవీ భూల్ భులయ్యా 3లో ద్విపాత్రాభినయం చేసింది. ప్రస్తుతం హిందీలో మా బెహెన్, తెలుగులో ప్రభాస్ సరసన స్పిరిట్ సినిమా చేస్తోంది. తెలుగులో ఇదే తన తొలి సినిమా కావడం విశేషం!చదవండి: ఫుడ్డుతో చంపేస్తున్న ప్రభాస్.. ఏ హీరోయిన్కు పంపాడంటే? -
హీరోయిన్ కోసం ప్రభాస్ స్పెషల్ ట్రీట్
డార్లింగ్ ప్రభాస్ భోజనప్రియుడు. ఇంటి భోజనాన్ని ఎక్కువ ఇష్టపడతాడు. తను తినడమే కాదు చుట్టూ ఉన్నవారికి సైతం ఫుడ్డు పెట్టి చంపేస్తాడు. ఎక్కడ షూటింగ్ ఉన్నా సరే ఇంటి నుంచి తెప్పించి మరీ తోటి నటీనటులకు, చిత్రయూనిట్కు భోజనం తినిపిస్తాడు. కొన్నిసార్లు అందరి కోసం ఫుడ్ ఆర్డర్ చేస్తుంటాడు. అలా ఆదిపురుష్ సినిమా షూటింగ్ సమయంలో ఏకంగా చెన్నై నుంచి ముంబైకి భోజనం తెప్పించాడు.హీరోయిన్ కోసం స్పెషల్ ఫుడ్తాజాగా ఫౌజీ హీరోయిన్ ఇమాన్వికి ఇలాగే ఫుడ్ ట్రీట్ ఇచ్చాడు. స్టార్టర్ దగ్గరినుంచి బిర్యానీ, స్వీట్స్ వరకు.. అన్నింటినీ పార్శిల్ చేసి పంపించాడు. వాటిన్నింటినీ టేబుల్ ముందు పెట్టుకున్న ఇమాన్వి వీడియో తీసి ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. ఇంత రుచికరమైన భోజనం పంపింనందుకు ప్రభాస్కు కృతజ్ఞతలు చెప్పింది.సినిమాఫౌజీ విషయానికి వస్తే.. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో ఇమాన్వి కథానాయికగా నటిస్తోంది. సీతారామం ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తుండగా మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్నారు. మిథున్ చక్రవర్తి, జయప్రద, అనుపమ్ ఖేర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ భాషల్లో 2026 దసరాకి విడుదల కానుంది.చదవండి: బాఫ్టా అవార్డులు.. తొలిసారి భారత్ మూవీకి అవార్డ్ -
అమితాబ్ను చూసేందుకు ఒక్కరూ రాలేదా?
ఆదివారం వచ్చిందంటే చాలు ఇంటి బయటకు వచ్చి అభిమానులను పలకరిస్తుటాడు బిగ్బీ అమితాబ్ బచ్చన్. దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఈ ఆచారాన్ని కొనసాగిస్తున్నాడు. తనకోసం సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన అభిమానులకు కనిపించడం, పలకరించడం తన కర్తవ్యం అని భావిస్తాడు. అయితే నిన్న (ఫిబ్రవరి 22) మాత్రం అమితాబ్ ఇంటి నుంచి బయటకే రాలేదు.కనిపించని అభిమానులుఅందుకు గల కారణాన్ని అమితాబ్ తాజాగా తన బ్లాగ్లో రాసుకొచ్చాడు. పనెప్పుడూ ఉత్సాహంతోనే సాగుతుంది. కానీ, అది పూర్తవకముందే రోజు ముగుస్తుంది. ఇంతలోనే విరామం, విశ్రాంతి తీసుకునేందుకు ఆదివారం వస్తుంది. దుదరదృష్టవశాత్తూ ఈ ఆదివారం జల్సా (బిగ్బీ ఇంటి పేరు) గేటు ముందు ఎవరూ లేరు. కాబట్టి మీరు కూడా ఎవరూ దూర ప్రయాణాలు పెట్టుకోకండి, మీ శక్తిని ఆదా చేసుకోండి.అదేంటి?తర్వాత మనం మళ్లీ కలుద్దాం. అప్పటివరకు ఈ నిశ్శబ్ధపు ఆలోచనల్లోనే ప్రేమను పంచుకుందాం అని రాసుకొచ్చాడు. ఇది చూసిన నెటిజన్లు.. అమితాబ్ను చూసేందుకు ఎవరూ రాకపోవడమేంటి? ఆయన చరిష్మా తగ్గిపోయిందా? అని కామెంట్లు చేస్తున్నారు. ఎన్నో ఏండ్లుగా హీరోగా రాణిస్తున్న అమితాబ్.. చివరగా వేట్టైయాన్ సినిమాలో కనిపించాడు. 120 బహదూర్ మూవీకి వాయిస్ ఓవర్ ఇచ్చాడు. అలాగే రామాయణ: పార్ట్ 1లో జటాయు పాత్రకు వాయిస్ ఓవర్ ఇవ్వనున్నాడు.చదవండి: ధోతి స్టైల్లో హీరోయిన్ డ్రెస్.. ధరెంతంటే? -
ఇది ఉత్తరాది-దక్షిణాది మధ్య యుద్ధం కాదు అంతకు మించి
సంక్రాంతి తర్వాత చెప్పుకోదగ్గ స్థాయిలో బాక్సాఫీస్ దగ్గర సౌండ్ లేదు. అయితే మార్చిలో 'ధురంధర్ 2', టాక్సిక్ లాంటి భారీ పాన్ ఇండియన్ మూవీస్ థియేటర్లలోకి రాబోతున్నాయి. వీటి గురించి సగటు ప్రేక్షకుడు ఆత్రుతగా ఎదురుచూస్తున్నాడు. మరోవైపు ఈ చిత్రాల మధ్య పోటీ గురించి.. ప్లస్ మైనస్సుల గురించి దర్శకుడు రాంగోపాల్ వర్మ తనదైన శైలిలో విశ్లేషించాడు. ఈ మేరకు ట్విటర్లో తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు.'నేను కేవలం రెండు పెద్ద సినిమాల గురించి మాట్లాడటం లేదు. భారతీయ సినీ చరిత్రలో ముందెన్నడూ చూడని ఓ భీకర యుద్ధాన్ని చూడబోతున్నాం. ఇది డేవిడ్, గోలియత్ మధ్య జరుగుతున్న పోరాటం. గతంలో 'కేజీఎఫ్ 2' సాధించిన భారీ వసూళ్లు.. 'ధురంధర్' ముందు చిన్నవిగా అనిపించాయి. ఇప్పుడు 'ధురంధర్ 2' అనే డేవిడ్ ముందు 'టాక్సిక్' అనే గోలియత్ నిలబడింది. ధురంధర్ మేకర్స్.. ప్రేక్షకుల తెలివితేటలని గౌరవిస్తున్నారు. 'టాక్సిక్' మేకర్స్ మాత్రం ప్రేక్షకుల్ని మూర్ఖులని భ్రమపడుతున్నారు' అని ఆర్జీవీ రాసుకొచ్చాడు. అలానే కొన్ని పాయింట్స్ కూడా దేనికదే చెప్పుకొచ్చాడు.హీరోయిజం: గుడ్డిగా హీరోని ఆరాధించడం ఓవైపు ఉంటే, కథలోని నైతిక విలువల ద్వారా హీరోని ప్రేక్షకులని అభిమానించడం మరోవైపు.యాక్షన్: గాలిలో ఎగిరే స్టంట్స్, న్యూటన్ ఫార్ములాని వెక్కిరించే ఫైట్స్ 'టాక్సిక్'లో ఉంటే.. ఒళ్లు గగుర్పొడితే సహజ యాక్షన్ 'ధురంధర్' సొంతంమ్యూజిక్: ప్రతి ఐదు నిమిషాలకు విజిల్స్ వేయించే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఒకటైతే, నటనకు అవకాశమిస్తూ నిశ్శబ్దంగా సాగే సంగీతం మరోవైపుకేవలం ఓ నటుడిని దేవుడిలా చూపించడానికి రూ.700 కోట్లు ఖర్చు చేయడం కంటే ప్రతి పాత్రని మనిషిలా చూపించడానికి రూ.130 కోట్లు ఖర్చు చేయడం గొప్ప. ప్రేక్షకులని పిల్లలనుకుని ప్రతిదీ వివరించి చూపించడం మానేయాలి. క్లిష్టంగా ఉండే స్టోరీలని కూడా అర్థం చేసుకోగలరని 'ధురంధర్' నిరూపించింది. అయితే ఇదంతా కూడా ఆదిత్య ధర్ మీద ప్రేమతో రాయడం లేదు. మన సినిమాపై ఉన్న ఆశతో రాస్తున్నాను. మార్చి 19న మన దేశం.. ధురంధర్ 2ని ఎంచుకుంటుందో లేదా టాక్సిక్ మాస్ మత్తులో పడుతుందో చూడాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని రాంగోపాల్ రాసుకొచ్చాడు.ఈ ట్వీట్ చూసిన చాలామంది.. 'ధురంధర్ 2'ని పొగుడుతూ 'టాక్సిక్'ని తక్కువ చేశాడా అని మాట్లాడుకుంటున్నారు. దీంతో ఆర్జీవీ మరో ట్వీట్ చేశాడు. తాను సినిమాల గురించి మాట్లాడట్లేదని.. స్టైల్ ఆఫ్ మూవీస్ గురించి ప్రస్తావించానని క్లారిటీ ఇచ్చాడు.For all the dumbos , who dint understand I just wanted to clarify that , in the context of the 2 releases , I was talking about the styles of cinema and not in particular about a film https://t.co/Ydy61Nr32F— Ram Gopal Varma (@RGVzoomin) February 22, 2026 -
హీరోయిన్ కళ్లలో కళ్లు పెట్టి చూడాలంటేనే సిగ్గు: జాకీ ష్రాఫ్
బాలీవుడ్ సెలబ్రిటీలు మాధురి దీక్షిత్, జాకీ ష్రాఫ్ తాజాగా 'ద గ్రేట్ ఇండియన్ కపిల్ షో' నాలుగో సీజన్కు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు కలిసి పని చేసిన అనుభవాలను గుర్తు చేసుకున్నారు. ముందుగా మాధురి దీక్షిత్ మాట్లాడుతూ.. 'కర్మ' సినిమా సెట్లో తొలిసారి జాకీ ష్రాఫ్ను కలిశాను. నేను ఆ మూవీలో ఒక చిన్న పాటలో నటించాను. మొహమాటంఆ సమంలో జగ్గూ దాదా (జాకీ ష్రాఫ్), అనిల్ కపూర్ గారు అక్కడే ఉన్నారు. ఇద్దరూ నా పర్ఫామెన్స్ చూస్తున్నారు. నాకసలే అదంతా కొత్త.. వీళ్లిద్దరూ నన్నే చూస్తుండటంతో కాస్త మొహమాటంగా ఫీలయ్యాను. ఇక ఆ సాంగ్ చూసిన తర్వాత జగ్గూ దాదా, శ్రీదేవి.. అందులో వారిని ఊహించుకున్నారు అని గుర్తు చేసుకుంది.మాధురి అందాన్ని చూసి..జాకీ ష్రాఫ్ మాట్లాడుతూ.. కొరియోగ్రాఫర్, నటి సరోజ్ ఖాన్ ద్వారా నాకు తొలిసారి మాధురి గురించి తెలిసింది. మాధురి అందమైన హీరోయిన్ అలాగే అద్భుతమైన డ్యాన్సర్ కూడా అని సుభాష్ గయ్తో చెప్పింది. మాధురిని సినిమాలో ఎంపిక చేసుకోమని సలహా ఇచ్చింది. అలా తన గురించి తెలిసింది. ఇప్పటికీ నేను మాధురి అందాన్ని చూసి ఆశ్చర్యపోతూ ఉంటా.. తను నాతో అన్నిరకాల పాత్రల్లో నటించింది. ప్రియురాలిగా, భార్యగా, అలాగే నా అత్తగానూ యాక్ట్ చేసింది. అయితే మాధురితో రొమాంటిక్ సీన్స్ చేసేటప్పుడు నేను చాలా మొహమాటపడ్డాను. జాకీపై ప్రశంసలుకొన్ని భావోద్వేగాలు మనసులోనే కదలాడతాయి. వాటిని పైకి చూపించడం కష్టం. పైగా ఆమె మాట్లాడేటప్పుడు తన కళ్లలో కళ్లు పెట్టి మాట్లాడటడం, పాడటం మరింత కష్టతరం. తను మాత్రం పాత్రలో లీనమైపోయి బోలెడంత ప్రేమను కురిపిస్తుంది అన్నాడు. ఇంతలో మాధురి మాట్లాడుతూ.. జగ్గూ చాలా అమాయకుడు. ఎంత ఎదిగినా ఒదిగి ఉంటాడు అని జాకీ ష్రాఫ్పై ప్రశంసలు కురిపించింది. ఇకపోతే వీరిద్దరి కాంబినేషన్లో చివరగా దేవదాస్ అనే సినిమా వచ్చింది.చదవండి: పవిత్ర లోకేశ్ నాతో ఎలా ఉంటుందంటే?: నరేశ్ పెద్ద కుమారుడు -
కుర్రాడైనా ఓకే.. రొమాన్స్కి రెడీ అంటున్న నడివయసు హీరోయిన్లు
పెద్ద వయసు హీరోలు, పిన్న వయసు హీరోయిన్లు అనేది మన దేశ సినీ తెరపై కనిపించడం అత్యంత సర్వసాధారణ విషయం. అయితే తనకన్నా చిన్న వయసు హీరోతో పెద్ద వయసు హీరోయిన్ నటించడం, రొమాంటిక్ సీన్లను పండించడం అనేది చాలా అరుదు. హాలీవుడ్ చిత్రాల్లో బాగా పాప్యులరైన ఈ తరహా స్క్రీన్ రొమాన్స్ ఇటీవలి కాలంలో మన సినిమాల్లోనూ తరచు కనిపిస్తోంది. కనిపించినప్పుడల్లా కొంత చర్చనీయాంశంగా, వార్తాంశంగా మారుతున్నప్పటికీ నడివయసు హీరోయిన్స్ పట్టించుకోవడం లేదు.తమకన్నా 10 నుంచి– 25 ఏళ్ల వరకు తక్కువ ఉన్న వయసున్న హీరోలతో తెరపై జత కడుతున్నారు. అభిషేక్ బచ్చన్ భార్య, మాజీ మిస్ వరల్డ్ ఐశ్వర్య రాయ్ బచ్చన్ తన కన్నా 9ఏళ్లు చిన్నవాడైన రణ్బీర్ కపూర్ తో ఏ దిల్ హై ముష్కిల్ అంటూ రొమాన్స్ చేసింది. అయితే ఈ సినిమా కవి హదయాన్ని ప్రేక్షకులు అర్ధం చేసుకున్నారు కానీ బచ్చన్ కుటుంబం మాత్రం దీన్ని జీర్ణించుకోవడం బహుత్ ముష్కిల్ అంటూ ఆక్షేపించిందని వార్తలు వచ్చాయి.సైఫ్ అలీఖాన్ శ్రీమతి కపూర్ వంశ వారసురాలు కరీనా కపూర్ కి అండ్ కా అనే సినిమాలో అర్జున్ కపూర్తో పండించిన డేరింగ్ రొమాన్స్ ప్రేక్షకుల్ని కట్టి పడేసింది. అర్జున్ కపూర్ ఆమె కన్నా 20ఏళ్లు చిన్నవాడు కావడం విశేషం. అలాగే బ్రదర్స్ సినిమాలోనూ తనకన్నా 10ఏళ్ల చిన్నవాడైన సిద్ధార్థ్ మల్హోత్రాతో జోడీ కట్టడం ద్వారా కరీనా అలాంటి సాహసాలకు తాను వెనుకాడేది లేదని తేల్చి చెప్పింది.టాలీవుడ్ ప్రిన్స్తో కలిసి వారణాసి ద్వారా టాలీవుడ్కి వస్తున్న ప్రియాంక చోప్రా తన కన్నా నాలుగేళ్లు చిన్నవాళ్లయిన హీరో రణవీర్ సింగ్, అర్జున్ కపూర్ ఇద్దరితోనూ వేర్వేరు సినిమాల్లో సందడి చేసింది. ఇలా 5ఏళ్ల లోపు చిన్నవాళ్లతో నటించిన వారిలో రాణిముఖర్జీ(షాహిద్ కపూర్తో) శృతిహాసన్(గిరీష్ కుమార్తో) కొంకణా సేన్ శర్మ(రణబీర్ కపూర్తో)...ఇలా జాబితా ఎక్కువగానే ఉంది.వీళ్లందరూ ఒకెత్తయితే ఫిఫ్టీ ప్లస్ లో కూడా సింగిల్గా ఉంటూ ప్రేక్షకులను తరగని గ్లామర్తో కట్టిపడేస్తున్న టబు తన కన్నా వయసులో ఏకంగా పాతికేళ్లు చిన్నవాడైన ఇషాన్ ఖట్టర్తో రొమాన్స్ చేసి అందరికీ షాకిచ్చింది. ఆమెకు అతడు ‘ సూటబుల్ బాయ్’ అనే దర్శక నిర్మాతల అభిప్రాయం ఎలా ఉన్నా ఈ సినిమా విమర్శకుల నోళ్లకు బాగానే పనిచెప్పింది.వృద్ధ హీరోల పక్కన కుర్ర హీరోయిన్లను చూపడానికి, చూడడానికి అలవాటు పడింది దక్షిణాది చిత్ర పరిశ్రమ. ఇప్పుడిప్పుడే ఇక్కడ సమ వయస్కుడైన హీరో తో హీరోయిన్లు నటించడం వరకూ కొంచెం మార్పు కనిపిస్తోంది. ఇక తమకన్నా వయసులో బాగా చిన్నవారి పక్కన నటించడం అనేది మన సౌత్లో ఇప్పట్లో సాధ్యం కాకపోవచ్చు.పెళ్లికైనా, ప్రేమకైనా మగవాళ్ల వయసు మహిళల కన్నా ఎక్కువ ఉండాలనే సంప్రదాయం నుంచే సినిమా పాత్రలు కూడా పురుడు పోసుకున్నాయి. అయితే ప్రస్తుతం మారుతున్న సామాజిక పరిస్థితులతో పాటు సినిమా పాత్రల తీరుతెన్నులు కూడా కొత్త రూపు సంతరించుకుంటున్నాయి. మరోవైపు నడివయసులోనూ యువతులకు థీటుగా గ్లామరస్గా కనిపించే హీరోయిన్లు పెరగడం కూడా దీనికి దోహదం చేస్తోంది. -
'అందుకే బాలీవుడ్ వదిలేయాల్సి వచ్చింది.. కానీ'.. వారణాసి బ్యూటీ
బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా ప్రస్తుతం టాలీవుడ్ బిగ్ ప్రాజెక్ట్లో కనిపించనుంది. రాజమౌళి- మహేశ్ బాబు కాంబోలో వస్తోన్న వారణాసిలో హీరోయిన్గా నటిస్తోంది. ఈ అడ్వెంచరస్ మూవీ కోసం ప్రిన్స్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రియాంక ప్రస్తుతం ది బ్లఫ్ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఆమె నటించిన ఈ చిత్రం ఫిబ్రవరి 25న అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ కానుంది.ఈ నేపథ్యంలోనే ది బ్లఫ్ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉంది ప్రియాంక చోప్రా. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రియాంక హాలీవుడ్కి వెళ్లడంపై మాట్లాడింది. నేను బాలీవుడ్ను వదిలి వెళ్లాలని ఎప్పుడూ అనుకోలేదని తెలిపింది. హిందీ చిత్రాలలో పనిచేస్తున్నప్పుడు చాలా కారణాల వల్ల పరిమితంగానే ఫీలయ్యానని పేర్కొంది. అందువల్లే హాలీవుడ్లో అడుగుపెట్టాల్సి వచ్చిదంని వెల్లడించింది. ఇండియన్ సినిమాల్లో చేయడం అంటే తనకు చాలా ఇష్టమని.. వారణాసిలో నటిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందని ప్రియాంక చోప్రా తెలిపింది.ప్రియాంక చోప్రా మాట్లాడుతూ..' నేను హిందీ చిత్రాలలో పనిచేస్తున్నప్పుడు చాలా కారణాల వల్ల పరిమితంగా భావించా. నా కెరీర్ మరింత విస్తరించాలనుకున్నా. అందుకే హాలీవుడ్లో పనిచేశా. కానీ బాలీవుడ్ని వదిలి వెళ్లాలని ఎప్పుడూ అనుకోలేదు. పరిమితమైన అవకాశాలే రావడంతో ప్రాజెక్టుల విషయంలో కొంత ఒత్తిడికి గురయ్యా. అలాంటి పరిస్థితుల్లోనే హాలీవుడ్లోకి అడుగుపెట్టా. నాకు భారతీయ సినిమాలంటే చాలా ఇష్టం. ఇప్పుడు రాజమౌళి సార్తో వారణాసి చేస్తున్నందుకు సంతోషంగా ఉంది' అని తెలిపింది. -
అదే చివరి సినిమా అనుకున్నా.. రూ.1 కోటి పారితోషికం!
కొన్ని సినిమాలు కెరీర్నే మలుపు తిప్పుతాయి. బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీకి మున్నాభాయ్ ఎంబీబీఎస్ అలాంటి సినిమానే! హీరో సంజయ్ దత్కు రైట్ హ్యాండ్గా ఉంటూ తన కామెడీ టైమింగ్, డైలాగులతో కడుపుబ్బా నవ్విస్తాడు. వీరి కాంబినేషన్ ప్రేక్షకులకు ఎంతగానో నచ్చింది. ఇప్పటికీ ఈ సినిమా టీవీలో వస్తుందంటే చాలామంది కన్నార్పకుండా చూస్తుంటారు. ఎంతిస్తే అంత చాలనుకున్నా..ఈ మూవీ తన కెరీర్లోనే టర్నింగ్ పాయింట్ అంటున్నాడు బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ. తాజాగా పింక్విల్లాతో మాట్లాడుతూ.. మున్నా భాయ్ సినిమాకంటే ముందు నేను పెద్దగా సంపాదించిందంటూ ఏమీ లేదు. ఎంతిస్తే అంత చాలనుకుని సినిమాలు చేసుకుంటూ పోయాను తప్ప ఎన్నడూ మంచి పారితోషికం కోసం గొడవపడలేదు. మున్నా భాయ్ ఎంబీబీఎస్ రిలీజయ్యాక కరోజు దర్శకనిర్మాత విపుల్ షా నాకు ఫోన్ చేశాడు. మున్నా భాయ్ MBBS మూవీలో ఒక దృశ్యంరెమ్యునరేషన్ రూ.1 కోటిఇక మీదట నువ్వు చేసే సినిమాలకు రూ.1 కోటి కంటే ఒక్క రూపాయి తక్కువ తీసుకున్నా నిన్ను ఊరికే వదిలిపెట్టను. నీ టాలెంట్ నీకు తెలియట్లేదు. ఎందుకిలా చేస్తున్నావు? అని క్లాస్ పీకాడు. అప్పుడు నా మేనేజర్తో ఎవరైనా అడిగితే నా రెమ్యునరేషన్ కోటి రూపాయలు అని చెప్పమన్నాను. అప్పటినుంచే నాకు కొంచెం ఎక్కువ డబ్బు రావడం మొదలైంది. నిజానికి మున్నాభాయ్ సినిమా ఆఫర్ నాకంటే ముందు చాలామందికి వెళ్లింది. నేను కూడా మంచి పొజిషన్లో ఉంటే రిజెక్ట్ చేసేవాడినేమో!చివరి సినిమా అనుకున్నా..ఇదే నా చివరి సినిమా అవుతుందనుకున్నాను. ఎందుకంటే మళ్లీ గూండాలా నటించమనే ఆఫర్లు వస్తాయి.. వాటిని చేయడం నావల్ల కాదని డిసైడయ్యాను. అనూహ్యంగా సినిమాకు మంచి స్పందన లభించింది. నాకు ఎంతో పేరు తీసుకొచ్చింది అని అర్షద్ వార్సీ చెప్పుకొచ్చాడు. ఇకపోతే మున్నాభాయ్ ఎంబీబీఎస్కు రీమేక్గా తెలుగులో శంకర్దాదా MBBS తెరకెక్కగా ఇక్కడ కూడా ఘన విజయం అందుకుంది.చదవండి: కూతురు పుట్టిన ఏడాదికి పాప ఫోటో షేర్ చేసిన అంబటి అర్జున్ -
11 ఏళ్ల వయసు, అర్థరాత్రి క్యాబ్లో వెళ్తుంటే.. : ప్రియాంక చోప్రా
తనకు 11 ఏళ్ల వయసు ఉన్నప్పుడు జరిగిన ఓ సంఘటన గురించి తాజాగా మీడియాతో షేర్ చేసుకుంది ప్రియాంక చోప్రా. ఆమె నటించిన తాజా చిత్రం ‘ది బ్లఫ్’. త్వరలోనే ఈ చిత్రం నేరుగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల కాబోతుంది. ఈ మూవీ ప్రమోషన్స్లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తనకు 11 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఢిల్లీలో జరిగిన ఓ సంఘటన గురించి చెబుతూ.. తల్లి మధు చోప్రా ధైర్యసాహసాలపై ప్రశంసలు కురిపించింది.‘మేము ఒకరోజు ఢిల్లీలోని ఓ హోటల్ నుంచి క్యాబ్లో బయటకు వెళ్తున్నాం. అర్థరాత్రి 11 గంటలు అవుతుంది. క్యాబ్లో అమ్మ, నేను మాత్రమే ఉన్నాం. కొంచెం దూరం వెళ్లిన తర్వాత క్యాబ్ డ్రైవర్ సడెన్గా రూట్ మార్చాడు. వేరే దారిలోకి కారుని తీసుకెళ్లాడు. ఆ దారిలో ఎవరూ లేకపోవడంతో ‘ఈ వైపు ఎందుకు వెళ్తున్నావు’ అని అమ్మ అడిగితే..‘షార్ట్కట్’ అని డ్రైవర్ సమాధానం ఇచ్చాడు. అమ్మకు అనుమానం వచ్చింది. ప్రమాదాన్ని ముందే పసిగట్టి, వెంటనే వెనుక సీట్లో కూర్చోనే క్యాబ్ డ్రైవర్ గొంతు గట్టిగా పట్టుకుంది. మెయిన్ రోడ్డుపైకి వెళ్లాలని హెచ్చరించింది. అంతటి ఆగకుండా డ్రైవర్ని చెప్పదెబ్బ కొట్టిమరీ.. మెయిన్ రోడ్డు వైపుకి వచ్చేలా చేసింది. ఆ సమయంలో అమ్మ గట్టిగా అరిచింది కూడా. ‘టీనేజ్ వయసున్న నా కూతురితో ఉన్నాను. మర్యాదగా మెయిన్ రోడ్డువైపు వెళ్లండి’ అని సీరియస్ అయింది. అమ్మను అలా చూసి షాకయ్యాను. దాదాపు నాలుగు నెలల వరకు ఆమెను వాదించేందుకు సాహసం చేయలేదు. బహుషా ఒంటరిగా ఉంటే అమ్మ అంత గట్టిగా అరిచేది కాకపోవచ్చు. భయపడేది కూడా. కానీ పక్కన నేను ఉండడంతో..తల్లిలోని రక్షించే గుణం బయటకు వచ్చింది. అమ్మలో అలాంటి యాంగిల్, అంత ధైర్యాన్ని ఎప్పుడూ చూడలేదు’ అని ప్రియాంక చెప్పుకొచ్చింది. ‘ది బ్లఫ్’ విషయానికొస్తే.. ఫ్రాంక్ ఈ ఫ్లవర్స్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఫిబ్రవరి 25 నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. 19వ శతాబ్దపు కరీబియన్ నేపథ్యంలో సాగే ఈ కథలో తన కుటుంబాన్ని కాపాడుకునేందుకు పోరాడే మహిళగా ప్రియాంక కనిపించనున్నారు. ప్రస్తుతం ప్రియాంక.. రాజమౌళి దర్శకత్వంలో మహేశ్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ‘వారణాసి’లో హీరోయిన్గా నటిస్తోంది. -
ధురంధర్.. ఆ సీన్ అయిపోగానే ఏడ్చేశారు: మాధవన్
బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాసిన చిత్రం ధురంధర్. రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ 2025 డిసెంబర్ 5న విడుదలవగా ప్రపంచవ్యాప్తంగా రూ.1350 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా షూటింగ్లో జరిగిన ఓ ఆసక్తికర విషయాన్ని తాజాగా ఆర్. మాధవన్ బయటపెట్టాడు.దుఃఖం ఆపుకోలేకపోయారుఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ఉగ్రవాద ముఠాని పెంచి పోషించే రెహమాన్ బలోచ్ పాత్రలో అక్షయ్ ఖన్నా, పాకిస్తాన్ మేజర్గా అర్జున్ రాంపాల్ నటించారు. సినిమాలో 26/11 ముంబై దాడుల సన్నివేశాన్ని చిత్రీకరించగానే అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్ ఒక్కసారిగా ఏడ్చేశారు. షూటింగ్ అయ్యేవరకు బాధను గొంతులోనే దిగమింగుకున్నారు. దర్శకుడు కట్ చెప్పిన మరుక్షణం కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. అలాంటి పాత్రలు పోషించినప్పుడు వాటి ప్రభావం వారిపై కొన్నిరోజులపాటు ఉంటుంది అని చెప్పుకొచ్చాడు.సినిమాధురంధర్ విషయానికి వస్తే ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో రణ్వీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, ఆర్. మాధవన్ కీలక పాత్రలు పోషించారు. సారా అర్జున్ కథానాయికగా నటించింది. ఈ బ్లాక్బస్టర్ మూవీకి సీక్వెల్గా తెరకెక్కుతున్న ధురంధర్ 2 మార్చి 19న విడుదల కానుంది.చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన హారర్ మూవీ -
బాడీబిల్డర్ ఆ హీరో... బెండకాయ తిన్నా అరగదు....
పుష్టిగా కండలు తిరిగి ఉన్నవారిని చూస్తే సాధారణంగా ఆరోగ్యవంతులు అనుకుంటాం. ఎలాంటివి తిన్నా జీర్ణం చేసుకోగల సామర్ధ్యం ఉందని కూడా భావిస్తాం. కానీ అది నిజం కాదని కొంత మంది కండల వీరులు మనకి చెప్పకనే చెబుతుంటారు. అలాంటి కండల వీరుడే జాన్ అబ్రహాం. బాలీవుడ్ హీమ్యాన్స్లో ఒకరుగా పేరొందాడు. తెరమీద ప్రత్యర్ధుల బెండు తీసే ఈ హీరోకి కనీసం బెండకాయను తిని కూడా అరిగించుకునే శక్తి లేదట. సాక్షాత్తూ జాన్ అబ్రహాం ఫిట్నెస్ ట్రైనరే ఇటీవల ఈ విషయం వెల్లడించాడు.సెలబ్రిటీ ట్రైనర్ వినోద్ చన్నా ఇటీవల ఓ పోడ్ కాస్టర్తో మాట్లాడుతూ ‘‘జాన్ అబ్రహం గ్లాడ్ రాగ్స్ సూపర్ మోడల్గా ఉన్నప్పుడు నా దగ్గర శిక్షణ పొందేందుకు వచ్చాడు. ఆ సమయలలో అతను రివటలా, చాలా సన్నగా ఉండేవాడు. తాను అందాల పోటీల్లో పాల్గొంటున్నాను కాబట్టి కేవలం 1-2 నెలల్లో భారీగా కండలు తిరిగిన శరీరంగా తనను మార్చాలని కోరుకున్నాడు. అప్పటికే అతను 67 నెలల నుంచి వ్యాయామం చేస్తున్నాడు. ఆ తర్వాత నేను అతనిని 92 కిలోల బరువు, కండలు తిరిగిన బాడీ బిల్డర్గా తయారు చేశాను’’అంటూ ఆయన గుర్తుచేసుకున్నాడు. ఈ సందర్భంగా జాన్ అబ్రహం... ఫిజిక్లోని విశిష్టతలను కూడా అతను వివరించాడు. జాన్ శరీరం వ్యాయమ సమయంలో చాలా వేగంగా స్పందిస్తుందనీ, అతని అబ్స్ (ఉదర కండరాలు) ఒక వేలు లోతు కలిగి ఉంటాయని చెప్పాడు. అయితే అతని 100 శాతం ఫిజిక్ ఏ సినిమాలోనూ చూపించలేదని ట్రైనర్ అభిప్రాయపడ్డాడు. దాదాపు 90 కిలోల కంటే ఎక్కువ బరువు ఉన్నప్పటికీ కేవలం 45 శాతం ఫ్యాట్ మాత్రమే ఉండడం అంటే అలాంటి కండలు తిరిగిన శరీరం నమ్మశక్యం కాదని అది జాన్కి మాత్రమే స్వంతమని కొనియాడాడు. దీనికి కారణమైన జాన్ ఆహారపు అలవాట్లను వివరిస్తూ, 53 ఏళ్ల వయసులోనూ ఈ ఫిజిక్ మెయిన్టెయిన్ చేసేందుకు జాన్ చాలా కఠినంగా ఉంటాడని చెప్పాడు. కఠినమైన డైట్ కారణంగా ప్రస్తుతం అతని శరీరం కొన్ని ఆహారాలను జీర్ణం చేసుకోలేకపోతుందని తెలిపాడు. ‘‘ జాన్ అబ్రహాం... శాఖాహారి, కానీ అతను గుడ్లు మాత్రం ఆహారంగా తీసుకుంటాడు. అతను డైట్ విషయంలో మరీ ఎక్కువ కఠినంగా ఉంటాడు. అతను కొంచెం కూడా చక్కెర తినడు. ఒకవేళ తింటే అతనికి దగ్గు వస్తోంది. అలా కొన్ని ఆహార పదార్ధాల పట్ల అతని శరీరం మరీ సెన్సిటివ్గా మారిపోయింది. అందుకే నేను అతనికి అలా దేన్నీ కూడా పూర్తిగా ఆపవద్దని సలహా ఇస్తుంటాను’’ అంటూ వివరించాడు.‘అతను చాలా సంవత్సరాలుగా కఠినమైన డైట్లో ఉన్నాడు. అతను బెండకాయ కూర తింటే అతనికి కడుపునొప్పి వచ్చేస్తుంది. ఎందుకంటే తను చాలా సంవత్సరాలుగా వాటిని తినలేదు కాబట్టి మీరు అస్సలు తిననిది ఏదైనా అకస్మాత్తుగా తనలోకి వస్తే, శరీరం దానిని జీర్ణించుకోదు ఎందుకంటే అది ఒక నిర్దిష్ట ఆహారానికి బాగా అలవాటు పడింది. అందుకే నేరుగా చక్కెర కాకపోయినా, నేను అతనికి కొంత బెల్లం లేదా చక్కెర లను మరో రూపంలో తినమని చెబుతున్నాను’’ అంటూ జాన్ అభ్రహాం ట్రైనర్ వెల్లడించాడు. ఏదేమైనా అతి సర్వత్రా వర్జయేత్ అని పెద్దవాళ్లు ఊరికే చెప్పలేదు. ప్రకృతి సిద్ధమైన సహజ ఆహారం కూరగయాల్ని కూడా అరిగించుకోలేని జాన్ అబ్రహాం పరిస్థితి...డైట్ రూట్లో ఉన్నవారికి తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సిన సంగతే. -
'అందుకేగా నిన్ను పెళ్లి చేసుకుంది' రూమర్స్కు చెక్ పెట్టిన నటి
హిందీ బిగ్బాస్ సీజన్ 1 ఓటీటీ విన్నర్ దివ్య అగర్వాల్, భర్త అపూర్వ పడ్గోయంకర్ మధ్య విభేదాలు తలెత్తాయని, వీరు విడిపోతున్నారని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ రూమర్స్కు ఫుల్స్టాప్ పెట్టింది దివ్య. పెళ్లిరోజు సందర్భంగా భర్తతో కలిసున్న ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.హ్యాపీ యానివర్సరీ మై లవ్నువ్వు నన్ను ఎంతగానో అర్థం చేసుకుంటావ్.. అందుకేగా నేను నిన్ను పెళ్లి చేసుకుంది. నేనేంటో, ఎలాంటిదాన్నో నీకు బాగా తెలుసు. నన్ను అది మార్చుకో, ఇది మార్చుకో అని నువ్వెప్పుడూ చెప్పలేదు. నన్ను నన్నుగా ఇష్టపడ్డావు. హ్యాపీ యానివర్సరీ మై లవ్.. ఇలాంటి పెళ్లిరోజులు మనమెన్నో జరుపుకోవాలి. నా ప్రతి ఆలోచన తనకు తెలుసు, కాబట్టి తనకు నాగురించి ఎటువంటి భయం లేదు అని రాసుకొచ్చింది. ఈ పోస్ట్కు పలువురు సెలబ్రిటీలు స్పందిస్తూ హ్యాపీ యానివర్సరీ అని కామెంట్లు చేస్తున్నారు.అసలేమైంది?దివ్య ఇటీవలే ద 50 అనే రియాలిటీ షోకి హాజరైంది. అయితే ఈ షోలోని మరో కంటెస్టెంట్ భవ్య సింగ్.. దివ్యపై సంచలన ఆరోపణలు చేసింది. ఆమె భర్తతో కలిసుండటం లేదని ఆరోపించింది. తను షోకి వచ్చినప్పటికీ భార్య కోసం అపూర్వ ఒక్క పోస్ట్ కూడా పెట్టలేదని, ఇక్కడే వారి దాంపత్య జీవితం ఎలా ఉందో తెలిసిపోతుందని విమర్శలు గుప్పించింది. దీంతో దివ్య దంపతులు విడిపోతున్నారంటూ రూమర్స్ రాగా వాటిని నటి టీమ్ కొట్టిపారేసింది. ఆ ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని క్లారిటీ ఇచ్చింది. View this post on Instagram A post shared by Divyaa Agarwal (@divyaagarwal_official) -
ఏడేళ్లు విడివిడిగా నిద్ర.. మా ఇద్దరికీ స్లీప్ డివోర్స్: నటి
బాలీవుడ్ నటి అర్చన పూరణ్ సింగ్ అటు వెండితెర, ఇటు బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తోంది. ఇవేవీ కాకుండా సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్గా ఉంటుంది. యూట్యూబ్లో ఫ్యామిలీతో కలిసి వీడియోలు చేస్తోంది. ఎటువంటి మొహమాటం లేకుండా పర్సనల్, ప్రొఫెషనల్.. అన్ని విషయాలను పంచుకుంటోంది. ఐ లవ్యూ చెప్పుకోవడం కాదుతాజాగా ఆమె మాట్లాడుతూ.. ప్రేమ అనేది ఐ లవ్యూ చెప్పుకోవడంలో కాదు, దాన్ని చూపించడంలో ఉంటుంది. అయితే పెరుగుతున్న వయసును బట్టి ఈ ప్రేమ రూపాలు కూడా మారుతుంది. ఇప్పుడు మా పిల్లలు ఎదిగిపోయారు. కాబట్టి మరోసారి మేమిద్దరం కలిసి కబుర్లు చెప్పుకునే వీలు దొరికింది. నాకు ఆలస్యంగా పడుకోవడం అలవాటు. తనేమో త్వరగా నిద్రపోతాడు. చిన్న పనులే..అతడికి డిస్టర్బ్ అవకూడదని నేను ఎటువంటి శబ్ధాలు చేయను. హెడ్ఫోన్స్ పెట్టుకునే పాటలు వింటాను. పొద్దున ఆయన త్వరగా లేస్తాడు. అప్పుడు నేనింకా నిద్రలోనే ఉంటాను కాబట్టి తను కూడా నన్ను డిస్టర్బ్ చేయడు. సైలెంట్గా తన పనులు తాను చేసుకుంటాడు. ఈ చిన్నచిన్న పనులే ప్రేమను సూచిస్తాయి.ఈ లెక్కన విడాకులైనట్లే!నా భర్తకు గురక అలవాటు ఉంది. నాకేమో చిన్న అలికిడి అయినా చటుక్కున లేస్తాను. మళ్లీ నిద్రలోకి జారుకోవడం చాలా కష్టం. అందుకే భర్త పక్కన నేను పడుకోలేను. నిజానికి ఇది చాలా పెద్ద సమస్య. దీన్ని స్లీప్ డివోర్స్ అంటారు. ఐదు నుంచి ఏడేళ్లపాటు మేమిద్దరం ఇలాగే విడివిడిగానే నిద్రపోయాం. ఈ లెక్కన విడాకులు తీసుకున్నట్లే! (నవ్వుతూ)జీవితం చాలా చిన్నదిగత 10-15 ఏళ్లలో మా మధ్య ఇగో పూర్తిగా నశించిపోయింది. ముందు నువ్వే సారీ చెప్పాలన్న వాదన అనేదే మా మధ్య లేదు అని చెప్పుకొచ్చింది. అర్చన భర్త, నటుడు పర్మీత్ మాట్లాడుతూ.. జీవితం చాలా చిన్నది. ఇంకా ఎన్ని పండుగలు, బర్త్డేలు ఉన్నాయని? ప్రతిదానికి గొడవపడుతూ కూర్చుంటే జీవితమే చేజారిపోతుంది. అన్నింటినీ పక్కనపెట్టి సంతోషంగా బతికేయాలి అని చెప్పుకొచ్చాడు.చదవండి: అజిత్, విజయ్ మధ్య శతృత్వం? క్లారిటీ ఇచ్చిన షాలిని -
ధనుష్ ఆ రోజు నా కోసం.. ఓ కారణముంది: మృణాల్
సీతారామం, హాయ్ నాన్న తదితర సినిమాలతో తెలుగు ప్రేక్షకుల్ని అలరించిన మృణాల్ ఠాకుర్.. అంతకు ముందు హిందీ సీరియల్స్తో పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం బాలీవుడ్లో మూవీస్ చేస్తూ బిజీగా ఉంది. ఈమె గ్లామర్ గురించి ఎప్పుడూ సోషల్ మీడియాలో డిస్కషన్ నడుస్తూనే ఉంటుంది. అలాంటిది గత కొన్నిరోజుల నుంచి మాత్రం తమిళ స్టార్ హీరో ధనుష్తో ఈమె బంధం గురించి తెగ రూమర్స్ వచ్చాయి. ఏకంగా పెళ్లి చేసుకుంటారని కూడా మాట్లాడుకున్నారు. అంతకు ముందు మృణాల్ చేసిన ఓ ప్రీమియర్లో ధనుష్ కనిపించడమే దీనికి కారణం. అయితే ఆ రోజు ధనుష్ ఎందుకు వచ్చాడనేది ఇప్పుడు మృణాల్ బయటపెట్టింది.(ఇదీ చదవండి: లెస్బియన్ పాత్రలో రష్మిక?)'నేను ధనుష్ సర్కి పెద్ద అభిమానిని. ఆయన చేసిన రాయన్, మారి, రాంఝానా, కెప్టెన్ మిల్లర్ సినిమాలు చూశాను. ముఖ్యంగా 'అసురన్' అయితే ఎన్నిసార్లు చూశారో లెక్కలేదు. ఆయన నటన అద్భుతం. మిగతా యాక్టర్స్ నుంచి బెస్ట్ ఫెర్ఫార్మెన్స్ రాబట్ట గల సత్తా కూడా ఆయన సొంతం. నటుడిగానే కాకుండా గీత రచయిత, సింగర్, డ్యాన్సర్, డైరెక్టర్ కూడా. 'తేరే ఇష్క్ మే' షూటింగ్ జరుగుతున్న టైంలో సర్.. మా 'సన్ ఆఫ్ సర్దార్ 2' స్క్రీనింగ్కి వస్తారా? అని అడిగాను. ఆయన వస్తారని అస్సలు అనుకోలేదు. నిజంగానే ఆయన రావడం చాలా సంతోషంగా అనిపించింది. భవిష్యత్లో ఆయనతో కలిసి పనిచేయాలని కోరుకుంటున్నాను' అని ఓ ఎఫ్ఎమ్ ఛానెల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.అంతకు ముందు ఓ ఇంటర్వ్యూలో పెళ్లి రూమర్స్ గురించి మాట్లాడిన మృణాల్.. అసలు ఇదంతా ఎవరు మొదలుపెట్టారో కూడా నాకు తెలియదు. ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వకపోయినా నా పేరు మీద ఏవేవో రాశారు. అది చూసి నేను కూడా ఆశ్చర్యపోయాను అని చెప్పింది. ఇష్టమైతే వచ్చే ఏడాది పెళ్లి చేసుకుంటానని, కాకపోతే అంతలోపు తాను నేర్చుకోవాల్సినవి, చేయాల్సినవి కొన్ని ఉన్నాయని పేర్కొంది. ఈమె హీరోయిన్గా చేసిన హిందీ మూవీ 'దో దివానే షెహర్ మే' ఈ రోజే థియేటర్లలోకి వచ్చింది.(ఇదీ చదవండి: ఆ హీరోని చూసి నా ఎక్స్ భాయ్ఫ్రెండ్ భయపడ్డాడు: మృణాల్)Actress #MrunalThakur on #Dhanush! "He is a genius! He is a multi-talented. I would like to work with him definitely. After watching his movie, I became a huge fan of his works."pic.twitter.com/s7B65LPvil— Star Talkies (@startalkies_ofl) February 20, 2026 -
అమ్మ ఉగ్రరూపం.. పీక పట్టుకుని చెంప పగలగొట్టింది!
గ్లోబల్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా "ద బ్లఫ్" సినిమాతో ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో నేటి (ఫిబ్రవరి 20) నుంచే అందుబాటులోకి వచ్చింది. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్లో ప్రియాంక తన తల్లి మధు చోప్రా ధైర్యసాహసాలపై ఆసక్తికర కామెంట్స్ చేసింది.పక్కదారి పట్టడంతో..ప్రియాంక మాట్లాడుతూ.. అప్పుడు నాకు 11 ఏళ్లు ఉంటాయనుకుంటాను. ఒకసారి ఢిల్లీలో ఉండగా రాత్రిపూట అమ్మ, నేను బయటకు వెళ్లాం. క్యాబ్ బుక్ చేసుకుని కొంత దూరం వెళ్లగానే సడన్గా అమ్మ ముఖం ఎర్రబడింది. డ్రైవర్ పీక పట్టుకుని తిట్టడం మొదలుపెట్టింది. అతడు నెమ్మదిగా కారును మెయిన్ రోడ్ నుంచి మరోవైపు దారి తిప్పాడు. అది షార్ట్కట్ అని చెప్పాడు. 4 నెలలు కిక్కుమనకుండా..కారులో అమ్మ, నేను మాత్రమే ఉన్నాం. అమ్మ అతడి కాలర్ పట్టుకుని మెయిన్రోడ్ మీదుగానే కారును తీసుకెళ్లమని హెచ్చరించింది. అతడి చెంప కూడా పగలగొట్టింది. అమ్మను అలా ఉగ్రరూపంలో ఎన్నడూ చూడలేదు. ఆ సంఘటన తర్వాత దాదాపు నాలుగు నెలలవరకు ఎన్నడూ అమ్మతో గొడవపడలేదు. ఆరోజు నేను లేకపోయుంటే అమ్మ అంత సీరియస్ అయ్యేదో? లేదో? కానీ, హోటల్కు తిరిగి రాగానే అమ్మ నిలువెల్లా వణికిపోయింది అని ప్రియాంక చోప్రా చెప్పుకొచ్చింది.చదవండి: మలయాళ మూవీ చథా పచ్చ రివ్యూ -
గర్వం... వారసత్వం
బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్ముఖ్ టైటిల్ రోల్లో నటిస్తూ, స్వీయ దర్శకత్వం వహిస్తున్న ద్విభాషా (హిందీ, మరాఠీ) చిత్రం ‘రాజా శివాజీ’. ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవితం ఆధారంగా రూపొందు తున్న సినిమా ఇది. ఇందులో సంజయ్ దత్, అభిషేక్ బచ్చన్ , మహేశ్ మంజ్రేకర్, సచిన్ ఖేడ్కర్, భాగ్యశ్రీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. జియో స్టూడియోస్, ముంబై ఫిల్మ్ కంపెనీ సంస్థల సమర్పణలో జ్యోతీ దేశ్పాండే, జెనీలియా దేశ్ముఖ్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది మే 1న రిలీజ్ కానుంది.ఫిబ్రవరి 19న ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా ‘రాజా శివాజీ’ సినిమా కొత్తపోస్టర్ను రిలీజ్ చేశారు మేకర్స్. ‘మన రాజు మన గర్వం... మన వారసత్వం’ అంటూ ‘ఎక్స్’ వేదికగా ఈ సినిమాపోస్టర్ను షేర్ చేశారు రితేష్. హిందీ, మరాఠీ భాషలతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని ΄్లాన్ చేస్తున్నారని బాలీవుడ్ సమాచారం. -
6సార్లు శివాజీగా మెప్పించిన యాక్టర్.. కొడుకు పేరు జహంగీర్!
ఛత్రపతి శివాజీ.. ఈ పేరు వినగానే తెలియని ధైర్యం ఒంట్లోకి వస్తుంది. తన మతాన్ని, సామ్రాజ్యాన్ని కాపాడుకోవడానికి ప్రాణాలకు సైతం తెగించి పోరాడిన ధీరశాలి. నేడు (ఫిబ్రవరి 19న) శివాజీ మహారాజ్ జయంతి. ఈ సందర్భంగా వెండితెరపై ఆరుసార్లు శివాజీగా వేషం వేసి మెప్పించిన నటుడెవరో చూసేద్దాం..ఆరు సార్లు శివాజీగా..ప్రముఖ నటుడు, రచయిత, నిర్మాత చిన్మయ్ మాండ్లేకర్.. ఒకటీ రెండుసార్లు కాదు, ఏకంగా ఆరుసార్లు వెండితెరపై శివాజీ పాత్రను పోషించాడు. ఫర్జంద్, ఫత్తేశికస్త్, పవన్కైండ్, షేర్ శివరాజ్, సుబేదార్, శివరాయంచ అనే ఆరు మరాఠి సినిమాల్లో శివాజీగా వేషం కట్టాడు. కానీ ఒకే ఒక్క సంఘటన వల్ల ఇకపై ఎన్నటికీ శివాజీగా కనిపించనని సంచలన నిర్ణయం తీసుకున్నాడు.అసలేం జరిగిందంటే?మరాఠి నటుడు చిన్మయ్ మాండ్లేకర్.. శివాజీ పాత్రలో నటించినందుకుగానూ ప్రత్యేక గుర్తింపు, ఆదరణ పొందాడు. కానీ ఆయన కుమారుడికి జహంగీర్ అనే పేరు పెట్టాడు. ఆ విషయం బయటకు వచ్చినప్పటి నుంచి తనపై విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. కుటుంబం మొత్తానిపై విమర్శలు వచ్చాయి. దీంతో మనస్తాపం చెందిన చిన్మయ్.. ఈ ట్రోలింగ్ అన్యాయం అంటూ ఓ వీడియో షేర్ చేశాడు. సంచలన నిర్ణయంవృత్తిపరంగా విమర్శలు చేస్తే ఓకే కానీ, వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేయడం బాధాకరం అని విచారం వ్యక్తం చేశాడు. తన కొడుకు, భార్య క్యారెక్టర్పై ప్రజలు ప్రశ్నలు సంధిస్తున్నారని, ఇది తప్పని అభిప్రాయపడ్డాడు. శివాజీ మహారాజ్ అంటే తనకు ఎంతో గౌరవం అని, ఇకపై ఆయన పాత్రను వెండితెరపై చేయనని సంచలన నిర్ణయం తీసుకున్నాడు.కుమారుడికి ఆ పేరు ఎందుకంటే?మరి కుమారుడికి జహంగీర్ పేరు ఎందుకు పెట్టాడంటే? జహంగీర్ జంషెడ్ నవ్రోజ్లో జన్మించాడు. భారతరత్న జహంగీర్ రతన్జీ దాదాభాయ్ టాటా స్ఫూర్తితో కుమారుడికి జహంగీర్ అని పేరు పెట్టాడు. ఇక చిన్మయ్ మాండ్లేకర్.. హిందీలో తేరే బిన్ లాడెన్, సమీర్, ద కశ్మీర్ ఫైల్స్, గాంధీ గాడ్సే: ఏక్ యుధ్ సినిమాల్లో నటించాడు. కాలాపాణి, దల్దల్ వంటి వెబ్ సిరీస్లలోనూ యాక్ట్ చేశాడు.చదవండి: ఓటీటీలో థ్రిల్లర్ వెబ్ సిరీస్... రిలీజ్ ఎప్పుడంటే? -
ది కేరళ స్టోరీ సీక్వెల్ సెన్సార్ పూర్తి.. డైరెక్టర్ రియాక్షన్ ఇదే
సుదీప్తో సేన్ డైరెక్షన్లో వచ్చి ది కేరళ స్టోరీ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆదా శర్మ కీలక పాత్రలో తెరకెక్కంచిన ఈ మూవీ సూపర్ హిట్గా నిలిచింది. ఎన్ని విమర్శలొచ్చినా కలెక్షన్ల వర్షం కురిపించింది. తాజాగా ఈ మూవీకి సీక్వెల్గా ది కేరళ స్టోరీ-2 ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ చేయగా.. ముగ్గురు హిందూ అమ్మాయిల కథగా ఈ సినిమాను రూపొందించినట్లు తెలుస్తోంది.తాజాగా ఈ మూవీ సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ యూ/ఏ సర్టిఫికేట్ జారీ చేసింది. ఈ సందర్భంగా మూవీ డైరెక్టర్ కామాఖ్య నారాయణ్ సింగ్ సెన్సార్ బోర్డ్కు కృతజ్ఞతలు తెలిపారు. సెన్సార్ ఆమోదించిన కట్స్ ఈ సినిమాను మరింత ఎక్కువమంది ప్రేక్షకులు చూడటానికి మార్గం సుగమం చేశాయని అన్నారు. కుటుంబంతో కలిసి థియేటర్కు వచ్చి సినిమా చూడాలని అన్నారు.కామాఖ్య నారాయణ్ సింగ్ మాట్లాడుతూ.. 'మేము సెన్సార్ చెప్పిన కట్స్ను ఆమోదం తెలిపాం. అందుకే U/A సర్టిఫికేట్ వచ్చింది. మన టీనేజ్ సోదరీమణులు, మన కుమార్తెలు సినిమా హాళ్లకు వెళ్లి చూడటానికి వీలుగా సర్టిఫికేట్ ఇచ్చినందు సెన్సార్ బోర్డుకు నా కృతజ్ఞతలు. యువకులు, తల్లిదండ్రులు కూడా థియేటర్కు వెళ్లి సినిమా చూడాలి' అని అన్నారు. కాగా.. ది కేరళ స్టోరీ 2 చిత్రంలో ఉల్కా గుప్తా, అదితి భాటియా, ఐశ్వర్య ఓజా ప్రధాన పాత్రలు పోషించారు. మొదటి చిత్రం ది కేరళ స్టోరీలో ఆదా శర్మ, సోనియా బలానీ, యోగితా బిహానీ, సిద్ధి ఇద్నానీ నటించారు. ఈ చిత్రానికి సుదీప్తో సేన్ ఉత్తమ దర్శకుడిగా జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకోగా, ప్రశాంతను మోహపాత్ర ఉత్తమ సినిమాటోగ్రఫీ అవార్డ్ అందుకున్నారు.. -
జైళ్లలో స్మోకింగ్ జోన్ ఉండాలి: రాజ్పాల్ యాదవ్
చెక్ బౌన్స్ కేసులో తీహార్ జైలుకు వెళ్లిన ప్రముఖ హాస్య నటుడు రాజ్పాల్ యాదవ్ తాత్కాలిక బెయిల్పై బయటకు వచ్చాడు. అనంతరం జైలు సౌకర్యాలపై కీలక వ్యాఖ్యలు చేశాడు. రైల్వే స్టేషన్స్, విమానాశ్రాయాల మాదిరిగా జైళ్లలోనూ పొగ తాగేందుకు ప్రత్యేక ప్రాంతాలు (స్మోకింగ్ జోన్స్) ఏర్పాటు చేయాలన్నాడు. జైళ్లు కేవలం శిక్షా కేంద్రాలుగా కాకుండా ఖైదీలు తమ తప్పులను సరిదిద్దుకుని మారేందుకు వీలైన సంస్కరణ కేంద్రాలుగా ఉండాలని అభిప్రాయపడ్డాడు. బయట నుంచి చూసేవారికి ఎవరు కరడుగట్టిన నేరస్థులు, ఎవరు పొరొపాటున నేరం చేసి వచ్చారో అర్థం కాదని తెలిపాడు. ప్రస్తుతం తన ఇంట్లో వివాహ వేడుక ఉందని, ఆ సెలబ్రేషన్స్ పూర్తయ్యాక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి పూర్తి వివరాలు వెల్లడిస్తానన్నాడు. ప్రస్తుతం సింపతీ సాధించడం కన్నా డబ్బు సంపాదించమే ముఖ్యమని పేర్కొన్నాడు.ఏం జరిగింది?రాజ్పాల్ యాదవ్, ఆయన భార్య రాధపై మురళీ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ 2017లో చెక్ బౌన్స్ కేసు పెట్టింది. తమ వద్ద తీసుకున్న రూ.5 కోట్లు తిరిగివ్వడం లేదని, పైగా ఇచ్చిన చెక్లు కూడా బౌన్స్ అయ్యాయని ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. దీంతో 2018లో ఈ చెక్బౌన్స్ కేసులో ఢిల్లీ మెజిస్ట్రేట్ కోర్టు రాజ్పాల్ దంపతులను దోషులుగా తేల్చింది. నటుడికి ఆరు నెలల జైలు శిక్ష విధించింది.2019లో సెషన్స్ కోర్టు ఈ శిక్షను సమర్థించింది. దీన్ని సవాలు చేస్తూ రాజ్పాల్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. ఫిర్యాదుదారుడికి డబ్బు చెల్లిస్తానంటూ స్టే తెచ్చుకున్నాడు. కానీ, వాగ్ధానం ప్రకారం డబ్బు తిరిగి చెల్లించకపోవడంతో న్యాయస్థానం సీరియస్ అయింది. కోర్టు ఆదేశాల మేరకు నటుడు తీహార్ జైలులో లొంగిపోయాడు. ఫిర్యాదుదారునికి రాజ్పాల్ యాదవ్ రూ.1.5 కోట్లు డిపాజిట్ చేయడంతో ఢిల్లీ హైకోర్టు మార్చి 18 వరకు ఆయన శిక్షను సస్పెండ్ చేసింది. తాత్కాలిక బెయిల్ మంజూరు చేయడంతో ఫిబ్రవరి 17న నటుడు విడుదలయ్యాడు. కాగా రాజ్పాల్ యాదవ్.. హంగామా, భూల్ భూలయా, డ్రీమ్ గర్ల్ 2, బేబీ జాన్ వంటి అనేక హిందీ చిత్రాల్లో నటించాడు. కిక్ 2 సినిమాతో తెలుగువారికి పరిచయమయ్యాడు.చదవండి: ఆ హీరోను చూసి నా మాజీ ప్రియుడు భయపడ్డాడు: మృణాల్ -
ఆ హీరోని చూసి నా ఎక్స్ భాయ్ఫ్రెండ్ భయపడ్డాడు: మృణాల్ ఠాకూర్
‘సీతారామం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్. ఆ ఒక్క సినిమాతో టాలీవుడ్లో స్టార్ హీరోయిన్ల సరసన నిలిచింది. ఆ తర్వాత హాయ్ నాన్నతో తెలుగు ఆడియన్స్కి మరింత దగ్గరైంది. ప్రస్తుతం తెలుగులో డెకాయిట్తో పాటు బాలీవుడ్లోనూ పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా మారిపోయింది. తాజాగా ఈ బ్యూటీ..తన బ్రేకప్ స్టోరీని వివరిస్తూ.. కెరీర్ ప్రారంభంలో జరిగిన ఓ సంఘటనను గుర్తు చేసుకుంది.బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కలిసి సూపర్ 30 సినిమా షూటింగ్లో పాల్గొనే సమయంలో తన బాయ్ఫ్రెండ్ అభద్రతా భావానికి గురయ్యాడని మృణాల్ వెల్లడించింది. అగ్రహీరోలతో నటించే అవకాశం రావడంతో.. ఎక్కడ తనని వదిలేస్తానేమో అనే భయంతో జిమ్కి వెళ్లి కండలు కూడా పెంచాడని, కానీ ఎంతో నిజాయితీగా ఉన్న ఆ బంధం నిలవలేదని మృణాల్ తెలిపింది.‘కెరీర్ ప్రారంభంలో నేను షూటింగ్కి వెళ్లిన ప్రతిసారి నా బాయ్ఫ్రెండ్ ఆందోళనకు గురయ్యేవాడు. స్టార్ హీరోల సినిమాల్లో నటించే అవకాశం వచ్చిన ప్రతిసారి తనను ఎక్కడ విడిచిపెడతానోనని.. తనని తాను నిరూపించుకునేందుకు ప్రయత్నించేవాడు. జిమ్కి వెళ్లి కండలు పెంచేవాడు. ఆ సమయంలో దాదాపు 15 కిలోలు తగ్గాడు. కానీ కొన్ని రోజులకు మళ్లీ బరువు అయ్యాడు. అతని వింత ప్రవర్తన చూసి ఆశ్చర్యపోయేదాన్ని. ఎందుకిలా చేస్తున్నావు అని అడిగితే.. ‘నీ చుట్టూ ఉండే హీరోలతో నేను కూడా పోటీ పడాలనుకున్నా. వాళ్లలాగా నేను కూడా అందంగా మారాలనుకున్నా. కానీ నావల్ల కాలేదు. అందుకే జిమ్ మనేశా’ అని చెప్పాడు. అందం, ఫిట్నెస్ విషయంలో ఇతరులతో పోల్చుకోవడం ఎంతటి మానసిక ఒత్తిడికి దారి తీస్తుందో ఆయనను చూస్తే అర్థమైంది. నేను ఎప్పుడూ అతడిని బరువు తగ్గమని లేదా మారమని అడగలేదు. కానీ తన చుట్టూ ఉన్న సినీ ప్రపంచమే అతడిలో అభద్రతా భావం పెంచింది. నేను ఎంతో నిజాయితీగా ఉన్నా.. ఆ బంధం నిలవలేకపోయింది’ అని మృణాల్ చెప్పుకొచ్చింది. కాగా, తాను సినిమాల్లో నటించడం ఇష్టంలేకనే బాయ్ఫ్రెండ్ బ్రేకప్ చెప్పాడని గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మృణాల్ చెప్పింది. -
ఆ హీరో తల్లి కాళ్లు కడిగి నీళ్లు తాగుతాడు!
బాలీవుడ్ నటుడు గోవిందా ఈ మధ్యకాలంలో సినిమా అప్డేట్స్ కన్నా వ్యక్తిగత విషయాలతోనే వార్తల్లో నిలుస్తున్నాడు. మరీ ముఖ్యంగా అతడి ఎఫైర్స్ గురించే ఎక్కువ ప్రచారం జరిగింది. భార్య సునీత అహూజాతో విడిపోతున్నాడని కూడా రూమర్స్ రాగా అదంతా ఉట్టి ప్రచారమే అని తేలిపోయింది.ఆయన నుంచే ప్రేరణఅయితే గోవిందా వ్యక్తిత్వం ఎంతో ఉత్తమమైనదని, ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నానంటున్నాడు నటుడి మేనల్లుడు వినయ్ ఆనంద్. తాజాగా ఓ పాడ్కాస్ట్లో విజయ్ ఆనంద్ మాట్లాడుతూ.. గోవిందా అంకుల్ను చూసి నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. నేనే కాదు, ఆయన ఇండస్ట్రీలో టాప్ పొజిషన్లో ఉన్నప్పుడు దేశం మొత్తం ఆయన నుంచి స్ఫూర్తి పొందింది.కాళ్లు కడిగి ఆ నీళ్లుఆయన్ను, ఆయన డ్యాన్స్ను కాపీ కొట్టని స్టార్ హీరోలు లేరు. డ్యాన్స్ రానివారు కూడా ఆయన్ను చూసి స్టెప్పులేయడం మొదలుపెట్టారు. అమ్మమ్మ (గోవిందా తల్లి) పుట్టినరోజు నాడు ఆమె కాళ్లు కడిగి ఆ నీళ్లను తాగేవాడు. అలాంటి గొప్ప వ్యక్తికి అవకాశాలు తగ్గిపోవడం చూసి చాలా బాధపడ్డాను. తనకోసం కొన్ని ఆఫర్లు తీసుకొచ్చినా చేసేవాడు కాదు. ఈవెంట్స్ చేయమని అడిగినా నిరాకరించేవాడు. తన కారణాలు తనకు ఉండొచ్చు. మా మధ్య 14 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉంది.ఎన్నడూ ప్రశ్నించలేదుఆయన నాకు మామయ్య అయినప్పటికీ ఎందుకిలా తీసుకొచ్చిన ఆఫర్స్ రిజెక్ట్ చేస్తున్నారని ఎన్నడూ ప్రశ్నించలేదు. ఆయన ఏం చెప్పినా ఓకే సర్ అంటుంటాను. దాదాపు 70 (హిందీ, భోజ్పురి) సినిమాల్లో హీరోగా నటించినా, పేరు, గుర్తింపు ఉన్నా ఆయన ముందు మాత్రం ఎప్పటికీ వినమ్రుడిగానే ఉంటాను అని చెప్పుకొచ్చాడు.చదవండి: బేబి గర్ల్ మూవీ రివ్యూ -
రామ్ చరణ్ 'పెద్ది'కి భారీ డిజిటల్, ఆడియో డీల్
రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్లో వస్తున్న 'పెద్ది' సినిమా మీద అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన నాన్-థియేట్రికల్ బిజినెస్ ఇప్పటికే హాట్ టాపిక్గా మారింది. నిర్మాత సతీష్ కిలారు ఈ సినిమాను ఏప్రిల్ 30న విడుదల చేయాలని ప్రయత్నిస్తున్నారు. రామ్ చరణ్ సరసన జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రానికి సంగీతం ఎఆర్ రెహమాన్ అందిస్తున్నారు. ఓటిటి మార్కెట్ డౌన్ కాకముందే డిజిటల్ హక్కుల డీల్ ఫినిష్ చేసుకోవడం నిర్మాతల అదృష్టమనే చెప్పాలి. ఆ రోజుల్లో దాదాపు రూ. 130 కోట్ల భారీ బడ్జెట్ పెట్టి పెద్ది(Peddi) చిత్రాన్ని కోనుగోలు చేసిందట ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్.ఆడియో హక్కులు మరో 18 కోట్ల మేరకు వచ్చాయి. శాటిలైట్ హక్కులు ఇంకా ఫైనల్ కాలేదు. కానీ మంచి మొత్తంలో వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమాను నేరుగా హిందీలో కూడా విడుదల చేయనున్నారు. అందువల్ల హిందీ డబ్బింగ్ అవసరం లేదు. కానీ హిందీ శాటిలైట్ హక్కులు వేరుగా ఉంటాయి. నాన్-థియేట్రికల్ ఆదాయం మొత్తం కలిపి 150 కోట్లకు పైగా వచ్చే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న 'పెద్ది' విడుదలకు ముందే మంచి బిజినెస్ చేస్తోందనే చెప్పాలి. -
ఆపరేషన్ సింధూర్పై మరో సినిమా.. వివేక్ అగ్నిహోత్రి రియాక్షన్ ఇదే..!
ఆపరేషన్ సిందూర్పై మరో సినిమా రానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ ఆపరేషన్ పేరుతో ఇప్పటికే ఓ సినిమా ఫిక్సయింది. తాజాగా మరో మూవీ సైతం రానుందని లేటేస్ట్ టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రానికి ది కశ్మీర్ ఫైల్స్ ఫేమ్ వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించనున్నారని బాలీవుడ్లో టాక్. అయితే దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటనైతే రాలేదు. త్వరలోనే ఈ ప్రాజెక్టు వివరాలు వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది.అయితే తనపై వస్తున్న ఈ రూమర్స్పై వివేక్ అగ్నిహోత్రి స్పందించారు. ఆపరేషన్ సిందూర్ ఆధారంగా రూపొందిస్తారని వస్తున్న వార్తలతో తనకు సంబంధం లేదన్నారు. ప్రస్తుతం తాను అతిపెద్ద జాతీయవాద ప్రాజెక్ట్పై పనిచేస్తున్నానని వెల్లడించారు. ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్ అని.. చాలా ఆసక్తికరంగా ఉంటుందని తెలిపారు. అయితే దీనికి సంబంధించి మరిన్ని వివరాలను వెల్లడించేందుకు వివేక్ నిరాకరించారు.తాజా న్యూస్ ప్రకారం టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్తో కలిసి వివేక్ అగ్నిహోత్రి 'ఆపరేషన్ సిందూర్' తెరకెక్కించున్నారని వార్తలొచ్చాయి. ఈ చిత్రానికి వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహిస్తారని టాక్ వచ్చింది. ఈ నేపథ్యంలోనే వివేక్ అగ్నిహోత్రి స్పందించారు. గతేడాది అగ్నిహోత్రి ది బెంగాల్ ఫైల్స్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు.మరోవైపు ఆపరేషన్ సిందూర్ పేరుతో దర్శకుడు ఉత్తమ్ నితిన్ సినిమాని ప్రకటించారు. ఈ మేరకు పోస్టర్ను కూడా విడుదల చేశారు. కాగా.. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ దాడి తర్వాత పాకిస్తాన్పై భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ పేరుతో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. పహల్గామ్ ఉగ్రదాడి ఘటన ఏప్రిల్ 22, 2025న జరిగింది. -
జీవితంలో ఒక్క పుస్తకం చదవలేదు: అక్షయ్ కుమార్
భార్య పుస్తకాల రచయిత్రి, కానీ తాను మాత్రం ఇంతవరకు ఒక్క పుస్తకం కూడా చదవలేదంటున్నాడు బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్. ప్రస్తుతం ఈయన హోస్ట్గా వ్యవహరిస్తున్న షో "వీల్ ఆఫ్ ఫార్చ్యూన్". తాజాగా ఈ షో ఎపిసోడ్లో ఓ ఆసక్తికర విషయం చెప్పాడు అక్షయ్. నా భార్య ట్వింకిల్ ఖన్నా రచయిత్రి. నాకు తెలిసి తను రోజుకొక పుస్తకం అయినా చదివేస్తుంది.పుస్తకం చదివిన పాపాన పోలేదునేను మాత్రం ఇంతవరకు జీవితంలో ఒక్క పుస్తకం కూడా చదవలేదు. కాకపోతే అందరి ముఖాల్ని ఇట్టే చదివేయగలను. మనుషుల్ని చదవడం కన్నా ఉత్తమమైనది మరొకటి లేదని నా అభిప్రాయం అని చెప్పుకొచ్చాడు. అక్షయ్ ప్రస్తతం భూత్ బంగ్లా అనే హారర్ కామెడీ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ ఏప్రిల్ 10న విడుదల కానుంది. అలాగే వెల్కమ్ టు ద జంగిల్ అనే మరో ప్రాజెక్ట్ అతడి చేతిలో ఉంది.సినిమాఅక్షయ్ భార్య ట్వింకిల్ ఖన్నా విషయానికి వస్తే.. బర్సాత్, జబ్ ప్యార్ కిస్సే హోతా హై, బాద్షా వంటి పలు సినిమాల్లో నటించింది. పెళ్లి తర్వాత సినిమాలు తగ్గించేసిన ఆమె పుస్తక రచయిత్రిగా మారింది. మిసెస్ ఫన్నీబోన్స్, పైజామాస్ ఆర్ పర్గివింగ్, వెల్కమ్ టు ప్యారడైజ్ వంటి ఎన్నో పుస్తకాలు రాసింది. ఇటీవల 'టూ మచ్ విత్ కాజోల్ అండ్ ట్వింకిల్ 'అనే షోకి సహ వ్యాఖ్యాతగానూ వ్యవహరించింది.చదవండి: రెండుసార్లు గుండెపోటు, వీల్చైర్కే పరిమితమయ్యా..: అనురాగ్ కశ్యప్ -
రెండుసార్లు గుండెపోటు, వీల్చైర్కే పరిమితం: దర్శకుడు
బాలీవుడ్ దర్శకుడు, నటుడు అనురాగ్ కశ్యప్ 2023లోనే రాసుకున్న కథ "కెనడీ". షూటింగ్ పూర్తయి చాలాకాలం అయిన ఈ సినిమా ఎట్టకేలకు ఓటీటీ ప్లాట్ఫామ్ జీ5లో ఈ శుక్రవారం (ఫిబ్రవరి 20) విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో అనురాగ్ కశ్యప్ తను కెరీర్లో ఎదుర్కొన్న ఇబ్బందులను పేర్కొన్నాడు.2009 నుంచి..అతడు మాట్లాడుతూ.. మాగ్జిమమ్ సిటీ ప్రాజెక్ట్ విషయంలో నేను చాలా బాధపడ్డాను. ఎందుకంటే ఆ ప్రాజెక్ట్ కోసం చాలా ఖర్చుపెట్టాం. 2009 నుంచి నా ధ్యాసంతా ఆ సినిమాపైనే! ఈ కథను నెట్ఫ్లిక్స్ చదవకుండానే ఓకే చెప్పేసింది. మీరు దేనికి ఓకే చెప్పారో ఒకసారి చూసుకోండి అంటే ఒక్కరు తప్ప ఎవరూ స్క్రిప్ట్ చదవలేదు.పక్కన పడేసిన నెట్ఫ్లిక్స్ఏడాదిన్నర కాలంలో నేను 900 పేజీలు రాశాను. నా స్క్రిప్ట్ నచ్చకపోయుంటే నెట్ఫ్లిక్స్ ముందే చెప్పొచ్చుగా! సైలెంట్గా ఉండిపోయింది. తర్వాత సడన్గా తమ పాలసీలో కొన్ని మార్పులు చేస్తున్నామంటూ పలు వెబ్ సిరీస్, సినిమాలను రద్దు చేసింది. అందులో నా ప్రాజెక్ట్ ఒకటి. అయితే దానికి పరిహారంగా వేరే స్క్రిప్ట్ పంపించి వాటిని డైరెక్ట్ చేయమని అడిగింది. అవి యావరేజ్గా ఉన్నాయని, నాకు కొంచెం సమయం ఇవ్వండని అడిగాను. రెండుసార్లు గుండెపోటువాళ్లు మాత్రం మా దగ్గర 4 నెలలపాటు యాక్టర్స్ డేట్స్ ఖాళీగా ఉన్నాయని ఒత్తిడి చేశారు. నాకు కొంచెం సమయం ఇస్తే తప్ప వాటిని చేయలేనని చెప్పాను. నేను రాసిన ఒక షో వారికి బాగా నచ్చింది. కానీ దాన్ని మనీ హీస్ట్ ఇండియన్ వర్షన్గా మార్చి రాయమన్నారు. వాళ్ల పద్ధతి నాకసలు నచ్చలేదు. చాలా బాధపడ్డాను. ఎక్కువ ఒత్తిడి, బాధ వల్ల రెండుసార్లు గుండెపోటు వచ్చింది. ఆస్తమాదాంతో రక్తం పలుచబడేందుకు మందులు వాడాను, కరోనా వ్యాక్సిన్ కూడా అప్పుడే తీసుకున్నాను. ఇవి నా శరీరంలో సైడ్ ఎఫెక్ట్స్ చూపించాయి. ఆస్తమా వచ్చింది. దానికోసం స్టెరాయిడ్స్ వాడాను. ఎక్కువ డోసు మందులు వాడేసరికి నాకు డ్రగ్స్ వాడినట్లే అనిపించింది. తాగడం మొదలుపెట్టాను. జంక్ఫుడ్ ఆర్డర్ పెడుతూ నచ్చినట్లు తిన్నాను. ఎనిమిది నెలల్లోనే 35 కిలోలు పెరిగాను. వీల్చైర్కే పరిమితంనన్ను చూసి నా కూతురు భయపడిపోయింది. రిహాబిలిటేషన్ సెంటర్కు పంపింది. అలా మూడుసార్లు రిహాబిలిటేషన్కు వెళ్లాను. ఒకసారి అక్కడ క్రికెట్ ఆడుతున్నప్పుడు నా కుడి కాలుకి దెబ్బ తగిలింది. రక్తం పలుచబడే మందులు వాడుతున్నందున సర్జరీ చేయడం కుదరదన్నారు. కొన్ని నెలలపాటు వీల్చైర్లో ఉన్నాను. నెమ్మదిగా కోలుకుని ఇప్పుడిలా ఉన్నాను అని అనురాగ్ కశ్యప్ చెప్పుకొచ్చాడు.చదవండి: మగవాళ్ల మందు పార్టీకి ఒంటరిగా రమ్మని పిలుపు: నటి -
మందుపార్టీకి ఒంటరిగా రమ్మన్నారు: బాలీవుడ్ నటి
ఒకప్పుడు సినిమాల్లో యాక్టివ్గా ఉన్న నటి వైష్ణవి మెక్డొనాల్డ్.. తర్వాత వెండితెరకు గుడ్బై చెప్పేసింది. గత కొంతకాలంగా బుల్లితెరపైనే సందడి చేస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సినిమాలకు దూరం కావడానికి గల కారణాన్ని వెల్లడించింది. వైష్ణవి మాట్లాడుతూ.. ఒక పెద్ద సినిమాలో ప్రధాన పాత్ర కోసం నన్ను ఎంపిక చేశారు. పోస్టర్స్, బ్యానర్స్ కూడా రెడీ అయ్యాయి. అందరూ మగవాళ్లే..కానీ తర్వాత మాత్రం మూవీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. కారణమేంటంటే.. నేను ఎక్కడికి వెళ్లిన అమ్మను వెంట తీసుకునే వెళ్తాను. కానీ ఓ సాయంత్ర కాలం మీటింగ్ కోసం ఒంటరిగా రమ్మన్నారు. ఆ పార్టీలో అందరూ మగవాళ్లే ఉంటారని, కలిసి మందు తాగొచ్చని చెప్పారు. నాకది నచ్చలేదు. అమ్మ ఎల్లప్పుడూ నా వెంటే ఉండటం వాళ్లకూ నచ్చలేదు. హీరోకి నాపై ఆసక్తిషూటింగ్ కోసం నేను స్విట్జర్లాండ్ వెళ్లాల్సి ఉంటుందని ఆ నిర్మాణ సంస్థ నాకు పాస్పోర్ట్ తీసిపెట్టింది. కానీ మా అమ్మకు మాత్రం పాస్పోర్ట్ రెడీ చేయలేదు. పైగా హీరోకు నాపై ప్రత్యేక ఆసక్తి ఉండేది. అతడి ప్రపోజల్ రిజక్ట్ చేయడంతో హీరో, దర్శకుడు, నిర్మాత కలిసి నన్ను సినిమా నుంచి తీసేశారు. అది చాలా పెద్ద సినిమా. నేను అందరితో పెద్దగా కలిసేదాన్ని కాదు. నా పని నేను చేసుకుంటూ పోయేదాన్ని. సినిమా నుంచి సీరియల్ఆచితూచి పాత్రల్ని ఎంపిక చేసుకునేదాన్ని. దాంతో రానురానూ ఆఫర్లు కూడా తగ్గిపోయాయి. ఆ సమయంలోనే శక్తిమాన్ సీరియల్కు ఓకే చెప్పాను. ఇది నా కెరీర్కు ఎంతో తోడ్పడింది అని చెప్పుకొచ్చింది. హిందీలో బాబుల్, సాంచా, మమ్మీ పంజాబీ, సూపర్ నాని వంటి పలు చిత్రాల్లో నటించింది. బుల్లితెరపై శక్తిమాన్, మే ఢిల్లీ హూ, కసౌటీ జిందగీ కే, మిలే జబ్ హమ్ తుమ్ వంటి పలు సీరియల్స్లో యాక్ట్ చేసింది.చదవండి: నా విజయానికి నా ప్రతిభ కారణం కాదు: చిరంజీవి ఎమోషనల్ పోస్ట్ -
నాగ చైతన్యతో గంగూలీ..జాన్ అబ్రహాం ఢీ
సినిమా తారలు, వెండితెర ప్రముఖులు తమ సినిమాల ద్వారా పోటీ పడడం అనేది దశాబ్ధాల తరబడి మనకు తెలిసిందే. అయితే ఇప్పుడు తారల సమరం సినిమాలను దాటేసింది. క్రికెట్లో ఐపీఎల్ అనేది ఎప్పుడైతే ఒక సక్సెస్ ఫార్ములాగా మారిందో.. అప్పుడే స్టార్ ఫైట్ సినిమాలను దాటి క్రీడలకూ విస్తరించింది. క్రికెట్, ఫుట్బాల్...తదితర క్రీడలన్నీ ఐపీఎల్ తరహాలోనే లీగ్స్ నిర్వహిస్తూంటే సినీ తారలు పలు క్రీడా జట్లకు అధిపతులుగా మారుతూ ఆటతో పాటు ఆదాయాన్ని కూడా అందుకుంటున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇదే తరహాలో కొత్తగా క్రీడాలోకంలో తెరకెక్కింది ఇండియన్ రేసింగ్ లీగ్. ఫార్ములా వన్ కార్ల తరహాలో సింగిల్ సీటింగ్తో తయారైన కార్లతో ప్రత్యేకంగా నిర్వహించే అంతర్జాతీయ మోటార్ స్పోర్ట్ ఇది.తొలిసారి మన దేశంలో జరుగుతున్న ఈ ఇండియన్ రేసింగ్ లీగ్ లో మొత్తం 6 టీమ్స్ పోటీపడుతున్నాయి. ఈ టీమ్స్కు పలువురు సినీ తారలు సారధ్యం వహిస్తుండడం విశేషం. ఈ పోటీలో టాలీవుడ్ టాప్ హీరో నాగ చైతన్య హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ టీమ్కు సారధిగా ఉన్నాడు. తొలి నుంచీ రేసింగ్ అంటే ఇష్టం చూపించే నాగ చైతన్య అదే క్రమంలో స్థానిక టీమ్ను దక్కించుకున్నాడు. ఆయనకు పోటీగా ఐఆర్ఎల్లో బాలీవుడ్ స్టార్ జాన్ అబ్రహం (గోవా ఏసెస్ జెఎ రేసింగ్), కన్నడ నటుడు కిచ్చా సుదీప్ (కిచ్చాస్ కింగ్స్ బెంగళూరు), మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ (కోల్కతా రాయల్ టైగర్స్) మరో బాలీవుడ్ స్టార్ అర్జున్ కపూర్(స్పీడ్ డెమన్స్ ఢిల్లీ) (చెన్నై టర్బో రైడర్స్)లు ఢీ కొడుతున్నారు. తాజాగా గోవాలో జరిగిన ఈ లీగ్ పోటీల్లో వీరు క్రీడ, వినోదం మిళితం చేసిన వారాంతానికి స్టార్ అట్రాక్షన్ జోడించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ యజమాని హోదాలో నాగ చైతన్య మాట్లాడుతూ, ‘‘మన దేశంలో ఈ క్రీడకు మద్దతు అంతకంతకూ పెరుగుతుండటం అద్భుతంగా ఉంది. గోవా లాంటి ఒక నగరంలో ఇలాంటి స్ట్రీట్ రేస్ నిర్వహించడానికి గట్టి ప్రయత్నం అభిరుచి అవసరం, దానిని సాధ్యం చేసినందుకు పాల్గొన్న ప్రతి ఒక్కరినీ అభినందిస్తున్నా. పోటీలు, గెలుపు సంగతి ఎలా ఉన్నా యువతకు ఒక వేదికను ఇవ్వడం ముఖ్యం అనేది నా అభిప్రాయం. మోటార్స్పోర్ట్ భారతదేశంలో ఇంకా కొత్త కావచ్చు, కానీ ఓర్పు నిరంతర ప్రోత్సాహంతో అది మరింత ఉన్నతంగా ఎదుగుతుంది. యువ డ్రైవర్లకు నేను శుభాకాంక్షలు’’ అంటూ చెప్పారు. పేరుకు తగినట్లుగా, ఇండియన్ రేసింగ్ ఫెస్టివల్ కేవలం క్రీడా పోటీ కి విభిన్నంగా కొనసాగాలని లక్ష్యంగా పెట్టుకుంది. నిర్వాహకులు వారాంతాన్ని జీవనశైలి కార్యక్రమంగా మారుస్తున్నారు. అత్యంత ఖరీదైన క్రీడగా పేరొందిన ఈ రేసింగ్ను మన దేశంలో ఊపు తేవడానికి సినిమా తారలు తమ వంతు ప్రయత్నం చేయడం అభినందనీయం. గత ఏడాది ఆగస్టులో కోయంబత్తూర్ వేదికగా ప్రారంభమైన ఈ లీగ్ గోవా పోటీలతో 4దశలు పూర్తి చేసుకుంది. వచ్చే మార్చి నెలలో ముంబైలో జరిగే తుది పోరులో విజేత జట్టు ఎవరో తేలనుంది. ప్రస్తుతానికి ఈ పోటీల్లో జాన్ అబ్రహాంకు చెందిన టీమ్, అర్జున్కపూర్ల టీమ్స్ ముందంజలో ఉండగా నాగచైతన్య టీమ్ పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో ఉంది. -
మగాళ్లకి వర్జిన్ భార్యలే కావాలి : నటి సంచలన కామెంట్స్
ఛోళీకే పీఛే క్యాహై అనే ఖల్నాయక్లో పాట గుర్తున్నవాళ్లకి మాధురీ దీక్షిత్, సంజయ్ దత్లతో సమానంగా గుర్తుండే మహిళ నీనాగుప్తా. సినిమాల్లో నటనకు మాత్రమే కాదు అత్యంత స్వేఛ్చాయుత వ్యక్తిగత జీవితం ద్వారా బాలీవుడ్ టాప్ స్టార్స్ కన్నా మిన్నగా ఆమె గుర్తొస్తారు. మహిళల వ్యక్తిగత స్వేఛ్చా స్వాతంత్య్రంపై ఆమె తరచుగా వెల్లడించే అభిప్రాయాల సందర్భంలో నీనా వ్యక్తిగత జీవితం కూడా చర్చనీయాంశంగా మారుతుంటుంది. ఆమె 30 సంవత్సరాల వయసులో పెళ్లికాకుండానే ఒంటరి తల్లి అయ్యింది. ఆమె కుమార్తె మసాబా రాకను సంతోషంగా స్వాగతించింది. వెస్టిండీస్ క్రికెటర్ వివ్ రిచర్డ్స్ తన బిడ్డకు తండ్రి అని ఆ తర్వాత వెల్లడించింది. ఆ తర్వాత కూడా ఆమె అంతే స్వేఛ్చగా తన జీవితం గడుపుతూ వస్తోంది. అయితే తన నిర్ణయాలతో తనకు బాగుండవచ్చునని, అందరినీ అదే దారి ఎంచుకోవాలనే సలహా తాను ఇవ్వబోనని తరచుగా ఆమె స్పష్టం చేస్తుంటారు. ఈ నేపధ్యంలో...మన దేశంలో మహిళలు ఇప్పటికీ ఎదుర్కొంటున్న వివక్షాపూరిత వాస్తవాల గురించి ప్రముఖ నటి నీనా గుప్తా మరోసారి కుండ బద్ధలు కొట్టారు. ఆధునిక సమాజపు ఆలోచనల్లో చాలా మార్పు వచ్చిందనీ, విశాల థృక్పధం గణనీయంగా అభివృద్ధి చెందిందనే ఆమె నిర్ధ్వందంగా తిప్పికొట్టారు. ఇటీవల ఓ మీడియాతో జరిపిన సంభాషణలో, ఈ సీనియర్ నటి పితృస్వామ్యం, పురుషాధిక్యత ఇప్పటికీ వివాహం తర్వాత మహిళల జీవితాలను ఎలా ప్రభావితం చేస్తున్నాయో ఆమె ఎత్తి చూపారు. ఈ సంభాషణ సందర్భంగా భారతీయ సంప్రదాయ సమాజంలో వధువు కన్యత్వం పట్ల ఇంకా కొనసాగుతున్న వ్యామోహాన్ని నీనా ప్రస్తావించారు. నేటికీ కన్యత్వం అంత ముఖ్యమైన అంశంగా ఉందా అని అడిగినప్పుడు, భారతదేశం గురించి మాట్లాడుతున్నావా? ఇక్కడ ఇప్పుడు ఏం మారింది? అంటూ ఎదురు ప్రశ్నించారు. ‘మగ వారు భార్యను కన్యగానే కోరుకుంటున్నారు‘ అని ఆమె అన్నారు. కొంత వరకూ నగరాల్లో, ఇంగ్లీష్ మాట్లాడే మగ వారు చూడడానికి చాలా విశాల మనస్తత్వం ఉన్నట్టు కనిపిస్తారని అయితే అది నిజం కాదని ఆమె స్పష్టం చేశారు. ’వారు కూడా కన్యనే భార్యగా కావాలని కోరుకుంటున్నారని వెల్లడించారామె.పరిస్థితులు మారిపోయాయనే ఊహను నీనా ప్రశ్నించింది. ‘మన దగ్గర జనం ఓపెన్గా ఉంటారని ఎలా అంటున్నారు? అదొక్కటే కాదు మన దేశంలో చాలా విషయాలు ఇప్పటికీ మారలేదు. మహిళలు ఇప్పటికీ తలపై కొంగు కప్పుకుని ఆ తర్వాత మామగారి పాదాలను తాకుతారు. ఇక్కడ నువ్వూ నేనూ మైనారిటీలం, మనం నిజమైన భారతదేశం కాదు. చక్కగా దుస్తులు ధరించి, చక్కగా మాట్లాడే మనలాంటి వారు భారతదేశం కాదు.‘ అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారామె. తన అభిప్రాయాన్ని బలపరిచేలా నీనా తన సొంత కుటుంబంలోని కొన్ని సంఘటనలను పంచుకున్నారు.‘నేను మీకు ఒక ఉదాహరణ ఇస్తాను. నా తండ్రి వైపు ఉన్న ఒక బంధువుల అమ్మాయి ముంబైలో ఒక పెద్ద సంస్థలో పనిచేసే వ్యక్తిని వివాహం చేసుకుంది. ఒకసారి నా తండ్రి ఆ అబ్బాయి, అమ్మాయి ఆమె కుటుంబాన్ని తన ఇంటికి మాట్లాడటానికి పిలిచాడు. ఎందుకంటే ఆ అమ్మాయి ముంబైలో ఆ అబ్బాయి, అతని కుటుంబంతో ఇకపై నివసించడానికి నిరాకరించింది. ఆ అమ్మాయి అలాంటి వివక్ష ఎదుర్కుంది మరి. కనీసం తనకు నచ్చిన దేవుడ్ని పూజించడానికి కూడా ఆ అమ్మాయిని అనుమతించలేదట. ఆ అమ్మాయి సాయి బాబా అంటే ఇష్టం కాబట్టి బాబా ఫొటోను తన గదిలో ఉంచితే ఆమె అత్తగారు దానికి కూడా అనుమతించలేదు. తాము పూజించే ఓ గురువు ఫొటోనే పెట్టాలని ఆదేశించింది‘ అని ఆమె గుర్తు చేసుకున్నారు.తర్వాత ఆమె మరొక సంఘటనను ఉదహరించారు. ‘నేను మీకు మరో ఉదాహరణ ఇస్తాను. ఇది నా మేనకోడలికి సంబందించింది. ఆమెను ఆమె అత్తగారు తన కుటుంబ ఫోటోను తన పడక టేబుల్పై పెట్టుకోవద్దని అడ్డుకున్నారు’’ అంటూ పంచుకున్నారామె. ఏదేమైనా దేశంలోని మహిళల స్థితిని మార్చే విషయంలో మనం ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది అని అభిప్రాయపడ్డారు. -
ప్రముఖ హీరో ఇంట తీవ్ర విషాదం.. తండ్రి కన్నుమూత
ఇండస్ట్రీలో విషాదం. బాలీవుడ్ స్టార్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా తండ్రి కన్నుమూశారు. నాలుగు రోజుల క్రితమే ఇది జరిగినప్పటికీ.. కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియాలో సిద్ధార్థ్ ఎమోషనల్ పోస్ట్ పెట్టేసరికి అందరికీ ఈ విషయం తెలిసింది. ఈ క్రమంలోనే హిందీ సెలబ్రిటీలు అందరూ తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. నివాళి అర్పిస్తున్నారు.(ఇదీ చదవండి: హీరోయిన్తో క్లోజ్గా ఉండే పాత్ర అని పిలిచి అవమానించారు)స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్, ఏక్ విలన్, షేర్ షా తదితర సినిమాలతో హీరోగా కాస్త గుర్తింపు తెచ్చుకున్న సిద్ధార్థ్ మల్హోత్రా తండ్రి సునీల్ మల్హోత్రా.. ఫిబ్రవరి 14న ఢిల్లీ తుదిశ్వాస విడిచారు. నిద్రలోనే కన్నుమూశారు. ఈ విషయం తెలిసిన వెంటనే భార్య కియారా అడ్వానీతో కలిసి ఢిల్లీ వెళ్లిన సిద్ధార్థ్.. అక్కడే అంత్యక్రియలు కూడా పూర్తి చేశారు. కష్టకాలంలో కుటుంబంతో కలిసి ఉన్నారు. నాన్న చనిపోయిన విషయాన్ని మర్చిపోలేకపోతున్న సిద్ధార్థ్.. మంగళవారం రాత్రి ఇన్ స్టాలో పోస్ట్ పెట్టాడు. నాన్నతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుని బోలెడన్ని ఫొటోలని పంచుకున్నాడు.'ఆయన నిజాయతీ కలిగిన వ్యక్తి. ఎప్పుడూ తలవంచలేదు. జీవితం ఆయన్ని పరీక్షించినప్పుడు కూడా బలంగా నిలబడ్డారు. మర్చంట్ నేవీ కెప్టెన్గా సముద్రాన్ని శాసించడం దగ్గర నుంచి అనారోగ్యాన్ని ఎదుర్కోవడం వరకు ఎప్పుడూ ఒకేలా ఉండేవారు. స్ట్రోక్ వల్ల ఆయన వీల్ ఛైర్కే పరిమితమైనప్పటికీ బలంగా నిలబడ్డారు. మీ పాజిటివిటీ ఇప్పటికీ ఈ కుటుంబాన్ని కలిపి ఉంచుతోంది. నిద్రలోనే మమ్మల్ని మీరు వదిలి వెళ్లారు. మీరు లేని లోటు తీరనిది. మీ వల్లే నేను ఇలా ఉన్నాను. ఎప్పటికీ మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటాను నాన్న' అని సిద్ధార్థ్ రాసుకొచ్చాడు.(ఇదీ చదవండి: సరైన న్యాయం దక్కలేదు.. సుప్రీం తీర్పుపై ప్రత్యూష తల్లి ఆవేదన) View this post on Instagram A post shared by Sidharth Malhotra (@sidmalhotra) -
తీవ్ర విషాదం.. 'రెడీ' నటి కన్నుమూత
బాలీవుడ్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటి ప్రవీణ దేశ్పాండే (60) కన్నుమూశారు. గత ఐదేళ్లుగా క్యాన్సర్తో బాధపడుతున్న ఆమె.. మంగళవారం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని ప్రవీణ కుటుంబ సభ్యులు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.ప్రవీణ దేశ్పాండే 2019లో మల్టిపుల్ మైలోమా (బ్లడ్ క్యాన్సర్ రకం) బారిన పడ్డారు. అయినప్పటికి ఓ వైపు చికిత్స పొందుతూనే తన నటనను కొనసాగించారు. 2023లో కొంత కాలం విరామం తర్వాత ఆమె మళ్లీ మేకప్ వేసుకున్నారు. ఆమె చివరిగా ఇటీవల విడుదలైన 'తస్కరీ' (Taskaree) వెబ్ సిరీస్లో ఆతిది పాత్రలో కన్పించారు. తన హుందాతనమైన నటనతో ఈ సిరీస్లోనూ ఆకట్టుకున్నారు. అయితే ఇటీవల ఆమె ఆరోగ్య పరిస్ధితి మరింత క్షీణించింది. ఈ క్రమంలోనే దేశ్పాండే ప్రాణాలు విడిచారు. ముఖ్యంగా సల్మాన్ ఖాన్ నటించిన 'రెడీ' చిత్రంలో ఆమె పోషించిన పాత్ర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆమె కేవలం వెండితెరపైనే కాకుండా, అనేక సూపర్ హిట్ హిందీ, మరాఠీ సీరియల్స్లో నటించి ఇంటింటికీ సుపరిచితురాలయ్యారు. ఆమె 'పరమాణుస, 'జలేబీస, 'ఏక్ విలన్' వంటి చిత్రాలలో ఆమె సహాయ నటిగా అలరించారు. ఆమె మృతి పట్ల సినీ & టీవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ సంతాపం వ్యక్తంచేసింది.


