breaking news
Bollywood
-
తమన్నా ఐటం సాంగ్కు 100 కోట్ల వ్యూస్..
ఓ పక్క సినిమాలు చేస్తూనే మరోపక్క ఐటం సాంగ్స్తో వైరల్ అవుతోంది తమన్నా భాటియా. అలా ఆమె స్పెషల్గా స్టెప్పులేసిన పాట ఒకటి వన్ బిలియన్ వ్యూస్ వ్యూస్ దాటింది. అదే 'స్త్రీ 2' మూవీలోని 'ఆజ్ కీ రాత్'. ఈ విషయాన్ని మిల్కీబ్యూటీ సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తూ అందరికీ కృతజ్ఞతలు తెలిపింది. 'ఫస్ట్ వ్యూ నుంచి 1 బిలియన్ (100 కోట్ల) వరకు.. మీ ప్రేమకు థాంక్స్' అని రాసుకొచ్చింది.సినిమాతమన్నా 2005లో హీరోయిన్గా కెరీర్ మొదలుపెట్టింది. శ్రీ మూవీతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. హ్యాపీ డేస్తో గుర్తింపు తెచ్చుకుంది. 100% లవ్, బద్రీనాథ్, రచ్చ, ఎందుకంటే ప్రేమంట, ఆగడు, బాహుబలి, ఎఫ్ 2, ఎఫ్ 3 వంటి పలు సినిమాల్లో యాక్ట్ చేసింది. చివరగా ఓదెల 2 మూవీలో నటించింది. ప్రస్తుతం హిందీలోనే మూడు సినిమాలు చేస్తోంది.ఐటం సాంగ్తో మరింత క్రేజ్అల్లుడు శీను మూవీలో 'రావే నా లబ్బర్ బొమ్మ' అనే ఐటం సాంగ్లో తొలిసారి స్టెప్పులేసింది. జై లవకుశలో 'స్వింగ్ జర', సరిలేరు నీకెవ్వరులో 'డాంగ్ డాంగ్', జైలర్లో 'నువ్వు కావాలయ్యా..', స్త్రీ 2లో 'ఆజ్ కీ రాత్', రైడ్ 2లో 'నషా' వంటి ఐటం సాంగ్స్తో తమన్నా ఫుల్ పాపులర్ అయిపోయింది. View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) చదవండి: మన శంకరవరప్రసాద్గారు నాలుగు రోజుల కలెక్షన్స్ ఎంతంటే? -
విరాట్ కోహ్లీ, అనుష్క ఫెస్టివ్ వైబ్ : రూ. 38 కోట్ల ఆస్తి కొనుగోలు
భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మ కు సంబంధించిన ఒక శుభవార్త ప్రస్తుతం నెట్టింట సందడిగామారింది. అలీబాగ్లోని రాయ్గఢ్ జిల్లాలో ఐదు ఎకరాలకు పైగా భూమిని కొనుగోలు చేశారు. సీఆర్ఈ (CRE) మ్యాట్రిక్స్ ఆస్తి పత్రాల ప్రకారం, దీని విలువ 37.86 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా.మహరాష్ట్రలోని రాయ్గడ్ జిల్లా (402201)లోని అలీబాగ్లోని గాట్ నంబర్లు 157 158లోని విలేజ్ జిరాద్లో ఈ భూమి ఉంది. రిజిస్టర్డ్ సేల్ డీడ్ ప్రకారం, మొత్తం భూమి 21,010 చదరపు మీటర్లు లేదా దాదాపు 5.19 ఎకరాలు ఉంటుంది. ఈ లావాదేవీ జనవరి 13, 2026న రిజిస్టర్ చేశారు. సోనాలి అమిత్ రాజ్పుత్ నుంచి అనుష్క, విరాట్ దంపతులు ఈ భూమిని కొనుగోలు చేసినట్టు CRE మ్యాట్రిక్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అభిషేక్ కిరణ్ గుప్తా వెల్లడించారు. నిబంధనల ప్రకారం విరాట్, అనుష్క రూ.2.27 కోట్ల స్టాంప్ డ్యూటీ చెల్లించారు. రిజిస్ట్రేషన్ ఫీజు రూ.30,000, డాక్యుమెంట్ హ్యాండ్లింగ్ ఛార్జీలు రూ.1,000గా నమోదయ్యాయి. ఇదీ చదవండి: పండగవేళ విషాదం : చేపలకోసం ఎగబడ్డ జనంమరోవైపు సెలబ్రిటీ జంట విరుష్క అలీబాగ్లో ఇదే తొలి రియల్ ఎస్టేట్ పెట్టుబడి కాదు. 2022లో, ఈ జంట 2022లో అలీబాగ్లో 19.24 కోట్ల రూపాయలకు దాదాపు 8 ఎకరాలు కొనుగోలు చేశారు. తరువాత ఈ జంట సంపాదించిన ప్లాట్లలో ఒక విలాసవంతమైన వెకేషన్ హోమ్ను నిర్మించారు. ఇదే ప్రాంతంలో ల్యాండ్ను కొనుగోలు చేసినవారిలో ప్రముఖ కొనుగోలుదారులలో బాలీవుడ్ నటుడు కార్తీక్ ఆర్యన్ కూడా ఉన్నారు. గత ఏడాది సెప్టెంబర్ 2025లో చాటౌ డి అలీబాగ్లో సుమారు రూ. 2 కోట్ల విలువైన 2,000 చదరపు అడుగుల ప్లాట్ను కొనుగోలు చేశారు. అలాగే బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కూడా ఈ ప్రాంతంలో భారీగా పెట్టుబడి పెట్టారు. 2024 ఏప్రిల్లో రూ. 10 కోట్లకు 10,000 చదరపు అడుగుల భూమిని కొనుగోలు చేశారు, ఆ తర్వాత అక్టోబర్ 2025లో రూ. 6.6 కోట్లకు మొత్తం 9,557 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న మూడు ఆనుకుని ఉన్న ప్లాట్లను కొనుగోలు చేశారు. షారుఖ్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్ కూడా అలీబాగ్లో వ్యవసాయ భూమిని కొనుగోలు చేసిన ప్రముఖులలో ఉండటం విశేషం.ఇదీ చదవండి: కన్నకూతుళ్లపై తండ్రి అఘాయిత్యం, 6 ఏళ్ల వయసు నుంచి -
ప్రభాస్ ఫ్యాన్స్కు గుడ్న్యూస్.. అప్పుడే స్పిరిట్ రిలీజ్..
పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రాల్లో స్పిరిట్ ఒకటి. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో త్రిప్తి డిమ్రి హీరోయిన్. వివేక్ ఒబెరాయ్, సీనియర్ నటి కాంచన కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా స్పిరిట్ రిలీజ్ డేట్ ప్రకటించారు. వచ్చే ఏడాది రిలీజ్2027 మార్చి 5న విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ మధ్యే స్పిరిట్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. అందులో ప్రభాస్ ఒళ్లంతా గాయాలై కట్టు కట్టి ఉంది. ఒంటిపై చొక్కా లేకుండా నిలబడ్డ ప్రభాస్.. చేతిలో మందు బాటిల్తో వైల్డ్గా కనిపించాడు. త్రిప్తి డిమ్రి అతడికి సిగరెట్ వెలిగిస్తూ కనిపించింది.సినిమాస్పిరిట్ నుంచి రిలీజైన వన్ బ్యాడ్ హ్యాబిట్ వాయిస్ ఓవర్ గ్లింప్స్ కూడా జనాలను ఎంతగానో ఆకట్టుకుంది. ఇకపోతే స్పిరిట్ మూవీలో ప్రభాస్ పోలీసాఫీసర్గా కనిపించనున్నాడు. ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నాడు. భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా, కృష్ణన్ కుమార్, ప్రభాకర్ రెడ్డి వంగా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా తొమ్మిది భాషల్లో ఈ మూవీని రిలీజ్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Prabhas (@actorprabhas) -
'టాక్సిక్' కోసం 'ధురంధర్ 2' వాయిదా? డైరెక్టర్ క్లారిటీ...
ధురంధర్.. బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తున్న సినిమా. ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన ఈ మూవీ 2025 డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మౌత్ టాక్తోనే బ్లాక్బస్టర్ కొట్టేసిన ఈ మూవీ ఇప్పటికీ థియేటర్లలలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. దీనికి సీక్వెల్గా ధురంధర్ 2 రాబోతున్నట్లు ప్రకటించారు.అదేరోజు టాక్సిక్ రిలీజ్ఇది మార్చి 19న విడుదల కానున్నట్లు ప్రచారం జరిగింది. అయితే యష్ టాక్సిక్ సినిమా కూడా అదే రోజు విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. దీంతో ఈ సినిమాతో పోటీకి వెనకడుగు వేస్తూ ధురంధర్ 2 వాయిదా పడ్డట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారానికి ఆదిత్య ధర్ ఫుల్స్టాప్ పెట్టాడు. అనుకున్న సమయానికే వస్తున్నామంటూ సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చాడు. డైరెక్టర్ క్లారిటీధురంధర్ సినిమాపై ఓ అభిమాని ప్రశంసలు కురిపిస్తూ మెసేజ్ చేశాడు. నిజం చెప్తున్నా.. ధురంధర్ మేనియా నుంచి బయటపడలేకపోతున్నా.. ఇప్పుడు రెండోసారి సినిమా చూశా.. మీరుర నిజంగా GOAT(గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్టైమ్) డైరెక్టర్, ధురంధర్ 2 కోసం ఎదురుచూస్తున్నా.. మీలాంటి దర్శకులు ఉండటం భారత్కు గర్వకారణం అని రాసుకొచ్చాడు. ఆదిత్య ఆ మెసేజ్కు రిప్లై ఇస్తూ.. థాంక్యూ.. మార్చి 19న మళ్లీ కలుద్దాం అన్నాడు.చదవండి: మల్టీస్టారర్ మూవీ.. నెలరోజుల్లో ఓటీటీలోకి.. -
సాయిపల్లవి బాలీవుడ్ ఎంట్రీ.. పోస్టర్తోనే విపరీతంగా ట్రోల్స్..!
భామ.. తమిళం, మలయాళంలోనూ నటించింది. ప్రస్తుతం బాలీవుడ్కు షిఫ్ట్ అయిన సాయిపల్లవి.. రామాయణతో పాటు ఏక్ దిన్ అనే మూవీలో కనిపించనుంది. ఈ సినిమాలో అమిర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాతోనే సాయి పల్లవి బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది.తాజాగా సంక్రాంతి కానుకగా ఏక్ దిన్ మూవీకి సంబంధించిన అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఏక్ దిన్ మూవీ పోస్టర్ను రిలీజ్ చేశారు. అయితే ఈ పోస్టర్ కాస్తా విమర్శలకు దారి తీసింది. ఇది చూస్తుంటే 2016లో వచ్చిన థాయ్ రొమాంటిక్ డ్రామా వన్ డేను పోలి ఉందని పలువురు సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. ఆ మూవీని కాపీ చేశారంటూ నెటిజన్లు విమర్శిస్తున్నారు.పేరుతో పాటు ఫస్ట్లుక్ పోస్టర్ వరకూ అన్నీ ఒకేలా ఉన్నాయంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అయితే దీనిపై ఇప్పటివరకు మేకర్స్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. మరి ఈ చిత్రం రీమేక్ చేయనున్నారా? లేదా కొత్త స్టోరీనా అనేది క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. లేదంటే కాపీ కంటెంట్ అనే విమర్శలొస్తూనే ఉంటాయి. ఈ మూవీని ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్పై నిర్మిస్తున్నారు. సునీల్ పాండే దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రాన్ని సమ్మర్లో మే 1న రిలీజ్ చేయనున్నారు. Amir Khan Production: Sai Pallavi’s Bollywood debut #EkDin is the remake of Thai Film #OneDay.Of late Why Amir Khan is behind remakes🤔#LalSinghChadha - Flop#Loveyapa - Flop#SithareZameenPar - Decent#EkDin - 🤞 pic.twitter.com/W0IuZ7bbZZ— Christopher Kanagaraj (@Chrissuccess) January 16, 2026 -
ఇండో-పాక్ వార్.. గూస్ బంప్స్ తెప్పిస్తోన్న బోర్డర్-2 ట్రైలర్
గతంలో రిలీజై సూపర్ హిట్గా నిలిచిన వార్ మూవీ బోర్డర్. దాదాపు 28 ఏళ్ల తర్వాత ఈ చిత్రానికి సీక్వెల్ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. సన్నీ డియోల్ కీలక పాత్రలో వస్తోన్న బోర్డర్-2.. రిపబ్లిక్ డే కానుకగా థియేటర్లలో రిలీజ్ కానుంది.ఇవాళ సంక్రాంతి కానుకగా బోర్డర్-2 ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ చూస్తే 1971లో జరిగిన ఇండో-పాక్ యుద్ధ నేపథ్యంలోనే ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ మూవీ అనురాగ్ సింగ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో వరుణ్ ధావన్, దిల్జీత్ దొసాంజ్ కీలక పాత్రల్లో నటించారు. -
అల్లుడు సెంచరీ.. మామయ్య ఫుల్ ఖుషీ..!
అల్లుడు కేఎల్ రాహుల్పై మామయ్య సునీల్ శెట్టి ప్రశంసలు కురిపించాడు. న్యూజిలాండ్తో జరిగిన వన్డే మ్యాచ్లో సెంచరీ కొట్టడంతో బాలీవుడ్ నటుడు కొనియాడారు. విభిన్నమైన స్థానం.. అదే ప్రశాంతత.. అదే వ్యక్తిత్వం అంటూ అల్లుడిని ఆకాశానికెత్తేశారు. ఆ స్కోర్ బోర్డ్లో ఈ సెంచరీ ప్రత్యేకంగా గుర్తుంటుందని అన్నారు. దీని వెనుక ఉన్న క్షణాలను సంయమనాన్ని నేను ఎప్పటికీ గుర్తుంచుకుంటానని సునీల్ శెట్టి పోస్ట్ చేశారు. నిన్ను చూస్తుంటే గర్వంగా ఉందంటూ ఇన్స్టాలో ఓ వీడియోను షేర్ చేశారు. ఇది చూసిన కేఎల్ ఫ్యాన్స్ సైతం శుభాకాంక్షలు చెబుతున్నారు.కాగా.. కేఎల్ రాహుల్.. సునీల్ శెట్టి కుమార్తె అతియా శెట్టిని పెళ్లాడిన సంగతి తెలిసిందే. వీరిద్దరికీ ఓ కుతూరు కూడా జన్మించింది. వీరి పెళ్లి వేడుకను సునీల్ తన ఫామ్ హౌస్లోనే గ్రాండ్గా నిర్వహించారు. ఈ పెళ్లి బాలీవుడ్ సినీ ప్రముఖులు, పలువురు క్రికెటర్లు సందడి చేశారు. కాగా.. కేఎల్ సతీమణి అతియా శెట్టి కేవలం మూడు సినిమాల్లో మాత్రమే నటించింది. View this post on Instagram A post shared by Suniel Shetty (@suniel.shetty) -
తట్టుకోలేకపోయా, గదిలో కూర్చుని ఏడ్చా..: షారూఖ్ కూతురు
కింగ్ షారూఖ్ ఖాన్ కూతురు సుహానా 'ద ఆర్చీస్' మూవీతో సినీప్రయాణాన్ని ప్రారంభించింది. ఇప్పుడేకంగా తండ్రితో కలిసి నటించబోతోంది. షారూఖ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న కింగ్ చిత్రంలో సుహానా కీలక పాత్ర పోషిస్తోంది. అయితే చిన్నప్పుడు యాక్టింగ్ అంటే ఆసక్తే ఉండేది కాదని, రానురానూ తన ఆలోచన మారిందని చెప్తోంది.ఒంటరిగా ఏడ్చా..తాజాగా ఓ ఇంటర్వ్యూలో సుహానా మాట్లాడుతూ.. చిన్నప్పుడు స్కూల్లో నాటకాల్లో పాల్గొనాలంటే అస్సలు ఇంట్రస్ట్ ఉండేది కాదు. కానీ, తర్వాత సడన్గా నాకు దానిపై ఆసక్తి పెరిగింది. ఓసారి స్కూల్లో వేయబోయే ఒక నాటకం కోసం ఆడిషన్ ఇచ్చాను, కానీ నేను కోరుకున్న పాత్రలో నన్ను సెలక్ట్ చేయలేదు. ప్రాధాన్యత లేని పాత్ర ఇచ్చారు. చాలా బాధపడ్డాను. గదిలో ఒంటరిగా కూర్చుని ఏడ్చాను. కింగ్ సినిమాలో..అప్పుడు నాకు యాక్టింగ్పై ఎంత ఇష్టం ఉందనేది తెలిసింది. స్టేజీపై పర్ఫామ్ చేస్తుంటే ఆ కిక్కే వేరు. ఆ ప్యాషన్ ఇప్పటికీ నన్ను ముందుకు నడిపిస్తోంది అని చెప్పుకొచ్చింది. కింగ్ సినిమా విషయానికి వస్తే.. సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తుండగా షారూఖ్ కూతురు సుహానా కీలక పాత్ర పోషిస్తోంది. దీపికా పదుకొణె కథానాయికగా నటిస్తోంది. 'కింగ్' షారూఖ్తో దీపికా నటిస్తున్న ఆరో సినిమా కావడం విశేషం! గతంలో వీరిద్దరూ ఓం శాంతి ఓం, చెన్నై ఎక్స్ప్రెస్, హ్యాపీ న్యూ ఇయర్, పఠాన్, జవాన్ సినిమాల్లో కలిసి నటించారు.చదవండి: 37 ఏళ్ల తర్వాత మొదటి హీరోను కలిసిన స్టార్ హీరోయిన్ -
తన వల్లే నా పెళ్లి జరిగింది: నుపుర్ సనన్
బాలీవుడ్ భామ, హీరోయిన్ కృతి సనన్ సిస్టర్ నుపుర్ సనన్ ఇటీవలే పెళ్లి చేసుకుంది. తన ప్రియుడైన స్టీబిన్ను పెళ్లాడింది ముద్దుగుమ్మ. మొదటి క్రిస్టియన్ సంప్రదాయంతో వివాహం చేసుకున్న బ్యూటీ.. ఆ తర్వాత హిందూ సంప్రదాయంలోనూ గ్రాండ్గా పెళ్లి వేడుకను జరుపుకుంది. ఈ పెళ్లిలో ఆదిపురుష్ బ్యూటీ కృతి సనన్ సందడి చేసింది. చెల్లి పెళ్లిలో అన్నీ తానై ముందుండి నడిపించింది.అయితే వీరిద్దరిదీ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అన్న సంగతి తెలిసిందే. దీంతో పెళ్లికి నుపుర్ సనన్ మదర్ ఒప్పుకోలేదు. ఆమె ససేమిరా అనడంతో కృతి సనన్ రంగంలోకి దిగింది. సిస్టర్ కోసం అమ్మను ఒప్పించి మరీ ఈ పెళ్లి జరిపించింది ముద్దుగుమ్మ. తాజాగా తన అక్క స్టీబిన్ గురించి తల్లిని ఎలా ఒప్పించిందో కూడా నుపుర్ సనన్ వెల్లడించింది. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన నుపుర్ ఈ విషయాన్ని పంచుకుంది.నుపుర్ సనన్ మాట్లాడుతూ.. "స్టీబిన్ గురించి నేను మొదట చెప్పింది నా సోదరికే. మా ఇద్దరి మధ్య ఐదేళ్ల వయస్సు తేడా ఉన్నప్పటికీ మేము చాలా క్లోజ్గా ఉంటాం. అంతేకాదు ప్రాణ స్నేహితులం కూడా. స్టీబిన్ వృత్తిపరంగా ఇప్పుడే కెరీర్ ప్రారంభించాడు. కాబట్టి కెరీర్ పరంగా చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేదు. నేను అతని గురించి ఒక వ్యక్తిగా ఎక్కువగా చెప్పా. తనకు అతని పాట వినిపించా. వెంటనే అతను అపారమైన ప్రతిభ ఉన్నవాడని కృతి చెప్పింది." అని తెలిపింది."కొన్ని నెలల తర్వాత ఈ విషయం మా అమ్మకు చెప్పా. చాలా మంది తల్లులలాగే ఆమె కూడా కొంచెం సంకోచించింది. అప్పుడే నా సోదరి రంగంలోకి దిగింది. నేను స్టీబిన్ను కలిశాను.. అతని పాటలు కూడా విన్నాను.. చాలా ప్రతిభావంతుడు.. కష్టపడి పనిచేసేవాడని అమ్మతో చెప్పింది. అలా తన మాటలతో అమ్మను మార్చేసింది. అక్కడి నుండి అంతా సజావుగా జరిగిపోయింది" అని పంచుకుంది. కాగా.. నుపుర్ సనన్- స్టీబిన్ పెళ్లి ఉదయపూర్ జరిగింది. ఈ వేడుకలకు సన్నిహిత కుటుంబ సభ్యులు, స్నేహితులు హాజరయ్యారు. -
ఈ చిన్నారిని గుర్తుపట్టారా? స్టార్ హీరోయిన్గా, వేశ్యగా..
ఫోటోలో కనిపిస్తున్న ఈ చిన్నారి ఒకప్పుడు స్టార్ హీరోయిన్. బాలీవుడ్లో అనేక సక్సెస్ సినిమాలు చేసిన ఈ బ్యూటీ తెలుగులోనూ ఒకటీరెండు సినిమాల్లో మెప్పించింది. ప్రాణాంతక క్యాన్సర్తో పోరాడి మహమ్మారిపై విజయం సాధించింది. మరి ఎవరో గుర్తుపట్టారా? తనే మనీషా కొయిరాలా.చిన్నతనంలోనే..చిన్నప్పుడు మహారాజు గెటప్ వేసిన ఫోటోను మనీషా కొయిరాలా సోషల్ మీడియాలో షేర్ చేసింది. అందులో గుబురు మీసం, పెద్ద బొట్టు, భారీ అలంకరణతో ఠీవీగా కనిపిస్తోంది. ఇది చూసిన అభిమానులు నటనను చిన్నప్పటి నుంచే పుణికి పుచ్చుకుందని కామెంట్లు చేస్తున్నారు. మనీషా.. ఫెరి బేతాల అనే నేపాలీ చిత్రంతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. సౌదగర్ మూవీతో బాలీవుడ్లో అడుగుపెట్టింది. సినిమాతక్కువకాలంలోనే స్టార్ హీరోయి్గా మారింది. 1942: ఎ లవ్స్టోరీ, అకేలే, హమ్ అకేలే తుమ్, ఖామోషి: ద మ్యూజికల్, దిల్సే, కంపెనీ, తాజ్ మహల్, భూత్ రిటర్న్స్ ఇలా అనేక సినిమాలు చేసింది. బాంబే, ఇండియన్ (భారతీయుడు), ముదల్వన్ (ఒకే ఒక్కడు), బాబా, మప్పిళ్లై వంటి చిత్రాలతో తమిళంలోనూ క్రేజ్ సంపాదించుకుంది. తెలుగులో నాగార్జున క్రిమినల్ మూవీ చేసింది.క్యాన్సర్పై పోరాటంమనీషా స్టార్ హీరోయిన్గా రాణిస్తున్న సమయంలో తన జీవిత ఒక్కసారి కుదుపునకు లోనైంది. 2012లో అండాశయ క్యాన్సర్ బారిన పడింది. మంచి చికిత్స, మనోధైర్యంతో క్యాన్సర్ను జయించింది. ఈమె చివరగా 'హీరామండి: ది డైమండ్ బజార్' అనే వెబ్ సిరీస్లో మల్లికాజాన్ అనే వేశ్యపాత్రలో యాక్ట్ చేసింది. గతేడాది లండన్లోని యూనివర్సిటీ ఆఫ్ బ్రాడ్ఫోర్డ్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందింది.చదవండి: పెళ్లిరోజు గిఫ్ట్గా విడాకులు: బాలీవుడ్ నటి -
పెళ్లిరోజు గిఫ్ట్ అంటూ విడాకుల పత్రం..: నటి
పెళ్లిరోజు గిఫ్ట్ అంటూ తన భర్త విడాకుల పత్రం ఇచ్చాడంటోంది బాలీవడ్ నటి సెలీనా జైట్లీ. భర్త పీటర్ హగ్పై గృహహింస వేధింపుల కేసు పెట్టిన ఆమె తాజాగా తన పిల్లలు దూరమవుతున్నారంటూ అల్లాడిపోతోంది. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టింది. ఆస్ట్రియాను వదిలేసి వచ్చినరోజు నుంచి నా పిల్లలకు దూరమయ్యాను. దారుణమైన వైవాహిక జీవితాన్ని అనుభవించిన ఎంతోమంది మహిళలకు, పురుషులకు చెప్తున్నా.. ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఒక్కరే లేరు. నేను కూడా బాధితురాలినే..పెళ్లిరోజు గిఫ్ట్ అంటూ విడాకులు..సెప్టెంబర్ నెల మొదట్లో నా భర్త 15వ పెళ్లిరోజు గిఫ్ట్ అంటూ విడాకుల పత్రం నా చేతిలో పెట్టాడు. పిల్లల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ.. నేను స్నేహపూర్వకంగా విడిపోవడానికే నిర్ణయించుకున్నాను. కానీ, అతడు మాత్రం నేను పెళ్లికి ముందు సంపాదించిన ఆస్తులు కావాలని అడిగాడు, అసంబద్ధమైన కండీషన్లు పెట్టాడు. వేధింపులు తట్టుకోలేక..అతడి వేధింపులు తట్టుకోలేక 2025 అక్టోబర్ 11న ఉదయం ఒంటిగంటకు ఆస్ట్రియాను వదిలేసి ఇండియాకు వచ్చేశాను. అప్పుడు నా అకౌంట్లో చాలా తక్కువ డబ్బు ఉంది. పీటర్ను పెళ్లి చేసుకోవడానికి ముందు ఇండియాలో నేను కొనుక్కున్న నా ఇంట్లో ప్రశాంతంగా బతకాలనుకున్నాను.పిల్లలకు దూరంఆ ఇంటితో ఏ సంబంధం లేకపోయినా దానిపై ఆజమాయిషీ చూపించాలనుకున్నాడు. దీంతో నేను కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. మరో విషయం.. ఆస్ట్రియా ఫ్యామిలీ కోర్టు పిల్లల బాధ్యతను మా ఇద్దరికీ అప్పజెప్పింది. జాయింట్ కస్టడీ అని ఆదేశాలు జారీ చేసింది. అయినా సరే నా ముగ్గురు పిల్లలతో నన్ను మాట్లాడనివ్వడం లేదు.శత్రువుగా చిత్రీకరిస్తున్నారుపిల్లల్ని నాకు వ్యతిరేకంగా మార్చేస్తున్నారు. వారికి ప్రేమను పంచడం తప్ప ఏదీ తెలియని తల్లిని శత్రువుగా చిత్రీకరిస్తున్నారు అంటూ భావోద్వేగానికి లోనైంది. సెలీనా జైట్లీ, పీటర్ హగ్ 2010లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు సంతానం. సెలీనా.. గోల్మాల్ రిటర్న్స్, నో ఎంట్రీ, మనీ హైతో హనీ హై, థాంక్యూ సినిమాల్లో యాక్ట్ చేసింది. -
ధనశ్రీ- చాహల్ మళ్లీ కలవబోతున్నారా?.. క్రికెటర్ రియాక్షన్ ఇదే..!
ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మ.. టీమిండియా క్రికెటర్ యుజ్వేందర్ చాహల్ను పెళ్లాడారు. ఆ తర్వాత వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకుని తమ బంధానికి ముగింపు పలికారు. గతేడాది అఫీషియల్గా విడిపోయారు. ప్రస్తుతం వీరిద్దరు తమ వర్క్ లైఫ్తో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ విడిపోయిన జంటపై నెట్టింట రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఈ జంట మరోసారి కలవబోతున్నారంటూ టాక్ వినిపిస్తోంది. అయితే మళ్లీ కలిసి జీవించడానికి కాదు.. ఓ రియాలిటీ షో కోసమట. చాహల్- ధనశ్రీ వర్మ ది -50 అనే రియాలిటీ షోలో కనిపించనున్నారని వార్తలొచ్చాయి. తాజాగా వీటిపై క్రికెటర్ చాహల్ స్పందించారు.అయితే తామిద్దరు కలుస్తామన్న వార్తలను చాహల్ కొట్టిపారేశారు. తమ వస్తున్న కథనాలన్నీ అవాస్తవమని క్రికెటర్ స్పష్టం చేశారు. ఈ విషయాన్ని క్రికెటర్ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా పంచుకున్నారు. ఇందులో ఎలాంటి నిజం లేదని.. కేవలం ఊహాజనితం, తప్పుడు సమాచారం అని పేర్కొన్నారు. అయితే ఈ రూమర్స్పై ధనశ్రీ వర్మ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటనైతే చేయలేదు. కాగా.. ది -50 అనే రియాలిటీ షో ఫిబ్రవరి 1న ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఈ షోకు చిత్రనిర్మాత ఫరా ఖాన్ హోస్ట్గా వ్యవహరిస్తున్నారు. -
గ్రాండ్గా సిస్టర్ పెళ్లి.. సందడి చేసిన ఆదిపురుష్ హీరోయిన్
బాలీవుడ్ బ్యూటీ, ఆదిపురుష్ భామ కృతి సనన్ తన సిస్టర్ నుపుర్ సనన్ పెళ్లిలో సందడి చేసింది. ఉదయ్పూర్లో జరిగిన ఈ గ్రాండ్ వెడ్డింగ్లో ఆదిపురుష్ భామ కృతి సనన్ అన్నీ తానై దగ్గరుండి నడిపించింది. ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అంతకుముందే వీరిద్దరు క్రిస్టియన్ సంప్రదాయంలో వివాహబంధంలోకి అడుగుపెట్టారు. తాజాగా హిందూ సంప్రదాయం ప్రకారం మరోసారి పెళ్లి చేసుకున్నారు. ఈ సందర్భంగా కృతి సనన్ తన చెల్లి పెళ్లిలో హంగామా చేస్తూ కనిపించింది. కాగా.. నుపుర్ సనన్.. తన ప్రియుడు, సింగర్ అయిన స్టెబిన్ను పెళ్లాడింది. ఉదయపూర్లో జరిగిన వివాహ వేడుకలో కృతి సనన్ ప్రియుడు కబీర్ బహియా కూడా పాల్గొన్నారు. అంతేకాకుండా దిశా పటాని, మౌనీ రాయ్ సన్నిహితులు కూడా హాజరయ్యారు.నుపుర్ సనన్ సినీ కెరీర్..నుపుర్ సనన్.. 'టైగర్ నాగేశ్వరరావు' అనే తెలుగు మూవీతో హీరోయిన్గా పరిచయమైంది. తర్వాత ఒకటీరెండు ఆల్బమ్ సాంగ్స్లో కనిపించింది. ప్రస్తుతం 'నూరని చెహ్రా' అనే హిందీ సినిమా చేస్తోంది. బాలీవుడ్లో ఇదే తన తొలి సినిమా కావడం విశేషం. View this post on Instagram A post shared by Nupur Sanon (@nupursanon) View this post on Instagram A post shared by Varinder Chawla (@varindertchawla) Kriti Sanon walks sister Nupur down the aisle as she weds Stebin Ben in dreamy Christian & Hindu ceremonies!#kritisanon #stebin #nupursanon #marriage #ptcpunjabigold pic.twitter.com/hNpgUbEeFo— PTC Punjabi Gold (@PtcGold) January 12, 2026 -
పవర్ఫుల్ పాత్రలో...
బాలీవుడ్ బ్యూటీ ప్రియాంకా చోప్రా లీడ్ రోల్లో నటించిన హాలీవుడ్ చిత్రం ‘ది బ్లఫ్’. ఫ్రాంక్ ఇ.ఫ్లవర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కార్ల్ అర్బన్, ఇస్మాయిల్ క్రజ్ కోర్డోవా సఫియా ఓక్లీ–గ్రీన్, టెమ్యూరా మారిసన్ ఇతర పాత్రలు పోషించారు. ఏజీబీవో, సినీస్టార్ పిక్చర్స్, బిగ్ ఇండీ పిక్చర్స్, పర్పుల్ పెబుల్ పిక్చర్స్పై జో రుస్సో,ఆంటోనీ రుస్సో, ఏంజెలా రుస్సో–ఓట్సా్టట్, మైఖేల్ డిస్కో, ప్రియాంకా చోప్రా, సిలీ సల్దానా, మరియల్ సల్దానా నిర్మించారు.ప్రియాంకా చోప్రా పవర్ ఫుల్ పాత్ర పోషించిన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా ఫిబ్రవరి 25 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ మూవీ టీజర్ని సోమవారం విడుదల చేసింది చిత్రబృందం. ఈ మూవీ టీజర్ను ప్రియాంకా చోప్రా షేర్ చేశారు. ఇదిలా ఉంటే... లాస్ఏంజిల్స్లోని బెవర్లీ హిల్టన్ వేదికగా 83వ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ వేడుక వైభవంగా జరిగింది. ఈ వేడుకకి భర్త నిక్ జోనస్తో కలిసి రెడ్ కార్పెట్పై గ్రాండ్గా ఎంట్రీ ఇచ్చారు ప్రియాంక. ప్రస్తుతం ఈ వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. -
రాజాసాబ్ 'బాడీ డబుల్' ఎఫెక్ట్.. ప్రభాస్పై ట్రోలింగ్
‘రాజాసాబ్’ సినిమా విడుదలైన తర్వాత హీరో ప్రభాస్ సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు గురవుతున్నారు. ఈ విమర్శలకు కారణం సినిమాలో బాడీ డబుల్ను అధికంగా వాడారనే భావన ప్రేక్షకుల్లో కలగడమే. ప్రభాస్ సీన్లలో ఎక్కువగా హెడ్ రీప్లేస్మెంట్ టెక్నిక్ ఉపయోగించి బాడీ డబుల్తో చిత్రీకరించారని ప్రేక్షకులు అంటున్నారు. దీంతో ఆయన స్వయంగా యాక్షన్, డ్యాన్స్ సీన్లలో పాల్గొనలేదనే అభిప్రాయం బలపడుతోంది.అయితే ఇదే సమయంలో విడుదలైన 'మన శంకర వరప్రసాద్' సినిమాలో 70 ఏళ్ల మెగాస్టార్ ప్రతి సీన్లోనూ స్వయంగా పాల్గొన్నారు. డ్యాన్స్లు, ఫైట్లు అన్నీ ఆయనే చేసి అందరినీ ఆకట్టుకున్నారు. అవి మరీ అంత క్లిష్టమైన సీన్లు కాకపోయినా, ఒక్క సీన్ కూడా డూప్కు వదలకుండా మెగాస్టార్ స్వయంగా చేశారని ప్రేక్షకులు ఆ రెండు సినిమాలను పోలుస్తూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. 70 ఏళ్ల చిరంజీవి ఒక్క సీన్ కూడా డూప్కు వదలకుండా చేస్తే మరి 40 ఏళ్లు దాటిన ప్రభాస్ మాత్రం ఎందుకు చేయలేకపోతున్నారని సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశ్నలు వేస్తున్నారు. ఆ ప్రశ్నలకు ఫ్యాన్స్ కూడా బలంగా సమాధానం చెప్పలేకపోతున్నారు. కారణం ‘రాజాసాబ్’లో టెక్నికల్ లోపాలు లేదా నిర్లక్ష్యం వల్లనో కానీ హెడ్ రీప్లేస్మెంట్ షాట్లు స్పష్టంగా కనిపించడం సినిమా చూసిన ప్రేక్షకులకు తెలిసిపోవడమే. -
బండోడా అని అమ్మ తిట్లు.. కళ్లు తిరిగి పడిపోయా!
బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్ మొదట్లో కాస్త లావుగా ఉండేవాడు. కానీ కఠినమైన డైట్ పాటించి, వర్కవుట్స్ చేసి చాలా సన్నబడ్డాడు. గతేడాది అతడి ట్రాన్స్ఫర్మేషన్ చూసి అందరూ ముక్కున వేలేసుకున్నారు. తాజాగా తన వెయిట్ లాస్ జర్నీ గురించి ఓ పాడ్కాస్ట్లో మాట్లాడాడు.సరైన సమయం దొరక్క..కరణ్ జోహార్ మాట్లాడుతూ.. బరువు తగ్గడం అనేది చాలా ఈజీ. కానీ నా వృత్తిలో సరైన టైమింగ్స్ అంటూ ఉండవు, సెలవులు ఉండవు, పండగ హాలీడేస్ ఉండవు. అర్జంట్ అంటూ తరచూ ఫోన్లు వస్తుంటాయి. కాబట్టి నేను డైటింగ్ను తు.చ తప్పకుండా పాటించడం కాస్త కష్టమైంది. అయితే మా నాన్న.. నేను లావుగా ఉన్నప్పటికీ హ్యాండ్సమ్గానే ఉన్నాననేవారు. అమ్మ తిట్టేదిఅమ్మ మాత్రం ఒప్పుకోకపోయేది. ఏం మాట్లాడుతున్నావ్? వాడు చాలా లావుగా, బండలా ఉన్నాడనేది. నేను హీరో కావాలని మా నాన్న కోరుకుంటే అమ్మ మాత్రం.. నన్ను ఎగాదిగా చూసి అది జరగదని తేల్చిపడేసేది. ఆమె ఎప్పుడూ నన్ను తిడుతూనే ఉండేది. కాలేజీకి మంచి డ్రెస్ వేసుకుని వెళ్లినప్పుడు అందరూ నాకంటే సన్నగా కనిపించేవారు. కళ్లు తిరిగి పడిపోయా..అప్పుడు తొలిసారి బరువు తగ్గాలనుకున్నాను. ఎన్నో డైట్స్ ప్రయత్నించాను, కానీ ఏదీ వర్కవుట్ కాలేదు. ఒక నెలపాటు డైటింగ్ చేయగానే అనారోగ్యానికి గురయ్యేవాడిని. ఒకసారి కాలేజీలో నా క్లాస్రూమ్లో కళ్లు తిరిగి కింద పడిపోయాను. అప్పుడే మా అమ్మ నన్ను తిట్టి డైట్ మాన్పించింది. నేను చికిత్స ద్వారా బరువు తగ్గానని చాలామంది అనుకుంటారు, కానీ అది నిజం కాదు. వాటి వల్లే బరువు తగ్గా..కాకపోతే బరువుకు కారణమేంటి పరీక్షలు చేయించుకుంటే థైరాయిడ్ ఉన్నట్లు తేలింది. శరీరంలో గ్లూటెన్ ఎక్కువగా ఉందని నిర్ధారణ అయింది. దాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేశాను. అందుకు బాదం పాలు తోడ్పడ్డాయి. చక్కెర తగ్గించేశాను. వర్కవుట్స్ చేశాను. గేమ్స్ ఆడాను, ఈత కొట్టాను. బరువు తగ్గాను అని కరణ్ జోహార్ చెప్పుకచ్చాడు.చదవండి: ఓటీటీ మూవీ చీకటిలో.. ట్రైలర్ చూశారా? -
ప్రేమపై నాకు నమ్మకం ఉంది!
మలైకా అరోరా.. పరిచయం అక్కర్లేని పేరు. ప్రత్యేకపాటల్లో తనదైన హుషారైన స్టెప్పులతో ప్రేక్షకులను అలరించారామె. మహేశ్బాబు ‘అతిథి’ చిత్రంలో ‘రాత్రైనా నాకు ఓకే..’, పవన్ కల్యాణ్ ‘గబ్బర్ సింగ్’ సినిమాలో ‘కెవ్వు కేక...’పాటలతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు మలైకా అరోరా. నటుడు సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్తో 1998లో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు మలైకా. వ్యక్తిగత కారణాల వల్ల 2017లో విడాకులు తీసుకున్నారు. అర్జున్ కపూర్తో ప్రేమలో ఉండటం వల్లే అర్బాజ్ ఖాన్కి మలైకా విడాకులిచ్చారనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.ఆ తర్వాత అర్జున్ కపూర్– మలైకా అరోరా కూడా రిలేషన్ షిప్కి బ్రేకప్ చెప్పారు. తాజాగా తన విడాకులు, రిలేషన్ షిప్ గురించి మాట్లాడారు మలైకా అరోరా. ‘‘నేను వివాహ బంధంలోకి అడుగుపెట్టాను. ఆ తర్వాత విడిపోయాను. అనంతరం రిలేషన్షిప్లో ఉన్నాను. బ్రేకప్ అయ్యింది. అంత మాత్రాన ప్రేమ అనేది తప్పు అని నేను అనుకోవడం లేదు. అవి నా విషయంలో సెట్ కాలేదు అంతే. అయినప్పటికీ ప్రేమ మీద నాకు ఇప్పటికీ నమ్మకం ఉంది. ప్రేమను పంచడం, పొందడం అనేది నాకు చాలా ఇష్టం. అది దక్కాలంటే అదృష్టం ఉండాలి’’ అని పేర్కొన్నారు మలైకా ఆరోరా. -
ప్రభాస్కు అచ్చిరాని R అక్షరం.. మరోసారి రుజువైందా?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కెరీర్లో బ్లాక్బస్టర్లు, ఇండస్ట్రీ హిట్ సినిమాలున్నాయి. అలాగే ఫ్లాపులు, డిజాస్టర్లకు సైతం కొదవ లేదు. అయితే తన అపజయాల లిస్టు చూస్తే అందులో R అక్షరంతో మొదలైన సినిమాల సంఖ్యే ఎక్కువగా ఉంది. దీంతో ప్రభాస్కు R అక్షరం కలిసిరావడం లేదన్న వాదన మొదలైంది. ఈ భయంతోనే కాబోలు రాజాసాబ్ సినిమా టైటిల్ ముందు The అనేది యాడ్ చేశారు. అయినా సరే ఆ సెంటిమెంట్ కొనసాగినట్లే కనిపిస్తోంది...R అక్షరం వల్లే..ప్రభాస్ తొలిసారి హారర్ జానర్లో నటించిన మూవీ ది రాజాసాబ్. ఈ సినిమా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వస్తోంది. సినిమా టైటిల్ రాజాసాబ్ ఆర్ అక్షరంతో మొదలుకావడం వల్లే ఇంత వ్యతిరేకత వస్తోందని కొందరంటున్నారు. ఈ సెంటిమెంట్ ఇప్పుడు పుట్టుకొచ్చింది కాదు.. రాఘవేంద్ర సమయంలో మొదలైంది. నెగెటివ్ టాక్ప్రభాస్ నటించిన సెకండ్ మూవీయే రాఘవేంద్ర. 2003లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశపర్చింది. దాదాపు 9 ఏళ్ల తర్వాత రెబల్ సినిమా చేశాడు. రాఘవ లారెన్స్తో కలిసి చేసిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ అందుకుంది. మళ్లీ పదేళ్ల తర్వాత అంటే 2022లో రాధే శ్యామ్ అని భారీ బడ్జెట్ సినిమా చేశాడు. ఇందులో ప్రభాస్ పెదనాన్న కృష్టంరాజు చివరిసారిగా యాక్ట్ చేశాడు. భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ మూవీ డిజాస్టర్గా నిలిచింది.సాహసం చేస్తాడా?ఇలా ఆర్ లెటర్తో చేసిన నాలుగు సినిమాలు తనకస్సలు కలిసిరాలేదు. ఈసారి 'ది రాజాసాబ్'తో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ఆర్ సెంటిమెంట్ ప్రభాస్ను వెంటాడినట్లే కనిపిస్తోంది. మరి మున్ముందు ప్రభాస్ R అక్షరంతో సినిమాలు చేస్తాడా? ఈ సెంటిమెంట్ను పరిగణనలోకి తీసుకుంటాడా? లేదా లైట్ తీసుకుంటాడా? అన్నది చూడాలి! -
గోశాలకు సోనూసూద్ రూ.11 లక్షలు విరాళం
మంచితనానికి మారుపేరుగా ఉండే ప్రముఖ నటుడు సోనూసూద్ మరో గొప్ప పని చేశాడు. గుజరాత్లోని వారాహి గోశాలకు రూ.11 లక్షలు విరాళంగా ఇచ్చాడు. వారాహి గోశాలను సందర్శించిన ఆయన గోవులను సంరక్షిస్తున్న విధానం చూసి సంతోషం వ్యక్తం చేశాడు. సోనూసూద్ మాట్లాడుతూ.. కేవలం కొద్ది ఆవులతో మొదలైన ఈ గోశాలలో ఇప్పుడు వాటి సంఖ్య ఏడు వేలకు చేరింది. ఇది నిజంగా చాలా గొప్ప విషయం.గోశాలకు విరాళంఈ గ్రామంలోని ప్రజలందరూ వాటి సంరక్షణ కోసం పాటుపడుతుండటం అభినందనీయం. వారు చేసినంత సేవ నేను చేయకపోవచ్చు. కానీ నా తరపున రూ.11 లక్షలు విరాళం ఇచ్చాను. దానివల్ల వారి సేవలు ఎటువంటి ఆటంకం లేకుండా విజయవంతంగా కొనసాగుతాయని ఆశిస్తున్నాను. ఈ గ్రామ ప్రజల ప్రేమ నన్నెంతగానో కట్టిపడేసింది. వీలు కుదిరినప్పుడు తప్పకుండా మరోసారి ఇక్కడికి వస్తాను. ఇక్కడ ఆవులను సంరక్షిస్తున్న విధానాన్ని దేశమంతా అమలు చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పుకొచ్చాడు.సినిమాసోనూసూద్ సినిమాల విషయానికి వస్తే.. సూపర్, అరుంధతి, చంద్రముఖి, దూకుడు, జులాయి, అల్లుడు అదుర్స్.. ఇలా అనేక సినిమాల్లో విలన్గా చేశాడు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో నటుడిగా రాణిస్తున్నాడు. చివరగా 'ఫతే' అనే హిందీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాతో ఆయన దర్శకుడిగానూ మారాడు.చదవండి: చచ్చిపోవాలన్నంత బాధ.. ఎంతోమందిని కలిశా.. -
ప్రియుడిని పెళ్లాడిన 'టైగర్ నాగేశ్వరరావు' హీరోయిన్
బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ చెల్లెలు, కథానాయిక నుపుర్ సనన్ పెళ్లి పీటలెక్కింది. వారం రోజుల క్రితమే ప్రియుడు, ప్రముఖ సింగర్ స్టెబిన్ బెన్తో ఎంగేజ్మెంట్ జరుపుకుంది. పెళ్లికి ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా శనివారం (జనవరి 10న)నాడు ప్రియుడిని వివాహం చేసుకుంది. రాజస్తాన్లో ఉదయ్పూర్లో వీరి పెళ్లి ఘనంగా జరిగింది.పెళ్లి చేసుకున్న హీరోయిన్ఇరు కుటుంబ సభ్యులు సహా అతి దగ్గరి బంధుమిత్రులు మాత్రమే ఈ వేడుకకు హాజరయ్యారు. ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్న వీరు వైవాహిక జీవితంలో అడుగుపెట్టిన క్షణాలకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పెళ్లిలో ఇద్దరూ తెలుపు దుస్తుల్లోనే మెరిశారు. జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించిన ఈ జంటకు అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.ఒకే ఒక్క మూవీనుపుర్ సనన్.. 'టైగర్ నాగేశ్వరరావు' అనే తెలుగు మూవీతో హీరోయిన్గా పరిచయమైంది. తర్వాత ఒకటీరెండు ఆల్బమ్ సాంగ్స్లో కనిపించింది. ప్రస్తుతం 'నూరని చెహ్రా' అనే హిందీ సినిమా చేస్తోంది. బాలీవుడ్లో ఇదే తన తొలి సినిమా కావడం విశేషం. View this post on Instagram A post shared by Bollywood (@lifestyleofbollywood)Finally its here ✨5 years of love and a start to forever 🫶🏻#StebiNupurOnLoop #StebinBen#NupurSanon#KritiSanon pic.twitter.com/WhlvX3UuzJ— G (@kixtr1KSanon) January 10, 2026 View this post on Instagram A post shared by Stebin Ben (@stebinben) -
సూపర్ హిట్ మూవీ ఫ్రాంచైజీ.. ఈ నెలలోనే మూడో పార్ట్
రాణీ ముఖర్జీ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం "మర్దానీ 3". దేశంలోనే అతిపెద్ద మహిళా పోలీస్ ఫ్రాంచైజీగా మర్దానీ రికార్డు సృష్టించింది. ఇప్పటికే ఈ ఫ్రాంచైజీ నుంచి వచ్చిన రెండు భాగాలు బ్లాక్బస్టర్గా నిలిచాయి. తాజాగా మూడో పార్ట్ విడుదల తేదీ ప్రకటించారు. జనవరి 30న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ఓ పోస్టర్ వదిలారు. నిజానికి ఈ సినిమాను హోలి పండగ సందర్భంగా ఫిబ్రవరి 27న విడుదల చేస్తామని గతంలో ప్రకటించారు. ఇప్పుడు ఆ రిలీజ్ను ఓ నెల ముందుకు జరిపారు.సినిమామర్దానీ 3 విషయానికి వస్తే.. అన్యాయం, అక్రమాలను ఎదురించే డేర్ డెవిల్ పోలీస్ శివానీ శివాజీరాయ్గా రాణీ ముఖర్జీ మరోసారి కనిపించనున్నారు. 'ద రైల్వేమెన్' ఫేమ్ ఆయుష్ గుప్తా కథ అందించాడు. అభిరాజ్ మినావాలా దర్శకత్వం వహించగా, యశ్ రాజ్ ఫిలింస్ బ్యానర్పై ఆదిత్య చోప్రా నిర్మించారు. మంచికి, చెడుకు మధ్య జరిగే పోరాటాల్ని సినిమాలో చూపించనున్నారు. View this post on Instagram A post shared by Yash Raj Films (@yrf) చదవండి: ఇలా జరుగుతుందనుకోలేదు.. సారీ: రాజాసాబ్ డైరెక్టర్ -
ధురంధర్ హీరోతో మూవీ.. స్పందించిన సౌత్ హీరోయిన్
మలయాళ హీరోయిన్ కల్యాణి ప్రియదర్శన్ 'లోక చాప్టర్ 1: చంద్ర' మూవీతో బ్లాక్బస్టర్ హిట్ అందుకుంది. ఈ ఉమెన్ సెంట్రిక్ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టింది. దీంతో లోక సినిమాతో పాటు కల్యాణి పేరు కూడా నేషనల్ వైడ్గా పాపులర్ అయింది. ఈ క్రమంలోనే కల్యాణికి బాలీవుడ్ నుంచి కబురు వచ్చినట్లు కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది.ధురంధర్ హీరో సరసన..ధురంధర్ మూవీతో బ్లాక్బస్టర్ కొట్టిన రణ్వీర్ సింగ్ నెక్స్ట్ మూవీ 'ప్రళయ్' (ప్రచారంలో ఉన్న టైటిల్)లో కల్యాణి యాక్ట్ చేయనుందంటూ బాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. ఈ ప్రచారంపై ఎట్టకేలకు కల్యాణి ప్రియదర్శన్ స్పందించింది. ఆమె మాట్లాడుతూ.. నాకెలా చెప్పాలో అర్థం కావట్లేదు.. కానీ భాషతో సంబంధం లేకుండా మంచి కథలు ఎప్పుడూ నన్ను వెతుక్కుంటూ వస్తాయి. మంచి కథలు చేయాలన్న అత్యాశ నాకు చాలా ఎక్కువ.అన్నీ నాకే కావాలి!మంచి కథ ఉందంటే మాత్రం.. అది హిందీ, మరాఠి, కన్నడ, తమిళ, తెలుగు, మలయాళం.. ఏ ఇండస్ట్రీ అయినా సరే, అది నాకు సొంతం కావాలని అనుకుంటాను. అలా అని కుప్పలుతెప్పలుగా ఒకేసారి పది సనిమాలు చేయలేను. కథ బాగుంటే భాష నాకు అడ్డంకే కాదు అని తెలిపింది.ప్రళయ్ సినిమా!ప్రళయ్ విషయానికి వస్తే.. జాంబీల నేపథ్యంలో సాగే ఈ సర్వైవల్ థ్రిల్లర్ సినిమాకు జై మెహతా దర్వకత్వం వహిస్తారని, ప్రస్తుతానికి ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని సమాచారం. ఈ మూవీలో హీరోయిన్ పాత్ర కోసం కల్యాణిని సంప్రదించారట! ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటే మాత్రం తను నటించబోయే తొలి స్ట్రయిట్ హిందీ సినిమా ప్రళయ్ అవుతుంది.చదవండి: పరిస్థితి మా చేయిదాటింది: జననాయగణ్ నిర్మాత భావోద్వేగం -
హోటల్లో 18 ఏళ్ల టీనేజ్ అమ్మాయితో స్టార్ హీరో..
బాలీవుడ్ నటుడు కార్తిక్ ఆర్యన్ తెలుగువారికి కూడా బాగా పరిచయమే.. నటి శ్రీలీలతో ఆయన డేటింగ్లో ఉన్నారంటూ కొద్దిరోజుల క్రితం పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. అయితే, ఆ వార్తలను వారు ఖండించారు. అయితే, తాజాగా కార్తిక్ ఆర్యన్ డేటింగ్ గురించి బాలీవుడ్లో బిగ్ న్యూస్ వైరల్ అవుతుంది. UKకి చెందిన టీనేజ్ అమ్మాయి కరీనా కుబిలియుటే(18)తో కార్తీక్ ఆర్యన్ ప్రేమలో ఉన్నాడనే పుకార్లు వైరల్ అవుతున్నాయి. దీంతో అతను సోషల్మీడియాలో ఆమెను అన్ఫాలో చేసినట్లు తెలుస్తోంది.35ఏళ్ల కార్తిక్ ఆర్యన్ టీనేజ్ అమ్మాయితో గోవా బీచ్లో కెమెరా కంటపడ్డారు. ఈ నెల ప్రారంభంలో ఇద్దరూ గోవాలోని సెయింట్ రెగిస్ హోటల్లో దాదాపు ఒకే సమయంలో బస చేశారని, కానీ.. వేర్వేరు గదుల్లో వారిద్దరూ ఉన్నారని సమాచారం. సోషల్మీడియాలో వారు షేర్ చేసిన ఫోటోలలో సారూప్యత ఉండటంతో ఈ వార్తలు వెలుగులోకి వచ్చాయి. అయితే, UKకి చెందిన కరీనా కుబిలియుటే వయసు 17ఏళ్లు మాత్రమేనని కొందరు అభిప్రాయ పడుతున్నారు. మైనర్ అమ్మాయితో డేటింగ్ చేయడం ఏంటి అంటూ కార్తిక్ ఆర్యన్కు మెసేజ్లు పెడుతున్నారు.బాలీవుడ్ మీడియా నివేదిక ప్రకారం, కార్తీక్తో పాటు ఆ అమ్మాయి కూడా గోవాలోని సెయింట్ రెగిస్ హోటల్లో ఒకే సమయంలో అతిథులుగా ఉన్నారని ప్రకటించాయి. అయితే, ఇద్దరూ వేర్వేరు గదుల్లో బస చేశారని కథనాలు వచ్చాయి. డేటింగ్ పుకార్లు వెలువడిన తర్వాత, కరీనా తన ఇన్స్టాగ్రామ్ బయోలో, "నాకు కార్తీక్ తెలియదు, నేను అతని ప్రియురాలిని కాదు, నేను నా కుటుంబంతో సెలవులో ఉన్నాను" అని పేర్కొంది. కొంత సమయం తర్వాత ఆమె తన బయోను "నాకు కార్తీక్ తెలియదు" అని రాసింది. ఆపై కరీనా తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్లకు కామెంట్స్ను ఆపేసింది. కానీ, కార్తిక్ ఆర్యన్ మాత్రం ఎలాంటి వివరణ ఇవ్వలేదు.సండే గార్డియన్ నివేదిక ప్రకారం, కరీనా UK లోని కార్లైల్ కాలేజీలో చదువుతోంది. ఆమె చీర్లీడర్ కూడా. ఆమె వయస్సు ముఖ్యంగా అందరి దృష్టిని ఆకర్షించిందని పేర్కొంది. కరీనాకు 18 సంవత్సరాలు, కార్తీక్ ప్రస్తుతం 35 సంవత్సరాలు అని అందులో తెలిపింది. గతంలో, కార్తీక్ ఆర్యన్ సారా అలీ ఖాన్, అనన్య పాండే, పష్మీనా రోషన్, శ్రీలీల, జాన్వీ కపూర్లతో సహా పలువురు నటీమణులతో డేటింగ్లో ఉన్నాడని వార్తలు వచ్చాయి.కార్తీక్ ఆర్యన్ విషయానికి వస్తే.. ప్యార్ కా పంచనామా, లూకా చుప్పీ, పతీ పత్నీ ఔర్ ఓ, భూల్ భులయ్యా 2, భూల్ భులయ్యా 3, షెహజాదా(అల వైకుంఠపురములో హిందీ రీమేక్), లూకా చుప్పి, ధమాకా.. ఇలా అనేక సినిమాలతో టాప్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ఇటీవల కార్తీక్ 'తూ మేరీ మైన్.. తేరా మైన్ తేరా తు మేరీ' మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే బాక్సాఫీస్ వద్ద ధురంధర్ హవా కారణంగా ఈ సినిమా నిలదొక్కుకోలేకపోయింది. -
Stray Dogs case : నటి షర్మిలకు సుప్రీం స్ట్రాంగ్ కౌంటర్
వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది. వీధి కుక్కల బెడదను ఎదుర్కోనేందుకు అన్ని కుక్కల పట్ల ఒకే విధానాన్ని అనుసరించ డాన్ని వ్యతిరేకిస్తూ నటి షర్మిలా ఠాగూర్ చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఆమె వాదనలు వాస్తవానికి పూర్తిగా దూరంగా ఉన్నాయని అభివర్ణించింది.ప్రజా ప్రదేశాలలో వీధి కుక్కల సమస్యను పరిష్కరించడానికి ఇటీవల తీసుకున్న చర్యలు ఉత్తమమైన విధానం కాకపోవచ్చని షర్మిలా వాదించారు. తన వాదనలకు మద్దతుగా ఠాగూర్ కొన్ని ఉదాహరణలను కూడా ఇచ్చారు. వాస్తవదూరంగా ఆలోచిస్తున్నారు : సుప్రీంకొన్నేళ్లుగా ఎయిమ్స్లో స్నేహపూర్వకంగా ఉంటున్న కుక్క 'గోల్డీ' గురించి ఉదాహరించారు. కొన్ని కుక్కలను నిర్మూలించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది, అయితే దూకుడుగా ప్రవర్తించే వాటిని ముందుగా ఒక కమిటీ గుర్తించాల్సి ఉంటుందని, కుక్కల ప్రవర్తనను పరిశీలించేందుకు కమిటీ ఉండాలని, దూకుడుగా ఉండే కుక్కలకు, సాధారణ కుక్కలకు మధ్య తేడాను చూడాలంటూ షర్మిల తరపు న్యాయవాది వాదించారు. అలాగే వీధి కుక్కల సమస్యను పరిష్కరించడానికి సైన్స్ మనస్తత్వశాస్త్రం సహాయం అవసరమని ఠాగూర్ తన పిటిషన్లో అన్నారు. ABC నియమాలు ఫూల్ప్రూఫ్ కాకపోవచ్చు, కాబట్టి దీనిని పరిశీలించాల్సిన అవసరం ఉందని వాదించారు. వీటన్నింటినీ సుప్రీంకోర్టు ఒక్కొక్కటిగా ఖండించింది.ఆసుపత్రులలో కుక్కల్ని కీర్తించడానికి ప్రయత్నించవద్దు అంటూ సుప్రీం గట్టిగానే వాదించింది. ఆ కుక్కను ఆసుపత్రి ఆపరేషన్ థియేటర్లోకి కూడా తీసుకు వెళ్తున్నామా? వీధుల్లో తిరిగే ఏ కుక్కకైనా పేలు ఉంటాయి. అలాంటి వాటిని థియేటర్లలోకి అనుమతిస్తే ఇన్ఫెక్షన్లు, వినాశకరమైన పరిణామాలకు దారితీస్తుంది. మీకు అర్థమవుతోందా? మీవాదనల వెనుకున్న వాస్తవికత ఏమిటో మే మీకు తెలియజేస్తాంఅంటూ మండిపడింది.ఇదీ దచవండి: అమ్మానాన్నల్ని ఫస్ట్ ఫ్లైట్ ఎక్కిస్తే.. ఆ కిక్కే వేరప్పా!చెవులకు రంగులుమరోవైపు ప్రజలను కరిచిన కుక్కలను గుర్తించడానికి కాలర్ల (చెవులకు)కు రంగులు వేయాలని ఠాగూర్ తరపు న్యాయవాది సూచించారు. జార్జియా అర్మేనియా వంటి దేశాలలో ఈ పద్ధతిని అనుసరిస్తున్నారని చెప్పారు. ఈ సూచనపైనా కూడా సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ దేశాల జనాభా ఎంత? సుప్రీంకోర్టు ఆ వాదనను కూడా కొట్టిపారేసింది.సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ కల్పించుకుని కమిటీలో నిపుణులు లేకుండా వచ్చిన ఆరావళి విషయంలో వచ్చిన తీర్పు ఉదహరించారు.. "న్యాయ జోక్యం అనేది ఖాళీలు ఉన్న అంతరాలలో మాత్రమే తప్ప, శాసనసభ ఉద్దేశపూర్వకంగా చట్టం చేయకూడద’’ని అనుకున్న విషయాల్లో కాదన్నారు.ఇదీ చదవండి: 498 ఏ, పొరిగింటి మహిళకు షాక్ : ఇలా కూడా కేసు పెట్టొచ్చా?దాడిచేసే వారి మీద కేసు పెట్టుకోండికుక్కలకు ఆహారాన్నదిస్తున్న మహిళలపై దాడులు, దుర్భాషలాడుతున్న వారి గురించి సీనియర్ న్యాయవాది మహాలక్ష్మి లేవనెత్తినప్పుడు, కూడా సుప్రీం ఇదే వ్యాఖ్యాచేసింది. ప్రజలు ఎవర్నైనా, ఎలా అయినా అవమానించవచ్చు. మమ్మల్ని కూడా అంటున్నారు. అలాంటి వాళ్లమీద చర్య తీసుకోండని సూచించింది. ఫీడర్ వ్యతిరేక విజిలెంట్స్" మహిళలపై దాడి చేస్తున్నారని, అధికారులు దాని గురించి మౌనంగా ఉన్నారని పావని ఆరోపించారు. ఇలాదేశవ్యాప్తంగా జరుగుతోందన్నారు. హర్యానాలో, సొసైటీలు బౌన్సర్లను నియమించుకుని మరీ దాడిచేస్తున్నాయన్నారు. దీనికి వీధి కుక్కల సమస్యలతో సంబంధం లేదని సుప్రీం స్పష్టం చేసింది. స్ట్రీట్ డాగ్స్ అంశంపై, సూచనలు ఉంటే, ఇవ్వవచ్చు అని చెబుతూ మహిళలపై దాడి చేస్తున్నవారిపై FIR దాఖలు చేయండి. హైకోర్టుకు వెళ్లండి అని సుప్రీంకోర్టు పేర్కొంది.వీధుల నుండి ప్రతి కుక్కను తొలగించాలని ఆదేశించలేదని, జంతువుల జనన నియంత్రణ (ABC) నిబంధనల ప్రకారం వీధి కుక్కలకు చికిత్స చేయాలని ఆదేశించిందని సుప్రీంకోర్టు గురువారం స్పష్టం చేసింది. పబ్లిక్ ప్లేసెస్నుంచి కుక్కల్ని తొలగించడం వల్ల ప్రభుత్వానికి రూ.26,800 కోట్ల వరకు ఖర్చవుతుందని సుప్రీంకిచ్చిన నివేదికలో పేర్కొన్నారు. ఇదీ చదవండి: టీనేజ్ లవర్స్ : 40 ఏళ్లకు 60లలో మళ్లీ పెళ్లి -
త్వరలో గుడ్న్యూస్ చెప్తానంటున్న హీరోయిన్
హీరోయిన్, చిన్నారి పెళ్లికూతురు ఫేమ్ అవికా గోర్ గతేడాది పెళ్లిపీటలెక్కింది. ప్రియుడు మిలింద్ చంద్వానీని 2025 సెప్టెంబర్ 30న వివాహం చేసుకుంది. తాజాగా ఈ జంట ఓ వ్లాగ్లో త్వరలోనే ఒక కొత్త ప్రయాణం మొదలు కానుందని ప్రకటించింది. దీంతో అవికా ప్రెగ్నెంట్ అంటూ ప్రచారం ఊపందుకుంది.ఈ రూమర్స్ను తాజాగా అవికా గోర్ కట్టిపారేసింది. నేను గర్భవతిని కాదు, అలాంటి విశేషం ఏం లేదు. కాపోతే త్వరలోనే ఓ శుభవార్త చెప్తాను, అదేంటో తెలుసుకోవాలంటే కొంతకాలం ఆగాల్సిందే! అని చెప్పింది.ప్రేమ- పెళ్లిఅవికా- మిలింద్ 2020లో హైదరాబాద్లో తొలిసారి కలుసుకున్నారు. మ్యూచువల్ ఫ్రెండ్స్ ద్వారా వీరి మధ్య పరిచయం ఏర్పడింది. కొంతకాలానికే ఆ స్నేహం ప్రేమగా మారింది. 2025 జూన్లో ఈ లవ్బర్డ్స్ ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. అదే ఏడాది 'పతీ పత్నీ ఔర్ పంగా' అనే రియాలిటీ షోలో పెళ్లి చేసుకున్నారు.సినిమాఅవికా విషయానికి వస్తే.. చిన్నారి పెళ్లికూతురు సీరియల్తో బాలనటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఉయ్యాల జంపాల చిత్రంతో హీరోయిన్గా మారింది. లక్ష్మీ రావే మా ఇంటికి, సినిమా చూపిస్త మావ, ఎక్కడికి పోతావు చిన్నవాడ, 10th క్లాస్ డైరీస్, షణ్ముఖ వంటి పలు తెలుగు సినిమాలు చేసింది.చదవండి: రాజాసాబ్ రిలీజ్.. థియేటర్లలో మొసళ్లు! -
బంగ్లా నుంచి కబురు వచ్చింది
హీరో అక్షయ్ కుమార్, దర్శకుడు ప్రియదర్శన్ కాంబినేషన్లో రూపొందుతున్న హారర్ కామెడీ సినిమా ‘భూత్ బంగ్లా’. టబు, పరేష్ రావల్, రాజ్పాల్ యాదవ్, వామికా గబ్బి, జిస్సు సేన్ గుత్తా ఇతర ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు. శోభా కపూర్, ఏక్తా కపూర్, అక్షయ్ కుమార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఈ సినిమాను తొలుత ఈ ఏడాది ఏప్రిల్ 2న విడుదల చేయాలనుకున్నారు. అయితే మే 15న రిలీజ్ చేయనున్నట్లుగా గురువారం కొత్త విడుదల తేదీని ప్రకటించారు. ‘బంగ్లా నుంచి కొత్త కబురు వచ్చింది. మే 15న బంగ్లా డోర్స్ తెరుచుకుంటాయి (న్యూ రిలీజ్ డేట్ని ఉద్దేశించి)’ అని దర్శక–నిర్మాతలు పేర్కొన్నారు. -
సినిమాలు తక్కువ.. ఇంటర్వ్యూలు ఎక్కువ!
సినిమాకు ప్రమోషన్స్ కచ్చితంగా కావాల్సిందే! కంటెంట్ సంగతి పక్కనపెడితే.. ఫలానా మూవీ థియేటర్లలో వస్తుందని తెలిసేది ప్రమోషన్స్ వల్లే! కాబట్టి రిలీజయ్యేవరకు గట్టిగా ప్రమోషన్స్ చేయాల్సిందే.. తర్వాత టాక్ బాగుంటే సినిమా దానంతటదే పుంజుకుంటుంది! అందుకే ఈ మధ్య రకరకాలుగా ప్రమోషన్స్ చేస్తున్నారు.సినిమాల కన్నా ఇంటర్వ్యూలే ఎక్కువఅయితే పాన్ ఇండియా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాను కూడా ఈ ప్రమోషన్స్లోకి లాగుతున్నారు. సందీప్ రెడ్డి ఇప్పటివరకు మూడే మూడు సినిమాలు తీశాడు. 2017లో అర్జున్ రెడ్డితో బ్లాక్బస్టర్ కొట్టాడు. దాన్నే హిందీలో కబీర్ సింగ్గా రీమేక్ చేసి అక్కడా విజయం సాధించాడు. రెండేళ్ల క్రితం యానిమల్ మూవీతో మరోసారి రికార్డులు తిరగరాశాడు. తొమ్మిదేళ్లలో మూడు సినిమాలు తీస్తే.. ఇంటర్వ్యూలు మాత్రం అందుకు రెట్టింపు సంఖ్యలో చేశాడు.ఆర్ఆర్ఆర్ నుంచి..ఆర్ఆర్ఆర్ మూవీ రిలీజ్ సమయంలో దర్శకధీరుడు రాజమౌళితో ఇంటర్వ్యూ, దేవర సమయంలో జూనియర్ ఎన్టీఆర్తో, కింగ్డమ్ అప్పుడు విజయ్ దేవరకొండ, దర్శకుడు గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్లో, శివ రీరిలీజ్ సమయంలో రాంగోపాల్ వర్మతో.. ఇలా వరుసగా ఇంటర్వ్యూలు చేశాడు. హాయ్ నాన్న రిలీజ్ సమయంలో నానిని కూడా ఇంటర్వ్యూ చేశాడు. ఇప్పుడు ది రాజా సాబ్ కోసం రంగంలోకి దిగాడు. రాజాసాబ్ హీరోహీరోయిన్లు ప్రభాస్, మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్లను ఇంటర్వ్యూ చేశాడు. బుల్లెట్ పాయింట్ ప్రశ్నలుఅందరూ సందీప్నే యాంకర్గా ఎంచుకోవడానికి ఓ ప్రత్యేక కారణం ఉంది. జనాల్లో అతడికున్న క్రేజ్.. అలాగే తన ఇంటర్వ్యూలో సాగదీత అనేది ఉండదు. బుల్లెట్ పాయింట్స్లా ప్రశ్నలడుగుతాడు. ఇంటర్వ్యూ ఎంతసేపు అయినా బోర్ కొట్టకుండా జనాలు మైమరచిపోయి చూస్తుండిపోయేలా చేయగలడు. అతడి అభిప్రాయాలు చాలామంది సినీప్రేక్షకులకు కనెక్ట్ అవడం మరో విశేషం. పైగా పాన్ ఇండియా డైరెక్టర్ కాబట్టి బాలీవుడ్లోనూ బజ్ క్రియేట్ అవుతుందన్న ఆశ కూడా ఉండొచ్చు! అందుకే వంగాతో ఇంటర్వ్యూ అంటే అటు చిత్రయూనిట్కు, ఇటు సినీప్రియులకు ఎంతో ఇష్టం! చదవండి: 23 ఇయర్స్ ఇండస్ట్రీ.. ఒక్క అవార్డు రాలే -
23 ఇయర్స్ ఇండస్ట్రీ.. ఒక్క అవార్డు రాలే!
బాలీవుడ్ దర్శకుడు రోహిత్ శెట్టి ఇండస్ట్రీలో అడుగుపెట్టి 23 ఏళ్లవుతోంది. ఈ రెండు దశాబ్దాలలో ఎన్నో హిట్స్ ఇచ్చాడు. కానీ, ఇంతవరకు ఒక్క అవార్డు కూడా అందుకోలేదు. తను డైరెక్ట్ చేసిన సినిమాలు అవార్డులు గెలిచాయి కానీ ఉత్తమ దర్శకుడిగా ఆయనకు మాత్రం ఒక్క అవార్డు కూడా దక్కలేదు. తాజాగా భారత జాతీయ సినీ అకాడమీ (NICA) ప్రెస్మీట్కు హాజరైన రోహిత్ శెట్టి ఈ అవార్డులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.యాంకరింగ్ చేయమని..ఆయన మాట్లాడుతూ.. నాకు, అవార్డులకు మధ్య సంబంధమే లేదు. ఇప్పటివరకు 17 సినిమాలు తీశాను. అవార్డు ఫంక్షన్కు పిలుస్తుంటారు, కానీ హోస్ట్గా చేయమని మాత్రమే ఇన్విటేషన్ వస్తుంటుంది. అలా అవార్డుల ఫంక్షన్లో యాంకర్గా మాత్రమే కనిపించాను అన్నాడు.ఎప్పుడో మొదలైందినార్త్ వర్సెస్ సౌత్ సినిమాల గురించి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ సినిమా రిలీజైతే పండగ చేసుకోవాలి. సినిమా అనేది మొదలైనప్పటినుంచే ఇక్కడి వాళ్లు దక్షిణాదిలో.. దక్షణాదివాళ్లు బాలీవుడ్లో సినిమాలు తీస్తున్నారు. 1950 నుంచే ఇదంతా జరుగుతోంది. మనం ప్రాంతీయ బేధాలు చూడకుండా సినిమా సెలబ్రేట్ చేసుకోవాలి. సోషల్ మీడియా వల్ల ప్రపంచమే చిన్నగా మారిపోయింది. ఇప్పుడు అందరూ అందరికీ తెలుసు. అందరం కలిసికట్టుగా పనిచేసి సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలి అని చెప్పుకొచ్చాడు.సినిమారోహిత్ శెట్టి.. జమీన్, గోల్మాల్, సింగం, చెన్నై ఎక్స్ప్రెస్, సింగం రిటర్న్స్, సూర్యవంశీ, సర్కస్.. ఇలా అనేక సినిమాలు చేశాడు. చివరగా సింగం అగైన్ సినిమా తీశాడు. అజయ్ దేవ్గణ్, రణ్వీర్ సింగ్, కరీనా కపూర్, అక్షయ్ కుమార్, దీపికా పదుకుణె, టైగర్ ష్రాఫ్, అర్జున్ కపూర్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.370 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ప్రస్తుతం రోహిత్ శెట్టి 'గోల్మాల్' ఫ్రాంచైజీలో 5వ సినిమా తీస్తున్నాడు.చదవండి: హీరో తరుణ్ రీఎంట్రీ.. మూడేళ్లుగా నిరీక్షణ -
కొడుక్కి నామకరణం.. ఆ పేరుతో విక్కీకి ప్రత్యేక అనుబంధం!
బాలీవుడ్ స్టార్ కపుల్ విక్కీ కౌశల్- కత్రినా కైఫ్ ఇటీవలే తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందారు. 2025 నవంబర్ 7న ఈ జంటకు కొడుకు పుట్టాడు. బాబు పుట్టి రెండు నెలలైన సందర్భంగా అతడికి నామకరణం చేశారు. విక్కీ, కత్రినా చేతిలో కొడుకు చేయి పెట్టిన ఫోటో షేర్ చేస్తూ "విహాన్ కౌశల్" అని పరిచయం చేశారు.పేరు వెనక ప్రత్యేకతవిహాన్ పేరుకు విక్కీ కౌశల్కు విడదీయరాని అనుబంధం ఉంది. 'ఉరిః ది సర్జికల్ స్ట్రైక్' సినిమాలో హీరో విక్కీ కౌశల్ పోషించిన పాత్ర పేరు మేజర్ విహాన్ సింగ్ షెర్గిల్. ఆ పాత్రకు గుర్తుగానే కొడుక్కి విహాన్ అని పేరు పెట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఉరి సినిమా డైరెక్టర్ ఆదిత్య ధర్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. విక్కీ.. విహాన్ పాత్రకు వెండితెరపై ప్రాణం పోస్తే... ఇప్పుడు చిన్న విహాన్ అతడి చేతిలో జీవం పోసుకున్నాడు.. జీవితమంటేనే ఒక సర్కిల్ కదా! అని కామెంట్ చేశాడు. కాగా 2019లో వచ్చిన 'ఉరి' మూవీ బ్లాక్బస్టర్గా నిలిచింది. View this post on Instagram A post shared by Katrina Kaif (@katrinakaif) -
బాలీవుడ్లో టాప్
హిందీ చిత్రం ‘ధురంధర్’ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డును సృష్టించింది. రణ్వీర్సింగ్ హీరోగా ఆదిత్య ధర్ దర్శ కత్వం వహించిన సినిమా ‘ధురంధర్’. మాధవన్, సంజయ్దత్, అక్షయ్ఖన్నా, సారా అర్జున్, అర్జున్ రాంపాల్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. జియో స్టూడియోస్, బీ62 స్టూడియోస్ పతాకాలపై ఆదిత్యధర్,లోకేష్ ధర్, జ్యోతిదేశ్పాండే నిర్మించిన ఈ చిత్రం గత ఏడాది డిసెంబరు 5న థియేటర్స్లో విడుదలైంది. కాగా ‘ధురంధర్’ సినిమా 33 రోజుల్లో రూ.831.40 కోట్ల రూపాయల కలెక్షన్స్ను సాధించి, ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ చిత్రంగా నిలిచిందని చిత్ర నిర్మాణ సంస్థ జియో స్టూడియోస్ సోషల్ మీడియా మాధ్యమాల్లో పేర్కొంది. ఇక ప్రపంచవ్యాప్తంగా ‘ధురంధర్’ చిత్రం రూ. 1200 కోట్లకు పైగా కలెక్షన్స్ను సాధించి, ఇంకా థియేటర్స్లో ప్రదర్శించబడుతోంది. ఇక ‘ధురంధర్ 2’ చిత్రం మార్చి 19న రిలీజ్ కానుంది. -
చావు తప్ప మరో దారి లేదు.. విడాకులిచ్చా: నటి
ఒకరు మన తోడుంటేనే జీవితం పరిపూర్ణం అని చెప్పారు తప్ప నీకు నవ్వు ముఖ్యం.. ఒంటరిగా అయినా సంతోషంగా ఉండగలవు అని ఎవరూ చెప్పలేదు అంటోంది బాలీవుడ్ నటి షెఫాలి షా. హిందీ సినిమాలు, సిరీస్లతో అలరించే షెఫాలికి రెండు పెళ్లిళ్లయ్యాయి. మొదటగా బుల్లితెర నటుడు హర్ష్ చయ్యను పెళ్లాడింది. రెండు పెళ్లిళ్లుకానీ, వీరి బంధం ఎంతోకాలం కొనసాగలేదు. 2000వ సంవత్సరంలో దంపతులిద్దరూ విడిపోయారు. తర్వాత అదే ఏడాది దర్శకుడు విపుల్ అమృత్లాల్ షాను రెండో పెళ్లి చేసుకుంది. వీరికి ఇద్దరు కుమారులు సంతానం. తాజాగా తన మొదటి వైవాహిక జీవితపు తాలూకు చేదు అనుభవాలను నటి గుర్తు చేసుకుంది. ఎన్నో దారుణాలుషెఫాలి మాట్లాడుతూ.. నీకు భర్త, స్నేహితుడు, అన్న, చెల్లి.. ఇలా ఎవరి అవసరమూ లేదు, నీకు నువ్వు చాలు అని ఎవరూ నాతో చెప్పలేదు. ఒకవేళ మీరు మంచి రిలేషన్లోనే ఉంటే అంతకన్నా అద్భుతం ఇంకోటి ఉండదు. కానీ ఆ రిలేషన్షిప్ బాగోలేకపోతే మాత్రం అంతకన్నా నరకం మరొకటి లేదు. ఎన్నో దారుణాలు చూడాల్సి వస్తుంది. ఆ రిలేషన్ను కొనసాగించాలా? వదిలేయాలా? అన్న అంతర్మథనంలో పడతారు. చావు తప్ప..చివరకు ఒకరోజు వస్తుంది. ఇక సహించడం నా వల్ల కాదనిపిస్తుంది.. దీన్నలాగే వదిలేస్తే రేపు నా ప్రాణాలు పోవచ్చేమో అనిపిస్తుంది. అలాంటి సందర్భం నా జీవితంలోనూ ఎదురైంది.. అది నా ఫస్ట్ మ్యారేజ్ సమయంలో! అప్పుడు నా క్లోజ్ ఫ్రెండ్ ఓ ప్రశ్న అడిగింది. నీ జీవితంలో మళ్లీ నిన్ను ప్రేమించే వ్యక్తి తారసపడకపోతే ఏం చేస్తావ్? రిస్క్ తీసుకుంటావా? లేదా ఈ బంధాన్ని కంటిన్యూ చేస్తావా? అని అడిగింది. రిస్క్ తీసుకోవడానికే మొగ్గు చూపాను.రిస్క్ చేశాఅవసరమైతే నా జీవితాన్ని ఒంటరిగానైనా గడుపుతానన్నాను. అంతేకానీ నాకు విలువ లేని చోట, ఏమాత్రం ఆనందం దొరకని చోట శిలలా బతకలేనని బదులిచ్చాను. ప్రతి ఒక్కరినీ సంతృప్తి పరిచేందుకు నేనేం పిజ్జాను కాదని చెప్పా.. అని గుర్తు చేసుకుంది. షెఫాలి చివరగా ఢిల్లీ క్రైమ్ సీజన్ 3 వెబ్ సిరీస్లో కనిపించింది. ఈ సిరీస్ నెట్ఫ్లిక్స్లో అందుబాటులో ఉంది.చదవండి: రూ.25 లక్షలు మోసపోయా.. సినిమా ఛాన్సులు కూడా -
నేను పెళ్లి చేసుకుంటా: శ్రద్ధా కపూర్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్కు 38 ఏళ్లు. ఇప్పటికీ తన ఫోకస్ అంతా సినిమాలపైనే తప్ప పెళ్లిగురించి ఆలోచించడమే లేదు. అయితే కొంతకాలంగా రచయిత రాహుల్ మోదీతో ప్రేమాయణం నడుపుతోంది. తాజాగా తన పెళ్లి గురించి స్పందించింది.పెళ్లి చేసుకుంటాసోషల్ మీడియాలో జ్యువెలరీ బ్రాండ్ ప్రమోషన్స్ చేసింది శ్రద్ధా కపూర్. ఈ మేరకు ఓ యాడ్ వీడియో పోస్ట్ చేసింది. అందులో లవ్- బ్రేకప్ గురించి మాట్లాడింది. ఇది చూసిన నెటిజన్లు.. మీ పెళ్లి సంగతేంటి? అని ప్రశ్నిస్తున్నారు. దానికి హీరోయిన్ స్పందిస్తూ... నేను కూడా పెళ్లి చేసుకుంటా అని రిప్లై ఇచ్చింది. అది చూసి ఆశ్యర్యపోయిన అభిమానులు.. పెళ్లెప్పుడు? అని ఆరా తీస్తున్నారు.సినిమాశ్రద్ధా సినిమాల విషయానికి వస్తే.. ఈమె చివరగా స్త్రీ 2 సినిమాలో నటించింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్ హిట్గా నిలిచింది. ప్రస్తుతం శ్రద్ధా.. తుంబాడ్ సినిమా ప్రీక్వెల్ పహడ్పాంగిర మూవలో నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే స్త్రీ 3, భేడియా 2 మూవీస్లోనూ యాక్ట్ చేయనుంది. ప్రస్తుతం ఈతా సినిమాలో యాక్ట్ చేస్తోంది.చదవండి: దర్శకురాలిగా హనుమాన్ నటి ఎంట్రీ -
టీవీ చరిత్రలో ఓ శకం ముగిసింది
టెలివిజన్ చరిత్రలో ఒక విప్లవాత్మక శకం ముగిసింది. నాలుగున్నర దశాబ్దాల క్రితం రేడియోలోనే సంగీతం వింటూ ఉర్రూతలూగే అప్పటి తరానికి పాశ్చాత్య సంగీతం, పాప్ కల్చర్ పరిచయం చేసిన ఎమ్టీవీ (MTV).. తన 24 గంటల మ్యూజిక్ ఛానెల్స్ని అధికారికంగా మూసివేసింది. మైఖేల్ జాక్సన్ లాంటి పాప్ సింగర్లని ప్రపంచానికి పరిచయం చేసిన ఈ ఛానెల్ తన ప్రయాణాన్ని ఆపేసింది. మారుతున్న కాలం, దానికి అనుగుణంగా జనంలో వస్తున్న మార్పులు, టీవీల నుంచి స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్లపై మళ్లిన ప్రేక్షకుల ఆసక్తి దృష్ట్యా ఎంటీవీ ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం!1981 ఆగస్టు 1న ప్రారంభమైంది. పేరులోనే మ్యూజిక్ ఉన్న ఎంటీవీ.. సంగీతంలో ఓ విప్లవాత్మక మార్పునే తెచ్చిందని చెప్పొచ్చు. అప్పటి నుంచి ఇప్పటి దాకా ప్రేక్షకుల్లో తనదైన ముద్ర వేసుకున్న ఎంటీవీ కేవలం సంగీతాన్ని అందించడమే కాదు.. పాశ్చాత్య సంగీతం నుంచి పాప్ కల్చర్ వరకు మైఖేల్ జాక్సన్ లాంటి ఎంతో మంది కళాకారులను ప్రపంచానికి అందించింది. ఎంటీవీ పేరిట ప్రారంభమైన ఆ ఛానెల్... క్రమేణా ప్రేక్షకుల్లో పెరిగిన అభిమానం, ఆసక్తిని దృష్టిలో పెట్టుకుని ఎంటీవీ మ్యూజిక్, ఎంటీవీ 80స్, 90స్, క్లబ్ ఎంటీవీ, ఎంటీవీ లైవ్ అనే ఛానెళ్లను కూడా పరిచయం చేసింది. చివరకు ఆ ఛానెళ్లన్నింటినీ ఇప్పుడు మూసివేస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించింది.1981లో తొలిసారి ఎంటీవీలో ప్రసారమైన "వీడియో కిల్డ్ ది రేడియో స్టార్" అనే పాటనే.. 2025 డిసెంబర్ 31న చివరిసారి ప్రసారం చేసి తన ఛానెళ్ల ప్రసారాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. 45 ఏళ్ల క్రితం ఛానెల్ ప్రారంభించిన అదే పాటతో ముగించడం ద్వారా ఎంటీవీ తన ప్రయాణాన్ని వలయాకారంలో చూపే ప్రయత్నం చేసింది. పాట అదే అయినప్పటికీ అప్పటి మ్యూజిక్ వీడియో యుగాన్ని ప్రారంభించి, ఇప్పటి స్ట్రీమింగ్ యుగంలో ముగిస్తూ అప్పటి కాలం నుంచి ఇప్పటి వరకు ప్రయాణమనే సందేశాన్నిచ్చింది.ఎంటీవీ మూసేస్తున్నట్లు ప్రకటన విని ఆ ఛానెల్కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు.. ఈ ఛానెల్తో తమ జ్ఞాపకాలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఎంటీవీ మ్యాజిక్ మూసివేసినప్పటికీ ఆ బ్రాండ్ కొనసాగుతుంది. ఇప్పుడు రియాలిటీ షోలు, ఎంటర్టైన్మెంట్, డిజిటల్ ప్లాట్ఫార్మ్లపై దృష్టి పెట్టనున్నట్లు సదరు ఛానెల్ ప్రకటించింది.ఎంటీవీ ఛానెల్కు సంబంధించిన ప్రధాన ఘట్టాలు1981లో అప్పటి వరకు మ్యూజిక్ను రేడియో ద్వారా వినే ప్రేక్షకులకు మ్యూజిక్ వీడియో యుగం పరిచయం చేసింది.1983లో థ్రిల్లర్ ఆల్బమ్లోని బిల్లీ జీన్, బీట్ ఇట్ వీడియోలు ఎంటీవీలో ప్రసారం అవడంతో మైఖేల్ జాక్సన్ గ్లోబల్ సూపర్స్టార్గా మారాడు.1984లో ఎంటీవీ వార్షిక వీడియో మ్యూజిక్ అవార్డ్స్ ప్రారంభించడంతో... క్రమేణా అవి సంగీత పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మక అవార్డులుగా మారాయి. కళాకారుల్లో పోటీ పెరగడంతో ఎంతోమంది సంగీత కళాకారుల ప్రతిభ వెలుగు చూసింది.1985లో ఎంటీవీని వయాకామ్ ఇంటర్నేషనల్ అనే సంస్థ కొనుగోలు చేసింది. దాంతో ఎంటీవీ మరింత విస్తరించింది.1990లో ఎంటీవీ లైవ్ అకౌస్టిక్ ప్రదర్శనలు పాపులర్గా మారాయి. నిర్వానా, ఎరిక క్లాప్టన్ వంటి కళాకారుల ప్రదర్శనలు లెజెండరీగా నిలిచాయి.1992లో ఎంటీవీ రియాలిటీ టీవీకి నాంది పలికింది. ఇది తరువాత కాలంలో ఎంటీవీ దశను, దిశను మార్చేసింది.2000లో రియాల్టీ షోస్ యుగం వచ్చేసింది. జెర్సీ షోర్, లాగునా బీచ్, ది హిల్స్ వంటి వంటి షోలు ఎంటీవీని మ్యూజిక్ ఛానెల్ నుండి ఎంటర్టైన్మెంట్ ఛానెల్గా మార్చాయి.2025 డిసెంబర 31న ఎంటీవీ తన 24 గంటల మ్యూజిక్ ఛానెల్స్ను నిలిపి వేసింది. చివరి ప్రసారం 'వీడియో కిల్డ్ ది రేడియో స్టార్'తోనే ముగించింది. 1981లో మొదట ప్రారంభమైన పాటతోనే ముగింపు పలికింది. -
పాక్లో షరారత్ క్రేజ్ మామూలుగా లేదుగా, అమ్మాయిల స్టెప్పులు వైరల్
బాలీవుడ్ స్టార్హీరో రణవీర్ సింగ్ నటించిన లేటెస్ట్ మూవీ దురంధర్ (Dhurandhar ) బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొడుతోంది. అంతేకాదు గ్లోబల్గా కూడా హాట్ టాపిక్గా మారింది. దీంతో ఈ మూవీలో పాటల క్లిప్లు తెగ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా 'షరారత్' (Shararat) పాటతో ఒక పెళ్లి వేడుకలో పాకిస్తాన్ అమ్మాయిలు స్టెప్పులు నెట్టింట సందడిగా మారాయి.పాకిస్తానీ మహిళలు సినిమాలోని పాటకు డ్యాన్స్ చేస్తున్నారంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో విశేషంగా నిలుస్తోంది. ఈ క్లిప్లో, ఇద్దరు మహిళలు పెళ్లి వేదిక లోపల 'షరారత్' పాటకు డ్యాన్స్ చేస్తుండగా, ఇతర అతిథులు వారిని చూస్తూ ప్రోత్సహిస్తున్నారు.ఈ వీడియోపై చాలామంది నెటిజన్లు స్పందిస్తూ, నిషేధం ఉన్నప్పటికీ ఈ సినిమా ఇంతటి ఆదరణ పొందడంపై కామెంట్ల వెల్లువ కురిపిస్తున్నారు. “నిషేధం ఉన్నప్పటికీ ఈ సినిమాకు ఇంత క్రేజ్.. వావ్,” అని ఒకరు, “పాకిస్తానీలు దురంధర్ను విపరీతంగా ఇష్టపడు తున్నారు. బహుశా ఈ మూవీ దర్శకుడు ఆదిత్య ధార్కు నిషాన్-ఎ-పాకిస్తాన్ ఇస్తారేమో అని మరొకరు వ్యాఖ్యానించారు. భారత ఉపఖండంపై బాలీవుడ్ సాంస్కృతిక ముద్ర ఉందని మరకొరు కమెంట్ చేశారు.Pakistani girls dancing to Shararat despite the ban on Dhurandhar. https://t.co/l89mWhDEdH— Abhishek Dhiman (@Abhi_dhiman8090) January 5, 2026కాగా దురంధర్ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్లకు పైగా వసూలు చేసింది. అయితే పాకిస్తాన్తో పాటు బహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈలలో ఈ మూవీ విడుదల కాలేదు. అయినా కూడా 2025లో విదేశాలలో అత్యంత విజయ వంతమైన భారతీయ చిత్రంగా నిలిచింది.మరోవైపు ఆయేషా ఖాన్,క్రిస్టల్ డిసౌజా నటించిన 'షరారత్' డ్యాన్స్ నంబర్ మ్యూజిక్ వీడియో యూట్యూబ్లో 100 మిలియన్ల వీక్షణలను దాటింది. ఈ పాటకు శశ్వత్ సచ్దేవ్ సంగీతం అందించగా, మధుబంతి బాగ్చి , జాస్మిన్ సాండ్లాస్ పాడారు. విజయ్ గంగూలీ ఈ పాటకు కొరియోగ్రఫీ చేశారు. ఇదొక గూఢచారి థ్రిల్లర్ చిత్రం. ఈ మూవీలో రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించగా, అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్, ఆర్. మాధవన్ ,సంజయ్ దత్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. 2025లో భారతదేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. దీని రెండవ భాగం మార్చి 2026లో విడుదల కానుందని భావిస్తున్నారు. -
దీపికా పదుకోణె బర్త్డే.. ఛాన్సులు పోయినా సరే వెనక్కు తగ్గని జీవితం
బాలీవుడ్లో అగ్ర కథానాయికల్లో ఒకరైన దీపికా పదుకోన్ నేడు 39వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఇండియాలోనే పాపులర్ హీరోయిన్గా ఆమెకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ప్రస్తుతం బాలీవుడ్లో అత్యధిక రెమ్యునరేషన్ (రూ. 20 నుంచి 30 కోట్లు) ఒక్కో సినిమాకు అందుకునే నటిగా కొనసాగుతున్నారు. అయితే, నటిగా కెరీర్ మొదలుపెట్టిన పదిహేడేళ్లకు ‘కల్కి 2898 ఏడీ’ మూవీతో దీపికా పదుకోన్ తెలుగు తెరపై కనిపించారు. హీరో ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్లో రూపొందిన ఈ సైన్స్ ఫిక్షన్ అండ్ మైథలాజికల్ మూవీలోని సుమతి పాత్రలో అద్భుతంగా నటించారు. అయితే, సీక్వెల్లో ఆమె నటించలేదు.ఛాన్స్లు పోయినా సరే ఎక్కడా తగ్గన దీపికపని గంటలు విషయంలో ఆమె షరతులు పెట్టారని అందుకే కల్కి-2 నుంచి మేకర్స్ తొలగించారనే వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ప్రభాస్ కొత్త సినిమా స్పిరిట్ నుంచి కూడా చర్చల దశలోనే ఆమెను తప్పించారని టాక్. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఆమెపై తీవ్రమైన ట్రోలింగ్కు దిగారు. కానీ, తను మాత్రం ఎక్కడా కూడా తిరిగి వారికి కౌంటర్ ఇవ్వలేదు. ఒక వ్యక్తి 8 గంటలకంటే ఎక్కువగా పనిచేయడం కష్టమని ఆమె పదేపదే అన్నారు. అదే మాటపై కట్టుబడుతానని బహిరంగంగా చెప్పారు. అలా ఒప్పుకున్న వారితోనే కలిసి సినిమా చేస్తానని చెప్పుకొచ్చారు. కొద్దిరోజుల తర్వాత తను చేసిన వ్యాఖ్యలను చాలామంది మేకర్స్ సమర్ధించారు కూడా.. ఈ క్రమంలో తనకు కొన్ని సినిమా ఛాన్సులు కూడా పోయాయి. అయినప్పటికీ తను ఎంతమాత్రం తగ్గలేదు. అయితే, అల్లు అర్జున్- అట్లీ కాంబినేషన్ సినిమాలో దీపికా నటిస్తున్నడం విశేషం. నేడు ఆమె బర్త్డే సందర్భంగా ఆ చిత్ర నిర్మాణ సంస్థ ఒక పోస్టర్ను కూడా విడుదల చేసింది.బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరిగా దూసుకెళుతున్నారు దీపికా పదుకోన్. ‘ఐశ్వర్య’ (2006) అనే కన్నడ సినిమాతో హీరోయిన్గా పరిచయమైన ఈ బ్యూటీ రెండు దశాబ్దాల కెరీర్కి చేరువ అవుతున్నారు. కన్నడ, హిందీ, తమిళ, తెలుగు, ఇంగ్లిష్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించారామె. కెరీర్ పీక్స్లో ఉన్నప్పుడే బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్తో ఏడడుగులు వేశారు. 2018 నవంబరు 14న వీరి వివాహం జరిగింది. పెళ్లి తర్వాత కూడా దీపిక క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. వరుస క్రేజీ ప్రాజెక్ట్లను సొంతం చేసుకుని, ఔరా అని ఆశ్చర్యపరిచారామె.ఇప్పటికీ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ల జాబితాలో దీపికా పదుకోన్ పేరు టాప్ ప్లేస్లో ఉండటం విశేషం. పైగా పెళ్లయినప్పటికీ హిందీలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్గా కంటిన్యూ అవుతున్నారీ బ్యూటీ. రణ్వీర్–దీపిక దంపతులకు దువా పదుకోన్ సింగ్ అనే పాప ఉంది. 2024లో అమ్మగా ప్రమోషన్ పొందారు దీపిక. మాతృత్వపు మాధుర్యాన్ని ఆస్వాదిస్తున్న ఆమె సినిమాలకు కొంచెం విరామం ఇచ్చారు. ఆ తర్వాత ఎలాగూ బిజీ అవుతారని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ప్రస్తుతం ఆమె చేతిలో ‘కింగ్’(వర్కింగ్ టైటిల్) అనే సినిమాతో పాటు అల్లు అర్జున్ సినిమా కూడా ఉంది.8గంటల పనిపై దీపికా వివరణ‘‘నేనో బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత మా అమ్మగారిపై మరింత గౌరవం పెరిగింది. వృత్తి జీవితాన్ని, పిల్లల పెంపకాన్ని బ్యాలెన్స్ చేయొచ్చని చాలామంది అంటుంటారు. కానీ అది చాలా కష్టమైన పని. కొత్తగా తల్లయిన వారు తిరిగి పనికి వచ్చినప్పుడు వారికి అందరూ సపోర్ట్ చేయాలి’’ అని దీపికా పదుకోన్ అన్నారు. సినిమా ఇండస్ట్రీలో మహిళలకు 8 గంటలు మాత్రమే పని చేసే వెసులుబాటును కల్పించాలని దీపిక కొంత కాలంగా పలు సందర్భాల్లో మాట్లాడిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్యూలో మరోమారు ఈ అంశంపై ఆమె మాట్లాడుతూ– ‘‘రోజుకి 8 గంటల పని మానవ శరీరానికి, మనసుకు సరిపోతుంది.మనం ఆరోగ్యంగా ఉండి, పని చేసినప్పుడే అవుట్పుట్ బాగా వస్తుంది. ఒత్తిడితో పని చేస్తే సరైన ఫలితం రాకపోవచ్చు. మా ఆఫీసులో సోమవారం నుంచి శుక్రవారం వరకు మేం 8 గంటలే పని చేస్తాం. వినేవారికి బోరింగ్గా ఉండొచ్చు. టైమ్ అనేది మన చేతుల్లో ఉన్న ధనంతో సమానం. దీన్ని ఎవరితో, ఎప్పుడు, ఎలా స్పెండ్ చేయాలని నిర్ణయించుకునే స్వేచ్ఛ నాకు ఉండాలి. నా దృష్టిలో సక్సెస్ అంటే ఇదే. 8 గంటలు మాత్రమే పని చేయాలనే నా నిర్ణయం కరెక్టే’’ అని చెప్పుకొచ్చారు దీపికా పదుకోన్. -
చెల్లి పెళ్లిలో డ్యాన్స్.. పైసా తీసుకోలే: బాలీవుడ్ హీరో
బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్ ఇంట గత నెలలో శుభకార్యం జరిగింది. కార్తీక్ చెల్లెలు కృతిక తివారీ వివాహం జరిగింది. పైలట్ తేజస్వి కుమార్ సింగ్తో ఆమె ఏడడుగులు వేసింది. తాజాగా ఈ పెళ్లి విశేషాలను కార్తీక్ పంచుకున్నాడు. కార్తీక్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం తూ మేరీ మైన్.. తేరా మైన్ తేరీ తు మేరీ. అనన్య పాండే హీరోయిన్గా యాక్ట్ చేసింది. పెళ్లిలో ఫ్రీగా డ్యాన్స్ఈ సినిమా డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా ప్రమోషన్స్లో భాగంగా కార్తీక్, అనన్య పాండే 'ద గ్రేట్ ఇండియన్ కపిల్ షో'కి హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్తీక్ మాట్లాడుతూ.. గత నెలలో చెల్లి పెళ్లి జరిగింది. పనులన్నీ అమ్మ, చెల్లియే చూసుకున్నారు. నా ఇంట్లో శుభకార్యానికి నేనే అతిథిగా వెళ్లాను. పెళ్లిలో ఉచితంగా డ్యాన్స్ చేశాను. నా సోదరి నాకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు అని సరదాగా చెప్పుకొచ్చాడు.సినిమాకార్తీక్ ఆర్యన్ విషయానికి వస్తే.. ప్యార్ కా పంచనామా, లూకా చుప్పీ, పతీ పత్నీ ఔర్ ఓ, భూల్ భులయ్యా 2, భూల్ భులయ్యా 3, షెహజాదా(అల వైకుంఠపురములో హిందీ రీమేక్), లూకా చుప్పి, ధమాకా.. ఇలా అనేక సినిమాలతో టాప్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ఇటీవల కార్తీక్ 'తూ మేరీ మైన్.. తేరా మైన్ తేరా తు మేరీ' మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే బాక్సాఫీస్ వద్ద ధురంధర్ హవా కారణంగా ఈ సినిమా నిలదొక్కుకోలేకపోయింది. View this post on Instagram A post shared by KARTIK AARYAN (@kartikaaryan) View this post on Instagram A post shared by KARTIK AARYAN (@kartikaaryan) చదవండి: కీర్తి సురేశ్ అక్కలో ఈ టాలెంట్ కూడా ఉందా? -
సినిమా ఫెయిల్.. నాకు బాగా కలిసొచ్చింది: నటి
హిందీ సినిమా 'మస్తీ 4' ఫ్లాప్ అయినప్పటికీ తనకు మాత్రం బాగానే కలిసొచ్చిందంటోంది నటి ఎల్నాజ్ నురోజి. మస్తీ 4 బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాన్ని అందుకోనప్పటికీ వ్యక్తిగతంగా, వృత్తిపరంగా తనను తాను మెరుగుపర్చుకోవడానికి ఉపయోగపడిందని చెప్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఎల్నాజ్ మాట్లాడుతూ.. మస్తీ 4 నాకు చాలా బాగా ఉపయోగపడింది.ట్రై చేశా..సినిమా రిజల్ట్ బాగోలేకపోయినప్పటికీ పర్ఫామెన్స్కు మాత్రం ప్రశంసలు దక్కాయి. నేను కామెడీ యాంగిల్ ట్రై చేయాలని ఎప్పటినుంచో అనుకున్నా.. అది ఈ సినిమాతో నెరవేరింది. నేను కామెడీ కూడా చేయగలనని ప్రేక్షకులకు నిరూపించాను. సేక్ర్డ్ గేమ్స్, అభయ్ వంటి ప్రాజెక్టులలో సీరియస్ పాత్రలు పోషించాను. రాణ్నీతిలో అయితే మరింత సీరియస్గా కనిపిస్తాను. కొత్తగా ఏదైనా చేయాలనిపించింది. నేనే ధైర్యం తెచ్చుకుని..ఆ విషయంలో మస్తీ 4 నాకు దోహదపడింది. అయితే సినిమా అనుకున్న రీతిలో ఆడనప్పుడు ఎవరైనా బాధపడతారు. అలా అని నేను రోజులకొద్దీ బాధపడుతూ కూర్చునే మనిషిని కాదు. ఒకటీరెండురోజులు ఫీలవుతాను. తర్వాత నాకు నేనే ధైర్యం తెచ్చుకుని ముందుకు సాగుతాను. ఎందుకంటే సినిమా రిజల్ట్ మన చేతుల్లో ఉండదు.నా లైఫ్ నాదిమస్తీ 4 మూవీలోని అడల్ట్ జోక్స్పై జరిగిన ట్రోలింగ్ను నేనస్సలు లెక్క చేయలేదు. ఈ నెగెటివిటీనే నేను పట్టించుకోను. నా జీవితం నాది.. పైగా కొన్నిసార్లు ట్రోల్స్ను నా ఫ్రెండ్స్తో షేర్ చేసుకుని నవ్వుతుంటాను కూడా! అని నటి ఎల్నాజ్ చెప్పుకొచ్చింది. చదవండి: 'మా జీవితాల్లో విలన్ ఎవరూ లేరు.. 15 ఏళ్ల బంధానికి ముగింపు' -
భర్తతో హీరోయిన్ తెగదెంపులు.. 'మా జీవితంలో విలన్..'
బుల్లితెర జంట జై భానుషాలి - మహి విజ్ వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతూ విడిపోవాలని నిర్ణయించుకున్నారు. 15 ఏళ్ల అన్యోన్య దాంపత్యానికి ఫుల్స్టాప్ పెడుతూ విడాకులు తీసుకుంటున్నారు. ఈ విషయాన్ని జై భానుషాలి, మహి సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈరోజు మేమిద్దరం విడిపోవాలని నిర్ణయించుకున్నాం. ఇకపై ఎవరి జీవితాలు వారివి. అయినప్పటికీ ఒకరికొకరం సపోర్ట్గా ఉంటాం. దారులు వేరుమా పిల్లలు తార, ఖుషి, రాజ్వీర్లకు తల్లిదండ్రులుగా, బెస్ట్ ఫ్రెండ్స్గా కొనసాగుతాం. వారికోసం ఏదైనా చేస్తాం. మా దారులు వేరయ్యాయి. కానీ, మా కథలో విలన్ అంటూ ఎవరూ లేరు. దయచేసి మా నిర్ణయాన్ని తప్పుపట్టకండి. మేము డ్రామాలు చేయడానికి బదులుగా శాంతియుతంగా ఉండటానికే సిద్ధమయ్యాం. దంపతులుగా విడిపోయినా స్నేహితులుగా కొనసాగుతాం అని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో నోట్ షేర్ చేశారు.ప్రేమకథజై- మహి ఓ క్లబ్లో తొలిసారి కలిశారు. పరిచయమైన మూడు నెలల్లోనే మహి తనకు కరెక్ట్ పార్ట్నర్ అనిపించింది జైకి. ఇద్దరి మనసులు కలవడంతో 2011లో పెళ్లి చేసుకున్నారు. వీరు తమ దగ్గర పనిచేసేవారికి జన్మించిన పిల్లలు రాజ్వీర్, ఖుషిల బాధ్యతను భుజానేసుకున్నారు. ఆ ఇద్దరు పిల్లలను పెంచుతున్నారు. జై దంపతులకు 2019లో ఐవీఎఫ్ ద్వారా కూతురు తారా జన్మించింది. ఇకపోతే 2025లోనే బుల్లితెర జంట విడిపోతున్నట్లు రూమర్స్ వచ్చాయి. అయితే అందులో నిజం లేదని మహి వాటిని కొట్టిపారేసింది. ఇప్పుడు అదే నిజమని రుజువు చేస్తూ వీరు విడిపోయారు.తెలుగు సినిమా హీరోయిన్మహి.. 2004లో వచ్చిన తెలుగు మూవీ తపనలో హీరోయిన్గా కనిపించింది. ఇతర భాషల్లోనూ సినిమాలు చేసింది. తర్వాత సీరియల్స్కు షిఫ్ట్ అయింది. జై భానుషాలి.. హేట్ స్టోరీ 2, ఏక్ పహేలీ లీలా వంటి సినిమాల్లో యాక్ట్ చేశాడు. అలాగే పలు సీరియల్స్లోనూ తళుక్కుమని మెరిశాడు. జై- మహి జంటగా నాచ్ బలియే అనే డ్యాన్స్ షో సీజన్ 5లో పాల్గొని ట్రోఫీ గెలిచారు.చదవండి: హీరో విజయ్ సీఎం అవుతాడు: నటుడు సుమన్ -
సంక్రాంతి కానుకగా శంబాల.. ట్రైలర్ రిలీజ్
ఆది సాయికుమార్ హీరోగా వచ్చిన మైథలాజికల్ థ్రిల్లర్ మూవీ శంబాల. యుగంధర్ ముని దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు నిర్మించారు. ఈ మూవీ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకొచ్చింది. తొలి రోజు నుంచే ఈ సినిమాకు పాజిటివ్ రావడంతో వసూళ్లపరంగానూ దూసుకెళ్తోంది. ఈ మూవీతో చాలా రోజుల తర్వాత ఆది సాయికుమార్ ఖాతాలో హిట్ పడింది.తెలుగులో సూపర్ హిట్ అయిన ఈ చిత్రాన్ని నార్త్ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. హిందీలో డబ్ చేసి సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే హిందీ ట్రైలర్ విడుదల చేశారు. కన్నడ హీరో రిషబ్ శెట్టి చేతుల మీదుగా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా శంబాల టీమ్కు రిషబ్ శెట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మూవీ జనవరి 09న బాలీవుడ్ ప్రేక్షకులను అలరించనుంది.కాగా.. ఈ చిత్రంలో అర్చన్ అయ్యర్ హీరోయిన్గా నటించారు. ఈ మైథలాజికల్ థ్రిల్లర్ మూవీకి శ్రీచరణ్ పాకాల సంగీతం అందించాడు. కేవలం వారం రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.16.20 కోట్లు రాబట్టిన ఈ సినిమా ఇప్పటికీ థియేటర్లలో సక్సెస్ఫుల్గా రన్ అవుతోంది.After a grand successful Telugu release. #Shambala releasing in Hindi on 9th Jan’26Unveiling the Hindi trailer - https://t.co/S1IUlDRVJzAll the best to @iamaadisaikumar and the entire team😊@tweets_archana @ugandharmuni #RajasekharAnnabhimoju @ShiningPictures… pic.twitter.com/itnt68GNa2— Rishab Shetty (@shetty_rishab) January 4, 2026 -
అమ్మాయి చున్నీ లాగే సీన్.. అమ్మానాన్న చేతిలో తిట్లు!
బాలీవుడ్ మోస్ట్ ఐకానిక్ విలన్స్లో శక్తి కపూర్ ఒకరు. అయితే ఆయన విలన్గా నటించడం ఇంట్లోవాళ్లకు అస్సలు ఇష్టముండేది కాదట! ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో శక్తి కపూర్ మాట్లాడుతూ.. కెరీర్ తొలినాళ్లలో జరిగిన సంఘటన ఇది. నేను నటించిన ఓ పెద్ద సినిమా 'ఇన్సానియత్కే దుష్మన్' అప్పుడే రిలీజైంది. చున్నీ లాగే సీన్..ఆ మూవీ చూడమని మా పేరెంట్స్కు చెప్పాను. అమ్మానాన్న ఇద్దరూ థియేటర్కు వెళ్లారు. సినిమా ప్రారంభంలోనే నేను ఓ అమ్మాయి చున్నీ లాగుతూ ఉంటాను. అది చూడగానే మా నాన్నకు చిరాకొచ్చింది. చలో, చూసింది చాలు, ఇక వెళ్లిపోదాం అని అమ్మతో అన్నాడు. వాడు బయట గూండాలా చేస్తాడు.. ఇప్పుడు సినిమాలో కూడా అదే చేస్తున్నాడు. చెడామడా తిట్టారుఇది చూసేందుకా మనం వచ్చింది? ఏం అక్కర్లేదు, నాకైతే సినిమా చూడాలని లేదంటూ అమ్మతో కలిసి బయటకు వెళ్లిపోయాడు. ఇంటికి రాగానే నన్ను చెడామడా తిట్టారు. ఎలాంటి పాత్రలు చేస్తున్నావ్? ఇంత నీచమైన పనులు చేయడానికి మనసెలా వస్తుంది? గూండా పాత్రలు పక్కనపెట్టి మంచి రోల్స్ చేయు.. హేమమాలిని, జీనత్ అమన్ వంటి వారి పక్కన హీరోగా నటించమని చెప్పారు. నెగెటివ్ రోల్స్ వల్లే..నాకు జన్మనిచ్చింది మీరే.. ఈ ముఖాన్ని సృష్టించింది మీరే.. నా ముఖం చూసి ఎవరూ హీరోగా లేదా మంచి పాత్రలు ఇవ్వడం లేదు. విలన్గానే నటించమని అడుగుతున్నారు. వాటిని తిరస్కరించేంత శక్తి నాకు లేదు. పైగా ఆ నెగెటివ్ రోల్స్ వల్లే అంతో ఇంతో గుర్తింపు వస్తోంది అని నచ్చజెప్పాను అన్నాడు. కాగా అండాజ్ అప్న అప్న, గుండా వంటి ఎన్నో చిత్రాల్లో తనదైన విలనిజం పండించాడు శక్తి కపూర్. -
ప్రియురాలితో స్టార్ హీరో మేనల్లుడి ఎంగేజ్మెంట్
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ మేనల్లుడు అయాన్ అగ్నిహోత్రి ఫ్యాన్స్కు గుడ్ న్యూస్ చెప్పారు. తన ప్రియురాలు టీనా రిజ్వానీతో నిశ్చితార్థం చేసుకున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ప్రియురాలికి ప్రపోజ్ చేసిన ఫోటోలను షేర్ చేశారు. ఇవీ కాస్తా వైరల్ కావడంతో అయాన్కు అభినందనలు చెబుతున్నారు. కాగా.. సల్మాన్ ఖాన్ మేనల్లుడు సంగీతకారుడు అయాన్ అగ్నిహోత్రి సింగర్, మ్యూజిషియన్గా రాణిస్తున్నారు. ఇటీవల దుబాయ్లో జరిగిన ఒక ఈవెంట్లో అద్భుతమైన ప్రదర్శన ఇచ్చాడు.మరోవైపు సల్మాన్ ఖాన్ ప్రస్తుతం'బ్యాటల్ ఆఫ్ గాల్వాన్' పేరుతో తీస్తున్న ఓ సినిమాలో హీరోగా చేస్తున్నాడు. కొన్నిరోజుల క్రితమే టీజర్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ సల్మాన్ ఫ్యాన్స్ను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ చిత్రాన్ని అపూర్వ లఖియా దర్శకత్వంలో రూపొందిస్తున్నారు. సల్మాన్ ఖాన్ ఇందులో ఇండియన్ ఆర్మీ ఆఫీసర్గా కనిపించనున్నారు. 2020లో గల్వాన్ లోయలో భారత-చైనా సైనిక ఘర్షణ ఘటన నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఇందులో వీరమరణం పొందిన తెలంగాణలోని సూర్యాపేటకు చెందిన కల్నల్ బిక్కుమళ్ళ సంతోష్ బాబు పాత్రలో సల్మాన్ కనిపించబోతున్నారు. View this post on Instagram A post shared by Agni (@ayaanagnihotri) -
అది నా అదృష్టం!
‘కౌన్ బనేగా కరోడ్పతి’ (కేబీసీ).. ఈ రియాలిటీ షో ఎంత పాపులర్ అయిందో తెలిసిందే. ఈ షో అంత పాపులర్ కావడానికి ప్రధాన కారణం అమితాబ్ బచ్చన్. 17 సీజన్లుగా ఈ షోకి ఆయన వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ‘కేబీసీ’ సీజన్ 17 గ్రాండ్ ఫినాలే శుక్రవారం ఘనంగా ముగిసింది. ఈ ఎపిసోడ్లో ఆరంభంలో అమితాబ్ బచ్చన్ మాట్లాడుతూ–‘‘25 ఏళ్లుగా ‘కేబీసీ’ షోతో విడదీయరాని బంధాన్ని ఏర్పరుచుకున్నాను.నా జీవితంలో మూడింట ఒక వంతు సమయాన్ని ఈ కార్యక్రమం కోసమే వెచ్చించాను. సామాన్యుల జ్ఞానానికి అగ్నిపరీక్షలా నిలిచే ఈ వేదికపై ఇంతకాలం హోస్ట్గా ఉండటం కూడా నా అదృష్టంగా భావిస్తున్నాను. నేను నవ్వితే నాతోపాటే నవ్వారు వీక్షకులు.. నా కళ్లలో నీళ్లు తిరిగితే మీ కళ్లు చెమ్మగిల్లాయి. మీరు ఇలా తోడుగా ఉన్నంత వరకు ఈ గేమ్ షో ఇలానే కొనసాగుతుంది. థ్యాంక్యూ’’ అంటూ భావోద్వేగానికి లోనయ్యారు అమితాబ్. -
పెళ్లి పీటలెక్కబోతున్న లవ్బర్డ్స్: హాట్టాపిక్గా ఎంగేజ్మెంట్ రింగ్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ సోదరి, నటి నుపుర్ సనన్ త్వరలో పెళ్లి పీటలెక్కేందుకు సిద్ధపడుతోంది. సోషల్ మీడియా వేదికగా తనప్రియుడు ప్రముఖ సింగర్ స్టెబిన్ బెన్తో ఎంగేజ్మెంట్ వార్తను అధికారికంగా ప్రకటింది. దీంతో ఈఫోటోలు నెట్టింట సందడిగామారాయి. 2023 నుండి డేటింగ్లో ఉన్న ఈ జంట జనవరి 3న తన రిలేషన్ షిప్ను అధికారికంగా ప్రకటించాయి. రాజస్తాన్లోని ఉదయ్పూర్లో అత్యంత ఘనంగా జనవరి 11 పెళ్లి చేసుకోనున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ సందర్బంగా నూపుర్ తన నిశ్చితార్థపు విశేషాలు ఆసక్తికరంగా మారాయి. నూపుర్ భారీ నిశ్చితార్థపు ఉంగరం ధర ఎంత అనేది చర్చనీయాంశంగా మారింది. స్టెబిన్ తన ప్రియురాలు నూపుర్ కోసం ఉత్తమమైన ఉంగరం కోసం పెద్ద రీసెర్చే చేసి ఉంటాడని భావిస్తున్నారు. నూపుర్ సనన్ భారీ నిశ్చితార్థపు ఉంగరం ధర ఎంత? ఎప్పటిలాగా రౌండ్గా గాకుండా ఉన్న క్లాసీ మార్క్విస్ ఉంగరం హాట్టాపిక్గా నిలిచింది. ఎంగేజ్మెంట్ కోసం కాబోయే వధువుకు సాధారణంగా గుండ్రని, ప్రిన్సెస్-కట్ డైమండ్ ఉంగరాలతో నిండిన ఈ ప్రపంచంలో, స్టెబిన్ బెన్ ఒక మార్క్విస్-కట్ నిశ్చితార్థపు ఉంగరాన్ని ఎంచుకోవడం విశేషం. కొన్ని నివేదికల ప్రకారం మధ్యలో ఉన్న వజ్రం 0.8 అని కొందరు వాదిస్తున్నప్పటికీ, 4 క్యారెట్లు అని పలు నివేదిలు పేర్కొంటున్నాయి. అన్నట్టు మార్క్విస్-కట్ నిశ్చితార్థపు ఉంగరాలకు రాయల్ లుక్కి ప్రతీకగా నిలుస్తాయి. యూరోపియన్ రాజరిక కాలంలో ఇవి ప్రాచుర్యం పొందాయి. దీంతో స్టెబిన్ సౌందర్య ప్రియత్వంపై ప్రశంసలు లభిస్తున్నాయి.ఇదీ చదవండి: జంక్ ఫుడ్ వద్దు.. ఈ లడ్డూ వెరీ గుడ్డూ!మధ్యలో ఉన్న వజ్రానికి ఇరువైపులా రెండు క్లాసీ వజ్రాలు కూడా ఉన్నాయిజ ఈ ఉంగరం ఖచ్చితంగా ప్రకృతి మూలకాల నుండి ప్రేరణ పొంది తయారు చేశారని అంచనా. మిస్మాలిని ప్రకారం, మధ్యలో ఉన్న వజ్రం 4 క్యారెట్ల బరువు ఉంటే, ఆ ఉంగరం ధర సుమారు రూ. 8,32,000 ఉండవచ్చని భావిస్తున్నారు.నుపుర్- బెన్ నుపుర్ సనన్ మాస్ మహారాజా రవితేజ నటించిన 'టైగర్ నాగేశ్వరరావు' (2023) సినిమాతో నుపుర్ హీరోయిన్గా టాలీవుడ్లోకి అడుగుపెట్టింది. బి ప్రాక్ పాడిన 'ఫిలాల్' వంటి సూపర్ హిట్ మ్యూజిక్ వీడియోలలో కనిపించడంతోపాటు ఒక ఆంట్రప్రెన్యూర్గా రాణిస్తోంది. రొమాంటిక్ సాంగ్స్కు ఇతను పెట్టింది పేరైన స్టెబిన్ బెన్ బాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ ప్లేబ్యాక్ సింగర్లలో ఒకరిగా ఖ్యాతి గడించాడు.ఇదీ చదవండి: కర్ణాటకలో అద్భుతం : ఇది ‘మామూలు చిరుత’ కాదు -
సల్మాన్ ఖాన్ రూ.80 కోట్ల ఆస్తి ఆమె పేరిట?
సల్మాన్ ఖాన్ ఈ మధ్య తరుచుగా వార్తల్లో నిలుస్తున్నాడు. 'బ్యాటల్ ఆఫ్ గాల్వాన్' పేరుతో తీస్తున్న ఓ సినిమాలో హీరోగా చేస్తున్నాడు. కొన్నిరోజుల క్రితమే గ్లింప్స్ రిలీజ్ చేశారు. అంతలోనే దీనిపై చైనా అక్కసు వెళ్లగక్కింది. ఈ సంగతి పక్కనబెడితే ఇప్పుడు ఆసక్తికర పనిచేసి చర్చనీయాంశమయ్యాడు. తన సవతి చెల్లిపై అంతులేని ప్రేమ చూపించడమే ఇందుకు కారణం. ఇంతకీ ఏంటి సంగతి?(ఇదీ చదవండి: సింగర్తో యంగ్ బాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. అధికారిక ప్రకటన)సల్మాన్ ఖాన్కి ముంబైలో ఇల్లు ఉన్నప్పటికీ.. పాన్వెల్ అనే ప్రాంతంలో 150 ఎకరాల విస్తీర్ణంలో ఉండే ఫామ్ హౌస్లోనే ఎక్కువగా ఉంటుంటాడు. కొన్నిరోజుల క్రితం పుట్టినరోజు వేడుకల్ని కూడా అక్కడే సెలబ్రేట్ చేసుకున్నాడు. ఈ ఫౌమ్ హౌస్కే తన సవతి చెల్లి అర్పితా పేరుని పెట్టాడు. ఇదే ఇప్పుడు ఆసక్తికరంగా అనిపిస్తుంది. ఎందుకంటే సల్మాన్ ఖాన్కి ఇద్దరు సోదరులు, ఓ సోదరి ఉన్నప్పటికీ.. తెచ్చి పెంచుకున్న అర్పితాపై ఎక్కువ మమకారం చూపిస్తుంటాడు.చిన్నప్పటి నుంచి అర్పితాని పెంచి పెద్ద చేసి పెళ్లి చేయడంలో సల్మాన్ కీలక పాత్ర పోషించాడు. ఆమె కొడుకుల్ని కూడా ముద్దు చేస్తుంటాడు. ఇప్పుడు ఈమె పేరుని తన ఫౌమ్ హౌస్కి పెట్టాడంటే రాబోయే రోజుల్లో ఈ ఆస్తిని ఆమెకు రాసిచ్చిన ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. 150 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఫౌమ్ హౌస్ ప్రస్తుత విలువ రూ.80 కోట్ల పైనే ఉండొచ్చని టాక్.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన మలయాళ థ్రిల్లర్.. తెలుగు రివ్యూ) -
పోకిరి విలన్కు యాక్సిడెంట్.. ఆస్పత్రిలో వీడియో రిలీజ్
ప్రముఖ నటుడు, పోకిరి విలన్ ఆశిష్ విద్యార్థి పెద్ద గండం నుంచి బయటపడ్డాడు. భార్య రూపాలి బరువాతో కలిసి శుక్రవారం రాత్రి గువహటిలో బయట డిన్నర్ చేశాడు ఆశిష్. డిన్నర్ తర్వాత రోడ్డు దాటే క్రమంలో స్పీడుగా వస్తున్న ఓ బైక్ వీరిని ఢీ కొట్టింది. అది గమనించిన స్థానికులు వెంటనే బైకర్తో పాటు ఆశిష్ దంపతులను ఆస్పత్రిలో చేర్పించారు.యాక్సిడెంట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న ఆశిష్ తాజాగా ఇన్స్టాగ్రామ్లో లైవ్లోకి వచ్చాడు. నిన్న రోడ్డు దాటుతుండగా యాక్సిడెంట్ అయింది. ప్రస్తుతానికి ఇద్దరం క్షేమంగానే ఉన్నాం. రూపాలిని ఇంకా అబ్జర్వేషన్లో ఉంచారు. నాకు చిన్న గాయం అయింది, కానీ లేచి నడవగలను, మాట్లాడగలను. మీ ఆశీస్సుల వల్ల అంతా బానే ఉంది. భయపడాల్సిందేమీ లేదు అని చెప్పుకొచ్చాడు.సినిమాఆశిష్ విద్యార్థి.. గుడుంబా శంకర్, అన్నవరం, నరసింహుడు, అతిథి, తులసి, చిరుత, కంత్రి, అదుర్స్, నాయక్, ఆగడు, కిక్ 2, నాన్నకు ప్రేమతో, ఇస్మార్ట్ శంకర్.. ఇలా అనేక సినిమాలు చేశాడు. తెలుగుతో పాటు హిందీ, కన్నడ, తమిళ, బెంగాలీ, మలయాళ, మరాఠి భాషల్లోనూ పలు చిత్రాలు చేశాడు. చివరగా 'ద ట్రేటర్స్' అనే రియాలిటీ షోలో కనిపించాడు. ఆశిష్ గతంలో రాజోషిని పెళ్లి చేసుకోగా వీరికి కుమారుడు అర్థ్ సంతానం. పలు కారణాల రీత్యా 2022లో దంపతులు విడిపోయారు. ఆ మరుసటి ఏడాది ఆశిష్.. రూపాలి బరువాను రెండో పెళ్లి చేసుకున్నాడు. View this post on Instagram A post shared by Ashish Vidyarthi (@ashishvidyarthi1) చదవండి: మగాడిలా తయారవుతున్నావ్.. నటి కూతురి కౌంటర్ -
సింగర్తో యంగ్ హీరోయిన్ పెళ్లి.. అధికారిక ప్రకటన
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ ఇంట్లో పెళ్లి భాజాలు మోగనున్నాయి. ఈమె కంటే ముందు చెల్లి నుపుర్ సనన్ ఓ ఇంటిది కాబోతుంది. గత కొన్నాళ్లు వస్తున్న రూమర్స్ నిజం చేస్తూ సింగర్ స్టెబిన్ బెన్ని ఈమె పెళ్లి చేసుకోనుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. ఫొటోలు కూడా పోస్ట్ చేశారు.(ఇదీ చదవండి: విడాకులు తీసుకుని నాలుగేళ్లు.. మళ్లీ ప్రేమలో పడ్డ 'ఉరి' నటి)కృతి సనన్ మొదట తెలుగు సినిమాలు చేసి ఆపై బాలీవుడ్కి షిఫ్ట్ అయింది. చెల్లి నుపుర్ సనన్ కూడా అలానే చేయాలనుకుంది. మొదటగా టాలీవుడ్లో రవితేజ 'టైగర్ నాగేశ్వరరావు' మూవీతో హీరోయిన్గా పరిచయమైంది. సినిమా ఫ్లాప్ కావడంతో మరో అవకాశం రాలేదు. ఒకటిరెండు ఆల్బమ్ సాంగ్స్లో కనిపించింది. కెరీర్ పరంగా వెనకబడినప్పటికీ లైఫ్లో ముందడుగు వేసింది. పెళ్లికి సిద్ధమైంది.ప్రముఖ సింగర్ స్టెబిన్ బెన్ని నుపుర్ సనన్ పెళ్లి చేసుకోనుంది. జనవరి 11న ఈ శుభకార్యం జరగనుందని ఇదివరకే రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు కూడా పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చారు గానీ తేదీ లాంటివి ఏం ప్రకటించలేదు. నుపుర్కి స్టెబిన్ పెళ్లి ప్రపోజల్ చేస్తున్నట్లు, ఆమె అంగీకరించినట్లు ఉన్న ఫొటోలని నుపుర్ తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఇవి వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: సమంత హనీమూన్ ట్రిప్.. ఫొటోలు వైరల్!) View this post on Instagram A post shared by Nupur Sanon (@nupursanon) -
నాతోపాటు నవ్వారు, ఏడ్చారు.. బిగ్బీ భావోద్వేగం
సినిమాల ద్వారా అభిమానులను సంపాదించుకున్న బిగ్బీ అమితాబ్ బచ్చన్ టీవీ షోల ద్వారా వారికి మరింత దగ్గరయ్యాడు. కౌన్ బనేగా కరోడ్పతి (KBC) అనే రియాలిటీ షోకి అమితాబ్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు. ఈ కేబీసీ 17వ సీజన్ శుక్రవారం ముగిసిపోయింది. ఈ క్రమంలో చివరి ఎపిసోడ్ ప్రారంభంలో బిగ్బీ భావోద్వేగానికి లోనయ్యాడు.అంతా నిన్ననే..కొన్నిసార్లు మన జీవితంలోని కొన్ని క్షణాలను ఎంత గాఢంగా ఆస్వాదిస్తాం. ఆ క్షణాలు ముగింపుకు చేరుకుంటే.. అదేంటి, ఇప్పుడే కదా మొదలైంది అన్నంత బాధేస్తుంది. ప్రతీది నిన్ననే జరిగినట్లుగా ఉంటుంది. ఈరోజు చివరి ఎపిసోడ్.. నా మనసంతా అదోలా ఉంది. నా జీవితంలో మూడింట ఒక వంతు.. కాదు, అంతకన్నా ఎక్కువ ఈ షో ద్వారా మీ అందరితో గడిపాను. అదే నాకు దక్కిన గొప్ప అవకాశం.థాంక్యూ సో మచ్నేను ఎప్పుడు వచ్చినా మీ అందరూ సాదరంగా ఆహ్వానం పలికారు. నేను నవ్వితే నాతోపాటే నవ్వారు.. నా కళ్లలో నీళ్లు తిరిగితే మీ కళ్లు చెమ్మగిల్లాయి. ఈ ప్రయాణం మొదలైన దగ్గరి నుంచి ఆఖరు వరకు మీరంతా నాకు తోడుగా ఉన్నారు. మీరు ఇలా తోడుగా ఉన్నంతవరకు ఈ గేమ్ షో ఇలాగే కొనసాగుతుంది. థాంక్యూ సో మచ్ అని పేర్కొన్నాడు. ఆయన కామెంట్స్ విని అభిమానులు సైతం ఎమోషనలవుతున్నారు. మీరు షోలో ఉన్నారు కాబట్టే మేమింకా దాన్ని చూస్తున్నాం.. కేబీసీ 18వ సీజన్ కోసం ఎదురుచూస్తున్నాం అని కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by @sonytvofficial చదవండి: మగాడిలా తయారవుతున్నావ్.. నటి కూతురి కౌంటర్ -
హిందీలో డియర్ కామ్రేడ్? దాని జోలికే వెళ్లనన్న హీరో
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ 'అర్జున్ రెడ్డి' సినిమా బాలీవుడ్లో 'కబీర్ సింగ్'గా రీమేకై సంచలన విజయం సాధించింది. ఇదే క్రమంలో విజయ్ పాత మూవీ 'డియర్ కామ్రేడ్' ఇప్పుడు హిందీలో రీమేక్ కానుందని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రంలో సిద్దాంత్ చతుర్వేది, ప్రతిభ రంత హీరోహీరోయిన్లుగా నటించనున్నట్లు బీటౌన్లో వార్తలు వినిపిస్తున్నాయి.రీమేక్స్ జోలికి వెళ్లనుతాజాగా ఈ రూమర్స్పై సిద్దాంత్ చతుర్వేది స్పందించాడు. అందులో ఏమాత్రం నిజం లేదని క్లారిటీ ఇచ్చాడు. ఇకపై రీమేక్స్ చేయదల్చుకోలేదన్నాడు. ఒరిజినల్ సినిమాలకు, అందులో నటించిన యాక్టర్స్కు అభిమాని అయినప్పటికీ రీమేక్స్ జోలికి వెళ్లదల్చుకోలేదన్నాడు. అయితే ప్రతిభతో కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్లో ఓ స్టోరీ పెట్టాడు.అంతా గందరగోళంఅటు ప్రతిభ మాత్రం భిన్నంగా స్పందించింది. అధికారిక ప్రకటన వచ్చేవరకు ఆగమని కోరుతోంది. చాలా సినిమాల్లో నేను నటిస్తానని ప్రచారం జరగడం.. చివరకు వాటిలో నేను లేకపోవడంతో గందరగోళం ఏర్పడుతోంది. కాబట్టి ఏ విషయమైనా అఫీషియల్గా చెప్పిన తర్వాతే నమ్మండి అని పేర్కొంది.సినిమాసిద్దాంత్ చతుర్వేది చివరగా 'ధడక్ 2' సినిమాలో నటించాడు. ఇది తమిళ చిత్రం 'పెరియేరుమ్ పెరుమాల్' (2018)కి రీమేక్గా తెరకెక్కింది. ఈ మూవీ బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. 'డియర్ కామ్రేడ్' విషయానికి వస్తే.. ఇందులో విజయ్, రష్మిక మందన్నా జంటగా నటించారు. భరత్ కమ్మ దర్శకత్వం వహించిన ఈ మూవీ 2019లో ప్రేక్షకుల ముందుకు వచ్చి పర్వాలేదనిపించింది. -
ఓ మై గాడ్
బాలీవుడ్ సూపర్హిట్ ఫ్రాంచైజీ ‘ఓ మై గాడ్’ నుంచి ‘ఓ మై గాడ్ 3’ సినిమా షూటింగ్కు సన్నాహాలు మొదలయ్యాయి. ‘ఓ మై గాడ్ (2012), ఓ మై గాడ్ 2 (2023)’ చిత్రాల్లో లీడ్ రోల్లో నటించిన అక్షయ్కుమార్ ‘ఓ మై గాడ్ 3’లోనూ నటించనున్నారు. ఈ చిత్రంలోని మరో లీడ్ రోల్లో రాణీ ముఖర్జీ కనిపిస్తారని బాలీవుడ్ టాక్. అమిత్ రాయ్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమా ప్రీప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఒక సామాజిక అంశాన్ని చర్చించేలా ఈ సినిమా స్క్రిప్ట్ను రెడీ చేస్తున్నారట అమిత్. ఈ ఏడాది జూన్లో చిత్రీకరణను ప్రారంభించనున్నారని తెలిసింది . ఇక ప్రస్తుతం దర్శకుడు అనీస్ బాజ్మీతో ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్కి రెడీ అవుతున్నారు అక్షయ్కుమార్. తెలుగులో బ్లాక్బస్టర్గా నిలిచిన ‘సంక్రాంతికి వస్తున్నాం’కి హిందీ రీమేక్గా ఇది తెరకెక్కనుందట. ఈ సినిమా చిత్రీకరణ ఈ నెల మూడోవారంలో ప్రారంభం కానుందని తెలిసింది. -
విడాకులు తీసుకుని నాలుగేళ్లు.. మళ్లీ ప్రేమలో పడ్డ 'ఉరి' నటి
నెల క్రితం సమంత రెండో పెళ్లి చేసుకుంది. దర్శకుడు రాజ్ నిడిమోరుతో కొత్త జీవితం ప్రారంభించింది. ఈమె అనే కాదు గతంలోనూ పలువురు హీరోయిన్లు విడాకులు తీసుకున్న కొన్నేళ్లకు మరొకరిని పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు ఈ లిస్టులోకి మరో బ్యూటీ చేరింది. కొత్త ఏడాది సందర్భంగా తన సోషల్ మీడియాలో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ప్రియుడితో కలిసి వీడియోని కూడా పంచుకుంది.(ఇదీ చదవండి: సమంత హనీమూన్ ట్రిప్.. ఫొటోలు వైరల్!)యాడ్స్లో నటించి కెరీర్ ప్రారంభించిన కీర్తి కల్హారీ.. తర్వాత బాలీవుడ్లోనూ పింక్, ఉరి, షైతాన్, మిషన్ మంగళ్ తదితర సినిమాలు చేసింది. క్రిమినల్ జస్టిస్, హ్యుమన్, ఫోర్ మోర్ షాట్స్ తదితర వెబ్ సిరీస్ల్లోనూ కీలక పాత్రలు చేసి పేరు సొంతం చేసుకుంది. ఈమెనే ఇప్పుడు తన ప్రియుడిని పరిచయం చేసింది. 'ఫోర్ మోర్ షాట్స్' సిరీస్లో తన సహనటుడు రాజీవ్ సిద్ధార్థ్తోనే ప్రేమలో పడింది. గత కొన్నాళ్లుగా రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు వాటిని అధికారికం చేసేశారు.కీర్తి కల్హారీ గతంలో సాహిల్ సెహగల్ అనే నటుడిని 2016లో పెళ్లి చేసుకుంది. కానీ మనస్పర్థల కారణంగా 2021లో వీళ్లిద్దరూ విడిపోయారు. గత నాలుగేళ్లుగా ఒంటరిగానే ఉంటున్న కీర్తి ఇప్పుడు రాజీవ్తో కొత్త జీవితాన్ని ప్రారంభించనుంది. చూస్తుంటే త్వరలోనే పెళ్లి కబురు కూడా చెబుతారనిపిస్తోంది. కొత్త జంటకు తోటీనటీనటులు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇకపోతే 'ఫోర్ మోర్ షాట్స్' సిరీస్ చివరి సీజన్ గత నెల 19న స్ట్రీమింగ్ అయింది. ఆ సిరీస్ ఇలా అయిపోయిందో లేదు వీళ్లు తమ బంధాన్ని బయటపెట్టేశారు.(ఇదీ చదవండి: 'స్ట్రేంజర్ థింగ్స్' ఓవరాల్ రివ్యూ.. పదేళ్ల పాటు సాగిన సిరీస్) View this post on Instagram A post shared by Kirti Kulhari (@iamkirtikulhari) -
దుబాయ్లో గ్రాండ్గా తల్లి బర్త్డే : వివాదాల బ్యూటీ వీడియో వైరల్
నటి,వివాదాలతో వార్తల్లో నిలిచే బ్యూటీ క్వీన్ ఊర్వశి రౌతేలా తన తల్లి మీరా రౌతేలా పుట్టిన రోజును ఘనంగా నిర్వహించింది. ప్రపంచంలోనే అతి పెద్ద హెటల్, 24 క్యారెట్ల బంగారు కిరీటం, గోల్డ్ కేక్ లాంటి విశేషాలతో గుర్తుండిపోయేలా వేడుక చేసింది. దీనికి సంబంధించిన వీడియో,ఫోటోలను ఇన్స్టాలో షేర్ చేసింది.ప్రపంచంలోని ఎత్తైనహోటల్లో 24 క్యారెట్ల బంగారు కిరీట కేక్తో అమ్మ పుట్టినరోజు వేడుక.. మేం అందరం నిన్ను ప్రేమిస్తున్నాం. వరల్డ్ టాలెస్ట్ హోటల్,ప్యూర్ రాయల్ గోల్డ్ క్రౌన్ కేక్,ప్యూర్ లవ్’’అంటూ ఊర్వశి పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. దీంతో తల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలతోపాటు, ఊర్వశిపై ప్రశంసలు వెల్లువెత్తాయి.ఇదీ చదవండి: ఐదు నెలల చిన్నారి ఉసురు తీసిన ‘పాలు’విలాసవంతమైన వేడుకలో మూడు లేయర్ల బంగారు రంగు కేక్ ఒక ఆకర్షణ అయితే, 24 క్యారెట్ల బంగారంతో చేసిన కిరిటాన్ని ఊర్వశి తన తల్లి తలపై ఉంచడం మరో ఎట్రాక్షన్గా నిలిచింది. అందంగా ముస్తాబైన మీరా నవ్వుతూ, తన కుమార్తె స్వచ్ఛమైన ఆప్యాయత అనురాగాలను మురిసిపోయింది. కాగా ప్రతీ ఏడాది తల్లి బర్త్డే ఘనంగా నిర్వహించడం ఊర్వశికి అలవాటు. ఊర్వశి కలాజికల్ హారర్ చిత్రం కసూర్ 2 , వెల్కమ్ టు ది జంగిల్లలో నటించనుంది. గ్లెన్ బారెట్టో దర్శకత్వంలో ఆమె అఫ్తాబ్ శివదాసాని, జాస్సీ గిల్తో కలిసి నటిస్తోంది. View this post on Instagram A post shared by Urvashi Rautela (@urvashirautela) ఇదీ చదవండి: ఐఐటీ హైదరాబాద్ విద్యార్థికి ఏకంగా రూ. 2.5 కోట్ల ఆఫర్, రికార్డ్ -
సాయిపల్లవి కొత్త సినిమా.. స్టార్ హీరో వల్లే ఆలస్యం?
సాయిపల్లవి.. తెలుగు, తమిళ, మలయాళంలో సినిమాలు చేసిన హీరోయిన్. గతేడాది ఫిబ్రవరిలో 'తండేల్'తో ప్రేక్షకుల్ని పలకరించింది. తర్వాత నుంచి పూర్తిగా సైలెంట్. బయట కూడా ఎక్కడా కనిపించట్లేదు. ప్రస్తుతం ఈమె హిందీలో 'రామాయణ' అనే భారీ బడ్జెట్ మూవీ చేస్తోంది. ఇది రాబోయే దీపావళికి థియేటర్లలోకి రానుందని ప్రకటించారు. దీనికంటే ముందో ఓ హిందీ రొమాంటిక్ మూవీతో రానుంది. అయితే ఈ చిత్రం రిలీజ్ కావాల్సినప్పటికీ.. స్టార్ హీరో వల్లే ఆలస్యమవుతోందని మాట్లాడుకుంటున్నారు.సౌత్ ఇండస్ట్రీలో సినిమాలు చేసి గుర్తింపు తెచ్చుకున్న సాయిపల్లవి.. హిందీలో చేసిన తొలి సినిమా 'మేరే రహో'. సూపర్స్టార్ ఆమిర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ హీరో. ఈ మూవీ షూటింగ్ గతేడాది ఏప్రిల్లోనే పూర్తయిపోయింది. లెక్క ప్రకారం అయితే డిసెంబరు రెండో వారంలో రిలీజ్ చేద్దామనుకున్నారు. కానీ 'ధురంధర్' దెబ్బకు లెక్కలన్నీ మారిపోయాయి. కొడుకు చిత్రం మార్కెటింగ్ అంతా చూసుకుంటున్న ఆమిర్ ఖాన్.. కావాలనే ఈ మూవీ రిలీజ్ వాయిదా వేశాడు. రాబోయే రెండు మూడు నెలల్లోనూ బాలీవుడ్లో బోర్డర్ 2, ధురంధర్ 2, బ్యాటల్ ఆఫ్ గాల్వాన్ లాంటి పెద్ద పెద్ద సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.ఇంత పోటీలో వస్తే తమ సినిమాకు పెద్దగా కలెక్షన్స్ రావని భయపడ్డాడో ఏమో గానీ ఆమిర్ ఖాన్.. 'మేరే రహో' చిత్రాన్ని జూలైలో థియేటర్లలోకి తీసుకురావాలని అనుకుంటున్నాడట. ఒకవేళ ఇదే నిజమైతే.. 'రామాయణ' రిలీజ్కి కొద్ది రోజుల ముందే సాయిపల్లవి హిందీ ప్రేక్షకుల ముందుకొచ్చినట్లు అవుతుంది. ప్రస్తుతానికైతే ఈ ప్రాజెక్టుపై ఎలాంటి బజ్ లేదు.ఆమిర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ ఇప్పటికే ఓటీటీలో ఓ మూవీ, థియేటర్లలో ఓ సినిమా(లవ్ టుడే రీమేక్) చేశాడు. రెండు కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. మరి సాయిపల్లవితో చేసిన చిత్రంతోనైనా హిట్ కొడతాడేమో చూడాలి? -
బిగ్బాస్ బ్యూటీకి 150 మంది బాడీగార్డ్స్?
కొందరు బిగ్బాస్ సెలబ్రిటీలు బయటకు రాగానే చేసే హడావుడి అంతా ఇంతా కాదు. ఏదైనా ఈవెంట్కు వెళ్లినా, ఫంక్షన్కు వెళ్లినా చుట్టూ బాడీగార్డులను వెంటేసుకుని వెళ్తుంటారు. గతంలో బిగ్బాస్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్.. సోనియా-యష్ పెళ్లికి కూడా బాడీగార్డులను వెంటేసుకునే పోయాడు. నిన్నగాక మొన్న బిగ్బాస్ 9 విన్నర్ పవన్ కల్యాణ్ పడాల పదిమంది బాడీగార్డులతో ఓ ఈవెంట్కు హాజరయ్యాడు. 150 మంది బాడీగార్డులా?అయితే ఓ హిందీ కంటెస్టెంట్ మాత్రం ఏకంగా 150 మంది బాడీగార్డులను పెట్టుకుందంటూ ఓ వార్త వైరలవుతోంది. తను మరెవరో కాదు, తాన్య మిట్టల్. గొప్పలు చెప్పుకోవడంలో ఎప్పుడూ ముందుంటుందీ లేడీ కంటెస్టెంట్. పూటకో చీర కడతానని బిగ్బాస్ హౌస్కు దాదాపు 800 చీరలు తీసుకెళ్లింది. అలాగే 50 కిలోల నగలు కూడా పట్టుకెళ్లింది. లగ్జరీకి పెద్ద పీట వేసే ఈ బ్యూటీ తనకు 150మంది బాడీగార్డులున్నారన్న రూమర్పై తాజాగా స్పందించింది.అందులో నిజం లేదుతాన్య మిట్టల్ మాట్లాడుతూ.. నేను అలా ఎప్పుడూ చెప్పలేదు. ఇది కావాలని పుట్టించారు. నా కింద 150 మంది సిబ్బంది పనిచేస్తారని మాత్రమే చెప్పాను. దానికి బిగ్బాస్ హౌస్లోని ఓ కంటెస్టెంట్ జైషా ఖాద్రి.. వాళ్లందర్నీ నా బాడీగార్డ్స్ అని సరదాగా అన్నాడు. అంతకుమించి ఏమీ లేదు. అలా అని బాడీగార్డ్స్ లేరని చెప్పను. నాకంటూ కొంత సెక్యూరిటీ సిబ్బంది ఉంది.అబద్ధం చెప్పనుఎందుకంటే నాకు బట్టల పరిశ్రమ, ఫార్మా ఫ్యాక్టరీ, గిఫ్ట్ ఫ్యాక్టరీ ఉన్నాయి. అవన్నీ మీకు చూపించలేను. కానీ, నేనెప్పుడూ అబద్ధం చెప్పను. అబద్ధాలాడాల్సిన అవసరం నాకసలే లేదు అని పేర్కొంది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ తాన్య మిట్టల్.. హిందీ బిగ్బాస్ 19వ సీజన్లో పాల్గొని మూడో రన్నరప్గా నిలిచింది. ప్రముఖ దర్శకనిర్మాత ఏక్తా కపూర్ నిర్మిస్తున్న ఓ ప్రాజెక్ట్లోనూ నటించే ఛాన్స్ దక్కించుకుంది.చదవండి: ప్రేయసిని పరిచయం చేసిన బిగ్బాస్ కంటెస్టెంట్ షణ్ముఖ్ -
బాక్సాఫీస్ హిట్గా దురంధర్.. ఓటీటీ డీల్ ఎన్ని కోట్లో తెలుసా?
బాలీవుడ్ రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన దురంధర్ బాక్సాఫీస్ను షేక్ చేస్తోంది. డిసెంబర్ 5న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా.. ఏకంగా 2025లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. కేవలం రూ. 250 కోట్ల బడ్జెట్తో నిర్మించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే రూ. 1100 కోట్ల మార్కును దాటేసింది. ఆదిత్య ధార్ దర్శకత్వం వహించిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో దురంధర్ మూవీ ఓటీటీ డీల్పై చర్చ నడుస్తోంది. ఈ సినిమా ఎప్పుడు రానుందనే విషయంపై సినీ ప్రియుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. అయితే ఈ మూవీ ఓటీటీ రైట్స్కు ఇప్పటికే నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఈ సినిమా రెండు పార్ట్స్కు కలిపి రూ.130 కోట్ల డీల్ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన ఒక్కో పార్ట్కు రూ.65 కోట్లతో ఒప్పందం చేసుకుంది.అయితే ఈ సినిమా డీల్ మరింత పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ కావడంతో ఒప్పందం డబుల్ అయ్యే అవకాశమున్నట్లు తెలుస్తోంది. రూ.130 కోట్ల డీల్ చాలా తక్కువ అని బాలీవుడ్లో చర్చ మొదలైంది. దీంతో ఈ డీల్ విలువ రూ.275 కోట్ల వరకు చేరుకొవచ్చని సినీ ప్రియులు అంచనా వేస్తున్నారు. ఇదే నిజమైతే ఒక హిందీ చిత్రానికి నెట్ఫ్లిక్స్తో జరిగిన బిగ్ డీల్గా నిలవనుంది. గతంలో సూపర్ హిట్గా నిలిచిన స్టార్ సినిమాలు రూ.150 కోట్లకు పైగా ఓటీటీ వసూళ్లు దక్కించుకున్నాయి. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న వచ్చిన ఈ చిత్రంలో అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్, ఆర్. మాధవన్, రాకేష్ బేడి, సంజయ్ దత్ కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీ సీక్వెల్ మార్చి 19న విడుదల కానుంది. -
కుప్పలుతెప్పలు వద్దు.. ఒక్క సినిమానే చేస్తా!: ఆలియా భట్
'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' మూవీతో వెండితెరపై హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్. తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ఈమె చివరగా జిగ్రా (2024) సినిమాలో కనిపించింది. 2025లో ఒక్క సినిమా కూడా చేయలేదు. ప్రస్తుతం ఆల్ఫా, లవ్ అండ్ వార్ మూవీస్ చేస్తోంది.అర్థం చేసుకోగలిగా..తాజాగా ఆలియా భట్ మాట్లాడుతూ.. నేను హార్ట్ ఆఫ్ స్టోన్ అనే హాలీవుడ్ సినిమా చేశాను. కానీ అందులో నా పాత్రకు మరీ ఎక్కువ స్టంట్ సీన్లు లేవు. కానీ ఆల్ఫా మూవీలో ఎక్కువ యాక్షన్ సన్నివేశాల్లో నటించాను. పాప పుట్టాక ఇలాంటి సీన్లలో నటించడం కొత్త అనుభూతినిచ్చింది. నా శరీరం ఇటువంటి సన్నివేశాల్లో నటించేందుకు ఏమేరకు సహకరిస్తుందనేది అర్థం చేసుకోగలిగాను.అదే నేర్చుకున్నా..లవ్ అండ్ వార్ మూవీ అయితే నాకు ఎంతో ప్రత్యేకం. ఈ సినిమా కోసం పనిచేస్తున్నప్పుడు ఎప్పుడూ అలిసిపోయినట్లుగా అనిపించలేదు. సంజయ్ లీలా భన్సాలీతో పని చేయడం అందమైన అనుభవాలను మిగిల్చింది. సెట్లో ఎంతగానో నేర్చుకున్నాను. గంగూభాయ్ కతియావాడి సెట్లో మైండ్లో ఎక్కువ ఆలోచనలు పెట్టుకోకుండా.. ఖాళీ మైండ్తో ముందుకు వెళ్లాలని నేర్చుకున్నాను. అప్పుడే అన్నింటినీ పరిశీలించొచ్చు, గమనించి నేర్చుకోవచ్చు.రెండూ బ్యాలెన్స్ఒకేసారి ఎక్కువ సినిమాలు చేయాలనుకోవడం లేదు. ఒక్కసారి ఒక ప్రాజెక్టులో మాత్రమే నటించాలనుకుంటున్నాను. ఓ పక్క కూతురు రాహాను చూసుకుంటూ మరోపక్క ఏదైనా ఒక సినిమాలో మాత్రమే లీనమవ్వాలని భావిస్తున్నాను. ప్రస్తుతానికి నా పనిని ఆస్వాదిస్తున్నాను అని చెప్పుకొచ్చింది.చదవండి: మురారి క్లైమాక్స్.. కాస్త తేడా కొట్టినా నన్ను చంపేవాళ్లే: దర్శకుడు -
ఆ సినిమా చూసి డిస్టర్బ్ అయ్యా.. ఇది ఊహించలేదు!
'బైసన్' మూవీతో ఈ ఏడాది మంచి హిట్ అందుకున్నాడు తమిళ దర్శకుడు మారి సెల్వరాజ్.. కేవలం ఐదు సినిమాలతోనే టాప్ దర్శకుడిగా మారిపోయాడు. 'పెరియేరమ్ పెరుమాల్', 'కర్ణన్', 'మామన్నన్', 'వాళై', 'బైసన్' చిత్రాలతో ఇండస్ట్రీలో తన మార్క్ క్రియేట్ చేసుకున్నాడు. అయితే ఇటీవల ఓ సినిమా తనను ఎంతగానో డిస్టర్బ్ చేసిందంటున్నాడు మారి సెల్వరాజ్.కలత చెందా..తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ఓటీటీలో 'హోంబౌండ్' అనే హిందీ సినిమా చూశాను. ఆ తర్వాత రెండు, మూడు రోజులు నేను మామూలు మనిషిని కాలేకపోయాను. ఆ సినిమా నాపై ఇంత ప్రభావాన్ని చూపుతుందనుకోలేదు. ఎంతో కలత చెందాను.. మనం మాత్రం కరోనా లాక్డౌన్ను మనం ఇంత ఈజీగా దాటేశామా? అనిపించింది. నా దృక్కోణాన్నే మార్చేసిందిహోంబౌండ్ చూశాక కొద్దిరోజులు ఎవరితోనూ మాట్లాడలేదు. సినిమాను మరింత ప్రామాణికంగా, వాస్తవికంగా ఎలా తీయాలో నన్ను ఆలోచించేలా చేసింది. ఒక దర్శకుడిగా నా దృక్కోణాన్నే మార్చేసింది అని చెప్పుకొచ్చాడు. హోంబౌండ్ విషయానికి వస్తే.. ఇషాన్ ఖట్టర్, విశాల్ జెత్వా, జాన్వీ కపూర్ ప్రధాన పాత్రలు పోషించారు. నీరజ్ గెవాన్ దర్శకత్వం వహించాడు. మార్టిన్ స్కోర్సెస్ నిర్మించిన ఈ చిత్రం ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లో అందుబాటులో ఉంది.చదవండి: చిన్న వయసులో ఆస్తులన్నీ కోల్పోయాం.. షాంపూలు అమ్మా: నటుడు -
దానాలతో ఇల్లు గుల్ల.. ఇంటింటికీ తిరిగి షాంపూలు అమ్మా!
చాలా హిందీ సినిమాల్లో నవ్వులు పంచిన అర్షద్ వార్సీ నిజ జీవితంలో మాత్రం ఎన్నో కష్టాలు చూశాడు. 16 ఏళ్లకే తల్లిదండ్రులను కోల్పోవడంతో జీవితంలో నిలదొక్కుకునేందుకు, బతుకు బండి సాగించేందుకు నానా అగచాట్లు పడ్డాడు. ఆ విషయాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నాడు.బంగారు లైటర్అర్షద్ వార్సీ మాట్లాడుతూ.. నా తండ్రి పేరు అహ్మద్ అలీ ఖాన్. తను హార్మోనియం వాయించేవాడు. ఉర్దూలో షాయరీలు రాసేవాడు. చిన్నప్పుడు నన్ను హాస్టల్లో వేశారు. సెలవులకు మాత్రమే ఇంటికొచ్చేవాడిని. ఓసారి ఆయన తనదగ్గరున్న గోల్డ్ లైటర్ను వేరేవాళ్లకు బహుమతిగా ఇచ్చేశాడు. మా ఇంట్లో పెద్ద కారు కూడా ఉండేది. మా అంకుల్ ఆ కారు మీద మనసు పారేసుకోవడంతో ఆయనకు గిఫ్ట్గా ఇచ్చేశాడు. ఉన్నదంతా పోయిందిఇలా ఉన్నదంతా ఇచ్చుకుంటూ ఏమీ మిగలదని చిన్న వయసులోనే అర్థమైంది. మా ఇంటికి జగదీప్, యునుస్ పర్వీజ్ వంటి సెలబ్రిటీలు వచ్చి మాతో కలిసి భోజనం చేసేవారు. మా నాన్నకు ముంబైలో రెండు భవంతులు ఉండేవి. ఆ సమయంలో ఇంట్లో ఎక్కువకాలం అద్దెకు ఉండేవాళ్లు ఆ ఇంటి యజమానులవుతారు అని కోర్టు ప్రకటించింది. అన్నీ మానేశా..దీంతో నాన్న వెంటనే ప్రాపర్టీని కొందరి పేరు మీదకు బదిలీ చేశారు. తర్వాత వాళ్లు తిరిగిచ్చేస్తారనుకున్నాడు. కానీ అది జరగలేదు. సుమారు 16 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయాను. అప్పటిదాకా గాలికి తిరుగుతున్న నేను ఒక్కసారిగా పెద్దవాడినైపోయాను. ఫ్రెండ్స్తో తిరగడం, పార్టీలకు వెళ్లడం.. అన్నీ మానేశాను. సినిమాఅన్నీ వదిలేసి పని చేయడం మొదలుపెట్టాను. ఇంటింటికీ వెళ్లి షాంపూలు అమ్మాను. నాలుగు రాళ్లు సంపాదించాను. తర్వాత సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టాను అని చెప్పుకొచ్చాడు. అర్షద్ వార్సీ.. మున్నా భాయ్ ఎంబీబీఎస్, హల్చల్, సలాం నమస్తే, జాలీ ఎల్ఎల్బీ, మస్తీ 4 వంటి పలు సినిమాల్లో నటించాడు. ప్రస్తుతం ఢమాల్ 4, కింగ్, వెల్కమ్ టు ద జంగిల్ సినిమాల్లో యాక్ట్ చేస్తున్నాడు.చదవండి: 25 ఏళ్లకే పెళ్లా? ఆ తప్పు చేయొద్దంటున్న బాలీవుడ్ బ్యూటీ -
25 ఏళ్లకే పెళ్లి.. ఆ తప్పు మాత్రం చేయొద్దు!
అమ్మాయిలు.. మీకు చాలా లైఫ్ ఉంది.. వెంటనే పెళ్లి చేసుకోకండి అంటోంది బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా. తనకు 25వ ఏటనే పెళ్లయిందని, ఆ తప్పు మరెవరూ చేయకూడదంటోంది. ఇండియా టుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మలైకా మాట్లాడుతూ.. చిన్న వయసులో పెళ్లి చేసుకోకండి.. దయచేసి ఆ తప్పు చేయకండి. నేను అదే తప్పు చేశాను. కాకపోతే నా వైవాహిక జీవితంలో జరిగిన ఓ అందమైన విషయం ఏంటంటే బిడ్డను కనడం. వర్కవుట్ కాలేదుఅయినప్పటికీ నేను చెప్పేది ఒక్కటే ముందు లైఫ్ను ఆస్వాదించండి.. స్థిరపడేందుకు కొంత సమయం తీసుకోండి. ఆర్థికంగా, మానసికంగా స్వేచ్ఛ లభించాక జీవితంలో పెళ్లి చేసుకుని సెటిల్ అవండి అని సలహా ఇచ్చింది. ఇంకా మాట్లాడుతూ.. పెళ్లి అనే సాంప్రదాయాన్ని నేను బలంగా నమ్ముతాను. కానీ ఎందుకో మరి నా విషయంలో వర్కవుట్ కాలేదు. విడిపోయాం.. నేను అక్కడే ఆగిపోకుండా జీవితంలో ముందుకు సాగాను. ప్రేమను పొందడం ఇష్టంకొందరితో ప్రేమలో పడ్డాను. కానీ ఎన్నడూ విసుగుచెందలేను. ఇప్పటికీ నా లైఫ్ను నేను ఆస్వాదిస్తున్నాను. ప్రేమ అనే ఆలోచన నాకెంతో ఇష్టం. ప్రేమను పంచడం, పొందడం భలే ఇష్టం. అలా అని ఇప్పుడు నేను ప్రేమ కోసం ఎదురుచూడటం లేదు. ఒకవేళ అది నా ఇంటి తలుపు తడితే దాన్ని కాదనలేను, తప్పకుండా ఆహ్వానిస్తాను అని చెప్పుకొచ్చింది.పెళ్లి- విడాకులుచయ్య చయ్య, కెవ్వు కేక వంటి ఐటం సాంగ్స్తో పాపులర్ అయిన మలైకా అరోరా.. 25 ఏళ్ల వయసులోనే పెళ్లి చేసుకుంది. సల్మాన్ ఖాన్ సోదరుడు, నటుడు అర్బాజ్ ఖాన్ను పెళ్లాడింది. వీరికి కుమారుడు అర్హాన్ ఖాన్ సంతానం. కొంతకాలానికి మలైకా - అర్బాజ్ దంపతుల మధ్య భేదాభిప్రాయాలు రావడంతో 2017లో విడిపోయారు. తర్వాత అర్బాజ్ మేకప్ ఆర్టిస్ట్ షురా ఖాన్ను వివాహం చేసుకున్నాడు. మలైకా.. హీరో అర్జున్ కపూర్తో ప్రేమాయణం నడిపింది, కానీ వీరి బంధం పెళ్లి పట్టాలెక్కేలోపు బ్రేకప్ చెప్పుకున్నారు.చదవండి: చెప్పలేనంత బాధ.. భగవంతుడిని ఒకటే ప్రార్థిస్తున్నా: బండ్ల గణేశ్ -
‘ధురంధర్’ కి రూ. 90 కోట్ల నష్టం!
రణవీర్ సింగ్ హీరోగా నటించిన 'ధురంధర్' సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.1,100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సంచలనం సృష్టిస్తోంది. అయితే, మిడిల్ ఈస్ట్ దేశాల్లో ఈ చిత్రం విడుదల కాకపోవడంతో భారీ నష్టం వాటిల్లిందని సినిమా ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ ప్రణబ్ కపాడియా తెలిపారు.ఈ సినిమాలో పాకిస్తాన్ వ్యతిరేక సందేశం ఉందనే కారణంతో యూఏఈ, సౌదీ అరేబియా, కువైట్, ఖతార్, బహ్రైన్, ఒమన్ వంటి గల్ఫ్ దేశాల్లో 'ధురంధర్'(Dhurandhar)పై బ్యాన్ విధించారు. ఈ ప్రాంతంలో భారతీయ యాక్షన్ సినిమాలు సాధారణంగా బాగా ఆడతాయని, ఈ బ్యాన్ వల్ల కనీసం 10 మిలియన్ డాలర్లు (సుమారు రూ.90 కోట్లు) నష్టం వచ్చిందని ప్రణబ్ కపాడియా పేర్కొన్నారు.తాజాగా ఆయన ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ..‘మిడిల్ ఈస్ట్ మార్కెట్ యాక్షన్ సినిమాలకు చాలా ముఖ్యం. ఈ బ్యాన్ ఒక పెద్ద అవకాశాన్ని కోల్పోయినట్లు అయింది. అయినా, డిసెంబర్ హాలిడే సీజన్లో ప్రేక్షకులు ఇతర దేశాలకు ట్రావెల్ చేసి సినిమా చూస్తున్నారు’ అని కపాడియా తెలిపారు.ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ ఇప్పటికే భారత్లో అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ సినిమాగా నిలిచింది. నార్త్ అమెరికా, యూరప్ మార్కెట్లలో బాగా ఆడినా, గల్ఫ్ బ్యాన్ వల్ల మరింత వసూళ్లు రావాల్సి ఉండగా... ఆ అవకాశం చేజారిపోయింది.ఈ సినిమాకు సీక్వెల్ కూడా రాబోతుంది. వచ్చే ఏడాది మార్చి 19న ‘ధురంధర్ 2’ను రిలీజ్ చేస్తామని టీమ్ ఇప్పటికే ప్రకటించింది. -
సల్మాన్ ఖాన్ సినిమాపై చైనా అక్కసు.. కారణం ఇదేనా?
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కొత్త సినిమా 'బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్'పై చైనా తీవ్ర అభ్యంతరం తెలుపుతోంది. సినిమా తీసినంతమాత్రన చరిత్ర మారిపోదంటూ చైనా అధికారిక మీడియా గ్లోబల్ టైమ్స్ లో అక్కసు వెళ్లగక్కింది. ఈ మేరకు తమ సంపాదకీయంలో బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్ చిత్రంపై తీవ్ర ఆరోపణలు చేసింది. ఇండియన్ సినిమాపై చైనాకు ఎందుకంత అక్కసు? బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్ కథేంటి?తెలంగాణ వీర సైనికుడిగా సల్మాన్సల్మాన్ఖాన్(salman Khan) హీరోగా అపూర్వ లఖియా దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘బ్యాటిల్ ఆఫ్ గల్వాన్’(Battle of Galwan Movie). సల్మాన్ పుట్టినరోజు సందర్భంగా శనివారం ఈ చిత్ర టీజర్ విడుదలైంది. సల్మాన్ ఖాన్ ఇందులో ఇండియన్ ఆర్మీ ఆఫీసర్గా కనిపించనున్నారు. 2020లో గల్వాన్ లోయలో భారత-చైనా సైనిక ఘర్షణ ఘటన నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇందులో వీరమరణం పొందిన తెలంగాణలోని సూర్యాపేటకు చెందిన కల్నల్ బిక్కుమళ్ళ సంతోష్ బాబు పాత్రలో సల్మాన్ కనిపించబోతున్నాడు.అయితే ఈ సినిమా కథపైనే ఇప్పుడు చైనా అభ్యంతరం చెబుతోంది. ఈ చిత్రం చరిత్రను వక్రీకరిస్తోందని చైనా మీడియా ఆరోపిస్తోంది. చైనా ప్రాదేశిక సమగ్రతను కాపాడటంలో తమ సైన్యం సంకల్పాన్ని ఇలాంటి సినిమాలు దెబ్బతీయబోదంటూ గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. గ్లోబల్ టైమ్స్ ప్రచురించిన కథనంలో చైనా సైనిక నిపుణులు మాట్లాడుతూ..భారత్-చైనా గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణకు సంబంధించిన నిజాలను సినిమాలో చూపించలేదని ఆరోపించారు. మూవీ కథాంశం భారత్ కి అనుకూలంగా ఉండే అవకాశం ఉందని, ఇది ప్రజలను రెచ్చగొట్టడానికి దోహదమవుతుందని చైనా మీడియా ప్రచారం చేస్తోంది.అదే చైనా భయమా?2020 జూన్ 15న గాల్వాన్ లోయలో భారత్-చైనా సైనికుల మధ్య ఘర్షణ జరిగింది.భారత్ ఆధీనంలో ఉన్న ప్రాంతాలను ఆక్రమించేందుకు చైనా ఆర్మీ దుస్సాహసం చేయగా, 16వ బీహార్ బెటాలియన్కు చెందిన కమాండింగ్ అధికారి కల్నల్ సంతోష్ బాబు నేతృత్వంలోని భారత సైనికులు చైనా దళాలకు ధీటుగా జవాబిచ్చారు. ఈ ఘర్షణలో తెలంగాణకు చెందిన కల్నల్ సంతోష్ బాబుతో సహా 20 మంది జవాన్లు అమరులయనట్లు భారత ప్రభుత్వం అధికారికంగా ధృవీకరించింది. అయితే చైనా మాత్రం వారికి జరిగిన ప్రాణనష్టంపై ప్రకటన విడుదల చేసేందుకు నిరాకరించింది. ఈ ఘటనలో చైనాకు చెందిన 40 మందికిపైగా సైనికులు మరణించి ఉంటారని విదేశీ మీడియా కథనాలు వెలువరించినప్పటికీ, చైనా మాత్రం ఈ విషయంలో నోరు మెదపలేదు. ఇప్పుడు ఈ ఘటన నేపథ్యంలోనే 'బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్' సినిమా రాబోతుంది. ఈ సినిమా విడుదలైతే..అసలు నిజం చైనీయులకు కూడా తెలిసే అవకాశం ఉంది. భారత్ చేతిలో చైనా సైన్యం ఘోరంగా దెబ్బతిందనే విషయం కూడా ప్రపంచానికి తెలిసే అవకాశం ఉంది. అందుకే టీజర్ రిలీజ్ అయినప్పటి నుంచే ఈ సినిమాపై చైనా దుష్ప్రచారం చేస్తోంది. ఈ సినిమా చైనా సర్కార్ పై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉందని భారత విశ్లేషకులు చెబుతున్నారు. -
2025లో 'వైరల్' వయ్యారి వీళ్లే..
ఈ ఏడాది బాగా క్లిక్కయిన సాంగ్స్లో వైరల్ వయ్యారి ఒకటి. యంగ్ హీరోయిన్ శ్రీలీల స్టెప్పులు.. పాట రిథమ్.. అన్నీ సరిగ్గా సెట్టయ్యాయి. అందుకే ఆ పాట అంత వైరల్ అయింది. ఈ సాంగ్లో.. ఇన్స్టాగ్రామ్లో నా ఫాలోయింగు చూశావంటే మైండ్ బ్లోయింగు.. ఫాలోవర్స్ అందరికీ నేనే డార్లింగు నేనేమీ చేసినా ఫుల్లు ట్రెండింగు అన్న లిరిక్స్ ఉంటాయి. అన్నట్లుగానే కొందరు పూసలమ్ముకుని ఫేమస్ అయితే మరికొందరు సెలబ్రిటీలతో లవ్లో పడి వైరల్ అయ్యారు. అలా ఈ ఏడాది సోషల్ మీడియాలో వైరల్ అయిన మహిళలెవరో చూసేద్దాం..మోనాలిసామోనాలిసా.. మొన్నటివరకు పూసలమ్ముకునే అమ్మాయి. కానీ ఇప్పుడు సినిమా హీరోయిన్. మధ్యప్రదేశ్కు చెందిన మోనాలిసా.. ఉత్తరప్రదేశ్ ప్రయాగరాజ్లో పూసల దండలు అమ్ముకునేందుకు వెళ్లింది. కానీ తన తేనెకళ్లతో అందరి దృష్టిలో పడింది. ముఖ్యంగా సోషల్ మీడియాలోకి ఎక్కింది. ఇంకేముంది రాత్రికిరాత్రే స్టార్ అయిపోయింది. ఒక సాంగ్లో నటించడంతో పాటు హిందీ, తెలుగు భాషల్లో హీరోయిన్గా సినిమాలు చేస్తోంది.ఆర్యప్రియ భుయన్కేవలం ఒకే ఒక్క ఎక్స్ప్రెషన్తో వైరల్ అయిపోయింది ఆర్యప్రియ భుయన్. ఈ ఏడాది ఏప్రిల్లో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్తాన్ రాయల్స్ మధ్య జరిగిన ఓ మ్యాచ్కు అందరిలాగే ఆర్యప్రియ కూడా హాజరైంది. మహేంద్ర సింగ్ ధోనీ అవుట్ అయినప్పుడు ఆమె కోపంతో ఓ ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. కెమెరామన్ దాన్ని క్యాప్చర్ చేయడం.. అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అవడం ఇట్టే జరిగిపోయింది. అలా ఒక్క వీడియోతో ఓవర్నైట్ స్టార్ అయింది.గౌరీ స్ప్రాట్బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్కు ఇదివరకే రెండు పెళ్లిళ్లవగా.. ఇద్దరు భార్యలకు విడాకులిచ్చేశాడు. మూడో పెళ్లి ఆలోచన లేదంటూనే ఓ మహిళతో ప్రేమలో పడ్డాడు. ఆవిడే గౌరీ స్ప్రాట్. ముంబైలో ఓ సెలూన్ నడుపుతూ ప్రైవేట్ లైఫ్ గడుపుతున్న గౌరీ.. ఆమిర్తో ప్రేమ వ్యవహారం వల్ల సెన్సేషన్గా మారింది.అలీషా ఓరీఈమె కూడా ఐపీఎల్ మ్యాచ్ ద్వారా క్లిక్ అయిన బ్యూటీనే! అలీషా కేకేఆర్ (కోల్కతా నైట్ రైడర్స్) అభిమాని. వెస్ట్ ఇండీస్ క్రికెట్ దిగ్గజం డ్వేన్ బ్రావోతో కలిసి అలీషా స్టెప్పులేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టింది. దీంతో ఎవరీ మిస్టరీ గర్ల్ అని నెటిజన్లు తెగ వెతికేసి తనను వైరల్ చేశారు. అలీషా మోడల్, మేకప్ ఆర్టిస్ట్. తను 2021లో మిసెస్ ఇండియా లీగసీ టైటిల్ గెల్చుకుంది. 2023లో జరిగిన మిసెస్ యూనివర్స్ 2022 పోటీల్లో మిసెస్ పాపులర్ 2022 టైటిల్ అందుకుంది. Alisshaa Ohri 'Eid ka Chand' girl with DJ Bravo was unexpected but exciting to see pic.twitter.com/QN98UJMURO— Kashish (@kaha_jaa_rhe) April 9, 2025 మహికా శర్మక్రికెటర్ హార్దిక్ పాండ్యా 2024లో భార్య నటాషాతో విడాకులు తీసుకున్నాడు. ఆ తర్వాత మహికా శర్మ అనే మోడల్తో ప్రేమలో పడ్డాడు. వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో బోలెడున్నాయి. అలా క్రికెటర్తో ప్రేమ కారణంగా మహికా ఒక్కసారిగా వైరల్ అయింది.చదవండి: 'విగ్ కావాలా? ధురంధర్ నటుడికి పొగరు తలకెక్కింది' -
చరణ్కి ఫ్లాప్ ఇచ్చిన దర్శకుడితో సల్మాన్ సినిమా.. టీజర్ రిలీజ్
గత కొన్నేళ్ల నుంచి బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్కి అస్సలు కలిసి రావట్లేదు. చేసిన సినిమా చేసినట్లే బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టేస్తూ వచ్చాయి. ఈ క్రమంలోనే ట్రెండ్కి తగ్గట్లు దేశభక్తి బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీసిన 'బ్యాటల్ ఆఫ్ గాల్వాన్' అనే మూవీలో నటిస్తున్నాడు. సల్మాన్ పుట్టినరోజు సందర్భంగా ఇప్పుడు చిత్ర టీజర్ రిలీజ్ చేయడంతో పాటు విడుదల తేదీని కూడా అధికారికంగా ప్రకటించారు.(ఇదీ చదవండి: గర్ల్ఫ్రెండ్ని పరిచయం చేసిన 'బిగ్బాస్' ఇమ్మాన్యుయేల్)టీజర్లో గాల్వాన్ లోయని.. యుద్ధభూమిలో సల్మాన్ని మాత్రమే చూపించారు. ఈ సినిమాకు అపూర్వ లఖియా దర్శకుడు. ఇతడు గతంలో రామ్ చరణ్తో 'తుఫాన్' అనే మూవీ తీశాడు. ఇది ఎంత ఘోరంగా ఫ్లాప్ అయిందో తెలిసిందే. దీని తర్వాత హసీనా పార్కర్ అనే చిత్రం, క్రాక్ డౌన్, ముమ్ బాయ్ అనే వెబ్ సిరీస్లు చేశాడు. దాదాపు ఐదేళ్ల తర్వాత ఈ మూవీతో మళ్లీ దర్శకుడిగా అదృష్టం పరీక్షించుకోబోతున్నాడు. ఈ సినిమాకు సల్మాన్ ఖానే నిర్మాత కూడా. వచ్చే ఏడాది రంజాన్ సందర్భంగా ఏప్రిల్ 17న థియేటర్లలోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించారు.అయితే 'బ్యాటల్ ఆఫ్ గాల్వాన్' సినిమా.. కల్నల్ సంతోష్ బాబు బయోపిక్ అనే సందేహం కలుగుతోంది. ఎందుకంటే తెలంగాణ సూర్యాపేటకు చెందిన ఈయన.. పదిహేనేళ్లుగా సైన్యంలో పనిచేశారు. భారత్-చైనా సరిహద్దుల్లోని గాల్వాన్ లోయలో ఏడాదిన్నరగా విధులు నిర్వర్తించారు. భారత్-చైనా సైనిక బలగాల ఘర్షణ సందర్భంగా 2020లో అమరులయ్యారు. మూవీ రిలీజైతే ఈయన జీవితం ఆధారంగా సినిమా తీశారా లేదా అనేది క్లారిటీ వస్తుంది.(ఇదీ చదవండి: అతడికి 45.. ఆమెకు 20 ఏళ్లు.. సూర్య కొత్త సినిమా స్టోరీ ఇదే) -
నీలాంటి స్నేహితుడు దొరకడం అదృష్టం: చిరంజీవి
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నేడు (డిసెంబర్ 27న) 60వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా అతడికి పలువురు ప్రముఖులు పర్సనల్గా, సోషల్ మీడియా వేదికగా బర్త్డే విషెస్ తెలియజేస్తున్నారు. తాజాగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తన స్నేహితుడికి ఎక్స్ (ట్విటర్) వేదికగా విషెస్ తెలియజేశారు.హ్యాపీ బర్త్డేనా ప్రియమైన సోదరుడికి 60వ పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ అద్భుతమైన మైలురాయిని చేరుకున్న సల్లూభాయ్కు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ ఏడాది ఆయురారోగ్యాలతో పాటు అపారమైన సంతోషం, ప్రేమ పొందాలని మనసారా కోరుకుంటున్నాను. నువ్వు లక్షలాదిమందికి ఒక ఇన్స్పిరేషన్.. నిన్ను స్నేహితుడని పిలవడం మాలాంటివారికి దక్కిన అదృష్టం.ఎంజాయ్ చెయ్నువ్వు మరెన్నో విజయాలు అందుకోవాలి, సుఖసంతోషాలతో గడపాలి. ఈ ప్రత్యేకమైన రోజును హ్యాపీగా ఎంజాయ్ చెయ్ అంటూ సల్లూ భాయ్తో దిగిన ఫోటో షేర్ చేశారు. కాగా చిరంజీవి నటించిన 'గాడ్ ఫాదర్' మూవీలో సల్మాన్ ఖాన్ అతిథి పాత్రలో కనిపించాడు. సినిమాల విషయానికి వస్తే చిరంజీవి ప్రస్తుతం 'విశ్వంభర', 'మన శంకర వరప్రసాద్గారు' మూవీస్ చేస్తున్నారు. సల్మాన్.. 'బ్యాటిల్ ఆఫ్ గల్వాన్' మూవీ చేస్తున్నాడు. Happy 60th birthday to my beloved brother @BeingSalmanKhan 🌟Sallu bhai, on this special milestone, I want to share my heartfelt wishes with you. May this year bring you endless joy, good health, and all the love you truly deserve. You have always been an inspiration, not just… pic.twitter.com/4ESoduO2yA— Chiranjeevi Konidela (@KChiruTweets) December 27, 2025 చదవండి: బట్టతలపై జుట్టు.. అడ్వాన్స్ తీసుకుని డ్రామాలు -
బట్టతలపై జుట్టుండాలట.. అడ్వాన్స్ తీసుకుని డ్రామాలా!
దృశ్యం ఫ్రాంచైజీలో తెరకెక్కుతున్న మూడో భాగం "దృశ్యం 3". మలయాళంలో మోహన్లాల్ హీరోగా చేస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తవగా త్వరలోనే హిందీలో షూటింగ్ మొదలుకానుంది. అజయ్ దేవ్గణ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా నుంచి ప్రముఖ నటుడు అక్షయ్ ఖన్నా తప్పుకున్నట్లు రూమర్స్ వచ్చాయి.సడన్గా విగ్ కావాలట!పారితోషికం పెంపుతోపాటు, విగ్ కావాలని కోరాడని.. ఈ విషయంలో నిర్మాతతో భేదాభిప్రాయాలు రావడంతో ఆయన సినిమా నుంచి వైదొలగాడని వార్తలు వచ్చాయి. తాజాగా ఇవే నిజమంటున్నాడు నిర్మాత కుమార్ మంగట్ పాఠక్. ఆయన మాట్లాడుతూ.. దృశ్యం 3 కోసం అక్షయ్ ఖన్నా అగ్రిమెంట్పై సంతకం పెట్టాడు. ఆయన అడిగినంత డబ్బు ఇస్తామన్నాం. కానీ ఆయన విగ్ కావాలని డిమాండ్ చేశాడు. పక్కనున్న చెంచాల వల్లే..దృశ్యం 2లో అక్షయ్ విగ్ లేకుండా బట్టతలతోనే కనిపించాడు. అలాంటిదిప్పుడు విగ్ పెడితే బాగోదని దర్శకుడు అభిషేక్ పాఠక్ నచ్చజెప్పాడు. దాంతో ఆయన సరేనన్నాడు. అయితే ఆయన పక్కనున్న చెంచాలు విగ్ పెట్టుకుంటే స్మార్ట్గా కనిపిస్తావని లేనిపోనివి ఎక్కించారు. దాంతో ఆయన మళ్లీ విగ్ కావాలని అడిగాడు. దర్శకుడు ఆయన్ను సముదాయించాలని చూశాడు. అప్పుడేమో ఎగిరి గంతేసి..కానీ ఈసారి అతడు ఏకంగా సినిమా నుంచే తప్పుకున్నాడు. దృశ్యం 3 కథ చెప్పినప్పుడు.. ఇది రూ.500 కోట్ల సినిమా.. జీవితంలో ఇలాంటి కథ వినలేదంటూ టీమ్ను హత్తుకున్నాడు. రెమ్యునరేషన్ ఫైనల్ అయ్యాక అడ్వాన్స్ కూడా ఇచ్చాం. పదిరోజుల్లో షూట్ ఉందనగా సినిమా నుంచి తప్పుకున్నాడు. ఈ విషయంలో తనకు నోటీసులు పంపించాం.గుర్తింపు లేని సమయంలో ఛాన్స్అక్షయ్కు పేరు, గుర్తింపు లేని సమయంలో తనతో సెక్షన్ 375 మూవీ చేశాను. ఆయన గురించి చాలామంది ఎన్నో చెప్పారు. సెట్లో కూడా ఓవర్గా ప్రవర్తించేవాడు. సెక్షన్ 375 వల్ల అతడికి మంచి పేరు వచ్చింది. అలా అతడిని దృశ్యం 2కి తీసుకున్నాను. ఈ మూవీ తర్వాతే అతడికి పెద్ద సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. ఇప్పుడేమో గర్వం తలకెక్కింది.అక్షయ్ కంటే మంచి నటుడుదృశ్యం.. అజయ్ దేవ్గణ్ మూవీ, ఛావా.. విక్కీ కౌశల్ మూవీ, అలాగే ధుంధర్ రణ్వీర్ సింగ్ సినిమా! ఒకవేళ అక్షయ్ ఖన్నా సోలోగా సినిమా చేస్తే దానికి రూ.50 కోట్లు కూడా రావు. తనవల్లే ధురంధర్ బాగా ఆడుతోందని మాతో అన్నాడు. ధురంధర్ విజయానికి అనేక కారణాలున్నాయి. దృశ్యం 3లో అక్షయ్ స్థానంలో జైదీప్ అహ్లావత్ను తీసుకున్నాం. అక్షయ్ కంటే ఇతడు మంచి నటుడు అని చెప్పుకొచ్చాడు.చదవండి: నా భర్తను ఎందుకు లాగుతున్నారు?: అనసూయ -
మొన్న ఆమిర్... ఇప్పుడు షారూఖ్!
రజనీకాంత్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రాలకు ఇతర ప్రముఖ నటుల సపోర్టింగ్ తప్పనిసరిగా మారిందా? అంటే అవుననే సమాధానమే వస్తోంది. ఈయన ఇంతకు ముందు నటించిన జైలర్, వేట్టయయాన్, కూలీ చిత్రాల్లో ఇతర భాషలకు చెందిన ప్రముఖ నటులు ముఖ్య భూమిక పోషించిన విషయం తెలిసిందే! వీటిలో జైలర్ చిత్రం మినహా ఇతర చిత్రాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయాయి. రజనీకాంత్ సినిమాలో గెస్టులుజైలర్ చిత్రంలో రజనీకాంత్తో పాటు బాలీవుడ్ నటుడు జాకీష్రాఫ్, కన్నడ సూపర్స్టార్ శివ రాజ్కుమార్, మలయాళ సూపర్స్టార్ మోహన్ లాల్ కీలక పాత్రలు పోషించారు. అదేవిధంగా హీరోయిన్ తమన్నా ప్రత్యేక పాట సినిమాకు మరింత బలంగా మారింది. ఇక వేట్టయాన్ చిత్రంలో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ముఖ్యపాత్ర పోషించారు. అయినప్పటికీ ఆ చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. మిక్స్డ్ టాక్అదేవిధంగా రజనీకాంత్ ఇటీవల నటించిన కూలీ చిత్రంలోనూ బాలీవుడ్ స్టార్ నటుడు ఆమిర్ ఖాన్ అతిథి పాత్రలో నటించారు. టాలీవుడ్ స్టార్ నాగార్జున, శాండిల్వుడ్ స్టార్ ఉపేంద్ర ముఖ్యపాత్రలను పోషించారు. ఈ సినిమా రూ.500 కోట్లు రాబట్టినప్పటికీ మిక్స్డ్ టాక్ సంపాదించుకుంది. ప్రస్తుతం రజనీకాంత్ నటిస్తున్న చిత్రం జైలర్–2. ఇది జైలర్ చిత్రానికి సీక్వెల్. జైలర్ 2లో సూపర్ స్టార్ఇందులోనూ మలయాళ సూపర్స్టార్ మోహన్లాల్, శాండిల్ వుడ్ సూపర్ స్టార్ శివరాజ్కుమార్, బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి, బాలీవుడ్ భామ విద్యాబాలన్తోపాటు నటి రమ్యకష్ణ తదితరులు నటిస్తున్నారు. తాజాగా ఇందులో అతిథి పాత్రలో బాలీవుడ్ సూపర్స్టార్ షారూఖ్ ఖాన్ నటిస్తున్నట్లు సమాచారం. సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తి.. జైలర్ 2లో షారూఖ్ ఉన్నట్లు పేర్కొన్నాడు. అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్లో తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. -
కాబోయే భర్తతో సెలబ్రేషన్.. పెళ్లిపై హీరోయిన్ క్లారిటీ
మరో హీరోయిన్ పెళ్లికి రెడీ అయిపోయింది. కొన్నిరోజుల క్రితం రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు వాటిని నిజం చేస్తూ కాబోయే వధూవరులు ఇద్దరూ జంటగా కనిపించారు. కలిసి క్రిస్మస్ పండగని సెలబ్రేట్ చేసుకున్నారు. ఇప్పుడు ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.మహేశ్ బాబు 'వన్-నేనొక్కడినే' సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్.. తర్వాత తెలుగులో మరో మూవీ చేసింది గానీ పెద్దగా వర్కౌట్ కాలేదు. దీంతో హిందీ ఇండస్ట్రీకి షిఫ్ట్ అయిపోయింది. అడపాదడపా హిట్స్ అందుకుని గుర్తింపు సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈమె కంటే ముందు చెల్లి నుపుర్ సనన్కి పెళ్లి కానుంది. కొన్నిరోజుల క్రితం రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు ఓ క్లారిటీ వచ్చింది.(ఇదీ చదవండి: ఈ వీకెండ్ ఓటీటీల్లోకి వచ్చేసిన 22 సినిమాలు)కృతిసనన్ ఫ్యామిలీ క్రిస్మస్ని సెలబ్రేట్ చేసుకుంది. ఈ వేడుకలో సింగర్ స్టెబిన్ బిన్ కూడా కనిపించాడు. కృతి చెల్లి నుపుర్కి కాబోయే భర్త ఇతడే. గాయకుడిగా స్టెబిన్ బాగానే ఫేమ్ ఉంది. నుపుర్ కూడా హీరోయిన్గా తెలుగులోనే 'టైగర్ నాగేశ్వరరావు' అనే మూవీతో పరిచయమైంది. ఇది ఘోరమైన ఫ్లాప్ కావడంతో యాక్టింగ్ పక్కనబెట్టేసింది. ఇప్పుడు ఓ ఇంటిది కాబోతుంది.కొత్త ఏడాదిలో జరిగే సెలబ్రిటీ పెళ్లిలో నుపుర్దే మొదటిది అని చెప్పొచ్చు. రాజస్థాన్లోని ఉదయ్పుర్ వేదికగా జనవరి 11న ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ జరగనుంది. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కేవలం కుటుంబ సభ్యులు, అతికొద్ది మంది సన్నిహితులు మాత్రమే ఈ వివాహానికి హాజరు కానున్నారు.(ఇదీ చదవండి: ఇక నీకు సైడ్ క్యారెక్టర్లే గతి అన్నారు: రాజాసాబ్ హీరోయిన్) -
మరో అమ్మాయితో నా భర్త డేటింగ్.. వదిలిపెట్టను : స్టార్ హీరో భార్య
బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో గోవిందా, ఆయన భార్య సునీత ఆహుజా విడాకులు తీసుకోబోతున్నారనే వార్త గత కొంతకాలంగా ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం వీరిద్దరు సపరేట్గా ఉంటున్నారు. కానీ అధికారికంగా విడాకులు అయితే తీసుకోలేదు. కోర్టు ద్వారా గోవిందాకు నోటీసులు అందించారని..త్వరలోనే విడాకులు తీసుకునే అవకాశం ఉందని బాలీవుడ్ వర్గాల చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా భర్త గోవిందాపై సునీత(Sunita Ahuja) సంచలన ఆరోపణలు చేసింది. తన భర్తకు మరొక అమ్మాయితో వివాహేతర సంబంధం ఉందని.. డబ్బుల కోసమే ఆమె ఆయనకు దగ్గరైందని ఆరోపించారు.తాజాగా ఆమె ఓ మీడియా చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో విడాకుల రూమర్స్పై స్పందించారు. ‘మేమిద్దరం సపరేట్గా ఉంటున్న విషయం నిజమే. గోవిందా(Govinda) మరోక అమ్మాయితో డేటింగ్లో ఉన్నాడు. ఆ అమ్మాయి అతన్ని ప్రేమించడం లేదు.. డబ్బుల కోసమై దగ్గరైంది. ఆమె హీరోయిన్ అయితే కాదు. హీరోయిన్లు ఇతరుల కాపురాల్లో చిచ్చు పెట్టేంత చెడ్డవాళ్లు కాదు’ అని సునీత చెప్పుకొచ్చారు. ఇంకా మాట్లాడుతూ..గోవింద జీవితంలో ముగ్గురే మహిళలు కీలకంగా ఉండాలని కోరుకున్నాం. ఆమె తల్లి, భార్య, కూతురు.. ఈ ముగ్గురు మహిళలే ఆయన జీవితంలో ఉండాలకున్నాం. కానీ నాలుగో మహిళ రావడం జీర్ణించుకోలేకపోయామని సునీత ఎమోషనల్ అయ్యారు. ఇప్పటికైనా గోవింద తన చుట్టు ఉన్న చెంచాలను వదిలేసి.. వర్క్పై ఫోకస్ చేస్తే బాగుంటుందని సలహా ఇచ్చారు. కాగా.. సునీతా అహుజా, గోవిందల పెళ్లి 1987లో జరిగింది వీరికి ఇద్దరు పిల్లలు. కొడుకు పేరు యశ్, కూతురు పేరు టీనా. గత ఏడాదిగా వీరిద్దరు వేరు వేరుగా జీవితాన్ని కొనసాగిస్తున్నారు. విడాకుల రూమర్స్ వినిపిస్తున్నా.సునిత మాత్రం గోవిందా ఎప్పటికీ తనవాడే అని.. వదిలేసే ప్రసక్తే లేదన్నారు. -
మందు మానేశా.. ఇండస్ట్రీలో తాగుబోతులు లేరిక!
ప్రముఖ నటుడు శక్తి కపూర్, స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కలిసి ఎన్నో సినిమాలు చేశారు. జుడ్వా, చల్ మేరే భాయ్, హమ్ సాత్ సాత్ హే, హలో బ్రదర్, కహీ ప్యార్ నా హోజాయే.. ఇలా అనేక చిత్రాల్లో నటించారు. అయితే 2005లో శక్తి కపూర్ ఓ పెద్ద వివాదంలో చిక్కుకున్నాడు. ఇండస్ట్రీకి వచ్చే అమ్మాయిలు ప్రలోభాలకు గురి చేశాడంటూ ఆరోపణలు వచ్చాయి. దీంతో సల్మాన్.. శక్తి కపూర్తో కలిసి నటించడం ఆపేశాడు.అవమానభారం2011లో శక్తికపూర్ హిందీ బిగ్బాస్ ఐదో సీజన్లో అడుగుపెట్టాడు. ఈ షోకి సల్మాన్ ఖాన్, సంజయ్ దత్ వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. రియాలిటీ షో సమయంలో సల్లూ భాయ్.. శక్తిని పెద్దగా పట్టించుకోలేదు. అతడిని కావాలనే పక్కనపెట్టేశాడు. దీంతో శక్తికి అవమానంతో తలకొట్టేసినట్లయింది. బిగ్బాస్ నుంచి బయటకు వచ్చాక ఆయన సల్మాన్పై ఎదురుదాడికి దిగాడు. ఆడవాళ్లను కొడతాడని నింద వేశాడు. అలా ఇద్దరి మధ్య అగాథం ఏర్పడింది.ఎవరితోనూ గొడవల్లేవ్దాదాపు 15 ఏళ్ల తర్వాత తమ మధ్య పరిస్థితులు చక్కబడ్డాయంటున్నాడు శక్తికపూర్. ఇప్పుడు తనకెవరితోనూ గొడవలు లేవు అని చెప్తున్నాడు. మద్యపానానికి కూడా దూరంగా ఉంటున్నానన్నాడు. మందు మానేసి ఐదేళ్లవుతోందని చెప్పాడు. ప్రస్తుతం ఇండస్ట్రీలో మందుబాబులకన్నా ఆరోగ్యంపై ఫోకస్ చేసేవాళ్లే ఎక్కువున్నారు. గతంలో అయితే చాలామంది స్టార్స్ తాగి మరీ సెట్స్కు వచ్చేవాళ్లని గుర్తు చేసుకున్నాడు. శక్తి కపూర్ వందలాది సినిమాల్లో నటించగా ఆయన కుమారుడు సిద్దాంత్ నటుడిగా, శ్రద్దా కపూర్ స్టార్ హీరోయిన్గా రాణిస్తోంది.చదవండి: రెండో బిడ్డకు జన్మనిచ్చిన దేవర నటి -
దురంధర్ బాక్సాఫీస్.. యానిమల్ రికార్డ్ బ్రేక్..!
బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ దురంధర్. పెద్దగా బజ్ లేకుండానే వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ను శాసిస్తోంది. డిసెంబర్ 5న థియేటర్లలో విడుదలై ప్రభంజనం సృష్టిస్తోంది. ఇప్పటికే 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన ఈ చిత్రం.. తాజాగా మరో అరుదైన రికార్డ్ సొంతం చేసుకుంది.ఈ సినిమా విడుదలైన 21 రోజుల్లోనే రూ.1000 కోట్ల మార్క్ దాటేసింది. క్రిస్మస్ రోజున రూ. 26 కోట్లతో కలెక్షన్స్ పరంగా అదరగొట్టింది. దేశవ్యాప్తంగా రూ. 668.80 కోట్లు రాబట్టిన ఈ సినిమా.. ప్రపంచవ్యాప్తంగా రూ. 1006.7 కోట్లకు పైగా వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన ఏ రేటింగ్ చిత్రంగా ఘనత సాధించింది. అంతకుముందు ఈ రికార్డ్ రణబీర్ కపూర్ యానిమల్ పేరిట ఉంది.కాగా.. ఈ సినిమాకు ఆదిత్య ధార్ దర్శకత్వం వహించారు. పాకిస్తాన్ బ్యాక్డ్రాప్లో వచ్చిన ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కించారు. ధురంధర్లో సంజయ్ దత్, ఆర్ మాధవన్, రాకేష్ బేడి, అర్జున్ రాంపాల్, సారా అర్జున్ కూడా కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని జియో స్టూడియోస్, బీ62 స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. వచ్చే ఏడాది మార్చి 19న దురంధర్ పార్ట్-2 విడుదల కానుంది. Entering the 1000 CR club, loud and proud.Book your tickets. (Link in bio)🔗 - https://t.co/cXj3M5DFbc#Dhurandhar Frenzy Continues Worldwide.@RanveerOfficial #AkshayeKhanna @duttsanjay @ActorMadhavan @rampalarjun #SaraArjun @bolbedibol @AdityaDharFilms #JyotiDeshpande… pic.twitter.com/wAk2IklWT5— Jio Studios (@jiostudios) December 26, 2025 -
కళ్లకు కాటుక పెట్టుకున్నా బాధనే!: బుల్లితెర నటి
సెలబ్రిటీల ముఖంలో కాస్త తేడా కనిపించినా నెటిజన్లు ఇట్టే పసిగడతారు. అది మేకప్ మహిమో? లేక డైట్ వల్ల అలా అయిందో అనడానికి బదులుగా ఏకంగా సర్జరీ చేయించుకుందని ఈజీగా అనేస్తారు. మరింత అందంగా కనిపించడం కోసం ముక్కుకు, ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందని కామెంట్లు చేస్తారు. బుల్లితెర నటి ప్రియాంక చాహర్ చౌదరిపై కూడా కొంతకాలంగా ఇలాంటి రూమర్లే వస్తున్నాయి.ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్తాజాగా వీటిపై ప్రియాంక స్పందించింది. ఆమె మాట్లాడుతూ.. చాలారోజులుగా నాపై ఎన్నో రూమర్స్ వైరల్ అవుతున్నాయి. గతేడాది నా ఆరోగ్యం బాగోలేక ట్రీట్మెంట్ తీసుకున్నాను. ఎక్కువ డోస్ ఉన్న యాంటిబయాటిక్స్ వాడాను. చాలామంది జనాలకు ఈ విషయం తెలియనే తెలియదు. ఆ సమయంలో బరువు తగ్గిపోయాను కానీ ముఖం మాత్రం కాస్త ఉబ్బింది. కళ్లకు కాటుక రుద్దినా..అంతదానికే జనాలు ఏదేదో ఊహించుకున్నారు. అయినా అందాన్ని మెరుగుపర్చుకునే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. నేనేం చేయాలనుకున్నా, చేసినా అది నా ఇష్టం. ఇప్పుడు నేను కళ్లకు కాటుక రుద్దినా, లెన్స్ పెట్టుకున్నా సరే.. ముఖానికి ఏదో చేయించుకున్నానని మాత్రమే అంటారు. అందుకే నేను చెప్పేదేంటంటే.. నా ముఖం.. నా ఇష్టం! సీరియల్అయినా నా ఫేస్కు మేకప్ వేయడం తప్ప ఏదీ చేయలేదు. అయినప్పటికీ జనాలు అది మేకప్ అని నమ్మరు.. ఇంకా ఏదో ఉందని మాట్లాడుతూనే ఉంటారు. అది కరెక్ట్ కాదు అని చెప్పుకొచ్చింది. ప్రియాంక చౌదరి.. 'ఉడారియాన్' సీరియల్తో బాగా పాపులర్ అయింది. ప్రస్తుతం 'నాగిని 7' సీరియల్ చేస్తోంది. ఏక్తా కపూర్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సీరియల్ డిసెంబర్ 27న ప్రారంభం కానుంది. -
కొడుకులతో కలిసి హృతిక్ అదిరిపోయే డ్యాన్స్
దేశంలో బెస్ట్ డ్యాన్సర్ల లిస్ట్ తీస్తే అందులో కచ్చితంగా ఉండే పేరు హృతిక్ రోషన్. ఇతడి స్టెప్పులకు సెపరేట్ ఫ్యాన్స్ ఉంటారు. ఈ ఏడాది 'వార్ 2'తో ప్రేక్షకుల ముందుకొచ్చిన హృతిక్.. ఇందులోనూ ఓ పాటలో డ్యాన్స్ అదరగొట్టేశాడు. ఇప్పుడు బయట ఓ పెళ్లిలోనూ స్టేజీపై స్టెప్పులు ఇరగదీశాడు. అయితే ఇద్దరు కొడుకులతో కలిసి ఇది చేయడం ఇక్కడ విశేషం. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: 'దండోరా' సినిమా రివ్యూ)హృతిక్ రోషన్ మామ కొడుకు ఈషాన్ రోషన్ పెళ్లి రెండు రోజుల క్రితం ముంబైలో గ్రాండ్గా జరిగింది. ఈ వేడుకకు పలువురు బాలీవుడ్ సినీ తారలు హాజరయ్యారు. హృతిక్ తన ప్రేయసి షబా ఆజాద్తో కలిసి సందడి చేశాడు. ఇతడి మాజీ భార్య సుస్సానే ఖాన్ కూడా తన కొడుకులతో కలిసి పెళ్లిలో కనిపించింది.సంగీత్ సందర్భంగా హృతిక్.. తన ఇద్దరు కొడుకులు హ్రేహాన్, హృదాన్తో కలిసి హిందీ పాటకు స్టెప్పులేశాడు. హృతిక్ అనుకుంటే కుమారులు కూడా తండ్రితో పోటీపడి డ్యాన్స్ చేయడం విశేషం. చూస్తుంటే వీళ్లకు కూడా యాక్టింగ్, డ్యాన్స్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నట్లే కనిపిస్తుంది. మరి త్వరలో నటులుగా ఎంట్రీ ఇస్తారేమో?(ఇదీ చదవండి: హారర్ సినిమా 'ఈషా' రివ్యూ)Damn 😱 Gotta get lighter on my feet to keep up 🕺🏻 pic.twitter.com/UFnHNEIR7p— Hrithik Roshan (@iHrithik) December 25, 2025 -
నా బిడ్డను దూరం చేశారు.. ఏడ్చేసిన కమెడియన్
కమెడియన్ భారతీ సింగ్ ఇటీవలే రెండో బిడ్డకు జన్మనిచ్చింది. తను ఇంట్లో ఉన్న సమయంలో సడన్గా ఉమ్మునీరు లీకైంది. దీంతో వెంటనే ఆమెను ఆస్పత్రిలో చేర్పించగా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. తాజాగా తన బాబును తొలిసారి తన చేతుల్లోకి తీసుకున్న మధుర క్షణాల గురించి మాట్లాడుతూ యూట్యూబ్లో ఓ వీడియో షేర్ చేసింది.దూరంగా ఉంచారుబాబు పుట్టిన వెంటనే నా నుంచి దూరంగా తీసుకెళ్లారు. పరీక్షలని, అబ్జర్వేషన్లో ఉంచాలని ఏవేవో కారణాలు చెప్పారు. కానీ వాడిని నాకు దూరంగా ఉంచడం తట్టుకోలేకపోయాను. రెండు రోజుల తర్వాత బాబును నా చేతికందించారు. తొలిసారి వాడిని ఎత్తుకున్నప్పుడు సంతోషంతో ఏడ్చేశాను. ఎవరి దిష్టి తగలకూడదుగోలాలాగే వీడు కూడా చాలా అందంగా, ఆరోగ్యంగా ఉన్నాడు అంది. బాబును ముద్దుగా కాజు అని పిల్చుకుంటోంది. ఈ వీడియో కింద అభిమానులు.. మీ పిల్లలు కాజు, గోలా.. ఇద్దరికీ ఎవరి దిష్టి తగలకూడదు అని కామెంట్లు చేస్తున్నారు. కమెడియన్ భారతీ సింగ్.. యాంకర్, నిర్మాత హార్ష్ లింబాచియాను 2017లో పెళ్లి చేసుకుంది. వీరికి 2022లో బాబు లక్ష్ పుట్టాడు. ఇతడిని ముద్దుగా గోలా అని పిల్చుకుంటారు. View this post on Instagram A post shared by Harssh Limbachiyaa (@haarshlimbachiyaa30) -
కొత్త డాన్ తప్పుకున్నాడా?
‘ధురంధర్’ సినిమా బ్లాక్బస్టర్ సక్సెస్తో మంచి జోష్లో ఉన్నారు హీరో రణ్వీర్ సింగ్. అయితే ‘డాన్ 3’ సినిమా నుంచి రణ్వీర్ సింగ్ తప్పుకుంటున్నారనే టాక్ బాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. ఫర్హాన్ అక్తర్ దర్శకత్వంలో రణ్వీర్ సింగ్ హీరోగా ‘డాన్ 3’ సినిమా రానున్నట్లుగా 2023 ఆగస్టు 9న ప్రకటన వచ్చింది. రితేష్ సిద్వానీ, ఫర్హాన్ అక్తర్ ఈ ‘డాన్ 3’ సినిమాను నిర్మిస్తారని, 2025లో ఈ సినిమా విడుదలవుతుందనేది ఆ అనౌన్స్మెంట్ సారాంశం. కానీ వివిధ కారణాల వల్ల రణ్వీర్ సింగ్ హీరోగా ‘డాన్ 3’ సినిమా ఇంకా సెట్స్కు వెళ్లలేదు. ‘ధురంధర్’ సినిమా తర్వాత రణ్వీర్ సింగ్ నెక్ట్స్ మూవీ ‘డాన్ 3’ అని అందరూ అనుకున్నారు. కానీ రణ్వీర్ సింగ్ ఈ సినిమా నుంచి తప్పుకోవాలనుకుంటున్నారని బీ టౌక్. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక ‘డాన్ 3’ సినిమా అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు ‘డాన్’గా రణ్వీర్ సింగ్ వెండితెరపై కరెక్ట్ కాదన్నట్లుగా కొంతమంది షారుక్ ఖాన్ అభిమానులు సోషల్ మీడియాలో విమర్శించారు (ఫర్హాన్ అక్తర్ డైరెక్షన్లో వచ్చిన ‘డాన్: ది చేజ్ బిగిన్స్ ఎగైన్ (2006), ‘డాన్ 2 (2011) చిత్రాల్లో షారుక్ ఖాన్ హీరోగా నటించారు). కానీ ‘డాన్ 3’లో యాక్టర్గా తాను ప్రేక్షకులను మెప్పిస్తానని రణ్వీర్ సింగ్ రెస్పాండ్ అయ్యారు. అయితే ఈ ్ర΄ాజెక్ట్ నుంచి ఆయన తప్పుకుంటున్నట్లు ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే... రణ్వీర్ సింగ్ కొత్త సినిమాకు ‘ప్రళయ్’ అనే టైటిల్ ఖరారైందని, ఇదొక జాంబీ ఫిల్మ్ అని, ఒక తండ్రి తన కుటుంబాన్ని ఎలా రక్షించుకుంటాడు? అనే కోణంలో ఈ సినిమా కథనం సాగుతుందని బాలీవుడ్ టాక్. -
దృశ్యం 3 నుంచి 'ధురంధర్' నటుడు అవుట్?
థ్రిల్లర్ మూవీ 'దృశ్యం' సూపర్ డూపర్ హిట్టు. దర్శకుడు జీతూ జోసెఫ్, హీరో మోహన్లాల్ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. తెలుగు, కన్నడ, హిందీ, తమిళ భాషల్లో రీమేక్ అయి అక్కడా ఘన విజయాన్ని అందుకుంది. దీంతో 'దృశ్యం' ఫ్రాంచైజీలో రెండవ భాగాన్ని తీసుకొచ్చారు. కాకపోతే 2021లో కరోనా వల్ల మలయాళ వర్షన్ను ఓటీటీలో రిలీజ్ చేశారు. సూపర్ హిట్ దృశ్యంఓటీటీలో కూడా మంచి రెస్పాన్స్ రావడటంతో తెలుగు, హిందీలో రీమేక్ చేశారు. వెంకటేశ్ 'దృశ్యం 2' కూడా అదే ఏడాది ఓటీటీలో విడుదలైంది. అయితే అజయ్ దేవ్గణ్ హిందీ 'దృశ్యం 2' మాత్రం 2022లో బాక్సాఫీస్ ముందుకు వచ్చింది. రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సంచలన విజయాన్ని సాధించింది. ఇప్పుడు' దృశ్యం' మూడో పార్ట్ రాబోతోంది. మూడో పార్ట్మోహన్లాల్- జీతూ కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తయింది. వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు హిందీలో అజయ్ దేవ్గణ్ 'దృశ్యం 3' షూటింగ్ ఇటీవలే మొదలైంది. టబు, శ్రియా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అభిషేక్ పాఠక్ డైరెక్టర్. ఈ మూవీ 2026 అక్టోబర్ 2న విడుదల కానుంది. అయితే ఈ సినిమా నుంచి ప్రముఖ నటుడు అక్షయ్ ఖన్నా తప్పుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆ విషయంలో డిమాండ్ఈయన 'దృశ్యం 2'లో పోలీసాఫీసర్గా కనిపించారు. ఈ ఏడాది ఛావా, ధురంధర్ సినిమాలతో సెన్సేషన్ అయిన అక్షయ్.. మూడో పార్ట్ (Drishyam 3 Movie)లో నటించేందుకు కాస్త ఎక్కువ రెమ్యునరేషన్ డిమాండ్ చేశారట! అలాగే తన పాత్ర తెరపై కనిపించే తీరులో కొన్నిమార్పులు చేయమని సూచించాడట! నిజమెంత?ఈ విషయంలో నటుడికి, నిర్మాతలకు మధ్య భేదాభిప్రాయాలు వచ్చినట్లు భోగట్టా.. దీంతో ఆయనే స్వయంగా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు ప్రచారం నడుస్తోంది. ఇదెంతవరకు నిజమన్నది తెలియాల్సి ఉంది. ఒకవేళ ఇదే నిజమైనప్పటికీ అక్షయ్ ఖన్నా డిమాండ్లకు తలొగ్గి మళ్లీ అతడిని సినిమాలో తీసుకునే అవకాశాలూ లేకపోలేదు.చదవండి: వితికా షెరుకు ప్రమోషన్ -
దురంధర్ తెలుగు వర్షన్.. రిలీజ్ కాకపోవడానికి అదే కారణమా?
డిసెంబర్లో వచ్చిన ఆ ఒక్క సినిమా బాక్సాఫీస్ను షేక్ చేస్తోంది. పెద్దగా బజ్ లేకుండానే వచ్చిన రికార్డులు సృష్టిస్తోంది. డిసెంబర్ 5న థియేటర్లలో రిలీజైన స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్ ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా అవతరించింది. రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన ఈ సినిమా కేవలం హిందీలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అదుర్స్ అనిపిస్తోంది. కేవలం 18 రోజుల్లోనే రూ.872 కోట్ల వసూళ్లతో దూసుకెళ్తోంది.ఇంత క్రేజ్ ఉన్న ఈ సినిమాను దక్షిణాది భాషల్లో విడుదల చేయాలని సినీ ప్రియులు కోరుకుంటున్నారు. కేవలం నార్త్ ఆడియన్స్కే పరిమితమైన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ వీక్షించాలని సౌత్ ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఉన్నారు. కానీ దురంధర్ డబ్బింగ్ వర్షన్ రిలీజ్పై మేకర్స్ ఎలాంటి ప్రకటన చేయడం లేదు. అసలు దురంధర్ను సౌత్ భాషల్లో విడుదల చేస్తారా? లేదా? అనే విషయంలో ఎలాంటి క్లారిటీ లేదు. మరీ ముఖ్యంగా తెలుగు భాషలోనైనా ఈ మూవీని చూడాలని ఎంతోమంది సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ దురంధర్ తెలుగు వర్షన్ రిలీజవుతుందా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. కేవలం ఓటీటీలో మాత్రమే అన్ని భాషల్లో తీసుకొస్తారా? థియేటర్లలో రిలీజ్ చేస్తారా? తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.అదే కారణమా?అయితే తెలుగులో దురంధర్ రిలీజ్ చేయకపోవడానికి ఓ కారణముందని సోషల్ మీడియాలో వైరలవుతోంది. డిసెంబర్ 19న ఈ మూవీని తెలుగు డబ్బింగ్ వర్షన్ రిలీజ్ చేయాలన్న ఆలోచనను విరమించుకున్నట్లు తెలుస్తోంది. ఓ ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ ఫీడ్ బ్యాక్ ఆధారంగానే తెలుగులో విడుదలపై వెనక్కి తగ్గినట్లు సమాచారం. ఎందుకంటే హైదరాబాద్లోని తెలుగు ప్రేక్షకులు హిందీలోనే ఈ మూవీని బాగా ఎంజాయ్ చేస్తున్నారని టాక్. అందుకే డబ్బింగ్ వర్షన్తో ఈ మూవీ ఒరిజినాలిటీ మిస్సవుతుందని మేకర్స్ ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సోషల్ మీడియాలో వైరలవుతోంది.ఓటీటీలో చూడాల్సిందేనా..?ఇక సౌత్ భాషల్లో దురంధర్ను థియేటర్లలో చూసే అవకాశం కనిపించట్లేదు. కేవలం ఓటీటీ రిలీజ్ అయిన తర్వాతే తెలుగుతో పాటు ఇతర భాషల్లో అందుబాటులోకి తీసుకొచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దురంధర్ రిలీజై మూడోవారం నడుస్తోంది. ఈ నేపథ్యంలో క్రిస్మస్, సంక్రాంతి సినిమాల హడావుడి ఎక్కువగా ఉంది. అందువల్ల దురంధర్ డబ్బింగ్ వర్షన్ ఇక రిలీజయ్యేలా కనిపించడం లేదు. దీంతో తెలుగులో దురంధర్ వీక్షించాలనుకున్న అభిమానులకు నిరాశ తప్పేలా లేదు. దీనిపై రాబోయే రోజుల్లో మరింత క్లారిటీ రానుంది. అప్పటిదాకా వేచి చూడాల్సిందే. -
'ధురంధర్' కలెక్షన్స్లో మాకు వాటా ఇవ్వాలి: పాక్ ప్రజలు
'ధురంధర్' సినిమాని పాకిస్థాన్ కరాచీలోని లయరీ అనే ప్రాంతం బ్యాక్డ్రాప్లో తీశారు. 1990ల్లో అక్కడ జరిగిన గ్యాంగ్ వార్స్కి ఓ కల్పిత కథ జోడించి దర్శకుడు ఆదిత్య ధర్ ఈ మూవీ తెరకెక్కించాడు. ప్రస్తుతం రూ.1000 కోట్ల కలెక్షన్స్కి చేరువలో ఉంది. అయితే వసూళ్లలో తమకు షేర్ ఇవ్వాలని ఇప్పుడు లయరీ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అందుకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: హీరోయిన్లకు సలహా సరే.. ఈ 'సామాను' కామెంట్ అవసరమా శివాజీ?)ఈ వీడియోలో లయరీకి చెందిన పలువురు వ్యక్తులు మాట్లాడారు. తమ ప్రాంతాన్ని సినిమాలో చూపించారు కాబట్టి వసూళ్లలో ఎందుకు వాటా ఇవ్వకూడదు? అని అన్నాడు. మరో వ్యక్తి అయితే ఏకంగా 80 శాతం కలెక్షన్స్ తమకు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఈ మొత్తం ఇవ్వడం వల్ల దర్శకుడికి పెద్దగా పోయేదేం ఉండదని, తర్వాత కూడా ఎలానూ సినిమాల చేస్తాడు కదా అని చెప్పుకొచ్చాడు.మరో వ్యక్తి మాట్లాడుతూ.. 'ధురంధర్' వసూళ్లలో కనీసం సగానికి సగమైనా సరే లయరీ ప్రజలకు ఇవ్వాలని అభిప్రాయం వ్యక్తం చేశాడు. మరికొందరైతే రూ.5 కోట్లు, రూ.20 కోట్లు అని నోటికొచ్చినట్లు మొత్తాన్ని చెప్పారు. మరోవ్యక్తి మాత్రం కలెక్షన్స్లో కొంత మొత్తంతో ఆస్పత్రి కట్టించి ఇవ్వాలని అన్నాడు. ఇంకో వ్యక్తి అయితే ఒకవేళ దర్శకుడు ఇవ్వాలనుకున్నా సరే తమకు ఒక్క రూపాయి కూడా వచ్చే పరిస్థితి ఉండదని తమ ప్రభుత్వంలో పరిస్థితి ఎలా ఉందో చెప్పకనే చెప్పాడు.(ఇదీ చదవండి: 'ధురంధర్' తెలుగు రిలీజ్ ఎప్పుడు? ఎందుకింత ఆలస్యం?)ఈ సినిమాని పాకిస్థాన్లో బ్యాన్ చేశారు. అయినా సరే అక్కడి ప్రజలు పైరసీ వెర్షన్ డౌన్లోడ్ చేసుకుని మరీ చూస్తున్నారు. అలా ఏకంగా 2 మిలియన్లకు పైగా డౌన్లోడ్స్ జరిగినట్లు వార్తలొస్తున్నాయి. సినిమాలోని పాటలకు రీల్స్ చేస్తూ, పెళ్లిళ్లలో వీటినే ప్లే చేస్తూ పాక్ ప్రజలు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. అలా దాయాది దేశంలోనూ ఈ మూవీ హాట్ టాపిక్ అయిపోయిందనే చెప్పొచ్చు.రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన ఈ సినిమాని.. స్పై యాక్షన్ థ్రిల్లర్గా తీశారు. మన దేశానికి చెందిన ఓ ఏజెంట్.. రహస్యంగా పాక్ వెళ్లి అక్కడి గ్యాంగ్లో చేరి వాళ్లనే ఎలా తుదముట్టించాడు అనే కాన్సెప్ట్తో తీశారు. అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, అర్జున్ రాంపాల్ లాంటి స్టార్స్ ఇందులో యాక్టింగ్ అదరగొట్టేశారు. మ్యూజిక్, సాంగ్స్ కూడా సూపర్ ఉండటంతో సినిమాకి అద్భుతమైన కలెక్షన్స్ వస్తున్నాయి.(ఇదీ చదవండి: 'ధురంధర్' సినిమా రివ్యూ)BREAKING: Pakistanis want @AdityaDharFilms to give Lyari a portion of Dhurandhar's profits"Kam se kam yeh toh theek karwa lein"🤣🤣🤣🤣 pic.twitter.com/djlvJrLaJi— Sensei Kraken Zero (@YearOfTheKraken) December 22, 2025 -
అక్టోబరులో దృశ్యం 3
హీరో మోహన్ లాల్, దర్శకుడు జీతూజోసెఫ్ కాంబినేషన్ లో రూపొందిన మలయాళ ‘దృశ్యం’ ఫ్రాంచైజీకి ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉంది. ఇటీవలే వీరి కాంబినేషన్ లోనే ‘దృశ్యం 3’ సినిమా చిత్రీకరణ పూర్తయింది. వచ్చే ఏడాది ఈ చిత్రం విడుదల కానుంది. అయితే ‘దృశ్యం’ ఫ్రాంచైజీలోని సినిమాలు ఇతర భాషల్లోనూ రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. హిందీలో అజయ్ దేవగన్ హీరోగా నటిస్తున్నారు.కాగా, హిందీ వెర్షన్ ‘దృశ్యం 3’ షూటింగ్ మొదలైంది. అజయ్ దేవగన్ హీరోగా నటిస్తున్న ఈ ‘దృశ్యం 3’ చిత్రానికి అభిషేక్పాఠక్ డైరెక్టర్. టబు, శ్రియా శరణ్ ఇతరపాత్రల్లో నటిస్తున్నారు. అలోక్ జైన్ , అజిత్ అంథారే నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది అక్టోబరు 2న థియేటర్స్లో రిలీజ్ కానుంది. ‘దృశ్యం 3’ తెలుగు వెర్షన్ లో వెంకటేశ్ హీరోగా నటించనున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ్రపారంభం కావాల్సి ఉంది. -
రూ.50 కోట్లు నా దగ్గర ఎక్కడివి? మమ్మల్ని వదిలేయ్!
కుమారు సాను విలక్షణమైన సింగర్.. ఈయన తెలుగులో దేవుడు వరమందిస్తే.., మెరిసేటి జాబిలి నువ్వే.. వంటి పలు హిట్ సాంగ్స్ ఆలపించాడు. దాదాపు 16 భాషల్లో అనేక పాటలు పాడారు. అయితే ఆయన కెరీర్ పరంగానే కాకుండా పర్సనల్ లైఫ్లో ఒడిదుడుకుల కారణంగానూ తరచూ వార్తల్లో ఉంటాడు.రెండు పెళ్లిళ్లుఈయన రీటా భట్టాచార్యను 1986లో పెళ్లి చేసుకున్నాడు. వీరికి ముగ్గురు పిల్లలు సంతానం. అయితే భార్య ఉండగానే పలువురితో డేటింగ్ చేశాడు. వారిలో నటి కునికా సదానంద్ ఒకరు. ఈ విషయంలో గొడవలు రావడంతో కొన్నేళ్లకే వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఆరేళ్లపాటు కునికాతో రిలేషన్లో ఉన్న కుమార్ తర్వాత సలోని భట్టాచార్యను పెళ్లి చేసుకున్నాడు. ఈ జంటకు ఇద్దరు కూతుర్లు సంతానం.మాజీ భర్తపై ఆరోపణలుఇటీవల రీటా భట్టాచార్య మాజీ భర్త కుమార్ సానుపై సంచలన ఆరోపణలు చేసింది. అతడూ ఎప్పుడూ అబద్ధాలు ఆడేవాడని ఆరోపించింది. కొడుకు పెళ్లి సమయంలో కుమార్ ప్రేమకథల గురించి పుకార్లు వస్తే వాటికి ఫుల్స్టాప్ పెట్టమని కోరినందుకు తన నెంబర్ బ్లాక్ చేశాడంది. మూడోసారి గర్భవతిగా ఉన్నప్పుడు తిండిపెట్టకుండా టార్చర్ చేశారంది. ఆయన కుటుంం కిచెన్ స్టోరేజ్కు తాళం వేసుకునేవారంది. గర్భంతో ఉన్నానన్న కనికరం చూపకుండా తనను కోర్టులచుట్టూ తిప్పాడంది.రూ.50 కోట్ల పరువు నష్టం దావాఈ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన కుమార్ సాను కోర్టును ఆశ్రయించాడు. ఆమె వ్యాఖ్యలు తన వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించాయంటూ రీటాపై రూ.50 కోట్ల పరువు నష్టం దావా వేశాడు. విడాకుల సమయంలో ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకోకూడదన్న అగ్రిమెంట్ను ఉల్లంఘించిందని పేర్కొన్నాడు. ఈ మేరకు మాజీ భార్యకు నోటీసులు పంపాడు.దయచేసి హింసించొద్దుదానిపై రీటా భట్టాచార్య స్పందిస్తూ.. నేను షాక్లో ఉన్నాను. అతడు.. తన ముగ్గురు కొడుకుల తల్లిపై కేసు వేస్తున్నానన్న విషయం మర్చిపోయాడా? పైగా రూ.50 కోట్లు డిమాండ్ చేస్తున్నాడు. నా దగ్గర అంత డబ్బు ఎలా ఉంటుందనుకుంటున్నాడు? ఇది నిజంగా బాధాకరం. నా ముగ్గురు పిల్లల తండ్రిగా, ఒక మానవత్వం ఉన్న మనిషిగా అయినా మెదులుకోమని ఆయన్ను చేతులు జోడించి అడుగుతున్నాను. మమ్మల్ని ప్రేమించకపోయినా పర్వాలేదు.. కానీ దయచేసి ఇబ్బందిపెట్టకు అని కోరింది. -
బాక్సాఫీస్ వద్ద దురంధర్ క్రేజ్.. ఆ ట్యాగ్ బాగా కలిసొచ్చిందా?
ఈ ఏడాది కాంతారా చాప్టర్-1 రిషబ్ శెట్టిదే హవా అనుకున్నాం. ఆ మూవీనే 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన రికార్డ్ చెదరదని ఫిక్సయిపోయాం. అంతేకాకుండా విక్కీ కౌశల్ ఛావాను కొట్టే చిత్రం ఈ ఏడాది బాలీవుడ్ రావడం కష్టమే అనుకున్నాం. మరికొద్ది రోజుల్లోనే ఈ సంవత్సరం ముగియనుందగా.. ఆ రెండు రికార్డ్స్ చెక్కు చెదరవని ఈ సినిమాలు తీసినవాళ్లు సైతం అనుకునే ఉంటారు. కానీ పెద్దగా అంచనాలు లేకుండా వచ్చి బాక్సాఫీస్ను ఓ రేంజ్లో షేక్ చేస్తోంది ఆ సినిమా. డిసెంబర్ 5 తేదీకున్న మహిమో.. ఏమో గానీ ఈ ఏడాది బాక్సాఫీస్ లెక్కలను మాత్రం తారుమారు చేస్తూ దూసుకెళ్తోంది. ఇంతకీ ఆ సినిమాకు ఎందుకింత సక్సెస్ అయింది.. అదే ఈ సినిమాకు ప్లస్గా మారిందా? అనేది తెలుసుకుందాం.ఈ రోజుల్లో సినిమాలకు భారీ కలెక్షన్స్ రావడమంటే మామూలు విషయం కాదు. ఓటీటీలు వచ్చాక చాలామంది థియేటర్లకు వెళ్లడం తగ్గించేశారు. పెద్ద పెద్ద స్టార్స్ ఉంటే తప్ప థియేటర్స్ వైపు కన్నెత్తి చూడటం లేదు. ఇక చిన్న సినిమాలైతే అలా వచ్చి ఇలా వెళ్లిపోతున్నాయి. ఇలాంటి టైమ్లో ఎలాంటి బజ్ లేకుండా వచ్చిన దురంధర్ మాత్రం బాక్సాఫీస్ రికార్డులు తిరగరాస్తోంది. డిసెంబర్ 5న రిలీజైన ఈ చిత్రం 17 రోజుల్లోనే రూ.845 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ ఏడాది అత్యధిక వసూళ్ల లిస్ట్లో రెండో స్థానంలో ఉన్న ఛావాను అధిగమించింది. ఇక మరో ఏడు కోట్లు వస్తే చాలు కాంతార చాప్టర్-1 రికార్డ్ బ్రేక్ చేయనుంది. సైలెంట్గా వచ్చిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ ఇంతలా దూసుకెళ్లడానికి కారణాలేంటి? గతంలో ఇలాంటి జోనర్లో చాలా సినిమాలు వచ్చినా దురంధర్ క్రేజ్ అందుకోలేకపోయాయి. కేవలం హిందీలో విడుదలై ప్రభంజనం సృష్టించడానికి అదొక్కటే ప్రధాన కారణమా? అనేది తెలుసుకుందాం.సాధారణంగా స్పై, గూఢచారి సినిమాలు యుద్ధాల నేపథ్యంలో తెరకెక్కిస్తుంటారు. వీటిలో కొన్ని ఫిక్షనల్.. అలాగే మరికొన్ని రియల్ వార్స్ కూడా ఉంటాయి. అలా వచ్చిన దురంధర్ డైరెక్టర్ కూడా పాకిస్తాన్ నేపథ్యంగా కథను ఎంచుకున్నారు. అక్కడ ఓ ప్రాంతంలోని ఉగ్రవాద నెట్వర్క్ ఆధారంగా దురంధర్ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు ఆదిత్య ధార్. ఈ మూవీలో భారతీయ ఏజెంట్ అయిన హంజా పాత్రలో రణ్వీర్ సింగ్ నటించారు. పాకిస్తాన్ టార్గెట్గా ఈ మూవీని తెరకెక్కించడం దురంధర్కు బాగా కలిసొచ్చినట్లు తెలుస్తోంది. హృతిక్ రోషన్ విమర్శలు..బాలీవుడ్ స్టార్ హీరో అయిన హృతిక్ రోషన్ ఈ సినిమాను పొగుడుతూనే విమర్శించారు. అంతా బాగుంది కానీ.. రాజకీయపరమైన అంశాలను చూపించడం తనకు నచ్చలేదంటూ మాట్లాడారు. ఆ తర్వాత చాలామంది ఈ మూవీని ప్రాపగండ సినిమా అంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేశారు. ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాఠీ ఏకంగా బీజేపీ ప్రాపగండ మూవీ అంటూ ఆరోపించారు. ఇదే దురంధర్కు మరింత ప్లస్గా మారింది. సాధారణంగా పాజిటివ్ కంటే నెగెటివ్కే ఎక్కువ పవర్ ఉంటుందని దురంధర్తో నిజమైంది. ప్రాపగండ ట్యాగ్ ముద్ర వేయడం కూడా దురంధర్కు కలెక్షన్స్ పెరిగేందుకు మరింత ఉపయోగిపడిందనడంలో ఎలాంటి సందేహం లేదు.కాగా.. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ స్పై థ్రిల్లర్లో అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, ఆర్ మాధవన్ కూడా కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీ పార్ట్- 2 మార్చి 2026లో విడుదల కానుంది. -
'ధురంధర్'లో తమన్నా ఉండాల్సింది.. కానీ రిజెక్ట్ చేశారు
ప్రస్తుతం దేశవ్యాప్తంగా వందల కోట్ల కలెక్షన్స్ సాధిస్తూ టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారిపోయిన సినిమా 'ధురంధర్'. పాకిస్థాన్లోని గ్యాంగ్ వార్స్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీసిన ఈ స్పై డ్రామాలో రణ్వీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, మాధవన్ లాంటి స్టార్స్ అదిరిపోయే ఫెర్ఫార్మెన్స్ ఇచ్చారు. అయితే ఈ మూవీలో తమన్నా కూడా నటించాల్సింది కానీ దర్శకుడు ఈమెని రిజెక్ట్ చేశాడట. ఈ విషయాన్ని కొరియోగ్రాఫర్ విజయ్ గంగూలీ బయటపెట్టాడు.'ధురంధర్' చిత్రం పూర్తిస్తాయి యాక్షన్ డ్రామాగా తెరకెక్కినప్పటికీ.. 'షరారత్' అంటూ సాగే ఓ స్పెషల్ (ఐటమ్) సాంగ్ కూడా ఉంది. హీరో పాత్రకు పెళ్లి జరిగే టైంలో ఇది వస్తుంది. ఇందులో ఆయేషా ఖాన్, క్రిస్టల్ స్టెప్పులేశారు. ఈ పాట కోసం తొలుత తమన్నానే అనుకున్నామని కొరియోగ్రాఫర్ చెప్పాడు. 'నా మైండ్లో తమన్నా పేరు మాత్రమే ఉంది. ఆమె అయితేనే పాటకు నిండుదనం తీసుకొస్తుంది. సరైన న్యాయం చేస్తుందని ఆదిత్యకు చెప్పాను. కానీ ఆయన చాలా క్లారిటీతో ఉన్నారు. ఇది రెగ్యులర్ ఐటమ్ సాంగ్లా ఉండకూడదని చెప్పేశారు' అని విజయ్ గంగూలీ తెలిపాడు.'సినిమా కథని డిస్టర్బ్ చేసేలా ఒక్క అంశం కూడా ఉండకూడదనేది ఆదిత్య ధర్ ఉద్దేశం. ఒకవేళ ఈ పాటలో తమన్నా ఉంటే అందరి దృష్టి ఆమెపైనే ఉంటుంది తప్ప స్టోరీపై ఉండదు. సినిమా నుంచి ప్రేక్షకులు పక్కదారి పట్టే అవకాశముంది. అలా ఒకరికి బదులు ఇద్దరు డ్యాన్సర్లని పెడదామని ఆదిత్య నన్ను ఒప్పించాడు. అలా ఆయేషా, క్రిస్టల్ వచ్చారు' అని విజయ్ చెప్పుకొచ్చాడు.గతంలో జైలర్, స్త్రీ 2, రైడ్ 2 తదితర సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ చేసిన తమన్నా.. మంచి ఫేమ్ సొంతం చేసుకుంది. ఎంతల అంటే ఐటమ్ సాంగ్స్ అంటేనే ఈమె గుర్తొంచేంతలా. ఒకవేళ 'ధురంధర్'లో గనక ఐటమ్ సాంగ్ కోసం ఈమెని తీసుకుని ఉంటే.. కొరియోగ్రాఫర్ చెప్పినట్లు ప్రేక్షకుడి దృష్టి మారిపోయి ఉండేదేమో! -
'ధురంధర్' తెలుగు రిలీజ్ ఎప్పుడు? ఎందుకింత ఆలస్యం?
దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయిపోతున్న సినిమా 'ధురంధర్'. పేరుకే హిందీ మూవీ గానీ దక్షిణాదిలోనూ మంచి కలెక్షన్స్ సాధిస్తోంది. అయితే రిలీజై రెండున్నర వారాలు దాటిపోయినా సరే ఇప్పటికీ ఈ మూవీ తెలుగు డబ్బింగ్ గురించి అస్సలు సౌండ్ లేదు. ఇంతకీ మన దగ్గర రిలీజ్ చేసే ఉద్దేశం ఉందా లేదా? ఎందుకింత ఆలస్యం చేస్తున్నారు?పాన్ ఇండియా ట్రెండ్ పెరిగిన తర్వాత బాలీవుడ్ చిత్రాల్ని కూడా తెలుగులో అప్పుడప్పుడు డబ్ చేసి వదులుతున్నారు. షారుఖ్, సల్మాన్, ఆమిర్ మూవీస్ ఒరిజినల్ వెర్షన్తో పాటు డబ్బింగ్ కూడా ఒకేసారి రిలీజ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. వీటిలో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నవి తక్కువే. కొన్ని సినిమాల విషయంలో తెలుగు ప్రేక్షకులు చాలా ఫీలవుతుంటారు.(ఇదీ చదవండి: మెడికో థ్రిల్లర్ సిరీస్.. 'ఫార్మా' రివ్యూ)ఈ ఏడాది ఫిబ్రవరిలో విక్కీ కౌశల్ 'ఛావా' మూవీ రిలీజైంది. తొలుత హిందీలో తీసుకొచ్చినప్పటికీ.. కాస్త ఆలస్యంగా అయినా సరే తెలుగులో రిలీజ్ చేశారు. తొలి వారం దాటేలోపే ఇది చేసి ఉంటే తెలుగు రాష్ట్రాల్లోనూ మరింత రీచ్ ఉండేదనేది చాలామంది అభిప్రాయం. దీని విషయంలో చేసిన తప్పే ఇప్పుడు 'ధురంధర్' విషయంలోనూ మేకర్స్ చేస్తున్నారు. ఈ నెల 5న థియేటర్లలోకి వచ్చిన 'ధురంధర్'.. బ్లాక్బస్టర్ హిట్ అయింది. చాలామంది తెలుగు మూవీ లవర్స్ దీన్ని ఒరిజనల్ వెర్షన్ చూసేశారు. మిగిలిన వాళ్లలో చాలామంది మాత్రం తెలుగు డబ్బింగ్ ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్నారు.గత శుక్రవారమే(డిసెంబరు 19) ఇది తెలుగులో రిలీజ్ అయిపోతుందని సోషల్ మీడియాలో చాలా హడావుడి నడిచింది. తీరా చూస్తే అది రూమర్ అని తేలిపోయింది. ఈ వారమూ వచ్చే అవకాశం అస్సలు లేదు. ఎందుకంటే ఛాంపియన్, దండోరా, శంబాల, వృషభ, పతంగ్, ఈషా, బ్యాడ్ గర్ల్జ్, మార్క్.. ఇలా లైన్లో చాలానే థియేటర్ మూవీస్ ఉన్నాయి. వీటితో పాటు వస్తే 'ధురంధర్'కి స్పేస్ దొరకడం కష్టం.మైత్రీ మూవీ మేకర్స్.. 'ధురంధర్' తెలుగు డబ్బింగ్ని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేసే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. ఇందుకోసం జనవరి 1వ తేదీని చూస్తున్నారట. ఇది నిజమా అబద్ధమా అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ ఇది కూడా జరగకపోతే మాత్రం తెలుగు ఆడియెన్స్.. ఓటీటీలోకి వచ్చాక చూసుకోవాల్సిందే. ఈ చిత్ర డిజిటల్ హక్కుల్ని నెట్ఫ్లిక్స్ దక్కించుకుంది. జనవరి 30 నుంచి స్ట్రీమింగ్ అయ్యే అవకాశముంది. (ఇదీ చదవండి: టికెట్ రేట్లు.. వైఎస్ జగనే బెటర్ అంటున్నారు: తెలుగు డైరెక్టర్) -
దురంధర్ మరో రికార్డ్.. ఆ లిస్ట్లో షారూఖ్ ఖాన్ జవాన్ కంటే..!
బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ దురంధర్ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. రిలీజైన రోజు నుంచే కాసుల వర్షం కురిపిస్తోంది. డిసెంబర్ 5న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ఇప్పటికే పలు రికార్డులను తిరగరాసింది. ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో మూడోస్థానంలో కొనసాగుతోంది. ఈ చిత్రంలో విడుదలైన 16 రోజుల్లో ఏకంగా రూ. 785 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది.ఓవరాల్గా చూస్తే ఇండియాలో రూ. 500 కోట్ల మార్కును అధిగమించిన ఏడో హిందీ చిత్రంగా 'ధురంధర్' నిలిచింది. షారూఖ్ ఖాన్ 'జవాన్', శ్రద్ధా కపూర్ 'స్త్రీ -2' చిత్రాల కంటే వేగంగా ఈ మైలురాయిని చేరుకుంది. ఇదే జోరు కొనసాగితే ఆదివారం రోజే ఛావా(రూ.807 కోట్లు) వసూళ్లను అధిగమించేలా కనిపిస్తోంది. అవతార్: ఫైర్ అండ్ యాష్ రిలీజ్ వల్ల దురంధర్ కలెక్షన్స్ కాస్తా తగ్గినట్లు కనిపిస్తోంది. కాగా.. ఈ చిత్రంలో రణవీర్ సింగ్ హమ్జా పాత్రలో నటించారు. ఈ చిత్రంలో అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, ఆర్. మాధవన్ కూడా ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ ఆదిత్య ధార్ దర్శకత్వం వహించారు. -
ఐటమ్ సాంగ్స్ భామకు రోడ్డు ప్రమాదం.. వీడియో రిలీజ్
బాలీవుడ్ బ్యూటీ, ఐటమ్ సాంగ్స్ ఫేమ్ నోరా ఫతేహీ కారు ప్రమాదానికి గురైంది. ముంబయిలో ఆమె ప్రయాణిస్తున్న కారును వేగంగా వచ్చిన మరో కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో నోరా కారు పూర్తిగా దెబ్బతినగా.. హీరోయిన్కు స్వల్పంగా గాయాలపాలైంది. ఈ ప్రమాదంలో నోరా ఫతేహీ తలకు దెబ్బ తగలడంతో కాస్తా మతిభ్రమించినట్లు తెలుస్తోంది. అయితే వెంటేనే ఆస్పత్రికి వెళ్లడంతో పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఎలాంటి అపాయం లేదని ప్రకటించారు. ఆ తర్వాత వెంటనే సన్బర్న్ సంగీత కచేరీ- 2025 ఈవెంట్కు హాజరైన ప్రదర్శనలో పాల్గొన్నారు.తాజాగా తన ఆరోగ్యంపై నోరా ఫతేహీ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది. ప్రస్తుతం తాను క్షేమంగా ఉన్నానని తెలిపింది. నిన్న కారు ప్రమాదంతో చాలా భయపడ్డానని పేర్కొంది. తాగిన మత్తులో కారు నడిపిన వ్యక్తి తప్పిదం వల్లే తన కారు ప్రమాదానికి గురైందని వెల్లడించింది. ఇలాంటి వాళ్లతో ప్రజల ప్రాణాలకు ముప్పుందని ఆవేదన వ్యక్తం చేసింది. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా వేదికగా పోలీసులను కోరింది.కాగా.. ప్రస్తుతం నోరా ఫతేహీ కాంచన 4, కేడీ: ది డెవిల్’ వంటి భారీ సౌత్ ప్రాజెక్ట్స్ల్లో నటిస్తోంది. అంతేకాకుండా ఇషాన్ ఖట్టర్తో కలిసి ది రాయల్స్ అనే వెబ్ సిరీస్ కూడా చేస్తోంది. Actress Nora Fatehi injured in road accident,while heading to the #SunburnFestival for #DavidGuetta’s concert#NoraFatehi @MumbaiPolice pic.twitter.com/AIVMieHSNb— Indrajeet chaubey (@indrajeet8080) December 20, 2025 #NoraFatehi suffers a car accident while travelling to the Sunburn Festival for her scheduled appearance with David Guetta, after a drunk driver rams into her vehicle. A source reveals, “Nora Fatehi was involved in an unfortunate car accident, while on her way to the Sunburn… pic.twitter.com/dejnizbh8z— Filmfare (@filmfare) December 20, 2025 -
నాలుగుసార్లు క్యాన్సర్ ఆపరేషన్.. 'జేకే' భార్య గురించి తెలుసా?
సినిమా ఇండస్ట్రీలో పెళ్లి, విడాకులు లాంటి మాటలు ఎప్పటికప్పుడు వినిపిస్తూనే ఉంటాయి. దీంతో నటీనటులందరూ ఇంతేనేమో అనేది చాలామంది నెటిజన్ల అభిప్రాయం. కానీ తెరపైనే కాదు రియల్ లైఫ్లోనూ తాము ఫెర్ఫెక్ట్ అనేలా కొందరు యాక్టర్స్ ఉంటారు. అలాంటి నటుడే షరీబ్ హష్మీ. ఈ పేరు చెబితే మీకు తెలియకపోవచ్చు గానీ 'ద ఫ్యామిలీ మ్యాన్' జేకే అంటే మాత్రం టక్కున గుర్తుపట్టేస్తారు. నటుడిగా మనల్ని ఎంతగానో నవ్వించే ఇతడి జీవితంలో షాకయ్యే కష్టాలున్నాయని మీలో ఎంతమందికి తెలుసు?షరీబ్ హష్మీది ముంబై. 2003లో నస్రీన్ని పెళ్లి చేసుకున్నాడు. వివాహం చేసుకునే టైంలో ఓ టీవీ ఛానెల్లో పనిచేసేవాడు. నటుడిగా ఛాన్సుల కోసం ప్రయత్నించేవాడు. కొన్నాళ్లకు ఉద్యోగం విడిచిపెట్టి పూర్తిగా ఇండస్ట్రీపైనే దృష్టి పెట్టాడు. అప్పటికే ఓ కొడుకు కూడా పుట్టాడు. దీంతో నస్రీన్.. కుటుంబ బాధ్యతల్ని తీసుకుంది. తన డబ్బులు, బంగారంతో పాటు ఇంటిని కూడా తాకట్టు పెట్టి మరీ భర్తని ప్రోత్సాహించింది. అలా 2008లో 'స్లమ్ డాగ్ మిలియనీర్'లో చిన్న పాత్రలో నటించే అవకాశం షరీబ్కి వచ్చింది. తర్వాత అటు సినిమాలు, ఇటు సీరియల్స్ చేస్తూ కెరీర్ పరంగా బిజీ అయ్యాడు. సరిగ్గా ఇలాంటి టైంలో షాకిచ్చే వార్త. భార్యకు ఓరల్(నోటి) క్యాన్సర్ అనే విషయం తెలిసి షరీబ్ గుండె బద్దలైంది.ఏకంగా నాలుగు సర్జరీలు జరిగాయి. కీమో థెరపీ కూడా తీసుకోవాల్సి వచ్చింది. చికిత్స తీసుకున్న తర్వాత మనిషి ఎలా మారిపోతారనే విషయాన్ని డాక్టర్స్ చెబుతుంటే షరీబ్-నస్రీన్ గుండె ఆగినంత పనయ్యింది. అయినా సరే బలంగా నిలబడ్డారు. క్యాన్సర్ని జయించారు. అయితే క్యాన్సర్ కారణంగా సర్జరీలు చేసుకోవడంతో నస్రీన్ ముఖాకృతి పూర్తిగా మారిపోయింది. అయినా సరే భార్య వెన్నంటే షరీబ్ నిలబడ్డాడు. అలా 2022 తర్వాత నస్రీన్ పూర్తిగా క్యాన్సర్ నుంచి కోలుకుంది. ఇదంతా చూసిన నెటిజనం.. ఈ జంటని తెగ అభినందిస్తున్నారు. ఒకరికి ఒకరు తోడుగా నిలిచి విధినే గెలిచారు కదా అని మాట్లాడుకుంటున్నారు.షరీబ్ విషయానికొస్తే.. సినిమాలు, సీరియల్స్ చాలానే చేసినప్పటికీ 'ద ఫ్యామిలీ మ్యాన్' సిరీస్ ఇతడికి ఎక్కడలేని గుర్తింపు తీసుకొచ్చింది. శ్రీకాంత్ తివారీ (మనోజ్ బాజ్పాయ్)పక్కనే కనిపించే జేకే తల్పడే పాత్రలో షరీబ్ హష్మీ అదరగొట్టేశాడు. తనదైన కామెడీ టైమింగ్తో దేశవ్యాప్తంగా క్రేజ్ సొంతం చేసుకున్నాడు. యాక్టింగ్ సంగతి పక్కనబెడితే భార్యకు కష్టసుఖాల్లో తోడునీడలా నిలిచి రియల్ 'ఫ్యామిలీ మ్యాన్' అనిపించుకుంటున్నాడు. -
రేసులో 'అవతార్'.. కానీ 'ధురంధర్' కలెక్షనే ఎక్కువ!
విడుదలై రెండు వారాలు దాటిపోయినా సరే 'ధురంధర్' జోరు అస్సలు తగ్గట్లేదు. పేరుకే హిందీ మూవీ అయినప్పటికీ దేశవ్యాప్తంగా సూపర్ రెస్పాన్స్ వస్తోంది. రూ.600-700 కోట్ల వరకు కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. అయితే తాజాగా థియేటర్లలోకి వచ్చిన హాలీవుడ్ భారీ బడ్జెట్ మూవీని కూడా వసూళ్లలో ఈ చిత్రం దాటేసినట్లు టాక్ వినిపిస్తుంది. ఇంతకీ ఏంటి విషయం?జేమ్స్ కామెరూన్ దర్శకత్వం వహించిన 'అవతార్' ఫ్రాంచైజీ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. 2009లో తొలి పార్ట్ రిలీజైనప్పుడు మూవీ లవర్స్ ఆశ్చర్యపోయారు. మన దేశంలోనూ వేల కోట్ల వసూళ్లు వచ్చాయి. 2022లో రెండు పార్ట్ విడుదలైతే ఓ మాదిరి రెస్పాన్స్ మాత్రమే దక్కింది. రూ.400-500 కోట్ల మధ్య కలెక్షన్స్ వచ్చాయి. కానీ నిన్న(డిసెంబరు 19) థియేటర్లలోకి మూడో పార్ట్కి మాత్రం పాజిటివ్ రెస్పాన్స్ రావట్లేదు. అదే స్టోరీ అదే విజువల్స్ ఉన్నాయని చూసొచ్చిన ఆడియెన్స్ అనుకుంటున్నారు. దీంతో తొలిరోజు దేశవ్యాప్తంగా రూ.20 కోట్ల వసూళ్లు మాత్రమే వచ్చినట్లు తెలుస్తోంది.అదే టైంలో 'ధురంధర్'కి నిన్న(డిసెంబరు 19) రూ.22.50 కోట్ల కలెక్షన్స్ వచ్చినట్లు సమాచారం. అంటే రేసులో ఉన్న హాలీవుడ్ మూవీ 'అవతార్ 3'ని కూడా హిందీ మూవీ దాటేసిందనమాట. చూస్తుంటే ఈ వీకెండ్లోనూ 'ధురంధర్' హవా కనిపించేలా ఉంది. ఈ మూవీ దెబ్బకు ఇటు తెలుగులో రిలీజైన 'అఖండ 2'పై గట్టిగానే ఎఫెక్ట్ పడింది. ఎందుకంటే తెలుగు తప్ప మిగతా ఏ భాషలోనూ బాలకృష్ణ చిత్రం ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోయింది. అలా 'ధురంధర్' ఎఫెక్ట్.. తెలుగు, ఇంగ్లీష్ మూవీస్పై గట్టిగానే పడినట్లు తెలుస్తోంది. -
అక్షయ్ క్రేజ్పై అసూయ? మాధవన్ ఆన్సరిదే!
యానిమల్ సినిమాలో జమల్ కదు పాట ఎంత ఫేమస్ అయిందో ధురంధర్లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ సాంగ్ అంత ఫేమస్ అయింది. అతడి స్వాగ్, లుక్స్, స్టెప్పులు అన్నింటికీ జనం ఫిదా అయ్యారు. అలా అని అదేదో రిహార్సల్స్ చేసిన డ్యాన్స్ కూడా కాదు. అప్పటికప్పుడు తోచినట్లుగా స్టెప్పేశాడంతే! ఇప్పుడేమో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా అక్షయ్ ఖన్నాయే ట్రెండ్ అవుతున్నాడు. సినిమాలో రణ్వీర్ సింగ్, ఆర్ మాధవన్ వంటి స్టార్స్ ఉన్నా సరే అక్షయ్నే ఎక్కువ కీర్తిస్తున్నారు.మాధవన్కు కుళ్లు?ఈ విషయంలో మాధవన్ కాస్త అప్సెట్ అయ్యాడట! ఓపక్క ధురంధర్ వెయ్యి కోట్ల దిశగా పరుగులు పెడుతున్నందుకు ఒకింత సంతోషంగా ఉన్నా.. అక్షయ్కే ఎక్కువ క్రెడిట్ రావడంతో హర్ట్ అయ్యాడంటూ సోషల్ మీడియాలో కొన్ని రూమర్లు వినిపిస్తున్నాయి. వీటిపై తాజాగా మాధవన్ స్పందించాడు. బాలీవుడ్ హంగామాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతడు మాట్లాడుతూ.. అక్షయ్కు మంచి గుర్తింపు లభించినందుకు చాలా సంతోషంగా ఉంది. అంతే తప్ప బాధెందుకు ఉంటుంది? ఆయన ఎంతో ప్రతిభావంతమైన నటుడు, అలాగే ఎంతో నిరాడంబరంగా ఉంటాడు. తనకు కచ్చితంగా ఈ ప్రశంసలు దక్కి తీరాల్సిందే!నాకంటే గొప్పవాడుఆయన తల్చుకుంటే లక్షల ఇంటర్వ్యూలు ఇవ్వొచ్చు. కానీ తన కొత్తింట్లో తాపీగా కూర్చున్నాడు. విజయాన్ని నిశ్శబ్ధంగానే ఎంజాయ్ చేస్తున్నాడు. నేను పెద్దగా జనం అటెన్షన్ కోరుకునే వ్యక్తిని కాదు. ఈ విషయంలో అక్షయ్ ఖన్నా నాకంటే గొప్పవాడు. ఆయన అసలేదీ పట్టించుకోడు. జయాపజయాలన్నీ కూడా అతడి దృష్టిలో సమానమే అని మాధవన్ చెప్పుకొచ్చాడు. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ధురంధర్ ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.730 కోట్లు వసూలు చేసింది. కేవలం భారత్లోనే రూ.483 కోట్లు రాబట్టింది.చదవండి: బిగ్బాస్ 9కి ప్రాణం పోసిన రియల్ గేమర్.. సంజనా -
ధురంధర్.. బాలీవుడ్కి ఓ ప్రమాద హెచ్చరిక!
కొన్ని సినిమాలు సౌండ్ చేయకుండా వస్తాయి. థియేటర్లలో నెవ్వర్ బిఫోర్ అనేలా రీసౌండ్ చేస్తాయి. ఎందుకంటే ఇండస్ట్రీలో ప్రకంపనలు ఆ రేంజులో ఉంటాయి. సెలబ్రిటీల నుంచి అవసరం లేని విమర్శలూ వినిపిస్తాయి. చాలామందికి నిద్రలేని రాత్రులే మిగులుతాయి. అవును ఇదంతా చెబుతున్నది 'ధురంధర్' కోసమే. ఇంతకీ ఈ సినిమా గురించి బాలీవుడ్లో ఏం మాట్లాడుకుంటున్నారు?'ధురంధర్'.. పదిహేను రోజుల క్రితం రిలీజైన హిందీ సినిమా. థియేటర్లలోకి వచ్చేంతవరకు ఇదో మూవీ ఉందని కూడా పెద్దగా తెలియదు. ఎందుకంటే రెగ్యులర్ బాలీవుడ్ స్టార్స్ చేసే పీఆర్ షో దీనికి చేయలేదు. కట్ చేస్తే రిలీజైన రెండు వారాల్లో సీన్ మారిపోయింది. ప్రేక్షకుల నుంచి అద్భుతమైన ఆదరణ దక్కుతోంది. అదే టైంలో హిందీ చిత్రసీమలో ప్రకంపనలు వినిపిస్తున్నాయి. దక్షిణాదిలోనూ మంచి రెస్పాన్స్, వసూళ్లు దక్కుతున్నాయి. ఇప్పటివరకు రూ.700 కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది.ఈ సినిమా చూసి చాలామంది బాలీవుడ్ స్టార్స్ తట్టుకోలేకపోయారు. హీరో హృతిక్ రోషన్ మాట్లాడుతూ సినిమా అంతా బాగానే ఉంది గానీ పాలిటిక్స్ చూపించకపోయింటే బాగుండేదని అన్నాడు. ఎందుకంటే ఈ మూవీ హిట్ అయి, జనాలకు ఇది నచ్చేస్తే ఇతడు హీరోగా ఉన్న స్పై యూనివర్స్ని ఇక జనాలు చూడరేమో అని భయం కావొచ్చు?హీరోయిన్ రాధిక ఆప్టే.. ఈ మూవీలో వయలెన్స్ దారుణంగా ఉందని చెప్పింది. ఇలాంటి చిత్రాలు తన పిల్లలకు ఎలా చూపించాలి అన్నట్లు మాట్లాడింది. మరి ఈమె గతంలో పలు చిత్రాల్లో నగ్న సన్నివేశాల్లోనూ నటించింది. మరి వాటి సంగతేంటని నెటిజన్లు ఈమెని విమర్శిస్తున్నారు. పలువురు పేరు మోసిన హిందీ రివ్యూయర్లు కూడా ఇదేం మూవీ అన్నట్లు కామెంట్స్ చేస్తున్నారు. కానీ ప్రేక్షకులు ఈ మూవీకి బ్రహ్మరథం పడుతున్నారు.ఇన్నాళ్లు హిందీ సినిమాల్లో పాకిస్థాన్ని చాలా పవర్ఫుల్గా, భాయ్ భాయ్ దోస్తానా అన్నట్లు చూపించారు. యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మాణ సంస్థ తీసిన స్పై యూనివర్స్లోని 'ఏక్ థా టైగర్', 'టైగర్ జిందా హై', 'పఠాన్', 'వార్', 'వార్ 2' సినిమాల్లో పాకిస్థాన్ని ఒకలా ప్రెజెంట్ చేశారు. ఉగ్రవాదులని ఒకలా చూపించారు. కానీ 'ధురంధర్' చూసిన తర్వాత జనాలకు కొన్ని విషయాలు క్లియర్గా అర్థమయ్యాయని చెప్పొచ్చు. దీని దెబ్బకు ఇకపై యష్ రాజ్ స్పై యూనివర్స్ని జనాలు ఆదరిస్తారా అనేది చూడాలి? ఎందుకంటే రాబోయే రోజుల్లో 'ధురంధర్' ఆ రేంజ్ ఎఫెక్ట్ చూపించబోతుంది.బాలీవుడ్లో గతంలోనూ నెపోటిజం ఉన్నప్పటికీ.. గత కొన్నేళ్లలో మాత్రం అది పీక్స్కి చేరింది. సదరు స్టార్ హీరో లేదా హీరోయిన్స్ ఉన్న సినిమాలు ఏ మేరకు ఆడుతున్నాయనేది అందరికీ తెలుసు. అయినా సరే వీళ్లు మాత్రమే స్టార్స్ అన్నట్లు ప్రొజెక్ట్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు 'ధురంధర్' సినిమాతో వాటికి చెక్ పడటం గ్యారంటీలా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ సినిమాలో అక్షయ్ ఖన్నా, రణ్వీర్ సింగ్, సంజయ్ దత్తో పాటు చాలామంది చిన్న పెద్ద యాక్టర్స్ మెరిశారు. ఇందులో యాక్టర్స్ ఫెర్ఫార్మెన్స్ చూసిన తర్వాత బాలీవుడ్ స్టార్స్ చేస్తున్నది కూడా యాక్టింగేనా అనిపించక మానదు.'ధురంధర్' సినిమాలో ఒక్కసారి కూడా మతం గురించి ప్రస్తావించలేదు. సామాన్య ప్రజలను రాక్షసులుగా చూపించలేదు. కేవలం దాయాది దేశంలోని ఓ ప్రాంతంలో కొన్నేళ్ల క్రితం ఇలా ఉండేది అని మాత్రమే చూపించే ప్రయత్నం చేశారు. అలా అని దర్శకుడు ఆదిత్య ధర్ ఏదో పెద్ద పెద్ద మెసేజులు ఇవ్వలేదు. ఇది పరిస్థితి అని చూపించాడు. అర్థం చేసుకున్నోళ్లకు అర్థం చేసుకున్నంత అన్నట్లు వదిలేశాడు.దర్శకుడు రాంగోపాల్ వర్మ కూడా 'ధురంధర్'ని ప్రశంసిస్తూ చాలా పెద్ద ట్వీట్ చేశాడు. ప్రస్తుత దర్శకులు ఈ సినిమా నుంచి చాలా విషయాలు నేర్చుకోవాలని అన్నాడు. కొన్నాళ్ల ముందు కూడా తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా.. బాలీవుడ్లో 'కబీర్ సింగ్' తీసినప్పుడు ఇలానే చాలామంది చాలా విమర్శలు చేశారు. 'యానిమల్' రిలీజ్ టైంలోనూ ఇదే రిపీటైంది. కానీ వాళ్లందరికీ సందీప్.. తన సినిమాతో సమాధానమిచ్చాడు. ఇప్పుడు కూడా ఆదిత్య అలాంటి పంచ్ ఇచ్చాడు. బాలీవుడ్ పునాదులు కదిలించే ప్రయత్నం చేశాడు. చెప్పాలంటే బాలీవుడ్కి ఇదో ప్రమాద హెచ్చరిక లాంటిది! -
ఫ్యాన్స్కు గుడ్ న్యూస్ చెప్పిన దృశ్యం డైరెక్టర్..!
సూపర్ హిట్ మూవీ దృశ్యం-2 డైరెక్టర్ అభిషేక్ పాఠక్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. పెళ్లయిన రెండు సంవత్సరాల తర్వాత తాను తండ్రి కాబోతున్నట్లు ప్రకటించారు. నటి శివాలిక ఓబెరాయ్ను పెళ్లాడిన ఆయన ఇవాళ శుభవార్తను పంచుకున్నారు. బేబీ పాఠక్ 2026లో వస్తోందంటూ ఫోటోను షేర్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు.ఈ జంట ఫిబ్రవరి 2023లో గోవాలో వివాహం చేసుకున్నారు. అభిషేక్ పాఠక్ నిర్మించిన ఖుదా హాఫిజ్ మూవీతో శివాలిక నటించారు. అదే సమయంలో వీరిద్దరికి పరిచయం ఏర్పడింది. అభిషేక్ పాఠక్ టర్కీలో శివాలికకు ప్రపోజ్ చేశాడు. ఆ తర్వాత వీరిద్దరు పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు. వచ్చే ఏడాదిలో ఈ జంట తల్లిదండ్రులు కాబోతున్నారు. కాగా.. అభిషేక్ పాఠక్ బాలీవుడ్లో పలు సినిమాలకు దర్శకత్వం వహించారు. ఆయన భార్య శివాలికి ఓబెరాయ్ మూడు సినిమాల్లో హీరోయిన్గా కనిపించింది. View this post on Instagram A post shared by Shivaleeka Oberoi Pathak (@shivaleekaoberoi) -
రెండో బిడ్డకు జన్మనిచ్చిన కమెడియన్
ప్రముఖ కమెడియన్ భారతీ సింగ్ రెండో బిడ్డకు జన్మనిచ్చింది. ఈసారి ఆమెకు మగబిడ్డ పుట్టినట్లు తెలుస్తోంది. నిజానికి ఈ రోజు ఆమె లాఫ్టర్ చెఫ్ షూటింగ్కు వెళ్లాల్సి ఉంది. కానీ, సడన్గా నొప్పులు రావడంతో వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆమెకు మరోసారి కొడుకు పుట్టాడు.2017లో పెళ్లికాగా భారతి సింగ్.. యాంకర్, నిర్మాత, రచయిత హార్ష్ లింబాచియాను 2017లో పెళ్లి చేసుకుంది. వీరి ప్రేమానురాగాలకు గుర్తుగా 2022లో కుమారుడు లక్ష్య జన్మించాడు. ఇతడిని ముద్దుగా గోల అని పిలుచుకుంటారు. గోలతో ఆడుకునేందుకు మరో బుజ్జాయి రాబోతోందన్న విషయాన్ని దంపతులిద్దరూ అక్టోబర్లో వెల్లడించారు. ప్రెగ్నెంట్ అని తెలియక..స్విట్జర్లాండ్లో ట్రిప్లో ఉన్న సమయంలో భారతికి తాను ప్రెగ్నెంట్ అన్న విషయం తెలిసింది. అప్పటికి ఆమెకు ఏడు వారాలు. ఈ విషయం గురించి భారతి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నేను ప్రెగ్నెంట్ అని తెలియక నచ్చింది తింటూ, తాగుతూ ఎంజాయ్ చేశా.. మందు కూడా తాగాను. ఓసారి అనుకోకుండా ప్రెగ్నెన్సీ కిట్ కనిపించేసరికి ట్రై చేశా.. ఆశ్చర్యంగా అది పాజిటివ్ వచ్చింది. ఇటీవలే సీమంతంనా భర్తకు చెప్తే అసలు నమ్మలేదు. ఆస్పత్రికి వెళ్లి పరీక్ష చేయించుకుంటే గర్భం దాల్చానని నిర్ధారణ అయింది అని చెప్పుకొచ్చింది. ప్రెగ్నెంట్ అని తెలియగానే ఉన్నపళంగా ఇండియా వచ్చేశారు. కానీ బేబీ పుట్టాక మిగిలిన ట్రిప్ కచ్చితంగా పూర్తి చేస్తానంది. నవంబర్లో తను బేబీ బంప్తో ఉన్న ఫోటోలను షేర్ చేసింది. వారం రోజుల క్రితమే తన సీమంతం జరిగింది.కమెడియన్గా, యాంకర్గా..భారతీ సింగ్.. ద గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ ఛాలెంజ్ షోలో పాల్గొని సెకండ్ రన్నరప్గా నిలిచింది. కామెడీ సర్కస్ షోలలోనూ పాల్గొంది. ఇండియాట్ గాట్ టాలెంట్ 5, 7, 8వ సీజన్స్, కామెడీ నైట్స్బ చావో, ద ఖాత్ర షో,డ్యాన్స్ దీవానే మూడో సీజన్, సరిగమప లిటిల్ చాంప్స్ 2022, లాఫ్టర్ చెఫ్స్ వంటి పలు షోలకు వ్యాఖ్యాతగానూ వ్యవహరించింది. View this post on Instagram A post shared by Bharti Siingh (@bharti.laughterqueen) -
'ధురంధర్'కి భారీ ఓటీటీ డీల్.. స్ట్రీమింగ్ ఎప్పుడు?
ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో బాక్సాఫీస్ దగ్గర రచ్చ లేపుతున్న సినిమా 'ధురంధర్'. పేరుకే హిందీ మూవీ అయినప్పటికీ దక్షిణాదిలోనూ మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి వసూళ్లు నమోదవుతున్నాయి. చూసిన చాలామందికి ఇది నచ్చేస్తోంది. మరికొందరు మాత్రం ఓటీటీలోకి వచ్చిన తర్వాత చూసుకోవచ్చులే అనుకుంటారు. ఈ క్రమంలోనే 'ధురంధర్' డిజిటల్ డీల్ గురించి సోషల్ మీడియాలో రూమర్స్ వినిపిస్తున్నాయి.రణ్వీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్ తదితరులు ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో కనిపించారు. 'ఉరి' ఫేమ్ ఆదిత్య ధర్ దర్శకత్వం వహించాడు. రిలీజ్కి ముందు ఓ మాదిరి హైప్ మాత్రమే ఉంది. ఎప్పుడైతే థియేటర్లలోకి వచ్చిందో బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం రూ.700 కోట్ల వరకు కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. దీనికి సీక్వెల్ కూడా ఉందని ప్రకటించారు. రాబోయే మార్చి 19న అది థియేటర్లో ఇది విడుదల కానుంది.(ఇదీ చదవండి: 'ధురంధర్' నటితో ముద్దు వీడియో.. ట్రోల్స్పై స్పందించిన నటుడు)అసలు విషయానికొస్తే.. 'ధురంధర్' డిజిటల్ హక్కుల్ని నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. అయితే రూ.130 కోట్లకు ఈ డీల్ జరిగిందని కొన్నిరోజుల క్రితం రూమర్స్ రాగా.. ఇప్పుడు ఏకంగా రూ.285 కోట్లతో ఒప్పందం జరిగిందని అంటున్నారు. ఏదేమైనా ఏదో ఒకలా సోషల్ మీడియాలో ఈ మూవీ గురించి డిస్కషన్ నడుస్తోంది.'ధురంధర్' స్ట్రీమింగ్ విషయానికొస్తే థియేటర్లలోకి వచ్చిన 8 వారాల తర్వాతే స్ట్రీమింగ్ చేసేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. అంటే వచ్చే జనవరి 30న నెట్ఫ్లిక్స్లో ఇది వచ్చే ఛాన్స్ ఉంది. ఇకపోతే తెలుగు డబ్బింగ్ రిలీజ్ ఉందని మాట్లాడుకుంటున్నారు కానీ ఇంతవరకు ఈ విషయంపై క్లారిటీ అయితే రాలేదు.(ఇదీ చదవండి: 'ధురంధర్' సినిమా రివ్యూ) -
'దక్షిణాది నిర్మాత హోటల్కు రమ్మన్నాడు'..: క్యౌస్టింగ్ కౌచ్పై బిగ్బాస్ బ్యూటీ
సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ పదం ఎక్కువగా వినిపిస్తూ ఉంటోంది. సినీతారలు ఏదో ఒక సందర్భంలో అలాంటి అనుభవాన్ని ఎదుర్కొనే ఉంటారు. కొందరు వాటిని బహిరంగంగా మాట్లాడితే.. మరికొందరు బయటికి చెప్పలేక సతమతమవుతుంటారు. గతంలో చాలామంది హీరోయిన్స్ తమకు ఎదురైన చేదు అనుభవాలను పంచుకున్నారు. తాజాగా మరో నటి తనకెదురైన క్యాస్టింగ్ కౌచ్ ఎక్స్పీరియన్స్ను షేర్ చేసింది.బాలీవుడ్ నటి, స్టార్ క్రికెటర్ దీపక్ చాహర్ సోదరి అయిన మాల్టీ చాహర్ ఇటీవలే సల్మాన్ ఖాన్ బిగ్బాస్ సీజన్-19లో కనిపించింది. తాజాగా ఓ పాడ్కాస్ట్కు హాజరైన మాల్టీ చాహర్ తాను కూడా క్యాస్టింగ్ కౌచ్ బారిన పడినట్లు తెలిపింది. కెరీర్ ప్రారంభంలో ఇలాంటి అనుభవం ఎదురైందని చెప్పుకొచ్చింది. ఫిల్మ్ ఇండస్ట్రీలో పరిస్థితులు, క్యాస్టింగ్ కౌచ్ సంఘటనల గురించి మాట్లాడింది.తనకు క్యాస్టింగ్ డైరెక్టర్లతో ఎలాంటి సమస్య రాలేదని మాల్టీ చాహర్ తెలిపింది. ఏ క్యాస్టింగ్ డైరెక్టర్ కూడా నాతో అసభ్యంగా ప్రవర్తించలేదని వెల్లడించింది. అయితే ఓ దర్శకుడు మాత్రం వర్క్ పరంగా మాట్లాడే సమయంలో అనుచితంగా ప్రవర్తించాడని వివరించింది. ఆ వేధింపులు ఎప్పుడూ ప్రత్యక్షంగా ఉండేవి కావని.. వారి ఉద్దేశ్యాన్ని బయటికి చెప్పకుండా అలాంటి హింట్స్ ఇస్తారని మాల్టీ తెలిపింది. ఓ దక్షిణాది నిర్మాతతో సమావేశమైనప్పుడు అతని హోటల్ రూమ్ గది నంబర్ తనకు ఇచ్చాడని ఆ అనుభవాన్ని పంచుకుంది. అలాంటి పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నానని తెలిపింది. ఆ సమయంలో నేను అర్థం కానట్లు నటించానని.. ఆ తర్వాత మేము మళ్లీ కలుసుకోలేదని మాల్టీ చెప్పుకొచ్చింది.మాల్టీ చాహర్ మాట్లాడూతూ..'ఒక ఆఫీస్ మీటింగ్లో వీడ్కోలు సమయంలో తనకు ఇలాంటి అనుభవమే ఎదురైంది. సాధారణ ఆలింగనం అని భావించా. కానీ అతను నన్ను ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నించాడు. అది నాకు చాలా అసౌకర్యంగా అనిపించింది. వెంటనే అతన్ని అడ్డుకుని.. ఆ తర్వాత అతనితో అన్ని సంబంధాలను తెంచుకున్నా. అక్కడే అతన్ని నిలదీశా. అతన్ని నా తండ్రిలా భావించా. ఆ సంఘటన నాకు ఒక గుణపాఠం నేర్పింది. ఎవరినీ కూడా ఉన్నత స్థానంలో ఉంచొద్దు. 'అని అన్నారు. మహిళలు అవకాశాల కోసం ఇలాంటి వాటికి అంగీకరించవద్దని సూచించింది. మనపై మనకు నియంత్రణ ఉండాలని కోరింది.కాగా.. ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాకు చెందిన ఈ బ్యూటీ 2018లో అనిల్ శర్మ దర్శకత్వం వహించిన బాలీవుడ్ చిత్రం జీనియస్ ద్వారా రూబీనా పాత్రను పోషించింది. అరవింద్ పాండే దర్శకత్వం వహించిన రొమాంటిక్ డ్రామా ఇష్క్ పాష్మినా (2022)లో ఒమిషా పాత్రను పోషించి తన నటనా నైపుణ్యాలను మరింతగా ప్రదర్శించింది. అనేక బ్రాండ్లకు ప్రచారకర్తగా కూడా ఆమె పనిచేస్తోంది. ఇన్స్టాలో గ్లామరస్ ఫొటోలు, ఫ్యాషన్ పోస్ట్లతో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటుంది. 2018లో ఐపీఎల్ మ్యాచ్లో మిస్టరీ గర్ల్గా ఫేమస్ అయ్యింది. ఆ తరువాత ఆమె దీపక్ చాహర్ సోదరి అని ప్రపంచానికి తెలిసింది. -
ఓటీటీకి వందకోట్ల సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
హర్షవర్ధన్ రాణే,సోనమ్ బాజ్వా జంటగా నటించిన చిత్రం ఏక్ దీవానే కీ దీవానీయత్'. ఈ మూవీ అక్టోబర్ 21న థియేటర్లలో సందడి చేసింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.110 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్కు మిలాప్ జవేరి దర్శకత్వం వహించారు. దేశీ మూవీస్ ఫ్యాక్టరీ బ్యానర్పై అన్షుల్ గార్గ్, దినేష్ జైన్ నిర్మించారు.తాజాగా ఈ చిత్రం ఓటీటీలో సందడి చేసేందుకు వస్తోంది. థియేటర్లలో విడుదలైన రెండు నెలల తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్కు వచ్చేస్తోంది. డిసెంబర్ 26 నుంచి స్ట్రీమింగ్ కానుందని జీ5 అఫీషియల్గా ప్రకటించింది. ఈ మేరకు పోస్టర్ను పంచుకుంది. కాగా.. ఈ చిత్రంలో షాద్ రంధావా, సచిన్ ఖేడేకర్, అనంత్ నారాయణ్ మహాదేవన్, రాజేష్ ఖేరా కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా లవ్ అండ్ రొమాంంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కించారు. దాంపత్య జీవితంలో భార్య, భర్తల మధ్య ఆధిపత్య ధోరణి, వాటివల్ల వచ్చే ఎదురయ్యే సమస్యల ఆధారంగా రూపొందించారు. This Holiday Season, har gulaab mein ishq dikhega, aur uske kaanton mein Ek Deewane Ki Deewaniyat! 🥀 #EkDeewaneKiDeewaniyat Premieres 26th December, only on #ZEE5#EkDeewaneKiDeewaniyatOnZEE5 pic.twitter.com/IYyhLPACda— ZEE5Official (@ZEE5India) December 18, 2025 -
ఫస్ట్ సినిమా.. డబ్బులివ్వలేదు, దారుణంగా చూశారు
బాలీవుడ్ బ్యూటీ రాధికా ఆప్టే ఇండస్ట్రీలో అడుగుపెట్టి 20 ఏళ్లవుతోంది. 2005లో వచ్చిన కామెడీ ఫిలిం 'వాహ్ లైఫ్ ఓతో ఐసీ'తో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. తర్వాత అనేక సినిమాలు, సిరీస్లు చేసింది. రెండు దశాబ్దాలుగా టాలెంటెడ్ నటిగా సినీరంగంలో రాణిస్తోంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకుంది.చేదు అనుభవంరాధికా ఆప్టే మాట్లాడుతూ.. అందరూ తమ ఫస్ట్ సినిమా గురించి మంచిగా చెప్పుకుంటారు. కానీ, నాకు మాత్రం నా ఫస్ట్ మూవీ భయానక అనుభవాలనే పంచింది. నిర్మాత (సంగీత అహిర్) నాకు సరైన వసతి కల్పించలేదు, డబ్బులివ్వలేదు. నేను, అమ్మ.. వారిని సినిమా రెమ్యునరేషన్కు సంబంధించిన కాంట్రాక్టుపై సంతకం చేయమన్నాం.దారుణంగా..కానీ, వాళ్లేమో.. ఊర్మిళ వంటి పెద్ద నటియే ఏ హామీ అవసరం లేదంది.. మీరేంటి ఇలా అడుగుతున్నారు? అని దాటవేశారు. అదెంతవరకు నిజమో నాకు తెలియదు కానీ మమ్మల్ని మాత్రం చాలా దారుణంగా ట్రీట్ చేశారు. అందుకే నా ఫస్ట్ సినిమాను ఎప్పుడూ మర్చిపోవాలనుకుంటాను అని తెలిపింది..ఆయనే న్యాయ నిర్ణేతసినిమాలో తొలి అవకాశం ఎలా వచ్చిందన్నదాని గురించి మాట్లాడుతూ.. నేను బ్రెయిన్ సర్జన్ అనే నాటకం వేశాను. మా టీమ్కు రాష్ట్ర స్థాయిలో అవార్డు వచ్చింది. అయితే మాకు అవార్డు ఇచ్చిన జడ్జి టీమ్లో దర్శకుడు మహేశ్ మంజ్రేకర్ ఉన్నారు. నాటకం అయిపోయిన వెంటనే నన్ను పిలిచి సినిమా ఛాన్స్ ఇస్తానన్నాడు. అలా ఆయన డైరెక్షన్లోనే తెరంగేట్రం చేశాను. చూస్తుండగానే 20 ఏళ్లు గడిచిపోయాయి అని నటి చెప్పుకొచ్చింది.సినిమాలురాధికా ఆప్టే తెలుగులో రక్త చరిత్ర, లెజెండ్, లయన్ చిత్రాల్లో నటించింది. తెలుగు, హిందీతో పాటు ఇంగ్లీష్, మరాఠి, బెంగాలీ, తమిళ సినిమాల్లోనూ యాక్ట్ చేసింది. మేడ్ ఇన్ హెవెన్, సేక్రెడ్ గేమ్స్, ఓకే కంప్యూటర్ వంటి వెబ్ సిరీస్లలోనూ నటించింది. చివరగా సాలి మొహబ్బత్ అనే థ్రిల్లర్ సినిమాలో కనిపించింది. ఈ మూవీ ప్రస్తుతం జీ5లో అందుబాటులో ఉంది.చదవండి: భార్యకు విడాకులిచ్చిన దేవి నటుడు -
జైలర్ 2లో ఐటం సాంగ్!
సినిమాలో ఎంత పెద్ద హీరోలు ఉన్నా ఐటమ్ సాంగ్స్ తప్పనిసరిగా మారుతోంది. కథ, కథనాలు ఎంత బాగున్నా, ఆ చిత్రాలకు ఎక్కువ మైలేజ్ ఇస్తున్నవి ఐటమ్ సాంగ్స్నే అంటున్నారు సీనీ పండితులు. అలా ఐటమ్ సాంగ్స్కు బ్రాండ్ అంబాసిడర్లుగా మారిన అతి కొద్దిమంది స్టార్ హీరోయిన్లలో తమన్నా పేరు ముందు ఉంటుంది. రజనీ నటించిన జైలర్ మూవీలో తమన్నా అందాలు ఆరబోసిన నువ్వు కావాలయ్యా పాట ఎంత హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. జైలర్ 2లో ఐటం సాంగ్అదేవిధంగా కూలీ చిత్రంలో పూజాహెగ్డే స్టెప్పేసిన మోనికా సాంగ్ కూడా ఈచిత్రానికి కొంత మైలేజ్ను తీసుకొచ్చింది. తాజాగా రజనీ నటిస్తున్న జైలర్–2 చిత్రంలోనూ ఐటమ్సాంగ్ ఉంటుందని సమాచారం. కాకపోతే ఈ సారి మిల్కీ బ్యూటీ తమన్నాకు బదులుగా బాలీవుడ్ బ్యూటీని ఎంపిక చేసే ప్లాన్లో ఉన్నారట! ఆమె ఎవరో కాదు నోరా ఫతేహి.స్టెప్పేయనున్న నోరా ఫతేహి?మోడలింగ్ రంగంలో రాణించిన ఈ క్రేజీ భామ హిందీ బిగ్బాస్ రియాలిటి గేమ్షోలోనూ పాల్గొంది. అనంతరం పలు హిందీ చిత్రాల్లో నటిస్తున్న ఈ బ్యూటీ బాహుబలి వంటి కొన్ని చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్లో నటించి గుర్తింపు పొందింది. ఇప్పుడు జైలర్–2 మూవీలో ఐటమ్ సాంగ్ చేయనుందని తెలుస్తోంది. ఈ విషయంపై క్లారిటీ రావాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు ఆగాల్సిందే! -
19 ఏళ్లకే బట్టతల.. 50 ఏళ్లు దాటినా సింగిల్గా!
అందాన్ని కాపాడుకునేందుకు సెలబ్రిటీలు పడే పాట్లు అంతా ఇంతా కాదు. కడుపు మాడ్చుకుంటారు, క్రీములు వాడతారు, జిమ్కెళ్తారు. అందం, శరీర సౌష్టవం కోసం ఏదైనా చేస్తారు. కానీ ఇండస్ట్రీలో అడుగుపెట్టే సమయానికే జుట్టు రాలడం మొదలైతే ఇంకేమైనా ఉందా? అందులోనూ అబ్బాయిలు బట్టతలతో ఆడిషన్కు వెళ్తే ఎవరైనా తీసుకుంటారా? అక్షయ్ ఖన్నాకు కూడా ఇదే భయం. కానీ భయపడుతూ కూర్చుంటే ఏదీ మారదని అర్థమై ధైర్యంగా ముందడుగు వేశాడు. లుక్ కన్నా టాలెంట్ ముఖ్యమని నిరూపించాడు. ఈ ఏడాది ఛావా, ధురంధర్ సినిమాలతో సెన్సేషన్గా మారిన ఈ నటుడి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం..19 ఏళ్లకే జుట్టు రాలడందివంగత నటుడు, రాజకీయ నాయకుడు వినోద్ ఖన్నా కుమారుడే అక్షయ్ ఖన్నా. స్కూల్, కాలేజీ డేస్లో చదువులో కన్నా ఆటల్లోనే ఎక్కువ రాణించేవాడు. కానీ చిన్నతనంలోనే హెయిర్ లాస్ సమస్యతో బాధపడ్డాడు. 19 ఏళ్లకే ఉన్న జుట్టంతా ఊడిపోతుంటే భరించలేకపోయాడు. తలపై ఎన్ని వెంట్రుకలు ఉంటే అన్ని ఆఫర్స్ వస్తాయనుకునేవాడు. తండ్రి సినిమాతో ఎంట్రీకానీ, జుట్టు రాలడాన్ని తగ్గించలేమన్న నిజాన్ని అర్థం చేసుకున్నాక తన టాలెంటే అవకాశాలు తెచ్చిపెడుతుందని ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేశాడు. తండ్రి హీరోగా నటించి, నిర్మించిన హిమాలయ పుత్ర (1997) మూవీతో తొలిసారి వెండితెరపై అడుగుపెట్టాడు. అయితే అక్షయ్ (Akshaye Khanna)కు మంచి బ్రేక్ ఇచ్చింది మాత్రం తన రెండో మూవీ 'బోర్డర్'. ఈ చిత్రం తర్వాత అక్షయ్ వెనుదిరిగి చూసుకోలేదు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్గా తనదైన మార్క్ సృష్టించాడు. వైరల్దిల్ చహ్తా హై, హమ్రాజ్, దీవాంగే, రేస్, తీస్ మార్ ఖాన్, ఇత్తేఫఖ్, సెక్షన్ 375, దృశ్యం 2 ఇలా హిందీలో సినిమాలు చేసుకుంటూ పోయాడు. దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత ఛావాతో తిరిగొచ్చాడు. ఔరంగజేబుగా అద్భుతంగా నటించి మంచి కమ్బ్యాక్ ఇచ్చాడు. ధురంధర్ చిత్రంలో తన యాక్టింగ్, డ్యాన్స్ క్లిప్తో మరోసారి వార్తల్లోకెక్కాడు. అయితే అక్షయ్కు అందరిలా పార్టీలు చేసుకుంటూ ఎప్పుడై లైమ్లైట్లో ఉండే అలవాటు లేదు. 50 ఏళ్లు దాటినా సింగిల్గానే..వచ్చామా? సినిమాలు చేసుకున్నామా? అయిపోయిందా? అంతే! అన్నట్లుగా ఉంటాడు. 50 ఏళ్లు వచ్చినా పెళ్లి చేసుకోకుండా మిగిలిపోయిన ఈ హీరో గతంలో హీరోయిన్ కరిష్మా కపూర్తో ప్రేమలో పడ్డాడు. కానీ ఆ ప్రేమకథ పెళ్లిదాకా రాకముందే ఆగిపోయింది. 28 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న అక్షయ్ ఆస్తి రూ.167 కోట్లు ఉంటుందని అంచనా! #AkshayeKhanna How on earth are you aging backwards, sharpening your features instead of softening them.? Akshay, you insane, precision-crafted monster of talent, how are you this god-level? It’s illegal at this point.He’s grown into a kind of dangerous handsomeness, the kind… pic.twitter.com/dExZhHFddH— sweeti singh vikram (@SweetiSghVikram) December 7, 2025 -
పేరెంట్స్గా ప్రమోషన్.. లావణ్య నుంచి సోనియా ఆకుల వరకు!
ఇల్లు కట్టి చూడు- పెళ్లి చేసి చూడు అంటారు. కానీ తరాలు మారుతున్నాయి. ఇప్పుడు పెళ్లి చేసి చూడు, పిల్లల్ని కని చూడు అంటున్నారు. ఆ రేంజ్లో సంతాన సమస్యలు పెరుగుతున్నాయి. అయితే ఎంత బిజీగా ఉన్నా సరే చిన్నపాపాయి నవ్వు చూస్తే ఆ ఒత్తిడి అంతా మటాష్ అయిపోతుంది. అందుకే చాలామంది సెలబ్రిటీలు కెరీర్లో సెటిల్ అవగానే పేరెంట్హుడ్ గురించి ఆలోచిస్తున్నారు. అలా ఈ ఏడాది (2025) పలువురు తారలు తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందరు. ఆ జాబితాను చూసేద్దాం....వరుణ్ తేజ్ -లావణ్య త్రిపాఠికొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నవీరిద్దరు.. 2023 నవంబరులో పెళ్లి చేసుకున్నారు. ఈ ఏడాది సెప్టెంబరు 10న బిడ్డకు జన్మనిచ్చినట్లు చెప్పారు. వీళ్లిద్దరూ కలిసి మిస్టర్, అంతరిక్షం సినిమాల్లో జంటగా నటించారు..వశిష్ట సింహ- హరిప్రియవశిష్ట సింహ- హరిప్రియ 20203 జనవరిలో ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్లయిన రెండేళ్లకు ఈ జంటకు మగబిడ పుట్టింది. పెళ్లిరోజునే బాబు పుట్టడం మరో విశేషం!విక్కీ కౌశల్- కత్రినా కైఫ్హీరో విక్కీ కౌశల్కు ఈ ఏడాది బాగా కలిసొచ్చింది. ఓపక్క ఛావా విజయం, మరోపక్క పుత్ర సంతానంతో గాల్లో తేలుతున్నాడు. విక్కీ- కత్రినా దంపతులలకు నవంబర్ 7న బాబు పుట్టాడు.సిద్దార్థ్ మల్హోత్రా- కియారా అద్వానీసిద్- కియారా చాలాకాలం ప్రేమలో మునిగి తేలారు. 2023 ఫిబ్రవరిలో రాజస్థాన్లోని జైసల్మీర్లో ఘనంగా పెళ్లి చేసుకున్నారు. పెళ్లయిన రెండేళ్లకు జూలై 15న తమ కుటుంబంలోకి బుజ్జి పాపాయి వచ్చినట్లు ప్రకటించారు. పాపకు సరాయా అని నామకరణం చేశారు.పరిణీతి చోప్రా- రాఘవ్ చద్దాహీరోయిన్ పరిణీతి చోప్రా- నాయకుడు రాఘవ్ చద్దా 2023లో వివాహం చేసుకున్నారు. ఈ దంపతులు అక్టోబర్ 19న పండంటి బాబుకు జన్మనిచ్చారు. ఈ చిన్నోడికి నీర్ అని పేరు పెట్టారు.అర్బాజ్ ఖాన్- షురా ఖాన్బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ సోదరుడు, నటుడు అర్బాజ్ ఖాన్ మేకప్ ఆర్టిస్ట్ షురా ఖాన్ను రెండో పెళ్లి చేసుకున్నాడు. వీళ్లు ఈ ఏడాది అక్టోబర్5న ఆడబిడ్డకు జన్మనిచ్చారు. తమ కూతురికి సిపారా ఖాన్ అని నామకరణం చేశారు.రాజ్కుమార్ రావు- పాత్రలేఖసినిమాలతో బిజీ ఉండే రాజ్కుమార్- పాత్రలేఖ.. ఇద్దరూ పర్సనల్ లైఫ్ను ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ఏడాది తల్లిదండ్రులుగా ఒక స్టెప్ ముందుకు వేశారు. నవంబర్ 15న తమ మూడో పెళ్లి రోజునాడే పాప పుట్టిందని ప్రకటించారు.కేఎల్ రాహుల్- అతియా శెట్టిక్రికెట్ క్రీడాకారుడు కేఎల్ రాహుల్, నటి అతియా శెట్టి ఈ ఏడాది మార్చిలో పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. పాపకు ఎవారా అని నామకరణం చేశారు. దీనర్థం దేవుడు పంపిన బహుమతి.వీళ్లే కాకుండా బుల్లితెర నటులు సాయికిరణ్- స్రవంతి, మహాతల్లి జాహ్నవి జంట, బిగ్బాస్ సెలబ్రిటీలు సుదీప్, సోనియా ఆకుల కూడా తొలిసారి పేరెంట్హుడ్కు స్వాగతం పలికారు. బాలీవుడ్లో జైద్ దర్బార్- గౌహర్ ఖాన్, మాళవిక రాజ్- ప్రణవ్ బగ్గ, షీనా బజాజ్ - రోహిత్ పురోహిత్, షీనా బజాజ్ రోహిత్ పురోహిత్, జహీర్ ఖాన్- సాగరిక, నవరాజ్ హన్స్- అజిత్ కౌర్.. ఇలా పలు జంటల ఇళ్లలో చంటిబిడ్డల నవ్వులు వినిపించాయి. -
స్టార్ హీరోయిన్, ఆమె భర్తపై ఫ్రాడ్ కేసు
ముంబైకి చెందిన దీపక్ కొఠారి అనే వ్యాపారవేత్తని మోసం చేశారనే అభియోగాలపై కొన్ని నెలల క్రితం నటి శిల్పా శెట్టి దంపతులపై కేసు నమోదైంది. ఈ మేరకు జుహు పోలీసులు దీనిని ఆర్థిక నేరాల విభాగానికి బదిలీ చేయగా.. దర్యాప్తు కొనసాగింది. ఇప్పుడు ఈ కేసులో పురోగతి లభించింది. రూ.60 కోట్లు మోసం చేశారనే ఆరోపణలపై శిల్పాశెట్టితో పాటు ఈమె భర్త రాజ్ కుంద్రాపై ముంబై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 420 సెక్షన్ పెట్టారు.అసలేం జరిగింది?2015- 2023 వరకు ఓ వ్యాపార ఒప్పందం నిమిత్తం దీపక్ కొఠారి అనే వ్యక్తి.. శిల్పాశెట్టి దంపతులకు రూ.60.48 కోట్లు ఇచ్చాడు. కానీ వీళ్లు ఆ డబ్బును వ్యక్తిగత ఖర్చుల కోసం ఉపయోగించుకున్నారు. షాపింగ్ ప్లాట్ఫామ్ బెస్ట్ డీల్ టీవీకి శిల్పా-రాజ్ కుంద్రా డైరెక్టర్లుగా ఉన్న సమయంలో దీపక్ ఒప్పందం చేసుకున్నారు. అప్పటికి ఆ కంపెనీలో 87 శాతం కంటే ఎక్కువ వాటా వీళ్లదే. 2016 ఏప్రిల్లో శిల్పా శెట్టి తనకు వ్యక్తిగత హామీ కూడా ఇచ్చారని దీపక్ చెప్పారు.అయితే ఆ తర్వాత కొన్ని నెలలకే శిల్పా శెట్టి.. డైరెక్టర్ పదవికి రాజీనామా చేశారని, ఆ విషయాన్ని బయటకు చెప్పలేదని దీపక్ కొన్నాళ్ల క్రితం చేసిన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం ఆ కంపెనీ దివాలా తీసిన విషయం తెలిసిందని చెప్పారు. ఇప్పుడు ఈ కేసులో పురోగతి లభించింది. శిల్పా, ఈమె భర్త రాజ్ కుంద్రాపై ఫ్రాడ్ కేసు నమోదు చేశారు.మరోవైపు శిల్పా శెట్టికి చెందిన ప్రముఖ రెస్టారెంట్ 'బాస్టియన్' వివాదంలో చిక్కుకుంది. బెంగళూరులోని సెయింట్ మార్క్స్ రోడ్లో ఇది ఉంది. అనుమతించిన టైమ్ కంటే ఎక్కువసేపు తెరిచి ఉంచడం, అర్ధరాత్రి పార్టీలకు పర్మిషన్ ఇచ్చి నిబంధనలు ఉల్లంఘించినందుకుగాను బెంగళూరు పోలీసులు ఈ రెస్టారెంట్పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కర్ణాటక పోలీస్ చట్టంలోని సెక్షన్ 103 కింద సుమోటో ఫిర్యాదుల ఆధారంగా కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. -
ఆస్కార్ షార్ట్ లిస్ట్లో 'హోంబౌండ్'
ఇషాన్ కట్టర్, విశాల్ జెత్వా, జాన్వీ కపూర్ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం "హోమ్ బౌండ్". నీరజ్ ఘెవాన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ పలు అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటింది. అలాగే 2026లో జరగనున్న ఆస్కార్ అవార్డుల పోటీకి 'బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిలిం' కేటగిరీలో ఇండియా నుంచి అధికారికంగా ఎంపికైన విషయం తెలిసిందే! ఇప్పుడు మరో ముందడుగు పడింది. ఆస్కార్ ఎంపికలో అతి ముఖ్యమైన షార్ట్లిస్ట్ జాబితాలో స్థానం సంపాదించుకుంది.ఫైనల్ షార్ట్లిస్ట్ అప్పుడే..ఈ విషయాన్ని హోంబౌండ్ మూవీ యూనిట్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. తాజాగా 12 విభాగాల్లో పోటీపడుతున్న సినిమాల షార్ట్లిస్ట్ను అకాడమీ ప్రకటించింది. బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిలిం విభాగంలో మొత్తం 15 సినిమాలను తాజాగా షార్ట్లిస్ట్ చేశారు. అందులో హోంబౌండ్ చోటు దక్కించుకోవడంతో సినీప్రియులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తుది జాబితాలో ఈ సంఖ్యను ఐదుకి తగ్గించనున్నారు. ఈ ఫైనల్ జాబితాను జనవరి 22న ప్రకటించనున్నారు. అప్పుడు కూడా హోంబౌండ్ మరోసారి షార్ట్లిస్ట్ అవుతుందని ఆశిద్దాం..హోంబౌండ్ కథేంటి?షోయబ్, చందన్ కుమార్ అనే ఇద్దరు మిత్రుల కథే హోంబౌండ్. అట్టడుగు ఆర్థిక పరిస్థితుల్లో ఉన్న వీరిద్దరూ చిన్ననాటి నుంచే పోలీస్ కానిస్టేబుల్ అవాలని కలలు కంటారు. ఓపక్క పోలీస్ ఉద్యోగం కోసం కష్టపడుతూ మరోపక్క చిన్నచిన్న ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు. కానీ, ఊరు విడిచి నగరానికి చేరుకున్నాక.. దేశంలో వేళ్లూనుకుపోయిన వివక్ష వారికి అనుభవంలోకి వస్తుంది. మరి వీరి కల నెరవేరిందా? వీరి ప్రయాణం ఎక్కడివరకు సాగిందనేదే కథ. ఈ సినిమాను కరణ్ జోహార్, అదర్ పూనావాలా నిర్మించారు. #Homebound has been shortlisted for Best International Feature Film at the 98th Academy Awards! @TheAcademy We’re deeply grateful for the extraordinary love and support we've received from around the world. pic.twitter.com/2dgXjh57Wx— Neeraj Ghaywan (@ghaywan) December 16, 2025 -
ఈవెంట్లో కన్నీళ్లు పెట్టుకున్న సన్నీ డియోల్.. వీడియో వైరల్
బాలీవుడ్ హీరో సన్నీ డియోల్ ప్రస్తుతం బోర్డర్-2 మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఈ ఏడాది జాట్ మూవీతో సూపర్ హిట్ కొట్టిన ఆయన.. ఈ సినిమాతో హిట్ కొట్టేందుకు రెడీ అయ్యారు. 1971లో జరిగిన ఇండో-పాక్ యుద్ధం నేపథ్య కథతోనే ఈ సినిమాని తెరకెక్కించారు. గతంలో 1997లో బ్లాక్బస్టర్గా నిలిచిన బోర్డర్ చిత్రానికి సీక్వెల్ రూపొందించారు. తాజాగా ఈ మూవీ టీజర్ మేకర్స్ రిలీజ్ చేశారు.ఈ సందర్భంగా ఈవెంట్కు హాజరైన సన్నీ డియోల్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తన తండ్రి ధర్మేంద్ర మరణాన్ని తలచుకుని ఎమోషనల్ అయ్యారు. ఈ టీజర్లోని డైలాగ్ చెబుతూ అభిమానులను అలరించారు. ఈవెంట్లో మాట్లాడుతూ.. ఆవాజ్ ఎక్కడి వరకు వెళ్లాలి? అని సన్నీ డియోలా అనడంతో.. ప్రేక్షకులు లాహోర్ వరకు అంటూ గట్టిగా అరిచారు. ప్రేక్షకుల స్పందనతో సన్నీ డియోల్ వేదికపైనే కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.ఈ మూవీ వచ్చే ఏడాది రిపబ్లిక్ డే కానుకగా జనవరి 23న ఈ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు. తొలి పార్ట్కి జెపి దత్తా దర్శకత్వం వహించగా.. రెండో భాగాన్ని అనురాగ్ సింగ్ తెరకెక్కించారు. ఈ చిత్రంలో దిల్జిత్ దోసాంజ్, వరుణ్ ధావన్, అహన్ శెట్టి కూడా ప్రధాన పాత్రల్లో నటించారు. వీరంతా దేశాన్ని రక్షించడానికి పోరాడే సైనికుల పాత్రలు పోషించారు. ఈ సినిమాలో మోనా సింగ్, సోనమ్ బాజ్వా, అన్య సింగ్, మేధా రాణా హీరోయిన్లుగా కనిపించనున్నారు.#SunnyDeol Gets Emotional At #Border2teaser Launch Event 🔥😭 pic.twitter.com/fn7dqfWc8J— Filmy_Duniya (@FMovie82325) December 16, 2025 -
దురంధర్ క్రేజ్.. మూవీని వీక్షించిన టీమిండియా
రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్ బాక్సాఫీస్ను షేక్ చేస్తోంది. కేవలం హిందీ భాషల్లో విడుదలైనప్పటికీ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ రూ.600 కోట్ల మార్క్ను చేరుకుంది. ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో ఏకంగా మూడో స్థానానికి ఎగబాకింది. పాకిస్తాన్ నేపథ్యంలో వచ్చిన ఈ మూవీకి అభిమానుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది.తాజాగా ఈ మూవీని టీమిండియా సభ్యులు వీక్షించారు. లక్నోలోని ఫీనిక్స్ పలాసియో మల్టీప్లెక్స్ మాల్లో క్రికెటర్స్ దురంధర్ సినిమాను ఆస్వాదించారు. టీమిండియా కోచ్ గౌతం గంభీర్తో పాటు సూర్యకుమార్ యాదవ్, శుభ్మన్ గిల్, హార్దిక్ పాండ్యా, అర్ష్దీప్ సింగ్, తిలక్ వర్మ దురంధర్ మూవీని చూసినవారిలో ఉన్నారు. క్రికెటర్స్ థియేటర్లోకి వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా.. టీమిండియా ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ ఆడుతోంది. రెండు జట్ల నాలుగో టీ20 లక్నో వేదికగా బుధవారం జరగనుంది. ఈ నేపథ్యంలోనే లక్నో చేరుకున్న టీమ్ దురంధర్ను వీక్షించింది.ధురందర్ రిలీజైన 11 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.600 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్ దిశగా దూసుకెళ్తోంది. ఇప్పటికే సైయారా ఆల్టైమ్ కలెక్షన్స్ను అధిగమించింది. ప్రస్తుతం 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో మూడోస్థానంలో కొనసాగుతోంది. దురంధర్ రెండో భాగం వచ్చే ఏడాది మార్చిలో విడుదల కానుంది. View this post on Instagram A post shared by Subodh Rambir Singh (@bollyfreaksofficial) -
ఇకపై కాంతార, ఛావా కాదు.. దురంధర్ పేరు రాసుకోండి..!
బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ హీరోగా వచ్చిన లేటేస్ట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ 'ధురంధర్'. డిసెంబర్ 5న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దుమ్ములేపుతోంది. రిలీజైన పది రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.550 కోట్ల మార్కును దాటేసింది. తెలుగులో బాక్సాఫీస్ వద్ద అఖండ-2 రిలీజైన దురంధర్ వసూళ్లు ఏమాత్రం తగ్గడం లేదు. కేవలం 11 రోజుల్లోనే రూ.600 కోట్ల మార్క్ను దాటేసింది. ఈ మూవీ సూపర్ హిట్ కావడంతో ఇప్పటికే పలువురు స్టార్స్ ప్రశంసలు కురిపించారు. అల్లు అర్జున్ సైతం మేకర్స్ను కొనియాడారు.సైయారాను దాటేసిన దురంధర్..డిసెంబర్ 5న థియేటర్లలో విడుదలైన దురంధర్ వసూళ్ల పరంగా దూసుకెళ్తోంది. స్పై యాక్షన్ థ్రిల్లర్ కావడంతో ఆడియన్స్ నుంచి విపరీతమైన ఆదరణ వస్తోంది. ఇప్పటికే ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో ఏకంగా మూడో స్థానానికి చేరుకుంది. రెండవ సోమవారం కూడా కలెక్షన్లపరంగా దుమ్ములేపింది. మొదటి సోమవారం కంటే అధిక వసూళ్లు రాబట్టింది. ఈ లిస్ట్లో తొలి రెండు స్థానాల్లో రిషబ్ శెట్టి కాంతార చాప్టర్-1, విక్కీ కౌశల్ ఛావా ఉన్నాయి.కాంతార చాప్టర్-1 ను అధిగమించే ఛాన్స్..ఈ మూవీ రిలీజై ఇప్పటికి 11 రోజులు పూర్తి చేసుకుంది. కేవలం హిందీలో మాత్రమే విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ను షేక్ చేస్తోంది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో దక్షిణాది భాషల్లోనూ డబ్ చేసి రిలీజ్ చేయాలన్న డిమాండ్ వినిపిస్తోంది. అలా దురంధర్ తెలుగులోనూ రిలీజైతే ఈ వసూళ్లు మరింత పెరిగే ఛాన్స్ ఉంది. ఈ లెక్కన 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన కాంతార చాప్టర్-1ను త్వరలోనే దురంధర్ అధిగమించే ఛాన్స్ ఉంది.అందుకే బజ్..పాకిస్తాన్ నేపథ్యంలో స్టోరీ కావడం దురంధర్కు కలిసొచ్చిందని చెప్పొచ్చు. ఈ చిత్రంలో రణవీర్ సింగ్ పాకిస్తాన్లోని లయారీ ముఠాలలోకి చొరబడే భారతీయ గూఢచారి హమ్జా పాత్రలో నటించారు. ఈ మూవీలో కందహార్ విమానం హైజాక్, 2001 పార్లమెంట్ దాడి, 26/11 ముంబయి దాడులు వంటి భౌగోళిక రాజకీయ, ఉగ్రవాద సంఘటనలు చూపించారు. అందువల్లో దేశవ్యాప్తంగా ఈ మూవీ ఆడియన్స్కు కనెక్ట్ అయింది. దేశ భద్రతకు సంబంధించిన అంశాలతో తెరకెక్కించడం.. రెండేళ్ల గ్యాప్ తర్వాత రణ్వీర్ సింగ్ మూవీ రావడం కూడా దురంధర్కు బాగా కలిసొచ్చింది. దీంతో బాక్సాఫీస్ వద్ద రెండో వారం కూడా అత్యధిక వసూళ్లు సాధించింది.ఇప్పటివరకు 11 రోజుల్లోనే రూ.600.75 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. రెండో వారాంతంలో ఇండియాలో ఏకంగా రూ.140 కోట్లకు పైగా నికర వసూళ్లు రాబట్టి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఓవరాల్గా చూస్తే భారతదేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన బాలీవుడ్ చిత్రాల జాబితాలో ఎనిమిదో స్థానంలో నిలిచింది. తాజాగా రూ.600 కోట్ల మార్క్తో ఈ ఏడాది రొమాంటిక్ బ్లాక్బస్టర్ సైయారా (రూ.580) కోట్ల వసూళ్లను అధిగమించింది. అంతేకాకుండా పద్మావత్ (రూ.585 కోట్లు), సంజు (రూ.592 కోట్లు) వంటి పెద్ద హిట్ల రికార్డులను తుడిచిపెట్టేసింది.ఆదిత్య ధార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, రాకేష్ బేడీల నటనకు ప్రశంసలు అందుకున్నారు. ఈ చిత్రంలో ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్ కూడా నటించారు. ఈ సినిమా జియో స్టూడియోస్, బి62 స్టూడియోస్ బ్యానర్లపై నిర్మించారు. ఈ మూవీకి కొనసాగింపుగా సీక్వెల్గా మార్చి 12, 2026న విడుదల కానుంది. -
'బోర్డర్ 2' సినిమా టీజర్ రిలీజ్
భారత్- పాకిస్థాన్ యుద్ధం నేపథ్యం కథతో తీసిన సినిమా 'బోర్డర్'. 1997లో రిలీజైన ఈ చిత్రం అప్పట్లో సంచనలమైంది. ప్రేక్షక్షుల నుంచి విశేషాదరణ దక్కించుకుంది. ఇప్పుడు ఈ మూవీకి సీక్వెల్ తీశారు. 'బోర్డర్ 2' పేరుతో తెరకెక్కించారు. సన్నీ డియోల్, వరుణ్ ధావన్, దిల్జీత్ దొసాంజ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. తాజాగా విజయ్ దివస్ సందర్భంగా టీజర్ రిలీజ్ చేశారు. ఇది ఆకట్టుకునేలా ఉంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన హాలీవుడ్ యాక్షన్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్)వచ్చే ఏడాది రిపబ్లిక్ డే కానుకగా జనవరి 23న ఈ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు. తొలి పార్ట్కి జెపి దత్తా దర్శకత్వం వహించగా.. రెండో భాగాన్ని అనురాగ్ సింగ్ తీశారు. 1971లో జరిగిన ఇండో-పాక్ యుద్ధం నేపథ్య కథతోనే ఈ సినిమాని కూడా తెరకెక్కించారు. ఇందులో వరుణ్ ఆర్మీ, దిల్జీత్ ఎయిర్ఫోర్స్, అహన్ శెట్టి నేవీ సైనికులుగా కనిపించనున్నారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్) -
పాన్ ఇండియా బ్యాచిలర్స్ వీళ్లే.. ఒక్కొక్కరిదీ ఒక్కో స్టోరీ
ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది ఓ భాగం. కానీ ఇప్పుడు యువత.. అదంటేనే భయపడుతున్నారు. సరే సరైన జాబ్ లేదు, పోషించేందుకు డబ్బులు లేవు కదా వివాహానికి నో చెబుతున్నారని అనుకోవచ్చు. బోలెడంత ఫేమ్, కోట్లాది ఆస్తి ఉన్న స్టార్ హీరోహీరోయిన్లు కూడా కొందరు ఏజ్ బార్ అవుతున్నా పెళ్లి చేసుకోకుండా సింగిల్గానే ఉండిపోయారు. అలాంటి కొందరి గురించి ఈ స్టోరీ.ఇండియన్ స్టార్స్లో బ్యాచిలర్ అనగానే చాలామందికి గుర్తొచ్చే పేరు సల్మాన్ ఖాన్. బాలీవుడ్లో గత కొన్ని దశాబ్దాల నుంచి స్టార్ హీరోగా వెలుగొందుతున్నాడు. ఐశ్వర్యారాయ్, కత్రినా కైఫ్ లాంటి హీరోయిన్లతో రిలేషన్, డేటింగ్ రూమర్స్ వచ్చాయి గానీ పెళ్లి మాత్రం చేసుకోలేదు. బహుశా ఇతడికున్న అనారోగ్య సమస్యలు కావొచ్చు. లేదంటే తన స్నేహితుల వైవాహిక జీవితంలో సమస్యల ప్రభావం కావొచ్చు సల్మాన్.. ఇప్పటికీ ఒంటరిగానే ఉంటున్నాడు. ప్రస్తుతం ఇతడికి 59 ఏళ్లు. ఇకపై చేసుకునే అవకాశమే లేదు.(ఇదీ చదవండి: 'అవతార్' రెండు పార్ట్స్లో ఏం జరిగింది? మూడో భాగం స్టోరీ ఏంటి?)ఈ లిస్టులో నెక్స్ట్ ఉండేది ప్రభాస్. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్గా వరస సినిమాలు చేస్తున్నాడు. పెదనాన్న కృష్ణంరాజు బతికున్నప్పుడే ప్రభాస్కి పెళ్లి చేసేస్తాం అని చాలాసార్లు చెప్పారు. కానీ పాన్ ఇండియా హీరో అయిపోయిన తర్వాత అస్సలు ఖాళీ అన్నదే దొరకట్లేదు. గతంలో హీరోయిన్ అనుష్కని పెళ్లి చేసుకుంటాడని రూమర్స్ వచ్చాయి గానీ తామిద్దరం స్నేహితులు మాత్రమే అని చెప్పారు. అయితే ఇటు ప్రభాసే కాదు అటు అనుష్క కూడా పెళ్లి చేసుకోకుండా ఇప్పటికీ ఒంటరిగానే ఉండిపోయింది. ఇకపై కూడా వీళ్లిద్దరికీ(వేర్వేరుగా) జరుగుతుందనే నమ్మకం కూడా అభిమానుల్లో లేదు.రీసెంట్ బ్లాక్బస్టర్ హిట్ 'ధురంధర్'లో విలన్గా అదిరిపోయే ఫెర్ఫార్మెన్స్ ఇచ్చిన నటుడు అక్షయ్ ఖన్నా కూడా బ్యాచిలరే. ప్రస్తుతం ఇతడి వయసు 50 ఏళ్లు. ఇప్పటికీ పెళ్లి చేసుకోకపోవడానికి చాలానే కారణాలున్నాయి. గతంలో కరిష్మా కపూర్తో ఇతడికి వివాహం సెట్ అయి, రద్దయిందని.. అప్పటినుంచి అక్షయ్ ఖన్నా ఒంటరిగానే ఉండిపోయాడనేది టాక్. అలానే మరో వ్యక్తి బాధ్యత తీసుకోవడం తనకు సూట్ కాని పనికాని కూడా అక్షయ్ చెప్పాడు. చూస్తుంటే జీవితాంతం సింగిల్గానే ఉండిపోవడం గ్యారంటీ.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)ఈ లిస్టులో తర్వాతి నటి టబు. ఈమె వయసు ప్రస్తుతం 54 ఏళ్లు. మరి పెళ్లి చేసుకుంటే నటిగా కెరీర్ ముగిసిపోతుందని భయపడిందో ఏమో గానీ అస్సలు ఆ వైపు చూడను కూడా చూడలేదు. ఇప్పటికీ సౌత్, నార్త్ అనే తేడా లేకుండా వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రేక్షకుల్ని అలరిస్తోంది.మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ కూడా ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు. ఇందుకు గల కారణాన్ని కూడా గతంలో చెప్పింది. జీవితంలో కలిసిన కొందరు పురుషులు.. చాలా నిరాశపరిచారని చెప్పింది. అలానే తను దత్తత తీసుకున్న పిల్లల (రెనీ, అలీసా) ప్రాధాన్యత.. సరైన వ్యక్తి కోసం ఎదురుచూడటం లాంటివి కూడా కారణమని చెప్పుకొచ్చారు. మూడుసార్లు పెళ్లి చేసుకోవడం వరకు వెళ్లినప్పటికీ దేవుడే తనని రక్షించాడనేది ఈమె నమ్మకం.తమిళ హీరో శింబు జీవితంలో చాలా ప్రేమకథలే ఉన్నాయి. నయనతార, నిధి అగర్వాల్ లాంటి పలువురు హీరోయిన్లతో ఇతడు డేటింగ్ చేశాడని రూమర్స్ వచ్చాయి. పెళ్లి కూడా జరుగుతుందని మాట్లాడుకున్నారు. తీరా చూస్తే 42 ఏళ్లొచ్చినా ఇప్పటికీ సింగిల్గానే ఉండిపోయాడు. మరి పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందో లేదో తెలియదు. కన్నడ హీరో రక్షిత్ శెట్టి జీవితంలోనూ విషాదం ఉంది. హీరోయిన్ రష్మికతో చాన్నాళ్ల క్రితమే నిశ్చితార్థం జరిగింది. మరి ఏమైందో ఏమో గానీ ఇది రద్దయింది. అప్పటినుంచి రక్షిత్ శెట్టి జీవితంలో పెళ్లి అనే ఆలోచన లేకుండా పోయింది. (ఇదీ చదవండి: దిగ్గజ గాయని బయోపిక్లో సాయిపల్లవి?) -
మన సికింద్రాబాద్లో పుట్టిన డైరెక్టర్.. ఏకంగా ఎనిమిది జాతీయ అవార్డులు..!
డైరెక్టర్ శ్యామ్ బెనగళ్ ఈ పేరు ఇప్పటి తరానికి అంతగా తెలియకపోవచ్చు. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక అధ్యాయం లిఖించుకున్న దర్శకుడాయన. కమర్షియల్ సినిమాల ప్రవాహంలో కొట్టుకుపోతున్న రోజుల్లో సినిమాకి ఊపిరి పోసిన దర్శకుడు శ్యామ్ బెనగళ్. ఆయన పూర్తి పేరు బెనగళ్ శ్యామ్ సుందర రావు. మన సికింద్రాబాద్లోని తిరుమలగిరిలో డిసెంబరు 14, 1934న జన్మించారు. మన దేశ సినీ చరిత్రలో తన ప్రత్యేకతను చాటుకున్నారు. గతేడాది డిసెంబర్ 23న 90 ఏళ్ల వయసులో అనారోగ్య కారణాలతో కన్ను మూశారు. ఈ సందర్భంగా శ్యామ్ బెనెగల్ దర్శకత్వంపై ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.శ్యామ్ బెనెగల్.. మొదట యాడ్ ఏటెన్సీలో కాపీ రైటర్గా తన కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత ఆయన దృష్టి పూర్తిగా సినిమా వైపు మళ్లింది. కమర్షియల్ సినిమాలకు భిన్నంగా తన ఆలోచనలు ఉండేవి. జీవితాన్ని, సమాజంలోని పాత్రల్ని వాస్తవికంగా తెరపై ఆవిష్కరించాలనే ఆశయంతో శ్యామ్ బెనెగల్ సినీరంగంలో అడుగుపెట్టారు. హైదరాబాద్లో ఫిలిమ్ సొసైటీ ప్రారంభించిన ఏకైక వ్యక్తి శ్యామ్ బెనగళ్. ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన అత్యున్నతమైన సినిమాల ప్రింట్లు అతి కష్టం మీద తెప్పించుకుని.. సినిమా లవర్స్ కోసం హైదరాబాద్ ఫిలిమ్ సొసైటీలో ప్రదర్శిస్తుండే వారాయన. శ్యామ్ బెనెగల్ అంకుర్ సినిమాతో తన ప్రస్థానం మొదలెట్టారు. ఆ తర్వాత మంథన్, నిశాంత్, గరమ్ హవా, భూమిక ది రోల్ లాంటి సూపర్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించారు.స్త్రీ పాత్రలకే ఎక్కువ ప్రాధాన్యం..శ్యామ్ బెనగళ్ దర్శకత్వం వహించిన చివరి చిత్రం ముజిబ్: ది మేకింగ్ ఆఫ్ ఏ నేషన్. బంగ్లాదేశ్ తొలి అధ్యక్షుడు షేక్ ముజిబుర్ రెహమాన్ జీవితం ఆధారంగా రూపొందిన ఈ చిత్రం 2023 అక్టోబరు 13న విడుదలైంది. శ్యామ్ బెనగళ్కు భార్య నీరా బెనగళ్, కుమార్తె పియా బెనెగళ్ ఉన్నారు. జన్మతః కన్నడిగ అయినప్పటికీ తెలంగాణలో పుట్టి పెరగడం వల్ల తెలంగాణ చైతన్యం ఆయనలో శ్యామ్ బెనెగల్లో కనిపించింది. సికింద్రాబాద్లో పుట్టి పెరగడం వల్ల రైతులు, విప్లవ పోరాటాల ప్రభావం నా మీద ఉంది. సినిమాలు ఎప్పుడు ప్రజల పక్షం నిలబడాలి ఎప్పుడు అనుకునేవారు శ్యామ్ బెనెగల్. ముఖ్యంగా శ్యామ్ బెనగల్(ShyamBenegal)తన సినిమాల్లో శక్తివంతమైన స్త్రీ పాత్రలకు రూపకల్పన చేశాడు. అంకుర్(1974)తో మొదలెట్టి జుబేదా (2001) వరకు దాదాపుగా ప్రతి సినిమాలో స్త్రీ పాత్రలకు చైతన్యాన్ని, శక్తిని ఇచ్చిన దర్శకుడు శ్యామ్ బెనగళ్. సత్యజిత్ రే వాస్తవిక సినిమాను ప్రవేశపెట్టి ఆ పరంపరను మృణాళ్ సేన్ అందుకున్నాక శ్యామ్ బెనగళ్ ఆ ఛత్రాన్ని గట్టిగా పట్టుకుని నిలబెట్టాడు. ముస్లిమ్ మహిళల జీవితాలను స్పృశిస్తూ మమ్ము, సర్దారీ బేగమ్, జుబేదా అని మూడు సినిమాలు తెరకెక్కింటారు. వెండితెరపై ప్రయోగాలు:శ్యామ్ బెనగళ్ తన సినిమాల్లో ఎన్నో ప్రయోగాలు చేసేవారు. ఎప్పుడు కొత్తవారికే ఎక్కువ అవకాశం ఇచ్చేవారు. బెనగళ్ సినిమాలతో షబానా, స్మితా పాటిల్ గొప్ప పాత్రలతో గుర్తింపు పొందారు. షబానాకు మొదటి సినిమాతోటే జాతీయ పురస్కారం వచ్చింది. ఆయన దర్శకత్వంలో నటించాలనే అభిలాషతో అనుగ్రహంలో వాణిశ్రీ నటించింది. అంతేకాకుండా మన దేశం కోసం ఎన్నో డాక్యుమెంటరీలు తీశాడు. వాటిలో సత్యజిత్ రే మీద డాక్యుమెంటరీ, నెహ్రూ డిస్కవరీ ఆఫ్ ఇండియాను భారత్ ఏక్ ఖోజ్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, మేకింగ్ ఆఫ్ మహాత్మా లాంటి సినిమాలకు దర్శకత్వం వహించాడు. భారతీయ సినిమాకు ఆయన చేసిన సేవలు కేవలం బాక్సాఫీస్ సంఖ్యలు మాత్రే కాదు.. అంతకు మించి అని అందరూ చెప్పడం ఆయన టాలెంట్కు ఓ నిదర్శనం.ఎనిమిది జాతీయ అవార్డులు...శ్యామ్ బెనగళ్ భారత ప్రభుత్వం నుంచి 8 జాతీయ చలన చిత్ర అవార్డులు అందుకున్నారు. అవి అంకుర్(1975), నిశాంత్(1976), మంథన్ (1977), భూమిక: ది రోల్(1978), జునూన్(1979), ఆరోహణ్(1982), నేతాజీ సుభాష్ చంద్రబోస్(2005), వెల్డన్ అబ్బా(2009) చిత్రాలకు దక్కాయి. ఆయనకు సినీ రంగంలో సేవలకు గానూ 1976లో పద్మశ్రీ, 1991లో పద్మభూషణ్, 2003లో ఇందిరాగాంధీ జాతీయ సమైక్యత పురస్కారం, 2013లో ఏఎన్ఆర్ జాతీయ అవార్డులు అందుకున్నారు. అదేవిధంగా 2005 సంవత్సరానికిగాను 2007 ఆగస్టు 8న అత్యంత ప్రతిష్ఠాత్మమైన దాదా సాహెబ్ ఫాల్కే అందుకున్నారు. తెలుగు సినిమా అనుగ్రహంకు నంది అవార్డు దక్కించుకున్నారు. బాలీవుడ్లో అనంత్ నాగ్, షబానా అజ్మీ , నసీరుద్దీన్ షా , ఓం పురి , స్మితా పాటిల్ , అమ్రేష్ పురి లాంటి గొప్ప నటుల్ని వెండితెరకు పరిచయే చేసిన డైరెక్టర్ శ్యామ్ బెనగల్ కావడం విశేషం. -
బాక్సాఫీస్ షేక్ చేస్తోన్న దురంధర్.. రణ్వీర్ సింగ్ రియాక్షన్ ఇదే..!
బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ హీరోగా వచ్చిన లేటేస్ట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ధురంధర్. డిసెంబర్ 5న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దుమ్ములేపుతోంది. రిలీజైన పది రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.550 కోట్ల మార్కును దాటేసింది. దేశవ్యాప్తంగా నెట్ వసూళ్లపరంగా చూస్తే రూ.364.60 కోట్లు సాధించింది. రెండో ఆదివారం ఇండియాలో ఏకంగా రూ.58.20 కోట్ల నికర వసూళ్లను రాబట్టింది. ఇప్పటి వరకు ఒక హిందీ చిత్రానికి వచ్చిన రెండో ఆదివారం అత్యధిక వసూళ్లు కావడం విశేషం. కాగా.. ఈ మూవీపై ఇప్పటికే పలువురు స్టార్స్ ప్రశంసలు కురిపించారు. అల్లు అర్జున్ సైతం మేకర్స్ను కొనియాడారు.ఈ మూవీ సూపర్ హిట్ కావడంతో రణ్వీర్ సింగ్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. తన ఆనందాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. అదృష్టానికి మంచి అలవాటు ఉంది. సమయానికి తగ్గట్టు అది మారుతూ ఉంటుంది. కానీ, ఓర్పు చాలా ముఖ్యం అంటూ సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. 2025లో అత్యధిక కలెక్షన్స్ వచ్చిన ఇండియన్ చిత్రాల జాబితాలో ధురంధర్ ఏకంగా నాలుగో స్థానానికి చేరుకుంది. ఈ మూవీ కంటే ముందు కాంతార: చాప్టర్ 1 ఛావా, సైయారా తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. మరిన్ని రోజులు ఇదే జోరు కొనసాగితే దురంధర్ స్థానం మరింత మెరుగయ్యే అవకాశమున్నట్లు కనిపిస్తోంది.దురంధర్ దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు రూ.430.20 కోట్లుగా గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ఓవర్సీస్లో రూ.122.50 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. రెండో వీకెండ్లో శుక్రవారం రూ34.70 కోట్లు, శనివారం రూ.53.70 కోట్లు, ఆదివారం రూ.58.20 వసూళ్లతో అరుదైన మైలురాయిని చేరుకుంది. దీంతో బాలీవుడ్ సినీ చరిత్రలో రెండో వారంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా దురంధర్ నిలిచింది. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్కు ఆదిత్య ధార్ దర్శకత్వం వహించారు. ఈ మూవీని కందహార్ విమానం హైజాక్, 2001 పార్లమెంట్ దాడి, 26/11 ముంబయి దాడులు వంటి భౌగోళిక రాజకీయ, ఉగ్రవాద సంఘటనల నేపథ్యంలో సాగే రహస్య గూఢచార కార్యకలాపాల నేపథ్యంలో తెరకెక్కించారు. పాకిస్తాన్ నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కించడంతో అరబ్ దేశాల్లో దురంధర్పై నిషేధం విధించారు. జియో స్టూడియోస్, బి62 స్టూడియోస్ బ్యానర్లపై నిర్మించిన ఈ మూవీలో సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్, సారా అర్జున్, ఆర్. మాధవన్, రాకేష్ బేడీ కీలక పాత్రల్లో నటించారు.The story of The Unknown Men is now known globally.Book your tickets. 🔗 - https://t.co/cXj3M5DFbc#Dhurandhar Ruling Cinemas Worldwide.@RanveerOfficial #AkshayeKhanna @duttsanjay @ActorMadhavan @rampalarjun #SaraArjun @bolbedibol @AdityaDharFilms #JyotiDeshpande… pic.twitter.com/zvxEJqbrvv— Jio Studios (@jiostudios) December 15, 2025 -
నేనెప్పుడూ నీవైపే.. ఒట్టేసి చెప్తున్నా: శిల్ప శిరోద్కర్
శిరోద్కర్ సిస్టర్స్ ఇండస్ట్రీలో తామేంటో రుజువు చేసుకున్నారు. అక్క నమ్రత తెలుగులో హీరోయిన్గా రాణిస్తే.. చెల్లి శిల్ప బాలీవుడ్లో అగ్ర కథానాయికగా దుమ్ము లేపింది. కాకపోతే ఇద్దరూ పెళ్లయ్యాక సినిమాలను పట్టించుకోవడం మానేశారు. శిల్ప రీఎంట్రీకి సిగ్నల్ ఇస్తూ గతేడాది హిందీ బిగ్బాస్ 18వ సీజన్లో పాల్గొంది. ఈ ఏడాది 'జటాధర' సినిమాతో పలకరించింది.పర్ఫెక్ట్ బర్త్డే డిన్నర్ఇదిలా ఉంటే శిల్ప- రంజిత్ దంపతుల కూతురు అనౌష్క ఇటీవలే పుట్టినరోజు వేడుకలు జరుపుకుంది. అందుకు సంబంధించిన ఫోటోలను నటి ఆలస్యంగా సోషల్ మీడియాలో షేర్ చేసింది. "నా పర్ఫెక్ట్ కూతురికి పర్ఫెక్ట్ బర్త్డే డిన్నర్.. ఫ్యామిలీ, ఫుడ్, అంతులేని సంతోషం.." అని క్యాప్షన్ ఇచ్చింది. ఈ ఫోటోల్లో అనౌష్క పెద్దమ్మాయిగా కనిపిస్తోంది. అందంలో తల్లికే కాంపిటీషన్ ఇచ్చేలా ఉంది. ఈ ఫోటోల్లో శిల్ప భర్త రంజిత్ కూడా ఉన్నాడు.ఎంత ఎదిగిపోయావో..అనౌష్క పుట్టినరోజునాడు తను చిన్నప్పుడు దేశీ గర్ల్ పాటకు స్టెప్పేసిన ఓ డ్యాన్స్ వీడియోను సైతం షేర్ చేసింది. నా గారాలపట్టి అప్పుడే ఎంత పెద్దదైపోయింది. కాలం చాలా వేగంగా పరిగెడుతోంది. నువ్వు ఎన్ని బర్త్డేలు జరుపుకున్నా సరే నాకు మాత్రం ఎప్పుడూ చిన్న పాపవే! ఒక ధృడమైన అమ్మాయిగా నువ్వు ఎదిగిన తీరు చూస్తుంటే నా మనసు గర్వంతో ఉప్పొంగుతోంది. ఆ సంతోషాన్ని మాటల్లో వర్ణించలేను. నా ప్రపంచం, సంతోషం అన్నీ నువ్వే.. నమ్ముతావో, లేదో కానీ.. నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వి కూడా! నేను నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నా బంగారం. ఎల్లప్పుడూ నేను నీకు అండగా నిలబడతానని మాటిస్తున్నాను అని రాసుకొచ్చింది. View this post on Instagram A post shared by Shilpa Shirodkar Ranjit (@shilpashirodkar73) View this post on Instagram A post shared by Shilpa Shirodkar Ranjit (@shilpashirodkar73) -
'అఖండ 2'ని దెబ్బకొట్టిన 'ధురంధర్'!
గత వీకెండ్ తెలుగులో రిలీజైన 'అఖండ 2'కు మిశ్రమ స్పందన వచ్చింది. వీకెండ్కి ఏమైనా పికప్ అవుతుందనుకుంటే అలా జరిగినట్లు కనిపించలేదు. ఎందుకంటే తొలిరోజు వచ్చిన కలెక్షన్లకు.. శని-ఆదివారాల్లో వచ్చిన వసూళ్లకు పొంతన లేదు. దీనితో పాటు రిలీజైన 'మోగ్లీ' తేలిపోయింది. టాక్-కలెక్షన్స్ ఏ మాత్రం రావట్లేదు. అయితే బాలకృష్ణ సినిమాకు ఓ హిందీ చిత్రం దెబ్బకొట్టిందని చెప్పొచ్చు. అదే 'ధురంధర్'.రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ఇది. స్పై బ్యాక్ డ్రాప్ స్టోరీతో దీన్ని తెరకెక్కించారు. డిసెంబరు 5న థియేటర్లలో హిందీ వెర్షన్ మాత్రమే రిలీజైంది. విడుదలకు ముందు ఎలాంటి హైప్ లేదు. టికెట్స్ కూడా పెద్దగా బుక్ అవ్వలేదు. కానీ బిగ్ స్క్రీన్పైకి వచ్చిన ఒకటి రెండు రోజుల తర్వాత పాజిటివ్ టాక్ వచ్చింది. ఒక్కసారిగా పికప్ అయిపోయింది. అలా 10 రోజుల్లోనే రూ.500 కోట్ల మేర వసూళ్లు వచ్చాయి. దీనితో పాటే రావాల్సిన 'అఖండ 2' వారం వాయిదా పడటం తెలుగు రాష్ట్రాల్లో 'ధురంధర్'కి కలిసొచ్చిందనే చెప్పొచ్చు.(ఇదీ చదవండి: అఖండ2 సినిమాపై పవన్ కల్యాణ్ సైలెంట్.. ఎందుకు?)ఎందుకంటే డిసెంబరు 12న 'అఖండ 2' రిలీజైనప్పటికీ 'ధురంధర్' జోరు ఆగలేదు. హైదరాబాద్లో చాలాచోట్ల ఈ హిందీ సినిమాకు శని-ఆదివారం హౌస్ఫుల్స్ పడ్డాయి. అఖండ సీక్వెల్ ఈ విషయంలో కాస్త వెనకబడిపోయింది. సోమవారం బుకింగ్స్లోనూ బాలకృష్ణ మూవీ కంటే రణ్వీర్ చిత్రమే కాస్త ముందుంది. మరోవైపు 'ధురంధర్' తెలుగు డబ్బింగ్ని ఈ శుక్రవారమే(డిసెంబరు 19) థియేటర్లలో రిలీజ్ చేసే అవకాశముందని అంటున్నారు. ఒకవేళ ఇదే జరిగితే 'అఖండ 2' కలెక్షన్స్ కి ఇంకాస్త దెబ్బ పడటం గ్యారంటీ. ప్రస్తుతం 'అఖండ 2' చిత్రానికి రూ.50 కోట్ల మేర నెట్ వసూళ్లు వచ్చాయని అంటున్నారు.ధురంధర్ విషయానికొస్తే.. ఓ భారతీయ స్పై ఏజెంట్, పాకిస్థాన్ వెళ్లి అక్కడి ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు? అనే విషయాల్ని చూపించారు. హీరో రణ్వీర్ సింగ్ అయినప్పటికీ.. కీలక పాత్ర చేసిన అక్షయ్ ఖన్నా యాక్టింగ్ ఇరగదీశాడని చూసిన ప్రతి ఒక్కరూ చెబుతున్నారు. సంజయ్ దత్, అర్జున్ రాంపాల్ కూడా ఏ మాత్రం తగ్గలేదు. ఈ చిత్రాన్ని 'ఉరి' ఫేమ్ దర్శకుడు ఆదిత్య ధర్ తీశాడు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్) -
ఉదయం 9కల్లా సెట్లో.. అర్దరాత్రి వరకు షూటింగ్స్తోనే బిజీ!
వయసు మీద పడుతుంటే ఒంట్లో శక్తి సన్నగిల్లుతుంది. అందులోనూ 80 దాటిందంటే అడుగు తీసి అడుగు వేయడం కూడా కష్టంగా ఉంటుంది. కానీ బిగ్బీ అమితాబ్ బచ్చన్ మాత్రం 83 (తన వయసు) అనేది జస్ట్ నంబర్ మాత్రమేనని, తానింకే కుర్రవాడినేనంటున్నారు. ఆయన చేసే పనులు కూడా అలాగే ఉన్నాయి.కేబీసీ షో హోస్ట్గా..అమితాబ్ సినిమాలతో పాటు కౌన్ బనేగా కరోడ్పతి (KBC) అనే షోను హోస్ట్ చేస్తున్నారు. దాదాపు రెండు దశాబ్దాలుగా ఈ షోని విజయవంతంగా నడిపిస్తున్నారు. ప్రస్తుతం కేబీసీ 17వ సీజన్ రన్ అవుతోంది. ఈ షోకి ఇటీవలే ద ఫ్యామిలీ మ్యాన్ టీమ్ మనోజ్ బాజ్పాయ్, జైదీప్ అహ్లావత్, షరీబ్ హష్మీ అతిథులుగా విచ్చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కేబీసీ అనుభవాలను పంచుకున్నాడు షరీబ్ హష్మీ. అంతా కలలా ఉందిఆయన మాట్లాడుతూ.. అమితాబ్ (Amitabh Bachchan) గారిని కలిశానంటే ఇప్పటికీ అంతా ఒక కలలా ఉంది. ఆ అనుభవాన్ని నా జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను. నా జర్నీ గురించి అడిగినప్పుడు ఆయన నాతోనే మాట్లాడారా? అని గాల్లో తేలిపోయాను. కానీ, ఆయన ఎనర్జీకి మాత్రం దండం పెట్టాల్సిందే! ఈ వయసులో కూడా ఆయన చాలా యాక్టివ్గా ఉంటారు. ఒక్క రోజులోనే మూడు ఎపిసోడ్ షూటింగ్స్ పూర్తి చేస్తారు. పొద్దున తొమ్మిదికల్లా సెట్కు వస్తే అర్ధరాత్రి వరకు అక్కడే ఉంటారు. మేము హాజరైన ఎపిసోడ్ షూటింగ్ అర్ధరాత్రి 12 గంటలకు జరిగింది. అలసట లేకుండా..మేమందరం కాసేపైనా ఓ చిన్న కునుకు తీస్తే బాగుండు అన్నట్లుగా ఉన్నామా? ఆయన మాత్రం నిద్రను దరిచేరనీయకుండా యాక్టివ్గా ఉన్నారు. అందుకే ఆయన అంత సెద్ద సూపర్ హీరో అయ్యారు అని షరీబ్ (Sharib Hashmi) చెప్పుకొచ్చాడు. ఇటీవల అమితాబ్ సైతం ఓ బ్లాక్లో తాను ఉదయం ఐదున్నర గంటల వరకు పని చేసినట్లు తెలిపారు. ఇదంతా చూసిన అభిమానులు మీకున్న ఎనర్జీ, డెడికేషన్కు హ్యాట్సాఫ్ అని కామెంట్లు చేస్తున్నారు.చదవండి: కాంతార హీరోయిన్కు బాలీవుడ్లో ఆఫర్ -
కాంతార హీరోయిన్కు బాలీవుడ్ ఆఫర్!
సౌత్లోని భారీ బడ్జెట్ సినిమాలకు బాలీవుడ్ హీరోయిన్లను తీసుకోవడం ఈ మధ్య పరిపాటి అయిపోయింది. అయితే దక్షిణాదిలో టాలెంట్ నిరూపించుకుంటున్న భామలకు బాలీవుడ్ నుంచి కూడా పిలుపొస్తోంది. అందుకు యంగ్ బ్యూటీ శ్రీలీల పెద్ద ఉదాహరణ.. హిందీ హీరో కార్తీక్ ఆర్యన్కు జంటగా ఓ సినిమా చేస్తోంది. తాజాగా మరో సౌత్ బ్యూటీకి బాలీవుడ్ నుంచి పిలుపు వచ్చిందని ప్రచారం జరుగుతోంది. ఆ హీరోయిన్ మరెవరో కాదు రుక్మిణి వసంత్..నాలుగేళ్లు గ్యాప్2019లో బీర్బర్ ట్రయాలజీ మూవీతో కన్నడలో ఎంట్రీ ఇచ్చింది రుక్మిణి. అదే ఏడాది అప్స్టార్స్ అనే హిందీ మూవీలో యాక్ట్ చేసింది. ఈ చిత్రం తనకు ఏమాత్రం ఉపయోగపడలేదు. దీంతో నాలుగేళ్ల గ్యాప్ తర్వాత సప్త సాగరదాచె ఎల్లో అనే కన్నడ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగులో డ్రాగన్ఈ సినిమా తెలుగులో సప్తసాగరాలు దాటి టైటిల్తో విడుదలై మంచి స్పందన రాబట్టింది. దీని సీక్వెల్ కూడా సక్సెస్ అవడంతో పాటు రుక్మిణి అందానికి అందరూ ఫిదా అయ్యారు. మధ్యలో కొన్ని సినిమాలు చేసినా పెద్దగా మెప్పించలేకపోయింది. కాంతార: చాప్టర్ 1 చిత్రంతో మరోసారి సెన్సేషన్గా మారింది. ప్రస్తుతం ఈ బ్యూటీ యష్ 'టాక్సిక్', ఎన్టీఆర్ 'డ్రాగన్' సినిమాలు చేస్తోంది. బాలీవుడ్ నుంచి పిలుపుబాలీవుడ్ నుంచి తనకు ఆఫర్లు వస్తున్నట్లు ఫిల్మీదునియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఈ క్రమంలో రుక్మిణి (Rukmini Vasanth) మాట్లాడుతూ.. చిన్నప్పటినుంచి హిందీ సుపరిచితమైన భాషే అంది. ఒక బాలీవుడ్ సినిమా గురించి చర్చలు జరుగుతున్నాయని.. భగవంతుడి దయ ఉంటే త్వరలోనే ఆ ప్రయాణాన్ని ప్రారంభిస్తాను అని ఆశాభావం వ్యక్తం చేసింది.చదవండి: తిండీనిద్ర మానేసి మందు తాగుతూ ఉన్నా: ఊర్వశి -
ప్లేటు పట్టుకుని లైన్లో నిల్చోవాలా? తినకుండా వచ్చేస్తా!
పెళ్లి భోజనాలనగానే కొందరు పండగ చేసుకుంటారు. నచ్చిన వంటకాలను కడుపునిండా ఆరగించవచ్చని ఉబలాటపడతారు. మరికొందరు మాత్రం అంతమందిలో లైను కట్టి మరీ తినడానికి మొహమాటపడతారు. తనకు ఆ మొహమాటం కాస్త ఎక్కువేనంటున్నాడు బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్.నాకంత ఓపిక లేదుకృతి కర్బందా, పులకిత్ సామ్రాట్ హోస్ట్ చేస్తున్న 'ద మాన్యావర్ షాదీ' షోకి తాజాగా కరణ్ జోహార్ హాజరయ్యాడు. కృతి, పులకిత్ పెళ్లి విందు గురించి మాట్లాడారు. ఎంతమంది జనాలున్నా సరే అందరూ తమ వంతు వచ్చేవరకు ఓపికగా నిల్చుకుని భోజనం చేస్తారని పేర్కొన్నారు. ఇంతలో కరణ్ కలగజేసుకుటూ తనకు మాత్రం అంత ఓర్పు, సహనం లేదన్నాడు.భోజనం చేయకుండా వచ్చేస్తా!పెళ్లిలో నేనెప్పుడూ భోజనం చేయలేదు. భోజనం దగ్గర పెద్ద పెద్ద లైన్లుంటాయి. ఆహారం కోసం ప్లేటు పట్టుకుని అంత పెద్ద క్యూలో నిల్చోవాలంటే నాకు ఎందుకో ఇబ్బందిగా అనిపిస్తుంది. అందుకే పెళ్లిళ్లకు వెళ్తాను.. కానీ అక్కడ భోజనం చేయకుండానే వెనుదిరుగుతాను అని పేర్కొన్నాడు. అతడి సమాధానం విని కృతి అవాక్కయింది.సినిమాఇకపోతే కరణ్ నిర్మించిన తాజా చిత్రం "తూ మేరీ మే తేరా -మే తేరా తు మేరీ". సమీర్ విద్వాన్స్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో కార్తీక్ ఆర్యన్, అనన్య పాండే హీరోహీరోయిన్లుగా నటించారు. వీళ్లిద్దరూ గతంలో 'పతీ పత్నీ ఔర్ వో' సినిమాలో తొలిసారి జోడీ కట్టారు. ఇప్పుడు రెండోసారి జత కట్టిన ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న విడుదల కానుంది.చదవండి: మౌగ్లీ ఫస్ట్ డే కలెక్షన్స్ -
ఇద్దరు పిల్లలు పుట్టాక పెళ్లికోసం ప్లానింగ్!
బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ తన ఎంగేజ్మెంట్ అయిపోయిందని వెల్లడించాడు. ప్రియురాలు గాబ్రియెల్లా డెమట్రాయిడ్స్తో తన నిశ్చితార్థం జరిగిందని తెలిపాడు. ఈ విషయాన్ని రియా చక్రవర్తి చాప్టర్ 2 అనే పాడ్కాస్ట్లో వెల్లడించాడు. ఈ పాడ్కాస్ట్కు అర్జున్ ప్రేయసి గాబ్రియెల్లాతో కలిసి హాజరయ్యాడు. మాకింకా పెళ్లి కాలేదు. ఆరేళ్లుగా డేటింగ్అదెప్పుడు జరుగుతుందో ఎవరికి తెలుసు? అని గాబ్రియెల్లా అంది. అందుకు అర్జున్ వెంటనే.. కాకపోతే మా నిశ్చితార్థం మాత్రం జరిగిపోయింది అన్నాడు. అలా నిశ్చితార్థం విషయాన్ని తొలిసారి బయటపెట్టారు. అంటే ఆరేళ్లుగా డేటింగ్ చేసుకుంటున్న వీరు ఎట్టకేలకు పెళ్లి చేసుకోబోతున్నారన్నమాట!!మొదటి పెళ్లికాగా అర్జున్ రాంపాల్.. 1998లో నిర్మాత మెహర్ జెసియాను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కూతుర్లు సంతానం. దంపతుల మధ్య భేదాభిప్రాయాలు రావడంతో 2018 మేలో భార్యాభర్తలు విడిపోతున్నట్లు ప్రకటించారు. మరుసటి ఏడాది విడాకులు తీసుకున్నారు. అదే ఏడాది నటి గాబ్రియెల్లాతో ప్రేమలో పడటంతో పాటు ఆమెను గర్భవతిని చేశాడు అర్జున్. అలా పెళ్లికి ముందే వీరు తల్లిదండ్రులు కూడా అయ్యారు. ఈ జంటకు ఇద్దరు కుమారులు సంతానం.ఎవరీ గాబ్రియెల్లా?గాబ్రియెల్లా 16 ఏళ్లకే మోడలింగ్ చేసింది. పలు మ్యూజిక్ వీడియోల్లో నటించింది. ఇష్క్ ఝమేలా అనే హిందీ మూవీలో అర్జున్-గాబ్రియెల్లా కలిసి నటించారు. తెలుగులో ఊపిరి మూవీలో ఫ్రెంచ్ డ్యాన్సర్గా గాబ్రియెల్లా అలరించింది. ఇక అర్జున్ రాంపాల్ విషయానికి వస్తే.. ఆంఖేన్, డాన్, ఓం శాంతి ఓం, ఈఎమ్ఐ, హౌస్ఫుల్, రాజ్నీతి, చక్రవ్యూహ్, సత్యాగ్రహ, ధాకడ్, ధురంధర్ వంటి పలు హిందీ సినిమాలు చేశాడు. తెలుగులో భగవంత్ కేసరి చిత్రంలో నటించాడు.చదవండి: రెండోసారి విడాకులు తీసుకోబోతున్న దర్శకుడు! -
బాక్సాఫీస్ వద్ద దురంధర్.. దెబ్బకు పుష్ప-2 రికార్డ్ బ్రేక్..!
డిసెంబర్ తొలివారంలో రిలీజైన బిగ్ మూవీ దురంధర్. రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ ఆదిత్య ధర్ తెరకెక్కించారు. డిసెంబర్ 5న థియేటర్లలోకి ఈ మూవీ తొలి రోజు నుంచే బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. మొదటి రోజే రూ.30 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అలా మూడు రోజుల్లోనే వంద కోట్లు దాటేసింది. ఓవరాల్గా ఇప్పటి వరకు రిలీజైన 9 రోజుల్లో ఏకంగా రూ.292 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఆదివారం కలెక్షన్స్ కూడా కలిపితే రూ.300 కోట్లు దాటడం ఖాయంగా కనిపిస్తోంది.అయితే మొదటి వారం కలెక్షన్స్ పెరగడం ఏ సినిమాకైనా సాధ్యమే. కానీ రెండో వారంలోనూ కలెక్షన్స్ ఏమాత్రం తగ్గకుండా దురంధర్ దూసుకెళ్తోంది. ఇదే క్రమంలో రెండో వారంలో ఈ మూవీ ఓ క్రేజీ రికార్డ్ను అందుకుంది. రెండో శుక్రవారం బాక్సాఫీస్ను షేక్ చేసింది. ఆ రోజు పుష్ప-2, ఛావా, యానిమల్ లాంటి బిగ్ హిట్స్ వసూళ్లను అధిగమించింది. హిందీలో ఈ సినిమాల రికార్డులను తిరగరాసింది. ఫ్రైడే ఒక్క రోజే ఈ మూవీ రూ.34.7 కోట్ల వసూళ్లు సాధించింది.ఈ లిస్ట్లో పుష్ప-2 రూ.27.50 కోట్లు, ఛావా రూ.24.03 కోట్లు, యానిమల్ రూ.23.53 కోట్లు, గదర్-2 రూ.20.50 కోట్లు, బాహుబలి2 రూ.19.75 కోట్లు సాధించాయి. తాజాగా ఈ రికార్డులను రణ్వీర్ సింగ్ దురంధర తుడిచిపెట్టేసింది. రెండో వారంలోనూ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటడంతో బాలీవుడ్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంచనాలను మించి బాక్సాఫీస్ వద్ద రాణిస్తుండడంతో దురంధర్ మేకర్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇదే జోరు కొనసాగితే దురంధర్ త్వరలోనే రూ.500 కోట్ల మార్క్ అందుకునేలా కనిపిస్తోంది.కాగా.. ఈ చిత్రంలో మాధవన్, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్, సారా అర్జున్, రాకేశ్ బేడీ, సౌమ్య టాండన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. కథ విషయానికొస్తే.. ఇదొక దేశభక్తి అంశాలతో ముడిపడిన స్పై యాక్షన్ థ్రిల్లర్. పాకిస్థాన్లోని ఉగ్రవాద సంస్థల్ని అంతమొందించేందుకు భారత ఇంటెలిజెన్స్ బ్యూరో చేపట్టిన రహస్య ఆపరేషన్ నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుంది. ఇందులో సీక్రెట్ ఏజెంట్గా రణ్వీర్ సింగ్.. ఐబీ చీఫ్గా మాధవన్ నటించారు. విలన్గా అక్షయ్ ఖన్నా తనదైన నటనతో మెప్పించాడు. HISTORIC... 'DHURANDHAR' OVERTAKES 'PUSHPA 2', 'CHHAAVA', 'ANIMAL' ON *SECOND FRIDAY*... #Dhurandhar is rewriting the record books 🔥🔥🔥.First, take a look at the *second Friday* numbers...⭐️ #Pushpa2 #Hindi: ₹ 27.50 cr⭐️ #Chhaava: ₹ 24.03 cr⭐️ #Animal: ₹ 23.53 cr⭐️… pic.twitter.com/AYRjQia5sF— taran adarsh (@taran_adarsh) December 13, 2025 -
ప్రేమంటే ఇదేరా.. ఫస్ట్ చాయిస్ ఎవరంటే?
కథ రాసుకోవడంతో సినిమా అయిపోదు, అక్కడే అసలు కథ మొదలువుతుంది. ఆ కథలోని పాత్రల ఎంపిక దగ్గరే దర్శకనిర్మాతలు మల్లగుల్లాలు పడుతుంటారు. విక్టరీ వెంకటేశ్ "ప్రేమంటే ఇదే రా" సినిమా విషయంలో ఇదే జరిగింది. జయంత్ సి. పరంజీ దర్శకత్వం వహించిన ఈ మూవీ అప్పట్లో సూపర్ హిట్గా నిలిచింది.ఫస్ట్ ఛాయిస్ ఐశ్వర్యఇందులో వెంకీ సరసన బాలీవుడ్ హీరోయిన్ ప్రీతి జింటాను తీసుకున్నారు. అయితే ప్రీతి కంటే ముందు చాలామందినే సంప్రదించారు. ఆ విషయం గురించి జయంత్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఈ సినిమాకు ఫస్ట్ ఐశ్వర్యరాయ్ను అనుకున్నాం. తనకు కథ బాగా నచ్చి డేట్స్ కూడా ఇచ్చింది. కానీ అప్పటికే తన రెండు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.స్క్రీన్ టెస్ట్ కూడా పూర్తిదీంతో ఆమె ఐరన్ లెగ్ అని పక్కన పెట్టాం. అలా తనను వద్దని వేరే హీరోయిన్స్ దగ్గరకు వెళ్లాం. అమీషా పటేల్, రేణూ దేశాయ్ను స్క్రీన్ టెస్ట్ చేశాం. భూమిక చావ్లా, రీమా సేన్.. ఇలా చాలామందిని అనుకున్నాం. ఇంకో మూడునాలుగురోజుల్లో ముహూర్తం ఉందనగా రామానాయుడు స్టూడియోలో ఒంటరిగా కూర్చుని.. ఎవర్ని హీరోయిన్గా తీసుకోవాలి? అని తల పట్టుకున్నాను. ఐదు నిమిషాల్లో హీరోయిన్ ఫిక్స్సరిగ్గా అప్పుడే అనిల్ కపూర్ వచ్చి పలకరించాడు. నా సమస్య చెప్పాను. ఓ వాణిజ్య ప్రకటనలో నటించిన ప్రీతి జింటాను తీసుకోమని సలహా ఇచ్చాడు. తర్వాతి రోజే తనతో మీటింగ్ ఏర్పాటు చేశాడు. ఆమెతో మాట్లాడిన ఐదు నిమిషాల్లోనే తనే నా మూవీ హీరోయిన్ అని ఫిక్సయ్యాను అని చెప్పాడు. అలా ప్రేమంటే ఇదే రా మూవీతో ప్రీతి జింటా తెలుగులో ఎంట్రీ ఇచ్చింది.రీరిలీజ్ వాయిదా1998లో విడుదలైన ఈ సినిమా మ్యూజికల్గా కూడా చాలా పెద్ద హిట్టయింది. రమణ గోగుల.. నైజాం బాబులు, నాలో ఉన్న ప్రేమ వంటి హిట్ సాంగ్స్ అందించారు. అన్నీ కలిసొస్తే నేడు (డిసెంబర్ 13న) ప్రేమంటే ఇదేరా రీరిలీజ్ అయ్యేది. కానీ, ప్రస్తుతానికి వాయిదా పడింది.చదవండి: ఈ ఏడాది పెళ్లి చేసుకున్న తారలు వీళ్లే -
ఈ ఏడాది పెళ్లి చేసుకున్న సెలబ్రిటీలు వీళ్లే..
సెలబ్రిటీలు ఎంతసేపూ పనిగురించే ఆలోచిస్తుంటారు. వయసు మీద పడుతున్నా పెళ్లి ఊసెత్తరు. కొందరైతే డేటింగ్లోనే కాలం గడిపేస్తూ వెడ్డింగ్ను మాత్రం వాయిదా వేస్తుంటారు. అయితే కల్యాణం వచ్చినా.. కక్కొచ్చినా ఆగదన్నట్లు.. శుభ ఘడియలు దగ్గరపడితే పెళ్లిని ఎవరూ ఆపలేరు. అలా ఈ ఏడాది (2025) పలువురు తారలు వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. సింగిల్ లైఫ్కు ఫుల్స్టాప్ పెట్టి జంట ప్రయాణం మొదలుపెట్టిన ఆ సెలబ్రిటీలెవరో చూసేద్దాం..అఖిల్ - జైనబ్కింగ్ నాగార్జున తనయుడు అఖిల్ అక్కినేని ఈ ఏడాదే పెళ్లి చేసుకున్నాడు. గతేడాది అన్న నాగచైతన్య.. శోభితను పెళ్లి చేసుకుంటే ఈ ఏడాది తమ్ముడు జైనబ్తో ఏడడుగులు వేశాడు. జూన్ 6న ఎంతో గ్రాండ్గా ఈ వెడ్డింగ్ జరిగింది.సమంత- రాజ్ నిడిమోరుహీరోయిన్ సమంత, దర్శకుడు రాజ్ నిడిమోరు కొంతకాలంగా ప్రేమాయణం నడుపుతున్నారు. ఇద్దరూ జంటగా చెట్టాపట్టాలేసుకుని తిరిగారు కానీ అఫీషియల్గా మాత్రం ప్రకటించలేదు. డిసెంబర్ 1న తమిళనాడులోని కోయంబత్తూరులో ఈషా యోగా సెంటర్లో భూతశుద్ధి వివాహం చేసుకుని సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు. అన్నట్లు వీరిద్దరికీ ఇది రెండో పెళ్లే!అభిషన్ జీవింత్- అఖిలటూరిస్ట్ ఫ్యామిలీ సినిమాతో దర్శకుడిగా తొలి ప్రయత్నంలోనే సక్సెస్ అయ్యాడు అభిషన్ జీవింత్. ఓ సినిమా ఈవెంట్లో ప్రియురాలు అఖిలను అక్టోబర్ 31న నన్ను పెళ్లి చేసుకుంటావా? అని ప్రపోజ్ చేశాడు. చెప్పిన డేట్ ప్రకారం అక్టోబర్ 31న ప్రియురాలు మెడలో మూడు ముళ్లు వేశాడు.అవికా గోర్- మిలింద్ చంద్వానీచిన్నారి పెళ్లికూతురుతో ప్రేక్షకులను మెప్పించిన అవికా గోర్ నిజంగానే పెళ్లికూతురుగా ముస్తాబైంది. సెప్టెంబర్ 30న ఓ రియాలిటీ షోలో ప్రియుడు మిలింద్ చంద్వానీని పెళ్లి చేసుకుంది.అర్మాన్ మాలిక్- ఆష్న ష్రాఫ్సింగర్ అర్మాన్ మాలిక్ ప్రియురాలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఆష్న ష్రాఫ్ను పెళ్లి చేసుకున్నాడు. జనవరి 2న ఎంతో గ్రాండ్గా వీరి పెళ్లి జరిగింది.హీనా ఖాన్- రాకీ జైస్వాల్బుల్లితెర నటి హీనా ఖాన్ కొంతకాలంగా క్యాన్సర్తో పోరాడుతోంది. ఇలాంటి కష్టసమయంలోనూ ఆమె చేయిని వదలకుండా పట్టుకున్నాడు ప్రియుడు రాకీ. ఈ ప్రేమజంట జూన్ 4న పెళ్లి చేసుకున్నారు.ఆశ్లేష సావంత్- సందీప్ బస్వానా23 ఏళ్లుగా ప్రేమలో మునిగి తేలుతూ పెళ్లిని పక్కనపెట్టేశారు నటులు ఆశ్లేష సావంత్- సందీప్ బస్వానా. కానీ ఇటీవల ఓ కృష్ణుడి గుడికి వెళ్లినప్పుడు పెళ్లి చేసుకోవాలన్న కోరిక మనసులో పుట్టింది. అనుకున్నదే తడవుగా నవంబర్ 23న వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు.అర్చన- బీఆర్ శరత్కన్నడ నటి అర్చన కొట్టిగె, క్రికెటర్ బీఆర్ శరత్ వేదమంత్రాల సాక్షిగా కొత్త జీవితాన్ని ఆరంభించారు. వీరి పెళ్లి ఏప్రిల్ 23న బెంగళూరులో జరిగింది.వీళ్లే కాకుండా సారా ఖాన్- క్రిష్ పాఠక్.. సెలీనా గోమెజ్-బెన్నీ బ్లాన్కో, దర్శన్ రావల్-దరల్ సురేలియా, ప్రతీక్ బాబర్- ప్రియా బెనర్జీ, ఆదార్ జైన్- అలేఖ అద్వానీ, ప్రజక్త కోహ్లి- వృషాంక్ ఖనల్ వంటి పలువురు జంటలు సైతం ఈ ఏడాది పెళ్లి బంధంలో అడుగుపెట్టారు. -
అఖండ 2: శివుడి పాత్ర చేసిందెవరో తెలుసా?
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన తాజా చిత్రం అఖండ 2: తాండవం. ఇది 2021లో వచ్చిన హిట్ సినిమా అఖండకు సీక్వెల్గా తెరకెక్కింది. దైవభక్తిపై ఆధారపడి తీసిన ఈ మూవీ డిసెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సోషల్ మీడియాలో ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వస్తోంది. కాకపోతే సినిమాలో కొన్ని సీన్లు లాజిక్తో సంబంధం లేకుండా మరీ ఓవర్గా ఉన్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.అఖండ 2లో శివుడుఅయినా బాలయ్య డైలాగులు, యాక్షన్ 'అతి' లేకుండా ఉండవని అందరికీ తెలిసిందే! అయితే సినిమాలో శివుడి పాత్ర మాత్రం బాగుందంటున్నారు. అఖండ తల్లి మరణించినప్పుడు కైలాసంలోని శివుడు భువిపైకి వచ్చి ఆమె చితికి అగ్ని సంస్కారం చేస్తాడు. ఈ సన్నివేశాన్ని బోయపాటి ఎంతో భక్తిభావంతో అద్భుతంగా తెరకెక్కించాడు. ఈ ముఖ్యమైన సీన్లో శివయ్యగా మెప్పించిన ఆ నటుడెవరు? అని నెట్టింట జనం ఆరా తీస్తున్నారు.హిందీ సీరియల్స్లో ఫేమస్అతడు మరెవరో కాదు హిందదీ బుల్లితెర నటుడు తరుణ్ ఖన్నా. 2015లో ప్రసారమైన సంతోషి మా సీరియల్లో తొలిసారి మహాశివుడిగా నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు. రాధాకృష్ణ, రామ్ సియాకె లవ్కుశ, నమః, దేవి ఆది పరాశక్తి, శ్రీమద్ రామాయణ్, వీర్ హనుమాన్: బోలో బజ్రంగ్ బలీకీ జై, కాల భైరవ్ రక్ష శక్తిపీఠ్ కే వంటి పలు సీరియల్స్లో ఈశ్వరుడిగా వేషం కట్టి మెప్పించాడు.పర్ఫెక్ట్!అందుకే ఈ పాత్రకు తనైతే పర్ఫెక్ట్గా సూట్ అవుతాడని భావించినట్లు తెలుస్తోంది. దర్శకుడి అంచనా నిజమైంది. తరుణ్ ఖన్నా తెరపై అడుగుపెట్టిన ప్రతి సీన్ వెండితెరపై బాగా పేలిందని టాక్ వినిపిస్తోంది. తరుణ్ ఖన్నా (Tarun Khanna).. చంద్రగుప్త మౌర్య సీరియల్లో చాణక్య పాత్ర పోషించాడు.చదవండి: 25 ఏళ్లుగా డిన్నర్కే వెళ్లలేదంటున్న బాలీవుడ్ స్టార్ -
25 ఏళ్లుగా డిన్నర్కే వెళ్లలేదంటున్న స్టార్ హీరో!
సినిమా తారలకు ఎన్నో ఆంక్షలు ఉంటాయి. కాదు, కాదు వాళ్లే ఆంక్షలు పెట్టుకుని బతుకుతుంటారు. నోరు కట్టేసుకుంటారు, స్వేచ్ఛగా బయటకు వెళ్లలేరు, ఒక్కమాటలో చెప్పాలంటే నచ్చినట్లు జీవించలేరు. ఎంతసేపూ ప్రేక్షకులకు నచ్చే సినిమాలు తీయాలన్న తాపత్రయంలో ఉంటారు. అందుకోసం తమ శరీర సౌష్టవాన్ని నిత్యం కాపాడుకునే ప్రయత్నం చేస్తారు.25 ఏళ్లుగాఅయితే కొందరు సెలబ్రిటీలు మాత్రం చీటింగ్ డే అంటూ కొన్నిసార్లు అన్నీ పక్కనపెట్టి నచ్చింది ఆరగిస్తుంటారు. అది బిర్యానీ అయినా, ఐస్క్రీమ్ అయినా! కాస్త గ్యాప్ దొరికితే వెకేషన్కో, డిన్నర్కో బయటకు వెళ్తుంటారు. కానీ అలా తాను డిన్నర్కు వెళ్లి 25 ఏళ్లు అయిందంటున్నాడు బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్.వాళ్లే ఉన్నారుతాజాగా రెడ్ సీ ఫిలిం ఫెస్టివల్కు హాజరైన సల్మాన్ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడాడు. నేనెప్పుడూ కుటుంబం, ఫ్రెండ్స్ అంటూ వారికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటాను. కానీ నా జీవితంలో కొందరు క్లోజ్ ఫ్రెండ్స్ను కోల్పోయాను. దీంతో ఇప్పుడు నాతో నలుగురైదుగురు మాత్రమే ఉన్నారు. వాళ్లు ఎన్నో ఏళ్లకొద్దీ నాతో సావాసం చేస్తున్నారు.అదే నా పనినేను బయట డిన్నర్కు వెళ్లి 25 ఏళ్లవుతోంది. ఎంతసేపూ షూటింగ్, ఎయిర్పోర్ట్, హోటల్, ఈవెంట్.. ఆ వెంటనే షూటింగ్.. ఇదే నా పని. అలా అని ఈ విషయంలో నేనేమీ బాధపడటం లేదు. ఎందుకంటే ప్రేక్షకులు నాపై ఎంతో ప్రేమాభిమానాలు చూపిస్తుంటారు. వారికోసం నేను కష్టపడుతూనే ఉంటాను అని చెప్పుకొచ్చాడు. మర్చిపోయాడా?అయితే సల్మాన్ ఖాన్ పలువురు సెలబ్రిటీలతో గతంలో డిన్నర్కు వెళ్లినట్లు వార్తలు వచ్చాయి. మరి ఆనాటి విషయాల్ని సల్మాన్ మర్చిపోయాడా? లేదంటే అప్పుడు తినకుండానే బయటకు వచ్చేశాడా? అన్నది తనకే తెలియాలి! ప్రస్తుతం సల్మాన్ ఖాన్ (Salman Khan).. బ్యాటిల్ ఆఫ్ గల్వాన్ సినిమా చేస్తున్నాడు. -
దగ్గరివాళ్లే ద్రోహం చేశారు.. రెండేళ్లవుతోంది: నటి
బాలీవుడ్ బ్యూటీ రిచా చద్దా గతేడాది పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. పాప పుట్టాక తనను చూసుకోవడంతోనే సరిపెట్టుకున్న రిచా చద్దా ఇప్పుడు మళ్లీ సెట్స్లో అడుగుపెట్టింది. అయితే అనుకున్నదానికంటే ఆలస్యంగానే సెట్లో రీఎంట్రీ ఇచ్చానంటోంది రిచా. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో రాసుకొచ్చింది.ద్రోహం చేశారుదాదాపు రెండేళ్ల తర్వాత మళ్లీ పనిలో నిమగ్నమయ్యాను. వీలైనంత త్వరగా సెట్లో అడుగుపెట్టాలనుకున్నాను.. కానీ నా శరీరం, మనసు అందుకు సిద్ధపడటానికి చాలా సమయమే తీసుకుంది. వీటిని పక్కనపెడితే ఇండస్ట్రీలో అత్యంత దగ్గరి వ్యక్తులే నాకు ద్రోహం చేశారు. ఈ రంగంలో కొందరికి మాత్రమే నీతి నిజాయితీ అనే విలువలు ఉంటాయని అర్థమైంది. వాళ్లను క్షమిస్తానేమో కానీ..వాళ్లకు ఆత్మనూన్యతా భావం ఎక్కువ. వాళ్లు ఎప్పుడూ సంతోషంగా ఉండరు, పక్కపవాళ్లనూ సంతోషంగా ఉండనివ్వరు. ఎలా అంటే పక్కవాళ్ల జీవితంలోని ఆనందాన్నంతా పీల్చేస్తుంటారు. అయితే ఇదంతా కొత్తేమీ కాదు.. గురు దత్ 70 ఏళ్ల క్రితమే చెప్పాడు. అలాంటివాళ్లను నేను క్షమిస్తానేమో కానీ జరిగినదాన్ని మాత్రం మర్చిపోను.నాకంటూ లైఫ్ ఉందిపాప పుట్టకముందు నేనెలా ఉండేదాన్నో నాకే గుర్తులేదు. చాలామంది ఏదో ఒక కంటెంట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉండమని చెప్తున్నారు. నాకంటూ ఓ జీవితం ఉంది. ఆ లైఫ్లో జరిగే ప్రతీది చెప్పడం నాకిష్టం లేదు. అసలు సోషల్ మీడియాలో ప్రతీది షేర్ చేయాల్సిన అవసరం ఏంటి? దానివల్ల ఎవరైనా ఒంటరితనం పోతుందా? లేదా మనమేదో రిచ్ అని చెప్పడానికా? అయినా నేను ఆల్రెడీ రిచే (Richa) అని చెప్పుకొచ్చింది.సినిమారిచా చద్దా (Richa Chadha).. గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్, ఫర్కీ, సర్బ్జిత్, లవ్ సోనియా, గోలియో కీ రాస్లీల రామ్లీల, షకీల, సెక్షన్ 375 వంటి పలు సినిమాల్లో నటించింది. చివరగా హీరామండి వెబ్ సిరీస్లో కనిపించింది. View this post on Instagram A post shared by Richa Chadha (@therichachadha) -
నన్ను సర్జరీ చేయించుకోమన్నారు: ధురంధర్ నటి
స్టార్ నటులు రణ్వీర్ సింగ్, మాధవన్ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ధురంధర్. ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఏకంగా రూ.200 కోట్ల క్లబ్లో చేరేందుకు సిద్ధమైంది. ఈ మూవీలో ఆయేషా ఖాన్ స్పెషల్ సాంగ్లో మెరిసింది. శరారత్ అనే పాటలో స్టెప్పులేసింది. ఈ సినిమాలో భాగమవడాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతోంది.సర్జరీ చేయించుకోమని సలహాఅయితే కెరీర్ తొలినాళ్లలో తన లుక్పై చాలా నెగెటివ్ కామెంట్లు వచ్చాయంటోంది. తాజా ఇంటర్వ్యూలో ఆయేషా మాట్లాడుతూ.. ఓ వ్యక్తి నా ముక్కును సరిచేయించుకోమన్నాడు. నేను ఆశ్చర్యపోయాను. నాకు నా ముక్కంటే చాలా ఇష్టం. దాన్ని సర్జరీ చేయించుకోమని చెప్పడానికి అతడెవరు? ఇలాంటి వాళ్లు లైఫ్లో ముందుకెళ్లరు.. కానీ పక్కవాళ్ల మీద పడి ఏడుస్తారు!ఫేమస్ డైరెక్టర్ మూవీఒకసారి ఓ హారర్ సినిమా ఆడిషన్కు వెళ్లాను. ఆయన ఫేమస్ డైరెక్టర్. ఆడిషన్ పూర్తయింది. అది వాళ్లకు నచ్చింది. కచ్చితంగా నన్నే సెలక్ట్ చేస్తారని అక్కడున్నవాళ్లు చెప్పారు. అప్పుడు చాలా సంతోషంగా అనిపించింది. కానీ అంతలోనే.. ఇది హారర్ సినిమా కాబట్టి సరిపోయింది. తెలుగులో సినిమాలుకానీ ఇలాంటి అవకాశాలు రావాలంటే నీ పళ్లవరస మార్చుకోవాలి అన్నారు. అది నాకెంతో ఇబ్బందిగా అనిపించింది అని ఆయేషా ఖాన్ చెప్పుకొచ్చింది. ఈ బ్యూటీ తెలుగులో ముఖచిత్రం, ఓం భీమ్ బుష్ సినిమాలు చేసింది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీలో ఐటం సాంగ్ చేసింది. జాట్లో కానిస్టేబుల్ పాత్రలో మెరిసింది. ప్రస్తుతం కిస్ కిస్కో ప్యార్ కరూ 2 మూవీ చేస్తోంది. హిందీ బిగ్బాస్ 17వ సీజన్లోనూ పార్టిసిపేట్ చేసింది. View this post on Instagram A post shared by Ayesha Khan (@ayeshaakhan_official) -
రణ్వీర్ సింగ్ దురంధర్.. ఆ దేశాల్లో బ్యాన్..!
రెండేళ్ల గ్యాప్ తర్వాత బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్. డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రాం బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. మూడు రోజుల్లోనే వందకోట్లకు పైగా వసూళ్లు సాధించింది. పాకిస్తాన్ నేపథ్యంలో తెరకెక్కించిన మూవీ కావడంతో ఒక్కసారిగా ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.అయితే తాజాగా ఈ చిత్రానికి అంతర్జాతీయంగా చిక్కులు ఎదురవుతున్నాయి. ఇందులో పాకిస్తాన్ను నెగెటివ్గా చూపించారంటూ అరబ్ దేశాలు దురంధర్పై నిషేధం విధించాయి. ఈ మూవీని బహ్రెయిన్, కువైట్, ఓమన్, ఖతార్, సౌదీ, యూఏఈ బ్యాన్ చేశాయి. దీంతో ఆయా దేశాల్లో దురంధర్ చూడాలనుకున్న అభిమానులకు నిరాశే ఎదురైంది. ఈ చిత్రంలో పాక్కు వ్యతిరేకంగా ప్రస్తావనలు ఉన్నాయనే అరబ్ దేశాలు ఈ చర్యలకు పాల్పడినట్లు తెలుస్తోంది. బాలీవుడ్కు కీలక మార్కెట్ అయిన గల్ఫ్ దేశాల్లోని థియేటర్లలో దురంధర్ విడుదల చేయడానికి నిర్మాతలు ప్రయత్నించారు. కానీ కొన్నిచోట్ల అసలు అనుమతులు కూడా రాలేదు. దీంతో చివరికీ కొన్ని థియేటర్స్కు మాత్రమే పరిమితం చేశారు. పాకిస్థాన్కు వ్యతిరేకంగా తెరకెక్కించడం వల్లే ఆయా దేశాలు దీన్ని బ్యాన్ చేసినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ కలెక్షన్ల పరంగా ఏమాత్రం తగ్గడం లేదు. రూ.200 కోట్ల దిశగా దురంధర్ దూసుకెళ్తోంది. -
టాప్ ప్లేస్లో సైయారా
ప్రముఖ ఎంటర్టైన్మెంట్ పోర్టల్ ఐఎండీబీ ఈ ఏడాదికి గాను అత్యంత ప్రజాదరణ పొందిన భారతీయ చిత్రాల జాబితాను విడుదల చేసింది. హిందీ చిత్రం ‘సైయారా’ తొలి స్థానంలో నిలిచింది. మోహిత్ సూరి దర్శకత్వం వహించిన ఈ మ్యూజికల్ లవ్స్టోరీ సినిమాలో అహాన్ పాండే, అనీత్ పడ్డా లీడ్ రోల్స్లో నటించారు. యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రం ఈ ఏడాది జూలైలో విడుదలై, బ్లాక్బస్టర్గా నిలిచింది. ఇక రెండో స్థానంలో యానిమేషన్ ఫిల్మ్ ‘మహావతార్ నరసింహా’, మూడో స్థానంలో విక్కీ కౌశల్ ‘ఛావా’, నాలుగో స్థానంలో రిషబ్ శెట్టి ‘కాంతారా: చాప్టర్ 1’ చిత్రాలు నిలిచాయి.రజనీకాంత్ ‘కూలీ’, ప్రదీప్ రంగనాథన్ ‘డ్రాగన్’, ఆమిర్ ఖాన్ ‘సితారే జమీన్ పర్’, షాహిద్ కపూర్ ‘దేవా’, అజయ్ దేవగణ్ ‘రైడ్ 2’, కల్యాణీ ప్రియదర్శన్ ‘లోక చాప్టర్1: చంద్ర’ చిత్రాలు వరుసగా 5, 6, 7, 8, 9, 10 స్థానాల్లో నిలిచాయి. అలాగే ఐఎండీబీ పోర్టల్ టాప్టెన్ వెబ్ సిరీస్ జాబితాలో ‘ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3’కి తొమ్మిదో స్థానం దక్కింది. షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డైరెక్ట్ చేసిన ‘బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్’ సిరీస్ తొలి స్థానంలో నిలిచింది. -
ఓటీటీల్లో వందలకొద్ది వెబ్ సిరీస్లు.. టాప్-10లో ఇండియాకు నో ప్లేస్!
ఓటీటీలు వచ్చాక సినిమాలు,వెబ్ సిరీస్లకు కొదవే లేదు. కొన్ని చిత్రాలు నేరుగా ఓటీటీలోనే రిలీజ్ అవుతుంటాయి. ఏ భాషలో వచ్చినా సరే డబ్బింగ్ చేసి డిజిటల్గా స్ట్రీమింగ్ చేసేస్తున్నారు. ప్రతి ఏటా వందలకొద్ది చిత్రాలు, వెబ్ సిరీస్లు ఓటీటీ ప్రియులను అలరిస్తున్నాయి. ప్రతివారం సరికొత్త కంటెంట్తో సినీ ప్రియులను వెబ్ సిరీస్లు వచ్చేస్తున్నాయి. అలా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు రిలీజైన ఆదరణ దక్కించుకున్నవి చాలానే ఉన్నాయి.కానీ ఇండియన్ సినీ ఇండస్ట్రీలోనూ ప్రతి ఏటా సరికొత్త కంటెంట్తో వెబ్ సిరీస్లు వస్తున్నాయి. వాటిలో ముఖ్యంగా క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్ లాంటి వాటికి మాత్రమే ఆడియన్స్ కనెక్ట్ అవుతున్నారు. మర్డర్ మిస్టరీ లాంటి సిరీస్లకు ఓటీటీలో మంచి డిమాండ్ ఉంది. సినీ ప్రియుల అభిరుచితి తగ్గట్టుగానే చాలా వెబ్ సిరీస్లు డిజిటల్ ఫ్లాట్ఫామ్లో సందడి చేస్తున్నాయి. అయితే కొన్ని మాత్రమే ప్రేక్షకుల ఆదరణ దక్కించుకుంటున్నాయి. చాలా వరకు మన దేశ ఆడియన్స్ ఆదరిస్తున్నప్పటికీ.. ప్రపంచవ్యాప్తంగా చూస్తే మన కంటెంట్ సత్తా చాటలేకపోయింది.ఓవరాల్ రేటింగ్ పరంగా చూస్తే ప్రపంచవ్యాప్తంగా టాప్-10లో మన ఇండియన్ వెబ్ సిరీస్ ఒక్కటీ కూడా లేకపోవడం గమనార్హం. ఐఎండీబీ ప్రకటించిన టాప్-25 వెబ్ సిరీస్లో ఇండియా నుంచి కేవలం నాలుగు మాత్రమే చోటు దక్కించుకున్నాయి. ఇందులో టాప్-15లో హర్షద్ మెహతా స్కామ్-1992 కాస్తా ఫర్వాలేదనిపించింది. ఈ లిస్ట్లో తొలిస్థానంలో బ్రేకింగ్ బ్యాడ్(9.5) అనే వెబ్ సిరీస్ నిలవగా.. బ్యాండ్ ఆఫ్ బ్రదర్స్(9.4), ప్లానెట్ ఎర్చ్-2(9.4) రెండు, మూడు స్థానాల్లో రేటింగ్ దక్కించుకున్నాయి.టాప్-10 విషాయానికొస్తే నాలుగు నుంచి వరుసగా.. ప్లానెట్ ఎర్త్, ది వైర్, చెర్నోబిల్, అవతార్- ది లాస్ట్ ఎయిర్బెండర్, బ్లూ, కాస్మోస్, బ్లూ ప్లానెట్-2 నిలిచాయి. ఇక 11 వ ప్లేస్లో గేమ్ ఆఫ్ థ్రోన్స్ నిలవగా.. 12లో ది సోప్రానోస్ వెబ్ సిరీస్ నిలిచింది. ఇక ఇండియా నుంచి హర్షద్ మోహతా వెబ్ సిరీస్ స్కామ్-1992(9.2) ఈ లిస్ట్లో 13వ స్థానం దక్కంచుకుంది. ఆ తర్వాత ఆస్పిరెంట్స్, గుల్లక్, టీవీఎఫ్ పిచర్స్ వరుసగా 23, 24, 25 స్థానాల్లో నిలిచాయి. ఓవరాల్గా చూస్తే మనదేశం నుంచి ఒక్క వెబ్ సిరీస్ కూడా టాప్-10లో రేటింగ్ సాధించలేకపోయింది. -
కాంతారపై రణ్వీర్ సింగ్ కాంట్రవర్సీ.. స్పందించిన సీనియర్ హీరో భార్య..!
బాలీవుడ్ రణ్వీర్ సింగ్ ఇటీవల కాంతార మూవీని ఉద్దేశించి చేసిన కామెంట్స్ వివాదానికి దారితీశాయి. గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI) ముగింపు వేడుకల్లో కాంతార సీన్ను ఇమిటేట్ చేశాడు. అదే కాంతార ఫ్యాన్స్కు ఆగ్రహం తెప్పించింది. తమ దైవాన్ని కించపరిచేలా మాట్లాడారని.. క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు.ఈ వివాదం కాస్తా మరింత ముదరడంతో రణ్వీర్ సింగ్ క్షమాపణలు కోరాడు. రిషభ్ ఫెర్ఫార్మెన్స్ గురించి చెప్పాలనేది నా ఉద్దేశమని వివరణ ఇచ్చాడు. తాజాగా ఈ వివాదంపై సీనియర్ హీరో గోవిందా సునీతా అహుజా స్పందించారు. ఈ విషయంలో రణ్వీర్ సింగ్కు ఎలాంటి చెడు ఉద్దేశం ఉండకపోవచ్చని అన్నారు. కానీ దక్షిణాది ప్రజలు చాలా సున్నితంగా ఉంటారు.. అందుకే వారికి అది నచ్చలేదని సునీతా అభిప్రాయం వ్యక్తం చేశారు. కాగా... రణ్వీర్ సింగ్ నటించిన దురంధర్ మూవీ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది.అసలేం జరిగిందంటే..ఈవెంట్లో స్టేజీపై రణ్వీర్ సింగ్ మాట్లాడుతూ.. 'రిషబ్.. నేను థియేటర్లో కాంతార: చాప్టర్ 1 సినిమా చూశాను. మీ నటన అద్భుతంగా ఉంది. ముఖ్యంగా ఆడ దెయ్యం (చాముండీ) మీకు ఆవహించే సీన్లో మీ నటన అద్భుతంగా ఉంది' అని ప్రశంసించాడు. అయితే సినిమాలో బాగా పాపులర్ అయిన 'ఓ..' అనే హావభావాన్ని చేసి చూపించాడు. ఇది సీరియస్గా ఉండాల్సింది పోయి కామెడీగా అనిపించింది. దీంతో కన్నడిగుల ఆగ్రహానికి గురయ్యాడు. నిన్నంతా సోషల్ మీడియాలో ఓ రేంజులో రణ్వీర్ని విమర్శించారు. దీంతో ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా క్షమాపణ చెప్పాడు.కాంతార మూవీ..రిషబ్ శెట్టి దర్శకత్వం వహించడంతో పాటు హీరోగా నటించిన కాంతార చిత్రం (Kantara Movie) బ్లాక్బస్టర్గా నిలిచింది. 2022లో వచ్చిన ఈ చిత్రం దాదాపు రూ.450 కోట్ల మేర వసూళ్లు రాబట్టింది. ఈ ఏడాది ఈ మూవీకి ప్రీక్వెల్గా కాంతార: చాప్టర్ 1 రిలీజైంది. జయరామ్, రుక్మిణి వసంత్, గుల్షన్ దేవయ్య కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం ఏకంగా రూ.850 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసింది. -
రూమర్స్ నిజం చేశారు.. డేటింగ్పై నటి కృతిక క్లారిటీ
స్వతహాగా టీవీ నటుడు అయినప్పటికీ ఐపీఎల్లో హోస్ట్గా గుర్తింపు తెచ్చుకున్న గౌరవ్ కపూర్ ఇప్పుడు మరోసారి ప్రేమలో పడ్డాడు. గత కొన్నాళ్లుగా ఇతడి గురించి రూమర్స్ వస్తున్నప్పటికీ తాజాగా వాటిపై క్లారిటీ వచ్చేసింది. గౌరవ్ ఎవరితోనైతే రిలేషన్లో ఉన్నాడని పుకార్లు వచ్చాయో సదరు నటి.. ఇద్దరూ కలిసున్న కొన్ని ఫొటోలని పోస్ట్ చేసింది. దీంతో కొత్త జంటకు విషెస్ చెబుతున్నారు.(ఇదీ చదవండి: అమ్మ ఆశీర్వదించింది.. భగవంతుడు నిజం చేశాడు: పూర్ణ)రేడియో జాకీగా కెరీర్ ప్రారంభించిన గౌరవ్ కపూర్.. కొన్ని హిందీ సినిమాల్లో సహాయ పాత్రలు చేశాడు. కాకపోతే 2008లో ప్రారంభమైన ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్)లో హోస్ట్గా చేసిన తర్వాత చాలా గుర్తింపు వచ్చింది. అలా 2017 వరకు ఈ లీగ్లో హోస్టింగ్ చేశాడు. ప్రస్తుతం క్రిక్బజ్లో అంతర్జాతీయ మ్యాచ్లకు వ్యాఖ్యతగా పనిచేస్తున్నాడు.గతంలోనే నటి కిరాట్ బట్టల్ అనే నటిని గౌరవ్, 2014లో పెళ్లి చేసుకున్నాడు. కానీ 2021లో వీళ్లిద్దరూ విడాకులు తీసుకున్నారు. గత నాలుగేళ్లుగా గౌరవ్ ఒంటరిగానే ఉంటున్నాడు. ఈ ఏడాది ప్రారంభం నుంచి కృతిక కమ్రా అనే నటితో గౌరవ్ డేటింగ్ చేస్తున్నాడనే రూమర్స్ వస్తున్నాయి. ఇప్పుడు కృతికనే ఇన్ స్టాలో గౌరవ్తో కలిసున్న ఫొటోలు పోస్ట్ చేయడంతో బంధం అధికారికం చేసేశారని మాట్లాడుకుంటున్నారు. 37 ఏళ్ల కృతిక ప్రస్తుతం ఓటీటీల్లో సినిమాలు, వెబ్ సిరీస్ల్లో నటిస్తూ గుర్తింపు తెచ్చుకుంది.(ఇదీ చదవండి: సినిమాల్లో అవకాశాలు లేవ్.. చాలా బాధపడ్డా!: నటి ప్రగతి) View this post on Instagram A post shared by Kritika Kamra (@kkamra) -
పెళ్లి బంధంలోకి అడుగుపెట్టిన బుల్లితెర నటి.. ఫోటోలు వైరల్!
ప్రముఖ బుల్లితెర భామ, బిగ్బాస్ బ్యూటీ రూపాలి త్యాగి వివాహబంధంలోకి అడుగుపెట్టింది. తన ప్రియుడు నోమిష్ భరద్వాజ్ను పెళ్లాడింది. ముంబయిలో జరిగిన ఈ పెళ్లి వేడుకలో సినీతారలు, అత్యంత సన్నిహితులు హాజరయ్యారు. తన పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది ముద్దుగుమ్మ. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఈ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. వీరిద్దరి గ్రాండ్ వెడ్డింగ్ డిసెంబర్ 5న జరిగింది.కాగా.. రూపాలి త్యాగి సప్నే సుహానే లడక్పన్ కే సీరియల్లో గుంజన్ పాత్రతో ఫేమ్ తెచ్చుకుంది. అంతేకాకుండా బిగ్ బాస్ సీజన్- 9లో కంటెస్టెంట్గా పాల్గొంది. కాగా.. వీరిద్దరు రెండు సంవత్సరాల క్రితం ముంబయిలో స్నేహితుల ద్వారా పరిచయమయ్యారు. ముంబయికి చెందిన నోమిష్ ప్రస్తుతం లాస్ ఏంజిల్స్లో యానిమేషన్ ఇండస్ట్రీలో పనిచేస్తున్నారు.రూపల్ త్యాగి కెరీర్..హమారీ బేటియూన్ కా వివాహ్ సీరియల్తో కెరీర్ ప్రారంభించిన రూపాలి త్యాగి..బాలీవుడ్లో పలు సీరియల్స్లో నటించింది. ఏక్ నయీ చోటి సి జిందగీ, రంజు కి బేటియాన్, కసమ్ సే, దిల్ మిల్ గయే, శక్తి- అస్తివా కే ఎసాస్ కీ, యంగ్ డ్రీమ్స్ లాంటి హిందీ సీరియల్స్లో కనిపించింది. బెంగళూరుకు చెందిన రూపల్ త్యాగి కొరియోగ్రాఫర్గా కూడా రాణిస్తోంది. అంతేకాకుండా బిగ్ బాస్ -9 తో పాటు 2015లో ఝలక్ దిఖ్లా జా -8 లాంటి రియాలిటీ షోలో కూడా పాల్గొంది. View this post on Instagram A post shared by Roopal Tyagi (@roopaltyagi06) -
పాకిస్తాన్లో అలాంటివేవి లేవు.. ‘దురంధర్’పై హిలేరియస్ రివ్యూ
రణ్వీర్ సింగ్ హీరోగా దర్శకుడు ఆదిత్య ధర్ నిర్మించిన సినిమా ‘దురంధర్’ విడుదలై రోజులు గడుస్తోంది. పాకిస్థాన్లో ఉగ్రమూకలను తుదముట్టించేందుకు ఓ భారతీయ ఐబీ అధికారి చేసిన ప్రయత్నమే ఈ దురంధర్(Dhurandhar Movie) కథ. సినిమాపై పబ్లిక్ టాక్ భిన్నంగా ఉన్నప్పటికీ అదేదో బలూచిస్తాన్ పాటకు అక్షయ్ ఖన్నా చేసిన డ్యాన్స్పై మాత్రం ఇంటర్నెట్ ప్రశంసల వర్షం కురిపిస్తోంది. ఇన్స్టాగ్రామ్పై రకరకాల రీళ్లూ ప్రత్యక్షమవుతున్నాయి. అయితే తాజాగా ఈ సినిమాపై ఓ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లూయెన్సర్ రివ్యూ చేశాడు. దురంధర్ సినిమా చూసిన పాకిస్థాన్ ఎలా రియాక్ట్ అవుతాడన్నది ఈ రివ్యూ సారాంశం... ఇంతకీ అతగాడు ఏమంటాడంటే...‘‘అయ్యా... దురంధర్ సినిమా ఇప్పుడే చూశా. బాబులూ ఒక్క విషయం చెప్పదలుచుకున్నా.. సినిమాలో మీరు చూపించినవి ఏవీ పాకిస్థాన్లో లేవు. ఒకొక్కటి.. ప్రతి ఒక్కటీ అబద్ధం. అందులో రణ్వీర్ సింగ్ ఓ మోటర్ సైకిల్ నడుపుతూంటాడు. అలాంటిది పాకిస్థాన్ మొత్తమ్మీద లేదంటే నమ్మండి. నాయనలారా! ఇంత అత్యాచారాలకు పాల్పడకండి సారూ. స్పె్లండర్ బైక్నే సూపర్ బైక్ అనుకునే రకాలం మేము. అట్లాంటిది.. మీరు ఆ సినిమాలో ఏమేమో చూపించేశారు. కరాచీలో అండర్పాస్ ఉన్నట్లు చూపారు. ఊహూ... ఎక్కడా అలాంటిది లేదయ్యా.. మాకున్న అండర్పాస్లు అన్నీ భారత్ సరిహద్దుల్లోనే.. అది కూడా ఉగ్రవాదులను ఇటు నుంచి అటుకు పంపేందుకు మాత్రమే. అయ్యో... స్క్రిప్ట్లో లేని విషయమూ చెప్పేశానే. కొంచెం మరచిపోండేం! మిగిలిన విషయాలంటారా?... మేజర్ ఇక్బాల్, రెహ్మాన్ డెకాయిట్, 26/11... వంటివేవీ మేము చేయలేదు. ఒట్టు. ఏంటి అవన్నీ నిజమే అంటావా? లేదు సారు.. అవన్నీ పచ్చి అబద్ధాలు.’’కోనసీమ వెటకారానికి మించిన హిలేరియస్ రివ్యూ ఇది. మీరూ ఒకసారి చూసేయండి మరి. View this post on Instagram A post shared by Sanchit Pulani (@sanchitpulani) -
నాకు 33 ఏళ్లు.. అందుకే ఎగ్ ఫ్రీజింగ్: రియా చక్రవర్తి
2020లో హిందీ చిత్రపరిశ్రమ ఎంతోమంది ప్రముఖులను కోల్పోయింది. వారిలో ఇర్ఫాన్ ఖాన్, రిషి కపూర్, సుశాంత్ సింగ్ రాజ్పుత్ వంటి సెలబ్రిటీలున్నారు. అయితే సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం మాత్రం వార్తల్లో సంచలనమైంది. అతడి ఆత్మహత్యకు ప్రేయసి రియా చక్రవర్తి కారణమంటూ నెట్టింట సదరుహీరోయిన్పై తీవ్ర ట్రోలింగ్ జరిగింది. జైలుకుఅలాగే సుశాంత్ మృతి కేసులో ఆమె అరెస్టయి జైలుకు కూడా వెళ్లొచ్చింది. అయితే అతడి మరణానికి రియా చక్రవర్తికి ఎటువంటి సంబంధం లేదంటూ కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. రియాకు ఆఫర్లు తగ్గిపోయాయి. దీంతో ఆమె పాడ్కాస్ట్తో పాటు చాప్టర్ 2 డ్రిప్ పేరిట బట్టల బిజినెస్ మొదలుపెట్టింది. ఈరోజు ఆ బ్రాండ్ విలువ రూ.40 కోట్లుగా ఉంది.ఎగ్ ఫ్రీజింగ్తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నాకు 33 ఏళ్లు. ఈ మధ్యే గైనకాలజిస్ట్ను కలిశా.. ఎగ్ ఫ్రీజింగ్ గురించి అడిగి తెలుసుకున్నాను. ఎందుకంటే ఓపక్క కెరీర్లో సెట్ అవ్వాలి. మరోపక్క సామాజిక ఒత్తిడి. మన శరీరం ఓ వయసు రాగానే పిల్లల గురించి ఆలోచించమని చెప్తుంది. కానీ మనసు మాత్రం.. నీ బిజినెస్, బ్రాండ్, కెరీర్.. అవే పిల్లలని, వాటి ఎదుగుదల గురించి ఫోకస్ చేయమని చెప్తుంది. నేనింకా సాధించాల్సింది చాలా ఉంది. సినిమాఅందుకే ఇప్పుడే పెళ్లి, ఫ్యామిలీ అని ఆలోచించదల్చుకోలేదు. కాకపోతే ఎగ్ ఫ్రీజింగ్ చేయాలనుకుంటున్నాను అని చెప్పుకొచ్చింది. రియా చక్రవర్తి (Rhea Chakraborty).. తూనీగ తూనీగ అనే తెలుగు మూవీతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. మేరే డాడ్ కీ మారుతి, సోనాలి కేబుల్, జిలేబి, చెహరె సినిమాలు చేసింది. దొబారా, హాఫ్ గర్ల్ఫ్రెండ్ మూవీలో అతిథి పాత్రలో మెరిసింది.చదవండి: నరసింహ మూవీలో ఐశ్వర్యరాయ్... రజనీకాంత్ ఏమన్నారంటే? -
నా అందానికి రహస్యం వ్యాయామం, ఫుడ్ కాదు!
దక్షిణాదిలో అగ్ర కథానాయికగా రాణించిన ఉత్తరాది భామల్లో శ్రియ ఒకరు. తెలుగు, తమిళం, కన్నడం, హిందీ తదితర భాషల్లో నటించి పేరు తెచ్చుకున్న ఈ నటిలో మంచి డాన్సర్ ఉన్నారు. గ్లామర్కు అయితే కొదవ లేదు. పాత్రలకు న్యాయం చేసే నటనా ప్రతిభ కూడా తోడుంది. వీటన్నింటికి తోడుగా అదృష్టం కలిసి రావడంతో తెలుగు, తమిళం భాషల్లో స్టార్ హీరోలతో జత కట్టే అవకాశాలను అందుకున్నారు. అలా దాదాపు రెండు దశాబ్దాలపాటు కథానాయికగా నటించారు. హీరోయిన్ నుంచి క్యారెక్టర్ ఆర్టిస్టుగా2018లో శ్రియ తన బాయ్ఫ్రెండ్ ఆండ్రీ కోస్కీవ్ను వివాహం చేసుకున్నారు. వీరికి ఒక బిడ్డ పుట్టింది. పెళ్లి తరువాత కొంత కాలం నటనకు దూరంగా ఉన్న ఈమె ఇటీవల మళ్లీ నటించడం మొదలెట్టారు. అయితే కథానాయికగా కాకుండా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అదే విధంగా ప్రత్యేక పాటల్లోనూ నటిస్తూ అభిమానులను అలరిస్తున్నారు. అలా ఇటీవల సూర్య కథానాయకుడిగా నటించిన రెట్రో చిత్రంలో స్పెషల్ సాంగ్లో నటించారు.అదే నా అందానికి రహస్యంతెలుగు చిత్రం మిరాయిలో ముఖ్య భూమిక పోషించారు. ఇప్పుడీమె వయసు 43 ఏళ్లు. ఈ వయసులోనూ తన అందాలను కాపాడుకుంటూ హోయలొలికిస్తున్నారు. తాజాగా తన బ్యూటీ రహస్యాన్ని ఇటీవల ఒక భేటీలో పేర్కొన్నారు. ముఖ్యంగా వ్యాయామం, ఆహారపు అలవాట్లు వంటి వాటికంటే మంచిని వినడం, మంచివి చూడడం, మంచి చేయడం వంటి విషయాలతో సౌందర్యం మన నుంచి దూరం కాదు అని పేర్కొన్నారు. సాధారణంగా చెడు వినవద్దు, చెడు కనవద్దు, చెడు మాట్లాడవద్దు అంటారు. దీనికి నటి శ్రియ కొత్త అర్థాన్ని చెబుతూ దాన్ని అందంతో పోల్చడం విశేషం! -
ఇడియట్స్ మళ్లీ కలిస్తే?
ఆమిర్ఖాన్ హీరోగా నటించిన ‘3 ఇడియట్స్’ మూవీ సీక్వెల్కి సన్నాహాలు మొదలయ్యాయని బాలీవుడ్ టాక్. రాజ్కుమార్ హిరాణి దర్శకత్వంలో ఆమిర్ఖాన్ హీరోగా, ఆర్. మాధవన్ , శర్మన్ జోషి, కరీనా కపూర్, బొమన్ ఇరానీ ప్రధానపాత్రల్లో నటించిన హిందీ సినిమా ‘3 ఇడియట్స్’. విధు వినోద్ చోప్రా నిర్మించిన ఈ చిత్రం 2009లో విడుదలై, బ్లాక్ బస్టర్గా నిలిచింది.‘3 ఇడియట్స్’ సినిమాకు సీక్వెల్ను రూపొందించే పనిలో ఉన్నారట రాజ్కుమార్ హిరాణి. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని, కథ పూర్తయిన తర్వాత ఈ చిత్రంపై అధికారిక ప్రకటన రావొచ్చనే టాక్ బాలీవుడ్లో తెరపైకి వచ్చింది. ‘3 ఇడియట్స్’ చిత్రం తొలిపార్టులో నటించిన ప్రధాన తారాగణ మంతా సీక్వెల్లోనూ నటిస్తారట. అంతేకాదు.. ఈ సినిమాలోని ప్రధానపాత్రధారులు 15 సంవత్సరాల తర్వాత కలుసుకుంటే ఏం జరుగుతుంది? అనే కోణంలో ‘3 ఇడియట్స్’ కథనం సాగుతుందని బాలీవుడ్ భోగట్టా.ఈ సంగతి ఇలా ఉంచితే.. ఆమిర్ఖాన్ , రాజ్కుమార్ హిరాణి కాంబినేషన్ లో ‘దాదా సాహెబ్ ఫాల్కే’ బయోపిక్ రానుందని ఓ ప్రకటన వచ్చింది. మరి.. ‘3 ఇడియట్స్’ సీక్వెల్ ముందు సెట్స్కి వెళుతుందా? లేక దాదా సాహెబ్ ఫాల్కే బయోపిక్ మొదలవుతుందా? అనేది తెలియాల్సి ఉంది. -
ఎంపీ కుమార్తె పెళ్లిలో కంగన డ్యాన్స్.. వీడియో వైరల్
హీరోయిన్గా పేరు తెచ్చుకుని ప్రస్తుతం భాజాపా తరఫున ఎంపీగా ఉన్న కంగనా రనౌత్.. ఈ మధ్య పెద్దగా వార్తల్లో కనిపించట్లేదు. లేదంటే ఎప్పుడో ఏదో విషయమై హాట్ టాపిక్ అవుతూనే ఉంటారు. చాన్నాళ్ల తర్వాత ఈమె గురించి సోషల్ మీడియాలో డిస్కషన్ నడుస్తోంది. దానికి కారణం ఓ పెళ్లిలో ఈమె చేసిన డ్యాన్స్. ఇంతకీ ఏంటి విషయం?(ఇదీ చదవండి: ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన ఎన్టీఆర్)గత కొన్నాళ్లు నుంచి చూసుకుంటే కంగన పేరు చెప్పగానే ఫైర్ బ్రాండ్ అనే మాటనే గుర్తొస్తుంది. బాలీవుడ్ స్టార్ హీరోలు, దర్శకులు, హీరోయిన్లు.. ఇలా ఎవరినీ వదిలిపెట్టకుండా విమర్శలు చేసింది. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ప్రత్యర్థులపైన విరుచుకుపడింది. అవార్డ్ ఫంక్షన్స్లో, డ్యాన్సులు చేయడం లాంటి వాటికి ఈమె పూర్తిగా వ్యతిరేకి. అలాంటిది ఇప్పుడు ప్రముఖ పారిశ్రామికవేత్త, సహచర ఎంపీ నవీన్ జిందాల్ కుమార్తె పెళ్లిలో డ్యాన్స్ చేసింది. ఆ వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.స్టేజీపై ఎంపీ నవీన్ జిందాల్తోపాటు, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా, ఎన్సీపీకి ఎంపీ సుప్రియా సులేతో పాటు వేదికగా కంగన కూడా హుషారుగా స్టెప్పులేసింది. అయితే ఈ వీడియోపై నెగిటివ్ కామెంట్స్ ఎక్కువగా వస్తున్నాయి. మూడు వివిధ పార్టీలకు చెందిన నాయకులు ఒకే చోట కలిసి స్టెప్పులేయడమే దీనికి కారణం.(ఇదీ చదవండి: దుబాయి యూట్యూబర్తో తెలుగు హీరోయిన్ ప్రేమ.. త్వరలో పెళ్లి)Supriya Sule and Mahua Moitra dancing along with Kangana Ranaut at BJP MP Naveen Jindal’s daughter’s weddingThis video is for all those supporters who risk their careers and lives for such leaders 🙌 pic.twitter.com/JsgnoVhDs2— Veena Jain (@Vtxt21) December 7, 2025 -
ఓటీటీకి మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ సీక్వెల్.. ఎక్కడ చూడాలంటే?
ఓటీటీలు వచ్చాక ఆడియన్స్ సినిమాలు చూసే ధోరణి పూర్తిగా మారిపోయింది. క్రైమ్ అండ్ సెస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు ఫుల్ డిమాండ్ పెరిగిపోయింది. కంటెంట్ నచ్చితే చాలు ఓటీటీల్లో అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. అలా 2020లో నెట్ఫ్లిక్స్లో విడుదలైన మర్టర్ మిస్టరీ థ్రిల్లర్ రాత్ అకేలి హై. కోవిడ్ సమయంలో ఈ మూవీ రిలీజైంది.తాజాగా ఈ చిత్రానికి కొనసాగింపుగా రాత్ అకేలి హై.. ది బన్సల్ మర్డర్స్ పేరుతో మరోసారి ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఇప్పటికే టీజర్ రిలీజ్ చేయగా ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సీక్వెల్ మూవీ డిసెంబర్ 19 నుంచి నెట్ఫ్లిక్స్ వేదకగా స్ట్రీమింగ్ కానుంది. ఇందులో నవాజుద్దీన్ సిద్ధిఖీ, రాధికా ఆప్టే మరోసారి తమ పాత్రల్లో అలరించనున్నారు. ఈ సీక్వెల్లో కొత్తగా చిత్రాంగద సింగ్, రజత్ కపూర్, రేవతి, దీప్తి నావల్, సంజయ్ కపూర్ కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీని ఇటీవల గోవాలో జరిగిన 56వ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ప్రీమియర్ షో ప్రదర్శించారు.ఈ సినిమాకు హనీ ట్రెహాన్ దర్శకత్వం వహించారు. స్మితా సింగ్ రాసిన ఈ థ్రిల్లర్ మూవీని ఆర్వీఎస్పీ, మాక్గఫిన్ పిక్చర్స్ బ్యానర్లపై నిర్మించారు. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ రాత్ అకేలి హై: ది బన్సాల్ మర్డర్స్ కోసం ఓటీటీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. #RaatAkeliHai : #TheBansalMurders Tamil Dubbed Movie OTT Release Sets To Premiere From December 19th on Netflix Also In Telugu Hindi pic.twitter.com/dxhpWaJ15l— SRS CA TV (@srs_ca_tv) December 7, 2025 -
రాత్రిపూట మనోజ్ ఫోన్ కాల్.. ఎంతో ఏడ్చా: బాలీవుడ్ నటుడు
సినిమా లేదా సిరీస్ బాగుందంటే జనం ఆటోమేటిక్గా చూస్తారు. సెలబ్రిటీలు కూడా ఆయా ప్రాజెక్ట్ను మెచ్చుకుంటూ పోస్టులు పెడతారు. అయితే బాలీవుడ్లో ఇలా మెచ్చుకునే ప్రోగ్రామ్స్ ఉండవంటున్నాడు నటుడు మనోజ్ బాజ్పాయ్. ఇతడు ప్రధాన పాత్రలో నటించిన హిట్ సిరీస్ 'ద ఫ్యామిలీ మ్యాన్'. ఈ సిరీస్ మూడో సీజన్ ఇటీవలే రిలీజవగా మంచి రెస్పాన్స్ వచ్చింది.జీవితంలో మర్చిపోలేనుతాజాగా ఫ్యామిలీ మ్యాన్ టీమ్ అంతా ఓ చిట్చాట్ నిర్వహించింది. ఈ సందర్భంగా జైదీప్ అహ్లావత్ మాట్లాడుతూ.. పాతాళ్ లోక్ సీజన్ 1 రిలీజైనప్పుడు మనోజ్ రాత్రిపూట నాకు ఫోన్ చేసి పావుగంటపైనే మాట్లాడాడు. అది నేను నా జీవితంలో మర్చిపోలేను. ఆ ఫోన్కాల్ తర్వాత నేనెంతో ఏడ్చాను అని చెప్పాడు. ఇంతలో మనోజ్ మాట్లాడుతూ.. ఆ రోజు ఫోన్లో ఏం చెప్పానంటే అతడు ఒక ఇన్స్టిట్యూషన్ ఓపెన్ చేస్తే అందులో తాను ఒక విద్యార్థిగా చేరతానన్నాను అని గుర్తు చేసుకున్నాడు. అభద్రతా భావం ఎక్కువఆ వెంటనే ఇండస్ట్రీలో ఇలా ఒకరినొకరు పొగడటం చాలా తక్కువ అని చెప్పాడు. ఏ సెలబ్రిటీ కూడా ఫోన్ చేసి నీ యాక్టింగ్ బాగుంది, నీ ప్రాజెక్ట్ బాగుంది అని చెప్పరు. ఎందుకంటే వాళ్లకు అభద్రతా భావం ఎక్కువ. ఇప్పటికీ నేను మంచి పాత్రల కోసం ఫోన్ చేసి అడుగుతుంటాను. కష్టజీవిగా ఉండటానికే నేను ఇష్టపడతాను అని మనోజ్(Manoj Bajpayee) చెప్పుకొచ్చాడు. కాగా మనోజ్ బాజ్పాయ్, జైదీప్ అహ్లావత్ (Jaideep Ahlawat).. గతంలో గ్యాంగ్ ఆఫ్ వాసేపూర్ అనే వెబ్ సిరీస్లో, చిట్టగ్యాంగ్ మూవీలో నటించారు.చదవండి: చిన్న వయసులో చాలా చూశా.. ఏడ్చేసిన కృతీ శెట్టి -
బాక్సాఫీస్ వద్ద దురంధర్ దూకుడు.. మూడు రోజుల్లోనే సెంచరీ!
బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్. ఈ మూవీకి ఆదిత్య ధార్ దర్శకత్వం వహించారు. ఈనెల 5న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. తొలి రోజే దాదాపు రూ.30 కోట్లకు వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం మూడు రోజుల్లోనే సెంచరీ దాటేసింది. ఈ సినిమా ఆదివారం నాటికి దేశవ్యాప్తంగా రూ. 103 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ సాధించింది. ఒక్క రోజే ఏకంగా రూ.43 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టింది. గ్రాస్ పరంగా చూస్తే రూ.123.5 కోట్లు వసూలు చేసింది.ఇక ప్రపంచవ్యాప్తంగా దురంధర్ హవా కొనసాగుతోంది. మూడు రోజుల్లోనే వరల్డ్ వైడ్గా రూ.152 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ క్రమంలోనే టైగర్ ష్రాఫ్ బాఘి 3 (రూ.137 కోట్లు), హృతిక్ రోషన్ విక్రమ్ వేద (రూ.135 కోట్లు), సన్నీ డియోల్ జాట్ (రూ.110 కోట్లు) చిత్రాలను అధిగమించింది. ఇదే జోరు కొనసాగితే తొలి వారంలోనే ధురంధర్ రూ.250 కోట్ దాటేలా కనిపిస్తోంది. కాగా.. ఈ మూవీని భారీ బడ్జెట్తో తెరకెక్కించారు. దాదాపు రూ.140 కోట్లకు పైగా బడ్జెట్తో నిర్మించారు. ఈ చిత్రంలో అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, ఆర్ మాధవన్ నటించారు. ఈ చిత్రం పార్ట్-2 మార్చి 19, 2026న విడుదల కానుంది. -
స్టార్ డైరెక్టర్తో సినిమా.. రూమర్స్పై స్పందించిన అమిర్ ఖాన్..!
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ కూలీ మూవీతో సూపర్ హిట్ కొట్టారు. ఈ చిత్రంలో రజినీకాంత్ హీరోగా నటించగా.. బాలీవుడ్ నటుడు అమిర్ ఖాన్ ప్రత్యేక పాత్రలో కనిపించారు. ఆ తర్వాత అమిర్ ఖాన్తో మూవీ తెరకెక్కించేందుకు లోకేశ్ రెడీ అయ్యారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న మూవీ కావడంతో అటు కోలీవుడ్.. ఇటు బాలీవుడ్ ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే ఇటీవల ఈ సినిమా రద్దైనట్లు సోషల్ మీడియాలో రూమర్స్ వినిపిస్తున్నాయి. అదే స్టోరీని మరో నటుడితో లోకేశ్ ప్లాన్ చేస్తున్నారని టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ వార్తలపై బాలీవుడ్ హీరో అమిర్ ఖాన్ స్పందించారు. తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న అమిర్ ఈ విషయంపై మాట్లాడారు. కాగా.. అమిర్తో సినిమా పవర్ఫుల్ యాక్షన్ మూవీ తెరకెక్కిస్తానని లోకేశ్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.మరోవైపు లోకేశ్ కనగరాజ్ ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం హీరోగా డీసీ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో వామిక గబ్బి హీరోయిన్గా కనిపించనుంది. అంతేకాకుండా రజనీకాంత్- కమల్హాసన్లతో లోకేశ్ మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలొచ్చాయి. దీంతో పాటు ఖైదీ -2 మూవీని ఎప్పుడో ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే లోకేశ్ బిజీగా ఉండడం వల్లే అమిర్ ఖాన్తో చిత్రంపై రూమర్స్ వచ్చినట్లు తెలుస్తోంది. -
డేంజర్ జోన్లో బాలీవుడ్ భామలు!
మొన్నటి వరకు వెండితెరపై బాలీవుడ్ భామలదే హవా. తెలుగుతో పాటు అన్ని భాషల్లోనూ వాళ్లే నటించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. బాలీవుడ్ని సౌత్ బ్యూటీస్ ఏలేస్తున్నారు. రష్మిక, సమంత, నయనతార లాంటి తారలు అన్ని భాషల్లో సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ అవుతుంటే.. బాలీవుడ్ భామలు మాత్రం కెరీర్ విషయంలో తడబడుతున్నారు. వరుస అపజయాల కారణంగా పాన్ ఇండియా సినిమాల్లోనే కాదు బాలీవుడ్లోనూ అవకాశాలు రావట్లేదు. ఇక దీపికా పదుకొణె లాంటి హీరోయిన్లు మాత్రం కండీషన్ల కారణంగా చేతికి వచ్చిన ప్రాజెక్టులను కోల్పోతూ.. కెరీర్ని నాశనం చేసుకుంటున్నారు.అలియా చేతితో ‘ఆల్ఫా’ ఒక్కటేబాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో అలియాభట్ ఒకరు. ఆర్ఆర్ఆర్ తర్వాత ఆమె ఇమేజ్ మరింత పెరిగింది. పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు సంపాదించుకుంది. కానీ ఆ స్థాయిలో మరో హిట్ మాత్రం పడలేదు. ఆమె ప్రధాన పాత్రలో నటించిన జిగ్రా చిత్రం భారీ అంచనాల మధ్య 2024లో ప్రేక్షకుల ముందుకు వచ్చి డిజాస్టర్గా నిలిచింది. రూ. 80 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రానికి కేవలం 32 కోట్ల వసూళ్లు మాత్రమే వచ్చాయి. అలియా కెరీర్లోనే ఇది బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ చిత్రంగా మిగిలిపోయింది. దీంతో అలియా చేతికి మరో భారీ ప్రాజెక్టు రాలేదు. ఇప్పుడు తన ఆశలన్నీ ‘ఆల్ఫా’ చిత్రం మీదే పెట్టుకుంది. యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్లో మొదటి ఫీమేల్-లెడ్ యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.హిట్ కోసం కృతి ఎదురుచూపులుబాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ గురించి తెలుగు ప్రేక్షకులకు కూడా ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మహేష్ బాబు, సుకుమార్ కాంబోలో వచ్చిన 1 నేనొక్కడినే చిత్రంతో నటిగా తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత బాలీవుడ్ షిఫ్ట్ అయ్యి అక్కడే వరుస సినిమాల్లో నటిస్తుంది. అయితే ఈ బ్యూటీ ఖాతాలో కూడా భారీ హిట్ లేదు. ధనుష్తో కలిసి నటించిన 'తేరే ఇష్క్ మే' ఈ మధ్య రిలీజై హిట్ టాక్ని సంపాదించుకుంది. అయితే కృతి చేతిలో మాత్రం ప్రస్తుతం భారీ ప్రాజెక్టులేవీ లేవు.కియారాకు వరుస షాకులుఅందం, అభినయం ఉన్న కియారా అద్వానీకి బాక్సాఫీస్ వద్ద వరస షాకులు తగులుతున్నాయి.‘భూల్ భులయ్యా 2’ తర్వాత కియరా ఖాతాలో హిట్ అనేదే లేదు. ‘జగ్ జగ్ జియో’ మొదలు గేమ్ ఛేంజర్ వరకు ఇలా ఆమె నటించిన భారీ చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. దీంతో కియరాకు అవకాశాలు తగ్గిపోయాయి. ప్రసుత్తం ఆమె చేతిన ఒకటి రెండు ప్రాజెక్టులు ఉన్నా.. వాటిపై పెద్ద అంచాలు అయితే లేవు.‘కండీషన్ల’తో రిస్క్ చేస్తున్న దీపికబాలీవుడ్ హీరోయిన్లలో దీపికా పదుకొణెది విచిత్రమైన పరిస్థితి. మిగతావాళ్లంతా భారీ ప్రాజెక్టులకు కోసం ఎదురు చూస్తుంటే..దీపికా పదుకొణె మాత్రం చేతికి వచ్చిన అవకాశాలను వదులుకొని కెరీర్ని రిస్క్లో పెడుతోంది. స్పిరిట్లో ప్రభాస్కు జోడీగా నటించే అవకాశం మొదట్లో దీపికా పదుకొణెకే వచ్చింది. అయితే ఆమె పెట్టిన పని గంటల కండీషన్ నచ్చక దర్శకుడు సందీప్ రెడ్డి వంగా.. ఆ ప్రాజెక్టు నుంచి దీపికను తప్పించాడు. ఆ తర్వాత 'కల్కి 2898 AD' సీక్వెల్ నుంచి కూడా ఆమె తప్పుకున్నారు.ప్రస్తుతం దీపికా రెండు భారీ సినిమాల్లో నటిస్తున్నారు. అందులో ఒకటి షారుఖ్ ఖాన్ ‘కింగ్’. ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ కానుంది. మరొకటి అల్లు అర్జున్-అట్లీ మూవీ. ఈ రెండింటిపైనే దీపికా ఆశలు పెట్టుకుంది. కానీ ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో కండీషన్స్ అంటూ దీపికా తన కెరీర్ని ప్రమాదంలోకి తీసుకెళ్తోంది. ఒవైపు సౌత్ స్టార్ల డామినేషన్..మరోవైపు కొత్త భామల దూకుడు కారణంగా ఈ బ్యూటీస్ కెరీర్ డేంజర్ పడింది. బాలీవుడ్లో తమ స్థానాన్ని కాపాడుకోవాలంటే..వీళ్లందరికి అర్జెంట్గా భారీ హిట్ పడాల్సిందే. -
60 ఏళ్లకు లవ్లో పడాలనుకోలే..
అరవై ఏళ్లకు ఎవరైనా రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తారు. కానీ సినిమా హీరోలు మాత్రం యంగ్ హీరోలకు పోటినిచ్చేలా ఎలాంటి సినిమాలు తీయాలన్న ప్లానింగ్లో ఉంటారు. బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ ఆ పనితో పాటు మరో పనిలో కూడా ఉన్నాడు. గౌరీ స్ప్రాట్తో ప్రేమాయణం నడుపుతున్నాడు. ఈ విషయాన్ని గతంలోనే అధికారికంగా వెల్లడించాడు.మూడోసారి ప్రేమలో..రెండు పెళ్లిళ్లు - విడాకుల తర్వాత ముచ్చటగా మూడోసారి ప్రేమలో పడ్డానని తెలిపాడు. కానీ ఈ ఏజ్లో లవ్లో పడతానని అస్సలు ఊహించలేదని, ప్రేమ కోసం పాకులాడలేదని చెప్తున్నాడు. తాజాగా ఓ వేదికపై ఆమిర్ ఖాన్ మాట్లాడుతూ.. నేను మళ్లీ రిలేషన్షిప్లో అడుగుపెడతానని అస్సలు అనుకోలేదు. కానీ గౌరీ నా జీవితంలో చాలా ప్రశాంతతను, స్థిరత్వాన్ని తీసుకొచ్చింది. తనొక అద్భుతమైన వ్యక్తి. తనను కలవడమే ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. గొడవల్లేవ్వైవాహిక బంధంలో సక్సెస్ అవకపోయినప్పటికీ మాజీ భార్యలు రీనా, కిరణ్లను కలుస్తూ ఉంటాను. ఇప్పుడు గౌరీ కూడా యాడ్ అయింది. నేను వ్యక్తిగా ఎదిగేందుకు వీళ్లంతా చాలా దోహదపడ్డారు. అందుకు నేను వారిని ఎంతో గౌరవిస్తాను. రీనా దత్తాతో నేను విడిపోయినప్పటికీ మా మధ్య ఎటువంటి గొడవలు లేవు. మంచి స్నేహితులుగా కలిసే ఉంటాం. ఫస్ట్ పెళ్లికిరణ్ విషయంలోనూ అంతే.. తను కూడా ఎంతో అద్భుతమైన వ్యక్తి. మేమిద్దరం భార్యాభర్తలుగా విడిపోయినప్పటికీ కుటుంబంగా మాత్రం కలిసే ఉన్నాం. రీనా.. ఆమె పేరెంట్స్, కిరణ్.. ఆమె పేరెంట్స్.. నా తల్లిదండ్రులు.. అందరూ ఒక కుటుంబంలా కలిసిమెలిసి ఉంటారు అని చెప్పుకొచ్చాడు. కాగా ఆమిర్ ఖాన్.. 1986లో రీనా దత్తాను పెళ్లాడాడు. వీరికి జునైద్ ఖాన్, ఇరా ఖాన్ సంతానం. రెండో పెళ్లికొంతకాలానికి దంపతుల మధ్య భేదాభిప్రాయాలు రావడంతో 2022లో విడిపోయారు. ఆ తర్వాత ఆమిర్ (Aamir Khan).. 2005లో కిరణ్ రావును పెళ్లి చేసుకున్నాడు . వీరికి కుమారుడు ఆజాద్ సంతానం. పెళ్లయిన 16 ఏళ్ల తర్వాత వీరు విడాకులు తీసుకున్నారు. ఇప్పుడు గౌరీ స్ప్రాట్తో ప్రేమాయణం సాగిస్తున్నాడు.చదవండి: తనూజ చెల్లి వివాహం.. ఫోటోలు వైరల్ -
దురంధర్ బాక్సాఫీస్.. అంచనాలను మించిపోయిన వసూళ్లు..!
బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ దురంధర్. ఈ చిత్రం ఇటీవల డిసెంబర్ 5న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాకు ఆదిత్య ధార్ దర్శకత్వం వహించారు. ఈ మూవీని జియో స్టూడియోస్, బీ62 స్టూడియోస్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మించారు. ఈ శుక్రవారం రిలీజైన దురంధర్ వసూళ్ల పరంగా దూసుకెళ్తోంది.ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ విడుదలైన రెండు రోజుల్లో రూ.60 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. మొదటి రోజు రూ.27 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. రెండో రోజు వీకెండ్ కలిసి రావడంతో రూ.33 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. ఇక దేశవ్యాప్తంగా రూ.72 కోట్ల గ్రాస్ రాగా.. ప్రపంచవ్యాప్తంగా చూస్తే రూ.88 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద రాణిస్తోంది. శనివారం రాత్రి షోల్లో 63 శాతం ఆక్యుపెన్సీని నమోదు చేసింది. ఆదివారం రోజు వరల్డ్ వైడ్ వందకోట్ల మార్క్ చేరుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. దురంధర్ ఉహించినా దానికంటే అధిక కలెక్షన్స్ రాబడుతోంది. దీంతో మేకర్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.కాగా.. ఈ మూవీలో అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం రణవీర్ సింగ్ సరసన సారా అర్జున్ హీరోయిన్గా నటించింది. పాకిస్తాన్ నేపథ్యంలో సాగే స్పై థ్రిల్లర్ మూవీని నిజ సంఘటనల ఆధారంగా తెరకెక్కించారు. ఈ చిత్రంలో రణ్వీర్ సింగ్ గూఢచారి పాత్ర పోషించారు. -
బాలీవుడ్ నటితో వాషింగ్టన్ సుందర్ డేటింగ్?
టీమిండియా యువ ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ డేటింగ్ అంటూ వార్తలు కొత్తేం కాదు. గతంలో ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు తరఫున ఆడుతున్నప్పుడు తెలుగు యాంకర్ వర్షిణితో ఇతడు డేటింగ్ చేస్తున్నాడనే రూమర్స్ వచ్చాయి. తర్వాత తర్వాత అవి కేవలం పుకార్లు మాత్రమే అని తేలిపోయాయి. ఇప్పుడు సుందర్, ఓ బాలీవుడ్ నటి, స్పోర్ట్స్ ప్రెజెంటర్తో డేటింగ్ చేస్తున్నాడని అనుకుంటున్నారు. ఇంతకీ ఏంటి విషయం?(ఇదీ చదవండి: ఇదో సైకో కథ, షాక్ ఇచ్చే క్లైమాక్స్.. ఓటీటీలో ఈ సినిమా చూశారా?) క్రికెటర్లు.. హీరోయిన్లతో డేటింగ్, పెళ్లి చేసుకోవడం లాంటివి కొత్తేం కాదు. ఇప్పుడు ఆ లిస్టులోకి సుందర్ చేరుతాడా అనిపిస్తుంది. ఎందుకంటే హిందీ నటి సాహిబా బాలీతో ఓ కేఫ్లో సుందర్ జంటగా కనిపించాడు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో క్లిప్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఇది ఎప్పటిది అనేది తెలియట్లేదు గానీ సుందర్-సాహిబా డేటింగ్ గురించి నెటిజన్లు తెగ మాట్లాడుకుంటున్నారు.సాహిబా బాలీ విషయానికొస్తే.. ఈమె కశ్మీరీ కుటుంబానికి చెందిన అమ్మాయి. నాటకాలతో మొదలుపెట్టి హిందీలో పలు సినిమాల్లో, వెబ్ సిరీస్ల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. గతేడాది ఐపీఎల్లో స్పోర్ట్స్ ప్రెజెంటర్గానూ కనిపించి ఆకట్టుకుంది. ఈ ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ టైంలోనూ క్రికెట్ యాంకర్గా పనిచేసింది. అయితే సుందర్-సాహిబా మధ్య ఉన్నది స్నేహమా? ప్రేమా అనేది తెలియదు గానీ సోషల్ మీడియాలో మాత్రం డేటింగ్ అని కామెంట్స్ వినిపిస్తున్నాయి.(ఇదీ చదవండి: అఖండ 2.. టాలీవుడ్కి ఓ గుణపాఠం!) -
రెండో పెళ్లి చేసుకున్న బిగ్బాస్ బ్యూటీ
బుల్లితెర నటి సారా ఖాన్ రెండో పెళ్లి చేసుకుంది. నటుడు క్రిష్ పాఠక్ను రెండు సాంప్రదాయాల ప్రకారం వివాహం చేసుకుంది. రామాయణ సీరియల్లో లక్ష్మణుడిగా నటించిన సునీల్ లాహిరి కుమారుడే క్రిష్ పాఠక్. డిసెంబర్ 5న ఇరు కుటుంబసభ్యులు సహా బంధుమిత్రులు, బుల్లితెర తారల సమక్షంలో ఈ వివాహం ఎంతో ఘనంగా జరిగింది. రెండో పెళ్లిఇందుకు సంబంధించిన ఫోటోలను సారా తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేసింది. ఈ కొత్త జంట తమ సంగీత్లో కూలీ సినిమాలోని మోనికా సాంగ్కు స్టెప్పులేశారు. అలాగే హిందీ పాటలకు సైతం కాలు కదిపారు. కాగా సారా ఖాన్.. సాప్న బాబుల్ కా బిడాయి సీరియల్తో బుల్లితెరకు పరిచయమైంది. బుల్లితెరపై, వెండితెరపై..పలు సీరియల్స్తో పాటు జర నాచ్కే దిఖా, నాచ్ బలియే 4 వంటి డ్యాన్స్ రియాలిటీ షోలలోనూ పాల్గొంది. డార్క్ రెయిన్బో, సైనైడ్, హమారీ అధూరీ కహాని వంటి చిత్రాల్లోనూ నటించింది. ఓటీటీలో లాక్ అప్ షోలోనూ పార్టిసిపేట్ చేసింది. హిందీ బిగ్బాస్ నాలుగో సీజన్లో సారా (Sara Khan) పాల్గొంది. అదే షోలో నటుడు అలీ మర్చంట్ కూడా పాల్గొన్నాడు. బిగ్బాస్ షోలో ఉన్నప్పుడే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు.మొదటి పెళ్లిబయటకు వచ్చాక 2010లో పెళ్లి చేసుకున్నారు. కానీ, వివాహమైన కొన్ని నెలలకే విడాకులు తీసుకున్నారు. తర్వాత అలీ మర్చంట్ 2016లో అనమ్ మర్చంట్ను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఈ బంధం కూడా ఎక్కువకాలం నిలవలేకపోయింది. 2021లో దంపతులిద్దరూ విడిపోయారు. దర్వాత తన స్నేహితురాలు ఆండ్లీబ్ జైదీని ముచ్చటగా మూడో పెళ్లి చేసుకున్నాడు. View this post on Instagram A post shared by Saaraa Khan (@ssarakhan) చదవండి: సమంత ఆ ఒక్క పని చేస్తే చాలు: హీరోయిన్ చిన్నత్త -
సమంత పక్కన కూర్చోవాలంటే సిగ్గేసింది!: రాజ్ పిన్ని
హీరోయిన్ సమంత, దర్శకుడు రాజ్ నిడిమోరు ఇటీవలే వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. కోయంబత్తూరులోని ఈషా సెంటర్లో భూతశుద్ధి పద్ధతిలో వీరి పెళ్లి ఎంతో సింపుల్గా జరిగింది. ఈ వివాహం గురించి సంగీత విద్వాంసురాలు శోభారాజు మాట్లాడారు. ఈమె ఎవరంటే.. అన్నమాచార్య సంకీర్తనలతో పాటు సంగీత దర్శకురాలిగా మంచి పేరు గడించింది డాక్టర్ శోభారాజు. శోభారాజు రియాక్షన్2010లో ఈమెను పద్మశ్రీ పురస్కారం వరించింది. ఈమెకు రాజ్ నిడిమోరు బంధువవుతాడు. శోభారాజు అక్క రమాదేవి కొడుకే రాజ్ నిడిమోరు. కోడలి వరసయ్యే సమంత గురించి శోభారాజు మాట్లాడుతూ.. ఒక ఆధ్యాత్మిక పద్ధతిలో వీరి పెళ్లి జరిగింది. ఆశ్రమంలో స్వామివారి ఆధ్వర్యంలో ఈ వివాహ వేడుక జరిగింది. రాజ్ అంటే నాకు చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచే..వాడు చిన్నగా ఉన్నప్పుడే ముద్దుగారే యశోద.. వంటి పాటలు నేర్చుకుని పాడేవాడు. మీ పిన్ని పేరు నిలబెట్టావని అందరూ వాడిని మెచ్చుకునేవాళ్లు. అది నాకు చాలా సంతోషంగా అనిపించేది. తను సంగీతం నేర్చుకుని ఎన్నో పాటలు పాడాడు. వాడికి స్పిరిచ్యువాలిటీ ఎక్కువ. సమంతకు కూడా ఆధ్యాత్మిక మార్గంపై ఆసక్తి ఉందని తెలిసింది.పక్కన కూర్చోవాలంటే సిగ్గేసిందిఓ రెండుసార్లు తను వచ్చినప్పుడు చూశాను, చాలా సన్నగా ఉంది. తన పక్కన కూర్చోవాలంటే సిగ్గేసింది. సన్నగా అవాలంటే ఎలా? అని అడిగినప్పుడు ఏవో ఎక్సర్సైజ్లు చెప్పింది, కానీ నేను చేయలేనన్నాను. తను మూడు నెలలకోసారి ఈషా ఆశ్రమానికి వెళ్లి మౌనం పాటిస్తూ సాధన చేస్తుందని తెలిసి సంతోషంగా అనిపించింది. బహుమతులు ఏమిచ్చారంటే?ఎంతో బిజీ నటి అయుండి ఇలా ధ్యానానికి సమయం కేటాయిస్తుందంటే ముచ్చటేసింది. అలాంటి అమ్మాయి రాజ్కు దొరకడం హ్యాపీ. సమంత (Samantha Ruth Prabhu) వాడిని మరింత ఆధ్యాత్మిక మార్గంలో నడిపిస్తుందని ఆశిస్తుందన్నాను. పెళ్లిలో ఆరోగ్యకరమైన ఆహారమే వడ్డించారు. అలాగే కెమికల్స్ వాడని పర్ఫ్యూమ్స్ కానుకగా ఇచ్చారు అని శోభా రాజు చెప్పుకొచ్చారు. చదవండి: పవన్ కల్యాణ్.. బిగ్బాస్ చరిత్ర తిరగరాయనున్నాడా? -
చెల్లి పెళ్లి చేసిన యంగ్ హీరో.. ఎమోషనల్ పోస్ట్
బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ ఇంట్లో పెళ్లి సందడి. ఇతడి చెల్లి కృతికకు శుక్రవారం ఉదయం ఘనంగా వివాహం జరిగింది. పైలట్ తేజస్వి కుమార్ సింగ్తో ఏడడుగులు వేసింది. కార్తీక్ ఆర్యన్ సొంతూరు అయిన గ్వాలియర్లోని ఓ రిసార్ట్లో ఈ శుభకార్యం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ క్రమంలో పెళ్లి ఫొటోలు పోస్ట్ చేసిన కార్తీక్.. భావోద్వేగానికి గురై పోస్ట్ పెట్టాడు.(ఇదీ చదవండి: అఖండ 2.. టాలీవుడ్కి ఓ గుణపాఠం!) 'నీ ప్రపంచం చాలా మారింది. అందులో ఈ రోజు ఒకటి. నా కికీని పెళ్లి కూతురిలా చూస్తుంటే ఇన్నేళ్లు ఒక్క క్షణంలా అనిపిస్తుంది. నువ్వు నా వెనక పరుగెత్తడం దగ్గర నుంచి ఇప్పుడు ఎంతో ఆనందంగా పెళ్లి కూతురిలా నడిచి వస్తున్నావ్. నిన్ను ఇలా చూస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది. నువ్వు ఓ కొత్త జీవితాన్ని ప్రారంభించొచ్చు. కానీ ఎప్పటికీ నువ్వు నా చిట్టి చెల్లిలివే. ఈ ప్రయాణం నువ్వు కోరుకున్నవన్నీ ఇస్తుందనుకుంటున్నాను' అని కార్తీక్ ఆర్యన్ ఎమోషనల్ అయిపోయాడు.కార్తీక్ ఆర్యన్ ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండానే హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. 2011 నుంచి బాలీవుడ్లో మూవీస్ చేస్తున్నాడు. ప్యార్ కా పంచనామా, లూకా చుప్పీ, పతీ పత్ని ఔర్ ఓ, భూల్ భులయ్యా 2, చందు ఛాంపియన్, భూల్ భులయ్యా 3 తదితర చిత్రాలతో క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ఇతడి చెల్లి పేరు కృతిక తివారీ. ఈమె డాక్టర్. ఇప్పుడు ఈమెకే పెళ్లయింది. కార్తీక్ ప్రస్తుతం 'తూ మేరీ మైన్ తేరా మైన్ తేరీ తు మేరీ' అనే సినిమా చేశాడు. ఈ నెల 25న థియేటర్లలోకి రానుంది. (ఇదీ చదవండి: ఈ ఏడాది టాప్- 10 సినిమాలు ఇవే.. తెలుగు నుంచి ఒకే ఒక్కటి) View this post on Instagram A post shared by KARTIK AARYAN (@kartikaaryan) -
బేబీ బంప్ ఫోటోలు షేర్ చేసిన హీరోయిన్
బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ త్వరలోనే రెండోసారి తల్లి కాబోతోంది. ఈ విషయాన్ని ఇటీవలే సోషల్ మీడియాలో వెల్లడించింది. తాజాగా ఈ నటి తన బేబీ బంప్ ఫోటోలను ఆన్లైన్లో షేర్ చేసింది. నల్లటి బనారస్ చీరలో బేబీ బంప్తో ఉన్న నటి ఫోటోలను చూసిన అభిమానులు బేబీ ఆన్ ద వే అంటూ కామెంట్లు చేస్తున్నారు.వ్యాపారవేత్తతో పెళ్లిప్రముఖ నటుడు అనిల్ కపూర్ కుమార్తె సోనమ్ కపూర్, వ్యాపారవేత్త ఆనంద్ అహూజా 2018 మేలో పెళ్లి చేసుకున్నారు. వీరికి 2022లో వాయు అనే కుమారుడు జన్మించాడు. సినిమాల విషయానికి వస్తే.. సంజయ్ లీలా భన్సాలీ డైరెక్షన్లో 'సావరియా' మూవీతో సోనమ్ వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. సినిమాలుబాంబే టాకీస్, బ్లైండ్, ప్రేమ రతన్ ధన్పాయో, నీర్జా, సంజు, థాంక్యూ, రాంఝన, ఖుబ్సూరత్ వంటి చిత్రాలు ఆమెకు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. ప్రస్తుతం సోనమ్ (Sonam Kapoor) బ్యాటిల్ ఫర్ బిట్టోరా సినిమా చేస్తోంది. ఇది అనూజా చౌహాన్ నవల ఆధారంగా తెరకెక్కుతోంది. ఇది ప్రకటించి రెండేళ్లవుతున్నా మళ్లీ దానిపై ఎటువంటి అప్డేట్ లేదు. View this post on Instagram A post shared by Sonam A Kapoor (@sonamkapoor) చదవండి: జుట్టు పీక్కునేలా గొడవలు పడ్డాం: హీరోయిన్ -
జుట్టు పీక్కునేంతలా మామధ్య గొడవలు: సోనాక్షి
ఈరోజుల్లో ప్రేమపెళ్లి అనేది కామన్. కానీ భిన్న వర్గాలవారు పెళ్లి చేసుకుంటేనే సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తారు. బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హ అలాంటి ట్రోలింగ్ బారిన పడింది. ఈమె జహీర్ ఇక్బాల్ను ప్రేమించి పెళ్లాడింది. అయితే అన్ని ప్రేమకథల్లోలాగే తమ లవ్స్టోరీలో కూడా చాలా గొడవలు జరిగాయంటోంది.గొడవలుసోనాక్షి మాట్లాడుతూ.. మేము మూడేళ్లపాటు ప్రేమలో ఉన్నాక మామధ్య చాలా గొడవలు జరిగాయి. ఎంతలా అంటే ఒకరి జుట్టు మరొకరు పట్టుకుని పీక్కునేంతలా! అసలు ఒకరి ఆలోచనలను మరొకరం అర్థం చేసుకోలేకపోయాం. అలా అని విడిపోవాలనుకోలేదు. దీన్ని పరిష్కరించుకోవాలనుకున్నాం. నెగెటివ్గా చూడొద్దని..కపుల్స్ థెరపీకి వెళ్దామని జహీర్ ఐడియా ఇచ్చాడు. ఈ ఆలోచనేదో బాగుందనిపించింది. రెండు సిట్టింగ్స్లోనే మా మధ్య గొడవలు పరిష్కారమయ్యాయి. ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్నాం. ప్రతీది నెగెటివ్గా చూడకూడదని తెలుసుకున్నాం అని చెప్పుకొచ్చింది. అలా ఏడేళ్లు ప్రేమలో మునిగి తేలిన సోనాక్షి (Sonakshi Sinha), జహీర్ 2024 జూన్ 23న పెళ్లి చేసుకున్నారు. ముంబైలో గ్రాండ్ రిసెప్షన్ కూడా ఏర్పాటు చేశారు. సల్మాన్ పార్టీలో తొలిసారి..ఇకపోతే వీరిద్దరూ డబుల్ XL (2022) అనే మూవీలో నటించారు. అంతకంటే ముందు వీరు సల్మాన్ ఖాన్ హోస్ట్ చేసిన పార్టీలో కలిశారు. తర్వాత 2017లో ట్యూబ్లైట్ ప్రీమియర్లో మరోసారి కలుసుకున్నారు. అప్పుడే సరదాగా ఐదుగంటల పాటు మాట్లాడుకున్నారు. అప్పుడే ఈ బంధం ఏదో స్పెషల్గా ఉందని సోనాక్షికి అర్థమైంది. తర్వాత అదే నిజమై వైవాహిక బంధంగా మారింది. సోనాక్షి చివరగా జటాధర అనే తెలుగు మూవీలో నటించింది.చదవండి: పవన్ కల్యాణ్.. బిగ్బాస్ చరిత్ర తిరగరాయనున్నాడా? -
తండ్రయిన వెంటనే ఖరీదైన కారు కొన్న హీరో
బాలీవుడ్ స్టార్ జంట విక్కీ కౌశల్- కత్రినా కైఫ్ ఇటీవలే తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందారు. నవంబర్ 7న కత్రినా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. బాబును ఆడించడంలోనే ఈ దంపతులిద్దరూ ఫుల్ బిజీగా ఉన్నారు. బాబు పుట్టాక తొలిసారి ఓ ఖరీదైన వస్తువు కొన్నారు.లగ్జరీ కారులెక్సస్ బ్రాండ్కు LM350h 4S మోడల్ కారును తమ సొంతం చేసుకున్నారు. దీని విలువ రూ.3.20 కోట్లు ఉన్నట్లు తెలుస్తోంది. విక్కీ కౌశల్ ఈ కారును నడుపుతున్న పలు వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ కారులో ప్రీమియం సౌండ్తో పాటు 48 ఇంచుల హెచ్డీ డిస్ప్లే ఉంది. సీటింగ్ కూడా ఎంతో సౌకర్యంగా ఉంటుంది.అదో కొత్త ఫీలింగ్ఇకపోతే ఈ ఏడాది తనకు ఎక్కువ సంతోషాన్నిచ్చిన క్షణం.. తాను తండ్రవడమేనని ఓ ఇంటర్వ్యూలో మాట్లాడాడు విక్కీ కౌశల్. అది మాటల్లో చెప్పలేని అనుభూతి అని, ఒక మ్యాజికల్ మూమెంట్ అని పేర్కొన్నాడు. ఈ సమయం వచ్చినప్పుడు కచ్చితంగా భావోద్వేగానికి లోనవుతానని తనకు తెలుసని.. బాబును చేతుల్లోకి తీసుకున్నప్పుడు మనసుకెంతో ప్రశాంతంగా అనిపించిందన్నాడు. అలాంటి అనుభూతి అంతకుముందెన్నడూ కలగలేదని గుర్తు చేసుకున్నాడు. కాగా విక్కీ కౌశల్ (Vicky Kaushal), కత్రినా 2021 డిసెంబర్ 9న పెళ్లి చేసుకున్నారు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani)చదవండి: అఖండ 2.. ఇప్పట్లో రిలీజ్ లేనట్లేనా? -
లండన్లో రాజ్... సిమ్రాన్
సినిమా ప్రేమికులందరూ అమితంగా ఇష్టపడిన ప్రేమ కావ్యం ‘దిల్వాలే దుల్హనియా లే జాయేంగే’. ఈ సినిమాలో రాజ్ (షారుక్ ఖాన్), సిమ్రాన్ (కాజోల్)ల ప్రేమకథ ప్రేక్షకులను ఏ స్థాయిలో అలరించిందో తెలిసిందే. తాజాగా లండన్స్ లోని లీసెస్టర్ స్క్వేర్లో రాజ్, సిమ్రాన్ల కాంస్య విగ్రహాలను ఏర్పాటు చేయడం విశేషం. లండన్ లీసెస్టర్ స్క్వేర్లో విగ్రహ రూపంలో ఆవిష్కరింపబడ్డ తొలి ఇండియన్ సినిమా ‘దిల్వాలే దుల్హనియా లే జాయేంగే’ కావడం ఓ అరుదైన గౌరవం. షారుక్ ఖాన్, కాజోల్ జోడీగా ఆదిత్యా చోప్రా దర్శకత్వం వహించిన చిత్రం ‘దిల్వాలే దుల్హనియా లే జాయేంగే’.యశ్ చోప్రా నిర్మించిన ఈ సినిమా 1995 అక్టోబరు 20న విడుదలైంది. అత్యధిక రోజులు ప్రదర్శితమైన సినిమాగా అరుదైన ఘనతను సాధించిన చిత్రం కూడా ఇదే. తెలుగులో ‘ప్రేమించి పెళ్లాడుతా’ పేరుతో రిలీజై, ఇక్కడా భారీ వసూళ్లతో బాక్సాఫీస్ని షేక్ చేసింది. ఈ సినిమా విడుదలై 30 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ మూవీలో షారుక్–కాజోల్ల సిగ్నేచర్ పోజుతో కూడిన కాంస్య విగ్రహాలను రూపొంందించారు. లండన్లోని లీసెస్టర్ స్క్వేర్లో ఏర్పాటు చేసిన ఈ విగ్రహాలను షారుక్, కాజోల్ ఆవిష్కరించారు.ఈ కార్యక్రమానికి యశ్ రాజ్ ఫిల్మ్స్ సీఈఓ అక్షయ్ విదానీ, హార్ట్ ఆఫ్ లండన్ బిజినెస్ అలయన్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రాస్ మోర్గన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా షారుక్ ఖాన్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాని స్వచ్ఛమైన మనసుతో ఎంతగానో ప్రేమించి తీశాం. ఈ చిత్రం రిలీజైనప్పటి నుంచి ఇప్పటివరకు నేను, కాజోల్ ప్రేక్షకుల నుంచి ప్రేమను పొంందుతూనే ఉన్నాం’’ అని తెలిపారు. కాజోల్ మాట్లాడుతూ– ‘‘లండన్లో విగ్రహం ఆవిష్కరించిన దృశ్యాన్ని చూసినప్పుడు... ఆ చారిత్రాత్మక అనుభూతిని మళ్లీ పొంందినట్లుగా అనిపించింది’’ అని పేర్కొన్నారు. -
'బాలీవుడ్ అంతా మొసళ్లతో నిండిపోయింది'.. నటి సంచలన కామెంట్స్..!
ప్రముఖ బాలీవుడ్ నటి దివ్య ఖోస్లా ఆసక్తికర కామెంట్స్ చేసింది. బాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం మొసళ్లతో నిండిపోయిందంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన దివ్య ఖోస్లా ఇండస్ట్రీని ఉద్దేశించి మాట్లాడింది. తాను విలువలతో రాజీ పడకుండా నిజాయితీగా ఉంటానని తెలిపింది. అవకాశాల కోసం తానెప్పుడు ఆత్మ గౌరవాన్ని అమ్ముకోనని దివ్య ఖోస్లా పేర్కొంది. ఆస్క్ మీ ఎనిథింగ్ పేరుతో నిర్వహించిన ఈ సెషన్లో పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చింది.దివ్య ఖోస్లా మాట్లాడుతూ..'బాలీవుడ్లో చాలా మొసళ్లు ఉన్నాయి. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. ఇక్కడ నువ్వు నిజాయితీగా ఉండటం చాలా ముఖ్యం. పని కోసం నా ఆత్మ గౌరవాన్ని నేను ఎప్పుడూ అమ్ముకోను. యూకేలో ఓ సినిమా కోసం సున్నా డిగ్రీల టెంపరేచర్లో దాదాపు 42 రోజుల పని చేశా. అది నా కెరీర్లో అత్యంత అద్భుతమైన షూట్. దాదాపు మైనస్ 10 డిగ్రీలు.. అయినా కూడా నాన్-స్టాప్గా చిత్రీకరించాం. ఇతర సినిమాలతో పోల్చడానికి నాకు ఒక బెంచ్మార్క్ను ఏర్పాటు చేసింది.' అని తెలిపింది.అంతేకాకుండా భూషణ్కుమార్తో విడాకులపై కూడా దివ్య ఖోస్లా స్పందించింది. మీరు విడాకులు తీసుకుంటున్నారా? అని అడగ్గా.. ఆమె క్లారిటీ ఇచ్చింది. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదు.. కానీ మీడియా అది నిజం కావాలని కోరుకుంటుందని షాకింగ్ కామెంట్స్ చేసింది. కాగా.. ఆమె 2005లో టీ-సిరీస్ ఛైర్మన్, ఎండీ భూషణ్ కుమార్ను వివాహం చేసుకుంది. ఇక సినిమాల విషయానికొస్తే దివ్య ఖోస్లా చివరిసారిగా నీల్ నితిన్ ముఖేష్తో కలిసి నటించిన థ్రిల్లర్-కామెడీ ఏక్ చతుర్ నార్లో కనిపించింది. -
18 ఏళ్లకే అమరుడు.. ఓటీటీకి వచ్చేసిన వీరుడి బయోపిక్..!
పిన్న వయసులోనే దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఖుదీరామ్ బోస్ జీవితం ఎంతోమంది యువతకు ఆదర్శం. ఆయన జీవితం ఆధారంగా తెరకెక్కించిన చిత్రం ఖుదీరామ్ బోస్. ఈ చిత్రానికి విద్యాసాగర్ రాజు దర్శకత్వం వహించగా.. విజయ్ నిర్మించారు. దేశభక్తి ప్రధానంగా రూపొందిన ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ మూవీని ఇప్పటికే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వేడుకల్లో ప్రదర్శించారు.తాజాగా ఈ చిత్రంలో ఓటీటీకి వచ్చేసింది. కేంద్ర ప్రభుత్వ అధికారిక ఓటీటీ ఫ్లాట్ఫామ్ వేవ్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ విషయాన్ని కోలీవుడ్ స్టార్ రజినీకాంత్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ మూవీ ప్రస్తుతం హిందీ, తెలుగు, తమిళం, బెంగాలీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. కాగా.. డిసెంబర్ 3, 1889న జన్మించిన ఖుదీరామ్ బోస్ కేవలం 18 ఏళ్ల వయసులోనే దేశం కోసం తన ప్రాణాలర్పించాడు. ఇటీవలే అతని జయంతి సందర్భంగా యావత్ దేశం నివాళులర్పించింది కాగా.. ఈ సినిమాలో రాకేశ్ జాగర్లమూడి, వివేక్ ఒబెరాయ్, అతుల్ కులకర్ణి కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతమందించారు. Khudiram Bose is streaming on the Central Government’s Waves OTT. Wishing the team all the very best. pic.twitter.com/t6CAzvhPto— Rajinikanth (@rajinikanth) December 5, 2025 -
విమానాలు రద్దు.. 'లక్షలు' ఖర్చు చేసిన సెలబ్రిటీలు
దేశవ్యాప్తంగా ప్రస్తుతం విమాన సర్వీసులు రద్దు అనే విషయం హాట్ టాపిక్ అయిపోయింది. తాజాగా మారిన నిబంధనల వల్ల ఎక్కడిక్కడ సిబ్బంది కొరత ఏర్పడింది. దీంతో విమానాలు రద్దయ్యాయి. చాలామంది సామాన్యులు.. విమానాశ్రయాల్లో గంటలు గంటలు పడిగాపులు కాస్తున్నారు. వీళ్లలో పలువురు సెలబ్రిటీలు కూడా ఉన్నారు. విమానాలు వాయిదా, రద్దు కారణంగా తామెంత ఫస్టేషన్కి గురవుతున్నామో చెప్పుకొచ్చారు.(ఇదీ చదవండి: ప్రియుడిని పరిచయం చేసిన 'బిగ్బాస్' పునర్నవి)రెండు రోజుల క్రితం తెలుగు సీనియర్ నటుడు నరేశ్.. విమాన సర్వీస్ ఆలస్యం కారణంగా తనెలాంటి ఇబ్బంది ఎదుర్కొన్నారో రాసుకొచ్చారు. చెప్పిన టైమ్కి చేరుకున్నా సరే విమానాలు లేటు అయ్యాయని, దీనికి తోడు తమ లాంటి నటులకు ప్రైవసీ కూడా కరువైందని, జనాలు గుర్తుపట్టేస్తున్నారని చెప్పుకొచ్చారు. ఈ మేరకు ఓ వీడియోని పోస్ట్ చేశారు.మరోవైపు బాలీవుడ్ సింగర్ రాహుల్ వైద్య.. స్టేజీ ప్రోగ్రాం కోసం గోవా-ముంబై, ముంబై నుంచి కోల్కతా వెళ్లాల్సి ఉంది. అయితే తన ఫ్లైట్ టికెట్స్ క్యాన్సిల్ కావడంతో ఏకంగా రూ.5.40 లక్షలు ఖర్చు చేసి వేరే విమానంలో వెళ్లాల్సి వచ్చిందని చెప్పి అసహనం వ్యక్తం చేశారు. నటి నియా శర్మ కూడా ఇలా తను బుక్ చేసుకున్న ఫ్లైట్ రద్దయిన కారణంగా.. ఏకంగా రూ.54 వేలు చెల్లించి మరో విమానంలో తన గమ్యస్థానానికి చేరాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది. తన టీమ్ సభ్యుల్లో నలుగురు.. మూడు వేర్వేరు విమానల్లో గమ్యస్థానానికి చేరుకున్నామని కూడా చెప్పుకొచ్చింది. వీళ్లే కాదు ఇలా తమ ఇబ్బందిని బయటపెట్టని సెలబ్రిటీలు మరికొందరు కూడా ఉండొచ్చు.(ఇదీ చదవండి: 'అఖండ 2' విడుదల వాయిదాకు కారణాలివే!)The fun of Flying ended in the 90s 🥹. Reached in time at HYD Indigo terminal at 8:15 AM. All Indigo flights delayed . Packed food by then to eat in the flight. Shopping & rush back to see a full scale battle between the ground crew and passenger. Filth🤬. To make matters worse,… pic.twitter.com/rj7bCArbgD— Naresh Vijaya Krishna (@ItsActorNaresh) December 3, 2025 View this post on Instagram A post shared by Vidyullekha / Vidyu Raman (@vidyuraman) -
రణవీర్ సింగ్ ‘దురంధర్’ మూవీ ట్విటర్ రివ్యూ
బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘దురంధర్’. ఆదిత్య ధర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్ కీలక పాత్రలు పోషించారు. భారీ అంచనాల మధ్య నేడు(డిసెంబర్ 5)ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు సంబంధించిన పెయిడ్ ప్రీమియర్స్ డిసెంబర్ 4న తేది రాత్రే పడిపోయాయి. దీంతో సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. దురంధర్ ఎలా ఉంది? రణ్వీర్ ఖాతాలో హిట్ పడిందా లేదా? తదితర అంశాలను ఎక్స్లో చర్చిస్తున్నారు. అవేంటో చదివేయండి.ఎక్స్లో దురంధర్ చిత్రానికి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. సినిమా బాగుందని, రణ్వీర్ వన్మ్యాన్ షో అంటూ అని పలువురు నెటిజన్స్ ట్వీట్స్ చేస్తున్నారు.Dhurandhar is a decent patriotic actiondrama with solid thrills. Ranveer Singh impresses as Major Mohit, and the action + BGM work well. Story familiar hai, par presentation engaging banati hai.⭐️⭐️⭐️/5 — Massy,emotional & good one-time watch.#Dhurandhar #DhurandharReview pic.twitter.com/RkGCCeOIur— Critixpro (@CritixPro999) December 5, 2025‘దురంధర్’ దేశభక్తిని రేకెత్తించే డీసెండ్ యాక్షన్ డ్రామా. అద్భుతమైన థ్రిల్లింగ్స్ అంశాలు ఉన్నాయి. మేజర్ మోహిత్ పాత్రలో రణవీర్ సింగ్ ఆకట్టుకున్నాడు. పోరాట ఘట్టాలు, నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్ అయింది. తెలిసిన కథే అయినా కథనం ఎంగేజింగ్గా ఉంటుందంటూ ఓ నెటిజన్ 3 రేటింగ్ ఇచ్చాడు. What a magnificent first half!🔥 Aditya Dhar has cooked with the intense scenes,Akshay Khanna is out of the box,R Madhavan delivers his best,trust me there are hardly action sequences in first half,still Dhar has managed to keep gripping screenplay just with convos #Dhurandhar https://t.co/6rfOSlsX7p pic.twitter.com/s0REydeUQp— Shahid (@CinephileScribe) December 5, 2025 ఫస్టాఫ్ అద్భుతంగా ఉంది. ఆదిత్య ధార్ కొన్నీ సీన్లను అద్భుతంగా తీర్చిదిద్దాడు. అక్షయ్ ఖన్నా, మాధవన్ కెరీర్ బెస్ట్ ఫెర్మార్మెన్స్ ఇచ్చారు. ఫస్టాఫ్లో యాక్షన్ సన్నివేశాలు తక్కువగానే ఉన్నాయి. అయినప్పటికీ ఆదిత్య ధార్ కేవలం డైలాగ్స్తోనే స్క్రీన్ ప్లేను అసక్తికరంగా మార్చాడు అని ఓ నెటిజన్ రాసుకొచ్చాడు.#Dhurandhar Interval: It was good, not Great, but theek hai 1st half Takes time to buildup & film lengthy feel hoti hai Bcoz of The film has been presented till now but let's see hoping for the better 2nd half 🫡I have fate in Aditya Dhar Hoping for the Best!🫡 pic.twitter.com/UmbzoQ7u5B— DEV KA REVIEW (@DEVKAREVIEW3180) December 5, 2025#Dhurandhar It’s INTERVAL🔥Mass Cinema + Solid Content = Mr.DHARPure Cinema Peaks Here @AdityaDharFilms Stay Away From Social Media Freaks, Book Seats & Enjoy Gripping Spy Thriller🇮🇳Stay Tuned For Full Review….#RanveerSingh @yamigautam #Madhvan— Bollywood Legacy Channel (@LegacyChannel_) December 5, 2025 -
పదింటిలో 9 ఆఫర్స్ రిజెక్ట్.. ఖాళీగా ఉన్నా ఓకే!
కొత్త బంగారు లోకం సినిమాతో యూత్ అందర్నీ తనవైపు తిప్పుకుంది శ్వేతా బసు ప్రసాద్. ఫస్ట్ సినిమాతోనే ప్రేక్షకలోకాన్ని మెప్పించిన ఈ బ్యూటీ తర్వాత మాత్రం ఆ క్రేజ్ను కాపాడుకోలేకపోయింది. అలా తెలుగు తెరకు నెమ్మదిగా దూరమైంది. ప్రస్తుతం ఓటీటీలో సినిమాలు, సిరీస్లు చేస్తోంది. సెలక్టివ్గా ముందుకెళ్తున్నా!ఇటీవలే మహారాణి వెబ్ సిరీస్ నాలుగో సీజన్లో కనువిందు చేసింది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో ప్రేక్షకుల దృష్టి కోణం నుంచి ఆలోచించే కథలు ఎంపిక చేసుకుంటున్నానని చెప్తోంది. ఇంకా మాట్లాడుతూ.. నేను ఎప్పుడూ ఏదో ఒక ప్రాజెక్ట్ చేస్తూనే ఉన్నాను. అలా అని వచ్చిన అవకాశాలన్నింటికీ ఓకే చెప్పడం లేదు. చాలా సెలక్టివ్గా కథలు ఎంచుకుంటున్నాను. భయం లేదుఅందుకే జనాలకు నాపై ఓ నమ్మకం ఉంది. అంత జాగ్రత్తగా పాత్రలు సెలక్ట్ చేసుకుంటున్నాను. కానీ, భవిష్యత్తులో నా ఎంపిక తప్పవొచ్చేమో! చెప్పలేం. ఒకవేళ అలాంటిదేమైనా జరిగితే వాటి నుంచి నేర్చుకుని ముందుకు వెళ్తాను. ప్రయోగాలు చేయడానికి నాకేమాత్రం భయం లేదు. కానీ, అవకాశాలకు నో చెప్పడానికి మాత్రం అస్సలు భయపడను. అవన్నీ రిజెక్ట్నిజం చెప్పాలంటే నాకు వచ్చే 10 ప్రాజెక్టుల్లో తొమ్మింటిని రిజెక్ట్ చేస్తూ ఉంటాను. దానివల్ల నేను ఆరు నెలలు ఇంట్లో ఖాళీగా కూర్చున్నా మరేం పర్లేదు. సరైన అవకాశం కోసం ఎదురుచూస్తూ ఉంటాను. నా జీవితంలో పెద్దగా ఖర్చులంటూ ఏమీ ఉండవు. పెద్దగా పార్టీలకు కూడా వెళ్లను. కాబట్టి ఇదంతా నాకు పెద్ద విషయమే కాదు అని శ్వేతా బసు ప్రసాద్ (Shweta Basu Prasad) చెప్పుకొచ్చింది.చదవండి: శంకర్ సినిమాలో హీరో సూర్య -
మొదట ప్రేమించిన వ్యక్తిని పెళ్లాడొద్దు.. అమ్మ సలహా!
కెవ్వు కేక, చయ్యచయ్య చయ్యా, మున్నీ బద్నాం హూయి.. వంటి పాటలతో దుమ్ములేపింది మలైకా అరోరా. ఆకర్షణీయమైన అందం, అదిరే స్టెప్పులతో అభిమానులను ఉర్రూతలూగించింది. ఇటీవలే థామా సినిమాలోనూ 'పాయిజన్ బేబీ' పాటలో తళుక్కుమని మెరిసింది. ఐటం సాంగ్స్ స్పెషలిస్ట్గా వెండితెరపై ఓ వెలుగు వెలిగిన ఈ బ్యూటీ పర్సనల్ లైఫ్లో మాత్రం ఎన్నో ఒడిదుడుకులను చూసింది.పెళ్లి - విడాకులుఓ కాఫీ యాడ్ షూట్లో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ సోదరుడు, నటుడు అర్బాజ్ ఖాన్ను కలిసింది మలైకా. తొలిచూపులోనే ఇద్దరూ ప్రేమలో పడ్డారు. వెంటనే మరేం ఆలోచించకుండా పెళ్లి చేసుకుంది. వీరికి కుమారుడు అర్హాన్ ఖాన్ సంతానం. రానురానూ దంపతుల మధ్య భేదాభిప్రాయాలు రావడంతో 2015లో వీరిద్దరూ విడిపోయారు. యంగ్ హీరోతో డేటింగ్అనంతరం తనకంటే వయసులో 12 ఏళ్లు చిన్నవాడైన హీరో అర్జున్ కపూర్తో ప్రేమలో పడింది. కొన్నేళ్లపాటు డేటింగ్ చేసిన వీరు ఆ తర్వాత సడన్గా బ్రేకప్ చెప్పుకున్నారు. ప్రస్తుతం ఈ బ్యూటీ హర్ష్ మెహతా అనే వ్యాపారితో ప్రేమలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే తాజాగా మలైకా అరోరా ఓ ఇంటర్వ్యూలో తన తల్లి ఇచ్చిన సలహాను ఎలా పెడచెవిన పెట్టిందో చెప్పుకొచ్చింది. డేట్ చేసినవాడితో పెళ్లెందుకు?ఆమె మాట్లాడుతూ.. మా అమ్మ ఎప్పుడూ జీవితాన్ని ఎంజాయ్ చేయమని చెప్తుండేది. ఫస్ట్ ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవద్దని సలహా ఇచ్చింది. కానీ, నేనదే చేశాను. నేను ప్రేమించిన మొదటి వ్యక్తినే పెళ్లాడాను. నా నిర్ణయాన్ని అమ్మ తప్పుపట్టింది. అప్పుడే పెళ్లి చేసుకుంటే నీకోసం బయట ఏం దాగి ఉందో నీకెలా తెలుస్తుంది? అని కంగారుపడింది. ఏం కాదమ్మా.. అని సర్ది చెప్పాను. మేం ఏం చేయాలనుకున్నా సరే తనెన్నడూ అడ్డు చెప్పలేదు.మగవాళ్లను తప్పుపట్టరుకానీ ఈ ప్రపంచంలో మగవాడు ఏం చేయాలనుకున్నా ఎవరూ తప్పుపట్టరు. విడాకులు తీసుకున్నా.. తన వయసులో సగం ఏజ్ ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నా సరే.. వావ్ అని పొగుడుతారు. అదే పని మహిళ చేస్తే మాత్రం ఆమెను నానామాటలంటారు. అంతెందుకు? ఆడవాళ్లు ధైర్యంగా నిలబడి ముందుకెళ్తుంటే కూడా చూసి ఓర్వలేరు అని మలైకా అరోరా (Malaika Arora) చెప్పుకొచ్చింది.చదవండి: టికెట్ టు ఫినాలే గెలిచేదెవరు?


