breaking news
Peddapalli
-
ఆ ఒక్కటి అడగొద్దు..!
మంథని: అవుట్ సోర్సింగ్.. పార్ట్ టైం ఉద్యోగం పేరిట వివిధ శాఖల్లో వేలాది మంది బోగస్ ఉద్యోగులు పనిచేస్తున్నట్లు అందిన సమాచారం మేరకు ప్రభుత్వం వారిని తొలగిస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీచేసింది. ఈ క్రమంలోనే రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖలో పనిచేసే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను ఆర్ఖిక శాఖ విధుల నుంచి తొలగించింది. కానీ, వారంతా ఇప్పటికీ అనధికారికంగా విధుల్లోనే కొనసాగుతున్నట్లు సమాచారం. విధుల్లోనే కంప్యూటర్ ఆపరేటర్లు.. రాష్ట్రంలోని రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేసే సుమారు 300 మంది ఉద్యోగుల్లో 190 మందిని అక్టోబర్ 10న తొలగిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. మొత్తం 300 మందిలో 190 మంది కంప్యూటర్ ఆపరేటర్లు కాగా మిగతా వారు అటెండర్లు, షరాప్లు ఉన్నారు. అటెండర్లు, షరాప్లను కొనసాగిస్తూ 190 సిస్టం ఆపరేటర్లను విధుల్లోంచి తొలగించారు. ఈశాఖలో పనిచేసే షరాప్, అటెండర్లు నెలకు రూ.16,500 వేతనంపైనే నెట్టుకు వస్తున్నారు. వీరికి చాలీచాలని వేతనాలు వస్తున్నాయని ఆందోళన ఉన్నారు. తక్కువ వేతనాలు ఉండడంతో అందరినీ కొనసాగించాలని ఉద్యోగులు విన్నవించారు. ఈమేరకు ఏటా వారి విధులను పొడిగిస్తున్నారు. కానీ, సిస్టం ఆపరేటర్ల విషయంలో ప్రభుత్వం కనికరం చూపలేదు. మరోవైపు.. ప్రభుత్వం వారిని విధుల్లోంచి తొలగించినా ఆయా కార్యాలయాల్లో అనధికారికంగా కొనసాగుతున్నట్లు సమాచారం,. వేతనాల చెల్లింపుపై అనుమానాలు ఆర్థికభారం తగ్గించుకునేందుకు రిజస్ట్రేషన్ల శాఖలో అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేస్తున్న సిస్టం ఆపరేటర్లను తొలగించి అదే శాఖలో రెగ్యులర్ ఉద్యోగులను ఆ విధులను చూసుకోవాలని ప్రభు త్వం సూచించింది. కానీ, ఉమ్మడి కరీంనగర్ జిల్లా లోని 14 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో చాలాచోట్ల సిస్టం ఆపరేటర్లు యథావిధిగా పనులు చేస్తూనే ఉన్నారని సమాచారం. వీరికి అవుట్ సోర్సింగ్ పద్ధతిన ప్రతినెలా రూ.19.500 చొప్పున చెల్లించేవారు. ప్రభుత్వం వారిని తొలగించడంతో వీరికి వేతనాలు ఎవరు చెల్లిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంపై జిల్లాలోని ఓ అధికారిని వివరణ అడిగేందుకు యత్నించగా ‘ఆ ఒక్కటి అడక్కు’ అని సమాధానమిచ్చారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రైవేటు పర్సన్ హవా? రిజిస్ట్రేషన్ల శాఖలో ప్రైవేటు వ్యక్తులదే పెత్తనం ఉంది. కీలకమైన విభాగాలు వారే చూస్తూ రిజిస్ట్రేషన్ల ప్రక్రియను నడిపిస్తున్నారు. చాలాకార్యాలయాల్లో రెగ్యులర్ సబ్ రిజిస్ట్రార్ల కొరత ఉండడం, దీనికితోడు ప్రైవేటు వ్యక్తుల ప్రమేయం అధికంగా కొనసాగుతున్నా ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదు. దస్తావేజు లేఖరులు సైతం తమ పరిధిని మించిన పనులు చేస్తూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పెద్దఎత్తున అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. తొలగించినా.. విధుల్లోనే కొనసాగింపు సబ్రిజిస్ట్రార్ ఆఫీసుల్లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ప్రతీనెల వేతనాల చెల్లింపుపై అనేక అనుమానాలు -
పూర్వ విద్యార్థుల సిల్వర్ జూబ్లీ వేడుకలు
గోదావరిఖనిటౌన్: పెద్దపల్లి జిల్లా గోదావరిఖని మార్కండేయకాలనీలోని లిటిల్ ఫ్లవర్ హైస్కూల్లో 1999–2000 బ్యాచ్కు చెందిన పదోతరగతి విద్యార్థులు 25 ఏళ్ల తర్వాత ఆదివారం కలుసుకున్నారు. ఇందుకు స్థానిక ఒక ఫంక్షన్ హాల్ వేదికై ంది. చిన్ననాటి తరగతి గది జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. చదువు నేర్పిన గురువులను శాలువాలతో ఘనంగా సత్కరించారు. స్కూల్ కరస్పాండెంట్ పొరండ్ల మధు, పూర్వ ఉపాధ్యాయులు మల్లికార్జున్రెడ్డి, కల్వల నాగరాజు, రమేశ్, తిరుపతి, రాజన్న, సునీల్, సత్యనారాయణ, పూర్వ విద్యార్థులు సుకాంత్, రవి, సతీశ్, రషీద్, రాజేశ్, శ్రీలతరెడ్డి, మాధవి తదితరులు పాల్గొన్నారు. -
బోధన్ రైలుకు బోర్డేది..!
రామగుండం: రైలు నంబర్ 67771 సిర్పూర్టౌన్–కరీంనగర్ వెళ్లే మెమూ ప్యాసింజర్ రైలు కొద్ది క్షణాల్లో రెండో నంబర్ ప్లాట్ఫారంపై రానున్నదంటూ.. రామగుండం రైల్వే స్టేషన్లో ఉదయం 11.05 గంటలకు రానున్న సమయంలో ముందస్తుగా రైల్వే అనౌన్స్మెంట్ చేయనున్నారు. కానీ మెమూ(మెయిన్లైన్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్) రైలు మాత్రం బోధన్ వరకు వెళ్లనుందనే విషయం అసలు ప్రయాణికులకు తెలియకపోవడం గమనార్హం. రైలు నం.67771 సిర్పూర్టౌన్–కరీంనగర్, రైలు నం.67773 కరీంనగర్–బోధన్ వరకు రెండు నంబర్లతో రైలు నడుస్తుంది. అదే రైలు తిరుగు ప్రయాణంలో రైలు నం.67774 బోధన్–కరీంనగర్, రైలు నం.67772 కరీంనగర్ నుంచి సిర్పూర్టౌన్ వరకు. కాగా రైల్వే యాప్లో సిర్పూర్టౌన్ నుంచి బోధన్ వరకు రైళ్లను పరిశీలిస్తే స్పష్టమైన సమాచారం రాకపోవడం గమనార్హం. నంబర్తో పని లేకుండా.. రైలు నంబర్తో పని లేకుండా నేరుగా సదరు రైలు గమ్యస్థానానికి వెళ్లే ప్రాంతాన్ని అనౌన్స్మెంట్ చేయడంతో కొత్తగా వెళ్లే ప్రయాణికులకు అర్థమవుతుంది. ఒకవేళ కరీంనగర్ వరకు వెళ్లే రైలు నంబర్తో అనౌన్స్మెంట్ చేసినా.. గమ్యస్థానాన్ని సైతం అనౌన్స్ చేస్తే ప్రయాణికుల నుంచి విశేష స్పందన ఉంటుంది. సమయం ఆదా.. సిర్పూర్టౌన్ నుంచి నేరుగా బోధన్కు వెళ్లే ప్రయాణికులు అతి తక్కువ చార్జీలతో.. తక్కువ సమయంలో.. సుఖమయమైన ప్రయాణం చేసే అవకాశమున్నా.. రైల్వే శాఖ వైఫల్యంతోనే ప్రయాణికుల నుంచి ఆదరణ కరువైంది. కరీంనగర్ వరకు ఒక నంబర్, అక్కడి నుంచి బోధన్కు మరో రైలు నంబర్ ఉండడంతో.. సమాచారంపై అస్పష్టతతో ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారిస్తున్నారు. చార్జీలు అతి స్వల్పం సిర్పూర్టౌన్(కొమురంభీం జిల్లా) నుంచి బోధన్(నిజామాబాద్ జిల్లా) వరకు మెమూ ప్యాసింజర్ రైలు రాకపోకలు సాగిస్తోంది. సిర్పూర్టౌన్–కరీంనగర్ వరకు 143 కిలోమీటర్లు. కరీంనగర్ నుంచి బోధన్కు 169 కిలోమీటర్లు. మొత్తంగా 312 కిలోమీటర్ల దూరం. ఈ మెమూ రైలులో సిర్పూర్టౌన్ నుంచి బోధన్ వెళ్లేవారికి గరిష్టంగా ఆరు గంటల సమయం పడుతుండగా.. చార్జీ మాత్రం రూ.100 లోపే ఉండడం విశేషం. -
కొనసాగుతున్న శిబిరం
పెద్దపల్లిరూరల్: స్థానిక శ్రీసరస్వతి శిశుమందిర్ ఉన్నత పాఠశాలలో భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆధ్వర్యంలో శనివారం మొదలైన త్రితీయ సోఫాన్ టెస్టింగ్ క్యాంపు ఈనెల 29వ తేదీ వరకు జరుగుతుందని జిల్లా కార్యదర్శి జ్యోతి తెలిపారు. ఆదివారం నాటి కార్యక్రమంలో గాయత్రీ విద్యాసంస్థల చైర్మన్ అల్లెంకి శ్రీనివాస్ స్కౌట్ పతాకాన్ని ఆవిష్కరించారు. జిల్లాలోని పలు విద్యాసంస్థలకు చెందిన 76 మంది గైడ్స్, 11 మంది గైడ్ కెప్టెన్స్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రధానాచార్యులు శ్రీధర్ రాజు, రఘు సింగ్ తదితరులు పాల్గొన్నారు. -
ఈకేవైసీపై అధికారుల ప్రత్యేక దృష్టి
పెద్దపల్లి: జిల్లాలో ఇంకా ఈకేవైసీ నమోదు ను పూర్తిచేయని రేషన్కార్డుదారులపై జిల్లా అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. ఈమేరకు జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు నిర్దేశిత లక్ష్య సాధన కోసం ప్రత్యేక ప్రణాళిక రచించారు. మరణించిన వారి పేర్లు, నకిలీ కార్డులు తొలగించడానికి వీలుగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. కేంద్రప్రభుత్వ ఆదేశాల మేరకు రేషన్కార్డుదారులు అందరూ రేషన్ దుకాణాలకు వెళ్లి ఈకేవైసీ నమోదు చేయించుకోవాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఇప్పటికే పలుమార్లు జిల్లావాసులకు సూచించారు. వాస్తవానికి రెండేళ్ల క్రితమే ఈప్రక్రియ పూర్తిచేయాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. కా నీ జిల్లావ్యాప్తంగా ఆ ప్రక్రియ నత్తనడకన సా గుతోంది. జిల్లాలో ఇప్పటివరకు కేవలం 76శాతం మాత్రమే ఈకేవైసీ నమోదు పూర్తయిందని డీసీఎస్వో శ్రీనాథ్ తెలిపారు. -
వలసకూలీల సహపంక్తి భోజనం
పెద్దపల్లిరూరల్: యాసంగి వరి నాట్లు ఊపందుకుంటున్నాయి. రైతులు వరినారు పోసుకుని నాటేందుకు సిద్ధంగా ఉన్నా.. కూలీలు లభించడంలేదు. దీంతో పొరుగు గ్రామాల నుంచి రప్పించి నాట్లు వేయిస్తున్నారు. ఎకరాకు 12 మంది నాటు వేసేందుకు అవసరమైతే.. రవాణాతోపాటు వారికి మొత్తంగా రూ.4,800 చెల్లిస్తున్నట్లు రైతులు తెలిపారు. పెద్దపల్లి పట్టణ శివారు పెద్దమ్మనగర్కు చెందిన కూలీలు వరినాట్లు వేస్తూ ఆదివారం మధ్యాహ్నం వేళ తుర్కలమద్దికుంట శివారులోని ప్రధాన రహదారిపై ఒకేవరుసలో కూర్చుని భోజనం చేస్తూ ఇలా కనిపించారు. -
బైక్ను నడుముకు కట్టుకొని.. బావిలో దూకి..
● పెగడపల్లిలో వ్యక్తి బలవన్మరణం పెగడపల్లి(ధర్మపురి): మండల కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి తన బైక్ను తాడుతో నడముకు కట్టుకొని బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై కిరణ్కుమార్ వివరాల ప్రకారం.. బండారు వెంకటేశం(50) కొంతకాలంగా తాగుడుకు బానిసయ్యాడు. శనివారం మధ్యాహ్నం తన బైకుపై బయటకు వెళ్లిన వెంకటేశం.. రాత్రి ఇంటికి రాకపోవడంతో ఆదివారం కుంటుంబ సభ్యులు వెతికారు. గ్రామ శివారులోని దాసరి పాపయ్య అనే రైతు వ్యవసాయ బావి వద్ద చెప్పులు, ఇతర వస్తువులు కనిపించాయి. బావిలో చూడగా.. బైక్తో సహా వెంకటేశం మృతదేహం లభించింది. మృతుడి భార్య గంగవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు. మృతుడికి తల్లి, తండ్రి, భార్య, ఇద్దరు కూతుళ్లున్నారు. వేములవాడ: భీమన్నను ఆదివారం 20వేల మంది భక్తులు దర్శించుకున్నారు. ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని ఈనెల 30న ఉదయం 3 గంటల నుంచి ప్రత్యేక కార్యక్రమాల అనంతరం భీమేశ్వరాలయంలో 4 నుంచి 4.30 గంటల వరకు ఆలయ శుద్ధి, 4.30 నుంచి 5 గంటల వరకు ప్రాతఃకాల పూజ, 5.45 గంటలకు పల్లకీసేవలపై ఉత్తరద్వార ప్రవేశం ఉంటుందని ఆలయ ఈవో రమాదేవి తెలిపారు. -
మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్ మేడ్చల్
కరీంనగర్స్పోర్ట్స్: జిల్లా మాస్టర్స్ అథ్లెటిక్ సంఘం ఆధ్వర్యంలో 2 రోజులుగా కరీంనగర్ అంబేడ్కర్ స్టేడియంలో జరుగుతున్న 12వ రాష్ట్రస్థాయి మాస్టర్స్ అథ్లెటిక్ చాంపియన్షిప్ పోటీలు ఆదివారంతో ముగిశాయి. రాష్ట్ర ఓవరాల్ చాంపియన్షిప్ను మేడ్చల్ జిల్లా జట్టు కై వసం చేసుకోగా.. రన్నరప్ను రంగారెడ్డి జిల్లా జట్టు గెలుచుకుంది. సాయంత్రం విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు తెలంగాణ మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు దేవేందర్రెడ్డి, అధ్యక్షుడు మర్రి లక్ష్మారెడ్డి, ప్రధాన కార్యదర్శి ప్రభుకుమార్గౌడ్ ట్రోఫీలను ప్రదానం చేశారు. 18 జిల్లాల నుంచి సుమారు 900 మందికి పైగా 30 నుంచి 90 సంవత్సరాల వయస్సు వారు పోటీలకు హాజరైనట్లు తెలిపారు. రాష్ట్ర పోటీల్లో రాణించిన అథ్లెట్లను జాతీయస్థాయి పోటీలకు ఎంపిక చేశామన్నారు. వివేకానంద విద్యాసంస్థల అధినేత సౌగాని కొంరయ్య, కరీంనగర్ జిల్లా మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డాక్టర్ చాట్ల శ్రీధర్, నీలం లక్ష్మణ్, డి.లక్ష్మి, కిషన్రావు, శిరీష, శాట్స్ రిటైర్డ్ ఏడీ కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. మేడ్చల్ జోరు.. రన్నింగ్, త్రోస్, జంప్స్ విభాగాల్లో రాణించి ఎక్కువ పతకాలు కై వసం చేసుకున్న మేడ్చల్ జిల్లా జట్టు 581 పాయింట్లతో చాంపియన్గా నిలిచింది. రంగారెడ్డి జిల్లా జట్టు 252 పాయింట్లతో ద్వితీయ చాంపియన్షిప్ను కై వసం చేసుకుంది. మేడ్చల్ పురుషుల విభాగంలో 250, మహిళల విభాగంలో 331 పాయింట్లు సాధించింది. పతకాలు ప్రదానం చేసిన ఎమ్మెల్యే గంగుల ఆదివారం మధ్యాహ్నం కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సందర్శించారు. పలువురు విజేతలకు బంగారు, రజత, కాంస్య పతకాలను ప్రదానం చేశారు. ఆయన మాట్లాడుతూ.. వయస్సు తేడా లేకుండా ఉత్సాహంగా పాల్గొనడం అభినందనీయమన్నారు. మాస్టర్ల స్టెప్పులు.. పోటీలు ముగియడంతో.. వివిధ జిల్లాలకు చెందిన అథ్లెట్లు ఆడుతూ పాడుతూ అదిరేటి స్టెప్పులు వేస్తూ సందడి చేశారు. గెలిచిన, ఓడినవారు అనే తేడా లేకుండా ఆరోగ్యానికి వ్యాయామం అవసరమన్న సంకేతంతో జానపద పాటలపై నృత్యాలు చేసిన తీరు ఆహుతులను ఎంతగానో ఆకట్టుకుంది. ద్వితీయ స్థానంలో రంగారెడ్డి ముగిసిన 12వ రాష్ట్రస్థాయి పోటీలు -
సుల్తానాబాద్ చేరిన ఎస్సారెస్పీ నీరు
పెద్దపల్లి/పెద్దపల్లిరూరల్: యాసంగి పంటల సాగు కోసం ఎస్సారెస్పీ ద్వారా వారబందీ పద్ధతిన ఈనెల 24వ తేదీన విడుదల చేసిన సాగునీరు ఆదివారం స్థానిక పూసాల సమీప ఎస్సారెస్పీ కాలువలోకి వచ్చిచేరింది. జూలపల్లి, ఎలిగేడు నుంచి సుల్తానాబాద్ వరకు కాలువద్వారా నీరుచేరడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే, జగిత్యాల జిల్లాకు కేటా యించిన నీటిలో అదనపు నీటిని వృథా చేయ కుండా పెద్దపల్లి జిల్లాకు తరలిస్తున్నారని, ఇది ఎప్పుడు ఆగిపోతుందో తెలియదని అధికారు లు చెబుతున్నారు. వాస్తవంగా ఎస్సారెస్పీ నీ రు వచ్చే ఏడాది జనవరి 2న జిల్లాకు చేరాలి.కళాకారులను ఆదుకోవాలి పెద్దపల్లి: జానపద కళాకారులను ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకోవాలని తెలంగాణ జానపద సకలవృత్తి కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు తాళ్లపల్లి సంధ్యగౌడ్ డిమాండ్ చేశారు. స్థానిక నందన గార్డెన్స్లో ఆదివారం జరిగిన కళాకారుల సమావేశంలో మాట్లాడారు. గుర్తింపుకార్డులు ఇవ్వాలని, వృద్ధులకు పింఛన్, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని, జానపద కళలను భావితరాలకు అందించేందుకు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వలస సుభాష్ చంద్ర బోస్ మాట్లాడారు. నాయకులు, కళాకారులు సారయ్యగౌడ్, ఎద్దు మమత, కేశవేణి రమాదేవి, బూడిద అనసూయ, కొమురయ్య, నాంపల్లి, సింధుజ, కందుకూరి లలిత, మల్లమ్మ, రమాదేవి తదితరులు పాల్గొన్నారు. విద్యారంగానికి పెద్దపీట ● పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు ఎలిగేడు(పెద్దపల్లి): ప్రభుత్వ విద్యారంగాన్ని పటిష్టం చేసేందుకు కాంగ్రెస్ సర్కార్ కట్టుబడి ఉందని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. శివపల్లిలోని తన నివాసంలో తెలంగాణ టీచర్స్ షెడరేషన్(టీఆర్టీఎఫ్) రూపొందించిన 2026 క్యాలెండర్, డైరీని ఆదివారం ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. జీరో ఎన్రోల్మెంట్ పాఠశాలలను సమీప హ్యాబీటేషన్లకు అనుసంధానం చేసి పునరుద్ధరించాలని అన్నారు. టీఆర్టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కటకం రమేశ్, జిల్లా ప్రఽఽధాన కార్యదర్శి సంతోష్కుమార్, నాయకులు లక్ష్మీనారాయణ, రవికుమార్, మహేందర్రెడ్డి, అశోక్కుమార్, శ్రీనివాస్, రవీందర్రావు, విఠల్, ప్రేమ్సాగర్, మహేశ్కుమార్, రమేశ్, కరుణాకర్రెడ్డి, నాగరు, లక్ష్మీనారాయణ, రమేశ్, మహేందర్, దస్తగిరి పాల్గొన్నారు. కాగా, సుల్తానాబాద్ మండలం నీరుకుల్ల సర్పంచ్(స్వతంత్ర) కంపెల్లి సతీశ్కుమార్, వార్డుసభ్యులు ముత్యం జ్యోశీల, దుగ్యాల భూంరావు ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ‘పరిషత్’లో సత్తా చాటుతాం పెద్దపల్లిరూరల్: పరిషత్ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులు విజయం సాధించడం ఖాయమని బీజేపీ జిల్లా పరిశీలకుడు నాగపురి రాజమౌళి అన్నారు. జిల్లాకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యవర్గ సమావేశంలో ఆయన పలు సూచనలు చేశారు. పెద్దపల్లి, మంథని, రామగుండం సెగ్మెంట్లలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలతోపాటు మున్సిపల్ ఎన్నికల్లోనూ బీజేపీ అభ్యర్థులు విజయం సాధిస్తారనే ధీమా వ్యక్తం చేశారు. మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ను ప్రజలు విశ్వసించడం లేదన్నారు. కార్యక్రమంలో నాయకులు మీస అర్జున్రావు, గొట్టిముక్కుల సురేశ్రెడ్డి, హనుమంతుగౌడ్, రావుల రాజేందర్, మహేశ్, పల్లె సదానందం, కడారి అశోక్రావు, కందుల సంధ్యారాణి, నల్ల మనోహర్రెడ్డి, మహేందర్, నిర్మల, రాము, అమరగాని ప్రదీప్, భాస్కర్రెడ్డి, శివంగారి సతీశ్, వెల్లంపల్లి శ్రీనివాసరావు, క్రాంతి, రాజేందర్, వెంకటకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో దంపతుల దుర్మరణం
గొల్లపల్లి(ధర్మపురి): అబ్బాపూర్లో రోడ్డు ప్రమాదంలో దంపతులు దుర్మరణం చెందారు. పోలీసుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రెడపాక లింగయ్య(57), లచ్చవ్వ(49) గ్రామంలో మేసీ్త్ర పని చేసుకుంటూ జీవిస్తున్నారు. వ్యక్తిగత పని నిమిత్తం లచ్చవ్వ బంధువుల ఇంటికి హైదరాబాద్ వెళ్లేందుకు ఆదివారం ద్విచక్ర వాహనంపై దంపతులిద్దరూ కలిసి జగిత్యాల వెళ్తుండగా.. జగిత్యాల నుంచి గొల్లపల్లి వైపు అతివేగంగా, అజాగ్రత్తగా వచ్చిన తవేరా వాహనం గొల్లపల్లి శివారులో బలంగా ఢీకొంది. లచ్చవ్వ అక్కడికక్కడే మృతిచెందగా.. తీవ్ర గాయాలపాలైన లింగయ్యను చికిత్స నిమిత్తం జగిత్యాల ఏరియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఘటనా స్థలాన్ని సందర్శించిన సీఐ రాంనర్సింహారెడ్డి వివరాలు సేకరించారు. వీరికి వివాహమైన కొడుకు, కూతురున్నారు. కోడలు రజిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై కృష్ణసాగర్రెడ్డి తెలిపారు. మంథనిరూరల్: రెండు రోజులుగా పెద్దపల్లి జిల్లా మంథని అడవుల్లో సంచరించిన పెద్ద పులి.. ఆదివారం మానేరు నది దాటి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోకి ప్రవేశించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శనివారం సాయంత్రం మంథని మండలం భట్టుపల్లి అటవీ ప్రాంతంలో పులి అడుగులు గుర్తించిన అటవీ శాఖ అధికారులు.. ఆదివారం తిరిగి గాలింపు చర్యలు చేపట్టారు. భట్టుపల్లి అటవీ ప్రాంతం నుంచి అడవిసోమన్పల్లి మానేరు నదిలో పులి అడుగుల కోసం అన్వేషణ చేపట్టారు. అయితే మానేరు తీర ప్రాంతంలో అడుగులు కన్పించకపోవడంతో అధికారులు అడవిలోనే మకాం వేసినట్లు భావించారు. కానీ ఆదివారం ఉదయం జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం జడలపేట శివారులోని అటవీ ప్రాంతంలో ఓ ఎద్దుపై దాడి చేసినట్లు సమాచారం రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మంథని, ముత్తారం మండలాల్లోని మానేరు తీర ప్రాంతాల్లో అటవీ శాఖ అధికారులు 2 బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం లభించలేదు. అయితే ముత్తారం మండలం ఓడేడ్, అడవిశ్రీరాంపూర్ మానేరు నది మీదుగా చిట్యాల వైపు వెళ్లే అవకాశాలున్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ గాలింపు చర్యల్లో ఎఫ్ఎస్వోలు నర్సయ్య, రహ్మతుల్లా హుస్సేన్, సోని కిరణ్, ఎండీ అఫ్జల్ అలీ, ఎఫ్బీవోలు ప్రదీప్, శ్రీకాంత్, రాంసింగ్, ప్రవీణ్, సిబ్బంది పాల్గొన్నారు. -
జాతరకు ముందస్తు చర్యలేవి..?
సుల్తానాబాద్రూరల్: మినీ మేడారంగా ప్రసిద్ధి గాంచిన నీరుకుల్ల–వేగురుపల్లి గ్రామాల మధ్య ఉన్న శ్రీరంగానాయకస్వామి ఆలయం సమీపంలో ఉన్న సమ్మక్క–సారలమ్మ జాతర అత్యంత వైభోవంగా జరుగుతుంది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నీరుకుల్ల గ్రామంలో రెండేళ్లకోసారి జరిగే జాతరకు భక్తులు అధిక సంఖ్యలో వచ్చి వన దేవతకు ప్రత్యేక మొక్కులు చెల్లించుకుంటారు. ఇక్కడ మేడారం కోయ పూజారులు వచ్చి పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ జాతరకు దాదాపు 3 లక్షలకు పైగా భక్తులు వస్తుంటారు. జాతర సమీపిస్తున్నా ముందస్తు చర్యలేమి ఎండోమెంట్ అధికారులు, ప్రజాప్రతినిధులు చేపట్టకోవడంతో.. జాతరలో తిప్పలు తప్పేట్లు లేవని భక్తులు వాపోతున్నారు. ఇబ్బందులు తప్పేనా? రెండేళ్లకోసారి అత్యంత వైభవంగా జరిగే సమ్మక్క–సారలమ్మ జాతర 2026 జనవరి చివరి వారంలో జరగనుంది. భక్తులు బస చేసేందుకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ముందస్తుగా చర్యలు తీసుకోవాలి. ధ్వంసమైన రోడ్డును మరమ్మతు చేసి భక్తులు బస చేసేందుకు, వంటలు చేసుకునేందుకు వీలుగా జాతర సమీపంలోని పంట పొలాల్లో పంటలు సాగు చేయకుండా ఆయా రైతులతో ఒప్పందం కుదుర్చుకొని చర్యలు తీసుకునేవారు. ప్రస్తుతం రైతులు పంటలు సాగు చేసేందుకు సిద్ధమవుతున్నారు. గతంలో మానేరు వాగులో భక్తులు బస చేసేవారు. చెక్ డ్యాం నిర్మాణంతో నీటితో నిండి ఉండడంతో జాతర సమీపంలో ఉన్న పంట పొలాలే దిక్కయ్యే పరిస్థితి ఉంది. రంగనాయకస్వామి దేవాలయం ఎండోమెంట్ అధికారుల ఆధ్వర్యంలో ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసి జాతర నిర్వహిస్తారు. రోడ్లు ఇలా.. వెళ్లేదెలా.. నీరుకుల్ల నుంచి జాతర ప్రాంతానికి దాదాపు 2 కిలోమీటర్ల దూరం ఉంటుంది. రోడ్డు పూర్తిగా చెడిపోవడంతో ప్రయాణం నరకంగా ఉంది. గద్దెల వద్దకు వెళ్లే రోడ్డు మానేరు వాగు నీటి ఉధృతికి కొట్టుకుపోగా.. తాత్కాలికంగా మట్టి రోడ్డు వేశారు. ఈ రోడ్లతో వచ్చే భక్తులకు తీవ్ర ఇబ్బందులతోపాటు ట్రాఫిక్కు అంతరాయం కల్గనుంది. కమిటీ జాడ ఎక్కడ? శ్రీరంగనాయకస్వామి ఆలయం ఎండోమెంట్ ఆధ్వర్యంలో ఉత్సవ కమిటీ ఎన్నుకొని జాతర సజావుగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తారు. జాతర జరిగేందుకు నెల రోజులే ఉన్నా.. కమిటీ ఎన్నిక జరగలేదు. జనవరిలో జరగనున్న సమ్మక్క–సారలమ్మ జాతర నీరుకుల్లకు దాదాపు 3 లక్షలకు పైగా భక్తుల రాక ప్రతిసారీ ట్రాఫిక్తో తిప్పలు సౌకర్యాలు కల్పించాలని కోరుతున్న భక్తులు -
కబడ్డీ చాంపియన్లు సూర్యాపేట, హైదరాబాద్–2
మహిళల రన్నర్గా రంగారెడ్డి జిల్లా జట్టు మహిళల చాంపియన్షిప్ కై వసం చేసుకున్న హైదరాబాద్–2 జట్టు కరీంనగర్స్పోర్ట్స్: కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ స్టేడియంలో జిల్లా కబడ్డీ సంఘం ఆధ్వర్యంలో 4 రోజలపాటు జరిగిన 72వ రాష్ట్రస్థాయి సీనియర్స్ కబడ్డీ చాంపియన్షిప్ పోటీలు ఆదివారంతో ముగిశాయి. పురుషుల విభాగంలో సూర్యాపేట జిల్లా జట్టు చాంపియన్షిప్ను కై వసం చేసుకోగా.. మహిళల విభాగంలో హైదరాబాద్–2 జట్టు విజేతగా నిలిచింది. పురుషుల విభాగంలో రన్నర్గా జోగులాంబ గద్వాల్ జట్టు, తృతీయ స్థానాల్లో నిజామాబాద్, నాగర్ కర్నూల్ నిలిచాయి. మహిళల విభాగంలో రన్నర్గా రంగారెడ్డి జిల్లా జట్టు, తృతీయ స్థానాల్లో వరంగల్, ఖమ్మం జట్లు నిలిచాయి. మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు ట్రోఫీలు ప్రదానం చేశారు. మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహించడానికి స్పోర్ట్స్ పాలసీ తీసుకొచ్చిందన్నారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లా కబడ్డీ క్రీడాకారులకు రెండు ఆస్ట్రోటర్ఫ్ కోర్టులు ఇచ్చేందుకు కృషి చేస్తానని అన్నారు. సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర పోటీలతో కబ్డడీకి మరింత క్రేజ్ వచ్చిందన్నారు. మహిళల జాతీయస్థాయి కబడ్డీ పోటీలు హైదరాబాద్లోని పటాన్చెరులో ఫిబ్రవరి 5 నుంచి 8 వరకు జరుగుతాయని రాష్ట్ర కబడ్డీ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు కాసాని వీరేశం, మహేందర్రెడ్డి తెలిపారు, రాష్ట్ర కబడ్డీ సంఘం ఉపాధ్యక్షుడు సీహెచ్ సంపత్రావు, తెలంగాణ ఒలింపిక్ సంఘం సంయుక్త కార్యదర్శి గసిరెడ్డి జనార్దన్రెడ్డి, జిల్లా కబడ్డీ సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ అమిత్కుమార్, మల్లేశంగౌడ్ పాల్గొన్నారు. రన్నర్గా నిలిచిన జోగులాంబ గద్వాల్, రంగారెడ్డి జిల్లాలు ముగిసిన 72వ రాష్ట్రస్థాయి సీనియర్స్ కబడ్డీ పోటీలు ట్రోఫీలు ప్రదానం చేసిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ -
సంప్రదించాల్సిన ఫోన్నంబరు : 98490 22772 సమయం : ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు
మల్లన్నకు బోనం మొక్కులు ఓదెల: ఓదెల మల్లికార్జునస్వామి సన్నిధి ఆదివారం భక్తులతో కోలాహలంగా మారింది. స్వామివారికి బోనంతో నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆకట్టుకున్న శోభాయాత్ర యైటింక్లయిన్కాలనీ: యాదవ సంఘం ఆధ్వర్యంలో పట్టణంలో ఆదివారం మల్లన్నస్వామి బోనాల శోభాయాత్ర వైభవంగా నిర్వహించారు. షిర్కే బస్స్టాప్ చౌరస్తా నుంచి న్యూమారేడుపాక శ్రీనాగుల మల్లికార్జునస్వామి ఆలయం వరకు యాత్ర కొనసాగింది. దారిపొడవునా ఒగ్గు కళాకారులు విన్యాసా లు, కళాకారులు కోలాటాలతో ఆకట్టుకున్నారు. అనంతరం భక్తులు స్వామివారికి బోనాలతో నైవే ద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. కా ర్యక్రమంలో నాయకులు గడ్డం తిరుపతి, కేశవులు, సాంబమూర్తి, మల్లేశ్యాదవ్ పాల్గొన్నారు. ఎన్టీపీసీలో ఉల్లాస్ మేళా జ్యోతినగర్(రామగుండం): ఎన్టీపీసీ పర్మినెంట్ టౌ న్షిప్లో ఆదివారం ఉల్లాస్ మేళా ఘనంగా ని ర్వ హించారు. ఎన్టీపీసీ సదరన్ రీజియన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అర్విందం సిన్హా కేక్ కట్ చేసి మేళా ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ, ఎన్టీపీసీలో అన్ని రాష్ట్రాల ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారన్నా రు. అందరి సహకారంతో విద్యుత్ ఉత్పత్తితో పాటు ఉద్యోగుల అభ్యున్నతికి సంస్థ కృషి చేస్తుందని తెలిపారు. కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈడీ చందన్ కుమార్ సామంత, ఏజీఎం బిజయ్కుమార్ సిగ్దర్, అధికారులు పాల్గొన్నారు. యాసంగి సాగు వివరాలు(ఎకరాల్లో) పప్పు దినుసులపై నిరాసక్తత పప్పుదినుసుల సాగుపై రైతులు ఆసక్తి చూపడంలేదు. కంది గెట్టు పంటగా మారగా, పెసర, మినుము, వేరుశనగ లాంటి పంటలు వేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. 2022లో 691 ఎకరాల్లో కంది సాగు చేసిన రైతులు.. 2023లో 159 ఎకరాలు, 2024లో 169 ఎకరాల్లో పండించారు. ఈఏడాది 110 ఎకరాలకే పరిమితం చేశారు. వేరుశనగ నాలుగెకరాల్లోనే సాగవడం గమనార్హం. దిగుబడిపై ప్రభావం వాతావరణ పరిస్థితులు ఈఏడాది దిగుబడిపై ప్రభావం చూపాయి. వానాకాలం వరి పంట చేతికి అందే దశలో కురిసిన అకాల వర్షాలకు జరిగిన నష్టం వివరాలను ప్రభుత్వానికి నివేదించాం. పత్తిపై ప్రభావం చూపడంతో దిగుబడి గణనీయంగా తగ్గింది. – శ్రీనివాస్, డీఏవో -
అకాలం.. అన్నదాత ఆగం
సోమవారం శ్రీ 29 శ్రీ డిసెంబర్ శ్రీ 2025పెద్దపల్లిరూరల్: చెరువులు, కుంటల్లో నీరు సమృద్ధిగా ఉండడంతో రైతులు యాసంగి సాగులో నిమగ్నమయ్యారు. వచ్చే ఏడాది జనవరి 2న ఎస్సారెస్పీ నీరు జిల్లాకు చేరుకుంటుంది. దీనిఆధారంగా రైతులు వరి, మొక్కజొన్న వేయాలని చూస్తున్నారు. చలితీవ్రత అధికంగా ఉండడంతో కొన్నిచోట్ల నారుమడులు దెబ్బతింటున్నాయి. కూనారం వ్యవసాయ పరిశోధనాకేంద్రం శాస్త్రవేత్తలు మేలు రకం వంగడాలనే విత్తాలని సూచిస్తున్నారు. ధర ఉన్నా దిగుబడి రాలే ఈ సారి పత్తి సాగు చేసిన రైతులు ఆశించిన స్థాయిలో దిగుబడి సాధించలేదు. దిగుబడి తగ్గాక ప్రస్తుతం క్వింటాల్ ధర రూ.7,400కుపైగా పలుకుతోంది. దీంతో తెల్లబంగారం సిరులు కురిపిస్తుందని ఆశపడ్డ రైతులు దిగాలు చెందుతున్నారు. సీసీఐ ఆంక్షలతో అవస్థలు.. పత్తి విక్రయాలపై కాటన్కార్పొరేషన్ ఆఫ్ ఇండి యా(సీసీఐ) విధించిన ఆంక్షలు ఇటు రైతులు, అ టు మిల్లర్లు, అడ్తివ్యాపారులను ఇబ్బందులకు గురిచేశాయి. కపాస్ యాప్ ద్వారా ఆన్లైన్లో వివరాలు నమోదు చేసుకోవడంపై అవగాహన లేనిరైతులు ఆందోళన చెందారు. ఎకరాకి గతంలో 12 క్వింటాళ్ల వరకు కొనుగోలు చేసిన సీసీఐ.. ఈ ఏడాది 7 క్వింటాళ్లకే పరిమితం చేయడం వివాదానికి దారితీసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రంగంలోకి దిగడంతో కొనుగోళ్లు సాధారణంగానే సాగాయి. ధాన్యం తేమశాతం రాక.. ధాన్యం దిగుబడి కూడా ఆశించిన మేర రాలేదు. కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తే తేమశాతం లేదని నిర్వాహకులు కొర్రీలు పెట్టారు. రైతులు రోజుల త రబడి నిరీక్షించారు. ఒక్కోటి రూ.15 లక్షలు వెచ్చించి కొనుగోలు చేసిన ధాన్యం ఆరబెట్టే యంత్రాల(డయ్యర్)ను జిల్లాకు ఐదు చొప్పున కేటాయించారు. ఇవి ఇప్పటివరకు ఒక్కగింజను కూడా ఆరబెట్టలేదు. రైతులకు రోడ్లే దిక్కయ్యాయి. కొందరు రైతులకు ఇంకా బోనస్ డబ్బులు జమకాలేదు. రైతుబీమా వివిధ కారణాలతో మరణించిన రైతు కుటుంబాలకు రైతుబీమా వర్తింపజేశారు. జిల్లాలో 94,473 మంది తమ పేర్లు నమోదు చేసుకున్నారు. ఆరేళ్లలో 2,208 మంది రైతులు మరణించారు. అందులో 2,190 మంది కుటుంబాలకు బీమా సొమ్ము జమచేశారు. రైతుభరోసా ద్వారా ఈఏడాది 1,51,507 మంది రైతులకు రూ.1,61,02,63,368 అందజేశారు. పీఎం కిసాన్ సమ్మాణ్నిధి రైతుల సంఖ్య ఐదేళ్లక్రితం 83,419 ఉండగా.. 31 జూలై 2025 నాటికి వారి సంఖ్య 61,048కే పరిమితమైంది. పండ్లు, కూరగాయలకు ప్రోత్సాహం పండ్లతోటలు, కూరగాయల సాగునుప్రోత్సహించేందుకు ప్రభుత్వం రాయితీలు అందిస్తోంది. ధ ర్మారం, జూలపల్లి మండలాల్లోని మామిడితోటల్లో నాణ్యమైన దిగుబడికి బంచ్కవర్ పద్ధతి పాటించేలా రైతులకు ఉద్యానవన అధికారులు సూచనలిస్తున్నారు. పెద్దపల్లి మండలం రంగాపూర్ గ్రామానికి చెందిన నరేశ్ డ్రాగన్ ప్రూట్ సాగుచేసి మంచి ఆదాయాన్ని ఆర్జిస్తున్నాడు. ఆయిల్పాంపై ప్రత్యేక దృష్టి.. ఆయిల్పాం సాగుచేసే రైతులకు ప్రభుత్వం రాయితీలు అందిస్తూ ప్రోత్సహిస్తోంది. 2,500 ఎకరాల సాగు లక్ష్యంగా నిర్దేశించగా.. ఇప్పటివరకు 500 ఎకరాల్లో పంట సాగుచేశారు. మరో 350 ఎకరాల్లో సాగుకానుంది. అంతరపంటగా చాకొలేట్ తయారీకి అవసరమయ్యే కొకొవా రకం పంట సాగును ఈఏడాది నుంచే అందుబాటులోకి తీసుకొచ్చారు. క్యాడ్బరీ అనే చాకొలేట్ కంపెనీ ప్రతినిధులు ఇటీవలే రైతులకు అవగాహన కల్పించారు.ఈ ఏడాది వ్యవసాయ రంగంపై వాతావరణ ప్రతికూల పరిస్థితులు తీవ్ర ప్రభావం చూపాయి. అన్నదాతలు ఆశించిన స్థాయిలో దిగుబడి సాధించలేక పోయారు. గతేడాది వానాకాలంలో ధాన్యం దిగుబడి మెరుగ్గా ఉండగా.. ఈసారి పంట చేతికందే దశలో వాతావరణంలో మార్పులు, అకాల వర్షాలు ఆగం చేశాయి. జిల్లాలో వరి 2,12,000 ఎకరాలు, పత్తి 49,482 ఎకరాల్లో సాగు చేశారు. ఆదిలోనే అన్నదాతకు అనేక కష్టాలు పంట చేతికొచ్చే దశలో ఆగని వానలు ధరలు పెరిగినా బాగా తగ్గిన పత్తి దిగుబడి గతేడాది దిగుబడి ఘనం.. ఈసారి అంతంతే నల్లరేగడి నేలలు(ఎకరాల్లో) 1,10,504 ఎర్ర నేలలు(ఎకరాల్లో) 1,79,330 ఇసుక నేలలు(ఎకరాల్లో) 5,360 రైతుల సంఖ్య 1,61,032 వానాకాలం సాగు వివరాలు(ఎకరాల్లో) జిల్లా సమాచారం -
బుధవారంపేట శివారులో ఉద్రిక్తత
రామగిరి(మంథని): బుధవారంపేట గ్రామ శివారులోని ఎనిమిదో వార్డులో మిళ్లకు నంబర్లు వేసేందుకు శనివారం వచ్చిన సింగరేణి, రెవెన్యూ అధికారుల చర్యలతో తీవ్రఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నా యి. మూడు, నాలుగు రోజులుగా ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఇళ్లకు నంబర్లు వేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారంపేట శివారులో ఇళ్లకు నంబర్లు వేసేప్రక్రియను సింగరేణి అధికారు లు కొందరి స్వార్థపరుల సహకారంతో చేపట్టారని గ్రామస్తులు ఆరోపించారు. అధికారులను అడ్డుకు నే క్రమంలో ప్రజలను మభ్యపెట్టి విభజించే ప్రయ త్నం జరిగిందని, పోలీసు బందోబస్తు మధ్య దౌర్జ న్యంగా నంబర్లు వేశారని పేర్కొన్నారు. నడిరోడ్డు పైకి వచ్చి స్వచ్ఛందంగా నిరసనకు దిగారు. తమ ప్రాణాలైనా అర్పిస్తామని, కానీ తమ ఇళ్లు, తమ హక్కులు వదులుకోబోమని నినాదాలు చేశారు. కొంతమంది నాయకులు తమ స్వార్థ ప్రయోజనా ల కోసం సింగరేణికి తొత్తులుగా మారి గ్రామ ప్రజలను మోసగించేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సమ్మతి లేకుండా చేపట్టే ఎలాంటి చర్యలనైనా తీవ్రంగా వ్యతిరేకి స్తామని వారు స్పష్టం చేశారు. ఇళ్ల నంబర్ల అంశంపై అధికారుల తీరును వెంటనే మార్చుకోవాలని, ప్రజలతో చర్చించి నిర్ణయాలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఎస్సై శ్రీనివాస్ గ్రామస్తులకు నచ్చచెప్పి ఆందోళన విరమింపజేశారు. -
ఘనంగా గణపతి హోమం
జ్యోతినగర్(రామగుండం): ఎన్టీపీసీ అయ్యప్ప ఆలయంలో శనివారం గణపతి హోమం ఘ నంగా నిర్వహించారు. రాంపల్లి వామనశర్మ ఆ ధ్వర్యంలో హోమం నిర్వహించగా, అఖిల భా రతీయ అయ్యప్ప ధర్మ ప్రచారసభ సభ్యుడు జనగామ తిరుపతి, సభ్యులు సంపత్రావు, న డిపెల్లి రామ్మోహన్రావు, నడిపెల్లి ప్రవీణ్రా వు, శ్రీధర్స్వామి, కృష్ణస్వామి, నారాయణస్వా మి, దీక్షిత్స్వామి, స్వాములు పాల్గొన్నారు. హ్యాండ్బాల్ పోటీలకు ఎంపిక సుల్తానాబాద్రూరల్: గర్రెపల్లి సాంఘిక సంక్షేమ గు రుకుల బాలికల పాఠశాల కు చెందిన శ్రీనిజ రాష్ట్రస్థా యి హ్యాండ్ పోటీలకు ఎంపికై నట్లు ప్రిన్సిపాల్ మంజుల తెలిపారు. శనివారం సిరిసిల్లలో జరిగిన ఉమ్మడి జిల్లా పోటీల్లో ఆమె ప్రతిభ కనబర్చిందన్నారు. విద్యార్థినిని ప్రిన్సిపాల్, అధ్యాపకులు అభినందించారు. శిక్షణ తర్వాతే విధులు సుల్తానాబాద్రూరల్: శిక్షణ ఇచ్చాకే సర్పంచు లు, ఉప సర్పంచులకు ప్రభుత్వం పాలన బా ధ్యతలు అప్పగిస్తుందని జిల్లా పంచాయతీ అ ధికారి వీరబూచ్చయ్య తెలిపారు. బొంతకుంటపల్లిని శనివారం డీపీవో సందర్శించారు. వైకుంఠధామం, సెగ్రిగేషన్ షెడ్డు పరిశీలించారు. కొ త్త సర్పంచులు, ఉప సర్పంచులకు సంక్రాంతి తర్వాత శిక్షణ ఇస్తామని తెలిపారు. సర్పంచ్ శ్రీరంగారావు, ఉపసర్పంచ్ సుమలత, ఎంపీవో సమ్మిరెడ్డి, పంచాయతీ సిబ్బంది ఉన్నారు. కల్వర్టులపై ఎమ్మెల్యే నిర్లక్ష్యంమంథనిరూరల్: కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కమి టీ చైర్మన్, మంత్రి అయిన మంథని ఎమ్మెల్యేకు ఇరుకై న కల్వర్టులను బాగుచేయాలనే ఆలోచన లేదని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ విమర్శించారు. అడవిసోమన్పల్లి సమీపంలో ని ఇరుకై న కల్వర్టును శనివారం ఆయన పరిశీలించిన మాట్లాడారు. సీఎంతోపాటు రాహుల్గాంధీకి అత్యంత సన్నిహితుడిగా ఉండే మంథ ని ఎమ్మెల్యే.. ఈ ప్రాంత అభివృద్ధికి ఎందుకు ఆలోచన చేయడంలేదో ప్రశ్నించాలన్నారు. నా యకులు శంకర్గౌడ్, కనవేన శ్రీనివాస్, పు ప్పాల తిరుపతి, కొండ రవీందర్, ప్రసాదరా వు, పెగడ శ్రీనివాస్, రాజుగౌడ్, నరేందర్, సంపత్, జంజర్ల శేఖర్ తదితరులు పాల్గొన్నారు. కొనసాగుతున్న కూల్చివేతలుజ్యోతినగర్(రామగుండం): ఎన్టీపీసీ అన్నపూ ర్ణకాలనీలోని అక్రమ కట్టడాల కూల్చివేతలు శ నివారం కూడా కొనసాగాయి. ఈ సందర్భంగా మేడిపల్లి రోడ్డులోని ఓ ఇంటి ప్రహరీ అక్రమం కట్టడమని గుర్తించిన మున్సిపల్ టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు.. జేసీబీతో దానిని కూల్చి వేశారు. కొద్దిరోజులు క్రితం అన్నపూర్ణకాలనీ లో కూల్చివేతలు చేపట్టి, కొన్నిఅక్రమ కట్టడాలను గుర్తించిన అధికారులు.. వాటిని తొలగించుకోవాలని ఆదేశాలు జారీచేశారు. కొందరు కూల్చివేయక పోవడంతో శనివారం కూల్చివేతలను కొనసాగించినట్లు సమాచారం. తమ ప్రహరీని కూల్చివేస్తున్న క్రమంలో బాధితురాలు రోదిస్తున్నప్పటికీ కూల్చి వేత ఆగలేదు. హైవే పనులు అడ్డగింత రామగిరి(మంథని): బేగంపేట పరిధిలో చేపట్టిన నేషనల్ హైవే పనులను సర్పంచ్ మంథని చంటి, వార్డు సభ్యులు శనివారం అడ్డుకున్నారు. కొత్త అండర్పాస్లను తక్కువ ఎత్తు, పొడవుతో నిర్మిస్తున్నారని ఆరోపించారు. ఇలా నిర్మిస్తే భారీవాహనాలు వెళ్లవని తెలిపారు. ప్రజాభద్రత, రవాణా సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకుని నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా అండర్పాస్లు నిర్మించాలని వారు డిమాండ్ చేశారు. ఉప సర్పంచ్ సందెల రేణుక, వార్డుసభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. రిపబ్లిక్ డే శిబిరానికి ఎంపిక ఎలిగేడు(పెద్దపల్లి): సు ల్తాన్పూర్ గ్రామానికి చెందిన అక్కినపల్లి నాగరాజు–శివజ్యోతి దంపతుల కుమారుడు అక్కినపల్లి అభిరామ్ 2026 జనవరి 26న న్యూఢిల్లీలో నిర్వహించనున్న రిపబ్లిక్ డే క్యాంపు(ఆర్డీసీ)కి ఎంపికయ్యాడు. ప్రధాని మోదీ సమక్షంలో క్రమశిక్షణ, ఐక్యత, దేశభక్తి ప్రదర్శించనున్నాడు. అభిరామ్ ఎంపిక అంకితాభావం ,క్రమశిక్షణ, కఠోర శ్రమకు నిదర్శనమని గ్రామస్తులు ప్రశంసించారు. -
సంతోషంగా ఉంది
మా ఊరు పెద్దగుట్ట ప్రాంతంలో రెండేళ్లకోసారి జరిగే సమ్మక్క – సారలమ్మ జాతరకు భక్తులు పెద్దసంఖ్యలో తరలి వస్తుంటారు. ఎస్సారెస్పీ కాలువ రోడ్డు పైనుంచి భక్తులు వచ్చేవాహనాలతో దుమ్ము లేచి తరచూ ఇబ్బందులు పడాల్సివస్తున్నది. ఇప్పుడు బీటీరోడ్డు పనులు ప్రారంభించడంతో ఆ బాధలు ఉండవు. రోడ్డు నిర్మించడం చాలాసంతోషంగా ఉంది. – ముత్యాల నరేశ్, తుర్కలమద్దికుంట మాట నిలబెట్టుకున్న ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి సమ్మక్క – సారలమ్మ జాతర ప్రాంతానికి బీటీ రోడ్లు వేయిస్తున్నా. ఈ ప్రాంత ప్రజల ఆరాధ్యదైవాలైన సమ్మక్క సారలమ్మ జాతర ఉత్సవాలకు ఇంటిల్లీపాదిగా తరలివస్తుంటారు. వారంతా మట్టిరోడ్లపై ప్రయాణించి పడుతున్న ఇ బ్బందులను దూరం చేసేందుకే ప్రభుత్వాన్ని ఒప్పించి నిధులు కేటాయించి పనులు ప్రారంభించా.– విజయరమణారావు, ఎమ్మెల్యే పెద్దపల్లి -
మాస్టర్ అథ్లెటిక్స్ షురూ
కరీంనగర్ జిల్లా మాస్టర్స్ అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం కరీంనగర్లోని అంబేద్కర్ స్టేడియంలో రాష్ట్రస్థాయి 12వ మాస్టర్ అథ్లెటిక్స్ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. 60ఏళ్లలోనూ 20 ఏళ్ల యువలా పోటీల్లో పలువరు ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ 800 మీటర్ల రన్నింగ్కు జెండా ఊపారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన మాస్టర్ అథ్లెట్ల మార్చ్ఫాస్ట్ ఆకట్టుకుంది. పలువరు ఆటల్లో రాణించి.. పతకాలు గెలుచుకున్నారు. -
పెరిగిన నేరాలు
సాక్షి పెద్దపల్లి: ఏటా గుబులు పుట్టిస్తున్న నేరాలు, ఘోరాల సంఖ్య ఈసారి కూడా తగ్గుముఖం పట్టలేదు. అలాగరి గతేడాదితో పోల్చితే తీవ్రమైన నే రాలు, హత్యలు చోటు చేసుకోలేదు. ప్రధానంగా హత్యలు, అత్యాచారాలు, దోపిడీ కేసులు తగ్గినా.. సైబర్ నేరగాళ్ల బారినపడినవారి సంఖ్య భారీగా పె రిగింది. పలు ప్రాంతాల్లో చోరీలు, కిడ్నాప్లు తదిత ర కేసుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది. పోలీసులు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా మహిళలపై వేధింపులు ఆగడం లేదు. వీటితోపాటు రోడ్డుప్రమాదాలు, ఆత్మహత్యలు, మిస్సింగ్ కేసులు కూ డా బాగానే నమోదయ్యాయి. పోలీసుల పటిష్ట చ ర్యలతో జిల్లాలో ఈఏడాది ఎమ్మెల్సీ, గ్రామ పంచా యతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ట్రాఫిక్ జరిమానాలు రూ.13కోట్లు ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించిన కేసలు 4,12,553 నమోదవగా. రూ.13, 67,91,645 జరిమానా విధించారు. డ్రంక్ డండ్ డ్రైవ్ కేసులు 9,678 నమోదు కా గా, 6,772 మందికి రూ.96,45,100 జరిమానా విధించారు. 28 కేసుల్లో చిత్తుగా మద్యం తాగిన వారికి జైలు శిక్ష విధించారు. నెత్తురోడిన రహదారులు.. జిల్లాలో ఈఏడాది 334 రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకోగా.. అందులో 126 ఘోరరోడ్డు ప్రమాదాలు, 170 సాధారణ రోడ్డు ప్రమాదాలు జరిగాయి. 137 మంది మరణించారు. 388 మందికి గాయాలపాలయ్యారు. బ్లాక్స్పాట్స్ వద్ద హెచ్చరిక బోర్డులు లేకపోవడం, వాహనాదారులకు రోడ్డు భద్రతపై అవగాహన కొరవడడంతో ఇందుకు కారణమని తెలుస్తోంది. ఈవ్టీజింగ్లో 41మంది మైనర్లు జిల్లాలోని 1,285 హాట్స్పాట్స్ వద్ద షీటీంలు స్కూల్, కాలేజీ, బస్స్టాండ్ తదితర పబ్లిక్ ప్లేస్ల్లో 362మందిని రెడ్హ్యాండడ్గా పట్టుకున్నారు. అందులో 41మంది మైనర్లు ఉన్నారు. తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ చేసి 37మందిపై ఈ పెటీ కేసులు నమోదు చేశారు. ఆరుగురికి జీవితఖైదు జిల్లాలో ఈ ఏడాది 41 కేసుల్లో 59 మందికి వివిధ శిక్షలు పడగా, అందులో ఆరుగురికి యావజీవకారా గార శిక్ష పడింది. ఇందులో ముగ్గురికి పదేళ్లు, ఐదు గురికి ఏడేళ్లు, మరో ఐదుగురికి ఐదేళ్లు, ఒకఏడాది నలుగురికి, ఏడాదిలోపు శిక్షలు 12మందికి, కేవలం జరిమానా మాత్రమే విధించిన కేసులు 15.. ఇలా వివిధ రకాల శిక్షలను కోర్టులు విధించాయి. వీరినుంచి రూ.3,53,350 జరిమానా విధించారు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన కేసులు మన వద్దే.. రికవరీ కొంతే జిల్లాలో గతేడాదితో పోల్చితే చోరీలు కొంత తగ్గినట్లుకనిపిస్తున్నా.. రికవరీ శాతం పెరిగినా.. ఆందోళనకరమైన స్థాయిలోనే చోరీలు చోటుచేసుకుంటున్నాయి. పోలీసులు రాత్రి వేళల్లో గస్తీ పెంచాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తున్నాయి. -
జీవో 252ను సవరించాలి
పెద్దపల్లిరూరల్: జర్నలిస్టుల హక్కుల ను హరించేలా ప్రభుత్వం జారీచేసిన జీవో నంబరు 252ను వెంటనే సవరించాలని టీయూడబ్ల్యూజే హెచ్– 143 నాయకులు డిమాండ్ చేశారు. కలెక్టరేట్ ఎదుట శనివారం నిరసన తెలిపా రు. యూనియన్ జిల్లా అధ్యక్షుడు కొట్టె సదానందం, నేషనల్ కౌన్సిల్ సభ్యుడు అంకరి ప్రకాశ్, నా యకులు కాల్వ రమేశ్, ముద్దసాని సమ్మయ్య, ఎ ర్రోజు వేణు, తిర్రి తిరుపతి, కీర్తి రమేశ్, దొమ్మటి రాజేశ్ తదితరులతో కలిసి అడిషనల్ కలెక్టర్ వేణు కు వినతిపత్రం అందజేశారు. అక్రిడిటేషన్కార్డుల జారీవిషయంలో ప్రభుత్వం జారీచేసిన జీవో ప్రకా రం జర్నలిస్టులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నపత్రికల ఉనికిని ప్ర మాదంలో పడేసిందని ఆందోళన వ్యక్తం చేశారు. నాయకులు ఎన్డీ తివారీ, అర్కుటి మల్లేశ్, చిలా రపు కిషన్, కొయ్యడ తిరుపతి, తూర్పటి శ్రీనివాస్, దుర్గం లక్ష్మణ్, తిర్రి సుధాకర్, మారుపాక అంజి, డీఎల్ఎన్ చారి తదితరులు పాల్గొన్నారు. -
తీరనున్న సమ్మక్క భక్తుల తిప్పలు
పెద్దపల్లిరూరల్: తెలంగాణ ప్రాంతంలోనే అతిపెద్ద గిరిజన దేవుళ్ల వేడుక సమ్మక్క–సారలమ్మ జాతర. ఉత్సవాలకు హాజరయ్యే వేలాది మంది భక్తుల ఇబ్బందులను దూరం చేసేందుకు ప్రధాన రహదారుల నుంచి జాతర ప్రాంతం వరకు బీటీ రోడ్లు ని ర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు పె ద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. భక్తులరద్దీ అధికంగా ఉండే పెద్దపల్లి మండలం తుర్కలమద్దికుంట, సుల్తానాబాద్ మండలం నారాయణపూర్, కాల్వశ్రీరాంపూర్ మండ లం మీర్జంపేట, పెద్దరాతుపల్లి, ఓదెల మండలం కొలనూర్ గ్రామాల్లో వనదేవతల జాతర వరకూ బీటీ రోడ్డు నిర్మిస్తారు. ఇందుకోసం ఎమ్మెల్యే విజయరమణారావు శనివారం పనులు ప్రారంభించారు. జాతర వరకు రహదారులు అందుబాటులో వచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు. రూ.5.61కోట్లతో పనులు.. పెద్దపల్లి నియోజకవర్గంలోని సమ్మక్క – సారలమ్మ జాతరలు జరిగే ఐదు ప్రధాన ప్రాంతాలకు బీటీ రోడ్డు వేసే పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.5.61కోట్లు కేటాయించింది. ఆ నిధులతో పనులను శనివారం ప్రా రంభించారు. వచ్చే ఏడాది జనవరిలో మొదలయ్యే సమ్మక్క – సారలమ్మ జాతర ఉత్సవాల నాటికి రోడ్ల పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్కు ఎమ్మెల్యే సూచించారు. పెద్దపల్లి మండలం తుర్కలమద్దికుంట, సుల్తానాబాద్ మండలం నారాయణపూర్, ఓదెల మండలం కొలనూర్, కాల్వశ్రీరాంపూర్ మండలం మీర్జంపేట జాతర ప్రాంతం వరకు రూ.99లక్షల అంచనా వ్య యంతో బీటీ రోడ్డు పనులు చేపడతారు. కాల్వశ్రీరాంపూర్ మండలం పెద్దరాతుపల్లి వరకు రూ. 1.65కోట్లు వెచ్చిస్తారు. ప్రతీ రెండేళ్లకోసారి నిర్వహించే జాతరకు వేలాది మంది భక్తులు తరలివస్తా రు. బీటీరోడ్లు అందుబాటులోకి వస్తే భక్తుల రవాణా కష్టాలు తీరుతాయి. కాల్వశ్రీరాంపూర్/సుల్తానాబాద్రూరల్/ఓదెల(పెద్దపల్లి): కాల్వశ్రీరాంపూర్ మండలం పెద్దరాతుపల్లి, మీర్జంపేట, ఓదెల మండలం కొలనూర్లో సమ్మక్క జాతర వరకు చేపట్టిన సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు ఎమ్మెల్యే విజయరమణారావు శనివారం శంకుస్థాపన చేశారు. ఆయా ప్రాంతా ల్లో జరిగిన కార్యక్రమాలో ఆయన మాట్లాడారు. ఓదెల మండలం కొలనూర్ సమ్మక్క – సారలమ్మ జాతరను మేడారం తరహాలో అభివృద్ధి చేస్తామన్నారు. కాల్వశ్రీరాంపూర్ మండలంలోని చివరి ఆయకట్టు వరకూ సాగునీరు అందిస్తామని తెలిపారు. సుల్తానాబాద్ మండలం కేజీబీవీలో అదనపు తరగతి గదులు ప్రారంభించిన ఎమ్మెల్యే మాట్లాడుతూ.. క్రమశిక్షణతో చదివితే విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారన్నారు. ఆయా కార్యక్రమాల్లో నాయకులు సారయ్యగౌడ్, లంక సదయ్య, రామిడి తిరుపతిరెడ్డి, లత, శైలజ, మనోహర్రావు, కొమురయ్య, రమే శ్, మోహన్, రాంచంద్రారెడ్డి, శ్రీనివాస్, గాజన వేన సదయ్య, ఉయ్యాల వైకుంఠం, పల్లె కనుకయ్య, పిట్టల రవికుమార్, రంగు మల్లేశ్గౌడ్, మూల ప్రేంసాగర్రెడ్డి, బైరి రవిగౌడ్, చిన్నయ్య, రమేశ్గౌడ్, రాజిరెడ్డి, తిరుమల్రావు, ప్రకాశ్రా వు, కల్లెపల్లి జాని, సతీశ్, విజేందర్రెడ్డి పాల్గొన్నారు. మేడారం తరహాలో కొలనూర్ జాతర -
వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలి
పెద్దపల్లిరూరల్: నూతన సంవత్సర వేడుకలను ప్ర శాంత వాతావరణంలో జరుపుకోవాలని డీసీపీ భూ క్యా రాంరెడ్డి సూచించారు. స్థానిక పోలీస్స్టేషన్ను శనివారం ఆయన తనిఖీ చేశారు. ఫిర్యాదులు, కేసు లు, ఇతరత్రా వివరాలపై ఎస్సై లక్ష్మణ్రావు, సీఐ ప్రవీణ్కుమార్, రూరల్ ఎస్సై మల్లేశ్ను అడిగి తెలుసుకున్నారు. హ్యాపీ న్యూఈయర్ అంటూ యువత అర్ధరాత్రి వరకూ రోడ్లపై తిరిగినా, మద్యం మత్తు లో ఇతరుల హక్కులకు భంగం కలిగించినా కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ఈనెల 31న పోలీసు అధికారులలు తనిఖీ చేస్తాయని అన్నారు. -
కూల్చివేతలకు వ్యతిరేకంగా ఆందోళన
కోల్సిటీ: రామగుండం నగరపాలక సంస్థ పరిధిలో జరుగుతున్న కూల్చివేతలకు నిరసనగా శుక్రవారం అఖిల పక్ష జేఏసీ ఆధ్వర్యంలో బల్దియా కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. మాజీ ఎ మ్మెల్యే కోరుకంటి చందర్తో పాటు బీఆర్ఎస్ నా యకులు కౌశిక హరి, బీజేపీ నాయకురాలు కందుల సంధ్యారాణి మాట్లాడుతూ బల్దియా అధికారులు, కాంగ్రెస్ పాలకులు దుకాణాలను కూల్చివేసి చిరువ్యాపారుల జీవితాలను రోడ్డున పడేస్తున్నారని అన్నారు. గోదావరిఖని చౌరస్తా సమీపంలో తమలపాకులు విక్రయించుకునే సిరిశెట్టి మల్లేశ్కు చెందిన దుకాణాన్ని కూల్చివేయడాన్ని వ్యతిరేకిస్తూ, న్యా యం కోసం బాధిత కుటుంబం ఆరురోజులుగా కూల్చిన శిథిలాల ఎదుట నిరసన దీక్ష చేస్తుంటే, బ ల్దియా అధికారులతోపాటు ఎమ్మెల్యే స్పందించకపోవడం బాధాకరమన్నారు. అనంతరం మున్సి పల్ చౌరస్తాలోని అంబేడ్కర్ విగ్రహానికి నాయకులు వినతిపత్రం సమర్పించారు. అఖిల పక్ష జేఏసీ నాయకులు కొండపర్తి సంజీవ్, కోమళ్ల మహేశ్, పిడుగు కృష్ణ, తోట వేణు, మూల విజయారెడ్డి, ఐ.కృష్ణ, గోపు అయులయ్యయాదవ్, పర్లపల్లి రవి, నారాయణదాసు మారుతి, జేవీ రాజు పాల్గొన్నారు. -
లాంగ్వాల్ పనులు త్వరగా పూర్తి చేయండి
రామగిరి: లాంగ్వాల్ పనులను నిర్దేశించిన సమయంలో త్వరితగతిన పూర్తి చేయాలని ఆపరేషన్స్ డైరెక్టర్ ఎల్వీ.సూర్యనారాయణ అన్నారు. శుక్రవారం అడ్రియాల లాంగ్వాల్ గనిని సందర్శించి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. లాంగ్పనులు పూర్తి చేసేందుకు తీసుకుంటున్న చర్యలను జీఎం కొలిపాక నాగేశ్వర్రావు డైరెక్టర్కు వివరించారు. 3వ ప్యానెల్ సాల్వేజింగ్ పనుల పురోగతి, 4వ ప్యానల్ తయారీ పనులపై చర్చించి భద్రతపై పలు సూచనలు చేశారు. అనంతరం గనిలోకి వెళ్లి పాత లాంగ్వాల్ పనులు, నూతన ప్యానల్ పనులను పరిశీలించారు. కార్పొరేట్ సేఫ్టీ, రామగుండం రీజీనల్ సేఫ్టీ జనరల్ మేనేజర్లు కె.సాయిబాబా, ఎస్.మధుసూదన్, ఏరియా ఇంజినీర్ కె.యాదయ్య, ఎస్వోటూ జీఎం బండి సత్యనారాయణ, ప్రాజెక్ట్ ఇంజినీర్ టి.రఘురాం, సర్వే అధికారి హన్మండ్లు తదితరులు పాల్గొన్నారు.లిమ్కా బుక్ఆఫ్ రికార్డ్స్కు ఎంపికకమాన్పూర్: మండలంలోని గుండారం గ్రామ ప రిధిలోని రాజాపూర్కు చెందిన ముకుంద శ్రావణ్ లిమ్కాబుక్ ఆఫ్ రికార్డ్స్కు ఎంపికయ్యాడు. విజన్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో గతనెల 23న హైదరాబాద్ సరూర్నగర్లోని ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన పోటీల్లో ప్రతిభ కనబరిచి లిమ్కాబుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం సంపాదించాడు. హామీల అమలులో విఫలంగోదావరిఖని: గత గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో గెలిచిన ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీలు ఇచ్చిన హామీల అమలులో విఫలమయ్యాయని టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి అన్నారు. శుక్రవారం వకీల్పల్లిగనిపై ఏర్పాటు చేసిన గేట్ మీటింగ్లో మాట్లాడారు. గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీయూసీ 47 హా మీలు, ప్రాతినిధ్య సంఘమైన ఐఎన్టీయూసీ ఆరు గ్యారంటీలు, 39 హామీలు ఇచ్చి గెలిచిన తర్వాత ఒక్క హామీ కూడా అమలు చేయలేదని అన్నారు. గతంలో ఉన్న హక్కులు కూడా పోయే పరిస్థితులు కల్పించినట్లు తెలిపారు. గ త గుర్తింపు కార్మిక సంఘంగా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం 70కి పైగా కార్మిక హక్కులను సాధించిందన్నారు. నాయకులు చెరుకు ప్రభాకర్రెడ్డి, బేతి చంద్రయ్య, వెంకటేశం, రవితేజ, మామిడి తిరుపతి, హరిప్రసాద్, దాసరి శ్రీనివాస్, నరేశ్, చౌడ శ్రీనివాస్, వెంకటస్వామి, రాజారాం, సురేందర్, మల్లేశ్నాయక్, రాజమౌళి, ఆవుల రాములు, సిరిశెట్టి రాములు, రాజు తదితరులు పాల్గొన్నారు. -
చలి.. పులి
జ్యోతినగర్: జిల్లాలో చలిపులి వణికిస్తోంది. భానుడి భగభగలు మాయమై.. ఎముకలు కొరికే చలి పంజా విసురుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోవడంతో పాటు జిల్లాలో సైతం చలి జ్వరాలు ఇంటింటినీ పలకరిస్తోంది. వాతావరణంలో ఒక్కసారిగా వచ్చిన ఈ మార్పులతో వైరస్లు స్వైరవిహారం చేస్తున్నాయి. ఫలితంగా ప్రతీ ఇంటా జలుబు, దగ్గు, ఒళ్లు నొప్పుల బాధితులు కనిపిస్తున్నారు. రానున్న మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఉష్ణ నియంత్రణ వ్యవస్థపై ఒత్తిడి సాధారణంగా మన శరీర ఉష్ణోగ్రతను మెదడులోని హైపోథాలమస్ గ్రంథి నియంత్రిస్తుంది. అయితే బయట ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల కంటే తక్కువకు పడిపోతే శరీరంలోని ఉష్ణ నియంత్రణ వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి పడుతుంది. ప్రస్తుతం రాష్ట్రంలో పలుచోట్ల ఉష్ణోగ్రతలు 5 నుంచి 13 డిగ్రీల మధ్యే రికార్డవుతుండటంతో బాడీ మెకానిజం దెబ్బతినే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల రక్తనాళాలు కుంచించుకుపోయి బీపీ పెరగడం, తద్వారా గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉష్ణోగ్రతలు అకస్మాత్తుగా పడిపోతే, అది హైపోథెర్మియా వంటి ప్రాణాంతక స్థితికి దారితీసే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. రోజంతా గోరువెచ్చని నీటినే తాగాలని, ఇది గొంతు సమస్యలను దూరం చేయడమే కాకుండా శరీర ఉష్ణోగ్రతను స్థిరంగా ఉంచుతుందని చెబుతున్నారు. జాగ్రత్తలు పాటించాలి బయటకు వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. స్వెట్టర్లు, మఫ్లర్లు, గ్లౌజులు తప్పనిసరిగా ఉపయోగించాలని, ముఖ్యంగా ముక్కు, చెవుల ద్వారా చలి గాలి లోపలికి వెళ్లకుండా జాగ్రత్త పడాలని పేర్కొన్నారు. శ్వాసకోశ సమస్యలున్న వారు రోజుకు రెండుసార్లు ఆవిరి పడితే ఊపిరితిత్తులకు ఉపశమనం లభిస్తుందని తెలుపుతున్నారు. రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి తాజా ఆకుకూరలు, పండ్లు, ప్రోటీన్లతో కూడిన ఆహారం తీసుకోవాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా వద్ధులు, చిన్నారులు, ఆస్తమా రోగులు ఈ సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని, తెల్లవారుజామున, అర్థరాత్రి వేళల్లో ప్రయాణాలు మానుకోవడం ఉత్తమమని, చలి తీవ్రత పెరిగే కొద్దీ బ్యాక్టీరియా విజృంభణ కూడా పెరుగుతుంది కాబట్టి స్వల్ప లక్షణాలు కనిపించినా నిర్లక్ష్యం చేయవద్దని నిపుణులు సూచిస్తున్నారు. -
రూ.కోటితో బీటీ రోడ్డు నిర్మాణం
పెద్దపల్లిరూరల్: సమ్మక్క సారలమ్మ జాతర ఉత్సవాలకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం పెద్దపల్లి మండలం తుర్కలమద్దికుంట గ్రామశివారులో రూ.99 లక్షల వ్యయంతో బీటీ రోడ్డు పనులు చేపడుతున్నామని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. ఈ రోడ్డు పనులు జాతర వరకల్లా పూర్తి చేయిస్తానని తెలిపారు. సర్పంచ్ రాజయ్య, నాయకులు ముత్యాల నరేశ్ తదితరులు పాల్గొన్నారు. నాణ్యతా ప్రమాణాలతో బీటీ రోడ్డు చేపట్టాలి సుల్తానాబాద్రూరల్: నాణ్యత ప్రమాణాలతో బీటి రోడ్డు పనులు చేపట్టాలని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. సుల్తానాబాద్ మండలంలోని నారాయణపూర్–కొదురుపాక గ్రామాల మధ్య సమ్మక్క సారలమ్మ గద్దెల వరకు డీఎంఎఫ్టీ నిధులు రూ.95లక్షలతో చేపట్టిన బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. సర్పంచులు సతీశ్, ఉత్తమకుమారి, ఏఎంసీ చైర్మన్ ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు. పేదింటి ఆడబిడ్డలకు చేయూత జూలపల్లి: పేదింటి ఆడబిడ్డలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. ఎంపీడీవో కార్యాలయంలో 24 మంది లబ్ధిదారులకు రూ.24,02,784 విలువ గల కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. మహిళా సంక్షేమం, ఆర్థిక స్వావలంబనకు ప్రభుత్వం ఆధిక ప్రాధాన్యం ఇస్తోందని అన్నారు. యాసంగిలో యూరియాపై రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఎకరాకు 3బస్తాలను ప్రత్యేక యాప్ ద్వారా అందుబాటులో ఉంచుతున్నామని వివరించారు. తహసీల్దార్ వనజ, సర్పంచులు వెంకటేశం, శ్రీనివాస్, అనూష, ప్రశాంతి, సంపత్ తదితరులు పాల్గొన్నారు. -
‘అంజన్న’కు నోటీసులు!
సాక్షిప్రతినిధి,కరీంనగర్: జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేట కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ పరిసరాల్లో దేవాదాయ– అటవీశాఖల మధ్య సరిహద్దు వివాదం ఆలయ అభివృద్ధికి అడ్డంకిగా మారుతోంది. కొండగట్టు మీది ప్రాంతం మాత్రమే గుడిదని, ఇటీవల తమ భూముల్లోకి చొచ్చుకువచ్చి దాదాపు ఆరున్నర ఎకరాల భూమిని దేవాదాయశాఖ ఆక్రమించిందని అటవీశాఖ ఆరోపిస్తోంది. ఆ ఆరున్నర ఎకరాల్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మార్కింగ్ చేయడంతో రెండుశాఖల మధ్య వివాదం మొదలైంది. ఈ ఆరున్నర ఎకరాల భూమి తమదంటే తమదని ఇరుశాఖలు పరస్పరం వాదించుకుంటున్నాయి. కొండగట్టు ఆలయాన్ని ఆనుకుని ఉన్న అటవీ భూములను ప్రత్యామ్నాయ భూముల కేటాయింపుతో తాము తీసుకునే అవకాశం ఉందని దేవాదాయశాఖ అధికారులు చెబుతుండగా.. అనుమతి లేకుండా తమ భూములు ఎలా తీసుకుంటారని అటవీ అధికారులు వాదిస్తున్నారు. మొత్తానికి అటవీశాఖ అధికారులు పెట్టిన కిరికికి కొండగట్టు అంజన్న ఆలయ అభివృద్ధికి ప్రతిబంధకంగా మారేలా కనిపిస్తోంది. వివాదం ఇదీ.. కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయానికి భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. దేవాదాయశాఖ కొన్ని అభివృద్ధి పనులు చేపట్టింది. గుడి ఉన్న గట్టు ప్రాంతం మినహా కింద ఉన్న భూములు తమకే చెందుతాయని అటవీశాఖ వాదన. గట్టు కింద భక్తుల కోసం 20 గదుల వసతి భవనం, ఈవో కార్యాలయ భవనం, వాహన పూజా మండపం తదితర భవనాలు దశాబ్దకాలం క్రితం నిర్మించారు. అవన్నీ తమ పరిధిలోకి వస్తాయని అటవీశాఖ అధికారులు నోటీసులు జారీ చేసి, మార్కింగ్ చేయడంతో విషయం వివాదంగా రూపుదాల్చింది. ఇది క్రమంగా రాజకీయ రంగు పులుముకునేలా కనిపిస్తోంది. కొండగట్టు ఆలయ భూములు సంరక్షించాలని, భూములను ఆలయానికి అప్పగించాలని విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఒకరోజు దీక్ష చేపట్టారు. వైజంక్షన్ వద్ద గేటు ఏర్పాటు సన్నాహాలతో కొండగట్టు ఆలయానికి వెళ్లే దారిలో ఘాట్రోడ్డు, జేఎన్టీయూ రోడ్డు కలిసే వైజంక్షన్ వద్ద అటవీశాఖ అధికారుల గేటు ఏర్పాటు సన్నాహాలు రెండు శా ఖల మధ్య ఉద్రిక్తతలు పెంచేలా చేశాయి. రెండున్నరేళ్ల క్రితం కొండగట్టు పరిసరాల్లోని అటవీభూముల్లో అర్బన్ పార్కు ప్రతిపాదనలో భాగంగా వైంజ క్షన్ వద్ద గేటు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. గేటు ఏర్పాటుతో వై జంక్షన్కు వాహనాల పార్కింగ్కు ఇబ్బందిగా మారుతుందని ఆలయ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ పరిణామం రెండుశాఖల మధ్య దూరం పెంచింది. కొండగట్టు ఆలయానికి వచ్చే భక్తులు తమ వాహనాలు పార్కింగ్ చేసుకునేందుకు స్థలం కొరతతో ఇబ్బంది పడుతుండగా, వైజంక్షన్ సమీపంలో అటవీశాఖ గేటు ఏర్పా టు చేస్తే.. తాము వాహనాలు ఎక్కడ పార్క్ చేసుకోవాలని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆల య ఈవో శ్రీకాంత్ రావు కూడా ఆ భూములు ఆలయానికే చెందుతాయని స్పష్టంచేస్తున్నారు. ఆర్డీవో మధుసూదన్, డీఎఫ్వో రవికుమార్ సమక్షంలో అటవీశాఖ, దేవాదాయశాఖ, రెవెన్యూశాఖ ముకుమ్మడిగా హద్దుల ఏర్పాటు కోసం సర్వే చేపట్టారు. గుడికి భూములిచ్చేందుకు సిద్ధం కొండగట్టు ఆలయ అభివృద్ధికి ఇప్పటికే రెవెన్యూ భూములు బదిలీ చేశాం. ఆలయ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని అటవీశాఖ ప్రత్యామ్నాయంగా భూముల కేటాయింపు చేసుకునే అవకాశముంది. కలెక్టర్ ఆదేశాలతో కొండగట్టులో అటవీశాఖ, దేవాదాయశాఖ సరిహద్దుల వివాదం పరిష్కరించేందుకు సర్వే చేపట్టాం. అటవీశాఖ హద్దులు గుర్తించాం. – పులి మధుసూదన్, ఆర్డీవో, జగిత్యాల -
మీ పైసలు తీస్కోండి..!
‘ఎన్నికల్లో గెలవాలని అందిన కాడికాల్లా అప్పు తెచ్చి పంచిన.. గుంపగుత్తగా ఓట్లు రాబట్టేందుకు కులసంఘాలకు ఇంత చొప్పున ఇచ్చా.. అయినా గెలవలేదు. సరికదా పోటీ ఇచ్చే స్థాయిలో ఓట్లూ రాలేదు. మీ సంఘం కోసం ఇచ్చిన పైసలు వాపస్ ఇవ్వండి.. అంటూ జిల్లాలో పలువురు ఓడిన సర్పంచ్ అభ్యర్థులు వేడుకుంటుండగా, మరికొన్ని చోట్ల ఓడిన అభ్యర్థుల తిట్లు, శాపనార్థాలు తట్టుకోలేక ఓటర్లే తమకు ఇచ్చిన పైసలను అభ్యర్థులకు వాపస్ ఇచ్చిపోతున్నారు. ఇలా జిల్లాలో పలు గ్రామాల్లో ఎన్నికల తర్వాత పైసలు వాపస్ ఇవ్వాలంటూ కొత్తపంచాయితీలు మొదలయ్యాయి.’’సాక్షి పెద్దపల్లి: గ్రామపంచాయతీ ఎన్నికలు గ్రామాల్లో కొత్త తలనొప్పులను తీసుకొచ్చాయి. భారీగా ఖర్చు పెట్టి మందు, పైసలు పంచి సర్పంచ్ ఎన్నికల్లో ఓడిన అభ్యర్థుల బాధలు, ఏడుపులు, శాపనార్థాలతో జిల్లాలోని పలు గ్రామాల్లో పైసలు తీసుకున్న ఓటర్లు తిరిగి వాపస్ ఇస్తున్నారు. ఎన్నికల్లో విజయం కోసం పోటీచేసిన అభ్యర్థులు భారీగా అప్పులు తీసుకొచ్చి, మరికొందరు ఉన్న భూములను తాకట్టు పెట్టి మరీ ఎన్నికల్లో ఖర్చు చేశారు. తీరా ఎన్నికల ఫలితాలు తేడా కొట్టడంతో వారంతా తెచ్చిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక తెగ మదనపడుతున్నారు. కొందరైతే ఏకంగా ఏడుస్తూ శాపనార్థాలు పెడుతుండటం, మరికొందరు తమకు ఓటు వేయలేదని అనుమానం వచ్చిన వారితో ప్రమాణం చేయిస్తున్నారు. దీంతో చాలా గ్రామాల్లో ఓటర్లు గుట్టుచప్పుడు కాకుండా పోయి పైసలు వాపస్ ఇస్తున్నారు. కుల సంఘాలు, యువజన సంఘాలు ఎన్నికల్లో విజయం కోసం పలు గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థులు తమ ఊళ్లో ఉన్న కులసంఘాలు, యువజన సంఘాల ఓట్లను గుంపగుత్తగా వేయించుకునేందుకు భారీ మొత్తంలో సంఘం బాధ్యులకు అప్పజెప్పారు. ఆయా సంఘాల భవనాల నిర్మాణం, తదితర పనుల కోసం పెద్దమొత్తంలో ముట్టజెప్పారు. తీరా ఎన్నికల్లో సదరు అభ్యర్థులు ఓడిపోవడంతో ఆయా సంఘాలకు ఇచ్చిన పైసలు వాపస్ ఇవ్వాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తుండటంతో ఆయా పైసలను కులసంఘాల నేతలు ఓడిన అభ్యర్థులకు అప్పజెప్పుతున్నారు. గెలిచినోళ్లలోనూ దిగులే.. ఎన్నికల్లో ఓడిన వాడు రోడ్డుపైన ఏడిస్తే, గెలిచినోడు ఇంట్లో ఏడుస్తున్నాడు.. అన్న విధంగా జిల్లాలో పలువురు సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యుల్లో కనిపిస్తోంది. ఓడినోడు బహిరంగంగా బాధపడుతుంటే, గెలిచి సర్పంచ్గా ప్రమాణస్వీకారం చేసిన నేతలు చేసిన ఖర్చు ఎట్లా తిరిగి రాబట్టుకోవాలో ఆర్థంకాక, ఇచ్చిన హమీలు ఎలా నెరవేర్చాలో తెలియక సతమతమవుతున్నారు. ప్రమాణస్వీకారం తర్వాత ఆయా జీపీల్లో పెండింగ్ బిల్లులు, ఆదాయ వ్యయాలు చూసి ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున నిధులు రాకపోతే తమ పరిస్థితి అగమ్యగోచరమేనని లోలోపల వాపోతున్నారు. -
అప్రమత్తంగా ఉండాలి
పెద్దపల్లి: వినియోగదారు కొనుగోలు చేసే ప్ర తీవస్తువుకు రసీదు తీసుతీసుకోవాలని అదన పు కలెక్టర్ వేణు సూచించారు. బుధవారం జా తీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో క లెక్టరేట్లో ఏర్పాటు చేసిన సమావేశంలో వే ణు మాట్లాడారు. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్న వస్తుసామగ్రి ఎంపిక చేసుకోవాలని సూచించారు. మోసపోతే వినియోగదారుల రక్షణ చట్టం ప్రకారం పరిహారం పొందవచ్చని అన్నారు. డిజిటల్ న్యాయవ్యవస్థ ద్వారా ఈఏ డాది సమస్యలు త్వరితగతిన పరిష్కారం అ వుతున్నాయని తెలిపారు. వినియోగదారుల ఫోరం అధ్యక్షుడు కె.ప్రకాశ్, రాష్ట్ర ప్రధాన కా ర్యదర్శి చేతన సోనీ, పౌర సరఫరాల అధికారి శ్రీనాథ్, స్టేట్ లీగల్ సెల్ అధ్యక్షురాలు వరలక్ష్మి, ఫుడ్ ఇన్స్పెక్టర్ అరవింద్ పాల్గొన్నారు. 28న బోనాల శోభాయాత్ర యైటింక్లయిన్కాలనీ(రామగుండం):యాదవ సంఘం ఆధ్వర్యంలో ఈనెల 28న మల్లన్నస్వామి బోనాల శోభాయాత్ర నిర్వహిస్తామని ఆ సంఘం అడక్ కమిటీ అధ్యక్షుడు గడ్డం తి రుపతి యాదవ్ తెలిపారు. ఉత్సవ సమితి క మిటీ సభ్యులతో కలిసి మల్లన్నస్వామి బోనా ల శోభాయాత్ర ప్రచార పోస్టర్ను బుధవారం పట్టణంలో ఆవిష్కరించి మాట్లాడారు. మా రం మల్లేశ్యాదవ్, చెప్ప మల్ల య్య యాదవ్, సాంబమూర్తి యాదవ్, పాశం ఓదెలు యాద వ్, కట్ల సత్యం యాదవ్, ఆవులు రాజేశ్ యాద వ్, రేశవేణి కేశవులు యాదవ్, గొ డుగు రమేశ్ యాదవ్, లక్ష్మణ్ యాదవ్, శంకర్ ఉన్నారు. కుష్ఠు నివారణకు చర్యలు పెద్దపల్లి/సుల్తానాబాద్రూరల్: కుష్ఠు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేయాల ని లెప్రసీ సర్వే రాష్ట్ర పరిశీలకురాలు సుజాత సూచించారు. 2027 మార్చి 31వ తేదీ వరకు నిర్దేశిత లక్ష్యం సాధించాలన్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో చేపట్టిన లెప్రసీ సర్వేను బు ధవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. అ నంతరం జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో డీఎంహెచ్వో ప్రమోద్కుమార్తో కలిసి సమీక్షించారు. కుష్ఠును ప్రారంభదశలోనే గుర్తిస్తే నయం చేయొచ్చన్నారు. ప్రోగ్రాం ఆఫీసర్లు వాణిశ్రీ, సుధాకర్రెడ్డి, శ్రీరాములు, కిరణ్కుమార్, ఉదయ్కుమార్, డీపీఎంవోలు దేవిసింగ్, రమేశ్, గర్రెపల్లి ఎంఎల్హెచ్పీ సంతోష్, ఏఎన్ఎంలు శోభన, తబాస పాల్గొన్నారు. 14రోడ్లు.. రూ.49.93కోట్లు మంథని/కమాన్పూర్: పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల్లోని 14 రోడ్ల నిర్మాణానికి రూ.43.93 కోట్లు మంజూరైనట్లు మంత్రి శ్రీధర్బాబు క్యాంపు కార్యాలయం ప్రకటించింది. మంథని మండలం చిన్నఓదాల నుంచి మానేరు వరకు రూ.కోటి, పీడబ్ల్యూడీ రోడ్డు– విలోచవరం – మంథనిలోని అయ్యగారి చెరువు వరకు రూ. 3.62 కోట్లు, కన్నాల నుంచి మల్లేపల్లి వరకు రూ.1.82 కోట్లు, గుమునూరు పీడబ్ల్యూడీ రో డ్డు నుంచి కాకర్లపల్లి – దంతలపల్లి వరకు రూ.3.75 కోట్లు మంజూరు చేశారు. ముత్తారం, కమాన్పూర్, కాటారం, మల్హర్, మహదేవపూర్ మండలాల్లో రోడ్ల నిర్మాణానికి కూడా నిధులు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. రిటైర్డ్ బెనిఫిట్స్ చెల్లించాలి పెద్దపల్లి: పింఛన్దారులందరికీ రిటైర్డ్ బెని ఫి ట్స్ వెంటనే చెల్లించాలని ప్రభుత్వ పింఛన్దారుల సంయుక్త కార్యాచరణ సమితి జిల్లా చైర్మ న్ లక్ష్మయ్య కోరారు. కలెక్టరేట్ ఎదుట బుధవారం చేపట్టిన ఒకరోజు నిరాహార దీక్షను టీపీటీయూ రాష్ట్ర జనరల్ సెక్రటరీ కాదాసి సార య్య నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు. లక్ష్మ య్య తదితరులు మాట్లాడారు. నాయకులు సత్యనారాయణ, మహేందర్రెడ్డి, సత్యనారాయణ, రవీందర్రావు, దామోదర్రెడ్డి, నంబయ్య, మొగిలి, లక్ష్మీనారాయణ, శ్రీనివాస్, సత్యనారాయణమూర్తి పాల్గొన్నారు. జాతర పనులు ప్రారంభం రామగుండం: గోలివాడ సమ్మక్క – సారలమ్మ జాతర అభివృద్ధి పనులను ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్ బుధవారం ప్రారంభించారు. భక్తులకు మెరుగైన వసతులు కల్పిస్తామని అన్నారు. నాయకులు పాల్గొన్నారు. -
పల్లెదరికి అత్యవసర సేవలు
● మంత్రి శ్రీధర్బాబు ముత్తారం(మంథని): గ్రామీణులకు అత్యవసర వైద్య సేవలు అందించేందుకు 108 అంబులెన్స్ ప్రారంభిస్తున్నట్లు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు తెలిపారు. మచ్చుపేటలో బుధవారం రాత్రి 108 అంబులెన్స్ను మంత్రి ప్రారంభించి మాట్లాడారు. ఆధునిక సాంకేతికత కలిగిన అంబులెన్స్లో శిక్షణ పొందిన సిబ్బందిని నియమించామని తెలిపారు. గ్రామీణ ప్రజలకు క్షణాల్లో వైద్యసేవలు అందించేందుకు ఈ అంబులెన్స్ దోహదపడుతుందన్నారు. అనంతరం గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దుండె రాజేశం విగ్రహాన్ని ఆవిష్కరణ చేశారు. ఎస్సీకాలనీలో తాగునీటి బోరు ప్రారం భించారు. ఇటీవల మృతి చెందిన పలు కుటుంబ సభ్యులను పరామర్శించారు. అడిషనల్ కలెక్టర్ వేణు, ఆర్డీవో సురేశ్, డీఎంహెచ్వో ప్రమోద్కుమార్, తహసీల్దార్ మధూసూదన్రెడ్డి, వైద్యుడు అమరేందర్రావు, కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు చోప్పరి సదానందం, మండల అధ్యక్షుడు దొడ్డ బాలాజీ, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు గోవిందుల పద్మ, మాజీ జెడ్పీటీసీ నాగినేని జగన్మోహన్రావు, సర్పంచ్ సిలివేరు జ్యోతి, ఉపసర్పంచ్ దొంతుల రాకేశ్ తదితరులు పాల్గొన్నారు. -
రకైస్తవుల సంక్షేమానికి పెద్దపీట
● పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు పెద్దపల్లి: క్రైస్తవుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. జిల్లా కేంద్రంలోని డీసెంట్ ఫంక్షన్హాల్లో బుధవారం ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేసిన క్రిస్మస్ విందుకు ఆయన హాజరై మాట్లాడారు. చర్చిల అభివృద్ధికి రూ.30 వేల చొప్పున ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. క్రిస్మస్ పండుగ శాంతి, ప్రేమ, సోదరభావం వంటి విలువలను తెలియజేస్తుందని అన్నారు. అనంతరం కేక్కట్చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. అదనపు కలెక్టర్ వేణు, ఆర్డీవో గంగయ్య, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్, మైనారిటీ సంక్షేమ శాఖ సీనియర్ సహాయకుడు అప్షానా అబ్రార్, తహసీల్దార్లు, రాజయ్య, బషీరుద్దీన్ తదితరులు ఉన్నారు. క్రీడాస్పూర్తి చాటాలి పెద్దపల్లిరూరల్: క్రీడలు స్నేహ సంబంధాలను పెంపొందించేలా ఉండాలని, క్రీడాస్ఫూర్తితో ముందు కు సాగేలా ఆలోచన చేయాలని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ మైదానంలో బుధవారం పెద్దపల్లి ప్రీమియర్ క్రికెట్ లీగ్ పోటీలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. యువతకు ఆసక్తిఉన్న క్రికెట్ పోటీలను నిర్వహించడం సంతోషకరమన్నారు. వచ్చే ప్రీమియర్ లీగ్ పోటీల నిర్వహణకు భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, ప్రస్తుత మంత్రి అజహరుద్దీన్ను రప్పిస్తానని ఆయన అన్నారు. క్రీడాకారులను పరిచయం చేసుకుని పోటీలను ప్రారంభించారు. మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్, నాయకులు మల్లన్న, జడల సురేందర్, మస్రత్, రాజగోపాల్, మంథని నర్సింగ్, బండి అనిల్, జగదీశ్, సంపత్, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. -
తడి.. పొడి.. మొక్కుబడి!
ఇది రామగుండం నగరంలోని గోదావరి నదీతీరంలో ఉన్న డంపింగ్ యార్డు. మొత్తం 60 డివిజన్ల నుంచి రోజూ 59 స్వచ్ఛ ఆటోలు, 14 ట్రాక్టర్ల ద్వారా సుమారు 130 మెట్రిక్ టన్నుల చెత్తను సేకరించి ఇక్కడకు తీసుకొచ్చి కుప్పగా పోస్తున్నారు. కొందరు నిప్పంటించడంతో ఇలా పొగ కమ్ముకుంటోంది. తడి, పొడి చెత్త వేసేందుకు రామగుండం నగరంలోని అన్నిడివిజన్లలో ట్రిపుల్, డబుల్డస్ట్ బిన్లు ఏర్పాటు చేశారు. రోడ్లపై వేయకుండా డస్ట్బిన్లలోనే వేసేలా అధికారులు ఇలా చేశారు. కానీ, గోదావరిఖని మార్కండేయకాలనీలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ ఎదుట ఏర్పాటు చేసిన డస్ట్బిన్లు చోరీకి గురవడం గమనార్హం. -
చర్యలు చేపడతాం
రామగుండం, పెద్దపల్లి, మంథని, సుల్తానాబాద్ బల్దియాల్లో పారిశుధ్యం మెరుగుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటాం. ఇందుకు ప్లాన్ సిద్ధం చేస్తాం. స్వచ్ఛ సర్వేక్షణ్–2025 –26లో జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలు మంచి ర్యాంక్ సాధించేలా కార్యక్రమాలు చేపడతాం. పెద్దపల్లి, సుల్తానాబాద్లో బయోమైనింగ్ ఏర్పాటు చేస్తున్నాం. మంథనిలో కూడా డీఆర్సీసీ నిర్మాణ దశలో ఉంది. అన్ని మున్సిపాలిటీల్లో తడిచెత్తతో ఎరువులు తయారు చేయిస్తున్నాం. – అరుణశ్రీ, అదనపు కలెక్టర్ -
సుల్తానాబాద్
రామగుండం7.5చెత్త357957013080,000 61615,000 6,000(లక్షలు)2.10(రోజుకు)1712(నెలకు)2973పెద్దపల్లిమంథనిసాక్షి,పెద్దపల్లి/కోల్సిటీ(రామగుండం): జిల్లాలోని పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథని మున్సిపాలిటీలతోపాటు రామగుండం నగరంలో ఇంటింటికీ తడి, పొడి చెత్త సేకరణ ప్రక్రియ ప్రచారానికే పరిమతమవుతోంది. ప్రతినెలా రూ.లక్షలు వెచ్చిస్తున్నా క్షేత్రస్థాయిలో చెత్తసేకరణ సజావుగా సాగడం లేదు. ప్రధానంగా చెత్త సేకరణకు వాహనాల కొరత ఆటంకంగా మారుతోంది. ఒకేవాహనంలో తడి, పొడిచెత్త కలిపి తరలించడం విస్మయం కలిగిస్తోంది. క్షేత్రస్థాయిలో తనిఖీలు లేక నిబంధనలు అమలు కావడం లేదని విమర్శలు ఉన్నాయి. ఆదాయంపై చిత్తశుద్ధి ఏది? బల్దియాల్లో తడిచెత్తతో కంపోస్ట్ ఎరువు తయారీ ప్రక్రియ నామమాత్రంగా సాగుతోంది. తడిచెత్తతో సేంద్రియ ఎరువు తయారీ, పొడిచెత్త(ఘన)తో బయోమైనింగ్ చేస్తూ ఆదాయం సమకూర్చుకునే అవకాశం ఉన్నా బల్దియాలకు చిత్తశుద్ధి కరువైంది. రామగుండంలో దశాబ్దాకాలం క్రితమే తడిచెత్తతో సేంద్రియ ఎరువు తయారు చేసి జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక ప్రోత్సహకాలు అందిస్తున్నా.. ప్రయోజనం లేకుండాపోతోంది. రూ.కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన వాహనాలు, నిర్మించిన సెగ్రిగేషన్ షెడ్లు నిరుపయోగంగానే మారాయి. రోజూ 179.5 మెట్రిక్ టన్నుల చెత్త జిల్లాలో రోజూ సుమారు 179.5 మెట్రిక్ టన్నుల తడి, పొడిచెత్త సేకరిస్తున్నారు. రామగుండం నగరంలో రోజూ సుమారు 130 మెట్రిక్ టన్నులు, పెద్దపల్లిలో 35 మెట్రిక్ టన్నులు, మంథనిలో 7 మెట్రిక్ టన్నులు, సుల్తానాబాద్లో 7.5 మెట్రిక్ టన్నులు వెలువడుతోందని అధికారులు తెలిపారు. మొక్కుబడిగా చెత్త సేకరణ.. తడి, పొడి చెత్త సేకరణ మొక్కుబడిగా సాగుతోందని విమర్శలు ఉన్నాయి. రామగుండంలో వెలువడే 130 మెట్రిక్ టన్నుల చెత్తలో 2 టన్నుల వరకు పొడి చెత్త సేకరిస్తున్నట్లు అధికారులు తెలిపారు. క్షేత్రస్థాయిలో ఆ లెక్కలకు పొంతన కుదరడం లేదు. మిగతా బల్దియాల్లోనూ మొక్కుబడిగా సాగుతోంది. డీఆర్సీసీలపై నిర్లక్ష్యం డ్రై రీసోర్స్ కలెక్షన్ సెంటర్ల(డీఆర్సీసీ) నిర్వహణపై బల్దియాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయి. జిల్లాలోనే ఏకై క నగరం రామగుండం. ఇక్కడి గౌతమినగర్లోనే ఒక డీఆర్సీసీ వినియోగంలో ఉంది. నాలుగు నెలల క్రితం రూ.83లక్షల వ్యయంతో గోదావరి తీరంలోని డంపింగ్ యార్డులో డీఆర్సీసీకి ప్రత్యేక భవనం నిర్మించేందుకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ భవనం ఫిల్లర్ల దశలోనే ఉంది. డీఆర్సీసీలు అందుబాటులోకి వస్తే.. ఇంటింటా చెత్త సేకరించే పారిశుధ్య కార్మికులకు ఆదాయం కూడా లభిచనుంది. కిలో ప్లాస్టిక్కు రూ.16, పేపర్కు రూ.8, గాజు సీసాకు రూ.3 చొప్పున డీఆర్సీసీ నిర్వాహకులు చెల్లిస్తున్నారు. రూ.లక్షల్లో ఖర్చు.. అయినా రాని మార్పు చెత్త సేకరణకు బల్దియాలు ప్రతీనెల రూ.లక్షల్లో ఖర్చు చేస్తున్నాయి. పారిశుధ్యం నిర్వహణలో మార్పు అయితేరావడం లేదు. రామగుండంలో పీహెచ్ వర్కర్లు 44 మంది, 448 మంది తాత్కాలిక పారిశుధ్య కార్మికులు, 124 మంది ర్యాగ్ పిక్కర్లు పని చేస్తున్నారు. చెత్త సేకరణకు 14 ట్రాక్టర్లు, 59 స్వచ్ఛ ఆటో ట్రాలీలు, ఒక కంపాక్టర్ వాహనం ఉపయోగిస్తున్నారు. వీటి వినియోగానికి రోజూ సుమారు రూ.80వేల విలువైన ఇంధనం వినియోగిస్తున్నారు. జాడలేని బయోమైనింగ్ బల్దియాల్లో తడిచెత్తతో మొక్కుబడిగా కంపోస్టు తయారు చేస్తున్నారు. రామగుండంలో ప్రతీరోజు మార్కెట్లో పడేసిన వ్యర్థాలతోపాటు పూలవ్యాపారులు, దేవాలయాల నుంచి వెలువడే వ్యర్థాలు సుమారు 2టన్నులను గౌతమినగర్ డీఆర్సీసీకి తరలించి కంపోస్టు తయారు చేస్తున్నారు. దీనిని మొక్కలకు ఎరువుగా ఉపయోగించడానికి నిల్వ చేస్తున్నారు. పెద్దపల్లి, మంథని, సుల్తానాబాద్నూ కంపోస్టును తయారు చేస్తున్నారు. కానీ ఈ ప్రక్రియ మొక్కుబడిగానే సాగుతోందని తెలుస్తోంది. ఎక్కడా బయోమైనింగ్పై దృష్టి సారించిన దాఖలాలే లేవు. పెద్దపల్లిలో ఓ ఏజెన్సీకి పనులు అప్పగించారు. -
సింగరేణిలో డ్రై వాషరీష్
గోదావరిఖని: సింగరేణిలో బొగ్గును శుద్ధి చేసే డ్రైవాషరీష్ ప్రారంభం అవుతాయా? గతంలో నీటిద్వారా వెట్ వాషరీష్ కొనసాగగా, ప్రస్తుతం వాటిని మూసివేశారు. వినియోగదారులకు నాణ్యమైన బొ గ్గు అందించాలనే లక్ష్యంతో ఉత్పత్తి అవుతున్న బొగ్గును డ్రైవాషరీష్లో శుభ్రం చేసి వినియోగదారులకు అందిస్తే వారిని కాపాడుకోవడం ద్వారా సంస్థకు లాభాలు పెరిగే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఇదేవిషయంపై కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్రెడ్డి సూచించిన క్రమంలో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. సింగరేణిలో డ్రైకోల్వాషరీష్ ఏర్పాటు చేసుకోవాలని, నాణ్యమైన బొగ్గును విద్యుత్ సంస్థలకు అందిస్తే ధర ఎక్కువగా పలకడంతో పాటు విద్యుత్ సంస్థలకు లాభాలు అధికంగా వచ్చే అవకాశాలుంటాయని సూచించారు. మట్టి, ఇతర పదార్థాలు, షేల్బొగ్గు వేరు చేసేందుకు డ్రైవాషరీష్ను ఎంతగానో ఉపయోగపడుతాయి. ఈవిధానం ప్రస్తుతం మనదేశంలో వినియోగం లేనట్లుగా అధికార వర్గాలు తెలిపాయి. సింగరేణిలో గతంలో వెట్కోల్వాషరీస్ సింగరేణి సంస్థలో దశాబ్దం క్రితం వరకు వెట్కోల్వాషరీస్ కొనసాగాయి. బొగ్గు గనుల నుంచి వెలుబడిన బొగ్గును చిన్నముక్కలుగా కట్చేసి నీటితో శుభ్రం చేసి విద్యుత్ సంస్థలకు అందించే విధానం కొనసాగింది. అయితే ఈవిధానం వల్ల బొగ్గును కడిగిన మల్మ(బొగ్గుబురద) పంపించడం ద్వారా పర్యావరణానికి హాని కలుగింది. అంతేకాకుండా బొగ్గు బురదనీటిని శుద్ధిచేయడం కూడా కష్టసాధ్యంగా మారింది. పర్యావరణానికి ఎక్కువ గా హాని కలుగుతుండటంతో పర్యావరణ శాఖ అనుమతులు కఠినతరం చేసింది. దీంతో సింగరేణి వ్యాప్తంగా ఉన్న కోల్వాషరీష్ను మూసివేశారు. డ్రైవాషరీస్కు అనుమతి సులభతరం నీటితో బొగ్గును శుభ్రపర్చే విధానం కన్నా గాలితో బొగ్గును శుభ్రపర్చి నాణ్యమైన బొగ్గును వేరుచేసే విధానానికి పర్యావరణ శాఖ అనుమతులు సులభతరంగా ఉన్నాయి. దీంతో కేంద్ర బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ దీనిపై దృష్టి సారించాలని సూచిస్తోంది. ప్రస్తుతానికి మనదేశంలో డ్రైవాషరీల్ ప్రస్తుతం లేవని, విదేశాల్లో మాత్రం కొనసాగుతున్నాయని అంటున్నారు. ఈక్రమంలో సింగరేణి ఈవిధానం పాటిస్తే బెటర్ అంటున్నారు. బొగ్గు డ్రైవాషరీష్ విధానం ఇలా నీళ్లు ఉపయోగించకుండా, గాలి, వైబ్రేషన్, గ్రావిటీ ఆధారంగా బొగ్గులోని మట్టి, రాళ్లు, పనికిరాని పదార్థాలను వేరు చేయడం. థర్మల్ పవర్ ప్లాంట్లకు సరఫరా కోసం ఈబొగ్గును ఎక్కువగా వాడుతారు. గనుల నుంచి వచ్చిన బొగ్గును ముందుగా క్రషర్లో వేసి చిన్నసైజ్లుగా చేస్తారు. సాధారణంగా 6 ఎం. ఎం. నుంచి 50ఎం.ఎం. మందంగా చేస్తారు. సరైన సైజ్లేకపోతే డ్రైవాషింగ్ పనిచేయదు. వైబ్రేటింగ్ స్క్రీన్లతో బొగ్గును వేర్వేరు సైజ్లుగా వడపోస్తారు. మూడు విభాగాలుగా తయారు చేస్తారు. ఫైన్కోల్, మీడియం కోల్, కోర్స్ కోల్ విభజిస్తారు. ఎయిర్ డెన్సిటీ సెపరేషన్.. ఎయిర్ డెన్సిటీ సెపరేషన్ డ్రైవాషరీలో ముఖ్యమైన దశ. బొగ్గును ఎయిర్టేబుల్, ఎయిర్ ఫ్లూయిడైజ్డ్ బెడ్మీద వేస్తారు. కింద నుంచి బలమైన గాలి ప్రవాహం వదులుతారు. బరువు తక్కువ బొగ్గుపైకి బరువు ఎక్కువ ఉన్నమట్టి, రాళ్లు కిందకు వెళ్తాయి. ఇలానే శుద్ధి(వాషింగ్) కొనసాగుతుంది. వైబ్రేషన్, గ్రావిటీ విధానం.. టేబుల్ కంపనం వల్ల శుద్ధమైన కోల్ ఒకవైపు, మలినాలు, మట్టి ఉన్న కోల్ మరోవైపు వెళ్తాయి. డ్రైప్రాసెస్ విధానం కావడంతో దుమ్ము ఎక్కువగా వస్తుంది. దీన్ని నివారించేందుకు డస్ట్ ఎక్స్ట్రాక్టర్లు, బ్యాగ్ ఫిల్టర్లు, సైక్లోన్ సెపరేటర్లు ఉపయోగిస్తారు. శుద్ధి చేసిన డ్రైకోల్ కన్వేయర్ బెల్ట్ ద్వారా స్టాక్ యార్డ్ లేదా రైల్వే సైడింగ్కు పంపిస్తారు. అనేక ఉపయోగాలు నీటి వినియోగం తక్కువ. ఆపరేటింగ్ ఖర్చుకూడా తక్కువే. పవర్ ప్లాంట్లకు సరైన గ్రావిటీబొగ్గు అందుతుంది. పర్యావరణానికి అనుకూలం ఉంటుంది. బొగ్గులో తేమశాతం పెరగదు. దీంతో సంస్థకు లా భాలు భారీగా రావడంతోపాటు పర్యావరణాకి ము ప్పు ఏర్పడకుండా ఉంటుంది. ఈక్రమంలో సింగరేణి యాజమాన్యం డ్రైకోల్వాషరీష్పై దృష్టి సారించే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. -
మంత్రి మాటలు హాస్యాస్పదం
● మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు మంథని: చెక్డ్యాం నాణ్యతతో నిర్మించలేదని మంథని ఎమ్మెల్యే ధ్రువీకరిస్తూ విచారణకు ఆదేశించామని అంటున్నారని, మంత్రిస్థాయిలో నాణ్యత లేదని చెప్తుంటే.. అధికారులు మరోతీరు నివేదిక ఇస్తారా? అని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ప్రశ్నించారు. పరోక్షంగా అధికారులను భయపెడుతూ తమకు అనుకూలంగా నివేదిక వచ్చేలా మట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. స్థానిక రాజగృహలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఆదినుంచీ చెక్డ్యాంలు నిర్మించడం ఇష్టంలేదని పదేపదే చెప్పిన మంథని ఎమ్మెల్యే.. అడవిసోమన్పల్లి చెక్డ్యాంను తన అనుచరులతో కూల్చివేయించినట్లు వ్యవహరిస్తూ ఉంటే అనుమానం వస్తోందన్నారు. చెక్డ్యాంను సందర్శించిన ఎమ్మెల్యే శ్రీధర్ మాట్లాడిన తీరు హాస్యాస్పదమన్నారు. సమావేశంలో నాయకులు తరగం శంకర్లాల్, ఏగోళపు శంకర్గౌడ్, ఆరెపల్లి కుమార్, కనవేన శ్రీనివాస్, బెల్లంకొండ ప్రకాశ్రెడ్డి, పుప్పాల తిరుపతి, కొండ రవీందర్ పాల్గొన్నారు. -
హైదరాబాద్ను తలపించేలా అభివృద్ధి
● సుల్తానాబాద్ పట్టణంపై ప్రత్యేక దృష్టి ● పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావుపెద్దపల్లి: హైదరాబాద్ను తలపించేలా సుల్తానాబాద్ పట్టణంలో రహదారులు నిర్మిస్తామని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. సుల్తానాబాద్లో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను ఆయన మంగళవారం పరిశీలించి మాట్లాడారు. అప్పటి ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి సుల్తానాబాద్పై సవతి ప్రేమ చూపారని ధ్వజమెత్తారు. గత ఎమ్మెల్యేలు ముకుందరెడ్డి, బిరుదు రాజమల్లు ఈప్రాంతానికి అనేక ప్రభుత్వ కార్యాలయాలు తీసుకొస్తే.. మనోహర్రెడ్డి వాటిని తరలించుకుపోయారని ఆరోపించారు. మున్సిపల్ కమిషనర్ రమేశ్, అధికారులు రాజ్కుమార్, రవికుమార్, గుణశేఖర్రెడ్డి, ఏఎంసీ చైర్మన్ మినుపాల ప్రకాశ్రావు, సర్పంచుల ఫోరం మండల మాజీ అధ్యక్షుడు పడాల అజయ్గౌడ్, సింగల్విండో మాజీ చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్సాయిరి మహేందర్ పాల్గొన్నారు. సమస్యలు పరిష్కరిస్తాం.. సుల్తానాబాద్రూరల్: విద్యాలయాల్లోని సమస్యలు పరిష్కరిస్తామని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. గర్రెపల్లి, భూపతిపూర్ గురుకులాల్లో సొంతఖర్చులతో 17 గ్రీజర్లు ఏర్పాటు చేయగా ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. ప్రిన్సిపాల్స్ శ్రీనివాస్, గిరిజ, ఏఎంసీ చైర్మన్ ప్రకాశ్రావు, సర్పంచులు రమేశ్గౌడ్, చిన్నయ్య, నాయకులు అజయ్గౌడ్, జాని, సతీశ్, పన్నాల రాములు, నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.అనుమతులు వచ్చిన వెంటనే ప్రారంభం పెద్దపల్లి/పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రంలో కూరగాయల మార్కెట్ నిర్మాణానికి ప్రభుత్వం డిజైన్ ఫైనల్ చేసిందని, అనుమతి రాగానే పనులు ప్రారంభిస్తామని ఎమ్మెల్యే విజయరమణారావు తెలిపారు. మున్సిపల్ అధికారులతో ఈమేరకు సమీక్షించారు. మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్, ఏఈ సతీశ్, టౌన్ ప్లానింగ్ అధికారి వినయ్ తదితరులు పాల్గొన్నారు. -
వేడుకలు.. నిరసనలు
సింగరేణి బొగ్గు గనుల సంస్థ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళవారం ఒకవైపు వేడుకలు ఘనంగా నిర్వహించగా.. మరోవైపు వివిధ కార్మిక సంఘాలు నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి. ఉత్సవాల కోసం కేటాయించే నిధుల్లో కోత విధించడం, తూతూమంత్రంగా వేడుకలు నిర్వహించడంపై గుర్తింపు కార్మిక సంఘంతోపాటు ఇతర యూనియన్లు యాజమాన్యం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాయి.గోదావరిఖని: బొగ్గు ఉత్పత్తి లక్ష్య సాధనలో అగ్రగామిగా నిలవాలని ఆర్జీ–వన్ జీఎం లలిత్కుమార్ కోరారు. జీఎం కార్యాలయంలో జరిగిన సంస్థ ఆవిర్భావ దినోత్సవంలో ఆయన మాట్లాడారు. పట్టుదల, అంకితభావం, క్రమశిక్షణతో పనిచేస్తూ రక్షణతో కూడిన ఉత్పత్తి సాధించాలని ఆయన కార్మికు లకు సూచించారు. రాష్ట్రంలో సింగరేణి సంస్థ అగ్రగామిగా నిలవడం చాలా సంతోషంగా ఉందని సంతో షం వ్యక్తం చేశారు. నీటిశుద్ధి కోసం 17 ఎంఎల్డీ ఎస్టీపీ త్వరలో పూర్తికానుందని తెలిపారు. ఈసందర్భంగా నిర్వహించిన పలు పోటీల్లో విజేతలు, ఉత్త మ కార్మికులు, అధికారులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా కళాకారులు, విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఆఈ కార్యక్రమంలో క్వాలిటీ రీజియన్ జీఎం సుజాయిముజందార్, అధికారుల సంఘం అధ్యక్షుడు బి.మల్లేశ్, ఎస్వోటూ జీఎం చంద్రశేఖర్, ఏసీఎంవో అంబిక, ఏజీఎం రాంమోహన్రావు, ప్రాజెక్టు అధికారి రమేశ్, ఏజెంట్లు శ్రీనివాస్, రమేశ్, పర్సనల్ మేనేజర్ రవీందర్రెడ్డి, సెక్యూరిటీ అధికారి వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఏఐటీయూసీ నాయకుల నిరసన సింగరేణి డేను తూతూమంత్రంగా నిర్వహించడాన్ని ఏఐటీయూసీ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈమేరకు ఆర్జీ–1 ఏరియాలోని అన్ని గనులపై నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. యాజమాన్యం తీరుపై మండిపడ్డారు. కార్యక్రమంలో నాయకులు మడ్డి ఎల్లాగౌడ్, ఆరెల్లి పోషం, రంగు శ్రీను, మాదన మహేశ్, సిద్దమల్ల రాజు తదితరులు పాల్గొన్నారు. యైటింక్లయిన్కాలనీలో.. యైటింక్లయిన్కాలనీ(రామగుండం): ఆర్జీ–2 ఏరియాలో సింగరేణి ఆవిర్భావ వేడుకలను మొక్కుబడిగా నిర్వహించడాన్ని వ్యతిరేకిస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. కార్యక్రమంలో నాయకులు జిగురు రవీందర్, రాజారత్నం, అన్నారావు, శ్యాంసన్, సాంబశివరావు, బుర్ర తిరుపతి, మహేందర్, శ్రీనివాస్, శ్రీకాంత్, సత్యనారాయణగౌడ్, పుల్లయ్య, రాజేశ్, వెంకటేశ్, మనోహర్, కిశోర్ తదితరులు పాల్గొన్నారు. వేడుకల బహిష్కరణ రామగిరి(మంథని): ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆర్జీ–3, ఏపీఏ గనులపై సింగరేణి ఆవిర్భావ వేడుకలను బహిష్కరించారు. కార్యక్రమంలో ఆర్జీ–3 బ్రాంచ్ సెక్రటరీ ఎం.రామచంద్రారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సెంట్రల్ సెక్రటరీ జూపాక రామచందర్, బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ బండారి క్రాంతి, నాయకులు డీటీ రావు, గంగాధర్, సురేశ్, పోశం, ఎన్.రమేశ్ తదితరులు పాల్గొన్నారు.కేక్కట్ చేస్తున్న జీఎం లలిత్కుమార్ -
డ్రగ్స్ను నియంత్రించాలి
పెద్దపల్లి: జిల్లాలో మాదక ద్రవ్యాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ వేణు ఆదేశించారు. డ్రగ్స్ నియంత్రణకు చేపట్టిన చర్యలపై మంగళవారం తన చాంబర్లో పలువురు అధికారులతో సమీక్షించారు. మాదక ద్రవ్యాలకు అలవాపడితే ఆరో గ్యం దెబ్బ తింటుందని అన్నారు. ఆలోచనా విధానం నశిస్తుందని పేర్కొన్నారు. ఇలాంటి వాటి నియంత్రణలో అందరూ భాగస్వాములు కావాలని ఆయన కోరారు. కలెక్టరేట్ పరిపాలన అధికారి ప్రకాశ్, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ మహిపాల్రెడ్డి, అధికారులు పాల్గొన్నారు. ఆపరేషన్ విజయవంతం పెద్దపల్లి: స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో డాక్టర్ అమరసింహారెడ్డి మంగళవారం ఓ మహిళకు అరుదైన ఆపరేషన్ విజయవంతంగా పూర్తిచేశారని డీసీహెచ్ శ్రీధర్ తెలిపారు. కాల్వశ్రీరాంపూర్ మండలం వెన్నెంపల్లి గ్రామానికి చెందిన మహిళ కడుపులో కుడివైపు నొప్పితో కొంతకాలంగా బాధపడుతూ ఇటీవల ఆస్పత్రిలో చేరింది. పరీక్షించిన డాక్టర్.. గ్లాడ్బ్లాడర్లో 14 ఎం. ఎం. మందంగల రాయిని గుర్తించారు. ఇప్పటి కే ఆమెకు నాలుగు ఆపరేషన్లు జరిగాయని, మరోఆపరేషన్ చేయడం క్లిష్టమైనా.. వైద్యులు సాయిప్రసాద్, విష్ణుచంద్రిక, స్వాతి, భవాని ఆధ్వర్యంలో ఆపరేషన్ను విజయవంతం చేశా రు. వారిని డాక్టర్ శ్రీధర్ అభినందించారు. ఎఫ్ఎల్ఎస్పై దృష్టి పెట్టాలి గోదావరిఖనిటౌన్: ఫౌండేషనల్ లర్నింగ్ స్టడీ (ఎఫ్ఎల్ఎస్)పై ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా అకడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ షేక్ సూచించారు. రామగుండం మండలంలోని జెడ్పీహైస్కూల్, గాంధీపార్క్, ఉ ర్దూ మీడియం పాఠశాలల్లో ఎఫ్ఎల్ఎన్పై ప్రా థమిక పాఠశాలల ఉపాధ్యాయులకు రెండురోజులుగా సాగుతున్న జిల్లాస్థాయి సమావేశంలో మంగళవారం ఆయన పాల్గొన్నారు. మూడో తరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. కాంప్లెక్స్ హెచ్ఎం భవాని, ఆర్పీలు నీకత్ ఫాతిమ, అబ్దుల్ నిషాద్, అతిఫ, సీఆర్పీ వెంకటేశ్వర్లు, టీచర్లు ఉన్నారు. రేపు ఎన్టీపీసీ డైరెక్టర్ల రాక జ్యోతినగర్(రామగుండం): రామగుండంలోని తెలంగాణ ప్రాజెక్టు సందర్శనకు ఈనెల 25న ఐదుగురు ఇండిపెండెంట్ డైరెక్టర్లు రానున్నా రు. ఇందులో అనిల్కుమార్ త్రిగునాయత్, అ నిల్ కుమార్ గుప్త, పంకజ్ గుప్త, గాయత్రిదేవి, సుశీల్ కుమార్చౌదరి ఉన్నారు. థర్మల్, సోలా ర్, ఫ్లోటింగ్ సోలార్, తెలంగాణ స్టేజ్–1 ప్రాజెక్టుల్లో వారు పర్యటించనున్నారు. ఇటీవల ప ర్యావరణ అనుమతి పొందిన థర్మల్ ప్రాజెక్టు స్థలంతోపాటు పలు విభాగాలను పరిశీలించి అధికారులతో విద్యుత్ ఉత్పత్తి, ఉత్పాదకతపై సమీక్షిస్తారు. ఈమేరకు రామగుండంలోని ఎన్టీ పీసీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సేంద్రియ ఎరువుతో మేలు పెద్దపల్లిరూరల్: భూసారం పెంపొందించేందు కు సేంద్రియ ఎరువుల వినియోగమే మేలని జి ల్లా వ్యవసాయాధికారి శ్రీనివాస్ అన్నారు. బ్రా హ్మణపల్లి రైతువేదికలో మంగళవారం జాతీ య రైతుదినోత్సవం నిర్వహించారు. రామగిరి కృషి విజ్ఞాన కేంద్రం కో ఆర్డినేటర్ వెంకటరమే శ్, శాస్త్రవేత్తలు వెంకన్న, భాస్కర్రావు, వినోద్కుమార్, కిరణ్, నవ్య, పూర్ణచందర్ నేల స్వ భావం కాపాడేందుకు పాటించాల్సిన పద్ధతుల గురించి వివరించారు. ప్రతీఒక్కరు ఇంటి ఆవ రణలో పెరటి తోటలను పెంచుకోవాలని, త ద్వారా రసాయనాలను లేనికూరగాయలు ల భించి ఆరోగ్యంగా ఉంటారని సర్పంచ్ మేకల రోజారాణి అన్నారు. ఏడీఏ శ్రీనాథ్, ఉపసర్పంచ్ జంగిలి శేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
గోదావరి దాటిన పులి
గోదావరిఖని/జ్యోతినగర్: సుమారు పదిరోజులుగా గోదావరినదీతీర ప్రాంత ప్రజల కంటిమీద కునుకులేకుండా చేసిన పులి ఎట్టకేలకు నది దాటి అవతలివైపు వెళ్లినట్లు అటవీ అధికారులు నిర్ధారించారు. దీంతో ప్రజలు ఊపిరిపీల్చుకుంటున్నారు. ఈనెల 14న మంచిర్యాల జిల్లా శ్రీరాపూర్ ప్రాంతం నుంచి గోదావరిఖని వైపు చొరబడిన పులి.. మూసివేసిన సింగరేణి మేడిపల్లి ఓసీపీ డంప్–1లో తలదాచుకుంది. అనంతరం మల్యాలపల్లె సమీప బీపీఎల్ ఖాళీ స్థలంలో సంచరించింది. పులి సంచారం.. ప్రజల్లో భయం రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని పలు ప్రాంతాల్లో పులి సంచరిస్తున్నట్లు వస్తున్న సమాచారంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. మల్కాపూర్, మేడిపల్లి, లింగాపూర్, మల్యాలపల్లె, గోలివాడ ప్రాంతాల్లో సంచరిస్తున్నట్లు తెలియడంతో అటవీ అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజ లను హెచ్చరిస్తూ పులి కదలికలను నిపుణులతో ప ర్యవేక్షించారు. పదిరోజుల పాటు సంచరించినా.. ఒక్కప్రాణికి కూడా హాని చేయలేదు. దీంతో పులి ఎలాంటి ఆహారం తీసుకుందనేదానిపై అధికారులు ఆరాతీస్తున్నారు. మంచిర్యాల జిల్లా ఇందారం ఫారె స్ట్ ప్రాంతానికి పులి వెళ్లిందని అటవీ అధికారులు నిర్ధారించడంతో ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. అధికారుల అప్రమత్తత.. పులి సంచారంతో జిల్లా అటవీ అధికారి శివయ్య నే తృత్వంలో ఎఫ్ఆర్వోలు సతీశ్కుమార్, కొముర య్య, రహమతుల్లా, మల్లేశ్ తదితరులు, నిపుణులు పులి సంచారంపై రోజూ తనిఖీలు చేశారు. అది ఎక్కడ నుంచి ఎక్కడకు వెళ్తుందనే దానిపై నిత్యం పర్యవేక్షణ చేశారు. గ్రామాల్లో డప్పు చాటింపుతోపాటు పోస్టర్లు అంటించి ప్రజల్ని అప్రమత్తం చేశారు. పులి సంచారం తెలిస్తే.. అధికారులకు సమాచారం అందించాలని, మొబైల్ నంబర్లను ప్రకటించి ప్రజలకు భరోసా కల్పించారు. -
బహుముఖ ప్రజ్ఞాశాలి పీవీ నర్సింహారావు
● రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్ గోదావరిఖని: బహుముఖ ప్రజ్ఞాశాలి, అనేక ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చిన గొప్పనేత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు అని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్ అన్నారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం పీవీ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. పీవీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. పీవీ ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి ప్రపంచదేశాలకు దీటుగా భారత్ను నిలిపారని ఆయన ప్రశంసించారు. ఆయనను అందరూ ఆదర్శంగా తీసుకోవాలని మక్కాన్సింగ్ సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బొంతల రాజేశ్, మహంకాళి స్వామి, తిప్పారపు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అన్ని హంగులతో భవన నిర్మాణం గోదావరిఖనిటౌన్: ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్ర కారం అన్ని హంగులతో క్రిష్టియన్ భవనం నిర్మిస్తామని ఎమ్మెల్యే మక్కాన్సింగ్ హామీ ఇచ్చారు. మార్కండేయకాలనీ ఆర్కే గార్డెన్స్లో నిర్వహించిన ముందస్తు క్రిస్మస్ వేడుకల్లో ఆయన మా ట్లాడారు. నియోజకవర్గంలో గుర్తింపు ఉన్న 28 చర్చిలకు సీఎం రేవంత్రెడ్డి రూ.30వేల చొప్పు న అందించనున్నారని రాజ్ఠాకూర్ తెలిపారు. -
నాసిరకమని నాడే చెప్పా
● మంత్రి శ్రీధర్బాబు మంథని: గత ప్రభుత్వం చెక్డ్యాంలను అశాసీ్త్రయంగా, నాసిరకంగా నిర్మిస్తోందని తాను ఎమ్మెల్యేగా ఉన్నసమయంలోనే వెల్లడించానని మంత్రి శ్రీధర్బాబు తెలిపారు. శాసనసభలో ఈ విషయం గురించి సుదీర్ఘంగా తాను మాట్లాడానని గుర్తుచేశారు. దానిఫలితం ఇప్పుడు కనిపిస్తోందన్నారు. అడవిసోమన్పల్లి మానేరులో ఇటీవల కూలిన చెక్డ్యాంను మంగళవారం మంత్రి పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. నాటి ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు పేరిట మూడు బ్యారేజీలు, మానేరుపై రూ.కోట్లు వెచ్చించి నిర్మించిన చెక్డ్యాంలు ని ష్ప్రయోజనంగా మారాయన్నారు. చెక్డ్యాంలు కూ లిన ఘటనపై నీటిపారుదల మంత్రి ఉత్తంకుమార్రెడ్డి విజిలెన్స్ విచారణకు ఆదేశించారనిమంత్రి తెలిపారు. నివేదికను కూడా త్వరగా బయట పె ట్టాలని ఆయన అన్నారు. తద్వారా బాధ్యులపై చర్యలు ఉంటాయని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో నీటిపారుదల శాఖ ఈఈ బలరామయ్య, డీఈఈ రమేశ్బాబు, నాయకులు సెగ్గెం రాజేశ్, గట్టు దామోదర్, శశిభూషణ్ కాచే, కుడుదుల వెంకన్న, తొట్ల తిరుపతి యాదవ్, ఐలి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
ఆశలు ఆవిరి
పెద్దపల్లిరూరల్: తమ ఇంట తెల్లబంగారం సిరులు కురిపిస్తుందని ఆశిస్తే.. అందులో సగం కూడా దిగుబడి రాలేదని జిల్లాలో పత్తిసాగు చేసిన రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈఏడాది జిల్లావ్యాస్తంగా 48,215 ఎకరాల విస్తీర్ణంలో పత్తి సాగుచేశారని వ్యవసాయాధికారులు అంచనా వేశారు. తద్వారా 5,78,580 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందని అంచనాకు వచ్చారు. సీజన్ చివరి దశకు వచ్చినా ఇప్ప టివరకు కేవలం 1,15,000 క్వింటాళ్ల పత్తి మాత్రమే కొనుగోలు చేసినట్లు రికార్డులు చెబుతున్నాయి. ఇందులో సీసీఐ 61వేల క్వింటాళ్లు కొనుగోలు చేయగా, ప్రైవేట్ వ్యాపారులు 54వేల క్వింటాళ్లు కొనుగోలు చేసినట్లు అధికారవర్గాల లెక్కల ద్వారా తెలుస్తోంది. ఇంకా దిగుబడులు వచ్చే పరిస్థితి కూడా కనిపించక పోవడంతో పత్తి రైతుల్లో నైరాశ్యం నెలకొంది. ఎకరాలో కనీసం మూడు నుంచి నాలుగు క్వింటాళ్ల వరకు పత్తి దిగుబడి నష్టపోవాల్సి వచ్చిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈసారి ప్రైవేట్ వ్యాపారులు కూడా దాదాపుగా సీసీఐకి సమానంగా ధరలు చెల్లించినా.. దిగుబడి రాక నష్టపోవాల్సి వస్తోందని వాపోతున్నారు. దిగుబడులు చివరిదశకు వస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో పత్తి ధరలు పెరుగుతుండడం అన్నదాతను నిరుత్సాహానికి గురిచేస్తున్నాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో అనేక కష్టనష్టాలకు ఓర్చిన రైతులు.. పంటను కంటికి రెప్పలా కాపాడుకున్నారు. కానీ, పలు తెగుళ్లతో దిగుబడి పడిపోవడం, ఇప్పుడు ధరలు పెరగడం ఆందోళనకు గురిచేస్తున్నాయి. జిల్లా సీసీఐ ప్రైవేట్ పెద్దపల్లి 61,000 54,000 కరీంనగర్ 1,53,000 62,000 సిరిసిల్ల 1,79,000 39,200 జగిత్యాల 9,400 11,000 క్వింటాల్ పత్తి రూ.7,418 పెద్దపల్లిరూరల్: స్థానిక వ్యవసాయ మార్కెట్యార్డు ఆవరణలో మంగళవారం పత్తి క్వింటాల్కు గరిష్టంగా రూ.7,418 ధర పలికింది. కనిష్టం రూ.6,651, సగటు రూ.7,151గా ధర నమోదైందని మార్కెట్ ఇన్చార్జి కార్యదర్శి ప్రవీణ్రెడ్డి తెలిపారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి 162 మంది రైతులు తీసుకొచ్చిన 680 క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేసినట్లు ఆయన వివరించారు. -
నీటి ప్రాజెక్టుల రక్షణ బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలి
మంథనిరూరల్: నీటి ప్రాజెక్టుల రక్షణ బాధ్యత ప్ర భుత్వమే తీసుకోవాలని రామన్ మెగాసేసే అవార్డు గ్రహీత, వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్రసింగ్ కోరారు. పెద్దపల్లి జిల్లా మంథని మండలం అడవిసోమన్పల్లి మానేరులో కూలిపోయిన చెచెక్డ్యాంను సోమవారం జనవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి.ప్రకాశ్తో కలిసి పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ, వివిధ ప్రయోజనాల కోసం నిర్మించిన సాగునీటి ప్రాజెక్టులను ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంటుందన్నా రు. అందుకు భిన్నంగా తెలంగాణలో ప్రాజెక్టులు, చెక్డ్యాంలు ధ్వంసం అవుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వరదలు వచ్చే సమయంలో డ్యాంలు, ప్రాజెక్టులు కూలిపోయే అవకాశం ఉంటుంద ని, కానీ, వరద ఉధృతి లేనిసమయంలో అడవిసోమన్పల్లి చెక్డ్యాం కూలిపోయే అవకాశాలు ఉండవని అభిప్రాయపడ్డారు. చెక్డ్యాం కూలిపోయిన తీరును పరిశీలిస్తే ధ్వంసం చేసినట్లే తాము భావిస్తున్నామని అన్నారు. ఇరిగేషన్ అధికారుల ఫిర్యాదుపై ప్రభుత్వం స్పందించి విచారణ కమిషన్ వేయాలని డిమాండ్చేశారు. కార్యక్రమంలో ప్రజానిఘా వేదిక ప్రతినిధి వీవీ రావు, మానేరు పరిరక్షణ సమితి అధ్యక్షుడు నోముల శ్రీనివాసరెడ్డి, వాక్ ఫర్ వాటర్ సంస్థ నిర్వాహకుడు కరుణాకర్రెడ్డి, జర్నలిస్ట్ సలీం తదితరులు పాల్గొన్నారు. -
సర్పంచ్ ప్రమాణస్వీకారం.. ఉపసర్పంచ్ రాజీనామా
పెద్దపల్లిరూరల్: నిట్టూరు గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సం సోమవారం జరగగా.. ఉపసర్పంచ్ నీలం లక్ష్మణ్, తొమ్మిదో వా ర్డు సభ్యుడు పల్లెర్ల ఆంజనేయులు గైర్హాజరయ్యా రు. వారిద్దరు మినహా సర్పంచ్ ఆకుల సువర్ణ, వార్డుసభ్యుల చేత ప్రత్యేకాధికారి అలివేణి పదవీ ప్రమాణ స్వీకారం చేయించారు. సర్పంచ్ సువర్ణకు బాధ్యతలు అప్పగించారు. ఇటు సర్పంచ్గా ఆకుల సువర్ణ పదవీ బాధ్యతలను స్వీకరిస్తుండగానే.. అటు ఉపసర్పంచ్ నీలం లక్ష్మణ్ తన పదవికి వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు రాసిన రాజీనామా లేఖను అందించారని ఎంపీడీవో శ్రీనివాస్ తెలిపారు. వార్డు సభ్యుడి గైర్హాజర్ ఎందుకో? నిట్టూరులోని 9వ వార్డు సభ్యుడు పల్లెర్ల ఆంజనేయులు కూడా రాజీనామా చేయనున్నారా? అందు కే గైర్హాజరయ్యారా? అనే చర్చ సాగుతోంది. సర్పంచ్ పదవి చేజారడంతో ఉపసర్పంచ్ పదవినైనా దక్కించుకోవాలనే ఆలోచనతో ఉన్న ప్రత్యర్థుల ఎ త్తులు చిత్తవడంతోనే పాలకమండలిలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నట్లు సమాచారం. నిట్టూరులో మొదలైన రాజకీయ ఎత్తులో ఎవరి వ్యూహాలు ఫలిస్తాయో చూడాల్సిందే. ప్రశాంతంగా బాధ్యతలు స్వీకరణ పెద్దపల్లి: జిల్లాలోని 262 గ్రామ పంచాయతీల పా లవర్గాలు సోమవారం కొలువు దీరాయి. సర్పంచు లు, ఉప సర్పంచులతోపాటు వార్డుసభ్యులు పదవీ ప్రమాణ స్వీకారం చేశారని డీపీవో వీరబుచ్చయ్య తెలిపారు. పలువురు అధికారులు పాలకవర్గాలతో ప్రమాణ స్వీకారం చేయించారని ఆయన పేర్కొన్నారు. పెద్దపల్లి మండలం నిట్టూరు ఉపసర్పంచ్ పదవికి సతీశ్ రాజీనామా చేసి, మండల అధికారులకు లేఖ ఇచ్చారని, అయినా రాజీనామాకు ఆమోదం తెలుపలేదని ఆయన వివరించారు. అధికార పార్టీ ఒక నాయకుడు ప్రాబల్యంతోనే రాజీనామా చేసినట్లు ప్రచారం సాగుతోంది. అధికార పార్టీ నాయకులు కలగజేసుకొని రాజీనామాను ఉపసంహరించుకునేలా చేయాలని పలువురు కార్యకర్తలు కోరుతున్నారు. -
పల్లెకు పాలకవర్గం
సాక్షి పెద్దపల్లి: జిల్లాలోని కొత్త పంచాయతీ పాలకవర్గాలు సోమవారం కొలువుదీరాయి. పంచాయతీ కార్యాలయాల్లో ప్రత్యేకాధికారుల నుంచి సర్పంచు లు బాధ్యతలు స్వీకరించారు. జిల్లావ్యాప్తంగా 263 పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయగా.. ఒకపంచాయతీ కేసు కోర్టుకు చేరింది. మిగిలిన 262 పంచాయతీల్లో ఎన్నికై న కొత్త సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు పదవీ ప్రమాణం చేశారు. సుమారు రెండేళ్లుగా ప్రత్యేకాధికారుల పాలనలో ఉన్న గ్రామ పంచాయతీలకు నూతన పాలకవర్గాల ప్రమాణ స్వీ కారం చేపట్టిన వెంటనే కొందరు సర్పంచులు గ్రా మంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టా రు. పలువురు సర్పంచ్లు మాట్లాడుతూ, తమపై నమ్మకంతో ఓటు వేసి గెలిపించిన ప్రజలకు ఎల్లవేళాల అందుబాటులో ఉంటామన్నారు. ప్రజాసేవకే అంకితమవుతాని చెప్పారు. ఎన్నిక సందర్భంగా ఇ చ్చిన హామీలను నెరవేరుస్తామని మరోసారి హామీ ఇచ్చారు. పార్టీలకు అతీతంగా గ్రామ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తామని పేర్కొన్నారు. ప్రమాణ స్వీకారం ఇలా.. జిల్లాలోని గత పంచాయతీ పాలకవర్గాల పదవీకా లం 2024 ఫిబ్రవరి ఒకటో తేదీన ముగిసింది. దీంతో ప్రభుత్వం గ్రామాల్లో ప్రత్యేకాధికారుల పాలనను అమల్లోకి తీసుకొచ్చింది. ప్రభుత్వ అధికారులను ఇన్చార్జిలుగా నియామించింది. దాదాపు 20 నెలల పాటు పల్లెపాలన కొనసాగించింది. అయితే, తమ శాఖలోని సమస్యలతో సతమతమయ్యే ప్రత్యే కాధికారులు.. పల్లెల్లోని సమస్యలను పట్టించుకోకపోవడంతో ఎక్కడి సమస్యలు అక్కడే నిలిచిపోయా యి. తాజాగా ఎన్నికలు నిర్వహించడంతో.. గెలుపొందిన పాలకవర్గాల వివరాలతో కూడిన ఫారం–15ను రిటర్నింగ్ అధికారి నుంచి అందుకుని పంచాయతీ కార్యదర్శలు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు స భ్యులతో ప్రత్యేకాధికారులు ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారం అనంతరం ప్రమాణప్రతంపై కొత్త సర్పంచులు సంతకం చేశారు. తొలిసమావేశంలో పలు తీర్మాణాలు పదవీ ప్రమాణ స్వీకారం అనంతరం ఏర్పాటు చేసిన సమావేశాల్లో సర్పంచులు, పాలక వర్గాలు పలు కీలకమైన నిర్ణయాలు తీసుకున్నాయి. పాలకవర్గాల సమక్షంలో పలు వివిధ తీర్మానాలు చేశాయి. ప్రధానంగా ఎన్నికై న 15రోజుల్లోగా తొలిగ్రామసభ నిర్వహించాలని నిర్ణయించాయి. చాలా పంచాయతీల్లో గ్రామసభ నిర్వహణ, బడ్జెట్ ఆమోదం, అభివృద్ధి పనులు, వీధిదీపాలు, పారిశుధ్యం పర్యేవేక్షణ, సీసీ రోడ్ల నిర్మాణం తదితర అంశాలపై తొలిరోజు చర్చ కొనసాగించాయి. పార్టీలకతీతంగా అభివృద్ధి ధర్మారం(ధర్మపురి): కొత్త సర్పంచులు పార్టీలకతీతంగా గ్రామాల సమగ్ర అభివృద్ధికి పనిచేయాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ కోరా రు. కొత్తూరు సర్పంచ్ భూక్య సంగీత, వార్డు సభ్యులు సోమవారం పదవీ ప్రమాణ స్వీకారం చేయగా.. మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మా ట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సారథ్యంలో ప్రభుత్వం ప్రతీగ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు నిధులు కేటాయిస్తోందన్నారు. వ్యక్తిగత విభేదాలు, రాజకీయ ద్వేషాలు పక్కనపెట్టి పల్లెప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేయాలని ఆయన కోరారు. నియోజకవర్గంలో 149 గ్రామాలు ఉంటే.. 108 పంచాయతీల్లో కాంగ్రెస్ మద్దతుదారులు సర్పంచులు విజ యం సాధించడం ప్రభుత్వంపై ప్రజలకున్న విశ్వాసానికి నిదర్శనని అన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ లావుడ్య రూప్లానాయక్, మాజీ సర్పంచ్ మల్లేశం, నాయకులు చింతల ప్రదీప్రెడ్డి, తిరుపతిరెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో ప్రవీణ్కుమార్, ఆర్ఐలు వరలక్ష్మి, నవీన్రావు, ఎంపీవో రమేశ్, ఏపీవో రవీందర్ తదితరులు పాల్గొన్నారు. -
అర్జీలను సత్వరమే పరిష్కరించాలి
పెద్దపల్లి: ప్రజావాణి ద్వారా అర్జీల రూపంలో అందిన సమస్యలను సత్వరమే పరిష్కరించా లని అదనపు కలెక్టర్ వేణు ఆదేశించారు. కలెక్టర్లో సోమవారం ప్రజావాణి ద్వారా ఆయన ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. పె ద్దపల్లికి చెందిన మౌనిక.. వారధి ద్వారా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలో ఖాళీగా ఉన్న స్టోర్ కీపర్ ఉద్యోగం ఇప్పించాలని విన్నవించారు. కాల్వశ్రీరాంపూర్ మండలం వెన్నంపల్లికి చెందిన బండి దేవమ్మ.. తనకు గృహజ్యోతి పథకం వర్తింపజేయాలని, పాలకుర్తి మండ లం కొత్తపల్లి గ్రామానికి చెందిన గుంపుల సతీశ్.. తాను దివ్యాంగుడనని, మూడు చక్రాల వాహనం అందించాలని, పెద్దపల్లికి చెందిన డి.స్వప్న డబుల్బెడ్రూమ్ ఇంటికోసం దర ఖాస్తు చేశారు. వీటిని క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులకు సూచించారు. ప్రజావాణి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చి, పెండింగ్లో ఉంచకుండా పరిష్కరించాలని ఆయన అన్నారు. బాధ్యతలు స్వీకరణ పెద్దపల్లి: జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ప్రత్యేక అధికారులు సోమవారం బాధ్యతలు స్వీకరించారని డీసీవో శ్రీమాల తెలిపారు. ఈనెల 20న ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఇన్చార్జిల బాధ్యతలను రద్దు చేయడంతోపాటు ప్రత్యేక అధికారులను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. కాగా, సహకార సంఘాల ప్రక్షాళనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిసింది. విద్యార్థులకు కంటిపరీక్షలు సుల్తానాబాద్రూరల్: విద్యార్థులందరికీ కంటి పరీక్షలు చేయాలని జిల్లా వైద్యాధికారి ప్రమోదుకుమార్ సూచించారు. గర్రెపల్లి మోడల్ స్కూల్లో రాష్ట్రీయ బాల స్వస్థ్య కార్యక్రమంలో భాగంగా సోమవారం విద్యార్థులకు కంటి పరీక్షలు చేశారు. డీఎంహెచ్వో పరీక్షల తీరు పరిశీలించి మాట్లాడారు. కంటి సమస్యలు ఉన్నవారిని గుర్తించి సమస్య పరిష్కరించాలన్నారు. ప్రోగ్రాం అధికారి శ్రీరాములు, నిపుణు లు అజయ్కుమార్, రమాదేవి పాల్గొన్నారు. నియామకం రామగుండం: అంతర్గాం మండలం గోలివాడ స మ్మక్క – సారలమ్మ జాత ర కమిటీ చైర్మన్గా గీట్ల శంకర్రెడ్డిని నియమించా రు. రామగుండం ఎమ్మె ల్యే మక్కాన్సింగ్ఠాకూర్ ఆదేశాల మేరకు ఆయన నియామకం చేపట్టారు. ఆయనను పలువురు అభినందించారు. క్వింటాల్ పత్తి రూ.7,414 పెద్దపల్లిరూరల్: స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలో సోమవారం పత్తి క్వింటాల్కు గరిష్టంగా రూ.7,414 ధర పలికింది. కనిష్టంగా రూ.6,161, సగటు ధర రూ.7,112గా నమోదైందని మార్కెట్ ఇన్చార్జి కార్యదర్శి ప్ర వీణ్రెడ్డి తెలిపారు. మొత్తం 922 క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేసినట్లు ఆయన వివరించారు. కబడ్డీ పోటీలకు ఎంపిక ఓదెల(పెద్దపల్లి): పొత్కపల్లి హైస్కూల్లోని పదో తరగతి విద్యార్థిని శ్రీవల్లి రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికై ంది. పెద్దపల్లిలో ఇటీవల జరిగిన జిల్లాస్థాయి పోటీల్లో ఆమె ప్రతిభ చూపింది. ఆమెను ప్రధానోపాధ్యాయుడు సాంబయ్య, డీటీఎఫ్ నేత అమృత కిశోర్, పీఈటీ హరికృష్ణ, ఉపాధ్యాయులు సోమవారం అభినందించారు. కూల్చిన స్థలంలోనే నిర్మించాలి గోదావరిఖని: కూల్చివేసిన స్థలంలోనే మళ్లీ షా పు నిర్మించి ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ డిమాండ్ చేశారు. స్థానిక ప్రధాన చౌరస్తాలో సోమవారం ఆయన ధర్నా చేశారు. కూల్చి వేసిన షాప్ వద్ద నిరసన చేపట్టిన ఆ కుల మల్లేశ్ దంపతులను ఆయన కలిసి సంఘీభావం తెలిపారు. రెండేళ్లుగా కూల్చివేతల ప ర్వం సాగుతోందన్నారు. ఎమ్మెల్యే రాజ్ఠూకర్ కారణంగా రోడ్డున పడ్డ లలిత కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. కా ర్యక్రమంలో కౌశిక హరి, గోపు అయులయ్య యాదవ్, కౌశిక లత, పాముకుంట్ల భాస్కర్, కుమ్మరి శ్రీనివాస్, కల్వచర్ల కృష్ణవేణి, జనగామ కవితసరోజిని, బాదే అంజలి, బొడ్డుపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
మహనీయులను ఆదర్శంగా తీసుకోవాలి
పెద్దపల్లి: మహనీయులను స్ఫూర్తిగా తీసుకోవాలని అదనపు కలెక్టర్ వేణు సూచించారు. మాజీకేంద్రమంతి జి.వెంకటస్వామి(కాకా) వర్ధంతి కలెక్టరేట్లో సోమవారం నిర్వహించారు. ఆయన చిత్రపటానికి అదనపు కలెక్టర్ పూలమాలవేసి నివాళ ఇర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, అట్టడుగువర్గాల సంక్షేమం, అభివృద్ధికి సహకారం అందించాలన్నారు. కలెక్టరేట్ పరిపాలన అధికారి ప్రకాశ్, జిల్లా క్రీడల అధికారి సురేశ్, డీపీవో వీరబుచ్చయ్య తదితరులు పాల్గొన్నారు. కమిషనరేట్లో కాకా వర్ధంతి గోదావరిఖని: రామగుండం పోలీస్ కమిషనరేట్లో వెంకటస్వామి(కాకా) వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి అదనపు డీసీపీ శ్రీనివాస్ పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. కార్యక్రమంలో ఏఆర్ ఏసీపీ ప్రతాప్, ఏవో శ్రీనివాస్, పీసీఆర్ సీఐ రవీందర్, ఆర్ఐ దామోదర్, శ్రీనివాస్, శేఖర్, మల్లేశం పాల్గొన్నారు. కార్మిక పక్షపాతి ‘కాకా’.. గోదావరిఖని : సింగరేణి రిటైర్డ్ కార్మికులకు పింఛ న్ ఇప్పించి కార్మిక పక్షపాతిగా వెంకటస్వామి(కా కా) నిలిచాడని ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్ అన్నారు. స్థానిక జీఎం ఆఫీస్ సమీపంలోని కాకా విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. వివిధ ప్రాంతాల్లో వర్ధంతి నిర్వహించారు. నాయకులు బొంతల రాజేశ్, పి.మల్లికార్జున్, గుమ్మడి కుమారస్వామి, పెంచాల తిరుపతి, రాజేందర్, సారయ్య, కామ విజయ్ తదితరులు పాల్గొన్నారు. -
చర్చిల మరమ్మతుకు నిధులు
పెద్దపల్లి: క్రిస్మస్ సందర్భంగా జిల్లాలోని చర్చిల మరమ్మతు, క్రైస్తవులకు విందు ఏర్పాటు చేసేందు కు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు మంజూరు చేసింది. ఈనెల 25న జరగనున్న క్రిస్మస్ సందర్భంగా నియోజకవర్గంలోని రెండు ప్రధాన పట్టణాల్లో విందులు ఏర్పాటు చేయనున్నారు. పెద్దపల్లి, రామ గుండం, మంథని నియోజకవర్గానికి 50 చర్చిలకు నిధులను మంజూరు చేసింది. నిధుల కేటాయింపు జిల్లాలోని చర్చిల మరమ్మతుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయగా.. ఒక్కో చర్చికి రూ.30 వేల చొప్పున కేటాయించింది. భవనాలకు రంగులు వేయడం(పెయింటింగ్), డిజిటల్ లైటింగ్ ఏర్పాటు, అలంకరణ తదితర పనులు చేపడతారు. గత ప్రభుత్వం క్రైస్తవులకు పండుగ సందర్భంగా కొత్త దుస్తులు అందించగా.. ప్రస్తుత ప్రభుత్వం నిధులు మంజూ రు చేయడం గమనార్హం. విందుకు రూ.6 లక్షలు జిల్లావ్యాప్తంగా ఎంపికచేసిన పట్టణాల్లో క్రైస్తవులకు విందు ఏర్పాటు చేసేందుకు రూ.6 లక్షలను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. నియోజకవర్గంలోని ప్రధాన పట్టణాల్లో ఈ నిధులు వెచ్చించి విందులు ఏర్పాటు చేస్తారు. ఇవీ నిబంధనలు.. నిధులు కేటాయించేందుకు ప్రభుత్వం నిబంధనలు అమలు చేస్తోంది. కచ్చితంగా చర్చి సొసైటీ రిజిస్ట్రే షన్ ఉండాలి. బైలా, ప్రెసిడెంట్, సెక్రటరీలేదా కో శాధికారికి జాయింట్ అకౌంట్ సొసైటీ పేరున ఉండాలి. నిధుల కోసం పెద్దపల్లి నుంచి 30, మంథని నుంచి 14, రామగుండం నుంచి 18 దరఖాస్తులు వచ్చినట్లు మైనార్టీ కార్పొరేషన్ జిల్లా ఇన్చార్జి అధికారి నరేశ్కుమార్ నాయుడు తెలిపారు. -
కష్టపడి చదివితేనే మంచి భవిష్యత్
పెద్దపల్లి: విద్యార్థులు కష్టపడి చదివితే మంచి భవిష్యత్ ఉంటుందని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. సుల్తానాబాద్ ప్రభుత్వ జూనియర్ కళా శాల విద్యార్థుల కోసం తనసొంత నిధులు వెచ్చించి 45 రోజులపాటు మధ్యాహ్న భోజనం అందించే కార్యక్రమాన్ని సోమవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులు లక్ష్య సాధనతోపాటు తల్లిదండ్రుల ఆశయాలను నిజం చేయాలని ఎమ్మె ల్యే విదార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రమేశ్, ప్రిన్సిపాల్ రామచంద్రరెడ్డి, హెచ్ఎం రత్నాకర్రెడ్డి, ఏఎంసీ చైర్మన్ ప్రకాశ్రావు, వా లీబాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ముస్త్యాల రవీందర్, నాయకులు గాజుల రాజమల్లు, బిరుదు కృష్ణ, గణేశ్, లెక్చరర్లు దేవేందర్, ప్రభాకర్, హరికృష్ణ, సునీల్, మాధవిలత, నిర్మల తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి అభివృద్ధికి నిరంతర కృషి జిల్లా కేంద్రం అభివృద్ధికి కృషి చేస్తామని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. రంగంపల్లితోపాటు వివిధ ప్రాంతాల్లో చేపట్టిన అభివృద్ధి పనులకు ఆ యన శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. పట్టణాభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్నానని అన్నారు. మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్, అధికారులు, సిబ్బంది, మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. మేడిపల్లి ఓబీ డంప్యార్డుపై పులి గోదావరిఖని: మూసివేసిన సింగరేణి మేడిపల్లి ఓసీపీ ఓబీ డంప్యార్డుపైనే పులి మకాం వేసింది. నాలుగురోజులుగా మేడిపల్లి ఓసీపీని కేంద్రంగా చేసుకుని పరిసర ప్రాంతాల్లో తిరుగుతోంది. ఓబీ డంప్యార్డుపై చెట్లపొదలు పెద్దఎత్తున ఉన్నాయి. ఇది పులి ఆవాసానికి అనువుగా ఉన్నట్లు భావిస్తున్నారు. అలాగే వన్యప్రాణులు కూడా ఉండడంతో పులికూడా అదే ప్రాంతంలో నివాసంగా మార్చుకున్నట్లు చెబుతున్నారు. వేటకోసం చుట్టు పక్కల ఉన్న పంటపొలాలు, ఇతర ప్రాంతాల్లో తిరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఈక్రమంలో సోమవారం ప్రాసెస్ ఓబీ, టెంపుల్ ఏరియా ప్రాంతంలో పులిఅడుగు జాడలు కనిపించినట్లు గుర్తించారు. ఫారెస్ట్ అధికారులు, వైల్డ్లైఫ్ సిబ్బంది, సింగరేణి అధికారులు కలిసి చాలాసేపు ఆప్రాంతాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సింగరేణి సెక్యూరిటీ అధికారి వీరారెడ్డి, ఫారెస్ట్ అధికారి రహ్మతుల్లా తదితరులు పాల్గొన్నారు. -
నాన్నా... నాకూ ఆడుకోవాలనుంది
కరీంనగర్: తన తోటి పిల్లలు ఆడుకుంటుంటే ‘నాన్నా.. నాకు కూడా ఆడుకోవాలని ఉంది’.. అన్న ఓ చిన్నారి మాటలు.. ఆ తండ్రి గుండెను పిండేశాయి. ఆ మాటలకు మౌనంగా రోదించడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి. ఇది ఒక్క రోజు వేదన కాదు.. ఆ బిడ్డను చూస్తున్న ప్రతిసారి ‘నేనేమీ చేయలేకపోతున్నానే’ అని ఆ తండ్రి ఆవేదన. పుట్టుకతోనే వెన్నెముక సమస్యతో బాధపడుతున్న బాలికకు ఆపరేషన్ కోసం రూ.6 లక్షలు అవసరం ఉంది. హమాలీ కార్మికుడైన తండ్రి తన శక్తి మేర చికిత్స చేయిస్తున్నా, దాతల సాయం కోసం ఎదురుచూడడం తప్ప తను అంత ఖర్చు పెట్టుకోలేని పరిస్థితి. వివరాలు.. కరీంనగర్లోని హౌజింగ్బోర్డు కాలనీకి చెందిన హమాలీ కార్మికుడు మోతె హరీశ్, శ్రీలత దంపతుల జీవితం నిత్య పోరాటం. రోజూ కష్టపడితే తప్ప కడుపునిండని దుస్థితి. ఈ పేదరికానికి తోడు పుట్టుకతోనే వెన్నెముక సమస్యతో జన్మించిన తమ పెద్ద కుమార్తె సిరిచందన (14)ను కంటికి రెప్పలా పెంచుకుంటున్నారు. పుట్టినప్పటి నుంచి ఆసుపత్రుల చుట్టూ తిరిగినా, 12 ఏళ్లు వచ్చే వరకు శస్త్రచికిత్స సాధ్యం కాదని వైద్యులు చెప్పారు. అయితే తోటి పిల్లలలాగే తాను లేననే బాధతో ఆ చిన్నారి పాఠశాలకు సైతం సరిగా వెళ్లలేకపోతుంది. 12 ఏళ్ల వయసు పూర్తయినా ఆపరేషన్కు కావాల్సిన లక్షల రూపాయల ఖర్చు వారికి అడ్డంకిగా మారింది. ఆపరేషన్కు వైద్యులు సుమారు రూ.6 లక్షల వరకు ఖర్చవుతుందని చెబుతున్నారు. పేదరికంలో జీవిస్తున్న ఆ కుటుంబానికి అది తలకు మించిన భారమే. అయినా తండ్రి వెనకడుగు వేయలేదు. చిన్నారి చికిత్స కోసం అప్పులు చేస్తూ, సాయం కోసం తలుపు తడుతూ ముందుకు సాగుతున్నాడు. ప్రజాప్రతినిధుల వద్దకూ వెళ్లినా ఇప్పటివరకు ఆశించిన స్పందన ఎక్కడా రాలేదు. రెండేళ్లుగా ‘ఎవరైనా దయగల హృదయులు స్పందిస్తారా?’ అన్న ఆశతో ఎదురుచూస్తున్నారు. తన కూతురు తోటి పిల్లలతో కలిసి ఆడుకుంటే చూడాలన్న తండ్రి కల ఇంకా కలగానే ఉంది. చిన్నారి భవిష్యత్తు ఒక శస్త్రచికిత్సపై ఆధారపడి ఉంది. మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరి స్పందన ఆమెకు కొత్త జీవితం ఇవ్వగలదు. దాతలు చేసే సాయం బాలిక జీవితాన్ని నిలబెట్టగలదు. స్పందించే దాతలు 99480 55713 నంబర్కు ఫోన్పే/గూగుల్ పే ద్వారా లేదా ఫోన్లోనైన తమను సంప్రదించాలని హరీశ్ వేడుకుంటున్నాడు. బాలికకు పుట్టుకతో వెన్నెముక సమస్య శస్త్ర చికిత్స కోసం చిన్నారి ఎదురుచూపు -
అంధత్వ నివారణ లక్ష్యం
‘సైట్ ఫస్ట్’ అనేది మా మొదటి నినాదం. అంధత్వ నివారణ మా లక్ష్యం. దీనికోసం ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన 20 మంది నేత్రవైద్య సహాయకులతో ఉచితంగా నేత్ర శస్త్రచికిత్సలు చేస్తున్నాం. – పూదరి దత్తాగౌడ్, వ్యవస్థాపక అధ్యక్షుడు, లయన్స్ క్లబ్ విజన్ కేర్ ఉచితంగా ఆపరేషన్లు వృద్ధాప్యం, మధుమేహం, అధిక రక్తపోటు, దీర్ఘకాలం స్టెరాయిడ్ మందులు వినియోగించడం, పొగతాగడం వంటి అలవాట్లు కంటిచూపుపై ప్రభావం చూపుతాయి. సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా త్వరగా కంటి వైద్యుని సంప్రదిస్తే మంచి ఫలితాలు వస్తాయి. – వెల్దండి రఘు, నేత్రవైద్య నిపుణుడు -
అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తా
ఇబ్రహీంపట్నం: కేశాపూర్ సర్పంచ్ పదవిని జనరల్ మహిళకు కేటాయించడంతో పోటీ చేశా. బీఎస్సీ, ఎంపీఎస్ చదివా. ఉద్యోగం రాకపోవడంతో ఇంట్లోనే బీడీలు చేస్తున్న. మా అత్త రాజుబాయ్ ఎంపీటీసీగా గ్రామానికి సేవలందించారు. నాకు సర్పంచ్గా అవకాశం వచ్చినందున గ్రామంలో అవినితీ పాలన లేకుండా, అభివృద్ధే లక్ష్యంగా ముందుకెళ్తా. తీరిక సమయంలో బీడీలు చేస్తా. ఓదెల: మండలంలోని శానగొండ సర్పంచ్గా ఎన్నికై న జీల రాజుయాదవ్కు 23ఏళ్లు. శానగొండ అనుబంధ గొల్లపల్లి స్వగ్రామం. డిగ్రీ పూర్తిచేశాడు. గ్రామాన్ని సంపూర్ణంగా అభివృద్ధి చేస్తానని పేర్కొన్నాడు. గ్రామస్తులకు నాణ్యమైన వైద్యం, విద్య అందించేలా చూస్తానన్నారు. ప్రజల సహకారంతో సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని వివరించారు. -
అదృష్టంగా భావిస్తున్నా
రామగుండం: అంతర్గాం మండలం విసంపేట సర్పంచ్ దారవేణి సాయికుమార్ వయసు 24ఏళ్లు. తను పుట్టిన ఏడాదిలోపే తల్లి, ఐదేళ్ల క్రితం తండ్రిని కోల్పోయాడు. సోదరుడి పెంపకంతో ప్రయోజకులయ్యారు. ఎంబీఏ (హెచ్ఆర్) పూర్తిచేసి ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేశాడు. ప్రస్తుతం సర్పంచ్గా గెలిచాడు. తల్లిదండ్రుల ఆప్యాయతలకు నోచుకోలేదని, అయినా వందలాది మంది గ్రామస్తులు తనపై ప్రేమాభిమానాలు చూపి సర్పంచ్గా ఎన్నుకున్నారని తెలిపారు. చిన్న ఉద్యోగం చేసుకుంటున్న తనకు ఊహించని విధంగా సర్పంచ్ పదవి దక్కడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. -
వ్యక్తి మృతిపై అనుమానాలు
● అంత్యక్రియలకు తీసుకెళ్తుండగా పోలీసులకు ఫిర్యాదు ● పోస్టుమార్టంకు తరలించిన అధికారులు ● అనుమానాస్పద మృతిగా కేసుఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): గల్ఫ్ నుంచి నెల రోజుల క్రితం ఇంటికొచ్చిన వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందడం కలకలం రేపింది. అంత్యక్రియలు నిర్వహించేందుకు తీసుకెళ్తుండగా పోలీసులు రంగప్రవేశం చేసి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. ఈ సంఘటన రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేటలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు. రాజన్నపేటకు చెందిన ఏర్పుల నర్సయ్య(58) గల్ఫ్లో ఉంటున్నాడు. నెల క్రితం స్వగ్రామానికి వచ్చి తన కుమారుని వివాహం చేశాడు. శుక్రవారం పొలం పనికి వెళ్లి ఇంటికి తిరిగి వచ్చిన నర్సయ్య రాత్రి మృత్యువాత పడ్డాడు. హార్ట్స్ట్రోక్(గుండెపోటు)తో తన భర్త చనిపోయినట్లు భార్య వజ్రవ్వ గ్రామస్తులను నమ్మించి శనివారం దహన సంస్కారాలకు ఏర్పాట్లు చేసింది. డప్పుచప్పుల మధ్య అంత్యక్రియలకు తీసుకెళ్తుండగా మృతదేహం మెడపై గాయంతో నల్లటి గాటు ఉండడంతో అక్కడ ఉన్నవారికి అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు ఘటన అక్కడికి చేరుకొని మృతదేహాన్ని పాడేపై నుంచి కిందికి దించి పోస్టుమార్టంకు తరలించారు. పోలీసులు వజ్రవ్వను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. పోలీసుల విచారణలో అసలు విషయం తేలనుంది. మృతుడు నర్సయ్యకు ఇద్దరు కొడుకులు మధు, యోగేష్, కూతురు మౌనిక ఉన్నారు. ఈ సంఘటనపై ఎస్సై రాహుల్రెడ్డిని వివరణ కోరగా.. నర్సయ్య మృతిపై అనుమానాలు ఉన్నాయని, ప్రస్తుతం అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామన్నారు. మృతుని భార్యను విచారిస్తున్నామని, పోస్టుమార్టం రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు. -
పేదల జీవితాల్లో వెలుగులు
● ఉచితంగా నేత్రశస్త్రచికిత్సలు ● ఉమ్మడి జిల్లాలో రోజూ శిబిరాలు పెద్దపల్లి: పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు లయన్స్ క్లబ్ సంస్థవారు. ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన అభాగ్యులకు అండగా ఉంటున్నారు. గత ప్రభుత్వం చేపట్టిన కంటి వెలుగు పథకం ద్వారా ప్రత్యేక వైద్య నిపుణుల సాయంతో వేలాదిమందికి కంటి పరీక్షలు చేశారు. సమస్య తీవ్రంగా ఉన్నవారిని గుర్తించి అందులో 23,485 మందికి ఉచితంగా శస్త్రచికిత్స చేసి వెలుగులు నింపారు. దాతల సాయంతో 63,743 మందికి ఉచితంగా కళ్లద్దాలు పంపిణీ చేశారు. మంథనిలో రోజూ ఉచితంగా కంటి పరీక్షలు చేస్తున్నారు. దీంతోపాటు లక్సెట్టిపేట, పరకాలలో ప్రతీ మంగళవారం, బుధవారం కోరుట్ల, నిర్మల్ జిల్లా ఖానాపూర్లో, గురువారం పెద్దపల్లిలో, శనివారం కాటారం, ఆసిఫాబాద్లో, ఆదివారం కొత్తపల్లి హవేలి, బె ల్లంపల్లిలో ఉచిత సేవలు అందిస్తున్నారు. -
మానేరుపై మరో వంతెన
మంథని: మంథని నియోజకవర్గంలోని గో దావరి నదిపై ఇప్పటికే పలు వంతెనల నిర్మాణానికి నిధులు కేటాయింయిన ప్రభుత్వం.. తాజాగా ఆరెంద వద్ద మానేరుపై రూ.203 కోట్లతో మరోవంతెన నిర్మించనుందని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు తెలిపారు. ఆరెంద నుంచి జయశంకర్ భూపాలపల్లి జిల్లా దామెరకుంట వరకు 1.120 కిలో మీటర్ల పొడవున, 13 మీటర్ల వెడల్పుతో హై లెవెల్ వంతెన, 9.530 కి.మీ. పొడవున అప్రోచ్ రోడ్డు నిర్మిస్తామని పేర్కొన్నారు. వంతెన అందుబాటులోకి వస్తే.. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వర–ముక్తీశ్వర స్వామి దేవాలయం అంతర్ రాష్ట్ర వంతెన వరకు, అక్కడి నుంచి మహారాష్ట్రకు మార్గం సుగమం కానుందని ఆయన తెలిపారు. జిల్లావాసులు కాళేశ్వరం వెళ్లడానికి 25 కి.మీ. దూరభారం తగ్గుతుందన్నారు. కా ళేశ్వరం టూరిజంగా మరింత అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలకు కనెక్టివిటీ పెరుగుతుందని మంత్రి శ్రీధర్బాబు వివరించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలి పెద్దపల్లి/మంథని : భూపాలపల్లి – పెద్దపల్లి జి ల్లాల సరిహద్దుల్లోని మానేరుపై అడవిసోమన్పల్లి వద్ద నిర్మించిన చెక్డ్యాం కూలిపోవడానికి బాధ్యులైన వారిన వారిని గుర్తించి చర్య లు తీసుకోవాలని కాంగ్రెస్ ప్రతినిధులు కోరా రు. ఈమేరకు కలెక్టర్కు శనివారం వినతి ప త్రం అందించారు. అనంతరం వారు మాట్లా డుతూ, గత ప్రభుత్వం మానేరుపై చెక్డ్యాంలు నిర్మించిందన్నారు. ఇవి కూలిపోవడంపై అధికారులు, కాంట్రాక్టర్లు పరస్పర విరుద్ధమై న ప్రకటనలు చేస్తున్నారని, ఇది ప్రజలను త ప్పుదారి పట్టించడమేనని, రాజకీయ కోణంలో ప్రజాప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా ఉంటుందన్నారు. ప్రతినిధులు ప్రసాద్, వెంకన్న, సత్యం, శశి భూషణ్ కాచే, ప్రవీణ్కుమార్, శంకర్, కిరణ్, సమ్మయ్య పాల్గొన్నారు. నేటినుంచి రైల్వేగేట్ మూసివేత ఓదెల(పెద్దపల్లి): ఓదెల రైల్వేస్టేషన్ సమీపంలోని తారక రామకాలనీ లెవల్ క్రాసింగ్ రై ల్వేగేట్ను ఆదివారం నుంచి మూసిఉంచనున్నారు. రైళ్లవేగం మరింత పెంచేందుకు ఆధునికీకరణ చేపడతారు. వారం రోజుల పాటు మరమ్మతులు కొనసాగనున్న దృష్ట్యా రైల్వే గేట్ మూసివేసి ఉంచుతామని, ప్రయాణికులు, ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని అధికారులు సూచించారు. జిల్లాస్థాయి క్రాస్కంట్రీ పోటీలు ధర్మారం(ధర్మపురి): నందిమేడారం గురుకు ల విద్యాలయంలో క్రాస్కంట్రీ జిల్లాస్థాయి పోటీలను జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి కొమ్ము గట్టయ్య శనివారం ప్రారంభించా రు. బాల,బాలికలకు అండర్–16లో 2 కి.మీ., అండర్–18లో 6కి.మీ. అండర్– 20లో 8 కి.మీ., మహిళలు, పురుషులకు 10 కి.మీ. విభాగాల్లో క్రాస్కంట్రీ పోటీలు నిర్వహించారు. ప్రతిభ చూపిన క్రీడాకారులను వచ్చే నెల 2న రంగారెడ్డి జిల్లాలో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీలకు పెద్దపల్లి జిల్లా తరఫున పంపించనున్నట్లు ప్రతినిధులు తెలిపారు. వ్యా యామ ఉపాధ్యాయులు బైకనీ కొమురయ్య, అంజయ్, మహేశ్, సురేశ్ పాల్గొన్నారు. అరుణాచలానికి ఆర్టీసీ బస్సు గోదావరిఖనిటౌన్: అరుణాచలం పుణ్యక్షేత్రానికి ఈనెల 23న గోదావరిఖని నుంచి ఆర్టీసీ ప్రత్యేకంగా బస్సు నడపనున్నట్టు డిపో మేనేజర్ నాగభూషణం తెలిపారు. గోదావరిఖని లో మధ్యాహ్నం ఒంటి గంటకు బయలు దేరే ఈ బస్సు.. పెద్దపల్లి, కరీంనగర్ నుంచి కాణి పాకం, అరుణాచలం, శ్రీరంగం, పళని, పాతా ళశంభు, మధురై, రామేశ్వరం, విష్ణుకంచి, శివకంచి, జోగులాంబకు వెళ్తుందన్నారు. భక్తుల కు దర్శన అవకాశం కల్పించాక ఈనెల 29న గోదావరిఖని చేరుకుంటుందని తెలిపారు. పెద్దలకు రూ.8వేలు, పిల్లలకు రూ.6వేలు చా ర్జీ నిర్ణయించామని టికెట్లను www.tgsrtc bus.in వెబ్సైట్లో బుక్ చేసుకో వాలని, వి వరాలకు 73828 47596, 70135 04982 నంబర్లలో సంప్రదించాలని ఆయన కోరారు. -
చెక్డ్యాం పరిశీలించిన ఫోరెన్సిక్ నిపుణులు
మంథనిరూరల్: పెద్దపల్లి జిల్లా మంథని మండలం అడవిసోమన్పల్లి చెక్డ్యాంను ఫోరెన్సిక్ నిపుణులు శనివారం సాయంత్రం పరిశీలించారు. మూడురోజుల క్రితం చెక్డ్యాం కూలిపోగా ఇరిగేషన్ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం విదితమే. ఈ క్రమంలో కాటారం డీఎస్పీ సూర్యనారాయణ ఆధ్వర్యంలో ఫోరెన్సిక్ నిపుణులు చెక్డ్యాం సందర్శించారు. క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు. మానేరులో పడిపోయిన గోడ బండరాళ్లను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. శాంపిళ్లు సేకరించారు. స్టేట్ ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించి వాటిని పరీక్షిస్తామని, నివేదిక ఆధారంగా చర్యలు ఉంటాయని డీఎస్పీ తెలిపారు. -
పైడిపెల్లిలో రీపోలింగ్ నిర్వహించండి
వెల్గటూర్: తాము 50 ఏళ్ల నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నామని, ఆ పోరాటంలో తాము విజయం సాధించినా.. అధికారులు అడ్డుకున్నారని పేర్కొంటూ మండలంలోని పైడిపెల్లి గ్రామస్తులు ఎంపీడీవో కార్యాలయానికి తరలివచ్చారు. ఈనెల 17న నిర్వహించిన మూడో విడత ఎన్నికల కౌంటింగ్లో అవకతవకలు జరిగాయని, మరోసారి పోలింగ్ నిర్వహించాలని సుమారు మూడు వందల మంది ట్రాక్టర్లలో తరలివచ్చి కార్యాలయం ఎదుట బైఠాయించారు. ఈ నెల 22న జరగనున్న సర్పంచ్ ప్రమాణస్వీకారాన్ని ఆపాలని డిమాండ్ చేశారు. కౌంటింగ్ రోజు గ్రామస్తులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని ఎంపీవో కృపాకర్కు వినతిపత్రం అందించారు. సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన మమత మాట్లాడుతూ గ్రామంలో ఒకే కుటుంబం ఆధిపత్యం చెలాయిస్తోందని, నియంతృత్వాన్ని సహించలేక ప్రజలంతా ఏకతాటిపై నిలబడినా కౌంటింగ్లో గోల్మాల్ చేసి తనను ఓడగొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. కౌంటింగ్ పూర్తి కాకముందే తాను ఓడిపోయినట్లు ధృవీకరించి, బెదిరించి, బలవంతంగా తనతో సంతకం తీసుకున్నారని, తమకు న్యాయం చేయాలని, రీకౌంటింగ్ చేయాలని శాంతియుతంగా తాము నిరసన తెలిపితే పోలీసులు లాఠీచార్జ్ చేశారని కన్నీరుపెట్టుకున్నారు. ఆడవాళ్లని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్లు కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు కాల్పులు జరిపిన తర్వాతనే తాము ప్రాణ రక్షణకు రాళ్లు విసిరామని తెలిపారు. తమను కౌంటింగ్ కేంద్రానికి వందమీటర్ల దూరం ఉంచిన అధికారులు.. ప్రముఖ రాజకీయ నాయకుడి సోదరుడిని కౌంటింగ్ కేంద్రంలోకి ఎలా అనుమతించారని, ఆయనకు కనీసం గ్రామంలో ఓటు కూడా లేదని తెలిపారు. తమకు న్యాయం జరిగేవరకూ పోరాటం కొనసాగుతుందని, అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ ధర్మపురి నియోజకవర్గ కన్వీనర్ కొమ్ము రాంబాబు, ఎలుక రాజు, గాలి హరీశ్, మహిళలు పాల్గొన్నారు. ఎంపీడీవో కార్యాలయానికి తరలివచ్చిన గ్రామస్తులు ప్రమాణ స్వీకారం ఆపాలని వినతిపత్రం అక్రమ కేసులు ఎత్తేయాలని డిమాండ్ -
● కళాకారులుగా.. ఉద్యోగులుగా.. వివిధ రంగాల్లో రాణించి ● సర్పంచ్లుగా ఎన్నికై న యువత
వారు వివిధ వృతులు, ఆయా రంగాల్లో రాణిస్తున్నారు. ప్రజల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఊరికి సేవ చేయాలని భావించారు. మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్గా పోటీచేసి గెలుపొందారు. గ్రామానికి ప్రథమ పౌరులయ్యారు. ప్రజాసేవలో తరించాలి... పాలనలో ప్రత్యేకత చూపాలని భావిస్తున్నారు. మరో వైపు ఓటర్లు గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి యువతకు పట్టం కట్టారు. అభిమానం, సామాజిక సేవ, గౌరవం, తమ గ్రామాలను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తారనే నమ్మకంతో అవకాశం కల్పించారు. సోమవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సర్పంచ్లు ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో పలువురు సర్పంచ్ల ప్రత్యేకతపై ఈ వారం సండే స్పెషల్..!! -
మోడల్ విలేజ్గా..
మా ఆయన విజయ్కుమార్ సైన్యంలో చేరి దేశరక్షణ కోసం సేవలందించారు. ఆయన స్ఫూ ర్తి, ప్రోత్సాహంతో ప్రజా సేవ చేయాలన్న తపనతో సర్పంచ్గా పోటీచేశా. గ్రామస్తులంతా తనకే అండగా నిలవడంతో 1,124 ఓట్ల మెజార్టీతో విజయాన్ని కట్టబెట్టారు. ఎ మ్మెస్సీ కంప్యూటర్స్ చదివిన. గ్రామాభివృద్ధికి పాటుపడతా. గ్రామాన్ని మోడల్ విలేజ్గా తీర్చిదిద్దుతా. పెద్దపల్లి: భోజన్నపేట గ్రా మాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతా. ఎంకాం, డీఈడీ, బీఈడీ చదువుకున్న. ప్రభుత్వ పథకాలను అర్హులందరికీ వర్తింప జేసేలా అధికారులను కోరుతా. గ్రామంలోని సమస్యలపై అవగాహన పెంచుకుని పరిష్కరిస్తా. ప్రజలకు మెరుగైన సేవలందిస్తా. -
జాతీయ నాయకుల ఫొటోలకు రక్తాభిషేకం
ఓదెల(పెద్దపల్లి): పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం మడక గ్రామంలో కాంగ్రెస్ నాయకుడు గొస్కె రాజేశం ఆ పార్టీ జాతీయకులు సోనియాగాంధీ, రాహుల్గాంధీ, సీఎం రేవంత్రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క చిత్రపటాలకు శనివారం రక్తాభిషేకం చేశారు. చాలా ఏళ్లుగా కాంగ్రెస్లో కార్యకర్త నుంచి జిల్లా అధికార ప్రతినిధిస్థాయికి ఎదిగానని, అయినా, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు తనకు మద్దతు ఇవ్వకుండా మరోవ్యక్తికి మద్దతు ఇచ్చి ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్గా గెలిపించుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మడక పంచాయతీ ఎస్సీ కేటగిరీకి రిజర్వేషన్ చేశారని, 300 కుటుంబాలు కలిగిన తమకు అన్యాయం చేశారని అన్నారు. ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తిని సర్పంచ్ చేశారని రాజేశం పేర్కొన్నారు. కొందరు ప్రభుత్వ స్థలాలను అన్యాక్రాంతం చేశారని, వారిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తే పెద్దలు కాపాడరని ఆరోపించారు. అనంతరం రోడ్డుపై కాలనీవాసులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్లో సీనియర్ నాయకులకు అన్యాయం జరుగుతోందని ఆవేదన చెందారు. విద్యుదాఘాతంతో ఇల్లు దగ్ధం మంథనిరూరల్: పెద్దపల్లి జిల్లా మంథని మండలం గుంజపడుగులో కరెంట్ షార్ట్సర్క్యూట్తో ఇల్లు కాలిపోయింది. భారీగా ఆస్తినష్టం వాటిల్లింది. బాధితులు తెలిపిన వివరాలు. ఇందారపు విజయ్ ఇంటిలో రాచమల్ల శివకుమార్ అద్దెకు ఉంటున్నారు. ఇంటికి తాళం వేసి ఊరికి వెళ్లిన క్రమంలో షార్ట్సర్క్యూట్తో మంటలు వ్యాపించాయి. స్థానికుల సమాచారంతో సర్పంచ్ దండవేన సంధ్యబానేశ్ వెంటనే మంథని అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇచ్చారు. సిబ్బంది చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అప్పటికే వస్తువులు, బంగారం, నగదు, బట్టలు అగ్నికి ఆహుతి అయ్యాయి. ఇంటి యజమానికి రూ.15లక్షలు, అద్దెకు ఉండే శివకుమార్కు రూ.5లక్షల వరకు ఆస్తినష్టం వాటిల్లింది. సర్వం కోల్పోయిన శివకుమార్తోపాటు ఓనర్ విజయ్ను ప్రభుత్వం ఆదుకోవాలని సర్పంచ్ కోరారు. ప్రయాగ్రాజ్కు మరిన్ని ప్రత్యేక రైళ్లు రామగుండం: ధనుర్మాసం సందర్భంగా ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేసే భక్తుల రద్దీ విపరీతంగా పెరుగుతోంది. దీంతో దక్షిణ మధ్య రైల్వే అధికారులు మరిన్ని రైళ్లను నడిపిస్తున్నట్లు ప్రకటించారు. ఈనెల 23, 24, 25, 26వ తేదీల్లో 07402/03/04/05 రైళ్లు ప్రయాగ్రాజ్కు నడుస్తాయన్నారు. ఇవి చర్లపల్లిలో రాత్రి 7.45గంటలకు బయలుదేరి కాజీపేటకు రాత్రి 9.42 గంటలకు, పెద్దపల్లికి రాత్రి 11.50గంటలకు, మంచిర్యాలకు అర్ధరాత్రి 12.35గంటలకు చేరుకుంటాయన్నారు. రెండోరోజు వేకువజామున 4.30గంటలకు ప్రయాగ్రాజ్ చేరుకుంటాయని వివరించారు. -
రాజన్న ఎన్కౌంటర్కు 40 ఏళ్లు
ఓదెల(పెద్దపల్లి): పెద్దపల్లి ప్రాంతంలోని రెబ్బల్దేవులపల్లి గ్రామంలో జరిగిన ఎన్కౌంటర్లో ఓదెల మండలం కొలనూర్ గ్రామానికి చెందిన అ ప్పటి పీపుల్స్వార్, ప్రస్తు త మావోయిస్టు పార్టీకి చెందిన దళనేత తుంగాని రాజన్న ఉరఫ్ గోపన్న చనిపోయిన ఆదివారం నాటికి 40 ఏళ్లు. పీడిత, తాడిన ప్రజల పక్షాన పెద్దపల్లి గడ్డపై గళమెత్తిన ధీరుడు రాజన్న. దొరలను గడగడలాడించిన వీరుడు. సుల్తానాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలోని రెబ్బల్దేవులపల్లిలోని ఓ ఇంట్లో తుంగాని రాజన్న ఉరఫ్ గోపన్నతోపాటు ధర్మారం మండలం ఖానంపల్లికి చెందిన చంద్రయ్య ఉరఫ్ శీనన్న షెల్టర్ తీసుకున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసు బలగాలు రాజన్న, శీనన్న షెల్టర్ తీసుకున్న గుడిసెను చుట్టుముట్టారు. ఇరువర్గాల మధ్య ఎన్కౌంటర్ ప్రారంభం కావటంతో తొలు కానిస్టేబుల్ నర్సయ్య మృతిచెందారు. ఆగ్రహం చెందినపోలీసులు.. గుడిసైపె పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఆనాటి జ్ఞాపకాలు జిల్లా ప్రజల మదిలో ఇంకా మెదలుతూనే ఉన్నాయి. రాజన్న చనిపోయిన 40 ఏళ్లు కావడంతో భార్య తుంగాని రాధక్క, కూతురు క్రాంతి, కుటుంబసభ్యులు ఆయనను స్మరించుకున్నారు. కుటుంబ సభ్యున్ని కోల్పోయి కన్నీటిపర్యంతమయ్యారు. స్మరించుకున్న కుటుంబసభ్యులు -
పకడ్బందీ ప్రణాళిక.. అప్రమత్తం
● పంచాయతీ ఎన్నికల్లో భారీగా నగదు, లిక్కర్ స్వాధీనం గోదావరిఖని: పకడ్బందీ ప్రణాళిక, సమయస్ఫూర్తి, వ్యూహాత్మకంగా వ్యవహరించిన రామగుండం పో లీస్ కమిషనరేట్ పోలీసులు.. పంచాయతీ ఎన్నిక ల్లో అక్రమంగా తరలించే నగదు, మద్యం, విలువైన బహుమతులను స్వాధీనం చేసుకున్నారు. ఈసారి మూడు దశల్లో నిర్వహించిన పంచాయతీ ఎన్నికల్లో అనుక్షణం అప్రమత్తంగా విధులు నిర్వర్తించారు. ఓటర్లను మభ్యపెట్టేందుకు.. ఓటర్లను మభ్యపెట్టేందుకు నగదు, మద్యం ప్రవాహం ఈసారి భారీగా పెరిగింది. ఒక్కో సర్పంచ్ అభ్యర్థి కనీసం రూ.20 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ఖర్చు చేశారనే ప్రచారం ఉంది. ఈక్రమంలో గ్రామాల్లో ఉద్రిక్తత కూడా పెరిగింది. అయినా.. పరిస్థితులపై సమాచారం సేకరిస్తూ అక్రమ మద్యం, ధన ప్రవాహాన్ని నిలువరింపజేశా రు. సున్నిత, అతిసున్నిత ప్రాంతాల్లో పోలీసు బలగాలను మోహరించారు. మొబైల్ పెట్రోలింగ్ పార్టీ లు, క్విక్ రెస్పాన్స్టీంలతోపాటు ప్రత్యేక చెక్పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు ముమ్మరం చేశారు. 1,700 మందితో బందోబస్తు.. పంచాయతీ ఎన్నికలు ఈసారి అసెంబ్లీ ఎన్నికలను తలపించాయి. మంచి ఆదాయం ఉన్న గ్రామపంచాయతీల్లో ఒక్కో ఓటుకు రూ.5వేల వరకు పంచిపెట్టారు. చిన్న పంచాయతీల్లో రూ.వెయ్యి నుంచి రూ.3వేల వరకు ముట్టజెప్పారు. ఈక్రమంలో పోలీసులు చెక్పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు ముమ్మరం చేశారు. తనిఖీల్లో రూ.13.73లక్షలు నగదు, రూ.9.84లక్షల విలువైన లిక్కర్, రూ.1.58 లక్షల విలువైన బహుమతులు స్వాధీనం చేసుకున్నారు. ఒక్కోదశలో 1,700 మందికిపైగా పోలీసులతో బందోబస్తు చేపట్టారు. స్వాధీనం చేసుకున్న నగదు, మద్యం -
సమస్యలపై అవగాహనతో..
బోయినపల్లి: మండలంలోని దుండ్రపల్లి గ్రామానికి చెందిన జంగం అంజయ్య లాయర్గా ప్రాక్టీస్ చేస్తూనే ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో సర్పంచుగా ఎన్నికయ్యాడు. బీఏ ఎల్ఎల్బీ చేసి 2014 నుంచి లాయర్గా రాణిస్తున్నాడు. వేములవాడ కోర్టులో చురుకై న న్యాయవాదిగా గుర్తింపు తెచ్చుకున్నారు. వకీల్గా సమస్యలపై ఉన్న అవగాహనతో రాజకీయాల్లో రాణిస్తానని చెప్పారు. కోనరావుపేట: మండలంలోని నిజామాబాద్ గ్రామానికి చెందిన సింగం శ్రీహరి ఐదేళ్లుగా లాయర్గా కొనసాగుతున్నారు. రోజూ సిరిసిల్లకు వెళ్లి న్యాయవాద వృత్తినే కొనసాగిస్తున్న అతడు ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్గా గెలిచారు. గ్రామ సమస్యలు పరిష్కరించి, అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని చెప్పారు. రామగుండం: అంతర్గాం టీటీఎస్ గ్రామ సర్పంచ్గా గెలిచిన అంబోతు రవికుమార్ రాయ్పూర్ ఎన్ఐటీలో ఎంటెక్ పూర్తి చేసి సాఫ్ట్వేర్ ఉద్యోగంతో నెలకు రూ.రెండున్నర లక్షల వేతనం పొందాడు. తనతో పాటు కొంతమందికి ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో రెండేళ్ల క్రితం ఉద్యోగం వదిలేశాడు. మండల పరిధిలోని పేద కుటుంబాలకు చెందిన యువతకు తన సొంత ఖర్చుతో గ్రూప్స్, సివిల్స్లో శిక్షణ ఇప్పించాడు. ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్స్ నిర్మించాడు. ప్రస్తుతం డైయిరీ ఫామ్ ఏర్పాటు చేసి అందులో పాడి రైతులకు ఉపాధి కల్పిస్తున్నాడు. -
చలితీవ్రతకు వ్యక్తి మృతి
రామగుండం: పెద్దపల్లి జిల్లా రామగుండం పట్టణంలోని ఏ–పవర్హౌస్ చమన్ పరిసరాల్లోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తి చనిపోయి కనిపించాడు. మద్యం మత్తులో ఉన్న ఆ వ్యక్తి చలితీవ్రతకు మృతిచెంది ఉంటాడని భాస్తున్నట్లు స్థానిక కాంగ్రెస్ నాయకుడు సలీంబేగ్ తెలిపారు. ఈమేరకు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై సంధ్యారాణి శనివారం ఆ మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బంధువులు ఉంటే 87126 56525 నంబరుకు ఫోన్చేసి సమాచారం అందించాలని ఎస్సై కోరారు. పరిశుభ్రతపై దృష్టి పెద్దపల్లిరూరల్: గ్రామాల పరిశుభ్రతపై దృష్టి పెట్టాలని డీపీవో వీరబుచ్చయ్య అన్నారు. హన్మంతునిపేట పంచాయతీని ఆయన శనివారం సందర్శించారు. రికార్డులు తనిఖీ చేశారు. ముందస్తు క్రిస్మస్ వేడుకలు పెద్దపల్లి/పెద్దపల్లిరూరల్: జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి లో శనివారం ముందస్తు క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నారు. సూపరింటెండెంట్ శ్రీధర్ కేక్కట్ చేశారు. ఆర్ఎంవో విజయ్కుమార్, నర్సింగ్ సూపరింటెంటెండెంట్ అనిత ప్రియదర్శిని, పద్మ, హెడ్నర్స్ బేబీరాణి, భవాని ఉన్నారు. హత్యాయత్నం కేసులో జైలు కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రానికి చెందిన మర్రి కుమార్పై హత్యాయత్నం చేసిన అల్లంల మధునయ్యకు 10నెలల జైలుశిక్ష, రూ.వెయ్యి జరిమానా విధిస్తూ జిల్లా జడ్జి సునీత శనివారం తీర్పు ఇచ్చారని ఎస్సై వెంకటేశ్ తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన గౌడ రాజమ్మ 11వ రోజు కర్మకు వెళ్లిన మర్రి కుమార్.. అల్లంల మధునయ్య మధ్య గొడవ జరిగింది. గొడవను మనసులో పెట్టుకున్న అల్లంల మధునయ్య.. గత ఫిబ్రవరి 3వ తేదీన మర్రి కుమార్పై వెంట తెచ్చుకున్న స్క్రూ డ్రైవర్తో దాడి చేశాడు. అంతటితో ఆగకుండా బీరుసీసాతో కొట్టాడు. గాయపడిన కుమార్ను స్థానికు ఆస్పత్రికి తరించారు. బాధితుడి మేనల్లుడు ఒజ్జె శివ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న ఎస్సై.. విచారణ అనంతరం కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. వరువర్గాల వాదనలు విన్న జడ్జి.. జైలుశిక్షతోపాటు జరిమానా విధించారు. -
పుట్టిన ఊరుకు సేవ చేయాలని..
బుగ్గారం: మండలంలోని సిరికొండకు చెందిన పంచిత ధర్మరాజుయాదవ్ చిన్నతనంలోనే తండ్రిని కోల్పోవడంతో కుటుంబ బాధ్యత మీదపడింది. ఈ క్రమంలో ఉపాధి కోసం గల్ఫ్బాట పట్టాడు. 15 ఏళ్లుగా దుబాయ్, ఖతార్ దేశాల్లో వివిధ కంపెనీల్లో పనిచేశాడు. ఖతార్ కంపెనీలో మంచి స్థాయిలో కుదురుకున్నాక తెలంగాణా ప్రజాసమితి స్వచ్ఛంద సంస్థను స్థాపించి సేవాకార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్యంగా అక్కడ మరణించిన వారి మృతదేహాలను స్వగ్రామాలకు పంపించడం, జైళ్లలో ఉన్నవారికి న్యాయసహాయం అందించడం వంటి కార్యక్రమాలు చేపట్టాడు. గ్రామంలోని యువకులకు వీసాలు పంపి గల్ఫ్లో ఉద్యోగ అవకాశాలు కల్పించాడు. తాను పుట్టిన ఊరుకు మరింత సేవ చేయాలనే ఆలోచనతో ఇటీవల సర్పంచ్ ఎన్నికల్లో బరిలో నిలిచాడు. గ్రామంలోని యువత, మహిళలు, రైతులు పూర్తి మద్దతు తెలుపడంతో సర్పంచ్గా విజయం సాధించాడు. -
వడివడిగా ఎస్ఐఆర్
సాక్షిప్రతినిధి,కరీంనగర్: ఉమ్మడి జిల్లాలోని ఓటరు జాబితా ప్రక్షాళనకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) చేపట్టిన ఎస్ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్/ఎన్నికల జాబితా విస్తృత జాబితా సవరణ) ప్రక్రియ వడివడిగా ముందుకు సాగుతోంది. దేశంలో నిజమైన పౌరులను గుర్తింపే లక్ష్యంగా మొదలైన ఈ ప్రక్రియపై ప్రజల్లో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. కొన్ని వర్గాలు ఈ సర్వేను స్వాగతిస్తుండగా.. మరికొన్ని వర్గాలు సర్వేపై ఆందోళన, అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఉత్తర భారతదేశంలోని పొరుగు దేశాలతో సరిహద్దు పంచుకుంటున్న రాష్ట్రాల్లో విజయవంతంగా నిర్వహించిన కేంద్రం.. తెలంగాణలోనూ ఈ ప్రక్రియను ముమ్మరం చేసింది. ఇందుకు బూత్ లెవల్ ఆఫీసర్లు(బీఎల్వో) క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారు. పలు ప్రాంతాల్లో సర్వేపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఎవరు నిజమైన ఓటరు.. ఎవరు కాదు? ఎవరు కొత్త ఓటరు.. ఎంతకాలం నుంచి నివసిస్తున్నారు అన్న అంశాలపై బీఎల్వోలు వివరాలు సేకరిస్తున్నారు. ఏమిటీ సర్వే? భారత పౌరుల ఓటరు నిర్ధరణకు ప్రారంభించిన సర్వే ఇది. ఇందులో 2002 ఓటరు జాబితా 2025 ఓటరు జాబితాను పక్కపక్కన పెట్టుకుని వివరాలు సరిపోలుస్తూ.. స్థానికంగా ఓటర్లు నివసిస్తున్నారా? లేదా.. ప్రస్తుత డేటాతో పాత డేటా మ్యాచ్అవుతుందా లేదా చూస్తున్నారు. దీన్ని మ్యాపింగ్ అని పిలుస్తున్నారు. 2002, 2025 ఓటర్ల జాబితాలో (రెండింటిలో) పేర్లు ఉన్నవారు మొదటి కేటగిరీగా, 2002 ఓటరు జాబితాలో లేకుండా 1987కు ముందు జన్మించిన వారు రెండో కేటగిరీగా, 2002 ఓటరు జాబితాలో లేని , 1987 నుంచి 2004కు మధ్యలో పుట్టిన వారు మూడో కేటగిరీగా, 2004 తరువాత జన్మించిన వారు నాలుగో కేటగిరీగా విభజించారు. ఉదాహరణకు 2002లో దంపతులకు ఓటు ఉందనుకోండి. వారికి పుట్టిన పిల్లలకు, వారి మనవలకు ఓటుపై ఎలాంటి వివాదం ఉండదు. ఇలాంటి ఓట్లను వివాదం లేని గ్రీన్ కేటగిరీలో వేస్తున్నారు. ఇందుకోసం పాత పోలింగ్ స్టేషన్, ఓటు నంబర్లను పోల్చి చూస్తున్నారు. వాటి ఆధారంగా పురుషులు, సీ్త్రలు, ట్రాన్స్జెండర్ల వివరాలను అప్డేట్ చేస్తున్నారు. ఆందోళన ఏమిటి? ఓటర్ల తనిఖీలో భాగంగా 2002లో ఉన్న ఇంటి పెద్దలు 2025లో ఉన్నారా? వారి పిల్లలు, మనవల పేర్లు చూస్తున్నారు. వీరికి ఎలాంటి ఇబ్బందులు లేవు. కానీ, నేటి గ్లోబలైజేషన్ కాలంలో స్థిర నివాసాలు తగ్గిపోతున్నాయి. ఉద్యోగాలు, వ్యాపారాలు, కూలీ పనులు, జీవనోపాధి, వలసలు, వివాహాలు తదితరతో పలు కుటుంబాలు రెండు, మూడు దశాబ్దాల్లో పలు చిరునామాలు మార్చాల్సి వస్తోంది. స్థానచలనంతో ఇళ్లు మారిన వారిలో ఆందోళన మొదలైంది. ఇలాంటి వారి ఓట్ల విషయంలో ఓటర్లు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వివాహాలు అయి ఇతర జిల్లాల నుంచి వచ్చిన వారి పేర్లు 2002 జాబితాలో సరిపోల్చే సమయంలో తమ ఓటర్లు మిస్సవుతాయని ఆందోళన చెందుతున్నారు. చాలామంది కూలీలు తమ పాత పోలింగ్ స్టేషన్, ఇంటి నంబరు వివరాలు చెప్పలేకపోతున్నారు. ఉమ్మడి జిల్లాకు ఉన్న మరో ప్రత్యేకత సింగరేణి గనులు. ఇక్కడ పదవీ విరమణ పొందిన వేలాదిమంది కార్మికులు ఉన్నారు. వీరిలో పావు వంతు రెండు పేర్లు కలిగి ఉన్నారు. వీరి ఓట్ల విషయంలోనూ ఇపుడు గందరగోళం నెలకొంది. ఈ వివరాలపై అధికారులను వివరణ కోరేందుకు ప్రయత్నిచంగా అందుబాటులోకి రాలేదు. ఎస్ఐఆర్ సర్వే అనుకున్నంత వేగంగా కాకుండా వడివడిగానే సాగుతోంది. ఇప్పటివరకూ కరీంనగర్లో 20 శాతం, పెద్దపల్లిలో 18 శాతం, జగిత్యాలలో 19 శాతం, సిరిసిల్లలో 16శాతం మేర పూర్తయింది.ఉమ్మడి జిల్లా ఓటర్ల వివరాలు -
దరఖాస్తుల పరిష్కారంలో అగ్రస్థానం
● కలెక్టర్ కోయ శ్రీహర్ష పెద్దపల్లి/కాల్వశ్రీరాంపూర్: ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంలో జిల్లా రాష్ట్రంలోనే ముందు వరుసలో ఉందని కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. కాల్వశ్రీరాంపూర్ తహసీల్దార్ జగదీశ్వర్రావును తన కార్యాలయంలో శనివారం కలెక్టర్ అభినందించారు. ప్ర జావాణి దరఖాస్తులను పరిష్కరించడంలో తహసీల్దార్ జగదీశ్వర్రావు విశేష కృషి చేశారని, దీంతో ఆయనను ప్రణాళిక కమిషన్ వైస్చైర్మన్ చిన్నారెడ్డి హైదరాబాద్లో ప్రశంసించారని అన్నారు. కాల్వశ్రీరాంపూర్ తహసీల్దార్ భవిష్యత్లోనూ ఇలాంటి పనితీరు కనబర్చాలని కలెక్టర్ ఆకాంక్షించారు. యాప్లో బుక్చేస్తేనే యూరియా పెద్దపల్లిరూరల్: యూరియా అవసరమైన రైతులు.. యాప్లో బుక్చేస్తే కొనుగోలు సులభం అవుతుందని కలెక్టర్ శ్రీహర్ష అన్నారు. జెండా కూడలిలో ఎరువుల దుకాణాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పంటలు వేసిన ప్రతీరైతు అవసరాలకు అనుగుణంగా యూరియా అందించేందుకే యాప్ అందుబాటులోకి తీసుకొచ్చారని కలెక్టర్ అన్నారు. ఇంటివద్ద బుక్ చేసుకుని ఎరువుల షాప్ నుంచి వివరాలు, ఓటీపీ చెప్పి పొందొచ్చని ఆయన పేర్కొన్నారు. జిల్లా వ్యవసాయాధికారి శ్రీనివాస్, ఏవో అలివేణి తదితరులు పాల్గొన్నారు. -
ఆ కుటుంబానిదే ఆధిపత్యం
పెద్దపల్లిరూరల్: కనగర్తి గ్రామ పంచాయతీలో యెడెల్లి శంకర్ కుటుంబానిదే ఆధిపత్యం నడుస్తోంది. ప్రజాప్రతినిధిగా 20 ఏళ్లపాటు సేవలు అందించిన ఆ కుటుంబానికి చెందిన ఎడెల్లి శ్రీదేవి ఇటీవలి జరిగిన పంచాయతీ ఎన్నికల్లో పంచాయతీ సర్పంచ్గా గెలుపొందారు. జనరల్ మహిళకు కేటాయించడంతో (రెండోసారి) సర్పంచ్గా ఎన్నికయ్యారు. గతంలో ఎడెల్లి శంకర్ రెండుసార్లు సర్పంచ్గా, ఓసారి ఎంపీటీసీ సభ్యుడిగా ఎన్నికై గ్రామానికి సేవలు అందించారు. యెడెల్లి శంకర్.. ‘కనగర్తి శంకర్’గా ఈ ప్రాంత ప్రజలకు సుపరిచితులు. -
సిరిసిల్ల: ఏర్పుల నర్సయ్య అనుమానాస్పదంగా మృతి
సిరిసిల్ల: గల్ఫ్ నుంచి నెల రోజుల క్రితం ఇంటికొచ్చిన వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందడం కలకలం రేపింది. అంత్యక్రియలు నిర్వహించేందుకు తీసుకెళ్తుండగా పోలీసులు రంగప్రవేశం చేసి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. ఈ సంఘటన రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేటలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు. రాజన్నపేటకు చెందిన ఏర్పుల నర్సయ్య(58) గల్ఫ్లో ఉంటున్నాడు. నెల క్రితం స్వగ్రామానికి వచ్చి తన కుమారుని వివాహం చేశాడు. శుక్రవారం పొలం పనికి వెళ్లి ఇంటికి తిరిగి వచ్చిన నర్సయ్య రాత్రి మృత్యువాత పడ్డాడు. హార్ట్స్ట్రోక్(గుండెపోటు)తో తన భర్త చనిపోయినట్లు భార్య వజ్రవ్వ గ్రామస్తులను నమ్మించి శనివారం దహన సంస్కారాలకు ఏర్పాట్లు చేసింది. డప్పుచప్పుల మధ్య అంత్యక్రియలకు తీసుకెళ్తుండగా మృతదేహం మెడపై గాయంతో నల్లటి గాటు ఉండడంతో అక్కడ ఉన్నవారికి అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు ఘటన అక్కడికి చేరుకొని మృతదేహాన్ని పాడేపై నుంచి కిందికి దించి పోస్టుమార్టంకు తరలించారు. పోలీసులు వజ్రవ్వను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. పోలీసుల విచారణలో అసలు విషయం తేలనుంది. మృతుడు నర్సయ్యకు ఇద్దరు కొడుకులు మధు, యోగేష్, కూతురు మౌనిక ఉన్నారు. ఈ సంఘటనపై ఎస్సై రాహుల్రెడ్డిని వివరణ కోరగా.. నర్సయ్య మృతిపై అనుమానాలు ఉన్నాయని, ప్రస్తుతం అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామన్నారు. మృతుని భార్యను విచారిస్తున్నామని, పోస్టుమార్టం రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు. -
నాగులమ్మ పాటల నర్తకి.. నేడు బోటు మీద పల్లె సర్పంచ్
వారు వివిధ వృతులు, ఆయా రంగాల్లో రాణిస్తున్నారు. ప్రజల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఊరికి సేవ చేయాలని భావించారు. మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్గా పోటీచేసి గెలుపొందారు. గ్రామానికి ప్రథమ పౌరులయ్యారు. ప్రజాసేవలో తరించాలి... పాలనలో ప్రత్యేకత చూపాలని భావిస్తున్నారు. మరో వైపు ఓటర్లు గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి యువతకు పట్టం కట్టారు. అభిమానం, సామాజిక సేవ, గౌరవం, తమ గ్రామాలను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తారనే నమ్మకంతో అవకాశం కల్పించారు. సోమవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సర్పంచ్లు ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో పలువురు సర్పంచ్ల ప్రత్యేకతపై ఈ వారం సండే స్పెషల్..!! జానపద కళాకారిణి.. సర్పంచ్ఇల్లంతకుంట: నాగులమ్మ.. నాగులమ్మ.. నల్ల నాగులమ్మ.. చిన్న దొర బంగ్లా మీద సీటీలెయ్యకురా.. తెల్లచీర కట్టుకొని టేకుళ్లకు కలువబోతే.. వంటి జానపదపాటలకు నృత్యంతో అలరించిన యూట్యూబ్ ఆర్టిస్ట్ గౌరవేణి శివాని రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం బోటు మీద పల్లె గ్రామ సర్పంచ్గా ఎన్నికయ్యారు. శివాని 300కు పైగా జానపద పాటలకు డాన్సర్గా అభినయించారు. చిన్నప్పటినుంచి డ్యాన్స్ అంటే ఇష్టం. ఆమె సోదరుడు బాబు వద్ద డ్యాన్స్ నేర్చుకున్నారు. తర్వాత క్లాసికల్ డాన్స్ మాస్టర్ సత్యం వద్ద మెలకువలు నేర్చుకున్నారు. ఆర్ఎన్ఎస్ పేరుతో డ్యాన్స్సూ్కల్ ఏర్పాటు చేశారు. జానపద గేయాల డాన్సర్గా, కొరియోగ్రాఫర్ కొనసాగారు. నాగర్కర్నూల్ జిల్లాకు చెందిన శివానికి బోటు మీద పల్లెకు చెందిన గౌరవేణి సుమన్తో వివాహమైంది. దాచారం అనుబంధ గ్రామంగా ఉన్న బోటు మీద పల్లె నూతన గ్రామపంచాయతీగా ఏర్పడడంతో రిజర్వేషన్ కలిసొచ్చి సర్పంచ్గా ఎన్నికయ్యారు. సర్పంచ్గా గ్రామ అభివృద్ధికి పాటుపడడంతో పాటు, అవకాశం వచ్చినప్పుడు జానపద గేయాల్లో రాణిస్తానని శివాని పేర్కొన్నారు.సైనికుడు.. సేవకుడుఫెర్టిలైజర్ సిటీ: మొన్నటి వరకు దేశ సరిహద్దుల్లో సైనికుడిగా విధులు నిర్వహించి.. నేడు గ్రామ సర్పంచ్గా సేవలందించేందుకు సిద్ధమయ్యారు రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం గుంటూరుపల్లి సర్పంచ్ యర్రం హరినాథ్రెడ్డి 2003లో దేశ రక్షణ కోసం ఇండియన్ ఆర్మీలో చేరారు. 17ఏళ్లు సరిహద్దుల్లో విధులు నిర్వహించి 2020లో ఉద్యోగ విరమణ చేశారు. ఊరిపై ఉన్న మమకారంతో రాజకీయాల్లోకి వచ్చారు. 2023లో రామగుండం మార్కెట్ కమిటీ డైరెక్టర్గా ఎన్నికయ్యారు. గ్రామ పంచాయతీ ఎన్ని కలు రావడంతో పదవికి రాజీ నామా చేసి, గుంటూరుపల్లి సర్పంచ్గా పోటీ చేశారు. 303 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. బీఏ చదివిన హరినాథ్రెడ్డి గ్రామాభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తానని వెల్లడించారు. -
జీజీహెచ్లో యువకుడి హల్చల్
● ఓపీ కౌంటర్ అద్దాలు ధ్వంసం ● అదుపులోకి తీసుకున్న పోలీసులు కోల్సిటీ(రామగుండం): గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి(జీజీహెచ్)లో శుక్రవారం ఓ యువకుడు వైద్య సిబ్బందిపై ఆగ్రహంతో హల్చల్ సృష్టించాడు. ఫర్నీచర్, కంప్యూటర్లు ధ్వంసం చేశాడు. వైద్యాధికారులు, సిబ్బంది కథనం ప్రకారం.. గోదావరిఖనికి చెందిన ఓ యువకుడు ఈనెల 11న వాంతులు, ఇతర అనారోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చేరాడు. పరీక్షించిన వైద్యులు గ్యాస్ట్రో సమస్యగా గుర్తించి ఆరోగ్యశ్రీ కింద ఇన్పేషెంట్గా అడ్మిట్ చేసుకున్నారు. ఆరోగ్యం కుదుటపడడంతో ఈనెల 17న డిచ్చార్చి చేస్తున్నట్లు చెప్పి ఆరోగ్యశ్రీలో వివరాలు అప్డేట్ చేయడానికి ఆన్లైన్లో సమస్య ఉందని, ఫోన్చేసి సమాచారం ఇచ్చినప్పుడు ఓటీపీ చెప్పాలని పేషెంట్ను ఇంటికి పంపించారు. శుక్రవారం ఆస్పత్రికి వచ్చిన ఆ యువకుడు.. తనకు మెరుగైన వైద్యం చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆరోగ్యశ్రీ సిబ్బందిని బెదిరిస్తూ ఓపీ అద్దాలను పగులగొట్టాడు. దాడిలో కంప్యూటర్, కీబోర్డు, స్కానర్ ధ్వంసమయ్యాయి. ఒక సిబ్బంది కాలుకు గ్లాసు తగిలి స్వల్ప గాయమయ్యింది. యువకుడు కూడా స్వల్పంగా గాయపడ్డాడు. సెక్యూరిటీ సిబ్బంది వెంటనే యువకుడుని అడ్డుకొని పోలీసులకు అప్పగించారు. పోలీసులు విచారణ జరుపుతున్నారని తెలిసింది. ఘటనపై ఆస్పత్రి ఆర్ఎంవోలు కృపాబాయి, రాజును వివరణ కోరగా.. దాడికి పాల్పడిన వ్యక్తిపై వన్టౌన్లో ఫిర్యాదు చేశామన్నారు. దాడులకు పాల్పడడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. -
విచారణకే పరిమితమా..!
మెట్పల్లి ఖాదీ గ్రామోద్యోగ ప్రతిష్టాన్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. దీనికి సంబంధించిన ఆధారాలతో నేరుగా ముఖ్యమంత్రిని కలిసి ఫిర్యాదు చేశాను. తొందరలోనే విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటాం..ఇందులో ఎవరి ప్రమేయం ఉన్నా విడిచిపెట్టే ప్రసక్తే లేదు అని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ప్రారంభంలో నియోజకవర్గానికి చెందిన ఆ పార్టీ ముఖ్య నేత తరచూ ఈ వ్యాఖలు చేశారు. అతను అన్నట్లే..ఆ తర్వాత విజిలెన్స్ విభాగం అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ జరిపి వెళ్లిపోయారు. ఇది జరిగి ఐదు నెలలు గడిచినా ఇంతవరకు ఈ వ్యవహారంలో ఎలాంటి పురోగతి లేదు. మొదట ఎంతో హడావుడి చేసిన ఆ నేత కూడా ప్రస్తుతం ఖాదీ పేరు తీయడం లేదని కాంగ్రెస్లో చర్చ నడుస్తుండడం గమనార్హం.మెట్పల్లి(కోరుట్ల): మెట్పల్లి ఖాదీ గ్రామోద్యోగ్ ప్రతిష్టాన్లో అక్రమాలు చోటు చేసుకున్నాయనే ఆరోపణలపై ఇంకా నిజాలు నిగ్గు తేలడం లేదు. ప్రతిష్టాన్ పాలకవర్గ సభ్యులు పలు వ్యవహారాల్లో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారనే విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై గతంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు ఆందోళనలు సైతం నిర్వహించారు. అంతేగాకుండా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ ముఖ్య నేత ప్రభుత్వ పెద్దలకు ఫిర్యాదు చేయగా, వారు విజిలెన్స్ విచారణకు అదేశించారు. దీంతో ఆ విభాగం అధికారులు విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదికను అందజేసినట్లు తెలిసింది. ఇవే ఆరోపణలు విజిలెన్స్తో విచారణ కనిపించని పురోగతి -
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి
మల్యాల(చొప్పదండి): చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుడు వలలో చిక్కుకొని మృతి చెందిన ఘటన మల్యాల మండలం నూకపల్లిలో జరిగింది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాలు.. నూకపల్లి గ్రామానికి చెందిన దువ్వాక నర్సయ్య(62) గురువారం మధ్యాహ్నం గ్రామ శివారులోని వరదకాలువలో చేపలు పట్టేందుకు వెళ్లాడు. రాత్రి వరకు ఇంటికి రాకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. శుక్రవారం ఎస్సై నరేశ్కుమార్ వరదకాలువలో వెతకగా నర్సయ్య వలలో చిక్కుకొని మృతిచెంది ఉన్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. పోక్సో కేసులో ఏడేళ్ల శిక్ష ధర్మారం(ధర్మపురి): పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికపై అత్యాచారం చేసిన అదే గ్రామానికి చెందిన బొడిగె రాజయ్య(69)కు ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష రూ.10వేల జరిమానా విధిస్తూ, బాధితురాలికి రూ.3 లక్షల పరిహారం చెల్లించాలని పెద్దపల్లి జడ్జి స్వప్నరాణి తీర్పు వెల్లడించారు. పోలీసుల కథనం ప్రకారం.. ఒంటరిగా ఉన్న బాలిక ఇంట్లోకి ప్రవేశించిన రాజయ్య తన ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడని పోలీసులకు ఫిర్యాదు అందింది. అప్పటి ఎస్సై అశ్విని కేసు నమోదు చేయగా ఏసీపీ కృష్ణ విచారణ జరిపారు. ఫాస్ట్ట్రాక్ అండ్ పోక్సో కోర్టులో వాదోపవాదాల అనంతరం నేరం రుజువు కావడంతో జడ్జి తీర్పు వెలువరించారు. రోడ్డు వెంట షాపుల కూల్చివేత కోల్సిటీ: గోదావరిఖని గాంధీచౌక్ చౌరస్తాలో రోడ్డు వెంట ఉన్న దుకాణాలను బల్దియా అధికారులు కూల్చివేశారు. షాపింగ్ కాంప్లెక్స్ అభివృద్ధి లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. వీరబుచ్చయ్యకు సన్మానం పెద్దపల్లి: పంచాయతీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించడంలో సఫలీకృతమైన డీపీవో, జిల్లా అదనపు ఎన్నికల అధికారి వీరబుచ్చయ్యను ఎంపీవోలు, పంచాయతీ కార్యదర్శులు శుక్రవారం ఘనంగా సన్మానించారు. ఈమేరకు కలెక్టరేట్లో ఆయనను కలుసుకున్నారు. -
బీటెక్ చేసి.. గ్రూప్–3 సాధించి
రామడుగు: మండలంలోని గోపాల్రావుపేటకు చెందిన పైండ్ల శ్రీకాంత్ గ్రూప్–3 ఉద్యోగం సాధించారు. తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డులో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం వచ్చింది. గతంలో గ్రూప్–4 ఉద్యోగం సాధించిన శ్రీకాంత్ గ్రూప్–3లోనూ ప్రతిభ చాటారు. తల్లిదండ్రులు పైండ్ల అంజయ్య–శాంత. బీటెక్ పూర్తి చేశారు. వల్లంపట్ల యువకుడి ప్రతిభ ఇల్లంతకుంట(మానకొండూర్): మండలంలోని వల్లంపట్లకు చెందిన ఎర్రం రఘు గ్రూపు–3 ఉద్యోగానికి ఎంపికయ్యాడు. మారుమూల గ్రామం వల్లంపట్లకు చెందిన యువకుడు కార్మిక ఉపాధి కల్పన శాఖలో ఉద్యోగం సాధించడంతో గ్రామస్తులు అభినందిస్తున్నారు. నిరుపేద కుటుంబమైనప్పటికీ కష్టపడి తల్లి చదివించింది. తల్లి కష్టానికి రఘు ఫలితం దక్కించారు. -
రాణించిన రాయికల్ యువకులు
రాయికల్: జగిత్యాల జిల్లా రాయికల్కు చెందిన యువకులు సురతాని అరవింద్రెడ్డి, భూపతిపూర్కు చెందిన బొడ్డుపల్లి విజయ్కుమార్ గ్రూప్–3 ఉద్యోగాలు సాధించారు. అరవింద్రెడ్డి రాష్ట్రస్థాయిలో 103వ ర్యాంక్ సాధించారు. ట్రెజరీ అండ్ అకౌంట్స్ హెచ్వోడీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో సీనియర్ అసిస్టెంట్గా ఎంపికయ్యారు. రాయికల్కు చెందిన సురతాని మల్లారెడ్డి, భాగ్యలక్ష్మి దంపతుల కుమారుడు. మరో యువకుడు భూపతిపూర్కు చెందిన బొడ్డుపల్లి విజయ్కుమార్ వస్తాపూర్ కార్యదర్శిగా పనిచేస్తూనే గ్రూప్–3లో ఫైనాన్స్ డిపార్ట్మెంట్కు సీనియర్ అకౌంటెంట్గా ఎంపికయ్యారు. బొడ్డుపల్లి విజయ్కుమార్ చిన్నతనంలోనే తన తండ్రి చనిపోగా తల్లి గంగరాజు బీడీలు చుడుతూ చదివించింది. విద్యాభ్యాసం మొత్తం ప్రభుత్వ సంస్థల్లోనే పూర్తి చేశారు. ఆర్ఆర్బీ, గ్రూప్–4 ఉద్యోగాలు సైతం వచ్చాయి. సురతాని అరవింద్రెడ్డిబొడ్డుపల్లి విజయ్కుమార్ -
పాత పాలకవర్గాలకు చెల్లు
కరీంనగర్ అర్బన్: ప్రాథమిక సహకార సంఘాల పరిపాలన అధికారుల హస్తగతమైంది. పాత పాలకవర్గాలను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. కేడీసీసీబీతో పాటు ఉమ్మడి జిల్లాలో కేడీసీసీబీ పరిధిలో గల 131 ప్యాక్స్ పాలకవర్గాలు రద్దయ్యాయి. కేడీసీసీబీ పర్సన్ ఇన్చార్జీగా కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతిని నియమించారు. ఎన్నికలు జరిగే వరకు ఇదే విధానం ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎన్నికల నిర్వహణ ఆలస్యమయ్యే అవకాశముందని తెలుస్తోంది. దీంతో పర్సన్ ఇన్చార్జీగా ఐఏఎస్ను నియమించారన్న వాదన వినిపిస్తోంది. 4 నెలల క్రితం పొడగింపు.. అంతలోనే రద్దు సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహిస్తారా.. మళ్లీ పాలకవర్గాల గడువు పొడిగిస్తారా అన్న మీమాంస క్రమంలో నాలుగు నెలల క్రితం ఆగస్టు 14న పాలకవర్గాల గడువు పొడిగించింది. ఎన్నికలుంటాయా.. నామినేటెడ్ పద్ధతిలో నియమిస్తారా అన్న ఊహగానాలకు తెరదించుతూ గడువు పొడిగించింది. నాలుగు నెలల వ్యవఽధిలోనే పాలకవర్గాలను రద్దు చేయడం చర్చనీయాంశఽమైంది. 2019 ఫిబ్రవరిలో ఎన్నికలు జరగగా వాస్తవానికి 2025 ఫిబ్రవరితో గడువు ముగిసింది. సదరు సమయంలో 6 నెలల గడువు పెంచగా ఆగస్టు 14తో ముగియగా మళ్లీ పెంచిన విషయం తెలిసిందే. స్థానిక ఎన్నికల తరువాతే స్థానిక సంస్థల ఎన్నికల క్రమంలో ఇటీవలే సర్పంచి ఎన్నికలను పూర్తి చేసిన విషయం తెలిసిందే. 42శాతం బీసీ రిజర్వేషన్ తెరపైకి రావడం, హైకోర్టు పాత పద్ధతిలోనే ఎన్నికలకు వెళ్లాలని ఆదేశించడం తెలిసిందే. సర్పంచ్ ఎన్నికలు పూర్తవగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఉండటంతో పర్సన్ ఇన్ఛార్జీని నియమించారని సమాచారం. సదరు ప్రక్రియ ఆలస్యమవుతుండగా సహకార సంఘాల ఎన్నికలు ఇప్పట్లో ఉండే అవకాశఽం లేదు. తొలుత జెడ్పీటీసీ, ఎంపీటీసీ, తదుపరి సర్పంచి, మునిసిపాలిటీ ఎన్నికలు జరగాల్సి ఉండగా తొలుత సర్పంచి ఎన్నికలను నిర్వహించారు. మిగతా ఎన్నికలు నిర్వహించాలంటే కనీసం 3–4నెలలు పట్టనుంది. అన్ని ఎన్నికలు వరుసగా వస్తాయన్న ప్రచారం నడుస్తోంది. స్థానిక సంస్థల పోరు అనంతరం సొసైటీ ఎన్నికలకు వెళ్లాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. నామినేట్ చేసే అవకాశం ఎన్నికలు నిర్వహించడం ఖర్చుతో వ్యవహారం కావడంతో నామినేట్ చేసేందుకు అవకాశాలున్నట్లు తెలుస్తోంది. కేడీసీసీబీ పరిధి ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉండగా కరీంనగర్,జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల్లో సహకార సంఘాలున్నాయి. నామినేటేడ్ చేసే అవకాశాలే ఎక్కువని ఉన్నతాధికారులు సైతం అభిప్రాయపడుతున్నారు. సదరు విధానంతో పార్టీలో కష్టపడి పనిచేసిన వ్యక్తికి పదవి కట్టబెట్టినట్లవుతుందన్న వాదన వినిపిస్తోంది. -
మెరిసిన పారిశుధ్య కార్మికుని కొడుకు
వీర్నపల్లి: మండలం గర్జనపల్లికి చెందిన పారిశుధ్య కార్మికుడు గుడిసె చంద్రయ్య–ఎల్లవ్వ దంపతుల రెండో కొడుకు గుడిసె రంజిత్కుమార్ గ్రూప్–3లో ప్రతిభ చాటారు. ట్రెజరీలో సీనియర్ అకౌంటెంట్గా ఎంపికయ్యాడు. రంజిత్కుమార్ 10వ తరగతి వరకు గర్జనపల్లిలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో చదివాడు. ఇంటర్, బీటెక్ ట్రిపుల్ ఐటీ బాసరలో చదివారు. కరీంనగర్, హైదరాబాద్లోని ఎస్సీ స్టడీసర్కిల్లో కోచింగ్ తీసుకొని గ్రూప్–3కి ఎంపికయ్యారు. తండ్రి గ్రామపంచాయతీ పారిశుధ్య కార్మికుడు కాగా, తల్లి కూలి పనులు చేస్తుంటుంది. -
ప్రజాసమస్యల పరిష్కారమే లక్ష్యం
● పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): ప్రజాసమస్యల పరిష్కారంలో సర్పంచులదే ప్రధాన భూమిక కా వాలని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. మీర్జంపేట గ్రామ పంచాయతీ సర్పంచ్ పోచాల శైలజ– సదానందంలను ఎమ్మెల్యే స్వగృహంలో శుక్రవారం సన్మానించి అభినందించారు. ఆయన మాట్లాడుతూ, ప్రజలకు అందుబాటులో ఉండి అధికారుల సమన్వయంతో గ్రామాభివృద్ధికి పాటుపడాలని సూచించారు. మాజీ ఎంపీపీ సారయ్యగౌడ్, వార్డు సభ్యులు బండ మల్లారెడ్డి, పుల్లూరి అన్విత, సాగర్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రాజెక్టుకు ఓకే.. ప్రయోజనం లేకే..
రామగిరి(మంథని): రామగుండం కోల్మైన్స్(బాహుబలి) ప్రాజెక్టు ఏర్పాటుపై శుక్రవారం చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణ ప్రశాంతంగా ముగిసింది. కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో అధికారి భిక్షపతి అధ్యక్షతన పన్నూర్ జేఎన్టీయూలో సభ నిర్వహించారు. కలెక్టర్ కోయ శ్రీహర్ష ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత సింగరేణి రామగుండం–3 ఏరియా జనరల్ మేనేజర్ నరేంద్ర సుధాకరరావు ప్రాజెక్టు వివరాలు వెల్లడించారు. అనంతరం కలెక్టర్, మాట్లాడుతూ, ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగా ప్రజలు లేవనెత్తిన సమస్యలు పరిష్కరిస్తామన్నారు. ఎవరూ ఆందోళన చెందవద్దని అన్నారు. రామగిరి మండలం పన్నూరు, నాగేపల్లి, లద్నాపూర్, రత్నాపూర్, బుధవారంపేట, కమాన్పూర్ మండలం జూలపల్లి, ములకలపల్లి, వకీల్పల్లి గ్రామాల సమీపంలో 4,326 హెక్టార్ల విస్తీర్ణంలో బాహుబలి ఓపెన్కాస్ట్ మైనింగ్ కోసం రూ పొందించిన డీపీఆర్పై ప్రజాభిప్రాయం సేకరిస్తున్నామని ఆయన తెలిపారు. వచ్చే 40ఏళ్లపాటు బొగ్గు ఉత్పత్తికి ఇబ్బందులు కలుగకుండా రామగుండంలో ఏర్పాటయ్యే తెలంగాణ సూపర్ థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు సరఫరా చేసేలా ఓపెన్కాస్ట్ మైనింగ్ పనిచేస్తుందని కలెక్టర్ చెప్పారు. ఆర్డీవో సురేశ్, ఏపీఏ, ఆర్జీ–1, 2, ఎన్విరాన్మెంట్ జీఎంలు నాగేశ్వరరావు, లలిత్కుమార్, వెంకట య్య, సైదులు, గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాల నా యకులు వాసిరెడ్డి సీతారామయ్య, బి.జనక్ ప్రసా ద్, పర్యావరణ అధికారి రాజారెడ్డి, పర్సనల్ మేనేజర్ సుదర్శనం, తహసీల్దార్ సుమన్ తదితరులు పాల్గొన్నారు. ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీబందోబస్తు ఏర్పాటు చేశారు. -
రోజూ చేపలు పట్టుకునే వాళ్లం
చెక్డ్యాం నిర్మించాక చేపలు పట్టుకోవడం మొదలు పెట్టాం. మూడేళ్లుగా పదిహేను మందిమి కలిసి క్వింటాల్ వరకు చేపలు పట్టేవాళ్లం. రోజూ సుమారు రూ.800 నుంచి రూ.1,000 వరకు సంపాదించుకునేటోన్ని. చెక్డ్యాం కూలిపోవడంతో ఉపాధి పోయింది. – కొటారి సమ్మయ్య, మత్స్యకారుడు సాయంత్రం పోయే సరికే.. పొద్దుగాల చేపలు పట్టుకుని ఇంటికి పోయా. సాయంత్రం మళ్లా చెక్డ్యాం వద్దకు వచ్చేసరికి కూలిపోయి ఉంది. చెక్డ్యాంతో ఎంతోమందికి ఉపాధి దొరికింది. ఉదయం, సాయంత్రం వేళలో చేపలు పట్టుకునేవాళ్లం. ఇప్పుడు కూలిపోయి నీళ్లన్నీ వృథాగా పోతున్నయ్. మేము సైతం ఉపాధి కోల్పోయాం. – అనపర్తి శంకర్, మత్స్యకారుడు -
కూలిపోయిన ఉపాధి
మంథనిరూరల్: చేపల వేటతో తమ కుటుంబాలను పోషించుకుంటున్న వందలాది మంది మత్స్యకారులకు ఇప్పుడు ఉపాధి లేకుండాపోయింది. బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో అడవిసోమన్పల్లి మానేరుపై చెక్డ్యాం నిర్మించింది. దీని నిర్మాణంతో సుమారు లక్ష క్యూసెక్కుల నీరునిల్వ ఉంటుండటంతోపాటు.. మూడేళ్లుగా వివిధ గ్రామాలకు చెందిన మత్స్యకారులు చేపలు పట్టుకుని ఉపాధి పొందుతున్నారు. రెండు రోజుల క్రితం అది కూలిపోవడంతో తాము ఉపాధి కోల్పోయామని పలువురు మత్య్సకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మానేరుపై 16 చెక్డ్యాంలు.. భూగర్భజలాల పెంపు, మత్స్య సంపదను పెంపొందించి, మత్స్యకారులకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2022లో జి ల్లాలోని మానేరుపై వివిధ చోట్ల 16 వంతెనల నిర్మాణానికి రూ.128కోట్లు వెచ్చించింది. శరవేగంగా వాటి నిర్మాణాలు పూర్తిచేసింది. పెద్దపల్లి జిల్లాలోని మంథని మండలం అడవిసోమన్పల్లి, చిన్నఓదాల, గోపాల్పూర్ గ్రామాల మధ్య మానేరుపై సుమారు రూ.16 కోట్ల వ్యయంతో మూడు చెక్డ్యాంలు ని ర్మించింది. ఇందులో అడవిసోమన్పల్లి చెక్డ్యాం రెండు రోజుల క్రితం కుప్పకూలిపోయింది. చేపలు పట్టుకుని జీవనోపాధి.. చెక్డ్యాం నిర్మాణంతో నీటినిల్వలు వృద్ధి చెందాయి. తద్వారా చేపలకు ఆవాసం ఏర్పడింది. అనేకమంది చేపలు పట్టుకుని ఉపాధి పొందుతున్నారు. లక్ష క్యూసెక్కల మేర నీటి నిల్వ ఉండటంతో మూడేళ్లపాటు పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల్లోని మత్స్యకారులు చేపలు పట్టుకునేవారు. నిత్యం వంద నుంచి దాదాపు 150 క్వింటాళ్ల వరకు చేపలు పట్టుకుని విక్రయించే వారని, తద్వారా ఈ ప్రాంతంలోని దాదాపు 200 కుటుంబాలు ఉపాధి పొందుతుండేవని స్థానికులు చెబుతున్నారు. అనేక అనుమానాలు.. అడవిసోమన్పల్లి చెక్డ్యాం కూలిపోవడంపై స్థానికులు సైతం అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్ప టికే ఇరిగేషన్ అధికారులు చెక్డ్యాం కూలడంపై విచారణ చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొందరు కావాలనే కూల్చివేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా తాము ఉపాధి కోల్పోయా మని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
చెక్డ్యాం పరిశీలన
మంథనిరూరల్: రెండ్రోజుల క్రితం కూలిపోయిన అడవిసోమన్పల్లి మానేరు చెక్డ్యాంను ఇరిగేషన్ అధికారులు శుక్రవారం పరిశీలించారు. దీనిపై అధికారులు అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇరిగేషన్ సీఈ శ్రీనివాసరావు గుప్త, ఎస్ఈ శ్రీనివాసచారితో కలిసి పరిశీలించారు. చెక్డ్యాం గోడలు కూలిపోయిన తీరుపై అనుమానం వ్యక్తం చేశారు. గతంలో వరద ఉధృతితోపాటు రెండురోజుల క్రితం వరకు ఎంతమేర నీరు నిలిచి ఉందనే విషయంపైనా వారు ఆరా తీశారు. ప్రస్తుత వరద తాకిడికి కూలిపోయే అవకాశం ఏ మాత్రం లేదని అధికారులు వివరించారు. ఈఈ బలరామయ్య, డీఈ రమేశ్బాబు, ఏఈఈ నిఖిల్ తదితరులు పాల్గొన్నారు. -
24న ఎస్సారెస్పీ నీటి విడుదల
పెద్దపల్లిరూరల్: యాసంగి పంటలకు ఎస్సారెస్పీ ద్వారా ‘వారబందీ’ పద్ధతిన ఈనెల 24 న సాగునీటిని విడుదల చేయనున్నారు. నిజామాబాద్ జిల్లా పోచంపాడ్ ప్రాజెక్టులో గేట్లు ఎత్తడంతో సరఫరా అయ్యే నీటిని తొలుత జ గిత్యాలకు సరఫరా చేస్తారని తెలిసింది. ఆ త ర్వాత పెద్దపల్లి జిల్లాకు చేరే అవకాశం ఉంది. వరి సాగుచేసే రైతులు ఇప్పటికే నారు పోసినా.. చలితీవ్రతతో తెగుళ్లు ఆశించి నారు పా డైందని రైతులు వాపోయారు. కొన్ని ప్రాంతా ల్లో మళ్లీ నారుపోయాల్సి వస్తోందని అంటు న్నారు. ఈసందర్భంగా నీటి పారుదల శాఖ ఈఈ శ్రీనివాస్ మాట్లాడుతూ, ఈనెల 24 పో చంపాడ్ వద్ద గేట్లు ఎత్తినా పెద్దపల్లి జిల్లాకు జ నవరి 2వ తేదీ వరకు సాగునీరు చేరే అవకా శం ఉందన్నారు. వారబందీ పద్ధతిన వచ్చే నీ టిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వడ్ల కల్లాలపై వానరాలు మంథనిరూరల్: గ్రామాల్లో కోతులు బీభత్సం సృష్టిస్తున్నాయి. గుంపులుగా స్వైరవిహారం చే స్తున్నాయి. కూరగాయాల తోటలను ధ్వంసం చేస్తున్న వానరాలు.. ఆఖరుకు వడ్ల కల్లాల్లో ఆ రబోసిన ధాన్యంపై దాడులు చేస్తున్నాయి. క ల్లాల్లో తిరుగుతూ వడ్లను తింటూ చిందరవందర చేస్తూ రైతులకు నష్టం కలిగిస్తున్నాయి. ధాన్యం కొనుగోళ్లు కొంత ఆలస్యం కావడంతో అటవీ ప్రాంతాల్లోని గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలపై ఇలా కోతుల గుంపులు దాడులు చేస్తున్నాయి. ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయడంతోపాటు కోతులను తరలించేలా అధికారులు చర్యలు తీసుకోవాలంటున్నారు. పోరు ముగిసె.. పోస్టర్ తొలగే పెద్దపల్లిరూరల్: పంచాయతీ ఎన్నికల సంగ్రా మం ముగిసింది. ఈసారి పంచాయతీ పోరు అసెంబ్లీ ఎన్నికలను తలపించింది. సర్పంచ్ స్థానాలకు పోటీపడ్డవారు తమ గుర్తు ఓటర్లకు తెలిసేలా ప్రచార పోస్టర్లను ముద్రించి ప్రధా న కూడళ్లు, గోడలపై అంటించారు. ఎన్నికలు ముగియడంతో ఆ పోస్టర్లను తొలగించే పను ల్లో పంచాయతీ సిబ్బంది నిమగ్నమయ్యారు. మల్యాలపల్లికి చేరిన పులి!రామగుండం: సుమా రు ఆరురోజుల క్రితం మేడిపల్లి ఓసీపీ పరిసరాలు, గోదావరి తీరంలో సంచరించిన పెద్ద పులి.. శుక్రవారం మ ల్యాలపల్లి గ్రామ శివారులో ప్రత్యక్షమైనట్లు గ్రామస్తురాలు కత్తెరమ ల్ల కుమారి తెలియజేసింది. మేతకోసం తన మేకలను సమీపంలోని బీపీఎల్ స్థలంలోని అడవిలోకి తీసుకెళ్లింది. పులి అరుపులతో మే కలు బెదిరి వెనక్కి పరిగెత్తి వచ్చాయి. అటుగా వెళ్లిన మహిళకు కూడా పులి కనిపించింది. భ యాంళోనలకు గురైన ఆమె ప్రాణభయంతో కేకలు వేస్తూ గ్రామంలోకి పరుగులు పెట్టింది. సమాచారం అందుకున్న ఫారెస్టు అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేయగా.. పులి అడుగులు కనిపించాయి. రెండ్రోజుల క్రితం లింగాపూర్ గోదావరి శివారు, మేడిపల్లి, పాములపేటలో సంచరించిన పులి.. రామగుండం నడిబొడ్డులోని బీపీఎల్ ప్రాంతంలోకి రావ డం ఆందోళన, ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ‘సింగరేణి వేడుకలపై వివక్ష’యైటింక్లయిన్కాలనీ(రామగుండం): రాష్ట్రప్ర భుత్వం కోల్బెల్ట్ ఏరియాల్లో చేపట్టే ప్రతీ కార్యక్రమానికి అవసరమైన నిధులు సమకూర్చుతున్న సింగరేణి.. తన ఆవిర్భావ వేడుకలపై వివక్ష చూపడం సరికాదని టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి అన్నారు. ఈనెల 23న చేపట్టే ఆవిర్బావ వేడుకలను గ తంలో మాదిరిగానే వైభవంగా నిర్వహించాలన్నారు. స్థానిక ప్రెస్భవన్లో శుక్రవారం ఆ యన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వేడుకలకు గతంలో రూ. 41లక్షలు ఖర్చుచేసి న సింగరేణి.. ప్రస్తుతం రూ.8లక్షలకు కుదించడం శోచనీయమన్నారు. నాయకులు రా మ్ముర్తి, రవి, కొమురయ్య, ప్రభాకర్రెడ్డి, సతీశ్, శశాంక్, శ్రీనివాస్రెడ్డి, అనిల్రెడ్డి, హరిప్రసాద్, రమేశ్ తదితరులు పాల్గొ న్నారు. -
శనివారం శ్రీ 20 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
బీసీలవిజయబావుటా56986974120156126224648257సిరిసిల్లకరీంనగర్పెద్దపల్లిజగిత్యాలగెలిచినవి మొత్తంజనరల్లో బీసీలుబీసీరిజర్వ్ -
మేడారం జాతరకు 700 బస్సులు
● ఆర్టీసీ రీజినల్ మేనేజర్ రాజుకరీంనగర్టౌన్: వచ్చే ఏడాది జనవరిలో జరగను న్న మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర కోసం క రీంనగర్ రీజియన్ పరిధిలోని డిపోల నుంచి 700 బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ కరీంనగర్ రీజినల్ మేనేజర్ రాజు తెలిపారు. శుక్రవారం బస్స్టేషన్ స మావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రీజియన్ పరిధిలో గోదావరిఖని, హుస్నాబాద్, హుజూరాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, మంథని డిపోల నుంచి జాతర బస్సులు ఉంటాయని తెలిపారు. ఆరు ఆపరేటింగ్ పాయింట్ల వద్ద అవసరమైన మౌలిక వసతుల ఏర్పాటు, ఎంపిక చేసిన బస్సులకు అవసరమైన మరమ్మతులు, జాతర విధులు నిర్వర్తించే సిబ్బంది ఎంపిక, భక్తుల సురక్షిత ప్రయాణం తదితర అంశాలపై తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సమావేశంలో కరీంనగర్ డిప్యూటీ రీజనల్ మేనేజర్లు ఎస్.భూపతి, పి.మల్లేశం, డిపో మేనేజర్లు నాగభూషణం, వెంకన్న, రవీంద్రనాథ్, విజయమాధురి, ఎం.శ్రీనివాస్, శ్రవణ్ కుమార్, కె. కల్పన, ఎస్.మనోహర్, దేవరాజు, ప్రకాశ్రావు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రజారోగ్యాన్ని కాపాడాలి
సింగరేణి ఓసీపీలతో దుమ్ము, ధూళి వస్తున్నది. ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. గాలిలో నాణ్యత మెరుగుకు ఎస్జీడీ యూనిట్లు నిర్మించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అవి అమలు కావడం లేదు. ఏక్యూఐలో తప్పుడు సంఖ్య నమోదు చేస్తున్నారు. వాయు కాలుష్యాన్ని నియంత్రించి, ప్రజారోగ్యానికి పెద్దపీట వేయాలి. నిరుద్యోగులకు అన్యాయం సింగరేణి ప్రభావిత ప్రాంతా ల నిరుద్యోగులకు ఉపాధి కల్పనలో అన్యాయమే జరుగుతోంది. గత ప్రజాభిప్రా య సేకరణ సందర్భంగా ఇదేవిషయాన్ని అధికారుల దృష్టికి తీసుకొచ్చాం. అయినా ఉపయోగం లేకుండా పోతోంది. ఇప్పుడు జరుగుతున్న కాంట్రాక్టు నియా మకాల్లో ప్రభావిత ప్రాంతాల నిరుద్యోగులు లేరు. అందరూ ఇతర ప్రాంతాల వారే. – మబ్బు శంకర్, అక్కెపల్లి అభివృద్ది సంగతేమిటి? రామగుండం కోల్మైన్స్ ప్రాజెక్టు ఏర్పాటు మాకు అంగీకారమే కానీ.. భూములను కోల్పోతున్న మా సంగతేమిటి? ఓసీపీలతో నష్టం జరుగుతున్నా.. మా ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని మద్దతిస్తున్నాం. పరిసర ప్రాంతాలు, ఆర్అండ్ఆర్ కాలనీల్లో మౌలికవసతులు కల్పించాలి. సింగరేణి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం మానుకోవాలి. – కె.అభిలాష్, బుధవారంపేట ప్రమాణాలు మెరుగుపర్చాలి ఓసీపీలతో ప్రజల సగటు జీ వన ప్రమాణాలు పడిపోతున్నాయి. గాలి, నీరు, ధ్వని కాలుష్యం పెరిగిపోతోంది. విపరీతమైన కాలుష్యంతో ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారు. బొ గ్గు రవాణా చేసే లారీలు నిబంధనలు పాటించడంలేదు. అధికారులూ పట్టించుకోవడం లేదు. జీవన ప్రమాణాలు మెరుపర్చాలి. – సీహెచ్ లింగమూర్తి, జాతీయ కార్యదర్శి, సదాశయ ఫౌండేషన్ -
గల్ఫ్లో గుండెపోటుతో ఎల్లారెడ్డిపేటవాసి మృతి
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): పుట్టి న ఊరిలో ఉపాధిలేక బతుకుదెరువు కోసం గల్ఫ్ వెళ్లిన ఓ వలసజీవి గుండెపోటుకు గు రై మృతిచెందాడు. ఈ సంఘటనతో ఎల్లారెడ్డిపేట మండ ల కేంద్రంలో విషాదం అలుముకుంది. స్థానికులు తెలిపిన వివరాలు. మండల కేంద్రానికి చెందిన చెన్ని బాలనర్సు(40) గత 15 ఏళ్లుగా దుబాయ్ వెళ్తున్నాడు. గురువారం ఎప్పటిలాగే కంపెనీలో పనిచేస్తుండగా గుండెపోటు రావడంతో వెంటనే హాస్పిటల్కు తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు అక్కడి వైద్యులు తెలిపారు. బాలనర్సు మిత్రులు కుటుంబ సభ్యులకు తెలిపారు. మృతుని భార్య దేవ కన్నీటిపర్యంతమైంది. మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చేలా ఏర్పాటు చేయాలని స్థానిక నాయకులను ఆమె వేడుకుంటుంది. వలస కార్మికుడి ఆత్మహత్యరుద్రంగి(వేములవాడ): రు ద్రంగి మండల కేంద్రంలో బుధవారం రాత్రి వలస కా ర్మికుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు. ఉత్తరప్రదేశ్ నుంచి రుద్రంగికి వచ్చిన వలసకార్మికుడు సన్ని(25) బుధవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకున్నాడు. రుద్రంగి పోలీసులు శవ పంచనామా చేసి మృతుని బంధువుల ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వేములవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అటవీశాఖ అధికారిపై దాడిజగిత్యాలక్రైం: జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం రంగపేట అటవీ ప్రాంతంలో అటవీశాఖ సెక్షన్ అధికారి సాంబయ్యపై దాడి జరిగినట్లు అటవీశాఖ డిప్యూటీ రేంజర్ రవికుమార్ తెలిపారు. రంగపేట అటవీ ప్రాంతంలో విధి నిర్వహణలో భాగంగా సాంబయ్య అడవిలోకి వెళ్లాడు. అదే గ్రామానికి చెందిన రాకేశ్ అనే వ్యక్తి గొడ్డలితో కన్పించగా సాంబయ్య అతడిని మందలించాడు. దీంతో కోపంతో రాకేశ్ గొడ్డలితో సాంబయ్యపై దాడిచేశాడని, ఘటనలో సాంబయ్య చేతివేళ్లకు గాయాలయ్యాయని తెలిపారు. బాల్య వివాహాన్ని అడ్డుకున్న అధికారులురాయికల్: రాయికల్ పట్టణంలో ఓ బాల్య వివాహాన్ని 1098 ఐసీడీఎస్ అధికారులు అడ్డుకున్నారు. పట్టణంలోని ఓ ఫంక్షన్హాల్లో పట్టణానికి చెందిన అబ్బాయి, సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి గ్రామానికి చెందిన అమ్మాయితో వివాహం జరిపిస్తున్నారు. ఐసీడీఎస్ అధికారులు ఘటన స్థలానికి వెళ్లి వధూవరుల వయసును పరిశీలించారు. వధువు వయసు తక్కువగా ఉండటంతో మేజర్ అయ్యేంత వరకు వివాహం చేయొద్దని 1098 కౌన్సిలర్ శ్రీనివాస్, సోషల్ వర్కర్ రాణి, గంగాధర్, ఐసీడీఎస్ సూపర్వైజర్ పద్మావతి కౌన్సెలింగ్ ఇచ్చారు. దీంతో వివాహం వాయిదా పడింది. -
ఇబ్బందుల్లేకుండా ఏర్పాట్లు
పంచాయతీ ఎన్నికల విధులు నిర్వర్తించేందుకు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న మాకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశారు. చలి తీవ్రతను తట్టుకునేందుకు వీలుగా వేడినీటిని కూడా అందుబాటులో ఉంచారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలయ్యేలోపే అల్పాహారం తిన్నాం. – మాధవి, ఉపాధ్యాయురాలు ఏర్పాట్లు బాగున్నాయ్ పంచాయతీ ఎన్నికల విధులు నిర్వహించేందుకు ఎలిగేడు మండలం నర్సాపూర్ వచ్చా. పోలింగ్ కేంద్రంలో ఎన్నికల సామగ్రిని భద్రపర్చినం. మాకు రాత్రిబస చేసేందుకు అవసరమైన అన్నిఏర్పాట్లు చేశారు. ఇబ్బందులు కలుగకుండా స్థానిక అధికారులు, సిబ్బంది సహకారం అందించారు. – భాగ్యలక్ష్మి, జూనియర్ లెక్చరర్ సంతృప్తిగా ఉంది పంచాయతీ ఎన్నికల విధులను నిర్వహించడం సంతృప్తినిచ్చింది. పోలింగ్ సమయానికల్లా సిద్ధంగా ఉండేంలా సామాగ్రితో ముందురోజు మధ్యాహ్నం వరకే పోలింగ్ కేంద్రానికి చేరుకున్నాం. ఇక్కడ మాకు ఎలాంటి ఇబ్బందులు కలెగకుండా స్థానిక అధికారులు తీసుకున్న చర్యలు ఎంతో సంతృప్తినిచ్చాయి. – సామ శిరీష, ఉప్పట్ల, మంథని -
పైసలు పాయే..
శుక్రవారం శ్రీ 19 శ్రీ డిసెంబర్ శ్రీ 2025ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఓ గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానానికి పోటీపడిన ప్రధాన రాజకీయ పార్టీ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా భారీగా ఖర్చుచేశారు. ఫలితాలు వెలువడే వరకూ విజయం తనదేననే ధీమా తో అందినకాడికి అప్పు తీసుకొచ్చి మరీ ఎన్నికల ప్రచారం చేశారు. తీరా ఓటమి పాలవడంతో అప్పు ఎలా తీర్చాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. పైసలు పోయే, పదవి రాకపాయేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా మానేరు తీరం, ఇటుకబట్టీలు, రైస్ మిల్లులు, కంకర క్వారీలు విస్తరించి ఉన్న పంచాయతీల్లో అభ్యర్థులు డబ్బులు ధారపోసినా ఫలితం తేడా కొట్టడంతో తలలు పట్టుకున్నారు. పదవీ రాకపాయే.. ఓటమితో డీలాపడిన పంచాయతీ అభ్యర్థులు ప్రచారం కోసం చేసినఅప్పులు తీర్పడం ఎట్లా? పోల్ పోస్టుమార్టంలో రాజకీయ పార్టీల నాయకులు పరిషత్ ఎన్నికల వైపు ఓటమిపాలైన అభ్యర్థుల చూపు -
వాక్సెన్ యూనివర్సిటీతో అవగాహన ఒప్పందం
కరీంనగర్రూరల్: బొమ్మకల్లోని బిర్లా ఓపెన్మైండ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులకు ప్రపంచస్థాయి విద్యా అవకాశాలను కల్పించాలనే ఉద్దేశంతో వాక్సెన్ యూనివర్సిటీతో అవగాహన ఒప్పందం(ఎంఓయూ) చేసుకుంది. ఈమేరకు గురువారం స్కూల్ చైర్మన్ దాసరి ప్రశాంత్రెడ్డి, యూనివర్సిటీ ప్రతినిధి వినోద్లు ఒప్పందంపై అధికారికంగా సంతకాలు చేశారు. ఈ సందర్భంగా స్కూల్ చైర్మన్ ప్రశాంత్రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల సమగ్ర అభివృద్ధి, నైపుణ్యాధారిత విద్యతో పాటు భవిష్యత్ను సిద్ధం చేయాలనే లక్ష్యంతో వాక్సెన్ యూనివర్సిటీతో ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు. ఒప్పందం ద్వారా రెండు సంస్థలు కలిసి విద్యార్థులకు గ్లోబల్ స్థాయిలో విద్యాబోధన అందుబాటులోకి వస్తుందన్నారు. వాక్సెన్ యూనివర్సిటీ ప్రతినిధి వినోద్ మాట్లాడుతూ చిన్న వయస్సులోనే విద్యార్థులకు ఉన్నత విద్య అవకాశాలపై అవగాహన కల్పించడం ఎంతో అవసరమన్నారు. బిర్లా స్కూల్ అమలు చేస్తున్న విద్యాప్రమాణాలు, వినూత్న కార్యక్రమాలను అభినందించారు. -
26న ‘గోపా’ స్వర్ణోత్సవాలు
పెద్దపల్లి: గౌడ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్(గోపా) స్వర్ణోత్సవాలు ఈనెల 26న హైదరాబాద్లో నిర్వహిస్తామని ఆ సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధికార ప్రతినిధి బుర్ర జగదీశ్వర్గౌడ్ తెలిపారు. స్వర్ణోత్సవాల ప్రచార పోస్టర్ను గురువారం సుల్తానాబాద్లో ఆవిష్కరించి మాట్లాడారు. గౌడల సమస్యలు, యువతకు విద్య, ఉపాధి అవకాశాలు, రాజకీయాల్లో ప్రాతినిధ్యం తదితర అంశాలపై ఇందులో చర్చిస్తామన్నారు. ప్రతినిధులు అడ్డగుంట రాజేందర్గౌడ్, బైరగోని రవీందర్గౌడ్, అంతటి చిరంజీవిగౌడ్, ఏరుకొండ తిరుపతిగౌడ్, వేముల కిరణ్గౌడ్, పోడేటి వెంకటేశ్గౌడ్, పొన్నం శ్రీనివాస్గౌడ్, ముత్యం నరేశ్గౌడ్, కొయ్యడ రమాకాంత్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.‘మీ డబ్బు.. మీ హక్కు’పై అవగాహన పెద్దపల్లి: ‘మీ డబ్బు.. మీ హక్కు’పై ఈనెల 20న క లెక్టరేట్లో అవగాహన కల్పిస్తామని లీడ్ బ్యాంక్ మే నేజర్ వెంకటేశ్ తెలిపారు. బ్యాంకుల్లో పొదుపులు, షేర్లు, డివిడెంట్లు, మ్యూచువల్ ఫండ్స్, బీమా తది తరాల్లో డబ్బు క్లెయిమ్ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నారని, దీనికోసం శిబిరాలు నిర్వహిస్తున్నామని, వీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. -
వేడినీళ్లు.. నోరూరించే టిఫిన్లు
పెద్దపల్లిరూరల్: గతానికి భిన్నంగా ఈసారి ఎన్నికల సిబ్బంది వసతి, సౌకర్యాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. గతానుభవాలను దృష్టిలో పెట్టుకుని ఎలాంటి లోటుపాట్లు తలెత్తకుండా పక్కా ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకున్నారు. పంచాయతీ సర్పంచ్, వార్డు స్థానాల్లో ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేసిన పోలింగ్, ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో విధులను నిర్వహించేందుకు వచ్చిన పోలింగ్ అధికారులు, ఓపీవోలు, మెడికల్, పోలీసు, తదితర సిబ్బందికి అవసరమైన వసతీసౌకర్యాలు మెరుగ్గా కల్పించారు. 85 పంచాయతీల్లో ఎన్నికలు.. జిల్లాలో ఆఖరువిడత పంచాయతీ ఎన్నికల్లో 85 సర్పంచ్, 636 వార్డు స్థానాల కోసం నిర్వహించిన ఎన్నికల్లో సిబ్బందికి అసౌకర్యాలు కలుగకుండా చర్యలు తీసుకున్నారు. ఇందులో 128 మంది పోలింగ్ అధికారులు, 166 మంది ఓపీవో తదితర సిబ్బందికి అవసరమైన సౌకర్యాలను ఆయా కేంద్రాల సమీపంలో కల్పించారు. వణికిస్తున్న చలిలో ఉదయమే స్నానం చేసేందుకు వీలుగా వేడినీటిని కూడా అందించారు. నోరూరించే అల్పాహారం, రుచికరమైన భోజనం అందించినట్లు పలువురు ఎన్నికల సిబ్బంది చెప్పారు. ఏర్పాట్లపై కొందరిని పలుకరించగా.. కడుపునిండా రుచికరమైన భోజనం ఎన్నికల విధుల నిర్వహణ తృప్తినిచ్చింది పోలింగ్, లెక్కింపు కేంద్రాల్లో సౌకర్యాలు భేష్ స్థానిక అధికారుల సహకారంతో సమస్యలు దూరం ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉద్యోగుల మనోగతం -
వకీల్పల్లి
తంగళ్లపల్లి నుంచి అనేక మంది న్యాయవాదులుగా రాణిస్తున్నారు. దోర్నాల లక్ష్మారెడ్డి న్యాయవాద వృత్తిలో ఉంటూనే టీడీపీ, బీఆర్ఎస్ పార్టీల్లో క్రియాశీల రాజకీయ నాయకుడిగా కొనసాగారు. పాతికేళ్ల క్రితమే ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్పర్సన్గా సేవలందించారు. ప్రస్తుతం సబ్బని రవీందర్, కోడం సత్యనారాయణ, కోడం సురేశ్, దోర్నాల సంజీవ్రెడ్డి, దోర్నాల జనార్దన్రెడ్డి, కోడి లక్ష్మణ్, సబ్బని రమేశ్ (కరీంనగర్), బండి చైతన్యగౌడ్, ిసీనియర్ న్యాయవాదులుగా కొనసాగుతున్నారు. ఇటీవల పలువురు జూనియర్ న్యాయవాదులు తక్కళ్ల సారిక, సుహాసిని, వినీత, ఆకుల శ్రీనివాస్, బొల్లారం ప్రదీప్, గజభీంకార్ సృజన, పసుల వంశీ ఇటీవలనే న్యాయవాద వృత్తిలోకి ప్రవేశించారు. రాణించిన న్యాయవాదులు -
ఎన్నికలు విజయవంతం
పెద్దపల్లి: జిల్లాలో మూడుదశల్లో పంచాయతీ ఎన్నికలను విజవంతంగా నిర్వహించామని జిల్లా పంచాయతీ అధికారి(డీపీవో) వీరబుచ్చయ్య తెలిపా రు. ఈమేరకు గురువారం కలెక్టర్ శ్రీహర్షను కలిసి పుష్ఫగుచ్చం అందించి కృతజ్ఞతలు తలిపారు. 24న రిటైర్డ్ ఉద్యోగులకు దీపావళి బోనస్ గోదావరిఖని: రిటైర్డ్ ఉద్యోగులకు లాభాల వాటా చెల్లిస్తూ సింగరేణి యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. ఈమేరకు ఈనెల 18న ఖాతాల్లో జమ చేశారు. అలాగే దీపావళి లాభాల బోనస్ను కూడా ఈనెల 24న చెల్లించనున్నట్లు పేర్కొంది. ఈఏడాది సెప్టెంబర్ 30వ తేదీలోగా ఉద్యోగ విరమణ చేసిన వారికి వాటా వర్తించనున్నట్లు తెలిపింది. -
ఈకేవైసీ పూర్తిచేయాలి
పెద్దపల్లి: జిల్లాలోని రేషన్కార్డుదారులు ఈకేవై సీ పూర్తిచేసుకోవాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. ఇప్పటివరకు 76.29శాతమే ఈ కేవైసీ పూర్తయ్యిందని, మిగతా వారు పూర్తిచేయాలన్నారు. జిల్లాలో ఇంకా 1,68,272 మంది సమీపంలోని రేషన్ దుకాణాల్లో ఈకేవైసీ పూర్తిచేసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. దరఖాస్తులు ఆహ్వానం పెద్దపల్లి: క్రీడా సామగ్రి అవసరమైన యువజన సంఘాలు ఈనెల 30వ తేదీలోగా దర ఖాస్తు చేయాలని జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి వెంకట్ రాంబాబు తెలిపారు. సూచించారు. రిజిస్ట్రేషన్ ఉన్న, 18ఏళ్ల నుంచి 29ఏళ్ల వయసులోపు కలిగిన సభ్యులు కలిగి ఉన్న సంఘాలు అర్హులన్నారు. ఐదేళ్లలో ఆ సంఘాలు చేసిన సేవా కార్యక్రమాల ప్రతులను దరఖాస్తు తో జతచేయాలని సూచించారు. దరఖాస్తుల ను మేరా యువభారత్, కరీంనగర్ జిల్లా(బస్టాండ్ ఎదురుగా) కార్యాలయం నుంచి పొందాలని, వివరాలకు 91773 29258 నంబరు లో సంప్రదించాలని సూచించారు. సమర్థవంతంగా ఎన్నికల నిర్వహణ గోదావరిఖని: రామగుండం పోలీస్ కమిషనరేట్ లోని పెద్దపల్లి, మంచిర్యా ల జిల్లాల్లో పంచాయతీ ఎ న్నికలను సమర్థవంతంగా నిర్వహించామని సీపీ అంబర్ కిశోర్ ఝా తెలిపారు. క్రమశిక్షణ, అప్రమత్తత, పటిష్టమైన పోలీస్ బందోబస్తుతో ఎన్నికల ప్రశాంత వాతావరణంలో ముగిశాయన్నారు. డీసీపీలు భూక్యా రాంరెడ్డి, భాస్కర్ పర్యవేక్షణలో అదనపు డీసీపీ (అడ్మిన్) శ్రీనివాస్, స్పెషల్ బ్రాంచ్, పెద్దపల్లి, గోదావరిఖని, మంచిర్యాల, జైపూర్, బెల్లంప ల్లి, ఏఆర్ ఏసీపీలు నాగేందర్, కృష్ణ, రమేశ్, ప్రకాశ్, వెంకటేశ్వర్లు, రవికుమార్, ప్రతాప్ పక డ్బందీ పర్యవేక్షణ, ఇతర ప్రభుత్వ శాఖల సమన్వయంతో, దూరదృష్టి ఇందుకు తోడైందని ఆ యన వివరించారు. అన్ని విభాగాల్లోని పోలీస్ సిబ్బంది విధుల్లో అంకితభావం, అప్రమత్తతో వ్యవహరించారని సీపీ ప్రశంసించారు. జిల్లా వైద్యాధికారిగా ప్రమోద్కుమార్ పెద్దపల్లి: జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారిగా ప్రమోద్కుమార్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన జగిత్యాల జిల్లా నుంచి బదిలీపై వచ్చారు. కలెక్టర్ శ్రీకోయ శ్రీహర్ష, అదనపు కలెక్టర్ వేణును ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. ఇప్పటివరకు ఇన్చార్జి జిల్లా వై ద్య, ఆరోగ్యశాఖ అధికారిగా విధులు నిర్వర్తించిన వాణిశ్రీ యథావిధిగా ప్రోగ్రాం అధికారిగా పెద్దపల్లిలోనే కొనసాగుతారు. కాగా, ఆర్బీఎస్కే సిబ్బందితో నిర్వహించిన సమీక్షలో డీఎంహెచ్వో పాల్గొని పలు సూచనలు చేశారు. చిరువ్యాపారికి సన్మానం యైటింక్లయిన్కాలనీ(రామగుండం): వ్యాపారంలో వినూత్న పద్ధతులు అవలంబిస్తూ ఢి ల్లీలో జరిగే గణతంత్ర వేడుకలకు కేంద్రపభు త్వం నుంచి ఆహ్వానం అందుకున్న చిరువ్యా పారి అల్లూరులోని బాలసాని నిర్మలను గ్రామస్తులు సన్మానించారు. పీఎం స్వనిధి ద్వారా రు ణాలు తీసుకుని వ్యాపార రంగంలో రాణిస్తూ, సకాలంలో రుణవాయిదాలు చెల్లించడంలో ఆమె అగ్రస్థానంలో నిలిచారని బీజేపీ నాయకులు ప్రశంసించారు. ఈమేరకు గ్రామంలో గురువారం ఆమెను సన్మానించారు. నాయకులు ఆకుల శశికుమార్, మూకిరి రాజు, లింగం నాయక్, శంకర్, అనిల్ కుమార్, వెంకటేశ్వర్లు, ప్రవీణ్, రమాదేవి, నర్మద, స్వరూప, రజిత తదితరులు పాల్గొన్నారు. ఆదివరాహస్వామికి పూజలు కమాన్పూర్(మంథని): దేవాదాయ శాఖ అదనపు కమిషనర్ సుప్రియ గురువారం శ్రీఆదివరాహస్వామిని దర్శిచుకున్నారు. ఆలయ ఈవో కాంతారెడ్డి ఆమెకు శాలువా కప్పి ఘనంగా స న్మానించారు. కార్యక్రమంలో పలువురు నాయ కులు, అర్చకులు తదితరులు పాల్గొన్నారు. -
బాహుబలిపై మీరేమంటారు?
సాక్షిప్రతినిధి,కరీంనగర్: సింగరేణి సంస్థ ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న రామగుండం కోల్మైన్ ఏర్పాటులో ముందడుగు పడింది. సింగరేణి చరిత్రలోనే అతిపెద్ద భారీ ఓపెన్కాస్ట్ ప్రాజెక్టు లేదా బాహుబలి ఓపెన్కాస్ట్గా పిలుస్తోన్న రామగుండం కోల్మైన్ కోసం గురువారం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (పీసీబీ) ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించనున్నారు. మంథని జేఎన్టీయూ వేదికగా జరగనున్న ఈ కార్యక్రమానికి పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరవనున్నారు. ప్రాజెక్టు కోసం మొత్తం 4,326.08 హెక్టార్ల భూమి అవసరం అవనుంది. ప్రస్తుతం సింగరేణి వద్ద 3,266.88 హెక్టార్ల వరకు భూమి అందుబాటులో ఉంది. (అందులో 397.9 హెక్టార్ల అటవీ భూమి, 2,868 అటవీయేతర భూమి) అదనంగా 1,059.2 హెక్టార్ల భూమి (అందులో 305 హెక్టార్ల అటవీ భూమి, 753 హెక్టార్లు అటవీయేతర భూమి) అవసరం అవుతుంది. ఈ భూమి కూడా ఇప్పటికే సింగరేణి పరిధిలోనే ఉంది. రామగుండం కోల్మైన్ అనేది భారీ ప్రాజెక్టు. ఇందులో నాలుగు ఆపరేటివ్ మైన్స్ విలీనమవుతున్నాయి. అందులో రామగుండం ఓపెన్కాస్ట్ –1, ఎక్స్టెన్షన్ ఫేజ్–2, రామగుండం ఓపెన్కాస్ట్–2, అడ్రియాల షాప్ట్ అండర్గ్రౌండ్ కోల్మైనింగ్ ఎక్స్టెన్షన్ ప్రాజెక్టు, వకీల్పల్లి మైన్తోపాటు మూసివేసిన 10వ ఇంక్లైన్ గనులను కలిపి భారీ ఓపెన్కాస్ట్ ప్రాజెక్టుగా ఆవిర్భవించనుంది. ఇలాంటి ప్రాజెక్టు సింగరేణి చరిత్రలోనే అతిపెద్ద ప్రాజెక్టుగా సరికొత్త రికార్డు సృష్టించనుంది. పర్యావరణ సమస్యలపైనే ప్రజాభిప్రాయం.. బాహుబలి గనినుంచి దాదాపు 600 మిలియన్ టన్నుల వరకు బొగ్గు నిక్షేపాలను తీయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. దాదాపు 30 ఏళ్లపాటు ఏటా 21 మిలియన్ టన్నులపాటు బొగ్గును ఉత్పత్తి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రాజెక్టులో భాగంగా మూసివేసిన 10 ఇంక్లైన్ భూగర్భ గనిని ఓపెన్కాస్ట్గా మార్చనున్నారు. అనంతరం ప్రస్తుతం భూగర్భగనిగా పనిచేస్తున్న వకీల్పల్లి మైన్ను కూడా ఓపెన్కాస్ట్గా మారుస్తారు. ఇంతటి భారీ గని కారణంగా చుట్టుపక్కల పల్లెల్లో ప్రజలు దుమ్ము, ధూళితో తీవ్ర ఇబ్బందులు పడతారని, వ్యవసాయం, పాడిపంటలు, సంప్రదాయల కులవృత్తులు, జీవనోపాధులు దెబ్బతింటాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్నేళ్లక్రితం ఈ ప్రాజెక్టు కోసం తమ గ్రామాల్లో భూసేకరణ చేసేటప్పుడు పునరావాసంతోపాటు, సింగరేణిలో కొలువులు కల్పిస్తామన్న అధికారులు ఇంతవరకూ మాట నిలబెట్టుకోలేదని ఆయా గ్రామాల ప్రజలు గుర్తుచేస్తున్నారు. పర్యారవణం మాట అటుంచితే.. తమకు బతుకుదెరువు కరువైందని వాపోతున్నారు. అదే సమయంలో సాధారణంగా విద్యుదుత్పత్తి కోసం టన్ను బొగ్గును కాల్చినప్పుడు దానిలోని కార్బన్, ఆక్సిజన్తో కలిసి సుమారు 2.2 నుంచి 2.9 టన్నుల కార్బన్ డయాకై ్సడ్ను విడుదల చేస్తుంది. ఇదీకాక ఆమ్లవర్షాలకు కారణమైన సల్ఫర్ డైయాకై ్సడ్, నైట్రోజన్ ఆకై ్సడ్ ఉద్గారాలకు కూడా కారణమవుతుందని పర్యావరణవేత్తలు ఆందోళన చెందుతున్నారు. ప్రభావిత గ్రామాల ప్రజల ప్రధానమైన డిమాండ్లు ● దుమ్ముతో వస్తున్న శ్వాసకోశ వ్యాధుల నివారణకు చర్యలు తీసుకోవాలి ● ఓపెన్కాస్టు ప్రాజెక్టులో బ్లాస్టింగ్ల వల్ల ప్రభావిత గ్రామమైన జూలపల్లి, ముల్కలపల్లి గ్రామాల ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారు ● కిడ్నీల సమస్యలతోపాటు వివిధ రకాలుగా రోగాలకు గురవుతూ అనారోగ్యాల బారిన ప్రజలు పడుతున్నారు ● సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో ముల్కలపల్లి గ్రామాన్ని ఆనుకుని ఏర్పాటు చేసిన సోలార్ ప్లాంట్ రేడియేషన్ వల్ల కూడా ప్రజలు అనారోగ్యాల పాలవుతున్నారు ● భూసేకరణ వల్ల నిర్వాసితులైన గీత కార్మికులు, ఇతర నిరుద్యోగులకు జీవనోపాధి, వైద్యసదుపాయాలను కల్పించలేదు ● సింగరేణి విడుదల చేసే డీఎంఎఫ్టీ నిధులను కేవలం ప్రభావిత గ్రామాల అభివృద్ధికి మాత్రమే దోహదపడేలా చర్యలు తీసుకోవాలి. నేడు మంథని జేఎన్టీయూలో పీసీబీ ప్రజాభిప్రాయసేకరణ హాజరవుతున్న పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తొమ్మిది గ్రామాల్లో భూమి.. వెయ్యి హెక్టార్లలో ప్రాజెక్టు ఏటా 21 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యం ప్రాజెక్టుపై పర్యావరణవేత్తలు, స్థానికుల ఆందోళన -
60 ఏళ్ల ప్రాక్టీస్
వైద్య ఉమాశంకర్ ఊరిలో తొలి న్యాయవాది. 1965 నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు. ఎల్లారెడ్డిపేట మక్తల్ తహసీల్దార్గా వ్యవహరించిన తండ్రి వీరప్ప తన ఆరేళ్ల వయసులో కన్నుమూశారు. ఆ వారసత్వాన్ని కొనసాగించేందుకు, పురిటిగడ్డను వీడకుండా న్యాయవాద వృత్తిని ఎంచుకుని సివిల్ కేసుల్లో సిద్ధహస్తుడిగా పేరు తెచ్చుకున్నారు. నిరంతర శ్రమతో సామాన్యులకు న్యాయం చేయాలన్న సదుద్దేశంతో సాధన చేస్తే మంచి అడ్వకేట్గా మారొచ్చు అనేది ఈ తరానికి ఆయన ఇచ్చే సందేశం. – వైద్య ఉమాశంకర్ ఉద్యమస్ఫూర్తితో.. 1988లో న్యాయవాదిగా నమోదై.. ఆరేళ్లు ప్రాక్టీస్ చేశారు. 1994 మేలో పీపీగా, జ్యుడీషియల్ ఆఫీసర్గా ఎంపికయ్యారు. నంద్యాలలో తొలి పోస్టింగ్. రాష్ట్రం విడిపోకముందే తెలంగాణ న్యాయమూర్తుల సంఘాన్ని స్థాపించి తొలి ప్రధాన కార్యదర్శిగా ఉద్యమాలకు నేతృత్వం వహించారు. పదేళ్లపాటు హైకోర్టు ఉమ్మడిగా ఉండాలన్న నిర్ణయంపై.. న్యాయవ్యవస్థ కూడా వేరుపడాలని 2015లో సుప్రీంకోర్టులో రిట్వేశాం. 2016లో 250 మంది న్యాయమూర్తులు కలిసి మహాధర్నా నిర్వహించారు. దీంతో సస్పెన్షన్కు గురయ్యారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆదేశాలు, అప్పటి గవర్నర్ చొరవతో నెల రోజుల తరువాత సస్పెన్షన్ ఎత్తేశారు. తీవ్రమైన న్యాయ సంక్షోభాన్ని సృష్టించడంతో రెండు నెలల్లో న్యాయవ్యవస్థను విభజించాలంటూ 2018 అక్టోబర్లో సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. 2019లో అమలులోకి వచ్చింది. 2024 జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా పదవీ విరమణ చేశారు. – వైద్య వరప్రసాద్, విశ్రాంత న్యాయమూర్తి -
చోరీల నియంత్రణకు చర్యలు
గోదావరిఖని: సింగరేణి ఆస్తుల పరిరక్షణ, చోరీల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ బాలరాజు సూచించారు. బాధ్యతలు స్వీకరించాక తొలిసారి ఆ యన గురువారం ఆర్జీ–2 ఏరియాలో పర్యటించారు. జీఎం వెంకటయ్య ఆయనను ఘనంగా స న్మానించారు. అనంతరం ఏరియాలో పర్యటించి భ ద్రతపై ఆరా తీశారు. సెక్యూరిటీ అధికారులతో సమావేశమయ్యారు. భద్రతా సిబ్బంది పనితీరు, విధుల నిర్వహణలో ఎదురవుతున్న ఆటంకాలు, అవసరమైన సౌకర్యాలు తదితర అంశాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. భద్రతా సిబ్బంది విధుల్లో అప్రమత్తత, క్రమశిక్షణ, అత్యంత కీలకమని, సంస్థ ఆస్తుల పరిరక్షణ ప్రధాన ధ్యేయంగా పనిచేయాలని అన్నారు. ఎస్వోటూ జీఎం రాముడు, పర్సనల్ డీజీఎం అరవిందరావు, ఐఈడీ డీజీఎం చంద్రశేఖర్, సెక్యూరిటీ ఆఫీసర్ షరీఫ్ మహమ్మద్ తదితరులు ఉన్నారు. ఓసీపీల జీఎంకు సన్మానం రామగుండం డివిజన్–2 పరిధిలోని ఓసీపీ–3ని కార్పొరేట్ ఓసీపీల జీఎం ఎలీషా సందర్శించారు. యంత్రాలను తనిఖీ చేసి పనితీరు గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జీఎం కార్యాలయంలో జీఎం వెంకటయ్య ఎలీషాను శాలువాతో ఘనంగా సన్మానించారు. సింగరేణి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ బాలరాజు ఆర్జీ–2 ఏరియాలో విస్తృత పర్యటన -
సింగరేణి ‘పొదుపు మంత్రం’
ఏరియాల వారీగా కేటాయించిన బడ్జెట్(రూ.లక్షల్లో) గోదావరిఖని: సింగరేణి బొగ్గు గనుల సంస్థ ఆవిర్భావ వేడుకలను సాదాసీదాగా నిర్వహించాలని యాజమాన్యం నిర్ణయించింది. గతంలో ఎంతోహంగూ ఆర్భాటాలతో ఉత్సవాలు నిర్వహించగా.. ఈసారి జీఎం కార్యాలయాలకే పరిమితం చేయాలని ఆదేశాలు జారీచేసింది. ఒక్కో ఏరియాకు గతంలో కేటాయించిన బడ్జెట్లో 70శాతం కోత విధిస్తూ నిర్ణయం తీసుకుంది. రూ.3.38లక్షల నుంచి రూ.60వేలకు.. ఆర్జీ–1 ఏరియాకు గతంలో రూ.3.38లక్షలు కేటాయించగా తాజాగా రూ.60వేలు కేటాయిస్తూ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు కొనసాగిన సీఎండీ ఎన్.బలరాం స్థానంలో కొత్త సీఎండీగా ఐఏఎస్ అధికారి దేవరరకొండ కృష్ణభాస్కర్ను రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈక్రమంలో సింగరేణి ఆర్థిక వనరులను పొదుపుగా వినియోగించుకోవాలనే ఆలోచనతో ఈనిర్ణయం తీసుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. తాజా సర్క్యులర్ ప్రకారం సింగరేణి మొత్తమ్మీద 15ప్రాంతాలకు రూ.8లక్షలు మాత్రమే కేటాయిస్తూ యాజమాన్యం ఆదేశాలు జారీచేయడం గమనార్హం. గతంలో ఒక్కో ఏరియాకు రూ. 3.50లక్షల వరకు కేటాయించే పద్దతి కొనసాగిది. ఘనంగా నిర్వహించాలని నిర్ణయించినా.. వాస్తవానికి సింగరేణి ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించాలని భావించి గతనెల 29న ఏరియాల వారీగా బడ్జెట్ కేటాయిస్తూ యాజమాన్యం ఆదేశాలు జారీచేసింది. ఆ సర్క్యులర్ ప్రకారం.. సింగరేణిలోని అన్ని ఏరియాల్లో ఆటలు, వెల్బేబీ షో, ఉత్తమ గృహాలు, దీపాలంకరణ తదితర పోటీలను ఏరియాల వారీగా నిర్వహించారు. ఇంకాకొన్ని పోటీలు నిర్వహించాల్సి ఉంది. ఈలోగా తాజా జీవోతో ఉత్కంఠ నెలకొంది. తలలు పట్టుకుంటున్న అధికారులు.. పాత ఉత్తర్వుల ప్రకారం.. ఏరియాల వారీగా ఇప్పటికే వివిధ పోటీలు నిర్వహించారు. ఇందులో వెల్బేబీ షో, ఉత్తమ గృహాలంకరణ, ఎన్విరాన్మెంట్ క్వార్టర్లు, బెస్ట్సేవా సభ్యులు తదితర పోటీల్లో విజేతలను కూడా ఎంపిక చేశారు. గత బడ్జెట్ పూర్తిగా తగ్గించడంతో ఇప్పటివరకు నిర్వహించిన పోటీలకు బడ్జెట్ ఎలా సరిపెట్టాలనే ఆలోచనలో అధికారులు ఉన్నారు. నిధుల్లో కోత విధించడంతో వేడుకలపై ప్రభావం ఉంటుందని అధికారులు తలలు పట్టుకుంటున్నారు. సంబంధం లేని ఆటలకు రూ.10కోట్లు? సింగరేణికి సంబంధం లేని ఆటలకు సింగరేణి యాజమాన్యం రూ.10కోట్లు కేటాయించిందని, సింగరేణి ఆవిర్భావ వేడుకల కేటాయించే నిధుల్లో భారీగా కోత పెట్టిందని కార్మిక సంఘాలు తప్పు పడుతున్నాయి. గతంలో మాదిరిగానే సింగరేణి డే ఘనంగా నిర్వహించాలని గుర్తింపు యూనియన్ నాయకులు, కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ఏరియా గతం ప్రస్తుతం కార్పొరేట్ – 1.00 కొత్తగూడెం 3.38 0.60 ఇల్లెందు 2.25 0.50 మణుగూరు 3.38 0.60 భూపాలపల్లి 3.38 060 ఆర్జీ–1 3.38 0.60 ఆర్జీ–2 2.82 0.55 ఆర్జీ–3, ఏఎల్పీ 2.82 0.55 బెల్లంపల్లి 2.25 0.50 మందమర్రి 3.38 0.60 శ్రీరాంపూర్ 3.38 0.60 హైదరాబాద్ 0.56 0.20 సత్తుపల్లి – 0.50 నైనీ – 0.35 ఎస్టీపీపీ 0.67 0.25 మొత్తం 31.65 8.00 సాదాసీదాగానే సింగరేణి ఆవిర్భావ వేడుకలు జీఎం కార్యాలయ ఆవరణల్లోనే ఉత్సవాల నిర్వహణకు ఆదేశాలు బడ్జెట్ కేటాయింపులు తగ్గించిన యాజమాన్యం -
జాతర పనులు పూర్తిచేయాలి
గోదావరిఖని: గోదావరి తీరంలోని సమ్మక్క– సారలమ్మ జాతర వద్ద సుమారు రూ.6కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులు త్వరగా పూర్తిచేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. సమ్మక్క గద్దెలను కలెక్టర్ గురువారం సందర్శించారు. మున్సిపల్, ఎన్టీ పీసీ, సింగరేణి అధికారులతో సమన్వయం చేసుకుంటూ పనులు పూర్తిచేయాలన్నారు. వచ్చే ఏడాది జనవరి 28, 29, 30, 31వ తేదీల్లో గిరిజన దేవతల జాతర జరుగుతుందని అన్నారు. గోదావరినది ఒడ్డున ఉన్న శ్మశానవాటిక అభివృద్ధి కోసం డీపీఆర్ తయారు చేయాలని సూచించారు. అశోక్నగర్ బాలికల హైస్కూల్ అభివృద్ధికి రూ.కోటి మంజూరు చేశామని, డిజైన్ ప్రకారం నెల రోజుల్లోగా పనులు పూర్తిచేయాలన్నారు. ఆర్జీ –వన్ జీఎం లలిత్కుమార్, సింగరేణి శ్రీనివాస్ పాల్గొన్నారు. 22లోగా ప్రతిపాదనలు పంపించాలి పెద్దపల్లి: జిల్లాలోని గోదావరిఖని, గోలివాడ ప్రాంతాల్లో జరిగే సమ్మక్క – సారలమ్మ జాతర ఏర్పాట్లపై ఈనెల 22లో ప్రతిపాదనలు సమర్పించాలని కలెక్టర్ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. తన కార్యాలయంలో జాతర నిర్వహణపై ఆయన సమీక్షించారు. పారిశుధ్యం నిర్వహణ, రోడ్లు, విద్యుత్, తాగునీరు, సిబ్బందికి భోజన వసతి తదితర సౌకర్యాలు కల్పించాలని సూచించారు. ఆర్డీవో గంగయ్య, కరీంనగర్ దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సుప్రియ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ కోయ శ్రీహర్ష -
బుధవారంపేటను స్వాధీనం చేసుకోవాలి
రామగిరి(మంథని): సింగరేణి సంస్థ ఓసీపీ–2 విస్తరణలో భాగంగా బుధవారంపేట గ్రామాన్ని స్వాధీనం చేసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. గురువారం సర్వేకు వచ్చిన సింగరేణి అధికారులను వారు అడ్డుకున్నారు. సుమారు 15ఏళ్లుగా సింగరేణి సంస్థ తమ గ్రామంపై వివక్ష చూపిస్తోందని ధ్వజమెత్తారు. తమ పంచాయతీ పరిధిలోని మొత్తం వ్యవసాయ భూములు, గ్రామాన్ని పూర్తిస్థాయిలో స్వాధీనం చేసుకుని మెరుగైన పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆర్అండ్ఆర్ ద్వారా అన్ని వసతులతో కొత్త గ్రామాన్ని నిర్మించి తగిన న్యాయం చేయకుంటే సింగరేణి సంస్థ నిర్వహించే పనులను అడ్డుకుంటామని హెచ్చరించారు. తమ గ్రామాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకొని సౌకర్యాలు కల్పిస్తేనే సర్వేకు సహకరిస్తామని తేల్చిచెప్పారు. అప్పటివరకు అధికారులు, సింగరేణికి సహకరించేది లేదని హెచ్చరించారు. చేసేదిలేక సర్వేకు వెళ్లిన అధికారులు వెనక్కి వచ్చేశారు. -
ఇసుక దందా కోసమే చెక్డ్యాంల పేల్చివేత
మంథనిరూరల్: కాంగ్రెస్ నాయకులు ఇసుక దందా కోసమే మానేరులోని చెక్డ్యాం పేల్చివేశారని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ ఆరోపించారు. బుధవారం కొట్టుకుపోయిన అడవిసోమన్పల్లి మానేరు చెక్డ్యాంను గురువారం ఆయన పరిశీలించి మాట్లాడారు. ఇక్కడ చెక్డ్యాం కట్టొద్దని మంథని ఎమ్మెల్యే శ్రీధర్బాబు ప్రెస్మీట్లలో చెప్పారని గుర్తుచేశారు. ఈక్రమంలో.. చెక్డ్యాం ఉంటే ఇసుక తీసుకోవడం ఇబ్బందిగా ఉంటుందని భావించి కాంగ్రెస్ నాయకులు పేల్చివేసినట్లు కనిపిస్తోందని ధ్వజమెత్తారు. 12 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహాన్ని కూడా తట్టుకుని నిలబడిన చెక్డ్యాం.. లక్ష్య క్యూసెక్కుల నీటి నిల్వకు ఎలా కొట్టుకుపోతుందో కాంగ్రెస్ నాయకులే సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. మంథని ఎమ్మెల్యేకు చిత్తశుద్ధి ఉంటే విచారణ జరిపి దోషులను శిక్షించాలని, చెక్డ్యాం పునర్మించాలని ఆయన డిమాండ్ చేశారు. నాయకులు ఏగోళపు శంకర్గౌడ్, తగరం శంకర్లాల్, కనవేన శ్రీనివాస్, మాచిడి రాజుగౌడ్, సంపత్, నాగరాజు, నరేందర్ తదితరులు పాల్గొన్నారు. త్వరలో పరిశీలిస్తా.. మాజీ మంత్రి హరీశ్రావు అడవిసోమన్పల్లి చెక్డ్యాంను త్వరలో పరిశీలిస్తా నని మాజీమంత్రి హరీశ్రావు తెలిపారు. చెక్డ్యాం క్షేత్రస్థాయి పరిస్థితిని మధూకర్ వీడియో కాల్ ద్వారా ఆయనకు సూపించడంతో స్పందించారు. బీఆర్ఎస్ను అభాసుపాలు చేసేందుకు కుట్ర మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ -
తెలుగులో తీర్పుతో గుర్తింపు
1986 నుంచి కరీంనగర్లో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తూనే 1992లో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పరీక్షలో విజయం సాధించారు గొట్టె రవీందర్. ఆదిలాబాద్, సిర్పూర్, వరంగల్లో విధులు నిర్వర్తించారు. పదోన్నతిపై సీనియర్ ఏపీపీగా నర్సంపేటలో బాధ్యతలు నిర్వహిస్తూ 2004లో తిరిగి జ్యుడీషియల్ ఆఫీసర్గా ఎంపికయ్యారు. కర్నూలు, డోన్లో పనిచేశారు. సీనియర్ సివిల్ జడ్జిగా 2013లో హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు, నాంపెల్లి కోర్టులో విధులు నిర్వహించి పదవీ విరమణ పొందారు. తెలుగులో తీర్పునిచ్చిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. – గొట్టె రవీందర్, విశ్రాంత న్యాయమూర్తి సేవ చేయాలన్న సంకల్పంతో.. విద్యార్థి దశ నుంచే నెహ్రూ యువకేంద్రం ద్వారా సామాజిక సేవలపై ఆసక్తి పెరిగింది ఆసాని జ యశ్రీకి. టీచర్గా పనిచేసిన తండ్రి రాజారెడ్డి స్వ చ్ఛంద సేవలే స్ఫూర్తిగా న్యాయవిద్యను పూర్తి చే శారు. 1996లో న్యాయవాదిగా నమోదై.. మెట్పల్లిలో నాలుగేళ్లపా టు ప్రాక్టీస్ చేశారు. అనంతరం కుటుంబంతోపాటు కరీంనగర్కు షి ఫ్ట్ అయ్యారు. స్థానికసంస్థల్లో సర్పంచ్లు, వార్డుసభ్యులకు పలు మార్లు శిక్షణ ఇచ్చారు. జ్యుడీషియల్ శాఖలోకి 2015లో అడుగుపెట్టి పెద్దపల్లి, కరీంనగర్, ప్రస్తుతం సిరిసిల్లలో పనిచేస్తున్నారు. – ఆసాని జయశ్రీ, స్పెషల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ సెకండ్ క్లాస్ -
అయ్యో.. పాపం
పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి మండలం గోపయ్యపల్లి, ముత్తారం, రాఘవాపూర్ సర్పంచ్ పదవికి గత ఎన్నికల్లో పోటీపడి పరాజితులైన అభ్యర్థులే ఈసారి మళ్లీ బరిలో నిలిచి తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. గోపయ్యపల్లి పంచాయతీ సర్పంచ్కు పోటీపడ్డ బానోత్ అంజినాయక్ గత ఎన్నికల్లో అత్యల్ప ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. ఈసారి ఓటర్లు కరుణించి సర్పంచ్ పీఠం అధిష్టించే అవకాశాన్ని కల్పించారు. రాఘవాపూర్ సర్పంచ్ స్థానానికి పోటీపడ్డ తాడిచెట్టి చామంతి భర్త శ్రీకాంత్ గతంలో సర్పంచ్, ఎంపీటీసీగా ఓడిపోయారు. ఈసారి మహిళలకు అవకాశం దక్కడంతో ఆయనభార్య చామంతిని బరిలో నిలిపి ఒక్క అవకాశం ఇవ్వాలని అభ్యర్థించారు. ఓటర్లు శ్రీకాంత్పై సానుభూతిని చూపి ఆయన సతీమణి చామంతిని ప్రథమ పౌరురాలిగా ఎన్నుకున్నారు. ముత్తారం పంచాయతీ సర్పంచ్ స్థానానికి గతంలో పోటీపడ్డ మాజీ ఎంపీటీసీ నల్లగొండ కుమార్.. ఈసారి మళ్లీ బరిలోకి దిగి ప్రజలతో తన బాధను పంచుకున్నారు. సోషల్మీడియాలో చేసిన ప్రచారం చూసిన ఓటర్లు సానుభూతితో కుమార్ను సర్పంచ్గా అవకాశం కల్పిస్తూ తీర్పునిచ్చారు. ఏదేమైనా ఈసారి కొందరు అభ్యర్థులకు సెంటిమెంట్ పవనాలు వీయడంతో సర్పంచ్ గిరీ దక్కిందంటూ చర్చించుకుంటున్నారు. ఫలించిన సానుభూతి మంత్రం గత ఎన్నికల పరాజితులు.. నేడు విజేతలు -
ఉపసర్పంచ్ పదవికి వేలం
● ఇరువర్గాల మధ్య స్వల్ప ఉద్రిక్తత ● రంగంలోకి దిగిన పోలీసులు ధర్మపురి: ధర్మపురి మండలం కమలాపూర్లో బుధవారం నిర్వహించిన పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్గా కుమ్మరి తిరుపతి గెలుపొందారు. ఉపసర్పంచ్ పోటీలో ఉన్న కొందరు తనకంటే తనకు అంటూ రసాభాస చేశారు. ఇరువర్గాల మధ్య మాటల యుద్ధం నడిచి స్వల్ప ఉద్రిక్తతకు దారి తీసింది. ఉపసర్పంచ్ పదవికి రూ.25 వేల నుంచి రూ.లక్ష వరకు ఇస్తామంటూ వేలానికి దిగారు. విషయం తెలిసిన వెంటనే సీఐ రాంనర్సింహరెడ్డి ఆధ్వర్యంలో ఎస్సైలు చేరుకుని గొడవను సద్దుమణిగేలా చేశారు. ఇరువర్గాలకు నచ్చజెప్పారు. రోడ్డు ప్రమాదంలో రిటైర్డ్ కార్మికుడికి గాయాలు జూలపల్లి (పెద్దపల్లి): అబ్బాపూర్ గ్రామానికి చెందిన సింగరేణి రిటైర్డ్ కార్మికుడు బొమ్మెనవేని చంద్రయ్య బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. పనినిమిత్తం అబ్బాపూర్ నుంచి జూలపల్లికి వెళ్లి ద్విచక్రవాహనంపై తిరిగి వస్తున్నాడు. ఈక్రమంలో స్థానిక కొచ్చెరువుకు సమీపంలో ఆటోను తప్పించబోయి అదుపుతప్పి పడిపోయాడు. ఈఘటనలో కాలితీవ్రగాయమైంది. స్థానికుల సమాచారంతో 108 వాహనం సిబ్బంది ఆరె సతీశ్, ఈఎంటీ, పైలెట్ శ్రీనివాస్ వెంటనే ఘటనా స్థలానికి చేరకున్నారు. ప్రథమ చికిత్స అనంతరం కరీంనగర్లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
ఉద్యాన రైతుకు చేయూత
కరీంనగర్రూరల్: వ్యవసాయానికి అనుబంధంగా ఉద్యాన రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆధునిక పద్ధతులు, ఎక్కువ విస్తీర్ణంలో ఉద్యాన పంటలను రైతులు సాగు చేసేందుకు వీలుగా యాంత్రీకరణకు ప్రాధాన్యమిస్తోంది. రైతులపై పడుతున్న ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం సబ్సిడీపై వ్యవసాయ పరికరాలను అందిస్తోంది. దీనిలో భాగంగా కరీంనగర్ జిల్లాకు 86 యూనిట్లు మంజూరు చేసింది. దశాబ్దం తర్వాత.. గతంలో వ్యవసాయంతోపాటు ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో రైతులకు సబ్సిడీపై వ్యవసాయ పరికరాలను పంపిణీ చేశారు. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతుబంధు పంపిణీ చేస్తున్నారనే సాకుతో సబ్సిడీ పరికరాల పంపిణీ కార్యక్రమాన్ని నిలిపేశారు. దీంతో పలువురు రైతులు ప్రైవేట్గా పరికరాలను కొనుగోలు చేయడంతో ఆర్థికంగా భారం పడింది. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో తిరిగి సబ్సిడీ పరికరాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టింది. జిల్లాకు 86 యూనిట్లు మంజూరు కాగా.. అర్హులైన రైతుల నుంచి ఉద్యాన శాఖ అధికారులు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఇప్పటివరకు 49 మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారని అధికారులు తెలిపారు. యంత్ర పరికరాలకు సంబంధించి ప్రభుత్వం పలు కంపెనీలతో ఒప్పందాలను చేసుకుంది. పరికరాల కొనుగోలుపై 5 ఎకరాల్లోపు సన్న, చిన్నకారు రైతులకు 50 శాతం, 5 ఎకరాలకు పైగా భూమి ఉన్న రైతులకు 40 శాతం సబ్సిడీని అందిస్తారు. ప్రభుత్వం సబ్సిడీపై ఉద్యాన రైతులకు యంత్ర పరికరాలను అందిస్తోంది. ప్రభుత్వం సబ్సిడీ నిధులను మంజూరు చేసింది. పరికరాలు అవసరమున్న రైతులు దరఖాస్తు చేసుకోవాలి. – అయిలయ్య, ఉద్యాన శాఖ అధికారి, ఉమ్మడి కరీంనగర్ మండలంపవర్ వీడర్లు: 18, బ్రష్ కట్టర్లు: 29 పవర్ స్ప్రేయర్లు: 27, పవర్ టిల్లర్లు: 9 మినీ ట్రాక్టర్లు: 3 -
వేతనం.. సతమతం..
కరీంనగర్ అర్బన్: ఒక నెల వేతనం రాకుంటే అల్లాడే కుటుంబాలు ఎన్నో. అలాంటిది 2 నెలలుగా వేతనాల్లేక పడిగాపులు కాస్తున్నారు. ఉపాధిహామీ పథకంలో పని చేసే కాంట్రాక్టు ఉద్యోగుల బాధలు వర్ణనాతీతం. ఓవైపు పిల్లల స్కూలు ఫీజులు.. మరోవైపు నిత్యావసరాలకు డబ్బుల్లేక ఇబ్బందులు పడుతున్నారు. వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తూ అవసరాలు తీర్చుకుంటుండగా.. వడ్డీ తడిసి మోపెడవుతోందని వాపోతున్నారు. సాంకేతిక కారణాలను బూచిగా చూపుతూ ప్రభుత్వం వేతనాలను మంజూరు చేయడకపోవడం ఆందోళనకర పరిణామం. జీతాలపై అధికారులను అడిగినా సరైన స్పందన లేకపోవడంతో ఉపాధిహామీ కాంట్రాక్టు ఉద్యోగులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. రెండేళ్లుగా మూడు నెలలు, నాలుగు నెలలకోసారి వేతనమిస్తూ ఉద్యోగులను ఇక్కట్లకు గురి చేస్తున్నారు. ఆపరేటర్ నుంచి ఏపీవో వరకు.. జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో పని చేసేందుకు కాంట్రాక్టు పద్ధతిలో ఏపీవో, ఈసీ(ఇంజనీరింగ్ కన్సల్టెంట్), టెక్నికల్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్లను ప్రభుత్వం అప్పట్లో నియమించుకుంది. జిల్లాలో ఏపీవోలు 15, ఆరుగురు ఈసీలు, 38 మంది టెక్నికల్ అసిస్టెంట్లు, 274 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు, 20 మంది కంప్యూటర్ ఆపరేటర్లున్నారు. జిల్లాలో మొత్తంగా 350 మంది ఉపాధిహామీ కాంట్రాక్టు ఉద్యోగులు పని చేస్తున్నారు. వీరికి ప్రతి నెల క్రమం తప్పకుండా వేతనం వేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. అయితే రెండు నెలల నుంచి జీతం రావడం లేదు. వేతనాలకు సంబంధించి స్పర్స్ సాఫ్ట్వేర్లో తలెత్తిన లోపాల కారణంగా రావడం లేదని తెలుస్తోంది. వేతనాలు రాకున్నా ప్రభుత్వం మాత్రం పట్టనట్లు వ్యవహరిస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రూ.కోటి పైనే.. ఉపాధిహామీలో పని చేసే కంప్యూటర్ ఆపరేటర్లకు రూ.18,000 నుంచి రూ.20వేలు, ఫీల్డ్ అసిస్టెంట్లకు రూ.11,500, టెక్నికల్ అసిస్టెంట్లకు రూ.25వేల నుంచి రూ.30వేలు, ఈసీలు, ఏపీవోలకు రూ.50వేల వరకు వేతనాలిస్తున్నారు. వీరికి నెలకు సుమారు రూ.50.25లక్షల చొప్పున 2 నెలలకు గాను రూ.1.05కోట్లు వేతనాలు పెండింగ్లో ఉన్నాయి. తగ్గని టార్గెట్లు.. వేతనాలు పెండింగ్లో ఉన్నా.. విధుల్లో మాత్రం తేడా రావొద్దంటూ గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు విధిస్తున్న టార్గెట్ ఫీల్డ్, టెక్నికల్ అసిస్టెంట్లు, ఈసీ, ఏపీవోలను మరింత ఇబ్బందికి గురి చేస్తున్నాయి. క్షేత్రస్థాయిలో ఫీల్డ్, టెక్నికల్ అసిస్టెంట్లదే కీలకపాత్ర. గ్రామాల్లో ఉపాధిహామీ కింద పనులు చేయించడం ఫీల్డ్ అసిస్టెంట్ల బాధ్యత కాగా.. చేపట్టిన పనులను క్షేత్రస్థాయికి వెళ్లి కొలతలు వేయాల్సిన బాధ్యత టెక్నికల్ అసిసెంట్లపై ఉంటుంది. కొలతలకు సంబంధించి ఎంబీ రికార్డులు తయారు చేసి ఆన్లైన్లో నమోదు చేయాల్సిన బాధ్యత టీఏలపై ఉంటుంది. టెక్నికల్ అసిస్టెంట్లు వేసిన కొలతల ఆధారంగానే కూలీలకు వేతనాలు వస్తాయి. పని తక్కువ చేసిన కూలీకి తక్కువ, పని ఎక్కువ చేసిన కూలీకి ఎక్కువ డబ్బులు వస్తుంటాయి. కూలీలకు రూ.300 వేతనం కచ్చితంగా రావాలన్న అధికారుల ఆదేశాలు టీఏలకు తలనొప్పులు తెచ్చి పెడుతున్నాయి. గత ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన గిరిజన తండాలు, పంచాయతీల్లో క్షేత్ర సహాయకులను నియమించకపోవడంతో ఆ పని భారం టీఏలపై పడుతోంది. ఒక్కో గ్రామంలో కనీసం పది ప్రాంతాల్లో కూలీలు పనులు చేస్తున్నారు. ఆ ప్రదేశాలను సందర్శించాలంటే సమయం సరిపోని పరిస్థితి. 2 నెలలుగా అందని వైనం ఆందోళనలో ‘ఉపాధి’ ఉద్యోగులు -
ఫలించిన సాఫ్ట్వేర్ ఉద్యోగి కల
సుల్తానాబాద్రూరల్: సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి స్వగ్రామాన్ని అభివృద్ధి చేయడంతోపాటు నిరుద్యోగ యువతకు ఏఐ టెక్నాలజీతో ఉద్యోగ అవకాశాలు కల్పించేలా చూస్తానాని హామీ ఇచ్చిన సాఫ్ట్వేర్ ఉద్యోగిని సర్పంచ్ పీఠం వరించింది. నీరుకుల్ల(కొమండపల్లి)కి చెందిన కాంపెల్లి సతీశ్కుమార్ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. నీరుకుల్ల సర్పంచ్ రిజర్వేషన్ అనుకూలించడంతో సర్పంచ్గా పోటీచేశాడు. పోటీలో ఆరుగురు ఉన్నా.. బుధవారం జరిగిన ఎన్నికల్లో గ్రామస్తులు సాఫ్ట్వేర్ ఉద్యోగికే పట్టం కట్టారు. సతీశ్కుమార్ మాట్లాడుతూ, యువత, నిరుద్యోగుల కోసం ముందుగా గ్రంథాలయాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. -
కాంట్రాక్టు కార్మికుడి ఆత్మహత్య
గోదావరిఖని: పెద్దపల్లి జిల్లా గోదావరిఖని విజయ్నగర్లో నివాసముంటూ మంచిర్యాల జిల్లా జైపూర్ ఎస్టీపీపీలో కాంట్రాక్టు కార్మికుడిగా పనిచేస్తున్న ఆవుల రమేశ్(50) బుధవారం ఉరివేసుకుని మృతి చెందినట్లు వన్టౌన్ ఏఎస్సై వెంకటేశ్వరబాబు తెలిపారు. ఏడాదిన్నర క్రితం భార్య పుట్టింటికి వెళ్లిపోగా, తల్లితో కలిసి నివాసముంటున్నాడు. భార్య కాపురానికి రావడంలేదని తాగుడుకు బానిసై జీవితంపై విరక్తి చెంది ఇంట్లో ఉరివేసుకుని అఘాయిత్యానికి పాల్పడినట్లు ఏఎస్సై వివరించారు. మృతుడి తల్లి ఆవుల లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. చికిత్స పొందుతూ విద్యార్థి మృతిఇల్లంతకుంట(మానకొండూర్): స్నేహితుడి పుట్టిన రోజు వేడుకలకు వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ విద్యార్థి చికిత్స పొందుతూ మృతిచెందాడు. విద్యార్థి మృతితో రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం రేపాకలో తీవ్ర విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన గుర్రం శరత్రెడ్డి(20) కరీంనగర్లో డిగ్రీ సెకండియర్ చదువుతున్నాడు. కరీంనగర్లోని తన స్నేహితుడి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనేందుకు రేపాక నుంచి సోమవారం బైక్పై మరో ఫ్రెండ్తో కలిసి వెళ్లాడు. కరీంనగర్లోని ఎల్ఎండీ వద్ద రాజీవ్ రహదారిపై స్కూటీ ఢీకొనడంతో బైక్ అదుపుతప్పి పడిపోయాడు. తీవ్రంగా గాయపడ్డ శరత్రెడ్డిని హైదరాబాద్కు తరలించి చికిత్స అందిస్తుండగా మంగళవారం రాత్రి మృతిచెందాడు. ఎల్ఎండీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బైక్ అదుపుతప్పి ఒకరి దుర్మరణం● మరొకరి పరిస్థితి విషమం కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం గంగారం గ్రామంలోని వారసంత సమీపంలో బుధవారం రాత్రి బైక్ అదుపు తప్పిన ఘటనలో ఒకరు మృతి చెందారని, మరొకరు తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. భూపాలపల్లి జిల్లా పెద్దతూండ్ల గ్రామానికి చెందిన పింగిలి బబ్బులు(25)తీవ్రగాయాలతో కాల్వశ్రీరాంపూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడని పేర్కొన్నారు. కాల్వశ్రీరాంపూర్ మండలం పెగడపల్లి గ్రామానికి చెందిన ఒజ్జం వినయ్(22) తీవ్రంగా గాయపడగా.. కరీనంగర్ తరలించారన్నారు. వినయ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదానికి అతివేగమే కారణమని భావిస్తున్నారు. బైక్ అదుపుతప్పి మోరీ గోడకు ఢీకొనడంతో ప్రమాదం సంభవించినట్లు సమాచారం. పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. -
ఎన్నికలు తెచ్చిన పంచాయితీ
తంగళ్లపల్లి(సిరిసిల్ల): ప్రశాంతంగా ఉండే ఆ పల్లెలోని ఓ వర్గంలో పంచాయతీ ఎన్నికలు కొత్త పంచాయితీని తెచ్చి పెట్టాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం చీర్లవంచలో ఇటీవల రెండో దశ స్థానిక ఎన్నికల్లో భాగంగా సర్పంచ్ ఎన్నికలు జరిగాయి. కాగా ఓ వర్గానికి సంబంధించిన అభ్యర్థి సర్పంచ్ బరిలో పోటీచేయగా ఆవర్గం వారు సదరు అభ్యర్థికే ఓటేయాలని తీర్మానించారు. సుమారు 500 ఓట్లు ఉన్న ఆ వర్గం వారి ఓట్లలో 150 వేరే అభ్యర్థికి పోల్ కావడంతో అతడు విజయం సాధించాడాని తేల్చారు. దీంతో బుధవారం గ్రామంలోని ఆలయం వద్ద పంచాయితీ నిర్వహించారు. తమ అభ్యర్థి రూ.లక్షలు ఖర్చుచేసి పోటీలో ఉంటే ఓట్లు వేరే వారికి ఎలా వేస్తారని చర్చించుకున్నారు. ఓ మహిళ దీనంతటికి కారణమని గుర్తించి ఆమెను కూడా నిలదీశారు. ప్రశాంతంగా ఉండే పచ్చని పల్లెలో ఎన్నికలు చిచ్చు రేపాయాని గ్రామస్తులు చర్చించుకుంటున్నా రు. ఈ విషయంపై పోలీసులను వివరణ కోరగా ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. -
మెడికల్ కాలేజీలో ప్రవేశాలు
కోల్సిటీ(రామగుండం): రామగుండం ప్రభుత్వ మెడికల్ కాలేజీ(సిమ్స్)లో పీజీ కోర్సుల్లో చేరేందుకు విద్యార్థులు ముందుకు వచ్చారు. నాలుగు కోర్సుల్లో 16 పీజీ సీట్లు ఉండగా ప్రస్తుతం 12 మంది చేరడానికి కౌన్సెలింగ్లో ఆప్షన్ ఎంచుకున్నారు. 50 శాతం సెంట్రల్ కోటాలో 8 పీజీ సీట్లు ఉండగా ఇప్పటివరకు ఆరుగురు, మరో 50 శాతం స్టేట్ కోటాలో 8 సీట్లు ఉండగా ఇందులో కూడా ఆరుగురు విద్యార్థులు కౌన్సెలింగ్లో రామగుండం మెడికల్ కాలేజీని ఎంపిక చేసుకున్నారు. ఇంకా నాలుగు సీట్లు ఖాళీగా ఉన్నాయని, ఇవికూడా కౌన్సెలింగ్ పూర్తయ్యేలోగా భర్తీ అవుతాయని ప్రిన్సిపాల్ నరేందర్ తెలిపారు. బుధవారం స్టేట్ కోటాలో వచ్చిన ఇద్దరు విద్యార్థులు కాలేజీలో జాయిన్ అయ్యారు. వారిలో ఆర్థోపెడిక్ జి.హర్షిల్, ఎమర్జెన్సీ మెడిసిన్ డి.వరెన్య సిమ్స్లో చేరారు. వీరికి ప్రిన్సిపాల్ జాయినింగ్ ఆర్డర్లు అందజేసి అభినందించారు. ఈనెల 25 వరకు సెంట్రల్ కోటా కౌన్సెలింగ్ గడువు ఉండగా, గురువారం వరకు స్టేట్ కోటా కౌన్సెలింగ్ ప్రక్రియకు గడువు ముగుస్తుందని ప్రిన్సిపాల్ వెల్లడించారు. వైస్ ప్రిన్సిపాల్ లావణ్య, డాక్టర్లు ప్రదీప్, భానులక్ష్మి, ఓబులేశ్ తదితరులు పాల్గొన్నారు. -
కూలగొట్టారా?
కొట్టుకుపోయిందా..మంథనిరూరల్: పెద్దపల్లి జిల్లా మంథని మండలం అడవిసోమన్పల్లి మానేరుపై నిర్మించిన చెక్డ్యాం కొట్టుకుపోవడం చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ హయాంలో మానేరుపై చెక్డ్యాం నిర్మించగా బుధవారం వేకువజామున సుమారు పది మీటర్ల పొడవున కొట్టుకుపోయింది. వరద ఉధృతికి కొట్టుకుపోయిందా? ఎవరైనా కావాలనే కూలగొట్టారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చేపలు పట్టేందుకు గ్రామానికి చెందిన కొందరు వెళ్లి వచ్చిన కాసేపటికే చెక్డ్యాం కొట్టుకు పోయిందని చెబుతున్నారు. గత నవంబర్లో జిల్లాలోని గుంపుల వద్ద చెక్డ్యాం కొట్టుకుపోవడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం విదితమే. అదే తరహాలో ఇక్కడ కూడా జరిగి ఉండవచ్చనే ప్రచారం జరుగుతోంది. జిల్లాలో 16 చెక్డ్యాంలు.. బీఆర్ఎస్ ప్రభుత్వం జిల్లాలో మానేరు నదిపై వివిధ చోట్ల 16 చెక్డ్యాంలు నిర్మించింది. ఇందుకోసం రూ.128కోట్లు వెచ్చించింది. ఇందులో మంథని మండలం అడవిసోమన్పల్లి, చిన్నఓదాల, గోపాల్పూర్ ప్రాంతాల్లో చెక్డ్యాంలు ఉన్నాయి. అడవిసోమన్పల్లి వద్ద నిర్మించిన చెక్డ్యాం అవతలివైపు కొట్టుకుపోవడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. బుంగపడి.. కుంగిపోయిందా..? కొద్దిరోజుల క్రితం చెక్డ్యాం వద్ద పెద్దబుంగపడిందని స్థానికులు చెబుతున్నారు. ప్రతీరోజు చేపలు పట్టేందుకు కొందరు అక్కడకు వెళ్తుంటారని, అక్కడక్కడా పగుళ్లతోపాటు బుంగ కూడా కనిపించిందని స్థానికులు తెలిపారు. మానేరులో ప్రస్తుతం వరద కూడా అధికంగానే ఉందని, ఈక్రమంలో బుంగతోనే కుంగిపోయి కొట్టుకుపోయిందని స్థానికులు అంటున్నారు. నాణ్యతపై ఆరోపణలు.. చెక్డ్యాంల నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించలేదనే ఆరోపణలు అప్పట్లో చక్కర్లు కొట్టాయి. రూ.కోట్లు వెచ్చించి నిర్మిస్తున్న చెక్డ్యాంలపై అధికారుల పర్యవేక్షణ కొరవడడంతోనే కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా నిర్మించారనే వాదనలు వినిపించాయి. కానీ భారీవర్షాల సమయంలో కొట్టుకుపోకుండా ప్రస్తుతం నామమాత్రంగా వచ్చిన వరద తాకిడితో కొట్టుకుపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అధికారుల పరిశీలన.. చెక్డ్యాం కొట్టుకుపోయిందన్న సమాచారం మేరకు ఇరిగేషన్ ఏఈ నిఖిల్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వరద తాకిడితో కొట్టుకుపోయిందా? లేక ఎవరైనా కూలగొట్టారా? అనే కోణంలో పరిశీలన చేశారు. అక్కడి పరిస్థితులు అనుమానాస్పదంగా ఉన్నాయని, వరద తాకిడితో కొట్టుకుపోయినట్లు కనిపించడం లేదని ఏఈఈ తెలిపారు. ఘటనపై అధికారులు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయనున్నట్లు తెలిసింది. కూలిన అడవిసోమన్పల్లి చెక్డ్యాం నాసిరకమా?.. కావాలనే కూల్చారా? పరిశీలించిన ఇరిగేషన్ అధికారులు చెక్డ్యాం కొట్టుకుపోవడంపై అనుమానాలు -
పనులు పూర్తిచేయండి
కోల్సిటీ(రామగుండం): అభివృద్ధి పనులు నా ణ్యతతో వేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని రామగుండం బల్దియా కమిషనర్ అరు ణశ్రీ ఆదేశించారు. అభివృద్ధి పనులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో ఇంజినీరింగ్ అ ధికారులతో కమిషనర్ బుధవారం సమీక్షించారు. నిర్ణీతవ్యవధిలో అభివృద్ధి పనులు ప్రా రంభించని, పూర్తిచేయని కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్ట్లో పెట్టాలని అన్నారు. ఆక్రమణలు తొలగించి రోడ్డు విస్తరణ నిరాటంకంగా కొనసాగించాలని ఆదేశాలు జారీ చేశారు. ఎస్ఈ గురువీ ర, ఈఈ రామన్, ఏసీపీ శ్రీహరి, టీపీఎస్ నవీన్, సూపరింటెండెంట్ శ్రీనివాస్ పాల్గొన్నారు. భూగర్భ జలాల సంరక్షణకు చర్యలు జల సంచయ్–జల భాగీరథిలో భాగంగా చేపట్టిన భూగర్భ జలాల సంరక్షణ చర్యలు విజయవంతం చేయడంలో వార్డు అధికారులు సహకరించాలని అరుణశ్రీ కోరారు. అధికారు లు, సహాయకులకు అవగాహన కల్పించారు. లింగ నిర్ధారణ నేరం పెద్దపల్లి: స్కానింగ్ కేంద్రాల్లో లింగ నిర్ధారణ చే స్తే చట్టరీత్యా చర్యలు తప్పవని జిల్లా వైద్య, ఆ రోగ్య శాఖాధికారి వాణిశ్రీ హెచ్చరించారు. జి ల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో బుధవా రం జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. గర్భస్థ శిశు వు లింగనిర్ధారణ వ్యతిరేక చట్టాన్ని పగడ్బందీగా అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రతినిధులు శ్రీరాములు రవీ, శ్రీనయన, రాకే శ్, రాజగోపాల్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఒత్తిడిని దూరం చేయాలికాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): విద్యార్థులు సానుకూల ఆలోచనలతో ఒత్తిడి దూరం చేసుకోవచ్చని, తద్వారా కేరీర్లో విజయం సాధించవ చ్చని ప్రముఖ సైకలాజిస్ట్ లావణ్య భరద్వాజ అన్నారు. ‘ఆడపిల్లల సామాజిక భావోద్వేక శ్రే యస్సు’పై బుధవారం మల్యాల మోడల్ స్కూల్లో అవగాహన కల్పించారు. విద్యార్థుల భవిష్యత్ లక్ష్యాల సాధనతోపాటు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఉద్దేశంతో కేరీర్ గైడెన్స్, కౌన్సెలింగ్, సోషల్ – ఎమోషనల్, వెల్బీయింగ్ అంశాలపై వివరించారు. ప్రిన్సిపాల్ పోచ య్య, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఆకట్టుకున్న వెల్బేబీ షో గోదావరిఖని: స్థానిక సింగరేణి ఏరియా ఆస్పత్రిలో బుధవారం నిర్వహించిన వెల్బేబీ షో ఆకట్టుకుంది. బాల, బాలికలను అందంగా ముస్తాబుచేసి పోటీలకు తీసుకొచ్చారు. బేబీ కింగ్, బేబీ క్వీన్, ప్రిన్స్, ప్రిన్సెన్స్ విభాగాల్లో పోటీలు నిర్వహించారు. విజేతలుగా నిలిచిన చిన్నారులకు ఈనెల 23న సింగరేణి ఆవిర్భావ వేడుకల్లో బహుమతలు అందజేయనున్నారు. కార్యక్రమంలో సేవా అధ్యక్షురాలు అనిత, ఆస్పత్రి ఏసీఎంవో అంబిక పాల్గొన్నారు. కానిస్టేబుల్ కుటుంబాన్ని ఆదుకుంటాం ఓదెల(పెద్దపల్లి): కొమిర గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న టీఎస్ఎస్పీ బెటాలియన్ కానిస్టేబుల్ పని శివాజీ కుటుంబాన్ని 17వ బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ రాందాస్ బుధవారం పరామర్శించారు. ఆయన మాట్లాడుతూ, కానిస్టేబుల్ శివాజీ కుటుంబాన్ని ఆదుకుంటామన్నారు. అనంతరం కానిస్టేబుల్ మృతదేహంపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళి అర్పించారు. అంత్యక్రియలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మృతుడి భార్య తేజస్విని, కుమారుడు రోదనలు మిన్నంటాయి. -
గురువారం శ్రీ 18 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
పల్లె పోరులో పైచేయిమూడోవిడతలో పార్టీల వారీగా.. విజేతలు(ఏకగ్రీవాలతో కలిపి) మండలం మొత్తం జీపీలు కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ ఇతరులు ఎలిగేడు 12 10 02 00 00 సుల్తానాబాద్ 27 17 10 00 00 ఓదెల 22 18 02 01 01 పెద్దపల్లి 30 23 03 02 02 మొత్తం 91 68 17 03 03 మూడు విడతల్లో ఇలా.. మూడో విడతలోనూ కాంగ్రెస్ పార్టీదే జోరు రెండోస్థానానికే పరిమితమైన బీఆర్ఎస్ మూడు విడతల్లో 187 స్థానాల్లో కాంగ్రెస్ మద్దతుదారుల గెలుపు నామమాత్రపు పోటీ ఇచ్చిన బీజేపీ, పలుచోట్ల స్వతంత్రుల ప్రభావం -
పులి జాడ కోసం అన్వేషణ
మంథనిరూరల్: రామగుండం ఓపెన్కాస్ట్ ఏరియాలో పులి సంచరిస్తుందన్న ప్రచారంతో మంథని అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. రెండురోజులుగా పులి అడుగుల కోసం అన్వేషణ కొనసాగిస్తున్నారు. రామగుండం నుంచి అడవిసోమన్పల్లి వరకు గోదావరి నదీపరీవాహక ప్రాంతాల్లో ఇన్చార్జి ఫారెస్ట్రేంజ్ ఆఫీసర్ రమేశ్ ఆధ్వర్యంలో అటవీశాఖ అధికారుల బృందం పర్యటిస్తూ ఆనవాళ్లు గుర్తించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. గోదావరి అవతలివైపు నుంచి వచ్చిందా? గోదావరి నది అవతలివైపు నుంచి పెద్దపల్లి జిల్లాలోకి ప్రవేశించిన పులి.. సింగరేణిలోని మేడిపల్లి ఓపెన్ కాస్ట్ ప్రాంతంలో సంచరిస్తుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే పులి రామగుండం ఓపెన్కాస్ట్ల మీదుగా మంథని వైపు కూడా వచ్చే అవకాశం ఉండడంతో ఫారెస్ట్ అధికారులు అప్రమత్తమయ్యారు. సమీప గ్రామాల ప్రజలకు జాగ్రత్తలు చెబుతున్నారు. గతేడాది సైతం మహాముత్తారం అడవుల నుంచి చిన్నఓదాల అడవుల్లోకి ప్రవేశించిందని, ఆ తర్వాత కొద్దిరోజులకే మళ్లీ వెళ్లిపోయిందని అటవీ అధికారులు గుర్తు చేస్తున్నారు. ఈ క్రమంలో ఓపెన్కాస్ట్ల మీదుగా ఇటువైపు వచ్చిందా? అనే కోణంలో నదీతీర ప్రాంతంలో పులి అడుగుల కోసం అన్వేషణ సాగిస్తున్నారు. అభయారణ్యంలోకి ఇసుక రీచ్? మంథని మండలం విలోచవరం గోదావరి నదిలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇసుక రీచ్ అభయారణ్యం పరిధిలోని వస్తుందని అటవీ శాఖ అధికారులు తెలిపారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం ఇసుక రీచ్ వద్ద ట్రాక్టర్ యజమానులు, డ్రైవర్లకు పులి సంచారంపై అవగాహన కల్పించారు. ఈ ప్రాంతంలో ఇసుక తవ్వకాలు చేయరాదని, అభయారణ్యం పరిధిలో వాహనాలు నడపరాదని వివరించారు. వన్యప్రాణుల సంరక్షణ చర్యల దృష్ట్యా ఇసుక తవ్వకాలు నిలిపివేయాలని అధికారులు సూచించారు. పులి సంచారంపై అధికారుల అప్రమత్తం గోదావరి నదీపరీవాహక ప్రాంతాల్లో గాలింపు -
తుది సంగ్రామం
బుధవారం శ్రీ 17 శ్రీ డిసెంబర్ శ్రీ 2025పార్లమెంట్లో నిరసన గోదావరిఖని: ఉపాధిహామీ పథకం పేరు మా ర్పును వ్యతిరేకిస్త్తూ పార్లమెంట్లోని మహాత్మా గాంధీ విగ్రహం ఎదుట కాంగ్రెస్ ఎంపీలు మంగళవారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఇందులో పెద్దపల్లి పార్లమెంటు సభ్యుడు గడ్డం వంశీకృష్ణ పాల్గొని కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఖండించారు. పథకంలోని మహాత్మాగాంధీ పేరు తొలగించాలనే ప్రయత్నం రాజ్యాంగంపై చేసిన దాడి అని ఆయన వ్యాఖ్యానించారు. ఉపాధిహామీ కేవలం సంక్షేమ పథకం మాత్రమే కాదని, ఇది పేదలకు పని, గౌరవం, జీవన భద్రతకు హామీ ఇచ్చిన రాజ్యాంగపరమైన హక్కు అని ఆయన అన్నారు. ప్రణాళిక ప్రకారం అభివృద్ధి గోదావరిఖని: ప్రణాళిక ప్రకారం అభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్ అన్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం ఆయన స్కూటీపై పర్యటించారు. స్థానికులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల సహకారంతో ఆదర్శ నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని ఆయన అన్నారు. అనంతరం సమ్మక్క–సారలమ్మ గద్దెల పునర్నిర్మాణ పనులను పరిశీలించారు. ప్రజల విశ్వాసాలు, సంప్రదాయాలకు అనుగుణంగా నాణ్యమైన పనులు చేపట్టాలని సూచించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల కోసం కేటాయించిన స్థలాన్ని పరిశీలించారు. వైకుంఠ ధామాన్ని సందర్శించి సౌకర్యాలు, నిర్వహణపై ఆరా తీశారు. నాయకులు మహంకాళి స్వామి, సింగరేణి శ్రీనివాస్, పెద్దెల్లి ప్రకాశ్, సమ్మక్క ఆలయ కమిటీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.బాలికలకు టీకా వేస్తాం పెద్దపల్లి: గర్భాశయ క్యాన్సర్ నియంత్రణ కోసం 14ఏళ్ల వయసు గల బాలికలకు టీకా వే స్తామని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి వా ణిశ్రీ తెలిపారు. తన కార్యాలయలో వైద్యాధికారులు, ఎంఎల్హెచ్పీలు, సూపర్వైజర్లకు టీ కాపై మంగళవారం శిక్షణ ఇచ్చారు. జిల్లా వై ద్యాధికారి మాట్లాడుతూ, బాలికలు ముందస్తుగా టీకా తీసుకుంటే గర్భాశయ క్యాన్సర్ దరి చేరదని, ఈ విషయంపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. అధికారులు కిరణ్కుమార్, సుధాకర్రెడ్డి, శ్రీరాములు పాల్గొన్నారు. అనంతరం జిల్లా కేంద్రంలోని ప లు ఆస్పత్రులు తనిఖీచేశారు. ప్రైవేట్ ఆస్పత్రు లు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ఆమెవెంట డాక్టర్లక్ష్మీభవాని, డిప్యూటీ మాస్ మీడియా అధికారి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. రోడ్డు పనుల పరిశీలన పెద్దపల్లి: జిల్లా కేంద్రంలోని సుభాష్నగర్లో చేపట్టిన బీటీ రోడ్డు పనులను మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్ మంగళవారం పరిశీలించారు. సుమారు రూ.70 లక్షల అంచనా వ్యయంతో కొనసాగుతున్న పనులను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ, మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. డ్రైనేజీ నిర్మాణం, కొత్త విద్యుత్ స్తంభా ల బిగింపు తదితర పనులు పూర్తిచేశామని తెలిపారు. బీటీ రోడ్డు నిర్మాణం పూర్తయితే జెండా చౌరస్తా వరకు బైపాస్ అందుబాటులో వస్తుందని ఆయన చెప్పారు. అసిస్టెంట్ ఇంజినీర్ సతీశ్, టౌన్ ప్లానింగ్ అధికారులు నరేశ్, వినయ్, సిబ్బంది, వార్డు ప్రజలు పాల్గొన్నారు. క్వింటాల్ పత్తి రూ.7,383 పెద్దపల్లిరూరల్: స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో మంగళవారం పత్తి క్వింటాల్కు గరిష్టంగా రూ.7383 ధర పలికింది. కనిష్టంగా రూ.6,073గా నమోదైంది. సగటు రూ. 7,171గా ఉందని మార్కెట్ ఇన్చారి కార్యదర్శి ప్రవీణ్రెడ్డి తెలిపారు. మంగళవారం 975 క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేసినట్లు ఆయన వివరించారు. సాక్షి పెద్దపల్లి: మూడో విడత పంచాయతీ ఎన్నికలకు జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. బుధవారం ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ జరుగనున్నది. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉంటుంది. లెక్కింపు పూర్తికాగానే ఉపసర్పంచ్ను ఎన్నుకుంటారు. ఈమేరకు జిల్లా ఎన్నికల అధికారులు అన్నిఏర్పాట్లు పూర్తిచేశారు. పెద్దపల్లి, ఓదెల, ఎలిగేడు, సుల్తానాబాద్ మండలాల్లోని పంచాయతీలకు బ్యాలెట్ బాక్స్తోపాటు సరిపడా బ్యాలెట్ పేపర్లను తీసుకుని ఎన్నికల సిబ్బంది తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు మంగళవారం సాయంత్రమే తరలివెళ్లారు. ఆరు సర్పంచ్లు ఏకగ్రీవం.. మూడోవిడతలో 91 సర్పంచ్ స్థానాలకు 6 ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 85 స్థానాలకు 300 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. 852 వార్డులకు 215 ఏకగ్రీవంకావడంతో మిగిలిన 636 వార్డులకు 1,797మంది బరిలో ఉన్నారు. పెద్దపల్లి మండలం రాంపల్లి, సుల్తానాబాద్లో నారాయణరావుపల్లి, గొల్లపల్లి, రామునిపల్లి, ఓదెల మండలంలో పిట్టలఎల్లయ్యపల్లి, ఎలిగేడులో ర్యాల్దేవ్పల్లి గ్రామాలు ఏకగ్రీవం అయినవాటిలో ఉన్నాయి. పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న సిబ్బంది.. ఎన్నికల అధికారులు ఆయా మండల కేంద్రాల్లో సిబ్బందికి పోలింగ్ మెటీరియల్ పంపిణీ చేశారు. అక్కడి నుంచి ఆయా పోలింగ్ కేంద్రాలకు మంగ ళవారం రాత్రికే సిబ్బంది చేరుకున్నారు. రూట్మ్యా ప్ ప్రకారం బూత్ల గదులను ఏర్పాటు చేసుకు న్నారు. పంచాయతీ కార్యదర్శులు వారికి కావా ల్సిన వసతులను కల్పించారు. అసిస్టెంట్ ఎన్నికల అధికారులు పోలింగ్ సిబ్బందిని తరలించడానికి బస్సులను ఏర్పాటు చేశారు. పోలీస్ బందోబస్తు నడుమ ఎన్నికల అధికారులు, సిబ్బంది ఆయా పోలింగ్ కేంద్రాలకు సురక్షితంగా చేరుకున్నారు. మద్యం, మాంసం పంపిణీ పోలింగ్కు ముందు ఓటర్లకు అభ్యర్థులు తాయిలాలను పంచిపెట్టారు. చివరి రెండురోజులు ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు పోటాపోటీగా మద్యం, చికెన్, మటన్ పంపిణీ చేశారు. ఈ రెండు రోజుల్లోనే రాత్రివేళల్లో విచ్చలవిడిగా నగదు, మద్యం పంపిణీ చేశారు. ఒక్కో గ్రామంలో ఒక్కో విధంగా అభ్యర్థుల స్థాయిని బట్టి ప్రలోభాల పంపిణీ జరిగింది. ఒక అభ్యర్థి ఓటుకు రూ.500 ఇస్తే, మరొకరు రూ.1,000 చొప్పున పంపిణీ చేశారు. ఒక్కొక్క ఓటుకు క్వార్టర్ మద్యం పంచితే, మరొకరు హాఫ్ బాటిల్ మద్యం అందించినట్లు తెలిసింది. సర్పంచ్, వార్డుల అభ్యర్థులు కొన్నిచోట్ల ఉమ్మడిగా, మరికొ న్నిచోట్ల వేర్వేరుగా పంచిపెట్టారు. ఇంకొందరు నేరుగా ఓటర్ల ఫోన్నంబర్లు తీసుకొని రూ.500, రూ.1,000 చొప్పున ఫోన్పే, గూగుల్ పే చేస్తున్నా రు. కొన్నిచోట్ల ఓటుకు రూ.2 వేల నుంచి రూ.3వేల చొప్పున గుట్టుచప్పుడు కాకుండా పంపిణీ చేశారు. సిబ్బందికి సూచనలు సుల్తానాబాద్రూరల్: మూడోవిడత పంచాయతీ ఎన్నికలకు అన్నిఏర్పాటు చేసినట్లు అదనపు కలెక్టర్ వేణు తెలిపారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశా లోని డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని మంగళవారం ఆయ న తనిఖీ చేశారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కౌంటింగ్ పూర్తికాగానే ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహిస్తామని ఎంపీడీవో దివ్యదర్శన్రావు తెలిపారు. అప్రమత్తంగా ఉన్నాం ఓదెల(పెద్దపల్లి): స్థానిక ఎన్నికల్లో అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అప్రమత్తంగా ఉండాలని పెద్దపల్లి డీసీపీ భూక్యా రాంరెడ్డి, పెద్దపల్లి ఏసీపీ కృష్ణ సూచించారు. స్థానిక పోలీసులతో మంగళవారం వారు సమావేశమై పలు సూచనలు చేశారు. పోలింగ్ కేంద్రాల్లో అవకతవకలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తొలి, మలివిడతల మాదిరిగా చివరిదశ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. గోదావరిఖని ఏసీపీ రమేశ్, సీఐలు సుబ్బారెడ్డి, ప్రసాదరావు, ఎస్సైలు రమేశ్, వెంకటేశ్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఉపాధ్యాయ సమస్యలపై ఉద్యమం పెద్దపల్లి: ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి ఉ ద్యమం చేస్తామని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(తపస్) జోన్ ఎన్నికల పరిశీలకుడు వీరమ ల్ల వెంకటరమణారావు అన్నారు. జిల్లా కేంద్రంలో సరస్వతీ శిశుమందిర్ పాఠశాలలో మంగళవారం స మావేశం నిర్వహించారు. ఆయన మాట్లాతూ, ప్రభుత్వం పీఆర్సీ ప్రకటించాలన్నారు. 2010 కన్నా ముందు నియామకమైన ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మోడల్ స్కూల్ టీచర్లకు 010 పద్దు కింద వేతనాలు చెల్లించాలని కోరారు. అనంతరం తపస్ జిల్లా అధ్యక్షుడిగా ముస్కుల సునీల్రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా గుండవేని జగన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జోన్ ఎన్నికల పరిశీలకుడు వెంకటేశ్ పాల్గొన్నారు.మూడోవిడత సమాచారం పంచాయతీలు 85 సర్పంచ్ అభ్యర్థులు 300 వార్డులు 636 అభ్యర్థులు 1797 పోలింగ్ కేంద్రాలు 91 ఓటర్లు 1,44,563 పీవోలు 128 ఏపీవోలు 166 జోన్లు 16 రూట్లు 35 వెబ్కాస్టింగ్ కేంద్రాలు 67 జిల్లాలో నేడు చివరిదశ పోలింగ్ సర్వం సిద్ధం చేసిన అధికారులు గ్రామాలకు తరలిన పోలింగ్ సిబ్బంది గెలుపు కోసం అభ్యర్థుల భారీ ఖర్చు పటిష్ట బందోబస్తు చేపట్టిన పోలీస్లు ఉదయం 7గంటల నుంచే.. పెద్దపల్లిరూరల్: జిల్లాలోని నాలుగు మండ లాల్లో బుధవారం ఉదయం 7గంటలకే పోలింగ్ ప్రారంభం అవుతుంది. మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరిగే ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లను అధికార యంత్రాంగం పూర్తిచేసింది. వార్డుకో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. అందులో 67 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నట్లు గుర్తించి, అక్కడ వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేసింది. హోరాహోరీగా పోరు.. పంచాయతీ స్థానాలకు హోరాహోరీగా పోరు జరుగుతోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా అసెంబ్లీ ఎన్నికలను తలపించేలా ప్రచార రథాలతో చిన్నపల్లెల్లోనూ ఈసారి ఎన్నికల ప్రచారం నిర్వహించడం గమనార్హం. కొన్ని పంచాయతీల్లో ముఖాముఖి పోటీ జరుగుతుండగా, మరికొన్నిచోట్ల బహుముఖ పోటీ సాగుతోంది. 2,500 మంది ఓటర్లు మొదలు.. దాదాపు 4వేల మంది ఓటర్లుగల పంచాయతీల్లో పోరు రసవత్తరంగా సాగుతోంది. పెద్దపల్లి మండలంలోని రంగాపూర్, రాఘవాపూర్, పెద్దకల్వల, తుర్కలమద్దికుంటతోపాటు మిగతా మండలాల్లోని ఒకట్రెండు పంచాయతీల్లో పోటీ ఉత్కంఠ భరితంగా మారింది. ఉపసర్పంచ్ గిరీపై కన్ను.. పంచాయతీల్లో వార్డు సభ్యులుగా పోటీ చేస్తున్న వారిలో.. ఎలాగైనా ఉపసర్పంచ్ గిరీ దక్కించుకోవాలనే ఆలోచనతో ఉన్నవారే అధికమంది ఉన్నారు. అందుకే వార్డు సభ్యుడిగా ఎలాగైనా ఎన్నిక కావాలనే ఆశతో ఓటర్లకు ఎన్నడూ లేనివిధంగా ఒక్కో ఓటుకు రూ.400 మొదలు రూ.వెయ్యి దాకా నజరానా అందిస్తున్నట్లు సమాచారం. ఉపసర్పంచ్కు సర్పంచ్తోపాటు చెక్పవర్ ఉండడంతోనే ఆ పదవికి అంతటి ప్రాధాన్యం పెంచిందని రాజకీయ విశ్లేషకులు పలువురు భావిస్తున్నారు. పాపా.. ఇదేమిటి? పెద్దపల్లిరూరల్/పెద్దపల్లి: ‘పాపా.. ఇదేమిటి చెప్పు.. ఇందులోని అక్షరాలు ఏమిటో చదువు’ అని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఓ చిన్నారిని ఆప్యాయంగా పలకరించడం అక్కడున్నవారిలో ఉత్సాహం నింపింది. పెద్దపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మంగళవారం ప్రీప్రైమరీ స్కూల్ విద్యార్థులకు యూనిఫామ్, లర్నింగ్ మెటీరియల్, ఆటవస్తులను కలెక్టర్ అందజేశారు. ఈసందర్భంగా చిన్నారులతో కాసేపు ముచ్చటించారు. భావిభారత పౌరులను క్రమశిక్షణతో తీర్చిదిద్దేలా బలమైన పునాది వేసేందుకు ప్రీప్రైమరీస్కూళ్లు దోహదపడతాయని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో 58 ప్రీప్రైమరీ స్కూళ్లు ఉన్నాయని, వీటికి అదనంగా మరో 5 పీఎంశ్రీ పాఠశాలలు పనిచేస్తున్నాయని ఆయన వివరించారు. -
పకడ్బందీ ఏర్పాట్లు చేశాం
పెద్దపల్లి/పెద్దపల్లిరూరల్/ఎలిగేడు/ఓదెల/సుల్తానాబాద్రూరల్: జిల్లాలోని పెద్దపల్లి, సుల్తానాబాద్, ఎలిగేడు, ఓదెల మండలాల్లో బుధవారం జరిగే మూడోవిడత పంచాయతీ ఎన్నికలకు అన్నిఏర్పాట్లు పూర్తిచేసినట్లు కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. పెద్దపల్లి, సుల్తానాబాద్లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, ఓదెల మోడల్ స్కూల్, ఎలిగేడు ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను అదనపు కలెక్టర్ వేణుతో కలిసి కలెక్టర్ మంగళవారం పరిశీలించారు. చివరి విడతలో 91 పంచాయతీలు, 852 వార్డుల్లో ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ విడుదల చేశామని, ఇందులో 6 సర్పంచ్, 215 వార్డులు ఏకగ్రీవమయ్యాయని అన్నారు. మిగిలిన వాటికి ఎన్నికలు నిర్వహిస్తామని, ఈమేరకు ఏర్పాట్లు పూర్తిచేశామని ఆయన చెప్పారు. ఎన్నికల అధికారులు విధులను పకడ్బందీగా నిర్వర్తించాలని సూచించారు. కలెక్టర్ వెంట జెడ్పీ సీఈవో నరేందర్, డీపీవో వీరబుచ్చయ్య, తహసీల్దార్లు రాజయ్య, యాకన్న, బషీరొద్దీన్, ధీరజ్ తదితరులు ఉన్నారు. విధుల్లో నిర్లక్ష్యం చేస్తే చర్యలు ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని డీసీపీ రాంరెడ్డి హెచ్చరించారు. పోలీసు సిబ్బందితో ఆయన సమావేశమయ్యారు. సుల్తానాబాద్, ఓదెల తదితర మండలాల్లో పర్యటించారు. ఎన్నికల బందోబస్తుపై సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఓటర్లతో మర్యాదగా ప్రవర్తించాలని సూచించారు. అనంతరం ఏసీపీ కృష్ణ మాట్లాడుతూ, ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయ్యే వరకూ భద్రతా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. సీఐ సుబ్బారెడ్డి, ఎస్సైలు, సిబ్బంది ఉన్నారు. కలెక్టర్ కోయ శ్రీహర్ష డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల పరిశీలన -
పులి ఎక్కడుంది?
రామగుండం: మూతపడిన సింగరేణి మేడిపల్లి ఓపెన్కాస్టు ప్రాజెక్టు పరిసరాలు, గోదావరి నదీతీరంలో రెండురోజుల పాటు సంచరించిన పులి ఆనవాళ్లు గుర్తించేందుకు అటవీశాఖ అధికారులు మూడో రోజు మంగళవారం కూడా అన్వేషణ కొనసాగించా రు. అంతర్గాం మండలం ఎల్లంపల్లి ప్రాజెక్టు సమీప గోదావరి నది, రామునిగుండాల శివారు, పాములపేట, ఆబాది రామగుండం, లింగాపూర్ సమీప సింగరేణి ఓబీ కుప్పలు తదితర వన్యప్రాణులు సంచరించే అవకాశం ఉన్న ప్రాంతాల్లో గాలింపు చర్య లు చేపట్టారు. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ తిరుమల సతీశ్కుమార్ నేతృత్వంలో అధికారులు మూడు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు ముమ్మరం చేశా రు. ఆయా ప్రాంతాల్లో పులి సంచరించినట్లు ఆనవాళ్లు ఏమీ లభించలేదని వారు తెలిపారు. అయి నా.. పులి సంచరిస్తున్నట్లుగానే భావిస్తూ సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని అటవీశాఖ అధికారులు కోరారు. పులిని బందించే వరకు వివిధ ప్రాంతాల్లో గాలింపు చర్యలు కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు. ఫారెస్టు ఉన్నతాధికారులు జి.కొమురయ్య, పి.దేవదాస్, సయ్యద్ రహ్మతుల్లాతోపాటు యానిమల్ ట్రాకర్స్ సెర్చ్ బృందాలు అన్వేషణలో పాలుపంచుకుంటున్నారు. ఈ జాగ్రత్తలు పాటించాలి.. గాలిస్తున్న అటవీఅధికారులు మూడు బృందాలుగా అన్వేషణ మూడోరోజు కనిపించని ఆనవాళ్లు -
రండి.. ఓటేయండి
పెద్దపల్లిరూరల్: ఓటుహక్కు కలిగిఉన్న పల్లెవాసులు అందరూ ఓట్లు వేసేలా అధికారయంత్రాంగం చర్యలు చేపట్టింది. వివిధ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి ఎన్నికల సిబ్బంది మంగళవారం ఎన్నికల సామగ్రితో బయలు దేరి సాయంత్రం వరకు తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకుంది. పెద్దపల్లి ప్రభుత్వ జూనియర్ కాలేజీ మైదానంలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రం నుంచి ఆయా పోలింగ్ కేంద్రాలకు సామగ్రితో ఎన్నికల అధికారులు, సిబ్బంది చేరుకున్నారు. పెద్దపల్లి, సుల్తానాబాద్, ఓదెల, ఎలిగేడు మండలాల్లో 636 పోలింగ్ కేంద్రాలకు సామగ్రిని చేర్చేందుకు 16 జోన్లు ఏర్పాటు చేసి 35 రూట్లుగా విభజించారు. 59 బస్సుల్లో సామగ్రి, సిబ్బందిని తరలించారు. వరండాల్లోనే పోలింగ్ కేంద్రాలు.. జిల్లాలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం కొన్నిచోట్ల వరండాల్లో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అలాగే మరికొన్ని పాఠశాలల్లో అవసరమైనన్ని గదులు అందుబాటులో లేకపోవడంతో ఒకేగది ఆవరణలో రెండు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆ కేంద్రానికి, ఈ కేంద్రానికి మధ్య టేబుళ్లను ఉంచారు. ఏ వార్డు ఓటరు ఆ వార్డు బూత్కే టేబుల్ మధ్య నుంచి వెళ్లేలా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సిబ్బంది -
ఎన్నికలకు పటిష్ట బందోబస్తు
గోదావరిఖని: చివరిదశ పంచాయతీ ఎన్నికలు కూడా ప్రశాంతంగా జరిగేందుకు పోలీసుశాఖ డేగకన్ను వేసింది. రామగుండం పోలీసు కమిషనరేట్ లోని అన్నిపోలింగ్ కేంద్రాల వద్ద బలగాలను మోహరించింది. పెద్దపల్లి జోన్లోని చివరి విడతలో సుల్తానాబాద్, ఎలిగేడు, పెద్దపల్లి, ఓదెల మండలాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. మంచిర్యాల జోన్ పరిధిలో భీమారం, చెన్నూర్, జైపూర్, కోటపల్లి, మందమర్రి మండలాల్లో పోలింగ్కు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. మొత్తంగా కమిషనరేట్లోని 1,720 పోలింగ్ కేంద్రాల్లో 563 సమస్యాత్మకమైనవిగా గుర్తించి పోలీస్ బందోబస్తు పటిష్టం చేశారు. భారీ పోలీసు బందోబస్తు చివరివిడత పంచాయతీ ఎన్నికలకు కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇద్దరు డీసీపీలు, ఏడుగురు ఏసీపీలు, 32 మంది సీఐలు, 97 మంది ఎస్సైలు, 270 మంది ఏఎస్సైలు, హెడ్కానిస్టేబుళ్లు, 520 మంది కానిస్టేబుళ్లు, 240 మంది హోంగార్డులు, 190 మంది ఆర్ముడ్ సిబ్బంది, 54క్యూఆర్టీ టీంలు, 57 రూట్మోబైల్ పార్టీలను ఎన్నికల విధుల్లో నియమించారు. సుమారు 1,700మందితో బందోబస్తు చేపట్టారు. 1,700 మంది పోలీస్ బలగాలతో పహారా ప్రతీ పోలింగ్ కేంద్రం వద్ద ప్రత్యేక నిఘా సమస్యాత్మక ప్రాంతాలపై డేగకన్ను -
కాంగ్రెస్ పాలనలో విధ్వంసం
గోదావరిఖని: రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో విధ్వంసమే కొనసాగిందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ విమర్శించారు. స్థానిక ప్రెస్క్లబ్లో మంగళవారం ఆయన విలేకరు ల సమావేశంలో మాట్లాడారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ పాలన సాగిందన్నారు. రెండేళ్ల ఎమ్మెల్యే రాజ్ఠాకూర్ పాలనపై చార్జీషీట్ విడుదల చేశామని ఆయన పేర్కొన్నారు. కూల్చివేతల తో చిరు వ్యాపారులు రోడ్డున పడ్డారని, వ్యాపార కేంద్రం లక్ష్మీనగర్లో తవ్వకాలతో వ్యాపారం కుంటుపడిందన్నారు. ఏ ప్రభుత్వమైనా గత ప్రభుత్వం చేపట్టిన పనులను పూర్తిచేసే బాధ్యత తీసుకుంటుందని, కానీ రామగుండంలో తన హయాంలో చేప ట్టిన ఒక్కపని కూడా ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్ పూర్తిచేయలేదని దుయ్యబట్టారు. తమ ప్రభుత్వం మంజూరు చేసిన రూ.వందల కోట్లను ఈ ప్రభుత్వం విడుదల చేసిందని, ఆ నిధులు ఎక్కడ ఖర్చు చేశారో కూడా తెలియని పరిస్థితి ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ఉన్న డ్రైనేజీలనే తవ్వడం, సెంటర్ లైట్లు, విద్యుత్ స్తంభాలను తొలగించడం, కొత్త పోల్స్ వేయడం తప్ప చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలన విధ్వంసం, కూల్చివేతలు, ప్రశ్నించే గొంతులను అణిచివేయడం, కక్షసాధింపులు, కేసులు బనాయించడం తప్ప ఏమీ సాధించలేదన్నారు. అర్ధరాత్రి గుడులు కూల్చిన వారిపై ఇప్పటికీ చర్యలు తీసుకోలేదని ఆయన గుర్తుచేశారు. ఈ విషయాలన్నింటినీ ప్రజలు గమనిస్తున్నారని, ఈపాలనకు చరమగీతం పాడాలని చూస్తున్నారని అన్నారు. సమావేశంలో నాయకులు మూల విజయారెడ్డి, జనగామ కవితసరోజిని, నూతి తిరుపతి, బుర్రి వెంకటేశ్, కిరణ్జీ, సట్టు శ్రీనివాస్, గుర్రం పద్మ పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ -
పోలీసుల డేగకన్ను
సమస్యాత్మక పోలీంగ్ కేంద్రాలపై డేగకన్ను వేశాం. అత్యంత సున్నితమైన పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేకంగా సిబ్బందిని నియమించాం. స్ట్రైకింగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్, క్విక్ రెస్పాన్స్ టీంలను సిద్ధంగా ఉంచాం. ఓటింగ్, కౌంటింగ్ సమయంలో పరిస్థితులను నిరంతరం గమనిస్తూ ప్రత్యేక నిఘా ఉంచుతాం. నియమావళి ఉల్లంఘనలు, బెదిరింపులు, గొడవలు, అక్రమ మద్యం, డబ్బు పంపిణీ వంటి వాటిపై కఠిన చర్యలుంటాయి. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టపరమైన చర్యలుంటాయి. ఓటర్లు స్వేచ్ఛగా ఓటుహక్కు వినియోగించుకోవాలి. – అంబర్ కిశోర్ ఝా, సీపీ, రామగుండం -
వీ హబ్ పనులు పూర్తిచేయండి
● కలెక్టర్ కోయ శ్రీహర్ష పెద్దపల్లి: వీ హబ్ భవనం పెండింగ్ పనులు పూర్తిచేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. రంగంపల్లిలో చేపట్టిన వీ హబ్ భవన నిర్మాణ ప్రగతిని ఆయన సోమవారం పరిశీలించారు. సీసీ కెమేరా లు, ఏసీలను త్వరగా బిగించాలని అన్నారు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు శిక్ష ణ, అవగాహన కల్పించడం లక్ష్యంగా వీ హబ్ భవ నం నిర్మిస్తున్నామని తెలిపారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారి కాళిందిని, పంచాయతీరాజ్ అ సిస్టెంట్ ఇంజినీర్ పవన్ తదితరులు పాల్గొన్నారు. -
సీనియర్ సిటిజన్ల సంక్షేమంపై దృష్టి
పెద్దపల్లి: తల్లిదండ్రులతోపాటు సీనియర్ సి టిజన్ల సంక్షేమం లక్ష్యంగా లీగల్ ఎయిడ్ క్లిని క్లు ప్రారంభిస్తున్నామని, వీటిని సద్వినియో గం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల అన్నారు. కలెక్టరేట్లోని జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయంలో సీనియర్ సి టిజన్ లీగల్ ఎయిడ్ క్లినిక్ను సోమవారం జడ్జి ప్రారంభించి మాట్లాడారు. ప్రతీ సోమవారం ప్యానల్ న్యాయవాది ఎస్.అశోక్ కుమార్, లీ గల్ వలంటీర్ ఎస్.మల్లేశ్ క్లినిక్లో అందుబాటులో ఉంటారన్నారు. తమ పిల్లలతో సమస్య లు ఎదుర్కొంటున్న తల్లిదండ్రులు ఇక్కడ ఫి ర్యాదు చేయాలని సూచించారు. జిల్లా సంక్షేమ అధికారి వేణుగోపాల్, ఎఫ్ఆర్వో స్వర్ణలత, ప్రతినిధులు శేఖర్, అశోక్ పాల్గొన్నారు. రైల్వేమంత్రి దృష్టికి సమస్యలురామగుండం: పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ సోమవారం రైల్వేస్టేషన్లలో సమస్యలను ఆ శాఖమంత్రి అశ్విని వైష్ణవ్ దృష్టికి తీసుకెళ్లారు. ఢిల్లీలో రైల్వే శాఖ మంత్రిని కలిసి న మంత్రి.. రామగుండం, పెద్దపల్లి, మంచిర్యాల, బెల్లంపల్లిలోని రైల్వే కార్మికులకు మిషన్ భగీరథ తాగునీరు సరఫరా చేయాలని, రామగుండంలో వి విధ కారణాలతో మూతపడిన పాఠశాలను తె రిపించాలని, రైల్వే డిస్పెన్సరీకి అంబులెన్స్ కే టాయించాలని, బెల్లంపల్లి రైల్వేస్టేషన్లో తొలగించిన అంబేడ్కర్ విగ్రహాన్ని మళ్లీ ఏర్పాటు చేయాలని మంత్రికి విన్నవించారు. కుందనపల్లి, పెద్దంపేటలో రైల్వే వంతెనల టెండర్ ప్రక్రియను పూర్తిచేయించాలన్నారు. మంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఎంపీ పేర్కొన్నారు. జాతీయ పోటీలకు ఎంపిక జూలపల్లి(పెద్దపల్లి) : మండల కేంద్రా నికి చెందిన అక్షయ్రాజ్ వాలీబాల్ పో టీల్లో జాతీయ స్థా యికి ఎంపికయ్యా డు. 2024లో స్పో ర్ట్స్ అథారిటీ ఆఫ్ తె లంగాణ అకాడమీ కి ఎంపికై .. సీనియ ర్ కోచ్ సంపత్గౌడ్ వద్ద మెలకువలు నేర్చుకున్నాడు. క్రీడాకారులు హన్మంతరెడ్డి, కొసరి కృష్ణ, కమలాకర్రెడ్డి, రవీందర్, గంగాధర్గౌడ్ ఆయనను సోమవారం అభినందించారు. సాధువులకు సన్మానం మంథని: గోదావరి పరిక్రమణ యాత్రలో భా గంగా యానాం నుంచి ధర్మపురి వెళ్తున్న పలువురు సాధువులకు సోమవారం పట్టణంలో ఘ నస్వాగతం లభించింది. ఉత్తరప్రదేశ్లోని వింద్రావన్ పీఠానికి చెందిన మలూక్పీత్ శ్రీరాజేంద్రదాస్జీ మహారాజ్తోపాటు పలురాష్ట్రాలకు చెందిన సాధువులు, మండేశ్వరులు, మహామండలేశ్వరులు సుమారు 500 మంది తొలుత కాళేశ్వరం సందర్శించారు. ఆ తర్వాత ధర్మపురి వెళ్తుండగా మంథనిలో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలికారు. వీహెచ్పీ జిల్లా ఉపాధ్యక్షుడు కొత్త శ్రీనివాస్, మంథని ప్రఖండ ఉపాధ్యక్షుడు రావుల సతీశ్, ప్ర చారక్ తూర్పాటి రాము, సత్రంగ ప్రముఖ మే డగోని రాజమౌళిగౌడ్, బోట్ల ఆంజనేయులు, బత్తుల సత్యనారాయణ తదితరులు ఉన్నారు. అప్రమత్తంగా ఉండాలి రామగిరి(మంథని): ఉద్యోగులు విధుల్లో అప్రమత్తంగా ఉండలని భద్రతా తనిఖీ బృందం క న్వీనర్ వెంకటరమణ అన్నారు. ఆర్జీ–3 ఏరి యా ఓసీపీ–2లో సోమవారం నిర్వహించిన వార్షిక భద్రతా పక్షోత్సవాల్లో జీఎం సుధాకర్రావుతో కలిసి మాట్లాడారు. గతాను భవాలను దృష్టిలో పెట్టుకుని విధుల్లో నిర్లక్ష్యం వహించవద్దన్నారు. ఆర్జీ రీజియన్ సేఫ్టీ జీఎం మధుసూ దన్, ప్రతినిధులు రామచంద్రరెడ్డి, రవీందర్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, రామ్మోహన్, రాజశేఖర్, శంకర్, చంద్రశేఖర్, రామారావు పాల్గొన్నారు. -
కాంగ్రెస్తోనే అభివృద్ధి సాధ్యం
పెద్దపల్లిరూరల్/సుల్తానాబాద్రూరల్/ఎలిగేడు: పల్లెలు, పట్టణాల అభివృద్ధి, ప్రజా సంక్షేమం కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. పెద్దపల్లి మండలం అప్పన్నపేట, నిట్టూరు, పెద్దకల్వల, సుల్తానాబాద్ మండలం సుద్దాల, కనుకుల, తొగర్రాయి, కదంబాపూర్తోపాటు ఎలిగేడు మండలం నర్సాపూర్, రాములపల్లి, ముప్పిరితోటలో సోమవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వసతుల కల్పన, కొత్త రేషన్కార్డులు, సన్నబియ్యం పంపిణీ కాంగ్రెస్ సర్కార్ ఘనతేనని అన్నారు. ఈనెల 17న పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరచిన అభ్యర్థులనే గెలిపించాలని ఆయన అభ్యర్థించారు. అభ్యర్థులు ఆరె సంతోష్, అర్కుటి ధనలక్ష్మి, గిర్నేని స్రవంతి, ఢిల్లేశ్వర్రావు, మీస లక్ష్మి, చిలుక స్రవంతి, గొస్కుల సదయ్య, పల్లెర్ల వెంకటేశ్గౌడ్, సిద్ధి తిరుపతి, రామిడి శైలజ – వెంకట్రామ్రెడ్డి, ఏఎంసీ చైర్మన్ ప్రకాశ్రావు, నాయకులు పడాల అజయ్గౌడ్, పెగడ రమేశ్, సంతోష్, సంపత్రావు, దుగ్యాల సంతోష్రావు తదితరులు పాల్గొన్నారు. -
స్వేచ్ఛగా ఓటు వేయాలి
పెద్దపల్లి: స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత పోలింగ్కు ప్ర జలు సహకరించాలని, ఓటుహక్కును స్వేచ్ఛగా వి నియోగించుకోవాలని పెద్దపల్లి డీసీపీ రాంరెడ్డి కో రారు. మూడోవిడతలో పోలింగ్ నిర్వహించే పెద్దపల్లి, ఎలిగేడు, సుల్తానాబాద్, ఓదెల మండలాల్లోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను ఆయన సోమ వారం తనిఖీ చేశారు. అనంతరం మాట్లాడుతూ, పోలింగ్ కేంద్రాల్లోని పోలీస్లు ఎన్నికల అధికారులకు సహకారం అందించాలన్నారు. ఎన్నికల ప్రక్రి య ప్రశాంతంగా సాగేందుకు బాధ్యతాయుతంగా ప్రవర్తించాలాన్నారు. మద్యం తాగి పోలింగ్ కేంద్రా లకు రావడం నిషేధమన్నారు. తప్పుడు ప్రచారం, వదంతులు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయరాదని సూ చించారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
మహిళల తీర్పే కీలకం
తుదివిడతకు పటిష్ట బందోబస్తు పెద్దపల్లిరూరల్: జిల్లాలో మూడోవిడతగా పంచాయతీలకు ఈనెల 17న నిర్వహించే ఎన్నికల్లో మహిళా ఓటర్ల తీర్పే అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయిస్తుంది. చివరి విడతలో పెద్దపల్లి, సుల్తానాబాద్, ఓదెల, ఎలిగేడు మండలాల్లోని 91 పంచాయతీలకు ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ విడుదలైంది. ఇందులో ఆరు పంచాయతీలు ఏకగ్రీవం కా వడంతో 85 సర్పంచ్, 636 వార్డు స్థానాలకు పోలింగ్ ని ర్వహిస్తారు. మొత్తం 1,44,563 మంది ఓటర్లు త మ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. ఇందులో 73,669 మంది మహిళా ఓటర్లుండగా.. 70,892 మంది పురుష ఓటర్లు, ఇద్దరు ఇతరులు ఉన్నారు. మహిళా ఓటర్ల కటాక్షం కోసం అభ్యర్థులు నానాపాట్లు పడుతున్నారు. గ్రామాల్లోని స్వశక్తి సంఘాల మహిళలతో సమావేశాలు నిర్వహించి తమకే మద్దతు ఇవ్వాలంటూ అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం నిర్వహించారు. గోదావరిఖని: రామగుండం పోలీస్ కమిషనరేట్లోని పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో చివరి విడత ఎన్నికలు జరిగే మండలాల్లో 163 బీఎన్ఎస్ఎస్ యాక్ట్ అమలు చేస్తున్నట్లు పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. పెద్దపల్లి జోన్లోని మూడోవిడతలో సుల్తానాబాద్, ఎలిగేడు, పెద్దపల్లి, ఓదెల మండలు, మంచిర్యాల జోన్ పరిధిలోని భీమారం, చెన్నూర్, జైపూర్, కోటపల్లి, మందమర్రి మండలాల్లో ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడానికి ఈనిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఐదుగురు లేక అంతకన్నా ఎక్కువ మంది గుమిగూడవద్దని, అత్యవసరమైతే అధికారుల నుంచి ముందస్తు అనుమతి తీసుకు ని చట్టబద్ధంగా సమావేశాలు నిర్వహించాలని ఆయన సూచించారు. ఈఉత్తర్వులు ఈ నెల 15 న సాయంత్రం 5గంటల నుంచి ఈనెల 17న ఎ న్నికల ప్రక్రియ కౌంటింగ్ ముగిసేంత వరకూ అమలులో ఉంటుందని ఆయన వివరించారు. ఆదేశాలను ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకోనున్నట్లు ఆయన హెచ్చరించారు. ఓటర్లు అందరూ ఓటు వేయాలని ఆయన కోరారు.పెద్దపల్లి: చివరిదశ పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని డీపీవో వీరబుచ్చయ్య సూచించారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని డిస్టిబ్యూషన్ సెంటర్ను ఆయన సోమ వారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉద్యోగులు, సిబ్బంది సమన్వయంతో పోలింగ్ విధులు నిర్వ హించాలలని ఆయన కోరారు.డిస్ట్రిబ్యూషన్ కేంద్రం పరిశీలిస్తున్న డీపీవో మూడోవిడత ఎన్నికల్లో ఓటర్ల వివరాలు మండలం మొత్తం ఓటర్లు మహిళలు పురుషులు పెద్దపల్లి 50,986 25,996 24,989 ఎలిగేడు 18,570 9481 9088 ఓదెల 35,807 18,219 17,588 సుల్తానాబాద్ 39,200 19,973 19,227 మొత్తం 70,892 73,669 70,892 -
కార్మికులపై కేంద్ర ప్రభుత్వం దాడి
గోదావరిఖని: కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కార్మికులపై దాడికి దిగుతోందని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు వేల్పుల కుమారస్వామి ధ్వజమెత్తారు. సోమవారం స్థానిక సీఐటీయూ కార్యాలయంలో యూనియన్ జెండా ఎగురవేశారు. ఆయన మా ట్లాడుతూ ఈనెల 31న యూనియన్ 18వ మహాసభలు విశాఖపట్నంలో నిర్వహిస్తున్నామన్నారు. పెట్టుబడుదారులకు అనుకూలంగా కార్మిక చ ట్టాల ను నాలుగు లేబర్కోడ్లుగా మార్చిందని ఆయన ఆరోపించారు. దీనిని అమలు చేయడానికి రాష్ట్రప్రభుత్వాలపై ఒత్తిడి పెంచిందని ఆరోపించారు. లేబర్కోడ్లు అమలైతే.. భారత కార్మికవర్గం బానిసత్వంలోకి వెళ్లే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. లేబర్కోడ్ల రద్దు కోసం కార్మిక వర్గం ఏకతాటిపైకి వచ్చి పోరాటాలు చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు మెండే శ్రీనివాస్, మేదరి సారయ్య, శివరాంరెడ్డి, రమేశ్, మధు, మల్లేశ్, సమ్మయ్య, సారయ్య, ఆంజనేయులు, గౌస్ తదితరులు పాల్గొన్నారు. -
ఆరా తీస్తూ.. అడ్రస్ తెలుసుకుంటూ
పెద్దపల్లిరూరల్: పంచాయతీ ఎన్నికల్లో ప్రతీఒక్క ఓటు కీలకమేనని భావించిన సర్పంచ్, వార్డుస్థానాల అభ్యర్థులు.. ఉపాధి కోసం దూర ప్రాంతాలు, పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్లిన ఓటర్లపై దృష్టి సా రించారు. ఓటరు జాబితా ఆధారంగా వారి వివరాలపై ఆరా తీస్తున్నారు. వలస ఓటర్లు ప్రస్తుతం ని వాసం ఉంటున్న చిరునామాలు సేకరించి ఓటు హక్కు వినియోగించునేందుకు రప్పించేలా ఏర్పా ట్లు చేయడంలో నిమగ్నమయ్యారు. పోటీ తీవ్ర తను బట్టి ఒక్కఓటుతో ప రాజయం పాలైన వారుకూ డా ఉండడంతో జాబితాలో ని ఓటర్లు అందరూ ఓట్లు వేసేలా చూసేందుకు నానాపాట్లు పడుతున్నారు. పొరుగు రాష్ట్రాల్లో ఉన్నవారిపై దృష్టి.. ఇరుగు, పొరుగు జిల్లాల్లో వలస ఓటర్లు ఉంటే తమ బంధుగణాన్ని అక్కడకు పంపించి వాహనంలో రా వాలని, అందుకయ్యే ఖర్చు తామే భరిస్తామని, ఇంకా ఇతరత్రా కూడా కొంత సమకూర్చుతామంటూ అభ్యర్థులు ఆఫర్ ఇస్తున్నారు. దీంతో చాలామంది వలస ఓటర్లు సైతం తమ ఊళ్లకు వచ్చి ఓటేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఫోన్లో అందుబాటులో ఉన్నవలస ఓటర్లకు సొమ్మును ఫోన్పే, గూగుల్పే ద్వారా చెల్లించి వారినే వాహనం సమకూర్చుకుని రావాల్సిందిగా ఆహ్వానిస్తున్న అభ్యర్థు లూ ఉన్నారు. వలస ఓటర్ల కరుణతోనైనా పంచా యతీ ఎన్నికల్లో గట్టెక్కుతామేమోనన్న గంపెడాశ తో అభ్యర్థులు ఎంతఖర్చుకై నా వెనుకాడడం లేదు. చివరి విడతలో 91 పంచాయతీలు.. పెద్దపల్లి సెగ్మెంట్ పరిధిలోని సుల్తానాబాద్, ఎలిగే డు, పెద్దపల్లి, ఓదెల మండలాల్లో 91 పంచాయతీ లు, 852 వార్డు స్థానాలకు ఈనెల 17న ఎన్నికలను నిర్వహించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇందులో ఆరు పంచాయతీ సర్పంచ్, 215 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగ తా 85 సర్పంచ్, 636వార్డు స్థానాలకు పోలింగ్ నిర్వహణకు ఎన్నికల అధికారులు ప్రణాళిక రూపొందించారు. 85 సర్పంచ్ స్థానాలకు 294 మంది, 636 వార్డు స్థానాలకు 1,582 మంది అభ్యర్థులు పోటీపడు తున్నారు. తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు శతవిధాలా ప్రయ త్నాలు చేస్తున్నారు. ప్రచారానికి తెర.. ప్రలోభాలకు ఎర.. పంచాయతీ సర్పంచ్, వార్డు స్థానాల కోసం పోటీపడుతున్న అభ్యర్థులు అసెంబ్లీ ఎన్నికలను తలపించేలా పల్లెల్లోనూ ప్రచార రథాలను ఏర్పాటు చేసుకుని హోరాహోరీగా ప్రచారం నిర్వహించారు. సోమవారం (ఈనెల15)తో ప్రచార పర్వం ముగిసింది. బుధవారం చివరి దశ పంచాయతీ పోలింగ్ జరగనుంది. ఎన్నికల ప్రచారం ముగియడంతో ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు నగదు, మద్యం, చీరలు పంపిణీ చేసే పనిలో అభ్యర్థులు, వారి మద్దతుదారులు తలమునకలయ్యారు. మద్యం దుకాణాల మూసివేత మూడోవిడత పంచాయతీ ఎన్నికలు ఈనెల 17న జరగనున్నాయి. దీంతో మద్యం దుకాణాలను సో మవారం సాయంత్రమే మూసివేయించినట్లు ఎక్సై జ్ అధికారులు తెలిపారు. ఎన్నికల నిర్వహణకు విఘాతం కలుగకుండా మద్యం దుకాణాలు మూసివేయించినట్లు వారు వివరించారు. పెద్దపల్లి మండలం భోజన్నపేట గ్రామానికి చెందిన ఓ కుటుంబం ఉపాధి కోసం ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి వలస వెళ్లింది. ఈనెల 17న పంచాయతీ సర్పంచ్, వార్డు స్థానాల ఎన్నికలు ఉండడంతో ఓటేసేందుకు రావాలని ఓ అభ్యర్థి వారికి విన్నవించారు. రానుపోను రవాణా ఖర్చులను ఫోన్పే ద్వారా పంపించారు. దీంతో ఆ కుటుంబం ఇటీవలే స్వగ్రామానికి చేరుకుంది. వలస ఓటర్లను సొంతఊళ్లోకి రప్పించి ఓటు వేయించుకునేందుకు సర్పంచ్ అభ్యర్థులు నానాపాట్లు పాట్లుపడుతున్నారు. దూరాన్ని బట్టి వాహనాలను సమకూర్చుతున్నారు. కొందరు బస్సు, రైలు చార్జీలు చెల్లిస్తున్నారు. వలస ఓటర్లను ఎలాగైనా రప్పించేందుకు శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. -
మేడిపల్లి నుంచి లింగాపూర్ వైపు..
గోదావరిఖని/రామగుండం: మూతపడిన సింగరే ణి మేడిపల్లి ఓపెన్కాస్టు ప్రాజెక్టు పరిధిలోని గోదా వరి తీరంలో ఆదివారం సంచరించిన పులి.. సోమ వారం లింగాపూర్ గ్రామ శివారులో ప్రత్యక్షమైనట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. మేడిపల్లి, మల్కాపూర్ గ్రామ శివారుల నుంచి లింగాపూర్ గ్రామ శివారులోని గోదావరి పంపుహౌస్ పరిసరాల్లో తిరిగినట్లు పులి అడుగుజాడలు గుర్తించారు. దీంతో ఎప్పుడు ఏం జరుగతుందోనని స్థానిక ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. అనుకూలంగా అటవీప్రాంతం.. సింగరేణికి చెందిన మేడిపల్లి ఓపెన్కాస్టు ప్రాజెక్టు మూతపడడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన అట వీ ప్రాంతంగా వృద్ధి చెందింది. ఇది పులికి నివా సయోగ్యంగా మారినట్లు అధికారులు చెబుతున్నా రు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ అటవీ ప్రాంతం నుంచి వచ్చిన పులి.. గోదావరి నదిదాటి మేడిపల్లికి చేరుకుందని, ఆ తర్వాత లింగాపూర్ గ్రామ శివారులోకి వచ్చిందని వారు భావిస్తున్నారు. ఒంటరిగా వెళ్లొద్దు.. గోదావరి నదీపరీవాహక ప్రాంతాల్లోని గ్రామస్తులు రాత్రివేళల్లో ఒంటరిగా బయటకు రాకూడదని అట వీ అధికారులు సూచిస్తున్నారు. అత్యవసరమైన వా రు, రైతులు తప్పనిసరైతే.. అలజడి చేస్తూ సామూహికంగా వెళ్లాలని వారు పేర్కొంటున్నారు. సోమ వారం పులి పాదముద్రలు గుర్తించిన వారిలో కా ళేశ్వరం ఫారెస్ట్ సర్కిల్ అధికారి ప్రభాకర్, జిల్లా అ టవీశాఖ అధికారి శివయ్య, అధికారులు ఎంవీ నా యక్, కొమురయ్య, సయ్యద్ రహ్మతుల్లా, మంగీలాల్, స్రవంతి, రామ్మూర్తి తదితరులు ఉన్నారు. -
పోలింగ్ కేంద్రాల పర్యవేక్షణ
జూలపల్లి(పెద్దపల్లి): మండలంలోని 13 పంచాయతీల్లో ఆదవారం జరిగిన ఎన్నికల సరళిని అ దనపు కలెక్టర్ వేణు పర్యవేక్షించారు. ఓటర్లు ఉ దయమే ఓటువేసేందుకు ఉత్సాహంగా తరలివచ్చారు. మొత్తం 130 పోలింగ్ కేంద్రాలు ఏ ర్పాటు చేశారు. జూలపల్లి పోలింగ్ కేంద్రాన్ని అడిషనల్ కలెక్టర్ వేణు పర్యవేక్షించి పలు సూ చనలు చేశారు. ఇన్చార్జి డీల్పీవో దేవకి, డి ప్యూటీ కలెక్టర్, ఇన్చార్జి తహసీల్దార్ బానవాత్ వనజ, ఎంపీడీ పద్మజ, డిప్యూటీ తహసీల్దార్ అనిల్కుమార్ పర్యవేక్షించారు. ఏఆర్డీఎస్పీ ప్రతాప్, సీఐ సుబ్బారెడ్డి, ఎస్సై సనత్కుమార్ ఆధ్వర్యంలో బందోబస్తు చేపట్టారు. మంత్రిని కలిసిన సర్పంచులు ముత్తారం(మంథని): కాంగ్రెస్ పార్టీ మద్దతుతో గెలిచిన సర్పంచులు శనివారం రాత్రి హైదరాబాద్లో మంత్రి శ్రీధర్బాబును కలిశారు. కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు చొప్పరి సదానందం, మండల అధ్యక్షుడు దొడ్డ బాలాజీ ఆధ్వర్యంలో మంత్రిని కలిశారు. సర్పంచులకు మంత్రి శుభకాంక్షలు తెలిపారు. కొత్త సర్పంచులు పెగడ తిరుమలకుమార్, ఇండ్ల కృష్ణావేని– సదయ్య, బియ్యని శివకుమార్, తాని ప్రభాకర్, సిలివేరి జ్యోతి – లక్ష్మణ్, చొప్పరి సంపత్, మెంగని స మత – తిరుపతి, బొంతల అన్నపూర్ణ – ఉపేందర్, రాపెల్లి రాజయ్య, గడ్డం రాజేశం మంత్రిని కలిసిన వారిలో ఉన్నారు. ధాన్యం గోల్మాల్పై నిరసన ముత్తారం(మంథని): కేశనపల్లి ఐకేపీ కొనుగో లు కేంద్రంలో ధాన్యం గోల్మాలైందని ఓ రైతు ఆదివారం ఆందోళన వ్యక్తం చేశాడు. బాధితు డు తాత కుమార్కు మద్దతుగా మాజీ సర్పంచ్ నూనె కుమార్తోపాటు స్థానికులు ఐకేపీ అధికారులను నిలదీశారు. కుమార్ 30 బస్తాల ధా న్యాన్ని తూకం వేసి వేరే రైతు ఖాతాలో జమచేశారని ఆరోపించారు. ఎన్నికల వేళ రైతులు స్పందించలేదని, లారీలో తక్కువ ధాన్యం ఉండడంతో వేరే రైతు ఆ ధాన్యం తనవే అని చె ప్పడంతో తూకం వేశామని ఐకేపీ అధికారి తి రుపతి తెలిపారు. బాధిత రైతుకు తెలియకుండా కాంటా వేయడం పొరపాటేనని, ధాన్యం డబ్బులు ఆయనకే వచ్చేలా చూస్తానని హామీ ఇవ్వడంతో రైతు అందోళన విరమించాడు. ఢిల్లీ ర్యాలీలో ‘ఖని’ నేతలుగోదావరిఖనిటౌన్: కాంగ్రెస్ అగ్రనేత రా హుల్ గాంధీ అధ్యక్షత న ఆదివారం న్యూఢిల్లీ రాంలీలా మైదానంలో జరిగిన ‘ఓట్ చోర్.. గ డ్డి చోడ్’ మహార్యాలీ లో గోదావరిఖనికి చెందిన ఎన్ఎస్యూ నేతలు పాల్గొన్నారు. ఎమ్మె ల్యే మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్ ఆదేశాల మే రకు ఎన్ఎస్యూఐ నేషనల్ ప్రెసిడెంట్ వరుణ్ చౌదరి నేతృత్వంలో దాసరి విజయ్కుమార్, గుడికందుల రవి, నేరెళ్ల రమేశ్, రాహుల్, అరవింద్, మహేశ్ ర్యాలీలో పాల్గొన్నారు. అప్పుడు భర్త ఓటమి.. ఇప్పుడు భార్య గెలుపు రామగుండం: అంతర్గాం మండలం రాయదండి గ్రామ పంచాయతీకి గ తంలో జరిగిన ఎన్నికల్లో సాదుల సదానందం ఓటమి పాలయ్యారు. తన ప్రత్యర్థి ధర్మాజి కృష్ణ ఒక్క ఓటుతో ఆయనపై గెలుపొందడం అప్పట్లో చర్చనీయాంశమైంది. అయినా మనస్తాపం చెందకుండా అప్పటి నుంచి ఇప్పటి వరకూ ప్రజల మధ్యే ఉన్నారు. గ్రామాభివృద్ధిలో పాలుపంచుకున్నారు. గ్రామస్తుల సమ స్యలు పరిష్కరిస్తూ వారి మన్ననలు పొందా రు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుత సర్పంచ్ ఎన్నిక ల్లో బీసీ(మహిళ) రిజర్వు స్థానం నుంచి తన భార్య సాదుల స్వప్నను బరిలో నిలిపారు. ఆ మె తన సమీప ప్రత్యర్థి మేడి వసంతపై 19 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఒక్క ఓటుతో ఓటమి పాలైన సదానందం.. తిరిగి సర్పంచ్ స్థానాన్ని తన సతీమణి స్వప్నతో భర్తీ చేయించారని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. -
ఓటుహక్కు వినియోగించుకున్నారా?
● వృద్ధురాలిని పలుకరించిన ఏసీపీ కృష్ణ పెద్దపల్లి/ధర్మారం: ధర్మారం మండలం ఖిలావనపర్తి గ్రామంలోని పోలింగ్ కేంద్రాన్ని పెద్దపల్లి ఏసీపీ కృష్ణ ఆదివారం సందర్శించారు. అక్కడ చేపట్టిన పోలీస్ బందోబస్తు తీరును తనిఖీ చేశారు. ఇదేసమయంలో ఓటుహక్కు వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రానికి ఓ వృద్ధురాలి వచ్చింది. ఏసీపీ కృష్ణ ఆమెను ఆప్యాయంగా పలుకరించారు. ఆ తర్వాత ఓటు వేశావా?, పోలింగ్ కేంద్రంలోకి వెళ్లడానికి పోలీస్ సిబ్బంది సాయం చేశారా? ఆరోగ్య పరిస్థితి బాగుందా? అని అడిగి తెలుసుకొన్నారు. పోలీసులు ప్రజలకు సాయం ఉంటారని, ప్రజలందరూ ఇబ్బందులు లేకుండా ఓటుహక్కు వినియోగించుకోవాలని ఏసీపీ సూచించారు. -
చివరి దశకు ధాన్యం కొనుగోళ్లు
పెద్దపల్లి: జిల్లాలో వానాకాలం ధాన్యం కొనుగోళ్లు చివరిదశకు చేరుకున్నాయి. ఇప్పటికే కొన్నిచోట్ల ధాన్యం రాకపోవడంతో కొనుగోలు కేంద్రాలను మూసివేసినట్లు సివిల్ సప్లయ్ డీఎం శ్రీకాంత్రెడ్డి తెలిపారు. ఈ సీజన్లో 333 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. ఇప్పటివరకు 62,756 మంది రైతుల నుంచి ధాన్యం సేకరించారు. వారినుంచి సేకరించిన ధాన్యం విలువ రూ.695 కోట్ల 18 లక్షలు కాగా ఇప్పటివరకు రూ.647 కోట్ల 50 లక్షలను వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. తినడానికి సన్నవడ్లు.. వానాకాలంలో అత్యధిక మంది రైతులు సన్నరకం వరి సాగుచేస్తారు. ఇందులో తినడానికి కొంత నిల్వచేసుకుని మిగతా ధాన్యం విక్రయిస్తారు. ఈసారి ఇప్పటివరకు సన్నరకం 2,53,418 మెట్రిక్ టన్నులు, దొడ్డురకం 37,438 మెట్రిక్ టన్నులను నిర్వాహకులు కొనుగోలు చేశారు. ధాన్యం విక్రయించిన రైతులకు 72 గంటల్లోనే ధాన్యం సొమ్మును బ్యాంకు ఖాతాల్లో జమచేశారు. ఎవరికై నా జమ కాకుంటే వెంటనే ఏఈవోలను సంప్రదించాలని అధికారులు సూచించారు. 40 సేకరణ కేంద్రాల మూసివేత 93 శాతం మంది రైతులకు ధాన్యం డబ్బులు చెల్లింపు రానివారు అధికారులను సంప్రదించాలి -
మేజర్ పంచాయతీల సర్పంచులు
పెద్దంపేట : ఆముల శ్రీనివాస్ (బీఆర్ఎస్) పాలకుర్తి: పెద్దపల్లి తిరుమల (బీఆర్ఎస్) ఈసాల తక్కళ్లపల్లి : బండి శ్రీనివాస్ (బీఆర్ఎస్)నంది మేడారం : వీర్పాల్ (కాంగ్రెస్) జూలపల్లి : పాటకుల అనూష (బీఆర్ఎస్) టీటీఎస్ అంతర్గాం : ఎ.రవికుమార్ (స్వతంత్ర) -
పోలింగ్ ప్రశాంతం: కలెక్టర్ కోయ శ్రీహర్ష
పెద్దపల్లి: రెండోవిడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. అంతర్గాం, పాలకుర్తి, ధర్మారం, జూలపల్లి మండలాల్లో పోలింగ్ 84.15 శాతం నమోదైందని అన్నారు. రెండోవిడత పోలింగ్ ప్రక్రియను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. మొత్తం 94,807 మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారని తెలిపారు. కలెక్టర్ వెంట జెడ్పీ సీఈవో నరేందర్, డీపీవో వీరబుచ్చయ్య, ఆర్డీవో గంగయ్య, తాహసీల్దార్లు శ్రీనివాస్, సునీత, ఎంపీడీవో ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. అంతర్గాంలో పర్యటన.. రామగుండం: అంతర్గాం మండలంలోని 15 పంచాయతీల్లో చేపట్టిన పోలింగ్ ప్రక్రియను కలెక్టర్ కోయ శ్రీహర్ష పర్యవేక్షించారు. తొలుత ఎంపీడీవో కార్యాలయానికి చేరుకున్నారు. ఎన్నికల ఏర్పాట్లు, ఇతరత్రా అంశాలు, అభ్యర్థుల వివరాలు, ఓటర్ల సంఖ్య, పోలింగ్ కేంద్రాలు తదితర అంశాలను ఎంపీడీవో సుమలతను అడిగి తెలుసుకున్నారు. జెడ్పీ సీఈవో నరేందర్, ఎంపీవో వేణుమాధవ్ ఉన్నారు. -
చెయ్యెత్తి.. జైకొట్టి..
సాక్షి పెద్దపల్లి: మలివిడత పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ ఆధిక్యం ప్రదర్శించింది. అంతర్గాం, పాలకుర్తి, ధర్మారం, జూలపల్లి మండలాల్లోని 73 పంచాయతీలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయగా.. మూడు పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. అందులో కాంగ్రెస్ మద్దతుదారులు బొట్లవనపర్తిలో సంగ రంజిత్కుమార్, బంజేరుపల్లిలో కల్లె ఇందిర, బీఆర్ఎస్ బలపరిచిన షైనేని రవి నాయకంపల్లిలో ఏకగ్రీవంగా గెలుపాందారు. మిగిలిన 70సర్పంచ్ స్థానాలకు 286 మంది అభ్యర్థులు పోటీపడగా, 684వార్డుల్లో 177వార్డులు ఏకగ్రీవమయ్యారు. మి గిలిన 507 వార్డుల్లో 1,417మంది పోటీపడ్డారు. ఏ కగ్రీవంతో కలుపుకుని 49 స్థానాల్లో కాంగ్రెస్ మద్దతుదారులు సత్తాచాటారు. బీఆర్ఎస్ 18 స్థానాల తో సరిపెట్టుకుంది. బీజేపీ బోణీకొట్టింది. 5చోట్ల స్వతంత్రులు, అంతర్గాం మండలం ఎక్లాస్పూర్లో సీపీఐ(ఎంఎల్) మాస్లైన్ అభ్యర్థి గెలుపొందారు. పల్లెల్లో కాంగ్రెస్ జోరు మొత్తం 70 స్థానాల్లో కాంగ్రెస్ మద్దతుదారులు సింహభాగం స్థానాలను దక్కించుకున్నారు. ఏకగ్రీవ మైన స్థానాలతో కలిపి మొత్తం 49 స్థానాలను కాంగ్రెస్ పార్టీ తన ఖాతాలో వేసుకుంది. రెండోస్థానానికే పరిమితమైన బీఆర్ఎస్ తొలివిడత ఎన్నికల్లో బీఆర్ఎస్ ద్వితీయ స్థానానికి పరిమితమవ్వగా, రెండోవిడతలో తలపడి రెండోస్థానానికే పరిమితమైంది. ఎంపీ, ఎమ్మెల్సీ ఎన్నికల తో పోల్చితే ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పుంజుకున్నట్లు కనిపిస్తోంది. ఎంపీ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడో స్థానానికి పరిమితమైన బీఆర్ఎస్.. స్థానిక ఎన్నిక ల్లో ద్వితీయ స్థానంతో పట్టును నిలుపుకుంది. రెండోవిడతలో ఏకగ్రీవంతో కలుపుకు ని 18సీట్లు గెలుపొందింది. జూలపల్లిలోని 13 సర్పంచ్ స్థానాల్లో కాంగ్రెస్ను వెనక్కినెట్టి 8 సీట్లు సాధించింది. బోణీ కొట్టిన బీజేపీ.. తొలివిడతలో ఖాతా కూడా తెరవని బీజేపీ.. రెండోవిడతలో జూలపల్లి మండలం కోనరావుపేటలో తన మద్దతుదారు విజయంతో బోణీ కొట్టింది. అక్కడ బీజేపీ మద్దతుతో నల్లా నరేందర్రెడ్డి సర్పంచ్గా గెలుపొందారు. ఎంపీ ఎన్నికల్లో ద్వితీయ, టీచర్స్, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రథమ స్థానంలో నిలిచి సీట్లను కై వసం చేసుకున్న బీజేపీ.. పంచాయతీ ఎన్నికల్లో డీలా పడింది. రెండోవిడత 84.15 శాతం పల్లె ఓటర్లు ఓటెత్తారు. రెండోవిడత పంచాయతీ ఎన్నికల్లో పెద్దఎత్తున ఓటుహక్కు వినియోగించుకున్నారు. తొలిసారి ఓటుహక్కు పొందిన యువత ఉ త్సాహంగా తమ ఓటుహక్కు వినియోగించుకున్నా రు. పోలింగ్ పూర్తయ్యాక మధ్యాహ్నం 2 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. వార్డుల వారీగా తొ లుత ఫలితాలు ప్రకటించి, అనంతరం సర్పంచ్ ఫ లితాలు వెల్లడించారు. అంతర్గాం, పాలకుర్తి, ధర్మారం, జూలపల్లి మండలాల్లోని 70 పంచాయతీల్లో సర్పంచ్, వార్డుస్థానాలకు పోలింగ్ జరిగింది. ఏజెంట్ల రాక ఆలస్యంతో.. పలుచోట్ల పోలింగ్ ముగిసిన తర్వాత భోజన వి రామం ప్రకటించారు. ఆ తర్వాత ఏజెంట్లు సకాలంలో లెక్కింపు కేంద్రాలకు చేరుకోలేదు. దీంతో ఓట్ల లెక్కింపు కాస్త ఆలస్యంగా ప్రారంభమైంది. సర్పంచ్, వార్డు సభ్యుల బ్యాలెట్ పేపర్లను వేరుచేసి 25 బ్యాలెట్ పేపర్లకు ఒకకట్టగా కట్టారు. ఆ తర్వాత అభ్యర్థులకు వచ్చిన ఓట్లు లెక్కించారు. ముందుగా వార్డు స్థానాల ఫలితాలు ప్రకటించారు. అనంతరం సర్పంచ్ ఫలితాలు వెల్లడించారు. ఓట్లు తక్కువగా ఉన్న చిన్నగ్రామ పంచాయతీల్లో సాయంత్రం ఐదు గంటల వరకే ఫలితాలు వెల్లడయ్యాయి. మండల కేంద్రాలు, మేజర్ గ్రామ పంచాయతీల్లో ఫలితాలు కాస్త ఆలస్యంగా వచ్చాయి. 1.88 శాతం పెరిగిన పోలింగ్.. వణికించే చలితో ఓటర్లు పొద్దున కాస్త ఆలస్యంగా పోలింగ్ కేంద్రాలకు కదిలివచ్చారు. ఉదయం మందకొడిగా సాగిన పోలింగ్.. గడువు ముగిసే స మయానికి పెరుగుతూ వచ్చింది. గడువు ముగిసిన పోలింగ్ కేంద్రాల్లో బారులు తీరిన ఓటర్లను ఓటుహక్కు వినియోగించుకోవడానికి ఎన్నికల అధికారు లు అనుమతించారు. ఉదయం 9 గంటలకు 23.94 శాతం, ఉదయం 11 గంటలకు 55.20 శాతం, పోలింగ్ ముగిసే సమయానికి 84.15 శాతం పోలింగ్ నమోదైంది. తొలివిడతలో 82.27శాతం పోలింగ్ నమోదుకాగా, మలి దశలో 1.88శాతం పెరిగింది. గుర్తింపు కార్డులేక.. ఫోన్లు అనుమతించక బీఎల్వోలు ఓటర్లకు పోల్చీటీలను ముందుగానే పంపిణీ చేశారు. అయినా, పలువురు ఓటర్లు పోల్ చీటీలతోపాటు గుర్తింపుకార్డులు తీసుకునిరాలేదు. దీంతో ఓటుహక్కు వినియోగించుకోవడానికి ఎన్నికల అధికారులు వారిని అనుమతించలేదు. ఇలాంటివారు మళ్లీ ఇళ్లకు వెళ్లి తమ గుర్తింపుకార్డులు తీసుకొని వచ్చి ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు పోలింగ్ కేంద్రాల్లోకి మొబైల్ఫోన్లు అనుమతించలేదు. విష యం తెలియక ఫోన్లతో తరలివచ్చిన పలువురు ఓ టర్లు వాటిని పోలింగ్ కేంద్రాల బయ ట ఉన్నవారికి అప్పగించారు. ఆ తర్వాత ఓటు హక్కు వినియోగించుకున్నారు. బ్యాలెట్ పేపర్పై అభ్యర్థి పేరు లేకుండా కేవలం గుర్తు మాత్రమే ఉండడంతో కొందరు ఓటర్లు ఓటు వేసేందుకు తికమకపడ్డారు. మొత్తంగా జిల్లావ్యాప్తంగా రెండోదశ పోలింగ్ ప్రశాంత వాతావరణంలో ముగిసింది.రామగుండం : కుందనపల్లి పోలింగ్ కేంద్రం ఎదుట ఓటర్ల సందడిధర్మారం ప్రభుత్వ జూనియర్ కళాశాల పోలింగ్ కేంద్రంలో బారులు తీరిన ఓటర్లుఓటుహక్కు వినియోగించుకున్న ఐఏఎస్ అధికారి పరికిపండ్ల నరహరి, పలువురు యువ ఓటర్లురెండోవిడత పోలింగ్ వివరాలు మండలం మొత్తం ఓట్లు పోలైనవి శాతం అంతర్గాం 17930 15455 86.20 ధర్మారం 42447 35178 82.88 జూలపల్లి 24163 20590 85.21 పాలకుర్తి 28118 23584 83.88 మొత్తం 1,12,658 94807 84.15 గెలుపొందిన వివిధ పార్టీల మద్దతుదారులు మండలం జీపీలు ఏకగ్రీవం కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ ఇతరులు పాలకుర్తి 16 0 14 02 0 0 అంతర్గాం 15 0 12 01 0 2 జూలపల్లి 13 0 03 08 1 1 ధర్మారం 29 3 18 06 0 2 మొత్తం 73 3 47 18 1 5 -
పల్లెలకు పట్టణ శోభ తెస్తాం
పెద్దపల్లిరూరల్: పల్లెలకు పట్టణ శోభ తీసుకొస్తామ ని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. పెద్దబొంకూర్, రాఘవాపూర్, రంగాపూర్, కనగర్తి, పా లితం, కాసులపల్లి, తుర్కలమద్దికుంట గ్రామాల్లో ఆదివారం పంచాయతీ ఎన్నికల సభల్లో పాల్గొని కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులను గెలిపించాలని అ భ్యర్థించారు. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ మద్దతుదారు లు దుష్ప్రచారం చేయడం మానుకోవాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేస్తోందన్నారు. అభివృద్ధిని ఆకాంక్షించే వారు కాంగ్రెస్ మద్దతుదారులనే గెలిపించుకోవాలని కోరారు. నాయకులు ఆడెపు వెంకటేశం, గంట రమేశ్, ముడుసు సాంబిరెడ్డి, కూ రమల్లారెడ్డి, ఇనుగాల తిరుపతిరెడ్డి పాల్గొన్నారు. గ్రామాభివృద్ధిపై దృష్టి కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): పాలకవర్గం గ్రామాభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే విజయరమణారావు సూచించారు. మొట్లపల్లి పంచాయతీ పాలకవర్గాన్ని ఎమ్మెల్యే అభినందించారు. సర్పంచ్ తులా మనోహర్రావు, ఉపసర్పంచ్ బొమ్మల సుమలత – సదయ్య, వార్డుసభ్యులు దొమ్మటి శంకరమ్మ, పోశా లు, శారద, రమేశ్, రాజేశం, మానస, కాంగ్రెస్ నాయకులు దొమ్మటి రవి, శ్రీనివాస్, సంపత్, తిరుపతి, గాదర్ల వెంకటేశ్, ఎండీ ఫారూక్ పాల్గొన్నారు. పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు -
ఎన్నికలకు బందోబస్తు
జూలపల్లి(పెద్దపల్లి): పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్ట చర్యలు తీసుకున్నట్లు పెద్దపల్లి డీసీపీ భూక్యా రాంరెడ్డి చెప్పారు. స్థానిక కళాశాల ఆవరణలో శనివారం పోలీసు సిబ్బంది కేటాయింపు తదితర అంశాలపై ఆరా తీశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని అన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు రాజకీయ పార్టీల నాయకులు, ఓటర్లు సహకరించాలని ఆయన కోరారు. ఏసీపీ కృష్ణ, ఏఆర్ డీసీపీ ప్రతాప్, సీఐ సుబ్బారెడ్డి, ఎస్సై సనత్కుమార్ తదితరులు పాల్గొన్నారు. వి‘జయలక్ష్మి’ పెద్దపల్లిరూరల్: రాంపల్లి ఉపసర్పంచ్గా మడుపు జయలక్ష్మి ఎన్నికయ్యారు. సర్పంచ్తో పాటు 8మంది వార్డుసభ్యులు ఏకగ్రీవమైన విషయం విదితమే. ఉపసర్పంచ్ ఎన్నిక కోసం రాంపల్లి రైతువేదికలో శనివారం సమావేశమయ్యారు. మడుపు జయలక్ష్మి, కనుకుంట్ల అంజ య్య పదవిని ఆశించారు. ఎవరికి వారే తమకు కావాలంటూ భీష్మించుకు కూర్చున్నారు. దీంతో గ్రామపెద్దల సమక్షంలో లాటరీ ద్వారా డ్రా తీయగా జయలక్ష్మిని ఉపసర్పంచ్ పదవి వరించింది. ఆమెను సర్పంచ్ కనపర్తి సంపత్రావు, మాజీ సర్పంచ్ ప్రభాకర్రావు, నాయకులు నర్సింగం తదితరులు అభినందించారు. సైక్లింగ్తో సంపూర్ణ ఆరోగ్యం సైక్లింగ్లో అపర్ణ–సాయి కృష్ణ దంపతులు జ్యోతినగర్(రామగుండం): ఆరోగ్యమే మహాభాగ్యమనే సందేశాన్ని ప్రజలకు చేరవేయడం, సైక్లింగ్ ప్రాముఖ్యతను చాటిచెప్పడం కోసమే సైక్లింగ్ చేపట్టామని కరీంనగర్కు చెందిన చిందం అపర్ణ – సాయికృష్ణ దంపతులు తెలిపా రు. 600 కి.మీ. వరకు చేపట్టిన సైకిల్ యాత్ర శనివారం ఎన్టీపీసీకి చేరుకుంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రస్తుత పరిస్థితుల్లో ఆరోగ్య సమస్యల పరిష్కారానికి వ్యాయామం ఎంతో అవసరమన్నారు. కరీంనగర్లో ప్రారంభమైన సైకిల్రైడ్ రామగుండం, వాంకిడి, కరీంనగర్, హైదరాబాద్(రింగ్ రోడ్డు) నుంచి కరీంనగర్ మీదుగా సాగుతుందని వారు తెలిపారు. కోల్ ఇండియా సైక్లింగ్లో గోల్డ్మెడల్ సాధించిన వెంకటతిరుపతిరెడ్డి తదితరులు వారిని కలిసి అభినందనలు తెలిపారు. రేపు పత్తి మార్కెట్ బంద్ పెద్దపల్లిరూరల్: స్థానిక వ్యవసాయ మార్కెట్యార్డు ఆవరణలో సోమవారం పత్తి కొనుగోళ్లు నిలిపివేస్తున్నామని మార్కెట్ ఇన్చార్జి కార్యదర్శి ప్రవీణ్రెడ్డి తెలిపారు. మార్కెట్లో అడ్తిదారు బుద్దె చంద్రమౌళి ఆకస్మిక మృతికి సంతాపసూచకంగా అడ్తిదారులంతా మార్కెట్ బంద్ ఉంచాలని కోరారని ఆయన పేర్కొన్నారు. రైతులు ఈనెల 15న (సోమవారం) పత్తి నిల్వ లు మార్కెట్కు తేవొద్దని ఆయన సూచించారు. ఎన్టీపీసీలో సమ్మెలు నిషేధం జ్యోతినగర్(రామగుండం): ఎన్టీపీసీలో ఆరు నెలలపాటు సమ్మెలు నిషేధించారు. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్ ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్, తెలంగాణ ఎసెన్షియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ యాక్ట్, 1971 (1971లోని చట్టం 20) నిబంధనల ప్రకారం, ఈనెల 14 నుంచి ఆరు నెలలపాటు సమ్మెలు నిషేధిస్తున్నట్లు ఉత్తర్వులు జారీచేశారు. కల్లుకు తగ్గిన డిమాండ్ పెద్దపల్లిరూరల్: జిల్లాలోని పంచాయతీ సర్పంచ్, వార్డుస్థానాలకు పోటీచేస్తున్న అభ్యర్థులు.. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు రోజూ మద్యం, మాంసంతో విందులు ఇస్తున్నారు. దీంతో తెల్లకల్లుకు గిరాకీ బాగా పడిపోయింది. పంచాయతీ సర్పంచ్ అభ్యర్థులు, వార్డు సభ్యులకు పోటీపడేవారు ఇలా ఓటర్లకు మద్యం అందిస్తుండడంతోనే తెల్లకల్లు తాగేందుకు ఎవరూ రావడంలేదని పలువురు గీతకార్మికులు తెలిపారు. అందుబాటులో బీర్లు, విస్కీ, బ్రాండీ ఉండగా.. తెల్లకల్లు తాగుడేందని ఓటర్లు భావిస్తున్నారో ఏమో! తమ వద్ద రోజూ ఈతకల్లు తాగేందుకు వచ్చే వారు ఎవరూ ఇటువైపు వచ్చిన దాఖలాలు కనిపించడం లేదని పలువురు గీతకార్మికులు పేర్కొంటున్నారు. -
70 పల్లెలు
4 మండలాలు..సాక్షి,పెద్దపల్లి/పెద్దపల్లి: జిల్లాలో రెండోవిడత పంచాయతీ సమరానికి ఎన్నికల అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఆదివారం ఉద యం 7 గంటల నుంచి మధ్యా హ్నం ఒంటిగంట వరకు పోలింగ్ నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభించి, ఫలితాలు వెల్లడిస్తారు. ఆ తర్వాత ఉపసర్పంచ్లను ఎ న్నుకుంటారు. జిల్లాలోని ధర్మారం, పాలకుర్తి, జూలపల్లి, అంతర్గాం మండలాల్లోని 70 గ్రామాల్లో పోలింగ్ నిర్వహిస్తారు. శనివారం ఉదయం నుంచే ఆయా మండల కేంద్రాల నుంచి ఎన్నికల సిబ్బంది సామగ్రితో తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. భద్రత బలగాలు వారివెంట తరలివెళ్లాయి. పల్లెలు ప్రశాంతం.. శుక్రవారం వరకు ప్రచారంలో హోరెత్తిన పల్లెలు ఇప్పుడు ప్రశాంతంగా మారాయి. సర్పంచ్, వార్డు స్థానాలకు పోటీపడుతున్న అభ్యర్థులు వారంరోజులుగా ఇంటింటా ప్రచారం చేశారు. ఊరేగింపులు, నమూనా బ్యాలెట్ పత్రాలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేశారు. శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ప్రచారం గడువు ముగియడంతో ప్రలోభాలకు తెరతీశారు. రెండోవిడతలో 73 పంచాయతీలో ఎన్నికలు జరపాల్సి ఉండగా.. బొట్లవనపర్తి, బంజేరుపల్లి, నాయకంపల్లి పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 70 సర్పంచ్ స్థానాల కు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 286 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అలాగే 684 వార్డులకు 177 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 507 వార్డులకు 1,454 మంది పోటీపడుతున్నారు. 1,13,908 మంది ఓటర్లు.. రెండోవిడతలో 1,13,908 మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకునే అవకాశం ఉంది. అంతర్గాం మండలంలో 17, 930మంది, ధర్మారంలో 43,697మంది, జూలపల్లి మండలంలో 24,163 మంది, పాలకుర్తి మండలంలో 28,118 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 57,702 మంది కాగా.. మహిళలు 56,201 మంది ఉండగా.. ఇతరులు ఐదుగురు ఉన్నారు. అమలులో 163 బీఎన్ఎస్ఎస్ యాక్టు.... ఎన్నికలు జరిగే నాలుగు మండలాల్లో 163 బీఎన్ఎస్ఎస్ యాక్టు అమలులో ఉండనుంది. ఓట్ల లెక్కింపు పూర్తికాగానే సాయంత్రం ఐదు గంటల నుంచి ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా పోలీస్శాఖ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. ఆంక్షల సమయంలో నలుగురికి మించి గుంపులుగా చేరడం, కర్రలు, కత్తులు తదితర మారణాయుధాలతో సంచరించడాన్ని నిషేధించారు. పల్లెబాట పట్టిన ప్రజలు హైదరాబాద్ తదితర సుదూర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ఆయా పల్లెల ప్రజలు పోలింగ్ నేపథ్యంలో స్వగ్రామాల బాటపట్టారు. సర్పంచ్, వార్డుస్థానాల్లో పోటీచేస్తున్న అభ్యర్థులు కూడా ఓటర్ల కోసం సొంతంగా వారికి వాహనాలు సమకూర్చుతున్నారు. చివరి ప్రయత్నంగా అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఇంటింటికీ తిరుగుతున్నారు. ఓటుకు నోటు, మద్యం సీసాలు పంపిణీ చేస్తున్నారు. తమకే ఓటు వేయాలంటూ కాళ్లు మొక్కుతూ, ఒట్టు కూడా వేయించుకుంటున్నారు. అయితే, మరికొద్ది గంటల్లోనే ఎవరి భవితవ్యం ఏమిటో తేలిపోనుంది. అధికారులు, సిబ్బంది సమాచారం పోలింగ్ కేంద్రాలు 684 పీవోలు 787 ఏపీవోలు 1,031 రూట్లు 2 జోన్లు 12 వెబ్కాస్టింగ్ కేంద్రాలు 39 రెండోవిడతలో మొత్తం పంచాయతీలు 73 ఏకగ్రీవమైన సర్పంచులు 3 ఎన్నికలు జరిగేవి 70 పోటీలో ఉన్న అభ్యర్థులు 286 మొత్తం వార్డులు 684 ఏగ్రీవమైనవి 177 ఎన్నికలు జరిగేవి 507 బరిలో ఉన్నవారు 1,454 -
పోలింగ్ కేంద్రాలపై పోలీస్ ఫోకస్
గోదావరిఖని: రెండోవిడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు భారీ పోలీసు బందో బస్తు ఏర్పాటు చేశారు. ఆదివారం పోలింగ్ జరిగే గ్రామ పంచాయతీలపై పోలీసులు డేగకన్ను వేశా రు. రామగుండం పోలీస్ కమిషనరేట్లో 1,680 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా, 1,700 మంది పోలీసు బలగాలను మోహరించారు. 519 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. పోలీసు బందోబస్తు ఇలా రామగుండం పోలీసు కమిషనరేట్లోని మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో ఎన్నికల నిర్వహణ కోసం భారీ పోలీస్ బందోబస్తు చేపట్టారు. ఇందులో ఇ ద్దరు డీసీపీలు, ఏడుగురు ఏసీపీలు, 30మంది సీఐ లు, 95మంది ఎస్సైలు, 270 మంది హెడ్ కానిస్టేబుళ్లు, 520మంది కానిస్టేబుళ్లు, 240మంది హోంగార్డులు, 190మంది ఆర్ముడ్ సిబ్బంది, 32 క్యూర్టీ టీంలు ఉన్నాయి. వీరితోపాటు రెండు రూట్ మొ బైల్ పార్టీలు 62 ఏర్పాటు చేశారు. చెక్పోస్ట్ల్లో భ ద్రత కట్టుదిట్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా స్థానిక పోలీసులతోపాటు డయల్ 100 నంబరకు సమాచారం ఇవ్వాలని పోలీస్ అధికారులు సూచించారు. కమిషనరేట్లోని పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లోని సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాం. పాతనేరస్తుల కదలికలపై డేగకన్ను వేశాం. రూట్ మొబైల్స్, స్ట్రెకింగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రెకింగ్ ఫోర్స్ను నియమించాం. ఎన్నికల ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా పటిష్టమైన చర్యలు చేపట్టాం. క్రిటికల్ పోలింగ్ గ్రామాల్లో ఫ్లాగ్మార్చ్ నిర్వహించి ఎన్నికలపై ప్రజల్లో భరోసా కల్పించాం. – అంబర్ కిశోర్ ఝా, పోలీస్ కమిషనర్, రామగుండం -
ఏఐసీసీ నేతలు స్పందించాలి
పెద్దపల్లి: బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి శ్రీ మన్నారాయణ శనివారం న్యూఢిల్లీలోని ఏఐసీసీ కా ర్యాలయాన్ని సందర్శించారు. జాతీయ స్థాయిలో ఓబీసీ ఉద్యమం ఆవశ్యకతపై ఏఐసీసీ అగ్రనేతలకు వివరించారు. బీసీ రిజర్వేషన్లపై పార్లమెంట్ సమావేశాల్లో ప్రస్తావించాలని రాహుల్ గాంధీ కార్యాల య కార్యదర్శికి వినతిపత్రం అందజేసినట్లు పేర్కొన్నారు. ఆయన వెంట నాయకులు ఉన్నారు.తీరని రైల్వేగేట్ కష్టాలు పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి – కూనారం మధ్య రైల్వే లెవల్ క్రాసింగ్ గేట్తో వాహనదారులకు తిప్పలు తప్పడం లేదు. ప్రతీ పది, ఇరవై నిముసాలకో రైలు రాకపోకలు సాగిస్తూ ఉంటుంది. తరచూ గేట్ వేయక తప్పని పరిస్థితి ఉంది. గంటల కొద్దీ నిరీక్షించలేని వాహనదారులు.. ప్రమాదం అని తెలిసినా గేట్ కిందనుంచి వాహనాలను ఇలా దాటిస్తూ ‘సాక్షి’ కెమెరాకు చిక్కారు. – పెద్దపల్లిరూరల్కొద్దిపాటి నీళ్లతోనే నారుమడులు ఎస్సారెస్పీ కాలువ ద్వారా సరఫరా అయ్యే సాగునీటిపై ఆధారపడిన రైతులు వరి నారుమడి సిద్ధం చేసేందుకు నీటికష్టాలు తప్పడం లేదు. ఎస్సారెస్పీ కాలువ అడుగున మిగిలిన కొద్దిపాటి నీటిని సైతం తోడేందుకు విద్యుత్ మోటార్లు అమర్చుకుంటున్నారు కొందరు రైతులు. ఆ నీటితోనే నారుమడిని సిద్ధం చేసుకుంటున్నారు. రాంపల్లి గ్రామశివారులోని ఎస్సారెస్పీ కాలువ వద్ద కనిపించిందీ దృశ్యం. – పెద్దపల్లిరూరల్ రైస్మిల్లుల్లో ధాన్యం గుట్టలు వానాకాలం ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యాయి. ఆశించిన దానికన్నా అధికంగానే పంట రైతుల చేతికి అందింది. ఐకేపీ, ప్యాక్స్లు కొనుగోలు చేసిన ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించారు. ఇలా తరలివచ్చిన ధాన్యం బస్తాలను మిల్లుల్లో నిల్వచేయగా.. గుట్టల్లా కనిపిస్తున్నాయి. సుల్తానాబాద్లోని మిల్లుల్లో కనిపించిన ధాన్యం బస్తాలు ఇవీ.. – సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి -
ఆధునిక సాంకేతికతపై ఇల్లెందు క్లబ్లో సదస్సు
గోదావరిఖని: ఆధునిక సాంకేతికతపై స్థానిక ఇల్లెందు క్లబ్లో శనివారం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్(ఐఈఐ) సదస్సు నిర్వహించారు. గనులు, విద్యుత్, మౌలిక సదుపాయాలు, డిజిటల్ సాంకేతికత, వ్యవసాయం వంటి విభిన్న రంగాలపై నిపుణులు అవగాహన కల్పించారు. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా, మాజీ ఎమ్మెల్యే, ఇంజినీర్ సోమారపు సత్యనారాయణ, ఐఈఐ రాష్ట్ర కమిటీ చైర్మన్ రమణ నాయక్, గౌరవ కార్యదర్శి మర్రి రమేశ్, సభ్యులు కె.లక్ష్మీనారాయణ ఆర్జీ–వన్ జీఎం లలిత్కుమార్ తదితరులు పాల్గొన్నారు. గనుల అక్రమ తరలింపు, ఫ్లైయాష్ నిర్వహణ, స్మార్ట్ మైనింగ్లో 5ఏ అడ్వాన్స్డ్, ‘క్రాప్ దర్పణ్’ యాప్, ఏఐ ఆధారిత పంట ఆరోగ్య నిర్ధారణ, ఎంఎండీఆర్ చట్టంపై సుదీర్ఘంగా చర్చించారు. సాంకేతిక సదస్సు జ్ఞాన మార్పిడి, వృత్తిపరమైన పరస్పర చర్యలు, విధానాలు – సాంకేతికత – సుస్థిరతపై చర్చకు వేదికగా సదస్సు నిలిచింది. -
ఎంపీల నివాసాల ఎదుట నిరసన
పెద్దపల్లి: పార్లమెంట్ సమావేశాల్లో బీసీ రిజర్వేషన్ల బిల్లు ప్రవేశ పెట్టాలనే డిమాండ్తో న్యూఢిల్లీలోని తెలంగాణ ఎంపీల నివాసాల ఎదుట బీసీ నాయకులు శనివారం నిరసన తెలిపారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి రాగరుషి అరుణ్ కుమార్, జేఏసీ కో ఆర్డినేటర్ గుజ్జ సత్యం, నాయకుడు తాళ్లపల్లి మనోజ్ కుమార్గౌడ్ ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ కోమటిపల్లి రాజేందర్ మాట్లాడుతూ, స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని రెండేళ్లుగా నమ్మించి. కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేసిందని ఆరోపించారు. భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ ఇచ్చిన హామీలు అమలు కాలేదని విమర్శించారు. ప్రతీ ఎన్నికలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు వర్తింపజేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ఉద్యమం ఆరంభం మాత్రమేనని, జనవరి 10న ఎంపీల ఇళ్లు ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. -
ప్రజల కోసం హెల్ప్డెస్క్
పెద్దపల్లి: లీగల్ ఎయిడ్ హెల్ప్ డెస్క్ను ప్రజ లు వినియోగించుకోవాలని జిల్లా జడ్జి సునీత కుంచాల సూచించారు. స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో సూపరింటెండెంట్ శ్రీధర్తో కలిసి లీగల్ ఎయిడ్ హెల్ప్ డెస్క్ను శుక్రవారం ప్రారంభించి మాట్లాడారు. వైద్యసేవలపై సంతృప్తి వ్యక్తం చేశారు. పలువురు ఉద్యోగులు పాల్గొన్నారు. ఓదెలలో స్థల పరిశీలన ఓదెల(పెద్దపల్లి): మండల కేంద్రంలో జూనియ ర్ సబ్కోర్డు పక్కా భవన నిర్మాణానికి సుల్తానాబాద్ కోర్డు జడ్జి గణేశ్ శుక్రవారం ఓదెలలో స్థల పరిశీలన చేశారు. ఎస్సారెస్పీ కార్యాలయం స మీపంలోని 1.5ఎకరాల్లో భవనం నిర్మించాలని నిర్ణయించారు. ఈమేరకు హద్దులు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ ధీరజ్కుమార్, న్యాయవాదులు పాల్గొన్నారు. నేడు నవోదయ ప్రవేశ పరీక్ష పెద్దపల్లి: ఆరో తరగతిలో ప్రవేశాల కోసం శని వారం ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు జవహర్ నవోదయ పరీక్ష నిర్వహిస్తారని డీఈవో శారద తెలిపారు. ఉమ్మ డి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 6,892 మంది విద్యార్థులు దరఖాస్తు చేశారని పేర్కొన్నారు. ఈమేరకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. విద్యార్థుకు సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని ఆమె సూచించారు. ఎన్టీపీసీలో ఓపెన్హౌస్ ఫోరంజ్యోతినగర్(రామగుండం): ఎగ్జిక్యూటివ్ డైరె క్టర్ ఆధ్వర్యంలో ఎన్టీపీసీ పరిపాలన భవనంలో శుక్రవారం ఓపెన్ ఫోరం హౌస్ నిర్వహించారు. సంస్థ అభివృద్ధిలో ఉద్యోగుల కృషి ఎంతో ఉందని ఆయన అన్నారు. అధికారులు, ఉద్యోగులు సంస్థాగత ప్రభావంపై పలు సూ చనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఉన్నతాఽధికారులు, అధికారులు, వివిధ యూనియన్ల ప్రతి నిధులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రంలో విశ్వం ఎడ్యు టెక్ ఆధ్వర్యంలో అబాకస్ అండ్ వేదిక్ మాథ్స్ జిల్లాస్థాయి పోటీలు శుక్రవారం జరిగాయి. ప లు ప్రాంతాల నుంచి 40 పాఠశాలలకు చెందిన 500 మంది వరకు విద్యార్థులు పాల్గొన్నారు. అందులో 31 మంది ప్రతిభ చూపి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు అన్నయ్యగౌడ్ ఎంపికైన విద్యార్థులను అభినందించారు. రాష్ట్రస్థాయి పోటీలు జనవరిలో ఉంటాయని రీజినల్హెడ్ వినాయక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో టీం సభ్యులు స్రవంతి, సురేందర్, సాగర్, నాగరాజు, కిశోర్, శివ, సూరజ్ పాల్గొన్నారు.ప్రశాంతంగా వాతావరణంలో ఎన్నికల నిర్వహణరామగుండం: రెండోవిడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా పకడ్బందీ బందోబస్తు చేపట్టామని పెద్దపల్లి డీసీపీ రాంరెడ్డి తెలిపారు. ఓటర్లపై ఒత్తిడి తేవొద్దన్నారు. అంతర్గాం మండలం గోలివాడలో శుక్రవారం ఆయన అభ్యర్థులకు పలు సూచనలు చేశారు. గోదావరిఖని ఏసీపీ రమేశ్, రామగుండం సీఐ ప్రవీణ్కుమార్, అంతర్గాం ఎస్సై వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.క్వింటాల్ పత్తి రూ.7,431 పెద్దపల్లిరూరల్: స్థానిక వ్యవసాయ మార్కెట్యార్డులో శుక్రవారం పత్తి క్వింటాల్కు గరిష్టంగా రూ.7,431 ధర పలికింది. కనిష్టంగా రూ. 6,878, సగటు రూ.7,211గా ధర నిర్ణయించినట్లు మార్కెట్ ఇన్చార్జి కార్యదర్శి ప్రవీణ్రెడ్డి తెలిపారు. జిల్లాలోని పలు ప్రాంతాలనుంచి రైతులు తీసుకొచ్చిన 532 క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేసినట్లు ఆయన వివరించారు. సూచనలిస్తున్న డీసీపీ రాంరెడ్డి -
ఆధిపత్య ఆరాటం!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: గ్రామపంచాయతీ ఎన్నికల్లో తొలిఘట్టం ముగిసింది. తొలివిడతలో 397 గ్రామాలకు ఎన్నికలకు జరగ్గా 51శాతానికి పైగా (205) స్థానాలు కై వసం చేసుకుని కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం ప్రదర్శించింది. ఇక 29శాతం (116) సీట్లు దక్కించుకుని బీఆర్ఎస్ రెండోస్థానంలో నిలవగా, బీజేపీ 9శాతం (35) సీట్లతో మూడో స్థానం దక్కించుకుంది. ఉమ్మడి జిల్లాలో తొలివిడతలో 398 గ్రామాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా.. పెద్దపల్లి జిల్లా పెద్దంపేట గ్రామం ఎన్నిక కోర్టు కేసు నేపథ్యంలో వాయిదా పడింది. మొత్తంగా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కాంగ్రెస్ ఆధిపత్యం ప్రదర్శించింది. బీఆర్ఎస్, బీజేపీలు చెప్పుకోదగ్గ సీట్లు సాధించాయి. నాలుగు నియోజకవర్గాల్లో జరిగిన ఎన్నికల్లో ఏయే గ్రామాల్లో ఎవరు ఎన్ని ఓట్లు సాధించారు? ఎంత వ్యత్యాసంతో ఓటమి చెందారు? ఏ కారణాలు విజయావకాశాలను ప్రభావితం చేశాయన్న విషయాలపై పార్టీలపరంగా ఆలోచనలు చేస్తున్నారు. బీజేపీ అనూహ్య ఫలితాలు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా బీజేపీ బలపరచిన దాదాపు 35 మంది సర్పంచులు గెలిచారు. మరో 35మంది వరకు స్వల్ప మెజారిటీతో ఓడిపోయారు. పెద్దపల్లి జిల్లాలో బీజేపీ ప్రభావం కనిపించలేదు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రాతినిధ్యం వహిస్తోన్న కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని కరీంనగర్లో 14, సిరిసిల్లలో 07 స్థానాలు గెలచుకుని సత్తా చాటింది. జగిత్యాలలోనూ 14 స్థానాలు కై వసం చేసుకుని మొత్తంగా 35 సర్పంచులను గెలిపించుకుంది. ఈ విజయానికి రెండో, మూడో విడతలను వేదికగా చేసుకోవాలని పథకాలు రచిస్తోంది. వాస్తవానికి ఒక్క కరీంనగర్ ఎంపీ సెగ్మెంట్లోనే తాము బలపరిచిన 50 మంది సర్పంచ్గా గెలిచారంటూ ప్రకటించడం విశేషం. మొత్తానిక బీజేపీ అనూహ్య ఫలితాలు ఆ పార్టీలో సరికొత్త జోష్ నింపింది. 10శాతం ఇతరులపై అధికార పార్టీ కన్ను ఉమ్మడి జిల్లావ్యాప్తంగా తొలివిడతలో 44 మంది అభ్యర్థులు ఇతరులు/ స్వతంత్రులు ఉన్నారు. వీరందరినీ ఇప్పటికే అధికార పార్టీ తమ వైపు తిప్పుకునే పనిలో నిమగ్నమైంది. దాదాపుగా వీరంతా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇక మిగిలిన బీఆర్ఎస్ నుంచి గెలిచిన 116 మంది సర్పంచుల్లో పలువురితో అధికార పార్టీ మంతనాలు మొదలుపెట్టింది. గెలిచిన వారంతా మనోళ్లే అన్న సిద్ధాంతంతో అధికార పార్టీ ముందుకు వెళ్తుండగా.. అప్పులు చేసి గెలిచిన వాళ్లు, అధికార పార్టీతో మనకెందుకు అన్న ఆందోళనలో ఉన్న వారంతా హస్తం తీర్థం పుచ్చుకునే ఆలోచిస్తున్నారు. వీరంతా తోడైతే అధికార పార్టీ మద్దతు ఉన్న సర్పంచుల సంఖ్య అమాంతం పెరగనుంది. తొలివిడతలో పెద్దపల్లిలో కాంగ్రెస్ 90 గ్రామాల సర్పంచ్ స్థానాలకుగాను 70 స్థానాలు గెలిచి పూర్తిస్థాయిలో ఆధిపత్యం ప్రదర్శించింది. కరీంనగర్లో 92 స్థానాలకు కాంగ్రెస్ 44 గెలవగా, 24 చోట్ల కారు పార్టీ విజయం సాఽధించింది. జగిత్యాలలో 122కి 52 సర్పంచులను కాంగ్రెస్ గెలవగా.. 42 సర్పంచు సీట్లను బీఆర్ఎస్ గెలుచుకుని గట్టిపోటీ ఇచ్చింది. సిరిసిల్లలోనూ 85 సర్పంచి స్థానాలలో 39 కాంగ్రెస్ దక్కించుకోగా.. 28 బీఆర్ఎస్ వశపరచుకుంది. పెద్దపల్లిలో కాంగ్రెస్ స్పష్టమైన ఆధిపత్యం ప్రదర్శించగా.. సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్లలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పోటా పోటీగా సర్పంచి స్థానాల కోసం పోటీ పడ్డాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న కరీంనగర్, కోరుట్లలో బీఆర్ఎస్ చక్కటి ఫలితాలు సాధించింది. 14వ తేదీన జరగనున్న రెండో విడత, 17వ తేదీన జరిగే మూడో విడతలో మరిన్ని సీట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎవరి వ్యూహాలు వారు అమలు చేస్తున్నారు. -
పంచాయతీల్లో వెన్నుపోట్లు
పొద్దున ప్రచారం.. రాత్రి విందు మంథని: తొలివిడత పంచాయ తీ పోరులో చిత్రవిచిత్రాలు చో టుచేసుకున్నాయి. సర్పంచ్ అభ్యర్థుల ఎత్తులు, పైఎత్తులకు ఓటర్లు వెన్నుపోటు పొడిచారు. అనేక ప్రలోభాలకు గురిచేసిన వారుకూడా చివరకు ఓటమి చవిచూడటంతో ఆసక్తికర చర్చ సా గుతోంది. ‘మీకే ఓటేస్తమని మా టిచ్చి ఇచ్చినకాడికి పుచ్చుకుని చేతిలో చెయ్యేసి బంధుత్వాలు, స్నేహాలు వలకబోసి నిండా ముంచార’ని ఓడిన అభ్యర్థులు తిట్ల పురాణాలు అందుకుంటున్నారు. పైసలు పంచినా మద్దతు రాకపాయే.. పైసలు పంచినా ఓటర్లు తమకు మద్దతు ఇవ్వక మరొకరిని ఆదరించి వెన్నుపోటు పొడిచినట్లు ఓటమి పాలైనవారు ఆవేదన చెందుతున్నారు. పదవిని దక్కించుకోవాలనే పట్టుదలతో కొంద రు ఆస్తులు, ఆభరణాలు అమ్ముకుని, తాకట్టు పెట్టి మరీ రూ.లక్షల్లో ధారపోశారు. కానీ ఓటర్లు విలక్షణమైన తీర్పు ఇవ్వడంతో బరిలో నిలిచినవారు లబోదిబో మంటున్నారు. పోలింగ్కు ఒక రోజు ముందు డబ్బుల ప్రభావం చూపుతుందని తెలిసిన కొందరు అభ్యర్థులు పోటాపోటీగా పంపిణీ చేసినట్లు తెలిస్తోంది. అయితే ముందుగా డబ్బులు తీసుకున్న ఓటర్లు ‘మీకే ఓటు వేస్తాం’ అని హామీ ఇచ్చి మరోకరు ఎక్కువ సొమ్ము ఆ వ్యక్తి ఓటు వేసినట్లు చర్చించుకుంటున్నారు. రూ.లక్షల్లో అప్పులు చేసిన అభ్యర్థులు ఓటమి తర్వాత వాటిని ఎలా తీర్చాలని తలలు పట్టుకుంటున్నారు. ఎ న్నికలకు ముందు వాగ్ధానాలు ఇ చ్చి అధికారంలోకి వచ్చాక మా టమార్చే నాయకులనే చూశాం.. కానీ ప్రస్తుతం నాయకులను మించి ఓటర్లు తయారయ్యారనే ఆసక్తికర చర్చ సాగుతోంది. మావోడు ఒక్క ఓటేస్తే.. ‘మావోడు వచ్చి ఒక్క ఓటేస్తే నేను గెలిచటోన్ని’ అని ఓ అభ్యర్థి.. ‘నాతోటి తిరిగినోడు పక్కోడికి ఓటు వేయడంతోనే నేను ఓడిపోయా’ అని మరోఅభ్యర్థి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘నావోళ్లని నమ్మితే పరాయోడికి ఓటు వేసిండ’ని ఇంకో అభ్యర్థి వాపోయారు. అనేక గ్రామ పంచాయతీల్లో ఒక్కఓటు కీలకమై అభ్యర్థుల తలరాతనే మార్చేసింది. తొలివిడత ఎన్నికల్లో ఓ పంచాయతీలో ఇద్దరికి సమానంగా ఓట్లు రాగా డ్రా తీయడంతో ఒకరు గెలిచారు. అలాగే మరో పంచాయతీలో కేవలం ఒక్క ఓటుతోనే సమీప అభ్యర్థి విజయం సాధించారు. గెలుపు అంచుల వరకు వచ్చి.. మంథని డివిజన్లోని కొందరు సర్పంచ్ అభ్యర్థులు విజయావకాశాల అంచుల వరకు వచ్చి ఒక్కఓ టు తేడాతో ఓడిపోయారు. ఇలాంటి వారు దుఃఖంలో ఉంటే.. గెలిచిన అభ్యర్థులు సంబురాల్లో మునిగితేలారు. కేవలం ఒక్కఓటు అభ్యర్థి తలరాతను మార్చుతుందని దీనిద్వారా మరోసారి తేలిపోయిందనే చర్చ సాగుతోంది.వేడెక్కిన రెండోవిడత పంచాయతీ పెద్దపల్లిరూరల్: వణికిస్తున్న చలికాలంలోనూ తొ లివిడత పంచాయతీ ఎన్నికలు పల్లెవాసుల్లో వేడి పుట్టించాయి. అదేవిధంగా రెండోవిడతలోనూ గ రంగరంగా ఎన్నికల ప్రచారం సాగింది. మూడో విడత రసవత్తరంగా సాగుతోంది. ఎన్నికల్లో ఎ వరు గెలుస్తరు.. కుల ఓట్లు ఎవరివి ఎక్కువున్నయ్.. అందరూ కట్టడిగనే ఉంటరా?.. ఇలా తుదివిడత ఎన్నికలు జరిగే పల్లెల్లో పంచాయతీ ముచ్చట్లే వినబడుతున్నాయి. పెద్దపల్లి, ఓదెల, ఎలిగేడు, సుల్తానాబాద్ మండలాల్లోని 85 సర్పంచ్, 636 వార్డులకు ఈనెల 17న పోలింగ్ నిర్వహిస్తారు. పట్టణాలకు సమీపంలోని మేజర్ పంచాయతీల్లో పోరు ‘నువ్వా.. నేనా’ అన్నట్లుంది. పొద్దంతా ఎన్నికల ప్రచారం.. అభ్యర్థులు తమ ఆధిపత్యం చూపించి అధికారం దక్కించుకునేందుకు పోటాపోటీ ప్రచారం చేస్తున్నారు. మూడో విడతకు కొద్దిరోజులే గడువు ఉండడంతో ఉదయం నుంచే ప్రచారం జోరుగా చేస్తూ తమ గుర్తును ఓటర్ల ముంగిటకు చేర్చేందుకు నానాతంటాలు పడుతున్నారు. పొద్దంతా ప్రచారం చేసి.. మద్దతుదారులతో ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు రాత్రివేళల్లో విందులు, వినోదాలు ఏర్పాటు చేస్తున్నారు. స్టేటస్లు.. వాట్సాప్ గ్రూపుల్లో.. ఈసారి పంచాయతీ ఎన్నికల ప్రచారం ‘డిజిటల్’ మయమైంది. సర్పంచ్, వార్డు స్థానా ల్లోని అభ్యర్థులు సోషల్మీడియా ద్వారా ప్రచా రం హోరెత్తిస్తున్నారు. వాట్సాప్ గ్రూప్లు క్రియే ట్ చేస్తూ ఓటర్ల మద్దతు కూడగడుతున్నారు. కుల బలం కోసం.. అభ్యర్థులు తమ కుల బాంధవులతో సమావేశా లు జరిపి మద్దతునివ్వాలని అభ్యర్థిస్తున్నారు. పె ద్దపల్లి మండలంలోని ఓ పల్లెలో తమ ఆరాధ్య దైవం గల ఆలయాన్ని రూ.30లక్షలతో అభివృద్ధి చేసేందుకు బాండ్ రాసివ్వడంతో కులబలగమంత సదరు అభ్యర్థికి బాసటగా నిలుస్తున్నట్లు స మాచారం. మరోఊరులో.. తమ కాలనీ రోడ్డు అ ధ్వానంగా ఉందని, గెలిచిన వెంటనే రోడ్డు వేయిస్తానని ఓ వార్డు అభ్యర్థి బాండ్ రాసిచ్చినట్లు తెలిసింది. ఇలా ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు అభ్యర్థులు నానాపాట్లు పడుతున్నారు. కా నీ, ఓటరు మహాశయుడి కరుణ ఎవరిపై ఉందో ననే విషయం ఈనెల 17న తేలిపోనుంది. -
పెరిగిన చలితీవ్రత
● 8.5 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రతలు జ్యోతినగర్(రామగుండం): జిల్లాలో చలితీవ్రత పెరుగుతోంది. రామగిరి మండలంలోని సింగరేణి ఆర్జీ–3 ఏరియాలోగల ముల్కలపల్లి గ్రామంలో శుక్రవారం గరిష్టంగా 29.4 డిగ్రీల సెల్సియస్, కనిష్టంగా 8.5 డిగ్రీల సెల్సియస్కు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. దీంతో చలితీవ్రత పెరిగి జిల్లావాసులు వణిపోయారు. వారంరోజులుగా ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. దీంతో రోజూ సాయంత్రం ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. జన సంచారం లేక ప్రధాన రహదారులు అన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. చలితీవ్రతతో ఇప్పటికే చాలామంది జ్వరం, జలుబు తదితర సీజనల్ వ్యాధుల తో ఇబ్బందులు పడుతున్నారు. చిన్నపిల్లలు, వృద్ధు లు, దీర్ఘకాలిక, శ్వాసకోక, ఆస్తమా తదితర వ్యాధిగ్రస్తులు ఇళ్లనుంచి బయటకు వెళ్లకూడదని వైద్యు లు సూచిస్తున్నారు. జిల్లాలో శుక్రవారం నమోదైన ఉష్ణోగ్రతలు(డిగ్రీల సెల్సియస్) ప్రాంతం గరిష్టం కనిష్టం ముల్కలపల్లి 29.4 8.5 కమాన్పూర్ 31.4 9.4 ఓదెల 30.4 9.5 ఎక్లాస్పూర్ 30.2 9.7 కూనారం 29.1 9.9 ధర్మారం 31.5 9.9 కనుకుల 29.9 10.0 -
అసెంబ్లీ ఎన్నికలను తలపించేలా..
పెద్దపల్లిరూరల్: పంచాయతీల్లో పట్టు సాధించేందుకు ప్రధాన రాజకీయ పార్టీల నేతలు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లాలోని మొత్తం 263 పంచాయతీలకు మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే తొలివిడత పూర్తయ్యింది. ఆదివారం రెండోవిడత పోలింగ్ నిర్వహిస్తారు. పార్టీ రహితమైనా.. గ్రామ పంచాయతీ ఎన్నికలు పార్టీ రహితంగానే జరుగుతున్నా.. అభ్యర్థులు ఏదో ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన వారే కావడం గమనార్హం. తొలివిడతలో 5 మండలాల్లోని 99 పంచాయతీలు, 896 వార్డులకు ఎన్నికలు జరగ్గా.. అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన మద్దతుదారులే అత్యధికంగా 70 స్థా నాల్లో విజయం సాధించారు. ప్రతిపక్ష బీఆర్ఎస్ 22 పంచాయతీలకే పరిమితమైంది. మరో ఏడు గురు స్వతంత్రులు కూడా సత్తాచాటారు. రేపే మలివిడత ఎన్నికలు.. జిల్లాలోని పాలకుర్తి మండలంలో 16, అంతర్గాంలో 15, ధర్మారంలో 29, జూలపల్లి మండలంలోని 13 పంచాయతీలు, 684 వార్డులకు ఈనెల 14న (ఆదివారం) పోలింగ్ నిర్వహిస్తారు. తొలివిడత ఫలితా లను విశ్లేషించుకున్న నేతలు.. రెండోవిడతకు అనుసరించాల్సిన వ్యూహాలకు పదును పెడుతున్నారు. చివరి విడతలో పెద్దపల్లి సెగ్మెంట్.. పెద్దపల్లి అసెంబ్లీ పరిధిలోని కాల్వశ్రీరాంపూర్ మండలంలోని 24 పంచాయతీలకు తొలివిడత గురువారం ఎన్నికలు జరిగాయి. 18 సర్పంచ్ స్థానాలను కాంగ్రెస్ మద్దతుదారులు కై వసం చేసుకున్నారు. ఆ తర్వాతి స్థానంలో బీఆర్ఎస్ ఐదు, ఒక స్థానంలో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. ఈనెల 17న పెద్దపల్లి మండలంలోని 30 పంచాయతీలు, సుల్తానాబాద్లోని 27, ఎలిగేడులోని 12, ఓదెల మండలంలోని 22 పంచాయతీలు, 852 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. పోటాపోటీగా వ్యూహాలు.. తొలివిడత ఎన్నికల్లో భారీ విజయాన్ని సాధించి ఊపు మీదున్న కాంగ్రెస్ను కట్టడి చేసి పల్లెస్థాయి నుంచే పట్టు సాధించాలన్న ఆలోచనతో బీఆర్ఎస్ వ్యూహాలు రచిస్తోంది. చివరి విడత పోరులో అక్క డక్కడా సర్పంచ్ స్థానం కోసం ఒకరికన్నా ఎక్కువ మంది అభ్యర్థులు రంగంలో ఉండడంతో ఆ ఊళ్ల జోలికి వెళ్లకుండా.. ‘ఎవరు గెలిచిన మనోళ్లే’.. అన్న ధోరణిని ఎమ్మెల్యే విజయరమణారావు ప్రదర్శిస్తున్నారు. మిగతా గ్రామాల్లో పోటీ తీవ్రతను బట్టి ఎమ్మెల్యే ఆయా గ్రామాల్లో పర్యటించి తమ అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచారం సాగిస్తున్నా రు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సైతం ఎలాగైనా త మ మద్దతు దారులను ఎక్కువ సంఖ్యలో గెలిపించుకునేందుకు అభ్యర్థులతో సమావేశాలను నిర్వ హించి పలు సూచనలు చేశారు. ఇలా వ్యూహ, ప్రతివ్యూహాలతో కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రచారహోరు సా గిస్తుండగా..బీజేపీ నేతల్లో నెలకొన్న అంతర్గత విభేదాలతో ఎవరికి వారే యమునాతీరే అన్నరీతిన వ్య వహరిస్తున్నారు. పెద్దపల్లి మండలంలో రెండు పంచాయతీల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించుకుంటా మని నేతలు పట్టుదలతో పనిచేస్తున్నారు. హోరెత్తుతున్న ప్రచారం.. జిల్లాలో గ్రాయ పంచాయతీ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తున్నాయి. అభ్యర్థులు ప్రచారం హోరెత్తిస్తున్నారు. కేవలం ఐదారువందల ఓట్లు ఉన్న పంచాయతీలో పోటీపడే వారు సైతం ప్రచార రథాలతో వాడవాడలా ప్రచారం చేయడం గమనార్హం. దీనిని బట్టి నాలుగైదువేల మంది ఓటర్లున్న పెద్దపంచాయతీల్లో ప్రచారం ఎలా సాగుతుందో అర్థం చేసుకోవచ్చు. తొలివిడతలో హస్తం విసిరిన పంజాతో డీలా పడ్డ విపక్ష పార్టీలు రెండు, మూడోవిడత ఎన్నికల్లో సత్తాను ఏమేర చాటుతాయోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.


