breaking news
Peddapalli
-
వరి విత్తనం సిద్ధం
● కొత్త వంగడాలను సృష్టిస్తున్న శాస్త్రవేత్తలు ● వానాకాలంలో సాగు చేసిన రైతులు కరీంనగర్రూరల్: యాసంగి సీజన్లో రైతులు సాగు చేసేందుకు అవసరమైన విత్తనం సిద్ధమవుతోంది. ప్రైవేట్ కంపెనీల విత్తనాల కొనుగోలుతో రైతులకు ఆర్థికంగా భారమవుతుండటంతో ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయం, వ్యవసాయశాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఫౌండేషన్ విత్తనం తయారీ చేస్తున్నారు. గత వానాకాలం సీజన్లో ఉమ్మడి కరీంనగర్ మండలంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే కార్యక్రమం నిర్వహించారు. మొత్తం 20 గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహించి ఒక్కో గ్రామంలో ఎంపిక చేసిన ఇద్దరు రైతులకు సాగు చేసేందుకు నాణ్యమైన వరి విత్తనాలు అందజేశారు. ఒక్కో విత్తన బస్తాతో ఎకరం చొప్పున మొత్తం 40 ఎకరాల్లో సాగు చేశారు. దొడ్డు రకం విత్తనాలు పంపిణీ వరిలో జేజీఎల్ 24423 దొడ్డురకం విత్తనాలను కరీంనగర్ పరిశోధన స్థానం నుంచి రైతులకు పంపిణీ చేశారు. కొన్ని వరి విత్తన పంటలు ప్రస్తుతం కోత దశలో ఉండగా మరికొన్ని గ్రామాల్లో కోతలు పూర్తి చేశారు. వారం రోజుల క్రితం కొత్తపల్లి మండలంలో శాస్త్రవేత్తలు పంటపొలాలను సందర్శించారు. తాము సరఫరా చేసిన విత్తనాలతో పండించిన పంట నుంచి గింజలను తీసుకుని రైతులు తిరిగి విత్తనంగా వాడుకోవచ్చని శాస్త్రవేత్తలు సూచించారు. పొలంలో కల్తీ కర్రలు, బెరుకులను ఏరివేసి పంటను వేరుగా నూర్పిడి చేసుకుని కొన్ని సీజన్ల వరకు విత్తనంగా వాడుకునే అవకాశముంది. గ్రామంలోని ఇతర రైతులకు ఈ విత్తనాలను విక్రయించవచ్చు. రైతులు పండించిన విత్తనాలను 3నుంచి 4 వారాల పాటు నిల్వ చేసిన అనంతరం విత్తనశుద్ధి చేయాల్సి ఉంటుంది. ప్రైవేటు కంపెనీల నుంచి విత్తనాలు కొనుగోలు చేస్తే రైతులకు ఎకరానికి రూ. 2వేల నుంచి రూ. 3 వేల వరకు ఖర్ఛవుతోంది. ఈ విత్తనమైతే సగం ఖర్చు మాత్రమే అవుతుందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. సేంద్రియ ఎరువులతో ఆరోగ్యకరమైన పంటలు కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యానవన వర్సిటీ వీసీ రాజిరెడ్డి కాల్వశ్రీరాంపూర్: శాసీ్త్రయ పద్ధతులు, సేంద్రియ ఎరువులు వినియోగించి ఆరోగ్యకరమైన పంటలు పండించాలని తెలంగాణ కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యానవన విశ్వవిద్యాలయం వైస్ చాన్స్లర్ దండ రాజిరెడ్డి సూచించారు. వాణిజ్య పంటలతోపాటు పండ్ల తోటలు, కూరగాయలు, సిరి ధాన్యాలు, పప్పు దినుసుల సాగుపైనా అవగాహన పెంచుకోవాలన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం కూనారం రైతువేదికలో ఆయన సోమవారం రైతులతో మాట్లాడారు. తొలుత ఎమ్మెల్యే విజయరమణారావు మాట్లాడుతూ కొయ్యకాళ్లు, వ్యర్థాలు కాల్చడం ద్వారా కాలుష్యం పెరుగుతుందన్నారు. వ్యర్థాలను వర్మీకంపోస్టుగా తయారు చేసేలా శాస్త్రవేత్తలు, వ్యవసాయాధికారులు అవగాహన కల్పించాలన్నారు. కృషి విజ్ఞానకేంద్రం రామగిరి ఖిల్లా ప్రధాన శాస్త్రవేత్త శ్రీనివాస్, కూనారం వ్యవసాయ పరిశోధన స్థానం శాతస్రవేత్త సతీశ్చంద్ర, ఉద్యానవన రిజిస్ట్రార్ భగవాన్, వర్సిటీ డైరెక్టర్ సురేశ్ కుమార్రెడ్డి, మాజీ ఎంపీపీ సారయ్యగౌడ్, ఏఎంసీ చైర్మన్ తిరుపతిరెడ్డి, రైతులు తదితరులు పాల్గొన్నారు. -
జింకను వేటాడిన వ్యక్తి అరెస్ట్
కొడిమ్యాల: వన్యప్రాణిని వేటాడిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు కొడిమ్యాల రేంజ్ అటవీశాఖ అధికారులు తెలిపారు. మండలంలోని తిరుమలాపూర్ గ్రామానికి చెందిన గుడికందుల ఆశయ్య కొద్దిరోజుల క్రితం జింకను వేటాడి చంపాడు. ఈ విషయం బయటకు పొక్కడంతో అటవీశాఖ అధికారులు తమ సిబ్బందితో కలిసి విచారణ చేపట్టారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆయన ఇచ్చిన సమాచారం మేరకు జింకను వేటాడిన ప్రాంతానికి వెళ్లి పరిశీలించారు. అనంతరం నిందితుడిని రిమాండ్కు తరలించినట్లు అధికారులు తెలిపారు. అటవీశాఖ అధికారి గులాం మొహినుద్దీన్, డిప్యూటీ రేంజర్ ముషీరుద్దీన్, బీట్ ఆఫీసర్ ఆనంద్ కుమార్, సిబ్బంది ఉన్నారు. -
రీల్స్ చేస్తూ గోదావరిలో యువకుడి గల్లంతు
మంథని: పెద్దపల్లి జిల్లా మంథని పట్టణ సమీప గోదావరి నదిలో ‘గోదావరి – గంగ స్నానం’ పేరిట మంథని మంట అనే యూట్యూబ్లో రీల్స్చేసే ఓ యువకుడు.. రోజూ మాదిరిగానే సోమవారం స్నానం కోసం గోదావరిలోకి వెళ్లి గల్లంతయ్యాడు. స్థానికుల కథనం ప్రకారం.. మంథని పాతబస్టాండ్ వెనకాల నివాసం ఉండే రావికంటి చంద్రశేఖర్ కుమారుడు సాయికృష్ట (30) బీటెక్ పూర్తిచేశాడు. ‘మంథని మంట’ పేరిట స్థానిక అంశాలపై రీల్స్ చేస్తూ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాడు. ఈక్రమంలో ‘గోదావరి– గంగస్నానం’ పేరిట రీల్స్ తీసి పిల్లలు, స్థానికులను ఉత్సాహ పరచడంతోపాటు ఈ ప్రాంత ప్రత్యేకతనూ పరిచయం చేశారు. ఇందుకోసం సాయికృష్ణ నిత్యం గోదావరి నదికి వెళ్లి స్నానం చేయడమే కాకుండా రీల్స్ తీస్తున్నారు. సోమవారం కూడా గోదావరిలోకి వెళ్లి స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక, మున్సిపల్, రెవెన్యూ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. మంథని ఎస్ఐ–2 సాగర్, మున్సిపల్ కమిషనర్ మనోహర్, తహసీల్దార్ కుమారస్వామి సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది, గతఈతగాళ్లు రాత్రి వరకు గాలించినా ఆచూకీ లభించలేదు. దీంతో కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరవుతన్నారు. గోదావరిలో ప్రవాహం అధికంగా ఉండడంతో కార్తీకమాసంలో పుణ్యస్నానాల కోసం వచ్చే భక్తులు లోతైన ప్రదేశానికి వెళ్లకుండా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తున్నామని, గజఈతగాళ్ల ను అందుబాటులో ఉంచామని మున్సిపల్ కమిషనర్ తెలిపారు. కాగా, బాఽధిత కుటుంబంతో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ఫోన్లో మాట్లాడి ఓదార్చారు. మంథని మాజీఎమ్మెల్యే పుట్ట మధు గోదావరి తీరాన్ని సందర్శించి పరిస్థితిని పర్యవేక్షించారు. -
రోడ్డుకు తాకిన స్టాండ్రాడ్.. స్కూటీకి మంటలు
ముస్తాబాద్(సిరిసిల్ల): రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్లోని తెలంగాణతల్లి చౌరస్తా వద్ద సోమవారం ఓ స్కూటీకి మంటలు అంటుకుంటున్నాయి. దుబ్బాక వైపు నుంచి ఇద్దరు వ్యక్తులు స్కూటీపై వస్తూ కొత్త బస్టాండ్ వైపు మళ్లారు. ఆ క్రమంలో వారి స్కూటీ స్టాండ్ రాడ్ బయటకు ఉండడంతో రోడ్డును తాకి ఒక్కసారిగా నిప్పురవ్వలు ఎగిసిపడ్డాయి. దీంతో స్కూటీకి మంటలు అంటుకున్నాయి. చుట్టుపక్కల వారు హెచ్చరించడంతో బైక్పై ఉన్న వ్యక్తులు వాహనాన్ని వదిలి కిందకు దూకారు. స్కూటీపై నీల్లు చల్లడంతో మంటలు ఆరిపోయాయి. తృటిలో ప్రాణపాయం తప్పిందని స్కూటీపై వున్న వారు పేర్కొన్నారు. -
భర్త హఠాన్మరణం.. భార్య బలవన్మరణం
వీర్నపల్లి(సిరిసిల్ల): నలభై రోజుల వ్యవధిలో భార్యాభర్తలు మృతిచెందడంతో ఇద్దరు చిన్నారులు అనాథలయ్యారు.. గ్రామస్తులు తెలిపిన వివరాలు.. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం కంచర్ల గ్రామానికి చెందిన దేవోల్ల హన్మంతు సెప్టెంబర్ 26న బహ్రెయిన్లో గుండెపోటుతో మృతిచెందాడు. ఒక పక్క అప్పులు, మరో పక్క భర్త మరణంతో తీవ్ర మానసిక వేదనకు గురైన భార్య సుమలత(30) సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో దూలానికి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పాఠశాలకు వెళ్లిన చిన్న కుమార్తె వచ్చేసరికి తలుపులు మూసి ఉండడంతో కిటికీలోంచి చూడగా తల్లి ఉరేసుకొని కనిపించింది. వెంటనే స్థానికులకు తెలుపడంతో పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై లక్ష్మణ్ ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేపట్టారు. మృతురాలికి ఇద్దరు కుమార్తెలు ఇందు, లాస్య ఉన్నారు. దంపతుల మరణంతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. నలభై రోజుల వ్యవధిలో ఇద్దరు మృతి.. అనాథలైన చిన్నారులు -
సీపీఐ శతజయంతి ఉత్సవాలకు సిద్ధం కావాలి
కరీంనగర్టౌన్: భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) ఆవిర్భవించి వందేళ్లు పూర్తవుతున్న సందర్భంగా వచ్చే నెల 26న నిర్వహించే శతజయంతి ఉత్సవాలకు సిద్ధం కావాలని సీపీఐ జాతీయ మాజీ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి అన్నారు. కరీంనగర్లోని బద్దం ఎల్లారెడ్డిభవన్లో సోమవారం జరిగిన జిల్లా కార్యవర్గ, కౌన్సిల్ సభ్యుల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సీపీఐ ఏర్పడిన వందేళ్లలో దేశంలో అనేక ఉద్యమాలు, పోరాటాలు నిర్వహించి ప్రజల హక్కుల కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల త్యాగాలను ప్రజలకు తెలియజేయాలన్నారు. ప్రతీ ఊరు, వాడవాడలో పార్టీ జెండాలు ఎగురవేసి, ర్యాలీలు, సభలు, సెమినార్లు నిర్వహించి పార్టీ చరిత్రను నేటి తరానికి చేరవేయాలని సూచించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ మాట్లాడుతూ పార్టీ శతజయంతి ఉత్సవాలను జిల్లాలోని అన్ని గ్రామాల్లో జాతాల రూపంలో నిర్వహించి ప్రజలకు సీపీఐ ప్రజాపక్ష ధోరణిని తెలియజేస్తామని తెలిపారు. ఈ సమావేశానికి కసిరెడ్డి సురేందర్ రెడ్డి అధ్యక్షత వహించగా.. నాయకులు పొనగంటి కేదారి, అందె స్వామి, మర్రి వెంకటస్వామి, బోయిని అశోక్ తదితరులు పాల్గొన్నారు. -
రైతు ఆత్మహత్యాయత్నం
హుజూరాబాద్రూరల్: మండలంలోని కందుగుల గ్రామానికి చెందిన రైతు ఇమ్మడి సదానందం అప్పు ల బాధ తట్టుకోలేక సోమవారం పురుగులమందు తాగాడు. వెంటనే స్థానికులు 108లో హుజూరా బాద్ ఏరియా ఆసుపత్రికి, మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎం హాస్పిటల్కు తరలించారు. తండ్రీకూతుళ్లు.. ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లబొప్పాపూర్కు చెందిన మిట్టపల్లి అఖిల అనే వివాహితను అత్తింటివారు వేధింపులకు గురి చేస్తుండగా, ఈ విషయంలో పోలీసులు తమకు సరైన న్యాయం చేయలేదని ఆరోపిస్తూ.. ఐదు రోజుల వ్యవధిలో తండ్రీకూతుళ్లు పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. బాధితుల వివరాలు.. రాచర్లబొప్పాపూర్కు చెందిన అఖిలకు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్కు చెందిన కృష్ణకాంత్తో 11 నెలల క్రితం వివాహం జరిగింది. అనంతరం ఆరునెలల పాటు వీరి కాపురం సజావుగా సాగింది. ఐదునెలలుగా అదనపు కట్నం కోసం అఖిలను అత్తింటి వారు వేధించసాగారు. దీంతో ఆమె పుట్టింటికి వచ్చింది. అత్తింటివారు కట్నం కోసం వేధిస్తున్నారని నాలుగునెలల క్రితం ఎల్లారెడ్డిపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా పట్టించుకోవడం లేదనే మనస్తాపంతో అఖిల గత నెల 30న పురుగులమందు తాగింది. స్థానిక ఆస్పత్రిలో ప్రథమ చికిత్స చేసి హైదరాబాద్ తరలించారు. ఈ క్రమంలోనే తన కూతురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం, పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ అఖిల తండ్రి మిట్టపల్లి ఆంజనేయులు గత శనివారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం ఆంజనేయులు ఆరోగ్యం కుదుటపడడంతో ఇంటికి వచ్చాడు. ఈ విషయంపై ఎస్సై రాహుల్రెడ్డిని వివరణ కోరగా.. అఖిల ఫిర్యాదు మేరకు భర్త కృష్ణకాంత్, అత్త, మామ, ఆడబిడ్డలపై అదనపు కట్నం కేసు నమోదు చేశామన్నారు. కేసు విషయంలో అత్తింటివారికి నోటీసులు కూడా జారీ చేయడం జరిగిందన్నారు. పోలీసులు పట్టించుకోవడం లేదని అఖిల, ఆంజనేయులు చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని పేర్కొన్నారు. -
మహిళ బలవన్మరణం
కొత్తపల్లి(కరీంనగర్): మతిస్థిమితం లేని మహిళ చింతకుంట ఎస్సారెస్పీ కెనాల్ పడి ఆత్మహత్యకు పాల్పడ్డట్టు కొత్తపల్లి ఎస్హెచ్వో బిల్ల కోటేశ్వర్ తెలిపారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. రాజన్నసిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం తడగొండ గ్రామానికి చెందిన ఉయ్యాల రాజశేఖర్ తన తల్లి, కుటుంబంతో కలిసి చింతకుంటలో నివాసం ఉంటూ ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు, అయితే తండ్రి 11 ఏళ్ల కిందట మృతి చెందగా తల్లి ఉయ్యాల అరుణ(53) మానసికంగా ఇబ్బంది పడుతూ రాత్రి వేళల్లో లేచి తిరుగుతుండటాన్ని గమనించి వారు ఇంటికి తీసుకొచ్చేవారు. ఈక్రమంలో సోమవారం తెల్లవారుజామున ఇంట్లో లేకపోవడాన్ని గమనించి చుట్టు పక్కల ఆరా తీయగా చింతకుంట ఎస్సారెస్పీ కెనాల్లో శవమై తేలింది. ఆరోగ్యం క్షీణించి మతిస్థిమితం లేక జీవితంపై విరక్తి చెంది కెనాల్లో పడి తల్లి అరుణ ఆత్మహత్య చేసుకున్నట్లు కుమారుడు రాజశేఖర్ ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు. కడుపునొప్పి భరించలేక యువకుడు..ఓదెల: పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం మడక గ్రామానికి చెందిన పిట్టల మహేశ్(23) కడుపునొప్పి భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. పొత్కపల్లి ఎస్సై రమేశ్ కథనం ప్రకారం.. కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం సీతంపేట గ్రామానికి చెందిన మహేశ్ మడకలో స్థిరపడ్డాడు. కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతున్నాడు. నొప్పి భరించలేక జీవితంపై విరక్తిచెంది ఆదివారం రాత్రి పురుగులమందు తాగాడు. కుటుంబసభ్యులు సుల్తానాబాద్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు డాక్టర్లు ధ్రువికరించారు. మృతుడి తండ్రి పిట్టల వెంకటేశ్ ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకొన్నట్లు ఎస్సై తెలిపారు. -
చెరువులో పడి వృద్ధుడి మృతి
ఓదెల: పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం మడక గ్రామంలో ఆవుల పెద్దరాజయ్య(72) ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతిచెందాడు. పొత్కపల్లి ఎస్సై రమేశ్ కథనం ప్రకారం.. సోమవారం బహిర్భూమికి వెళ్లిన పెద్దరాజయ్య.. చెరువులోకి దిగగా కాలుజారి నీటమునిగి మృతిచెందాడు. మృతుడు కుమారుడు ఆవుల కొమురయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు పొత్కపల్లి ఎస్సై వివరించారు. అనుమానాస్పద స్థితిలో మహిళ..ఇల్లందకుంట: అనుమానాస్పద స్థితిలో మహిళ మృతిచెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... హనుమకొండ గోపాల్పూర్కు చెందిన నిమ్మల శివశంకర్ రిటైర్డ్ సింగరేణి ఉద్యోగి కూతురు సాయి సుప్రజ (25)ను, ఇల్లందకుంటకు చెందిన గోడిశాల విక్రమ్ (28)తో ఫిబ్రవరిలో జరిగింది. వివాహ సమయంలో అన్ని కట్న కానుకలు అందించారు. కొన్నినెలలుగా అదనపు కట్నం తీసుకురావాలని సుప్రజను భర్త విక్రమ్, అత్త పుష్ప వేధింపులకు పాల్పడుతున్నారని బంధువులు ఆరోపించారు. ఈనెల 2న బాత్రూంలో సుప్రజ జారిపడిందని బంధువులకు విక్రమ్ సమాచారం అందించాడు. చికిత్స కోసం జమ్మికుంటలోని ఆసుపత్రికి తరలింగా ఆమె అప్పటికే మృతిచెందిందని వైద్యులు నిర్ధారించారు. సుప్రజ మృతిపై అనుమానం ఉందని, తమ కుమార్తె మృతికి కారణమైన భర్త, అత్తపై చర్యలు తీసుకోవాలని మృతురాలి తండ్రి శివశంకర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై క్రాంతికుమార్ పేర్కొన్నారు. ● దుబాయిలో గుండెపోటుతో రుద్రంగి వాసి మృతి రుద్రంగి(వేములవాడ): ఉపాధి కోసం గల్ఫ్ బాట పట్టిన వ్యక్తి గుండె ఎడారి దేశంలోనే ఆగింది. గ్రామస్తులు తెలిపిన వివరాలు.. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రానికి చెందిన మర్రిపెల్లి సతీశ్గౌడ్(38) ఉన్న ఊరిలో ఉపాధి లేక రెండేళ్ల క్రితం దుబాయ్ వెళ్లాడు. కుటుంబ సభ్యులను చూసుకునేందుకు ఇటీవల స్వగ్రామానికి వచ్చేందుకు సిద్ధమయ్యాడు. కంపెనీలో సెలవు తీసుకొని తెల్లారితే ఫ్లైట్ ఎక్కి ఇంటికి వస్తాడనుకున్న సమయంలో మృత్యు ఒడికి చేరాడు. ఈనెల 1న గుండెపోటుతో మృతిచెందాడు. మృతదేహాన్ని మంగళవారం రుద్రంగి తీసుకురానున్నారు. రెండేళ్ల తర్వాత ఇంటికి వస్తున్నాడని సంతోషంతో ఎదురుచూస్తున్న కుటుంబ సభ్యులకు సతీశ్ మరణవార్త కడు దుఃఖాన్ని మిగిల్చింది. మృతుడికి తల్లిదండ్రులు పెద్దన్న, నర్సవ్వ, భార్య లావణ్య, కూతురు హాసిని, కుమారుడు శ్రీవర్ధన్ ఉన్నారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. -
ఆర్ఎఫ్సీఎల్లో వందశాతం యూరియా ఉత్పత్తి
ఫెర్టిలైజర్సిటీ(రామగుండం): పెద్దపల్లి జిల్లా రామగుండం ఫెర్టిలైజర్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ కర్మాగారంలో పూర్తిసామర్థ్యంతో యూరియా ఉత్పత్తి జరుగుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో నిర్మించిన రామగుండం ఎరువుల కర్మాగారం.. తెలంగాణ రాష్ట్రంతోపాటు ఆరు రాష్ట్రాల్లో యూరియా సరఫరా చేయడంలో కీలకపాత్ర పోషిస్తోంది. గత ఆగస్టు 14న అమ్మోనియా కన్వర్టర్ పైప్లైన్ లీక్ కావడంతో ప్లాంట్ షట్డౌన్ చేశారు. మరమ్మత్తుల అనంతరం సెప్టెంబర్ 28న పునరుద్ధరించారు. ప్లాంట్ సామర్థ్యం రోజూ 3,850 మెట్రిక్ టన్నుల యూరియా, 2,200 మెట్రిక్ టన్నుల అమ్మోనియా. హెచ్టీఆర్లో అమ్మోనియా కన్వర్టర్ మరమ్మతుల అనంతరం ప్లాంట్ పూర్తిసామర్థ్యంతో నెలరోజులుగా అంతరాయం లేకుండా యూరియా ఉత్పత్తి చేస్తోంది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో అక్టోబర్లో 1,03,614.030 మెట్రిక్ టన్నుల నీం కోటెడ్ యూరియా ఉత్పత్తి చేసినట్లు ఆర్ఎఫ్సీఎల్ జీఎం(ప్రాజెక్ట్), యూనిట్ హెడ్ రాజీవ్ ఖుల్బే సోమవారం తెలిపారు. తెలంగాణకు 45,561.780 మెట్రిక్ టన్నులు, ఆంధ్రప్రదేశ్కు 22,720.230 మెట్రిక్ టన్నులు, కర్ణాటకకు 18,943.470 మెట్రిక్ టన్నులు, తమిళనాడుకు 16,388.550 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేశామని అన్నారు. ఆర్ఎఫ్సీఎల్లో ఉత్పత్తికి సహకరించిన కార్మికులు, ఉద్యోగులు, అధికారులను అభినందించారు. -
బిల్లు ఇప్పించండి
ఇందిరమ్మ ఇంటి బిల్లు ఇప్పించాలని రెండు నెలల నుంచి కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న. ఈఈ వద్ద పెండింగ్లో ఉందని స్థానిక అధికారులు దాటవేస్తున్నరు. అర్హత లేని వారికి బిల్లు మంజూరైంది. నాకు ఇప్పించాలె. – మాదాసు మమత, గర్రెపల్లి, సుల్తానాబాద్ అన్నం పెడ్తలేరు మాకు ఎవుసం భూమి ఉంది. ఙకొడుకులు అన్నం పెడ్తలేరు. ఆరోగ్యం బాగోలేక ఆపరేషన్ అయ్యింది. మూడు లక్షల రూపాయల ఖర్చయ్యింది. ఖర్చులకు డబ్బుల్లేవు. అన్నం పెట్టకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నరు. – తీర్థాల కొమురయ్య, దేవక్క. ఖమ్మంపల్లిఇల్లు ఇప్పించండి కూలీకై కిలి పనిజేసుకుంటేనే పూటగడిచే కుటుంబం మాది. దీనికితోడు మా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నడు. ఆస్తుల్లేవు. భూముల్లేవు. పేద కుటుంబం. ఇందిరమ్మ ఇల్లు ఇప్పించి గూడు సౌకర్యం కల్పించాలె. – హసీనాబేగం, సాగర్రోడ్డు, పెద్దపల్లి -
జాగ్రత్తలు తీసుకోవాలి
న్యుమోనియా వ్యాధి రాకుండా అప్పుడే పుట్టిన ప్రతీబిడ్డకు ముందస్తుగా వ్యాక్సిన్ వేయించాలి. వ్యాధి నియంత్రణకు పిల్లలు, పెద్దవారికి జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో టీకాలు అందుబాటులో ఉన్నాయి. పబ్లిక్ ప్రదేశాల్లోకి వెళ్లినప్పుడు ముఖానికి మాస్క్ అడ్డుపెట్టుకోవడం చాలామంచిది. వ్యాధిగ్రస్తులు కోలుకోవడానికి వైద్యులు రాసిన మందులు క్రమం తప్పకుండా వాడాలి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. ప్రధానంగా చలికాలంలో చాలాజాగ్రత్తలు తీసుకోవడం మంచిది.– వాణిశ్రీ, డీఎంహెచ్వో -
కోతలు లేకుండా ధాన్యం కొనుగోలు
జూలపల్లి(పెద్దపల్లి): కోతలు లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తామని ఎమ్మెల్యే విజయరమణారావు తెలిపారు. తెలుకుంట, పెద్దాపూర్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే విజయరమణారా వు సోమవారం ప్రారంభించి మాట్లాడారు. మద్దతు ధరతోనే ధాన్యం విక్రయించాలని రైతులకు సూచించారు. సన్నవడ్లకు బోనస్ ఇప్పించే బాధ్యత తనదేనని తెలిపారు. ఈ కార్యక్రమంలో ధూళికట్ట, ఎలిగేడు సింగిల్విండో చైర్మన్లు వేణుగోపాలరావు, విజయభాస్కర్రెడ్డి, నాయకులు తొంటి మధుకర్, సుదగోని నర్సయ్య, లింగయ్యగౌడ్, బొజ్జ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. 48 గంటల్లో ధాన్యం డబ్బులు కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): తాలు, తేమ పేరిట ధాన్యంలో కోత పెడుతూ రైతులను దోచుకునే ప్రభుత్వం తమది కాదని, కోతల్లేకుండా తూకం వేసి 48 గంటల్లో రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు చేస్తున్న ఘనత కాంగ్రెస్ సర్కార్దని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. కాల్వశ్రీరాంపూర్, కూనారంలో ఆయన ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రాంభించారు. 51 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు అందజేసి మాట్లాడారు. తుపానుతో పంటలు నష్టపోయిన రైతులకు న్యాయం చేసేలా సీఎం దృష్టికి తీసుకు వెళ్తానని అన్నారు. తహసీల్దార్ జగదీశ్వర్రావు, ఎంపీడీవో పూర్ణచందర్రావు, ఏఎంసీ చైర్మన్ రామిడి తిరుపతిరెడ్డి, మాజీ జెడ్పీటీసీ అంక సదయ్య, సింగిల్విండో చైర్మన్ రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే విజయరమణారావు -
‘భోజన’ నిర్వాహకులకు వంటగ్యాస్ కనెక్షన్లు
పెద్దపల్లి: ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన నిర్వాహకులకు వంటగ్యాస్ కనెక్షన్లు మంజూరు చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకంపై తన కార్యాలయంలో కలెక్టర్ సోమవారం సమీక్షించారు. ఈనెల 25వ తేదీ వరకు కట్టెలపొయ్యిపై వంటలు తయారు చేయకుండా గ్యాస్ కనెక్షన్ మంజూరు చేయాలని, గ్యాస్స్టవ్ పంపిణీ చేయాలన్నారు. జిల్లాలో 23వేల కొత్త రేషన్కార్డులు జారీచేశామని, అందులో వంటగ్యాస్ కనెక్షన్ లేనివారికి ఉజ్వల యోజన ద్వారా కనెక్షన్ అందించాలని సూచించారు. జిల్లా పౌర సరఫరాల అధికారి శ్రీనాథ్, సీ సెక్షన్ సూపరింటెండెంట్ ప్రకాశ్ పాల్గొన్నారు. దరఖాస్తులు ఆహ్వానం.. కేజీబీవీ, మోడల్ స్కూళ్లలో ఆరోతరగతి నుంచి ఇంటర్ వరకు ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని కలెక్టర్ శ్రీహర్ష తెలిపారు. 10శాతం వరకు సీట్లు ఖాళీగా ఉన్నాయని, ఆసక్తి, అర్హత గలవిద్యార్థులు జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో దరఖాస్తు సమర్పించాలని సూచించారు. పాఠాలు అర్థమవుతున్నాయా? పెద్దపల్లిరూరల్: ‘కంప్యూటర్ పాఠాలు సులభంగా అర్థమవుతున్నాయా.. కంప్యూటర్పై అవగాహన ఉందా.. ఎలా నేర్చుకుంటున్నారు? అని కలెక్టర్ కోయ శ్రీహర్ష విద్యార్థులను ప్రశ్నించారు. రంగాపూర్ ప్రాథమిక పాఠశాలలోని ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(ఏఐ) ల్యాబ్లో శిక్షణ పొందుతున్న ‘సి’ గ్రేడ్ విద్యార్థులను సోమవారం ఆయన కలుసుకున్నా రు. వారితో కాసేపు ముచ్చటించారు. విద్యార్థులు శివమణి, సాయివరుణ్తేజ, శ్రేయాన్స్.. కంప్యూటర్ ఆధారిత పాఠాలను స్క్రీన్పై చూపుతూ కలెక్టర్కు వివరించారు. ప్రైమరీలో 32మంది విద్యార్థులు ఉన్నారని, వారికి పాఠాలు సులువుగా అర్థమయ్యేలా బోధిస్తున్నామని టీచర్ స్నేహ వివరించారు. ఆదేశించిన కలెక్టర్ కోయ శ్రీహర్ష -
బస్సు డిపో పనులు ప్రారంభం
పెద్దపల్లిరూరల్: పంచాయతీ సమితి కార్యాలయంగా సుమారు 51ఏళ్ల క్రితం పురుడుపోసుకుని అప్పటి సీఎం జలగం వెంగళరావు ప్రారంభించిన భవనం కనుమరుగవుతోంది. అర్ధశతాబ్దపు ఆనవాళ్లు కనిపించకుండా పోతున్నాయి. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ను ఆనుకుని ఉన్న ఎంపీడీవో కార్యాలయంలోని చెట్లు నీడ, ఆహ్లాద వాతావరణం అందించేవి. వీటిని ప్రస్తుతం నరికివేస్తున్నారు. దీంతో స్థానికులు గతాన్ని గుర్తు చేసుకుంటున్నారు. మండే ఎండల్లో చల్లని నీడకోసం ఎంపీడీవో కార్యాలయంలోని చెట్లకిందకు వందలాది మంది చేరి సేదతీరేవారు. సెలవుదినాల్లో హాస్టల్ విద్యార్థులతో కలిసి తల్లిదండ్రులు సైతం ఇక్కడే విశ్రాంతి తీసుకుని కబుర్లు చెప్పుకునే వారు. ఆర్టీసీ బస్సు డిపోకు కేటాయించిన ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలో పెరి గిన రావి, టేకు, వేప, కానుగ, సుబాబుల్, సపోట, అల్లనేరేడు, కొబ్బరి, నిమ్మ, చింత, అశోక తదితర 150రకాల చెట్లను తొలగించడం సోమవారం ప్రా రంభించారు. చెట్ల నరికివేతతో కొద్దిరోజుల్లో ఏళ్లనాటి భవనాలు కాలగర్భంలో కలిసి పోనున్నాయి. వాటిస్థానంలో బస్సు డిపో ఏర్పాటు కానుంది. కాలగర్భంలో అర్ధశతాబ్దపు చెట్లు కనుమరుగుకానున్న భవనాలు -
ఆడపిల్లను పుట్టనిద్దాం
పెద్దపల్లి/పెద్దపల్లిరూరల్: ‘ఆడపిల్లలను పుట్ట నిద్దాం.. ఎదగనిద్దాం.. చదవనిద్దాం’ అని జి ల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి స్వప్నరాణి అన్నారు. స్థానిక ప్రగతినగర్ చౌరస్తా వద్ద మహిళా సాధికారిత కేంద్రం ఆధ్వర్యంలో సో మవారం విద్యార్థులతో కలిసి మానవహారం ఏర్పాటు చేశారు. భ్రూణహత్యలు, బాల్యవివాహాలు చట్టరీత్యా నేరమన్నారు, బాల్య వివాహా ల నియంత్రణకు అందరూ సహకరించాలని కోరారు. మహిళలు అన్నిరంగాల్లో రాణిస్తున్నారని, వారిని ప్రోత్సహించాలని సూచించారు. మహిళా సాధికారిత ప్రతినిధి సుచరిత, సమ త, స్వప్న, కనకరాజు, శ్యామల పాల్గొన్నారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక పాలకుర్తి(రామగుండం): బసంత్నగర్ జెడ్పీ హైస్కూల్ విద్యార్థిని జ యశ్రీ రాష్ట్రస్థాయి ఫుట్బాల్ పోటీలకు ఎంపికై నట్లు వ్యాయామ ఉపాధ్యాయుడు సోమశేఖర్ సోమవారం తెలిపారు. ఎస్జీఎఫ్– 14 విభాగంలో ప్రతిభ కనబరచడంతో రాష్ట్రస్థాయికి ఎంపికైందని, మంగళవారం నుంచి వికారాబాద్లో జరిగే పోటీల్లో పాల్గొంటుందని వివరించారు. జయశ్రీని హెచ్ఎం గా యత్రీదేవీ, ఉపాధ్యాయులు అభినందించారు. డీఎల్పీవోగా దేవకీదేవి పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి డివిజనల్ పంచాయ తీ అధికారి(డీఎల్పీవో) దేవకీదేవి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. మొన్నటివరకు పనిచేసిన వేణుగోపాల్రావు ఉద్యోగ విరమణ చే శారు. దీంతో గతంలో ఇక్కడ పనిచేసిన దేవకీదేవికే డీఎల్పీవోగా బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. పంచాయతీ కార్యదర్శులు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. నియామకం పెద్దపల్లి: జిల్లాలో ఏర్పాట య్యే రైతు విజ్ఞాన కేంద్రం నో డల్ అధికారిగా డాక్టర్ ఓదెల సంపత్రెడ్డిని నియమించా రు. ఈమేరకు సోమవారం ఉ త్తర్వులు జారీ అయ్యాయి. తె లంగాణలోని వ్యవసాయ వ ర్సిటీ ఆధ్వర్యంలో తొలివిడతలో 15 జిల్లాల్లో తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రాలు ఏర్పాటు చే స్తారు. అందులో పెద్దపల్లి జిల్లా కూడాఉంది. రిజిస్ట్రేషన్ పత్రాలు అందించాలి పెద్దపల్లి: జిల్లాలో రిజిస్ట్రేషన్ చేసుకున్న క్రీడా, యువజన సంఘాలు తమ రిజిస్ట్రేషన్ పత్రాలను ఈనెల 8వ తేదీలోగా సమర్పించాలని జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి సురేశ్ సూచించారు. జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి కార్యాలయం, మొదటి అంతస్తు, రూము నంబరు 225, కలెక్టరేట్, పెద్దపల్లిలో సాయంత్రం 5గంటల్లోగా అందజేయాలన్నారు. వివరాలకు 99890 90097 నంబరులో సంప్రదించాలని సూచించారు. నేడు పవర్ కట్ ప్రాంతాలుపెద్దపల్లిరూరల్: సుభాష్నగర్ ప్రాంతంలో రో డ్డు, డ్రైనేజీ పనులు చేపట్టినందున మంగళవా రం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని ఏఈ శ్రీనివాస్ తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు సు భాష్నగర్, కమాన్బస్టాప్, ఇండేన్ గ్యాస్, పంజాబ్ నేషనల్ బ్యాంకు ఏరియాలో విద్యుత్ ఉండదని, కస్టమర్లు సహకరించాలని కోరారు. క్వింటాల్ పత్తి రూ.6,844 పెద్దపల్లిరూరల్: స్థానిక వ్యవసాయ మార్కెట్లో సోమవారం పత్తి క్వింటాల్కు గరిష్టంగా రూ.6,844 ధర పలికింది. రూ.5,701 కనిష్ట, సగటు రూ.6,621 ధర నిర్ణయించినట్లు మార్కె ట్ ఇన్చార్జి కార్యదర్శి మనోహర్ తెలిపారు. లైవ్ సర్టిఫికెట్లు అందించాలి గోదావరిఖని: సింగరేణి రిటైర్డ్ కార్మికులు డిజి టల్ లైవ్ సర్టిఫికెట్లను సకాలంలో అందజేసి పింఛన్ నిలిచిపోకుండా చూసుకోవాలని ఆర్జీ–వన్ జీఎం లలిత్కుమార్ కోరారు. ఆర్జీ–1 జీ ఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సీఎంపీఎ ఫ్ శిబిరాన్ని సోమవారం ఆయన ప్రారంభించా రు. సీఎంపీఎప్ కమిషనర్ పచౌరి, అసిస్టెంట్ కమిషనర్ గోవర్ధన్తో కలిసి మాట్లాడారు. రిటై ర్డ్ ఉద్యోగులు ఏటా సమర్పించే లైవ్ సర్టిఫికెట్ ను ఈసారి మరింత సులభతరం చేసేందుకు రెండు రోజులపాటు శిబిరం నిర్వహిస్తారని, మంగళవారం కూడా కొనసాగుతుందన్నారు. -
ప్రజావాణికి సమస్యలు ఏకరువు
పెద్దపల్లి: అర్జీల రూపంలో అందే సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ వేణు ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి ద్వారా ప్రజల నుంచి ఆయన అర్జీలు స్వీకరించారు. పాలకుర్తి మండలం కుక్కలగూడూరు గ్రామానికి చెందిన కల్లుగీతకార్మికుడు గుండ రమేశ్.. ప్రమాదవశాత్తు చెట్టు పైనుంచి పడడంతో శాశ్వత వైకల్యం కలిగిందని, పరిహారం ఇప్పించాలని దరఖాస్తు చేశాడు. అవసరమైన చర్యలు తీసుకోవాలని ఎకై ్సజ్ శాఖకు అదనపు కలెక్టర్ వేణు సూచన చేశారు. సుల్తానాబాద్ పట్టణానికి చెందిన బి.రవికుమార్.. తనకు ఉద్యోగ అవకాశం కల్పించాలని అధికారులకు దరఖాస్తు చేయగా.. వారధి సొసైటీకి రాశారు. పెద్దపల్లి మండలం తుర్కల మద్దికుంటకు చెందిన ఒంటరి మహిళ ఎం.సమ్మక్క.. ఆర్థికసాయం కోసం అర్జీ సమర్పించగా.. డీఆర్డీవోకు బదిలీ చేశారు. పెద్దపల్లి మండలం రాఘవపూర్ గ్రామానికి చెందిన డి.శంకరయ్య.. హనుమాన్ ఆలయం వద్ద రెండు బెల్ట్షాపులు నిర్వహిస్తూ ప్రజలకు ఇబ్బందులు సృష్టిస్తున్నారని ఫిర్యాదు చేయగా.. చర్యలు తీసుకోవాలని ఎకై ్సజ్ శాఖను వేణు ఆదేశించారు. అదనపు కలెక్టర్ వేణు ఆదేశాలు ప్రజల నుంచి అర్జీలు స్వీకరణ -
ప్రధాని మోదీపై సీఎం వ్యాఖ్యలు శోచనీయం
పెద్దపల్లిరూరల్: ప్రధాని నరేంద్రమోదీపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా కేంద్రంలోని రాజీవ్ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. బీజేపీ పట్టణ, మండల అధ్యక్షులు రాకేశ్, రమేశ్ మాట్లాడుతూ, ప్రధాని మోదీపై సీఎం వ్యాఖ్యలు శోచనీయమన్నారు. తన వ్యాఖ్యల్ని బేషరతుగా వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. పోలీసులు రాస్తారోకోను విరమింపజేశారు. కార్యక్రమంలో నాయకులు తంగెడ రాజేశ్వర్రావు, సంపత్రావు, దాడి సంతోష్, రాజగోపాల్, శ్రీనివాస్, తిరుపతి, రాజం మహంత కృష్ణ, సతీశ్, శ్రీధర్, ఉమేశ్, కుమార్, సబ్బు మల్లయ్య, రాజు, మహేశ్, రాజేంద్రప్రసాద్, ఉప్పు కిరణ్, శ్రీకాంత్, సంపత్, తదితరులు పాల్గొన్నారు. హామీల అమలులో విఫలం పెద్దపల్లి: హామీల అమలులో రాష్ట్టప్రభుత్వం విఫలమైందని బీజేపీ నాయకులు ఆరోపించారు. స్థానిక పూసాల రహదారిపై బీజేపీ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించా రు. సీఎం, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీఎం దిష్టిబొమ్మ దహనం చేస్తారనే సమాచారంతో సీఐ సుబ్బారెడ్డి, ఎస్సైలు శ్రవణ్ కుమార్, వేణుగోపాల్, అశోక్రెడ్డి ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు చేపట్టారు. బీజేపీ మండల అధ్యక్షుడు కందుల శ్రీనివాస్, నాయకులు సౌదరి మహేందర్ యాదవ్, కామని రాజేంద్రప్రసాద్, కొమ్ము తిరుపతి, వేగోళం శ్రీనివాస్, మిట్టేపల్లి ప్రవీణ్ కుమార్, నాగేశ్వర్, అన్వేష్, గుంటి కుమార్, మహేశ్, రామకృష్ణ, రమేశ్, సదయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఊపిరికి భరోసా
కోల్సిటీ(రామగుండం): అత్యవసర వైద్య సేవలకు ఊపిరి పోసేలా గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి(జీజీహెచ్)లో చేపట్టిన క్రిటికల్ కేర్ సెంట ర్ త్వరలోనే అందుబాటుకి రానుంది. ఇందుకోసం సుమారు రూ.23.75 కోట్ల వ్యయంతో రెండంతస్తుల భవనం నిర్మిస్తున్నారు. భవన నిర్మాణ పనులు తుదిశకు చేరాయి. సెంటర్ అందుబాటులోకి వస్తే.. మనజిల్లావాసులతోపాటు పొరుగు జిల్లా ప్రజలకు కూడా అత్యవసర వైద్యసేవలు చేరువలోనే అత్యంత వేగంగా అందుతాయి. అత్యాధునిక హంగులు.. జీ ప్లస్– 2తో అత్యాధునిక హంగులతో భవనం నిర్మిస్తున్నారు. భవనం కోసం రూ.10 కోట్లు, వైద్య పరికరాల కోసం రూ.13.75 కోట్లు వెచ్చిస్తున్నారు. గతేడాది ఫిబ్రవరిలో ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్ పనులకు భూమిపూజ చేశారు. 50 పడకల సామర్థ్యం.. 50 పడకల సామర్థ్యంతో భవనం నిర్మిస్తున్నారు. ప్రతీబెడ్ వద్ద ఆధునిక మానిటరింగ్ పరికరాలు, వెంటిలేటర్లు, ఆక్సిజన్ లైన్లు, సెంట్రలైజ్డ్ ఆక్సిజన్ సిస్టమ్, సర్జికల్ సపోర్ట్ పరికరాలు ఏర్పాటు చేస్తున్నారు. 24 గంటలపాటు వైద్య సేవలు అందించేందుకు శిక్షణ పొందిన సిబ్బందిని నియమిస్తారు. డీఎంఈకి సూపరింటెండెంట్ లేఖ.. కాంట్రాక్టర్ బిల్డింగ్ను అప్పగించేలా, వైద్య పరికరాలు తెప్పించేలా టీఎస్ఎంఐడీసీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 60 రకాల ఆధునిక వైద్య పరికరాలను సమకూర్చాలంటూ ఈనెల ఒకటో తేదీన డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ)కు జీజీహెచ్ సూపరింటెండెంట్ దయాళ్సింగ్ ఓ లేఖ కూడా రాశారు. కలెక్టర్ పర్యవేక్షణలో పనులు.. కలెక్టర్ కోయ శ్రీహర్ష ప్రత్యేక పర్యవేక్షణతో క్రిటికల్ కేర్ ప్రాజెక్ట్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇందుకోసం తరచూ అధికారులతోఆయన సమీక్షిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో పేషెంట్లకు సత్వర సేవలు అంది ప్రాణనష్టం తగ్గుతుందని చెబుతున్నారు. ఈమేరకు పనులను పర్యవేక్షిస్తున్న ఇంజినీర్లకు కలెక్టర్ సూచనలు చేస్తున్నారు. ఎమర్జెన్సీ ట్రీట్మెంట్.. ఆధునిక పరికరాలతో కూడిన క్రిటికల్ కేర్ సెంటర్ను వేగంగా ఆధునికీకరిస్తున్నారు. దీనిద్వారా రోడ్డు ప్రమాదాలు, గుండెపోటు, ఊపిరితిత్తులు తదితర సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న వారికి ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ అందుతుంది. ఆస్పత్రి సామర్థ్యానికి కొత్త శక్తి.. సింగరేణి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(సిమ్స్ –ప్రభుత్వ)కు అనుబంధ గోదావరిఖని గవర్నమెంట్ జనరల్ ఆస్పత్రి(బోధనాస్పత్రి) రాష్ట్రంలో అత్యధిక మంది పేషెంట్లకు సేవలు అందించే వాటిలో ఒకటి. క్రిటికల్ కేర్ సెంటర్ ప్రారంభమైతే ఆస్పత్రి సామర్థ్యం మరింత పెరుగుతుందని వైద్యాధికారులు వెల్లడిస్తున్నారు. పేషెంట్ల ప్రాణరక్షణలో ఇది అత్యంత కీలకపాత్ర పోషిస్తుందంటున్నారు. జీజీహెచ్లో పనిచేస్తున్న వైద్యులు, సిబ్బంది ఇప్పటికే కొత్త సదుపాయం కోసం సన్నద్ధమవుతున్నారు. తుదిదశకు పనులు ప్రస్తుతం భవన నిర్మాణం పూర్తయ్యింది. విద్యుత్, ఆక్సిజన్ కనెక్షన్లు, అంతర్గత ఫర్నిషింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మరో 15 రోజుల్లో అన్నిఏర్పాట్లు పూర్తి చేసి సెంటర్ను ప్రారంభించే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. డీఎంఈకి లేఖ రాశాం జీజీహెచ్లో చేపట్టిన క్రిటికల్ కేర్ యూనిట్ భవనం పనులు చివరిదశలో ఉన్నాయి. వైద్య పరికరాల కోసం డీఎంఈకి లేఖ రాశాం. దీనిద్వారా ఎమర్జెన్సీ సేవలు మరింత బలోపేతం అవుతాయి. ప్రజలకు తక్షణ సేవలు అందించేందుకు అన్నిచర్యలు తీసుకుంటున్నాం. – డాక్టర్ రాజు, ఆర్ఎంవో, జీజీహెచ్ 15 రోజుల్లో పనులు పూర్తి క్రిటికల్ కేర్ సెంటర్ భవన నిర్మాణం మరో 15రోజుల్లో పూర్తికానున్నాయి. కాంట్రాక్టర్ భవనాన్ని అప్పగించాక.. మౌలిక సదుపాయాలతోపాటు అవసరమైన వైద్య పరికరాలు అందుబాటులోకి తీసుకొచ్చేలా చర్యలు తీసుకుంటాం. పనులను తరచూ పర్యవేక్షిస్తున్నాం. – విక్రమాదిత్య, ఏఈ, టీఎస్ఎంఐడీసీ -
ఓటరు ప్రత్యేక సవరణకు సిద్ధం
పెద్దపల్లి: దొంగ ఓట్ల నియంత్రణ కోసం జిల్లాలో ఓటరు ప్రత్యేక సవరణకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. ఇందుకోసం 2002 నుంచి 2025 వరకు ఓటరు జాబితాలో నమోదైన వారి వివరాలను కేటగిరీల వారీగా తయారు చేస్తున్నారు. భారత ఎన్నికల సంఘం సుమారు 23 ఏళ్ల తర్వాత ఈఏడాది ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (ఎస్ఐఆర్– స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) చేపట్టిందని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఇటీవల ప్రకటించిన విషయం విదితమే. ఈమేరకు 2002 ఓటరు జాబితాను ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఓటరు జాబితాను ఎన్నికల సంఘం వెబ్సైట్లో ఇప్పటికే అందుబాటులో ఉంచింది. దీనిని బీఎల్వోలకు పోలింగ్ కేంద్రాల వారీగా అందిస్తుంది. అప్పటిజాబితాలోని ఓటరుగా నమోదైన వారి వివరాలను 2025 జూలై నాటి ఓటరు జాబితాతో సరిపోల్చుతారు. -
దేవునిపల్లి నృసింహుని బ్రహ్మోత్సవాలు ప్రారంభం
పెద్దపల్లిరూరల్: దేవునిపల్లి శ్రీల క్ష్మీనరసింహస్వా మి బ్రహ్మోత్సవా లు ఆదివారం అ ధ్యయనోత్సవా లతో ప్రారంభమయ్యాయి. సో మవారం సేవాకాలం, ప్రబంధ కాలక్షేపం, విష్ణు సహస్రనామ పారాయణం ఉంటుందని ఆలయ ఈవో శంకరయ్య తెలిపారు. ఈనెల 4న ఉదయం మూలస్వామి వారికి పంచామృత నవకలశాభిషేకం, అమ్మవారికి, స్వామివారికి నూతన వస్త్రాలంకరణ, పెళ్లికొడుకు, పెళ్లి కూతురును తయారు చేసే కార్యక్రమాలు ఉంటాయని ఆయన వివరించారు. బుధవారం ఉదయం స్వామివారి కల్యాణంతోపాటు ప్రత్యేక పూజాకార్యక్రమాలు నిర్వాహిస్తామని ఆలయ ఈవోపాటు అర్చకుడు శ్రీకాంతచార్యులు తెలిపారు. వీరబ్రహ్మేంద్రస్వామి జయంతి పెద్దపల్లిరూరల్: స్థానిక పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి జయంతి ఆదివారం నిర్వహించారు. వేదపండితుడు శ్రీనివాస్ మంత్రోచ్ఛరణల మధ్య వేడుకలు జరిగాయి. ట్రస్టు వ్యవస్థాపకుడు కట్ట రాజానందంతోపాటు నాయకులు సత్యనారాయణ, రమేశ్, మోహనాచారి, వెంకటేశ్వర్లు, కోటన్న, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఆలయంలో ప్రత్యేక అభిషేకా లు, పూజాకార్యక్రమాలను నిర్వహించారు. ఫుట్బాల్ పోటీలకు ఎంపిక ధర్మారం(ధర్మపురి): స్థాని క మోడల్ స్కూల్ విద్యార్థి ని ఎన్.తేజస్విని రాష్ట్రస్థా యి ఫుట్బాల్ పోటీలకు ఎంపికై నట్లు పీఈటీ కొమురయ్య తెలిపారు. గోదావరిఖనిలో జరిగిన ఉమ్మడి కరీంనగర్ జిల్లాస్థాయి ఎస్జీఎఫ్– 14 విభా గంలో తొమ్మిదో తరగతి చదువుతున్న తేజ స్వీని ప్రతిభ కనబర్చిందన్నారు. ఈనెల 3 నుంచి 5వ తేదీ వరకు వికారాబాద్లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటుందన్నారు. ఆమెను ప్రిన్సిపాల్ రాజ్కుమార్, పీఈటీలు కొము రయ్య, మేకల సంజీవరావు అభినందించారు. పెద్దపల్లివాసికి రాష్ట్రకార్యవర్గంలో చోటు పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రానికి చెందిన ఎన్పీడీసీఎ ల్ ఏఈ వెంకటనారాయణ పవర్ డిప్లొమా ఇంజినీర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం నిజామాబాద్లో పనిచేస్తున్న వెంకటనారాయణ.. వరుసగా నా లుగోసారి ఈ పదవికి ఎన్నికకావడంపై పలువురు అభినందించారు. తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తానని వెంకటనారాయణ తెలిపారు. నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రంలోని సుభాష్న గర్లో రహదారి, మురుగునీటి కాలువల పనులు చేపట్టిన కారణంగా సోమవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని ఏఈ శ్రీనివాస్ తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు సుభాష్నగర్, కమాన్బస్టాప్, ఇండేన్గ్యాస్, పంజాబ్ నేషనల్ బ్యాంకు ఏరియాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని ఆయన వివరించారు. విద్యుత్ వినియోగదారులు తమతో సహకరించాలని ఆయన కోరారు. కొర్రీలు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలి పెద్దపల్లి: ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వా హకులు తేమ పేరిట కొర్రీలు పెట్టకుండా తక్షణమే తూకం వేసేలా అధికారులు చర్యలు తీ సుకోవాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి సునీల్ కోరారు. ఆదివారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని ఆయన అన్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు భారీవర్షాలతో దెబ్బతిన్నాయని ఆయన తెలిపారు. మిగిలిన పంటను కొనుగోలు కేంద్రాల్లో వెంటనే కొనుగోలు చేయాలని ఆయన కోరారు. -
తడిసిన పంటలను ఇలా కాపాడుకోండి
● వ్యవసాయాధికారి అలివేణి పెద్దపల్లిరూరల్: మోంథా తుపాను ప్రభావం జిల్లాపై తీవ్రంగా చూపింది. వివిధ పంటలకు కొంత నష్టం కూడా జరిగింది. కొన్నిచోట్ల నీట మునిగాయి. మరికొన్నిచోట్ల నేలవాలాయి. వర్షం, ఈదురుగాలులతో నేలవాలిన వరి, నీటమునిగిన పత్తిని కాపాడుకునేందుకు మెలకువలు పాటించాలని మండల వ్యవసాయాధికారి అలివేణి రైతులకు సూచించారు. ఏవో సూచనలు ఇవే.. వరిలో పాటించాల్సిన జాగ్రత్తలు.. వరిపొలం మడిలో నిలిచిన వర్షపు నీటిని బయటకు పంపించాలి. కంికి వర్షపు నీటిలో తడవకుండా చూడాలి. నేలవాలిన వరిపైరును పైకి లేపి కట్టలుగా కట్టాలి. ఇలా చేస్తే గింజ రంగు మారదు. తెగుళ్లు సోకకుండా ఒక పంపునకు 30 గ్రాముల సాఫ్ లేదా స్ప్రింట్ కలిపి పిచికారీ చేయాలి. కోతకు సిద్ధంగా ఉంటే లీటరు నీటిలో 5శాతం ఉప్పు ద్రావణాన్ని కలిపి చల్లాలి. ధాన్యం తడిస్తే ఆరబెట్టాలి. పత్తి రైతులకు.. పత్తి పూత, పిందెదశలో ఉంటే చేనులో వర్షపునీరు లేకుండా చూడాలి. మొక్కపై పత్తి బాగా ఆరిన తర్వాత తీయాలి. తడి పత్తిని ఏరవద్దు. తడిపత్తిని ఆరబెడితే బూజు పట్టిరంగు మారే అవకాశం ఉంటుంది. నాణ్యత దెబ్బతినకుండా పాలిథిన్ కవర్పై ఆరబెట్టాలి. కాయలు దెబ్బతినకుండా, నాణ్యతగా ఉండేందుకు ప్రొపికొనజోల్ 200 మి.లీ. మందును ఎకరాకి పిచికారీ చేయాలి. పత్తి ఆకులపై మచ్చలు కనిపిస్తే బోరాక్స్ 150గ్రాములను లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. -
నెలాఖరు వరకు సిటీ పోలీస్యాక్ట్
గోదావరిఖని: బహిరంగ ప్రదేశా ల్లో మద్యపానంపై నిషేధాజ్ఞలు కొనసాగిస్తామని, అనుమతిలేని డ్రోన్, డీజే సౌండ్స్పై కఠిన చర్య లు తీసుకుంటామని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా హెచ్చరించారు. ఈమేరకు సిటీ పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందన్నారు. మహిళలు, పౌరుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని మంచి ర్యాల, పెద్దపల్లి జోన్లలో ఈ ఆంక్షలు ఈనెలాఖరు వరకు అమలు చేస్తామని ఆయన పేర్కొన్నారు. ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలు, సభలు, సమావేశాల కోసం ముందుగా పోలీసు అధికారుల అనుమతి తీసుకోవాలని ఆయన సూచించారు. ఎస్టీయూ జిల్లా కార్యవర్గం ఎన్నిక పెద్దపల్లి: ఎస్టీయూ జిల్లా కార్యవర్గాన్ని ఆదివారం స్థానిక ఐఎంఏ భవన్లో ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా నడిపెల్లి సంతోష్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా మేరుగు సతీశ్, కోశాధికారిగా జి.మాధవాచారి ఎన్నికయ్యారు. అదేవిధంగా రాష్ట్ర కమిటీ సభ్యుడిగా మందల శ్రీకాంత్రెడ్డి, అసోసియేట్ అధ్యక్షులుగా బోగె చంద్రశేఖర్, సయ్యద్ ఫయాజుద్దీన్, ఉపాధ్యక్షుడిలుగా శేషాద్రి, అడిషనల్ జనరల్ సెక్రటరీలుగా తోటరాజు, కిన్నెర శ్రీనివాస్, కార్యదర్శులుగా బడుగు నగేశ్, కె.శ్రవణ్ కుమార్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఎస్టీయూ రాష్ట్ర కోశాధికారి ఆట సదయ్య మాట్లాడుతూ, రిటైర్డ్ ఉద్యోగుల ప్రయోజన బకాయిలను వెంటనే చెల్లించాలన్నారు. నేడు గోదావరి హారతి మంథని: పట్టణ సమీపంలోని గోదావరి నదిలో సోమవారం గోదావరిహారతి కార్యక్రమం నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. హారతి వేదిక స్థలాన్ని ఉత్సవ సమితి రాష్ట్ర కార్యదర్శి క్యాతం వెంకటరమణతోపాటు పలువురు ఆదివారం పరిశీలించారు. నదీ దీపారాధనతో శాంతి, సౌభాగ్యాలు కలుగుతాయని, రుగ్వేదంలో నదులకు హారతులు ఇచ్చే సంస్కృతి ఉండేదని వారు అన్నారు. పునర్ వైభవం కోసమే గోదావరిహారతిని 2012 నుంచి నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. భక్తులు భారీసంఖ్యలో తరలివచ్చి గోదావరి మాత ఆశీస్సులు పొందాలని వారు కోరారు. రాజమౌళి, శ్రీనివాసగుప్త, సబ్బ సత్యనారాయణ, నాంపల్లి రమేశ్, నారమల్ల కృష్ణ, కుమ్మరి మల్లిక్, తదితరులు పాల్గొన్నారు. -
యువ కార్మికులతోనే యూనియన్ల మనుగడ
● సీఐటీయూ ఆలిండియా సెక్రటరీ సుదీప్ దత్త గోదావరిఖని: యువకార్మికుల చైతన్యంతోనే కార్మి క సంఘాల మనుగడ సాధ్యమని సీఐటీయూ ఆలిండియా సెక్రటరీ సుదీప్దత్త అన్నారు. స్థానిక ఆర్సీవోఏ క్లబ్లో ఆదివారం యువ కార్మికుల సమస్యలపై అవగాహన కల్పించారు. కార్మిక సంఘాల్లో యువల భాగస్వామ్యం పెరిగితేనే హక్కులను కాపాడుకోవడం సులభతరం అవుతుందన్నారు. ఇందుకోసం కార్మిక చట్టాలపై మరింత అవగాహన పెంచుకోవాలని సూచించారు. తద్వారా, రాజకీయ, ప్రభుత్వాలు తీసుకునే కార్మిక వ్యతిరేక విధానాలపై ఉద్యమించడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. సమస్యలను నిర్లక్ష్యం చేయడంతోనే పనిఒత్తిడి ఎదుర్కొంటున్నారని అన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్.వీరయ్య, భూపాల్, సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు తుమ్మల రాజారెడ్డి, మంద నరసింహారావు, డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఎస్.నాగరాజు, నాయకులు గోపాల్, ఆరేపల్లి రాజమౌళి, మెండె శ్రీనివాస్, ఎస్కే గౌస్, సీహెచ్ వేణుగోపాల్రెడ్డి, దాసరి సురేశ్, వంగల శివరాంరెడ్డి పాల్గొన్నారు. -
తెలుగు యూట్యూబర్కు బంపరాఫర్
తన వద్ద పెద్దగా డబ్బు లేదు.. ఎవరి సపోర్ట్ కూడా లేదు.. కానీ, పెద్ద ప్రణాళిక ఉంది.. అంతకుమించి పట్టుదల ఉంది.. దాంతోనే రోజూ కొత్త విషయాలు నేర్చుకొని.. ఆ అంశాలనే ప్రజలతో పంచుకున్నాడు. వంద రూపాయలతో మొదలైన యూట్యూబర్ జీవితం నెలకు రూ.3లక్షల వరకు చేరింది. ఇలా సంపాదిస్తూ తెలుగు యూట్యూబర్లలో అగ్రగామిగా నిలిచాడు.ప్రపంచమే గుప్పిట్లో చేరిన ఈరోజుల్లో నిత్యం కొత్త విషయాలను వీక్షకులకు అందిస్తూ తనదైన శైలిలో ముందుకు సాగుతున్నాడు గోదావరిఖనికి చెందిన సయ్యద్ హఫీజ్. మొదట్లో హఫీజ్ వీడియోలకు కావలిసినంత వీక్షకులు రాకపోగా, ఇదెవరు చూస్తారని స్నేహితులు ఎగతాళి చేశారు. అయినా నిరాశ పడలేదు. క్రమశిక్షణ, నిరంతరకృషితో వీక్షకులు పెరుగుతూనే వచ్చారు. తన కృషికి ఫలితంగా గోల్డెన్ వీసా వరించింది. ప్రజలకు అవసరమైన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం నేర్చుకోవడమే కాదు.. ప్రజలతో పంచుకోవడం విశేషం. గోదావరిఖని(రామగుండం): రోజూ రూ.వందతో మొదలైన యూట్యూబర్ జీవితం నేడు నెలకు రూ.2లక్షల నుంచి 3లక్షల వరకు సంపాధిస్తూ తెలుగు యూట్యూబర్లలో అగ్రగామిగా నిలిచాడు. సింగరేణి కార్మికుని బిడ్డగా ఈప్రాంత వాసులను టెక్నాలజీలో అనేక అంశాల్లో చైతన్యవంతం చేస్తున్నాడు. సెల్ఫోన్లో నిత్యం కొత్త విషయాలను వీక్షకులకు అందిస్తూ తనదైన శైలిలో ముందుకు సాగుతున్నాడు. ముందుగా యైటింక్లయిన్కాలనీలో కంప్యూటర్ సెంటర్ నడిపించిన హఫీజ్ను యూట్యూబ్ ఉన్నత శిఖరాలకు చేర్చింది. ప్రస్తుతం ఎన్టీపీసీలో ఉంటూ TELUGU TECH TUTS యూట్యూబ్ చానెల్ నిర్వహిస్తూ అంతర్జాతీయ స్థాయిలో పేరు సాధించి యూఏఈ గోల్డెన్వీసా అందుకున్నాడు.చిన్ననాటి నుంచి ఆసక్తిచిన్నప్పటి నుంచి కంప్యూటర్పై పట్టున్న హఫీజ్ మొబైల్, కంప్యూటర్ గాడ్జెట్ల గురించి తెలుసుకునేందుకు ఆసక్తి కనబర్చేవాడు. మొదట ఇంగ్లిష్ టెక్ యూట్యూబర్ల వీడియోలు చూస్తూ పట్టు సాధించాడు. 2011లో “తెలుగు టెక్ ట్యూట్’ యూట్యూబ్ చానల్ ప్రారంభించాడు. మొదట్లో స్మార్ట్ఫోన్ కెమెరాతోనే వీడియోలు తీయడం ప్రారంభించాడు. హఫీజ్ వీడియోలకు కావలిసినంత వీక్షకులు లేకపోయినా, స్నేహితులు కొందరు ఇదెవరు చూస్తారని ఎగతాలి చేశారు.పట్టుదల, క్రమశిక్షణహఫీజ్ క్రమశిక్షణ, నిరంతరకృషితో వీక్షకులు పెరుగుతూ వచ్చారు. మొబైల్ రివ్యూలు, కొత్త యాప్స్ పరిచయం, ఆన్లైన్ సంపాదన మార్గాలు, సెక్యూరిటీ ట్రిక్స్ తదితర విషయాలను వీక్షకులకు వివరించాడు. తెలుగులో లక్ష మంది సబ్స్రై్కబర్స్, వన్ మిలియన్ వ్యూస్ సాధించిన టెక్ చానల్గా రికార్డుకెక్కింది. 2018లో సోషల్ మీడియా సమ్మిట్ అవార్డు, 2019లో టాప్ తెలుగు క్రియేటర్స్ జాబితాలో చోటు దక్కింది.2022లో ఫోర్బ్స్ ఇండియా డిజిటల్ స్టార్ లిస్ట్లో చోటు సాధించగా, బెస్ట్ తెలుగు టెక్క్రియేటర్ అవార్డు వరించింది. యూట్యూబ్ కాకుండా బ్రాండ్ డీల్స్, స్పాన్సర్షిప్స్, యాప్ ప్రమోషన్స్ ద్వారా ప్రతినెలా రూ.2 లక్షల నుంచి 3లక్షల ఆదాయం వస్తోంది. హఫీజ్ కృషిని గుర్తించిన యూఏఈ ప్రభుత్వం గోల్డెన్ వీసా అందించింది. పదేళ్ల పాటు యూఏఈలో కుటుంబ సభ్యులతో సహా జీవించే అవకాశం ఉంటుంది.మరింత మందిని తయారుచేస్తాటెక్, యూట్యూబ్, ఆన్లైన్ క్రియేటివ్ ఫీల్డ్లో ముందుకు రావాలనుకునే యువతకు గైడెన్స్ ఇవ్వాలని ఉంది. యువతకు ఉచిత వర్క్షాప్లు, ఆన్లైన్ గైడెన్స్ ప్రోగ్రామ్లు, స్మార్ట్ డిజిటల్ కెరీర్ మార్గాలు చూపించాలనుకుంటున్న.– సయ్యద్ హఫీజ్, తెలుగు టెక్ట్యూట్ క్రియేటర్ -
పోలీస్స్టేషన్ తనిఖీ
రామగుండం: అంతర్గాం పోలీస్స్టేషన్ను రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఠాణాలోని రికార్డులు పరిశీలించారు. రిసెప్షన్ సిబ్బందితో మాట్లాడి ఎక్కువగా నమోదవుతున్న కేసుల గురించి ఆరా తీశారు. పరిసరాలు, భౌగోళిక పరిస్థితులను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. పెద్దచెరువుకు బుంగ ముత్తారం(మంథని): పారుపల్లి పెద్దచెరువు తూ ము వద్ద బుంగ ఏర్పడింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తూముకు సమీపంలో బుంగ ఏర్పడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. బుంగపెద్దగా మారితే కట్ట తెగే ప్రమాదం ఉందని భయపడుతున్నారు. అధికారులు తక్షణమే మరమ్మతు చేపట్టాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు. -
అభివృద్ధి పనులు పర్యవేక్షించాలి
పెద్దపల్లి: ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన అభివద్ధి పనులను పర్యవేక్షించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. అదనపు కలెక్టర్ వేణుతో కలిసి శనివారం పాఠశాలల్లో చేపట్టిన ప్రగతి పనులపై శ్రీహర్ష సమీక్షించారు. జిల్లాకు కేటాయించినా.. వినియోగించకపోవడంతో రూ.4.5 కోట్లను ఆర్బీఐ వెనక్కి తీసుకున్నట్లు ప్రాథమికంగా సమాచారం అందిందన్నారు. ప్రభుత్వ శాఖల్లో ఉపయోగించని బ్యాంకు ఖాతాల వివరాలపై తనకు నివేదిక అందించాలని సూచించారు. ప్రీ ప్రైమరీ స్కూళ్ల పకడ్డందీగా నిర్వహించాలన్నారు. జిల్లాలో 60 ప్రీ ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయని, ఇందులో విధులు నిర్వహించేందుకు వచ్చిన దరఖాస్తుల్లో మెరిట్ ఆధారంగా పారదర్శకంగా టీచర్లను ఎంపిక చేశామని తెలిపారు. కాగా, జాబ్ మేళాలో ఉద్యోగాలు సాధించిన గుర్రాల సింధుజ, పెర్క సాయి సింధు, మినీష ఓడనాలాను కలెక్టర్ అభినందించారు. డీఈవో మాధవి, అకడమిక్ మానిటరింగ్ అధికారి పీఎం షేక్ పాల్గొన్నారు. 4న అవగాహన సదస్సు.. భారత వాయుసేనలో చేరేందుకు ఆసక్తికలిగిన యువతకు అవగాహన కల్పించేందుకు ఈనెల 4న బందంపల్లి స్వరూప గార్డెన్స్లో సదస్సు నిర్వహిస్తామని కలెక్టర్ శ్రీహర్ష తెలిపారు. వాయుసేనలో ఉద్యోగావకాశాలు, పరీక్ష విధానం, సిలబస్, ఎంపిక ప్రక్రియపై వాయుసేన అధికారులు అవగాహన కల్పిస్తారని, ఆసక్తిగలవారు హాజరు కావాలని కలెక్టర్ సూచించారు. వివరాలకు 99497 25997, 83330 44460 ఫోన్నంబర్లలో సంప్రదించాలని ఆయన కోరారు. -
ఎవరినీ ఉపేక్షించేదిలేదు
మద్యం తాగి డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే ఎంతటివారైనా ఉపేక్షించేదిలేదు. ఈవిషయంలో కఠిన చర్య లు తీసుకుంటాం. ఇటీ వల లారీ డ్రైవర్ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లో పట్టుబడ్డాడు. టెస్ట్ 240 పాయింట్లు రావడంతో కోర్టులో హాజరు పర్చాం. ఎక్కువగా ద్విచక్రవాహనదారులు డ్రంక్డ్రైవ్ టెస్ట్లో పట్టుబడుతున్నారు. ఈ ఏడాది రెండోసారి డ్రంక్ అండ్డ్రైవ్లో దొరికి జైలుకు వెళ్లివచ్చిన వారిసంఖ్య 25కు చేరింది. – శ్రీనివాస్, ఏసీపీ, ట్రాఫిక్, రామగుండం -
15న ప్రత్యేక లోక్ అదాలత్
పెద్దపల్లి/పెద్దపల్లిరూరల్: రాజీకి అర్హమైన కేసుల ప రిష్కారం కోసం ఈనెల 15న ప్రత్యేక లోక్ అథాలత్ నిర్వహిస్తామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి కుంచా ల సునీత తెలి పారు. ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా న్యాయ సేవాధి కార సంస్థ కార్యదర్శి స్వప్నరాణితో కలిసి జిల్లా కోర్టులో శనివారం సమీక్షించారు. ఇంటి గొడవలు, భూతగాదాలు, ప్రమాదాలు, భార్యాభర్తల వివాదా లు, చెక్బౌన్స్ వంటి కేసులను లోక్ అదాలత్లో ప రిష్కరించుకునేవీలుందన్నారు. ప్రమాదాలకు సంబంధించిన కేసుల్లో రాజీ చేసుకుంటే ఒకేసారి పరిహారం అందిస్తారని తెలిపారు. మూడేళ్లలోపు శిక్ష ప డే క్రిమినల్ కేసులు కూడా రాజీ చేసుకునే అవకాశం ఉందని అన్నారు. జిల్లాలోని నందిమేడారం, సుల్తానాబాద్, పెద్దపల్లి, మంథని, రామగుండం కోర్టుల్లో నిర్వహించే ప్రత్యేక లోక్ అథాలత్లను సద్వినియోగం చేసుకోవాలని జడ్జి సూచించారు. -
సుల్తానాబాద్ అభివృద్ధికి రూ.15కోట్లు
పెద్దపల్లి: సుల్తానాబాద్ పట్ట ణ అభివృద్ధికి మరో రూ.15 కోట్లు మంజూరు చేయించా మని ఎమ్మెల్యే విజయరమణారావు తెలిపారు. పదేళ్ల బీ ఆర్ఎస్ పాలనలో పట్టణ అ భివృద్ధి వెనుకబడిపోయిందని, పట్టణ ప్రజల రుణం తీర్చుకునేందుకు పక్కా కార్యాచరణతో నిధుల మంజూరుకు కృషి చేస్తున్నామన్నారు. అంతర్గత రోడ్లు, జంక్షన్లు, డ్రైనేజీలు, కల్వర్టు లు, విలీన గ్రామాల అభివృద్ధికి ఈ నిధులు వెచ్చించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.కోర్టు భవన నిర్మాణానికి స్థలం కేటాయింపుధర్మారం(ధర్మపురి): నందిమేడారం జూనియ ర్ సివిల్ జడ్జి కోర్టు భవన నిర్మాణానికి స్థలం కేటాయించినట్లు నందిమేడారం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గడ్డం లింగారెడ్డి తెలిపారు. గ్రామ శివారులోని సర్వే నంబరు 865లో రెండెకరాల ప్రభుత్వ భూమిని కేటాయిస్తు పెద్దపల్లి ఆర్డీవో ఉత్తర్వులు జారీచేశారన్నారు. నందిమేడారం అడ్వకేట్స్ అసోసియేషన్ విన్నపం మేర కు ప్రతిపాదనలు పంపించిన ప్రధాన న్యాయమూర్తి సునీత.. నందిమేడారం సివిల్ కోర్టు జూనియర్ సివిల్ జడ్జి సరిత, మంత్రి లక్ష్మణ్కుమార్కు బార్ అసోసియేషన్ తరఫున లింగారెడ్డి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఎకరాకు రూ.40వేల పరిహారం చెల్లించాలి పెద్దపల్లి/పెద్దపల్లిరూరల్: భారీవర్షాలతో పంట లు దెబ్బతిని ఆర్థికంగా నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.40 వేల పరిహారం చెల్లించాలని బీ జేపీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి డిమాండ్ చేశారు. అదనపు కలెక్టర్ అరుణశ్రీని శనివారం కలెక్టరేట్లో ఆయన కలుసుకుని ఒక వినతిప త్రం అందజేశారు. జిల్లావ్యాప్తంగా వరి, పత్తి, మొక్కజొన్న పంటలు భారీగా దెబ్బతిన్నాయని, ప్రభుత్వం నష్టంపై అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి నివేదించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో నాయకులు నల్ల మనోహర్రెడ్డి, బెజ్జంకి దిలీప్ కుమార్, మహేందర్ యాదవ్, రాజన్న, వెంకటస్వామి, ప్రదీప్ కుమార్, కందుల శ్రీనివాస్, కొల్లూరి కుమార్, సంపత్ దేవేందర్ పటేల్, మహంతా కృష్ణ, వెంకటేశ్, వెంకటకృష్ణ, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. గోదావరి మహాహారతి పోస్టర్ ఆవిష్కరణ రామగుండం: అంతర్గాం మండలం గోలివాడ సమీప గోదావరి నదీతీరంలో ఈనెల 6న చేపట్టే గోదావరి మహాహారతి కార్యక్రమ ప్రచార వాల్పోస్టర్ను వేడుకల నిర్వహణ కమిటీ రాష్ట్ర కార్యదర్శి క్యాతం వెంకటరమణ ఆధ్వర్యంలో శనివా రం ఆవిష్కరించారు. కార్తీకమాసంలో నదుల్లో దీపాలు వదిలితే అష్ట ఐశ్వర్యాలు సిద్ధించి మహిళలు శతవసంతాలు సౌభాగ్యవంతులుగా ఉంటారని వెంకటరమణ తెలిపారు. నాయ కులు కంద లోకనాథం, మాడ ప్రభాకర్రెడ్డి, ఒల్లెపు మల్లేశం, మల్లారెడ్డి, అంజిబాబు, రాజేందర్, మల్లిక్, హరీశ్, రాజు తదితరులు ఉన్నారు. ‘ఎల్లంపల్లి’కి ఇన్ఫ్లో రామగుండం: ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో కొనసాగుతోందని నీటిపారుదలశాఖ అధికారు లు శనివారం తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా ప్రస్తుతం 1.66 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోందని తెలిపారు. 13 గేట్లు ఎత్తి 1.35 లక్షల క్యూసెక్కులను దిగువన ఉన్న గోదావరిలోకి వదులుతున్నామని అధికారులు పేర్కొన్నారు. -
మద్యం మత్తులో డ్రైవింగ్
గోదావరిఖని: మద్యం మత్తుతో వాహనాలు నడిపేవాళ్లు టెర్రరిస్టులతో సమానమని ఓ పోలీసు అఽధికా రి ఇటీవల వాఖ్యానించారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ శివధర్రెడ్డి కూడా హెచ్చరించారు. మత్తెక్కితే కిక్కు దించుతామంటూ రామగుండం పోలీస్ కమిషరేట్లోని పోలీసులు చె బుతున్నారు. ఈమేరకు పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో వాహనాల తనిఖీ ముమ్మరం చేశారు. 35 శాతం ప్రమాదాలకు మద్యమే కారణం.. రామగుండం కమిషరేట్ పరిధిలో ప్రతీరోజు జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో 35 శాతం నుంచి 40 శాతం వరకు డ్రంక్ అండ్ డ్రైవ్తోనేనని పోలీసులు పేర్కొంటున్నారు. ఇలాంటివారిలో మార్పు తీసుకొచ్చేందుకు పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. మద్యం తాగి వాహనాలు నడుపుతూ ఒక సారి దొరికితే కేసు నమోదు చేస్తున్నారు. అయినా మార్పురావడం లేదు. మళ్లీ అదేపద్ధతిన రెండోసారి చిక్కి జైలుపాలవుతున్నారు. వీరిసంఖ్య ఏటా పెరుగుతూనే ఉంది. ఈ ఒక్క ఏడాదిలోనే మద్యం తాగి వాహనాలు నడుపుతూ 25 మంది పట్టుబడి జైలు శిక్ష అనుభవించారు. అయినా చాలామందిలో అస్సలు మార్పురావడం లేదు. పెరుగుతున్న ప్రమాదాలు.. మద్యం తాగి వాహనాలు నడపడం ద్వారా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇవి ఏటేటా పెరుగుతూనే ఉన్నాయి. మద్యం మత్తులో అతివేగంతో డ్రైవింగ్ చేయడం ద్వారా వాహనం అదుపులోకి రాక ప్రమాదాలు పెరుగుతున్నాయి. అతివేగంతో జరిగిన ప్రమాదాల్లో మృతులు, గాయపడివారి సంఖ్య కూడా పెరుగుతోంది. దీంతో పోలీసు శాఖ డ్రంకెన్ డ్రైవ్ టెస్టులను సీరియస్గా తీసుకుంది. తనిఖీలు ముమ్మరం.. డ్రంక్ అండ్ డ్రైవ్పై సివిల్, ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. రాత్రివేళడ్రంకెన్ డ్రైవ్ టెస్ట్లు పెంచుతున్నారు. బ్రీతింగ్ ఎనలైజర్ ద్వారా టెస్ట్ చేసిన వెంటనే ఆన్లైన్లో కేసు నమోదు చేస్తున్నారు. తర్వాత కోర్టులో హాజరు పర్చుతున్నారు. ఒకసారి పోలీసులకు పట్టుబడితే.. రూ.2వేల జరిమానా విధిస్తున్నారు. రెండోసారి దొరికితే మూడు రోజుల జైలు, మూడోసారి పట్టుబడితే నాలు గురోజు జైలు శిక్ష విధించి కరీంనగర్ జైలుకు తర లిస్తున్నారు. ఇలా ఎక్కువసార్లు పట్టుబడిన వారిలో టూవీలర్, ఆటో, లారీ, కారు, ట్రాక్టర్ డ్రైవర్లు అధికంగా ఉంటున్నారు. కేసుల వివరాలు ఏడాది కేసులు చార్జిషీట్ జైలు ఫైన్, జైలు జరిమానా(రూ.లలో) 2023 1,759 1,734 13 7 9,92,432 2024 2,553 2,518 20 12 34,25,105 2025 2,775 2,579 25 0 43,36,473 మొత్తం 7,087 6,831 58 19 87,53,010 -
సర్కారు జాప్యం.. విద్యార్థులకు శాపం
సిరిసిల్లకల్చరల్: పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్ నిధుల విడుదలలో జాప్యం ఉన్నత విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థుల పాలిట శాపంగా మారుతోంది. ప్రతీసారి హామీలే తప్ప నిధులు విడుదలలో ప్రభు త్వం మీనమేషాలు లెక్కిస్తుండడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో డిగ్రీ, పీజీ కళాశాలల యాజమాన్యాలు మరోసారి విద్యాసంస్థల నిరవధిక బంద్కు నిర్ణయం తీసుకున్నాయి. నాలుగేళ్లుగా బకాయిలే.. నాలుగేళ్లుగా ఫీజు బకాయిలతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని అన్ని డిగ్రీ, పీజీ, వృత్తి విద్యా కళాశాలల నిర్వహణ భారంగా మారింది. ప్రధానంగా సంప్రదాయ డిగ్రీ కోర్సులు నిర్వహించే గ్రామీణ ప్రాంత కళాశాలల స్థితి ఆగమ్యగోచరంగా మారింది. కళాశాల భవనాల అద్దెలు మొదలు సిబ్బంది జీత భత్యాలు ఇవ్వలేక చేతులెత్తేశాయి. చాలా వరకు కళాశాలల్లో లెక్చరర్లకు జీతాలు లేక కుటుంబాలు రోడ్డున పడే దుస్థితి ఏర్పడింది. హామీలు.. నీటిమీద రాతలే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడేనాటికి రెండేళ్ల బకాయిలు పేరుకుపోయాయి. ప్రజాప్రభుత్వంలో ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు సకాలంలో విడుదల చే స్తామని చెప్పిన పెద్దలు మాట నిలుపుకోవడంలో విఫలమయ్యారు. గతేడాది పరీక్షలు వాయిదా వేస్తామన్న తీర్మానానికి తలొగ్గి నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. ఇటీవల దసరాకు ముందు రూ.300కోట్లు, దీపావళి సమయానికి మరో రూ.300 కోట్లు విడుదల చేస్తామన్న అధికారులు అమలులో విఫలమయ్యారు. ఈ ఏడాది ప్రవేశాల సమయంలో కాస్త నెమ్మదించిన యాజమాన్యాలు మరోసారి ఫీజు పోరుకు సిద్ధమయ్యాయి. టోకెన్లు విడుదలైన మొత్తం రూ.1200 కోట్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నిధులు విడుదల చేయకపోతే నిరవధిక బంద్ పాటిస్తామని కళాశాలల యాజమాన్య సంఘం తేల్చిచెప్పింది. దీంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. విజిలెన్స్ కొరడా కళాశాలల యాజమాన్యాలపై మరో పిడుగు పడింది. అన్ని కళాశాలలపై విజిలెన్స్ అధికారుల తనిఖీలకు ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం బకాయిలు విడుదల చేశాక తనిఖీలకు సహకరిస్తామని యాజమాన్యాలు అంటున్నాయి. తమహక్కుగా ఉన్న బకాయిలను అడిగితే విజిలెన్స్ తనిఖీల పేరుతో భయభ్రాంతులకు గురిచేసేందుకు ప్రయత్నిస్తున్న ప్రభుత్వం దమన నీతిని యాజమాన్యాల సంఘం ఎండగడుతోంది. శాతవాహన వీసీకి సమ్మె నోటీస్ శాతవాహన యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల బంద్ నిర్ణయాన్ని వైస్చాన్స్లర్కు చేరవేయాలని సుప్మా కార్యవర్గం నిర్ణయించింది. శనివారం మధ్యాహ్నం వర్సిటీ రిజిస్ట్రార్ను కలిసిన యాజమాన్య సంఘం రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సుప్మా ప్రతినిధులు శ్రీపాద నరేశ్తో కూడిన బృందం లేఖ ద్వారా సమ్మె నోటీస్ అందజేశారు. బకాయిలు పూర్తిగా విడుదల చేస్తే తప్ప బంద్ విరమించేది లేదని స్పష్టం చేశారు. ఇప్పటికే 1,3,5 సెమిస్టర్ పరీక్ష ఫీజుల గడువు కూడా పూర్తయింది. త్వరలో సెమిస్టర్ పరీక్షల నిర్వహణకు యూనివర్సిటీ అధికారులు సమాయత్తమవుతున్నారు. ఈ నేపథ్యంలో బంద్ నిర్ణయం విద్యార్థుల ఫలితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తుందని తల్లిదండ్రులు వాపోతున్నారు. -
టెక్ హఫీజ్
తన వద్ద పెద్దగా డబ్బు లేదు.. ఎవరి సపోర్ట్ కూడా లేదు.. కానీ, పెద్ద ప్రణాళిక ఉంది.. అంతకుమించి పట్టుదల ఉంది.. దాంతోనే రోజూ కొత్త విషయాలు నేర్చుకొని.. ఆ అంశాలనే ప్రజలతో పంచుకున్నాడు. వంద రూపాయలతో మొదలైన యూట్యూబర్ జీవితం నెలకు రూ.3లక్షల వరకు చేరింది. ఇలా సంపాదిస్తూ తెలుగు యూట్యూబర్లలో అగ్రగామిగా నిలిచాడు. ప్రపంచమే గుప్పిట్లో చేరిన ఈరోజుల్లో నిత్యం కొత్త విషయాలను వీక్షకులకు అందిస్తూ తనదైన శైలిలో ముందుకు సాగుతున్నాడు గోదావరిఖనికి చెందిన సయ్యద్ హఫీజ్. మొదట్లో హఫీజ్ వీడియోలకు కావలిసినంత వీక్షకులు రాకపోగా, ఇదెవరు చూస్తారని స్నేహితులు ఎగతాలి చేశారు. అయినా నిరాశ పడలేదు. క్రమశిక్షణ, నిరంతరకృషితో వీక్షకులు పెరుగుతూనే వచ్చారు. తన కృషికి ఫలితంగా గోల్డెన్ వీసా వరించింది. ప్రజలకు అవసరమైన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం నేర్చుకోవడమే కాదు.. ప్రజలతో పంచుకోవడం విశేషం. – గోదావరిఖని– వివరాలు 8లోu -
అయ్యో పాపం.. ఎంతటి దయనీయం
సిరిసిల్ల: రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రంలో నేతన్న కుటుంబం రోడ్డున పడింది. కన్నకొడుకు శవాన్ని సైతం అద్దె ఇంటికి తీసుకెళ్లలేని దుస్థితిలో పోస్టుమార్టమ్ గది నుంచే శ్మశానవాటికకు తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సంఘటన సిరిసిల్లలో గురువారం చర్చనీయమైంది. స్థానికులు తెలిపిన వివరాలు. సిరిసిల్ల శివారులోని చంద్రంపేటకు చెందిన గౌడ శారద, నారాయణ దంపతులకు ముగ్గురు కొడుకులు మహేశ్, ప్రకాశ్, విశాల్. నారాయణ నేతకార్మికుడిగా భీవండి వెళ్లి పనిచేశాడు. భార్య శారద బీడీలు చేసేది. భీవండి నుంచి వచ్చిన నారాయణ చంద్రంపేటలో ఓ ఇంటిని కొనుగోలు చేసి కార్మికుడిగా పనిచేసేవాడు. ఆర్థిక ఇబ్బందులతో నారాయణ 20 ఏళ్ల క్రితం ఇంట్లోనే కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకోగా.. అదే సమయంలో ఇల్లు కూడా కొంతమేరకు కాలిపోయింది. కొద్ది రోజులకే ఆర్థిక ఇబ్బందులతో ఆ ఇంటిని అమ్మేసి సిరిసిల్లలో అద్దెకుంటున్నారు.రెండేళ్ల కిందట పెద్ద కొడుకు..జిల్లా కేంద్రంలోని శివనగర్ లో అద్దెకుంటూ ఓ హోటల్ నిర్వహిస్తున్నారు. ఈక్రమంలో ఆర్థిక ఇబ్బందులతో రెండేళ్ల క్రితం పెద్ద కొడుకు గౌడ మహేశ్ ఉరివేసుకుని మరణించాడు. ఇద్దరు కొడుకులతో హోటల్ నిర్వహిస్తూ అద్దె ఇంట్లో నెట్టుకొస్తున్నారు. బోటాబోటీ ఆదాయంతో సాగిపోతున్న ఆ కుటుంబాన్ని విశాల్ అనారోగ్య సమస్యలు చుట్టు ముట్టాయి. మెరుగైన వైద్యం చేయించుకునే ఆర్థిక స్థోమత లేక ప్రభుత్వ వైద్యంపై ఆధారపడ్డారు. ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలతో విసిగిపోయిన విశాల్ సోమవారం గడ్డి మందు తాగాడు. వెంటనే ఆస్పత్రిలో చేర్పించగా మూడు రోజులపాటు మృత్యువుతో పోరాడి గురువారం చనిపోయాడు. విశాల్ సిరిసిల్ల ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు.'గూడు' లేని గోడు"విశాల్ శవాన్ని అద్దె ఇంటికి తీసుకెళ్లలేని పరిస్థితి.. చేతిలో చిల్లి గవ్వలేని దుస్థితిలో చేసేదేమి లేక ఆ తల్లి తన కొడుకు శవాన్ని ప్రభుత్వ జనరల్ ఆస్ప త్రి నుంచే నేరుగా శ్మశానవాటికకు తీసుకెళ్లింది. పెళ్లి కాని కొడుకు విశాల్ మృతదేహానికి సాంప్రదాయం ప్రకారం జిల్లేడు చెట్టుతో అప్పటికప్పుడు పెళ్లిచేసి.. అనంతరం అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సంఘటన స్థానికులను కలచివేసింది. పగవాడికి సైతం ఇలాంటి కష్టాలు రావద్దని చర్చిం చుకున్నారు. -
జేఎన్టీయూలో ముగిసిన హ్యాకథాన్
రామగిరి(మంథని): సెంటినరీకాలనీలోని మంథని జేఎన్టీయూలో చేపట్టిన ఎకో హ్యాకథాన్ కార్యక్ర మం శుక్రవారం ముగిసింది. నేషనల్ గ్రీన్క్రాప్ హ్యాకథాన్ పోటీలకు 22 టీంలతోపాటు మంథని జేఎన్టీయూ, పెద్దపల్లి ట్రినిటి కళాశాల విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో 8 బృందాలు ఫైనల్ పో టీలకు ఎంపికయ్యాయి. జడ్జిలుగా శ్రీధర్రెడ్డి, సా హు ఛత్రపతి వ్యవహరించారు. ప్రథమ విజేతగా మహవర్ధన్, ద్వితీయ విజేతగా రాజ్కుమార్, తృతీ య విజేతగా ట్రినిటి కళాశాల శివానీ టీమ్ ఎంపికయ్యాయి. ప్రథమ బహుమతికి రూ.5వేలు, ద్వితీ య బహుమతికి రూ.3 వేలు, తృతీయ బహుమతికి రూ.వెయ్యి, హ్యాకథాన్లో పాల్గొన్న విద్యార్థులకు సర్టిఫికెట్లను ప్రిన్సిపాల్ విష్ణువర్ధన్ అందజేశారు. వైస్ ప్రిన్సిపాల్ ఉదయ్ కుమార్, కో ఆర్డినేటర్లు సదానందం, శివకృష్ణ, కావ్య, రాజేశ్, మహిపాల్, సాయిదీక్షిత్, నరహరి, వంశీకృష్ణ పాల్గొన్నారు. -
దేశ సమగ్రతను కాపాడాలి
పెద్దపల్లి: దేశ సమగ్రతను కాపాడాలని కలెక్టర్ కో య శ్రీహర్ష అన్నారు. జాతీయ ఐక్యత దినోత్సవం సందర్భంగా అదనపు కలెక్టర్లు వేణు, అరుణశ్రీతో కలిసి కలెక్టరేట్లో శుక్రవారం సర్ధార్ వల్లభాయ్ చి త్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. క లెక్టర్ మాట్లాడుతూ, దేశప్రజలు భారతీయులనే భావనను సుస్థిరం చేసిన మహనీయుడు సర్ధార్ వల్లభాయ్ పటేల్ అన్నారు. అనంతరం పోలీస్ శా ఖ చేపట్టిన 2కే రన్ను కలెక్టర్ ప్రారంభించారు. కార్యక్రమంలో ఆర్డీవో గంగయ్య, ఏవో శ్రీనివాస్, వైద్యాధికారి వాణిశ్రీ తదితరులు పాల్గొన్నారు. ఐదురోజుల పాటు వరి కోతలు వద్దు జిల్లాలో భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని వ చ్చే 5రోజులపాటు రైతులు వరికోతలు చేపట్టవద్దని కలెక్టర్ శ్రీహర్ష తెలిపారు. ఇదివరకే వరి కోసిన రై తులు వడ్లపై టార్పాలిన్ కవర్లు కప్పుకొని సంరక్షించుకోవాలని, తడిసిన వడ్లు వివరాలను వ్యవసాయ అధికారులకు తెలియజేయాలని సూచించారు. భూభారతి దరఖాస్తులు పరిష్కరించండి కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): భూభారతి దరఖా స్తు లను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ శ్రీహర్ష ఆదేశించారు. స్థానిక తహీసీల్దార్ కార్యాలయాన్ని ఆయ న ఆకస్మికంగా తనిఖీ చేశారు. 134 ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తులు వచ్చాయని, అందులో 110 ఇళ్ల నిర్మా ణం ప్రారంభమైందని, మిగతావా పనులు ప్రాంభించి వేగవంతంగా పూపూర్తిచేయాలని కలెక్టర్ సూచించారు. డిప్యూటీ కలెక్టర్ వనజ, తహసీల్దార్ జగదీశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పనులు వేగవంతం చేయాలి ఓదెల(పెద్దపల్లి): ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వే గవంతం చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. స్థానిక ఎంపీడీవో, తహసీత్దార్ కార్యాలయాలు, ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, కేజీబీవీని కలెక్టర్ సందర్శించి పలు సూచనలు చేశారు. డిప్యూటి కలెక్టర్ వనజ, ఎంపీడీవో తిరుపతి, తహసీల్దార్ ధీరజ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. పెండింగ్ పనులు పూర్తిచేయాలి పెద్దపల్లి: తాగునీటి సరఫరా కోసం చేపట్టిన పెండింగ్ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేయా లని కలెక్టర్ శ్రీహర్ష సూచించారు. తాగునీటి సరఫరాపై వివిధ శాఖల అధికారులతో జరిగిన సమీక్షలో ఆయన పలు సూచనలు చేశారు. మిషన్ భగీరథ ఈఈ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.సమైక్యతకు పాటుపడాలి గోదావరిఖని: దేశ సమగ్రతకోసం కోసం అందరూ పాటుపడాలని రామగుండం పోలీస్ క మిషనర్ అంబర్ కిశోర్ ఝా సూచించారు. జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా నగరంలో చేపట్టిన రన్ఫర్ యూనిటీలో ఆయ న మాట్లాడారు. ప్రజల్లో జాతీయ ఐక్యత, సా మరస్యం, దేశభక్తి, సమైక్యతాభావంపై అవగాహన కల్పించడమే రన్ లక్ష్యమన్నారు. సర్ధార్వల్లభాయ్ పటేల్ సేవలు ప్రతీ ఒక్కరికి ప్రేర ణ అని అన్నారు. రజాకార్లను విచ్ఛిన్నం చేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఏకం చేసి.. స్వేచ్ఛా వాయువులు పీల్చుకునేలా సర్ధార్ వల్లభాయ్పటేల్ సేవలు అందించారని సినీ నటుడు సా గర్ అన్నారు. అడిషనల్ డీసీపీ(అడ్మిన్) శ్రీనివాస్, గోదావరిఖని, ట్రాఫిక్, ఏఆర్ ఏసీపీలు రమేశ్, శ్రీనివాస్, ప్రతాప్, సీఐలు ఇంద్రసేనారెడ్డి, ప్రవీణ్కుమార్, రాజేశ్వర్రావు, ఆర్ఐలు దామోదర్, శ్రీనివాస్, వా మనమూర్తి, శేఖర్, మల్లేశం, సంపత్ తదితరులు పాల్గొన్నారు. -
368 ఎకరాల్లోనే వరికి నష్టం
జిల్లాలో ఇటీవల కురిసిన వానకు పంటలకు పెద్దగా నష్టమేమీ జరగలేదని ప్రాథమిక సర్వేలో తేలింది. ఇప్పటివరకు 264 మంది రైతులకు చెందిన 368 ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనాకు వచ్చాం. నేలవాలిన వరిపైరును కట్టలుగా కట్టాలని ఏఈవోలు రైతులకు సూచిస్తున్నారు. అలా చేస్తే దిగుబడి కూడా బాగానే వస్తుంది. – శ్రీనివాస్, డీఏవో ఐదురోజులు వరికోతలు వద్దు జిల్లాలో మరోఐదు రోజుల్లో భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచిస్తోంది. రైతులు.. వచ్చే ఐదురోజుల పాటు వరి కోతలు చేపట్టవద్దు. ఇప్పటికే కోసి ధాన్యం రాశులు పోసిన రైతులు.. వడ్లు తడవకుండా టార్పాలిన్లు కప్పి ఉంచాలి. తేమశాతం 17కు మించకుండా చూసుకోవాలి. – కోయ శ్రీహర్ష, కలెక్టర్ -
ఫలించిన ఏడేళ్ల పోరాటం
గోదావరిఖని: సింగరేణిలోని ఈపీ ఆపరేటర్లు, మైనింగ్ స్టాఫ్, ట్రేడ్స్మెన్ ఏడేళ్ల పోరాటం ఫ లించింది. అనారోగ్య కారణాలతో అండర్గ్రౌండ్లో అన్ఫిట్ అయితే ఉపరితలంలో సేమ్ డిజిగ్నేషన్తో ఉద్యోగం ఇచ్చేందుకు సింగరేణి అంగీకరించింది. సంస్థ వ్యాప్తంగా 2018 నుంచి 2025వ సంవతసరం వరకు అండర్గ్రౌండ్లో అన్ఫిట్అయి సర్ఫేస్లో జనరల్ అసిస్టెంట్గా పనిచేస్తున్న వారికి తాజా ఒప్పందం వర్తించనుంది. ఈపీ ఆపరేటర్లు, మైనింగ్ స్టాఫ్లో ఓవర్మెన్, సర్థార్లు, షార్ట్ఫైరర్లు, టెక్నీషియన్ వి భాగంలో ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, వెల్డర్, టర్నర్, మెకానిక్ కార్మికులు ఈ ఒప్పందంలోకి వ స్తా రు. సుమారు 74 మందికి దీనిద్వారా ప్రయోజనం చేకూరుతుందని యాజమాన్యంతోపాటు గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీయూసీ చెబుతున్నాయి. మెడికల్ టెస్ట్ నిర్వహించి సేమ్జాబ్ లోకి తీసుకునేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది. దరఖాస్తుల ఆహ్వానం.. సింగరేణి సంస్థ వ్యాప్తంగా పనిచేస్తున్న ఎలక్ట్రికల్, మెకానికల్, చార్జ్హ్యాండ్, ఫోర్మెన్ఇన్చార్జి, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, వెల్డర్, టర్నర్లు మె డికల్ కోసం దరఖాస్తు చేసుకోవాలని యాజమాన్యం కోరింది. ఈమేరకు అన్నిఏరియాలకు ఉత్తర్వు జారీచేసింది. ఈనెలాఖరులోగా దరఖాస్తులు తమకు పంపించాలని సూచించింది. వీరితోపాటు ఈపీ ఆపరేటర్లు కూడా దరఖాస్తు చేయాల్సి ఉందని చెబుతోంది. -
వేదనే మిగిలింది!
పెద్దపల్లిరూరల్: జిల్లాలో రెండ్రోజుల పాటు కురిసిన ఈదురుగాలులతో కూడిన భారీవర్షాలతో రైతు ల కంటిమీద కునుకు లుఎండాపోయింది. చేతికి అందేదశలో పంట చేజారి పోతుందేమోనని ఆందో ళన వ్యక్తమవుతోంది. అకస్మాత్తుగా కురిసిన వానలకు పంట, పొలాలు నీటమునిగాయి. పైరు నేలవాలడం కలవరపాటుకు గురిచేస్తోంది. జిల్లాలోని పెద్దపల్లి, కాల్వశ్రీరాంపూర్, ఓదెల, సుల్తానాబాద్, ధర్మారం, జూలపల్లి, ఎలిగేడు తదితర మండలాలతోపాటు మంథని ప్రాంతంలోని వివిధ గ్రామాల్లో వరి నేలవాలగా.. పత్తి చేలు నీటమునిగాయి. దిగుబడిపై ప్రభావం.. జిల్లాలో వరి 2,11,780 ఎకరాల్లో సాగు కాగా, పత్తి 48,215 ఎకరాల్లో సాగైంది. మొక్కజొన్న 501 ఎ కరాలు, ఉద్యావన పంటలు 9వేల ఎకరాల్లో సాగు చేసినట్లు అఽధికార వర్గాల ద్వారా తెలిసింది. పంట లు చేతికి అందే సమయంలో.. మంగళవారం రా త్రి, బుధవారం వానలు దంచికొట్టడంతో రైతులు దిగాలు పడ్డారు. నెలరోజుల క్రితం కూడా వరుసగా నాలుగు రోజులపాటు వర్షాలు కురిశాయి. దీంతో తెగుళ్లు సోకితే నివారణ చర్యలు చేపట్టామని, ఇప్పు డు దిగుబడి చేతికి అందేదశలో మరోసారి వరుణు డు ఉన్నట్టుండి ఉగ్రరూపం దాల్చడంతో ఏంచేయా లో పాలుపోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దిగుబడి తగ్గి .. పెట్టుబడి కూడా వస్తుందో.. రాదోననే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయాధికారుల సర్వే మోంథా తుపానుతో బలమైన ఈదురుగాలులతో కూడిన భారీ వర్షానికి ఏయే ప్రాంతాల్లో ఎంతమేర పంటలకు నష్టం జరిగిందనే విషయమై వివరాలను సేకరించేందుకు మండల వ్యవసాయాధికారులు, విస్తీర్ణాధికారులు ఊరూరా పర్యటిస్తూ సర్వే చేస్తు న్నారు. పూర్తివివరాలు ఇంకా రాలేదని, శనివారం వరకు సమగ్ర సమాచారం సేకరిస్తామని జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు వివరించారు. కట్టలుగా కడితే మేలు..బలమైన ఈదురుగాలులు, వర్షం ధాటికి నేలవాలిన వరి పైరును పైకి నిటారుగా నిల్చొబెట్టి.. కట్టలుగా కట్టాలని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. పొలంలో నీరు నిల్వఉండి నేలవాలితే గింజలు తడిసి రంగుమారి, దిగుబడి తగ్గే అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు. వీలైనంత మేరకు కట్టలుగా కట్టి పంటను కాపాడుకోవాలని వ్యవసాయాధికారులు తెలిపారు. వరి 2,11,780 పత్తి 48,215 మొక్కజొన్న 501 ఉద్యానవన 9,000 జిల్లాలో సాగు వివరాలు(ఎకరాల్లో) -
శిశు మరణాల కట్టడికి చర్యలు తీసుకోవాలి
పెద్దపల్లి: జిల్లాలో శిశు మరణాల కట్టడికి చర్యలు చే పట్టాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి వాణిశ్రీ సూచించారు. శిశు మరణాలపై నియంత్రణకు తీసు కోవాల్సిన చర్యలపై తన కార్యాలయంలో శుక్రవా రం సమీక్షించారు. ఎన్సీడీ సర్వేపై చర్చించారు. డి సెంబర్ 2024 నుంచి అక్టోబర్ 2025 వరకు జిల్లా లో 26 శిశు మరణాలు సంభవించాయని, ఇందులో బరువు తక్కువ, నెలలు నిండక ముందే పుట్టిన తదితర కేటగిరీల మరణాల కేసులు ఎంపికచేసి కారణాలపై సమీక్షించాలన్నారు. ఎన్సీడీ సర్వే వివరాలు ఆన్లైన్లో నమోదు చేయనివారిపై చర్య తీసుకుంటామని అన్నారు. ప్రోగ్రాం అధికారులు కిరణ్ కు మార్, రాజమౌళి డిప్యూటీ డీఎంహెచ్వో శ్రీరాము లు, వైద్యులు రవీందర్, మీరజ్ ఫాతిమా ఉన్నారు. -
అయ్యప్పస్వామి శోభాయాత్ర
కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): పాండవులగుట్టపై చేపట్టిన అయ్యప్పస్వామి ఆలయ నిర్మాణానికి సంబంధించిన స్వామివారి విగ్రహాలతో శుక్రవారం పురవీధుల్లో శోభాయాత్ర నిర్వహించా రు. మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. ఆలయ కమిటీ చైర్మన్ పెద్దిరెడ్డి వీరారెడ్డి, ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు ఇమ్మడి జ్యోతి, రాఘవులు, అశోక్ పాల్గొన్నారు. 4న జాబ్మేళా పెద్దపల్లి: నిరుద్యోగు కోసం ఈనెల 4న జాబ్మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి రాజశేఖర్ తెలిపారు. మెడ్ప్లస్ కంపెనీలో ఉద్యోగావకాశాలు ఉన్నాయన్నారు. 40 ఫార్మసిస్ట్, 50 ఫార్మసిస్ట్ ఏఐడీ, 100 జూనియ ర్ అసిస్టెంట్, 30 ఆడిట్ అసిస్టెంట్, 20 సీఎస్ఏ, 1 డెలీవరీ బాయ్, 1 సెక్యూరిటీగార్డు, 1 హౌస్ మెయిడ్ పోస్ట్లు ఖాళీగా ఉన్నాయన్నా రు. ఆసక్తి, అర్హత గలవారు ఉదయం 11 గంట ల సర్టిఫికెట్ జిరాక్స్లతో కలెక్టరేట్లోని రూమ్ నంబరు 225లో సంప్రదించాలని ఆయన సూచించారు. వివరాలకు 93923 10323, 89853 36947, 81212 62441 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని ఆయన కోరారు. ఫోన్కాల్స్కు స్పందించాలి పెద్దపల్లి: జిల్లాలోని 108 వాహనానికి వ చ్చే అత్యవసర ఫోన్ కాల్స్కు వెంటనే స్పందించాలని అంబులెన్స్ జిల్లా ప్రో గ్రామింగ్ మేనేజర్ జనార్దన్ సూచించా రు. సుల్తానాబాద్లోని కార్యాలయంతోపాటు 108 అంబులెన్స్ను శుక్రవారం తనిఖీ చేశారు. వైద్యపరికరాలు, వాహనం పనితీరుపై ఆరా తీ శారు. ప్రత్యేక శ్రద్ధతో పేషంట్లను ఆస్పత్రులకు తరలించాలని సూచించారు. ఎమర్జెన్సీ మెడిక ల్ టెక్నీషియన్ ఇరుగురాల రవివర్మ, పైలెట్ కా రంగుల సంపత్ కుమార్ పాల్గొన్నారు. బిల్లులు చెల్లించకుంటే సమ్మె పెద్దపల్లి: మధ్యాహ్న భోజన నిర్వాహకులకు వారంరోజుల్లోగా పెండింగ్ బిల్లులు చెల్లించ కుంటే సమ్మెలో చేస్తామని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పూసల రమేశ్ హెచ్చరించా రు. కలెక్టరేట్ ఎదుట శుక్రవారం మధ్యాహ్న భోజన నిర్వాహకులతో కలిసి ధర్నా చేశారు. అనంతరం డీఈవో మాధవికి వినతిపత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ 7నెలల నుంచి పూర్తిస్థాయి బిల్లులు చెల్లించడం లేదన్నారు. బకాయిలు చెల్లించకుంటే ఈనెల 15 నుంచి సమ్మె చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో నా యకులు బండారి వసంత, మేకల యశోద, పా ఠకుల కళావతి, పిడుగు గట్టయ్య, పద్మ, లంక విజయ, రావిశెట్టి సరూప, ధరణి, సుమలత, లక్ష్మణ్, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. ఇందిర సేవలు మరువలేనివిపెద్దపల్లిరూరల్: భారత మాజీప్రధాని ఇందిరాగాంధీ సేవలు చిరస్మరణీయమని కాంగ్రెస్ పా ర్టీ నాయకులు అన్నారు. ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా జిల్లా కేంద్రంలో శుక్రవారం ఆ మె చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. నాయకులు సురేశ్గౌడ్, ఈర్ల స్వ రూప, సంపత్, శ్రీకాంత్, అమ్రేశ్, శ్రీనివాస్, వెంకటేశ్, ఫణీంద్ర, రాజయ్య, సంతోష్, సమ్మ య్య, నదీం, హకీం, ఫిరోజ్ఖాన్ ఉన్నారు. అన్నదాతలను ఆదుకోవాలి సుల్తానాబాద్రూరల్(పెద్దపల్లి): తుపానుతో పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి డి మాండ్ చేశారు. రేగడిమద్దికుంటలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఆయన పరిశీలించారు. ఎకరాకు రూ.40వేల చొప్పున బాధి త రైతులకు పరిహారం చెల్లించాలన్నారు. నా యకులు అర్జున్రావు, గొట్టిముక్కల సురేశ్రెడ్డి, నల్ల మనోహర్రెడ్డి, మహేందర్, ప్రదీప్కుమా ర్, కందుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
ప్లాస్టిక్ వస్తువులు విక్రయిస్తే చర్యలు
కోల్సిటీ(రామగుండం): నిషేధిత సింగిల్ యూస్ ప్లాస్టిక్ వస్తుసామగ్రి విక్రయిస్తే చర్యలు తప్పవని రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్ డిప్యూ టీ కమిషనర్ వెంకటస్వామి హెచ్చరించారు. బల్ది యా కార్యాలయంలో టోకు వ్యాపారులతో శుక్రవా రం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడా రు. కమిషనర్ అరుణశ్రీ ఆదేశాల మేరకు రామగుండం నగరంలో సింగిల్యూస్ ప్లాస్టిక్ వస్తుసామగ్రి విక్రయాల నియంత్రణకు ప్రత్యేకంగా తనిఖీలు చేపట్టామని ఆయన పేర్కొన్నారు. ఈవిషయంపై వ్యాపారులకు తొలుత అవగాహన కల్పించడానికి సమావేశం ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ప్లాస్టిక్ వినియోగంతో అనేక అనర్థాలు జరుగుతాయన్నారు. సింగిల్ యూస్ ప్లాస్టిక్పై నిషేధాన్ని పకడ్బందీగా అమలు చేయడానికి సహకరించాలని కోరారు. నిబంధనలు అతిక్రమించే వ్యాపారులపై భారీగా జరిమానా విధిస్తామని హెచ్చరించారు. నగరానికి రవాణా అవుతున్న నిషేధిత ప్లాస్టిక్ సా మగ్రి గురించిన సమాచారం తకు అందజేసి సహకరించాలని ఆయన కోరారు. కాగా, తమకు మూడు రోజులు గడువు ఇవ్వాలని టోకు వ్యాపారులు విన్నవించగా.. ఆ తర్వాత నిషేధిత ప్లాస్టిక్ సామగ్రి విక్రయించబోమని హామీపత్రం రాసి ఇచ్చారు. ఈ సమావేశంలో అసిస్టెంట్ కమిషనర్ వెంకటేశ్వర్లు, మెప్మా టీఎంసీ మౌనిక, శానిటరీ ఇన్స్పెక్టర్లు నాగభూషణం, సంపత్, సీనియర్ అసిస్టెంట్లు కల్రామ్, శ్రీపాల్ తదితరులు పాల్గొన్నారు. -
వరికి నష్టం.. పత్తి కష్టం
సాక్షి పెద్దపల్లి: జిల్లా రైతులను మోంథా తుపాను నిండా ముంచేసింది. రెండురోజులుగా కురిసిన వర్షాలతో పత్తి, వరి పంటలు దెబ్బతిన్నాయి. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహించాయి. వేలాది ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. ఈదురుగాలుల ప్రభావానికి వరి, ఉద్యానపంటలు దెబ్బతిన్నాయి. పొట్టకొచ్చిన వరి నేలరాలడం, తేమతో పత్తికాయలు చెట్లపైనే కుళ్లిపోతున్నాయి. మొక్కజొన్నలు తడిసిపోయాయి. కొనుగోలు కేంద్రాలు, మార్కెట్ యార్డుల్లో ధాన్యం తడిసిముద్దయింది. తుపాన్ ప్రభావంతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లగా, ప్రాణనష్టం ఎక్కడా సంభవించలేదు. జిల్లాలో ఈసీజన్లో రైతులు 2.12లక్షల ఎకరాల్లో వరి, 52వేల ఎకరాల్లో పత్తి, 705 ఎకరాల్లో మొక్కజొన్న, 10వేల ఎకరాల్లో ఉద్యానవన పంటలు సాగు చేశారు. గురువారం జిల్లావ్యాప్తంగా అధికారులు పంటనష్టంపై సర్వే నిర్వహించి మేజర్ డ్యామేజీ జరగలేదని చెబుతున్నారు. కేవలం సుల్తానాబాద్, కాల్వశ్రీరాంపూర్లో 196మంది రైతులకు చెందిన 271 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని పేర్కొంటున్నారు. కానీ, క్షేత్రస్థాయిలో మాత్రం అందుకు భిన్నంగా ఉంది. వేలాది ఎకరాల్లో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. వణికించిన తుపాను మోంథా తుపాన్ ఎఫెక్ట్తో రెండు రోజుల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు మరో రెండు రోజులు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అయితే గురువారం ఉదయం నుంచి వర్షం తెరిపినివ్వడంతో అన్నదాతలు ఊపిరి పీల్చుకున్నారు. తడిసిన, కొట్టుకుపోయిన ధాన్యాన్ని ఆరబెట్టుకునే పనుల్లో నిమగ్నమయ్యారు. గరువారం సైతం వర్షం దంచికొడితే పూర్తిగా నష్టపోయేవారమని అన్నదాతలు వాపోతున్నారు. కలిసిరాని కాలం ఈ ఏడాది అన్నదాతలకు కాలం కలిసిరాలేదు. ముందస్తు వానలు పడుతాయన్న వాతావరణ సూచనలతో సీజన్ మొదట సాగు చేసినవారికి వానలు కురవక నష్టపోయారు. పత్తి విత్తనాలు రెండోసారి నాటుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తీరా సాగు చేశాక అకాలవర్షాలతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆగస్టులో కురిసిన వర్షాలతో జిల్లాలో 1,015 మంది రైతులకు చెందిన 1,752 ఎకరాల్లో వరి పంటలు నీట మునిగినట్లు వ్యవసాయశాఖ అ ధికారులు పంట నష్టంపై నివేదిక తయారు చేసి ప్ర భుత్వానికి సమర్పించారు. తాజాగా మోంథా తు పానుతో కోతకొచ్చిన వరి నేలవాలగా, పూతకొ చ్చిన పత్తి తడిసి రంగు మారడంతో ఈసారి సాగు కలిసిరాలేందంటూ రైతన్నలు వాపోతున్నారు. ప్రతిపాదనలకే పరిమితమైన పరిహారం అకాలవర్షాలతో పంటలు నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10వేల పరిహారం అందిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. అయితే మార్చి నుంచి ఇప్పటి వరకు వర్షాల కారణంగా రైతులకు జరిగిన నష్టాన్ని అధికారులు అంచనా వేసి రిపోర్టును ప్రభుత్వానికి అందజేశారు. నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు బాధిత రైతులకు పరిహారం అందకపోగా, ప్రతిపాదనల దశలోనే మగ్గుతున్నట్లు తెలుస్తోంది. వరుస దెబ్బలతో తీవ్రంగా నష్టపోయిన అన్నదాతలకు ప్రభుత్వం పరిహారం అందించి ఆదుకోవాలని వేడుకుంటున్నారు.ముత్తారం: ఓడెడ్ మానేరు వద్ద బ్రిడ్జి పిల్లర్ల వరకు చేరిన వరద ఉధృతి రేగడిమద్దికుంట కేంద్రంలో ధాన్యం ఆరబోస్తున్న రైతులు జిల్లాలో చెరువులు ఇలా.. ప్రభుత్వం ఆదుకోవాలి మార్కెట్లోయార్డులో నిల్వ చేసిన ధాన్యం కొట్టుకుపోయి భారీగా నష్టం జరిగింది. రెండురోజుల క్రితం యార్డులో ధాన్యం పోసినం. పలువురు రైతులకు చెందిన సుమారు వెయ్యి క్వింటాళ్లు తడిసినయి. ప్రభుత్వం ఆదుకోవాలి. – నరేశ్, రైతు, ఖానాపూర్, మంథని ఎకరం పూర్తిగా పోయింది నాలుగెకరాలు కౌలుకు తీసుకుని వరి వేసిన. ఇటీవల వర్షాలతోనే పంట బాగా దెబ్బతింది. మళ్లీ తుపాన్తో ఎకరం పూర్తిగా నేలవాలింది. కోతకు వచ్చిన పంట నీటిలోనే తేలుతాంది. మిగిలిన పంట కూడా చేతికచ్చే దాక నమ్మకం లేదు. – ఎస్కే బాబు, కౌలు రైతు, మల్లెపల్లి, మంథనిమూడెకరాలు మునిగింది మూడెకరాల్లో వరి సాగుచేస్తే తుపాను ముంచింది. వరదకు పొలమంతా నేలవాలింది. కిందపడిన వరిగింజలు మొలకెత్తాయి. దాదాపు రూ.2లక్షల నష్టం జరిగింది. ప్రభుత్వం ఆదుకోవాలి. – కర్ర నరేశ్, రైతు, గూడెం, ఓదెల వివరాలు సేకరిస్తున్నాం తుపాన్ కారణంగా రైతులకు ఏ మేర పంట నష్టం జరిగిందనే వివరాలను ప్రాథమికంగా సేకరిస్తున్నాం. పంటలకు పెద్దగా నష్టం కలగకపోవచ్చనే అంచనాకు వచ్చాం. పంట దిగుబడులను కాపాడుకునేందుకు పాటించాల్సిన పద్ధతులను సూచిస్తున్నాం. – శ్రీనాథ్, ఏడీఏ, పెద్దపల్లి మత్తడి పోస్తున్నవి 45975–100 శాతం 47950–75 శాతం 6725–50 శాతం 16మొత్తం చెరువులు 1,021 -
తమిళనాడు గిరి ప్రదక్షిణకు ప్రత్యేక బస్సు
మంథని: కార్తీక పౌర్ణమి సందర్భంగా వచ్చే నెల 5న తమిళనాడులోని అరుణాచలంలో జరిగే గిరి ప్రదక్షిణకు మంథని నుంచి ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సును నడిపిస్తున్నట్లు డిపో మేనేజర్ శ్రావణ్కుమార్ తెలిపారు. వచ్చే నెల 3న సాయంత్రం మంథని నుంచి బయలుదేరి కరీంనగర్, హైదరాబాద్ మీదుగా కాణిపాకం, గోల్డెన్ టెంపుల్ దర్శనం అనంతరం 4న రాత్రి అరుణాచలం చేరుకుంటుందన్నారు. 5న సాయంత్రం అరుణాచలం నుంచి బయలు దేరి 6న శ్రీఅలంపూర్ జోగులాంబ అమ్మవారి దర్శనం తర్వాత కరీంనగర్ మీదుగా మంథని చేరుకుంటుందన్నారు. ఫుల్ టికెట్ రూ.5,040, ఆఫ్ టికెట్ రూ. 3,790 ఉంటుందన్నారు. టికెట్ బుకింగ్ కోసం 99592 25923, 99486 71514 నంబర్లలో సంప్రదించాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలిఓదెల(పెద్దపల్లి): ప్రభుత్వం పేదలకు మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్లను వేగవంతం చేయాలని డీపీవో వీరబుచ్చయ్య పేర్కొన్నారు. గురువారం మండలంలోని శానగొండలో ఇందిరమ్మఇళ్ల నిర్మాణాలతో పాటు కమిటీ సభ్యులు, కార్యదర్శులతో మాట్లాడారు. లబ్ధిదారులు త్వరగా ఇళ్లు పూర్తి చేసేలా చూడాలన్నారు. గ్రామాల్లో కార్యదర్శులు నవంబర్ చివరివరకు వందశాతం పన్ను వసూలు చేయాలన్నారు. ఎంపీడీవో తిరుపతి, ఎంపీవో షబ్బీర్ తదితరులు పాల్గొన్నారు. కాంట్రాక్ట్ కార్మిక సంఘంతో చర్చలు విఫలంఫెర్టిలైజర్సిటీ(రామగుండం): రామగుండం ఎరువుల కర్మాగారంలో కాంట్రాక్టు కార్మికులకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని డిమాండ్ చేస్తూ రెండు రోజులుగా విధులు బహిష్కరించారు. గురువారం ఆర్ఎఫ్సీఎల్ సర్కిల్ నుంచి ప్లాంట్ గేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఎలాంటి ఘటనలు జరగకుండా ప్లాంట్ మెయిన్ గేట్ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాంట్రాక్ట్ కార్మిక సంఘం నాయకులు, కార్మికులకు, ఆర్ఎఫ్సీఎల్ యాజమాన్యానికి మధ్య చర్చలు నిర్వహించారు. చర్చలు విఫలం కావడంతో కార్మికులు వెనుతిరిగారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వకుంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడుతామని కాంట్రాక్ట్ కార్మికులు హెచ్చరించారు. కాగా, సమస్యలు పరిష్కరించాలని రెండు రోజులు నిరసన తెలిపినా యాజమాన్యం స్పందించకపోవడంతో సుమారు 300 మంది కాంట్రాక్టు కార్మికులు తమ వేతనాన్ని నష్టపోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తడిసిన ధాన్యాన్ని కొనాలిపెద్దపల్లి: అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అన్నారు. సుల్తానాబాద్ వ్యవసాయ మార్కెట్లో తడిసిన ధాన్యాన్ని గురువారం పరిశీలించారు. జిల్లా వ్యాప్తంగా పత్తి, కూరగాయలసాగు, మొక్కజొన్న, వరి తడిసి ముద్దయిందని, రైతులను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. బీఆర్ఎస్ మండల కన్వీనర్ బోయిరి రాజమల్లు, విండో చైర్మన్ సందీప్రావు తదితరులు పాల్గొన్నారు. -
మెడికో స్టూడెంట్స్ ధైర్యంగా ఉండాలి
కోల్సిటీ(రామగుండం): వైద్య విద్యలో తొలి అడుగు వేస్తున్న ఎంబీబీఎస్ ఫస్టియర్ విద్యార్థులు ఎలాంటి విపత్కర పరిస్థితిలోనైనా ధైర్యంగా ఉండాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష పిలుపునిచ్చారు. గోదావరిఖనిలోని సింగరేణి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(సిమ్స్) కాలేజీలో గురువారం ఎంబీబీఎస్ ఫస్టియర్ స్టూడెంట్స్ కోసం నిర్వహించిన వైట్ కోట్ వేడుకతోపాటు క్యాడావరిక్ ఒత్ కార్యక్రమాలను ప్రారంభించి మాట్లాడారు. రాబోయే నాలుగైదేళ్లు మెడికోల జీవితంలో చాలా కీలకం కాబోతుందని, చాలా సార్లు నిరుత్సాహపడే పరిస్థితులు రావచ్చని, ఎలాంటి పరిస్థితుల్లోనూ నమ్మకం, ఆత్మవిశ్వాసం కోల్పోవద్దని సూచించారు. సిమ్స్ కాలేజీలో మెరుగైన వసతులు అందుబాటులో ఉన్నాయన్నారు. రెండున్నరేళ్లుగా స్టూడెంట్స్ పడిన కృషి ఫలితంతోనే, నేడు వైట్ కోట్ వేడుకలో పాల్గొంటున్నారని కొనియాడారు. మొదటి గురువు ‘శరీరదాత’కు గౌరవం అనాటమీ డిపార్ట్మెంట్లో ఏర్పాటు చేసిన క్యాడావరిక్ ఒత్ కార్యక్రమంలో భాగంగా మెడికల్ కాలేజీకి శరీరదానం చేసిన దాతకు గౌరవం తె లు పుతూ, దాత శరీరాన్ని మొదటి గురువుగా భావిస్తామని, మానవ శరీర ని ర్మాణం నేర్చుకునే సమయంలో గౌరవభావంతో వ్యవహరించాలని మె డికో స్టూడెంట్స్తో కలెక్టర్, ప్రిన్సిపాల్ వాగ్దానం చేయించారు. హెడ్వోడీలు, ప్రొఫెసర్లు లావణ్య, ప్రదీప్చంద్ర, భానులక్ష్మి, ఫరీద్, అనూష, రాజు, శిరీష, రవివర్మ, హర్షిణి, ఓబులేశ్, కల్పన, అజయ్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఫస్టియర్ మెడికోలు -
భూసమస్యల పరిష్కారానికి పటిష్ట చర్యలు
పెద్దపల్లి/పెద్దపల్లిరూరల్: భూ సమస్యల పరిష్కారానికి పటిష్ట చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. రెవెన్యూ శాఖ పనితీరుపై అదనపు కలెక్టర్ వేణుతో కలిసి తన కార్యాలయంలో బుధవారం కలెక్టర్ శ్రీహర్ష సమీక్షించారు. భూభారతి, సాదాబైనామా, మీ సేవా దరఖాస్తులు, ఎస్ఐఆర్ ఓటర్ జాబితా, అసైన్డ్ భూసమస్యలు తదితర అంశాలపై అధికారులకు పలుసూచనలు చేశారు. భూభారతి పెండింగ్ దరఖాస్తులను త్వర గా పరిష్కరించాలన్నారు. సాదాబైనామాలు పరిశీలించి అర్హత ఉన్నవాటికి పట్టాలు అందించాలని అన్నారు. ప్రభుత్వ ఆస్తులు, దేవాదాయ, తదితర రిజిస్ట్రేషన్ చేయకూడని భూముల జాబితా సిద్ధం చేయాలని సూచించారు. ఎస్ఐఆర్ డెస్క్ పని శనివారం నాటికి పూర్తిచేయాలని ఆదేశించారు. అనంతరం ఆర్ అండ్ బీ అధికారులతో రోడ్డు అభివృద్ధి పనులపై చర్చించారు. పెద్దపల్లి బైపాస్ రోడ్డు భూ సర్వే పనులు సకాలంలో పూర్తికావాలని తెలిపారు. కూనారం రైల్వే ఓవర్ బ్రిడ్జి పెండింగ్ భూసేకరణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. రామగుండం – మారేడుపాక ఆర్ అండ్ ఆర్ కాలనీ పనులు పూర్తిచేయాలని అన్నారు. ఆర్డీవోలు గంగయ్య, సురేశ్, తహసీల్దార్లు రవీందర్ పటేల్, సునీత, రాకేశ్, యాకయ్య, జగదీశ్వర్రావు, రాజయ్య, సుమన్, సుధీర్, షఫీ పాల్గొన్నారు. స్వచ్ఛ గ్రామాలు లక్ష్యం.. గ్రామాలను పరిశుభ్రంగా తయారు చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. తన కార్యాలయంలో పంచాయతీ శాఖ పనితీరుపై ఆయన సమీక్షించారు. నవంబర్ 3 నుంచి 11వతేదీ వరకు ప్రతీగ్రా మంలో ప్రత్యేక పారిశుధ్య పనులు చేపట్టాలని, ప్లా స్టిక్ వ్యర్థాలు లేకుండా చూడాలని, ప్రజలు బయట చెత్తవేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. పాఠశాలలు, ఆస్పత్రులు, ప్రభుత్వ కార్యాలయాల పరిసరాల్లో పారిశుధ్య నిర్వహణకు అధిక ప్రాధా న్యం ఇవ్వాలని ఆదేశించారు. నవంబర్ 7వ తేదీవరకు కనీసం 60శాతం ఆస్తిపన్ను వసూలు చేయా లని అన్నారు. ఇంటింటికీ సురక్షిత తాగునీరు సరఫరా చేయాలని కలెక్టర్ సూచించారు. జిల్లా పంచాయతీ అధికారి వీరబుచ్చయ్య పాల్గొన్నారు. -
చేతికొచ్చినా కోయలేదు
నాకున్న మూడెకరాల్లో ఈసారి వరి ఏసిన. పెట్టుబడి బాగానే వచ్చింది. పంటను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చిన. ఇప్పుడు వరి పంట కోతకు వచ్చింది.. మాయదారి తుపానుతో రెండ్రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పంట కోయలేదు. పంటంతా నేలవాలింది. పెట్టుబడి నీళ్లల్లో పోసినట్లయ్యింది. ప్రభుత్వమే ఆదుకోవాలి. – బీరం నర్సయ్య, ఓదెల పత్తి నల్లబారింది నాకున్న ఎనిమిదెరాల్లో పత్తి, వరి వేసిన. వర్షాలతో పత్తి నల్లబారింది. చేతికొచ్చిన వరిపంట కోయవద్దని అధికారులు చెబుతున్నరు. కోయక పోతే గింజరాలిపోయి చేతికొచ్చే పరిస్థితి లేదు. ప్రభుత్వమే తడిసిన ధాన్యం కొనుగోలు చేసి ఆదుకోవాలి. – సుధాకార్రెడ్డి, రేగడిముద్దికుంట అప్రమత్తంగా ఉండాలి మోంథా తుపాను ప్రభావంతో వాతావరణ శాఖ జిల్లాకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. రైతులు అప్రమత్తంగా ఉండాలి. పంట చేలలో నీరు నిల్వఉండి మొక్కలు, వేర్లు కుళ్లిపోయే ప్రమా దం ఉంది. సాధ్యమైనంత వరకు నీటిని తొల గించాలి. వరి కోతలు, పత్తి ఏరడం వాయిదా వేసుకోవాలి. – శ్రీనివాస్, డీఏవో -
గ్యారంటీ ఇస్తేనే సీఎమ్మార్
పెద్దపల్లి: సీఎమ్మార్(కస్టమ్ మిల్లింగ్ రైస్) ఇవ్వ కుండా మోసం చేసే రైస్మిల్లర్లను గాడిలో పెట్టేందుకు రాష్ట్రప్రభుత్వం కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. గతసీజన్లో 50 శాతం ధాన్యం మరాడించి ప్రభుత్వానికి అప్పగించిన వారు జిల్లాలో 10 శాతం మందే ఉన్నారని సర్కార్ గుర్తించింది. ఈమేరకు బ్యాంకు గ్యారంటీ ఇచ్చిన మిల్లర్లకే సీఎమ్మార్ కేటాయిస్తామని సివిల్ సప్లయ్ డీఎం శ్రీకాంత్ ప్రకటించగా.. బుధవారం వరకు జిల్లాలోని 70 మంది రైస్మిల్లర్లు మాత్రమే బ్యాంకు గ్యారంటీ బాండ్లు సమర్పించారు. నవంబర్ మొదటివారం వరకు ధాన్యం కొనుగోళ్లు వేగవంతమవుతాయని, ఆలోగా బాండ్లు తెచ్చిఇవ్వాలని ఆయన సూచించారు. బ్యాంకు గ్యారంటీ తప్పనిసరి సీఎమ్మార్ బకాయిలపై కఠినంగా వ్యవహరించేలా గతేడాది కొత్త విధానం తీసుకొచ్చినా.. క్షేత్రస్థాయిలో అమలు కాలేదు. ఈ ఏడాది వానకాలంలో బ్యాంకు గ్యారంటీ తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులిచ్చింది. వీటిని జిల్లాలో 165 మంది రైస్మిల్లర్లకు ఇటీవల అధికారులు అందజేశారు. సీఎమ్మార్ బకాయి లు లేని రైస్ మిల్లర్లు 10శాతం, డిఫాల్ట్ మిల్లర్లు 25శాతం బ్యాంకు గ్యారంటీ ఇస్తున్నారు. 83 కొనుగోలు కేంద్రాలు ప్రారంభం జిల్లాలో ఇప్పటివరకు 83 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. నిర్దేశిత తేమశాతం ఉన్న ధాన్యం తూకం వేసి మిల్లులకు కేటాయిస్తున్నారు. 250 కొనుగోలు కేంద్రాలను నవంబర్ మొదటివారంలో ప్రారంభించనున్నారు. -
రోడ్లపై పశువులు.. ఇబ్బందుల్లో ప్రజలు
పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారులపై పశువులు తిష్టవేస్తున్నాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి సమయాల్లో వాటిని గమనించక ప్రమాదాల బారినపడుతున్నారు. ప్రమాదాల నియంత్రణకు ట్రాఫి క్ పోలీసులు.. ఆవుల కొమ్ములకు రేడియం స్టిక్లర్లు కూడా వేయించారు. అయినా ఫలితం కనిపించడం లేదని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా.. మెయిన్ రోడ్లపై పశువులు యథేచ్ఛగా సంచరించడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని కొందరు ఇటీవల కలెక్టర్ శ్రీహర్ష దృష్టికి తీసుకెళ్లారు. యజమానులు వాటిని తీసుకెళ్లేలా చూడాలని మున్సిపల్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈక్రమంలోనే తీసుకెళ్లకపోతే గోశాలకు తరలించి యజమానులకు రూ.10వేల జరిమానా విధించేలా మున్సిపల్ అధికారులు కార్యచరణ చేపట్టారు. ఎన్నిసార్లు చెప్పినా? పశువులను రోడ్లపై వదిలిపెట్టరాదని అధికారులు, సిబ్బంది అనేకసార్లు యజమానులకు సూచించా రు. హెచ్చరికలు కూడా చేశారు. కొంతకాలం క్రితం కొన్నిపశువులను గోశాలకు కూడా తరలించేందుకు చర్యలు తీసుకున్నారు. అయినా యజమానుల్లో మార్పు కనిపించడంలేదు. ప్రధాన రహదారులపై తిష్ట.. ప్రధాన మార్గాల్లోనే పశువులు తిష్టవేయడమే కా కుండా డివైడర్ల మధ్య, కాలనీల్లోని నివాసాల్లో పెంచుకుంటున్న చెట్లు, మొక్కలను పశువులు తినేస్తున్నాయి. ఈ విషయంపై అధికారులకు అనేక ఫిర్యాదులూ వస్తున్నాయి.యజమానులకు జరిమానా కోల్సిటీ(రామగుండం): పశువులు రోడ్లపైకి వ స్తే వాటి యజమానులకు రూ.10వేల చొప్పున జరిమానా విధిస్తామని రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్ అరుణశ్రీ హెచ్చరించారు. పశువులు రోడ్లపై సంచరించకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గత సెప్టెంబర్ 23వ తేదీ నుంచి రోడ్లపై సంచరిస్తున్న గోవులను సంజయ్గాంధీనగర్లోని గోశాలకు ఇప్పటి వరకు 77 పశువులను తరలించగా.. యజమానులు జ రిమానా చెల్లించి 31 పశువులను తీసుకెళ్లినట్లు తెలిపారు. తమ పశువులను గోశాల నుంచి విడిపించుకోవడానికి ఇకనుంచి రూ.10వేల చొప్పు న జరిమానాతోపాటు నిర్వహణ వ్యయం కింద రోజూ రూ.250 చొప్పున చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఇప్పటివరకు రోడ్లపై తిరుగుతున్న గో వులనే గోశాలకు తరలించగా, ఇకముందు రోడ్లు కనిపిస్తే గేదెలనూ తరలిస్తామన్నారు. -
తుపాను.. పరేషాన్
సాక్షి పెద్దపల్లి/పెద్దపల్లి: మోంథా తుపాను ప్రభావంతో జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వ ర్షాలు అన్నదాతను ఆగం చేస్తున్నాయి. ఇప్పటికే కొ ద్దిరోజులుగా అడపాదడపా కురుస్తున్న వానలు రై తులకు శాపంగా మారగా.. తాజాగా తుపాను పీడకలలా వారిని వెంటాడుతోంది. తుపాన్ నేపథ్యంలో ఈదురుగాలుల ధాటికి కోతకు వచ్చిన వరిపైరు నేలవాలుతోంది. కొనుగోలు కేంద్రాల్లో విక్రయానికి పోసిన వడ్లు తడిసిపోయాయి. పత్తి నేలరాలి నల్లబారుతోంది. పంటలను కాపాడుకునేందుకు అన్నదాతలు పడరానిపాట్లు పడుతున్నారు. ఆరుగాలం శ్రమ కళ్లెదుటే నీళ్లపాలవుతుంటే నిస్సాహాయ స్థితిలో ఉండిపోవడం తప్ప అన్నదాత ఏమీచేయలేక కన్నీటిపర్యంతమవుతున్నాడు. స్తంభించిన జనజీవనం.. భారీవర్షాలతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. రామగుండం రీజియన్లోని సింగరేణి ఓపెన్కాస్ట్(ఓసీపీ) ప్రాజెక్టుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు 12గేట్లు ఎత్తి సుమారు లక్ష క్యూసెక్కుల నీటిని దిగువన ఉన్న గోదావరి నదిలోకి వదులుతున్నారు. దీంతో నదీ పరీవాహక ప్రాంతాల్లో గొర్రె లు, పశువులకాపరులు అప్రమత్తంగా ఉండాలని ఉన్నతాధికారులు సూచనలు జారీచేశారు. ఆగిన పంట కోతలు వర్షాలతో పత్తి, వడ్లు, మొక్కజొన్న పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పత్తికాయలు దెబ్బతింటుండటంతోపాటు ఇప్పటికే ఏరిన పత్తికి తేమ సమస్యగా మారింది. కూలీలను పెట్టి సేకరించిన పత్తిని ఇంటి కి తీసుకొచ్చినా .. మార్కెట్కు తీసుకువెళ్లే పరిస్థితి లేకుండాపోయింది. మరోవైపు తుపాను ప్రభావంతో వరి పైరు వాలింది. దీంతో రైతులు కోతలు వా యిదా వేస్తున్నారు. పంట కోస్తే వడ్లను ఎలా ఆరబెట్టాలో తెలియక ఇబ్బంది పడుతున్నారు. తెంపిన మక్కకంకులు చేలలోనే ఉండిపోయి వానలతో త డిసి ముద్దవుతున్నాయి. కంకులను ఎండబెట్టుకోలేక అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడవకుండా అన్నదాతలు టార్పాలిన్ కవర్లు కప్పుతున్నారు. రేపో, మాపో వరి కోతలు చేద్దామనుకున్న రైతులు చేతికి అందివచ్చిన పంట వర్షాలకు నేలకొరుగుతుంటే చూసి లబోదిబోమంటున్నారు. దూది రైతుకు దుఃఖం మంగళవారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఈదురుగాలులు వీస్తున్నాయి. చలికి జనం వణికిపోతున్నారు. ఇలాంటి వాతావరణంలో పత్తి పంటకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. సేకరణ దశకు వచ్చిన పత్తి వర్షాలకు తడిసి చేలలోనే రాలిపోతోంది. పైగా తడిసి పత్తి రంగు మారుతోంది. ఫలితంగా దిగుబడి తగ్గిపోవడంతోపాటు గిట్టుబాటు ధర వచ్చే పరిస్థితులు కనిపించడం లేదని అన్నదాతలు వాపోతున్నారు. పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్లో పత్తి బస్తాలుజిల్లా కేంద్రంలో జలమయమైన కాలనీదంచికొడుతున్న వానవర్షంలో వాహనదారుల ఇబ్బందులుఓదెల98.5 సుల్తానాబాద్76.8 కాల్వశ్రీరాంపూర్68.3 పెద్దపల్లి55.0 ఎలిగేడు63.5 ధర్మారం36.0 సుగ్లాంపల్లి33.5 మంథని62.3 భోజన్నపేట32.0 ఎక్లాస్పూర్27.0కమాన్పూర్44.5 రామగిరి49.0ముత్తారం62.0జూలపల్లి41.0 రామగుండం10.0 -
పింఛన్ సర్టిఫికెట్లకు వేళాయె!
గోదావరిఖని: సింగరేణి రిటైర్డ్ కార్మికుల పింఛన్ నిలిచిపోకుండా సీఎంపీఎఫ్ అధికారులు దృష్టి సారించారు. ఆయా ఏరియాలకే అధికారులు వెళ్లి లైవ్సర్టిఫికెట్లు తీసుకునేలా ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం వచ్చేనెల 2 నుంచి 28వ తేదీ వరకు రామగుండం, బెల్లంపల్లి రీజియన్లో శిబిరాలు నిర్వహిస్తారు. ప్రత్యేకంగా యాప్ కూడా.. సకాలంలో పింఛన్ పొందేందుకు మొబైల్ఫోన్ ఉన్నవారు ప్లేస్టోర్లోకి వెళ్లి ఉమాంగ్ (UMANG) యాప్తోపాటు ఆధార్ ఫేస్ ఆర్డీ డౌన్లోడ్ చేసుకోలి. ఉమాంగ్యాప్లోని సర్వీస్ ఆప్షన్కు వెళ్లి పింఛ న్ హెడ్డింగ్లో లైవ్సర్టిఫికెట్ ఆప్షన్ సెలక్ట్ చేసుకోవా లి. జనరేట్ లైవ్ సర్టిఫికెట్లో జనరేట్ లైవ్ సర్టిఫికెట్ ఎంచుకొని ఫేస్ రికగ్నైజ్డ్ ఆప్షన్ ఎంచుకోవాలి. జ నరేట్ ఓటీపీపై క్లిక్ చేయాలి. దీంతో 6 అంకెల ఓ టీపీ వస్తుంది. దానిని ఓటీపీ ప్లేస్లో నమోదు చే యాలి. ఆధార్లో ఉన్నప్రకారం పేరు నమోదు చే యాలి. పింఛన్ పేమెంట్ ఆర్డర్ నంబర్ సరిగ్గా న మోదు చేయాలి. సింగరేణి రిటైర్డ్ కార్మికుడు అయి తే సర్వీస్అని, కార్మికుడి భార్య అయితే ఫ్యామిలీ అని సెలక్ట్ చేసుకోవాలి. ఆర్గనైజేషన్స్థానంలో సెంట్రల్ గోవ్ట్ అటానమస్/స్టాట్యుటరీ ఆర్గనైజేషన్/బాడీ/సొసైటీని సెలక్ట్ చేసుకోవాలి. డిస్ట్రిబ్యూషన్ ఏజెన్సీలో కోల్మైన్స్ ఫావిడెంట్ఫండ్ ఆర్గనైజేషన్ అని ఆటోమెటిక్ వస్తుంది. ఏజెన్సీ నేమ్లో కోల్మైన్స్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అని ఆటోమెటిక్ వస్తుంది. అకౌంట్ నంబర్ ప్లేస్లో మీ పింఛన్ ఏ ఖాతా నంబర్లో జమ అవుతుందో ఆ అకౌంట్ నంబర్ నమోదు చేయాలి. దీంతో లైవ్ సర్టిఫికెట్ ఆటోమెటిక్గా జనరేట్ అవుతుంది. గోదావరిఖని కార్యాలయ సమాచారం సర్టిఫికెట్ రెన్యూవల్ శిబిరాలు ఏరియా నెల తేదీలు ఆర్జీ–1 నవంబర్ 3, 4 ఆర్జీ–2 నవంబర్ 6, 7 ఆర్జీ–3 నవంబర్ 10, 11 శ్రీరాంపూర్ నవంబర్ 12, 13 మందమర్రి నవంబర్ 17, 18 భూపాలపల్లి నవంబర్ 19, 20 బెల్లంపల్లి, గోలేటి నవంబర్ 24, 25 ఈశ్వరకృప వృద్ధాశ్రమం నవంబర్ 26 సీఎంపీఎఫ్ ఆఫీస్ నవంబర్ 3 – 28 మొత్తం పింఛన్దారులు 68,886 లైవ్సర్టిఫికెట్ ఇవ్వనివారు 3,090 ప్రస్తుతం పింఛన్దారులు 66,796 -
ఆయుధం వీడిన అన్నల అడుగులు ఎటువైపు?
బడిలో తండ్రి బోధించిన పాఠాల కన్నా కళాశాలలో స్నేహితుడి దగ్గర నేర్చుకున్న విప్లవ మాటలే అతడిని అడవిబాట పట్టించాయి. గ్రామాల్లో వడ్డీ వ్యాపారుల ఆగడాలు నశించాలని, పీడీత, బాధిత పక్షాల కోసం పోరాడాలని అనుకున్నాడు. అందుకు తుపాకీనే మార్గమని భావించారు. పోరాట పంథాతోనే సమసమాజం సాధ్యమనుకుని 45 ఏళ్లు అజ్ఞాతంలో గడిపారు. మారిన కాలమాన పరిస్థితులు, అనారోగ్య సమస్యలతో తన నిర్ణయాన్ని మార్చుకుని ఆయుధం వీడి జనంలో వచ్చారు మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు పుల్లూరి ప్రసాద్రావు అలియాస్ చంద్రన్న, శంకరన్న, సోమన్న. సాయుధ పోరాటాల ద్వారా లక్ష్యాన్ని చేరుకోలేమని భావించి, ప్రజాస్వామ్య పద్ధతుల్లో వెళ్లాలని నిర్ణయించుకుని చంద్రన్న అస్త్రసన్యాసం చేయడం అటు మావోయిస్టు పార్టీలో, ఇటు ప్రజల్లోనూ చర్చకు దారి తీసింది.సాక్షి, పెద్దపల్లి: సాయుధ పోరాటం ద్వారానే రాజ్యాధికారం సాధ్యమనే సిద్ధాంతాన్ని నమ్ముకుని పనిచేసిన మావోయిస్టులు ఆయుధం వీడి జనజీవన స్రవంతిలోకి వస్తున్నారు. ఇప్పటికే జిల్లాకు చెందిన కేంద్రకమిటీ సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్రావు మహారాష్ట్ర సీఎం ఎదుట లొంగిపోగా, తాజాగా తెలంగాణ డీజీపీ వద్ద కేంద్రకమిటీ సభ్యుడు, తెలంగాణ కమిటీకి మార్గదర్శిగా వ్యవహరిస్తున్న పుల్లూరి ప్రసాద్రావు అలియాస్ చంద్రన్న లొంగిపోయాడు. ప్రాణభయంతో లొంగిపోయారా? అనారోగ్య సమస్యలతోనా.. పార్టీకి నమ్మకద్రోహం చేశారా? సాయుధ పోరాట పంథాకు కాలం చెల్లిందన్న అభిప్రాయంతో జనజీవన స్రవంతిలో కలిశారా అనేది చర్చనీయాంశంగా మారింది. మాజీ మావోయిస్టులు తదుపరి జీవితాన్ని ఎలా గడపబోతున్నారు?పునరావాస శిబిరాల్లో కాలం వెళ్లదీస్తారా? సొంత ఊళ్లకు, తమకు నచ్చిన ప్రదేశానికో వెళ్లి సాధారణ జీవనం గడుపుతారా? పాలక పార్టీలో చేరుతారా? ప్రజా ఉద్యమాల్లో పాల్గొంటారా అనేక ప్రశ్నలు ప్రజాసంఘాల్లో వ్యక్తమవుతున్నాయి.రణమా...శరణమా ?జిల్లాకు చెందిన ఇద్దరు కీలక నేతలు మల్లోజుల వేణుగోపాల్, పుల్లూరి ప్రసాద్రావు లొంగిపోగా అడవిలో ఉన్న మిగితా నేతలు ఆయుధం వీడి లొంగిపోతారా? లేక పోరాట పంథాలోనే కొనసాగుతారా అనేది ఆసక్తిగా మారింది. జిల్లా నుంచి మల్లా రాజిరెడ్డి, అప్పాసి నారాయణ, గంగిడి సత్యనారాయణరెడ్డి, ఆలేటి రామలచ్చులు, దాతు ఐలయ్య, దీకొండ శంకరయ్య, కంకణాల రాజిరెడ్డి, జూవ్వడి వెంకటేశ్వర్రావు మావోయిస్టు పార్టీలో కొనసాగుతున్నారు. కేంద్ర ప్రభుత్వం 2026 మార్చి 1 నాటికి దేశంలో మావోయిస్టులు లేకుండా చేస్తామని ప్రకటించింది. దీంతో విప్లవ పంథా కొనసాగుతుందా లేక ప్రజాపంథాలోకి మిగిలిన నేతలు వస్తారా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.కలిసి చదువుకున్నాంపుల్లూరి ప్రసాదరావు నేను వడ్కాపూర్లోనే 5 వ తరగతి వరకు, 10వ తరగతి వరకు ధూళికట్టలో కలిసి చదువుకున్నం. అప్పట్లోనే గ్రామాల్లో వడ్డీ వ్యాపారుల ఆగడాలు నశించాలని పోరాడేవాడు. చాలా సౌమ్యుడు. ఎక్కువగా మాట్లాడక పోయేది. ఇంటర్ చదివేందుకు పెద్దపల్లికి వెళ్లి ఆప్పటి నుంచి ఇప్పటి వరకు కనబడలేదు. – చెన్నమనేని సాగర్రావు, ప్రసాదరావు మిత్రుడు, వడ్కాపూర్ -
వచ్చే 48గంటలు వరికోతలు వద్దు
పెద్దపల్లి: ‘బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుపానుగా మారింది. జిల్లాలోనూ తుపాను ప్రభావం ఉంటుంది. వచ్చే 48 గంటలు భారీ వర్షాలు కురిసే నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలి. ఈ రెండు రోజులు వరికోతలు కోయవద్దు’ అని జిల్లా అదనపు కలెక్టర్ దాసరి వేణు రైతులకు సూచించారు. మొక్కజొన్న, పత్తి పంటలను సైతం మార్కెట్కు తీసుకురావొద్దని అన్నారు. నవంబర్ మొదటి వారంలో జిల్లావ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తామని వివరించారు. జిల్లాలో ఇప్పటికే ప్రారంభించిన ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు పూర్తిచేశామని పేర్కొన్నారు. మంగళవారం ‘సాక్షి’తో మాట్లాడారు. అందుబాటులో టార్ఫాలిన్లు.. నేడు, రేపు జిల్లావ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, ఇప్పటికే ప్రారంభించిన 83 కొనుగోలు కేంద్రాల్లో 7,740 వేల టార్పాలిన్లు అందుబాటులో ఉంచాం. వర్షం కారణంగా పంటలు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని జిల్లావ్యవసాయ అధికారితో పాటు ఏఈవోలను అప్రమత్తం చేశాం. హార్వెస్టర్లు వరి పంటలు కోయొద్దని సూచించాం. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడవకుండా రైతులు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. కేంద్రాల్లో 150 ప్యాడీనర్లు 334 మ్యాచర్ మీటర్లు, 989 వెయిట్ మిషన్లు ఉన్నాయి. వరితో పాటు రెండుచోట్ల మొక్కజొన్న కేంద్రాలు ప్రారంభించాం. ఇబ్బందులు లేకుండా చర్యలు కేంద్రాల్లో హమాలీ సమస్య లేదు. ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీలకు ధాన్యం తరలింపు బాధ్యతలు ఇచ్చాం. తూకం వేయకుండా మిల్లులకు తరలించి అక్కడ వేబ్రిడ్జి కాంటా వేసుకోవచ్చు. ధాన్యంలో కోత పెడితే అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు. జిల్లాలో నాలుగు లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. సన్నధాన్యానికి రూ.500 బోనస్ చెల్లిస్తాం. ధాన్యం కేటాయింపులో పైరవీలకు తావు లేదు. జిల్లాలో 158 బైల్డ్, రారైస్ మిల్లులున్నాయి. ప్రతి మిల్లు పదిశాతం బ్యాంకు గ్యారంటీ ఇవ్వాలని ఆదేశించాం. డిఫాల్ట్ మిల్లులు 25శాతం గ్యారంటీ ఇవ్వాల్సిందే. -
ప్రజాపంథాలోకి చంద్రన్న
బడిలో తండ్రి బోధించిన పాఠాల కన్నా కళాశాలలో స్నేహితుడి దగ్గర నేర్చుకున్న విప్లవ మాటలే అతడిని అడవిబాట పట్టించాయి. గ్రామాల్లో వడ్డీ వ్యాపారుల ఆగడాలు నశించాలని, పీడీత, బాధిత పక్షాల కోసం పోరాడాలని అనుకున్నాడు. అందుకు తుపాకీనే మార్గమని భావించారు. పోరాట పంథాతోనే సమసమాజం సాధ్యమనుకుని 45 ఏళ్లు అజ్ఞాతంలో గడిపారు. మారిన కాలమాన పరిస్థితులు, అనారోగ్య సమస్యలతో తన నిర్ణయాన్ని మార్చుకుని ఆయుధం వీడి జనంలో వచ్చారు మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు పుల్లూరి ప్రసాద్రావు అలియాస్ చంద్రన్న, శంకరన్న, సోమన్న. సాయుధ పోరాటాల ద్వారా లక్ష్యాన్ని చేరుకోలేమని భావించి, ప్రజాస్వామ్య పద్ధతుల్లో వెళ్లాలని నిర్ణయించుకుని చంద్రన్న అస్త్రసన్యాసం చేయడం అటు మావోయిస్టు పార్టీలో, ఇటు ప్రజల్లోనూ చర్చకు దారి తీసింది.సాక్షి, పెద్దపల్లి: సాయుధ పోరాటం ద్వారానే రాజ్యాధికారం సాధ్యమనే సిద్ధాంతాన్ని నమ్ముకుని పనిచేసిన మావోయిస్టులు ఆయుధం వీడి జనజీవన స్రవంతిలోకి వస్తున్నారు. ఇప్పటికే జిల్లాకు చెందిన కేంద్రకమిటీ సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్రావు మహారాష్ట్ర సీఎం ఎదుట లొంగిపోగా, తాజాగా తెలంగాణ డీజీపీ వద్ద కేంద్రకమిటీ సభ్యుడు, తెలంగాణ కమిటీకి మార్గదర్శిగా వ్యవహరిస్తున్న పుల్లూరి ప్రసాద్రావు అలియాస్ చంద్రన్న లొంగిపోయాడు. ప్రాణభయంతో లొంగిపోయారా? అనారోగ్య సమస్యలతోనా.. పార్టీకి నమ్మకద్రోహం చేశారా? సాయుధ పోరాట పంథాకు కాలం చెల్లిందన్న అభిప్రాయంతో జనజీవన స్రవంతిలో కలిశారా అనేది చర్చనీయాంశంగా మారింది. మాజీ మావోయిస్టులు తదుపరి జీవితాన్ని ఎలా గడపబోతున్నారు?పునరావాస శిబిరాల్లో కాలం వెళ్లదీస్తారా? సొంత ఊళ్లకు, తమకు నచ్చిన ప్రదేశానికో వెళ్లి సాధారణ జీవనం గడుపుతారా? పాలక పార్టీలో చేరుతారా? ప్రజా ఉద్యమాల్లో పాల్గొంటారా అనేక ప్రశ్నలు ప్రజాసంఘాల్లో వ్యక్తమవుతున్నాయి. రణమా...శరణమా ? జిల్లాకు చెందిన ఇద్దరు కీలక నేతలు మల్లోజుల వేణుగోపాల్, పుల్లూరి ప్రసాద్రావు లొంగిపోగా అడవిలో ఉన్న మిగితా నేతలు ఆయుధం వీడి లొంగిపోతారా? లేక పోరాట పంథాలోనే కొనసాగుతారా అనేది ఆసక్తిగా మారింది. జిల్లా నుంచి మల్లా రాజిరెడ్డి, అప్పాసి నారాయణ, గంగిడి సత్యనారాయణరెడ్డి, ఆలేటి రామలచ్చులు, దాతు ఐలయ్య, దీకొండ శంకరయ్య, కంకణాల రాజిరెడ్డి, జూవ్వడి వెంకటేశ్వర్రావు మావోయిస్టు పార్టీలో కొనసాగుతున్నారు. కేంద్ర ప్రభుత్వం 2026 మార్చి 1 నాటికి దేశంలో మావోయిస్టులు లేకుండా చేస్తామని ప్రకటించింది. దీంతో విప్లవ పంథా కొనసాగుతుందా లేక ప్రజాపంథాలోకి మిగిలిన నేతలు వస్తారా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.పుల్లూరి ప్రసాదరావు నేను వడ్కాపూర్లోనే 5 వ తరగతి వరకు, 10వ తరగతి వరకు ధూళికట్టలో కలిసి చదువుకున్నం. అప్పట్లోనే గ్రామాల్లో వడ్డీ వ్యాపారుల ఆగడాలు నశించాలని పోరాడేవాడు. చాలా సౌమ్యుడు. ఎక్కువగా మాట్లాడక పోయేది. ఇంటర్ చదివేందుకు పెద్దపల్లికి వెళ్లి ఆప్పటి నుంచి ఇప్పటి వరకు కనబడలేదు. – చెన్నమనేని సాగర్రావు, ప్రసాదరావు మిత్రుడు, వడ్కాపూర్ -
పసిబిడ్డకు ఊపిరి పోశారు
పెద్దపల్లి/పెద్దపల్లిరూరల్: ప్రసూతికి పెద్దపల్లిలోని మాతాశిశు ఆసుపత్రికి వచ్చిన గర్భిణీకి హైబీపీ రావడంతో వైద్యులు ఆపరేషన్ చేశారు. బరువు తక్కువ ఉన్న శిశువు జన్మించడంతో వైద్యుల పర్యవేక్షణలో 22 రోజులు చికిత్స అందించి మంగళవారం డిశ్చార్జి చేశారు. జూలపల్లి మండలం వెంకట్రావుపల్లికి చెందిన లావణ్య గర్భిణి కాగా.. నెలవారీ పరీక్షలకు ఈనెల మొదటివారంలో జిల్లా ఆస్పత్రికి వచ్చింది. ఆ సమయంలో బీపీ పెరగడంతో వైద్యులు తప్పనిసరి పరిస్థితుల్లో ఆపరేషన్ చేశారు. 1.3కేజీల బరువుతో మగబిడ్డ జన్మించాడు. శ్వాస సంబంధమైన ఇబ్బందులు తలెత్తాయి. ఆసుపత్రిలోని నవజాత శిశు యూనిట్లో సీపాప్ ద్వారా రెండు రోజులు కృత్రిమశ్వాస అందించారు. మరో రెండు రోజులు నాసల్ ప్రాంజ్ ద్వారా శ్వాస అందించారు. బాబు తనంతట తాను శ్వాస తీసుకుంటున్నట్లు గమనించి తల్లిపాలు తాగించారు. పసిబిడ్డతో వ్యవహరించాల్సిన పద్ధతులపై తల్లికి కంగారు మదర్కేర్ శిక్షణ ఇచ్చినట్లు ఆసుపత్రి సూపరింటెండ్ శ్రీధర్ తెలిపారు. బాబు 1.5 కేజీల బరువు పెరగడంతో మంగళవారం డిశ్చార్జ్ చేసినట్టు పేర్కొన్నారు. పసిబిడ్డకు ఊపిరిపోసిన ఎస్ఎన్ిసీయూ వైద్యులు, సిబ్బందిని సూపరింటెండ్ అభినందించారు. -
సీనియర్ సీఆర్పీ సేవలు వినియోగించుకోవాలి
పెద్దపల్లి/పెద్దపల్లిరూరల్: జిల్లాకు కేటాయించిన వరంగల్ సీనియర్ సీఆర్పీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. మంగళవారం సమీకృత కలెక్టరేట్లో మండల, గ్రామ సమాఖ్యలకు అందించే ప్రత్యేక శిక్షణపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ.. గ్రామీణ పేదరిక నిర్ములన సంస్థ– సెర్ప్ సీఈవో ఆదేశాల మేరకు జిల్లాలో వరంగల్ మహా సమాఖ్య ఆధ్వర్యంలో 8మంది సీనియర్ సీఆర్పీలతో 13 మండలాల్లో 15 సమాఖ్యలకు, 12గ్రామ సమాఖ్యలకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని ఆదేశించారు. డీఆర్డీవో కాళిందని, అదనపు డీఆర్డీవో బి.రవీందర్, డిపీఎం కే.రవి పాల్గొన్నారు. 100శాతం ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్ చేయాలి ఇందిరమ్మ ఇళ్లకు 100శాతం గ్రౌండింగ్ చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. కలెక్టరేట్లో ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమంపై సమీక్షించారు. నిర్మాణాలు పూర్తయిన ఇళ్లను ప్రారంభించాలన్నారు. మార్కింగ్ చేసిన ఇళ్లు బేస్మెంట్స్థాయికి చేరుకునేలా హౌసింగ్శాఖ అసిస్టెంట్ ఇంజినీర్లు, పంచాయతీ కార్యదర్శులు పర్యవేక్షించాలన్నారు. లబ్ధిదారులకు పెట్టుబడి సమస్య ఉంటే మహిళా సంఘాల ద్వారా రుణం ఇప్పించాలని, ఇళ్లనిర్మాణంలో అలసత్వం వహిస్తే మంజూరు చేసిన ఇళ్లను రద్దు చేయాలన్నారు. జెడ్పీ సీఈవో నరేందర్, డీపీవో వీరబుచ్చయ్య పాల్గొన్నారు. కిసాన్ కపాస్పై అవగాహన కల్పించాలి జిల్లాలో పత్తిని మద్దతు ధరకు సీసీఐ కేంద్రాల్లో విక్రయించేలా కపాస్ కిసాన్ యాప్పై విస్తృత ప్రచారం చేయాలని కలెక్టర్ శ్రీహర్ష ఆదేశించారు. మంగళవారం అడిషనల్ కలెక్టర్ వేణుతో కలిసి వానాకాలం పంట కొనుగోళ్లపై సమీక్షించారు. ఇప్పటి వరకు రెండు సీసీఐ కేంద్రాలను ప్రారంభించినట్టు తెలిపారు. జిల్లాలోని ఓదెల, శ్రీరాంపూర్ మండలాల్లో 596 ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగైందని, మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశామన్నారు. నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు చేసిన 48గంటల్లోపు రైతు ఖాతాలో డబ్బు జమచేయాలన్నారు. కలెక్టర్ను కలిసిన ఎంపీడీవోలు గ్రూప్– 1లో ఎంపికై జిల్లాకు కేటాయించిన ముగ్గురు ఎంపీడీవోలు మంగళవారం కలెక్టర్ కోయ శ్రీహర్షను మర్యాద పూర్వకంగా కలిశారు. వీరిలో మంథని ఎంపీడీవో కంకణాల శ్రీజరెడ్డి, అంతర్గాం ఎంపీడీవో వేముల సుమలత, కమాన్పూర్ ఎంపీడీవో సాదినేని ప్రియాంక ఉన్నారు. హర్షవిజిలెన్స్ వారోత్సవాల పోస్టర్ను కలెక్టర్ ఆవిష్కరించారు. హౌసింగ్ పీడీ రాజేశ్వర్, కలెక్టరేట్ ఏవో శ్రీనివాస్ పాల్గొన్నారు. -
సర్వర్ డౌన్.. కొనుగోళ్లు జాప్యం
పెద్దపల్లిరూరల్: పత్తిరైతులకు ఖరీఫ్ సీజన్ కలిసి రావడం లేదు. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు చేలు తెగుళ్ల బారిన పడడంతో పంట దిగుబడులపై ప్రభావం పడుతుందనే ఆందోళనలో అన్నదాతలున్నారు. జిల్లావ్యాప్తంగా 48,215 ఎకరాల్లో పత్తి సాగు చేయగా, 5,78,580 క్వింటాళ్ల మేర దిగుబడులు వస్తాయని అధికారులు అంచనా వేశారు. అనూహ్యంగా కురుస్తున్న వానలతో పత్తి రైతులు పరేషాన్ అవుతున్నారు. మంగళవారం కురిసిన వర్షానికి పెద్దగా పత్తి తడవకపోయినా..టార్పాలిన్ల కొరత కనిపించింది. అమ్మేటప్పుడు ఆగమాగమే రైతులు తొలివిడతగా తీసిన పత్తి దిగుబడులను అమ్ముకునేందుకు మంగళవారం జిల్లాకేంద్రంలోని మార్కెట్ యార్డుకు తీసుకొచ్చారు. ఒక్కసారిగా వర్షం కురియడంతో ఆందోళనకు గురయ్యారు. పత్తి కొంచెం తడవడంతో వ్యాపారులు సంచికి రెండు, మూడు కిలోలు తగ్గిస్తామనడంతో రైతులు వాదనకు దిగారు. మార్కెట్ చైర్పర్సన్ ఈర్ల స్వరూప, కార్యదర్శి మనోహర్, అడ్తిదారుల సమక్షంలో లచ్చయ్య అనే రైతుకు చెందిన తడిసిన పత్తి సంచిని తూకం వేసి, అంతకు ముందు వేసిన తూకానికి గల వ్యత్యాసాన్ని గుర్తించారు. దాని ఆధారంగా సంచికి ఒక కిలో కోత పెట్టేందుకు అందరూ అంగీకరించడంతో తూకం యథాతథంగా సాగింది. తూకం జరిగిన పత్తి సంచులను వెంటవెంటనే లారీల్లో పంపించి వేసిన రైతుల సమస్యను పరిష్కరించారు. సర్వర్ డౌన్తో జాప్యం మార్కెట్లో పత్తిని ఈ నామ్ పద్ధతిన కొనుగోలు చేస్తున్నారు. మంగళవారం సర్వర్డౌన్ కావడంతో కొంతసేపు కొనుగోళ్లు నిలిచిపోయాయి. రెండు గంటల పాటు జాప్యం కావడంతో ఒక్కసారిగా వర్షం కురిసింది. రైతులు అందుబాటులో ఉన్న టార్పాలిన్లను కప్పగా.. అక్కడక్కడ పత్తి సంచులు తడిసిపోయాయి. అధికారుల తీరే ఇందుకు కారణమని ఆరోపించారు. ఇక ముందు ఇలాంటి తప్పిదాలు జరగకుండా చూడాలని రైతులు కోరుతున్నారు. -
సీసీఐ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి
కమాన్పూర్(మంథని): పత్తికి మద్దతు ధర పొందడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) కొనుగోలు కేంద్రాలను రైతులు సద్విన్వియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ వేణు, కమాన్పూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు, డీఎంవో ప్రవీణ్రెడ్డి సూచించారు. మండలంలోని గొల్లపల్లి శివారులోని పరమేశ్వర కాటన్ జిన్నింగ్ మిల్లులో ఏర్పాటు చేసిన సీసీఐ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. రైతులు ముందుగా కాపాస్ యాప్లో స్లాట్బుక్ చేసుకుంటే ఏ రోజు పత్తి కొనుగోలు చేసే తేదీ, సమయాన్ని కేటాయించడం జరుగుతుందన్నారు. పత్తిలో 8శాతం తేమ ఉంటే రూ.8,110 మద్దతు ధర లభిస్తుందన్నారు. కమాన్పూర్ పీఏసీఎస్ చైర్మన్ ఇనగంటి భాస్కర్రావు, డైరెక్టర్ గుమ్మడి వెంకన్న పాల్గొన్నారు. గోదావరిఖని: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్ పాల్గొన్నారు. సోమాజిగూడ డివిజన్ పరిధిలోని ఎల్లారెడ్డిగూడ ప్రాంతంలోని 290, 291 బూత్లలో తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నవీన్యాదవ్కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను తెలియజేశారు. అభివృద్ధి యాత్ర కొనసాగాలంటే ప్రతి ఓటరు హస్తం గుర్తుకు ఓటు వేసి నవీన్యాదవ్ను గెలిపించాలని కోరారు. ముత్తారం: ముత్తారం ప్రభుత్వ జూనియర్ కళాశాలను మంగళవారం జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి డి.కల్పన తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరుశాతం పెంచాలని అధ్యాపకులకు సూచించారు. పరీక్షల్లో విద్యార్థులకు వచ్చే మార్కులు, బోధనా విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. వెనుకబడిన విద్యార్థులపై దృష్టి సారించాలని, వందశాతం ఫలితాల కోసం అధ్యాపకులు కృషి చేయలన్నారు. ఇన్చార్జి ప్రిన్సిపాల్ జీఎల్ఎన్రావు ఉన్నారు. పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్యార్డు ఆవరణలో మంగళవారం పత్తి క్వింటాల్కు గరిష్ట ధర రూ.6,788 పలికిందని ఇన్చార్జి కార్యదర్శి మనోహర్ తెలిపారు. కనిష్ట ధర రూ.5,371, సగటు ధర రూ.6,571గా నమోదైందని వివరించారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి 321మంది రైతులు తెచ్చిన 907 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేసినట్లు వివరించారు. ధర్మారం: ధర్మారం మండలం రచ్చపల్లి ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు కిడ్డీబ్యాంకు ఏర్పాటు చేసుకున్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సముద్రాల వంశీమోహనాచార్యులు పాఠశాలలో జంకుఫుడ్ను నిషేధించారు. తల్లిదండ్రులు ఇచ్చే పాకెట్ మనీ దాచిపెట్టుకునేందుకు కిడ్డీబ్యాంకు నిర్వహించుకోవాలని సూచించారు. స్పందించిన విద్యార్థులు కిడ్డీబ్యాంకు కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. లంచ్ టైంలో డబ్బులు జమచేయటం, అవసరం ఉన్న వారు తీసుకోవటం జరుగుతుందని ప్రధానోపాధ్యాయుడు తెలిపారు. పొదుపు చేసిన డబ్బులను విద్యార్థులు బుక్స్, పెన్షిల్ అవసరాల కోసం వినియోగించుకునేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. -
మూడు క్వింటాళ్లు తెచ్చిన
నాకు ఉన్న ఎకరం భూమిలో పత్తి పంట సాగుచేసిన. ఈ సారి కురిసిన వానలకు చేను ఎర్రబారి పత్తి అంతంత మాత్రంగానే పండింది. మంగళవారం మూడుక్వింటాళ్ల దాక పత్తి తెస్తే తూకం వేసుడు ఆలస్యమైంది. ఈ లోగా వాన కురవడంతో తడవకుండా సంచులపై కప్పేతందుకు టార్పాలిన్లు కూడా లేవు. – వొడ్నాల ఎల్లయ్య, నాగారం మార్కెట్కు వచ్చిన పత్తి తూకం వేయడంలో సర్వర్ డౌన్ కావడంతో కొంత జాప్యం జరిగింది. ఈ లోపే వర్షం కురియడంతో అప్రమత్తమై అందుబాటులో ఉన్న టార్పాలిన్లు ఇచ్చాం. పత్తి తడిసిన విషయమై వ్యాపారులు, రైతులను సముదాయించి సమస్య పరిష్కరించాం. – మనోహర్, ఇన్చార్జి కార్యదర్శి మార్కెట్యార్డులో ధాన్యం, పత్తి దిగుబడులను మద్దతు ధరకు అమ్ముకునేందుకు వచ్చే రైతులకు అండగా ఉంటాం. ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకుంటాం. ఽఇప్పటికే రైతుల సౌకర్యం కోసం ప్లాట్ఫాంలు వినియోగంలోకి తేవడం, వెలుగు కోసం విద్యుత్ టవర్లను ఏర్పాటు చేయించాం. – ఈర్ల స్వరూప, మార్కెట్ చైర్పర్సన్ -
ఎత్తిపోతలు ఉత్తవేనా?
మంథని: పోతారం – విలోచవరం గ్రామాల మధ్య చేపట్టిన ఎత్తిపోతలపై అన్నదాతల్లో ఆశలు సన్నగిల్లుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మంథని మండలం సిరిపురం సమీప పార్వతీ బ్యారేజీకి అనుసంధానంగా గత ప్రభుత్వంలో ఎత్తిపోతల ప్రతిపాదించారు. ఇది ఎప్పుడు పూర్తవుతుందా? అని రైతులు ఐదేళ్లకుపైగా నిరీక్షిస్తున్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో జిల్లాలోని ధర్మారం మండలం పత్తిపాకలో చేపట్టినప్రతిపాదిత బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ద్వారా మంథని ప్రాంత టేలెండ్ రైతుల కష్టాలు తీర్చుతామనే హామీలూ కాల్యరూపం దాల్చడంలేదు. తలాపునే గోదావరి .. సాగునీటికి తంటాలు జిల్లాలో మంథని నియోజకవర్గం టేలెండ్ ప్రాంతం కావడంతో వర్షాధార పంటలే పండిస్తున్నారు. తలాపునే గోదావరి నది ఉన్నా సాగునీటి అవస్థలు తప్పడంలేదు. ఎగువన ఉన్నన ఎస్సారెస్పీ నీరు అన్నిప్రాంతాలకు చేరడం లేదు. డీ–83 ద్వారా సరఫరా చేసే సాగునీరు కమాన్పూర్, రామగిరి మండలాల్లోని కొన్ని గ్రామాల్లోగల ఆయకట్టుకే.. అదికూడా ఆరుతడి పంటలకే సరిపోతోంది. మంథని, ముత్తారం, రామగిరి మండలాల్లోని చివరి ఆయకట్టుకు చుక్కనీరు అందడం లేదు. దీంతో సాగు భూములు ఏళ్లుగా బీళ్లుగా ఉంటున్నాయి. డీ–83 కాలువుపై భారం తగ్గించడంతోపాటు ఎస్సారెస్పీ ఆయకట్టులోని 20 వేల ఎకరాలు, టేలెండ్లోని చివరి భూములు, కొత్తగా 10 వేల ఎకరాలను సాగులోకి తీసుకురావడం కోసం గత ప్రభుత్వం పోతారం వద్ద ఎత్తిపోతలకు ఐదేళ్ల క్రితం ప్రణాళిక రూపొందించింది. రూ.320 కోట్లతో ప్రతిపాదనలు పోతారం–విలోచవరం మధ్య ప్రతిపాదించిన ఎత్తిపోతలతో 3 టీఎంసీలు ఎత్తిపోయాలని అధికారు లు ప్రతిపాధించారు. ఇందుకోసం పోతారం నుంచి సుందిళ్ల, ఎల్–8 నుంచి చల్లపల్లి, ఎల్–6 నుంచి కన్నాల వరకు మూడు పైపులైన్లు నిర్మించాలని నిర్ణయించారు. పథకం కోసం మొత్తం రూ.320 కోట్లతో అంచనాలు రూపొందించగా.. నిధుల మంజూరుకు ఆర్థికశాఖ అనుమతి లభించింది. కానీ, ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు మంజూరు కాలేదు. రాష్ట్రంలో కొత్తం ప్రభుత్వం కొలువుదీరడం.. కాళేశ్వరం ప్రాజెక్టు లోపాలపై రగడ కొనసాగుతున్న క్రమంలో ఎత్తిపోతలు ప్రారంభం కావడం సులువేమీకాదని నిపుణులు భావిస్తున్నారు. ప్రత్యామ్నాయ మార్గాలపై ఆశలు.. సుమారు 20 వేల ఎకరాల ఆయకట్టు సాగునీటి కష్టాలు తీర్చేందుకు మంత్రి శ్రీధర్బాబు ప్రత్యా మ్నాయ ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఇప్పటికే సూచించారు. ఇందుకోసం జిల్లాలోని ధర్మారం మండలం పత్తిపాకలో బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ద్వారా మంథని ప్రాంతానికి వచ్చే డీ–83, –86 కాలువలకు అనుసంధానం చేయాలని ప్రతిపాదించారు. ఆ దిశగా ప్రయత్నాలు ఎక్కడా సాగడంలేదు. టేలెండ్ ప్రాంతాల్లోని భూములు సాగులోకి తీసుకువచ్చేలా ఎత్తిపోతలు, లేదా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. -
పనులు చేపడుతూనే జవాబిస్తాం
గోదావరిఖని: అభివృద్ధి పనులు చేపడుతూ, తమ పనితీరుతోనే ప్రజలకు జవాబిస్తామని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్ అన్నారు. నగరంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సామాన్యులకు నష్టం కలిగించే పనులు చేప్టబోమని, అభివృద్ది విషయంలో రాజీపడే ప్రసక్తేలేదని అన్నారు. నియోజవర్గంలో రూ.676.50కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని ఎమ్మెల్యే తెలిపారు. మరో రూ.వంద కోట్లతో సింగరేణి కార్మికవాడల్లో ప్రగతిపనులు చేపట్టిందన్నారు. ఎస్టీపీపీల ద్వారా మురుగునీటిని శుద్ధి చేస్తామని చెప్పారు. బీ –గెస్ట్హౌస్ వద్ద ఐర్లాండ్ నిర్మిస్తున్నట్లు తెలిపారు. రూ.7.5కోట్లతో ప్రభుత్వ జూనియర్ కాలేజీ భవనం నిర్మిస్తామని ఆయన పేర్కొన్నారు. ఆర్ఎఫ్సీఎల్ బాధితులు ఫిర్యాదు చేస్తే చర్యలు తీ సుకుంటామని ఆయన అన్నారు. నాయకులు బొంతల రాజేశ్, మహంకాళి స్వామి, మారెల్లి రాజిరెడ్డి, లింగస్వామి, పెద్దెల్లి ప్రకాశ్, ముస్తాఫా, దీటి బాలరాజు, కొలిపాక సుజాత తదితరులు పాల్గొన్నారు. -
డ్రగ్స్ రహిత సమాజం నిర్మిద్దాం : జడ్జి స్వరూపరాణి
పెద్దపల్లి/పెద్దపల్లిరూరల్: డ్రగ్స్ రహిత సమా జ నిర్మాణం కోసం కృషి చేయాలని సీనియర్ సివిల్ జడ్జి స్వప్నరాణి కోరారు. డ్రగ్స్తో కలిగే నష్టాలపై అవగాహన కల్పించేందుకు స్థానిక మున్సిపల్ కార్యాలయంలో సోమవారం ము గ్గుల పోటీలు నిర్వహించారు. జడ్జి హాజరై మా ట్లాడారు. చట్టాలపై ప్రతీఒక్కరు అవగాహన క లిగి ఉండాలన్నారు. పిల్లలతో స్నేహపూర్వకంగా ఉంటూ గుడ్టచ్, బ్యాడ్టచ్పై అవగాహన కలిగించాలని సూచించారు. మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్, జండర్ స్పెషలిస్ట్ సుచరిత, మె ప్మా ఇన్చార్జి టీఎంసీ స్వప్న పాల్గొన్నారు. వెండి నాణేలపై విచారణ జూలపల్లి(పెద్దపల్లి): చీమలపేటలోని ఓ పా డుబడిన ఇంటిస్థలాన్ని చదును చేస్తుండగా ల భించిన వెండి నాణేలపై రెవెన్యూ అధికారులు సోమవారం విచారణ ప్రారంభించారు. శనివా రం సాయంత్రం నాణేలు లభించగా బయట కు పొక్కనీయలేదు. ఆదివారం బహిర్గతం కా వడంతో గ్రామస్తులు మరికొన్నింటి కోసం ఆ స్థలంలో వెతకడం ప్రారంభించారు. సమాచా రం అందుకున్న పోలీసులు విచారణ జరపగా 9 నాణేలు లభించాయి. ఈమేరకు నాయబ్ తహసీల్దార్ అనిల్ కుమార్ సోమవారం విచారణ జరిపారు. నాణేలపై ఒకవైపు చార్మినార్, మరోవైపు ఉర్దూ అక్షరాల్లో రాసి ఉందని అధి కారులు తెలిపారు. ఇవి 1900వ సంవత్సరాని కి చెందినవిగా భావిస్తున్నామని, 10 నాణేలు స్వాధీనం చేసుకున్నామని పోలీస్స్టేషన్లో అ ప్పగిస్తామని నాయబ్ తహసీల్దార్ తెలిపారు. ఒక్కోటి ఒక తులం బరువు ఉందన్నారు. క్వింటాల్ పత్తి రూ.7,017 పెద్దపల్లిరూరల్: స్థానిక వ్యవసాయ మార్కెట్యార్డులో సోమవారం పత్తి క్వింటాల్కు గరిష్టంగా రూ.7,017 ధర పలికింది. కనిష్టంగా రూ.5,501, సగటు ధర రూ.6,750గా నమో దు అయ్యిందని మార్కెట్ ఇన్చార్జి కార్యదర్శి మనోహర్ తెలిపారు. జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన 472 మంది రైతులు మార్కెట్కు తెచ్చిన 1,273 క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేసినట్లు ఆయన వివరించారు. హమాలీల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి పెద్దపల్లి: హమాలీల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎరవెల్లి ముత్యంరావు డిమాండ్ చేశారు. కలెక్టరేట్ ఎ దుట హమాలీలతో కలిసి సోమవారం ధర్నా చేశారు. ఆయన మాట్లాడుతూ, కూలిరేట్లు పెంచాలన్నారు. బీమా, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వమే గుర్తింపు కా ర్డులు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. అనంతరం అడిషనల్ కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. నాయకులు సిపెల్లి రవీందర్, అంజయ్య, గంగయ్య, సత్తయ్య, తిరుపతి, శంకరయ్య, రాజవెల్లి, సత్తయ్య, తిరుపతి, కనకయ్య, నంబయ్య, గట్టయ్య, శ్రీనివాస్, క్యా దాషి నర్సయ్య, దేవయ్య పాల్గొన్నారు. ఇప్పుడే వరికోతలు వద్దు ఎలిగేడు(పెద్దపల్లి): రానున్న మూడు రోజుల పాటు జిల్లావ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందనే వాతావరణ శాఖ సూచనల నేపథ్యంలో రైతులు వరి కోతలు చేపట్టవద్దని జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాస్ సూచించారు. సుల్తాన్పూర్లోని వరి పొలాలను సోమవారం ఆయన పరిశీలించారు. రైతు ఊర సత్యనారాయణరావు తన పొలంలో సాగు చేసిన దాన్ –75 రకం వరిపంట పిలకలు, గొలుసులు, గింజబరువు పరిశీలించారు. త్వరలోనే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. మండల వ్యవసాయ అధికారి ఉమాపతి, ఏఈవో గణేశ్, రైతులు పాల్గొన్నారు. -
ఐదేళ్లుగా బీడు
తంగెళ్లకుంట కింద ఉన్న నా రెండెకరాలు ఐదేళ్లుగా బీళ్లు గానే ఉంటున్నయ్. వర్షాకాలంలో చెరువు నిండితే పంట వేస్తంది. అదికూడా చేతి కందేది నమ్మకం లేదు. ఈ సారి కూడా వడ్లు అలికినం. ఎండిపోయాయి. పొ లాలకు సరిపడా సాగునీళ్లు అందేలా చూడాలి. – అక్కపాక శ్రావణ్, రైతు మట్టికుప్పలతో ఇబ్బంది తంగళ్లకుంటకు సమీపంలోనే సింగరేణి ఓపెన్కాస్టు మట్టి కుప్పలు ఉన్నయి. పొలాలకు నీరు వచ్చేందుకు వీలుకావడంలేదు. ఎవుసం బావిలో నీళ్లు ఉన్నన్నిరోజులు పంటలు వేసిన. – దేవళ్ల విజయ్కుమార్, రైతు ప్రణాళికలు సిద్ధం టేలెండ్ ఏరియాలో సాగునీటి ఇబ్బందులు తీర్చేందుకు మంత్రి శ్రీధర్బాబు ఆదేశాల మేరకు ప్రణాళికలు సిద్ధం చేశాం. పత్తిపాక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్తో ఎస్సారెస్పీ డీ–83, – 86 కాలువలను అనుసంధానిస్తాం. దీనిద్వారా టేలెండ్ ప్రాంత చివరి ఆయకట్టుకూ సాగునీరు అందుతుంది. – బలరామయ్య, ఈఈ, నీటిపారుదల శాఖ -
సమస్యలు పరిష్కరించాలి
పెద్దపల్లి/పెద్దపల్లిరూరల్: ప్రజావాణి ద్వారా అర్జీ ల రూపంలో అందే సమస్యలు సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ వేణు ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం జరిగిన ప్రజావాణి కార్య క్రమం ద్వారా ఆయన ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఓదెల మండలం జీలకుంటలోని దార సతీశ్.. సర్వే నంబరు 563లోగల 16 గుంటల ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని ఫిర్యాదు చేయగా.. తగిన చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ను ఆదేశించారు. పాలకుర్తి మండలం కుక్కలగూడూరుకు చెందిన మంథని లక్ష్మి ఉరఫ్ సంధ్య.. సర్వే నంబర్ 309లో తనకు ఐదెకరాలను లొంగిపోయిన నక్సల్స్ పునరావాసం కింద కేటాయించాలని విన్నవించగా.. ప్రతిపాదనలు తయారు చేయాలని అధికారులకు సూచించారు. తన పోషణ విస్మరించి ఇంట్లోంచి గెంటేసిన కుమారుడు శ్రీధర్పై చర్యలు తీసుకోవాలని రామగుండం మండలం వీర్లపల్లికి చెందిన భోజరాజు దరఖాస్తు చేయగా.. తగిన చర్యలు తీసుకోవాలని ఆర్డీవోకు సూచించారు. పెద్దపల్లి కమాన్వాడకు చెందిన వేణు మాధవ్.. కమర్షియల్ ఏరియా వెనకాల ఖాళీస్థలం చిత్తడిగా ఉండడంతో పాములు ఇళ్లలోకి వస్తున్నాయని అర్జీపెట్టారు. తగిన చర్యలు మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు. -
కొత్తవారికే లక్కు
సాక్షి, పెద్దపల్లి: ఎవరి ముఖంలో చూసినా టెన్షన్.. లక్కీడ్రాలో తమపేరు వస్తుందా? రాదా? అనే ఆందోళనే కనిపించింది. అసలే ఒక్కో వైన్స్షాపు కోసం పదుల సంఖ్యలో దరఖాస్తు చేశారు. అందుకే ఏమవుతుందో? ఏమో? అనే ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. రెండేళ్లకాల వ్యవధి కోసం వైన్స్షాపుల నిర్వహణ బాధ్యతలు లభించినవారు ‘పుల్లు’ జోష్తో ఉప్పొంగారు. అదృష్టం వరించని వారు దేవు‘డ్రా’! అనుకుంటూ నిట్టూర్చారు. ఇది పెద్దపల్లి శివారులోని స్వరూప గార్డెన్స్ ఆవరణలో సోమవా రం కనిపించిన ఉత్కంఠ భరితమైన దృశ్యం. అదృష్టం పరీక్షించుకునేందుకు.. ఎలాగైనా మద్యం దుకాణం సొంతం చేసుకోవాల న్న ఉద్దేశంతో పదుల సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నవారు కొందరైతే.. అదృష్టాన్ని పరీక్షించుకుందామని పోటీపడ్డారు మరికొందరు. దీంతో ఒక్కో వైన్స్షాప్నకు సగటున 20 మంది పోటీపడ్డారు. ఈక్రమంలో ఎకై ్సజ్ సూపరింటెండెంట్ మహిపాల్రెడ్డి అధ్యక్షతన మద్యం దుకాణాల కేటాయింపు కోసం సోమవారం డ్రా నిర్వహించారు. అదనపు కలెక్టర్ అరుణశ్రీ హాజరై డ్రాలో ఎంపికై న వారిపేర్లు ప్రకటించారు. ఒక్కో పేరు పిలుస్తూనే డ్రాలో వెళ్లిన దుకాణం నంబరును దరఖాస్తుదారులకు చూపించారు. ఈ ప్రక్రియ మొత్తాన్ని వీడియోలో చిత్రీకరించారు. దుకాణాలు దక్కించుకున్న వారు వార్షిక లైసెన్స్ ఫీజులో ఆరోవంతు చెల్లించి ప్రొవిజినల్ లై సెన్స్లు పొందారు. సుమారు 2,000 మంది వరకు దరఖాస్తుదారులు ఈ కార్యక్రమానికి హాజరు కావడంతో గార్డెన్స్ ఆవరణ సందడిగా కనిపించింది. మొత్తంగా 74 దుకాణాల్లో గౌడ సామాజికి వర్గానికి 13, ఎస్సీలకు 8, మహిళలకు 16 మద్యం దుకాణాలు దక్కాయి. వ్యాపారంతో సంబంధంలేనివారే.. మద్యం వ్యాపారంతో సంబంధం లేనికొత్త వ్యక్తులు ఈసారి తెరపైకి వచ్చారు. చాలాచోట్ల గ్రూపులుగా ఏర్పడి పదుల సంఖ్యలో దరఖాస్తు చేశారు. వీరికి ధీటుగా పాతవ్యాపారులు సైతం వందల సంఖ్య లో దరఖాస్తు చేసినా.. లాటరీలో వారికి సింగిల్ డిజిట్ దుకాణానికి మించి రాలేదు. అదృష్టం కలిసిరావాలని కొందరు తమ కుటుంబ సభ్యుల పేరిట దరఖాస్తు చేశారు. దీంతో 16మంది మహిళలను వైన్స్ షాపులు వరించాయి. భారీ పోలీస్ బందోబస్తు బందంపల్లిలోని స్వరూప గార్డెన్స్లో డ్రా సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీబందోబస్తు ఏర్పాటు చేశారు. దరఖాస్తుదారులు, వారి బంధువులు భారీగా రావడంతో వారి వాహనాలతో ఆ ప్రాంతం హడావుడిలా కనిపించింది. మరోవైపు.. లోనికి మొబైల్ఫోన్లను అనుమతించకపోవడంతో చాలామంది ఇబ్బందులకు గురయ్యారు.పెద్దపల్లి: జిల్లాలోని మద్యం దుకాణాలను పూర్తిపారదర్శకంగా, డ్రా పద్ధతిన కేటాయించామని అదనపు కలెక్టర్ అరుణశ్రీ తెలిపారు. పెద్దపల్లి సమీపంలోని బందంపల్లి స్వరూప గార్డెన్స్లో సోమవారం మద్యం దుకాణాల కేటాయింపు కోసం డ్రా నిర్వహించారు. అరుణశ్రీ మాట్లాడుతూ, జిల్లాలోని మొత్తం 74 మద్యం దుకాణాల కోసం 1,507 దరఖాస్తులు అందాయన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం రిజర్వుచేసిన వాటితోపాటు జనరల్ కేటగిరీలోని వైన్స్షాప్లను లాటరీ పద్ధతిన కేటాయించామని ఆమె వివరించారు. ఈ మొత్తం ప్రక్రియను వీడియోలో చిత్రీకరించారని చెప్పారు. ఎకై ్సజ్ సూపరింటెండెంట్ మహిపాల్రెడ్డి, దరఖాస్తుదారులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. చక్రం తిప్పునున్న వ్యాపారులు లిక్కర్ మాఫియాలో రాటుతేలిన వ్యాపారుల్లో కొందరికి దుకాణాల రాకపోవడం.. మద్యం వ్యాపారంతో సంబంధంలేని వారిని వైన్స్షాపులు వరించడంతో వ్యాపారులు ఒకింత నిరాశలో ఉన్నారు. పదుల సంఖ్యలో దరఖాస్తు చేసినా.. లాటరీ తగలనివారు.. దుకాణాలు దక్కిన వారికి గుడ్విల్ చెల్లించి షాప్స్ సొంతం చేసుకోవాలనే ప్రయత్నాలు ఇప్పటికే ఆరంభించారు. కొత్తగా వచ్చినవారి గురించి ఆరా తీస్తున్నారు. భారీగా గుడ్విల్ ఆఫర్ చేసి, వైన్స్షాపులు దక్కించుకునేందుకు యత్నిస్తున్నారు. -
లైసెన్స్డ్ సర్వేయర్లు వస్తున్నారు..
పెద్దపల్లి: జిల్లాలోని భూ సంబంధిత సమస్యల పరిష్కారం లక్ష్యంగా యంత్రాంగం పటిష్ట చర్యలు తీ సుకుంటోంది. ఇందులో భాగంగా ఎంపికచేసిన లై సెన్స్డ్ సర్వేయర్లకు ఇటీవల శిక్షణ కూడా ఇచ్చింది. వీరు ఇటీవల సీఎంరేవంత్రెడ్డి నుంచి సర్టిఫికెట్లు అందుకున్నారు. తొలిదశలో జిల్లాకు కేటాయించిన వారిలో 68 మంది ఉన్నారు. రెండోదశలో 81మందికి సోమవారం శిక్షణ ఇచ్చారు. వీరికి త్వరలోనే నియామకపత్రాలు అందజేస్తారని తెలిసింది. భూ సమస్యలకు పరిష్కారం.. భూ సర్వే, ఇతర సమస్యల పరిష్కారం కోసం రైతు లు దరఖాస్తు చేసి ఏళ్లు గడుస్తోంది. సర్వేయర్లు లేక సరిహద్దు సమస్యలు తీరడం లేదు. దీంతో రైతుల మధ్య వివాదాలు, ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. వీటిని పరిష్కరించే లక్ష్యంతో ప్రభుత్వం లైసెన్స్డ్ సర్వేయర్లను నియమిస్తోంది. మెరుగైన సేవలు లక్ష్యం.. భూ వివాదాల పరిష్కారం, రైతులకు మెరుగైన సేవలు అందించడం లక్ష్యంగా ధరణి స్థానంలో భూభారతిని అందుబాటులోకి తీసుకొచ్చారు. అంతేకాదు.. గ్రామస్థాయిలో పాలనను చక్కదిద్దేందుకు ఇటీవల పాలనాధికారులను నియమించా రు. అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రతీరిజిస్ట్రేషన్కు భూపటం జతచేయడం తప్పనిసరి చేశారు. ఇందులో లైసెన్స్డ్ సర్వేయర్ల పాత్ర అత్యంత కీలకంగా మారింది. దీంతో వీరి నియామకంపై ప్ర భు త్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈక్రమంలోనే జిల్లాకు లైసెన్స్డ్ సర్వేయర్లను నియమిస్తోంది. -
ప్రాణం తీసిన కిటికీ వివాదం
కరీంనగర్ కార్పొరేషన్: చిన్న కిటికీ వివాదానికి నిండు ప్రాణం బలైన ఘటన కరీంనగర్లో సంచలనం సృష్టించింది. పక్కింటి వాళ్లతో పాటు నగరపాలక సంస్థ టౌన్ప్లానింగ్ అధికారుల వేధింపులతోనే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు మృతుడు సూసైడ్ నోట్లో పేర్కొనడం కలకలం రేపుతోంది. కరీంనగర్ సిటీలోని రాఘవేంద్రనగర్లో వడ్లకొండ లక్ష్మీరాజం శనివారం పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. నిబంధనల పేరిట తమ ఇంటి కిటికీలను నగరపాలక సంస్థ అధికారులు పదేపదే తొలగించడం అవమానంగా భావించి ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబసభ్యులు తెలిపారు. తన ఇంటి కిటికీ విషయంపై పక్కింటి వాళ్లతో పాటు, నగరపాలక సంస్థ టౌన్ప్లానింగ్ అధికారులు వేణు, ఖాదర్ వేధించడంతోనే చనిపోతున్నట్లు లక్ష్మిరాజం సూసైడ్ నోట్ రాశాడు. దాదాపు మూడేళ్లుగా పక్కింటివాళ్లతో కిటికీల విషయంపై లక్ష్మిరాజంకు వివాదం నడుస్తోంది. సెట్బ్యాక్ నిబంధనలు ఉల్లంఘించారని పేర్కొంటూ టౌన్ప్లానింగ్ అధికారులు కిటికీని 2023లో మొదటిసారి తొలగించారు. మళ్లీ ఏర్పాటు చేశారంటూ ఈ సంవత్సరం ఆగస్టులో మరోసారి తొలగించారు. తన కిటికీలు తొలగించడం, పక్కింటి వాళ్లపై తాను ఫిర్యాదు చేస్తే పట్టించుకోకపోవడంతో మానసిక వేదనతో లక్ష్మిరాజం ఆత్మహత్య చేసుకున్నాడని ఆయన కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. తన భర్త ఆత్మహత్య చేసుకోవడానికి కారణమైన పక్కింటి వాళ్లతోపాటు, నగరపాలక సంస్థ టౌన్ప్లానింగ్ అధికారులు వేణు, ఖాదర్పై చర్య తీసుకోవాలని లక్ష్మిరాజం భార్య శారద వన్టౌన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉంటే పక్కింటి వ్యక్తి ఫిర్యాదు, హైకోర్టు ఆదేశాల మేరకే తాము నిబంధనలు ఉల్లంఘించి నిర్మించిన కిటికీలు తొలగించామని డిప్యూటీ సిటీ ప్లానర్ బషీర్ తెలిపారు. -
నిందితులపై డేగకన్ను
పీడీయాక్ట్ కేసులు గోదావరిఖని: రౌడీషీటర్లు పేట్రేగుతున్న నేపథ్యంలో రామగుండం కమిషరేట్ పోలీసుశాఖ అప్రమత్తమైంది. ప్రధానంగా పాతనేరస్తులపై డేగకన్ను వేసింది. ఇప్పటికే పీడీ యాక్ట్, రౌడీ, హిస్టరీ షీట్లను పోలీస్స్టేషన్లకు పిలిపించి కౌన్సెలింగ్ ఇస్తున్న పోలీస్ అధికారులు.. నిజామాబాద్ జిల్లాలో కానిస్టేబుల్ హత్య, హైదరాబాద్లో డీసీపై హత్యాయత్నం జరగడంతో కమిషనరేట్ పరిధిలో పాతనేరస్తుల కదలికలపై డేగకన్ను వేశారు. పీడీయాక్ట్ కేసులు 152.. సమాజంలో ఉద్రిక్తతలు సృషిస్తూ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న నేరస్తులపై కఠినంగా వ్యవహరించాలని రామగుండం కమిషనరేట్లోని పోలీస్ అధికారులు నిర్ణయించారు. పాత నేరస్తులపై నిఘా పెంచారు. ఈ క్రమంలోనే మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో పీడీయాక్ట్లు 152కి చేరాయి. పీడీయాక్టు కేసుల నమోదులో హైదరాబాద్ తర్వాత రామగుండం కమిషనరేట్ అగ్రస్థానంలో నిలిచిందని పోలీసు అధికారులు తెలిపారు. ఠాణాల వారీగా జాబితా.. పోలీస్స్టేషన్ల వారీగా నేరస్తుల జాబితా సేకరించిన పోలీస్ అధికారులు.. నేరస్తుల తోక ఊపితే పీక నొక్కుతామని స్పష్టం చేస్తున్నారు. కోల్బెల్ట్ ప్రాంతంలో రామగుండం పోలీస్ కమిషనరేట్ ఏర్పాటుతో శాంతిభద్రతలు అదుపులోకి వచ్చినా.. భూ మాఫియా, రౌడీయిజం, గుట్కా దందా, కలప, రేషన్ బియ్యం అక్రమ రవాణా, దొంగలపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ప్రజాశాంతికి భంగం కలిగించే వారిని ఎట్టిపరిస్థితుల్లో వదిలిపెట్టొద్దని, నేరస్తుల ఏరివేత ద్వారానే శాంతిభద్రతలు అదుపులో ఉంటాయని స్పష్టం చేస్తున్నారు. దొంగలపైనే పీడీ యాక్టులు రామగుండం కమిషనరేట్లో పీడీయాక్టులు కేసులు ఇప్పటివరకు 152కు చేరాయి. పెద్దపల్లిలో 86, మంచిర్యాలజిల్లాలో 66 పీడీయాక్ట్ కేసులు నమోదయ్యాయి. ఎక్కువగా దొంగలపైనే పీడీయాక్టు కేసులు నమోదు చేస్తున్నారు. రెండోస్థానంలో సమాజంలో భయాందోళ సృష్టించే రౌడీలపై అమలు చేస్తున్నారు. మూడు కేసులు నమోదైన వారిపై పీడీయాక్టు కేసులు నమోదు చేస్తున్నారు. వరుస దొంగతనాలు, రౌడీయిజం, హత్యలు, పేకాట గ్యాంగ్లు, కలపస్మగ్లర్లు, అక్రమ భూదందాలు నిర్వహించే వారిపై ఈ కేసులు పెడుతూ పాతనేరస్తులకు హెచ్చరికలు జారీచేస్తున్నారు. రౌడీషీటర్లపై ప్రత్యేక నిఘా.. రౌడీషీటర్లు, హిస్టరీ షీట్లపై పోలీసులు కన్నేసి ఉంచారు. ప్రతీరౌడీషీటర్ ఇంటికి బ్లూకోల్ట్స్ సిబ్బంది, పోలీసు అధికారులు వెళ్లి వివరాలను సేకరిస్తున్నా రు. రౌడీషీటర్లతో జాగ్రత్తగా ఉండాలని ఆదేశాలు ఉన్నాయి. నేరస్తులను ఠాణాకు తరలించే క్రమంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.ఏడాది పెద్దపల్లి మంచిర్యాల మొత్తం 2017 01 0 01 2018 05 02 07 2019 16 11 27 2020 27 16 43 2021 30 33 63 2022 0 0 0 2023 07 02 09 2024 – 01 01 2025 0 01 01 మొత్తం 86 66 152 డీసీలు, కేడీలు, రౌడీలు, సస్పెక్ట్ల సమాచారం డీసీలు 79 కేడీలు 40 రౌడీలు 484 సస్పెక్ట్లు 1,310 మొత్తం 1,913 -
యువతకు ఉపాధి కల్పనే లక్ష్యం
సాక్షి,పెద్దపల్లి: పార్లమెంట్ పరిధిలోని యువతకు ఉపాధి కల్పించడమే తన లక్ష్యమని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. పెద్దపల్లి నూతన ప్రెస్క్లబ్ను ఆదివారం ఆయన సందర్శించిన అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఒకప్రాంతం అభివృద్ధికి రోడ్లు, రైల్వే, విమాన సర్వీసు సేవ లు విస్తృతం కావాలన్నారు. టూరిజాన్ని అభివృద్ధి చేస్తే సందర్శకుల రాక పెరుగుతుందని అన్నారు. తద్వారా ఉపాధి అవకాశాలు మెరగవుతాయని, పె ట్టుబడులు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయని తెలిపారు. పెద్దపల్లి ప్రజల ఆశీర్వాదంతో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో భారతదేశ ప్రతినిధిగా మాట్లాడే అవకాశం దక్కడం సంతోషంగా ఉందన్నారు. ‘కాకా’ వెంకటస్వామి పింఛన్ హక్కుల కోసం అనేక పోరాటాలు చేశారని, జెనీవాలో ప్రసంగించారని గుర్తుచేశారు. 40ఏళ్ల తర్వాత తెలంగాణ నుంచి అదే వేదికపై తను మాట్లాడటం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. దుబాయ్లోని ఇన్వెస్టర్లను ఇటీవల కలిసి పెద్దపల్లి – మంచిర్యాల మధ్య ప్రాంతాల్లో పెట్టుబడుల పెట్టాలని తాను విజ్ఞప్తి చేశానని ఆయన తెలిపారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ కుమార్ పదివేల మంది యువతకు ఉపాధి కల్పించేలా మెగా జాబ్మేళా నిర్వహించారని, పెద్దపల్లి పరిధిలో అలాంటి జాబ్ మేళాలు, స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు నిర్వహించాలని ఎంపీ సూచించారు. రామగుండం ఎయిర్పోర్ట్ ప్రాజెక్టు కోసం కృషి కొనసాగుతోందని తెలిపారు. ఆర్ఎఫ్సీఎల్ హెడ్ఆఫీస్ను రామగుండానికి మార్చడం ద్వా రా యూరియా సరఫరా సమస్యలను శాశ్వతంగా పరిష్కరించగలమని ఆయన అన్నారు. రామగిరి ఖిల్లాను టూరిస్ట్ హబ్గా తీర్చిదిద్దేందుకు రూ.5కోట్లతో రోప్వే సహా అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయని పేర్కొన్నారు. ఎంపీని ప్రెస్క్లబ్ అధ్యక్షుడు శ్రీనివాస్ ఆధ్వర్యంలో సన్మానించారు. -
సీసీఐ కేంద్రాల్లోనే పత్తికి మద్దతు
పెద్దపల్లిరూరల్: కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీపీఐ) కేంద్రాల్లో విక్రయిస్తేనే పత్తికి మద్దతు ధర లభిస్తుందని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. రాఘవాపూర్లోని శ్రీరామ జిన్నింగ్ మిల్లులో ఆదివారం సీసీఐ కొనుగోలు కేంద్రాన్ని పె ద్దపల్లి, సుల్తానాబాద్ మార్కెట్ కమిటీ చైర్పర్సన్లు ఈర్ల స్వరూప, ప్రకాశ్రావు, జిల్లా మార్కెటింగ్ అధి కారి ప్రవీణ్రెడ్డి, కార్యదర్శి మనోహర్తో కలిసి ఎ మ్మెల్యే ఆదివారం ప్రారంభించారు. వాతావరణ ప రిస్థితులతో ఈసారి పత్తి దిగుబడి తగ్గే అవకాశం ఉందని ఎమ్మెల్యే అన్నారు. రైతుకు మద్దతు ధర కల్పించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. దళారులకు పత్తి విక్రయించి నష్ట పోవద్దని రైతులకు సూచించారు. రైతుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పాలనలో ప్రజాప్రతినిధులు, నేతల చేతిలో వరి రైతులు దగా పడ్డారని విమర్శించారు. మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ జడల సురేందర్, డైరెక్టర్ ఎడ్ల మహేందర్, ముడుసు సాంబిరెడ్డి, మల్లారెడ్డి, సంపత్, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. -
కోత విధిస్తే ఉద్యమం
ధర్మారం(ధర్మపురి): ధాన్యం తూకంలో కిలో కోత విధించినా రైతులతో కలిసి బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ హెచ్చరించారు. మల్లాపూర్లోని ధాన్యం కేంద్రాన్ని ఆదివారం ఆయన సందర్శించారు. తడిసిన ధాన్యం పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తూకంలో కోతలు విధిస్తున్నా మంత్రి లక్ష్మణ్కుమార్ ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు. కార్యక్రమంలో నాయకులు ముత్యాల బలరాంరెడ్డి, కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి, రాసూరి శ్రీధర్, పుస్కూరి జితేందర్రావు, గందం రవీందర్, పాకాల రాజయ్య, ఎగ్గేల స్వామి, కూరపాటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఆకట్టుకునే పిచ్చుకగూళ్లు మంథనిరూరల్: తుమ్మచెట్టుకు పిచ్చుకలు క ట్టుకున్న గూళ్లు వేలాడుతూ కనువిందు చేస్తున్నాయి. తెల్లవారు జామున గిజిగాడి గూళ్ల నుంచి బయటకు వచ్చి సందడి చేస్తుంటాయి. వాటి అరుపులు వినసొంపుగా ఉంటుంది. పి చ్చుకలు ఎక్కువగా తుమ్మచెట్లకే గూళ్లు నిర్మించుకుంటాయి. మంథని మండలం ఉప్పట్లకు వెళ్లే రహదారిలో పోతారం చెరువు గట్టున ఉన్న తుమ్మ చెట్టుకు పదుల సంఖ్యలో పిచ్చుకగూళ్లు వేలాడుతుండగా ఇలా కనిపించాయి. హక్కుల సాధనే లక్ష్యం పెద్దపల్లి: కార్మికుల హక్కుల కోసం పోరాడేది సీఐటీయూ మాత్రమేనని ఆ యూనియన్ జి ల్లా కార్యదర్శి ముత్యంరావు అన్నారు. సుల్తానా బాద్లోని రోడ్లు, భవనాల శాఖ అతిథి గృహంలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆ యన మాట్లాడారు. నవంబర్ 15, 16వ తేదీ ల్లో జిల్లా కేంద్రంలో జిల్లామహాసభలు నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. అనంతరం సుల్తానాబాద్ మండల కన్వీనర్గా తాండ్ర అంజయ్య, సభ్యులుగా బ్రహ్మచారి, పూసాల సంపత్, మాతంగి రాజమల్లు, భగవాన్, ప్రశాంత్, ఆరేపల్లి సురేశ్, ఎండీ మంజూర్, ఆవునూరి కుమార్, పోగుల తిరుపతి, గున్నాల అన్నపూర్ణ, తుడిచెర్ల స్వరూప, నరసింగంను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఆయన తెలిపారు. బీసీ జేఏసీ చైర్పర్సన్గా ఉష పెద్దపల్లి: బీసీ సంఘాల జేఏసీ జిల్లా చైర్పర్స న్గా దాసరి ఉషను నియమించారు. ఈమేరకు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ఆదివారం ఉత్తర్వులు జారీచేశారు. ఉషకు నియామకం పత్రం అందజేశారు. ఆమెను పలువురు అభినందించారు. డబ్బులున్నవారికే పదవులా? పెద్దపల్లి: బీసీల ఆత్మగౌరవాన్ని బీఆర్ఎస్కు కట్టబెట్టడం తనను మనస్తాపానికి గురిచేసిందని బీసీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాడూరి శ్రీమాన్ ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ప్రెస్క్లబ్లో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీఆర్ఎస్ నేత దాసరి ఉషను బీసీ జేఏసీ చైర్పర్సన్గా నియమించడం దారుణమన్నారు. డబ్బులతో నే బహుజన ఉద్యమాలు నడుస్తాయనే దానికి ఈ నియామకమే నిదర్శనమన్నారు. 20 ఏళ్లుగా బీసీ ఉద్యమాల్లో పాల్గొని, బహుజనులను ఐక్యం చేయడంలో శ్రమిస్తున్న తనను సంప్రదించకుండా చైర్మన్ పదవిని ఇతరులకు కట్టబెట్టడం అన్యాయమని పేర్కొన్నారు. ఉషను ఆ పదవి నుంచి వెంటనే తప్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆర్.కృష్ణయ్య తీరుకు నిరసనగా తాను అన్ని బీసీ పదవుల నుంచి తప్పుకుంటున్నట్లు శ్రీమాన్ ప్రకటించారు. నాయకులు భూతగడ్డ సంపత్, బొడ్డుపల్లి శ్రీనివాస్, భూతగడ్డ అజయ్, ముక్కెర్ల రాజేశం, రాజు తదితరులు పాల్గొన్నారు. -
నృసింహుని బ్రహ్మోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ
పెద్దపల్లిరూరల్: దేవునిపల్లిలోని శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల ప్రచార పోస్టర్ను ఆలయ ఈవో శంకరయ్య తదితరులు ఆదివారం ఆలయ ఆవరణలో ఆవిష్కరించారు. నవంబర్ 2న బ్రహ్మోత్సవాలు ప్రారంభం అవుతాయని ఆయన తెలిపారు. నవంబర్ 5న స్వామివారి కల్యాణం, 10న రథోత్సవం, జాతర నిర్వహిస్తామని అన్నారు. భక్తులు అధికసంఖ్యలో తరలిరావాలని ఆయన కోరారు. అర్చకులు శ్రీకాంతచార్యులు, నాయకులు బొక్కల సంతోష్ తదితరులు పాల్గొన్నారు. స్వయం సేవకుల కవాతు గోదావరిఖని: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పెద్దపల్లి నగరశాఖ ఆధ్వర్యంలో ఆదివారం శతాబ్ది ప థసంచలన్ నిర్వహించారు. విభాగ ప్రతినిధి కొంప ల రాజన్న, విభాగ బౌద్ధిక్ ప్రముఖ్ సామల కిరణ్, జిల్లా కార్యవాహక్ గడ్డి రమేశ్ తదితరులు పాల్గొన్నారు. ప్రధాన వీధుల గుండా కవాతు కొనసాగింది. ప్రాయకరావు నాగరాజు, గోపు మోహన్, జార తి సంతోష్, రామగిరి శ్రీనివాస్, కంచర్ల శ్రీనివాస్, దయాకర్, గుజ్జుల రామకృష్ణారెడ్డి, గొట్టుముక్కుల సురేశ్రెడ్డి, నల్ల మనోహర్రెడ్డి, పవన్ చంద్రశేఖర్, చల్ల కుమార్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
రైతుల ఆశలపై ‘నీళ్లు’
పెద్దపల్లి: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆదివారం వేకువజామున మోస్తరు వర్షం కురిసింది. కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడిసిపోయింది. కొన్నిచోట్ల వరిపైరు నేలవాలింది. పంటలు చేతికి అందుతున్న తరుణంలో కురుస్తున్న వర్షాలు అన్నదాత గుండెల్లో గుబులు రేపుతున్నాయి. వరి, పత్తి, మొక్కజొన్న కోతకు వస్తున్న తరుణంలో తు పాను దెబ్బతీస్తుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. కొనుగోళ్లకు ఆటంకం పంటలు చేతికి వస్తున్న తరుణంలో కురుస్తున్న వర్షం రైతులకు నష్టమే కలిగిస్తుందని అంటున్నారు. వివిధ తెగుళ్ల బారినపడ్డ పంటలను కాపాడుకునేందుకు రైతులు ఇప్పటికే పురుగుమందులు చల్లి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. దీనికి వర్షం తోడుకావడంతో ధాన్యం తడిసి ముక్కవాసన వస్తుందని, పత్తి రంగు మారుతుందని, మక్క మొలక వస్తుందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పత్తి, మక్కలను సీసీఐ కొనుగోలు చేసేందుకు నిరాకరిస్తుందని అంటున్నారు. -
మంత్రిపై ఆరోపణలు చేస్తే సహించేదిలేదు
గోదావరిఖని: మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబుపై వ్యక్తిగత ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని డీసీసీ అధ్యక్షుడు, రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్ హెచ్చరించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు వ్యక్తిగత విషయాలపై మంత్రిని నిందించడం సరికాదన్నారు. ప్రజా సంక్షేమం కోసం నిత్యం పా టుపడుతున్న శ్రీధర్బాబును దూషిస్తే ప్రజలే తగి న బుద్ధి చెబుతారని ఆయన హెచ్చరించారు. ప్రజ ల్లో వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక గతంలో సీ తక్క, కొండా సురేఖ, ప్రస్తుతం శ్రీధర్బాబుపై ఆ రోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. జూబ్లీహి ల్స్ ఎన్నికల్లో అభ్యర్థి ఓటమి ఖాయమని బీఆర్ఎస్ నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రిలో వందమందికిపై గా నిరుద్యోగులకు ఉపాధి తానే కల్పించానని అ న్నారు. నాయకులు బొంతల రాజేశ్, మహంకాళి స్వామి, మారెల్లి రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
లక్కు ఎవరికో..?
● నేడు మద్యం టెండర్ల లక్కీడ్రా ● దరఖాస్తుదారుల్లో ఉత్కంఠ పెద్దపల్లి: మద్యం దుకాణాల కోసం దరఖాస్తుల స్వీకరణ గడువు ఈనెల 23వ తేదీతో ముగిసింది. వైన్స్షాపుల కేటాయింపే మిగిలింది. ఈనెల 27(సోమవారం) లక్కీడ్రా ద్వారా దుకాణాలు కేటాయిస్తారు. జిల్లాలోని 74 మద్యం దుకాణాల కోసం అధికారులు టెండర్లు ఆహ్వానించగా.. 1,507 దరఖాస్తులు అందాయి. ఒక్కో దరఖాస్తు ద్వారా ప్రభుత్వానికి రూ.3లక్షల ఆదాయం సమకూరింది. పారదర్శకంగా డ్రా.. వైన్స్షాపులు దక్కించుకునేందుకు అదేవ్యాపారంలో ఉన్నవారు అత్యధికంగా టెండర్లు వేశారు. టెండరు ఫీజు పెంచడంతో గ్రూపులుగా ఏర్పడి 5 నుంచి 10 షాపులకు దరఖాస్తు చేసుకున్నారు. ఒక్క షాపు దక్కినా అందరూ కలిసి వ్యాపారం చేసేలా ఒప్పందం చేసుకున్నారని ప్రచారంలో ఉంది. మద్యం వ్యాపారుల్లో టెన్షన్.. డ్రాలో అదృష్టం వరిస్తుందా? లేదా? అనే టెన్షన్ వ్యాపారులను వెంటాడుతోంది. పూర్తిగా అదృష్టంపై ఆధారపడిన వ్యాపారం కావడంతో కొందరు దేవుళ్లకు పూజలు చేస్తున్నారు. మరికొందరు జాతకాలు చూపించుకుంటున్నారు. ముడుపులు కడుతున్నారు. అధిక సంఖ్యలో టెండర్లు దాఖలు చేసిన వారికై తే కంటిమీద కునుకు ఉండడం లేదు. వైన్స్ షాపుల లైసెన్స్ జారీ ప్రక్రియలో లాటరీ కేవలం అదృష్ట పరీక్ష మాత్రమే కాదు.. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో తాత్కాలిక పెట్టుబడులు, మద్యం ప న్నులు, అనుబంధ పరిశ్రమల ద్వారా వచ్చే ఆ దాయం కూడా అనే భావన ఉంది. అందుకే అధికారులు పారదర్శకంగా డ్రా నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దరఖాస్తుదారులకు ఇప్పటికే పాసులు జారీచేశారు. పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. పెద్దపల్లి సమీపంలోని బందంపల్లి స్వరూప గార్డెన్స్లో డ్రా నిర్వహించనున్నట్లు ఎక్సైజ్ సూపరింటెండెంట్ మహిపాల్రెడ్డి తెలిపారు. -
ప్రేమకథ విషాదాంతం
యైటింక్లయిన్కాలనీ(రామగుండం): ఇన్స్ట్రాగామ్లో పరిచయం ఆ ఇద్దరి మధ్య ప్రేమకు దారితీసింది. కులాలు వేరైనా యువకుడి తల్లి దండ్రులు అంగీకరించడంతో వివాహం చేసేందుకు పెద్దలు నిర్ణయించారు. ఇంతలోనే నీట మునిగి ఆ యువతి మృతి చెందింది. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖని నగర సమీపంలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గోదావరిఖని విఠల్నగర్కు చెందిన దానవేన రవితేజ సింగరేణిలోని బోరింగ్ డిపార్ట్మెంట్లో కాంట్రాక్ట్ కారి్మకుడిగా పనిచేస్తున్నాడు. పెద్దపల్లి మండలం పెద్దబొంకూరు గ్రామానికి చెందిన మౌనిక(17) పదో తరగతి వరకు చదివి ప్రస్తుతం ఇంటివద్దే ఉంటోంది. ఈ క్రమంలో రెండేళ్ల క్రితం ఇన్స్ట్రాగామ్ ద్వారా మౌనిక, రవితేజ మధ్య పరిచయం ఏర్పడింది. అదికాస్త ప్రేమగా మారింది. రవితేజను వివాహం చేసుకోవాలనే ఉద్దేశంతో తన ఇంట్లో ఎవరికీ చెప్పకుండా మౌనిక నెల క్రితం గోదావరిఖనిలోని రవితేజ ఇంటికి వచ్చింది. అయితే మౌనిక మైనర్ కావడంతో 18 ఏళ్లు నిండిన తర్వాత వివాహం చేయాలని ఇద్దరి కుటుంబ సభ్యులు అంగీకరించారు. ఇందుకోసం వచ్చేనెల ఒకటో తేదీన ముహూర్తం నిర్ణయించారు. కుల సంప్రదాయం ప్రకారం.. మౌనిక, రవితేజ కుటుంబ సభ్యులతో కలిసి గోదావరి నది స్నానానికి వెళ్లారు. యువతీయువకులిద్దరూ నదిలోకి దిగి ప్రమాదవశాత్తు నీటమునిగారు. అక్కడే ఉన్న జాలర్లు, కుటుంబ సభ్యులు వెంటనే రక్షించేందుకు ప్రయతి్నంచారు. ఈక్రమంలో రవితేజను బయటకు తీయగా, ప్రాణాలతో బయటపడ్డాడు. నీటిలో కొట్టుకుపోతున్న మౌనికను కూడా బయటకు తీయగా అప్పటికే ఆమె మృతి చెందింది. మృతురాలి తల్లి కళ ఇచి్చన ఫిర్యాదు మేరకు సీఐ ప్రసాద్రావు ఆధ్వర్యంలో ఎస్సై అహ్మదుల్లా కేసు నమోదు చేశారు. -
చట్టాలపై అవగాహన అవసరం
పెద్దపల్లిరూరల్: ప్రతీపౌరుడికి మన రాజ్యాంగం హక్కులు, బాధ్యతలు కల్పించిందని, వా టిని సద్వినియోగం చేసుకునేందుకు చట్టాల పై కనీస అవగాహన ఉండాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల అన్నారు. స్థాని క గాయత్రీ డిగ్రీ, పీజీ కాలేజీలో శనివారం జరిగిన న్యాయవిజ్ఞాన సదస్సులో న్యాయసేవాధికారసంస్థ కార్యదర్శి స్వప్నరాణితో కలిసి మా ట్లాడారు. ఉన్నత చదువుల కోసం కాలేజీలకు వెళ్లే యువత డ్రగ్స్, గంజాయి లాంటి మత్తు పదార్థాలకు బానిసలు కావొద్దని సూచించారు. భవిష్యత్ లక్ష్యం ఎంచుకుని సాకారం చేసుకునేందుకు క్రమశిక్షణతో శ్రమించాలన్నారు. లీగ ల్ ఎయిడ్ కౌన్సెల్ సభ్యుడు శ్రీనివాస్, శ్యామ ల, కరస్పాండెంట్ అల్లెంకి శ్రీనివాస్, లోక్అదా లత్ సభ్యురాలు రజనీదేవి పాల్గొన్నారు.బ్యాంకు గ్యారంటీ ఇవ్వాలి పెద్దపల్లి: బ్యాంకు గ్యారంటీ ఇచ్చిన రైస్మిల్లులకే వానాకాలం ధాన్యం కేటాయిస్తామని సివి ల్ సప్లయ్ డీఎం శ్రీకాంత్రెడ్డి అన్నారు. తన కార్యాలయంలో శనివారం రైస్మిల్లర్లతో సమావేశమై వానకాలంలో ధాన్యం కేటాయింపులపై సమీక్షించారు. కస్టమ్ మిల్లింగ్(సీఎమ్మార్) ని బంధనలను ప్రభుత్వం కఠినతరం చేసిందని తెలిపారు. సోమవారంలోగా బ్యాంకు గ్యారంటీ పత్రాలు తీసుకొచ్చి తన కార్యాలయంలో అందజేయాలని సూచించారు. తడిసిన ధా న్యం సేకరించడంతో తలెత్తే సమస్యలు పరిష్కరించాలని రైస్మిల్లర్లు ఆయనకు విజ్ఞప్తి చేశా రు. కార్యక్రమంలో రైస్మిల్లర్ల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు నగునూరి అశోక్కుమార్, మండల అధ్యక్షుడు జైపాల్రెడ్డి పాల్గొన్నారు. రైతుల కష్టం నేలపాలు మంథనిరూరల్: ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు.. చేతికందే సమయంలో చేజారిపోయేలా ఉన్నాయి. శుక్రవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి అనేక గ్రామాల్లో వరిపైరు నేలవాలింది. గుంజపడుగు, పోతారం, ఉప్పట్ల, వెంకటాపూర్, గోపాల్పూర్, చిన్నఓ దాల తదితర గ్రామాల్లో వరిపంట నేలపాలైందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. కోతదశకు వచ్చిన పంట వర్షార్పణం కావడంతో కన్నీటిపర్యంతమవుతున్నారు. రక్తదానం చేయండి సుల్తానాబాద్రూరల్: రక్తదానం ప్రాణదానంతో సమానమని పెద్దపల్లి డీసీపీ కరుణాకర్ అ న్నారు. స్థానిక పోలీస్స్టేషన్లో శనివారం మె గా రక్తదాన శిబిరాన్ని డీసీపీ ప్రారంభించి మా ట్లాడారు. ప్రజల కోసం పోలీసులు నిరంతరం శ్రమిస్తున్నారన్నారు. పోలీసుల త్యాగ ఫలితా మే ప్రశాంతంగా ఉంటున్నామన్నారు. అనంతరం రక్తదానంచేసిన 220మందికి సర్టిఫికెట్లు అందజేశారు. ఏసీపీ కృష్ణ, సీఐలు సుబ్బారెడ్డి, ప్రవీణ్, ఎస్సైలు శ్రావణ్కుమార్, అశోక్రెడ్డి, వేణుగోపాల్, వేంకటేశ్, సనత్కుమార్రెడ్డి, మధుకర్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు. నేడు పవర్ కట్ ప్రాంతాలు పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రంలోని సుభాష్నగర్ రోడ్డులో చేపట్టిన రహదారి, డ్రైనేజీ పనుల్లో భాగంగా విద్యుత్ స్తంభాల మరమ్మతు కోసం ఆదివారం ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కరెంట్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏఈ శ్రీనివాస్ తెలిపారు. సుభాష్నగర్, గ్యాస్ ఆఫీసు ఏరియా, కమాన్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నామని, వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు. ఇద్దరికి జీఎంలుగా పదోన్నతి గోదావరిఖని: ఇద్దరు సింగరేణి అధికారులకు జీఎంలుగా పదోన్నతి కల్పిస్తూ యాజమాన్యం ఆదేశాలు జారీచేసింది. ఎస్టేట్ అడిషనల్ జీ ఎం లక్ష్మీపతిగౌడ్కు జీఎంగా పదోన్నతి కల్పించారు. అలాగే ఎస్టీపీపీలో ఈఅండ్ఎం ఏజీఎంగా పనిచేస్తున్న మదన్మోహన్కు జీఎంగా ప్రమోషన్ కల్పిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. -
గైర్హాజర్పై సీరియస్
గోదావరిఖని: ఉద్యోగుల గైర్హాజర్పై సింగరేణి యాజమాన్యం సీరియస్గా ఉంది. ఏడాదిలో 150 మస్టర్ల కన్నా తక్కువ ఉంటే విచారణ ఎదుర్కొనేలా నిబంధనలు రూపొందించింది. ఈమేరకు ఇటీవల ఉత్తర్వులు జారీచేసింది. కొత్త నిబంధనల ప్రకారం.. మొత్తం ఉద్యోగుల్లో సుమారు 25శాతం వరకు గైర్హాజర్ అవుతున్నారని గుర్తించింది. ఇది సంస్థకు ఇబ్బందికరమని భావిస్తోంది. దీనిప్రభావం బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకతపై పడుతోందని చెబుతోంది. గడిచిన మూడేళ్లతో పోల్చితే ఈ ఏడాది గైర్హాజర్ శాతం పెరిగిందని ఆందోళన వ్యక్తం చేస్తోంది. దీర్ఘకాలికంగా విధులకు రాని ఉద్యోగులకు ఉచిత విద్యుత్, నీరు, వైద్యసౌకర్యాలు అందిస్తున్నా కంపెనీకి వారిసహకారం ఉండడం లేదంటోంది. వచ్చేనెల 5వ తేదీన గుర్తింపు.. భూగర్భగనుల్లో పనిచేసే ఉద్యోగులు ప్రతీనెల 16 కన్నా తక్కువ, ఉపరితల ఉద్యోగులు 20 మస్టర్ల కన్నా తక్కువ చేస్తే వచ్చేనెల ఐదోతేదీన గుర్తించా లని సింగరేణి ఆదేశాలు జారీచేసింది. భూగర్భగను ల్లో మూడు నెలల పాటు ఇలాగే హాజరు ఉంటే గనిమేనేజర్ స్థాయి అధికారి, మూడునెలల తర్వాత ఏరియాస్థాయి కమిటీకి పంపించాలని ఉత్తర్వులు జారీఅయ్యాయి. గైర్హాజరై కౌన్సెలింగ్కు హాజరు కా కుంటే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీచేసింది. ఒక క్యాలెండర్ సంవత్సరంలో 190/ 240 కన్నా తక్కువ మస్టర్లు ఉన్న ఉద్యోగుల విచార ణ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించింది. జీఎంస్థాయి అధికారి నెలవారీ సమీక్ష గైర్హాజర్ విచారణ ఎదుర్కొనే కార్మికులపై చర్యల గురించి ప్రతీనెల నిర్వహించే సమీక్షలో ఏరియాస్థాయి జీఎంలు పర్యవేక్షించాలని యాజమాన్యం సూచించింది. గైర్హాజర్ తగ్గించడానికి తగిన చర్యలు తీసుకోవాలని జీఎంలకు అధికారాలు కట్టబెట్టింది. ఈవిషయంలో ఏరియాల స్థాయిలో ప్రత్యేక మార్గదర్శకాలను రూపొందించవద్దని ఆదేశించింది. 150 మస్టర్లు లేకుంటే గైర్హాజరే.. ఏడాదిలో నిర్ణీత 150 మస్టర్లు లేకుంటే గైర్హాజర్ కార్మికుడిగా గుర్తిస్తారు. గతంలో వంద మస్టర్లు ఉండగా ప్రస్తుతం దానిని 150 మస్టర్లకు పెంచింది. 150కన్నా తక్కువ మస్టర్లు ఉన్న కార్మికుల పేర్లను ఆయాగనుల నోటీసు బోర్డులపై ప్రదర్శించాలని ఆదేశించింది. వచ్చే ఏడాది జనవరి 31నాటికి చార్జిషీట్, ఫిబ్రవరి–15లోగా కార్మికుల వివరణ, వివరణ సంతృప్తిగా లేకుంటే మార్చి 15నాటికి విచారణ పూర్తిచేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. కౌన్సెలింగ్ నిర్వహించి ఏప్రిల్ 30 నాటికి కౌన్సెలింగ్ పూర్తి చేయనున్నట్లు సింగరేణి ప్రకటించింది. -
సింగరేణి పరిరక్షణకు ఐక్యపోరాటాలు
● కోల్బెల్ట్ ప్రాంత ఎమ్మెల్యేలు కలిసిరావాలి ● కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకులు గోదావరిఖని: ఉద్యోగాలు, ఉపాధి అవకాశాల కోసం సింగరేణి సంస్థను పరిరక్షించుకుందామని ఐక్య కార్యాచరణ కమిటీ కోరింది. శనివారం స్థానిక ప్రెస్క్లబ్లో సింగరేణి కార్మిక సంఘాల ఐక్య వేదిక సదస్సు నిర్వహించారు. కొత్తగనులు రాకుండా అడ్డుపడటం ద్వారా సింగరేణి మనుగడ లేకుండా చేసేందుకు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు కుట్రపన్నుతున్నాయని ధ్వజమెత్తారు. వరుస లాభాలతో నడుస్తున్న సింగరేణి సంస్థ.. కొత్త గనులు ప్రారంభించడానికి, ఉద్యోగాలు ఉపాధిని కల్పించడానికి అడ్డమేమిటని ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ కోదండరాం, సింగరేణి కార్మిక సంఘాల నాయకులు టి.శ్రీనివాస్ (ఐఎఫ్టీ యూ, మాదాసు రామ్మూర్తి(టీజీబీకేఎస్), కామెర గట్టయ్య(తెలంగాణ ఉద్యోగుల సంఘం), రత్నాకర్రావు(టీఎన్టీయూసీ), రాజమౌళి (ిసీఐటీయూ), కె.విశ్వనాథ్ (ఐఎఫ్టీయూ), ఎ.రాములు(ఏఐఎఫ్టీయూ), తోకల రమేశ్(టీయూసీఐ) నాయకులు ప్రశ్నించారు. సింగరేణిని రక్షించుకునేందుకు, కార్మికుల హక్కులను కాపాడేందుకు కొత్త ఉద్యోగాలను సాధించుకునేందుకు, కాంట్రాక్టు కార్మికులకు హైపవర్ వేతనాలు అమలు చేసేందుకు ఐక్యపోరాటాల కు సిద్ధం కావాలని వారు కోరారు. సింగరేణి ప్రాంత ఎమ్మెల్యేలు సంస్థను బతికించుకునేందుకు ముందుకు రావాలని అన్నారు. గోదావరి లోయ ప్రాంతా ల్లో నేటికీ అపారమైన బొగ్గునిక్షేపాలు ఉన్నాయని, వాటిని వెలికితీసేందుకు పూనుకోవాలని అన్నారు. సింగరేణిని బతికించుకోవడం, గని కార్మికులకే కాకుండా రిటైర్డ్ కార్మికులు, గోదావరి తీర ప్రాంతంలోని ప్రజానీకం.. తెలంగాణ ప్రజలు ‘సింగరేణి బచావ్ఙో’ఉద్యమంలో పాల్గొనాలని వారు కోరారు. -
యూట్యూబర్కు గోల్డెన్ వీసా
● సన్మానించిన సదాశయ ఫౌండేషన్ బాధ్యులు గోదావరిఖని: గోల్డెన్ వీసా సాధించిన సింగరేణి కార్మికుని కుమారుడు హఫీజ్ను సదాశయ ఫౌండేషన్ నిర్వాహకులు శనివారం ఘనంగా సన్మానించారు. స్థానిక ప్రెస్క్లబ్లో జరిగిన కార్యక్రమంలో శాలువాతో సన్మానించి అభినందించారు. సన్మానగ్రహీత హఫీజ్ మాట్లాడుతూ, తాను 2011లో యూట్యూబ్ చానల్ ప్రారంభించానన్నారు. అప్పటినుంచి నిరంతరం కంటెంట్ ఉన్న వీడియోలను అప్లోడ్ చేస్తూ వస్తున్నానని తెలిపారు. 2017లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతిలో ఏర్పాటు చే సిన సోషల్ మీడియా సమ్మిట్లో బెస్ట్ కంటెంట్ అ వార్డు అందుకున్నట్లు వెల్లడించారు. తన వీడియో లు విదేశాల్లో సైతం ప్రాచుర్యం పొంది గోల్డెన్ కార్డు రావడం గర్వంగా ఉందన్నారు. ఈ కార్డు ద్వారా వీ సాలేకుండా 10 సంవత్చరాలపాటు తాను, తన కుటుంబ సభ్యులు యూఏఈకి వెళ్లే అవకాశం ఉందని వివరించారు. ఇది ఇప్పటివరకు సినీ హీరో లకు మాత్రమే ఉందని, యూట్యూబ్ ద్వారా తొలిసారిగా తనకే ఆ అవకాశం దక్కిందని సంతోషం వ్యక్తం చేశారు. సమావేశంలో సదాశయ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రావణ్కుమార్, కె.లింగమూర్తి, సానా రామకృష్ణారెడ్డి, నూక రమేశ్, మారెల్లి రాజిరెడ్డి, చంద్రమౌళి, శంకర్, చంద్రశేఖర్, సమ్మ య్య, రాజయ్య, నరేశ్, మధు పాల్గొన్నారు. -
తెలంగాణ ప్రాజెక్టు పనుల ప్రగతిపై సమీక్ష
జ్యోతినగర్(రామగుండం): సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ సభ్యుడు, ఎన్టీపీసీ రిటైర్డ్ డైరెక్టర్ వి.రమేశ్బాబు శనివారం రామగుండంలోని ఎస్టీపీసీ తెలంగాణ ప్రాజెక్ట్ను సందర్శించారు. ఈడీ చందనకుమార్ సమంత, హెచ్ఆర్ ఏజీఎం బీజయ్కుమార్ సిక్ధర్తో పాటు పలువురు జీఎంలు ఆయనకు ఘనస్వాగతం పలికారు, ప్రాజెక్టు వద్ద నిర్మించిన సీఐఎస్ఎఫ్ సెక్యూరిటీ భవనాన్ని రమేశ్బాబు ప్రారంభించారు, అనంతరం తెలంగాణ ప్రాజెక్ట్ స్విచ్ యార్డ్ను సందర్శించారు. ప్రాజెక్టులో చేపట్టిన పనుల ప్రగతిపై అధికారులతో సమీక్షించారు. ఈ కార్యక్రమంలో పలు విభాగాల జనరల్ మేనేజర్లు, అధికారులు పాల్గొన్నారు. 13లోగా పదోతరగతి పరీక్ష ఫీజు చెల్లించాలి పెద్దపల్లిరూరల్: జిల్లాలో పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు నవంబర్ 13వ తేదీలోగా ఫీజు చెల్లించాలని డీఈవో మాధవి తెలిపారు. రెగ్యులర్ విద్యార్థులు రూ.125 ఫీజు చెల్లించాలన్నారు. ఫెయిలైనవారు 3 సబ్జెక్టుల వరకు రూ.110, అంతకన్నా ఎక్కువ సబ్జెక్టులు ఉంటే రూ.125 చెల్లించాలని పేర్కొన్నారు. సకాలంలో చెల్లించని విద్యార్థులు రూ.50 అపరాధ రుసుంతో నవంబర్ 29 వరకు, రూ.200 పెనాల్టీతో డిసెంబర్ 11వరకు, రూ.500 లేట్ఫీజుతో డిసెంబర్ 29 వర కు ఫీజు చెల్లించవచ్చని వివరించారు. అదనంగా ఫీజు వసూలు చేసినట్లు తన దృష్టికి వస్తే శాఖాపరమైన చర్యలుంటాయని డీఈవో హెచ్చరించారు. -
కార్మిక సమస్యలపై నిర్లక్ష్యం
● సీఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు రాజారెడ్డి రామగిరి(మంథని): సింగరేణి కార్మికుల ఓట్లతో గెలిచిన కార్మిక సంఘాల నాయకులు.. వారి సమస్యలను పట్టించుకోవడం లేదని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి విమర్శించారు. శనివారం ఆర్జీ–3 ఏరియాలో 10వ డివిజన్ మహాసభల సందర్భంగా బైక్ర్యాలీ నిర్వహించారు. అనంతరం జెండా ఆవిష్కరణ చేశారు. సింగరేణి పరిరక్షణకు సమరశీల పోరాటలు చేయాలన్నారు. నూతన గనుల తవ్వకం, పని ప్రదేశాల్లో సమస్యల పరిష్కారానికి పోరాడాలని కోరారు. నివాస ప్రాంత సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవాలని మహాసభల్లో పలు తీర్మానాలు చేశారు. సీఐటీయూను మరింత బలోపేతం చేసి కార్మిక సమస్యల పరిష్కారంలో ముందుండాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం కుట్రలను తిప్పికోట్టాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎరవెల్లి మత్యంరావు, డి.కొమురయ్య, విజయ్ కుమార్రెడ్డి, వెంకటేశ్వర్లు, కుమార్, అహ్మద్ పాషా, వేణుగోపాల్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. -
ఆదివారం శ్రీ 26 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
● మూస ధోరణికి స్వస్తి.. సేంద్రియంపై ఆసక్తి ● కాలానుగుణంగా ‘సాగు’తూ.. ● ఆదర్శంగా నిలుస్తున్న పలువురు అన్నదాతలుసేద్యం..కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): సంప్రదాయ వరిసాగుకు కేరాఫ్గా నిలుస్తున్నారు కాల్వ శ్రీరాంపూర్ మండలం కిష్టంపేటకు ఆదర్శ రైతు కొప్పుల సత్యనారాయణ– స్రవంతి దంపతులు. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్సార్ పాలనలో ఆదర్శ రైతుగా ఎంపికై కూనారం వ్యవసాయ పరిశోధన కేంద్రంలో సత్యనారాయణ శిక్షణ తీసుకున్నాడు. సుమారు 25 రకాల దేశీ వరి ధాన్యాన్ని సంప్రదాయ పద్ధతిలో పండిస్తూ, వివిధ రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నాడు. వీటిలో తెగుళ్లను తట్టుకునే దొడ్డు, సన్నరకాలు ఉన్నాయి. సుమారు 850 రకాల వరి విత్తనాలు తనవద్ద అందుబాటులో ఉన్నట్లు పేర్కొన్నాడు. ప్రస్తుతం డయాబెటిస్ విజృంభిస్తున్న తరుణంలో ఆర్గానిక్ ఉత్పత్తులైన బ్లాక్రైస్, రెడ్ రైస్, నవారు వరిపంటను పండిస్తున్నాడు. తోటి రైతులకు సాగులో సూచనలు అందిస్తున్నారు.సత్యనారాయణ స్రవంతి దంపతులునీరుంటే వరి.. లేకుంటే పత్తి పంటలనే ఎక్కువగా సాగు చేస్తారు ఉమ్మడి జిల్లాలోని రైతులు. ‘పండితే పండుగ.. ఎండితే దండగ..’ అతివృష్టి.. అనావృష్టి ఏదైనా అన్నదాతకు తీరని నష్టాన్ని మిగుల్చుతోంది. ఒకే విధమైన పంటల సాగుతో భూసారం దెబ్బతింటోంది. పంటలకు వాడే రసాయనాలతో మనుషుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలువురు రైతులు కాస్త భిన్నంగా ఆలోచన చేస్తున్నారు. వివిధ రకాల పంటలు పండిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. సేంద్రియ పద్ధతిలో పోషక విలువలున్న పండ్ల తోటలు.. పాతకాలపు వరి విత్తనాలు.. తక్కువ కాలంలో ఎక్కువ దిగుబడి వచ్చే కూరగాయలు, ఆకుకూరలను మందులు పిచికారీ చేయకుండా, సేంద్రియ పద్ధతిలో సాగుచేస్తున్నారు. మూసధోరణిలో కాకుండా కాలానికనుగుణంగా సేద్యం చేస్తూ.. తినేవారికి ఆరోగ్యాన్ని పంచుతూ.. పంటల విక్రయాలతో ఆదాయం గడిస్తున్న రైతులపై సండే స్పెషల్..!! – వివరాలు 8లోu ఆర్గానిక్ బియ్యం -
జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి
● సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ గోదావరిఖని: రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీలను గుర్తించి జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ డిమాండ్ చేశారు. శనివారం ఆసిఫాబాద్ వెళ్తున్న సందర్భంగా కాసేపు ఆయన గోదావరిఖనిలో ఆగి విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుకు బిల్లు తీసుకొస్తే.. కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటోందని ఆరోపించారు. మైనార్టీలకు రిజర్వేషన్లు ఉండకూడదనే కుట్రతోనే బీసీల రిజర్వేషన్లను బీజేపీ అడ్డుకుంటోందని ఆయన ధ్వజమెత్తారు. కలిసి వచ్చే రాజకీయ పార్టీలు, సంఘాలు, సంస్థలను కలుపుకొని అఖిలపక్షం ఏర్పాటు చేసి కేంద్రప్రభుత్వంపై ఉద్యమించి బీసీ రిజర్వేషన్ సాధించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు బండారి రవికుమార్, కె.భూపాల్, వై.యాకయ్య, మహేశ్వరి, వేల్పుల కుమారస్వామి, టి.రాజారెడ్డి, ఎన్.భిక్షపతి, సీహెచ్ శైలజ, గీట్ల లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మంచైపె కాపలా
ఒకప్పుడు రైతులు తమ పంట కాపలా కోసం మంచె వినియోగించేవారు. పొలానికి, రైతుకు వారధిలా ఉండే మంచె.. ఎండ, వాన, చలి నుంచి కాపాడేందుకూ ఉపయోగపడేది. వన్యప్రాణులను కనిపెట్టేందు కు మంచె లేని పొలం ఉండేది కాదు. గ్రామీణ వాతావరణానికి మంచె నిలువటద్దంలా నిలిచేది. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లోని వ్యవసాయ క్షేత్రాల్లో మంచెలు కనిపిస్తున్నాయి. పల్లె వాతావరణాన్ని తలపిస్తున్నాయి. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం ఇదులాపూర్ గ్రామ శివారులోని చెరువు వద్ద చేపల కాపలా కోసం మత్స్యకారులు ఏర్పాటు చేసిన మంచె ‘సాక్షి’ కెమెరాకు ఇలా కనిపించింది. – సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి -
అమరవీరులను ఆదర్శంగా తీసుకోవాలి
మంథని: శాంతిభద్రతల పరిరక్షణలో ప్రాణాలు అర్పించిన పోలీస్ అమరవీరులను ఆదర్శంగా తీసుకోవాలని పెద్దపల్లి డీసీపీ కరుణాకర్ కోరారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా గురువారం స్థానిక పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో ఆయన మాట్లాడారు. ప్రతీపౌరుడు బాధ్యతగా సమాజాభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు ముందుంటారని, ప్రజల సహకారం తప్పనిసరి అని ఆయన అన్నారు. ఈ సందర్భంగా సుమారు 150 మంది రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో గోదావరిఖని ఏసీపీ రమేశ్, సీఐలు రాజు, ప్రసాద్రావు, ఎస్సై రమేశ్, ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ కావేటి రాజగోపాల్, వైస్ చైర్మన్ తూము రవీందర్, లయన్స్ క్లబ్ మంథని అధ్యక్షుడు మేడగోని వెంకటేశ్, నాయకులు ఐలి ప్రసాద్, కుడుదుల వెంకన్న, శశిభూషణ్ కాచే, వొడ్నాల శ్రీనివాస్, పోతరవేణి క్రాంతికుమార్ తదితరులు పాల్గొన్నారు. రక్తదాన శిబిరంలో పెద్దపల్లి డీసీపీ కరుణాకర్ -
ఖనిలోనే కీమోథెరపీ
కోల్సిటీ(రామగుండం): అనేక దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న కీమోథెరపీ, పాలియేటివ్ కేర్ సేవలు ఎట్టకేలకు కేన్సర్ బాధితుల చెంతకు చేరాయి. అనేక పరిశ్రమలకు నిలయమైన రామగుండం పారిశ్రామిక ప్రాంతంతోపాటు జిల్లాలోని వివిధ మండలాల్లో అనేకమంది కేన్సర్ వ్యాధిగ్రస్తులు ఉన్నారు. వాతావరణ కాలుష్యం, పరిశ్రమల్లోంచి వెలువడే రసాయన వ్యర్థాలు, ఇతరత్రా కారకాలతో జిల్లాలో కేన్సర్ బారినపడేవారి సంఖ్య ఏటా పెరుగుతోందని వైద్యులు చెబుతున్నారు. వీరికి కరీంనగర్, హైదరాబాద్లోనే కీమోథెరపీ, పాలియేటివ్ కేర్ సేవలు అందుబాటులో ఉంటున్నాయని అంటున్నారు. సామాన్యులు, పేదలు అంతదూరం వెళ్లి చికిత్స పొందడం ఆర్థిక ప్రయాసలతో కూడుకున్నది. ఈ నేపథ్యంలోనే గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి(జీజీహెచ్)లో గురువారం కేన్సర్ బాధితులకు చికిత్స ప్రారంభించడంతో సర్వత్రా హర్షం వ్యకమవుతోంది. రాష్ట్రంతోపాటు జిల్లాలోనూ.. ప్రభుత్వం రాష్ట్రంలోని పలు సర్కార్ ఆస్పత్రుల్లో కేన్సర్ డే కేర్ సెంటర్లను ఏర్పాటుచేయగా.. గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి(జీజీహెచ్)లోనూ అందుబాటులోకి తీసుకొచ్చింది. మెడికల్ సూపరింటెండెంట్ దయాళ్సింగ్ సేవలను గురువారం ప్రారంభించారు. ఓ పేషెంట్కు డే కేర్ సెంటర్ ఇన్చార్జి, జనరల్ సర్జన్ ఫరీద్ పర్యవేక్షణలో అనెస్థీషి యా ఇర్ఫాన్ నేతృత్వంలో చికిత్స అందించడం ద్వారా సేవలు అందుబాటులోకి వచ్చినట్లయ్యింది. డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ అరుణ, ఆర్ఎంవో రాజు, నర్సింగ్ ఆఫీసర్లు పాల్గొన్నారు. కేన్సర్ డే కేర్ సెంటర్ సేవలను వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనరసింహ గతనెల రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రారంభించారు. ఉదయం వచ్చి.. సాయంత్రం వెళ్లొచ్చు.. కేన్సర్ డే కేర్ సెంటర్ ద్వారా పేషెంట్లకు కీమోథెరపీ, పాలియేటివ్ కేర్ వంటి కీలకమైన సేవలు అందిస్తున్నారు. ఉదయం వచ్చి చికిత్స పొంది సాయంత్రం ఇంటికి వెళ్లవచ్చని వైద్య నిపుణులు తెలిపారు. మధ్యలో ఆపివేస్తే ముప్పే.. కేన్సర్ బాధితులు చికిత్సను మధ్యలో ఆపివేస్తే వ్యాధి మళ్లీ దాడిచేసే ప్రమాదం ఉంది. రేడియేషన్, కిమోథెరపీ, మందుల వినియోగం క్రమంతప్పకుండా వాడుకుంటూ ఉండాలి. పల్లెవాసులు అవగాహన లేక దూరభారంతో హైదరాబాద్ వంటి నగరాలకు వెళ్లలేక మధ్యలోనే చికిత్స ఆపేస్తున్నారని వైద్యులు వివరిస్తున్నారు. ఇలాంటి వారికి జీజీహెచ్లోని డే కేర్ సెంటర్ ఎంతో ఊరటనిస్తుందని వారు పేర్కొంటున్నారు. జీజీహెచ్లో ప్రత్యేక వార్డు కేటాయింపు.. జీజీహెచ్లో కేన్సర్ డే కేర్ సెంటర్ కోసం ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశారు. జిల్లానుంచి వచ్చే పేషెంట్ల సంఖ్యకు అనుగుణంగా 25 వరకు పడకల వరకు పెంచనున్నట్లు వైద్యాధికారులు తెలిపారు. వైద్యులకు శిక్షణ.. పేషెంట్లకు చికిత్స అందించడానికి జీజీహెచ్లోని జనరల్ సర్జన్ ఫరీద్, అనెస్థీషియా ఇర్ఫాన్కు డీఎంఈ ద్వారా ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. అవసరమైన మందులు కూడా సరఫరా చేశారు. ఎంఎన్జే రెఫరల్ ఆధారంగానే.. హైదరాబాద్లోని ఎంఎన్జే కేన్సర్ ఆస్పత్రి ఆధ్వర్యంలో తొలుత పేషెంట్కు వ్యాధిని నిర్ధారణ చేస్తారు. తొలి కిమోథెరపీ చేస్తారు. ఆ తర్వాత అవసరమైన కీమోథెరపీలను జీజీహెచ్లోని డే కేర్ సెంటర్లో అందిస్తారు. ఇందుకోసం అన్ని వైద్య పరీక్షలు చేస్తారు. అనుకూలంగా లేని పీషెంట్లను హైదరాబాద్ కేన్సర్ ఆస్పత్రికి పంపించనున్నారు. జీజీహెచ్లో ప్రత్యేక సెంటర్ వినియోగంలోకి వచ్చిన సేవలు కేన్సర్ బాధితులకు భారీ ఊరట 25 పడకల వరకు పెంచే యోచన -
రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించాలి
పెద్దపల్లిరూరల్: ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు సత్వరమే రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందజేయాలని రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రమౌళి డిమాండ్ చేశారు. కలెక్టరేట్ ఎదుట గురువారం నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం కలెక్టరేట్లో అధికారులకు వినతిపత్రం అందజేశారు. అనంతరం నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడచినా రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించలేదన్నారు. దీంతో అనేకమంది మానసిక వేదనకు గురవుతున్నారని ఆయన పేర్కొన్నారు. కొందరు కోర్టును ఆశ్రయించారని గుర్తుచేశారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు వారికి ప్రయోజనాలు చెల్లించారని అన్నారు. న్యాయస్థానాలను ఆశ్రయించలేని వారిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా ప్రభుత్వం పీఆర్సీ –2020 ఎరియర్స్, జీపీఎఫ్ తదితర బకాయిలను వెంటనే చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. రిటైర్డ్ ఉద్యోగులకు ప్రభుత్వం అండగా ఉండాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు ప్రభాకర్రావు, దివాకర్ భారతి, రాంరెడ్డి, నర్సయ్య, మొగిలయ్య మహేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రిటైర్డ్ ఉద్యోగ, ఉపాధ్యాయుల డిమాండ్ కలెక్టరేట్ ఎదుట నిరసన -
‘సిమ్స్’ ప్రిన్సిపాల్గా నరేందర్
● హిమబిందుసింగ్ను తొలగిస్తూ ఉత్తర్వులు కోల్సిటీ(రామగుండం): గోదావరిఖనిలోని సింగరేణి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (సిమ్స్–ప్రభుత్వ) కాలేజీ ప్రిన్సిపాల్ హిమబింద్సింగ్ను ఆ బాధ్యతల నుంచి తొలగిస్తూ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి డాక్టర్ క్రిస్టియానా జె.చోంగ్తూ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. ఇదే కాలేజీలో బయోకెమిస్ట్రీ విభాగం ప్రొఫెసర్(హెచ్వోడీ), వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ జి.నరేందర్కు ఇన్చార్జి ప్రిన్సిపాల్ బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు వెలువరించారు. ఇప్పటివరకు ప్రిన్సిపాల్గా వ్యవహరించిన హిమబిందుసింగ్ను ఆ బాధ్యతల నుంచి త ప్పించడం చర్చనీయాంశమైంది. అయితే ఇదే కాలేజీలో ఖాళీగా ఉన్న పీడియాట్రిక్స్ విభాగానికి హెచ్వోడీగా కొనసాగాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. హిమబిందుసింగ్పై పలు ఆరోపణలు, ఫిర్యాదులు రావడంతోనే ప్రిన్సిపాల్ పదవి నుంచి తొలగించినట్లు కాలేజీలో ప్రచారం జరుగుతోంది. -
ఇంకుడు గుంతలు నిర్మించాలి
కోల్సిటీ(రామగుండం): భూగర్భ జలసంరక్షణలో భాగంగా ఇంటింటా ఇంకుడుగుంత నిర్మించుకునేలా ప్రజలను చైతన్యపరచాలని రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్ అరుణశ్రీ ఆదేశించారు. బల్దియా కార్యాలయంలో వార్డు ఆఫీసర్లతో గురువారం ఆమె సమావేశమయ్యారు. జలశక్తి అభియాన్లో భాగంగా నగరంలో డిసెంబర్ 31వ తేదీ వరకు 10 వేల ఇంకుడుగుంతలు నిర్మించడం లక్ష్యంగా నిర్దేశించామని ఆమె తెలిపారు. వార్డుఆఫీసర్లు, సహాయకులు, ఆర్పీల సహకారంతో ఇంటింటా సర్వే చేయాలన్నారు. ఇంకుడుగుంతలు ఉన్నవి, లేని ఇళ్ల వివరాలు, ఆ ఇంట్లో నిర్మించడానికి అవకాశం ఉందా? లేదా? అనే సమాచారం ఈనెలాఖరులోగా సేకరించి ఇవ్వాలని ఆదేశించారు. అవకాశం ఉన్నచోట నగరపాలక సంస్థ ద్వారా ఇంకుడుగుంత నిర్మిస్తుందని కమిషనర్ అన్నారు. స్వయంగా నిర్మించుకోవడానికి యజమాని ముందుకు వస్తే ఆస్తిపన్నులో 10 శాతం రాయితీకి అర్హులవుతారని అవగాహన కల్పించాలని అన్నారు. న ల్లా కనెక్షన్ వివరాలు అమృతం యాప్లో నమోదు చేయాలని ఆదేశించారు. పైలెట్ ప్రాజెక్ట్ కింద ఎన్టీపీసీ హెలిపాడ్ ట్యాంక్ పరిధిలో త్వరలో 24 గంటల పాటు తాగునీరు సరఫరా చేయడానికి కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో అడిషనల్ కమిషనర్ మారుతీప్రసాద్, సూపరింటెండెంట్ ఇంజినీర్ గురువీర, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రామన్, కార్యదర్శి ఉమామహేశ్వర్రావు, అసిస్టెంట్ కమిషనర్ వెంకటేశ్వర్లు, ఏసీపీ శ్రీహరి, ఆర్వో ఆంజనేయులు పాల్గొన్నారు. నగరంలో నిర్దేశిత లక్ష్యం 10 వేలు రామగుండం బల్దియా కమిషనర్ అరుణశ్రీ వెల్లడి -
పేషెంట్లకు ఊరట
మెడికల్ కాలేజీకి అనుబంధంగా బోధన ఆస్పత్రిలో క్యాన్సర్ డే కేర్ సెంటర్ ఏర్పాటు చేశాం. దీనిద్వారా పేషెంట్లకు ఊరట కలుగుతుంది. క్యాన్సర్ ఆస్పత్రి మార్గదర్శకాల మేరకే కీమోథెరపీ అందిస్తున్నాం. ఇందుకోసం ప్రత్యేకంగా వార్డు కేటాయించాం. పేషెంట్ల సంఖ్యకు అనుగుణంగా బెడ్లు పెంచుతాం. – దండే రాజు, ఆర్ఎంవో, జీజీహెచ్ ఆరోగ్య పరిస్థితిని బట్టి చికిత్స పేషెంట్ ఆరోగ్య పరిస్థితిని బట్టి ఎలాంటి చికిత్స చేయాలనేది నిర్ణయిస్తాం. ఎంఎన్జే క్యాన్సర్ ఆస్పత్రివారు తొలుత పేషెంట్కు అన్ని పరీక్షలు చేసి, తొలి కీమో సైకిల్ చేసిన వివరాలు నమోదు చేస్తారు. తర్వాత చికిత్స అందిస్తాం. – డాక్టర్ ఫరీద్, డే కేర్ సెంటర్ ఇన్చార్జి -
పరిహారం చెల్లిస్తేనే భూములిస్తాం
ముత్తారం(మంథని): పోతారం సమీపంలో చేపట్టిన గ్రీన్ఫీల్డ్ రోడ్డు పనులు చేయడానికి గురువారం వెళ్లిన అధికారులు, కాంట్రాక్టర్లను నిర్వాసిత రైతులు అడ్డుకున్నారు. రెండు రోజులుగా హైవే పనులు అడ్డుకుంటున్నారు. తొమ్మిది మంది రైతులు సాగు చేసుకుంటున్న భూములకు పరిహారం చెల్లించకుండా పనులు ఎలా చేస్తారని ప్రశ్నించారు. సమాచారం అందుకున్న తహసీల్దార్ మధూసూదన్రెడ్డి.. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. గ్రీన్ఫీల్డ్ రోడ్డు కోసం సేకరిస్తున్న భూములు పరిశీలించారు. పట్టాలతో ఆయన కార్యాలయానికి వెళ్లిన నిర్వాసిత రైతులతో తహసీల్దార్ మాట్లాడారు. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. ఓదెలలో వర్షం ఓదెల(పెద్దపల్లి): మండల కేంద్రంలో గురువారం హఠాత్తుగా వర్షం కురిసింది. రైతులు ఆరబోసుకున్న ధాన్యం తడిసేలోగా టార్పాలిన్ కవర్లు కప్పడంతో ప్రమాదం తప్పినట్లయ్యింది. కొనుగోళ్ల ప్రారంభంలోనే వర్షం కురవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆకట్టుకున్న యోగా పోటీలు గోదావరిఖనిటౌన్: ఇండియన్ యోగా ఫెడరేషన్ ఆధ్వర్యంలో స్థానిక శ్రీరామ విద్యా నికేతన్ పాఠశాలలో గురువారం జిల్లాస్థాయి అండర్– 10, 12, 14 యోగా పోటీలు నిర్వహించారు. విజేతలు హైదరాబాద్లోని సరూర్నగర్లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. ప్రతిభ చూపిన విద్యార్థులకు మెడల్స్ అందజేశారు. యోగా అసోసియేషన్ జిల్లా కార్యదర్శి సూర్యదేవర వెంకటేశ్వరరావు, అధ్యక్షురాలు కె.కవిత, కార్యదర్శి హసీనా బేగం, టోర్నమెంట్ డైరెక్టర్ ఎ.విజయ్కుమార్, పీఈటీలు ఎండీ ఆసిన్, సప్నరావు, సీహెచ్ అంజలి పాల్గొన్నారు. మెడికల్ షాపుల్లో తనిఖీలు పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రంలోని పలు మెడికల్ షాపుల్లో డ్రగ్ ఇన్స్పెక్టర్ శ్రవణ్కుమార్ గురువారం తనిఖీలు చేశారు. మూడురోజుల క్రితం ఓ మెడికల్ షాపులో పిల్లల కోసం కొనుగోలు చేసిన సిరప్ నాసిరకంగా ఉందని, కల్తీ చేశారనే అనుమానంతో బాధితుడు చిరంజీవి వైద్యాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో గురువారం మెడికల్ షాపులను తనిఖీ చేశారు. బాధితుడి వద్ద గల సిరప్ సీసా సీజ్ చేసి ల్యాబొరేటరీకి పంపించనున్నట్లు శ్రవణ్కుమార్ తెలిపారు. నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. మెడికల్ షాపుల నుంచి మందులను కొనుగోలు చేసే వారంతా తప్పనిసరిగా బిల్లు పొందాలని సూచించారు. వినియోగదారులకు మందులతోపాటు బిల్లులు ఇవ్వాలని దుకాణ యజమానులను ఆయన ఆదేశించారు. డీపిల్లరింగ్ ప్యానెల్ ప్రారంభం గోదావరిఖని: సింగరేణి ఆర్జీ–1 పరిధిలోని జీడీకే–11గనిలో డీపిల్లరింగ్ సీఎం –వన్ ప్యా నెల్ సీ–టూ బీ ప్యానెల్ను జీఎం లలిత్కుమా ర్ గురువారం ప్రారంభించారు. గ్రూప్ ఏజెంట్ రాందాస్, గని మేనేజర్ మల్లేశం, సేఫ్టీ ఆఫీసర్ మల్లేశ్, ఫిట్ ఇంజినీర్ రాకేశ్ పాల్గొన్నారు. నేటి నుంచి రైల్వేగేట్ మూసివేత పెద్దపల్లిరూరల్: అందుగులపల్లిలోని రైల్వే లె వల్ క్రాసింగ్ గేట్ నంబరు 44ను శుక్రవారం నుంచి ఈనెల 30వ తేదీ వరకు మూసివేసి ఉంచుతామని అధికారులు తెలిపారు. ఖాజీపేట–బల్లార్ష సెక్షన్లోని ఈ ప్రాంతంలో అత్యవసరంగా మరమ్మలు చేపట్టడంతో గేట్ మూసివేసిఉంచుతామన్నారు. ప్రజలు, ప్రజాప్రతినిధు లు, అధికారులు సహకరించాలని కోరారు. -
జీజీహెచ్లో స్కానింగ్ సెంటర్ తనిఖీ
కోల్సిటీ(రామగుండం): గోదా వరిఖని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్(జీజీహెచ్)లోని రేడి యాలజీ, గైనిక్ విభాగంలోని స్కానింగ్ మిషన్ను జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి(డీఎంహెచ్వో) వాణిశ్రీ గురువారం తనిఖీ చేశారు. రేడియోలజిస్ట్ సమత నుంచి వివరాలు అడిగి సేకరించారు. స్కానింగ్ రికార్డులు, ఫారమ్ –ఎఫ్ రిపోర్టులు, స్కానింగ్ యంత్రం తయారీ, మోడల్, సీరియల్ నంబర్ తదితర వివరాలను పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ.. ప్రతీ గర్భిణికి స్కానింగ్ చేసే సమయంలో తప్పనిసరిగా ఫారమ్ – ఎఫ్ నింపాలన్నారు. గర్భంలోని పిండం, శిశువు లింగ సమాచారం గురించి తాము అడుగబోమని డిక్లరేషన్ తీసుకోవాలి సూచించారు. స్కానింగ్ పొందిన వారి వివరాలను ఎప్పటికప్పుడు వెబ్సైట్లో నమోదు చేయాలన్నారు. ఫారమ్– ఎఫ్లను జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో ప్రతీనెల 5వ తేదీలోగా అందజేయాలని కోరారు. లింగ నిర్ధారణ చేసినా, చేయాలని అడిగినా, ప్రోత్సహించినా చట్ట ప్రకారం 3 సంవత్సరాలు జైలు శిక్షతోపాటు రూ.10 వేల జరిమానా విధిస్తారని ఆమె హెచ్చరించారు. నర్సింగ్ కాలేజీ సందర్శన.. గోదావరిఖని శారదనగర్లోని ప్రభుత్వ నర్సింగ్ కాలేజీని డీఎంహెచ్వో శ్రీవాణి సందర్శించారు. విద్యార్థులకు అందుతున్న అకడమిక్ వివరాలు, హాస్టల్లో సౌకర్యాలు తదితర వివరాలను ప్రిన్సిపాల్ ప్రసూన, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడిన డీఎంహెచ్వో.. విద్యా విధానం, సమస్యలపై ఆరా తీశారు. -
24 గంటల్లో ధాన్యం డబ్బుల చెల్లింపు
పెద్దపల్లి/కాల్వశ్రీరాంపూర్/ఓదెల: ప్రభుత్వ కొను గోలు కేంద్రాల్లో రైతులు విక్రయించిన ధాన్యం డబ్బులను 24 గంటల్లో వారి బ్యాంకు ఖాతాల్లో జమచేస్తామని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. సుల్తానాబాద్ వ్యవసాయ మార్కెట్లో పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రం, కాల్వశ్రీరాంపూర్ వ్యవసాయ మార్కెట్లో డీసీఎంఎస్, ఓదెల మండలం పొత్కపల్లిలో మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను గురువారం ఆయన అడిషనల్ కలెక్టర్ వేణుతో కలిసి ప్రారంభించారు. పొత్కపల్లిలో ధాన్యం కొనుగోళ్లనూ ప్రారంభించి మాట్లాడారు. క్వింటాల్ మక్కలు రూ.2,400 మద్దతు ధరతో కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని ఆయన సూచించారు. ఆయా కార్యక్రమాల్లో తహసీల్దార్లు రాకేశ్, జగదీశ్వర్రావు, పౌర సరఫరాల డీఎం శ్రీకాంత్, డీసీవో శ్రీమాల, మార్కెట్ డీఎం ప్రవీణ్రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ శంకర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్యగౌడ్, సుల్తానాబాద్, పెద్దపల్లి ఏ ఎంసీ చైర్పర్సన్లు ప్రకాశ్రావు, స్వరూప, నాయ కులు సారయ్యగౌడ్, సబ్బని రాజమల్లు, గాజనవేన సదయ్య, లంక సదయ్య, ఆళ్ల సుమన్రెడ్డి, మూల ప్రేంసాగర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు -
చలికాలం.. భద్రం
● జాగ్రత్తలు తీసుకుంటేనే ఆరోగ్యం ● జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి వాణిశ్రీ పెద్దపల్లి: వానాకాలం ముగిసింది. చలికాలం ఆరంభమైంది. వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇందుకు అనుగుణంగా ప్రజలు.. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, ఆస్తమా, శ్వాసకోశ, గుండె సంబంధిత తదితర వ్యాధిగ్రస్తులు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకుంటేనే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటా రని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి వాణిశ్రీ వివరిస్తున్నారు.చలికాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? డీఎంహెచ్వో : చిన్నపిల్లలు, వృద్ధులు తప్పనిసరిగా షట్టర్లు, దుప్పట్లు ధరించాలి. పిల్లల ఆరోగ్యగంపై తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకోవాలి. ఉదయం లేవగానే చలిలో ఉండొద్దు. ఉదయం లేవగానే ఏం చేయాలి? డీఎంహెచ్వో : అన్ని వయసులవారు మార్నింగ్ వాకింగ్ చేయడం మంచిది. గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలుపుకుని తాగాలి. ఇలా చేస్తే శరీరం పొడిబారదు. ఎలాంటి ఆహారం తీసుకోవాలి? డీఎంహెచ్వో : ప్రతీరోజు వేడిగా ఉన్న అన్నం,కూరలు తీసుకోవాలి. తాజా ఆకుకూరలు, కూరగాయలు, సూప్లు తీసుకోవాలి. ఎలాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది? డీఎంహెచ్వో : చలికాలంలో జలుబు, దగ్గు, ఒళ్లు నొప్పులు, జ్వరం వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయి. వృద్ధులకు గుండెపోటు వచ్చే అవకాశాలు ఉన్నాయా? డీఎంహెచ్వో : చలితీవ్రతకు శరీరంలోని రక్తం చిక్కబడుతుంది. ఇది వృద్ధుల్లో ఎక్కువగా ఉంటుంది. ఆస్తమా బాధితులు ఏం చేయాలి? డీఎంహెచ్వో : ఆస్తమా బాధితులు చలికాలంలో చాలాజాగ్రత్తలు తీసుకోవాలి. దుమ్ము, ధూళిలో తిరగవద్దు. ఇన్హేలర్ అందుబాటులో ఉంచుకోవాలి. న్యుమోనియా బారినపడేవారెవరు? డీఎంహెచ్వో : పిల్లలు, వృద్ధులు న్యుమోనియా బారిన పడే అవకాశం ఉంది. వీరు చల్లని వాతావరణంలో ఎక్కువసేపు ఉండొద్దు. మంచు కురిసే ఉదయం, రాత్రి వేళలో బయటకు వెళ్లవద్దు. ఈ వ్యాధి బారిన పడకుండా పిల్లలకు టీకా వేయించాలి. చాలామంది ఇంటి వైద్యాన్ని ఆశ్రయిస్తున్నారు? డీఎంహెచ్వో : ఇంటి వైద్యం ప్రాణాంతకం. వైద్యుల పర్యవేక్షణలోనే తగిన చికిత్స తీసుకోవాలి. వ్యాధి నిరోధక శక్తి ఎలా పెరుగుతుంది? డీఎంహెచ్వో : నిమ్మలో సి– విటమిన్ అధికంగా ఉంటుంది. ఇలా విటమిన్లు ఉండే పండ్లు తినాలి. తద్వారా వ్యాధి రోధక శక్తి పెరుగుతుంది. అంతేకాదు.. తగినంత తాగునీరు తీసుకోవాలి. ఫ్రిజ్లో నిల్వచేసిన ఐస్, ఐస్ క్రీమ్ తినవద్దు. పల్లిపట్టి, శరీరానికి వేడిచేసే పదార్థాలు మాత్రమే చలికాలంలో తీసుకోవడం మంచిది. -
శతాధిక వృద్ధురాలు మృతి
రామడుగు: రామడుగు మండలం గుండి గ్రామానికి చెందిన శతాధిక వృద్ధురాలు చేని నర్సవ్వ(106) బుధవారం ఆనారోగ్యంతో మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. నర్సవ్వకు ముగ్గురు కొడుకులు, కుతురు ఉన్నారు. ప్రస్తుతం వారి మొత్తం కుటుంబ సభ్యులు 68మంది వరకు ఉంటారని గ్రామస్తులు తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తి..జమ్మికుంట: పట్టణంలోని రైల్వేస్టేషన్లో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. రామగుండం రైల్వే పోలీస్ హెడ్ కానిస్టేబుల్ గంగారపు తిరుపతి వివరాల ప్రకారం.. జమ్మికుంట రైల్వే స్టేషన్ ప్లాట్ఫారంపై గుర్తు తెలియని 65ఏళ్ల వ్యక్తి చనిపోయి ఉన్నాడు. మృతుని వద్ద ఎలాంటి అధారాలు లేవు. లేత ఆకుపచ్చ కలర్ టీషర్ట్, తెలుపు ధోతి ధరించి, చేతి కర్రతో ఉన్నాడు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో ఉంచారు. ఎవరైనా తెలిసినవారుంటే 9949304574, 8712658604 నంబర్ను సంప్రదించాలని సూచించాడు. కోనరావుపేట(వేములవాడ): సెల్టవర్ పైనుంచి దూకి ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన మండలంలోని మామిడిపల్లిలో విషాదం నింపింది. గ్రామస్తులు తెలిపిన వివరాలు. రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మామిడిపల్లికి చెందిన గుమ్మడి దేవయ్య–సరవ్వ కుమారుడు బాబు(32) కొన్నాళ్ల క్రితం గల్ఫ్ వెళ్లి దసరా పండుగకు ముందు స్వగ్రామానికి వచ్చాడు. గ్రామంలోనే ఉంటున్న బాబు బుధవారం రాత్రి ఎన్గల్కు వెళ్లే దారిలోని టవర్ ఎక్కాడు. విషయం తెలుసుకున్న భార్య, గ్రామస్తులు టవర్ ఎక్కి కాపాడే ప్రయత్నం చేస్తుండగానే పై నుంచి దూకడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతికి గల కారణాలు తెలియరాలేదు. కాగా గతంలో కూడా పలుమార్లు టవర్పైకి ఎక్కి ఆత్మహత్యాప్రయత్నం చేశాడు. మృతునికి భార్య ప్రవళిక, కుమారుడు, కూతురు ఉన్నారు. జర్మనీలో నర్సింగ్ కోర్సువిద్యానగర్(కరీంనగర్): జర్మనీలో ఆరోగ్య సంరక్షణ కార్మికులకు, నర్సులకు అధిక డిమాండ్ ఉన్నందున అక్కడ నర్సింగ్ మూడేళ్ల ఇంటర్నేషనల్ డిగ్రీ చదవడానికి తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ అవకాశం కల్పిస్తోందని, జిల్లా ఉపాధి కల్పనాధికారి వై.తిరుపతి రావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. చదువుకునే సమయంలో మూడేళ్లపాటు రూ.లక్ష స్టైఫండ్, నర్సుగా నెలకు రూ.3లక్షల వరకు వేతనం పొందే అవకాశం ఉందన్నారు. ఇంటర్లో 60శాతం మార్కులతో ఉత్తీర్ణత పొంది, 18 నుంచి 28 ఏళ్లోపు వయసువారు అర్హులని, ఎంపికై న అభ్యర్థులను జర్మనీకి పంపించే ముందు హైదరాబాద్లో జర్మన్ భాషలో తొమ్మిది నెలల పాటు రెసిడెన్షియల్ శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలపారు. ఆసక్తి ఉన్నవారు 63022 92450, 94400 51763 నంబర్లలో సంప్రదించాలని, అభ్యర్ధులు తమ రెజ్యూమ్ను tomcom. recruitment manager@gmail.comకు ఈనెల 30లోగా పంపాలని సూచించారు. వీడియో వైరల్పై సీరియస్వేములవాడ: రాజన్న ప్రసాదాల ప్రధాన గోదాంలో నుంచి ఓ ఉద్యోగి సరుకులు తరలిస్తున్నట్లు ఉన్న వీడియో సోషల్మీడియాలో వైరల్గా మారడాన్ని రాష్ట్ర దేవాదాయశాఖ సీరియస్గా పరిగణించింది. ఆలయ ఈవో రమాదేవి, ఏఈవోలు, ఇతర అధికారులు భీమేశ్వర సదన్లోని సీసీ ఫుటేజీలను పరిశీలించారు. అందులో కనిపించిన ఉద్యోగులను వేర్వేరుగా విచారించగా.. ఆలయంలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి ఉద్దేశ్యపూర్వకంగానే ఇద్దరు ఔట్సోర్సింగ్ సిబ్బందితో ఈ వీడియో రికార్డింగ్ చేయించినట్లు సీసీ కెమెరా ఫుటేజీల్లో స్పష్టంగా తెలుస్తోంది. ఈ విషయం తెలిసినప్పటి నుంచి సదరు ఉద్యోగి తనని తాను రక్షించుకునేందుకు పైరవీలు మొదలుపెట్టినట్లు ప్రచారంలో ఉంది. గోదాంలోని అధికారి.. సిబ్బందిని విధులు సరిగ్గా నిర్వహించాలని ఆదేశించినందుకే ఇలాంటి చర్యలకు పాల్పడినట్లు అధికారుల విచారణలో తేలినట్లు సమాచారం. వీడియో రికార్డింగ్ చేయించిన ఉద్యోగిపై త్వరలోనే శాఖాపరమైన చర్యలకు దిగనున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా గోదాంలోని సరుకులు పక్కదారి పట్టకుండా ఇక నుంచి ప్రతీ 15 రోజులకోసారి తూకం వేసి లెక్కలు చూడాలని ఈవో రమాదేవి ఆదేశాలు జారీ చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. గంభీరావుపేట(సిరిసిల్ల): ఉమ్మడి జిల్లా హ్యాండ్బాల్ పోటీల్లో విజేతగా రాజన్నసిరిసిల్ల జిల్లా జట్లు నిలిచాయి. గంభీరావుపేట మండలం కొ త్తపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో బుధవారం ఉమ్మడి జిల్లాస్థాయి హ్యాండ్బాల్ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో రాజన్నసిరిసిల్ల, పెద్దపల్లి, జగిత్యాల, కరీంనగర్లకు చెందిన 8 జట్లు పాల్గొన్నాయి. బాలురు, బాలికలకు వేర్వేరుగా పోటీలు నిర్వహించారు. బాలురు, బాలికల విభాగాల్లో రాజన్న సిరిసిల్ల జట్లు ప్రథమ, కరీంనగర్ జట్లు ద్వితీయ స్థా నాల్లో నిలిచాయి. విజేతలకు స్థానిక నాయకుడు దమ్మ శ్రీనివాస్రెడ్డి బహుమతులను అందించారు. షాదుల్, మల్లేశం భోజన వసతి కల్పించారు. పీడీ భార భాను, ఎంఈవో గంగారాం, హ్యాండ్బాల్ అసోసియేషన్ సభ్యులు శ్రీనివాస్, అశోక్, సుమన్, కృష్ణహరి పాల్గొన్నారు. -
వరి పంటకు నిప్పు పెట్టిన రైతు
పాలకుర్తి(రామగుండం): ఆరుగాలం కష్టించి సాగు చేసిన పంటకు దోమపోటు సోకడంతో కాపాడుకునేందుకు ప్రయత్నించి విసుగుచెందిన రైతు.. చివ రకు పంటకు నిప్పు పెట్టిన సంఘటన పాలకుర్తి మండలం బసంత్నగర్లో చోటుచేసుకుంది. గ్రా మానికి చెందిన రైతు పర్శవేన శ్రీనివాస్ తన రెండెకరాల్లో ఈసారి సన్నరకం వరి వేశాడు. దాదాపు రూ.60వేల వరకు పెట్టుబడి పెట్టాడు. మరికొద్దిరోజుల్లో పంట కోసేందుకు సిద్ధమయ్యాడరు. ఈక్రమంలో వరికి దోమపోటు సోకింది. నాలుగుసార్లు పురుగులమందు పిచికారీ చేశాడు. అయినా.. దో మపోటు అదుపులోకి రాలేదు. విసుగుచెందిన రై తు.. బుధవారం పంటకు నిప్పుపెట్టాడు. ఆరుగాలం కష్టించి పండించిన పంట చివరిదశలో ఉండగా సోకిన తెగులుతో పెట్టుబడి కూడా వచ్చే పరిస్థి తి లేదని రైతు శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశాడు. -
ధర్మపురిలో రెండిళ్లలో చోరీ
ధర్మపురి: తాళం వేసి ఉన్న రెండిళ్లలో చోరీకి పాల్పడి నగదు, బంగారం ఎత్తుకెళ్లిన ఘటన ధర్మపురిలో చోటు చేసుకుంది. పట్టణానికి చెందిన కొరిడె సత్తయ్య జర్మనీలో ఉంటున్న తన కూతురు వద్దకు ఇటీవల వెళ్లాడు. అలాగే ప్రభుత్వ ఉపాధ్యాయుడు నాందేవి దీపావళి సెలవుల కోసం సొంతూరుకు వెళ్లాడు. ఈ రెండిళ్లలో గుర్తు తెలియని వ్యక్తులు చొరబడ్డారు. నాందేవి బుధవారం ఇంటికి వచ్చి చూడగా తాళాలు పగులగొట్టి ఉన్నాయి. రూ.15వేలు, అర తులం బంగారం, సత్తయ్య ఇంట్లో తులంనర బంగారం, వెండి పత్ర మాయమైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఉదయ్కుమార్ తెలిపారు. -
అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్
జగిత్యాలక్రైం: జగిత్యాల అర్బన్ మండలం ధరూర్లో ఈనెల 13న తాళం వేసిన ఇళ్లలో చోరీకి పాల్పడిన అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్ చేసినట్లు జగిత్యాల డీఎస్పీ రఘుచందర్ తెలిపారు. జగిత్యాల రూరల్ సర్కిల్ కార్యాలయంలో బుధవారం వివరాలు వెల్లడించారు. ధరూర్ గ్రామంలో ఈనెల 13న తాళం వేసిన నాలుగిళ్లలో గుర్తుతెలియని దొంగలు చోరీకి పాల్పడ్డారు. కేసు నమోదు చేసి నిందితులను సాంకేతిక పరిజ్ఞానంతో మహారాష్ట్ర అంతర్రాష్ట్ర దొంగలుగా గుర్తించారు. మూడు ప్రత్యేక పోలీసు బృందాలను మహారాష్ట్రకు పంపించి గాలింపు చర్యలు చేపట్టారు. ధరూర్ శివారులోని బైపాస్రోడ్లో నిందితులు కారులో వెళ్తుండగా 15ఏళ్ల బాలుడితోపాటు మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ధర్మాబాద్ తాలూక దేవిగల్లికి చెందిన మ్యాకల్వార్ సాయినాథ్, ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం యామయ్కుంటకు చెందిన శ్రీకాంత్ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. వారి నుంచి 24.05 గ్రాముల బంగారు నగలు, రూ.19 వేలు, కారు, రెండు సెల్ఫోన్లు, మూడు ఫేస్మాస్క్లు, హ్యాండ్ గ్లౌస్లు, ఓ ఐరన్ రాడ్ స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ వెల్లడించారు. మరో నిందితుడు మహారాష్ట్రలోని హింగోలి జిల్లా బాస్మత్ తాలూకా ఖార్ఖానారోడ్కు చెందిన మార్కులి అనిల్ పరారీలో ఉన్నాడని తెలిపారు. పట్టుబడిన దొంగలంతా గతంలో జగిత్యాల, మంచిర్యాల, నిజామాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, మహారాష్ట్రలోని నాందేడ్, హింగోలి జిల్లాల్లో దొంగతనాలకు పాల్పడ్డారని, వారిపై కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. దొంగలను పట్టుకోవడంలో కృషి చేసిన జగిత్యాల రూరల్ సీఐ సుధాకర్, రూరల్ ఎస్సై సదాకర్, మెట్పల్లి ఎస్సై కిరణ్కుమార్, బీర్పూర్ ఎస్సై రాజు, ఏఎస్సై సత్తయ్య, కానిస్టేబుళ్లు శ్రీనివాస్, మోహన్, రమేశ్, శ్రీనివాస్, కిరణ్, విశాల్, ప్రణయ్, ఆంజనేయులు, సత్యనారాయణను డీఎస్పీ అభినందించారు. వారికి నగదు రివార్డులు అందించారు. 24.05 గ్రాముల బంగారం.. రూ.19 వేలు, కారు స్వాధీనం -
ఐదు నిమిషాలైతే ఇల్లు చేరేదే..
ధర్మపురి: ఐదు నిమిషాలైతే ఆమె క్షేమంగా ఇంటికి చేరుకునేది. అంతలోనే విషాదం చోటుచేసుకుంది. వ్యవసాయ పనులకు వెళ్లి ద్విచక్ర వాహనంపై తిరిగి వస్తుండగా గేదెను ఢీకొని మహిళాకూలి మృతి చెందిన సంఘటన మండలంలోని నేరెల్ల శివారులో బుధవారం చోటుచేసుకుంది. ఎస్సై రవీందర్, గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన వేముల పుష్పలత (50) రోజులాగానే పత్తి ఏరేందుకు కూలీకి వెళ్లింది. సాయంత్రం పనులు ముగించుకున్న అనంతరం భూమి యజమానితోపాటు పుష్పలత, గౌరమ్మను బైక్పై ఇంటికి బయల్దేరారు. నేరెళ్ల సమీపంలోకి రాగానే ఎదురుగా గేదె అడ్డు వచ్చింది. దానిని ఢీకొట్టడంతో పుష్పలత, గౌరమ్మ కింద పడిపోయారు. పుష్పలతకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందింది. గౌరమ్మకు స్వల్పగాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు ఘటన స్థలానికి చేరుకుని గుండెలవిసేలా రోధించారు. ఐదు నిమిషాల్లో ఇంటికి చేరేదానివంటూ కన్నీటి పర్యంతమయ్యారు. పుష్పలతకు భర్త చంద్రయ్య, ముగ్గురు కుమారులున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. రోడ్డు ప్రమాదంలో మహిళ దుర్మరణం -
వైభవంగా కార్తీక దీపోత్సవం
వేములవాడ: రాజన్న అనుబంధ భీమేశ్వరస్వామి ఆలయంలో కార్తీక దీపోత్సవం బుధవారం రాత్రి ఘనంగా జరిగాయి. శ్రీలలితసేవా సమితి సభ్యులు వివిధ ఆకృతుల్లో పూలను పేర్చి అందులో దీపాలు వెలిగించారు. రాజన్న ఆలయంలో ఆకాశదీపం కార్తీకమాసం సందర్భంగా రాజన్న ఆలయంలోని గండాదీపంలో ఆకాశదీపాన్ని ఆలయ అర్చకులు వెలిగించారు.అభిషేక ప్రియుడికి కోటి దండాలు వేములవాడ: రాజన్నను బుధవారం భారీ సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. రాజన్న, భీమన్న ఆలయాల్లో దర్శనాలు, కోడెమొక్కులు కొనసాగాయి. రాజన్న ఆలయంలో అభిషేకాలు అత్యధికంగా జరిగాయి. ఆలయంలో పనులు జరుగుతుండడంతో గంటసేపు దర్శనాలు నిలిపివేశారు. ఏర్పాట్లను ఈవో రమాదేవి, ఏఈవో శ్రీనివాస్, పర్యవేక్షకులు నునుగొండ రాజేందర్ పరిశీలించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ సతీమణి అపర్ణ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. -
అంత్యక్రియలకు వెళ్తూ.. అనంత లోకాలకు..
ఎల్లారెడ్డిపేట/కోనరావుపేట: బంధువుల అంత్యక్రియలకు వెళ్తుండగా జరిగిన ప్రమాదంలో ఓ మహిళ మృతిచెందింది. ఎల్లారెడ్డిపేట మండలంలో జరిగిన ప్రమాదం కోనరావుపేట మండలం సుద్దాలలో విషాదాన్ని నింపింది. ఎల్లారెడ్డిపేట ఎస్సై రాహుల్రెడ్డి తెలిపిన వివరాలు. కోనరావుపేట మండలం సుద్దాల గ్రామానికి చెందిన దొబ్బల మరియమ్మ(58) అల్మాస్పూర్లో బంధువుల ఇంట్లో ఒకరు చనిపోగా బైక్పై తన చిన్నకుమారుడు ప్రభాకర్తో కలిసి వస్తుంది. ఈక్రమంలో అక్కపల్లి శివారులోని బుగ్గరాజేశ్వరస్వామి ఆలయం వద్ద గల మూలమలుపు వద్ద వాహనం అదుపుతప్పడంతో మరియమ్మ కిందపడింది. తలకు బలమైన గాయాలు కావడంతో ఎల్లారెడ్డిపేటలోని ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాహుల్రెడ్డి తెలిపారు. అంగన్వాడీ కేంద్రంలో ఆయాగా పనిచేస్తున్న మరియమ్మ అంత్యక్రియలు సుద్దాలలో గురువారం నిర్వహించనున్నారు. రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి -
రెండు ఆలయాల్లో దొంగతనం
కథలాపూర్: మండలంలోని భూషణరావుపేట శివారులోని రెండు ఆలయాల్లో దొంగతనం జరిగినట్లు గ్రామస్తులు తెలిపారు. దుర్గామాత ఆలయంలో దొంగలు పడి అమ్మవారి మెడలో ఉన్న బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. హుండీని ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. రేణుక ఎల్లమ్మ ఆలయంలో చొరబడి బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. హుండీని ధ్వంసం చేసి డబ్బులు ఎత్తుకెళ్లినట్లు గ్రామస్తులు తెలిపారు. సంఘటన స్థలాన్ని ఎస్సై నవీన్కుమార్ పరిశీలించి వివరాలు సేకరించారు. ఆలయాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించాలని ఆలయ కమిటీ సభ్యులకు ఎస్సై సూచించారు. -
ఇరాక్లో పెగడపల్లి వాసి మృతి
పెగడపల్లి: స్వదేశానికి వచ్చేందుకు రెండు రోజులు క్రితం విమాన టికెట్టు బుకింగ్ చేసుకున్న వలస జీవి.. అంతలోనే గుండెపోటుతో మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. పెగడపల్లి మండలకేంద్రానికి చెందిన లింగంపల్లి రమేశ్ (55) ఉపాధి నిమిత్తం రెండేళ్ల క్రితం ఇరాక్ వెళ్లాడు. స్వదేశానికి వచ్చేందుకు టికెట్ బుక్ చేసుకున్నాడు. ఈ క్రమంలో మంగళవారం రమేశ్ గుండెలో నొప్పిగా ఉందంటూ చెప్పగా.. తోటిమిత్రులు ఆసుపత్రికి తీసుకెళ్తుండగానే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులకు సమాచారమందింది. క్షేమంగా ఇంటికొస్తాడని అనుకుంటున్న సమయంలో ఇలా గుండెపోటు రూపంలో మృత్యువు కబళించడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. రమేశ్కు భార్య, కుమారుడు, కూతురున్నారు. ఇంటికొచ్చేందుకు టికెట్ బుకింగ్.. అంతలోనే గుండెపోటు -
డీపీఆర్కు మంత్రివర్గం సానుకూలమేనా?
రామగుండం: పట్టణంలో మూతపడిన ఆర్టీఎస్–బీ విద్యుత్ కేంద్రానికి చెందిన స్థలంలోనే కొత్తగా 800 మెగావాట్ల సూపర్ క్రిటికల్ విద్యుత్ కేంద్రం స్థాపనపై జెన్కో సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)ను సిద్ధం చేసింది. ఈ నేపథ్యంలో గురువారం క్యాబినెట్ సమావేశంలో దీనికి మంత్రివర్గం ఆమోదముద్ర వేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఫలితంగా విద్యుత్ కేంద్రం స్థాపనకు తొలిఅడుగు పడనుంది. ఈవిషయమై పట్టణ ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది. ఈమేరకు ఎమ్మెల్యే మక్కాన్సింగ్ఠాకూర్ హైదరాబాద్లో విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్కను కలిసి పలు అంశాలపై ఇప్పటికే చర్చించారు. విద్యుత్ కేంద్రం స్థాపనకు అనుకూలం.. మూతపడిన విద్యుత్ కేంద్రం స్థలంలో కొత్తగా 800 మెగావాట్ల సామర్థ్యంతో విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని, అందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని గతేడాది ఆగస్టు 31వ తేదీన బీ–థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని సందర్శించిన విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఆయన వెంట ఉన్న మంత్రులు శ్రీధర్బాబు, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే మక్కాన్సింగ్ఠాకూర్ సమక్షంలో ఇంజినీర్ల బృందం కొత్త విద్యుత్ కేంద్రానికి స్థానికంగా ఉన్న వనరుల లభ్యత, మానవ వనరులు తదితర అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై విద్యుత్ మంత్రి భట్టి సంతృప్తి చెందారు. రూ.10,893.05 కోట్ల వ్యయంతో.. కొత్త విద్యుత్ కేంద్రం స్థాపనకు రూ.10,893.05 కోట్లు వ్యయం అవుతుందని నిర్ణయించారు. ప్రాజెక్టు స్థాపనకు 650 ఎకరాలు అవసరం ఉంటుందని పేర్కొన్నారు. ఏటా విద్యుత్ వినియోగానికి 3.053 మిలియన్ టన్నుల బొగ్గు, గంటకు 2,365 క్యూబిక్ మీటర్ల నీరు(ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి) వినియోగం ఉంటుందని ప్రభుత్వానికి సమర్పించనున్న నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. ఆస్తులు, మానవ వనరులు.. గతేడాది సందర్శించిన విద్యుత్శాఖ మంత్రికి నివేదించిన గణాంకాల ప్రకారం.. బీ–థర్మల్ విద్యుత్, ఉద్యోగుల క్వార్టర్లతో కలిపి భూములు 700.24 ఎకరాలు కాగా ప్రస్తుతం 580.09 ఎకరాలు మాత్రమే క్లియర్గా ఉన్నట్లు తెలిసింది. జెన్కో భూముల్లోనే పోలీస్స్టేషన్, పోస్టాఫీస్, ఈఎస్ఐలో కొంత స్థలం, మున్సిపల్ శాఖ, ఎస్టీపీలు ఉండగా, 90 ఎకరాలు కబ్జాకు గురైనట్లు గణాంకాల్లో పేర్కొన్నారు. బీ–థర్మల్ ఉద్యోగులు 323 మంది కాగా వైటీపీఎస్ బదిలీ వెళ్లిన ఉద్యోగులను తీసివేసేత 225 మంది స్థానికంగా ఉన్నారు. ఇంజినీర్లు–52, కెమిస్ట్ ఒకరు, ఓఅండ్ఎం–80, అకౌంట్స్ సెక్షన్–17, పర్సనల్(జనరల్)–12, ఫైర్ సేఫ్టీ–8, జెన్కో కానిస్టేబుళ్లు–14, ఆర్టిజన్లు–49 మంది ఉన్నారు. గతేడాది జూన్ 4న మూతపడిన విద్యుత్ కేంద్రం.. సుమారు 16 నెలల క్రితం మూతపడిన విద్యుత్ కేంద్రంలో వివిధ విభాగాలకు చెందిన 98 మందిని యాదాద్రికి బదిలీ చేశారు. మిగతా ఉద్యోగులు, ఇంజినీర్లు, ఆర్టిజన్లు స్థానికంగా ఉండగా వారికి నెలవారీ జీతాల కింద సుమారు రూ.3 కోట్లు వెచ్చిస్తున్నట్లు సమాచారం. స్థానికంగా విధులు నిర్వహించని షిఫ్ట్ ఉద్యోగులకు అలవెన్సులు చెల్లిస్తుండడంపై యాదాద్రికి బదిలీపై వెళ్లిన ఉద్యోగులు తీవ్రఅసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలోని ఇతర విద్యుత్ కేంద్రాల్లో షిఫ్ట్ అలవెన్సులు చెల్లించడం లేదని, మూతపడిన కేంద్రంలోని ఉద్యోగులకు షిఫ్ట్ అలవెన్సులు చెల్లించడం ఏమిటని బదిలీపై వెళ్లిన వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జెన్కో ఇంజినీర్లతో విద్యుత్శాఖ మంత్రి భట్టి (ఫైల్) ఎమ్మెల్యేతో సమావేశమైన ఇంజినీర్లు (ఫైల్)మేము కేవలం స్థానికంగా విద్యుత్ భద్రత పర్యవేక్షకులుగా కొనసాగుతున్నాం. కొద్దిమంది ఉద్యోగుల సంక్షేమానికి చర్యలు చేపడుతున్నాం. కొత్త విద్యుత్ కేంద్రం స్థాపన, ఇతరత్రా అంశాలన్నీ ఉన్నతస్థాయిలోనే నిర్ణయాలు జరుగుతాయి. – దాసరి శంకరయ్య, ఇన్చార్జి ఎస్ఈ, బీ–థర్మల్ క్యాబినెట్ సమావేశంలో కొ త్త విద్యుత్ కేంద్రం డీపీఆర్ కు తప్పకుండా ఆమోదము ద్ర పడుతుందని ఆశిస్తు న్నా. ఆ తర్వాత ప్రస్తు తం ఉన్న కేంద్రాన్ని స్క్రాప్కు తరలించి కొత్త ప్రాజెక్టు పనులు ప్రారంభిస్తాం. కొత్త విద్యుత్ కేంద్రం స్థాపన నా ముఖ్య ధ్యేయం. – మక్కాన్సింగ్ ఠాకూర్, ఎమ్మెల్యే, రామగుండం -
బాస్కెట్బాల్ పోటీలకు ఎంపిక
కరీంనగర్రూరల్: నగరంలోని అంబేద్కర్ స్టేడియంలో ఇటీవల నిర్వహించిన ఎస్జీఎఫ్ అండర్– 14 బాస్కెట్బాల్ పోటీల్లో బొమ్మకల్లోని బిర్లా ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్ధులు విక్యాత్, నిత్య ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు ఎంపికై నట్లు కోచ్ అనూప్ తెలిపారు. విద్యార్థులను బుధవారం ప్రిన్సిపాల్ బబిత విశ్వనాథన్, చైర్మన్ దాసరి ప్రశాంత్రెడ్డి, వ్యాయామ విభాగం అధిపతి మురళీధర్ అభినందించారు. నేడు ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం పెద్దపల్లి: సుల్తానాబాద్ వ్యవసాయ మార్కెట్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం ఎమ్మెల్యే విజయరమణారావు ప్రారంభించనున్నారు. పట్టణ పరిధిలో సుమారు 112 రైస్ మిల్లులు ఉన్నాయి. ఫలితంగా జిల్లాలో కొనుగోలు చేసే ధాన్యాన్ని సుల్తానాబాద్లోని మిల్లులకే అధికంగా తరలిస్తామని, ఇందుకోసం రవాణా, హమాలీలు, కూలీలు తదితర ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు. సన్న రకం ధాన్యం క్వింటాల్కు రూ.500 బోనస్ చెల్లిస్తోంది. ఏ గ్రేడ్ ధాన్యానికి రూ.2,389, సాధారణ రకానికి రూ.2,369గా మద్దతు ధర చెల్లిస్తారు. తప్ప, తాలు, మట్టి లేకుండా, నిర్దేశిత తేమశాతంతోనే ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకు రావాలని అధికారులు సూచించారు. -
రేడియాలజిస్ట్ల జాడేది?
● ఐదు సింగరేణి ఆస్పత్రుల్లో ఖాళీలు ● నిరుపయోగంగా స్కానింగ్ యంత్రాలుగోదావరిఖని: సింగరేణిలోని ఏడు ఆస్పత్రుల్లో రూ.లక్షలు వెచ్చించి స్కానింగ్ యంత్రాలు ఏర్పాటు చేశారు. కానీ, అర్హతగల రేడియాలజిస్ట్లను నియంచలేదు. ఫలితంగా రూ.60లక్షలు వెచ్చించి కొనుగోలు చేసిన 5 స్కానింగ్ యంత్రాలు నిరుపయోగంగా మారాయి. స్కానింగ్ యంత్రాలతో మేలు.. స్కానింగ్ యంత్రం ద్వారా గుండెకు సంబంధిత వ్యాధులను సకాలంలో గుర్తించే వీలుంటుందని నిపుణులు చెబుతున్నారు. దీనిద్వారా 2డీ ఇకో, గర్భానికి సంబంధించి ఆల్ట్రాసౌండ్స్ స్కానింగ్, లివర్, కిడ్నీలో రాళ్ల గుర్తింపు స్కానింగ్తోనే సాధ్యమంటున్నారు. సింగరేణి యాజమాన్యం ఖర్చుకు వెనుకాడకుండా స్కానింగ్ యంత్రాలు కొనుగోలు చేసినా.. రేడియాలజిస్ట్లు అందుబాటులో లేక పరీక్షలు నిలిచిపోతున్నాయి. అత్యవసరమైతే ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించాల్సి వస్తోంది. సకాలంలో స్పందించని వైద్యులు.. కార్పొరేట్కు ధీటుగా సింగరేణి కార్మికులకు వైద్యం అందిస్తామని సంస్థ సీఎండీ బలరాం చెబుతు న్నారు. వాస్తవ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంటోంది. అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రులకు వెళ్తే డాక్టర్లు సరిగా స్పందించడం లేదనే ఫిర్యాదులు అధికంగా వస్తున్నాయి. కొందరు నిర్లక్ష్యంగా, బా ధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈవిషయంలో ఉన్నతాధికారులు స్పందించాలని పలువురు కార్మికులు, వారి కుటుంబాలు కోరుతున్నారు.రెండ్రోరోజుల క్రితం సింగరేణి కార్మికుడి కుమార్తెను పురిటి నొప్పులతో గోదావరిఖని సింగరేణి ఏరియా ఆస్పత్రిలో చేర్పించారు. డాక్టర్లు పరీక్షించి ఇంజక్షన్ వేయగా నొప్పి తగ్గింది. ఆ తర్వాత అడ్మిట్ చేసుకున్నారు. మరుసటిరోజు డెలివరీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఇందుకు స్కానింగ్ అవసరమని ఓ ప్రైవేట్ సెంటర్కు పంపించారు. గర్భంలోనే శిశువు మృతి చెందిందని స్కానింగ్ రిపోర్టులో నిర్ధారించారు. సింగరేణి ఆస్పత్రిలోనే స్కానింగ్ చేసే రేడియాలజిస్ట్ ఉంటే ఈ పరిస్థితి ఏర్పడేది కాదని నిపుణులు అంటున్నారు. -
మెడి‘కిల్’ దందా!
సాక్షి పెద్దపల్లి: మీకు జ్వరం వచ్చినా.. జలుబు చేసినా.. తల నొప్పిగా ఉన్నా.. నిద్ర పట్టకున్నా.. ఇలా సమస్య ఏదైనా సరే డాక్టర్ల వద్దకు వెళ్లాల్సిన పనిలేదు. మెడికల్ షాప్లకు వెళ్తే నాడీ పట్టకుండానే అవసరమైన మందులు ఇచ్చేస్తారు. డాక్టర్ చీటీ (ప్రిస్క్రిప్షన్) లేకుండా మందులు ఇవ్వకూడదనేది నిబంధన ఉన్నా.. కొందరు మెడికల్ దుకాణ నిర్వాహకులు.. అదేమీ పట్టించుకోకుండా యాంటీబయాటిక్స్ సహా అన్ని మెడిసిన్స్ విక్రయిస్తున్నారు. తాజాగా జిల్లా కేంద్రంలోని ఓ ఆస్పత్రికి చెందిన మెడికల్ షాపులో తమ పిల్లవాడి కోసం తీసుకెళ్లిన సిరప్లో వ్యర్థాలు రావడంతో బాధితుడు లబోదిబోమంటూ అధికారులకు ఫిర్యాదు చేశాడు. అధికారుల నిఘా పూర్తిగా కొరవడడంతో మెడికల్ షాపు ల నిర్వాహకులు ఆడిందే ఆట, పాడిందే పాటగా మారిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నియంత్రణ లేక.. వైద్యం పేరిట వ్యాపారం చేసే కొన్నిహోల్సేల్ మందుల ఏజెన్సీలతోపాటు, మెడికల్ దుకాణాలపై ఔ షధ నియంత్రణ విభాగం అధికారుల నిఘా కొరవడింది. జిల్లాలో 500 వరకు మెడికల్ దుకాణాలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. నిబంధనలు అతిక్రమిస్తూ మందులు విక్రయిస్తున్నారనే విష యంపై తనిఖీలు లేకపోవడం అక్రమాలకు ఊతమిస్తోంది. ప్రస్తుతం మందుల షాపుల యజమానులు జనరిక్ ఇచ్చి బ్రాండెడ్ మందుల ముసుగులో దోపిడీకి పాల్పడుతున్నారనే విమర్శలున్నాయి. బిల్లు ఇచ్చుడే లేదు ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు ఇవ్వకూడదు. మందుల వివరాలతో కూడిన బిల్లును వినియోగదారురుకు ఇవ్వాలి. కానీ, జిల్లాలో ఒకట్రెండు మెడికల్ షాపుల్లో తప్ప మిగతా దుకాణాల్లో ఇది అమలు కావడం లేదు. నిరక్షరాస్యులు, వృద్ధుల అవసరాలను ఆసరాగా చేసుకుని మందుల దుకాణా నిర్వాహకులు అధిక మొత్తంలో డబ్బు గుంజుతున్నారు. దీనిని పర్యవేక్షించాల్సిన అధికారులు.. సిబ్బంది కొరత పేరిట తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. మెడికల్ షాపును నిర్వహించే ఫార్మాసిస్టు డ్రెస్కోడ్తోపాటు మందులు అందించే సమయంలో గ్లౌస్లు వేసుకోవాలి. కొన్ని మందు లను ఫ్రిజ్లో మాత్రమే భద్రపరచాలి. కానీ ఎక్కడా ఈ నిబంధనలు పాటించడం లేదు. లైసెన్స్ ఒకరిది.. నిర్వహణ మరొకరిది మెడికల్ షాప్లో బీ – ఫార్మసీ పూర్తిచేసిన వారే ఉంటూ మందులు ఇవ్వాలి. కానీ, జిల్లాలోని మందుల దుకాణా నిర్వాహకులు చాలావరకు అద్దెకు సర్టిఫికెట్లు తెచ్చుకొని, లైసెన్స్ తీసుకొని మెడికల్ దుకాణాలు నిర్వహిస్తున్న వారే అధికంగా ఉన్నారు. అలాగే మెడికల్ షాపుల్లో ఫార్మాసిస్టులు లేకుండానే యాంటీబయాటిక్స్తో పాటు రెండు, మూడు రకాల ట్యాబ్లెట్లు ఇచ్చి సొమ్ము చేసుకుంటున్నారు.లైసెన్స్ రద్దు చేస్తాం మెడికల్ దుకాణాల్లో ఫార్మాసిస్టు లేకున్నా, ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు విక్రయించినా బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. బిల్లులు, రికార్డులు తప్పనిసరిగా నిర్వహించాలి. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే లైసెన్స్ రద్దు చేస్తాం. – శ్రవణ్, డగ్ర్ ఇన్స్పెక్టర్ -
అర్హులకే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలి
పెద్దపల్లిరూరల్: అర్హులైన వారికే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నా రు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం ఆయ న ఇందిరమ్మ కమిటీ సభ్యు లు, అధికారులతో సమావేశమయ్యారు. ఇందిరమ్మ కమిటీ సభ్యులు వార్డుల వారీగా పర్యటించి అర్హులనే ఎంపిక చేయాలన్నారు. అక్రమాలకు పాల్పడ్డట్టు తన దృష్టికి వచ్చినా, అనర్హులను ఎంపిక చేసినా తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్, ఏఎంసీ చైర్పర్సన్ స్వరూప పాల్గొన్నారు. నేరాల నియంత్రణలో భాగస్వాములు కావాలి గోదావరిఖని: నేరాల ని యంత్రణలో యువత భాగస్వాములు కావాల ని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా సూచించారు. పోలీ స్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా బుధవారం గోదావరిఖని వన్టౌన్ పోలీస్స్టేషన్లో మెగారక్తదాన శిబిరం నిర్వహించారు. సీపీ మాట్లాడుతూ, విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీసుల త్యాగాలను గుర్తుచేస్తూ రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో పెద్దపల్లి డీసీపీ కరుణాకర్, గోదావరిఖని ఏసీపీ రమేశ్, ఎస్సైలు రమేశ్, సంధ్యారాణి, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు ఎల్లప్ప, జోన్ చైర్మన్ మల్లికార్జున్, రిజయా న్ చైర్మన్ రాజేందర్, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. -
ఇక రహదారులపైనే తనిఖీలు
● రంగంలోకి ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ● జిల్లాకు ముగ్గురు అధికారుల కేటాయింపు ● కొత్తవారితో కలిపితే ఎనిమిదికి చేరిన ఇన్స్పెక్టర్ల సంఖ్య ● రవాణా శాఖ చెక్పోస్టుల ఎత్తివేత పర్యవసానం ● వాహనాల అక్రమ ప్రవేశాలకు అడ్డుకట్ట వేసే యోచన పెద్దపల్లిరూరల్: అంతర్ జి ల్లాల సరిహద్దులను అక్రమంగా దాటే వాహనాలను నియంత్రించేందుకు ఏర్పా టు చేసిన ఆర్టీఏ(రవాణా శాఖ) చెక్పోస్టులను ప్రభు త్వం గతంలోనే ఎత్తివేసింది. ఎన్ఫోర్స్మెంట్ అధికారులతో రోడ్లపైనే వాహనాల తనిఖీ ముమ్మరం చేస్తోంది. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 111మంది అధికారులను నియమించి శిక్షణ కూడా ఇప్పించింది. ఈక్రమంలో జిల్లా రవాణా శాఖ కార్యాలయాల్లో కొత్తగా ముగ్గురు అధికారులు ఇటీవల బాధ్యతలు స్వీకరించారు. వారిరాకతో జిల్లాలో ఇన్స్పెక్టర్స్థాయి అధికారుల సంఖ్య 8కి చేరింది. మూడునెలల క్రితమే ఎత్తివేత రాష్ట్రప్రభుత్వం మూడు నెలల క్రితమే రవాణా శాఖ ఆధ్వర్యంలోని అంతర్ జి ల్లాల సరిహద్దు చెక్పోస్టులను ఎత్తివేస్తూ ఆదేశాలు జారీచేసింది. అయినా ఇప్పటివరకు కొనసాగిస్తూనే ఉన్నారు. అయితే, ఆన్లైన్లో పర్మిట్లు పొందే విధానంపై అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. వాహనదారులు ఆన్లైన్ పర్మిట్లతో రవాణా చేస్తున్నట్లు గుర్తించి చెక్పోస్టులను పూర్తిగా ఎత్తేసేందుకు చర్యలు తీసుకున్నట్లు సంబంధిత శాఖ అధికారుల ద్వారా తెలిసింది. రోడ్డుపైనే తనిఖీలు ముమ్మరం అంతర్జిల్లా చెక్పోస్టులను ఎత్తేయడంతో రోడ్లపై సరుకుల లోడ్తో వెళ్తున్న వాహన తనిఖీలను ముమ్మరం చేయనున్నట్లు సమాచారం. ఇందుకు సరిపడా అధికారులు ఉన్నా.. కిందిస్థాయి సిబ్బంది కొరత ఉంది. చెక్పోస్టులను ఎత్తివే స్తూ ఆదేశాలిచ్చినా ప్రభుత్వం.. కొత్తగా అనుసరించాల్సిన విధివిధానాలపై ఉత్తర్వులు ఇవ్వలేదని తెలిసింది. కార్యాలయాల్లో సిబ్బంది అవసరమైనంత లేక అవస్థలు పడుతున్నారు. చెక్పోస్టుల ఎత్తివేతతో రోడ్లపై తిరిగే వాహనాలను జిల్లాల పరిధిలోని ఎంవీఐ, ఏఎంవీఐ, ఆర్టీవో స్థాయి అధికారులు తనిఖీ చేయాల్సి వస్తే.. ఆ సమయంలోనూ కిందిస్థాయి సిబ్బంది అవసరమే. ప్రభుత్వ ఖజానాకు ఆదాయం సమకూర్చేందుకు కొద్దినెలల క్రితం ఏకకాలంలో ఆర్టీఏ చెక్పోస్టుల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన విషయం విదితమే. -
నేడు ముగియనున్న గడువు
పెద్దపల్లి: జిల్లాలోని వైన్స్షాప్ల కోసం గురు వారం సాయంత్రం 5గంటల వరకు దరఖాస్తుల దాఖలుకు గడువు ముగుస్తుందని ప్రొహిబిషన్, ఎకై ్సజ్ ఇన్స్పెక్టర్ నాగేశ్వర్రావు తెలిపా రు. స్థానిక వ్యవసాయ మార్కెట్లోని ఎకై ్సజ్ కార్యాలయంలో దరఖాస్తులు స్వీకరిస్తున్నామన్నారు. ఈనెల 27న ఉదయం 11గంటలకు బందపల్లి స్వరూప గార్డెన్స్లో లాటరీ పద్ధతిన మద్యం షాప్లు కేటాయిస్తామని తెలిపారు. లింగ నిర్ధారణ నేరం పెద్దపల్లిరూరల్: స్కానింగ్ సెంటర్ల నిర్వాహ కులు నిర్ధారణ పరీక్షలు చేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్యాధికారి వాణిశ్రీ హెచ్చరించారు. తన కార్యాలయంలో బుధవా రం నిర్వహించిన అడ్వయిజరీ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రభుత్వాస్పత్రుల్లో గర్భిణుల స్కానింగ్ వివరాలను ఫారం – ఎఫ్ లో పొందుపర్చాలని సభ్యుడు రాజగోపాల్ కో రారు. గ్రామైక్యసంఘం సభ్యులకు లింగ వివక్షతపై అవగాహన కల్పిస్తామని అధ్యక్షురాలు స్నేహ అన్నారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాకేశ్తోపాటు వెంకటేశ్వర్లు, జగన్ పాల్గొన్నారు. పోలీస్స్టేషన్లలో ఓపెన్హౌస్ పెద్దపల్లిరూరల్: నేరాల నియంత్రణకు పోలీసులు నిర్వర్తించే విధులు, ఆయుధాల వినియో గం, లాకప్గదుల నిర్వహణపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు రూరల్, పెద్దపల్లి పోలీస్స్టేషన్లలో ఓపెన్హౌస్ నిర్వహించారు. ఎస్సైలు మల్లేశ్, నరేశ్, ఏఎస్సై రామస్వామి, సిబ్బంది తదితరులు పలు అంశాలపై అవగాహన కల్పించారు. పోలీసు అమరవీరుల వారోత్సవావల సందర్భంగా పెద్దకల్వల నోబెల్స్కూల్ విద్యార్థుల సందేహాలను తీర్చారు. -
దుబాయ్ వ్యాపారులతో సమీక్ష
రామగుండం: ఐక్యరాజ్యసమితి సర్వసభ్య స మావేశాలకు హాజరై భారత్కు తిరుగు ప్రయాణమవుతుండగా మంగళవారం దుబాయ్ వ్యా పార దిగ్గజాలతో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ సమావేశమయ్యారు. గనులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, విద్యుత్ ఉత్పత్తి, ఫుడ్ ప్రాసెసింగ్, విద్యా, వైద్య సెక్టార్లకు సంబంధించిన వ్యాపారులతో సమీక్షించారు. పెద్దపల్లి నియోజకవర్గంలోని మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలు పరిశ్రమల స్థాపనకు అనువుగా ఉంటాయన్నారు. ఈ ప్రాంతాల్లో సమృద్ధిగా బొగ్గు, విద్యుత్, రైల్వే, రోడ్డు సదుపాయాలు ఉన్న స్థలాల్లో పెట్టుబడులు పెట్టి పరిశ్రమలు నెలకొల్పేందుకు తమ వంతు ప్రోత్సహకాన్ని అందజేస్తామని, పరిశ్రమల స్థాపనతో వేలాది మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని తెలిపారు. నోటీసు బోర్డుపై ధరల పట్టిక ఉండాలి సుల్తానాబాద్: ప్రైవేటు ఆస్పత్రుల్లో ధరల పట్టిక రోగులకు తెలిసే విధంగా నోటీసు బోర్డులో ప్రదర్శించాలని డీఎంహెచ్వో వాణిశ్రీ సూ చించారు. సుల్తానాబాద్లోని పలు ఆస్పత్రుల ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలో ధర ల పట్టిక ప్రకారం మాత్రమే ఫీజులు వసూలు చేయాలని ఆదేశించారు. ఆస్పత్రిలోని రికార్డులు పరిశీలించారు. ప్రోగ్రాంఽ ఆధికారులు బి.శ్రీరాములు, కేవీ.సుధాకర్రెడ్డి పాల్గొన్నారు. లైవ్ సర్టిఫికెట్ సమర్పించాలి గోదావరిఖని: సీఎంపీఎఫ్ పెన్షన్దారులు లైవ్ సర్టిఫికెట్ నిర్ణీత ఽగడువులోగా సమర్పించాలని గోదావరిఖని సీఎంపీఎఫ్ కార్యాలయ కమిషనర్లు హరిపచౌరీ, కె.గోవర్దన్ సూచించారు. ఈ ఏడాది డిసెంబర్లోగా లైవ్ సర్టిఫికెట్ అందజేస్తే తమ పెన్షన్ నిలిచిపోయే అవకాశం ఉండదన్నారు. దీనికోసం కార్యాలయం పరిధిలోని అన్ని ఏరియాల్లో ప్రత్యేక తేదీలు నిర్ణయించినట్లు తెలిపారు. పెన్షన్ పేమెంట్ ఆర్డర్కాపీ(పీపీవో), ఆధార్కార్డు, బ్యాంక్పాస్బుక్, ఆధార్తో లింక్ అయిన మొబైల్నంబర్ తీసుకుని క్యాంపుకు హాజరుకావాలన్నారు. లేకుంటే మీసేవా సెంటర్లో వచ్చేనెల 3,4తేదీల్లో ఆర్జీ–1, 6,7తేదీల్లో ఆర్జీ–2 ఏరియా, 10,11 తేదీల్లో ఆర్జీ–3 ఏరియా, నవంబర్ 3,28వరకు రీజినల్ సీఎంపీఎఫ్ కార్యాలయంలో అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. లేని పక్షంలో జనవరి నుంచి తమ పెన్షన్ నిలిచిపోతుందన్నారు. అట్టహాసంగా చదరంగం పోటీలు పెద్దపల్లి: పెద్దపల్లి రిక్రియేషన్ క్లబ్లో 69వ ఉమ్మడి జిల్లా అండర్– 14 ఎస్జీఎఫ్ చదరంగం పోటీలను జిల్లా కార్యదర్శి కనుకుంట్ల లక్ష్మణ్ ప్రారంభించారు. చదరంగంతో మేధస్సు, ప్రశాంతత పెరుగుతుందన్నారు. గెలుపు, ఓటములను సమానంగా తీసుకోవాలన్నారు. గెలుపొందిన క్రీడాకారులు వచ్చేనెల పెద్దపల్లి జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. ఈ పోటీలకు ఉమ్మడిజిల్లాలోని 40మంది విద్యార్థులు హాజరయ్యారు. చెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు గడ్డాల శ్రీనివాస్, జిల్లా పెటా అధ్యక్షుడు వేల్పుల సురేందర్, అర్బీటర్ కర్ణాకర్రెడ్డి పాల్గొన్నారు. నేడు జిల్లాస్థాయి క్రికెట్ పోటీలు పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లాస్థాయి క్రికెట్ పోటీలు నేటినుంచి నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్జీఎఫ్ కార్యదర్శి కనుకుంట్ల లక్ష్మణ్ తెలిపారు. జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్జీఎఫ్) ఆధ్వర్యంలో జేఎన్టీయూ కళాశాల క్రీడా మైదానంలో 22వ తేదీన 17 ఏల్ల బాలబాలికలకు, 23వ తేదీన 14 సంవత్సరాల బాలురకు క్రికెట్ ఎంపిక పోటీలు ఉంటాయని తెలిపారు. అర్హురు ఉదయం 9గంటలకు ఎంట్రీ ఫారంతో రిపోర్ట్ చేయాలని, వివరాలకు పీడీ కే.శ్రీనివాస్ 9440394743 నంబర్ను సంప్రదించాలని సూచించారు. -
పనులు త్వరగా పూర్తిచేయాలి
రామగుండం/గోదావరిఖనిటౌన్: రామగుండం బైపాస్ రోడ్డు నుంచి పోస్టాఫీస్ వరకు కొనసాగుతున్న రహదారి విస్తరణ పనులు, శ్రీభక్తాంజనేయస్వామి ఆలయం ప్రధాన రహదారిలోని డ్రైనేజీ నిర్మాణ పనులను ఎమ్మెల్యే మక్కాన్సింగ్ఠాకూర్ పరిశీలించారు. డ్రైనేజీ నిర్మాణం ఎత్తును పరిశీలించి ఇంజినీర్లతో చర్చించి ఎత్తు తగ్గించేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. రోడ్డు విస్తరణకు అడ్డుగా ఉన్న జెన్కో క్వార్టర్లను పరిశీలించారు. జెన్కో అధికారులతో చర్చించి రోడ్డు విస్తరణకు పలు క్వార్టర్లను తొలగించనున్నట్లు పేర్కొన్నారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన భవన నిర్మాణానికి రామగుండం ఎమ్మెల్యే రాజ్ఠాకూర్ మక్కాన్సింగ్ స్థల పరిశీలన చేశారు. కళాశాల నిర్మాణం స్థానిక యువత, విద్యార్థులకు విద్యా సౌకర్యాలు కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. మెగాథర్మల్ పవర్ ప్లాంట్ ప్రారంభించండిగోదావరిఖని: రామగుండంలో 800మెగావాట్ల పవర్ ప్లాంట్ త్వరలో ప్రారంభించాలని ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కోరారు. దీపావళి సందర్భంగా హైదరాబాద్లో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. పాలకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ చివరి ఆయకట్టు వరకు నీళ్లు అందించడానికి లిఫ్ట్ మంజూరు చేయాలన్నారు. సూపర్క్లిటికల్ థర్మల్ఫ్లాంట్ నిర్మాణం గురించి రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉందని, గత నెలలో బోర్డు ఆమోదించిందని డిప్యూటీ సీఎం తెలిపినట్లు ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ పేర్కొన్నారు. -
కానరాని కారుణ్యం!
గోదావరిఖని(రామగుండం): కాలం కరుగుతోంది. కారుణ్య నియామకాల కోసం కార్మికులు నిరీక్షిస్తున్నారు. ఆరునెలలు గడిచినా అతీగతీలేదు. సింగరేణిలో అనారోగ్యం బారిన పడిన కార్మికులను మెడికల్ ఇన్వాలిడేషన్ చేసి వారిస్థానంలో వారసులకు ఉద్యోగం ఇచ్చేలా యాజమాన్యం అవకాశం కల్పించింది. దీంతో యువ ఉద్యోగుల సంఖ్య పెరిగింది. 2018 మార్చిలో మెడికల్ ఇన్వాలిడేషన్ ప్రారంభమైంది. సుమారు 116 మెడికల్ బోర్డులు నిర్వహించారు. వీటిద్వారా దాదాపు 16వేల మందికిపైగా కార్మిక వారసులు ఉద్యోగాల్లో చేరారు. అయితే, ఆ రునెలలుగా మెడికల్ బోర్డు నిలిచిపోయింది. కారు ణ్య నియామకాలు ఆగిపోయాయి. ఇప్పటికే మెడికల్ బోర్డుకు హాజరై ఇన్వాలిడేషన్ అయిన వారిస్థానంలో వారసులకు ఉద్యోగం ఇవ్వాల్సి ఉంది. 2018 నుంచి సింగరేణిలో 2018 నుంచి కారుణ్య నియామక ప్రక్రియ కొనసాగుతోంది. యాజమాన్యం కొత్తగూడెంలోని ప్రధాన ఆస్పతిలో ప్రతీ నెలమెడికల్ బోర్డు నిర్వహిస్తోంది. కొన్ని సందర్భాల్లో ఒక్కోనెలలో రెండు మెడికల్బోర్డులు కూడా నిర్వహించిన సందర్భాలు ఉన్నాయి. కారణాలపై అస్పష్టత.. మెడికల్ బోర్డు నిలిచిపోవడానికి గల కారణాలపై గుర్తింపు, ప్రాతినిధ్య కార్మిక సంఘాలు స్పష్టత ఇవ్వడంలేదు. జూలై చివరి వారంలో నిర్వహించిన హయ్యర్ సెంటర్ మెడికల్ బోర్డులో 55మందిని ఆహ్వానించగా.. ఒకరు గైర్హాజరయ్యారు. మిగతా వారిలో ఐదుగురినే మెడికల్ ఇన్వాలిడేషన్ చేశారు. మిగతా వారిని సేమ్జాబ్, మరికొందరిని అండర్గ్రౌండ్ నుంచి ఉపరితలనానికి కేటాయించారు. తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఉన్న కార్మికులను కూడా ఫిట్ఫర్ సర్ఫేస్ ఇవ్వడంతో కార్మిక కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి.కారుణ్యం ఉంటుందా? ఆరునెలలుగా రెగ్యులర్ మెడికల్ బోర్డు నిర్వహణ లేకపోవడంతో కార్మికులు, వారి కుటుంబాల్లో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు కారుణ్యం ఉంటుందా? నిలిచిపోతుందా? అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో సింగరేణి సీఎండీ బలరాం, గనుల శాఖ, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క జోక్యం చేసుకోవాలని వారు కోరుతున్నారు. -
కూలీలకు చేతినిండా పని
మంథనిరూరల్: గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు చేతినిండా పనికల్పించి ఆర్థిక భరోసా కల్పించేలా అమలు చేస్తున్న ఉపాధిహామీ ద్వారా 2026–27 ఆర్థిక సంవత్సరానికి పనుల గుర్తింపునకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈనెల 2 నుంచే గ్రామసభలు నిర్వహించాల్సి ఉండగా స్థానిక ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో వాయిదా వేశారు. ఎన్నికలు కూడా వాయిదా పడడంతో ప్రతీగ్రామంలో సభ నిర్వహించి వచ్చే ఏడాది చేపట్టే పనుల గుర్తింపునకు శ్రీకారం చుట్టారు. నిబంధల ప్రకారం గ్రామసభ ద్వారా అందరి ఆమోదంతో పనులు గుర్తించనున్నారు. 35 గ్రామపంచాయతీల్లో మంథని మండలంలోని 35 గ్రామపంచాయతీల్లో పనుల గుర్తింపుకు ఉపాధి గ్రామ సభలు ప్రారంభయమయ్యాయి. మండలంలో 21,677 జాబ్ కార్డులు ఉండగా అందులో 14,012మంది మాత్రమే పనులకు హాజరవుతున్నారు. వీరికి ప్రతీరోజు ఉపాధి కల్పించేలా పనులను గుర్తించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. 58 రకాల పనులు గ్రామసభల ద్వారా గ్రామాల్లో ఈఆర్థిక సంవత్సరంలో ముఖ్యంగా 58రకాల పనుల గుర్తింనపు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. వాటికి సంబంధించిన అంచనాలను కూడా రూపొందించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఇందులో ఎక్కువగా భవన నిర్మాణాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. గ్రామ పంచాయతీ భవనాలు, చెక్డ్యాంలు, నీటి సంరక్షణ పనులు, పాఠశాలల కాంపౌండ్ వాల్ తదితర పనులను చేపట్టేలా అధికారులు చర్యలు చేపట్టారు. తగ్గనున్న పూడికతీత గతంలో ఉపాధిహామీ ద్వారా చెరువులు, కుంటల్లో చేపట్టే పూడికతీత పనులు ఈ ఆర్థిక సంవత్సరంలో తగ్గనున్నాయి. ఏటా చెరువుల్లో పూడికతీతతో సత్పలితాలు రావడం లేదని, సోషల్ ఆడిట్లో సైతం తరచూ అక్రమాలు వెలుగు చూస్తున్నాయని ఆ పనులకు ప్రాధాన్యం తగ్గిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో గ్రామసభల ద్వారా పనులను గుర్తించేలా చర్యలు తీసుకుంటున్నారు. వచ్చేనెల 18లోగా గ్రామసభలు పూర్తిచేస్తాం ఆయా గ్రామాల్లో ఉపాధి పనుల గుర్తింపునకు ఇటీవల సభలు ప్రారంభించాం. ప్రభుత్వం నుంచి 58 పనుల గుర్తింపునకు ఆదేశాలు వచ్చాయి. ఆ ఆదేశాల మేరకు పనులను గ్రామస్తుల ఆమోదంతో గుర్తిస్తున్నాం. వచ్చేనెల 18వ తేదీలోగా గ్రామసభలను పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటున్నా. – సదానందం, ఏపీవో, మంథని -
అమరులకు సెల్యూట్
గోదావరిఖని: పోలీసు అమరవీరుల త్యాగాలు అజరామరమని రామగుండం సీపీ అంబర్కిషోర్ఝా అన్నారు. మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్దీపక్తో కలిసి మంగళవారం పోలీస్కమిషనరేట్ కార్యాలయం ఆవరణలోని పోలీసు అమరవీరుల స్తూపం వద్ద పుష్పగుచ్ఛాలుంచి ఘనంగా నివాళి అర్పించారు. శాంతి భద్రతల పరిరక్షణలో ప్రాణత్యాగాలకు చేసిన పోలీసుల సేవలు మరువలేనివన్నారు. ప్రజల్లో మంచి పేరు తీసుకరావడానికి చిత్తశుద్ధి, నితీ, నీజాయితీతో పోలీసులు పనిచేయాలన్నారు. అనంతరం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో అమరవీరుల కుటుంబ సభ్యులకు జ్ఞాపికలు అందజేశారు. పెద్దపల్లి డీసీపీ కరుణాకర్, ఆర్జీ–1 జీఎం లలిత్కుమార్, అడిషనల్ డీసీపీ అడ్మిన్ శ్రీనివాస్, గోదావరిఖని ఏసీపీ ఎం.రమేశ్, మంచిర్యాల ఏసీపీ ఆర్.ప్రకాశ్, ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్, ఏవో శ్రీనివాస్ పాల్గొన్నారు. -
రైతుల సంక్షేమమే లక్ష్యం
● పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు పెద్దపల్లి: రైతుల సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. సుల్తానాబాద్లోని ఎస్సారెస్పీ– డీ86 క్యాంప్ ఆఫీస్ చుట్టూ రూ.28.64 లక్షలతో నిర్మించ తలపెట్టిన ప్రహరీ నిర్మాణానికి సోమవారం భూమిపూజ చేసి, పనులు ప్రారంభించారు. త్వరలోనే సుల్తానాబాద్ ఎస్సారెస్పీ క్యాంప్ ఆఫీసులకు నూతన భవనాలు నిర్మించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ మినుపాల ప్రకాశ్రావు, సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, డీఈఈ మధుమతి పాల్గొన్నారు. -
వెలుగుల వేడుక
పెద్దపల్లి/రామగిరి/రామగుండం/కాల్వశ్రీరాంపూర్: జిల్లావ్యాప్తంగా సోమవారం దీపావళి వేడుకలను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. వాణిజ్య, వ్యాపారసంస్థలు, నివాసగృహాల్లో లక్ష్మిపూజలు నిర్వహించారు. మంగళవారం పలు ప్రాంతాల్లో కేదారేశ్వరస్వామి నోములు నోముకున్నారు. రాత్రిపూట చిన్నాపెద్ద టపాసులు కాల్చి సంబురాలు జరుపుకున్నారు. కాల్వ శ్రీరాంపూర్ మండలం గంగారం గ్రామ పంచాయతీ పరిధిలోని ఊశన్నపల్లెలో ముసుకు వంశానికి చెందిన 22 కుటుంబాలు ఒకేచోట కేదారేశ్వర నోములు నోముకున్నారు. రామగిరి మండలం సెంటినరికాలనీ జోన్–1లో బొమ్మల కొలువు ఏర్పాటు చేశారు. రామగుండంలో సమాధుల వద్ద దీపావళి వేడుకలు జరుపుకున్నారు. రామగుండం, పెద్దపల్లి, సుల్తానాబాద్లో టపాసుల దుకాణాల వద్ద సందడి నెలకొంది. -
ఎన్టీపీసీ అధికారిపై సస్పెన్షన్ ఎత్తివేయాలి
జ్యోతినగర్: ఎన్టీపీసీ రామగుండం ప్రాజెక్టు అధికారి సస్పెన్షన్ ఎత్తి వేయాలని అధికారుల సంఘం ప్రతినిధులు నల్లబ్యాడ్జీలతో సోమవారం నిరసన చేపట్టారు. ఎన్టీపీసీ రామగుండం తెలంగాణ ప్రాజెక్టు ఆవరణలోని సోలార్ ప్లాంట్లో ఈనెల 9న ఓ కాంట్రాక్టు కార్మికుడిపై ట్రాన్స్ఫార్మర్ మీద పడి మృతి చెందాడు. ఈ సంఘటనపై ఎన్టీపీసీ యాజమాన్యం తక్షణమే స్పందిస్తూ సంబంధిత ఇంజినీరింగ్ ఇన్చార్జ్ డీజీఎం రాజ్కుమార్ను సస్పెండ్ చేసింది. రామగుండం ఎన్టీపీసీ అధికారుల సంఘం ఈ విషయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సస్పెన్షన్ ఎత్తివేయాలని నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ప్రాజెక్టులో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. స్పందించకుంటే ఈనెల 27వ తేదీన గేట్ మీటింగ్ నిర్వహిస్తామని అధికారుల సంఘం అధ్యక్షుడు మహేందర్ కుమార్, ప్రధాన కార్యదర్శి నితీశ్ కుమార్ తెలిపారు. -
మద్యం సిండికేట్కు చెక్?
● దరఖాస్తుల దాఖలుకు గడువు ఈనెల 23 ● 27న డ్రా ద్వారా వైన్స్షాపుల కేటాయింపుపెద్దపల్లి: మద్యం దుకాణాలకు భారీస్థాయిలో టెండర్లు దాఖలు అవుతాయని భావించినా.. అధికారుల అంచనాలు తారుమారయ్యాయి. వ్యాపారులు సిండికేట్గా మారి తక్కువ సంఖ్యలో దరఖాస్తులు సమర్పించారనే కారణంతో టెండర్ల స్వీకరణకు ప్రభుత్వం గడువు పొడిగించిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈక్రమంలో ఈనెల 23వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని ఎకై ్సజ్ సూపరింటెండెంట్ మహిపాల్రెడ్డి ఆదివారం తెలిపారు. జిల్లాలో 74 మద్యం దుకాణాలు ఉండగా.. శనివారం అర్ధరాత్రి వరకు 1,378 దరఖాస్తులు వచ్చాయని ఆయన పేర్కొన్నారు. గడువు ముగిశాక ఈనెల 27న లక్కీడ్రా ద్వారా మద్యం దుకాణాలు కేటాయిస్తామని ఆయన పేర్కొన్నారు. తక్కువ దరఖాస్తులపై సమీక్ష జిల్లాలో 74 వైన్స్షాపులు ఉండగా.. గతంలో 2,020 దరఖాస్తులు అందాయి. ఈసారి 1,378 మాత్రమే టెండర్లు దాఖలు కావడం, వీటిమధ్య భారీవ్యత్యాసం ఉండడంతో వ్యాపారులు సిండికేట్గా మారినట్లు అభిప్రాయపడుతున్నారు. అయితే, సిండికెట్కు చెక్ పెట్టేందుకే దరఖాస్తుల స్వీకరణ గడువును ప్రభుత్వం పొడిగించిందని అంటున్నారు. అయితే, పెద్దపల్లి సమీపంలోని బంతదంపల్లి స్వరూప గార్డెన్స్లో కలెక్టర్ కోయ శ్రీహర్ష సమక్షంలో ఈనెల 27న లక్కీడ్రా తీస్తారు. ఈప్రక్రియ ద్వారా వైన్స్షాపులు కేటాయిస్తారు. ఈప్రక్రియ మొత్తాన్ని వీడియోలో చిత్రీకరిస్తారు. జిల్లా సమాచారం ప్రాంతం వైన్స్ అందిన షాపులు టెండర్లు పెద్దపల్లి 20 384 సుల్తానాబాద్ 15 283 రామగుండం 24 450 మంథని 15 261 -
వైభవం.. దీపావళి ఉత్సవం
గోదావరిఖని: సింగరేణి ఆధ్వర్యంలో రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్ నేతృత్వంలో స్థానిక జవహర్లాల్నెహ్రూ స్టేడియంలో ఆదివారం రాత్రి నిర్వహించిన దసరా, దీపావళి హంగామా కార్మిక కుటుంబాలను విశేషంగా ఆకట్టుంది. మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్బాబు, అడ్లూరి లక్ష్మణ్కుమార్, సింగరేణి ఆర్జీ–1 జీఎం లలిత్కుమా ర్, ఎస్సీ కమిషన్ జాతీయ సభ్యుడు రాంచందర్ తదితరులు హాజరయ్యారు. ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ శివారెడ్డి మిమిక్రీకి విశేష స్పందన లభించింది. గీతామాధురి గీతాలు, సినీ యా క్టర్లు ఆలీ, శివారెడ్డి చేసిన నృత్యం ఆకట్టుకుంది. -
రాజకీయాలను శాసించాలి
● యాదవ సంఘాల ఉమ్మడి జిల్లా కన్వీనర్ సౌగాని కొమురయ్య పెద్దపల్లి/పెద్దపల్లిరూరల్: స్థానిక ఎన్నికల్లో యాదవులను అత్యధిక సంఖ్యలో గెలిపించుకుని రాజకీ యాలను శాసించాలని యాదవ సంఘాల ఉమ్మడి జిల్లా కన్వీనర్ సౌగాని కొమురయ్య అన్నారు. స్థాని క ప్రెస్క్లబ్లో ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు మేకల మల్లేశం ఆధ్వర్యంలో ఆయన విలేకరుల సమావే శంలో మాట్లాడారు. జనాభాలో 22 శాతం యాదవులు ఉన్నారని, ఆ ప్రాతిపదికన రాజకీయ అవకాశాలు లభించడంలేదన్నారు. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించే అంశాలపై ఈనెల 24న కరీంనగర్ జిల్లాలోని చెంజర్ల ఫామ్హౌస్లో శిక్షణ తరగతులు నిర్వహిస్తామని, పోటీచేసేవారు హాజ రు కావాలని ఆయన కోరారు. ప్రతీ ఆదివారం యా దవులు మద్యం, మాసం మానేయాలని ఆయన కోరారు. సమావేశంలో నాయకులు సందనవేన రా జేందర్, మారం తిరుపతియాదవ్, రాజయ్యయా దవ్, తమ్మడబోయిన ఓదెలు, కుమార్ యాదవ్, నాగారపు సత్యనారాయణ, చిలారపు పర్వతాలు, మేకల రాజేందర్, అట్ల సాగర్, రాజం మహంత కృష్ణ, పోసాని శ్రీనివాస్ యాదవ్, ఉప్పరి శ్రీనివాస్ యాదవ్, బత్తిని లక్ష్మణ్, రాజ్కుమార్ ఉన్నారు. -
పనులు ప్రారంభించలే
పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కాలేజీకి సొంతభవనం లేదు. బాలుర, బాలికల జూనియర్ కాలేజీ ల్యాబ్లోనే తరగతులు నిర్వహిస్తున్నారు. ఐదు కోర్సులు అందుబాటు ఉండగా 230 మంది విద్యార్థినులు చదువుకుంటున్నారు. 14మంది అధ్యాపకులు విద్యా బోధన చేస్తున్నారు. బాలికల కాలేజీ ప్రిన్సిపాల్ ఈఏడాది జనవరిలో ఉద్యోగ విరమణ చేశారు. బాలుర కాలేజీ ప్రిన్సిపాల్ రవీందర్రెడ్డికి అదనపు బాధ్యతలను అప్పగించారు. సీఎం శంకుస్థాపన చేసి ఏడాది.. బాలికల జూనియర్ కాలేజీ భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దాదాపు ఏడాది క్రితం శంకుస్థాపన చేశారు. ఇప్పటికీ పనులు మొదలే కాలేదు. పాత భవనం కూల్చి కొత్తభవనం పనులు ప్రారంభించే సమయంలో స్థానికుల నుంచి అభ్యంతరాలు వచ్చాయి. వాకర్స్కు అనువుగా ఉండేలా చూడాలని విన్నవించారు. దీంతో పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. దీంతో విద్యార్థినుల తరగతులను బాలికల జూనియర్ కాలేజీకి చెందిన మూడు, బాలుర కాలేజీకి చెందిన మరో 3 ల్యాబ్ గదుల్లో ప్రస్తుతం తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన రూ.2 కోట్లతో పనులు చేపడితే ఇప్పటికే భవనం పూర్తయ్యేదనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. మల, మూత్ర విసర్జనకు తిప్పలే.. ల్యాబ్ గదుల్లో తరగతులు నిర్వహిస్తుండగా విద్యార్థినులు, అధ్యాపకులకు అవసరమైన మరుగుదొడ్లు అందుబాటులో లేక అవస్థలు పడుతున్నారు. పాత మరుగుదొడ్లకు మరమ్మతులు చేసుకుని వాటినే విద్యార్థినులు, మహిళా అధ్యాపకులు వినియోగించుకుంటున్నారు. పురుష అధ్యాపకులతోపాటు నాన్ టీచింగ్ స్టాఫ్ ఒకటి, రెంటికి బయటకు వెళ్లాల్సిన పరిస్థితులే నెలకొని ఉన్నాయి. రూ.20లక్షలతో తాత్కాలిక మరమ్మతులు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలోని లాబోరేటరీ గదులు వర్షాలకు ఉరుస్తుండడం, ఫ్లో రింగ్ కుంగిపోవడంతో తాత్కాలిక మరమ్మతులను రూ.20లక్షల అంచనాలతో చేపట్టారు. ఇదివరకున్న ఫ్లోరింగ్ తొలగించి సిమెంట్తో ఫ్లోరింగ్ చేపట్టినా నాసిరకంగా సాగుతున్నాయనే ఫిర్యాదులు ఉన్నా యి. అధికారులు పర్యవేక్షించి పనులు నాణ్యవంతంగా జరిగేలా చూడాలని కోరుతున్నారు. -
అభివృద్ధి పనులకు నిధులు
● మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ రామగిరి(మంథని): అభివృద్ధి పనులకు అవసరమైన నిధులు కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ అభ యం ఇచ్చారు. వివిధ ప్రాంతాల్లో మంత్రి ఆదివా రం పర్యటించారు. ఇటీవల మృతి చెందిన బుధవారంపేట(రామయ్యపల్లి) గ్రామానికి చెందిన సోమి శెట్టి మల్లయ్య కుటుంబాన్ని ఆయన పరామర్శించా రు. మల్లయ్య చిత్రపటానికి పూలమాలవేసి నివాళి అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం మాజీ ఎంపీపీ ఆరెల్లి దేవక్క మంత్రిని కలిసి పలు సమస్యలు విన్నవించారు. ప్రధానంగా బుధవారంపేట గ్రామంలో ఎస్సీ కమ్యూనిటీహాల్ మరమ్మతు, విస్తరణకు నిధులు మంజూరు చేయాలని కోరారు. మంత్రి సానుకులంగా స్పందించారు. కాగా, రామయ్యపల్లి స్టేజీ వద్ద మంథని పీఏసీఎస్ చైర్మన్ కొత్త శ్రీనివాస్ మంత్రి లక్ష్మణ్ను కలిశారు. ఏఎంసీ చైర్మన్ కుడుదుల వెంకన్నతో కలిసి మంత్రికి శాలువా కప్పి సన్మానించారు. ఆయా కార్యక్రమాల్లో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తోట్ల తిరుపతి యాదవ్, నాయకులు రోడ్డ బాపన్న, బుద్దార్థి బుచ్చయ్య, దేవునూరి రజిత, ఆరెల్లి కొము రయ్య, దేవునూరి శ్రీనివాస్, తీగల సమ్మయ్య, నరేశ్, బావు కత్తెరసాల, కన్నూరి శ్రావణ్, పూదరి రమేశ్, మల్లయ్య, రాజయ్య, మహేందర్, ముస్కుల సురేందర్రెడ్డి, రావికంటి సతీశ్ కుమార్, అజీంఖాన్ తదితరులు పాల్గొన్నారు. -
నడకతో ఆరోగ్యం
జ్యోతినగర్(రామగుండం): నడకతో ఆరోగ్యంగా ఉంటామని హెచ్ఎంఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సీహె చ్ ఉపేందర్ అన్నారు. ఎన్టీపీసీ సింధూర కళాశాల లో ఆదివారం వాకర్స్కు ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఏ వయసు వారైనా రోజూ కనీసం 30 నిమిషాలపాటు వ్యా యామం చేయాలని సూచించారు. కళాశాల మైదానంలోని వాతావరణంలో ఇందుకు అనుకూలంగా ఉందని తెలిపారు. పదేళ్లుగా వాకింగ్ చేస్తున్న పాప య్య టీం ప్రతినిధులను శాలువాలు కప్పి సన్మానించారు. ఎన్టీపీసీ రిటైర్డ్ ఉద్యోగులు కొమ్ము గోపాల్, రాజమౌళి, అశోక్, శంకరయ్య, పురుషోత్తం, సాయి లు, సత్యనారాయణ, విజన్ టెక్నాలజీ నిర్వాహకు లు మహేశ్వర్రెడ్డి, కిషన్రావు, మహేశ్, కాంట్రాక్టు కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చిలుక శంకర్, నాయకులు అబ్దుల్లా, తిరుపతిరెడ్డి ఉన్నారు. -
రాజన్నను దర్శించుకున్న శృంగేరి పీఠాధిపతి
● ఘనస్వాగతం పలికిన మంత్రి పొన్నం, విప్ ఆది శ్రీనివాస్ ● పూర్ణకుంభ కలశంతో ఆలయ అర్చకుల స్వాగతంవేములవాడ: ధర్మ విజయ యాత్రలో భాగంగా వేములవాడకు శృంగేరి పీఠాధిపతి జగద్గురు విధుశేఖర భారతీతీర్థ మహాస్వామి ఆదివారం రాత్రి చేరుకున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యార్, కలెక్టర్ హరిత, ఎస్పీ మహేశ్ బీ గీతే, ఈవో రమాదేవి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయ స్థానాచార్యులు ఉమేశ్శర్మ ఆధ్వర్యంలో అర్చకుల బృందం పూర్ణకుంభ కలశంతో స్వామి వారికి స్వాగతం పలికారు. స్థానిక తెలంగాణచౌక్కు చేరుకున్న స్వామీజీ ప్రత్యేక రథంపై ఆసీనులయ్యారు. జేసీబీ సహాయంతో గజమాల వేశారు. ఒగ్గుడోలు, భజన మండలి కళాకారులు ప్రత్యేక నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. స్వామీజీని చూసేందుకు పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. పెద్దమ్మ స్టేజీ వద్ద జిల్లాలోకి.. గంభీరావుపేట/ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): శృంగేరి శారదా పీఠాధిపతి విధుశేఖర భారతీతీర్థ మహాస్వామి చేపట్టిన విజయ ధర్మ యాత్ర గంభీరావుపేట మండలం పెద్దమ్మస్టేజీ వద్ద జిల్లాలోకి ప్రవేశించింది. బాసర నుంచి వస్తున్న స్వామీ యాత్రకు పెద్దమ్మస్టేజీ, ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లగొల్లపల్లిలో భక్తులు ఘనంగా స్వాగతం పలికారు. అభాషణం చేస్తున్న శృంగేరి పీఠాధిపతి విధుశేఖర భారతీ మహాస్వామీవిధుశేఖర భారతీ మహాస్వామికి స్వాగతం పలుకుతున్న విప్, అధికారులు -
వెలుగుల దీప్తి.. ఆలోచనల స్ఫూర్తి
సోమవారం శ్రీ 20 శ్రీ అక్టోబర్ శ్రీ 2025పెద్దపల్లి : ఆకట్టుకుంటున్న టెర్రాకోట ప్రమిదలుగోదావరిఖనిటౌన్ : రామగుండం నగరంలో..పెద్దపల్లి/గోదావరిఖని: కోటి వెలుగుల క్రాంతి. కొత్త ఆలోచనలకు స్ఫూర్తి దీపావళి. కష్టాలు అనే చీకట్లను తొలగించే వేడుక. చెడుపై మంచి సాధించిన విజయంతో సంబురాలు జరుపుకునే వెలుగుల తారాజువ్వల మాలిక. నేటి దీపావళి వేడుకలకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలు సిద్ధం అయ్యారు. వ్యాపార, వాణిజ్య సముదాయాల్లో ప్రత్యేక పూజలు, నివాసాలు, ఆలయాల్లో నోములు, వ్రతాలు జరుపుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. దీపావళి సందర్భంగా మార్కెట్లు కిక్కిరిశాయి. బంతిపూలు, గుమ్మడికాయలు, ఇతర పూజాసామగ్రి అమ్మకాలతో రద్దీగా మారాయి. ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన టపాకాయల దుకాణాల వద్ద సందడి నెలకొంది. కిలో చొప్పున విక్రయిస్తుండగా.. ధరలు ఆకాశాన్ని అంటున్నాయని చెబుతున్నారు. ఏదేమైనా నిశీధిలో అలుముకున్న అమావాస్య చీకట్లను బాణసంచాలతో బెదరగొట్టి, వెలుగుల దీపావళి వేడుకను సంబురంగా జరుపుకునేందుకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలు సిద్ధం అయ్యారు. – వివరాలు 8లో -
సొంత భవనం నిర్మించాలి
ప్రభుత్వ బాలికల జూనియర్ కాలేజీకి సొంత భవనం ని ర్మించాలి. ప్రస్తుతం ల్యాబ్ సామగ్రిని ఓ మూలన పెట్టి ఆ గదిలో చదువుకోవాల్సి వస్తోంది. తరగతి గదిలో ఉండాల్సిన వాతావరణం లేదు. మాకు ఇబ్బందిగా ఉంది. – జాహ్నవి, హెచ్ఈసీ, సెకండియర్ అధికారులు చొరవ చూపాలి బాలికల జూనియర్ కాలేజీ భవనం పనులను త్వరగా చేపట్టేందుకు వీలుగా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ చూపాలె. బాలికలకు అవసరమైన సౌకర్యాలతో కొత్తభవనం నిర్మించి అందుబాటులోకి తేవాలి. – శ్రావణి, సీఈసీ, సెకండియర్ త్వరలోనే పనులు బాలికల జూనియర్ కాలేజీ సొంత భవనం పనులు త్వరలోనే ప్రారంభం అవుతాయి. ఇసుక లభ్యం కాగానే జరుగుతాయి. పెద్దపల్లి, కాల్వశ్రీరాంపూర్, ముత్తారంలో ప్రిన్సిపాల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. – కల్పన, ఇంటర్ విద్య నోడల్ అధికారి -
ఓదెల మల్లన్నకు పట్నాలు
ఓదెల(పెద్దపల్లి): ఓదెల మల్లికార్జునస్వామి సన్నిధిలో ఆదివారం భక్తుల రద్దీ పెరిగింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాతోపాటు మహారాష్ట్ర నుంచి కూడా పెద్దసంఖ్యలో తరలివవచ్చారు. కోనేరులో స్నానం ఆచరించారు. మల్లికార్జునస్వామి, సీతారామచంద్రస్వామి, నందీశ్వరులను దర్శించుకున్నారు. అర్చకులు వీరభద్రయ్య, నరసింహచారి ఆధ్వర్యంలో తీర్థప్రసాదాలు అందజేశారు. ఒగ్గు పూజారులతో స్వామివారికి పట్నాలు వేయించారు. బోనాలతో నైవేద్యం సమర్పించారు. ఆలయ ఈవో సదయ్య, జూనియర్ అసిస్టెంట్ కుమారస్వామి భక్తుల ఏర్పాట్లు పర్యవేక్షించారు. ఆదివరాహస్వామికి పూజలు కమాన్పూర్(మంథని): ప్రసిద్ధ శ్రీఆదివరాహస్వామి దర్శనం కోసం ఆదివారం భక్తులు పో టెత్తారు. స్వామివారి దర్శనం అనంతరం ము డుపులు చెల్లించుకున్నారు. అనంతరం పలువురు భక్తులు అన్నదానం చేశారు. రైళ్లన్నీ కిటకిట రామగుండం: దీపావళి పండుగ పురస్కరించుకొని సుదూర ప్రాంతాల నుంచి స్వస్థలాలకు చేరుకుంటున్న ప్రయాణికులతో రైళ్లు, రైల్వేస్టేషన్లు ఆదివారం కిటకిటలాడాయి. భాగ్యనగర్, సింగరేణి, ఇంటర్సిటీ, కాగజ్నగర్ ఎక్స్ప్రెస్, కేరళ తదితర రైళ్లలో రద్దీ బాగా పెరిగిపోయింది. శనివారం కూడా సెలవురోజు అయినా.. బీసీ బంద్ నేపథ్యంలో ప్రయాణికులు తమ ప్రయాణాన్ని ఆదివారానికి వాయిదా వేసుకున్నారు. దీంతో రైళ్లన్నీ ఆదివారం రద్దీగా మారాయి. ఆస్పత్రిలో పార్కింగ్ పాట్లు పెద్దపల్లిరూరల్: జిల్లా ప్రభుత్వ, మాతాశిశు ఆస్పత్రుల్లో వాహనాల పార్కింగ్ ఇష్టారాజ్యంగా ఉంటోంది. ప్రధానంగా ద్విచక్రవాహనాలు ఎక్కడపడితే అక్కడ నిలుపుతున్నారు. గర్భిణులకు తీసుకొచ్చే 102, అత్యవసర వైద్యం కోసం బాధితులను తీసుకొచ్చే 108 వాహనాలు ఆస్ప త్రి ఆవరణలోకి వచ్చివెళ్లేందుకు ద్విచక్రవాహనాలు అడ్డుగా ఉంటున్నాయి. పేషెంట్లు, బంధువుల రాకపోకలకూ సమస్యలు తలెత్తుతున్నాయి. అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. అభివృద్ధే లక్ష్యం గోదావరిఖని: అభివృద్ధిని అడ్డుకునేందుకు ఎవరెన్ని కుట్రలు చేసినా ఊరుకునేది లేదని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్ హెచ్చరించారు. స్థానిక బస్టాండ్ సమీపంలో చిరువ్యాపారులు నిర్మించుకున్న షాపింగ్ కాంప్లెక్స్ను ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్ ఆదివారం ప్రారంభించి మాట్లాడారు. అంతర్గాంను అభివృద్ధి చేస్తాం అభివృద్ధిలో అంతర్గాం మండలాన్ని అగ్రగామిగా నిలుపుతామని ఎమ్మెల్యే రాజ్ఠాకూర్ పేర్కొన్నారు. మండల ముఖ్య నాయకులతో వివిధ అంశాలపై ఆయన సమీక్షించారు. ఈసందర్భంగా బీఆర్ఎస్ నాయకులు ధారవేణి సంతోష్, తమ్మనవేని మణికుమార్, అజయ్, ప్రవీణ్ కాంగ్రెస్లో చేరారు. నాయకులు భాను తిరుపతినాయక్, హనుమాన్రెడ్డి, కాంపెల్లి సంతోష్, ప్రశాంత్ పాల్గొన్నారు. సంక్షోభంపై దృష్టి సారించండి పెద్దపల్లి: బెస్ట్ అవైలబుల్ స్కూళ్లలోని దాదా పు 25,000 మంది విద్యార్థులు ఫీజు బకాయిల చెల్లింపులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ సంక్షోభంపై దృష్టి సారించాలని ఎంపీ వంశీకృష్ణ కోరారు. తగిన చర్యలు తీసుకోవా లని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రి లక్ష్మణ్కుమార్కు ఒక లేఖలో విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం నుంచి రూ.200 కోట్లు ప్రైవేట్ పాఠశాలలకు చెల్లించాల్సి ఉందని పేర్కొన్నారు.ల -
తక్షణమే స్పందిస్తే.. ప్రాణాలు కాపాడవచ్చు
● సీపీఆర్పై అవగాహన అవసరం పెద్దపల్లి: కార్డియో పల్మనరీ రెసిపిటేషన్(సీపీఆర్) విధానంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాచరణతో ముందుకు సాగుతోంది. పీహెచ్సీల పరిధిలోని విద్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు ప్రధాన కూడళ్లలో సదస్సులో నిర్వహిస్తోంది. గుండెపోటుకు గురైన, ఇతరత్రా ప్రమాదాల్లో చిక్కుకున్న వారి ప్రాణాలు కాపాడేందుకు అనుసరించాల్సిన సీపీఆర్ పద్ధతిపై అవగాహన కల్పిస్తోంది. తొలుత అటెండర్లు, సిబ్బందికి.. జిల్లాలోని 18 ప్రాథమిక ఆరోగ్య, 6 అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధి ఆస్పత్రుల్లో తొలుత పేషెంట్లు, అటెండర్లకు సీపీఆర్పై అవగాహన కల్పించారు. గుండె ఆగిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించే లోపు, వైద్యసాయం అందేవరకు సీపీఆర్ ఎంతోఅవసరమని, దీనిద్వారా మెదడు ఇతర ముఖ్య అవయవాలకు ఆక్సిజన్ అంది తాత్కాలికంగా రక్తం సరఫరా అవుతుందని, తద్వారా మెదడు దెబ్బతినదని వైద్యులు చెబుతున్నారు. సీపీఆర్తో ప్రాణాలు కాపాడేందుకు అవకాశాలు మెరుగుపడతాయని వారు అంటున్నారు. విస్తృతంగా అవగాహన సీపీఆర్ పద్ధతిపై జిల్లావ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ప్రజలకు దీ నిపై విస్తృతస్థాయిలో అవగాహన కల్పించి చైతన్యవంతం కల్పిస్తున్నాం. బాధితుల ప్రా ణాలను కాపాడేందుకు మా వంతు ప్రయ త్నం చేస్తున్నాం. వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు వస్తున్నందున సీపీఆర్ చేయడం ద్వారా ప్రాణాలను కాపాడే అవకాశం అధికంగా ఉంటుంది. ప్రతీపౌరుడు దీనిపై అవగాహన పెంచుకోవాలి. – వాణిశ్రీ, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి -
‘సిమ్స్’లో సంబురాలు
● కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ కోల్సిటీ(రామగుండం): నగరంలోని సింగరేణి ప్రభుత్వ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(సిమ్స్)కు నేషనల్ మెడికల్ కౌన్సిల్(ఎన్ఎంసీ) 16 పీజీ సీట్లకు అనుమతి ఇవ్వడంపై కాలేజీలో ప్రొఫెసర్లు, మెడికోలు శనివారం సంబురాలు జరుపుకున్నారు. ముఖ్య అతిథిగా హాజరైన ప్రిన్సిపాల్ హిమబింద్సింగ్ తొలుత కేక్ కట్ చేసి మెడికోలకు మిఠాయిలు పంచిపెట్టి శుభాకాంక్షలు తెలిపారు. ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. కొత్త మెడికల్ కాలేజీ అయినా.. సిమ్స్ను ప్రోత్సహించేలా నాలుగు విభాగాల్లో 16 పీజీ సీట్లకు ఎన్ఎంసీ అనుమతి ఇవ్వడం సంతోషకరమన్నారు. సిమ్స్లో నాణ్యమైన విద్యతోపాటు చక్కటి వాతావరణం, ఆధునిక సౌకర్యాలతో విశాలమైన అకడమిక్ బ్లాక్, హాస్టళ్లు మెడికోలకు అందిస్తున్నట్లు హిమబింద్సింగ్ తెలిపారు. ప్రతీ మెడికో క్రమశిక్షణ, అంకితభావంతో వ్యవహరించాలని ఆమె సూచించారు. పీజీ సీట్లు మంజూరు కావడానికి కృషి చేసిన రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్, కలెక్టర్ కోయ శ్రీహర్ష, జీజీహెచ్ సూపరింటెండెంట్ దయాళ్సింగ్కు ప్రిన్సిపాల్ తదితరులు కృతజ్ఞతలు తెలిపారు. -
చట్టాలపై అవగాహన అవసరం
పెద్దపల్లిరూరల్: విద్యావంతులైన యువత చట్టాలపై కనీస అవగాహన కలిగి ఉండి, కుటుంబసభ్యులకూ అవగాహన కల్పించాలని జిల్లా జడ్జి కుంచాల సునీత అన్నారు. స్థానిక మదర్ థెరిసా ఇంజినీరింగ్ కాలేజీలో శనివారం నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సు లో న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి స్వప్నరాణితో కలిసి జడ్జి మాట్లాడారు. విద్యార్థులు క్రమశిక్షణతో వ్యహరించి, ఎంచుకున్న లక్ష్య సాధనకు పాటుపడాలని సూచించారు. మత్తు పదార్థాలకు బానిసలుగా మారి భవిష్యత్తును పాడు చేసుకోవద్దని జిల్లా జడ్జి పేర్కొన్నారు. లీగల్ ఎయిడ్ కౌన్సిల్ సభ్యుడు శ్రీనివాస్, భా ను, న్యాయవాదులు ఠాకూర్ హనుమాన్సింగ్, బర్ల రమేశ్బాబు, ఝాన్సీ, శరత్కుమార్, ప్రి న్సిపాల్ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. సీపీఆర్పై అవగాహన పెద్దపల్లిరూరల్: కార్డియో పల్మనరీ రెసిపిటేషన్(సీపీఆర్)పై అందరికీ అవగాహన ఉండాలని జిల్లా జడ్జి కుంచాల సునీత సూచించారు. జిల్లా ప్రధాన న్యాయస్థానంలో శనివారం సీనియర్ సివిల్ జడ్జి స్వప్నరాణి, డీఎంహెచ్వో వాణిశ్రీతో కలిసి కోర్టు ఉద్యోగులు, సిబ్బంది, న్యా యవాదులకు అసిస్టెంట్ ప్రొఫెసర్ మౌనిక సీ పీఆర్పై అవగాహన కల్పించారు. ఉప్పు విని యోగం తగ్గించాలని, అధికబరువును నియంత్రణలో ఉంచుకోవాలని డీఎంహెచ్వో సూచించారు. ప్రోగ్రాం అధికారి రాజమౌళి, కిరణ్కుమార్, మమత తదితరులు పాల్గొన్నారు.విద్యార్థికి గోల్డ్మెడల్ ధర్మారం(ధర్మపురి): హైదరాబాద్లోని మహిళా(వీరనారి చాకలి ఐలమ్మ ఉమెన్స్) యూనివర్సిటీ కళాశాలలో అత్యధిక మార్కులు సాధించిన ధర్మారం మండల కేంద్రానికి చెందిన కొత్తపల్లి జరూష శనివారం గవర్నర్ నుంచి బంగారు పతకం అందుకుంది. 2021–24 బ్యాచ్కి చెందిన జరూష బీఏలో గోల్డ్ మెడల్ సాధించింది. ఈ సందర్భంగా హైదరాబాద్లోని మహిళా విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గవర్నర్ జిష్టుదేవ్ వర్మ.. జరూషను శాలువాతో సత్కరించి బంగారు పతకం అఽందించారు. ఆస్తిపన్ను వసూలు చేయాలి ఎలిగేడు(పెద్దపల్లి): గ్రామాల్లో ఆస్తిపన్ను వసూ లు చేయాలని డీఎల్పీవో వేణుగోపాల్ సూచించారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీవో కిరణ్తో కలిసి శనివారం పంచాయతీ కార్యదర్శులతో ఆస్తిపన్ను వసూళ్ల ప్రగతిపై సమీక్షించారు. ఈనెల 31వ తేదీ వరకు 50 శాతం ఆస్తిపన్ను వసూలు చేయాలని ఆదేశించారు. పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. సింగరేణి అధికారుల బదిలీ గోదావరిఖని: సింగరేణిలోని ముగ్గురు ఐఈడీ అధికారులను బదిలీ చేస్తూ యాజమాన్యం శనివారం ఆదేశాలు జారీచేసింది. ఆర్జీ–3 ఏరియాలో పనిచేస్తున్న ఐఈడీ డీజీఎం కె.చంద్రశేఖర్ను ఆర్జీ–2 ఏరియాకు బదిలీ చేశారు. ఆర్జీ–2 ఏరియాలో పనిచేస్తున్న ఐఈడీ డీజీఎం మురళీకృష్ణ ఆర్జీ–3 ఏరియాకు బదిలీ అయ్యా రు. అదేవిధంగా ఎస్టీపీపీలో పనిచేస్తున్న ఐఈడీ డీజీఎం ఎం.ప్రభాకర్రావును ఇల్లెందుకు బదిలీ చేశారు. బదిలీ అయిన అధికారులు ఈనెల 25వ తేదీలోగా ఆయా స్థానాల్లో రిపోర్టు చేయాలని ఉత్తర్వుల్లో ఆదేశించారు. ఆస్పత్రుల పరిసరాల్లో టపాసులు కాల్చొద్దు పెద్దపల్లిరూరల్: జిల్లాలోని ఆస్పత్రులు, పాఠశాలల పరిసరాల్లో టపాకాయలు పేల్చవద్దని కలెక్టర్ శ్రీహర్ష సూచించారు. కాలుష్య నియంత్రణ మండలి తాజా నివేదిక ప్రకారం 2024లో టపాసులు పేల్చే విధానాలను వివరించారు. దీపావళి పర్వదినం సందర్భంగా రాత్రి 8గంటల నుంచి 10గంటల వరకే టపాకాయలు కాల్చాలన్నారు. సాధారణ ప్రమా ణాల కన్నా అధికంగా ఉన్న టపాసులను పేల్చితే ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉందని పేర్కొన్నారు. కాలుష్య నియంత్రణ మండలి నిబంధనలకు లోబడే టపాసులు పేల్చాలని ఆయన సూచించారు. -
నవ్వించే నటులు.. ఆటాపాటల కళాకారులు
గోదావరిఖని: దీపావళి వేడుకలను అంగరంగవైభవంగా నిర్వహించేందుకు సింగరేణి యాజమాన్యం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్, ఆర్జీ–1 జీఎం లలిత్కుమార్, ఏసీపీ రమేశ్తో కలిసి శనివారం జవహర్లాల్నెహ్రూ స్టేడియంలో ఏర్పాట్లు పరిశీలించారు. ఆదివారం నిర్వహించే ఉత్సవాలు కనీవినీ ఎరుగనతి రీతిలో ఉండాలని వారు అధికారులను ఆదేశించారు. ఈమేరకు జవహర్లాల్నెహ్రూ స్టేడియం ముస్తాబవుతోంది. ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయింపు.. వేడుకల కోసం సింగరేణి యాజమాన్యం దాదాపు రూ.20లక్షలు, ఇతర సంస్థలు మరో రూ.10లక్షల వరకు వెచ్చిస్తున్నాయి. వేడుకల కోసం గ్రౌండ్లో ప్రత్యేక స్టేజీ నిర్మిస్తున్నారు. మిరుమిట్లుగొలిపేలా.. సినీ ప్రపంచాన్ని తలపించేలా భారీ సెట్టింగ్లు వేస్తున్నారు. జిగేల్మనిపించే రంగురంగలు విద్యు త్ దీపాలు అమర్చుతున్నారు. కళాకారుల రాక దీపావళి వేడుకల సందర్భంగా ఆహూతులను అలరించేందుకు సినీ, మిమిక్రీస్టార్ శివారెడ్డి నేతృత్వంలో సినీనటులు, కళాకారులు తరలివస్తారు. ఇందు లో సినీ హాస్యనటుడు ఆలీ, గాయని గీతామాధురి, జబర్దస్త్ బుల్లెట్టీం భాస్కర్, గోవిందడాన్స్ గ్రూ ప్ కళాకారులు ఉంటారు. వీరు పాటలు, నృత్యా లతో అదరగొడతారు. మద్రాస్ నుంచి ఫైర్డాన్స్ బృందం కూడా రానుంది. చివరగా నరకాసుర వధ నిర్వహించనున్నారు. ప్రత్యేక స్టాళ్ల ఏర్పాటు.. అతిథుల కోసం తెలంగాణ రుచులు అందించేలా స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నారు. ఎగ్జిబిషన్ స్టాళ్లు కూడా సిద్ధమవుతున్నాయి. ఆకాశాన్ని తాకేలా తారాజువ్వలు, పటాకుల ప్రదర్శన, మిరుమిట్లు గొలిపే విద్యుత్ దీపాలు, తెలంగాణ రుచుల సమ్మేళనాలు, ఫుడ్ స్టాల్స్, ఆకర్షణీయమైన ఎగ్జిబిషన్లు స్టాల్స్, స్పెషల్ క్యాంప్ ఫైర్ వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని నిర్వాహకులు వెల్లడించారు. -
అభిప్రాయం గోప్యం!
సాక్షిప్రతినిధి,కరీంనగర్: సంస్థాగత ప్రక్రియలో భాగంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన అభిప్రాయ సేకరణ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో శనివారం ముగిసింది. అభిప్రాయ సేకరణ సందర్భంగా కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో చోటుచేసుకొన్న రభసతో పరిశీలకులు రూటు మార్చారు. ఓ హోటల్లో రహస్యంగా అభిప్రాయాలను సేకరించారు. కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల డీసీసీ అధ్యక్ష, కరీంనగర్, రామగుండం సిటీ అధ్యక్ష స్థానాల ఆశావహుల నుంచి చివరిరోజు అభిప్రాయాలు తీసుకున్నారు. అభిప్రాయ సేకరణ ప్రక్రియ ముగియడంతో, నివేదికను అధిష్టానానికి అందించనున్నారు. ఆరు రోజులుగా.. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక మొదటిసారిగా పార్టీ సంస్థాగత నిర్మాణంపై కాంగ్రెస్ దృష్టి పెట్టింది. దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న ‘పార్టీ శ్రేణుల అభిప్రాయాల మేరకే ఎంపిక’ విధానాన్ని తెలంగాణలోనూ ప్రవేశపెట్టింది. ఏఐసీసీ పరిశీలకుడిగా శ్రీనివాస్ మన్నె, పీసీసీ నుంచి ఆత్రం సుగుణ, చామల కిరణ్కుమార్రెడ్డి, ఖాజాఫకృద్దీన్ను నియమించింది. ఈ నెల 13వ తేదీ నుంచి ఉమ్మడి జిల్లాలో ఏఐసీసీ, పీసీసీ పరిశీలకులు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పార్టీ శ్రేణుల అభిప్రాయాలను సేకరించారు. ఒక్కో నియోజకవర్గానికి వెళ్లి అక్కడ నాయకులను కలిసి ఎవరిని అధ్యక్షుడిని చేస్తే బాగుంటుందో తెలుసుకున్నారు. రూటు మార్చి కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ అభిప్రాయ సేకరణ సందర్భంగా డీసీసీ కార్యాలయంలో ఆశావహుల ఆధిపత్యపోరు రసాభాసకు దారితీయడం తెలిసిందే. నాయకుల నడుమ వాగ్వాదాలు, పాత, కొత్త నేతల పంచాయితీ, పోటాపోటీగా జనసమీకరణ, ఉద్రిక్తతల నేపథ్యంలో పూర్తిస్థాయిలో అభిప్రాయాలు చేపట్టకుండానే పరిశీలకుడు వెనుదిరగాల్సి వచ్చింది. కరీంనగర్ అనుభవంతో పరిశీలకులు రూటు మార్చారు. శుక్ర, శనివారాల్లో రహస్యంగా అభిప్రాయాలు తీసుకున్నారు. అధ్యక్ష స్థానాలకు పోటీపడుతున్న నాయకులు, పార్టీ పదవులున్న నా యకులు, స్వచ్ఛంద సంస్థలు, మీడియా ప్రతినిధులను పిలిచి అభిప్రాయలు సేకరించారు. శనివారం ఎంపీ చామల కిరణ్కుమార్ రెడ్డి కూడా కరీంనగర్లోని అభిప్రాయ సేకరణలో పాల్గొన్నారు. ఎన్ని రోజులకో ఉమ్మడి జిల్లాలోని 13 అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పార్టీ శ్రేణుల అభిప్రాయాలు సేకరించిన పరిశీలకులు త్వరలో అధిష్టానానికి నివేదిక అందించనున్నారు. నాలుగు జిల్లాల అధ్యక్షులు, రెండు నగర అధ్యక్షుల ఎంపికకు అభిప్రాయ సేకరణ జరగగా, పరిశీలకులు ఇచ్చే నివేదికపైనే ఆశావహుల భవితవ్యం ఆధారపడి ఉంది. పార్టీ శ్రేణుల అభిప్రాయాలతో పాటు, మంత్రులు, ఎమ్మెల్యేల అభిప్రాయాలకు అధిక ప్రాధాన్యం ఉండే అవకాశముంది. పార్టీ పదవులు ఉన్న వారి నుంచి ఎక్కువగా అభిప్రాయాలు సేకరించడంతో, ఆ అభిప్రాయాలు పాత నాయకులకు అనుకూలమనే ప్రచారం ఉంది. నివేదికను అధిష్టానానికి ఎప్పుడు ఇస్తారు, డీసీసీలను ఎప్పుడు ప్రకటిస్తారో, ఈ మొత్తం ప్రక్రియ ఇంకెన్ని రోజులు పడుతుందో? అనే చర్చ పార్టీ వర్గాల్లో మొదలైంది. పార్టీ చేపట్టిన అభిప్రాయ సేకరణను పూర్తిస్థాయిలో పరిగణలోకి తీసుకొంటారా, సామాజిక, ఆర్థిక సమీకరణల కారణంగా నియామకాలు చేపడుతారో వేచి చూడాలి. డీసీసీ, నగర అధ్యక్ష స్థానాలకు వచ్చిన దరఖాస్తులు కరీంనగర్ 38జగిత్యాల 36రాజన్న సిరిసిల్ల 16పెద్దపల్లి 25కరీంనగర్ సిటీ 24రామగుండం సిటీ 05 -
సిండికేట్ మాయ
సాక్షి పెద్దపల్లి: జిల్లాలో మద్యం దుకాణ టెండర్లపై వ్యాపారుల సిండికేట్ ఎఫెక్ట్ పడింది. ఈ మాఫి యాతో పాటు పెరిగిన ఫీజుతో గతం కన్నా దరఖాస్తులు బాగా తగ్గాయి. రాష్ట్రప్రభుత్వం మద్యం టెండరు విధానం ద్వారా 2025–27లో భాగంగా జిల్లా లో 74 వైన్స్షాప్ల కోసం టెండర్లు ఆహ్వానించింది. క్రితంసారి 2,020 దరఖాస్తులు అందగా.. ఖజానాకు రూ.40.40కోట్ల ఆదాయం సమకూరింది. ఈసారి 1,189 దరఖాస్తులు అందగా, రూ.35.67 కోట్ల ఆదాయమే సమకూరింది. ఈనెల 18వ తేదీ తో దరఖాస్తులకు గడువు ముగిసింది. చివరిరోజు టెండర్లు భారీగానే వచ్చినా గతంతో పోల్చితే తగ్గాయని అధికారులు తెలిపారు. గడువు మరింత పెంచే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. వ్యాపారుల కుమ్మక్కు! మద్యం దుకాణాలకు దరఖాస్తులు భారీగా తగ్గాడానికి వ్యాపారులు సిండికేట్గా మారడమే ప్రధాన కారణమని తెలుస్తోంది. మద్యం వ్యాపారంలో కింగ్ మేకర్లుగా ఎదిగిన కొందరు ముఠాగా ఏర్పడ్డారని, వీరే ఆసక్తి ఉన్నవారికి అప్పులు ఇచ్చి మరీ పెట్టుబడులు పెట్టిస్తున్నారని చర్చ సాగుతోంది. రూ.3 లక్షల నగదు ఇచ్చి టెండరు వేసేలా రహస్యంగా ఒప్పందాలు చేసుకున్నారని అంటున్నారు. ఇందుకు పలుమార్లు సమావేశాలు ఏర్పాటు చేసి ఆసక్తి గలవారిని తమ గ్రూపుల్లో చేర్చుకున్నారని భావిస్తున్నారు. పెట్టుబడి కింగ్మేకర్లదే అయినా.. వారు విధించే నిబంధనలు పాటించాల్సిందే. ఎవరికి దుకాణం అప్పగించాలన్నా.. నిర్ణయం వారిదే. ఒకవేళ దుకాణం రాకపోతే పెట్టుబడి సొమ్ము వాయిదా పద్ధతుల్లో చెల్లించేలా కూడా ఒప్పందం చేసుకున్నా రు. మద్యం వ్యాపారుల మాయాజాలం ఇప్పుడు జిల్లాలో హాట్టాపిక్గా మారింది. ఈ ప్రక్రియతో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు భారీగా గండిపడింది. జిల్లాలో 74 మద్యం దుకాణాలు.. జిల్లాలో మొత్తం 74 మద్యం దుకాణాలు ఉండగా, టెండర్ నోటిఫికేషన్ జారీచేసినప్పటి నుంచి ఇప్పటివరకు దరఖాస్తులు ఆశించినట్లు పెద్దగా రాలేదు. స్థానిక సంస్థల ఎన్నికలు, బతుకమ్మ, దసరా పండుగలు దాటినా దరఖాస్తులు అంతంత మాత్రంగానే అందాయి. గతంలో ఒక్కో దుకాణానికి రోజూ 50 నుంచి 100 దరఖాస్తులు రాగా ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించలేదు. కొద్దిరోజుల్లో ఎంపీటీసీ, సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నా.. వ్యాపారులు సిండికేట్ కావడంతోనే దరఖాస్తులు పెద్దగా నమోదు కానట్లు తెలుస్తోంది. నేతల కనుసన్నల్లోనే.. ప్రస్తుతం మద్యం దుకాణాలు నడుపుతున్న వారే గ్రూపులుగా ఏర్పడి దరఖాస్తు చేస్తున్నారనే ప్రచా రం ఉంది. గత టెండర్లలో పోటీపడి దరఖాస్తు చేయగా ఈసారి ఒప్పందాలతో ఆ పని చేస్తున్నారు. ముందుగా అన్నీ మాట్లాడుకున్నాకే టెండర్లు దాఖ లు చేస్తున్నారు. మరికొన్నిచోట్ల మండల, నియోజ కవర్గస్థాయి నేతలు ఎక్కువగా తమ బంధువర్గంతో దరఖాస్తులు వేయిస్తున్నారు. ఏదిఏమైనా ప్రభు త్వ ఖజానాకు ఆశించిన ఆదాయం సమకూరకపోవడంతో అధికారులు పునరాలోచన పడ్డారని తెలిసింది. -
బీసీ బంద్ ప్రశాంతం
పెద్దపల్లి/పెద్దపల్లిరూరల్/మంథని/గోదావరిఖని: బీసీలకు 42శాతం రిజర్వేషన్ సౌకర్యం వర్తింప జేయాలనే డిమాండ్తో బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో శనివారం చేపట్టిన బంద్ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. బీసీ కుల సంఘాల ఆందోళనలకు అధికార కాంగ్రెస్తోపాటు బీఆర్ఎస్, బీజేపీ, వామపక్ష పార్టీల నేతలు మద్దతు ప్రకటించి ప్రత్యక్ష ఆందోళనల్లో పాల్గొన్నారు. పెద్దపల్లి, గోదావరిఖని, మంథని, సుల్తానాబాద్లో ఆయా పార్టీలు, యూనియన్లు రాస్తారోకోలు, ర్యాలీలు, ధర్నాలు, ప్రదర్శనలు నిర్వహించాయి. వ్యాపార, వాణిజ్యసంస్థలు, పెట్రోల్ బంక్లు, మద్యం దుకాణాలు మూతపడ్డాయి. మధ్యాహ్నం వరకు ఆర్టీసీ బస్సులు నడవలేదు. బస్టాండ్లు, రహదారులు వాహనాలు, ప్రజలు లేక బోసిపోయి కనిపించాయి. పెద్దపల్లిలో మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు బైక్ర్యాలీ నిర్వహించారు. బీజేపీలోని గుజ్జుల రామకృష్ణారెడ్డి వర్గీయు లు కమాన్ ప్రాంతంలో సీఎం దిష్టిబొమ్మ దహనం చేసేందుకు యత్నించగా ఎస్సైలు లక్ష్మణ్రావు, మల్లేశ్ అడ్డుకున్నారు. జెండా కూడలివద్ద తెరిచి ఉన్న పాన్షాపును మూసివేయించేందుకు ప్రదీప్కుమార్ వర్గీయులు యత్నిస్తుండగా ఇరువర్గాల మ ధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు సముదాయించారు. బీసీ సంఘాల నేత తాడూరి శ్రీమాన్ తదితరులు బైక్ర్యాలీ నిర్వహించారు. పెద్దపల్లి డీసీపీ కరుణాకర్, ఏసీపీ కృష్ణ, సీఐలు ప్రవీణ్ కుమార్, సుబ్బారెడ్డి, పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశా రు. కాగా, బీజేపీ నాయకులు సీఎం రేవంత్రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేసేందుకు యత్నించగా రూ రల్ ఎస్సై మల్లేశం అడ్డుకున్నారు. దీంతో పోలీసులను బీజేపీ నాయకులు తోసేయగా.. స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. పలువురికి స్వల్ప గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు తాళ్లపల్లి మనోజ్గౌడ్, జిల్లా గ్రంథాలయం సంస్థ అధ్యక్షుడు అన్నయ్యగౌడ్, వివిధ పార్టీల నాయకులు సతీశ్, రాజమల్లు, అబ్బయ్యగౌడ్, పడాల అజయ్గౌడ్, కందుల శ్రీనివాస్, కూకట్ల నాగరాజు, మిట్టపల్లి ప్రవీణ్, కాంపల్లి బాబు, బుర్ర శ్రీనివాస్, గుణపతి, సూర శ్యామ్, అమీరిశెట్టి తిరుపతి, టీకే ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. బీసీలపై బీజేపీ, బీఆర్ఎస్ కపట ప్రేమ బీఆర్ఎస్, బీజేపీ నేతలు బీసీలపై కపట ప్రేమ చూపిస్తున్నాయని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్ విమర్శించారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేపట్టిన బీసీ బంద్లో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణతో కలిసి పాల్గొన్నారు. కార్యక్రమంలో నాయకులు మహంకాళి స్వామి, బొంతల రాజేశ్, కాల్వలింగస్వామి, మాదరబోయిన రవికుమార్, ఎండీ ముస్తాఫా, ధూళికట్ట సతీశ్, తిప్పారపు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ ర్యాలీ రామగుండం బీజేపీ నియోజకవర్గ ఇన్చార్జి కందు ల సంధ్యారాణి ఆధ్వర్యంలో నగరంలో ర్యాలీ నిర్వహించారు. నాయకులు ముస్కుల భాస్కర్రెడ్డి, పి డుగు కృష్ణ, జక్కుల నరహరి, గుండబోయిన భూమయ్య, కోడూరి రమేశ్, ఊరగొండ అపర్ణ, బోడకుంట సుభాష్, బండారి శ్యామ్, అందే రాజ్కుమార్, మహేశ్, మెరుగు శ్రీనివాస్, జక్కుల పద్మ, ప్రవీణ్, బియ్యాల మహేందర్, శివరామకృష్ణ, మామిడి వీరేశం తదితరులు పాల్గొన్నారు. బీసీ రిజర్వేషన్లు అమలుకాకుండా కుట్ర బీసీ రిజర్వేషన్లు అమలు చేయకుండా బీజేపీ, కాంగ్రెస్ నేతలు కుట్ర చేస్తున్నారని మంథని మాజీఎమ్మెల్యే పుట్ట మధు అనుమానం వ్యక్తం చేశారు. బీసీ సంఘాల జేఏసీ పిలుపు మేరకు పట్టణంలో చేపట్టిన బంద్లో ఆయన పాల్గొని మాట్లాడారు. -
సింథటిక్ మ్యాట్.. గ్రీన్గ్రాస్ కోర్ట్
● సింగరేణి స్టేడియానికి ఆధునిక హంగులు ● సమూల మార్పులకు యాజమాన్యం కసరత్తు ● రూ.7.20కోట్లతో కార్పొరేట్కు ప్రతిపాదనలుగోదావరిఖని: నగరంలోని సింగరేణి జవహర్లాల్ నెహ్రూ సేటడియం సింథటిక్ మ్యాట్, గ్రీన్గ్రాస్ ఫుట్బాల్ కోర్టు తదితర ఆధునిక హంగులతో రూపుదిద్దుకోనుంది. ఇందుకోసం సింగరేణి యాజమాన్యం ప్రణాళిక రూపొందించింది. దీనికోసం రూ.7.20కోట్లు వెచ్చించనుంది. 400 మీటర్ల పొడవైన సింథటిక్ 8లైన్ల వాకింగ్ ట్రాక్, మధ్యలో గ్రీన్మ్యాట్ ఫుట్బాల్ గ్రౌండ్ ఏర్పాటు చేస్తుంది. ప్రస్తుత మైదానాన్ని ఖాళీచేసి గోదావరి తీరంలోని సమ్మక్క – సారలమ్మ గద్దెలు, ఇన్టెక్వెల్ మధ్య సుమారు 20 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో గ్రౌండ్ నిర్మించేందుకు నిర్ణయించింది. వాకర్లకు ఎంతో అనుకూలం.. స్టేడియంలో నిర్మించే 8లేన్ల సింథటిక్ ట్రాక్ వాకర్లకు ఎంతగానో ఉపయోగపడనుంది. మధ్యలో గ్రీన్గ్రాస్ ఫుట్బాల్ కోర్టు ఏర్పాటు చేయనున్నారు. సింగరేణి ఉన్నతాధికారులతోపాటు ట్రాక్ నిర్మాణం కోసం ప్రత్యేక నిపుణులను ఇక్కడకు రప్పించి ప్లాన్ తీసుకున్నారు. ప్రతిపాదనలు సింగరేణి కార్పొరేట్ కార్యాలయానికి పంపించారు. త్వరలో గ్రీన్సిగ్నల్ వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. గోదావరి తీరంలో ప్రత్యేక గ్రౌండ్ నగర శివారులోని గోదావరి తీర సమ్మక్క– సారలమ్మ గద్దెలు, ఇన్టెక్వెల్ మధ్య సుమారు 20ఎకరాల్లో ప్రత్యేకంగా మైదానం నిర్మించాలని సింగరేణి సూత్రప్రాయంగా నిర్ణయించింది. సంస్థకు చెందిన భారీ యంత్రాలతో ఆ ప్రాంతంలోని తుమ్మపొదలను తొలగించి నేల చదను చేయడం కూడా ఇప్పటికే ప్రారంభించారు. స్టేడియంలో స్టేజీ తొలగింపు.. జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో మార్పులకు సింగరేణి యాజమాన్యం శ్రీకారం చుట్టింది. దీంతో ప్రస్తుతం ఉన్నస్టేజీని తొలగించింది. కార్పొరేట్ కార్యాలయం నుంచి గ్రీన్సిగ్నల్ రాగానే అభివృద్ధి పనులు ప్రారంభిస్తారని అంటున్నారు. ప్రస్తుత మైదానాన్ని అభివృద్ధి చేస్తూనే భవిష్యత్లో క్రీడాకారులకు ఉపయోగపడేలా తీర్చిదిద్దుతున్నారు. -
బీసీ సంఘాల బంద్కు కాంగ్రెస్ మద్దతు
● పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ సౌకర్యం కల్పిలంచాలనే డిమాండ్తో ఈనెల 18న చేపట్టిన రాష్ట్రబంద్కు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని పెద్దపల్లి ఎ మ్మెల్యే విజయరమణారావు స్పష్టం చేశారు. పెగడపల్లిలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఉద్యోగ, విద్య, రాజకీయ రంగాల్లో బీసీలకు అవకాశాలు పెరిగాయన్నారు. కులగణన నిర్వహించిన ఘనత సీఎం రేవంత్రెడ్డి, కాంగ్రెస్ పార్టీకే దక్కిందన్నారు. బీజేపీ, బీఆర్ఎస్లు బీసీ రి జర్వేషన్లకు సుముఖంగా లేవని విమర్శించారు. బీ సీలపై ఆ రెండు పార్టీలు పక్షపాత వైఖరి అవలంబిస్తున్నాయన్నారు. ఈక్రమంలో బీసీ సంఘాలు చేపట్టిన రాష్ట్రబంద్కు కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు మద్దతుగా ఆందోళనలో పాల్గొనాలని ఆయన కోరారు. ఈసమావేశంలో మాజీ ఎంపీపీ సారయ్యగౌడ్, ఏఎంసీ చైర్మన్ రామి డి తిరుపతిరెడ్డి, వైస్ చైర్మన్ సబ్బని రాజమల్లు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గాజనవేన సదయ్య, మా జీ జెడ్పీటీసీ లంక సదయ్య, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. -
రైల్వేస్టేషన్లో తనిఖీలు
రామగుండం: స్థానిక రైల్వేస్టేషన్లో శుక్రవా రం రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(ఆర్పీఎఫ్), ప్ర భుత్వ రైల్వే పోలీస్ (జీఆర్పీ), సివిల్ పోలీస్ బలగాలు కార్డెన్ సెర్చ్ నిర్వహించాయి. ప్ర యాణికుల బ్యాగులు, వెయిటింగ్ రూమ్స్ లో తనిఖీ చేశారు. అనుమానితుల నుంచి వి వరాలు సేకరించారు. సోదాలతో ఏం జరుగుతుందోనని ప్రయాణికులు ఉత్కంఠకు గురయ్యారు. ఆర్పీఎఫ్ సీఐ, ఎస్సైలు లింగమ య్య, నాగరాజు, జీఆర్పీ ఇన్చార్జి తిరుపతి, సివిల్ సీఐ, ఎస్సైలు ప్రవీణ్కుమార్, సంధ్యా రాణి, వెంకటస్వామి తదితరులు ఉన్నారు. వాలీబాల్ పోటీలకు ఎంపిక ధర్మారం(ధర్మపురి): ఉమ్మడి జిల్లా ఎస్జీఎ ఫ్ అండర్ – 19 వాలీబాల్ పోటీల్లో స్థానిక మోడల్ స్కూల్ విద్యార్థులు ద్వితీయ స్థానం సాధించినట్లు వ్యాయామ ఉపాధ్యాయుడు బైకని కొమురయ్య తెలిపారు. ప్రతిభ చూపి న బి.పూజ, జి.పూజ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు వివరించారు. విద్యార్థులను ప్రి న్సిపాల్ రాజ్కుమార్, వ్యాయామ ఉపాధ్యాయుడు ఎం.సంజీవరావు అభినందించారు.బయోమైనింగ్కు ఏర్పాట్లుపెద్దపల్లి: సుల్తానాబాద్ మార్కండేయకాలనీ డంపింగ్ యార్డులో బయోమైనింగ్కు ఏర్పా ట్లు పూర్తిచేయాలని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ జాయింట్ డైరెక్టర్ సంధ్య ఆదేశించారు. సు ల్తానాబాద్లోని డంపింగ్యార్డ్ను శుక్రవా రం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఏజెన్సీ సంస్థ సాగర్ మోటార్స్ లిమిటెడ్ పనులు వేగవంతం చేసేలా చర్యలు తీసుకోవాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు. మున్సిపల్ కమిషన ర్ రమేశ్, మేనేజర్ అలీమొద్దీన్, ఏఈ రాజ్కుమార్, ఇన్చార్జి శానిటరీ ఇన్స్పెక్టర్ రమేశ్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నేడు వెయ్యి బైక్లతో ర్యాలీ పెద్దపల్లిరూరల్: బీసీ రిజర్వేషన్ల సాధనకోసం శనివారం చేపట్టిన బంద్ సందర్భంగా జేఏసీ ఆధ్వర్యంలో వెయ్యి బైక్లతో ర్యాలీ నిర్వహించనున్నట్లు బీసీ సంఘాల నాయకులు ప్రకటించారు. స్థానిక ఆర్యవైశ్యభవన్లో శుక్రవా రం తాడూరి శ్రీమన్నారాయణ అధ్యక్షతన జ రిగిన సమావేశంలో నాయకులు మాట్లాడా రు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కాలేజీ మైదానంలో ర్యాలీ ప్రారంభమవుతుందని అన్నా రు. చేతి ధర్మయ్య, కొలిపాక నర్సయ్య, మ నోజ్గౌడ్, శంకర్, సదాశివ్, పర్వతాలు, ఐల య్య, ఉప్పు రాజ్కుమార్, శ్రీనివాస్, సతీశ్, సదానందం, పూర్ణచారి, రంగు శ్రీనివాస్ రామ్మూర్తి, భూమేశ్ తదితరులు ఉన్నారు. లక్ష్యం నిర్దేశించుకోవాలి పెద్దపల్లి: విద్యార్థులు లక్ష్యం నిర్దేశించుకొని ముందుకు సాగాలని డీవైఎస్వో సురేశ్, ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి లక్ష్మణ్ సూచించారు. సు ల్తానాబాద్లో శుక్రవారం జిల్లాస్థాయి టేబుల్ టెన్నిస్ పోటీలను వారు ప్రారంభించి మాట్లా డారు. ఎంఈవో రాజయ్య, ప్రతినిధులు దాసరి రమేశ్, మాటేటి సంజీవ్ కుమార్, కృష్ణప్రియ, ప్రణయ్, వెంకటేశ్, సత్యం, శివ, స్వప్న, సతీశ్ తదితరులు పాల్గొన్నారు. పోషక విలువలపై అవగాహన రామగిరి(మంథని): సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ, రామగిరి ఖిల్లా కృషి విజ్ఞాన్ కేంద్రం ఆధ్వర్యంలో కిచెన్ గార్డెన్ – సాగు పద్ధతులు, పో షక విలువలు అంశంపై అంగన్వాడీ టీచర్ల కు శుక్రవారం శిక్షణ ఇచ్చారు. కేవీకే శాస్త్రవేత్త శ్రీనివాస్ మాట్లాడుతూ, జిల్లాలోని 15 అంగన్వాడీ కేంద్రాలను కేవీకే దత్తత తీసుకుని పోషణ వనాలుగా అభివృద్ధి చేస్తుందన్నారు. శాస్త్రవేత్తలు వెంకన్న, భాస్కర్రావు ఉన్నారు. -
స్వేచ్ఛను హరించే కుట్ర
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛను హరించే కుట్ర చేస్తున్నది. ప్రజల పక్షాన వార్తలు ప్రచురి స్తు న్న సాక్షి దినపత్రిక ఎడిటర్, జర్నలిస్టులపై ఏపీ కూటమి ప్రభుత్వం కేసులు నమోదు చేయడం సిగ్గుచేటు. దీనిని మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. పత్రికా స్వేచ్ఛకు గోడ్డలి పెట్టుగా భావిస్తున్నాం. ప్రభుత్వం తీరుమార్చుకోవాల్సిందే. – కల్లేపల్లి అశోక్, ఎస్ఎఫ్ఐ నేత, పెద్దపల్లి కక్ష సాధింపు సరికాదు ప్రజాస్వామ్యంలో ఫోర్త్ ఎస్టే ట్ కీలకం. పత్రిక ప్రతిపక్ష పాత్ర పోషిస్తే హర్షించాలి కానీ, అక్రమ కేసులు, వేధింపులు ఏ ప్రభుత్వానికీ మంచివికాదు. కేసులతో భయపెట్టి అడ్డులేకుండా చూసుకోవాలని చూస్తున్నట్లు కనబడుతుంది. భావప్రకటనా స్వేచ్ఛను హరించే విధానాలకు స్పస్తి చెప్పాలి. పాత్రికేయులు, పత్రికకు అండగా ఉంటాం. – తాండ్ర సదానందం, సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి, సీపీఐపరత్రిక గొంతు నొక్కితే పతనం తప్పదు రాజకీయ కక్షతో సాక్షి దినపత్రిక గొంతు నొక్కాలని చూస్తే పతనం తప్పదు. ప్రభుత్వ తీరును ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ప్రజాస్వామ్యంలో పత్రికలే ప్రజల గొంతుకగా పనిచేస్తాయి. దాడులను అందరూ ఖండించాల్సిందే. – రాజోజుల శివకుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు బీఆర్ఎస్వీ -
పత్రికా స్వేచ్ఛను హరిస్తారా?
పెద్దపల్లి: పత్రికలు స్వేచ్ఛగా పనిచేస్తేనే ప్రజాస్వామ్యానికి మనుగడ ఉంటుందని, స్వేచ్ఛకు సంకెళ్లు వేస్తే ప్రజాస్వామ్యానికి చేటు చేసినట్లేనని పెద్దపల్లి ప్రెస్క్లబ్ అధ్యక్షుడు గుడ్ల శ్రీనివాస్ అన్నారు. ‘సాక్షి’ ఎడిటర్ ధనంజయరెడ్డి, జర్నలిస్టులపై ఆంధ్రప్రదేశ్ పోలీసుల వేధింపులు, అక్రమ కేసుల నమోదుకు నిరసనగా జిల్లా కేంద్రంలోని తెలంగాణ అమరవీరుల స్తూపం నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు శుక్రవారం ర్యాలీ నిర్వహించారు. బస్టాండ్ సమీపంలో రాజీవ్ రహదారిపై ప్రజాసంఘాలతో కలిసి నిరసన తెలిపారు. శ్రీనివాస్ మాట్లాడుతూ, విమర్శనాత్మక, స్వతంత్ర, పరిశోధనాత్మక కథనాలు ప్రజాస్వామిక రాజ్యానికి జీవనాడిలాంటివని నోబెల్ శాంతి బహుమతి గ్రహీత నెల్సన్ మండేలా చెప్పారని గుర్తుచేశారు. ప్రజాస్వామ్యానికి మూలస్తంభాల్లో ఒకటైన ఫోర్త్ ఎస్టేట్ మీడియా ప్రతిపక్ష పాత్ర పోషించడం సర్వసాధారణమని ఆయన అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతున్నారనే కక్షతోనే ‘సాక్షి’పై కత్తిగట్టారని విమర్శించారు. సమాజంలోని వివిధ అంశాలపై పత్రికలు కథనాలు ప్రచురిస్తాయని, అభ్యంతరాలు ఉంటే వివరణ ఇవ్వాలే తప్ప కేసులు బనాయించి బెదిరించడం పత్రికా స్వేచ్ఛను హరించడమేనన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న ధోరణి హిట్లర్, ముస్సోలిని లాంటి నియంత పోకడలను తలపిస్తోందని ఆయన ధ్వజమెత్తారు. ఏపీ ప్ర భుత్వ వైఖరిని ప్రజాస్వామ్యవాదులు ఖండించా లని ఆయన కోరారు. ఇది ఒక్క ‘సాక్షి’ సమస్య కా దని, పాత్రికేయులు, ప్రజాస్వామికవాదులు మే ల్కొనకోకపోతే అందరికీ.. ముఖ్యంగా ప్రజాస్వామ్యానికి పెనుసవాల్గా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా పత్రికలు పనిచేస్తున్నాయని బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ఉప్పు రాజ్కుమార్ తెలిపారు. వామపక్ష నాయకులు కల్లేపల్లి అశోక్, సీపల్లి రవీందర్, మానస్ కుమార్ మాట్లాడారు. మంథని డివిజన్ ప్రెస్క్లబ్ అధ్యక్షుడు మోత్కూరి శ్రీనివాస్, జర్నలిస్ట్లు కేసీఆర్, అడ్డగుంట రాజేందర్, కీర్తి రమేశ్, మర్రి సతీశ్రెడ్డి, లెశెట్టి రాజు, ముంజ శ్రీనివాస్, గొర్రె తిరుపతి, అమర్, శ్రీనివాస్, బాలయ్య, వినయ్, కుమార్, గాదె బాలయ్య, తాళ్ల రమేశ్, గుర్రం వంశీ, శ్రీనివాస్, ప్రవీణ్రెడ్డి, ఆరెల్లి మల్లేశ్, ఎర్రోజు వేణుగోపాల్, బెజ్జంకి నరేశ్, కల్వ రమేశ్, ముద్దసా ని సమ్మయ్య, ఆరుకుటి మల్లేశ్యాదవ్, కొయ్యాడ తిరుపతి, మొగిలి, కత్తెర్ల చందర్, మేకల సంతోష్, వెంకటేశ్, మరుపాక అంజయ్య, సంకే రాజు, తోట సతీశ్, చందర్, ప్రసాద్, దొమ్మటి రాజేశ్, నల్లాపు తిరుపతి, తిరుమల సురేశ్, నాగపూర్ తిరుపతి, హరిప్రసాద్, మామిడాల కుమార్, జంగ సంపత్యాదవ్, బీఆర్ఎస్ నేతలు పెంచాల శ్రీధర్, బొడ్డుపల్లి రమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
బీసీ డిక్లరేషన్ సంగతేమిటి?
పెద్దపల్లిరూరల్: అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కామారెడ్డిలో ప్రకటించిన బీసీ డిక్లరేషన్ ప్రకారం 42శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఆ పార్టీ పట్టణ, మండల అధ్యక్షులు రాకేశ్, రమేశ్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని కమాన్ చౌరస్తావద్ద రాజీవ్ రహదారిపై శుక్రవారం రాస్తారోకో చేశారు. నాయకులు మాట్లాడుతూ, బీసీల ఓట్లతో అధికారంలోకి వచ్చినా రిజర్వేషన్ల అమలులో ఇంకా మభ్యపెట్టడం సరికాదన్నారు. కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్, సంపత్, పర్వతాలు, తంగెడ రాజేశ్వర్రావు, రాజగోపాల్, సంపత్రావు, సంతోష్, ఈర్ల శంకర్, ఉమేశ్, కృష్ణ, కిషన్, రమేశ్, కృష్ణ, సతీశ్, శివయ్య, పూరెల్ల రాజేశం, శ్రీధర్, వీరేశ్, రాజేంద్రప్రసాద్, కృష్ణమోహన్, అంజి, రాజు, కుమార్, మధుకర్ తదితరులు పాల్గొన్నారు. కాగా, బీసీల బంద్కు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర మాజీ ప్రధానకార్యదర్శి దుగ్యా ల ప్రదీప్కుమార్ పేర్కొన్నారు. -
రూ.7.20 కోట్లతో ప్రతిపాదనలు
సింగరేణి జవహర్లాల్నెహ్రూ స్టేడియాన్ని ఆధునికీకరిస్తాం. ఎమ్మెల్యే రాజ్ఠాకూర్ ప్రత్యేక చొరవతో రూ.7.20కోట్లతో పనులు చేపపడతాం. అనుమతులను కార్పొరేట్ కార్యాలయం పరిశీలిస్తుంది. గ్రీన్సిగ్నల్ రాగానే పనులు ప్రారంభిస్తాం. అలాగే గోదావరి తీరంలో సువిశాలమైన స్థలంలో ప్రత్యేక గ్రౌండ్ నిర్మించే పనులు ఇప్పటికే ప్రారంభించాం. – లలిత్కుమార్, జీఎం, ఆర్జీ–1 క్రీడాకారులకు అనువుగా.. క్రీడాకారులకు అనుకూలంగా జవహర్లాల్ నెహ్రూస్టేడియాన్ని ఆధునికీకరిస్తాం. ఇందులో భాగంగానే స్టేజీ తొలగించాం. భవిష్యత్లో బహిరంగసభలు, ఎగ్జిబిషన్లు అన్నీ గోదావరి తీరంలో నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నాం. సింగరేణి సహకారంతో ఈప్రాంతవాసులకు ఉపయోగపడేలా తీర్చిదిద్దుతాం. – ఎంఎస్ రాజ్ఠాకూర్, ఎమ్మెల్యే, రామగుండం -
ఈడీ చేతికి మెటా!?
సాక్షిప్రతినిధి,కరీంనగర్ ●: మెటా క్రిప్టో కరెన్సీ పేరుతో కరీంనగర్లో వెలుగుచూసిన కుంభకోణం మలుపు తిరగనుంది. త్వరలోనే కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగప్రవేశం అనివార్యంగా కనిపిస్తోంది. ఈ కేసులో డబ్బులను అనతికాలంలోనే రెట్టింపు చేస్తామని బాధితుల నుంచి వసూలు చేసి, దేశం దాటడం, అందుకు సంబంధించిన ప్రాథమిక ఆధారాలను కరీంనగర్ సీపీ గౌస్ ఆలం నేతృత్వంలో పోలీసులు గుర్తించారు. మరింత లోతుగా దర్యాప్తు జరిపి త్వరలోనే డీజీపీకి నివేదిక పంపనున్నారు. అనంతరం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి సమాచారం ఇవ్వనున్నారని సమాచారం. ఈ కేసులో పోలీసులు అరెస్టు చేసిన వారి సంఖ్య ఆరుకు చేరుకుంది. కింగ్పిన్ లోకేశ్వర్రావు అరెస్టుతో కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసుపై సాక్షి కథనాలను తొలుత ఖండించిన పోలీసులు తాజాగా నిర్వహించిన ప్రెస్మీట్తో వాటిని అంగీకరించినట్లయింది. దుబాయ్ హవాలాపై దృష్టి ఈ కేసులోని నిందితులు మలేషియా, సింగపూర్, థాయ్లాండ్, దుబాయ్ తదితర దేశాలకు పెట్టుబడిదారులను తిప్పారు. దుబాయ్లో బినామీలను నియమించుకున్నారు. ఇక్కడ వసూలు చేసిన మొత్తం డబ్బును యూఎస్డీటీ, హవాలా మార్గాల ద్వారా దుబాయ్కి పంపారు. ఆ డబ్బుతో అక్కడ బంగారం కొన్నారు. అందులో 30 తులాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 450 మంది బాధితుల నుంచి రూ.30 కోట్ల వరకు వసూలు చేశారని పైకి చెబుతున్నా, దాని విలువ దాదాపుగా వీరు రూ.100 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. ఈ కేసులో మనీలాండరింగ్ జరిగినట్లు ప్రాథమిక ఆధారాలు సేకరించారు. నిందితులు దుబాయ్ తదితర దేశాల్లో హవాలా ద్వారా పంపిన డబ్బులతో బంగారం, ఆస్తులు కూడబెట్టారని సమాచారం. దుబాయ్లో ఈ ముఠా రూ.40 కోట్ల విలువైన ఓ పబ్ను నడుపుతున్నారని పోలీసులకు సమాచారం అందింది. అక్కడ పదేళ్ల గోల్డెన్ వీసా సంపాదించి అరెస్టును జాప్యం చేసేలా ఎత్తుగడలు వేసినట్లు గుర్తించారు. నిందితులు లీగల్ టీం ఏర్పాటు చేసుకుని ఏకంగా కరీంనగర్ సీపీకి నోటీసులు పంపడం, ఫిర్యాదుదారులపై ప్రైవేటు కేసులు ఫైల్ చేయడాన్ని పోలీసుశాఖ తీవ్రంగా పరిగణించింది. ఈ కేసులో ఇప్పటి వరకు ఆరుగురిని అరెస్టు చేసిన పోలీసులు త్వరలోనే మరిన్ని అరెస్టులు జరపనున్నారు. సరైన సమయం చూసి అరెస్టు చేసే ఆలోచనలో ఉన్నారు. గతంలో నిందితులు ముందస్తు బెయిల్ పొందిన నేపథ్యంలో ఈ మేరకు ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.కరీంనగర్క్రైం : మెటాఫండ్ ప్రధాన నిందితుడు వరాల లోకేశ్వర్రావు(32)ను కరీంనగర్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. సీపీ గౌస్ ఆలం కమిషనరేట్లో కేసు వివరాలు వెల్లడించారు. హైదరాబాద్లోని పీవీఎన్కాలనీకి చెందిన వరాల లోకేశ్ సాఫ్ట్వేర్ అప్లికేషన్ల తయారీలో నిపుణుడు. గతంలో ఆన్లైన్ బిట్కాయిన్లో, డిజిటల్ కరెన్సీలో పెట్టుబడులు పెట్టాడు. అతని తండ్రి స్నేహితుడైన కరీంనగర్కు చెందిన తులసీ ప్రకాశ్ తమ ప్రాంతంలో యూబిట్ కాయిన్లో చాలా మంది పెట్టుబడులు పెడుతున్నారని ఒకసారి వస్తే కొంతమందిని పరిచయం చేస్తానని చెప్పి 2024లో నగరానికి చెందిన బూర శ్రీధర్, దాసరి రాజు, దాసరి రమేశ్, కట్ల సతీశ్ను పరిచయం చేయించాడు. ఒక నకిలీ కాయిన్‘మెటాఫండ్’ రూపొందించి గతేడాది ఏప్రిల్లో హైదరాబాద్లోని శామీర్పేటలో ఓ రిసార్ట్లో ఆవిష్కరించారు. యాప్ ప్రచారం కోసం కరీంనగర్, జగిత్యాల, హైదరాబాద్ ప్రాంతాల్లో ఏజెంట్లను నియమించారు. అధిక లాభాలు వస్తాయని నమ్మబలికి కరీంనగర్కు చెందిన భాస్కర్ నాయక్ వద్ద రూ.15లక్షలు, మరో 450 మంది ద్వారా రూ.30కోట్ల వరకు పెట్టుబడులు పెట్టించారు. డబ్బులు విత్డ్రా చేయలేని విధంగా యాప్ను డిజైన్ చేశారు. కొద్దిరోజులకు బాధితుల ఫిర్యాదుతో కరీంనగర్ రూరల్, టూటౌన్ పోలీస్స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. నగరానికి చెందిన తులసీ ప్రకాశ్, బూర శ్రీధర్, దాసరి రాజు, దాసరి రమేశ్, కట్ల సతీశ్ను గతంలోనే అరెస్టు చేశారు. లోకేశ్వర్రావును అలుగునూరులో అదుపులోకి తీసుకుని, గురువారం రిమాండ్ చేశారు. నిందితుల నుంచి ఆస్తి ప్రతాలు, 30తులాల బంగారం, మొబైల్ఫోన్లు, ట్యాబ్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును దర్యాప్తు చేసిన రూరల్ ఏసీపీ విజయ్కుమార్, సీసీఎస్ సీఐ ప్రకాశ్ను సీపీ అభినందించారు. -
డాక్టర్లు మంచిగా చూస్తున్నారా..
పెద్దపల్లిరూరల్: అమ్మా.. ఆసుపత్రిలో సేవలు ఎలా అందుతున్నయ్.. డాక్టర్లు, సిబ్బంది బాగా చూస్తున్నారా.. సౌకర్యాలు ఎలా ఉన్నా యి.. అంటూ వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్కుమార్ జిల్లా ప్రభుత్వాసుపత్రిలో రోగులను అడిగి తెలుసుకున్నారు. జిల్లా ప్రభుత్వాసుపత్రిని గురువారం ఆకస్మికంగా సందర్శించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీధర్, ఆర్ఎంవో విజయ్కుమార్ తదితరుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. ఆసుపత్రిలో గత నెలలో రికార్డు స్థాయి ప్రసూతిసేవలు అందించడం అభినందనీయమన్నారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు సరిపడా మందులు అందుబాటులో ఉంచాలన్నారు. హాస్పిటల్ ఆవరణలో పారిశుధ్యం మెరుగ్గా ఉండేలా పర్యవేక్షించాలని సూచించారు. 21 నుంచి అమరవీరుల వారోత్సవాలుగోదావరిఖని(రామగుండం): రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లలో ఈనెల 21 నుంచి పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు సీపీ అంబర్కిషోర్ఝా తెలిపారు. పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా 21 నుంచి 31వరకు ఓపెన్హౌస్ నిర్వహించి పోలీసు విధులు, వినియోగించే ఆయుధాలు, సాంకేతిక వినియోగం, వ్యాసరచన పోటీలు నిర్వహించడం, రక్తదాన శిబిర కార్యక్రమాలు, సైకిల్ ర్యాలీ, షార్ట్ ఫిలిమ్స్, ఫొటోగ్రఫీ పోటీలు ఉంటాయన్నారు. పోలీస్ రిలేటెడ్ అంశం మీద ఫొటోగ్రఫీ, షార్ట్ ఫిలిం తీయడానికి జిల్లాలో ఆసక్తి గల యువత, ఫొటోగ్రాఫర్లు ముందుకు రావాలన్నారు. షార్ట్ ఫిలిం తీసి పంపిస్తే వాటిని రాష్ట్రస్థాయి పోటీలకు పంపిస్తామని పేర్కొన్నారు. అంకితభావంతో పనిచేయాలికోల్సిటీ(రామగుండం): వార్డు ఆఫీసర్లు అంకితభావంతో పని చేయాలని రామగుండం నగరపాలక కమిషనర్ జె.అరుణశ్రీ అన్నారు. గురువారం కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఆస్తి పన్ను, ట్రేడ్ లైసెన్స్ ఫీజులు లక్ష్యం ప్రకారం వసూలు చేయాలన్నారు. భారీ బకాయిలు ఉన్నవారికి రెవెన్యూ రికవరీ చట్టం కింద నోటీసులు జారీ చేయడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిషేధిత ప్లాస్టిక్ వినియోగిస్తున్నట్లు గుర్తిస్తే, మెటీరియల్ స్వాధీనం చేసుకొని జరిమానా విధించాలన్నారు. అదనపు కమిషనర్ మారుతిప్రసాద్, అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, ఆర్వో ఆంజనేయులు, సూపరింటెండెంట్ పబ్బాల శ్రీనివాస్, ఆర్ఐలు శంకర్రావు, ఖాజా పాల్గొన్నారు. వైద్యులు అందుబాటులో ఉండాలిముత్తారం(మంథని): వైద్యులు అందుబాటులో ఉండి సేవలందించాలని డీఎంహెచ్వో శ్రీవాణి సూచించారు. గురువారం ముత్తారం పీహెచ్సీని సందర్శించారు. రోగులకు అన్నీ వైద్య సేవలు అందేలా చూడాలన్నారు. నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదన్నారు. రోజు వారి ఓపీని పరిశీలించారు. వైద్యుడు అమరేందర్రావు, సిబ్బంది ఉన్నారు. అదనపు బాధ్యతలుపెద్దపల్లిరూరల్: జిల్లా పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నియమితులైన డొంకెన రవికి ప్రభుత్వం అదనపు బాధ్యతలను అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఫాస్ట్ట్రాక్ స్పెషల్ కోర్టు ఫర్ ట్రయల్ అండ్ డిస్పోజల్ ఆప్ రేప్ అండ్ పోక్సో యాక్టు కేసులను పరిష్కరించే బాధ్యతలు అప్పగించిందని రవి పేర్కొన్నారు. -
బెనిఫిట్స్ ఇస్తలేరు..
సమస్యలు వింటలేరు.. ● ఇబ్బందిపడుతున్న ఉమ్మడి జిల్లా విశ్రాంత ఉద్యోగులు ● పీఆర్సీ ఇవ్వడంలో తాత్సారంపై నిరసన ‘తంగళ్లపల్లి మండలానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు గతేడాది మధ్యలో రిటైర్డ్ అయ్యాడు. ఉద్యోగ కాలంలో పోగేసిన, ప్రభుత్వం ఇచ్చే బెనిఫిట్స్ రూ. 40 లక్షల నుంచి రూ.50లక్షలు రావాల్సి ఉంది. ఏడాది దాటినా ఆ డబ్బులు అందలేదు. ఉద్యోగంలో ఉండగానే కూతురు పెళ్లి నిశ్చయించుకున్నారు. రిటైర్డ్ బెనిఫిట్స్తో ఘనంగా జరుపాలనుకున్న ఆయన ఆశలు తీరలేదు. చేతిలో డబ్బుల్లేక పెళ్లి ఆగిపోయి ఆ కుటుంబమంతా తీవ్ర మానసిన ఆందోళనకు గురయ్యారు’. ‘సిరిసిల్లకు చెందిన ఓ ఏఆర్ కానిస్టేబుల్ గతేడాది రిటైర్డ్ అయ్యాడు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ రూ. 40లక్షలు ప్రభుత్వం నుంచి రావాల్సి ఉండగా సమయానికి అందివ్వలేదు. అనుకోకుండా పక్షవాతానికి గురయ్యాడు. చేతిలో డబ్బు లేక కుటంబ సభ్యులు రూ.4లక్షలు అప్పు చేసి అత్యవసర చికిత్స చేయించగా, ఆ కుటుంబం దీనావస్థలో కాలం వెల్లదీస్తోంది. ప్రభుత్వ పరంగా బెనిఫిట్స్ సకాలంలో అందినా ఈహెచ్ఎస్ ద్వారా ఆయనకు చికిత్స అంది ఆ కుటుంబ పరిస్థితి వేరేలా ఉండేది’. సిరిసిల్లటౌన్: వారంతా ఒకప్పటి ప్రభుత్వ ఉద్యోగులే. మూడున్నర దశాబ్దాల కాలం పనిచేస్తూ.. గౌరవప్రదమైన జీవితాన్ని గడిపిన వారు. వయస్సు రావడంతో రిటైర్డ్ అయి విశ్రాంత ఉద్యోగులుగా ఉంటున్నారు. ప్రభుత్వ పరంగా రావాల్సిన బెనిఫిట్స్ ఉద్యోగ విరమణ సమయంలో ఇవ్వడం లేదు. జీవితకాలం కష్టాన్ని ప్రభుత్వం వద్ద వివిధ రూపాల్లో పొదుపు చేసుకుంటే వాటన్నింటికీ గ్రాట్యూటి కలిపి నగదును ప్రభుత్వం అందించాలి. ఇలా ఒకప్పటి విశ్రాంత ఉద్యోగులు పొందిన బెనిఫిట్స్ మాదిరిగా ప్రస్తుతం రిటైర్డ్ ఉద్యోగులు పొందడం లేదు. వృద్ధాప్యంలో ప్రభుత్వం నుంచి రావాల్సిన బెనిఫిట్స్ అందక చెప్పుకోలేని పరిస్థితుల్లో జీవితాలు వెల్లదీస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 25,000 మంది.. ఉమ్మడి జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేసి రిటైర్డ్ అయిన వారు, ఫ్యామిలీ పెన్షనర్లు మొత్తం సుమారు 25,000 మంది ఉన్నారు. ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ డబ్బుపై ఆధారపడి జీవిస్తున్నారు. ప్రణాళిక బద్ధంగా వినియోగించుకునే కొంతమంది తమ జీతంపై అత్యవసర పరిస్థితుల్లో బ్యాంకులు, ఇతర సంస్థల్లో రుణాలు పొంది ఉన్నారు. ప్రతినెలా మొదటి వారంలో కిస్తులు చెల్లించాల్సి ఉంటుంది. ఒక్కో నెలలో ఏదైనా కారణాలతో జీతాలు ఆలస్యంగా వస్తే రుణదాతల నుంచి ఇబ్బందులు పడుతున్నారు. ఈహెచ్ఎస్ నిధుల లేమీతో ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రుల్లో వీరికి చికిత్స అందించడం లేదు. అత్యవసర పరిస్థితుల్లో నగదు పెట్టి చికిత్స చేయించుకున్న వారికి రీయింబర్స్మెంట్ పొందే అవకాశం ఉండగా, నిధుల్లేక ఏళ్ల తరబడిగా నిరీక్షిస్తున్న వారున్నారు. విశ్రాంత ఉద్యోగుల డిమాండ్లు జిల్లాల వారీగా పెన్షనర్లు (సుమారు)కరీంనగర్ 14,000 సిరిసిల్ల 4,200 జగిత్యాల 4,000 పెద్దపల్లి 2,800 -
ఈహెచ్ఎస్ అమలు చేయాలి
విశ్రాంత ఉద్యోగులకు ఎంప్లాయి హెల్త్ స్కీం(ఈహెచ్ఎస్) పూర్తిస్థాయిలో అందించాలి. పెండింగ్లో ఉన్న డీఏల డబ్బులు ఖాతాల్లో జమచేయాలి. కొత్త పీఆర్సీని ప్రకటించాలి. మా హక్కుల సాధనకు ప్రణాళిక బద్ధంగా ముందుకెళ్తాం. – బలరాం, విశ్రాంత ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు బెనిఫిట్స్ వెంటనే ఇవ్వాలి ఉద్యోగులకు రావాల్సిన జీవితకాలం కష్టం ఫలితాన్ని ప్రభుత్వం ఇవ్వకపోవడం సరికాదు. బెనిఫిట్స్ వారి హక్కు. మా హక్కుల సాధనకు రేపటి నుంచి ప్రణాళిక బద్ధంగా పోరాడుతాం. అవసరమైతే సెక్రటేరియట్కు తరలుతాం. – మల్లారపు పురుషోత్తం, ఆర్ఈడబ్ల్యూఏ జిల్లా అధ్యక్షుడు -
ఎన్నాళ్లీ అణచివేత
జర్నలిస్టుల స్వేచ్ఛపై ఆంధ్రప్రదేశ్లోని టీడీపీ కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. పత్రికా స్వేచ్ఛను హరిస్తూ, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంది. ప్రజా సమస్యలపై గళమెత్తిన ‘సాక్షి’ ఎడిటర్ ధనంజయరెడ్డితో పాటుగా విలేకరులపై కూటమి సర్కారు అక్రమ కేసులు బనాయిస్తూనే ఉంది. సాక్షి కార్యాలయాల్లో పోలీసులు హల్చల్ చేయడంపై రాజకీయ పార్టీలు, సామాన్య ప్రజలు ధ్వజమెత్తుతున్నారు.కక్షపూరిత చర్య ప్రజాస్వామ్య పద్ధతిలో పోలీసులు వ్యవహరించాలి. పత్రికా స్వేచ్ఛను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. ఇది ముమ్మాటికి కక్షపూరిత చర్యే. ప్రతీ అంశంపై ప్రజలను చైతన్యవంతం చేయడమే మీడియా ఉద్దేశం. ఏపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతున్నారనే అక్కసుతో కేసులు నమోదు చేయడం సరికాదు. – మిర్యాల రాజిరెడ్డి, టీబీజీకేఎస్ అధ్యక్షుడు కేంద్రం స్పందించాలి మూడు రోజులుగా ఏపీ ప్రభుత్వం సాక్షి ఎడిటర్, పాత్రికేయులపై కేసులు నమోదు చేసి బెదిరింపులకు దిగడం సరికాదు. సోదాలు నిర్వహించడం, వార్త సోర్స్ను అడగడం రాజ్యాంగ విరుద్ధం. ఈవిషయంలో కేంద్ర ప్రభుత్వం స్పందించాలి. పత్రికాస్వేచ్ఛను కాపాడాలి. అన్యాయాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు నమోదు చేయడం సిగ్గు చేటు. – యాదగిరి సత్తయ్య, బీఎంఎస్ అధ్యక్షుడు పత్రికలపై కక్షసాధింపు ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా నిలిచే పత్రికలపై కక్షసాధింపు సరికాదు. వైఫల్యాలను ఎత్తిచూపే పత్రికలపై రాజకీయ కక్షలు తగవు. ప్రసార మాధ్యమాల గొంతు వినిపించే హక్కును కాలరాయవద్దు. జర్నలిస్టులపై అక్రమ కేసులు పెట్టడం అప్రజాస్వామికం. – గంగుల కమలాకర్, కరీంనగర్ ఎమ్మెల్యేపత్రికా స్వేచ్ఛను హరించడమే పత్రికలు, ప్రసారమాద్యమాల్లో ఏవైనా వార్తలు ప్రచురించినప్పుడు, వారి మనోభావాలు దెబ్బతిన్నాయని బావిస్తే న్యాయపోరాటం చేయాలి. ఇలా బెదిరింపు ధోరణిలో పత్రికా స్వేచ్ఛను హరించివేయడం సరికాదు. – పంజాల శ్రీనివాస్, సీపీఐ జిల్లా కార్యదర్శి -
పశువులకు గాలికుంటు నివారణ టీకాలు
పెద్దపల్లి: జిల్లాలోని పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయడం ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని వచ్చే నెల 14 వరకు నిర్వహిస్తారు. టీకా వేసిన పశువు చెవికి క్యూఆర్ కోడ్ పోగులు వేసి భారత్ పశుదాన్ యాప్లో వివరాలు నమోదు చేస్తారు. గురువారం 5,127 పశువులకు టీకాలు వేసినట్లు జిల్లా పశువైద్యాధికారి విజయ్భాస్కర్ తెలిపారు. జిల్లాలోని పెద్దపల్లి, మంథని, రామగుండం నియోజకవర్గాల పరిధిలో మొత్తం మేకలు, గొర్లు, గేదెలు, ఆవులు, ఎద్దులు 5,35,557 ఉన్నట్లు పేర్కొన్నారు. గాలికుంటు సోకిన పశువుల నోటి నుంచి చొంగకారడం, కాలి డెక్కలో పగుళ్లు ఏర్పడి నడవకపోవడం, పాల ఉత్పత్తి తగ్గడం తదితర లక్షణాలు కల్పిస్తాయి. దూడలకు రెండునెలల వయసులోనే మొదటి టీకా వేయాలి. నెల తర్వాత బూస్టర్ డోస్ ఇవ్వాలి. తర్వాత ఏటా ఒకసారి టీకా తప్పనిసరిగా వేయిస్తే వ్యాధి నివారించవచ్చు. టీకా వేయించాలి పాడి రైతులు తప్పనిసరిగా పశువులకు గాలికుంటు వ్యాధి నివారణకు టీకాలు వేయించాలి. పశువులకు జబ్బువచ్చిన వెంటనే గ్రహించాల్సిన అవసరం రైతులకు ఉంది. టీకా వేయిస్తే జబ్బు రాకుండా ఉంటుంది. పశుసంపద పెరుగుతుంది. – విజయభాస్కర్, జిల్లా పశువైద్యాధికారి -
మెరుగైన సౌకర్యాలు కల్పించాలి
● కలెక్టర్ కోయ శ్రీహర్ష ముత్తారం(మంథని): విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష పేర్కొన్నారు. గురువారం మండలంలోని ధర్యపూర్ మోడల్ స్కూల్, కళాశాలను సందర్శించారు. విద్యార్థులతో ముచ్చటించారు. విద్యాప్రమాణాల గూర్చి తెలుసుకున్నారు. చదువులో వెనుకబడిన విద్యార్థులపై దృష్టి పెట్టాలని ఉపాధ్యాయులకు సూచించారు. పాఠశాలలో పెండింగ్లో ఉన్న డైనింగ్ హాల్, పెయింటింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. అలాగే ముత్తారం రైతు వేదికలో ఉచిత వైద్య శిబిరాన్ని సందర్శించారు. చినజీయర్ స్వామి సంస్థ ప్రతినిధి వికాస్ తరంగణి ఆధ్వర్యంలో మహిళలకు ఉచితంగా క్యాన్సర్ పరీక్షలు చేయడానికి ముందుకు రావడం అభినందనీయమని కలెక్టర్ పేర్కొన్నారు. శిబిరంలో సుమారు 200మందికి పైగా మహిళలకు పరీక్షలు చేశారు. డీఎంహెచ్వో వాణిశ్రీ, చినజీయర్ సంస్థ కోఆర్డినేటర్ మాధవి, అశోక్రావు, వైద్యుడు అమరేందర్రావు, ఽమోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ సంతోష్కుమార్ తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి పనుల్లో వేగం పెంచండిమంథని: అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. గురువారం మంథనిలో పలు అభివృద్ధి పనుల పురోగతిని పరిశీలించారు. పాత పాల కేంద్రంలో ఉష ఇంటర్నేషనల్ లిమిటెడ్, రాష్ట్ర ప్రభుత్వ సౌజన్యంతో ఏర్పాటు చేసిన మహిళ కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. మహిళలకు ఉచితంగా కుట్టుమిషన్ శిక్షణ అందించడం జరుగుతుందన్నారు. వయోవృద్ధులకు అనుకూలంగా ఉండేలా డే కేర్ సెంటర్ ఏర్పాటు పనులను వారం రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. మంచిర్యాల– వరంగల్ గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణానికి సంబంధించి జిల్లాలో భూ బదలాయింపు చివరి దశకు చేరుకుందని కలెక్టర్ వివరించారు. అక్కడక్కడ మిస్సింగ్ పరిహారం కోసం భూ సేకరణ బాధితులు పనులను అడ్డుకుంటున్నారని తెలుసుకున్న కలెక్టర్ పెండింగ్ మిస్సింగ్ స్ట్రక్చర్ పరిహారం సమస్యను ఈ నెల 24 లోపు పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. నెలాఖరు వరకు మంథని, ముత్తారం, రామగిరి మండలాల పరిధిలో జాతీయ రహదారి నిర్మాణానికి సంబంధించిన గ్రావెల్ పని పూర్తి చేయాలన్నారు. ఆర్డీవో సురేశ్, మున్సిపల్ కమిషనర్ మనోహర్ తదితరులు ఉన్నారు.


