Peddapalli
-
కుక్కల దాడిలో గొర్రెలు మృతి
కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం మల్యాల గ్రామంలో బుధవారం పిచ్చికుక్కల దాడిలో బొట్కు మహేశ యాదవ్కు చెందిన 20 గొర్రెలు మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. ఈసంఘటనలో సుమారు రూ.లక్ష వరకు నష్టం వాటినట్లు బాధితుడు మహేశ్ బావురుమన్నాడు. గ్రామంలో పిచ్చికుక్కలు స్వైర విహారం చేస్తున్నాయని గ్రామస్తులు పేర్కొన్నారు. అధికారులు తగిన చర్యలు తీసుకొని కుక్కల బెడద తప్పించాలని వారు విజ్ఞప్తి చేశారు. మడేలేశ్వరస్వామి ఆలయంలో చోరీ● 15 గ్రాముల బంగారం చోరీ జగిత్యాలక్రైం: జగిత్యాలలోని మంచినీళ్ల బావి వద్దగల మడలేశ్వరస్వామి ఆలయంలో మంగళవారం రాత్రి గుర్తుతెలియని దొంగలు చోరీకి పాల్పడ్డారు. పూజ అనంతరం అర్చకులు ఆలయానికి తాళం వేసి వెళ్లారు. గుర్తుతెలియని దొంగలు చొరబడి 15 గ్రాముల బంగారం, హుండీలో కొంత నగదు ఎత్తుకెళ్లారు. ఉదయం అర్చకులు వెళ్లి చూసేసరికి తాళాలు పగులగొట్టి ఉండటంతో పోలీసులకు సమాచారం అందించారు. పట్టణ ఎస్సై మన్మథరావు సంఘటన స్థలానికి చేరుకుని దొంగతనం జరిగిన తీరును పరిశీలించారు. కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఆరోగ్య తెలంగాణ లక్ష్యంమేడిపల్లి: ఆరోగ్య తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. భీమారం మండలకేంద్రంలో రూ.1.43 కోట్లతో 30 పడకల ఆసుపత్రి నిర్మాణానికి బుధవారం భూమిపూజ చేశారు. 97 మందికి ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు, 27మందికి కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. మేడిపల్లి మండలం వల్లంపల్లిలో కాకతీయ కెనాల్పై రూ.2.50కోట్లతో నిర్మించిన బ్రిడ్జిని ప్రారంభించారు. భీమారం మండల ప్రజల చిరకాల కోరిక నెరవేరబోతోందని, ప్రజల కోరిక మేరకు వారు సూచించిన ప్రదేశంలోనే ఆసుపత్రి నిర్మాణం చేపడతామన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సింగిరెడ్డి నరేశ్రెడ్డి, చేపూరి నాగరాజు, బద్దం రాజేందర్ రెడ్డి, నీరటి మల్లేశం తదితరులు పాల్గొన్నారు. -
అడగండి... అడుగేయండి
గంభీరావుపేట(సిరిసిల్ల): ప్రైవేట్ పాఠశాలల్లో పిల్లలను చేర్పించే ముందు తల్లిదండ్రులు ఆచితూచీ అడుగేయాల్సిన అవసరం ఉంది. ఆ స్కూల్ ఎలాంటిది? గతంలో స్కూల్ విద్యార్థులు సాధించిన ఫలితాలు ఎలా ఉన్నాయి? ఫీజుల వివరాలు, తల్లిదండ్రులతో యాజమాన్యం ఎలా వ్యవహరిస్తుంది? అనే వివరాలు గమనించాల్సిన అవసరం ఉంది. విద్యార్థుల భవిష్యత్ను తీర్చిదిద్దేది పాఠశాలే కాబట్టి.. ఆలోచించి అడుగేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంది. జిల్లాలో 120 గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. నేటి నుంచి పాఠశాలలు పునర్ప్రారంభం కానుండడంతో ఇప్పటికే జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. హంగు ఆర్భాటాలతో విద్యార్థులను చేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఉపాధ్యాయులను ఇళ్లకు పంపిస్తూ పిల్లలను తమ బడిలో చేర్పించాలని కోరుతున్నారు. అనుమతులు ఉన్నాయా.. ప్రైవేటు పాఠశాల తమ వివరాలను విద్యాశాఖ కార్యాలయంలో నమోదు చేసుకొని ఉంటుంది. వారికి నిర్ధిష్ట సంఖ్య, నమోదైన సంవత్సరంతో కూడిన పత్రాన్ని ఇస్తారు. దీన్ని పరిశీలించాకే తల్లిదండ్రులు ప్రైవేటు పాఠశాలల్లో చేర్పించాలి. కొన్ని పాఠశాలలు 1–7, 8–10 తరగతుల వరకు నిర్వహిస్తారు. ఈ విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంది. నోటీస్ బోర్డుపై ఇవి ఉన్నాయా.. మీరు చేర్పించబోయే ప్రైవేటు పాఠశాలలోని బోధన సిబ్బంది అర్హతలు ఎలా ఉన్నాయో గమనించాలి. అర్హత గల ఉపాధ్యాయులు ఉన్నారా? అనేది ఆరా తీయాలి. బీఈడీ, డీఈడీ వంటి విద్యార్హతలు గల వారితో విద్యాబోధన చేస్తున్నారో.. లేదో తెలుసుకోవాలి. ఉపాధ్యాయుల వివరాలు, అర్హతలను ప్రభుత్వ పాఠశాలలో మాదిరిగా ప్రైవేటు పాఠశాల నోటీస్ బోర్డుపై ప్రదర్శించారో.. లేదో చూడాలి. ఫీజుల వివరాలు ఎలా ఉన్నాయి? ఫీజుల్లో పారదర్శకత ఉందా.. అడిగి తెలుసుకోవాలి. వసతులపై దృష్టి పెట్టండి మెరుగైన ఫలితాలతోపాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారో.. లేదో తెలుసుకోవాలి. ప్రాథమిక స్థాయి నుంచి పఠనాసక్తి కలిగించే ఎలాంటి అంశాలు అమలు చేస్తున్నారో అడగాలి. స్కూల్లో లైబ్రరీ, ప్లేగ్రౌండ్, టాయిలెట్స్.. తాగునీటి వసతుల గురించి తెలుసుకోవాలి. ఇన్నోవేటీవ్ అంశాలపై.. పాఠశాలలో ఇన్నోవేటివ్ అంశాలు నేర్పిస్తున్నారా.. కొత్త విషయాలను విద్యార్థులకు తెలిసేలా తరగతులు నిర్వహిస్తున్నారా.. తెలుసుకోవాలి. గతంలో వైజ్ఞానిక ప్రదర్శనలు.. ఇన్స్పైర్ మానక్, సైన్స్మేళాల్లో భాగస్వామ్యం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని, ప్రతిభ చాటే వారిని ఎలా ప్రోత్సాహం ఎలా ఉందో ఆరా తీయాలి. అలాంటి పాఠశాలలను తల్లిదండ్రులు ఎంపిక చేసుకోవాలి. -
ఆస్పత్రుల్లో అప్రమత్తం
● భద్రతా చర్యలపై నిరంతర నిఘా ● సీసీ కెమెరాల ఏర్పాటు, పర్యవేక్షణ తప్పనిసరి ● అనుమానిత వ్యక్తుల సమాచారం పోలీసులకు అందించండి ● గోదావరిఖని ఏసీపీ రమేశ్ ● జీజీహెచ్, సింగరేణి ఆస్పత్రుల తనిఖీగోదావరిఖని/కోల్సిటీ(రామగుండం): గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి(జీజీహెచ్)తోపాటు సింగరేణి ఏరియా ఆస్పత్రిలో భద్రతా చర్యలపై అప్రమత్తంగా ఉండాలని ఆస్పత్రి అధికారులను ఏసీపీ రమేశ్ కోరారు. రామగుండం పోలీస్ కమీషనర్ ఆదేశాల మేరకు బుధవారం వన్టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డితో కలిసి ఏసీపీ జీజీహెచ్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. సీసీ కెమెరాల పనితీరు పరిశీలించారు. వైద్య సిబ్బందిపై దాడులు, ఆస్పత్రుల నుంచి పిల్లల కిడ్నాప్ తదితర ఘటనలపై ఆస్పత్రి అధికారులతో చర్చించారు. మెడికల్ సూపరింటెండెంట్ దయాల్సింగ్తో భేటీ అయ్యారు. వైద్యం కోసం వచ్చే అనుమానస్పద వ్యక్తుల సమాచారాన్ని పోలీసులకు చేరవేయాలన్నారు. ఆస్పత్రుల్లో అనూహ్య ఘటనలు జరిగితే వైద్యులు, సిబ్బంది, ఆస్పత్రులపై బంధువులు, కుటుంబ సభ్యులు దాడులకు పాల్పడే అవకాశం ఉంటుందని, ముందస్తు భద్రత, రక్షణ కోసం ఆస్పత్రి ముఖద్వారం, ఎగ్జిట్ డోర్, ఆస్పత్రి మెయిన్ రోడ్లు, ఎమర్జెన్సీ, చిల్డ్రన్స్, మెటర్నటీ, క్యాజువాలిటీ వార్డ్ తదితర ముఖ్యమైన ప్రాంతాల్లో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. తరచూ వాటిని పర్యవేక్షించాలని సూచించారు. కార్యక్రమంలో గోదావరిఖని వన్టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి, పోలీస్ సిబ్బంది, డాక్టర్లు, జీజీహెచ్ ఆర్ఎంవో రేణుకతోపాటు పలువురు వైద్యాధికారులు పాల్గొన్నారు. -
ధర్మపురిని రెవెన్యూ డివిజన్గా చేస్తా
● 50 పడకల ఆసుపత్రి, ఐటీఐ, పాలిటెక్నిక్ కళాశాలలు నిర్మిస్తా ● విద్యార్థినుల ఉన్నత విద్యకు సదుపాయాలు ● ధర్మపురి పుణ్యక్షేత్ర అభివృద్ధికి మాస్టర్ప్లాన్ ● ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తా ● ‘సాక్షి’ ఇంటర్వ్యూలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ సాక్షిప్రతినిధి,కరీంనగర్: తనకు రాజకీయ జన్మనిచ్చిన ధర్మపురిని నియోకవర్గాన్ని, ఇటీవల రోడ్డు ప్రమాదంలో పునర్జన్మనిచ్చిన ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి రుణాన్ని తాను ఏనాడూ తీర్చుకోలేనని మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ పేర్కొన్నారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారిగా నియోజకవర్గానికి వచ్చిన ఆయన బుధవారం ‘సాక్షి’ ఇంటర్వ్యూలో మాట్లాడారు. నియోజకవర్గపరంగా మీ ప్రాధాన్యాలేంటి? అడ్లూరి: ధర్మపురి ప్రజలను, లక్ష్మీ నరసింహ స్వామిని జీవితంలో మర్చిపోను. ప్రజలు ఎమ్మెల్యేగా జన్మనిస్తే.. రోడ్డు ప్రమాదంలో స్వామి నన్ను కాపాడి పునర్జన్మనిచ్చారు. ఎన్నికల్లో ఎన్నిసార్లు ఓడినా నా అనుచరులు నా కోసమే పనిచేశారు. వారిరుణం ఎన్నటికీ తీర్చుకోలేనిది. మంత్రిగా నియోజకవర్గంలో సాగునీటికి తొలి ప్రాధాన్యం ఇస్తా. విద్య, వైద్యం, సదుపాయాలకు పెద్దపీట వేస్తా. ఇక్కడి విద్యార్థినులు డిగ్రీ, పీజీ కళాశాలలు లేక జగిత్యాల, కరీంనగర్ వెళ్తున్నారు. ధర్మపురిలో డిగ్రీ, పీజీ కళాశాలలతోపాటు ఐటీఐ, పాలిటెక్నిక్ విద్యాసంస్థలు ఏర్పాటు చేయిస్తా. చారిత్రక ధర్మపురి పుణ్యక్షేత్రానికి చీకటిపడితే రవాణా సౌకర్యం లేదు. ఆలయ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపొందించాలి. 50పడకల ఆసుపత్రి నిర్మిస్తా. ధర్మపురిని రెవెన్యూ డివిజన్గా మారుస్తా. మంత్రిగా భవిష్యత్ ప్రణాళికలు? అడ్లూరి: తొలిసారి ఎమ్మెల్యే, ఆపై విప్.. ఇప్పుడు మంత్రి పదవి. పార్టీలో సామాన్య కార్యకర్తలకు ప్రాధాన్యం ఉంటుందనడానికి నాకు దక్కిన పదవులే నిదర్శనం. మంత్రి అయ్యాక మరింత బాధ్యత పెరిగింది. నాకు ప్రభుత్వం కేటాయించిన ఏ శాఖ కేటాయించినా 100శాతం న్యాయం చేస్తా. ప్రజా ఆకాంక్షల మేరకు పనిచేస్తా. ప్రతీ 30రోజులకు నా శాఖలోని పనులపై సమీక్ష చేపడతా. మీరు మంత్రి కావడంలో కుటుంబ పాత్ర? అడ్లూరి: నా భార్య కాంతకుమారి ప్రభుత్వ లెక్చరర్. నా రాజకీయ జీవితంలో ఆమె పాత్ర చాలా కీలకం. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్థికంగా ఇబ్బందులున్నా.. తన ఉద్యోగాన్ని, కెరీర్ను త్యాగం చేసి నాకు అండగా నిలిచింది. 2018లో ఓడిన సమయంలో నాలో ధైర్యం నింపింది. నా పిల్లలు కూడా వెంట నిలిచారు. వారి సహకారం మాటల్లో వర్ణించలేనిది. -
సాంకేతిక శిక్షణ.. భవిష్యత్తుకు నిచ్చెన
● ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు ● టైలరింగ్, డ్రాయింగ్, క్రాఫ్ట్, ఆర్ట్లలో 42 రోజులపాటు.. ● పూర్తి చేసిన 89 మంది పురుషులు, 680 మంది మహిళలు నప్తగిరికాలనీ(కరీంనగర్): తమ చిన్ననాటి కలలను ఇప్పుడు సాకారం చేసుకుంటున్నాముని కొందరు.. నేర్చుకుంటున్న కళను ఇంకా మెరుగుపర్చుకుందామని మరికొందరు.. స్కూల్లో పిల్ల లకు పెట్టే టాస్క్లో మేము సైతం సాయం చేద్దామని ఇంకొందరు.. ఉపాధి కోసమని.. ఉద్యోగం సాధించాలని.. పది మందికి ఉపాధి కల్పించాలని ఇలా ఎవరికి వారు తమ ఆశయాలు, లక్ష్యం సార్థకం చేసుకునేందుకు సిద్ధమయ్యారు నారీమణులు. పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదని నిరూపిస్తూ కళలకు వయస్సుతో సంబంధం లేదని కరీంనగర్ మంకమ్మతోటలోని ధన్గర్వాడీ ప్రభుత్వ పాఠశాలలో నిర్వహిస్తున్న సాంకేతిక ఉపాధ్యాయ శిక్షణ కోర్సు(టీటీసీసీ)లో ఉత్సాహంగా పాల్గొన్నారు మహిళలు. బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న టెక్నికల్ టీచర్ ట్రైనింగ్ సర్టిఫికెట్ కోర్సులో పెద్ద సంఖ్యలో హాజరై శిక్షణ పొందారు. 42 రోజులపాటు సాగిన కోర్సు బుధవారంతో పూర్తయింది. ఈక్రమంలో శిక్షణ పొందిన మహిళల అనుభవాలు, భవిష్యత్ కార్యాచరణపై సాక్షి ప్రత్యేక కథనం. 42 రోజుల శిక్షణ ధన్గర్వాడీ పాఠశాలలో నిర్వహిస్తున్న టెక్నికల్ టీచర్ ట్రైనింగ్ సర్టిఫికెట్ కోర్సులో కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, కొమురంభీం, మంచిర్యాల, సిద్దిపేట, నిర్మల్ జిల్లాల నుంచి 89 మంది పురుషులు, 680 మంది మహిళలు మొత్తం 769 మంది వివిధ కోర్సుల్లో శిక్షణ పొందారు. మే 1న కోర్సు ప్రారంభించగా.. జూన్ 11తో ముగిసింది. టైలరింగ్, డ్రాయింగ్, ఆర్ట్, క్రాఫ్ట్లలో 42 రోజులపాటు శిక్షణ పొందారు. 469 మంది డ్రాయింగ్లో, 360 మంది టైలరింగ్, క్రాఫ్ట్లలో శిక్షణ తీసుకున్నారు. శిక్షణ కోర్సు డైరెక్టర్ బొట్ల రామస్వామి పర్యవేక్షణలో టీటీసీసీ శిక్షణ కార్యక్రమాలు పకడ్బందీగా పూర్తయ్యాయి. -
గొర్రెలకాపరులకు పరిహారం అందిస్తాం
ధర్మారం(ధర్మపురి): విద్యుత్ షాక్తో మరణించిన గొర్రెలకు పరిహారం అందిస్తామని, బాధితులు ఆందోళన చెందవద్దని బీసీ, ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ భరోసా ఇచ్చారు. చామనపల్లిలో ఇటీవల విద్యుదాఘాతంతో 52 గొర్రెలు మరణించగా మంత్రి లక్ష్మణ్కుమార్ బుధవారం కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి గొర్రెలకాపరులను పరామర్శించారు. అనంతరం స్థానిక మార్కె ట్ యార్డులో ప్రమాదవశాత్తు లారీపై నుంచి కిందపడి మరణించిన హమాలీ మెడవేని రాజేశం భార్య రాజేశ్వరికి రూ.5లక్షల పరిహారం చెక్కు అందజేసి మాట్లాడారు. ఇచ్చిన మాటప్రకారం సింగిల్విండో ద్వారా రూ.3 లక్షలు, కలెక్టర్ ప్రత్యేక నిధి ద్వారా రూ.2లక్షలను బాధిత కుటుంబానికి అందించామ న్నారు. చామనపల్లిలో మృత్యువాతపడ్డ ఒక్కో గొ ర్రెకు రూ.7వేల చొప్పున విద్యుత్ శాఖ ద్వారా పరి హారం మంజూరయ్యేలా చర్యలు తీసుకుంటానని మంత్రి హామీ ఇచ్చారు. ధర్మారం, పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీల చైర్పర్సన్లు రూప్లానాయక్, ఈర్ల స్వరూప, వైస్ చైర్మన్ అరిగే లింగయ్య, మేడారం సింగిల్విండో చైర్మన్ ముత్యాల బలరాంరెడ్డి, శ్రీలక్ష్మీ నర్సింహస్వామి ఆలయ కమిటీ చైర్మన్ సంతోష్, డీసీవో శ్రీమాల, డీఎంవో ప్రమీణ్రెడ్డి, మాజీ ఎంపీపీ కొడారి హన్మయ్య, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కొత్త నర్సింహం, మాజీ వైస్చైర్మన్ కాడే సూర్యనారాయణ, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గాగిరెడ్డి తిరుపతిరెడ్డి, యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు అశోద అజయ్, నాయకులు ఓరం చిరంజీవి, ఎండీ అష్ష్యు, ఎల్లయ్య, ఈదుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రమంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ గొర్రెల కాపరుల కుటుంబాలకు పరామర్శ -
దొంగను పోలీసులకు పట్టించిన రైతులు
జగిత్యాలక్రైం: జగిత్యాల పట్టణ శివారులోని మోతె బైపాస్ రోడ్డులో వ్యవసాయ మోటార్లు, విద్యుత్ వైర్లను ఎత్తుకెళ్తున్న దొంగను రైతులు పట్టుకుని రూరల్ పోలీసులకు అప్పగించారు. జగిత్యాల జిల్లాకేంద్రానికి చెందిన యువకులు ఆదాబ్, సయ్యద్, సాహెబ్ కొద్దికాలంగా మోతె శివారులోని మోటార్లు, విద్యుత్ వైర్లు, స్టార్టర్లు ఎత్తుకెళ్తున్నారు. దీంతో రైతులు నిఘా పెట్టారు. బుధవారం మధ్యాహ్నం సమయంలో ముగ్గురు యువకులు ద్విచక్రవాహనంపై వచ్చి కొత్తగా నిర్మిస్తున్న ఇంటి వద్ద సలాకలు, మోటార్ వైర్లు దొంగలించి తీసుకెళ్తుండగా రైతులు వెంటపడ్డారు. ఇద్దరు దొంగలు పారిపోయారు. ఒక దొంగను పట్టుకున్న రైతులు పోలీసులకు అప్పగించారు. ఏడాదికాలంగా దాదాపు 30 నుంచి 40 విద్యుత్ మోటార్లు, స్టార్టర్లు దొంగలు ఎత్తుకెళ్లారని, గతంలో కూడా దొంగలను పోలీసులకు పట్టిస్తే ఎలాంటి చర్యలూ తీసుకోలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. -
రైస్మిల్లులో అధికారుల విచారణ
● రంగంలోకి దిగిన ఎన్ఫోర్స్మెంట్, టాస్క్ఫోర్స్, సివిల్ సప్లయ్, రెవెన్యూ శాఖలుమంథని: సూరయ్యపల్లి గ్రామంలోని ఓ రైస్ మి ల్లులో బుధవారం ఎన్ఫోర్స్మెంట్, టాస్క్ఫోర్స్, సివిల్ సప్లయ్, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా మళ్లీ విచారణ చేపట్టారు. 2022–23, 2023–24 సంవత్సరాల్లో రైస్ మిల్లుకు పౌర సరఫరాల శాఖ ద్వారా కేటాయించిన ధాన్యం నిల్వలపై గత మార్చి 28న టాస్క్ఫోర్స్, సివిల్ సప్లయ్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. తొలుత తనిఖీలు చేసిన అధికారులు.. గంగాపురిలోని మరోరైస్ మిల్లు గోదాంలో నిల్వ చేసిన ధాన్యం తనిఖీ చేశారు, అయితే రెండు సంవత్సరాలకు సంబంధించి 41,365 క్వింటాళ్ల ధాన్యం నిల్వ ఉండాల్సి ఉండగా కేవలం 9,689 క్వింటాళ్లు మాత్రమే నిల్వ ఉన్నట్లు గుర్తించారు. మిగతా ధాన్యం స్వాహా చేసినట్లు అధికారుల విచారణలో తేలింది. ఈ నివేదికను సదరు అధికారులు కలెక్టర్కు నివేదించారు. ఆ నివేదికను తప్పుపడుతూ సదరు రైస్ మిల్లు యజమాని కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు తిరిగి ఎన్ఫోర్స్మెంట్, టాస్క్ఫోర్స్, సివిల్ సప్లై, రెవెన్యూ శాఖ అధికారుల మళ్లీ ఎంకర్వీ చేశారు. తొలుత ఇక్కడి రైస్ మిల్లులో తనిఖీలు చేసిన అనంతరం గంగాపురిలోని గోదాంలో ధాన్యం నిల్వలను తనిఖీ చేశారు. విచారణ నివేదికలను కోర్టుకు సమర్చిస్తామని అధికారులు తెలిపారు. -
పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు
● ఎమ్మెల్యే విజయరమణారావు ఓదెల(పెద్దపల్లి): పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడం ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మె ల్యే విజయరమణారావు అన్నారు. కనగర్తిలో బు ధవారం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేసి మాట్లాడారు. ప్రతీ మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రాన్ని అనుసంధానిస్తూ డబుల్ రోడ్లు నిర్మిస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మూల ప్రేంసాగర్రెడ్డి, మాజీవై స్ ఎంపీపీ పిట్టల కుమార్, ఎంపీడీవో తిరుపతి, మాజీ ఎంపీటీసీ చొప్పరి రాజయ్య, నాయకులు ఉడిగే సదయ్య, మహేందర్రెడ్డి పాల్గొన్నారు. శ్రీరంగనాథుని సన్నిధిలో పూజలు పెద్దపల్లిరూరల్: బొంపల్లి శ్రీభూగోదా సమేత రంగనాథస్వామి సన్నిధిలో ఎమ్మెల్యే విజయరమణారావు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ బ్ర హ్మోత్సవాల సందర్భంగా వేడుకలు నిర్వహించా రు. కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్ నాయకులు, గ్రామస్తులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. -
తొలిరోజు తీపిగురుతులెన్నో..
● బడి.. ఓ మధుర జ్ఞాపకం ● చదువుతోనే భవిష్యత్ అంటున్న ఉన్నతాధికారులు ● పాఠశాలల పునఃప్రారంభం నేపథ్యంలో ప్రముఖుల బాల్యస్మృతులుసాక్షి, పెద్దపల్లి/గోదావరిఖని: బాల్యం అంటే బడి.. పాఠశాలకు తొలిఅడుగు.. జీవితంలో మరిచిపోలేని మధుర క్షణం.. ఎప్పటికీ గుర్తుండిపోయే తీపిజ్ఞాపకం.. వేసవి సెలవుల్లో అనేక వ్యాపకాల్లో మునిగితేలిన పిల్లలు.. బడిగంట మోగగానే స్కూల్కు వెళ్లడానికి కాస్త బెరుకుగానే ఉంటారు. దీనిని ‘స్కూల్ ఫోబియా’ అంటారు. దీన్నుంచి వారిని బయట పడేయాలనే సంకల్పంతో తమ చిన్ననాటి బడి స్మృతులను ‘సాక్షి’తో పంచుకున్నారు పలువురు ప్రముఖులు. చిన్ననాటి అనుభవాలనూ వారు గుర్తు చేసుకున్నారు. వారి మాట్లల్లోనే..అమ్మతో కలిసి పోయేదిమా అమ్మానాన్న కోయ సులోచన –నాగేశ్వరరావు ప్రభుత్వ ఉపాధ్యాయులు. వేసవి సెలవులు పూర్తయ్యాక అందిరిలాగే అమ్మ పనిచేసే ఖమ్మం జిల్లా బోనకల్ మండలం రావినూతల సర్కారు బడికి తొలిరోజు నుంచే పోయేవాడిని. అక్కడే ఒకటి నుంచి ఐదో తరగతి వరకు చదివా. మొదటిరోజు ఫ్రెండ్స్తో ఆటాపాలతో గడిచిపోయింది. జీవితంలో పైకిరావడానికి బుడిబుడిఅడుగులు అక్కడే పడ్డాయి. ప్రైవేట్ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య దొరుకుతుందని అనుకోవడం పొరపాటు. ప్రభుత్వ పాఠశాలల్లో గతంకంటే మౌలిక వసతులు పెరిగాయి. విద్యతోపాటు సామాజికాంశాలు, ఆటలు, ఇతర అంశాలపై పట్టుసాధించేందుకు అవకాశం ఉంటుంది. ‘బడీడు’ పిల్లలందరూ బడిలో ఉండాలి. ప్రతీఒక్కరు చదువుకోవాలి. కష్టపడి చదువుకుంటేనే ఉన్నత స్థానాలకు చోరుకోవచ్చు. నేను చిన్నప్పటి నుంచి కష్టపడి చదివా. లక్ష్యం సాధించా. -
20న గిరిజన గ్రామాల్లో ప్రత్యేక శిబిరాలు
● కలెక్టర్ కోయ శ్రీహర్ష పెద్దపల్లిరూరల్: జిల్లాలోని గిరిజన గ్రామాల్లో ఈనె ల 20న ప్రత్యేక శిబిరాలు నిర్వహించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. పీఏం జన్మాన్, డీఏజేజీయూఏ పథకాల నిర్వహణపై కలెక్టరేట్లో బుధవారం ఆయన సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడు తూ, గిరిజన ప్రాంతాల్లో సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పీఏం జన్మాన్ (ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ్ మహా అభియాన్), డీఏజేజీయూఏ(ధరతి ఆభా జనజాతి గ్రా మ ఉత్కర్ష అభియాన్) కార్యక్రమాలను చేపట్టింద న్నారు. గిరిజనులు అధికంగా ఉన్న బట్టుపల్లిని ఇందుకు ఎంపిక చేసుకున్నామని, గ్రామస్తులందరికీ త ప్పనిసరిగా ఆధార్, ఆయుష్మాన్, రేషన్, కిసాన్కా ర్డులతోపాటు కులధ్రువీకరణ పత్రాలు జారీచేయాలని, అన్ని సదుపాయాలు కల్పించాలన్నారు. ఇందుకోసం మీసేవ సెంటర్తో సహా మిగతా అన్ని గి రిజన గ్రామాల్లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేయాలని, అర్హులతో దరఖాస్తు చేయించాలని సూచించా రు. దివ్యాంగులకు యూడీఐడీ వచ్చేలా చూడాలన్నారు. జన్ధన్ యోజన బ్యాంకు ఖాతాలు తెరవా లని, పీఎం విశ్వకర్మ, ముద్ర, స్టాండప్ ఇండియా వంటి పథకాల ద్వారా స్వయం ఉపాధి యూనిట్ల స్థాపనకు రుణాలు మంజూరు చేయాలని లీడ్ బ్యాంక్ మేనేజర్కు సూచించారు. పోడు భూముల కు పట్టాలు జారీచేసిన లబ్ధిదారులతో కూడా సమావేశం ఏర్పాటు చేసి వారికి ఇందిరా గిరిసౌర జల వి కాసంపై అవగాహన కల్పించాలని అన్నారు. ఈ సమావేశంలో మంథని ఆర్డీవో సురేశ్, జిల్లా గిరిజనాభివృద్ధి అధికారి సంగీత, డీఎఫ్వో శివయ్య, డీహెచ్ఏంవో అన్న ప్రసన్నకుమారి, లీడ్ బ్యాంక్ మేనేజర్ వెంకటేశ్, అధికారులు పాల్గొన్నారు. -
సంచులే బ్యాగ్లు
– కరుణాకర్, డీసీపీ, పెద్దపల్లి నా విద్యాభ్యాసం మొత్తం ప్రభుత్వ పాఠశాలల్లోనే పూర్తయ్యింది. నాన్న స్కూల్లో జాయిన్ చేస్తే.. నాకంటే ఒక్క క్లాస్ పెద్దయిన మా బ్రదర్తో కలిసి నడుచుకుంటూ పోయేవాడిని. ఎనిమిదో తరగతి వరకు ఉప్పల్, తొమ్మిదో తరగతి హుజూరాబాద్, పదో వతరగతి మళ్లీ ఉప్పల్ ప్రభుత్వ పాఠశాలలోనే చదివా. బియ్యపు సంచులను బ్యాగ్లుగా తయారుచేసి కుట్టిస్తే, వాటిని భుజానికి వేసుకుని స్కూల్కు పోయేవాళ్లం. తొలిరోజు స్కూల్కి పోయినప్పుడు వర్షం పడేది. అప్పుడు పుస్తకాలు తడవకుండా షర్ట్ జేబులో దాచుకునేవాడిని. చిన్నారులను సర్కారు బడికే పంపించాలి. వారిపై ఖర్చుచేసే డబ్బు ఆదా చేస్తే భవిష్యత్లో ఎంతోఉపయోగపడుతుంది. చదువుపై ఆసక్తి ఉంటే సర్కారు బడిలో చదివినా ఉన్నతంగా ఎదగవచ్చు. ప్రతీఒక్కరికి పసిప్రాయంలో అనేక అనుభూతులు ఉంటాయి. నాకు అలాగే ఉన్నాయి. అప్పటిరోజులు గోల్డెన్ డేస్. -
ఆర్ట్లో నైపుణ్యం సాధించా
ఎంటెక్ పూర్తి చేశా. ప్రస్తుతం జ్యోతిష్మతి ఇంజినీరింగ్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పని చేస్తున్నా. ఆర్ట్, డ్రాయింగ్ అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం. కోర్సులో భాగంగా చాలా రకాల వాటిని తయారు చేశా. కలెక్టర్ కూడా ఇంప్రెస్ అయ్యారు. – హెచ్.రోజా, కరీంనగర్ క్రాఫ్ట్ వర్క్ నేర్చుకున్నా కరీంనగర్లో జరిగిన టీటీసీసీ లో ప్రతిరోజు క్లాసులకు హాజ రయ్యా. క్రాఫ్ట్ వర్క్ బాగా నే ర్చుకున్నా. పూల బుట్టి, ఆకులతో పలు రకాల వస్తువులు తయారు చేశా. బీఎస్సీ డిగ్రీ పూర్తి చేశా. ఇలాంటి కోర్సులు మాకు ఉపాధినిచ్చే విధంగా ఉన్నాయి. ప్రతీ ఒక్కరు కోర్సు చేయాలి. – ఎల్.లక్ష్మి, ఇందారం, మంచిర్యాల టైలరింగ్లో శిక్షణ బీకామ్ డిగ్రీ చేశా. గతంలో శిశు గృహ తదితర సంస్థల్లో పని చేశా. కోర్సు పూర్తి చేసి స్కూళ్లలో చిన్నారులకు నేర్పించాలనుకుంటున్నా. టైలరింగ్లో అల్లికలు తదితర వాటిని బాగా నేర్చుకున్నా. ట్రైనర్స్ బాగా చెప్పారు. ప్రతీ ఒక్కరికి ఉపయోగపడే శిక్షణ ఇది. – ఇ.సంధ్య, గాలిపెల్లి, సిరిసిల్ల -
అమ్మ మాట.. అంగన్వాడీ బాటపై ప్రత్యేక శ్రద్ధ
● 17 వరకు ఇంటింటి ప్రచారం సుల్తానాబాద్(పెద్దపల్లి): రామగుండం, పెద్దపల్లి, మంథని ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో సుమారు 706 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో గర్భిణులు 3,471 మంది, ఆర్నెల్ల వయసుగల చిన్నారులు 2,414 మంది, మూడేళ్ల వయసుగలవారు 17,340 మంది, ఆరేళ్ల వయసుగలవారు 15,834 మంది ఉన్నారని అధికారులు తెలిపారు. గురువారం ప్రభుత్వ పాఠశాలలు పునఃప్రారంభం అవుతున్న నేపథ్యంలో అమ్మ మాట.. అంగన్వాడీ బాట పేరిట ఇంటింటా పర్యటించేందుకు అంగన్వాడీ సిబ్బంది ప్రత్యేక దృష్టి సారిస్తున్నా రు. మూడేళ్ల వయసుగల చిన్నారులను గుర్తించి అంగన్వాడీ కేంద్రాల్లో ప్రవేశాలు కల్పించేందుకు ప్రణాళిక రూపొందించారు. అదేవిధంగా ఐదేళ్ల వయసు పైబడిన పిల్లలను ప్రాథమిక పాఠశాలలో చేర్పించేలా చర్యలు తీసుకుంటున్నా రు. వీటితోపాటు ఈనెల 17వ తేదీ వరకు అంగన్వాడీ ప్రాంగణాల్లో కిచెన్ గార్డెన్లు అభివృద్ధి చే యాలి. కూరగాయల మొక్కలు పెంచాలి. హాట్కుక్ డ్ మీల్స్ ద్వారా పోషకాహారం అందించాలి. ఈ విషయాన్ని గ్రామస్తులకు తెలియజేయాలి. ఆటాపాటలు, బొమ్మల ద్వారా చదువు చెబుతున్నామని ప్రచారం చేయాలి. ఆటాపాటలతో చదువు ప్రభుత్వం ఈసారి అమ్మ మాట.. అంగన్వాడీ బాట పేరిట ప్రత్యేక కార్యక్రమం నిర్వహించాలని ఆదేశించింది. ఈమేరకు ఈనెల 12 నుంచి 17వ తేదీ వరకు అంగన్వాడీ టీచర్లు వివిధ కార్యక్రమాలు చేపడతారు. బొమ్మలు, వస్తువులతో ఆటాపాటల ద్వారా చిన్నారులకు చదువు చెబుతారు. – వేణుగోపాల్, డీడబ్ల్యూవో, పెద్దపల్లి -
ఆక్షేపణలు.. ఆరోపణలు
● ముగిసిన అభ్యంతరాల స్వీకరణ ● నేటినుంచి ఐదు రోజులపాటు పరిశీలన, విచారణ ● ఈనెల 21న తుది నోటిఫికేషన్ విడుదలకు సన్నాహాలు21న తుది నోటిఫికేషన్ రామగుండం నగరంలో డివిజన్ల పునర్విభజన ముసాయిదాపై ప్రజల నుంచి వచ్చిన అభిప్రాయాలు, సూచనలను పరిగణనలోకి తీసుకుంటాం. దరఖాస్తులపై క్షేత్రస్థాయిలో సర్వే చేయిస్తాం. డివిజన్ల మధ్య 10 శాతం వేరియేషన్ ఉండేలా ఓటర్లను 60 డివిజన్లకు కేటాయిస్తాం. డివిజన్ల హద్దులు, మ్యాపులు సిద్ధం చేసి ఈనెల 17, 18న కలెక్టర్, 19న సీడీఎంఏకు నివేదిస్తాం. ఈనెల 21న తుది నోటిఫికేషన్ విడుదల చేస్తాం. – అరుణశ్రీ, రామగుండం బల్దియా కమిషనర్(ఎఫ్ఏసీ) గందరగోళంగా ఉంది డివిజన్ల పునర్విభజన గందరగోళంగా ఉంది. పారదర్శత లేదు. హడావుడిగా, తప్పుల తడకగా, మొక్కుబడిగా పునర్విభజన చేశారు. ఓటరు జాబితా పొంతన లేకుండా ఉంది. దళిత సామాజిక రిజర్వేషన్లకు భంగం కలిగిస్తే హైకోర్టును ఆశ్రయిస్తాయిం. మా డివిజన్కు చెందిన ఓటర్లను సంబంధంలేని డివిజన్లో చేర్చారు. దీనిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజలకు, అభివృద్ధికి అనుకూలంగా విభజన చేయాలి. – మద్దెల దినేశ్, గోదావరిఖని కోల్సిటీ(రామగుండం): రామగుండం బ ల్దియాలో స్తబ్దుగా ఉన్న రాజకీయం.. డివి జన్ల పునర్విభజనతో ఒక్కసారిగా అలజడి రేగింది. ఈనెల 3న నగరాన్ని 60 డివిజన్లుగా విభజిస్తూ ఈ నెల 4న ముసాయిదా జాబితా వెల్లడించడం ఇందు కు కారణమైంది. క్షేత్రస్థాయిలో సర్వే చేయాల్సిన అ ధికారులు.. రెండ్రోజులపాటు గదుల్లో కూర్చొని ఓ టర్ల జాబితా ఆధారంగా ముసాయిదా రూపొందించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే, అభ్యంతరాలు, సలహాలు, సూచనల స్వీకరణకు ఇచ్చిన గడువు బుధవారం ముగిసింది. ఈనెల 21న తుది నోటిఫికేషన్ విడుదల చేయడానికి కసరత్తు చేస్తు న్నారు. పునర్విభజన పారదర్శకంగా లేదని ఆరోపణలు వస్తుండగా, డివిజన్ల హద్దులు మరోసారి మా రే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. 10 శాతం ఓటర్ల వ్యత్యాసం బల్దియాను 50 నుంచి 60 డివిజన్లుగా మార్పుచేయ డానికి 10 శాతం ఓటర్ల వ్యత్యాసం ప్రక్రియ చేపట్టినట్లు అధికారులు చెబుతున్నారు. దీనికనుగుణంగా ఒక్కో డివిజన్లో 2,700 మంది నుంచి 3,300 మంది ఓటర్లుగా ఉండేలా ముసాయిదా తయారు చేశా రు. అభ్యంతరాలపై ఈనెల 16వ తేదీ వరకు క్షేత్రస్థాయిలో విచారణ జరిపి తుది జాబితా రూపొందించనున్నారు. మ్యాపులు, హద్దుల ఏర్పాటుకు సన్నద్ధమవుతున్నారు. మరోవైపు.. ముసాయిదా జాబితాపై గడువు ముగిసే బుధవారం నాటికి 63 దరఖాస్తులు అందాయని అధికారులు తెలిపారు. హద్దుల మార్పుతో అయోమయం.. డివిజన్ల పునర్విభజనతో హద్దులు మారడంతో కార్పొరేటర్లుగా పోటీచేయాలనుకుంటున్న వారిలో అయోమయం నెలకొంది. తమకు అనుకూలంగా ఉండే ఓటర్లు, మరో డివిజన్లలోకి మారడంతో వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇవీ అభ్యంతరాలు.. ● అల్లూరు గ్రామస్తులు ఈనెల 9న బల్దియా కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. శ్రీపాదనగర్ను తమ గ్రామంలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. బల్దియాలో విలీనమైన వెంకట్రావుపల్లిని రాజీవ్నగర్లో కలుపకుండా ప్రత్యేక డివిజన్గానే గుర్తించాలని, మారేడుపాకలో వీర్లపల్లి ప్రాంతాన్ని కలపకుండా ప్రత్యేక డివిజన్గా ఏర్పాటు చేయాలని స్థానికులు విన్నవించారు. ● ఎన్టీపీసీ భీమునిపట్నం కాలనీలో కొంతభాగాన్ని నాలుగు, మరికొంత ఐదో డివిజన్లో చేర్చారు. భీమునిపట్నంకాలనీని ప్రత్యేక డివిజన్గా ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ● గాంధీనగర్, గంగానగర్, శ్రీరాంనగర్, చంద్రబాబుకాలనీ, శారదానగర్, హనుమాన్నగర్లో ఒకేబ్లాక్ ఇంటి నంబర్ల ఆధారంగా డివిజన్లు ఏర్పాటు చేయడంతో నైసర్గిక స్వరూపం మారిపోతోందని, క్షేత్రస్థాయి పరిశీలన, విచారణ చేయాలని స్థానికులు దరఖాస్తు చేశారు. ● సంజయ్గాంధీనగర్, రాజీవ్నగర్, ఇందిరానగర్లోని ఇళ్లన్నంటినీ ఒకే డివిజన్గా మార్పు చేయాలని విన్నవించారు. ● గతంలో 33వ డివిజన్గా ఉన్న పరుశురామ్నగర్, ఫైవింక్లయిన్ ఏరియాలో 3,200 ఓట్లు ఉండగా, ప్రస్తుతం పరుశురామ్నగర్కు సంబంధంలేని తిలక్నగర్, విఠల్నగర్ ఓట్లను చేర్చి ప్రత్యేక డివిజన్గా మార్చారని, దీనివల్ల దళితుల ఓట్లు చెల్లాచెదురుగా మారి రిజర్వేషన్ కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని స్థానికులు ఆందోళన చెందారు.డివిజన్ల పునర్విభజనపై సమీక్ష నగరంలో చేపట్టిన డివిజన్ల పునర్విభజన తీరును వరంగల్ పురపాలక శాఖ రీజినల్ డైరెక్టర్ షాహీ ద్ మసూద్ బుధవారం పరిశీలించారు. స్పెషలా ఫీసర్గా వ్యవహరిస్తున్న షాహీద్ మసూద్.. కమిషనర్(ఎఫ్ఏసీ) అరుణశ్రీతో భేటీ అయ్యారు. డివిజన్లపై వస్తున్న ఆక్షేపణలు, సలహాలు, సూ చనలపై ఆరా తీశారు. డిప్యూటీ కమిషనర్ వెంక టస్వామి, టౌన్ప్లానింగ్, రెవెన్యూ అధికారులతో నూ సమావేశమయ్యారు. విభజన పురోగతిపై స మీక్షించారు. మ్యాపులను టీపీవో నవీన్ వివరించారు. పొరపాట్లకు తావివ్వకుండా డివిజన్ల హ ద్దులు నిర్ణయించాలని ఆయన సూచించారు. -
భూవివాదంలో ఒకరి ఆత్మహత్యాయత్నం
మెట్పల్లిరూరల్: తాను కొనుగోలు చేసిన భూమిని ఇతరులకు విక్రయించి ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. మెట్పల్లి మండలం చౌలమద్దిలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితుడి వివరాల ప్రకారం.. కోరుట్లకు చెందిన వనతడుపుల నాగేశ్వరవరప్రసాద్ కొన్నేళ్ల క్రితం చౌలమద్ది శివారులోగల భూమి కొన్నాడు. డబ్బులు చెల్లించినా.. ఆ భూమిని ఓ కుల సంఘం పెద్దమనుషులు తనకు కాకుండా ఇతరులకు రిజిస్ట్రేషన్ చేయించారు. తన డబ్బులు తనకు ఇవ్వాలని అడిగినా ఇవ్వకపోవడంతో విసుగు చెందిన నాగేశ్వరవరప్రసాద్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానికులు అతడిని మెట్పల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుడి వద్ద ఓ నోట్ లభ్యమైంది. మెట్పల్లి సీఐ అనిల్, ఎస్సై కిరణ్కుమార్ బాధితుడి నుంచి వివరాలు తెలుసుకున్నారు. ఘటనపై ఫిర్యాదు రాలేదని పోలీసులు తెలిపారు. -
భూసమస్యల పరిష్కారానికే..
కమాన్పూర్(మంథని): భూసమస్యల పరిష్కా రానికే భూభారతి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని మంథని ఆర్డీవో సురేశ్ అన్నారు. రాజాపూర్లో బుధవారం నిర్వహించిన రెవె న్యూ సదస్సులో ఆయన మాట్లాడారు. దరఖాస్తులను పరిశీలించి విచారణ జరిపి భూ సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. తహసీల్దార్ వాసంతి, ఆర్ఐ స్రవంతి, సీనియర్ అసిస్టెంట్ సతీశ్, జూనియర్ అసిస్టెంట్లు శ్రీనివాస్, రజి త, కుమార్, రంజిత్ తదితరులు పాల్గొన్నారు. చిన్నారులకు టీకాలు వేయాలి పెద్దపల్లిరూరల్: శిశువులకు రోటాసిల్ టీకాలు వేయాలని డీఎంహెచ్వో అన్న ప్రసన్నకుమారి సూచించారు. రెండు డోసులు కలిగిన రోటా సి ల్ టీకా వాయిల్ను స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం ఆమె ప్రారంభించి మా ట్లాడారు. 6 వారాల వయసుగల శిశువుకు ఓ సపీవీ పెంటా వాలెంట్ తొలిడోసుతోపాటు ఇ వ్వాలన్నారు. వైరస్ సోకిన పిల్లల్లో తీవ్రనీళ్ల వి రోచనాలు, జ్వరం, వాంతులు, కడుపునొప్పి ఉంటాయని, విరోచనాలు అధికమైతే మృతి చెందవచ్చని, అందుకే రోటాసిల్ టీకాలు తప్పనిసరి వేయించాలన్నారు. ప్రోగ్రాం ఆఫీసర్ కిరణ్కుమార్, స్వాతిభాను, అఖిల ఉన్నారు. ప్రసవాల సంఖ్య పెంచాలి మంథని: స్థానిక మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో సీ్త్రవైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని, మహిళలు, గర్భిణులు సద్వినియోగం చేసుకోవాలని డీఎంహెచ్వో అన్న ప్రసన్న కుమారి కోరారు. గద్దలపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని వైద్యులు, సిబ్బందితో స్థానిక ఆస్పత్రిలో ఆమె వైద్యసేవలపై సమీక్షించారు. సర్కారు ఆస్పత్రిలో ప్రసవాల సంఖ్య పెంచాలని సూచించారు. కార్యక్రమంలో వైద్యులు సృజన్, మాధురి తదితరులు పాల్గొన్నారు. పాఠశాల బస్సుల ఫిట్నెస్ రెన్యూవల్ చేయించాలిజ్యోతినగర్(రామగుండం): జిల్లాలోని పాఠశాలల బస్సుల ఫిట్నెస్ రెన్యూ వల్ చేసుకోవాలని జిల్లా రవాణా శాఖ అధికారి రంగారావు సూచించారు. ఈ నెల 12న పాఠశాలలు, ఇ తర విద్యాసంస్థలు పునః ప్రారంభం అవుతు న్న నేపథ్యంలో యాజమాన్యులు తమ స్కూల్ బస్సులు, ఇతర వాహనాల ఫిట్నెస్ (వాహన సామర్థ్య పరీక్ష) రెన్యూవల్ చేసుకోవాలని సూచించారు. స్కూల్ బస్సులు నిబంధనలు పాటించాలని ఆయన పేర్కొన్నారు. 18న కలెక్టరేట్లో జాబ్మేళా పెద్దపల్లిరూరల్: జిల్లాలోని నిరుద్యోగులకు వీ వీసీ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ లో ఉద్యోగాలు కల్పించేందుకు ఈనెల 18న క లెక్టరేట్లో జాబ్మేళా నిర్వహించన్నుట్లు జిల్లా ఉపాధి కల్పనాధిధికారి తిరుపతిరావు బుధవా రం తెలిపారు. రూమ్ నంబర్–225లోని జిల్లా ఉపాధి కల్పనాధికారి కార్యాలయంలో చేపట్టే మేళాలో 60 ఈవీ సర్వీస్ టెక్నీషియన్, ఆటోమేటివ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు భర్తీచేస్తారన్నారు. పదో తరగతి, ఐటీఐ/డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులైనవారు అర్హులని, 18–30ఏళ్ల వయసు లోపు ఉండాలని తెలిపారు. నెల వేతనం రూ. 12 నుంచి రూ.15 వేల మధ్య ఉంటుందని పే ర్కొన్నారు. ఆసక్తి గలవారు ఈనెల 18న ఉద యం 11 గంటల సర్టిఫికెట్ జిరాక్స్లతో తమ వివరాలను నమోదు చేసుకోవాలని ఆయన కోరారు. వివరాలకు 77299 92061 నంబరులో సంప్రదించాలని సూచించారు. క్రీడా పాఠశాలల్లో ప్రవేశాలు పెద్దపల్లిరూరల్: హకీంపేట, కరీంనగర్, ఆదిలాబాద్లోని క్రీడా పాఠశాలల్లో ప్రవేశాల కో సం ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి సురేశ్ తెలిపా రు. నాలుగో తరగతి చదివే బాల, బాలికలు 1 సెప్టెంబర్ 2016 నుంచి 31 ఆగస్టు 2017 మధ్య జన్మించిన వారు అర్హులన్నారు. వీరికి మండల స్థాయిలో ఈనెల 16–19 తేదీలు, జిల్లాస్థాయిలో ఈనెల 23–25వ తేదీల మధ్య ఎంపిక పోటీలు నిర్వహిస్తామన్నారు. జిల్లాస్థాయిలో ఎంపికైన విద్యార్థుల కోసం రాష్ట్రస్థా యిలో ఈనెల జూలై 1 నుంచి 5వ తేదీ వరకు హకీంపేటలో ఎంపిక పోటీలు నిర్వహిస్తారని పేర్కొన్నారు. ఆసక్తిగల విద్యార్థులు ఆధార్ జి రాక్స్, బోనోఫైడ్ (నాలుగో తరగతి), మూడో తరగతి ప్రోగ్రెస్ రిపోర్ట్, పుట్టిన తేదీ, కులం ధ్రువీకరణ పత్రాలతో tgss.telangana. gov.in వెబ్సైట్లో తమ వివరాలు నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. -
సెలవుకు టాటా
● ఇక బడిబాట ● నేటి నుంచి స్కూళ్ల నిర్వహణ ● ముస్తాబైన సర్కారు పాఠశాలలు ● తొలిరోజే పుస్తకాలు, యూనిఫాంలు సాక్షి, పెద్దపల్లి: ఆటాపాటలతో వేసవి సెలవులు సరదాగా గడిచిపోయాయి. ఉల్లాసంగా, ఉత్సాహంగా ఎగిరి గంతులేసిన విద్యార్థులు గురువారం నుంచి బడిబాట పట్టనున్నారు. సుమారు నెలన్నరపా టు విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది లేక బో సిపోయి కనిపించిన పాఠశాలలు మళ్లీ కళకళలాడనున్నాయి. మరోవైపు.. ఇళ్లనుంచి సంతోషంగా వ చ్చే విద్యార్ధులకు ఘనంగా స్వాగతం పలికేందుకు కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో స్వాగత ఏర్పాట్లు చేశా రు. అయితే, చాలాచోట్ల మౌలిక వసతుల లేమి చిన్నారులను పలకరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. మౌలిక వసతుల కల్పనపై అధికార యంత్రాంగం చెప్పిన మాటలకు క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. మన ఊరు–మన బడి, అమ్మ ఆదర్శ పాఠశాల పథకాల ద్వారా అభివృద్ధి పనులు చేపట్టినా.. చాలాచోట్ల అసంపూర్తిగానే మిగిలిపోయాయి. సర్కారు స్కూళ్లలో ప్రవేశాలు పెంచేందుకు ప్రభు త్వం ఈనెల 6 నుంచి 19వ తేదీ వరకు ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం నిర్వహిస్తోంది. షెడ్యూల్ ప్రకారం అధికారులు వివిధ కార్యక్రమాలు చేపట్టి సర్కార్ స్కూళ్ల ప్రాధాన్యత గురించి తల్లిదండ్రులు, విద్యార్థులకు వివరించారు. ఇప్పటివరకు సుమారు 3 వేలకుపైగా కొత్తగా ప్రవేశాలు కల్పించినట్లు అధికారులు వివరించారు. కొనసాగుతున్న అభివృద్ధి పనులు గత ప్రభుత్వం చేపట్టిన మన ఊరు–మన బడి పథకం కింద ఎంపిక చేసిన 191 ప్రభుత్వ పాఠశా లల్లో పనులు పడకేశాయి. ప్రస్తుతం ఎంపిక చేసిన 418 అమ్మ ఆదర్శ పాఠశాలల్లో రూ.23.62కోట్లు వెచ్చించి అభివృద్ధి పనులు చేపట్టాలని నిర్ణయించగా ఇప్పటివరకు రూ11.84కోట్లతో ప్రగతి పను లు పూర్తిచేశారు. విద్యుత్, తాగునీరు, మూత్రశాలలు తదితర మౌలిక సౌకర్యాలు కల్పించగా, మిగతా పనులన్నీ పురోగతిలో ఉన్నాయి. పుస్తకాలు, యూనిఫామ్స్ పంపిణీకి సిద్ధం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు 2,22,840 పాఠ్యపుస్తకాలు అవసరం కాగా, ఇప్పటివరకు సుమారు 2లక్షలకుపైగా పాఠ్యపుస్తకాలు జిల్లా కేంద్రానికి చేరుకోగా.. మండల కేంద్రాలు.. అక్కడ నుంచి పాఠశాలలకు పంపించారు. మహిళా సంఘాలు జూన్ 10లోగా యూనిఫామ్స్ను కుట్టి ఉపాధ్యాయులకు అప్పగించేలా అధికారులు చర్యలు చేపట్టారు. మొత్తం 30 వేల యూనిఫామ్స్ కుట్టడం పూర్తయింది. పాఠ్య, నోట్పుస్తకాలే కాకుండా యూ నిఫామ్స్ను కూడా తొలిరోజే విద్యార్థులకు అందించనున్నారు. జిల్లాలో 2,220 ఉపాధ్యాయ ఖాళీలు ఉండగా, 2,195 మంది టీచర్లు పనిచేస్తున్నారు. జిల్లా సమాచారం ప్రభుత్వ పాఠశాలలు 545 విద్యార్థుల సంఖ్య(సుమారు) 30,000 కొత్త ప్రవేశాలు 3,000 ప్రైవేట్ పాఠశాలలు 174 విద్యార్థుల సంఖ్య(సుమారు) 60,000 మూతపడిన సర్కార్ స్కూళ్లు 29పండుగ వాతావరణం పాఠశాలలను పండుగ వాతావరణంలో పునఃప్రారంభిస్తున్నాం. విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్నిసౌకర్యా లు కల్పించేలా చర్యలు తీసుకున్నాం. పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్లు, నోట్బుక్స్లు పాఠశాలలకు చేరవేశాం. బడిబాట కార్యక్రమం కొనసాగుతోంది. అనుమతి లేనిప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థులు చేరవద్దు. ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజులు తెలిపేలా బోర్డులు ఏర్పాటు చేయాలి. – మాధవి, డీఈవో -
సింగరేణి ఆస్పత్రుల్లో మందుల కొరత
గోదావరిఖని: సింగరేణి ఆస్పత్రుల్లో మందులు లేక కార్మిక కుటుంబాలు ఇబ్బంది పడుతున్నా యని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భూపాల్ అన్నారు. స్థానిక యూనియన్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన బ్రాంచి కమిటీ స మావేశంలో ఆయన మాట్లాడారు. రోజువారీగా వాడే బీపీ, షుగర్ గోళీలు అందించడంలో యాజమాన్యం విఫలమైందన్నారు, కార్మికులు ఏటా రూ.వేల కోట్ల లాభాలు ఆర్జించి పెడుతున్నా.. వారి కనీస అవసరాలు తీర్చడంలో నిర్లక్ష్యం చే స్తోందని దుయ్యబట్టారు. కార్మికులు, వారి కు టుంబాల ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం తగదన్నారు. కష్టార్జిత సొమ్మును ఇతర ప్రాంతాల అభివృద్ధి కోసం కేటాయిస్తున్న సింగరేణి.. కార్మికు లకు టాబ్లెట్లు అందించడంలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తుందని నిలదీశారు. రిటైర్డ్ కార్మికులకు నెల నుంచి రెండు నెలలకు సరిపడా మందులు ఇవ్వా ల్సి ఉండగా, 15రోజులకే ఇచ్చి చేతులెత్తేస్తున్నార ని మండిపడ్డారు. మందుల కొరతను తక్షణమే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. నా యకులు ఎరవల్లి ముత్యంరావు, ఆరెపల్లి రాజమౌళి, మెండె శ్రీనివాస్, తోట నరహరిరావు, ఆస రి మహేశ్, సీహెచ్ వేణుగోపాల్రెడ్డి, పి.శ్రీనివాసరావు, నారాయణ, అన్నబోయిన శంకర న్న, శివరాంరెడ్డి, జనార్దన్రెడ్డి, రాజు పాల్గొన్నారు. సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భూపాల్ -
కార్మికులకు బీమా తప్పనిసరి
జ్యోతినగర్(రామగుండం): ప్రతీ కార్మికుడు బీ మా సౌకర్యం కలిగి ఉండాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, రామగుండం మున్సిపల్ కా ర్పొరేషన్ కమిషనర్ అరుణశ్రీ సూచించారు. ఎ న్టీపీసీ పర్మినెంట్ టౌన్షిప్లో మంగళవారం బీ మా మేళా నిర్వహించారు. దరఖాస్తుదారులకు ఆమె బీమాపత్రాలు అందజేసి మాట్లాడారు. పారిశుధ్య కార్మికులు, ర్యాగ్ పిక్కర్లు, హెల్త్వర్కర్లు రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తే వారి కుటుంబాలకు బీమాద్వారా పరిహారం అందుతుందన్నారు. లీడ్ బ్యాంకు మేనేజర్ వెంకటేశ్, బల్దియా డిప్యూటీ కమిషనర్ వెంకటస్వామి, రీజినల్ మేనేజర్ రవీందర్సింగ్, ఎస్బీఐ మేనేజర్ నవీన్కుమార్, బల్దియా సూపరింటెండెంట్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. బెస్ట్ అవైలేబుల్ స్కూల్లో ప్రవేశాలకు దరఖాస్తులుపెద్దపల్లిరూరల్: జిల్లాలోని బెస్ట్ అవైలేబుల్ స్కూల్లో మూడు, ఐదు, ఎనిమిదో తరగతు ల్లో ప్రవేశాల కోసం గిరిజన విద్యార్థులు ఈనెల 17వ తేదీలోగా దరఖాస్తు చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. మూడో తరగతిలో లంబాడ బాలికలకు ఒకటి, బాలురకు ఒకటి, ఎరుకలలో బాలురకు ఒకటి, ఐదో తరగతిలో గోండు బాలురకు ఒకటి, ఎనిమిదో తరగతిలో లంబాడ బాలికలకు ఒక సీటు కేటాయించామన్నారు. తల్లిదండ్రుల వార్షికాదాయం అర్బన్ ప్రాంతంలో రూ.రెండు లక్షలు, రూరల్ ప్రాంతంలో 1.50 లక్షలు ఉండాలన్నారు. కులం, ఆదాయం, పుట్టిన తేదీ, స్టడీ సర్టిఫికెట్, ఆధార్ కార్డు, రెండు పాస్ పోర్ట్సైజ్ ఫొటోలు జతచేసి పూర్తిచేసిన దరఖాస్తులను కరీంనగర్ జిల్లా గిరిజనాభివృద్ధి అధికారి కార్యాలయంలో సమర్పించాలని కలెక్టర్ తెలిపారు. ఈనెల 20న లా టరీ పద్ధతిన అర్హులను ఎంపిక చేయనున్నట్లు స్పష్టం చేశారు. వివరాలకు 96521 18867లో సంప్రదించాలని కలెక్టర్ సూచించారు. రైతులు శాస్త్రవేత్తల సూచనలు పాటించాలి జ్యోతినగర్/యైటింక్లయిన్కాలనీ(రామగుండం): అధికారులు, శాస్త్రవేత్తల సూచనలు పాటిస్తే అధిక దిగుబడి సాధ్యమని రామగిరి ఖిల్లా కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త భాస్కరరావు రైతులకు సూచించారు. మేడిపల్లి, జనగామ, అల్లూరులో సాగుచేస్తున్న పంటలను మంళవారం ఆయన పరిశీలించారు. రై తులు ఏటా ఒకేరకమైన వరి, పత్తికి బదులు స మగ్ర పంటల ప్రణాళిక తయారు చేసుకుని ముందుకు సాగాలని ఆయన సూచించారు. కూరగాయలు, పూలు, పండ్లు తదితర పంటలను సమయానుకూలంగా సాగు చేస్తే మార్కె ట్ డిమాండ్కు అనుగుణంగా మంచి ఆదా యం వస్తుందని ఆయన వివరించారు. ఆయిల్పామ్ సాగుతో అధిక ఆదాయం సమకూరుతుందని అన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ శాస్త్రవేత్త వినోద్కుమార్, డైరెక్టర్ ఆఫ్ పౌల్ట్రీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్, నేషనల్ మీట్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ హైదరాబాద్ శాస్త్రవేత్తలు కన్నకి, లక్ష్మణ్ మాట్లాడారు. మండల వ్యవయ అధికారి ప్రకాశ్, ఉద్యాన వన శాఖ అధికారి జ్యోతి తదితరులు పాల్గొన్నారు. పంటలకు యూరియా వినియోగం తగ్గించాలి పెద్దపల్లిరూరల్: రైతులు యూరియా వినియో గం తగ్గించాలని కూనారం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ ముఖ్య శాస్త్రవేత్త డాక్టర్ శ్రీధర్ సిద్ది సూచించారు. వికసిత కృషి సంకల్ప అభియాన్లో భాగంగా రాంపల్లి రైతువేదికలో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అవసరం మేరకే పురుగుమందులు వాడాలని సూచించారు. విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల కొనుగోలు సమయంలోనే రసీదులు తీసుకోవాలని అన్నారు. పంట మార్పిడి పద్ధతి అవలంబిస్తే అధిక ఆదాయం ఉంటుందని తెలిపారు. ఉ ద్యాన వన అధికారి మహేశ్, వ్యవసాయాధికా రి కాంతాల అలివేణి, వ్యవసాయ విస్తీర్ణాధికారి ప్రశాంత్, రైతులు తదితరులు పాల్గొన్నారు. -
గర్భిణులకు సకాలంలో వైద్యపరీక్షలు చేయాలి
పెద్దపల్లిరూరల్: గర్భిణులకు సకాలంలో అన్ని వైద్యపరీక్షలు చేయాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి అన్న ప్రసన్నకుమారి ఆదేశించారు. కలెక్టరేట్లోని తన కార్యాలయంలో మంగళవారం ఆశ కార్యకర్తలు, నోడల్ పర్సన్లతో గర్భిణులకు అందించే వైద్యసేవలపై డీఎంహెచ్వో సమీక్షించారు. ప్రతీ గర్భిణిని ట్రాక్ చేయాలని, 12వారాల్లోపే రిజిస్ట్రేషన్ చేయాలన్నారు. హైరిస్క్ గర్భిణులను గుర్తించి తగిన చికిత్స అందించాలని సూచించారు. పిల్లలకు ఆర్నెల్ల వయసు వచ్చేవరకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని డీఎంహెచ్వో పేర్కొన్నారు. గర్భిణులకు రామగుండం ప్రభుత్వ జనరల్, పెద్దపల్లి ప్రధాన ఆస్పత్రులు, మంథని, సుల్తానాబాద్ సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్య పరీక్షలు చేయాలని ఆమె ఆదేశించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచాలని ఆమె సూచించారు. సమావేశంలో ఆశ, నోడల్ సైపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు. -
స్కూల్ పరిసరాలను శుభ్రంగా ఉంచాలి
● జిల్లా విద్యాశాఖ అధికారి మాధవి పెద్దపల్లిరూరల్: పాఠశాలల ప రిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని జిల్లా విద్యాశాఖ అధి కారి మాధవి సూచించారు. జి ల్లా కేంద్రంలోని బాలుర జెడ్పీ హైస్కూల్లో మంగళవారం పారిశుధ్య పనుల నిర్వహణపై ఉపాధ్యాయులు, కార్మికులకు శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. సీజనల్ వ్యా ధుల వ్యాప్తిని నిరోధించేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని, వ్యర్థాల నిర్వహణకు ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు. తరగతి గదులు, టాయిలెట్లు, కారిడార్ మెట్లు, ఆటస్థలాలు, అసెంబ్లీ ప్రాంతాలు, సిబ్బంది గదులు, కార్యాలయ ప్రాంతాలు, నీటి ట్యాంకులు, వాషింగ్ స్టేషన్లను ఎలా శుభ్రపరుచుకోవాలనే ప్రతీ అంశంపై ఒక్కో మండలం నుంచి ఒక ఉపాధ్యాయునికి, ఇద్దరు పారిశుధ్య సిబ్బందికి శిక్షణ ఇచ్చామని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో సురేందర్, రిసోర్స్ పర్సన్ దయాకర్, సమన్వయకర్త అజీమ్ దబీర్, అధికారులు తదితరులు పాల్గొన్నారు. పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యం సుల్తానాబాద్రూరల్(పెద్దపల్లి): గురుకుల హాస్టళ్లను పరిశుభ్రంగా ఉంచితేనే విద్యార్థులు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని జిల్లా విద్యాశాఖాధికారి మాధవి అన్నారు. భూపతిపూర్ కాస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో శానిటేషన్ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా డీఈవో విద్యాలయాన్ని సందర్శించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, హాస్టళ్లను పరిశుభ్రంగా ఉంచడంలో శానిటేషన్ సిబ్బంది కీలకపాత్ర పోషించాలన్నారు. ఈ కార్యక్రమంలో జీసీడీవో కవిత, స్పెషల్ ఆఫీసర్ స్వప్న, డీఆర్పీ సంధ్య, రాణి, రజిత తదితరులు పాల్గొన్నారు. -
సాక్షిపై దాడి అప్రజాస్వామికం
● కొమ్మినేని అరెస్టు గర్హనీయం ● జర్నలిస్టుల సంఘాల నిరసనకరీంనగర్: ఏపీలో సాక్షి దినపత్రిక, టీవీ చానళ్ల కార్యాలయాలపై టీడీపీ ప్రభుత్వం కక్షపూరిత చర్యలకు పాల్పడడం అప్రజాస్వామికమని, మీడియా స్వేచ్ఛను హరించడం రాజ్యాంగ విరుద్ధ్దమని టీ యూడబ్ల్యూజే(ఐజేయూ) జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గాండ్ల శ్రీనివాస్, కొయ్యడ చంద్రశేఖర్, ‘సాక్షి’ బ్యూరో ఇన్చార్జి భాషబోయిన అనిల్కుమార్ పే ర్కొన్నారు. ఏపీలో ‘సాక్షి’ కార్యాలయాలపై దాడులు, సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టును నిరసిస్తూ మంగళవారం కరీంనగర్లోని తెలంగాణ చౌక్లో ఉమ్మడి జిల్లాకు చెందిన జర్నలి స్టులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వం మీడియాపై కక్ష సా ధింపు చర్యలను ఖండించారు. ఇటీవల ‘సాక్షి’ ఎడిటర్ ధనంజయ్రెడ్డి మీద కేసులు బనాయించడం, తాజాగా కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్టు చేయడం, ‘సాక్షి’ కార్యాలయాలపై దాడులకు పా ల్పడటం భావప్రకటన స్వేచ్ఛకు విఘాతం కలిగించేలా ఉన్నాయని మండిపడ్డారు. రాజ్యాంగ ప్రాథమికసూ త్రాలకు తిలోదకాలు ఇచ్చేలా ఉన్న ఏపీ ప్ర భుత్వ చర్యలను దేశవ్యాప్తంగా మీడియా ప్రతినిధులు తీవ్రంగా ఖండిస్తున్నారన్నారు. ఏపీ సర్కారు పత్రికా కార్యాలయాలపై, మీడియా ప్రతినిధులపై దాడులు కొనసాగిస్తే అదేస్థాయిలో నిరసనలు చేస్తామని హెచ్చరించారు. ఈ నిరసనలో టీయూడబ్ల్యూజే రాష్ట్ర, జిల్లా నాయకులు ఎలగందుల రవీందర్, బల్మూరి విజయసింహారావు, ఈద మధుకర్రెడ్డి, ఏలేటి శైలేందర్రెడ్డి, జీఎస్ ఆనంద్తోపాటు సీనియర్ జర్నలిస్టులు, ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. -
సింగరేణిలో సీబీఎస్ఈ
● విద్యార్థులకు అత్యుత్తమ బోధన అందించడమే లక్ష్యం ● అనుమతుల కోసం ముమ్మర ప్రయత్నాలు ● ఇప్పటికే సెక్టార్ –3 స్కూల్లో ప్రయోగాత్మకం ● మరో తొమ్మిది పాఠశాలల్లో అమలుకు వేగంగా చర్యలు ● కార్మికులు, ఉద్యోగుల్లో పెరుగుతున్న డిమాండ్విస్తరిస్తాం గోదావరిఖని: సంస్థ వ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలల్లో ఇకనుంచి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) పద్ధతిన విద్యాబోధన చేసేందుకు సింగరేణి యాజమాన్యం ప్రణాళిక రూపొందిస్తోంది. ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రయోగాత్మకంగా యైటింక్లయిన్ కాలనీ సెక్టార్ –3 పాఠశాలలో సీబీఎస్ఈ పద్ధతిన విద్యాబోధనకు శ్రీకారం చుట్టింది. దీనిని సంస్థ వ్యాప్తంగా విస్తరించేందుకు సన్నాహాలు చేస్తోంది. తొలిదశలో ఒకటినుంచి తొమ్మిదో తరగతి వరకు ఇదేవిధానంలో చదువు చెప్పాలని సింగరేణి నిర్ణయించింది. భారీస్పందన.. ఆర్జీ–2 ఏరియా యైటింక్లయిన్కాలనీ సెక్టార్–3 స్కూల్లో ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు చేస్తున్న సీబీఎస్ఈ విధానానికి భారీగా స్పందన వచ్చింది. అన్ని తరగతుల్లో కలిపి సుమారు 408 వ రకు సీట్లు ఉంటే.. దాదాపు 1,600 మంది ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకోవడం తల్లిదండ్రుల నుంచి వస్తున్న స్పందనకు అద్దంపడుతోంది. ఈస్కూల్లో సీటు సాధించేందుకు పైరవీలు కూడా జోరందుకున్నాయి. అయితే, సింగరేణి యాజమాన్యం సీబీఎస్ ఈ బోధనపై స్పష్టమైన ప్రకటన చేసింది. సంస్థ వ్యాప్తంగా ఉన్న 9 స్కూళ్లలో ఈ విధానంలో విద్యాబోధన చేసేందుకు అడుగులు వేస్తోంది. పెరుగుతున్న యువకార్మికుల సంఖ్య కారుణ్య నియామకాలతో సింగరేణి సీనియర్ కార్మికుల స్థానంలో యువకార్మికుల సంఖ్య భారీగా పెరుగుతోంది. వారిసంఖ్య ప్రస్తుతం సుమారు 12వేలకు చేరిందని గణాంకాలు చెబుతున్నాయి. ఈక్రమంలో సింగరేణి స్కూళ్లలో తమ పిల్లలను చదివించేందుకు పోటీపడుతున్నారు. సంస్థలో సుమారు 42 వేల కుటుంబాలు ఉండగా, ఒకటే స్కూల్లో సీబీఎస్ఈ పద్ధతిన బోధించేందుకు అనుమతి లభించింది. దీనిని ఆధునీకరించడం కోసం సింగరేణి రూ.5కోట్లు కేటాయించింది. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా అనుమతి సాధించింది. అన్ని హంగులు పూర్తిచేసుకుని ఈనెల 14న సీఎండీ బలరాం చేతుల మీదుగా ప్రారంభించేందుకు యాజమాన్యం సన్నాహాలు పూర్తిచేస్తోంది. కార్మికేతరుల పిల్లలకు కూడా.. సీబీఎస్ఈ సిలబస్ ప్రారంభిస్తున్న సింగరేణి పాఠశాలలో సీటు సాధించేందుకు పోటీపడుతున్నారు. 80 శాతం సింగరేణి కార్మికుల పిల్లలు, 20 శాతం ఇతరులకు సీట్లు కేటాయించారు. అందులో 408 సీట్లకు సుమారు 1,600 దరఖాస్తులు రావడంతో యాజమాన్యం తలపట్టుకుంటోంది. ఎవరికి సీట్లు కేటాయించాలో తెలియక తికమకపడుతోంది. అయితే, సీట్ల కేటాయింపు పారదర్శకంగా చేపట్టాలని నిర్ణయించింది. డి మాండ్ భారీగా ఉండడంలో సంస్థలోని తొ మ్మిది స్కూళ్లలో కూడా ఇదే విధానం ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. తొమ్మిది పాఠశాలలకు విస్తరణ.. సంస్థవ్యాప్తంగా ఉన్న తొమ్మిది స్కూళ్లలో సీబీఎస్ సిలబస్ ప్రవేశపెట్టాలని యాజమాన్యం నిర్ణయించింది. ఇప్పటికే ఒక పాఠశాలకు అనుమతి లభించగా, మిగతా వాటికి పర్మిషన్ సాధించేందుకు యా జమాన్యం ప్రయత్నాలు ప్రారంభించింది. బాలికల కళాశాల, మహిళా డిగ్రీ, పీజీ కళశాల, పాలిటెక్నిక్లు నిర్వహిస్తూ సుమారు 7,642 మంది విద్యార్థులకు విద్య అందిస్తోంది. క్రీడలు, ఎన్సీసీకీ పెద్దపీట సింగరేణి స్కూళ్లలలో క్రీడలు, అథ్లెటిక్స్, ఎన్సీసీ, స్కౌట్స్ అండ్ గైడ్స్లో శిక్షణ ఇస్తోంది. ఏటా వీరికి ప్రత్యేక శిక్షణ ఇస్తూ జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దుతోంది. అలాగే ఎస్సీసీలో శిక్షణ పొందే విద్యార్థులకు ప్రత్యేక రిజర్వేషన్ ఉండటంతో మంచి డిమాండ్ ఉంది. సింగరేణి సమాచారం పాఠశాలలు 9 జూనియర్ కాలేజీలు(బాలికలు) 1 మహిళా డిగ్రీ, పీజీ కాలేజీ 1 పాలిటెక్నిక్ 1 విద్యార్థుల సంఖ్య 7,642 కార్మికుల సంఖ్య(సుమారు) 42,000 సింగరేణిలోని అన్ని స్కూళ్లలో సీబీఎస్ఈ విద్యా విధానం ప్రవేశపెడతాం. ప్రస్తుతం ఒకే స్కూల్కు అనుమతి లభించింది. అందులో సీట్లకు డిమాండ్ ఎక్కువగా ఉంది. ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు సీబీఎస్ సిలబస్ కొనసాగిస్తాం. రాబోయే రోజుల్లో అన్ని స్కూళ్లలో క్రీడలు, ఎన్సీసీ, స్కౌట్స్ అండ్ గైడ్స్లోనూ నాణ్యమైన శిక్షణ ఇస్తాం. – గుండా శ్రీనివాస్, ఎడ్యుకేషనల్ సెక్రటరీ, సింగరేణి -
కృత్రిమ మేధతో ఉజ్వల భవిష్యత్
● 10 వేలకన్నా తక్కువ ర్యాంక్ వస్తే ఫీజు మాఫీ ● మంచి ర్యాంక్ విద్యార్థులకూ ఉచిత వసతి ● సీఎస్ఎం ఫీజు రూ.లక్ష వరకే.. ● సాక్షి ఫోన్ ఇన్లో మంథని జేఎన్టీయూ ప్రిన్సిపాల్ డాక్టర్ బి.విష్ణువర్ధన్ రామగిరి(మంథని): ప్రస్తుత పరిస్థితుల్లో ఇంజినీరింగ్ కోర్సుల్లో కృత్రిమ మేధ ఉజ్వల భవిష్యత్కు బాటలు వేస్తుందని మంథని జేఎన్టీయూ ప్రిన్సిపాల్ డాక్టర్ బులుసు విష్ణువర్ధన్ వెల్లడించారు. ఎప్సెట్లో పది వేల ర్యాంక్ కన్నా తక్కువ సాధిస్తే వివిధ కళాశాలల్లో ఫీజు మాఫీ వర్తిస్తుందన్నారు. ఉచిత వసతి కల్పిస్తారని అన్నారు. సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సు ఫీజు రూ.లక్ష వరకు ఉంటుందని తెలిపారు. మంగళవారం ‘సాక్షి’ నిర్వహించిన ఫోన్ఇన్ కార్యక్రమం ద్వారా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు వెలిబుచ్చిన పలు సందేహాలకు ప్రిన్సిపాల్ సమాధానాలు ఇచ్చారు. ఆ వివరాలు.. సమాధానాలు ఇస్తున్న ప్రిన్సిపాల్ డాక్టర్ బులుసు విష్ణువర్ధన్ సాక్షి: ఇంజినీరింగ్లో నా కుమార్తెకు 30 వేల ర్యాంక్ వచ్చింది, మంథని జేఎన్టీయూలో సీఎస్ఎం సీటు వస్తుందా? – కన్నం సుధారాణి, రాంచంద్రం, యైటింక్లయిన్ కాలనీ ప్రిన్సిపాల్: సీఎస్ఎం సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సు మంథని జేఎన్టీయూలో 2020 లో అందుబాటులోకి తీసుకొచ్చారు. గత సంవత్సరం బీసీ–బీ కోటా వారికి 39 వేల ర్యాంక్ సాధించిన వారికి మంథని కళాశాలలో సీటు వచ్చింది. సీఎస్ఎం కోర్సు ఫీజు రూ.లక్ష వరకు ఉంటుంది. సాక్షి: నా కుమారుడికి 8వేల ర్యాంక్ వచ్చింది, ఏ కోర్సు మంచిది? – శ్రీనివాస్, కరీంనగర్ ప్రిన్సిపాల్: ఇంజినీరింగ్ విద్యలో ఏఐ బెటర్. హైదరాబాద్లో మంచి కళాశాలలో సీటు వస్తుంది. ఏ కళాశాలలో సీటు వచ్చినా పది వేల ర్యాంక్ కన్నా తక్కువ సాధిస్తే ప్రభుత్వమే పూర్తిస్థాయిలో ఫీజురీయింబర్స్మెంట్ చెల్లిస్తుంది. సాక్షి: మేనేజ్మెంట్ సీటుకు ఫీజురీయింబర్స్మెంట్ వర్తిస్తుందా? – కీర్తన, గోదావరిఖని ప్రిన్సిపాల్: మేనేజ్మెంట్ కోటాలో పూర్తిస్థాయి ఫీజు విద్యార్థులే చెల్లించాలి. ఎలాంటి ఫీజురీయింబర్స్మెంట్ పథకం వర్తించదు. సాక్షి: ఎంఈసీ గ్రూప్తో ఈసీఈలో సీటు వస్తుందా? – ప్రియాంక్, బాన్స్వాడ ప్రిన్సిపాల్: ఎంఈసీ గ్రూప్ ద్వారా ఈసీఈ కోర్సులో సీటు రాదు. ఎప్సెట్ ర్యాంక్ ద్వారా మాత్రమే ఇంజినీరింగ్ సీటు సాధించాలి. సాక్షి: ఎప్సెట్లో నాకు 37 వేల ర్యాంక్ వచ్చింది. సీఎస్సీ, సీఎస్ఎంలో ఏ కోర్సు మంచిది? – ధీరజ్, మెట్పల్లి ప్రిన్సిపాల్: రెండు కోర్సులు బాగుంటాయి. మీకు సమీపంలోని కొండగట్టు, జగిత్యాలలో సీఎస్సీ కోర్సులో సీటు వస్తుంది, సీఎస్ఎం కోర్సు చేయాలనుకుంటే మంథని కళాశాలలో సీటు లభిస్తుంది. సాక్షి: ఈఐఈలో జాయిన్ కావచ్చా? – రోడ్డ ఆదర్శ్, బేగంపేట ప్రిన్సిపాల్: ఈఐఈ కోర్సు కేవలం హైదరాబాద్ కళాశాలలో మాత్రమే అందుబాటులో ఉంది. ఇంజినీరింగ్ చేయాలనుకునే వారు ఇతర దేశాల్లో చదువుకోవచ్చు. సాక్షి: మంచిర్యాల జిల్లా నస్పూర్లో సివిల్ డిప్లొమో కోర్సు పూర్తి చేశా. ఈసెట్ ద్వారా మైనింగ్ కోర్సులో జాయిన్ కావచ్చా? – శ్రీనివాస్, రామగుండం ప్రిన్సిపాల్: సివిల్ డిప్లొమో పూర్తిచేసిన విద్యార్థులు ఈసెట్ ద్వారా సంబంధిత కోర్సుల్లో మాత్రమే ప్రవేశాలు పొందే వీలు ఉంటుంది. సాక్షి: ప్రస్తుత పరిస్థితుల్లో ఏ కోర్సు బెటర్? – రేణుశ్రీ, కృత్తిక, వేములవాడ, సతీశ్, హన్మకొండ ప్రిన్సిపాల్: ప్రస్తుత పరిస్థితుల్లో మిషన్ లెర్నింగ్, ఏఐ సాంకేతిక కోర్సులు చదివితే ఉద్యోగాలు త్వరగా వచ్చే అవకాశం ఉంది.సాక్షి: నాకు 60 వేల ర్యాంక్ వచ్చింది. ఈబీసీ కోటాలో మంథని కళాశాలలో ఏ కోర్సులో సీటు వస్తుంది? – సాయిప్రియ, ముత్తారం ప్రిన్సిపాల్: మంథని జేఎన్టీయూలో గత సంవత్సరం ఈబీసీ కోటాలో 60 వేల ర్యాంక్ వచ్చిన వారికి సివిల్, ఈఈఈ, మెకానికల్ బ్రాంచ్ల్లో సీటు రావచ్చు. సీఎస్సీ అయితే డౌట్. సాక్షి: నాకు 55 వేల ర్యాంక్ వచ్చింది. మంథని కళాశాలలో సీటు వస్తుందా? – శివరాంరెడ్డి, పెద్దపల్లి ప్రిన్సిపాల్: ఈడబ్ల్యూఎస్ కోటా కింద గత సంవత్సరం 55 వేల ర్యాంక్ వచ్చిన విద్యార్థులకు ఈఈఈ, సివిల్లో సీటు లభించింది. ఏఐలో రెండో కౌన్సెలింగ్ లేదా మూడో కౌన్సెలింగ్లో వచ్చే అవకాశం ఉంది. -
మారుపేర్ల మార్పుపై డిప్యూటీ సీఎం సానుకూలం
● ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్ప్రసాద్ గోదావరిఖని: సింగరేణి కార్మికుల మారుపేర్ల సమస్య పరిష్కారానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సానుకూలంగా స్పందించినట్లు ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్ప్రసాద్ తెలిపారు. సోమవారం డిప్యూటీ సీఎంను హైదరాబాద్లో కలిసి సింగరేణిలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని కోరారు. పదేళ్లపాటు అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం.. కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మోసం చేసిన విషయం ప్రస్తావించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక సమస్యలు పరిష్కారం అయ్యాయన్నారు. 35 నుంచి 40 ఏళ్లకు వయోపరిమితి పెంపు, కాంట్రాక్ట్ కార్మికులకు రూ.5వేల బోనస్, కార్మికులకు రూ.కోటి ప్రమాద బీమా వంటి సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం పరిష్కరించిందన్నారు. అనేకఏళ్లుగా కార్మికులు మారుపేర్ల సమస్యతో ఇబ్బంది పడుతున్నారని తెలియజేశామన్నారు. కోలిండియా మాదిరిగా సింగరేణి కార్మికులకు పెర్క్స్పై ఇన్కంట్యాక్స్ మాఫీ చేయాలని కోరారు. ఓన్ యువర్ హౌస్ పథకాన్ని మలు చేయాలన్నారు. కార్పొరేట్ మెడికల్ బోర్డు నియామాల్లో మార్పులు చేయాలన్నారు. ఉద్యోగం నుంచి తొలగించిన మైనింగ్ సిబ్బందిని వన్టైం సెటిల్మెంట్ కింద మరో అవకాశం ఇవ్వాలని విన్నవించారు. హైదరాబాద్లో 100రోజుల్లో సింగరేణి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మించాలన్నారు. సింగరేణిలో ఐటీ కంపెనీ ఏర్పాటు చేయాలని, స్థానికంగా ఉద్యోగాలను పెంచేందుకు అనుబంధ పరిశ్రమలు స్థాపించాలని, పెండింగ్లోని 3,700కుపైగా ఉద్యోగుల కేసుల పరిష్కారం కోసం ఒకసారి లోక్ అదాలత్ నిర్వహించాలన్నారు. భవిష్యత్ కోసం కొత్త గనుల ప్రారంభాన్ని వేగవంతం చేయాలని ఆయన కోరారు. ఈప్రతిపాదనలపై డిప్యూటీ సీఎం సానుకూలంగా స్పందించినట్లు జనక్ప్రసాద్ పేర్కొన్నారు. -
రవాణా మరింత మెరుగు
● ఎమ్మెల్యే విజయరమణారావు ఓదెల(పెద్దపల్లి): డబుల్ రోడ్ల నిర్మాణంతో ప్ర యాణ సౌకర్యం మరింత మెరుగుడుతుందని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. ఓదెల – పెగడపల్లి మధ్య చేపట్టిన డబుల్ రోడ్డు నిర్మాణా న్ని సోమవారం ఆయన ప్రారంభించారు. ఇందిరమ్మ ఇళ్లకు ముగ్గులు పోసి, పట్టాల పంపిణీ చే శారు. పిట్టలఎల్లయ్యపల్లెలో రేషన్షాపు ప్రారంభించి మాట్లాడారు. మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి నిర్మించే డబుల్ రోడ్ల నిర్మాణంతో పల్లెలు త్వరితగతిన అభివృద్ధి చెందుతాయన్నారు. ఇప్పటికే పొత్కపల్లి – కాల్వశ్రీరాంపూర్, ఓదెల టెంపుల్ – కొమిర మధ్య చేపట్టిన బీటీరో డ్ల నిర్మాణం పూర్తయిందని తెలిపారు. కార్యక్ర మంలో పొత్కపల్లి సింగిల్విండో చైర్మన్ ఆళ్ల సు మన్రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మూల ప్రేంసాగర్రెడ్డి, నాయకులు అంబాల కొముర య్య, పిట్టల రవికుమార్, చీకట్ల మొండయ్య, బొడకుంట చిన్నస్వామి తదితరులు పాల్గొన్నారు. కాగా, మడకలో గొర్రెల యాజమాని వేల్పుల రా జకొమురయ్యకు ఎమ్మెల్యే విజయరమణారావు చెక్కు అందజేశారు. విద్యుత్షాప్తో ఇటీవల గొ ర్రెలు మృతి చెందగా రూ.1.75లక్షలు మంజూరయ్యాయి. ట్రాన్స్కో ఎస్ఈ మాధవరావు, ఏడీఏ మధుకర్, ఏఈఈ రాంమోహన్ పాల్గొన్నారు. 13న ఎలిగేడు ఠాణా ప్రారంభం ఎలిగేడు(పెద్దపల్లి): మాట ప్రకారం ఎలిగేడులో పోలీసుస్టేషన్ను ఈనెల 13న ప్రారంభిస్తామని ఎమ్మెల్యే విజయరమణారావు తెలిపారు. ఏసీపీ కృష్ణ, సీఐ సుబ్బారెడ్డితో కలిసి ఆయన ఠాణా భ వనం పరిశీలించారు. దీనితోపాటు పెద్దపల్లి రూ రల్, ట్రాపిక్, మహిళా పోలీసుస్టేషన్లు సైతం ప్రా రంభించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. నాయకు లు సామ రాజేశ్వర్రెడ్డి, దుగ్యాల సంతోష్రావు, వెంకటేశ్వర్రావు, వెంకటసత్యం పాల్గొన్నారు. -
30 వరకు బియ్యం పంపిణీ
పెద్దపల్లిరూరల్: జిల్లాలోని రేషన్ కార్డుదారుల కు రేషన్ బియ్యం పంపిణీకి ఈనెల 30వ తేదీ వరకు గడువు పొడిగించామని అదనపు కలెక్టర్ వేణు సోమవారం తెలిపారు. రాష్ట్ర పౌర సరఫ రాల శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు రేషన్ కార్డుదారులకు జూన్లో మూడు నెలలకు సరి పడా బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేస్తున్నందున గడువు పొడిగించినట్లు వివరించారు. ల బ్ధిదారులు ఆందోళన చెందకుండా ఈ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. అధిక చార్జీలు వసూలు చేయొద్దు రామగిరి(మంథని): అధిక చార్జీలు వసూలు చే సే మీ సేవ కేంద్రాల నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని ఈడీఎం కవిత, టీఎస్టీఎస్ మేనేజర్ సాగర్ తెలిపారు. సోమవారం స్థానిక మీసేవ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశా రు. వినియోగదారులకు అందుతున్న సేవలపై ఆరాతీశారు. పౌరులకు కనిపించేలా పౌరసేవలు, చార్జీలను ప్రదర్శించాలని సూచించారు.దేశవ్యాప్త సమ్మెలో పాల్గొనాలి గోదావరిఖని: దేశవ్యాప్తంగా చేపట్టే సమ్మెలో సింగరేణి ఉద్యోగులు, కార్మికులు పాల్గొనాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భూపాల్ కోరా రు. స్థానిక యూనియన్ కార్యాలయంలో సో మవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావే శంలో మాట్లాడారు. ప్రభుత్వ రంగ సంస్థల ప రిరక్షణ, నాలుగు లేబర్ కోడ్స్ రద్దు నిరసిస్తూ కార్మిక, కర్షకులు పాల్గొంటున్నారన్నారు. జూలై 9న జరిగే సమ్మెను విజయవంతం చేయాలని ఆయన కోరారు. నాయకులు వేల్పుల కుమారస్వామి, ఎరవెల్లి ముత్యంరావు, జి.జ్యోతి, వనజారాణి, సీపెల్లి రవీందర్, మెండె శ్రీనివాస్, అరవింద్, దొమ్మేటి కొమురయ్య, నార్వేట్ల నరసన్న, ఆరేపల్లి రాజమౌళి, నాంసాని శంకర్, ఈదునూరి రాజేశ్వర్, గిట్ల లక్ష్మారెడ్డి, చిప్పకుర్తి చందు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకు మంచిభోజనంసుల్తానాబాద్రూరల్(పెద్దపల్లి): విద్యార్థులకు రుచికరమైన భోజనం అందించాలని జండర్ ఈక్విటీ జిల్లా కో ఆర్టినేటర్ కవిత సూచించా రు. భూపతిపూర్ కేజీబీవీని సోమవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. వంటల తయారీ శిక్షణపై పలు సూచనలు చేశారు. విద్యార్థులు ఆరోగ్యంగా ఉండేందుకు రుచికరమైన వంటల తయారీపై శిక్షణ ఇస్తున్నామని వివరించారు. స్పెషల్ ఆఫీసర్ స్వప్న తదితరులు ఉన్నారు. అరుణాచలానికి ఆర్టీసీ బస్సు గోదావరిఖనిటౌన్: గోదావరిఖని నుంచి అరుణాచలానికి రాజధాని బస్సును కరీంనగర్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పి.సోలమాన్, రీజిన ల్ మేనేజర్ రాజు సోమవారం ప్రారంభించా రు. బస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. టీ–20 సభ్యులకు సూచనలిచ్చారు. డీఎం నాగభూషణం, అసిస్టెంట్ మేనేజర్(ట్రాఫిక్) కె.గీతాకృష్ణ, బస్స్టేషన్ మేనేజర్ జి.అమృత, ఆఫీస్ సూపరింటెండెంట్ శంకరయ్య పాల్గొన్నారు. సేవలకు గుర్తింపు మంథని: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గా దుద్దిళ్ల శ్రీనివాస్(శ్రీ నుబాబు) నియామకమయ్యారు. కాంగ్రెస్లో ఆ యన కొన్నేళ్లుగా క్రియాశీ లంగా పనిచేస్తున్నారు. ఐటీ, పరిశ్రమల మంత్రి శ్రీధర్బాబు సోద రుడు శ్రీనుబాబు.. అన్నకు వెన్నంటి ఉంటూ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలతో పాటు పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. యూత్ నేతగా మంచి పేరు తెచ్చుకున్నారు. నిత్యం వందలాది వివాహాలు, పరామర్శలతోపాటు అనేక సేవా కార్యక్రమాల్లో శ్రీనివాస్ ఉత్సహంగా పాల్గొంటున్నారు. అన్నకు తగ్గ తమ్ముడిగా మంచి పేరు సంపాదించుకున్నారు. మంథనితో పాటు ఇతర నియోజకవర్గాల్లో సైతం అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ యువతలో ఉత్సాహం నింపుతున్నారు. -
స్వీకరణతోనే సరి
● ప్రజావాణిపై పట్టింపు కరువు ● పరిష్కారానికి లభించని మోక్షం ● దరఖాస్తులు స్వీకరించినా తీరని సమస్యలు ● కలెక్టరేట్కు వచ్చినా తప్పని తిప్పలు సాక్షి, పెద్దపల్లి: ప్రజల ముంగిట్లోకి పాలన రావడ మే కాదు.. వారు ఎదుర్కొనే సమస్యలు తెలుసుకొ ని పరిష్కరించే లక్ష్యంతో ప్రతీ సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దీంతో తమ సమస్యలు తీర్చాలని జిల్లా కేంద్రానికొస్తున్న వేలా ది మంది అభాగ్యులు.. ఉన్నతాధికారులకు తమ బాధల్ని ఏకరువు పెడుతున్నారు. కానీ, ప్రభుత్వాని కి ఉన్న బాధ్యత, జవాబుదారీతనం, పారదర్శకత ను ప్రతిఫలించేలా అర్జీలకు అధికారులు పరిష్కారం చూపడంలేదు. కేవలం స్వీకరణతోనే అధికార యంత్రాంగం సరిపెడుతోంది. ఫలితంగా వందలాది దరఖాస్తులు ఇప్పటికీ అపరిష్కృతంగానే ఉండిపోతున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు 443 ఫిర్యాదులు ప్రజావాణికి రాగా, అందులో 187 సమస్యలు పరిష్కరించారు. మిగ తావి పరిష్కారానికి నోచుకోవడం లేదు. మండలాల్లో నిర్లక్ష్యం.. మండలస్థాయిలో అధికారులు తమ సమస్యలు పట్టించుకోవడం లేదని, కలెక్టర్ దష్టికి తీసకెళ్తే మొర ఆలకిస్తారని ఎంతోఆశతో కలెక్టరేట్కు వచ్చేవారికి నిరాశే ఎదురవుతోంది. వ్యయ, ప్రయాసలకోర్చి వ చ్చి వెళ్లడమే తప్ప తమకు ఒరిగేదేమీ లేదంటున్నా రు. జిల్లా వ్యాప్తంగా పదుల సంఖ్యలో అభాగ్యులు ప్రతీసోమవారం ప్రజావాణికి హాజరై ఉన్నతాధికారులకు తమ బాధలు మొరపెట్టుకుంటున్నారు. సంబంధిత శాఖల చుట్టూ చెప్పులరిగేలా తిరిగినా స్పందన లేక కలెక్టరేట్లోని ప్రజావాణిలో ఫిర్యాదు చేస్తున్నారు. కానీ, ఇక్కడా నిరీక్షణ తప్పడంలేదు. అమలుకు నోచుకోని కలెక్టర్ ఆదేశాలు ప్రజావాణి ఫిర్యాదులకు ప్రాధాన్యం ఇచ్చి పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశిస్తున్నారు. ప్రతీ సోమవారం వీటిపై సమీక్షిస్తున్నారు. కొన్ని శాఖలు తమ పరిధిలోని అర్జీలను త్వరగా పరిష్కరిస్తే.. సింహభాగం శాఖలు నిర్లక్ష్యం వహిస్తున్నాయి. లెక్కల్లో లేనివి అనేకం.. ప్రజావాణికి వచ్చేవారిలో కొందరే తమ అర్జీలను ఆన్లైన్లో నమోదు చేయిస్తున్నారు. మిగతావారు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి ఆ తర్వాత దరఖాస్తును తమ వెంట తీసుకెళ్తున్నారు. ఆన్లైన్లో నమోదు చేయిస్తే నంబరు ఆధారంగా సమస్య ప్రగతి వివరం తెలుసుకునే వీలుంటుంది. దరఖాస్తుదారులకు ఈ విషయంపై అవగాహన లేక అధికారులకు అర్జీలు సమర్పించి వెళ్తున్నారు. ఈ సమస్యలపైనే అధికం.. ప్రజావాణికి కొన్ని సమస్యలపై తరచూ ఫిర్యాదులు అందుతున్నాయి. భూ సమస్యలు, సామాజిక పింఛన్లు, క్షేత్రస్థాయి యంత్రాంగంపై ఫిర్యాదులు, గ్రా మాల్లో మౌలిక వసతులు, భూసేకరణ సమస్యలు, ఉపాధి అవకాశాలు, సంక్షేమ శాఖల రుణాలు, దివ్యాంగుల సమస్యలు, నిరాదరణకు గురవుతున్న వృద్ధులు.. ఇలాంటి అంశాలపైనే ప్రజావాణికి అధికంగా ఫిర్యాదు చేస్తున్నారు.(పీడీపీ01) వీరు గోదావరిఖని సమీపంలోని సుందిళ్ల గ్రామస్తులు. సింగరేణి ఓసీపీ–5లో భూములు కోల్పోయిన నిర్వాసితులకు పరిహారం చెల్లించేందుకు సర్వే చేసిన అధికారులు.. తొలుత కొందరికే పరిహారం చెక్కులు అందజేశారు. పరిహారం ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ రామస్వామి అనే విజిలెన్స్కు ఫిర్యాదు చేయడంతో మిగతా నిర్వాసితులకు పరిహారం ఆగిపోయింది. ఫిర్యాదుదారు అసలు రైతే కాదని నిర్వాసితులు వాపోతున్నారు. ప్రభుత్వం, సింగరేణి అధికారులు స్పందించి అర్హులకు పరిహారం చెల్లించాలని, అనర్హులు ఉంటే విచారణ జరిపి చర్య తీసుకోవాలని కోరారు. ఈమేరకు కలెక్టరేట్ ఎదుట సోమవారం ఆందోళన చేశారు. ఆ తర్వాత అదనపు కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. -
విస్తరణపై సింగరేణి నజర్
గోదావరిఖని: సింగరేణి బొగ్గ గనుల విస్తరణపై యాజమాన్యం దృష్టి సారించింది. కొన్ని ఏరియాల్లో కొత్తగనులకు అటవీ అనుమతులు అవసరంకాగా మరికొన్ని ఏరియాల్లో అన్వేషణ చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ప్రధానంగా మూడు ఏరియాల్లో కొత్తగనులు రాకపోతే భవిష్యత్ లేకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేస్తోంది. కొత్త బొగ్గు గనుల అన్వేషణ బాధ్యతలను ఆయా ఏరియాల జీఎంలకు అప్పగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. సింగరేణి సీఎండీ తొలిసారి అన్ని ఏరియాల జీఎంలతో మూ డురోజుల క్రితం ఈ అంశంపై సమీక్షించారు. కంపెనీ విస్తరణ, ఎదుర్కొంటున్న సమస్యలు, పరిష్కారంలో డైరెక్టర్లు, ముఖ్య అధికారులు పోషించాల్సిన పాత్రపై దిశానిర్దేశం చేశారు. బొగ్గు ఉత్పత్తి, రవాణాపై దృష్టి అన్ని ఏరియాల్లో బొగ్గు ఉత్పత్తి సాధించాలని సింరేణి సీఎండీ జీఎంలకు దిశానిర్దేశం చేశారు. బొగ్గు రవాణాలో తీసుకోవాల్సిన చర్యలను ఎప్పటికప్పుడు చేపట్టాలని పేర్కొన్నారు. బొగ్గు నాణ్యత, రక్షణతో కూడిన ఉత్పత్తి సాధించాలని, పనుల్లో సమర్థత ప్రదర్శించని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. మూడు ఏరియాల్లో కొత్తగనులు అవసరం సింగరేణిలో మొత్తం 11 ఏరియాలు ఉండగా, మూడు ఏరియాల్లో బొగ్గు నిల్వలు అంతరించి పోతున్నాయి. అక్కడ నూతన గనుల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేయాల్సి ఉంది. లేనిపక్షంలో ఇల్లెందు, మణుగూరు, బెల్లంపల్లి ఏరియాలకు భవిష్యత్ లేకుండా పోతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈనేపథ్యంలో నూతన గనుల కోసం ప్రయత్నాలు సాగించాల్సి ఉందని సింగరేణి భావిస్తోంది. ఇందుకోసం అటవీ అనుమతుల సాధనపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. నష్టాల నివారణపై అధ్యయన కమిటీ భూగర్భ గనుల్లోనూ నష్టాల నివారణపై ప్రత్యేక అధ్యయన కమిటీ ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలోనే కంపెనీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన శాంతిఖని, అడ్రియాల లాంగ్వాల్ ప్రాజెక్టుల్లో న ష్టాల నివారణపై అధ్యయనం చేసేందుకు ఈ కమిటీని ఏర్పాటు చేయనున్నారు. యంత్రాలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని, విధుల్లో నిర్లక్ష్యంగా ఉండే వారిని అవసరమైతే విధుల్లోంచి తొలగించాలని సీఎండీ ఆదేశించారు. గైర్హాజరు శాతాన్ని గణనీయంగా తగ్గించాలని, ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాలని దిశానిర్దేశం చేశారు. సింగరేణి సంస్థ ఒడిశాలో నూతనంగా ప్రారంభించిన నైనీ బ్లాక్లో బొగ్గు ఉత్పత్తి వేగవంతంపై దృష్టి సారించారు. సత్తుపల్లి వద్ద ఒక కోల్వాషరీ ఏర్పాటుపై కూడా ఉన్నత స్థాయి సమావేశంలో చర్చించారు. నూతన గనుల ఏర్పాటుపై దృష్టి ఏరియాల జీఎంలకు బాధ్యతలు కొత్త బొగ్గు గనులు రాకుంటే ఇల్లెందు, మణుగూరు, బెల్లంపల్లి ఏరియాలకు భవిష్యత్ ఉండదు. వాటికోసం అటవీ అనుమతుల ప్రక్రియ వేగంగా సాధించాలి. ఈబాధ్యతలను ఏరియా జీఎంలకు అప్పగించా లి. సంస్థ విస్తరణపై అధికారులు వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. ఇందుకు గల అవకాశాలపై అధ్యయనం చేయాలి. – సింగరేణి యాజమాన్యం -
బల్దియాలో రక్తదాన శిబిరం
కోల్సిటీ(రామగుండం): వందరోజుల ప్రణాళికలో భాగంగా బల్దియాలో జీజీహెచ్ బ్లడ్ క్యాంక్ ఆధ్వర్యంలో సోమవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. సుమారు 30 మంది స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. డిప్యూటీ కమిషనర్ వెంకటస్వామి, సూపరింటెండెంట్ శ్రీనివాస్, ఆర్ఐ శంకర్రావుతోపాటు చంద్రారెడ్డి, శంకర్స్వామి, సాయిరాం, రాజ్కుమార్, రవితేజ, శ్రీపాల్, కిరణ్, యుగాంత్, శ్రావణ్, మధూకర్, శ్రీకాంత్, కోటయ్య, సత్యనారాయణ, గంగరాజు, విశ్వతేజ, మెరుగు రాజేశ్, కేఎస్ వాసు పాల్గొన్నారు. రక్తదాతలకు బల్దియా కమిషనర్(ఎఫ్ఏసీ) అరుణశ్రీ అభినందించారు. -
పింఛన్తోనే బతకాలట
మాకు ఇద్దరు కొడుకులు ఉన్నరు. మా కష్టార్జితం ఆరెకరాల్లో చెరో రెండెకరాలను 16ఏళ్ల క్రితమే పంచి ఇచ్చినం. మిగిలింది మా పేరు మీద ఉంది. దానిని సైతం వారిద్దురూ దున్నుకుంటున్నరు. కనీసం కౌలు ఇవ్వడం లేదు. తిండి పెట్టడం లేదు. పింఛన్ మీదనే బతుకు అని అంటున్నరు. మీరే న్యాయం చేయాలి. – గాండ్ల సాయిలు, లలిత అబ్బాపూర్, జూలపల్లి అర్హులకు చెందేలా చూడాలి మా ఊరిలోని సర్వే నంబర్ 437లో సుమారు 50 ఎకరాలు ఉంది. మాదిగ సామాజికవర్గానికి చెందిన మే ము.. 70 కుటుంబాల వాళ్లం కలిసి ఉపాధికోసం అందులో సాగు చేసుకుంటున్నం. కొందరు ఇటీవల దౌర్జన్యంగా ఆ భూముల్లోకి చొరబడ్డరు. అది మా భూమి అంటూ భయభ్రాంతులకు గురిచేస్తున్నరు. రెవెన్యూ అధికారులు సర్వే చేసి అర్హులకు న్యాయం చేయాలె. – ఆరేపల్లి కృష్ణకుమార్, ఆరెంద, మంథని -
రామగుండం బల్దియాకు కొత్త వాహనం
కోల్సిటీ(రామగుండం): రామగుండం బల్దియాకు జేసీబీ కంపెనీకి చెందిన మినీ ట్రక్ ఎక్స్కావేటర్ వాహనం సో మవారం వచ్చిచేరింది. 15వ ఆర్థిక సంఘం నుంచి రూ.30లక్షలు వెచ్చించి ఈ వాహనం కొనుగోలు చేశారు. బ ల్దియా ఆవరణలో పార్క్చేసిన వాహనాన్ని ఈఈ రామన్ తనిఖీ చేశారు. దా ని పనితీరు, నాణ్యత, ఇతరత్రా అంశాలపై ఆరా తీశారు. దీనిద్వారా చిన్న, పెద్దనాలాల్లోని పూడిక తొలగించడంతోపాటు గల్లీల్లోనూ వివిధ పనులు చేపట్టడానికి ఉపయోగిస్తామని ఈఈ తెలిపారు. డీఈ శాంతిస్వరూప్, ఏఈ అన్వేష్, కాంట్రాక్టర్ మేరుగు రాజేశ్, జేసీబీ కంపెనీ ప్రతినిధులు ఉన్నారు. న్యాయవాదులకు శిక్షణ పెద్దపల్లిరూరల్: ఎస్సీ న్యాయవాదుల కు ప్రభుత్వ న్యాయవాదితో శిక్షణ ఇ ప్పిస్తామని ఎస్సీ అభివృద్ధి అధికారి వి నోద్కుమార్ తెలిపారు. ఆసక్తి, అర్హత గలవారు జూలై 31వ తేదీలోగా దరఖా స్తు చేసుకోవాలని సూచించారు. తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.2 లక్షల మించి ఉండకూడదన్నారు. వివరాల ను www.telanganaepass.cgg.gov.in వెబ్సైట్లో నమోదు చేయాలని ఆయన సూచించారు. దివ్యాంగులకు ఆధునిక ఉపకరణాలు పంపిణీపెద్దపల్లిరూరల్: ఉపకరణాల కోసం దివ్యాంగులు ఈనెల 18వ తేదీలోగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకో వాలని జిల్లా సంక్షేమాధికారి వేణుగోపాల్ సోమవారం తెలిపారు. వందశా తం రాయితీపై ఆధునిక ఉపకరణాలు పంపిణీ చేస్తున్న ప్రభుత్వం.. ఆసక్తిగల వారి కోసం https://tsobmms. cgg. gov.in// వెబ్సైట్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తోందని ఆయన పేర్కొన్నా రు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. -
జనం ఎక్కడుంటే.. ప్రచారం అక్కడే..
కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): వైద్యశిబిరం.. రేష న్ షాపు.. ఆర్టీసీ బస్టాండ్.. ప్రధాన కూడళ్లు.. ఉ పాధిహామీ కూలీల పని ప్రదేశాలు.. చెట్లనీడ.. ఇ లా ప్రజల రద్దీ అధికంగా ఉండే ప్రాంతాలను ప్ర చార వేదికలుగా చేసుకుంటున్న ఎంఈవో సిరిమ ల్ల మహేశ్కుమార్.. సర్కార్ స్కూల్లోనే పిల్లలను చేర్పించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఆధునిక హంగులు, సకల సౌకర్యాలు, డి జిటల్ విద్యాబోధన, బంధాలు, బంధుత్వాలు, ఆడుతూపాడుతూ.. అమ్మమ్మ.. బామ్మ.. తాతయ్యలు చెప్పే కథలు, జోలపాటలు వింటూ ఉన్న ఊళ్లోనే సర్కారు బడిలో పిల్లలకు చదువు నేర్పించాలని కోరుతున్నారు. ఈక్రమంలోనే ఆదివారం ఓ స్వచ్ఛంద సంస్థ చేపట్టిన వైద్య శిబిరం వద్ద ఎంఈవో బడిబాట నిర్వహించారు. తమ స ర్కారు బడిలోనే పిల్లలను చేర్పించాలని కోరారు. హెచ్ఎం రాజారాం, ఉపాధ్యాయులు ఉన్నారు. -
అంబేడ్కర్ ఆశయ సాధనకు కృషి
పాలకుర్తి(రామగుండం): అంబేడ్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలని రామగుండం ఎమ్మె ల్యే మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్ అన్నారు. ఈసాలతక్కళ్లపల్లిలో ఏర్పాటు చేసిన అంబేడ్కర్ వి గ్రహాన్ని ఆయన ఆదివారం ఆవిష్కరించి మా ట్లాడారు. మక్కాన్సింగ్ సేవాసమితి అధ్యక్షురాలు మనాలీ ఠాకూర్, అంబేడ్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మామిడిపల్లి బాప య్య తదితరులు పాల్గొన్నారు. ‘ఖని’లో చేప ప్రసాదం పంపిణీగోదావరిఖనిటౌన్: మృగశిర కార్తె సందర్భంగా ఆయుర్వేద డాక్టర్ పరశురాములు తనయు డు కుమార్ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక ప్ర ధాన చౌరస్తాలో చేప ప్రసాదం పంపిణీ చేశా రు. సుమారు 40 ఏళ్లుగా ఏటా మృగశిర సందర్భంగా చేపప్రసాదం పంపిణీ చేస్తున్నామని కుమార్ తెలిపారు. 101 వనమూలికలతో త యారు చేసే చేపప్రసాదంతో ఆస్తమా, గుండెజబ్బులు వంటి వ్యాధులు నియంత్రణలోకి వస్తాయని డాక్టర్ కుమార్ పేర్కొన్నారు. నేడు, రేపు రెవెన్యూ సదస్సులు పెద్దపల్లిరూరల్: చందపల్లి, బంధంపల్లి గ్రామా ల రైతుల కోసం సోమ, మంగళవారాల్లో పెద్దపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో భూ భారతి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామ ని అధికారులు తెలిపారు. రోజూ ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు సదస్సులో అధికారులు అందుబాటులో ఉంటారని, ప్రజలు సమస్యలపై ఆధారాలతో దరఖాస్తు చేసుకోవాలన్నారు. 30లోగా దరఖాస్తు చేయాలి పెద్దపల్లిరూరల్: సీఎం ఓవర్సీస్ పథకం కింద స్కాలర్షిప్, ఆర్థిక సాయం కోసం ఈనెల 30 వ తేదీలోగా మైనారిటీ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మైనారిటీ సంక్షేమ అధి కారి రంగారెడ్డి తెలిపారు. విదేశీ యూనివర్సిటీ ల్లో చదువుకునేందుకు ఇంజనీరింగ్లో 60 శా తం, పీజీలో 60 శాతం మార్కులు సాధించి, కుటుంబ వార్షికాదాయం రూ.5 లక్షల్లోపు ఉండాలన్నారు. అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, కె నడా, సింగపూర్, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, న్యూజీలాండ్, దక్షిణ కొరియా దేశాల్లోని యూ నివర్సిటీల్లో ప్రవేశం పొంది ఉండాలని, వివరాలకు వెబ్సైట్ www.telanganaepass. cgg.gov.inలో సంప్రదించాలన్నారు. ప్రవేశాల ప్రక్రియ పరిశీలన యైటింక్లయిన్కాలనీ: సెక్టార్–3 సింగరేణి పాఠశాలలో సీబీఎస్ఈ పద్ధతిన ఈ విద్యా సంవ త్సరం నుంచే విద్యాబోధన చేస్తున్నారు. ఇందు లో ప్రవేశాల కోసం చేపట్టిన స్క్రినింగ్ టెస్ట్ ప్ర క్రియను సింగరేణి ఎడ్యుకేషనల్ సొసైటీ కార్యదర్శి శ్రీనివాస్ ఆదివారం పరిశీలించారు. ప్రవేశాల ప్రక్రియ పారదర్శకంగా ఉంటుందన్నా రు. ప్రతిభ ఆధారంగానే సింగరేణి కార్మికుల పి ల్లలకు 80శాతం, ఇతరులకు 20 శాతం రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తున్నామని తెలిపారు. ఈనెల 12న సీబీఎస్ఈ విద్యాబోధన ప్రారంభిస్తా మని అన్నారు. హెచ్ఎం సుందర్రావు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఓదెల మల్లన్నకు నైవేద్యం ఓదెల(పెద్దపల్లి): ఓదెల మల్లికార్జునస్వామి సన్నిధిలో ఆదివారం భక్తుల రద్దీ పెరిగింది. ఒగ్గు పూజారులతో స్వామివారికి పట్నాలు వేయించి, బోనంతో నైవేద్యం సమర్పించారు. ఆలయ అధికారులు ఏర్పాట్లు పర్యవేక్షించారు. రెవెన్యూ మేళాకు స్పందన కోల్సిటీ(రామగుండం): రామగుండం బల్దియాలో ఆదివారం రెవెన్యూ మేళా నిర్వహించారు. తమ నివాసం కమర్షియల్ కేటగిరీలోకి చేర్చినందున ఆస్తిపన్ను అధికంగా వస్తుందని కొందరు, కొలతలు సవరించి ఆస్తిపన్ను తగ్గించాలని, పేర్లలో అక్షరదోషాలు సరిచేయాలని మరికొందరు దరఖాస్తు చేశారు. -
అడ్లూరి లక్ష్మణ్ అనే నేను..
● ఉమ్మడి జిల్లాకు మరో మంత్రి పదవి ● అడ్లూరి లక్ష్మణ్ను వరించిన అవకాశం ● విధేయతకు దక్కిన ప్రాధాన్యం ● మూడుకు చేరిన మంత్రుల సంఖ్య ● పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ముగ్గురు మంత్రులు ● కవ్వంపల్లికి విప్ ఇచ్చే అవకాశంధర్మపురికి అచ్చొచ్చిన మంత్రి పదవి తెలంగాణ ఏర్పాటు నుంచి జరిగిన మూడు అసెంబ్లీ ఎన్నికల్లో ధర్మపురి నియోజకవర్గానికి మంత్రివర్గంలో చోటు లభిస్తోంది. 2014లో గెలిచిన కొప్పుల చీఫ్విప్గా కేబినెట్ హోదా అందుకోగా, 2018లో సంక్షేమశాఖ మంత్రిగా వ్యవహరించారు. 2023లో గెలిచిన అడ్లూరి మొదట ప్రభుత్వ విప్గా, తాజాగా మంత్రిపదవి చేపట్టారు.సాక్షి ప్రతినిధి, కరీంనగర్: కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు మంత్రిపదవుల్లో పెద్దపీట దక్కింది. ఎన్న డూ లేని విధంగా ముగ్గురు మంత్రి పదవులను దక్కించుకోగా, గడ్డం వివేక్ సైతం ఉమ్మడి జిల్లాతో అనుబంధం కలిగి ఉన్నవారే. దీంతో మొత్తంగా రాష్ట్ర కేబినెట్లో జిల్లావాసులకు సముచిత స్థానం దక్కిందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని 13 నియోజకవర్గాలకు గానూ ఎనిమిది స్థానాల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేయగా, దానికి తగ్గట్టుగా మంత్రి పదవులు దక్కాయనే కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. ఉమ్మడి జిల్లానుంచి ఇప్పటికే దుద్దిళ్ల శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్ మంత్రులుగా కొనసాగుతుండగా, తాజాగా ధర్మపురి నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన అడ్లూరి లక్ష్మణ్ అదివారం రాజ్భవన్లో మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలవగా, అందులో ముగ్గురికి మంత్రి పదవులు దక్కటంతో కార్యకర్తలు, అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. అన్ని వర్గాలకు సమప్రాధాన్యం కాంగ్రెస అధికారంలోకి వచ్చిన తరువాత ఏర్పాటు చేసిన తొలిమంత్రివర్గ విస్తరణలో బ్రహ్మణ సామాజికవర్గానికి చెందిన శ్రీధర్బాబు, బీసీగౌడ్ నుంచి పొన్నం ప్రభాకర్కు మంత్రి పదవులు దక్కాయి. మాదిగ సామాజికవర్గానికి చెందిన అడ్లూరి, ము న్నూరు కాపు అయిన ఆది శ్రీనివాస్లకు ప్రభుత్వ విప్లుగా అవకాశం కల్పించారు. ఆదివారం రెండో విడత మంత్రివర్గ విస్తరణలో అడ్లూరికి మంత్రిపదవి లభించింది. మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు చివరి నిమిషంలో కేబినెట్లో చోటు దక్కకపోయినా.. ప్రభుత్వ విప్ ఇచ్చే అవకా శాలున్నట్లు గాంధీభవన్ వర్గాలు చెప్పుతున్నాయి. తొలిసారి ఎమ్మెల్యే.. కేబినెట్లోకి సుదీర్ఘకాలంగా పార్టీలోనే కొనసాగుతున్న అడ్లూరి లక్ష్మణ్కుమార్కు మంత్రి పదవిరావడం విధేయతకు పట్టం కట్టినట్లయింది. కార్మిక క్షేత్రమైన గోదావరిఖని నుంచి కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లో అడుగుపెట్టిన అడ్లూరి ఎన్ఎస్యూలో స్టూడెంట్ లీడర్గా, యూత్ కాంగ్రెస్లో, జెడ్పీటీసీ, జెడ్పీచైర్మన్, కార్పొరేషన్ చైర్మన్, జగిత్యాల డీసీసీ అధ్యక్షుడిగా వివిధ హాదాల్లో పనిచేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొంది, ప్రభుత్వ విప్గా కొనసాగగా, తాజాగా కేబినెట్లో చోటు సంపాదించారు. అడ్లూరి లక్ష్మణ్ నేపథ్యం 1982 నుంచి 85 వరకు గోదావరిఖని జూనియర్ కళాశాల ఎన్ఎస్యూఐ అధ్యక్షుడిగా పని చేశారు. 1986 నుంచి 94 వరకు ఎన్ఎస్యూఐ కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా, 1996 నుంచి 2001 వరకు ఏపీ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా కొనసాగారు. 2006లో ధర్మారం (ఎస్సీ) రిజర్వుడ్ స్థానం నుంచి జెడ్పీటీసీగా పోటీ చేసి గెలిచారు. 1999లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో మేడారం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. 2010–12 వరకు కరీంనగర్ జెడ్పీ చైర్మన్గా పని చేశారు. 2009లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో, 2010లో జరిగిన ఉప ఎన్నికల్లో ధర్మపురి నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయారు. 2014, 2018లో ధర్మపురి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2013–14వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా పని చేశారు. 2018లో జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ధర్మపురి నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ తన సమీప బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ పై 22,039 ఓట్ల మెజారిటీతో గెలిచారు. తొలిసారిగా అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. 2023 డిసెంబర్ 15న ప్రభుత్వ విప్గా ప్రభుత్వం నియమించింది. తాజాగా ఆయనకు కేబినెట్లో బెర్త్ కల్పించింది. -
చైతన్యవంతం చేస్తున్నాం
వర్షాకాలం సందర్భంగా గ్రామాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలను చైతన్యవంతం చేస్తున్నాం. ఇందుకోసం తరచూ సమావేశాలు నిర్వహిస్తున్నాం. వ్యాధులపై అప్రమత్తం చేస్తున్నాం. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అర్బన్ పీహెచ్సీల్లో అవసరమైన మందులు అందుబాలో ఉన్నాయి. – అన్న ప్రసన్న కుమారి, డీఎంహెచ్వో పారిశుధ్యంపై శ్రద్ధ వర్షాకాలం ప్రారంభానికి ముందే పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించాం. పారిశుధ్యం మెరుగుపర్చడంపై సూచనలు చేశాం. అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకుంటున్నాం. ఇంటికి వచ్చే పారిశుధ్య సిబ్బందికి ప్రజలు తడి, పొడి చెత్త వేరుచేసి ఇచ్చి సహకరించాలి.– వీరబుచ్చయ్య, డీపీవో -
జూన్ ఫీవర్
సాగు ఖర్చూ తడిసి మోపెడు.. ఉమ్మడి జిల్లాలో సుమారు 6,10,102 మంది రైతులు దాదాపు 12,82,207 ఎకరాల్లో వానాకాలం పంటలు పండిస్తారని అధికారులు అంచ నా వేశారు. తొలకరితో పెట్టుబడి సమయం అసన్నమైంది. భూములను చదునుచేసి, దుక్కిదున్ని, విత్తనాలు, ఎరువులకు పెద్దమొత్తంలో ఖర్చు చేయాల్సి ఉంటుంది. పెరిగిన యాంత్రీకరణ, ఎరువులు, విత్తనాల ధరలు, కూలీల కొరత రైతులను ఏటా వేధిస్తూనే ఉన్నాయి. దీనికితోడు అకాల వర్షాలు, చీడపీడలతో దిగుబడి తగ్గి అన్నదాతలు అప్పుల ఊబిలో చిక్కుకుంటున్నారు. సాగులో ఖర్చు తగ్గించుకునేందుకు విత్తనాలు సొంతగా తయారు చేసుకోవడం, ఆధునిక సాంకేతికను వినియోగించుకోవడం ద్వారా ఆదాయం పెంచుకునేలా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. అయినా, పిల్లల చదువులు, వ్యవసాయ పెట్టుబడులు, సీజనల్ వ్యాధులతో ఖర్చులు తడిసిమోపెడవుతున్నాయని ప్రజలు వాపోతున్నారు. సాక్షి, పెద్దపల్లి: వేసవి సెలవుల్లో ఆటాపాలతో ఆనందంగా గడిపిన విద్యార్థులు.. పుస్తకాలతో కుస్తీ పట్టేందుకు పాఠశాలలు, కళాశాలలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.. ఇదేసమయంలో తొలకరితో ఎరువులు, విత్తనాల కొనుగోలు తదితర ఖర్చులతో సామాన్యులు ‘అమ్మో.. జూన్’ అని ఆందోళన చెందుతున్నారు. దీనికితోడు వానలతో మారుతున్న వాతావరణ పరిస్థితులతో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం.. ఇలా అన్ని రకాల ఖర్చులు ఈనెలలో రానుండడంతో ఎలా గడపాలో తెలియక ప్రజలు తికమకపడుతున్నారు. జూన్ నెల పేద, మధ్యతరగతి కుటుంబాల్లో వణుకు పుట్టిస్తోంది. పెన్సిల్ నుంచి పుస్తకాల వరకూ మోతే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 938 ప్రైవేట్ పాఠశాలలు ఉండగా అందులో సుమారు 2,26,829 మంది విద్యార్థులు చదువుతున్నారు. పాఠశాలలు పునఃప్రారంభం అంటేనే ఫీజులు, పుస్తకాలు, నోట్బుక్సులతోపాటు, వాటిని భద్రపరుచుకునేందుకు బ్యాగులు, లంచ్ బాక్స్లు, పెన్నులు, పెన్సిళ్లు, టైబెల్టులు, యూనిఫామ్స్.. ఇలా ఒక్కటేమిటి?.. రకరకాల వస్తువులు ఆయా పాఠశాల్లోనే కొనుగోలు చేయాల్సిన పరిస్థితి. దీంతో యాజమాన్యాలు చెప్పిన ధర చెల్లించలేక తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు. ఇంటర్ కాలేజీల్లో సైతం ఏసీ క్యాంపస్లు, నాణ్యమైన విద్యాబోధన పేరిట రూ.లక్షల్లో ఫీజు వసూలు చేస్తుండడంతో ఆర్థికభారమైనా.. తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్ కోసం అప్పు లు తెచ్చి మరీ చెల్లిస్తున్నారు. స్టేట్, సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ తదితర బోర్డుల పేరిట నర్సరీ చదువులకే రూ.30వేలకుపైగా ఫీజులు వసూలు చేస్తున్నారు. ఫీజుల దోపిడీ యథేచ్ఛగా సాగుతున్నా.. పర్యవేక్షణ, నియంత్రణ మచ్చుకై నా కనిపించడం లేదు. భయపెడుతున్న వైరల్ ఫీవర్ ఒకసీజన్ నుంచి మరోసీజన్లోకి ప్రవేశించేటప్పుడు వాతావారణం చల్లబడి వైరల్ ఇన్ఫెక్షన్లు, జ్వరాల తీవ్రత ఉంటుంది. దోమల బెడత పెరిగి ప్రతీ పదిమందిలో నలుగురికి జ్వరం, గొంతునొప్పి, జలుబు, దగ్గు వంటి సమస్యలు చుట్టుముడుతున్నాయి. దీంతో వైద్యం కోసం తరచూ ఆస్పత్రులకు వెళ్లేపరిస్థితి నెలకొని ఉంటోంది. ముఖ్యంగా చిన్నపిల్లల్లో సీజనల్ వ్యాధుల ప్రభావం అధికంగా ఉంటుంది. దీంతో ఏటా జూన్, జూలైలో జ్వరాలతో ఆస్పత్రుల పాలై జేబులు గుల్లచేసుకునే వారు అధికంగానే ఉన్నారు. ఓపీ, టెస్టుల పేరిట ఆస్పత్రుల యాజమాన్యాలు పిండిపిప్పి చేస్తుండటంతో ఈవానాకాల అంటేనే జనాలు భయపడుతున్నారు. వ్యాధుల బారిన పడిన తర్వాత వైద్యఖర్చులకు భయపడడం కన్నా.. ముందు జాగ్రత్తలు తీసుకోవడంతో డబ్బు ఆదాతోపాటు టెన్షన్ ఉండదని నిపుణులు అంటున్నారు. చదువుల ఫీజులు.. సాగు పెట్టుబడులు.. సీజనల్ వ్యాధులు అన్ని ఖర్చులూ ఒకే నెలలో రావడంతో సర్వత్రా ఆందోళన ఆర్థికభారంతో హడలెత్తిపోతున్న సామాన్య ప్రజలు పెట్టుబడులు పెరిగాయ్ వ్యవసాయం రోజురోజుకూ భారంగా మారుతంది. పెరిగిన ఖర్చులతో సాగు చేయడం కష్టంగా మారింది. ఎరువులు, విత్తనాల ధరలు, కూలీల రేట్లు పెరుగుదలలో పోటీపడుతున్నాయి. సాగు సీజన్ వచ్చిందంటే హడలెత్తిపోవాల్సిన పరిస్థితి నెలకొంది. – మహేశ్గౌడ్, రైతు జూన్ అంటేనే భయం నాకు ఇద్దరు పిల్లలు. ఒకరు యూకేజీ, మరొకరు సెకండ్ క్లాస్. జూన్ వచ్చిందంటే అడ్మిషన్లు, పుస్తకాలు, బ్యాగులు, డ్రెస్ల కోసం భారీగా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. దీనికితోడు ప్రైవేట్ పాఠశాలలు ఏటా ఫీజులు పెంచుతూ మరింత ఆర్థిక భారం మోపుతున్నాయి. – రాదాసు శైలజ, గృహిణి -
ప్రచారం.. విస్తృతం
● జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అప్రమత్తం ● సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అధికారుల ముందస్తు చర్యలు ● నగరం, పట్టణాలు, పల్లెల్లో ప్రజలకు అవగాహనసుల్తానాబాద్(పెద్దపల్లి): వర్షాకాలం ప్రారంభమైంది. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. ఈసారి రోహిణి కార్తెకు ముందే వర్షాలు కురవడంతో వ్యాధుల ప్రభావం అధికంగా ఉంటుందని భావిస్తున్న అధికారులు.. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అధికారుల అప్రమత్తం జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి అన్న ప్రసన్నకుమారి ఆధ్వర్యంలో డీపీవో, వివిధ శాఖల ఇంజినీరింగ్ అధికారులతో ఇటీవల సమావేశమయ్యారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమీక్షించారు. వైద్యులు, గ్రామ పంచాయతీ కార్యదర్శులూ సమావేశానికి హాజరయ్యారు. నీటి నిల్వలు లేకుండా, డ్రైనేజీలను తరచూ శుభ్రం చేయాలని, రక్షిత తాగునీటి పథకాల్లో తరచూ బ్లీచింగ్ పౌడర్ చల్లించాలని, క్లోరినేషన్ చేసిన నీటినే సరఫరాచేయాలని, నీటి నిల్వలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో గంబూషియా చేపలు వదలాలని సూచించారు. విషజ్వరాలు, డెంగీ, మలేరియా తదితర వ్యాధులు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవడమే ఉత్తమని సూచించారు. అందుబాటులో ఉండాల్సిందే.. గ్రామాల్లోని హెల్ట్ సబ్ సెంటర్ల పరిధిలో ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు, సూపర్వైజర్లు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ అయ్యాయి. గ్రామ పంచాయతీ కార్యదర్శులు, కారోబార్లు, మల్టీపర్పస్ వర్కర్లు నిత్యం అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వీరందరినీ డాక్టర్లు పర్యవేక్షిస్తున్నారు. ఏటా ఏదోవ్యాధి బారిన పడి ఒక్కో కుటుంబం రూ.లక్షల్లో వైద్యం కోసం ఖర్చుచేసి ఆర్థికంగా ఇబ్బందులు పడుతోందని గుర్తించిన సర్కారు.. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడమే పరిష్కారమని భావిస్తోంది. స్వచ్ఛ శుక్రవారం నిర్వహణపై దృష్టి.. వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో స్వచ్ఛ శుక్ర, మంగళవారాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా డ్రమ్ములు, కుండలు, ట్యాంకర్లు, టైర్లలోని నీటినిల్వలు పారబోస్తున్నారు. పరిసరాలను మ ల్టీపర్పస్ వర్కర్లతో నిత్యం శుభ్రం చేయిస్తున్నా రు. నీటినిల్వల్లో దోమలు, బ్యాక్టీరియా వృద్ధి చెంది దాడి చేయడంతో ప్రజలు టైఫాయిడ్, మలేరియా, విషజ్వరాలు, డెంగీ తదితర ప్రాణాంతక వ్యాధులకు గురవుతున్నారు. దీంతో నీటినిల్వలు తొలగించడం, పారిశుధ్యం మెరుగుపర్చడం, దోమలు వృద్ధి చెందకుండా చర్యలు చేపట్టడం, దోమతెరలు వాడడం తదితర అంశాలపై అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. -
ధాన్యం కొనుగోళ్లలో రికార్డు
● 4.26 లక్షల క్వింటాళ్ల వడ్లు సేకరణ ● మంథని పీఏసీఎస్ జిల్లాలోనే అగ్రస్థానం మంథని: ధాన్యం కొనుగోళ్లలో మంథని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం జిల్లాలోనే రికార్డ్ సృష్టించింది. అత్యధికంగా వడ్లు కొనుగోలు చేసి గత రికార్డులు బ్రేక్ చేసింది. జిల్లాలోనే మంథని పీఏసీఎస్ అధికం సంఖ్యలోనూ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తోంది. ఐదేళ్లలో అత్యధిక స్థాయి లో ధాన్యం కొనుగోళ్లు చేస్తూ వస్తోంది. ఈసారి ఏకంగా 4లక్షల 26వేల 860 క్వింటాళ్ల ధాన్యం సేకరించి సరికొత్త రికార్డు సృష్టించింది. 35 కేంద్రాల్లో కొనుగోళ్లు పూర్తి.. ● ఈయాసంగి సీజన్లో మంథని సంఘం పరిధి లోని 35 కేంద్రాల్లో కొనుగోళ్లు పూర్తి చేసింది. ● 2021 యాసంగి సీజన్లో 32 కేంద్రాలు నిర్వహించి 4,414 మంది రైతుల నుంచి 64వేల031 క్వింటాళ్ల ధాన్యం సేకరించి రూ.68 కోట్ల 70 లక్షల70వేల612 వ్యాపారం చేసింది. ● 2021–22 వానాకాలం సీజన్లో 32 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 4,844 మంది రైతుల నుంచి 3లక్షల 19వేల879 క్వింటాళ్ల ధాన్యం సేకరించి రూ. 62కోట్ల 31లక్షల 95వేల 424 వ్యాపారం చేసింది. ● యాసంగి సీజన్లో 32 కొనుగోలు కేంద్రాలు నిర్వహించి 2,649 మంది రైతుల నుంచి 1 లక్ష 79వేల476 క్వింటాళ్ల వడ్లు సేకరించి రూ.35కోట్ల 17లక్షల 40వేల 816 వ్యాపారం చేసింది. ● 2022–23 వానాకాలం సీజన్లో 34 కొనుగోలు కేంద్రాల ద్వారా 5,009 మంది రైతుల నుంచి 3లక్షల 48వేల 044 క్వింటాళ్ల ధాన్యం సేకరించి రూ.71కోట్ల 34లక్షల 11వేల 740 వ్యాపారం చేసింది. ● 2023 యాసంగి సీజన్లో 33 కేంద్రాలు నిర్వహించి 3,820 మంది రైతుల నుంచి 3లక్షల 63వేల 360 క్వింటాళ్ల వడ్లు సేకరించి రూ.74కోట్ల 28లక్షల 80వేల 560 వ్యాపారం నిర్వహించింది. ● 2023–24 వానాకాలం సీజన్లో 33 కేంద్రాల ద్వారా 3,117 మంది రైతుల నుంచి 2లక్షల 28వేల 932 క్వింటాళ్ల ధాన్యం సేకరించి రూ.46కోట్ల 97లక్షల 17వేల 232 వ్యాపారం చేసింది. ● 2024 యాసంగి సీజన్లో 37 కేంద్రాలు నిర్వహించి 5,109 మంది రైతుల నుంచి 3లక్షల 68వేల 248 క్వింటాళ్ల వడ్లు సేకరించి రూ.75కోట్ల 40లక్షల 55వేల 408 వ్యాపారం చేసింది. ● 2024–25 వానాకాలం సీజన్లో 35 కేంద్రాలు నిర్వహించి 5,216 మంది రైతుల నుంచి 3లక్షల 69వేల 823 క్వింటాళ్లు సేకరించి రూ.85కోట్ల 13లక్షల 19వేల 511 వ్యాపారం చేసింది. ● 2025 యాసంగిలో 35 కేంద్రాలు నిర్వహించి 5,148 మంది రైతుల నుంచి 4లక్షల 26వేల 860 క్వింటాళ్ల ధాన్యం సేకరించి రూ.98కోట్ల 46లక్షల 11వేల 472 వ్యాపారం చేసింది. అందరి సహకారంతోనే.. జిల్లాలో రికార్డు స్థాయిలో ధాన్యం సేకరణ అందరి సహకారంతోనే సాధ్యమైంది. విజయవంతంగా కొనుగోళ్లు చేసేలా సహకరించిన ఐటీ, పరిశ్రమలు, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబుతోపాటు అధికారులకు కృతజ్ఞతలు. రైతులకు ఇబ్బంది కలుగకుండా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాం. మంత్రి ప్రత్యేక చొరవతో రైతుల నుంచి గింజ కూడా కోత విధించలేదు. – కొత్త శ్రీనివాస్, చైర్మన్, మంథని పీఏసీఎస్ -
ఇబ్బందులకు గురవుతున్నాం
పట్టణంలోని ప్రధానరోడ్ల అభివృద్ధి పనులు నత్తనడకన.. నాసిరకంగా సాగుతున్నాయి. బల్దియా అధికారుల పర్యవేక్షణలో పనులు జరిగేలా ఉన్నతాధికారులు చొరవ చూపాలి. పనుల్లో జాప్యంతో ఇబ్బందులకు గురవుతున్నాం. – దాడి సంతోష్, న్యాయవాది త్వరగా పూర్తిచేయాలి పట్టణంలోని రోడ్లపై పోసిన కంకరతో కష్టాలు పడుతున్నాం. పనుల నిమిత్తం పెద్దపల్లికి వస్తే వాహనాలకు మరమ్మతులు తప్పడం లేదు. నెలల తరబడి ఇదే పరిస్థితి ఉన్నా అధికారులు చొరవ చూపడం లేదు. పనులు త్వరగా పూర్తిచేయాలి. – మిట్టపల్లి శ్రీనివాస్, పెద్దబొంకూర్ పురోగతిలో పనులు జిల్లా కేంద్రంలో చేపట్టిన రహదారుల విస్తరణ, మురుగునీటి కాలువల పనులు పురోగతిలో ఉన్నాయి. వీలైనంత త్వరగా పనులు పూర్తిచేస్తాం. డ్రైనేజీల్లో చేరుతున్న మురుగునీటిని తొలగిస్తూ పనులు చేయాల్సి రావడంతో కొంతసమయం పడుతోంది. ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా వీలైనంత త్వరగా పనులు పూర్తిచేస్తాం. – సతీశ్, ఏఈ, పెద్దపల్లి మున్సిపాలిటీ -
కేబినెట్లోకి ఎవరో?
● ఉమ్మడి జిల్లా నుంచి ఒకరికి అవకాశం ● కవ్వంపల్లి, ఆది, అడ్లూరిలో ఒకరికి చోటు? ● ఉత్కంఠలో ఆశావహులుసాక్షిప్రతినిధి,కరీంనగర్: ఎప్పుడెప్పుడా.. అని ఎదురుచూస్తున్న తె లంగాణ రాష్ట్ర ప్రభుత్వ మంత్రివర్గ విస్తరణ ఉ త్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. కాంగ్రెస్ అధి ష్టానం గ్రీన్సిగ్నల్ ఇవ్వడంతో కేబినెట్ విస్తరణ ఆదివారం జరుగనుంది. కేబినెట్లో ఉమ్మడి క రీంనగర్ జిల్లాకు మంత్రి పదవి దక్కడం ఖాయమనే సమాచారం ఉంది. ప్రభుత్వ విప్లు ఆది శ్రీనివాస్, అడ్లూరి లక్ష్మణ్కుమార్, కరీంనగర్ డీ సీసీ అధ్యక్షుడు, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణలలో ఒకరికి చోటు లభించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మంత్రివర్గ విస్తరణలో ఉమ్మడి జిల్లా పరిధిలో ఒకరికి మంత్రి పదవి కట్టబెట్టి, ప్రభుత్వం చేపడుతున్న సంక్షే మ, అభివృద్ధి కార్యక్రమాలను గురించి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చే యాలని ఆలోచన చేశారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజ ల మద్దతును కూడగట్టే భాగంగా అధిష్టానం ఉ మ్మడి జిల్లాలో ఒకరికి మంత్రి పదవీ ఇచ్చేందుకు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ప్రభుత్వ వి ప్గా కొనసాగుతున్న రాజన్న సిరిసిల్ల జిల్లా వే ములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మున్నూరు సామాజికవర్గం కోటాలో మంత్రివర్గంలో బెర్తు ఖాయమనే ఊహగానాలు వినబడుతున్నాయి. ఎస్సీ సామాజికవర్గం నుంచి ప్రభుత్వ విప్, జగి త్యాల జిల్లా ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్కుమార్, కరీంనగర్ జిల్లా మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు కేబినెట్లో చోటు ఖాయమని వారి అనుచరులు ధీమాగా ఉన్నారు. ఉమ్మడి జిల్లా నుంచి ఇప్పటికే మంత్రులుగా దు ద్దిళ్ల శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్లు వ్యవహరిస్తుండగా ప్రస్తుత మంత్రివర్గంలో ఆది శ్రీనివా స్, అడ్లూరి లక్ష్మణ్కుమార్, కవ్వంపల్లి సత్యనారా యణలలో ఒకరిని తీసుకుని రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం అయ్యేలా పార్టీ అధిష్టా నం సమాలోచనలు జరిపినట్లు తెలిసింది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జీగా వ్యవహరి స్తున్న మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్రెడ్డి ఈ మేరకు కొత్తగా ఎన్నికైన నేతలు, సీనియర్ నేతలను సామాజిక వర్గం అంశాలను దృష్టిలో ఉంచుకొని ఉమ్మడి కరీంనగర్ నుంచి కేబినెట్లో ఒకరిని మంత్రిగా నియమించేందుకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు సమాచారం. ఆదివారం జరిగే కేబి నెట్ విస్తరణలో జిల్లా నుంచి ఈ ముగ్గురిలో ఒకరికి చోటు దక్కి ఉత్కంఠకు తెరపడనుంది. -
అరెస్ట్ చేసి ఎన్కౌంటర్లా?
గోదావరిఖని: మావోయిస్టు నాయకులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పర్చకుండా ఎన్కౌంటర్ చే యడం ఏమిటని సీపీఐ (ఎంఎల్) న్యూడెమొక్రసీ నేత చలపతిరావు విమర్శించారు. శనివారం స్థానిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆదివాసీలకు నాయకత్వం వహిస్తున్న మావోయిస్టులను బూటకపు ఎన్కౌంటర్లు చేసి చంపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మూడురోజుల క్రితం ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ నేషనల్ పార్క్లో అరెస్టు చేసిన మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు(చలం) సుధాకర్ను చిత్రహింసలు పెట్టి దారుణంగా ఎన్కౌంటర్ చేశారని ఆరోపించారు. పోలీసుల అధీనంలో ఉన్న మిగతా నాయకులను కూడా ఎన్కౌంటర్ చేసి చంపివేసే ప్రమాదం ఉందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. శాంతిచర్చలకు ముందుకు వచ్చిన మా వోయిస్ట్లు కాల్పుల విరమణ పాటిస్తున్నారని, నిరాయుధులుగా ఉన్న వారిపై హత్యాకాండ కొ నసాగించడాన్ని ప్రజలంతా ఖండించాలని ఆయ న కోరారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే తమ అధీనంలో ఉన్న వారిని కోర్టులో హాజరు పరచాలని ఆయన డిమాండ్ చేశారు. సమావేశంలో నాయకులు ఐ.కృష్ణ, ఇ.నరేశ్, వెంకన్న, అశోక్, శంకర్, బుచ్చక్క తదితరులు పాల్గొన్నారు. సీపీఐ(ఎంఎల్) న్యూడెమొక్రసీ నేత చలపతిరావు -
రారండోయ్.. సర్కారు బడికి
● ఊరూరా జయశంకర్ బడిబాట ● ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయుల ఇంటింటా ప్రచారం ● ఆకర్షించే కార్యక్రమాలు ● పిల్లలు సర్కారు బడిలో చేరాలని పిలుపుఇంగ్లిష్ మీడియం చదువులు.. ఉచితంగా ఏకరూప దుస్తులు.. షూలు.. చదువుకునేందుకు పాఠ్యపుస్తకాలు.. ఆకలేస్తే మధ్యాహ్నం రుచికరమైన పౌష్టికాహారం.. విశాలమైన డిజిటల్ తరగతి గదులు.. క్రీడా మైదానాలు.. సకల సౌకర్యాలు.. అన్నింటికీ మించి అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు.. ఇంకెందుకు ఆలస్యం.. రారండోయ్ సర్కారు బడికి అంటూ.. ఊరూరా ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. రూ.లక్షలు పోసి ప్రైవేటులో చదివించే కన్నా.. అన్నీ ఉచితంగా అందిస్తున్న సర్కారు బడిలో చేరాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో వినూత్నంగా ప్రచారం చేస్తూ.. పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో చేరేలా కృషి చేస్తున్న ఉపాధ్యాయులపై సండే స్పెషల్..ఇదే మా ఓపెన్ చాలెంజ్..● మా పిల్లల కన్నా ‘ప్రైవేటు’ వాళ్లు బాగా చదివితే రూ.500 నజరానా ● పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం రచ్చపల్లి స్కూల్ ఉపాధ్యాయుల వినూత్న ప్రచారం ధర్మారం: ‘ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు మా పిల్లల కన్నా బాగా చదవగలరా..? అలా ఒక్క విద్యార్థి చదివినా రూ.500 నజరానా ఇస్తాం’.. అంటూ పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం రచ్చపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు ఓపెన్ చాలెంజ్ చేస్తున్నారు. బడిబాటలో భాగంగా ఇంటింటా తిరుగుతూ.. ప్రభుత్వ పాఠశాలలో పిల్లలను చేర్పించాలని తల్లిదండ్రులను కోరుతున్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సముద్రాల వంశీమోహనాచార్యులు, ఉపాధ్యాయులు కలిసి ఫిబ్రవరి 21నుంచే బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇంటింటా తిరుగుతూ ప్రైవేటు పాఠశాలలకు వెళ్లే విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు. సర్కారు బడికి పంపించాలని కోరుతున్నారు. తమ పాఠశాలలో ఒకటి నుంచి ఐదో తరగతి చదివే విద్యార్థుల కన్నా ప్రైవేటులో చదివేవారు ప్రతిభ కనబరిస్తే.. రూ.500నగదు బహుమతి అందిస్తాని చాలెంజ్ చేస్తున్నారు. పాఠశాల ప్రత్యేకతలను వివరిస్తూ.. ఇంటింటా కరపత్రాలు పంచుతున్నారు. ఇప్పటి వరకు పాఠశాలలో 36 మంది విద్యార్థులుండగా.. బడిబాటలో భాగంగా 14మంది అడ్మిషన్లు తీసుకున్నారని హెచ్ఎం తెలిపారు. గ్రామంలోని ప్రతీ విద్యార్థి సర్కారు బడికి వచ్చేలా చొరవ చూపుతామని పేర్కొన్నారు.– వివరాలు 10లోu -
లాభసాటి పంటల సాగుపై రైతులు దృష్టి సారించాలి
రామగుండం: మారుతున్న వాతావరణ పరిస్థితులను అంచనా వేస్తూ లాభసాటి వ్యవసాయంపై దృష్టి సారించాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు రైతులకు సూచించారు. వికసిత్ కృషి సంకల్ప అభియాన్ పథకంలో భాగంగా టీటీఎస్ అంతర్గాం, ఎల్లంపల్లితో శనివారం వ్యవసా య శాస్త్రవేత్తలు రైతులతో సమావేశమయ్యా రు. బీజీ–3 పత్తి విత్తనాలు వాడొద్దన్నారు. ఈ వానాకాలంలో జూన్ – అక్టోబర్ మధ్య వరి సాగు పూర్తి చేయాలని అన్నదాతలకు వారు సూచించారు. నానో యూరియా వినియోగించాలని తెలిపారు. మహిళా సంఘాలకు అద్దెకు ఇచ్చేందుకు డ్రోన్లు అందుబాటులో ఉన్నాయ ని అన్నారు. కోళ్ల, మేకలు, గొర్రెలు, చేపల పెంపకం లాభసాటిగా ఉంటుందంని వివరించారు. కార్యక్రమంలోవ్యవసాయ శాస్త్రవేత్తలు రీతూపర్ణ బెనర్జీ, బీవీడీ శ్రీనివాస్రావు, ఎస్ఎ స్ పాల్, వెంకన్న, కిరణ్, నరేశ్, వ్యవసాయా ధికారులు సతీశ్, హరీశ్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.ప్రభుత్వ ఆస్పత్రిలో మెరుగైన సేవలు సుల్తానాబాద్(పెద్దపల్లి): స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో పేషెంట్లకు మెరుగైన వైద్యసేవలు అందుతున్నాయని కాయకల్ప బృందం ప్రతినిధులు సతీశ్బాబు, స్టీల్జా తెలిపారు. స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిని కాయకల్ప బృందం శనివారం సందర్శించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛభారత్ ఆస్పత్రులకు స్వచ్ఛ అవార్డులు అందజేస్తోందని, ఇందుకోసం దరఖాస్తు చేసుకున్న ఆస్పత్రుల్లో సేవలను తాము పరిశీలిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా ఆస్పత్రి, సిబ్బంది పనితీరు, మరుగుదొడ్లు, మూత్రశాలలు, గదులు, ఆపరేషన్ థియేటర్, పరికరాల వినియోగం, బయో మెడికల్ వేస్టేజీ నిర్వహణ తదితర అంశాలు పరిశీలించామని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ రమాదేవి, ఆర్ఎంవోలు మహేందర్, విశాల్, అనిల్, సతీశ్, రాజు, ఫర్హాద్, సునీత, వైద్య సిబ్బంది తదితరులు ఉన్నారు.నేడు రెవెన్యూ మేళా కోల్సిటీ(రామగుండం): రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలో వందరోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఆదివారం ఉదయం 10 గంటలకు రెవెన్యూ మేళా ఏ ర్పాటు చేసినట్లు కమిషనర్ (ఎఫ్ఏసీ) అరు ణశ్రీ శివారం తెలిపారు. ఆస్తిపన్నులకు సంబంధించిన ఫిర్యాదులను స్వీకరించనున్నట్లు వెల్లడించారు. క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి ఆస్తిపన్ను సరిచేస్తామని పేర్కొన్నారు. ఇంటిపన్ను చెల్లింపుదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. పారదర్శకంగా ప్రవేశాలు యైటింక్లయిన్కాలనీ(రామగుండం): ఆర్జీ–2 ఏరియా యైటింక్లయిన్కాలనీ సెక్టార్–3 సింగరేణి సీబీఎస్ఈ పాఠశాలలో ప్రవేశాలు పారదర్శకంగా కల్పిస్తున్నామని కరస్పాండెంట్, అధికార ప్రతినిధి అనిల్కుమార్ శనివారం తెలిపారు. విద్యార్థులకు స్క్రీనింగ్ టెస్ట్లు నిర్వహించి ప్రతిభ ఆధారంగానే అడ్మిషన్లు ఇస్తామన్నారు. సింగరేణి కాలరీస్ ఎడ్యుకేషనల్ సొసైటీ కార్యదర్శి గుండా శ్రీనివాస్ ఈ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షిస్తున్నారని పేర్కొన్నారు. హెచ్ఎం సుందర్రావు ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం యైటింక్లయిన్కాలనీ(రామగుండం): స్థానిక సెక్టార్–3 సింగరేణి పాఠశాలలో సీబీఎస్ఈ పద్ధతిన విద్యా బోధన చేసేందుకు అర్హులైన బోధన, బోధనేతర సిబ్బంది నియామకానికి దరఖాస్తులు స్వికరిస్తున్నట్లు యాజమాన్యం తెలిపింది. ఇంగ్లిష్ – 3, ఫిజిక్స్ –2, కంప్యూ టర్ –1, ప్రైమరీ టీచర్లు–1, ప్రీప్రైమరీ–4, లైబ్రెరేయన్–1, ఆఫీస్ సూపరింటెండెంట్–1, జూనియర్ అసిస్టెంట్ –3, ల్యాబ్ అటెండర్– 1, నైట్వాచ్ మన్–1, సోషల్ టీచర్–1, సైన్స్ టీచర్–1, క్లాస్ఫోర్త్–1, పీఈటీ–1, ఆయా–2 పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. అర్హతల ఆధారంగా భర్తీచేస్తామని ప్రకటించింది. అర్హత, అనుభవం కలిగిన అభ్యర్థులు ఈనెల 13లోగా పాఠశాలలో దరఖాస్తు చేసుకోవాలని కరస్పాండెంట్ అనిల్కుమార్ కోరారు. -
‘విస్తరణ’ కష్టాలు
పెద్దపల్లి జెండా, మెయిన్రోడ్డు నుంచి బస్టాండ్, జిల్లా ఆస్పత్రి వైపు వెళ్లే ప్రధాన రహదారికి ఇరువైపులా పోసిన కంకరపై వాహనదారులకు కష్టాల ప్రయాణం తప్పడం లేదు. కొద్దిరోజులకే టైర్లు పనికిరాకుండా పోతున్నాయి. వాహనదారులపై ఆర్థికభారం పడుతోంది. నెలల తరబడి పనులు సా..గుతుండడం వారి పాలిట శాపంగా మారింది. జిల్లా కేంద్రంలోని తిలక్నగర్ ప్రాంతం రోడ్డు ఇది. దాదాపు ఐదు నెలల క్రితం విస్తరణ పనులు చేపట్టిన అధికారులు.. రోడ్డుకు ఇరువైపులా కంకర పోసి వదిలేశారు. రాకపోకలకు స్థానికులు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం. ఈ ప్రాంతంలోని ఆలయానికి వెళ్లేందుకు వృద్ధులు, మహిళా భక్తులు అరిగోసపడుతున్నారు. -
ముంపు ముప్పు?
● లోతట్టు ప్రాంతాల్లో కానరాని ప్రత్యామ్నాయ చర్యలు ● భారీ వర్షాలు కురిస్తే మళ్లీ నీటమునిగే ప్రమాదం ● కాళేశ్వరం గేట్లు ఎత్తినా గోదావరిలో నీటి నిల్వలకు అవకాశం గోదావరిఖని: రెండేళ్ల క్రితం కురిసిన భారీ వర్షాలకు రామగుండం నియోజకవర్గంలోని అనేక ప్రాంతా లు బ్యాక్వాటర్లో మునిగాపోయాయి. నివాసాల్లోకి వరద చొచ్చుకు వచ్చి నిత్యావసరాలు, వస్తుసామగ్రి తడిసి ముద్దయ్యాయి. తినేందుకు తిండిలేక, తలదాచుకునేందుకు ప్రత్యామ్నాయాలు లేక అనేక కుటుంబాలు రోడ్డున పడ్డాయి. మళ్లీ వర్షాకాలం సమీపించడంతో బాధితులు జ్ఞాపకాలు నెమరు వేసుకుంటున్నారు. ఈసారి లోతట్టు ప్రాంతాల పరిస్థితి ఏమిటని ఆందోళన చెందుతున్నారు. గేట్లు ఎత్తినా వరదతో ముప్పే.. కాళేశ్వరంలో భాగంగా నిర్మించిన పార్వతీ బ్యారేజీ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసినా.. ఎగువ నుంచి గోదావరి నదికి భారీగా వరద వస్తే.. ఆయా ప్రాంతాల్లోంచి విడుదలయ్యే డ్రైనేజీలు వెనక్కి మళ్లిపోతాయి. తద్వారా లోతట్టు ప్రాంతాల్లోని నివాసాలు నీటమునుగుతాయి. రెండేళ్లక్రితం పార్వతీ బ్యారేజీ గేట్లు మూసినా.. ఎగువన కురిసిన భారీ వర్షాలకు గోదావరిఖని ప్రాంతంలోని మల్కాపూర్, సప్తగిరికాలనీ, ప్రశాంత్నగర్, రెడ్డికాలనీ, గంగానగర్, రఘుపతిరావునగర్, ఎన్టీపీసీ మేడిపల్లి, మ ల్కాపూర్లోని సుమారు 10వేల కుటుంబాలు వరదనీటితో ఇరుక్కుని ఇబ్బంది పడ్డాయి. ఇళ్లలోకి నీ ళ్లు రావడంతో చాలామంది నిరాశ్రయులయ్యారు. సరికొత్తసమస్య.. కాళేశ్వరం నిర్మాణంతో పారిశ్రామిక ప్రాంతానికి కొ త్త సమస్య ఎదురైంది. భారీ వర్షాలకు గోదావరిలో నీటి నిల్వలు పెరుగుతున్నాయి. బ్యాక్ వాటర్తో లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. పంటలు, నివాసాలు నీటమునిగి ఒక్కో కుటుంబం రూ.లక్షల్లో నష్టపోతోంది. ఈసారి కాళేశ్వరం గేట్లు ఎత్తివేసినా.. ఆదిలాబాద్ జిల్లాలో కురిసే భారీ వర్షాలతో గోదావరి నదికి వరద పోటెత్తుతుందని అంచనా వేస్తున్నారు. అందులో కలిసే మురుగునీరు వెనక్కి వచ్చి జనావాసాలను ముంచెత్తే ప్రమాదం ఉందనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. సుమారు 30 ఏళ్ల క్రితం వచ్చిన వరదలతో గోదావరి ఉప్పొంగి పవర్హౌస్కాలనీ, గంగానగర్ వరకు నీళ్లు వచ్చి చేరాయి. మంచిర్యాల – గోదావరిఖని మధ్య రాకపోకలు స్తంభించాయి. గోదావరి తీరం వెంట కరకట్ట లేక.. కాళేశ్వరం బ్యాక్వాటర్ ముంపు ముప్పు తప్పించేందుకు సిరిపురం వద్ద నిర్మించిన బ్యారేజీ నుంచి గోదావరి వెంట సుమారు 5 కి.మీ. పొడవున సుందిళ్ల వరకు కరకట్ట, వరద వెళ్లేందుకు డైవర్షన్ నాళా నిర్మించారు. అయితే, మరో 5 కి.మీ. పొడవున కరకట్ట నిర్మిస్తే పారిశ్రామిక ప్రాంతానికి వరద ముప్పు తప్పుతుందని నిపుణులు చెబుతున్నారు. ముప్పు ఉందని ముందే గుర్తించినా.. కాళేశ్వరం నిర్మాణంతో లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురవుతాయని భావించిన అధికారులు.. ముంపు గ్రామాలను గుర్తించలేదు. ప్రణాళిక ప్రకారం సముద్రమట్టానికి 132 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మించాలని డిజైన్ చేసినా, దాన్నిమార్పు చేసి 138 మీటర్లకు పెంచారు. దిగువకు 8లక్షల క్యూసెక్కుల వదరను విడుదల చేయాలని ప్రణాళిక సిద్ధం చేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు 15 లక్షల నుంచి 20 లక్షల వరకు క్యూసెక్కుల వ రద పోటెత్తగా.. దానిని విడుదల చేయాల్సి వచ్చింది. అంత సామర్థ్యం లేక గోదావరినదికి ఇరువైపులా వరద పోటెత్తి లోతట్టుప్రాంతాలను ముంచెత్తింది. గోదావరిఖని గంగానగర్ సమీపంలో రాజీవ్ రహదారి పైనుంచి వరద ప్రవహించింది. సమ్మక్క గద్దెల వద్ద కరకట్ట గోదావరి తీరంలోని సమ్మక్క–సారలమ్మ గద్దెల వద్ద బ్యాక్వాటర్ ముంపు ముప్పును అధిగమించేందుకు సింగరేణి రూ.3 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టింది. ప్రధానంగా సమ్మక్క గద్దెలతోపాటు గోదావరి తీరం, గోదావరి బ్రిడ్జి నుంచి పంప్హౌస్ వరకు మట్టిపోయాలని నిర్ణయించారు. -
రేషన్షాపు.. బడిబాట
కాల్వశ్రీరాంపూర్: మూడు నెలలకు సరిపడా బియ్యం ఒకేసారి పంపిణీ చేస్తుండడంతో కార్డుదారులు భారీగా తరలివస్తారని భావించిన స్థానిక ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు.. శనివారం స్థానిక రేషన్ షాపు ఎదుట బడిబాట కార్యక్రమం చేపట్టారు. సర్కారు బడుల్లో నాణ్యమైన విద్యాబోధన ఉందని, సన్నరకం బియ్యంతో కూడిన మధ్యాహ్న భోజనం పెడుతున్నామని, ఉచితంగా పుస్తకాలు, నోట్బుక్కులు, యూనిఫామ్స్ అందిస్తున్నామని, మౌలిక వసతులు కల్పించామని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని వారు కోరారు. -
నామినేటెడ్ పదవులు భర్తీ చేయాల్సిందే
● రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షికి స్పష్టం చేసిన కరీంనగర్ పార్లమెంటరీ నేతలుసాక్షి ప్రతినిధి, కరీంనగర్: త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్ని కల్లో పార్టీకి మంచి ఫలితాలు రావాలంటే.. తప్పకుండా నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయాల్సిందేన ని కరీంనగర్ పార్లమెంటరీ నాయకులు అధిష్టానానికి స్పష్టం చేశారు. శుక్రవారం గాంధీభవన్లో కరీంనగర్ పార్లమెంటరీ సమీక్ష నిర్వహించా రు. ఏఐసీసీ కార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల ఇన్చా ర్జి మీనాక్షి నటరాజన్ జిల్లా నేతలతో చర్చించా రు. ఈ సందర్భంగా నేతలందరి నోట దాదాపుగా ఒకే డిమాండ్ వినిపించింది. అధికారంలోకి వ చ్చి ఏడాది గడుస్తున్నా.. డీసీసీ, కార్పొరేషన్ చైర్మ న్లు సహా నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయకపోవడంపై కిందిస్థాయి నాయకులు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారని వెల్లడించారు. వెంటనే పోస్టులు భ ర్తీ చేయకపోతే.. పార్టీకి క్షేత్రస్థాయిలో జరిగే నష్టాలను వివరించారు. పదవులు భర్తీ చేయలేకపో తే.. గ్రామాల్లో సమాధానం చెప్పే పరిస్థితి కూడా ఉండదని కుండబద్ధలు కొట్టారు. ఈ క్రమంలో కలుగజేసుకున్న మీనాక్షి.. త్వరలోనే పదవుల భ ర్తీ ఉంటుందని, కష్టపడి పనిచేసిన వారందరికీ సముచితస్థానం కల్పిస్తామని భరోసా ఇచ్చారు. ఈ మేరకు అధిష్టానం ఇచ్చే ప్రొఫార్మా ప్రకారం.. పేర్లు పంపాలని సూచించారు. బీజేపీ, బీఆర్ఎస్ల విలీనం తథ్యం పథకాల అమలులో విపక్షాలు చేస్తున్న దుష్ప్రచా రాన్ని తిప్పికొట్టాలని, సన్నబియ్యం, ఇందిరమ్మ పథకాల అమలు తీరును మరింతగా జనాల్లోకి తీ సుకెళ్లాలని సూచించారు. బీజేపీ ధర్మం పేరుతో చేస్తున్న చర్యలను ప్రజలకు వివరించాలన్నారు. ఆపరేషన్ సిందూర్ విషయంలోనూ బీజేపీ వ్యవహరించిన తీరు, దాని వైఫల్యాలను ఎండగట్టాల ని ఆదేశించారు. బీఆర్ఎస్ పార్టీ ఏనాటికై నా బీజేపీలో విలీనం కావాల్సిందేనని, ఆ పార్టీల మైత్రిని ఎండగట్టాలని పిలుపునిచ్చారు. ఇక తాము ఎన్ని కల ముందు పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేశామని, తమకు న్యాయం జరగాలని మాజీ ఎమ్మె ల్యే ప్రవీణ్రెడ్డి, సిరిసిల్ల కాంగ్రెస్ నేత కేకే మహేందర్రెడ్డి, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇ న్చార్జి వెలిచాల రాజేందర్రావు తదితరులు గు ర్తుచేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, ఎమ్మెల్సీ భానుప్రసాద్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, ప్రణవ్బాబు, మాజీ మంత్రి జీవన్రెడ్డి, సీని యర్ నేత కటకం మృత్యుంజయం, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, గ్రంథాలయ చైర్మన్ సత్తు మల్లేశ్, నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. -
రూ.3 లక్షలు నష్టపోయా
వరదనీరు ఇంట్లోకి చేరి వస్తువులన్నీ తడిచిపోయాయి. సామానంతా పాడైపోయింది. రూ.3లక్షలు నష్టపోయా. ఇంట్లోకి నీళ్లు రావడంతో రోజంతా వేరే ప్రాంతంలో గడపాల్సి వచ్చింది. అలాంటి పరిస్థితి ఈసారి రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి. – ఎండీ రజాక్, మల్కాపూర్ నీళ్లలో కొట్టుకుపోయింది నీళ్లన్నీ ఇళ్లలోకి వచ్చాయి. 10 క్వింటాళ్ల బియ్యం తడిచిపోయాయి. వాషింగ్ మిషన్ నీళ్లలో కొట్టుకుపోయింది. మూడు మోటార్ సైకిళ్లు పాడైపోయాయి. రూ.4.50లక్షల నష్టం వచ్చింది. పోలీసులు వరద నుంచి కాపాడారు. మళ్లీ అప్పటి పరిస్థితి రాకుండా చూడాలి. – ఎరుకల రాజయ్య, సింగరేణి రిటైర్డ్ కార్మికుడు, సప్తగిరికాలనీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టాం మెయిన్ డ్రైనేజీలను అభివృద్ధి చేస్తున్నాం. మురుగునీరు సాఫీగా వెళ్లేందుకు రూ.60కోట్లు కేటాయించాం. పార్వతీ బ్యారేజీ గేట్లు ఎత్తివేస్తే బ్యాక్ వాటర్ సమస్య ఉండదు. ఎగువ నుంచి అనూహ్యంగా వరదలు వస్తే తగినట్లు ఏర్పాట్లు చేస్తున్నాం. – మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్, ఎమ్మెల్యే, రామగుండం -
ఆయిల్పామ్ సాగు చేయండి
● కలెక్టర్ కోయ శ్రీహర్ష కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): ఆయిల్పామ్ సాగుకు రైతులు ముందుకు రావాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష కోరారు. పెగడపల్లిలో పత్తి శ్రీనివాస్రెడ్డి సాగుచేసి న ఆయిల్పామ్ తోటలో గెలల సేకరణ కార్యక్రమా న్ని కలెక్టర్ శుక్రవారం జెండా ఊపి ప్రారంభించా రు. ఆయిల్పామ్ సాగుతో ఖర్చు తక్కువ ఉండి ఆ దాయం అధికంగా వస్తుందన్నారు. పంట సాగుచేశాక మూడేళ్ల వరకు అంతర్ పంటలు పండించొచ్చని, నాలుగో ఏడాది నుంచి దిగుబడి వస్తుందని ఉ ద్యానవన జిల్లా అధికారి జగన్మోహన్రెడ్డి తెలిపా రు. కోతులు, ఎలుకల బెడద ఉండదని, రాళ్లవానకూ కాయలు రాలవని హార్టికల్చర్ అధికారి మహే శ్ అన్నారు. జిల్లాలో సుమారు 3వేల ఎకరాల్లో ఆ యిల్పామ్ సాగవుతోందని సీఈవో కల్యాణ్ కర్ తెలిపారు. తహసీల్దార్ జగదీశ్వర్రావు, ఏఎంసీ చై ర్మన్ తిరుపతిరెడ్డి, సారయ్యగౌడ్ పాల్గొన్నారు. భూ సమస్యల పరిష్కారానికే.. భూ సమస్యల శాశ్వత పరిష్కారానికే భూ భారతి చట్టం అమలు చేస్తున్నామని కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. పెగడపల్లిలో చేపట్టిన భూ భారతి రెవె న్యూ సదస్సును ఆయన సందర్శించి రైతుల దరఖాస్తులను పరిశీలించారు. తహసీల్దార్తోపాటు డిప్యూటీ తహసీల్దార్ శంకర్ పాల్గొన్నారు. మూలసాల గ్రామంలో.. పెద్దపల్లిరూరల్: మూలసాలలో నిర్వహించిన రె వెన్యూ సదస్సుకు కలెక్టర్ హాజరై ఫిర్యాదులను పరిశీలించారు. ఫిర్యాదులపై పారదర్శకంగా విచారణ జరిపి పరిష్కారం చూపాలని ఆదేశించారు. తహసీ ల్దార్ రాజయ్య, ఆర్ఐ రాజిరెడ్డి పాల్గొన్నారు. -
నాణ్యమైన విత్తనాలతోనే అధిక దిగుబడి
● ముందస్తు సాగు పద్ధతులు పాటించాలి ● విత్తన కొనుగోలు సమయంలో రసీదు పొందాలి ● మట్టి నమూనాలు ఇస్తే భూసార పరీక్షలు చేయిస్తాం ● పచ్చిరొట్ట విత్తనాలతోనూ భూసారం పెంపు ● ‘సాక్షి’ ఫోన్ఇన్లో జిల్లా వ్యవసాయాధికారి ఆదిరెడ్డిపెద్దపల్లిరూరల్: నాణ్యమైన విత్తనాలతోనే అధిక దిగుబడి సాధ్యమని, ఈ వానాకాలంలో సన్న, దొడ్డురకం వరి రకాల సాగుకు సకాలంలో సమాయత్తం కావాలని జిల్లా వ్యవసాయాధికారి ఆదిరెడ్డి కోరారు. ఆడ, మగ విత్తనాలు అందించిన ప్రైవేట్ కంపెనీల ప్రతినిధులు దళారీలతో కలిసి మోసం చేస్తున్నారనే ఆరోపణలపై డీఏవో స్పందించారు. భూసార పరీక్షల కోసం మట్టి నమూనాలు అందిస్తే పరీక్షించి ఫలితాలు ఇస్తామన్నారు. శుక్రవారం ‘సాక్షి’ నిర్వహించిన ఫోన్ఇన్ కార్యక్రమం ద్వారా రైతులు వెలిబుచ్చిన అనేక సందేహాలకు డీఏవో ఆదిరెడ్డి సమాధానాలు ఇచ్చారు. -
విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవాలు
పాలకుర్తి(రామగుండం): కుక్కలగూడురులోని శివాలయ, త్రిశక్తి దేవాలయంలో (వారాహి, ల లిత, రాజశ్యామల) విగ్రహ ప్రతిష్ఠాపన మ హోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించా రు. గ్రామస్తుడు, ఎన్ఆర్ఐ పోతురాజుల అంబికా–రాధాకిషన్ చేపట్టిన ఈ కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్ దంపతులతోపాటు అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీ కాంట్రాక్ట్ కార్మికసంఘం అధ్యక్షుడు కౌశిక హరి దంపతులు పాల్గొని ప్రత్యేక పూజ లు చేశారు. ఈకార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులతోపాటు గ్రామస్తులు పాల్గొన్నారు. ప్రశాంతంగా లాసెట్ రామగిరి(మంథని): సెంటినరీరికాలనీలోని మంథని జేఎన్టీయూలో శుక్రవారం లాసెట్ ప రీక్ష ప్రశాతంగా జరిగింది. మూడు సెషన్లలో భాగంగా నిర్వహించిన పరీక్షకు ఉదయం 100 మందికి 61 మంది, మధ్యాహ్నం 100 మందికి 55మంది, సాయంత్రం 79 మందికి 66 మంది అభ్యర్థులు హాజరయ్యారని ప్రిన్సిపాల్ విష్ణువర్ధన్ తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఎస్సై చంద్రకుమార్ ఆ ధ్వర్యంలో పోలీసులు బందోబస్తు చేపట్టారు. రేషన్షాపు ఆకస్మిక తనిఖీ యైటింక్లయిన్కాలనీ(రామగుండం): బల్దియా లోని 15వ డివిజన్ పోస్టాఫీసు ఏరియా రేషన్షాప్ను జిల్లా పౌర సరఫరాల అధికారులు శు క్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. బియ్యం తూకంలో తక్కువగా వస్తున్నాయని మాజీ కా ర్పొరేటర్, కార్డుదారులు గురువారం ఆందోళ కు దిగారు. ఆ తర్వాత అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు పెద్దపల్లి డిప్యూటీ తహసీ ల్దార్ రవీందర్, అధికారులు సంతోష్సింగ్, శ్రీనివాస్ స్పందించి రేషన్షాప్ తనిఖీ చేశారు. సాంకేతిక సమస్యలతో ఆరు కేజీలకు బదులు ఐదు కేజీలు పంపిణీ చేసినట్లు గుర్తించారు. ల బ్ధిదారుకు మిగతా బియ్యం పంపిణీ చేయాలని రేషన్ డీలర్కు సూచించారు. రికార్డులు సరిగా లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. మూ డు నెలల బియ్యం ఒకేసారి పంపిణీ చేస్తున్నామని, తద్వారా ఒక్కో కార్డుదారు ఆరుసార్లు వే లిముద్రులు తీసుకోవాల్సి వస్తోందని అధికా రులు తెలిపారు. అయినా, ఈనెల 30వ తేదీ వరకు బియ్యం అందిస్తామని అన్నారు. మాజీ కార్పొరేటర్ శంకర్ నాయక్, నాయకుడు వీరారెడ్డి, మహిళలు తదితరులు పాల్గొన్నారు. మౌలిక వసతులపై ఆరా సుల్తానాబాద్(పెద్దపల్లి): హాస్టల్ ప్రారంభం నుంచే విద్యార్థులకు మౌలిక వసతులు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చొరవ తీసుకుందని మహాత్మా జ్యోతిబా పూలే విద్యాలయాల సంయుక్త కార్యదర్శి శ్యామ్ప్రసాద్లాల్ అన్నా రు. స్థానిక బీసీ హాస్టల్ను ఆయన శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్టళ్లలో వసతుల కల్పన, చిన్న మరమ్మతులకు నిధులు మంజూయ్యాయని తెలిపారు. ఈ నిధులతో చేపట్టిన పనులు సక్రమంగా చేశారా? అని ఆయన ఆరా తీశారు. మూత్రశాలలు, మరుగుదొడ్లు, క్యాంటీన్ తదితర సౌకర్యాలు పరిశీలించారు. విదేశీ విద్య కోసం దరఖాస్తుల ఆహ్వానం యైటింక్లయిన్కాలనీ: విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించేందుకు సీఎం విదేశీ విద్యా పథకం కోసం ఈనెల 30లోగా దరఖాస్తు చేసుకోవాల ని మైనార్టీ సంక్షేమ శాఖ డైరెక్టర్ యాస్మిన్బాషా, జమాత్ ఇస్లా మీ హింద్ టెమ్రిస్ వైస్ ప్రెసి డింట్ ఎండీ ఇస్మాయిల్ తెలిపారు. అమెరికా, యూకే, కెనడా, సింగపూర్, జర్మనీ, దక్షణ కొరి యా, జపాన్, ఫ్రాన్స్, న్యూజీలాండ్లో పీజీ, పీ హెచ్డీ కోర్సులు చేసేందుకు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ఎంపికై న వారికి ఉపకార వేతనం కింద రూ.20లక్షలు ప్రయాణ టికెట్ కోసం మంజూరు చేస్తారని వివరించారు. -
ఆగని మట్టి లొల్లి
పెద్దపల్లిరూరల్: ఇటుకల తయారీకి అవసరమయ్యే చెరువు మట్టి లొల్లికి ముగింపు లభించడంలేదు. రూ.కోట్ల విలువచేసే మట్టి తవ్వకాలు, తరలింపుల్లో అనుమతుల విషయంపై మైనింగ్, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారుల పాత్ర ప్రధానంగా ఉంటుండగా.. తాజాగా పోలీసులు రంగప్రవేశం చేయడం సమస్యను మరింత జటిలం చేసిందంటున్నారు. పెద్దపల్లి మండలం కొత్తపల్లి గ్రామంలోని చెరువు నుంచి మూడేళ్ల క్రితం తవ్వితీసిన మట్టిని అదే ప్రాంతంలోని రైతుల వ్యవసాయ భూముల్లో గుట్టలుగా పోసి నిల్వ చేశారు. ఇప్పుడు ఆ చెరువులో నుంచి కాకుండా గుట్టలుగా పోసిన కుప్పల్లోంచి మట్టిని తరలించుకు పోయేందుకు వాటికి సంబంధించిన ఇటుకబట్టీ యజమానులు రవాణా ప్రక్రియ కొనసాగిస్తున్నారు. అయితే, మట్టికుప్పులకు జరిమానా చెల్లించి తీసుకెళ్లాలని మైనింగ్ అధికారులు సూచించారు. వారి సూచనమేరకు నాలుగు ఇటుక బట్టీలకు చెందిన నిర్వాహకులు ఇటీవల జరిమానా చెల్లించారు. అందులో ముగ్గురు మట్టిని ఇప్పటికే తరలించుకుపోయారు. మట్టికుప్పల కోసం గొడవ.. పెద్దపల్లి మండలం గౌరెడ్డిపేట శివారులోని ఇటుకబట్టీ యజమానులు జరిమానా చెల్లించి మట్టిని టిప్పర్లలో తరలిస్తుండగా ఆ మట్టి తమదంటూ సుల్తానాబాద్ ప్రాంతానికి చెందిన ఇటుక బట్టీ యజమానులు రంగప్రవేశం చేశారు. అయితే మైనింగ్ అధికారులకు తాము జరిమానా చెల్లించి మట్టిని తీసుకెళ్తున్నామని గౌరెడ్డిపేటకు చెందిన ఇటుకబట్టీ వ్యాపారులు పేర్కొంటున్నారు. తమకు చెందిన మట్టి కుప్పనే సంబంధం లేనివారు తరలించుకుపోతున్నారని సుల్తానాబాద్కు చెందిన వ్యాపారులు ఆరోపిస్తున్నారు. వారికి మద్దతుగా పోలీసులు రంగప్రవేశం చేసి టిప్పర్లు, జేసీబీల తాళాలను లాక్కెళ్లడంతో వివాదం మరింత ముదిరింది. రాజకీయ నాయకుల అండ సుల్తానాబాద్ వ్యాపారులకు ఉండడంతోనే పోలీసులు తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని గౌరెడ్డిపేటకు చెందిన ఇటుకబట్టీ యజమానులు పేర్కొంటున్నారు. చెరువుమట్టి తరలింపుపై తలెత్తిన వివాదాన్ని పరిష్కరించాల్సిన మైనింగ్, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు.. తమకు పట్టీపట్టనట్టుగా వ్యవహరించడంతోనే మట్టిలొల్లి కొనసాగుతోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొత్తపల్లి శివారులో నిల్వ ఉంచిన కోట్లాది రూపాయల చెరువు మట్టి వ్యవహారంపై కలెక్టర్ జోక్యం చేసుకుని ప్రభుత్వ ఖజానాకు ఆదాయం సమకూరేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. మైనింగ్ అధికారుల దృష్టికి సమస్య.. చెరువు మట్టి విషయంలో ఇటుక బట్టీల నిర్వాహకుల మధ్య వివాదం తలెత్తిందని, ఈక్రమంలో తాము తగిన చర్యలు తీసుకుంటున్నామని ఎస్సై లక్ష్మణ్రావు తెలిపారు. ఈ విషయాన్ని మైనింగ్ అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలని వారికి సూచించామని ఆయన తెలిపారు. అనుమతి ఉన్నా పోలీసుల ఆటంకాలు ఆవేదనలో ఇటుక బట్టీ యజమానులు -
ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిద్దాం
పెద్దపల్లిరూరల్: పర్యావరణానికి ముప్పు కలిగించే ప్లాస్టిక్ వస్తువుల వాడకాన్ని తగ్గించేందుకు ప్రతి ఒక్కరం పాటుపడదామని, ఇందకనుగుణంగా మార్పు మన నుంచే మొదలు కావాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. ఫారెస్టు అధికారుల ఆధ్వర్యంలో గురువారం ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమంలో భాగంగా అడిషనల్ కలెక్టర్ వేణు, డీసీపీ కరుణాకర్తో కలిసి శ్రీఏక్ పేడ్ మా కే నామ్శ్రీ పేరిట మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ తన తల్లి పేరిట మొక్కలు నాటి కాపాడాలన్నారు. కలెక్టరేట్లోని అన్ని కార్యాలయాల్లోనూ ప్లాస్టిక్ వస్తువుల వాడకం తగ్గాలన్నారు. ప్రభుత్వోద్యోగులు తమ ఇళ్లలోనూ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలవాలన్నారు. జిల్లా అటవీ అధికారి శివయ్య, పలువురు అధికారులు పాల్గొన్నారు. విద్యా సామర్థ్యాల పెంపునకు కృషి చేయాలి విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలను పెంచేందుకు ఎంఈవోలు, కాంప్లెక్సు హెచ్ఎంలు కృషి చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. పెద్దపల్లిలోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో గురువారం జరిగిన వర్క్షాపులో మాట్లాడారు. ఈనెల 12న పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయని, విద్యార్థుల్లో నైపుణ్యాన్ని పెంచేలా ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. డీఈవో మాధవి, సమన్వయకర్త పీఎం షేక్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ కోయ శ్రీహర్ష -
న్యాయవాదుల సమస్యలపై కేబినెట్లో చర్చించండి
మంథని: రాష్ట్ర కేబినెట్లో న్యాయవాదుల సమస్యలపై చర్చించి పరిష్కరించాలని లాయర్స్ ఇండియా ఆర్గనైజేషన్ న్యాయవాదుల బృందం గురువారం హైదరాబాద్లో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్బాబు, కొమటిరెడ్డి వెంకట్రెడ్డిలకు వినతిపత్రాలు అందజేశారు. మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా రూ.10 లక్షల వరకు హెల్త్ కార్డులు పునరుద్ధరణ చేయాలన్నారు. జూనియర్ న్యాయవాదులకు రూ.5 వేలు స్టైఫండ్, ఇళ్ల స్థలాలు, రాష్ట్ర హైకోర్టు ప్రాంగణంలో దివ్యాంగులైన న్యాయవాదులకు ప్రత్యేక పార్కింగ్ సదుపాయం తదితర సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. లాయర్స్ ఇండియా ఆర్గనైజేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి పొన్నం రవీందర్, రాష్ట్ర కన్వీనర్ ఇనుముల సత్యనారాయణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆలె నర్సింహ, హైకోర్టు సీనియర్ న్యాయవాదులు ఆంటోనిరెడ్డి, కుమార్స్వామి తదితరులు పాల్గొన్నారు. ఆర్థికాభ్యున్నతి సాధించేందుకే మహిళాశక్తిపెద్దపల్లిరూరల్: మహిళలు ఆర్థికంగా ఎదిగేలా ప్రోత్సహించాలన్న ఆలోచనతో సీఎం రేవంత్రెడ్డి సారథ్యంలోని ప్రభుత్వం ఇందిరా మహిళాశక్తి పథకాన్ని అమలు చేస్తోందని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. జిల్లా ప్రభుత్వాసుపత్రి ఆవరణలో మహిళాశక్తి పథకం కింద మంజూరైన క్యాంటీన్ను గురువారం ప్రారంభించి మాట్లాడారు. జిల్లాలోని పలు మండలాలు, గ్రామాల నుంచి వచ్చే వారికి క్యాంటీన్ ద్వారా రుచి, శుచికరమైన పదార్థాలు అందించాలని సూచించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీధర్, డీఆర్డీవో కాళిందిని, మార్కెట్ చైర్పర్సన్ ఈర్ల స్వరూప, నాయకులు మల్లయ్య, సంపత్, శ్రీనివాస్, ఉప్పు రాజు, బొంకూరి అవినాష్, జడల సురేందర్, జగదీశ్ తదితరులున్నారు. నిత్యం పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాలి ఓదెల(పెద్దపల్లి): గ్రామాల్లో నిత్యం పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాలని జిల్లా పంచాయతీ అధికారి వీరబుచ్చయ్య అన్నారు. గురువారం మండలంలోని కొలనూర్ గ్రామపంచాయతీని సందర్శించి రికార్డులు తనిఖీ చేశారు. వ్యాధులు ప్రబలకుండా పరిసరాలను శుభ్రంగా ఉంచాలన్నారు. గ్రామంలోని నర్సరీ, సెగ్రిగ్రేషన్షెడ్డు, శ్మశానవాటికను పరిశీలించారు. పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కను నాటారు. ఎంపీవో షబ్బీర్ అలీ, కార్యదర్శి శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు. విద్యార్థులను బడిబాట పట్టించాలిపెద్దపల్లిరూరల్: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్షియల్ స్కూళ్లలో చేర్పించేలా విద్యార్థులను బడిబాట పట్టించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. కలెక్టరేట్లో గురువారం డీఈవో మాధవి, సంబంధిత అధికారులతో సమావేశమై సమీక్షించారు. ఈ నెల 6 నుంచి 19 వరకు బడిబాట నిర్వహించి బడీడు పిల్లలంతా సర్కారు బడుల్లో చేర్పించేలా తల్లిదండ్రుల్లో నమ్మకం పెంచాలన్నారు. గతేడాది జిల్లాలో బడిబాట కార్యక్రమం ద్వారా 2,099 మంది విద్యార్థులను చేర్పించినట్టు గుర్తు చేశారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు పునఃప్రారంభమయ్యే తొలిరోజునే పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు అందించేలా ఏర్పాట్లు చేశామన్నారు. 10,186 మంది నిరక్షరాస్యులను ఉల్లాస్ కార్యక్రమం ద్వారా రిజిస్ట్రేషన్ చేయించి విద్యనందించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలపై విద్యార్థులు, తల్లిదండ్రుల్లో నమ్మకం పెంచేందుకు స్వశక్తి మహిళలు సైతం తమవంతు సహకారం అందించాలన్నారు. జెడ్పీసీఈవో నరేందర్, డీపీవో వీరబుచ్చయ్య తదితరులున్నారు. -
రేషన్డీలర్పై చర్యలు తీసుకోవాలి
యైటింక్లయిన్కాలనీ(రామగుండం): రామగుండం కార్పొరేషన్ యైటింక్లయిన్కాలనీ 15వ డివిజన్లోని రేషన్ డీలర్ తూకంలో మోసం చేస్తున్నాడని, డీలర్పై చర్యలు తీసుకోవాలని గురువారం లబ్ధిదారులతో కలిసి మాజీ కార్పొరేటర్ శంకర్నాయక్ షాప్ ఎదుట ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం ఇస్తున్న సన్నబియ్యం ఆరు కిలోలకు నాలుగైదు కిలోల బియ్యం మాత్రమే ఇస్తున్నట్లు లబ్ధిదారులు శంకర్నాయక్కు తెలపడంతో వెంటనే షాప్ వద్దకు చేరుకొని పరిశీలించారు. ఈవిషయమై జిల్లా కలెక్టర్, సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. -
ఫిట్నెస్పై అశ్రద్ధ
స్కూల్ బస్సుల కండీషన్ చెక్ చేయించుకోవడంలో యాజమాన్యాల నిర్లక్ష్యంసాక్షి, పెద్దపల్లి: ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు అడ్మిషన్లు, ఫీజు వసూళ్లపై చూపిస్తున్నా శ్రద్ధ బడి బస్సులపై చూపడం లేదు. రోజూ ఉదయం, సాయంత్రం వేళలో విద్యార్థులను పికప్, డ్రాప్ చేయడం కోసం ఉపయోగించే బస్సుల భద్రతపై యాజమాన్యాలు నిర్లక్ష్యం చూపుతున్నాయి. తాజాగా రవాణాశాఖ ఫిట్నెస్ టెస్టుకు ఆసక్తిచూపకపోగా, వచ్చిన బస్సుల్లో అనేక నిబంధనలు ఉల్లంఘిస్తూ పిల్లల రక్షణకు సంబంధించి చర్యలు చేపట్టడం లేదని విమర్శలు వస్తున్నాయి. కొంతమంది ఫిట్నెస్ తనిఖీ సమయాల్లో నిబంధనలు పాటిస్తున్నా, తర్వాత పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. ఈనెల 12 నుంచి నూతన విద్యాసంవత్సరం ప్రారంభం కానుండగా, ఆ లోపే విద్యాసంస్థల బస్సుల ఫిట్నెస్ ప్రక్రియ పూర్తి చేసుకోవలసి ఉన్నా సరైన స్పందన లభించడంలేదు. జిల్లావ్యాప్తంగా 273 విద్యాసంస్థల బస్సులు ఉండగా, ఇప్పటి వరకు కేవలం 125 బస్సులకు మాత్రమే ఫిట్నెస్ పరీక్షలు పూర్తయ్యాయి. ఫిట్నెస్ పరీక్షలకు వెళ్తే అధికారులు బస్సులను సీజ్ చేస్తారేమోననే ఉద్దేశంతోనే వెనుకంజ వేస్తున్నట్లు తెలుస్తోంది. కండీషన్ లేని బస్సులపై ఆర్టీఏ అధికారులు కొరడా ఝులిపించాల్సింది పోయి.. యాజమాన్యాలు ఇచ్చే మామూళ్లకు కక్కుర్తిపడి ఫిట్నెస్ సరిగాలేని బస్సులకు సైతం ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తున్నారన్న ఆరోపణలు వినబడుతున్నాయి. అధికారుల తనిఖీల్లో అనేక బస్సుల్లో చాలా లోపాలు బయటపడుతుండటం గమనార్హం. గ్రిల్స్ లేకుండా.. బస్సుల్లో ప్రయాణించే విద్యార్థుల భద్రత కోసం బస్సుకు మూడు వైపులా తప్పనిసరిగా ఇనుప గ్రిల్స్ ఏర్పాటు చేయాలనే నిబంధన ఉంది. ము ఖ్యంగా పాఠశాలల బస్సుల్లో ప్రయాణించేది చిన్నపిల్లలు కావడంతో బస్సు కదిలేటప్పుడు కిటికీల నుంచి చేతులు బయటకు చాచకుండా గ్రిల్స్ ఏర్పా టు చేయాలి. అవి లేకుంటే ప్రయాణ సమయంలో విద్యార్థులు చేతులు బయటపెడితే ఇతర వాహనాల ద్వారా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. డ్రైవర్ వివరాలు లేకుండానే.. కొన్ని బస్సుల్లో నిబంధనల ప్రకారం డ్రైవర్ సీటు వెనుక భాగంలో అందరికీ కనిపించేలా ఉండాల్సిన డ్రైవర్ వివరాలు లేనే లేవు. అవేమీ లేకుండా బస్సులను సామర్థ్య పరీక్షలకు తీసుకొస్తున్నారు. అధికారులు సైతం చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నామమాత్రంగా ఫైర్ ఎస్టింగిషర్లు? అనుకోని పరిస్థితుల్లో ఏదైనా ప్రమాదం సంభవించి బస్సులో మంటలు చెలరేగితే వాటిని ఆర్పేందుకు ఫైర్ ఎస్టింగిషర్లు అందుబాటులో ఉండాలి. అగ్నిమాపక శాఖ నుంచి అనుమతి తీసుకొని బస్సుల్లో ఫైర్ ఎస్టింగిషర్లు ఏర్పాటు చేయాలి. అయితే బస్సుల్లో ఫైర్ ఎస్టింగిషర్స్ కనిపిస్తున్నప్పటికీ, నామమాత్రంగా ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. నిబంధనలు ఇవీ.. ● వాహనం ముందు, వెనుక భాగాల్లో ‘స్కూల్ బస్సు’, ‘బడి పిల్లలున్నారు’ అన్న వ్యాక్యాలు రాయాల్సి ఉంటుంది. పాఠశాల పేరు, ఫోన్ నంబర్, పూర్తి చిరునామా బస్సుకు ఎడమవైపు వెనుక భాగంలో కనిపించేలా రాయించాలి ● బస్సు పసుపు రంగులో ఉండాలి. ఆ రంగు స్పష్టంగా కనిపించాలి. ● బస్సు వేగం గంటకు 40కిలోమీటర్లకు మించకుండా లాక్ చేయాలి. 15 ఏళ్లు నిండిన బస్సుల్లో విద్యార్థులను తీసుకెళ్లడానికి వీలులేదు. ● ఐదేళ్ల అనుభవం, 60 ఏళ్లలోపు ఉన్నవారినే డ్రైవర్లుగా నియమించుకోవాలి. ప్రతీ మూడునెలలకోసారి కంటిచూపు, రక్తపోటు, మధుమేహ పరీక్షలు చేయించాలి. ● బస్సులో ప్రాథమిక చికిత్స పెట్టే ఉంచాలి. అందులో కావాల్సిన మందులు ఎప్పటికప్పుడు సమకూర్చుకోవాలి. ● బస్సుకు కనీసం ఒక అటెండర్ను ఏర్పాటు చేయాలి. పిల్లలు ఎక్కేది, దిగేది డ్రైవర్కు స్పష్టంగా కనిపించేలా కుంభాకార అద్దాలు అమర్చాలి. జిల్లాలో 273 బస్సులకు ఫిట్నెస్ చేసుకున్నవి 125 మాత్రమే.. వారం రోజుల్లో తెరుచుకోనున్న పాఠశాలలుఫిట్నెస్ లేకుంటే చర్యలు అనుమతులు లేకుండా పాఠశాల యజమానులు బస్సులు నడిపితే చర్యలు తీసుకుంటాం. పాఠశాలల పునఃప్రారంభం వరకు తప్పనిసరిగా ఫిట్నెస్ చేయించుకోవాలి. ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించి నిబంధనలు పాటించని యాజమాన్యాలపై కేసులు నమోదు చేస్తాం. – రంగారావు, ఆర్డీవో -
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి
పెద్దపల్లిరూరల్: పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకుని విరివిగా మొక్కలు నాటి సంరక్షించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జిల్లా గురువారం కోర్టు ఆవరణలో సెక్రటరీ స్వరూపరాణితో కలిసి మొక్కలు నాటారు. కరోనా కాలంలో అవసరమైన ఆక్సిజన్ కోసం డబ్బు ఖర్చు చేయాల్సి వచ్చిన పరిస్థితిని గుర్తు చేశారు. మళ్లీ అలాంటి పరి స్థితులు పునరావృతం కాకుండా అందరూ పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలన్నారు. బార్ అసోసియేషన్ కార్యదర్శి శ్రీనివాస్, లోక్అదాలత్ సభ్యుడు శ్రీధర్తో పాటు న్యాయవాదులు పాల్గొన్నారు. -
ముందస్తు సాగుపై అనుమానాలా?
● అయితే, జిల్లా వ్యవసాయాధికారిని సంప్రదించండి సంప్రదించాల్సిన ఫోన్ నంబరు 89777 52780 తేదీ : 06 : 06 : 2025 సమయం: శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి ఉదయం 11గంటల వరకు పెద్దపల్లిరూరల్: జిల్లాలో ముందస్తు సాగుకు సమాయత్తమయ్యే రైతులు, విత్తన ఎంపిక, భూసారం పెంపు తదితర అంశాలపై సందేహాలను నివృత్తి చేసుకునేందుకు ‘సాక్షి’ ఆధ్వర్యంలో శుక్రవారం (ఈనెల6న) ఫోన్ఇన్ కార్యక్ర మం నిర్వహిస్తోంది. వరిలో ఏ రకమైన విత్తనం వినియోగిస్తే అధిక దిగుబడి వస్తుంది, పత్తి సాగులో తలెత్తే సందేహాలకు సమాధానాలు, ముందస్తు సాగుకు సన్నద్ధమయ్యే తీరు, నకిలీ విత్తనాల గుర్తింపు.. ఇలాంటి సమస్యలపై జిల్లా వ్యవసాయాధికారి ఆదిరెడ్డి దృష్టికి తెచ్చి నివృత్తి చేసుకోవచ్చు. -
పని ఒత్తిడి.. ఆర్థిక భారం
పంచాయతీ పాలకవర్గాలు లేక కార్యదర్శులు అన్నీతామై పనులు చక్కబెడుతున్నారు. ఒకవైపు ప్రజాప్రతినిధులుగా, మరోవైపు ప్రభుత్వ సారథులుగా ఒకేసమయంలో రెండు విధులూ నిర్వర్తిస్తున్నారు. ఫలితంగా పనిఒత్తిడితోపాటు ఆర్థికంగా సతమతమవుతున్నారు. అయినా, వీరిగోస పట్టించుకునే నాథుడే లేడని ఆవేదన చెందుతున్నారు. సెలవుల్లోనూ విధులు ప్రభుత్వం చేపట్టిన సంక్షే మ పథకాలను విజయవంతం చేయడానికి రాత్రింబవళ్లు పనిచేస్తున్నాం. సెల వు రోజులు, పండుగ సమయాల్లోనూ విధులు నిర్వర్తిస్తున్నాం. కుటుంబాలకు దూరంగా ఉంటున్నాం. మా శాఖకు సంబంధం లేనిపనులు కూడా అప్పగించడంతో పనిభారం పెరుగుతోంది. – ఎడిపల్లి సంతోష్, కార్యదర్శుల సంఘం జిల్లా అధ్యక్షుడు, పెద్దపల్లి నిధులు నిలిచిపోయాయి గ్రామ పంచాయతీలకు పాలకవర్గాలు లేవు. ఫలితంగా వివిధ రూపాల్లో రావాల్సిన నిధులు నిలిచిపోయాయి. అత్యవసర పనులు చేయలేక కార్యదర్శులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయం మా దృష్టికి వచ్చింది. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. – వీరబుచ్చయ్య, డీపీవో ●రామగిరి(మంథని): గతేడాది ఫిబ్రవరిలో గ్రామపంచాయతీ పాలకవర్గాల గడువు ముగిసింది. ప్రజాప్రతినిధులు లేకపోవడంతో ఆ భారం కూడా పంచా యతీ కార్యదర్శులే మోయాల్సి వస్తోంది. రోజూ వారి విధులతోపాటు సర్వేలు, సంక్షేమ పథకాల లబ్ధిదారుల జాబితా తయారీ, వీధి దీపాలు, పారిశుధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా, ఇతరత్రా సమస్యల పరిష్కారం, వివిధ అభివృద్ధి పనులు చేపట్టడం తలకు మించిన భారంగా మారుతోంది. జిల్లాలో 266 పంచాయతీలు.. జిల్లాలో 266 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. గతేడాది ఫిబ్రవరి ఒకటిన పంచాయతీ పాలకవర్గా ల గడువు ముగిసింది. ప్రభుత్వం మళ్లీ ఎన్నికలు నిర్వహించలేదు. సర్పంచుల స్థానంలో ప్రభుత్వం ప్రత్యేకాధికారులను నియమించింది. అయితే, నిధులు లేకపోవడంతో వీధిదీపాలు, పారిశుధ్యం నిర్వహణ, తాగునీటి సరఫరాలో సమస్యలు తలెత్తుతున్నాయి. వీటి పరిష్కారానికి పంచాయతీ కార్యదర్శులు సొంతంగా నిధులు సమకూర్చుకుంటున్నారు. ఉదయం 9 గంటల్లోపే గ్రామాలకు చేరుకుని లైవ్ లోకేషన్ ద్వారా వారి ఫొటోలను ఆన్లైన్ అప్లోడ్ చేస్తున్నారు. ఏమాత్రం సమయం మించిపోయినా అధికారుల చీవాట్లు తప్పడంలేదు. తప్పని రాజకీయ నాయకుల ఒత్తిళ్లు.. పనిభారంతో సతమతమవుతున్న పంచాయతీ కార్యదర్శులపై వివిధ రాజకీయ పార్టీల నాయకులు వివిధ రకాలుగా ఒత్తిళ్లు చేస్తున్నారు. ప్రధానంగా కొందరు మాజీప్రజాప్రతినిధులు ఇప్పటికీ తాము అధికారంలో ఉన్నామనే భావనతో ఆస్తిప న్ను, నీటిబిల్లులు, లైసెన్స్ ఫీజు వసూలు చేయాలని తరచూ ఒత్తిడి చేస్తున్నారు. పన్నులు, బిల్లుల వసూళ్లలో నిర్దేశిత లక్ష్యం చేరుకోక అటు ఉన్నతాధికారుల నుంచి కూడా వారు చీవాట్లు పడుతుండగా, నాయకుల నుంచి ఒత్తిళ్లు పెరగడంతో కొందరు మనస్తాపానికి గురవుతున్నారు. మరమ్మతులకు సొంత డబ్బులు.. గ్రామాల్లో వాటర్పైప్లైన్ల లీకేజీల మరమ్మతు, పంచాయతీ ట్రాక్టర్ నెలవారీ బ్యాంక్ కిస్తీలు, విద్యుత్ దీపాల ఏర్పాటు, బ్యాంక్ ఇన్స్టాల్మెంట్, విద్యుత్ బిల్లుల చెల్లింపులు కూడా పంచా యతీ కార్యదర్శులు తమ జేబుల్లోంచి చెల్లిస్తున్నారు. ఇలా ఇప్పటికే ఒక్కో పంచాయతీ కార్యదర్శి సుమారు రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు వివిధ పనులకు వెచ్చించారని సమాచారం. డిపార్ట్మెంట్కు సంబంధం లేని పనులు గతంలో కార్యదర్శులు గ్రామ పంచాయతీ విధులే నిర్వర్తించేవారు. ఆస్తిపన్ను వసూలు, పంచాయతీ ఆదాయవ్యయాల నిర్వహణ, జనన, మరణ ధ్రువీ కరణ పత్రాల జారీ, ఇంటి నిర్మాణ అనుమతుల మంజూరు, పాలకవర్గా సమావేశాల తీర్మానాలు, పారిశుధ్య నిర్వహణ లాంటి పనులను చేసేవారు. ఇప్పుడు అదనంగా ప్రకృతి వనాలు, శ్మశానవాటిక, క్రీడా ప్రాంగణాల నిర్వహణ తదితర పనులు చేయాల్సి వస్తోంది. అంతేకాదు.. కులగణన, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, భూముల సర్వే తదితర పనులకూ అధికారులు పురమాయిస్తున్నారు. అసలు తమ శాఖకు సంబంధం లేని పనులు చేయాల్సి రావడంతో పంచాయతీ కార్యదర్శులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. సతమతమవుతున్న గ్రామ పంచాయతీ కార్యదర్శులు తమ గోస పట్టించుకునే వారు లేరంటూ పలువురి ఆవేదన -
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
జ్యోతినగర్/ఫెర్టిలైజర్సిటీ: పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని ఎన్టీపీసీ రామగుండం–తెలంగాణ ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చందన్కుమార్ సామంత, ఆర్ఎఫ్సీఎల్ సీఈవో అలోక్ సింగల్ అనారు. గురువారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఎన్టీపీసీ రామగుండంలో ఈడీ పర్యావరణ ర్యాలీ అనంతరం మొ క్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్టీపీసీ రామగుండం– తెలంగాణ ప్రా జెక్టులు పర్యావరణ బాధ్యతలకు కట్టుబడి ఉన్నాయన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను తొలగించడానికి సమష్టి చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొన్నారు. ఉద్యోగులకు జనపనార బ్యాగులు, ప ర్యావరణ పరిరక్షణ క్రమంలో నిర్వహించిన పలు పోటీల విజేతలకు బహుమతులు అందించారు. దీప్తి మహిళా సమితి అధ్యక్షురాలు రాఖీ సామంత, జనరల్ మేనేజర్లు తదితరులు పాల్గొన్నారు. అలాగే రామగుండం ఎరువుల కర్మాగారంలో సీఈవో మొక్కలు నాటారు. ప్లాస్టిక్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. పర్యావరణ దినోత్సవ ప్రతిజ్ఞ చేశారు. సీజీఎం ఉదయ రాజహంస, రమేశ్ ఠాకూర్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఎన్టీపీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చందన్కుమార్ సామంత, ఆర్ఎఫ్సీఎల్ సీఈవో అలోక్ సింగల్ -
రక్తమోడిన రహదారులు
● ఉమ్మడి జిల్లాలో వేర్వేరు చోట్ల రోడ్డు ప్రమాదాలు ● ఆరుగురు మృతి.. పలువురికి గాయాలుఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని రహదారులు గురువారం రక్తమోడాయి. మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపాయి. జగిత్యాల జిల్లా మల్యాల పరిధిలోని ముత్యంపేట వద్ద పెళ్లికారును డీసీఎం ఢీకొనడంతో చిన్నారి మృతి చెందగా.. పెళ్లి కుమారుడు సహా.. ఆరుగురు గాయపడ్డారు. ఇదే జిల్లా మల్లాపూర్ మండలం రాఘవపేట శివారులో ట్రాక్టర్ బోల్తాపడి తండ్రి మృతి చెందగా.. కొడుకు గాయపడ్డాడు. మెట్పల్లిలోని వెల్లుల్ల రోడ్డులో ఇసుక ట్రాక్టర్ ఢీకొని యువకుడు చనిపోయాడు. పెద్దపల్లి జిల్లా సుగ్లాంపల్లి వద్ద లారీ ఢీకొనడంతో దంపతులు చనిపోయారు. చిన్నారి గాయపడింది. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పరిధిలోని తుమ్మనపల్లి వద్ద రెండు లారీలు ఢీకొని ఒక డ్రైవర్ మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. – 10లోu -
పరిషత్ సమరానికి సిద్ధం!
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు కసరత్తు ● చర్యలు ప్రారంభించిన ఆయా జిల్లాల అధికారులు ● చకచకా ఓటర్ల తుది జాబితా, మార్పులు– చేర్పులు ● సిద్ధమవుతున్న పోలింగ్ స్టేషన్ల రూట్మ్యాప్లు ● ఈనెల 15 లేదా నెలాఖరున నోటిఫికేషన్ ?సాక్షిప్రతినిధి,కరీంనగర్: స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. ఇటీవల పదవీకాలం ముగిసిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల్లో తిరిగి ఎన్నికలు నిర్వహించే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఈ మేరకు ఉమ్మడి జిల్లా కలెక్టర్లు కసరత్తు ప్రారంభించారు. లోకల్బాడీ ఎన్నికలు జరిపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఇటీవల సంకేతాలు వెలువడిన దరిమిలా.. ఎన్నికల ప్రక్రియకు ఏర్పాట్లు చేస్తుండడం గమనార్హం. ఈమేరకు కరీంనగర్, రాజన్నసిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లోని జెడ్పీ సిబ్బంది ఇదే పనిలో నిమగ్నమయ్యారు. ఇందుకోసం ఓటర్ల తుది జాబితాను మే 30వ తేదీన హైదరాబాద్కు పంపారు. ఇది పంపే ముందు.. ఇటీవల 18 ఏళ్లు నిండిన కొత్త ఓటర్లను చేర్చడం విశేషం. ఆ తరువాత అందులో కొన్ని సవరణలు చేసి తిరిగి 31వ తేదీన మరోసారి ఓటర్ల జాబితాను హైదరాబాద్కు పంపారు. జోరుగా ఏర్పాట్లు.. ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు జిల్లా అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారని సమాచారం. ఈ నెల15న లేదా నెలాఖరులో నోటిఫికేషన్ విడుదల అవుతుందని, ఆ లోపు జిల్లా అధికారులు పూర్తిగా సంసిద్ధులు కావాలన్న ఆలోచనలో భాగంగానే ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిసింది. ఇందుకోసం ఇప్పటికే పోలింగ్ స్టేషన్ల ఖరారు చేశారు. పోలింగ్ స్టేషన్ల రూట్ మ్యాపింగ్ కూడా ఇప్పటికే సిద్ధం చేశారు. అదే సమయంలో అసెంబ్లీ నియోజకవర్గాలలోని పోలింగ్ స్టేషన్లను ఎంపీటీసీ, జెడ్పీటీసీ ప్రాదేశిక నియోజకవర్గాలకు అనుగుణంగా సర్దుబాటు చేసే ప్రక్రియ కూడా దాదాపుగా కొలిక్కి వచ్చింది. ఈ ప్రక్రియపై వారాంతానికి స్పష్టత రానుంది. ఈ నేపథ్యంలో అన్ని జిల్లాల జెడ్పీ కార్యాలయ సిబ్బంది ఇదే పనిలో తలమునకలయ్యారు. ఈనెలలో ఏక్షణమైనా ఎన్నికలు జరుగవచ్చన్న ప్రభుత్వ ఆదేశాలతో అంతా సిద్ధమవుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న రాజకీయ నాయకులు సైతం ఉత్సాహంగా ఉన్నారు. పోటీ చేసేందుకు ఆసక్తి ఉన్నవారంతా ఇక రంగంలోకి దిగేందుకు సిద్ధమతున్నారు.ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలుజిల్లా ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాలు స్థానాలు కరీంనగర్ 170 15 జగిత్యాల 216 20 పెద్దపల్లి 140 13 రాజన్నసిరిసిల్ల 123 12 మొత్తం 649 60 -
సర్కారు పాఠశాలలను కాపాడుకుందాం
పెద్దపల్లిరూరల్: సర్కారు స్కూళ్లలో విద్యార్థు ల సంఖ్య పెంచేలా ఉపాధ్యాయులు స్థానికు ల సహకారంతో ముందుకు సాగాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిళి శ్రీపాల్రెడ్డి కోరారు. టెన్త్ ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభను కనబర్చి న విద్యార్థులు, నూరు శాతం ఫలితాలు సా ధించిన హెచ్ఎంలకు పీఆర్టీయూ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో బుధవారం అవార్డులు అందజేశారు. డీఈవో మాధవి హాజరయ్యా రు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివి అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులనే అంబాసిడర్లుగా చూపించి ప్రవేశాలు కల్పించాలని సూచించారు. పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగుపడ్డాయన్నారు. సంఘం నాయకులు లక్ష్మణ్, కర్రు సురేశ్, దామోదర్రెడ్డి, హన్మంతు, హెచ్ఎంలు కృష్ణమూర్తి, కరుణాకర్రెడ్డి, జైపాల్రెడ్డి, శంకర్, మోహన్రావు, రవినందన్రావు, శ్రీధర్రావు, రాజమౌళి, శ్రీనివాస్, పోచయ్య, రమేశ్ తదితరులు పాల్గొన్నారు. ● ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శ్రీపాల్రెడ్డి -
బాలికలు గొప్పస్థాయికి చేరుకోవాలి
జ్యోతినగర్(రామగుండం): బాలికలు గొప్పస్థాయికి చేరుకోవడానికి ఎన్టీపీసీ అందించే శిక్షణ దో హదం చేస్తోందని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నా రు. ఎన్టీపీసీ కాకతీయ ఆడిటోరియంలో సీఎస్సా ర్ ఆధ్వర్యంలో బుధవారం బాలికా సాధికారత మిషన్–2025 రెసిడెన్షియల్ శిక్షణ ముగింపు వే డుకలు ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ హాజరై మాట్లాడారు. భవిష్యత్లో బాలికలు ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు. ఎన్టీపీసీ ఈడీ చందన్ కుమార్ సామంత మాట్లాడుతూ, విద్యుత్ రంగంలో అగ్రగామిగా నిలిచిన ఎన్టీపీసీ.. సమర్థవంతమైన, సరసమైన విద్యుత్ ఉత్పత్తి చేయడానికి కట్టుబడి ఉందన్నారు. 2032 నాటికి 130 గిగాబైట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం సాధించాలని ల క్ష్యంగా నిర్దేశించిందని తెలిపారు. చిన్నారుల ప్ర దర్శనలు ఆకట్టుకున్నాయి. ఎన్టీపీసీ ఈడీ చందన్ కుమార్ సామంత, దీప్తి మహిళా సమితి అధ్యక్షురాలు రాఖీ సామంత, ఎన్టీపీసీ ఎన్బీసీ సభ్యుడు బాబర్ సలీంపాషా, ఏజీఎం బిజయ్కుమార్ సిగ్దర్, ప్రవీణ్ చౌదరి, సీఎస్సార్ ప్రతినిధులు, యూనియన్ నాయకులు పాల్గొన్నారు. ఆస్పత్రి భవన నిర్మాణాల్లో వేగం పెంచాలి పెద్దపల్లిరూరల్: జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి భవన నిర్మాణంలో వేగం పెంచాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. పెద్దపల్లి, మంథని ప్రభుత్వ ఆస్పత్రుల భవన నిర్మాణాలు, మంథని ప్రభుత్వ ఆస్పత్రి పనితీరుపై జిల్లా ఆస్పత్రుల సూపరింటెండెంట్ శ్రీధర్, అధికారులతో ఆ యన కలెక్టరేలో సమీక్షించారు. రూ.57 కోట్లతో చేపట్టిన వంద పడకల భవనంలోని ఒక బ్లాక్ను వానాకాలంలోగా పూర్తిచేయాలని సూచించారు. మంథనిలో రూ.26కోట్లతో చేపట్టిన 50 పడకల ఆస్పత్రి భవనం పనులు సకాలంలో పూర్తిచేయాలని ఆదేశించారు. మంథనిలో వైద్యసేవలు మెరుగుపర్చాలని, అవుట్ పేషెంట్ల సంఖ్య పెంచాలని పేర్కొన్నారు. పారిశుధ్య నిర్వహణపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. మాతా శిశు ఆస్పత్రిలో ప్రసవాల సంఖ్య పెంచాలన్నారు. రెసిడెన్షియల్ స్కూళ్లు సిద్ధం చేయాలి జిల్లాలోని రెసిడెన్షియల్ స్కూ ళ్లను ఈనెల 10వ తేదీవరకు సిద్ధం చేయాలని కలెక్టర్ శ్రీహర్ష ఆదేశించారు. కార్యక్రమంలో డీఈవో మాధవి, బీసీ వెల్ఫేర్ అధికారి రంగారెడ్డి, ఎస్సీ సంక్షేమ అధి కారి వినోద్కుమార్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ కోయ శ్రీహర్ష -
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
ఓదెల(పెద్దపల్లి): అర్హులైన వారందరికీ ఇందిర మ్మ ఇళ్లు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. గుండ్లపల్లిలో బుధవారం ఆయన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ము గ్గుపోశారు. సీసీ రోడ్ల నిర్మానం ప్రారంభించి మాట్లాడారు. కాంగ్రెస్ హయాంలోనే ఇందిర మ్మ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టామన్నారు. మాజీ సర్పంచ్ పుప్పాల శంకర్, సింగిల్విండో చైర్మన్ ఆళ్ల సుమన్రెడ్డి, కాంగ్రెస్ మండల అ ధ్యక్షుడు మూల ప్రేంసాగర్రెడ్డి, గ్రామ అధ్యక్షు డు పెద్దిరెడ్డి రఘపతిరెడ్డి పాల్గొన్నారు. సమస్యల పరిష్కారమే లక్ష్యం జ్యోతినగర్(రామగుండం): భూ సమస్యల ప రిష్కారమే లక్ష్యంగా భూభారతి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని ఆర్డీవో గంగయ్య తె లిపారు. ఐదో డివిజన్ మల్కాపూర్లో బుధవా రం నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఆయన మాట్లాడారు. భూ సమస్యలపై మీ సేవ కేంద్రం ద్వారా ఉచితంగా దరఖాస్తు చేయొచ్చన్నారు. తహసీల్దార్ దత్తుప్రసాద్రావు, నాయ బ్ తహసీల్దార్లు ఈశ్వర్, కోటేశ్వ్రావు, గిర్దావ ర్లు ఇంతియాజ్, రాజేందర్, సంపత్కుమార్, సీనియర్ సహాయకులు శ్రావణి, చంద్రశేఖర్, రవీందర్, ఏఎస్సై తిరుపతి పాల్గొన్నారు. వ్యాధులు ప్రబలకుండా చర్యలు సుల్తానాబాద్(పెద్దపల్లి): సీజనల్ వ్యాధులు ప్ర బలకుండా ముందు జాగ్రత్తలు చేపట్టాలని జె డ్పీ సీఈవో నరేందర్ ఆదేశించారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయాన్ని ఆయన బుధవారం త నిఖీ చేశారు. నీటినిల్వలు తొలగించాలని, డ్రైనేజీలు శుభ్రం చేయాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు పనులు ప్రారంభించేలా చైతన్యవంతం చేయాలని కోరారు. ఎంపీడీవో దివ్యదర్శన్రావు, ఎంపీవో సమ్మిరెడ్డి, ఈజీఎస్ ఏపీ ఎం మల్లేశ్వరి, సిబ్బంది తదితరులు ఉన్నారు. శాంతికి భంగం కలిగించొద్దుగోదావరిఖని: ప్రజాశాంతికి భంగం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పెద్దపల్లి డీసీపీ కరుణాకర్ హెచ్చరించారు. బక్రీద్ను పురస్కరించుకుని స్థానిక వన్టౌన్ పోలీసుస్టేషన్లో బుధవారం పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు. అనుమతిలేకుండా, పశువైద్యుని ధ్రువీకరణ లేకుండా పశువులను రవాణా చేస్తే ఊరు కోబోమన్నారు. బహిరంగ ప్రదేశాలల్లో పశువులను వధించరాదని తెలిపారు. సోషల్ మీడియాలో వదంతులు ప్రచారం చేసినా చర్యలు తప్పవని అన్నారు. గోదావరిఖని ఏసీపీ రమేశ్, సీఐలు ఇంద్రసేనారెడ్డి, ప్రసాదరావు, ప్రవీణ్కుమార్, ఎస్సైలు రమేశ్, భూమేశ్, ఉదయ్కిరణ్, సంధ్యారాణి, మతపెద్దలు పాల్గొన్నారు. అభ్యంతరాలు స్వీకరిస్తాంకోల్సిటీ(రామగుండం): రామగుండం నగరపాలక సంస్థను 60 వార్డులుగా విభజిస్తూ ము సాయిదా నోటిఫికేషన్ విడుదల చేసినట్లు కమిషనర్(ఎఫ్ఏసీ) అరుణశ్రీ తెలిపారు. ఈ మేర కు బల్దియా కార్యాలయ నోటీస్ బోర్డుపై నోటి ఫికేషన్ ప్రదర్శనకు ఉంచినట్లు పేర్కొన్నారు. దీనిపై అభ్యంతరాలు, సలహాలు, సూచనలు ఉంటే ఈనెల 11వ తేదీ వరకు కార్యాలయంలో సమర్పించాలని కమిషనర్ కోరారు. శాంతిచర్చలు జరపాలిగోదావరిఖని: ఆపరేషన్ కగార్ను నిలిపివేసి మావోయిస్టులతో శాంతిచర్చలు జరపాలని వామపక్ష పార్టీల నేతలు డిమాండ్ చేశారు. బు ధవారం స్థానిక భాస్కర్రావు భవన్లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో వారు మాట్లాడారు. శాంతిచర్చలకు తాము సిద్ధమని మావోయిస్టులు ప్రకటించినా స్పందించకుండా కేంద్ర హోంమంత్రి అమిత్షా నరమేధాన్ని కొనసాగిస్తున్నారని, ఇప్పటికైనా కాల్పుల విర మణ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈనెల 14న హైదరాబాద్లో జరిగే మహాధర్నాను వి జయంతం చేయాలని కోరారు. ఇ.నరేశ్, తాండ్ర సదానందం, వై.యాకయ్య, ఐ.కృష్ణ, జూ పాక శ్రీనివాస్, దాముక లచ్చయ్య, గౌతమ్ గోవర్ధన్, మహేశ్వరి, ఐ.రాజేశం, రమేశ్, రామచందర్, కనకరాజు తదితరులు పాల్గొన్నారు. -
ముందస్తు సాగుపై అనుమానాలా?
● అయితే, జిల్లా వ్యవసాయాధికారిని సంప్రదించండి సంప్రదించాల్సిన ఫోన్ నంబరు 89777 52780 తేదీ : 06 : 06 : 2025 సమయం: శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి ఉదయం 11గంటల వరకు పెద్దపల్లిరూరల్: జిల్లాలో ముందస్తు సాగుకు సమాయత్తమయ్యే రైతులు, విత్తన ఎంపిక, భూసారం పెంపు తదితర అంశాలపై సందేహాలను నివృత్తి చేసుకునేందుకు ‘సాక్షి’ ఆధ్వర్యంలో శుక్రవారం (ఈనెల6న) ఫోన్ఇన్ కార్యక్ర మం నిర్వహిస్తోంది. వరిలో ఏ రకమైన విత్తనం వినియోగిస్తే అధిక దిగుబడి వస్తుంది, పత్తి సాగులో తలెత్తే సందేహాలకు సమాధానాలు, ముందస్తు సాగుకు సన్నద్ధమయ్యే తీరు, నకిలీ విత్తనాల గుర్తింపు.. ఇలాంటి సమస్యలపై జిల్లా వ్యవసాయాధికారి ఆదిరెడ్డి దృష్టికి తెచ్చి నివృత్తి చేసుకోవచ్చు. -
రేషన్.. పరేషాన్
సుల్తానాబాద్(పెద్దపల్లి): వర్షాకాలంలో లబ్ధిదారులకు ఇబ్బందులు తలెత్తకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జూన్, జూలై, ఆగస్టు నెలలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని ఒకేసారి.. ఈనెలలోనే పంపిణీ చేస్తున్నాయి. అయితే, వేలిముద్రలు సరిపోక, ఒకటికి మూడుసార్లు వేలిముద్రలు వేయాల్సి రావడంతో బియ్యం పంపిణీలో తీవ్ర జాప్యమవుతోంది. తద్వారా ఈనె కోటాలో బుధవారం వరకు 10 శాతం లబ్ధిదారులకు కూడా రేషన్ బియ్యం పంపిణీ చేయలేకపోయామని డీలర్లు వాపోయారు. ఎండ తీవ్రత.. బియ్యం కోసం ఆత్రుత ప్రస్తుతం ఎండతీవ్రత అధికంగా ఉంది. దీంతో కార్డుదారులు ఉదయమే రేషన్ షాపుల ఎదుట బారులు తీరుతున్నారు. అయితే, ఉదయం 9 గంటలు – ఉదయం 10 గంటల మధ్యే ఇంటర్నెట్ సౌకర్యం ఉంటుండడంతో క్యూలో నిల్చోలేక చాలామంది చెప్పులు, సంచులు క్యూలో పెడుతూ, వారు చెట్లు, రేకుల నీడన నిరీక్షిస్తున్నారు. బియ్యం పంపిణీలో తీవ్రజాప్యం సాంకేతిక సమస్యలే కారణం -
ప్రభుత్వ కాలేజీలో చేర్పించాలి
జూలపల్లి(పెద్దపల్లి): అర్హులైన అధ్యాపకులతో నాణ్యమైన ఉచిత విద్య అందిస్తున్న ప్రభుత్వ కళాశాలల్లోనే తమ పిల్లలను చేర్పించాలని అధ్యాపకులు పవన్కుమార్, మహేందర్ కోరారు. స్థానిక ప్రభుత్వ కళాశాల అధ్యాపకులు పదో తరగతి పాసైన విద్యార్థులను బుధవారం నేరుగా కలుసుకున్నారు. ప్రభుత్వ కళాశాలలో బోధిస్తున్న విద్యావిధానంపై అవగాహన కల్పించారు. తల్లిదండ్రులను కలిసి తమ పిల్లలను ప్రభుత్వ కళాశాలలోనే చేర్పించాలని కోరారు. కార్యక్రమంలో అధ్యాపకులు సురేశ్ కుమార్, విజేందర్, రవిచంద్రన్, శ్రీనివాస్, అజయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఆలస్యం చేయొద్దు
రేషన్షాప్ల్లోని మిషన్లలో సమస్య వస్తంది. ఒక్కరికి బియ్యం ఇవ్వడానికి రెండుగంటల సమయం పడుతుంది. ఇలా ఆలస్యం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి. – గడ్డం శంకరయ్య, లబ్ధిదారు, కాల్వశ్రీరాంపూర్ఎండతో ఇబ్బంది ఎండ తీవ్రత అధికంగా ఉంది. బియ్యం తీసుకుని వెళ్లేందుకు రేషన్ షాపులో ఇబ్బంది పడుతున్నం. ఎండను తట్టుకోలేక చెట్ల కింద నిలబడాల్సి వస్తంది. రేషన్ షాపుల వద్ద టెంట్లు వేసేలా చూడాలి. – శనిగారపు శంకరమ్మ, లబ్ధిదారు, కాల్వశ్రీరాంపూర్ -
పునర్విభజన గందరగోళం
● ముసాయిదాపై పలువురి అసంతృప్తి ● ఓటర్ల గల్లంతుపై అయోమయం ● రామగుండం బల్దియాలో డివిజన్ల పెంపుపై సర్వత్రా చర్చకోల్సిటీ (రామగుండం): ఎనిమిది గ్రామ పంచాయతీల విలీనంతో 1982లో నోటిఫైడ్ ఏరియాగా అవతరించిన రామగుండం.. 1995లో 34 వార్డులతో మున్సిపాలిటీగా మారింది. 2010లో యాబై డివిజన్లతో మున్సిపల్ కార్పొరేషన్ స్థాయికి ఎదిగింది. ప్రస్తుతం 60 డివిజన్లతో రాష్ట్రంలోని ప్రముఖ నగరాల సరసన చేరింది. 1982 నుంచి 93.87 చ.కి.మీ. వైశాల్యమే.. రామగుండం నగరం 1982 నుంచి 93.87 చ.కి.మీ.వైశాల్యానికే పరిమితమైంది. ప్రస్తుతం లింగాపూర్, వెంకట్రావుపల్లి, ఎల్కలపల్లిగేట్, అక్బర్నగర్ గ్రామాల విలీనంతో నగర విస్తీర్ణం 99.5 చ.కి.మీ.లకు విస్తరించింది. తాజాగా రామగుండం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ప్రకటన నేపథ్యంలో అభివృద్ధి పుంజుకుంటుందని నగరవాసులు భావిస్తున్నారు. తాజాగా 60 డివిజన్ల విభజనతో 1,84,427 ఓట్లర్లు ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. మున్సిపల్గా ఏర్పడిన 1995లో దాదాపు ఒక లక్షా 40 వేల మంది ఓటర్లు ఉండగా, 30ఏళ్ల అనంతరం కొన్ని గ్రామాల విలీనం చేశాక కూడా కేవలం 40 వేల మంది ఓటర్లే పెరగడం గమనార్హం. కొందరికి మోదం.. ఇంకొందరికి ఖేదం.. నగరంలో డివిజన్ల పెంపు కొందరికి మోదం కలిగించగా, మరికొంతదరికి ఖేదం కలిగించినట్లయ్యింది. ఈసారి కార్పొరేటర్లుగా పోటీ చేద్దామనుకునే మాజీ లు తమ డివిజన్ హద్దులు మారడంతో కంగుతి న్నారు. అభివృద్ధి పనులు చేపట్టిన ప్రాంతాలు పొరుగు డివిజన్లలో కలవడంతో ఓటుబ్యాంక్ కోల్పోతామని ఆందోళన చెందుతున్నారు. కొత్త ఆశావహులకు కొంత కలిసి వచ్చింది. గతంతో పోల్చితే.. ఓట్ల సంఖ్య తగ్గడంతో విజయం సులభమవుతుందని మరికొందరు భావిస్తున్నారు. ఏదేమైనా డివిజన్ల పునర్విభజన ముసాయిదా స్తబ్ధుగా ఉన్న రాజకీయాల్లో ఒక్కసారిగా అలజడి రేపింది. సంఖ్య పెంపు, ఒక్కో డివిజన్ రెండు ముక్కలు కావడం, సమీప డివిజ్లోనైనా రిజర్వేషన్ కలిసివస్తుందని కొందరు సంతోష పడుతున్నారు. బీసీల రిజర్వేషన్ కోటా 42 శాతం అమలైతే దాదాపుగా 25 సీట్లు వారి కోటాలోకే వెళ్తాయంటున్నారు. 50శాతం సీట్లు.. అంటే 30 సీట్లు మహిళలకు దక్కనున్నాయి. మరోవైపు.. ప్రతీ విభజన సమయంలో మేయర్ స్థానం ఎస్సీ కోటాలోకే వెళ్తోంది. ఈసారి కూడా అదే ఒరవడి కొనసాగుతుందని కొందరు భావిస్తున్నారు. బీసీ రిజర్వేషన్ సౌకర్యం పెరిగిన నేపథ్యంలో ఈసారి బీసీలకు ఆ స్థానం దక్కుతుందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. గందరగోళంగా ముసాయిదా.. డివిజన్ల పునర్విభజన ముసాయిదా నోటిఫికేషన్ గందరగోళంగా ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. చాలామంది ఓటర్లను లెక్కించకుండానే మొక్కుబడిగా ముసాయిదా తయారు చేసినట్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని డివిజన్లలోని ఓటర్లను పరిగణనలోకి తీసుకోకుండా, పార్ట్ అని పొందుపరచడం అయోమయానికి దారితీస్తోంది. ఓటరు జాబితా పొంతన లేకుండా ఉందంటూ పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తూ కమిషనర్కు వినతి పత్రాలను సమర్పించారు. -
క్రమంతప్పకుండా వ్యాయామం చేయాలి
కోల్సిటీ(రామగుండం): విద్యార్థులు చదువుతోపాటు శారీరక, మానసిక ఆరోగ్యం కోసం క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్ కోరారు. గోదావరిఖని సిమ్స్లో ఏర్పాటు చేసిన జిమ్ను ప్రిన్సిపాల్ హిమబింద్సింగ్తో కలిసి ఎమ్మెల్యే మంగళవా రం ప్రారంభించారు. రైతులకు నాణ్యమైన విత్త నాలు పంపిణీ చేసి మాట్లాడారు. మెడికోలు, ఫ్యాకల్టీలు ఒత్తిడిని తగ్గించుకోవడానికి జిమ్ ఒక ప్లాట్ఫాంగా దోహదపడుతుందన్నారు. నాణ్యమైన విత్తనాలతోనే సాగు లాభసాటిగా ఉంటుందని అన్నారు. సిమ్స్ వైస్ ప్రిన్సిపాల్ నరేందర్, డీఏవో ఆదిరెడ్డి, వ్యవసాయాధికారులు ఉన్నారు. ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్ -
భూ సమస్యలు పరిష్కరిస్తాం
కమాన్పూర్(మంథని): భూ భారతి చట్టంతో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని మంథని ఆర్డీవో సురేశ్ అన్నారు. నాగారంలో మంగళవారం నిర్వహించిన భూ భారతి రె వెన్యూ సదస్సులో ఆయన మాట్లాడారు. భూ సమస్యలు ఉన్నవారు దరఖాస్తు చేస్తే అధికారు లు పరిశీలించి పరిష్కరిస్తారని తెలిపారు. తహసీల్దార్ వాసంత, పీఏసీఎస్ చైర్మన్ ఇనగంటి భాస్కర్రావు, ఆర్ఐ వాసంత, సిబ్బంది సతీశ్, రాజేందర్, రజిత, కట్ట కుమార్ పాల్గొన్నారు. కాగా, గుండారంలో నిర్వహించిన మరో కార్యక్రమంలో శాస్త్రవేత్త సిద్ధి, ఏవో గిరిరామకృష్ణ, ఏఈవోలు అనూష, శ్వేత పాల్గొన్నారు. విత్తనోత్పత్తిపై దృష్టి సారించాలి ఎలిగేడు(పెద్దపల్లి): రైతులు విత్తనోత్పత్తిపై దృష్టి సారించాలని కరీంనగర్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త శ్రావణి అన్నారు. స్థానిక రైతువేదికలో మంగళవారం నిర్వహించిన కా ర్యక్రమంలో ఆమె మాట్లాడారు. నాణ్యమైన వి త్తనాన్ని వినియోగిస్తే అధిక దిగుబడి వస్తుందన్నారు. ఏడీఏ కాంతారావు, మండల వ్యవసాయశాఖ అధికారి ఉమాపతి, ఏఈవోలు సురేశ్, గణేశ్, శరణ్య, రైతులు పాల్గొన్నారు. నాణ్యమైన విత్తనాలు వాడాలిపెద్దపల్లిరూరల్: నాణ్యమైన విత్తనాలతోనే అధి క దిగుబడి వస్తుందని కూనారం వ్యవసాయ పరిశోధన కేంద్రం ముఖ్య శాస్త్రవేత్త శ్రీధర్ సిద్ధి అన్నారు. రాఘవాపూర్ రైతువేదికలో మంగళవారం పలువురు రైతులకు 46 వరి విత్తన, 23 పెసరు విత్తన బ్యాగులు పంపిణీ చేశారు. ఏవో అలివేణి, అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికసుల్తానాబాద్రూరల్(పెద్దపల్లి): గట్టెపల్లి ప్రభుత్వ ఉ న్నత పాఠశాల విద్యార్థిని రమాదేవి రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో సత్తా చాటింది. అథ్లెటిక్స్ అసోసియేష న్ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్లో నిర్వహించిన షాట్పుట్ అండర్– 12లో సిల్వర్ మెడల్ సాధించింది. ఎంఈవో రాజయ్య హెచ్ఎం అన్నపూర్ణ, పీడీ ప్రణయ్, జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ సెక్రటరీ గట్టయ్య తదితరులు అభినంధించారు. యూటీఎఫ్ బడిబాట ప్రారంభం పెద్దపల్లిరూరల్: టీఎస్యూటీఎఫ్ ఆధ్వర్యంలో చేపట్టిన బడిబాట కార్యక్రమాన్ని డీఈవో మాధవి, జీసీడీవో కవిత మంగళవారం జిల్లా కేంద్రంలో జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమంలో వారు మాట్లాడారు. పాఠశాల విద్యలో డిజిటల్ విద్యోపకరణాలతో బోధనకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. తల్లిదండ్రులు కార్పొరేట్ ఉచ్చులో పడి పిల్లలకు మానసిక ఒత్తిడితో కూడిన విద్య అందించొద్దని, వారి భవిష్యత్ను ఆలోచించి నాణ్యమైన విద్య అందించే ప్రభుత్వ బడుల్లోనే చదివించాలని కోరారు. ప్రతినిధులు కాంపెల్లి లక్ష్మణ్, విష్ణు, ప్రణయ్, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. డివిజన్ల పునర్విభజన ముసాయిదా విడుదల కోల్సిటీ(రామగుండం): రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ను 60 డివిజన్లుగా విభజిస్తూ రూపొందించిన ముసాయిదాను అధికారులు మంగళవారం విడుదల చేశారు. నగరంలోని పాత 50 డివిజన్లు, విలీమైన నాలుగు గ్రామాల్లోని ఓటర్లను లెక్కించి తుది జాబితా సిద్ధం చేశారు. ఈ జాబితా ప్రకారం 60 డివిజన్లలో మొత్తం 1,84,417 మంది ఓటర్లు ఉన్న ట్లు అధికారులు ఆ జాబితాలో పేర్కొన్నారు. 50 డివిజన్లలో 1,74,172 మంది ఓటర్లు ఉండ గా, తాజా ముసాయిదాలో 1,84,417 మంది ఓటర్లు ఉన్నట్లు వారు పేర్కొన్నారు. దీంతో 10,245 మంది కొత్త ఓటర్లు వచ్చిచేరారు. వైశాల్యం ఆధారంగా ఒక్కో డివిజన్లో సుమారు 2,600 మంది నుంచి 3,650 మంది ఓటర్లను కేటాయిస్తూ 60 డివిజన్ల ఓటర్ల సంఖ్యను ముసాయిదాలో సర్దుబాటు చేశారు. కాగా, ఈనెల 11వ తేదీలోగా అభ్యంతరాలు తెలియజేయాలని కమిషనర్ అరుణశ్రీ సూచించారు. -
చిట్టీల రాయుళ్లు!
శాతవాహన వర్సిటీలో భారీగా చూచిరాతలు ● డిగ్రీలో డిబార్ అవుతున్న వారిలో కరోనా టైంలో ‘పది’ పాసైన వారే ఎక్కువ ● మొదటి నుంచి ఆరో సెమిస్టర్ వరకు ఇదే తీరు ● పర్యవేక్షణ పెరగడంతో భారీగా పట్టుబడుతున్న విద్యార్థులు ● సోషల్ మీడియా వ్యసనం, చదవలేక పోవ డంతో అడ్డదారులు ● డిబార్ అయిన విద్యార్థికి మద్దతుగా ఉత్తరాది మంత్రి ఫోన్!సాక్షిప్రతినిధి,కరీంనగర్: కుదురుగా పది నిమిషాలు కూర్చుని పరీక్ష రాయలేరు. పరీక్ష మొదలవగానే.. జేబులో దాచిన మైక్రో జిరాక్స్లు తీయడం, కాపీ చేయడం.. ఇదీ.. శాతవాహన వర్సిటీలో డిగ్రీ విద్యార్థుల తీరు. వాస్తవానికి మునుపెన్నడూ లేని స్థాయిలో విద్యార్థులు చిట్టీలు కొడుతూ పట్టుబడి డిబార్ అవుతున్నారు. గతవారంలో ఒకేరోజు 35 మంది డిబార్ అవడం వర్సిటీ చరిత్రలోనే మొదటిసారి కావడం గమనార్హం. వాస్తవానికి విద్యార్థులు ఇలా చిట్టీలు రాయడం ఆందోళన కలిగిస్తోంది. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలన్న ఆశయంతో యూనివర్సిటీ అధికారులు ఈసారి సిబ్బందిని పెంచి ఆకస్మిక తనిఖీలు చేయిస్తుండటంతో భారీగా చిట్టీల రాయుళ్లు పట్టుబడుతున్నారు. గతంలో ఎన్నడూ చూడని విధంగా విద్యార్థులు డిబార్ కావడంపై వర్సిటీ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతోంది. జూన్ 2 వరకు వర్సిటీ పరిధిలో డిగ్రీ పరీక్షలు రాస్తున్న 171 మంది డిబార్ అయ్యారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కరోనా సమయంలోని వారేనా? ఈ విషయంపై ఆరా తీసినప్పుడు పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. వాస్తవానికి ఇప్పుడు డిబార్ అవుతున్న విద్యార్థులంతా కరోనా విపత్తు సమయంలో 10వ తరగతి పాస్ అయినవారే కావడం ఆందోళన కలిగిస్తోంది. 2020 మార్చిలో ఆకస్మికంగా కరోనా విపత్తు ప్రపంచాన్ని కుదిపేసింది. దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించడంతో జనజీవనం స్తంభించింది. ఈ క్రమంలో ప్రభుత్వం ఎలాంటి పరీక్షలు నిర్వహించలేకపోయింది. ఫలితంగా ఎలాంటి పరీక్షలు లేకుండా విద్యార్థులందరినీ పాస్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ తర్వాత 2021లోనూ పరీక్షలు లేకుండా పది పాసయ్యారు. 2022లో మాత్రం పది పరీక్షలు నిర్వహించినా.. గతంలో ఉన్న 11 పేపర్లను ఆరుకు కుదించి తేలిగ్గా ప్రశ్నలు ఇచ్చారు. 2023లో పది పరీక్షరాసిన పిల్లలు కాస్త నయంగానీ, 2020, 2021లో అసలు పరీక్షలు లేకుండా పాసైన విద్యార్థుల ప్రతిభాపాటవాలపై అనేక సందేహాలు తలెత్తుతున్నాయి. సోషల్ మీడియా మరో కారణం 2020, 2021లో పది పాసైన వారి ప్రతిభాపాటవాలపై ఇప్పుడు ప్రొఫెసర్లు అనేక సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. డిబార్ అవుతున్న వారిలో అధికంగా వారే ఉండటం, వారంతా సోషల్ మీడియా ప్రభావంతో కాపీయింగ్ పాల్పడుతున్నారని అభిప్రాయపడుతున్నారు. సులువుగా పరీక్షలు పాసవడానికి అలవాటు పడినవారు, ఆ కోణంలో వెళ్తున్నారని అంటున్నారు. కాపీ కొడితే పట్టుబడ్డారంటూ సోషల్మీడియా రీల్స్ చూసి వీరు కూడా పాటించి దొరికిపోతున్నారని పేరు తెలిపేందుకు ఇష్టపడని ఓ ప్రొఫెసర్ తెలిపారు. మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. డిబార్ అయిన విద్యార్థులంతా రాజకీయ నాయకులతో వారిని వదిలేయాలంటూ వర్సిటీ అధికారులపై ఒత్తిడి చేయిస్తున్నారు. వారిలో ఓ విద్యార్థిని వదిలేయాలంటూ ఉత్తరాదికి చెందిన ఓ పెద్ద మంత్రి ఏకంగా వర్సిటీకి ఫోన్ చేయడంతో విస్తుపోవడం అధికారుల వంతైంది.వారిలోనే డిబార్ సంఖ్య ఎక్కువ 2020లో పది పాసైనవారు ఇప్పుడు 6వ సెమిస్టర్, 2021లో పది పాసైనవారు 4వ సెమిస్టర్, 2022లో పది పాసైన వారు 2వ సెమిస్టర్ పరీక్షలు రాస్తున్నారు. ప్రతీ విద్యాసంవత్సరంలోనూ 1,3,5వ సెమిస్టర్లకు ఒకసారి, 2,4,6వ సెమిస్టర్లకు మరోసారి పరీక్షలు నిర్వహిస్తారు. 2023–24లో 1,3,5వ సెమిస్టర్లలో 26 మంది డిబార్ అయ్యారు. అదే 2023–24 విద్యా సంవత్సరంలో 2,4,6 సెమిస్టర్లలో 60 మంది డిబార్కు గురయ్యారు. 2024–25లో 1,3,5వ సెమిస్టర్లలో కేవలం 31 మంది డిబార్ కాగా, 2024–25 విద్యాసంవత్సరంలో 2,4,6 సెమిస్టర్లలో ఏకంగా 140 మంది డిబార్ అయ్యారంటే.. పరిస్థితి ఏ రకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అందులో మే 28న ఒకేరోజు 34 మంది డిబార్కావడం గమనార్హం. అందులోనూ కరీంనగర్ నడిబొడ్డున తెలంగాణచౌక్ను ఆనుకుని ఉన్న కాలేజీ నుంచి ఏకంగా 13 మంది విద్యార్థులు ఉండటం విశేషం. ఇప్పుడు డిబార్ అయిన విద్యార్థుల్లో అధికంగా 2020, 2021లో పదో తరగతి పాసైన వారే అధికంగా ఉండటం గమనించదగ్గ అంశం. శాతవాహన యూనివర్సిటీ కింద సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, సిద్ధిపేట, హన్మకొండ జిల్లాల పరిధిలో మొత్తం 120 డిగ్రీ కాలేజీలు, 28 పీజీ, 23 బీఈడీ, 7 ఎంబీఏ, ఒక ఎంఈడీ, ఒక బీపీఈడీ, ఒక లా కాలేజీలు తదితరాలు ఉన్నాయి. ఇటీవల వర్సిటీకి అదనంగా లా, ఇంజినీరింగ్ కాలేజీలు కూడా మంజూరయ్యాయి. ఇంతటి ప్రతిష్టాత్మక వర్సిటీలో ఇలాంటి విపరీత ధోరణి ఇదే తొలిసారి అని పలువురు వాపోతున్నారు. -
ముగిసిన ధాన్యం కొనుగోళ్లు
● ఈసారి ధాన్యం సేకరణలో జిల్లాదే అగ్రస్థానం ● 95శాతం రైతులకు చెల్లింపులు పూర్తిసాక్షి, పెద్దపల్లి: అకాల వర్షాల మధ్య యాసంగి ధాన్యం కొనుగోళ్లు సజావుగానే పూర్తయ్యాయి. గింజ కోత లేకుండానే.. వానాకాలం సీజన్ ప్రా రంభానికి ముందే.. జూన్ తొలివారంలోపే కొనుగోళ్లు ముగిశాయి. దీంతో రైతులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అంతేకాదు.. అన్నదాత లు వానాకాలం పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ సారి రికార్డుస్థాయిలో 315 కొనుగోలు కేంద్రాల్లో 3.98 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించా రు. 95 శాతం రైతుల వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లో ధాన్యం సొమ్ము రూ.871.2 కోట్లు జమచేశారు. రాష్ట్రంలోనే ఇది ప్రథమ స్థానం అని అధికార యంత్రాంగం సంతోషం వ్యక్తం చేస్తోంది. ధాన్యం డబ్బుల చెల్లింపుల్లో టాప్.. కొనుగోళ్లు తొలుత మందకోడిగా సాగినా.. అధి కారుల పర్యవేక్షణ, సమన్వయంతో ఆ తర్వాత వేగం పుంజుకున్నాయి. రైతుల నుంచి ధాన్యం సేకరించగానే రోజువారీ కొనుగోళ్ల వివరాలను ట్యాబ్ల్లో నమోదు చేయడం, కొనుగోలు కేంద్రా ల ఇన్చార్జిల నివేదికలను పౌర సరఫరాల మేనే జర్ పరిశీలించి, సమాచారం సరిగ్గా ఉంటే ఆన్లైన్లో డిజిటల్ సంతకంతో ఆమోదించారు. దీంతో రైతుల బ్యాంకు ఖాతాల్లోకి ధాన్యం డబ్బులు నేరుగా జమయ్యాయి. ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే రైతుల బ్యాంకు ఖాతాల్లో ప్ర భుత్వం డబ్బులు జమచేయాలనే లక్ష్యాన్ని జిల్లా యంత్రాంగం సాకారం చేసింది. హమాలీల కొరత తీర్చేందుకు బిహార్ కూలీలను రప్పించడం, లారీలు, గన్నీసంచులు అందుబాటులో ఉంచడంతో ఆటంకాలు లేకుండానే ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యాయి. దీంతో 315 ధాన్యం కొనుగోలు కేంద్రాలను మూసివేశారు. బోనస్ కోసం ఎదురుచూపులు యాసంగిలో నెలకొన్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా సన్నధాన్యాన్ని రైతులు ఎక్కువగా సాగు చేయరు. కానీ, ప్రభుత్వం సన్నవడ్లు క్వింటాల్కు రూ.500 బోనస్ చెల్లిస్తుండడంతో ఈసారి సన్నవడ్లను ఎక్కువగానే సాగు చేశారు. అయితే ప్రభు త్వం ధాన్యం డబ్బులు వెంటనే జమ చేస్తున్నా, ఇప్పటివరకు ఒక్క రైతు ఖాతాలో బోనస్ డబ్బు లు జమచేయలేదు. బోనస్ డబ్బులు వస్తే వానాకాలం సాగు పెట్టుబడికి అక్కరకు వస్తాయని అన్నదాతలు ఎదురుచూస్తున్నారు.జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల సమాచారం సేకరించిన ధాన్యం(మెట్రిక్ టన్నుల్లో)3,98,006 విక్రయించిన రైతుల సంఖ్య: 60,020 కొనుగోలు చేసినదాని విలువ(రూ.కోట్లలో) 918.75 రైతులకు చేసిన చెల్లింపులు(రూ.కోట్లలో) 871.02 నమోదుచేసిన శాతం: 95 దొడ్డు రకం(మెట్రిక్ టన్నుల్లో): 3,20,244 సన్నరకం: 77,761 చెల్లించాల్సిన బోనస్(రూ.కోట్లలో): 38.8 సమన్వయంతోనే సక్సెస్ యాసంగిలో ధాన్యం కొనుగోళ్లకు జిల్లాలో 315 కేంద్రాలను ఏర్పాటు చేశాం. 2024 యాసంగిలో జూన్ 10న, 2023 యాసంగిలో జూన్ 15న కొనుగోళ్లు పూర్తిచేసి కొనుగోలు కేంద్రాలు మూసివేశాం. కానీ, ఈసారి జిల్లా యంత్రాంగం సమన్వయంతో పనిచేయడంతో వర్షాలు ప్రారంభంకాకముందే కొనుగోళ్లు పూర్తి చేశాం. రికార్డుస్థాయిలో 95శాతం మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమచేశాం. మిగతా వారికి సైతం సాధ్యమైనంత త్వరలోనే ధాన్యం డబ్బులు జమచేస్తాం. – శ్రీకాంత్, డీఎం, పౌర సరఫరాలు -
అభివృద్ధి పనులకు భూసేకరణ
మంథని: అభివృద్ధి పనులకు అవసరమైన భూసేకరణ చేపట్టాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించా రు. అంగుళూరు శివారులో రోడ్లు, భవనాల శాఖ చేపట్టే శ్రీపాద మార్గ్, బైపాస్ రోడ్డు, ఇండస్ట్రియల్ పార్క్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణానికి అనుకూలమైన భూములను ఆయన మంగళవారం పరిశీలించారు. కలెక్టర్ మా ట్లాడుతూ, శ్రీపాద మార్గ్, బైపాస్ రోడ్డు నిర్మాణాని కి అనువైన భూ సేకరణకు వెంటనే మార్కింగ్ చే యాలని, దీనిద్వారా రెవెన్యూ అధికారులు ఎంజాయ్మెంట్ సర్వే చేస్తారన్నారు. ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు అనుకూలంగా ఉన్న 70 ఎకరాల సేకర ణకు ఎంజాయ్ంట్ సర్వే ప్రారంభించాలని సూచించారు. స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణానికి ప్రతిపాదనలు సమర్పించాలని సర్వేయర్లను ఆదేశించారు. కార్యక్రమంలో మంథని ఆర్డీవో సురేశ్, మున్సిపల్ కమిషనర్ మనోహర్ తదితరులు పాల్గొన్నారు. ప్రైవేట్ సర్వేయర్లకు శిక్షణ రామగిరి(మంథని): ప్రైవేట్ సర్వేయర్లకు లైసెన్స్ జారీచేసేందుకు మెరుగైన శిక్షణ ఇవ్వాలని కలెక్టర్ శ్రీహర్ష ఆదేశించారు. సెంటినరీకాలనీలోని మంథ ని జేఎన్టీయూలో చేపట్టిన సర్వేయర్ల శిక్షణ శిబిరా న్ని ఆయన తనిఖీ చేశారు. భూ భారతి చట్టం ప్రకా రం భూ క్రయ, విక్రయాలు, మ్యుటేషన్ కోసం మ్యాప్ జతచేయాలని అన్నారు. జిల్లాలోని రెండు బ్యాచ్ల్లో 112 మంది ప్రైవేట్ సర్వేయర్లకు భూభా రతి చట్టం, ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ మే 26 నుంచి జూలై 26వ తేదీ వరకు సుదీర్ఘంగా శిక్షణ ఇస్తున్నామని అన్నారు. అసిస్టెంట్ డైరెక్టర్ సర్వే ల్యాండ్స్ రికార్డ్స్ శ్రీనివాసులు, డిప్యూటీ ఐవోఎస్ గణపతి, రఘుపతి, అనిల్ పాల్గొన్నారు. -
డీఈవో అవినీతిపై విచారణ జరపండి
పెద్దపల్లిరూరల్: ప్రభుత్వ ఉపాధ్యాయులతో కు మ్మక్కైన డీఈవో అక్రమ హెచ్ఆర్ఏల్లో భాగస్వా మ్యం కలిగి ఉన్నారని, అక్రమంగా ఫైనాన్స్, చిట్టీల దందా సాగిస్తున్నారని విద్యార్థి, యువజన సంఘా ల నేతలు ఆరోపించారు. కలెక్టరేట్ ఎదుట మంగళవారం నిరసన తెలిపారు. డీఈవోను సస్పెండ్ చే యాలని డిమాండ్ చేశారు. అవినీతి, అక్రమాలపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కలెక్టర్ స్పందించకపోవడం శోచనీయమన్నారు. ఉపాధ్యాయ శిక్షణ శిబిరాల నిర్వహణలో నిబంధనల ఉల్లంఘన జరిగింద న్నారు. సమగ్రశిక్షా నిధుల్లో జిల్లా ప్రాజెక్ట్ ఆఫీసర్ గా అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపించారు. కంప్యూటర్స్ కొనుగోళ్లలోనూ నిధుల దుర్వినియోగం జరిగితే ఏడాది క్రితమే డీఈవోకు వ్యతిరేకంగా నివేదిక ఇచ్చారని, దానిని తొక్కిపెట్టారని తెలిపారు. ఆ నివేదికపై చర్యలు ఎందుకు చేపట్టలేదో తెలియజేయాలని అన్నారు. నిబంధనల ప్రకారం ఒకే జి ల్లాలో మూడేళ్లకే బదిలీ అనివార్యమైనా ఐదేళ్లుగా పె ద్దపల్లిలో కొనసాగుతుండడం అనుమానాలకు తా విస్తోందని పేర్కొన్నారు. దీనిపై విద్యాశాఖ ఉన్నతాధికారులు సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. నాయకులు సిలివేరు మధు, గూడెపు జనార్దన్రెడ్డి, రాజాం మహంతకృష్ణ, రామగిరి మహేందర్, జంగా కిరణ్రెడ్డి, పంజాల రవీందర్గౌడ్, వెంకటేశ్వర్లు, కొమ్మ ఐలయ్య, ఐలయ్య, దాడి రవీందర్, రాజేంద ర్, రాజయ్య, అశోక్గౌడ్, కనకయ్య, శ్రీనివాస్, ఎల్లేశ్గౌడ్, అనిల్, సాగర్తోపాటు ప్రజా, రైతు, విద్యా ర్థి, యువజన సంఘాల నాయకులు పాల్గొన్నారు. విద్యార్థి, యువజన సంఘాల డిమాండ్ -
ధాన్యం కొనుగోళ్లలో పెద్దపల్లిదే అగ్రస్థానం
సాక్షి, పెద్దపల్లి: ధాన్యం కొనుగోళ్లు, రైతుల బ్యాంకు ఖాతాల్లో ధాన్యం డబ్బు జమచేయడంలో జి ల్లా రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచిందని ఎమ్మె ల్యే చింతకుంట విజయరమణరావు అన్నారు. స్థానిక ఆర్కే గార్డెన్స్లో మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. జిల్లాలోని 315 కొనుగోలు కేంద్రాల ద్వారా 60,020మంది రైతుల నుంచి 3,98,006 మెట్రిక్ టన్నుల ధా న్యం కొనుగోలు చేశామన్నారు. రికార్డు స్థాయిలో 58 వేల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ. 871.02 కోట్ల ధాన్యం డబ్బు జమచేశామని అ న్నారు. 95శాతం చెల్లింపులతో రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచిందని తెలిపారు. అకాల వర్షాల తో తడిసిన, రంగు మారిన మెలకెత్తిన ధాన్యాన్ని కోతల్లేకుండా కొనుగోలు చేయించామని చెప్పా రు. సన్నవడ్ల బోనస్ రూ.38.54 కోట్లను త్వరలో రైతుల ఖాతాల్లో జమ చేస్తామని వెల్లడించారు. బీఆర్ఎస్ హయాంలో యాసంగిలో 24 శాతం చె ల్లింపులు చేస్తే.. ప్రజాపాలనలో ఈ సీజన్లో 95 శాతం మందికి జమచేసి పెద్దపల్లిని ఆదర్శంగా నిలిపామన్నారు. రైతులను మోసం చేసిన పార్టీ బీఆర్ఎస్, నల్లచట్టాలు తెచ్చి అన్నదాతలపై బు ల్లెట్లు ప్రయోగించిన పార్టీ బీజేపీ అని, రైతులను రాజును చేయాలనుకునే పార్టీ కాంగ్రెస్ అని ఆ యన అన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాస్థాయి సమీక్ష సమావేశంలో మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డితో మాట్లాడి సన్నధాన్యన్ని బాయిల్డ్ చేయాలని ఒప్పించామని గుర్తుచేశారు. ఏఎంసీ చైర్పర్సన్లు ఈర్ల స్వరూప, మినుకాల ప్రకాశ్రావు, సింగిల్విండో చైర్మన్లు ఆళ్ల సుమన్రెడ్డి, చింతపండు సంపత్, రాంచంద్రారెడ్డి, కుర్రమల్లరెడ్డి, నూగిల్లా మ ల్లన్న, భూతగడ్డ సంపత్, సయ్యద్ మస్రుత్, మూ ల ప్రేమ్సాగర్రెడ్డి, ధనాయక్ దామోదర్రావు, అరె సంతోష్, సమా రాజేశ్వర్రెడ్డి, చిలుక సతీశ్, బొజ్జ శ్రీనివాస్, బొంకురి అవినాశ్, బొడ్డుపల్లి శ్రీనివాస్, జడల సురేందర్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే విజయరమణారావు -
ప్రభుత్వ పాఠశాలలకు పూర్వవైభవం
సుల్తానాబాద్(పెద్దపల్లి): ప్రభుత్వ పాఠశాలల పూర్వ వైభవానికి రాష్ట్రప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా జిల్లాలోని 543 ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల భవనాలకు మరమ్మతులను మే 31వ తేదీలోపే పూర్తిచేశారు. ఆధునిక హంగులు కల్పించి కార్పొరేట్కు దీటుగా మార్చారు. ఇప్పటికే తల్లిదండ్రులు, ఉపాధ్యాయు లతో సమావేశాలూ నిర్వహించారు. బడి బయట ఉన్న బడీడు పిల్లలను గుర్తించి బడిలో చేర్పించడం లక్ష్యంగా ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. విద్యాబోధనలో మెలకువలు, డిజిటల్ విద్యా విధానంపై ఉపాధ్యాయులకు ఇప్పటికే శిక్షణ పూర్తిచేశారు. ఇంగ్లిష్, గణితం, భౌతిక, జీవశాస్త్రం బోధన తీరుపైనా అవగాహన కల్పించారు. 6 నుంచి ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట ఈనెల 6 నుంచి 19వ తేదీ వరకు ఆచార్య జయశంకర్ బడిబాట కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా అత్యధిక మంది విద్యార్థులను ప్రభుత్వ బడుల్లో చేర్పించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈనెల 12న ప్రభుత్వ పాఠశాలలు పునః ప్రారంభమయ్యే నాటికి పండుగ వాతావరణంలో విద్యార్థులను స్వాగతించడానికి స్కూళ్లను అలంకరించేలా చర్యలు తీసుకుంటున్నారు. బడుల భవనాలకు మరమ్మతులు తరగతి గదుల్లో మౌలిక వసతులు సర్కార్ స్కూళ్లు ప్రారంభానికి సిద్ధం 6 నుంచి బడిబాట కార్యక్రమంవిజయవంతం చేయాలి ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు సమన్వయంతో బడిబాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. ఇప్పటికే సర్కారు బడుల భవవనాలకు రంగులు వేయడం పూర్తిచేశాం. కొత్త బోర్డులు ఏర్పాటు చేశాం. – మాధవి, డీఈవో -
సింగరేణిలో మైనింగ్ అధికారుల బదిలీ
గోదావరిఖని: సింగరేణి బొగ్గు గనుల సంస్థలో 14 మంది మైనింగ్ అధికారులను బదిలీ చేస్తూ యాజ మాన్యం ఆదేశాలు జారీచేసింది. ఈమేరకు సీఆర్పీ/పీఈఆర్/సీ/26/1860పేరున మంగళవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. బదిలీ అయిన అధికారుల వివరాలు.. మందమర్రి సేఫ్టీ విభాగంలో పని చేస్తున్న డీవైజీఎం మాటూరి రవీందర్ భూపాలపల్లి ఏజెంట్గా, ఆర్జీ–3 ఏవో పనిచేస్తున్న డీవైజీఎం వి.ప్రవీణ్ పీవో, ఎస్ఎంఎస్ ప్లాంట్కు బదిలీ అ య్యారు. కాసిపేట గనిలో డీవైజీఎంగా పనిచేస్తున్న ఎన్.భూశంకరయ్య మందమర్రి ఏఎస్వోగ, ఏఎ ల్పీలో డీవైజీఎంగా పనిచేస్తున్న కె.జనార్దన్ ఏఎల్పీ ఏవోగా, ఇందారం ఓసీలో డీవైజీఎంగా పనిచేస్తున్న జి.రవికుమార్ కేటీకే ఓసీ–2 ఏజెంట్గా, జేవీఆర్ ఓసీ–2లో కాలరీ మేనేజర్గా పనిచేస్తున్న జి.దు ర్గాప్రసాద్రావు కొత్తగూడెం క్వాలిటీగా, జేవీఆర్ ఓసీ–2లో అండర్మేనేజర్గా పనిచేస్తున్న బి.రమేశ్ కాసిపేట మేనేజర్గా, జేవీఆర్ ఓసీ–2లో అండర్ మేనేజర్గా పనిచేస్తున్న బి.రమాకాంత్ కేటీకే ఓసీ–2 మేనేజర్గా, ఏఎల్పీలో అండర్మేనేజర్గా పనిచేస్తున్న సునీల్కుమార్ ఏఎల్పీ మేనేజర్గా, ఎంవోసీలో అండర్ మేనేజర్గా పనిచేస్తున్న ఎస్.మధుసూదన్ ఎస్ఆర్పీ ఓసీ–2కు బదిలీ అయ్యారు. అదేవిధంగా ఓసీపీ–2 ఎస్ఈగా పనిచేస్తున్న జి.ప్రశాంత్జీవన్ పీకే ఓసీకి, ఓసీపీ–2 ఎస్ఈగా పనిచేస్తున్న ఎం.యుగంధర్ పీకే ఓసీకి, కేటీకే–1లో అండర్ మేనేజర్గా పనిచేస్తున్న కె.పూర్ణచందర్ భూపాలపల్లి ఆర్ఆర్ఆర్టీకు, ఆర్కే–6లో అండర్ మేనేజర్గా పనిచేస్తున్న సీహెచ్ శ్రీను పీకే ఓసీకి బదిలీ అయ్యారు. -
పోటెత్తిన భక్తులు
మల్యాల(చొప్పదండి): కొండగట్టు అంజన్న సన్నిధికి మంగళవారం భక్తులు పోటెత్తారు. వివిధ ప్రాంతాల నుంచి వేలాదిమంది తరలిరావడంతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. కోనేరులో స్నానమాచరించి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కార్యనిర్వహణ అధికారి శ్రీకాంత్రావు, అశోక్, సుధాకర్రెడ్డి, రవి, రాములు చర్యలు చేపట్టారు. వేలాదిమంది తరలిరావడంతో కోనేటి నీరు మురికిగా మారగా, భక్తులు షవర్ల వద్ద స్నానమాచరించారు. ప్రతీ శని, మంగళవారాలు కోనేటిలోకి నీరు నిరంతరాయంగా విడుదల చేయాలని భక్తులు కోరుతున్నారు. -
యోగా నేర్చుకున్నా
శిక్షణ శిబిరంలో నేను యోగా నేర్చుకున్నా. మంచి భోజనం, వసతితోపాటు దుస్తులు కూడా అందించారు. అన్నిసౌకర్యాలు కల్పించారు. అనేక డబ్బులు ఖర్చుపెట్టినా కూడా లభించని అవకాశం మాకు ఎన్టీపీసీ కల్పించింది. భవిష్యత్లో మంచిగా చదువుకుంటా. – కసీఫానాజ్, కమాన్పూర్ కంప్యూటర్ నేర్చుకుంటున్న వేసవి శిక్షణ శిబిరంలో నేను కంప్యూటర్ నేర్చుకున్న. నాకు డ్యాన్స్ చేయడం అంటే చాలా ఇష్టం. ఎన్టీపీసీ వేసవి శిబిరం ఏర్పాటు చేసి ఇలా నెలరోజుల పాటు ఇస్తున్న శిక్షణలో నేను పూర్తిస్థాయిలో కంప్యూటర్ నేర్చుకుని ఉత్తమ సాంకేతిక విద్య పొందుతా. – ఐశ్వర్య, పవర్హౌస్కాలనీ, గోదావరిఖని బాలికలకు ఉపయోగం ఎన్టీపీసీ సామాజిక సేవా బాధ్యతా పథకం(సీఎస్సార్) సహకారంతో బాలికా సాధికారత మిషన్–2025 విజయవంతంగా పూర్తిచేశాం. 120 మంది బాలికలకు ప్రత్యేక ప్రణాళిక ప్రకారం శిక్షణ ఇస్తున్నాం. చిన్నారుల్లోని సృజనాత్మకతను వెలికితీయడంతోపాటు ఆసక్తి ఉన్న అంశాలపై శిక్షణ అందిస్తున్నాం. – రాఖీ సామంత, అధ్యక్షురాలు, దీప్తి మహిళా సమితి, ఎన్టీపీసీ -
రేషన్.. పరేషాన్
మూడు నెలల రేషన్ బియ్యం ఒకేసారి పంపిణీ చేస్తున్నారు. దీంతో చౌకధరల దుకాణాల ఎదుట కార్డుదారులు బారులుతీరుతున్నారు. కొన్ని దుకాణాల్లో స్టాక్ కోసం నిరీక్షిస్తుంటే.. మరికొన్నింటి వద్ద సందడి నెలకొంది. బయోమెట్రిక్ మూడుసార్లు వేస్తుండడం, ఆన్లైన్ నమోదు ప్రక్రియలో సాంకేతిక ఇబ్బందులు తలెత్తడంతో కార్డుదారు ఇబ్బందులకు గురవుతున్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రం భూంనగర్లోని రేషన్ దుకాణం వద్ద బారులు తీరి ‘సాక్షి’ కెమెరాకు ఇలా కనిపించారు రేషన్ కార్డుదారులు. – సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి -
ఎస్పీ కార్యాలయం ఎదుట ఆందోళన
జగిత్యాలక్రైం: రోడ్డు ప్రమాదం కేసును మల్యాల సీఐ నీరుగార్చుతున్నారని, వాహనదారునికి వత్తాసు పలుకుతున్నాడని మృతుడి కుటుంబ సభ్యులు మంగళవారం జగిత్యాల ఎస్పీ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. వివరాలు.. మల్యాల మండలం రాంపూర్ గ్రామానికి చెందిన అల్లెపు నరేశ్ ఏప్రిల్ 28న రాజారం వద్ద లారీ ఢీకొని మృతిచెందాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి లారీని స్టేషన్కు తరలించారు.లారీకి ఇన్సూరెన్స్ ఉందని, పరిహారం వస్తుందని మృతుడి కుటుంబ సభ్యులకు నచ్చజెప్పారు. దీంతో చివరికి లారీని వదిలిపెట్టి ప్రస్తుతం లారీకి ఇన్సూరెన్స్ లేదని మల్యాల సీఐ కేసును నీరుగార్చుతున్నారని, తమను నిత్యం పోలీస్స్టేషన్కు రమ్మని రోజుకో కారణం చెబుతూ అన్యాయం చేస్తున్నాడని ఆరోపించారు. దీంతో నరేశ్ తండ్రి అల్లెపు బాలయ్య, తల్లి శారదతో పాటు పలువురు బంధువులు ఎస్పీ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. -
నేటి నుంచి పలు రైళ్లు రద్దు
రామగుండం: కాజీపేట–బల్హర్షా సెక్షన్లోని పలు రైల్వేస్టేషన్ల పరిధిలో ఇంటర్ లాకింగ్ సిస్టం పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం నుంచి ఈనెల 20వ తేదీ వరకు పలు ప్యాసింజర్, ఎక్స్ప్రెస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజనల్ డీఆర్యూసీసీ మాజీ ప్రతినిధి క్యాతం వెంకటరమణ తెలిపారు. రద్దయిన రైళ్లు ● రైలు నంబరు : 67771/67772 : సిర్పూర్ – కరీంనగర్ : ఈనెల 20వ తేదీ వరకు ● రైలు నంబరు : 67773/67774 : కరీంనగర్–బోధన్ : ఈనెల 20 వరకు ● రైలు నంబరు : 17003/17004 : కాజీపేట–సిర్పూర్ కాగజ్నగర్–బల్హర్షా : ఈనెల 20 వరకు ● రైలు నంబరు : 17035/17036 : కాజీపేట–బల్హర్షా : ఈనెల 20 వరకు ● రైలు నంబరు : 12757/12758 : సికింద్రాబాద్–సిర్పూర్ కాగజ్నగర్ : ఈనెల 20 వరకు ● రైలు నంబరు : 12511 : గోరఖ్పూర్–రఫ్తిసాగర్ : ఈనెల 5, 6, 8, 12, 13, 15, 19 తేదీల్లో ● రైలు నంబరు : 12512 : రఫ్తిసాగర్–గోరఖ్పూర్ : 4, 8, 10, 11, 15, 17, 18 తేదీల్లో రద్దు ● రైలు నంబరు : 12521 : భరౌణీ–ఎర్నాకులం : ఈనెల 9వ తేదీన రద్దు ● రైలు నంబరు : 12522 : ఎర్నాకులం–భరౌణి : ఈనెల 6, 13వ తేదీల్లో రద్దు ● రైలు నంబరు : 12591 : గోరఖ్పూర్–యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్ రైలు ఈనెల 7, 14వ తేదీలలో రద్దు చేశారు. ● రైలు నంబరు : 12592 : యశ్వంత్పూర్–గోరఖ్పూర్ : ఈనెల 9, 16వ తేదీల్లో రద్దు -
మంత్రిగా బండికి ఏడాది
● జూన్ 9న ప్రమాణస్వీకారం చేసిన సంజయ్ ● సంబరాలకు సిద్ధమవుతున్న కమలనాథులు ● ప్రోగ్రెస్ రిపోర్టు విడుదల చేసిన ఎంపీ ఆఫీస్సాక్షిప్రతినిధి,కరీంనగర్: కేంద్ర సహాయమంత్రిగా బండి సంజయ్ ఏడాది పదవీకాలం పూర్తవుతున్న సందర్భంగా బీజేపీ నాయకులు సంబరాలకు సిద్ధమవుతున్నారు. ఈ ఏడాదికాలంలో బండి సంజయ్ చేసిన పనులు, చూపిన చొరవను వివరిస్తూ పార్టీ జిల్లా నాయకులు ప్రోగ్రెస్ రిపోర్టు విడుదల చేశా రు. 2024లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా బండి సంజయ్ విజయం సాధించారు. జూన్ 9న ప్రధాని నరేంద్రమోదీ కేబినెట్లో కేంద్ర సహా యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. మంత్రిగా ఏడాది పూర్తికానుండడంతో అభిమానులు, పార్టీ నాయకులు సంబరాలకు సిద్ధమవుతున్నారు. అభివృద్ధి పనులపై దృష్టి జాతీయ ఉపాధిహామీ పథకం కింద ప్రతీ మండలానికి రూ.2కోట్లు ఖర్చు చేసి ఆయా మండలాల పరిధిలోని గ్రామాల్లో రోడ్లు నిర్మించారు. సగటున ఒక్కో గ్రామానికి రూ.5లక్షలు అంతర్గత రోడ్లకు వెచ్చించారు. ఆధునీకరణ పనుల్లో భాగంగా కరీంనగర్ రైల్వేస్టేషన్ అభివృద్ధికి రూ.33కోట్లకుపైగా ఖర్చు చేశారు. పెండింగ్లో ఉన్న కరీంనగర్–జగిత్యాల జాతీయ రహదారి విస్తరణ పనులకు రూ.2వేల కోట్లతో మరో రెండు వారాల్లో టెండర్ ప్రక్రియను ప్రారంభించనున్నారు. రైల్వేపై ప్రత్యేక శ్రద్ధ ఇటీవల కరీంనగర్ రైల్వేస్టేషన్ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ వర్చువల్గా ప్రారంభించిన విషయం తెలిసిందే. వీటితోపాటు కరీంనగర్, జమ్మికుంట ఆర్వోబీ నిర్మాణంలో జాప్యమవుతున్న విషయాన్ని పలుమార్లు సంబంధిత అధికారులతో సమావేశమై వేగవంతం చేయాలని ఆదేశించారు. ఆగస్టు నాటికి జమ్మికుంట ఆర్వోబీ పనులు పూర్తికాకపోతే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన విషయం తెలిసిందే. కరీంనగర్–తీగలగుట్టపల్లి ఆర్వోబీ నిర్మాణంలో ఇబ్బందులను అధిగమించేందుకు రైల్వేశాఖ, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేసి.. పనుల వేగవంతం చేయించడంలో సఫలీకృతులయ్యారు. వారానికోసారి నడిచే కరీంనగర్–తిరుపతి రైలును వారానికి రెండుసార్లు నడిచేలా కృషి చేశారు. అదే రైలును ఇకపై వారానికి 4 సార్లు నడిపేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈమేరకు రైల్వేశాఖ ఉన్నతాధికారులకు లేఖ రాశారు. మరిన్ని పనులివే.. ● సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల్లో సైనిక్ స్కూళ్ల ఏర్పాటుకు బండి సంజయ్ వినతికి కేంద్రం సానుకూలత వ్యక్తం చేసింది. ● సిరిసిల్ల, హుస్నాబాద్ నియోజకవర్గాల్లో నవోదయ స్కూళ్ల మంజూరులో చొరవచూపారు. ● వేములవాడ, కొండగట్టు, ఇల్లందకుంట ఆలయాలను టూరిజం సర్క్యూట్గా మార్చాలన్న ప్రతిపాదలపై త్వరలోనే కేంద్రం ప్రకటన చేయనుంది. ● శాతవాహన వర్సిటీ పరిధిలో లా కళాశాల మంజూరుకు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ మేఘ్వాల్ను కలిసి మంజూరు చేయించారు. ● అంబేడ్కర్ స్టేడియంలో సింథటిక్ పార్క్, స్పోర్ట్స్ రీక్రియేషన్ సౌకర్యాలు కల్పించాలన్న ప్రతిపాదనకు కేంద్ర క్రీడాశాఖ సుముఖత వ్యక్తం చేసింది. పెండింగ్లో ఉంటున్న కరీంనగర్లో ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటుకు బండి సంజయ్ కృషి మరువలేనిది. ● కరీంనగర్ పార్లమెంటు పరిధిలో రూ.5కోట్ల సీఎస్సార్ నిధులను రాబట్టారు. వాటితో వేములవాడ, హుస్నాబాద్, హుజూరాబాద్, జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రులకు అత్యాధునిక వైద్య పరికరాలను అందించారు. ● ఈ ఏడాది 10వ తరగతి చదివే 6 వేల మంది బాలికలకు ప్రత్యేకంగా సైకిళ్లను అందించేందుకు ఆర్డర్ ఇచ్చారు. వీటిని త్వరలోనే విద్యార్థులకు అందజేయనున్నట్లు మంత్రి కార్యాలయం వెల్లడించింది. ● ఈ ఏడాది మార్చిలో థాయిలాండ్ లో సైబర్ కేఫ్ లో చిక్కుకున్న 540 మంది భారతీయులను సాక్షి కథనాలతో స్పందించిన బండి సంజయ్ ప్రత్యేక చొరవ తీసుకుని కాపాడారు. రెండు ప్రత్యేక విమానాల్లో వారిని ఇండియాకు తరలించారు. -
ఏసీబీ వలలో ఇన్చార్జి తహసీల్దార్
రాయికల్(జగిత్యాల): భూమి రిజిస్ట్రేషన్ కోసం రూ.15 వేల లంచం బేరం కుదుర్చుకుని రూ.10 వేల డబ్బులను రాయికల్ ఇన్చార్జి తహసీల్దార్ గణేశ్, ప్రైవేటు డాక్యుమెంట్ రైటర్ ముజాఫర్ మధ్యవర్తితో తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. డీఎస్పీ విజయ్కుమార్ వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం సింగరావుపేట గ్రామానికి చెందిన గాజర్ల రవి తన 1.025 ఎకరాల భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకోవడం కోసం వారం క్రితం ఇన్చార్జి తహసీల్దార్ గణేశ్ను సంప్రదించగా రూ.15 వేలు లంచం డిమాండ్ చేశాడు. మధ్యవర్తిగా ప్రైవేటు డాక్యుమెంట్ రైటర్ ముజాఫర్ సంప్రదింపులతో బేరం కుదుర్చుకున్నారు. ఈ విషయమై బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా పక్కా ప్రణాళికతో మంగళవారం తహసీల్ కార్యాలయంలో రూ.10 వేలు మధ్యవర్తి ముజాఫర్ ద్వారా ఇస్తుండగా రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఇన్చార్జి తహసీల్దార్ గణేశ్, ముజాఫర్ను రిమాండ్కు తరలిస్తున్నట్లు తెలిపారు. దాడుల్లో ఇన్స్పెక్టర్లు తిరుపతి, కిరణ్రెడ్డి పాల్గొన్నారు. భూమి రిజిస్ట్రేషన్ కోసం రూ.15 వేల బేరం రూ.10 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ డీఎస్పీ ప్రైవేటు డాక్యుమెంట్ రైటర్ మధ్యవర్తితో లంచం -
రూ.15 వేలు డిమాండ్ చేశారు
మాది రాయికల్ మండలం సింగరావుపేట. 1.025 ఎకరాల భూమిని జగిత్యాలకు చెందిన ఉస్మాన్కు అమ్మాను. నా సర్వే నంబరులో ఎక్కువ భూమి ఉందని, రిజిస్ట్రేషన్ చేయడం కుదరదని, డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేయగా మూడు రోజుల క్రితం ఏసీబీ అధికారులను ఆశ్రయించా. రూ.15 వేలకు బేరం కుదుర్చుకుని రూ.10 వేలు ఇస్తుండగా పట్టుకున్నారు. – గాజర్ల రవి, బాధితుడు లంచం అడిగితే ఏసీబీని సంప్రదించండి ప్రభుత్వ శాఖల అధికారులు ఎవరైనా లంచం అడిగితే ఏసీబీ టోల్ఫ్రీ నంబరు 1064 లేదా 94404 46106 నంబర్లను సంప్రదించాలి. వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం. అవినీతి నియంత్రణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి. – విజయ్కుమార్, ఏసీబీ డీఎస్పీ -
పోలీసులంటే గౌరవం ఉండాలి
హుజూరాబాద్: ప్రజలకు పోలీసులంటే గౌరవం ఉండాలే తప్ప భయం కాదని టీపీసీసీ ఎస్సీ డిపార్ట్మెంట్ రాష్ట్ర ఇన్చార్జి తిప్పారపు సంపత్ అన్నారు. ఇటీవల ఎస్సై భార్గవ్ దళిత యువకుడు మహేందర్ను తీవ్రంగా కొట్టిన వీడియోలను మీడియాకు రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎస్సై భార్గవ్ ప్రవర్తన ఒక నియంతలా ఉందన్నారు. దళితుడిని అసభ్య పదజాలతో దూషిస్తూ కొట్టడం ఏంటన్నారు. ఈ ఘటనపై పలుసార్లు ఫిర్యాదు చేసినా, ఇప్పటివరకు చర్యలు తీసుకోవడం లేదన్నారు. బాధ్యతాయుతంగా వ్యవహరించని కానిస్టేబుళ్లు ఆకాష్ రెడ్డి, రవి కుమార్ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. సైక్లింగ్తో ఆరోగ్యవంతమైన సమాజంమల్లాపూర్(కోరుట్ల): రోజూ సైక్లింగ్ చేయడంతో ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించవచ్చని రాష్ట్రపతి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, సైక్లింగ్ క్లబ్ ఫౌండర్ వాల్గొట్ కిషన్ అన్నారు. ప్రపంచ సైకిల్ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం నిర్మల్ జిల్లా ఖానాపూర్ నుంచి సైక్లింగ్తో మల్లాపూర్ మండలం మొగిలిపేటకు చేరుకుని గ్రామస్తులకు అవగాహన కల్పించారు. సైక్లింగ్తో షుగర్, రక్తపోటు, ఊబకాయాన్ని నివారించవచ్చన్నారు. ‘సైకిల్ తొక్కండి.. ఆరోగ్యంగా ఉండండి’ అనే నినాదంతో ప్రజలందరూ నిత్యం సైక్లింగ్ చేయాలని సూచించారు. కార్యక్రమంలో గోల్కోండ రమేశ్, ఏలేటి ప్రీతంరెడ్డి, గంధం రఘు తదితరులు పాల్గొన్నారు. త్రుటిలో తప్పిన ప్రమాదం హుజూరాబాద్: హుజురాబాద్ మండలంలోని సింగాపూర్ గ్రామ శివారులో కరీంనగర్ – వరంగల్ రహదారిపై మంగళవారం ఆయిల్ ట్యాంకర్ ట్రాలీ ఆటోను ఢీకొంది. ఈ ఘటనలో ఆటో ట్రాలీ బోల్తాపడడంతో రోడ్డుపై సిలిండర్లు చెల్లాచెదురగా పడిపోయాయి. కాగా కొన్ని సిలిండర్ల నుంచి గ్యాస్ లీకై ంది. అయినా అవి పేలకపోవడంతో ప్రమాదం తప్పిందని గ్రామస్తులు తెలిపారు. కాగా ట్యాంకర్ డ్రైవర్ పారిపోయాడు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కాలగర్భంలో రామగుండం బీ–థర్మల్
రామగుండం: పట్టణంలోని 62.5 మెగావాట్ల సామర్థ్యంగల రామగుండం థర్మల్ పవర్ స్టేషన్ (ఆర్టీఎస్–బీ) కాలగర్భంలో కలిసి పోయి బుధవరాం నాటికి ఏడాది పూర్తవుతోంది. ఉమ్మడి రాష్ట్రంలోనే తొలివిద్యుత్ కేంద్రంగా పేరు గాంచిన ఆర్టీపీఎస్.. సుమారు ఆరు దశాబ్దాలపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెలుగులు పంచింది. ఈక్రమంలోనే విద్యుత్ ఉత్పత్తి, పీఎల్ఎఫ్లో అనేక సరికొత్త రికార్డులు నెలకొల్పింది. స్థానికంగా బొగ్గు, నీరు, రవాణా వ్యవస్థకు అనువైన పరిస్థితులు ఉండడంతో రామగుండం ప్రాంతం విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు నిలయంగా మారింది. దీంతో దేశంలోనే ఆధునిక విద్యుత్ కేంద్రాలతో పోటీ పడుతూ, అతి తక్కువ ధరకే విద్యుత్ ఉత్పత్తి చేసిన ఘనత బి–థర్మల్ కేంద్రానికే దక్కింది. రూ.14.8 కోట్ల వ్యయంతో 1965 జూలై 19న విద్యుత్ కేంద్రం స్థాపనకు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత డిసెంబర్ 10, 2007 నుంచి నిరాటకంగా 159 రోజులపాటు విద్యుత్ ఉత్పత్తి చేసి రికార్డు సాధించింది. దానిని తిరగరాస్తూ 20 ఫిబ్రవరి 2017 తర్వాత ఒకరోజు ఎక్కువగా 160 రోజులు సాధించి రికార్డులు బద్ధలు కొట్టింది. 159 రోజుల్లో 92.64 పీఎల్ఎఫ్తో 221.74 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేసింది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత సైతం ఆధునిక విద్యుత్ కేంద్రాలతో పోటీపడుతూ ఉత్పత్తి, పీఎల్ఎఫ్లో ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించింది. విద్యుత్ కేంద్రం మూతపడి నేటితో ఏడాది -
అమరుల త్యాగాలు మరువలేనివి
సాక్షి,పెద్దపల్లి: అమరుల ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రం, జిల్లాను అభివృద్ధి పథంలో తీసుకెళ్లేందు కు అందరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర మహి ళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద పిలుపునిచ్చా రు. కలెక్టర్లో సోమవారం నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో శారద ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తొలుత అమరవీరుల స్తూపం వద్ద నివాళి అర్పించారు. శారద మాట్లాడుతూ, మ హిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి ఇప్పటివరకు రూ.139.40 కోట్లు వెచ్చించామన్నారు. రూ.500 రాయితీ వంటగ్యాస్ సిలిండర్ ద్వారా 1,17,856 కుటుంబాలకు రూ.14.3కోట్లు రాయితీ వర్తింపజేశామని, గృహజ్యోతి కింద రూ.74.23 కోట్లు చెల్లించి 1,31,187 కుటుంబాలకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేశామన్నారు. ఇందిరా మహిళా శక్తి ద్వారా మహిళా సంఘాలతో 27 కుట్టుమిషన్ శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేశామని, వీటిద్వారా విద్యార్థులకు యూనిఫామ్స్ కుట్టిస్తున్నామని తెలిపారు. 4 క్యాంటీన్లు, మొబైల్ ఫిష్ రిటైల్ ఔట్ లె ట్లు ఏర్పాటు చేశామని చెప్పారు. రెండు సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లు స్థాపిస్తున్నామని వివరించారు. కొత్తగా 4,467 రేషన్ కార్డులు జారీచేశామని, భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకే భూ భారతి చట్టం తీసుకొచ్చామని అన్నారు. రైతు సంక్షేమానికి ప్రాధాన్యం రైతు సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తూ, రూ.2లక్షల వరకు రుణమాఫీ చేశామని శారద తెలిపారు. యాసంగిలో రూ.12వేల చొప్పున 1,21,698 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.88.86కోట్లు రైతుభరోసా జమ చేశామని తెలిపారు. అకాల వర్షాలకు పంటలు నష్టపోయిన 3,556 ఎకరాలకు రూ.10 వేల చొప్పున పరిహారం జమచేస్తామని అన్నారు. 31మందికి గుండె శస్త్రచికిత్సలు రాజీవ్ ఆరోగ్యశ్రీ సాయాన్ని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచి 163 కొత్త వ్యాధులను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చామని నేరెళ్ల శారద వివరించారు. దీంతో 24,285 మందికి రూ.57.84కోట్ల విలువైన శస్త్రచికిత్సలను ఉచితంగా నిర్వహించామ ని అన్నారు. జిల్లా ఆస్పత్రిలో ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ క్లిష్టమైన సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్నామని, జిల్లాలో 31 మంది పిల్లలకు గుండె ఆపరేషన్లు ఉచితంగా చేశామన్నారు నిరుద్యోగుల కోసమే రాజీవ్ యువ వికాసం నిరుద్యోగులకు స్వయం ఉపాధి కల్పించేందుకు రాజీవ్ యువ వికాసం పథకం ప్రవేశ పెట్టామని నేరెళ్ల శారద అన్నారు. దీని ద్వారా గతేడాది 611 మందికి ఉపాధి కల్పిస్తూ రూ.41.53 కోట్ల పెట్టుబడితో 53 వ్యాపార యూనిట్లకు అనుమతి మంజూరు చేశామన్నారు. ప్రధానమంత్రి ఉపాధి కల్పన ద్వారా రూ.3కోట్ల సబ్సిడీతో 51 యూనిట్లు మంజూరు చేశామని, టీ ప్రైడ్, టీ ఐడియా ద్వారా 84 సేవా, తయారీ రంగ పరిశ్రమలకు రూ.7.68కోట్ల సబ్సిడీ విడుదల చేశామని వివరించారు. వరి విత్తన వంగడాల పంపిణీ కూ నారం వ్యవసాయ పరిశోధన కేంద్రం అభివృద్ధి చేసి న కేఎన్ఎం–7715, కేఎన్ఎం–1638, కేఎన్ఎం–12510 సన్నరకాలను 9 మంది రైతులకు ఎమ్మెల్యేలు విజయరమణారావు, మక్కాన్సింగ్, కలెక్టర్ కోయ శ్రీహర్ష, అదనపు కలెక్టర్లు అరుణశ్రీ, వేణుతో కలిసి శారద అందజేశారు. డీఏవో ఆదిరెడ్డి, శాస్త్రవే త్త శ్రీధర్ సిద్ధి, మహిళా కమిషన్ సభ్యురాలు కటారి రేవతిరావు, అంతటి అన్నయ్యగౌడ్, ప్రకాశ్రావు, ఈర్ల స్వరూప, డీసీపీ కరుణాకర్ పాల్గొన్నారు.సీపీ కార్యాలయంలో.. గోదావరిఖని: రామగుండం పోలీస్ కమిషనరేట్లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సీపీ అంబర్ కిశోర్ ఝా జాతీయ జెండా ఎగురవేశారు. గ్రూప్–1, 3 పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించిన అడ్మిన్ అ డిషనల్ డీసీపీ రాజు, ఏఆర్ ఏసీపీ ప్రతాప్కు ప్రసంశాపత్రాలు అందజేశారు. స్పెషల్ బ్రాంచ్, గోదావరిఖని, ట్రాఫిక్ ఏసీపీలు మల్లారెడ్డి, రమేశ్, శ్రీనివాస్ప్రతాప్, సురేందర్, ఏవో శ్రీనివాస్, సీఐలు, ఆర్ఐలు పాల్గొన్నారు. కాగా, పోలీసు సేవా పతకానికి ఎంపికై న పెద్దపల్లి డీసీపీ కరుణాకర్ సీపీ అభినందించారు. అభివృద్ధి దిశగా తెలంగాణ జ్యోతినగర్(రామగుండం): తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని ఎన్టీపీసీ రామగుండం – తెలంగాణ ప్రాజెక్టు ఈడీ చందన్ కుమార్ సామంత అన్నారు. పీటీఎస్లో జరిగిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో జెండా ఆవిష్కరించి మాట్లాడారు. రాష్ట్రంలో ఎన్టీపీసీ రామగుండం ప్రాంతం పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చెందిందని ఆయన అన్నారు. ఎన్టీపీసీ ఎన్బీసీ సభ్యుడు బాబర్ సలీంపాషా, జనరల్ మేనేజర్లు అలోక్ కుమార్ త్రిపాఠి, ముఖుల్ రాయ్, కేసీ సింఘరాయ్, ఏజీఎం బిజయ్కుమార్ సిగ్దర్ తదితరులు పాల్గొన్నారు. ఆర్ఎఫ్సీఎల్లో.. ఫెర్టిలైజర్సిటీ(రామగుండం): రామగుండం ఫెర్టిలైజర్స్, కెమికల్స్ లిమిటెడ్ కర్మాగారంలో సీఈవో అలో క్ సింఘాల్ జాతీయ జెండా ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ రంగ అభివృద్ధికి సకాలంలో యూరియా సరఫరా చేయడంలో ఆర్ఎఫ్సీఆర్ అగ్రస్థానంలో ఉందన్నారు. కార్యక్రమంలో ఆర్ఎఫ్సీఆర్ సీజీఎం ఉదయ రాజహంస, అధికారులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో కొత్తగా 4,467 రేషన్ కార్డుల జారీ రాజీవ్ యువ వికాసంతో నిరుద్యోగులకు ఉపాధి భూభారతి చట్టంతోనే భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు -
నేటి నుంచి వైద్యశిబిరాలు
సుల్తానాబాద్(పెద్దపల్లి): వందరోజుల కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ఈనెల 3 నుంచి నిర్వహించే వైద్యశిబిరాలను విజయవంతంచేయాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి అన్న ప్రసన్నకుమారి కోరారు. కలెక్టరేట్లోని తన కార్యాలయంలో మేల్ హెల్త్ అసిస్టెంట్లు, ఐసీటీసీ కేంద్రాల్లోని సిబ్బందితో ఆమె సోమవారం సమావేశమయ్యారు. శిబిరాల్లో వైద్యాధికారి, ల్యాబ్ టెక్నీషియన్, కౌన్సెలర్లు సేవలు అందిస్తారని తెలిపారు. డయాబెటిస్, బీపీ, హిమోగ్లోబిన్, క్షయ, మహిళా వ్యాధుల నిర్ధారణకు శాంపిళ్లు సేకరిస్తారని ఆమె అన్నారు. కార్యక్రమంలో డాక్టర్లు కేవీ సుధాకర్రెడ్డి, రాజమౌళి, శ్రీరాములు, వాణిశ్రీ, కిరణ్కుమార్ పాల్గొన్నారు. ఐటీఐలలో ప్రవేశాలు సుల్తానాబాద్(పెద్దపల్లి): జిల్లాలోని వివిధ ఐటీఐలలో ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఇన్చార్జి ప్రిన్సిపల్ శ్రీనివాస్ తెలిపారు. ఈనెల 21 తేదీ వరకు గడువు ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్, మైనారిటీ ఐటీఐలలో ప్రవేశాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. విద్యార్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లను స్కాన్ చేసి ఆన్లైన్లో నమోదు చేయాలని, ఒకరు ఒకే దరఖాస్తు చేయాలన్నారు. దరఖాస్తుల నమోదుకు వెబ్సైట్ https://iti. telangana.gov.inలో లాగిన్ చేయాలని ఆయన సూచించారు. ప్రవేశ రుసుం రూ.100 చెల్లిస్తూ, ఆధార్, మొబైల్ నంబర్, మెయిల్ ఐడీ తప్పనిసరిగా నమోదు చేయాలని ఆయన సూచించారు. -
ఆకట్టుకుంటున్న వాల్ ఆర్ట్స్
కోల్సిటీ(రామగుండం): రామగుండం నగర ప్రజల దృష్టిని ఆకర్శించేలా అధికారులు వాల్ ఆర్ట్స్ ప్రాజెక్ట్ చేపట్టారు. 15వ ఆర్థిక సంఘం నుంచి రూ.40 లక్షలు వెచ్చించి ఈ పనులు చేపట్టారు. హైదరాబాద్కు చెందిన ఓ సంస్థ టెండరు దక్కించుకుని వాల్ ఆర్ట్ ప్రారంభించింది. తొలుత రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయం గోడలపై ఆకట్టుకునేలా రంగులతో బొమ్మలు చిత్రీకరిస్తున్నారు. నగర అందం, ప్రత్యేక శోభను తీసుకొచ్చేందుకు ప్రభుత్వ కార్యాలయాలు, పార్క్ల ప్రహరీలపై రంగుల చిత్రాలను వేయిస్తున్నట్లు కమిషనర్ అరుణశ్రీ తెలిపారు. -
‘రాష్ట్రాన్ని దోచుకున్న బీఆర్ఎస్’
జ్యోతినగర్(రామగుండం): బీ ఆర్ఎస్ పార్టీ తె లంగాణ రాష్ట్రా న్ని దోచుకుందని బీజేపీ జిల్లా అ ధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి విమర్శించారు. జిల్లా కేంద్రంలోని ఆ పార్టీ కార్యాలయంలో సోమవారం తెలంగాణ ఆవిర్భావ వేడుకలు నిర్వహించగా, ఆయన జాతీయ జెండా ఆవిష్కరించి మాట్లాడారు. తెలంగాణ తెచ్చింది తామే అంటూ అధికారాన్ని చేపట్టిన బీఆర్ఎస్.. తన కుటుంబ లాభానికి తెలంగాణని దో చుకుందని ధ్వజమెత్తారు. తెలంగాణ ఇచ్చిన పార్టీ తమదేనంటూ అధికారంలోకి వచ్చిన 15 నెలల్లోనే కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రాన్ని లూటీ చేసిందని మండిపడ్డారు. పల్లె సదానందం, ప ర్ష సమ్మయ్య, జంగ చక్రధర్రెడ్డి, శ్రీనివాస్, తో డి రవీందర్, దూలం సతీశ్ పాల్గొన్నారు. నేటినుంచి రెవెన్యూ సదస్సులుపెద్దపల్లిరూరల్: తెలంగాణ ను భూసమస్యలు లేనిరాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు చేపట్టిన భూభారతి చట్టం–2025, భూభారతి నియమావళి– 2025ని అమలు చేసేందుకు ఈనెల 3 నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నట్లు ఆర్డీవో గంగయ్య తెలిపారు. పెద్దపల్లి డివిజన్లోని అన్ని రెవెన్యూ గ్రామాల్లో ఈ నెల 20 వరకు సదస్సులు నిర్వహిస్తామ న్నా రు. అధికారులు గ్రామాలను సందర్శించి రై తుల నుంచి అర్జీలు స్వీకరిస్తారని పేర్కొన్నారు. ‘పంట మార్పిడి’ పాటించాలి జూలపల్లి(పెద్దపల్లి): రైతులు పంట మార్పిడి పద్ధతి పాటిస్తే అధిక దిగుబడి వస్తుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు భాస్కర్, వినోద్,కిరణ్ సూ చించారు. శ్రీకొండా లక్ష్మణ్ బాపూజీ వ్యవసా య విద్యాలయం, రామగిరి ఖిల్లా కృషి విజ్ఞాన కేంద్రం, తెలంగాణ వ్యవసాయ విభాగం సంయుక్తంగా వికాసిత్ కృషి సంకల్ప అభియాన్ను కుమ్మరికుంట, వడ్కాపూర్, చీమలపేటలో సో మవారం నిర్వహించాయి. కొత్త వ్యవసాయ వి ధానం, భూసారం పెంపు, డ్రోన్ వినియోగం, ఎరువులు, పురుగుమందు వినియోగం, నారు మడుల్లో యాజమాన్య పద్ధతులు తదితర అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు. సీనియర్ శాస్త్రవేత్త లక్ష్మణ్, ప్రిన్సిపల్ సైంటిస్ట్ నిరంజన్, ఏవో ప్రత్యూష పాల్గొన్నారు. వేగంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపెద్దపల్లిరూరల్: పైలెట్ గ్రామాల్లో తొలివిడత లో మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్ల పనులు వే గవంతం చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. కలెక్టరేట్లోని రూమ్ నంబరు 224 లో హౌసింగ్ పీడీ కొత్త కార్యాలయాన్ని సోమ వారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఇందిరమ్మ ఇళ్ల పర్యవేణకు రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ కార్యాలయాన్ని రూమ్ నంబరు 224లో ఏర్పాటు చేశామని తెలిపారు. ఇళ్ల పనుల పురోగతి వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించారు. రెండోవిడత మంజూరైన ఇళ్ల ప్రొసీడింగ్స్ను అందుకున్న ల బ్ధిదారులకు పంచాయతీ కార్యదర్శుల సహకారంతో పనులకు మార్కింగ్ చేయాలన్నారు. ప్రభుత్వం నుంచి త్వరగా బిల్లులు అందేలా చూడాలని ఆదేశించారు. రెవెన్యూ ఆర్డీవో గంగయ్య, హౌసింగ్ పీడీ రాజేశ్వర్ పాల్గొన్నారు. ఎన్డీఆర్ఎఫ్కు రెస్క్యూ శిక్షణ గోదావరిఖని: ఎన్టీఆర్ఎఫ్ ఐదోబ్యాచ్ సిబ్బందికి రెస్క్యూ శిక్షణను ఆర్జీ–2 జీఎం వెంకట య్య సోమవారం ప్రారంభించారు. కొత్తగూడేనికి చెందిన ఆరో బెటాలియన్ ఎన్డీఆర్ఎఫ్ బృందం తర్ఫీదు పొందుతోంది. జీఎం మాట్లాడుతూ సింగరేణి రెస్క్యూ అందిస్తున్న శిక్షణ ఎంతో తోడ్పడుతుందన్నారు. రెస్క్యూ జీఎం శ్రీనివాస్రెడ్డి, సూపరింటెండెంట్ మాధవరా వు, రాజేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఓదెల మల్లికార్జునస్వామి ఆదాయం రూ.5లక్షలు ఓదెల(పెద్దపల్లి): ఓదెల మల్లికార్జునస్వామి జాతర ఆదాయం రూ.5లక్షల12వేల 20 సమ కూరినట్లు ఈవో సదయ్య సోమవారం తెలిపారు. భక్తులు ఒకరోజు మల్లికార్జునస్వామిని దర్శించుకోవడం ద్వారా, స్వామివారికి పట్నా లు, బోనాలు వేయడం ద్వారా, ప్రత్యేక దర్శనం, అర్చనలు ద్వారా ఈ ఆదాయం సమకూరినట్లు ఆయన వివరించారు. -
అమరవీరుల స్తూపంపై నిర్లక్ష్యం!
కోల్సిటీ(రామగుండం): తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం సందర్భంగా సోమవారం అమరవీరుల స్తూపంపై రామగుండం బల్దియా అధికారులు వ్యవహరించిన తీరుపై స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గోదావరిఖని గాంధీచౌక్ ప్రధాన చౌరస్తాలోని అమరవీరుల స్తూపానికి పూలతో అలంకరణ చేయకపోవడంపై వారు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. కంగుతిన్న బల్దియా అధికారులు వెంటనే అమరవీరుల స్తూపానికి పూలమాలలతోపాటు విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఆగ్రహం వ్యక్తం చేసిన స్వచ్ఛంద సంఘాలు సాయంత్రానికి పూలతో అలంకరించిన అధికారులు -
‘రామగుండం’లో 60 డివిజన్లు
● డివిజన్ల పునర్విభజనకు కసరత్తు ● మారనున్న బల్దియా స్వరూపం ● ఓటరు జాబితా రూపకల్పనలో వార్డు ఆఫీసర్లు, రెవెన్యూ అధికారులు ● నాలుగు గ్రామాలను విలీనం చేసి ఓటర్ల లెక్కింపు ● నేడు డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు అవకాశంకోల్సిటీ(రామగుండం): రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ స్వరూపంలో మార్పు మొదలైంది. ప్రస్తుతమున్న 50 డివిజన్లతోపాటు సమీపంలోని నాలుగు గ్రామాలను విలీనం చేసి 60 డివి జన్లగా విభజించే ప్రక్రియ చేపడుతున్నారు. నగ ర స్వరూపాన్ని మార్చడానికి రెండు రోజులుగా బల్దియా రెవెన్యూ అధికారులు కసరత్తు చేస్తున్నారు. రాష్ట్ర పురపాలక శాఖ ఉన్నతాధికారుల ఆదేశాలతో తాజా ఓటరు జాబితా ఆధారంగా ఓటర్ల లెక్కింపు ప్రక్రియ నిర్వహిస్తున్నారు. వీటి ఆధారంగా గుర్తించిన మొత్తం ఓటర్లను 60 డివిజన్లుగా విభజిస్తున్నారు. సోమవారం అర్ధరాత్రి వరకు ఓటరు జాబితా కసరత్తు పూర్తిచేసి మంగళవారం డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఓట్ల లెక్కింపులో వార్డు ఆఫీసర్లు.. తాజా ఓటరు జాబితా ఆధారంగా రెవెన్యూ అధికారులు 50 డివిజన్లలో ఓట్ల లెక్కింపు చేపట్టారు. బల్దియా రెవెన్యూ ఆఫీసర్(ఆర్వో) ఆంజనేయులు నేతృత్వంలో ఆర్ఐలు, వార్డు ఆఫీసర్లు, బిల్ కలెక్టర్లతో రెండురోజులుగా ఓట్ల లెక్కింపులో నిమగ్నమయ్యారు. నాలుగు గ్రామాల ఓట్లు కూడా.. నాలుగు గ్రామాల్లోని ఓట్లను నగరపాలక సంస్థలో విలీనం చేయడానికి తాజా ఓట్లను కూడా లె క్కిస్తున్నారు. రామగిరి మండలం వెంకట్రావుపల్లి, పాలకుర్తి మండలం ఎల్కలపల్లి, అంతర్గాం మండలం లింగాపూర్తోపాటు కుందనపల్లి గ్రా మ పంచాయతీ పరిధి అక్బర్నగర్లోని తాజా ఓట్లను కూడా లెక్కించి నివేదిక తయారు చేస్తున్నారు. ఇప్పటికే ఈ నాలుగు గ్రామాల విలీన ప్రక్రియకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మారనున్న బల్దియా స్వరూపం.. రామగుండం నగరపాలక సంస్థ ప్రస్తుతం 93.87 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ఉంది. ఇప్పుడున్న 50 డివిజన్లతోపాటు సమీపంలోని నాలుగు గ్రామాలను విలీనం చేసి 60 డివిజన్లుగా విభజిస్తే బల్దియా స్వరూపం 99.5 చదరపు కిలోమీటర్లకు విస్తరిస్తుందని అంచనా వేస్తున్నారు. దీనికితోడు బల్దియా జనాభాతోపాటు ఓటర్ల సంఖ్య కూడా పెరుగుతుంది. నేడు డ్రాఫ్ట్ నోటిఫికేషన్? ఓటరు జాబితా ఆధారంగా ఓట్ల సంఖ్య లెక్కిస్తున్న అధికారులు, సోమవారం అర్ధరాత్రి వరకు జాబితా పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నారు. మొత్తం 60 డివిజన్ల కోసం లెక్కించిన ఓటర్ల జా బితా ఆధారంగా డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీ చేయ డానికి ఏర్పాట్లు చేస్తున్నారు. మంగళవారం డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీచేసి, అభ్యంతరాలకు వారంరోజుల గడవు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఒక్కో డివిజన్లో 3,500 నుంచి 3,080 వరకు ఓటర్లు ఉండేలా నివేదిక తయారు చేస్తున్నారని సమాచారం. -
చిన్నవ్యాధులకు ‘సింగరేణి’లోనే చికిత్స
గోదావరిఖని: చిన్న వ్యాధులకు ఇక సింగరేణి ఆస్పత్రుల్లోనే వైద్య చికిత్సలు అందించనున్నారు. సంస్థవ్యాప్తంగా ఉన్న ఏడు ఏరియా ఆస్పత్రులను స్పెషాలిటీస్గా తీర్చిదిద్దిన క్రమంలో.. సూపర్స్పెషాలిటీ వైద్యమైతేనే రిఫర్ చేయాలని సీఎండీ ఎన్.బలరాం ఆదేశించారు. ఆ దిశగా వైద్య యంత్రాంగం ప్రణాళిక రూపొందిస్తోంది. చిన్న చికిత్సలకు ఇక రిఫర్ చేయాలంటే కుదరదని సీఎండీ స్పష్టం చేశారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండి కూడా.. రిఫరల్ వైద్యం కోసం రూ.కోట్లు వెచ్చించడంపై ఆయన ప్రత్యేక దృష్టి సారించారు. ఈమేరకు సీఎండీ బుధవారం వైద్యాధికారులతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. వారి తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రిఫర్ చేసే వైద్యం కోసం మూడేళ్లలో రూ.30 కోట్లు వెచ్చిస్తే, గత ఆర్నెల్లలో రూ.వంద కోట్లు ఖర్చు చేయడమేమిటని మండిపడ్డారని, ఈ క్రమంలో రిఫర్పై విధివిధానాలు మారబోతున్నాయని వెల్లడించారు. వైద్య పరీక్షల యంత్రాలు, ఔషధాలు సమకూర్చడానికి యాజమాన్యం సిద్ధంగా ఉన్నా.. కొన్ని ఏరియా ఆస్పత్రుల నుంచి ప్రతిపాదనలు పంపకపోవడం, తనిఖీల సమయంలో చేతులెత్తేయడాన్ని సీఎండీ తీవ్రంగా పరిగణిస్తున్నారు. వైద్య పరికరాలకు గ్రీన్సిగ్నల్ సింగరేణి కార్మిక కుటుంబాలకు వైద్యం అందించేందుకు.. కనీస వైద్య పరికరాలు, మందుల కోసం వెంటనే ప్రతిపాదనలు పంపించాలని సీఎండీ ఆదేశించారు. తనిఖీల సమయంలో.. ఏ ఒక్క పరికరం అందుబాటులో లేదనే మాట వస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. వార్షిక ప్రణాళిక కోసం ఎదురు చూడకుండా.. ఎప్పటికప్పుడు అవసరమైన పరికరాల కోసం ప్రతిపాదనలు పంపించాలన్నారు. ఏరియా ఆస్పత్రులకు వైద్యుల్ని కేటాయించామని, ఇంకా అవసరమైన వైద్యుల్ని, టెక్నీషియన్లను నియమించేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. వైద్యులు సమర్థతను నిరూపించుకోవాలి కార్మిక కుటుంబాలకు ఏరియా ఆస్పత్రుల్లో వైద్యం అందించే అవకాశం ఉన్నా వెంటనే హైదరాబాద్ ఆస్పత్రులకు రిఫర్ చేస్తున్నారని సీఎండీ పేర్కొన్నారు. తద్వారా మూడేళ్లలో రూ.30 కోట్ల వరకు ఉన్న రిఫర్ బిల్లులు.. ఇప్పుడు రూ.100 కోట్లకు చేరాయని ఆవేదన వ్యక్తం చేశారు. కంపెనీ డాక్టర్లు తమ సమర్థతను, నైపుణ్యాన్ని చూపించకుండా ప్రతీచిన్న కేసును రిఫర్ చేయడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. డాక్టర్లు అంకితభావంతో సేవలు అందించాలని, విధి నిర్వహణలో క్రమశిక్షణ పాటించాలన్నారు. ఏటా సింగరేణి ఉద్యోగుల ఆరోగ్య పరిరక్షణ కోసం రూ.400 కోట్లు వెచ్చిస్తోందన్నారు. హైదరాబాద్లోనూ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటు దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయన్నారు. కరోనాను ఎదుర్కొనేందుకు సిద్ధం.. దేశవ్యాప్తంగా కరోనా కేసులు వెలుగు చూస్తున్న క్రమంలో.. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని సీఎండీ బలరాం సూచించారు. వైరస్ వ్యాప్తి జరిగితే ఎదుర్కొనేందుకు అన్ని ఏరియా ఆస్పత్రుల్లో తగిన విధంగా సంసిద్ధమై ఉండాలని, ప్రణాళికలు రూపొందించుకోవాలని ఆదేశించారు.కార్పొరేట్కు దీటైన వైద్యంసింగరేణిలో వైద్యులు ఉన్నారు. పరికరాలు, సదుపాయాలు కల్పించాం. ఏడు ఏరియా ఆస్పత్రులు, 21 డిస్పెన్సరీలు ఉన్నాయి. సుమారు 170 మంది వైద్య సిబ్బంది ఉన్నారు. కార్పొరేట్ ఆస్పత్రితో సమానంగా స్పెషాలిటీ వైద్యం అందుబాటులో ఉంది. చిన్న వైద్య సేవలు ఇక్కడే పొందాలి. దీన్ని గమనించి సింగరేణి వైద్యుల సేవలను ఉపయోగించుకోవాలి. వైద్యంలో రాజీ లేకుండా ముందుకు వెళ్తున్నాం.ఏటా రూ.400 కోట్లు వైద్యం కోసం వెచ్చిస్తున్నాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఉండి కూడా చిన్న వైద్యానికి సూపర్స్పెషాలిటీ ఆస్పత్రులు రిఫర్ చేయడం సరికాదు. ఉద్యోగుల్లో వైద్యులు నమ్మకాన్ని పెంచుకోవాలి. సంస్థపై ఆర్థిక భారం పడకుండా చూడాలి. – కిరణ్రాజ్ కుమార్, చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్, సింగరేణి -
అధికార యంత్రాంగం అప్రమత్తం
మంథని: కరోనా వైరస్ మరోసారి జిల్లాలో కలకలం రేపుతోంది. అయితే, గతానుభవాలను దృష్టిలో పెట్టుకున్న జిల్లా ప్రజలు ఆందోళన చెందుతున్నా.. మాస్క్లు ధరిస్తూ, తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పొరుగున ఉన్న మహారాష్ట్రలో అధికంగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో నలుగురు మరణించగా అందులో మహారాష్ట్రలోనే ఇద్దరిని కరోనా కాటు వేసింది. మన రాష్ట్రంలో పెద్దగా పాజిటివ్ కేసులు నమోదుకాక పోయినా.. పొరుగు రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ప్రజల్లో ఆందోళన.. అప్రమత్త కనిపిస్తోంది. దగ్గు, జలుబుతో ఆందోళన వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటుండంతో సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి. వర్షాలకు తోడు ఇటీవల కాళేశ్వరంలో 12 రోజుల పాటు సరస్వతీ పుష్కరాలు జరిగాయి. పుష్కర స్నానాలు చేసి వచ్చిన అనేక మంది జలుబు, దగ్గుతో బాధపడుతున్నారు. అంతేగాకుండా వేసవి సెలవులు కావడంతో చాలామంది పుణ్యక్షేత్రాల పర్యటనకు వెళ్లివచ్చారు. ఈ క్రమంలో దగ్గు, జలుబుతోపాటు వైరల్ ఫీవర్తో సతమతమవుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులకు అడపాదడపా ఇలాంటి బాధితులు వస్తున్నారని వైద్యులు చెబుతున్నారు. దీంతో కోవిడ్ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దేశ, విదేశాలు, రాష్ట్రాలతో సంబంధాలు.. మంథనితో ప్రపంచ దేశాలు, రాష్ట్రాలతో సంబంధాలు ఉంటాయి. ఇక్కడి వారు విద్యా, ఉపాధి కోసం రాకపోకలు సాగిస్తూ ఉంటారు. ఈక్రమంలో మంథని ప్రజలకు కరోనా ముప్పు పొంచి ఉంటుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. కరోనా మొదటి, రెండు విడతల్లోనూ మంథని ప్రజలు కోవిడ్ కేసుల బారిన పడి ఇబ్బందులకు గురయ్యారు. చాలామంది బయటపడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. కోవిడ్ కేసుల నమోదు ఇక్కడ రహస్యంగానే ఉంటుంది. పెరిగిన మాస్కుల వినియోగం తెల్లవారు మొదలు రాత్రి వరకూ జనంతో కలిసిపోయో వివిధ శాఖలు, ఆయా వర్గాల్లో ప్రధానంగా ఆస్పత్రులు, కటింగ్ దుకాణదారులు, టీ కోట్టులు, హోటళ్ల వద్ద మాస్కుల వినియోగం పెరి గింది. చాలామంది మాస్కులు ధరించి విధులకు హాజరవుతున్నారు. కరోనా వ్యాప్తి వేగంతోనే మాస్కులు వినియోగిస్తున్నట్లు వారు తెలిపారు. పొరుగు రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి జిల్లావాసుల్లో తీవ్ర ఆందోళన మాస్కులు ధరిస్తూ.. జాగ్రత్తలు పాటిస్తున్న జనం భయంతోనే మాస్కులు కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగు తున్నది. అయితే, మేం కస్టమర్కు దగ్గరగా ఉండి కటింగ్, సేవింగ్ చేస్తాం. ఒక్కోసారి దగ్గడం, తుమ్మడం చేస్తారు. ఈక్రమంలో వారికి వైరస్ ఉంటే మాకు అంటుకునే అవకాశం ఉంది. గతంలో చాలా ఇబ్బంది పడ్డాం. ముందు జాగ్రత్తగా మాస్కులు ధరిస్తున్నాం. అందరూ అప్రమత్తంగా ఉంటే మంచిది. – మంథని సురేశ్, జిల్లా కార్యదర్శి, నాయీబ్రహ్మణ సంఘం, మంథని -
పోలీసు అధికారులకు సేవా పతకాలు
గోదావరిఖని: పోలీసు శాఖలో విశిష్ట సేవలు అందించిన పోలీస్ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం సేవా పతకాలు ప్రకటించింది. ఈమేరకు ఆదివారం ఉత్తర్వులు జారీచేసింది. రామగుండం పోలీస్ కమిషనరేట్కు చెందిన ట్రాఫిక్ ఏఎస్సై బి.శ్రీనివాస్రావు మహోన్నత సేవా పతకానికి ఎంపికయ్యారు. కార్ విభాగంలోని ఏఆర్ ఎస్సై కె.ప్రకాశ్ ఉత్తమ సేవా పతకం, సేవా పతకానికి పెద్దపల్లి డీసీపీ పి.కరుణాకర్, రామగుండం కమిషనరేట్ కార్ విభాగానికి చెందిన సీహెచ్ ప్రతాప్, రామగుండం ట్రాఫిక్ ఎస్సై సహదేవ్సింగ్, టూటౌన్ ఏఎస్సై ఎస్.సుధాకర్, ట్రాఫిక్ ఏఎస్సై వి.మల్లేశం, వన్టౌన్ వర్టికల్ హెడ్కానిస్టేబుల్ ఎం.సత్తయ్య సేవా పతకానికి ఎంపికయ్యారు. వీరికి తెలంగాణ ఆవిర్భావం సందర్భంగా పతకాలు అందించి సన్మానించనున్నారు. -
ఆధునిక సాగుతో అధిక దిగుబడి
పెద్దపల్లిరూరల్: ఆధునిక యంత్రపరికరాలతో సాగు చేస్తే పెట్టుబడి ఖర్చు ఆదా చేయడంతోపాటు అధిక దిగుబడి సాధించవచ్చని కేవీకే శాస్త్రవేత్తలు వెంకన్న, కిరణ్, నరేశ్, ముత్తుకుమార్, యోగేశ్, పాల్యాదవ్ అన్నారు. రాగినేడు, బ్రాహ్మణపల్లి, కనగర్తిలో మండల వ్యవసాయాధికారి అలివేణితో కలిసి ఆదివారం వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్పై అవగాహన కల్పించారు. రైతులు ఆధునిక పద్ధతులతో సాగుచేయాలన్నారు. నాణ్యమైన విత్తనాలనే కొనాలని, అందుకు రసీదును దిగుబడి వచ్చేదాకా భద్రపర్చుకోవాలని సూచించారు. పశువులు, కోళ్ల ఎరువు లాంటి సేంద్రియ ఎరువులనే వినియోగించాలని అన్నారు. సాగుకు ముందు పచ్చిరొట్టను ఎరువుగా కలియదున్నాలని సూచించారు. పాడిపశువులు, కోళ్ల పెంపకంతో అదనపు ఆదాయం సమకూర్చుకోవాలని సూచించారు. అప్పన్నపేట సింగిల్విండో చైర్మన్ సంపత్, డైరెక్టర్ వెంకటేశ్, ఏఈవో పూర్ణచందర్ తదితరులు ఉన్నారు. కాలనీలను కమ్మేసిన బూడిద రామగుండం: ఈదురుగాలుల ధాటికి ఎన్టీపీసీ యాష్పాండ్లోని బూడిద ఆదివారం అక్బర్నగర్, కుందనపల్లి, రైల్వేస్టేషన్ ఏరియా, రైల్వే క్వార్టర్లను కమ్మేసింది. ఏటా ఏప్రిల్, మే, జూన్లో ఈదురుగాలులు వచ్చి బూడిదతో తాము ఇబ్బందులు పడుతున్నామని, ఈ సమస్య పరిష్కరించాలని అధికారులకు విన్నవించినా నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నారని పలువురు బాధితులు ఆవేదన చెందుతున్నారు. సంబంధిత శాఖ అధికారులు ఇప్పటికై నా స్పందించాలని స్థానికులు కోరుతున్నారు. ‘కమిటీ’ సేవలు అభినందనీయం పాలకుర్తి(రామగుండం): మనరాష్ట్రంలో 20 సు మారు ఏళ్లుగా ఆత్మహత్యల నివారణపై ప్రజ ల్లో అవగాహన కల్పిస్తున్న ఆత్మహత్యల నివా రణ కమిటీ సేవలు అభినందనీయమని బసంత్నగర్వాసి, మధ్యప్రదేశ్ ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ పరికిపండ్ల నరహరి అన్నారు. పెద్దపల్లిలో ఆదివారం జరి గిన ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైన ఆయనను కమిటీ సభ్యులు కలుసుకున్నారు. ప్రముఖ సైకాలజిస్ట్ అశోక్ సారథ్యంలో సభ్యులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. నరహరి మాట్లాడుతూ, జీవితం చాలా విలువైనదని, తాత్కాలిక కష్టాలను అధిగమించాలి కానీ, ఆత్మహత్యల జోలికి వెళ్లొద్దన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గుమ్మడవెల్లి శ్రీనివాసులు గురూజీ, రామ రిషికేశ్ తదితరులు పాల్గొన్నారు. ఊరూరా నాణ్యమైన విత్తనాలు పంపిణీ చేస్తాంపెద్దపల్లిరూరల్: వానాకాలం సాగు చేసేందుకు ప్రతీ రెవెన్యూ గ్రామానికి ముగ్గురు రైతులకు వరి, పెసర విత్తనాలు పంపిణీ చేయనున్నట్లు జిల్లా వ్యవసాయాధికారి ఆదిరెడ్డి తెలిపారు. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ‘నాణ్యమైన విత్తనం రైతన్న నేస్తం’ అనే వినూత్న కార్యక్రమాన్ని చేపట్టిందని అన్నారు. జిల్లాలోని 206 రెవెన్యూ గ్రామాలకు చెందిన రైతులకు కూనారం పరిశోధనా కేంద్రం నుంచి వరి, పెసర విత్తనాలు తెప్పించినట్లు ఆయన పేర్కొన్నారు. సోమవారం (ఈనెల 2న) కలెక్టర్ శ్రీహర్ష, ఎమ్మెల్యే విజయరమణారావు విత్తనాల పంపిణీని ప్రారంభిస్తారని పేర్కొన్నారు. మంగళవారం నుంచి రైతులు రూ.50 చొప్పున చెల్లించి విత్తన సంచులు తీసుకెళ్లాలని ఆయన సూచించారు. సాగు కాలంలో శాస్త్రవేత్తల ద్వా రా సూచనలు అందిస్తామని, రాబోయే మూడేళ్లలో అన్ని గ్రామాల్లో విత్తనోత్పత్తి సాధిస్తామని ఆయన వివరించారు. -
ఆవిర్భావ వేడుకలకు ఏర్పాట్లు
గోదావరిఖని: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని స్టేడియాలు ముస్తాబయ్యాయి. సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సీఎల్, కేశోరాం సంస్థలు వేర్వేరుగా వేడుకల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నాయి. సింగరేణిలోని గోదావరిఖని, యైటింక్లయిన్కాలనీ, సెంటినరీకాలనీ క్రీడామైదానాలతోపాటు ఎన్టీపీసీ గ్రౌండ్లో వేడుకలను కన్నులపండువగా నిర్వహించనున్నారు. ఉదయం ఫుడ్కోర్టు స్టాల్స్ ఏర్పాటు చేయడం, సాయంత్రం ప్రముఖ కళాకారులతో ధూంధాం నిర్వహించనున్నారు. వేడుకలకు హాజరయ్యేవారికి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా కేంద్రంలోనూ అధికార యంత్రాంగం తగిన ఏర్పాట్లు పూర్తిచేసింది. -
వ్యవ‘సాయం’లో డ్రోన్
● జీపీఎస్ ఆధారంగా నిర్దేశిత పొలంలో పిచికారీ ● ఎరువులు, పురుగు మందులు చల్లడంలో దిట్ట ● నష్టాలు తగ్గించి లాభాలు గడించడమే లక్ష్యం రామగుండం: డ్రోన్ పేరు వినగానే ఫొటోషూట్, పోలీసు, ఇంటలిజెన్స్ నిఘా విభాగాల వ్యవస్థలకు వినియోగిస్తారని గుర్తొస్తుంది. కానీ, అదే డ్రోన్ సాయంతో పంట పొలాల్లో ఎరువులు, పురుగుమందులు పిచికారీ చేయొచ్చని అధికారులు అంటున్నారు. దీనినే అన్ మ్యాన్డ్ ఏరియల్ వెహికల్(మానవ రహిత యంత్రం)గా పేర్కొంటున్నారు వ్యవసాయ శాస్త్రవేత్తలు. వినూత్న పోకడలతో లాభదాయకం.. మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల సాగులో ఎదురయ్యే ఆటంకాలను ముందే గుర్తించి వాటిని అధిగమించే వీలుంది. అంతేకాదు.. తక్కువ ఖర్చుతో నా ణ్యమైన అధిక దిగుబడి సాధించవచ్చని రై తులకు అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటికే నాటు వేసే, కలుపు తీసే, వరి కోసే యంత్రా లు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం ఎరువులను నిర్దేశిత సమయంలో పంట పొలంలో పిచికారీ చేసేందుకు డ్రోన్ సాంకేతిక పరిజ్ఞానం వినియోగంలోకి వచ్చింది. డ్రోన్తో ఎంతో లాభదాయకం.. ఎకరా విస్తీర్ణంలో 20 లీటర్ల ఎరువు లిక్విడ్ను కేవలం ఆరు నిమిషాల వ్యవధిలో డ్రోన్ పిచికారీ చేస్తుందని అధికారులు చెబుతున్నారు. 25 కేజీల యూరియా, పొటాష్, ఇతర గుళికలను కేవలం నాలుగు నిమిషాల్లో పొలంలో వెదజల్లుతుందంటున్నారు. వ్యవసాయ కూలీలతో ఎరువులు చల్లిస్తే.. ఎకరాకు 160 లీటర్ల నీరు అవసరమవుతుందని, డ్రోన్తో పది లీటర్ల నీటితో పొలంలో చల్లొచ్చని వారు అంటున్నారు. వరి, పెసర, కంది, మొక్కజొన్న తదితర పంటలకు వెదజల్లే పద్ధతిని డ్రోన్ సాయంతో సేవలు పొందవచ్చని పేర్కొంటున్నారు. దీనిద్వారా సమ యం ఆదా, ఖర్చు తక్కువ, వంద శాతం ఫలి తం ఉంటుందని వివరిస్తున్నారు. వీటన్నింటితోపాటు బహుళ అంతస్తుల్లో జరిగే అగ్ని ప్రమాదాల సమయంలో నిప్పుపై నీటిని చల్లి మంటలను అదుపులోకి తీసుకురావచ్చు. వరదల సమయంలో బాధితులకు ఆహార పొ ట్లాలు సైతం అందించే అవకాశం ఉంటుంది. జీపీఎస్ ద్వారా.. ఆధునిక పరిజ్ఞానంతో కూడిన డ్రోన్ను రూ.25 లక్షలకు కొనుగోలు చేసిన యువ కుడు పల్లె రాజు.. సాధారణ డ్రోన్లతో పోల్చితే ఇందులో అడ్వాన్సు టెక్నాలజీ ఉందని అంటున్నాడు. అంతేకాదు.. పంట పొలం వద్ద నిలబడి రిమోట్తో డ్రోన్ను ఆపరేట్ చేస్తూ పొలంలో పిచికారీ చేస్తున్నాడు. పంట పొలం, సర్వే నంబర్, సాగు విస్తీర్ణం (పిచికారి చేసే విస్తీర్ణం) అందులో ఫీడ్చేస్తే.. పొలంలోకి వెళ్లి పిచికారీ చేసి వస్తోంది డ్రోన్. డ్రోన్ ఆ సర్వే నంబర్ను జీపీఎస్ ద్వారా గుర్తించి అదే ప్రాంతంలో నిక్కచ్చిగా పిచికారీ చేస్తోంది. ఉద్యోగం రాలేదనే బెంగలేదు పీజీ పూర్తిచేసినా ఉద్యోగం రాలేదనే బెంగ లేదు. మరొకరి కింద పనిచేయాలనే అయిష్టంతోనే నూతన ఆవిష్కరణ వైపు దృష్టి సారించా. అగ్రి గ్రీన్పామ్స్ స్థాపించి ఇంక్యూబెటర్ సాయంతో అత్యధికంగా గుడ్లను పొదిగి కోడి పిల్లలను ఉత్పత్తి చేయడం ప్రారంభించా. అప్పటినుంచే ఆవిష్కరణలకు అడుగులు పడ్డాయి. నూతన ఆవిష్కరణలు విజయవంతమైన తర్వాత ఔత్సాహికులైన యువతకు శిక్షణ ఇవ్వడం మా ప్రత్యేకత. ఇప్పటికే 630 మంది యువ రైతులకు వివిధ అంశాలపై శిక్షణ ఇచ్చాం. మా సేవలను గుర్తించి గత కలెక్టర్ ముజామ్మిల్ఖాన్ ఎంతగానో అభినందించారు. – పల్లె రాజు, రాయదండి -
మహిళల ఆర్థికాభివృద్ధికి కుట్టు శిక్షణ దోహదం
రామగిరి(మంథని): మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించేందుకు ఉచిత కుట్టు శిక్షణ దోహదపడుతుందని రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు కటారి రేవతిరావు అన్నారు. మండలంలోని కల్వచర్ల గ్రామంలో రేండ్ల శారద కుమార్స్వామి దంపతులు సుమారు 300 మందికి ఉచిత కుట్టు శిక్షణ అందించి న్యాక్ ఆధ్వర్యంలో శుక్రవారం పరీక్షలు నిర్వహించారు. సదరు మహిళలకు డీఎంహెచ్వో అన్నప్రసన్న కుమారి, డీపీవో వీరబుచ్చయ్యతో కలిసి సర్టిఫికెట్స్ అందజేశారు. అనంతరం రేవతిరావు మాట్లాడుతూ, గ్రామంలోని మహిళలకు ఆర్థిక తోడ్పాటు అందించాలని ఉచిత కుట్టు శిక్షణతో పాటు పరికరాలు అందజేయడం, న్యాక్ ద్వారా ప్రతి మహిళకు రుసుము చెల్లించి పరీక్షలు నిర్వహించడంతో పాటు సర్టిఫికెట్లు అందజేస్తున్న శారదకుమార్స్వామి దంపతుల సేవలు భేష్ అని కొనియాడారు. కార్యక్రమంలో రేండ్ల కొమురయ్య, బూస బాపు, కస్ప కవిత, మహేందర్, రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు శ్రీనివాస్ పాల్గొన్నారు. -
పీసీసీలో మనోళ్లకు చోటు
● పీఏసీ కమిటీలో దుద్దిళ్ల, పొన్నం, ఆది ● కేబినెట్లో చోటు కోసం ఉమ్మడి నేతల ఆరాటంసాక్షిప్రతినిధి, కరీంనగర్: కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రకటించిన వివిధ పీసీసీ కమిటీల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ఇద్దరు మంత్రులు, ఇద్దరు ఎమ్మెల్యేలు, మాజీ మంత్రికి చోటు దక్కింది. పీసీసీ కమిటీల్లో కీలకమైన రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సభ్యులుగా ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు, రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్లను నియమించారు. కాగా.. ఇటీవల కొంతకాలంగా పార్టీ పెద్దల తీరుపై అసంతృప్తితో రగిలిపోతున్న మాజీ మంత్రి తాటిపర్తి జీవన్రెడ్డికి సలహా కమిటీలో అవకాశం కల్పించారు. అదేవిధంగా డీలిమిటేషన్ కమిటీలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణలను సభ్యులుగా నియమించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎనిమిది మంది ఎమ్మెల్యేలుగా గెలవగా, అందులో నలుగురికి పీసీసీ కమిటీల్లో అవకాశం లభించింది. మంత్రి వర్గంలో ఆది.. మంత్రి వర్గ విస్తరణ త్వరలో జరగబోతున్న నేపథ్యంలో ఉమ్మడి జిల్లాకు మరో బెర్తు ఖాయంగా కనిపిస్తోంది. కొత్తగా ఎన్నికై న ఎమ్మెల్యేల్లో ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఉన్నారు. మున్నూరు కాపు సామాజికవర్గం కోణంలో ఆయనకు బెర్తు ఖాయమయ్యే అవకాశాలున్నాయని సమాచారం. మాదిగ సామాజిక వర్గం తరఫున తమకు కూడా కేబినెట్ లో చోటు కల్పించాలని మరో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణలు కోరుతున్నారు. మరోవైపు తనకు కూడా మంత్రి పదవి ఇవ్వాలని ఇటీవల రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ కోరిన విషయం విధితమే. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ఇప్పటికే దుద్దిళ్ల శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్లు కేబినెట్లో ఉన్నారు. వీరికి తోడుగా మరో ఒక్క బెర్తు మాత్రమే ఖరారయ్యే అవకాశాలు ఉండటంతో ఈ ఒక్క మంత్రి పదవి ఎవరిని వరిస్తుందో అన్న ఉత్కంఠ నెలకొంది. -
పొగాకు ఉత్పత్తులు హానికరం
పెద్దపల్లిరూరల్: ప్రతి ఒక్కరూ పోషక విలువలున్న ఆహారం తీసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, హానికారకమైన పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండాలని జిల్లా అడిషనల్ జడ్జి శ్రీనివాసరావు అన్నారు. జిల్లా కోర్టు ఆవరణలో శుక్రవారం ప్రపంచ పొగాకు వ్యతిరేక వారోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జూనియర్ సివిల్జడ్జి మంజులతో కలిసి పాల్గొన్నారు. ఆరోగ్యానికి హాని కలిగించే పొగాకును, వాటితో తయారయ్యే వస్తువులకు దూరంగా ఉండాలన్నారు. పొగాకు వల్ల కలిగే దుష్ఫలితాలపై వివరిస్తూ ప్రజల్లో చైతన్యం పెంచాలన్నారు. నిరంతరం పెట్రోలింగ్ చేయాలిఓదెల(పెద్దపల్లి): పోలీసులు నిరంతరం పెట్రోలింగ్ చేయాలని పెద్దపల్లి డీసీపీ కరుణాకర్, ఏసీపీ కృష్ణ పేర్కొన్నారు. శుక్రవారం పొత్కపల్లి పోలీస్స్టేషన్ను డీసీపీ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పెండింగ్ కేసులపై ఆరా తీశారు. ఠాణాకు వచ్చే బాధితులతో మర్యాదగా ప్రవర్తించి సమస్యలు పరిష్కరించాలన్నారు. స్టేషన్ పరిధిలో సమస్యాత్మక గ్రామాలపై నిత్యం నిఘా పెట్టాలని సూచించారు. మత్తు పదార్థాలు రవాణా చేసే వ్యక్తుల కదలికలపై ఎప్పటికప్పుడు సమాచారం సేకరించాలన్నారు. ఎస్సై రమేశ్, సిబ్బంది పాల్గొన్నారు. సమ్మర్ క్యాంపు తనిఖీపెద్దపల్లిరూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు సమ్మర్క్యాంపులను నిర్వహిస్తున్న తీరును పర్యవేక్షించేందుకు విద్యాశాఖ ప్రత్యేకాధికారి దుర్గాప్రసాద్ శుక్రవారం జిల్లా కేంద్రంలోని అమర్నగర్ ప్రైమరీ స్కూల్ను డీఈవో మాధవితో కలిసి సందర్శించారు. వేసవిలో విద్యార్థులు ఆటపాటలతో తమ మేధస్సును పెంచుకునేందుకు వీలుగా ప్రభుత్వం సమ్మర్క్యాంపులను నిర్వహిస్తోందన్నారు. ఉద యం 8.30 నుంచి 11గంటల వరకు అందుబా టులో ఉంటూ విద్యార్థులకు సులువుగా అర్థమయ్యేలా బోధించాలని సూచించారు. సీఆర్పీ బాలసాని వెంకటేశం తదితరులున్నారు. అభ్యసన సామర్థ్యాలు వెలికితీయాలిసుల్తానాబాద్రూరల్: శిక్షణ కాలంలో నేర్చుకున్న అంశాలను పాఠశాలల్లో అమలు చేసి విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలను వెలికి తీయాలని జిల్లా విద్యాధికారి మాధవి అన్నా రు. సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ఉపాధ్యాయుల కెపాసిటి బిల్డింగ్పై శిక్షణ కార్యక్రమం శుక్రవారంతో ముగిసింది. ఈ సందర్భంగా అబ్జర్వర్ దుర్గాప్రసాద్, డీఈవో శిక్షణ కార్యక్రమాన్ని పరిశీలించారు. కోర్స్ డైరెక్టర్ కవిత, రిసోర్స్ పర్సన్స్ నరేశ్, కుమార్, సాధన, ప్రత్యక్ష, సీఆర్సీలు కిరణ్కుమార్, మంజుల తదితరులున్నారు. యాజమాన్య పద్ధతులు పాటించాలికమాన్పూర్(మంథని): పంటల సాగులో రైతులు తప్పనిసరిగా యాజమాన్య పద్ధతులు పాటించాలని శాస్త్రవేత్తలు అన్నారు. మండలంలోని గుండారం, నాగారం, సిద్దిపల్లె గ్రామాల్లో ఖరీఫ్ పంటల సాగు విధానాలపై శుక్రవారం రామగిరి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు వికసిత్ కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమంలో భాగంగా అవగాహన కల్పించారు. ఖరీఫ్ సాగుకు రైతులు దుక్కులు దున్ని సిద్ధం చేసుకోవాలని సూచించారు. అధిక దిగుబడులు ఇచ్చే, చీడపీడలను తట్టుకునే విత్తనాలను విత్తుకోవాలని సూచించారు. మంథని ఏడీఏ అంజని, శాస్త్రవేత్తలు వెంకన్న, కిరణ్, సురేశ్, బాబ్జీ, పాల్యాదవ్, గిరీశ్, ఏవో రామకృష్ణ, జ్యోతి, అనూష, శ్వేత పాల్గొన్నారు. -
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
ఎలిగేడు/జూలపల్లి: పెద్దపల్లి నియోజకవర్గంలో అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నామని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. శుక్రవారం ఎలిగేడు మండలం లాలపల్లి, ఎలిగేడు, ర్యాకల్దేవుపల్లి, రాములపల్లి, జూలపల్లి మండలం నాగులపల్లె, చీమలపేట, తేలుకుంటలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లు అధికారంలో ఉండి డబుల్బెడ్రూం ఇళ్లు ఇస్తామని ఒక్క ఇల్లు ఇవ్వకుండా పేదలను మోసం చేసిందన్నారు. ఎలిగేడు నుంచి లాలపల్లి వరకు రూ.3కోట్లతో రోడ్డు నిర్మాణం జరుగుతుందని, త్వరలోనే మండల కేంద్రంలో మంత్రి చేతులమీదుగా పోలీస్స్టేషన్ను ప్రారంభించుకుంటామని పేర్కొన్నారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా తడిసిన, రంగుమారిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసిందని వివరించారు. కార్యక్రమాల్లో తహసీల్దార్ యాకన్న, ఎంపీడీవోలు భాస్కర్రావు, పద్మజ, ఎంపీవో అనిల్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ వేణుగోపాలరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ గండు సంజీవ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సామ రాజేశ్వర్రెడ్డి, దుగ్యాల సంతోష్రావు, బాలుసాని పరుశరాములుగౌడ్, రాజేశ్వర్రెడ్డి, వెంకట్రెడ్డి, కోరుకంటి వెంకటేశ్వర్రావు, పల్లెర్ల వెంకటేశ్గౌడ్, బూర్ల వెంకటసత్యం తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే విజయరమణారావు -
పారదర్శకంగా భూ సమస్యల పరిష్కారం
● కలెక్టర్ కోయ శ్రీహర్ష పెద్దపల్లిరూరల్: భూ సంబంధిత సమస్యలను భూభారతి చట్టం ద్వారా పారదర్శకంగా పరిష్కరించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. కలెక్టరేట్లో శుక్రవారం అడిషనల్ కలెక్టర్ వేణుతో కలిసి సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలోని ఎలిగేడు మండలంలో పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన గ్రామాల్లో భూసమస్యలపై స్వీకరించిన దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. సేత్వార్కు సంబంధించిన సమస్యలే ఎక్కువగా వచ్చాయని వివరించారు. 2020 సంవత్సరం వరకు సాదాబైనామా కింద దరఖాస్తు చేసుకున్న సమస్యలనే పరిష్కరించాలని కొత్తగా సాదాబైనామా దరఖాస్తులు తీసుకోవద్దన్నారు. జూన్ 3నుంచి నిర్వహించే రెవెన్యూ సదస్సులకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. తిరస్కరించే దరఖాస్తులకు కారణాలను స్పష్టంగా చెప్పాలన్నారు. అవినీతి, అక్రమాలకు పాల్పడినట్లు దృష్టికి వస్తే కఠినంగా వ్యవహరిస్తామని పేర్కొన్నారు. సమావేశంలో ఆర్డీవోలు గంగయ్య, సురేశ్, సర్వే ల్యాండ్రికాడ్స్ఏడీ శ్రీనివాసులు తదితరులున్నారు. -
కోల్బెల్ట్ నుంచే శంఖారావం!
గోదావరిఖని: రాష్ట్ర రాజకీయాల్లో పెనుదుమారం రేపుతున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కోల్బెల్ట్ వేదికగా రాజకీయ ఆరంగేంట్రం చేస్తారా? అనే సందేహాలకు ప్రస్తుతం చోటుచేసుకుంటున్న పరిణామాలు అవుననే అంటున్నాయి. అంతేకాదు.. భవిష్యత్లో సింగరేణిలో ‘జాగృతి’కి పెద్దపీట వేస్తారా? లేక తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘాన్ని బలోపేతం చేస్తారా? అనేదానిపై చర్చ కూడా జోరందుకుంది. ఈ రెండింటికీ సుప్రీం కల్వకుంట్ల కవిత కావడం ఇందుకు కారణమైంది.పనితీరుపై ఆసక్తి..సింగరేణి జాగృతి పనితీరు ఎలా ఉంటుంది, కార్మికులతో కలిసి ఎలా ముందుకు వెళ్తుంది? అనేదానిపై పీటముడి వీడడంలేదు. ఇదే సమయంలో టీబీజీకేఎస్ను భవిష్యత్ ఏమిటనే దానిపైనా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సింగరేణిలో కారుణ్య నియామకాలు, హక్కులను సాధించి పెట్టిన టీబీజీకేఎస్కు కార్మికుల్లో మంచి పట్టుఉంది. రెండుసార్లు గుర్తింపు కార్మిక సంఘంగా గెలిచి అన్ని ఏరియాల్లో పూర్తిస్థాయి కమిటీలను ఏర్పాటు చేశారు. గతగుర్తింపు సంఘం ఎన్నికలకు యూనియన్ దూరంగా ఉండడంతో యూనియన్ శ్రేణులు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. కొందరు నాయకులు ఇతర యూనియన్లకు వలసవెళ్లారు.బీఆర్ఎస్తో సంబంధం లేకుండానే..టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షరాలిగా ఉన్న కల్వకుంట్ల కవిత.. బీఆర్ఎస్ పార్టీతో సంబంధం లేకుండా సొంతంగా సింగరేణి జాగృతి కన్వీనర్లను అన్ని ఏరియాల్లో నియమించారు. ఈమేరకు 11 ఏరియాల్లోని కన్వీనర్లకు నియామక పత్రాలు అందజేశారు. బీఆర్ఎస్కు అనుబంధంగా కొనసాగుతున్న టీబీజీకేఎస్ను బలోపేతం చేయడంపై ఇటీవల దృష్టి సారించారు. ఈ నేపథ్యంలోనే అన్ని ఏరియాల్లో కమిటీలను పునర్వ్యవస్థీకరించాలని నిర్ణయించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి, కల్వకుంట్ల కవితకు మధ్య గ్యాప్ వచ్చిందనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సింగరేణిలో జాగృతి కన్వీనర్లను నియమించడం చర్చనీయాంశంగా మారింది.యాక్టివ్ నేతలపై ఆరా..ఇటీవల రామగుండం ప్రాంతంలో పర్యటించిన ఎమ్మెల్సీ కవిత.. టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలి హోదాలో యూనియన్ సమావేశం కూడా నిర్వహించారు. యూనియన్ శ్రేణులను జాగృతం చేసేలా ప్రసంగించారు. అంతేకాకుండా కోల్బెల్ట్ ప్రాంతంలో యూనియన్ను బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగాలని ఆదేశించారు. ఆ తర్వాత ఇల్లెందు క్లబ్లో జరిగిన ఓ యూనియన్ నాయకుని ఫంక్షన్లో పాల్గొని అక్కడికి వచ్చిన యూనియన్ నేతలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. సింగరేణిలోని మొత్తం 11 ఏరియాల్లో యూనియన్ తీరు, యాక్టివ్గా ఉన్న నాయకుల గురించి ఆరా తీశారు. చాలారోజుల తర్వాత రామగుండం పారిశ్రామిక ప్రాంతానికి వచ్చిన ఆమెకు ఘనస్వాగతమే లభించింది. ఈక్రమంలో గత మంగళవారం ఏరియా కన్వీనర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీచేయడం, ఇటు సొంత పార్టీ బీఆర్ఎస్, సొంత యూనియన్ టీబీజీకేఎస్లో చర్చనీయాంశంగా మారింది. మిగతా యూనియన్లు కూడా ఈ విషయాన్ని ఆసక్తిగా గమనిస్తున్నాయి.కార్మిక క్షేత్రంలో పట్టుకోసమే..రాష్ట్రంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో విస్తరించి ఉంది. కార్మిక క్షేత్రంతో కవితకు అనుబంధం కూడా ఎక్కువేగానే ఉంది. రెండుసార్లు గుర్తింపు కార్మిక సంఘంగా గెలిచిన టీబీజీకేఎస్కు గౌరవధ్యక్షరాలిగా కొనసాగారు. ఈక్రమంలో ఇక్కడి నుంచే రాజకీయ ఆరంగేట్రం ప్రారంభించాలనే ఆలోచనతో సింగరేణి ఏరియాలో జాగృతి కన్వీనర్లను నియమించినట్లుగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.టీబీజీకేఎస్ నేతలకు నో ఇన్ఫర్మేషన్జాగృతి కన్వీనర్లకు నియామక లేఖలు ఇచ్చిన సమయంలో టీబీజీకేఎస్ నాయకులను కవిత ఆహ్వానించలేదంటున్నారు. మరోవైపు.. భవిష్యత్లో కూడా అన్నివేదికలపై పట్టు సాధించేందుకు బతుకమ్మ కమిటీలు, జాగృతి కమిటీలు, సాంస్కృతిక కమిటీలు.. ఇలా ఏర్పాటు చేస్తారనే ప్రచారం ఉంది. ఏదిఏమైనా కార్మిక క్షేత్రం నుంచే రాజకీయ అరంగేట్రం మొదలు కావడం చర్చనీయాంశంగా మారింది. -
అర్హులకే ఇందిరమ్మ ఇండ్లు!
సాక్షిప్రతినిధి,కరీంనగర్: ఇందిరమ్మ ఇళ్లను అర్హులకే కేటాయించాలని.. అనర్హులకు ఇస్తే అధికారులపై చర్యలు తప్పవని ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్లు, భూభారతి, ధాన్యం కొనుగోలు వానాకాలం పంటలసాగు సన్నద్ధతపై కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో గురువారం మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ ఉమ్మడి జిల్లా కలెక్టర్లు ఉన్నతాధికారులతో కలిసి రివ్యూ నిర్వహించారు.‘ప్రజాసంక్షేమం కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంక్షేమ పథకాలను పకడ్బందీగా అమలు చేయాలి. ఖరీఫ్ సీజన్లో ఎస్సారెస్పీ నీటి విడుదల ప్రణాళికలో స్థానిక ఎమ్మెల్యే, ఎంపీలను భాగస్వామ్యం చేస్తాం. ఎస్సారెస్పీ సామర్థ్యం సిల్ట్ కారణంగా తగ్గింది. రాష్ట్ర ప్రభుత్వం పాలసీ ప్రకారం ఎస్సారెస్పీ రిజర్వాయర్ పూడికతీత, డీసిల్టేషన్ ఆధునిక పద్ధతుల్లో పూర్తిచేసి పూర్వపు సామర్థ్యం తీసుకొస్తాం. కడెం ప్రాజెక్టుతో పాటు ఇతర ప్రాజెక్టుల్లో సిల్ట్ తొలగించేందుకు అత్యాధునిక పద్ధతులను వినియోగిస్తాం. కరీంనగర్ జిల్లా సర్వతోముఖాభివృద్ధికి ప్రత్యేకంగా కృషి చేస్తాం.. ఇందుకు మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ సహకారంతో ముందుకు వెళ్తాం. సింగరేణి భూముల సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం. బండ్ల వాగు ఎత్తిపోతల పథకాన్ని వారం రోజులలో ప్రారంభిస్తాం. పాలకుర్తి ఎత్తిపోతల పథకం, పత్తిపాక రిజర్వాయర్ నిర్మాణ పనులకు ప్రభుత్వం సానుకూలంగా ఉంది’ అని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు.● రోళ్లవాగు ప్రాజెక్టు అటవీ అనుమతులు వచ్చేలా ఉన్నతాధికారులతో జగిత్యాల కలెక్టర్ నిరంతరం సంప్రదింపులు చేయాలని మంత్రి సూచించారు. నారాయణపురం రిజర్వాయర్, కొండగట్టు ఎత్తిపోతల పథకం, కలికోట సూరమ్మ ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తామని తెలిపారు. తడిసిన ధాన్యం ప్రభుత్వం కొనుగోలుచేస్తుందని మంత్రి పేర్కొన్నారు. కలెక్టర్లు మరోవారం పాటు కొనుగోళ్లపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. అవసరమైనమేర ధాన్యం రవాణా కోసం వాహనాలు సిద్ధం చేసుకోవాలని.. లారీల కొరత ఉంటే ట్రాక్టర్లు వాడాలని అన్నారు. దేశంలో మొదటిసారిగా తెలంగాణలోని 84 శాతం జనాభాకు ఉచితంగా ఆరుకిలోల సన్నబియ్యం అందజేస్తున్నట్లు తెలిపారు. దేశ చరిత్రలోనే ఇది విప్లవాత్మక పథకమని.. దేశంలో సన్నబియ్యం పంపిణీ చేస్తున్న ఏకై క రాష్ట్రం మనదే అని తెలిపారు.ఇండ్ల స్థలాలపై ఆందోళన వద్దు..మీడియా మిత్రులకు ఎస్సారెస్పీ సమీపంలో అందుబాటులో ఉన్న భూములు పంపిణీకి ఉన్న సమస్యలు పరిష్కరించి త్వరలోనే ఇంటి పట్టాలు కేటాయిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి అన్నారు. కరీంనగర్ మీడియా మిత్రులు ఇండ్ల పట్టాల పంపిణీ విషయంలో ఎలాంటి ఆందోళన చెందవద్దని, మంత్రులు శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్తో చర్చించి త్వరలో పట్టాలు అందించే కార్యక్రమం చేపడుతామని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు.● మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ పకడ్బందీగా జరిగిందన్నారు. అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10 వేల చొప్పున రూ.51 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. అకాల వర్షాలతో రైతుల నష్టపోకుండా అవసరమైన టార్ఫాలిన్ కవర్లు కొనుగోలు కేంద్రాల వద్ద అందుబాటులో ఉంచాలని అధికారులను కోరారు. భూ భారతి చట్టంతో పట్టాదారులకు ఎటువంటి నష్టం రాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.● మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. గత పాలకుల హయాంలో రైస్ మిల్లులవద్ద తూకం పేరుతో రైతులు అనేక ఇబ్బందులకు గురయ్యారని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో ఎక్కడా ఇబ్బంది లేదన్నారు. మలకపేట, సూరమ్మ, మోతే నారాయణపూర్, గౌరవెల్లి, దేవాదుల వంటి ప్రాజెక్టుల పనులు స్పీడప్ చేయాలని అధికారులను మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఆదేశించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోకి భూపాలపల్లి, హనుమకొండ, సిద్దిపేట జిల్లాలు వస్తాయని.. ఆయా జిల్లాల కలెక్టర్లను సైతం సమీక్ష సమావేశాలకు ఆహ్వానించాలని అధికారులను మంత్రి కోరారు. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, రామగుండం, పెద్దపల్లి ఎమ్మెల్యేలు మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్, చింతకుంట విజయరమణారావు, డాక్టర్ సంజయ్కుమార్, మేడిపల్లి సత్యం, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశ్, ఉమ్మడి జిల్లా కలెక్టర్లు పమేలా సత్పతి, సందీప్ కుమార్ ఝా, సత్యప్రసాద్, పెద్దపల్లి అదనపు కలెక్టర్ జె.అరుణ, వివిధ శాఖల ఉన్నతాధికారులు, అధికారులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. -
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి
● పట్టభద్రుల ఎమ్మెల్సీ అంజిరెడ్డి పెద్దపల్లిరూరల్: ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠ శాలలను బలోపేతం చేయాలని పట్టభద్రుల ఎ మ్మెల్సీ అంజిరెడ్డి కోరారు. స్థానిక జెడ్పీ బాలికోన్నత పాఠశాలలో చేపట్టిన ఉపాధ్యాయుల శిక్షణ శిబిరానికి బుధవారం ఆయన హాజరై మాట్లాడా రు. తాను కూడా ప్రభుత్వ పాఠశాలలోనే చదివా నని గుర్తుచేశారు. ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. డీఈవో మాధవి, బీజేపీ జిల్లా అధ్యక్షు డు సంజీవరెడ్డి, నాయకులు శివంగారి సతీశ్, మంథెన కృష్ణ, కాసనగొట్టు విజయ్, సందీప్, రామగిరి అఖిల్, రవీందర్ తదితరులు ఉన్నారు. మానవ అక్రమరవాణా నిర్మూలిద్దాం మానవ అక్రమ రవాణా నిర్మూలనలో ప్రజలు భాగస్వామ్యం కావాలని డీఈవో మాధవి, ప్రజ్వ ల సీనియర్ ప్రాజెక్టు మేనేజర్ బలరామకృష్ణ అన్నారు. విద్యాపరిశోధన శిక్షణ సంస్థ, ప్రజ్వల స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో రెండురోజుల శిక్షణ శిబిరం బుధవారం ప్రారంభమైంది. ఆర్థిక, సామాజిక కారణాలతో ట్రాఫికెర్స్ టార్గెట్ చేసి మాయామాటలతో నమ్మించి వ్యభిచార గృహాలకు విక్రయిస్తున్నారని పేర్కొన్నారు. -
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
● కేంద్ర పర్యావరణ డైరెక్టర్ తరుణ్ కుమార్ గోదావరిఖని/రామగిరి(మంథని): పర్యావరణా న్ని కాపాడుకోవడం అందరి బాధ్యత అని కేంద్ర పర్యావరణ, అటవీశాఖ హైదరాబాద్ రీజియన్ డైరెక్టర్ కె.తరుణ్కుమార్ అన్నారు. ప్లాస్టిక్ను వినియోగించవద్దన్నారు. బుధవారం ఆయన ఆర్జీ– 2, 3, ఏపీఏలో పర్యటించారు. తొలుత ఉద్యోగులకు జూట్ బ్యాగులు అందజేశారు. ప్రతీఒక్కరు మొక్కలు నాటాలని కోరారు. అనంతరం వకీల్ప ల్లిగని, పెంచికల్పేట, న్యూపెద్దంపేట, మారేడు పాక, ఓిసీపీ–1, జూలపల్లి, ముల్కలపల్లి, పన్నూ ర్, రత్నాపూర్, నాగేపల్లి గ్రామాల్లో పర్యటించా రు. ఓసీపీ–1పై రెమిడేషన్ ప్లాన్లో భాగంగా చేపట్టిన పనుల వివరాల గురించి జీఎం నాగేశ్వరరా వు ఆయనకు వివరించారు. కార్పొరేషన్ ఎన్విరాన్మెంట్ విభాగం జీఎం సైదులు, ఎస్వో టు జీ ఎం రామ్మోహన్, ఏరియా ఇంజినీర్ శేఖర్బాబు, ఫైనాన్స్ ఏజీఎం శ్రీనివాసులు పాల్గొన్నారు. -
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
● డీఎంహెచ్వో అన్న ప్రసన్నకుమారి పెద్దపల్లిరూరల్: సీజనల్ వ్యాధుల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి అన్న ప్రసన్నకుమారి ఆదేశించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అనుసరించాల్సిన పద్ధతులపై పంచాయతీ, వైద్య, మిషన్ భగీరథ తదితర శాఖల అధికారులతో కలెక్టరేట్లో బుధవారం ఆమె సమావేశమై పలు సూచనలు చేశా రు. ఇంటి ఆవరణను శుభ్రంగా ఉంచుకునేలా ప్రజలను ప్రోత్సహించాలని సూచించారు. దేశంలో కరోనా ప్రబలుతోందని, ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రతపై శ్రద్ధ చూపాలని ఆమె సూచించా రు. సమావేశంలో జిల్లా అధికారులు వీరబుచ్చ య్య, శ్రీనివాస్, శ్రీరాములు, రాజమౌళి, సుధాకర్రెడ్డి, కిరణ్తోపాటు మున్సిపల్ కమిషనర్లు వెంకటేశ్, మనోహర్ తదితరులు పాల్గొన్నారు. -
ఎన్కౌంటర్ మృతదేహాలను ఎందుకివ్వరు?
పెద్దపల్లిరూరల్: ఎన్కౌంటర్ పేరిట మావోయిస్టులు నంబాల కేశవరావు సహా 27మందిని హ తమార్చిన పాలకులు మృతదేహాలను వారి కు టుంబసభ్యులకు ఎందుకు ఇవ్వరని ప్రజా, పౌరహక్కుల సంఘాల నేతలు ప్రశ్నించారు. స్థానిక బస్టాండ్ సమీపంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద బుధవారం నిరసన తెలిపారు. నారాయణపూర్ ఎన్కౌంటర్లో మరణించిన మావోయిస్టుల మృతదేహాల అప్పగింతపై ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు అమలు కావడం లేదన్నారు. ఛత్తీస్గఢ్ పో లీసులు ఎన్కౌంటర్ మృతదేహాలకు అంత్యక్రియలు జరపడం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. కుమారస్వామి, లక్ష్మణ్, రవి, కొమురయ్య, ర వీందర్, రాజయ్య, సుదర్శన్, అశోక్, శ్రావణ్, ఆంజనేయశర్మ, సుచరిత, పర్వతాలు, సత్యనారాయణ, మల్లేశం, సుధాకర్, జగన్ ఉన్నారు. -
సంఘం స్థలం స్వాహాకు యత్నం?
వేములవాడ: పట్టణంలోని ఆర్యవైశ్య సంఘ స్థలం విషయంలో వివాదం ఏర్పడి పంచాయితీ ఎస్పీ వద్దకు చేరింది. వివరాలు ఇలా ఉన్నాయి.. పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో సుమారు 1800 సభ్యుల సంకల్పంతో 2011లో సర్వే నం.977లో 968 గజాల స్థలం కొనుగోలు చేశారు. సంఘం అధ్యక్షుడు, కార్యవర్గం పేరుపై ఉండాల్సిన భూమిని 12 మంది ప్రముఖులు ఓ ట్రస్టుగా ఏర్పడి తమ పేరుతో రిజిస్త్రేషన్ చేయించుకోవడంతో వివాదం చెలరేగింది. సంఘ సభ్యుల హితాన్ని దృష్టిలో ఉంచుకొని భవిష్యత్లో సేవా కార్యక్రమాల కేంద్రంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో కొన్న ఈ స్థలంలో 12 మంది ప్రముఖులు తామే యజమానులమని గత డిసెంబర్లో తమ పేతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు వెలుగు చూసింది. దీంతో సంఘ సభ్యులంతా తీవ్ర ఆగ్రహానికి లోనై ఇది కేవలం ఆస్తిపై మాత్రమే కాదు మన ఆర్యవైశ్యుల ఆత్మగౌరవంపై దాడి అంటూ పట్టణానికి చెందిన 1800 మంది సభ్యుల నమ్మకాన్ని, ఆశలను తాకట్టు పెడుతున్నారని మండిపడుతున్నారు. ఈ అంశంతో ఆర్యవైశ్య ప్రముఖులు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న అక్రమ రిజిస్ట్రేషన్దారులు కాంప్రమైజ్ అవుతామనీ, తమపై ఉన్న రిజిస్ట్రేషన్ రద్దు చేసుకుని తిరిగి సంఘానికి చేస్తామని చెప్పినట్లు తెలిసింది. ఈ వివాదం బుధవారం వేములవాడలో సామాజికంగా కీలకమైన అంశంగా మారింది. వైశ్య సంఘం న్యాయబద్ధంగా తమ హక్కులను తిరిగి పొందుతుందా? లేక ఈ ప్రయత్నం వ్యర్థమవుతుందా? అన్న చర్చ కొనసాగింది. వేములవాడలో ఆర్య వైశ్య సంఘ భూవివాదం ఎస్పీ వద్దకు చేరిన పంచాయితీ -
ఆపదలో ఉన్నాం.. ఆదుకోండి
రామగిరి(మంథని): భర్త అనారోగ్యం.. ఆర్థికలేమి.. ముగ్గురు పిల్లలు పోషణ.. కూలీ పనులతో కుటుంబాన్ని నెట్టుకు రావడం ఆ గృహిణికి తలకుమించిన భారంగా మారింది. దాతలు సాయం చేస్తే భర్తకు మంచి వైద్యచికిత్స అందిస్తామని, పిల్లల పోషణ చూసుకుంటానని అంటోంది ఆ గృహిణి. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం బేగంపేట గ్రామానికి చెందిన దుబ్బాక కుమార్ – విజయ దంపతులు. వీరికి ముగ్గురు సంతానం కిరణ్, మహేందర్, చెర్రీ ఉన్నారు. అనారోగ్యానికి గురైన కుమార్.. పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందాడు. అయినా నయం కాలేదు. తనకున్న స్థోమత వరకు ఖర్చుచేశాడు. చేతిలో ఉన్న సొమ్మంతా ఖర్చు కావడంతో మళ్లీ ఆస్పత్రికి వెళ్లడానికి చిల్లిగవ్వకూడా లేకుండాపోయింది. కనీసం ప్రయాణానికి కూడా డబ్బులు లేని దీనస్థితిలో ఆ కుటుంబం ఉంది. విజయ కూలీ పనులకు వెళ్లి అంతోఇంతో సంపాదిస్తున్నా కుటుంబ పోషణకు కూడా సరిపోవడం లేదు. దాతలు ముందుకు వచ్చి తన భర్తను కాపాడాలని విజయ కోరుతోంది. రెండు కిడ్నీలు పనిచేయక యువకుడి నరకయాతన -
దళిత యువకుడిని చితకబాదిన పోలీసులు
సైదాపూర్: డ్రంకెన్డ్రైవ్లో సహకరించడం లేదని ఓ దళిత యువకుడిని 20 రోజుల క్రితం చితకబాదిన ఘటన కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలో చోటుచేసుకుంది. జరిగిన ఘటనపై దళిత సంఘాలు వివిధ రూపాల్లో బాధితుడికి న్యాయం చేయాలని ఆందోళనలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. బాధితుడు కరీంనగర్ సీపీ, మానవ హక్కుల కమిషన్, నేషనల్ ఎస్సీ కమిషన్కు ఫిర్యాదు చేశాడు. ఘటనపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని కమిషన్ కోరినట్లు తెలిసింది. వివరాల్లోకి వెళ్తే.. సైదాపూర్లో ట్రైనీ ఎస్ఐగా బాధ్యతలు నిర్వహిస్తున్న అగస్త్య భార్గవ్గౌడ్ తోటి సిబ్బందితో కలిసి మండలంలోని లస్మన్నపల్లి శివారులో డ్రంకెన్డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. గొల్లగూడెం గ్రామానికి చెందిన బత్తుల మహేందర్ మొలంగూర్ నుంచి సైదాపూర్ వస్తున్నాడు. పోలీసులు ఆపారు. టెస్టు చేసి చలాను వేసిన తర్వాత అతడి వివరాలు రాసుకున్నారు. ఇంతలో మహేందర్కు ఇంటి వద్ద నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్ మాట్లాడుతున్న బాధితున్ని సహకరించడం లేదని ఫోన్ తీసుకొని ఎస్ఐ అగస్త్య భార్గవ్గౌడ్తోపాటు ఇద్దరు కానిస్టేబుళ్లు అక్కడే చితకబాదారు. చెవి కర్ణభేరి దెబ్బతిని చెవి నుంచి రక్తం కారుతున్నా వదల్లేదని, తర్వాత పోలీస్ స్టేషన్కు పిలిచి తనతో క్షమాపణ పత్రం రాయించుకున్నారని మహేందర్ కమిషన్లకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఘటనపై విచారించాలని కరీంనగర్ సీపీ హుజూరాబాద్ ఏసీపీ శ్రీనివాస్ను ఆదేశించారు. బాధితుడి వాగ్మూలం తీసుకున్న మర్నాడే ఏసీపీ శ్రీనివాస్ బదిలీ కావడంతో పోలీసుల విచారణలో జాప్యం జరుగుతోందని బాధితుడు అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. హెచ్ఆర్సీ, నేషనల్ ఎస్సీ కమిషన్ మాత్రం అడిషనల్ డీజీపీ, కరీంనగర్ సీపీకి విచారణ నివేదికను 20 రోజుల్లో అందజేయాలని నోటీసులు జారీ చేసింది. తాను పీజీ బీఈడీ చేసి, నిరుద్యోగిగా కూల్డ్రింకులు సరఫరా చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నానని, అకారణంగా చితకబాదడంతో అవమానంతో మానసికంగా భరించలేకపోతున్నాని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. మహేందర్ అప్పటికే వేరే సంఘటనలో ఇతరులతో తగాదా పడి దెబ్బలు తిని వస్తున్నాడని, డ్రంకెన్డ్రైవ్ టెస్టులో సహకరించకుండా పోలీసులలో దుర్భాషలాడారని, అందుకు క్షమాపణ పత్రం రాసి ఇచ్చాడని పోలీసులు పేర్కొంటున్నారు. వాస్తవాలు ఉన్నతాధికారుల విచారణలో తేలాల్సి ఉంది. దెబ్బతిన్న బాధితుడి చెవి కర్ణభేరి హెచ్ఆర్సీ, నేషనల్ ఎస్సీ కమిషన్కు ఫిర్యాదు విచారించి నివేదిక ఇవ్వాలని అడిషనల్ డీజీపీ, సీపీకి నోటీసులు -
డీఈవో వ్యాఖ్యలు.. ఆరని మంటలు!
● మహిళా కమిషన్కు ఫిర్యాదు చేసిన కరీంనగర్వాసి ● చర్యలు తీసుకోవాలని మరిన్ని ఫిర్యాదులు ● క్రమంగా వెలుగులోకి జనార్దన్రావు వ్యవహారాలు ● ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఐదేళ్లుగా కరీంనగర్లో విధులు ● కలెక్టర్ కార్యాలయం తీరుపైనా విమర్శలుసాక్షిప్రతినిధి,కరీంనగర్: కరీంనగర్ జిల్లా విద్యాశాఖాధికారి జనార్దన్రావు వ్యవహారం మరింత ముదిరింది. ‘భర్తలకు వంట రాకపోతే.. భార్యలు లేచిపోతారు.. తాను రెండు సంసారాలు ఈదుతున్నా’ అంటూ తలతిక్క వ్యాఖ్యలతో శిక్షణ శిబిరాల్లో టీచర్లను బెంబేలెత్తించిన డీఈవోపై విమర్శలు, ఆరోపణలు ఆగడం లే దు. ఆయన్ను ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ.. కలెక్ట ర్ పమేల సత్పతి మంగళవారం రాత్రి ఆదేశాలిచ్చి నా.. టీచర్లు శాంతించడం లేదు. ఆయన వ్యాఖ్యలు మహిళా లోకాన్ని కించపరిచేలా ఉన్నాయని తోటి ఉద్యోగులు మండిపడుతుండగా.. సామాజిక ఉద్యమకారుడు షాబుద్దీన్ డీఈవోపై చర్యలు తీసుకోవా లని కోరుతూ.. మహిళా కమిషన్కు ఎక్స్ వేదికగా ఫిర్యాదు చేశారు. డెమొక్రాటిక్ టీచర్ ఫెడరేషన్ (డీటీఎఫ్) నాయకులు జనార్దన్రావుపై హైదరాబాద్లో విద్యాశాఖ కార్యదర్శికి ఫిర్యాదు చేశారు. స్టేట్ టీచర్స్ యూనియన్ (ఎస్టీయూ) కూడా అతనిపై చర్యలకు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. బుధవా రం కూడా సోషల్ మీడియాలో, మెయిన్స్ట్రీమ్ మీ డియాలో విషయం ప్రాధాన్యం సంతరించుకోవడంతో ఇదే వ్యవహారంపై చర్చ నడుస్తోంది. డీఈ వో జనార్దన్రావు సిరిసిల్లకు కూడా డీఈవోగా పూర్తి స్థాయి అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. దీంతో కామారెడ్డి డీఈవో ఎస్.రాజుకు అదనపు బాధ్యతలు అప్పగించారు. మరోవైపు కరీంనగర్ డైట్ ప్రిన్సిపాల్ మొండయ్య నూతన డీఈవోగా బుధవారం అదనపు బాధ్యతలు చేపట్టారు. దండిగా పెద్దల దన్ను.. జనార్దన్రావుకు ప్రభుత్వ పెద్దల నుంచి దండిగా స హకారాలు ఉన్నాయని సమాచారం. కరోనా నుంచి డీఈవోగా కొనసాగుతున్న ఈయనపై ఎన్ని విమర్శలు వచ్చినా చర్యలు తీసుకోవడంలో గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తున్నాయన్న వి మర్శలు ఉన్నాయి. ● టీచర్లకు అకారణంగా, అత్యధికంగా మెమోలు ఇచ్చిన డీఈవో అన్న ఆరోపణలు ఉన్నాయి. యూనియన్ నాయకులకు ఇంక్రిమెంట్లలో కోత విధించారన్న విమర్శలు తెలిసిందే. ● వాస్తవానికి గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు జిల్లాలో పనిచేసిన ప్రతీ ఉన్నతాధికారి ఎన్నికల నియమావళి ప్రకారం.. బదిలీపై వెళ్లారు. కానీ, ఈయనను కదపలేదు. ● హుజూరాబాద్ అసెంబ్లీ ఉపఎన్నిక, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ, అనంతరం అసెంబ్లీ, పార్లమెంట్, ఇటీవల టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. అయినా ఇతని బదిలీ జరగకపోవడం అతని పలుకబడికి నిదర్శనం. ● ఇవన్నీ తెలిసీ.. కలెక్టర్ కార్యాలయం కూడా ఆయన బదిలీ విషయంలో అలసత్వం వహించి విమర్శలను మూటగట్టుకుంది. ● 317 జీవో సమయంలోనూ పలువురు టీచర్లు ప్రొడ్యూస్ చేసిన మెడికల్ సర్టిఫికెట్ల విషయంలో అనేక ఆరోపణలు వచ్చాయి. ● హుజూరాబాద్ ఉప ఎన్నిక సమయలో అప్పటి సీఎం సభను విజయవంతం చేయాలని ఆదేశాలివ్వడం, రూటు బాధ్యతలను టీచర్లకు అప్పగించడం తీవ్ర దుమారం రేపింది. ● ఇపుడు కూడా తన స్వయంకృపరాదంతో వేటు పడిందే.. ఆయన్ను ఇక్కడ నుంచి ఎవరూ కదపలేకపోవడం గమనార్హం. -
కోర్టు ఆవరణలో ఆటో దొంగిలించిన వ్యక్తి అరెస్ట్
జగిత్యాలక్రైం: జిల్లా కోర్టు ఆవరణలో పార్కింగ్ చేసిన ఆటోను దొంగిలించిన నిజామాబాద్ జిల్లాకేంద్రంలోని గౌతమినగర్కు చెందిన జిలకర ప్రసాద్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు పట్టణ సీఐ వేణుగోపాల్ తెలిపారు. నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలం బుట్టపూర్కు చెందిన మగ్గిడి కృష్ణ ఈనెల 26న జగిత్యాల కోర్టు ఆవరణలో ఆటోను పార్కింగ్ చేశాడు. దానిని ప్రసాద్ చాకచక్యంగా దొంగిలించాడు. బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ఈ క్రమంలో ఈనెల 27న పట్టణ ఎస్సై గీత జిల్లాకేంద్రంలోని గాంధీనగర్ వద్ద వాహనాల తనిఖీ చేస్తుండగా ప్రసాద్ ఆటోలో వస్తూ అనుమానాస్పదంగా కనిపించాడు. అతడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టగా దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నాడు. అతడిన ఉంచి ఆటోను స్వాధీనం చేసుకుని నిందితుడిని బుధవారం రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు. ఎస్సై గీత, కానిస్టేబుళ్లు జీవన్, అనిల్, వంశీ పాల్గొన్నారు. ఉద్యమకారులను ఆదుకోవాలి పెద్దపల్లిరూరల్: తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనకోసం పోరాడిన ఉద్యమకారులను గుర్తించి అన్నివిధాలా ఆదుకోవాలని ఉద్యమకారుల ఫోరం పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు ఐలయ్య కోరారు. స్థానిక అమరవీరుల స్తూపం వద్ద బుధవారం ఉద్యమకారులతో కలిసి నివాళి అర్పించారు. స్వరాష్ట్రం సాధించిన తర్వాత తమకు ప్రాధాన్యత దక్కుతుందని ఆశపడితే అప్పటి సీఎం ఉద్యమకారులను విస్మరించారని విమర్శించారు. కేవలం తమ కుటుంబానికే ప్రాధాన్యత ఇచ్చుకున్నారని దుయ్యబట్టారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా తమకు మేలు కలిగేలా చూడాలని కోరారు. ఉద్యమకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్, నాయకులు సారయ్య, నల్ల మనోహర్రెడ్డి, రాజేశం, జ్యోతి, చంద్రకళ, సురేందర్రెడ్డి, భాస్కర్, సదాశివ, రాజిరెడ్డి, రాజు, కృష్ణ, సదయ్య తదితరులు ఉన్నారు. ఫాజుల్నగర్ ప్రాంతంలో పులి ఆనవాళ్లువేములవాడరూరల్: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలంలోని ఫాజుల్నగర్ ప్రాంతంలో పులి తిరుగుతున్నట్లు ఆనవాళ్లు బయటపడ్డాయి. ఈవిషయంపై వేములవాడ ఎఫ్ఆర్వో కలీలొద్దీన్ను వివరణ కోరగా వేములవాడ, కొడిమ్యాల, చందుర్తి ఫారెస్ట్ ప్రాంతంలో పులి తిరుగుతుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రోజుకు పులి 35 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని, అది ఫారెస్టు ప్రాంతంలో అనుకూలమైన ప్రాంతానికి వెళ్తుందని తెలిపారు. -
సింగరేణి స్టేడియానికి ఆధునిక హంగులు
● రూ.2కోట్లు ప్రకటించిన సీఎండీ బలరామ్ ● ప్రత్యేక సంస్థతో ప్రతిపాదనల రూపకల్పన ● త్వరలో తుదిరూపం వచ్చే అవకాశం ● సింథటిక్ ట్రాక్తోపాటు స్టేడియం విస్తరణకు చర్యలు ● కొన్ని సంగరేణి క్వార్టర్లను కూడా తొలగించే అవకాశంగోదావరిఖని: క్రీడాకారులకు అనుగుణంగా సింగరేణి స్టేడియాన్ని ఆధునిక హంగులతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని యాజమాన్యం నిర్ణయించింది. సింథటిక్ వాకింగ్ట్రాక్తో పాటు క్రికెట్ ప్లే గ్రౌండ్, వాలీబాల్ కోర్టు, ట్రాక్ విస్తరణ కోసం మైదాన్ని విస్తరించాలని కూడా నిర్ణయించింది. ఇందుకోసం సీఎండీ బలరాం ఇటీవల రూ.2కోట్లు ప్రకటించారు. దీంతో రాబోయే తరానికి ఉపయోగపడేలా సింగరేణి జవహర్లాల్ నెహ్రూ స్టేడియాన్ని ఆధునిక హంగులతో తీర్చిదిద్దాలని అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం స్టేడియంలోని కట్టడాలు, రాబోయే రోజుల్లో విస్తరిస్తే ఎలా మార్చాల్సి ఉంటుందనే అంశంపై నివేదిక సిద్ధం చేస్తున్నారు. ఈమేరకు స్పోర్ట్స్ అథారిటీ కంపెనీ ప్రతినిధులు మంగళవారం స్టేడియాన్ని పరిశీలించారు. సింథటిక్ ట్రాక్పైనే దృష్టి.. ప్రధానంగా సింథటిక్ వాకింగ్ ట్రాక్పై యాజమాన్యం దృష్టి సారించింది. 400 మీటర్ల వాకింగ్ ట్రాక్ లేదా 800మీటర్ల వాకింగ్ట్రాక్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. మైదానం చుట్టూ సింథటిక్ వాకింగ్ట్రాక్, మధ్యలో క్రికెట్ గ్రౌండ్, ఫుట్బాల్ కోర్టు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. క్వార్టర్ల తొలగింపుపై ఆలోచన జవహర్లాల్ నెహ్రూ స్టేడియం విస్తరణలో భాగంగా మైదానాన్ని ఆనుకుని ఉన్న సీఈఆర్క్లబ్ ఎదుట గల సింగరేణి క్వార్టర్లను తొలగించాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. అలాగే స్టేడియం వెనకాల ఉన్న కొన్ని క్వార్టర్లను కూడా తొలగించే అవకాశం ఉన్నట్లుగా చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికి స్పోర్ట్స్ అథారిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం జవహర్లాల్ నెహ్రూ స్టేడియం అభివృద్ధి కోసం రూ.2కోట్లు కేటాయిస్తారు. ఈప్రాంత క్రీడాకారులతోపాటు సింగరేణి ఉద్యోగులకు అనుకూలంగా స్టేడియంలో అన్నిఏర్పాట్లు చేస్తాం. సింథటిక్ వాకింగ్ట్రాక్ ఏర్పాటు చేయడంపై ప్రత్యేక దృష్టి సారించాం. ఎమ్మెల్యే సూచనల మేరకు ఈప్రాంత క్రీడాకారుల కోసం స్టేడియం విస్తరణ పనులు శరవేగంగా సాగుతాయి. – లలిత్కుమార్, ఆర్జీ–1 జీఎం -
అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య
రాయికల్: మండలంలోని అల్లీపూర్కు చెందిన సిరిపురం శ్రీహరి (47) అప్పుల బాధతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై సుధీర్రావు కథనం ప్రకారం.. శ్రీహరి బీడీ ప్యాకర్గా పనిచేస్తున్నాడు. కుటుంబపోషణకు కొంత అప్పు చేశాడు. ఇటీవలే కూతురు పెళ్లి చేశాడు. మొత్తం రూ.8లక్షల వరకు అప్పు ఉందని, దానిని ఎలా తీర్చలోనని నిత్యం మనస్తాపం చెందుతున్నాడు. జీవితంపై విరక్తిచెంది ఇంట్లోనే ఫ్యాన్కు ఉరేసుకున్నాడు. కుటుంబ సభ్యులు అతడిని జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడికి కుమారుడు, కూతురు ఉన్నారు. శ్రీహరి భార్య అంజలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. పరారైన ఖైదీ కోసం లుక్ ఆఫ్ నోటీస్జగిత్యాలక్రైం: జగిత్యాల జిల్లా కోర్టు నుంచి మంగళవారం సాయంత్రం పరారైన జున్ను ప్రసాద్ కోసం పోలీసులు ప్రత్యేక గాలింపు చర్యలు చేపట్టారు. పెగడపల్లి మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన ప్రసాద్ను పట్టుకునేందుకు పోలీసు శాఖ ఆరు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. ఈ ఆరు బృందాలు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి గాలింపు చర్యలు చేపట్టాయి. నిందితుడు విదేశాలకు పారిపోకుండా బుధవారం ఉదయమే దేశంలోని అన్ని ఎయిర్పోర్టులకు లుక్ ఆఫ్ నోటీసు జారీ చేశారు. సిరిసిల్లలో కోవిడ్ పాజిటివ్ కేసులు?● ప్రభుత్వ ఆస్పత్రిలో నిర్ధారించని వైద్యులు సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలో కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. జ్వరంతో బాధపడుతున్న ఓ దంపతులు బుధవారం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి వెళ్లారు. కోవిడ్ పరీక్షలు చేయడం లేదని ల్యాబ్ నిర్వాహకులు వెనక్కి పంపించినట్లు సమాచారం. సదరు దంపతులు ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ వచ్చినట్లు తెలిసింది. నోరు రుచి, ముక్కు వాసన పోవడంతో మూడు రోజులుగా జ్వరంతో బాధపడుతున్న ఆ దంపతులు కోవిడ్గా అనుమానించి ప్రభుత్వ ఆస్పత్రికి రాగా.. పరీక్షలు చేయకపోవడం గమనార్హం. -
సీపీఐని ప్రజాక్షేత్రంలోకి తీసుకెళ్లండి
కరీంనగర్: జిల్లాలో సీపీఐకి పూర్వవైభవాన్ని తెచ్చేందుకు సిద్ధంగా ఉండాలని పార్టీ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సీపీఐ జిల్లా మహాసభలు రెండోరోజు కొనసాగాయి. నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్రెడ్డి, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మచ్చ రమేశ్, భారత జాతీయ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు కిన్నెర మల్లవ్వ అధ్యక్షవర్గంగా వ్యవహరించారు. జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి మూడేళ్లలో జిల్లాలో నిర్వహించిన పార్టీ కార్యక్రమాల నివేదికను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ సీపీఐకి జిల్లాలో ఘనమైన చరిత్ర ఉందన్నారు. తెలంగాణ దశాదిశా నిర్దేశించేలా క్రియాశీలక పాత్ర పోషించిందని తెలిపారు. ఆర్ఎన్ఎన్ శక్తుల విజృంభన కొనసాగిస్తూ బీజేపీ ప్రమాదకరంగా మారిందన్నారు. రాష్ట్రంలో పెన్షన్, రుణమాఫీ, రైతు భరోసా, ఇందిరమ్మఇళ్లు పథకాలు పూర్తిస్థాయిలో అమలు కావడం లేదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కలవేన శంకర్, మర్రి వెంకటస్వామి, పొనగంటి కేదారి, బోయిని అశోక్, కొయ్యడ సృజన్కుమార్, అందె స్వామి, బత్తుల బాబు, గూడెం లక్ష్మి పాల్గొన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, చాడ వెంకటరెడ్డి -
రైతుల కష్టం వరదపాలు
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లతిమ్మాపూర్, వెంకటాపూర్ గ్రామాల్లో రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం అధికారుల నిర్లక్ష్యం మూలంగా వరదపాలైంది. అకాల వర్షాలు దండికొట్టడంతో 45రోజులుగా తూకం వేయకుండా కేంద్రాల్లోనే ఉన్న ధాన్యం వర్షానికి తడిసి మొలకెత్తింది. దీంతో అన్నదాతలకు అపార నష్టం వాటిల్లింది. ఐకేపీ అధికారులు, నిర్వహకుల నిర్లక్ష్యం వల్ల మాయిచ్చర్ వచ్చి 45 అయినప్పటికీ రైతులు కేంద్రాలకు తెచ్చిన వడ్లను తూకం వేయలేదు. కేంద్రాల్లో హమాలీలు లేక, నిర్వహకులు పట్టించుకోకపోవడం వల్లనే ఈ పరిస్థితి వచ్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరుతున్నారు. తడిసి మొలకెత్తిన ధాన్యం -
రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు
సిరిసిల్ల: జిల్లాలో యాసంగి(రబీ) సీజన్లో రికార్డుస్థాయిలో ధాన్యం కొనుగోళ్లు చేసినట్లు కలెక్టర్ సందీప్కుమార్ ఝా బుధవారం తెలిపారు. 242 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా ఇప్పటివరకు 37,223 మంది రైతుల వద్ద రూ.578 కోట్ల విలువైన 2,49,372మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని వెల్లడించారు. వీటిలో 2,16,258 మెట్రిక్ టన్నుల ధాన్యం వివరాలు ఆన్లైన్ చేశామని, 34,479 మంది రైతుల బ్యాంకు ఖాతాలో రూ.447 కోట్లు జమ అయ్యాయని వివరించారు. మిగతా రైతులకు త్వరలో డబ్బులు జమ అవుతాయని ప్రకటించారు. జిల్లాలో ధాన్యం సేకరణ తుది దశకు వచ్చిందని, ఇప్పటికే 133 కొనుగోలు కేంద్రాలను మూసివేశామన్నారు. ఇంకా 109 కేంద్రాల్లో కొద్దిగా ధాన్యం ఉందన్నారు. జిల్లాలో చివరి గింజ వరకు దాన్యం సేకరిస్తామని తెలిపారు. తడిసిన ధాన్యం సైతం సేకరిస్తామని రైతులెవరూ ఆందోళన చెందవద్దని సూచించారు. మూడేళ్లలో ధాన్యం సేకరణ తీరిదీ జిల్లాలో రబీ(యాసంగి) సీజన్లో మూడేళ్ల ధాన్యం సేకరణ తీరును కలెక్టర్ గణాంకాలతో వెల్లడించారు. 2022–2023లో మే 28వ తేదీ నాటికి 1,64,044 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని, అదే 2023–2024 రబీ సీజన్లో ఇదే రోజు నాటికి 2,49,514 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఈ ఏడాది మే 28వ తేదీ నాటికి 2,49,372 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని అన్నారు. జిల్లాలో కొనుగోళ్లు పూర్తి అయ్యేనాటికి రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు నమోదు అవుతాయని స్పష్టం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇప్పటికే 2,49,372 మెట్రిక్ టన్నుల సేకరణ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా -
పట్టణాభివృద్ధికి కృషి చేయాలి
పెద్దపల్లిరూరల్: పట్టణాన్ని అభివృద్ధి చేయడంపై అధికారులు శ్రద్ధ చూపాలని బీజేపీ నాయకులు పల్లె సదానందం, శివంగారి సతీశ్ కోరా రు. మున్సిపల్ కార్యాలయం ఎదుట బుధవా రం పార్టీశ్రేణులతో కలిసి నిరసన ప్రదర్శన ని ర్వహించారు. అంతర్గత రోడ్లను అభివృద్ధి చే యాలని, ఇప్పటికే చేపట్టిన పనులను సకాలంలో పూర్తిచేయాలన్నారు. హోటళ్లు, రెస్టారెంట్లు, మండి బిర్యానీ సెంటర్లలో శుభ్రత లోపించిందనిఆరోపించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. నాయకు లు భాస్కర్, రాజు, సాయికృష్ణ, శ్రీనివాస్, నరే శ్, రాజేశం, క్రాంతి, మనోహర్, విజయ్, కృష్ణ, అభి, అఖిల్, సందీప్, వెంకటేశ్, సోడాబాబు, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.బాలికల భవిష్యత్కు చేయూత జ్యోతినగర్(రామగుండం): బాలికల ఉజ్వల భవిష్యత్కు ఎన్టీపీసీ చేయూతనిస్తోందని ఆ సంస్థ సంయుక్త మహిళా సమితి సీనియర్ స భ్యురాలు సునీత జైకుమార్ శ్రీనివాసన్, దక్షిణ దీపాంజలి మహిళా సమితి అధ్యక్షురాలు రంజ నా దువా అన్నారు. సీఎస్సార్ ఆధ్వర్యంలో బా లికలకు నెలరోజులపాటు అందించే రెసిడెన్షియల్ శిక్షణ శిబిరాన్ని వారు బుధవారం సందర్శించి మాట్లాడారు. శిక్షణలో నేర్చుకున్న విషయాలను ఇంటికి వెళ్లిన తర్వాత పాటించాలని సూచించారు. అనంతరం బాలికలు ప్రదర్శించిన నృత్యాలు, కరాటే పోటీలు, స్కిట్లు ఆక ట్టుకున్నాయి. ఎన్టీపీసీ దీప్తి మహిళా సమితి అ ధ్యక్షురాలు రాఖీ సామంత, ఏజీఎం బిజయ్కుమార్ సిగ్దర్, అధికారులు పాల్గొన్నారు. రజకులకు ప్రాధాన్యం ఇవ్వాలి పెద్దపల్లిరూరల్: సంక్షేమ పథకాల్లో రజకులకు ప్రత్యేక ప్రాధాన్యం ఇనివ్వాలని ఆ సంఘం జి ల్లా అధ్యక్షుడు రమేశ్, అధికార ప్రతినిధి అలువాల రాజేందర్ డిమాండ్ చేశారు. రజక సంఘం జిల్లా ప్రచార కార్యదర్శిగా ప్రణయ్, ని యోజకవర్గ ఇన్చార్జిగా వెంకటేశ్ను నియమించగా.. బుధవారం వారికి జిల్లా కేంద్రంలో ని యామక పత్రాలు అందించారు. అంతకుముందు పట్టణంలో చేపట్టే మడేలయ్య బోనాల జా తరకు హాజరు కావాలని మాజీ ఎమ్మెల్యే దా సరి మనోహర్రెడ్డికి ఆహ్వాన పత్రిక అందించా రు. మల్లేశ్, ఉప్పలయ్య, రామ్మూర్తి, సురేశ్, రమేశ్, నవీన్, కుమారస్వామి పాల్గొన్నారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు చర్యలుసుల్తానాబాద్రూరల్: ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు పకడ్బందీగా చర్యలు చేపట్టామని ట్రాఫిక్ ఏ సీపీ శ్రీనివాస్ తెలిపారు. స్థానిక అంబేడ్కర్ చౌ రస్తా, పూసాల రోడ్డు, బస్టాండ్ ఏరియాలను బుధవారం ఆయన పరిశీలించారు. ఏసీపీ మా ట్లాడుతూ రాజీవ్ రహదారిపై వాహనాల రద్దీని క్రమబద్ధీకరించేందుకు నియంత్రణ చర్యలు తీ సుకుంటున్నామన్నారు. అవసరమైనచోట ట్రా ఫిక్ సిగ్నల్స్ వ్యవస్థ ఏర్పాటు చేస్తామని తెలిపా రు. సీఐలు అనిల్, సుబ్బారెడ్డి ఉన్నారు. పంట పరిహారం విడుదల సాక్షి, పెద్దపల్లి: జిల్లాలో యాసంగి సాగు సమయంలో అకాల వర్షం, వడగళ్ల వానతో పంట లు నష్టపోయిన రైతులకు బుధవారం ప్రభు త్వం నిధులు విడుదల చేసింది. మార్చి, ఏప్రిల్లో కురిసిన అకాలవర్షాలతో నష్టపోయిన పంట పొలాలను సర్వే చేసిన వ్యవసాయ శా ఖ.. జిల్లాలో 3,556 ఎకరాల్లో వివిధ పంటలకు నష్టం వాటిల్లినట్లు ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. దానికి సంబంధించిన 3,297మంది రైతులకు సుమారు రూ.3.567 కోట్ల పరిహారం విడుదల చేయడంతో నేరుగా రైతుల వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లో జమచేయనున్నారు. మే నెలలో జరిగిన పంట నష్టానికి సంబంధించిన పరిహారాన్ని త్వరలో విడుదల చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించటంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
లక్ష్మీపూర్లో మున్నాభాయ్ ఎంబీబీఎస్!
తంగళ్లపల్లి(సిరిసిల్ల): మండలంలోని లక్ష్మీపూర్ గ్రామంలో మున్నాభాయ్ ఎంబీబీఎస్ లాగా నకిలీ వైద్యుడి లీలలు బుధవారం వెలుగు చూశాయి. గ్రామంలో వంగరి గోవర్దన్ అనే వ్యక్తి ఒక ఇంటిని అద్ధెకు తీసుకుని మెడికల్ ప్రాక్టీషనర్ పేరుతో క్లినిక్ను ప్రారంభించాడు. అంతటితో ఆగకుండా తన కొడుకు పేరుతో ఎంబీబీఎస్ లెటర్ హెడ్తో వైద్యం ప్రారంభించాడు. పేషంట్లకు ఇంజక్షన్లు, సైలెన్లు పెట్టడం, ఎంబీబీఎస్ లెటర్ హెడ్పై మందులు వ్రాయడం మొదలెట్టాడు. వస్తున్న కాసులు సరిపోవడం లేదని అనుకున్నాడో ఎమో తెలియదు కానీ ఏకంగా మహిళలకు సంతానం కలిగిస్తానంటూ కొత్త వైద్యం ప్రారంభించాడు. సాధారణంగా గైనకాలజీ డాక్టర్లు మహిళలకు సంతానోత్పత్తి కొరకు హెచ్సీజీ ఇంజక్షన్లను అన్ని వైద్య పరీక్షల అనంతరం అవసమైతేనే ఇస్తుంటారు. ప్రథమ చికిత్సలకు పరిమితం కావాల్సిన మెడికల్ ప్రాక్టీషనర్లు ఏకంగా అర్హతగల డాక్టర్ల మాదిరిగా చికిత్సలు చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. నకిలీ వైద్యుడి వైద్యంపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రజితను ‘సాక్షి’ వివరణ కోరగా వారం రోజుల క్రితమే అతడికి నోటీసులు ఇచ్చామని, ధ్రువీకరణ పత్రాలు పరిశీలించి దర్యాప్తు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కొడుకు పేరుతో తండ్రి వైద్యం అద్దె ఇంటిలోనే పేషంట్లకు సైలెన్లు, ఇంజక్షన్లు ఇస్తున్న వైనం -
బియ్యం పంపిణీకి ఏర్పాట్లు
● మూడు నెలల స్టాక్ ఒకేసారి ● గోదాముల నుంచి గ్రామాలకు.. ● సరఫరా చేస్తున్న అధికారులు ● జూన్ మొదటివారంలో పంపిణీ సుల్తానాబాద్(పెద్దపల్లి): కేంద్రప్రభుత్వం ఆదేశానుసారం లబ్ధిదారులకు మూడు నెలల రేషన్ బియ్యం పంపిణీ చేసేందుకు జిల్లా పౌర సరఫరాల అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. వర్షాకాలంలో రవాణా వ్యవస్థ స్తంభిస్తే పేదలకు బియ్యం అందకుండా పోతాయని, వారికి ఇబ్బందులు తలెత్తకుండా జూన్, జూలై, ఆగస్టు కోటాను జూన్లో ఒకేసారి ఇవ్వాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే జిల్లాలో రేషన్ బియ్యం పంపిణీకి పౌర సరఫరాల అధికారులు శ్రీకారం చుట్టారు. డీఎస్వో పర్యవేక్షణలో.. మూడు నెలల స్టాక్తోపాటు వాహనాలు, బియ్యం సరఫరా ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించేందుకు జిల్లా పౌర సరఫరాల అధికారి(డీఎస్వో) రాజేందర్కు బాధ్యతలు అప్పగించారు. గతంలో పంపిణీ చేసిన దొడ్డుబియ్యం నాసిరకంగా ఉండడంతో చాలామంది లబ్ధిదారులు తినడానికి ఇష్టపడలేదు. ప్రస్తుతం సన్నబియ్యం ఉచితంగా పంపిణీ చేస్తుండడంతో పేదలు అందరూ తీసుకెళ్తున్నారు. తద్వారా వారిపై నిత్యావసరాల భారం తగ్గుతోంది. జిల్లాలో 413 రేషన్ దుకాణాలు.. జిల్లావ్యాప్తంగా మొత్తం 413 రేషన్ దుకాణాలు ఉన్నాయి. వీటికి పెద్దపల్లి, మంథని, సుల్తానాబాద్ లోని గోదాముల నుంచి బియ్యం సరఫరా చేస్తున్నా రు. జిల్లాలోని లబ్ధిదారులకు ప్రతీనెల సుమారు 3 వేల మెట్రిక్ టన్నుల బియ్యం కోటా విడుదల చేస్తారు. ఈలెక్కన ఈసారి మూడు నెలలకు సుమా రు 12వేల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరమని అధికారులు అంచనా వేశారు. అయితే, రేషన్ డీలర్ల వద్ద మూడు నెలల స్టాక్ నిల్వ చేసేందుకు సౌకర్యం ఉందా? లేదా? అనే అంశంపై అధికారులు ఆరా తీస్తున్నారు. సౌకర్యాలు లేనివారు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులు సూచించారు. జూన్ మొదటివారంలో పంపిణీ.. రాష్ట్రప్రభుత్వం రెండు నెలల నుంచి కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ చేస్తోంది. మే నెల కోటా పంపిణీ పూర్తయ్యింది. దీంతో జూన్, జూలై, ఆగస్టు కోటాను జూన్ మొదటి వారంలో ఒకేసారి పంపిణీ చేసేందుకు పౌర సరఫరాల అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు.. జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం సందర్భంగా జిల్లాకు మంజూరైన మరో 4,467 కొత్త రేషన్ కార్డులు లబ్ధిదా రులకు అందజేస్తారు. వీటిపై కూడా బియ్యం పంపిణీ చేసేందుకు కోటా విడుదల చేస్తున్నారు. ఏర్పాట్లు చేయాలి లబ్ధిదారులకు మూడునెలల రేషన్ బియ్యం ఒకేసారి పంపిణీ చేసేందుకు బయోమెట్రిక్ తప్పనిసరి అవసరం. అందుకు తగిన విధంగా అధికారులు ఏర్పాట్లు చేయాలి. బయోమెట్రిక్లో ఆటంకాలు ఎదురైతే లబ్ధిదారులతో గొడవలు జరిగే ప్రమాదం ఉంది. – కొమురయ్య, డీలర్, సుల్తానాబాద్ సరిపడా సరఫరా మూడు నెలలకు సరిపడా బియ్యాన్ని డీలర్లకు సరఫరా చేస్తున్నాం. లబ్ధిదారులకు సరిపడా బియ్యం నిల్వలు అందుబాటులోనే ఉన్నాయి. గ్రామాల వారీగా రేషన్ షాపులకు సరఫరా చేస్తున్నాం. బయోమెట్రిక్లో ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తాం. – రాజేందర్, జిల్లా పౌర సరఫరాల అధికారి -
ముందస్తు సాగుదాం
● వరి నాట్లలో ప్రకృతి వైపరీత్యాల నుంచి గట్టెక్కే అవకాశం ● జూన్ 15లోగా నాట్లు పూర్తిచేసేలా అధికారుల సూచనలు ● రైతులకు అవగాహన కల్పిస్తేనే సత్ఫలితాలు వచ్చే అవకాశంసాక్షి, పెద్దపల్లి: రైతులు ఆరుగాలం కష్టపడి పంట లు పండిస్తుండగా, పంట చేతికొచ్చే సమయానికి ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోతున్నారు. రూ.లక్షల్లో పెట్టుబడి పెడుతున్నా చివరిక్షణంలో అకాలవర్షాలు దెబ్బతీస్తున్నాయి. ప్రకృతి వైపరీత్యాలను తప్పించలేం కానీ పంట కాలాన్ని ముందుకు జరుపుకోవడం మన చేతిలో పని అని, తద్వారా పంటలను కాపాడుకోవచ్చని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పంటల సీజన్ను నెల రోజులు ముందుకు జరిపేలా జిల్లా అధికార యంత్రాంగం రైతులకు అవగహన కల్పిస్తూ చైతన్యం తెస్తోంది. కొన్నేళ్లుగా ఏటా కురుస్తున్న అకాల వర్షాల తీరును పరిశీలిస్తే నవంబర్లో వచ్చే తుపాన్లు, ఏప్రిల్లో కురిసే అకాల వర్షాలతో చేతికొచ్చే పంటలు దెబ్బతిని అన్నదాతలు ఆర్థికంగా నష్టపోతున్నారు. రోహిణి కార్తెలో తొలకరి.. ఈఏడాది నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశించడంతో రోహిణి కార్తెలోనే తొలకరి పలకరించింది. ముందస్తు సాగుకు సన్నద్ధం చేసేందుకు ఇదేమంచి అవకాశమని, పొలంబాట పట్టాలని అధికారులు రైతులకు సూచిస్తున్నారు. ఇప్పటికే జీలుగ విత్తనాలు పంపిణీ చేస్తూ, విత్తనాలు, ఎరువుల కొరత తలెత్తకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇలా చేస్తే మేలు.. ● వానాకాలం వరి సాగును ముందస్తుగా చేపట్టడం ద్వారా పంటను అక్టోబర్ మూడోవారం నుంచి నవంబర్ మొదటివారం లోపు కోసుకోవచ్చు. యాసంగి వరి నారును నవంబర్ 15 నుంచి 20వ తేదీ వరకు సిద్ధం చేసుకుంటే, పంటను మార్చి మూడోవారం నుంచి ఏప్రిల్ మొదటి వారం వరకు కోసుకోవచ్చు. ● 140 రోజులు అంతకన్నా ఎక్కువ దీర్ఘకాలిక పంటలకు మే 25 నుంచి జూన్ 10 మధ్య, 135 రోజుల పంటకాలం కలిగిన మధ్యకాలిక పంట లకు జూన్ 15 నుంచి జూన్ 30 వరకు, 120 రోజుల పంటకాలం కలిగిన పంటలకు జూలై 15 వరకు నార్లు పోసుకుంటే మేలని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ● వానాకాలంలో దీర్ఘకాలిక రకాలను సాగు చేయాలనుకునే రైతులు రోహిణి కార్తెలో నారుపోస్తే మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుందని, జూన్ 2వ వారం పూర్తయిన తర్వాత నారుపోస్తే పూత సమయంలో చలితో గొలుసు పూర్తిగా బయటకు రాక గింజ నల్లపడడం, వర్షాలతో దిగుబడి తగ్గే అవకాశం ఉంటుందని వారు వివరిస్తున్నారు. ఈవానాకాలంలో సాగు సమాచారం(ఎకరాల్లో) మొత్తం సాగు 2,76,076 వరి 2,12,500 పత్తి 52,500 మొక్కజొన్న 705 ఉద్యాన 10,086 ఇతర 285 అవసరమైన విత్తనాలు 1,84,457 (క్వింటాళ్లలో) అవసరమైన ఎరువులు 70,731 (మెట్రిక్ టన్నుల్లో) అవగాహన కల్పిస్తున్నాం ప్రకృతి వైపరీత్యాలను అధిగమించేందుకు రైతులు ముందస్తు పంటలను సాగు చేసేలా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. వానాకాలం సీజన్ను ఒక నెల ముందుకు జరిపితే రైతులకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది. ప్రభుత్వం సాగునీరు ఇవ్వడానికి, విత్తనాలు, ఎరువులు సరఫరా చేయడానికి సిద్ధంగా ఉంది. రైతులు వెంటనే వ్యవసాయ పనులను ప్రారంభించుకోవాలి. – ఆదిరెడ్డి, డీఏవో ముందస్తు ప్రణాళికతో మేలు తొలకరిలో దున్నితే నేలలోకి నీరు బాగా ఇంకి బాగా గుల్లబారుతుంది. తర్వాత వేసే పంటలకు ఉపయోగపడుతుంది. మొక్కల వేర్లు లోనికిపోయి తేమ, పోషకాలను ఎక్కువశాతం అందుకుంటుంది. దిగుబడి, నాణ్యత పెరుగుతాయి. ప్రకృతి వైపరీత్యాలను అధిగమించవచ్చు. వేసవి దుక్కులు, నేల చదును, విత్తనాల ఎంపిక, శుద్ధి, ఎరువుల వినియోగం, పంటకు అనుగుణంగా నేలను సిద్ధం చేయడం వంటి ప్రణాళిక చేపడితే అధిక దిగుబడి సాధించవచ్చు. – పిల్లి కిరణ్, కేవీకే శాస్త్రవేత్త దుక్కులు దున్నడం.. దుక్కులు దున్నితే తొలకరితో నేల నీటిని పీల్చుకొని పొలంలో తేమశాతం వృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. వాలుకు అడ్డుగా లోతు దుక్కులు దున్నడంతో వర్షపునీరు వృథా కాకుండా, నేల కోతకు గురికాదు. తోటల్లో దుక్కులతో మొండిజాతి కలుపు మొక్కలు, దుంపలు వేళ్లతో సహా బయటకు వచ్చి పిచ్చిమొక్కల కలుపు నివారణ జరుగుతుంది. నిద్రావస్థలోని కీటకాలు నశిస్తాయి. సేంద్రియ ఎరువులైన పేడ, వర్మికంపోస్ట్ను దుక్కుల్లో వేసుకోవచ్చు. ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకముందు రైతులు పత్తి విత్తనాలు విత్తితే ఎండవేడికి భూమిలో మాడిపోయే ప్రమాదం ఉందని, సరైన వర్షం కురిసిన తర్వాతే విత్తనాలు విత్తాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. -
ఓసీపీల్లో అధికారులు అప్రమత్తం
● మాన్సూన్కు ముందస్తు ఏర్పాట్లు ● బొగ్గు ఉత్పత్తిపై ప్రభావం చూపకుండా చర్యలు ● రుతుపవనాల రాకతో అప్రమత్తం ఏర్పాట్లు పూర్తిచేశాం వర్షాలతో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలుగకుండా ఏర్పాట్లు చేశాం. డంపర్లు నడిచే హాలేజీ రోడ్ల వెంట నీరు, బురద నిలవకుండా సైడ్ డ్రైన్లు నిర్మించాం. వర్షం తగ్గిన వెంటనే బొగ్గు వెలికి తీసేలా అధికారులను సన్నద్ధం చేశాం. ఓబీ, కోల్బెంచ్ల్లో భారీ విద్యుత్ మోటార్లు ఏర్పాటు చేశాం. మరిన్ని అందుబాటులో ఉంచాం. భారీ యంత్రాలు వరదలో మునిగిపోవకుండా పైబెంచ్లో పార్కింగ్ చేసేలా ఆదేశాలిచ్చాం. – వెంకటయ్య, ఆర్జీ–2 జీఎం గోదావరిఖని: నైరుతి రుతుపవనాల రాకతో వర్షా లు మొదలయ్యాయి. వర్షాలతో ఓపెన్కాస్ట్ ప్రాజెక్టు(ఓసీపీ)ల్లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడకుండా సింగరేణి యాజమాన్యం ఏర్పాట్లు చేస్తోంది. భారీవర్షాలు కురిశా బొగ్గు వెలికి తీసేలా ప్రణాళిక రూపొందించింది. రామగుండం రీజియన్లోని ఆర్జీ–1 ఏరియా జీడీకే–5 ఓసీపీ, ఆర్జీ–2 ఏరియాలోని ఓసీపీ–3, ఆర్జీ–3 ఏరియాలోని ఓసీపీ–1, 2లో నిర్దేశిత బొగ్గు ఉత్పత్తి సాధించాలని సీఎండీ బలరాం ఇప్పటికే ఆదేశాలు జారీచేశారు. ఉత్పత్తిలో కీలకం.. సింగరేణి సంస్థకు బొగ్గు ఉత్పత్తిలో ఓసీపీలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. ఓసీపీల్లోంచి 80 శాతం బొగ్గు ఉత్పత్తి వస్తోంది. మిగతా 20శాతం భూ గర్భగనుల ద్వారా వస్తోంది. అయితే, రానున్న మూడు నెలల్లో వర్షాలతో ఓసీపీల్లో బొగ్గు ఉత్పత్తి తగ్గితే ఈ ప్రభావం ఆర్థిక సంవత్సరంపై పడుతుంది. ఈక్రమంలో యాజమాన్యం ఈసారి వర్షాకాలంలో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలుకుండా అన్ని ఏరియాల్లోని అధికారులను అప్రమత్తం చేసింది. వరదతో బురద.. వర్షాలతో ఓసీపీల్లోని హాలేజీ రోడ్లు బురదగా మా రుతున్నాయి. క్వారీల్లోని ఓబీ, కోల్బెంచ్ల్లో నీటిమ ట్టం పెరుగుతోంది. తద్వారా బెంచ్ల్లోని భారీయంత్రాలు నీట మునుగుతున్నాయి. ఇప్పుడు అలాంటి సంఘటనలకు ఆస్కారం ఇవ్వకుండా భారీ యంత్రాలు నిత్యం నడిచే క్వారీ హాలేజీ(ప్రధాన) రోడ్లపై యాజమాన్యం ప్రత్యేక దృష్టి సారించింది. భారీ వ ర్షాలు కురిసినా రోడ్లపై నీరు నిల్వ ఉండకుండా సైడ్ డ్రైన్లు నిర్మిస్తోంది. రోడ్లపై బురద ఎప్పటికప్పుడు తొలగించేందుకు గ్రేడర్లను సిద్ధం చేస్తోంది. వర్షం తగ్గిన వెంటనే రహదారులపై నీరు, బురద తొలగిస్తూ, సైడ్డ్రైన్లు నిర్మిస్తోంది. యంత్రాలు నీటమునగకుండా.. భారీవర్షాలు కురిసి ఓసీపీ క్వారీల్లోకి వరద వచ్చి చేరుతోంది. దీంతో భారీయంత్రాలు నీటమునిగే పరిస్థితులు గతంలో ఉండేవి. కొన్నిభారీ యంత్రాలు నీట మునిగిన ఘటనలూ ఉన్నాయి. ఈక్రమంలో ఓసీపీల్లో నీటి నిల్వలు పెరగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. అత్యధిక సామర్థ్యంగల విద్యుత్ మోటార్లు ఏర్పాటు చేస్తున్నారు. క్వారీలోని నీటిని ఎప్పటికప్పుడు తోడేసేలా 350 హెచ్పీ విద్యుత్ మోటార్లను అమర్చుతున్నారు. అలాగే సబ్ మెర్సిబుల్ పంపుల ద్వారా నీటిని తోడేలా చూస్తున్నారు. క్వారీలోని సంపుల్లో నీటిని బయటకు పంపించేందుకు ఏర్పాట్లు పూర్తిచేశారు. పాంటూన్ ప్లాట్ఫామ్లు ఏర్పాటు.. భారీవర్షాలతో ఓసీపీ క్వారీలోకి నీరుచేరి అందులో పంపులు మునిగిపోకుండా పాంటూన్ ప్లాట్ఫామ్ (నీటిపై తేలియాడే) ఏర్పాట్లు చేశారు. నీటినిల్వలు పెరిగినా నీటిపై తేలియాడే పాంటూన్ ప్లాట్ఫామ్పై మోటార్లు ఏర్పాటు చేశారు. నీటిని ఎప్పటికప్పుడు తోడేసేలా ప్రణాళిక రూపొందించారు. అలాగే ఓసీపీల పక్కనే ఉన్న వాగులు, కాల్వలు ఉండటంతో వాటినుంచి వరద ఓసీపీల్లోకి రాకుండా కార్యాచరణ సిద్ధం చేశారు. వాగులు, కాల్వల్లో పూడి కను ఇప్పటికే తొలగించడం వేగవంతం చేశారు. -
నిబంధనలు ఉల్లంఘిస్తే చర్య
పెద్దపల్లిరూరల్: మీసేవ కేంద్రాల నిర్వాహకు లు నిబంధనల మేరకు పనిచేయాలని, ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని అడిషనల్ కలెక్టర్ వేణు హెచ్చరించారు. కలెక్టరేట్లో మంగళవారం మీ సేవ కేంద్రాల నిర్వహణపై సమీక్షించారు. సేవ లు, ఫీజులను అందరికీ తెలిసేలా బోర్డులు ఏ ర్పాటు చేయాలన్నారు. ధ్రువీకరణపత్రాల జా రీపై ఫిర్యాదులు అందితే చర్యలు తప్పవన్నా రు. నిబంధనల మేరకే ఫీజు వసూలు చేయా లని పేర్కొన్నారు. ఈడీఎం కవిత, జిల్లా మేనేజర్ విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు. అన్యాయం చేశారని ఆందోళన పాలకుర్తి(రామగుండం): ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో తమకు అన్యాయం జరిగిందని ఆ రోపిస్తూ స్థానికులు మంగళవారం మండల ప రిషత్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. దూట సతీశ్, నంది శ్రీకాంత్, దారవేణి ఓదెమ్మ, పాటాకుల సూర్య ప్లకార్డులు పట్టుకుని బైఠాయించారు. భూములు, ఆస్తులు ఉన్నవారికే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశారని, అద్దెఇళ్లలో ఉంటున్నవారికి, నిరుపేదలకు అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు మరోసారి విచారణ జరిపి న్యాయం చేయాలని కోరారు. పోలీసుల జో క్యంతో వారు శాంతించారు. అనంతరం ఎంపీడీవోకు వినతిపత్రం సమర్పించారు. ఉపాధి కూలీల నిరసన జూలపల్లి(పెద్దపల్లి): ఈజీఎస్ టెక్నికల్ అసిస్టెంట్ శ్రీకర్ తమను పరుష పదజాలంతో దూ షించారని ఆరోపిస్తూ మహిళా కూలీలు మంగళవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయం ఎదు ట నిరసన తెలిపారు. దాదాపు వంద మంది కూలీలు ఎస్సారెస్పీ డీ– 83 మెయిన్ కాలువ లో పూడిక తొలగించే పనులను ఫీల్డ్ అసిస్టెంట్ నర్సయ్య చేయిస్తున్నారని, పరిశీలనకు వచ్చిన శ్రీకర్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడారన్నారు. ఈ విషయమై టీఏ శ్రీకర్ను సంప్రదించగా, తాను ఎవరినీ దూషించలేదన్నారు.31 వరకు గడువు కోల్సిటీ(రామగుండం): లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీం(ఎల్ఆర్ఎస్) దరఖాస్తుల పరిష్కారానికి ఈనెల 31వ తేదీ వరకు గడువును పొడి గించినట్లు రామగుండం బల్దియా కమిషనర్ అరుణశ్రీ తెలిపారు. 2020లో ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం దరఖాస్తు చేసుకున్న వారు వెంటనే బల్దియా కార్యాలయంలోని టౌ న్ప్లానింగ్ విభాగంలో సంప్రదించాలన్నారు. నిర్ణీత రుసుం, డాక్యుమెంట్లు సమర్పించి స్థలాలను క్రమబద్ధీకరించుకోవాలని, 25 శాతం రాయితీ వర్తిస్తుందని ఆమె వివరించారు.కొనసాగుతున్న మరమ్మతులు ఫెర్టిలైజర్సిటీ(రామగుండం): రామగుండం ఎ రువుల కర్మాగారంలో వార్షిక మరమ్మతుల కో సం ఈనెల 6న కర్మాగారాన్ని షట్డౌన్ చేశారు. దీంతో యూరియా ఉత్పత్తి నిలిచిపోయింది. 21 రోజులుగా వార్షిక మరమ్మతులు సాగుతు న్నాయి. పనులు పూర్తికావడానికి మరో 15 రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. జూన్ రెండోవారంలో యూరియా ఉత్పత్తి ప్రారంభించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ‘డబుల్’ ఇళ్లు పంపిణీ చేస్తాంపెద్దపల్లిరూరల్: పేదల కోసం నిర్మించిన డ బుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీని 15 రోజుల్లోగా పూర్తిచేయాలని ఎమ్మెల్యే విజయరమణారావు సూచించారు. చందపల్లి, కూనారం రైల్వేగేట్ స మీపంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంగళవారం కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి ఎ మ్మెల్యే పరిశీలించారు. జూన్ 10లోగా లబ్ధిదారులకు ఇళ్లు అప్పగించాలని సూచించారు. అవతరణ వేడుకలకు ఏర్పాట్లుపెద్దపల్లిరూరల్: రాష్ట్రావతరణ వేడుకల నిర్వ హణకు ఏర్పాట్లు చేయాలని అడిషనల్ కలెక్టర్ వేణు ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో సమావేశమయ్యారు. స్వశక్తి సంఘాలు, ప్రతినిధులు హాజరు కావాలన్నారు. డీసీపీ కరుణాక ర్, ఏసీపీ కృష్ణ, ఆర్డీవో గంగయ్య ఉన్నారు. -
వరద వచ్చినా సిద్ధం
● ముందస్తు రుతుపవనాలతో ఇరిగేషన్శాఖ అప్రమత్తం ● మిడ్మానేరు ప్రాజెక్టు, ఎల్లంపల్లి గేట్ల నిర్వహణ షురూ ● పనుల కోసం టెండర్లు పిలిచిన అధికారులు ● ఎల్ఎండీలో మొదలైన పనులు, ఎంఎండీ, ఎల్లంపల్లివి జూన్లో ● వరదకు ముందే అప్రమత్తంగా ఉండేలా చర్యలుప్రాజెక్టు సామర్థ్యం గేట్లు ఎల్ఎండీ 24 టీఎంసీ 20 ఎంఎండీ 27.5 టీఎంసీ 25 ఎల్లంపల్లి 20 టీఎంసీ 62 సాక్షిప్రతినిధి, కరీంనగర్: ఈ ఏడాది రుతుపవనాలు ముందుగానే వచ్చాయి. సాధారణంగా జూన్ మొదటి వారంలో రాష్ట్రంలో తొలకరి పలకరిస్తుంది. వాతావరణ మార్పుల కారణంగా ఈసారి అసాధారణరీతిలో దాదాపు రెండువారాల ముందే వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో నీటిపారుదలశాఖ వానాకాలానికి ముందస్తుగానే గేట్ల నిర్వహణకు ప్రణాళిక సిద్ధం చేసుకుంది. రుతుపవనాలు ముందుగా రావడంతో ఈ పనుల్లో వేగం పెంచింది. ఇప్పటికే లోయర్ మానేరు డ్యాం అధికారులు గేట్ల నిర్వహణ పనులు చేపట్టారు. ప్రస్తుతం పనులు శరవేగంగా సాగుతున్నాయి. పెద్దపల్లి జిల్లాలోని ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్ల నిర్వహణకు టెండర్లు ఖరారవగా.. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మిడ్మానేరు ప్రాజెక్టు గేట్ల నిర్వహణ కోసం అధికారులు టెండర్లు పిలిచారు. ప్రీ మాన్సూన్, పోస్ట్ మాన్సూన్ల కాలంలో గేట్ల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏటా ఏం చేస్తారు? సాధారణంగా ఏటా వర్షాకాలానికి ముందే.. నీటిపారుదలశాఖ అధికారులు గేట్ల నిర్వహణకు పూనుకుంటారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిబంధనల ప్రకారం ప్రతీ డ్యాం వద్ద వర్షాకాలానికి ముందు (ప్రీ మాన్సూన్), వర్షాకాలానికి తరువాత (పోస్ట్ మాన్సూన్) గేట్ల లూబ్రికేషన్ ప్రక్రియను చేపడతారు. వరద సమయంలో గేట్లు సులువుగా పైకి లేచేందుకు లూబ్రికేషన్ దోహదపడుతుంది. ఇందులో భాగంగా వాల్వ్ గేర్బాక్స్లకు కూడా గ్రీస్ పూయాల్సి ఉంటుంది. ఇవే కాకుండా అత్యవసర సమయాల్లో వినియోగించేందుకు వీలుగా జనరేటర్ల పని తీరును సమీక్షిస్తారు. వీటిని ప్రతీ ఐదు రోజులకు ఒకసారి దాదాపు ఐదు నిమిషాలపాటు అనివార్యంగా పనిచేయిస్తారు. ఇలాంటి భారీ జనరేట్లు ప్రతీ ప్రాజెక్టు వద్ద రెండు వరకు ఉంటాయి. వీటితోపాటు లిఫ్ట్లు, మెకానిక్ టూల్స్, ఇతర ఎలక్ట్రిక్ వస్తువులను కూడా నిర్వహణ చేయాల్సి ఉంటుంది. ఎల్ఎండీ అధికారులు రూ.13 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు టెండర్లు పిలవగా.. ప్రస్తుతం పనులు వేగంగా నడుస్తున్నాయి. ఇక పెద్దపల్లి జిల్లా ఎల్లంపల్లికి సంబంధించి రూ.38లక్షలకు టెండరు ఇచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా మిడ్మానేరుకు సంబంధించి దాదాపు రూ.26 లక్షలతో తాజాగా టెండరు పిలిచారు. ఈ రెండు ప్రాజెక్టుల పనులు జూన్లో మొదలు కానున్నాయి. వరద అవకాశాలు అంతంతే.. సాధారణంగా కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఎత్తిపోతలు ఉన్న సమయంలో ప్రాజెక్టుల్లో నీరు చెప్పుకోదగ్గస్థాయిలో ఉండేది. వీటికి వర్షాలు తోడైనపుడు ప్రాజెక్టులు వేగంగా నిండి గేట్లు తెరవాల్సిన పరిస్థితి ఉత్పన్నమయ్యేది. దాదాపుగా ఏడాదిన్నరగా ఎత్తిపోతలు నిలిచిపోయిన దరిమిలా మునుపటి తరహాలో ప్రాజెక్టులలో నీటిమట్టాలు లేవనే చెప్పాలి. ఒకవేళ భారీగా కుండపోత వర్షాలు కురిసి, ఎగువనున్న మహారాష్ట్ర నుంచి పెద్ద ఎత్తున వరదలు వస్తేనే మన ప్రాజెక్టులు నిండి, గేట్లు తెరవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని నీటిపారుదల శాఖ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. -
క్రీడాప్రాంగణాన్ని అభివృద్ధి చేస్తాం
● రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్ గోదావరిఖని: సింగరేణి జవహర్లా ల్ నెహ్రూ క్రీడాప్రాంగణాన్ని అభివృద్ధి చేస్తామని రామగుండం ఎ మ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్ అన్నా రు. మంగళవారం ఆర్జీ–1 జీఎం లలిత్కుమార్తో కలిసి స్థానిక స్టేడియాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు. సింథటిక్ వాకింగ్ ట్రాక్, మైదానం విస్తరణ తదితర అంశాలను ఆయన పరిశీలించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యువతకు క్రీడల్లో ప్రోత్సాహం అందించే దిశగా స్టేడియాన్ని ఆధునిక సదుపాయాలతో అభివృద్ధి చేస్తామన్నారు. క్రీడాకారుల కు అంతర్జాతీయ స్థాయి ప్రాక్టీస్ సదుపాయాలు కల్పిస్తామని అన్నారు. కార్యక్రమంలో నాయకులు బొంతల రాజేశ్, మహంకాళి స్వామి, పెద్దెల్లి ప్రకాశ్, మారెల్లి రాజిరెడ్డి, బాలరాజ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఘనంగా నెహ్రూ వర్ధంతి జవహర్లాల్ నెహ్రూ వర్ధంతి సందర్భంగా ఎమ్మె ల్యే క్యాంపు ఆఫీస్లో నెహ్రూ చిత్రపటానికి ఎమ్మె ల్యే మక్కానసింగ్ రాజ్ఠాకూర్ పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. -
జిన్నింగ్ మిల్లుల్లో పత్తి కొనుగోళ్లు
పెద్దపల్లిరూరల్: రైతుల నుంచి జిన్నింగుమిల్లుల్లో పత్తి కొనుగోలు చేస్తున్నారు. మార్కెట్యార్డుకు ఆశించిన మేర పత్తి నిల్వలు రాకపోవడంతో కొనుగోలు చేసేందుకు వ్యాపారు లు రావడంలేదు. మిగిలి ఉన్న పత్తి నిల్వలను అమ్ముకునేందుకు వచ్చే రైతుల నుంచి జిన్నింగుమిల్లుల్లో కొనుగోలు చేస్తున్నారు. మంగళవారం రూ.7,400 క్వింటాళ్లు కొనుగోలు చేసినట్లు రాఘవాపూర్ జిన్నింగుమిల్లు నిర్వాహకులు తెలిపారు. జిల్లాకు చెందిన వారే కాకుండా పొరుగున ఉన్న ఆసిఫాబాద్, వేములవాడ, జమ్మికుంట తదితర ప్రాంతాలకు చెందిన రైతులు సైతం వ్యాన్లలో పత్తిని తీసుకొచ్చి పెద్దపల్లిలోని జిన్నింగ్ మిల్లుల్లో విక్రయిస్తున్నారు. -
వందేళ్ల చరిత్ర ఉన్న పార్టీ సీపీఐ
● కమ్యూనిస్టులకు దూరమై బీఆర్ఎస్ అధికారాన్ని పోగొట్టుకుంది ● కాంగ్రెస్ను నమ్మే పరిస్థితి లేదు ● సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుకరీంనగర్: దేశంలో వందేళ్ల చరిత్ర కలిగిన పార్టీ సీ పీఐ ఒక్కటేనని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. సీపీఐ కరీంనగర్ జిల్లా 23వ మహాసభలు నగరంలోని మధుగార్డెన్లో మంగళవారం ప్రారంభమయ్యాయి. పార్టీ పతాకాన్ని సీనియర్ నాయకుడు వే ముల వెంకట్రాజం ఆవిష్కరించారు. అమరవీరుల స్మారకస్తూపం చిహ్నాన్ని శ్రీరాముల రామచంద్రం ప్రారంభించారు. సాంబశివరావు మాట్లాడుతూ క మ్యూనిస్టులను దూరం చేసుకుని అధికారాన్ని పో గొట్టుకున్నామనే బాధలో బీఆర్ఎస్ ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి సీపీఐ ఎంత కృషి చేసిందో ప్రజలకు తెలుసని ఆయన అన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ను నమ్మే పరిస్థితి లేదన్నారు. స్థానికసంస్థల ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని పిలుపునిచ్చారు. జాతీయ కార్యదర్శివర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ కార్మికులందరూ నాలుగు లేబర్కోడ్లను వ్యతిరేకిస్తూ పోరాటం చేయాలన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కలవేన శంకర్, పొనగంటి కేదారి, కొయ్యడ సృజన్కుమార్, బోయిని అశోక్, అందెస్వామి, టేకుమల్ల సమ్మయ్య, కసిరెడ్డి సురేందర్రెడ్డి పాల్గొన్నారు. -
ఘనంగా తిరంగా యాత్ర
గోదావరిఖనిటౌన్: విశ్వహిందూ పరిషత్ మాతృశక్తి దుర్గావాహిణి ఆధ్వర్యంలో ఆపరేషన్ సిందూర్ వి జయవంతంపై నగరంలో మంగళవారం తిరంగా యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వహిందూ పరిషత్ మ హిళా విభాగం బాధ్యులు సూర్యదేవ జ్యోతి, కోట తిరుమల, ఆరెల్లి మమత మాట్లాడారు. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల దాడిలో పహగాల్గాంలో అమయక పర్యాటకులు మృతి చెందారని అన్నారు. ఉగ్రవాదులను గుర్తించి కఠినంగా శిక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ నగర కార్యదర్శి మ్యాడగోని రవీందర్, నాయకులు దీప్తి, ఇందిర, ప్రమీళ, మల్లేశ్వరి, వర్షిత, భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
రైల్వే సేవలన్నీ ఒకే యాప్లో..
రామగుండం: ఇండియన్ రైల్వే ప్రయాణికుల కోసం ఐఆర్సీటీసీ ఒకేయాప్లో అన్నిసేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. దానిని సూపర్ యాప్ ‘స్వరైల్’గా నామకరణం చేసింది. ఆండ్రాయిడ్, ఐవోఎస్ ప్లాట్ఫామ్ మొబైళ్లు వినియోగించే వారు ఈ సేవలు పొందే వీలుంది. యాప్లో ఇకనుంచి ఐఆర్సీటీసీ, యూటీస్, రేల్ మదాద్, ఫుడ్ ఆన్ ట్రాక్ వంటి వేర్వేరు సేవలను ‘స్వరైల్’ యాప్ ద్వారా పొందవచ్చు. ప్రయాణికులకు అందే సేవలు.. ● రిజర్వేషన్ టికెట్లు, టికెట్ బుకింగ్ ● నాన్ రిజర్వ్, జనరల్ టికెట్లు (అన్ రిజర్వుడ్ టికెట్ సిస్టం– యూటీఎస్ టికెట్లు) ● ప్లాట్ఫారం టికెట్లు (స్టేషన్లో ప్రవేశించడానికి) ● లైవ్ రన్నింగ్ స్టేటస్, షెడ్యూల్ సమాచారం ● క్యాటరింగ్, రైల్వేస్టేషన్లలో ఫుడ్ ఆర్డర్ అండ్ డెలివరీ ● రైల్ మద్దత్ (ఫిర్యాదుల పరిష్కారం, సపోర్ట్ సిస్టమ్) ● రిజర్వేషన్ చరిత్ర, ప్రయాణ విశ్లేషణ, డిజిటల్ వ్యాలెట్, పేమెంట్ గేట్వేలు సాంకేతిక సామర్థ్యం, రికార్డులు ● ప్రతీనిమిషానికి సగటున పది వేల టికెట్లు బుక్ చేసే సామర్థ్యం ● రోజూ 15 లక్షల టికెట్ల వరకు ప్రాసెస్ సౌకర్యం ● ఇతర యాప్ల కంటే రెండువేల రేట్లు వేగవంతమైన యూజర్ ఇంటర్ఫేస్ ● ఏఐ ఆధారిత సిఫార్సులు, గత ప్రయాణాల ఆధారంగా రూట్లు, ట్రైన్లు సూచించడం ● మల్టీ లాంగ్వేజ్ సపోర్ట్, తెలుగు, హిందీ, ఇంగ్లిష్ సహా పలు భాషల్లో యాప్ అందుబాటులో ఉంది. ● ఈ యాప్ ఇండియాలో అభివృద్ధి చేసిన డిజిటల్ ప్లాట్ఫామ్ యాప్ వినియోగించడం ఇలా.. ● గూగుల్ ప్లే స్టోర్ లేదా ఆపిల్ యాప్ స్టోర్ ఓపెన్ చేయాలి ● ‘స్వరైల్ బై ఐఆర్సీటీసీ’ అని సెర్చ్ చేయాలి ● డౌన్లోడ్ చేసుకొని లాగిన్ చేసుకొని వినియోగించడమే తరువాయి. -
ప్రపంచ అర్చరీ పోటీలకు చికిత
కరీంనగర్స్పోర్ట్స్: ప్రపంచ అర్చరీ క్రీడాకారిణి, పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం సుల్తాన్పూర్కు చెందిన తానిపర్తి చికిత జూన్లో సింగపూర్లో, ఆగస్టులో కెనడాలో జరగబోయే ప్రపంచస్థాయి పోటీల్లో పాల్గొనే భారత మహిళల కంపౌండ్ క్రీడాకారుల జట్టులో చోటు సంపాదించింది. మహిళల కంపౌండ్ విభాగంలో ప్రపంచ ర్యాంకింగ్లో 71వ స్థానంలో కొనసాగుతోంది. ఏషియా కప్స్టేజ్ 2 పోటీలు సింగపూర్లో జూన్ 14 నుంచి 21 వరకు, వరల్డ్ యూత్ చాంపియన్ షిప్ పోటీలు ఆగస్టు 16 నుంచి 25వరకు కెనడాలోని విన్నిపెగ్లో జరుగనున్నాయి. పూణెలో జరిగిన ఇండియన్ టీంసెలక్షన్ ట్రయల్స్లో చికిత అద్భుతంగా రాణించి చోటు దక్కించుకుంది. ఏషియా, వరల్డ్ యూత్ చాంపియన్ షిప్ పోటీలకు తానిపర్తి చికిత ఎంపికకావడంపై ఉమ్మడి జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్ష కార్యదర్శులు నందెల్లి మహిపాల్, గసిరెడ్డి జనార్దన్రెడ్డి, కోశాధికారి నాగిరెడ్డి సిద్దారెడ్డి, ఉపాధ్యక్షుడు తుమ్మల రమేశ్రెడ్డి, మహ్మద్ కరీం, పెద్దపల్లి డీవైఎస్వో సురేశ్, బేస్బాల్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, ఉమ్మడి జిల్లా అర్చరీ సంఘం కార్యదర్శి కొమురాజు శ్రీనివాస్, కొమురాజు కృష్ణ తదితరులు హర్షం వ్యక్తం చేశారు. -
కొత్త పింఛన్దారులకు 3.0 పింఛన్
జ్యోతినగర్(రామగుండం): ప్రయాస్ పథకాల కింత కొత్త పింఛన్దారులకు 3.0 పింఛన్ చెల్లింపు ఉత్తర్వులు విడుదలయ్యాయని ఈపీఎఫ్వో కరీంనగర్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి నరేశ్, నోడల్ అధికారి పరశురాం తెలిపారు. ఎన్టీపీసీ మిలీనియం హాల్లో మంగళవారం నిధి పే నిక్కత్ 2.0లో భాగంగా కార్మికుల సమస్యల పరిష్కారం కోసం అవగాహన సదస్సు నిర్వహించారు. వారు మాట్లాడుతూ, భవిష్యనిధి ద్వారా కార్మికులకు అనేక ప్రయోజనాలు ఉన్నాయన్నారు. కార్మికులు తమ వివరాలను ఈపీఎఫ్ సేవల వెబ్సైట్లో తెలుసుకోవచ్చని అన్నారు. డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్, ప్రయాస్ పథకం, వాటాదారులకు అవగాహన కల్పించారు. ఫీఎఫ్ సమస్యలు పరిష్కరించాలి ఎన్టీపీసీ కాంట్రాక్టు కార్మికులు పీఎఫ్ సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎన్టీపీసీ కాంట్రాక్టు కార్మిక సంఘాల నాయకులు తెలిపారు. ఈమేరకు ఈఫీఎఫ్వో ఎన్ఫోర్స్మెంట్ అధికారి నరేశ్, నోడల్ అధికారి పరశురాంకు వినతిపత్రం అందించారు. పుట్టిన తేదీల్లో పొరపాట్లు, కాంట్రాక్టర్లు ఫీఎఫ్ జమచేయకపోవడం, యజమాని మారినప్పుడు, ప్రస్తుత నంబరుపై కాకుండా పాత నంబర్పై డబ్బులు జమచేయడం, 58 ఏళ్లవయసు పూర్తిచేసిన కార్మికులకు పింఛన్ రాకపోవడం, మాన్యువల్ పద్ధతిలోని పీఎఫ్ డబ్బులు ప్రస్తుత ిపీఎఫ్ నంబర్లోకి జమకాకపోవడం తదితర సమస్యలు ఎదుర్కొంటున్నారని నాయకులు తెలిపారు. సర్వీస్ సర్టిఫికెట్లలో ఇంటిపేరు పూర్తిగా లేకపోవడంతో నిధులు ట్రాన్సఫర్ కావడం లేదన్నారు. ఈ సమస్యలపై కరీంనగర్ భవిష్యనిధి కార్యాలయానికి వెళ్లే కార్మికులకు సిబ్బంది సహకరించకుండా, ఇబ్బందులకు గురిచేసే విధానం మానుకోవాలని హెచ్చరించారు. ఐన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు భూమల్ల చందర్, సీఐటీయూ నాయకులు నాంసాని శంకర్, గీట్ల లక్ష్మారెడ్డి, ఐఎఫ్టీయూ నాయకులు చిలుక శంకర్, నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ ఈపీఎఫ్వో ఎన్ఫోర్స్మెంట్ అధికారి నరేశ్ -
భూసారం తెలుసుకోవడం తప్పనిసరి
● భూసార పరీక్షతో సుస్థిర వ్యవసాయం సాధ్యం ● రామగిరిఖిల్లాలో ఉచితంగా భూసార పరీక్షలు రామగిరి(మంథని): నైరుతి రుతుపవనాల ప్రవేశం తర్వాత రైతులు వ్యవసాయానికి సిద్ధమవుతున్నారు. అంతకంటే ముందే నేలలో మట్టి పరీక్షలు చేయించాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. భూసార పరీక్షలకు ఇదేసరైన సమయమంటున్నారు. పొలాల్లోని మట్టి నమునాలను సేకరించి పరీక్షలు చేయించుకుంటే భూసారం తెలియడంతో పాటు ఆ నేలల్లో ఎలాంటి పంటలు వేసుకోవాలి, ఎంతమేర ఎరువులను వినియోగించాలనే విషయాలు రైతులు తెలుసుకోవచ్చు. రైతులు పంట పండించేందుకు మూడు పెట్టుబడులు అవసరం. అవి భూమి, విత్తనం, నీరు. వీటన్నింటికన్నా నేల ముఖ్యమైన పెట్టుబడి. అందుకే భూమిగుణగణాలు తెలిస్తే ఎలాంటి పంటలు పండుతాయో అవగాహన వస్తుంది. అందుకోసం మట్టి పరీక్షలు చేయించాలి. తద్వారా పంటలకు ఎంత మోతాదులో ఎరువులు వేసుకోవాలో తెలియడంతో ఖర్చు తగ్గించుకోవచ్చు. చాలామంది రైతులు మట్టిపరీక్షలు జరిపించకుండా ఎరువులు అధిక మోతాదులో వేస్తున్నారు. దీనివల్ల పెట్టుబడి వ్యయం పెరగడంతోపాటు పంటల్లో పురుగుల ఉధృతి కూడా ఎక్కువవుతుంది. పొలాల్లో ఎరువుల మోతాదు తెలుసుకునేందుకు కచ్చితంగా మట్టి నమూనాలు సేకరించి భూసార పరీక్ష కేంద్రాలకు పంపించాలి. దీనికోసం సాగుభూమి నుంచి మట్టిని ఇలా సేకరించాలి. మట్టి నమూనా సేకరించ కూడని ప్రదేశాలు ● పొలం వరాలు, చెట్టు నీడ, బోరుబావులు, నీరు పొసేచోటు, బండరాళ్లు ఉన్న చోటు, మందులు కలుపుకునే చోటు. మట్టి నమూనా సేకరించే విధానం ● భూసార పరీక్ష ఫలితాలు సేకరించే మట్టి నమూనాలపై ఆధారపడి ఉంటాయి. కనుక మట్టి నమూనాలను ఒక ఎకరం విస్తీర్ణంలో ఒకచోటు నుంచే కాకుండా 10 నుంచి 15 ప్రదేశాల్లో తీయాలి. ● ఎంపిక చేసిన పొలంలో జిగ్జాగ్(ఎగుడు దిగుడు) పద్ధతిలో 10 నుంచి 15 చోట్ల గుర్తులు పెట్టాలి. ● గుర్తులు పెట్టిన చోట చెత్తాచెదారం తొలిగించి శుభ్రపరచాలి. శుభ్రపర్చిన చోట గుంతలు తీయాలి. ● ఆ గుంతల్లో ఒక అంగుళం(2.5 సెం.మీ.) మట్టిని సేకరించాలి. ● పొలంలో 10 నుంచి 15 చోట్ల సేకరించిన మట్టిని ఒకకుప్పగా పోసి బాగా కలపాలి. ఈ విధంగా బాగా కలిపిన మట్టిని గుండ్రంగా చేసి నాలుగు భాగాలుగా విభజించాలి. పైరెండు భాగాలను(ఏ, సీ)లుగా, కింది రెండు భాగాలను(బీ,డీ) భాగాలుగా గుర్తించాలి. వీటిలో రెండు ఎదురెదురుగా ఉన్న భాగాలను (బీ,డీ) కలిపి మిగిలిన రెండు భాగాలను(ఏ, సీ) తొలిగించాలి. ఇప్పుడు మిగిలిన (బీ,డీ) భాగాలను బాగా కలిపి మళ్లీ గుండ్రంగా చేసుకోవాలి. ఈ విధంగా గుండ్రంగా చేసుకున్న మట్టిని మళ్లీ ముందుగా విభజించినట్లుగా నాలుగు భాగాలుగా చేసి ఎదురెరుగా ఉన్న భాగాలను(ఏ,సీ) కలిపి మిగిలిన రెండు భాగాలను(బీ,డీ)లను తొలిగించాలి. ఈ విధంగా 10–15 చోట్ల నుంచి సేకరించిన మట్టిని అర్ధకిలో మట్టి నమూనా వచ్చే వరకు చేసుకోవాలి. తర్వాత ఈ నమూనాను నీడలో ఆరబెట్టి పరిశుభ్రమైన, గుడ్డసంచిలో నింపి సమీపంలోని కృషి విజ్ఞాన కేంద్రంలో ఇవ్వాలి. అన్నదాతలకు ఉచితంగా భూసార పరీక్షలు రామగిరి ఖిల్లా కృషి విజ్ఞాన కేంద్రంలో ఉచితంగా భూసార పరీక్షలు నిర్వహిస్తున్నాం. కార్డులు కూడా ఉచితంగా ఇస్తాం. భూసారాన్ని బట్టి ఏ పంటకు ఎలాంటి ఎరువులు వాడాలో కూడా రైతులకు సూచిస్తున్నాం. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి.– డాక్టర్ పిల్లి కిరణ్, మృత్తిక శాస్త్రవేత్త, కేవీకే, రామగిరి ఖిల్లా -
రిమాండ్ ఖైదీ పరార్
● గాలిస్తున్న పోలీసులు జగిత్యాలక్రైం: జగిత్యాల జిల్లా కేంద్రంలోని కోర్టు నుంచి జైలుకు తరలిస్తున్న క్రమంలో రిమాండ్ ఖైదీ పోలీసుల కన్నుగప్పి పరారైన సంఘటన మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం లింగాపూర్కు చెందిన జున్ను ప్రసాద్ నిరుద్యోగులను గల్ఫ్ పంపిస్తానని, డబ్బులు తీసుకుని మోసానికి పాల్పడ్డాడు. దీంతో బాధితులు పెగడపల్లి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఈనెల 17న కేసు నమోదు చేసి జున్ను ప్రసాద్ను జగిత్యాల జైలుకు తరలించారు. అతడిపై కొడిమ్యాల పోలీస్స్టేషన్లో కూడా గల్ఫ్ మోసంపై కేసు నమోదైంది. దీంతో కొడిమ్యాల పోలీసులు పీటీ వారెంట్ ద్వారా ప్రసాద్ను జైలు నుంచి తీసుకొచ్చి.. జగిత్యాల కోర్టులో మంగళవారం సాయంత్రం న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చారు. తిరిగి రిమాండ్కు తరలిస్తున్న క్రమంలో పోలీసుల కన్నుగప్పి పరారయ్యాడు. అతడి కోసం పోలీసులు ప్రత్యేక బృందాల ద్వారా గాలింపు చర్యలు చేపట్టారు. గంజాయి తరలిస్తున్న ఇద్దరి పట్టివేతమెట్పల్లి: గంజాయి తరలిస్తున్న ఇద్దరిని పట్టుకున్నట్లు ఎస్సై కిరణ్కుమార్ తెలిపారు. పట్టణ శివారులో మంగళవారం పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా..అబ్దుల్ సోహైల్, ఓ మైనర్ బాలుడు ద్విచక్ర వాహనంపై అక్కడకు వచ్చారు. అనుమానాస్పదంగా కనిపించిన వారిని తనిఖీ చేయగా.. వారి వద్ద 120 గ్రాముల గంజాయి దొరికింది. వారిపై కేసు నమోదు చేసి బైక్, రెండు సెల్ఫోన్లు సీజ్ చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు. -
కర్బూజ రైతు నష్టాలపాలు
● అకాల వర్షాలతో ఆగం ● రూ.లక్షలు వస్తాయనుకుంటే.. ఖర్చులు కూడా రాలేదంటున్న వైనం ● పురుగు పట్టి పనికి రాకుండా పోయిన కాయలు జగిత్యాలఅగ్రికల్చర్: కొద్ది రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలు రైతులను అతులాకుతలం చేశాయి. ముఖ్యంగా వేసవిలో కర్బూజ, తర్బూజ వంటి ఉ ద్యాన పంటలను సాగు చేసిన రైతులను కోలుకోకుండా చేశాయి. జిల్లాలో యువ రైతులు వినూత్నంగా సాగు చేసిన కర్బూజ(పుచ్చకాయ) పంటను మరో వారం రోజుల్లో మార్కెట్కు తీసుకెళ్లే తరుణంలో కురిసిన వర్షాలు దెబ్బతీశాయి. ప్రభుత్వం నష్టపరిహారం అందజేసి తమను ఆదుకోవాలని కోరుతున్నారు. 100 ఎకరాల్లో సాగు.. జిల్లాలో వేసవిలో చల్లదనాన్నిచ్చే కర్బూజ, తర్బూజ, జన్నత్ వంటి పండ్ల తోటలను దాదాపు 100 ఎకరాలకు పైగా సాగు చేశారు. రెండు, మూడేళ్లుగా యువ రైతులు సాగు చేస్తూ.. నేరుగా మార్కెటింగ్ చేస్తూ మంచి అదాయాన్ని పొందుతున్నారు. సారంగాపూర్ మండలం పెంబట్లకు చెందిన బండారి వెంకటేశ్, మల్లాపూర్ మండలం సిర్పూర్కు చెందిన నరేశ్, రాయికల్ మండలం అలూరుకు చెందిన మెక్కొండ రాంరెడ్డి, రాజు, మల్లారెడ్డి, ధర్మారంకు చెందిన రాజు, రాజిరెడ్డి అనే యువ రైతులు 25 ఎకరాల వరకు సాగు చేసి తీవ్రంగా నష్టపోయారు. తమ పంటను జగిత్యాల, మెట్పల్లి, కోరుట్ల పట్టణాల్లో నేరుగా విక్రయిస్తుండడంతోపాటు హైదరాబాద్లోని పలు కార్పొరేట్ సంస్థలతో కూడా ఒప్పందం చేసుకున్నారు. హైదరాబాద్లో వర్షాలు కురవడం, రాష్ట్రమంతా చల్లదనంగా ఉండటంతో కాయలు తెంపేందుకు వేచి చూస్తున్న తరుణంలో ఒక వర్షం తర్వాత మరో వర్షం కురవడంతో పంట పూర్తిగా ధ్వంసమైంది. విత్తన ఖర్చే రూ.35 వేలు కర్బూజ(వాటర్ మిలన్), తర్బూజ(మస్క్మిలన్), జన్నత్(సూపర్ మార్కెట్ వైరెటీ) పండ్ల తోటలను సాగు చేశారు. మార్కెట్లో ఎప్పుడు ఏ ధర ఉంటుందో తెలియదు కాబట్టి.. సగటున ధర గిట్టుబాటయ్యేందుకు ప్రతి పంటను మూడు దఫాలుగా సాగు చేశారు. ఫిబ్రవరి నెలలో సాగు చేసిన పంట.. మండు వేసవిలో మే నెలలో చేతికందుతున్న తరుణంలోనే పూర్తిగా దెబ్బతింది. వీటికి సంబంధించిన 50 గ్రాముల విత్తనాలకే దాదాపు రూ.1,600 నుంచి 1,800 వరకు ధర ఉంటుంది. ఎకరాకు దాదాపు రూ.35వేలు ఖర్చు పెట్టి హైదరాబాద్, బెంగళూర్ నుంచి విత్తనాలు తెప్పించారు. పంట పూర్తిగా నాశనం.. రైతులు సాగు చేసిన కర్బూజ కాయలు అమ్మకానికి వచ్చాయి. కాయలు తెంపే సమయంలోనే భారీ వర్షాలతో భూమిలో నీళ్లు ఆగాయి. వేరు వ్యవస్థ దెబ్బతిని కర్బూజ మొక్కలు వాడిపోయాయి. దీనికితోడు పూత రాలిపోయింది. అప్పటికే కాచిన కాయ లు కుచించుకుపోయాయి. పక్వానికి వచ్చిన కాయ ల్లో పురుగు చేరింది. దీనికితోడు రాళ్ల వానతో కాయ లు ఎక్కడికక్కడే పగిలిపోయి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఒక్కో ఎకరానికి రూ.3లక్షల నుంచి 4లక్షలు వస్తాయనుకుంటే.. కనీసం విత్తనాలకు పెట్టిన పెట్టుబడి కూడా రాలేదని కన్నీళ్లపర్యంతమవుతున్నారు. అకాల వర్షాలతో కర్బూజ వంటి కొత్త పంటలు పెట్టాలంటేనే రైతులు భయపడే పరిస్థితి నెలకొంది. -
రోజుకు ఉమ్మడి జిల్లా నుంచి 50 నుంచి 60 వేల ఆర్డర్లు ● రూ.కోట్లలో వ్యాపారం
షాపింగ్.. ఒకప్పుడు ఒకరిద్దరిని తోడుగా తీసుకొని వెళ్లి.. నచ్చింది చూసి.. ధర ఆరా తీసి.. బేరం చేసి తెచ్చుకునేవాళ్లం. నేడు అంతా మారిపోయింది. ఏది కావాలన్నా ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే నిమిషాల్లో గుమ్మంలోకి వచ్చి చేరుతోంది. జీవితం ఉరుకుల..పరుగులమయం కావడంతో ప్రస్తుతం ఆన్లైన్ షాపింగ్ బెస్ట్ ఆప్షన్గా మారింది. ఉమ్మడి జిల్లా నుంచి రోజుకు సుమారు 50 నుంచి 60 వేల ఆర్డర్లు వెళ్తుండగా, కోట్లలో వ్యాపారం సాగుతున్నట్లు సమాచారం. ఈ ఆన్లైన్ షాపింగ్ డెలివరీబాయ్స్కు ఉపాధినిస్తుండగా.. ప్రజలకు ఇంట్లో నుంచి బయట అడుగుపెట్టే శ్రమ లేకుండా పోతోంది. ఫలితంగా ఆరోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. చిన్న వయసులోనే మధుమేహం.. బీపీ.. గుండె సంబంధిత సమస్యలు వస్తున్నాయి. జీవితమే టైమ్ మెషిన్లా మారిన నేటి కాలంలో ఆన్లైన్ షాపింగ్.. పరిణామాలపై స్పెషల్ స్టోరీ..– వివరాలు 8లోu -
కబ్జాదారుల్లో గుబులు
రామగుండం: అంతర్గాం మండల కేంద్రంలోని టెక్స్టైల్, కుర్సికం, ప్రభుత్వ భూముల్లో విమానాశ్రయం ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం మొగ్గు చూపుతోంది. ఇండియన్ ఎయిర్ఫోర్స్ అథారిటీ అధికారులు ఇటీవల ఆ ప్రాంతాన్ని సందర్శించి ఎయిర్పోర్టు ఏర్పాటుకు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. దీంతో ఆ భూములపై వివాదాలు తలెత్తకుండా, ఇప్పటికే సమస్యలు ఉంటే ముందే పరిష్కరించి విమానాశ్రయం లేదా భారీ పరిశ్రమను స్థాపించాలని నిర్ణయించినట్లు తెలిసింది. పరిహారం చెల్లింపుల్లో కదలిక.. సుమారు నాలుగు దశాబ్దాల క్రితంనాటి అంతర్గాం స్పిన్నింగ్, వీవింగ్ మిల్లు కార్మికుల భూ సమస్య, పరిహారం చెల్లింపులపై ప్రస్తుతం రాష్ట్రస్థాయిలో కదలిక మొదలైంది. భూ పరిపాలన శాఖ అధికారి (సీసీఎల్ఏ)తో రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ఠాకూర్ ఇటీవల సుదీర్ఘంగా చర్చించారు. ఆ త ర్వాత బర్మా, శ్రీలంక, కాందీశీకుల కుటుంబాలతో టెక్స్టైల్, రెవెన్యూ అధికారుల నుంచి సమగ్ర స మాచారం సేకరించాలని సీసీఎల్ఏ నుంచి ఆదేశా లు జారీచేశారు. ఇంతలోనే బర్మా, కాందీశీకులతో కలెక్టర్ కోయ శ్రీహర్ష అత్యవసరంగా సమావేశమయ్యారు. వారి డిమాండ్ల గురించి తెలుసుకున్నారు. బతుకు దెరువు కోసం వచ్చి.. బర్మా, శ్రీలంక, కాందీశీకులు బతుకు దెరువు కోసం అంతర్గాం వలస వచ్చారు. వారికి ఉపాధి కల్పించేందుకు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 1964లో అంతర్గాం ప్రాంతాన్ని ఎంపిక చేసింది. రీ హాబిలిటేషన్ హౌసింగ్ లోన్ కింద వెయ్యి మంది కా ర్మిక కుటుంబాలకు రూ.41 లక్షలు వెచ్చించి క్వార్ట ర్లు నిర్మించింది. ఇందుకోసం సొసైటీ నిధులతో 96.09 ఎకరాల పట్టా భూములు సేకరించింది. ఆ జామాబాద్ ఇండస్ట్రియల్ పేరిట ఉన్న మరోచోట 71.30 ఎకరాలు, ప్రభుత్వ భూములు 334.10 ఎకరాలను పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో స్వాధీనం చే సుకుంది. ఇందులోనే కార్మికుల నివాసాలు, స్పి న్నింగ్, వీవింగ్ మిల్లు నిర్మించింది. ఒక్కో కుటుంబానికి పది గుంటల విస్తీర్ణంలో క్వార్టర్, మిగతా స్థలంలో కూరగాయలు, ఆకుకూరలు సాగు చేసుకోవాలని సూచించింది. గత 50ఏళ్లలో సుమారు 800 క్వార్టర్లు కుప్పకూలి నామరూల్లేకుండాపోయాయి. 107.34 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న మిగతా క్వార్టర్లు శిథిలావస్థకు చేరాయి. నవంబర్ 1991లో మూతపడే నాటికి స్పిన్నింగ్ మిల్లు వర్కర్లు 434 మంది, జూన్ 1985లో మూతపడే నాటికి వీవింగ్ సొసైటీ కార్మికులు 197 మంది ఉన్నారు. అందులో ఇప్పటివరకు 260 మంది మృతి చెందారు. ప్రస్తుతం వారి వారసులు మిగిలారు. కార్మికుల డిమాండ్లు ఇవే.. ● పది గుంటల విస్తీర్ణంలో నివాసం, మిగతా స్థలానికి ప్రహరీ నిర్మించి పట్టాలు ఇవ్వాలి ● వీవింగ్ సొసైటీ కార్మికుల వేతన బకాయిలు రూ.1.05 కోట్లు చెల్లించాలి ● వీఆర్ఎస్లో నష్టపోయిన స్పిన్నింగ్ మిల్లు కార్మికులకు రూ.5.50 కోట్ల పెండింగ్ పరిహారం విడుదల చేయాలి ● కబ్జాదారుల నుంచి మిల్లులకు చెందిన 200 ఎకరాలను స్వాధీనం చేసుకోవాలి. అంతర్గాం టెక్స్టైల్ భూముల స్వాధీనానికి చర్యలు భూ సమస్యపై ఉన్నతాధికారుల సమీక్ష ఎయిర్పోర్ట్ ఏర్పాటు ప్రస్తావనతో కదలిక స్వాధీనం చేసుకుంటాం స్పిన్నింగ్, వీవింగ్ మిల్లులు స్థాపించేందుకు 50 ఏళ్ల క్రితం భూములు కేటాయించారు. వాటిని సర్వే నంబర్ల ఆధారంగా గుర్తించి ఇప్పుడు స్వాధీనం చేసుకుంటాం. – మక్కాన్సింగ్ ఎమ్మెల్యే, రామగుండం -
లోకో పైలెట్కు పురస్కారం
రామగుండం: సీనియర్ లోకో పైలెట్ సీహెచ్ రవి రైల్వే సంరక్ష పురస్కార్ అవార్డు–2025 అందుకున్నారు. సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్(డీఆర్ఎం) భరతేశ్ కుమార్ జైన్ నుంచి ఆయన సోమవారం సికింద్రాబాద్లో అవా ర్డు స్వీకరించారు. కరీంనగర్ రైల్వేస్టేషన్లో లారీ రైల్వే పట్టాలపై నిలిచిపోగా, సకాలంలో దానిని గుర్తించిన లోకో పైలెట్ రవి.. ఎమర్జెన్సీ బ్రేక్ వేసి రైలును నిలపడంతో ఐదుగురి ప్రాణాలు కాపాడినట్లయ్యిందని డీఆర్ఎం వివరించారు. డివిజనల్ స్థాయిలో ముగ్గురు లోకో పైలెట్లకు ఈ అవార్డులు రాగా అందులో రామగుండం పైలెట్ ఉన్నారని పేర్కొన్నారు. రవిని పలువురు లోకో పైలెట్లు అభినందించారు. అభ్యసన సామర్థ్యం పెంపొందించాలి సుల్తానాబాద్రూరల్(పెద్దపల్లి): విద్యార్థుల్లో అ భ్యసన సామర్థ్యం మెరుగుపరిచేలా ఉపాధ్యా యులకు శిక్షణ ఇస్తున్నామని డీఈవో మాధవి తెలిపారు. గర్రెపల్లి జెడ్పీ హైస్కూల్లో జీవశాస్త్రం ఉపాధ్యాయులకు సామర్థ్య నిర్మాణంపై శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. డీఈవో సోమవారం శిబిరాన్ని పరిశీలించి మాట్లాడా రు. శిక్షణలో నేర్చుకున్న విషయాలను పాఠశాలలో అమలు చేయాలన్నారు. విద్యార్థులు అన్నిసామర్థ్యాలు సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని డీఈవో సూచించారు. ఈ కార్యక్రమంలో కోర్స్ డైరెక్టర్ వి.కవిత, రిసోర్స్ పర్సన్స్ నరేశ్, కుమార్, సాధన, ప్రత్యక్ష, సీఆర్సీలు కిరణ్కుమార్, రజియా, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ‘రోహిణి’లో ఆరుద్ర ప్రత్యక్షం జ్యోతినగర్(రామగుండం): వానాకాలం సీజన్ ఈనెల 25న(రోహిణి కార్తె ప్రవేశంతో) ప్రారంభమైంది. ఈమేరకు రైతులు సాగు పనులు ముమ్మరం చేశారు. ఇప్పటికే కొన్నిచోట్ల వ ర్షాలు కురవగా.. అన్నదాతలు దుక్కిదున్నడంలో నిమగ్నమయ్యారు. అయితే, రోహిణి కా ర్తెలో ఆరుద్ర పురుగులు కనిపించడంతో రైతు లు తమకు శుభ సంకేతమని భావిస్తున్నారు. సాధారణంగా ఈ పురుగులు ఆరుద్ర కార్తెలో కనిపిస్తాయని గ్రామస్తులు చెబుతున్నారు. సో మవారం పట్టణంలో వాకింగ్కు వెళ్లిన వారికి ఈ పురుగులు కనిపించడంతో ఆశ్చర్యానికి లోనయ్యారు. పీపీ గది తొలగింపు సుల్తానాబాద్(పెద్దపల్లి): నిజాం కాలంలో ని ర్మించిన పట్టణంలోని మున్సిఫ్ కోర్టులో గల పబ్లిక్ ప్రాసిక్యూటర్(పీపీ) గది పూర్తిగా శిథిలావస్థకు చేరింది. ఎప్పుడు కూలుతుందో తెలియక కక్షిదారులు, కోర్టు ఉద్యోగులు, సిబ్బంది భయంతో వణుకుతున్నారు. ఈ క్రమంలో ప్రమాదం జరగకముందే దీనిని కూల్చివేయాలని సుల్తానాబాద్ బార్ అసోసియేషన్ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లింది. హైకోర్టు ఇందుకు అనుమతి ఇచ్చిందని అసోసియేషన్ కార్యదర్శి భూమయ్య, న్యాయవాదులు తెలిపారు. ఈమేరకు జేసీబీ సాయంతో సోమవారం పీపీ గది తొలగించారు. కాగా, మున్సిఫ్ కోర్టు కార్యకలాపాలను కొత్త భవనంలోకి తరలించగా, పాత భవనం ఖాళీగానే ఉంటోంది. జీవో నంబరు 44ను అమలు చేయాలి సుల్తానాబాద్(పెద్దపల్లి): ప్రాథమిక సహకార సంఘాల కోసం జారీచేసిన జీవో నంబరు 44లో పొందుపరిచిన అంశాలను సక్రమంగా అమలు చేయాలని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల కార్యదర్శుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బొంగోని శంకర్ కోరారు. మండల కేంద్రంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జీవో ప్రకారం బదిలీలకు వ్యతిరేకం కాదని, బ్యాంకు ఉద్యోగుల మాదిరిగా ప్రతీనెల ఒకటో తేదీన పాలకవర్గాలకు సంబంధం లేకుండా బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలన్నారు. సంఘం అభివృద్ధి కోసం కష్టపడే వారిని ప్రభుత్వం గుర్తించాలని విన్నవించారు. -
ప్రమాదాల నియంత్రణే లక్ష్యం
● రాజీవ్ రహదారి వెంట సర్వీస్ రోడ్లు ● రూ.25 కోట్ల అంచనాలతో ప్రతిపాదనలు తయారీగోదావరిఖని: రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని రాజీవ్ రహదారికి ఇరువైపులా సర్వీస్ రోడ్ల వి స్తరణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఇందుకు అవరోధంగా మారిన ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ఓ భవనం, 20 దుకాణాలను ఇటీవల తొలగించిన అధికారులు.. మిగతాచోట్ల పనులు చేపట్టేందుకు పక్కా ప్రణాళిక రూపొందించారు. రామగుండం నుంచి గంగానగర్ వరకు.. రామగుండం తహసీల్దార్ కార్యాలయం నుంచి గంగానగర్ ఫ్లైఓవర్ వరకు రాజీవ్ రహదారి అత్యంత ప్రమాదకరంగా మారింది. నిత్యం ఏదోఓచోట ప్ర మాదం జరుగుతూనే ఉంది. ఇప్పటిరకు ఇలా జరిగిన ప్రమాదాల్లో పదుల సంఖ్యలో వాహనదారు లు, పాదచారులు, ప్రయాణికులు మృతిచెందారు. అనేకమంది గాయాలపాలయ్యారు. భారీ వాహనా లు అతివేగంగా వెళ్లడం, అదేసమయంలో రోడ్డు దాటే ప్రయత్నం చేస్తుండడంతో ప్రమాదాల పరంపర కొనసాగుతోంది. ఇక్కడ సింగరేణి, ఎన్టీపీసీ, ఆ ర్ఎఫ్సీఎల్ పరిశ్రమలు విస్తరించాయి. దీంతో రో డ్లు నిత్యం బిజీగా మారాయి. పెరుగుత్ను జనాలు, వాహనాల రద్దీకి అనుగుణంగా హెచ్కేఆర్ సంస్థ రోడ్లు విస్తరించడం లేదని, తద్వారా ప్రమాదాల సంఖ్య పెరుగుతోందనే ఆరోపణలు వస్తున్నాయి. బీగెస్ట్ హౌస్ మూలమలుపు వద్ద సర్కిల్.. సింగరేణి బీ – గెస్ట్హౌస్ మూలమలుపు వద్ద రాజీ వ్ రహదారిపై తరచూ చోటుచేసుకునే ప్రమాదాలను నియంత్రించేందుకు సర్కిల్ నిర్మించాలని ప్రతిపాదించారు. ఇక్కడ రోడ్డు విస్తరిస్తే.. మంచిర్యాల వైపు వెళ్లే, మంచిర్యాల నుంచి గోదావరిఖని వైపు వచ్చే వాహనాల రాకపోకలకు అంతరాయం ఉండదని అధికారులు ఈ నిర్ణయానికి వచ్చారు. రాజీవ్ హైవేపై బ్లాక్ స్పాట్లు.. రాజీవ్ హైవేపై బీ– పవర్హౌస్ గడ్డ నుంచి గంగానగర్ ఫ్లైఓవర్ వరకు ప్రమాదాలు అధికంగా జరు గుతున్నాయి. దీంతో పోలీసుశాఖ రంగంలోకి దిగింది. ఎన్టీపీసీ లేబర్గేట్, ఆర్ఎఫ్సీఎల్ క్రాసింగ్, మున్సిపల్ తీన్రస్తా, బస్టాండ్, జీఎం ఆఫీస్ మూలమలుపు, మిలీనియం క్వార్టర్స్ రోడ్డు క్రాసింగ్, గంగానగర్ ఫ్లైఓవర్ వరకు బ్లాక్స్పాట్లు గుర్తించింది. ఫుట్ ఓవర్ బ్రిడ్జి లేక.. ఎన్టీపీసీ లేబర్గేట్ వద్ద కార్మికులు రాజీవ్ రహదారి దాటుతున్న క్రమంలో వేగంగా వచ్చే వాహనాలు ఢీకొని మరణిస్తున్నారు. చాలామంది గాయాలపాలవుతున్నారు. ప్రమాదాలను నియంత్రణకు ఇక్కడ ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మించాలనే డిమాండ్ ఎప్పటినుంచో ఉంది. మేడిపల్లి చౌరస్తా కూడా అత్యంత ప్రమాదకరంగా మారింది. ఫుట్బ్రిడ్జి కోసం రూ.5 కోట్లు.. మున్సిపల్ చౌరస్తా వద్ద రోడ్డు ప్రమాదాలు నియంత్రణకు ఆర్ అండ్ బీ మంత్రిని ఎమ్మెల్యే కలిశారు. మెడికల్ కాలేజీ నుంచి ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి వరకు నేరుగా వెళ్లేందుకు రాజీవ్ హైవేపై ఫుట్ఓవర్ బ్రిడ్జి నిర్మించాలని విన్నవించగా, రూ.5 కోట్లు మంజూరయ్యాయి. దీంతో మెడికల్, పీజీ, డిగ్రీ కళాశాలలకు వెళ్లివచ్చే వారికి సౌకర్యంగా ఉంటుంది. అసంపూర్తిగా సర్వీస్రోడ్లు కవిత థియేటర్ నుంచి ఇల్లెందు గెస్ట్హౌస్ వరకు సర్వీస్ రోడ్డు ఇంకా పూర్తికాలేదు. సాయిలీలా హోటల్ నుంచి పోలీసు కమిషనరేట్, ఎస్బీఐ నుంచి మేడిపల్లి సెంటర్ వరకు, బీ – పవర్హౌస్ గడ్డ నుంచి కుడివైపు సర్వీస్ రోడ్డు నిర్మించాల్సి ఉంది. సర్వీస్ రోడ్ల పరిశీలన రాజీవ్ హైవే వెంట సర్వీస్ రోడ్ల విస్తరణపై రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్, ఆర్జీ–1 జీఎం లలిత్కుమార్, హెచ్కేఆర్ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు, ఇంజినీర్లు, నిపుణులు సోమ వారం పరిశీలన చేశారు. సర్వీస్ రోడ్ల విస్తరణకు సుమారు రూ.25కోట్లతో అంచనాలు ప్రతిపాదించారు. నగర రవాణా వ్యవస్థను మరింత సులభతరం చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ చేపట్టినట్లు ఎమ్మెల్యే తెలిపారు. జీఎం ఆఫీస్ మూలమలుపు వద్ద ప్రమాదాల నియంత్రణకు పటిష్ట ప్రణాళిక రూపొందించాలని అధికారులకు సూచించారు. -
మీ సేవలో ‘ఆధార్’ సేవలు
పెద్దపల్లిరూరల్: జిల్లాలోని మీసేవ కేంద్రాల్లో ‘ఆధార్’ సెంటర్లు పనిచేసేలా చర్య లు తీసుకోవాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించా రు. ‘ఆధార్ అవస్థలు’ శీర్షిక న ‘సాక్షి’లో సోమవారం ప్రచురితమైన కథనానికి కలెక్టర్ స్పందించా రు. ప్రజల ఇబ్బందులను దూరం చేసేందుకు ఆధార్ కేంద్రాలను అందుబాటులోకి తేవాలన్నారు. జూన్ 3న ఆధార్కార్డు అప్డేట్ కోసం కలెక్టరేట్లో మెగా క్యాంపు ఏర్పాటు చేయా లని ఆదేశించారు. 5 నుంచి 15ఏళ్లలోపు పిల్లల వివరాలను తప్పనిసరిగా అప్డేట్ చేయించాలన్నారు. మండల కేంద్రాల్లోనూ ఆధార్ అప్డేట్కు ప్రత్యేక శిబిరాల ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. తప్పుడు చిరునామాల తో వెనక్కి వచ్చిన ఆధార్కార్డుల వివరాలను తపాలా కార్యాలయాల నుంచి తెప్పించాలని పేర్కొన్నారు. విద్యార్థుల కోసం ప్రత్యేక శిబి రాలు నిర్వహించాలని సూచించారు. యూఐడీఏఐ ప్రాజెక్టు మేనేజర్ నరేశ్చంద్ర, జిల్లా సంక్షేమశాఖ అధికారి వేణుగోపాల్ ఉన్నారు. -
విస్తరణకు అడుగులు
● జోరుగా భవనాలు, షాపుల కూల్చివేత ● రామగుండం నగరంలో తెరుచుకుంటున్న కొత్తదారులు ● దశాబ్దాల తర్వాత వేగంగా రహదారుల అభివృద్ధి ● ఆధునిక షాపింగ్ కాంప్లెక్స్లకూ అంకురార్పణ ● మరో 50ఏళ్ల అవసరాలకు అనుగుణంగా ప్రగతి పనులు ● హైవేపై ప్రమాదాల నియంత్రణకు సర్వీస్ రోడ్ల నిర్మాణంగోదావరిఖని: జిల్లాలోనే ఏకై క నగరం రామగుండం. పారిశ్రామిక ప్రాంతంగా ప్రఖ్యాతిగాంచిన నగరంలో గోదావరిఖని, యైటింక్లయిన్కాలనీ, రామగుండం పట్టణాలు ఉన్నాయి. అయితే, ప్రధాన ప్రాంతా ల్లో ఇరుకైన రోడ్లు నగరవాసులకు చుక్కలు చూపెడుతున్నాయి. వాటి విస్తరణకు పలుపర్యాయాలు ప్రయత్నాలు జరిగినా.. భవనాలు, నివాసాలు అవరోధం కలిగిస్తూ వస్తున్నాయి. వాటిని తొలగించేందుకు యత్నిస్తే రాజకీయ ఒత్తిళ్లు ఆటంకం కలిగిస్తున్నాయి. వీటన్నింటినీ అధిగమించడం అధికారులకు సవాల్గా మారుతోంది. అయితే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, స్థానిక ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్ అధికార పార్టీ ఎమ్మెల్యే కావడం, సింగరేణితోపాటు ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సీఎల్ తదితర పరిశ్రమలు సహకరించడంతో నగరం ఆధునికత సంతరించుకుంటోంది. సినిమా టాకీస్ కూల్చివేతతో శ్రీకారం.. నగరం నడిబొడ్డున ఉన్న ఓ సినిమా టాకీస్ కూల్చివేతతో రోడ్ల విస్తరణకు తొలిఅడుగు పడింది. ప్రస్తుతం బీ – పవర్హౌస్గడ్డ నుంచి గోదావరి నది సమీపంలోని గంగానగర్ ప్లైఓవర్ వరకు సర్వీస్ రోడ్ల విస్తరణపై అధికారులు దృష్టి సారించారు. ఈ క్రమంలోనే రాజీవ్ రహదారి వెంట సర్వీ సు రోడ్ల నిర్మాణం వేగవంతమైంది. వీటికి అడ్డుగా ఉన్న భవనాల కూల్చివేతలకు తొలుత వ్యతిరేకత ఎదురైనా.. అదేస్థాయిలో రోడ్ల విస్తరణ, ఆధునిక వ్యాపార సముదాయాల నిర్మాణం, నగర అభివృద్ధికి అడుగులు పడుతుండడంతో ప్రజల్లో సానుకూలత వ్యక్తమవుతోంది. ప్రమాదాలకు నిలయం.. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో రాజీవ్ రహదారి పక్కనే ఉన్న భవనం సర్వీసు రోడ్డు విస్తరణకు అవరోధంగా మారింది. అంతేకాదు.. రోడ్డు ఇరుకుగా ఉండడంతో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. బస్టాండ్లోకి వెళ్లడం, ఆటోలు కూడా చక్కర్లు కొట్టడంతో ప్రయాణికులకు నరకం కనిపిస్తోంది. వాహనదారులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. సర్వీసు రోడ్ల విస్తరణపై దృష్టి సారించిన ఎమ్మెల్యే రాజ్ఠాకూర్.. బస్టాండ్ సమీపంలో కూడా రోడ్డు విస్తరించాలని సూచించారు. దీంతో ఆ భవనాన్ని ఇటీవల కూల్చివేశారు. అదే విధంగా వ్యాపార కేంద్రమైన కల్యాణ్నగర్లోనూ రోడ్ల విస్తరణ జోరందుకుంది. మార్కండేయకాలనీలో రోడ్డు విస్తరణకు అవరోధంగా ఉన్న రాజేశ్ థియేటర్ వెనకాల ఉన్న ఓ భవనాన్ని కూడా శనివారం బల్దియా అధికారులు కూల్చివేశారు. ఈభవనం కూల్చివేతతో రోడ్డు విస్తరణ వేగం పుంజుకుంటుందని భావిస్తున్నారు.50 ఏళ్ల అవసరాలకు అనుగుణంగా పనులు మరో 50 ఏళ్లవరకు అప్పటి జనాభా అవసరాలకు అనుగుణంగా రోడ్లు విస్తరించాలి. ఆధునిక భవనాలు, షాపింగ్కాంప్లెక్స్ నిర్మించాలి. అందుకు దీర్ఘకాలిక ప్రణాళికతో ముందుకు సాగుతున్నాం. ఈ పనులతో కొందరికి ఇబ్బందులు ఎదురైనా చాలామందికి సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. ఇందు కోసం రాజీలేకుండా ముందుకు సాగుతాం. – ఎంఎస్ రాజ్ఠాకూర్, రామగుండం ఎమ్మెల్యే -
సహకార సంఘాల్లో బదిలీల జాతర
సుల్తానాబాద్(పెద్దపల్లి): జిల్లాలోని ప్రాథమిక సహకార సంఘాల(పీఏసీఎస్)ల్లో బదిలీల ప్రక్రియకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. కార్యదర్శు(సీఈవో)లతోపాటు ఉద్యోగులను బదిలీ చేయాలని ఇటీవల ఉత్తర్వులను జారీచేసింది. దీర్ఘకాలంగా ఒకే సింగల్విండోలో పనిచేయడంతో రైతులను పలు రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారనే ఫిర్యాదుల మేరకు ఉద్యోగుల బదిలీకి శ్రీకారం చుట్టింది. త్వరలో బదిలీలు ఉంటాయి. పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు సుల్తానాబాద్లో ఇటీవల జరిగిన బహిరంగ సభలో ఉద్యోగుల బదిలీల ప్రక్రియ ప్రారంభమైందని వెల్లడించడం గమనార్హం. తొలిసారి బదిలీలు.. జిల్లా కేంద్ర సహకార బ్యాంకు శాఖల పరిధిలోని ప్రాథమిక సహకార సంఘాల్లో పనిచేస్తున్న సిబ్బంది వివరాలను రాష్ట్ర ప్రభుత్వం సేకరించింది. ఈమేరకు గతనెల 20న ఉద్యోగుల వివరాలు నమోదు చేసింది. ఒకేప్రాంతంలో మూడు నుంచి ఐదేళ్లుగా విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులు, సిబ్బందిని కచ్చితంగా బదిలీ చేయాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే, వందేళ్ల చరిత్ర కలిగిన సహకార సంఘాల్లో బదిలీలు చేపట్టడం ఇదే తొలిసారి కావడం విశేషమని అంటున్నారు. జిల్లాలో కార్యదర్శులు 20 మంది ఉండగా సిబ్బంది 92 ఉన్నారని అంచనా. ఏళ్ల తరబడి ఒకేచోట.. సహకార సంఘాల ఉద్యోగులు, సిబ్బంది ఏళ్ల కొద్దీ ఒకే సంఘంలో పనిచేయడంతో సోమరిపోతుల్లాగా మారారని, తాము చెప్పిందే నడుస్తుందనే భావనతో రైతులు, పాలకవర్గ సభ్యులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ప్రభుత్వం గుర్తించింది. చాలామంది ఉద్యోగులు, సిబ్బంది 10 ఏళ్ల నుంచి 20 ఏళ్లకుపైగా ఒకేచోట పనిచేస్తుండడంతో సమస్యలు వస్తున్నాయని, సంఘాల అధ్యక్షులను గుప్పిట్లో పెట్టుకొని పెత్తనం చెల్లాయిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. మరోవైపు.. రిటైర్మెంట్కు దగ్గర ఉన్నవారిని బదిలీ చే యవద్దని పలువురు ఉద్యోగులు కోరుతున్నారు. ● దీర్ఘకాలికంగా పనిచేస్తున్న వారికి స్థానచలనం జిల్లా పరిధిలోనే బదిలీ చేయాలి రాష్ట్ర ప్రభుత్వం గతంలో జారీచేసిన 44 జీవోను సవరిస్తూ కొత్తగా 82 జీవోగా మార్చింది. బదిలీ ప్రక్రియ చేపడుతున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే, ఉమ్మడి జిల్లా పరిధిలో కాకుండా జిల్లా పరిధిలోనే బదిలీ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. రిటైర్మెంట్కు దగ్గర ఉన్నవారిని బదిలీ చేయవద్దు. – బొంగోని శంకర్గౌడ్, రాష్ట్ర అధ్యక్షుడు, ప్రాథమిక సహకార సంఘాల అసోసియేషన్ -
ముగిసిన డీఈఈసెట్
రామగిరి(మంథని): సెంటినరీకాలనీలోని మంథని జేఎన్టీయూలో ఆదివారం చేపట్టిన డీఈఈసెట్ ఆన్లైన్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఉదయం సెషన్లో జరిగిన పరీక్షకు 137 మంది అభ్యర్థులకు 100 మంది, మధ్యాహ్నం జరిగిన పరీక్షకు 144 మందికి 103 మంది హాజరయ్యారని ప్రిన్సిపాల్ బి.విష్ణువర్ధన్ తెలిపారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్సై చంద్రకుమార్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు చేపట్టారు. శాంతిచర్చలు జరపాలి జ్యోతినగర్(రామగుండం): మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు ఎన్కౌంటర్పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని సీపీఐ(ఎంఎల్)మాస్లైన్ ప్రజా పంథా ఉమ్మడి కరీంనగర్ జిల్లా కార్యదర్శి జూపాక శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఎన్టీపీసీలోని రాజీవ్ రహదారిపై ఆదివారం నల్లజెండాలతో నిరసన చేపట్టారు. శ్రీనివాస్ మాట్లాడుతూ, కేశవరావు సహా 27 మంది మావో యిస్టులను ఎన్కౌంటర్లో హతమార్చడం దుర్మార్గమన్నారు. మావోయిస్టులతో కేంద్రప్రభుత్వం శాంతిచర్చలు జరపాలని ప్రజలు, ప్రజాస్వామికవాదులు, మేధావులు, రాజకీయ పార్టీలు విజ్ఞప్తి చేస్తున్నా కేంద్రప్రభుత్వం పెడచెవిన పెట్టడం శోచనీయమన్నారు. ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపివేయాలని ఆయన కోరారు. నాయకులు తోకల రమేశ్, గొల్లపల్లి చంద్రయ్య, గూడూరు వైకుంఠం, మార్త రాములు, రాయమల్లు, సురేశ్, సునీత, మల్లేశ్, రవి, రాములు పాల్గొన్నారు. సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలిగోదావరిఖని: మావోయిస్టు పార్టీ కేంద్ర క మిటీ కార్యదర్శి నంబాల కేశవరావు ఎన్కౌంటర్పై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎం.శ్రీనివాస్ డిమాండ్ డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక ప్రెస్క్లబ్ లో నిర్వహించిన జిల్లాస్థాయి సదస్సులో ఆ యన మాట్లాడారు. పహల్గామ్ హత్యలపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలని, ఆపరేషన్ సిందూర్లో దాగిఉన్న అంశాల్లో అన్నికోణాలను బహిర్గతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పహల్గాంలో దాడి చేసిన వారిని ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం గుర్తించి పట్టుకోలేదని, ఆపరేషన్ సిందూర్లో యుద్ధం అర్ధ్ధంతరంగా ముగిసిందని అమెరికా అధ్యక్షుడు ట్రంపు ప్రకటించడంలో ఆంతర్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు. నాయకులు ఐ.కృష్ణ, నరేశ్, వెంకన్న, చిలుక శంకర్, రామకృష్ణ, రాజేశం, మేరుగు చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. ఈసందర్భంగా అరుణోదయ కళాకారుల పాటలు ఉత్తేజపర్చాయి. ప్రశాంతంగా గ్రామపాలన అధికారుల పరీక్ష పెద్దపల్లిరూరల్: స్థానిక ప్రభుత్వడిగ్రీ కాలేజీలో ఆదివారం గ్రామపాలన అధికారుల పరీక్ష ప్రశాంతంగా జరిగింది. ఈ పరీక్షకు 90మంది అభ్యర్థులు హాజరుకావాల్సి ఉండగా 82మంది హాజరయ్యారని పరీక్షల సూపరింటెండెంట్, ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ లక్ష్మీనర్సయ్య తెలిపారు. పరీక్ష కేంద్రాన్ని అడిషనల్ కలెక్టర్ వేణు ఆకస్మికంగా తనిఖీ చేశారు. నేడు మంత్రి పర్యటన మంథని: నియోజకవర్గంలో మంత్రి శ్రీధర్బాబు సోమవారం పలు అభివృద్ధి పనులను ప్రా రంభించనున్నారు. గుంజపడుగులో రూ.2.90 కోట్లతో ఏర్పాటు చేసే సోలార్ ప్రాజెక్ట్ అనుమ తి పత్రాలను మంత్రి అందజేస్తారు. మంథని బస్ డిపో సమీపంలో డ్రీమ్, స్టార్ట్ – రైజ్ ఇన్నో వేషన్ నెట్వర్క్లో భాగంగా గ్రామీణ ప్రొటోటైపింగ్ ఇన్నోవేషన్ సెంటర్ను ప్రారంభిస్తారు. మల్హర్ మండలం కొయ్యూరు సరస్వతీ పుష్కరాలకు వెళ్లేవారికి అన్నదానం ప్రారంభిస్తారు. -
‘ఆధార్’ అవస్థలు
● అధికారుల తప్పిదంతోనే తిప్పలు ● సవరించుకునేందుకు వ్యయ‘ప్రయాస’లు ● అందుబాటులో నమోదు కేంద్రాలు లేక ఇబ్బందులు పెద్దపల్లిరూరల్: ఆధార్ కార్డు అన్నింటికీ ఆధారమైంది. బర్త్, డెత్ సర్టిఫికెట్ కావాలన్నా, బ్యాంకు ఖాతా అవసరం ఉన్నా, స్కూల్లో ప్రవేశం కల్పించాలన్నా, కులం, ఆదాయం, నివాసం ధ్రువీకరణపత్రాలు కావాలన్నా, సంక్షేమ పథకాల్లో లబ్ధి పొందాలన్నా ఆధార్ కార్డు తప్పనిసరిగా మారింది. తొలుత మీసేవ కేంద్రాల నిర్వాహకులకు సైతం ఆధార్ కార్డు సర్వీసు బాధ్యతలు ఇచ్చినా.. వారు అక్రమాలకు పాల్పడుతున్నారని అనుమానించి వా రి బాధ్యతలను తొలగించారు.అయితే, ప్రభుత్వ కా ర్యాలయాల ఆవరణలోనే ఏర్పాటు చేయాలని ఉ న్నతాధికారులు తీసుకున్న నిర్ణయం ఎక్కడా అమ లు కావడం లేదు. దీంతో జిల్లాలోని పలు మండలా లు, గ్రామాల ప్రజలు ఆధార్కార్డులో దొర్లిన పొరపాట్లను సవరించుకునేందుకు, పుట్టిన పాపాయికి కార్డు కోసం సుదూర ప్రాంతాలకు తిరుగుతూ అనేక వ్యయ, ప్రయాసలకు గురవుతున్నారు. పనిచేసేవి నాలుగే.. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆఫీసుల ఆవరణలో పనిచేసేందుకు ఏడు ఆధార్ నమోదు కేంద్రాలు ఏర్పాటు చేసినా అందులో 4 సెంటర్లే పనిచేస్తున్నాయి. వాటిలో ఒక్క కేంద్రమే జెండా ప్రాంతంలోని బీఎస్ఎన్ఎల్ ఆఫీసులో అందరికీ అనువుగా ఉంది. కలెక్టరేట్ ఆవరణలో ఉండాల్సిన ఆధార్ కేంద్రాన్ని అమర్నగర్ ప్రాంతంలోని ఓ గల్లీలో ఏర్పాటు చేశారు. దాని చిరునామా తెలుసుకోవడం ఇబ్బందిగా మారింది. కొందరు ఎలాగోలా తెలుసుకుని అక్కడకు చేరుకునేందుకు నానాతంటాలు పడాల్సి వస్తోంది. మరోరెండు కేంద్రాలను బ్యాంకు ఆవరణలో ఏర్పాటు చేసినా అక్కడ ప్రజలకు సేవలు అంతంత మాత్రంగానే అందుతున్నాయనే ఫిర్యాదులు ఉన్నాయి. ఆధార్ సెంటర్ల తీరుపై సరైనరీతిన అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో తాము ఇబ్బందులు పడాల్సి వస్తోందని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. కలెక్టర్ ప్రత్యేక దృష్టిసారించి ఆధార్ అవస్థలను దూరం చేసి సేవలను దగ్గర చేయాలని కోరుతున్నారు. ఆపరేటర్లకు వసతి కల్పించరా? ఆధార్ సెంటర్ కలిగియున్న మీసేవ ఆపరేటర్లు ప్రభుత్వకార్యాలయాల ఆవరణలోనే ఆధార్ సేవలను అందించాలని ఉన్నతాధికారులు ఇచ్చిన ఆదేశాలు ఇప్పటికీ అమలుకు నోచడం లేదు. జిల్లా కేంద్రమైన పెద్దపల్లి కలెక్టరేట్తో పాటు ఆర్డీవో, తహసీల్దార్, ఎంపీడీవో ఆఫీసుల్లో ఏర్పాటు చేసుకునేందుకు సంబంధిత ఆపరేటర్లు దరఖాస్తు చేసుకున్నా ఇప్పటికీ వసతి కల్పించలేదు. దీంతో ఆ కేంద్రాలు పనిచేయడం లేదు. ఓదెల మండలం పొత్కపల్లికి చెందిన పంజాల మాధవి కుటుంబం ఇది. వారి బాబు ఆధార్కార్డులో దొర్లిన పొరపాటును సవరించుకునేందుకు జిల్లా కేంద్రంలోని ఆధార్ కేంద్రానికి ఇటీవల వచ్చింది. పొరపాటు సవరణకు అవసరమైన ఆధారాలు లేవని ఆధార్ కేంద్రం నిర్వాహకులు చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఇతడి పేరు రాజు. పెద్దపల్లి మండలం కుర్మపల్లి స్వగ్రామం. తన కుమారడి ఆధార్కార్డు కోసం కేంద్రానికి వచ్చాడు. తహసీల్దార్ కార్యాలయం జారీచేసిన బర్త్ సర్టిఫికెట్లో పిన్కోడ్ లేదని ఆధార్ కార్డు ఇచ్చేందుకు నిర్వాహకులు తిరస్కరిస్తున్నారని వాపోయాడు. ఇబ్బంది రావొద్దు కలెక్టరేట్తోపాటు అన్నిమండల కేంద్రా ల్లోని ప్రభుత్వ ఆఫీసుల్లో ఆధార్ కేంద్రాలు ఏర్పాటు చేయాలి. సర్కారు ఆఫీసుల్లో ఆధార్ సెంటర్లు ఉంటే ఏ సమస్య వచ్చినా అధికారులు అప్పటికప్పుడే పరిష్కరించే అవకాశముంటుంది. కలెక్టర్ చొరవ చూపి వీలైనంత త్వరగా ఏర్పాటు చేయించాలి. – కందుల శ్రీనివాస్, సుల్తానాబాద్ ఆదేశాలు ఉన్నాయి మీసేవ కేంద్రాలు, ఇతర భవనాల్లో ఏర్పాటు చేసుకున్న ఆధార్ సెంటర్లను ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలోకి మార్చాలనే ఆదేశాలున్నాయి. వాటిని అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటాం. – గంగయ్య, ఆర్డీవో, పెద్దపల్లి