breaking news
Peddapalli
-
కాపీ రాయుళ్లా.. మజాకా?
సాక్షిప్రతినిధి,కరీంనగర్: శాతవాహన వర్సిటీ పరిధిలో జరుగుతున్న న్యాయపరీక్షల్లో పట్టుబడుడుతున్న కాపీరాయుళ్ల వ్యవహారం కలకలం రేపుతోంది. ఇటీవల డిగ్రీ పరీక్షల్లో డీబార్ అయిన ఓ విద్యార్థికి మద్దతుగా ఉత్తారిదికి చెందిన ఓ సీనియర్ మంత్రి ఫోన్ చేసిన విషయం మరవకముందే.. అదే తరహా ఘటనలు పునరావృతమవుతున్నాయి. యథేచ్ఛగా చిట్టీలు పెట్టి రాస్తూ.. వర్సిటీ సిబ్బంది పట్టుకుంటే వెంటనే వారిపై ఒత్తిళ్లు తెస్తూ.. బెదిరిస్తున్నారు. వినకపోతే ఆఖరి అస్త్రంగా రాజకీయ నాయకులను రంగంలోకి దించుతున్నారు. వర్సిటీలో ఇటీల జరిగిన కొన్ని పరిణామాలు సిబ్బంది ఆత్మస్థైర్యం దెబ్బతీసేలా ఉండటం చర్చానీయాంశంగా మారింది. ఓ ‘లా’ విద్యార్థి ఈనెల 18న కాపీ కొడుతూ వర్సిటీలో దొరికిపోయాడు. వదిలేయాలని కోరాడు. సిబ్బంది వినలేదు. దీంతో పలువురు రాజకీయ నాయకులతో ఫోన్ల మీద ఫోన్లు చేయించడం ప్రారంభించాడు. అప్పటికే అతన్ని డీబార్ చేసిన అధికారులు తామేం చేయలేమని చేతులెత్తేశారు. మరో ఘటనలో నగరానికి చెంది ఓ పార్టీ నాయకుడు నామినేటెడ్ పోస్టులో కొనసాగుతున్నాడు. అతను కూడా లా పరీక్షలో కాపీ కొడుతూ దొరికిపోయాడు. ఈయన సైతం సిబ్బందితో తీవ్ర వాగ్వాదానికి దిగాడు. కాపీ కొడుతూ దొరికిన సంగతి మరిచి, తనను వదిలేయాలంటూ వాదించసాగాడు. యూనివర్సిటీ సిబ్బంది అవేమీ పట్టించుకోకుండా అతన్ని డీబార్ చేసేశారు. ఒక్క పరీక్షలో దొరికి డీబార్ అయినా నిబంధనల ప్రకారం.. మొత్తం సెమిస్టర్ పరీక్షలన్నీ వచ్చే ఏడాది రాసుకోవాలి. ఉదాహరణకు ఒక సెమిస్టర్లో ఐదు పేపర్లు ఉన్నాయనుకుంటే.. అందులో ఆఖరు పేపరు రోజు కాపీ కొట్టి దొరికితే.. మొత్తం పరీక్షల్లో డీబార్గా ప్రకటిస్తారు. దీంతో మొత్తం పేపర్లు మరో ఏడాది వరకు రాసుకోవాలి. వారం దాటినా ఆగని ఫోన్లు వాస్తవానికి ఆ ఒత్తిళ్ల వ్యవహారం ఆ ఒక్కరోజుతో ముగిసిపోలేదు. సదరు అధికారులకు వారం రోజులైనా ఫోన్ల తాకిడి ఆగలేదు. ‘మా వాడిని కొంచెం చూడండి.. డీబార్ రద్దు చేయండి’ అంటూ ఒత్తిళ్లు తెస్తున్నారు. అర్ధరాత్రి, అపరాత్రి, సెలవు దినం అన్న తేడా లేకుండా ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారని సిబ్బంది వాపోతున్నారు. వాస్తవానికి నిబంధనల ప్రకారం.. ఒకసారి డీబార్ చేసిన తరువాత దాన్ని ఎత్తేయడం అంటూ ఉండదు. ఇదే విషయాన్ని ఫోన్ చేసే వారికి వివరించినా అర్థం కావడం లేదంటూ వర్సిటీ సిబ్బంది తలలు పట్టుకుంటున్నారు. మరోవైపు వీరి వ్యవహారం తెలిసి కొన్ని విద్యార్థి సంఘాలు కూడా వర్సిటీ సిబ్బందికి ఫోన్లు చేయడం ప్రారంభించాయి. డీబార్ ఎత్తివేస్తే ఊరుకునేది లేదని, వర్సిటీ ఎదుటే ఆందోళనకు దిగుతామంటూ స్పష్టంచేశాయి. దీంతో సిబ్బంది ఇటు కాపీ రాయుళ్లు, అటు విద్యార్థి సంఘాల మధ్య నలిగిపోతున్నారు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా ఇంటెలిజెన్స్ దృష్టికి కూడా వెళ్లింది. దీంతో వారు రంగంలోకి దిగి.. అసలేం జరిగిందో తెలుసుకుని, ప్రభుత్వానికి నివేదిక పంపారు.ఇది చాలా సాధారణ విషయం వాస్తవానికి వర్సిటీలో ఈ ఘటన ఈనెల 18న జరిగింది. చాలా సాధారణ విషయం. కొందరు దీన్ని పెద్దదిగా చేసి చూపిస్తున్నారు. సహజంగానే ఈ రోజుల్లో న్యాయపరీక్షలకు ఉన్నత స్థాయి ఉద్యోగులు, రాజకీయ నాయకులు, ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులు, డాక్టర్లు, రెవెన్యూ తదితరులు హాజరవుతున్నారు. పరీక్షల్లో కొందరు కాపీ కొడుతూ దొరకడం, వారికి మద్దతుగా రాజకీయ నాయకులు, వీఐపీలు ఫోన్లు చేయడం మాకు షరా మామూలే. – సురేశ్, కంట్రోలర్, ఎస్యూ -
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
జూలపల్లి(పెద్దపల్లి): అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని మంత్రి అడ్లూరి లక్ష్మ ణ్ కుమార్ అన్నారు. అబ్బాపూర్లోని 18 మంది ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంగళవారం ఆయన మంజూరు పత్రాలు ఆందజేసి మాట్లాడారు. విడతల వారీగా అర్హులకు ఇందిరమ్మ ఇ ళ్లు మంజూరు చేస్తామని తెలిపారు. గతప్రభు త్వం పదేళ్లలో ఒక్క ఇంటిని కూడా మంజూరు చేయలేదని విమర్శించారు. ఎంపీడీవో పద్మజ, తహసీల్దార్ స్వర్ణ, జూలపల్లి, ధర్మారం ఏఎంసీ చైర్మన్లు గండు సంజీవ్, రుప్లానాయక్,, నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. మర్యాదగా వ్యవహరించాలి పాలకుర్తి(రామగుండం): ఫిర్యాదుదారులు, ప్ర జలతో మర్యాదగా వ్యవహరించాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా సూచించారు. బసంత్నగర్ పోలీస్స్టేషన్ను సీ పీ మంగళవారం తనిఖీ చేశారు. ఠాణా ఆవరణలో మొక్క నాటారు. ఆయన మాట్లాడుతూ, వృద్ధులను దూషించేవారు, నేరాలు చేసే మైనర్లపై నమోదు చేసే కేసులు, చట్టాలు ఎలా ఉంటున్నాయని ఎస్సై స్వామిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మహిళా సిబ్బంది సీపీని శాలువాతో సత్కరించారు. డీసీపీ కరుణాకర్, సీఐ ప్రవీణ్కుమార్, ఎస్సై స్వామి ఉన్నారు. ప్రశాంతంగా జరుపుకోవాలి పెద్దపల్లిరూరల్/ఓదెల: వినాయకచవితి పర్వదినాన్ని జిల్లావాసులు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఎమ్మెల్యే విజయరమణారావు కోరారు. పెద్దపల్లి బల్దియా చేపట్టిన మ ట్టి గణపతుల విగ్రహాలను మంగళవారం ఆ యన పంపిణీ చేశారు. ఓదెల మండలం బా యమ్మపల్లె, అబ్బిడిపల్లి గ్రామాల్లో వివిధ అభివృద్ధి పనులు ప్రారంభించి మాట్లాడారు. కాంగ్రెస్ హయాంలోనే గ్రామపంచాతీలకు పక్కా భవనాలు నిర్మిస్తోందని తెలిపారు. పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్, ఏఎంసీ చైర్పర్సన్ స్వరూప, ఏఈ సతీశ్ పాల్గొన్నారు. నీట్ తరగతులు నిర్వహించాలి జూలపల్లి(పెద్దపల్లి): ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు నీట్ తరగతులు నిర్వహించాలని ఇంటర్ బోర్డు ప్రత్యేకాధికారి రమణారావు సూచించారు. స్థానిక ప్రభుత్వ జూనియ ర్ కళాశాలను ఆయన మంగళశారం తనిఖీ చే శారు. అధ్యాపకులు, విద్యార్థులతో సమావేశం నిర్వహించి బోధన తీరుపై సూచనలు చేశారు. ప్రిన్సిపాల్ విశ్వప్రసాద్ పాల్గొన్నారు. మండపాలకు ఉచిత విద్యుత్ సుల్తానాబాద్(పెద్దపల్లి): వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గణపతి మండపాలకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేసేందుకు ప్ర భు త్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకో సం నిర్వాహకులు రిజిస్ట్రేషన్ స్లిప్పులు, ఖర్చు వి వరాలు సమర్పించాలి. సంతకం చేసిన ప్రొఫార్మను విద్యుత్ శాఖ అధికారులకు అందించాలి. సమస్యలు ఎదురైతే డయల్ 100 నంబరుతోపాటు రామగుండం పోలీస్ కమిషనరేట్లోని 87126 56597 నంబరులో సంప్రదించాలి. యూరియా కొరత లేదు జూలపల్లి(పెద్దపల్లి): జిల్లాలో యూరియా కొ రత లేదని జిల్లా వ్యవసాయాధికారి శ్రీనివాస్ తెలిపారు. స్థానిక పీఏసీఎస్లో కొనసాగుతున్న యూరియా పంపిణీ ప్రక్రియను ఆయన మంగళవారం పరిశీలించారు. గతేడాదికన్నా ఈసా రి 2,960 మెట్రిక్ టన్నుల యూరియాను రైతులకు అధికంగా అందించామన్నారు. ముందు గా కొనుగోలు చేసి నిల్వ చేసుకోవడంతోనే చి న్న, సన్నకారు రైతులకు సకాలంలో అదడం లే దని తెలిపారు. ఆర్ఎఫ్సీఎల్ సెప్టెంబరు 3న ప్రారంభమైతే యూరియా కొరత తీరుతుంద ని వివరించారు. ఆయన వెంట వ్యవసాయాధికారులు శ్రీనాఽథ్, ప్రత్యూష పాల్గొన్నారు. 22 మంది వైద్యుల బదిలీ గోదావరిఖని: సింగరేణిలో 22 మంది డాక్టర్లు బదిలీ అయ్యారు. ఈమేరకు ఉత్తర్వులిచ్చారు. -
నైపుణ్యం.. పర్యావరణ హితం
జ్యోతినగర్(రామగుండం)/మంథనిరూరల్: చిట్టి చేతులు మట్టి వినాయక విగ్రహాలను తయారు చేస్తూ పర్యావరణ పరిరక్షణకు తోడ్పాటు అందిస్తూ ప్రకృతి ప్రేమికుల మనసు దోచుకుంటున్నాయి. ప్రధానంగా ఎన్టీపీసీ దుర్గయ్యపల్లె, ఎల్కలపల్లిగేట్ ప్రభుత్వ పాఠశాలలతోపాటు మంథని మండలం ఆరెంద, గుంజపడుగు, చిన్నఓదాల సర్కారు బడుల విద్యార్థులు చక్కటి ఆలోచనతో మట్టి వినాయక విగ్రహాలు తయారు చేస్తున్నారు. కుల, మతాలకు అతీతంగా మట్టి విగ్రహాల తయారీతోపాటు వివిధ రంగులు అద్దుతూ అందంగా తయారు చేస్తున్నారు. స్థానికులు, పల్లెవాసులకు పంపిణీ చే స్తూ ఉదారత చాటుకుంటున్నారు. ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో వీరుముందుకు వెళ్తున్నారు.మట్టి విగ్రహాలతో గుంజపడుగు స్కూల్ విద్యార్థులుటీచర్కు మట్టి విగ్రహం అందిస్తున్న చిన్నారులు -
తాగునీరు వృథా చేస్తే నల్లా కనెక్షన్ కట్
పెద్దపల్లిరూరల్: పట్టణ ప్రజలకు ఇకనుంచి రోజూ తాగునీరు సరఫరా చేయాలని, ఇందుకోసం ప్రణా ళిక సిద్ధం చేయాలని, తాగునీటిని వృథా చేస్తే నల్లా కనెక్షన్ తొలగించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నా రు. మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం వివి ధ అంశాలపై సమీక్షించారు. అభివృద్ధి పనులు నా ణ్యంగా ఉండాలని, పురోగతి పనులను నెలరోజుల్లోగా పూర్తి చేయాలన్నారు. వీధుల్లో చీకటి ఉండొద్దని, అవసరమైతే కొత్తగా విద్యుత్ స్తంభాలు వే యించాలని సూచించారు. దోమల నివారణకు ఫా గింగ్ చేయాలని అన్నారు. మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్, ఏఈ సతీశ్ తదితరులు ఉన్నారు. అనంతరం తెనుగువాడ ప్రైమరీ స్కూల్ విద్యార్థులకు మట్టి విగ్రహాలు అందించారు. ‘టామ్కామ్’తో ఉపాధికి భరోసా విదేశాల్లో ఉపాధి అవకాశాల కల్పనకు ప్రభుత్వం ‘టామ్కామ్’ను అందుబాటులోకి తీసుకొచ్చి యు వతలో భరోసా కల్పిస్తోందని కలెక్టర్ శ్రీహర్ష అన్నా రు. కలెక్టరేట్లో టామ్కామ్ కోర్సులపై అవగాహన కల్పించారు. విదేశీ నియామకదారులతో ఈ సంస్థను అనుసంధానం చేసి డాక్యుమెంటేషన్, ప్లేస్మెంట్, శిక్షణకు సహకరిస్తుందని తెలిపారు. -
వాటర్ కలర్స్ వాడిన
అందరూ మట్టి విగ్రహాలను పూజించి పర్యావరణాన్ని కా పాడాలె. మేం తయారు చేసిన మట్టి విగ్రహాలకు వా టర్ కలర్స్ వేసినం. చాలా అందంగా ఉన్నయి. టీచర్లకు బహుమతిగా అందించినం. – పెగడపల్లి శ్రీవిద్య, విద్యార్థిని ప్రజలకు ఇచ్చినం స్కూల్లో మేం తయారు చేసిన మట్టి విగ్రహాలను ప్ర జలకు అందించినం. వీటినే పూజించాలె. ప్రోత్సహించిన టీచర్లకు కృతజ్ఞతలు. – సాయివికాస్, విద్యార్థి -
పెద్దపల్లి
బుధవారం శ్రీ 27 శ్రీ ఆగస్టు శ్రీ 2025సాక్షి పెద్దపల్లి: నీలివిప్లవం పథకంలో భాగంగా చెరువులు, కుంటల్లో చేపపిల్లలు పంపిణీ చేసేందుకు ఎట్టకేలకు రంగం సిద్ధమవుతోంది. ఈమేరకు టెండరు ప్రక్రియ ఖరారు చేయడంలో జిల్లా అధికారులు నిమగ్నమయ్యారు. ఇటీవల కురిసిన వర్షాలతో కొన్నిచెరువులు మినహా దాదాపు అన్నింట్లోకి వరదనీరు వచ్చిచేరింది. వాటిలో చేపపిల్లలను వదిలేందుకు మత్య్సశాఖ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఆన్లైన్ టెండర్లను పిలిచింది. చెరువుల సామర్థ్యానికి అనుగుణంగా చేపపిల్లలను విడుదల చేయనున్నారు. ఈసారి తమ ఉపాధికి భరోసా దక్కినట్లయ్యిందని మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆన్లైన్లో టెండర్లు ప్రతీ సీజన్ మాదిరిగానే ఈసారి కూడా రాష్ట్రస్థాయిలో ఆన్లైన్ టెండర్లను ఆహ్వానించారు. ఈనెల 18 నుంచి ఆన్లైన్లో టెండర్ ప్రక్రియ ప్రారంభమైంది. సెప్టెంబర్ 1, మధ్యాహ్నం 3 గంటల వరకు టెండర్లు దాఖలు చేసేందుకు గడువు ఇచ్చారు. అదేరోజు మధ్యాహ్నం 3.30 గంటల నుంచి టెండర్లను తెరవనున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు అనుగుణంగా దాఖలైన టెండర్లను ఖరారు చేయనున్నారు. సెప్టెంబర్ రెండోవారం నుంచే చేపపిల్లలను విడుదల చేసేలా జిల్లా అధికార యంత్రాంగం ప్రణాళిక సిద్ధం చేస్తోంది. 1,073 చెరువులు.. 1.58 కోట్ల చేపపిల్లలు.. జిల్లాలో ఎల్లంపల్లి ప్రాజెక్టుతోపాటు సుందిళ్ల, అన్నారం బ్యారేజీలు, చెరువులు, కుంటల్లో చేపలు, రోయ్యలు విడుదల చేయనున్నారు. సుందిళ్ల బ్యారేజీలో 11.41లక్షలు, అన్నారం బ్యారేజీలో 8.79లక్షలు, ఎల్లంపల్లిలో 6.10లక్షలు, 1,073 చెరవులు, కుంటల్లో 1.58కోట్ల చేపపిల్లలను పంపిణీ చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఇందులో 35 ఎం.ఎం. నుంచి 40ఎం.ఎం. సైజ్ వి 1.02కోట్లు, 80 ఎం.ఎం. నుంచి 100 ఎం.ఎం. సైజ్వి 56.80లక్షలు ఉన్నాయి. గతేడాది చిన్నసైజ్ చేపపిల్లలను పంపిణీ చేయడంతో మత్స్యకారులు అడ్డుకోవడంతో మధ్యలోనే నిలిపివేశారు. ఈసారైనా టెండర్ల దక్కించుకున్న కాంట్రాక్టర్లు.. నిర్ణీత ప్రమాణాలకు అనుగుణంగా పెద్దసైజ్, నాణ్యతగల చేపపిల్లలను పంపిణీ చేయాలని మత్స్యకారులు డిమాండ్ చేస్తున్నారు. పంపిణీ తీరు ఇలా సొసైటీలు 281 సభ్యులు 13450 చెరవులు, కుంటలు 1,073 ఈఏడాది లక్ష్యం(కోట్లలో) 1.58 నాణ్యమైనవే పంపిణీ జిల్లాలోని జలాశయాలు, చెరువుల్లో సగానికిపైగా నీరుచేరిన తర్వాత చేపపిల్లలు పంపిణీ చేస్తాం. వాటి సరఫరాకు రాష్ట్ర మత్స్యశాఖ ఆదేశాల మేరకు టెండర్లు పిలిచాం. సెప్టెంబర్ 1న మధ్యాహ్నం 3గంటల వరకు దరఖాస్తు దాఖలుకు గడువు ఉంది. అదేరోజు మధ్యాహ్నం 3.30 గంటలకు బిడ్స్ ఓపెన్ చేస్తారు. చేపపిల్లలను సరఫరా చేసే వ్యాపారులు పారదర్శకత పాటించాలి. – నరేశ్ నాయుడు, జిల్లా మత్స్యశాఖ అధికారి -
సాంకేతిక కోర్సులతో ఉపాధి
కోల్సిటీ(రామగుండం): ఉద్యోగ, ఉపాధి అవ కాశాలు పుష్కలంగా లభించే సాంకేతిక కోర్సులను ఉచితంగా అందిస్తున్న రామగుండం అడ్వాన్స్డ్ ట్రెయినింగ్ సెంటర్లో విద్యార్థులు చేరేలా ప్రోత్సహించాలని రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్ అరుణశ్రీ కోరారు. బల్దియా కా ర్యాలయంలో మంగళవారం వయోజన విద్య, మెప్మా ఆధ్వర్యంలో నవభారత్ సాక్షరతా కార్యక్రమం – ఉల్లాస్లో భాగంగా మండల స్థాయి, అ డ్వాన్స్డ్ ట్రెయినింగ్ సెంటర్ కోర్సులపై అవగా హన కల్పించారు. ఐటీఐలను ప్రభుత్వం ఆధునికీకరించి డిమాండ్ ఉన్న కోర్సులను ప్రవేశ పెడుతోందన్నారు. ఐటీఐ ప్రిన్సిపాల్ సురేందర్ మా ట్లాడుతూ, ఐటీఐలో చేరేందుకు ఈ నెలాఖరు లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ ప్రసాద్ మాట్లాడుతూ, అసంఘటిత రంగ కార్మికులు ఈ శ్రమ్ పోర్టల్లో తమ పేర్లు నమోదు చేసుకుని ప్రభుత్వ ప్రయోజనాలు పొందాలన్నారు. అనంతరం వయోజన విద్య రూపొందించిన పుస్తకాలను ఆవిష్కరించారు. ఐటీఐ శిక్షణాధికారి విద్యాసాగర్రెడ్డి, మెప్మా టీఎంసీ మౌనిక తదితరులు పాల్గొన్నారు. -
సున్నిత ప్రాంతాలపై డేగకన్ను
గోదావరిఖని: గణపతి నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో జరుపుకునేలా.. అసాంఘిక శక్తుల ఆకట్టించేలా.. రామగుండం కమిషనరేట్ పరిధిలో పోలీసు యంత్రాంగం డేగకళ్లతో నిఘా ఉంచుతుందని సీపీ అంబర్ కిశోర్ ఝా వెల్లడించారు. సామాజిక మాధ్యమాల్లో రెచ్చగొట్టే పోస్టులు వైరల్ చేసినా, మత సామరస్యానికి భంగం కలిగించేలా వ్యవహరించినా సహించేది లేదన్నారు. ‘సాక్షి’ ఇంటర్వ్యూలో ఆయన పలు విషయాలు వెల్లడించారు. ప్రతీరోజు వారుచేసే పనులు ఏమిటి? సీపీ : ప్రతీరోజు గణేశ్ మండపాలను తనిఖీ చేస్తారు. ఫైర్సేఫ్టీ, ఎలక్ట్రిసిటీ, బారికేడ్ల పరిశీలన, పాయింట్ బుక్స్ చెకింగ్, సమస్యాత్మక ప్రాంతాల్లో పహారా సరిగ్గా సాగేలా పర్యవేక్షిస్తారు. ఫిర్యాదులు స్వీరించి పరిష్కరిస్తారు. బలవంతపు చందాలపై ఫిర్యాదులు వచ్చాయా? సీపీ : ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదులు నమోదు కాలేదు. పోలీసు పహారా, ఇంటలిజెన్స్ సిబ్బంది ద్వారా నిరంత రం పర్యవేక్షణ కొనసాగుతోంది. బలవంతపు చందాలపై ఫిర్యాదులు వస్తే కచ్చితంగా చర్యలు తీసుకుంటాం. గతేడాది తీసుకున్న చర్యలు? నిందితుల వివరాలు? సీపీ : గతేడాది దాదాపుగా ఏడు సమస్యాత్మక ప్రాంతాల్లో జరిగిన సంఘటనలపై క్రిమినల్ కేసులు నమోదు అయ్యాయి. అప్పటి నిందితులపై ఈసారి గట్టి నిఘా ఏర్పాటు చేశాం.అక్కడ గతంలో చోటుచేసుకున్న ఘటనలు, తీసుకున్న నియంత్రణ చర్యలేమిటి? సీపీ : గతంలో జరిగిన ఘటనలపై క్రిమినల్ కేసులు నమోదు చేశాం. మళ్లీ అలాంటి సంఘటనలకు తావులేకుండా ఈసారి సీసీ టీవీలు, కెమెరాలు, బారికేడ్లు ఏ ర్పాటు చేస్తున్నాం. అదనపు సిబ్బంది తో ప్రత్యేక పెట్రోలింగ్ చేస్తున్నాం.నవరాత్రి ఉత్సవాలు సాఫీగా సాగేందుకు తీసుకుంటున్న చర్యలు ఏమిటి? సీపీ : ఎవరికీ ఇబ్బంది లేకుండా గణపతి విగ్రహాలు ప్రతిష్ఠించాలి. వాటి పర్యవేక్షణ కోసం బ్లూకోల్ట్స్, పెట్రోకార్స్, విజిబుల్ పోలీసింగ్ ని ఘా నిరంతరం కొనసాగుతుంది. ఇందుకోసం ప్రతీ విగ్రహం వద్ద పాయింట్ బుక్ ఏర్పాటు చేస్తాం. జిల్లాలో సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయా? సీపీ : రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి జిల్లాలో గోదావరిఖని, మంథని, పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలోని చెన్నూరు, మంచిర్యాల, బెల్లంపల్లి పట్టణాలను సున్నిత, సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించాం. మండపాల పర్యవేక్షణకు సిబ్బందిని నియమించారా? సీపీ: రామగుండం కమిషనరేట్ పరిధిలో మండపాల పర్యవేక్షణకు పోలీస్ సిబ్బందిని నియమించాం. వీరు నిరంతరం విధుల్లో ఉంటారు. ఇందులో ఒక ఎస్సైస్థాయి అధికారి, ఐదుగురు కానిస్టేబుళ్లు, ఇద్దరు స్పెషల్ బ్రాంచ్, ఇంటలిజెన్స్ సిబ్బంది ఉంటారు. నవరాత్రులు ముగిసే వరకూ ఆంక్షలు అమలులో ఉంటాయా? సీపీ : ఈనెల 27 నుంచి సెప్టెంబరు 6వ తేదీ వరకు ఆంక్షలు అమలులో ఉంటాయి. నిబంధనలు అతిక్రమించే వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు ? సీపీ : నిబంధనలు అతిక్రమించే వారిని బైండోవర్ చేస్తాం. జరిమానా విధిస్తాం. క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తాం. -
ఎదురెదురుగా ఢీకొన్న కార్లు
మల్యాల: మండలంలోని ముత్యంపేట శివారు దిగువ కొండగట్టు వద్ద జగిత్యాల–కరీంనగర్ రహదారిపై మంగళవారం రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ సంఘటనలో రెండుకార్లలో ఉన్న నలుగురు గాయపడ్డారు. కొండగట్టుకు చెందిన రంగు నర్సింహులు, విజయ హైదరాబాద్ నుంచి కొండగట్టుకు వస్తున్నారు. జగిత్యాల మున్సిపల్ మాజీ చైర్పర్సన్ భర్త అడువాల లక్ష్మణ్ కరీంనగర్ వైపు వెళ్తున్నాడు. దిగువ కొండగట్టు వద్ద రెండు కార్లు ఎదురెదురుగా వేగంగా ఢీకొన్నాయి. కార్ల ముందుభాగం నుజ్జునుజ్జయ్యింది. కార్ల బెలూన్లు తెరుచుకోవడంతో నర్సింహులు, విజయ, అడువాల లక్ష్మణ్, మరో వ్యక్తి స్వల్పంగా గాయపడ్డారు. ట్రాఫిక్ అంతరాయం కలగడంతో ఎస్సై నరేశ్కుమార్, కానిస్టేబుల్ మధుసూదన్ రెడ్డి ట్రాఫిక్ను పునరుద్ధరించారు. బాధితులను 108లో జగిత్యాల ఆస్పత్రికి తరలించారు. నర్సింహులు అతివేగంగా, అజాగ్రత్తగా కారు నడిపి లక్ష్మణ్ కారును ఢీకొన్నారని, లక్ష్మణ్ బావమరిది మిట్టపల్లి సాయిప్రసాద్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై నరేశ్ కుమార్ తెలిపారు. -
ఉరివేసుకుని విద్యార్థిని మృతి
గోదావరిఖని: స్థానిక అశోక్నగర్ చెందిన కాంపెల్లి అక్షర (17) మంగళవారం రాత్రి ఉరివేసుకొని మృతి చెందింది. ఇంట్లో ఎవరూ లేనిసమయంలో ఫ్యాన్కు ఉరేసుకోగా గమనించిన కుటుంబసభ్యులు అక్షరను ఆస్పత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు తెలిపారు. దీంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. మృతికి గల కారణాలు తెలియాల్సిఉంది. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు గోదావరిఖని వన్ టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి తెలిపారు.భార్య కాపురానికి రావడంలేదని యువకుడి ఆత్మహత్యతంగళ్లపల్లి(సిరిసిల్ల): మండలంలోని పద్మనగర్కు చెందిన వేముల కరుణాకర్(35) మంగళవారం ఎలుకల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాలు. కరుణాకర్ భార్య పద్మ నాలుగేళ్లుగా దూరంగా ఉంటోంది. భార్య కాపురానికి రావడం లేదని మనస్తాపంతో కరుణాకర్ ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి కొడుకు, కూతురు ఉన్నారు. తంగళ్లపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రైతులకు ఆధునిక టెక్నాలజీ
జగిత్యాలఅగ్రికల్చర్: రైతులకు ఆధునాతన టెక్నాలజీని పరిచయం చేయడంతోపాటు మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేలా కేంద్ర ప్రభుత్వం నమోడ్రోన్ దీదీ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద మహిళాసంఘాలకు ఎరువులు, రసాయనాలు పిచికారీ చేసే డ్రోన్లను సబ్సిడీపై సరఫరా చేయనుంది. రానున్న రోజుల్లో కూలీల సమస్యతో వ్యవసాయ రంగంలో డ్రోన్ల వాడకం పెరగనుండటంతో.. డ్రోన్లను అద్దెకిచ్చి మహిళలు స్వయం ఉపాధి పొందవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో జిల్లాలోని మహిళాసంఘాల నుంచి దరఖాస్తులు స్వీకరించి.. అర్హులైన సంఘాలను ఎంపిక చేయాలని బ్యాంకర్లకు ఆదేశాలు అందాయి. వ్యవసాయంలో ఆధునికత కోసం వ్యవసాయ రంగంలో పెరుగుతున్న సాగు ఖర్చులు, కూలీల సమస్యతో రైతులకు పెద్దగా గిట్టుబాటు కావడం లేదు. ఇటీవల పంటలపై పురుగులు, తెగుళ్ల బెడద పెరుగుతుండటంతో ప్రతి రైతు క్రిమిసంహారక, రసాయన మందులు పిచికారీ చేయాల్సి వస్తోంది. అయితే మందులు పిచికారీ చేసేందుకు కూలీలు దొరికే పరిస్థితి లేదు. సన్న, చిన్నకారు రైతుల సంఖ్యే ఎక్కువగా ఉండటం.. ఆర్థిక సమస్యలతో ఆధునిక పరికరాల వాడకం పెద్ద సమస్యగా మారింది. లక్షలు విలువ చేసే పరికరాలను కొనుగోలు చేయలేని రైతులకు అండదండగా ఉండేందుకు మహిళా సంఘాలకు డ్రోన్లు అందించి వాటిద్వారా రైతులకు అద్దెకు ఇవ్వాలని కేంద్రం భావిస్తోంది. దీనివల్ల రైతులు లబ్ధిపొందేలా.. మహిళలు ఆర్థికంగా ఎదిగేలా నమో డ్రోన్ దీదీ పథకానికి రూపకల్పన చేశారు. ఈ పథకం కింద డ్రోన్లను సబ్సిడీపై కొనుగోలు చేసి అద్దెకిస్తే.. నెలకు మహిళా సంఘాల సభ్యులు రూ.లక్ష వరకు సంపాదించే వెసులుబాటు ఉంటుందని బ్యాంకర్లు చెపుతున్నారు. డ్రోన్ కొనుగోలుకు రూ.8లక్షల సబ్సిడీ ఈ పథకం కింద దేశవ్యాప్తంగా రూ.1,261 కోట్లతో 14,500 మహిళా సంఘాలకు ఆధునాతన డ్రోన్లను అందించనున్నారు. ఏ మహిళా గ్రూపు ముందుగా దరఖాస్తు చేసుకుంటుందో.. ఆ సంఘం ఎంపికయ్యే అవకాశం ఉంది. ఎంపిక చేసిన మహిళాసంఘాలకు డ్రోన్ పరికరాలను సబ్సిడీపై అందిస్తారు. డ్రోన్ ఖర్చులో గరిష్టంగా రూ.8లక్షల వరకు (80 శాతం) సబ్సిడీ ఇస్తారు. ఉదాహరణకు.. డ్రోన్ కొనుగోలుకు రూ.10 లక్షలైతే.. అందులో రూ.8లక్షల సబ్సిడీ ఇస్తారు. మరో రూ.రెండులక్షల వరకు బ్యాంకులు రుణ సదుపాయం కల్పిస్తాయి. తీసుకున్న రుణానికి ఏడాదికి కేవలం 3శాతం వడ్డీ చెల్లిస్తే సరిపోతుంది. వ్యవసాయంలో సాగు ఖర్చులు తగ్గించడం.. పంట దిగుబడి పెంచడంలో డ్రోన్ టెక్నాలజీని రైతులు విరివిగా వాడేలా చైతన్యం చేయాలని వ్యవసాయ శాఖ ద్వారా ప్రచారం చేస్తూనే.. డ్రోన్ల కొనుగోలుకు మహిళాసంఘాలు ముందుకొచ్చేలా గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా మహిళలతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. గ్రామాల్లోకి ఇంకా డ్రోన్లు పెద్దగా రాలేవని, ఇప్పుడే డ్రోన్లు కొనుగోలు చేసి పాగా వేస్తే.. మహిళల ఉపాధికి డోకా ఉండదని అధికారులు భావిస్తున్నారు. డ్రోన్ టెక్నాలజీలో ప్రత్యేక శిక్షణ మహిళాసంఘాల గ్రూపులకు డ్రోన్లను సబ్సిడీపై అందించడమే కాకుండా డ్రోన్ టెక్నాలజీ.. ఉపయోగంపై ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఈ శిక్షణ దాదాపు 15రోజులు ఉంటుంది. శిక్షణలో వ్యవసాయ శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులు పాలుపంచుకుంటారు. డ్రోన్లు ఆధునాతన జీపీఎస్, సెన్సార్ టెక్నాలజీతో రూపొందించబడి ఉంటాయి. ఏ మందును ఎంత ఎత్తులో పిచికారీ చేయాలనే దానిపై కూడా పూర్తిస్థాయిలో క్షేత్రస్థాయి శిక్షణ ఇస్తారు. పురుగుమందులు పిచికారీ చేయడమే కాకుండా.. పొలంలో కలుపుమొక్కలు ఎక్కడున్నాయి..? నీరు ఎక్కడ లేదు..? వంటి వాటిపై కూడా డ్రోన్ శిక్షణలో మహిళలకు వివరిస్తారు. అలాగే మరమ్మతు, ఫిట్టింగ్ వంటి వాటి కోసం మరో సహాయకుడిని నియమించుకుంటే వారికీ శిక్షణ ఇస్తారు. ఈ పథకంలో డ్రోన్ డిమాండ్ అధికంగా ఉండే మహిళా సంఘాల సభ్యులు పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకోవచ్చు. మహిళలకు ఆర్థిక స్వావలంబన సబ్సిడీపై ‘నమో డ్రోన్ దీదీ’ జిల్లాలోని మహిళా సంఘాల సభ్యులు ఈ పథకం కింద ధరఖాస్తు చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా 15వేల డ్రోన్లు ఇవ్వనున్నందున ఎవ్వరు ముందుగా దరఖాస్తు చేసే వారికి ఈ పథకం అందనుంది. అర్హత ఉండి, ఆసక్తి గల మహిళా సంఘాలు సమీపంలోని బ్యాంకులను సంప్రదించవచ్చు. – రాంకుమార్, లీడ్ బ్యాంకు మేనేజర్, జగిత్యాల -
జైలు నుంచి విడిపించండి
ప్రవాసీ ప్రజావాణిలో బాధిత కుటుంబాల ఫిర్యాదు జగిత్యాలక్రైం/సిరిసిల్ల: బహ్రెయిన్లో రెండేళ్ల జైలు శిక్ష పడిన ఐదుగురిని విడిపించాలని కోరుతూ.. బాధితుల కుటుంబ సభ్యులు మంగళవారం హైదరాబాద్లోని సీఎం ప్రవాసీ ప్రజావాణిని ఆశ్రయించారు. తమ కుటుంబ సభ్యులను విడిపించాలని నలుగురి తల్లులు, ఒకరి చెల్లెలు సహాయం కోసం ప్రజావాణిని ఆశ్రయించారు. సీఎంకు వినతిపత్రం సమర్పించారు. గడువు తీరిన ఆహార ఉత్పత్తుల తేదీలను ఫోర్జరీ చేసి మార్చడం.. నిల్వ పదార్థాల మార్కెటింగ్ చేసిన కేసులో అక్కడి న్యాయస్థానం ముగ్గురికి మూడేళ్లు, 19మందికి రెండేళ్ల జైలు శిక్ష విధించింది. నిజామాబాద్కు చెందిన నకిడి లింబాద్రి (డిచ్పల్లి), కర్రోల్ల లక్ష్మీనర్సింహ (మల్లారం), తిమ్మజడ సంతోష్ (తిర్మన్పల్లి), జగిత్యాలకు చెందిన గోవిందు రాకేశ్ (రత్నాపూర్), రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన బంటుబాబు (కొండాపూర్)కు చెందిన ఐదుగురు వ్యక్తులు ఉన్నారు. వీరిని విడిపించాలని ఎన్ఆర్ఐ అడ్వైజరీ కమిటీ చైర్మన్, అంబాసిడర్ వినోద్కుమార్, వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి, గల్ఫ్ కుటుంబాలను సీఎం ప్రజావాణి నోడల్ అధికారి దివ్య దేవరాజన్ వద్దకు తీసుకెళ్లి వివరించారు. సీఎంవోలో కీలక అధికారి ప్రిన్సిపల్ సెక్రటరీ వి.శేషాద్రి దృష్టికి తీసుకెళ్లారు. -
ఆగమశాస్త్రం ప్రకారం ఆలయ అభివృద్ధి
వేములవాడ: ఆగమశాస్త్ర ప్రకారం ఆలయ అభివృద్ధి, విస్తరణ పనులు చేపడుతామని ప్రభుత్వవిప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. గుడి ఓపెన్స్లాబ్లో మంగళవారం రాజన్న ఆలయ అభివృద్ధి, విస్తరణపై పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఆర్కిటెక్చర్ (వాస్తు శిల్పి) సూర్యనారాయణ మూర్తి వివరించారు. విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో భక్తుల రద్దీ అనుగుణంగా ఆలయాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. మహాశివరాత్రి, సమ్మక్క సారలమ్మ జాతర సమయాల్లో పార్కింగ్ సమస్య రాకుండా జగిత్యాల వైపు 20 ఎకరాలు గుర్తించినట్లు తెలిపారు. 4.6 ఎకరాల్లో ఆలయ విస్తరణ, 33 ఎకరాల వరకు మాస్టర్ప్లాన్ డెవలప్మెంట్ ఏరియా ఉంటుందని తెలిపారు. ఆలయ అభివృద్ధికి రూ.110కోట్లకు టెండర్లు పిలిచినట్లు తెలిపారు. రెండో విడతగా రూ.285కోట్లు కేటాయించనున్నట్లు చెప్పారు.ఆలయ విస్తరణ పనులు జరిగే సమయంలో భీమేశ్వర ఆలయంలో దర్శనం ఉండేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు. దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి మరో 36 గుంటల సేకరణకు చర్యలు చేపడతామన్నారు. దేవాదాయశాఖ కమిషనర్ వెంకటరావు, దేవాదాయశాఖ సలహాదారు గోవింద్హరి, ఆలయ ఈవో రాధాబాయి పాల్గొన్నారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ రాజన్న ఆలయ విస్తరణపై పవర్పాయింట్ ప్రజెంటేషన్ -
నిర్వాహకులదే బాధ్యత
కోల్సిటీ(రామగుండం): బయో మెడికల్ వేస్ట్ నిర్వహణ బాధ్యతలు ఆస్పత్రులు, క్లినిక్ల ని ర్వాహకులదేనని డీఎంహెచ్వో అన్న ప్రసన్న కుమారి స్పష్టం చేశారు. బల్దియా కార్యాల యంలో మంగళవారం నగరంలోని ఆస్పత్రు లు, క్లినిక్లు, డెంటల్ ఆస్పత్రులు, ల్యాబ్లు, డయాగ్నోస్టిక్, ఇమేజింగ్ సెంటర్ల నిర్వాహ కులు, వైద్యులతో బయో మెడికల్ వేస్ట్ నిర్వహణపై అవగాహన కల్పించారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనుమతి పొందిన కరీంనగర్లోని వెంకటరమణ ఇన్సినరేటర్ ఏజెన్సీ ద్వారానే బయో మెడికల్ వ్యర్థాలను డిస్పోజ్ చేయాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సందర్భంగా వెంకటరమణ ఇన్సినరేటర్స్ ఏజెన్సీ ప్రతినిధి సతీశ్.. బయో మెడికల్ వ్యర్థాలను వేరుచేసే విధానంపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. ఐఎంఏ అధ్యక్షుడు క్యాస శ్రీనివాస్, డాక్టర్లు దామెర అనిల్కుమార్, మోహన్రావు, మెడికల్ అసో సియేషన్ నాయకులు కజాంపురం రాజేందర్, కరుణాకర్, భిక్షపతి పాల్గొన్నారు. లింగ నిర్ధారణ చట్ట విరుద్ధం పెద్దపల్లిరూరల్: లింగ నిర్ధారణ చట్ట విరుద్ధమని జిల్లా వైద్యాధికారి అన్నప్రసన్నకుమారి అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని తన కార్యాలయంలో జిల్లా అడ్వయిజరీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. జిల్లాలో మొత్తం 32 స్కానింగ్ కేంద్రాలు ఉన్నాయని తెలిపారు. ప్రతీ స్కానింగ్ను ఆన్లైన్ చేయాలని సూచించారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేసినా, చేయించుకున్నా, ప్రోత్సహించినా చట్ట రీత్యానేరమని తెలిపారు. ఇందుకు మూడేళ్ల దాకా జైలుశిక్ష, రూ.10వేల జరిమానా విధిస్తారని పేర్కొన్నారు. స్కానింగ్ సెంటర్లను ప్రతినెలా తనిఖీ చేస్తున్నామని అన్నారు. ప్రోగ్రాం అధికారి వాణిశ్రీతోపాటు రవీందర్, ఫాతిమా, రెడ్క్రాస్సొసైటీ కన్వీనర్ రాజగోపాల్, వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు. మాజీ హోంగార్డ్ అరెస్ట్ గోదావరిఖని: జడ్జిని అడ్డుకొని పోలీస్ కాని స్టేబుల్పై దాడికి పాల్పడ్డారనే కేసులో మాజీ హోంగార్డ్ మామిడి పద్మను అరెస్టు చేసినట్లు గోదావరిఖని వన్ టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి మంగళవారం తెలిపారు. ఓ లేఖ పట్టుకుని జడ్జి వాహనానికి అడ్డుగా వెళ్లడంతో పోలీసులు ఆమెను ఆపివేశారని పేర్కొన్నారు. ఈ క్రమంలో కానిస్టేబుల్పై రాయి విసరగా గాయాలయ్యాయని తెలిపారు. ఈమేరకు నిందితురాలిపై కేసు నమోదు చేశామమని పేర్కొన్నారు. కోర్టు ఆదేశాలతో రిమాండ్కు తరలించామని సీఐ వివరించారు. -
కపాస్ కిసాన్.. కర్శకుని నిషాన్
కరీంనగర్ అర్బన్: నిలకడలేని పత్తి ధరలతో నష్టపోయే రైతన్నకు ఉపయుక్తమైన యాప్ అందుబాటులోకి వచ్చింది. పత్తి రైతులందరూ 2025–26 సంవత్సరానికి సంబంధించి కనీస మద్దతు ధర పొందేందుకు వీలుగా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) దేశంలోనే తొలిసారిగా శ్రీకపాస్ కిసాన్శ్రీ యాప్ను అందుబాటులోకి తెచ్చింది. పంట పండించే రైతులు తమ పేర్లను సెప్టెంబరు 1నుంచి 30 వరకు యాప్లో నమోదు చేసుకోవాలి. వివరాలు నమోదు చేసుకున్న వారే సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో తమ సరకు విక్రయించుకునే అవకాశం ఉంటుంది. నూతన కార్యక్రమంపై రైతుల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని మార్కెటింగ్ శాఖ సిబ్బందిని సీసీఐ అధికారులు ఆదేశించారు. విక్రయ సమయంలో ఇదే ఆధారం ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం పత్తి క్వింటాలుకు కనీస మద్దతు ధర రూ.8,110గా ప్రకటించింది. కనీస ధర పొందాలంటే యాప్లో రిజిస్టర్ అయిన రైతులు పత్తి విక్రయ సమయంలో స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏ రోజు సీసీఐ కేంద్రంలో వారు విక్రయించాలో వివరాలు తెలుపుతూ యాప్ సమాచారం ఇస్తుంది. ఇలా చేయడం వల్ల రోజుల తరబడి నిరీక్షించాల్సిన బాధ తప్పుతుంది. స్లాట్ బుక్ చేసుకున్న వారికి మాత్రమే ఈ వెసులుబాటు ఉంటుంది. అక్రమ విక్రయాలకు ముకుతాడు పత్తి విక్రయ సమయంలో ధరల దోబూచూలాడుతూ రైతులను పీల్చిపిప్పి చేయడం వ్యాపారులకే చెల్లు. అంతిమంగా వారు చెప్పిన రేటుకే అమ్మేలా సఫలీకృతులవుతుంటారు. విక్రయాలు పూర్తయ్యాక రైతుల పేరుతో సదరు వ్యాపారులే సీసీఐకి విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. అసలైన రైతుకు మద్దతు ధక్కకపోగా వ్యాపారులే రెండురకాలుగా లాభాలు గడిస్తున్నారు. కరీంనగర్, జమ్మికుంట, గంగాధర, చొప్పదండి మార్కెట్లతో పాటు జిన్నింగ్ మిల్లుల్లో అక్రమాలు షరామామూలేనన్న ఆరోపణలున్నాయి. యాప్తో సదరు అక్రమాలకు చెక్ పడినట్లేనని విఽశ్లేషకులు భావిస్తున్నారు. పత్తి పంట వేస్తేనే వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. తగ్గుతున్న పత్తి సాగు విస్తీర్ణం గతేడాది కంటే ఈఏడాది జిల్లాలో పత్తి సాగు విస్తీర్ణం తగ్గింది. గతంలో 70–90వేల ఎకరాల్లో సాగయ్యేది. చీడపీడలతో పాటు దళారుల దోపిడీతో సాగు విస్తీర్ణం క్రమేణా తగ్గుతోంది. 2020లో 90వేల ఎకరాల్లో పత్తి సాగవగా ప్రస్తుతం 50వేలకు చేరింది. కాగా వచ్చే నెల రెండో వారం నుంచి పంట చేతికొస్తుంది. కొద్ది రోజుల నుంచి విస్తారంగా వర్షాలు పడుతున్న నేపథ్యంలో ఈసారి ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం ఉందని రైతులు భావిస్తున్నారు. కాగా పత్తి రైతులు ‘కిసాన్ కపాస్’ యాప్ను తమ మొబైల్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవాలని, తర్వాత పేర్లు నమోదు చేసుకోవాలని వ్యవసాయ మార్కెటింగ్ అధికారులు వివరించారు. రైతులకు ఇబ్బందులు లేకుండా మద్దతు ధర దక్కేలా చేయడమే ప్రభుత్వ ఉద్దేశం. కార్యక్రమంపై జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని వ్యవసాయ మార్కెటింగ్ అధికారులు పేర్కొన్నారు. పత్తి రైతులకు ప్రత్యేక యాప్ అందుబాటులోకి తెచ్చిన సీసీఐ అక్రమ విక్రయాలకు ముకుతాడు రైతుల సంఖ్య: 2,18,012 సాగు విస్తీర్ణం: 3.33 లక్షల ఎకరాలు పత్తి సాగుచేసే రైతులు 32,019 పత్తి సాగు విస్తీర్ణం: 50,000 ఎకరాలు దిగుబడి అంచనా: 6 లక్షల క్వింటాళ్లు యాప్ డౌన్లోడ్ చేసుకోవాల్సిందే తొలుత ‘కపాస్ కిసాన్’ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి. సదరు రైతుకు సంబంధించి భూమి రికార్డులు, రెవెన్యూ శాఖ అధికారుల ద్వారా ధ్రువీకరించిన పత్తి పంట రికార్డు, ఆధార్ కార్డు వివరాలు అందులో నమోదు చేయాలి. ఫలితంగా దేశంలో పత్తి రైతులు, పంట విస్తీర్ణం, సాంద్రత తదితర వివరాలన్నీ సీసీఐకి చేరుతాయి. వచ్చే నెలాఖరుకు రైతులు యాప్లో రిజిస్టర్ చేసుకోవాలి. -
రేషన్ డీలర్ల కమీషన్ ఇప్పించండి
కరీంనగర్ అర్బన్: ప్రజాపంపిణీ వ్యవస్థలో పారదర్శకంగా పనిచేసే రేషన్ డీలర్లు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారని, 5 నెలలుగా కమీషన్ లేక నానాపాట్లు పడుతున్నామని తెలంగాణ రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల రమేశ్బాబు వాపోయారు. మంగళవారం నగరంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ను కలిసి వినతిపత్రం అందజేశారు. కేంద్ర కమీషన్ వేరు రాష్ట్ర కమీషన్ వేరంటూ డీలర్లకు కమీషన్ విడుదల చేయడం లేదని, ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించారు. ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు కమీషన్ రాలేదని వివరించారు. కేంద్ర ప్రభుత్వం డీలర్లకు చెల్లిస్తున్న క్వింటాకు రూ.90 కమీషన్కు తోడుగా కనీస గౌరవ వేతనాన్ని కూడా ప్రకటించే విధంగా చూడాలని కోరారు. తెలంగాణ డీలర్ల సంఘం జిల్లా అధ్యక్షులు రొడ్డ శ్రీనివాస్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెడ్డిమల్ల హన్మాండ్లు, కరీంనగర్ కార్యవర్గం గాలి గట్టయ్య, ఎ.రవీందర్, రుద్రవేణి కనుకయ్య, విజయ్ పాల్గొన్నారు. కేంద్ర మంత్రి సంజయ్కి డీలర్ల వినతి -
పాత కార్యకర్తలను పట్టించుకోండి!
సాక్షిప్రతినిధి,కరీంనగర్/గంగాధర: ‘పదేళ్లు కాంగ్రెస్ పార్టీ జెండాలు మోశాం.. ప్రజ ల కోసం ధర్నాలు, రాస్తారోకోలు చేశాం.. పార్టీ కోసం కేసులు భరించాం.. తీరా ఇప్పుడు ఇతర పార్టీల నుంచి నేతలు వలస రాగానే.. మాకు ప్రాధాన్యం తగ్గుతోంది.. దయచేసి దశాబ్దకాలంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మోసిన కష్టాలు, కే సులు, పడ్డ అవమానాలను దృష్టిలో ఉంచుకుని పాత కార్యకర్తలకు ప్రాధాన్యం ఇవ్వాలి’ అని కాంగ్రెస్ నాయకులు ముక్తకంఠంతో అన్నారు. సోమవారం గంగాధర మండలంలోని ఎల్కే గార్డెన్స్లో నిర్వహించిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ ముఖ్యకార్యకర్తల సమావేశంలో పలువురు కాంగ్రెస్ సీనియర్ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేగా పోటీ చేసిన అభ్యర్థులు తమ మనసులోని భావాలను, ఆవేదనను టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్కు వెళ్ల్లబోసుకున్నారు. డిమాండ్లు.. విన్నపాలు.. హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి ప్రణవ్బాబు మాట్లాడుతూ.. ‘జనహిత యాత్ర విజయవంతమైందని, సంక్షేమ పథకాలు అందిన లబ్ధిదారుల జాబితా తీసుకుని వారిని కలవాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. వెంటనే కార్యకర్తలకు పదవులిస్తే రాబోయే ఎన్నికల్లో ఉత్సాహంగా పనిచేస్తారని పేర్కొన్నారు. కోరుట్ల ఇన్చార్జి జువ్వాడి నర్సింగరావు మాట్లాడుతూ.. కార్యకర్తలు నామినేట్ పదవుల కోసం ఎదురుచూస్తున్నారని, జగిత్యాల జిల్లాలో ప్రొటోకాల్ సమస్య రాకుండా చేయాలని కోరారు. కేకే మహేందర్రెడ్డి మాట్లాడుతూ.. సిరిసిల్లలో ఒక్కో కార్యకర్తపై 40 నుంచి 50 కేసులు నమోదయ్యాయని, వీలైనంత త్వరగా వాటిని ఎత్తేయాలని కోరారు. సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి మాట్లాడుతూ.. కష్టకాలంలో పార్టీ జెండా మోసినవారిని కడుపులో పెట్టుకోవాలని, అవకాశమిస్తే కరీంనగర్లో కూడా సత్తా చూపిస్తామని అన్నారు. విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. యూరియా విషయంలో బీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యే రాజ్ఠాకూర్ మాట్లాడుతూ.. మా పార్టీ నేతలు అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల్లో ఉండేందుకు పాదయాత్రలు చేస్తామని, బీజేపీని బొందపెడతామని, రాహుల్ని ప్రధాని చేసే లక్ష్యంతో పనిచేస్తామని వెల్లడించారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ.. వచ్చే ఐదేళ్లు కూడా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, ఎస్సీల వర్గీకరణ, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు కృషి చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే అన్నారు. పార్టీని అధికా రంలోకి తెచ్చిన కార్యకర్తలకు పదవుల్లో పెద్దపీట వేయాలని మాజీమంత్రి జీవన్రెడ్డి కోరారు. అనంతరం రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ మాట్లాడుతూ.. 80 శాతం పదవులు పాత కార్యకర్తలకే ఇస్తామని, కొత్తవారు తమను తాము నిరూపించుకోవాలని సూచించారు. వసతి గృహంలో శ్రమదానం గంగాధర మండల కేంద్రంలోని బాలుర వసతి గృహంలో గంటన్నర సేపు మీనాక్షి నటరాజన్ శ్రమదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. హాస్టల్ ఆవరణలో మట్టి పోయడంతో పాటు, మొక్కలు నాటారు. గోడలకు రంగులు వేసి, బాత్రూంలు శుభ్రం చేశారు. పాటలతో నాయకులు, కార్యకర్తలను ఉల్లాసపరిచారు. కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
మట్టి గణపతులను పూజిద్దాం
పెద్దపల్లిరూరల్: జిల్లావాసులు తమ ఇళ్లలో మ ట్టి గణపతులనే పూజిస్తూ, పర్యావరణ పరిరక్ష ణకు సహకరించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అ న్నారు. కలెక్టరేట్లో సోమవారం మట్టి వినా యకులనే పూజించాలంటూ అవగాహన క ల్పించేలా ముద్రించిన పోస్టర్ను ఆవిష్కరించి మాట్లాడారు. సహజసిద్ధంగా లభించే మట్టితో తయారు చేసిన వినాయక విగ్రహాలనే పూజించేలా ప్రజల్లో అవగాహన పెంచాలన్నారు. కా ర్యక్రమంలో బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ రంగారెడ్డి, కాలుష్య నియంత్రణ మండలి ఈఈ భిక్షపతి, సూపరింటెండెంట్ ప్రకాశ్ పాల్గొన్నారు.నిబంధనలు పాటించాలి గోదావరిఖని: గణేశ్ మండప నిర్వాహకులు ని బంధనల మేరకు వ్యవహరించాలని గోదావరిఖని ఏసీపీ రమేశ్ సూచించారు. స్థానిక రాజ్య లక్ష్మి ఫంక్షన్హాల్లో సోమవారం గణేశ్ మండ ప నిర్వాహకులకు అవగాహన కల్పించారు. వి నాయక విగ్రహాల ఏర్పాటుకు పోలీసు, విద్యు త్ శాఖల అనుమతి తీసుకోవాలన్నారు. రాత్రి 10 గంటల తర్వాత మైక్లు వాడొద్దని, ఇతర మతాలు, వ్యక్తులను కించపర్చేలా ప్రసంగా లు, పాటలు ఉండొద్దని, అనుమానాస్పద వ్య క్తుల గురించి పోలీస్లకు సమాచారం ఇవ్వా ల ని అన్నారు. సీఐలు ఇంద్రసేనారెడ్డి, ప్రసాదరా వు, ప్రవీణ్కుమార్, ఎస్సైలు సంధ్యారాణి, ర మేశ్, భూమేశ్, అనూష పాల్గొన్నారు. లోకోపైలెట్ల నిరసన రామగుండం: తమ డిమాండ్లను పరిష్కరించా లని కోరుతూ స్థానిక రైల్వేస్టేషన్లో లోకోపైలె ట్లు సోమవారం నిరసన తెలిపారు. అసోసియే షన్ ప్రతినిధులు మాట్లాడుతూ, అసిస్టెంట్ లో కోపైలెట్(ఏఎల్పీ)ఖాళీలు భర్తీ చేయాలని, రి టైర్డ్ రన్నింగ్ స్టాఫ్ను కాంట్రాక్టు బేసిక్పై వి ధు ల్లోకి తీసుకోవడం సరికాదన్నారు. ప్రతినిధు లు సీహెచ్ రవి, సచిన్, మిథిలేశ్, లక్ష్మణ్, వి నయ్, శ్యామ్, సూరజ్ తదితరులు పాల్గొన్నారు. బోనస్ చెల్లించాలని వినతి స్థానిక రైల్వే ఆర్వోహెచ్ షెడ్ కాంట్రాక్టు కార్మి కులకు జాతీయ సెలవులు (ఎన్హెచ్), అలవెన్సులు, దసరా బోనస్ చెల్లించాలని రైల్వే సీ అండ్ డబ్ల్యూ, డిపో సీనియర్ సెక్షన్ ఇంజినీర్ పాండునాయక్కు దక్షిణ మధ్య రైల్వే మల్టిపుల్ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు కన్నూరి సతీశ్కుమార్ ఆధ్వర్యంలో వినతిప త్రం అందజేశారు. నాయకులు సీహెచ్ కుమా రస్వామి, ఆసిఫ్, రజనీకాంత్, ప్రసాద్, సిసింద్రీ, అతిక్, శ్రావణ్, సతీశ్, రాజు ఉన్నారు. సమస్యలు పరిష్కరిస్తాం గోదావరిఖని: సింగరేణి ఉద్యోగులు, కాంట్రా క్టు కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని గో దావరిఖని సీఎంపీఎఫ్ అడిషనల్ కమిషనర్ గోవర్ధన్ అన్నారు. ఆర్జీ–1 జీఎం కార్యాలయంలో సోమవారం జరిగిన పింఛన్ సెటిల్మెంట్ సమావేశంలో ఆయన మాట్లాడారు. పింఛన్ చె ల్లింపు, సెటిల్మెంట్, సవరణ, రివైజ్డ్ క్లెయి మ్, ఎన్సీడబ్ల్యూఏ ఉద్యోగులు, కాంట్రాక్ట్ వ ర్క్మెన్ సీఎంపీఎఫ్ ఆడిట్ షీట్, కాంట్రాక్ట్ డ్రై వర్ల సీఎంపీఎఫ్ నంబర్ సమస్యల గురించి ఆ యన అవగాహన కల్పించారు. పర్సనల్ మే నేజర్ రవీందర్రెడ్డి, సెక్యురిటీ అధికారి వీరారెడ్డి, డిప్యూటి పర్సనల్ మేనేజర్ వేణు, సీనియర్ పర్సనల్ అధికారులు శ్రావణ్కుమార్, హనుమంతరావు, డిప్యూటీ సూపరింటెండెంట్ దేవాచారి తదితరులు పాల్గొన్నారు. రియాజ్ను బహిష్కరిస్తున్నాం గోదావరిఖని: యూనియన్ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న రియాజ్అహ్మద్ను బిహిష్కరిస్తున్నట్లు హెచ్ఎంఎస్ అధ్యక్షుడు జ క్కుల నారాయణ తెలిపారు. స్థానిక ప్రెస్క్లబ్ లో సోమవారం విలేకరుల సమావేశంలో మా ట్లాడారు. నియంతృత్వపోకడ, బ్లాక్మెయిల్ రాజకీయాలతో యూనియన్ను దిగజార్చుతున్నారని విమర్శించారు. గుర్తింపుకార్మిక సంఘం ఎన్నికల్లో 3 నుంచి ఐదో స్థానానికి యూ నియన్ను దిగజార్చారని మండిపడ్డారు. -
నడ్డా కార్యాలయం ఎదుట ధర్నా చేయండి
సుల్తానాబాద్(పెద్దపల్లి): కేంద్ర మంత్రులు బండి సంజయ్ కుమార్, కిషన్రెడ్డి.. బీజేపీ ఎంపీలతో క లిసి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి జేబీ నడ్డా కా ర్యాలయం ఎదుట ధర్నా చేసి యూరియా కొరత తీ ర్చాలని ఎమ్మెల్యే విజయరమణారావు సవాల్ విసిరారు. స్థానిక ఎస్వీఆర్ గార్డెన్లో సోమవారం బీఆర్ఎస్కు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్లో చేరారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం అవసరం మేరకు యూరియా సర ఫరా చేయకనే సమస్య ఏర్పడిందన్నారు. తాను, ఎ మ్మెల్సీ, వేర్వేరు కాదని, ఇద్దరమూ ఒకటేనన్నారు. గర్రెపల్లి మాజీ సర్పంచ్ పడాల అజయ్గౌడ్, నాయకులు వీరగోని సుజాత, వొద్ది ప్రసాద్రావు, కొక్కిరా ల మహేశ్వర్రావు, ఎలిగేడు కమలమ్మ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నా రు. నాయకులు అంతటి అన్నయ్యగౌడ్, ప్రకాశ్రా వు, స్వరూప, సారయ్యగౌడ్, మస్రత్, అబ్బయ్య గౌ డ్, సతీశ్, రాజేశ్వర్రెడ్డి, సదయ్య, సురేశ్గౌడ్, జానీ, దామోదర్రావు, రాములు పాల్గొన్నారు. -
భోజనం బాగుందా?
● ఆరా తీసిన జిల్లా జడ్జి సునీత పెద్దపల్లిరూరల్: ‘హాస్టల్లో వసతులు ఎలా ఉన్నాయ్.. భోజనం బాగుందా.. వార్డెన్ అందుబాటులో ఉంటున్నారా?’ అని జిల్లా ప్రధా న న్యాయమూర్తి సునీత విద్యార్థినులను ప్ర శ్నించారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ కా ర్యదర్శి స్వప్నరాణితో కలిసి స్థానిక ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఆవరణలోని బాలికల హాస్టల్ను సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మె నూ ప్రకారం విద్యార్థినులకు భోజనం అందించాలని సూచించారు. అదేవిధంగా జిల్లా కోర్టు ఆవరణలో జరిగిన నేత్రదాన పక్షోత్సవంలో జడ్జి సునీత మాట్లాడుతూ, నేత్రదానం మహాపుణ్యకార్యమన్నారు. సదాశయ ఫౌండేషన్ ప్ర తినిధి పృథ్వీరాజ్, ఏవో రవీందర్, పీపీ రమేశ్, లైసెనింగ్ ఆఫీసర్ కోటేశ్వరరావు, సభ్యులు శ్యాంప్రసాద్, అశోక్, మహేందర్ ఉన్నారు. ఇక సులభంగా పింఛన్ల పంపిణీ పెద్దపల్లిరూరల్: లబ్ధిదారులకు ఇకనుంచి సులభంగా పింఛన్లు పంపిణీ చేసేందుకు చ ర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ శ్రీహర్ష తెలి పారు. కలెక్టరేట్లో పోస్టాఫీసు బ్రాంచి మేనేజ ర్లకు ఎఫ్ఆర్ఎస్ మొబైల్, బయోమెట్రిక్ మిషన్లను సోమవారం ఆయన అందజేశారు. అనంతరం మాట్లాడుతూ, నడవలేని స్థితిలో ఉన్నవారికి ఎఫ్ఆర్ఎస్(ముఖ గుర్తింపు) ద్వారా పింఛన్లు సులభంగా అందించేందుకు 22మంది మేనేజర్లకు మొబైల్స్, బయోమెట్రిక్ యంత్రాలను అందిస్తున్నామన్నారు. జిల్లాలోని రామగిరి, జూలపల్లి, సుల్తానాబాద్, మంథని మండలాల పరిధిలోని 44 గ్రామాల్లో గల 6,921 మందికి వీటిద్వారా ప్రయోజనం కలుగుతుందని అన్నారు. డీఆర్డీవో కాళిందిని, అడిషనల్ డీఆర్డీవో రవీందర్ పాల్గొన్నారు.విద్యార్థులు క్రీడాస్ఫూర్తి పెంపొందించుకోవాలి పెద్దపల్లిరూరల్: విద్యార్థులు చదువుతోపాటు ఆటలపోటీల్లో పాల్గొంటూ క్రీడాస్ఫూర్తిని పెంపొందించుకోవాలని డీఈవో మాధవి సూచించారు. అప్పన్నపేట జెడ్పీ హైస్కూల్లో సోమ వారం క్రీడాపోటీలను ఆమె ప్రారంభించారు. 18 పాఠశాలలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు. క్రీడాపోటీల్లో పాల్గొంటే మానసికంగ ధృడంగా తయారవుతారన్నారు. ఎంఈవో సు రేందర్కుమార్, హెచ్ఎం పురుషోత్తం, వేల్పు ల సురేందర్ తదితరులు పాల్గొన్నారు. -
పరిహారం రాలె!
మంథనిరూరల్: ఇటీవల కురిసిన భారీవర్షాలు, వరదలు అన్నదాతలను నిండా ముంచాయి. వర్షాలు కురుస్తున్నాయన్న ఆనందం కన్నా.. వరదలు వచ్చి పంటలను దెబ్బతీశాయనే వేదనే రైతులను వెంటాడుతోంది. భారీ వర్షాలతో గోదావరి నది పరీవాహక ప్రాంతంలోని వందల ఎకరాల్లో వివిధ పంటలను వరదముంచెత్తింది. ఇందులో వరి, పత్తి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని రైతులు ఆవేదన చెందారు. వంద ఎకరాలకు పైగా.. మంథని మండల వ్యాప్తంగా ఈ వానాకాలం సీజన్లో సుమారు ఐదు వేల నుంచి దాదాపు ఎనిమిది వేల ఎకరాల్లో పత్తి, సుమారు 15 వేల ఎకరాల్లో వరి సాగు చేశారని అంచనా. తొలకరితో పంటలు వేసిన రైతులకు భారీ వర్షాలు తీవ్రనష్టం తెచ్చిపెట్టాయి. ప్రధానంగా గోదావరి వరదకు వంద ఎకరాలకు పైగా వరి, పత్తి పంటలు నీట మునిగాయి. పరీవాహక ప్రాంతాల్లోనే నష్టం.. గోదావరి పరీవాహక ప్రాంతాల్లోని ఉప్పట్ల, విలోచవరం, పోతారం, ఖానాపూర్, ఖాన్సాయిపేట పరిధిలోని వివిధ పంటలు వరదనీటిలో మునిగాయి. పోతారం గ్రామంలో అత్యధికంగా పత్తి దెబ్బతినగా, ఖానాపూర్, ఖాన్సాయిపేట, విలోచవరం గ్రామాల్లో వరి పంటపంట నీట మునిగింది. అ యితే వరద తాకిడితో పత్తికి భారీ నష్టం జరిగిందని, వరి కూడా దెబ్బతిందని రైతులు చెబుతున్నారు. పరిహారం అందించాలని.. వేలాది రూపాయిల పెట్టుబడితో సాగు చేసిన పంటలను వరదలు ముంచెత్తాయని రైతులు వాపోతున్నారు. ఇప్పటివరకు పత్తిపంటకు ఎకరాకు రూ.35 వేలు, వరి పంటకు రూ.25వేల వరకు పెట్టుబడిపెట్టామని చెబుతున్నారు. కౌలుకు తీసుకుని సాగు చేసిన రైతుకు మరో రూ.20వేలు అదనంగా ఖర్చు అవుతోంది. నష్టపోయిన రైతులకు పరిహారం అందించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. -
ఓదెల మల్లన్న ఆలయ అభివృద్ధికి కృషి
ఓదెల(పెద్దపల్లి): ఓదెల మల్లికార్జునస్వామి ఆల య అభివృద్ధికి కృషి చేస్తానని మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ హామీ ఇచ్చారు. ఓదెల మల్లికార్జునస్వామి సన్నిధిలో ఆలయ చైర్మన్గా చీకట్ల మొండయ్య, సభ్యులు సోమవారం పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి అడ్లూరి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎన్టీపీసీ, రామగుండం, ఆర్ఎఫ్సీఎల్ సంస్థల సహకారంతో ఆలయంలో గెస్ట్హౌస్లు లేదా అదనపు వసతి గదులు నిర్మిస్తామన్నారు. ఎమ్మెల్సీ భానుప్రసాదరావు, ఎమ్మెల్యే విజయరమణరావు మా ట్లాడారు. అంతకుముందు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అధికారులు సుప్రియ, సదయ్య, పెద్దపల్లి మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఈర్ల స్వరూప, నాయకులు ఆళ్ల సుమన్రెడ్డి, మూల ప్రేంసాగర్రెడ్డి, జడల సురేందర్, బొద్దుల లక్ష్మణ్, గొపగాని సారయ్యగౌడ్, బైరి రవిగౌడ్ పాల్గొన్నారు. -
రైతు సంక్షేమాన్ని పట్టించుకోని కాంగ్రెస్ సర్కార్
పెద్దపల్లిరూరల్: కాంగ్రెస్ సర్కార్ రైతు సంక్షేమా న్ని విస్మరిస్తోందని బీజేపీ నాయకులు విమర్శించా రు. జిల్లా కేంద్రంలో సోమవారం పార్టీ పట్టణ, మండల అధ్యక్షులు పెంజర్ల రాకేశ్, వేల్పుల రమేశ్ ఆ ధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. ఆర్డీవో కార్యాలయం ఎదుట బైఠాయించారు. నాయకులు మా ట్లాడుతూ, పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయలేదని, సన్నరకం ధాన్యానికి బోనస్ చెల్లించడం లేదన్నారు. ఇలాంటి రైతు సమస్యలకు సత్వరమే పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. సన్నరకం ధాన్యానికి బోనస్ చెల్లించడంలో జాప్యమెందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. నాయకులు తంగెడ రాజేశ్వర్రావు, పోల్సాని సంపత్రావు, శ్రీనివాస్, ఈర్ల శంకర్, తి రుపతి, మల్లయ్య, శివయ్య, శ్రీధర్, ఉమేశ్, సతీశ్, కృష్ణమోహన్, రేండ్ల వేణు, అంజి, కుమార్, రాజేంద్రప్రసాద్, సతీశ్, రాజు, స్వామి, రవి పాల్గొన్నారు. -
వరి పంట నీటమునిగింది
నాకున్న రెండున్నర ఎకరాల్లో వరి సాగు చేసిన. ఎకరాకు రూ.35 వేల దాకా పెట్టుబడి పెట్టిన. భారీ వర్షాలతో గోదావరికి వరద వచ్చింది. వరదనీరు మా పొలాలను ముంచేసింది. నాకున్న రెండున్నర ఎకరాలతోపాటు సమీపంలోని రైతుల వరి వరదనీటిలో మునిగి అక్కరకురాకుండా పోయింది. – బోగిరి లక్ష్మణ్, రైతు, పోతారం ప్రభుత్వమే ఆదుకోవాలె నాకున్న రెండెకరాలతోపాటు మూడెకరాలు కౌలుకు తీసుకుని వరి, పత్తి ఏసిన. పంటలు మంచిగా పెరిగినయ్. గోదావరికి వరదలు వచ్చి నది తీరంలోని పంటలు మునిగిపోయినయ్. ఎకరంన్నర పత్తి నీళ్లలో మునిగి నల్లగా మారింది. ప్రభుత్వమే ముందుకువచ్చి సాయం చేయాలె. – బోగిరి భాస్కర్, రైతు పోతారం 30 ఎకరాల్లో పత్తికి నష్టం గోదావరి వరదలతో నదీతీరంలోని సుమారు 30ఎకరాల్లో పత్తి పంట దెబ్బతింది. మరో వంద ఎకరాల వరకు వరనీటిలో మునిగింది. గోదావరి నది పరీవాహక ప్రాంతంలో ఒకేవైపు నుంచి పంటల మీదుగా వరద పోయింది. మా వ్యవసాయ శాఖ అధికారులు దెబ్బతిన్న పంటలను ఇటీవల సర్వే చేశారు. ప్రభుత్వం ఆదేశాలిస్తే నివేదిక సమర్పించి బాధిత రైతులకు పరిహారం అందజేస్తాం. – అంజనీమిశ్రా, ఏడీఏ, మంథని -
ఆధునికం.. ఆహ్లాదం
యైటింక్లయిన్కాలనీ(రామగుండం): అది సింగరే ణి ప్రభావిత గ్రామం.. రామగుండం కార్పొరేషన్ 19వ డివిజన్ పరిధిలోని న్యూమారేడుపాక(నర్సింహపురం) జెడ్పీ హైస్కూల్ అక్కడి ప్రత్యేకత. స్కూల్ తరగతి గదులను ఆధునికీకరించారు. డిజిటల్ పద్ధతిన విద్యాబోధన చేస్తున్నారు. అంతేకాదు.. పాఠాలు సులభంగా అర్థమయ్యేందుకు, విద్యార్థులు శ్రద్ధతో వినేందుకు అవసరమైన ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించారు. రూ.9 లక్షలు కేటాయించడంతో.. తరగతి గదులు, మూత్రశాలలు, వంటగదులు లేక విద్యార్థులు, ఉపాధ్యాయులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈవిషయాన్ని ప్రధానోపాధ్యాయురాలు స్వర్ణ.. ఇటీవల ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఎమ్మెల్యే.. సింగరేణి ఆర్జీ–2 యాజమాన్యంతో మాట్లాడి దాదాపు రూ.9లక్షలు మంజూరు చేయించారు. ఈ నిధులు వెచ్చించి ప్రహరీ, బడి వరకు సీసీ రోడ్డు, వంటగది నిర్మించారు. ఆరు నుంచి పదో తరగతి వరకు క్లాస్రూమ్లను డిజిటల్ బోధనకు అనుకూలంగా తీర్చిదిద్దారు. స్టేజీ నిర్మాంచారు. బాలుర కోసం ప్రత్యేకంగా మూత్రశాలలు అందుబాటులోకి తీసుకొచ్చారు. రోజూ ప్రత్యేక తరగతులు.. పదో తరగతి విద్యార్థులు వార్షిక పరీక్షల్లో అత్యు త్తమ మార్కులు సాధించేలా రోజూ ఉదయం, సాయంత్రం ప్రత్యేక తర గతులు నిర్వహిస్తున్నా రు. చదువులో వెనకబడిన విద్యార్థులను గుర్తించి వారికి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. దీంతో గ తేడాది టెన్త్లో 97శాతం ఉత్తీర్ణత సాధించి మండలంలోనే పాఠశాల అగ్రస్థానంలో నిలించింది. 98 మంది విద్యార్థులు ఉండగా.. ఉపాధ్యాయులు చేపట్టిన బడిబాట, టెన్త్ ఫలితాల ప్రచారంతో 30 మంది విద్యార్థులను కొత్తగా బడిలో చేర్పించారు. అందంగా చెట్లు.. పాఠశాల ఆవరణలోని మొక్కలు, చెట్లకు గణిత ఉపాధ్యాయురాలు పద్మ కుమారి సహకారంతో విద్యార్థులు రంగులు వేశారు. అందంగా తీర్చిదిద్దారు. వాటిద్వారా కలిగే ప్రయోజనాల గురించి విద్యార్థులకు వివరిస్తున్నారు. -
విద్యుత్ తీగలు సరిచేస్తాం
పెద్దపల్లిరూరల్: పంటలు పండించే రైతులు విద్యుత్ సంబంధిత సమస్యలతో ఇబ్బందులు పడొద్దనే ఆలోచనతో ఎన్పీడీసీఎల్ అధికారులు చేపట్టిన పొలంబాట కార్యక్రమం సత్పలితాలు ఇస్తోంది. గతేడాది నవంబర్ నుంచి ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్న అధికారులు.. వారి దృష్టికి వచ్చిన సమస్యలకు సత్వర పరిష్కారం చూపిస్తున్నారు. వేలాడే తీగలు, ఒరిగిన, వంగిన విద్యుత్ స్తంభాలను సరిచేస్తున్నారు. పూర్తిగా దెబ్బతిని ప్రమాదకరంగా మారిన స్తంభాలు ఉంటే వాటిస్థానంలో కొత్త విద్యుత్ పోళ్లను అమర్చుతున్నారు. పంట పొలాలకు సమీపంలో తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లతో ప్రమాదం పొంచి ఉందని భావిస్తే.. సత్వరమే స్పందించి వాటిఎత్తును పెంచడమో, లేక చుట్టూ రక్షణ కోసం కంచెలు ఏర్పాటు చేయడమో చేస్తున్నారు. దీర్ఘకాలిక సమస్యలకు మోక్షం.. జిల్లాలో చేపట్టిన పొలంబాట కార్యక్రమం సత్పలితాలనే ఇస్తోంది. ఇప్పటివరకు ప్రమాదకరంగా ఉన్న లో లెవల్ క్రాసింగ్ లైన్ల 187 పనులను గుర్తించి ఆపనులు పూర్తిచేశారు. తక్కువ ఎత్తులో పంట చేలకు సమీపంలో ప్రమాదకరంగా ఉన్న 56 ట్రాన్స్ ఫార్మర్ల చుట్టూ కంచెలు ఏర్పాటు చేయడం, ఎత్తు పెంచడం లాంటి పనులు చేపట్టారు. అలాగే లూస్లైన్లకు సంబంధించిన 232 పనులను పునరుద్ధరించడం, ఒరిగి, వంగి ప్రమాదకరంగా 45 ఉన్న విద్యుత్ స్తంభాలను సరిచేయడం చేశారు. డబుల్ ఫీడింగ్ పాయింట్ల 45 పనులు చేపట్టారు. -
సీసీ కెమెరాలు.. జియో ట్యాగింగ్
గోదావరిఖని: రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో గణేశ్ నవరాత్రి ఉత్సవాలు ప్రశాంత వా తావరణంలో జరుపుకునేలా పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. మండప నిర్వాహకులు తప్పనిసరిగా పోలీస్ శాఖ అనుమతి తీసుకోవాలని, ఇందుకోసం ఆన్లైన్లో దరఖాస్తు చేయా లని సూచిస్తోంది. ప్రతీమండపంలో సీసీ కెమెరా లు ఏర్పాటు చేయడం తప్పనిసరి చేసింది. ఈనె ల 27న ఉత్సవాలు ప్రారంభమవుతాయి. మతపెద్దలతో శాంతి కమిటీ సమావేశం పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల పోలీసు అధికారు లు, మతపెద్దలతో సీపీ అంబర్ కిశోర్ ఝా ఇటీవల శాంతి సమావేశం నిర్వహించారు. వినాయ క నవరాత్రి ఉత్సవాలు, మిలాన్ ఉన్ నబీ వేడుకలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని, ఇందుకోసం సహకరించాలని సూచించారు. గతేడాది 4,786 విగ్రహాల ఏర్పాటు గతేడాది రామగుండం పోలీస్ కమిషనరేట్ పరి ధిలో 4,786 గణపతి విగ్రహాలు ఏర్పాటు చేశా రు. ఈసారి వాటి సంఖ్య మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. అయితే, గణేశ్ మండపాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు, ప్రతీ విగ్రహానికి జియోట్యాగింగ్ చేసి నవరాత్రి ఉత్సవాలు ప్ర శాంతంగా జరిగేలా పోలీస్లు పక్కాగా నిఘా ఉంచుతారు. నిమజ్జన వేడుకలు సాఫీగా సాగేందుకు ఈ ప్రక్రియ ఎంతోదోహదం చేస్తుందని పో లీస్ అధికారులు చెబుతున్నారు. మరోవైపు.. ఎ లాంటి సమస్యలు ఎదురైనా, సమాచారం కోసమైనా డయల్ 100 నంబరుతోపాటు రామగుండం పోలీస్ కమిషరేట్ కంట్రోల్ రూం 87126 56597 నంబరుతోపాటు పోలీసులను సంప్రదించాలని సూచిస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి నిరంతరం నిఘా ఉంచుతారు. -
బంగారు చికిత
● ఆర్చరీ వరల్డ్ యూత్ గేమ్స్లో పసిడి పతకం సొంతం కరీంనగర్స్పోర్ట్స్/ఎలిగేడు: షాంఘైలో జరిగిన ప్రపంచకప్ ఆర్చ రీ స్టేజ్–2 పోటీల్లో రజ తం, బ్యాంకాక్ ఏషియాడ్లో కాంస్యం, ఉత్తరాఖండ్ జాతీయ క్రీడల్లో కాంస్యం.. ఇలా తను పాల్గొన్న ప్రతీ ఈవెంట్లో ఏదో ఒక పతకంతో సత్తా చాటుతోంది చికిత. సుల్తాన్పూర్ గ్రామానికి చెందిన తా నిపర్తి చికిత కెనడాలోని వెన్నిపెగ్లో జరుగుతున్న వరల్డ్ యూత్ ఆర్చరీ చాంపియన్షిప్ పోటీల్లో బంగారు పతకం సాధించింది. ఆదివారం కొరియా క్రీ డాకారిణి పార్క్ యరీన్తో జరిగిన ఫైనల్ పోరులో 142–136 పాయింట్ల తేడాతో ఓడించింది. హ హ రియాణాలోని సోనిపట్లో శిక్షణ పొందుతున్న చికి త .. ప్రస్తుతం పసిడి పతకం సాధించడంతో తల్లిదండ్రులు శ్రీనివాస్రావు, శ్రీలత ఆనందం వ్యక్తం చేశారు. -
నేడు ఓదెలకు మంత్రుల రాక
ఓదెల(పెద్దపల్లి): దేవాదాయ, ధర్మాదాయ శా ఖ మంత్రి కొండా సురేఖ, ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు, పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ సోమ వారం ఓదెల శ్రీమల్లికార్జునస్వామి సన్నిధికి చే రుకుంటారు. ఓదెల మల్లికార్జునస్వామి ఆల య చైర్మన్గా చీకట్ల మొండయ్యతోపాటు 11 మంది డైరెక్టర్లు పదవీప్రమాణ స్వీకారం చేయనుండగా.. ఈ కార్యక్రమానికి మంత్రులు హాజరవుతారు. ఈ సందర్భంగా ఆలయాన్ని ము స్తాబు చేశారు. ఆలయ అభివృద్ధి, భక్తుల విడి ది కోసం అదనపు గదులు, గుడి చుట్టూ సీసీ రోడ్డు నిర్మాణం, అవసరమైన స్థలం కొనుగో లు తదితర సమస్యలను మంత్రులకు విన్నవించేందుకు పాలకవర్గం సిద్ధమవుతోంది. ‘పోలీసుల తీరు సరికాదు’ పెద్దపల్లిరూరల్: కేంద్రంప్రభుత్వం అమలు చే స్తున్న ఆపరేషన్ కగార్కు వ్యతిరేకంగా వరంగల్లో చేపట్టిన ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక బహిరంగ సభకు పోలీసులు అ నుమతి నిరాకరించడం సరికాదని ప్రజాసంఘాల నాయకులు అన్నారు. సభకు వెళ్లకుండా ప్రజాసంఘాల నేతలను అరెస్టు చేయడం శోచనీయమన్నారు. ఈమేరకు ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు బొంకూరి లక్ష్మణ్, ఆదివాసీ హక్కుల పో రాట సంఘం కన్వీనర్ మల్లన్న తదితరులు స్థా నిక అమరవీరుల స్తూపం ఎదుట నిరసన తెలి పారు. ప్రజాప్రభుత్వమని చెబుతున్న కాంగ్రెస్ పాలకులు సమావేశాలు పెట్టుకునే స్వేచ్ఛ హ రించండం ఏమిటని నిలదీశారు. నాయకులు కుమారస్వామి, జ్యోతి, శుభాన్, దేవిసత్యం, జైపాల్సింగ్, బాలసాని రాజయ్య, పులిపాక రవీందర్, రత్నకుమార్, వినోద్, శంకర్ గుమ్మడి కొమురయ్య, గాండ్ల మల్లేశం, ఎరుకల రాజన్న తదితరులు పాల్గొన్నారు.బోనస్ కోసం ఆందోళన పాలకుర్తి(రామగుండం): బసంత్నగర్ అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీ మైన్స్ ఓబీ కాంట్రాక్ట్ సంస్థ జననీలో విధులు నిర్వర్తించే లారీడ్రైవర్లు ఆ దివారం కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. ఐదేళ్లుగా పనిచేస్తున్నా దీపావళి బో నస్ చెల్లించడం లేదన్నారు. కాంట్రాక్ట్ సంస్థ గడువు ముగియడంతో నాలుగు నెలలుగా పనుల్లేక, చేతిలో చిల్లిగవ్వలేక దుర్భర జీవితం అనుభవిస్తున్నామని ఆవేదన చెందారు. ఈమేరకు చేతిలో పురుగులమందు, పెట్రోలు సీసా లతో సంస్థ క్యాంపు ఆవరణలో బైఠాయించా రు. సమాచారం అందుకున్న కంపెనీ సెక్యూ రిటీ అధికారి రవీందర్రెడ్డి, గుర్తింపు కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి దాడి మహేశ్ సంఘటన స్థలానికి చేరుకుని డ్రైవర్లతో చర్చించా రు. కాంట్రాక్టు సంస్థతో చర్చించి 15రోజుల్లో గా డబ్బు చెల్లించేలా కృషి చేస్తామని ఇచ్చిన హామీ మేరకు ఆందోళన విరమించారు. వర్తక సంఘం కార్యవర్గం పెద్దపల్లిరూరల్: వెండి, బంగారు వర్తక సంఘం ప ట్టణ అధ్యక్షుడిగా రంగు శ్రీనివాస్ ఎన్నికయ్యారు. జిల్లా కేంద్రంలోని స్వర్ణకా ర సంఘ భవనంలో జరి గిన ఎన్నికల్లో 20 ఓట్ల మె జార్టీతో రంగు శ్రీనివాస్ తన ప్రత్యర్థి కట్ట సదానందంపై విజయం సాధించారు. రంగు శ్రీనివాస్కు 55ఓట్లు పోల్ కాగా, కట్ట సదానందంకు 35 ఓట్లు పోలయ్యాయని ఎన్నికల అధి కారులు ప్రకటించారు. సంఘం సభ్యుల సమస్యల పరిష్కారానికి సహకారం అందిస్తానని అధ్యక్షుడిగా ఎన్నికై న శ్రీనివాస్ పేర్కొన్నారు. సమస్యలపై ఉద్యమం గోదావరిఖని: కార్మికుల సమస్యలపై దశలవా రీ ఉద్యమానికి సిద్ధమయ్యామని టీబీజీకేఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసు రామమూర్తి అ న్నారు. స్థానిక యూనియన్ కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గుర్తింపు, ప్రాతినిధ్య కార్మిక సంఘాలు యాజమాన్యాని కి వత్తాసు పలుకుతున్నాయని విమర్శించారు. కార్మికుల సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్తో ఈనెల 28న బొగ్గు గనులపై నల్లబ్యాడ్జీలు ధరించి, 29న జీఎంలకు వినతిపత్రాలు సమర్పిస్తామని, వచ్చేనెల 2న కొత్తగూడెంలో ధర్నా చేస్తామని పేర్కొన్నారు. పర్లపల్లి రవి, వడ్డేపల్లి శంకర్, జావిద్ పాషా, సతీశ్ పాల్గొన్నారు. -
ఎన్టీపీసీ ఉద్యోగులకు అండగా ఐఎన్టీయూసీ
జ్యోతినగర్(రామగుండం): ఎన్టీపీసీ ఉద్యోగులకు ఐఎన్టీయూసీ అండగా ఉంటుందని ఎన్బీసీ సభ్యు డు, యూనియన్ జాతీయ సీరియర్ కార్యదర్శి బా బర్ సలీంపాషా అన్నారు. పీటీఎస్లో 8వ ఆల్ ఇండియా ఎన్టీపీసీ వర్కర్స్ ఫెడరేషన్ వర్కింగ్ కమిటీ ముగింపు సమావేశం ఆదివారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ, ఎన్టీపీసీ ఉద్యోగుల అభ్యున్నతికి ఐఎన్టీయూసీ కృషి చేస్తుందన్నారు. అనంతరం పలు తీర్మానాలు చేశారు. ఉద్యోగ గుర్తింపు సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ వేముల కృష్ణయ్య, ఆ రెపల్లి రాజేశ్వర్, చంద్రవంశీ తదితరులు ఉన్నారు. -
కష్టాలను తెలుసుకునేందుకే జనహిత యాత్ర
సాక్షి ప్రతినిధి, కరీంనగర్/గంగాధర: ప్రభుత్వ పథకాల అమలు తీరును తెలుసుకునేందుకు, ప్రజల క ష్టసుఖాల్లో పాలుపంచుకునేందుకు జనహిత పాదయాత్ర చేపట్టామని టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్ అన్నారు. ఆదివారం చొప్పదండి నియోజకవర్గంలో చేపట్టిన జనహితయాత్రలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్తో కలిసి పాల్గొన్నారు. గంగాధర మండలం ఉప్పర మల్యాల నుంచి గంగాధర మధురానగర్ చౌరస్తా వరకు పా దయాత్ర సాగింది. మధురానగర్ చౌరస్తాలో మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్, అడ్లూరి లక్ష్మణ్కుమార్, విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు మేడిపల్లి స త్యం, రాజ్ఠాకూర్, మాజీ ఎంపీ వీహెచ్, మాజీ ఎ మ్మెల్సీ జీవన్రెడ్డి తదితరులతో కలిసి మహేశ్కుమా ర్గౌడ్ ప్రసంగించారు. బీజేపీ, బీఆర్ఎస్లపై దు మ్మెత్తి పోశారు. వచ్చే ఎన్నికల్లో గెలిచి ఇదే గంగాధరలో విజయోత్సవాలు చేసుకుందామన్నారు. రోల్మోడల్గా చొప్పదండి: ఎమ్మెల్యే సత్యం సీఎం రేవంత్రెడ్డి, మంత్రుల సహకారంతో చొప్పదండ నియోజకవర్గాన్ని రోల్ మోడల్గా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధి శూన్యమన్నారు. పదేళ్ల పాలనలో ఒక్క ఇళ్లు ఇవ్వలేదని, కాంగ్రెస్ అ ధికారంలోకి రాగానే ప్రతీగ్రామానికి ఇందిరమ్మ ఇ ళ్లు ఇచ్చిందన్నారు. చురుగ్గా నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు. తొమ్మిది రోజుల్లో రూ.9వేలకోట్ల రైతుభరోసా విడుదల చేశామన్నారు. రూ.21వేల కోట్ల రుణమాఫీ చేశామని, 60వేల ఉద్యోగాలు, అ ర్హులందరికీ రేషన్కార్డులు, కార్డులున్న వారికి సన్న బియ్యం ఇస్తున్న ఘనత కాంగ్రెస్దేనన్నారు. బీఆర్ఎస్ హయాంలో నియోజకవర్గంలో అదనంగా చు క్కనీరు ఇవ్వలేదన్నారు. ఎవరు అడ్డుపడినా అభివృద్ధి ఆగదన్నారు. నారాయణపూర్ రిజర్వాయర్ కట్ట ఎత్తు పెంచి, నిర్వాసితులకు పరిహారంతో పాటు వ్యవసాయానికి నీరు అందిస్తామన్నారు. త్వరలోనే గంగాధరలో డిగ్రీ కళాశాల మంజూరు చేస్తానన్నారు. కొండగట్టు అభివృద్ధికి నిధులు మంజూరు చేయిస్తానన్నారు. ఇప్పటికే ఇంటిగ్రేటెడ్ పాఠశాల మంజూరు అయిందని తెలిపారు. ఇందిరమ్మ ఇల్లు ప్రారంభం మండలంలోని కురిక్యాలలో ఇందిరమ్మ ఇల్లు పథకంలో బాలగోని భాగ్య– గంగయ్య దంపతులు నిర్మించుకున్న ఇంటిని పాదయాత్రలో భాగంగా మీనాక్షి నటరాజన్తో పాటు మంత్రులు గృహ ప్రవేశం చేశారు. సొంత ఇల్లు కట్టుకున్నందుకు సంతోషంగా ఉందని, పదేళ్లుగా రేషన్ కార్డు రాలేదని, కాంగ్రెస్ వచ్చాక రేషన్ కార్డు వచ్చిందని భాగ్య దంపతులు భావోద్వేగంతో కంటితడి పెట్టారు. -
నిత్యాన్నదాన సత్రానికి అడుగులు
● నేడు పనుల ప్రారంభోత్సవం ● హాజరు కానున్న మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు ● రాజన్న భక్తుల కోసం రూ.40 కోట్లతో ఏర్పాటు సాక్షిప్రతినిధి,కరీంనగర్: రాజన్న ఆలయ సమీపంలో ప్రభుత్వం తలపెట్టిన విస్తరణ, అభివృద్ధి పనులు ఊపందుకుంటున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) తరహాలో వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం సమీపంలో నిర్మించనున్న నిత్యాన్నదాన సత్రం పనులు ఆదివారం ప్రారంభం కానున్నాయి. మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్బాబు, అడ్లూరి లక్ష్మణ్కుమార్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పనులను ప్రారంభించనున్నారు. గంగాధరలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ ‘జనహిత’ పాదయాత్రకు ముందే మంత్రులు వేములవాడలో నిత్యాన్నదానం పనులను ప్రారంభించి, ఇతర అభివృద్ధి పనులను పరిశీలిస్తారని అధికారులు తెలిపారు. దాదాపు రూ.40కోట్ల బడ్జెట్తో రూపొందించిన ప్లాన్, డిజైన్లను ఇప్పటికే వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ (వీటీడీఏ) ఖరారు చేసింది. ఈ పనులతోపాటు వేములవాడలో పలు రోడ్ల విస్తరణ పనులు ఆదివారం నుంచి పునఃప్రారంభం కానుండగా, తిప్పాపూర్ వద్ద అదనపు పనులు కూడా వేగం పంజుకోనున్నాయి. మాస్టర్ ప్లాన్ ప్రకారం రెండెకరాల సువిశాల స్థలంలో దాదాపు రూ.40 కోట్లతో పనులు చేపట్టనున్నారు. మొత్తం రెండంతస్తుల్లో నిర్మించనున్న ఈ భవనంలో తొలి అంతస్తులో ఒకేసారి 1,500 మంది భక్తులు భోజనం చేసేలా సదుపాయాలు కల్పిస్తున్నారు. రోజుకు 15,000 మంది భోజనం చేసేలా ఏర్పాట్లు చేయనున్నారు. భవిష్యత్తులో భక్తుల రద్దీ పెరిగితే అందుకు అనుగుణంగా రెండో అంతస్తును కూడా వినియోగంలోకి తీసుకువస్తారు. అప్పుడు రోజుకు 30వేల మంది భక్తులు భోజనం చేసే వీలుంటుందని అధికారులు తెలిపారు. కిలోమీటరు వరకు విస్తరణ షురూ.. వేములవాడలోని తిప్పాపూర్ వంతెన నుంచి రాజరాజేశ్వర స్వామి దేవాలయం వద్దకు దాదాపు 1.1 కిమీ దూరం వరకు తలపెట్టిన రోడ్డు విస్తరణ పనులు పునః ప్రారంభం కానున్నాయి. గతంలో పలు న్యాయ వివాదాలు ఎదురైనప్పటికీ.. వాటిని విజయవంతంగా ఎదుర్కొన్న కలెక్టర్ సందీప్కుమార్ ఝా.. విస్తరణ పనులకు ఎలాంటి అవాంతరాలు లేకుండా మాస్టర్ప్లాన్లో రాజీపడకుండా.. రోడ్డు విస్తరణ పనులను తిరిగి ప్రారంభించనున్నారు. తిప్పాపూర్ వద్ద రూ.15 కోట్లతో అదనపు వంతెన పనులు కూడా ప్రారంభమయ్యాయి. ఇప్పటికే టెండర్లు పూర్తయిన ఈ పనులను కాంట్రాక్టర్ ఇప్పటికే ప్రారంభించారు. ప్రస్తుతం మట్టి తవ్వకాలు నడుస్తున్నాయి. గతేడాది నవంబరులోనే వేములవాడ ఆలయానికి సంబంధించి పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. -
గతం కన్నా ఘనంగా గణపతి ఉత్సవాలు
కోల్సిటీ(రామగుండం): గణేశ్ ఉత్సవాలు గతంకన్నా అత్యంత వైభవంగా జరుపుకుందామని, ఇందుకోసం వివిధ విభాగాల సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నామని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్ తెలిపారు. గణేశ్ ఉత్సవ ఏర్పాట్లపై బల్దియా కమిషనర్ అరుణశ్రీ అధ్యక్షతన శనివారం బల్దియాలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సీఎల్, ఎన్పీడీసీఎల్, ఎల్, పోలీస్, అగ్నిమాపక తదితర విభాగాలు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలన్నారు. విద్యుత్, అగ్ని ప్రమాదాలు చోటుచేసుకోకుండా మండప నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఉత్సవ కమిటీ సూచనల ప్రకారం ఒకేరోజు.. సెప్టెంబర్ 5న గణపతి విగ్రహాల నిమజ్జనం కోసం ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. పర్యావరణహిత మట్టి గణేశుని విగ్రహాలనే ప్రతిష్ఠించాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా మట్టివినాయక విగ్రహాలు పంపిణీ చేశారు. అధికారులు రమేశ్, గంగాధర్, వెంకటయ్య, వరప్రసాద్, వీరారెడ్డి, వెంకటస్వామి, రామన్, నాయకులు మహంకాళి స్వామి, ముస్తాఫా తదితరులు పాల్గొన్నారు. అనంతరం మూడు ఫాగింగ్ యంత్రాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. -
కేంద్రం నిర్లక్ష్యంతోనే యూరియా కొరత
● ఆర్ఎఫ్సీఎల్లో ఉత్పత్తి నిలిచిపోయినా ఎందుకు స్పందించడం లేదు?● పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు సుల్తానాబాద్(పెద్దపల్లి): కేంద్ర ప్రభుత్వ వైఫల్యంతోనే యూరియా కొరత ఏర్పడుతోందని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నా రు. స్థానిక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరుల స మావేశంలో మాట్లాడారు. సాంకేతిక లోపంతో ఆర్ఎఫ్సీఎల్లో సుమారు 90 రోజులుగా యూరియా ఉత్పత్తి కావడం లేదని, సాంకేతిక నిపుణులతో సరిచేయాల్సిన కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవ హరించడంతోనే సమస్య ఎదురవుతోందన్నారు. కేంద్రమంత్రులు బండి సంజయ్ కుమార్, కిషన్రెడ్డి అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారని విమర్శించారు. జిల్లాలో శనివారం వరకు 2.50 లక్ష ల ఎకరాల్లో వరి సాగు చేశారని, ఇందుకోసం 21, 581 మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని, ఇ ప్పటివరకు 19 వేల మెట్రిక్ టన్నులే సరఫరా చేశా రని అన్నారు. కలెక్టర్ కోయ శ్రీహర్ష చొరవతో కొర త తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని ఆయ న అన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు రైతులపై చిత్తశుద్ధి ఉంటే కేంద్రమంత్రి నడ్డా వద్దకు వెళ్లి యూరియా కేటాయించేలా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు అంతటి అన్నయ్యగౌడ్, మినుపాల ప్రకాశ్రావు, శ్రీగిరి శ్రీనివాస్, సాయిరి మహేందర్, కల్లేపల్లి జానీ, దామోదర్రావు, అబ్బయ్యగౌడ్, చిలుక సతీశ్, గాజుల రాజమల్లు, పన్నాల రాములు, అమిరిశెట్టి రాజలింగం, తిరుపతి, ముస్త్యాల రవీందర్, విజయభాస్కర్రెడ్డి, రఫిక్, రాజన్న, గోపాల్, రవీందర్, రాజన్న తదితరులు పాల్గొన్నారు. -
పండుగలు మతసామరస్యానికి ప్రతీకలు
● సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలకు స్పందించవద్దు ● రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా గోదావరిఖని: పండుగలు, వేడుకలు ప్రశాంత వాతావరణంలో జరుపుకుంటూ మత సామరస్యానికి ప్రతీకలుగా నిలవాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా ఆకాంక్షించారు. ఈ నేపథ్యంలోనే గణపతి నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలన్నారు. పోలీస్ కమిషనరేట్లో శనివారం పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లోని మత పెద్దలతో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. సీపీ మాట్లాడుతూ, గతేడాది 4,786 వినాయక విగ్రహాలు ఏర్పాటు చేశారని, ఈసారి ఆ సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు. మండప నిర్వాహకులు తమ వివరాలతో పోలీస్స్టేషన్లో సంప్రదించి అనుమతి తీసుకోవాలని సూచించారు. దీనిఆధారంగా ఆన్లైన్, జియోట్యాగింగ్ చేస్తామని అన్నారు. నిమజ్జనం సందర్భంగా అవాంతరాలు ఎదురవకుండా రూట్మ్యాప్ ఏర్పాటును పర్యవేక్షిస్తామని తెలిపారు. గణపతి మండపాల కమిటీ అధ్యక్షుడు ధృవీకరణపత్రాన్ని సమర్పించాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. లక్కీడ్రాలు ఏర్పాటు చేయొద్దని, జూదం ఆడరాదని, బలవంతపు చందాలు వసూలు చేయొద్దని అన్నారు. సోషల్ మీడియాలో వైరల్ అయ్యే అసత్య ప్రచారాలు, పుకార్లు నమ్మవద్దన్నారు. తప్పుడు పోస్టులు పెట్టేవారిపై కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. గణేశ్ నిమజ్జనంతోపాటు, మిలాద్ ఉన్ నబి వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలని సీపీ సూచించారు. మంచిర్యాల, పెద్దపల్లి డీసీపీలు భాస్కర్, కరుణాకర్, ఏసీపీలు మల్లారెడ్డి, రమేశ్, ప్రకాశ్, వెంకటేశ్వర్లు, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. -
మట్టి గణపతి
ఆదివారం శ్రీ 24 శ్రీ ఆగస్టు శ్రీ 2025మట్టి గణపతిని తయారు చేస్తున్న రమేశ్ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలు పర్యావరణ హితమైన మట్టి ప్రతిమల ప్రతిష్ఠకే మొగ్గు చూపుతున్నారు. చిన్నచిన్న విగ్రహాలు మొదలు.. భారీ విగ్రహాల వరకు మట్టి గణపతులనే పూజిస్తామంటున్నారు. నాటి పద్ధతులను ఇప్పటికీ పాటిస్తూ పాతతరంవారికి ఆదర్శంగా నిలుస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి నవరాత్రులు నిర్వహిస్తుండగా.. మరికొన్ని ప్రాంతాల్లో ఊరంతా కలిసి ఒకే మండపం ఏర్పాటు చేస్తూ ఐకమత్యాన్ని చాటి చెబుతున్నారు. పర్యావరణ పరిరక్షణకు కొందరు స్వచ్ఛందంగా మట్టి ప్రతిమలను తయారు చేస్తూ.. వారు ప్రతిష్ఠించడంతో పాటు ఇంటింటా పంపిణీ చేస్తున్నారు. విగ్రహాల తయారీకి కరీంనగర్, కోరుట్ల కేరాఫ్గా మారాయి. ఇక్కడ గంగమట్టితో తయారు చేసిన ప్రతిమలను వివిధ ప్రాంతాలకు చెందిన వారు కొనుగోలు చేస్తున్నారు. జిల్లాలోని ఒక్కో ప్రాంత మండపానికి ఒక్కో ప్రత్యేకత ఉండగా.. ఈ నెల 27వ తేదీన వినాయక చవితి సందర్భంగా ప్రత్యేక కథనాలు.. – మరిన్ని కథనాలు 8లోu -
స్వాతంత్య్ర ఉద్యమ స్ఫూర్తితో..
సిరిసిల్లటౌన్: సిరిసిల్లలో అత్యధికశాతం ఉండే పద్మశాలి సామాజికవర్గం వారే తొలిసారిగా గణపతి ఉత్సవాలను నిర్వహించారు. స్థానిక గాంధీచౌక్లో అప్పటి పుర ప్రముఖులు రుద్ర శంకరయ్య, మడూరి అంబాజి, భీమనాఽథిని నారాయణ, కుడిక్యాల రాజారాం, ఎలగొండ నారాయణ సమాజ సేవా సంఘాన్ని ఏర్పాటు చేసి మొదటి గణపతిని ప్రతిష్ఠించారు. 1947 నుంచి ఇక్కడ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం స్థానిక మార్కండేయ భవనంలో 79వ వినాయక చవితి ఉత్సవాలు జరిపేందుకు సిద్ధమయ్యారు. అధ్యక్షుడిగా గోలి వెంకటరమణ కొనసాగుతున్నారు. సిరిసిల్ల వర్తక సంఘం ఆధ్వర్యంలో 1948 నుంచి వినాయక నవరాత్రులు నిర్వహిస్తున్నారు. తొలితరంలో గాండ్ల వీరయ్య నేతృత్వంలో సంఘాన్ని స్థాపించారు. ఈ ఏడాదితో 78వ వార్షికోత్సవం జరుపుతున్న వర్తక సంఘానికి ప్రస్తుతం పుల్లూరి వేణు అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. -
చట్టాలపై అవగాహన పెంచుకోవాలి
● జిల్లా జడ్జి, లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి స్వప్నరాణి సుల్తానాబాద్(పెద్దపల్లి): ప్రతీవిద్యార్థి చట్టాలపై అవగాహన పెంచుకోవాలని జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి, జిల్లా జడ్జి స్వప్నరాణి సూచించారు. పట్టణంలోని అల్ఫోర్స్ పాఠశాలలో శనివారం చట్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. జడ్జి మాట్లాడుతూ, ఉన్నత న్యాయస్థానాలు అందరికీ న్యాయం జరగాలన్న ఉద్దేశంతో అన్నికోర్టుల్లో లీగల్ సర్వీసెస్ అథారిటీలు ఏర్పాటు చేశాయన్నారు. వాటి ద్వారా న్యాయవిజ్ఞాన సదస్సులు నిర్వహిస్తూ చట్టాలపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. అన్యాయం జరిగిన వెంటనే లీగల్ సర్వీసెస్ అథారిటీని సంప్రదిస్తే ఉచితంగా న్యాయం అందిస్తారని తెలిపారు. కొందరి స్వార్థం కోసం యువతను చెడుమార్గాల్లో నడిపిస్తున్నారని, విద్యార్థులు, యువత వాటికి దూరంగా ఉండాలని సూచించారు. మైనర్లు వాహనాలు నడపరాదని అన్నారు. వాహనాల చట్టం, సోషల్ మీడియా, సైబర్ క్రైమ్ తదితర చట్టాలపై న్యాయవాదులు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో న్యాయవాదులు టి.నరేశ్ పటేల్, ఆర్.ఝాన్సీ, శరత్తోపాటు ప్రిన్సి పాల్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
రామగిరి(మంథని): పంచాయతీ కార్యదర్శులు విధి నిర్వహణలో పొరపాట్లు చోటుచేసుకోకుండా చూసుకోవాలని డీపీవో వీరబుచ్చయ్య సూచించా రు. పన్నూర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో శనివారం ఆయన కార్యదర్శులతో వివిధ అంశాలపై సమీక్షించారు. పారిశుధ్య పనులు సమర్థవంతంగా నిర్వహించాలని, చెత్తను సెగ్రిగేషన్కు తరలించి కంపోస్ట్ ఎరువు తయారుచేయాలన్నారు. తాగునీటి పైపులైన్ లీకేజీలకు వెంటనే మరమ్మతు చేయాలని, వృత్తి, వ్యాపార లైసెన్స్లు, ఇంటి నిర్మాణ అనుమతులు సకాలంలో మంజూరు చేయాలని ఆయన పేర్కొన్నారు. ఓటరు జాబితా పరిశీలించాలని అన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో శైలజారాణి, ఎంపీవో ఉమేశ్, ఈ పంచాయతీ ఆపరేటర్లు వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. -
విక్రయాలకు కేరాఫ్
కొత్తపల్లి(కరీంనగర్): కరీంనగర్, రేకుర్తి, కొత్తపల్లి, చింతకుంట పరిసర ప్రాంతాల్లో తయారవుతున్న వినాయక విగ్రహాలు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా తరలుతున్నాయి. ఆయా ప్రాంతాల్లో సుమారు 40 దుకాణాల్లో గణేశుని విగ్రహాలను తయారు చేస్తున్నారు. సుమారు 300 మంది ప్రత్యక్షంగా, మరో 300 మంది పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. రాజస్థాన్కు చెందిన కార్మికులు విగ్రహాల తయారీలో నిష్ణాతులు కాగా.. స్థానిక కార్మికులు కలరింగ్, అద్దకం పనుల్లో పాల్పంచుకుంటున్నారు. సుమారు రూ.20 వేల నుంచి రూ.లక్ష విలువ చేసే విగ్రహాలు అందుబాటులో ఉన్నాయి. బడ్జెట్ను బట్టి ప్రతిమలను కొనుగోలు చేస్తున్నారు. మరికొంతమంది నచ్చిన ప్రతిమలకు అడ్వాన్స్ రూపంలో చెల్లిస్తూ రిజర్వ్ చేసుకుంటున్నారు. మట్టి వినాయకులపై అవగాహన పెరగడంతో ప్లాస్టర్ ఆఫ్ పారిస్ ప్రతిమలకు గిరాకీ తగ్గిందని చెబుతున్నారు. -
రీయింబర్స్మెంట్ విడుదల చేయాలి
● ఎస్ఎఫ్ఐ నిరసన దీక్ష పెద్దపల్లిరూరల్: విద్యార్థులకు ఫీజురీయింబర్స్మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ బాలికల విభాగం రాష్ట్ర కన్వీనర్ పూజ డిమాండ్ చేశారు. ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సందీప్, ప్రశాంత్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో శనివారం చేపట్టిన నిరసనదీక్షలో నాయకులు కుమారస్వామి, జ్యోతి, అశోక్, రవీందర్, సాయిరాం ఆజాద్ తదితరులతో కలిసి ఆమె మాట్లాడారు. ఉన్నత చదువులకు వెళ్లే విద్యార్థులను కళాశాల యాజమాన్యాలు వేధింపులకు గురిచేయకుండా ఆదేశాలివ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పాలనలో విద్యాశాఖకు మంత్రిని నియమించకపోవడం శోచనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాజ్కుమార్, అరవింద్, ఆదిత్య, రాజశేఖర్, ఐశ్వర్య, అక్షయ, శిరీష, అక్షిత, సాత్విక తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉద్యోగాలు పెద్దపల్లిరూరల్: జిల్లా ప్రభుత్వ ఆస్పత్రితోపాటు మంథని, సుల్తానాబాద్ ఆస్పత్రుల్లో వైద్యుల పోస్టుల భర్తీకి ఈనెల 29న ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు ఆస్పత్రుల సూపరింటెండెంట్ శ్రీధర్ తెలిపారు. పెద్దపల్లిలో గైనకాలజిస్ట్, ఆర్థోపెడిక్, మంథనిలో గైనకాలజిస్ట్, సుల్తానాబాద్లో పిడియాట్రిక్ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. వీటిని కాంట్రాక్టు పద్ధతిన భర్తీ చేస్తామన్నారు. ఆసక్తి గలవారు బయోడేటాతో హాజరు కావాలని కోరారు. వివరాలకు 84990 61999, 94914 81481 నంబర్లలో సంప్రదించాలని ఆయన సూచించారు. -
ఆధునిక విద్యకు అడుగులు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఆధునిక బోధనలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల (సమీ కృత గురుకులాలు) నిర్మాణానికి అడుగులు వేస్తోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇప్పటి వరకు రెండు స్కూళ్లకు శంకుస్థాపన జరగగా, మరో రెండు స్కూళ్లకు టెండర్లు పూర్తయ్యాయి. గతేడాది నవంబ రులో మంథని, హుస్నాబాద్ నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల(సమీకృత గురుకులాలు)లకు మంత్రులు శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్ శంకుస్థాపనలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా పెద్దపల్లి జిల్లాలోనే రెండు సమీకృత పాఠశాలల నిర్మాణానికి టెండర్లు పూర్తవడం గమనార్హం. ప్రతీ పాఠశాలను అత్యాధునిక సదుపాయాలతో, పర్యావరణహితంగా సౌరవిద్యుత్తుతో నిర్వహించేలా నిర్మించాలనే ఆలోచనలో ప్రభుత్వం ముందుకెళ్తుండడం విశేషం. ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తి చేసుకున్న నాలుగు పాఠశాలలను 2026 దసరా నాటికి పాఠశాలను ప్రారంభించాలని కోరుతున్నారు. పెద్దపల్లి జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో.. వాస్తవానికి 4 తరగతి నుంచి 12 తరగతి వరకు చదివే విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యనందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 55 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ స్కూళ్లను ప్రభుత్వం నిర్మించనుంది. ఈ మేరకు రూ.1,100 కోట్లకుపైగా నిధులు విడుదల చేసింది. తొలిదశలో ఒక్కో గురుకులానికి రూ.145 కోట్ల చొప్పున వెచ్చించి సదుపాయాలు కల్పించనున్నారు. ఇప్పటికే మంథని, హుస్నాబాద్ టెండర్లు పూర్తవగా.. తాజాగా పెద్దపల్లి, రామగుండంలోనూ టెండర్లు అయ్యాయి. రామగుండం నుంచి అంతర్గాంకు వెళ్లే దారిలో సోషల్ వెల్ఫేర్ పాఠశా ల సమీపంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కోసం ప్రభుత్వం 27 ఎకరాల భూమి కేటాయించింది. పెద్దపల్లి నియోజవర్గంలో ఎలిగేడు మండలం ర్యాకల్దేవ్పల్లి గ్రామం వద్ద 25 ఎకరాల భూమిని కేటాయించారు. హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలోనూ మంత్రి పొన్నం ప్రభాకర్ గతేడాది నవంబరులోనే శంకుస్థాపన చేశారు. మంథని మండలం అడవిసోమన్పల్లి వద్ద 25 ఎకరాలల్లో సమీకృత పాఠశాలకు మంత్రి శ్రీధర్బాబు శంకుస్థాపన చేశారు. ఒక్కో పాఠశాలకు రూ.150కోట్ల చొప్పున ప్రభుత్వం విడుదల చేయనుంది. టెండర్లు ఖరారవగానే.. తొలివిడతగా రూ.30 కోట్ల చొప్పున పనుల కోసం విడుదల చేస్తామని అధికారులు తెలిపారు. ప్రత్యేకతలు ఇవే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ విద్యాలయాలను 25 ఎకరాల్లో నిర్మిస్తారు. 4 నుంచి 12వ తరగతి వరకు అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యా బోధన అందిస్తారు. తరగతి గదులలో డిజిటల్ స్మార్ట్బోర్డ్, కంప్యూటర్ ల్యాబ్, లైబ్రరీ, క్రికెట్, ఫుట్బాల్, బాస్కెట్ బాల్, టెన్నిస్ క్రీడల కోసం మైదానం ఏర్పాటు చేస్తారు. వచ్చే దసరా నాటికి ఇంటిగ్రేటెడ్ విద్యాసంస్థల నిర్మాణం పూర్తి చే యాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రతీ స్కూల్లో 2,500 మందికి పైగా విద్యార్థులు, వీరికి 120 మంది టీచర్లతో బోధించనున్నారు. భవనా లు, సదుపాయాలకు రూ.250 కోట్ల నుంచి రూ.300 కోట్లు వెచ్చిస్తారు. సొంత సోలార్ విద్యుత్తుతో లిప్టులు, వీధిదీపాలు, క్లాస్రూమ్ ఉపకరణాల నిర్వహణ ఉంటుంది. బీసీ, ఎస్టీ, ఎస్టీ విద్యార్థులకు అడ్మిషన్లు కల్పిస్తారు. -
విద్యాబోధనపై దృష్టి
● కలెక్టర్ కోయ శ్రీహర్షపెద్దపల్లి రూరల్: విద్యా బోధనపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఉపాధ్యాయులకు సూచించారు. కలెక్టరేట్లో శుక్రవారం విద్యాశాఖపై సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ ప్రాథమిక పాఠశాలల్లో కనీస విద్యా ప్రమాణాలు పెంపు లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. అయినా ఆశించిన స్థాయిలో ఫలితాలు రావడంలేదని తెలిపారు. జిల్లా విద్యాఽ శాఖాధికారి మాధవి, అధికారులు పాల్గొన్నారు. సమస్యలు పరిష్కరించాలి జూలపల్లి(పెద్దపల్లి): భూభారతి నిబంధనల ప్రకారం భూసమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ శ్రీహర్ష సూచించారు. అదనపు కలెక్టర్ వేణుతో కలిసి ఆయన రెవెన్యూ సమస్యలపై సమీక్షించారు. కార్యక్రమంలో ఆర్డీవోలు గంగయ్య, సురేశ్, ఏడీ సర్వే ల్యాండ్ రికార్ుడ్స శ్రీనివాస్, అధికారులు తదితరులు పాల్గొన్నారు. దరఖాస్తుల ఆహ్వానం పెద్దపల్లి రూరల్: అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం కింద ఉన్నత చదువుల కోసం ఆర్థికసాయం అవసరమైన వారు ఈనెల 31లోగా దరఖస్తు చేసుకోవాలని జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి వినోద్కుమార్ సూచించారు. అమెరికా, జర్మనీ, న్యూజీలాండ్, జపాన్, సింగపూర్, సౌత్కొరియా తదితర దేశాల్లో పీజీ చదివేందుకు ప్రభుత్వం సాయం చే స్తుందన్నారు. ఆసక్తి, అర్హత గలవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. -
తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం వివక్ష
ధర్మారం(ధర్మపురి): అవసరం మేరకు యూరి యా కేటాయించకుండా కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై వివక్షత చూపుతోందని మంత్రి లక్ష్మణ్కుమార్ ఆరోపించారు. స్థానిక ప్రాథమిక పాఠశాల ఆవరణలో అంగన్వాడీ భవనం, కేజీబీవీలో డా ర్మెటరీ గదుల నిర్మాణానికి మంత్రి శుక్రవారం భూమిపూజ చేశారు. ప్రాథమిక పాఠశాల విద్యార్థులు భోజనం పరిశీలించారు. దొడ్దు బియ్యంతో కూడిన అన్నం పెట్టడడంతో సివిల్ సప్లయ్ అ ధికారికి ఫోన్చేసి ఆగ్రహం వ్యక్తంచేశారు. సన్నబియ్యంతో కూడిన భోజనం వడ్డించాలని, ఇందుకోసం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేయాలని మంత్రి సూచించారు. కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్ రైతుల సమస్యలు పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు. కాగా, పత్తిపాక సింగిల్విండో చైర్మన్ నో ముల వెంకటరెడ్డి మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ సమక్షంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చే రారు. నాయకులు రూప్లానాయక్, అరిగే లింగయ్య, యశోద అజయ్, గాగిరెడ్డి తి రుపతిరెడ్డి, సోగాల తిరుపతి, కొత్త నర్సింహు లు, కాడే సూ ర్యనారాయణ, పాలకుర్తి రాజేశంగౌడ్, కొడారి అంజన్న, అధికారులు ప్రవీణ్కుమార్, ఉదయ్కుమార్, ప్రభాకర్, వరలక్ష్మి పాల్గొన్నారు. -
గ్రామాల సమగ్రాభివృద్ధే కాంగ్రెస్ ధ్యేయం
రామగుండం: నియోజకవర్గ సమగ్రాభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే మక్కాన్సింగ్ఠాకూర్ అన్నారు. అంతర్గాం మండలంలోని టీటీఎస్ అంతర్గాం, ముర్మూర్, గోలివాడలో ఆయన వివిధ అభివృద్ధి పనులు ప్రారంభించి మాట్లాడారు. పాడి పరిశ్రమాభివృద్ధి చైర్మన్ గుత్తా అమిత్రెడ్డి, తహసీల్దార్ రవీందర్పటేల్, ఎంపీడీవో వేణుమాధవ్, సీడీపీవో అలేఖ్య, డీఆర్డీఏ పీడీ శ్రీనివాస్ తతదితరులు ఉన్నారు. మున్సిపల్ ఉద్యోగికి నివాళి పోస్టాఫీస్ వీధిలో నివాసం ఉండే ఎమ్మెల్యే గురు వు మాదేశి నారాయణ కుమారుడు, మున్సిపల్ ఉద్యోగి శ్రీనివాస్ ప్రథమ వర్ధంతికి ఎమ్మెల్యే ఠాకూర్ హాజరై నివాళి అర్పించారు. మృతుడి సతీమణితోపాటు సోదరులు శివ, హనుమాన్, వరప్రసాద్ను ఎమ్మెల్యే పరామర్శించారు. -
ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ స్కానింగ్ సేవలు
సుల్తానాబాద్(పెద్దపల్లి): జిల్లాలోని పెద్దపల్లి, సు ల్తానాబాద్, మంథని ప్రభుత్వ ఆస్పత్రుల్లో నాణ్యమైన స్కానింగ్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. గర్భం దాల్చిన సమయం నుంచే గర్భిణులకు స్కానింగ్ సేవలు అందించేలా కలెక్టర్ కోయ శ్రీహర్ష చొరవతో జిల్లాకేంద్రంలో టీఫా, పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథనిలో స్కానింగ్ యంత్రాలు అందుబాటులోకి తెచ్చారు. ఇందుకోసం సుమారు రూ.20 లక్షల వరకు వెచ్చించారని అధికారులు చెబుతున్నారు. నిత్యం గ్రామాల నుంచి 108 వాహనాల ద్వారా వారిని ఆస్పత్రులకు తరలించి సేవలు అందిస్తున్నారు. రోజూ సుమారు 100 మందికిపైగా స్కానింగ్ చేస్తున్నట్లు సీహెచ్ శ్రీధర్ తెలిపారు. జి ల్లాలో దాదాపు 3,465 మంది గర్భిణులు ఉన్నారని అంచనా వేశారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఒక్కోసారి స్కానింగ్ చేస్తే.. సగటున రూ.వెయ్యి చొప్పున మొత్తంగా డెలివరీ అయ్యే వరకూ సుమారు రూ.6వేల వరకు వెచ్చించాల్సి వస్తోంది. అదేవిధంగా గర్భం దాల్చిన తర్వాత ఒక్కో గర్భిణికి టిఫా స్కానింగ్ చేయాల్సి వస్తోంది. ఇలా మొత్తం గర్భిణులు రూ.2కోట్ల వరకు ప్రైవేట్ స్కానింగ్ సెంటర్లకు చెల్లించాల్సి వచ్చేదని, కానీ, ఇంతటి విలువైన సేవలు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ఉన్నాయని వైద్యాధికారులు వివరిస్తున్నారు. మంథని, పెద్దపల్లి, సుల్తానాబాద్ ఆస్పత్రులతోపాటు 8 అర్బన్ ప్రాథమిక, 16 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోంచి ఆయా ఆస్పత్రులకు గర్భిణులను తరలిస్తున్నారు. వీరికి అవసరమైన సమయాల్లో స్కానింగ్ సేవలు ఉచితంగానే అందిస్తున్నారు. -
అన్నివర్గాల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యం
పెద్దపల్లిరూరల్: సీఎం రేవంత్రెడ్డి సారథ్యంలో ని కాంగ్రెస్ ప్రభుత్వం అన్నివర్గాల అభ్యున్నతే ధ్యేయంగా పనిచేస్తోందని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. రాగినేడు, బ్రాహ్మణపల్లిలో శు క్రవారం వివిధ అభివృద్ధి పనులు ప్రారంభించా రు. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్కు అండగా నిలవాలని కోరారు. డీఆర్డీవో కాళిందిని, ఎంపీడీవో శ్రీనివాస్, నాయకులు ఆరె సంతోష్, మల్లయ్య, గుమ్మడి విజయ్, పరమేశ్వర్ ఉన్నారు. రూ.15కోట్లతో అభివృద్ధి పనులు సుల్తానాబాద్/ఎలిగేడు/జూలపల్లి(పెద్దపల్లి): పట్టణంలో రూ.15 కో ట్లతో చేపట్టిన అభివృద్ధి ప నులు దశలవారీగా కొనసాగుతున్నాయని ఎమ్మె ల్యే విజయరమణారావు అన్నారు. సుల్తానాబా ద్, జూలపల్లి, ఎలిగేడులో వివిధ అభివృద్ధి పను లతోపాటు మోడల్ ఇందిరమ్మ ఇళ్లు ప్రారంభించి మాట్లాడారు. హౌసింగ్ పీడీ రాజేశ్వర్రావు, ఎంపీడీవో దివ్యదర్శన్రావు, ఎంపీడీవో పద్మజ, డీపీ ఎం రమణ, విజయభాస్కర్రెడ్డి, యాకన్న, భా స్కర్రావు, కిరణ్, గీత, సదానందం ఉన్నారు. -
తరచూ నేరాలు చేస్తే ‘గ్యాంగ్ ఫైల్స్’ ఓపెన్
గోదావరిఖని: తరచూ నేరాలు చేస్తే గ్యాంగ్ ఫై ల్స్ ఓపెన్ చేయాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా ఆదేశించారు. పోలీస్ క మిషనరేట్లో శుక్రవారం పెద్దపల్లి, మంచిర్యాల జోన్ పోలీస్ అధికారులతో జూలైకి సంబంధించి న నేరసమీక్ష నిర్వహించారు. అందుబాటులోని టెక్నాలజీ, శాసీ్త్రయ పద్ధతులు అనుసరిస్తూ కేసు ల దర్యాప్తు చేపట్టాలన్నారు. మహిళలపై జరిగే నే రాలు, కేసుల్లో దర్యాప్తు పారదర్శకంగా చేట్టాల ని సూచించారు. గణపతి నవరాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని అ న్నారు. పలువురు అధికారులకు ప్రశంసాపత్రా లు అందజేశారు. డీసీపీలు భాస్కర్, కరుణాకర్, ఏసీపీలు మల్లారెడ్డి, రమేశ్, ప్రకాశ్, కృష్ణ, రవికుమార్, శ్రీనివాస్, ప్రతాప్ పాల్గొన్నారు. ఇటీవ ల మృతి చెందిన ఏఎస్సై వెంకటరెడ్డి కుటుంబానికి రూ.8లక్షల విలువైన భద్రత చెక్కును మృతుడి భార్య శ్రీలతకు సీపీ అందజేశారు. -
50శాతం సబ్సిడీపై వ్యవసాయ పనిముట్లు
సుల్తానాబాద్రూరల్(పెద్దపల్లి): జిల్లాలోని మ హిళా రైతులకు 50 శాతం సబ్సిడీపై వ్యవసాయ పనిముట్లు పంపిణీ చేస్తున్నారు. పనిముట్ల కోసం 2025–26 సంవత్సరంలో రూ.2.23 కో ట్లు కేటాయించారు. ఈ నిధులు వెచ్చించి 2,805 రకాల వ్యవసాయ పనిముట్లను రాష్ట్రీయ కృషి వికాస్ యోజన(ఆర్కేవీవై) ప్రాజెక్టు కింద కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. సబ్ మిషన్ ఆన్ అగ్రికల్చర్ మెకనైజేషన్ పథకంలో వీటిని అందిస్తున్నారని అధికారులు వివరించారు. 60 శాతం కేంద్రప్రభుత్వం, 40 శాతం రాష్ట్ర ప్రభుత్వం నిధులు సమకూర్చుతున్నాయి. ఎస్సీ, ఎస్టీ, మహిళా రైతులకు 50 శాతం, ఇతర సామాజిక వర్గాల రైతులకు 40శాతం రాయితీ వర్తింపజేస్తున్నారు. పదిరోజులుగా జిల్లాలోని ఆయా మండలాల్లో ఏఈవోలు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. శనివారం దరఖాస్తు స్వీకరణకు గడువు ముగుస్తుందని అధికారులు తెలిపారు. ఇవీ నిబంధనలు.. మహిళా రైతుల పేరిట రెవెన్యూ రికార్డుల్లో తప్పనిసరిగా భూమి నమోదై ఉండాలి. రూ.లక్ష కన్నా అధిక విలువైన వ్యవసాయ పనిముట్లు తీసుకోవాలంటే కనీసం ఒక ఎకరం భూమి కలిగి ఉండాలి. కస్టమ్ హైరింగ్ సెంటర్లు, కిసాన్ డ్రోన్లు మంజూరు చేయడానికి 2.5 ఎకరాలు ఉండాలనే నిబంధన విధించారు. అందుబాటులోని పనిముట్లు జిల్లావ్యాప్తంగా బ్యాటరీ స్ప్రేయర్, చేతిపంపులు 2,049 అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా పవర్ స్ప్రేయర్స్ 408, రోటోవేటర్లు 120, సీడ్ కం ఫెర్టిలైజర్ డ్రీల్ 21, కల్టివేటర్, ఎఫ్బీ ప్లవర్, కేడ్ వీల్, డిస్క్ హ్యరోలు 115, బండ్ పార్మర్(నాన్ పీటీవో) 06, పవర్ వీడర్ 17, బుష్ కట్టర్ 33, పవర్ టిల్లర్, 17, స్ట్రా బ్యాలర్స్ 19 ఉన్నాయని అధికారులు వివరించారు.నిబంధనల ప్రకారం ఎంపిక సబ్సిడీ వ్యవసాయ పనిముట్ల కోసం అర్హులైన మహిళా రైతులను నిబంధనల మేరకు ఎంపిక చేస్తాం. శనివారంతో ఈ పథకం దరఖాస్తుల స్వీకరణ గడువు పూర్తవుతుంది. అర్హులు సద్వినియోగం చేసుకోండి. – శ్రీనివాస్, జిల్లా వ్యవసాయాధికారి -
ఆపరేషన్ పోచమ్మ మైదాన్
గోదావరిఖని: అది వివాదాస్పద పోచమ్మ మైదా న ప్రాంతం.. ఒకవైపు పోలీసులు.. మరోవైపు సింగరేణి సెక్యూరిటీ సిబ్బంది.. ఆ వెంటే జేసీబీల రాక.. ఏమైందోనని స్థానికులు తెలుసుకుని తేరుకునేలోపే కట్టడాల కూల్చివే ప్రారంభమైంది. షాపుల్లో అద్దెకు ఉంటున్న వారు, యాజమానులు అడ్డుకున్నా.. పోలీసుల బందోబస్తు మధ్య తొలగింపుల ప్రక్రియ కొనసాగింది. మంగళవారం సాయంత్రం ప్రారంభమైన కూల్చివేతలు బుధవారం తెల్లవారుజాము వరకూ సుమారు 12 గంటల పాటు కొనసాగాయి. రాత్రి పది గంటల తర్వాత.. వివాదాస్పద స్థలంలోని కట్టడాల కూల్చివేత తొలుత ఆరు జేసీబీలతో ప్రారంభం కాగా.. రాత్రి 10 గంటల వరకు పొక్లెయిలు, ప్రత్యేక యంత్రాలు రంగప్రవేశం చేశాయి. జనగామ శివారులోని పోచమ్మ మైదానం భూహద్దుల విషయంలో ఈనెల 18న జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ (సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్) సర్వే చేశారు. మరుసటి రోజే కట్టడాల కూల్చివేత ప్రారంభమైంది. మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ ఎదుటి భవనాన్ని ఇప్పటికే కూల్చివే యగా, ఇదేప్రాంతంలోని షాపులను తాజాగా తొల గించారు. వ్యాపారులు దుకాణాలను ఖాళీచేసి వెళ్లిపోయారు. ఇదే ప్రాంతంలోని ఓషాప్లో అద్దె ప్రాతిపదికన కొనసాగుతున్న మణప్పురం బ్యాంకును ఖాళీచేసేందుకు కొంత గడువు ఇచ్చారు. ఇందులో లాకర్లు, విలువైన సామగ్రి ఉండటంతో బుధవారం మధ్యాహ్నం వరకూ నిర్వాహకులు గడువు కోరారు. దీంతో ఈ ఒక్క భవనం కూల్చివేత తాత్కాలికంగా నిలిపివేశారు. గతంలో కూరగాయల మార్కెట్.. సింగరేణి కార్మిక కుటుంబాల కోసం గతంలో పోచమ్మ గుడిని ఆనుకుని కూరగాయాల మార్కెట్, మాంసం దుకాణాలు, చిరువ్యాపారాలు, సింగరేణి బ్యారెక్స్ ఉండేవి. వాటినుంచి సింగరేణి అద్దెవసూలు చేసేది. క్రమంగా సింగరేణి స్థలం కనుమరుగై ఇతరుల చేతుల్లోకి వెళ్లి దుకాణాలు వెలిశాయి. తమదే ఈ స్థలమంటూ కొందరు కోర్టుమెట్లు ఎక్కారు. చాలాఏళ్లుగా ఈ అంశంలో పెండింగ్ ఉంటూ వస్తోంది. చివరకు ఆ స్థలం తమదేనంటూ సింగరేణి కట్టడాలు కూల్చివేసి స్వాధీనం చేసుకుంటోంది. అక్రమ కట్టడాలపై ప్రత్యేక దృష్టి.. రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్ ని యోజవర్గ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించా రు. ఇందుకోసం నగరంలో రోడ్ల విస్తరణ, పాత దుకాణాల స్థానంలో ఆధునిక షాపింగ్కాంప్లెక్స్, కార్పొరేట్ స్థాయి భవన నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించా రు. ఇందులో భాగంగానే తొలుత ఓల్డ్ అశోక టాకీస్ను తొలగించి అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టా రు. ఆ తర్వాత సింగరేణి క్వార్టర్ల కూల్చివేత ప్రారంభించారు. రాజేశ్ థియేటర్, బస్టాండ్ సమీపంలోని భవనాలు కూడా కూల్చివేశారు. దీంతో బస్టాండ్ ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు నియంత్రణలోకి వచ్చాయి. తాజాగా పోచమ్మ మైదానంలోని వివా దాస్పద స్థలంలో కట్టడాలపై దృష్టి సారించారు. భవిష్యత్ కార్యాచరణ ఏమిటి? పోచమ్మ మైదానంలోని 39 గుంటల స్థలం స్వాధీ నం చేసుకుంటున్న సింగరేణి యాజమాన్యం.. దానిని ఎలాంటి అవసరాలకు వినియోగిస్తుందనే చర్చ అప్పుడే మొదలైంది. ప్రధానంగా మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ ఇదే స్థలంలో ఉండగా, ఇంకా చాలాస్థలం ఖాళీగా ఉంటోంది. ప్రస్తుతం మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్పై పూర్తిస్థాయిలో అధ్యయనం జరుగుతోంది. నిపుణులు ఇప్పటికే షాపింగ్ కాంప్లెక్స్ను సందర్శించి భవిష్యత్ ప్రణాళికపై రూట్ మ్యాప్ ఇచ్చినట్లు సమాచారం. భవనానికి పూర్తిస్థాయిలో మరమ్మతులు చేసి అందుబాటులో తేవడమా? నిధులు ఎక్కువ అవసరమైతే దానిని కూల్చివేసి పోచమ్మగుడి వరకు అతిపెద్ద షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించాలా? అందులోనే వాహనాల పార్కింగ్ కూడా ఏర్పాటు చేయాలా? అని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే పోచమ్మ గుడిని కార్పొరేట్ స్థాయిలో ఆధునికీకరించేలా నిర్ణయించినట్లు సమాచారం. పోచమ్మగుడి నుంచిప్రధానచౌరస్తా వరకు ఉన్న స్థలంలో మల్టీషాపింగ్ కాంప్లెక్స్ నిర్మించి ప్రజలకు అందుబాటులో తేవాలని యోచిస్తున్నట్లు కూడా తెలుస్తోంది. -
ఇందిరమ్మ ముందుకు
చిత్రంలో స్లాబ్ పూర్తయి గృహప్రవేశానికి సిద్ధమైన ఇల్లు పెద్దపల్లి జిల్లా మంథని పరిధిలోని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన అడవిసోమన్పల్లి గ్రామంలోనిది. గ్రామంలో 348 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశారు. 192 నివాసాలు బెసెమ్మెంట్ లెవల్, 85 గోడలు, 51స్లాబ్, 20 ఇళ్లు నిర్మాణాలు పూర్తిచేసుకుని గృహప్రవేశాలకు సిద్ధం అయ్యాయి. మంచిరోజు చూసి మంత్రి శ్రీధర్బాబు చేతుల మీదుగా గృహప్రవేశాలు చేయించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.సాక్షి, పెద్దపల్లి: పేదల సొంతింటి కల నెరవేరుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ముమ్మరంగా కొనసాగుతోంది. అర్హుల ఎంపికతోపాటు పనులు ప్రా రంభమైన నాటి నుంచి ఇటు ప్రజాప్రతి నిధులు, అటు అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఆర్థికంగా ఇ బ్బందులున్నవారికి మహిళా సంఘాల ద్వారా రు ణాలిప్పిస్తున్నారు. బేస్మెంట్ పూర్తయితే రూ.లక్ష, గోడల నిర్మాణానికి రూ.లక్ష, స్లాబ్కు రూ.2లక్షలు గృహప్రవేశ సమయంలో రూ.లక్ష బిల్లులు మంజూరు చేస్తూ, లబ్ధిదారులను ప్రోత్సహిస్తున్నారు. మండలానికో మోడల్ ఇందిరమ్మ ఇంటిని నిర్మించగా, హౌసింగ్ ఆఫీసులుగా వినియోగించనున్నారు. ఇళ్లు మంజూరై ఆర్థిక ఇబ్బందులతో నిర్మించుకోలేక పోతున్నవారికి స్వయం సహాయక సంఘాల ద్వా రా రుణాలిప్పిస్తున్నారు. దీంతో ఇళ్ల నిర్మాణాలు ఊపందుకోగా, త్వరితగతిన బిల్లులు మంజూరు అవుతున్నాయి. ఒక్క పెద్దపల్లి జిల్లాలోనే 470 మందికి సుమారు రూ.4.7కోట్ల రుణాలు అందించారు. ఇందిరమ్మ ఇల్లును 400 చదరపు గజాల నుంచి 600 చదరపు గజాల లోపు మాత్రమే నిర్మించుకోవాలి. లేకుంటే జీపీఎస్ యాప్లో నమోదు కాదు. బిల్లుల చెల్లింపు జరగదు. ప్రతివారం ఇంటి నిర్మాణ పనులను జీపీఎస్ ద్వారా చిత్రీకరించి, ప్రగతిని బట్టి ఏదేనీ సోమవారం చెల్లింపులు చేస్తున్నారు. లబ్ధిదారుల అకౌంట్లో నాలుగు విడతలుగా బిల్లులు చెల్లిస్తున్నారు. బేస్మెంట్తో పాటు ఇతర దశల వారీగా పనులు పూర్తి కాగానే సంబంధిత అధికారులు వాటి ఫొటోలు తీసి ప్రత్యేక యాప్లో అప్లోడ్ చేస్తున్నారు. బేస్మెంట్స్థాయిలో రూ.లక్ష, గోడల నిర్మాణానికి రూ.లక్ష, స్లాబ్ వేసిన తర్వాత రూ.2 లక్షలు, మిగతా పనులు పూర్తి చేసిన తర్వాత రూ.లక్ష చెల్లిస్తున్నారు. నిర్మాణాలకు ఇబ్బందులు లేకుండా వారంలో రెండు రోజులు ఇసుక, మట్టి కోసం అనుమతులు మంజూరు చేస్తున్నారు. బ్యాంకుల విలీనం, వేరువేరు ఖాతాలు, ఇతరత్రా సాంకేతిక సమస్యలతో బిల్లుల మంజూరులో తలెత్తుతున్న సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం దృష్టిసారించింది. ఇందులో భాగంగా లబ్ధిదారుడి ఆధార్ అనుసంధానం కలిగిన బ్యాంక్ ఖాతాలోనే బిల్లు జమచేస్తోంది. ఈ విధానంతో క్షేత్రస్థాయిలో తీసిన లబ్ధిదారుల ఫొటోలను యాప్లో అప్లోడ్ చేసిన వివరాల ఆధారంగా త్వరితగతిన బిల్లు మంజూరు చేస్తున్నారు.ఈ చిత్రంలో నిర్మాణం పూర్తయిన ఇందిరమ్మ ఇంటి రెదుట కనిపిస్తున్న మహిళ సీహెచ్ స్వరూప. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం కోనరావుపేట. స్వరూప ఇంటి నిర్మాణానికి మార్చిలో ఎమ్మెల్యే విజయరమణరావు చేతుల మీదుగా ముగ్గు పోశారు. గ్రామంలో ఈమెతో పాటు మరో ఇద్దరు నిర్మాణాలు పూర్తిచేసుకుని, గృహప్రవేశానికి సిద్ధమవ్వగా, ఒక్కొక్కరి ఖాతాలో ఇప్పటికే రూ.4లక్షల చొప్పున బిల్లు జమైంది. గృహప్రవేశం సందర్భంగా మరో రూ.లక్ష పడనుంది. రెండు మూడు రోజుల్లో ఎమ్మెల్యే చేతుల మీదుగా గృహప్రవేశం చేయనున్నారు. -
రైలు ప్రమాదాల నివారణకు చర్యలు
ఓదెల: సంకోచ, వ్యాకోచాలతో రైలు ప్రమాదా లు జరగకుండా రైల్వేశాఖ శ్రీకారం చుట్టింది. కాజీపేట్ నుంచి బల్లార్షా సెక్షన్ల మధ్యలో కాజీ పేట్, జమ్మికుంట, ఓదెల, పొత్కపల్లి, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, సిర్పూర్ కాగజ్నగర్ వరకు రైలుపట్టాలు మార్చుతున్నారు. సూపర్ఫాస్ట్, ప్రత్యేక రైళ్ల రాకపోకలకు అనుకూలంగా పట్టాలు మార్చుతున్నట్లు రైల్వేశాఖ సిబ్బంది పేర్కొన్నారు.శాసీ్త్రయసాగుతో దిగుబడులుకాల్వశ్రీరాంపూర్: సస్యరక్షణ చర్యలతో చీడపీడలను నివారించాలని, ఎరువు, నీటి యాజ మాన్యం, శాసీ్త్రయ వ్యవసాయ సాగు పద్ధతులతో అధిక దిగుబడులు పొందాలని కూనారం వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త సతీశ్చంద్ర, ఏవో నాగార్జున సూచించారు. గురువారం మండలంలోని గంగారం, కూనారం గ్రామాల్లో క్షేత్రపర్యటన చేసి రైతులకు సాగు పద్ధతులపై సూచనలు, సలహాలు చేశారు. అధిక వర్షాలతో పత్తి, మొక్కజొన్నకు చీడపీడలు వచ్చే అవకాశముందని, రైతులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వివిధ రకాల తెగుళ్లకు ఏ మందులు వాడాలో రైతులకు సూచించారు.ప్రమాదంలో ప్రజాస్వామ్యంగోదావరిఖని: దేశ ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని సీపీఐ(ఎంఎల్) మాస్లైన్ ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు విమర్శించారు. గురువారం గోదావరిఖనిలో మాట్లాడుతూ దేశంలో ఎన్నికల కమిషన్ వైఫ ల్యం చెందిందని, బిహార్లో 60లక్షల ఓట్లను తీసివేసి బీజేపీ ప్రభుత్వానికి అనుకూలంగా ఎన్నికలు జరిగేలా చేసిందన్నారు. పోలైన ఓట్లకు ఉన్న ఓట్లకు లక్షల సంఖ్యలో తేడాలు కనిపిస్తున్న నేపథ్యంలో భారత ఎన్నికల కమి షన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రైతులకు 15 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉండగా కేంద్రం ఇప్పటివరకు 7లక్షల మెట్రిక్ టన్నులే కేటాయించిందన్నారు. కట్ట రమ, నంది రామయ్య, జూపాక శ్రీనివాస్, తోకల రమేశ్, జాడి దేవరాజ్, జిందం రాంప్రసాద్ పాల్గొన్నారు.కేబుళ్లు తొలగించాలిపెద్దపల్లిరూరల్: పెద్దపల్లి పట్టణంలోని విద్యుత్ స్తంభాలకు అస్తవ్యస్తంగా అమర్చిన కేబుల్, ఇంటర్నెట్ వైర్లను తొలగించాలని ట్రాన్స్ కో ఏడీఈ రాజ్కుమార్ పేర్కొన్నారు. పట్టణంలోని పలు వీధుల్లో అడ్డంగా ఉన్న వైర్లను ఏఈలు శ్రీనివాస్, జగదీశ్తో కలిసి పరిశీలించారు. వినాయక నవరాత్రోత్సవాల సందర్భంగా విగ్రహాలను మండపాలకు తరలించడం, నిమజ్జనానికి తరలించే సమయాల్లో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. వీలైనంత త్వరగా వైర్లను స్వచ్ఛందంగా తొలగించుకోవాలని, లేదంటే తామే ఇంటర్నెట్, కేబుల్ వైర్లను తొలగిస్తామని నిర్వాహకులను హెచ్చరించారు.24న జిల్లాస్థాయి పోటీలుజ్యోతినగర్: జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 24న ఎన్టీపీసీ రామగుండం జిల్లా పరిషత్ హైస్కూల్ క్రీడా మైదానంలో జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీలు నిర్వహిస్తున్నట్లు అధ్యక్ష, కార్యదర్శులు కొలిపాక శ్రీనివా స్, కొమ్ము గట్టయ్య తెలిపారు. అండర్– 14, 16,18,20 బాల బాలికలకు ఎంపిక పోటీలు ఉంటాయని, ప్రతిభచూపిన 30మందిని మహబూబ్నగర్లో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. -
యూరియా కష్టాలకు ‘చెక్’ పోస్టులు
సుల్తానాబాద్: రైతులకు అవసరమున్న మేరకు యూరియా సరఫరా చేసేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. కలెక్టర్ కోయ శ్రీహర్ష జిల్లా అధికార యంత్రాంగంతో సమీక్షించి యూరి యా సరిహద్దులు దాటిపోకుండా చూడాలని ఆదేశించారు. ఈ మేరకు మంథని ప్రాంతంలోని సుందిళ్ల, అడవి సోమనపల్లిలో చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. ఇప్పటికే వ్యవసాయ, పోలీస్, సివిల్సప్లై అధికారులతో టాస్క్ఫోర్స్ బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ బృందం యూరియా నిల్వలు జిల్లా సరిహద్దులు దాటిపోకుండా పర్యవేక్షిస్తోంది. యూరియా అక్రమ రవాణాకు కళ్లెం వేస్తోంది. 28వేల మెట్రిక్ టన్నులు అవసరం జిల్లావ్యాప్తంగా 20 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలతో పాటు ప్రైవేట్ వ్యాపారులు యూరి యాను విక్రయిస్తున్నారు. జిల్లాలోని రైతుల సాగు కు దశలవారీగా 28వేల మెట్రిక్ టన్నులు అవసరం ఉంటుందని అంచనా వేస్తున్నారు. వానాకాలం సాగు ప్రారంభంలో జిల్లాలో 9,030 మెట్రిక్ టన్ను ల నిల్వలు ఉండగా.. 12,551 మెట్రిక్ టన్నులను కొత్తగా దిగుమతి చేసుకున్నారు. రైతులకు ఇప్పటివరకు 18,991 మెట్రిక్ టన్నులు అందించగా.. ఇంకా 2,590 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉన్నా యి. మరో 3,829 మెట్రిక్ టన్నులు అవసరం కాగా గుజరాత్ నుంచి 6,419 మెట్రిక్ టన్నులు దిగుమతి చేసుకున్నట్లు వ్యవసాయ అధికారులు తెలిపారు. టాస్క్ఫోర్స్ కమిటీ పర్యవేక్షణ జిల్లాలో యూరియా పక్కదారి పట్టకుండా కలెక్టర్ టాస్క్ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ బృందంలో వ్యవసాయ అధికారులతో పాటు సివిల్ సప్లై, పోలీస్ అధికారులు ఉన్నారు. యూరియా జిల్లా సరిహద్దులు దాటిపోకుండా ఈ కమిటీ పర్యవేక్షిస్తోంది. చెక్పోస్టుల్లో 24గంటల పాటు అందుబాటులో ఉంటూ.. ప్రతీ వాహనాన్ని తనిఖీ చేస్తున్నారు. సాగుకు అనుగుణంగా జిల్లాలో యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. జిల్లావ్యాప్తంగా ఫర్టిలైజర్ తనిఖీలు నిర్వహించి, రిజిస్టర్లను పరిశీలించారు. నిల్వల్లో, విక్రయాల్లో తేడా లేకపోవడంతో సంతృప్తి వ్యక్తం చేశారు. మంథని పరిధిలోని సుందిళ్ల, అడవి సోమనపల్లిలో ఏర్పాటు టాస్క్ఫోర్స్ బృందంతో నిత్యం పర్యవేక్షణ -
మందు వేయరు.. సూదీ ఇవ్వరు
కోల్సిటీ(రామగుండం): ‘దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారా...? ఒక్కసారి ఆక్యుప్రెషర్, సుజోక్, వైబ్రేషన్, మాగ్నేటిక్ థెరఫీ చికిత్స పొంది ఫలితం చూడండి. ఎలాంటి మందులు వాడనవసరం లేదు. ఇంజక్షన్లు అసలే లేవు. నొప్పి ఉండదు. చికిత్స ఉచితం’ అంటున్నారు రాజస్థాన్కు చెందిన డాక్టర్ రాంమనోహర్ లోహియా ఆరోగ్య జీవన సంస్థాన సంస్థ ప్రతినిధులు. గోదావరిఖనిలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక స్వతంత్రచౌక్లో ఉచిత చికిత్స కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. రాజస్థాన్ టు రామగుండం రాజస్థాన్లోని హనుమాన్ఘడ్ జంక్షన్లో ఉండే డాక్టర్ రాంమనోహర్ లోహియా ఆక్యుప్రెషర్ ఆరో గ్య జీవన సంస్థానం సంస్థ, దేశంలోని వివిధ రాష్ట్రా ల ప్రజలకు ఉచితంగా ప్రకృతి వైద్య చికిత్స అందించడానికి శ్రీకారం చుట్టింది. గోదావరిఖనిలో నిర్వహిస్తున్న ఈ శిబిరంలో కేవలం రూ.200 రిజిస్ట్రేషన్ ఫీజుతో వారం రోజుల వరకు చికిత్సను అందిస్తున్నారు. రామగుండం లయన్స్ క్లబ్ సంస్థ ఈ ప్రకృతి వైద్య శిబిరానికి సహకారం అందిస్తోంది. నాడీ వ్యవస్థపై ఒత్తిడి శిబిరానికి వస్తున్న వారి వ్యాధులను ముందుగా థెరఫిస్టులు తెలుసుకుంటున్నారు. శరీరంలోని నాడీ వ్యవస్థలోని ముఖ్యమైన పాయింట్లను గుర్తిస్తూ వారి దగ్గరున్న వైబ్రేషన్, మ్యాగ్నెటిక్ పరికరాలతో ఒత్తిడి కలిగిస్తున్నారు. ఎలాంటి నొప్పి లేకుండా, మందులు వాడకుండా కేవలం నాడీ వ్యవస్థపై ఒత్తిడితో వ్యాధులు నయం అవుతాయనడంతో ఈ శిబిరానికి ఆదరణ పెరుగుతోంది. అన్ని జబ్బులకు చికిత్స ఆక్యుప్రెషర్, వైబ్రేషన్, సుజోక్, మ్యాగ్నెటిక్ చికిత్స విధానం ద్వారా శరీరంలోని అన్ని రకాల జబ్బులు నయం అవుతాయంటున్నారు రాజస్థాన్కు చెందిన అక్యుప్రెషర్ థెరఫిస్టులు. నడుం నొప్పి, ఎసిడిటీ, కీళ్ల నొప్పులు, అస్తమా, గుండెపోటు, కిడ్నీలు, ఊపిరితిత్తులు, జీర్ణవ్యవస్థ, అధిక బరువు, తలనొప్పి, కంటి, చెవి, ముక్కు, మెడ నొప్పులు, నిద్రలేమి, మనశ్శాంతి లేకున్నా ఇలా అనేక సమస్యలకు ఆక్యుప్రెషర్ చికిత్స అందించవచ్చని చెబుతున్నారు. ఆక్యుప్రెషర్తో దీర్ఘకాలిక వ్యాధులు నయం నాడీ వ్యవస్థపై మ్యాగ్నటిక్ ఒత్తిడితో ఫలితం రాజస్థాన్ నుంచి రామగుండం చేరిన థెరఫిస్టులు శిబిరానికి తరలివస్తున్న నగర ప్రజలు -
మల్లన్నకు లక్ష బిల్వార్చన
శ్రావణమాసం మాస శివరాత్రి సందర్భంగా ఓదెల మల్లికార్జునస్వామి ఆలయంలో గురువారం లక్షబిల్వార్చన పూజలు, స్వామివారికి ఏకాదశి రుద్రాభిషేకం, భ్రమరాంబికా అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించారు. లక్షబిల్వార్చనలో 150మంది దంపతులు పాల్గొన్నారు. మల్లికార్జునస్వామి, భ్రమరాంభ అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించారు. గర్భగుడిలో ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు చేశారు. గోదావరిఖనికి చెందిన కన్నూరి రాయమల్లు– సుగుణ దంపతులు అన్నదానం చేశారు. ఈవో బి.సదయ్య, జూనియర్ అసిస్టెంట్ ముద్దసాని కుమారస్వామి ఏర్పాట్లను పర్యవేక్షించారు. – ఓదెల -
ప్రతీ సమస్యకు కలెక్టరేట్కు రావొద్దు
పెద్దపల్లిరూరల్/కాల్వశ్రీరాంపూర్: ప్రతీ భూ సమస్యల పరిష్కారానికి కలెక్టరేట్కు రావొద్దని, ఆర్డీవో స్థాయిలోనే పలు రకాల సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. భూ సమస్యలున్న వారు కలెక్టరేట్కు వచ్చి వ్యయ, ప్రయాసలకు లోను కావొద్దన్నారు. మార్కెట్ విలువ రూ.5లక్షల కన్న తక్కువ ఉన్న మిస్సింగ్ సర్వేనంబర్ సమస్య ఆర్డీవో స్థాయిలోనే పరిష్కరించుకోవచ్చని పేర్కొన్నారు. భూ విస్తీర్ణ సవరణ, పట్టాదారు పాసుపుస్తకం డిజిటల్ సైన్, పట్టాధార్ పాసుపుస్తకంలో పేరు సవరణ, పెండింగ్ మ్యుటేషన్, పెండింగ్ సక్సేషన్, నాలా, కోర్టు, పీపీబీ, నాలా నుంచి వ్యవసాయ భూమిగా మార్చుకునేందుకు ఆర్డీవోలకే అధికారం ఉందని వివరించారు. ఇలాంటి సమస్యలున్న వారు ఆర్డీవో ఆఫీసులోనే పరిష్కరించుకోవాలని సూచించారు. వసతులెలా ఉన్నాయి. ‘హాస్టల్లో వసతులెలా ఉన్నాయి. వార్డెన్ రెగ్యులర్ వస్తున్నారా. భోజనం రుచిగా ఇస్తున్నారా’.. అంటూ కలెక్టర్ కోయ శ్రీహర్ష పెద్దపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో ఉన్న బీసీ బాలికల వసతిగృహంలో ఉన్న విద్యార్థినులను అడిగి తెలుసుకున్నా రు. గురువారం ఉదయం హాస్టల్ను ఆకస్మికంగా సందర్శించి, అటెండెన్స్ రిజిస్టర్ను పరిశీలించారు. వార్డెన్ ఏ సమయంలో వస్తారరని ఆరా తీశారు. మెనూ ప్రకారం భోజనాన్ని అందించాలన్నారు. భూముల సందర్శన.. పాఠశాలల తనిఖీ భూభారతి దరఖాస్తులు, భూ సమస్యల సత్వర పరిష్కారం దిశగా కలెక్టర్ కోయ శ్రీహర్ష కాల్వ శ్రీరాంపూర్ మండలం కూనారం, ఇదులాపూర్, జాఫర్ఖాన్పేట గ్రామాల్లో గురువారం పర్యటించా రు. ఆయా గ్రామాల్లో ఆటవీ, సమస్యాత్మక భూములను పరిశీలించారు. ఇదులాపూర్లో మిస్సింగ్ సర్వే నంబర్ పట్టాకోసం వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పాఠశాలలో మధ్యా హ్న భోజనం, అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేశా రు. మధ్యాహ్న భోజన వర్కర్ల సమస్యలు, మెనూ ప్రకారం వంట చేస్తున్నారా అని తెలుసుకున్నారు. విద్యార్థులతో పాఠాలు చదివించి, ప్రశ్నలు వేసి జవాబులు రాబట్టారు. తహసీల్దార్ జగదీశ్వర్రావు, పీటీ శంకర్, సర్వేయర్ రాజు పాల్గొన్నారు. ఆర్డీవో స్థాయిలోనే భూ సమస్యలు పరిష్కారం కలెక్టర్ కోయ శ్రీహర్ష -
మాదక ద్రవ్యాల నియంత్రణకు చర్యలు
ధర్మారం: రామగుండం కమిషనరేట్ పరిధిలో మాదకద్రవ్యాల నియంత్రణకు పటిష్ట నిఘా ఏర్పాటు చేశామని రామగుండం పోలీసు కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. ధర్మారం పోలీస్స్టేషన్ను గురువారం తనిఖీ చేశారు. సీపీకి ఎస్సై ప్రవీణ్కుమార్ ఆధ్వర్యంలో సిబ్బంది పూలమొక్కను అందించి స్వాగతం పలికారు. పెండింగ్, కోర్టు, ప్రస్తుతం దర్యాప్తులో ఉన్న కేసుల రికార్డులను సీపీ తనిఖీ చేశారు. స్టేషన్పరిధిలో రౌడీషీటర్ల కదలికలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ పక్క రాష్ట్రాల నుంచి మాదకద్రవ్యాల రవాణా జరుగుతోందని తెలిపారు. సదరు ప్రాంతాలను గుర్తించి సరిహద్దుల్లో నిఘా వ్యవస్థను పటిష్టం చేశామని స్పష్టం చేశారు. డ్రగ్స్ కంట్రోల్ కోసం ట్రాకింగ్ డాగ్స్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వినాయక నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణలో జరుపుకోవాలని సూచించారు. మంటపాల ఏర్పాటులో తగు జాగ్రత్తలు తీసుకోవా లన్నారు. అనంతరం పోలీసుస్టేషన్ ఆవరణలో మొక్క నాటారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి డీసీపీ కరుణాకర్, ఏసీపీ కృష్ణ, పెద్దపల్లి సీఐ ప్రవీణ్కుమార్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. వినాయక మండపాల్లో జాగ్రత్తలు అవసరం రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా -
ఒక్కో పనికి ఒక్కోరేటు
మంథని: జిల్లాల పునర్విభజన తర్వాత ఉన్నతస్థాయి అధికారుల పర్యవేక్షణ పెరిగి పరిపాలన మరింత మెరుగుడుతుందని అందరూ ఆశించినా.. క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు విరుద్ధంగా త యారైంది. కలెక్టర్తోపాటు ఒకట్రెండు ప్రభుత్వ శాఖలు పాలనను సాఫీగా పర్యవేక్షిస్తుండగా.. మిగతా శాఖల ఉన్నతాధికారులు పెద్దగా పట్టించుకోవడం లేదనే విమర్శలు ఇంకా వస్తూనే ఉన్నాయి. దీంతో కిందిస్థాయిలో అధికారులు, సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అదుపులేని అవినీతి.. రెవెన్యూ, కార్మిక, పంచాయతీరాజ్, మున్సిపల్, స బ్ ట్రెజరీ, సబ్ రిజిష్ట్రార్, ఎకై ్సజ్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సోషల్ వెల్పేర్, ఆర్ అండ్ బీ, విద్య, వైద్యం, ఆర్డబ్ల్యూఎస్, వ్యవసాయ, పశుసంవర్ధక, నీటిపారుదల, సీ్త్ర,శిశు సంక్షేమం, దివ్యాంగులు, అట వీ, కరెంట్ తదితర శాఖల్లో అవినీతికి హద్దూఅదు పు లేకుండాపోతోంది. మారుమూల ప్రాంతం మంథని నియోజకవవర్గంలో ప్రజలు తమ పనుల పూర్తికి పడుతున్న తిప్పలు అన్నీఇన్నీకావు. విభాగాల చొప్పున పైరవీకారులు జిల్లాలోని కొన్నిముఖ్యమైన ప్రభుత్వ శాఖలకు పైరవీకారులు పుట్టుకొస్తున్నారు. నిత్యం ప్రజావసరాలు ఉండే.. కల్యాణలక్ష్మీ, షాదీముబారక్, రేషన్, లేబర్ కార్డులు, కుల, కుటుంబసభ్యుల సర్టిఫికెట్లు, బ్యాంకుల్లో ఎన్వోసీలు, విద్యుత్.. ఇలాంటి విభాగాల్లో పనులు కావాలంటే పైరవీకారులను సంప్ర దించాల్సిందే. రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా.. ఎవరు అధికారంలో ఉంటే వారి మద్దతుతోపాటు అధికారుల అండదండలతో పనులు చక్కబెడుతున్నారు. అధికారులు సైతం వారికి రాచమర్యాదలు చేస్తున్నారు. అందుబాటులో ఉండని అధికారులు మంథని డివిజన్లోని కొన్ని ప్రభుత్వ శాఖల అధికారులు కార్యాలయాల్లో అందుబాటులో ఉండడం లేదు. ఫీల్డ్ విజిట్ పేరిట సొంత పనుల్లో నిమగ్నమవుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పనుల పర్యవేక్షణ పేరిట కార్యాలయాలకే రాకపోవడం, వచ్చినా చుట్టపుచూపుగా వచ్చి వెళ్లడం తప్ప పనులేమీ చేయడం లేదంటున్నారు. దీంతో మంది ప్రజలు తప్పనిసరి పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ మార్గాలను ఆశ్రయిస్తున్నారు. మచ్చుకు కొన్ని ఉదాహరణలు.. ఏసీబీ దృష్టి సారిస్తే.. ప్రభుత్వ శాఖల్లో మితిమీరిన అవినీతిపై ఏసీబీ అధికారులు దృష్టి సారించాలని జిల్లావాసులు కోరుతున్నారు. ఏసీబీపై అవగాహన ఉన్న కొందరు.. అధికారులను ఆశ్రయిస్తున్నారు. కానీ, చాలామందికి అవగాహన, సమాచారం అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 1064కు కాల్చేయండి ప్రభుత్వ అధికారులు లంచం అడిగితే టోల్ఫ్రీ నంబరు 1064కు కాల్చేసి సమాచారం అందించండి. పనిచేసేందుకు, ఇతర సమస్యలు పరిష్కరించేందుకు లంచం అడిగితే ఫిర్యాదు చేయొచ్చు. బాధితుల పేర్లు గోప్యంగా ఉంచుతాం. సమస్యలు పరిష్కరించేలా, పనులు పూర్తయ్యేలా చొరవ తీసుకుంటాం. – విజయ్కుమార్, డీఎస్పీ, అవినీతి నిరోధక శాఖ, కరీంనగర్ మంథనికి చెందిన శ్రీకాంత్ ఓ కంపెనీలో ప్రైవేటు ఉద్యోగి. ఓ గ్రామ శివారులో కొన్ని భూములు ఉన్నాయి. వాటికి తాతల కాలం నుంచి పట్టా ఉంది. ఇందులో కొంత ఇతరుల పేరిట మారింది. రికార్డు ల్లో సరిగ్గానే ఉందని బాధితుడు దర ఖాస్తు చేస్తే.. సాంకేతిక సమస్య అని అధికారులు జాప్యం చేస్తూ వచ్చారు. సెలవులు పెట్టుకొని వచ్చి రెవెన్యూ కార్యాలయంలోని అధికారులను సంప్ర దించినా పనికాలేదు. విసిగిన బాధితుడు.. తన సమస్యను ఓ వ్యక్తికి మొరపెట్టుకున్నాడు. ఆయన సలహా మేరకు పైరవీకారుడిని కలిసి కొంత సొమ్ము ముట్టజెప్పడంతో పనిఅయిపోయింది. అధికారుల చుట్టూ తిరిగినా పరిష్కారం కాని సమస్య డబ్బు ముట్టగానే పరిష్కారం కావడంతో అవాక్కయ్యాడు. -
ప్రభుత్వాన్ని నిలదీద్దాం
మంథని: ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయక మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్ర భుత్వాన్ని నిలదీద్దామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణమాదిగా అన్నా రు. మండల కేంద్రంలో బుధవారం జరిగిన స మావేశంలో ఆయన మాట్లాడారు. హామీలు నె రవేర్చే వరకు పోరాటం కొనసాగిద్దామని కో రారు. ఏపూరి వెంకటేశ్వరరావు, అంబాల రా జేందర్, గోపాల్, పల్లె బాపు, నరిగ మల్లేశ్వరి, మంథని చందు, ఐరెడ్డి నారాయణరెడ్డి, మడిపల్లి దశరథం, కేసారపు నరేశ్, అసం తిరుపతి. మంథని లక్ష్మణ్, శ్యాం, రవి పాల్గొన్నారు. నియామకం గోదావరిఖనిటౌన్: స్థానిక పీజీ కళాశాల ప్రిన్సిపాల్గా ఇనుగాల మనోహర్ను నియమించా రు. ఈమేరకు యూనివర్సిటీ రిజిష్ట్రార్ బుధ వారం ఆదేశాలు జారీచేశారు. మనోహర్ యూ నివర్సిటీలో బిజినెస్ మేనేజ్మెంట్ విభాగానికి బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్గా వ్యవహరించారు. బోధన, బోధనేతర సిబ్బంది ఆయనను శాలువాతో సన్మానించారు. అధ్యాపకులు రమాకాంత్, ఎన్వీ రంగప్రసాద్, రవి, ప్రసాద్, శ్యాంకుమార్, సుధ, రమ్య, శ్రీనివాస్, రవీందర్, శంకర్, కమలాకర్ తదితరులు పాల్గొన్నారు. ఫోరెన్సిక్ వాహనం ప్రారంభం గోదావరిఖని: నేరస్తులకు శిక్షపడేలా సాక్ష్యాధారాలు సేకరించేందుకు ఫోరెన్సిక్ విభాగాన్ని బ లోపేతం చేసినట్లు రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా తెలిపారు. పోలీస్ కమిషనరేట్కు కేటాయించిన ఫోరెన్సిక్ మొబైల్ వా హనాన్ని సీపీ బుధవారం ప్రారంభించి మాట్లాడారు. అత్యాధునిక పరికరాలతో రూపొందించిన వాహనాన్ని సద్విని యోగం చేసుకుని నిందితులకు శిక్ష పడేలా చూడాలని సూచించారు. స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ మల్లారెడ్డి, ఏవో శ్రీనివా స్, ఏఆర్ ఏసీపీ ప్రతాప్, ఆర్ఎఫ్ఎస్ఎల్ అ సిస్టెంట్ డైరెక్టర్ రాము, సీఐలు రవీందర్, చంద్రశేఖర్గౌడ్, ఆర్ఐలు దామోదర్, మల్లేశం, ఆర్ఎస్ఐ ప్రవీణ్కుమార్ పాల్గొన్నారు. కొనసాగుతున్న ఇన్ఫ్లో రామగుండం: ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి ని ల్వసామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా ప్ర స్తుతం 14.89 టీఎంసీలకు చేరింది. ఎగువ నుంచి వస్తున్న భారీ ఇన్ఫ్లోతో ప్రాజెక్టు 40 గే ట్లు ఎత్తి 5,35,282 క్యూసెక్కులను దిగువన ఉ న్న గోదావరి నదిలోకి వదులుతున్నారు. ఎ స్సారెస్పీ నుంచి 2,49,400 క్యూసెక్కులు, క డెం నుంచి 7,028 క్యూసెక్కులు, వరదనీరు 2,29,771 క్యూసెక్కులు ఇన్ఫ్లోగా వస్తోంది. ప్రజల జీవనస్థితిపై సర్వే పెద్దపల్లిరూరల్: ప్రజల జీవనస్థితిగతులు, ప్ర జారవాణా సౌకర్యాలు తదితర అంశాలపై జా తీయ గణాంక అధికారులు బుధవారం జిల్లా కేంద్రంలో సర్వే చేశారు. పల్లె, పట్టణ ప్రజల ఆర్థిక, సామాజిక స్థితి, ఉపాధి అవకాశాలపై ఆరా తీసి కేంద్రానికి నివేదిక ఇవ్వనున్నట్లు జా తీయ గణాంక అధికారి సుధాకర్ తెలిపారు. దేశంలో తొలిసారి చేపట్టిన ఈ సర్వే ద్వారా ప్ర జారవాణా ఎలా ఉందనే విషయమై సమగ్ర స మాచారాన్ని సేకరించి ఆ వ్యవస్థను మరింత బ లోపేతం చేసేందుకు వీలుగా ప్రణాళిక రూ పొందిస్తామని అన్నారు. మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్, తహసీల్దార్ రాజయ్య, ఎంపీడీవో శ్రీనివాస్, స్టాటిటికల్ అధికారులు శ్రీనివాస్, వెంకటేశ్, కృష్ణారెడ్డి తదితరులు ఉన్నారు. దోమలను నిర్మూలించాలి పెద్దపల్లిరూరల్: దోమల నిర్మూలనతోనే వ్యా ధులు దూరమవుతాయని జిల్లా వైద్యాధికారి అన్న ప్రసన్న కుమారి అన్నారు. ‘వరల్డ్ మస్కి టో డే’ సందర్భంగా స్థానిక బస్టాండ్ వద్ద బుధవారం అవగాహన కల్పించారు. ప్రోగ్రాం అధి కారి శ్రీరాములు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ఉమామహేశ్వర్, రవీందర్, అంజయ్య, రాజబాబు, రాకేశ్, అఫ్రోజ్ పాల్గొన్నారు. ఆర్ఎఫ్సీఎల్కు చైర్మన్ ఫెర్టిలైజర్సిటీ(రామగుండం): ఆర్ఎఫ్సీఎల్ను బుధవారం ఉన్నతస్థాయి అధికారులు సందర్శించారు. మరమ్మతు పనులు తనిఖీ చేశారు. ‘సాంకేతిక లోపమా? స్వయంకృతాపరాధ మా‘ శీర్షికన ‘సాక్షి’ బుధవారం కథనం ప్రచురించింది. దీంతో ఆర్ఎఫ్సీఎల్ చైర్మన్ శరవరన్ కర్మాగారానికి చేరుకుని మరమ్మతులు తనిఖీ చేశారు. అధికారులపై మండిపడ్డారు. -
1940 పనులు.. రూ.18.43 కోట్లు
● 22న పనుల జాతర ● కలెక్టర్ కోయ శ్రీహర్ష పెద్దపల్లిరూరల్: జిల్లాలో ఈనెల 22న పనుల జాత ర పేరిట రూ.18.43కోట్లతో చేపట్టే 1,940 పను లకు శ్రీకారం చుడుతామని కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. స్వచ్ఛభారత్మిషన్, ఈజీఎస్, గ్రామీణ నీటిసరఫరా, పంచాయతీరాజ్ శాఖల ద్వారా ఈ వి నూత్న కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలుచేస్తోందన్నారు. దీనికింద 35 గ్రామ పంచాయతీ, 27 అంగన్వాడీ భవనాలు, 2 కమ్యూనిటీ శానిటరీకాంప్లెక్స్ లు, 2 ప్లాస్టిక్ వేస్ట్ యూనిట్లు, 2 సెగ్రిగేషన్షెడ్లు 260 పశువులపాకలు, 26 గొర్రెల షెడ్లు, 65 కోళ్ల ఫారాలు, 13 పాఠశాలల మరుగుదొడ్లు, 130 వర్మీకంపోస్టుగుంతలు, 13 చెక్డ్యాంలు, 1,300 వ్యక్తిగ త ఇంకుడుగుంతలు, 65 అజోల సాగు పనులు చే పట్టేందుకు ప్రతిపాదించామని వివరించారు. 2026 మార్చిలోగా పనులు పూర్తిచేయడమే లక్ష్యంగా ప్ర ణాళిక సిద్ధం చేశామన్నారు. అన్ని మండల కేంద్రా ల్లో ఈనెల 21 నుంచి 23వ తేదీ వరకు ఆధార్ సవరణ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. ఎంపీడీవో ఆఫీసుతోపాటు పెద్దపల్లి, రామగుండం మున్సిపల్ కార్యాలయాల్లో మూడురోజులపాటు ఇవి సేవలు అందిస్తాయని అన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో నాణ్యమైన సేవలు సుల్తానాబాద్(పెద్దపల్లి): ప్రభుత్వ ఆస్పత్రుల్లో నా ణ్యమైన వైద్యసేవలు అందించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. స్థానిక కమ్యూనిటీ హెల్త్సెంటర్లో స్కానింగ్ యంత్రం ప్రారంభించి మాట్లాడారు. ప్రసవాల సంఖ్య పెంచాలని సూచించారు. అనంతరం స్థానిక ప్యాక్స్ గోడౌన్, ఎరువుల దుకాణాలు తనిఖీ చేశారు. రైతులకు సరిపడా యూరి యా అందుబాటులో ఉందని, కొరత లేదన్నారు. -
టెండర్లకు వేళాయె
సాక్షి పెద్దపల్లి: మద్యం దుకాణాల టెండర్ల ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. 2025 – 27 ఆర్థిక సంవత్సరం దుకాణాల కాలపరిమితికి సంబంధించి టెండర్లు పిలిచేందుకు రంగం సిద్ధం చేసింది. వచ్చేడిసెంబర్ ఒకటో తేదీతో ప్రస్తుత దుకాణాల లైసెన్స్ గడువు ముగియనుండగా.. టెండర్ల కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నవారికి సర్కారు కిక్కులాంటి శుభవార్త చె ప్పింది. దీంతో ప్రస్తుతం మద్యం దుకాణం నిర్వహిస్తున్న వ్యాపారులతోపాటు గతంలో లక్కీడ్రాలో అ దృష్టం వరించనివారు మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమతున్నారు. గత ప్రభు త్వం ఎస్సీలకు 10శాతం, ఎస్టీలకు 5 శాతం, గౌడ లకు 15 శాతం ప్రత్యేక రిజర్వేషన్ సదుపాయం క ల్పించిన విషయం విదితమే. ఈసారి కూడా అదేవిధంగా టెండర్ల ప్రక్రియ నిర్వహించనున్నది. ఈ ఏ డాది గతం కంటే పెద్దసంఖ్యలో దరఖాస్తులు వచ్చే అవకాశాలు ఉన్నాయని జిల్లా ఎకై ్సజ్ శాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో గతంలో కంటే పోటీ ఎక్కువగా ఉండనున్నదని భావిస్తున్నారు. గతంలో 77 షాపులకు 2,022 దరఖాస్తులు జిల్లాలో 14 మండలాలు ఉండగా వీటి పరిధిలో మొత్తం 77 మద్యం దుకాణాలు ఉన్నాయి. గతంలో 2,022 దరఖాస్తులు రావడంతో సర్కారు ఖజానాకు రూ.40.44 కోట్ల ఆదాయం సమకూరింది. ఈ ఏడాది స్థానిక ఎన్నికలు, సమ్మక్క – సారక్క జాతర నేపథ్యంలో మద్యం విక్రయాలు భారీస్థాయిలో ఉండే అవకాశం ఉంటుందంటున్నారు. దీంతో పెద్దసంఖ్యలో వ్యాపారులు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఒక్కో దుకాణానికి రూ.3 లక్షల ఫీజు జిల్లాలోని 77 మద్యం దుకాణాల్లో రిజర్వ్ దుకాణా లు మినహా ఒక్కోవ్యక్తి ఒక్కో దుకాణానికి ఎన్ని దరఖాస్తులనైనా సమర్పించవచ్చు. జిల్లాకేంద్రంతోపాటు రాష్ట్రంలోని ఏ మద్యం దుకాణానికై నా టెండర్ వేసే వీలుంది. ఒక్కో దరఖాస్తుకు గతంలో రూ.2 లక్షలు ఉండగా, ప్రస్తుతం రూ.3లక్షలకు (నాన్ రిఫండేబుల్) నిర్ణయించారు. దరఖాస్తు ఫీజు ను రూ.3 లక్షల డీడీతో లేదా చలాన్ ద్వారా చెల్లించవచ్చు. రెండుమూడ్రోజుల్లో జిల్లాల వారీగా నోటి ఫికేషన్ విడుదల చేసి దరఖాస్తులు స్వీకరిస్తారు. ఇందుకోసం అధికారులు ప్రణాళిక రూపొందించారు. -
రాజీవ్ ఆశయ సాధనకు కృషి
సుల్తానాబాద్(పెద్దపల్లి): రాజీవ్గాంధీ ఆశయ సాధనకు ప్రతీ కాంగ్రెస్ కార్యకర్త పనిచేయాలని ఎమ్మె ల్యే విజయరమణారావు అన్నారు. స్థానిక నెహ్రూ విగ్రహం వద్ద మాజీ ప్రధాని రాజీవ్గాంధీ జయంతి నిర్వహించారు. ఆయన చిత్రపటానికి ఎమ్మెల్యే పూలమాలవేసి నివాళి అర్పించారు. నాయకులు డి. దామోదర్రావు, అబ్బయ్యగౌడ్, చిలుక సతీశ్, సా యిరి మహేందర్, పన్నాల రాములు, బిరుదు కృష్ణ, అమిరిశెట్టి రాజలింగం, తిరుపతి, తిరుమల్రావు, రఫీక్, పాహిం, వేగోళం శంకర్ పాల్గొన్నారు. పెద్దపల్లిలో రాజీవ్గాంధీ జయంతి పెద్దపల్లిరూరల్: కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సురేశ్గౌడ్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో రాజీవ్గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. నాయకులు అవినాష్, మస్రత్, మల్లయ్య, సంపత్, సుభాష్, జగదీశ్, శ్రీనివాస్, శ్రీకాంత్, శ్రీ మాన్, ఫణీంద్రభూపతి, శ్రీనివాస్, నదీం ఉన్నారు. -
24న ‘జనహిత’ యాత్ర
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ చేపట్టిన జనహిత పాదయాత్రకు జిల్లాలో ఏర్పాట్లు మొదలయ్యాయి. ఈనెల 24న చొప్పదండిలో ఆమె పాదయాత్ర చేయనున్నారు. చొప్పదండి నియోజకవర్గంలోని ఉప్పరమల్యాల నుంచి మధురానగర్ వరకు యాత్ర సాగనుంది. దాదాపు 5 నుంచి 6 కిలోమీటర్ల మేర సాగనున్న ఈ పాదయాత్రలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్కుమార్, ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఉమ్మడి జిల్లా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొననున్నారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ఉమ్మడి జిల్లాకు తొలిసారిగా రానున్న నేపథ్యంలో ఆమె పాదయాత్రను విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ నాయకులు పట్టుదలతో ఉన్నారు. గంగాధరలో బహిరంగ సభ.. ఉప్పర మల్యాల నుంచి గంగాధరలోని మధురానగర్ చౌరస్తా వద్ద బహిరంగ సభకు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆధ్వర్యంలో ఏర్పాట్లు మొదలయ్యాయి. దాదాపు 6 కిలోమీటర్ల వరకు సాగే పాదయాత్రలో మీనాక్షి పలువురు ప్రజలతో మాట్లాడతారు. అదే సమయంలో అవసరమైన చోట శ్రమదానం, స్థానిక నేతలతో సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ సభకు ఉమ్మడి జిల్లా నుంచి భారీగా కాంగ్రెస్ శ్రేణులు తరలనున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్, సిరిసిల్ల, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల పార్టీ అధ్యక్షులు ఇప్పటికే ఈ సభ నిర్వహణ, ఏర్పాట్లపై ఫోన్లో మంతనాలు సాగిస్తున్నారు. 24న పాదయాత్ర అనంతరం మీనాక్షి జిల్లాలోనే బస చేయనున్నారు. ఆమె కరీంనగర్ జిల్లా కేంద్రంలో బస చేస్తారా..? లేక గంగాధర మండలంలోనే ఆగుతారా..? అన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. మరునాడు 25న ఉదయం గంగాధర మండలంలోని వెంకటాయపల్లిలోని ఎల్కే గార్డెన్స్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ నేతల సమావేశానికి ఆమె నేతృత్వం వహిస్తారు. నామినేటెడ్ పదవులపై ఉత్కంఠ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భర్తీ కాని నామినేటెడ్ పదవుల విషయంలో కేడర్ తీవ్ర అసంతృప్తిగా ఉంది. పార్టీ తీసుకున్న నిర్ణయం ప్రకారం ప్రతీ అసెంబ్లీకి ఇద్దరు నేతల పేర్లు సూచించాలని అధిష్టానం ఆదేశించింది. అయితే కరీంనగర్ అసెంబ్లీకి మాత్రం కనీసం ఐదుగురు నేతలకు నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలని ఇక్కడి నేతలు డిమాండ్ చేస్తున్నారు. పార్టీలు మారి వచ్చిన వారికి కాకుండా.. పార్టీ పదేళ్లపాటు ప్రతిపక్షంలో ఉన్నపుడు వెన్నంటి ఉన్న నాయకులకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతున్నారు. డీసీసీ, పట్టణ, మండల, గ్రామ, బ్లాక్ అధ్యక్షుల భర్తీకి దరఖాస్తులు తీసుకున్నా.. ఇప్పటివరకూ ఎలాంటి పదవుల కేటాయింపు జరగలేదు. 25న మీనాక్షి నటరాజన్ నేతృత్వరంలో జరిగే సమావేశంలో ప్రతీ కార్యకర్తతో ఆమె మాట్లాడనున్నారు. ఈ నేపథ్యంలో మెజారిటీ సీనియర్ నేతలు తమకు పదవుల్లో ప్రాధాన్యమివ్వాలని కోరనున్నారు. మరికొందరు ఉమ్మడి జిల్లా నేతలు పార్టీ పరిస్థితిని వివరిస్తూ.. పలువురు నటరాజన్కు ఇప్పటికే సమాచారం చేరవేసినట్లు తెల్సింది. ముఖ్యంగా కరీంనగర్ విషయంలో త్వరగా నిర్ణయం తీసుకోవాలని పలువురు ఆమెకు విజ్ఞప్తి చేసినట్లు తెలిసింది. -
ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి
● గ్రామస్థాయి నుంచి కాంగ్రెస్ బలోపేతం ● ఉమ్మడి జిల్లా ఉన్నతస్థాయి సమీక్షలో మంత్రి తుమ్మల నాగేశ్వర్రావుసాక్షిప్రతినిధి, కరీంనగర్: ప్రణాళికాబద్ధంగా జిల్లాను అన్నిరంగాల్లో అభివృద్ధి పర్చాలని ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉన్నతస్థాయి సమీక్ష సమావేశాన్ని బుధవారం హైదరాబాద్లోని తాజ్కృష్ణ హోటల్లో నిర్వహించారు. సమావేశానికి అధ్యక్షత వహించిన తుమ్మల మాట్లాడుతూ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు, విద్య, వైద్యం, ఉపాధి రంగాల పురోగతికి చర్యలు చేపట్టామన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు పెంపొందించేందుకు చిన్న, మధ్య తరహా పరి శ్రమలకు ప్రోత్సాహం ఇవ్వాలన్నారు. రైతుబజార్ల ను విస్తరించాలని, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ఏర్పాటుకు కృషి చేయాలని సూచించారు. డబు ల్ బెడ్రూం ఇళ్లు, రైతు రుణమాఫీ, పంటల నష్ట పరిహారం, విద్యార్థులకు స్కాలర్షిప్లు, మైనార్టీ, మహిళల అభివృద్ధికి పథకాలను పకడ్బందీగా అమలయ్యేలా చూడాలన్నారు. గ్రామస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేయాలన్నారు. మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్కుమార్, ప్రభుత్వ విప్ ఆది శ్రీని వాస్, మాజీమంత్రి టి.జీవన్రెడ్డి, ఎమ్మెల్యేలు చింతకుంట విజయరమణారావు, మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్, మేడిపల్లి సత్యం, సంజయ్, ఎమ్మెల్సీ టి. భానుప్రసాద్రావు, నియోజక వర్గ ఇన్చార్జిలు వొడితెల ప్రణవ్, కేకే.మహేందర్రెడ్డి, జువ్వాడి నర్సింగరావు, నాయకులు వెలిచాల రాజేందర్రావు, వూట్కూరి నరేందర్రెడ్డి ఉన్నారు. -
గౌరవంగా బతికేలా..
కోల్సిటీ(రామగుండం): యాచకులు లేనినగరంగా మార్చడానికి రామగుండం నగరపాలక సంస్థ ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన స్మైల్ పథకాన్ని అమలు చేయడానికి బల్దియాలో యాచకుల వివరాల సేకరణ కోసం సర్వే నిర్వహిస్తున్నారు. యాచక వృత్తి నిర్మూలించి, దానిపై ఆధారపడి బతుకుతున్న వారికి పునరావా సం కల్పించి.. వారి జీవితాల్లోనూ ‘స్మైల్’ నింపేందుకు ఈ పథకం దోహదం చేస్తుందని భావిస్తోంది. పునరావాసం.. సంక్షేమం.. ‘సపోర్ట్ ఫర్ మార్జినలైజ్డ్ ఇండివిడ్యువల్స్ ఫర్ లైవ్లీవుడ్ అండ్ ఎంటర్ర్పైజ్’(స్మెల్) పేరిట కేంద్ర ప్రభుత్వం రెండు రకాల పథకాలను అమల్లోకి తీసుకొచ్చింది. ఇందులో ఒకటి.. ట్రాన్స్జెండర్ల పునరా టవాసం, సమగ్ర సంక్షేమం, రెండోది.. యాచకుల సమగ్ర పునరావాసం కల్పన ఉన్నాయి. యాచక వృత్తిని అవలంబిస్తున్న వారిని గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక, స్వచ్ఛంద, సామాజిక సంస్థల సహకారంతో సమాజంలో గౌరవం పొందేలా చర్యలు తీసుకోవడానికి స్మైల్కు శ్రీకారం చుడుతున్నారు. నిధులు కేటాయించిన కేంద్రప్రభుత్వం.. స్మైల్ పథకాన్ని అమలు చేయడానికి సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ కింద యాచకుల సంక్షేమానికి కేంద్రప్రభుత్వం నిధులు కేటా యించింది. దీనిద్వారా వారి జీవనోపాధి, పునరావాస కల్పన, విద్య, ఆరోగ్యం, శిక్షణ గురించి అధికారులు తగిన చర్యలు తీసుకుంటారు. ఈ పథకం అమలు చేయడానికి రాష్ట్రంలో అధిక జనాభా కలిగిన పలు మున్సిపల్ కార్పొరేషన్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంపిక చేశాయి. ఇందులో మనజిల్లాలోని నగరం రామగుండం బల్దియాను కూడా ఎంపిక చేశారు. స్మైల్ పథకం అమలుకు ఇటీవల రామగుండానికి రూ.9లక్షలు కేటాయించారు. యాచకుల వివరాల సేకరణ.. స్మైల్లో భాగంగా సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల మేరకు.. రామగుండంలో ప్రతీయాచకుడి పూర్తి వివరాలను మెప్మా ఆధ్వర్యంలో సేకరించే ప్రక్రియ చేపట్టారు. గోదావరిఖని ఆర్టీసీ బస్టాండ్, రామగుండంలోని రైల్వేస్టేషన్, నగరంలోని ఇతర ప్రధాన కూడళ్లు, దేవాలయాల ప్రాంతాల్లో ఉండే యాచకులను గుర్తించడానికి అధికారులు శరవేగంగా సర్వే కొనసాగిస్తున్నారు. సర్వేలో పొందుపర్చిన వివరాలను మెప్మా సిబ్బంది నమోదు చేసుకుంటున్నారు. ఎన్జీవోకు నిర్వహణ బాధ్యతలు.. నైట్షెల్టర్ల నిర్వహణ తరహాలోనే స్మైల్ను కూడా నిర్వహించడానికి ఎన్జీవోలకు బాధ్యతలు అప్పగించడానికి రామగుండం బల్దియా కమిషనర్ ఇటీవల నోఫికేషన్ విడుదల చేసిందని తెలిసింది. స్మైల్ నిర్వహణకు ఆసక్తి చూపిన రెండు ఎన్జీవోల నుంచి ఇప్పటికే బల్దియాకు అందిన దరఖాస్తుల్లో ఒక ఎన్జీవోనే ఎంపిక చేయడానికి బల్దియా అధికారులు జాబితా ను కలెక్టర్ పరిశీలనకు పంపించారు. -
సరిపడా యూరియా ఉంది
● త్వరలోనే మరికొంత వస్తుంది● మోతాదుకు మించి వినియోగించొద్దు● ఇళ్లలో నిల్వచేస్తే ఆవిరవుతుంది ● ‘సాక్షి’తో జిల్లా వ్యవసాయాధికారి బి.శ్రీనివాస్ పెద్దపల్లిరూరల్: వానాకాలం పంటల దిగుబడి పెంచుకునేందుకు ఎరువులు, పురుగు మందులను అవసరమైన మోతాదులోనే వినియోగించాలని జిల్లా వ్యవసాయాధికారి బి.శ్రీనివాస్ రైతులకు సూచించారు. ప్రస్తుత అవసరాలకు సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయని, అయితే, అవసరానికి మించి తీసుకెళ్లడంతోనే కొన్నిచోట్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. మోతాదుకు మించి యూరియా చల్లితే వరి రంగుమారుతుందని తెలిపారు. ఈ విషయంలో వ్యవసాయాధికారుల సూచనలు పాటించాలని సూచించారు. విదేశాల నుంచి యూరియా దిగుమతి అయ్యే అవకాశాలు మెరుగుపడడంతో రెండురోజుల్లోగా మరిన్ని నిల్వలు జిల్లాకు చేరే అవకాశాలు ఉన్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు.మోతాదుకు మించి యూరియా చల్లితే ఏమవుతుంది? డీఏవో : వరి పంటలో ఎకరానికి రెండు బస్తాలు నాలుగు దఫాలు, పత్తికి మూడు బస్తాలను చల్లాలి. ఆఖరి దఫాలో పొటాష్ను కలిపి చల్లాల్సి ఉంటుంది. ఎక్కువ చల్లితే ఆకురంగు మారి, పూత, కాత తగ్గి దిగుబడిపై ప్రభావం చూపుతుంది. జిల్లాలో వానాకాలం సాగు విస్తీర్ణం ఎంత? డీఏవో : అన్నిరకాల పంటలు కలిపి 2,65,990 ఎకరాల విస్తీర్ణంలో సాగవుతున్నాయని అంచనా వేశాం. ఇప్పటివరకు 2,44,687 ఎకరాల విస్తీర్ణంలో సాగైంది. ఇందులో అత్యధికంగా వరి 1,92,260 ఎకరాల్లో సాగు కాగా, పత్తి 51,595 ఎకరాల్లో సాగు చేశారు. కొందరు వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించి అధిక ధర వసూలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి? డీఏవో : యూరియా విక్రయాలు ఈ పాస్ ద్వారానే జరుగుతున్నాయి. వివరాలను ఆన్లైన్లో పరిశీలిస్తున్నాం. ఎరువులు, విత్తనాల విక్రయాలపై ప్రత్యేక దృష్టి సారించేందుకు టాస్క్ఫోర్స్ బృందాలు ఉన్నాయి. అయినా ఆధారాలతో ఫిర్యాదు చేస్తే తగిన చర్యలు తీసుకుంటాం.యూరియా ఏమేరకు అవసరమని అంచనా వేశారు? డీఏవో : వానాకాలం సాగుకు 28 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని అంచనా వేశాం. కానీ 21,581మెట్రిక్ టన్నులు జిల్లాకు చేరింది. అందులో 18,991 మెట్రిక్ టన్నులను రైతులకు విక్రయించారు. ఒక్కొక్కరికి ఎన్ని యూరియా బస్తాలిస్తున్నారు? డీఏవో : ఎకరాకి రెండు బస్తాలు అవసరం. ప్రస్తుత నిల్వను బట్టి ఆధార్, పట్టాదార్ పాస్పుస్తకం ఆధారంగా ఈపాస్మిషన్లో రైతు వివరాలు నమోదు చేసి ఎకరాకి ఒక బస్తా ఇస్తున్నాం. మళ్లీ 20 రోజుల తర్వాత ఇంకొక బస్తా అందిస్తాం. యూరియా లేదని రైతులు ఆందోళన పడుతున్నారు? డీఏవో : జిల్లాలో ప్రస్తుతం 2,590 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వ ఉంది. ఇది నాలుగైదు రోజుల వరకు సరిపోతుంది. ఈలోగా మరికొంత జిల్లాకు చేరేలా కలెక్టర్ చర్యలు తీసుకుంటున్నారు. రైతులకు ఇబ్బందులు రాకుండా చూస్తాం. సమస్యలు ఎదురైతే ఎవరిని సంప్రదించాలి? డీఏవో : యూరియా సంబంధిత సమస్యలు ఎదురైతే జిల్లా వ్యవసాయాధికారి కార్యాలయంలోని 99899 94617 ఫోన్ నంబరులో సంప్రదించాలి.చిన్నరైతులకు యూరియా అందడడం లేదంటున్నారు? డీఏవో : రైతులు తమ అవసరాలకు మించి తీసుకెళ్లి ఇళ్లలో నిల్వ చేసుకుంటున్నారు. ఇలా చేస్తే యూరియా ఆవిరై పోతుంది. వాస్తవంగా అవసరమయ్యే చిన్నరైతులకు యూరియా లభించకనే సమస్య ఉత్పన్నమవుతోంది. ఇంట్లో యూరియా నిల్వ ఉంటే అనారోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. -
పనులు పూర్తిచేయాలి
సుల్తానాబాద్(పెద్దపల్లి): షెట్టర్ నిర్మాణాలను నెలరోజుల్లో పూర్తిచేయాలని ఎమ్మెల్యే విజయరమణారావు సూచించారు. కాల్వశ్రీరాంపూర్ క్రాస్రోడ్డులో రూ.65 లక్షలతో చేపట్టిన షెట్టర్ నిర్మాణాలను ఆయన పరిశీలించి పలు సూచనలుచేశారు. చౌరస్తా సుందరీకరణకు అందరూ సహకరించాలని కోరారు. ఈసందర్భంగా నవ తెలంగాణ పబ్లిషింగ్ హౌస్ పుస్తక ప్రదర్శన కేంద్రాన్ని ప్రారంభించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్యగౌడ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మినుపాల ప్రకాశ్రావు, నాయకులు దాన్నాయక దామోదర్రావు, గాజుల రాజమల్లు, అబ్బయ్యగౌడ్, చి లుక సతీశ్, శ్రీగిరి శ్రీనివాస్, కిశోర్, సత్యంగౌ డ్, మొండయ్య, సతీశ్, లక్ష్మణ్ పాల్గొన్నారు. టీబీ రహిత గ్రామాలు లక్ష్యం ముత్తారం(మంథని): టీబీ రహిత గ్రామాలుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని టీబీ అలర్ట్ ఇండియా ప్రోగ్రాం జిల్లా అధికారి శ్రీనివాస్ అన్నారు. స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిని ఆయన మంగళవారం తనిఖీ చేశారు. టీబీని ప్రాథమిక దశలోనే గుర్తిస్తే నయం చేయవచ్చన్నారు. ప్రతీఆరోగ్య కేంద్రంలో టీబీ నివారణ మందులు ఉ చితంగా లభిస్తున్నాయని తెలిపారు. టీబీపై అవగాహన కల్పించాలని వైద్యుడు అమరేందర్రావు, వైద్య సిబ్బందికి ఆయన సూచించారు. ‘హత్యాకాండ ఆపేయాలి ’జ్యోతినగర్(రామగుండం): అటవీసంపదను కాపాడుతున్న ఆదివాసీలను ఆపరేషన్ కగార్ పేరిట చంపవద్దని, ఆపరేషన్ కగార్ను నిలిపివేసి మావోయిస్టులతో చర్చలు జరపాలని తె లంగాణ రైతు సమస్యల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు ముడిమడుగుల మల్లన్న, సమతా సైనిక దళ్ నాయకుడు దుర్గం నగేశ్ డిమాండ్ చేశారు. స్థానిక మేడిపల్లి సెంటర్లో ఆదివాసీ హక్కులు– కార్పొరేటీకరణ కగార్ హత్యాకాండ కాల్పుల విరమణపై ముద్రించిన పోస్టర్లను మంగళవారం ఆవిష్కరించి మాట్లాడారు. మా వోయిస్టులతో శాంతిచర్చలు జరపాలనే డి మాండ్తో ఈనెల 24న హన్మకొండలో బహిరంగసభ నిర్వహిస్తామని తెలిపారు. రామటెంకి మల్లేశ్, జనగామ రాజన్న, చీమల ఆనంద్, జిమ్మిడి అశోక్, గూడూరు లవన్ కుమార్, మ హేశ్, లింగయ్య, శ్రీనివాస్ పాల్గొన్నారు. నేడు టీబీజీకేఎస్ సమావేశం గోదావరిఖని: తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం(టీబీజీకేఎస్) కేంద్ర కార్యవర్గ సమావేశం బుధవారం హైదరాబాద్లో నిర్వహిస్తున్నట్లు అధికార ప్రతినిధి పర్లపల్లి రవి తెలిపారు. సింగరేణి కార్మికుల సమస్యలు, గుర్తింపు, ప్రాతి నిధ్య సంఘాల వైఫల్యం, సంస్థ, ఉద్యోగుల భవిష్యత్పై చర్చించి పోరుబాటకు కార్యాచరణ సిద్ధం చేయనున్నట్లు పేర్కొన్నారు. కొనసాగుతున్న కూల్చివేతలు గోదావరిఖని: స్థానిక ప్రధాన చౌరస్తా సమీపంలోని మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ భవనం ఎ దుట గల పోచమ్మ మైదాన్లోని కట్టడాల కూ ల్చివేత మంగళవారం కూడా కొనసాగింది. త మ సామగ్రి షాపుల్లోనే ఉందని, కూల్చివేత ఆ పాలని స్థానికులు ఆందోళనకు దిగారు. సీఐ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు ఆందో ళనకారులను పక్కకు తీసుకెళ్లారు. సింగరేణి సెక్యూరిటీ సిబ్బంది కూడా పాల్గొంది. పోచ మ్మ మైదానంలోని వివాదాస్పద 39 గుంటల సింగరేణి స్థలానికి సంబంధించి రెవెన్యూ అధికారులు సోమవారమే సర్వే చేశారు. నివేదికను కోర్టుకు సమర్పిస్తామని వెల్లడించారు. 22న జాబ్మేళా పెద్దపల్లిరూరల్: మెడ్ప్లస్లో ఉద్యోగావకాశాల భర్తీకి ఈనెల 22న జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎంప్లాయిమెంట్ ఇన్చార్జి అధికారి తిరుపతిరావు తెలిపారు. 40 ఫార్మసిస్టు, 20 కస్టమ్ సేల్స్ అసోసియేట్, 30 స్టాక్ పికింగ్, ప్యాకింగ్, 30 ఆడిట్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నా యని తెలిపారు. వివరాలకు 93923 10323, 89853 36947లో సంప్రదించాలని కోరారు. -
పేదలకు ఇళ్లు కట్టిస్తాం
ధర్మారం(ధర్మపురి): స్థోమతలేని పేదలకు తానే ద గ్గరుండి ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తానని మంత్రి లక్ష్మణ్ కుమార్ అభయం ఇచ్చారు. స్థానిక మండల పరిష త్ కార్యాలయంలో మంగళవారం 23 మంది కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు రూ.23,26,006తోపాటు 121 మందికి సీఎంఆర్ఎఫ్కు సంబంధించి రూ. 41,63,500 విలువైన చెక్కులను మంత్రి పంపిణీ చేసి మాట్లాడారు. అర్హులైనవారందరికీ దశలవారీ గా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. రా జకీయ జన్మనిచ్చిన ధర్మారం మండలంలోని ప్రతీపేదకు ఇల్లు నిర్మించి ఇచ్చే బాధ్యత తానే తీసుకుంటానని భరోసా ఇచ్చారు. పదేళ్లపాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఒక్క రేషన్కార్డు కూడా అందించలే దని ఆరోపించారు. నాయకులు లావుడ్య రూప్లానాయక్, అరిగే లింగయ్య, కొడారి అంజయ్య, కొత్త న ర్సింహులు, తిరుపతిరెడ్డి, అధికారులు ఉన్నారు. -
ఆనకట్ట కట్టలేదు.. నీళ్లు ఆపుతలేరు
మంథనిరూరల్: నాడు గోదావరి నదిపై ఆనకట్టలు కట్టాలని, ఇప్పుడు వృథాగాపోతున్న వరదనీటిని ఆపాలని మంథని ఎమ్మెల్యే ఏనాడూ ఆలోచన చే యలేదని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ విమర్శించారు. గోదావరి విలాపం పేరిట మంగళవారం సిరిపురం సమీపంలోని పార్వతీ బరాజ్ను సందర్శించి నీటి ప్రవాహాన్ని పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ, కాళేశ్వరంపై సీఎం రేవంత్రెడ్డి విషం చిమ్ముతున్నారని, మంథని ఎమ్మెల్యే అడుగులకు మడుగులొత్తుతున్నారని దుయ్యబట్టారు. మేడిగడ్డ బరాజ్ దెబ్బతింటే లోపంలేనిపార్వతీ బరాజ్ గేట్లు ఎత్తి నీటిని ఎందుకు దిగువకు వదులుతున్నారో సమాధానం చెప్పాలని ఆయన ప్రశ్నించారు. వెంటనే గేట్లు మూసి నీళ్లు ఆపాలని ఆయన డిమాండ్ చేశారు. నాయకులు ఏగోళపు శంకర్ గౌడ్, తగరం శంకర్లాల్, గుజ్జుల రాజిరెడ్డి, ఆరెపల్లి కుమార్, కనవేన శ్రీనివాస్, కొండా రవీందర్, మిర్యాల ప్రసాదరావు పాల్గొన్నారు. -
గోదావరి వరదలపై కలెక్టర్ సమీక్ష
● రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో పర్యటన ● లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన రామగుండం: ఎగువన ఉన్న శ్రీరాంసాగర్, కడెం ప్రాజెక్టుల గేట్లు ఎత్తడంతో వరదనీరు ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా వచ్చి చేరుతోంది. దీంతో ప్రా జెక్టు 35 గేట్లు ఎత్తి దిగువన ఉన్న గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. కలెక్టర్ కోయ శ్రీహర్ష మంగళవారం ఎల్లంపల్లి ప్రాజెక్టును పరిశీలించారు. వరద ఉధృతిపై అధికారులతో సమీక్షించారు. గోదావరి పరీవాహక ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేయాలని ఆయన సూచించారు. పశువులు, గొ ర్రెలకాపరులు, మత్స్యకారులు నదిలోకి వెళ్లొద్దని అ న్నారు. చీఫ్ ఇంజినీర్ సుధాకర్రెడ్డి, సూపరింటెండెంట్ ఇంజినీర్ సత్యనారాయణ, డీఈ బుచ్చిబాబు, శరత్బాబు, తహసీల్దార్ ఈశ్వర్ పాల్గొన్నారు. ముంపు ప్రాంతాల పరిశీలన జ్యోతినగర్(రామగుండం): వరద ముంపు గ్రామాలైన మల్కాపూర్, రామయ్యపల్లెలో కలెక్టర్ పర్యటించారు. ముంపు, లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సీఈ సుధాకర్రెడ్డి, ఎస్ఈ సత్యనారాయణ, డీఈ బుచ్చిబాబు, శరత్బాబు, తహసీల్దార్ ఈశ్వర్, ఈఈ రా మన్, డీసీసీ కార్యదర్శి ఎండీ రహీమ్ పాల్గొన్నారు. -
కాసులు కురిపిస్తున్న బొగ్గు
మంథనిరూరల్: సింగరేణి ప్రభావిత గ్రామాల్లో ఏ ఇంటి ముందు, వెనుక చూసినా బొగ్గు కుప్పలే దర్శనమిస్తున్నాయి. ఈ దృశ్యం ఆ ఊళ్లలో సహజమే అయినా.. కొందరు దళారులు అక్రమ మార్గంలో తరలిస్తూ రూ.లక్షల్లో ఆర్జిస్తున్నారు. తొలుత రాత్రి, తెల్లవారుజామున సమీపంలోని ఓవర్ బర్డెన్(ఓబీ – మట్టి) కుప్పల నుంచి బొగ్గు సేకరిస్తూ గ్రామాల్లో నిల్వ చేస్తున్నారు. ఈ ప్రక్రియ ద్వారా స్థానికులకు ఉపాధి లభిస్తున్నా.. కొందరికి కాసులు కురిపిస్తోంది. సింగరేణి ప్రభావిత గ్రామాలుగా గుర్తించడంతో అభివృద్ధి పనులు, ప్రభుత్వపరంగా అందే ఉపాధి అవకాశాలు కోల్పోవడంతో గత్యంతరం లేక కొందరు బొగ్గు సేకరణను ఉపాధిగా మార్చుకుంటున్నారు. ప్రధానంగా ఇది మంథని మండలంలోని సింగరేణి ప్రభావిత అక్కెపల్లి, సిద్ధపల్లి తదితర గ్రామాల్లో జోరుగా సాగుతోంది. ఓబీ కుప్పల నుంచి సేకరణ.. సింగరేణి బొగ్గు గనుల సంస్థ తమ అవసరాలు, ఓసీపీల విస్తరణ కోసం అక్కెపల్లి, సిద్ధపల్లి గ్రామాలను స్వాధీనం చేసుకుంది. ఈక్రమంలో ఓసీపీలో బొగ్గు తీసేందుకు పైపొరలోని మట్టిని తవ్వితీస్తోంది. ఈ మట్టిన ప్రభావిత గ్రామాల సమీపంలోనే కుప్పలుగా పోస్తోంది. ఈ మట్టిలో కలిసిఉన్న బొగ్గును స్థానికులు సేకరించి నిల్వ చేస్తున్నారు. ఇలా కొన్నేళ్లుగా బొగ్గు సేకరణతో వారు ఉపాధి పొందుతున్నారు. ఇది నిబంధనలకు విరుద్ధమని సింగరేణి అధికారులు తరచూ హెచ్చరించినా కొందరిలో మార్పురావడం లేదు. హోటళ్లు, ఇటుక బట్టీలకు విక్రయాలు.. ఓబీ కుప్పల నుంచి సేకరించిన బొగ్గును ఒకచోట నిల్వ చేశాక.. కొందరు బొగ్గు నిల్వలను ఎడ్లబండ్లు, ట్రాక్టర్ల ద్వారా ఇటుక బట్టీలు, ఇతర ప్రాంతా ల్లోని హోటళ్లకు అక్రమంగా తరలిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లోని ప్రజలు సింగరేణి బొగ్గును పొయ్యిలలో వినియోగిస్తుండడంతో డిమాండ్ పెరిగింది. దళారుల ఎంట్రీతో.. ప్రభావిత గ్రామాల్లోని కొందరి ఉపాధిని ఆసరాగా చేసుకుంటున్న దళారులు బొగ్గును అక్రమ మార్గంలో తరలించేందుకు తెరలేపారు. తక్కువ ధరకు స్థా నికుల నుంచి కొనుగోలు చేసి ఇతర ప్రాంతాలకు అక్రమంగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. బస్తాకు రూ.70 నుంచి రూ.100 ధర సిమెంట్ బ్యాగ్లో నింపిన బొగ్గు ఒక బస్తా రూ.70 నుంచి రూ.100 వరకు ధర పలుకుతోంది. ఒకవ్యక్తి రోజూ మూడు నుంచి ఐదు బస్తాల్లో బొగ్గు సేకరిస్తూ నిల్వచేస్తున్నాడు. ఇలా సేకరించిన బొగ్గు ను సింగరేణి ఏరియాల్లో స్థానికులు వంటలు త యారు చేసేందుకు ఎక్కువగా వినియోగిస్తున్నారు. దీంతో కొందరు సమీపంలోని సింగరేణి ప్రాంతాల్లో రహస్యంగా బొగ్గు అమ్ముకుంటున్నారు. పట్టుకుంటున్నాం సింగరేణి ప్రభావిత గ్రామాల్లో తరచూ దా డు లు చేస్తూ అక్రమంగా నిల్వ చేసిన బొగ్గు పట్టు కుని కేసులు నమోదు చేస్తున్నాం. అక్రమ రవాణా నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. అలాగే యాంటీ కోల్ తెఫ్ట్ టీం సైతం దాడులు చేస్తోంది. బొగ్గు అక్రమ రవాణాను అరికట్టేలా చర్యలు తీసుకుంటోంది. – షబ్బీర్, సెక్యూరిటీ ఆఫీసర్, ఆర్జీ– 3 ఏరియా -
ఆగని ముసురువాన
పెద్దపల్లిరూరల్: జిల్లాలో కురుస్తున్న వర్షాలతో చెరువులు, కుంటలు నిండి జలకళ సంతరించుకున్నాయి. మారెడుగొండ చెరువు మత్తడి దూకుతోంది. పెద్దబొంకూర్ వద్ద హుస్సేనిమియా వాగు ప్రవాహం పెరిగింది. రాగినేడు మత్తడి వద్ద చేపలు కొట్టుకుపోకుండా మత్స్యకారులు జాలీ ఏర్పాటు చే శారు. పెద్దకల్వల, భోజన్నచెరువు, చీకురాయి మ ల్లారెడ్డి చెరువు.. ఇలా జలవనరులన్నీ నిండుకుండ ల్లా మారుతున్నాయి. అదేవిధంగా సబ్బితం శివారు లోని గౌరీగుండాలు జలపాతం ఉధృతమైన జలధా రగా పోస్తోంది. రాఘవాపూర్ జెడ్పీ హైస్కూల్ ఆవరణ వరదనీటితో నిండి చెరువును తలపించింది. విద్యార్థులు మోకాలిలోతు నీటిలో బిక్కుబి క్కుమంటూ తరగతులకు వెళ్లాల్సి వచ్చింది. జిల్లాలో అత్యధికంగా అంతర్గాంలో 41.7 మి.మీ., అత్యల్పంగా సుల్తానాబాద్ మండలంలో 3.7 మి. మీ. వర్షపాతం నమోదైనట్లు ముఖ్యప్రణాళికశాఖ ఇన్చార్జి అధికారి రవీందర్ తెలిపారు. ఓసీపీల్లో నిలిచిన బొగ్గు ఉత్పత్తి గోదావరిఖని: రామగుండం రీజియన్లోని ఓసీపీ ల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఆర్జీ–1 ఏరియా లోని జీడీకే–5 ఓసీపీ, ఆర్జీ–2 ఏరియాలోని ఓసీ పీ–3, ఆర్జీ–3 ఏరియాలోని ఓసీపీ–1, 2లో హాలేజీ రోడ్లు జలమయం అయ్యాయి. బొగ్గు ఉత్పత్తితో పాటు ఓబీ వెలికితీ పనులు నిలిచిపోయాయి. మంగళవారం నమోదైన వర్షపాతం (మి.మీ.లలో) ప్రాంతం వర్షపాతం సరాసరి 15.6 ధర్మారం 21.3 పాలకుర్తి 25.9 రామగుండం 10.0 రామగిరి 13.8 కమాన్పూర్ 13.4 పెద్దపల్లి 18.1 జూలపల్లి 10.2 ఎలిగేడు 7.7 ఓదెల 16.6 శ్రీరాంపూర్ 11.7 ముత్తారం 10.8 మంథని 14.0 -
చిత్రం.. జ్ఞాపకాల పత్రం
● ఫొటోగ్రఫీ డే గురించి ఫ్రెంచ్ దేశస్తుడైన డాగురే 1839లో మొదటిసారి ఫొటోగ్రాఫీక్ ప్రాసెస్ కనిపెట్టి అదే సంవత్సరం ఆగష్టు 19న ప్రపంచానికి పరిచయం చేశాడు. సిల్వర్ అయొడైడ్ రసాయనంతో చిత్రానికి శాశ్వతత్వం కల్పించవచ్చని ప్రతిపాదించాడు. 1842 నుంచి 1880 మధ్య కాలంలో ఇండియలో ఫొటోగ్రఫీ పరిశ్రమ విస్తరించింది. ఆంధ్రప్రదేశ్లో మొదటి పోర్ట్రయిట్ స్టూడియోను దీన్ దయాళ్ కెన్నడీ అనే మహిళ స్థాపించింది. 1960 నాటికి స్టూడియో ఫొటోగ్రఫీ, 1980 నాటికి కంప్యూటర్తో కలర్ ఫొటోగ్రఫీ విస్తరించింది. రాజా త్రయంబక్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో మొదటి సారి 1957లో ఫొటోగ్రఫీ సొసైటీ ప్రారంభమైంది. ● ఉమ్మడి జిల్లా ప్రస్థానం 1940లో ఉమ్మడి జిల్లా కేంద్రం కరీంనగర్లో మొదటి ఫొటోస్టూడియో నెలకొల్పారు. ప్రతిష్టాత్మక ఫెలోషిఫ్ ఆఫ్ రాయల్ ఫొటోగ్రఫీ సొసైటీ(ఇంగ్లాండ్) సాధించిన ఉమ్మడి రాష్ట్రంలోనే ఏకై క వ్యక్తి కోరుట్లకు చెందిన ఫొటోగ్రాఫర్ బండి రాజన్బాబు. 1987లో నగ్న చిత్రాలపై థీసిస్ సమర్పించి రాయల్ ఫొటోగ్రఫీ సొసైటీ ఫెలోషిప్ పొందారు. జగిత్యాలకు చెందిన అల్లె శ్రీకాంత్, కోరుట్లకు చెందిన బండి వెంకటరమణ, కరీంనగర్కు చెందిన బాబురెడ్డి, వేణు, రాజు, సంపత్కుమార్, వాసు, గంగాధర్, సదానందం, ఆత్మారాం, వేములవాడకు చెందిన రాజయ్య, జగిత్యాలకు చెందిన రామ్మోహన్, సతీష్, సిరిసిల్లలో ఎం.సి. శేఖర్, బోడ రవీందర్, కోడం దేవేందర్, వంకాయల శ్రీకాంత్, కోరుట్లకు చెందిన నాగరాజు, రాజేశం, శేఖర్, మహేందర్, మారుతి, మెట్పల్లి రాము, మల్యాల శ్రీనులు, ఎల్లారెడ్డిపేటకు చెందిన ప్రభాకర్రెడ్డి, సిరిసిల్లకు చెందిన శంకర్ మరెందరో ఫొటోగ్రఫీలో సృజనాత్మకతను జోడించి రాష్ట్ర స్థాయి అవార్డులు పొందారు. ● ప్రీ వెడ్డింగ్ ఫొటోగ్రఫీ ఏ ఫంక్షన్ జరిగిన, ఎక్కడికి వెళ్లిన సెల్ఫోన్లతోనే ఫొటోలు, సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ప్రీ వెడ్డింగ్ ఫొటోగ్రఫీపై కొత్తగా జంటలు ఉత్సాహం చూపిస్తున్నారు. దేశవ్యాప్తంగా తమకు అనువైన ప్రాంతాలను ఎంపిక చేసుకుని ప్రీ వెడ్డింగ్ ఫొటోలతోపాటు పెళ్లి వేడుకలను ఫొటోగ్రాఫర్లతో తీయించుకుంటున్నారు. చరితకు చెరిగిపోని సాక్ష్యం నేడు ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం విద్యానగర్(కరీంనగర్)/సిరిసిల్ల: ఫొటో.. చెదిరిపోని జ్ఞాపకం. గతించిన కాలాన్ని కళ్ల ముందుంచే సాక్ష్యం. మదిలే మెదిలే భావాలను కళ్ల ముందు నిలిపే ఛాయాచిత్రం. ఫొటోగ్రఫీకి సృజనాత్మకత తోడైతే అద్భుత చిత్రాలు కళ్లముందుంటాయి. మదిని పులకింపజేసి.. మనుసును తట్టిలేపి.. మధురమైన అనుభూతులను పదిలం చేసేది ఫొటో. ప్రపంచ ఫొటోగ్రఫీ డే సందర్భంగా ఫొటోగ్రఫీలో వస్తున్న మార్పులు.. జిల్లా వాసుల ప్రతిభపై ప్రత్యేక కథనం. 1961 ప్రాంతంలో కరీంనగర్లో ఫొటో స్టూడియోలు ఏర్పాటయ్యాయి. కరీంనగర్లోని క్లాక్టవర్ వద్ద ఏవీఎం ఫొటో స్టూడియో, తిలక్రోడ్లో అజంతా ఫొటో స్టూడియోను ప్రారంభించారు. కరీంనగర్కు చెందిన ఏలేటి వేణుమాధర్రెడ్డి 1961 జనవరి 1న ఆయన పేరుతో ఏవీఎం స్టూడియో ప్రారంభించారు. మూడేళ్ల తర్వాత గురుదత్త నిర్మాత సారథ్యంలో ముంబైలో రూపొందిన మొదటి స్కొప్ సినిమాకు అసిస్టెంట్ కెమెరామెన్గా పనిచేశారు. బ్లాక్ అండ్ వైట్ మాన్యువల్ నుంచి 35 ఎంఎం మినియేచర్ ఫిలిం, కలర్ ప్రాసెసింగ్ కంప్యూటర్ వరకు కొనసాగారు. ఆయన వాడిన 1945 నాటి రోలిఫ్లెక్స్, ఎగ్జాక్ట, మన్య, కేబినేట్, ఫుల్సైజ్ల నెగెటివ్ల బాడీ కెమెరాలు ఇప్పటికి వాళ్ల ఇంట్లో భద్రంగా ఉన్నాయి. ఆయన నలుగురు కొడుకులు ఈ రంగంలోనే రాణిస్తున్నారు. నాడు రీళ్లతో ఫొటోలు తీసేవాళ్లం, సాంకేతిక ప్రగతిలో నేడు డిజిటల్ కెమెరాలు అందుబాటులోకి వచ్చాయి. సెల్ఫోన్ కెమెరాలు, ఇంటింటికీ కెమెరాలు వచ్చినప్పటికీ ఫొటో స్టూడియోలకు ఆదరణ తగ్గలేదు. రీళ్ల పద్ధతి పోయి, డిజిటల్ కెమెరాలు, ప్రింటింగ్ యంత్రాలు ప్రవేశించడంతో ఈ ప్రక్రియ పూర్తిగా సులభతరమైంది. – ఆవుల నరేశ్, ఫొటోగ్రాఫర్, జ్యోతినగర్, కరీంనగర్ మా చిన్నప్పుడు ఫొటో అంటే ఓ క్రేజ్. ఏదైనా ఫంక్షన్ జరిగితే ఫొటోగ్రాఫర్ వచ్చి ఫొటోలు తీయడం, స్టూడియోకి వెళ్లి ఫొటోలు దిగడం చాలా కొత్తగా అనిపించేది. ఇప్పుడు సెల్ఫోన్లో అన్ని ఫంక్షన్లు, అన్ని సందర్భాల్లో ఫొటోలు తీసుకోవడం, మెమొరీ కార్డుల్లో భద్రపరచుకుంటున్నాం. – పల్లెర్ల శ్రీనివాస్, అశోక్నగర్, కరీంనగర్ సిరిసిల్లకు చెందిన ఫొటోగ్రాఫర్ మేర్గు చంద్రశేఖర్(ఎంసీ శేఖర్)కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. దక్షిణాఫ్రికా పర్యాటక గిరిజనశాఖ, ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ డిలా ఆర్ట్ ఆఫ్ ఫొటోగ్రఫీలు సంయుక్తంగా నిర్వహించిన ప్రపంచస్థాయి పోటీల్లో శేఖర్ తీసిన ‘హార్టీస్మైల్’ బంగారు పతకం సాధించింది. అంతకుముందే శేఖర్ దశాబ్దకాలంగా గిరిజన జీవనశైలిపై, సామాజిక అంశాలపై ఫొటోలు తీసి పురస్కారాలు అందుకున్నారు. హైదరాబాద్ కేంద్రంగా సిగ్మా ఫొటోగ్రఫీ అకాడమీ స్థాపించారు. ఔత్సాహికులైన ఫొటోగ్రాఫర్లకు శిక్షణ ఇస్తున్నారు. ఇటీవల సాలర్జంగ్ మ్యూజియంలో రాష్ట్రస్థాయి ఫొటో వర్క్షాప్ నిర్వహించారు. ఎం.సీ.శేఖర్ తీసిన ఫొటోలకు 98 జాతీయ, అంతర్జాతీయ అవార్డులు దక్కాయి. విద్యానగర్(కరీంనగర్): కరీంనగర్ జిల్లా లక్ష్మీపూర్కు చెందిన దాసరి మల్లేశ్ కరీంనగర్ పోలీస్ కమిషనరేట్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాడు. చిన్నప్పటి నుంచి ఫొటోగ్రఫీపై మక్కువ పెంచుకున్న మల్లేశ్ ఫొటోగ్రఫీలోని మెలకువలను నేర్చుకొని.. తీరక సమయంలో తన కళాభిరుచిని తీర్చుకుంటున్నారు. ఫొటో వర్క్షాప్లలో పాల్గొని అద్భుత ఫొటోలు తీసి బహుమతులు అందుకున్నారు. పల్లె ప్రజల జీవన విధానం, సంస్కృతి సంప్రదాయాలపై తీసిన ఫొటోలకు ప్రశంసలు అందుకున్నారు. ఇటీవల జరిగిన జోనల్స్థాయి పోలీస్ డ్యూటీ మీట్లో ఫొటోగ్రఫీ విభాగంలో కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం చేతుల మీదుగా మూడో బహుమతి అందుకున్నారు. -
రాజీవ్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం
● వేగంగా దూసుకొచ్చి బస్సును ఢీకొట్టిన కారు ● నుజ్జునుజ్జయిన వాహనం.. వేలాడిన మృతదేహం తిమ్మాపూర్: తిమ్మాపూర్ మండలం ఇందిరానగర్ స్టేజీ సమీపంలో సోమవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందగా.. మరో నలుగురు గాయపడ్డారు. స్థానికుల కథనం.. కరీంనగర్ నుంచి కొంగారి మృత్యుంజయ్ (32) భార్య, కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ వెళ్తున్నారు. ముందున్న మరో వాహనాన్ని ఓవర్టేక్ చేసే ప్రయత్నంలో రోడ్డుపై కారు అదుపుతప్పింది. డివైడర్ అవతలివైను ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు సగం బస్సు కిందికి చొచ్చుకుపోయింది. డ్రైవర్ పక్కసీట్లో కూర్చున్న మృత్యుంజయ్ అక్కడిక్కడే చనిపోయాడు. సమాచారం అందుకున్న ఎల్ఎండీ ఎస్ఐ శ్రీకాంత్ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని, స్థానికుల సహాయంతో మృతదేహాన్ని కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ట్రాఫిక్ను పోలీసులు క్లియర్ చేశారు. క్షతగాత్రులను ఆస్పత్రిలో చేర్పించారు. మృతుడు మత్యుంజయ్ హైదరాబాద్కు చెందిన వాడు. ఈయన ఇటీవల కులాంతర వివాహం చేసుకున్నట్లు సమాచారం. బహిరంగ ప్రదేశంలో కోడె టికెట్లు ?● ఉద్యోగుల తీరుపై అనుమానాలు వేములవాడ: రాజన్న ఆలయంలో ప్రధాన మొక్కు అయిన కోడె టికెట్లు ఆలయం బయట ప్రదేశంలోకి రావడం కలకలం రేపాయి. కోడెమొక్కు చెల్లించే భక్తులు రూ.200 పెట్టి టికెట్ కొని కోడెతో ప్రదక్షిణ చేసి ప్రధాన ద్వారానికి ఎదురుగా కట్టేస్తారు. ఈక్రమంలో కోడె టికెట్లు పరిశీలించేందుకు రెండు చెక్పోస్టులను ఏర్పాటు చేశారు. అక్కడ విధులు నిర్వర్తించే సిబ్బంది కోడె టికెట్లు తీసుకుని చించివేస్తారు. అయితే ఆ చించివేసిన టికెట్లు సోమవారం ఆలయంలోని స్వామి వారి ఓపెన్స్లాబ్పై దర్శనమిచ్చాయి. ఇక్కడి ఎలా వచ్చాయని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఆలయ ఉద్యోగులే రీసైక్లింగ్ చేస్తూ డబ్బులు దండుకునేందుకు ఇలా తెచ్చి ఉంటారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై ఈవో రాధాభాయి మాట్లాడుతూ గతంలో ఈ టికెట్లను ఓపెన్స్లాబ్పై వేసి ఉంటారని, ఇక్కడ విధులు నిర్వహించే సిబ్బందిని విచారించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇసుక వివాదం..మెట్పల్లి రూరల్: ఇసుక విషయమై జరిగిన వివాదంపై మెట్పల్లి పోలీసులు నలుగురిపై అట్రాసిటీ కేసు నమోదు చేశారు. పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ గోదాంలో ఈనెల 10న అగ్నిప్రమాదం చోటుచేసుకున్న విషయం తెల్సిందే. ప్రమాదంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగగా.. అగ్నిమాపక శాఖ అధికారులు మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినా రెండు రోజులైనా అదుపులోకి రాలేదు. యార్డులో గన్నీసంచులు కాలుతుండగా వాటిపై ఇసుక పోసి మంటలు ఆర్పాలని అధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగా ఆత్మకూర్ పెద్దవాగు నుంచి ఈనెల 12న ట్రాక్టర్లలో ఇసుక తరలించారు. ఆ సమయంలో పలువురు ట్రాక్టర్లను అడ్డుకుని వివాదం చేశారు. అక్కడే ఉన్న తనను కులం పేరుతో దూషిస్తూ దుర్భషలాడారని వీడీసీ చైర్మన్ రమేశ్ మెట్పల్లి పోలీస్ స్టేషన్లో నలుగురిపై ఫిర్యాదు చేశాడు. దీంతో గ్రామానికి చెందిన తాటిపెల్లి సురేశ్రెడ్డి, తిప్పిరెడ్డి శ్రీనివాస్రెడ్డి, కేశిరెడ్డి నవీన్రెడ్డి, శోభపై పోలీసులు అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఈ మేరకు మెట్పల్లి డీఎస్పీ రాములు సోమవారం ఆత్మకూర్కు వెళ్లి విచారణ జరిపారు. ఆయన వెంట మెట్పల్లి ఎస్సై కిరణ్కుమార్ ఉన్నారు. సంఘటనా స్థలంలో మృత్యుంజయ్ మృతదేహం ఎలక్ట్రికల్ బస్సును ఢీకొన్న కారు -
ప్రభుత్వం భరించాలి
చెరుకు రైతులపై పడే రవాణా భారాన్ని ప్రభుత్వం భరించాలి. చెరుకు పండిస్తే మాకు ఆదాయం కాకుండా ఖర్చులు మిగులుతున్నాయి. త్వరగా ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని ప్రారంభించి చెరుకు రైతులకు అండగా ఉండాలి. – మామిడి మహేందర్రెడ్డి, తొంబరావుపేట, మేడిపల్లి చెరుకు పంటపై మమకారం చంపుకోలేక సాగు చేస్తున్నాం. ఇక్కడ ఫ్యాక్టరీ ప్రారంభం కాకపోవడంతో కామారెడ్డికి తరలించాల్సి వస్తోంది. రవాణా భారం, కటింగ్ వంటి అనేక సమస్యలను ఎదుర్కొంటున్నాం. – పీసు రాజేందర్రెడ్డి, మూడుబొమ్మల మేడిపల్లి, మెట్పల్లి -
చెరుకు రైతుకు రవాణా భారం
జగిత్యాలఅగ్రికల్చర్: జిల్లాలో ఏకై క ముత్యంపేట చెరుకు ఫ్యాక్టరీని ప్రారంభించాలని రైతులు ఏళ్ల తరబడి కోరుతున్నా.. పాలకులు మాత్రం పట్టించుకోవడం లేదు. ఐదేళ్లకోసారి ప్రభుత్వాలు మారుతున్నా.. చక్కెర ఫ్యాక్టరీ మాత్రం ప్రారంభం కావడం లేదన్నది ఇక్కడి రైతుల వేదన. దీంతో చెరుకు పంటపై మమకారం చంపుకోలేక.. రైతులు ఇతర జిల్లాలో ఉన్న ప్రైవేట్ చెరుకు ఫ్యాక్టరీతో ఒప్పందాలు చేసుకొని చెరుకును సాగు చేస్తున్నారు. ఇదే అదునుగా భావించిన ప్రైవేట్ చక్కెర ఫ్యాక్టరీ సైతం చెరుకు రైతులకు అవసరమైన సదుపాయాలను కల్పించలేక నిర్లక్ష్యం చూపుతోంది. ఈ నేపథ్యంలో ముత్యంపేట చెరుకు ఫ్యాక్టరీని ప్రారంభించాలని, అప్పటివరకు చెరుకు రైతులపై పడే రవాణా భారాన్ని ప్రభుత్వం భరించాలని చెరుకు రైతులు ఇటీవల జగిత్యాలకు వచ్చిన మంత్రులు శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మన్కుమార్, వివేక్ వెంకటస్వామికి వినతిపత్రం అందించారు. 1,500 ఎకరాల్లో సాగు జిల్లాలో సాగునీటి వనరులు పుష్కలంగా ఉండడంతో.. ప్రస్తుతం చెరుకు పంటను దాదాపు 1,500 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ఒకప్పుడు 10వేల ఎకరాలకు పైగా చెరుకు పంట ఉన్నా.. ఫ్యాక్టరీ మూసేయడంతో విస్తీర్ణం తగ్గిపోయింది. గతంలో జిల్లాలో ఉన్న చెరుకు ఫ్యాక్టరీ ప్రభుత్వానిది కావడంతో.. పంట సాగు చేసే రైతులకు ఎరువులు, విత్తనం, కటింగ్, రవాణా వంటి వాటిపై ప్రోత్సాహకాలు అందించేది. ఇప్పుడు జిల్లాలో చెరుకు సాగు చేసే రైతులు కామారెడ్డి జిల్లాలో ఉన్న ప్రైవేట్ షుగర్ ప్యాక్టరీకి చెరుకును పంపిస్తుండడంతో.. రైతులకు ప్రోత్సాహకాలు ఇవ్వకపోగా, లేనిపోని నిబంధనలు పెట్టి జిల్లా రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. రవాణా భారం.. ప్రైవేట్ ఫ్యాక్టరీ ఎలాంటి సబ్సిడీలు ఇవ్వకపోయినా.. చెరుకు పంటపై ఆసక్తితో చెరుకును సాగు చేసిన రైతులకు రవాణా భారం పెద్ద సమస్యగా మారింది. జిల్లా నుంచి కామారెడ్డి చక్కెర ఫ్యాక్టరీ కనీసం 150 కి.మీ. వరకు ఉంటుంది. గతంలో ముత్యంపేట ఫ్యాక్టరీ వారు 15 కి.మీ. వ్యాసార్థంలో రవాణా భారం వేసేవారు కాదు. 15 కి.మీ. తర్వాత ఉన్న రైతులు ఎంతో కొంత మొత్తం చెల్లించేవారు. ఇప్పుడు జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో చెరుకు సాగు చేసేవారు కామారెడ్డికి లారీల్లో చెరుకు తరలించడం పెద్ద సమస్యగా మారింది. ప్రస్తుతం రైతులు చెరుకును కామారెడ్డి ప్రైవేట్ ఫ్యాక్టరీకి తరలించేందుకు టన్నుకు దాదాపు రూ.700 వరకు అదనంగా ఖర్చు పెట్టాల్సి వస్తోంది. ఇలా దాదాపు జిల్లా చెరుకు రైతులు రవాణా పేరిట రూ.4.50కోట్ల వరకు నష్టపోతున్నారు. దిగుబడులు ఘనం.. వచ్చేది స్వల్పం ఇక్కడి చెరుకు రైతులు అన్ని రకాల యాజమాన్య పద్ధతులు పాటించడంతో ఎకరాకు 40 టన్నుల వరకు దిగుబడి సాధిస్తున్నారు. ప్రస్తుతం చెరుకు టన్ను ధర రూ.3,470 వరకు ఉండగా, అందులో చెరుకు కటింగ్ కోసం కూలీలకు టన్నుకు రూ.860, రవాణా కోసం టన్నుకు రూ.700 వరకు ఖర్చు చేస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చు. పంటకు అవసరమైన రసాయన ఎరువులు, కలుపు వంటి వాటి కోసం మరింత ఖర్చు చేయాల్సి వస్తోంది. దీంతో ఇతర ప్రాంతాలకు చెరుకు తరలించడం వల్ల రైతులకు పెద్దగా మిగిలింది ఏమీ లేదు. ఫ్యాక్టరీ ప్రారంభం కాక అదనపు ఖర్చులు టన్నుకు రూ.700 వరకు భారం ఆదుకోవాలని రాష్ట్ర మంత్రులకు విన్నపాలు -
ఇంట్లో జారిపడి వ్యక్తి మృతి
జగిత్యాలక్రైం: జిల్లాకేంద్రంలోని గంజ్రోడ్ ప్రాంతానికి చెందిన మహ్మద్ అతిక్ (38) తన ఇంట్లో ప్రమాదవశాత్తు కాలుజారి పడి మృతిచెందాడు. అతిక్ ఆదివారం సాయంత్రం తన ఇంట్లో కాలుజారి పడగా తలకు తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు కరీంనగర్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు చికిత్స అందించినా ఫలితం లేకుండాపోయింది. చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చిగురుమామిడి: మండలంలోని గాగిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీలో పని చేస్తు న్న జుట్టు స్వామి విషజ్వ రంతో సోమవారం మృతిచెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. స్వామి వారంరోజులు కరీంనగర్లోని ఓ ఆసుపత్రిలో చికిత్సపొందాడు. అయినా జ్వరం తగ్గలేదని తెలిపారు. జగిత్యాలక్రైం: జగిత్యాల రూరల్ మండలం వెల్దుర్తి గ్రామానికి చెందిన బందెల రాజశేఖర్ (35) అనే వ్యక్తి ఒంటరితనం భరించలేక మనస్తాపానికి గురై ఆదివారం రాత్రి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వెల్దుర్తి గ్రామానికి చెందిన బందెల రాజశేఖర్ భార్య మూడు నెలల క్రితం అనారోగ్యంతో మరణించింది. అప్పటి నుంచి రాజశేఖర్ ఒంటరితనంతో బాధపడుతూ తీవ్ర ఆందోళనలో ఉన్నాడు. ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి తల్లి బందెల గంగు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్సై సదాకర్ తెలిపారు. రెండు ఆలయాల్లో చోరీవీణవంక: మండలంలోని కోర్కల్ గ్రామంలో ఆదివారం రాత్రి రెండు ఆలయాల్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. గ్రామ శివారులోని రేణుక ఎల్లమ్మ ,పెద్దమ్మ తల్లి ఆలయాల్లో రెండున్నర తులాల బంగారం, 59తులాల వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లారు. క్లూస్ టీం రంగంలోకి దిగి ఆధారాలు సేకరించారు. గ్రామస్తుడు పూదరి కృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తిరుపతి తెలిపారు. జగిత్యాలజోన్: సెల్ఫోన్లో మాట్లాడుకుంటూ.. వాహనాన్ని అజాగ్రత్తగా.. నిర్లక్ష్యంగా నడిపి ఒకరి మృతికి కారణమైన ట్యాక్సీ డ్రైవర్కు రెండేళ్ల జైలు శిక్షతోపాటు రూ.3వేల జరిమానా విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.రత్నపద్మావతి సోమవారం తీర్పు చెప్పారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ జంగిలి మల్లికార్జున్ కథనం ప్రకారం.. జగిత్యాల రూరల్ మండలం తిమ్మాపూర్కు చెందిన 12 మంది మహిళలు రాయికల్ మండలం కుమ్మరిపల్లిలో జరిగిన ఓ శుభకార్యానికి ఓ మినీటాక్సీలో వెళ్లారు. మోరపల్లి శివారులో డ్రైవర్ పరాంకుశంవంశీకృష్ణ సెల్ఫోన్ మాట్లాడుతూ.. వాహనాన్ని అజాగ్రత్తగా నడిపి రోడ్డుపక్కనున్న కల్వర్టును ఢీ కొట్టాడు. ఈ ఘటనలో ఆటోలో ఉన్న తోట్ల గంగవ్వ అక్కడికక్కడే చనిపోయింది. మిగతావారు గాయపడ్డారు. దీనిపై బాధితురాలు రాధ ఫిర్యాదు మేరకు అప్పటి జగిత్యాల రూరల్ ఎస్సై చిరంజీవి కేసు నమోదు చేశారు. సీఐ కృష్ణకుమార్ దర్యాప్తు చేసి కోర్టులో చార్జీషీట్ దాఖలు చేసారు. కోర్టు మానిటరింగ్ అధికారులు ఎం.కిరణ్కుమార్, కె. నరేశ్ సాక్ష్యాలను కోర్టులో ప్రవేశపెట్టడంతో వంశీకృష్ణకు రెండేళ్ల జైలు, జరిమానా విధించారు. ● ఉద్యోగుల తీరుపై అనుమానాలు వేములవాడ: రాజన్న ఆలయంలో ప్రధాన మొక్కు అయిన కోడె టికెట్లు ఆలయం బయట ప్రదేశంలోకి రావడం కలకలం రేపాయి. కోడెమొక్కు చెల్లించే భక్తులు రూ.200 పెట్టి టికెట్ కొని కోడెతో ప్రదక్షిణ చేసి ప్రధాన ద్వారానికి ఎదురుగా కట్టేస్తారు. ఈక్రమంలో కోడె టికెట్లు పరిశీలించేందుకు రెండు చెక్పోస్టులను ఏర్పాటు చేశారు. అక్కడ విధులు నిర్వర్తించే సిబ్బంది కోడె టికెట్లు తీసుకుని చించివేస్తారు. అయితే ఆ చించివేసిన టికెట్లు సోమవారం ఆలయంలోని స్వామి వారి ఓపెన్స్లాబ్పై దర్శనమిచ్చాయి. ఇక్కడి ఎలా వచ్చాయని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఆలయ ఉద్యోగులే రీసైక్లింగ్ చేస్తూ డబ్బులు దండుకునేందుకు ఇలా తెచ్చి ఉంటారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై ఈవో రాధాభాయి మాట్లాడుతూ గతంలో ఈ టికెట్లను ఓపెన్స్లాబ్పై వేసి ఉంటారని, ఇక్కడ విధులు నిర్వహించే సిబ్బందిని విచారించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
సమన్వయ లోపమే కారణమా?
గోదావరిఖని: వరుస లాభాలు సాధిస్తున్న రామ గుండం ఎరువుల కర్మాగారం(ఆర్ఎఫ్సీఎల్) కొంతకాలంగా యూరియా ఉత్పత్తిలో వెనుకబడుతోంది. తరచూ మరమ్మతులతో షట్డౌన్ కావడంతో అమోనియా, యూరియా ఉత్పత్తి నిలిచిపోతోంది. యూరియా కొరతను అధిగమించేందుకే.. రాష్ట్ర అవసరాలు తీర్చుతూ, కొరతను అధిగమించ డం ధ్యేయంగా రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కె మికల్స్ లిమిటెడ్(ఆర్ఎఫ్సీఎల్)ను 17 ఫిబ్రవరి 2015న ఎఫ్సీఐ పాతస్లాంట్ స్థానంలో స్థాపించా రు. ప్రతీరోజు 2,200 మెట్రిక్ టన్నుల అమ్మోని యా, 3,850 మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి లక్ష్యంగా డిజైన్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేట్ భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన ప్లాంట్లో తరచూ మరమ్మతు చోటుచేసుకుని ఉత్పత్తిపై ప్రభా వం చూపుతోంది. ప్రధానంగా అమ్మోనియా పైపు లైన్ల లీకేజీలతో ఉత్పత్తికి విఘాతం కలుగుతోంది. ఇలాంటి సమస్యలు గతంలో ఎదురైనా.. ఈసారి మరమ్మతులకు అధిక సమయం తీసుకుంటోంది. దూరంలో కార్పొరేట్ కార్యాలయం ఆర్ఎఫ్సీఎల్ కార్పొరేట్ కార్యాలయం ఢిల్లీలో నో యిడాలో ఉంది. దీంతో ప్లాంట్లో ఏదైనా సమస్య తలెత్తితే ఢిల్లీలోని ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకోవడంలో జాప్యం జరుగుతోంది. అంతేకాకుండా మరమ్మతులు నిర్వహించే ఇంజినీర్లు అందుబాటు లో ఉండడంలేదు. దీంతో సమస్య జటిలంగా మారుతోంది. గ్యాస్ ఆధారితంగా నడిచే ప్లాంట్లో ఎలాంటి సాంకేతిక సమస్యలు ఏర్పడినా ఇతర ప్రాంతాల నుంచి నిపుణులను రప్పించడం కష్టంగా మారుతోంది. ఐదు నెలల్లో మూడుసార్లు లీకేజీ.. గత ఐదునెలల్లో ప్లాంట్లో మూడుసార్లు యూరి యా, అమ్మోనియం ఉత్పత్తికి విఘాతం కలిగింది. గత మే 8 నుంచి జూన్ 15 వరకు ఉత్పత్తి నిలిచిపోయింది. జూలై 16 నుంచి ఆగస్టు 4 వరకు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. ఆగస్టు 14 నుంచి అమ్మోనియం లీకేజీతో ప్లాంట్ట్ షట్డౌన్లో ఉంది. అ మ్మోనియా పైపులైన్ లీకేజీలతె ఉత్పత్తి నిలిపివేయాల్సి వస్తోంది. వార్షిక మరమ్మతుల సమయంలోనూ సమయం అధికంగా తీసుకుంటోంది. అయినా, శాశ్వత ప్రాతిపదికన పనులు చేయడం లేదనే విమర్శలు ఉన్నాయి. 20వేల టన్నులే సరఫరా ఈఏడాది ఇప్పటి వరకు 65వేల టన్నులకు గాను 20వేల టన్నులను మాత్రమే రాష్ట్రానికి అందించింది. వరి సాగు మొదలైన క్రమంలో యూరియా ఉత్పత్తికి విఘాతం కలుగడం రైతాంగాన్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సైతం సీరియస్గా ఉంది. ఈక్రమంలో రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాగూర్ మూడు రోజుల క్రితం ఆర్ఎఫ్సీఎల్ ఫ్లాంట్ సందర్శించి ప్లాంట్లో ఉత్పత్తి నిలిచిపోవడానికి గల కారణాల గురించి అడిగి తెలుసుకున్నారు. మూడేళ్లలో సాధించిన వార్షిక లాభాలు(రూ.కోట్లలో) ఏడాది వార్షికాదాయం నికర లాభం 2022–23 4,586 8.59 2023–24 4,941 328.13 2024–25 5,291 413.30సీబీఐతో విచారణ జరపాలి ప్లాంట్ నిర్వహణపై ఆర్ఎఫ్సీఎల్ యాజమా న్యం తీరు అనుమానాస్పదంగా ఉంది. ఉత్పత్తి గురించి పట్టించుకోవడమే లేదు. ప్రమాదకరమైన అమ్మోనియా లీకేజీతో కార్మికులకు ప్ర మాదం పొంచిఉంది. షట్డౌన్ అయిన ప్రతీ సారి కార్పొరేట్ కార్యాలయం నుంచి ఉన్నతాధికారులు వచ్చి నిర్ణయం తీసుకోవడంతో జా ప్యమవుతోంది. రైతులకు సకాలంలో యూరి యా అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఆర్ఎఫ్సీఎల్ లక్ష్యం అందుకోలేకపోతోంది. వీటన్నింటిపైనా సీబీఐ విచారణ జరిపించాలి. – రాజ్ఠాకూర్, ఎమ్మెల్యే, రామగుండంఉద్దేశపూర్వకంగా షట్డౌన్? ఆర్ఎఫ్సీఎల్ యాజమాన్యం ఉద్దేశపూర్వకంగా ప్లాంట్ను షట్డౌన్ చేస్తోందా? లేక తరచూ మరమ్మతులకు గురవుతోందా? అనే విషయంపై స్పష్టతకోసం రాజకీయ నేతలు పట్టుబడుతున్నారు. వార్షిక మరమ్మతులు పూర్తిచేసుకున్న తర్వాత కొద్దిరోజుల పాటు సజావుగానే ఉత్పత్తి సాగుతున్నా.. ఆ తర్వాతే షట్డౌన్ కావడంతో రైతులకు సకాలంతో యూరియా అందించలేకపోతున్నారు. -
రైతులూ.. ఆందోళన వద్దు
సాక్షి, పెద్దపల్లి: ‘జిల్లా అవసరాలకు సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయి.. గతేడాదికన్నా 6,000 మెట్రిక్ టన్నులు అధికంగానే పంపిణీ చే శాం.. రైతులు ఆందోళన చెందొద్దు’ అని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నాపారు. యూరియా లభ్యత, టామ్కామ్, ఏటీసీ, ఐటీఐ సీట్లు, టాస్క్ ఇందిర మ్మ ఇళ్లు, రేషన్కార్డుల జారీ తదితర అంశాలపై సోమవారం కలెక్టరేట్లో మీడియా సమావేశంలో మాట్లాడారు. వానాకాలం పంటలకు 28 వేల మె ట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా, ఇప్పటివరకు 19 వేల మెట్రిక్ టన్నులు పంపిణీ చే శామన్నారు. ప్రస్తుతం 2,500 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉందని తెలిపారు. త్వరలో మ రో 300 మెట్రిక్ టన్నులు, ఈనెల 24న మరో వంద మెట్రిక్ టన్నులు ఆర్ఎఫ్సీఎల్ నుంచి వ స్తుందని తెలిపారు. రైతులు అవసరం మేరకే కొ నుగోలు చేయాలని కోరారు. పదిరోజుల్లో ఆర్ఎఫ్సీఎల్ నుంచి 1,500 మెట్రిక్ టన్నులు ప్రత్యేకంగా తెప్పించామన్నారు. ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లోంచి మహారాష్ట్రకు కొంత అక్రమంగా తరలివెళ్తోందని, ముందుజాగ్రత్తగా మన జిల్లాలో కూడా చెక్పోస్ట్లు ఏర్పాటు చేసి అక్రమ రవాణాను అడ్డుకుంటామని తెలిపారు. వెంటనే బిల్లులు మంజూరు జిల్లాకు 6,400పైగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని, ఇప్పటివరకు 3,926 మంది ముగ్గుపోశారని, 1,466 వరకు బేస్మెంట్ స్థాయిలో ఉన్నా యని కలెక్టర్ తెలిపారు. ఆధార్ ఆధారంగా ప్రతీ సోమవారం లబ్ధిదారు బ్యాంకు ఖాతాల్లో బిల్లు డబ్బులు జమ అవుతున్నాయన్నారు. ఇలా ఇప్పటివరకు రూ.19.52 కోట్లు జమచేశామన్నారు. ఇ ళ్ల నిర్మాణం ప్రారంభించేందుకు స్వశక్తి మహిళా సంఘాల నుంచి రూ.4.9కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలు అందించామని, సభ్యత్వం లేని 10 కుటుంబాలకు కలెక్టరేట్ నుంచి రూ.లక్ష చొప్పు న రుణం మంజూరు చేశామని వివరించారు. కొత్తగా 12,165 కుటుంబాలకు రేషన్కార్డులు జా రీచేశామని, మరో 30 వేల మంది సభ్యులను రే షన్ పరిధిలోకి చేర్చామని అన్నారు. మీసేవ, ప్ర జాపాలన దరఖాస్తులనూ పరిశీలిస్తున్నామని, దీనిని నిరంతరం కొనసాగిస్తామని తెలిపారు.విదేశాల్లో ఉపాధి అవకాశాల కోసం అగ్నివీర్ ద్వారా సైన్యంలో ఉద్యోగావకాశా లు కల్పించేందుకు 200 మంది ఆసక్తిగల అ భ్యర్థులకు సింగరేణి, ఎన్టీపీసీ సహకారంతో ఉచి తంగా శిక్షణ అందిస్తున్నామని కలెక్టర్ శ్రీహర్ష తెలిపారు. టామ్కామ్ ద్వారా విదే శాల్లోనూ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని వెల్లడించారు. ఇందుకోసం ఈనెల 26న కలెక్టరేట్లో అవగాహన కల్పిస్తామని, యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. డిగ్రీ, ఇంజినీరింగ్ పాసైన యువత ముందుకు వచ్చి టాస్క్ కోర్సుల్లో తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. ఐటీఐ, ఏటీసీల్లో ఆధునిక యంత్రాలను అందుబాటులో ఉంచామని, సీట్ల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. ఈ కోర్సులు పూర్తిచేసిన యువతకు ఉపాధి అవకాశాలు ఉంటాయని వివరించారు. భారీవర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్త్తంగా ఉందని కలెక్టర్ తెలిపారు. -
అర్జీలు పెండింగ్లో ఉంచొద్దు
పెద్దపల్లిరూరల్: జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు ప్రతీ సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణి ద్వారా అందిస్తున్న అర్జీలకు సత్వర పరిష్కారం చూపాలని, ఎట్టిపరిస్థితుల్లోనూ పెండింగ్లో ఉంచొద్దని కలెక్టర్ శ్రీహర్ష ఆదేశించారు. సోమవారం అడిషనల్ కలెక్టర్ వేణుతో కలిసి కలెక్టరేట్లో ప్రజావాణి ద్వారా కలెక్టర్ వినతులు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడారు. సమస్యలపై తక్షణమే స్పందించాలని కలెక్టర్ సూచించారు. ఆత్మహత్యాయత్నంతో కలకలం.. ప్రజావాణి ద్వారా తన సమస్యను కలెక్టర్ ఇతర ఉన్నతాధికారులకు విన్నవించేందుకు కాల్వశ్రీరాంపూర్ మండలం కిష్టంపేట నుంచి వచ్చిన బండి సతీశ్ ఒక్కసారిగా క్రిమిసంహారకమందు తాగి ఆత్మహత్యకు యత్నించడం కలకలం రేపింది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది సతీశ్ను బయటకు తీసుకెళ్లి అంబులెన్సులో జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న సతీశ్ ఆరోగ్యపరిస్థితి నిలకడగానే ఉందని సూపరింటెండెంట్ శ్రీధర్ తెలిపారు. -
ముసురేసింది
సాక్షి పెద్దపల్లి: జిల్లావ్యాప్తంగా మూడురోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వానపడుతోంది. వాగులు, చెక్డ్యాంలు వరదతో పరవళ్లు తొక్కుతున్నాయి. చెరువులకు భారీగా వరదనీళ్లు వచ్చిచేరుతున్నాయి. గోదావరి నదితోపాటు మానేరులో నీటి ప్రవాహం పెరిగింది. ఎగువన కురుస్తున్న వర్షాలతో ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద భారీగా వస్తోంది. చెరువులు, వాగుల్లోనీరు చేరుతుండటంతో రైతులు సాగు పనులు ముమ్మరం చేశారు. మరికొద్ది రోజులు భారీవానలు కురిస్తే అన్ని చెరువులు మత్తడిదూకే అవకాశం ఉంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. పాఠశాలలకు వెళ్తున్న విద్యార్థులు మొదలు.. ఉద్యోగుల వరకూ.. ఇబ్బంది పడుతున్నారు. గొడుగులు పట్టుకుని ప్రయాణం చేస్తున్నారు. జోరువానల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా అధికార యంత్రాంగం సూచిస్తోంది. ఇంకా 16శాతం లోటు.. జిల్లాలోని 7 మండలాలు మినహా మిగతా ప్రాంతాల్లో సాధారణానికి మించి వానాలు కురిశాయి. ధర్మారం, రామగుండం, రామగిరి, పెద్దపల్లి, జూలపల్లి, ఎలిగేడు, మంథని మండలాల్లో ఇంకా లోటు వర్షపాతమే నమోదయ్యింది. ఈసీజన్లో ఇప్పటివరకు 582.5 మి.మీ. వర్షపాతం నమోదు కావాల్సి ఉంది. కానీ, 16శాతం లోటుతో 491.4 మి.మీ. వర్షపాతం నమోదైంది. జిల్లా వ్యాప్తంగా 1,018 చెరువులుండగా 210 చెరువులు మత్తడి దూకుతున్నాయి. మరో 512 చెరువులు మత్తడి పోసేందుకు సిద్ధంగా ఉన్నాయి. నిండుకుండలా ‘గుండారం’ కమాన్పూర్(మంథని): కమాన్పూర్, రామగిరి, ముత్తారం, మంథని మండలాల పరిధిలోని ఆయకట్టకు సాగునీరు అందించే గుండారం రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటి నిల్వలతో నిండుకుండలా మారింది. కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలు, ఎస్సారెస్పీ నీటి విడుదల, గౌరీగుండం జలపాతం వరదనీటితో రిజర్వాయర్ జలకల సంతరించుకుంది. రిజర్వాయర్ నీటిమట్టం 12 అడుగులకు చేరిందని అధికారులు తెలిపారు. చెరువులకు జలకళ మంథనిరూరల్: గుంజపడుగు, నాగారం, విలోచవరం, కన్నాల, పుట్టపాక, ఉప్పట్ల గ్రామాల్లోని చెరువులు మత్తడి దూకుతున్నాయి. మొన్నటి వరకు నీళ్లు లేక వెలవెలబోయిన చెరువులు వరదనీటితో కళకళలాడుతున్నాయి. మానేరు ఉధృతం ఓదెల(పెద్దపల్లి): కనగర్తి, మడక, గుంపుల, పేట, కనగర్తి, ఇందుర్తి తదితర తీర ప్రాంతాల్లోని మానేరు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఇటీవల ఇసుక తిన్నెలతో కనిపించిన ఏరు.. అకస్మాత్తుగా నీటితో జలకళ సంతరించుకోవడంతో స్థానికులతోపాటు రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు.. మానేరు అవతలి వ్యవసాయ పొలాలకు వెళ్లే రైతులు ఎక్కడికి అక్కడే ఆగిపోయారు. పొత్కపల్లి ఎస్సై రమేశ్ గ్రామస్తులను అప్రమత్తం చేస్తున్నారు. ‘ఎల్లంపల్లి’ గేట్లు మళ్లీ ఎత్తివేత రామగుండం: ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లను సోమవారం మరోసారి ఎత్తి దిగువన ఉన్న గోదావరిలోకి నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువన ఉన్న శ్రీరాంసాగర్, కడెం ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేయడంతో ఆదివారం రాత్రి నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి వరద భారీస్థాయిలో వచ్చిచేరుతోంది. నీటిపారుదల శాఖ అధికారులు పర్యవేక్షిస్తూ ఉధృతికి అనుగుణంగా గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా ప్రస్తుతం 16.70 టీఎంసీలకు చేరింది. ప్రాజెక్టులోకి 78 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా, హైదరాబాద్కు 295 క్యూసెక్కులు, ఎన్టీపీసీకి 121 క్యూసెక్కులు, నంది పంపుహౌస్కు 3,150 క్యూసెక్కులు ఎత్తిపోస్తున్నారు. ప్రాజెక్టు 32 గేట్లు ఎత్తి 1,65,632 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. దీంతో గోదావరి నదికి వరద పోటెత్తింది.జిల్లాలో సోమవారం నమోదైన వర్షపాతం(మి.మీ.లలో) ధర్మారం 15.1 పాలకుర్తి 24.6అంతర్గాం 19.3 రామగుండం17.1 రామగిరి 28.2 కమాన్పూర్ 28.0 మంథని 17.2 జూలపల్లి(పెద్దపల్లి): వడ్కాపూర్ శివచెరువు, పెద్దాపూర్ పెద్దచెరువు, తెలుకుంట రామప్పచెరువు నీటితో కళకళలాడుతున్నాయి. భారీవర్షాలకు తోడు ఎస్సారెస్పీ డీ– 83, డీ– 86 మైనర్ కాలువల ద్వారా నీరు విడుదల చేయడంతో పొలాల్లోంచి చెరువుల్లోకి చోరుతోంది. వరిపంటకు ఢోకాలేదు వర్షాలకుతోడు ఎస్సారెస్పీ కాలువనీరు వచ్చి చేరుతోంది. చెరువులు దాదాపు నిండే స్థాయికి చేరాయి. వరినాట్లు పూర్తి చేస్తున్నాం. ఇక వరి పంటకు సరిపడా నీరు వచ్చి చేరుతోంది. – మంద లక్ష్మణ్, రైతు, తెలుకుంట -
యూరియా కోసం బారులు
ఎలిగేడు(పెద్దపల్లి): స్థానిక సహకార సంఘ కా ర్యాలయం ఎదుటు రైతులు సోమవారం ఉదయమే బారులు తీరారు. యూరియా లోడ్ వ చ్చిందనే సమాచారంతో ఒక్కసారిగా అన్నదా తలు తరలివచ్చారు. మొత్తం 1,320 బస్తాల యూరియా రాగా.. ఒక్కో ఎకరాకి ఒకబస్తా చొప్పున రైతులకు పంపిణీ చేసినట్లు ఏవో ఉ మాపతి తెలిపారు. యూరియా కోసం రైతులు అపోహ పడొద్దని, అవసరాలకు అనుగుణంగా అందిస్తామని ఏవో వివరించారు. విగ్రహ ప్రతిష్ఠాపన ధర్మారం(పెద్దపల్లి): ఖిలావనపర్తిలో సోమవా రం శ్రీమడేలేశ్వరస్వామి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. నాయకులు ముత్యాల వీరస్వామి, గుడికందుల సురేశ్, లావుడ్య రూప్లానాయక్, పోల్దాసరి సంతోష్, తిరుపతిరెడ్డి, గందం మల్లయ్య, కొత్త నర్సింహులు, సోగాల తి రుపతి, జగన్మోహన్రెడ్డి, ఓరం చిరంజీవి, నూనే మల్లేశం, సాగంటి కొండయ్య, సోగాల మీనా, మోతె రవి, సంతోష్ పాల్గొన్నారు. కొనసాగుతున్న ఎత్తిపోతలు ధర్మారం(ధర్మపురి): నందిమేడారంలోని నందిపంప్హౌస్ ద్వారా ఎల్లంపల్లి నీటిని ఆరు రో జులుగా ఎత్తిపోస్తున్నారు. తొలిరోజు మూడు విద్యుత్ మోటార్లను ఆన్ చేసిన అధికారులు.. క్రమంగా నాలుగింటిని ప్రారంభించి మేడా రం నంది రిజర్వాయర్లోకి ఎత్తిపోయిస్తున్నా రు. సోమవారం రెండు పంప్లతోనే నడిపించారు. ఒక్కోదాని నుంచి 3,150 క్యూసెక్కుల ను తరలిస్తున్నారు. ఇదే నీటిని గాయత్రీ పంప్హౌస్కు తరలిస్తున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలు వచ్చేంత వరకు ఎత్తిపోతలు కొనసాగుతాయని ఏఈ నర్సింగరావు తెలిపారు. ఘనంగా వరదపాశం వేడుక కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): వెన్నంపల్లి–జాఫర్ఖాన్పేట గుట్టల్లోని పాండవలొంక జలపా తం వద్ద సోమవారం వరదపాశం లక్ష్మీదేవర బోనాలు వైభవంగా జరిగాయి. బోనాలతో స్వామివారికి నైవేద్యం సమర్పించారు. వర్షాలు సమృద్ధిగా కురువాలని, పాడిపంటలు, ఆయురారోగ్యాలతో చల్లంగా చూడాలని మహిళా భక్తులు వరదపాయసం పోశారు.టెక్నాలజీని వినియోగించాలి రామగిరి(మంథని): మారుతున్న కాలానికి అ నుగుణంగా ఆధునిక సాంకేతికతను అందిపు చ్చుకోవాలని అల్ట్రాటెక్ ప్లాంట్ అధిపతి మంద ల శ్రీనివాస్రెడ్డి, పెద్దపల్లి డీసీపీ కరుణాకర్ సూచించారు. పన్నూర్ జేఎన్టీయూలో ప్రిన్సిపాల్ విష్ణువర్ధన్ ఆధ్వర్యంలో మొదటి సంవత్సరం ఇంజినీరింగ్ విద్యార్థులకు ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. శ్రీనివాస్రెడ్డి, కరుణాకర్ హాజరై మాట్లాడారు. ఇంజినీరింగ్ కోర్సులు పూర్తిచేసుకున్న విద్యార్థులు నైపుణ్యం పెంపొందించుకుంటేనే భవిష్యత్లో రాణిస్తార ని అన్నారు. ఏసీపీ రమేశ్, సీఐ రాజుగౌడ్, ఎ స్సై శ్రీనివాస్, టీచింగ్ సిబ్బంది పాల్గొన్నారు. పారిశుధ్య సిబ్బందికి రెయిన్కోట్స్ అందజేతకోల్సిటీ(రామగుండం): పారిశుధ్య సిబ్బందికి బల్దియా కమిషనర్ అరుణశ్రీ రెయిన్ కోట్లు పంపిణీ చేశారు. వ్యక్తిగత రక్షణ కిట్లతోపాటు రెయిన్ కోట్లనూ ధరించాలని సూచించారు. -
అందరికీ సన్నబియ్యం
● కొత్తకార్డులకు సెప్టెంబర్ కోటా సుల్తానాబాద్(పెద్దపల్లి): జిల్లాలో కొత్తగా రేషన్కార్డులు పొందిన పేదలు అందరికీ సెప్టెంబర్ కోటా సన్నబియ్యం వస్తోంది. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు సుమారు 12,168 కార్డులకు అవసరమైన సన్నబియ్యం కోటా కేటాయించినట్లు అధికారులు తెలిపారు. గోదాముల నుంచి రేషన్ డీలర్లకు సన్నబియ్యం సరఫరా చేయనున్నట్లు కూడా వారు ప్రకటించారు. వర్షాకాలం నేపథ్యంలో రవాణాకు అంతరాయం కలుగుతుందనే ఉద్దేశంతో కేంద్రప్రభు త్వం జూన్, జూలై, ఆగస్టు నెలలకు సంబంధించిన మొత్తం కోటాను గత జూన్ నెలాఖరు వరకు కార్డు దారులకు అందజేసిన విషయం విదితమే. అప్పటివరకు కొత్తకార్డులు మంజూరైన పేదలకు కూడా పంపిణీ చేసింది. అయితే, గత జూలై, ఆగస్టు నెలల వరకు కార్డులు మంజూరైన వారికి రేషన్బియ్యం అందలేదు. ఈసారి వీరికి కూడా బియ్యం అందించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బియ్యం సంచులపై సీఎం ఫొటో.. బియ్యంతోపాటు ఈసారి ‘అందరికీ సన్నబియ్యం పంపిణీ.. ప్రజాప్రభుత్వంతోనే సాధ్యం’ నినాదం ముద్రించిన సంచులు కూడా పౌర సరఫరాల శాఖ ద్వారా పంపిణీ చేయన్నట్లు వెల్లడిస్తున్నారు. ఈ సంచులపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, సివిల్ సప్లయ్ శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఫొటోలు ముద్రించి ఉన్నట్లు జిల్లా అధికారులు తెలిపారు. జిల్లావ్యాప్తంగా 413 రేషన్ దుకాణాలు ఉన్నాయి. వీటి పరిధిలో పాతరేషన్కార్డులు 2,23,553 ఉన్నాయి. ఇప్పటివరకు కొత్తగా 12,168 కార్డులు అధికారులు పంపిణీ చేశారు. దశాబ్ద కాలంగా రేషన్కార్డులు లేక జిల్లాలో ని పేదలు అనేక సంక్షేమ పథకాలకు దూరమయ్యారు. ప్రస్తుతం కార్డులు రావడంతో తమకు ఇక అన్ని పథకాల ద్వారా లబ్ధి చేకూరుతుందని కొత్త కార్డుదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. -
బురద రోడ్డుపై వరినాట్లు
మంథని: స్థానిక పోచమ్మవాడ వాటర్ ట్యాంక్ సమీప బురదరోడ్డుపై మహిళలు ఆదివారం వ రినాట్లు వేసి నిరసన తెలిపారు. చిన్నపాటి వ ర్షానికి రోడ్లు బురదమయమై నడక నరకంగా మారిందని ఆవేదన చెందారు. సమస్యను ప ట్టించుకునేవారు కరువయ్యారని పేర్కొన్నారు. సిమెంట్ రోడ్లు మంజూరు చేసి సమస్యకు పరిష్కారం చూపాలని మహిళలు కోరారు. ‘ఎల్లంపల్లి’ గేట్ల మూసివేత రామగుండం: ఎగువ నుంచి వచ్చిన భారీ వ ర్షాలతో ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి వరద వచ్చి చే రడంతో శనివారం 20గేట్లు గేట్లు ఎత్తిన అధికా రులు.. ఇన్ఫ్లో తగ్గడంతో ఆదివారం గేట్లు మూ సివేశారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి కేవలం 20 వే ల క్యూసెక్కుల ఇన్ఫ్లో మాత్రమే వస్తోంది. దీంతో గేట్లు పూర్తిగా మూసివేశారు. ప్రాజెక్టు ప్ర స్తుతం నీటినిల్వలతో జలకళ సంత రించుకుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా ప్రస్తుతం 18.28 టీ ఎంసీలు ఉంది. ఎగువ నుంచి 20,738 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. తద్వారా త్వరలోనే ప్రాజెక్టు నీటినిల్వ సామర్థ్యానికి చేరనుంది. కాగా, హైదరాబాద్కు 295 క్యూసెక్కులు, ఎన్టీపీసీకి 121 క్యూసెక్కులు, నందిపంపుహౌస్కు 12,600 క్యూసెక్కులు ఎత్తిపోస్తున్నారు. కార్గో సేవలు సద్వినియోగం చేసుకోవాలి సుల్తానాబాద్(పెద్దపల్లి): ఆర్టీసీ అందిస్తున్న కార్గో సేవలను సద్వినియోగం చేసుకోవాలని రీజినల్ మేనేజర్ రాజు కోరారు. స్థానిక బస్టాండ్లో ఆదివారం ఆయన కార్గో సేవలు ప్రారంభించి మాట్లాడారు. తక్కువ ధరల్లో ఎక్కువ సే వలు అందిస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో గోదావరిఖని డిపో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ చంద్రమౌళి, ఏజెంట్ రంజిత్, ప్రతినిధులు జక్కుల మల్లేశం, బస్టేషన్ ఇన్చార్జి ట్రాఫిక్ గైడ్ రమేశ్ తదితరులు పాల్గొన్నారు. ఆపరేషన్ కగార్ను ఆపేయండి పెద్దపల్లిరూరల్: ఆదివాసీలపై కేంద్ర ప్రభు త్వం ఆపరేషన్ కగార్ పేరిట చేపట్టిన మారణకాండను వెంటనే ఆపేయాలని పౌరహక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నక్క నారాయణరావు డిమాండ్ చేశారు. ఈనెల 24న వరంగల్లో జరిగే బహిరంగసభ పోస్టర్, వాల్పోస్టర్ను జిల్లా కేంద్రంలో ఆదివారం ఆవిష్కరించి మాట్లాడారు. ఆపరేషన్ కగార్ కోసం ఏ ర్పాటు చేసిన పోలీసు క్యాంపులను ఎత్తేయాలని, తక్షణమే కాల్పుల విరమణ ప్రకటించాలని డిమాండ్ చేశారు. అటవీహక్కుల పరిరక్షణ, పె సా చట్టాలు, గ్రామసభ తీర్మాణాలను అమలు పర్చాలన్నారు. నాయకులు చంద్రమౌళి, వెంకటయ్య, మార్వాడీ సుదర్శన్, విశ్వనాథ్, రత్నకుమార్, గుమ్మడి కొమురయ్య, బాపు, రవి, ప్రసాద్, లెనిన్, రాజన్న, లక్ష్మణ్, వినోద్, రాజలింగు, రవీందర్, మల్లేశం, స్వామి ఉన్నారు. సందర్శకుల సందడి పాలకుర్తి(రామగుండం): బసంత్నగర్ శ్రీబుగ్గ రామలింగేశ్వరస్వామి ఆలయానికి ఆదివారం సందర్శకులు పోటెత్తారు. ఆదివారం సెలవుదినం కావడంతో గోదావరిఖని, ఎన్టీపీసీ, పెద్దపల్లి, మంచిర్యాల తదితర ప్రాంతాల నుంచి అధికసంఖ్యలో సందర్శకులు తరలివచ్చారు. స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. కుటుంబసభ్యులతో కలిసి వంటలు చేసుకుని సహపంక్తి భోజనాలు చేశారు. రద్దీతో ఆలయ ప్రాంగణం, పరిసరాలు సందడిగా మారాయి. -
లోలెవల్ వంతెనలు.. హైలెవల్ సమస్యలు
● మోస్తరు వర్షాలకే వరదలు ● స్తంభిస్తున్న రాకపోకలు ● పల్లెవాసులకు తప్పని తిప్పలు కాల్వశ్రీరాంపూర్/మంథనిరూరల్/ఓదెల: సుల్తానాబాద్ – కాల్వశ్రీరాంపూర్, పెద్దపల్లి – కాల్వశ్రీ రాంపూర్, జ మ్మికుంట – కాల్వశ్రీరాంపూర్, మంథని – కాల్వశ్రీ రాంపూర్ ఆర్ అండ్ బీ రోడ్లపై లో లెవల్ వంతెనలు కొద్దిపాటి వర్షానికే వరద ఉధృతి లో మునిగిపోతున్నాయి. మనుషులు, పశువులు ప్రవాహంలో కొట్టుకుపోయారు. కాల్వశ్రీరాంపూర్ మండలం మల్యాల – గూడెం నక్కల వాగు ఒర్రెల్లో వరద ప్రవాహంలో గతేడాది ఎడ్లుబండి కొట్టుకుపోయాయి. స్థానికులు తాళ్లు వేయడంతో రైతు ప్రాణాలతో బయట పడ్డాడు. కొత్తపల్లి – మల్యాల మధ్య నక్కలవాగు ఒర్రెలో గతేడాది సెప్టెంబర్ ఒకటో తేదీన కారోబార్ పవన్ ప్రవాహంలో గల్లంతై మృతి చెందాడు. పెగడపల్లి – గంగారం మధ్య ఒర్రె, కూ నారం జగదాంబ ఒర్రె ప్రవాహంలో మనుషులు కొ ట్టుకుపోయిన ఘటనలూ ఉన్నాయి. 15 రోజుల కిందట వ్యవసాయ కూలీలు పోచంపల్లి–మల్యాల న క్కవాగు ఒర్రె తాత్కాలిక వంతెన దాటుతూ ప్రమాదానికి గురయ్యారు. రైతులు తాడుతో రక్షించారు. ఓదెల – కొలనూరు శివారు లోలెవల్ వంతెన పరిస్థితి కూడా దాదాపు ఇలాగే ఉంది.ఇది మంథని – విలోచవరం మధ్యగల మెయిన్ రోడ్డు డ్యామ్. ఈ మార్గంలో పోతారం, ఉప్పట్ల గ్రామాల ప్రజలు నిత్యం రాకపోకలు సాగించేందుకు ఇదొక్కటే దిక్కు. వర్షం కురిస్తే ఎగువన ఉన్న నాగారం, గుంజపడుగు గ్రామాల చెరువులు మత్తడి దూకుతాయి. దీంతో రోడ్డు డ్యామ్ హఠాత్తుగా వరదనీటిలో మునుగుతుంది. రాకపోకలు స్తంభిస్తాయి. పొలం పనులకు వెళ్లే రైతులు, కూలీలు ఇళ్లకు వెళ్లాలన్నా.. పనులకు పోవాలన్నా వరద వెంటాడుతూనే ఉంటుంది. -
జిల్లాకు వర్షసూచన
పెద్దపల్లిరూరల్: జిల్లాలో సోమ, మంగళవారాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. వాతావరణ శాఖ జిల్లాకు ఎల్లో అలర్ట్ జారీచేసిందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఓ మోస్తరు నుంచి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. చెరువులు, కుంటల్లో నీటిని ల్వలను నిరంతరం పర్యవేక్షిస్తూ ప్రమాదాల ని యంత్రణకు అధికారులు సహకరించాలని కోరారు. పర్యావరణ పరిరక్షణ లక్ష్యం జ్యోతినగర్(రామగుండం): పర్యావరణ పరిరక్షణతోనే భావితరాలకు మనుగడ ఉంటుందని మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. ఎన్టీపీసీలో హరితసేన బాధ్యులు విత్తన గణపతి ప్రతిమలు అందజేయడం సంతోషంగా ఉందన్నారు. ఆదివా రం విత్తన గణపతి ప్రతిమను స్వీకరించిన తర్వాత మాట్లాడుతూ, గ్రీన్ ఇండియా చాలెంజ్ హరితసే నలో భాగంగా వేలాది మొక్కలు నాటామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ అభిషేక్రావు, హరితసేన రాష్ట్ర కోఆర్డినేటర్ గర్రెపల్లి సతీశ్, చెప్యాల రాజేశ్వర్రావు తదితరులున్నారు. -
అందరికీ సంక్షేమ ఫలాలు
గోదావరిఖని: అర్హులైన వారందరికీ సంక్షేమ ఫలా లు అందేలా చూస్తామని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్ అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కా ర్యాలయంలో ఆదివారం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులు 111మందికి రూ. 1.11కోట్ల వి లువైన ఎమ్మెల్యే చెక్కులు, 4,687 కొత్త తెల్లరేషన్కా ర్డులు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలో ఇప్పటివరకు రూ.7.56 కోట్ల విలువైన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కు లు పంపిణీ చేసినట్లు తెలిపారు. అంతర్గం, పాలకుర్తి మండల్లాలో రూ. 2కోట్ల చొప్పున కేటాయించి మహిళా భవన్లు నిర్మిస్తామన్నారు. రూ.25కోట్లతో సింగరేణి కార్మిక ప్రాంతాల్లో రోడ్లు, డ్రైనేజీలు నిర్మిస్తున్నట్లు తెలిపారు. తహసీల్దార్ ఈశ్వర్, నాయకులు బొంతల రాజేశ్, మహంకాళి స్వామి, గట్ల రమేశ్, తిప్పారపు శ్రీనివాస్ పాల్గొన్నారు. రోడ్డు సౌకర్యం కల్పించాలని వినతి రామగుండం: ఆబాది రామగుండంలో ముస్లిం శ్మ శానవాటికకు రహదారి సౌకర్యం కల్పించాలని మసీదు కమిటీ ప్రతినిధులు ఎమ్మెల్యే ఠాకూర్ను కలిసి విన్నవించారు. త్వరలోనే రోడ్డు నిర్మాణానికి చర్యలు చేపడతానని హామీ ఇచ్చారు. మాజీ కార్పొరేటర్ నస్రీన్బేగం, కమిటీ ప్రతినిధులు ఉన్నారు. దుర్మమ్మ జాతరకు హాజరు.. గోదావరిఖనిటౌన్: రెల్లి కుల సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో నగరంలో నిర్వహించిన శ్రీకనకదుర్గ మాతా జాతర శోభాయాత్రకు ఎమ్మెల్యే మక్కాన్సింగ్ హాజరయ్యారు. అమ్మవారికి ప్రత్యేకపూజలు చేసి బోనంతో నైవేద్యం సమర్పించారు. నాయకు లు తాళ్లపల్లి యుగేందర్ తదితరులు పాల్గొన్నారు. -
సమస్యలపై నిరంతర పోరు
మంథని: కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతున్నట్లు మున్సిపల్ వర్కర్స్, ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి జనగామ రాజమల్లు అన్నారు. స్థానిక ఫ్రెండ్స్ క్లబ్లో ఆదివారం నిర్వహించిన యూనియన్ జిల్లా నాలుగో మహాసభల్లో ఆయన మాట్లాడారు. కార్మికులు ఐక్యంగా ఉండి సమస్యలు పరిష్కరించుకోవాలని కోరారు. అంతకుముందు పాతపెట్రోల్ బంక్ నుంచి ర్యాలీ నిర్వహించారు. సీఐటియూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎర్రవెల్లి ముత్యంరావు, నాయకులు మహేశ్, వెంకటస్వామి, బూడిద గణేశ్, చింతల గోవింద్, వడ్లకొండ రాజయ్య, ఆర్ల సందీప్, గొర్రంకల సురేశ్, మంథని లింగయ్య, బావు రవి, గడిపెల్లి మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు. -
వర్షం పడితే అంతే..
వర్షాకాలంలో ఎప్పుడు భారీ వర్షం పడినా మా ఊరికి వెళ్లే దారిలోని రోడ్డు డ్యామ్ వరదతో పొంగిపొర్లుతది. ఏటా నాలుగైదుసార్లు వరద వచ్చి రాకపోకలు నిలిచిపోతయి. రోడ్డుడ్యామ్ అవతల ఐదెకరాలు కౌలుకు తీసుకుని పంటలు ఏసిన. పొలంకాడికి పోయి రాత్రి ఇంటి రాంగ వరదతో గోసగోసతైంది. – పుట్ట సంతోష్, రైతు, విలోచవరం వంతెన నిర్మించాలి కాల్వశ్రీరాంపూర్ – మొట్లపల్లి మధ్య మట్టలవాగుపై నా లుగు దశాబ్దాల కింద లోలె వల్ వంతెన నిర్మించారు. ఇ ప్పుడది శిథిలావస్థకు చేరింది. రైతులు, కూలీలు, వాహనాలు వరద ప్రవాహంలో కొట్టుకు పోతున్నాయి. హైలెవల్ వంతెన నిర్మాణం చేసి ఇబ్బందులు తొలగించాలి. – రాంరెడ్డి, రైతు, మొట్లపల్లి -
ఆలయ అభివృద్ధికి నిధులు కేటాయిస్తా
ధర్మారం(ధర్మపురి): మండలంలోని నర్సింగాపూర్ గ్రామంలో గల శ్రీఅభయకృష్ణ ఆలయంలో శనివారం సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి అర్చకులు, భక్తులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రిని ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు సన్మానించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, ఆలయ అభివృద్ధికి నిధులు కేటాయిస్తానని హామీ ఇచ్చారు. మార్కెట్ కమిటీ చైర్మన్ లావుడ్య రూప్లానాయక్, డైరెక్టర్ బద్దం గంగారెడ్డి, సురకంటి శ్రీనివాస్రెడ్డి, బద్దం అజయ్పాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. యూరియా కొరత సృష్టించేందుకు కేంద్రం కుట్రఫెర్టిలైజర్సిటీ(రామగుండం): రాష్ట్రంలో యూరి యా కొరత సృష్టించేందుకు కేంద్రం కుట్ర పన్నుతోందని ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్ ఆరోపించారు. శనివారం రామగుండం ఎరువుల కర్మగారాన్ని సందర్శించి అమ్మోనియా లీకై న హెచ్టీఆర్ కనెక్టర్ మరమ్మతు పనులు పరిశీలించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కర్మాగారం నిర్మాణంలో నాణ్యత లోపించడంతో అమ్మోనియా ప్లాంట్లో పైప్లైన్ లీకయి షట్డౌన్ చేయాల్సిన దుస్థితి వస్తుందన్నారు. మూడునెలల్లో కర్మాగారాన్ని మూడుసార్లు షట్డౌన్ చేశారని, అమ్మెనియా ప్లాంట్లో పైప్లైన్ నిర్మాణ పనులు చేపట్టిన కంపెనీపై సీబీఐకి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో నడుపుతున్న కర్మాగారంలో ఉత్పత్తి అయిన యూరియాలో 50 శాతం రాష్ట్రానికి కేటాయించాలని డిమాండ్ చేశారు. అలాగే ప్లాంటుకు ఆనుకొని ఉన్న వీర్లపల్లి గ్రామాన్ని తరలించి ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కల్పించాలని ఆర్ఎఫ్సీఎల్ సీఈవో అలోక్ సింఘాల్కు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో మహంకాళి స్వామి, నెలకంటి రాము, చిట్టబోయిన రాజ్కుమార్, బూర్ల శ్రీనివాస్, కందుల సతీశ్, హరినాథ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సమస్యలు పరిష్కరించాలని సింగరేణి అధికారుల నిరసన గోదావరిఖని(రామగుండం): సింగరేణి యాజ మాన్యం తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అధికారులు శనివారం ఆర్జీ–1 ఏరియా జీడీకే–5 ఓసీపీలో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. రాబోయే రోజుల్లో ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామన్నారు. రిలే నిరాహార దీక్షలు, వర్క్టూ రూల్ వంటి ప్రతిపాదనలతో ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో సీఎంఓఏఐ నాయకులు పొనుగోటి శ్రీనివాస్, పెరుమాళ్ల శ్రీనివాస్, ఆంజనేయులు, ప్రాజెక్ట్ ఆఫీసర్ డి.రమేశ్, అధికారులు పైడీశ్వర్, డి.రమేశ్బాబు, అనిల్గబాలే, పర్సనల్ మేనేజర్, ఎం.రవీందర్రెడ్డి, రాజన్న పాల్గొన్నారు. -
సైకిల్పై తిరిగొద్దాం
ఇంటి నుంచి అడుగు బయటపెట్టడమే ఆలస్యం.. వాహనం ఎక్కి దూసుకెళ్తున్నాం. ప్రమాదానికి ఆస్కారం ఉందని తెలిసినా రహదారి నిబంధనలు పట్టించుకోం. మనస్థాయికి తగ్గ వాహనాలు ఉన్నా.. వాటికి అప్పుడప్పుడు విరామమిద్దాం. వారంలో కనీసం ఒక్కరోజు ఆఫీసుకే కాదు... చిన్నచిన్న అవసరాలకు సైకిల్పై వెళ్లొద్దాం. ఆరోగ్యంగా ఉందాం. ఫిట్నెస్ కోసం ప్రత్యేకంగా జిమ్లకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. సైకిల్ తొక్కడంతో సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటాం. సెలవు దొరికితే సినిమా లేదా ఎగ్జిబిషన్కు వెళ్దామా అని చాలామంది ఆలోచిస్తుంటారు. ఈ ఆదివారం పిల్లలతో కలిసి సమీపంలోని వ్యవసాయ క్షేత్రానికి వెళ్లొద్దాం. రైతు పడుతున్న కష్టాన్ని తెలుసుకుందాం. పిల్లలకు సాగు పద్ధతులు తెలియచేద్దాం. చుట్టుపక్కల ఉన్న పచ్చదనంతో ఆహ్లాదంతో గడుపుదాం. ప్రకృతి విలువ అర్థమయ్యేలా వివరిద్దాం. ఇలా చేయడంతో గ్రూప్డిస్కషన్ జరుగుతుంది. పరిశీలించే గుణం పెరుగుతుంది. వాతావరణం, పంటలపై అవగాహన కలుగుతుంది. క్షేత్రస్థాయి అనుభవం వస్తుంది. -
లోతట్టు ప్రాంతాలు జలమయం
జ్యోతినగర్(రామగుండం): రా మగుండం కార్పొరేషన్ మూడో డివిజన్ జంగాలపల్లెలో వరద నీరు ఇళ్లలోకి చేరడంతో ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. శని వారం ఉదయం కురిసిన భారీ వర్షానికి జంగాలపల్లెలోని లో తట్టు ప్రాంతాల్లోని పలు ఇళ్లలో కి వరద నీరు చేరింది. రోడ్డుపై మూడడుగల పైన వరద నీరు ప్రవహించింది. డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఈదునూరి రవి డివిజన్లో పర్యటించి సమస్యను రామగుండం ఎమ్మెల్యే రాజ్ఠాకూర్ మక్కాన్సింగ్కు తెలిపారు. దీంతో ఆయన సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయగా వరద నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో జేసీబీతో కాలువలు తవ్వించారు. వరద నీరు ఇళ్లలో నుంచి బయటకు వెళ్లేందుకు సహాయ చర్యలు చేపట్టారు. జంగాలపల్లె గ్రామస్తులు ఎమ్మెల్యే మక్కాన్సింగ్కు, రవికి కృతజ్ఞతలు తెలిపారు. -
కన్నయ్యా.. చల్లంగా చూడయ్య
పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రంలో శనివారం కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో చిన్నారుల వేషధారణ ఆకట్టుకుంది. ఉట్టిగొట్టేందుకు చిన్నారులు పోటీపడడాన్ని చూసిన వారంతా సంబరపడ్డారు. బీహెచ్పీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ స్వరూప్కిరణ్, నాయకులు సత్యం, బొమ్మకంటి రవి, మురళి, తారాబాయి, కవిత, వేదశ్రీ, శ్రీవాణి తదితరులున్నారు. శాంతినగర్లోని యాదవ చారిటబుల్ ట్రస్టు ఆఫీసులో శ్రీకృష్ణుడికి పూజలు చేశారు. మారం తిరుపతి, మేకల మల్లేశం, పర్వతాలు, రాజేందర్, ఓదెలు, లక్ష్మణ్, పోచం తదితరులున్నారు. -
ఆధ్యాత్మిక క్షేత్రాలకు వెళ్దాం
పోటీ ప్రపంచంలో దొరికే కొద్దివిరామ సమయాన్ని పబ్బులు, రెస్టారెంట్లు, పార్కులకు కేటాయిస్తున్నారు. వీటితో కలిగే ప్రయోజనం కన్నా ఇబ్బందులే ఎక్కువ. అలా కాకుండా ఆధ్యాత్మికతను అందిపుచ్చుకుందాం. ఇష్టదైవారాధన కోసం ప్రార్థనా మందిరాలకు వెళ్దాం. అక్కడ ఓ పూట ఆనందంగా గడుపుదాం. పెద్దల సందేశాలను మన జీవితాలకు అన్వయించుకుందాం. తోటి భక్తుల్లోని మంచిని స్వీకరిద్దాం. ఒక అధ్యయనం ప్రకారం.. ప్రతీ ముగ్గురిలో ఇద్దరు అదే పనిగా ఫోన్ వినియోగిస్తుండగా వారిలో 11శాతం మంది సెల్కు బానిసలవుతున్నారు. ఇది అనేక సమస్యలకు కారణమవుతోంది. ఆదివారం ఫోన్ను పక్కన పెడదాం. పుస్తక పఠనం లేదా దినపత్రికను పూర్తిగా చదువుదాం. ఒక రోజులో 30 పేజీలకు తక్కువ కాకుండా చదివితే జ్ఞానంతోపాటు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మెదడు చురుగ్గా పనిచేస్తుంది. దినపత్రికలు చదవడంతో నిత్యనూతనంగా.. హుషారుగా పనిచేస్తాం. -
మోకాళ్లలోతు వరద
కోల్సిటీ(రామగుండం): రామగుండం నగరపాలక సంస్థ 49వ డివిజన్ పరిధి మార్కండేయకాలనీలోని బీసీ హాస్టల్ లైన్లో శనివారం కురిసిన వర్షానికి వరదనీరు చెరువును తలపించేలా నిలిచిపోయింది. సమీపంలోని నాలాలోకి వెళ్లే మార్గం లేక ఇళ్ల ముందు మోకాళ్లలోతు వరద నీటిలో సీపీఐ నగర కార్యదర్శి కె.కనకరాజ్ నిరసన తెలిపారు. రోడ్డుపై నిలిచిన వరదనీటిని మళ్లించే చర్యలు చేపట్టకపోతే, సమీపంలోని ఇళ్లల్లోకి వెళ్లే ప్రమాదం ఉందన్నారు. నగరపాలక అధికారులకు ఎన్నిమార్లు విన్నవించుకున్నా, స్పందన లేదన్నారు. కొత్తగా నిర్మించిన నాలా సైడ్వాల్కు రంధ్రాలు ఏర్పాటు చేయకపోవడంతో వరద నీరు చెరువును తలపిస్తోందన్నారు. అధికారులు స్పందించి యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. -
రొడ్యాంపై వరద.. నిలిచిన రాకపోకలు
మంథనిరూరల్: రెండు రోజులతో పాటు శుక్రవారం రాత్రి నుంచి కురిసిన బారీ వర్షానికి జిల్లా మంథని మండలం విలోచవరం గ్రామసమీపంలోని రొడ్యాంపై వరద ప్రవహిస్తోంది. ఎగువన ఉన్న గుంజపడుగు, నాగారంతో పాటు కొత్త చెరువు అలుగు పడి రొడ్యాం మీదుగా వరద వెళ్తోంది. దీంతో మంథని నుంచి విలోచవరంకు రాకపోకలు నిలిచిపోయాయి. విలోచవరం వెళ్లాలంటే నాగారం మీదుగా పోతారం నుంచి రావాల్సి ఉంటుందని గ్రామస్తులు పేర్కొంటున్నారు. రాకపోకలు నిలిపివేసిన పోలీసులు విలోచవరం రొడ్యాంపై నుంచి వరదనీరు ప్రవహిస్తుండడంతో పోలీసులు రాకపోకలను నిలిపివేసి హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. ఎస్సై డి.రమేశ్ ఆదేశాల మేరకు ఏఎస్సై మల్లయ్య, గ్రామ పోలీస్ ఆఫీసర్ రమేశ్రావు, హెడ్కానిస్టేబుల్ సురేశ్శర్మ గ్రామస్తులకు అవగాహన కల్పించారు. పై నుంచి వరద నీరు వస్తోందని, ఎలాంటి ప్రమాదాలు జరుగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అప్రమత్తమైన రైతులు భారీ వర్షాల కారణంగా గోదావరినదిలోకి వరద వచ్చే అవకాశాలు ఉండడంతో విలోచవరం, ఉప్పట్ల, గుంజపడుగు గ్రామాల రైతులు అప్రమత్తమయ్యారు. సాగునీటి కోసం గోదావరినదిలో ఏర్పాటు చేసిన బోరు మోటార్లను తీసుకు వస్తున్నారు. గతేడాది అకస్మాత్తుగా నదిలోకి భారీ వరద వచ్చి రైతుల మోటార్లు కొట్టుకుపోయాయి. ఈ క్రమంలో రైతులు ముందస్తు చర్యగా నదిలోని మోటార్లను తీసుకువస్తున్నారు. -
గ్రీన్ ఎనర్జీ దిశగా అడుగులు
జ్యోతినగర్(పెద్దపల్లి): గ్రీన్ ఎనర్జీ విస్తరణదిశగా ఎన్టీపీసీ వేగంగా అడుగులు ముందుకు వేస్తోందని రామగుండం – తెలంగాణ ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(ఈడీ) చందన్ కుమార్ సామంత అన్నారు. స్థానిక మహాత్మాగాంధీ క్రీడా మైదానంలో జరిగిన స్వాంతత్య్ర దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడారు. స్వాతంత్య్ర సాధన కోసం పోరాడిన వారి త్యాగాలు, ధైర్యం, సంకల్పం గురించి అందరం గుర్తుచేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా దేశభక్తి గీతాల ప్రతిధ్వనులు, త్రివర్ణ పతాక రెపరెపలు ఆకట్టుకున్నాయి. ప్రతిభ కనభర్చిన ఉద్యోగులకు ప్రశంసాపత్రాలను, బాలికలకు సైకిళ్లను అందించారు. దీప్తి మహిళా సమితి అధ్యక్షురాలు రాఖీ సామంత, జనరల్ మేనేజర్లు, సీనియర్ అధికారులు, ఉద్యోగ గుర్తింపు సంఘం ప్రధాన కార్యదర్శి ఆరెపల్లి రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. -
లక్ష్య సాధనలో ముందుండాలి
గోదావరిఖని: వార్షిక బొగ్గు ఉత్పత్తి లక్ష్య సాధనలో ప్రతీఉద్యోగి ముందుండి సింగరేణి సంస్థ అభివృద్ధిలో పాలుపంచుకోవా లని ఆర్జీ – వన్ జీఎం లలిత్కుమార్ సూచించారు. జీఎం కార్యాలయంలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆయన జాతీయ జెండా ఎగురవేశారు. రక్షణతో కూడిన ఉత్పత్తి సాధించి దేశప్రగతిలో మనవంతు కర్తవ్యం చాటాలని అన్నారు. ఓసీపీలు లాభాల బాటలో కొనసాగుతుండగా, భూగర్భ గనులు నష్టాల్లో ఉన్నాయని తెలిపారు. అధికారులు భైద్యా, రమేశ్, రవీందర్రెడ్డి, రమేశ్, శ్రీనివాస్, జితేందర్సింగ్, కర్ణ, వీరారెడ్డి, సాంబశివరావు, రాజు, వసంత్కుమార్, వేణు, శ్రావణ్కుమార్, హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. -
చాలామంది రిటైర్ అయ్యారు
15 ఏళ్ల నాటి పీఆర్పీ ఇప్పటికీ చెల్లించలేదు. చాలామంది పీఆర్పీ తీసుకోకుండానే రిటైర్డ్ కాగా మరికొందరు చనిపోయారు. కోర్టు తీర్పు ఇచ్చినా అమలు కావడం లేదు. – పెద్ది నర్సింహులు, ప్రధాన కార్యదర్శి సీఎంవోఏఐ పరిష్కారమయ్యే వరకూ పోరు సమస్యలు పరిష్కారమయ్యేంత వరకూ నిరసన కార్యక్రమాలు కొనసాగుతాయి. బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకతలో అహర్నిశలు శ్రమిస్తున్న అధికారుల విషయంలో సింగరేణి ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. సీఎండీ, డైరెక్టర్ల దృష్టికి సమస్యలు తీసుకెళ్లి నా పరిష్కారం కాలేదు. ఆందోళనలు ఉధృతం చేసేందుకు ఈనెల 17న భూపాలపల్లి లో సమావేశమై కార్యాచరణ రచిస్తాం. – టి.లక్ష్మీపతిగౌడ్, అధ్యక్షుడు, సీఎంవోఏఐ -
బోర్డు ఒకటి.. దందా మరోటి
పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రంలోని మినీట్యాంక్ బండ్ సమీపంలో ఉన్న ఈ గుడిసెను చూసి కూరగాయలు విక్రయాలు చేస్తున్నారనుకుంటే తప్పులో కాలేసినట్టే.. లైసెన్స్ పొంది నిర్వహించే బార్ అండ్ రెస్టారెంట్ను తలపించేలా మద్యం, మాంసంతోపాటు బిర్యానీ ఇతర తినుబండారాలన్నీ ఈ గుడిసెలోనే లభిస్తాయన్నది నగ్నసత్యం. శుక్రవారం స్వాతంత్య్ర దినోత్సవం కావడంతో మద్యం దుకాణాలు మూసివేశారు. దీంతో ఇక్కడ మద్యం సీసాలకు రెక్కలొచ్చాయి. నిర్వాహకులు చెప్పినంత ఇస్తేనే.. మద్యం దొరుకుతుండడడంతో గత్యంతరంలేక కొనుగోలు చేస్తున్నామని మద్యం ప్రియులు వాపోతున్నారు. దీని నిర్వాహకులు ప్రభుత్వ శాఖల్లో పనిచేసే ఉద్యోగులు, వారిబంధుగణమే కావడం గమనార్హం. ప్రతినెలా అడిగినంత నజరానా ఇస్తుండడమే కారణమని పట్టణంలో చర్చించుకుంటున్నారు. వీరిని చూసి మినీట్యాంక్ బండ్ పరిసరాల్లో రోజుకో బెల్ట్షాపు పుట్టుకొస్తోందని, ఇప్పటికే చిన్నచిన్నవి ఏడెనిమిది మద్యం అమ్మకాలు సాగించే దుకాణాలు వెలిశాయంటున్నారు. ఎక్కడ మద్యం దొరక్క పోయినా.. ఏ సమయంలో వచ్చినా మినీట్యాంక్ బండ్ వద్ద మద్యం దొరుకుతుండడంతో ఈప్రాంతం నిత్యం మద్యం మత్తులో ఉన్నవాళ్లే కనిపిస్తుంటారు. ఏదైనా అవసరం నిమిత్తం రావాలంటే భయమేస్తోందని మహిళలు వాపోతున్నారు. ఇప్పటికై నా పోలీసు, ఎకై ్సజ్ తదితర శాఖల అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
ఉద్యమం ఉధృతం
గోదావరిఖని: సింగరేణి అధికారుల సంఘం నాయకులు సమస్యల పరిష్కారం, హక్కుల సాధనకు ఉద్యమం ఉధృతం చేశారు. నాలుగు రోజులుగా నల్లబ్యాడ్జీలతో నిరసన తెలుపుతున్న సింగరేణి కోల్మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ (సీఎంవోఏఐ) ప్రతినిధులు.. త్వరలోనే వర్క్ టూ రూల్, ఒక రోజు సమ్మె చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తు న్నారు. ఈనెల 17న భూపాలపల్లిలో సమావేశమై దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు. పెర్ఫార్మెన్స్ రిలేటెడ్పే(పీఆర్పీ) కోసం పట్టుపడుతున్నారు. గత ఆ ర్థిక సంవత్సరంతోపాటు పదేళ్లనాటి పీఆర్పీ బకాయిలు చెల్లించాలని కోరుతున్నారు. వీటితోపాటు వివిధ సమస్యలపై సింగరేణి సీఎండీ, డైరెక్టర్లతో ప లుదఫాలు సమావేశమైనా స్పష్టత రాలేదు. దీంతో నిరాశ, నిస్పృహలతో విధులు నిర్వర్తిస్తున్నారు. ఇంకా అందని బకాయిలు పీఆర్పీ బకాయిల కోసం రిటైర్డ్ అధికారులు ఎదురుచూస్తున్నారు. ఇవి చేతికి రాకుండానే చాలామంది ఉద్యోగ విరమణ చేశారు. వీరిలో కొందరు కో ర్టుకు వెళ్తే అనుకూల తీర్పు వచ్చినట్లు నాయకులు చెబుతున్నారు. అయినా.. బకాయిలు చెల్లించేందుకు సింగరేణి యాజమాన్యం ముందుకు రావడం లేదనే అసంతృప్తితో ఉన్నారు. ప్రధాన డిమాండ్లు ఇవే.. -
శనివారం శ్రీ 16 శ్రీ ఆగస్టు శ్రీ 2025
ఠాకూర్కు సీఎం శుభాకాంక్షలుగోదావరిఖని: రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్కు సీఎం రేవంత్రెడ్డి శుక్రవారం పు ట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాసేవ లో నిమగ్నమై, ప్రజాపాలనలో భాగస్వాము లు కావడానికి భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని సీఎం ఆకాంక్షించారు. ఈ సందర్భంగా రామగుండం నియోజకవర్గంలోని పలుచోట్ల అన్నదానం, రక్తదానం తదితర సేవా కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థులకు ఉపకారవేతనాలు గోదావరిఖనిటౌన్: జనగామ జెడ్పీ హైస్కూల్ లో కెనరా బ్యాంక్ తిరుమలనగర్ శాఖ విద్యార్థులకు బ్యాంకు ఖాతాలు ప్రారంభించింది. వి ఠల్నగర్, ఎలుకలపల్లి, జనగామ ప్రభుత్వ పా ఠశాలల్లో చదువుకుంటూ ప్రథమ స్థానంలో ని లిచిన 5, 6, 7వ తరతగతి బాలికలకు ప్రోత్సాహకంగా రూ.3 వేలు, 8, 9, 10 తరగతుల వి ద్యార్థినులకు రూ.5వేల చొప్పున స్కాలర్షిప్స్ డిపాజిట్ చేసి పాస్పుస్తకాలు అందజేశారు. బ్యాంక్ మేనేజర్ అజిత్, ప్రధానోపాధ్యాయురాలు జ్యోష్ణలత, ఉపాధ్యాయులు ఉన్నారు. ఒకే భవనం.. మూడు జెండాలు జూలపల్లి(పెద్దపల్లి): స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా స్థానిక సహకార సంఘ భవనం ఎదుట మూడు జాతీయ జెండాలను ఒకేసారి ఆవిష్కరించారు. సహకార సంఘ భవనంలో వ్యవసాయ, శాఖ గ్రంథాలయం, ప్యాక్స్ కా ర్యాలయాలు ఉన్నాయి. దీంతో ఏటా ఒకేసారి మూడు జాతీయ జెండాలు ఎగురవేయడం ఆనవాయితీగా వస్తోంది. ఏవో ప్రత్యూష లైబ్రేరియన్ మౌళి, ప్యాక్స్ చైర్మన్ కొంజెర్ల వెంకటయ్య త్రివర్ణ పతాకాలు ఆవిష్కరించారు. అందుబాటులో యూరియా పెద్దపల్లిరూరల్: రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉందని, ఎరువుల కోసం ఆందోళన వద్దని కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. కలెక్టరేట్లో శుక్రవారం యూరియా పంపిణీపై వ్యవసాయాధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. అవసరాల కన్నా ఎక్కువ నిల్వ చే సుకోవద్దని సూచించారు. కొందరు డీలర్లు సై తం ఎరువుల విక్రయాల్లో అవకతవకలకు పా ల్పడుతున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయని, వాస్తవమమని తేలితే కఠిన చర్యలు ఉంటాయని కలెక్టర్ హెచ్చరించారు. డీఏవో శ్రీనిఆవస్, ఏడీఏ కాంతారావు, అంజనీతోపాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. ఎల్కలపల్లికి ఆర్టీసీ బస్సు ఫెర్టిలైజర్సిటీ(రామగుండం): పాలకుర్తి మండ లం ఎల్కలపల్లికి పల్లెవెలుగు ఆర్టీసీ బస్సును ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్ శుక్రవారం ప్రా రంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గోదావరిఖని నుంచి ఎఫ్సీఐ ఎల్కలపల్లి గేట్ మీదు గా గుంటూరుపల్లి, ఎల్కలపల్లి గ్రామాలను క లుపుతూ సబ్బితం నుంచి పెద్దపల్లి వరకు బ స్సు సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. ప్రజలు స ద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మ నాలీ ఠాకూర్, కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరిస్తున్న ఒబెదుల్లా కొత్వాల్ సాహెబ్ మహిళా పోలీసు బలగాల కవాతు సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంసాక్షి, పెద్దపల్లి: ప్రజా సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా పాలన సాగిస్తున్నామని రాష్ట్ర మైనారిటీస్ ఫైనా న్స్ కార్పొరేషన్ చైర్మన్ మహమ్మద్ ఒబెదుల్లా కొ త్వాల్ సాహెబ్ అన్నారు. కలెక్టరేట్ ప్రాంగణంలోని పరేడ్ గ్రౌండ్స్లో శుక్రవారం నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవానికి ఒబెదుల్లా కోత్వాల్ సాహెబ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత ఆయన పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జాతీయ పతాకం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సభికులను ఉద్దేశించి మాట్లాడారు. మహిళలకు అండగా.. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలు, ట్రాన్స్జెండర్లకు ఆర్టీసీ బస్సుల్లోఉచిత ప్రయాణ సౌకర్యం కల్పి స్తున్నామని, దీనిద్వారా జిల్లాలో ఇప్పటివరకు రూ.155.80 కోట్ల వరకు ఆదా అయిందని కొత్వాల్ సాహెబ్ అన్నారు. రూ.500కే వంటగ్యాస్ సిలిండర్ను ప్రభుత్వం అందిస్తోందని, దీనిద్వారా ఇప్పటి వరకు 1,18,397 కుటుంబాలకు రాయితీగా వారి బ్యాంక్ ఖాతాల్లో రూ.14.3 కోట్లు జమచేశామ న్నారు. గృహజ్యోతి పథకం ద్వారా 200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగిస్తున్న వారికి రూ. 85.24 కోట్లు చెల్లించి 1,31,966 కుటుంబాలకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేశామని ఆయన తెలిపారు. సొంతింటి కల నెరవేరేలా.. పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రవేశ పెట్టిందని, జిల్లాలో తొలివిడతలో ఇప్పటివరకు 6244 ఇళ్లు మంజూరు చేసి రూ.19.52కోట్లు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశామని కొత్వాల్ సాహెబ్ అన్నారు. ఉగాది పండుగనాడు సన్నబియ్యం పంపిణీని ప్రారంభించించామని, కొత్తగా 12,168 కుటుంబాలకు రేషన్కార్డులు అందజేశామని ఆయన వివరించారు. రైతులకు పెట్టుబడి సహాయాన్ని రూ.12 వేలకు పెంచి వానాకాలం పంటల కోసం 1,51,507 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.161.2 కోట్ల భరోసా నిధులు జమచేస్తామని ఆయన వివరించారు. చివరి ఆయకట్టు రైతులకు భరోసా.. కాకతీయకాలువ కింద సుమారు 2.30 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ, 10 వేల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు శ్రీలక్ష్మీనరసింహస్వామి పత్తిపాక రిజర్వాయర్ నీటి నిల్వ సా మర్థ్యాన్ని 3 టీఎంసీల నుంచి 5 టీఎంసీలకు పెంచామని, దీని డీపీఆర్ తయారీ కోసం రూ.1.10 కోట్లు మంజూరు చేశామని ఆయన తెలిపారు. దీంతోపాటు 13,396 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణకు రామగుండం ఎత్తిపోతల పెండింగ్ పనులను యుద్ధ ప్రాతిపదికను పూర్తిచేసి ఇటీవల ప్రారంభించామని ఆయన గుర్తుచేశారు. చిల్లపల్లి గ్రామానికి అవార్డు మంథని మండలం చిల్లపల్లి గ్రామ పంచాయతీకి ఉమెన్ ఫ్రెండ్లీ పంచాయతీ కేటగిరీలో దీన్దయాళ్ ఉపాధ్యాయ పంచాయతీ సతత్ వికాస్ పురస్కారం లభించిందని ఒబెదుల్లా అన్నారు. పట్టణ ప్రాంతాల్లో రూ.173 కోట్లు ఖర్చు చేస్తూ సీసీ రోడ్లు, సీసీ డ్రెయినేజీలు, బీటీ రోడ్లు, శ్మశానవాటికలు, ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు, పురపాలక భవనం, డంప్యార్డ్ వంటి పనులు చేపట్టామని తెలిపారు. అమృత పథకం 2.0 కింద రూ.293.84కోట్లతో ఫీవర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు నిర్మిస్తున్నామని అన్నారు. ప్రతిభావంతులకు పురస్కారాలు విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన 203 మంది ఉద్యోగులకు కొత్వాల్ సాహెబ్ ప్రశంసాపత్రాలు పంపిణీ చేశారు. పదో తరగతి, ఇంటర్లో టాపర్లుగా నిలిచిన నలుగురు విద్యార్థులకు రూ.10వేల చొప్పున ప్రోత్సాహకం అందించారు. మెప్మా కింద 148 స్వయం సహాయక సహాయ మహిళా సంఘాలకు రూ.17,36,98,000 బ్యాంకు లింకేజీ రుణాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కలెక్టర్ కోయ శ్రీహర్ష, పెద్దపల్లి, రామగుండం ఎమ్మెల్యేలు చింతకుంట విజయరమణారావు, మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అన్నయ్యగౌడ్, అదనపు కలెక్టర్లు అరుణశ్రీ, వేణు, డీసీపీ కరుణాకర్, ఆర్డీవో గంగయ్య, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. జెండాకు వందనం చేస్తున్న ప్రతినిధులు -
పోరాటాల ‘గాలిపల్లి’
ఇల్లంతకుంట: పోరాటాల గ్రామంగా చరిత్రలో నిలిచిపోయింది రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం గాలిపల్లి. దేశానికి స్వాతంత్య్రం వచ్చినా.. నిజాంపాలిత ప్రాంతం హైదరాబాద్ రాష్ట్రానికి ఇంకా విముక్తి లభించలేదు. బద్ధం ఎల్లారెడ్డి ప్రాంతమైన గాలిపల్లి ప్రజలు నైజాం పాలనపై తిరగబడ్డారు. 1948 సెప్టెంబర్ మొదటి వారంలో రజాకార్లు గాలిపల్లికి వచ్చారు. తిరుగుబాటుదారులు వారిసైన్యంపై రాళ్లు విసిరారు. రజాకార్ల కాల్పుల్లో తిరుగుబాటుదారుల్లో ముందువరుసలో ఉన్న 11మంది చనిపోయారు. వీరిలో గాలిపల్లికి చెందిన వారు ఏడుగురు, బేగంపేట, సోమారంపేట, తాళ్లపల్లి, నర్సక్కపేట గ్రామాలకు చెందినవారు నలుగురు ఉన్నారు. రజాకార్ల పాలన నుంచి విముక్తి కలిగిన తరువాత గాలిపల్లిలో దాదాపు 20మందికి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఫ్రీడంఫైటర్ పింఛన్లు మంజూరు చేశాయి. -
సేవలకు దక్కిన గౌరవం
జగిత్యాలక్రైం/మల్యాల: విధి నిర్వహణలో వారు ఎప్పుడూ ముందున్నారు. తమ సర్వీసులో ఏనాడూ మచ్చ కూడా ఎరగరు. వారి సేవలను గుర్తించిన కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు అనేక పతకాలు అందించింది. తాజాగా ప్రతిషాత్మకమైన ఇండియన్ పోలీస్ మెడల్కు కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. జగిత్యాల స్పెషల్ బ్రాంచ్ ఏఎస్సై రాజేశుని శ్రీనివాస్, మల్యాల పోలీస్స్టేషన్ ఏఎస్సై రుద్ర కృష్ణకుమార్కు మెడల్ ప్రకటించింది. రాజేశుని శ్రీనివాస్ 1989లో కానిస్టేబుల్గా పోలీసుశాఖలో చేరారు. 2012లో హెడ్ కానిస్టేబుల్గా, 2019లో ఏఎస్సైగా పదోన్నతి పొందారు. 2012లో రాష్ట్ర పోలీసు సేవా పథకం, 2019లో ఉత్తమ సేవా పథకం అందుకున్నారు. 36ఏళ్లుగా పోలీస్ పోలీసు శాఖకు చేస్తున్న సేవలను గుర్తించి కేంద్రప్రభుత్వం ఇండియన్ పోలీస్ మెడల్కు ఎంపిక చేసింది. అలాగే రుద్ర కృష్ణ కుమార్ 1989లో కానిస్టేబుల్గా పోలీసుశాఖలో చేరారు. 2017లో హెడ్కానిస్టేబుల్గా.. 2021లో ఏఎస్సైగా పదోన్నతి పొందారు. 2022లో రాష్ట్ర పోలీసు సేవా పథకానికి ఎంపికయ్యారు. 36 ఏళ్లుగా చేస్తున్న సేవలను గుర్తించి ఇండియన్ పోలీస్ మెడల్కు ఎంపిక చేశారు. ఇద్దరిని జగిత్యాల ఎస్పీ అశోక్కుమార్ అభినందించారు. కష్టపడి పనిచేసే పోలీస్ అధికారులకు గుర్తింపు వస్తుందని తెలిపారు. గురువారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రాజేశుని శ్రీనివాస్ రుద్ర కృష్ణకుమార్ ఇండియన్ పోలీస్ మెడల్కు ఇద్దరు ఏఎస్సైలు -
చిల్లపల్లి కార్యదర్శికి సన్మానం
పెద్దపల్లిరూరల్/మంథనిరూరల్: గతేడాది జాతీయ స్థాయిలో ఉత్తమ పంచాయతీ అవార్డు అందుకున్న మంథని మండ లం చిల్లపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి రాంకిశోర్ను భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖ, పంచాయతీరాజ్ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రి సన్మానించా రు. గురువారం న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో చిల్లపల్లి సెక్రటరీతోపాటు రాష్ట్రంలోని వివిధ గ్రామ పంచాయతీలకు చెందిన మరో ఐదుగురు కార్యదర్శులను సత్కరించారు. వీరితోపాటు పెద్దపల్లి జిల్లా పంచాయతీ అధికారి వీరబుచ్చయ్య ఆగస్టు 15న న్యూఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగే స్వాతంత్య్ర వేడుకలకు ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరుకానున్నారు. సర్పంచులు లేకపోవడంతో వారి స్థానంలో పంచాయతీ కార్యదర్శులను ఆహ్వానించారు. నేడు ఎర్రకోటలో పంద్రాగస్టు వేడుకలకు హాజరు -
లీడింగ్ ఫైర్ ఆఫీసర్ వహిదుల్లాఖాన్కు రాష్ట్రపతి పతకం
మెట్పల్లి: జగిత్యాల జిల్లా మెట్పల్లి ఫైర్ స్టేషన్లో లీడింగ్ ఫైర్ ఆఫీసర్గా విధులు నిర్వర్తిస్తున్న వహిదుల్లాఖాన్ అత్యున్నత పురస్కారమైన రాష్ట్రపతి పతకానికి ఎంపికయ్యారు. 1986లో ఫైర్మెన్గా అగ్ని మాపక శాఖలో చేరిన ఆయన.. ఆసిఫాబాద్, ఇచ్చోడ, ఆదిలాబాద్, పెద్దపల్లి, కరీంనగర్లో పని చేసి.. రెండేళ్ల క్రితం మెట్పల్లికి బదిలీపై వచ్చారు. 2015లో లీడింగ్ ఫైర్మెన్గా పదోన్నతి పొందారు. మొదటి నుంచి అంకితభావంతో పనిచేసే ఆయన విపత్తుల సమయాల్లో సమర్థవంతంగా విధులు నిర్వర్తిస్తారనే పేరు సంపాదించారు. అత ని సేవలకు గుర్తింపుగా ఇప్పటివరకు ఆరు ప్రశంసపత్రాలు, ఒక సేవాపతకం ప్రదానం చేశారు. ప్రస్తుతం రాష్ట్రపతి పతకానికి ఎంపిక కావడంపై ఆయనను ఉన్నతాధికారులు అభినందించారు. లీడింగ్ ఫైర్మెన్ గోపాల్రెడ్డికి రాష్ట్రపతి అవార్డు జమ్మికుంట: జమ్మికుంట పట్టణ అగ్నిమాపక కేంద్రంలో లీడింగ్ ఫైర్మెన్గా విధులు నిర్వహిస్తున్న బీరెడ్డి గోపాల్రెడ్డికి అరుదైన గౌరవం దక్కింది. ఫైర్మెన్గా విధుల్లో అత్యంత ఉత్తమ సేవలు అందించినందుకు రాష్ట్రపతి అవార్డుకు ఎంపికయ్యారు. ఫైర్ ఆఫీసర్గా విధుల్లో క్రమ శిక్షణ, నిబద్ధతతో పని చేసినందుకు అవార్డుకు ఎంపికై నట్లు గోపాల్రెడ్డి తెలిపారు. -
సూక్ష్మకళ.. భళా
ఓదెల(పెద్దపల్లి): మడక గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఆడెపు రజనీకాంత్ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పెన్సిల్ మొనపై 4 మి.మీ. పొడవు, 2 మి.మీ. వెడల్పుతో అతిచిన్న జాతీయ జెండా రూపొందించారు. ఇందుకోసం సుమారు గంట సమయం తీసుకున్నారు. చాక్పీస్పై 7 మి.మీ. పొడవు, 5 మి.మీ. వెడల్పుతో గంట పది నిమిషాలపాటు శ్రమించి చెక్కారు. చాక్పీస్పై హ్యాపీ ఇండిపెండెన్స్డే ఆంగ్ల అక్షరాలు చెక్కి శుభాకాంక్షలు చెక్కారు. వీటిని వివిధ బుక్ ఆఫ్ రికార్డులకు ప్రతిపాదించినట్లు రజనీకాంత్ తెలిపారు. -
క్రెడిట్ కార్డుల కమీషన్ పేరుతో డబ్బులు స్వాహా..
● నిందితుడి అరెస్ట్ ● వివరాలు వెల్లడించిన ఇన్స్పెక్టర్ శివకుమార్ వరంగల్ క్రైం: క్రెడిట్ కార్డుల ద్వారా క మీషన్ తీసుకోకుండా డబ్బులు ఇస్తానంటూ బాధితుల నుంచి లక్షలు స్వాహా చే సిన నిందితుడిని అరెస్ట్ చేసినట్లు హనుకొండ ఇన్స్పెక్టర్ ఎం.శివకుమార్ తెలి పారు. గురువారం పీఎస్లో నిర్వహించి న విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం మడిపల్లికి చెందిన నేరెళ్ల అరుణ్ 2023లో హనుమకొండ రాయపురలో ‘భద్రకాళి డిజిటల్ సేవ’ పేరుతో షాపు ఏర్పాటు చేశాడు. ఆన్లైన్ అప్లికేషన్స్తోపాటు కస్టమర్ల క్రెడిట్ కార్డు స్వైప్ చేసి వారికి డబ్బులు ఇచ్చేవాడు. రెగ్యులర్ కస్టమర్లను తన వాలెట్లో యాడ్ చేసుకుని వారి క్రెడిట్ కార్డుల్లో బ్యాలెన్స్ ఉంటే ఫోన్ చేసేవాడు. తాను వేరే పేమెంట్ చేసేది ఉందని చెప్పి వారి కార్డులు స్వైప్ చేసి వారికి ఎలాంటి చార్జీలు లేకుండా తానే క్రెడిట్ కా ర్డుల బిల్లులు చెల్లిస్తానని మోసం చేసేవాడు. కార్డులు స్వైప్ చేసిన తర్వాత వేరే కస్టమర్ల కార్డులు పేమెంట్ చేసి దానికి 4 శాతం వరకు చార్జీ తీసుకుని లాభం పొందేవాడు. ఎలాంటి కమీషన్ లేకుండా డబ్బులు డ్రా చేసి ఇస్తానని నమ్మించి డబ్బులు వాడుకున్న అనంతరం కొన్ని రోజుల తర్వాత ఇతరుల క్రెడిట్ కార్డు బిల్లులు చెల్లించేవాడు. ఏడాదిన్నరపాటు కస్టమర్లకు నమ్మకంగా ఉంటూ వారి క్రెడిట్ కార్డు బిల్లులు చెల్లిస్తూ, క్రెడిట్ కార్డులు స్వైప్ చేస్తూ బాధితుల డబ్బుల నుంచి తన క్రాప్ లోన్, అప్పులు కట్టుకున్నాడు. ఇలా సుమారు రూ.28 లక్షలు వాడుకున్నాడు. కొద్ది రోజులుగా విజయవాడలో ఉంటున్న నిందితుడు బుధవారం షాపు ఖాళీ చేస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించగా అరెస్ట్ చేసినట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. -
బీదబిడ్డల చదువంటే మంత్రికి చులకనే..
మంథని: అట్టడుగు వర్గాలకు చెందిన బిడ్డల ఉన్నత చదువులంటే మంత్రికి చులకనేనని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ ఆరోపించారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలను గురువారం ఆయన సందర్శించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఉన్నత విద్యను ప్రోత్సహిస్తున్నామని చెబుతున్న మంత్రి.. జేఎన్టీయూలో స్థానికేతర విద్యార్థులు 118మంది ఉంటే 72మంది మంథనికి చెందిన వాళ్లుఉన్నారని, పాలిటెక్నిక్లో వంద మందికి కేవలం 16మంది మాత్రమే మంథని ప్రాంతవాసులు ఉన్నారని, తద్వారా ఇవి ఎవరికి ఉపయోగపడుతున్నాయో ఆలోచన చేయాలన్నారు. ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు పెట్టించడం తప్ప పేదవిద్యార్థుల భవిష్యత్ కోసం ఆలోచన లేదన్నారు. తనను కేసుల్లో ఇరికించాలని ఎన్నిప్రయత్నాలు చేసినా భయపడేది లేదని, శ్వాస ఉన్నంతవరకు ప్రజల కోసం పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. నాయకులు ఏగోళపు శంకర్గౌడ్, ఆరెపల్లి కుమార్, కనవేన శ్రీనివాస్, గోనే శ్రీనివాసరావు, మాచిడి రాజుగౌడ్, వేల్పుల గట్టయ్య, గొబ్బూరి వంశీ తదితరులు పాల్గొన్నారు. -
రైళ్ల హాల్టింగ్ పునరుద్ధరణ
రామగుండం: పెద్దపల్లి, రామగుండం రైల్వేస్టేషన్లలో గతంలో రద్దు చేసిన పలు ఎక్స్ప్రెస్ రైళ్ల హాల్టింగ్ను ఈనెల 15న పునరుద్ధరించనున్నట్లు ఉత్తర తెలంగాణ రైల్వే ఫోరం అధ్యక్షుడు కంకటి ఫణి గురువారం తెలిపారు. ఐఆర్సీటీసీ రైల్వే పోర్టల్లోపై వాటి రాకపోకలు, హాల్టింగ్ మార్పును అప్డేట్ చేయనున్నట్లు వెల్లడించారు. హాల్టింగ్ పునరుద్ధరణ ఇలా.. రైలు నంబరు : 12656 : చైన్నె సెంట్రల్–అసర్వ జంక్షన్ (నవజీవన్ సూపర్ఫాస్ట్): పెద్దపల్లి జంక్షన్కు రాత్రి 8.59 గంటలకు చేరుతుంది. తిరుగు ప్రయాణంలో(12655) సాయంత్రం 4.45గంటలకు చేరుకుంటుంది. రైలు నంబరు : 22737 : సికింద్రాబాద్–హిస్సార్ (హిస్సార్ సూపర్ఫాస్ట్): ప్రతీ మంగళ, బుధవారాల్లో పెద్దపల్లి జంక్షన్కు వేకువజామున 2.34గంటలకు చేరుకుంటుంది. దీనికి ఈనెల 19 నుంచి హాల్టింగ్ ఉంటుంది. రైలు నంబరు : 17005 : హైదరాబాద్–రక్సోల్ (రక్సోల్ సూపర్ఫాస్ట్): ప్రతీ గురువారం వేకువజామున 2.34గంటలకు పెద్దపల్లి జంక్షన్కు చేరుకుంటుంది. ఈనెల 21 నుంచి పెద్దపల్లి జంక్షన్లో హాల్టింగ్ ఉంటుంది. రైలు నంబరు : 17006 : రక్సోల్ –హైదరాబాద్ (రక్సోల్ సూపర్ఫాస్ట్): ప్రతీ ఆదివారం రాత్రి 11.59గంటలకు పెద్దపల్లి జంక్షన్కు చేరుకుంటుంది. ఈనెల 17 నుంచి హాల్టింగ్ ఉంటుంది. రైలు నంబరు : 12295 : బెంగళూరు–దాణాపూర్ (సంఘమిత్ర సూపర్ఫాస్ట్): ప్రతీరోజు వేకువజామున 2.09గంటలకు రామగుండం రైల్వేస్టేషన్ చేరుకుంటుంది. శుక్రవారం నుంచి హాల్టింగ్ ఉంటుంది. -
ప్రజారోగ్యంతో చెలగాటం
కోల్సిటీ(రామగుండం): రామగుండం నగరపాలక సంస్థలోని పలు ప్రైవేట్ ఆస్పత్రుల నిర్వాహకులు, బయో మెడికల్ వేస్ట్(జీవ వైద్య వ్యర్థాలు) నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. లక్ష్మీనగర్లో బల్దియా పారిశుధ్య విభాగం అధికారులు గురువారం చేసిన తనిఖీల్లో ప్రైవేట్ ఆస్పత్రుల నిర్వాహకులు బహిరంగ ప్రదేశాల్లో పడేసిన బయో మెడికల్ వేస్ట్ వెలుగు చూసింది. ప్రమాదకరమైన బయో మెడికల్ వేస్ట్ను బయట పడవేసిన శ్రీఅదితి హాస్పిటల్కు రూ.లక్ష, సత్యం హాస్పిటల్కు రూ.50వేలు, వెంకటసాయి క్లినికల్ ల్యాబ్కు రూ.10వేలు జరిమానా విధించారు. బయో మెడికల్ వేస్ట్ను బహిరంగ ప్రదేశాల్లో వేస్తే జరిమానా విధించడంతోపాటు మున్సిపల్ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. -
శుక్రవారం శ్రీ 15 శ్రీ ఆగస్టు శ్రీ 2025
మా భూమి.. మా దేశం.. మా ప్రాంతం.. మా సొత్తు.. మా మనుషులు నినాదంతో ఎందరో మహనీయుల పోరాటాలతో సాధించుకున్న స్వాతంత్య్ర భారతదేశం అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోంది. ఉద్యమ సమయం నాటి అనేక సంఘటనలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇంకా కళ్లముందు కదలాడుతున్నాయి. స్వాతంత్య్ర పోరాటానికి వేదికై న మెట్పల్లి ఖాదీప్రతిష్టాన్ విదేశీ వస్తు బహిష్కరణలో కీలక పాత్ర పోషించింది. తాజాగా పొలిటికల్ బ్రాండ్గా పేరొందుతోంది. ఉమ్మడి జిల్లానుంచి ఎందరో మహనీయులు ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు. అమరులైన వారి పేరిట శిలాఫలకాలు ఆయా ప్రాంతాల్లో దర్శనమిస్తున్నాయి. నాటికీ.. నేటికీ పరిస్థితులు మారాయి. 78 ఏళ్ల స్వాతంత్య్ర భారతదేశం అభివృద్ధిలో దూసుకుపోతోంది. అయినప్పటికీ విద్య, వైద్యం, చట్టాలపై మరింత చైతన్యం రావాల్సిన అవసరం ఉందని నేటి యువత అంటోంది. 2047 నాటికి వందేళ్ల భారతదేశాన్ని పునర్నిర్మిస్తామని సగర్వంగా చెబుతోంది. నేడు 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా.. -
ఆంజనేయరాజుకు అవార్డు
జ్యోతినగర్(రామగుండం): రామగుండంలోని ఎన్టీపీసీ సీ ఐఎస్ఎఫ్ డిప్యూటీ కమాండెంట్ ఎస్.ఆంజనేయరాజు కు ప్రతిష్టాత్మక రాష్ట్రపతి మె రిటోరియస్ సర్వీస్ పతకం లభించింది. ఆంజనేయరాజు సేవలను గుర్తించిన అధికారులు.. ఆయనను మెరిటోరియస్ సర్వీస్ మెడల్కు ఎంపిక చేశారు. ఆయనను సీఐఎస్ఎఫ్ సీనియర్ కమాండెంట్ అరవింద్ కుమార్, అధికారులు, జవాన్లు, ప్రాజెక్టు అధికారులు తదితరులు అభినందించారు. ‘స్వచ్ఛ సర్వేక్షణ్’ పర్యటనఎలిగేడు(పెద్దపల్లి): స్వచ్చ సర్వేక్షణ్ గ్రామీణ్– 2025 కేంద్ర బృందం గురువారం ధూళికట్టలో పర్యటించింది. స్కూళ్లు, అంగన్వాడీ కేంద్రా లు, ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించింది. సేవలపై ఆరా తీసింది. ఇంకుడుగుంతలు, మరుగు దొడ్ల వినియోగం, కిచెన్ గార్డెన్లు, డ్రైనేజీలు తదితర వాటి ఫొటోలు తీసుకుంది. సభ్యులు వి.మధు, డి.రజిత ఎంపీడీవో భాస్కర్రావు, ఎంపీవో కిరణ్, ఎస్బీఎం కో ఆర్డినేటర్ రాఘవులు, పంచాయతీ కార్యదర్శులు పున్నమ య్య, అంజలి, ఏపీవో సదానందం, ఏపీఎం గీత, సీసీ మల్లేశం తదితరులు పాల్గొన్నారు. సింగరేణి అధికారుల నిరసన రామగిరి(మంథని): పెర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే (పీఆర్పీ) కోసం సింగరేణి అధికారులు మూడురోజులుగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం ఆర్జీ–3 ఏరియా ఓసీపీ–1, 2, అడ్రియాల లాంగ్వాల్ ప్రాజెక్టులోని వివిధ విభాగాల అధికారులు జీఎం కార్యాల యం ఎదుటట నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. సీఎంవోఏఐ నాయకులు మాట్లాడుతూ 2022–23, 2023–24 ఆర్ధిక సంవత్సరాల పీఆర్పీ ఇప్పటివరకు చెల్లించలేదన్నారు. కోల్ ఇండియాలో ఏటా చెల్లిస్తోందన్నారు. డిప్యూటి సీఎం భట్టివిక్రమార్క, మంత్రి శ్రీధర్బాబు, సింగరేణి సీఎండీ బలరాం నాయక్ చొరవ తీసుకుని సమస్యలు పరిష్కారించాలని కోరా రు. జీఎంలు సుధాకర్రావు, నాగేశ్వరరావు, అధికారుల సంఘం నేతలు వెంకటరమణ, శ్రీనివాస్రావు, సుదర్శనం పాల్గొన్నారు. బీజేపీ తిరంగా యాత్ర పెద్దపల్లిరూరల్: బీజేపీ ఆధ్వర్యంలో గురువా రం జిల్లా కేంద్రంలో తిరంగా యాత్ర నిర్వహించారు. కో ఆర్డినేటర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ప్రగతినగర్ చౌరస్తా నుంచి కమాన్ వరకు యాత్ర కొనసాగింది. నాయకులు ఠాకూర్ రాంసింగ్, జంగ చక్రధర్రెడ్డి, నల్ల మనోహర్రెడ్డి, పల్లె సదానందం, ఫహీం, క్రాంతి, లక్ష్మీనారాయణ, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.పదవీకాలం పొడిగింపు సుల్తానాబాద్(పెద్దపల్లి): ప్రాథమిక వ్యవసా య సహకార సంఘాల పదవీకాలం మరో ఆ ర్నెల్లపాటు పొడిగించినట్లు ఉత్తర్వులు జారీ అ య్యాయని డీసీవో శ్రీమాల తెలిపారు. పీఏసీఎ స్ పదవీకాలం గురువారం ముగిసిందన్నారు. దీంతో పీఏసీఎస్ల పదవీకాలం పొడిగిస్తూ సర్కార్ ఉత్తర్వులు ఇచ్చిందని వివరించారు. ప్రభుత్వ ఆస్పత్రికి మహర్దశ మంథని: స్థానిక ప్రభుత్వ సామాజిక వైద్యశాలకు మహర్దశ పట్టనుంది. సౌకర్యాల కల్పన, డాక్టర్ల నియామకం, పలు అభివృద్ధి పనులకు రూ.20లక్షలు మంజూరు కావడంతో ఆస్పత్రి రూపురేఖలు మారుతాయని జిల్లా మెడికల్ సూపరింటెండెంట్ శ్రీధర్ తెలిపారు. ఇద్దరు డాక్టర్ల నియామకం, రూ.5లక్షలతో వెయిటింగ్హాల్ నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయన్నారు. మాతాశిశు ఆస్పత్రిలో గర్భిణుల కోసం రూ.12లక్షలతో అల్ట్రా సౌండ్ స్కానింగ్, శిశువు ల కోసం రూ.1.12లక్షలతో వార్నర్, ఫొటో థె రపీ, రూ.1.80లక్షలతో ఆర్వో ప్లాంట్ ఏర్పా టు చేస్తామన్నారు. మంత్రి శ్రీధర్బాబు ఆదేశాలతో కలెక్టర్ నిధులు మంజూరు చేశారన్నారు. రేపు ఎస్జీఎఫ్ క్రీడాపోటీలు జ్యోతినగర్(రామగుండం): జిల్లాస్థాయి ఎస్జీఎ ఫ్ క్రీడా ఎంపిక పోటీలు ఈనెల 16న నిర్వహించనున్నట్లు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి కనుకుంట్ల లక్ష్మణ్ తెలిపారు. ఎన్టీపీసీ జెడ్పీ హైస్కూల్లో అండర్–15లో వాలీబాల్, ఫుట్ బాల్ పోటీలు ఉంటాయని పేర్కొన్నారు. -
పంద్రాగస్టుకు పోదువు.. లే కొడుకా
తిమ్మాపూర్: ఉదయం అందరితో కలిసి సంతోషంగా బడికి వెళ్లాడు. తెల్లవారితే పంద్రాగస్టు కావడంతో ఆ వేడుకల గురించే తోటి పిల్లలతో మాట్లాడుకుంటూ ఇంటికి ఆటోలో బయల్దేరా డు. కానీ, ఆ బాలుడి ఆనందం మార్గంమధ్యలోనే ఆవిరైంది. ఆటో ప్రమాదం అనంతలోకాలకు తీసుకెళ్లింది. ‘పంద్రాగస్టుకు పోతువు లే.. కొడుకా’ అంటూ తల్లిదండ్రులు రోదించిన తీ రు స్థానికులను కన్నీరు పెట్టించింది. ఈ విషాద ఘ టన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లి గ్రామ శివారులో గురువారం చోటుచేసుకుంది. తిమ్మాపూర్లోని ఓ ప్రైవేట్ పాఠశాలకు చెందిన 15 మంది విద్యార్థులతో స్కూల్ నుంచి ఆటో మన్నెంపల్లికి బయల్దేరింది. గ్రామానికి 500మీటర్ల దూరంలో కుక్కలు ఆటో వెంట పరుగెత్తడంతో డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేశాడు. ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. 15మంది చిన్నారుల్లో నలుగురుకి తీవ్రగాయాలు, మిగిలినవారికి స్వల్ప గాయాలయ్యాయి. మ న్నెంపల్లికి చెందిన 4వ తరగతి విద్యార్థి నాంపల్లి హ ర్షవర్ధన్ (9) తీవ్రంగా గాయపడ్డాడు. ఆటో ఎడమవై పు కూర్చున్న హర్షవర్ధన్న్పై ఆటో బరువుపడడంతో పాటు, పగిలిన ఆటో అద్దాలు అతని తలలో గుచ్చుకున్నాయి. ఎడమ చేయి కూడా దెబ్బతిని నుజ్జునుజ్జుగా మారింది. వెంటనే ఆస్పత్రికి తరలించినా గా యాల తీవ్రతతో హర్షవర్ధన్ మృతి చెందాడు. అదే ఆటోలో హర్షవర్ధన్ అక్క నాంపల్లి శ్రీసాహితి కూడా ఉంది. తమ్ముడు కళ్లముందే తీవ్రంగా గాయపడడం చూసి బోరున విలపించింది. హర్షవర్ధన్ తల్లిదండ్రులు నాంపల్లి శ్రీనివాస్, సమతలు వ్యవసాయం చేస్తూ, కష్టపడి పిల్లలను చదివిస్తున్నారు. ఈ దుర్ఘటన వారి కుటుంబాన్ని తీవ్ర శోకంలో ముంచెత్తింది. శ్రీనివాస్ ఫిర్యాదుతో ఆటో డ్రైవర్ అనిల్పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. పాఠశాలకు వెళ్లొస్తుండగా అదుపుతప్పిన ఆటో నాలుగేళ్ల బాలుడి దుర్మరణం.. నలుగురికి తీవ్రగాయాలు రెండు నిమిషాల్లో ఇంటికి చేరే క్రమంలో ప్రమాదం కరీంనగర్ జిల్లా మన్నెంపల్లి శివారులో ఘటన -
పొలిటికల్ బ్రాండ్.. మెట్పల్లి ఖాదీ ప్రతిష్టాన్
కోరుట్ల/మెట్పల్లి: ఇక్కడి నేతలకు ఖాదీ బట్టలే స్ఫూర్తి. చాలా మందికి ఖాదీ రాజకీయంగా ఊపిరి పోసిందంటే అతిశయోక్తి కాదు. స్వాతంత్య్ర పోరా టకాలంలో ఖాదీ ఉద్యమానికి వేదికగా నిలిచింది జగిత్యాల జిల్లాలోని మెట్పల్లి. గాంధీ శిశ్యుడు అన్నాసాహెబ్ ఆధ్వర్యంలో మెట్పల్లిలో వెలిసిన ఖాదీ ప్రతిష్టాన్ ఖద్దరు ఆ కాలంలో ఖ్యాతి పొందింది. అప్పటి ఆనవాయితీని పుణికిపుచ్చుకుని మెట్పల్లి ప్రాంత రాజకీయ నాయకులు ఖాదీ వస్త్రాలు ధరించడం ఇప్పటికీ దూరం కాలేదు. కడక్ ఖాదీ బట్టలతో ఎవరైనా కనిపిస్తే చాలు ఈయన మెట్పల్లి లీడరని చెప్పొచ్చు. 1983లో ఎన్టీఆర్ ప్రభుత్వ హయంలో కార్మికశాఖ మంత్రిగా పనిచేసిన వర్ధినేని వెంకటేశ్వర్రావు, మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్.విద్యాసాగర్రావు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా జెడ్పీ మాజీ చైర్మన్ కేవీ.రాజేశ్వర్రావు, జనతా పార్టీ నుంచి ఏకై క ఎమ్మెల్యేగా ఎన్నికై న కొమొరెడ్డి రామ్లు, జెడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమ ఖాదీ ప్రతిష్టాన్ వస్త్రాలు ధరించి రాజకీయాల్లో కీలకంగా ఎదిగినవారే. 2009 అసెంబ్లీ పునర్విభజనలో కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గంగా మారినప్పటికీ.. మెట్పల్లి ఖాదీ కార్ఖానా స్ఫూర్తిగా రాజకీయాల్లోకి వచ్చిన నేతలు కల్వకుంట్ల విద్యాసాగర్రావు, సంజయ్ ఇక్కడి ఎమ్మెల్యేలుగా కొనసాగడం గమనార్హం. -
ప్రజలు ఏకతాటిపైకి రావాలి
● రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్ గోదావరిఖని: న్యాయ సమ్మతమైన ఎన్నికల కోసం ప్రజలు ఏకం కా వాలని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ కోరారు. స్థాని క ప్రధాన చౌరస్తాలో గురువారం రాత్రి కొ వ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. ‘ఓట్ల దొంగలు – గద్దె దిగండి’ అంటూ నినాదాలు చేశారు. ప్రజాస్వామ్యంలో పవిత్రమైన ఓటును దోచుకునే వారికి రాజకీయాల్లో స్థానం ఉండవద్దని అన్నారు. నాయకులు మహంకాళి స్వామి, బొంతల రాజేశ్, తిప్పారపు శ్రీనివాస్, ప్రకాశ్ పాల్గొన్నారు. గ్రామాల అభివృద్ధే లక్ష్యం పాలకుర్తి(రామగుండం): గ్రామాల అభివృద్ధే ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్ అన్నారు. బసంత్నగర్, పాలకుర్తి, ఈసాలతక్కళ్లపల్లి, కొత్తపల్లి, రామారావుపల్లి, పుట్నూర్, జయ్యారం, కుక్కలగూడూర్, వేంనూర్ గ్రామాల్లో చేపట్టిన రోడ్లు, తదితర అభివృద్ధి పనులకు తన సతీమణి మనాలీ ఠాకూర్తో కలిసి గురువారం భూమిపూజ చేశారు. కొత్త రేషన్ కార్డులు, షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేసి మాట్లాడారు. ప్రతీ సంక్షేమ పథకం అర్హులైన ప్రతీఒక్కరికి అందిస్తామన్నారు. నాయకులు తిరుపతి, మనోహర్రెడ్డి, రమేశ్, శ్రీనివాస్, సూర సమ్మయ్య, పర్శవేని శ్రీనివాస్, తంగెడ అనిల్రావు, తలారీ శంకర్, శిలగాని రాజేశం, మల్లెత్తుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి పనులకు శంకుస్థాపన రామగుండం: అంతర్గాం, రామగుండంలో ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కుందనపల్లి అర్బన్ పార్క్లోని అటవీశాఖ జిల్లా నివాసాన్ని ప్రారంభించారు. -
ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి
గోదావరిఖని: బాధితుల ఫిర్యాదులపై పోలీసులు తక్షణమే స్పందించాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా సూచించారు. వార్షిక తనిఖీల్లో భాగం గురువారం గోదావరిఖని వన్టౌన్ పోలీస్స్టేషన్ను తనిఖీ చేశారు. రికార్డులను తనిఖీ చేశారు. పెండింగ్, కోర్టు, దర్యాప్తు కేసులపై ఆరా తీశారు. ప్రజల్లో విశ్వాసం పెంపొందించడానికి ప్రతీఒక్కరు క్రమశిక్షణ, నిజాయితీ, నిబద్ధతతో విధులు నిర్వహించాలని సూచించారు. అనంతరం ఠాణా ఆవరణలో మొక్కలు నాటారు. పెద్దపల్లి డీసీపీ కరుణాకర్, గోదావరిఖని ఏసీపీ రమేశ్, వన్టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి, రవీందర్, ఎస్సైలు భూమేశ్, రమేశ్ పాల్గొన్నారు. -
విశ్వగురుగా భారత్
‘ప్రపంచంలోనే మనదేశం తిరుగులేని శక్తిగా అ వతరిస్తోంది. 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం సాధించినప్పటి నుంచి అనేక ఒడిదొడుకులు ఎదుర్కొన్నా.. ప్రస్తుతం అన్నిరంగాల్లో దూసుకెళ్తోందని’ వక్తలు అన్నారు. స్థానిక ట్రినిటి ఇంజినీరింగ్ కాలేజీలో ‘స్వతంత్ర భారతం.. వందేళ్ల భవితవ్యం’ అంశంపై ‘సాక్షి’ టాక్ షో నిర్వహించింది. కాలేజీ అటానమస్ అకడమిక్ డైరెక్టర్ అశోక్కుమార్, ప్రిన్సిపాల్ మణిగణేశన్, కో ఆర్డినేటర్ అశోక్, హెచ్వోడీ ప్రభాకర్, విద్యార్థులు పాల్గొన్నారు. మనదేశం అంతరిక్ష ప్రయోగాల్లో నూ రాణిస్తోందని తెలిపారు. యువశక్తి సంకల్ప దీక్షతో దేశఔన్నతాన్ని పెంచేలా ముందుకు సాగా లని అభిప్రాయపడ్డారు. పర్యావరణ పరిరక్షణకు ఎలక్ట్రిక్ వాహనాలు వినియోగం పెరుగుతోందన్నారు. సౌరశక్తిని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. పారిశ్రామిక, విద్య, వైద్య రంగాల్లో నూ సూపర్పవర్గా ఎదుగుతోందని అభిప్రాయపడ్డారు. స్వతంత్రం సిద్ధించి వందేళ్లు పూర్త య్యే నాటికి భారత్ ప్రపంచంలోనే రాజకీయ, ఆర్థిక, సాంకేతిక, సైనిక తదితర రంగాల్లో అగ్రగామిగా నిలిచి విశ్వగురుగా అవతరిస్తుందని ప్రతినిధులు ధీమా వ్యక్తం చేశారు. – పెద్దపల్లిరూరల్ ఉపాధి కల్పించాలి యువత శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఎదగాలి. పోటీ యుగంలో నెగ్గేందుకు నైపుణ్యం పెంపొందించాలి. ఉపాధి పొందడం కోసం కాకుండా పలువురికి ఉపాధి కల్పించేలా ఎదగాలి. – బండారి రాహుల్, సీఎస్ఈ మన సంస్కృతి గొప్పది మనదేశ సంస్కృతి, సంప్రదాయాలు గొప్పవి. పాశ్చాత్య దేశాలన్నీ మన సంస్కృతి పాటిస్తున్నాయి. మనం పరాయి పాలనలోని దురలవాట్లు పాటిస్తున్నాం. వాటినుంచి బయటపడి దేశ ఔన్నత్యాన్ని పెంచాలి. – ఆఖ్య, ఈసీఈ కుల, మతాలకు తావుండదు ఇప్పుడున్న కుల, మతాలు భవిష్యత్లో ఉండక పోవచ్చు. మనుషులంతా ఒక్కటే అనే భావన పెరిగి పరస్పర సహకారం, స్నేహభావంతో ముందుకు సాగే పరిస్థితులు వస్తాయి. ప్రస్తుతం చదువుకునే సమయంలోనే కులం అనే పదం వినిపిస్తోంది. – ఉస్మాన్, ఎంఐఈ సాంకేతికతతో అభివృద్ధి సాంకేతిక పరిజ్ఞానం గణనీయంగా వృద్ధి చెందుతోంది. డిజిటల్ మార్కెటింగ్, వెబ్ డిజైనింగ్, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ లాంటి కోర్సులను సద్వినియోగం చేసుకుంటూ యువత దేశ భవిష్యత్లో కీలకపాత్ర పోషించాలి. – హసీనా, ఏఎంఐఈ ఇంధన భద్రతపై దృష్టి ఇంధన భద్రత కోసం ప్రపంచంలోనే అతిముఖ్యమైన బయోఫ్యూయల్ ఉత్పత్తిపై మనదేశం దృష్టి సారించింది. సాంకేతిక పరిజ్ఞానం. స్టార్టప్ వ్యవస్థను ప్రోత్సహించడంలో అగ్రగామిగా నిలవాలి. ఇంధన మిశ్రమంలో గ్యాస్ వాటా పెంచాలి. – శివాని, ఏఎంఐఈ ఉచితాలు వద్దు మనదేశం ఆర్థికశక్తిగా ఎగబాకుతోంది. దీనికితోడు యువ త, ప్రజలకు అవసరమైన ఉపాధి కల్పించేలా ప్రణాళిక సిద్ధం చేయాలి. ప్రజలకు ఉచితంగా లబ్ధి చేకూరే పథకాలను క్రమంగా తగ్గించాలి. యువత ఉత్పత్తి రంగంలో రాణించేలా ప్రోత్సహించాలి. – సయిఫ్, ఈసీఈ ఐటీ రంగంలో మేటి సాంకేతిక పరిజ్థానాన్ని యువ తకు అందిస్తూ ఐటీ రంగంలో మేటిగా ఉంది. దీంతో దేశ ఆర్థిక వ్యవస్థ బలపడుతోంది. ఆర్థిక, సాంకేతిక రంగాల్లో పురోగతి సాధించి మనదేశం ప్రపంచంలోనే గొప్పగా ఉంటుంది. – మణిగణేశన్, ప్రిన్సిపాల్ సాంకేతికతపై పట్టుసాధించాలి ప్రపంచ దేశాల మధ్య పోటీ పెరిగింది. అందులో మన దేశం అన్నిరంగాల్లో ముందు కు దూసుకుపోతోంది. సాంకేతికత, ఇంటర్నెట్ వినియోగంపై పట్టు సాధించేలా యువతకు శిక్షణ ఇవ్వాలి. ఏఐ టెక్నాలజీ రాజ్యమేలడం ఖాయం. – ప్రొఫెసర్ అశోక్, ఆర్ అండ్ డీ కో ఆర్డినేటర్ అన్నిరంగాల్లో ప్రగతి మనదేశం అన్నిరంగాల్లో ప్రగతి సాధించి ప్రపంచంలోనే అగ్రగామిగా నిలుస్తుంది. సౌర, జల విద్యుత్శక్తి ఉత్పత్తి పెరుగుతోంది. యువశక్తికి కొదవలేదు. వారు దేశ ఔన్నత్యం కోసం పాటుపడేలా శిక్షణ ఇవ్వాలి. – ప్రభాకర్, ఈసీఈ హెచ్వోడీ ఆటోమేషన్పై ఫోకస్ స్వతంత్ర భారతానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆటోమేషన్, టెక్నాలజీ తదితర రంగాలపై ఫోకస్ పెడితే ఆర్థికవృద్ధి సా ధిస్తుంది. ఇంటర్నెట్ వినియోగం, డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో ముందుంది.– అశోక్కుమార్, అకడమిక్ డైరెక్టర్ -
ఇందిరమ్మ లబ్ధిదారులకు అప్పు ఇవ్వండి
● స్వశక్తి సంఘాలకు కలెక్టర్ శ్రీహర్ష సూచన పెద్దపల్లిరూరల్: ఇం దిరమ్మ ఇల్లు మంజూరైన స్వశక్తి సంఘాల మహిళలకు రూ.లక్ష అప్పు ఇ వ్వాలని కలెక్టర్ కో య శ్రీహర్ష స్వశక్తి సంఘాల ప్రతినిధులకు సూచించారు. కలెక్టరేట్లో గురువారం వివిధ శాఖల పనితీరుపై సమీక్షించారు. సీ్త్రనిధి, బ్యాంక్ లింకేజీ రుణ లక్ష్యాలు పూర్తికావాలని సూచించారు. ఈనెల 26న విదేశాల్లో ఉపాధి అవకాశాలపై టామ్కామ్ ద్వారా అవగాహ న సదస్సు నిర్వహిస్తామని తెలిపారు. పీఎంశ్రీ పాఠశాల, యంగ్ఇండియా గురుకులాలు, జూనియర్, డిగ్రీకాలేజీలు, గోదావరిఖని శాతవాహన యూనివర్సిటీ అడ్మిన్బ్లాక్, సుల్తానాబాద్ బాలసదనం తదితర పనుల పురోగతిపై ఆరా తీశారు. రూ.23.75 కోట్లతో చేపట్టిన గోదావరిఖని ఆస్పత్రి అభివృద్ధి, రూ.22కోట్లతో మంథనిలో చేపట్టిన ఆస్పత్రి నిర్మాణాలను వేగంగా పూర్తిచేయాలని ఆదేశించారు. ఆయా కార్యక్రమాల్లో అడిషనల్ కలెక్టర్ వేణు, డీఆర్డీవో కాళిందిని, అడిషనల్ డీఆర్డీవో రవీందర్, డీసీపీ కరుణాకర్, ఏసీపీ కృష్ణ, ఈఈ అశోక్కుమార్, ఏఈ నరేశ్ తదితరులు పాల్గొన్నారు. -
మొదటి జెండా ఎగిరింది ధర్మపురిలోనే..
ధర్మపురి: నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడి, స్వాతంత్య్ర సమరయోధులుగా గుర్తింపు పొందిన జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందిన కేవీ.కేశవులు, మాణిక్యశాస్త్రి ప్రాణస్నేహితులు. కేశవులు ఆనాటి ముఖ్యమంత్రి జలగం వెంగల్రావు హయాంలో చేనేత జౌళిశాఖ మంత్రిగా కొనసాగారు. 1947లో ఆగస్టు 15న దేశానికి స్వాతంత్య్రం వచ్చిన రోజు ధర్మపురిలోని గోదావరి ఒడ్డునున్న కర్నెఅక్కెపెల్లి భవనంపై తన మిత్రుడైన మాణిక్యశాస్త్రితో కలిసి మొట్టమొదటి జాతీయ జెండాను ఆవిష్కరించారు. జెండా ఎగురవేయడం నిషేధమని అప్పటి నిజాం ప్రభుత్వం కేశవులను బంధించడానికి ప్రయత్నించగా.. నిండుగా ప్రవహిస్తున్న గోదావరిలోంచి వెళ్లి తప్పించుకున్నారు. ఏడాదిపాటు ముంబయిలో తలదాచుకున్నారు. 1948 సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినం రోజు తిరిగి ధర్మపురికి చేరుకున్నారు. 2019 జనవరి 30న అనారోగ్యంతో మృతి చెందారు. -
మొక్కల సంరక్షణ బాధ్యత మహిళలకే
● వారికి అప్పగిస్తే అవినీతికి తావుండదు ● రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్ కోల్సిటీ(రామగుండం): మొక్కల సంరక్షణ బా ధ్యతను మహిళా సంఘాలకు అప్పగిస్తే ప్లాంటేషన్కు కేటాయిస్తున్న రూ.కోట్లలో అవినీతికి తావుండ దని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్ అన్నారు. 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక లో భాగంగా బుధవారం రామగుండం బల్దియాలో మొక్కలు పంపిణీ చేసి మాట్లాడారు. ఏటా లక్షల్లో మొక్కలు నాటితే ఛత్తీస్గఢ్ జంగల్ తరహాలో చెట్లు కనిపించాలని, ప్రస్తుతం ఆ పరిస్థితి లేదన్నారు. 10 వేల మొక్కలు నాటి లక్ష నాటినట్లు చూపిస్తే కాంట్రాక్టర్ను జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. మహిళలు తమ కుటుంబసభ్యుల పేరిట మొక్కలు నాటి సంరక్షిస్తే పర్యావరణానికి మేలు జరుగుతుందని అన్నారు. స్వశక్తి మహిళా సంఘాలతో త్వరలో నే ఆర్టీసీ బస్సులు, సోలార్ ప్లాంట్లు, పెట్రోల్ బంకులు ఏర్పాటు చేయిస్తామని తెలిపారు. డిప్యూటీ కమిషనర్ వెంకటస్వామి, అధికారులు రామన్, షాభాజ్, తేజస్విని, సాయి, మౌనిక పాల్గొన్నారు. కాగా, మల్కాపూర్ శివారులోని డంపింగ్యార్డ్లో రూ.83 లక్షల అంచనా వ్యయంతో చేపట్టిన డ్రై రీసోర్స్ కలెక్షన్ సెంటర్, కౌపోస్ట్ షెడ్ పనులకు ఎమ్మెల్యే మక్కాన్సింగ్ శంకుస్థాపన చేశారు. అభివృద్ధి పనులకు శంకుస్థాపన ఫెర్టిలైజర్సిటీ(రామగుండం): పాలకుర్తి మండలం గుంటూరుపల్లిలో ఎమ్మెల్యే మక్కాన్సింగ్ పలు అభివృద్ధి పనులకు భూమిపూజ చేశారు. కొత్త రేషన్కార్డులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి గైర్హాజరై న తహసీల్దార్తోపాటు అధికారులపై రాజ్ఠాకూర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై కలెక్టర్కు ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన తెలిపారు. -
పంద్రాగస్టు వేడుకలకు ముఖ్య అతిథి అబ్దుల్లా
సుల్తానాబాద్(పెద్దపల్లి): ఈనెల 15న జిల్లాలో నిర్వహించే భారత స్వాతంత్య్ర వేడుకలకు తె లంగాణ మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఎండీ అ బ్దుల్లా ముఖ్య అతిథిగా హాజరువుతారని బు ధవారం ఉత్తర్వులు జారీఅయ్యాయి. ఉద యం 10 గంటలకు కలెక్టరేట్లో ఆయన జా తీయ జెండా ఆవిష్కరిస్తారని పేర్కొన్నారు. రామునిగుండాలకు జలకళ రామగుండం: కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలతో రామునిగుండాల జలపాతం జాలువారుతూ కనువిందు చేస్తోంది. వాటర్ఫాల్స్ తి లకించేందుకు పర్యాటకులు పెద్దసంఖ్యలో తరలివస్తున్నారు. పచ్చనిచెట్ల అందం, పర్చుకున్న పచ్చదనం ఆహ్లాదాన్ని ఆస్వాదిస్తున్నారు. శ్రావణమాసం కావడంతో రామునిగుండాలతోపా టు రామునిపాదాలు దర్శించేందుకు భక్తులు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. ‘ఎల్లంపల్లి’కి ఇన్ఫ్లో రామగుండం: ఎగువన కురుస్తున్న భారీవర్షాల తో ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో వచ్చిచేరుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ సామ ర్థ్యం 20.175 టీఎంసీలు కాగా ప్రస్తుతం 14.0 6 టీఎంసీలకు చేరింది. సుమారు 19,062 క్యూ సెక్కుల ఇన్ఫ్లో వస్తోందని అధికారులు బుధవారం తెలిపారు. ఇందులో అత్యధికంగా కడెం ప్రాజెక్టు నుంచి 11,478 క్యూసెక్కులు వచ్చి చే రుతోంది. మరోవైపు.. ప్రాజెక్టు నుంచి హైదరా బాద్కు 330 క్యూ సెక్కులు, ఎన్టీపీసీకి 121 క్యూసెక్కుల విడుదల చేస్తున్నారు. జాతీయ జెండా ఐక్యతకు చిహ్నం జ్యోతినగర్(రామగుండం): మన జాతీయ జెండా చిహ్నం మాత్రమే కాదని, ఐక్యతకు గర్వకారణమని సీఐఎస్ఎఫ్ ఎన్టీపీసీ యూనిట్ సీనియర్ కమాండెంట్ అరవింద్కుమార్ అన్నారు. హర్ ఘర్ తిరంగా – 2025లో భాగంగా సీఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ప్రాజెక్టు లేబర్ గేట్ వద్ద బైక్ ర్యాలీని బుధవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రత్యేకంగా అలంకరించిన బైక్లతో త్రివర్ణ పతాకం మోసుకెళ్లి, దేశభక్తి నినాదాలు చేయడం ఆనందంగా ఉందని ఆయన అన్నారు. ర్యాలీలో సుమారు 150 మంది సీఐఎస్ఎఫ్ సిబ్బంది పాల్గొని 15 కి.మీ. మేరకు ర్యాలీ నిర్వహించారు. డిప్యూటీ కమాండెంట్ ఆంజనేయరాజు, ఓవీకే శాస్త్రి, అసిస్టెంట్ కమాండెంట్ తాళియన్ పాల్గొన్నారు. ఢిల్లీలో వేడుకలకు చిల్లపల్లి పంచాయతీ కార్యదర్శి మంథనిరూరల్: స్వచ్ఛ స ర్వేక్షణ్ భారత్ అమలులో చిల్లపల్లి గ్రామ పంచాయ తీకి జాతీయస్థాయి అవా ర్డు లభించిన విషయం వి దితమే. ఈ నేపథ్యంలోనే ఢిల్లీలో జరిగే స్వాతంత్య్ర వేడుకలకు ప్రత్యేక అతిథిగా హాజరు కావాలని పంచాయతీరాజ్ కమిషనర్ నుంచి చిల్లపల్లి కా ర్యదర్శి రాంకిశోర్కు ఆహ్వానం అందింది. ఈ మేరకు బుధవారం ఆయన ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. సంపూర్ణ పారిశుధ్యం నిర్వహణలో చి ల్లపల్లికి అవార్డు దక్కగా అప్పటి సర్పంచ్తోపా టు పంచాయతీ కార్యదర్శి రాష్ట్రపతి నుంచి పు రస్కారం అందుకున్నారు. కాగా, గురువారం ప్రభుత్వం రాంకిశోర్ను సన్మానించనుంది. శుక్రవారం ఢిల్లీ ఎర్రకోటలో జరిగే స్వాతంత్య్ర వేడుకలకు ఆయన హాజరుకానున్నారు. చెక్డ్యాం పనులకు రూ.35.54 కోట్లు సుల్తానాబాద్రూరల్(పెద్దపల్లి): నీరుకుల్ల మా నేరుపై నిర్మించిన చెక్డ్యాంకు రూ.35.54కోట్ల పరిపాలనా అనుమతి లభించిందని ఇరిగేషన్ డీఈఈ రాజేందర్ తెలిపారు. చెక్డ్యాం నిర్మాణానికి 2020లో రూ.21.02 కోట్లు సాంకేతికంగా మంజూరు కాగా, వాస్తవ పరిస్థితులైన కరకట్ట, రంగనాయకస్వామి ఆలయ ప్రహరీ పనికోసం ఇరిగేషన్ అధికారులు రూ.40.14కోట్లకు మంజూరు ఇవ్వాలని అభ్యర్థించారు. -
‘ఆటోమేటిక్’గా పట్టేస్తాయి
జిల్లాలో నమోదైన కేసులు, జరిమానాలు గోదావరిఖని: జిల్లాలో విస్తరించిన రహదారులపై నిత్యం ఏదోఒకచోట రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంటూనే ఉంది. ప్రధానంగా సుల్తానాబాద్ మండలం దుబ్బపల్లి నుంచి గోదావరిఖనిలోని గంగానగర్ సమీప గోదావరి వంతెన వరకు, గోదావరిఖని నుంచి మంథని వరకు, పెద్దపల్లి నుంచి మంథని వరకు, పెద్దపల్లి నుంచి ధర్మారం వరకు గల రోడ్లు అత్యంత ప్రమాదకరంగా మారాయి. కొందరు ప్రాణాలు కోల్పోతే.. మరికొందరు శాశ్వతంగా అంగవైకల్యం పాలవుతున్నారు. అతివేగం, ట్రా ఫిక్ నిబంధనలు అతిక్రమించడంతో రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని అధికారులు వివ రిస్తున్నారు. అయితే, రోడ్డు ప్రమాదాల నియంత్రణకు సంబంధిత శాఖ అధికారులు ఇప్పటికే బ్లాక్స్పాట్లు గుర్తించారు. అక్కడ సైన్బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. వేగ నియంత్రణ కోసం స్పీడ్గన్లు ఏర్పాటు చేశారు. వీటిద్వారా సత్ఫలితాలు వస్తున్నా.. లక్ష్యం నెరవేరడం లేదు. ఈఏడాది జరిగినలో జరిగిన 79 సీరియస్ ప్రమాదాల్లో 88 మంది మృతి చెందారు. సమన్వయంతో ముందుకు.. ట్రాఫిక్ పోలీసులు, రోడ్డు భద్రతా అధికారులు సమన్వయంతో ప్రమాదాల నియంత్రణ లక్ష్యంగా అవగాహన కల్పిస్తున్నారు. పాఠశాలలు, కాలేజీల్లో విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తున్నారు. విద్యార్థి దశనుంచే ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన ఉంటే ప్రమాదాలు తగ్గే అవకాశం ఉందనే భావనతో ఈ నిర్ణయానికి వచ్చారు. బహుముఖ వ్యూహం రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ట్రాఫిక్ పోలీసు లు బహుముఖ వ్యూహం అవలంబిస్తున్నారు. ప్రధాన ప్రాంతాల్లో ఆటోమెటిక్గా జరిమానా విధించే 12 ఆటో క్యాప్చర్ కెమెరాలు అమర్చి 58,442 కేసులు నమోదు చేశారు. రూ.1.40 కోట్లు జరిమానా విధించారు. డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల ద్వారా 6,413 కేసులు నమోదు చేసి, 4,562 మందిని కోర్టులో హాజరు పర్చారు. వాహనదారులకు రూ.61.50 లక్షల జరిమానా విధించారు. ఇందులో 17మందికి జైలుశిక్ష కూడా పడింది. నిబంధనలు పాటించినవారికి నజరానా.. ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమిస్తున్న వారిపై కొరడా ఝుళిపిస్తున్న ట్రాఫిక్ పోలీసులు.. రూల్స్ను కచ్చితంగా పాటిస్తున్న వాహనదారులకు నజరానా అందిస్తున్నారు. ఈక్రమంలో వారం క్రితం స్పెషల్ డ్రైవ్ నిర్వహంచి మహిళా బైక్ రైడర్లకు చీరెలు బహుమతిగా అందజేశారు. ప్రధాన రహదారులపై స్పీడ్గన్లు రహస్య కెమెరాలతోనూ నిఘా నిత్యం డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు అధికారుల బహుముఖ వ్యూహం రోడ్డు ప్రమాదాల నియంత్రణే లక్ష్యం ప్రధాన రోడ్లపై నిఘా జిల్లాలోని మెయిన్ రోడ్లన్నింటిపైనా నిఘా ఉంది. ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పిస్తున్నాం. పాటించే వారిని అభినందిస్తూనే, అతిక్రమిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం. ప్రమాదాల నియంత్రణే లక్ష్యంగా ట్రాఫిక్ విభాగం పనిచేస్తోంది. – సీహెచ్ శ్రీనివాస్, ఏసీపీ, ట్రాపిక్, రామగుండం డ్రంకెన్ డ్రైవ్ 6,413 కోర్టులో హాజరు పరిచినవి 4,562 విధించిన జరిమానా(రూ.లక్షల్లో) 61.50 జైలుశిక్ష పడిన వారిసంఖ్య 17 లేజర్ గన్ నమోదుచేసిన కేసులు 12,086 విధించిన జరిమానా(రూ.కోట్లలో) 1.25 ఆటోమేటిక్ కెమెరా కేసులు 58,442 విధించిన జరిమానా(రూ.కోట్లలో) 1.40 ఈ చలానా కేసులు 2,60,364 విధించిన జరిమానా(రూ.కోట్లలో) 8.06 ఈ ఏడాది రోడ్డు ప్రమాదాలు 226 గాయపడిన వారిసంఖ్య 335 ప్రమాదకరమైన యాక్సిడెంట్లు 79 మరణించిన వారిసంఖ్య 88 నిఘా కెమెరాలు స్పీడ్ లిమిట్ లేజర్ గన్లు 2 ఆటోమెటిక్ చలానా కెమెరాలు 12 సీసీ కెమెరాలు(సుమారు) 5,500 -
ప్రజలు ఇళ్లనుంచి బయటకు రావొద్దు
● రామగుండం సీపీ అంబర్ కిశోర్ ఝా గోదావరిఖని: రానున్న 72 గంటలపాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ప్రజలు ఇళ్లనుంచి బయటకు రావొద్దని సీపీ అంబర్ కిశోర్ ఝా బుధవారం సూచించారు. కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచన నేపథ్యంలో పోలీసుయంత్రాంగం అప్రమత్తమైందని అన్నారు. ఆపదలో ఉంటే వెంటనే స్థానిక పో లీస్ అధికారులు లేదా డయల్ 100 నంబరుకు ఫోన్చేసి సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణమే లక్ష్యం డ్రగ్ రహిత సమాజ నిర్మాణమే లక్ష్యమని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా అన్నారు. తన కార్యాలయంలో బుధవారం నాషాముక్త్ భార త్ అభియాన్–2025లో భాగంగా మాదక ద్రవ్యాల కు వ్యతిరేకంగా ఉద్యోగులతో సామూహిక ప్రతిజ్ఞ చేయించారు. సీపీ మాట్లాడుతూ, గంజాయి రవాణా చేసినా, సాగు చేసినా, విక్రయించినా కఠిన చ ర్యలు తప్పవన్నారు. స్పెషల్ బ్రాంచ్, ట్రాఫిక్ ఏసీపీలు మల్లారెడ్డి, శ్రీనివాస్, ఏవో శ్రీనివాస్, యాంటీ నార్కోటిక్, సీసీఆర్బీ, పీసీఆర్, సీసీఎస్, స్పెషల్ బ్రాంచ్ సీఐలు రాజ్కుమార్, సతీశ్, రవీందర్, బాబురావు, భీమేశ్, శ్రీనివాస్, ఆర్ఐలు శ్రీనివాస్, వామనమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
దంచికొట్టిన వాన
కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): జిల్లాలోని కాల్వశ్రీ రాంపూర్, ఓదెల మండలాల్లో మంగళవారం రాత్రి భారీవర్షం కురిసింది. కాల్వశ్రీరాంపూర్ మండలం మల్యాల – పోచంపల్లి, తారుపల్లి – మీర్జంపేట మధ్య ఒర్రెలపై కల్వర్టులు తెగిపోయి రాకపోకలు నిలిచిపోయాయి. మల్యాల–జమ్మికుంట ఆర్ అండ్ బీ రోడ్డుపై గూడెం విద్యత్ సబ్స్టేషన్ సమీపంలో ఒర్రెపొంగింది. రాకపోకలు నిలిచి పోయాయి. ఓదెల(పెద్దపల్లి): కొలనూర్లోని మెరుగు పోశాని ఇంట్లోకి వరదనీరు వచ్చి చేరింది. గూడెం నక్కలవాగు అలుగుపారుతోంది. గూడెం – కాల్వశ్రీరాంపూర్ మధ్య రోడ్డు తెగింది. కొలనూర్, కనగర్తి, ఓదెల, పొత్కపల్లి, గుంపుల చెరువులు వరదనీటితో నిండి నిండుకుండలా కనిపిస్తున్నాయి. 300 కుంటలకు కూడా జలకళ సంతరించుకుంది. -
రాఖీ కట్నం
15.48● ఆర్టీసీకి కరీంనగర్ రీజియన్లో లాభాల పంట ● గోదావరిఖని డిపోకు మొదటిస్థానంవిద్యానగర్(కరీంనగర్): రాఖీ పండుగ కరీంనగర్ రీజియన్కు కాసుల పంట పండించింది. ఈనెల 7వ తేదీ నుంచి 12వ తేదీ వరకు రూ.15.48 కోట్ల ఆదా యం సమకూరింది. పండుగ సందర్భంగా ఈనెల 7వ తేదీనుంచి 11వ తేదీ వరకు రీజియన్ పరిధి లోని 11డిపోల్లో ఉన్న బస్సులు 21.50 లక్షల కిలో మీటర్లు తిరగగా.. 29,10,435 మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారు. వీరిలో 73శాతంపైగా (21,21,668) మహిళలు ఉండగా మహాలక్ష్మి పథ కం ద్వారా రూ.9.08 కోట్లు ఆదాయం వచ్చింది. రాఖీ పౌర్ణమి రోజున ఈనెల 9న రికార్డుస్థాయిలో 7.02 లక్షల మంది రాకపోకలు సాగించగా రూ.3.94 కోట్ల ఆదాయం వచ్చింది. అత్యధికంగా గోదావరిఖని డిపో నుంచి 4,28,432 మంది ప్రయాణించారు. వీరిలో 3,21,821మంది మహిళలు ఉన్నారు. మొత్తం రూ.223.79 లక్షల ఆదాయం రాగా.. మహాలక్ష్మీ స్కీంకింద రూ.130.09 లక్షల ఆదాయం వచ్చింది. జగిత్యాల డిపో 3,67,855 మందిని చేరవేసి రెండోస్థానంలో నిలిచింది. వీరిలో 2,71,103 మంది మహిళలున్నారు. మొత్తం ఆదాయం రూ.178.57 లక్షలు రాగా.. జీరో టికెట్లు ద్వారా 104.38లక్షల ఆదాయం వచ్చింది.కోట్లుఅందరి సహకారంతోనే కరీంనగర్ రీజియన్ పరిధిలోని 11 డిపోలకు చెందిన సిబ్బంది, డైవర్లు, కండక్టర్లులు, అధికారుల సహకారంతోనే ఇది సాధ్యమైంది. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా స్పేర్ బస్సులతో పాటు జేబీఎస్ నుంచి సిటీ బస్సులు నడిచేలా చూశాం. 29 లక్షలకు పైగా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేశాం. – బి.రాజు, కరీంనగర్ రీజినల్ మేనేజర్ -
బిల్లులు ఇస్తున్నారా?
● ‘ఇందిరమ్మ’ లబ్ధిదారులతో కలెక్టర్ ● ఇంటి నిర్మాణాలు ప్రారంభించాలి ● లేదంటే రద్దు చేసి ఇతరులకు ఇస్తాం ● కోయ శ్రీహర్ష ఆదేశాలు పెద్దపల్లిరూరల్: ‘అమ్మా.. మీకు ప్రభుత్వం ఇందిర మ్మ ఇల్లు ఇచ్చింది.. చేసిన పనులకు బిల్లులు ఇచ్చారా..’ అని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఇందిరమ్మ ఇళ్ల ల బ్ధిదారులను ప్రశ్నించారు. లబ్ధిదారులు సందనవేన గంగమ్మ, లాస్య మాట్లాడుతూ.. బిల్లులు వెంటనే ఇచ్చారన్నారు. పనులు చివరిదశకు చేరాయని సంతోషంగా చెప్పారు. పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి న నిమ్మనపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల పురోగతిని హౌ సింగ్ పీడీ రాజేశ్వర్తో కలిసి బుధవారం కలెక్టర్ ప రిశీలించారు. గ్రామంలోని అర్హులైన పేదలందరికీ 140 ఇళ్లు మంజూరు చేస్తే కేవలం 45 ఇళ్ల పనులే చేపట్టడానికి గల కారణాలు ఏమిటని ప్రశ్నించారు. పనులు చేపట్టేలా చూడాలని ఎంపీడీవో శ్రీనివాస్ ను కలెక్టర్ ఆదేశించారు. లబ్ధిదారులు సానుకూలంగా స్పందించకుంటే రద్దు చేసి ఇతరులకు కేటాయించాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. సులభంగా అర్థమయ్యేలా బోధించాలి నిమ్మనపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను సందర్శించిన కలెక్టర్.. నాలుగో తరగతి విద్యార్థులతో ఇంగ్లిష్ పాఠాలు చదివించారు. సారాంశం అర్థమైందా? అని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు సు లభంగా అర్థమయ్యేలా బోధించాలని ఉపాధ్యాయులకు సూచించారు. పీడీ, ఎంపీడీవోతపాటు హెచ్ఎం సతీశ్, ఏఈ నరేశ్ తదితరులు ఉన్నారు. వినోద రంగంలో నైపుణ్య కోర్సులు సుల్తానాబాద్(పెద్దపల్లి): వినోద రంగంలో స్వల్పకాలిక నైపుణ్య శిక్షణ కోర్సులు అందిస్తున్నామని, ఆస క్తి గలవారు జిల్లా ఉపాధి కల్పనాధికారి కార్యాల యంలో దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ శ్రీహర్ష తెలిపారు. సినిమాటోగ్రఫీ, వీడియో ఎడిటింగ్, సౌండ్ రికార్డింగ్, డబ్బింగ్, వాయిస్ ఓవర్, డిజిట ల్ డిజైన్, సోషల్ మీడియా మేనేజ్మెంట్ కోర్సుల్లో శిక్షణ ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ‘టాస్క్’పై అవగాహన కల్పించాలి టాస్క్ కోర్సులపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ శ్రీహర్ష సూచించారు. కలెక్టరేట్లో యువతకు ఉపాధి కల్పనపై డిగ్రీ, ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్స్తో సమీక్షించారు. టాస్క్లో శిక్షణ పొందిన వారికి మల్టీనేషనల్ కంపెనీల్లో ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయని తెలిపారు. జిల్లా ఉపాధి క ల్పనాధికారి తిరుపతిరావు, ముఖ్యప్రణా ళికాధికారి రవీందర్, కౌసల్య, గంగప్రసాద్ పాల్గొన్నారు. -
స్థానిక పోరుకు సిద్ధం
● ఏర్పాట్లలో అధికారులు నిమగ్నం ● గుజరాత్ నుంచి బ్యాలెట్ బాక్స్లు ● ఈసారి స్వల్పంగా తగ్గిన పంచాయతీలు ● ఇంకా స్పష్టతరాని రిజర్వేషన్ల ప్రక్రియ పెద్దపల్లిరూరల్: ఇదిగో.. అదిగో అంటూ ఊరిస్తున్న స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి సర్కార్ ఎప్పు డు గ్రీన్సిగ్నల్ ఇచ్చినా తాము సర్వసన్నద్ధంగా ఉన్నామంటూ జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. స్థానిక సంస్థల పాలక వర్గాల గడువు ముగిసి సుమారు ఏడాదిన్నరకుపైగా అవుతోంది. అప్పట్నుంచి గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేకాధికారుల పాలనే కొనసాగుతోంది. బ్యాలెట్ పేపర్.. బాక్స్లు సిద్ధం స్థానిక ఎన్నికలకు సిద్ధంగా ఉండాలంటూ ఉన్నతాధికారులు గతంలోనే ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా జిల్లా అధికారులు పోలింగ్ కేంద్రాల గుర్తింపు, బ్యాలెట్ పత్రాలు, బాక్స్లు సిద్ధం చేశారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన సిబ్బంది, ఉద్యోగులను ఎంపిక చేసి ఓ ధఫా శిక్షణ కూడా పూర్తిచేశారు. ఎన్నికల సామగ్రి ఇప్పటికే జిల్లాకు వచ్చి చేరింది. ఆ సామగ్రిని మండలాలకు తరలించేందుకు వీలుగా కసరత్తు చేస్తున్నట్లు అధికారవర్గాల ద్వారా తెలిసింది. తగ్గిన వార్డులు.. పెరిగిన ఓటర్లు జిల్లాలోని 13 మండలాల్లో (రామగుండం మినహా) గత ఎన్నికల కన్నా 4 పంచాయతీలు, 35 వార్డులు తగ్గాయి. దాదాపు 50 వేల మంది వరకు ఓటర్ల సంఖ్య పెరిగినట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో 3,57,556 మంది ఓటర్లుండగా.. ఇప్పటివరకు 4 లక్షల మందికిపైగా ఓటర్లుగా జాబితాలో నమోదై నట్లు సమాచారం. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవ కాశం కూడా ఉంది. గతంలో 267 పంచాయతీలు, 2,467 వార్డులు ఉండగా.. ఈసారి 263 పంచాయతీలు, 2,432 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. రిజర్వేషన్ల సంగతేమిటో..? ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు వర్తింపజేయాలని నిర్ణయించినా అందుకు కేంద్రప్రభుత్వం బిల్లును ఆమోదించలేదు. దీంతో రిజర్వేషన్లపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. అయితే కోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం సెప్టెంబర్లోగా ఎన్నికలు నిర్వహిస్తుందా? లేక బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే ఎన్నికలకు వెళ్తుందా? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఏర్పాట్లు ముమ్మరం.. ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఎప్పుడొచ్చినా ఎన్నికలను నిర్వహించేందుకు సర్వసన్నద్ధంగా ఉండేలా జిల్లా అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే పోలింగ్ అధికారులు, సిబ్బంది జాబితా సిద్ధం చేశారు. ఓటరు మ్యాపింగ్ ప్రక్రియలో బిజీగా ఉన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల జాబితానూ సిద్ధం చేస్తున్నారు. సిద్ధంగా ఉన్నాం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అవసరమైన ప్రక్రియ పూర్తిచేసే పనుల్లో అధికారులు, సిబ్బంది నిమగ్నమయ్యారు. ఓటరు మ్యాపింగ్ పనులు పురోగతిలో ఉన్నాయి. ప్రభుత్వం, ఉన్నఽతాధికారులు ఇచ్చే ఆదేశాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటాం. బ్యాలెట్ బాక్స్లు గుజరాత్ నుంచి తెప్పించి సిద్ధంగా ఉంచాం. – వీరబుచ్చయ్య, డీపీవో -
అక్షరాస్యత పెంపొందించాలి
పెద్దపల్లిరూరల్: ప్రతీఒక్కరికి కనీస అక్షర జ్ఞా నం అందించేందుకు చేపట్టిన ఉల్లాస్, నవభారత్ అక్షరాస్యత కార్యక్రమాలు సద్వినియోగ మయ్యేలా చూడాలని డీఈవో మాధవి సూచించారు. రిసోర్స్పర్సన్లతో జిల్లా కేంద్రంలో సో మవారం ఆమె సమావేశమయ్యారు. చదువు రాని వారనే చిన్నచూపుతో వయోజనులను కించపర్చవద్దన్నారు. కనీస అక్షరజ్ఞానాన్ని అందిస్తే కుటుంబంలో మార్పు కనిపిస్తుందని తెలి పారు. జిల్లా రిసోర్స్పర్సన్ జక్కం శ్రీనివాస్, ప్రతినిధులు స్వరూప్చంద్, అనిల్ప్రసాద్ తదితరులు పలు అంశాలపై అవగాహన కల్పించా రు. వయోజనవిద్య ఏపీవో శ్రీనివాస్, కోర్సు డైరెక్టర్ సురేందర్కుమార్ పాల్గొన్నారు. వ్యాధి నిరోధక శక్తి పెంచాలిపెద్దపల్లిరూరల్: టీనేజీ పిల్లల్లో రక్తహీనతను నియంత్రించడంతోపాటు వ్యాధినిరోధక శక్తిని పెంచేవి ఆల్బెండజోల్ మాత్రలని జిల్లా వైద్యాధికారి అన్న ప్రసన్నకుమారి అన్నారు. స్థానిక జెడ్పీ బాలికోన్నత పాఠశాలలో సోమవారం నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీ చే శారు. అంగన్వాడీలు, ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రై వేట్ పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో మాత్ర లు పంపిణీ చేస్తామని తెలిపారు. ప్రోగ్రాం ఆఫీసర్ కిరణ్కుమార్, హెచ్ఎం అరుణ, ఆర్బీఎస్కే వైద్యసిబ్బంది పాల్గొన్నారు. అంతర్గాం పీహెచ్సీ సందర్శనరామగుండం: అంతర్గాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, మర్రిపల్లి ప్రభుత్వ పాఠశాలను జి ల్లా వైద్యాధికారి అన్న ప్రసన్నకుమారి ఆకస్మికంగా సందర్శించారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ ఉదయ్కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఆర్యవైశ్యుల అభ్యున్నతికి కృషి జ్యోతినగర్(రామగుండం): ఆర్యవైశ్యుల అ భ్యున్నతికి కృషి చేస్తానని ఆర్యవైశ్య సంఘం ప ట్టణ పొలిటికల్ అడ్వైయిజర్ రావికంటి వరప్రసాద్ అన్నారు. పట్టణ ఆర్యవైశ్య సంఘం ఎన్నికల సందర్భంగా సోమవారం ఆయన తన నా మినేషన్పత్రాన్ని ఎన్నికల అధికారులు వొల్లా ల సురేశ్, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్కు అందజేసి మాట్లాడారు. సంఘం బలోపేతానికి పాటుపడతానన్నారు. పేద ఆర్యవైశ్యులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈనెల 17వ తేదీన నిర్వహించే ఎన్నికల్లో తనకు మద్దతు తెలియజేయాలని ఆయన కోరారు. అనంతరం వరప్రసాద్కు మద్దతుగా హిందూ ఐక్యవేదిక సభ్యు లు ర్యాలీ నిర్వహించారు. హిందూ ఐక్యవేదిక సభ్యులు, ఆర్యవైశ్య ప్రతినిధులుపాల్గొన్నారు. కొత్త స్వశక్తి సంఘాలు ఏర్పాటు చేయాలి పెద్దపల్లిరూరల్: జిల్లాలో కొత్త మహిళా స్వశక్తి సంఘాలతో పాటు వృద్ధులు, దివ్యాంగులు, బాలికల సంఘాల ఏర్పాటును ఈనెలాఖరు వ రకు పూర్తిచేయాలని డీఆర్డీవో కాళిందిని సూ చించారు. ఏపీఎం, సీసీ, మండల సమాఖ్య ప్రతినిధులతో జిల్లా కేంద్రంలో సోమవారం ఆమె సమావేశమయ్యారు. కొత్తవారిని గుర్తించి స్వశక్తి సంఘంలో సభ్యత్వం పొందేలా అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి వేణుగోపాల్రావు, అడిషనల్ డీఆర్డీవో రవీందర్ తదితరులు పాల్గొన్నారు. గ్యాస్ రీఫిల్లింగ్ షాపుల్లో తనిఖీగోదావరిఖని: గ్యాస్ రీఫి ల్లింగ్ సెంటర్లలో పోలీసులు సోమవారం తనిఖీ చేశారు. ఓ షాపులో గ్యాస్ సిలిండర్ నుంచి మంటలు రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. దీనిపై సోమవారం ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. స్పందించిన పోలీస్ అధికారుల ఆదేశాల మేర కు సీఐ ఇంద్రసేనారెడ్డి సిబ్బందితో లక్ష్మీనగర్లోని గ్యాస్స్టవ్, సిలెండర్ షాపుల్లో తనిఖీలు చేశారు. ప్రజాభద్రత, జీవనానికి భంగం కలిగించేలా వ్యవహరించిన 8 మందిని అదుపులోకి తీసుకుని బైండోవర్ చేశారు. -
యూరియా కష్టాలు
● సొసైటీల వద్ద రైతుల పడిగాపులు ● వ్యవసాయ పనులు వదులుకొని నిరీక్షణ ● గంటల తరబడి బారులు తీరుతున్న వైనం ● అయినా, ఒక్కో రైతుకు రెండు బస్తాలే పంపిణీ సాక్షి పెద్దపల్లి: వానాకాలం పంటలకు అవసరమయ్యే ఎరువుల కోసం అన్నదాతలకు తిప్పలు ప్రారంభమయ్యాయి. వరినాట్లు మొదలైన 20 రోజుల తర్వాత యూరియా అవసరమవుతుంది. విత్తనాలు విత్తిన నాటినుంచీ చినుకు జాడలేక పైరు ఎండే పరిస్థితి ఎదురైంది. ఈ సమయంలో వారంరోజులుగా కురుస్తున్న వర్షాలు జీవం పోసినట్లయ్యింది. ఇదేసమయంలో పంటలకు యూరియా అవసరం ఏర్పడింది. దీంతో తమ పనులన్నీ వదులుకొని సింగిల్విండోలు, ఇతర సెంటర్లలో రైతులు పడిగాపులు కాస్తున్నారు. అవసరం మేరకు యూరియా అందుబాటులో ఉందని అధికారులు చెబుతూనే.. ఒక్కో ఆధార్ కార్డుపై రెండు బస్తాల యూరియా పంపిణీ చేయడం కొరతకు ప్రత్యక్ష సాక్షిగా నిలుస్తోంది. సోమవారం కాల్వశ్రీరాంపూర్, ఒదెల, పాలకుర్తి మండలాల్లో రైతులు యూరియా కోసం పీఏసీఎస్ల ఎదుట బారులు తీరడం సమస్య తీవ్రతకు అద్దంపడుతోంది. షరతులతో ఇబ్బందులు జిల్లాలో సుమారు 2.76 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేయనుండగా, ఇప్పటివరకు వరి 1,42,153 ఎకరాలు, పత్తి 48,215 ఎకరాలు, కందులు 87 ఎకరాలు, మొక్కజొన్న 377 ఎకరాలు, మిగతా ఇతర పంటలు సాగు చేశారు. ఈసీజన్కు 32,447మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా ఇప్పటివరకు 17,036 మెట్రిక్ టన్నులే సరఫరా అయ్యింది. గతేడాది ఇదేసమయానికి 28,868 మెట్రిక్ టన్నులు సరఫరా అయ్యింది. గతేడాదితో పోల్చితే.. సుమారు 12వేల మెట్రిక్ టన్నులు తగ్గినట్లు అధికారులే చెబుతున్నారు. ఆ లోటును పూడ్చేందుకు ఒక్కోరైతుకు రెండోబస్తా పంపిణీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే అదనుగా యూరియా బ్యాగ్లతోపాటు నానో యూరియా, కాంప్లెక్స్ ఎరువులు, జింక్ కొనుగోలు చేయాల్సిందేనని కొందరు వ్యాపారులు షరతులు విధిస్తున్నారు. మరికొన్నిచోట్ల బక్కో బస్తాపై రూ.50 నుంచి రూ.100 వరకు పెంచి అమ్ముతున్నారు. రైతులకు తప్పని తిప్పలు జిల్లా సమాచారం రైతుల సంఖ్య 1,61,032 సాగు లక్ష్యం(ఎకరాల్లో) 2,76,076 సాగైన వరి(ఎకరాల్లో) 1,42,153 సాగైన పత్తి(ఎకరాల్లో) 48,215 అవసరమైన యూరియా(మెట్రిక్ టన్నుల్లో) 32,447 ఇప్పటివరకు వచ్చిన యూరియా(మెట్రిక్ టన్నుల్లో) 17,036 ఇంకా రావాల్సిన యూరియా(మెట్రిక్ టన్నుల్లో) 15,411 గతేడాది ఇదే సమయానికి సరఫరా అయ్యింది(మె.ట.) 28,868 కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): కూనారం సింగిల్విండో కార్యాలయం ఎదుట రైతులు ఉదయమే యూరియా కోసం బారుల తీరారు. ఆధార్, ప ట్టాదారు పాస్పుస్తకాలతో తరలివస్తే.. ఒక్కొక్క రికి ఒక యూరియా బస్తానే ఇచ్చారు. ఒకరం నుంచి పదెకరాల వరకు ఉన్న రైతులు.. ఒక్క యూరియా బస్తా ఎలా సరిపోతుందని సిబ్బందిపై ఆగ్రహం వ్య్తక్తం చేశారు. త్వరలోనే మరి కొంత వస్తుందని ఏవో నాగార్జున తెలిపారు. బ్లాక్మార్కెట్లో అధిక ధరలు.. ఓదెల(పెద్దపల్లి): మొత్తం 22 గ్రామాలకు ఏకై క సొసైటీ పొత్కపల్లి. ఇక్కడే యూరియా పంపిణీ చేస్తున్నారు. దీంతో వేలాదిమంది రైతులు ఉదయమే సొ సైటీ ఎదుట బారులు తీరా రు. తమకు యూరియా ఇవ్వాలని నిరసన తెలిపారు. ఆందోళన పరి స్థితులు ఏర్పడడంతో ఎస్సై రమేశ్ ఆధ్వర్యంలో సిబ్బంది పరిస్థితిని చక్కదిద్దారు. మరోవైపు.. డీసీఎంఎస్లో యూరియాను బ్లాక్చేసి అధిక ధరలకు విక్రయించినట్లు రైతులు ఆరోపించారు. పొద్దంతా పడిగాపులు యూరియా కోసం పొ ద్దున్నే పొత్కపల్లి సొసైటీ వద్దకు వచ్చి న. యూరియా ఉందని తెలిసి చాలామంది రైతులు గుమికూడారు. ఈక్రమంలో తోచుకున్నారు. చివరకు పోలీసులు రా వడంతో అసంపూర్తిగా పంపిణీ చేశారు. – గుడి సుధాకర్రెడ్డి, గోపరపల్లె -
సీబీఐ చేతికి గట్టు వామనరావు దంపతుల కేసు
సాక్షి, న్యూఢిల్లీ: గట్టు వామనరావు దంపతుల హత్య కేసుపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కు అప్పగించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని మంగళవారం ఆదేశించింది. ఈ క్రమంలో.. హత్య కేసును తిరిగి విచారణ జరపాలని, పిటిషనర్కు భద్రత కల్పించాలని సీబీఐకి సూచించింది.హైకోర్టు లాయర్లైన వామనరావు, ఆయన సతీమణి నాగమణి దంపతులను పెద్దపల్లి జిల్లా మంథనిలో 2021 ఫిబ్రవరి 17వ తేదీన రోడ్డుపైనే కొందరు దారుణంగా హతమార్చారు. ఈ జంట హత్య తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపింది. ఈ కేసులో పలువురిని అరెస్ట్ చేయగా.. ఇంకా దర్యాప్తు కొనసాగుతోంది. అయితే ఈ కేసును సీబీఐకి అప్పగించాలని వామనరావు తండ్రి కిషన్ రావు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. జస్టిస్ ఎంఎం సుందరేశ్ , జస్టిస్ ఎన్ కె. సింగ్ల ధర్మాసనం పిటిషన్ను విచారించి.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. అలాగే హత్యకు సంబంధించిన వీడియోలు, పత్రాలు అందజేయాలని ఆదేశించింది. సీబీఐ విచారణ అవసరమా? అనే అంశంపై రికార్డులు పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని ధర్మాసనం తెలిపింది.ఈలోపు.. కేసును సీబీఐకి అప్పగించేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలంగాణ ప్రభుత్వం తరఫున న్యాయవాది తెలిపారు. దీంతో.. సీబీఐకి కేసును బదిలీ చేస్తున్నట్లు సుప్రీం కోర్టు ఇవాళ ఆదేశాలు జారీ చేసింది. -
ఠాణా మెట్లెక్కించిన సిగరేట్
గోదావరిఖని: సిగరేట్ తాగాలనే తాపత్రయం ఠా ణా మెట్లెక్కించింది. ఇరువర్గాలు రోడ్డుపై కొట్టుకో వడం భయాందోళనకు గురిచేసింది. పోలీసులు రంగప్రవేశం చేసి 8మందిపై కేసు నమోదు చేశారు. గోదావరిఖనిలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. వన్టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి కథనం ప్రకారం.. ఇద్దరు మిత్రులు సిగరెట్ కోసం రాజేశ్ థియేటర్ సమీపంలోని ఓ పాన్షాప్ వద్దకు వెళ్లారు. మూడు సిగరెట్లకు డబ్బులు చెల్లించగా రెండు సిగరెట్లే ఇచ్చావని షాపు నిర్వాహకుడిని ప్రశ్నించారు. ఈక్రమంలో ఇరువర్గాల మద్య మాటామాట పెరిగింది. కొట్టు కట్టేసే సమయం అయిపోయిందని, పక్కకు వెళ్లి సిగరెట్ తాగాలని షాపు యాజమాని సూచించాడు. దీంతో ఆయనపై ఇద్దరు మిత్రలు చేయి చేసుకున్నారు. ఈక్రమంలో బాధితుడు తన బందువులకు ఫోన్చేసి ముగ్గురిని పిలిపించాడు. సిగరెట్ కోసం వచ్చిన ఇద్దరు యువకులు కూడా ఫోన్చేసి మరో ఇద్దరిని పిలిపించుకున్నారు. దీంతో ఇరువర్గాలకు చెందిన 8 మంది నడిరోడ్డుపై కొట్టుకోవడంతో అక్కడ భీతావహ పరిస్థితి తలెత్తింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలను అదుపులోకి తీసుకున్నారు. ఇందులో ఒకవర్గానికి చెందిన కె.ప్రణయ్కౌశిక్, మహ్మద్ ఆజీం, బి.ఆదర్శ్, టి.రాహుల్, మరో వర్గానికి చెందిన ఎం.శ్యాంసుందర్, ఎం.అభిలాష్, జి.రాజ్కుమార్, సీహెచ్ చంద్రమౌళిగా గుర్తించారు. నడిరోడ్డుపై గొడవకు దిగి శాంతిభద్రతలకు భంగం కలిగించిన నిందితులపై కేసునమోదు చేసినట్లు సీఐ తెలిపారు. సిగరేట్ కోసం ఠాణా మెట్లు ఎక్కి కేసులో ఇరుక్కోవడం నగరంలో చర్చనీయాంశమైంది. -
ప్రజావాణి ఫిర్యాదులకు ప్రాధాన్యం
పెద్దపల్లిరూరల్: జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి తరలివచ్చి తమ సమస్యలపై ప్రజావాణిలో ప్రజలు అందించే ఫిర్యాదులకు సంబంధిత శాఖ అధికారులు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. నిశితంగా పరిశీలించిన సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని సూచించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమం ద్వారా ఆయన ప్రజ ల నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం ఆ యన మాట్లాడారు. పదేపదే ఒకేసమస్యపై ఫిర్యా దులు రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో పలు శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
రైతులకు తప్పని తిప్పలు
కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): కూనారం సింగిల్విండో కార్యాలయం ఎదుట రైతులు ఉదయమే యూరియా కోసం బారుల తీరారు. ఆధార్, ప ట్టాదారు పాస్పుస్తకాలతో తరలివస్తే.. ఒక్కొక్క రికి ఒక యూరియా బస్తానే ఇచ్చారు. ఒకరం నుంచి పదెకరాల వరకు ఉన్న రైతులు.. ఒక్క యూరియా బస్తా ఎలా సరిపోతుందని సిబ్బందిపై ఆగ్రహం వ్య్తక్తం చేశారు. త్వరలోనే మరి కొంత వస్తుందని ఏవో నాగార్జున తెలిపారు. బ్లాక్మార్కెట్లో అధిక ధరలు.. ఓదెల(పెద్దపల్లి): మొత్తం 22 గ్రామాలకు ఏకై క సొసైటీ పొత్కపల్లి. ఇక్కడే యూరియా పంపిణీ చేస్తున్నారు. దీంతో వేలాదిమంది రైతులు ఉదయమే సొ సైటీ ఎదుట బారులు తీరా రు. తమకు యూరియా ఇవ్వాలని నిరసన తెలిపారు. ఆందోళన పరి స్థితులు ఏర్పడడంతో ఎస్సై రమేశ్ ఆధ్వర్యంలో సిబ్బంది పరిస్థితిని చక్కదిద్దారు. మరోవైపు.. డీసీఎంఎస్లో యూరియాను బ్లాక్చేసి అధిక ధరలకు విక్రయించినట్లు రైతులు ఆరోపించారు. -
అనుబంధ రంగాల అభివృద్ధికి పెద్దపీట
మంథనిరూరల్: వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. గుంజపడుగు శివారులో మంథని పీఏసీఎస్ ఆధ్వర్యంలో పీఎం కుసుమ్ ద్వారా రూ.3.50కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసే సోలార్ ప్లాంట్, చిల్లపల్లిలో రూ.7 కోట్ల వ్యయంతో ఐదెకరాల్లో చేపట్టిన రెండు గోదాముల నిర్మాణానికి కలెక్టర్ కోయ శ్రీహర్ష, కేడీసీసీబీ చైర్మన్ కొండూరి రవీందర్రావుతో కలిసి సోమవారం మంత్రి శంకుస్థాపన చేశారు. ఆయన మాట్లాడుతూ గ్రీన్ఎనర్జీ పాలసీలో భాగంగా నందిమేడారం, కాల్వశ్రీరాంపూర్, అప్పన్నపేట, మంథని ప్రాంతాల్లో ఒక్కో మెగావాట్ చొప్పున పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. 4 నెలల్లో వీటిని పూర్తి చేయాలని మంత్రి సూచించారు. గుంజపడుగులో సహకార బ్యాంక్ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపాలని సూచించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అన్నయ్యగౌడ్, కేడీసీసీబీ సీఈవో సత్యనారాయణరావు, మంథని మార్కెట్ కమిటీ చైర్మన్ కుడుదుల వెంకన్న, ఆర్డీవో సురేశ్, డీసీవో శ్రీమాల, సింగిల్విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రైతు సంక్షేమానికి పాటుపడాలి కమాన్పూర్(మంథని): సహకార బ్యాంకులు, సొసైటీలు రైతుల సంక్షేమానికి కృషి చేసేలా ఆధునిక భవనాలు నిర్మిస్తున్నామని ఐటీమంత్రి శ్రీధర్బాబు అన్నారు. రూ.79 లక్షల వ్యయంతో నిర్మించిన కేడీసీసీ బ్యాంక్, రూ.65 లక్షలు వెచ్చించి నిర్మించిన పీఏసీఎస్ భవనాలను డీసీసీబీ చైర్మన్ కొండూరి రవీందర్రావు, కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి మంత్రి ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ, ప్రజాప్రభుత్వం రైతు సంక్షేమం కోసం రాజీపడకుండా ముందుకు సాగుతోందన్నారు. కార్యక్రమంలో మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తొట్ల తిరుపతియాదవ్, కమాన్పూర్, కన్నాల పీఏసీఎస్ చైర్మన్లు ఇనగంటి భాస్కర్రావు, బయ్యపు మనోహర్రెడ్డి, కమాన్పూర్ ఏఎంసీ చైర్మన్ వైనాల రాజు, నాయకులు సయ్యద్ అన్వర్ తదితరులు పాల్గొన్నారు. ● మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు -
బయట చెత్త వేస్తే జరిమానా
● బల్దియా కమిషనర్ అరుణశ్రీ ● అధికారులకు పలు సూచనలుకోల్సిటీ(రామగుండం): బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేసినా, నిషేధిత ప్లాస్టిక్ వినియోగించినా జరిమానా విధించాలని రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్(ఎఫ్ఏసీ) అరుణశ్రీ ఆదేశించారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం పారిశుధ్య పర్యవేక్షకులు, నీటిసరఫరా, మెప్మా సిబ్బంది, వార్డు అధికారులతో వేర్వేరుగా వివిధ అంశాలపై సమీక్షించారు. రోడ్లు, కాలువలు, ఓపెన్ ప్లాట్లలో చెత్తవేస్తే జరిమానా వసూలు చేయాలన్నారు. ఇంటింటా తడి, పొడిచెత్త వేర్వేరుగా సేకరించాలని, మురుగునీటి కాలువల్లో పూడికతీత, స్ప్రే, ఫాగింగ్, ఆయిల్ బాల్స్ వేయాలని ఆదేశించారు. స్వచ్ఛ ఆటోలు పూర్తిసామర్థ్యంతో రెండుసార్లు డంపింగ్ యార్డ్ కు వెళ్లాలన్నారు. జ్వరాలు ప్రబలే ప్రాంతాల్లో పా రిశుధ్య పనులు మెరుగుపర్చాలని అన్నారు. ఒకేఇంటికి రెండు నల్లా కనెక్షన్లు ఉంటే ఒకటి తొలగించాలని ఆదేశించారు. పైప్లైన్ లీకేజీలను వెంటనే మరమ్మతు చేయించాలని ఆమె పేర్కొ న్నారు. ప్రతీ ఉపరితల ట్యాంక్ ఆవరణను పరి శుభ్రంగా ఉంచి మొక్కలు నాటాలని ఆదేశించా రు. 18ఏళ్ల వయసు నిండిన నిరుపేద మహిళల తో కొత్త స్వశక్తి సంఘాలు, సమాఖ్యలు ఏర్పాటు చేయాలని ఆమె చెప్పారు. వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలన్నారు. వీధివ్యాపారులను గుర్తించాలన్నారు. ఆస్తిపన్ను, లైసెన్స్ రుసుం వసూలయ్యేలా వినియోగదారులను చైతన్యపరచాలని ఆమె సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ వెంకటస్వామి, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రామన్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ ఆస్పత్రుల్లో పేషెంట్ల రద్దీ
పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ, మాతా శిశు ఆస్పత్రుల్లో సోమవారం పేషెంట్ల రద్దీ పెరిగింది. జ్వరం, దగ్గు, జలుబు లాంటి సీజనల్ వ్యాధుల బారినపడ్డ వేలాదిమంది ఆస్పత్రుల బాటపట్టారు. ఓపీ వద్ద, బ్లడ్శాంపిల్ సేకరణ కోసం వివరాలను నమోదు చేయించేందుకు నిరీక్షించారు. వైద్యులు పరీక్షించి రాసిన మందులను తీసుకునేందుకు ఫార్మసీ కౌంటర్ వద్ద కూడా బారులుతీరారు. జిల్లాలోని పలు ప్రాంతాలనుంచి వచ్చి న గర్భిణులు టిఫా స్కానింగ్ కోసం పెద్దసంఖ్యలో క్యూలైన్లో వేచిఉండడం కనిపించింది. జీజీహెచ్లోనూ.. కోల్సిటీ(రామగుండం): రామగుండం నగరంలో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. జ్వరపీడితులతో గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి(జీజీహెచ్) కూడా రద్దీగా మారింది. దగ్గు, జలుబు, తలనొప్పి, వాంతులు, విరోచనాలు, కీళ్లనొప్పులు, జ్వరం తదితర సమస్యలతో పేషెంట్లు ఆస్పత్రికి భారీగా తరలివచ్చారు. వరుసగా రెండురోజులు సెలవులు రావడంతో బాధితుల సంఖ్య భారీగా పెరిగింది. ఒక్కరోజే 1,270 మంది ఓపీ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. -
రెండుసార్లు కాలిపోయింది
వరినాటు వేసినప్పటి నుంచి కరెంట్ మోటారు రెండుసార్లు కాలిపోయింది. అధికారులకు చెబితే.. లో వోల్టేజీ సమస్య ఉందంటున్నరు. కొత్త ట్రాన్స్ఫార్మర్ పెట్టి కొత్త కనెక్షన్లు అనుమతి తీసుకునేలా అధికారులు చొరవ తీసుకోవాలి. – ఆడెపు వెంకటేశ్వర్లు, కాట్నపల్లి అనధికార కనెక్షన్లే సమస్య రైతులు అనుమతి లేకుండా కరెంట్ వాడడంతోనే లో వోల్టేజీ సమస్య వస్తోంది. తద్వారా విద్యుత్ మోటార్లు తరచూ కాలిపోతున్నాయి. బోరుబావుల వద్ద కెపాసిటర్లు ఏర్పాటు చేసుకోవాలి. కొత్తగా విద్యుత్ కనెక్షన్ల కోసం డీడీ చెల్లిస్తే వెంటనే మంజూరు చేస్తాం. – మాధవరావు, ఎస్ఈ, ట్రాన్స్కో -
కాలిపోతున్న కరెంట్ మోటార్లు
సుల్తానాబాద్(పెద్దపల్లి): ఈ వర్షాకాలంలో ఆశించినస్థాయిలో వర్షాలు కురువడంలేదు. దీంతోపా టు విద్యుత్ సరఫరాలో తరచూ అంతరాయంతో కరెంట్ మోటార్లు, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు కా లిపోతున్నాయి. ప్రస్తుతం నాట్లు వేసిన రైతులు.. సాగునీరు పారించే విద్యుత్ మోటార్లు మరమ్మతుకు వెళ్లడంతో నీళ్లు అందక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ పంపుసెట్ల ఆధారంగా.. ఈసారి ఇప్పటివరకు లోటు వర్షపాతమే నమో దు అయ్యింది. దీంతో ఎక్కువ మంది రైతులు వ్యవసాయ బావుల వద్ద పంపుసెట్ల ఆధారంగా వివిధ పంటలు వేస్తున్నారు. నీళ్లు అందక పంటలు ఎండిపోతుండడంతో వాటిని కాపాడుకునేందుకు అన్నదాతలు నానాపాట్లు పడుతున్నా రు. ప్రధానంగా అత్యధికంగా విద్యుత్ వినియోగించడంతో కరెంట్ మోటార్లు కాలిపోతున్నాయ ని అధికారులు చెబుతున్నారు. అయితే, లోవో ల్టేజీ సమస్యతోనే అవి కాలిపోతున్నాయని రైతు లు ఆరోపిస్తున్నారు. ఒకసారి కరెంట్ మోటారు కాలిపోతే మరమ్మతు కోసం సుమారు రూ.6000 – రూ.10,000 వరకు ఖర్చు అవుతోందని వ్యవసాయదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ట్రాన్స్ఫార్మర్ కాలితే రైతులపైనే భారం విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే దాని మరమ్మతుల ఖర్చును రైతులపైనే వేస్తున్నారని ఆరోపి స్తున్నారు. ట్రాక్టర్ తీసుకొని మరమ్మతు కేంద్రానికి తామే తరలించాల్సి వస్తోందంటున్నారు. మరమ్మతులకు గురైన మోటార్లు జూలై 258 ఆగస్టు 50 -
ప్రజావాణి ఫిర్యాదులకు ప్రాధాన్యం
● కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశాలు పెద్దపల్లిరూరల్: జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి తరలివచ్చి తమ సమస్యలపై ప్రజావాణిలో ప్రజలు అందించే ఫిర్యాదులకు సంబంధిత శాఖ అధికారులు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. నిశితంగా పరిశీలించిన సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని సూచించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమం ద్వారా ఆయన ప్రజ ల నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం ఆ యన మాట్లాడారు. పదేపదే ఒకేసమస్యపై ఫిర్యా దులు రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో పలు శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
రెండు బస్తాలే ఇచ్చారు
నాకు ఆరెకరాలు ఉంది. రెండు బస్తాలే ఇచ్చారు. ఇవి ఎన్నెకరాలకు సరిపోతయి? మిగతా యూరియా కోసం ఎన్నిసార్లు తిరగాలి. పంటకు యూరియా ఎప్పుడు వేయాలి? అదను దాటితే కర్ర పెరగది. సరిపడా ఇవ్వాలె. – గడికొప్పుల రాజయ్య, వెన్నంపల్లి కొరత లేదు యూరియా విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అదనంగా కొనుగోలు చేసి స్టాక్ పెట్టుకోవద్దు. ప్రసుత్తం 2,270 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉంది. ఆర్ఎఫ్సీఎల్ నుంచి మరో 3వేల మెట్రిక్ టన్నులు వస్తుంది. యూరియా కొరత ఏమీలేదు. – శ్రీనివాస్, డీఏవో -
రవాణా సౌకర్యంతోనే అభివృద్ధి
● ఎమ్మెల్యే విజయరమణారావు ● ఇందిరమ్మ ఇళ్ల ప్రగతిపై సమీక్షసుల్తానాబాద్రూరల్(పెద్దపల్లి): రవాణా వ్యవస్థ మెరుగు పడితేనే గ్రామాలు సంపూర్ణంగా అభివృద్ధి చెందుతాయని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. కదంబపూర్ – కాల్వశ్రీరాంపూర్ గ్రామాల మధ్య రూ.1.50 కో ట్ల వ్యయంతో చేపట్టిన బీటీ రోడ్డు పనులకు ఎ మ్మెల్యే సోమవారం శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం నిధులు కేటాయిస్తోందన్నారు. కదంబపూర్ వివేకానంద వి గ్రహం నుంచి కనుకుల ఎక్స్ రోడ్డు వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదించామని తెలిపారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అన్నయ్యగౌడ్, సింగిల్విండో చైర్మన్ శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు సతీశ్, పన్నాల రాములు, దామోదర్రావు, కొడెం అజయ్ తదితరులు పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో వేగం ఎలిగేడు(పెద్దపల్లి): ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో వేగం పెంచాలని, అవినీతికి తావులేకుండా చర్య లు చేపట్టాలని ఎమ్మెల్యే విజయరమణారావు సూచించారు. శివపల్లిలోని తన నివాసంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై హౌసింగ్ అధికారులు, ఎంపీడీవోలతో సమీక్షించారు. ఇళ్ల పురోగతిని అధి కారులు తరచూ పర్యవేక్షించాలన్నారు. పనులు త్వరగా పూర్తిచేసేలా చూడాలని అన్నారు. హౌ సింగ్ పీడీ రాజేశ్వర్, డీఈలు, ఏఈలు, ఎంపీడీ వోలు దివ్యదర్శన్, శ్రీనివాస్, పద్మజ, పూర్ణచంద ర్, తిరుపతి, భాస్కర్రావు తదితరులు ఉన్నారు. -
రెండుసార్లు కాలిపోయింది
వరినాటు వేసినప్పటి నుంచి కరెంట్ మోటారు రెండుసార్లు కాలిపోయింది. అధికారులకు చెబితే.. లో వోల్టేజీ సమస్య ఉందంటున్నరు. కొత్త ట్రాన్స్ఫార్మర్ పెట్టి కొత్త కనెక్షన్లు అనుమతి తీసుకునేలా అధికారులు చొరవ తీసుకోవాలి. – ఆడెపు వెంకటేశ్వర్లు, కాట్నపల్లి అనధికార కనెక్షన్లే సమస్య రైతులు అనుమతి లేకుండా కరెంట్ వాడడంతోనే లో వోల్టేజీ సమస్య వస్తోంది. తద్వారా విద్యుత్ మోటార్లు తరచూ కాలిపోతున్నాయి. బోరుబావుల వద్ద కెపాసిటర్లు ఏర్పాటు చేసుకోవాలి. కొత్తగా విద్యుత్ కనెక్షన్ల కోసం డీడీ చెల్లిస్తే వెంటనే మంజూరు చేస్తాం. – మాధవరావు, ఎస్ఈ, ట్రాన్స్కో -
నులి పురుగులను నలిపేద్దాం
● నేటి నుంచి నులిపురుగుల నివారణ కార్యక్రమం ● అందుబాటులో 2,41,450 అల్బెండజోల్ మాత్రలుసుల్తానాబాద్: నులి పురుగుల నిర్మూలనకు జిల్లా యంత్రాంగం సన్నద్ధమైంది. జాతీయ బోధకాలు నియంత్రణ దినోత్సవం సందర్భంగా ఈనెల 11నుంచి కార్యక్రమం అమలు చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. బోధకాలు వ్యాధి, నులి పురుగుల నిర్మూలనకు సామూహికంగా డీఈసీ, అల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేపట్టనున్నారు. జిల్లా వ్యాప్తంగా 2,27,250 మందిని అర్హులుగా గుర్తించారు. వీరికి మాత్రలు వేసేందుకు 706 మందిని ఎంపిక చేశారు. ఒక్కో బృందంలో ఒక ఆశా కార్యకర్త, ఒక అంగన్వాడీ టీచర్ ఉంటారు. ఇప్పటికే యూపీహెచ్సీ, పీహెచ్సీలలో వైద్యాధికారులు సమావేశమై సూచనలు ఇచ్చారు. జిల్లావ్యాప్తంగా డాక్టర్లకు, సూపర్వైజర్లకు కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆధ్వర్యంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి అన్నప్రసన్నకుమారి శిక్షణ ఇప్పించారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలతో పాటు మిగిలిన వారిని ఈనెల 18న మాఫ్ ఆఫ్ దినోత్సవం నిర్వహించనున్నారు. జిల్లాలో ఇలా.. జిల్లాలో పెద్దపల్లి, మంథని, సుల్తానాబాద్ మున్సిపాలిటీలతో పాటు గోదావరిఖని కార్పొరేషన్, 14 మండలాలు, 266 గ్రామపంచాయతీలు ఉన్నాయి. యూపీఎస్సీలు 8, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు 16 ఉండగా.. ప్రభుత్వ పాఠశాలలు 534, ప్రైవేటు పాఠశాలలు 161, ప్రభుత్వ జూనియర్ కళాశాలలు 40, ప్రైవేట్ జూనియర్ కళాశాలలో 13 ఉన్నాయి. అందులో 2,27,250 మంది అర్హులను గుర్తించారు. 2,,41,450 మాత్రలు అందుబాటులో ఉన్నట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. గ్రామాలు, పట్టణాల్లో ఈనెల 11న ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేయనున్నారు. మాత్రలు వేసుకున్న వారు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ప్రభుత్వ ఆసుపత్రి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెంటనే వెళ్లాల్సిన అవసరం ఉందని ఆరోగ్య సిబ్బంది తెలుపుతున్నారు. -
యథేచ్ఛగా గ్యాస్ రీఫిల్లింగ్ దందా
● నిబంధనలకు విరుద్ధంగా షాపుల్లోనే రీఫిల్లింగ్ ● తెలిసినా పట్టించుకోని అధికారులు గోదావరిఖని: గోదావరిఖని పట్టణంలోని పలు ప్రాంతాల్లో గ్యాస్ రీఫిల్లింగ్ దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. దీనికి అన్ని రకాల అనుమతులు తీసుకున్న తర్వాత జనావాసాలకు దూరంగా గ్యాస్ రీఫిల్లింగ్ చేయాల్సి ఉండగా.. అదేమి పట్టించుకోకుండా గ్యాస్ స్టవ్లు, సిలిండర్ల రిపేర్ల పేరుతో రీఫిల్లింగ్ దందా కొనసాగిస్తున్నారు. అలాగే వంట గ్యాస్ను కార్లలో ఫిల్లింగ్ చేసేందుకు కూడా కొన్ని సెంటర్లు కొనసాగుతున్నాయి. గ్యాస్సిలిండర్ను తీసుకెళ్తే ఎలక్ట్రిక్, డీసీ మోటార్ ద్వారా పైపులు బిగించి కార్లలో గ్యాస్ రీఫిల్లింగ్ నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా చాలా షాపుల్లో పెద్ద సిలిండర్ల నుంచి పైపుల ద్వారా మూడు, ఐదుకిలోల గ్యాస్ సిలిండర్లను రీఫిల్లింగ్ చేస్తున్నారు. ఇదంతా బాహాటంగానే సాగుతున్నా అధికారులు ఏంచేస్తున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. పలు సంఘటనలు జరుగుతున్నా.. గ్యాస్ రీఫిల్లింగ్ సమయంలో ప్రమాదాలు జరుగుతున్నాయి. శనివారం గోదావరిఖని లక్ష్మీనగర్ మేదర్బస్తీ వైపు వెళ్లే దారిలో ఓగ్యాస్ సిలిండర్ రీఫిల్లింగ్ చేస్తున్న క్రమంలో పెద్ద ఎత్తున మంటలు లేచాయి. దీంతో సిలిండర్ను నడిరోడ్డుపై పడేశారు. మంటలను చూసిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే స్పందించి తడిచిన తట్టుబొంతలు వేసి మంటలు ఆర్పివేశారు. లేకుంటే పెద్ద ప్రమాదం జరిగేదని అంటున్నారు. గ్యాస్ సిలిండర్ నుండి గ్యాస్ లీకై పెద్ద ఎత్తున మంటలు లేస్తున్న సిలిండర్ పక్కనే ద్విచక్రవాహనం ఉంది. టూవీలర్కు మంటలు అంటుకుంటే పెద్ద ప్రమాదమే సంభవించేదని అంటున్నారు. గతంలో ఇలా రీఫిల్లింగ్ చేస్తున్న క్రమంలో చాలా మంది గాయపడి సందర్భాలు, అగ్ని ప్రమాదాలు జరిగిన సంఘటనలు ఉన్నాయి. ఇప్పటికై నా అధికారులు స్పందించి నిబందనలకు విరుద్దంగా గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. రీఫిల్లింగ్ చేయడం చట్ట విరుద్ధం పెద్దసిలిండర్ల నుంచి చిన్న సిలిండర్లలో రీఫిల్లింగ్ చేయడం చట్ట విరుద్దం. జనావాస ప్రాంతాల్లో గ్యాస్ రీఫిల్లింగ్ చేయడం ప్రమాదకరం. రీఫిల్లింగ్ అనుమతి పొంది జనావాసాలకు కనీసం వంద మీటర్ల దూరంలో రీఫిల్లింగ్ సెంటర్ ఉండాలి. అగ్నిప్రమాదాలు జరిగితే అత్యవసర పరిస్థితుల్లో 101నెంబర్కు ఫోన్ చేసి సమాచారం అందించాలి. – డి.అనిల్కుమార్, జిల్లా అగ్నిమాపక అధికారి -
అన్నివర్గాల అభ్యున్నతే ప్రభుత్వ ధ్యేయం
● ఎమ్మెల్యే విజయరమణారావు పెద్దపల్లిరూరల్: సీఎం రేవంత్రెడ్డి సారథ్యంలోని ప్రభుత్వం అన్ని వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా పనిచేస్తోందని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. పెద్దపల్లి మండలం అప్పన్నపేట, బొంపల్లి, మేరపల్లి గ్రామాల్లో ఆదివారం రూ.కోటి 10లక్షల వ్యయ అంచనాలతో చేపట్టిన అభివృద్ది పనులను ప్రారంభించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు ప్రొసిడింగ్స్ అందించి నిర్మాణాలకు ముగ్గు పోశారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పాలకులు ధనార్జనే ధ్యేయంగా పనిచేశారే తప్ప ఏనాడు ప్రజాసంక్షేమాన్ని పట్టించుకోలేదన్నారు. కానీ అధికారంలోకి రాగానే అర్హులైన వారందరికీ రేషన్కార్డులు అందించి లబ్దిదారులందరికీ సన్నబియ్యం పంపిణీ చేస్తున్న ఘనత సీఎం రేవంత్రెడ్డిదేనని అన్నారు. రాబోయే స్థానిక ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచి ఆశీర్వదించాలన్నారు. నాయకులు ఆరె సంతోష్, రాజేందర్, చింతపండు సంపత్, మహేందర్, నరేశ్, రాజు, వీరేశం, శ్రీనివాస్, శ్రీకాంత్ తదితరులున్నారు. పేదల సొంతింటి కల సాకారం చేస్తున్నాం జూలపల్లి: పేదల సంక్షేమమే ధ్యేయంగా అమలు చేస్తున్న పథకాల్లో భాగంగా సొంతింటి కల సాకారం చేస్తున్నామని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. మండలంలోని కోనరావుపేటలో లబ్ధిదారుడు ఆవులమ్మ–ఐలయ్యకు మంజూరైన ఇందిరమ్మ గృహ ప్రవేశాన్ని ఆదివారం చేయించి లబ్ధిదారునికి శుభాకాంక్షలు తెలిపారు. సర్పంచుల ఫోరం మండల మాజీ అధ్యక్షుడు నర్సింహయాదవ్, నాయకులు రాంగోపాల్రెడ్డి, డైరెక్టర్ చుక్కయ్య లబ్దిదారులు పాల్గొన్నారు. -
సింగరేణిపై కవిత నజర్
గోదావరిఖని: సింగరేణిలో పట్టుకోసం టీబీజీకేఎస్ గౌవాధ్యక్షురాలిగా ఉన్న కల్వకుంట్ల కవిత వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం హెచ్ఎంఎస్తో కలిసి చేయాలని నిర్ణయించారు. ఈ నిర్ణయం వెనక వ్యూహాత్మక ప్రణాళికలున్నట్లు చర్చ జరుగుతోంది. ఈ పరిణామాలకు ముందే 11ఏరియాలకు ఇన్చార్జీలుగా జాగృతి నాయకులను ప్రకటించారు. సంఘం నాయకులను సంప్రదించకుండానే ఏరియా ఇన్చార్జీలను నియమించడంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టీబీజీకేఎస్ కేంద్ర కమిటీ సభ్యులతో సమావేశమై యూనియన్ ఇన్చార్జిగా కొప్పుల ఈశ్వర్ను ప్రకటించారు. త్వరలో శ్రీరాంపూర్ఏరియాలో భారీ సభ నిర్వహించాలని యోచిస్తున్నారు. హెచ్ఎంఎస్ నేత రియాజ్అహ్మద్తో సమావేశమైన జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హెచ్ఎంఎస్, జాగృతి కలిసి సమష్టిగా ముందుకెళ్లాలని నిర్ణయించారు. ఈ మేరకు హైదరాబాద్లో ఆదివారం సమావేశం అయ్యారు. సింగరేణిలో పట్టుకోసం కవిత వ్యూహం టీబీజీకేఎస్ ఇన్చార్జిగా కొప్పుల ఈశ్వర్ను ప్రకటించిన క్రమంలో కవిత సింగరేణిలో పట్టు కోసం కార్మికుల వద్దకు వెళ్లాలని ప్రణాళికలు రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు జాతీయ కార్మిక సంఘమైన హెచ్ఎంఎస్తో కలిసి అన్ని ఏరియాల్లో పర్యటించి, కార్మికులకు దగ్గర కావాలని నిర్ణయించారు. దశాబ్ధకాలంగా టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలిగా ఉన్న కవిత ఈ ప్రాంతంలో అనేక కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకు దగ్గరయ్యారు. ఈ క్రమంలో హెచ్ఎంఎస్ యూనియన్తో కలిసి కార్మికుల్లోకి వెళ్లాలని భావిస్తున్నారు. యూనియన్ గౌరవాధ్యక్షురాలిగా ఉండి హెచ్ఎంఎస్తో ముందుకెళ్లాలని నిర్ణయించడంతో టీబీజీకేఎస్ వైఖరి ఏవిధంగా ఉంటుందోనని అందరూ ఎదురుచూస్తున్నారు. వచ్చేనెలలో కార్మిక భరోసా యాత్ర కార్మికుల సమస్యలపై సింగరేణివ్యాప్తంగా పర్యటించేందుకు కల్వకుంట్ల కవిత నిర్ణయించారు. హెచ్ఎంఎస్ నాయకులతో కలిసి కార్మికుల్లో భరోస నింపడానికి ప్రణాళికలు రూపొందించారు. గతనెలలో మెడికల్ బోర్డులో కార్మికులకు జరిగిన అన్యాయం, ఇన్కంటాక్స్ రద్దు చేయాలని, అంతర్గత ఉద్యోగాలు భర్తీ చేయాలని, కార్మికుల సొంతింటి కల నిజం చేయడంతో పాటు పలు సమస్యల పరిష్కారం కోసం కార్మిక భరోసా యాత్రకు ప్రణాళికలు రూపొందించారు. ఈనెల రెండో వారంలో సంస్థ సీఅండ్ఎండీని కలిసి వినతిపత్రం ఇవ్వాలని నిర్ణయించారు. హెచ్ఎంఎస్తో ముందుకెళ్లేందుకు నిర్ణయం అన్ని ఏరియాల్లో పర్యటించేందుకు ప్రణాళికలు కోల్బెల్ట్లో మారుతున్న సమీకరణలు -
ఆపరేషన్ కగార్ నిలిపేయాలి
ఓదెల:కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపివేయాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి అన్నారు. ఆదివారం ఓదెల మండలం కనగర్తిలో జరిగిన సీపీఐ మండల మహాసభలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులతో శాంతిచర్చలు జరపాలన్నారు. ఇటీవల ఆపరేషన్ కగార్లో మృతి చెందిన మావోయిస్టు అగ్రనాయకుల మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ మౌనం పాటించారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో సీపీఐ నాయకులు, కార్యకర్తలు పోటీ చేసి విజేతలుగా నిలవాలన్నారు. సమావేశంలో సీపీఐ రాష్ట్ర నాయకులు కలవేన శంకర్, తాళ్లపల్లి లక్ష్మణ్, స్వామి, జిల్లా నాయకులు తాండ్ర సదానందం తదితరులు పాల్గొన్నారు బీసీ రిజర్వేషన్లపై పార్లమెంట్లో చట్టం చేయాలిగోదావరిఖని: 42శాతం బీసీ రిజర్వేషన్ల అమలు కోసం కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో చట్టం చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వై.యాకయ్య డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఆదివారం గోదావరిఖని మెయిన్ చౌరస్తాలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో తీర్మానం చేసి 42శాతం బీసీ రిజర్వేషన్ల కోసం కేంద్రానికి ఆమోదం కోసం పంపిందన్నారు. కేంద్ర ప్రభుత్వం బీసీలను మోసం చేస్తూ మతం రంగు పులుముతోందని తెలిపారు. నాన్చుడు ధోరణిని ప్రదర్శిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి ప్రజాపోరాటాల ద్వారా బుద్ధి చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎ.ముత్యంరావు, వేల్పుల కుమారస్వామి, ఎ.మహేశ్వరి, మేదరి సారయ్య, మెండే శ్రీనివాస్, శైలజ, ఎన్.బిక్షపతి, నేర్వట్ల నర్సయ్య, తుమ్మల రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మల్లన్న సన్నిధిలో భక్తుల పూజలుఓదెల: ఓదెల మల్లికార్జునస్వామి దేవస్థానంలో భక్తులు ఆదివారం పూజలు చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు పలు ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి కోనేరులో స్నానాలు ఆచరించి మల్లికార్జునస్వామి, సీతారామచంద్రస్వామి, ఖండేలరాయుడు, నందీశ్వరులను దర్శనం చేసుకున్నారు. ఒగ్గు పూజారులతో స్వామివారికి పట్నాలతో పాటు బోనాలు సమర్పించుకున్నారు. అక్టోబర్ 3న దసరా సెలవుగా ప్రకటించాలిగోదావరిఖని: అక్టోబర్ 2న గాంధీ జయంతి, దసరా పండుగ ఒకేరోజు వచ్చినందున అక్టోబర్ 3న దసరా పండుగ జరుపుకునేందుకు సెలవు దినంగా సింగరేణి యాజమాన్యం ప్రకటించాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి కోరారు. ఆదివారం గోదావరిఖనిలోని శ్రామికభవన్లో మాట్లాడుతూ తెలంగాణ సంప్రదాయంలో ఆడబిడ్డలు, అల్లుళ్లు, కొడుకులు, కూతుళ్లతో ఇంటిల్లిపాది జరుపుకునే అతిపెద్ద పండుగ దసరా అన్నారు. అక్టోబర్ 2 గాంధీ జయంతి వచ్చినందున ఆనందదాయంగా జరుపుకోవడం వీలుకాదని తెలిపారు. కార్మిక కుటుంబాలకు అక్టోబర్ 2న కాకుండా 3న దసరా సెలవు ప్రకటించాలని కోరారు. పోచమ్మకు బోనంగోదావరిఖనిటౌన్: శివాజీనగర్ కూరగాయల మార్కెట్లోని పోచమ్మ ఆలయంలో ఆదివారం రామగుండం ఎమ్మెల్యే సతీమణి మనాలి ఠాకూర్ ప్రత్యేక పూజలు చేసి అమ్మవారికి బోనం సమర్పించారు. బోనాలు మన తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని, అమ్మవారిని ఆరాధించడం వల్ల ప్రజలుసుభిక్షంగా ఉంటారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, భక్తులు పాల్గొన్నారు. -
బ‘స్టాప్’ షెల్టర్లు ఏవి..?
పెద్దపల్లిరూరల్: జిల్లాలో ఆర్టీసీ బస్సులు నడిచే ప్రధానమార్గాలతో పాటు గ్రామాలకు వెళ్లే రూట్లలోనూ బస్షెల్టర్లు లేక జనం ఇబ్బందులు పడుతున్నారు. తమ అవసరాల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాలనుకునే వారు రోడ్డుపై నిరీక్షించలేక ప్రైవేట్వాహనాలను ఆశ్రయించి ఆర్థికంగా నష్టపోతున్నా ఆర్టీసీ అధికారులు స్పందించడం లేదన్న విమర్శలున్నాయి. బస్షెల్టర్ లేని బాధలు పేద, మధ్యతరగతి ప్రజల ప్రయాణానికి ఆర్టీసీ బ స్సులే ఆధారం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ‘మహాలక్ష్మి’ పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడంతో బస్సుల్లో ప్రయాణించే వారి సంఖ్య పెరిగిందని చెప్పుకోవచ్చు. కానీ, ప్రయాణికులు బస్సులకోసం నిరీక్షించేందుకు అవసరమైన షెల్టర్లు లేక ఎండకు ఎండుతూ, వానకు తడవాల్సిన పరిస్థితులున్నాయని వాపోతున్నారు. పలుచోట్ల నిరుపయోగంగా..జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్కు పలు ప్రాంతాల నుంచి ప్రజలు తమ అవసరాల నిమిత్తం వచ్చిపోతుంటారు. వారి సౌకర్యం కోసం కలెక్టరేట్ వద్ద ఆర్టీసీ బస్సులు నిలపాలని కలెక్టరేట్ అధికారులు పలు మార్లు ఆర్టీసీ అధికారులను కోరారు. ప్రయాణికుల కోసం బస్షెల్టర్ కూడా నిర్మించారు. అయినా ఇక్క డ ఆర్డీనరీ బస్సులు తప్ప ఎక్స్ప్రెస్, లగ్జరీ బస్సులు నిలపడం లేదని ప్రజలు పేర్కొంటున్నారు. సుల్తానాబాద్ మండలం చిన్నకల్వల వంతెన వద్ద కూడా బస్షెల్టర్ నిరుపయోగంగానే ఉంటోంది. ఇలా రాజీవ్రోడ్డు వెంట బస్సులు ఆగే ప్రాంతాల్లో కాకుండా దూరంగా నిర్మించిన షెల్టర్లను బస్సులు ఆగే చోట నిర్మిస్తే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని పలువురు పేర్కొంటున్నారు. ఏటా పెరుగుతున్న ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సాగించే వారి సంఖ్య ఏటా పెరుగుతూనే ఉంది. అయినా సంబంధిత అధికారులు కనీస ఏర్పాట్లు కూడా చేయకపోవడాన్ని పలువురు ప్రశ్నిస్తున్నారు. గతంలో లయన్స్, రోటరీక్లబ్, కేశోరాం, ఎన్టీపీసీ లాంటి సంస్థలు బస్షెల్టర్ల నిర్మాణాలకు ముందుకొచ్చేవి. కానీ, ఈ మధ్య అలాంటి కార్యక్రమాలను ఎవరూ చేపట్టకపోవడం కూడా సమస్య తీవ్రతకు కారణంగా చెప్పుకోవచ్చు. బస్సుల కోసం ప్రయాణికుల పాట్లు ఎండకు ఎండుడే.. వానకు తడుసుడే రోడ్లపై.. దుకాణాల ఎదుట నిరీక్షణ జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి ‘ఈ చిత్రం జిల్లాకేంద్రంలోని కమాన్ ఏరియా సమీపంలోనిది. ఇక్కడి నుంచి గోదావరిఖని, మంచిర్యాల, మంథని తదితర ప్రాంతాలకు వెళ్లే బస్సుల కోసం ప్రయాణికులు రోడ్డుపై ఎండలో, వానలో నిలబడాల్సిందే. సమీపంలో ఉన్న దుకా ణాల ముందు నిలబడితే వారితో చీవా ట్లు తినాల్సి వస్తోందని వాపోతున్నారు.’‘ఇది పెద్దపల్లిలోని కమాన్ ప్రాంతంలో గల (కరీంనగర్వైపు) బస్టాప్. కరీంనగర్ వెళ్లే బస్సుల్లో ఎక్కేందుకు రోడ్డుపైనే నిరీక్షించే ప్రయాణికులకు ప్రైవేట్ వాహనదారులు నరకం చూపిస్తున్నారు. ఆర్టీసీ బస్సులు వచ్చే సమయం దాకా వాటికి అడ్డుగా ప్రైవేట్ వాహనాలను నిలపడంతో అవి ఆగకుండా పోతున్నాయని ప్రయాణికుల ఆవేదన.’ ‘ఇది పెద్దపల్లి మండలం పెద్దకల్వల వద్ద హెచ్కేఆర్ వారు వేసిన బస్షెల్టర్. ఇరవైఏళ్లుగా ఈ షెల్టర్లో కనీసం ఒక్కప్రయాణికుడు కూడా కూర్చోలేదు. ఎందుకంటే ఇక్కడ బస్సులే ఆగవు. దీనికి సమీపంలోనే కలెక్టరేట్ వద్ద షెల్టర్ లేక ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. ఈ షెల్టర్ను అక్కడికి మార్చాలని కోరుతున్నారు.’ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం ఆర్టీసీ బస్సులు ఆగే స్థలాల వద్ద బస్షెల్టర్లు అవసరమనే విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. కమాన్ ప్రాంతంలో ప్రైవేట్ వాహనాలను నియంత్రించేందుకు కొంతకాలం ఆర్టీసీ అధికారిని నియమించింది. సమస్య పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటాం. – రాంగోపాల్రెడ్డి, బస్స్టేషన్ మేనేజర్, పెద్దపల్లి -
‘సర్కారు’ భూమి ‘హస్తగతం’
సాక్షిప్రతినిధి, కరీంనగర్: పరాధీనంలో ఉంటున్న రూ.కోట్లాది విలువైన భూమిని కలెక్టర్ చొరవతో అధికారులు తిరిగి హస్తగతం చేసుకున్నారు. స్థానికులు తెలిపిన వివరాలు. జిల్లా కేంద్రం శివారులోని చంద్రగిరి సమీపంలో సర్వేనంబరు 25, 26లోని ప్రభుత్వ భూమిలో చాలా ఏళ్లు ఇటుకబట్టీలను తిప్పాపూర్కు చెందిన ఓ వ్యక్తి నడిపించాడు. జిల్లా కలెక్టర్గా సందీప్కుమార్ ఝా వచ్చినప్పటి నుంచి పరాధీనంలో ఉంటున్న ప్రభుత్వ భూములను రికవరీ చేస్తున్నారు. గతంలో కొంతమందిపై కేసులు కూడా నమోదయ్యాయి. అయితే చంద్రగిరి శివారులో ఉన్న భూమి ప్రస్తుతం రూ.60కోట్ల వరకు పలుకుతోంది. ఇటుక బట్టీలు నడిపించిన వ్యక్తి ఇతరుల వద్ద కొనుగోలు చేసినట్లు సమాచారం. కాగా ప్రభుత్వ భూమి కావడంతో సదరు భూమిలో ఇటుకబట్టీలు నడిచి పరాధీనంలో ఉంటున్నాయన్న విషయం కలెక్టర్ దృష్టికి రావడంతో రెవెన్యూ అధికారులతో విచారణ చేపట్టారు. ప్రభుత్వ భూములుగా తేలడంతో వెంటనే రికవరీకి ఆదేశించినట్లు సమాచారం. అధికారులు ఆదివారం సదరు భూమిలో ఉన్న కట్టడాలను జేసీబీ సహాయంతో కూల్చేశారు. రూ.60కోట్ల విలువైన భూమి ప్రభుత్వపరం కావడం స్థానికుల్లో చర్చనీయాంశమైంది. ● రూ.60కోట్ల విలువైన స్థలం రికవరీ