breaking news
Bollywood
-
హీరోయిన్లు ఎక్కువసేపు కనిపించొద్దట, ఐటం సాంగ్ చాలట! హీరోలపై ఫైర్
హీరోలు వారి స్వార్థం కోసం సంగీతాన్ని చంపేస్తున్నారు అంటున్నాడు బాలీవుడ్ దర్శకుడు కునాల్ కోహ్లి (Kunal Kohli). ఐటం సాంగ్స్ ఉంటే చాలని ఫీలవుతున్నారంటూ సోషల్ మీడియా వేదికగా కథానాయకుల తీరును ఎండగట్టాడు. అదే సమయంలో అహాన్ పాండే, అనీత్ పడ్డా డెబ్యూ సినిమా 'సైయారా'కి పాటల వల్లే మంచి బజ్ వస్తుండటంపై ప్రశంసలు కురిపించాడు.ఐటం సాంగ్స్ మాత్రమే హిట్టా?'ఈ రోజుల్లో హీరోయిన్ల పాత్రలను తగ్గించడం కోసం హీరోలు సంగీతాన్ని చంపేస్తున్నారు. కేవలం ఐటం సాంగ్స్ మాత్రమే హిట్టు పాటలని ఫీలవుతున్నారు. ఇలాంటి తరుణంలో మార్పు మొదలైనట్లు కనిపిస్తోంది. నేడు (జూలై 18న సైయారా మూవీ రిలీజ్) ఇండియన్ సినీ చరిత్రలోనే ఒక గొప్ప రోజు. మంచి సినిమాలు, వినసొందపైన సంగీతం తిరిగి పట్టాలెక్కనున్నాయి. ఆల్బమ్స్కు మంచి రోజులు రానున్నాయ్.హీరోలకు హక్కు లేదుసినిమా గురించి, అందులోని పాటల గురించి నిర్ణయాలు తీసుకోవాల్సింది హీరోలు, వారి మేనేజర్లు కాదు.. కేవలం దర్శకనిర్మాతలకు మాత్రమే ఆ హక్కు ఉంది! సరికొత్త మార్పునకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. అందుకు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను' అన్నాడు. బాలీవుడ్లో అనేక సినిమాలు డైరెక్ట్ చేసిన కునాల్ తెలుగులో నెక్స్ట్ ఏంటి? మూవీ తీశాడు.పాటలతోనే మంచి బజ్సైయారా మూవీ విషయానికి వస్తే ఈ చిత్రానికి మోహిత్ సూరి దర్శకత్వం వహించాడు. తనిష్క్ బగ్చి, అర్స్లన్ అబ్దుల్లా, ఫహీం నిజామి అద్భుతమైన సంగీతం అందించారు. ముఖ్యంగా టైటిల్ సాంగ్ ఈ మూవీకి విపరీతమైన బజ్ తీసుకొచ్చింది. సంగీతంతోనే ప్రేక్షకులను తనవైపు తిప్పుకునేలా చేసిన ఈ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ లభిస్తోంది. All have had HIT music. Today’s heroes have killed music by wanting to reduce the role of heroines and thinking that item songs are hit songs. Tmrw is a legendary day in indian cinema. The change has begun. Good films. Good music are back. Albums. Complete albums. Filmmakers not… https://t.co/vyPNqyioZ2— kunal kohli (@kunalkohli) July 17, 2025 చదవండి: 'కూలీ'ని రిజెక్ట్ చేసిన పుష్ప విలన్.. ఎందుకంటే? -
హీరామండి నటికి అరుదైన గౌరవం.. అదేంటంటే?
చాలా ఏళ్ల తర్వాత లస్ట్ స్టోరీస్తో గ్రాండ్గా రీ ఎంట్రీ సీనియర్ హీరోయిన్ మనీషా కొయిరాలాకు అరుదైన గౌరవం దక్కింది. యూకేకు చెందిన ప్రముఖ యూనివర్సిటీ ఆమెకు డాక్టరేట్ను అందించింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది మనీషా కొయిరాలా. తాను డాక్టరేట్ స్వీకరించిన వీడియోను షేర్ చేసింది. తన జీవితంలో సాంప్రదాయ విద్యా మార్గం ద్వారా ఈ స్థానానికి చేరుకోలేదని చెప్పింది.కాగా.. నటి మనీషా కొయిరాలా ఇంగ్లాండ్లోని బ్రాడ్ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ను అందుకుంది. ఈ గుర్తింపు తనకు చాలా సంతోషంగా ఉందని చెప్పుకొచ్చింది. ఈ గౌరవం నేను మాటల్లో చెప్పలేనంత ఎక్కువ అని తెలిపింది. నా కృషి, వైఫల్యాలను ఎదుర్కొని ఈ రోజు ఈ స్థాయిలో నిలబడ్డానని పేర్కొంది. మన ప్రయాణం ఎక్కడ మొదలైనా.. చివరికీ ఎక్కడికి చేరుకున్నామనేది ముఖ్యమని మనీషా తన పోస్ట్లో ప్రస్తావించింది. తనను గుర్తించిన బ్రాడ్ఫోర్డ్ విశ్వవిద్యాలయానికి ధన్యవాదాలు అంటూ పోస్టే చేసింది.మనీషా తన ఇన్స్టాలో రాస్తూ.. 'బ్రాడ్ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ను అందుకోవడం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా యూకే సిటీ ఆఫ్ కల్చర్-2025 ఏడాదిలో అందుకోవడం మరో విశేషం. క్రియేటివ్ డైరెక్టర్, ప్రతిభావంతులైన డేనియల్ లీతో కలిసి ఈ గుర్తింపును పంచుకోవడం మరింత సంతోషాన్నిచ్చింది. 2025కు అభినందనలు.. నా ప్రయాణం ఇప్పుడే ప్రారంభమైంది'పోస్ట్ చేసింది.ఇక సినిమాల విషయానికొస్తే మనీషా కొయిరాలా సౌదాగర్ (1991) మూవీతో బాలీవుడ్లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత 1942: ఎ లవ్ స్టోరీ , బాంబే , అగ్ని సాక్షి , గుప్త్: ది హిడెన్ ట్రూత్ , దిల్ సే, కంపెనీ లాంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత సినిమాలకు దూరమైన మనీషా చాలా కాలం తర్వాత లస్ట్ స్టోరీస్ (2018) తో రీ ఎంట్రీ ఇచ్చింది. ఆమె చివరిసారిగా సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో వచ్చిన వెబ్ సిరీస్ హీరామండి: ది డైమండ్ బజార్ (2024) లో నటించింది. ఇందులో మల్లికాజాన్ అనే వేశ్య పాత్రను పోషించింది. విభజనకు ముందు కాలంలో లాహోర్లోని హీరా మండిలో నవాబులు, బ్రిటిష్ అధికారులతో వేశ్యల జీవితాలు ఎలా ఉన్నాయనే కోణంలో ఈ సిరీస్ను తెరకెక్కించారు. View this post on Instagram A post shared by Manisha Koirala (@m_koirala) -
ఫొటోలు వద్దు.. దీవెనలు చాలు
హీరోయిన్ కియారా అడ్వాణీకి ఈ మధ్యే కూతురు పుట్టింది. ఈ క్రమంలోనే సెలబ్రిటీల నుంచి ఆమె అభిమానుల వరకు చాలామంది శుభాకాంక్షలు చెప్పారు. మన దగ్గర తక్కువ కానీ బాలీవుడ్లో ఫొటోగ్రాఫర్స్ కల్చర్ చాలా ఎక్కువ. నటీనటులు ఎక్కడికెళ్లినా సరే 10-15 మంది ఫొటోలు తీస్తూ కనిపిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే తన కుమార్తె ఫొటోలు కూడా ఎవరైనా లీక్ చేస్తారేమోనని కియారా-సిద్ధార్థ్ దంపతులు ఓ స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. ఈ మేరకు దాన్ని ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ చేశారు.'మీ అందరి ప్రేమ, శుభాకాంక్షలతో మేం చాలా సంతోషపడుతున్నాం. తల్లిదండ్రులుగా మేం మొదటి అడుగులు వేస్తున్నాం. ఈ సమయాన్ని పూర్తిగా ఆస్వాదించాలని కోరుకుంటున్నాం. ఇలాంటి సమయంలో గోప్యత పాటించాలనుకున్నాం. అందుకే ఫొటోలు షేర్ చేయడం లేదు. మీరు కూడా దయచేసి మా పాప ఫొటోలు తీయొద్దు. మీ ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని అనుకుంటున్నాం. మీ అందరి సపోర్ట్కి థ్యాంక్స్' అని కియారా దంపతులు పేర్కొన్నారు.(ఇదీ చదవండి: 5 నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా)కియారా-సిద్ధార్థ్ మల్హోత్రానే కాదు బాలీవుడ్ జంటలైన అనుష్క-విరాట్, దీపిక-రణ్వీర్ దంపతులు కూడా ఇప్పటివరకు తమ కూతురు ఫొటోలని ఎక్కడా పోస్ట్ చేయలేదు. ఎవరికీ పిక్స్ తీయనివ్వలేదు. ఆలియా-రణ్బీర్ దంపతులు కూడా తమ కూతురు పుట్టిన కొన్నాళ్ల వరకు బయటకు చూపించలేదు. తెలుగులోనూ చరణ్-ఉపాసన కూడా తమ కుమార్తె ఫేస్ రివీల్ కాకుండా జాగ్రత్త పడుతున్నారు.బాలీవుడ్లో వేర్వేరుగా కెరీర్ మొదలుపెట్టిన కియారా, సిద్దార్థ్ మల్హోత్రా.. 2021లో రిలీజైన 'షేర్షా' సినిమాలో కలిసి నటించారు. అప్పుడు మొదలైన స్నేహం కాస్త ప్రేమగా మారింది. 2023లో పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు వీళ్లకు పాప పుట్టింది. కియారా అడ్వాణీ నటించిన 'వార్ 2' విడుదలకు సిద్ధమైంది. ఆగస్టు 14న థియేటర్లలోకి రానుంది.(ఇదీ చదవండి: బాలీవుడ్ న్యూసెన్స్కి నో ఎంట్రీ.. వేలకోట్లున్నా సరే అక్కడికి..) -
కరీనా మోడ్రన్ స్టైల్ ‘‘గళ్ల లుంగీ స్కర్ట్.. నల్ల కళ్లద్దాలు’’!
బాలీవుడ్ నటి కరీనా కపూర్ ఖాన్ (Kareena Kapoor Khan) ప్రస్తుతం గ్రీస్లో వెకేషన్ను ఎంజాయ్ చేస్తోంది. ఈ సందర్భంగా ఇన్స్టాలో కొన్ని ఫోటోలను షేర్ చేసి అభిమానులను మెస్మరైజ్ చేసింది.తన మోడ్రన్ లుక్స్కు దేశీ ట్విస్ట్ ఇవ్వడం కరీనా ఫ్యాషన్ స్టైల్కు నిదర్శనంగా నిలుస్తోంది. పసుపు రంగు హాల్టర్-నెక్ బ్రాలెట్తో పాటు గళ్ల లుంగీ-స్టైల్ స్కర్ట్లో అల్ట్రా-హిప్గా కనిపిస్తున్న కొత్త చిత్రాలను పోస్ట్ చేసింది కరీనా. నల్ల సన్ గ్లాసెస్ , బ్రౌన్ టోపీతో తన లుక్ను మరింత ఎలివేట్ చేసింది.తన ఫోటోలకు “గ్రీస్లో లుంగీ డ్యాన్స్ ..భలే మజా వచ్చింది. తప్పకుండా తప్పక ప్రయత్నించండి’’ అనే క్యాప్షన్ ఇవ్వడం విశేషం. దీనికి వెరైటీ లుంగీ అంటూ ఫ్యాన్స్ కమెంట్స్ చేశారు. ఫ్యాన్స్తో పాటు, కరీనా స్నేహితులు మనీష్ మల్హోత్రా, సావ్లీన్ మంచాంద, పూనమ్ దమానియా ఫైర్ ఎమోజీలను పోస్ట్ చేశారు. View this post on Instagram A post shared by Kareena Kapoor Khan (@kareenakapoorkhan) ఇటీవల వివాదం రేపిన ప్రాడా కొల్హాపురి చెప్పులపై కూడా ఎమోజీలతో సెటైర్ వేసింది కరీనా. కొల్హాపురి మెటాలిక్ సిల్వర్ స్లిప్పర్లలో ఒక చిత్రాన్ని షేర్ చేస్తూ.. "సారీ...ఇది ప్రాడా కాదు... నా OG కొల్హాపురి" అని క్యాప్షన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. కొల్హాపురి చెప్పులనుంచి భారతీయ లుంగీ వరకు కరీనా స్టైలింగ్, ఫ్యాన్స్ ప్రశంసలు లభిస్తున్నాయి. -
పుట్టెడు దుఃఖం, డిప్రెషన్.. అక్క కోసం ఇండియాకు వచ్చేశా: శిల్ప శిరోద్కర్
నమ్రత- శిల్ప శిరోద్కర్.. అక్కాచెల్లెళ్లు ఇద్దరూ ఒకప్పుడు వెండితెరపై హీరోయిన్గా రాణించినవారే! హిందీలో ఎక్కువ సినిమాలు చేసిన నమ్రత 'వంశీ', 'అంజి' చిత్రాలతో తెలుగులో హీరోయిన్గా అలరించింది. సూపర్స్టార్ మహేశ్బాబును పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకు గుడ్బై చెప్పేసింది. శిల్ప శిరోద్కర్ కూడా అంతే! బాలీవుడ్లో అనేక సినిమాలు చేసిన ఈమె తెలుగులో 'బ్రహ్మ' అనే ఏకైక చిత్రంలో యాక్ట్ చేసింది. పెళ్లి తర్వాత వెండితెరకు టాటా చెప్పేసి న్యూజిలాండ్లో సెటిలైంది. 2010 తర్వాత మళ్లీ ఇండియాకు వచ్చి ఇక్కడే స్థిరపడింది.ఆ ఆలోచనే లేదుఅందుకు గల కారణాన్ని తాజా ఇంటర్వ్యూలో వెల్లడించింది. శిల్ప శిరోద్కర్ (Shilpa Shirodkar) మాట్లాడుతూ.. సినిమా అవకాశాల కోసం నేను భారత్కు తిరిగిరాలేదు. అప్పుడు నా మానసిక స్థితి సరిగా లేదు. తల్లిదండ్రులను కోల్పోయి పుట్టెడు శోకంలో ఉన్నాను. డిప్రెషన్లోకి వెళ్లిపోయాను. కనీసం అక్క (నమ్రత)కు దగ్గరగానైనా ఉండొచ్చనే న్యూజిలాండ్ నుంచి వచ్చేశాను. మళ్లీ సినిమాల్లోకి వెళ్లాలన్న ఆలోచన కూడా నాకు రాలేదు. 2010లో ఇక్కడికి వచ్చిన నేను ఎవరినీ పని కోసం అర్థించలేదు, ఎటువంటి ఫోటోషూట్లూ చేయలేదు. పైగా ఈ పీఆర్ (పబ్లిక్ రిలేషన్స్) స్టంట్ల గురించి ఏమాత్రం అవగాహన లేదు. తట్టుకోలేకపోయా..నా మనసులో ఉన్నదల్లా ఒక్కటే.. నేను ఎక్కడికీ వెళ్లను, మా అక్కకు వీలైనంత దగ్గరగా ఉండాలని ధృడంగా నిశ్చయించుకున్నాను. నిజానికి అప్పుడు అపరేశ్ (శిల్ప భర్త) ఉద్యోగంలో ఉన్నత స్థాయిలో ఉన్నాడు. అనుష్క (కూతురు) స్కూలుకు వెళ్తోంది, తనకంటూ స్నేహితులను సంపాదించుకుంది. అంతా సంతోషంగా సాగుతున్న సమయంలో అమ్మానాన్న ఒకరితర్వాత ఒకరు తక్కువ కాల వ్యవధిలోనే చనిపోయారు. నేను తట్టుకోలేకపోయాను. ఎప్పుడూ ఏడుస్తూనే..ఎప్పుడూ ఏడుస్తూ ఉండేదాన్ని. ఎంత ప్రయత్నించినా కన్నీళ్లు ఆగేవి కాదు. దేనిపైనా ఆసక్తి ఉండేది కాదు. ఒక రోబోలా తయారయ్యాను. బరువు పెరిగాను, కళ్ల కింద నల్లటి వలయాలు వచ్చాయి. ఎక్కడికీ వెళ్లేదాన్ని కాదు, ఏం చేసేదాన్నీ కాదు. కేవలం నా కూతుర్ని స్కూల్లో దింపిరావడం, స్కూల్ అయిపోగానే ఇంటికి తీసుకురావడం.. ఈ ఒక్కటే చేసేదాన్ని. ఇంట్లో ఎవరితోనూ సరిగా మాట్లాడేదాన్ని కాదు. ఒక్కోసారి నా తలను గోడకేసి బాదుకోవాలనిపించేది. జీవితంపై విరక్తి వచ్చింది.కూతుర్ని కొట్టా..డాక్టర్ను కలిశా.. యాంటీ డిప్రెసంట్స్ మందులు వాడాను. భర్తపై, కూతురిపై అరిచేదాన్ని.. ఒక్కోసారి ఆవేశంతో కూతుర్ని కొట్టేదాన్ని కూడా! కానీ, మా అక్కతో మాత్రం బాగా మాట్లాడేదాన్ని. తను మాత్రమే నన్ను బాగా అర్థం చేసుకునేది. తనకు దగ్గరగా ఉండాలనుకున్నాను. ఏదేమైనా ఇండియాకు వచ్చేయాలనుకున్నాను, వచ్చేశాను. నాకోసం నా భర్త న్యూజిలాండ్లో మంచి ఉద్యోగాన్ని కూడా వదిలేసి వచ్చాడు అని శిల్ప శిరోద్కర్ చెప్పుకొచ్చింది.చదవండి: 'కూలీ'ని రిజెక్ట్ చేసిన పుష్ప విలన్.. ఎందుకంటే? -
బాలీవుడ్ న్యూసెన్స్కి నో ఎంట్రీ.. వేలకోట్లున్నా సరే అక్కడికి అనుమతి ఉండదు
డబ్బుoటే కొండ మీద కోతి దిగొస్తుంది అంటారు అదేమో గానీ ఒక్కోసారి మనకు కావాల్సిన చోట, కోరుకున్నవారి మధ్య నివాసం కూడా పొందలేమని నిరూపితమవుతోంది. భారతదేశపు వాణిజ్య రాజధాని నగరమైన ముంబైలో సంపద ఉండడం అనేది వారి స్థాయిని నిర్దేశించే ఒక ప్రధాన అంశం, అయితే ఆ నగరంలోని కొన్ని ప్రాంతాలలో విస్తుపోయేలా దీనికి అతీతమైన ధోరణి కనిపిస్తుంది. అటువంటి ఒక ప్రాంతం, పెడ్డర్ రోడ్, ఈ రోడ్ సంపదకు మాత్రమే కాకుండా దానికే స్వంతమైన ఆలోచనల ద్వారా కూడా ప్రత్యేకంగా నిలుస్తుంది, ఇక్కడ నివాసాలకు అపారమైన సంపద లేదా ప్రముఖ హోదా కూడా అనుమతి, అంగీకారం పొందుతామనే హామీ ఇవ్వదు. ఈ విచిత్రమైన ఈ వాస్తవికతను ఇటీవల సీనియర్ జర్నలిస్ట్ విశాల్ భార్గవ వెలుగులోకి తెచ్చారు. ఈ ప్రాంతంలో ఇళ్ళు కొనడానికి ప్రయత్నించినప్పుడు బాలీవుడ్ సెలబ్రిటీలు తరచుగా అనధికారిక అడ్డంకులను ఎదుర్కొంటారని ఆయన చెప్పడం సంచలనంగా మారింది. అంతేకాదు దివంగత బిలియనీర్, బాలీవుడ్ సినిమాలకు పెట్టుబడిదారు రాకేష్ జున్ జున్ వాలా కూడా ఈ ప్రాంతంలోని ఒక ఎలైట్ క్లబ్ నుంచి తిరస్కరణను ఎదుర్కొన్నారని ఆయన వెల్లడించారు.‘ముంబై, మంచ్ అండ్ మార్కెట్ విత్ చింతన్ వాసని‘ పేరిట ఇన్స్ట్రాగామ్ ఎపిసోడ్లో ఆయన మాట్లాడుతూ, టాటా చైర్మన్ ముఖేష్ అంబానీ వంటి ప్రముఖులకు నిలయంగా, ‘ధనవంతులు, అంతకు మించిన సూపర్ రిచ్ల‘ డొమైన్గా పెడ్డర్ రోడ్ను అభివర్ణించారు. కానీ, సెలబ్రిటీలను ఎదురేగి ఆహ్వానించే, స్వీకరించే బాంద్రా మాదిరిగా కాకుండా, పెడ్డర్ రోడ్ సొసైటీలు తరచుగా బాలీవుడ్ నటులను తమకు పెద్ద న్యూసెన్స్లా చూస్తాయి, అక్కడ ఆస్తిని కొనుగోలు చేసే వారికి అనధికారిక పరిమితులను విధిస్తాయి అంటూ ఆశ్చర్యపరిచే నిజాలను ఆయన వెల్లడించారు.ఈ ప్రత్యేకత నివాస సొసైటీలతో పాటు విందు వినోద కేంద్రాలకు సైతం విస్తరించింది. దీనికి ఈ రోడ్లోని ఒక ప్రముఖ సంస్థ అయిన విల్లింగ్డన్ క్లబ్ను భార్గవ దీనికి ఉదహరించారు. ‘వారు బాలీవుడ్ నటులను ఇష్టపడరు, అంతేకాదు వారు అత్యున్నత విద్యావంతులు తప్ప ఇతరత్రా తమను తాము ఉన్నతంగా భావించే ఎవరినీ ఇష్టపడరు‘ అని ఆయన వివరించారు. భారత స్టాక్ మార్కెట్లో పేరొందిన ‘బిగ్ బుల్‘ అయిన జున్ జున్ వాలా ఆ ప్రాంతంలోని విల్లింగ్డన్ క్లబ్లో సభ్యత్వం పొందడానికి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని ఆయన అభ్యర్ధనను క్లబ్ ఏకంగా మూడుసార్లు తిరస్కరించడం జరిగిందని కూడా భార్గవ వెల్లడించారు.‘మీ దగ్గర డబ్బు ఉందడం ప్రాధాన్యత కాదు, పెద్దర్ రోడ్లో నివసించాలంటే డబ్బు కు మించిన విలువ ఏదైనా ఉండాలి‘ అని భార్గవ నొక్కిచెప్పారు. ‘ధనవంతులు సూపర్ రిచ్‘ గా ఉండటం చాలా సార్లు అర్హతగా మారుతుందని అయితే, ‘ధనవంతులు. ప్రముఖులు‘ గా ఉండటం అక్కడ అనర్హత అని ఆయన వివరించారు. బదులుగా, ‘ధనవంతులు అత్యంత ఆధునిక భావాలు కలిగిన వ్యక్తులు ఈ అల్ట్రా–ఎక్స్క్లూజివ్ ఆవరణలో ప్రవేశం పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అన్నారాయన.గత 2022లో ఆగస్టు 14 వ తేదీన తన 62 సంవత్సరాల వయసులో మరణించిన జున్ జున్ వాలా తన సామ్రాజ్యాన్ని రూ.5,000 పెట్టుబడి నుంచి 5.5 బిలియన్ల సంపదకు నిర్మించుకున్నారు. చురుకైన పెట్టుబడి వ్యూహాలతో ‘వారెన్ బఫెట్ ఆఫ్ ఇండియా‘ గా ప్రసిద్ధి చెందారు. అంతటి ప్రముఖ వ్యక్తి సైతం ఒక క్లబ్ సభ్యత్వం పొందలేకపోయారనే వాస్తవం వెల్లడి కావడం ముంబైలోని పెడ్డర్ రోడ్ పట్ల ఆసక్తిని రేకెత్తిస్తోంది. View this post on Instagram A post shared by Chintan Vasani️ (@chintanvasani) -
సీతగా 'సాయిపల్లవి'నే ఎందుకు.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్
భారత సినీ పరిశ్రమలోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమా 'రామాయణ'.. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం ఏకంగా రూ. 4 వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మూవీకి నితేశ్ తివారీ దర్శకుడు. ఇందులో రాముడిగా బాలీవుడ్ స్టార్ రణ్బీర్ కపూర్, సీత పాత్రలో సాయి పల్లవి నటిస్తున్నారు. రాకింగ్ స్టార్ యశ్ నిర్మాణ సంస్థ మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్, అలాగే నమిత్ మల్హోత్రా నిర్మాణ సంస్థ ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్ సంయుక్తంగా కలిసి ఈ మూవీని నిర్మిస్తున్నాయి. తాజాగా ఈ మూవీ టీమ్ మాట్లాడుతూ సీతగా సాయిపల్లవిని ఎందుకు ఎంపిక చేశారో పేర్కొంది.సీతా దేవి పాత్ర కోసం చాలామందిని అనుకున్నాం. కానీ, సాయిపల్లవిని ఫైనల్ చేయడానికి తమకు చాలా కారణాలు ఉన్నాయిని రామాయణ చిత్ర యూనిట్ పేర్కొంది. ఆమె గ్లామర్ పాత్రలకు దూరంగా ఉండటమే కాకుండా తన అందం కోసం ఆమె ఎలాంటి సర్జరీలు చేయించుకోలేదని తెలిపింది. సహజ అందమే తమ సినిమాకు బాగుంటుందని అనుకున్నామని, అలా ఒక సందేశం ఇచ్చినట్లు ఉంటుందని టీమ్ రామాయణ ప్రకటించింది. సాయి పల్లవి మంచి నటి కూడా.. ఎలాంటి పాత్రనైనా సులువుగా చేయగలదు. సీత పాత్ర తనకు ఎంతో పేరు తప్పకుండా తెస్తుందని వారు తెలిపారు. రాముడిగా రణ్బీర్ను తీసుకోవడానికి కారణం ఆయన మొఖంలో చాలా ప్రశాంతత కనిపిస్తుందని చెప్పారు. తనలోని వ్యక్తిత్వమే కాకుండా గొప్పగా నటించే నైపుణ్యం తనలో ఉందని మేకర్స్ చెప్పారు. ఈ మూవీ మొదటి పార్ట్ 2026 దీపావళికి, రెండోది 2027 దీపావళికి విడుదల కానున్న విషయం తెలిసిందే. హాలీవుడ్ హిట్ సినిమా'లార్డ్ ఆఫ్ ది రింగ్స్'కు పనిచేసిన స్టంట్ డైరెక్టర్ టెర్రీ ‘రామాయణ’ ప్రాజెక్ట్లో భాగమయ్యారని మేకర్స్ ప్రకటించారు. వానరసేన, హనుమాన్లతో కనిపించే సన్నివేశాలకు సంబంధించి ఆయన క్రియేట్ చేసిన ప్రపంచానికి అందరూ ఫిదా అవుతారని తెలిపారు. 'ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్'లో ఏ విధంగానైతే వీఎఫ్ఎక్స్ పనితీరు ఉంటుందో అదే విధంగా రామాయణ చిత్రంలోని వానరసేన అంతే సహజంగా ఉంటుందని టీమ్ తెలిపింది. -
థగ్ లైఫ్.. ఈ సినిమా ఎందుకు చేశావని తిట్టారు: బాలీవుడ్ నటుడు
భారీ అంచనాల మధ్య వచ్చి బోల్తా కొట్టిన సినిమాలెన్నో.. ఇటీవల వచ్చిన కమల్ హాసన్ థగ్ లైఫ్ మూవీ కూడా అదే కోవలోకి వస్తుంది. మణిరత్నం దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా నిలిచింది. అయితే ఈ సినిమాలో నటించినందుకు తనను నానామాటలు అన్నారని చెప్తున్నాడు బాలీవుడ్ నటుడు అలీ ఫజల్ (Ali Fazal).ఎందుకీ సినిమా చేశావ్?తాజాగా అలీ ఫజల్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. థగ్ లైఫ్ సినిమా (Thug Life Movie) నేనింతవరకు చూడలేదు. కానీ చాలామంది ఈ మూవీ ఎందుకు చేశావని తిట్టారు. దానికి ఒకే ఒక్క కారణం మణిరత్నం సర్. ఆయనపై ఉన్న అభిమానంతోనే ఈ మూవీలో నటించాను. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సరిగా ఆడలేదు. దాంతో నా స్నేహితులు, అభిమానులు ఎందుకీ సినిమా చేశావ్? అవసరమా నీకిది? అని కోప్పడ్డారు. వారందరికీ మరేం పర్వాలేదని బదులిచ్చాను.అది ముగిసిన చాప్టర్మణిరత్నం సర్ విజన్ను ప్రశ్నించేంత పెద్దవాడిని కాదు. వారు సినిమా కోసం కష్టపడ్డారు. కానీ షూటింగ్ జరిగేకొద్దీ కథలో చాలా మార్పులు జరిగాయని తెలుస్తోంది. అయినా థగ్ లైఫ్ చాప్టర్ ముగిసిపోయింది. భవిష్యత్తులో అవకాశం వస్తే మళ్లీ తప్పకుండా మణిరత్నం డైరెక్షన్లో నటిస్తాను అని అలీ ఫజల్ చెప్పుకొచ్చాడు.థగ్ లైఫ్మణిరత్నం- కమల్ హాసన్ కాంబినేషన్లో వచ్చిన రెండో చిత్రం థగ్ లైఫ్. గతంలో వీరి కాంబినేషన్లో నాయకుడు మూవీ వచ్చింది. బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది. ఆ తరహాలోనే థగ్ లైఫ్ కూడా ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఈ మూవీ విజయాన్ని అందుకోలేకపోయింది. జూన్ 5న విడుదలైన ఈ చిత్రం ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లో అందుబాటులో ఉంది.చదవండి: జబర్దస్త్ పవిత్రకు ప్రపోజ్ చేసిన ప్రిన్స్ యావర్.. అబ్బో! -
మళ్లీ వచ్చేస్తున్న 'కౌన్ బనేగా కరోడ్పతి'.. అమితాబ్ పారితోషికం ఎంతంటే?
ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) మరోసారి బుల్లితెరపై సందడి చేసేందుకు రెడీ అయ్యాడు. కౌన్ బనేగా కరోడ్పతి 17వ సీజన్తో అలరించనున్నాడు. ఈ షో ఆగస్టు 11 నుంచి ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని సోనీ టీవీ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఓ ప్రోమో రిలీజ్ చేసింది. అందులో ఈసారి కూడా అమితాబ్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నట్లు చూపించారు.25 ఏళ్ల క్రితం మొదలు..ఈ క్రమంలో బిగ్బీ పారితోషికం ఎంత ఉండొచ్చు? అని నెటిన్లు చర్చించుకుంటున్నారు. బీటౌన్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం అమితాబ్.. ఒక్క ఎపిసోడ్కు రూ.5 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడట! 25 ఏళ్ల క్రితం కౌన్ బనేగా కరోడ్పతి షో (Kaun Banega Crorepati Show) మొదలైంది. బిగ్బీ అడిగే ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పినవారు రూ.1 కోటి గెల్చుకునే అవకాశం ఉంటుంది. దీనికి సెలబ్రిటీలను కాకుండా సామాన్యులనే పార్టిసిపెంట్లుగా ఎంపిక చేసుకుంటారు. అందుకే ఈ షోకు ఎక్కువ క్రేజ్!తెలుగులోనూ..బిగ్బీ హోస్టింగ్, కోటి రూపాయల ప్రైజ్మనీతో.. రియాలిటీ షోలలోనే కేబీసీ సరికొత్త సంచలనంగా నిలిచింది. ఇదే షో తెలుగులో మీలో ఎవరు కోటీశ్వరుడు పేరిట ప్రారంభమైంది. మొదటి మూడు సీజన్లు నాగార్జున, నాలుగో సీజన్ చిరంజీవి, ఐదో సీజన్ జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేశారు. తర్వాతేమైందో కానీ తెలుగులో ఈ షోను కొనసాగించలేదు. అమితాబ్ సినిమాల విషయానికి వస్తే ఆయన ప్రస్తుతం సెక్షన్ 84 మూవీ చేస్తున్నాడు. దీనితో పాటు బిగ్బీ చేతిలో.. బ్రహ్మాస్త్ర 2, కల్కి 2898 ఏడీ సీక్వెల్ సినిమాలున్నాయి. View this post on Instagram A post shared by Sony Entertainment Television (@sonytvofficial) చదవండి: నా భార్య గర్భం దాల్చినా.. అందుకే పిల్లలు లేరు: అనుపమ్ ఖేర్ -
నా భార్య గర్భం దాల్చింది.. అయినా పిల్లలు లేరు: అనుపమ్ ఖేర్
కెరీర్ పీక్లో ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలని ఆరాటపడ్డాడు అనుపమ్ ఖేర్ (Anupam Kher). విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించాలని తాపత్రయపడ్డాడు. మంచి కథలను ఎంపిక చేసుకుని నటించేవాడు. గొప్ప నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. అయితే వృత్తి కోసం వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేశాడు. అనుపమ్ ఖేర్.. 1979లో నటి మధుమాలతిని పెళ్లి చేసుకోగా కొంతకాలానికే విడిపోయారు. 1985లో నటి కిరణ్ ఖేర్ (Kirron Kher)ను పెళ్లాడాడు. కిరణ్కు కూడా ఇది రెండో పెళ్లి! కొడుకున్న నటితో రెండో పెళ్లిగతంలో ఆమె వ్యాపారవేత్త గౌతమ్ను పెళ్లాడగా వీరికి సికిందర్ అనే కుమారుడు జన్మించాడు. దంపతుల మధ్య పొరపచ్చాలు రావడంతో అతడికి విడాకులిచ్చేసి 1985లో అనుపమ్ను పెళ్లాడింది. అయితే అనుపమ్- కిరణ్ జంటకు సంతానం లేదు. గతంలో ఈ విషయాన్ని తలుచుకుని బాధపడ్డాడు నటుడు. ఎంతైనా ఓ కొడుకు ఉంటే, వాడు కళ్ల ముందు పెరుగుతూ ఉంటే ఆ సంతోషమే వేరేలా ఉండేదని ఫీలయ్యాడు. గర్భం దాల్చినా..తాజాగా ఓ ఇంటర్వ్యూలో మరోసారి గుండెలోని వెలితిని వెల్లడించాడు. నేను స్థాపించిన స్వచ్ఛంద సంస్థలో ఎంతోమంది పిల్లలతో కలిసి పని చేస్తుంటాను. పిల్లలంటే నాకు చాలా ఇష్టం. సే నా సమ్థింగ్ టు అనుపమ్ అంకుల్ అని వారితో ఓ షో చేసేవాడిని. ఇది చిన్నారుల షో! కన్నకొడుకు లేనందుకు ఒక్కోసారి బాధగా అనిపిస్తుంది. మా పెళ్లయిన మొదట్లో కిరణ్ ప్రెగ్నెంట్ అవలేదు. తీరా గర్భం దాల్చినప్పుడు లోపల శిశువు ఎదుగుదల సరిగా లేదు. అప్పుడేదీ మిస్ అవలేదునేను కెరీర్లో బిజీగా ఉండటంతో పట్టించుకోలేదు. అయినా నాకు సికిందర్ చాలు. కిరణ్ను పెళ్లి చేసుకున్నప్పుడు అతడికి నాలుగేళ్లు. తను నా జీవితంలోకి వచ్చాక నేనేదీ మిస్ అవుతున్నట్లు అనుకోలేదు. 60 దాటాక మాత్రమే నాకంటూ కన్న కొడుకుంటే బాగుండని కొన్నిసార్లు అనిపించింది అని చెప్పుకొచ్చాడు. అనుపమ్ కీలక పాత్రలో నటించిన తన్వి ద గ్రేట్ మూవీ జూలై 18న విడుదల కానుంది. అలాగే హరిహర వీరమల్లు చిత్రం జూలై 24న రిలీజ్ అవుతోంది.చదవండి: బాహుబలి, ఆర్ఆర్ఆర్ కాదు.. రాజమౌళి బెస్ట్ ఫిల్మ్ ఇదేనట! -
కౌంట్ డౌన్ స్టార్ట్
‘‘వెండితెరపై యుద్ధానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. 30 రోజుల్లో బాక్సాఫీస్ విధ్వంసానికి ‘వార్ 2’’ సిద్ధం అంటూ చిత్రయూనిట్ పేర్కొంది. హృతిక్ రోషన్, కియారా అద్వానీ జంటగా నటించిన చిత్రం ‘వార్ 2’. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమా ద్వారా హీరో ఎన్టీఆర్ హిందీ చిత్ర పరిశ్రమకి పరిచయమవుతున్నారు. యశ్ రాజ్ ఫిల్మ్స్పై ఆదిత్యా చోప్రా నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 14న హిందీ, తెలుగు, తమిళ భాషల్లో పాన్ ఇండియా ఫిల్మ్గా విడుదల కానుంది.‘వార్ 2’ ముప్పై రోజుల్లో రానుందని తెలిసేలా తాజాగా ఓపోస్టర్ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పోస్టర్లో హృతిక్ రోషన్, ఎన్టీఆర్, కియారా అద్వానీపాత్రల్ని చూపించేలా డిజైన్ చేశారు. ‘‘యాక్షన్ ఓరియంటెడ్ స్పై డ్రామాగా రూపొందిన చిత్రం ‘వార్ 2’’ అని చిత్రబృందం పేర్కొంది. -
రోడ్డుపై చిత్తు కాగితాలతో నటి.. తనలో తనే మాట్లాడుకుంటూ..
బుల్లితెరపై, వెండితెరపై వెలుగు వెలిగిన నటి సడన్గా రోడ్డుపై ప్రత్యక్షమైంది. తనలో తనే మాట్లాడుకుంటూ, చిత్తు కాగితంపై ఏదో రాస్తూ కనిపించింది. ఆమెను గుర్తుపట్టని జనాలు ఎవరు నువ్వు? అని ఆరా తీయగా తాను నటినని, తన పేరు సుమి హర్ చౌదరి అని వెల్లడించింది. నడిరోడ్డుపై ఒంటరిగా..సుమి హర్ చౌదరి (Sumi Har Chowdhury).. బెంగాలీ నటి. పలు సీరియల్స్తో పాటు సినిమాలు కూడా చేసింది. ద్వితియో పురుష్, కాశీ కథ: ఎ గోట్ సాగా వంటి చిత్రాలతో ఎక్కువ గుర్తింపు తెచ్చుకుంది. కొంతకాలంగా వెండితెర, బుల్లితెరకు దూరంగా ఉంటున్న ఆమె మంగళవారం నాడు రోడ్లపై తిరుగుతూ కనిపించింది. పశ్చిమ బెంగాల్లోని పర్ప బార్దమాన్ జిల్లా అమిలా బజార్లోని దిక్కు తోచని స్థితిలో ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తోంది. హైవేపై నడుచుకుంటూ కొంతదూరం వెళ్లిన ఆమె ఒకచోట ఆగి పక్కన కూర్చుని చిత్తుకాగితంపై ఏదో రాసుకుంటూ ఉందట! నమ్మలేకపోయిన జనాలుతనలో తనే సగం బెంగాలీ, సగం ఇంగ్లీష్లో ఏదేదో మాట్లాడుకుంటూ ఉండటాన్ని అక్కడే ఉన్న స్థానికులు గమనించారు. ఎవరు నువ్వు? అని వారు పలకరించగా.. తన పేరు సుమి హర్ చౌదరి అని, తాను నటిని అని చెప్పింది. మొదట నమ్మలేకపోయిన స్థానికులు గూగుల్లో వెతికి చూడగా తను చెప్పింది నిజమేనని గ్రహించారు. వెంటనే పోలీసులకు సమాచారమివ్వగా.. వారు అక్కడికి చేరుకుని నటిని షెల్టర్కు తరలించారు. ఆమె కుటుంబ సభ్యులను సంప్రదించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.చదవండి: శూర్పణఖగా 10th క్లాస్ అమ్మాయి.. ఆమె ఎవరంటే? -
శూర్పణఖగా 10th క్లాస్ అమ్మాయి.. ఆమె ఎవరంటే?
సినిమాను విజువల్ వండర్లా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ఎంత ఖర్చయినా వెనక్కు తగ్గడం లేదు నిర్మాతలు. మామూలు సినిమాకు కూడా రూ.100 కోట్ల బడ్జెట్ అనేది సాధారణమైపోయింది. ఆర్ఆర్ఆర్, కల్కి 2898ఏడీ, ఆదిపురుష్.. ఇవన్నీ అయితే రూ.500 కోట్లపైనే పెట్టి తీశారు. అయితే భారతీయ సినీచరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా రామాయణ చిత్రం (Ramayana Movie) తెరకెక్కుతోంది. నితీశ్ తివారీ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో రణ్బీర్ కపూర్ రాముడిగా, సాయిపల్లవి సీతాదేవిగా నటిస్తున్నారు. బాల శూర్పణఖగా..రాకింగ్ స్టార్ యశ్ రావణుడిగా, సన్నీ డియోల్ హనుమంతుడిగా, రవి దూబే లక్ష్మణుడిగా కనిపించనున్నారు. శూర్పణఖ పాత్ర కోసం ప్రియాంక చోప్రాను సంప్రదించగా ఆమె బిజీగా ఉండటంతో అవకాశాన్ని వదిలేసుకుందట. దీంతో ఈ రోల్ రకుల్కు వెళ్లిందని ప్రచారం జరిగింది. లేటెస్ట్ టాక్ ప్రకారం.. పదిహేనేళ్ల దిశిత సెగల్ను బాల శూర్పణఖగా వెండితెరపై చూపించాలని ప్రయత్నిస్తున్నారట! ఆడిషన్తో పాటు లుక్ టెస్ట్ కూడా అయిపోందని, తనపై కొన్ని సీన్లు కూడా చిత్రీకరించారని బీటౌన్లో ప్రచారం జరుగుతోంది. మరి ఇదెంతవరకు నిజమన్నది తెలియాల్సి ఉంది.ఎవరీ దిశిత సెగల్?నాలుగేళ్లే వయసులోనే వాణిజ్య ప్రకటనల్లో కనిపించింది దిశిత. బేబీ సినిమాలో అక్షయ్ కుమార్ కూతురిగా, డియర్ జిందగీలో చిన్నారి ఆలియా భట్లా యాక్ట్ చేసింది. వార్, హిందీ మీడియం చిత్రాల్లోనూ నటించింది. ఇటీవలే బెహాన్ డర్గయినా అనే ఓటీటీ షోలోనూ మెరిసింది. View this post on Instagram A post shared by Dishita Sehgal🧿 (@cutiepiedishita) చదవండి: జీవితంలో తొలిసారి పిడకలు చేశా.. ఆ మరునాడే..: నిత్యామీనన్ -
స్టూడెంట్స్ ముగ్గురికీ ఆడపిల్లలే పుట్టారు
బాలీవుడ్లో మరో జంట గుడ్ న్యూస్ చెప్పేశారు. తెలుగులో 'భరత్ అను నేను', 'వినయ విధేయ రామ', 'గేమ్ ఛేంజర్' సినిమాల్లో హీరోయిన్గా చేసిన కియారా అడ్వాణీకి ఆడపిల్ల పుట్టింది. మంగళవారం రాత్రి బిడ్డకు జన్మనివ్వగా.. బుధవారం కియారా-సిద్ధార్థ్ జంట తమకు ఆడపిల్ల పుట్టిన విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ క్రమంలోనే నెటిజన్లు ఓ ఆసక్తికర విషయాన్ని కనిపెట్టారు. ఇప్పుడు అదికాస్త వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: హీరోతో 'బ్రహ్మముడి' సీరియల్ నటి నిశ్చితార్థం)2012లో 'స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్' సినిమాతో ఆలియా భట్, సిద్ధార్థ్ మల్హోత్రా, వరుణ్ ధావన్ పరిచయమయ్యారు. వీళ్లు ముగ్గురు ప్రస్తుతం పలు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఆలియా భట్ ఇప్పటికే స్టార్ హీరోయిన్ అయిపోయింది. 2022లో హీరో రణ్బీర్ కపూర్ని పెళ్లి చేసుకోగా అదే ఏడాది కూతురు రహాకి జన్మనిచ్చింది. కూతురితో ఆలియా ఎప్పటికప్పుడు మీడియా కంట పడుతూనే ఉంటుంది. ఈమె కూతురికి సోషల్ మీడియాలోనూ మంచి ఫాలోయింగ్ ఉంది.వరుణ్ ధావన్ విషయానికొస్తే నటాషా దలాల్ అనే అమ్మాయిని 2021లో పెళ్లి చేసుకున్నాడు. గతేడాది జూన్లో ఇతడికి కూడా కూతురు పుట్టింది. ఇప్పుడు సిద్ధార్థ్ మల్హోత్రాకు కూడా కూతురే పుట్టంది. దీంతో 'స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్'లో హీరోహీరోయిన్లు అయిన ముగ్గురికీ ఆడపిల్లనే పుట్టిందని నెటిజన్లు అంటున్నారు.(ఇదీ చదవండి: ఆ హాలీవుడ్ మూవీ చూస్తుంటే 'జెర్సీ' గుర్తొచ్చింది: నాగవంశీ) View this post on Instagram A post shared by Sidharth Malhotra (@sidmalhotra) -
ఆస్పత్రిలో పంచాయత్ వెబ్ సిరీస్ నటుడు.. జీవితం చాలా చిన్నదంటూ పోస్ట్!
పంచాయత్ వెబ్ సిరీస్తో ఫేమ్ తెచ్చుకున్న నటుడు ఆసిఫ్ ఖాన్ ఆస్పత్రిలో చేరారు. గుండె పోటు రావడంతో ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. జీవితం చాలా చిన్నది అంటూ ఆస్పత్రి పైకప్పు ఫోటోను షేర్ చేశారు. ఇది చూసిన అభిమానులు త్వరగా కోలుకోవాలంటూ పోస్టులు పెడుతున్నారు.‘మీర్జాపూర్ వెబ్సిరీస్తో ఓటీటీకి ఎంట్రీ ఇచ్చిన ఆసిఫ్ ఖాన్ మంచి గుర్తింపు పొందారు. ఆ తర్వాత పంచాయత్, పాతాళ్ లోక్ వంటి వెబ్ సిరీస్ల్లోనూ కీలక పాత్రలు పోషించారు. అంతేకాకుండా రెడీ, టాయిలెట్, అగ్నిపథ్, పాగ్లైట్, కాకుడా హిందీ సినిమాల్లో నటించారు. అయితే ఆసిఫ్ ఖాన్ రెండు రోజుల క్రితం అయితే గుండెపోటుతో ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం. ప్రస్తుతం బాగానే ఉన్నారని.. రెండు రోజుల్లో డిశ్చార్జ్ అవుతాడని తెలుస్తోంది.ఆసిఫ్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో ఆస్పత్రి పైకప్పు ఫోటోను షేర్ చేస్తూ.. "గత 36 గంటలుగా దీన్ని చూసిన తర్వాత జీవితం చిన్నది. ఏ రోజును తేలికగా తీసుకోకండి, ప్రతిదీ ఒక్క క్షణంలో మారవచ్చు., మీ దగ్గర ఉన్నదాని పట్ల కృతజ్ఞతతో ఉండండి. మీకు ఎవరు ఎక్కువ ముఖ్యమైనవారో గుర్తుంచుకోండి. ఎల్లప్పుడూ వారిని గౌరవించండి. జీవితం ఒక బహుమతి' అని రాసుకొచ్చారు. కాగా.. పంచాయత్' వెబ్ సిరీస్లో ఆసిఫ్ ఖాన్.. గణేష్ పాత్రను పోషించాడు. -
సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. సీనియర్ నటుడు కన్నుమూత
ఇటీవల సినీ పరిశ్రమలో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. టాలీవుడ్లో కోట శ్రీనివాసరావు మరణించగా.. ఆ తర్వాత మరో సీనియర్ నటి సరోజా దేవి కూడా కన్నుమూశారు. ఇవాళ మరో ప్రముఖ నటుడు మృతి చెందారు. బాలీవుడ్ నిర్మాత అయిన ధీరజ్ కుమార్ ముంబయిలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆయన న్యుమోనియాతో బాధపడుతూ ఆస్పత్రిలో చేరగా.. కోలుకోలేక తుదిశ్వాస విడిచారు.కాగా.. ధీరజ్ కుమార్ 1965లో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ఆయన తన కెరీర్లో సినిమాలతో పాటు సీరియల్స్లోనూ నటించారు. 1970- 1984 మధ్య దాదాపు 21 పంజాబీ చిత్రాలలో నటించాడు. 'ఓం నమః శివాయ్' వంటి ఆధ్యాత్మిక, పౌరాణిక కార్యక్రమాలకు ప్రసిద్ధి చెందిన క్రియేటివ్ ఐ అనే నిర్మాణ సంస్థను స్థాపించాడు. అంతేకాకుండా 'స్వామి', 'హీరా పన్నా' 'రాతోన్ కా రాజా' వంటి లాంటి హిందీ చిత్రాలలో కూడా నటించాడు. ఆ తర్వాత రోటీ కపడా ఔర్ మకాన్ (1974), సర్గం (1979), క్రాంతి (1981) వంటి చిత్రాలలో సహాయక పాత్రలు పోషించారు. దాదాపు ఐదు దశాబ్దాలకు పైగా సినిమాల్లో ధీరజ్ కుమార్ కొనసాగారు. ధీరజ్ కుమార్ మరణ వార్తను ధృవీకరించిన ఆయన కుటుంబం.. అభిమానులు, శ్రేయోభిలాషుల ప్రార్థనలకు కృతజ్ఞతలు తెలిపింది. రేపు ఉదయం 10 గంటల వరకు అభిమానుల సందర్శనార్థం భౌతికకాయాన్ని ఇంటివద్దకు తరలించనున్నారు. అనంతరం ఉదయం 11 గంటలకు విలే పార్లే వెస్ట్లోని పవన్ హన్స్ శ్మశానవాటికలో అంత్యక్రియలు జరుగుతాయి. -
నటిపై దారుణ ట్రోల్స్.. మహిళలంటే ఎందుకంత ద్వేషం.. ఉర్ఫీ జావెద్ ఆగ్రహం!
బిగ్బాస్ బ్యూటీ ఉర్ఫీ జావెద్ మరోసారి వార్తల్లో నిలిచింది. ఇటీవలే ది ట్రైటర్స్ టైటిల్ గెలిచిన ముద్దుగుమ్మ నెటిజన్స్ ట్రోల్స్పై తీవ్రస్థాయిలో మండిపడింది. ఇలాంటివీ నా జీవితంలో చాలా చూశానని ఉర్ఫీ చెప్పుకొచ్చింది. ఒక మహిళ ఎదుగుతుంటే ఓర్వలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజాగా ఇటీవల ప్రముఖ యూట్యూబర్ ఆశిష్ చంచలానీతో ప్రేమలో ఉన్నట్లు నటి ఎల్లీ అవ్రామ్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే ఇది చూసిన నెటిజన్స్ ఈ జంటపై ట్రోల్స్ చేయడం ప్రారంభించారు.ఈ ప్రేమజంటను చూసి ట్రోల్స్ చేయడంపై నటి ఉర్ఫీ జావెద్ మండిపడింది. ఎల్లి అవ్రామ్ను లక్ష్యంగా చేసుకుని ట్రోల్స్ చేసినందుకు ఉర్ఫీ జావేద్ విమర్శించింది. ఈ రోజుల్లో స్త్రీలపై విద్వేషం చూపించడం ఫ్యాషన్ అయిపోయిందన్నారు. ఇది చూస్తుంటే మహిళల పట్ల ఈ ప్రపంచం ఎంత క్రూరంగా ఉందో అర్థమవుతోందని చెప్పింది. కేవలం ఒక అమ్మాయి వయసును ఉద్దేశించి కామెంట్స్ చేయడమేంటని ఉర్ఫీ ప్రశ్నించింది. ఇక్కడ మహిళలను విలన్గా చూపించడానికి, ద్వేషించడానికే ఎక్కువ ఇష్టపడతారని.. అదే వారు ఉన్నతంగా భావిస్తారని ఉర్ఫీ ఆవేదన వ్యక్తం చేసింది. సమాజం ఎల్లప్పుడూ మహిళలను విమర్శించడానికి ఏదో ఒక మార్గాన్ని ఎంచుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేసింది.కాగా.. జూలై 12న, ఆశిశ్, ఎల్లీ ఇన్స్టాగ్రామ్లో ఇద్దరు కలిసి ఉన్న ఫోటోను పోస్ట్ చేశారు. ఆశిష్ ఎల్లీని తన చేతుల్లోకి ఎత్తుకుని కనిపించారు. తామిద్దరం ప్రేమలో ఉన్నట్లు ఫైనల్లీ అంటూ క్యాప్షన్ రాసుకొచ్చారు. ఇది చూసిన నెటిజన్స్ వీరిద్దరి వయస్సును ఉద్దేశిస్తూ ట్రోల్స్ చేశారు. అయితే వీరిద్దరి మధ్య మూడేళ్ల ఏజ్ గ్యాప్ ఉంది.యూట్యూబ్లో ఫన్నీ వీడియోలతో అశిష్ చంచ్లానీ చాలా పాపులారిటీ సొంతం చేసుకున్నాడు. ఒకటి రెండు సినిమాల్లోనూ నటించాడు. రీసెంట్ టైంలో ఇతడు బాలీవుడ్ నటి ఎల్లీ అవ్రామ్తో తరచుగా కనిపిస్తూ వచ్చాడు. దీంతో వీరిద్దరి మధ్య సమ్థింగ్ సమ్థింగ్ అని నెటిజన్లు మాట్లాడుకున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు 'ఫైనల్లీ' అని ఆశిష్ ఓ ఫొటో పోస్ట్ చేశాడు. ఇందులో ఎల్లీని ఎత్తుకుని, ఇద్దరు నవ్వుతూ కనిపించారు. దీంతో పలువురు నటులు వీళ్లకు కంగ్రాట్స్ చెబుతున్నారు.మరోవైపు ఎల్లీ అవ్రామ్ విషయానికొస్తే ఈమెది మన దేశం కాదు స్వీడన్. కాకపోతే మోడలింగ్ చేస్తూ బాలీవుడ్ దర్శకుల దృష్టిలో పడింది. అలా 2013 నుంచి హిందీతో పాటు తమిళ, కన్నడ, మరాఠీ భాషల్లో పలు సినిమాల్లో నటించింది. బిగ్బాస్ 7, జలక్ ధిక్లా జా 7, బాక్స్ క్రికెట్ లీగ్ 2 తదితర రియాలిటీ షోల్లోనూ పాల్గొంది. -
ఓటీటీకి సరికొత్త క్రైమ్ థ్రిల్లర్.. ట్రైలర్ చూశారా?
ఓటీటీలో కంటెంట్కు డిమాండ్ విపరీతంగా పెరిగిపోతోంది. దీంతో మేకర్స్ సైతం సరికొత్త మిస్టరీ థ్రిల్లర్స్తో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. తాజాగా ఓటీటీ ప్రియులను అలరించేందుకు మరో మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ వచ్చేస్తోంది. బాలీవుడ్ నటి వాణీ కపూర్ లీడ్రోల్ పోషించిన సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ మండల మర్డర్స్. ఈ సిరీస్ నెట్ఫ్లిక్స్ వేదికగా సందడి చేయనుంది.ఈ నేపథ్యంలోనే ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్. ఈ సిరీస్లో వాణీకపూర్ పోలీస్ ఆఫీసర్గా కనిపించనుంది. వైభవ్ రాజ్ గుప్తా, సుర్వీన్ చావ్లా కీలక పాత్రలు పోషిస్తున్నారు. కొన్ని శతాబ్దాల కిందట చరణ్దాస్పూర్లో జరిగిన హత్యల నేపథ్యంలో ఈ సిరీస్ను తెరకెక్కించారు. ఈ వెబ్ సిరీస్కు గోపి పుత్రన్ దర్శకత్వం వహించగా.. యశ్రాజ్ ఫిల్మ్స్ బ్యానర్లో నిర్మించారు. ఈ సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ఈనెల 25 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. -
విడాకుల తర్వాత కొత్త ప్రయాణం.. మళ్లీ పెళ్లి చేసుకోని తారలు వీళ్లే!
బాలీవుడ్ నటీనటులకు ప్రేమ, పెళ్లి, విడాకులు సర్వసాధారణం అనే టాక్ బయట ఉంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఎంతో మంది స్టార్స్ కొన్నాళ్లకే విడిపోయారు. పలువురు విడాకులు తీసుకొని మరోపెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని గడుపుతున్నారు. అయితే రూపాయికి ఇంకో వైపు ఉన్నట్లుగా.. బాలీవుడ్ తారల్లో మరో కోణం కూడా ఉంది. విడాకులు తీసుకున్న తర్వాత..మరో పెళ్లి చేసుకొని తారలు కూడా ఉన్నారు. పెళ్లి బంధానికి స్వస్తి చెప్పి.. సింగిల్గానే ఉంటూ కెరీర్పై దృష్టిసారించిన కొంతమంది బాలీవుడ్ స్టార్స్పై ఓ లుక్కేద్దాం. మనీషా కొయిరాలామనీషా కొయిరాలా, 1990లలో తన అందం, నటనతో బాలీవుడ్ను ఓ ఊపు ఊపిన నటి. 'దిల్ సే', 'ఒకే ఒక్కడు' వంటి చిత్రాలతో స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందిన ఆమె, 2010లో నేపాలీ వ్యాపారవేత్త సామ్రాట్ దహల్ను వివాహం చేసుకుంది. అయితే, వివాహం జరిగిన ఆరు నెలలకే వారి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తాయి. దీంతో 2012లో విడాకులు తీసుకుంది. ఆ తర్వాత మనీషా మరో పెళ్లి చేసుకోకుకండా ఒంటరిగానే ఉంటుంది. ప్రస్తుతం ఆమె సినిమాల్లో కొనసాగుతూ, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్నారు. పూజా భట్పూజా భట్, 'దిల్ హై కి మాంతా నహీ', 'సడక్' వంటి చిత్రాలతో పాపులర్ అయిన నటి మరియు నిర్మాత. ఆమె 2003లో వ్యాపారవేత్త మనీష్ మఖీజాను వివాహం చేసుకుంది, కానీ 2014లో వారు విడిపోయారు. ఆ తర్వాత మరో పెళ్లి చేసుకోకుండా.. ఒంటరిగానే ఉంటున్నారు. ప్రస్తుతం ఆమె సినిమా నిర్మాణం, దర్శకత్వంలో బిజీగా ఉన్నారు. చిత్రాంగద సింగ్చిత్రాంగద సింగ్, 'హజారోం ఖ్వాహిషే ఐసీ', 'దేశీ బాయ్జ్' వంటి చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న నటి. ఆమె 2001లో గోల్ఫర్ జ్యోతి రంధావాను వివాహం చేసుకుంది. వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. అయితే, 2013లో వారు విడిపోయారు, 2014లో విడాకులు ఖరారయ్యాయి. చిత్రాంగద తన కెరీర్పై దృష్టి సారించి, సినిమాల్లో నటిస్తూ, సింగిల్ మదర్గా తన కుమారుడిని పెంచుతోంది. ప్రస్తుతం వరకు ఆమె మళ్లీ వివాహం చేసుకోలేదు, తన వృత్తి, కుటుంబంపై దృష్టి పెట్టింది.కరిష్మా కపూర్'రాజా హిందుస్థానీ', 'దిల్ తో పాగల్ హై' వంటి చిత్రాలతో 90లలో స్టార్డమ్ సంపాదింకున్న నటి కరిష్మా కపూర్. ఆమె 2003లో వ్యాపారవేత్త సంజయ్ కపూర్ను వివాహం చేసుకుంది, వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే, వైవాహిక సమస్యల కారణంగా 2014లో విడిపోయి, 2016లో విడాకులు తీసుకుంది. కరిష్మా ప్రస్తుతం సినిమా నిర్మాణంలో నిమగ్నమై, తన పిల్లల సంరక్షణపై దృష్టి సారిస్తూ సింగిల్గా జీవిస్తోంది. ఆమె మళ్లీ వివాహం చేసుకోలేదు.రేఖాబాలీవుడ్ దిగ్గజ నటి రేఖా, తన అద్భుతమైన నటనతో దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తోంది. ఆమె 1990లో వ్యాపారవేత్త ముఖేష్ అగర్వాల్ను వివాహం చేసుకుంది, కానీ ఈ వివాహం కేవలం ఒక సంవత్సరం మాత్రమే కొనసాగింది. ముఖేష్ 1991లో ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. ఆ తర్వాత రేఖ మళ్లీ వివాహం చేసుకోలేదు. వీరితో పాటు పలువురు బాలీవుడ్ తారలు విడాకుల తర్వాత ఒంటరి జీవితాన్నే గడుపుతున్నారు. -
ప్రీ-మెటర్నిటీ షూట్ కూడా చేశా.. కానీ ఒక్కరోజు ముందే..!
ప్రముఖ బిగ్బాస్ బ్యూటీ, బుల్లితెర నటి సంభావన సేత్ బాలీవుడ్లో పలు సీరియల్స్లో నటించింది. సీరియల్స్తో పాటు కొన్ని సినిమాల్లో కూడా కనిపించింది. 2016లో అవినాశ్ ద్వివేదిని పెళ్లాడిన ఈ ముద్దుగుమ్మ.. తాజాగా తనకెదురైన చేదు అనుభవాన్ని పంచుకుంది. గతేడాది ఐవీఎఫ్ ద్వారా గర్భం దాల్చగా.. ఆ తర్వాత జరిగిన షాకింగ్ ఘటనను వివరించింది.గతేడాది డిసెంబర్లో జరిగిన తనకు గర్భస్రావమైందని సంభావన సేత్ వెల్లడించింది. మొదటి త్రైమాసికంలో అంతా బాగానే ఉందని వైద్యుడు మాకు హామీ ఇస్తూనే ఉన్నాడని తెలిపింది. కానీ ఆ తర్వాత గర్భంలో తన బిడ్డ హృదయ స్పందన 15 రోజుల ముందే ఆగిపోయిందని తాను గుర్తించానని వెల్లడించింది. మూడు నెలల గర్భవతిగా ఉన్నప్పుడు ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించాలని ప్రీ-మెటర్నిటీ షూట్ కూడా నిర్వహించామని సంభావన పేర్కొంది. ఈ సంతోషకర విషయాన్ని చెప్పేందుకు ఒక రోజు ముందే తనకు బ్లీడింగ్ మొదలైందని షాకింగ్ విషయాన్ని రివీల్ చేసింది.అయితే దాదాపు 15 రోజుల ముందే అనారోగ్యంతో ఉన్నానని వైద్యుడికి సమాచారం ఇచ్చా.. కానీ నాకు ఆర్థరైటిస్ సమస్య అని తేలిగ్గా తీసుకున్నారు. ఆ తర్వాత ఆర్థరైటిస్ స్పెషలిస్ట్ వద్దకు వెళ్లగా అలాంటిదేం లేదని చెప్పారు.. ఇది గర్భస్రావానికి సంకేతమని డాక్టర్ అన్నారు. కానీ మేము సంప్రదించిన డాక్టర్ మాత్రం ఎలాంటి టెస్టులు చేయకుండా అంతా నార్మల్గానే ఉందని చెప్పారని గుర్తు చేసుకుంది. డాక్టర్ నిర్లక్ష్యం వల్లే తనకు గర్భస్రావం అయిందని తెలుసొచ్చిందని సంభావన వివరించింది. అంతేకాకుండా మీకు చాలా ఆరోగ్య సమస్యలు ఉన్నాయంటూ తనదే తప్పు అన్నట్లుగా మాట్లాడిందని తన బాధను వ్యక్తం చేసింది -
'రామాయణ' బడ్జెట్ రివీల్ చేసిన నిర్మాత.. మీ ఊహకు కూడా అందదు
రామాయణం మానవ జీవితానికి అవసరమైన విలువలను, మార్గదర్శకత్వాన్ని అందించే ఒక గొప్ప గ్రంథం. మన రాముడి గురించి 'రామాయణ' సినిమా ద్వారా ప్రపంచానికి బాలీవుడ్ చూపనుంది. తాజాగా విడుదలైన గ్లింప్స్ విజువల్స్ అద్బుతంగా ఉన్నాయంటూ గ్రాఫిక్స్ వర్క్పై ప్రశంసలు అందుతున్నాయి. దర్శకుడు నితేశ్ తివారీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రాముడి పాత్రలో బాలీవుడ్ స్టార్ రణ్బీర్ కపూర్, సీత పాత్రలో సాయి పల్లవి నటిస్తున్నారు. రాకింగ్ స్టార్ యశ్ నిర్మాణ సంస్థ మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్, అలాగే నమిత్ మల్హోత్రా నిర్మాణ సంస్థ ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్ సంయుక్తంగా కలిసి ఈ మూవీని నిర్మిస్తున్నాయి. రెండు భాగాలుగా రానున్న ఈ చిత్రాల బడ్జెట్ గురించి నమిత్ మల్హోత్రా సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.రూ. 4 వేల కోట్ల బడ్జెట్ఇటీవల జరిగిన పాడ్కాస్ట్లో, నమిత్ మల్హోత్రా మాట్లాడుతూ.. రామాయణంలోని రెండు భాగాలకు దాదాపు $500 మిలియన్లు, అంటే దాదాపు రూ. 4000 కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. దీంతో రామాయణం అత్యంత ఖరీదైన భారతీయ చిత్రంగా నిలిచింది. ఇప్పటివరకు విడుదలైన భారతీయ చిత్రాల బడ్జెట్లు ఏవీ 1000 కోట్లు దాటలేదు. ఈ బడ్జెట్తో రామాయణం ప్రపంచ సినిమాల్లో అత్యంత ఖరీదైన ఫ్రాంచైజీలలో ఒకటిగా కూడా మారనుంది. ఇప్పటివరకు ఈ చిత్రాల బడ్జెట్ రూ. 1500 కోట్ల వరకు ఉంటుందని మీడియాలో కథనాలు వచ్చాయి. ఇప్పుడు నిర్మాత చెప్పిన లెక్కలు చూస్తుంటే కళ్లు చెదిరేలా ఈ మూవీ ఉండబోతుందని అర్థం అవుతుంది."పార్ట్ 1, పార్ట్ 2 రెండు సినిమాలు కలిపి పూర్తయ్యే సమయానికి ఇది దాదాపు $500 మిలియన్లు అవుతుంది, అంటే దాదాపు రూ. 4000 కోట్లు. ప్రపంచం చూడవలసిన గొప్ప కథ రామాయణం. మేము ప్రపంచంలోనే అతిపెద్ద చిత్రాన్ని నిర్మిస్తున్నాము. అయితే, ఇది ఇప్పటికీ కొన్ని హాలీవుడ్ చిత్రాల బడ్జెట్ల కంటే తక్కువేనని నేను భావిస్తున్నాను. తక్కువ ఖర్చుతో పెద్ద చిత్రాన్ని నిర్మిస్తున్నామని నేను భావిస్తున్నాను. ఈ చిత్రం కేవలం డబ్బు కోసమే చేస్తుంది కాదు. ప్రపంచానికి మన రాముడి గురించి చెప్పాలని అనుకున్నాను.' అని నమిత్ అన్నారు. 20కి పైగా భాషలుహాలీవుడ్లోని ఇతర సినిమాల మాదిరిగానే రామాయణం కూడా ప్రపంచవ్యాప్తంగా సుమారు 20కి పైగా భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రాన్ని DC కామిక్స్ హిట్ చిత్రాలు బ్యాట్మన్, సూపర్ మెన్, వండర్ వుమన్ వంటి వాటితో పాటు మార్వెల్ సినిమాలకు తగ్గకుండా రామాయణ ప్రాజెక్ట్ రూపొందించాలని మేకర్స్ యోచిస్తున్నారు. మొదటి భాగం 2026 దీపావళి సందర్భంగా విడుదల కానుంది. రెండవ భాగం 2027 దీపావళి సందర్భంగా తెరపైకి రానుంది. -
లార్డ్స్లో లవ్ బర్డ్స్.. బాయ్ఫ్రెండ్తో ఆదిపురుష్ భామ సందడి!
ఆదిపురుష్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బాలీవుడ్ ముద్దుగుమ్మ కృతి సనన్. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన మెప్పించింది. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న భామ ప్రస్తుతం లండన్లో వాలిపోయింది. ఇంగ్లాండ్లో జరుగుతున్న టీమిండియా మ్యాచ్లో తళుక్కున మెరిసింది. అయితే ఆమెతో పాటు బాయ్ఫ్రెండ్గా భావిస్తోన్న కబీర్ బహియా కూడా కనిపించారు. ఇద్దరు జంటగా కనిపించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దీంతో మరోసారి ఈ ముద్దుగుమ్మపై డేటింగ్ రూమర్స్ వినిపిస్తున్నాయి.కృతి-కబీర్ డేటింగ్ రూమర్స్అయితే ఈ జంట ఇలా కనిపించడం ఇదేం మొదటిసారి కాదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో బెంగళూరులో జరిగిన స్నేహితుడి వివాహానికి హాజరయ్యారు. అప్పట్లో వీరిద్దరు కలిసి వచ్చిన ఓ వీడియో నెట్టంట వైరలైంది. ఈ పెళ్లిలో కృతి సనన్- కబీర్ చాలా సన్నిహితంగా కనిపించారు. లండన్కు చెందిన వ్యాపారవేత్త అయినా కబీర్తో కలిసి చాలాసార్లు విహారయాత్రల్లోనూ కృతి కనిపించింది. అయితే వీరిద్దరికీ దాదాపు ఎనిమిదేళ్ల ఏజ్ గ్యాప్ ఉంది. ఈ జంట ప్రస్తుతం ప్రేమలో ఉన్నారని.. ఈ ఏడాదిలోనే వివాహం చేసుకోవాలని కూడా ప్లాన్ చేస్తున్నారని బాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది.అయితే ఇదే మ్యాచ్లో పలువురు బాలీవుడ్ తారలు కూడా హాజరై సందడి చేశారు. హీరో అక్షయ్ కుమార్, ట్వింకిల్ ఖన్నా సైతం లార్డ్స్ టెస్ట్ మ్యాచ్కు హాజరయ్యారు. భారత క్రికెట్ జట్టు మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రితో కలిసి మ్యాచ్ను వీక్షించారు.Kriti Sanon at the Lord's. #AkshayKumar sabke sb pauch gye 😐 waha lanka lagi hui hai Jadeja 🥳 khel jao #INDvsENG #JHOPE #TestCricket #INDVsENGLive pic.twitter.com/umWT58y0DG— Karan Visible (@Visibleindustry) July 14, 2025 -
22 ఏళ్ల బంధానికి గుడ్ బై.. డైెరెక్టర్తో బుల్లితెర నటి విడాకులు!
ప్రముఖ బుల్లితెర నటి వివాహా బంధానికి గుడ్ బై చెప్పేసింది. బాలీవుడ్లో అనే సీరియల్స్లో నటించిన నటి పల్లవిరావు తన భర్తతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించింది. పెళ్లైన దాదాపు 22 ఏళ్ల తర్వాత తన భర్త, దర్శకుడు సూరజ్ రావుతో బంధానికి ముగింపు పలకనున్నట్లు వెల్లడించింది. ప్రశాంతమైన జీవితాన్ని కొనసాగించడానికే తామిద్దరం విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ విషయాన్ని రెండు వారాల క్రితమే పోస్ట్ చేసింది.పాండ్యా స్టోర్తో అనే సీరియల్లో పల్లవిరావు బాలీవుడ్లో గుర్తింపు తెచ్చుకుంది. పల్లవి 2009లో హిందీ సీరియల్ యహాన్ మే ఘర్ ఘర్ ఖేలీతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పునర్ వివాహ ఏక్ నయీ ఉమీద్, మెయిన్ లక్ష్మీ తేరే అంగన్ కీ, బిట్టో, పాండ్యా స్టోర్, కహానీ హుమారే మహాభారత్ కీ వంటి సీరియల్స్లో మెప్పించింది. అంతేకాకుండా పల్లవి ఫియర్ ఫైల్స్, సావధాన్ లాంటి వాటిలో కొన్ని ఎపిసోడ్లలో కూడా కనిపించింది. పల్లవి బుల్లితెర నటిగానే కాకుండా యాడ్స్లోనూ నటించింది. అనేక టీవీ సీరియల్స్లో అతిథి పాత్రలో అలరించింది.కాగా.. వీరిద్దరికీ ఇద్దరు పిల్లలు 21 ఏళ్ల కుమార్తె, 18 ఏళ్ల కుమారుడు ఉన్నారు. ఈ జంట 2003లో వివాహం చేసుకున్నారు. అయితే విడాకులపై నటి భర్త సూరజ్ రావు ఇంకా ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు. -
లండన్లో లవ్ బర్డ్స్.. ఆ ఫోటోలతో దొరికిపోయిన మహ్వశ్- చాహల్!
ప్రముఖ ఆర్జే మహ్వశ్ గత కొన్ని నెలలుగా వార్తల్లో నిలుస్తోంది. టీమిండియా క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్తో కనిపించడంతో ఆమె పేరు ఒక్కసారిగా మార్మోగిపోయింది. వీరిద్దరు డేటింగ్లో ఉన్నారంటూ పలు సందర్భాల్లో వార్తలొచ్చాయి. కానీ తమపై వస్తున్న కథనాలపై ఇప్పటి వరకు ఎవరూ కూడా క్లారిటీ ఇవ్వలేదు. ఇటీవల కపిల్ శర్మ షోలో పాల్గొన్న చాహల్ ఇన్డైరెక్ట్గా హింట్ ఇచ్చేశాడు. తను ఎవరో మీ అందరికీ ఇప్పటికే తెలుసుగా అంటూ చాహల్ తన మనసులో మాట చెప్పేశాడు. దీంతో ఈ జంట డేటింగ్ నిజమేనంటూ నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేశారు.ఈ నేపథ్యంలోనే చాహల్, ఆర్జే మహ్వశ్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు వైరల్గా మారాయి. లండన్లో ఈ ప్రేమజంట చక్కర్లు కొడుతున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరు తమ ఇన్స్టా వేదికగా షేర్ చేసిన ఫోటోల్లో బ్యాక్గ్రౌండ్లో లోకేషన్ ఓకేలా కనిపిస్తోంది. దీంతో ఈ లవ్ బర్డ్స్ తాజాగా లండన్లోనే వేకేషన్ ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఫోటోలు కాస్తా నెట్టింట వైరల్ కావడంతో ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. చాహల్ ఫోటోలు చూసిన ఓ నెటిజన్ మహ్వశ్ బాబీ తీశారా అంటూ కామెంట్ చేశాడు. వారిద్దరు డేటింగ్ చేస్తున్నారని నాకు తెలుసు అంటూ మరో నెటిజన్ రాసుకొచ్చాడు.చాహల్, మహ్వశ్పై డేటింగ్ రూమర్స్క్రికెటర్ చాహల్ తన భార్య ధనశ్రీ వర్మతో విడాకులు తీసుకున్నారు. అంతకుముందే మహ్వశ్, చాహల్ డేటింగ్లో ఉన్నట్లు రూమర్స్ మొదలయ్యాయి. ఎందుకంటే ఛాంపియన్ ట్రోఫీ మ్యాచ్లో జంటగా కనిపించడం.. ఆ తర్వాత ఐపీఎల్ మ్యాచ్ల్లోనూ పంజాబ్ కింగ్స్ టీమ్కు మద్దతుగా మ్యాచ్ల్లో సందడి చేసింది. View this post on Instagram A post shared by Mahvash (@rj.mahvash) View this post on Instagram A post shared by Yuzvendra Chahal (@yuzi_chahal23) -
పాకిస్థాన్లో 'రామాయణం' నాటకం.. ఫొటోలు వైరల్
అవును మీరు విన్నది నిజమే. దాయాది దేశం పాకిస్థాన్లోని కరాచీలో 'రామాయణ' గాథని నాటకంగా ప్రదర్శించారు. ఈ స్టేజీ షోకు అద్భుతమైన ఆదరణ కూడా వచ్చినట్లు తెలుస్తోంది. దాదాపు మూడు రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమానికి జనాలు కూడా బాగానే వచ్చారండోయ్. ఇంతకీ అసలెలా ఇది సాధ్యమైంది? నాటకం వేసింది ఎవరు?పాకిస్థాన్ పేరు చెప్పగానే ఉగ్రదాడులు, మత కల్లోలాలు లాంటివే గుర్తొస్తాయి. కానీ ఆ దేశంలోనూ ఇప్పుడు రామాయణ గాథని నాటకం వేయడం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. కరాచీ నగరానికి చెందిన యోగేశ్వర్ కరేరా, రాణా కజ్మాలతో పాటు మరికొందరు నాటక రంగంపై ఉన్న ఇష్టంతో థియేటర్ ఆర్ట్స్తో పాటు వివిధ విభాగాల్లో శిక్షణ తీసుకున్నారు. వీళ్లంతా తన బృందానికి 'మౌజ్' అని పేరు పెట్టుకున్నారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 15 సినిమాలు రిలీజ్)గతేడాది నవంబరులో తొలిసారి ఓ ఆర్ట్ గ్యాలరీలో రామాయణ నాటకాన్ని ప్రదర్శించారు. దీనికి మంచి స్పందన వచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా మరిన్ని హంగులు జోడించి, ఏఐ టెక్నాలజీని కూడా కాస్త ఉపయోగించి తాజాగా మూడు రోజుల పాటు నాటకాన్ని కరాచీలోని ఆర్ట్స్ కౌన్సిల్లో మరోసారి ప్రదర్శించారు. దీనికి కూడా విశేష స్పందన వచ్చింది.రామాయణ నాటకాన్ని ప్రదర్శించినందుకు తమకు ఎలాంటి విమర్శలు, బెదిరింపులు రాలేదని దర్శకుడు యోగేశ్వర్ కరేరా చెప్పుకొచ్చారు. ఈ పురాణ గాథకు విశేషాదరణ దక్కిందని అన్నారు. ఏదైతేనేం పాక్ దేశంలో రామాయణ నాటకం ప్రదర్శించడం ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయింది.(ఇదీ చదవండి: ప్రముఖ నటి సరోజా దేవి కన్నుమూత) -
పోలీసులకు ఫిర్యాదు చేసిన బిగ్బాస్ బ్యూటీ.. ఎందుకంటే!
ప్రముఖ బిగ్బాస్ కంటెస్టెంట్ కశిష్ కపూర్ (24) పోలీసులను ఆశ్రయించింది. తన ఇంట్లో దొంగతనం జరిగినట్లు పీఎస్లో ఫిర్యాదు చేసింది. తన ఇంటి పనిమనిషి సచిన్ కుమార్ చౌదరి ఈ చోరీకి పాల్పడ్డారని ఆరోపిస్తూ ముంబయిలోని అంబోలి స్టేషన్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. తన బీరువాలోని రూ.4 లక్షల నగదు చోరీ చేశాడని జూలై 9న ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు. కాగా.. సచిన్ కుమార్ మార్ చౌదరి గత ఐదు నెలలుగా ఆమె ఇంటి పనిమనిషిగా పనిచేస్తున్నారని పోలీసులకు తెలిపింది. కాగా.. బిగ్బాస్ బ్యూటీ కశిశ్ కపూర్ బీహార్ స్వస్థలం కాగా.. ప్రస్తుతం ముంబయి అంధేరి వెస్ట్లోని ఆజాద్నగర్ వీర దేశాయ్ రోడ్లోని సొసైటీలో నివసిస్తోంది. ఆమె సినిమాలతో పాటు పలు టీవీ సీరియల్స్లో నటించింది. బిగ్ బాస్లో కంటెస్టెంట్గా పాల్గొని మరింత ఫేమ్ తెచ్చుకుంది. -
బాలీవుడ్కు వస్తానంటున్న స్క్విడ్ గేమ్ హీరో
ఛాన్స్ ఇస్తే ఇండియన్ సినిమాలో నటిస్తానంటున్నాడు స్క్విడ్ గేమ్ హీరో లీ జంగ్ జే (Lee Jung Jae). నెట్ఫ్లిక్స్ బ్లాక్బస్టర్ సిరీస్ స్క్విడ్ గేమ్ (Squid Game) మూడు సీజన్లలో కథానాయకుడిగా యాక్ట్ చేశాడు లీ జంగ్ జే. ప్లేయర్ 456గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నాడు. తాజాగా అతడు భారతీయ సినిమాలో నటించాలనుందన్న కోరికను బయటపెట్టాడు. ఛాన్సిస్తే బాలీవుడ్ సినిమాలో నటించడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పుకొచ్చాడు. మరి లీ జంగ్ జే భవిష్యత్తులో బాలీవుడ్ సినిమాలో కనిపిస్తాడేమో చూడాలి!సినిమా- సిరీస్దక్షిణ కొరియాకు చెందిన లీ జంగ్ జే.. ఎన్ ఎఫైర్, సిటీ ఆఫ్ ద రైజింగ్ సన్, ఓ బ్రదర్స్, ఓవర్ ద రైన్బో, లాస్ట్ ప్రజెంట్, బిగ్ మ్యాచ్, ద ఫేస్ రీడర్, డెలివర్ అజ్ ఫ్రమ్ ఈవిల్ ఇలా అనేక సినిమాలు చేశాడు. స్క్విడ్ గేమ్ మొదటి సీజన్తో ఇంటర్నేషనల్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సిరీస్లో తన నటనకుగానూ ఆసియా ఆర్టిస్ట్, హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ టీవీ అవార్డు అందుకున్నాడు హంట్ సినిమాతో దర్శకుడిగానూ మారాడు.చదవండి: 'బిగ్బాస్'లో టాలీవుడ్ సెలబ్రిటీలు, సన్యాసం తీసుకున్న ఆ హీరోయిన్ కూడా! -
ముద్ద సీన్ని తొలగిస్తారా?.. సెన్సార్ టీమ్పై నటి ఫైర్!
సినిమాలో ముద్దు సీన్ తొలగించిన సెన్సార్ బోర్డ్పై బాలీవుడ్ నటి శ్రేయా ధన్వంతరి(Shreya Dhanwanthary) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి చర్యల వల్ల ప్రేక్షకులు థియేటర్స్ రాకుండా వెళ్తారని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రేక్షకులను చిన్నపిల్లల భావించి, థియేటర్ని అనుభూతిని పూర్తిగా ఆస్వాదించకుండా చేస్తున్నారంటూ సెన్సార్ బోర్డ్పై మండిపడింది. వివరాల్లోకి వెళితే..డేవిడ్ కొరెన్స్వెట్, రెచెల్ ప్రధాన పాత్రల్లో నటించిన హాలీవుడ్ సినిమా ‘సూపర్ మ్యాన్’(Superman) ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఇండియన్ వెర్షన్లో 33 సెకన్ల ముద్దు సన్నివేశంతో పాటు హీరోకి సంబంధించిన కొన్ని డైలాగ్స్ని తొలగించారు. సెన్సార్ టీమ్ అభ్యంతరం చెప్పడం వల్లే ఆయా సన్నివేశాలు తొలగించాల్సి వచ్చిందని చిత్రబృందం పేర్కొంది. దీనిని నటి శ్రేయా ధన్వంతరి తప్పుపట్టింది. ఇదొక అర్థంపర్థం లేని చర్య అని సోషల్ మీడియా వేదికగా తన అసంతృప్తిని వెల్లడించింది. ‘సూపర్ మ్యాన్లో 33 సెకన్ల ముద్దు సీన్ని తొలగించడం ఏంటి? ప్రేక్షకులు థియేటర్స్కి వచ్చి సినిమా చూడాలని సెన్సార్ వాళ్లే చెబుతుంటారు. పైరసీని ప్రొత్సహించొద్దని అంటారు. కానీ వాళ్లు మాత్రం ఇలాంటి అర్థంపర్థం లేని పనులు చేస్తారు. వాళ్ల లక్ష్యం ఏంటో నాకు అర్థం కాదు. ఇలాంటి చిన్న చిన్న సీన్లను కూడా కట్ చేసి.. థియేటర్ అనుభూతిని దారుణంగా దెబ్బతీస్తున్నారు. మేమే డబ్బులు పెడుతున్నాం..మేమే సమయం కేటాయిస్తున్నాం కదా.. మరి మాకు నచ్చింది చూడకుండా ఆపుతారెందుకు? మేం ఏం చూడాలనుకుంటున్నామో మమ్మల్నే నిర్ణయించుకోనివ్వండి. సినిమా చూడడానికి థియేటర్ ఉత్తమ మార్గం. ప్రేక్షకులను చిన్న పిల్లలా భావించి.. థియేటర్స్ అనుభూతిని ఆస్వాదించకుండా చేస్తున్నారు’ అని సెన్సార్ బోర్డుపై ఫైర్ అయింది.శ్రేయా ధన్వంతరి ప్రస్తుతం బాలీవుడ్లో వరుస సినిమాలు, వెబ్ సిరీస్లతో బిజీగా ఉంది. ‘ఫ్యామిలీ మ్యాన్’, ‘చుప్: రివెంజ్ ఆఫ్ ది ఆర్టిస్ట్’, ‘స్కామ్ 1992’ వంటి వెబ్ సిరీస్లతో ప్రేక్షకుల ఆదరణ పొందింది. తెలుగులో ‘జోష్’, ‘స్నేహగీతం’ చిత్రాల్లో నటించింది. త్వరలో విడుదల కానున్న ‘ఫ్యామిలీ మ్యాన్ 3’ వెబ్ సిరీస్లో కూడా ఆమె కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. -
'బిగ్బాస్'లో టాలీవుడ్ సెలబ్రిటీలు, సన్యాసం తీసుకున్న ఆ హీరోయిన్ కూడా!
బిగ్బాస్ (Bigg Boss Reality Show) మొదలవడానికి రెండు నెలల ముందు నుంచే హంగామా మొదలైపోతుంది. తెలుగు బిగ్బాస్ తొమ్మిదో సీజన్ సెప్టెంబర్ మొదటివారంలో ప్రారంభమయ్యేట్లు కనిపిస్తోంది. ఇప్పటికే పలువురి పేర్లు తెరపైకి వచ్చాయి. ఇమ్మాన్యుయేల్, అలేఖ్య పికిల్స్ చెల్లెలు రమ్య, దెబ్జానీ, రీతూ చౌదరి, శివకుమార్, సాయికిరణ్, ముకేశ్ గౌడ సహా పలువురిని సంప్రదించినట్లు తెలుస్తోంది. అలాగే కామన్ మ్యాన్ కేటగిరీలో ఇద్దరుముగ్గురిని హౌస్లోకి పంపించనున్నారు.బిగ్బాస్లో టాలీవుడ్ సెలబ్రిటీలుతాజాగా పోకిరి విలన్ ఆశిష్ విద్యార్థి, నువ్వునేను హీరోయిన్ అనిత హస్సానందని కూడా బిగ్బాస్ షోలో అడుగుపెట్టనున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాకపోతే వీరిద్దరితో సంప్రదింపులు జరుపుతోంది తెలుగు బిగ్బాస్ టీమ్ కాదట! హిందీ బిగ్బాస్ టీమ్! హిందీ బిగ్బాస్ 19వ సీజన్ ఆగస్టు నెలాఖరులో ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఈసారి హౌస్లోకి వెళ్లేది వీరేనంటూ పలువురి పేర్లు తెరపైకి వచ్చాయి. కంటెస్టెంట్లు వీళ్లేనా?ఆ జాబితా ఓసారి చూసేద్దాం.. నటి మున్మున్ దత్తా, ఆలిషా పన్వర్, కనిక మన్, అరిష్ఫా ఖాన్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అపూర్వ ముఖిజ, మిస్టర్ ఫైజు, యూట్యూబర్ గౌరవ్ తనేజా, పురవ్ జా, వ్యాపారవేత్త రాజ్ కుంద్రా (హీరోయిన్ శిల్పా శెట్టి భర్త), నటుడు ధీరజ్ ధూపర్, పరాస్ కల్నవత్, కృష్ణ ష్రాఫ్ (జాకీ ష్రాఫ్ కూతురు), సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్ట్ మిక్కీ, కవలలు చింకీ-మింకీ ఉన్నారట!సన్యాసం తీసుకున్న ఆమె కూడా!వీరే కాకుండా లతా సబర్వాల్ (ఈమె తెలుగులో కొంచెం కొత్తగా మూవీలో నటించింది), తనుశ్రీ దత్తా (వీరభద్ర సినిమాలో హీరోయిన్గా యాక్ట్ చేసింది), ఆశిష్ విద్యార్థి (టాలీవుడ్ విలన్), హీరోయిన్ అనిత కూడా ఉన్నారంటూ ఈ జాబితా నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇటీవల జరిగిన మహాకుంభమేళాలో సన్యాసం తీసుకున్న మమతా కులకర్ణి సైతం బిగ్బాస్కు వెళ్లనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈమె తెలుగులో ప్రేమ శిఖరం, దొంగాపోలీస్ సినిమాల్లో కథానాయికగా నటించింది. మరి ఫైనల్ జాబితాలో వీరిలో ఎంతమంది ఉంటారనేది చూడాలి!చదవండి: హీరోను తిట్టా, కొట్టా.. సారీ మాత్రం చెప్పను: దర్శకురాలు -
అఫీషియల్.. ఫేమస్ యూట్యూబర్తో నటి డేటింగ్
ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు డేటింగ్, పెళ్లి విషయంలో యువత ఆలోచనలో మార్పు కనిపిస్తుంది. కొందరు అసలు పెళ్లి చేసుకోవడానికే భయపడుతుంటే.. మరికొందరు అబ్బాయిలు మాత్రం తన కంటే ఎక్కువ వయసున్న అమ్మాయిలతో ప్రేమలో పడుతున్నారు. పెళ్లి వరకు వెళ్తున్నారు. కొన్నిరోజుల క్రితం ఇలానే అఖిల్.. తన కంటే పెద్దదైన జైనబ్ని పెళ్లి చేసుకున్నాడు! ఇప్పుడు ప్రముఖ నటి కూడా తన కంటే చిన్నవాడైన ఓ యూట్యూబర్తో ప్రేమలో పడింది. ఆ విషయాన్ని ఇప్పుడు ఇద్దరూ ప్రకటించారు కూడా!(ఇదీ చదవండి: బన్నీ కోసం రిస్క్ చేయబోతున్న రష్మిక?) యూట్యూబ్లో ఫన్నీ వీడియోలతో అశిష్ చంచ్లానీ చాలా పాపులారిటీ సొంతం చేసుకున్నాడు. ఒకటి రెండు సినిమాల్లోనూ నటించాడు. రీసెంట్ టైంలో ఇతడు బాలీవుడ్ నటి ఎల్లీ అవ్రామ్తో తరచుగా కనిపిస్తూ వచ్చాడు. దీంతో వీరిద్దరి మధ్య సమ్థింగ్ సమ్థింగ్ అని నెటిజన్లు మాట్లాడుకున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు 'ఫైనల్లీ' అని ఆశిష్ ఓ ఫొటో పోస్ట్ చేశాడు. ఇందులో ఎల్లీని ఎత్తుకుని, ఇద్దరు నవ్వుతూ కనిపించారు. దీంతో పలువురు నటులు వీళ్లకు కంగ్రాట్స్ చెబుతున్నారు.ఎక్కడా కూడా తన బంధం గురించి చెప్పలేదు కానీ ఆశిష్-ఎల్లీ డేటింగ్లో ఉన్నారని నెటిజన్లు కన్ఫర్మ్ చేసేస్తున్నారు. ఎల్లీ అవ్రామ్ విషయానికొస్తే ఈమెది మన దేశం కాదు స్వీడన్. కాకపోతే మోడలింగ్ చేస్తూ బాలీవుడ్ దర్శకుల దృష్టిలో పడింది. అలా 2013 నుంచి హిందీతో పాటు తమిళ, కన్నడ, మరాఠీ భాషల్లో పలు సినిమాల్లో నటించింది. బిగ్బాస్ 7, జలక్ ధిక్లా జా 7, బాక్స్ క్రికెట్ లీగ్ 2 తదితర రియాలిటీ షోల్లోనూ పాల్గొంది. ఈమె వయసు 34 ఏళ్లు కాగా, ఆశిక్కి 31 ఏళ్లు. మరి వీళ్లు ఎప్పుడు పెళ్లి పీటలు ఎక్కుతారో చూడాలి?(ఇదీ చదవండి: రేణు దేశాయ్కు సర్జరీ.. అసలేమైంది?) View this post on Instagram A post shared by Ashish Chanchlani (@ashishchanchlani) -
రాజా సాబ్ సెట్లో తెలుగు నేర్చుకుంటున్నాను : సంజయ్ దత్
‘‘వెంకీ సార్, సుప్రీత్లకు సినిమా పట్ల ఎంతో ప్యాషన్ ఉంది. అందుకే ‘కేడీ: ది డెవిల్’ని గొప్పగా నిర్మించారు. ధృవ నా తమ్ముడులాంటివారు. శిల్పా శెట్టితో ఎప్పుడు పని చేసినా అదే ఎనర్జీ ఉంటుంది. మా ‘కేడీ: ది డెవిల్’ సినిమాకి విజయం అందించాలి’’ అని సంజయ్ దత్ పేర్కొన్నారు. ధృవ సర్జా హీరోగా, రీష్మా నానయ్య హీరోయిన్గా ప్రేమ్ దర్శకత్వం వహించిన చిత్రం ‘కేడీ: ది డెవిల్’. సంజయ్ దత్, శిల్పా శెట్టి, నోరా ఫతేహి ముఖ్య పాత్రలు పోషించారు. వెంకట్ కె. నారాయణ నిర్మించిన ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్లో జరిగింది. సంజయ్ దత్ మాట్లాడుతూ– ‘‘హైదరాబాద్తో నాకెంతో అనుబంధం ఉంది. ఎంతో మందితో కలిసి పని చేశాను. ప్రస్తుతం ప్రభాస్ ‘రాజా సాబ్’ సినిమా చేస్తున్నాను. ఆ సెట్లో తెలుగు నేర్చుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు. ధృవ సర్జా మాట్లాడుతూ–‘‘సంజయ్ దత్, శిల్పా శెట్టి వంటి వారితో పని చేయడం సంతోషంగానే ఉంటుంది. త్వరలో విడుదల కానున్న మా సినిమాని ఆదరించాలని కోరు కుంటున్నాను’’ అన్నారు. ‘‘మా సినిమా అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాను’’ అని నమ్మకం వ్యక్తం చేశారు ప్రేమ్. శిల్పా శెట్టి మాట్లాడుతూ– ‘‘నేను నా తొలి చిత్రం హిందీలో కాకుండా తెలుగులో (సాహసవీరుడు సాగరకన్య) చేశాను. ఇప్పుడు చేసిన ఈ ‘కేడీ: ది డెవిల్’లో అన్ని వాణిజ్య అంశాలున్నాయి.. ప్రేక్షకులు ఆదరించాలి’’ అన్నారు. హీరోయిన్ రీష్మా నానయ్య, కేవీఎన్ ్ర΄÷డక్షన్ బిజినెస్ హెడ్ సుప్రీత్ మాట్లాడారు. -
పిరియడ్స్లోనూ ‘హాఫ్ ఐరన్మ్యాన్’.. రికార్డు సృష్టించిన నటి
కొంతమంది తారలు నటనతో ఆకట్టకుంటూనే అప్పుడప్పుడు తమలోని అసాధరణమైన నైపుణ్యాన్ని బయటిప్రపంచానికి చూపించి.. ఆశ్చర్యపరుస్తుంటారు. కేవలం సినిమా రంగంలోనే కాకుండా..ఇతర రంగాలలోనూ తన టాలెంట్ని నిరూపించుకొని ప్రత్యేక గుర్తింపుని సంపాదించుకుంటారు. అలాంటి వారిలో నటి సయామీ ఖేర్(Saiyami Kher ) ఒకరు. తనదైన నటనతో అటు బాలీవుడ్, ఇటు తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న ఈ బ్యూటీ.. క్రీడల్లోనూ రాణిస్తోంది. ఇటీవల ‘ఐరన్మ్యాన్ 70.3’ అనే ట్రయాథ్లాన్ను పూర్తిచేసి..ఒకే ఏడాదిలో రెండు సార్లు ఈ రేసుని పూర్తి చేసిన తొలి భారతీయ నటిగా రికార్డు సృష్టించింది. అయితే ఈ సారి ఆమె పిరియడ్స్లో ఉన్నప్పుడు ఈ ఘనత సాధించడం గమనార్హం.ఏమిటీ ‘ఐరన్ మ్యాన్70.3’ ‘ఐరన్మ్యాన్ 70.3’ అనేది ఒక ప్రముఖ ట్రయాథ్లాన్ రేసు, ఇది ఐరన్మ్యాన్ సిరీస్లో భాగం. దీనిని "హాఫ్ ఐరన్మ్యాన్" అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇది పూర్తి ఐరన్మ్యాన్ రేస్ దూరంలో సగం ఉంటుంది. ఈ రేస్ మూడు ఈవెంట్లను కలిగి ఉంటుంది. తొలుత 1.9 కిలోమీటర్లు (1.2 మైళ్లు) ఈత కొట్టాలి. తర్వాత 90 కిలో మీటర్లు(56 మైళ్లు) సైక్లింగ్ చేయాలి. ఆ తర్వాత 21.1(13.1 మైళ్లు) కిలోమీటర్లు పరుగెత్తాలి. మొత్తం దూరం 113 కిలోమీటర్లు(70.3 మైళ్లు). అందుకే దీన్నీ ఐరన్ మ్యాన్ 70.3 అని పిలుస్తారు. ఇది ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రదేశాలలో నిర్వహించబడుతుంది. జులై 6న స్వీడన్లోని జోంకోపింగ్లో నిర్వహించిన ఈ రేస్లో సయామీ ఖేర్ పాల్గొని పతాకాన్ని సాధించిది. గతేడాది సెప్టెంబర్లో తొలిసారిగా మెడల్ అందుకున్న సయామీ.. ఇప్పుడు స్వీడన్లో నిర్వహించిన రేస్లో సత్తా చాటి మరో పతకం అందుకుంది.నెలసరి సమస్యను అధిగమించి.. నాకు పీసీఓఎస్(పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్) ఉంది. దీని వల్ల రుతుక్రమం సరిగ్గా కాదు. రేసులో పాల్గొనే వారంలోనే నాకు పిరియడ్స్ మొదలయ్యాయి. అదృష్టవశాత్తు నా పీరియడ్స్ చివరి రోజు రేసులో పాల్గొన్న కాబట్టి నొప్పి అంతగా లేదు. కానీ సాధారణ రోజుల కంటే ఆ సమయంలోనే నాకు కాస్త అసౌకర్యంగానే అనిపించింది. మానసికంగా కొంత కలవరపెట్టింది. చాలా మంది మహిళలు పీరియడ్స్ ఉన్నప్పుడు కూడా ఉద్యోగానికి, ఇతర పనులకు హాజరవుతుంటారు. అసౌకర్యంలోనూ మనం ఎలా ముందుకు సాగాలో వారి నుంచి నేర్చుకోవచ్చు. నేను కూడా నెలసరి సమస్యను అధిగమించి గత పోటీ కంటే ఈ సారి 32 నిమిషాల ముందే రేసుని పూర్తి చేశాను’ అని సయామీ ఓ నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పింది.సయామీ సీనీ నేపథ్యంనాసిక్కి చెందిన సయామీ.. ‘రేయ్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఆ తర్వాత బాలీవుడ్కి వెళ్లి.. అక్కడ వరుస సినిమాలతో స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందింది. చాలా కాలం తర్వాత ‘వైల్డ్ డాగ్’ సినిమాతో మళ్లీ టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది. ఇటీవల వచ్చిన హిందీ చిత్రం ‘జాబ్’లో కీలక పాత్ర పోషించింది. ప్రస్తుతం హిందీ, మరాఠీ చిత్రాలతో బీజీగా అయింది. -
'తన్వి ది గ్రేట్' సినిమా వీక్షించిన రాష్ట్రపతి
తన్వి ది గ్రేట్ (Tanvi The Great) అనే చిత్రాన్ని భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము(Droupadi Murmu) వీక్షించారు. చిత్ర యూనిట్తో కలిసి రాష్ట్రపతి భవన్లో ఈ సినిమాను ఆమె చూశారు. అనంతరం వారిని అభినందించారు. భారత సాయుధ దళాల ధైర్యం, త్యాగాలకు నివాళిగా ‘తన్వి ది గ్రేట్’ చిత్రాన్ని అనుపమ్ ఖేర్ (Anupam Kher) తెరకెక్కించారు. శుభాంగి దత్ టైటిల్ పాత్రలో నటించింది. ట్రైలర్లోనే ఆమె నటనతో అందరినీ మెప్పించింది. జులై 18న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రం ఇప్పటికే ఈ సినిమా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్, న్యూయార్క్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్స్లో ప్రదర్శించబడింది. ఒక ఆర్మీ కుటుంబంలో పుట్టిన అమ్మాయి ఆటిజం అనే అడ్డంకిని అధిగమించి ఆర్మీలో చేరాలనే కలను ఎలా నెరవేర్చిందన్నదే ఈ కథ ప్రధాన కథాంశం. 2002లో వచ్చిన 'ఓం జై జగదీష్' సినిమా తర్వాత మళ్లీ ‘తన్వి ది గ్రేట్’ చిత్రానికి అనుపమ్ ఖేర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో జాకీ ష్రాఫ్, అరవింద స్వామి, బొమన్ ఇరానీ, పల్లవి జోషి, నాజర్ వంటి స్టార్ నటులు ఉన్నారు. ఈ చిత్రాన్ని ఎన్ఎఫ్డీసీతో కలిసి అనుపమ్ స్టూడియోస్ నిర్మించింది. -
గదాధారి...
‘‘గదాధారి హనుమాన్’ సినిమా కథ చాలా బలమైనది. అందుకే ఈ చిత్రాన్ని తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చేస్తున్నాం. చిన్న వాళ్ల నుంచి పెద్ద వాళ్ల వరకు మా సినిమా ఆకట్టుకుంటుంది’’ అని రవికిరణ్ తెలిపారు. ఆయన హీరోగా రోహిత్ కొల్లి దర్శకత్వం వహించిన చిత్రం ‘గదాధారి హనుమాన్’. రేణుకా ప్రసాద్, బసవరాజ్ హురకడ్లి నిర్మించారు.హైదరాబాద్లో నిర్వహించిన ఈ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్కి నిర్మాతలు సి. కల్యాణ్, రాజ్ కందుకూరి, దర్శకుడు సముద్ర ముఖ్య అతిథులుగా హాజరై, సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు. రోహిత్ కొల్లి మాట్లాడుతూ– ‘‘గదాధారి హనుమాన్’తో మూడేళ్లు ప్రయాణం చేశాను. గద ఎంత పవర్ఫుల్ అనేదానిపై మా చిత్రంలో ఓ సీక్వెన్స్ అద్భుతంగా ఉంటుంది’’ అని తెలిపారు. ‘‘మా దర్శకుడు రోహిత్ ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు’’ అన్నారు రేణుకా ప్రసాద్. ‘‘కుటుంబ కథా చిత్రంగా ఈ ప్రాజెక్ట్ ఉంటుంది. సినిమాని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’’ అని బసవరాజ్ హురకడ్లి చెప్పారు. -
వింబుల్డన్ మ్యాచ్లో దేవర భామ.. బాయ్ఫ్రెండ్తో కలిసి!
దేవర బ్యూటీ జాన్వీ కపూర్ వింబుల్డన్ మ్యాచ్లో సందడి చేసింది. తన బాయ్ఫ్రెండ్ శిఖర్ పహారియాతో కలిసి మ్యాచ్కు హాజరైంది. లండన్లో జరుగుతున్న టోర్నీలో మెరిసింది. ఇది చూసిన నెటిజన్స్ జాన్వీ కపూర్ను ఉద్దేశించి క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కొందరు నెటిజన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే జాన్వీ కపూర్- శిఖర్ చాలాసార్లు ఇలా విదేశాల్లో చిల్ అవుతూ కనిపించారు.ఇక సినిమాల విషయానికొస్తే జాన్వీ కపూర్ ప్రస్తుతం పెద్ది చిత్రంలో కనిపించనుంది. రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమాకు బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో పాటు హోమ్బౌండ్, సన్నీ సంస్కారి కి తులసి కుమారి, పరమ్ సుందరి లాంటి బాలీవుడ్ సినిమాల్లో కనిపించనుంది. పరం సుందరి జూలై 24, 2025న విడుదల కావాల్సి ఉండగా.. ఈ చిత్రం వాయిదా పడినట్లు తెలుస్తోంది.Spotting Janhvi Kapoor with Shikhar Pahariya at Wimbledon was not on my list today😭— Preet (@preekaaaa) July 11, 2025Janhvi and Shiku at #Wimbledon pic.twitter.com/a5ejBasqmx— Radha (@JanhviSupremacy) July 11, 2025 -
చాలా ఏళ్లు బతకాలని ఉంది.. అప్పుడే నన్ను చంపేయొద్దు: నెటిజన్లకు కరణ్ జోహార్ కౌంటర్
ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ ఇటీవలే ట్రైటర్స్ పేరుతో ఓ రియాలిటీ షోకు హోస్ట్గా వ్యవహరించారు. అమెజాన్ ప్రైమ్లో ప్రసారమైన ఈ షోలో బిగ్బాస్ నటి ఉర్ఫీ జావెద్తో నికితా లూథర్ విజేతగా నిలిచారు. అయితే కొద్ది రోజుల క్రితం కరణ్ లుక్ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. మరి బక్కచిక్కపోయి కనిపించడంతో అసలు ఏమైందని తెగ ఆరా తీశారు. ఇంత త్వరగా బరువు తగ్గడం ఎలా సాధ్యమంటూ నెటిజన్స్ ప్రశ్నించారు. కేవలం ఇంజక్షన్స్ ద్వారానే ఇలాంటివి సాధ్యమని కొందరు ఆరోపించారు.ఈ నేపథ్యంలో తన వెయిట్ లాస్కు సంబంధించి వచ్చిన రూమర్స్పై మరోసారి స్పందించాడు. ధడక్ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్కు హాజరైన కరణ్ జోహార్ తాను బరువు తగ్గడంపై మాట్లాడారు. నెటిజన్స్ తనను ఏకంగా చంపేశారని అన్నారు. నేను చాలా ఆరోగ్యంతో సంతోషంగా ఉన్నానని తెలిపారు.కరణ్ మాట్లాడుతూ..'నేను బరువు తగ్గడానికి ఒకే ఒక కారణం ఉంది. నేను జీవితంలో ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి చాలా సవాళ్లను స్వీకరించా. నెటిజన్స్కు నేను చెప్పేది ఏంటంటే.. నా పిల్లల కోసం చాలా ఏళ్ల పాటు బతకాలనుకుంటున్నా. నేను ఇంకా చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. వాటిని మీ అందరికీ పరిచయం చేస్తా' అని అన్నారు.నెటిజన్స్ ట్రోల్స్కాగా.. గతంలో కరణ్ జోహార్ ఓజెంపిక్ను ఉపయోగించడం లేదని చేసిన వాదనలపై నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. ‘ఓజెంపిక్తో మీరు బరువు తగ్గారని అంగీకరించడంలో తప్పు లేదు. బరువు తగ్గడానికి చాలా సమయం పడుతుంది. బరువు మీ జీవితాన్ని అనేక విధాలుగా ప్రభావితం చేస్తుంది, మీరు బరువు తగ్గిన తర్వాత బాగానే ఉంటే, మీరు దానిని ఎలా కోల్పోయారన్నది ముఖ్యం కాదు. మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో గర్వపడండి మీ డ్రీమ్ అదే కదా .. ఉన్నది ఒక్కటే జీవితం. మన శరీరంతో సంతోషంగా ఉండాలనుకోవడంలో తప్పులేదు. ఆల్ ది బెస్ట్..’ అంటూ ఒక నెటిజన్ కామెంట్ చేశాడు. ‘‘అది ఓజెంపిక్ ముఖమే.. దానిని అంగీకరించడంలో సిగ్గు లేదు. ప్రపంచం మొత్తం ఇప్పుడు దీనిని ఉపయోగిస్తోంది .దాని గురించి బహిరంగంగా చెప్పే వ్యక్తులు గతంలో కంటే ఎక్కువ ప్రశంసలు దక్కించుకుంటున్నారు. సార్ నిజం నిర్భయంగా చెప్పడి" అంటూ మరో నెటిజన్ ప్రశ్నించాడు. దీంతో తాజాగా తనపై హెల్త్పై వచ్చిన రూమర్స్పై రిప్లై ఇచ్చారు కరణ్ జోహార్. -
ఆ హీరో నా కొడుకే.. తనతో గొడవపడ్తూ ఉంటా: సవతి తల్లి
బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ (Shahid Kapoor) చిన్నవయసులోనే అతడి తల్లిదండ్రులు నీలిమ అజీమ్- పంకజ్ కపూర్ విడిపోయారు. తర్వాత పంకజ్.. నటి సుప్రియ పాఠక్ను 1988లో రెండో పెళ్లి చేసుకున్నాడు. వీరికి కుమారుడు రుహాన్, కూతురు సనా సంతానం. తాజాగా ఓ ఇంటర్వ్యూలో షాహిద్తో ఉన్న అనుబంధాన్ని చెప్పుకొచ్చింది సుప్రియ పాఠక్ (Supriya Pathak). ఆమె మాట్లాడుతూ.. అతడు నా కొడుకు. తల్లీకొడుకుల మధ్య ఎలాంటి అనుబంధం ఉంటుందో మా మధ్య కూడా అదే ఆత్మీయత ఉంటుంది.నటి సుప్రియ పాఠక్ ఫ్యామిలీతో షాహిద్షాహిద్ నా కొడుకే..షాహిద్కు ఆరేళ్లున్నప్పుడు అతడిని కలిశాను. కన్నతల్లిని కాకపోయినా అతడు నా కొడుకే అనిపిస్తుంది. రుహాన్, సనాతో పాటు షాహిద్ కూడా నా పిల్లలే అని భావిస్తాను. ఈ ముగ్గురితోనూ ప్రేమగా ఉంటాను, పోట్లాడతాను, ఫ్రెండ్లా ఉంటాను అని చెప్పుకొచ్చింది. షాహిద్ కపూర్ సినిమాల విషయానికి వస్తే.. ఇష్క్ విష్క్ చిత్రంతో హీరోగా మారాడు. సినిమా36 చైనా టౌన్, చుప్చుప్కే, జబ్ వి మెట్, ఆర్.. రాజ్కుమార్, హైదర్, ఉడ్తా పంజాబ్, పద్మావత్ వంటి చిత్రాలతో అలరించాడు. అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్లో యాక్ట్ చేసి సాలిడ్ హిట్ అందుకున్నాడు. ఫర్జి వెబ్ సిరీస్లోనూ మెప్పించాడు. తేరీ బాతో మే ఐసా ఉల్జా జియా చిత్రంతో మరోసారి హిట్టందుకున్నాడు. చివరగా షాహిద్ నటించిన దేవా మూవీ బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది.చదవండి: మా కన్నడ భాష జోలికొస్తే ఊరుకోం: హీరో ధృవ సర్జా -
'దానికి మీరు అమ్మాయి అయితే చాలు'.. కింద పడేసి కొట్టాడన్న దంగల్ నటి!
దంగల్ సినిమాతో ఫేమ్ తెచ్చుకున్న నటి ఫాతిమా సనా షేక్. అమిర్ ఖాన్ కూతురిగా మెప్పించిన ఫాతిమా బాలీవుడ్లో వరుస సినిమాలతో బిజీగా ఉంది. ప్రస్తుతం అనురాగ్ బసు దర్శకత్వం వహించిన మెట్రో ఇన్ డినో చిత్రంలో కనిపించింది. ఈ మూవీలో అలీ ఫజల్ సరసన నటించింది. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీ సక్సెస్ ఎంజాయ్ చేస్తోన్న నటి.. ఇటీవల ఇంటర్వ్యూలో తనకెదురైన చేదు అనుభవాన్ని వివరించింది. ఇంతకీ అదేంటో తెలుసుకుందాం.ఇటీవల ఓ వ్యక్తి తనతో అనుచితంగా ప్రవర్తించాడని తెలిపింది. ఆ సమయంలో అతన్ని తాను కొట్టానని ఫాతిమా వెల్లడించింది. అయితే తను కూడా తిరిగి తనను గట్టిగా కింద పడేంతలా కొట్టాడని వివరించింది. దీంతో తాను తీవ్ర నిరాశకు గురయ్యానని తెలిపింది. ఆ సంఘటన తర్వాత తాను చాలా జాగ్రత్తగా ఉన్నానని ఫాతిమా సనా షేక్ చెప్పుకొచ్చింది. అటువంటి పరిస్థితులలో ఎలా స్పందించాలో ఇప్పుడు తెలిసొచ్చిందని పేర్కొంది. మనలో ఏదో తప్పు జరుగుతోంది.. దానికి మనం ఎలా స్పందించాలో మాత్రమే ఆలోచించాలని చెబుతోంది ఫాతిమా.అంతేకాకుండా ముంబయిలో ఓ టెంపో డ్రైవర్ నన్ను ఫాలో అయ్యేవాడని ఫాతిమా సనా షేక్ తెలిపింది. కొవిడ్ టైమ్లో ముసుగు ధరించి సైకిల్ తొక్కుతుంటే.. నన్ను చూసిన టెంపో డ్రైవర్ హారన్ మ్రోగించేవాడని.. నేను నా లైన్లో వెళ్తంటే నా వెంటే వచ్చేవాడని వివరించింది. సెలబ్రిటీ అయినా.. సామాన్యులైనా ఇటువంటి సంఘటనలు సర్వసాధారణమని తెలిపింది. దీనికి మీరు కేవలం అమ్మాయి అయి ఉంటే చాలని అన్నారు.ఇక సినిమాల విషయానికొస్తే ఫాతిమా సనా షేక్ నటించిన ఆప్ జైసా కోయి ఈ రోజే నెట్ఫ్లిక్స్లో విడుదలైంది. ఇందులో ఆర్ మాధవన్ కూడా నటించారు. ఈ చిత్రం ఇద్దరు మధ్య వయస్కుల మధ్య జరిగే ప్రేమకథగా తెరకెక్కించారు. ఒక స్త్రీ సంప్రదాయ కుటుంబంలో తన ప్రేమ కోసం ఎలా పోరాడుతుందో ఈ మూవీలో చూపించనున్నారు. -
మరో రీమేక్.. 'దఢక్ 2' ట్రైలర్ రిలీజ్
బాలీవుడ్లో మరో రీమేక్ రాబోతుంది. జాన్వీ కపూర్ హీరోయిన్గా పరిచయమైన 'దఢక్' చిత్రానికి ఇప్పుడు సీక్వెల్ వస్తోంది. కాకపోతే ఇందులో హీరోహీరోయిన్లతో పాటు స్టోరీ కూడా పూర్తిగా మారిపోయింది. కాకపోతే మెయిన్ పాయింట్ మాత్రం దాదాపు అదే ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇంతకీ ఇది ఏ మూవీకి రీమేక్? ట్రైలర్ ఉందనేది ఇప్పుడు చూద్దాం.మరాఠీలో వచ్చిన 'సైరాత్' సినిమా అదిరిపోయే హిట్. దాన్ని హిందీలో 'దఢక్' పేరుతో రీమేక్ చేశారు. తక్కువ కులానికి చెందిన ఓ అబ్బాయి.. పై కులానికి చెందిన అమ్మాయితో ప్రేమలో పడతాడు. తర్వాత వీళ్లిద్దరూ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారనేదే ప్లాట్ పాయింట్. ఆ మూవీ హిందీలోనూ హిట్ అయింది. ఇప్పుడు దీనికి సీక్వెల్ 'దఢక్ 2' తీశారు. ఆగస్టు 1న థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: బాలీవుడ్ పరువు తీసిన సంజయ్ దత్!)ట్రైలర్ చూడగానే అరె ఈ స్టోరీ ఎక్కడో చూసినట్లు ఉందే అనిపించింది. తమిళంలో 2018లో 'పరియరుమ్ పెరుమాళ్' అనే మూవీ వచ్చింది. ఇప్పుడు దీన్నే హిందీలో 'దఢక్ 2' పేరుతో రీమేక్ చేశారు. ఒరిజినల్ ఆర్ట్ ఫిల్మ్ తరహాలో ఉంటుంది. రీమేక్కి వచ్చేసరికి మాత్రం కాస్త కమర్షియల్ టచ్ ఇచ్చారనిపిస్తోంది. ఇందులో సిద్ధాంత్ చతుర్వేది తక్కువ కులానికి చెందిన కుర్రాడిగా, 'యానిమల్' ఫేమ్ తృప్తి దిమ్రి పై కులానికి చెందిన అమ్మాయిగా నటించారు.ట్రైలర్ అయితే చూడటానికి బాగానే ఉంది. హీరోహీరోయిన్లుగా చేసిన సిద్ధాంత్, తృప్తి జంట మధ్య కెమిస్ట్రీ బాగానే వర్కౌట్ అయినట్లు కనిపిస్తుంది. మరి సినిమా ఏ మేరకు క్లిక్ అవుతుందో చూడాలి?(ఇదీ చదవండి: 56 ఏళ్ల హీరోతో మృణాల్ రొమాన్స్.. ట్రైలర్ రిలీజ్) -
బాలీవుడ్ పరువు తీసిన సంజయ్ దత్!
'బాహుబలి' రిలీజ్ తర్వాత పాన్ ఇండియా ట్రెండ్ బాగా పెరిగింది. ఈ క్రమంలో ఆర్ఆర్ఆర్, పుష్ప లాంటి తెలుగు సినిమాలతో పాటు కేజీఎఫ్ తదితర చిత్రాలు ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర కళ్లు చెదిరే వసూళ్లు సాధించాయి. హిందీ ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకుంటున్నాయి. మరోవైపు బాలీవుడ్లో పరిస్థితి దారుణంగా తయారైంది. స్టార్ హీరోలు తీసిన సినిమాలు సరిగా ఆడట్లేదు. కొందరు సౌత్ దర్శకులు.. హిందీ హీరోలతో తీసిన జవాన్, యానిమల్ లాంటివి బ్లాక్ బస్టర్స్ అయ్యాయి.ఈ క్రమంలోనే గత కొన్నాళ్లలో హిందీ నటీనటులు.. బాహాటంగానే సొంత ఇండస్ట్రీపై సెటైర్లు వేస్తున్నారు. ఇప్పుడు సీనియర్ నటుడు సంజయ్ దత్ కూడా అలాంటి కామెంట్స్ చేశాడు. 'కేజీఎఫ్' చిత్రంలో విలన్గా అలరించిన ఇతడు.. ఇప్పుడు 'కేడీ ది డెవిల్' అనే మరో కన్నడ మూవీలో కీలక పాత్ర పోషించాడు. తాజాగా ఈ చిత్ర టీజర్ రిలీజ్ చేశారు. హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టారు. ఇందులోనే సంజయ్ దత్.. బాలీవుడ్ పరిస్థితి ఏంటో చెప్పేశాడు.(ఇదీ చదవండి: 56 ఏళ్ల హీరోతో మృణాల్ రొమాన్స్.. ట్రైలర్ రిలీజ్)ప్రస్తుతం మీరు దక్షిణాది సినిమాల్లో నటిస్తున్నారు కదా.. ఇక్కడి నుంచి మీ ఇంటికి ఏం తీసుకెళ్తారు? అని ఓ రిపోర్టర్ అడిగాడు. దీనికి బదులిచ్చిన సంజయ్ దత్.. 'మంచి సినిమాలు తీయాలనే ప్యాషన్ని బాలీవుడ్కి తీసుకెళ్తా. గతంలో మా దగ్గర మంచి సినిమాలు వచ్చేవి. అయితే ఇప్పుడు మా వాళ్లు.. కలెక్షన్, నంబర్లపై మాత్రమే దృష్టి పెడుతున్నారు. కానీ సౌత్లో అలా కాదు. ముఖ్యంగా తెలుగులో మూవీస్పై మంచి ప్యాషన్ కనిపిస్తోంది. అందుకే నాకు ఇక్కడ పనిచేయడం సంతోషంగా ఉంది' అని చెప్పుకొచ్చాడు.ప్రభాస్ 'రాజాసాబ్' మూవీలోనూ సంజయ్ దత్ కీలక పాత్రలో నటించాడు. ఆ చిత్రంతో పాటు తెలుగు సినీ పరిశ్రమతో తనకున్న అనుబంధాన్ని బయటపెట్టాడు. 'తెలుగులో చాలామంది నిర్మాతలు నాకు తెలుసు. వాళ్లతో కలిసి నేను పనిచేశాను. 1980ల నుంచి హైదరాబాద్ వస్తున్నాను. ఇక్కడి వాతావరణం, ఫుడ్ బాగుంటాయి. తెలుగులో ప్రభాస్తో సినిమా చేస్తున్నా. తెలుగు కూడా నేర్చుకుంటున్నాను. ప్రభాస్ నాకు ఫుడ్ ఎక్కువగా పెట్టేస్తున్నాడు' అని సంజూ చెప్పాడు. ఇతడు చెప్పిన దానిబట్టి చూస్తే బాలీవుడ్లో ఇప్పుడు ఎవరూ సరైన సినిమాలు తీయట్లేదని, ఈ విషయంలో టాలీవుడ్ చాలా బెటర్ అని అర్థం. ఓ రకంగా చూస్తే పరోక్షంగా సొంత ఇండస్ట్రీ పరువునే తీసేశాడు!(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'కుబేర'.. అధికారిక ప్రకటన) -
'మర్యాద రామన్న'కు రీమేక్.. ఇప్పుడు పార్ట్ 2 కూడా
తెలుగులో కొన్నే సినిమాలు చేసినప్పటికీ మృణాల్ ఠాకుర్ అభిమానుల్ని బాగానే సంపాదించుకుంది. కొన్నిరోజుల క్రితం ఓ విషయమై ఈమె తెగ ట్రెండ్ అయింది. సరే ఇవన్నీ పక్కనబెడితే తాజాగా ఓ హిందీ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించేందుకు సిద్ధమైంది. తాజాగా చిత్ర ట్రైలర్ని రిలీజ్ చేశారు. 56 ఏళ్ల హీరోతో ఈ మూవీలో రొమాన్స్ చేసినట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: 'బాహుబలి' రీ యూనియన్.. అనుష్క అందుకే కనిపించలేదా?)2010లో తెలుగులో 'మర్యాద రామన్న' సినిమా రిలీజైంది. రాజమౌళి దర్శకత్వం వహించగా కమెడియన్ సునీల్.. ఇందులో హీరోగా నటించాడు. పలు భాషల్లో ఇది రీమేక్ అయింది. హిందీలో అజయ్ దేవగణ్ 'సన్ ఆఫ్ సర్దార్' పేరుతో రీమేక్ చేశాడు. 2012లో ఇది విడుదలైంది. హిట్ అయింది. ఇప్పుడు దీనికి సీక్వెల్ సిద్ధం చేశారు. 'సన్ ఆఫ్ సర్దార్ 2' పేరుతో జూలై 25న రిలీజ్ చేయబోతున్నారు. తొలి పార్ట్లో సోనాక్షి సిన్హా హీరోయిన్ కాగా.. ఇప్పుడు మృణాల్ ఠాకుర్ హీరోయిన్.ట్రైలర్ విషయానికొస్తే.. పంజాబ్ నుంచి సర్దార్, స్కాట్లండ్ వెళ్తాడు. అక్కడ హీరోయిన్ కుటుంబానికి సాయం చేసే క్రమంలో ఓ సమస్యలో ఇరుక్కుంటాడు. తర్వాత ఏమైంది? ఆ ప్రాబ్లమ్ నుంచి ఎలా బయటపడ్డాడు అనేదే స్టోరీలా అనిపిస్తోంది. తొలి భాగంలానే దీన్ని కూడా కామెడీ ఎంటర్టైనర్గా తీశారు. ట్రైలర్ ఓకే ఓకే ఉంది. పెద్దగా మెరుపులేం లేవు. మరి థియేటర్లలో మూవీ ఏ మేరకు వర్కౌట్ అవుతుందో చూడాలి?(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'కుబేర'.. అధికారిక ప్రకటన) -
ఒక్క సినిమాకు 150 కట్స్.. విడుదలకు ముందే కోర్టు స్టే
'ఉదయపూర్ ఫైల్స్' నిర్మాతలకు ఎదురుదెబ్బ తగిలింది. నేడు (జులై 11)న విడుదల కావాల్సిన ఈ సినిమా ప్రదర్శనపై స్టే విధిస్తూ ఢిల్లీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. రాజస్థాన్లోని ఉదయపూర్లో జరిగిన 'టైలర్ కన్హయ్య లాల్' హత్య ఆధారంగా తెరకెక్కిన చిత్రం 'ఉదయపూర్ ఫైల్ ' ( Udaipur Files )... ఈ మూవీ విషయంలో ఇప్పటికే పలు అభ్యంతరాలు వచ్చాయి. ఏకంగా 150 సీన్స్కు సెన్సార్ బోర్ట్ కూడా అభ్యంతరం చెప్పినట్లు తెలుస్తోంది. ఈ చిత్రం విడుదలైతే.. ద్వేషపూరిత ప్రసంగాన్ని ప్రోత్సహిస్తుందని, ఒక సమాజాన్ని లక్ష్యంగా చేసుకుని ఉండటమే కాకుండా మతపరమైన ఉద్రిక్తతను రేకెత్తించగలదని వాదిస్తూ.. పిటిషనర్లు - జమియత్ ఉలామా-ఎ-హింద్ అధ్యక్షుడు మౌలానా అర్షద్ మదానీ, పాత్రికేయుడు ప్రశాంత్ టండన్ దీని విడుదలపై శాశ్వత నిషేధం కోరుతూ పిటిషన్ వేశారు. ఈమేరకు సినిమా విడుదలపై ఢిల్లీ కోర్టు స్టే ఇచ్చింది. సినిమా విడుదల చేయాలా వద్దా అని నిర్ణయించుకోవడానికి కోర్టు కేంద్రానికి వారం సమయం ఇచ్చింది.టైలర్ కన్హయ్య లాల్ హత్య స్టోరీ ఏంటి..2022 ఉదయపూర్లో జరిగిన టైలర్ కన్హయ్య లాల్ హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మహ్మద్ ప్రవక్తపై బీజేపీ నేత నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినందుకు గాను టైలర్ కన్హయ్య లాల్ను దారుణంగా చంపేశారు. ఇద్దరు వ్యక్తులు పట్టపగలే అతని దుకాణంలోనే ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. అచ్చం ఉగ్ర సంస్థ ఐసిస్ దుండగులను తలపించేలా గొంతు కోసి క్రూరంగా పొట్టన పెట్టుకున్నారు. 26 సార్లు కత్తితో నరికినట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. పైగా దాన్ని రికార్డు చేసి వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దాంతో దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. బీజేపీ సస్పెండ్ నేత నూపుర్ శర్మ వ్యాఖ్యలను సమర్థించినందుకే హత్య చేశామంటూ హంతకులు మరో వీడియో పోస్టు చేశారు. పైగా ప్రధాని నరేంద్ర మోదీని కూడా ఇలాగే చంపుతామని హెచ్చరించారు. ప్రవక్త వివాదం తాలూకు జ్వాలను రగిలించింది ఆయనేనని ఆరోపించారు. హత్యకు వాడిన కత్తిని చూపిస్తూ, ‘ఇది మోదీ(ప్రధానిని ఉద్దేశిస్తూ) మెడ దాకా కూడా చేరుతుంది’ అంటూ బెదిరించారు. నిందితులను రియాజ్ అక్తర్, గౌస్ మొహమ్మద్గా గుర్తించారు. రియాజ్ గొంతు కోయగా.. గౌస్ ఆ ఉదంతం అంతా రికార్డు చేశాడు. ఈ ఇద్దరినీ పోలీసులు గంటల వ్యవధిలోనే అరెస్టు చేశారు. హత్యకు పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాద సంస్థల సంబంధం ఉందని అనుమానాలు వ్యక్తమయ్యాయి. హైదరాబాద్ నగరంతో కూడా నిందితులకు సంబంధాలు ఉన్నట్లు NIA విచారణలో తేలింది.నుపుర్ శర్మ ఎవరు..?న్యూఢిల్లీకి చెందిన నుపుర్ శర్మ విద్యార్థి దశ నుండి బీజేపీ విద్యార్థి విభాగం ఏబీవీపీలో కీలకంగా వ్యవహరించింది. 2008లో ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షురాలిగా పనిచేశారు. వృత్తి రీత్యా న్యాయవాది . 2015 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధిగా న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి అరవింద్ కేజ్రీవాల్పై పోటీ చేశారు. 31 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయితే, మహ్మద్ ప్రవక్తపై ఆమె చేసిన వ్యాఖ్యలతో పార్టీ నుంచి బీజేపీ తొలగించింది. మహ్మద్ ప్రవక్త గురించి వారి వివాహం సమయంలో అతని మూడవ భార్య ఆయిషా వయస్సు గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరానికి గురిచేశాయి. ఆ సమయంలో ఖతర్, సౌదీ అరేబియా వంటి గల్ఫ్ దేశాలు భారత్ను క్షమాపణ కోరాయి.దర్శకుడు ఏమన్నారు..?ఉదయపూర్ ఫైల్స్ సినిమా విడుదల నేపథ్యంలో దర్శకుడు భరత్ ఎస్ శ్రీనేట్ వివరణ ఇచ్చారు. ఈ మూవీ ఒక మతానికో..? విశ్వాసాకో సంబంధించినది కాదని చెప్పారు. భావజాలం, సత్యం గురించి మాత్రమే సినిమాలో ఉంటుందని పేర్కొన్నారు. ఇందులో ఎవరి మనో భావాలను దెబ్బ తీసే కంటెంట్ ఎంత మాత్రం ఉండదని క్లారిటీ ఇచ్చారు. ఇందులో కన్హయ్య లాల్ పాత్రలో విజయ్ రాజ నటిస్తున్నారు. దుగ్గల్, రజనీష్, ప్రీతి ఘుంగియానీ, కమలేష్, సావంత్, కంచి సింగ్, ముస్తాక్ ఖాన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అమీత్ జానీ ఈ చిత్రాన్ని నిర్మి స్తున్నారు. -
కమెడియన్ కపిల్శర్మ కేఫ్పై కాల్పులు.. వీడియో వైరల్!
బాలీవుడ్ స్టార్ కమెడియన్ కపిల్ శర్మ కేఫ్పై కాల్పులు జరిపారు. కెనడాలోని ఆయన కేఫ్పై గుర్తు తెలియని వ్యక్తి గన్తో కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. అయితే ఈ కేఫ్ను కపిల్ శర్మ ఇటీవలే ప్రారంభించినట్లు తెలుస్తోంది. కారులో వచ్చిన గుర్తు తెలియిని వ్యక్తి కాల్పులు జరపినట్లు సమాచారం. అయితే ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని తెలుస్తోంది. స్థానికంగా ఈ ఘటన కలకలం సృష్టించింది. కపిల్ శర్మను లక్ష్యంగా చేసుకుని దాడి జరిగిందా? కేఫ్ టార్గెట్గా చేశారా? అన్న వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.కాల్పులకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియోను రితేష్ లఖి అనే జర్నలిస్ట్ ట్విటర్ వేదికగా షేర్ చేశారు. కాగా.. కపిల్ శర్మ ఇటీవల కెనడాలోని సర్రేలో మూడు రోజుల క్రితమే కాప్స్ అనే పేరుతో కేఫ్ను ప్రారంభించారు. ఈ కాల్పుల ఘటనపై ఘటనపై నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు. ఈ సంఘటన దిగ్భ్రాంతికి గురిచేసిందని చాలా మంది నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.World Famous comedian Kapil Sharma's newly inaugurated restaurant KAP'S CAFE shot at in Surrey, BC, Canada last night.Harjit Singh Laddi, a BKI operative, NIA's (INDIA ) most wanted terrorist has claimed this shoot out citing some remarks by Kapil@SurreyPolice pic.twitter.com/p51zlxXbOf— Ritesh Lakhi CA (@RiteshLakhiCA) July 10, 2025 -
ఫ్లాట్లో విగత జీవిగా యువ నటి.. అంత్యక్రియలకు తండ్రి నిరాకరణ!
పాకిస్తాన్లో ఇటీవల నటీనటుల మరణవార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే ఊహించని విధంగా నటీమణలు సూసైడ్ చేసుకోవడం పాక్ సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. గతనెల 20న పాకిస్తాన్ నటి ఆయేషా ఖాన్ (76) అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్.. కరాచీలోని తన ఫ్లాట్లో విగతజీవిగా కనిపించింది. ఇలా హఠాత్తుగా ఆమె మరణించడం పాక్ సినీ ఇండస్ట్రీని షాక్కు గురిచేసింది.తాజాగా మరోసారి అలాంటి విషాద ఘటనే చోటు చేసుకుంది. పాకిస్థాన్కు చెందిన నటి, మోడల్ హుమైరా అస్గర్ అలీ (Humaira Asghar Ali) అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. ప్రస్తుతం ఆమె వయసు 32 ఏళ్లు కాగా.. కరాచీలోని తన ఫ్లాట్లో శవమై కనిపించింది. అయితే ఆమె మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో కనిపించడంతో చనిపోయి దాదాపు మూడు వారాలకు పైగానే అయినట్లు తెలుస్తోంది.కరాచీలోని డిఫెన్స్ ఏరియాలో హుమైరా అస్గర్ అలీ గత కొన్ని సంవత్సరాలుగా ఒంటరిగానే నివసిస్తోంది. గత మూడు వారాలుగా ఆమె స్థానికులకు కనిపించకపోవడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు ఫ్లాట్ లోపలికి వెళ్లి చూడగా.. నటి శవమై కనిపించింది. పోలీసులు ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అమె మృతిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.లాహోర్కు చెందిన హుమైరా హుమైరా అస్గర్ ప్రముఖ రియాలిటీ షో తమాషా ఘర్లో నటించింది. ఆ తర్వాత 2015లో యాక్షన్-థ్రిల్లర్ చిత్రం జలైబీలో కూడా కనిపించింది. జలైబీ చిత్రంతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాకుండా హుమైరా జస్ట్ మ్యారీడ్, చల్ దిల్ మేరే, ఎహ్సాన్ ఫరామోష్, గురు లాంటి పాకిస్తాన్ సీరియల్స్లో నటించింది. ఆమె చివరిసారిగా ఫర్హాన్ సయీద్, సోన్యా హుస్సిన్ ప్రధాన పాత్రల్లో నటించిన లవ్ వ్యాక్సిన్ చిత్రంలో కనిపించింది. ఈ సినిమా 2021లో విడుదలైంది.అంత్యక్రియలకు నిరాకరించిన తండ్రి..అయితే హుమైరా మృతదేహాన్ని ఖననం చేసేందుకు ఆమె తండ్రి, రిటైర్డ్ ఆర్మీ వైద్యుడు డాక్టర్ అస్గర్ అలీ నిరాకరించారు. తమతో ఆమెకు ఎలాంటి సంబంధం లేదని పోలీసులకు తెలిపారు. చాలా ఏళ్ల క్రితమే మాతో సంబంధాలు తెంచుకుందని చెప్పారు. మృతదేహాన్ని మీరే ఏదైనా చేసుకోండని అధికారులతో అన్నారు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు ఎవరూ కూడా ముందుకు రాకపోవడంతో సింధ్ సాంస్కృతిక విభాగం ఆమె అంత్యక్రియలు నిర్వహించడానికి ముందుకొచ్చింది. ఈ కార్యక్రమానికి నటులు యష్మా గిల్, సోన్యా హుస్సేన్ కూడా ముందుకొచ్చారు. -
'రాజాసాబ్' విలన్ నటించిన హారర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
హారర్ సినిమా 'ద భూతిని' ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయింది. సంజయ్ దత్ (Sanjay Dutt) ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో మౌనీ రాయ్, సన్నీ సింగ్, పాలక్ తివారి కీలక పాత్రలు పోషించారు. సిద్దాంత్ కుమార్ సచ్దేవ్ దర్శకత్వం వహించాడు. సంజయ్ దత్తో పాటు దీపక్ ముకుత్ నిర్మించారు.నెలన్నర తర్వాతే ఓటీటీలో రిలీజ్మే 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మెప్పించలేకపోయింది. తాజాగా జీ5 ద భూతిని ఓటీటీ రిలీజ్ డేట్ ప్రకటించింది. జూలై 18న జీ5లో అందుబాటులోకి రానున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ఓ వీడియో క్లిప్ ఎక్స్ (ట్విటర్) ఖాతాలో షేర్ చేసింది. సినిమా బాలేదంటే నెల తిరిగేలోపే ఓటీటీలో రిలీజ్ చేస్తారు. కానీ ఈ చిత్రాన్ని మాత్రం నెలన్నర గ్యాప్ తర్వాతే డిజిటల్ ప్లాట్ఫామ్లో అందుబాటులోకి తెస్తున్నారు.సినిమాలుసంజయ్ దత్ విషయానికి వస్తే.. బాలీవుడ్లో హీరోగా, విలన్గా అనేక సినిమాలు చేశాడు. డబుల్ ఇస్మార్ట్ చిత్రంతో తెలుగులోనూ గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం అఖండ 2 మూవీ చేస్తున్నాడు. ఈయన కీలక పాత్రలో నటించిన ది రాజా సాబ్ డిసెంబర్ 5న విడుదల కానుంది. ఈయన హిందీలో యాక్ట్ చేసిన ధురంధర్ మూవీ కూడా అదే రోజు (డిసెంబర్ 5నే) రిలీజ్ చేస్తున్నట్లు వెల్లడించారు. దీంతో తన రెండు సినిమాలు ఒకేరోజు విడుదల కాకూడదని కోరుకుంటున్నాడు సంజయ్. Pyaar, panic, aur ek possessive bhootnii — jab bhootnii takrayegi baba se, shuru hoga full-on madness! #TheBhootnii premieres on 18th July, 8 pm, on #ZEE5 & #ZEECinema#TheBhootniiOnZEE5 pic.twitter.com/SmzceTDH6j— ZEE5Official (@ZEE5India) July 10, 2025 చదవండి: యాంకరింగ్లో సిండికేట్.. ఈవెంట్లు చేస్తానో, లేదో?: ఉదయభాను -
ప్రముఖ నటి షోలో చనిపోయేందుకు ట్రై చేసింది: బిగ్బాస్ టీమ్
చాలామంది బిగ్బాస్ షో (Bigg Boss Reality Show)కు పాపులారిటీ, డబ్బు కోసమే వెళ్తుంటారు. బిగ్బాస్ హౌస్లో అడుగుపెట్టాక పూర్తిగా అందులోనే లీనమవుతారు. కొన్నిసార్లు ప్రేమలో పడి బయట ప్రపంచాన్నే మర్చిపోతారు. అలా ఓ నటి నిజంగానే లవ్లో పడింది. కానీ అవతలి వ్యక్తి ఫుటేజీకోసం, పాపులారిటీ కోసం ఆమెను ప్రేమిస్తున్నట్లు నటించాడు. ఈ విషయం తెలిసి సదరు నటి ప్రాణాలు తీసుకునేందుకు ప్రయత్నించింది.బ్రేకప్ అయ్యాక హౌస్లోకి..ఈ విషయాన్ని ఎండమోల్ షైన్ ఇండియాలో బిగ్బాస్ ప్రాజెక్ట్ హెడ్గా పనిచేసే అభిషేక్ ముఖర్జీ వెల్లడించాడు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ప్రియుడితో బ్రేకప్ అయి విపరీతమైన బాధలో ఉన్న ఓ ప్రముఖ నటి బిగ్బాస్ షోలో పాల్గొంది. ఆ బ్రేకప్ బాధ నుంచి బయటపడొచ్చన్న ఉద్దేశ్యంతో రియాలిటీ షోకి వచ్చింది. కానీ రోజులు గడిచేకొద్దీ హౌస్లోని ఓ వ్యక్తితో ప్రేమలో పడింది. అతడు కూడా ప్రేమిస్తున్నట్లు నటించాడు. అది ఆమె గుర్తించలేకపోయింది. అతడు మోసం చేస్తున్నాడని గ్రహించిన రోజు బాధ తట్టుకోలేకపోయింది.అదే వారం ఎలిమినేట్తను షోలో ఉన్న విషయం కూడా మర్చిపోయి తెల్లవారుజామున మూడుగంటలకు బాత్రూమ్కి వెళ్లి చనిపోయేందుకు ప్రయత్నించింది. ఆమె చేస్తున్న పనిని గ్రహించి మేమంతా సెట్లోకి పరిగెత్తి తనను అడ్డుకున్నాం. మా లక్ ఏంటంటే సైకియాట్రిస్ట్ ఎప్పుడూ అందుబాటులో ఉంటారు. ఆయన ముంబై నుంచి వచ్చేవరకు తనతో మాట్లాడుతూ కూర్చున్నాం. పొద్దున ఏడింటివరకు తనతోనే ఉన్నాం. అదే వారం ఆమెను ఎలిమినేట్ చేసి పంపించేశాం అని చెప్పుకొచ్చాడు. ఆ నటి పేరు మాత్రం వెల్లడించలేదు.బిగ్బాస్ ఎన్ని భాషల్లో?డచ్ రియాలిటీ షో బిగ్బ్రదర్ నుంచి పుట్టిందే బిగ్బాస్. ఇండియాలో బిగ్బాస్.. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, మరాఠీ, బెంగాలీ భాషల్లో ప్రసారమవుతోంది. తెలుగులో బిగ్బాస్ 8 సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకుంది. త్వరలోనే తొమ్మిదో సీజన్ ప్రారంభం కానుంది. మూడో సీజన్ నుంచి నాగార్జునే ఈ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.చదవండి: యాంకరింగ్లో సిండికేట్.. ఈవెంట్లు చేస్తానో, లేదో?: ఉదయభానుముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
ప్రభాస్ ది రాజాసాబ్తో బాక్సాఫీస్ క్లాష్.. ఆ పని చేయరనుకుంటున్నా: కేజీఎఫ్ నటుడు
ప్రభాస్ నటిస్తోన్న రొమాంటిక్ హారర్ కామెడీ చిత్రం ది రాజాసాబ్. ఈ మూవీకి మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, రిద్ధి కుమార్, మాళవిక మోహన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సలార్, కల్కి వస్తోన్న సినిమా కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ డేట్ను కూడా మేకర్స్ ప్రకటించారు. డిసెంబర్ 5న థియేటర్లలో సందడి చేయనుందని వెల్లడించారు.అయితే తాజాగా రణ్వీర్ సింగ్ నటిస్తోన్న యాక్షన్ థ్రిల్లర్ దురంధర్ మూవీ ఫస్ట్ లుక్ రివీల్ చేశారు. ఈ సినిమాను కూడా ది రాజాసాబ్ రిలీజ్ రోజునే రానుందని మేకర్స్ ప్రకటించారు. ఫస్ట్ లుక్ వీడియోతో పాటు విడుదల తేదీని కూడా వెల్లడించారు. దీంతో బాక్సాఫీస్ వద్ద ది రాజాసాబ్తో రణ్వీర్ సింగ్ పోటీపడడం ఖాయంగా కనిపిస్తోంది.ఈ నేపథ్యంలో ఈ రెండు చిత్రాల బాక్సాఫీస్ క్లాష్పై కేజీఎఫ్ నటుడు సంజయ్ దత్ స్పందించారు. తాజాగా తాను నటించిన కేడీ ది ముంబయి డెవిల్ మూవీ టీజర్ లాంఛ్ ఈవెంట్లో ఎదురైన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. దురంధర్, ది రాజాసాబ్ అదే రోజు రిలీజ్ కావడంపై సంజయ్ దత్ మాట్లాడారు.సంజయ్ దత్ మాట్లాడుతూ..' ఈ రెండు సినిమాలు చాలా డిఫరెంట్. ది రాజాసాబ్, దురంధర్ చిత్రాల్లో నా రోల్స్ చాలా భిన్నమైనవి. ఈ రెండు సినిమాలు ఓకే రోజు విడుదల అవ్వడం నాకు ఇష్టం లేదు. వాళ్లు కూడా ఈ పని చేయరని అనుకుంటున్నా' అని పంచుకున్నారు. -
బర్త్ డే గిఫ్ట్.. లగ్జరీ కారు కొన్న రణ్వీర్ సింగ్
బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్ ప్రస్తుతం బిగ్ ప్రాజెక్ట్తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ధురంధర్ అనే యాక్షన్ థ్రిల్లర్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు ఆదిత్య ధార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే జూలై 6న రణ్వీర్ సింగ్ బర్త్ డే సందర్భంగా ఫస్ట్ లుక్ వీడియోను విడుదల చేయగా ఆడియన్స్ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ యాక్షన్ చిత్రం డిసెంబర్ 5, 2025న థియేటర్లలో విడుదల కానుంది. ఇందులో ఆర్ మాధవన్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్ కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీలో రణ్వీర్ సరసన సారా అర్జున్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ సినిమా తర్వాత ఫర్హాన్ అక్తర్ దర్శకత్వం వహిస్తోన్న డాన్ -3లో నటించనున్నారు.ఇక సినిమాల సంగతి పక్కనపెడితే తాజాగా మన స్టార్ హీరో ఖరీదైన కారును కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. సినీ తారలు ఇలాంటి లగ్జరీ కార్లు కొనడం సాధారణమే అయినప్పటికీ దీని విలువ దాదాపు రూ.4.57 కోట్ల వరకు ఉన్నట్లు సమాచారం. సరికొత్త హై ఎండ్ ఈవీని రణ్వీర్ సింగ్ తన గ్యారేజీకి మరో కారును తీసుకొచ్చారు. ఈ విలాసవంతమైన కారును తన పుట్టిన రోజు కానుకగా జూలై 6న కొన్నట్లు టాక్ వినిపిస్తోంది. కొత్తకారులో తన సతీమణి దీపికా పదుకొణెతో కలిసి ముంబయి వీధుల్లో చక్కర్లు కొట్టారు. View this post on Instagram A post shared by Instant Bollywood (@instantbollywood) -
పొద్దున్నేమో డైట్ ఫుడ్.., రాత్రికి డ్రగ్స్ : సినీతారలపై టాప్ డైరెక్టర్ వ్యాఖ్యలు
ఇటీవల సినీ తారల వ్యక్తిగత అలవాట్ల గురించి మీడియా కన్నా సినీ రంగంలోని వాళ్లే ఎక్కువగా మాట్లాడుతున్నారు. అంతేకాదు మీడియా నుంచి వచ్చే విమర్శల కన్నా ఇవి చాలా వాడిగా వేడిగా పదనుగా ఉంటున్నాయి. సహజంగానే సినీతారల గురించి అందరి కన్నా ఎక్కువగా తెలిసేది అదే రంగంలో ఉన్న దర్శకులు, నిర్మాతలు, ఇతర సాంకేతిక నిపుణులకు కాబట్టి..వీరి విమర్శల్లో నిజం ఉంటుందని అనేక మంది భావిస్తుండడంతో ఇవి సంచలనంగా మారుతున్నాయి. ఇప్పుడు తారలపై విమర్శలు గుప్పించే సినీ ప్రముఖుల జాబితాలో మరో అగ్రదర్శక నిర్మాత కూడా జేరారు. ఆయన పేరు పహ్లాజ్ నిహలానీ.భారతీయ చలనచిత్ర నిర్మాత పహ్లాజ్ నిహలానీ సాదా సీదా వ్యక్తి కాదు. ఆయన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సిబిఎఫ్సి) మాజీ ఛైర్మన్ కూడా. ఆయన గత 2009 వరకు 29 సంవత్సరాల పాటు సినిమాలు, టీవీ ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. నిహలానీ 1982లో హాత్కడితో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు నాటి టాప్ హీరో గోవింద (ఇల్జామ్, 1986) చంకీ పాండే (ఆగ్ హి ఆగ్, 1987) వంటి పలువురు నటులను పరిచయం చేశారు. షోలా ఔర్ షబ్నం ఆంఖేన్ తో సహా అనేక ప్రసిద్ధ చిత్రాలను నిర్మించారు. ఆయన 2012లో అవతార్ సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేశారు.ఆ ప్రముఖ నిర్మాత మాజీ సిబిఎఫ్సి చీఫ్ పహ్లాజ్ నిహలానీ ప్రస్తుతం బాలీవుడ్లో విపరీతంగా పెరుగుతున్న విషపూరిత సంస్కృతిని విమర్శించడం సంచలనంగా మారింది. ఇటీవల లెర్న్ ఫ్రమ్ ది లెజెండ్ పాడ్కాస్ట్లో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కొత్త తరం సెలబ్రిటీ జీవనశైలిని ఆకర్షణీయమైన ముఖభాగాల వెనుక దాగి ఉన్న నిరంతర మాదకద్రవ్య సేవనాన్ని తూర్పారబట్టారు.గతంలో ఒక నటుడు మాత్రమే కనిపిస్తే, నేడు నటులు పది మంది బృందాలతో కనిపిస్తారని ఆయన ఎద్దేవా చేశారు. నిన్న కాక మొన్న వచ్చిన కొత్తవారు కూడా తమ సొంత మేకప్ ఆర్టిస్ట్, హెయిర్డ్రెస్సర్ల నుంచి తమ అద్దం పట్టుకోవడానికి కూడా పర్సనల్ అసిస్టెంట్ కావాలంటున్నారని, అలాగే వ్యక్తిగత ఫిట్నెస్ ట్రైనర్ను కలిగి ఉండాలని పట్టుబడుతున్నారన్నాని వెల్లడించారు. చివరికి వీటన్నింటికీ ఖర్చులు నిర్మాత జేబుల నుంచే చెల్లిస్తారని ఆయన గుర్తు చేశారు. వ్యాయామం చేయడం, వంట చేయడం సమావేశాలు నిర్వహించడం వంటి వాటి కోసం ఏకంగా ఆరు వేర్వేరు వానిటీ వ్యాన్ల డిమాండ్ కూడా చేస్తున్నారని ఇది చాలా ఓవర్గా ఉందన్నారు. .చాలా మంది నటులు ద్వంద్వ జీవితాలను గడుపుతున్నారని ఆయన తీవ్రంగా ఆరోపించారు.. పగటిపూట శుభ్రమైన,ఆరోగ్యకర ఆహారం డిమాండ్ చేస్తూ, రాత్రిపూట మత్తుపదార్ధాల వినియోగంలో మునిగిపోతున్నారన్నారు. తారలు తరచుగా ప్రాథమిక సేవల కోసం పెంచిన బిల్లులను సమర్పిస్తారని, మేకప్ ఖర్చులే లక్షల్లో ఉంటాయని ఆయన పేర్కొన్నారు. చిత్ర పరిశ్రమలో మాదకద్రవ్యాల సంస్కృతి ఇప్పటికీ కొనసాగుతోందా అని అడిగినప్పుడు స్పందిస్తూ, ఇప్పుడు చాలా ఎక్కువగా ఉందని కొన్ని సందర్భాల్లో, కొంతమంది నటుల ప్రవర్తనలో కూడా అది స్పష్టంగా కనిపిస్తుందని స్పష్టం చేశారు.అంతేకాదు...తాను తీసిన తలాష్: ది హంట్ బిగిన్స్... చిత్రం సందర్భంగా జరిగిన విషయాల్ని గుర్తు చేసుకుంటూ, హీరో అక్షయ్ కుమార్ తన పక్కన కరీనా కపూర్ను ప్రధాన పాత్రగా తీసుకోవాలని పట్టుబట్టారని కూడా ఆయన వెల్లడించారు. తన కెరీర్లో ఒక నటుడు ఇలాంటి డిమాండ్ చేయడం ఇదే మొదటిసారి అని, ఇది సాంప్రదాయ నిర్మాత–దర్శకుడు కాస్టింగ్ విధానాన్ని అధిగమించిందని నిహలానీ పేర్కొన్నారు. ఇప్పుడు అది సాధారణంగా మారిపోయిందన్నారు. నేడు, నటులు తరచుగా తారాగణం నుంచి దర్శకుడు సిబ్బంది వరకు ప్రధాన నిర్ణయాలను అన్నింటినీ నియంత్రిస్తున్నారని ఆయన వెల్లడించారు. హీరో, హీరోయిన్స్ మధ్య వయసు తేడా ల గురించి మాట్లాడుతూ వృద్ధ నటులు తాము యంగ్గా కనిపించడానికి యువ తారల్ని ఇష్టపడతారని ఆయన ఎద్దేవా చేశారు. -
కన్నప్ప సినిమా.. చీటింగ్ చేసిన అక్షయ్ కుమార్?!
మంచు విష్ణు కన్నప్ప సినిమా (Kannappa Movie)లో నార్త్ నుంచి సౌత్ వరకు పెద్ద పెద్ద స్టార్స్ భాగమయ్యారు. ప్రభాస్, మోహన్లాల్, శరత్కుమార్, అక్షయ్కుమార్.. ఇలా పలువురు కన్నప్ప చిత్రంలో నటించారు. అక్షయ్కుమార్ శివుడిగా, కాజల్ అగర్వాల్ పార్వతిగా యాక్ట్ చేశారు. మొదట ఈ మూవీ చేసేందుకు అక్షయ్ అసలు ఒప్పుకోనేలేదు. రెండుసార్లు రిజెక్ట్ చేశాడు. అయినా విష్ణు పట్టు వదలకుండా ప్రయత్నించి ఆయన్ను ఎలాగోలా ఒప్పించాడు. డైలాగ్స్ చెప్పేందుకు అక్షయ్ కుమార్ తిప్పలుఅలా అక్షయ్ కుమార్ వెండితెరపై మహాశివుడిగా కనిపించాడు. జూన్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీకి పాజిటివ్ రెస్పాన్స్ లభించింది, కానీ కలెక్షన్లు మాత్రం రాలేదు. తాజాగా ఈ సినిమాలోని ఓ క్లిప్ నెట్టింట విపరీతంగా వైరలవుతోంది. అందులో అక్షయ్ కుమార్ డైలాగులు నేర్చుకుని సొంతంగా చెప్పినట్లు కనిపించడం లేదు. టెలిప్రాంప్టర్ను చూస్తూ అక్కడ రాసున్న డైలాగ్స్ చదువుతున్నట్లుగా ఉంది. అది అతడి కళ్లు తిప్పడం చూస్తేనే అర్థమైపోతుంది.ఇది చీటింగ్ కాదా?ఇది చూసిన నెటిజన్లు అక్షయ్పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. దశాబ్దాలుగా ఇండస్ట్రీలో ఉన్నా ఇప్పటికీ డైలాగ్స్ గర్తుపెట్టుకుని చెప్పలేడా? ఎందుకిలా సగం సగం యాక్టింగ్ చేయడం? శివుడి వేషం కట్టుకుని చిన్న డైలాగ్స్ కూడా చెప్పడం రాకపోతే ఎలా? ఇది జనాల్ని చీటింగ్ చేయడమే అవుతుంది అని కామెంట్లు చేస్తున్నారు. అయితే సదరు వీడియోను సోషల్ మీడియా నుంచి తొలగించినట్లు తెలుస్తోంది. కాగా అక్షయ్ కుమార్.. ఇలా ప్రాంప్టర్ చూసుకుంటూ డైలాగ్స్ చెప్పడం కొత్తేమీ కాదు. సర్ఫిరా సినిమాలోనూ ఓ సీన్లో ఇలాగే డైలాగ్స్ చూసుకుంటూ చదివాడు. అక్షయ్ ప్రస్తుతం జాలీ ఎల్ఎల్బీ 3, వెల్కమ్ టు ద జంగిల్ సినిమాలు చేస్తున్నాడు.చదవండి: ప్రియుడితో శ్రద్ధా.. సీక్రెట్ వీడియో వైరల్.. ఇంత పని చేస్తారనుకోలేదు -
ప్రియుడితో శ్రద్ధా.. సీక్రెట్ వీడియో వైరల్.. ఇంత పని చేస్తారనుకోలేదన్న రవీనా
సెలబ్రిటీలకు కనీస ప్రైవసీ లేకుండా పోతోంది. వాళ్లు ఎక్కడికి వెళ్లినా, ఏం చేసినా ఎవరో ఒకరు వారిని వెంబడిస్తూనే ఉన్నారు. కెమెరాల కళ్లు గప్పి ఫ్రెండ్స్తో లేదా బాయ్ఫ్రెండ్తో ఎక్కడికైనా వెళ్దామా? అంటే అక్కడ కూడా ఎవరో ఒకరు ఈ జంటను కనిపెట్టి ఫోన్లో ఫోటోలు, వీడియోలు రికార్డ్ చేస్తున్నారు. బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ (Shraddha Kapoor) విషయంలో ఇదే జరిగింది.సీక్రెట్గా వీడియోశ్రద్ధా, ప్రియుడు రాహుల్ మోదీతో కలిసి విమానంలో ప్రయాణించింది. వీరిద్దరూ ఎకానమీ క్లాసులో కూర్చోగా శ్రద్ధా తన ఫోన్లో ఏదో రాహుల్కు చూపిస్తోంది. దీన్నంతటినీ విమాన సిబ్బంది ఒకరు సీక్రెట్గా వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో వదిలారు. ఐదు నెలల క్రితం జరిగిన సంఘటన ఇది. ఏమైందో, ఏమో కానీ తాజాగా మరోసారి ఈ వీడియో నెట్టింట వైరలవుతోంది. రవీనా టండన్ ఫైర్ఇండియా ఫోరమ్స్ ఇన్స్టాగ్రామ్ పేజీలో ప్రత్యక్షమైన ఈ వీడియో హీరోయిన్ రవీనా టండన్ (Raveena Tandon) కంటపడింది. అంతే విమాన సిబ్బందిని ఏకిపారేస్తూ సదరు పోస్ట్ కింద కామెంట్ పెట్టింది. ఇలా రహస్యంగా వీడియో రికార్డ్ చేయడమనేది వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడమే అవుతుంది. ఈ విషయం సిబ్బందికి తెలిసే ఉంటుంది. ముందు వారి అనుమతి తీసుకుని ఆ తర్వాత వీడియో రికార్డ్ చేసుకోవాల్సింది. ఇంట్లోకి చొరబడి తీసిందా?ఎయిర్లైన్ స్టాఫ్ కూడా ఇలా చేస్తారని అస్సలు ఊహించలేదు అని మండిపడింది. కొందరు ఆమె మాటలతో ఏకీభవిస్తూ.. సెలబ్రిటీలు కూడా మనుషులేనని, వారికి కొంత ప్రైవసీ ఇవ్వాలని కామెంట్లు చేస్తున్నారు. మరికొందరేమో.. వాళ్లకు లేని ఇబ్బంది మీకెందుకు? ఆమె సెలబ్రిటీ ఇంట్లోకి చొరబడి వీడియో తీయలేదు కదా.. విమాన సిబ్బందిని తిట్టాల్సిన అవసరం లేదు, వారు కూడా మనుషులే అంటూ ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు. View this post on Instagram A post shared by India Forums (@indiaforums) చదవండి: 'ఐ లవ్ యూ' చెబితే ఓకే చెప్పేశాను: అనుష్క -
ఆ ఒక్క కారణంతో రాత్రికి రాత్రే 9 ప్రాజెక్టుల నుంచి తీసేశారు.. : విద్యా బాలన్
చిత్ర పరిశ్రమలో రాణించడం చాలా కష్టం. ఇప్పుడు స్టార్ హోదాలో ఉన్నవారంతా ఒకప్పుడు ఎన్నో కష్టాలను అనుభవించే ఈ స్థాయికి వచ్చారు. ముఖ్యంగా హీరోయిన్లకు కెరీర్ ప్రారంభంలో ఎన్నో సమస్యలు వస్తుంటాయి. ఫస్ట్ చాన్స్ కోసం చాలా ఏళ్లుగా ఎదురు చూసినవాళ్లు కూడా ఉన్నారు. వచ్చిన ఆ ఒక్క చాన్స్ని సరిగ్గా వాడుకున్న వాళ్లే ఇప్పుడు స్టార్ హీరోయిన్లుగా మారారు. అలా అందరిలాకే కెరీర్ ప్రారంభంలో తాను కూడా చాలా ఇబ్బందులు పడ్డానని చెబుతోంది బాలీవుడ్ హీరోయిన్ విద్యా బాలన్(Vidya Balan). ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్గా రాణిస్తున్న ఈ టాలెంటెడ్ నటిపై మొదట్లో ‘ఐరెన్ లెగ్’ అనే ముద్ర వేసి రాత్రికి రాత్రే 9 ప్రాజెక్టుల నుంచి తీసేశారట. ఈ విషయాన్ని తాజాగా ఓ యూట్యూబ్ చానెల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్వయంగా విద్యా బాలనే చెప్పింది.‘కెరీర్ ప్రారంభంలో నాకు మోహన్లాల్తో కలిసి ‘చక్రం’ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. షూటింగ్ ప్రారంభం అయిన కొన్నాళ్లకు అనూహ్యంగా అది ఆగిపోయింది. దానికి కారణం నేనే అని ప్రచారం జరిగింది. నాపై ‘ఐరెన్ లెగ్’ అనే ముద్ర వేసి ఘోరంగా విమర్శించారు. చక్రం సినిమా ఆగిపోయిందనే విషయం తెలియగానే రాత్రికి రాత్రే నేను ఒప్పుకున్న 9 ప్రాజెక్టుల నుంచి నన్ను తొలగించారు. అసలు ఆ సినిమా ఆగిపోవడానికి కారణం నేను కానే కాదు. ఆ మూవీ డైరెక్టర్, మోహన్లాల్ మధ్య బేధాభిప్రాయాలు రావడంతో సగంలోనే ఆపేశారు. అది నా కెరీర్పై చాలా ప్రభావం చూపింది. అయినా నేను ధైర్యం కోల్పోలేదు. విశ్వాసంతో ముందుకు సాగాను. నాపై నాకు ఉన్న నమ్మకే ఈ రోజు ఈ స్థాయిలో నిలబడేలా చేసింది. విశ్వాసంతో ముందుకుసాగితే ఏదోఒకరోజు కచ్చితంగా మనది అవుతుంది’ అని విద్యా చెప్పుకొచ్చింది. కాగా, 2005లో పరిణిత మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన విద్యా.. ‘ది డర్టీ పిక్చర్’తో భారీ హిట్ని తన ఖాతాలో వేసుకుంది. సిల్క్ స్మిత జీవిత కథ ఆధారంగా వచ్చిన ఈ చిత్రంలో విద్యా లీడ్ రోల్ చేసింది. ఆమె నటనపై విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించారు. ఆ తర్వాత వరుసగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ.. బాలీవుడ్లోనే కాదు దేశమంతటా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపుని సంపాదించుకుంది. ఇటీవల భూల్ భూలయ్య 3 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి.. మరో భారీ హిట్ని తన ఖాతాలో వేసుకుంది. -
ఒకప్పటి స్టార్ హీరో.. హెయిర్ కట్కు బ్రాండ్ అంబాసిడర్.. ఎవరో గుర్తుపట్టారా?
చిన్నపిల్లలు, టీనేజ్ యువకులు ఎవరైనా హెయిర్ కట్ చేసుకోవాలంటే ఎక్కువగా హీరోల స్టైల్స్నే ఫాలో అవుతుంటారు. ఆ హీరో స్టైల్లో కటింగ్ చేయమని సెలూన్ వాళ్లను అడిగి మరీ తమ అభిమాన హీరోలా తయారవుతారు. అందుకే ఏ సెలూన్ షాప్ల ముందైనా హీరోల హెయిర్ కట్స్తోనే పోస్టర్స్ పెడతారు. అలా ఓ హీరోను చూసి ఎంతో యూత్ అచ్చం అలానే ఉండాలని ఒకప్పుడు ఫుల్ క్రేజ్ ఉండేది. ఆ హీరో ఎవరో మీకు గుర్తున్నారా? 1990ల్లో ఓ యూత్ ఫ్యాన్స్లో ఓ రేంజ్లో క్రేజ్ తెచ్చుకున్న హీరో ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే షాకవుతారు. ఒకప్పుడు హెయిర్ కట్ స్టెల్కు బ్రాండ్గా మారిన ఆయన ఇప్పుడు గుర్తుపట్టలేరేమోనని అనిపిస్తోంది. ఇంతకీ అతనెవరో తెలుసుకోవాలనుందా?అయితే ఈ స్టోరీ చదివేయండి.ఆయనే మరెవరో కాదు.. ప్రేమదేశం హీరో అబ్బాస్.. ఈ పేరు ఇప్పటి జనరేషన్కి పెద్దగా తెలిసి ఉండకపోవచ్చు. 1990ల్లో పుట్టిన కుర్రాళ్లను అడిగితే మాత్రం టక్కున గుర్తుపట్టేస్తారు. ఎందుకంటే అప్పట్లో ఆయన నటించిన సూపర్ హిట్ లవ్స్టోరీ మూవీ 'ప్రేమదేశం' చూసి అచ్చం అబ్బాస్ లాగే హెయిర్ స్టైల్ చేయించుకున్నారు యూత్ ఆడియన్స్. అతడిలా ఉండటానికి ఎంతోమంది ట్రై చేశారు. అప్పట్లో రజనీకాంత్, కమల్ హాసన్, మమ్ముట్టి లాంటి స్టార్ హీరోలతో కలిసి సినిమాలు చేసిన అబ్బాస్.. ఆ తర్వాత కొన్నాళ్లకు ఇండస్ట్రీకి దూరమైపోయాడు.తాజాగా ఆయనకు సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇది చూసిన వాళ్లు అసలు అబ్బాసేనా అని డౌటానుమానం వ్యక్తం చేస్తున్నారు. అంతలా మారిపోయింది మరి ఆయన కటౌట్. తెల్లటి గడ్డం, స్టైలిష్ హెయిర్ లుక్లో అచ్చం అప్పటిలాగే ఉన్నప్పటికీ గుర్తుపట్టడానికి కాస్తా టైమ్ తీసుకోవాల్సిందే. ఎందుకంటే అప్పటి అబ్బాస్ లవర్ బాయ్లా ఉంటే.. ఇప్పటి అబ్బాస్ కాస్తా సీరియస్ లుక్లో కనిపిస్తున్నాడు. ఏదేమైనా యూత్ హెయిర్ కట్కు బ్రాండ్ అంబాసిడర్ అబ్బాస్ అనడంలో ఎలాంటి సందేహం లేదు.రీ ఎంట్రీ కోసం ప్రయత్నాలు..అయితే సినిమాల్లో అవకాశాలు తగ్గిపోవడంతో న్యూజిలాండ్లోని కుటుంబం దగ్గరికి వెళ్లిపోయిన అబ్బాస్.. పెట్రోల్ బంక్ లో పనిచేయడం లాంటి జాబ్స్ చేశాడు. ప్రస్తుతం కార్పొరేట్ ఫీల్డ్లో సెటిలయ్యాడు. అయితే సినిమాల్లో రీ ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నానిని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. న్యూజిలాండ్లో మధ్యతరగతి జీవితాన్ని గడపిన ఆబ్బాస్ మళ్లీ చెన్నై వచ్చాడు. అతను చివరిసారిగా మలయాళ చిత్రం పచ్చకల్లం (2015)లో కనిపించాడు. తమిళంలో రామానుజన్ బయోపిక్లో భారతీయ శాస్త్రవేత్త ప్రశాంత్ చంద్ర మహలనోబిస్ పాత్రను పోషించాడు. తెలుగులో నీ ప్రేమకై, రాజా, శ్వేతనాగు, రాజహంస, ప్రియా ఓ ప్రియా లాంటి సూపర్ హిట్ చిత్రాల్లో అబ్బాస్ నటించారు. -
దీపిక, ప్రియాంక కాదు.. దీవిని కొన్న అందాల నటి తెలుసా.. అక్కడ ఏం చేస్తోందో..!
ఇంపోర్టెడ్ కార్లు, ఇంద్ర భవనాలు,నుంచి కళాఖండాలను దాటి క్రికెట్ టీమ్స్ దాకా కాదేదీ అనర్హం. తారల దర్పానికి, స్టార్ డమ్ ప్రదర్శనకి అన్నట్టుగా సాగుతోంది. ఇప్పుడిప్పుడే కార్ల ట్రెండ్ పాతబడుతూ వాటి స్థానంలో ప్రైవేట్ జెట్స్ సైతం సూపర్ స్టార్లకు అలంకారంగా మారుతున్నాయి. ఈ నేపధ్యంలో బాలీవుడ్కి చెందిన ఓ అందాల నటి ఏకంగా ఐలాండ్నే కొనుగోలు చేసిందని తెలుస్తోంది. ఈ వార్త వినగానే మన కళ్ల ముందు మెదిలే బాలీవుడ్ టాప్ హీరోయిన్స్లో దీపికా పదుకోన్, ప్రియాంకా చోప్రా, అలియా భట్, ఐశ్వర్యా రాయ్ వంటివారు ముందుండడం సహజమే.అయితే వీరందరూ కాకుండా.. నిజం చెప్పాలంటే విజయాల్లో వీరి సరసన నిలబడే స్థాయి లేని నటి ఐలండ్ క్వీన్గా మారిందనేది తెలుసుకోదగ్గ విశేషమే. ఆమె పేరు గ్లామర్ స్టార్ జాక్వలిన్ ఫెర్నాండెజ్. విదేశాల నుంచి మన దేశానికి వచ్చి సక్సెస్ అయిన తారల్లో ఒకరు శ్రీలంకకు చెందిన జాక్వలిన్. దాదాపు పాతికేళ్ల క్రితం 2006లో మిస్ యూనివర్స్ పోటీల్లో శ్రీలంకకు సారధ్యం వహించిన ఈ బ్యూటీకి కిరీటం దక్కకపోయినా బాలీవుడ్ ఛాన్సులు దండిగానే దక్కాయి. అలా 2009 నుంచి వరుస సినిమాలు చేసుకుంటూ అదే పనితో ఆగిపోకుండా రకరకాల వ్యాపారాల్లోనూ ఆమె తనదైన ముద్ర వేసింది. ఇప్పటికే ముంబైలో, శ్రీలంకలో విలాసవంతమైన అపార్ట్మెంట్, లగ్జరీ కార్లు, బ్రాండెడ్ వస్తువులు సైతం ఆమె స్వంతం. స్టార్ డమ్లో దిగువన ఉన్నా ఇన్ కమ్లో ముందున్న ఈ భామ ఆస్తులు దాదాపుగా రూ.100కోట్ల పైమాటే అని సమాచారం.ఈ నేపధ్యంలోనే ఆమె స్వదేశంలో, అంటే శ్రీలంక తీర ప్రాంతంలో ఒక ప్రైవేట్ దీవిని కూడా ఆమె కొనుగోలు చేసినట్టు తెలిసింది. ఇది బహిరంగంగా ఆమె ప్రకటించని విషయమే అయినా, తాజాగా వెలుగులోకి వచ్చింది. జాక్వలిన్ ఈ ప్రైవేట్ దీవిని కుటుంబం కోసం కొనుగోలు చేసినట్టు విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి. అక్కడ ఎటువంటి నిర్మాణాలు జరిగాయో కానీ, అది పూర్తి స్థాయిలో పర్యాటకుల నుంచి దూరంగా, నిశ్శబ్దత నడుమ ఆమె తన కోసం విశ్రాంతి కోసం ఏర్పాటు చేసుకున్న ప్రదేశమని అంటున్నారు. ఈ వార్త వెలుగులోకి రావడం వల్ల బాలీవుడ్లో జాక్వలిన్ స్థానం, ఆమె సంపద, జీవనశైలి పై కొత్త చర్చ మొదలైంది. ఎందుకంటే బాలీవుడ్లో ఇది అరుదైన విషయమే మరి. నటుల్లో స్వంత దీవిని కలిగిన నటి అనే ఘనతను జాక్వలిన్ ఒక్కరే దక్కించుకుంది.ఎక్కడ? ఎప్పుడు?శ్రీలంక దక్షిణ తీరానికి సమీపంగా 2012లో సుమారు 4 ఎకరాల ప్రైవేట్ దీవిని సుమారుగా రూ.3కోట్లకు జాక్వలిన్ ఫెర్నాండెజ్ కొనుగోలు చేసినట్టు సమాచారం. ఈ దీవి ఖరీదు చేసినప్పుడు, ‘విలాసవంతమైన విల్లా నిర్మాణం‘ ఉండొచ్చని అంచనా వేశారట, అయితే అక్కడ అలాంటి నిర్మాణం జరిగిందా లేదా అనేది స్పష్టంగా వెలుగు చూడలేదు. ఈ దీవి, మాజీ శ్రీలంక క్రికెట్ కెప్టెన్ కుమార్ సంగక్కరా కి చెందిన సొంత దీవి దగ్గరనే ఉందని కూడా తెలుస్తోంది.కొసమెరుపు ఏమిటంటే... ఓ నాలుగేళ్ల క్రితం ఈ జాక్వెలిన్ పై మనీ లాండరింగ్ కేసులు దాఖలయ్యాయి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందు కూడా విచారణకు హాజరైంది. ఈ కారణం వల్లనే ఆమెకు ఘోస్ట్ సినిమాలో మన కింగ్ అక్కినేని నాగార్జున సరసన తెలుగులో నటించడానికి వచ్చిన ఛాన్స్ చేజారినట్టు సమాచారం. -
తండ్రి కాబోతున్న స్త్రీ-2 నటుడు.. సోషల్ మీడియాలో పోస్ట్
హిందీలో వరుస సినిమాలతో దూసుకెళ్తున్న బాలీవుడ్ హీరో రాజ్ కుమార్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. తాను త్వరలోనే తండ్రి కాబోతున్నట్లు తెలిపారు. పెళ్లయిన మూడున్నర్ర సంవత్సరాల తర్వాత శుభవార్తను ప్రకటించారు. కాగా.. బాలీవుడ్ నటి పాత్రలేఖను నవంబర్ 15, 2021న రాజ్కుమార్ వివాహం చేసుకున్నారు. ఈ శుభవార్తను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. 'బేబీ ఆన్ ది వే' అంటూ ఇన్స్టాలో పోస్ట్ చేశారు బాలీవుడ్ దంపతులు. ఈ విషయం తెలుసుకున్న పలువురు బాలీవుడ్ తారలు ఈ జంటకు అభినందనలు చెబుతున్నారు.కాగా.. రాజ్కుమార్ రావు గతేడాది సూపర్ హిట్ మూవీ స్త్రీ-2 చిత్రంలో నటించారు. శ్రద్ధాకపూర్ కీలక పాత్రలో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఈ ఏడాది బుల్ చుక్ మాఫ్ అనే రొమాంటిక్ కామెడీ మూవీతో ప్రేక్షకులను అలరించారు. మే నెలలో థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం పెద్దగా రాణించలేకపోయింది. మరోవైపు ఆయన భార్య పాత్రలేఖ గతేడాది వెల్డ్ వైల్డ్ పంజాబ్ అనే మూవీలో నటించింది. ఈ ఏడాదిలో పూలే సినిమాతో అభిమానులను అలరించింది. View this post on Instagram A post shared by RajKummar Rao (@rajkummar_rao) -
2025లో టాప్ సినిమా ఏదో తెలుసా? 500% లాభాలు తెచ్చిపెట్టిన మూవీ
కొత్త సంవత్సరం మొదలై ఆరు నెలలు గడిచిపోయాయి. ఈ ఫస్టాఫ్లో ఎన్నో సినిమాలు రిలీజయ్యాయి. బాక్సాఫీస్ మీద కనక వర్షం కురిపించిన సినిమాలు కొన్నయితే నిర్మాతల నెత్తిన గుదిబండ వేసిన చిత్రాలు మరికొన్ని. అయితే వీటన్నింటినీ జల్లెడపట్టిన ఐఎమ్డీబీ (IMDB).. 2025 ఫస్టాఫ్- మోస్ట్ పాపులర్ ఇండియన్ చిత్రాల జాబితాను రిలీజ్ చేసింది.ఫస్టాఫ్లో టాప్ 102025లో జనవరి 1 నుంచి జూలై 1 మధ్య విడుదలైన సినిమాలను పరిగణనలోకి తీసుకుంది. ఆరు, అంత కంటే ఎక్కువ రేటింగ్ వచ్చిన చిత్రాలను తన జాబితాలో పొందుపరిచింది. టాప్ 10లో అత్యధికంగా బాలీవుడ్ నుంచే ఆరు సినిమాలున్నాయి. అందరూ ఊహించినట్లుగానే విక్కీ కౌశల్ ఛావా సినిమా మొట్టమొదటి స్థానంలో ఉంది. రూ.130 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం రూ.809 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. టాప్ 5లో ఏమున్నాయ్?మరాఠా యోధుడు శివాజీ మహారాజ్ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం దాదాపు 500% లాభాలను తెచ్చిపెట్టింది. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రష్మిక మందన్నా, దివ్య దత్తా, వినీత్ కుమార్ సింగ్ కీలక పాత్రలు పోషించారు. 2025లో ఇప్పటివరకు అత్యధిక వసూళ్లు రాబట్టిన ఇండియన్ మూవీగా ఛావా రికార్డు సృష్టించింది. తమిళ సినిమా డ్రాగన్ రెండో స్థానంలో ఉంది. కోలీవుడ్ నుంచి 3 సినిమాలుబాక్సాఫీస్ వద్ద నిరాశపరిచిన షాహిద్ కపూర్ దేవా మూడో స్థానంలో ఉండటం గమనార్హం. అజయ్ దేవ్గణ్ రైడ్ 2 నాలుగో స్థానంలో, సూర్య రెట్రో ఐదో స్థానంలో ఉన్నాయి. ద డిప్లొమాట్, ఎల్ 2: ఎంపురాన్, సితారే జమీన్ పర్, కేసరి చాప్టర్ 2, విడాముయర్చి టాప్ 6 నుంచి 10 స్థానాల్లో నిలిచాయి. టాప్ 10లో తమిళం నుంచి మూడు, మలయాళం నుంచి ఒక మూవీ జాబితాలో ఉంది. టాలీవుడ్ నుంచి ఏ సినిమా కూడా ఈ లిస్ట్లో చోటు దక్కించుకోలేకపోయింది. View this post on Instagram A post shared by IMDb India (@imdb_in) చదవండి: సినిమాలు మానేసి సెలూన్లో పని చేశా.. 10th ఫెయిలైనా.. -
బేబీ బంప్పై ‘అమృతస్వరం’ పాట పాడితే.. వీడియో వైరల్
బాలీవుడ్ సూపర్ గాయని శ్రేయ ఘోషల్ (Shreya Ghoshal) తన మధురమైన గాత్రంతో ప్రపంచ వ్యాప్తంగా అనేకమంది అభిమానులను సంపాదించుకుంది. అనేక భాషల్లో తన స్వరంతో సంగీతాభిమానులు ఉర్రూతలూగించింది. తాజాగా తన గానంతో కడుపులో ఉన్న బిడ్డను కూడా కదిలించింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట్ వైరల్గా మారింది.ఆమ్స్టర్డామ్ లోని ‘‘ఆల్ హార్ట్స్ టూర్’’ సందర్భంగా తన వీరాభిమానిని కలిసింది శ్రేయా ఘోషల్. గర్భిణి అయిన అభిమాని ముందు మోకాళ్లపై కూర్చుని, ఆమె గర్భంపై తన చేతిని సున్నితంగా ఉంచి, పుట్టబోయే బిడ్డ కోసం జోలపాట పాడటం విశేషం. పరిణీత చిత్రంలోని "పియు బోలే సాంగ్ను మంద్రంగా ఆలపించింది. అంతే గర్భస్థ శిశువు పరవశంతో కదిలిందిట. ఆ సమయంలో అభిమానితో పాటు శ్రేయ కూడా ఆనందంలో మునిగిపోయింది. ఈ వీడియో నెట్టింట అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. View this post on Instagram A post shared by Varinder Chawla (@varindertchawla)లక్కీ బేబీ అంటూ ఫ్యాన్స్ కమెంట్ చేశారు. ‘డివైన్ వాయిస్ ఆ బిడ్డను ఆశీర్వదించింది’ అని ఒకరు, ‘ఓహ్..ఆ పుట్టబోయే బిడ్డకు ఎంత అదృష్టం’ అని మరో అభిమాని వ్యాఖ్యానించడం విశేషం."శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం ఫణిః" అని ఇదేనేమో!ఇదీ చదవండి: ట్విన్స్కు జన్మనివ్వబోతున్నా.. నా బిడ్డలకు తండ్రి లేడు : నటి భావోద్వేగ పోస్ట్ -
నేను చాలా సెల్ఫిష్.. ప్రజల కోసం జీవితం త్యాగం చేయలేను: కంగనా
సామాన్యులకు సేవ చేయడం కోసం రంగుల ప్రపంచాన్ని కాదనుకుని రాజకీయాల్లోకి వచ్చిన తారలు ఎంతోమంది. అందులో సక్సెస్ అయినవారు కొందరైతే విఫలమైన వారు మరికొందరు! కానీ, బాలీవుడ్ ఫైర్బ్రాండ్ కంగనా రనౌత్ (Kangana Ranaut) తొలి ప్రయత్నంలోనే ఎంపీగా గెలిచి తన సత్తా చాటారు. ప్రజల కోసం పనిచేస్తానంటూ బింకాలు పలికారు. కానీ, ఏడాది తిరిగేసరికి రాజకీయ జీవితమే విసుగొచ్చిందంటున్నారు.ఈ పంచాయితీ ఏంది?కంగనా రనౌత్ మాట్లాడుతూ.. రాజకీయ జీవితాన్ని నేను ఎంజాయ్ చేయడం లేదు. ఎందుకంటే ఇక్కడ సామాజిక సేవ చేస్తున్నట్లే అనిపిస్తోంది. నేను మహిళల హక్కుల కోసం పోరాడాను, కానీ ప్రజలకు సేవ చేయాలని ఎన్నడూ అనుకోలేదు. కొందరు నాలా ధ్వంసమైందని నా దగ్గరకు వచ్చి చెప్తుంటారు. పంచాయతీ స్థాయిలోని సమస్యలను నా ముందు ఏకరువు పెడతారు. PM పదవి కోసం పోటీ?నేను ఎంపీనన్న విషయమే లెక్క చేయరు. రోడ్లు బాలేకపోయినా నాకే చెప్తారు. అది రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటుందన్నా సరే.. నీ దగ్గర డబ్బులున్నాయిగా.. వాటితో బాగు చేయించమని డిమాండ్ చేస్తారు. రాజకీయంలో ఇంకా ముందుకు వెళ్లాలనైతే నేను అనుకోవడం లేదు. ప్రధానమంత్రి పదవికి పోటీపడేంత సమర్థురాలిని కాను. ఆ పోస్ట్ కోసం పోటీపడేంత అర్హత లేదు, ఆసక్తి అంతకన్నా లేదు. నేను సెల్ఫిష్సామాజిక సేవ అనేది నా లైఫ్లో లేదు. నేను చాలా సెల్ఫిష్ జీవితాన్ని గడిపాను. పెద్ద ఇల్లు, మంచి కారు, వజ్రాల ఆభరణాలు ఉండాలనుకున్నాను. అందంగా కనిపించాలనుకునేదాన్ని. నేను కోరుకున్నట్లే బతికాను. కానీ, దేవుడు నన్ను ఇటువైపు ఎందుకు నడిపించాడో తెలియడం లేదు. నా జీవితాన్ని ప్రజల కోసం త్యాగం చేయలేను. పూర్తిగా సామాజిక సేవకు అంకితం చేసే జీవితం నాకిష్టం లేదు. అలా జరగాలని కూడా నేను కోరుకోను అని కంగనా చెప్పుకొచ్చారు.సినిమాకంగనా.. 2024లో జరిగిన లోకసభ ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్.. మండి నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. సినిమాల విషయానికి వస్తే.. తెలుగులో ఏక్ నిరంజన్ మూవీలో హీరోయిన్గా నటించారు. బాలీవుడ్లో అనేక సినిమాలు చేసిన ఆమె చివరగా ఎమర్జెన్సీ చిత్రంలో ఇందిరా గాంధీ పాత్రలో మెప్పించారు. ఈ మూవీలో కంగనా నటించడంతో పాటు దర్శకురాలిగా, నిర్మాతగానూ వ్యవహరించారు. ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో అందుబాటులోంది.చదవండి: అమెరికాలో ప్రియుడితో సమంత చెట్టాపట్టాల్?! -
బాలీవుడ్ ఫస్టాఫ్ రిపోర్ట్.. అభినయంతో ఆకట్టుకున్న స్టార్స్ వీళ్లే!
సాధారణంగా సినిమా జయాపజయాలను కలెక్షన్లతో ముడిపెడతారు. అలాగే ప్రతీ ఏటా కలెక్షన్లను అనుసరించి ఆ సంవత్సరపు క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ఇయర్లీ సినిమా ఫలితాలను స్టార్ల స్టార్ డమ్ను విశ్లేషించడం కూడా రివాజు. అయితే ఈ సంప్రదాయానికి విరుద్ధంగా.. నటీనటుల అభినయం పరంగా ఈ విశ్లేషణ మొదలైనట్టు కనిపిస్తోంది. బాలీవుడ్ మీడియా దీనికి శ్రీకారం చుట్టింది. తాజాగా ఈ ఏడాది అర్ధభాగంలో విడుదలైన సినిమాలను తీసుకుని వాటిలో అభినయం ద్వారా ప్రభావం చూపిన స్టార్స్ను గుర్తిస్తోంది. అందులో భాగంగా 8మంది తారల్ని ప్రకటించింది. అర్ధభాగంలో అభినయంతో ఆకట్టుకున్న ఆ నటీనటులు ఎవరంటే...అభిషేక్ బెనర్జీస్టోలెన్ సినిమాలో నటించిన అభిషేక్ బెనర్జీ ఆ సినిమాని అమాంతం ప్రేక్షకుల హృదయాల్లో కూర్చోబెట్టారు. ఈ చిత్రంలో ప్రతీ భావాన్ని నిజంగా అన్నట్టు ప్రతిబింబించాడాయన. అతని నటన ఆ చిత్ర ప్రేక్షకులు పొందిన అనుభూతిని ఆకాశానికి తాకించింది. తరచూ నిశ్శబ్ధాన్ని ఆశ్రయిస్తూ ప్రేక్షకుల మనసుల్లో నిశ్శబ్ధంగా నిలిచిపోయింది.సన్యా మల్హోత్రామిస్ట్రెస్ సినిమాలో నటించిన సన్యా మల్హోత్రా కూడా ఈ జాబితాలో స్థానాన్ని అందుకుంది. ఈ సినిమాలో ఆమె పాత్ర సినిమా మొత్తాన్ని తన భుజాలపై మోసింది. ఒక మహిళగా ఈక్వాలిటీ కోసం పోరాడటం, ఊహించని ఒత్తిడి ఎదుర్కోవడం – ఆమె వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోవడం, ఇలాంటి పాత్ర పోషించడం సులభం కాదు. కానీ ఆమె ఆ పాత్రకు జీవం పోసింది.ఆదర్శ్ గౌరవ్సూపర్ బాయ్స్ ఆఫ్ మాలెగావ్ సినిమాలో ఆదర్శ్ గౌరవ్ పాత్రను మరచిపోవడం అంత సులభం కాదు. అందుకే అంత సులభంగా అతను ఫేమస్ అయ్యాడు. చిన్న పట్టణపు యువత కలలను ప్రతిబింబించడంతో పాటు హాస్య–భావాలను మనసుతో పలికించడం ద్వారా అతను అందరికీ గుర్తుండి పోయాడు.వామికా గబ్బీబూల్ చుక్ మాఫ్ చిత్రంలో నటించిన వామికా గబ్బీ ప్రేమచుట్టూ అల్లుకునే అనేక సమస్యలను వాటిని ఎదుర్కున్న తీరును ఆమె పాత్ర కొత్తగా పరిచయం చేస్తుంది. తెరపై అద్భుతమైన భావాలను చూపెట్టిన వామికా గబ్బీ..ఈ ఏడాది గట్టి ప్రభావం చూపిన నటీమణుల్లో ఒకరుగా నిలిచింది.రణదీప్ హుడామంచి విజయాన్ని సాధించిన జాట్ సినిమాలో రణదీప్ హుడా వీరానురాగాన్ని చూపిస్తూ విలనిజాన్ని ప్రదర్శించాడు. అతని పాత్ర అంత భయంకరంగా కనిపించకపోతే ఆ సినిమా అంతగా ప్రేక్షకులను ఆకట్టుకునేది కాదేమో..రణదీప్ నటన జాట్ను ఒక సినిమాగా మాత్రమే కాదు ఒక అనుభవంగా మార్చింది. కాజోల్ఇప్పటికే అనేక పాత్రల ద్వారా తనను తాను నిరూపించుకున్న సీనియర్ నటి కాజోల్... మా సినిమాలో మరింతగా ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకుంది. మాతృత్వ బాధ్యతల్లో మునిగి పోయిన ఒక సగటు తల్లిగా కాజోల్, పటిష్టంగా పలికించిన భావోద్వేగాల లోతు అంతరంగాల్ని తాకుతుంది.విక్కీ కౌశల్చావా సినిమా సృష్టించిన సంచలనాల గురించి చెప్పుకోవడం ఎంత ముఖ్యమో ఆ సినిమాలో నటించిన విక్కీ కౌశల్ గురించి మాట్లాడడం అంతకన్నా ముఖ్యం. మరాఠా వీరుడు శంభూజీ మహరాజ్ ను ప్రేక్షకుల కళ్ల ముందు అతను ప్రతిష్టించిన తీరు అమోఘం. దేశంలో అత్యధిక శాతం మందికి అంతగా పరిచయం లేని ఓ వీరుని కధను పరిచయం చేయడం మాత్రమే కాదు వారి గుండెల్లో నిలిచిపోయేలా చేయడంలో విక్కీ...విజయం సాధించాడు.అమీర్ఖాన్...భావోద్వేగ భరిత సినిమాల ద్వారా భారీ విజయాల్ని అందుకోవడంలో తానెందుకు మిగిలిన హీరోల కన్నా ముందుంటాడో చాటి చెప్పడంలో అమీర్ఖాన్ మరోసారి విజయం సాధించాడు. సితారే జమీన్ పర్ లో అమీర్ ఖాన్ తన స్టార్ డమ్ ద్వారా కళ్ల ముందు మెరుపులు మెరిపించడం కన్నా... మన హృదయాలను స్పర్శించడానికే ప్రాధాన్యత ఇచ్చాడు. ఆ పనిలో ఆయన విజయం సాధించాడు. -
సినిమాలు మానేసి సెలూన్లో పని చేశా.. 10th ఫెయిలైనా..
నమ్రత శిర్కోదర్ టాలీవుడ్లో హీరోయిన్గా రాణిస్తే చెల్లి శిల్ప శిరోద్కర్ (Shilpa Shirodkar) బాలీవుడ్లో కథానాయికగా అలరించింది. హమ్, ఆంఖెన్, పెంచన్ వంటి సినిమాలతో శిల్ప హిందీలో ఫుల్ బిజీ అయింది. అయితే 2000వ సంవత్సరంలో వచ్చిన గజగామిని మూవీ తర్వాత ఆమె వెండితెరకు విరామం ప్రకటించింది. అప్పుడే యూకేకి చెందిన బ్యాంకు ఉద్యోగి అపరేశ్ రంజిత్ను పెళ్లాడింది. మొదట్లో ఈ దంపతులు నెదర్లాండ్స్కు షిఫ్ట్ అయ్యారు. ఆ తర్వాత న్యూజిలాండ్లో సెటిలయ్యారు.కోర్సు నేర్చుకున్నా..ఇక హీరోయిన్గా స్టార్డమ్ చూసిన శిల్ప.. సినిమాలు మానేశాక ఏం పని చేసిందనే విషయాన్ని తాజాగా బయటపెట్టింది. ఆమె మాట్లాడుతూ.. నేను ఖాళీగా ఉండకుండా బిజీగా గడపాలని న్యూజిలాండ్లో హెయిర్డ్రెస్సింగ్ కోర్సు నేర్చుకున్నాను. ఇందులో మేకప్, బ్యూటీ గురించి ఉండటంతో యాక్టింగ్కు కనెక్ట్ అయి ఉన్నట్లే అనిపించేది. రెండునెలలపాటు సెలూన్లో కూడా పని చేశాను. పనిగంటలు సెట్టవకపోవడంతో మానేశాను. పదో తరగతి ఫెయిల్ అని రెజ్యూమ్కార్పొరేట్ సంస్థలో పని చేసిన అనుభవం లేదు కాబట్టి ఇంకేదైనా చేయాలనుకున్నాను. నా భర్తకు నా రెజ్యూమ్ సిద్ధం చేయమని చెప్పాను. అందుకాయన రెజ్యూమ్లో ఏమని రాయను? అన్నాడు. అబద్ధాలు చెప్పకుండా నా గురించి ఉన్నది ఉన్నట్లు రాయు. 10th ఫెయిల్ అని, అలాగే సినిమాల్లో పని చేశానని కూడా పేర్కొనమని చెప్పాను. ఆశ్చర్యంగా ఒక్కరోజే నాకు రెండు జాబ్ ఆఫర్స్ వచ్చాయి. డన్ అండ్ బ్రాడ్షీట్ కంపెనీలో క్రెడిట్ కంట్రోలర్గా ఉద్యోగంలో చేరాను.జోక్ కాస్తా నిజమైందికానీ ఉద్యోగంలో చేరిన కొంతకాలానికే నాకు అలసటగా అనిపించేది. ఇదే మాట నా స్నేహితురాలికి చెప్తే ప్రెగ్నెంట్ అయ్యావేమో అని జోక్ చేసింది. ఎందుకైనా మంచిదని టెస్ట్ చేసుకుంటే పాజిటివ్ అని తేలింది. కానీ ఆ జర్నీ అంత ఈజీగా సాగలేదు. ఇన్సులిన్ ఇంజక్షన్లు, బరువు తగ్గేందుకు ప్రయత్నాలు.. ఇలా చాలా కష్టాలే పడాల్సి వచ్చింది. అలా నాకు కూతురు అనుష్క పుట్టింది. దాంతో సినిమాలకు మరింత దూరంగా ఉండాల్సి వచ్చింది అని శిల్ప శిరోద్కర్ చెప్పుకొచ్చింది.చదవండి: అమెరికాలో ప్రియుడితో చెట్టాపట్టాల్?!.. అతడితోనే సమంత విందు, విహారం -
హీరోయిన్ పేరుతో 77 లక్షల మోసం.. మాజీ పీఏ అరెస్ట్!
బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్(Alia Bhatt ) మాజీ పర్సనల్ అసిస్టెంట్(పీఏ) వేదికా ప్రకాశ్ శెట్టిని పోలీసులు అరెస్ట్ చేశారు. హీరోయిన్ సంతకాలు ఫోర్జరీ చేసి రూ. 77 లక్షల మోసానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఆలియా తల్లి, దర్శకురాలు సోనీ సోనీ రజ్దాన్ ఇచ్చిన ఫిర్యాదుతో వేదిక ప్రకాశ్శెట్టిని పోలీసులు అరెస్ట్ చేశారు. 2021 నుంచి 2024 వరకు అలియా వ్యక్తిగత సహాయకురాలిగా వేదిక పని చేసింది. ఆ సమయంలో ఆలియాకు సంబంధించిన ఫైనాన్షియల్ డాక్యుమెంట్లు, పేమెంట్స్, షెడ్యూల్ ప్లానింగ్లను వేదికనే చూసుకునేది. అదే సమయంలోనే వేదికా నకిలీ బిల్లులు సృష్టించి ఆలియా సంతకాన్నీ మార్ఫింగ్ చేసి ఈ మోసానికి పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఐదు నెలల క్రితమే వేదికపై ఆలియా తల్లి ఫిర్యాదు చేసింది. ఈ విషయం తెలిసిన వెంటనే సోనియా ముంబై నుంచి పారిపోయింది. రాజస్తాన్, కర్ణాటక, పుణెల్లో తిరుగుతూ.. చివరకు బెంగళూరులో పోలీసులకు చిక్కింది. ఆమెను అరెస్ట్ చేసి ముంబైకి తరలించినట్లు పోలీసులు తెలిపారు. -
అమెరికాలో ప్రియుడితో చెట్టాపట్టాల్?!.. అతడితోనే విందు, విహారం..
స్టార్ హీరోయిన్ సమంత (Samantha Ruth Prabhu) ఇటీవల తానా వేడుకల కోసం అమెరికా వెళ్లింది. మొదటి సినిమా నుంచి తెలుగు ప్రేక్షకులు తనను ఆదరిస్తూనే ఉన్నారంటూ భావోద్వేగానికి లోనైంది. తెలుగువారికి తన హృదయంలో ప్రత్యేక స్థానం ఉందని పేర్కొంది. ఈ వేడుకల అనంతరం సామ్ అమెరికాలో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నట్లు కనిపిస్తోంది.రాజ్తో అమెరికాలో చెట్టాపట్టాల్అమెరికాలోని డెట్రాయిట్లో తనకు నచ్చిన ఫుడ్ తింటూ అక్కడి అందాలను ఆస్వాదిస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అందులో రెండు ఫోటోల్లో దర్శకుడు రాజ్ నిడిమోరు కూడా ఉండటం విశేషం! ఓ ఫోటో అయితే.. వీరిద్దరూ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నారు. రాజ్.. ఆప్యాయంగా సామ్ భుజంపై చేయి వేశాడు. అతడి సాన్నిహిత్యంలో ఉన్న సామ్ నవ్వులు చిందిస్తూ కనిపిస్తోంది. మరో ఫోటోలో రాజ్తో పాటు మరికొంతమంది ఫ్రెండ్స్తో లంచ్కు వెళ్లింది. ఇది చూసిన అభిమానులు.. సామ్.. రాజ్తో రిలేషన్ను అధికారికంగా ప్రకటించేసినట్లేనని అభిప్రాయపడుతున్నారు.ఎలా మొదలైంది?రాజ్ నిడిమోరు (Raj Nidimoru), తన స్నేహితుడు కృష్ణతో కలిసి ద ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ డైరెక్ట్ చేశాడు. ఇందులో సమంత హీరోయిన్గా నటించింది. అప్పుడే వీరిమధ్య ఏర్పడిన పరిచయం ప్రేమకు దారి తీసినట్లు తెలుస్తోంది. తర్వాత వీరిద్దరూ సిటాడెల్: హనీ బన్నీ వెబ్ సిరీస్ చేశారు. సమంత చేతిలో ఉన్న రక్త బ్రహ్మాండ్: ద బ్లడీ కింగ్డమ్ ప్రాజెక్టుకు సైతం రాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు.పర్సనల్ లైఫ్అయితే రాజ్కు ఇదివరకే పెళ్లయింది. అతడికి భార్యతో పాటు ఓ కూతురు కూడా ఉంది. త్వరలోనే రాజ్.. ఆమెకు విడాకులివ్వనున్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. సమంత విషయానికి వస్తే.. 2017లో నాగచైతన్యను పెళ్లి చేసుకుంది. కొంతకాలం పాటు వీరు బాగానే కలిసున్నారు. తర్వాతేమైందో ఏమోకానీ 2021లో విడాకులు తీసుకున్నారు. అనంతరం నాగచైతన్య.. తెలుగు హీరోయిన్ శోభిత ధూళిపాళను వివాహం చేసుకున్నాడు. -
సాయిపల్లవి సినిమాకు రూ.1000 కోట్ల లాభం.. అదీ విడుదల కాకుండానే...
సినిమాల లాభాలు సాధారణంగా ఆ సినిమా విడుదలైన కొన్ని రోజుల తర్వాత గానీ లెక్కకు రావు. అరుదుగా కొన్ని సెన్సేషనల్ చిత్రాలు మాత్రం బిజినెస్ రైట్స్ అమ్మకాలు వంటి వాటి ద్వారా ముందే రికార్డ్స్ సృష్టిస్తాయి. అయితే వీటన్నింటికీ అతీతంగా హక్కుల అమ్మకాల ద్వారా కాకుండా ఎప్పుడూ ఎవరూ చవిచూడని రీతిలో ఓ సినిమా లాభాలను ఆర్జించి వార్తల్లో నిలిచింది. బహుశా భారతీయ సినీ చరిత్రలో ఈ తరహా లాభాలు అదీ ఈ స్థాయిలో అందుకున్న తొలిసినిమా ఇదే కావచ్చు. ఆ సినిమా పేరు రామాయణ(Ramayana). భారత దేశంలో హిందూ సంస్కృతీ సంప్రదాయాలను ప్రత్యక్షంగా పరోక్షంగా శాసించే పౌరాణిక గాధ... భారతీయ సినిమాను సైతం శాసించనున్నట్టు ఈ రికార్డ్స్ వెల్లడిస్తున్నాయి. భారతీయ చలనచిత్ర చరిత్రలోనే నభూతో నభవిష్యత్గా తెరకెక్కుతున్న ఈ సినిమా అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు. దాదాపుగా రూ.1000 కోట్ల వరకూ అంచనా వ్యయంతో రూపొందుతున్న ఈ సినిమా అప్పుడే రూ.1000 కోట్ల లాభాలు ఎలా అర్జించిందీ అంటే...వెయ్యికోట్ల లాభం వెనుక...ఈ భారీ మైథలాజికల్ ప్రాజెక్ట్ను నమిత్ మల్హోత్రా ఆధ్వర్యంలోని ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్ నిర్మిస్తోంది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బిఎస్ఇ)లో లిస్టింగ్ లో ఉన్న కంపెనీ ప్రైమ్ ఫోకస్. ఈ ప్రతిష్టాత్మక సినిమా ‘రామాయణ’ తొలి గ్లింప్స్ ఈ నెల3న విడుదలైంది. ఆ విడుదలతోనే దేశవ్యాప్తంగా ఈ సినిమా చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమాకు సంబంధించిన అంచనాలు, ప్రచారం పెరుగుతూ పోతుండడంతో ప్రైమ్ ఫోకస్ కంపెనీకి స్టాక్ మార్కెట్లో భారీ లాభాలు రావడం మొదలైంది. ఈ కంపెనీ షేర్లు జూన్ 25న రూ113.47 వద్ద ఉండగా, జూలై 1 నాటికి రూ.149.69కి పెరిగాయి. అయితే, జూలై 3న ‘రామాయణం’ ఫస్ట్ లుక్ విడుదలైన రోజున ఈ షేర్ విలువ ఏకంగా రూ.176కి చేరింది. దీంతో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ జూలై 1న రూ.4638 కోట్ల నుంచి రూ5641 కోట్లకు పెరిగింది. అంటే, కేవలం రెండు రోజుల్లోనే సంస్థకు రూ.1000 కోట్ల వరకూ సంపద పెరిగింది. మార్కెట్ ముగిసే సమయానికి షేర్ ధర ₹169గా ఉండగా, మొత్తం క్యాప్ దాదాపు 5200 కోట్ల వద్ద స్థిరపడింది.భారీ పారితోషికం...హీరోకి కూడా షేర్లు...ఇక ఈ సినిమా హీరో రణబీర్ కపూర్(Ranbir Kapoor) కూడా నిర్మాణ సంస్థలో పెట్టుబడి ఉన్న విషయం వెలుగులోకి వచ్చింది. కంపెనీ బోర్డు మంజూరు చేసిన 462.7 మిలియన్ షేర్ల ప్రిఫరెన్షియల్ ఇష్యులో రణబీర్ కూడా షేర్లను పొందారని బిజినెస్ స్టాండర్డ్ వెల్లడించింది. రణబీర్ మొత్తం 12.5 లక్షల షేర్లను కలిగి ఉన్నట్టు సమాచారం. మరోవైపు ఈ సినిమాలో నటిస్తున్నందుకు గాను రణబీర్కు రూ.150కోట్ల వరకూ పారితోషికం చెల్లిస్తున్నట్టు సమాచారం. నితేశ్ తివారీ దర్శకత్వం వహిస్తున్న రామాయణం సినిమా రెండు భాగాలుగా రూపొందుతుంది. మొదటి భాగం 2026 దీపావళికి, రెండవ భాగం 2027లో విడుదల కానుంది.సీతగా సాయిపల్లవి...ఈ చిత్రంలో శ్రీరాముడిగా రణబీర్ కపూర్ శ్రీరాముడిగా రావణుడిగా, యష్(yash)లు నటిస్తుండగా సీత పాత్రలో దక్షిణాది స్టార్ హీరోయిన్ సాయిపల్లవి(Sai Pallavi) నటిస్తుండడం విశేషం. ఇక లక్ష్మణుడిగారవీ దూబే హనుమంతుడిగా సన్నీ డియోల్ నటిస్తున్నారు. ఈ సినిమాకి సంగీతాన్ని ఏఆర్ రెహ్మాన్, హాలీవుడ్ దిగ్గజ సంగీత దర్శకుడు హాన్స్ జిమ్మర్ కలిసి సంయుక్తంగా రూపొందించనున్నారు. హాన్స్ జిమ్మర్కు ఇది బాలీవుడ్ లో ఆరంగేట్రం కావడం విశేషం.రామాయణం’ ప్రాజెక్ట్తో భారతీయ సినిమాని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం సాకారమవుతోందని సినీవర్గాలు భావిస్తున్నాయి. -
ఒక్క రోజులో జీవితం మారిపోతే..!
దక్షిణాదిలో స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న సాయి పల్లవి నార్త్లోనూ సత్తా చాటాలనుకుంటున్నారు. ఈ ప్రయత్నంలో భాగంగా సాయిపల్లవి హిందీ చిత్రాలు ‘ఏక్ దిన్’, ‘రామాయణ’లకు సైన్ చేశారు. తాజాగా ‘ఏక్ దిన్’ సినిమా విడుదల తేదీ ఖరారైందని, ఈ చిత్రం ఈ నవంబరు 7న విడుదల కానుందని తెలిసింది. సాయి పల్లవి కెరీర్లోని ఈ తొలి హిందీ చిత్రంలో బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ హీరోగా నటించారు. సునీల్ పాండే దర్శకత్వంలో ఆమిర్ ఖాన్, మన్సూర్ ఖాన్ ఈ చిత్రాన్ని నిర్మించారు.‘జానే తూ... యా జానే నా’ (2008) సినిమా తర్వాత ఆమిర్ ఖాన్, మన్సూర్ కలిసి 17 సంవత్సరాల తర్వాత నిర్మించిన చిత్రం ‘ఏక్ దిన్’ కావడం విశేషం. ఒకరితో ఒకరికి పరిచయం లేని ఓ అబ్బాయి, ఓ అమ్మాయి ఓ విచిత్రమైన పరిస్థితుల్లో కలుసుకుంటారు. ఆ ఒక్క రోజు తర్వాత వారి జీవితాలు ఏ విధంగా మారిపోయాయి? అన్నదే ‘ఏక్ దిన్’ సినిమా కథాంశమని సమాచారం. మరోవైపు నితీష్ తివారి ‘రామాయణ’ సినిమాలో సీతగా నటిస్తున్నారు సాయి పల్లవి. రాముడి పాత్రలో రణ్బీర్ కపూర్, రావణుడిగా యశ్ నటిస్తున్నారు. ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది. తొలి భాగం 2026 దీపావళికి, రెండో భాగం 2027 దీపావళికి రిలీజ్ కానున్నాయి. -
ఆసక్తికర వెబ్ సిరీస్ వాయిదా.. కొత్త స్ట్రీమింగ్ ఇదే!
గతంలో ఓటీటీ ప్రియులను ఆకట్టుకున్న వెబ్ సిరీస్ స్పెషల్ ఓపీఎస్. 2020 మార్చిలో తొలి సీజన్ రిలీజ్ కాగా.. ఆడియన్స్ను విపరీతంగా ఆకట్టుకుంది. ఆ తర్వాత 1.5 పేరుతో ఓ నాలుగు ఎపిసోడ్స్ కూడా రిలీజ్ చేశారు. దాదాపు ఐదేళ్ల గ్యాప్ తర్వాత మరోసారి ఓటీటీ ఆడియన్స్ను అలరించేందుకు వస్తున్నారు. ఇటీవలే స్పెషల్ ఓపీఎస్ సీజన్-2 ట్రైలర్ విడుదల చేసిన మేకర్స్.. స్ట్రీమింగ్ డేట్ను కూడా ప్రకటించారు. జూలై 11 నుంచే స్ట్రీమింగ్ కానుందని తెలిపారు.అయితే తాజాగా మేకర్స్ స్పెషల్ ఓపీఎస్-2 వెబ్ సిరీస్ను వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా కొత్త స్ట్రీమింగ్ తేదీని కూడా రివీల్ చేశారు. ఈ నెల 18 నుంచి వెబ్ సిరీస్ అందుబాటులోకి వస్తుందని మేకర్స్ వీడియో ద్వారా తెలిపారు. కొన్నిసార్లు అన్ని మనచేతుల్లో ఉండవని అందుకే వాయిదా వేయాల్సి వచ్చిందని నటుడు కేకే మేనన్ పేర్కొన్నారు. మరికొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదని ఆడియన్స్ను కోరారు. ఈ సారి అన్ని ఎపిసోడ్స్ ఓకేసారి స్ట్రీమింగ్ చేస్తామని తెలిపారు.కాగా.. ఈ వెబ్ సిరీస్లో కేకే మేనన్, కరణ్ థాకర్, వినయ్ పాఠక్, విపుల్ గుప్త కీలక పాత్రలు పోషించారు. స్పై యాక్షన్ జోనర్లో వచ్చిన ఈ సిరీస్ రెండో భాగానికి నీరజ్ పాండే దర్శకత్వం వహిస్తూనే నిర్మాతగానూ వ్యవహరించారు. హిమ్మత్ సింగ్, అతని టీమ్ ఈసారి.. 'ఏఐ', 'సైబర్ క్రైమ్' నుంచి భారత్కు ఎదురయ్యే సవాళ్లతో పోరాటం చేయనుంది. ఈ ఆసక్తికర వెబ్ సిరీస్ జూలై 18 నుంచి జియోహాట్స్టార్లో సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. రెండో సీజన్లో సయామీఖేర్, ప్రకాశ్ రాజ్ లాంటి వాళ్లు కూడా ఉన్నారు.We understand you're on the edge of your seat, but thoda aur intezar and it’s going to be worth all the wait! #HotstarSpecials #SpecialOps2, all episodes streaming from July 18, only on #JioHotstar#SpecialOps2OnJioHotstar pic.twitter.com/ky15pZPgnh— JioHotstar (@JioHotstar) July 8, 2025 -
'ఇప్పటికే మూడో పెళ్లి చేసుకున్నా.. కానీ'.. అమిర్ ఖాన్ కామెంట్స్
బాలీవుడ్ స్టార్ హీరో అమిర్ ఖాన్ ఇటీవలే సితారే జమీన్ పర్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. గతనెలలో థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. లాల్ సింగ్ చద్ధా తర్వాత అమిర్ చేసిన మూవీ కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. 2018లో వచ్చిన మూవీకి సీక్వెల్గా ఈ సినిమాను తెరకెక్కించారు. ప్రస్తుతం ఈ మూవీ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు బాలీవుడ్ హీరో.అయితే ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకుని విడాకులు తీసుకున్న అమిర్ ఖాన్ మరోసారి రిలేషన్లో ఉన్నారు. తన చిన్ననాటి స్నేహితురాలు గౌరీ స్ప్రాట్తో డేటింగ్ ప్రారంభించారు. తన పుట్టిన రోజు సందర్భంగా ఈ విషయాన్ని పంచుకున్నారు. ప్రస్తుతం గౌరీతో రిలేషన్లో ఉన్న అమిర్ ఖాన్.. మూడో పెళ్లిపై స్పందించారు. గౌరీని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నట్లు అమిర్ ఖాన్ తెలిపారు. మేమిద్దరం చాలా నిజాయితీ, నిబద్ధతతో ఉన్నామని అన్నారు. మీకు తెలుసా? మేము ప్రస్తుతం భాగస్వాములని.. ఇప్పటికే తన హృదయంతో ఆమెను పెళ్లాడానని అమిర్ ఖాన్ ఫ్యాన్స్కు సర్ప్రైజ్ ఇచ్చారు. మేము కలిసి ఉన్నామని.. అయితే అధికారికంగా పెళ్లి చేసుకోవాలా? వద్దా? అనే దానిపై రాబోయే రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని అమిర్ ఖాన్ తెలిపారు.కాగా.. ఈ సంవత్సరం మార్చిలో తన 60వ పుట్టినరోజు సందర్భంగా తన స్నేహితురాలు గౌరీ స్ప్రాట్తో తన రిలేషన్ను అఫీషియల్గా ప్రకటించారు. అమిర్ వయస్సు 60 ఏళ్లు కాగా.. గౌరీకి(46) అతనికి దాదాపు 14 సంవత్సరాల వయస్సు తేడా ఉంది. ఆమె ప్రస్తుతం బెంగళూరులో ఉన్నారు. ఇప్పటికే అమిర్ ఖాన్ 1986లో మొదట రీనా దత్తాను పెళ్లాడారు. ఆ తర్వాత 2002లో విడిపోయారు. మరో మూడేళ్లకు డైరెక్టర్ కిరణ్ రావును వివాహమాడారు. వీరిద్దరు 2021లో విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం మూడో పెళ్లికి సిద్ధమయ్యారు మన బాలీవుడ్ స్టార్ హీరో. -
స్మృతి ఇరానీకి జాక్పాట్.. రీ ఎంట్రీలో కళ్లుచెదిరే రెమ్యునరేషన్!
బుల్లితెర నటిగా కెరీర్ ప్రారంభించి కేంద్రమంత్రి స్థాయికి ఎదిగిన స్మృతి ఇరానీ మరోసారి అలరించేందుకు సిద్ధమైంది. 'క్యుంకీ సాస్ భీ కభీ బహు థి' అనే సీరియల్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న ఆమె రీ ఎంట్రీ ఇవ్వనుంది. గతంలో ఈ సీరియల్ ద్వారానే ఫేమ్ తెచ్చుకున్న స్మృతి ఇరానీ 'క్యుంకీ సాస్ భీ కభీ బహు థి-2' సీక్వెల్ ద్వారా మరోసారి తులసి విరానీగా బుల్లితెర అభిమానులను అలరించనుంది. ఈ నెలలోనే ప్రసారం కానున్న ఈ సీిరియల్కు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్గా మారింది.'క్యుంకీ సాస్ భీ కభీ బహు థి-2' సీక్వెల్ ద్వారా రీ ఎంట్రీ ఇస్తోన్న స్మృతి ఇరానీ భారీగానే రెమ్యుననేషన్ తీసుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది. 2000లో ఈ షో ప్రారంభించినప్పుడు ఒక్కో ఎపిసోడ్కు కేవలం రూ.1800 రూపాయలు తీసుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఆ పాత్రకు ఎపిసోడ్కు ఏకంగా రూ.14 లక్షల పారితోషికం అందుకుంటున్నట్లు వార్తలొస్తున్నాయి. అయితే ఈ వార్తలపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు. అయినప్పటికీ బాలీవుడ్లో మాత్రం స్మృతి ఇరానీ రెమ్యునరేషన్పై టాక్ నడుస్తోంది. తాను ఒక పెద్ద స్టార్ అవుతానని జ్యోతిష్యంలో చెప్పారని గత ఇంటర్వ్యూల్లో ఆమె వెల్లడించారు. మొదట తాను మెక్డొనాల్డ్స్లో ఉద్యోగం చేసే సమయంలో నెలకు కేవలం రూ.1800 జీతం మాత్రమే అందుకున్నట్లు తెలిపారు.కాగా.. 'క్యుంకీ సాస్ భీ కభీ బహు థి-2' సీరియల్ జూలై 29 నుంచి స్టార్ ప్లస్లో ప్రీమియర్ కానుంది. ఇటీవల స్మృతి ఇరానీ.. తులసి విరానీ పాత్రలో నటించిన ప్రోమోను షేర్ చేశారు. View this post on Instagram A post shared by StarPlus (@starplus) -
' నా భార్యకు ఐవీఎఫ్ చికిత్స.. ఆశలు వదిలేసుకున్నాం.. కానీ'.. విష్ణు విశాల్
బాలీవుడ్ స్టార్ హీరో అమిర్ ఖాన్ ఇటీవలే హైదరాబాద్లో సందడి చేశారు. ప్రముఖ కోలీవుడ్ హీరో విష్ణు విశాల్ కుమార్తె నామకరణ వేడుకకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా విష్ణు విశాల్- గుత్తా జ్వాల బిడ్డకు అమిర్ ఖాన్ ముద్దుపేరు పెట్టారు. మైరా అంటూ అంటూ వారి పాపకు నామకరణం చేశారు. ఈ విషయాన్ని విష్ణు విశాల్ దంపతులు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలయ్యాయి.అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన విష్ణు విశాల్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తన భార్య గుత్తా జ్వాలాకు ఐవీఎఫ్(ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్) ద్వారా చాలా సార్లు ప్రయత్నించామని తెలిపారు. చాలాసార్లు విఫలం కావడంతో ఇక ఆశలు వదిలేసుకునే స్థాయికి చేరుకున్నామని వెల్లడించారు. కానీ అమిర్ ఖాన్ ముంబయిలోని అతనికి తెలిసిన వైద్యుడి వద్దకు మమ్మల్ని తీసుకెళ్లారని వివరించారు. అలా అమిర్ ఖాన్ తమకు మరిచిపోలేని సాయం చేశారని అన్నారు.విష్ణు విశాల్ మాట్లాడుతూ.. ' జ్వాలా, నేను కొన్ని నెలల పాటు ఐవీఎఫ్ ప్రక్రియ ద్వారా బిడ్డ కోసం ప్రయత్నించాం. కానీ మా ప్రయత్నాలు ఫలించలేదు. ఇక లాభం లేదనుకుని దాదాపు ఆశలు వదిలేసుకున్నాం. అయితే చెన్నైలో వరదల సమయంలో నేను అనుకోకుండా అమీర్ సర్ను కలిశాను. మా గురించి తెలుసుకుని వెంటనే సాయం చేసేందుకు ముంందుకొచ్చాడు. అతను మమ్మల్ని ముంబయికి తీసుకొచ్చి వైద్యం కోసం అన్ని రకాల ఏర్పాటు చేశాడు. జ్వాలా గుత్తా తన చికిత్స కోసం ముంబయిలోనే ఉండాల్సి వచ్చింది. గుత్తా జ్వాలా తన తల్లి, సోదరీమణులతో పాటు అమీర్ ఖాన్ ఇంట్లోనే దాదాపు 10 నెలలు ఉండిపోయింది. తన ఇంట్లోనే అతిథ్యం ఇచ్చి పది నెలల పాటు మమ్మల్న ఎంతో జాగ్రత్తగా చూసుకున్నారు. అమీర్ సర్ తల్లి, సోదరీమణులు జ్వాలను ఎంతో బాగా చూసుకున్నారని' తెలిపారు.ఇటీవల తన కూతురికి పేరు పెట్టమని అమీర్ సర్ను అడిగిన క్షణాన్ని విష్ణు విశాల్ గుర్తు చేసుకున్నారు. మాకు బిడ్డ పుట్టబోతున్నప్పుడు నేను అమీర్ సార్కు ఫోన్ చేసి కృతజ్ఞతలు తెలిపాను. ఆ తర్వాత మా పాపకు పేరు పెట్టమని అడిగాను.. వెంటనే మాకోసం హైదరాబాద్కు విమానంలో వచ్చి మా అమ్మాయికి మైరా అని పేరు పెట్టారు. అమీర్ సర్కు కృతజ్ఞతలు చెప్పడానికి ఏమిచ్చినా సరిపోదు.. జ్వాలా, మైరా, నేను ఎల్లప్పుడూ ఆయనకు కృతజ్ఞులమై ఉంటామని విష్ణు విశాల్ భావోద్వేగానికి గురయ్యారు.కాగా.. 2023 చెన్నైలో వరదల సమయంలో అమీర్ ఖాన్ తన తల్లితో చెన్నైలో చిక్కుకున్నారు. తన తల్లికి చికిత్స కోసం కొన్ని నెలలు చెన్నైలోనే ఉన్నారు. ఆ సమయంలో విష్ణు విశాల్, అమీర్ ఖాన్ ఓల్డ్ మహాబలిపురం రోడ్ (OMR) లోని ఒకే ప్రాంతంలో నివసించారు. అప్పుడు వీరందరినీ పడవల ద్వారా రక్షించిన సంగతి తెలిసిందే. -
తెలంగాణ సీఎంను కలిసి స్టార్ హీరో అజయ్ దేవగణ్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ప్రముఖ బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ కలిశారు. రాష్ట్రంలో అంతర్జాతీయ ఫిల్మ్ సిటీ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రికి అజయ్ దేవగణ్ హామీ ఇచ్చారు. ఏఐ సాంకేతికత జోడింపుతో వీఎఫ్ఎక్స్, స్మార్ట్ స్టూడియోలు ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలు సీఎంకు అందజేశారు.మాజీ క్రికెటర్ కపిల్ దేవ్తో భేటీముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఢిల్లీలోని ఆయన నివాసంలో ఇండియా క్రికెట్ మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ కలిశారు. ఈ సందర్భంగా హైదరాబాద్లో స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటుపై చర్చించారు. దీనికి సంబంధించిన అంశాలపై ముఖ్యమంత్రికి కపిల్దేవ్ వివరించారు. -
సూపర్ హిట్ వెబ్ సిరీస్ ఐదో సీజన్.. మేకర్స్ అఫీషియల్ ప్రకటన
ఓటీటీ ప్రియులను విపరీతంగా ఆకట్టుకున్న వెబ్ సిరీస్ల్లో పంచాయత్ ముందు వరుసలో ఉంటుంది. విలేజ్ బ్యాక్ డ్రాప్లో వచ్చిన ఈ సిరీస్కు ఓటీటీలో అద్భుతమైన రెస్పాన్స్ దక్కించుకుంది. ఇటీవలే నాలుగో సీజన్ విడుదలై అభిమానులను అలరించింది. దీంతో మేకర్స్ మరో సీజన్కు రెడీ అయిపోయారు. త్వరలోనే మీ ముందుకు వస్తామంటూ పోస్టర్ను విడుదల చేశారు. వచ్చే ఏడాదిలో పంచాయత్ ఐదో సీజన్ రానుందని ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ అమెజాన్ ప్రైమ్ కొత్త పోస్టర్ను రిలీజ్ చేసింది. 2026లో మీ ముందుకొస్తామని మేకర్స్ వెల్లడించారు.జితేంద్ర కుమార్, నీనా గుప్తా, రఘువీర్ యాదవ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్కు దీపిక్ కుమార్ మిశ్రా, అక్షత్ సంయుక్తంగా దర్శకత్వం వహించారు. 2020లో తొలి సీజన్ రిలీజ్ కాగా.. 2022, 2024లో రెండు, మూడు సీజన్లు వచ్చాయి. ఇటీవలే నాలుగో సీజన్ కూడా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది. ఇది కేవలం హిందీలో మాత్రమే అందుబాటులో ఉంది.Hi 5 👋 Phulera wapas aane ki taiyyaari shuru kar lijiye 😌#PanchayatOnPrime, New Season, Coming Soon@TheViralFever @StephenPoppins #ChandanKumar @Akshatspyro @uncle_sherry @vijaykoshy @Farjigulzar #RaghubirYadav @Neenagupta001 @malikfeb @chandanroy77 @Sanvikka #DurgeshKumar… pic.twitter.com/59R6Xvj3R1— prime video IN (@PrimeVideoIN) July 7, 2025 -
చాలా మిస్ అవుతున్నా, కన్నీళ్లు ఆగడంలేదు: రష్మిక
రష్మిక మందన్నా.. సక్సెస్ఫుల్ హీరోయిన్గా రాణిస్తోంది. వందకోట్లు, వెయ్యికోట్ల కలెక్షన్ సినిమాలతో బాక్సాఫీస్ క్వీన్గా ఇండస్ట్రీనే షేక్ చేస్తోంది. అయితే ఇంతటి భారీ విజయాలను చూస్తున్న రష్మిక (Rashmika Mandanna).. సెలవు దినాల్లో మాత్రం కంటికి ధారగా ఏడ్చేస్తోందట! ఎందుకో రష్మిక మాటల్లోనే చదివేద్దాం.. నాకు ఓ చెల్లి ఉంది. నాకంటే 16 ఏళ్లు చిన్నది. తనకిప్పుడు 13 ఏళ్లుంటాయి. నా కెరీర్ ప్రారంభమైనప్పటినుంచి.. దాదాపు ఎనిమిదేళ్లుగా తనతో గడిపే సమయమే దొరకడం లేదు. తన ఎదుగుదలను దగ్గరుండి చూడలేకపోతున్నాను.మిస్ అవుతున్నా..ఇప్పుడు తను నా హైట్కు వచ్చేసింది. ఈ ప్రయాణంలో నేను ఆగకుండా పరిగెడుతూనే ఉన్నానని అర్థమైంది. ఒక్క క్షణం వెనక్కి తిరిగి చూసుకుంటే నేను ఏం మిస్ అవుతున్నానో అర్థమవుతోంది. ఇంటికి వెళ్లి ఏడాదిన్నర అవుతోంది. నా స్నేహితులను కలిసి చాలాకాలమే అయిపోయింది. వాళ్లు ఏదైనా ప్లాన్ చేసినప్పుడు నన్నూ పిలిచేవారు. కానీ ఇప్పుడు నాకెలాగో అంత టైం ఉండదని వాళ్లే డిసైడ్ అయి దూరం పెట్టేస్తున్నారు. ఇవన్నీ నన్ను చాలా బాధిస్తున్నాయి. ఎవరూ లేనప్పుడు మనసు తేలిక చేసుకోవడానికి ఏడ్చేస్తున్నాను.బ్యాలెన్స్ చేసేందుకు ట్రై చేస్తున్నామా అమ్మ ఎప్పుడూ చెప్తుండేది.. వృత్తిలో రాణించాలంటే వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేయాలి.. అదే వ్యక్తిగత జీవితం కావాలంటే వృత్తిని త్యాగం చేసుకోక తప్పదు అని! నేను రెండింటినీ బ్యాలెన్స్ చేయాలని ప్రయత్నిస్తున్నాను. అందుకోసం ప్రతిరోజు యుద్ధం చేస్తూనే ఉన్నాను అని భావోద్వేగానికి లోనైంది. రష్మిక చివరగా కుబేర సినిమాలో నటించింది. ప్రస్తుతం థామా, ద గర్ల్ఫ్రెండ్, మైసా చిత్రాలు చేస్తోంది.చదవండి: ఇంటింటికీ తిరిగి ఛాన్సులివ్వమని అడుక్కున్న హీరో! ఆయన రేంజ్ ఏంటి? -
11 ఏళ్ల వయసులో స్కూల్ నుంచి పారిపోయా.. ఎందుకంటే?: కాజోల్
చాలామందికి చిన్నతనంలో అమ్మ కంటే అమ్మమ్మ అంటేనే ఎక్కువ ఇష్టం. ఆమె చేసే గారాబం, చూపించే ప్రేమకు అసలు తనను వదిలి వెళ్లబుద్ధి కాదు. బాలీవుడ్ హీరోయిన్ కాజోల్ (Kajol)కు కూడా అమ్మమ్మ అంటే బోలెడంత ఇష్టం. తనకోసం చిన్నతనంలో చేసిన ఓ సాహసాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకుంది.11 ఏళ్ల వయసులో సాహసంనేను బోర్డింగ్ స్కూల్లో చదివాను. ఓసారి మా అమ్మమ్మకు ఆరోగ్యం బాగోలేదని తెలిసింది. అప్పుడు నా వయసు 11 ఏళ్లు. అమ్మకు ఫోన్ చేస్తే.. నాకు ఎగ్జామ్స్ ఉన్నందున ఇంటికి రావొద్దని చెప్పింది. డిసెంబర్లో సెలవులు ఇస్తారు కదా.. అప్పుడు ఇంటికి రావొచ్చులే అంది. నాకేమో అమ్మమ్మ గురించి తెలిశాక అక్కడ ఉండబుద్ధి కాలేదు. అప్పటికే నా స్నేహితురాలు కూడా ఎందుకో బాధగా ఉంది. దీంతో మేమిద్దరం స్కూల్ నుంచి పారిపోవాలని నిర్ణయించుకున్నాం. ఎలాగైనా ముంబై వెళ్లిపోవాలనుకున్నాం. అమ్మ ఫోన్ చేసిందని అబద్ధంనేను చదువుకుంటున్న టౌన్ పంచంగిలో మా చుట్టాలున్నారు. అలా మా మామయ్యను కలుసుకుని.. 'అమ్మ నాకు ఇంటికి రమ్మని ఫోన్ చేసింది. నన్ను బస్టాండ్కు తీసుకెళ్లు' అని చెప్పాను. ఆయన నిజమని నమ్మి నన్ను బస్టాప్కు తీసుకెళ్లాడు. అంతా అనుకున్నట్లుగానే జరుగుతోంది.. ఇక ఇంటికి వెళ్లిపోవచ్చు అనుకునే సమయంలో ప్లాన్ రివర్స్ అయింది. బస్ కోసం ఎదురుచూస్తుండగా స్కూల్లో పనిచేసే నన్స్.. నన్ను, నా ఫ్రెండ్ను వెతుక్కుంటూ వచ్చారు. నా చెవులు మెలేస్తూ తిరిగి స్కూల్కు తీసుకెళ్లారు అని నవ్వుతూ చెప్పుకొచ్చింది.దూరాన్ని లెక్క చేయకుండా..కాజోల్ పంచంగి పట్టణంలో హాస్టల్ వసతి ఉన్న స్కూల్లో చదువుకుంది. అక్కడి నుంచి ముంబై వెళ్లాలంటే కనీసం ఐదు గంటల సమయమైనా పడుతుంది. కానీ అమ్మమ్మపై ఉన్న ప్రేమ.. ఆ దూరాన్ని లెక్క చేయనివ్వలేదు. ఎలాగైనా ఇంటికి వెళ్లాలనుకున్న ఆమె స్కూల్ మేనేజ్మెంట్కు దొరికిపోవడంతో ప్లాన్ బెడిసికొట్టింది. కాజోల్ ప్రధాన పాత్రలో నటించిన మా చిత్రం ప్రస్తుతం థియేటర్లలో రన్ అవుతోంది.చదవండి: జర్నలిస్టు నుంచి నిర్మాతగా.. 25 మంది తెలుగమ్మాయిలను పరిచయం చేస్తా -
హీరో కుమార్తెకు పేరు పెట్టిన అమిర్ ఖాన్..!
కోలీవుడ్ నటుడు విష్ణు విశాల్.. బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాలను పెళ్లాడిన సంగతి తెలిసిందే. వీరిద్దరికి ఈ ఏడాది ఏప్రిల్లో పాప జన్మించింది. 2021లో ఈ జంట పెళ్లి చేసుకోగా.. నాలుగేళ్ల తర్వాత వీరి బిడ్డ పుట్టింది. అయితే తాజాగా వీళ్ల ఇంటికి బాలీవుడ్ హీరో అమిర్ ఖాన్ విచ్చేశారు. అంతేకాకుండా ఈ జంట జన్మించిన చిన్నారికి పేరు కూడా పెట్టారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు హీరో విష్ణు విశాల్.ఈ సందర్భంగా తమ కుమార్తెకు పేరు పెట్టినందుకు అమిర్ ఖాన్కు ధన్యవాదాలు తెలిపారు. మా మైరాని పరిచయం చేస్తున్నాను... మా బిడ్డకు పేరు పెట్టడానికి హైదరాబాద్ వచ్చినందుకు అమిర్ ఖాన్ సార్కు కృతజ్ఞతలు అంటూ రాసుకొచ్చారు. ఇది చూసిన అభిమానులు బ్యూటీఫుల్ నేమ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.కాగా.. కోలీవుడ్ హీరో విష్ణు విశాల్ ఎఫ్ఐఆర్, లాల్ సలామ్ లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. మరోవైపు అమిర్ ఖాన్ సితారే జమీన్ పర్తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. అయితే గతంలో.. తన తల్లికి చికిత్స చేయించే క్రమంలో ఆమిర్.. విష్ణు విశాల్ ఇంట్లో కొన్ని రోజులు ఉన్నట్టు కోలీవుడ్లో వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Vishnu Vishal (@thevishnuvishal) -
ఏడుస్తూ వెళ్లిపోయిన హరిహర వీరమల్లు నటి.. వీడియో వైరల్!
బాలీవుడ్ భామ నోరా ఫతేహీ పేరు వినగానే స్పెషల్ సాంగ్స్ గుర్తుకొస్తాయి. బాలీవుడ్ పలు చిత్రాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం టాలీవుడ్ చిత్రం హరిహర వీరమల్లు చిత్రంలోనూ కనిపించనుంది. ఇటీవలే విడుదలైన హౌస్ఫుల్-5 మూవీతోనూ ప్రేక్షకులను అలరించింది. చివరిసారిగా నెట్ఫ్లిక్స్ వెబ్ సిరీస్ ది రాయల్స్లో నటించిన ముద్దుగుమ్మ ముంబయిలో ఎయిర్పోర్ట్లో కనిపించింది. అయితే ఆమె ఏడుస్తూ విమానాశ్రయంలో వెళ్తున్న వీడియో వైరల్గా మారింది.అదే సమయంలో ఓ వ్యక్తి ఆమెతో సెల్ఫీ తీసుకునేందుకు యత్నించాడు. ఏడుస్తూ వెళ్తున్న నటితో ఫోటో తీసుకోవడానికి ప్రయత్నించడంతో ఆమె బాడీగార్డ్ వెంటనే రియాక్ట్ అయ్యాడు. సెల్ఫీ కోసం యత్నించిన యువకుడిని గట్టిగా పట్టుకుని పక్కకు తోసేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే అంతకుముందే నోరా ఫతేహీ తన సోషల్ మీడియా ఖాతాలో అరబిక్లో పోస్ట్ చేసింది. అయితే నోరా ఎందుకు అలా వెళ్లారో వివరాలు ఇంకా తెలియరాలేదు.ఈ ఏడాది బీ హ్యాపీ, హౌస్ఫుల్-5 చిత్రాలతో మెప్పించిన నోరా.. చివరిసారిగా ది రాయల్స్ వెబ్ సిరీస్లో కనిపించింది. బాలీవుడ్లో ఎక్కువగా ఐటమ్ సాంగ్స్తోనే ఎక్కువగా గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాకుండా స్ట్రీట్ డాన్సర్ 3డీ, భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా, క్రాక్, మడ్గావ్ ఎక్స్ప్రెస్ లాంటి చిత్రాలలో కూడా నటించింది. View this post on Instagram A post shared by Instant Bollywood (@instantbollywood) -
ఆర్జే మహ్వశ్తో డేటింగ్.. చాహల్ బయటికి చెప్పేశాడుగా!
టీమిండియా ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ తర్వాత ప్రముఖ ఆర్జే మహ్వశ్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఎందుకంటే ఆ మ్యాచ్లో క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్తో కలిసి స్టేడియంలో కనిపించింది. ఆ తర్వాత వీరిద్దరిపై డేటింగ్ రూమర్స్ ఓ రేంజ్లో వైరలయ్యాయి. అంతేకాకుండా ఆర్జే మహ్వశ్ ఐపీఎల్లోనూ పంజాబ్ కింగ్స్ మద్దతుగా నిలిచింది. పంజాబ్ ఆడిన అన్ని మ్యాచ్లకు హాజరై సందడి చేసింది. దీంతో చాహల్తో డేటింగ్లో ఉన్నది నిజమేనంటూ పలు కథనాలొచ్చాయి. అయితే తనపై వస్తున్న రూమర్స్పై ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వలేదు ముద్దుగుమ్మ.అయితే తాజాగా చాహల్ ది గ్రేట్ ఇండియన్ కపిల్ షోకు హాజరయ్యారు. ఈ ఎపిసోడ్లో అతని ప్రేమ, డేటింగ్ గురించి ప్రస్తావన వచ్చింది. తన రిలేషన్ షిప్ గురించి "కౌన్ హై వో లడ్కీ? అంటూ చాహల్ను ప్రశ్నించారు. దీనికి చాహల్ స్పందిస్తూ 'నాలుగు నెలల కిందటే.. ఇండియా మొత్తం తెలుసు' అంటూ మాట్లాడారు. ఇది చూసిన నెటిజన్స్ పరోక్షంగా ఆర్జే మహ్వశ్ అని క్లారిటీ ఇచ్చాడని కామెంట్స్ చేస్తున్నారు. ఆమె పేరు ప్రస్తావించకపోయినా నెట్టింట మాత్రం తెగ వైరల్గా మారింది. మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ సైతం చాహల్ను ఆట పట్టించారు.కాగా.. టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ తన మొదటి భార్య ధనశ్రీ వర్మతో విడాకులు తీసుకున్నారు. ఈ సంవత్సరం మార్చిలో విడాకులు తీసుకున్నారు. అంతకుముందే ఆర్జే మహ్వశ్తో కలిసి చాహల్ మొదటిసారి ఛాంపియన్ ట్రోఫీ మ్యాచ్ల కనిపించారు. అప్పటి నుంచే ఈ జంటపై డేటింగ్ రూమర్స్ మొదలయ్యాయి. తాజాగా కపిల్ షోలో చాహల్ కామెంట్స్ చూస్తుంటే మహ్వస్తో డేటింగ్ కన్ఫామ్ చేసినట్లేనని నెటిజన్స్ భావిస్తున్నారు. -
నా ప్రెగ్నెన్సీ పుకార్లకు కారణం ఆయనే : హీరోయిన్
సెలెబ్రెటీల ప్రేమ, పెళ్లి విషయంలో నిత్యం ఏదో ఒక రూమర్ వస్తూనే ఉంటుంది. పెళ్లయ్యే వరకు డేటింగ్, ప్రేమ పుకార్లు చక్కర్లు కొడితే.. పెళ్లి తర్వాత కొన్నాళ్లకే ప్రెగ్నెన్సీ రూమర్స్ వినిస్తాయి. తండ్రి కాబోతున్న హీరో, తల్లి కాబోతున్న హీరోయిన్ అంటూ వార్తలు వస్తాయి. తాజాగా అలాంటి ప్రెగ్నెన్సీ పుకారే బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా(Sonakshi Sinha ) విషయంలో వచ్చింది. అయితే ఆ పుకార్లకు కారణం తన భర్తే అంటుంది ఈ బ్యూటీ. దానికి సంబంధించిన ఆధారాలను బయటపెడుతూ.. ప్రెగ్నెన్సీ రూమర్స్కి చెక్ పెట్టింది.సోనాక్షి ఇటీవల కాస్త బరువు పెరిగింది. దీంతో ఆమె గర్బం దాల్చిందని, అందుకే బొద్దుగా మారిందనే వార్తలు నెట్టింట చక్కర్లు కొట్టాయి. చాలా మంది నిజమే అని నమ్మారు. తాజాగా దీనిపై సోనాక్షి స్పందించారు. తాను ప్రెగ్నెంట్ కాదని చెబుతూనే.. బరువు పెరగడానికి భర్తే కారణం అని చెప్పుకొచ్చింది సోనాక్షి.భర్త జహీర్ ఇక్బాల్ రోజు తనకు ఏదో ఒకటి తినిపిస్తూనే ఉంటాడట. అలా బయటఫుడ్ తినడం వల్లే బరువు పెరగానని.. దీంతో అందరూ గర్భం దాల్చిందని అనుకున్నారని సోనాక్షి చెప్పుకొచ్చింది. అర్థరాత్రి 12 గంటల తర్వాత కూడా ‘ఆకలేస్తుందా? ఏమైనా తీసుకురావాలా?’ అని అడుగుతాడంటూ.. భర్తతో చేసిన వాట్సాప్ చాట్ని ఇన్స్టా స్టోరీలో షేర్ చేసింది. కాగా, కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న సోనాక్షి, జహీర్ గతేడాది జూన్లో వివాహం చేసుకున్నారు. పెళ్లయిన ఐదు నెలల నుంచే ప్రెగ్నెన్సి రూమర్స్ మొదలయ్యాయి. గతంలో కూడా ఇలాంటి రూమర్సే వస్తే.. సోనాక్షి సింపుల్గా కొట్టిపారేసింది. ఈ సారి కూడా ఫన్వేలో తన ప్రెగ్నెన్సీ రూమర్స్కి చెక్ పెట్టింది. -
డిప్రెషన్లోకి వెళ్లిన మృణాల్.. చనిపోవాలనుకుందట!
టీవీలో ‘కుంకుమ‘ పెట్టుకొని ప్రారంభించి, నేడు సిల్వర్ స్క్రీన్ పై ‘సూపర్’గా మెరుస్తోంది. బ్యూటీకి బ్రెయిన్ మిక్స్ అయితే ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే ఆమెను చూస్తే చాలు, ఎమోషన్ , ఎలిగెన్స్, ఎక్స్ప్రెషన్– అన్నింటికీ చిరునామా! మారిన మృణాల్ చెప్పిన ముచ్చట్లు!మృణాల్ ఠాకూర్ ‘సీతారామం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ సరసన నటించబోతుందనే వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రాలేదు.నటి కావాలనేది మృణాల్ చిన్నప్పటి కోరిక. కానీ సినిమా రంగంపై అపోహల వల్ల ఆమె తల్లిదండ్రులు మొదట అందుకు అంగీకరించలేదు. ఒకరోజు ఆమె తండ్రికి ‘త్రీ ఇడియట్స్’ సినిమాను చూపించి, నటి అయితే ఇలాంటి మంచి సినిమాల్లో నటించే అవకాశం ఉంటుందని నచ్చజెప్పింది.అందుకే ప్రతి సినిమా చేసేముందు, తన తల్లిదండ్రులు గర్వపడేలా పాత్ర ఉందా లేదా అని చూసుకుని గ్రీన్ సిగ్నల్ ఇస్తానని మృణాల్ చెబుతుంది.మృణాల్ టీవీ సీరియల్స్తో కెరీర్ ప్రారంభించింది. ‘కుంకుమ రేఖ’ సీరియల్ ఆమెకు మంచి గుర్తింపు తెచ్చింది. కాని, ఆడిషన్లకు వెళ్లేటప్పుడు టీవీ నటి అనే ట్యాగ్తో చాలామంది చులకనగా చూసేవారు. కొన్నిసార్లు డిప్రెషన్ను తట్టుకోలేక, లోకల్ ట్రైన్ నుంచి దూకేయాలనిపించినా, తల్లిదండ్రులు గుర్తొచ్చి ఆగిపోయేదట!హృతిక్ రోషన్, షాహిద్ కపూర్ అంటే మృణాల్కు విపరీతమైన అభిమానం. హృతిక్తో ‘సూపర్ 30’, షాహిద్తో ‘జెర్సీ’ సినిమాల్లో నటించే అవకాశం వచ్చినప్పుడు ఆనందంతో పొంగిపోయింది.తెలుగు ఇండస్ట్రీలో ఆమెకు మొదటి పరిచయం దర్శకుడు నాగ్ అశ్విన్ ద్వారా. అప్పుడే తెలుగు పరిశ్రమపై ఒక స్పష్టమైన అభిప్రాయం ఏర్పడిందట! హను రాఘవపూడి ‘సీతారామం’ కథ చెప్పగానే, ఆ కథలో హీరోయిన్ పాత్రతో ప్రేమలో పడిపోయిందట. ఆ తర్వాత ‘హాయ్ నాన్న’, ‘ఫ్యామిలీ స్టార్’ సినిమాల్లో నటించింది. ఆమె పెర్ఫార్మెన్స్కి మంచి పేరు వచ్చింది.తన టీవీ కాలంలో పని చేసిన కొంతమంది నటులు, రచయితలు, మ్యూజిక్ డైరెక్టర్లు, హీరోలతో మృణాల్ పేరు కలిపి డేటింగ్ రూమర్లు వచ్చాయి. వాటిపై ఆమె స్పందిస్తూ, ‘నేను ఎవరితో రిలేషన్లో ఉన్నాను, ఎవరితో బ్రేకప్– ఇవన్నీ పబ్లిక్కి చెప్పాల్సిన అవసరం లేదు. పెళ్లి చేసుకున్నప్పుడు ఎలాగైనా చెబుతాను’ అని చెప్పింది.హీరోయిన్గా సినిమాల్లో బిజీగా ఉన్నా, వెబ్ సిరీస్లకు కూడా ఆసక్తి చూపుతోంది. ఇందుకు ప్రధాన కారణాలుగా తక్కువ పని రోజులు, విభిన్నమైన పాత్రలు, ఎక్కువ రీచ్ వస్తుందని చెప్పింది.మాతృభాష మరాఠీ అయినా, తెలుగు భాష కూడా దగ్గరగా ఉందని, కొద్దిగా బ్రోకెన్ తెలుగులో మాట్లాడగలనని మృణాల్ చెప్పింది.తన కాలేజ్ ఫ్రెండ్స్ క్షేమ, అనుశ్రీ జైన్ ఆమెకు బెస్ట్ ఫ్రెండ్స్. షూటింగ్లతో బిజీగా ఉన్నా వాళ్లతో తరచు ట్లాడుతుంటుందట!టీవీ సీరియల్స్లో పనిచేస్తున్న రోజుల్లో తరచు అపార్ట్మెంట్లు మార్చాల్సి వచ్చేది. ఒక్కో సీరియల్ నెలల తరబడి, ఏళ్ల తరబడి సాగేది. షూటింగ్ లొకేషన్కి దగ్గరగా, తక్కువ రెంటులో ఉండే ఫ్లాట్లను ఎంచుకునేది. ఆ సమయంలో వంట పని యాక్టింగ్ కంటే కష్టంగా అనిపించేదట!తెలుగు షూటింగ్లకి వచ్చినప్పుడు ఇడ్లీ, వడ ఆమె ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్. టిఫిన్ కంటే చట్నీలు తినడానికి ఇష్టపడుతుంది మృణాల్.మృణాల్కు చెందిన డేట్స్, రెమ్యునరేషన్ వంటి విషయాలు ఆమె సోదరి లోచన్ చూసుకుంటుంది. షూటింగ్లలో బిజీగా ఉన్నప్పుడు గంటన్నర, రెండు గంటలకంటే ఎక్కువ నిద్రపోయే అవకాశం ఉండదట. ఎక్కువగా ఫ్లైట్ జర్నీల్లోనే నిద్రపోతుంటుందట మృణాల్. -
పటౌడీ కుటుంబానికి షాక్
జబల్పూర్: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్తోపాటు ఆయన కుటుంబానికి గట్టి ఎదురుదెబ్బ తగలింది. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లోని రూ.15,000 కోట్ల విలువైన ఆస్తులకు వారసులు ఎవరన్నదానిపై మళ్లీ విచారణ చేపట్టాలని మధ్యప్రదేశ్ హైకోర్టు ఆదేశించింది. ఏడాదిలోగా విచారణ పూర్తిచేయాలని నిర్దేశించింది. ఆ ఆస్తులు పటౌడీ కుటుంబానికి (సైఫ్ అలీఖాన్, ఆయన తల్లి షర్మిలా ఠాగూర్, సోదరీమణులు సోహా అలీఖాన్, సబా అలీఖాన్) చెందుతాయంటూ 20 ఏళ్ల క్రితం ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పు, డిక్రీని హైకోర్టు పక్కనపెట్టింది. ఈ మేరకు జస్టిస్ సంజయ్ ద్వివేదితో కూడిన సింగిల్ బెంచ్ జూన్ 30న ఉత్తర్వు జారీ చేసింది. రూ.15,000 కోట్ల ఆస్తులకు వారసులు ఎవరో గుర్తించడానికి మళ్లీ విచారణ జరపాల్సిందేనని ట్రయల్ కోర్టుకు స్పష్టంచేసింది. అసలు ఏమిటీ వివాదం? భోపాల్ సంస్థానానికి చివరి పాలకుడు నవాబ్ హమీదుల్లా. ఆయనకు భార్య మైమూనా సుల్తాన్, ముగ్గురు కుమార్తెలు అబీదా, సాజీదా, రబియా ఉన్నారు. సాజీదా పటౌడీ సంస్థాన వారసుడు ఇఫ్తికార్ అలీఖాన్ను పెళ్లి చేసుకున్నారు. వారి కుమారుడే మన్సూర్ అలీఖాన్ పటౌడీ. ఆయన క్రికెటర్గా పేరుప్రఖ్యాతలు సంపాదించారు. బాలీవుడ్ నటి షర్మీలా ఠాగూర్ను ప్రేమవివాహం చేసుకున్నారు. వీరికి సైఫ్ అలీఖాన్, సోహా అలీఖాన్, సబా అలీఖాన్ జని్మంచారు. నవాబ్ హమీదుల్లా పెద్ద కుమార్తె అబీదా దేశ విభజన సమయంలో పాకిస్తాన్కు వెళ్లిపోయారు. అక్కడే స్థిరపడ్డారు. దాంతో సాజీదా భోపాల్లోని ఆస్తులకు వారసురాలయ్యారు. అనంతరం మన్సూర్ అలీఖాన్కు.. సైఫ్ అలీఖాన్, ఆయన సోదరీమణులకు ఆ ఆస్తులు వారసత్వంగా వచ్చాయి. దివంగత నవాబ్ హమీదుల్లా కుటుంబ సభ్యులైన బేగం సురయ్యా రషీద్, నవాబ్ మెహర్ తేజ్ సాజీదా తదితరులు 1999లో కోర్టుకెక్కారు. ఆస్తుల్లో తమకు వాటా ఇచ్చేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. వారి విజ్ఞప్తిని భోపాల్ జిల్లా కోర్టు తిరస్కరించింది. ఆస్తులకు పటౌడీ కుటుంబమే యజమాని అంటూ 2000 ఫిబ్రవరి 14న తీర్పు వెలువరించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ బేగం సురయ్యా రషీద్, నవాబ్ మెహర్ తేజ్ సాజీదా తదితరులు మధ్యప్రదేశ్ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. నవాబ్ హమీదుల్లా వారసురాలిగా సాజీదాను గుర్తిస్తూ భారత ప్రభుత్వం 1962 జనవరి 10 సరి్టఫికెట్ జారీ చేసిందని, ఆ ఆస్తులన్నీ తమకే చెందుతాయని పటౌడీ కుటుంబ సభ్యులు స్పష్టంచేశారు. ఈ వాదనను పిటిషనర్లు తిరస్కరించారు. ఈ నేపథ్యంలో పిటిషన్లు ప్రాథమికంగా 1999లో దాఖలయ్యాయి కాబట్టి మళ్లీ విచారణ జరపాలని హైకోర్టు ధర్మాసనం తేల్చిచెప్పింది. -
సితారకు వార్ 2
హీరో ఎన్టీఆర్ బాలీవుడ్లో ఎంట్రీ ఇస్తున్న చిత్రం ‘వార్ 2’. హృతిక్ రోషన్, కియారా అద్వానీ జంటగా నటించారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో యశ్ రాజ్ ఫిల్మ్స్పై ఆదిత్య చోప్రా నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 14న హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. ఈ సినిమా తెలుగు విడుదల హక్కులను సితార ఎంటర్టైన్మెంట్స్ (Sithara Entertainments) సంస్థ సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని ఆ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ‘‘భారీ యాక్షన్ థ్రిల్లర్గా రూపొందిన చిత్రం ‘వార్ 2’. ఇండియన్ సినీ హిస్టరీలో ఇద్దరు బిగ్ స్టార్స్ అయిన హృతిక్ రోషన్, ఎన్టీఆర్ మధ్య ఉండేపోటీ ప్రేక్షకులకు ఓ విజువల్ ఫీస్ట్లా ఉంటుంది.ఈ సినిమా కోసం ప్రేక్షకులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. యశ్ రాజ్ ఫిల్మ్స్ సక్సెస్ఫుల్ ఫ్రాంచైజీ స్పై యూనివర్స్లో భాగంగా మరో అధ్యాయంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘పఠాన్, టైగర్ 3, వార్’ వంటి గ్లోబల్ హిట్ మూవీస్ తర్వాత వస్తోన్న ‘వార్ 2’ పై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాని తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేయనుండటం హ్యాపీగా ఉంది. ఆగస్ట్ 14న థియేటర్స్లో ఈ ఉత్సవం మొదలు కానుంది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఐమ్యాక్స్ ఫార్మాట్లోనూ రిలీజ్ కానుంది’’ అని సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ పేర్కొంది. -
9 రోజులు మంచినీళ్లు తాగే బతుకుతా.. అన్నం ముట్టను: హీరోయిన్
చాలామంది వారానికోసారి లేదా ఏదైనా పండగ ఉన్నప్పుడు ఉపవాసం చేస్తుంటారు. అలా బాలీవుడ్ బ్యూటీ నర్గీస్ ఫక్రి (Nargis Fakhri)కి కూడా ఉపవాసం చేసే అలవాటుందట! కాకపోతే ఎప్పుడో ఒకసారి కాదు.. ఏకధాటిగా 9 రోజులు ఏమీ తినకుండా ఉంటుందట! ఇలా ఏడాదికి రెండుసార్లు దీన్ని కఠిన దీక్షలా పాటిస్తానని చెప్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో నర్గీస్ ఫక్రి మాట్లాడుతూ.. నేను ఏడాదికి రెండుసార్లు ఉపవాసం ఉంటాను. ఆ సమయంలో ఏమీ తినను. 9 రోజులు తిండి లేకుండా..తొమ్మిదిరోజులపాటు కేవలం నీళ్లు తాగే బతుకుతాను. ఇది చాలా కష్టంగా ఉంటుంది. 9 రోజులయిపోయేసరికి ముఖం వికృతంగా మారుతుంది. కళ్లు, బుగ్గలు లోపలకు వెళ్లిపోయి, దవడ బయటకు వచ్చినట్లు కనిపిస్తుంది. ముఖంలో మాత్రం కాస్త గ్లో ఉంటుంది. అయితే ఇది పాటించమని నేనెవరికీ సలహా ఇవ్వను. చాలామంది ఏదైనా త్వరగా జరిగిపోవాలనుకుంటారు. కానీ దేనికైనా సమయం పడుతుంది. ఉదాహరణకు మంచి నిద్ర కూడా మీకు ఎంతో మేలు చేస్తుంది. నేనైతే రోజూ ఎనిమిది గంటలు నిద్రపోతాను. సినిమాఎప్పటికప్పుడు నీళ్లు తాగుతూ ఉంటాను. విటమిన్స్, మినరల్స్ వంటి మంచి పోషక విలువలు ఉన్న ఆహారాన్ని మాత్రమే తీసుకుంటాను అని చెప్పుకొచ్చింది. నర్గీస్ ఫక్రి.. రాక్స్టార్ (2011) మూవీతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. మే తేరా హీరో, హౌస్ఫుల్ 3, టొర్బాజ్, అజర్, మద్రాస్ కేఫ్, అమవాస్ వంటి పలు చిత్రాల్లో నటించింది. ఇటీవల హౌస్ఫుల్ 5 సినిమాతో అలరించింది.చదవండి: పాపం.. ఏదో నోరు జారింది.. రష్మికను వదిలేయండి: నటి -
మందు తాగను,గుడ్డు కూడా తినను మరి ఆ పని ఎలా చేస్తా? : హీరో భార్య
మద్యపానం, లేదా ఇంకేదైనా చెడు అలవాట్లపై వాటి ప్రచారాలపై ఇదేందయ్యా మీరు ప్రముఖులు కదా ఇలా చేయవచ్చా? అని ప్రస్తుతం సెలబ్రిటీలు ఎవరిని ప్రశ్నించినా, వ్యక్తిగతం వేరే, వృత్తిగతం వేరే వ్యాపకాలు వేరే వ్యాపారం వేరే అంటూ దేనికి దాన్ని విడదీసి చూడాలంటూ చిలకపలుకులు వల్లిస్తున్నారు. మద్యం తదితర హానికారక పదార్ధాల ప్రకటనల్లో నటించడం దగ్గర నుంచి పబ్స్, క్లబ్స్ వంటి వ్యాపారాల్లో సెలబ్రిటీలు లేదా వారి సంబంధీకుల పేర్లతో ప్రత్యక్షంగానో పరోక్షంగానో పాలుపంచుకుంటున్నారు.ఇలాంటి పరిస్థితుల్లో బాలీవుడ్లో ఓ టాప్ హీరో భార్య తనకు ఇష్టం లేని పనులు చేయబోనని అంతేకాక మరొకరి చేత చేయించబోనని ఖండితంగా చెప్పడం బాలీవుడ్లో చర్చనీయాంశమైంది. ‘‘కొన్ని వ్యాపారాలు నా నమ్మకాలకు విరుద్ధం’’ అంటున్న ఆమె ప్రముఖ బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ భార్య మిరా రాజ్పుత్(Mira Rajput ) ఫోర్బ్స్ ఇండియా నిర్వహించిన ఓ ప్యానల్ చర్చలో మాట్లాడుతూ, ‘‘నేను సంపూర్ణ శాకాహారిని, కనీసం గుడ్లు కూడా తినను. అలాగే ఇంతవరకూ చేయలేదు భవిష్యత్తులో కూడా మద్యపానం చేయను. అలాంటప్పుడు మాంసాహారం మద్యం అందించే వ్యాపారంలో పెట్టుబడి ఎలా పెడతాను? అది నా నమ్మకాలకు పూర్తి విరుద్ధం కదా’’ అని చెప్పింది.ఇటీవల ఓ ప్రముఖ బ్రాండ్ నుంచి రెస్టారెంట్ వ్యాపారంలో పెట్టుబడి పెట్టమని వచ్చిన అవకాశాన్ని ఆమె తిరస్కరించారు. దీనికి కారణాలను గురించి ఆమె మాట్లాడుతూ ఆ కారణాలు తన జీవనశైలితో మాత్రమే కాదని వ్యక్తిగత నైతిక విలువలతో ముడిపడి ఉన్నవని అంటోంది.‘‘నిజమే వ్యాపారంలో లాభం ముఖ్యం అయినా, అది వ్యక్తిగత విలువలకు భంగం కలిగించకూడదు. నాపై నమ్మకం ఉంచినవారికి, నా కుటుంబానికి సమాజంతో సత్సంబంధాలు ఉండాలంటే, నేను నమ్మే విషయాలలో నాకు స్పష్టత ఉండాలి’’ అంటూ ఎంతో స్వఛ్చంగా స్పష్టంగా ఆమె చెప్పిన మాటలు సినీ వర్గాలను ఆకట్టుకున్నాయి.ఒక పబ్లిక్ ఫిగర్గా తన నిర్ణయాలు సమాజంపై ప్రభావం చూపుతాయన్న అంటూ అంగీకరించిన మీరా. ‘‘బయట ఎంతో మంది ఎన్నో మంచి మాటలు ఎప్పుడూ చెబుతుంటారు, కానీ మన స్వంతమైన చైతన్యం మనకు మార్గం చూపాలి. మనం ఎటువంటి నిర్ణయం తీసుకున్నా, అది మన అంతరాత్మ అంగీకరించేలా దానికి నచ్చేలా ఉండాలి’’ అని స్పష్టం చేశారు. మిరా రాజ్పుత్ ప్రస్తుతం హోలిస్టిక్ హెల్త్, నేచురల్ లివింగ్, స్కిన్ కేర్ రంగాల్లో వ్యాపారాల్ని పర్యవేక్షిస్తున్నారు. అంతేకాదు ఆమె సోషల్ మీడియా ద్వారా కూడా ఆరోగ్యకరమైన జీవనశైలి ప్రోత్సహిస్తున్నారు.ప్రస్తుతం సినీరంగానికి అవతల.. రెస్టారెంట్ లతో సహా అనేకానేక వ్యాపారాల్లో సెలబ్రిటీలు పెట్టుబడులు పెడుతున్నారు. ఈ నేపధ్యంలో ఇప్పటిదాకా ఏ పెద్ద సెలబ్రిటీ కి సాధ్యం కాని విధంగా మీరా రాజ్పుత్ వ్యక్తం చేసిన నైతిక విలువలు... అభినందనీయం మాత్రమే కాదు...రూ.వందల కోట్లు ఉన్నా ఇంకా డబ్బు పిచ్చితో సమాజాన్ని భ్రష్టు పట్టించే వ్యాపారాలకు వెన్ను దన్నుగా నిలుస్తున్న సెలబ్రిటీలకు. ఇకనైనా అనుసరణీయం కూడా. -
సైఫ్ అలీ ఖాన్కు చుక్కెదురు.. చేజారిన రూ.15 వేల కోట్లు
భోపాల్లోని పూర్వీకుల ఆస్తులకు సంబంధించి సైఫ్ అలీ ఖాన్ దాఖలు చేసిన పిటిషన్ను మధ్యప్రదేశ్ హైకోర్టు కొట్టివేసింది. తన ముత్తాత పాకిస్తాన్కు వలస వెళ్లిన కారణంగా రూ.15,000 కోట్ల విలువైన ఆస్తులను "శత్రువుల ఆస్తి"గా న్యాయస్థానం గుర్తించింది. సైఫ్ అలీ ఖాన్, ఆయన సోదరీమణులు సోహా, సబా, తల్లి షర్మిలా ఠాగూర్ తమ పూర్వీకుల ఆస్తులకు వారసులుగా గుర్తించాలని ట్రయల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను మధ్యప్రదేశ్ హైకోర్టు కొట్టివేసింది. దీంతో వారు రూ. 15 వేల కోట్ల ఆస్తులపై హక్కులను కోల్పోయారు.సైఫ్ అలీ ఖాన్ ఆస్తి వారసత్వ వివాదాన్ని కొత్తగా విచారించాలని, ఒక సంవత్సరం కాలపరిమితిని నిర్ణయించాలని ట్రయల్ కోర్టును ఆదేశించింది. 1947లో విభజన తర్వాత పాకిస్తాన్కు వలస వెళ్లిన వ్యక్తులకు సంబంధించిన ఆస్తులను కేంద్ర ప్రభుత్వం క్లెయిమ్ చేసుకోవడానికి 1968 నాటి శత్రు ఆస్తి చట్టం అనుమతిస్తుందని హైకోర్టు గుర్తుచేసింది.రూ. 15 వేల కోట్ల ఆస్తి స్టోరీ ఎంటి..?బ్రిటిషర్లకాలంలో ఉత్తరప్రదేశ్, మధ్య ప్రదేశ్ ప్రాంతాల్లో పటౌడీ సంస్థానాన్ని పాలించిన హమీదుల్లాహ్ రాజకుటుంబానికి చెందిన రూ.15,000 కోట్ల విలువైన ఆస్తులు ఎవరి పరం కానున్నాయనే ప్రశ్న తలెత్తింది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పూర్వీకులకు చెందిన ఈ ఆస్తులు ఇప్పుడు ఎవరికి చెందుతాయనే అంశం మరోసారి తెరమీదకొచ్చింది. సైఫ్ వాళ్ల నానమ్మ.. పటౌడీ సంస్థానానికి అసలైన వారసురాలని సీనియర్ న్యాయవాది జగదీశ్ ఛవానీ వాదిస్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వ వాదన దీనికి భిన్నంగా ఉంది.స్వాతంత్య్రం వచ్చేనాటికి భోపాల్ కేంద్రంగా పాలిస్తున్న పటౌడీ సంస్థానానికి ముహమ్మద్ హమీదుల్లాహ్ చివరి నవాబ్గా ఉన్నారు. ఆయన తదనంతరం ఆయన పెద్దకుమార్తె అబీదా సుల్తాన్ బేగమ్కు ఈ ఆస్తులు దక్కుతాయి. అయితే స్వాతంత్య్రం వచ్చాక విభజన సమయంలో ఆమె పాకిస్తాన్కు వలసవెళ్లారు. ఈ లెక్కన ఇప్పుడు వారసులు భారత్లో లేరు. అందుకే శత్రు ఆస్తుల చట్టం కింద ఆ ఆస్తులన్నీ ఇప్పుడు కేంద్ర హోం శాఖ పరిధిలోని భారత శత్రు ఆస్తుల సంరక్షణ సంస్థ(సీఈపీఐ) పర్యవేక్షణలోకి వస్తాయి’’ అని మోదీ సర్కార్ చెబుతోంది.ప్రభుత్వ వాదనను సైఫ్కు సంబంధించిన లాయర్ ఛవానీ కొట్టిపారేశారు. ‘‘ పెద్దకుమార్తె అబీదా పాకిస్తాన్కు వెళ్లిన తర్వాత 1960లో హమీదుల్లాహ్ మరణించారు. దాంతో ఆస్తి వారసత్వంగా తనకే వస్తుందని రెండో కుమార్తె సాజిదా సుల్తాన్ బేగమ్ భారత ప్రభుత్వాన్ని కోరారు. అందుకు సమ్మతిస్తూ 1962 జనవరి 10న కేంద్రం ఒక ఉత్తర్వు జారీచేసింది. ఈ లెక్కన సాజిదా అసలైన వారసురాలు. ఆమె నుంచి వారసత్వంగా సాజిదా కుమారుడు మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ(టైగర్ పటౌడీ) ఆయన తదనంతరం సైఫ్ అలీ ఖాన్ ఆ ఆస్తులకు హక్కుదారు అవు తారు’’ అని ఛవానీ వాదించారు.తమ ఆస్తులను శత్రు ఆస్తులుగా లెక్కకట్టొద్దని, మోదీ ప్రభుత్వం తెచ్చిన శత్రు ఆస్తుల(సవరణ, ధృవీకరణ) చట్టాన్ని సవాల్ చేస్తూ టైగర్ పటౌడీ భార్య, అలనాటి బాలీవుడ్ నటి షర్మిలా ఠాకూర్ 2015లో మధ్యప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై గత ఏడాది డిసెంబర్ 13న జస్టిస్ వివేక్ ఆగ్రావాల్ విచారణ చేపట్టారు. సైఫ్ తల్లి షర్మిలా వేసిన పిటిషన్ను ప్రభుత్వ న్యాయవాది తప్పుబట్టారు. ఇప్పుడు శత్రు ఆస్తుల చట్టం,1968 లేదు. దాని స్థానంలో 2017లో కొత్త చట్టమొచ్చిందని న్యాయస్థానం తెలిపింది. ఏమైనా ఫిర్యాదులుంటే సంబంధిత అప్పీలేట్ అథారిటీ ముందు గోడు వెళ్లబోసుకోండి’’ అని సూచించారు. అయితే, తాజాగా పూర్తి విచారణ తర్వాత ఆ రూ. 15 వేల కోట్ల ఆస్తలు 'శత్రువుల ఆస్తి'గానే గుర్తించాలని కోర్టు పేర్కొంది. కానీ, ఒక సంవత్సరంలోపు మళ్లీ పూర్తి విచారణ జరపాలని న్యాయస్థానం సూచించింది. -
దివాలా తీశామన్నారు.. రకుల్ భర్త జాకీ భగ్నానీ రియాక్షన్
బాలీవుడ్ నటుడు, నిర్మాత జాకీ భగ్నానీ(Jackky Bhagnani ) దివాలా తీశారని కొద్దిరోజుల క్రితం వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. రకుల్ ప్రీత్ సింగ్(Rakul Preet Singh)ను పెళ్లాడిన తర్వాత ఆయన నిర్మించిన మొదటి సినిమా 'బడే మియాన్ చోటే మియాన్' వల్ల భారీగా నష్టపోవడంతో తన ఆఫీస్, ఇల్లు అన్నీ అమ్మేశారని పలు కథనాలు వైరల్ అయ్యాయి. అయితే, తాజాగా ఈ అంశం గురించి జాకీ భగ్నానీ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు.'బడే మియాన్ చోటే మియాన్' విడుదలైన తర్వాత తనతో పాటు కుటుంబం ఎదుర్కొన్న కష్ట సమయాల గురించి ఆయన రకుల్ భర్త జాకీ ఇలా మాట్లాడారు. ' నేను నా జుహు కార్యాలయాన్ని తనఖా పెట్టిన మాట వాస్తవమే.. కానీ, ఇప్పుడు మళ్లీ తిరిగి సొంతం చేసుకున్నాను. గతంలో వార్తల్లో నిలిచిన భవనం ఇదే. నేను దివాళా తీయడం వల్ల దానిని అమ్మాల్సి వచ్చిందని, ఆహారం కొనడానికి కూడా నా దగ్గర డబ్బు లేదని వారు చెప్పారు. నేను పారిపోయానని వారు చెప్పారు. ఈ పుకార్లకు నేను ఎవరినీ నిందించాలనుకోవడం లేదు, కానీ అవి ఎలా ప్రారంభమయ్యాయో నాకు తెలియదు. అయితే, వాటి వల్ల నా కుటుంబం బాగా ఇబ్బంది పడింది. తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించాను.' అని ఆయన అన్నారు. ఇదే సమయంలో 'బడే మియాన్ చోటే మియాన్' సినిమా కోసం దర్శకుడిగా అలీ అబ్బాస్ జాఫర్ను ఎంపిక చేసి తప్పుచేశానని ఆయన అన్నారు.జాకీ భగ్నానీ సొంత బ్యానర్ పూజా ఎంటర్టైన్మెంట్స్ ద్వారా బడే మియాన్ చోటే మియాన్ను తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని దాదాపు రూ.350 కోట్ల భారీ బడ్జెట్తో రూపొందించారు. అయితే, బాక్సాఫీస్ వద్ద కేవలం రూ.59 కోట్లు మాత్రమే రాబట్టింది. దీంతో భారీ నష్టాలను ఆయన ఎదుర్కొన్నాడు. అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ వంటి స్టార్స్ ఈ చిత్రంలో నటించారు. అయితే, కనీసం ఓపెనింగ్స్ కూడా పెద్దగా లేకపోవడంతో కనీసం రెండురోజులు కూడా సినిమా రన్ కాలేదు. 1986 నుంచి పూజా ఎంటర్టైన్మెంట్స్ నుంచి పలు సినిమాలను జాకీ భగ్నానీ కుటుంబం నిర్మించింది. బాలీవుడ్లో ఈ బ్యానర్ నుంచి మంచి విజయాలు సాధించిన చిత్రాలు ఉన్నాయి. -
ఇండియన్ సినిమా చేయడం హ్యాపీ
‘‘ఇండియాని చాలా మిస్ అయిపోతున్నాను. హిందీ సినిమాలను కూడా మిస్సవుతున్నాను. ఇప్పుడు ఓ ఇండియన్ ప్రాజెక్ట్ చేస్తున్నాను. ఆ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను’’ అంటూ ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రియాంకా చోప్రా చెప్పిన విషయాలు వైరల్గా మారాయి. ఈ బ్యూటీ నటించిన హాలీవుడ్ చిత్రం ‘హెడ్స్ ఆఫ్ స్టేట్’ ఇటీవల విడుదలైంది. ఈ చిత్రం ప్రమోషన్లో భాగంగా ఆమె ఇండియన్ సినిమాల గురించి కూడా మాట్లాడారు. ‘‘ఇండియాలో 2002లో నా తొలి సినిమా (తమిళ చిత్రం ‘తమిళన్’)తో కెరీర్ మొదలుపెట్టి, ఎన్నో రకాల సినిమాలు చేశాను.ఎందరో ప్రతిభావంతులతో సినిమాలు చేశాను. అందుకే ఈ సంవత్సరం ఇండియన్ సినిమా (మహేశ్బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాని ఉద్దేశించి) చేయడం చాలా ఆసక్తిగా ఉంది. భారతీయ ప్రేక్షకులు నా పై చూపించే ప్రేమ నాకెంతో విలువైనది. నాపై వారి ప్రేమ ఎప్పటికీ అలానే ఉండాలని కోరుకుంటున్నా’’ అని ప్రియాంకా చోప్రా పేర్కొన్నారు.హాలీవుడ్ సింగర్–యాక్టర్–మ్యూజిక్ డైరెక్టర్ నిక్ జోనస్ని 2018లో పెళ్లి చేసుకున్న ప్రియాంక ఆ తర్వాత భారతీయ చిత్రాలు ఎక్కువ చేయడంలేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు పూర్తి స్థాయిలో మహేశ్బాబు–రాజమౌళి కాంబినేషన్లోని సినిమాలో నటించడం పట్ల ఆమె చాలా ఆనందంగా ఉన్నారు. ఈ చిత్రం 2027 వేసవిలో విడుదలయ్యే అవకాశం ఉంది. -
రామాయణ పార్ట్-1 గ్లింప్స్.. రచయితపై నెటిజన్ల ట్రోల్స్!
రణ్బీర్ కపూర్, సాయిపల్లవి జంటగా మైథలాజికల్ చిత్రం 'రామాయణ'. ఈ సినిమాలో రాముడిగా రణ్బీర్కపూర్ , సీతగా సాయి పల్లవి నటిస్తున్నారు. కేజీఎఫ్ స్టార్ యశ్ రావణుడిగా కనిపించనున్నారు. నితిశ్ తివారీ దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా గ్లింప్స్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ ప్రాజెక్ట్ మొదలైనప్పటి నుంచి ఇదే తొలి వీడియో కావడం విశేషం. గతంలో రామాయణంపై చాలా సినిమాలొచ్చినా.. ఎప్పటికీ ప్రత్యేకంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో మరోసారి భారీ బడ్జెట్తో రామాయణాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.అయితే రామాయణం అంటే అందరికీ గుర్తుకొచ్చేది శ్రీరాముడు మాత్రమే కాదు.. వాల్మీకి పేరు తప్పకుండా ఉంటుంది. అయితే ఈ సినిమాకు కథ అందించిన రచయిత శ్రీధర్ రాఘవన్పై నెటిజన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. ఈ సినిమాకు కథను తానే రాసినట్లు చెప్పుకోవడంపై నెటిజన్స్ మండిపడుతున్నారు. రామాయణం రచించింది వాల్మీకి అయితే.. ఆ క్రెడిట్ కూడా మీరు ఎందుకు తీసుకుంటున్నారని ప్రశ్నిస్తున్నారు. దీనిపై సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ చేస్తున్నారు. పఠాన్, టైగర్-3 చిత్రాలకు కథ అందించిన శ్రీధర్ రాఘవన్ రామాయణం కూడా రాశాడంటూ వ్యంగ్యంగా కామెంట్స్ చేశారు. what about brother valmiki? pic.twitter.com/OtR1lfZQtf— Shreemi Verma (@shreemiverma19) July 3, 2025 Sridhar Raghavan calling himself the writer of Ramayana is not too different from an Indian calling themselves Caucasian or a homeopath calling themselves doctor. pic.twitter.com/L5qIUH0RXL— রাজ শেখর (@DiscourseDancer) July 4, 2025 The writer of #Ramayana is Shridhar Raghavan, who also wrote Pathaan and Tiger 3 pic.twitter.com/18FS6jmzLu— Prayag (@theprayagtiwari) July 3, 2025 -
యంగ్ హీరోను ఇండస్ట్రీ నుంచి తరిమేయాలని స్టార్ సెలబ్రిటీల ప్లానింగ్
సినిమా ఇండస్ట్రీలో నటీనటుల మధ్య పోటీ ఎప్పుడూ ఉండేదే! అయితే కొత్తగా వచ్చే హీరోహీరోయిన్స్ ఎదుగుతున్నారంటే కొందరు బడా స్టార్స్ అస్సలు తట్టుకోలేరు. హీరో కార్తీక్ ఆర్యన్ విషయంలో ఇదే జరిగిందంటున్నాడు సింగర్ అమాల్ మాలిక్ (Amaal Mallik). బాలీవుడ్లోని చీకటి కోణం గురించి సింగర్ అమాల్ మాలిక్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడాడు. మాయా ప్రపంచంసినిమా ఇండస్ట్రీలో పరిస్థితులు ఎలా ఉంటాయో జనాలకు అర్థమవుతోంది. ఇక్కడ చీకట్లోనే ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. సుశాంత్ సింగ్ రాజ్పుత్.. దాన్ని ఎదిరించలేకపోయాడు. అతడిది ఆత్మహత్య అని కొందరు, హత్య అని మరికొందరు అంటుంటారు. ఏదేమైనా అతడు మనమధ్య లేడనేది నిజం. ఈ పరిశ్రమ వారి మనసును, మెదడును దెబ్బతీస్తుంది. ఆత్మస్థైర్యాన్ని కోల్పోయేలా చేస్తుంది. సినిమా ఇండస్ట్రీ అనేదే ఒక మాయాప్రపంచం. తగిన శాస్తిఈ విషయం జనాలకు అర్థమయ్యాక బాలీవుడ్పై వారి అభిప్రాయమే మారిపోయింది. వీళ్లు చెడ్డవాళ్లు.. ఊరికే వదిలిపెట్టకూడదు అని జనాల్లో కోపం కట్టలు తెంచుకుంది. సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణంతో సెలబ్రిటీలను, వారి సినిమాలను ప్రజలు దూరం పెట్టారు. ఈ పతనాన్ని చూసేందుకు వారు నిజంగానే అర్హులు. ఒక మంచి మనిషి (సుశాంత్ సింగ్) మన మధ్య లేకుండా పోయాడు. సమస్యలను ఎదిరించి..కార్తీక్ ఆర్యన్ (Kartik Aaryan)ను కూడా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో తొక్కడానికి ప్రయత్నించారు. కానీ, అతడు చిరునవ్వుతోనే ఆ సమస్యలను జయించాడు. అతడికి పేరెంట్స్ సపోర్ట్ ఉంది. ఇండస్ట్రీకి కొత్తవాడయినా తన స్వయంకృషితో ఎదిగాడు. కార్తీక్ను ఇండస్ట్రీ నుంచి బయటకు పంపించేందుకు దాదాపు వంద మంది ప్రయత్నిస్తున్నారు. అందులో పెద్ద హీరోలు, నిర్మాతలు.. ఎందరో ఉన్నారు అని చెప్పుకొచ్చాడు.సినిమాప్యార్ కా పంచనామా సినిమాతో బాలీవుడ్లో హీరోగా కెరీర్ మొదలుపెట్టాడు కార్తీక్ ఆర్యన్. ప్యార్ కా పంచనామా 2, లుకా చుప్పి, లవ్ ఆజ్ కల్, ధమాకా, భూల్ భులయ్యా 2, భూల్ భులయ్యా 3, ఫ్రెడ్డీ, షెహజాదా (అల వైకుంఠపురములో రీమేక్), సత్య ప్రేమ్కీ కథ వంటి చిత్రాల్లో నటించాడు.చదవండి: బిగ్బాస్ షోలో రోబో ఎంట్రీ.. కంటెస్టెంట్లకు కష్టమే! -
నాపై ఎందుకు ఇంత ద్వేషం.. ఇదేం మొదటిసారి కాదు: ఉర్ఫీ జావెద్
విచిత్రమైన దుస్తుల వేషధారణతో ఫేమ్ తెచ్చుకున్న బాలీవుడ్ బ్యూటీ ఉర్ఫీ జావెద్. ఆ తర్వాత బిగ్బాస్లోనూ మెరిసింది. ఇటీవల కరణ్ జోహార్ హోస్ట్ చేసిన ది ట్రైటర్స్ అనే షోలోనూ కనిపించింది. అమెజాన్ ప్రైమ్లో ప్రసారమైన ఈ షోలో చాలామంది కంటెస్టెంట్స్గా పాల్గొన్నారు. అయితే చివరికీ రియాలిటీ టీవీ షో 'ది ట్రెయిటర్స్' విజేతగా ఉర్ఫీ జావెద్ నిలిచింది.అయితే ది ట్రైటర్స్ విజేతగా నిలిచిన ఉర్ఫీ జావెద్కు సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి. కొందరు నెటిజన్స్ చాలా అసభ్యకరంగా సందేశాలు పంపారు. ఈ విషయాన్ని ఉర్ఫీ తన ఇన్స్టా వేదికగా పోస్ట్ చేసింది. తనపై వస్తున్న కామెంట్స్ను స్క్రీన్ షాట్ రూపంలో షేర్ చేసింది. తనకు ఇలా జరగడం ఇదేమీ మొదటిసారి కాదని అంటోంది.ఉర్ఫీ జావెద్ తన ఇన్స్టాలో రాస్తూ.. 'ఒక అమ్మాయి చేసే పని మీకు నచ్చకపోతే ఆర్ అనే పదాన్ని కామెంట్స్లో వదిలేయండి. నన్ను ఇలా బెదిరించడం, అసభ్యకరంగా మాట్లాడడం ఇదేం మొదటిసారి కాదు. కానీ ఈసారి నా దుస్తుల వల్ల కాదు.. నేను ఒక షో గెలిచినందు వల్ల. మీ అభిమానించే ఆటగాడు గెలవకపోతే నన్ను బెదిరించడం లాంటివి ఊహించుకోండి. నేను అప్లోడ్ చేసిన వాటిలో ఇవి చాలా డీసెంట్ కామెంట్స్. నేను ఏం చేసినా, ప్రజలు ద్వేషించడం, అసభ్యకరంగా కామెంట్స్ చేయడాన్నే ఇష్టపడుతున్నారు. ఇలాంటి ద్వేషం చూపిస్తూ చేసే మీ కామెంంట్స్ నన్ను ఇంతకు ముందు ఎప్పుడూ ఆపలేదు.. ఇకపై ఎప్పటికీ ఆపలేవు కూడా' అంటూ తన పోస్ట్లో రాసుకొచ్చింది.కాగా.. అంతకుముందే తాను 'ది ట్రెయిటర్స్' గెలవడం వరకు జరిగిన ప్రయాణాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. నా ఈ ప్రయాణం సులభం కాదని.. ఎన్నోసార్లు ఏడ్చానని తెలిపింది. జీవితంలో చాలా బాధలు ఎదురయ్యాయి.. ఒకానొక సమయంలో అన్ని వదిలేసి పారిపోవాలనుకున్నానని పేర్కొంది. తనకు చాలా బెదిరింపులు, అత్యాచార బెదిరింపులు, నాపై ఎంతోమందికి ద్వేషం ఉన్నప్పటికీ ఎక్కడా వెనకడుగు వేయలేదని రాసుకొచ్చింది. 'బిగ్ బాస్లో ఓడిపోయినప్పుడు మంచి జీవితాన్ని గడపడానికి నా చివరి అవకాశాన్ని కోల్పోయానని అనిపించిందని తెలిపింది. బిగ్ బాస్కు వెళ్లేముందు బట్టలు కొనడానికి స్నేహితుల నుంచి రుణం కూడా తీసుకున్నా.. ఆ సమయంలో నేను తిరిగి చెల్లించగలనో కూడా నాకు తెలియదని ఉర్ఫీ చెప్పుకొచ్చింది. -
బిగ్బాస్ షోలో రోబో ఎంట్రీ.. కంటెస్టెంట్లకు కష్టమే!
బిగ్బాస్ షో (Bigg Boss Reality Show)కి ఉన్న క్రేజే వేరు. గొడవలు, కొట్లాటలు, ప్రేమలు, స్నేహాలు, ఆటలు, పాటలు, సరదా స్కిట్టులు.. ఇలా చాలానే ఉంటాయి. వినోదమంతా ఒక్కచోటే దొరికితే ప్రేక్షకులకు ఇంకేం కావాలి. అందుకే ప్రతి ఏడాది బిగ్బాస్ ఎప్పుడు మొదలవుతుందా? అని వేయి కళ్లతో ఎదురుచూస్తుంటారు. అటు బిగ్బాస్ టీమ్ కూడా.. జనాలను నిరాశపర్చకుండా ఉండేందుకు కంటెస్టెంట్ల ఎంపికలో పలు జాగ్రత్తలు తీసుకుంటుంది. బిగ్బాస్ హౌస్లో AI రోబోసింగర్, డ్యాన్సర్, మోడల్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, యాంకర్, యాక్టర్, కొరియోగ్రాఫర్.. ఇలా వేర్వేరు ప్రొఫెషన్స్కు చెందినవారిని పార్టిసిపెంట్లుగా సెలక్ట్ చేస్తారు. ఆ మధ్య హిందీ బిగ్బాస్లో గాడిదను, శునకాన్ని తీసుకొచ్చారు. ఈసారి ఏకంగా ఏఐ రోబోను బిగ్బాస్ హౌస్కు తీసుకొస్తున్నారంటూ ప్రచారం మొదలైంది. హిందీ బిగ్బాస్ 19వ సీజన్ కోసం ఈ రకంగా ప్లాన్ చేస్తున్నారట! ఈ విషయం తెలుసుకున్న జనాలు.. మరమనిషి హౌస్లోకి రావడమేంటని నోరెళ్లబెడుతున్నారు.రోబో విశేషాలుయూఏఈకి చెందిన ఈ రోబో పేరు హబుబు. దీనికి ఏడు భాషలు వచ్చు. అందులో హిందీ కూడా ఉంది. తను పాటలు పాడుకుంటూ ఇంట్లో పనులన్నీ చకచకా చేయగలదు. మనిషిలా భావోద్వేగాలు కూడా పలికించగలదు. ముఖానికి గోల్డెన్ కలర్ మాస్క్తో లెహంగాలో క్యూట్గా కనిపిస్తుంది. తను నిజంగా బిగ్బాస్ షోలో అడుగుపెడితే గేమ్ ఛేంజర్గా మారడం ఖాయం. తన స్పీడును కంటెస్టెంట్లు అందుకోవడం కష్టమే! మరి నిజంగా హబుబు రియాలిటీ షోలో భాగమవుతుందా? లేదా? అన్నది చూడాలి!చదవండి: పాచిపని కూడా ఇవ్వట్లేదు.. ఈ బతుకొద్దనుకున్నా.. పాకీజా కన్నీళ్లు -
ఆర్మీ ఆఫీసర్గా సలార్ హీరో.. అఫీషియల్ ట్రైలర్ వచ్చేసింది!
సలార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ ఏడాది ఎంపురాన్-2 మూవీతో సూపర్ హిట్ను తన ఖాతాలో వేసుకున్నారు. ఈ సినిమాకు తానే దర్శకత్వం వహించారు. ప్రస్తుతం మరో యాక్షన్ సినిమాతో అభిమానులను అలరించేందుకు వస్తున్నాడు. ప్రస్తుతం పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తోన్న యాక్షన్ చిత్రం సర్జమీన్. కాయోజ్ ఇరానీ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంలో కాజోల్ హీరోయిన్గా నటించింది.తాజాగా సర్జమీన్ మూవీ ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు. ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్ ఆర్మీ అధికారి పాత్రలో కనిపించనున్నారు. దేశభక్తి నేపథ్యంలో వస్తోన్న ఈ మూవీ సైఫ్ అలీ ఖాన్ తనయుడు ఇబ్రహీం అలీ ఖాన్ కీ రోల్ ప్లే చేస్తున్నాడు. అయితే ఈ సినిమాను నేరుగా ఓటీటీలోనే విడుదల చేయనున్నారు. ఈ నెల 25 నుంచి జియో హాట్స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ నిర్మిస్తున్తారు. ఈ సినిమాతోనే కాయోజ్ ఇరానీ డైరెక్టర్గా అరంగేట్రం చేస్తున్నారు. Yahaan har faisla ek kurbani hai, desh ki ya apno ki… kuch aisi Sarzameen ki kahaani hai🇮🇳#Sarzameen, releasing July 25, only on #JioHotstar#SarzameenOnJioHotstar@PrithviOfficial @itsKajolD #IbrahimAliKhan #KaranJohar @adarpoonawalla @apoorvamehta18 @AndhareAjit @kayoze… pic.twitter.com/qMDDJA19Vq— JioHotstar (@JioHotstar) July 4, 2025 -
డేటింగ్ యాప్లో పరిచయం.. ప్రియుడితో బోనీ కూతురి ఎంగేజ్మెంట్
ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ (Boney Kapoor) కూతురు అన్షులా కపూర్ (Anshula Kapoor) గుడ్న్యూస్ చెప్పింది. ప్రియుడితో ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు వెల్లడించింది. ఇన్స్టాగ్రామ్ వేదికగా ప్రియుడు రోహన్ తక్కర్ తన వేలికి ఉంగరం తొడుగుతున్న ఫోటోలను షేర్ చేసింది. 'డేటింగ్ యాప్ ద్వారా ఒకరికొకరం పరిచయమయ్యాం. తొలిసారిగా మంగళవారం అర్ధరాత్రి 1.15 గంటలకు ఫోన్ చేస్తే పొద్దున ఆరింటివరకు మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఈ ప్రయాణం దేనికో ఆరంభం పలకనుందని నాకప్పుడే అనిపించింది. అర్ధరాత్రి ఒంటిగంటకు..మూడేళ్ల క్రితం నాకిష్టమైన న్యూయార్క్ నగరంలోని సెంట్రల్ పార్క్లో ప్రపోజ్ చేశాడు. అది కూడా అర్ధరాత్రి 1.15 గంటలకు! అప్పుడు ఏదో మ్యాజిక్ జరిగినట్లు ఈ ప్రపంచమే కొన్ని క్షణాలపాటు ఆగిపోయినట్లనిపించింది. అతడి చెంత ఉంటే ఇంట్లో ఉన్నట్లే అనిపిస్తుంది. అతడు ప్రపోజల్కు ఓకే చెప్పాను. నా బెస్ట్ఫ్రెండ్తో ఎంగేజ్మెంట్ జరిగింది' అని అన్షులా రాసుకొచ్చింది.అమ్మను ఎక్కువ మిస్ అవుతున్నా..ఇది చూసిన ఆమె అన్న, నటుడు అర్జున్ కపూర్ భావోద్వేగానికి లోనయ్యాడు. మీరు జీవితాంతం సంతోషంగా ఉండాలి. లవ్ యూ గయ్స్.. ఈరోజు అమ్మను కాస్త ఎక్కువగా మిస్ అవుతున్నాను అని రాసుకొచ్చాడు. అటు జాన్వీ కపూర్, ఖుషి కపూర్ సైతం.. మా సిస్టర్ పెళ్లి చేసుకోబోతుందోచ్ అని కామెంట్ల రూపంలో తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.బోనీ కపూర్ రెండు పెళ్లిళ్లునిర్మాత బోనీ కపూర్ మొదటి భార్య పేరు మోనా శౌరీ కపూర్. ఈవిడ కూడా నిర్మాతే! వీరిద్దరూ 1983లో పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు అర్జున్ కపూర్, అన్షులా కపూర్ సంతానం. 1996లో బోనీ.. భార్య మోనాకు విడాకులిచ్చాడు. అదే ఏడాది హీరోయిన్ శ్రీదేవిని పెళ్లి చేసుకున్నాడు. వీరికి జాన్వీ కపూర్, ఖుషి కపూర్ సంతానం. కాగా మోనా శౌరీ.. 2012లో కన్నుమూయగా, శ్రీదేవి 2018లో మరణించింది. జాన్వీ, ఖుషి సవతి తల్లి కూతుర్లయినప్పటికీ అర్జున్, అన్షులా.. వారితో అన్యోన్యంగా ఉంటారు. ఒకే కుటుంబంలా కలిసిమెలిసి ఉంటారు. View this post on Instagram A post shared by Anshula Kapoor (@anshulakapoor) చదవండి: ఓటీటీలో 'నార్నే నితిన్' ఫస్ట్ సినిమా స్ట్రీమింగ్ -
భారత్లో అత్యంత ఖరీదైన చిత్రం ఇదే.. ఆ తర్వాతే ప్రభాస్ 'కల్కి'
బాలీవుడ్లో తెరకెక్కుతున్న 'రామాయణ' సినిమా గురించి ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చించుకుంటున్నారు. తాజాగా విడుదలైన గ్లింప్స్ విజువల్స్ అద్బుతంగా ఉన్నాయంటూ గ్రాఫిక్స్ వర్క్పై ప్రశంసలు అందుతున్నాయి. ఈ మూవీ భారతదేశంలోనే అత్యంత ఖరీదైనదిగా రికార్డ్ నెలకొల్పనుంది. మానవ సమాజ గతినే ప్రభావితం చేసిన ఒక మహత్తర కావ్యం రామాయణం. ఈ కావ్యాన్ని ఆధారం చేసుకుని ఇప్పటికే పలు సినిమాలు వచ్చాయి. కానీ, గ్రాఫిక్స్ వర్క్ ప్రధాన బలంగా ఒక అద్భుతాన్ని దర్శకుడు నితేశ్ తివారీ వెండితెరపై చూపించనున్నాడు. రామాయణం మధురమైన కథ. ఎన్నిసార్లు రామాయణం చదివినా, విన్నా కొత్తగా అనిపిస్తుంది. అందుకే ఇప్పటికే పలుమార్లు సినిమాగా వెండితెరపై మెరిసింది. ఇప్పుడు మరోసారి బాలీవుడ్లో 'రామాయణ' పేరుతో అత్యంత భారీ బడ్జెట్ పేరుతో సినిమా వస్తుంది.భారతీయ సినీ చరిత్రలో అత్యంత బడ్జెట్ చిత్రంగా 'రామయణ'అన్ని యుద్ధాల్ని అంతం చేసే యుద్ధం మొదలైందని తాజాగా విడుదలైన రామయణ గ్లింప్స్లో మేకర్స్ పేర్కొన్నారు. అదేవిధంగా ఈ చిత్రంతో బాక్సాఫీస్ రికార్డ్లు అన్నీ అంతం కావడమే కాకుండా కొత్త రికార్డ్ మొదలైంది. రామయణ పార్ట్-1 కోసం ఏకంగా రూ. 835 కోట్ల బడ్జెట్ ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో దేశంలోనే అత్యంత ఖరీదైన సినిమాగా 'రామాయణ' చరిత్ర సృష్టించింది. రాకింగ్ స్టార్ యశ్ నిర్మాణ సంస్థ మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్, అలాగే నమిత్ మల్హోత్రా నిర్మాణ సంస్థ ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్ సంయుక్తంగా కలిసి ఈ మూవీని నిర్మిస్తున్నాయి. ఇప్పటివరకు అత్యధిక బడ్జెట్ చిత్రాలుగా నిలిచిన కల్కి 2898 ఏడీ (రూ. 600 కోట్లు), ఆర్ఆర్ఆర్ (రూ. 550 కోట్లు), ఆదిపురుష్ (రూ. 550 కోట్లు) వంటి చిత్రాలను రామాయణ అధిగమించింది.భారీ తారాగణంరామాయణ సినిమాలో రాముడి పాత్రలో బాలీవుడ్ స్టార్ రణ్బీర్ కపూర్, సీత పాత్రలో సాయి పల్లవి నటిస్తున్నారు. లంకాధిపతి రావణుడి పాత్రలో 'కేజీఎఫ్' ఫేమ్ యశ్ కనిపించనున్నారు. రవి దూబే (లక్ష్మణుడు), సన్నీ డియోల్ (ఆంజనేయుడు)గా కనిపించనున్నారు. వీరితో పాటు వివేక్ ఒబెరాయ్, రకుల్ ప్రీత్ సింగ్, లారా దత్తా, కాజల్ అగర్వాల్, అరుణ్ గోవిల్, షీబా చద్దా వంటి సూపర్స్టార్స్ ఈ మూవీ కోసం పనిచేస్తున్నారు. దంగల్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నితేశ్ తివారీ దర్శకత్వంలో ఈ భారీ ప్రాజెక్ట్ తెరకెక్కుతుంది.ఎనిమిది ఆస్కార్ అవార్డ్స్ అందుకున్న సంస్ధతో మ్యాజిక్ఈ మూవీ కోసం ఉత్కంఠభరితమైన విజువల్ ఎఫెక్ట్లను మేకర్స్ అందించనున్నారు. అందు కోసం కోట్ల రూపాయలే ఖర్చుచేస్తున్నారు. ప్రపంచంలోనే గుర్తింపు పొందిన బ్రిటిష్-ఇండియన్ VFX కంపెనీ ఈ ప్రాజెక్ట్ కోసం పనిచేస్తుంది. ఈ సంస్థ ఇప్పటికే ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్కు గాను ఎనిమిది ఆస్కార్ అవార్డ్లను గెలుచుకుంది. ఆపై ఈ మూవీకి హాలీవుడ్ సంగీత దర్శకుడు హన్స్ జిమ్మెర్ పనిచేస్తున్నారు. ఆయన గ్లాడియేటర్, ఇంటర్ స్టెల్లర్, ది లయన్ కింగ్, డ్యూన్ వంటి టాప్ చిత్రాలకు సంగీతం అందించారు. ఆర్ రెహమాన్ కూడా రామయణ చిత్రానికి సంగీతంలో భాగం పంచుకోవడం విశేషం. -
కాంతా లగా ఫేమ్ ఆకస్మిక మరణం.. ఆమెను తలచుకుని భర్త ఎమోషనల్!
'కాంతా లగా' అనే పాటతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటి షఫాలీ జరివాలా (Shefali Jariwala). 2002లో వచ్చిన ఈ పాటతోనే మొదటి వైరల్ సెలబ్రిటీగా ఆమె గుర్తింపు పొందింది. ఆ సమయంలో ఇన్స్టాగ్రామ్, రీల్స్ వంటివి లేకున్నా ఈ ఒక్క సాంగ్తో యూత్కు దగ్గరైంది. కానీ ఊహించని విధంగా ఆమె ఆకస్మిక మరణం అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. అయితే తాజాగా ఆమె మరణాన్ని తలచుకుని భర్త పరాగ్ త్యాగి ఎమోషనల్ పోస్ట్ చేశారు. తన భార్యతో ఉన్న రోజులను గుర్తు చేసుకున్నారు.పరాగ్ తన పోస్ట్లో రాస్తూ.. 'షెఫాలి నువ్వు ఎప్పటికీ శాశ్వతంగా నిలిచిపోతావు. నువ్వు ఒక నమ్మకమైన స్నేహితురాలు, నా ప్రియమైన భార్య. నువ్వు మా అందరిని అమ్మలా చూసుకున్నావ్. ఎల్లప్పుడూ ఇతరులకు మొదటి స్థానం ఇచ్చే నువ్వు గొప్ప అంకితభావం గల వక్తి. కేవలం ఆప్యాయతగల భార్య మాత్రమే కాదు.. సింబాకు అద్భుతమైన తల్లివి కూడా. నువ్వు ప్రేమించిన వారి వెంట నిలిచే నమ్మకమైన స్నేహితురాలివి. అందుకే షెఫాలి గుర్తింపునకు అర్హురాలు. ఆమె ప్రజలను అలరించిన విధానం మరిచిపోలేనిది. ఇప్పుడు మనతో లేకపోయినా తన ప్రేమను ఎప్పటికీ మరచిపోలేం. శాశ్వతంగా నిన్ను ప్రేమిస్తూనే ఉంటా.' అంటూ ఎమోనషల్ అయ్యారు. కాగా.. ఆమె మరణం తర్వాత ఐదు రోజులకు షెఫాలీ జరివాలా జ్ఞాపకార్థం ముంబయిలో ప్రార్థనా సమావేశం నిర్వహించారు. View this post on Instagram A post shared by Parag Tyagi (@paragtyagi) -
హీరో చెంప చెళ్లుమనిపించింది.. ఆ దెబ్బతో ఇమేజ్ డ్యామేజ్!
ఆవేశం అనర్థదాయకం అని ఈ హీరోయిన్ విషయంలో రుజువైంది. ఆవేశంతో చేసిన ఓ పని వల్ల తన కెరీర్ తలకిందులైంది. టాప్ హీరోయిన్గా వెలుగు వెలిగిన ఆమె చివరకు వెండితెరపై అవకాశాల్లేక బుల్లితెరకు షిఫ్ట్ కావాల్సి వచ్చింది. ఆమె సోదరి మాత్రం ఇప్పటికీ సినిమాల్లో రాణిస్తోంది. ఇంతకీ ఆ హీరోయిన్ మరెవరో కాదు ఫరా నాజ్. ఆమె సోదరి టబు.చిన్న వయసులోనే..హైదరాబాద్లో పుట్టిన ఫరా నాజ్ (Farah Naaz Hashmi) తర్వాత ముంబైకి షిఫ్ట్ అయింది. యష్ చోప్రా 'ఫాల్సే' మూవీతో 1985లో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. అప్పుడామె వయసు 17 ఏళ్లు మాత్రమే! ఈ సినిమా డిజాస్టర్ అయినా తన అందానికి, టాలెంట్కు ముగ్ధులైన దర్శకనిర్మాతలు ఆమెకు మరిన్ని ఛాన్సులిచ్చారు. మార్తే డం టక్, నసీబ్ అప్నా అప్నా, లవ్ 86, ఇమాందార్, వీరు దాదా, దిల్జలా, బాప్ నంబ్రీ బేటా దస్ నంబ్రీ.. ఇలా ఎన్నో హిట్ చిత్రాలు చేసింది. రాజేశ్ ఖన్నా, ధర్మేంద్ర, సంజయ్ దత్, ఆమిర్ ఖాన్ వంటి స్టార్ హీరోలతో కలిసి యాక్ట్ చేసింది.ఆవేశంస్టార్ హీరోయిన్గా వెలుగు వెలిగిన ఫరా నాజ్కు ఆవేశం ఎక్కువ. ఓసారి ఇంట్లో గొడవపడ్డప్పుడు ఆవేశంతో చేయి కోసుకుంది. అలా అని చనిపోవాలని ప్రయత్నించలేదు, కాకపోతే తన కోపాన్ని, బాధను అలా బయటపెట్టిందట! తన బాధ ఇంట్లోవాళ్లకు అర్థమవ్వాలనే అలాంటి పని చేసినట్లు తను ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఈ ఆవేశం తర్వాత కూడా అలాగే కంటిన్యూ అయింది.చెంప చెళ్లుమనిపించిందికసం వర్దీకీ సినిమాలో చుంకీ పాండేతో కలిసి నటించింది ఫరా. ఆ మూవీ షూటింగ్లో చుంకీ పాండే ఏదో జోక్ వేస్తే హీరోయిన్కు ఒళ్లంతా మండిపోయింది. ఆవేశం పట్టలేక అతడి చెంప చెళ్లుమనిపించినట్లు అప్పట్లో బోలెడు వార్తలు వచ్చాయి. అదే ఏడాది ఆమె నటించిన రఖ్వాలా సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయింది. ఫరాకు బదులు మాధురీ దీక్షిత్ను హీరోయిన్గా తీసుకుని ఉండుంటే సినిమా హిట్టయ్యేదని అనిల్ కపూర్ ఫీలయ్యాడట! ఈ విషయం తెలిసిన ఫరా.. అనిల్ను బెదిరించినట్లు భోగట్టా! ఇలా వరుస వివాదాలతో ఫరాపై నెగెటివిటీ పెరిగింది. అది నెమ్మదిగా తన ఇమేజ్ను దెబ్బ తీసింది.చెల్లితో అసభ్యంగా..జాకీ ష్రాఫ్తో కలిసి దిల్జలా మూవీ చేసింది ఫరా. ఈ సినిమా అయిపోయాక నటుడు డానీ డెంజోంగ్ప ఓ పార్టీ ఇచ్చాడు. దానికి ఫరా.. టబును తీసుకుని వెళ్లింది. తను తాగి పడిపోయింది. అప్పుడు పూటుగా తాగిన జాకీ ష్రాఫ్.. టబును ముద్దు పెట్టుకునేందుకు ప్రయత్నించాడు. అది చూసిన డానీ వెంటనే జాకీ ష్రాఫ్ను బయటకు తీసుకెళ్లిపోయాడు. ఈ వ్యవహారంపై మండిపడ్డ ఫరా.. మీడియా ముందే నటుడిని ఎండగట్టింది. అనంతరకాలంలో మాత్రం అపార్థం చేసుకున్నానని యూటర్న్ తీసుకుంది.రెండు పెళ్లిళ్లుఫరా.. రెజ్లింగ్ లెజెండ్ దారా సింగ్ కుమారుడు విందు దారా సింగ్ను పెళ్లాడింది. 1986లో వీరి వివాహం జరగ్గా 1997లో కుమారుడు జన్మించాడు. కానీ ఆ తర్వాత దంపతుల మధ్య విభేదాలు తలెత్తడంతో పెళ్లయిన ఆరేళ్లకే విడిపోయారు. విడాకులు తీసుకున్న ఏడాదే నటుడు సుమీత్ సైగల్ను రెండో పెళ్లి చేసుకుంది. ఆయనక్కూడా ఇది రెండో పెళ్లే! అయితే పిల్లలు వద్దనుకుని ఓ నిర్ణయానికి వచ్చాకే వీరిద్దరూ వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. ఫరా.. తెలుగులో ఒంటరి పోరాటం, విజేత విక్రమ్ సినిమాలు చేసింది. 20 ఏళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటోంది. మధ్యలో బుల్లితెరపై సీరియల్స్ చేసింది.చదవండి: ఇంట్లో నుంచి వెళ్లగొట్టారు.. అందుకే అంత ద్వేషం: స్మృతి ఇరానీ -
సూర్య, దీపికా పదుకొణెలతో 8 వసంతాలు..: డైరెక్టర్
8 వసంతాలు (8 Vasantalu Movie).. ఇది ప్రేమ కథ కాదు, ప్రేమ కావ్యమని చెప్పొచ్చు. ఫణీంద్ర నర్సెట్టి డైరెక్ట్ చేసిన ఈ మూవీ జూన్ 20న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రవి దుగ్గిరాల, హనురెడ్డి, అనంతిక సనిల్ కుమార్ హీరోహీరోయిన్లుగా నటించారు. కవిత్వం, భావుకత పుష్కలంగా ఉన్న ఈ సినిమా చాలామందికి నచ్చేసింది. అయితే ఈ సినిమా కోసం దర్శకుడు మొదట స్టార్ హీరోహీరోయిన్లను అనుకున్నాడట! ఈ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు. సూర్య, దీపికతో..ఫణీంద్ర నర్సెట్టి మాట్లాడుతూ.. 8 వసంతాలు మూవీ పెద్దవాళ్లతో చేద్దామనుకున్నాను. సూర్య, దీపికా పదుకొణెను దృష్టిలో పెట్టుకుని రాసుకున్నాను. అందుకే డైలాగులు అంత బలంగా ఉంటాయి. మైత్రీ మూవీ మేకర్స్ దగ్గరకు కథ తీసుకెళ్లినప్పుడు కొత్తవాళ్లతో అయితే ఇంకా బాగుండొచ్చు అన్నారు. పెద్దవాళ్లతో అంటే ఇబ్బందులు ఎదురవొచ్చేమో, కథ ఎక్కడైనా పాడవుతుందేమో.. ఒక్కసారి ఆలోచించు అన్నారు. అప్పుడు నేను ఆలోచించి కొత్తవాళ్లతో ముందుకు వెళ్లాను అని చెప్పుకొచ్చారు.చదవండి: సిగ్గు లేని మనిషి.. వెబ్ సిరీస్ కోసం కాంప్రమైజ్ అడిగాడు: నటి -
సిగ్గు లేని మనిషి.. వెబ్ సిరీస్ కోసం కాంప్రమైజ్ అడిగాడు: నటి
సినిమా అవకాశాల కోసం వెళ్తే చేదు అనుభవాలు ఎదుర్కొన్న నటీనటులు ఎందరో! అయితే సినిమాలే కాదని ఓటీటీలో ఛాన్సులు కావాలంటే కూడా పిచ్చి కండీషన్లు పెడుతున్నారని చెప్తున్నారు నటి హెల్లీ షా (Helly Shah). తనకు ఓ వెబ్ సిరీస్లో ఆఫర్ వచ్చిందట.. కానీ వాళ్లు చెప్పిన కండీషన్కు ఓకే అంటేనే ఎంపిక చేస్తామని మెలిక పెట్టారట! ఈ విషయం గురించి హెల్లీ షా మాట్లాడుతూ.. గతంలో నాకు పెద్ద వెబ్ సిరీస్లో భాగమయ్యే ఛాన్స్ వచ్చింది. ఆ ప్రాజెక్ట్ కోసం నన్ను సంప్రదిస్తూ ఓ మెసేజ్ వచ్చింది. కండీషన్కు ఒప్పుకుంటే..అది చూడగానే.. నేను మీ ప్రాజెక్టులో భాగం కావాలనుకుంటున్నారా? అని కన్ఫర్మేషన్ కోసం అడిగాను. అందుకు అవతలివైపు నుంచి అవును, అందుకోసమే మీకు మెసేజ్ చేశాం అని రిప్లై వచ్చింది. నేను చాలా సంతోషించాను. కానీ అంతలోనే.. ఓ కండీషన్.. మేము చెప్పిన ప్రదేశానికి వచ్చి చెప్పినట్లు చేయాలి. అందుకు ఓకే అంటే ఈ ప్రాజెక్ట్ మీ మీ సొంతం అన్నారు. నా వల్ల కాదు, మీరు వేరే ఎవర్నైనా చూసుకోండి అని రిప్లై ఇచ్చాను.ఆన్లైన్లో అయినా ఓకేఅప్పటికీ అవతలి వ్యక్తి ఊరుకోలేదు. పర్లేదు, మీరు రాకపోయినా సరే, ఫోన్లోనే నేను చెప్పింది చేయండి. ఆన్లైన్లో అయినా నాకేం పర్లేదని బదులిచ్చాడు. అతడు అన్న మాటల్ని నా నోటితో ఎలా చెప్పాలో కూడా తెలియట్లేదు. ఆన్లైన్లో కాంప్రమైజ్ అడిగాడు. ఈ సోదంతా నాకెందుకు అని అతడి నెంబర్ బ్లాక్లిస్ట్లో పెట్టాను. ఇలాంటివి ఇంకా జరుగుతూనే ఉన్నాయి. సిగ్గులేని జనాలు మారరు. కొంచెమైనా పద్ధతిగా ప్రవర్తించరు. ఇలాంటి మనుషులతో నాకెందుకు అని ఆ వెబ్ సిరీస్ను వదిలేసుకున్నాను అని చెప్పుకొచ్చారు.సీరియల్స్- సినిమాహెల్లీ షా ప్రస్తుతం గుజరాతీ మూవీ దేడ చేస్తున్నారు. ఇందులో హెల్లీ గర్భవతిగా కనిపించనున్నారు. ఈ మూవీ జూలై 4న విడుదలవుతోంది. ఇకపోతే హెల్లీ షా.. అలక్ష్మి: హమారీ సూపర్ బహు, ఖేల్తీ హై జిందగీ ఆంఖ్ మిచోలి, దేవాన్షి, స్వరాగిని- జోడైన్ రిష్తో కే సుర్, ఇష్క్ మే మర్జవాన్ 2: నయా సఫర్ వంటి పలు సీరియల్స్ చేశారు. గుల్లక్, పిరమిడ్ వంటి వెబ్ సిరీస్లలోనూ మెరిశారు.చదవండి: ఓటీటీలోకి సడన్గా వచ్చేసిన భారీ బడ్జెట్ మూవీ.. ఎక్కడంటే? -
దీపికా పదుకొణెకు అరుదైన గౌరవం.. తొలి ఇండియన్గా రికార్డు
బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణెకు అరుదైన గౌరవం దక్కింది. ‘హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ స్టార్ 2026’కు ఆమె ఎంపికయ్యారు. ఈ విషయాన్ని తాజాగా హాలీవుడ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధికారికంగా వెల్లడించింది. వినోదరంగంలో గణనీయంగా కృషి చేసినందుకుగాను ప్రతి ఏటా హాలీవుడ్ ఫిల్మ్ చాంబర్ ‘హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ స్టార్ ’ జాబితాను వెల్లడిస్తుంది. ఈ ఏడాది మోషన్ పిక్చర్స్ విభాగంలో దీపికను ఎంపిక చేసినట్లు హాలీవుడ్ చాంబర్ ఆఫ్ కామర్స్ వెల్లడించింది. ఈ జాబితాలో డెమి మూర్, రాచెల్ మెక్ఆడమ్స్, ఎమిలీ బ్లంట్ వంటి హాలీవుడ్ తారలతో పాటు మొత్తం 35 మంది ఉన్నారు. భారత్ నుంచి ‘హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ స్టార్’ గౌరవం దక్కించుకున్న తొలి నటిగా దీపిక చరిత్ర సృష్టించింది. బాలీవుడ్ అగ్రతారలు అయిన షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ కూడా ఈ జాబితాలో స్థానం పొందలేకపోవడం గమనార్హం.2006లో ఉపేంద్ర హీరోగా నటించిన కన్నడ సినిమా ఐశ్వర్యతో చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టింది దీపిక. ఆ తర్వాత షారుఖ్ ఖాన్ నటించిన బాలీవుడ్ మూవీ ఓం శాంతి ఓం తో మంచి గుర్తింపు సంపాదించుంది. 2017లో త్రిబుల్ ఎక్స్: ది రిటర్న్ ఆఫ్ జాండర్ కేజ్’ సినిమాలో హాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. కల్కి 2898 ఏడీ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ప్రస్తుతం అల్లు అర్జున్ -అట్లీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రంలో హీరోయిన్గా నటిస్తోంది. -
ఇంట్లో నుంచి వెళ్లగొట్టారు.. అందుకే అంత ద్వేషం: స్మృతి ఇరానీ
బుల్లితెర, వెండితెర, రాజకీయం.. అన్నిచోట్లా తనదైన మార్క్ చూపించారు స్మృతి ఇరానీ (Smriti Irani). సాధారణ మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన స్మృతి చిన్న వయసులోనే జీవితాన్ని చదివేశారు. కష్టాలు, తిరస్కరణలు తనను రాటు దేల్చాయి. అందుకే నటిగా మొదలైన తన ప్రయాణం కేంద్రమంత్రిని చేసింది. స్మృతి ఇరానీ మొదట యాడ్స్లో.. తర్వాత సీరియల్స్లో నటించారు. నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసి సీరియల్స్ కూడా నిర్మించారు. నా జీవితం అగ్నిపథ్ సినిమావంటిదిజై బోలో తెలంగాణ సహా పలు చిత్రాల్లో యాక్ట్ చేశారు. రాజకీయాల్లోనూ చురుకుగా ఉంటూ బీజేపీలో కేలక నేతగా ఎదిగారు. ఎంపీగా గెలిచి కేంద్రమంత్రిగానూ సేవలందించారు. తాజాగా స్మృతి ఇరానీ దర్శకనిర్మాత కరణ్ జోహార్కు ఇంటర్వ్యూ ఇచ్చారు. మీ జీవితాన్ని ప్రతిబింబించే పాట ఏది? అన్న ప్రశ్నకు స్మృతి.. పాట సంగతేమోకానీ, కుచ్ కుచ్ హోతా హై మూవీ నుంచి నా లైఫ్ సడన్గా అగ్నిపథ్ మూవీగా మారిపోయిందని బదులిచ్చారు. అమ్మకు అన్యాయంఏదైనా ప్రేమగీతం చెప్తారనుకుంటే ఇలా ప్రతీకారంతో రగిలిపోయే సినిమాను ఎంపిక చేసుకున్నారేంటని కరణ్ తిరిగి ప్రశ్నించారు. అందుకు స్మృతి స్పందిస్తూ.. తల్లి లక్ష్యాన్ని నెరవేర్చేందుకు కొడుకు చేసే ప్రయత్నాలను అగ్నిపథ్లో చూపిస్తారు. అమ్మకు అన్యాయం జరిగిందన్నది అతడి ఆవేదన. నా లైఫ్లోనూ అదే జరిగింది. మా అమ్మకు అన్యాయం జరిగిందని నేను భావిస్తాను. నాకు ఏడేళ్ల వయసున్నప్పుడు తనను ఇంట్లో నుంచి వెళ్లగొట్టారు. ఎందుకో తెలుసా? తను కొడుకును కనివ్వలేదని!అద్దె ఇంట్లో ఉన్న అమ్మకు..అగ్నిపథ్ సినిమాలోలాగే నేను కూడా నా తల్లికి న్యాయం చేయాలనుకున్నాను. ఆ ఇంటికి అమ్మను తిరిగి తీసుకెళ్లాలనుకున్నాను. ఎప్పటికైనా ఆ ఇల్లు కొనివ్వాలని డిసైడయ్యాను. దాదాపు అమ్మ జీవితమంతా అద్దింట్లోనే ఉంది. ఆరేళ్ల క్రితం తనకు ఇల్లు కొనిచ్చాను. కానీ, ఫ్రీగా ఉండటం ఇష్టం లేక ప్రతి నెలా నాకు రూ.1 అద్దె కడుతోంది అని చెప్పుకొచ్చారు.కష్టాలతో సావాసంమరో ఇంటర్వ్యూలోనూ తన పేరెంట్స్ కష్టాలు బయటపెట్టారు స్మృతి ఇరానీ. నాన్న ఆర్మీ క్లబ్ బయట పుస్తకాలు అమ్మేవాడు. అమ్మ ఇంటింటికీ తిరిగి మసాలా దినుసులు అమ్మేది. నాన్న పెద్దగా చదువుకోలేదు. కానీ, అమ్మ డిగ్రీదాకా చదివింది. వాళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నప్పుడు రూ.150 మాత్రమే వారి చేతిలో ఉన్నాయి. గేదెల కొట్టంలోని ఓ గదిలో వారు నివసించేవారు అని పేర్కొన్నారు. కాగా స్మతి పేరెంట్స్ ప్రేమించి పెళ్లి చేసుకోగా.. కొన్నేళ్ల తర్వాత విడాకులు తీసుకున్నారు.చదవండి: ఓటీటీలోకి సడన్గా వచ్చేసిన భారీ బడ్జెట్ మూవీ.. ఎక్కడంటే? -
ముంబయి టూ గోవా.. పరుగులు తీసిన స్టార్ హీరో.. వామ్మో అన్ని కిలో మీటర్లా?
పార్టీలు చేసుకోవాలి క్యాసినోలు చూసుకోవాలి బీర్లు తాగాలి బీచ్లలో పడి దొర్లాలి... గోవా అనగానే లెట్స్ గో... అనేందుకు చాలా మందికి అవే కారణాలు కావచ్చు. కానీ ఆ అగ్రనటుడు మాత్రం గోవాకి పరుగులు తీసిన కారణం వీటికి పూర్తిగా భిన్నం కావడం విశేషం. ఫిట్గా ఉండండి హిట్ అనిపించుకోండి అని ప్రభోధించడానికి ఆయన ఎంచుకున్న మార్గం ఏకంగా 600 కి.మీ ప్రయాణం అది కూడా ఎలా? పరుగులు తీస్తూ కాసేపు సైక్లింగ్లో మరింత సేపు...ఇంతకీ ఎవరా నటుడు? ఏమా కధ? లెట్స్ గెట్ ఇన్ టూ దిస్ స్టోరీ...ఫ్యాషన్ రంగంలో మోడల్ సినిమా రంగంలో నటుడు, అనగానే చాలామంది గుర్తుకు రావచ్చు కానీ.. ఫిట్నెస్ ఐకాన్ అనేది కూడా వీటికి జతకలిస్తే మాత్రం దేశవ్యాప్తంగా గుర్తుకు వచ్చే ఏకైక పేరు మిలింద్ సోమన్. గత కొన్నేళ్లుగా అన అనూహ్యమైన ఫిట్నెస్ స్థాయిలతో అందర్నీ అబ్బుపరుస్తూ యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్న మిలింద్..మరోసారి తన శారీరక సామర్ధ్యాన్ని చాటుకున్నాడు. ‘ది ఫిట్ ఇండియా రన్’ పేరుతో ఏటా నిర్వహించే రన్నింగ్ ఈవెంట్ దీనికి వేదికగా నిలిచింది. ఈ ఈవెంట్లో పాల్గొన్న ఆయన ముంబయి నుంచి గోవా వరకు సుమారు 600 కిలోమీటర్ల దూరం మోటారు వాహనం లేకుండా ప్రయాణించారు. ఈ ప్రయాణం 5 రోజుల్లో పూర్తి చేసిన ఘనత సాధించాడు.ఈ మార్గంలో ప్రతిరోజూ సుమారు 90కిమీ సైక్లింగ్ 21కిమీ పరుగు ఇలా విభజించుకుంటూ ఆయన ప్రయాణించాడు. గత నెల అంటే జూన్ 26న ముంబైలోని శివాజీ పార్క్ నుంచి మిలింద్ సోమన్ ఫిట్ ప్రారంభమైంది. మహారాష్ట్ర భూభాగానికి ఆనుకుని ఉన్న కొంకణ్ బెల్ట్ను పూర్తిగా కవర్ చేస్తూ పెన్, కొలాడ్, చిప్లూన్, రత్నగిరి, కంకవళి ల మీదుగా ప్రయాణిస్తూ జూన్ 30న గోవాకు చేరుకున్నాడు. తన సాహస ప్రయాణాన్ని తాజాగా ఆయన ఇన్ షేర్ చేశాడు. దానితో పాటే ఓ సందేశాన్ని కూడా.'ఫిట్ ఇండియన్ రన్ 5రోజుల పాటు 600కిమీ పూర్తి చేశాను. ఇది ప్రతీ ఏటా తప్పనిసరిగా నేను ఎదుర్కునే ఛాలెంజ్, శరీరం, మనస్సు బాగా పనిచేస్తున్నాయని నిర్ధారించుకునేందుకు ఇలాంటి ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేయడం నాకు ఉపకరిస్తుంది. అనేక మంది నాకు బెస్ట్ విషెస్ చెప్పడం మరెన్నో అఛీవ్ చేయాలని కోరుతుండడం నాకు మరింత ప్రేరణగా మారుతోంది. ప్రతి భారతీయుడు ఫిట్ ఇండియన్ అవ్వాలి. జైహింద్' అంటూ పంచుకున్నాడు.ప్రతీ ఒక్కరిలో ఫిట్నెస్ పట్ల ఆసక్తి పెంచేందుకు గత 2020లో భారత ప్రభుత్వం ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ను ప్రారంభించింది. అప్పటి నుంచి ఈ కార్యక్రమంలో మిలింద్ పాల్గొంటున్నాడు. ఈ సారి 60ఏళ్ల వయసులో కూడా అదే ఉత్సాహంతో ఆయన సాధించిన ఈ ఫీట్... ఫిట్నెస్లో ఆసక్తి ఉన్న చాలామందికి ప్రేరణ అందిస్తోంది. -
కూతురిగా చేసిన నటితో రొమాన్స్.. డైరెక్టర్ వద్దని చెప్పారు: అమిర్ ఖాన్
ఆమిర్ ఖాన్ ఇటీవలే 'సితారే జమీన్ పర్' చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. గతనెల విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. ఈ సినిమాలో జెనీలియా దేశ్ముఖ్ కీలక పాత్రలో కనిపించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 100 కోట్ల మార్కును దాటేసింది. అయితే గతంలో అమిర్ ఖాన్ నటించిన దంగల్ మూవీ రికార్డ్ స్థాయిలో వసూళ్లు సాధించింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రాల జాబితాలో మొదటిస్థానంలో ఉంది. ఈ మూవీలో బాలీవుడ్ ఫాతిమా సనా షేక్ అమిర్ ఖాన్ కూతురిగా మెప్పించింది.అయితే దంగల్లో అమిర్ ఖాన్ కూతురిగా నటించిన ఫాతిమా సనా షేక్ ఆ తర్వాత 2018లో వచ్చి థగ్స్ ఆఫ్ హిందూస్తాన్ మూవీలో హీరోయిన్గా నటించింది. ఈ చిత్రంలో అమిర్ ఖాన్ కలిసి రొమాన్స్ చేసింది. అయితే తన కూతురి పాత్రలో నటించిన ఆమెతో అమిర్ ఖాన్ రొమాన్స్ చేయడంపై తాజాగా స్పందించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆయన.. ఈ సినిమా మా ఇద్దరి మధ్య ఎలాంటి రొమాంటిక్ యాంగిల్ ఉండదని థగ్స్ ఆఫ్ హిందూస్తాన్ డైరెక్టర్ విజయ్ కృష్ణ ఆచార్య అన్నారని గుర్తు చేశారు. అయితే తనకు ప్రేమికుడిగా నటించడానికి ఫాతిమాకు ఎలాంటి అభ్యంతరం లేదని డైరెక్టర్తో చెప్పానని అమిర్ ఖాన్ వెల్లడించారు. ఎందుకంటే నేను ఆమె తండ్రిగా ఒక సినిమాలో మాత్రమే నటించా.. నిజ జీవితంలో కాదని డైరెక్టర్తో చెప్పినట్లు తెలిపారు. నేను నిజ జీవితంలో ఆమె ప్రియుడిని కాదు.. మేమిద్దరం కలిసి కేవలం సినిమా చేస్తున్నామని దర్శకుడితో చెప్పినట్లు వివరించారు. అంతే కాకుండా గత సినిమాల్లో తల్లి-కొడుకులుగా నటించిన అమితాబ్ బచ్చన్- వహీదా రెహ్మాన్లు.. ఆ తర్వాత ప్రేమికులుగా నటించారని అమిర్ గుర్తు చేశారు. దీపిక, ఆలియా భట్, శ్రద్ధా కపూర్ లాంటి తారలు ఈ మూవీని రిజెక్ట్ చేసినప్పటికీ ఫాతిమా ఈ చిత్రానికి సంతకం చేశారని అమిర్ ఖాన్ తెలిపారు. ఇది ఒక అద్భుతమైన సినిమా అని నిర్మాత ఆదిత్య చోప్రా నుంచి కాల్ వచ్చిన తర్వాత తాను షాక్ అయినట్లు గుర్తు చేసుకున్నారు. అయితే'థగ్స్ ఆఫ్ హిందుస్తాన్' బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయింది. -
ఒంటరిగా ఉండలేను.. ఐశ్వర్య సలహానే పాటిస్తున్నా : అభిషేక్
తనపై వచ్చే నెగెటివిటీని ఎదుర్కోవడానికి భార్య ఐశ్వర్య ఇచ్చే సలహాను పాటిస్తున్నానని చెప్పారు బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్(Abhishek Bachchan). ఆమె ఇచ్చిన సలహాతో ఇప్పుడు పాజిటివ్ విషయాలపై మాత్రమే దృష్టిపెడుతున్నానని అన్నారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నటుడిగా తనపై వచ్చే ఫేక్ న్యూస్, ట్రోలింగ్ని ఎలా ఎదుర్కొంటున్నాడో వివరించాడు. ‘నా చుట్టు ఉన్నవారిని సంతోషంగా ఉంచాలని నేను ఎప్పుడూ కోరుకుంటాను. అలా చేయడానికి ప్రయత్నిస్తాను. కానీ కొన్నిసార్లు కాలమే మనకు కఠినంగా ఉండమని చెబుతుంది. ఒక నటుడిగా అలా ఉండడం నాకు కుదరదు. అలా ఉంటే ఆ ప్రభావం నా కెరీర్పై పడుతుంది. ఎన్ని విమర్శలు వచ్చినా సరే నలుగురిని సంతోషంగా ఉండేలా చేయాలనే మనస్తత్వం నాది. నెగెటివ్ విషయాలు చెప్పే వారి గురించి ఎక్కువగా ఆలోచించేవాడిని, ట్రోలింగ్పై కూడా దృష్టిపెట్టేవాడిని. కానీ నా భార్య ఇచ్చిన ఒక సలహాతో వాటిని దూరం పెట్టేశాను.‘తప్పుడు వార్తలు మనపై ఎలాంటి ప్రభావం చూపవు. పాజిటివ్ విషయాలపై మాత్రమే దృష్టిపెట్టండి. దానివల్ల చాలా ఉపయోగం ఉంటుంది’ అని ఐశ్వర్య నాకు సలహా ఇచ్చింది. ఇప్పుడు అదే నేను ఫాలో అవుతున్నాను. ట్రోలింగ్ని పట్టించుకోకుండా ఎంజాయ్ చేస్తున్నాను. ఒంటరిగా ఎక్కువ రోజులు ఉండడం నా వల్ల కాదు. కుటుంబాన్ని చూడకుండా ఉండలేను. నా పక్కన మాట్లాడడానికి ఒక మనిషి కచ్చితంగా ఉండాలి. ఇంట్లో అందరం కలిసి సరదాగా మాట్లాడుకుంటాం. వర్క్ బిజీగా గడుపుతున్నప్పటికీ అప్పుడప్పుడు మనకోసం కూడా సమయం కేటాయించుకోవాలి’ అని అభిషేక్ అన్నారు. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఆయన కాళిధర్ లాపత మూవీ ప్రమోషన్స్లో బిజీగా ఉన్నాడు. జీ 5’ వేదికగా జులై 4 నుంచి ఇది అందుబాటులోకి రానుంది. -
సైడ్ యాక్టర్గా అజిత్.. నాకు నచ్చలేదు: విష్ణు
మంచు విష్ణు (Vishnu Manchu) తన డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్పను బాలీవుడ్ డైరెక్టర్ ముకేశ్ కుమార్తో తీశారు. టాలీవుడ్లో ఎవరూ దొరకలేదా? అంటే? వరుస ఫ్లాపులు అందుకున్న తనతో కన్నప్ప వంటి మైథాలజీ సినిమా తీసేందుకు ఎవరూ ముందుకు రారని అసలు విషయం చెప్పారు. అందుకే మహాభారత్ సీరియల్ తీసిన ముకేశ్తో కన్నప్ప సినిమాను తెరకెక్కించినట్లు వెల్లడించారు. బాలీవుడ్లో ఛాన్స్మరి హీరోగా బాలీవుడ్లో అడుగుపెట్టే ఆలోచనలేమైనా ఉన్నాయా? అంటే విష్ణు ఇలా స్పందించారు. ఇండియా టుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో విష్ణు మాట్లాడుతూ.. చాలాకాలం క్రితం హిందీలో సినిమా చేయమని కొందరు నన్ను సంప్రదించారు. కానీ వారు ఆఫర్ చేసినవేవీ నాకు నచ్చకపోవడంతో అక్కడ సినిమాలు చేయలేదు. పైగా నటుడిగా నాకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకున్నాను. అదే సమయంలో అభిమానుల ప్రేమను పొందాను. వారిని నేను గౌరవించాల్సిన అవసరం ఉంది. ఏవి పడితే అవి చేసి వారిని నేను బాధపెట్టలేను.చిన్న రోల్.. నచ్చలేదుఉదాహరణకు స్టార్ హీరో అజిత్ను తీసుకుందాం. ఆయన ఇండియాలోనే పెద్ద సూపర్స్టార్స్లో ఒకరు. షారూఖ్ ఖాన్ అశోక మూవీలో ఆయన సైడ్ రోల్ చేశారు. అది నాకు నచ్చలేదు. అజిత్ అన్నతో మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు.. మీరు ఇంత చిన్న పాత్ర చేసినందుకు నిరాశచెందాను అని చెప్పాను. అందుకాయన చిన్నగా నవ్వి సైలెంట్గా ఉండిపోయారు.సెల్ఫిష్గా ఆలోచించలేనుకాబట్టి ఏదో ఒక రోల్.. అని లైట్ తీసుకుని సినిమా చేయలేను. జనాలకు నచ్చినా, నచ్చకపోయినా నా ఇష్టమొచ్చిన సినిమాలు చేస్తా అని సెల్ఫిష్గా ఆలోచించలేను అని విష్ణు చెప్పుకొచ్చారు. కన్నప్ప సినిమా విషయానికి వస్తే.. విష్ణు తిన్నడు/కన్నప్పగా నటించారు. అక్షయ్ కుమార్, ప్రభాస్, మోహన్లాల్, శరత్కుమార్, కాజల్ ముఖ్య పాత్రలు పోషించారు. జూన్ 27న విడుదలైన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ లభించింది.చదవండి: మమ్మల్ని చంపుకుతింటున్నారు.. ఇండస్ట్రీలో ఫ్లాపులే లేవా? దిల్ రాజు -
మీరనుకున్నట్లు శ్రీదేవి అమాయకురాలు కాదు: సీనియర్ నటి పూనమ్
టాలీవుడ్ ప్రియుల గుండెల్లో అతిలోక సుందరిగా ముద్రవేసుకున్న హీరోయిన్ శ్రీదేవి. బాలీవుడ్తో పాటు తెలుగులోనూ స్టార్ హీరోయిన్గా మెప్పించింది. తాజాగా ఆమెపై మరో నటి, హీరోయిన్ పూనమ్ ధిల్లాన్ ప్రశంసలు కురిపించారు. అందరూ అనుకున్నట్లుగా తానేమీ తెలివితక్కువ వ్యక్తి కాదని తెలిపింది. తను చాలా అందమైన, అద్భుతమైన మనిషి అని అన్నారు. మీడియాలో చూపినట్లుగా మాటలు రాని వ్యక్తి కాదని పేర్కొన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన నటి పూనమ్ ధిల్లాన్.. శ్రీదేవిని ఉద్దేశించి ఇలా కామెంట్స్ చేశారు.నటి పూనమ్ ధిల్లాన్ మాట్లాడుతూ.. 'శ్రీదేవి చాలా తెలివైన నటి. మీడియా ఆమెను మాటలు రాని వ్యక్తిగా ముద్ర వేసింది. కానీ ఆమె అంత తెలివైనది కాదు. తనను అమాయకురాలిగా ముద్ర వేయడం అదంతా ఒక కుట్ర అని నేను చెప్తున్నా. ఎందుకంటే ఆమె చాలా తెలివిగల అమ్మాయి. అలా కాకపోతే ఆమె అంత అద్భుతమైన నటి ఎలా అవుతుంది? అందుకే శ్రీదేవి అమాయకురాలిగా నమ్మడాన్ని నిరాకరిస్తున్నా. నేను ఎల్లప్పుడూ ఆమె పనిని ఆరాధించేదాన్ని. తనతో కలిసి రెండు చిత్రాలలో పనిచేశా. శ్రీదేవి చాలా నిగ్రహం కలిగిన వ్యక్తి.' అని పంచుకుంది. కాగా.. శ్రీదేవి, పూనమ్ ధిల్లాన్ 'సోనే పే సుహాగా', 'జుదాయి' వంటి చిత్రాల్లో కలిసి పనిచేశారు.ఇక సినిమాల విషయానికొస్తే నటి పూనమ్ ధిల్లాన్ చివరిసారిగా రితేష్ దేశ్ముఖ్, తమన్నా భాటియా నటించిన 'ప్లాన్ ఎ ప్లాన్ బి'లో కనిపించింది. ఆమె జియో హాట్స్టార్ షో 'దిల్ బెకరార్'లో కూడా కనిపించనుంది. -
ఓటీటీలో మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!
ఓటీటీల్లో మిస్టరీ థ్రిల్లర్స్కు ఆదరణ విపరీతంగా పెరిగిపోయింది. ఓటీటీలో ఇలాంటి కంటెంట్నే ఆడియన్స్ ఎక్కువగా ఆదరిస్తున్నారు. ప్రేక్షకుల అభిరుచికి తగినట్లుగానే అలాంటి సరికొత్త కంటెంట్తో వెబ్ సిరీస్లు, చిత్రాలు వచ్చేస్తున్నాయి. తాజాగా ఓటీటీ ప్రియులను అలరించేందుకు మరో సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ వచ్చేస్తోంది. బాలీవుడ్ నటి వాణి కపూర్ ప్రధాన పాత్రలో తెరకెక్కించిన మండల మర్డర్స్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్కు సిద్ధమైంది.ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ అధికారికంగా వెల్లడించింది. జూలై 25 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుందని సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఈ మేరకు క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ కొత్త పోస్టర్ను నెట్ఫ్లిక్స్ విడుదల చేసింది. ఈ సిరీస్లో వాణికపూర్ తొలిసారి డిటెక్టివ్ పాత్రలో కనిపించనుంది. ఈ సిరీస్లో వైభవ్ రాజ్ గుప్తా, సుర్వీన్ చావ్లా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ను చరణ్దాస్పూర్ పట్టణం నేపథ్యంలో తెరకెక్కించారు. శతాబ్దాల క్రితం జరిగిన హత్యల నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ను యశ్రాజ్ ఫిల్మ్స్ బ్యానర్లో నిర్మించారు. ఈ మిస్టరీ థ్రిల్లర్ సిరీస్కు గోపి పుత్రన్ దర్శకత్వం వహించారు. ఈ సిరీస్ను ఆదిత్య చోప్రా, ఉదయ్ చోప్రా, యోగేంద్ర మోగ్రే, అక్షయ్ విధాని నిర్మించారు. 'ది రైల్వే మెన్' (2023) తర్వాత నెట్ఫ్లిక్స్, యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్లో వస్తోన్న సిరీస్ ఇదే కావడం విశేషం. Har vardaan mein ek shraap chhupa hai, mol chukane ka waqt jald aane wala hai 🕸️Watch Mandala Murders, out 25 July, only on Netflix.#MandalaMurders #MandalaMurdersOnNetflix #VaibhavRajGupta @SurveenChawla @ShriyaP #JameelKhan @gopiputhran @manan_rawat @MogreYogendra… pic.twitter.com/eQm3iX4x8a— Vaani Kapoor (@Vaaniofficial) June 30, 2025 -
'నేను ఏం మాట్లాడిన అలానే తీసుకుంటారు'.. విడాకుల రూమర్స్పై అభిషేక్ బచ్చన్!
బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్-ఐశ్వర్య జంటపై గత కొన్ని నెలలుగా రూమర్స్ వస్తూనే వినిపిస్తున్నాయి. వీరిద్దరు విడాకుల తీసుకోబోతున్నారంటూ చాలాసార్లు కథనాలొచ్చాయి. గతంలో ఐశ్వర్యరాయ్ తన కూతురు ఆరాధ్యతో కలిసి చాలాసార్లు కనిపించడంతో ఈ రూమర్స్ ఎక్కువయ్యాయి. అంతేకాకుండా ఐశ్వర్య బర్త్ డే ఆలస్యంగా విష్ చేయడం.. ఆమెతో అభిషేక్ బచ్చన్ ఎక్కువగా కనిపించకపోవడంతో విడాకుల వార్తలకు మరింత బలం చేకూరింది. అయితే ఈ వార్తలపై అభిషేక్ ఇప్పటివరకు స్పందించలేదు.తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన అభిషేక్ బచ్చన్.. తనపై వస్తున్న రూమర్స్పై స్పందించారు. సోషల్ మీడియాలో తన గురించి జరుగుతున్న తప్పుడు సమాచారంపై తాను ఎందుకు స్పందించలేదనే విషయాన్ని వెల్లడించారు. నెగెటివ్ వార్తలు రాయడం అనేది ఈ రోజుల్లో కొత్త ట్రోలింగ్ ట్రెండ్ అని అభిషేక్ అన్నారు. తాను ఏం మాట్లాడిన ప్రజలు నెెగెటివ్గానే తీసుకుంటారని స్పష్టం చేశారు.అభిషేక్ బచ్చన్ మాట్లాడుతూ.. "గతంలో నా గురించి వచ్చిన కథనాలేవీ నన్ను ఎలాంటి ప్రభావితం చేయలేదు. ఎందుకంటే ఈ రోజు నాకు ఒక కుటుంబం ఉంది. నేను ఏదైనా మాట్లాడితే అది వారిని చాలా బాధ పెడుతుంది. నేను ఏం చెప్పినా ప్రజలు దాన్ని నెగెటివ్గానే తీసుకుంటారు. ఎందుకంటే నెగెటివ్ వార్తలే ఎక్కువగా అమ్ముడవుతాయి. అలాంటి ప్రతికూలతను బయటపెట్టే వ్యక్తులు తమ మనస్సాక్షితో జీవించాలి. ఇక్కడ మనందరికీ కూడా కుటుంబాలు ఉన్నాయి. ఈ రోజుల్లో ఇది ఒక కొత్త ట్రోలింగ్ ఫ్యాషన్. మీరు సోషల్ మీడియాలో ఏదైనా చెప్పే బదులు.. డైరెక్ట్గా నాతో వచ్చి చెప్పడానికి మీకు అనుమతి ఇస్తా. కానీ నా ఎదురుగా వచ్చి చెప్పడానికి మీకు ధైర్యం ఉండదు. ఎవరైనా నా ఎదురుగా వచ్చి మాట్లాడితే వారిని స్వయంగా నేనే గౌరవిస్తా" అని అన్నారు. కాగా.. అభిషేక్ ప్రస్తుతం కాళిధర్ లపతా చిత్రంలో కనిపించనున్నారు. ఈ సినిమాకు మధుమిత దర్శకత్వం వహించారు. మరోవైపు అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ 2007లో వివాహం చేసుకున్నారు. ఈ జంటకు 13 ఏళ్ల కుమార్తె ఆరాధ్య బచ్చన్ ఉన్నారు. -
'మీ పిల్లలకు తల్లి లేకుండా చేస్తున్నావ్'.. చాలా బాధేసింది: డైరెక్టర్
సింగిల్ పేరెంటింగ్ అన్నది చాలా కష్టం. తల్లి/తండ్రి లేని లోటు తెలియకుండా పిల్లల్ని పెంచాలి. అమ్మానాన్న అన్నీ ఒక్కరై పిల్లల్ని చూసుకోవాలి. ఇద్దరి ప్రేమను ఒక్కరే పంచాలి. బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్ (Karan Johar) కూడా అదే పని చేస్తున్నాడు. 2017లో సరోగసి ద్వారా కవలలకు తండ్రయ్యాడు. అప్పటినుంచి అన్నీ తానై పిల్లల్ని చూసుకుంటున్నాడు. కానీ కొందరు దీన్ని కూడా తప్పుపట్టారు. ఆ చిన్నారులకు తల్లి లేకుండా చేశావని నిర్మాతను విమర్శించారు. ఆ మాటలు తననెంతగానో బాధపెట్టాయంటున్నాడు కరణ్ జోహార్.నాపై నాకే అనుమానంతాజాగా ఓ ఇంటర్వ్యూలో కరణ్ మాట్లాడుతూ.. నీ పిల్లలకు తల్లి లేకుండా చేస్తున్నావన్న విషయం నీకర్థమవుతోందా? అన్న కామెంట్లు చూసి భరించలేకపోయాను. నేనేమైనా తప్పు చేస్తున్నానా? అని నామీద నాకే అనుమానమేసింది. అప్పుడు వెంటనే పిల్లల గదిలోకి వెళ్లాను. అప్పుడు వారి వయసు ఐదేళ్లుంటాయంతే! మీరు సంతోషంగానే ఉన్నారా? అని అడిగాను. నువ్వు మా నాన్నవి కాబట్టి హ్యాపీగా ఉన్నామన్నారు. నేను ఆ సమాధానం కోసమే ఎదురుచూశాను. సింగిల్ పేరెంట్గా..వారి రెస్పాన్స్ విన్నాక నాకు కొండంత ధైర్యం వచ్చింది. ఎవరేమనుకున్నా నాకనవసరం అనిపించింది. సింగిల్ పేరెంట్గా ఉన్నందుకు గర్వంగా ఫీలయ్యాను. మా అమ్మానాన్నకు నేను ఒక్కడినే సంతానం. ఇప్పుడు నేను సింగిల్ పేరెంట్గా ఉన్నాను. నాకు అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ములు, లైఫ్ పార్ట్నర్ అంటూ ఎవరూ లేరు. ఉన్నదల్లా నా కుటుంబం, స్నేహితులు.. వీళ్లెప్పుడూ నా వెన్నంటే ఉంటారు. అందుకు గర్విస్తున్నాను అని చెప్పుకొచ్చాడు.చదవండి: తెలుగు డైరెక్టర్లు ఎవరూ నాతో సినిమా చేయరు.. అందుకే!: విష్ణు -
తెలుగు డైరెక్టర్లు ఎవరూ నాతో సినిమా చేయరు.. అందుకే!: విష్ణు
టాలీవుడ్ హీరో మంచు విష్ణు (Vishnu Manchu)కు హిట్టు పడి చాలా ఏళ్లే అయింది. ఆయన చివరగా జిన్నా మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. 2022లో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఈసారి రొటీన్ సినిమాలు కాదని తన డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్పను పట్టాలెక్కించాడు. దీనికోసం ఎంతో అధ్యయనం చేసిన తర్వాతే కన్నప్ప షూటింగ్ మొదలుపెట్టాడు. మోహన్బాబు, మోహన్లాల్, ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, శరత్ కుమార్ వంటి బడా తారలు కీలక పాత్రలు పోషించారు. కన్నప్పపై ట్రోలింగ్మహాభారత్, రామాయణ్ సీరియల్స్ తెరకెక్కించిన హిందీ దర్శకుడు ముకేశ్ కుమార్ సింగ్ (Mukesh Kumar Singh) ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు. జూన్ 27న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ లభిస్తోంది. దీంతో సినిమా సక్సెస్ మీట్ కూడా నిర్వహించారు. ఈ వేడుకలో విష్ణు.. కన్నప్పపై జరిగిన ట్రోలింగ్ గురించి మాట్లాడాడు. కన్నప్ప సినిమా టీజర్ రిలీజైనప్పుడు ఉత్తి పుణ్యానికే నెగెటివిటీ ప్రచారం చేశారు. యూట్యూబ్లో నాన్నగారి గురించి, నా గురించి ఏమీ లేకపోయినా నెగెటివ్ థంబ్నైల్స్ పెడితే వారికి ఎక్కువ క్లిక్స్ వస్తున్నాయి, ఆదాయం వస్తోంది. వీఎఫ్ఎక్స్ గుర్తించలేకపోయారుఅది ఎంత పెద్ద తప్పని వారు రియలైజ్ అవట్లేదు. లొకేషన్స్ బాలేవు, గ్రాఫిక్స్ బాగోలేవు అని నానామాటలు అన్నారు. చాలామందికి తెలియని విషయమేంటంటే నేను రిలీజ్ చేసిన మొదటి టీజర్లో చాలా తక్కువ వీఎఫ్ఎక్స్ ఉన్నాయి. రెండో టీజర్లో మాత్రం 70% వీఎఫ్ఎక్స్ ఉన్నాయి. అదెవరూ గుర్తించలేకపోయారు. మోహన్లాల్గారి ఎపిసోడ్లో ఆ బాణాలు తప్ప అన్నీ ఒరిజినలే! రియల్ లొకేషన్లో షూట్ చేశాం అన్నాడు. నాతో ఎవరూ చేయరుతెలుగులో లెజెండరీ డైరెక్టర్స్ ఉన్నా, హిందీలో ముకేశ్ కుమార్నే ఎందుకు నమ్మారు? ఆయనకే ఎందుకు డైరెక్షన్ బాధ్యతలు ఇచ్చారన్న ప్రశ్న ఎదురైంది. అందుకు విష్ణు స్పందిస్తూ.. నాతో తెలుగులో ఏ డైరెక్టర్ పని చేయరని నాకు తెలుసు. కన్నప్ప స్క్రిప్ట్ తీసుకెళ్తే ఎవరూ నాతో చేయరని అందరికీ తెలుసు. పైగా దీనికంటే ముందు నేను చేసిన రెండు,మూడు సినిమాలు కూడా పెద్దగా ఆడలేదు. అందువల్ల ఇక్కడ ఎవరూ చేయరు. మహాభారతాన్ని (సీరియల్) అంత గొప్పగా తీసిన ముకేశ్ కన్నప్పను అంతే అద్భుతంగా తెరపై చూపించగలరని నమ్మాను అని చెప్పాడు. ముకేశ్ కుమార్ సింగ్కు దర్శకుడిగా ఇదే తొలి సినిమా కావడం విశేషం!చదవండి: మనస్ఫూర్తిగా ప్రేమించినప్పుడు బాధపడొద్దు: శ్రావణ భార్గవి పోస్ట్ -
డైరెక్ట్గా ఓటీటీకి సలార్ హీరో సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
సలార్ మూవీతో టాలీవుడ్ ప్రేక్షకుల్లో ఫేమ్ తెచ్చుకున్న హీరో పృథ్వీరాజ్ సుకుమారన్. ఆ తర్వాత ఆడుజీవితం సినిమాతో మరోసారి సినీ ప్రియులను అలరించాడు. ఈ ఏడాది ఎంపురాన్-2 మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. మోహన్ లాల్ కీలక పాత్ర పోషించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. ఈ సినిమాకు తానే స్వయంగా దర్శకత్వం వహించారు.ప్రస్తుతం మరో యాక్షన్ థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. కాయోజ్ ఇరానీ దర్శకత్వం వహిస్తోన్న సర్జమీన్ అనే బాలీవుడ్లో చిత్రంలో కనిపించనున్నారు. ఈ మూవీలో కాజోల్ హీరోయిన్గా కనిపించనుంది. దేశభక్తి నేపథ్యంలో వస్తోన్న ఈ మూవీ సైఫ్ అలీ ఖాన్ తనయుడు ఇబ్రహీం అలీ ఖాన్ కీ రోల్ ప్లే చేస్తున్నాడు. ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమార్ ఆర్మీ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్ను మేకర్స్ విడుదల చేశారు. ఈ సినిమాను నేరుగా ఓటీటీలోనే విడుదల చేయనున్నారు.సర్జమీన్ మూవీని జూలై 25 నుంచి జియో హాట్స్టార్ వేదికగా స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ మేరకు అఫీషియల్ ప్రకటన పేరుతో ఓ వీడియోను పంచుకున్నారు. ఈ చిత్రంలో ఇబ్రహీం అలీ ఖాన్ ఉగ్రవాదిగా కనిపంచనున్నట్లు తాజాగా రిలీజ్ చేసిన వీడియో చూస్తే అర్థమవుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ నిర్మిస్తున్తారు. ఈ సినిమాతోనే కాయోజ్ ఇరానీ డైరెక్టర్గా అరంగేట్రం చేస్తున్నారు.సర్జమీన్' కథేంటంటే?కశ్మీర్ నేపథ్యంతో ఈ మూవీని తెరకెక్కించారు. తన విధి పట్ల ఎంతో నిబద్ధత చూపించే విజయ్ మీనన్ (పృథ్వీరాజ్) చుట్టూ తిరుగుతుంది. ఇక ఈ సినిమాలో మీరా పాత్రలో కాజోల్, హర్మన్ పాత్రలో ఇబ్రహీం అలీ ఖాన్ నటించారు. మాతృభూమిని కాపాడటం కంటే ముఖ్యమైనది మరొకటి లేదు అనే క్యాప్షన్తో జియోహాట్స్టార్ ఈ వీడియోను షేర్ చేసింది. Sarzameen ki salamati se badhkar kuch nahi 🇮🇳#Sarzameen, releasing July 25, only on @JioHotstar!#SarzameenOnJioHotstar@itsKajolD #IbrahimAliKhan #KaranJohar @adarpoonawalla @apoorvamehta18 @AndhareAjit @kayoze @MARIJKEdeSOUZA @somenmishra0 @Soumil1212 #ArunSingh… pic.twitter.com/qtxTBsq4Iq— Prithviraj Sukumaran (@PrithviOfficial) June 30, 2025 -
రూ. 25 కోట్ల ఎఫెక్ట్.. అక్షయ్ సినిమాపై మనసు మార్చుకున్న 'పరేష్ రావల్'
బాలీవుడ్లో వినోదాలు పంచిన సిరీస్ల్లో ‘హెరాఫెరీ’ (Hera Pheri) ఒకటి. గత కొన్ని నెలలుగా ‘హెరాఫెరీ 3’ మూవీ సీక్వెల్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. సుమారు 20 ఏళ్ల తర్వాత పార్ట్-3 ప్లాన్ చేశారు. అక్షయ్ కుమార్, సునీల్ శెట్టి, పరేష్ రావల్, టబు, ఓం పురి, గుల్షన్ గ్రోవర్ వంటి స్టార్స్ ఈ సిరీస్లలో నటించారు. అక్షయ్ కుమార్ నిర్మాణ సంస్థ, కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్ సంస్థ ప్రస్తుత సీక్వెల్ను నిర్మిస్తున్నట్లు ప్రకటించింది. అయితే, సడెన్గా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రముఖ నటుడు పరేష్ రావల్ (శంకర్ దాదా ఎంబిబిఎస్ ఫేం) కొద్దిరోజుల క్రితం ప్రకటించారు. కామెడీ ప్రధాన కాన్సెప్ట్తో వచ్చిన గత రెండు సిరీస్లో ఆయన పాత్ర చాలా కీలకం. కానీ, పార్ట్-3 నుంచి ఆయన తప్పుకుంటున్నట్లు చెప్పడంతో సినిమాపై అంచనాలు అన్నీ తారుమారు అయిపోయాయి. దీంతో అక్షయ్ కుమార్ నిర్మాణ సంస్థ రంగంలోకి దిగింది. ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు వారు చర్యలు ప్రారంభించారు. దీంతో పరేష్ రావల్ దిగొచ్చినట్లు తెలుస్తోంది. హెరాఫెరీ-3లో తాను నటిస్తున్నట్లు తాజాగా ప్రకటించారు.'హేరా ఫేరి 3' సినిమా నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన నెల రోజుల తర్వాత తిరిగి అందులో భాగమవుతున్నానని నటుడు పరేష్ రావల్ తాజాగా స్పష్టం చేశారు. ఇటీవల పాడ్కాస్ట్లో కనిపించిన ఆయన, చిత్ర బృందంతో పరిస్థితులు చక్కబడ్డాయని, దర్శకుడు ప్రియదర్శన్తో మంచి స్నేహం ఉందని చెప్పారు. అక్షయ్ కుమార్, సునీల్ శెట్టితో కలిసి ఈ ప్రాజెక్ట్లో చేరానని తెలిపారు. వారు ముగ్గురు మంచి స్నేహితులని పరేష్ రావల్ అన్నారు. ఆపై అక్షయ్ కుమార్ తనకు చిరకాల స్నేహితుడని ఆయన కితాబు ఇచ్చారు. రావల్ అకస్మాత్తుగా సినిమా నుండి నిష్క్రమించిన తర్వాత.., అక్షయ్ కుమార్ నిర్మాణ సంస్థ అతనిపై రూ. 25 కోట్ల దావా వేసింది, అతని చర్యల వల్ల ఆర్థిక నష్టాలు సంభవించాయని, నిర్మాణ షెడ్యూల్కు అంతరాయం కలిగిందని ఆరోపించింది. ఈ కారణం వల్లే ఆయన తిరిగి ఈ ప్రాజెక్ట్లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. పరేష్ రావల్ ఈ మూవీ కోసం రూ. 15 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. ఆయన ఇప్పటికే చిత్ర నిర్మాణ సంస్థ నుంచి అడ్వాన్స్ కూడా తీసుకున్నారట. అందుకే న్యాయపరమైన చిక్కులు వస్తాయిని తన మనసు మార్చుకున్నారని టాక్. బాలీవుడ్లో వినోదాత్మక చిత్రాభిమానులను అలరిస్తుందనే భారీ అంచనాల మధ్య రూపొందుతున్న చిత్ర ‘హేరా ఫేరి 3‘(Hera Pheri 3) . ఈ సినిమాలో బాలీవుడ్ అగ్ర కధానాయకుడు అక్షయ్ కుమార్ నటిస్తున్నాడు. ప్రియదర్శన్ దర్శకత్వం వహిస్తున్నారు. -
మొదటి భార్యతో విడాకులు.. మద్యానికి బానిసయ్యా: అమిర్ ఖాన్
ఇటీవలే సితారే జమీన్ పర్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు బాలీవుడ్ స్టార్ హీరో అమిర్ ఖాన్. ప్రస్తుతం ఈ మూవీ థియేటర్లలో సందడి చేస్తోంది. ఆమిర్ఖాన్ నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన హిట్ ఫిల్మ్ ‘తారే జమీన్ పర్’ (2007)కు సీక్వెల్గా ఈ మూవీ తెరకెక్కించారు. ఈ మూవీ జెనీలియా కీలక పాత్రలో నటించారు. ఆర్ఎస్ ప్రసన్న దర్శకత్వం వహించగా ఆమిర్ఖాన్ ప్రొడక్షన్స్ బ్యానర్పై ఆమిర్ఖాన్, అపర్ణ పురోహిత్ నిర్మించారు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ను సొంతం చేసుకుంది.తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన అమిర్ ఖాన్.. తన వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తన భార్య రీనా దత్తాతో విడిపోయాక ఎదుర్కొన్న పరిస్థితిని వివరించారు. ఆ టైమ్లో తీవ్రమైన ఒత్తిడి, బాధకు గురయ్యానని వెల్లడించారు. దీంతో మద్యానికి బానిసైనట్లు తెలిపారు. నా సినిమా లగాన్ విజయం సాధించినప్పటికీ.. జీవితంలో ఏదో కోల్పోయినట్లు అనిపించదన్నారు. అది తన జీవితంలో చీకటిదశ అని పేర్కొన్నారు.అమిర్ ఖాన్ మాట్లాడుతూ.. 'రీనాతో నేను విడిపోయినప్పుడు ఆ రోజు సాయంత్రంమే మద్యం ఫుల్ బాటిల్ తాగాను. ఆ తర్వాత దాదాపు ఏడాదిన్నర పాటు ప్రతిరోజూ మద్యం తాగాను. ఆ సమయంలో ఎప్పుడూ నిద్రపోలేదు. అధిక మద్యం సేవించడం వల్ల నేను స్పృహ కోల్పోయేవాడిని. ఒక సమయంలో ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించా. ఆ సమయంలో ఎవరినీ కలవడానికి ఇష్టపడలేదు. అదే ఏడాది నా సినిమా లగాన్ రిలీజైంది. అప్పట్లో నన్ను మ్యాన్ ఆఫ్ ది ఇయర్ అని పిలిచారు. అది నాకు చాలా వ్యంగ్యంగా అనిపించింది' అని పంచుకున్నారు.కాగా.. ఆమిర్, రీనా చాలా ఏళ్లుగా ప్రేమలో ఉన్నారు. అంతేకాదు అమిర్ ఖాన్ తన రక్తంతో ఆమెకు ఒక లేఖ కూడా రాశాడు. రీనా మొదట అమిర్ ప్రేమను అంగీకరించలేదు.. కానీ తరువాత ఓకే చెప్పి.. ఇద్దరూ రహస్యంగా వివాహం చేసుకున్నారు. అంతేకాకుండా రీనా దత్తా ఆమిర్ మొదటి చిత్రం 'ఖయామత్ సే ఖయామత్ తక్'లో కూడా ఒక చిన్న పాత్ర పోషించింది. వీరి వివాహమైన 16 ఏళ్ల తర్వాత విడిపోయారు. ఈ జంటకు జునైద్, ఐరా అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. రీనాతో విడాకులు తీసుకున్న తర్వాత.. ఆమిర్ 2005లో చిత్రనిర్మాత కిరణ్ రావును వివాహం చేసుకున్నాడు. ఈ జంట 16 సంవత్సరాల తర్వాత 2021లో విడిపోతున్నట్లు ప్రకటించారు. ఆమిర్ ప్రస్తుతం తన చిరకాల స్నేహితురాలు గౌరీ స్ప్రాట్తో రిలేషన్లో ఉన్నారు. -
దాదాసాహెబ్... అంత ఈజీ కాదు: ఆమిర్ ఖాన్
దివంగత ప్రముఖ దర్శక–నిర్మాత–స్క్రీన్ రైటర్ దాదాసాహెబ్ ఫాల్కే (Dada Saheb Phalke) జీవిత చరిత్ర వెండితెరపైకి రానుంది. ఈ చిత్రంలో ఆమిర్ ఖాన్ టైటిల్ రోల్ చేయనున్నారు. ఆమిర్ ఖాన్ (Aamir Khan)తో ‘త్రీ ఇడియట్స్, పీకే’ వంటి హిట్ చిత్రాలు తెరకెక్కించిన రాజ్కుమార్ హిరాణి దర్శకత్వంలో ఈ దాదాసాహెబ్ బయోపిక్ రూపొందనుంది. తాజాగా ఈ సినిమా గురించి ఆమిర్ ఖాన్ మాట్లాడారు. ‘‘దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ చేయడం అనేది పెద్ద చాలెంజ్. వాణిజ్యపరమైన అంశాలున్న సాధారణ సినిమా కాదు ఇది. ఆ రోజుల్లోనే ఎవరూ ఊహించలేని విధంగా అడ్వెంచర్ చేసిన వ్యక్తి కథ ఇది. అంత ఈజీ కాదుఆయన జీవితంలో ఎన్నో ఎగ్జైట్ చేసే అంశాలు, సంగతులు, సంఘటనలు ఉన్నాయి. అడ్వెంచర్ జర్నీలాంటి ఈ సినిమా చేయడం అంత సులభం కాదు. దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ చేయడాన్ని నేను, రాజు (దర్శకుడు రాజ్కుమార్ హిరాణి కావొచ్చు) పెద్ద గౌరవంగా ఫీల్ అవుతున్నాం. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా చిత్రీకరణను ప్లాన్ చేశాం’’ అని ఆమిర్ ఖాన్ పేర్కొన్నారు. వచ్చే ఏడాది క్రిస్మస్ సందర్భంగా ఈ సినిమాను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని బాలీవుడ్ సమాచారం.చదవండి: '21 లగ్జరీ కార్లు చూసి పడిపోయింది'.. తట్టుకోలేక ఏడ్చేసిన శుభశ్రీ -
షఫాలీ మరణానికి కారణం.. ఉపవాసం సమయంలో అలాంటి ఇంజెక్షనే!
‘కాంటా లగా’ పాటతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటి షఫాలీ జరివాలా (42) (Shefali Jariwala) ఆకస్మిక మరణం అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. 2002 సమయంలో వచ్చిన ఈ సాంగ్తో మొదటి వైరల్ సెలబ్రిటీగా ఆమె గుర్తింపు పొందింది. ఆ సమయంలో ఇన్స్టాగ్రామ్, రీల్స్ వంటివి లేకున్నా ఈ ఒక్క సాంగ్తో యూత్కు దగ్గరైంది. జూన్ 27న కార్డియాక్ అరెస్ట్తో ఆమె మరణించినట్లు మొదట వార్తలు వచ్చాయి. కానీ, ముంబై పోలీసులు ఎలాంటి వివరాలు ప్రకటించలేదు. అయితే, తాజాగా ఆమె మరణం పట్ల పలు విషయాలు తెరపైకి వస్తున్నాయి. ఆమె ఎప్పటికీ అందంగా ఉండాలనే కోరికే ప్రాణం మీదకు తీసుకొచ్చిందిని తెలుస్తోంది.నటి షఫాలీ జరివాలా మరణించిన వెంటనే, ముంబై పోలీసులు విచారణ ప్రారంభించి, ఆమె మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం కూపర్ ఆసుపత్రికి పంపారు. శవపరీక్ష నిర్వహించినప్పటికీ, మరణానికి గల కారణం గురించి వారు ఇంకా వెళ్లడించలేదు. తదుపరి వైద్య విశ్లేషణ కోసం వేచి ఉన్నారు. అయితే, ప్రాథమిక దర్యాప్తులో వైద్యపరమైన కారణాలు ఉండవచ్చని తెలుస్తోంది. షెఫాలి చాలా సంవత్సరాలుగా వృద్ధాప్య వ్యతిరేక (యాంటీ ఏజింగ్) ఇంజెక్షన్లు తీసుకుంటుందని పోలీసు వర్గాలు తెలిపాయి. ఆమె అందుకు సంబంధించిన మెడిసిన్స్తో పాటు ఇంజెక్షన్లను వారు స్వాధీనం చేసుకున్నారు. ఆమె మరణించిన రోజున శుక్రవారం ఇంట్లో పూజా కార్యక్రమాలు జరగడంతో.. ఆమె ఉదయం నుంచి ఉపవాసం ఉన్నారని సమాచారం. దీంతో ఖాళీ కడుపుతోనే యాంటీ ఏజింగ్కు సంబంధించిన ఇంజెక్షన్ తీసుకోవడంతో కార్డియాక్ అరెస్టై ఉంటారని బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆమె ఇంజెక్షన్ తీసుకున్న తర్వాత ఆమె పరిస్థితి ఆందోళనగా మారిందని, ఆమె శరీరం అంతా బాగా వణికిపోయిందని ఆపై స్పృహ కోల్పోయిందని సంఘటన స్థలంలో ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. పోస్ట్మార్టం, ల్యాబ్ నివేదికలను విశ్లేషించిన తర్వాత మరణానికి తుది కారణం నిర్ధారించబడుతుందని పోలీసులు తెలిపారు. జూన్ 29న, షెఫాలి భౌతికకాయాన్ని ఓషివారా శ్మశానవాటికలో దహనం చేశారు. ఆమె భర్త పరాగ్ త్యాగి అంత్యక్రియలు చేస్తుండగా విలపిస్తూ కనిపించారు. తొలుత గాయకుడు హర్మీత్ సింగ్ను ఆమె పెళ్లి చేసుకున్నారు. కొంతకాలానికే వీరు విడిపోయారు. అనంతరం నటుడు పరాగ్ త్యాగీని వివాహమాడారు. -
16 ఏళ్ల పాటు షూటింగ్.. భారతీయ సినీ చరిత్రలో నిలిచిపోయిన సినిమా!
రూ.వందల కోట్ల పెట్టుబడి గురించి ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు గానీ, దాదాపు అరవై ఐదు సంవత్సరాల క్రితమే, భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత ఖరీదైన సినిమా విడుదలైంది. ఈ సెల్యులాయిడ్ దృశ్య కావ్యం కేవలం ఒక సినిమా కాదు. ఓ రకంగా అది ఒక ఒక ఉద్యమం అని చెప్పాలి. దాదాపు 16 సంవత్సరాల పాటు సాగిన నిర్మాణం భారతీయ చలనచిత్ర పరిశ్రమలో నభూతో నభవిష్యతిగా నిలిచింది. అప్పట్లోనే అకౌంటెంట్లకు చెమటలు పట్టించే బడ్జెట్తో రూపొందింది. ఒక హిందీ సినిమా మొత్తం వ్యయం సగటున రూ. 10 లక్షల లోపు ఉన్న సమయంలో కేవలం ఒక పాట గురించి రూ.కోటి ఖర్చు చేశారంటే ఆ సినిమా రూపకర్త గుండెధైర్యం గురించి ఏం చెప్పాలి?అందుకే ఇప్పటికీ ఆ సినిమా గురించి చెప్పుకుంటున్నారు. ఆ సినిమా పేరు.. మొఘల్–ఎ–ఆజమ్ ,ఈ సినిమాకు కె. ఆసిఫ్ నిర్మాణంతో పాటు దర్శకత్వం కూడా వహించారు మొఘల్–ఎ–ఆజం చిత్రాన్ని అనేక చిన్న ద్వీపాలను కొనుగోలు చేయగల బడ్జెట్తో తీశారని అప్పట్లో ఒక ట్రేడ్ విశ్లేషకుడు వర్ణించారు. ఈ క్లాసిక్ ఇండియన్ సినిమాలో పృథ్వీరాజ్ కపూర్, దిలీప్ కుమార్, మధుబాల దుర్గా ఖోటే వంటి నాటి మేటి నటులు నటించారు. 1960లో విడుదలైన మొఘల్–ఎ–ఆజం(Mughal-E-Azam) మొఘలుల రాచరిక ప్రపంచపు అహాలను వ్యూహాలను మాత్రమే కాదు ప్రేమైక హృదయాలను కూడా మనకు దగ్గర చేస్తుంది. నాటి అందాల నటి మధుబాలపై చిత్రీకరించిన ప్రేమికులకు ఇప్పటికీ ధైర్య సాహసాలను ప్రబోధించే గీతం ‘ప్యార్ కియా తో దర్నా క్యా‘, పాట చిత్రీకరణకు ఏకంగా రూ. 1 కోటి ఖర్చు అయింది. ఈ పాటను లాహోర్ కోటలోని షీష్ మహల్ కు ప్రతిరూపంలో చిత్రీకరించారు. ఈ పాట సెట్ నిర్మాణానికి ప్రస్తుతం ఒక భారీ చిత్ర నిర్మాణానికి అయ్యే విధంగా దాదాపు రెండు సంవత్సరాలు పట్టింది. చక్రవర్తి అక్బర్గా పృథ్వీరాజ్ కపూర్, అధికార సునామీలా ఆదేశాలను అమలు చేస్తూంటే, రాజకీయ ఉద్రిక్తత రాజభవన కుట్రల మధ్యలో ప్రేమ కోసం తిరుగుబాటుదారుడుగా మారిన యువరాజు సలీమ్గా దిలీప్ కుమార్, ఆయన ప్రేయసి అనార్కలిగా మధుబాల మనకు ఈ చిత్రంలో కనిపిస్తారు. ఈ చిత్రంలో అనార్కలి ప్రేమకథను చూడటం మాత్రమే కాదు కళ వేదన మధ్య నిజ జీవిత యుద్ధాన్ని ప్రేక్షకులు చవిచూస్తారు.అత్యధిక కాలం ఈ చిత్ర నిర్మాణం జరగడానికి తరచుగా షూటింగ్స్కు అంతరాయాలు కూడా దీనికి కారణం. నిర్మాణ విరామాలతో పాటు రెండవ ప్రపంచ యుద్ధం నేపధ్యంలో రూపొందడం, నటీనటుల మార్పులు (సలీం పాత్ర పోషించిన మొదటి నటుడు స్థానంలో దిలీప్ కుమార్ వచ్చారు) ఆర్ధిక సమస్యలు వెంటాడడం... ఇలాంటివెన్నో సంభవించాయి. అవన్నీ ఎదుర్కుంటూనే కె. ఆసిఫ్ తన సర్వశక్తులు కేంద్రీకరించి మొఘల్–ఎ–ఆజం ను ఒక సినిమాలా కాకుండా యజ్ఞంలా తలపోయడంతో..ప్రతి సన్నివేశం ఒక కళాఖండంలా అనిపిస్తుంది. దీనికో ఉదాహరణ యుద్ధ సన్నివేశాల కోసం నిజమైన సైనికులను తీసుకోవాలని భావించిన కె. ఆసిఫ్ అందుకు భారత సైన్యాన్ని ఒప్పించడం , 1960 ఆగస్ట్ 5న విడుదలైన మొఘల్–ఎ–ఆజం రూ. 11 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. ద్రవ్యోల్బణం, ప్రేక్షక జనసాంద్రత వగైరాలను పరిగణనలోకి తీసుకుంటే మొఘల్–ఎ–ఆజం ఇప్పటిదాకా అత్యధిక వ్యయంతో పాటు వసూళ్లు చేసిన హిందీ చిత్రంగా నిలుస్తుందని వాణిజ్య విశ్లేషకులు అంటున్నారు.మొదట నలుపు–తెలుపులో ఒకే ఒక పాటతో విడుదలైన ఈ చిత్రాన్ని ఆ తర్వాత డిజిటల్గా రంగులు వేసి 2004లో తిరిగి విడుదల చేశారు తద్వారా కలర్ ఫుల్గా మారిన మొదటి నలుపు–తెలుపు భారతీయ చిత్రంగా కూడా ఇది నిలిచింది. తొలి రీరిలీజ్ చిత్రంగా, మరోసారి బాక్సాఫీస్ వద్ద హిట్ అయింది. అటు కలెక్షన్ల రికార్డ్స్తో పాటు జాతీయ అవార్డ్ సహా పలు ఫిల్మ్ ఫేర్ అవార్డులను సైతం దక్కించుకున్న ఈ సినిమా..భారతీయ సినిమా చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక పేజీని దక్కించుకుంది. -
తెలుగులో ఎప్పుడో నటించిన దీపికా.. ఆమె ఆస్తి ఎంతో తెలుసా?
బ్యాడ్మింటన్ కోర్టు వదిలేసి, మోడలింగ్ ప్రపంచంలో నాజూకు అడుగులతో మొదలుపెట్టింది. నేడు వెండితెర మీద తనదైన సామ్రాజ్యం నిర్మించుకుంది నటి దీపికా పదుకొణే. ఇప్పుడు కాస్త గ్యాప్ తీసుకొని త్వరలో రాబోతుండటంతో, ఎక్కడ చూసినా ఆమె పేరే ఒక హాట్ టాపిక్! అల్లు అర్జున్ – అట్లీ కాంబినేషన్లో రూపొందే సినిమాలో ఆమెను కథానాయికగా ఎంపిక చేయడం సినీ పరిశ్రమలో పెద్ద వార్తగా మారింది. ఆమె గురించి కొన్ని విషయాలు మీకోసం..బ్యాడ్మింటన్ ఆట నుంచి..దీపికా పదుకొణె (Deepika Padukone) కొంకణి అమ్మాయి. ఆమె తండ్రి ప్రకాశ్ పదుకొణే భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన బ్యాడ్మింటన్ క్రీడాకారుడు. తండ్రి ప్రభావంతో బ్యాడ్మింటన్ ఆడిన దీపికా, రాష్ట్రస్థాయి పోటీల్లోనూ పాల్గొంది. కాని తనకు సినిమా, మోడలింగ్పై ఆసక్తి ఎక్కువగా ఉండటంతో నటన వైపు మొగ్గుచూపింది. ఆమె సినీ ప్రయాణం తెలుగు సినిమా ‘మన్మథుడు’ ఆధారంగా రూపొందిన కన్నడ రీమేక్ ‘ఐశ్వర్య’ చిత్రంతో మొదలైంది. తెలుగులో ఎప్పుడో యాక్ట్ చేసిందితెలుగు దర్శకుడు జయంత్ సి. పరాన్జీ, దీపికాకు తెలుగులో మొదటి అవకాశం ఇచ్చారు. ఓ యువ ప్రేమకథలో ప్రత్యేక పాటలో నాట్యం చేసింది. ఆ సినిమా పూర్తయింది. కానీ, ఇప్పటికీ విడుదల కాలేదు. లేకపోతే ఆమె టాలీవుడ్లో ఎప్పుడో అడుగుపెట్టేది. ‘కల్కి’ సినిమాలో సుమతి పాత్రతో ఆకట్టుకున్న దీపికా, ఇప్పుడు మళ్లీ అల్లు అర్జున్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.గ్లామర్లో తగ్గేదేలే‘రామ్ లీలా’ సినిమా చిత్రీకరణ సమయంలో రణ్వీర్ సింగ్తో పరిచయం ప్రేమగా మారింది. అంతకు ముందు రణ్బీర్ కపూర్తో ప్రేమలో ఉన్న ఆమె, ఆ బ్రేకప్ తర్వాత కొత్త జీవితం మొదలుపెట్టింది. పెళ్లి అయినా, తల్లి అయినా, దీపికా తన గ్లామర్ను తగ్గించుకోలేదు. తన పని పట్ల నిబద్ధతతో ప్రవర్తించేది. హిందీ సినీ ప్రపంచంలో ఆమె తొలి సినిమా ‘ఓం శాంతి ఓం’, షారుఖ్ ఖాన్తో కలసి నటించింది. ఆ చిత్రం ఆమె సినీ జీవితాన్ని మలుపు తిప్పింది. ఆ తర్వాత ‘చెన్నై ఎక్స్ప్రెస్’, ‘హ్యాపీ న్యూ ఇయర్’, ‘పఠాన్’, ‘జవాన్’లాంటి హిట్ సినిమాల్లో నటించింది.రూ.500 కోట్లకు పైగా ఆస్తులుహాలీవుడ్లోనూ నటించే అవకాశం పొందిన దీపికా, ప్రపంచ సినీరంగంలో కూడా తనకంటూ ఓ స్థానాన్ని ఏర్పరచుకుంది. ప్రస్తుతం దీపికా ఆస్తుల విలువ దాదాపు రూ.500 కోట్లకు పైగా ఉంది. ముంబైలో ఆమెకు అంధేరి, బాంద్రా, ప్రభాదేవి ప్రాంతాల్లో మూడు ఇళ్లు ఉన్నాయి. 2022లో ఆమె సొంతంగా సౌందర్య ఉత్పత్తుల బ్రాండ్ను ప్రారంభించింది. ఇళ్లపై పెట్టుబడులు పెట్టడాన్ని ఆమె ఇష్టంగా భావిస్తుంది.రహస్యాన్ని అతడికే చెప్తాఓ ఇంటర్వ్యూలో తల్లి అయ్యాక, తన పాత్రల ఎంపికలో మరింత జాగ్రత్త వహిస్తున్నానని, బిడ్డకు సమయాన్ని ఇచ్చేలా ప్రయత్నిస్తున్నానని చెప్పింది. ఓ కార్యక్రమంలో ‘ఒక రహస్యాన్ని చెవిలో చెప్పాలంటే ఏ హీరోకి చెబుతారు?’ అన్న ప్రశ్నకు వెంటనే షారుఖ్ ఖాన్ అని బదులిచ్చింది. 2007లో రణ్బీర్ కపూర్తో పరిచయం, ప్రేమగా మారింది. ఒకే మేకప్ ఆర్టిస్ట్ కారణంగా ఫోన్ నంబర్లు మార్చుకుని ప్రేమలో పడ్డారు. తన మెడ వెనక అతడి పేరు టాటూ వేయించుకుంది. కాని, ఏడాదిలోనే బ్రేకప్ జరిగింది.డిప్రెషన్రణ్బీర్ కపూర్ మరో అమ్మాయితో సంబంధం పెట్టుకోవడం వల్ల విడిపోయినట్లు ఓ సందర్భంలో దీపిక చెప్పింది. దీని వలన డిప్రెషన్కు లోనైనా, కెరీర్పై ప్రభావం రాకుండా చూసుకుంది. ‘ఏ జవానీ హై దివానీ’ సినిమా అదే సమయంలో పూర్తి చేసింది. ఇప్పుడు ఇద్దరూ ఎవరి జీవితాల్లో వాళ్లు బిజీ అయిపోయారు. దీపికా – రణ్వీర్ సింగ్ను పెళ్లి చేసుకుని ఒక పాపకు జన్మనిచ్చింది. మరోవైపు రణ్బీర్ కపూర్ – ఆలియా భట్ను వివాహం చేసుకుని పాపకు తండ్రయ్యాడు. ఇప్పటికీ వీరిద్దరూ ఒకరిని ఒకరు ప్రొఫెషనల్గానే పలకరించుకుంటారు.చదవండి: స్క్విడ్ గేమ్ 3 రివ్యూ.. ఊహించని క్లైమాక్స్, అందరికీ రుచిస్తుందా? -
5 పెళ్లిళ్లు.. 300 సినిమాలు.. చేతిలో చిల్లిగవ్వ లేక దిక్కులేని స్థితిలో..
కరాటేలో బ్లాక్బెల్ట్.. డ్యాన్సర్, మోడల్. ఇవన్నీ కాదని నటనవైపు అడుగులు వేశాడు. 300 సినిమాలు చేశాడు. తెలుగు, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో విలనిజం పండించాడు. వెండితెరపై తిరుగులేని నటుడిగా రాణించాడు. కానీ, నిజ జీవితంలో మాత్రం ఒంటరితనంతో పోరాడి పేదరికంలో మగ్గిపోయి మరణించాడు. అతడే నటుడు మహేశ్ ఆనంద్ (Mahesh Anand).కెరీర్1982లో సనమ్ తేరీ కసం మూవీలో బ్యాక్గ్రౌండ్ డ్యాన్సర్గా పనిచేశాడు. రెండేళ్ల గ్యాప్ తర్వాత కమల్ హాసన్ 'కరిష్మా' చిత్రంతో నటుడిగా మారాడు. సస్తి దుల్హన్ మహేంగ దుల్హ చిత్రంతో హీరోగా మారాడు. అది వర్కవుట్ కాకపోవడంతో విలన్గా స్థిరపడిపోయాడు. బాలీవుడ్లో కరడుగట్టిన విలన్గా పేరు గడించిన మహేశ్ ఆనంద్.. తెలుగులో లంకేశ్వరుడు, ఎస్పీ పరశురామ్, బొబ్బిలి సింహం, ఘరానా బుల్లోడు, అల్లుడా మజాకా, నెంబర్ వన్, బాలు వంటి చిత్రాల్లో యాక్ట్ చేసి ఇక్కడి జనానికి దగ్గరయ్యాడు.ఐదు పెళ్లిళ్లువెండితెరపై ఇంత పాపులారిటీ సంపాదించుకున్న ఈయన వైవాహిక జీవితంలో మాత్రం విఫలమవుతూనే వచ్చాడు. మొదట బర్క రాయ్ను పెళ్లి చేసుకుని విడాకులిచ్చాడు. 1987లో మిస్ ఇండియా ఇంటర్నేషనల్ ఎరిక డిసౌజను వివాహం చేసుకున్నాడు. కానీ ఈ బంధం కూడా ఎంతోకాలం నిలవలేదు. ఆమెకు విడాకులిచ్చేశాక 1992లో మధు మల్హోత్రాను పెళ్లి చేసుకున్నాడు. మూడో పెళ్లి కూడా మూణ్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. అవకాశాలు దూరంఅనంతరం నటి ఉషా బచ్చనిని పెళ్లాడాడు. రెండేళ్లకే (2000-2002) వీరిద్దరూ విడిపోయారు. ఈ సమస్యలు మహేశ్ కెరీర్ను కూడా ప్రభావితం చేశాయి. 2005 తర్వాత ఆయనకు సినిమా అవకాశాలే రాలేదు. 2019లో రంగీలా రాజా అని ఒకే ఒక్క మూవీ చేశాడు. ఇదే ఆయన ఆఖరి చిత్రం. దాంపత్య జీవితంలో నాలుగుసార్లు విఫలమైన మహేశ్.. 2015లో రష్యన్ యువతి లనాను ఐదో పెళ్లి చేసుకున్నాడు. కానీ తర్వాత ఆమె కూడా నటుడిని వదిలేసినట్లు తెలుస్తోంది. పేదరికంలో మగ్గిన నటుడువందల సినిమాలు చేసిన మహేశ్.. దాదాపు 18 ఏళ్లపాటు కటిక పేదరికంలోనే మగ్గిపోయాడు. ఈ విషయాన్ని అతడే ఓ ఫేస్బుక్ పోస్ట్లో వెల్లడించాడు. నేను తాగుబోతునని అందరూ అంటుంటారు. నాకంటూ ఎవరూ లేరు. నా స్టెప్ బ్రదర్ రూ.6 కోట్లు తీసుకుని మోసం చేశాడు. 300కి పైగా సినిమాలు చేశా.. కానీ, ఇప్పుడు నీళ్ల బాటిల్ కొనుక్కునేందుకు కూడా డబ్బుల్లేవు. ఈ ప్రపంచంలో నాకంటూ ఒక్క స్నేహితుడు కూడా లేకపోవడం విషాదకరం అని రాసుకొచ్చాడు.మూడురోజులుగా కుళ్లిపోయిన మృతదేహం2019 ఫిబ్రవరి 9న మహేశ్ తన ఇంట్లోనే విగతజీవిగా కనిపించాడు. మూడు రోజులుగా ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో అతడి సోదరికి అనుమానం వచ్చింది. పోలీసులకు సమాచారమివ్వడంతో వారు వెళ్లి చూడగా నటుడు సోఫాలో శవమై కనిపించాడు. అతడి పక్కనే మందు బాటిళ్లు కూడా ఉన్నాయి. అది సహజ మరణమేనని వైద్యులు ధ్రువీకరించారు. కానీ, అప్పటికే మరణించి మూడు రోజులైనట్లు వెల్లడించారు.చదవండి: ఆ డైరెక్టర్ తిట్టాడు.. నావల్ల కాక ఏడ్చేశా: కీర్తి సురేశ్ -
ఆ సీన్ తర్వాత గతం మర్చిపోయిన అమ్రిష్ పురి..
హీరోయిన్ కాజోల్కు మతిమరుపు ఉండేది. కుచ్కుచ్ హోతా హై సినిమా సెట్లో పదేపదే అన్నింటినీ మర్చిపోయేది. ఓసారి తనే ఈ విషయాన్ని వెల్లడించింది. అయితే లెజెండరీ నటుడు అమ్రిష్ పురి (Amrish Puri) ఒకానొక సందర్భంలో తనెవరన్నది కూడా మర్చిపోయాడని చెప్పింది. ఓ ఇంటర్వ్యూలో కాజోల్ మాట్లాడుతూ.. అజయ్ దేవ్గణ్, అమ్రిష్ పురి ఓ సినిమాలో కలిసి నటించారు. అంతా మర్చిపోయిన అమ్రీష్పురిఅందులో అమ్రీష్.. జలపాతం కింద నిల్చునే సీన్ ఉంది. అందుకోసం ఆయన వాటర్ఫాల్ కింద నిలబడ్డారు. పైనుంచి ఎంతో వేగంగా వస్తున్న నీళ్లు ఆయన తలను కొట్టుకుంటూ కిందపడేవి. తలకు రక్షణగా ఏదీ పెట్టలేదు. సన్నివేశం అయిపోగానే ఆయన వాటర్ఫాల్ నుంచి వచ్చేశారు. కానీ అన్నీ మర్చిపోయాడు. అసలేదీ గుర్తులేదు. నేనెవర్ని? నేనిక్కడేం చేస్తున్నాను? అని ప్రశ్నించాడు. సెట్లో ఉన్నవాళ్లందరికీ భయంతో చెమటలు పట్టాయి. తనకు జ్ఞాపకశక్తి రావడానికి మూడు గంటలు పట్టింది. కరడుగట్టిన విలన్గా..ఇప్పుడు తల్చుకుంటే సరదాగా అనిపిస్తుందేమోకానీ ఆ సమయంలో మాత్రం అందరూ చాలా భయపడ్డారు అని చెప్పుకొచ్చింది. అమ్రీష్ పురి, అజయ్ దేవ్గణ్.. టార్జాన్: ద వండర్ కార్, ఫూల్ ఔర్ కాంటే, హల్చల్, గెయిర్ వంటి చిత్రాల్లో కలిసి నటించారు. హిందీలో వందలాది సినిమాలు చేసిన అమ్రిష్ పురి.. ఆదిత్య 369, బాబా, జగదేక వీరుడు అతిలోక సుందరి, మేజర్ చంద్రకాంత్, నిప్పురవ్వ వంటి పలు చిత్రాల్లో నటించారు. కరడుగట్టిన విలన్గా ప్రేక్షకులను తన ఆహార్యంతోనే భయపెట్టేవారు. 2005లో బ్లడ్ క్యాన్సర్తో కన్నుమూశారు.చదవండి: కన్నప్పలో ప్రభాస్ పెళ్లి టాపిక్.. రచ్చ లేపిన ఫ్యాన్స్ -
గుండె పోటు కాదు.. 42 ఏళ్ల నటి మృతిపై అనుమానాలు!
‘కాంటా లగా’ఫేం, బాలీవుడ్ నటి షెఫాలీ జరివాలా(42) మృతితో బాలీవుడ్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రియాంక చోప్రా, లారదత్తాతో పాటు పలువుడు బాలీవుడ్ తారలు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు. శుక్రవారం ఆమె గుండెపోటుతో మరణించినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆమె గుండెపోటుతో మరణించినట్లు ఆధారలేవి లేవని, మృతికి ఇంకా కారణాలు తెలియలేదని పోలీసులు చెబుతున్నారు.అసలేం జరిగిందంటే.. శుక్రవారం రాత్రి షెఫాలి తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఆమె భర్త పరాగ్ త్యాగి ఆమెను అంథేరిలోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. ఆమెను పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు వెల్లడించారు. అమె కార్డియాక్ అరెస్ట్తో మృతి చెందినట్లు తొలుత వార్తల వచ్చాయి. కానీ ఆమె కుటుంబ సభ్యులు మాత్రం వాటిని ధ్రువీకరించలేదు.పోలీసులు ఏం చెబుతున్నారంటే.. షఫాలీ మృతిపై తాజాగా ముంబై పోలీసులు అప్డేట్ ఇచ్చారు. ఆమె మృతికి గల కారణాలు ఇంకా తెలియలేదని, ప్రస్తుతం అనుమానాస్పద ఘటనగానే పరిగణలోకి తీసకొని దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. ‘అర్థరాత్రి ఒంటిగంట సమయంలో మాకు సమాచారం వచ్చింది. అంధేరీలోని షఫాలి నివాసంలో ఆమె మృతదేహాన్ని పరిశీలించాం. పోస్ట్మార్టం నిమిత్తం మృతదేహాన్ని కూపర్ ఆస్పత్రికి తరలించాం. మరణానికి గల కారణాలపై ఇంకా స్పష్టత రాలేదు. ప్రస్తుతం ఆమె అపార్ట్మెంట్లో ఫోరెన్సిక్ నిపుణులు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. అలాగే ఇంట్లో పని చేస్తున్న వారిని, వంట మనిషిని ప్రశిస్తున్నాం. ప్రస్తుతానికి అయితే అనుమానస్పద ఘటనగానే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం’ అని ముంబై పోలీసులు తెలిపారు.రీమిక్స్ సాంగ్తో ఫేమస్.. 2002లో వచ్చిన ‘కాంటా లగా’ రీమిక్స్ సాంగ్తో ఫేమస్ అయింది షెఫాలి. ఈ గుర్తింపుతోనే సినిమా అవకాశాలు వచ్చాయి. సల్మాన్ ఖాన్ ముజ్సే షాదీ కరోగా చిత్రంలో కీలక పాత్ర పోషించింది. అనంతరం పలు టీవీ రియాలిటీ షోలతో పాపులారిటీ సంపాదించుకుంది. హిందీ బిగ్బాస్ సీజన్ 13లోనూ కంటెస్టెంట్గా పాల్గొని అలరించింది. 2004లో సంగీత దర్శకుడు హర్మీత్ సింగ్ని వివాహం చేసుకుంది. 2009లో అతనితో విడాకులు తీసుకొని.. 2015లో నటుడు పరాగ్ త్యాగిని రెండో వివాహం చేసుకుంది. -
రెండో బిడ్డ జననం.. ఫోటో షేర్ చేసిన ఇలియానా
దేవదాసు, పోకిరి, జులాయి వంటి చిత్రాలతో తెలుగులో టాప్ హీరోయిన్గా రాణించింది ఇలియానా డీక్రూజ్ (Ileana D'Cruz). ఒకప్పుడు వరుసపెట్టి సినిమాలు చేసిన ఈ బ్యూటీ ప్రస్తుతం యాక్టింగ్ పక్కన పెట్టి కుటుంబానికే పెద్ద పీట వేస్తోంది. ఇటీవలే ఆమె రెండో బిడ్డకు జన్మనిచ్చింది. తాజాగా ఈ బుడ్డోడి ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అలాగే అతడికి ఏం పేరు పెట్టిందో కూడా వెల్లడించింది. శుభాకాంక్షల వెల్లువజూన్ 19న జన్మించిన కెయాను రఫె డోలన్ను మీ అందరికీ పరిచయం చేస్తున్నందుకు మా హృదయాలు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నాయి అని క్యాప్షన్ జోడించింది. ఈ పోస్ట్కు హీరోయిన్ ప్రియాంక చోప్రా స్పందిస్తూ.. శుభాకాంక్షలు తెలిపింది. పలువురు సెలబ్రిటీలు, అభిమానులు.. ఇలియానాకు అభినందనలు తెలియజేస్తున్నారు.పెళ్లి- పిల్లలుఇలియానా.. 2023లో విదేశీయుడు మైఖేల్ను పెళ్లి చేసుకుంది. అదే ఏడాది ఆగస్టులో పండంటి కొడుక్కి జన్మనిచ్చింది. అతడికి కోవా ఫోనిక్స్ డోలన్ అని నామకరణం చేసింది. ఇప్పుడు మరోసారి కొడుకే జన్మించాడు. ఇకపోతే ఇలియానా చివరగా 'దో ఔర్ దో ప్యార్' సినిమాలో కనిపించింది. 'రైడ్ 2'లో నటించే ఆఫర్ వచ్చినప్పటికీ చిన్న పిల్లాడు ఉన్నందున ఆ సినిమాను వదిలేసుకుంది. View this post on Instagram A post shared by Ileana D'Cruz (@ileana_official) చదవండి: 'కాంటా లగా' సాంగ్తో సెన్సేషన్.. నటి కన్నుమూత -
'కాంటా లగా' సాంగ్తో సెన్సేషన్.. నటి కన్నుమూత
బాలీవుడ్ నటి, కాంటా లగా సాంగ్ ఫేమ్ షెఫాలీ జరివాలా (42) ఆకస్మికంగా మరణించారు. శుక్రవారం రాత్రి ఆమె తీవ్ర అస్వస్థతకు గురికావడంతో భర్త పరాగ్ త్యాగి వెంటనే ఆమెను అంధేరిలోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లాడు. ఆమెను పరీక్షించిన వైద్యులు అప్పటికే నటి మృతి చెందినట్లు వెల్లడించారు. పోస్టుమార్టమ్ కోసం ఆమె మృతదేహాన్ని కూపర్ ఆస్పత్రికి తరలించారు. తొలుత ఆమె గుండెపోటుతో మరణించినట్లుగా వార్తలు వెలువడ్డాయి. దీనిపై పోలీసులు స్పందిస్తూ.. నటి మృతికి ఇంకా కారణాలు తెలియలేదన్నారు. ఫోరెన్సిక్ నిపుణులు ఆమె నివాసంలో పలు ఆధారాలను సేకరిస్తున్నారని తెలిపారు. షెఫాలి (Shefali Jariwala) మృతి పట్ల సెలబ్రిటీలు, అభిమానులు తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేస్తున్నారు.నటి ప్రయాణం సాగిందిలా..షెఫాలీ జరివాలా 2002లో వచ్చిన కాంటా లగా సాంగ్తో ఒక్కసారిగా ఫేమస్ అయ్యారు. అప్పటినుంచి అభిమానులు ఆమెను కాంటా లగా గర్ల్ అనే పిలుచుకుంటున్నారు. ఈ గుర్తింపుతోనే ముజ్సే షాదీ కరోగి చిత్రంలో షెఫాలీకి నటించే ఛాన్స్ వచ్చింది. అలాగే కన్నడలో హుడుగరు మూవీలో యాక్ట్ చేశారు. బేబీ కమ్నా అనే వెబ్ సిరీస్లోనూ కనిపించారు. హిందీ బిగ్బాస్ 13వ సీజన్లోనూ పాల్గొన్నారు. షెఫాలి.. 2004లో సంగీత దర్శకుడు హర్మీత్ సింగ్ను పెళ్లాడారు. కానీ ఈ బంధం ఎంతోకాలం నిలవలేదు. 2009లో విడిపోయారు. అనంతరం 2015లో నటుడు పరాగ్ త్యాగిని రెండో పెళ్లి చేసుకున్నారు.చదవండి: ఆస్కార్ కమిటీలో ఇండియన్ స్టార్స్ -
ఆస్కార్ కమిటీలో ఇండియన్ స్టార్స్
‘‘ప్రపంచ సినిమాకి చెందిన నటీనటులను, సాంకేతిక నిపుణులను అకాడమీలోకి ఆహ్వానిస్తున్నందుకు మాకెంతో థ్రిల్గా, ఆనందంగా ఉంది. అంకితభావం, నిబద్ధతతో ప్రపంచ చలన చిత్ర పరిశ్రమ పురోగతికి కృషి చేస్తున్న ప్రతిభావంతులు వీరు ’’ అంటూ ఆస్కార్ అకాడమీ కమిటీ సీఈవో బిల్ క్రామర్, ప్రెసిడెంట్ జానెట్ యాంగ్ పేర్కొన్నారు. 98వ ఆస్కార్ అవార్డు వేడుక వచ్చే ఏడాది మార్చి 15 (భారతీయ కాలమానం ప్రకారం మార్చి 16)న లాస్ ఏంజెల్స్లో జరగనుంది. ఈ నేపథ్యంలో ఆస్కార్ అవార్డు కమిటీ ఈ వేడుకకు సంబంధించిన పనులు మొదలుపెట్టింది.ఇందులో భాగంగా విజేతల ఎంపిక ఓటింగ్ కోసం అకాడమీలో సభ్యులుగా చేరాలంటూ దేశ, విదేశాలకు చెందిన సినిమా తారలకు ఆహ్వానం పంపింది కమిటీ. ఆ జాబితాను విడుదల చేసింది. ఈ ఏడాది కొత్తగా 534 మందికి సభ్యత్వం ఇస్తున్నట్లుగా పేర్కొంది. వారిలో యాక్టింగ్ విభాగంలో ఇండియన్ స్టార్స్ కమల్హాసన్, ఆయుష్మాన్ ఖురానాలకు, దర్శకురాలుపాయల్ కపాడియా, సినిమాటోగ్రాఫర్ రణబీర్ దాస్, క్యాస్టింగ్ డైరెక్టర్ కరణ్, ఫ్యాషన్ డిజైనర్ మ్యాక్సిమా బసు, డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ స్మృతీ ముంద్రాలకు ఆహ్వానం పంపారు.ఆస్కార్ అవార్డు విజేతల ఎంపిక ప్రక్రియలో వీరికి ఓటు హక్కు లభిస్తుంది. నామినేషన్ల దశ నుంచి విజేతల ఎంపిక వరకూ సభ్యులు ఓటింగ్లోపాలు పంచుకోవాల్సి ఉంటుంది. కాగా కొత్తగా ఎంపిక చేసిన 534 మంది సభ్యుల్లో స్త్రీల సంఖ్య 41 శాతం ఉన్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. జనవరి 12 నుంచి 16 వరకు నామినేషన్ ప్రక్రియ జరుగుతుంది. నామినేషన్ దక్కించుకున్నవారి జాబితాను జనవరి 22న ప్రకటిస్తారు. -
వార్కు కౌంట్డౌన్ స్టార్ట్
థియేటర్స్లో ‘వార్ 2’కి యాభై రోజుల కౌంట్డౌన్ మొదలైంది. హృతిక్ రోషన్, ఎన్టీఆర్, కియారా అద్వానీ లీడ్ రోల్స్లో నటించిన స్పై యాక్షన్ సినిమా ‘వార్ 2’. ‘వైఆర్ఎఫ్ (యశ్రాజ్ ఫిల్మ్స్)’ స్పై యూనివర్స్లో భాగంగా రూపొందిన ‘వార్ 2’ని అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ఆదిత్యా చోప్రా నిర్మించారు. ఈ చిత్రం ఆగస్టు 14న విడుదల కానుంది.కాగా ఈ సినిమా విడుదలకు సరిగ్గా 50 రోజులు ఉన్న నేపథ్యంలో ఈ సినిమాలో నటించిన ఎన్టీఆర్, హృతిక్ రోషన్, కియారా అద్వానీల పోస్టర్స్ను మేకర్స్ గురువారం విడుదల చేశారు. అలాగే ‘వార్ 2’ సినిమాను ఉత్తర అమెరికా, మిడిల్ ఈస్ట్, యూకె, యూరప్, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, సౌత్ ఈస్ట్ ఆసియా సహా భారతదేశంలో ఐమ్యాక్స్ థియేటర్లలో విడుదల చేయనున్నట్లుగా కూడా మేకర్స్ తెలిపారు. ‘‘భారతీయ సినీ పరిశ్రమలో ఇద్దరు సూపర్ స్టార్స్ హృతిక్ రోషన్, ఎన్టీఆర్ల మధ్య జరిగే ఈ అద్భుతమైన పోరును ఐమ్యాక్స్ ఫార్మాట్లో ప్రదర్శించడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులకు, ప్రేక్షకులకు ఒక అద్భుతమైన అనుభూతిని అందించనున్నాం’’ అని తెలిపారు యశ్ రాజ్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిబ్యూషన్ వైస్ ప్రెసిడెంట్ నెల్సన్ డిసౌజా. ‘‘యాక్షన్’ చిత్రాలకే ‘వార్ 2’ సినిమా ఓ పాఠంలా ఉంటుంది. ప్రేక్షకులు మర్చిపోలేని సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ను ఐమ్యాక్స్లో మాత్రమే పొందగలరు’’ అని పేర్కొన్నారు ఐమ్యాక్స్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్, డిస్ట్రిబ్యూషన్ వైస్ ప్రెసిడెంట్ క్రిస్టఫర్ టిల్లా్మన్. -
తమన్నా మాజీ ప్రియుడితో డేటింగ్.. దంగల్ నటి ఏమన్నారంటే?
దంగల్ ఫేమ్ ఫాతిమా సనా షేక్ ఇటీవల ఎక్కువగా వినిపిస్తోంది. అమిర్ ఖాన్ దంగల్ మూవీలో గీతా ఫోగట్ పాత్రలో ఆమె అదరగొట్టేసింది. 2015లో ఆమె తెలుగులో నటించిన ‘నువ్వు నేను ఒకటవుదాం’ అనే చిత్రంలోనూ నటించింది. అయితే ఆ మూవీ తర్వాత మరో సినిమా చేస్తున్న క్రమంలోనే ఒక నిర్మాత నుంచి కాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నట్లు గతంలో చెప్పుకొచ్చింది. ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం ఆమె 'మెట్రో... ఇన్ డినో' అనే మూవీలో కనిపించనుంది.ఈ మూవీ తర్వాత ఫాతిమా సనా షేర్.. గుస్తాక్ ఇష్క్ అనే చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాలో తమన్నా మాజీ బాయ్ఫ్రెండ్ విజయ్ వర్మ హీరోగా నటిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇద్దరు కలిసి జంటగా కనిపించారు. దీంతో ఈ జంటపై డేటింగ్ రూమర్స్ మొదలయ్యాయి. విజయ్ వర్మతో సనా డేటింగ్లో ఉందంటూ రూమర్స్ పుట్టకొచ్చాయి. ఈ నేపథ్యంలో తనపై వస్తున్న ఊహాగానాలపై ఫాతిమా సనా షేక్ స్పందించింది. తన రాబోయే చిత్రం ఆప్ జైసా కోయి' ట్రైలర్ లాంచ్ సందర్భంగా ఆమె మాట్లాడారు. మీ జీవితంలో ఎవరైనా ఉన్నారా? అడిగిన ప్రశ్నకు ఆమె క్లారిటీ ఇచ్చారు. తాను ప్రస్తుతం ఒంటరిగా ఉన్నానని. నా జీవితంలో ఎవరూ లేరని స్పష్టం చేసింది.ఫాతిమా సనా షేక్ మాట్లాడుతూ..'ప్రస్తుతం నేను ఒంటరిగానే ఉన్నా. నా లైఫ్లో ఎవరూ లేరు. ఎందుకంటే ఇప్పుడు మంచి వ్యక్తులంటూ ఎవరూ లేరు. మంచివాళ్లు కేవలం సినిమాల్లో మాత్రమే ఉంటారు. మీరు ఏదైనా పార్ట్నర్షిప్లో ఉంటే మిమ్మల్ని మీరు కోల్పోకుండా రిలేషన్ స్ట్రాంగ్ ఉండేందుకు కృషి చేస్తారు. రిలేషన్ బలంగా ఉండాలంటే అదే మార్గమని నేను భావిస్తున్నా' అని క్లారిటీ ఇచ్చేసింది.ఆప్ జైసా కోయి మూవీ గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. ప్రేమ, సమానత్వం అంటే ఇద్దరు వ్యక్తులు ఒకరినొకరు గౌరవిస్తారు. వారు ఒకరి మాట ఒకరు వింటారు. వాటిని తిరస్కరించరు. ఈ సినిమాలో ప్రేమ, సమానత్వం గురించేనని.. ఈ విషయంలో ఇద్దరూ రాజీ పడాలని ఫాతిమా సనా షేక్ తెలిపింది. కాగా.. ఆప్ జైసా కోయి చిత్రంలో ఆర్ మాధవన్ సరసన నటించింది. మాధవన్తో కలిసి పనిచేయడం నాకు చాలా అద్భుతంగా అనిపించిందని వెల్లడించింది. ఇప్పటికే 'ఆప్ జైసా కోయి' ట్రైలర్ విడుదల కాగా మంచి స్పందనను సొంతం చేసుకుంది. ఈ చిత్రం జూలై 11న నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. -
ఆరేళ్లపాటు డేటింగ్.. మాజీ ప్రియుడిని మరవలేకపోతున్న బ్యూటీ!
బాలీవుడ్ భామ మలైకా అరోరా పేరు చెప్పగానే ఐటమ్ సాంగ్సే గుర్తొస్తాయి. ఆ తర్వాత ఆమె డేటింగ్ వ్యవహారం గుర్తొస్తుంది. ఎందుకంటే హీరో సల్మాన్ ఖాన్ తమ్ముడు అర్భాజ్ ఖాన్ పెళ్లి చేసుకున్న ఈమె.. దాదాపు 19 ఏళ్ల తర్వాత విడాకులు తీసుకుంది. ఆ తర్వాత కొన్నేళ్లకు తన కంటే చిన్నవాడైన అర్జున్ కపూర్తో ప్రేమాయణం నడిపించింది. అయితే వీరి ప్రేమబంధం ఎక్కువ రోజులు నిలవలేదు. దాదాపు ఆరేళ్ల డేటింగ్ అనంతరం బ్రేకప్ చెప్పేసుకుని అభిమానులకు షాకిచ్చారు. అయితే కొన్నినెలల క్రితం ఐపీఎల్ మ్యాచ్లో శ్రీలంక మాజీ క్రికెటర్ కుమార సంగక్కర పక్కన మలైకా కనిపించడంతో వీరిద్దరు డేటింగ్లో ఉన్నారా? అంటూ రూమర్స్ వినిపించాయి. అయితే దీనిపై ఎవరూ కూడా స్పందించలేదు.తాజాగా తన మాజీ భాయ్ ఫ్రెండ్ అర్జున్ కపూర్ బర్త్ డే కావడంతో విషెస్ తెలిపింది ముద్దుగుమ్మ. ఈ మేరకు తన ఇన్స్టాలో పోస్ట్ చేసింది. హ్యాపీ బర్త్డే, అర్జున్ కపూర్' మాజీ ప్రియుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపింది. ప్రస్తుతం ఒంటరిగానే ఉంటోన్న మలైకా అరోరా మాజీ లవర్కు విషెస్ చెప్పడంపై నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.అయితే గతేడాది బ్రేకప్ చెప్పుకున్న ఈ జంట మాత్రం సోషల్ మీడియాలో ఫ్రెండ్షిప్ కొనసాగిస్తూనే ఉన్నారు. కాగా.. అర్జున్ కపూర్ ఇటీవలే తెరపైకి వచ్చిన 'మేరే హస్బెండ్ కి బివి' అనే రొమాంటిక్ కామెడీ చిత్రంలో కనిపించారు. ప్రస్తుతం 'నో ఎంట్రీ 2' అనే మూవీలో నటించనున్నారు. -
ధోనీని గంగూలీ బీట్ చేయగలడా? క్రికెటర్లలో ఎవరి బయోపిక్ రేంజ్ ఏంటి?
ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది గంగూలీ బయోపిక్. ఎప్పటి నుంచో ప్లాన్స్ వేసినప్పటికీ తాజాగా ఈ సినిమా పట్టాలక్కనుంది వచ్చే జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. తాజా సెన్సేషన్ మాలిక్ చిత్రంలో హీరోగా చేసిన రాజ్కుమార్ రావ్ గంగూలీ పాత్ర పోషించనున్నాడు. అది తప్ప ఇంకా ఈ సినిమాకు సంబంధించిన వివరాలు విశేషాలు ప్రకటించలేదు. ఈ నేపధ్యంలో... గత కొంత కాలంగా ఊపందుకున్న క్రికెటర్ల బయోపిక్స్..వాటికి దక్కిన ప్రేక్షకాదరణను ఒక్కసారి పరిశీలిస్తే...సచిన్..విన్సచిన్ ఎ బిలియన్ డ్రీమ్స్ ఫిల్మ్ 2017లో విడుదల అయింది. ఇండియన్ క్రికెట్ గాడ్గా అభిమానులు పిలుచుకునే సచిన్ జీవితం ఆధారంగా ఇది పూర్తి స్థాయి డాక్యుమెంటరీ ఫిల్మ్గా తయారైంది. కధ విషయానికి వస్తే సచిన్ బాల్య దశ నుంచి 2011 వరల్డ్ కప్ గెలుపు వరకు ఈ చిత్రంలో చూపించారు. ఇందులో సచిన్ స్వయంగా తన పాత్ర పోషించడం విశేషం. ఈ డాక్యుమెంట్రీ రూ.76 కోట్ల వరకూ వసూలు చేసి విమర్శకుల ప్రశంసలు, ఫ్యాన్స్ ఆదరణ దక్కించుకుంది.థోనీ...ధనాధన్ మాజీ కెప్టెన్ ఎమ్.ఎస్. ధోనీ ద అన్టోల్డ్ స్టోరీ 2016లో విడుదలైంది. ఇందులో థోనీ పాత్రను దివంగత బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ పోషించాడు. ఇందులో కథ ధోనీ క్రికెటర్గా మారడం నుంచి భారత కెప్టెన్గా ఎదగడం దాకా కొనసాగుతుంది. ఈ సినిమా రూ.216 కోట్లు వసూలు బాక్స్ ఆఫీస్ బ్లాక్బస్టర్గా నిలిచింది. సినిమాలో సుశాంత్ నటనకు ప్రశంసలు దక్కాయి. దేశవ్యాప్తంగా ధోనీ అభిమానుల ఆదరణ పొందింది. అజహర్...యావరేజ్ సర్..మహ్మద్ అజారుద్దీన్ జీవిత కధ ఆధారంగా రూపొందిన అజహర్ చిత్రం కూడా 2016లోనే విడుదలైంది. దీనిలో అజహర్ పాత్రను బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి పోషించాడు. క్రికెటర్గా అజార్ కెరీర్ కొనసాగిన విధం, మ్యాచ్ ఫిక్సింగ్ వివాదం వరకు సినిమా సాగుతుంది. మొత్తంగా రూ.50 కోట్లు వసూలు చేసి యావరేజ్ చిత్రంగా నిలిచింది. విమర్శకుల నుంచి మిశ్రమ స్పందన మాత్రమే దక్కించుకుంది.మిథాలీ...సారీ...మహిళల క్రికెట్కు భారత్లో చక్కని బాట వేసిన మిథాలి రాజ్ జీవితం ఆధారంగా రూపొందిన శభాష్ మిథు..2022లో విడుదలైంది.ఇందులో మిథాలి పాత్రను బాలీవుడ్ నటి తాప్సీ పన్ను పోషించింది. భారత మహిళా క్రికెట్ తో పాటుగా ఎదిగిన మిథాలీ జీవితాన్ని చూపించిన ఈ చిత్రం అట్టర్ ఫ్లాప్గా నిలిచింది. కనీసం రూ.2 కోట్లు కూడా వసూలు చేయలేక కమర్షియల్గా ఘోర పరాజయం పొందింది. ఈ సినిమా కథన శైలి, స్క్రీప్లేపై తీవ్రమైన విమర్శలు వచ్చాయి. అయితే, మిథాలి పాత్రను తాప్సీ సమర్ధంగా పోషించిందని ప్రశంసలు రావడం ఒక్కటే ఈ సినిమాకు దక్కిన ఊరట.కపిల్...కప్ ఫుల్...కపిల్దేవ్ 83 పేరిట రూపొందిన చిత్రం భారత క్రికెట్ దిగ్గజం కపిల్ జీవితంలో ముఖ్య ఘట్టమైన ప్రపంచ కప్ విజయం ఆధారంగా తెరకెక్కింది. ఇందులో కపిల్ పాత్రను బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ పోషించారు. 2021లో విడుదలైన ఈ చిత్రం రూ.193 కోట్లతో మంచి వసూళ్లే రాబట్టినా, చిత్రం బడ్జెట్ ప్రకారం కమర్షియల్ సక్సెస్ అనిపించుకోలేకపోయింది. అయితే విమర్శలు ప్రశంసలు బాగానే అందుకుంది.మొత్తం గా చూస్తే ధోనీ బయోపిక్ మాత్రమే అన్ని రకాలుగా విజయం సాధించింది అని చెప్పొచ్చు మరి గంగూలీ ఈ విషయం లో ధోని ని బీట్ చేయగలడా... -
ఐశ్వర్య రాయ్తో పెళ్లికి ముందు ఆ హీరోయిన్తో ఎంగేజ్మెంట్!
పెళ్లిళ్లు స్వర్గంలోనే నిర్ణయిస్తారు అంటుంటారు. అందుకేనేమో.. పీకల్లోతు ప్రేమలో ఉన్న అభిషేక్ బచ్చన్, కరిష్మా కపూర్.. ఎంగేజ్మెంట్ వరకు వచ్చి ఆగిపోయారు. మనసు నిండా ఒకరినొకరు నింపుకున్నారు కానీ, తలరాతల్లో మాత్రం లేకుండా పోయారు. జంటగా నడవాలనుకుంటే వేర్వేరుగా ప్రయాణించారు. అభిషేక్.. ఐశ్వర్యను, కరిష్మా.. సంజయ్ను పెళ్లాడారు. అసలు ఆనాడేం జరిగిందో ఓసారి గుర్తు చేసుకుందాం..అభిషేక్- కరిష్మా ప్రేమసినీరంగంలో సత్తా చాటుతున్న కపూర్ ఫ్యామిలీలో పుట్టింది కరిష్మా (Karisma Kapoor). 17 ఏళ్ల వయసులోనే నటిగా ప్రయాణం ప్రారంభించింది. మొదట్లో కొన్ని వైఫల్యాలు చూసిన కరిష్మా.. రాజా హిందుస్తానీ చిత్రంతో సక్సెస్ అందుకుంది. తర్వాత ఈ బ్యూటీ బిగ్బీ తనయుడు అభిషేక్ బచ్చన్ (Abhishek Bachchan)తో ప్రేమలో పడింది. అభిషేక్ సోదరి శ్వేత బచ్చన్ పెళ్లిలోనే వీరి చూపులు కలిశాయి. ఐదేళ్లపాటు ప్రేమించుకున్నారు. రెండు కుటుంబాలు ఏమీ అభ్యంతరం చెప్పలేదు. జయా బచ్చన్తో కరిష్మా కపూర్నా కోడలు: జయా బచ్చన్దీంతో 2002లో అమితాబ్ బచ్చన్ 60వ పుట్టినరోజు వేడుకల్లో జయా బచ్చన్.. అభిషేక్, కరిష్మాల ఎంగేజ్మెంట్ను ప్రకటించింది. కరిష్మాను తన కోడలిగా చేసుకోనున్నట్లు వెల్లడించింది. బాలీవుడ్లో పెద్ద పండగే జరగబోతుందనుకున్నవారికి షాకిస్తూ వీరి ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయింది. అమితాబ్ తన సంపదలో కొంత భాగం అభిషేక్ పేరు మీదకు ట్రాన్స్ఫర్ చేయాలని కరిష్మా తల్లి బబిత డిమాండ్ చేసిందట! ఈ నిశ్చితార్థం రద్దవడానికి ఈ డిమాండే ముఖ్య కారణమని అప్పట్లో ప్రచారం జరిగింది.పెళ్లిఎంగేజ్మెంట్ ఆగిపోయిన కొద్ది నెలలకే బబిత.. తన కూతురికి మంచి వ్యాపారవేత్తను చూసి పెళ్లి చేసింది. 2003లో కరిష్మా, సంజయ్ కపూర్ల పెళ్లి జరిగింది. ఇతడికిది రెండో పెళ్లి కావడం గమనార్హం. కానీ ఈ బంధం ఎంతోకాలం నిలవలేదు. పిల్లలు పుట్టిన కొంతకాలానికే కరిష్మా- సంజయ్ విడాకుల కోసం కోర్టుకెక్కారు. 2014లో విడాకుల కోసం దరఖాస్తు చేయగా 2016లో డివోర్స్ మంజూరయ్యాయి. కొద్దిరోజుల క్రితమే సంజయ్ కపూర్ కన్నుమూశాడు. ఇకపోతే అభిషేక్ బచ్చన్.. 2007లో ఐశ్వర్యరాయ్ను పెళ్లి చేసుకున్నాడు. వీరికి కూతురు ఆరాధ్య జన్మించింది. అభిషేక్- ఐశ్వర్య అయినా సంతోషంగా ఉన్నారా? అంటే.. అప్పుడే దూరంగా ఉన్నట్లు అనిపిస్తారు. అంతలోనే జంటగా కనిపిస్తారు. వీరి మధ్య ఏం జరుగుతుందనేది వారికే తెలియాలి! #KarismaKapoor and #AbhishekBachchan's #wedding announcement in the early 2000s was a highly anticipated union between two of #Bollywood's most prominent families. However, the engagement was abruptly called off, and the wedding never took place.#bollywood #aishwaryarai pic.twitter.com/U1dRUrmnT2— The Cheshire Cat (@C90284166) November 5, 2024 చదవండి: కాస్టింగ్ కౌచ్.. ఓ గొప్ప ఫిలింమేకర్ కాంప్రమైజ్ అడిగాడు: నటుడు -
బెట్ ఇలాంటి ‘వార్’ చూసి ఉండరు: ఎన్టీఆర్
ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘వార్ 2’. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కియరా అద్వానీ హీరోయిన్. యశ్రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ నిర్మించిన స్పై యాక్షన్ మూవీ ‘వార్’ (2019) కొనసాగింపుగా వార్ 2 తెరకెక్కుతుంది. ఆగస్ట్ 14న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం కౌంట్డౌన్ మొదలు పెట్టింది. మరో 50 రోజుల్లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు కొత్త పోస్టర్ల ద్వారా తెలియజేశారు.ఈ పోస్టర్లను ఎన్టీఆర్ తన ఎక్స్ (ట్విటర్)లో షేర్ చేస్తూ.. ‘బెట్ కాస్తున్నా.. ఇలాంటి ‘వార్’ చిత్రాన్ని మీరెప్పుడూ చూసి ఉండరు. కౌంట్డౌన్ మొదలు పెట్టండి’ అని రాసుకొచ్చాడు. ఎన్టీఆర్ ట్వీట్తో ఈ సినిమాపై మరింత అంచనాలు పెరిగాయని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా కోసమే గురువారం ఎన్టీఆర్ ముంబైకి వెళ్లారు.కూలీతో పోటీఆగస్ట్ 14న వార్ 2 తో పాటు మరో భారీ పాన్ ఇండియా చిత్రం కూడా రిలీజ్ కానుంది. అదే ‘కూలీ’. రజనీకాంత్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు. నాగార్జున, ఆమిర్ ఖాన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సౌత్లో రజనీకాంత్ మేనియా ఏ రేంజ్లో ఉంటుందో తెలిసిందే. అలాంటి హీరోతో ఎన్టీఆర్ పోటీ పడుతున్నాడు. మరి ఈ బాక్సాఫీస్ వార్లో గెలిదెవరో చూడాలి. Bet you haven’t ever seen a WAR like this! Let’s count it down #50DaysToWar2 … Releasing in Hindi, Telugu & Tamil on August 14th in cinemas worldwide! @iHrithik | @advani_kiara | #AyanMukerji | #War2 | #YRFSpyUniverse | @yrf pic.twitter.com/22ar5Mau9y— Jr NTR (@tarak9999) June 26, 2025 -
కాస్టింగ్ కౌచ్.. ఓ గొప్ప ఫిలింమేకర్ కాంప్రమైజ్ అడిగాడు: నటుడు
అడ్జస్ట్ అయితేనే అవకాశాలు ఇస్తామంటున్నారు అని ఎంతోమంది నటీమణులు మీడియా ముందు గోడు వెల్లబోసుకున్నారు. అయితే తనకూ అలాంటి పరిస్థితే ఎదురైందంటున్నాడు బాలీవుడ్ నటుడు సుధాన్షు పాండే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సుధాన్షు పాండే మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉంది. నేను కూడా ఆ ఇబ్బందులను ఎదుర్కొన్నాను. ఓ ప్రముఖ దర్శకనిర్మాత తను అడిగింది చేస్తే మంచి ఆఫర్ ఇస్తానన్నాడు.కాంప్రమైజ్ అయితేనే..ఇప్పుడాయన బతికి లేడు. గొప్ప ఫిలింమేకర్స్లో ఆయన ఒకరు. ఆయన అడిగినదానికి కాంప్రమైజ్ అయితేనే రోల్ ఇస్తానన్నాడు. ఆయనపై నాకెలాంటి కోపం, పగ లేదు. ఎందుకంటే వాళ్లు అడిగినదానికి ఒప్పుకోవడం, ఒప్పుకోకపోవడం అనేది మన చేతుల్లోనే ఉంది. ఆయన అడిగింది నా వల్ల కాదని సున్నితంగా తిరస్కరించాను. మర్యాదగా అడిగాడు కాబట్టి అంతే గౌరవంగా బదులిచ్చాను. బలవంతం చేస్తే నచ్చదుఅలా కాకుండా నాతో అసభ్యంగా ప్రవర్తించుంటే లాగిపెట్టి కొట్టేవాడిని. ఎవరైనా నన్ను బలవంతం చేస్తే నాకు చాలా కోపం వస్తుంది. నాకు నచ్చినపనే చేస్తాను. నచ్చినవాటివైపే నిలబడతాను. ఇష్టం లేకుండా ఏ పనీ చేయను అని చెప్పుకొచ్చాడు. సుధాన్షు పాండే.. ఖిలాడీ 420, ద మిత్, యాకీన్, మర్డర్ 2, రాజధాని ఎక్స్ప్రెస్ వంటి పలు చిత్రాలు చేశాడు. రోబో 2.0, మన్మథుడు 2 వంటి చిత్రాలతో తెలుగువారికీ సుపరిచితుడే.. ప్రస్తుతం ప్రైవేట్ సాంగ్స్లో కనిపిస్తున్నాడు.చదవండి: లయ కూతుర్ని చూశారా? ఎంత పెద్దగా అయిపోయిందో! -
విమానంలో మూర్ఛ వచ్చింది.. ఎక్కువ డోస్ ఇవ్వడంతో..: హీరోయిన్
బాలీవుడ్ హీరో విజయ్ వర్మ.. తమన్నాకు బ్రేకప్ చెప్పాక మరో హీరోయిన్తో ప్రేమలో పడ్డాడని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. దంగల్ బ్యూటీ ఫాతిమా సనా షైఖ్ (Fatima Sana Shaikh)తో పలుమార్లు కనిపించడంతో వీళ్లు లవ్ బర్డ్స్ అయుండొచ్చని పలువురూ అభిప్రాయపడ్డారు. కానీ, అందులో ఏమాత్రం నిజం లేదంటోంది ఫాతిమా. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ప్రేమలో ఉన్నప్పుడు ఇద్దరూ సమాన గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలి. ఒకరు చెప్పేది మరొకరు వినాలి. సింగిల్ లైఫ్కొన్నిసార్లు ఒకరి కోసం మరొకరు కాంప్రమైజ్ అవ్వాలి. మిమ్మల్ని మీరు కోల్పోకుండా మీ అనుబంధాన్ని ముందుకు నడిపించాలి. అప్పుడే ఆ బంధం విజయవంతంగా కొనసాగుతుంది. అలాంటి వ్యక్తి నా జీవితంలో ఎవరూ లేరు. మంచివాళ్లు కేవలం సినిమాల్లోనే ఉంటారు అంటూ తన రిలేషన్షిప్ స్టేటస్ సింగిల్ అని వెల్లడించింది. అలాగే తన అనారోగ్యం గురించి మాట్లాడుతూ.. నాకు మూర్ఛ రోగం (Epilepsy) ఉంది. అమెరికా వెళ్తున్నప్పుడు విమానంలో ఉండగా మూర్ఛ వచ్చింది. దాంతో నన్ను ఎయిర్పోర్ట్ హాస్పిటల్కు తీసుకెళ్లి చికిత్స అందించారు. ఫిట్స్ వచ్చి పడిపోయాఅయినా మూర్ఛ తగ్గకపోవడంతో ఎక్కువ డోసు ఇచ్చారు. దానివల్ల నా శరీరం ఎఫెక్ట్ అయింది. బెడ్రెస్ట్ తీసుకోక తప్పలేదు. అప్పుడు నా చేతిలో రెండు సినిమాలున్నాయి. వాటి షూటింగ్స్ క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది. షూటింగ్కు రమ్మని పిలిచినప్పుడు బాధ తట్టుకోలేక ఏడ్చేశాను. నాకున్న మూర్ఛ వ్యాధి గురించి అందరికీ చెప్పాలని డిసైడయ్యాను. అప్పుడే నాకు ఫిట్స్ ఉన్నట్లు వెల్లడించాను అని చెప్పుకొచ్చింది. ఫాతిమా.. మాధవన్ సరసన ఆప్ జైసా కోయ్ మూవీలో నటించింది. ఈ చిత్రం జూలై 11న నెట్ఫ్లిక్స్లో విడుదల కానుంది. ఫాతిమా నటించిన మరో చిత్రం 'మెట్రో ఇన్ డినో' జూలై 4న థియేటర్లలో రిలీజవుతోంది.చదవండి: నేను చెప్పానా.. జనాల్ని ఎలా ఫూల్స్ చేశారో చూశారా?: సింగర్ -
కరీనా కపూర్ బాత్రూమ్లో నా పోస్టర్ అతికించుకుంది: సల్మాన్ ఖాన్
అభిమాన హీరో, హీరోయిన్ల ఫోటోలు, పోస్టర్లు గది నిండా నింపుకుంటుంటారు చాలామంది. అయితే ఓ హీరోయిన్ తన బాత్రూమ్లో స్టార్ హీరో పోస్టర్లు అతికించిందుకుందట! ఈ విషయాన్ని భాయ్జాన్ సల్మాన్ ఖాన్ (Salman Khan) బయటపెట్టాడు. ఇంతకీ ఆ హీరోయిన్ మరెవరో కాదు.. కరీనా కపూర్! ఆమె అతికించిన పోస్టర్దో ఎవరికో కాదు సల్మాన్దే!సల్మాన్పై ఫన్నీ పోస్టర్లుసల్మాన్ ఖాన్.. ద గ్రేట్ ఇండియన్ కపిల్ షో మూడో సీజన్కు మొదటి గెస్టుగా విచ్చేశాడు. షోలో ప్రసారం చేయని అన్సీన్ ఫుటేజ్ను తన యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ చేశాడు. అందులో రోడ్డు పక్కన, కళ్లజోడు దుకాణంలో, మెన్స్ సెలూన్లో సల్మాన్ను ఎలా వాడేస్తున్నారనేది తెలియజేస్తూ ఆయా పోస్టర్లను చూపించాడు. అవి చూసి నవ్వేసిన హీరో ఓ ఆసక్తికర విషయాన్ని తెలియజేశాడు.కరీనా బాత్రూమ్లో నా పోస్టర్కరీనా కపూర్ బాత్రూమ్లో కూడా నా పోస్టర్ ఉందని విన్నాను. తర్వాత నేనోసారి ఆమె ఇంటికి వెళ్లినప్పుడు చూశాను. అప్పుడామె వయసు 8 ఏళ్లుంటాయనుకుంటాను. తనకు 15 ఏళ్లొచ్చాక నా పోస్టర్ తీసేసి రాహుల్ రాయ్ పోస్టర్ పెట్టుకుంది అని చెప్పుకొచ్చాడు. కాగా కరీనా, సల్మాన్ బాడీగార్డ్, క్యూంకీ, బజ్రంగీ భాయ్జాన్ వంటి చిత్రాల్లో నటించారు.ట్రిప్పుకెళ్తాంబాలీవుడ్ ట్రియో (ఆమిర్ ఖాన్, షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ త్రయం) గురించి చెప్తూ.. ఆమిర్ ఖాన్, నేను, షారూఖ్.. ముగ్గురం కలిసి ఓ ట్రిప్కు వెళ్దామని ఆమిర్ అన్నాడు. ఎవరికీ తెలియని ప్రదేశానికి వెళ్లాలనుకుంటున్నాం అన్నాడు. ఇంతలో అర్చన పూరణ్ సింగ్ కలగజేసుకుంటూ ఎవరికీ తెలియని చోటంటూ భూమిపై ఏదీ లేదు. మీరు చందమామ పైకి వెళ్తే బాగుంటుంది అని సలహా ఇచ్చింది. అందుకు హీరో నవ్వుతూ.. అవును, అది ట్రై చేయొచ్చు, కానీ ఎంతకాలం పడుతుందో చెప్పలేం అని సరదాగా అన్నాడు.చదవండి: ఆయన కోపం, తిట్లు భరించలేకపోయా.. మధ్యలోనే వెళ్లిపోయా! -
ఆయన కోపం, తిట్లు భరించలేకపోయా.. మధ్యలోనే వెళ్లిపోయా!
దర్శకుడు సాజిద్ ఖాన్ (Sajid Khan) సెట్లో తనను ఇబ్బంది పెట్టాడంటోంది బాలీవుడ్ బ్యూటీ ఈషా గుప్తా (Esha Gupta). సాజిద్ డైరెక్ట్ చేసిన హమ్షకల్ (2014) మూవీలో ఈషా హీరోయిన్గా నటించింది. ఆనాటి చేదు అనుభవాల గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది. నన్నెవరైనా చులకనగా చూస్తే అస్సలు ఊరుకోను. అలాంటిది సాజిద్ నన్ను సెట్లోనే తిట్టేవాడు. నేనెందుకు ఊరుకుంటాను? తిరిగి ఇచ్చిపడేసేదాన్ని. కొంతమందికి ఆలోచన తక్కువ.. ఫ్రస్టేషన్ ఎక్కువుంటుంది. సారీ చెప్పడంతో వెళ్లా..ఈయన పదేపదే కోప్పడుతుండేవాడు. ఎంతవరకని భరిస్తాం? అప్పటికే సినిమాను కష్టపడి ప్రమోట్ చేశాం. అయినా కూడా కనీస గౌరవం ఇవ్వడం లేదు. అందరిపైనా అరుస్తూ తన పరువు తనే తీసుకునేవాడు. ఓరోజు ఆయన వైఖరిపై కోపమొచ్చి నేరుగా కారెక్కి ఇంటికి వెళ్లిపోయాను. ఆ సినిమానే వదిలేయాలనుకున్నాను. కానీ నిర్మాత వాసు భగ్నానీ పిలిచి సారీ చెప్పడంతో వెళ్లాను. దర్శకుడు సాజిద్ కూడా క్షమాపణలు చెప్పాడు.. కానీ నా మనసులో మాత్రం ఆయన్ను క్షమించలేకపోయాను అని చెప్పుకొచ్చింది. సినీ జర్నీహమ్షకల్ మూవీలో సైఫ్ అలీ ఖాన్, రితేశ్ దేశ్ముఖ్, రామ్ కపూర్ హీరోలుగా నటించారు. తమన్నా భాటియా, బిపాషా బసు, ఈషా గుప్తా కథానాయికలుగా యాక్ట్ చేశారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మెప్పించలేకపోయింది. ఈషా గుప్తా సినీజర్నీ విషయానికి వస్తే.. 'జన్నత్ 2' (2012) చిత్రంతో కెరీర్ ప్రారంభించింది. తెలుగులో వీడెవడు మూవీ చేసింది. వినయ విధేయ రామలో 'ఏక్ బార్ ఏక్ బార్..' అనే ఐటం సాంగ్లో యాక్ట్ చేసింది. చివరగా 'వన్ డే: జస్టిస్ డెలివర్డ్' మూవీలో డీసీపీ లక్ష్మీగా నటించింది. ప్రస్తుతం ప్రైవేట్ సాంగ్స్లో కనిపిస్తోంది.చదవండి: హార్దిక్తో డేటింగ్.. ముందే అది ఫిక్స్ అయ్యాం: బాలీవుడ్ నటి -
బాలీవుడ్లోనే అతి ఖరీదైన బంగ్లా అదే.. అమితాబ్, షారూఖ్ది కాదు..
ముంబయిలో అత్యంత ఖరీదైన భవనాలు చాలానే ఉన్నాయి. సహజంగానే వాటిలో ఎక్కువ బాలీవుడ్ ప్రముఖులవే. మరీ ముఖ్యంగా షారూఖ్ ఖాన్ మన్నత్ నివాసం ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటుంది. బాలీవుడ్ సూపర్ స్టార్లు ఒకరిని మించి ఒకరు ఖరీదైన భవనాల యజమానులుగా కావడానికి ఉవ్విళ్లూరుతుంటారు.. అయితే షారూఖ్, అమితాబ్ తదితర బిగ్స్టార్లు అందరినీ తోసి రాజని ఓ యువ జంట కొనుగోలు చేసిన ఓ ఇల్లు వార్తల్లో నిలుస్తోంది. ఇప్పటిదాకా బాలీవుడ్ ప్రముఖుల అన్ని భవనాల కన్నా ఇదే ఖరీదైనదిగా తెలుస్తోంది.ముంబై రియల్ ఎస్టేట్ మార్కెట్లో సరికొత్త రికార్డు సృష్టించింది ఆ యువ జంట కొన్న భవనం. ముంబైలో వీరు కొనుగోలు చేసిన భవనం ఇప్పుడు బాలీవుడ్ సర్కిల్లో మాత్రమే కాదు ముంబయి నగరంలోననూ హాట్ టాపిక్గా మారింది. ఈ లగ్జరీ బంగ్లా ధర మన్నత్ (షారూక్ ఖాన్ స్వంతమైన ఫేమస్ బంగ్లా) కంటే ఎక్కువ కావచ్చన్న ఊహాగానాలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ భవనానికి వీరు వెచ్చించిన మొత్తం ముంబై రియల్ ఎస్టేట్ మార్కెట్లో కొత్త ప్రమాణాలు సృష్టించిందని విశ్లేషకులు చెబుతున్నారు.ఎక్కడ ఉందీ బంగ్లా?ఈ అత్యంత ఖరీదైన భవనం ముంబై నగరంలోని ప్రముఖుల నివాసాలకు ప్రసిద్ధిగాంచిన హై–ఎండ్ లోకాలిటీ పాలి హిల్ ప్రాంతంలో ఉంది. ఈ లగ్జరీ ప్రాపర్టీ ధర రూ. 250 కోట్ల వరకు ఉండొచ్చని అంచనాలు ఉన్నాయి. అంటే ఇది షారుఖ్ ఖాన్ మన్నత్ కంటే ఖరీదైన ప్రాపర్టీ అవుతుంది. ఎందుకంటే మన్నత్ విలువను 200 కోట్ల వరకు ఉంటుందని అంచనా. దీంతో ఈ తాజా కొనుగోలు ముంబై రియల్ ఎస్టేట్ మార్కెట్కు పెద్ద ప్రోత్సాహంగా మారింది. ప్రముఖుల ఇళ్ల ఖరీదు ఇప్పటివరకు 100–150 కోట్ల మధ్యే ఉండగా, ఈ డీల్ మార్కెట్ను మరింత ఎగబాకేలా చేసింది. ముంబై నగరంలో ఇదొక కొత్త చరిత్రగా నిలిచింది.ఎవరీ జంట?ఈ భవనాన్ని కొనుగోలు చేయడం ద్వారా వార్తల్లో నిలిచిన బాలీవుడ్ స్టార్ జంట రణబీర్ కపూర్, ఆలియా భట్. వీరి కొత్త బంగ్లా మన్నత్ కంటే ఖరీదైనది కాగా ఈ బంగ్లా కొనుగోలు తమకు పెద్ద గౌరవంగా భావిస్తున్నామని రణబీర్–ఆలియా సన్నిహితులతో అంటున్నారని సమాచారం. ఎంతో స్పెషల్గా నిర్మించిన ఇంట్లో పర్సనల్ జిమ్, ప్రైవేట్ థియేటర్, హైసెక్యూరిటీ వగైరాలతో పాటు అత్యంత ఆధునిక సదుపాయాలు అన్నీ ఉన్నాయట. ఈ ఇంటిని కేవలం ఇన్వెస్ట్మెంట్ కోసం కాకుండా, రణబీర్–ఆలియా తమ ఫ్యామిలీతో నివసించడానికి ప్రత్యేకంగా సిద్ధం చేస్తున్నారు. వారి కుమార్తె రాహా కోసం కూడా అనేక సదుపాయాలు ఇంట్లో ఏర్పాటు చేయబడ్డాయి. ఈ స్టార్ జంట కొత్త ఇంట్లోకి త్వరలోనే గృహ ప్రవేశం చేయనుంది. -
హార్దిక్తో డేటింగ్.. ముందే అది ఫిక్స్ అయ్యాం: బాలీవుడ్ నటి
సినిమా, క్రికెట్ సెలబ్రిటీల బంధాల గురించి ఎప్పటికప్పుడు ఏదో ఒక రూమర్ వినిపిస్తూనే ఉంటుంది. కొన్నిసార్లు అది నిజమైతే కొన్నిసార్లు అది పుకారుగానే మిగిలిపోతుంది. కొన్నిరోజుల క్రితం హార్దిక్ పాండ్య, నటి ఈషా గుప్తా డేటింగ్ గురించి కొన్ని రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు వాటిపై సదరు నటి స్పందించింది. అసలేం జరిగిందో చెప్పి పూర్తి క్లారిటీ ఇచ్చేసింది.'కొన్నినెలల పాటు మేమిద్దరం మాట్లాడుకున్నాం. మా మధ్య స్నేహం ఏర్పడింది. మేం డేటింగ్లో ఉన్నామని అనుకోవట్లేదు. మేం మాట్లాడుకోవడం మొదలుపెట్టినప్పుడు.. డేటింగ్లోకి వెళ్లే ఛాన్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చని ముందే ఫిక్స్ అయ్యాం. కానీ రిలేషన్లోకి అడుగుపెట్టకుండానే విడిపోయాం. రెండు, మూడుసార్లు కలిసుంటాం. కానీ కొన్నినెలల పాటు మా రిలేషన్ కొనసాగింది. తర్వాత అది ముగిసిపోయింది' అని ఈషా గుప్తా చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: ప్రభాస్ కాదు.. ఆ డ్రీమ్ ప్రాజెక్ట్లో అల్లు అర్జున్?)2012లో 'జన్నత్' అనే హిందీ సినిమాతో నటిగా ఈషా గుప్తా కెరీర్ ప్రారంభించింది. బేబీ, రుస్తుం, కమాండో 2 తదితర హిందీ చిత్రాల్లో నటించింది. వీడెవడు అనే తెలుగు మూవీలో హీరోయిన్గా చేసిన రామ్ చరణ్ 'వినయ విధేయ రామ'లో ఐటమ్ సాంగ్లోనూ ఈమె మెరిసింది. 2019 తర్వాత పూర్తిగా సినిమాలు చేయడం మానేసింది. అయితేనేం సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు హాట్ ఫొటోస్ పోస్ట్ చేస్తూ ఎంటర్టైన్ చేస్తూనే ఉంటుంది.హార్దిక్ పాండ్య విషయానికొస్తే.. టీమిండియా తరఫున ఆల్రౌండర్గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఐపీఎల్లో ప్రస్తుతం ముంబై ఇండియన్స్కి కెప్టెన్సీ చేస్తున్నాడు. వ్యక్తిగత జీవితానికొస్తే నటాషా స్టాంకోవిచ్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీళ్లకు అగస్త్య అని కొడుకు కూడా పుట్టాడు. కానీ కొన్నాళ్లకే మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతానికైతే హార్దిక్ సింగిల్గానే ఉంటున్నాడు.(ఇదీ చదవండి: మరో హీరోయిన్తో తమన్నా మాజీ ప్రియుడు డేటింగ్?) -
నా తల్లి అల్లా దగ్గరకు వెళ్లిపోయింది.. హీరోయిన్ ఎమోషనల్ పోస్ట్
ప్రముఖ నటి, ‘బిగ్బాస్’ ఫేం సనాఖాన్( Sana Khan) ఇంట విషాదం నెలకొంది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె తల్లి మంగళవారం మృతి చెందారు. ఈ విషయాన్ని సనాఖాన్ ఇన్స్టా వేదికగా అభిమానులతో తెలియజేస్తూ..ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ‘నా తల్లి అనారోగ్య సమస్యలతో బాధపడుతూ..ఇప్పుడు అల్లా వద్దకు చేరుకున్నారు’ అంటూ సనా భావోద్వేగానికి లోనయ్యారు.తన తల్లి ఆత్మకు శాంతి కలగాలని, అందరూ ప్రార్థనలు చేయాలని ఆమె కోరారు. తల్లి మరణంతో తీవవ్ర దుఖంలో మునిగిన సనాను పలువురు సినీ ప్రముఖులు ఓదార్చారు. అభిమానులు, సినీ ప్రముఖులు సనాకు సంతాపం తెలుపుతూ సందేశాలు పంపుతున్నారు.సనా ఖాన్ సినిమాల విషయానికి వస్తే.. సల్మాన్ ఖాన్ నటించిన 'జై హో' చిత్రం, వెబ్ సిరీస్ 'స్పెషల్ ఆప్స్' వంటి ప్రాజెక్ట్లతో పాటు హింది బిగ్ బాస్ షో ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకుంది. జర్నీ బాంబే టు గోవా మూవీలోనూ ఐటం సాంగ్ చేసింది. గోల్ సినిమాలో ఆమె చేసిన బిల్లో రాణి సెన్సేషన్ హిట్టయింది. ఈ సాంగ్తోనే విశేషమైన గుర్తింపు తెచ్చుకుంది. సిలంబట్టం (తమిళ) చిత్రంతో హీరోయిన్గా మారింది. కల్యాణ్ రామ్ కత్తి(2010) సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తెలుగులో గగనం, మిస్టర్ నూకయ్య మూవీస్ చేసింది. మలయాళ, కన్నడ భాషల్లోనూ పలు సినిమలు చేసింది. 2020లో ముస్లిం మత గురువు ముఫ్తీ అనాస్ సయ్యద్ని వివాహం చేసుకుంది. ఈ జంటకు 2023లో బాబు పుట్టాడు. పెళ్లి తర్వాత సనా సినిమాలకు దూరంగా ఉంటుంది. -
గంగూలీ బయోపిక్లో ఫిక్స్
ప్రముఖ క్రికెటర్, టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ బయోపిక్కి సన్నాహాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ బయోపిక్కి సంబంధించిన పనులు దాదాపు నాలుగేళ్లుగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో గంగూలీగా నటించనున్నారంటూ రణ్వీర్ సింగ్, ఆయుష్మాన్ ఖురానా వంటి నటుల పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఓ కార్యక్రమంలో తన బయోపిక్లో రాజ్కుమార్ రావు నటించనున్నారన్న సమాచారం ఉందని, అయితే ఆయన కాల్షీట్స్ కేటాయింపులో కొన్ని సమస్యలు ఉన్నాయన్నట్లుగా గుంగూలీ పేర్కొన్నారు.తాజాగా గంగూలీ బయోపిక్లో రాజ్కుమార్ రావు నటించనుండటం కన్ఫార్మ్ అయిపోయింది. ఈ బయోపిక్లో నటించనున్నట్లుగా రాజ్కుమార్ రావు ఓ జాతీయ ఆంగ్ల మీడియా సంస్థకు వెల్లడించి, ఆనందం వ్యక్తం చేశారు. ‘‘గంగూలీగారి బయోపిక్లో నటించడమనేది చాలా పెద్ద బాధ్యత. కాస్త ఆందోళనగా ఉంది. కానీ ఫుల్ ఫన్గా కూడా ఉంటుందని అనుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు రాజ్కుమార్.బెంగాలీకి చెందిన క్రికెటర్ గంగూలీ. రాజ్కుమార్ రావు భార్య పత్రలేఖ బెంగాలీ. దీంతో తన భార్య వద్ద బెంగాలీ భాషలో నైపుణ్యతను సంపాదించుకున్నారట రాజ్కుమార్. సో... భాష, ఉచ్చారణ పరంగా ఆయనకు సమస్య లేదు. ఇక తన బయోపిక్ చిత్రీకరణ 2026 జనవరిలో ప్రారంభమవుతుందని, అదే ఏడాది డిసెం బరులో రిలీజ్ కావొచ్చని ఓ సందర్భంలో గంగూలీ పేర్కొన్నారు. -
ఓటీటీకి అజయ్ దేవ్గణ్ క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
అజయ్ దేవ్గణ్ , రితేశ్ దేశ్ముఖ్ ప్రధాన పాత్రల్లో వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ రైడ్-2. గతంలో విడుదలైన రైడ్ మూవీకి సీక్వెల్గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. రాజ్ కుమార్ గుప్తా డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా గత నెలలో బాక్సాఫీస్ వద్ద సందడి చేసింది. థియేటర్ల వద్ద దాదాపు రూ. 157.88 కోట్ల నికర వసూళ్లు సాధించింది.తాజాగా ఈ మూవీ ఓటీటీలో వచ్చేందుకు సిద్ధమైంది. ఈనెల 26 నుంచి నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో రైడ్-2 ట్రైలర్ను విడుదల చేసింది నెట్ఫ్లిక్స్. ఈ చిత్రంలో అజయ్ దేవ్గన్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ ఆఫీసర్ అమయ్ పట్నాయక్ పాత్రలో కనిపించారు. రితేష్ దేశ్ముఖ్ ఎప్పుడూ చూడని పవర్ఫుల్ రోల్లో కనిపించారు. అంతేకాకుండా ఈ చిత్రంలో వాణి కపూర్, సౌరభ్ శుక్లా ప్రత్యేక పాత్రల్లో నటించారు.Aaj se ulti ginti shuru 🔥Amay Patnaik is back with a new case and the same old fire 👊 Watch Raid 2, out 26 June, on Netflix.#Raid2OnNetflix pic.twitter.com/f06uJB6feQ— Netflix India (@NetflixIndia) June 24, 2025 -
మీ కోడలు ఐశ్వర్యను ఎందుకు మెచ్చుకోరు?.. అమితాబ్ సమాధానం ఇదే?
సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే సీనియర్ హీరోలలో అమితాబ్ బచ్చన్ ఒకరు. సినిమా అప్డేట్లతో పాటు పర్సనల్ విషయాలను కూడా అభిమానులతో షేర్ చేసుకుంటారు. అంతేకాదు సమయం దొరికినప్పుడల్లా లైవ్లోకి వచ్చి ఫ్యాన్స్తో చిట్చాట్ చేస్తుంటాడు. వారు అడిగే ప్రతి ప్రశ్నకు ఓపికగా సమాధానం చెబుతుంటాడు. తాజాగా ఓ అభిమాని.. అమితాబ్ని విమర్శిస్తూ అడిగిన ఓ ప్రశ్నకు తనదైన శైలీలో సమాధానం చెప్పాడు బిగ్బీ.కొడుకుపై మాత్రమే ప్రశంసలు..! అమితాబ్పై ఓ విమర్శ ఉంది. ఆయన ఎప్పుడూ కొడుకు అభిషేక్ బచ్చన్ని పొగుడుతూనే ఉంటాడని.. అదే కోడలు ఐశ్వర్య, భార్య జయా బచ్చన్లను ప్రశంసిస్తూ ఒక్క ట్వీట్ కూడా చేయడు. కొడుకుని ప్రశంసినట్లుగానే భార్య, కోడలుని ఎందుకు ప్రశంసించరని కొందరు ఆయనను ట్రోల్ చేస్తుంటారు. తాజాగా ఓ అభిమాని ఇదే ప్రశ్నను డైరెక్ట్గా అమితాబ్నే అడిగాడు. ఐశ్వర్య, జయా బచ్చన్లను ఎందుకు ప్రశంసించరని ప్రశ్నించాడు. దానికి బిగ్బీ ఇలా సమాధానం ఇచ్చాడు.పబ్లిక్గా ప్రశంసించను కానీ.. నిజమే.. నేను అభిషేక్ని ఎప్పుడూ ప్రశంసిస్తూనే ఉంటాను. అలాగే నా భార్య జయాబచ్చన్, కోడలు ఐశ్వర్యతో పాటు కూతురుని కూడా పొగుడుతుంటాను. కాకపోతే వారిని మనసులోనే మెచ్చుకుంటుంటాను. అది నాకు మహిళలపై ఉన్న గౌరవం’అని రిప్లై ఇచ్చాడు. మరో యూజర్..‘అమితాబ్ రిప్లై ఇచ్చే వారంతా పెయిడ్ ఫ్యాన్స్’ అని కామెంట్ చేయగా.. దానికి బిగ్బీ ఇలా రిప్లై ఇచ్చాడు. ‘పెయిడ్ ఫ్యాన్స్ అని నిరూపించగలవా? నీది చాలా చిన్న మైండ్. అందుకే అలా భావిస్తున్నావు. నువ్వు కూడా డబ్బులు పెట్టి అభిమానులను సంపాదించుకోవచ్చు కదా? అని బిగ్బీ కౌంటర్ ఇచ్చాడు. -
మరో హీరోయిన్తో తమన్నా మాజీ ప్రియుడు డేటింగ్?
సినిమా ఇండస్ట్రీలో ప్రేమ, రిలేషన్, పెళ్లి.. ఇలాంటివన్నీ చాలా సాధారణమైన విషయాలు. టాలీవుడ్లో తక్కువ గానీ బాలీవుడ్లో మాత్రం ఫలానా హీరో.. ఫలానా హీరోయిన్తో డేటింగ్లో ఉన్నాడనే రూమర్స్ ఎప్పటికప్పుడు వినిపిస్తూనే ఉంటాయి. ఇవి నిజమనేటట్లు సదరు హీరోహీరోయిన్ జంటగా కనిపించడం, బయట కూడా కెమిస్ట్రీ పండించడం లాంటివి చూస్తే నిజమేనేమో అనిపిస్తుంది. కొన్నిరోజుల క్రితం వరకు తమన్నా-విజయ్ వర్మ గురించి ఇలానే మాట్లాడుకున్నారు.(ఇదీ చదవండి: 'గేమ్ ఛేంజర్'.. నేను చేసిన పెద్ద తప్పు: దిల్ రాజు)దాదాపు రెండు మూడేళ్ల పాటు తమన్నా.. నటుడు విజయ్ వర్మతో డేటింగ్ చేసిందనే ప్రచారం అయితే గట్టిగానే నడించింది. అందుకు తగ్గట్లు జంట పక్షుల్లా ఎక్కడపడితే అక్కడ వీళ్లిద్దరూ కనిపించేవారు. ప్రేమ, పెళ్లి గురించి ఇన్ డైరెక్ట్గా మాట్లాడేవారు కూడా. మరి ఏమైందో ఏమోగానీ ఈ జంట బ్రేకప్ చెప్పేసుకుంది. కలిసి కనిపించడమే మానేశారు. ప్రస్తుతం తమన్నా.. సినిమాలు, ఐటమ్ సాంగ్స్ చేస్తూ బిజీగా ఉంది. విజయ్ ఏం ప్రాజెక్టులు చేస్తున్నాడో తెలీదు.అలాంటిది ఇప్పుడు విజయ్ వర్మ.. మరోసారి వార్తల్లో నిలిచాడు. 'దంగల్' బ్యూటీ, హీరోయిన్ ఫాతిమా సనా షేక్తో కనిపించాడు. దీంతో వీళ్లిద్దరూ డేటింగ్లో ఉన్నారనే పుకార్లు మొదలయ్యాయి. వీటిలో ఎంత నిజముందో తెలీదు. రూమర్స్ అయితే గట్టిగానే వినిపిస్తున్నాయి. మరోవైపు విజయ్-ఫాతిమా ప్రస్తుతం జంటగా 'గుస్తాఖ్ ఇష్క్' అనే మూవీ చేస్తున్నారు. మరి ఈ సినిమా చేస్తున్నప్పుడు ఏమైనా ప్రేమలో పడ్డారా? లేదంటే ఇవి కేవలం రూమర్సేనా అనేది క్లారిటీ రావాలి?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్) -
మూడుభాషల్లో ఒకేసారి దృశ్యం 3
‘దృశ్యం’ సినిమాలకున్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. మలయాళ, తెలుగు, హిందీ భాషల్లో ‘దృశ్యం, దృశ్యం 2’ చిత్రాలు ఘన విజయం సాధించాయి. ఈ సిరీస్లో రానున్న మూడో చిత్రం ‘దృశ్యం 3’పై ఇటు ఇండస్ట్రీ, అటు ప్రేక్షకుల్లో ఫుల్ క్రేజ్ నెలకొంది. మోహన్ లాల్ హీరోగా జీతూ జోసెఫ్ దర్శకత్వంలో మలయాళంలో వచ్చిన ‘దృశ్యం, దృశ్యం 2’ చిత్రాలు విజయాన్ని అందుకున్నాయి. తెలుగులో వెంకటేశ్ హీరోగా శ్రీప్రియ దర్శకత్వం వహించిన ‘దృశ్యం’, వెంకటేశ్–జీతూ జోసెఫ్ కాంబినేషన్లో రూపొందిన ‘దృశ్యం 2’ హిట్గా నిలిచాయి.ఇక హిందీలో అజయ్ దేవగణ్ హీరోగా డైరెక్టర్ నిషికాంత్ కామత్ తెరకెక్కించిన ‘దృశ్యం’, అజయ్ దేవగణ్– డైరెక్టర్ అభిషేక్ పాఠక్ కాంబినేషన్లో వచ్చిన ‘దృశ్యం 2’ సినిమాలు కూడా మంచి విజయం సాధించాయి. ఇకపోతే ఈ సిరీస్లో మూడో భాగం ముందుగా మలయాళంలో రూపొందనున్న సంగతి తెలిసిందే. మూడో భాగంలోనూ మోహన్లాల్ నటించనుండగా జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించనున్నారు. ప్రీప్రోడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం అక్టోబరులో సెట్స్పైకి వెళ్లనుంది.ఇదిలా ఉంటే... జీతూ జోసెఫ్ కథతో సంబంధం లేకుండా హిందీలో ‘దృశ్యం 3’ ఉంటుందని అజయ్ దేవ్గణ్ ప్రకటించడం చర్చనీయాంశమైంది. దీనిపై తాజాగా జీతూ జోసెఫ్ మాట్లాడుతూ–‘‘మలయాళంలో నేను రాసిన కథతోనే తెలుగు, హిందీ భాషల్లోనూ ‘దృశ్యం 3’ సినిమా వస్తుంది. స్క్రిప్ట్ పని పూర్తయ్యాక హిందీ మూవీ టీమ్కు ఇస్తాను. అక్కడి సంస్కృతి, నేటివిటీకి తగ్గట్టు వాళ్లు కథలో మార్పులు చేసుకుంటారు.మూడు భాషల్లో ఒకేసారి ‘దృశ్యం 3’ని చిత్రీకరించడం సాధ్యం కాకపోయినప్పటికీ అన్ని భాషల్లోనూ ఒకేసారి విడుదల చేయాలనే ఆలోచన ఉంది’’ అని స్పష్టం చేశారాయన. ‘దృశ్యం 3’ తెలుగులో వెంకటేశ్, హిందీలో అజయ్ దేవగణ్ హీరోలుగా నటిస్తారని ఊహించవచ్చు. అయితే దర్శకులు ఎవరనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. -
మీనా కుమారి?
దివంగత ప్రముఖ నటి మీనాకుమారి జీవితం ఆధారంగా హిందీలో ‘కమల్ ఔర్ మీనా’ అనే సినిమా తెరకెక్కనుంది. ‘హిచ్ కీ, మహారాజ్’ వంటి చిత్రాల ఫేమ్ సిద్ధార్థ్ పి. మల్హోత్రా దర్శకత్వం వహించనున్నారు. కాగా ఈ సినిమాలోని మీనాకుమారి పాత్ర కోసం కృతీసనన్, కియారా అద్వానీ వంటి హీరోయిన్ల పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే సిద్ధార్థ్ పి. మల్హోత్రా ఇటీవల ఈ సినిమా కథని కియారా అద్వానీకి వినిపించగా, ఆమె గ్రీన్సిగ్నల్ ఇచ్చారని బాలీవుడ్ సమాచారం. నటుడు సిద్ధార్థ్ మల్హోత్రాతో వివాహ బంధంలో అడుగుపెట్టిన కియారా ప్రస్తుతం గర్భవతిగా ఉన్నారు.ఆమె ప్రసవం, కొంత విశ్రాంతి తర్వాత ఈ సినిమా చిత్రీకరణను ప్రారంభించాలన్నది మేకర్స్ ప్లాన్. అయితే ప్రెగ్నెన్సీ తర్వాత మీనాకుమారిలా కనిపించాలనుకోవడం కియారాకు పెద్ద సవాల్ అని, అయినప్పటికీ కథ నచ్చి ఒప్పుకున్నారని బాలీవుడ్ టాక్. ట్రాజెడీ క్వీన్ ఆఫ్ ఇండియన్ సినిమాగా చెప్పుకునే మీనా కుమారిగా కియారా నటిస్తే, ఈ సినిమాలోని దర్శకుడు కమల్ అమ్రోహి పాత్రను ఎవరు పోషించనున్నారనే చర్చకూడా జరుగుతోంది. సిద్ధార్థ్ పి. మల్హోతా, అమ్రోహి ఫ్యామిలీ, సరెగమా సంస్థలు ఈ సినిమాను నిర్మించనున్నాయి. -
ప్రముఖ సింగర్కు అరుదైన గౌరవం.. ఆయన పేరిట ఏకంగా కోర్సు!
ప్రముఖ సింగర్ దిల్జీత్ దోసాంజ్కు అరుదైన ఘనత దక్కింది. ఆయన పేరుపై ఏకంగా కోర్సు ప్రారంభించనున్నట్లు కెనడాకు చెందిన యూనవర్సిటీ ప్రకటించింది. ఈ పంజాబ్ గాయకుడిపై ఏకంగా కోర్సును అందిస్తున్నట్లు వెల్లడించింది. బోర్న్ టు షైన్ పేరుతో టొరంటో మెట్రోపాలిటన్ యూనివర్సిటీకి చెందిన ది క్రియేటివ్ స్కూల్లో వచ్చే ఏడాది నుంచి అతని పేరిట కోర్సు ప్రారంభించాలని నిర్ణయించింది. తాజాగా జరిగిన సమ్మిట్లో ఈ విషయాన్ని ప్రకటించారు.కాగా.. పంజాబ్కు చెందిన దిల్జీత్ దోసాంజ్ ప్రపంచ వేదికపై సత్తా చాటారు. గత ఇరవై ఏళ్లుగా అంతర్జాతీయ వేదికలపై తన గాత్రంతో అభిమానులను అలరించారు. 'మూన్చైల్డ్ ఎరా', 'గోట్' లాంటి మ్యూజిక్ ఆల్బమ్లు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందాయి. 'మూన్చైల్డ్ ఎరా' కెనడియన్ ఆల్బమ్ల జాబితాలో ఏకంగా 32వ స్థానానికి చేరుకుంది. ఒక భారతీయ కళాకారుడిగా అరుదైన ఘనత సాధించారు. తాజాగా ఆయనపై కోర్సు అందించడం అతని ప్రతిభకు నిదర్శనమని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.దిల్జీత్ దోసాంజ్ తన నటనా జీవితంలో అద్భుతంగా రాణించారు. 'జాట్ అండ్ జూలియట్', 'పంజాబ్ 1984', 'సజ్జన్ సింగ్ రంగ్రూట్' వంటి అనేక పంజాబీ సూపర్ హిట్స్ చిత్రాల్లో నటించారు. అలాగే 'ఉడ్తా పంజాబ్' లాంటి బాలీవుడ్ మూవీలోనూ కనిపించారు. గతేడాది 'చమ్కిలా' అనే చిత్రంలో నటనకు గానూ ప్రశంసలు అందుకున్నారు. అంతేకాకుండా 2023లో అతను తన 'దిల్-లుమినాటి' పర్యటనతో ఉత్తర అమెరికాలో చరిత్ర సృష్టించాడు. ఆ తర్వాత కెనడాలో జరిగిన అతిపెద్ద పంజాబీ కచేరీలతో పేరు సంపాదించారు. -
'ఈ ముసలాడికి పిచ్చి పట్టినట్లుంది' అమితాబ్ ఆన్సరిదే!
సమాజంలో రోజురోజుకూ సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం.. సైబర్ క్రైమ్పై అవగాహన పెంచే కాలర్ ట్యూన్లను ఆ మధ్య తెగ ప్రసారం చేసింది. ఓటీపీలు షేర్ చేయొద్దు, లింక్స్ క్లిక్ చేయొద్దు.. సైబర్ నేరగాళ్లతో జాగ్రత్త! అంటూ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan)తోనూ చెప్పించింది. రోజుకు 8- 10 సార్లు ఈ కాలర్ ట్యూన్లు వినిపించేవి.పిచ్చి పట్టినట్లుందిదాని గురించి కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో నసుగుతూ కామెంట్లు చేశారు. దీంతో ఆగ్రహించిన బిగ్బీ.. అయితే వెళ్లి ప్రభుత్వానికి చెప్పండి. నేను వారు చెప్పిందే చేశాను అని రిప్లై ఇచ్చారు. ఈ ముసలాడికి పిచ్చి పట్టినట్లుంది అన్న కామెంట్కు.. ఏదో ఒక రోజు నువ్వు కూడా ముసలాడివి అవుతావు. వయసు పెరిగినవారికి కొండంత అనుభవం, జ్ఞానం ఉంటుందని అంటుంటారు, తెలీదా? అని కౌంటర్ ఇచ్చారు. కాగా అమితాబ్ బచ్చన్ గతేడాది కల్కి 2898 ఏడీ, వేట్టయాన్ వంటి చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం రామాయణ: పార్ట్1 సహా మరో చిత్రంలో నటిస్తున్నారు.చదవండి: థగ్ లైఫ్ డిజాస్టర్.. క్షమాపణలు మాత్రమే చెప్పగలను.. మణిరత్నం -
ఫేక్ కలెక్షన్స్నే ఎక్కువగా ఎంజాయ్ చేస్తున్నారు: సన్నీ డియోల్
ఈ ఏడాది జాట్ మూవీతో సూపర్ హిట్ కొట్టిన బాలీవుడ్ హీరో సన్నీ డియోల్. టాలీవుడ్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగానే వసూళ్లు సాధించింది. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. సన్నీ డియోల్ ప్రస్తుతం బోర్డర్-2 మూవీలో నటిస్తున్నారు. అంతేకాకుండా నితీశ్ తివారీ తెరకెక్కించనున్న రామాయణంలోనూ కనిపించనున్నారు.అయితే తాజా ఇంటర్వ్యూకు హాజరైన సన్నీ డియోల్ మూవీ కలెక్షన్స్పై ఆసక్తికర కామెంట్స్ చేశారు. అభిమానులు ఫేక్ కలెక్షన్స్ను ఎంజాయ్ చేస్తున్నారని అన్నారు. అలాంటి వ్యక్తులు ఎలాంటివారో తనకు అర్థం కావడం లేదన్నారు. నకిలీ బాక్సాఫీస్ నంబర్స్ చూపించడం సరైన పద్ధతి కాదన్నారు. సినీ పరిశ్రమ ప్రమాణాల కంటే కేవలం హైప్పైనే ఆధారపడడంపై సన్నీ డియోల్ తప్పుబట్టారు.సన్నీ డియోల్ మాట్లాడుతూ.. 'ఇది చాలా బాధాకరం. ఎందుకంటే అభిమానులు వాస్తవికతను నమ్మడానికి ఇష్టపడరు. బాక్సాఫీస్ సంఖ్యలను పెంచి కానీ వాస్తవానికి భిన్నంగా చూపిస్తారు. టిక్కెట్లను పెద్దమొత్తంలో కొనుగోలు చేయడం.. నకిలీ బాక్సాఫీస్ సంఖ్యలు చూపించడం సరైంది కాదు. అది అలా ఉండకూడదు. మిమ్మల్ని మీరు హిట్ చేసుకోవడానికి ఇది మార్గం కాదు. అందువల్లే చాలా మంది యువకుల కథలు బయటకు రావడం లేదు. ప్రజలు కూడా మంచి కథకు విలువ ఇవ్వడం లేదు. ఈ రోజుల్లో కథ ప్రభావం కంటే ఫేక్ కలెక్షన్స్ ద్వారా విజయం డిసైడ్ చేస్తున్నారు' అని అన్నారు.సన్నీ డియోల్ చివరిసారిగా 'జాట్' చిత్రంలో కనిపించాడు. ఈ మూవీ ద్వారానే గోపీచంద్ మలినేని హిందీలో అరంగేట్రం చేశారు. ఈ చిత్రంలో రెజీనా , రణదీప్ హుడా, సయామి ఖేర్, రమ్య కృష్ణన్ కూడా నటించారు. -
ఈ మూవీ నవ్విస్తుంది, ఏడిపిస్తుంది.. చప్పట్లు కొట్టేలా చేస్తుంది
బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం సితారే జమీన్ పర్ (Sitaare Zameen Par). ‘సబ్ కా అప్న అప్న నార్మల్’ అనేది ఉపశీర్షిక. ఆమిర్ఖాన్ నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన హిట్ ఫిల్మ్ ‘తారే జమీన్ పర్’ (2007)కు సీక్వెల్గా ఈ మూవీ తెరకెక్కింది. జూన్ 20న విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తోంది.తాజాగా ఈ సినిమాకు సూపర్ స్టార్ మహేశ్బాబు (Mahesh Babu) రివ్యూ ఇచ్చాడు. సితారే జమీన్ పర్.. అందరి మనసులు దోచుకుంటోంది. ఈ మూవీ మిమ్మల్ని నవ్విస్తుంది, ఏడిపిస్తుంది. అలాగే చప్పట్లు కొట్టేలా చేస్తుంది. ఈ సినిమా చూశాక కచ్చితంగా చిరునవ్వుతో బయటకు వస్తారు అని రాసుకొచ్చాడు.సితారే జమీన్ పర్ మూవీలో ఆమిర్ ఖాన్, జెనీలియా జంటగా నటించారు. ఆర్ఎస్ ప్రసన్న దర్శకత్వం వహించగా ఆమిర్ఖాన్ ప్రొడక్షన్స్ బ్యానర్పై ఆమిర్ఖాన్, అపర్ణ పురోహిత్ నిర్మించారు. ఈ చిత్రంలో ఆరోష్ దత్తా, గోపీకృష్ణ వర్మ, సంవిత్ దేశాయ్, వేదాంత్ శర్మ, ఆయుష్ భన్సాలీ, ఆశిష్ పెండ్సే, రిషి షహానీ, రిషబ్జైన్ , నమన్ మిశ్రా, సిమ్రాన్ మంగేష్కర్ వంటి వారు కీలకపాత్రల్లో నటించారు. #SitaareZameenPar …Shines so bright and how…..It’ll make you laugh, cry and clap!! Like all Aamir Khan’s classics, you’ll walk out with a big smile on your face… Love and Respect..♥️♥️♥️#AamirKhan @geneliad @r_s_prasanna @AKPPL_Official @ShankarEhsanLoy #AmitabhBhattacharya…— Mahesh Babu (@urstrulyMahesh) June 22, 2025 చదవండి: మహేశ్బాబుతో పనిచేసేటప్పుడు గిల్టీగా ఫీలయ్యా: త్రిష -
త్రిప్తి డిమ్రి ఫేవరెట్ హీరోయిన్ ఎవరో తెలుసా? ఆమెలాగే హెయిర్కట్..
‘ఆ ఛాన్స్ నాకు ఎక్కడ దక్కుతుంది?’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పిన త్రిప్తికి.. కొన్ని రోజుల్లోనే ఆ అవకాశం పెద్ద పెద్ద స్టార్ హీరోయిన్స్ చుట్టూ తిరిగి చివరకు ఆమెనే వరించింది. దీపికా పదుకొణే ప్లేస్ని భర్తీ చేసిన త్రిప్తి తాజా జర్నీ ఆసక్తికరమే కాదు, ఆశ్చర్యకరమైనది కూడా!టాలీవుడ్లోనూ గుర్తింపుబాలీవుడ్ హీరోయిన్ త్రిప్తి డిమ్రి (Tripti Dimri).. సందీప్ రెడ్డి వంగా ‘యానిమల్’ సినిమాలో నటించి టాలీవుడ్లోనూ మంచి గుర్తింపు సంపాదించింది. ఇప్పుడదే దర్శకుడు ప్రభాస్తో చేస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘స్పిరిట్’లో హీరోయిన్ ఛాన్స్ దక్కించుకొని ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోయింది. త్రిప్తి.. దీపికా పదుకొణెకు పెద్ద అభిమాని. చిన్నతనంలో ‘చాందినీ చౌక్ టు చైనా’ సినిమాలో దీపికా లుక్ చూసి, అదే స్టయిల్లో హెయిర్ కట్ చేసుకుందట!మందు జోలికి వెళ్లనుమొన్నటి వరకు టీ ఎక్కువగా తాగే త్రిప్తి, ఇప్పుడు కాఫీ మీద మక్కువ పెంచుకుందట. టీ, కాఫీ తప్ప... ఇప్పటివరకు ఎప్పుడూ ఆల్కహాల్ టేస్ట్ చేయలేదని, భవిష్యత్తులో చేయాలనే ఆలోచన కూడా లేదని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ఇండియన్ సినిమాల్లో న్యూడ్గా నటించేందుకు ధైర్యం చేసిన అరుదైన నటీమణుల్లో త్రిప్తి ఒకరు. ‘యానిమల్’లో బోల్డ్ సీన్లు చేసిన తర్వాత స్టార్ అయింది. అయితే ఆ సీన్లు చూసి తల్లిదండ్రులు ఇబ్బంది పడ్డారని ఒప్పుకుంది. అయినా కెరీర్ కోసం ఇలాంటి సాహసాలు అవసరమే అంటోంది.యానిమల్ మూవీతో దశ తిరిగిందిత్రిప్తి 2017లో ‘పోస్టర్ బాయ్స్’ సినిమాతో రంగ ప్రవేశం చేసింది. ‘లైలా మజ్ను’, ‘బుల్ బుల్’ వంటి చిత్రాల్లో నటించినా పెద్దగా పాపులారిటీ రాలేదు. చిన్నప్పటి నుంచే టాప్ హీరోయిన్ కావాలని కలలు కన్న త్రిప్తి, అవి నెరవేరక మొదట్లో చాలా డిజప్పాయింట్ అయిందట! సరిగ్గా అలాంటి సమయంలో ‘యానిమల్’ ఛాన్స్ రావడంతో వదులుకోలేకపోయింది. ఆ సినిమా ఆమె కెరీర్ను ఊహించని ఎత్తులకు చేర్చింది. రష్మిక మందన్నా కన్నా త్రిప్తికి ‘ఛోటా భాభీ’గా ఎక్కువ క్రేజ్ వచ్చింది. బాలీవుడ్ సినిమాలుఆ తర్వాత కూడా బోల్డ్ కథలే త్రిప్తిని వెతుక్కుంటూ వచ్చాయి. ‘బ్యాడ్ న్యూస్’ చిత్రంలో ఇద్దరు బాయ్ఫ్రెండ్స్లో ఎవరి వల్ల గర్భం దాల్చిందో తెలియని యువతి పాత్రలో నటించింది. అలాగే, ‘విక్కీ విద్యా కా వోహ్ వాలా వీడియో’ అనే సినిమా హాలీవుడ్ సెక్స్ టేప్ కాన్సెప్ట్ ఆధారంగా తెరకెక్కింది. కొత్తగా పెళ్లైన జంట తమ మొదటి రాత్రిని షూట్ చేయడం, ఆ వీడియో లీక్ కావడం చుట్టూ కథ తిరుగుతుంది. ఈ సినిమాలో రాజ్ కుమార్ రావుతో కలిసి నటించింది.విమర్శలుత్రిప్తి నటనపై, డ్యాన్స్పై కొన్ని విమర్శలు వచ్చినా.. గ్లామర్, టాలెంట్, సక్సెస్ వల్ల అవకాశాలు మళ్లీ మళ్లీ వస్తున్నాయి. ‘యానిమల్’లో న్యూడ్ సీన్ తీసే సమయంలో డైరెక్టర్, హీరో ఎంతో మద్దతు ఇచ్చారని తెలిపింది. ఆ సీన్ను చాలా అందంగా చూపించారని, ఏ కాస్త అసౌకర్యంగా ఫీల్ అయినా షూటింగ్ ఆపేస్తామని మాట ఇచ్చిన తర్వాతే షూట్ చేశారని చెప్పింది త్రిప్తి.స్పిరిట్లో నేనా?ఒకసారి ఓ జర్నలిస్టు త్రిప్తిని ‘స్పిరిట్ సినిమాలో మీకు ఛాన్స్ వస్తుందా?’ అని అడిగినప్పుడు ‘ఒక్క శాతం కూడా అవకాశం లేదు. అంత పెద్ద ప్రాజెక్ట్లోకి ఎలా వస్తాను?’ అని ఆశ్చర్యంగా అంది. పైగా సందీప్ రెడ్డి వంగా తనకే మళ్లీ ఛాన్స్ ఇస్తాడా? అంటూ ఎదురు ప్రశ్నించింది. కానీ, విధి, సినిమా రంగం రెండూ మాయామయం! చివరకు దీపికా పదుకొణె స్థానంలో త్రిప్తి వచ్చి చేరింది.చదవండి: షూ విప్పడం కూడా రాదా? ఇంకేం యోగా చేస్తావ్? -
షూ విప్పడం కూడా రాదా? ఇంకేం యోగా చేస్తావ్?
బాలీవుడ్ హీరోయిన్ నుష్రత్ బరుచ (Nushrratt Bharuccha) విమర్శలపాలైంది. యోగా ఈవెంట్కు వెళ్లి ఆమె చేసిన పనికి అందరూ ఆమెను తిట్టిపోస్తున్నారు. అసలేం జరిగిందంటే.. శనివారం నాడు ముంబైలో జరిగిన యోగా ఉత్సవాల్లో నుష్రత్ పాల్గొంది. తెలుపు దుస్తుల్లో అక్కడికి హాజరైన ఆమెకు సొంతంగా షూలు విడిచేందుకు కూడా కష్టమైంది. అక్కడున్న మహిళా వాలంటీర్ల సాయం తీసుకుంది. అమ్మాయి కింద కూర్చుని హీరోయిన్ కాలు పట్టుకుని ఆమె షూ లేస్ తీసింది.. ఇంతలో నుష్రత్.. మరో కాలి షూ కూడా తీసేయమని వేలు పెట్టి చూపించింది. దీంతో ఆమె మరో కాలి షూ కూడా తీసేసింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.అది కూడా చేతకాదా?'నీ చేతులతో నువ్వు షూ లేస్ తీసేసి పక్కన విడిచిపెట్టలేవా?', 'నీ కాలికున్న షూలు తీసుకోలేవు కానీ యోగా చేస్తున్నావా?', 'నువ్వింకా చిన్న పిల్ల అనుకుంటున్నావా? డబ్బు, పాపులారిటీ చూశాక గర్వం తలకెక్కినట్లుంది' అని నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. నుష్రత్.. చివరగా చోరీ 2 సినిమాలో కనిపించింది. విశాల్ ఫ్యురియా దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ ఏప్రిల్ 11న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈమె తెలుగులో శివాజీ తాజ్మహల్ (2010) మూవీలో హీరోయిన్గా నటించింది. View this post on Instagram A post shared by TCX.official (@tellychakkar) చదవండి: న్యూజిలాండ్లో 7000 ఎకరాలు కొన్నాం: మోహన్బాబు -
రెండోసారి ప్రెగ్నెంట్? వీడియోతో క్లారిటీ వచ్చినట్లే!
బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ (Alia Bhatt) మరోసారి గర్భం దాల్చిందని కొన్ని వారాలుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కేన్స్ ఫిలిం ఫెస్టివల్కు ఆలియా హాజరైనప్పటి నుంచి ఈ రూమర్స్ మొదలయ్యాయి. పైగా జిమ్కు వెళ్లినప్పుడు కూడా కెమెరాలు కనిపించగానే ఎవరినీ పలకరించకుండా హడావుడిగా వెళ్లి కారులో కూర్చునేది. దీంతో నిజంగానే ఆలియా ప్రెగ్నెంట్ అయిందేమోనన్న అనుమానాలు వెలువత్తాయి. డ్యాన్స్ రిహార్సల్స్..కానీ, హీరోయిన్ లేటెస్ట్ వీడియోతో ఇవన్నీ వుట్టి పుకార్లేనని తేలిపోయాయి. ఆల్ఫా సినిమా కోసం డ్యాన్స్ రిహార్సల్స్ చేసిన ఆలియా తాపీగా వెళ్లి కారెక్కింది. మధ్యలో అక్కడున్నవారిని కూడా పలకరించింది. పైగా తనకు పొట్ట కూడా లేకపోవడంతో సెకండ్ ప్రెగ్నెన్సీ అంటూ వస్తున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని తేలిపోయింది. రాహా మూడో బర్త్డే..ఆలియా భట్ - రణ్బీర్ కపూర్ 2022లో పెళ్లి చేసుకున్నారు. అదే ఏడాది కూతురు రాహా జన్మించింది. ఈ ఏడాది రాహా మూడో బర్త్డే సెలబ్రేట్ చేసుకోనుంది. సినిమాల విషయానికి వస్తే ఆలియా ప్రస్తుతం 'ఆల్ఫా' మూవీ చేస్తోంది. 'ముంజ్య' హీరోయిన్ శార్వరితో కలిసి నటిస్తున్న ఈ మూవీ క్రిస్మస్కు విడుదల కానుంది. View this post on Instagram A post shared by Instant Bollywood (@instantbollywood) చదవండి: నా కూతురి జోలికొస్తే కారుతో తొక్కేస్తా.. కాజోల్ వార్నింగ్ -
వివాహ బంధానికి గుడ్ బై చెప్పిన ప్రముఖ బుల్లితెర జంట
ఇటీవల సినీ ఇండస్ట్రీలో విడాకుల వార్తలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే పలువురు స్టార్ నటీనటులు సైతం తమ వివాహ బంధానికి గుడ్ బై చెప్పేస్తున్నారు. తాజాగా మరో జంట తమ పెళ్లి బంధానికి ఎండ్ కార్డ్ పడేసింది. ప్రముఖ సీరియల్ నటి లతా సబర్వాల్.. తన భర్త సంజీవ్ సేథ్తో విడిపోతున్నట్లు ప్రకటించారు. సుదీర్ఘమైన చర్చల తర్వాత నేను.. నా భర్త విడిపోవాలని నిర్ణయించుకున్నాం. నాకు అందమైన కొడుకును ఇచ్చినందుకు అతనికి కృతజ్ఞతలు తెలుపుతున్నా. అతని భవిష్యత్తు బాగుండాలని శుభాకాంక్షలు' అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దాదాపు పెళ్లైన 16 ఏళ్లకు తమ వైవాహిక బంధానికి ముగింపు పలికారు. ఈ విషయంపై ఎటువంటి ప్రశ్నలు అడగకుండా తనను, తన కుటుంబాన్ని గౌరవించాలని ప్రతి ఒక్కరిని అభ్యర్థించింది. వీరిద్దరు బుల్లితెర నటీనటులు కాగా.. 'యే రిష్టా క్యా కెహ్లతా హై' సీరియల్ సెట్స్లో కలుసుకున్నారు. ఈ సీరియల్ బాలీవుడ్లో అత్యంత ఆదరణ దక్కించుకున్న వాటిలో ఒకటిగా నిలిచింది. ఇందులో భార్య, భర్తల పాత్రల్లో వీరిద్దరు నటించారు. అంతేకాకుడా ఈ జంట 2013లో 'నాచ్ బలియే 6' అనే డ్యాన్స్ షోలో కూడా పాల్గొన్నారు. ఆ తర్వాత ప్రేమలో పడిన జంట 2009లో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత ఈ జంటకు 2013లో ఓ కుమారుడు జన్మించారు. మరోవైపు సంజీవ్ సేత్ గతంలోనే నటి రేషమ్ టిప్నిస్ను వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత 2004లో ఈ జంట విడిపోయారు. అయితే పలు సీరియల్స్లో తనదైన నటనతో మెప్పించిన లతా సబర్వాల్ 2021లో నటనకు గుడ్బై చెప్పేసింది. ఆమె సీరియల్స్తో పాటు 'వివా', 'ఇష్క్ విష్క్' వంటి చిత్రాలలో కూడా కనిపించింది. -
ఇదెక్కడి ఆచారం రా నాయనా?.. హీరోకు ఏకంగా గిన్నె ఇచ్చారట!
బాలీవుడ్ నటుడు రణ్దీప్ హుడా ఇటీవలే జాట్ మూవీలో కనిపించారు. సన్నీ డియోల్ కీలక పాత్రలో నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్హిట్గా నిలిచింది. ఈ సినిమా ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లో ప్రసారమవుతోంది. అయితే బాలీవుడ్లో పలు సినిమాల్లో మెప్పించిన రణ్దీప్ హుడా రెండేళ్ల క్రితం తన ప్రియురాలు లిన్ లైస్రామ్ను పెళ్లాడారు. 2023లో మణిపూర్కు చెందిన లిన్ లైస్రామ్ను సంప్రదాయ వేడుకలో వివాహం చేసుకున్నారు.తాజాగా ఆ పెళ్లి వేడుకలో తనకెదురైన విచిత్రమైన అనుభవాన్ని పంచుకున్నారు. మణిపూరి సంప్రదాయంలో జరిగిన ఈ వేడుకలో తనకు మూత్ర విసర్జన కోసం గిన్నె ఇచ్చారని రణదీప్ హుడా గుర్తు చేసుకున్నారు. ఒకరకంగా ఈ పెళ్లి తంతు తనకు అంతర్యుద్ధం లాంటి పరిస్థితిని తలపించేలా చేసిందని తాజా ఇంటర్వ్యూలో పంచుకున్నారు.ఆ సంఘటనను రణ్దీప్ హుడా వివరిస్తూ..' పెళ్లిలో నాతో పాటు ఒక సహాయకుడు ఉన్నాడు. ఒక ట్యూటర్ లాగా. నేను నా వస్తువులను తలపై పెట్టుకున్న తర్వాత ఇక తలను వంచడం సాధ్యం కాదు. అప్పుడే నాకు ఒక గిన్నె, గొడుగు ఇచ్చారు. అప్పుడు మనల్ని ఓ ప్రదేశంలో ఉంచుతారు. అక్కడికి అందరూ వచ్చి మనల్ని చూడాలి. ఆ సమయంలో మనం చాలా గౌరవంగా కనిపించాలి. అయితే నేను గిన్నె దేనికోసం అని వారిని అడిగాను. మీరు మూత్ర విసర్జన చేయవలసి వస్తే.. మీకిచ్చిన ఆ గొడుగు తెరిచి అక్కనే మూత్ర విసర్జన చేయండి. ఎందుకంటే ఇప్పుడు మీరు దేవుడు కాబట్టి అక్కడి నుంచి కదల్లేరన్నాడు. వాళ్ల సంస్కృతి చాలా కఠినమైనది. అలాగే చాలా సిస్టమాటిక్ కూడా " అని తనకెదురైన విచిత్ర అనుభవాన్ని వివరించారు.తన పెళ్లి గురించి మాట్లాడుతూ. 'నా పెళ్లి సమయంలో మణిపూర్లో ఒక పెద్ద సమస్య తలెత్తింది. కానీ మేమిద్దరం వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. అంతేకాకుండా ఒక అమ్మాయి ఇంట్లో వివాహం చేసుకోకపోతే అది కూడా వివాహమేనా అని అక్కడే వివాహం చేసుకుంటానని తాను దృఢంగా చెప్పాను. ఈ పెళ్లి విషయంలో తనకు అస్సాం రైఫిల్స్లో బ్రిగేడియర్గా ఉన్న తన స్నేహితుడు సాయం చేశాడు. మీరు రండి పెళ్లి నేను జరిపిస్తాను అన్నాడు. దీంతో మేము దాదాపు 10 నుంచి 12 మంది అక్కడికి చేరుకున్నాం.' అని తెలిపారు. అయితే మేము లిన్ లైస్రామ్ ఇంటికి చేరుకున్నప్పుడు మంచి శాఖాహారం తిన్నారని.. వివాహం చేసుకునే ముందు వారి దేవుళ్లందరినీ పూజించారని గుర్తు చేసుకున్నాడు. అలాగే నా స్నేహితులు కూడా వివాహానికి తీసుకొచ్చావా? పవిత్ర తీర్థయాత్రకు తీసుకువచ్చావా? అంటూ తనతో జోక్ చేశారని రణ్దీప్ హుడా వెల్లడించారు. -
ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ సినిమాలివే!
ఇండియన్ సినిమా పేరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోతోంది. హాలీవుడ్ రేంజ్లో సినిమాలు తెరకెక్కించే స్థాయికి ఇప్పుడిప్పుడే చేరుకుంటున్నారు. త్వరలోనే మన సినిమాలు హాలీవుడ్ స్థాయిని అందుకునే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. రాజమౌళి ఆర్ఆర్ఆర్ మూవీ (RRR Movie) ఆస్కార్ అవార్డ్ దక్కించుకున్న తర్వాత భారతీయ చలనచిత్ర పరిశ్రమ పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోయింది. ప్రపంచవ్యాప్తంగా మన ఇండియన్ సినిమాలు భారీ వసూళ్లతో సరికొత్త రికార్డులు సృష్టించాయి. అలాగే దేశవ్యాప్తంగా సైతం అత్యధిక వసూళ్లతో రికార్డ్ సృష్టించిన టాప్-10 చిత్రాలేవో చూసేయండి.ప్రపంచవ్యాప్తంగా అమిర్ ఖాన్ దంగల్ అత్యధిక వసూళ్లతో మొదటిస్థానంలో నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 2,000 కోట్ల మార్కును దాటిన మొదటి భారతీయ చిత్రంగా నిలిచింది. ఈ రికార్డును ఇప్పటి వరకు ఏ సినిమా దాటలేకపోయింది. తర్వాత సెకండ్ ప్లేస్లో ఎస్ఎస్ రాజమౌళి బాహుబలి-2 నిలవగా.. మూడోస్థానంలో అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప-2 నిలిచింది. ఆ తర్వాత స్థానాల్లో వరుసగా ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్-2, జవాన్, పఠాన్, కల్కి, భజరంగీ భాయిజాన్, యానిమల్ ఉన్నాయి. బాలీవుడ్తో సమానంగా సౌత్ ఇండియా చిత్రాలు సత్తా చాటాయి.ప్రపంచవ్యాప్తంగా దంగల్ ఎక్కువ వసూళ్లు సాధించినప్పటికీ భారత్లో ఎక్కువ కలెక్షన్స్ రాబట్టింది మాత్రం బాహుబలి 2 మూవీయే! 2017లో బాహుబలి 2: ది కన్క్లూజన్ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ. 1400 కోట్లు దాటిన తొలి భారతీయ చిత్రంగా చరిత్ర సృష్టించింది. ఈ మూవీ కేవలం 21 రోజుల్లోనే ఈ ఘనత సాధించింది. గతేడాది డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకొచ్చిన అల్లు అర్జున్ 'పుష్ప 2: ది రూల్'.. బాహుబలి 2 రికార్డుకు దగ్గరగా వచ్చి ఆగిపోయింది.బాహుబలి-2 కంటే కేవలం రూ. 46 కోట్ల తక్కువ వసూళ్లు సాధించింది. అయితే రూ. 1,000 కోట్ల క్లబ్లోకి అత్యంత వేగంగా చేరిన భారతీయ చిత్రంగా తిరుగులేని రికార్డ్ సృష్టించింది. కేజీఎఫ్-2 మూవీతోనే కన్నడ సినిమా పేరు మార్మోగిపోయింది. ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్లో చిత్రాలు తెరకెక్కించే స్థాయికి ఎదిగిపోయింది.ప్రపంచ బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు చేసిన టాప్-10 ఇండియన్ సినిమాలు -
చీప్గా చూశారు, దెబ్బకు తిరిగి వెళ్లిపోతాననుకున్నారు: నటి
సినీ నటిగా, యాంకర్గా మందిరా బేడీ (Mandira Bedi) అందరికీ సుపరిచితురాలు. క్రికెట్ ఈవెంట్స్కు కూడా ఈమె వ్యాఖ్యాతగా వ్యవహరించింది. అయితే ఆ సమయంలో ఎవరూ తనను లెక్క చేయలేదని, చులకనగా చూశారంటోంది నటి. జూమ్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మందిరా బేడీ మాట్లాడుతూ.. ఏదైనా డిఫరెంట్గా చేసేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు అందరూ మనల్నే పరిశీలిస్తుంటారు. ఏదో ఒకటి అనేందుకు సిద్ధంగా ఉంటారు. అది వారి అభిప్రాయం అనుకోండి.మొదటివారమే డిజాస్టర్కొందరు మనల్ని ఇష్టపడతారు. మరికొందరేమో ద్వేషిస్తారు. అయితే నాకు టీమ్ నుంచి మంచి ఎంకరేజ్మెంట్ ఉండేది. అలా మొదటిసారి ఒక టోర్నమెంట్లో హోస్టింగ్ చేశాను. కానీ మొదటివారమే డిజాస్టర్ అయింది. మా టీమ్ నన్ను పిలిచి నీమీద ఎలాంటి ఒత్తిడి తీసుకురాము. నువ్వేం భయపడకు. వెయ్యిమంది అమ్మాయిల్ని ఆడిషన్ చేశాకే నిన్ను తీసుకున్నాం. నీలో ఆ సత్తా ఉంది అని ప్రోత్సహించారు.మైండ్సెట్ మార్చా..ఆ మాటలు నాకు కొండంత ధైర్యాన్నిచ్చాయి. ఇంత మంచి అవకాశం ఎవరికి దక్కుతుంది? భయపడి వెనకడుగు వేయడం దేనికి? అని ఆలోచించాను. ఉత్సాహంగా ముందుకు సాగాను. నెమ్మదిగా ప్యానెల్లో, ప్రేక్షకుల్లో నాపై ఉన్న అభిప్రాయాలు మారాయి. చాలామంది మైండ్సెట్ను నేను మార్చగలిగాను. నిజానికి ప్యానెల్లో ఉన్న వారికి నేనుండటమే ఇష్టం లేదు. నాకు కాస్తైనా మర్యాద ఇచ్చేవారు కాదు. చీప్గా చూసేవారు, పక్కన పడేసేవారు. డమ్మీ అని తిట్టారుమొదట్లో బాధపడ్డాను. కానీ నేనెందుకు తలదించుకోవాలనుకున్నాను. వాళ్లు వినిపించుకోకపోయినా ఒకటికి రెండుసార్లు ప్రశ్నలు అడిగేదాన్ని. కెమెరాలున్నాయి కాబట్టి వాళ్లు చచ్చినట్లు సమాధానం చెప్పేవాళ్లు. ఈమె తిరిగి వెళ్లిపోయేలా లేదని వాళ్లకర్థమైంది. చివరకు నన్ను ప్యానెల్లో మెంబర్గా స్వీకరించారు. సోషల్ మీడియాలో కూడా నేనో తెలివితక్కువదాన్ని, డమ్మీ అని తిట్టేవారు. నేనేదీ లెక్కచేయలేదు.యాంకర్గా, నటిగా..ఇక సౌతాఫ్రికా టోర్నమెంట్ నుంచి తిరిగి రాగానే నా ఇంటర్వ్యూల కోసం ఎగబడ్డారు. జనాలు నా గురించి తెలుసుకోవాలని ఆరాటపడ్డారు. అలా రోజుకు నాలుగైదు ఇంటర్వ్యూలు ఇచ్చాను అని చెప్పుకొచ్చింది. పలు హిందీ సీరియల్స్లో యాక్ట్ చేసిన మందిరా.. ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ (2003, 2007), ఛాంపియన్స్ ట్రోఫీ (2004, 2006)లకు హోస్టింగ్ చేసింది. మన్మథుడు, సాహో వంటి చిత్రాల్లోనూ యాక్ట్ చేసింది. చివరగా ఐడెంటిటీ అనే మలయాళ చిత్రంలో నటించింది.చదవండి: నా కూతురి జోలికొస్తే కారుతో తొక్కేస్తా.. కాజోల్ వార్నింగ్ -
నా కూతురి జోలికొస్తే కారుతో తొక్కేస్తా.. కాజోల్ వార్నింగ్
నా జోలికొస్తే ఊరుకుంటానేమో కానీ నా కూతురి జోలికొస్తే మాత్రం అంతు చూస్తానంటోంది హీరోయిన్ కాజోల్ (Kajol). ప్రస్తుతం ఆమె మా సినిమా ప్రమోషన్స్లో బిజీగా ఉంది. ఈ మూవీ జూన్ 27న విడుదల కానుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కాజోల్.. తన కూతురిని ట్రోల్ చేసేవారికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా.. నా కూతుర్ని విమర్శించేవాళ్లెవరూ నా కారు ముందుకు రావొద్దు. నా కారు ముందుకొచ్చారంటే..ఒకవేళ వచ్చారే అనుకోండి.. నా కారుతో మిమ్మల్ని ఢీ కొట్టి మీ శరీరాలపై నుంచే నా కారును పోనిస్తాను. సోషల్ మీడియాలో వెయ్యి మెసేజ్లు వస్తే అందులో 999 తను అందంగా ఉంది, మీరు అమేజింగ్.. ఇటువంటి కామెంట్లే ఉంటాయి. కానీ ఏదో ఒక్కటి మాత్రం బ్యాడ్ కామెంట్ ఉంటుంది. అలా చెత్త వాగుడు వాగేవారు ఎందుకున్నారో అర్థం కాదు. అయినా నేను మంచి గురించే ఎక్కువగా పట్టించుకుంటాను. చెడు గురించి కాదు అని చెప్పుకొచ్చింది.హారర్ సినిమాహారర్ సినిమాలను మ్యూట్లో పెట్టుకునే చూసే కాజోల్.. తొలిసారి ఈ జానర్లో నటిస్తోంది. విశాల్ ఫ్యురియా దర్శకత్వం వహిస్తున్న మా చిత్రంలో రోనిత్ రాయ్, ఇంద్రనీల్ సేన్గుప్తా, కెరిన్ శర్మ, నితిన్, సూర్జ్యశిఖ దాస్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాజోల్ చివరగా క్రూ సినిమాలో నటించింది. కాజోల్, బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్గణ్.. 1999లో పెళ్లి చేసుకున్నారు. 2003లో వీరికి కూతురు నైసా జన్మించింది. 2010లో కుమారుడు యుగ్ పుట్టాడు.చదవండి: ఎయిరిండియాకు నటుడి సపోర్ట్.. ఫ్రీ టికెట్ ఇచ్చారా?