Peddapalli
-
కోర్టు భవన నిర్మాణం మొదలయ్యేనా?
పెద్దపల్లిరూరల్: జిల్లా ప్రధాన న్యాయస్థానం, సీనియర్, జూనియర్ జడ్జి ఇలా.. ఇంకా పలు కోర్టులన్నీ ఒకే సముదాయంలో నిర్మించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు పెద్దపల్లి మండలం రాఘవాపూర్లో 10 ఎకరాల స్థలం కేటాయించి, భవన నిర్మాణాలకు నిధులు మంజూరు చేసి టెండర్లను కూడా ఖరారు చేసింది. ఇప్పటిదాకా బాగానే ఉన్నా... న్యాయవాదుల నడుమ బేధాభిప్రాయాలు పొడచూపాయి. జిల్లా కేంద్రమైన పెద్దపల్లి పట్టణంలోనే కోర్టు భవనాలు నిర్మించాలంటూ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మేకల మల్లేశంతో పాటు పలువురు సీనియర్ న్యాయవాదులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో కోర్టు భవన నిర్మాణాలు ఇంకా ప్రారంభానికి నోచుకోవడం లేదు. 20వ రోజుకు చేరిన రిలేదీక్షలు జిల్లా కేంద్రమైన పెద్దపల్లిలోనే కోర్టు భవనాలు నిర్మిస్తే అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుందని న్యాయవాదులు పేర్కొంటున్నారు. పెద్దపల్లి పట్టణమే అందరికీ అనువుగా ఉంటుందని, ఇందుకోసం అవసరమైన స్థలం కేటాయించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన రిలేదీక్షలు సోమవారం నాటికి 20వ రోజుకు చేరాయి. రాఘవాపూర్లో వద్దేవద్దు జిల్లా కోర్టు సముదాయ భవనాలను పెద్దపల్లి మండలం రాఘవాపూర్లో నిర్మించేందుకు అంగీకరించబోమంటూ న్యాయవాదులు స్పష్టం చేస్తున్నారు. పెద్దపల్లిలో నిర్మించడం వల్ల అందరికీ అనువుగా ఉంటుందని అంటున్నారు. బస్డిపోకు కేటాయించిన స్థలం, కలెక్టరేట్ ఆవరణలోని ట్రాఫిక్ పోలీస్స్టేషన్ ప్రాంతం, నిరుపయోగంగ ఉన్న పురావస్తుశాఖ భూమిలోనో ఇలా రాజీవ్ రహదారి వెంట ఉండేలా స్థలం కేటాయిస్తే తమకు అభ్యంతరం లేదని న్యాయవాదులు పేర్కొంటున్నారు. విశాలమైన స్థలం అక్కడే.. పెద్దపల్లి నుంచి మంథనికి వెళ్లే ప్రధాన రోడ్డుకు అతి సమీపంలోనే ఉన్న రాఘవపూర్లో జిల్లా కోర్టు సముదాయానికి స్థలం కేటాయించారని కొందరు న్యాయవాదులు పేర్కొంటున్నారు. పదెకరాల విశాలమైన స్థలం మరెక్కడా లేదని, స్థల కేటాయింపు సమయంలో ఏకాభిప్రాయమే ఉన్నా.. ఇప్పుడు అభ్యంతరం వ్యక్తం చేయడంలో అర్థం లేదని అంటున్నారు. ఎమ్మెల్యే విజయరమణారావు సైతం కోర్టు భవన నిర్మాణ విషయంలో వివాదాలు సృష్టించొద్దని, రాఘవాపూర్లోనే పనులు మొదలయ్యేలా అందరూ సహకరించాలంటున్నారు. -
‘అకాల’ భయం
మంథని: పంట చేతకచ్చే ప్రతీ ఖరీఫ్, రబీ సీజన్లలో అకాల వర్షం రైతన్నను నిలువునా మంచుతోంది. ఈసారి కూడా అవే పరిస్థితులు కనిపిస్తుండడంతో రైతులు హైరానా పడుతున్నారు. గత ఐదు సంవత్సరాల్లో పరిశీలిస్తే ఏప్రిల్, మే నెలల్లోనే ఖరీఫ్ సీజన్ రైతులను ముంచిన సందర్భాలున్నాయి. మంథని డివిజన్లో 50వేల ఎకరాలకు పైగా వరిసాగు చేశారు. వరి కోతకు రావడంతో రైతులు తమ పంటను కోసి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలించారు. అయితే సకాలంలో ధాన్యం తూకం కాకపోవడంతో కేంద్రాల్లోనే నిల్వ ఉన్నాయి. మాయిశ్చర్, ఇతర కారణాల వల్ల అనేక మంది రైతుల ధాన్యం తూకం వేయలేదు. నాలుగు రోజుల నుంచి మబ్బులు కమ్ముకొచ్చి వర్షసూచన ఉన్నా అధికారులు నిర్లక్ష్యంగానే వహిస్తున్నారు. కేంద్రాల్లో పేరుకుపోయిన ధాన్యం నిల్వలను వెనువెంటనే తూకం వేయడంలో ఆశ్రద్ధ కనబర్చుతున్నారు. ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే వర్షం పడటంతో రైతులు ఆందోళనలో ఉన్నారు. మళ్లీ వర్షం ఎక్కడ ముంచుతుందో అని గుండెలు బాదుకుంటున్నారు. ఽ ఆదివారం ఒక్కసారిగా వాతావరణంలో మార్పుచోటు చేసుకొని మబ్బులు కమ్ముతున్నాయి. ఈక్రమంలో వర్షం ఎప్పుడు వస్తుందోనని రైతులు భయపడుతున్నారు. వర్షం పడితే నష్టంపోయేది మంథని రైతులే ఎక్కువ మంథని వ్యవసాయ మార్కెట్లో సిమెంట్ ప్లాట్ఫాం, డ్రైనేజీ సిస్టం బాగా లేదు. దీంతో ప్రతీసారి వర్షానికి ధాన్యం పెద్ద ఎత్తున కొట్టుకుపోయి రైతులు నష్టపోతున్నారు. 200 క్వింటాళ్లకు పైగా ధాన్యం రాశులు ప్రతీసారి కేంద్రంలో నిల్వ ఉంటున్నాయి. ఈసారి కూడా అదే పరిస్థితి నెలకొంది. కాలువలకు సమీపంలో ధాన్యం రాశులు వేయకుండా మార్కెట్ అధికారులు జాగ్రత్తలు తీసుకున్నా రైతులు ధాన్యం వేసేందుకు స్థలం లేకపోవడంతో అక్కడే వేశారు. దీంతో వర్షానికి పెద్ద ఎత్తున ధాన్యం కాలువలో పడి కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. నష్టం జరగక ముందే అప్రమత్తత అవసరం వర్షసూచన ఉండడంతో నష్టం జరుగక ముందే వెనువెంటనే ధాన్యం తూకం వేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో ఐదు కాంటాలతో తూకం వేస్తున్నారు. అవసరమైతే మరో ఐదు కాంటాలను ఏర్పాటు చేసి ఎక్కువ మంది హమాలీలతో రాత్రింబవళ్లు కాంటాలు వేసి ధాన్యం సేకరిస్తే బాగుంటుందని రైతులు అభిప్రాయపడ్డారు. అంతేగాకుండా సరిపడా టార్పాలిన్ కవర్లు అందుబాటులో ఉంచాలని కోరుతున్నారు. నష్టం జరిగిన తర్వాత అధికారులు, ప్రజాప్రతినిధులు, పలకరింపులు ఎందుకని, అంతకుముందే తేరుకుంటే అందరికీ మంచిదనే అభిప్రాయం అన్నదాతల్లో వ్యక్తమవుతోంది. ఒక్క మంథని డివిజన్లోనే కాకుండా జిల్లాలోని పీఏసీఎస్, ఐకేపీ, డిసీఎంఎస్ కొనుగోలు కేంద్రాల్లో వందలాది క్వింటాళ్ల ధాన్యం రాశులు పేరుకుపోయాయి. 2025 ఏప్రిల్ 302024 మే 172023 ఏప్రిల్ 252021 మే 42023 ఏప్రిల్ 20 -
ఇక భూసార పరీక్షలకు వలంటీర్లు
మంథనిరూరల్: వర్షాకాలం, యాసంగి సీజన్లలో పంటల సాగుకు ముందు ఏ భూమిలో ఏ పంట వేయాలో తెలుసుకునేందుకు భూసార పరీక్షలు చేస్తుంటారు. పంటల్లో నాణ్యమైన అధిక దిగుబడితో పాటు సస్యరక్షణ చర్యలపై ప్రత్యేక దృష్టిసారించే క్రమంలో భూసార పరీక్షలు కీలకమైనవి. అయితే చాలా మంది రైతులకు భూసార పరీక్షలపై అవగాహన లేకపోవడం, వ్యవసాయ అధికారులపై పనిభారం పడుతుండటంతో ఈ పరీక్షలు నామమాత్రంగానే జరిగేవి. ఈనేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా భూసార పరీక్షలు నిర్వహించేలా వలంటీర్ల నియామకానికి కసరత్తు చేస్తోంది. ప్రతీ గ్రామంలో ముగ్గురిని నియమించి ఏటా భూసార పరీక్షలు చేసి ఫలితాలను రైతులకు అందించేలా ఏర్పాట్లు చేస్తోంది. రెవెన్యూ విలేజ్కు ముగ్గురు చొప్పున ప్రతీ రెవెన్యూ విలేజ్కు ముగ్గురు వలంటీర్ల నియామకానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పెద్దపల్లి జిల్లాలో 206 రెవెన్యూ విలేజ్లు ఉన్నాయి. ఇప్పటికే క్లస్టర్ల వారీగా వలంటీర్ల నియామకంపై వ్యవసాయ శాఖ అధికారులు దృష్టి సారించారు. ఆయా గ్రామాల నుంచి రైతులనే వలంటీర్లుగా ఎంపిక చేసేందుకు అవసరమైన ఏర్పాట్లలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది. ముందుకు రాని వలంటీర్లు భూసార పరీక్షలు రైతులకు చేరువ చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం వలంటీర్ల నియామకం చేపట్టగా ఆ దిశగా అడుగులు ముందుకు సాగడం లేదు. ప్రభుత్వం నియామకం చేసే వలంటీర్లకు ఎలాంటి పారితోషికం చెల్లించక పోవడంతో ఉచిత సేవలపై ఆసక్తి చూపడం లేదు. జిల్లా వ్యాప్తంగా 206 రెవెన్యూ విలేజ్లు ఉండగా ప్రతీ రెవెన్యూ విలేజ్కు ముగ్గురు చొప్పన నియమించాలి. కానీ ఇప్పటి వరకు కనీసం 50శాతం కూడా నియామకం జరుగలేదని తెలుస్తోంది. భూసార పరీక్షలతో రైతులకు మేలు భూసార పరీక్షలతో రైతులకు అనేక ప్రయోజనాలు ఉంటాయి. భూసార పరీక్షలు చేయడం ద్వారా ఆ భూమిలో ఏఏ లవణాలు, పోషకాలు తక్కువగా ఉన్నాయో గుర్తించవచ్చు. భూసార పరీక్షలతో ఏ పంట సాగు చేయాలో, ఆ పంటకు ఎంత మోతాదులో ఎరువులు అందించాలో తెలుస్తుంది. భూసార పరీక్షలు చేయించుకోకపోవడంతో పలు రసాయన ఎరువులు వాడటంతో భూసారం దెబ్బతిని పంట దిగుబడిపై ప్రభావం చూపుతోంది. గతంలో వ్యవసాయ అధికారులే.. గతంలో భూసార పరీక్షల బాధ్యతలు వ్యవసాయ శాఖ అధికారులే నిర్వహించే వారు. గత ప్రభుత్వ హయాంలో భూసార పరీక్షల కోసం ప్రత్యేక కిట్లు అందజేయగా రైతు వేదికల్లో రైతు భూమిలోని మట్టిని సేకరించి అక్కడే పరీక్షలు నిర్వహించి ఫలి తాలు చెప్పేవారు. కానీ ఈసారి నూతనంగా వలంటీర్లను నియమించి వారి ద్వారా వ్యవసాయ భూ ముల్లో మట్టిని సేకరించి ల్యాబ్కు పంపి ఫలితాలు అందించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.వలంటీర్ల నియామకం మొదలు పెట్టాం జిల్లావ్యాప్తంగా భూసార పరీక్షల కోసం వలంటీర్ల నియామకం ప్రారంభించారు. 206 రెవెన్యూ విలేజ్లలో అక్కడి వ్యవసాయ అధికారులతో నియామకాలకు శ్రీకారం చుట్టాం. అయితే ఉచితంగా రైతులకు సేవలు అందించాలని ఎవరూ ఆసక్తి చూపడం లేదు. ఈవిషయంలో ప్రతీ గ్రామంలో అవగాహన కల్పిస్తున్నాం. వలంటీర్లను పూర్తి స్థాయిలో నియమించేలా చర్యలు తీసుకుంటాం. – శ్రీనివాస్,జిల్లా వ్యవసాయ శాఖ అధికారి -
ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి
పెద్దపల్లి: ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. ఆదివారం సుల్తానాబాద్ పట్టణంలోని ఆర్యవైశ్యభవన ఆవరణలో నిర్వహించిన శ్రీవాసవీ మాత జయంతి వేడుకల్లో పాల్గొని ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. తమ ప్రభుత్వం ఆర్యవైశ్యులకు అండగా ఉంటుందని అన్నారు. సీఎం రేవంత్రెడ్డి వాసవీమాత జయంతిని ప్రభుత్వపరంగా నిర్వహించడం సంతోషించదగ్గ విషయమని తెలిపారు. ఈసందర్భంగా విజయరమణారావును ఆర్యవైశ్యులు సన్మానించారు. కార్యక్రమంలో వాసవీమాత ఆలయ చైర్మన్ చకిలం మారుతి, ఆర్యవైశ్య సంఘం పట్టణ గౌరవ అధ్యక్షుడు రామ్మూర్తి, అధ్యక్షుడు భాస్కర్, ప్రధాన కార్యదర్శి రాజేంద్రప్రసాద్, మున్సిపల్ చైర్మన్ రాధాకృష్ణ కమిషనర్ రమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
వాసవీ మాత బోధనలు సమాజానికి ఆదర్శం
పెద్దపల్లి: వాసవీ మాత బోధనలు సమాజానికి ఆదర్శమని కలెక్టరేట్ పరిపాలన అధికారి ప్రకాశ్ అన్నారు. ఆదివారం కలెక్టరేట్లో యువజన, పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వాసవీమాట జయంతి వేడుకల్లో వాసవీ మాత చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడా శాఖ అధికారి సురేశ్, మైనారీ వెల్ఫేర్ ఆఫీసర్ నరేశ్, టి.కుమార్, నర్సయ్య, ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడు నలుమాచు ప్రభాకర్, కార్యదర్శి లింగమూర్తి, గౌరవ అధ్యక్షుడు రమేశ్, జిల్లా మహిళా అధ్యక్షురాలు మంచాల జ్యోతి, ఆర్య వైశ్య సంఘం ప్రతినిధులు అనిల్, సురేశ్, వేణు, నవీన్, రాజేందర్, వెంకటరమణ, బీసీ సంఘం నాయకులు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. స్వీయ గణనకు ముందుకు రండికోల్సిటీ: జనాభా లెక్కల్లో స్వీయ గణన సదవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రతిఒక్కరూ తమ వివరాలు నమోదు చేసుకోవాలని రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి అన్నారు. ఆదివారం నగర పాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ జాయింట్ డైరెక్టర్ సుబ్బరాజుతో కలిసి స్వీయ గణన ప్రక్రియను ప్రారంభించారు. రామగుండంలో నివసిస్తున్న వారందరూ తమ వివరాలు నమోదు చేసుకోవాలని కోరారు. ఈ గణాంకాల ఆధారంగానే నిధుల కేటాయింపు, అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలు అమలవుతాయని తెలిపారు. జాయింట్ డైరెక్టర్ సుబ్బరాజు మాట్లాడుతూ సేకరించిన సమాచారం గోప్యంగా ఉంటుందని, ఏప్రిల్ 26నుంచి మే 10వరకు ఆన్లైన్లో స్వీయ గణన చేసుకోవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఆలయ అభివృద్ధికి కృషికమాన్పూర్: మండల కేంద్రంలోని శ్రీఆదివరహస్వామి ఆలయ అభివృద్ధికి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు సహకారంతో కృషి చేస్తానని ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ ముస్త్యాల దామోదర్ అన్నారు. ఆదివారం ఆలయ నూతన పాలకవర్గ సభ్యులు చాట్ల రాయమల్లు, తాళ్ల భాగ్యలక్ష్మి, పిల్లి రాజు, సాగి శ్రీనివాసరావు, తీగల రాజయ్య, తిమ్మరాజు గిరిజ, గాజుల శ్రీనివాస్, కుందారపు శంకర్, బొజ్జ సతీశ్, బూస శ్రీనివాస్, అనవేన శ్యామల, కొంతం శ్రీనివాస్, మల్యాల మల్లేష్లతో దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తొట్ల తిరుపతి యాదవ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు అన్వర్, సర్పంచ్ రంగు సత్యనారాయణగౌడ్, పీఏసీఎస్ మాజీ చైర్మన్ భాస్కర్రావు, మల్యాల రాంచంద్రంగౌడ్, పిల్లి శేఖర్ తదితరులు పాల్గొన్నారు. డబ్బులు ఇప్పించాలిగోదావరిఖని: ఆర్ఎఫ్సీఎల్ ఉద్యోగ బాధితులకు డబ్బులు ఇప్పించేందుకు రామగుండం ఎమ్మెల్యే చొరవ తీసుకోవాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వ్యాల్ల హరీశ్రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎరువుల కర్మాగారం ఉద్యోగ బాధితుల ఓట్లతో ఎమ్మెల్యేగా గెలిచిన మక్కాన్సింగ్ రెండున్నరేళ్లుగా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. దళారులను జైలుకు పంపించి బాధితులకు డబ్బులు ఇస్తానన్న మాట నిలబెట్టుకోవాలన్నారు. బాధితులతో ఢిల్లీకి వెళ్లి కేంద్ర పెట్రోలియంశాఖ అధికారులను కలుస్తామన్నారు. అయినా వినకపోతే గోదావరిఖనిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట టెంట్ వేసి ఆందోళన చేపడుతామని పేర్కొన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ అధికార ప్రతినిధి జాహిద్పాషా, తస్లీమాభాను, పోలాడి శ్రీనివాసరావు, మాజీ కార్పొరేటర్లు అయిత శివకుమార్, రవినాయక్, బొబ్బిలి సతీశ్, యువజన విభాగ అధికార ప్రతినిధి వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
సనాతన హిందూ ధర్మ రక్షణకు నడుం బిగిద్దాం
ఎలిగేడు: సనాతన హిందూ ధర్మరక్షణకు ప్రతీ హిందువు నడుం బిగించాలని విష్ణుసేవానందగిరి స్వామి అన్నారు. ఆదివారం ఎలిగేడు మండల కేంద్రంలోని మధుర ఫంక్షన్హాల్లో జరిగిన హిందూ సమ్మేళనంలో మాట్లాడారు. హిందూ సనాతన ధర్మాన్ని, సంస్కృతి సాంప్రదాయాలను ఆచరించి కాపాడాలని వివరించారు. ఆర్ఎస్ఎస్ విభాగ్ సంపర్క్ కుమ్మరికుంట సుధాకర్ మాట్లాడుతూ దేశంలో హిందువులు సంఘటితంగా ఉండటం అవసరమన్నారు. పిల్లలకు చిన్నప్పటి నుంచే హిందూ సంస్కృతి, సాంప్రదాయాలు నేర్పాలని కోరారు. వీహెచ్పీ జిల్ల్లా మాతృశక్తి సంయోజక ఠాగూర్ తారాబా యి మాట్లాడుతూ పంచపరివర్తనతో కుటుంబంలో మార్పులు తీసుకరావాలన్నారు. ఈ సందర్భంగా ధూళికట్టకు చెందిన గాయత్రి పాఠశాల విద్యార్థుల సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం, భజనలు, భక్తి పాటలు, నృత్యాలు అలరించాయి. హిందూ సమ్మేళనం అధ్యక్షుడు కరివేద రాజిరెడ్డి, ఉపాధ్యక్షుడు భూసారపు నర్సయ్య, కోశాధికారి జనార్దన్, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. -
ఉత్సాహం నింపిన ప్రోమో రన్
గోదావరిఖని: హైదరాబాద్కు చెందిన సొసైటీ ఫర్ తెలంగాణ రన్నర్స్ ఆధ్వర్యంలో గోదావరిఖనిలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఆదివారం నిర్వహించిన అవంతిక తెలంగాణ ప్రోమో రన్–2026 యువతలో ఉత్సాహాన్ని నింపింది. ఈ రన్లో 500 మందికి పైగా ఆన్లైన్లో నమోదు చేసుకోగా మరో 100 మంది స్వచ్ఛందంగా పాల్గొన్నారు. ఎవరి సామర్థ్యానికి తగ్గట్టు వారు 2కే, 5కే, 10కే పరుగు పూర్తి చేసి తమ లక్ష్యాన్ని సాధించారు. 5కే రన్లో ఏసీపీ ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా పాల్గొన్న గోదావరిఖని ఏసీపీ రమేశ్ 5కే రన్ పూర్తి చేసి అందరికీ స్పూర్తిగా నిలిచారు. జూన్ 7న హైదరాబాద్లో జ రిగే ఫైనల్ రన్లో గోదావరిఖని నుంచి పాల్గొనే వారికి ప్రత్యేక ప్రోత్సాహకంగా నగదు బహుమతిని పోలీసు శాఖ తరఫున తాను వ్యక్తిగతంగా అందజేస్తానని ప్రకటించారు. గంజాయి, డ్రగ్స్ మాదక ద్రవ్యాలకు బానిసగా మారుస్తున్న యువత రోజూ మైదానం బాటపట్టాలని సూచించారు. నిత్య ఆరోగ్యం కోసం పరుగు: మేయర్ నిత్యం ఆరోగ్యంగా ఉండేందుకు ప్రతిఒక్కరికీ రన్ని ంగ్ ఎంతో అవసరమని మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మహంకాళి స్వామి అన్నారు. రన్లో పా ల్గొన్న వారికి మెడల్స్ అందజేసి అభినందించారు. అలరించిన జుంబా డ్యాన్స్ సర్వేశ్ డ్యాన్స్ మాస్టర్ నేతృత్వంలో డ్యాన్సర్స్ చేసి న జుంబా డ్యాన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రన్కు ముందు, తర్వాత జరిగిన వార్మప్ సెషన్ అందరినీ అలరించింది. కార్యక్రమంలో సింగరేణి ఆ ర్జీ–2 ఎస్ఓటూ జీఎం రాముడు, సొసైటీ ఫర్ తెలంగాణ రన్నర్స్ అధ్యక్షుడు సోమా జగన్మోహన రెడ్డి, ఉపాధ్యక్షుడు మహేష్పటేల్, కోశాధికారి హరీశ్చంద్రరెడ్డి, ఈసీ సభ్యులు రవి, రాజు, సదాశయ ఫౌండేషన్ జాతీయ గౌరవ అధ్యక్షుడు సానా రామకృష్ణారెడ్డి, కార్యదర్శి లింగమూర్తి, ప్రతినిధులు కేఎస్ వాసు, చంద్రమౌళి, శంకర్, జబ్బర్ ఖాన్, సోమారపు అరుణ్ కుమార్, లావణ్య, వనజా రాపోలు, జ్యోతి, వెల్దీ కవిత అనంతరాములు పాల్గొన్నారు. -
ఈతకొడుతుండగా నీటమునిగి యువకుడి మృతి
రామగుండం: పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం పెద్దంపేట గ్రామ శివారులోని చెరువుకట్ట సమీపంలో నివాసముండే బుడిగజంగాల కుటుంబానికి చెందిన పస్తం పవన్(18) శనివారం ఈతకొడుతుండగా పిట్స్ రావడంతో నీటమునిగి చనిపోయాడు. మరోఇద్దరు యువకులతో కలిసి చెరువులో ఈదుతుండగా పిట్స్ వచ్చినట్లు స్థానికులు తెలిపారు. యువకుడు కొన్నేళ్లుగా పిట్స్తో బాధపడుతూ చికిత్స పొందుతున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. కాగా పస్తం రాంచందర్కు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు పవన్ ఉన్నాడు. రాంచందర్కు ఉన్న ఏకై క కుమారుడు పవన్ మృత్యువాత పడడంతో కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొన్నట్లు ఎస్సై వెంకటస్వామి తెలిపారు. జగిత్యాలక్రైం: బీర్పూర్ మండలకేంద్రంలో ద్విచక్రవాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ఘటనలో అదేగ్రామానికి చెందిన చీర్నేని బుచ్చన్నకు తీవ్రగాయాలయ్యాయి. బుచ్చన్న తన ద్విచక్ర వాహనంపై పొలం పనులకు వెళ్తుండగా.. జన్నారం నుంచి జగిత్యాలకు వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ఘటనలో బుచ్చన్న తలకు తీవ్రగాయాలుకాగా.. స్థానికులు 108 ద్వారా జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బీర్పూర్ ఎస్సై రాజు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. బాలికపై లైంగిక దాడి చేసిన వ్యక్తి అరెస్ట్ జగిత్యాలక్రైం: జగిత్యాలకు చెందిన బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిపై పోక్సో, కిడ్నాప్, అత్యాచారం కేసులు నమోదు చేసి నింది తుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ కరుణాకర్ తెలిపారు. హౌసింగ్బోర్డు కాలనీలో ని వాసముంటున్న మనువాడ విష్ణువర్దన్ కొద్దిరోజు ల క్రితం పట్టణానికి చెందిన ఓ బాలికను కిడ్నాప్ చే సి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక తండ్రి ఫిర్యా దు మేరకు నిందితుడిని రిమాండ్కు పంపించినట్లు సీఐ తెలిపారు. దాడి చేసిన వ్యక్తి రిమాండ్చందుర్తి(వేములవాడ): పాతకక్షలను దృష్టిలో పెట్టుకుని దాడిచేసిన చందుర్తి మండలం జోగాపూర్కు చెందిన ఓ వ్యక్తిని శనివారం అరెస్టు చేసినట్లు ఎస్సై జిల్లెల్ల రమేశ్ తెలిపారు. ఎస్సై రమేశ్ తెలిపిన వివరాలు. చందుర్తి మండలం జోగాపూర్కు చెందిన గొంటి లక్ష్మణ్ రోడ్డుపై వెళ్తుండగా అదే గ్రామానికి చెందిన నామాల ఉరఫ్ మ్యాదరి నర్సయ్య ఈనెల 5న గొడ్డలి కామతో దాడి చేశాడు. బాధితుడు లక్ష్మణ్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, రిమాండ్కు తరలించారు. ‘దేవి పుత్రిక’ అభినందనీయం ● జిల్లా అదనపు, సెషన్స్ జడ్జి నీరజ కరీంనగర్: ఆడపిల్ల పుడితే భారమనే వివక్షను వీడి, లక్ష్మీదేవిలా భావించినప్పుడే సమాజంలో లింగనిష్పత్తి తేడాలు తొలగిపోతాయని కరీంనగర్ జిల్లా అదనపు, సెషన్స్ జడ్జి నీరజ అన్నారు. కరీంనగర్ నగరంలో రోహన్ ఆసుపత్రి ప్రారంభించి 25వ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా శనివారం ‘దేవిపుత్రిక’ అనే వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం కింద ఆడపిల్ల పుడితే నార్మల్ డెలివరీ అయినా, సిజేరియన్ అయినా సంవత్సరం పాటు పూర్తిగా ఉచిత వైద్య సేవలు అం దించేందుకు డాక్టర్లు ఎనమల్ల శ్రీదేవి, ఎనమల్ల నరేశ్ ముందుకొచ్చారు. శనివారం ఆసుపత్రి ప్రాంగణంలో జరిగిన ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బీఎన్ రావుతో కలిసి ‘దేవిపుత్రిక’ పోస్టర్ ఆవిష్కరించి, కార్యక్రమాన్ని ప్రారంభించారు. సమాజంలో ఆడపిల్లల విషయంలో ఉన్న వివక్షను తొలగించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని నిర్వాహకులు తెలిపారు. -
కొడుకు హత్యకు తల్లి ప్లాన్
మంథనిరూరల్: కన్న కొడుకునే మరోకొడుకుతో అంతం చేయాలని చూసిందో తల్లి.. అర్ధ రా త్రి నిద్రిస్తున్న అన్నపై పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య చేసేందుకు యత్నించిన ఘటన పెద్దపల్లి జి ల్లా మంథని మండలం లక్కేపూర్లో చోటుచేసు కుంది. మంథని మండలం లక్కేపూర్ గ్రామానికి చెందిన కొత్త రఘుపై అతడి తమ్ముడు అనిల్ పె ట్రోల్ పోసి నిప్పంటించగా తీవ్రగాయాలు కావడంతో ఎంజీఎంకు తరలించారు. బాధితుడి సోదరి పా లడుగు సౌజన్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. వారి కథనం ప్రకారం.. రఘు తండ్రి 15ఏళ్లక్రితం చనిపోయాడు. తల్లి జ్యో తి తన తమ్ముళ్లతో కలిసి గ్రామంలోనే ఉంటున్నారు. తల్లి ప్రవర్తన బాగా లేకపోవడంతో తరచూ పెద్దతమ్ముడు గొడవ ప డుతుండేవాడు. శుక్రవారం రాత్రి సైతం గొడవ జరగడంతో తనకు అడ్డుగా వస్తున్నాడని భావించిన తల్లి.. తన చిన్న కొ డుకుతో పెద్ద కొడుకును చంపాలని పథకం వేసింది. ఈ క్రమంలో అంతకుముందే తెచ్చుకున్న పెట్రోల్ను నిద్రిస్తున్న రఘుపై పోసి నిప్పంటించాడు. మంటల తీవ్రతకు అరవడంతో స్థానికులు గమనించి కరీంనగర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వరంగల్ ఎంజీఎంకు తరలించారు. విచారణ జరిపి తన పెద్ద తమ్ముడిపై హత్యాయత్నం చేసి చిన్నతమ్ముడు అనిల్, తల్లి జ్యోతిపై తగిన చర్యలు తీసుకోవాలని సౌజన్య తన ఫి ర్యాదులో పేర్కొంది. చిన్న కొడుకును ప్రేరేపించిన తల్లి పెట్రోల్పోసి నిప్పంటించిన వైనం చావుబతుకుల్లో పెద్దకుమారుడు లక్కేపూర్ గ్రామంలో ఘటన -
న్యామూర్తి పోస్టు ముళ్ల కిరీటం
వేములవాడ: జడ్జి పోస్టు ముళ్ల కిరీటంలాంటిదని, ఒక్కో రోజు కేసులు పూర్తిస్థాయి పరిష్కరించేందుకు రాత్రి అవుతుందని, కేసుల్లో బ్యాలెన్స్ చేయడంలో చాలా జాగ్రత్తలు పాటించాల్సి వస్తుందని సీనియర్ సివిల్ జడ్జి అజయ్కుమార్ జాదవ్ పేర్కొన్నారు. వేములవాడ జూనియర్ సివిల్ జడ్జిగా మూడేళ్లపాటు విధులు నిర్వహించి ఖమ్మంకు బదిలీపై వెళ్తున్న జ్యోతిర్మయిని బార్ అసోసియేషన్ హాలులో శనివారం సత్కరించారు. ఈ సందర్భంగా అజయ్కుమార్ జాదవ్ మాట్లాడుతూ ఎంతో మంది అభాగ్యులు న్యాయం కోసం కోర్టులను ఆశ్రయిస్తారని, ఈక్రమంలో తమపై ఎంతో బాధ్యత ఉంటుందన్నారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పిట్టల మనోహర్ మాట్లాడుతూ జడ్జిగా విధులు నిర్వహించిన సమయంలో జూనియర్లకు ఎంతో అవకాశం కల్పించారని, బార్ అండ్ బెంచ్ సత్సంబంధాలతో కొనసాగాయన్నారు. మహిళలకు ఆదర్శం వేములవాడ జూనియర్ సివిల్ జడ్జిగా విధులు నిర్వహిస్తున్న క్రమంలోనే ఆగస్టు 16న వేములవాడ ప్రభుత్వాస్పత్రిలో నార్మల్ డెలివరీతో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చి సర్కార్ ఆస్పత్రులపై నమ్మకం పెంచారన్నారు. ఇలా మహిళలకు ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. ఏ ఆడపిల్లకై నా మొదటి డెలివరీ తల్లిగారింట్లో జరుగుతుందని.. అందుకే జడ్జి జ్యోతిర్మయికి వేములవాడ పుట్టినిల్లులాంటిదన్నారు. ఈక్రమంలో తమ సోదరికి వీడ్కోలు పలుకుతున్నట్లు భావిస్తున్నట్లు పేర్కొన్నారు. సీనియర్ సివిల్ జడ్జి అజయ్కుమార్ జాదవ్ జూనియర్ సివిల్ జడ్జి జ్యోతిర్మయికి వీడ్కోలు కంటతడి పెట్టిన జడ్జి జ్యోతిర్మయి కంటతడి పెట్టిన జడ్జి జ్యోతిర్మయి అనేక ఒడిదొడుకులు ఎదుర్కొని వేములవాడ జూనియర్ సివిల్ జడ్జిగా నియమితులైన జ్యోతిర్మయి వేములవాడను తన పుట్టినిల్లుగా మార్చుకున్నారంటూ పలువురు అడ్వకేట్లు కొనియాడడంతో భావోద్వేగానికిలోనయ్యారు. జడ్జి జ్యోతిర్మయి మాట్లాడుతుండగా కంటతడి పెట్టుకున్నారు. బార్ అసోసియేషన్ హాలులో శనివారం జరిగిన వీడ్కోలు సమావేశంలో ఆమె తన అనుభవాలను వివరిస్తూ వేములవాడను మరచిపోలేనని, తనను ఇంతగా ఆదరించిన వేములవాడ అడ్వేకేట్ల సేవలు గుర్తుండిపోతాయన్నారు. ఈక్రమంలో పలువురు అడ్వకేట్లు, కోర్టు సిబ్బంది సైతం భావోద్వేగానికి లోనయ్యారు. -
సహజ మరణానికి రూ.10 లక్షలు
గోదావరిఖని: సింగరేణి ఉద్యోగులకు బీమాపై ధీమా కల్పించేందుకు యాజమాన్యం ముందుకు వచ్చింది. సంస్థపై ఆర్థిక భారం పడకుండా చర్యలు తీసుకుంటోంది. ఈమేరకు అత్యధిక బ్యాంకు ఖాతాలు ఉన్న ఎస్బీఐతో ఒప్పందం చేసుకుంది. సహజ మరణానికి రూ.10 లక్షల బీమా సౌకర్యం వర్తించేలా ఒప్పందం కుదుర్చుకుంది. ఈనెల 23న సింగరేణి భవన్లో జరిగిన కార్యక్రమంలో ఎస్బీఐ అధికారులతో ఒప్పందం కుదిరింది. ఇప్పటివరకు ప్రమాదాల్లో మృతి చెందిన ఉద్యోగుల కుటుంబాలకు రూ.కోటి చెల్లించే బీమా పథకాన్ని అమలు చేస్తోంది. 2021–22 నుంచి ప్రమాద బీమా పథకం అమలవుతోంది. 50 మందికి రూ.30కోట్ల చెల్లింపు ఎస్బీఐ ప్రమాద బీమా సింగరేణి ఉద్యోగులను ఆ దుకుంటోంది. ఇప్పటివరకు జరిగిన పలు ప్రమాదాల్లో మృతి చెందిన 50 మంది ఉద్యోగుల కుటుంబాలకు రూ. 30కోట్ల బీమా సొమ్ము చెల్లించింది. ఆరోగ్య బీమా కూడా.. కార్పొరేట్ సాలరీ ఖాతా కలిగిన ఉద్యోగుల కుటుంబ సభ్యులు రూ.8,906 ప్రీమియం చెల్లిస్తే భార్యాభర్తలతోపాటు ఇద్దరు పిల్లలకు రూ.50 లక్షల ఆరోగ్య బీమా పథకాన్ని ఎస్బీఐ అందిస్తోంది. సాధారణ ఆ రోగ్య బీమా ప్రీమియంతో పోల్చితే తక్కువ ఇన్స్టాల్మెంట్తో ఖాతాదారులకు అందిస్తోంది. రూ.కో టి ప్రమాద బీమాతో పాటు పాక్షిక అంగవైకల్యం, సంపూర్ణ అంగవైకల్యానికి కూడా నిబంధనల ప్రకారం రూ.కోటి బీమా సొమ్ము చెల్లిస్తోంది. రిటైర్డ్ కార్మికులకు కూడా రూ.30 లక్షల ప్రమా ద బీమా పథకాన్ని 70ఏళ్ల వరకు అందిస్తోంది. మృతుడి కుటుంబంలోని పిల్లలు 18 నుంచి 25 సంవత్సరాలలోపు ఉన్నవారు చదువుతూ ఉంటే అబ్బాయి అయితే రూ.8లక్షలు, అమ్మాయి అయితే రూ.10 లక్షలు చదువు కొనసాగించడా నికి బ్యాంకు చెల్లిస్తోంది. వివాహ వయసు కలిగి న పిల్లలు ఉంటే ఒక్కొక్కరికి రూ.ఐదు లక్షలు చొప్పున గరిష్టంగా ఇద్దరికి కలిపి రూ.10 లక్షల వరకు చెల్లిస్తోంది. ప్రమాదాల్లో గాయపడిన వా రికి ప్లాస్టిక్ సర్జరీ అవసరమైతే రూ.5లక్షల చెల్లిస్తామని, తమ బ్యాంకుతో పాటు ఇతర బ్యాంకుల ఏటీఎంలలో ఉచితంగా లావాదేవీలు జరుపుకునే అవకాశం ఉందని, ఇంకా అనేక సౌకర్యాలు ఈ ఒప్పందంలో పొందుపరిచామని సింగరేణి ఉన్నతాధికారులు వెల్లడించారు. సింగరేణి ఉద్యోగులకు బీమా సౌకర్యం ఎస్బీఐతో ఒప్పందం చేసుకున్న యాజమాన్యం -
కమ్ముకున్న మేఘం.. రైతుల్లో భయం
వీణవంక: రెండ్రోజులుగా ఆకాశం మేఘావృతమై మబ్బులు కమ్ముకున్నాయి. ఎప్పుడు ఆకాల వర్షాలు పడతాయోనని విత్తనోత్పత్తి రైతులు కలవరపడుతున్నారు. వారం రోజుల్లో ఆడ, మగ వరి కోతలు ప్రారంభం కానుండగా వాతావరణం చల్లబడుతుండటం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. ఉత్తర తెలంగాణలోనే హైబ్రిడ్ సాగులో కరీంనగర్ జిల్లా మొదటి స్థానంలో ఉంది. మరో వారం రోజుల్లో పంట కోతలు ప్రారంభిచనున్నారు. కరీంనగర్ జిల్లాలో వీణవంక, జమ్మికుంట, శంకపట్నం, పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్, ఓదెల, ముత్తారం, జగిత్యాల జిల్లాలో పెగడపల్లి, ధర్మారం మండలాల్లో హైబ్రిడ్ సీడ్ను సాగు చేస్తున్నారు. ఈ సారి 1.20లక్షల ఎకరాల్లో వరిసాగులోకి వచ్చినట్లు కంపెనీ ప్రతినిధులు చెప్పుతున్నారు. ఆడ వరి కన్నా వారం ముందు మగ వరి కోయాల్సి ఉంటుంది. మగ వరి కోతలు ప్రారంభం కాగా.. ఆడవరి కోతలు ఇంకా ప్రారంభం కాలేదు. ప్రస్తుతం ఆడపైరులో బెరుకు తీసే పనిలో రైతులు బిజీగా ఉన్నారు. చిరుజల్లులకే నేలరాలే స్వభావం మగ వడ్లను కంపెనీలు కొనుగోలు చేయవు. ఆడ వడ్లను మాత్రమే దిగుమతి చేసుకుంటాయి. క్వింటాల్కు రూ.7వేల నుంచి రూ.20వేల వరకు కంపెనీలు చెల్లిస్తున్నాయి. మగ వడ్లను రైతులు ప్రైవేట్గా విక్రయించాల్సిందే. ఆడవడ్లకు ఈదురుగాలులు, చిరుజల్లులకే నేలరాలే స్వభావం ఉంటుంది. కంపెనీ ప్రతినిధులు వచ్చి సర్టిఫై చేస్తేనే వరి కోయాల్సి ఉంటుంది. లేకుంటే ధాన్యం రిజెక్ట్ చేసే అవకాశం ఉండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ నెల 28నుంచి వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ ప్రకటించడంతో రైతులు దిక్కుతోచన స్థితిలో పడ్డారు. పెట్టుబడి ఎక్కువే సాధారణ వరి సాగు చేస్తే ఎకరాకు రూ.20వేల నుంచి రూ.25వేల పెట్టుబడి అవుతుంది. ఆడ, మగ సాగు చేస్తే రూ.40వేల నుంచి రూ.50వేల పెట్టుబడి అవుతుంది. ఎకరం నాటు(హైబ్రిడ్)కు 20మంది కూలీలు అవసరం. సాధారణ వరికి 12మందితో పూర్తి చేస్తారు. వాతావరణం అనుకూలిస్తే హైబ్రిడ్ వరికి రూ.లక్ష నుంచి రూ.1.50లక్షల మధ్య దిగుబడి వస్తుంది. జిల్లాలోనే వీణవంక మండలం బేతిగల్, మల్లారెడ్డిపల్లి గ్రామాలు దిగుబడిలో మొదటిస్థానంలో ఉన్నాయి. పెద్దపల్లి జిల్లాలోని ముత్తారం మండలం ఓడేడు గ్రామం సాగులో ఆదర్శంగా నిలస్తుంది. వరుణుడు 15రోజులు గడువు ఇస్తే రైతులు గట్టెక్కనున్నారు. లేకుంటే తీవ్ర నష్టపోయే ప్రమాదముంది. కోతదశలో హైబ్రిడ్(ఆడ, మగ) వరి ఈ సమయంలో వర్షాలు కురిస్తే పైరుకు తీవ్ర నష్టం చిరుజల్లులకే గింజలు నేలరాలే స్వభావం ఆందోళనలో సీడ్ వరి రైతులు జిల్లాలో 1.20లక్షల ఎకరాలలో సాగు మూడేళ్లుగా వరి సాగు వివరాలు(ఎకరాల్లో 2024 68,000 2025లో 85,000 2026లో 1.20,000 ఐదు ఎకరాలలో ఆడ, మగ వరి పంట వేసిన. మగ వరి కోసి రెండు రోజులవుతుంది. ఆడ వరి కోయడానికి కంపెనీ ప్రతినిధులు ఇంకా అనుమతి ఇవ్వలేదు. రెండు రోజులుగా మబ్బులు కమ్ముకుంటుంటే ప్రాణం వణుకుతోంది. పంట చేతికి వచ్చిన సమయంలో ఆకాల వర్షాలు పడితే కోలుకోలేం. ఇప్పటికే ఎకరాకు రూ.40వేల పెట్టుబడి పెట్టిన. పది రోజులు వరుణుడు కరుణిస్తే గండం నుంచి గట్టెక్కుతా. – శ్రీనివాస్, రైతు, బేతిగల్ -
ఉద్యోగులెవరూ ఆత్మహత్య చేసుకోవద్దు
పెద్దపల్లి: సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగులెవరూ ఆత్మహత్య చేసుకోవద్దని ఉద్యోగ జేఏసీ నాయకులు కోరారు. ఆర్టీసీ సమ్మె సందర్భంగా మనస్తాపం చెంది నర్సంపేటలో ఆత్మహత్య చేసుకున్న ఆర్టీసీ ఉద్యోగి కోలా శంకర్గౌడ్ చిత్రపటం వద్ద కలెక్టరేట్లో శనివారం ఉద్యోగ జేఏసీ నాయకులు నివాళి అర్పించాయి. అనంతరం మే 5న చేపట్టనున్న నిరాహార దీక్ష కోసం కలెక్టర్ కోయ శ్రీ హర్షను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు బొంకూరి శంకర్, తూము రవీందర్ పటేల్, లెంకల బ్రహ్మానందరెడ్డి, కరుణాకర్, సాజిద్ అలీ, రవీంద్రనాథ్, రవీందర్, బావ్సింగ్, రంగారెడ్డి, సురేశ్, అనిత తదితరులు పాల్గొన్నారు. ఆర్టీసీ కార్మికుల సంబురాలు గోదావరిఖనిటౌన్: ఆర్టీసీ డిపోలో కార్మికులు శనివారం సంబురాలు జరుపుకున్నారు. కార్మిక సంఘాల జేఏసీతో జరిగిన చర్చలు సఫలం కావడంతో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మిఠాయిలు పంచిపెట్టి ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఖని ఆర్టీసీ జేఏసీ చైర్మన్ వంగర శ్రీనివాస్, నాయకులు శామ్యూల్, తిరుపతి, కార్తీక్, నాగరాజు, కె.రాణి, బి.రాణి, శ్రీనివాస్, రాజేశ్, ఎంవీ రెడ్డి పాల్గొన్నారు. -
ఆర్టీసీ కార్మికుల మౌనప్రదర్శన
గోదావరిఖనిటౌన్: ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె మూడోరోజు కొనసాగింది. ఈ సందర్భంగా గోదావరిఖని ఆర్టీసీ డిపో ఎదుట కార్మికులు శుక్రవారం నోటికి నల్లగుడ్డ కట్టుకొని మౌన ప్రదర్శన నిర్వహించారు. ప్లకార్డులతో నిరసన తెలిపారు. వరంగల్ జిల్లా నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్ కోలా శంకర్గౌడ్ ఆత్మాహుతికి సంతాపం తెలియజేస్తూ మౌనం పాటించారు. బీజేపీ నియోజకవర్గ ఇన్చార్జి కందుల సంధ్యారాణి వారికి మద్దతు తెలుపుతూ దీక్షలో కూర్చున్నారు. కార్యక్రమంలో ఆర్టీసీ జేఏసీ ఛైర్మన్ వంగర శ్రీనివాస్, కార్మికులు పాల్గొన్నారు. డ్రైవర్ మృతికి సంతాపం.. మంథని డిపో ఎదుట ధర్నా మంథని: నర్సంపేట బస్సు డిపో డ్రైవర్ శంకర్ మృతికి సంతాప సూచకంగా మంథని డిపో ఎదుట కార్మికులు బైఠాయించి నిరసన తెలిపారు. ఆర్టీసీ యాజమాన్యం నిర్లక్ష్యంతోనే డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడని ఆవేదన చెందారు. డిమాండ్లను పోరాటాల ద్వారానే పరిష్కరించుకోవాలని, ఆత్మహత్యలు వద్దని జేఏసీ చైర్మన్ కేకే రెడ్డి, వైస్ చైర్మన్లు ఐలయ్య, ఖాదర్ కోరారు. డ్రైవర్ మృతికి కార్మికులు సంతాపం తెలిపారు. ఎస్ఐ రమేశ్ ఆధ్వర్యంలో పటిష్ట పోలీస్ బందోబస్తు చేపట్టారు. ఆర్టీసీ బస్సులు లేక ప్రయాణికులు అవస్థలు పడ్డారు. ప్రైవేటు బస్సులను నడిపించారు. మంథని బస్సు డిపో వెల్పేర్ కమిటీ సభ్యులు, డ్రైవర్ సతీశ్, కండక్టర్ సుమలత తమ పదవులకు రాజీనామా చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు గందం రమేశ్, ఖుతుబుద్దీన్,జనార్దన్, పోచం, ఇంతియాజ్ బేగం, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. పోలీసుల భారీబందోబస్తు పెద్దపల్లి: జిల్లా కేంద్రంలోని బస్టాండ్లో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. అనూహ్య ఘటనలు జరిగితే ఇబ్బందులు తలెత్తకుండా 108 అంబులెన్సును సైతం అందుబాటులో ఉంచారు. పెద్దపల్లితోపాటు సుల్తానాబాద్ బస్టాండ్లోనూ ఎస్సైలు భద్రతా చర్యలు పర్యవేక్షించారు. -
క్రీడలు స్నేహానికి వారధులు
జ్యోతినగర్: కేంద్రీయ విద్యాలయ రీజియన్ క్రీడలు స్నేహానికి వారధులని రామగుండం–తెలంగాణ ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చందన్ కుమార్ సామంత అన్నారు. ఎన్టీపీసీ స్పందన క్లబ్ ఆడిటోరియంలో మూడు రోజుల పాటు నిర్వహించే స్పోర్ట్స్ మీట్ను ఆయన శుక్రవారం ప్రారంభించి మాట్లాడారు. క్రీడలతో ఆరోగ్యంతోపాటు మానసికోల్లాసం కలుగుతుందని అన్నారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదన్శనలు ఆకట్టుకున్నాయి. అండర్–14, 17, 19లో పోటీలు నిర్వహించారు. ఇన్చార్జి ప్రిన్సిపల్ సర్దార్ బాషా, ఏజీఎం సాగర్ రంజన్ సాహూ, సీఎంవో లహరి, స్పందన క్లబ్ అధ్యక్షుడు, జనరల్ మేనేజర్ బినోయ్ జోష్తోపాటు రీజియన్ పరిధిలోని 35 విద్యాలయాలకు చెందిన 137 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. -
సింగరేణి ‘సూపర్’ బజార్
గోదావరిఖని: సింగరేణి సూపర్ బజార్(సూపర్ మార్కెట్)ను మరింత పటిష్టం చేశారు. అన్నిరకాల సరుకులతో వ్యాపార లావాదేవీలు పెంచుతున్నారు. సింగరేణి కార్మిక కుటుంబాలకు రాయితీతో కూడిన నిత్యావసరాలు, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ గూడ్స్ అందించేందుకు గోదావరిఖని న్యూఅశోకథియేటర్ సమీపంలో సూపర్బజార్ కొనసాగుతోంది. కార్మిక కుటుంబాలతోపాటు స్థానికులకు నాణ్యమైన సరుకులను అందించడానికి సిద్ధమైంది. గత మార్చిలో ఆర్థిక సంవత్సర ముగిసింది. దీంతో కొత్త స్టాక్ తెప్పిస్తూ విక్రయిస్తున్నారు. నిత్యావసరాల విక్రయాలు.. నూతన ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో ఏప్రిల్ నుంచి వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా అన్నిరకాల నిత్యావసరాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. నాణ్యమైన పప్పుదినుసులు, వంటనూనెలు, బియ్యం విక్రయిస్తున్నారు. ఇతరత్రా సామగ్రి అందుబాటులోకి తెస్తున్నారు. ఎలక్ట్రిక్ అండ్ ఎలక్ట్రానిక్స్.. కార్మికకుటుంబాలకు సులభమైన వాయిదా పద్ధ తుల్లో ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ వస్తువులను విక్రయించేందుకు సిద్ధం చేశారు. గృహోపకరణాలు, ఏసీలు, మొబైల్ ఫోన్స్, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మిషన్స్, టీవీలు అందుబాటులోకి తీసుకొచ్చారు. సూపర్ బజార్ పనిచేసే వేళలు ఆధునికత సంతరించుకున్న మార్కెట్ విస్తరిస్తున్న వ్యాపార లావాదేవీలు -
నడుం నొప్పి.. కంటి సమస్య
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్– ఎస్ఐఆర్) ప్రక్రియ నమోదు సిబ్బందికి కొత్త సమస్యలు తీసుకొస్తోంది. సర్ దరఖాస్తు పత్రంలో 2003నాటి ఎస్ఐఆర్ పత్రంలో ప్రచురితమైన ఓటరు వ్యక్తిగత వివరాలను అతడు లేదా ఆమె, తాతతండ్రుల పేర్లను కానీ ఇవ్వాలి. ఈ మేరకు 2003 నాటి ఓటరు జాబి తాలను ఎన్నికల సంఘం వెబ్సైట్లో ఉంచారు. ఏ ఓటరుకై నా 2003 జాబితాలోని తన అసెంబ్లీ నియోజకవర్గం కానీ, పోలింగ్ బూత్ కానీ స్పష్టంగా తెలియకపోతే పెద్ద చిక్కే వస్తుంది. దీంతో ఆ ఓటరు వివరాల కోసం ఆ నియోజకవర్గంలోని అన్ని పోలింగ్ బూత్ల్లో వెతకాల్సిన పరిస్థితి నెలకొంది. ఓటరు దీర్ఘకాలంగా ఒకేచోట నివసిస్తున్నా, నియోజకవర్గం, పోలింగ్ కేంద్రం మారిపోయిన వారి వివరాలను వెతకడం సిబ్బందికి తలనొప్పిగా మారింది. ఆయా ఓటర్ల వివరాలను 2003 జాబితా ఆధారంగా సేకరించలేక బీఎల్వోలకు కొత్తగా కంటి సమస్యలు, నడుం నొప్పి వస్తోందని వాపోతున్నారు.సర్ అంటే -
పరిశుభ్ర రామగుండమే లక్ష్యం
కోల్సిటీ: చెత్త రహిత రామగుండం లక్ష్యంగా ప్రత్యేక కార్యాచరణ కొనసాగుతోందని, నగరం పూర్తిస్థాయిలో శుభ్రమయ్యేవరకూ విశ్రాంతి తీసుకోబోమని రామగుండం మేయర్ మహంకాళి స్వామి అన్నారు. శుక్రవారం 36వ డివిజన్లోని గాంధీనగర్లో కార్పొరేటర్ కల్వల పద్మావతితో కలిసి ఆయన పర్యటించారు. నగరాభివృద్ధికి ప్రధాన అవరోధంగా మారిన చెత్తను పూర్తిగా తొలగిస్తామన్నారు. ఇరుకు వీధులతో చెత్త సేకరణకు ఆటోట్రాలీలు, అత్యవసర సమయాల్లో అంబులెన్స్ వెళ్లేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. ఇళ్లఎదుట నిర్మించుకున్న గద్దెలను స్వచ్ఛందంగా తొలగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు రంజిత్, మారెల్లి రాజిరెడ్డి, గడ్డం శ్రీనివాస్, విజయ్తోపాటు డిప్యూటీ కమిషనర్ వెంకటస్వామి, ఎస్ఈ గురువీర, ఈఈ పీవీ రామన్, డీఈలు అఫ్తాబ్, జగదీశ్, ఏఈలు అన్వేశ్, టీపీఎస్ నవీన్, శానిటరీ ఇన్స్పెక్టర్ సంపత్, జవాన్ అశోక్ తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్లో ఉత్తమ ర్యాంక్ సాధించాలి స్వచ్ఛ సర్వేక్షణ్లో రామగుండం ఉత్తమ ర్యాంక్ సాధించేలా సిబ్బంది సమన్వయంతో పనిచేయా లని మేయర్ మహంకాళి స్వామి కోరారు. శానిటే షన్ డ్రైవర్లు, సిబ్బందితో బల్దియాలో ఆయన సమీక్షించారు. వేసవిలో జాగ్రత్తలు తీసుకుంటూ విధు లు నిర్వర్తించాలని సిబ్బందికి సూచించారు. డ్రైవ ర్లు, డ్రైన్క్లీనర్లు, జవాన్లు చక్కగా పనిచేస్తూ నగరపాలక సంస్థకు రూ.లక్షల ఆదాయ ఆదా చేస్తున్నా రని కితాబిచ్చారు. డిప్యూటీ కమిషనర్ వెంకటస్వామి, ఎస్ఈ గురువీర, ఈఈ రామన్, డీఈ శాంతిస్వరూప్, సూపరింటెండెంట్ శ్రీనివాస్, సీనియర్ అసిస్టెంట్ శ్రీపాల్, జవాన్లు పాల్గొన్నారు. అప్పటి వరకు విశ్రాంతి తీసుకునేదిలేదు రామగుండం మేయర్ మహంకాళి స్వామి -
జూన్ 2న తహసీల్దార్ భవనం ప్రారంభం
● కలెక్టర్ కోయ శ్రీహర్ష ముత్తారం: స్థానిక తహసీల్దార్ భవనం జూన్ 2న ప్రారంభించే అవకాశం ఉందని, ఇందుకోసం అన్నీ సిద్ధం చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. స్థానిక తహసీల్దార్ భవన నిర్మాణ పనులను ఆయన శుక్రవారం పరిశీలించారు. పనులు నాణ్యతతో వేగవంతం చేయాలని పీఆర్ ఏఈ జగదీశ్, కాంట్రక్టర్ను ఆదేశించారు. రాష్ట్ర అవతరణ రోజున భవనం ప్రారంభం అయ్యేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. మండలంలోని 28 ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన అభివృద్ధి పనులను వేసవిలో పూర్తిచేయాలని చెప్పారు. ఆయన వెంట తహసీల్దార్ మధూసూదన్రెడ్డి ఉన్నారు. నామినేటెడ్ ద్వారానే ‘సహకార’ చైర్మన్ల భర్తీ పెద్దపల్లి: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల చైర్మన్లు, డైరెక్టర్లను నామినేటెడ్ పద్ధతిన భర్తీ చేస్తామని మంత్రివర్గం ప్రకటించడంతో ఆశావహుల్లో సందడి నెలకొంది. అధికార పా ర్టీ నాయకులు ఎవరికి వారే నామినేటెడ్ పోస్టులపై ఆశలు పెంచుకుంటున్నారు. జిల్లాలో 20 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఉండగా 13 మండలాల్లో విస్తరించి ఉన్నాయి. సొసైటీల్లో 46,531 మంది ఓటర్లు ఉండగా పురుషులు 36,673 మంది, మహిళలు 9,858 మంది ఉన్నారు. కొత్త జిల్లాలు ఏర్పడిన దగ్గరనుంచి ఉమ్మడి జిల్లాలో కేడీసీసీ మాత్రమే కొనసాగుతోంది. డీసీఎంఎస్లు, కేడీసీసీలు కొత్తవి ఏర్పాటు చేస్తారా? లేక పాత వాటినే కొనసాగిస్తారా? అనేది ప్రభుత్వ నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది. 20న హైదరాబాద్కు పాదయాత్ర పెద్దపల్లి: విద్యార్థుల పెండింగ్ స్కాలరషిప్లు, ఫీజురీయింబర్స్మెంట్ విడుదల చేయాలనే డిమాండ్తో ఈనెల 28న హైదరాబాద్లోని సీఎం ఇంటి వరకు పాదయాత్ర చేపడతామని ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు సాయి ఆజాద్ తెలిపారు. ‘చలో సీఎం ఇంటికి’ పాదయాత్ర పోస్టర్ను జిల్లా కేంద్రంలో శుక్రవారం ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. స్కాలర్షిప్లు, ఫీజురీయింబర్స్మెంట్ రాక విద్యార్థులు తీవ్రఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఫీజు లు చెల్లిస్తేనే హాల్ టికెట్లు, సర్టిఫికెట్లు ఇస్తామని ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులను వేధిస్తున్నాయని ఆయన అన్నారు. యాజమాన్య పద్ధతులు పాటించాలి ఎలిగేడు: రైతులు యాజమాన్య పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడి సాధ్యమని రామగిరి ఖిల్లా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు వెంకన్న, భాస్కర్రావు, కిరణ్ పెల్లి అన్నారు. ధూళికట్ట రైతువేదికలో శుక్రవారం సమతుల్య ఎరువుల వినియోగంపై రైతులకు అవగాహన క ల్పించారు. నత్రజని, భాస్వరం, ఫొటాష్ వినియోగంపై అవగాహన కల్పించారు. అనంతరం పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా సర్పంచ్, ప్రజలకు పంచాయతీరాజ్ ప్రాముఖ్యత గురించి వివరించారు. సర్పంచ్ కొమురయ్య, ఏవో ఉమాపతి, ఏఈవో శరణ్య, రైతులు తదితరులు పాల్గొన్నారు. క్వింటాల్ పత్తి రూ.7,888 పెద్దపల్లిరూరల్: స్థానిక వ్యవసాయ మార్కెట్యార్డులో శుక్రవారం పత్తి క్వింటాల్కు గరిష్టంగా రూ.7,888 ధర పలికిందని మార్కెట్కమిటీ చైర్మన్ కూర మల్లారెడ్డి, కార్యదర్శి ప్రవీణ్రెడ్డి తెలిపారు. కనిష్ట ధర రూ.6,414గా, సగటు ధర రూ.6,818గా ఉందని పేర్కొన్నారు. -
ప్రజాప్రభుత్వంతోనే రైతుసంక్షేమం
పెద్దపల్లిరూరల్: ప్రజాప్రభుత్వంలోనే రైతులకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. తుర్కలమద్దికుంట, నిట్టూరు, నిమ్మనపల్లి, పెద్దకల్వల, పెద్దబొంకూర్, కొత్తపల్లి, మూలసాల, భోజన్నపేట, మారెడుగొండ, గుర్రాంపల్లిలో శుక్రవారం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. పెద్దకల్వలలో విలేకరులతో మాట్లాడారు. రైతులు ధాన్యాన్ని మద్దతు ధరతో కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని సూచించార. గింజ కోత లేకుండా కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. బీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కు రాజకీయాలు సీఎం రేవంత్రెడ్డి సారథ్యంలోని ప్రజాప్రభుత్వంపై అసత్య ప్రచారం చేస్తూ లబ్ధి పొందేందుకు బీఆర్ఎస్, బీజేపీలు కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడుతున్నాయని విజయరమణారావు విమర్శించారు. కాళేళ్వరం ప్రాజెక్టు పిల్లర్లు కుంగిపోయాయని బీఆర్ఎస్ నేతలు అంగీకరిస్తూనే తప్పును కప్పిపుచ్చుకునేందుకు అసత్య ప్రచారం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. మాజీమంత్రి కేటీఆర్ సోయిలేకుండా పూటకోమాట మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. అక్రమాలపై సీబీఐ విచారణ చేపట్టాలని సీఎం కోరినా బీజేపీ మంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్ కేంద్రాన్ని ఒప్పించకపోవడమేంటని ప్రశ్నించారు. ఆయా కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్మన్ మల్లయ్య, నాయకులు బండారి రామ్మూర్తి, నర్సింహారెడ్డి, మార్కెట్చైర్మన్ కూర మల్లారెడ్డితోపాటు ఆయా గ్రామాల సర్పంచులు రాజయ్య, ఆకుల సువర్ణ, వేల్పుల రమేశ్, నర్ల కనకమ్మ, తిరుపతి, రిబిక, శ్వేత, త్రివేణి, గుర్రం దేవేంద్ర, సంపత్, పెగడ రమేశ్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు -
బడికి టాటా.. ఇంటి బాట..
2025–26 విద్యా సంవత్సరం ముగిసింది. ఏప్రిల్ 24(శుక్రవారం) నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు. దీంతో చివరి రోజు గురువారం పాఠశాలల్లో పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ నిర్వహించారు. అనంతరం ప్రగతిపత్రాలు అందించి విద్యార్థులను ఇళ్లకు పంపించారు. ఆదివారం వస్తేనే సంబురపడే విద్యార్థులు వేసవి సెలవులు ప్రకటించడంతో ఎగిరి గంతేస్తూ బాడికి టాటా చెప్పి ఇంటిబాట పట్టారు. పది నెలలు పుస్తకాలతో కుస్తీ పట్టిన పిల్లలు ఇక ఆటపాటలతో సెలవుల్లో ఎంజాయ్ చేస్తామంటున్నారు. ఎండలు విపరీతంగా ఉన్నందున ప్రయాణాల్లో విద్యార్థులు, తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, సెలవుల్లో పిల్లలపై ఓ కన్నేసి ఉంచాలని ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు సూచించారు. జూన్ 12న కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది. – పెద్దపల్లి/‘సాక్షి’ ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి -
ఘోష్ కమిషన్పై హైకోర్టు తీర్పు చెంపపెట్టు
పెద్దపల్లి: ఘోష్ కమిషన్పై హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు అని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. హైకోర్టు తీర్పు ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టుపై తప్పుడు ప్రచారం బహిర్గతం అయిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై రాజకీయ కక్ష సాధింపుతోనే తప్పుడు ఆరోపణలు చేసి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని అపకీర్తి పరచాలనే ప్రయత్నం జరిగిందని విమర్శించారు. ప్రభుత్వం ఇప్పటికై నా తప్పుడు ప్రచారాన్ని మానుకుని, కాళేశ్వరం ప్రాజెక్టును త్వరితగతిన మరమ్మతులు చేసి ప్రజలకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మాజీ జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఠాకూర్ రఘువీర్సింగ్, పట్టణ అధ్యక్షుడు రాజ్కుమార్, కౌన్సిలర్ రవీందర్ సుజాత, నాయకులు తిరుపతిరెడ్డి, సంపత్, మోహన్రావు, సందీప్రావు తదితర నాయకులు పాల్గొన్నారు. -
అమ్మానాన్న.. ఇద్దరు ఉంటేనే పిల్లలకు తోడునీడ. కుటుంబానికి భరోసా. స్కూల్ నుంచి వస్తుండగా అమ్మ ఎదురుగా రాకపోతే ఆ చిన్నారుల ఆందోళనకు అంతుండదు. అదే శాశ్వతంగా కనిపించకుండా పోతే ఆ గుండె లయతప్పుతుంది. సాయంత్రానికి నాన్న కనిపించకపోతే పిల్లల ఆతృత పెరిగిపోతుంది. అద
నాన్న.. నీవే నా ధైర్యం అనుకున్న నాన్న.. నేను స్కూల్ నుంచి రాగానే ప్రతి రోజూ నా కోసం ఎదురుచూసే వాడివి. ఇప్పుడు నువ్వు కనిపించడం లేదు. నువ్వు ఉన్నావనే ధైర్యంతో అందరితో నవ్వుతూ తిరిగేవాడిని. ఇప్పుడు నా వెనుక నువ్వు లేవని తెలిసి కన్నీళ్లు ఆగడం లేదు. మా నాన్న లాగా క్షణికావేశంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకోకండి. పిల్లలను అనాథలుగా చేయకండి. మమ్మల్ని వదిలి వెళ్లిపోకండి. దయచేసి ప్రాణాలు తీసుకోవద్దు. – జంగునాయక్, శాంతినగర్(గుగులోత్ గోపాల్ కొడుకు) వీరు రాజన్నసిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం శాంతినగర్కు చెందిన గుగులోతు గోపాల్ కుటుంబ సభ్యులు. అప్పుల బాధ భరించలేక గత మార్చి 21న తన పొలం వద్ద చెట్టుకు ఉరేసుకొని మరణించాడు. ఇప్పుడు వారి కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడింది. ఇద్దరు బిడ్డలు, కొడుకు, భార్య నిర్మల ఏం చేయాలో తెలియడం లేదు. ఆ ఇల్లాలికి పిల్లలను ఎట్ల పెంచుకోవాలో తెలియక భర్త జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ తీవ్ర మనోవేదనకు గురవుతోంది.వివరాలు 8లో.. -
కాళేశ్వరంపై బహిరంగ చర్చకు సిద్ధమా?
కాల్వశ్రీరాంపూర్: కాళేశ్వరం ప్రాజెక్టు పిల్లర్లు లోప భూయిష్ట నిర్మాణ పనులతో కుంగిపోవడం నిజం కాదా? అని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే విజ యరమణారావు ప్రశ్నించారు. దీనిపై కేటీఆర్, హరీ శ్రావులు బహిరంగ చర్చకు సిద్ధమా.. అని సవాల్ విసిరారు. కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలో గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కోర్టు తీర్పు పై బీఆర్ఎస్ నాయకులు జబ్బలు చరుసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వాన్ని కోర్టు ఎక్కడా తప్పు పట్టలేదన్నారు. కమిటీ రిపోర్టు వాస్తవాలు, అవాస్తవాలు గ్రహించామని కేసీఆర్, హరీశ్రావులను ఇప్పుడే అరెస్టు చేయకండని తీర్పు ఇచ్చిందన్నారు. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారంలో బుంగలు పడింది నిజం కాదా అని అడిగారు. మెదక్ జిల్లా కోసం మల్లన్నసాగర్, కొండపోచమ్మ రిజర్వాయర్ కట్టుకుని ఇక్కడ నీళ్లను తీసుకుపోవడానికి ప్రయత్నించారని ఆరోపించారు. ఎస్సారెస్పీ ప్రాజెక్టు ష ట్టర్లు మరమ్మతు చేయకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హ యాంలో శ్రీపాద, ఎల్లంపల్లి, కడెం, మిడ్మానేరు, ఎస్సారెస్పీ ప్రాజెక్టులు నిర్మించి సాగునీరు అందించిందని స్పష్టం చేశారు. కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ చేయించాలని కోరారు. తెలంగాణలో యాసంగి వరి ధాన్యం కొనుగోలు చేయకుండా రా రైస్ కాదంటూ మెలిక పెట్టడం ఇక్కడి రైతులకు అన్యాయం చేయడమేనన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి నివేదిక ఇచ్చారని దీనిపై సీఎం రేవంత్రెడ్డి సమక్షంలో మంత్రి మండలిలో చర్చించనున్నట్లు తెలిపారు. మాజీ ఎంపీపీ సారయ్యగౌడ్, ఏఎంసీ చైర్మన్ తిరుపతిరెడ్డి, వైస్ చైర్మన్ రాజమల్లు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గాజనవేన సదయ్య, సర్పంచులు బంగారి రమేశ్, మనోహర్రావు, శ్రీనివాస్, సింగిల్విండో మాజీ చైర్మన్ రాంచంద్రారెడ్డి పాల్గొన్నారు. -
డిమాండ్లు నెరవేర్చాలి
మంథని: ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు నెరవేర్చాలని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు అ న్నారు. ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెకు సంఘీభావం తెలుపుతూ గురువారం సమ్మె శిబిరా న్ని సందర్శించారు. ఎన్నికల సమయంలో మే నిఫెస్టోలో ఆర్టీసీ కార్మికుల అంశాలను పొందుపర్చి అమలు చేయకుండా తుంగలో తొక్కుతున్నారన్నారు. భూపాలపల్లి జెడ్పీ చైర్పర్సన్ శ్రీహర్షిణి, నాయకులు ఏగోళపు శంకర్గౌడ్, రా జూగౌడ్, తరగం శంకర్లాల్, మంథని లక్ష్మణ్, జేఏసీ చైర్మన్ కేకే రెడ్డి, వైస్చైర్మన్ ఐలయ్య, నా యకులు ఖాదర్, రమేశ్, ఖుతుబుద్దీన్, జనా ర్దన్,ఇంతియాజ్బేగం తదితరులు పాల్గొన్నారు. -
కంటి వైద్యంలో మసక!
కోల్సిటీ(రామగుండం): గోదావరిఖనిలో ఆరోగ్య సేవలు ‘నియంత్రణలేని వ్యవస్థ’గా మారుతున్నాయా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశాల మేరకు ఇటీవల జిల్లా వైద్యాధికారులు నిర్వహించిన తనిఖీల్లో రిజిస్ట్రేషన్లు లేకుండా ఆస్పత్రులు నడుస్తున్న బాగోతాలు బహిర్గతం చేశాయి. ముఖ్యంగా కంటి ఆస్పత్రులు, ఆప్టికల్ షాపులు నిబంధనలు అతిక్రమిస్తూ ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెడుతున్నాయనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ● అనుమతుల్లేని ఆసుపత్రుల కార్యకలాపాలు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కె.ప్రమోద్ కుమార్ ఇటీవల గోదావరిఖనిలో ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. రెండు కంటి ఆసుపత్రులు ఎలాంటి అనుమతులు లేకుండానే నడుస్తున్నట్టు గుర్తించినట్లు డీఎంహెచ్వో గురువారం ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. లక్ష్మీనగర్లోని ఉమాశంకర్ కంటి ఆస్పత్రితోపాటు శ్రీనివాస్ కంటి ఆస్పత్రులు రిజిస్ట్రేషన్ లేకుండా నిర్వహిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. వెంటనే వాటికి నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. ● చట్టాలు ఉన్నా అమలు ఎక్కడ? క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 2010 ప్రకారం అన్ని ఆసుపత్రులు, కంటి క్లినిక్స్, డయాగ్నొస్టిక్, క్లినిక్లు, స్కానింగ్ సెంటర్లు, ఫిజియోథెరఫీ కేంద్రాలు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ పొందాలి. కానీ చాలా కేంద్రాలు ఈ చట్టాన్ని పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆస్పత్రులు, షాపుల ముందు తప్పుడు బోర్డులు పెట్టి, నకిలీ వైద్యం అందిస్తున్నారని ఆరోపణలున్నాయి. ● చూపుతో చెలగాటం.. ప్రమాదకర పరిణామాలు అర్హతలేని వ్యక్తులు కంటి పరీక్షలు చేయడం వల్ల తప్పుడు నిర్ధారణలు జరిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చిన్న పొరపాటు కూడా శాశ్వత చూపు నష్టానికి దారితీయవచ్చని చెబుతున్నారు. ● సమాధానం లేని కీలక ప్రశ్నలు అనుమతులు లేకుండా ఆసుపత్రులు నడుస్తున్నప్పటికీ డాక్టర్లు ఎందుకు నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు? ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతున్న ఈ పరిస్థితిపై జిల్లా వైద్యాధికారులు, మెడికల్ అసోసియేషన్ ఎందుకు స్పందించడం లేదు? అనే కీలక ప్రశ్నలకు సమాధానాలు చెప్పడానికి ముందుకు రావడం లేదు. ● కఠిన చర్యలే పరిష్కారం వైద్యరంగంలో అభివృద్ధి చెందుతున్న గోదావరిఖనిలో ఇలాంటి నిర్లక్ష్యం కొనసాగడం ఆందోళనకరం. వెంటనే కఠిన చర్యలు తీసుకుని, ఆరోగ్యరంగాన్ని క్రమబద్ధీకరించకపోతే పరిస్థితి మరింత విషమించవచ్చని స్థానిక ప్రజలు హెచ్చరిస్తున్నారు. నిబంధనల ప్రకారం అర్హత కలిగిన వైద్యులే కంటి పరీక్షలు నిర్వహించాలి. కానీ కొంతమంది వ్యాపారులు స్వయంగా పరీక్షలు చేస్తున్నారు. మందులు రాస్తున్నారు. కంటి చికిత్స కూడా నిర్వహిస్తున్నారు. డాక్టర్ల పేర్లతో బోర్డులు పెట్టి ప్రజలను నమ్మిస్తున్నా, వాస్తవానికి అక్కడ వైద్యులు లేకపోవడం గమనార్హం. అధికారులు తనిఖీలు చేసి నోటీసులు జారీ చేయడమే తప్ప, లైసెన్సులు రద్దు చేయడం, జరిమానాలు విధించడం వంటి కఠిన చర్యలు తీసుకోవడంలో వెనుకడుగు వేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రజల ప్రాణాలతో చెలగాటం అడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. -
రెండో రోజూ కొనసాగిన ఆర్టీసీ సమ్మె
పెద్దపల్లి/గోదావరిఖనిటౌన్/మంథని: ఆర్టీసీ ఉద్యోగులు న్యాయమైన డిమాండ్ల సాధనకు చేపట్టిన సమ్మె రెండో రోజు కొనసాగింది. గురువారం ప్రైవేటు సిబ్బందితో ఆర్టీసీ బస్సులను నడిపినప్పటికీ రాజీవ్ రహదారి వెంట మాత్రమే నడిచాయి. గ్రామీణ ప్రాంతాలకు బస్సులు నడవక పోవడంతో ఉద్యోగులు, ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఓవైపు మండుటెండలు.. మరోవైపు సమ్మె జరుగుతుండటంతో ప్రయాణికులు వారి గమ్యస్థానాలకు వెళ్లేందుకు నానా ఇక్కట్ల పాలయ్యారు. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేటు వాహనాల్లో తమ ప్రయాణాన్ని కొనసాగించారు. గోదావరిఖనిలో మోకాళ్లపై కూర్చొని నిరసన ప్రైవేటు డ్రైవర్లతో బస్సులను నడిపి ఆర్టీసీ సమ్మెను నిర్వీర్యం చేయొద్దని కోరుతూ గురువారం గోదావరిఖనిలో ఉద్యోగులు డిపో ఎదుట మోకాళ్లపై కూర్చొని దండాలు పెడుతూ మా కడుపు మీద కొట్టొద్దంటూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఖని ఆర్టీసీ చైర్మన్ వంగర శ్రీనివాస్ మాట్లాడుతూ ఆర్టీసీ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తామని అన్నారు. దీనికి ప్రైవేటు డ్రైవర్లు అర్థం చేసుకొని సహకరించాలని కోరారు. సీపీఐ నాయకులు మద్దతు తెలిపి సమ్మెలో పాల్గొన్నారు. ఖని ఆర్టీసీ జేఏసీ నాయకులు ఇందిరాదేవి, మాధవి, కేకే రెడ్డి, బి.రమేశ్. సీపీఐ నాయకులు తాండ్ర సదానందం, కె.కనకరాజు, కరీం, రమేశ్కుమార్, ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు పాల్గొన్నారు. -
పిల్లల ఎదుగుదలను పరిశీలించాలి
పెద్దపల్లి: పిల్లల ఎదుగుదలను నిరంతరం పరిశీలించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. గురువారం కలెక్టరేట్లో సంక్షేమ శాఖ పనితీరుపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. అంగన్వాడీలను సూపర్వైజర్లు క్రమం తప్పకుండా సందర్శించి, నమోదు చేసిన ప్రతీ చిన్నారి హాజరు శాతం పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. హాజరు మెరుగులో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇండస్ట్రియల్ ప్రాంతాలు, ఇటుక భట్టీలు (బ్రిక్ కిల్న్లు) వంటి ప్రాంతాల్లో పనిచేస్తున్న కార్మికుల పిల్లల వివరాలను సేకరించాలని, ఆ ప్రాంతాల్లో పిల్లలకు అవసరమైన సౌకర్యాలను గుర్తించి పరిశ్రమల ద్వారా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా సంక్షేమ శాఖ అధికారి వేణు, అధికారులు కవిత, అలేఖ్య, సంపదకుమారి, అనిల్కుమార్, జితేందర్, కుమారస్వామి, ఆసిఫ్, ఉమా తదితరులు పాల్గొన్నారు. డీఎంహెచ్వో కార్యాలయ సూపరింటెండెంట్, సీనియర్ అసిస్టెంట్ సస్పెన్షన్ జిల్లా వైద్య ఆరోగ్య అధికారి కార్యాలయంలో సూపరింటెండెంట్గా విధులు నిర్వహిస్తున్న ఎండీ అజీమ్తో పాటు సీనియర్ అసిస్టెంట్ రామును సస్పెన్షన్ చేస్తూ కలెక్టర్ శ్రీహర్ష ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో కొత్తగా నియమితులైన ల్యాబ్ టెక్నీషియన్ల వేతనాలు ఐఎఫ్ఎంఎస్ పోర్టర్లో ప్రాసెస్ చేయడం కోసం నగదు డిమాండ్ చేసినట్లు ఫిర్యాదులు అందగా ప్రాథమిక విచారణలో అవకతవకలు గుర్తించినట్లు తెలిపారు. అందుబాటులో ఉన్న సాక్ష్యాలను పరిశీలించి వారిని సస్పెన్షన్ చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 26 నుంచి స్వీయ గణన కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్వీయ గణనను జిల్లాలో ఈనెల 26నుంచి మే 10వరకు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ శ్రీహర్ష ఒక ప్రకటనలో తెలిపారు. పౌరులు డిజిటల్ విధానంలో ఎటువంటి ఆటంకం లేకుండా ఇంట్లోనే ఉండి ఆన్లైన్ ద్వారా తమ ఇంటి వివరాలు నమోదు చేసుకోవచ్చన్నారు. ఎల్కలపల్లి పాఠశాల సందర్శన ఫెర్టిలైజర్సిటీ: స్వచ్ఛ విద్యాలయాల్లో ప్రథమ స్థానంలో నిలిచిన పాలకుర్తి మండలం ఎల్కలపల్లి మండల పరిషత్ పాఠశాలను గురువారం కలెక్టర్ శ్రీహర్ష సందర్శించారు. పాఠశాల ఆవరణలో పచ్చని చెట్లతో సుందరంగా తీర్చిదిద్దిన పాఠశాల హెచ్ఎం లక్ష్మీనారాయణను అభినందించారు. టీచర్ పేరెంట్ మీటింగ్లో పాల్గొన్నారు. డీఈవో శారద, డీపీవో కవిత, ఎంఈవో విమల, పాఠశాల చైర్మన్ రఘున, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
భగీరథ మహర్షి సేవలు సమాజానికి ఆదర్శం
పెద్దపల్లి: భగీరథ మహర్షి సేవలు సమాజానికి ఆదర్శంగా నిలిచాయని అదనపు కలెక్టర్ దాసరి వేణు అన్నారు. భగీరథ మహర్షి జయంతి సందర్భంగా గురువారం కలెక్టరేట్లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. సమాజహితం కోసం ఆనాడు భగీరథుడు అవి శ్రాంతంగా కృషి చేసి నేటి సమాజానికి ఆదర్శప్రాయుడయ్యాని కొనియాడారు. మహనీయులను స్మరించుకుంటూ, వారి స్ఫూర్తితో ముందుకు సాగేందుకు రాష్ట్ర ప్రభుత్వం వారి జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహిస్తోందని తెలిపారు. బీసీ అభివృద్ధి అధికారి రంగారెడ్డి, సంఘం జిల్లా అధ్యక్షుడు మర్కు లక్ష్మణ్, నాయకుడు సదయ్య తదితరులు పాల్గొన్నారు. సుల్తానాబాద్రూరల్: కార్మిక చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సుల్తానాబాద్ మున్సి ఫ్ కోర్టు జూనియర్ సివిల్ జడ్జి దుర్గం గణేశ్ అన్నారు. గురువారం సుల్తానాబాద్ మండలం కాట్నపల్లిలో నిర్వహించిన న్యాయవిజ్ఞాన సదస్సులో మాట్లాడారు. కుటుంబ, ఆస్తి తగాదా లకు సంబంధించి న్యాయసేవాధికార సంస్థను సంప్రదించాలన్నారు. కాట్నపల్లిలోని ఇటుకబట్టిలో కుక్కల దాడిలో బాలిక మృతి చెందడం బాధాకరమని, దీనికి యాజమాన్యాలు కార్మికులకు రక్షణ కల్పించే బాధ్యత వారిదే అన్నారు. అనంతరం బాధిత కుటుంబానికి గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో రూ.20వేలు, నిత్యావసర సరుకులు అందజేశారు. సర్పంచ్ ఓగుల పూజ, ఎంపీవో మౌనిక, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రవీందర్, ఉపాధ్యక్షుడు శివకృష్ణ, న్యాయవాదులు భూమయ్య, రాజేంద్రప్రసాద్, రవికిరణ్, కార్యదర్శి రమేశ్, జీపీవో దివ్య, ఉపసర్పంచ్ రాయమల్లు, గ్రామస్తులు పాల్గొన్నారు. న్యాయవాదుల నిరసనపెద్దపల్లిరూరల్: జిల్లా కోర్టు భవన సముదాయాలను రాఘవాపూర్లో కాకుండా పెద్దపల్లిలోనే నిర్మించాలని డిమాండ్ చేస్తూ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మేకల మల్లేశం ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ఎదుట చేపట్టిన నిరసన దీక్ష గురువారం 16వ రోజుకు చేరింది. బార్ అసోసియేషన్ సభ్యులు సాయికృష్ణ, క్రాంతిసింగ్, తాని నరేశ్, అజయ్క్రాంతిసింగ్, శ్రీనివాస్, కుమారస్వామి, శివకుమార్, లవన్కుమార్, శ్రీకాంత్, రమేశ్, ఆనంద్, అశోక్, సతీశ్, సాగర్, సాయికుమార్, నర్సింగం, సుష్మ, శిరీషరాణి తదితరులు పాల్గొన్నారు. మేఽథోశక్తితో విద్య నేర్చుకోవాలిసుల్తానాబాద్రూరల్: ప్రతీ విద్యార్థి మేథోశక్తితో విద్య నేర్చుకోవాలని జోనల్ ఇన్చార్జి గిరిజ అన్నారు. గురువారం సుల్తానాబాద్ మండలం గర్రెపల్లిలోని సాంఘీక సంక్షేమ గురుకుల వి ద్యాలయాన్ని సందర్శించారు. సెలవులపై వెళ్తున్న విద్యార్థులకు పలు సూచనలు ఇచ్చారు. టీజీపీఏ జిల్లా ప్రధాన కార్యదర్శి లంకదాసరి భాస్కర్, వైస్ ప్రిన్సిపాల్ ధనలక్ష్మీ, జేవీపీ సృజన తదితరులు పాల్గొన్నారు. కొనుగోళ్లలో జాప్యం చేయొద్దు కమాన్పూర్(మంథని): ధాన్యం కొనుగోళ్లలో జాప్యం చేయకుండా తూకంపెట్టి మిల్లర్లకు తరలించాలని డీఆర్డీఏ పీడీ కళాంధిని అన్నారు. గురువారం కమాన్పూర్ మండలం గుండారంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. కొనుగోలు కేంద్రంలో ధాన్యంరాశులు పేరుకపోవడంతో తూకం ఎందుకు పెట్టడం లేదని నిర్వాహకులను అడుగగా, మిల్లర్లను కేటాయించలేదని తెలపడంతో రెండు రోజుల్లో మిల్లర్లను కేటాయిస్తామని తెలిపారు. అకాల వర్షాల నేపథ్యంలో ధాన్యం తడవకుండా టార్పాలిన్లు అందుబాటులో పెట్టుకోవాలని సూచించారు. అనంతరం గ్రామంలోని కుట్టుశిక్షణ కేంద్రం, వన నర్సరీని పరిశీలించారు. డీఆర్డీఏ వెంట ఏపీడీ రవీందర్, ఏపీఎం పద్మ, ఇన్చార్జి ఎంపీడీవో సౌమ్య, సీసీలు బిక్షపతి, మల్లయ్య, ఏపీఎం లావణ్య ఉన్నారు. -
అంతర్జాతీయ రెస్క్యూ పోటీలకు సింగరేణి జట్టు
గోదావరిఖని: జాంబియా దేశంలో ఈనెల 26 నుంచి మే 5వరకు జరుగనున్న అంతర్జాతీయ రెస్క్యూ పోటీల్లో సింగరేణి జట్టు పాల్గొంటున్నట్లు రెస్క్యూ జీఎం శ్రీనివాస్రెడ్డి తెలిపారు. గురువారం మెయిన్ రెస్క్యూ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా 25 జట్లు పాల్గొంటున్న ఈ పోటీల్లో ఇండియా నుంచి నాలుగు జట్లు, జాంబియా నుంచి 4, కెనడా నుంచి 4, చైనా నుంచి 4, ఆస్ట్రేలియా నుంచి 3, కొలంబియా నుంచి 3, పొలాండి నుంచి ఒకటి, ఇండోనేషియా నుంచి ఒకటి, కోట్డివైర్ నుంచి ఒక జట్టు పాల్గొనబోతున్నాయన్నారు. భారతదేశం నుంచి సింగరేణి జట్టు, మ్యాంగనీస్ ఓర్ ఇండియా లిమిటెడ్ నుంచి పురుషుల, మహిళా జట్లు, వెస్ట్రన్కోల్ఫీల్డ్స్ నుంచి ఒక జట్టు పాల్గొంటున్నాయని వివరించారు. సింగరేణి టీంకు ఫస్ట్ఎయిడ్ విభాగంలో డాక్టర్ రాజేశ్వర్ ప్రత్యేక చొరవ తీసుకుని శిక్షణ ఇచ్చారన్నారు. రెస్క్యూ సూపరింటెండెంట్ రాజేందర్రెడ్డి, క్యాప్టెన్ ప్రమోద్కుమార్, బ్రీఫింగ్ఆఫీసర్ నితిన్కుమార్ పాల్గొన్నారు. విజయధరహాసంతో తిరిగిరావాలి జాతీయస్థాయి రెస్క్యూ పోటీల్లో రాణించిన విధంగానే అంతర్జాతీయ స్థాయి రెస్క్యూలో రాణించి సింగరేణి కీర్తి పతాకాన్ని ఎగురవేయాలని సింగరేణి డైరెక్టర్ కె.వెంకటేశ్వర్లు అన్నారు. గురువారం మెయిన్ రెస్క్యూ స్టేషన్లో రెస్క్యూ సభ్యులను కలిసి అభినందనలు తెలిపారు. రెస్క్యూ జీఎం శ్రీనివాస్రెడ్డి, ఆర్జీ3 జీఎం మధుసూధన్, ఏపీఏ జీఎం నాగేశ్వర్రావు, రెస్క్యూ సూపరింటెండెంట్ రాజేందర్రెడ్డి పాల్గొన్నారు. -
అంతర్జాతీయ వేదికపై ‘సింగరేణి’
గోదావరిఖని: అంతర్జాతీయ రెస్క్యూ పోటీలకు సింగరేణి సిద్ధమైంది. జాంబియా దేశంలో నిర్వహించే పోటీల్లో పాల్గొనేందుకు ఈనెల 24 ఆ దేశానికి పయనమవుతోంది. మొత్తం ఆరుగురు సభ్యులు గల బృందానికి 45 రోజులుగా ఆర్జీ–2 ఏరియాలోని మెయిన్రెస్క్యూ స్టేషన్లో ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. కఠోర సాధనతో బ్రిగేడియర్లు శిక్షణ ముగించుకుని జాంబియాకు బయలుదేరి వెళ్లనున్నారు. మే ఒకటి వరకు పోటీలు 14వ అంతర్జాతీయ మైన్ రెస్క్యూ పోటీలు (ఐఎంఆర్సీ) జాంబియాలో నిర్వహించనున్నారు. సింగరేణి బ్రిగేడియర్లు ఈనెల 25న అక్కడకు చేరుకుంటారు. ఈనెల 28 నుంచి మే ఒకటే తేదీ వరకు జరిగే పోటీల్లో పాల్గొంటారు. వివిధ దేశాల మైన్స్ రెస్క్యూ బృందాలు హాజరవుతాయి. ప్రతీరెండేళ్లకోసారి జరిగే ఐఎంఆర్సీ పోటీల్లో సింగరేణి రెండు దశాబ్దాలుగా పాల్గొంటూ వస్తోంది. ఆలిండియా రెస్క్యూ పోటీల్లో డబుల్ హాట్రిక్ సాధించి తనకంటూ ప్రత్యేక స్థానం నిలుపుకున్న సింగరేణి రెస్క్యూ.. గతంకన్నా ఈసారి భిన్నంగా పోటీలకు ముందస్తుగా ప్రాక్టీస్ పొంది అంతర్జాతీయ పోటీల్లో సత్తా చాటేందుకు తహతహలాడుతోంది. సింగరేణిదే ఖర్చు.. రెస్క్య బ్రిగేడియర్లు విదేశాలకు వెళ్లి తిరిగి వచ్చేవరకు సింగరేణి సంస్థ ఖర్చులు భరిస్తోంది. ప్రత్యేక యూనిఫాం, షూలు, ఇతర ఏర్పాట్లు చేసింది. జట్టు సభ్యులకు రెస్క్యూ రికవరీ, ఫైర్ఫైటింగ్, రోప్రెస్క్యూ, ఫస్ట్ ఎయిడ్, రెస్క్యూ స్కిల్స్ విభాగాల్లో ప్రత్యేక తర్ఫీదు ఇచ్చారు. టీం సభ్యులు వీరే.. అంతర్జాతీ రెస్క్యూ పోటీలకు బయలుదేరి వెళ్లే సభ్యుల పేర్లను సింగరేణి ప్రకటించింది. కెప్టెన్గా ప్రమోద్కుమార్, బ్రీతింగ్ ఆఫీసర్గా నితిన్కుమార్, సభ్యులుగా శ్యాంకుమార్, శ్రీకాంత్, బానుప్రసాద్, రాకేశ్, టెక్నీషియన్గా సాయికృష్ణ, టెక్నికల్ ట్రాన్స్లేటర్గా రాజేందర్రెడ్డిని ప్రకటించారు. షెడ్యూల్ ఇలా ఈనెల 24న బయలు దేరివెళ్లడం 25న జాంబియాలో రిపోర్టింగ్ 27న ఓరియెంటేషన్ పోగ్రాం 28న ఫెర్ఫైటింగ్ పోగ్రాం 29న రోప్రెస్క్యూ మే 1న ఫస్ట్అండ్రెస్క్యూ 2న అండర్గ్రౌండ్ రెస్క్యూ 4న సిటీ విజిట్ 5న పోటీల ముగింపు వేడుకలు మే6 ఇండియాకు తిరిగి రావడం రెస్క్యూ పోటీలకు బ్రిగేడియర్లు సిద్ధం ఈనెల 24న జాంబియాకు పయనం 28 నుంచి మే ఒకటి వరకు పోటీలు జాంబియాలో జరిగే అంతర్జాతీయ రెస్క్యూ పోటీల్లో పాల్గొనేందుకు సింగరేణి జట్టు సర్వసన్నద్ధమైంది. సభ్యులు పూర్తిస్థాయిలో తర్ఫీదు పొందారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా సత్తా చాటుతాం. – శ్రీనివాస్రెడ్డి, రెస్క్యూ జీఎం -
‘సాయ్’ పిలుస్తోంది
కరీంనగర్స్పోర్ట్స్: క్రీడా రంగానికి భారత క్రీడాప్రాధికారిక సంస్థ మార్గదర్శకంగా నిలుస్తుంది. పంజాబ్ రాష్ట్రం పటియాలలోని నేతాజీ సుభాష్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ యువ క్రీడాకారులకు సువర్ణావకాశాన్ని అందించింది. 2026–27 సంవత్సరంలో పలు కోర్సుల్లో శిక్షణకు నోటిఫికేషన్ విడుదల చేసింది. క్రీడలను వృత్తిగా తీసుకోవాలనుకునే యువతకు గొప్ప అవకాశం. కోర్సులు కేవలం శిక్షణకు మాత్రమే కాకుండా, శాసీ్త్రయ ధృక్పథంతో ప్రొఫెషనల్గా తీర్చిదిద్దేందుకు ఉపయోగపడనున్నాయి. కోర్సులు పూర్తి చేసిన క్రీడాకారులు దేశవ్యాప్తంగా కోచ్లుగా, ఫిట్నెస్ ట్రైనర్లు, అనలిస్ట్, క్రీడా సంస్థల్లో ఉన్నత స్థానాల్లో అవకాశాలు పొందవచ్చు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో మంచి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. అంతర్జాతీయ స్థాయిలో కూడా అవకాశాలు దొరుకుతాయి. క్రీడలపై ఆసక్తి ఉన్న యువత https:// www. dipsc. nsnis. in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ సందర్భంగా పలు కోర్సుల వివరాలతో కథనం. కోర్సుల వివరాలు 42వ ఎంఎస్సీ స్పోర్ట్స్ కోచింగ్ (2 ఏళ్లు), 64వ డిప్లొమా ఇన్ స్పోర్ట్స్ కోచింగ్, 5వ పీజీ డిప్లొమా ఇన్ స్పోర్ట్స్ పెర్ఫార్మెన్స్ అనాలిసిస్, 4వ పీజీ డిప్లొమా ఇన్ స్పోర్ట్స్ సైకాలజీ, 4వ పీజీ డిప్లొమా ఇన్ స్పోర్ట్స్ న్యూట్రిషన్, 4వ పీజీ డిప్లొమా ఇన్ స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ (ఒక సంవత్సరం). కాగా 64వ డిప్లొమా ఇన్ స్పోర్ట్స్ కోచింగ్కు దరఖాస్తులు ఈ నెల 23 లోపు, మిగిలిన కోర్సులకు ఈ నెల 30 లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. సీట్లు ఇలా.. 64వ డిప్లొమా ఇన్ స్పోర్ట్స్ కోచింగ్ ఒక ఏడాది నిర్వహిస్తారు. 26 క్రీడాంశాల్లో 785 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఆర్చరీ 30, అథ్లెటిక్స్ 75, బ్యాడ్మింటన్ 20, బ్యాడ్మింటన్ 20, బాస్కెట్బాల్ 30, బాక్సింగ్ 50, కానోయింగ్ కయాకింగ్ 15, సైక్లింగ్ 30, ఫెన్సింగ్ 30, ఫుట్బాల్ 50, జిమ్నాస్టిక్స్ 20, హ్యాండ్బాల్ 20, హాకీ 50, జూడో 30, కబడ్డీ 30, ఖోఖో 20, రోయింగ్ 10, షూటింగ్ 20, స్విమ్మింగ్ 20, టేబుల్ టెన్నిస్ 40, తైక్వాండో 20, టెన్నిస్ 20, వాలీబాల్ 30, వెయిట్లిఫ్టింగ్ 30, రెజ్లింగ్ 50, వుషూ 25, యోగాసన 20 సీట్లు ఉన్నాయి. క్రీడల కోర్సుకు దరఖాస్తులు ప్రొఫెషనల్ ట్రైనింగ్తో భరోసా క్రీడలపై ఆసక్తి ఉన్నవారికి చాన్స్ 42వ ఎంఎస్సీ స్పోర్ట్స్ కోచింగ్ క్రీడలివే.. అథ్లెటిక్స్, బాస్కెట్బాల్, ఫుట్బాల్, జిమ్నాస్టిక్స్, హాకీ, స్విమ్మింగ్, వాలీబాల్, వెయిట్ లిప్టింగ్, రెజ్లింగ్. ఆధునిక క్రీడల్లో డేటా విశ్లేషణ కీలకం. పెర్ఫార్మెన్స్ అనాలిసిస్ వంటి కోర్సులు చేయడం ద్వారా ప్రత్యర్థుల బలహీనతలను పసిగట్టే నైపుణ్యం లభిస్తుంది. ఇది క్లిష్ట సమయాల్లో సరైన నిర్ణయాలు తీసుకునేందుకు తోడ్పడుతుంది. కోర్సులు పూర్తి చేసినవారు పాఠశాలలు, కళాశాలలు, ప్రొఫెషనల్ క్లబ్లలో ఫిట్నెస్ నిపుణులుగా స్థిరపడి, ఆరోగ్యవంతమైన క్రీడా సమాజాన్ని నిర్మించగలరు. – నాగిరెడ్డి సిధారెడ్డి, శాట్స్ అసిస్టెంట్ రిటైర్డ్ డైరెక్టర్ -
హిందూ సమ్మేళనం
కాల్వశ్రీరాంపూర్: హిందూ ధర్మ పరిరక్షణకు ప్రతిఒక్కరూ నడుం బిగించాలని చిదానందగిరి సామీజీ కోరారు. మండల కేంద్రంలో నిర్వహించిన హిందూ సమ్మేళనంలో స్వామీజీ ప్రవచించారు. అనంతరం కళాకారులు ప్రదర్శించిన నృత్యకార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.వడదెబ్బతో వలస కూలీ మృతిధర్మపురి: జీవనోపాధి కోసం వలస వచ్చిన కూలీ వడదెబ్బ తగిలిమృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాపట్ల జిల్లా చీరాల ప్రాంతానికి చెందిన యోహన్ అలియాస్ మహేష్ (28) కూలీ పనుల కోసం ధర్మపురి వచ్చాడు. మండలంలోని కమలాపూర్లో బుధవారం అతిగా మద్యం సేవించాడు. వడదెబ్బకు గురై మృతి చెందాడు. సీఐ రాంనర్సింహారెడ్డి ఆధ్వర్యంలో ఎస్సై మహేష్ సంఘటనా స్థలానికి చేరుకుని మృతుడి వివరాలు సేకరించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. గంజాయి విక్రేత అరెస్ట్ధర్మపురి:గంజాయి విక్రయిస్తున్న ఓ వ్యక్తిని అరెస్టు చేసి రిమాండుకు పంపినట్లు ఎస్సై మహేష్ తెలిపారు. మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటకు చెందిన ప్రణీత్కుమార్ గంజాయికి అలవాటు పడ్డాడు. పైగా విక్రయించేందుకు సిద్ధమయ్యారు. పట్టణంలోని పెట్రోల్ పంప్ వద్ద అనుమానాస్పదంగా వెళ్తుండడంతో పోలీసులు సోదా చేయగా అతని వద్ద 60 గ్రాముల గంజాయి లభించింది. గంజాయిని సీజ్ చేసి యువకుడిని అరెస్టు చేసి రిమాండ్కు పంపినట్లు ఎస్సై తెలిపారు. మహిళ ఆత్మహత్యాయత్నంకరీంనగర్క్రైం: కరీంనగర్కు చెందిన ఓ మహిళ కుటుంబ గొడవలతో విసిగిపోయి ఆత్మహత్య చేసుకుంటానని పద్మనగర్లోని వాటర్ ట్యాంక్ ఎక్కింది. అక్కడే ఉన్న స్థానికులు వెంటనే పోలీస్, అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారమందించారు. వెంటనే స్పందించిన టూటౌన్ సీఐ సృజన్రెడ్డి, డివిజన్ ఫైర్ అధికారి శ్రీనివాస్రెడ్డి సిబ్బందితో సంఘటనా స్థలానికి వెళ్లి మహిళకు నచ్చజెప్పి కిందకు తీసుకొచ్చారు. భార్యాభర్తలకు కౌన్సెలింగ్ ఇచ్చి ఇంటికి పంపించారు. -
కోర్సులపై దృష్టి పెట్టాలి
ప్రభుత్వం అందిస్తున్న కోర్సులు యువతకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి. క్రీడారంగంలో నైపుణ్యాలు పెంపొందించేందుకు ఇవి కీలకం. గ్రామీణ ప్రాంతాల యువతకు కూడా మంచి అవకాశాలు అందిస్తున్నాయి. ఉద్యోగ అవకాశాలను పెంచే దిశగా ఇవి చాలా సహాయపడతాయి. ప్రతీ క్రీడాకారుడు కోర్సులపై దృష్టి పెట్టాలి. – బుర్ర మల్లేశ్గౌడ్, కబడ్డీ సంఘం కార్యదర్శి శిక్షణ ద్వారా క్రీడాకారులు ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నతస్థాయి వరకు శిక్షణ ఇచ్చే మెలకువలు నేర్చుకుంటారు. శాసీ్త్రయ శిక్షణ పద్ధతులు నేర్పుతారు. ట్రైనింగ్ తీసుకున్నవారు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కోచ్గా ఎదిగి, దేశానికి పతకాలు తెచ్చే క్రీడాకారులను తయారు చేయొచ్చు. – బసరవేణి లక్ష్మణ్, హ్యాండ్బాల్ సంఘం కార్యదర్శి ఈ కోర్సులు క్రీడాకారులకు కొత్త దిశను చూపుతాయి. శిక్షణతో పాటు శాసీ్త్రయ పరిజ్ఞానం అందించడం గొప్ప విషయం. ప్రస్తుతం ప్రొఫెషనల్ కోచ్లకు డిమాండ్ పెరుగుతోంది. కోర్సులు పూర్తి చేసినవారు దేశానికి మంచి సేవ చేయగలరు. – గెల్లు మధుకర్యాదవ్, ఖేలో ఇండియా ఖోఖో సెంటర్ కోచ్ -
రైలు కిందపడి యువకుడి బలవన్మరణం
వెల్గటూర్: రైలు కింద పడి యువకుడు బలవన్మరణానికి పాల్పడిన ఘటన మండలంలోని జగదేవుపేటలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల వివరా ల ప్రకారం.. గ్రామానికి చెందిన కొండి శివకుమార్ (18) నిజామాబాద్లో పాలిటెక్నిక్ చదువుతున్నాడు. మంగళవా రం రాత్రి కళాశాల హాస్టల్ నుంచి వ్యక్తిగత పని ఉందని చెప్పి బయటికి వెళ్లాడు. నేరుగా రైల్వేస్టేషన్కు వెళ్లి రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోలీసులు కుటుంబసభ్యులకు ఫోన్ చేసి తెలపగా వారు హుటాహుటిన బయలుదేరి వెళ్లారు. మృతికి గల కారణాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది. ఆర్థిక ఇబ్బందులతో ఆటో డ్రైవర్..కొత్తపల్లి(కరీంనగర్): చింతకుంట గాంధీనగర్కు చెందిన ఆటో డ్రైవర్ గాండ్ల శ్రీకాంత్(40) ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నట్లు కొత్తపల్లి స్టేషన్ హౌస్ ఆఫీసర్, ట్రైనీ ఐపీఎస్ సోహం సునీల్ తెలిపారు. ఎస్హెచ్వో వివరాల మేరకు.. గాంధీనగర్లో అద్దె ఇంట్లో ఉంటూ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఈ మధ్యకాలంలో ఆటో సరిగా నడవక ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ తరచూ ఇంట్లో గొడవకు దిగుతున్నాడు. ఈ క్రమంలో ఆర్థిక ఇబ్బందులు అధికమై జీవితంపై విరక్తి చెంది శ్రీకాంత్ మంగళవారం రాత్రి ఇంట్లో ఉరేసుకున్నాడు. గమనించిన అతడి భార్య వెంటనే కరీంనగర్లోని ప్రభుత్వ ఆసుపత్రికి అంబులెన్స్లో తరలించింది. చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడి భార్య రూప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్హెచ్వో పేర్కొన్నారు. యువకుడి బలవన్మరణంచిగురుమామిడి: మండల కేంద్రానికి చెందిన చొప్పదండి అభిలాష్(22) అనే యువకుడు జీవితంపై విరక్తితో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం.. అభిలాష్ ఇంటర్ ఫస్ట్ ఈయర్ చదివి ఇంటి వద్దే ఉంటూ వెల్డింగ్ పనులకు వెళ్లేవాడు. నెల రోజులుగా ఎలాంటి పనులు చేయకుండా తిరుగుతూ మద్యానికి అలవాటు పడ్డాడు. కుటుంబ సభ్యులు మందలించినా.. తన ప్రవర్తనలో మార్పు రాలేదు. మంగళవారం రాత్రి మద్యం తాగి ఇంటికొచ్చిన అభిలాష్ను తండ్రి మందలించాడు. ఇది మనసులో పెట్టుకొని బుధవారం వేకువజామున చెట్టుకు ఉరేసుకున్నాడు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై పృధ్వీధర్గౌడ్ తెలిపారు. -
రూ.1.30కోట్ల కాపర్ వైర్ మాయం
గోదావరిఖని: సింగరేణి ఓసీపీలోని డ్రాగ్లైన్(పృథ్వీభంజన్)కు విద్యుత్ సరఫరా చేసే కాపర్ కేబుల్ను దొంగలు ఎత్తుకెళ్లారు. 3 –కోర్ ఆర్మ్డ్ కాపర్కేబుల్పై కన్నేసిన దొంగలు.. కొన్నిరోజుల క్రితమే చోరీచేసినట్లు తెలుస్తోంది. డ్రాగ్లైన్ జీవితకాలం పూర్తికావడంతో ప్రాజెక్టు ఉపరితలంపైకి తీసుకొచ్చి అలాగే ఉంచారు. దానికి విద్యుత్ కేబుల్ను అలాగే ఉంచారు. దీనిపై కన్నేసిన దొంగలు.. సుమారు 250 మీటర్ల పొడవున కత్తిరించి తీసుకెళ్లారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనివిలువ సుమారు 1.30కోట్లు ఉంటుంది కార్మికవర్గాలు చెబుతున్నాయి. రాగితీగ చోరీకి గురైన మాట వాస్తవమే అయినా.. విలువ అంతగా ఉండదని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. పోలీసులు, సింగరేణి విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు. ఇంటి దొంగల సహకారంతోనే చోరీ జరిగినట్లుగా ప్రచారం జరుగుతోంది. -
ఎలక్ట్రిక్ వాహనాలతో జాగ్రత్త!
జ్యోతినగర్: అపార్ట్మెంట్లు, ఇళ్లు, వీధుల్లో ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ) సంఖ్య వేగంగా పెరుగుతోంది. సాధారణ పెట్రోల్, డీజిల్ వాహన ప్రమాదాలకు ఈవీ ప్రమాదాలకు మధ్య చాలాతేడా ఉంటుంది. లిథియం–అయాన్ బ్యాటరీల స్వభావాన్ని అర్థం చేసుకోవడం వాహనదారులకే కాదు.. అపార్ట్మెంట్లలో నివసించే ప్రతీఒక్కరికి చాలాముఖ్యం. ఎలక్ట్రిక్ వాహనాల్లో మంటలు ప్రారంభమైతే శ్రీథర్మల్ రన్అవేశ్రీ అనే ప్రక్రియ జరుగుతుంది. ఇది ఒకగొలుసుకట్టు చర్య వంటిది. ఇక్కడ ఒక బ్యాటరీ సెల్ మంటలు అంటుకోగానే పక్కనే ఉన్నసెల్స్ను సెకన్ల వ్యవధిలో వేడి చేస్తుంది. తద్వారా ఉష్ణోగ్రతలు 600 సెంటీగ్రేడ్ల నుంచి 1000 సెంటిగ్రేడ్ల వరకు చేరుకుంటుంది. ఇలాంటి మంటలను ఆర్పడానికి సాధారణ పౌడర్ ఆధారిత ఫైర్ ఎక్స్టింగ్యుషర్లు ఏమాత్రం పనిచేయవు. ప్రమాదాలపై అప్రమత్తం వాహనం నుంచి పొగ రావడం గమనించిన వెంటనే తొలిప్రాధాన్యతగా అక్కడి నుంచి పారిపోవడం మాత్రమే అయి ఉండాలి. ఫోన్, బ్యాగ్ వంటి వస్తువుల కోసం సమయం వృథా చేయకండి. కారులో ఉన్నవారు గరిష్టంగా 60 సెకన్లలోపు బయటకు వచ్చి కనీసం 100 నుంచి 200 మీటర్ల దూరం పారిపోవాలి. బ్యాటరీ కాలిపోయేటప్పుడు ‘హైడ్రోజన్ ఫ్లోరైడ్’ అనే అత్యంత భయంకరమైన విషవాయువు వెలువడుతుంది. ఇది గాలి కన్నా బరువుగా ఉండి, ఊపిరితిత్తులను, చర్మాన్ని క్షణాల్లో దెబ్బతీస్తుంది. పొగను పీల్చడం ప్రాణాంతకం. గాలి వీచే దిశకు ఎదురుగా కాకుండా సురక్షిత ప్రాంతానికి వెళ్లాలి. బకెట్లతో నీళ్లు చల్లడంతో మంటలు ఆరకపోగా, ఆ నీరు విషవాయువులను నేరుగా ముఖంపైకి నెట్టే ప్రమాదం ఉంది. అపార్ట్మెంట్ సెల్లార్లలో, బేస్మెంట్లలో ఈవీ వాహనాలు ఉన్నప్పుడు ప్రమాద తీవ్రత ఇంకా అధికంగా ఉంటుంది. మంటలు అంటుకున్నప్పుడు పొగ సెల్లార్ అంతా నిండిపోయి లిఫ్ట్ షాఫ్టుల ద్వారా పైఅంతస్తులకు వ్యాపిస్తుంది. అందుకే ప్రమాదం జరిగినప్పుడు పొరపాటున కూడా లిఫ్ట్ వాడకూడదు. ముఖ్యమైన విషయాలు ఈవీ బ్యాటరీలు మంటలు ఆరిపోయినట్లు కనిపించినా 24 నుంచి 48 గంటల వరకు ఎప్పుడైనా మళ్లీ కాలిపోయే అవకాశం ఉంటుంది. లోపల రసాయన చర్య జరుగుతూనే ఉండటంతో ఇలా సంభవిస్తుంది. అందుకే మంటలు ఆరిపోయాయి కదా అని వాహనం దగ్గరకు వెళ్లకూడదు. ఫైర్ డిపార్ట్మెంట్కు సమాచారం ఇచ్చేటప్పుడు అది ‘ఎలక్ట్రిక్ వాహనం’అని కచ్చితంగా చెప్పాలి, అప్పుడే వారు ఆక్సిజన్ మాస్కులు, ప్రత్యేక హాజ్మత్ రక్షణ గేర్తో వస్తారు. ముందస్తు జాగ్రత్తలు బ్యాటరీని ఎప్పుడూ 100శాతం వరకు చార్జ్ చేయకుండా 20 నుంచి 80శాతం మధ్య ఉంచడం శాసీ్త్రయంగా సురక్షితం. ఎండఎక్కువగా ఉన్నప్పుడు, ఇంజిన్ వేడిగా ఉన్నప్పుడు వెంటనే చార్జింగ్ పెట్టకూడదు. అపార్ట్మెంట్లలో చార్జింగ్ పాయింట్ల వద్ద నాణ్యమైన వైరింగ్, తగిన సర్క్యూట్ బ్రేకర్లు ఉండేలా చూసుకోవాలి. ఎలక్ట్రిక్ వాహనాల ఫైర్సేఫ్టీ -
గుండెపోటుతో వైద్యుడి హఠాన్మరణం
భైంసాటౌన్/ఎల్లారెడ్డిపేట: నిర్మల్ జిల్లా భైంసా పట్టణానికి చెందిన వైద్యుడు, నర్సాపూర్(జి) ఆస్పత్రిలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ జీడి సురేందర్(50) బుధవారం గుండెపోటుతో మృతిచెందారు. బైంసాలోని తన ప్రైవేట్ ఆస్పత్రిలో బుధవారం ఓ రోగికి వైద్యసేవలు అందిస్తుండగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది నిర్మల్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ చనిపోయారు. పేద కుటుంబం నుంచి.. రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కిషన్దాస్పేటకు చెందిన జీడి సాయిలు, పోశవ్వ దంపతుల కుమారుడు జీడి సురేందర్. పదో తరగతి వరకు స్థానిక జెడ్పీ పాఠశాల, ఇంటర్ సిరిసిల్లలో, కామారెడ్డిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. డిగ్రీ చదువుతుండగానే వెటర్నరీ శాఖలో ఉద్యోగం పొందారు. అనంతరం వరంగల్లోని కాకతీయ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ చదివారు. 2011లో భైంసాలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో సివిల్ అసిస్టెంట్ సర్జన్గా విధుల్లో చేరారు. అప్పటి నుంచి ఎంతో మంది పేదలకు వైద్యసేవలందించారు. సాధారణ రైతు కుటుంబం నుంచి కష్టపడి చదివిన సురేందర్ ఎల్లారెడ్డిపేట నుంచి మొట్టమొదటి డాక్టర్గా పట్టా అందుకున్నారు. బైంసా ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్గా విధులు నిర్వహిస్తూ ప్రజల గుండెల్లో దేవుడిగా నిలిచిపోయారు. ఎంతోమంది పేదలకు ఉచితంగా వైద్యం అందించే పేదల డాక్టర్గా పేరు గడించారు. సురేందర్కు భార్య జ్యోతి, ఇద్దరు కూతుళ్లు ప్రీతి, అవంతిక. ఒకరు హైదరాబాద్లో మెడిసిన్ చదువుతుండగా, చిన్న కూతురు పట్టణంలోని ప్రైవేట్ పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. డాక్టర్ హఠాన్మరణంపై పట్టణ ప్రముఖులతోపాటు వైద్యులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పిల్లల అక్రమ రవాణా కేసులో ఆర్ఎంపీ అరెస్టుమల్యాల: దేశవ్యాప్తంగా నవజాత శిశువుల విక్రయం కేసులో మండలంలోని మద్దుట్లకు చెందిన ఓ ఆర్ఎంపీని గుజరాత్ పోలీసులు అరెస్టు చేశారు. నవజాత శిశువులను పిల్లలు లేని వారికి ఒక్కో చిన్నారిని రూ.2లక్షల నుంచి రూ.4లక్షలకు విక్రయిస్తున్నారనే ఆరోపణలతో గుజరాత్ నుంచి వచ్చిన పోలీసులు మద్దుట్ల వాసిని అరెస్టు చేసినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. ఆపరేషన్ దేవ్ పేరుతో పోలీసులు గుజరాత్, మహారాష్ట్ర, ఢిల్లీ, తెలంగాణ రాష్ట్రాల్లో పలువురిని అరెస్టు చేయగా.. వారిలో మద్దుట్లకు చెందిన వ్యక్తి ఉండడం స్థానికంగా కలకలం రేపింది. -
సమస్యలు వింటూ.. పరిష్కార మార్గం చూపుతూ..
పెద్దపల్లి: ప్రజావాణిలో స్వీకరించిన అర్జీలను పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఆదేశించారు. కలెక్టర్లే సోమవారం ప్రజావా ణి ద్వారా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అదనపు కలెక్టర్ వేణు హాజరయ్యారు. యైటింక్లయిన్కా లనీకి చెందిన కె.రాజమ్మ.. 69/ఈ సర్వేనంబరులో 26 గంటలు ఉందని, కొందరు తన సంతకం ఫోర్జరీ చేశారని, ఆ భూమిపై ఎవరికీ పట్టా చేయొద్దని వి న్నవించింది. జూలపల్లి మండలం కుమ్మరికుంటకు చెందిన ఎ.భూమయ్య.. తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరైందని, ప్రభుత్వం అందించే రూ.5 లక్షలతో రేకులషెడ్డు నిర్మాణానికి వెసులుబాటు కల్పించాలని కోరింది. సుల్తానాబాద్ మండలం సుద్దాలకు చెందిన ఎస్.మదన్మోహన్.. ఆరేళ్లక్రి తం రైలు ప్రమాదంలో కాలు కోల్పోయానని, ది వ్యాంగుల పింఛన్తోపాటు అంత్యోదయ రేషన్ కా ర్డు మంజూరు చేయాలన్నాడు. పెద్దపల్లి – కూనా రం మధ్య రోడ్డు గుంతలుపడి ప్రమాకరంగా మారింని, మరమ్మతు చేయించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ కో ఆర్డినేటర్ ఆకుల స్వామి వివేక్పటేల్ కోరారు. సమస్యలు పరిశీలించిన కలెక్టర్.. వాటిని సత్వరమే పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. పలువురు అధికారులు తదితరులు పాల్గొన్నారు.నాది నిరుపేద కుటుంబం. దివ్యాంగుడిని. దయచేసి నాయకు దివ్యాంగుల పింఛన్ ఇప్పించండి. – సాబీర్ హుస్సేన్, పెద్దపల్లి ఎస్సారెస్పీ కాలువను ఆక్ర మించి సాగు చేసుకుంటున్నారు. ఆక్రమణలు ఆపా లి. ఎస్సారెస్పీ కాలువ ద్వా రా పంటలకు సాగునీరు రాకుండా రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్న వారిపై చర్య తీసుకోవాలి. – సందీప్రెడ్డి, బుర్హామియాపేట, ఎలాగేడునా ఇంటి పన్ను రూ.5,500 ఉంది. కానీ, పంచాయతీ కార్యదర్శి అదనంగా రూ. 10,500 తీసుకున్నారు. గ్రామస్తులను మోసం చేస్తు న్న పంచాయతీ సెక్రటరీపై చర్య తీసుకోవాలి. – కరబూజ రవికుమార్, వెన్నంపల్లి మట్టి క్వారీకి అన్ని అనుమతులు ఉన్నా పెద్దపల్లి రూరల్ ఎస్సై లారీలను ఆపివేశారు. డ్రైవర్లను బెదిరించి పోలీస్స్టేషన్కు తరలించారు. తగిన విచారణ జరిపి చర్య తీసుకోవాలి. – ఎస్.రాంరెడ్డి, శాంతినగర్, పెద్దపల్లి -
ఆఫ్రికాకు సింగరేణి డాక్టర్
గోదావరిఖని: ఆఫ్రికా దే శంలో జరిగే అంతర్జాతీయ మైన్స్రెస్క్యూ పోటీలకు జ డ్జిగా సింగరేణి డాక్టర్ రాజేశ్వర్ ఎంపికయ్యారు. ఈనె ల 25 నుంచి మే 8వ తేదీ వరకు ఆఫ్రికాలోని జాంబి యా ప్రాంతంలో జరిగే అంతర్జాతీయ మైన్స్రె స్క్యూ పోటీలకు సింగరేణి వైద్యుడు ఎంపిక కావడం దేశంలోనే తొలిసారి. ఈసందర్భంగా పలువురు రాజేశ్వర్ను అభినందించారు. పథకాలపై అవగాహన ఉండాలిపెద్దపల్లి: మైనారిటీల సంక్షేమ, అభివృద్ధి ప థకాలపై అవగాహన అవసరమని జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి రమేశ్కుమార్ నాయుడు తెలిపారు. మైనార్టీల సంక్షేమ పథకాలపై కలెక్టరేట్లో సోమవారం అవగాహన కల్పించారు. ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక ద్వారా మైనారి టీ మహిళలకు కుట్టుయంత్రాలు పంపిణీ చే స్తామని తెలిపారు. యువతకు నైపుణ్యాభివృద్ధి పై అవగాహన కల్పిస్తామని చెప్పారు. ఈనెల 24న ముస్లిం ఫకీర్, తుర్కాకాషా కమ్యూనిటీ సభ్యులతో సమావేశాలు నిర్వహిస్తామని అ న్నారు. వక్ఫ్ బోర్డు రాష్ట్ర డైరెక్టర్ సనా ఫారూక్, ప్రధాన కార్యదర్శి సయ్యద్ ముషారఫ్, పాస్ట ర్స్ అధ్యక్షుడు డేవిడ్, అశోక్, రాజు ఉన్నారు. జిల్లాకు పాఠ్యపుస్తకాలు పెద్దపల్లి: జిల్లాలో పాఠశాలలు పునఃప్రారంభించేనాటికి పాఠ్యపుస్తకాలు పూర్తిస్థాయిలో అందించాలనే లక్ష్యంతో విద్యాశాఖ ముందస్తుగానే సరఫరా ప్రారంభించింది. జిల్లాకు 2,86,233 పాఠ్యపుస్తకాలు అవసరం కాగా ఇప్పటికే 1,54,590 వరకు చేరాయి. తొలివిడతలో వ చ్చిన పాఠ్యపుస్తకాలను అప్పన్నపేట గోదాంలో నిల్వచేశారు. జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ పా ఠశాలలు 576 వరకు ఉన్నాయి. ప్రశాంతంగా ‘ఓపెన్’ పరీక్షలు పెద్దపల్లి: జిల్లాలో ఓపెన్ టెన్త్, ఇంటర్మీడియట్ పరీక్షలు సోమవారం ప్రశాంతంగా జరిగాయని జిల్లా విద్యాశాఖ అధికారి శారద తెలిపారు. టెన్త పరీక్షకు 972 మంది విద్యార్థులకు 883 మంది హాజరయ్యారని, 90.84శాతం హాజరు నమోదు అయ్యిందని వివరించారు. ఇంటర్మీడియట్ పరీక్షకు 1,542 మందికి 1402 మంది హాజరయ్యారని డీఈవో వివరించారు. -
పీక్కతింటున్నాయి
సాక్షి పెద్దపల్లి: గ్రామ సింహాలు ఒకప్పుడు అపరిచితులు, దొంగలపాలిట సింహస్వప్నంగా ఉండేవి. మారిన పరిస్థుతుల దృష్ట్యా పిల్లలు, వృద్ధులపాలి ట మృత్యుమృగాలుగా మారుతున్నాయి. జిల్లావ్యాప్తంగా దడ పుట్టిస్తుండగా.. బాధితులు పెరిగిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. దొరికిన వారిని దొరికినట్లు కరిచేస్తున్నాయి. దీనికితోడు వేసవికావడంతో ఇరిటేషన్ పెరిగి ప్రజలపై విరుచుకుపడుతున్నాయి. రోజూ కనీసం పదుల సంఖ్యలో బాధితు లు ఆస్పత్రులకు పరుగులు పెడుతున్నారు. గత జ నవరిలో 831, ఫిబ్రవరిలో 779, మార్చిలో 684 కుక్కకాటు కేసులు నమోదయ్యాయి. ● అత్యధిక ఉష్ణోగ్రతలతో.. జిల్లాలో 40 డిగ్రీల సెల్సియస్కు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కుక్కల్లో విపరీతమైన ఇరిటేష న్ వచ్చి, దాహం ఎక్కువై స్వైరవిహారం చేస్తున్నా యని వైద్యులు చెబుతున్నారు. ఆగ్రహంతో ఎవరు కనిపించినా దాడి చేసేందుకు యత్నిస్తున్నాయి. సౖ రెన సమయంలో ఆహారం, నీళ్లు దొరక్క ఇలా వ్యవహరిస్తున్నాయి. ప్రధానంగా పిల్లలపై అధికంగా ప్రతాపం చూపుతున్నాయి. ● మాంసానికి అలవాటు పడి.. జీవవ్యర్థాలు, వృథా ఆహారం ఎక్కువగా లభించే ప్రాంతాల్లో కుక్కల బెడద అధికంగా ఉంది. ఫంక్షన్ హాల్స్, మటన్, చికెన్ షాపుల వద్ద వ్యర్థాలను తి నేందుకు అలవాటుపడ్డాయి. ఆహారం లభించనప్పుడు జనావాసాల వైపు వస్తున్నాయి. ఆ సమయంలో చేతిలో సంచితో వెళ్లే ప్రజలపై విరుచుకుపడుతున్నాయి. వాటిని ప్రతిఘంటించలేక అనేకమంది తీవ్రంగా గాయపడుతున్నారు. మాంసానికి అల వాటు పడిన కుక్కలు మేకలు, గొర్రెల మందలపై కూడా దాడులు చేసి పీక్కుతింటున్నాయి. ● స్టెరిలైజేషన్ లేక.. 2019 పశుగణన ప్రకారం జిల్లాలో సుమారు 4 వే ల కుక్కలు ఉన్నట్లు గుర్తించారు. ఇప్పటివరకు మ ళ్లీ గణన చేపట్టలేదు. ప్రస్తుతం వీటిసంఖ్య రెట్టింపైనట్లు అంచనా. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం.. వీధికుక్కలకు స్థానిక సంస్థల అధికారు లు రేబిస్ టీకాలు వేయించాలి. సంతాన నియంత్ర ణ ఆపరేషన్లు చేయించాలి. అవేవీ అమలుకు నోచుకోవడం లేదు. కుక్కలను యానిమల్ బర్త్ కంట్రో ల్ కేంద్రాలకు తరలించి శస్త్రచికిత్సలు చేసి వదిలేయాలి. అనారోగ్యంతో ఉన్న, రేబిస్ సోకిన వాటిని గుర్తించి చికిత్స అందించాలి. నిధుల కొరతతో వీటిని పట్టించుకునేవారు కరువయ్యారు. 07 మార్చి : రామగుండం కార్పొరేషన్ 39వ డివిజన్ కార్పొరేటర్ తిప్పారపు మానస కుమారుడు చార్విక్పై వీధికుక్కలు దాడి చేశాయి. తీవ్రంగా గాయపడ్డ చిన్నారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. 18 ఏప్రిల్ : పెద్దపల్లి మండలం అందుగులపల్లిలో పిచ్చికుక్కలు స్వైరవిహారం చేశాయి. ఆడుకుంటున్న రెండేళ్ల చిన్నారితోపాటు మరో ఇద్దరిపై దాడిచేసి గాయపర్చాయి. 19 ఏప్రిల్ : సుల్తానాబాద్ మండలం కాట్నపల్లిలోని ఓ రైస్మిల్లులో పనిచేసేందుకు వచ్చిన ఒడిశా కార్మికుడి కూతురు దివ్వ బెహరా(3)పై కుక్కలు పాశవికంగా దాడి చేసి చంపేసి పీక్కుతిన్నాయి. జిల్లాలో పెరిగిన కుక్కల బెడదకు ఈ ఘటన అద్దం పడుతోంది. కరిచినచోట తొలుత సబ్బుతో శుభ్రం చేసి ఆస్పత్రికి తరలించాలి. తీవ్రతను బట్టి వైద్యులు చికిత్స అందిస్తారు. పెంపుడు కుక్కలు కరిస్తే ఇదివరకే టీకా వే యించారా?లేదా అనే విషయాలు పరిగణనలోకి తీసుకొని చికిత్స చేస్తారు. వీధికుక్కలు కరిస్తే కరిచిన భాగాలను బట్టి తప్పనిసరిగా ఇమ్యునోగ్లోబిన్, వ్యాక్సినేషన్ ఇచ్చి చికిత్స కొనసాగిస్తారు. చిన్నారులు, వృద్ధులు వీటిబారిన పడే ఆస్కారం మరింత ఎక్కువ. బయటికి వెళ్లే తరుణంలో కర్రను తీసుకెళ్లడం ఉత్తమం. కుక్కల ప్రవర్తనలో తేడా కనిపించినా, వాటి నోటినుంచి నురగలాంటిది వెలువడినా పిచ్చికుక్కగా గుర్తించి మున్సిపల్ అధికారులకు సమాచారం అందించాలి. కుక్క కరిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించండి. లేదంటే రేబిస్వచ్చి ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. ప్రభు త్వ ఆస్పత్రిలో మెరుగైన వైద్యం అందిస్తాం. ఇంటివద్ద, పనిప్రదేశాల్లో కుక్కలకు దూరంగా ఉండండి. పెంపుడు కుక్కలు సైతం ఇతరులను కరవకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. – శ్రీధర్, డీసీహెచ్వో, పెద్దపల్లి -
బసవేశ్వర ఆశయాలు సాధించాలి
పెద్దపల్లి: సంఘసంస్కర్త, తత్వవేత్త బసవేశ్వర ఆశ య సాధనకు అందరూ కృషి చేయాలని అదనపు కలెక్టర్ వేణు అన్నారు. కలెక్టరేట్లో జిల్లా బీసీ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో సోమవారం బసవేశ్వర జ యంతి ఘనంగా నిర్వహించారు. అదనపు కలెక్టర్ వేణు బసవేశ్వరుని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం ఆయన మా ట్లాడుతూ, బసవేశ్వరుడు కుల వ్యవస్థ, అసమానతలు తొలగించేందుకు కృషి చేసిన గొప్ప సంస్కర్త అన్నారు. సమాజంలోని ప్రతీ వర్గం అభివృద్ధికి బసవేశ్వరుని ఆలోచనలు ఎంతో అవసరమని చెప్పా రు. జిల్లా బీసీ అభివృద్ధి అధికా రి వినోద్ కుమార్, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ వేణు సంఘ సంస్కర్తకు ఘననివాళి -
రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలకు ఎంపిక
కరీంనగర్స్పోర్ట్స్/కొత్తపల్లి: రంగారెడ్డి జిల్లా గుర్రంగూడాలో జరుగుతున్న 69వ రాష్ట్రస్థాయి పాఠశాలల అండర్– 17 బాలికల క్రికెట్ పోటీలకు ఉమ్మడి చింతకుంట జెడ్పీ స్కూల్కు చెందిన విద్యార్థిని ఎంపికై నట్లు ఫిజికల్ డైరెక్టర్ అంతడ్పుల శ్రీనివాస్ తెలిపారు. ఇటీవల జరిగిన ఉమ్మడి జిల్లా స్థాయి పోటీల్లో విద్యార్థిని నాగపూర్ శృతి ప్రతిభ కనబరిచి రాష్ట్ర పోటీలకు ఎంపికై ంది. ఈసందర్భంగా శృతిని ప్రధానోపాధ్యాయురాలు తాండ్ర శోభారాణి, 14,15వ డివిజన్ల కార్పొరేటర్లు గడ్డి ప్రదీప్, పిట్టల జ్యోతి, ఉపాధ్యాయులు అభినందించారు. నేత్రదానానికి అంగీకారం కరీంనగర్: జన్మదినాన్ని పురస్కరించుకొని నేత్రదానానికి అంగీకారం తెలుపుతూ ఆదర్శంగా నిలిచారు కరీంనగర్కు చెందిన కోటక్ మహీంద్ర బ్యాంకు టీమ్ లీడర్ బొజ్జ అరుణ్ కుమార్. సోమవారం సదాశయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన నేత్రదానానికి సంబంధించిన పత్రాలపై సంతకం చేసి పట్టణ కో కన్వీనర్ ఎస్.రాజకనకయ్యకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయనకు ఐడీ కార్డు, అభినందన సర్టిఫికెట్ అందించారు. పుట్టినరోజున నేత్రదానానికి ముందుకు రావడంతో తోటి ఉద్యోగులు, యువతకు అరుణ్కుమార్ ఆదర్శంగా నిలిచారని ఫౌండేషన్ ప్రతినిధులు పేర్కొన్నారు. కార్యక్రమంలో తాడూరి కరుణాకర్, ఎన్.కనకయ్య, ఎస్.ప్రభాకర్, టి.వాసు, బి.శంకర్గౌడ్, బి.కిషన్, మధుసూదనాచారి తదితరులు పాల్గొన్నారు. -
చిన్నకాళేశ్వరంపై సీఎం భరోసా
మంథని: దివంగత సీఎం డాక్టర్ వైస్ రాజశేఖరరెడ్డి హయాంలో పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గంలోని మహదేవపూర్ మండలం బీరాసాగర్ వద్ద గో దావరిపై చేపట్టిన చిన్నకాళేశ్వరం(కాళేశ్వర ముక్తీశ్వర ఎత్తిపోతల) నిర్మాణంపై రైతుల్లో ఆశలు చిగు రిస్తున్నాయి. రూ.500 కోట్ల అంచనాతో 18 ఏళ్లక్రి తం ప్రారంభించిన ఎత్తిపోతల.. అటవీ, పర్యావర ణ అనుమతులు, భూసేకరణతోపాటు ఇతరత్రా కా రణాలతో ముందుకుసాగడం లేదు. ఈప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే, ఐటీ, పరి శ్రమలు, అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ప్రత్యేక చొరవతో ఎత్తిపోతల పూర్తికి సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఈక్రమంలో సోమవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం నస్తూర్పల్లిలో నిర్వహించిన రైతుభరోసా సభలో చిన్నకాళేశ్వరం పూర్తిచేసే బాధ్యత తీసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్వయంగా ప్రకటించడంతో ఈప్రాంత రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. 45 వేల ఎకరాల ఆయకట్టుకు.. మంథని నియోజకవర్గంలోని మహదేవపూర్, కాటారం, మహాముత్తారం, మల్హర్, పలిమెల మండలాల్లోని 63 గ్రామల పరిధిలో గల 45,280 ఎకరాలకు సాగునీటితోపాటు తాగునీరందించేందుకు 2008 సెప్టెంబర్ 19న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కాళేశ్వరం ఎత్తిపోతలకు శంకుస్థాపన చేశారు. మహదేవపూర్ మండలం బీరాసాగర్ గోదావరి నుంచి నీటిని ఎత్తిపోసేలా రూపకల్పన చేశారు. రూ.500 కోట్ల వ్యయంతో పరిపాలనా అనమతులు వచ్చాయి. ఆ తర్వాత ప్రాజెక్టు వ్యయం రూ.946 కోట్లకు చేరింది. ప్రభుత్వం నిధులు విడుదల చేయడమే కాకుండా ప్రాజెక్టు పూర్తిచేస్తానని సీఎం మాటఇవ్వడంతో చిన్నకాళేశ్వరం పనులు పరుగులు పెడతాయని రైతులు వ్యక్తం చేస్తున్నారు. మంత్రి శ్రీధర్బాబు సైతం చిన్నకాళేశ్వరం పూర్తిచేయించి సీఎంతో ప్రారంభిస్తామని చెప్పడండో ఎత్తిపోతలపై అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నెరవేరిన వారధి కల మంథని మండలం ఆరెంద – కాటారం మండలం దామెరకుంట మధ్య మానేరుపై 1.120 కిలోమీటర్ల పొడవునా రూ.210 కోట్ల అంచనాతో నిర్మించ బోయో వారధికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శంకుస్థాపన చేశారు. దీంతో రెండు జిల్లాల మధ్య దూరభారం తగ్గి రాకపోకలు మెరుగుకానున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పెద్దపల్లి పర్యటనకు వచ్చిన సమయంలో మంథని గోదావరి నదిపై వంతెనకు శంకుస్తాపన చేశారు. నియోజకవర్గంలో కొత్తగా రెండు వంతెనలకు సీఎం శంకుస్థాపన చేయడం విశేషం. కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నస్తూర్పల్లిలో నిర్వహించిన సభకు మంథనిప్రాంతం నుంచి పెద్దఎత్తున జనం తరలివెళ్లారు. ఆర్టీసీ బస్సులతోపాటు ప్రైవేటు వాహనాలు పెద్ద సంఖ్యలో వెళ్లాయి. సభ సక్సెస్ కావడమే కాకుండా కాళేశ్వరం ఆలయ అభివృద్ధికి రూ.200 కోట్లు, ఆరెంద వంతెనకు శంకుస్థాపన, చిన్నకాళేశ్వరం పూర్తికి సీఎం మాట ఇవ్వడంతో కాంగ్రెస్ శ్రేణులు సంబురం వ్యక్తం చేస్తున్నారు. 45వేల ఎకరాల ఆయకట్టుకు ప్రయోజనం ఆరెంద–దామోరకుంట వారధికి శంకుస్థాపన కాటారం సభ సక్సెస్తో కాంగ్రెస్ శ్రేణుల్లో ఆనందం -
చకచకా అండర్ బ్రిడ్జి పనులు
పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి–కూనారం మధ్య లెవల్ క్రాసింగ్ గేట్ వద్ద రైల్వే శాఖ అండర్ బ్రిడ్జి పనులు కూడా చేపట్టింది. మూడేళ్ల క్రి తం ఇదేగేటు వద్ద చేపట్టిన రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు సాగుతున్న విషయం విదితమే. దీంతోపాటు అండర్ బ్రిడ్జి కూడా నిర్మించేందుకు నిర్ణయించిన అధికారులు.. ప్రస్తుతం పనులు చకచకా సాగిస్తున్నారు. ఆర్వోబీ పైనుంచి వెళ్తే.. కిందఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లకాలనీ తదితర ప్రాంత ప్రజలు వెళ్లేందుకు ఇబ్బందులు రాకుండా అండర్ బ్రిడ్జి (ఆర్యూబీ) ఉపయోగకరంగా ఉంటుందని అంటున్నారు. జేఎన్టీయూ విద్యార్థులకు ఉద్యోగాలు రామగిరి: పెద్దపల్లి జిల్లా మంథని జేఎన్టీయూ ఫైనలియర్ విద్యార్థులకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ లభించాయి. ప్లేస్మెంట్ సాధించిన వి ద్యార్థులకు ప్రిన్సిపాల్ విష్ణువర్ధన్ సోమవా రం నియామకపత్రాలు అందజేసి అభినందించారు. జీబీబీ ప్రైవేట్ లిమిటెడ్లో సీఎన్ఎం విద్యార్థి కావలి దీక్షిత్కు రూ.12 లక్షల ప్యాకేజీ లభించింది. మెకానికల్ విద్యార్థిని పైడాకుల అలేఖ్యకు జిందాల్ సంస్థలో రూ. 10.3 లక్షలు, మైనింగ్ విభాగంలో యాదండ్ల శాశంక్ యాదవ్, మోహన్ గుగులోత్, మెకానికల్లో లోకేశ్ బోడకు రూ.4 లక్షల చొప్పున ప్యాకేజీతో ఉద్యోగాలు లభించాయి. మెకానికల్ విద్యార్థి గరిదే దేవేందర్కు రూ.2.6 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం దక్కింది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఇప్పటివరకు 107 మంది విద్యార్థులకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ వచ్చినట్లు ప్రిన్సిపాల్ వివరించారు. మెకానికల్ విభాగం ప్రొఫెసర్ చెరుకు శ్రీధర్రెడ్డి, ప్లేస్మెంట్ సెల్ ఇన్చార్జి కావ్య, పరిపాలనాధికారి సుమన్ తదితరులు అభినందించారు. క్వింటాల్ పత్తి రూ.8,031 పెద్దపల్లిరూరల్: స్థానిక వ్యవసాయ మార్కె ట్ యార్డు ఆవరణలో పత్తి క్వింటాల్కు గరిష్టంగా రూ.8,031 ధర పలికిందని మార్కెట్కమిటీ చైర్మన్ కూర మల్లారెడ్డి, కార్యదర్శి ప్రవీణ్రెడ్డి తెలిపారు. కనిష్టంగా రూ.6,831 గా సగటు రూ.7,631గా ధర ఉందన్నారు. -
బడిని బతికించుకుంటున్నారు
మంథనిరూరల్: సాధారణంగా ప్రభుత్వ పాఠశాల ల్లో పనిచేసే ఉపాధ్యాయు లు విధి నిర్వహణలో భా గంగా పాఠశాలకు రావడం, పాఠాలు చెప్పడం, ప్రభు త్వ కార్యక్రమాల్లో పాల్గొనడం పరిపాటి. కానీ ఓ ప్ర ధానోపాధ్యాయుడు తనకాంప్లెక్స్ పరిధిలోని పాఠశాల మూతబడే పరిస్థితి ఏర్పడంతో బతికించుకోవాలంటూ బడిబాటకు శ్రీకారం చుట్టారు. పెద్దపల్లి జిల్లా మంథని మండలం చిన్న ఓదాల గ్రామపంచాయతీ పరిధి శ్రీరాములపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఈ విద్యా సంవత్సరం కేవలం ఇద్దరు విద్యార్థులు మాత్రమే చదువుకున్నారు. ఆ ఇద్దరిది ఐదో తరగతి పూర్తికావడంతో ఆరోతరగతి కోసం మరోపాఠశాలకు వెళ్లాల్సి వస్తోంది. దీంతో ఆ బడి లో విద్యార్థులు లేక మూతపడే పరిస్థితి నెలకొంది. సమాచారం అందుకున్న మంథని మండలం ఆరెంద జెడ్పీహెచ్ఎస్ హెచ్ఎం ఈదులపల్లి నర్సింహారా వు సోమవారం శ్రీరాములపల్లిలో బడిబాట చేపట్టా రు. ఇంటిఇంటికీ తిరుగుతూ బడిని కాపాడుకోవాలని గ్రామస్తులను వేడుకున్నారు. ఊరిలో బడి, గుడి ఉంటేనే గొప్పగా ఉంటుందని, బడి మూతపడితే ఆ ఊరికి విద్య దూరమయ్యే ప్రమాదం ఏర్పడుతుందని అవగాహన కల్పించారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న ఎంతోమంది ఉన్నతస్థాయికి ఎదిగారని, మీ పిల్లలను స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాలు, కార్యక్రమాలను వివరించారు. పాఠశాల మూతపడకుండా సర్పంచ్ సైతం సహకారం అందించి పిల్లలను చేర్పించే బాధ్యత తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నాగుల శారద – రాజయ్య, శ్రీరాములపల్లి హెచ్ఎం రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. -
ఇది అంబులెన్సే..
పెద్దపల్లిరూరల్: ఈ ఫొటో చూసి గూడ్స్ వ్యాన్ అనుకొవద్దు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి చెందిన అంబులెన్స్ ఇది. అత్యవసర సమయంలో పేషెంట్లు, ప్రమాదాల్లో గాయపడ్డ వారిని దీనిద్వారా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించాలి. కానీ ఇందులో సామగ్రిని ఇలా లోడ్ చేయడాన్ని చూసిన పలువురు ఇదేమిటని నివ్వెరపోయారు. ఇలాంటి చర్యలు పునరావృత్తం కాకుండా చూడాలని కోరుతున్నారు. దేశంలో శాంతి నెలకొనాలి వేములవాడ: దేశంలో శాంతి నెలకొ ని ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని వేములవాడ భీమన్నను మొ క్కుకున్నట్లు సినీనటి పూనమ్ కౌర్ పేర్కొన్నారు. రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడలోని భీమేశ్వరస్వామి ని సోమవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి కోడె మొక్కులు చెల్లించారు. ఆమె వెంట బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రతాప రామకృష్ణ ఉన్నారు. -
ఆస్తి పంచుకున్నరు.. అన్నం పెడ్తలేరు
గంగాధర: ఆ తల్లిదండ్రులు 25 ఎకరాల ఆస్తి సంపాదించారు. ఐదుగురు కొడుకులను పెంచి పెద్ద చేసే క్రమంలో అవసరాని కి ఐదెకరాలు అమ్మారు. భర్త చనిపోగానే 20 ఎకరాలు కొడుకులకు పంచింది. తనకు చేతనైన పని చేసుకుంటూ బతికింది. ప్రస్తుతం మంచానికి పరిమితం కాగా, కొడుకులు పట్టించుకోక పోవడంతో తనకు న్యాయం చేయండని పోలీసులను వేడుకుంటుంది. వివరాలు.. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కాచిరెడ్డిపల్లి గ్రామపంచాయతీ పరిధి పానుగంటిపల్లి గ్రామానికి చెందిన కుంట కిష్టయ్య–నంబవ్వ దంపతులకు ఐదుగురు కుమారులు. రెండో కుమారుడు మృతిచెందాడు. 18 ఏళ్ల క్రితం భర్త చనిపోగా, తనకున్న ఆస్తిని కొడుకుల పేరుమీద చేయించింది. తర్వాత ఐదేళ్లు చిన్న కుమారుడు సత్తయ్య, మరో పదేళ్లు నాల్గో కుమారుడు లచ్చయ్య వద్ద కాలం వెల్లదీసింది. మిగతా కుమారులు మల్లయ్య, నారాయణ కుటుంబ సభ్యులు, గంగయ్య పట్టించుకోవడం లేదు. పలుమార్లు పంచాయితీలు నిర్వహించగా తల్లికి నెలకు రూ.5వేలు ఇచ్చేందుకు ఒప్పుకున్నారు. పంచాయితీ జరిగి నెలలు గడుస్తున్నా మొదటి ముగ్గురు కుమారులు పట్టించు కోవడం లేదని వృద్ధురాలు ఆవేదన వ్యక్తం చేసింది. తనకు న్యాయం చేయాలని పోలీసులను వేడుకుంది. న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించిన తల్లి -
సబ్రిజిస్ట్రార్ ఆఫీస్లో విజిలెన్స్ తనిఖీలు
గంగాధర: స్థానిక సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో సోమవారం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికా రులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కొద్దిరోజులుగా వివాదంలో ఉంటున్న సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లోకి ఎవరినీ రానీయకుండా తనిఖీ చేయడంతో ఏం జరుగుతుందోనని సిబ్బంది ఆందోళనకు గురయ్యా రు. గతంలో ఓ సబ్ రిజిస్ట్రార్ అధికారి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కగా, మరో రిజి స్ట్రార్ ప్రభుత్వ భూములు రిజిస్ట్రేషన్ చేసి సస్పెన్షన్కు గురయ్యాడు. అప్పటి నుంచి ఏడాదికి పైగా ఇన్చార్జి అధికారులతోనే కొనసాగుతుంది. ప్రస్తు తం రెండుమూడు రోజులకో ఉద్యోగి ఇన్చార్జిగా వ స్తున్నారు. కాగా, ఇక్కడ ఇన్చార్జి విధులు నిర్వహించేందుకు జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం ఉద్యోగులు జంకుతున్నారు. ఈనేపథ్యంలో విజిలెన్స్ అండ్ ఎ న్ఫోర్స్మెంట్ సీఐలు అనిల్కుమార్, రవీందర్ భూ ముల క్రయవిక్రయాల రికార్డులు పరిశీలించారు. రోజుకు ఎన్ని రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని ఇన్చార్జి సబ్ రిజిస్ట్రార్ అన్వర్ను అడిగి తెలుసుకున్నా రు. అధికారులు మాట్లాడుతూ, సాధారణ తనిఖీలో భాగంగానే రికార్డులు పరిశీలించామన్నారు. -
తెలంగాణలో ఎరువులకు కొరత లేదు
● వానాకాలం సీజన్కు సరిపడా ఉత్పత్తి ● సరఫరాలో ఎలాంటి ఆలస్యం ఉండదు ● తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ సహకార శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్ ● ఆర్ఎఫ్సీఎల్ ప్లాంట్ పూర్తిసామర్థ్యంతో పనిచేయడానికి సర్కార్ సహకారం ● రామగుండం ప్రాజెక్టులో యూరియా ఉత్పత్తి, సరఫరాపై సమీక్ష ఫెర్టిలైజర్సిటీ: వచ్చేవానాకాలం సీజన్కు తెలంగాణ రాష్ట్రానికి అవసరమైన యూరియా సరఫరా ఎలాంటి అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ, సహకార శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్ సూచించారు. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎరువుల కర్మాగారాన్ని కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి ఆయన సోమవారం యూరియా ఉత్పత్తి, సరఫరాపై సమీక్షించారు. సురేంద్ర మోహన్ మాట్లాడుతూ, తెలంగాణకు యూరియా ప్రధాన సరఫరాదారుగా ఉన్న ఆర్ఎఫ్సీఎల్ ప్లాంట్ ఎరువులు అందుబాటులో ఉండేలా ముందస్తు ప్రణాళిక రూపొందించాలన్నారు. సమయానికి రైతులకు అందించడం అత్యంత ముఖ్యమని చెప్పారు. ఆర్ఎఫ్సీఎల్ పూర్తిసామర్థ్యంతో పనిచేయడానికి తెలంగాణ ప్రభుత్వం అన్నివిధాలుగా సహకారం అందిస్తుందని కలెక్టర్ శ్రీహర్ష తెలిపారు. రాష్ట్ర అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఉత్పత్తి, నిల్వలు, సరఫరాలో సమన్వయం పాటించాలని ఆయన సూచించారు. రైతుల ప్రయోజనాల కోసం అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ఎరువుల సరఫరాలో లోపాలు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం ప్లాంట్ను సందర్శించి, యూరియా ఉత్పత్తి ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్లాంట్ యూనిట్ హెడ్ జిందాల్, ప్రొడక్షన్ హెడ్ సహా, టెక్నికల్ సర్వీసెస్ హెడ్ సత్యనారాయణ, అధికారులు పాల్గొన్నారు. -
బాధితుల పక్షాన నిలబడాలి
గోదావరిఖని: ఆర్ఎఫ్సీఎల్ బాధితుల పక్షా న రామగుండం ఎమ్మెల్యే రాజ్ఠాకూర్ నిలబడాలని ఆర్ఎఫ్సీఎల్ మజ్దూర్ యూనియన్ అధ్యక్షుడు అంబటి నరేశ్ కోరారు. స్థానిక ప్రె స్క్లబ్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉ ద్యోగాల బాధితుల డబ్బులతో కొనుగోలు చే సిన భూమిని విక్రయించి న్యాయం చేస్తానని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే.. ఇప్పుడు దొంగల ప క్షాన నిలిచినట్లుగా అర్థమవుతోందని అన్నా రు. బాధితుల డబ్బులతో గోదావరినది ఒడ్డు న కొనుగోలు చేసిన 18 ఎకరాలకు డీటీసీపీ అనుమతి ఇవ్వడమే ఇందుకు నిదర్శనమన్నా రు. రామగుండంలో చీమచిటిక్కు మన్నా ఎ మ్మెల్యేకు తెలుస్తుందని, అలాంటిది రూ.కోట్ల విలువైన భూములకు ఎమ్మెల్యేకు తెలియకుండా అనుమతి వస్తుందా? అని ప్రశ్నించారు. బాధితులకు న్యాయం చేయకుంటే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట నిరాహార దీక్ష చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో ఉద్యోగ బాధితులు మర్రి రాములు, ఆర్.సత్యనారాయణ, రాకేశ్గౌడ్, సతీశ్, కుమారస్వామి, శ్రీకాంత్, నేరేళ్ల సతీశ్ తదితరులు పాల్గొన్నారు. -
గుండెకు భరోసా
గోదావరిఖని: హార్ట్ ఎటాక్, గుండె సంబంధిత వ్యాధులకు గురైన సింగరేణి కార్మికులు, వారి కుటుంబ సభ్యులను సుమారు 65 కి.మీ. దూరంలోని కరీంనగర్ లేదా సుదూరంలోని హైదరాబాద్కు తరలించాల్సిన దుస్థితి నెలకొంది. ఈలోగా అదృష్టం బాగుంటే పేషెంట్ ప్రాణం దక్కుతుంది. లేదంటే మార్గమధ్యంలోనే ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. ఇలాంటి పరిస్థితి నుంచి గట్టెక్కించేందుకు గోల్డెన్ అవర్లోనే వైద్యచికిత్సలు అందించేలా గోదావరిఖని సింగరేణి ఏరియా ఆస్పత్రిలో కార్డియాలజీ క్యాథ్ల్యాబ్ ఏర్పాటు చేస్తున్నారు. ఈనెలాఖరు లేదా వచ్చేనెల తొలివారంలో ప్రారంభించేందుకు సింగరేణి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. సిద్ధమవుతున్న కార్డియాలజీ క్యాథ్ల్యాబ్ ఈనెలాఖరు వరకు ప్రారంభించే అవకాశం ముఖ్యమంత్రి లేదా డిప్యూటీ సీఎం హాజరు ఏర్పాట్లు పూర్తిచేస్తున్న సింగరేణి యాజమాన్యం -
అన్నదాతకు ప్రజాప్రభుత్వం అండ
పెద్దపల్లిరూరల్: ఆరుగాలం శ్రమించి పంటలు పండిస్తున్న అన్నదాతలకు సీఎం రేవంత్రెడ్డి సారథ్యంలోని ప్రజాప్రభుత్వం అండగా ఉంటుందని ప్రభు త్వ విప్, ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. స్థానిక వ్యవసాయ మార్కెట్లో మంగళవారం ధా న్యం, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను అడిషన ల్ కలెక్టర్ వేణు, మార్కెట్ చైర్మన్ కూర మల్లారెడ్డి, జిల్లా మార్కెటింగ్ అధికారి ప్రవీణ్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మల్లయ్యతో కలిసి ప్రారంభించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలకులు కోతల పేరిట రైతులశ్రమను దోచుకున్నారని ఆరోపించారు. డీసీవో శ్రీమాల త దితరులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా కేంద్రంలోని ప్రధాన కూరగాయల మార్కెట్ను కొత్తగా ని ర్మించేందుకు వీలుగా వ్యవసాయ మార్కెట్ ఆవర ణలో తాత్కాలికంగా ఏర్పాటు చేసేందుకు అవసరమైన స్థలాన్ని పరిశీలించారు. చిరువ్యాపారులకు ఇ బ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్కు సూచించారు. మద్దతు ధరకే మక్కలు, ధాన్యం సేకరణ ప్రభుత్వ విప్ విజయరమణారావు పెద్దపల్లి మార్కెట్లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభం -
బదిలీల సందడి
సాక్షి పెద్దపల్లి: ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం ఎట్టకేలకు గ్రీన్సిగ్నల్ ఇచ్చి తీపి కబురు అందించింది. బదిలీలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ ప్రభు త్వం అధికారికంగా ఉత్తర్వులు జారీచేసింది. దీని ద్వారా మే ఒకటోతేదీ నుంచి మే 31వ తేదీ వరకు బదిలీల ప్రక్రియ కొనసాగనుంది. పారదర్శకతకు పెద్దపీట పారదర్శకతకు పెద్దపీట వేస్తూ, అటు పరిపాలన సౌలభ్యం, ఇటు ఉద్యోగుల వ్యక్తిగత అవసరాలను సమన్వయం చేస్తూ ప్రభుత్వం కొత్త నిబంధనలను రూపొందించి కీలక నిర్ణయం తీసుకుంది. 2024 ఆగస్టు ఒకటోతేదీ నుంచి సాధారణ బదిలీలపై నిషేధం విధిస్తూ గతేడాది జూలై 31న జీవో నంబరు 87 జారీ చేసింది. దీనిని ఎత్తివేస్తూ ప్రభుత్వం తాజాగా జీవో 38 విడుదల చేసింది. ఆరోపణలు, ఫిర్యాదులకు తావులేకుండా సకాలంలో సంబంధిత శాఖలు ప్రక్రియను నిర్వహించాలని ఆదేశించింది. బదిలీల్లో ఏవైనా ఆరోపణలు, ఫిర్యాదులు వస్తే ఆయా శాఖల అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించింది. మార్గదర్శకాలకు విరుద్ధంగా బదిలీలు నిర్వహించరాదని సూచించింది. ఈక్రజుమంలో మే నెల మొత్తం బదిలీల సందడి నెలకొనగా, జూన్ ఒకటి నుంచి బదిలీలపై మళ్లీ నిషేధం అమలులోకి వస్తుందని.. ఆలోపు ప్రక్రియ ను పూర్తిచేయాలని స్పష్టం చేసింది. జిల్లావ్యాప్తంగా గెజిటెడ్, నాన్ గెజిటెడ్, నాలుగో తరగతి ఉద్యోగులు, ఇతరత్రా కలిపి సుమారు 11వేల మంది వరకు ఉద్యోగులు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. మూడేళ్ల సర్వీసు పూర్తిచేస్తేనే.. మూడేళ్ల సర్వీసు కూడా పూర్తికాని ఉద్యోగులను ఈదఫా బదిలీ చేయరాదని ఆదేశించింది. తాజా మార్గదర్శకాల ప్రకారం.. 2026 జనవరి ఒకటో తేదీ నాటికి ఒకేచోట మూడేళ్ల సర్వీసు పూర్తిచేసుకున్న ఉద్యోగులు బదిలీలకు అర్హులు. ఏఒక్క ఉద్యోగిని కూడా ఒకేచోట నాలుగేళ్లకు మించి కొనసాగించకూడదని కచ్చితమైన ఆదేశాలు జారీచేసింది. తద్వారా సుదీర్ఘకాలంగా ఒకేచోట పాతుకుపోయిన వారికిస్థానచలనం కలగనుంది. ఏ క్యాడర్లోనైనా సరే మొత్తం ఉద్యోగుల సంఖ్యలో 40 శాతానికి మించి బదిలీలు చేయకూడదు. అలాగే 2027 మే 31లోగా ఉద్యోగ విరమణ చేయనున్న వారి అభ్యర్థన మేరకే బదిలీ చేయాలి. ఒకవేళ ప్రస్తుతం ఉన్నచోటే కొనసాగాలనుకుంటే ఇబ్బంది పెట్టకూడదు. భార్యాభర్తలు ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులైతే.. బదిలీల్లో ప్రాధాన్యత, మినహాయింపులు కల్పించారు. మానసిక సమస్యలున్న పిల్లల తల్లిదండ్రులకు ప్రాధాన్యత కల్పించారు. ప్రభుత్వ ఉద్యోగులు మే ఒకటో తేదీనుంచి తమ దరఖాస్తులను సమర్పించుకోవచ్చు. 2024 నుంచి బదిలీలపై నిషేధం 2024 జూలై 9న జారీచేసిన ఉత్తర్వులతో బదిలీలను అనుమతించారు. తదుపరి జూలై 31, 2024న జీవో 87 విడుదల చేసి నిషేధం విధించారు. దీంతో ఆగస్టు 1, 2024 నుంచి సాధారణ బదిలీలపై నిషేధం అమల్లోకి వచ్చింది. దీనిద్వారా సాధారణ బదిలీలు పూర్తిగా నిలిపివేశారు. ప్రత్యేక పరిస్థితుల్లోనే ముఖ్యమంత్రి, ఉన్నతాధికారుల అనుమతితో బదిలీలు చేపట్టారు. ఎన్నికల కోడ్, పరిపాలనాపరమైన కారణాలు, అంతకుముందు జరిగిన జీవో 317 గందరగోళంతో బదిలీలు నిలిచిపోయాయి. దీంతో వేలమంది ఉద్యోగులు తమ సొంత జిల్లాలకు లేదా అనుకూలమైన ప్రాంతాలకు వెళ్లలేక ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా భార్యాభర్తలు వేర్వేరు జిల్లాల్లో పనిచేస్తూ ఎదుర్కొంటున్న సమస్యలపై పెద్దఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. ప్రభుత్వం నిషేధాన్ని ఎత్తివేయడంతో ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. మే నెలంతా ట్రాన్స్ఫర్లు.. మే ఒకటినుంచి ప్రారంభమయ్యే బదిలీల ప్రక్రియలో అత్యంత పారదర్శకత పాటించాలని ప్రభుత్వం ఆదేశించింది. శాఖల వారీగా ఖాళీల వివరాలను ప్రదర్శించి, కౌన్సెలింగ్ ద్వారా బదిలీలు చేపట్టనున్నారు. రాజకీయ జోక్యం లేకుండా, కేవలం సీనియారిటీ, నిబంధనల ప్రకారమే ఈ ప్రక్రియ పూర్తి చేయాలని సంకల్పించింది. దీంతో మే నెల మొత్తం ప్రభుత్వ కార్యాలయాల్లో బదిలీల సందడి నెలకొననుంది. ఉద్యోగుల స్థానచలనానికి సర్కారు గ్రీన్సిగ్నల్ మే ఒకటి నుంచి 31వ తేదీ వరకు ట్రాన్స్ఫర్స్ మూడేళ్లు ఒకేచోట పనిచేసేవారికి అవకాశం జూన్ ఒకటినుంచి బదిలీలపై మళ్లీ నిషేధం షెడ్యూల్ ఇలా.. -
చెరువుల పునరుద్ధరణపై ప్రత్యేక దృష్టి
గోదావరిఖని/కోల్సిటీ/జ్యోతినగర్/గోదావరిఖనిటౌన్: రామగుండం నవ నిర్మాణంలో భాగంగా చె రువుల పునరుద్ధరణ చేపట్టామని రామగుండం ఎ మ్మెల్యే రాజ్ఠాకూర్ మక్కాన్సింగ్ అన్నారు. అమృత్– 2 ద్వారా విడుదలైన రూ.2.53 కోట్లతో నగరంలోని మూడోడివిజన్లోని ప్రశాంత్నగర్ మల్లపు రా ణికుంట, రూ 1.81 కోట్లతో మల్కాపూర్ బామండ్లకుంట చెరువుల పునరుజ్జీవన పనులకు మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతిపెల్లి ఎల్లయ్య, కార్పొరేటర్ వడ్లూరి రవితో కలిసి మంగళవారం ఆయన శంకుస్థాపన చేశారు. అంతకుముందు హనుమాన్నగర్ మండల పరిషత్, అడ్డగుంటపల్లి పాఠశాలల్లో చేపట్టిన అభివృద్ధి పనులు ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, చెరువుల సుందరీకరణతోపాటు ఆహ్లాదం అందించడానికి గార్డెన్, వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తామని అన్నారు. మల్కాపూర్, ప్రశాంత్నగర్కు వరద ముప్పు రాకుండా తగిన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. ప్రతీ విద్యార్థికి నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యమని తెలిపారు. మేయర్ మహంకాళి స్వామి మాట్లాడుతూ, కార్పొరేటర్ రవి అభ్యర్థన మేరకు ఎమ్మెల్యే మరో రూ.కోటి పనులను మంజూరు చేశా రన్నారు. ఆయా కార్యక్రమాల్లో కార్పొరేటర్లు వెంగల బాపు, కొలని కవితారెడ్డి, చిదురాల నాగరాజు, ధూళికట్ట సతీశ్, పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ విభాగం డీఈ నర్సింహస్వామి తదితరులు పాల్గొన్నారు. రామగుండం ఎమ్మెల్యే రాజ్ఠాకూర్ మక్కాన్సింగ్ -
అందుబాటులో పరికరాలు
రెనే ఆస్పత్రి సౌజన్యంతో సింగరేణి ఏరియా ఆస్పత్రిలో క్యాథ్ల్యాబ్ ఏర్పాటుకు నిర్ణయించిన యాజమాన్యం.. ఏర్పాట్లు ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలోనే క్యాథ్ల్యాబ్కు అవసరమైన యంత్రపరికరాలను కొనుగోలు చేసిన రెనే ఆస్పత్రి యాజమాన్యం.. వాటిని అమర్చే పనిలో బిజీగా మారింది. ఇప్పటికే డాక్టర్లను కూడా నియమించుకుంది. క్యాథలైజేషన్ ల్యాబొరేటరీ, యాంజియోగ్రామ్, యాంజియో ప్లాస్టీ, స్టంట్ వేయడం, ఫేస్మేకర్ అమర్చడం లాంటి ఆధునిక యంత్రసామగ్రిని ఆస్పత్రిలో బిగిస్తోంది. సివిల్ పనులు, యంత్రాల బిగింగ్ తర్వాత టెస్టింగ్ ప్రక్రియ చేపడతారు. -
నైపుణ్యాభివృద్ధి పెంచుతాం
జ్యోతినగర్: ఎన్టీపీసీ అధికారులు, ఉద్యోగుల నైపుణ్యాభివృద్ధి లక్ష్యంగా శిక్షణ అందిస్తున్నా మని ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చందన్ కు మార్ సామంత అన్నారు. టీటీఎస్లోని ఉద్యో గ వికాస కేంద్రంలో మంగళవారం రామగుండం, తెలంగాణ ప్రాజెక్టులోని ఎఫ్టీ, ఎంజీఆ ర్ సిబ్బంది కోసం ఏర్పాటు చేసిన పునశ్చర ణ, అభివృద్ధి శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నాలుగు రోజుల పాటు శిక్షణ ఇస్తారని తెలిపారు. జనరల్ మేనేజర్లు ముకుల్ రాయ్, మనీశ్ అగర్వాల్, ఏజీఎం(సేఫ్టీ) సుప్రకాశ్ చక్రవర్తి, హెచ్వోచ్ఆర్ సాగర్ రంజన్ సాహూ తదితరులు పాల్గొన్నారు. పడిపోతున్న నీటిమట్టం రామగుండం: ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీటిమ ట్టం భారీగా పడిపోతోంది. ప్రాజెక్టు పూర్తిస్థా యి నీటినిల్వలు 20.175 టీఎంసీలు కాగా మంగళవారం 9.32 టీఎంసీలకు పడిపోయా యి. గతేడాది ఇదేరోజు 8.79 టీఎంసీలు ఉ న్నాయి. ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో 864 క్యూసె క్కులు రాగా, ఎన్టీపీసీ 121 క్యూసెక్కులు, హైదరాబాద్ తాగునీటి అవసరాలకు 318 క్యూసెక్కులు, గూడెం ఎత్తిపోతలు 145 క్యూ సెక్కులు, మిషన్ భగీరథకు 81 క్యూసెక్కులు, వేడికి ఆవిరవుతున్న నీరు 199 క్యూసెక్కులుగా ఉందని అధికారులు తెలిపారు. డీఆర్ఎం పర్యటన రామగుండం: సికింద్రాబాద్ రైల్వే డివిజనల్ మేనేజర్ గోపాలకృష్ణణ్ స్థానిక రైల్వేస్టేషన్ను మంగళవారం సందర్శించారు. ఆర్వోహెచ్ షె డ్, కమర్షియల్ విభాగం, ప్లాట్ఫారం ఏరి యా, యార్డు, కాలనీ, పార్కింగ్ పరిసరాలు తదితర ప్రదేశాలు పరిశీలించారు. వివిధ అంశాలపై ఉన్నతాధికారులతో సమీక్షించారు. ముఖ్యంగా కోల్మైన్స్ నుంచి బొగ్గు రవాణా లో ఎదురవుతున్న ఇబ్బందులు, జాప్యం తదితర అంశాలపై ఆరా తీశారు. సీఐ రాజేంద్రప్రసాద్ సిబ్బందితో బందోబస్తు చేపట్టారు. 24 నుంచి స్కూళ్లకు సెలవు పెద్దపల్లి: పాఠశాల విద్యార్థులకు ఈనెల 24 నుంచి వేసవి సెలవులు ప్రకటిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఈనెల 23 చివరి పని దినంగా వెల్లడించింది. ఒకటి నుంచి తొమ్మి దో తరగతి వరకు చివరిరోజు ప్రొగ్రెస్కార్డులు అందిస్తారు. వచ్చే విద్యా సంవత్సరం జూన్ 12న ప్రారంభం కానుంది. అయితే, వేసవి సె లవుల్లో పాఠశాలలు, అందులోని క్రీడాసామగ్రి, కంప్యూటర్, ప్రింటింగ్ మిషన్, ఫర్నీచర్, గ్రంథాలయాలు, వాయిద్యాలు తదితర వాటి భద్రతపై ఉపాధ్యాయులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వాటిభద్రత, పరిరక్షణకు చర్యలు తీసుకోవాల్సి ఉందని అంటున్నారు. 25న జాబ్మేళా పెద్దపల్లి: మెడ్ప్లస్ కంపెనీలో ఉద్యోగావకాశా లు కల్పించేందుకు ఈనెల 25న జాబ్మేళా ని ర్వహిస్తామని జిల్లా ఉపాధి కల్పనాధికారి తి రుపతిరావు తెలిపారు. 40 ఫార్మాసిస్టు, 50 ఆ డిట్ అసిస్టెంట్, 201 సెక్యూరిటీగార్డు పోస్ట్లు ఖాళీగా ఉన్నాయన్నారు. ఆసక్తి, అర్హతగలవారు ఉదయం 11 గంటల సంబంధిత సర్టిఫికెట్లతో కలెక్టరేట్లోని రూమ్ నంబరు 233లో తమపేరు నమోదు చేసుకోవాలన్నారు. వివరాలకు 89853 36947, 81212 62441 నంబర్లలో సంప్రదించాలని ఆయన కోరారు. భూముల పరిరక్షణకు చర్యలు ఓదెల: రైల్వే స్థలాలు ఆక్రమణకు గురికాకుండా ప్రహరీలు నిర్మిస్తున్నారు. రైలు పట్టాలకు ఇరువైపులా సిమెంటు స్తంభాలు పాతి, హ ద్దురాళ్లుగా వేస్తున్నారు. ప్రస్తుతం మూడు ట్రాక్లు ఉండగా.. నాలుగోలైన్ నిర్మాణానికి స్థలం కొరత ఎదురవకుండా, ఉన్న స్థలాలను పరిరక్షించేందుకు రైల్వేశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. సికింధ్రాబాద్ నుంచి కాజీపే, కాజీపే ట నుంచి బల్హార్షా మధ్య ఈ పనులు శరవేగంగా సాగుతున్నాయి. క్వింటాల్ పత్తి రూ.8,068 పెద్దపల్లిరూరల్: స్థానిక వ్యవసాయ మార్కెట్లో మంగళవారం పత్తి క్వింటాల్కు గరిష్టంగా రూ.8,068గా ధర నమోదైందని మార్కెట్కమిటీ చైర్మన్ కూర మల్లారెడ్డి, కార్యదర్శి ప్రవీణ్రెడ్డి తెలిపారు. కనిష్టంగా రూ.6,361గా, సగటు రూ.7,606గా ధర ఉందన్నారు. -
రేవంత్ సర్కార్ ఎందుకు పోవాలి
కరీంనగర్ కార్పొరేషన్: సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వం ఎందుకు పోవాలో బీఆర్ఎస్ చెప్పాలని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ డిమాండ్ చేశారు. కేసీఆర్ చావును ఎవరూ కోరుకోలేదన్నా రు. కాళేశ్వరంపై సీబీఐ విచారణ జరిపేలా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చూడాలన్నారు. మంగళవారం కరీంనగర్ నగరంలోని ఆర్అండ్బీ అతిథిగృహంలో విలేకరులతో మాట్లాడా రు. రేవంత్ ప్రభుత్వం పోవాలంటూ బీఆర్ఎస్ నా యకులు చేస్తున్న వ్యాఖ్యలపై మండిపడ్డారు. తన చావు కోరుకున్నారంటూ జగిత్యాల సభలో కేసీఆర్ అనడాన్ని ఖండించారు. ప్రతిపక్షనాయకుడిగా ఆయన్ను గౌరవించామన్నారు. సీఎం రేవంత్ను బీఆర్ఎస్ నాయకులు ఏకవచనంతో మాట్లాడుతూ అవమానిస్తున్నారన్నారు. తమ ప్రతి పక్షనాయకులు అప్పటి సీఎం కేసీఆర్ను ఏనాడూ ఏకవచనంతో సంబోధించలేదని తెలిపారు. సీఎంగా ఉన్నప్పుడు కేసీఆర్ మంత్రులతో కూడా మాట్లాడలేదని, రేవంత్ అందరి సలహాలు, సూచనలు తీసుకుంటున్నారన్నారు. 2023లో చివరి రైతుబంధు వేసేందుకు కేసీఆర్ ఔటర్రింగ్రోడ్డును అగ్గువకు కుదవపె ట్టారని ఆరోపించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో చేసిన అప్పులకు ప్రతినెల రూ. 6వేల కోట్లు వడ్డీలు చెల్లిస్తున్నామని అన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో ఉన్నప్పటికీ సంక్షేమ పథకాల ను కొనసాగిస్తున్నామన్నారు. ఎఫ్సీఐ గోదాముల్లో పేరుకుపోయిన బియ్యం నిల్వలను కేంద్రంతో మా ట్లాడి తరలించే ప్రక్రియను కేంద్ర మంత్రి బండి సంజయ్ తీసుకోవాలన్నారు. కాళేశ్వరం కేసు సీబీ ఐకి అప్పగిస్తే కేంద్రం స్పందించడం లేదని, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో మాట్లాడి సీబీఐ విచారణ జరిపించేలా బండి సంజయ్ చూడాలన్నారు. జీవన్రెడ్డి పార్టీ మారడం వల్ల లాభమా, నష్టమా ప్రజలు నిర్ణయిస్తారన్నారు. త్వరలో జగిత్యాలలో సీఎం సభ నిర్వహిస్తామని తెలిపారు. డీసీసీ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి, అర్బన్ బ్యాంక్ చైర్మన్ కర్ర రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ చావును ఎవరూ కోరుకోలేదు కాళేశ్వరంపై సీబీఐ విచారణ జరిగేలా బండి సంజయ్ చూడాలి మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ -
బాలికను పీక్కుతిన్న కుక్కలు
సుల్తానాబాద్ రూరల్: ఆరుబయట ఆడుకుంటున్న ఓ బాలిక (3)పై దాడిచేసిన కుక్కలు.. నోటకరుచుకుని పొలాల్లోకి లాక్కెళ్లి పీక్కుతిన్నాయి. ఈ హృదయవిదారక ఘటన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి గ్రామ శివారులోని ఇటుకబట్టీల్లో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. ఎస్సై చంద్రకుమార్, వలస కారి్మకుల కథనం ప్రకారం.. ఒడిశా రాష్ట్రం సుల్సుల్యా ప్రాంతానికి చెందిన సరస్వతి బెహ్రా–బాబుబెహ్రా తమ కుమారుడు అజుస్ బెహ్రా (6), కూతురు దివ్య బెహ్రా(3)తో కలిసి ఐదునెలల క్రితం సుల్తానాబాద్ మండలం కాట్నపల్లిలోని భారణి (బీబీఏ) ఇటుకబట్టీలో పనికి కుదిరారు.సరస్వతి బెహ్రా అప్పటికే గర్భవతి. ఈక్రమంలో మూడు నెలల క్రితం సుల్తానాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో మరో ఆడశిశువుకు జన్మనిచ్చింది. అయితే, సోమవారం సెలవు కావడంతో ఇటుకబట్టీలోని కార్మికులు తమ పనుల కోసం సుల్తానాబాద్ పట్టణానికి వెళ్లారు. పలువురు పిల్లలు అక్కడ ఆడుకుంటుండగా చూసిన దివ్య బెహ్రా అటుగా వెళ్లింది. ఏమైందో ఏమోగానీ.. ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు పాప కనిపించక పోవడంతో వెతికారు. ఈ క్రమంలో పంటపొలాల్లో దివ్య జీవచ్ఛవంలా పడిఉండడాన్ని గుర్తించి బోరుమన్నారు. వీధి కుక్కలు దాడి చేయడంతోపాటు నోట కరుచుకొని పంట పొలాల్లోకి ఈడ్చుకెళ్లి పీక్కుతినడంతో మృతి చెందినట్లు భావిస్తున్నామని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై వివరించారు. -
వృద్ధులు, చిన్నారులు పైలం
వేసవిలో గర్భిణులు జాగ్రత్త తీసుకోవాలి. శరీరం డిహైడ్రేషన్ కాకుండా చూసుకోవాలి. ఇంట్లోనూ మంచి నీటిలో ఉప్పుచక్కెర వేసుకుని తాగాలి. గర్భిణులు, చిన్నారులు, వృద్ధులు బయటకు వెళ్లకపోవడం ఉత్తమం. మాంసాహారం, మసాలా దినుసులు, నూనె పదార్థాలు అధికంగా వాడొద్దు. వదులైనా కాటన్ దుస్తులను ధరించాలి. లవణాలతో కూడిన నీటిని అధికంగా తీసుకోవాలి. ఓఆర్ఎస్ పొట్లాలు ఎల్లప్పుడు అందుబాటులో ఉంచుకోవాలి. పండ్ల రసాలు, కొబ్బరినీళ్లు తాగాలి. చలువైన వస్తువులు వాడాలి. నీటిని తాగుతూ ఉండాలి. ఏ సమయంలోనూ అజాగ్రత్త వహించకుండా బయటి ప్రాంతాలకు వెళ్లేటప్పుడు తాగునీటిని వెంట తీసుకెళ్లాలి. వంట గదులు చల్లగా ఉండేలా చర్యలు తీసుకోవాలి. ప్రతి 30 నిమిషాలకు నీటిని తాగుతూ ఉండాలి. – సాయిని నరేందర్, ఎండీ, పల్మనాలజిస్ట్ వేసవిలో వాహనాల్లో గాలిని తరచూ చెక్ చేసుకోవాలి. నేరుగా ఎండ పడే చోట వాహనాన్ని నిలుపరాదు. నీడ ఉంటే చోటే నిలుపాలి. ఇంజిన్ అత్యధికంగా వేడెక్కితే డ్యాష్బోర్డులోని చెక్ ఇంజిన్, ఓవర్ హీట్ గుర్తులు బ్లింక్ అవుతుంటాయి. అప్రమత్తమై కూలంట్, రెడియేటర్ క్యాప్ సరిగా ఉన్నాయో లేవో చూసుకోవాలి. ఇంజిన్ ఆయిల్, బ్రేక్ ఆయిల్, గేర్ బాక్స్ ఆయిల్, ఏసీ కంప్రెసర్, వాటర్ లెవల్స్ తరచూ చెక్ చేస్తుండాలి. ఎండ అత్యధికంగా ఉండే మధ్యాహ్నం సమయంలో ప్రయాణం వాయిదా వేసుకోవడం ఉత్తమం. వీలైతే అసలు ప్రయాణం చేయకుండా ఉంటేనే మేలు. లాంగ్ టూర్ వెళ్లేవారు 50కిలోమీటర్లకు ఒకసారి బ్రేక్ తీసుకోవాలి. కారు, బైక్ వేటిలో ప్రయాణించినా అత్యవసరంలో ఉపయోగపడేలా రకరకాల సైజుల స్క్రూడ్రైవర్లు, రెంచ్లు, జాకీ, టైరు ఐరన్, చేతికి గ్లౌజులు, చీకట్లో ఉపయోగపడే ఫ్లాష్లైట్ వెంట ఉంచుకోవాలి. – రమణ, మెకానిక్ -
మల్లన్నకు పట్నాలు
ఓదెల: ఓదెల మల్లికార్జునస్వామి సన్నిధిలో భక్తులు ఆదివారం పోటాపోటీగా పట్నాలు వే శారు. తొలుత కొనేరులో స్నానాలు ఆచరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. స్వామివారికి కోడె మొక్కులు చెల్లించుకున్నారు. మల్లికార్జునస్వామి, శ్రీసీతారామచంద్రస్వామి, నందీశ్వరులు, బద్దిపోచమ్మ దర్శనం చేసుకొన్నా రు. హుండీలో కానుకలు వేశారు. తలనీలాలు సమర్పించారు. జూనియర్ అసిస్టెంట్ కుమారస్వామి భక్తుల ఏర్పాట్లు పర్యవేక్షించారు. దరఖాస్తులు ఆహ్వానం రామగుండం: ప్రస్తుత విద్యాసంవత్సరంలో టెన్త్, ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థుల నుంచి ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. పది, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా కోర్సులు పూర్తిచేసినవారు అ ర్హులు. శిక్షణ(ఇంటర్న్షిప్) సమయంలో ప్రతీ అభ్యర్థికి నెలకు రూ.9,000 అందిస్తారు. శిక్షణకాలం కంపెనీలను బట్టి 6, 9, 12 నెలలు ఉంటుంది. ఆసక్తిగలవారు https://pminternsh ip.mca.gov.in లేదా myscheme.gov.in/sc hemes/pmisలో వివరాలు చేయాలి. మద్దతు ఎందుకివ్వలేదు? పెద్దపల్లిరూరల్: మహిళలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం పెంచేలా ప్రధాని సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన మహి ళా రిజర్వేషన్ల బిల్లుకు కాంగ్రెస్, మిత్రపక్ష ఇండియా కూటమి ఎందుకు మద్దతు ఇవ్వలేదో స్పష్టంచేయాలని బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర నాయకురాలు సోమారపు లావణ్య డిమాండ్ చేశారు. కమాన్వద్ద రాజీవ్ రహదారిపై బీజేపీ పట్టణ, మండల అధ్యక్షులు రాకేశ్, రమేశ్ ఆఽ ద్వర్యంలో ఆదివారం రాస్తారోకో నిర్వహించా రు. రాహుల్గాంధీ దిష్టిబొమ్మ దహనం చేశా రు. ఇండియా కూటమి మహిళలకు వ్యతిరేకమని తేలిపోయిందని అన్నారు. నాయకులు తంగెడ రాజేశ్వర్రావు, సంపత్రావు, శ్రీనివా స్, రాజగోపాల్, మహంతకృష్ణ, తిరుపతి, శ్రీ కాంత్, కిరణ్, శ్రీనివాసరావు, సతీశ్, శ్రీధర్, ఉమేశ్, కుమార్, శివయ్య, రాజు, హరీశ్, అంజి, ఆనందరావు, సంపత్, వేణు, రమ, శిరీష, లక్ష్మి, సంధ్య తదితరులు పాల్గొన్నారు. ఇద్దరు యువకుల అరెస్ట్మెట్పల్లి: మెట్పల్లి ప్రాంతంలో గంజాయివిక్రయిస్తున్న ఇద్దరు యువకులను అరెస్ట్ చేసినట్లు ఎస్సై కిరణ్కుమార్ తెలిపారు. మల్యాల చందు, బాణాల రాజు మెదక్ జిల్లా నుంచి గంజా యి తీసుకొచ్చి విక్రయిస్తున్నారని అన్నారు. -
బోగస్ క్రీడా సంఘాలను నమ్మొద్దు
కరీంనగర్స్పోర్ట్స్: తెలంగాణలో కిక్ బాక్సింగ్ పేరిట పలువురు క్రీడా కార్యకలాపాలు కొనసాగిస్తున్నారని, అవి అన్ని బోగస్ క్రీడాసంఘాలని తెలంగాణ కిక్ బాక్సింగ్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామాంజనేయులు పేర్కొన్నారు. కరీంనగర్లో ఆదివారం మాట్లాడుతూ ఏదైనా క్రీడా సంఘం ఏర్పాటైతే అది తెలంగాణ ఒలంపిక్ సంఘం, జాతీయ ఫెడరేషన్, భారత ప్రభుత్వం గుర్తింపు పొంది ఉండాలన్నారు. రాష్ట్రంలో తెలంగాణ స్టేట్ కిక్బాక్సింగ్ అసోసియేషన్ మాత్రమే గుర్తింపు ఉందని ఈ సంఘం ఆధ్వర్యంలోనే ఏటా రెండుసార్లు రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించి, జాతీయ పోటీలకు తెలంగాణ జట్లను పంపిస్తున్నట్లు తెలిపారు. కొందరు మోసపూరితంగా సంఘాలను ఏర్పాటు చేసుకొని తల్లిదండ్రులను, పాఠశాలల యాజమాన్యాలను తప్పుదోవపట్టిస్తున్నారని వాటన్నింటని నమ్మవద్దని హితవు పలికారు. తెలంగాణ కిక్ బాక్సింగ్ ఆధ్వర్యంలో జారీ చేసిన క్రీడా సర్టిఫికెట్లలకు ట్రిపుల్ఐటీ, ఎంసెట్ తదితర ఉన్నత విద్యకు స్పోర్ట్స్ కోటా వర్తిస్తుందన్నారు. తెలంగాణలో 25 జిల్లాల్లో కిక్ బాక్సింగ్ సంఘాలున్నాయని, ఇవన్ని ఒలంపిక్ సంఘంలో గుర్తింపుపొందాయని తెలిపారు. అనధికార సంస్థలు లేదా టోర్నమెంట్లు నిర్వహిస్తున్న వారు మానుకోవాలని హెచ్చరించారు. బోగస్ లేదా అనధికార సంస్థలు నిర్వహించే ఈవెంట్స్లో పాల్గొంటే అందులో పొందిన సర్టిఫికెట్లు చెల్లుబాటు కావని సూచించారు. కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల కిక్ బాక్సింగ్ సంఘాల కార్యదర్శులు, కోచ్లు సురభి అన్వేష్, వి.శ్రీనివాస్, సురభి ఇంద్ర, ఎ.సంజీవ్, ఎస్.వినీశ్, కె.వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ కిక్ బాక్సింగ్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామాంజనేయులు -
కల్లెంరెడ్డిపల్లెను పంచాయతీ చేస్తాం
ధర్మారం/జూలపల్లి: కల్లెంరెడ్డిపల్లిని ప్రత్యేక గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేస్తామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ అభయం ఇచ్చారు. ధర్మారం మండలం కమ్మరిఖాన్పేట పంచా యతీ పరిధిలోని కల్లెంరెడ్డిపల్లితోపాటు జూలప ల్లి మండలంలో మంత్రి ఆదివారం పర్యటించా రు. గ్రామస్తుల సమస్యలపై స్పందించారు. జూలపల్లి మండలం సర్పంచులు ఫోరం మండల అధ్యక్షుడు తొగరు శ్రీనివాస్ ఆధ్వర్యంలో వార్డు సభ్యులు గ్రామస్తులు, కాంగ్రెస్ నాయకులు మంత్రిని కలిసి గ్రామాభివృద్ధిపై వినతిపత్రం అందజేశారు. మంత్రిని కలిసిన వారిలోవార్డు సభ్యులు తీగెల అశోక్, సంకెన్ల శోభ, మాజీ ఉపసర్పంచ్ బొజ్జ శ్రీనివాస్ ఉన్నారు. సభను విజయవంతం చేయాలి ధర్మారం: కాటారంలో సోమవారం జరిగే సీ ఎం రేవంత్రెడ్డి బహిరంగ సభను విజయవంతం చేయాలని మంత్రి లక్ష్మణ్కుమార్ కోరా రు. కాంగ్రెస్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రాజ్యాంగబద్ధంగా సీఎంగా ఎ న్నికై న రేవంత్రెడ్డిని కేటీఆర్, హరీశ్రావు ఏకవచనంతో సంబోధించడం సరికాదన్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ లావుడ్య రూప్లానాయక్, వైస్ చైర్మన్ అరిగే లింగయ్య, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గాగిరెడ్డి తిరుపతిరెడ్డి, నా యకులు కొత్త నర్సింహం, అసోద అజయ్, కొ డారి హన్మయ్య, కాడే సూర్యనారాయణ, బొల్లి స్వామి తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే ‘గీట్ల’కు నివాళి పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రంలోని కూనారం క్రాస్రోడ్డులోగల దివంగత మాజీ ఎమ్మెల్యే గీట్ల ముకుందరెడ్డి విగ్రహానికి ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు పూలమాల వేసి ఘననివాళి అర్పించారు. ఆదివారం ముకుందరెడ్డి వర్ధంతి సందర్భంగా గీట్ల ము కుందరెడ్డి తనయుడు రాజేందర్రెడ్డితోపాటు జిల్లా గ్రంథాలయసంస్థ అధ్యక్షుడు అన్నయ్య గౌడ్, మున్సిపల్ చైర్మన్లు మల్లయ్య, రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. గీట్ల ఆశయాలను కొనసాగిస్తామన్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రకాశ్రావు, కౌన్సిలర్లు మంథని నర్సింగ్, అమ్రేశ్, నాయకులు ఉప్పు రాజు, నర్సింహారెడ్డి, సురేశ్గౌడ్, యాట మల్లారెడ్డి, మస్రత్ తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యాన సాగుకు ఊపిరి
కరీంనగర్ అర్బన్: మూస ధోరణిలో పంటల సాగు కాకుండా ప్రజారోగ్యం, అవసరాల క్రమంలో సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఒకప్పుడు పత్తి, వరి తక్కువ విస్తీర్ణంలో సాగయ్యేది. మొక్కజొన్న, రాగులు, సజ్జలు, జొన్నలు, అవిసెలు, ఉలవలు, పెసర, కంది, మినుములు, శనగ వంటి పంటలకు ప్రాధాన్యతనిచ్చేవారు. కాలక్రమేణా పత్తి, వరి సాగే సింహభాగం కాగా ఇతర పంటలు కనుమరుగయ్యాయి. ఇక కూరగాయల సాగు అంతంతమాత్రమే. ఇతర రాష్ట్రాలు, జిల్లాలపై ఆధారపడాల్సిన దుస్థితి. దీంతో రవాణా ఖర్చులు, ఏజెంట్ కమీషన్ తదితర కారణాలతో వాటి ధరలు ఆకాశన్నంటుతున్నాయి. సదరు సమస్యకు పరిష్కారంగా కూరగాయలను పెద్దఎత్తున పండించాలని రాష్ట్ర ఉద్యానశాఖ నిర్ణయించింది. ఈ క్రమంలో కరీంనగర్ జిల్లాలోని వ్యవసాయ సహకార పరపతి సంఘాల ఆధ్వర్యంలో పలువురు రైతులను గుర్తించి వలంటీర్లుగా శిక్షణనిస్తోంది. 30 ప్యాక్స్లు.. 30మంది వలంటీర్లు పీఏసీఎస్కు ఒకరి చొప్పున వలంటీర్లను ఎంపిక చేయగా ఇప్పటికే రాజేంద్రనగర్లోని ఆచార్య జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఽఆధ్వర్యంలో శిక్షణనిచ్చారు. ఈ నెల 18న జిల్లా ఉద్యానశాఖ కార్యాలయంలో మలిదశ శిక్షణనిచ్చారు. కరీంనగర్ జిల్లాలోని 30 ప్యాక్స్లకు 30 మంది వలంటీర్లను ఎంపిక చేశారు. వారంతా తాము నేర్చుకున్న మెలకువలను రైతులకు వివరించి కూరగాయల రైతులను చైతన్యవంతులను చేయనుండగా బాసటగా నిలువనున్నారు. ఒక్కో వలంటీరు.. వంద ఎకరాలు ఒక్కో వలంటీరు వంద ఎకరాల చొప్పున కూరగాయల పంటలు సాగు చేయించాలని లక్ష్యంగా నిర్దేశించారు. సదరు లెక్కన 300 ఎకరాలలో కూరగాయలు పండించేలా కృషి చేయనున్నారు. విస్తీర్ణం పెరుగనుంది. తద్వారా విస్తీర్ణం మరింత పెరగనుందన్నది ప్రభుత్వ భావన. ఉచితంగా నారు ఇవ్వనుండగా టమాట, వంకాయ, మిర్చి వంటి వాటిని గరిష్టంగా 5ఎకరాల వరకు ఇవ్వనున్నారు. 50శాతం రాయితీతో ప్లాస్టిక్ మల్చింగ్ ఎకరానికి రూ.8వేల చొప్పున గరిష్టంగా 5 ఎకరాల వరకు ఇవ్వనుండగా 50శాతం రాయితీతో యూనిట్(అర్ధ ఎకరం)కు రూ.50వేల చొప్పున ఇవ్వనున్నారు. శాశ్వత పందిళ్లు వేసుకోలేని వారికి కట్టెలతో స్టేకింగ్ కోసం 50శాతం రాయితీతో ఎకరానికి రూ.4వేలు, నీరుపారుదలకు డ్రిప్ లేదా స్ప్రింక్లర్ రాయితీపై ఇస్తారు. ఇక సాగుకు కావాల్సిన స్ప్రేయర్లు, బ్రష్ కట్టర్లు, పవర్ వీడర్లు తదితర వాటిని 40–50శాతం రాయితీతో ఇవ్వనున్నారు. వర్మీకంపోస్ట్ తయారీకి 50శాతం రాయితీ, పండిన పంటను ప్యాక్ చేయడం, మిగిలిన వాటిని ఉంచడం కోసం ప్యాక్ హౌస్ 50శాతం రాయితీ, అంతేకాకుండా సోలార్ డ్రయర్, పాలీహౌస్, షెడ్నెట్, ఫామ్పాండ్స్ వంటి వాటిని రాయితీపై ఇవ్వనున్నారు. మూడు చోట్ల విత్తనోత్పత్తి వ్యవసాయశాఖ, నాబార్డు, వ్యవసాయ విశ్వవిద్యాలయం సమన్వయంతో జిల్లాలోని మూడు సహకార సంఘాల పరిధిలో విత్తనోత్పత్తి చేయనున్నారు. వరితో పాటు పెసర, కంది పంటలు సాగు చేయాలని నిర్ణయించారు. జిల్లాలో గట్టుదుద్దెనపల్లి, ఊటూరు, జమ్మికుంట ప్రాంతాల్లో ఒక్కో సంఘం పరిధిలో 10ఎకరాలు సాగు చేయాలని నిర్ణయించారు. ఆదర్శ రైతులను ఎంపిక చేసి వారి ద్వారా సాగు చేయించనున్నారు. ప్రభుత్వమిచ్చే రాయితీని వినియోగించుకుని రైతులు కూరగాయల సాగు చేసుకోవాలి. ప్రభుత్వమిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. రైతులే విక్రయించుకునేలా గిట్టుబాటు ధర లభించేలా మార్కెట్ సౌకర్యం ఉంటుంది. – పల్లె కమలాకర్రెడ్డి, జిల్లా ఉద్యాన, పట్టుపరిశ్రమ అధికారి సహకార సంఘాల పరిధిలో వలంటీర్ల నియామకం 30 ప్యాక్స్లలో 300 ఎకరాల్లో సాగుకు రైతుల ఎంపిక సాగుకు ప్రభుత్వ రాయితీ, ప్రోత్సాహం -
ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణమే లక్ష్యం
గోదావరిఖని: ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణమే లక్ష్యంగా ఫిట్ తెలంగాణ – ఫిట్ గోదావరిఖని నినాదంతో ఈనెల 26న చేపట్టిన అవంతిక తెలంగాణ ప్రొమో రన్లో ప్రజలు భాగస్వాములు కావాలని ఆ సంఘం అధ్యక్షుడు సోమా జగన్మోహన్రెడ్డి, ఉపాధ్యక్షుడు డాక్టర్ మహేశ్పటేల్ కోరారు. స్థానిక ప్రెస్క్లబ్లో ఆదివారం వారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మెట్రో నగరాలకే పరిమితమైన రన్ కల్చర్ను జిల్లాస్థాయికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో 10 జిల్లాల్లో ప్రొమోరన్స్ నిర్వహిస్తున్నామన్నారు. ఈక్రమంలో గోదావరిఖని సింగరేణి జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఈనెల 26న 2కే, 5కే, 10కే విభాగాల్లో ప్రొమో రన్ ఉదయం 10 గంటలకు నిర్వహించనున్నామని తెలిపారు. 90143 97581, 94927 81306 నంబర్లలో సంప్రదించాలని కోరారు. రన్లో పాల్గొనాలి రన్లో అందరూ భాగస్వాములు కావాలని గోదావరిఖని ఏసీపీ రమేశ్ కోరారు. సైకిల్పై స్టేడియానికి చేరుకుని నిర్వాహకులను కలిసి అభినందించారు. అసోసియేషన్ సభ్యుడు సతీశ్కుమార్, లయన్స్ క్లబ్ ప్రతినిధులు సానా రామకృష్ణారెడ్డి, నల్లవెల్లి శంకర్, సదాశయ ఫౌండేషన్ ప్రతినిధులు లింగమూర్తి, చంద్రమౌళి, కేఎస్ వాసు తదితరులు పాల్గొన్నారు. -
‘భరోసా’పై ఆశలు
మంథని: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తొలిసారి మంథని ని యోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా సీఎం ప్రకటించే వరాలపై పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల ప్రజలు గంపెడాశలు పెట్టుకున్నారు. రైతుభరోసా రెండోవిడత నిధుల విడుదల కోసం కాటారం మండలం నస్తూర్పల్లి లో ఆదివారం నిర్వహించే బహిరంగ సభకు సీఎం హాజరవుతారు. సభ సక్సెస్ కోసం మంత్రి శ్రీధర్ బాబు తగిన ఏర్పాట్లు సిద్ధం చేశారు. నిధుల తేవడంలో శ్రీధర్బాబు ముందంజ తాను ప్రాతినిద్యం వహిస్తున్న నియోజకవర్గాన్ని మోడల్గా తీర్చిదిద్దాలనే సంకల్పంతో మంథని ఎమ్మెల్యే, ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ముందుకు సాగుతున్నారు. రెండేళ్లలోనే అ నేక అభివృద్ధి పనులకు నిధులు తీసుకొచ్చారు. మిగిలిన పనులకు సైతం సీఎం రేవంత్రెడ్డి ద్వా రా మరిన్ని నిధులు ఇప్పిస్తారని ఈప్రాంత ప్రజ లు ఆశిస్తున్నారు. సీఎం రేవంత్రెడ్డితోపాటు మంత్రులు కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలు సందర్శిస్తారని సమాచారం. కాళేశ్వరముక్తీశ్వర స్వామి దర్శనం అనంతరం ఆలయ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ మేరకు ఆలయాలకు అనుసంధానంగా అభివృద్ధి చేసేందు కు ప్రతిపాదనలు సి ద్ధం చేశారు. తద్వా రా ఆలయాల అభివృద్ధి మరిన్ని నిధులు వచ్చే అవకాశం ఉంది. మెడికల్ కాలేజీ.. పరిశ్రమలపై ఆశలు మంథని ప్రాంతంలో దాదాపు 50ఏళ్లుగా ఇంటికో ఇంజినీర్.. వీధికో వైద్యుడు తయారవుతున్నారు. ప్రపంచ దేశాల్లో ఉన్నత ఉద్యోగాలు చేస్తూ స్థిరపడ్డారు. ప్రతిష్టాత్మక జేఎన్టీయూను కాంగ్రెస్పాలనలోనే దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి మంజూరు చేశారు. మెడికల్ కాలేజీని సైతం మంథని లో నెలకొల్పాలని స్థానికుల కోరిక. పీజీ కాలేజీ, పోతారం లిఫ్ట్ ఇరిగేషన్, పరిశ్రమల ఏర్పాటు లాంటి ముఖ్యమైన పనులకు సీఎం నుంచి గ్రీన్సిగ్నల్ వస్తుందని ఆశిస్తున్నారు. జన సమీకరణపై కసరత్తు సీఎం సభకు నియోజకవర్గం నుంచి పెద్దఎత్తున రైతులు, అన్నివర్గాలను తరలించేందుకు కాంగ్రెస్ శ్రేణులు చర్యలు చేపట్టారు. ఇందుకోసం వాహనాలు సమకూర్చారు. సాయంత్రం వేళ సభ ఉండడంతో మధ్యాహ్నమే జనం తరలింపునకు ఏర్పాట్లు చేశారు. నేడు జగిత్యాలలోనూ మాజీ సీఎం కేసీఆర్ సభ ఉండడంతో ఇక్కడి నుంచి బీఆర్ఎస్ శ్రేణులను అక్కడకు తరలించేందుకు ఆ పార్టీ నాయకులు ఏర్పాట్లు చేశారు. మంథనికి మరిన్ని వరాలు వస్తాయనే నమ్మకం నేడు కాటారానికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి జనసమీకరణకు కాంగ్రెస్ నాయకుల కసరత్తు -
హార్వెస్టర్ బావిలో పడి డ్రైవర్ దుర్మరణం
పెగడపల్లి: పొలం కోస్తుండగా ప్రమాదవశాత్తు హార్వెస్టర్తోపాటు వ్యవసాయ బావిలో పడి డ్రైవర్ దుర్మరణం చెందిన ఘటన మండలంలోని నందగిరిలో ఆదివారం విషాదం నింపింది. పోలీసులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన పాలకాల లింగయ్య, నర్సవ్వ దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లు. కూతుళ్లకు వివాహమైంది. లింగయ్య జీవనోపాధి కోసం విదేశాలకు వెళ్లాడు. నర్సవ్వ బీడీకార్మికురాలు. పెద్ద కుమారుడైన మధు (35) డైవర్గా పని చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. గ్రామానికి చెందిన దనాల పర్శరాం అనే యజమానికి హార్వెస్టర్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఓ రైతు వరిపంటను కోసేందుకు వెళ్లిన మధు ప్రమాదవశాత్తు హార్వెస్టర్తో పాటు వ్యవసాయ బావిలో పడిపోయాడు. ఈ ఘటనలో మధు అక్కడిక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఎస్సై కిరణ్కుమార్ ప్రమాదస్థలికి చేరుకుని క్రేన్ సహాయంతో హార్వెస్టర్ను బయటకు తీయించి, గజ ఈతగాళ్ల సహాయంతో మధు మృతదేహాన్ని వెలికితీశారు. మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. మధుకు భార్య, ఇద్దరు కుమారులున్నారు. భార్య కావ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. అన్ని విధాలా ఆదుకుంటాం: మంత్రి అడ్లూరి డ్రైవర్ మధు కుటుంబాన్ని ఆదుకుంటామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. ప్రమాదస్థలికి చేరుకున్న ఆయన మృతుని కుటుంబసభ్యులను ఓదార్చారు. ఇందిరమ్మ ఇంటితోపాటు కావ్యకు విద్యార్థత ఆధారంగా అంగన్వాడికేంద్రంలో హెల్పర్, లేదా మధ్యాహ్న భోజనం కేర్టేకర్, ఔట్సోర్స్ ఉద్యోగావకాశం కల్పిస్తామని భరోసానిచ్చారు. మంత్రి వెంట ఏఎంసీ చైర్మన్ రాములుగౌడ్, సర్పంచ్ రజిత తదితరులు ఉన్నారు. నందగిరిలో విషాదం -
నృసింహుడి నవరాత్రి ఉత్సవాలు
● ఈనెల 22 నుంచి 30 వరకు.. ధర్మపురి: ధర్మపురిలోని శ్రీలక్ష్మీనృసింహుని జయంతి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. తొమ్మిది రోజులపాటు నిర్వహించే ఈ ఉత్సవాలను తిలకించడానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారని ఈవో శ్రీనివాస్ తెలిపారు. ఈనెల 22 నుంచి 30 వరకు చేపట్టే ఉత్సవాలకు వచ్చే భక్తుల కోసం తాగునీరు, చలువ పందిళ్లు, లడ్డూప్రసాదాలను సిద్ధం చేశారు. 22న ఉదయం 6 గంటలకు బిందే తీర్థం, 8 గంటలకు పుణ్యవచనం, కలశస్థాపన, సాయంత్రం 5 గంటలకు స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు, 25న అన్నకూటోత్సవం, 26న సహస్ర కలశాభిషేకం, 27న చందనోత్సవం, 28న పల్లవోత్సవం, వసంతోత్సవం, 29న లక్ష తులసి అర్చన, 30న స్వామివారల జయంతి ఉత్సవం నిర్వహిస్తారు. భీమన్నకు మొక్కులువేములవాడ: వేములవాడ భీమన్నకు వీకెండ్ తాకిడి పెరిగింది. మండుతున్న ఎండలను సైతం లెక్కచేయకుండా వివిధ ప్రాంతాలకు చెందిన 32వేల మంది భక్తులు ఆదివారం తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం బద్దిపోచమ్మకు బోనం మొక్కులు చెల్లించుకున్నారు. -
బీసీల్లో ముదిరాజ్లే
సాక్షి, పెద్దపల్లి: జిల్లాలో జనాభాపరంగా మాదిగలు అధికంగా ఉండగా.. బీసీల్లో ముదిరాజ్లు అగ్రస్థానంలో ఉన్నారు. ఆ తర్వాత మున్నూరుకాపు, యాదవులు, పద్మశాలీలు, గౌడ్స్ వర్గాలు ఉన్నాయి. మొత్తంగా జిల్లాలో బీసీ లు 62.51శాతం ఉన్నారు. ఎస్సీల్లో మాదిగలు అత్యధికంగా ఉండగా, ఆ తర్వాత మాల సామాజిక వర్గం ఉంది. ఎస్టీల్లో లంబాడీలు, ఓసీల్లో రెడ్డిలు, కోమటోళ్లు అధికంగా ఉన్నారు. భూమి కలిగిన వారిలో ఓసీలు అధికంగా ఉండగా, బీసీ–సీ, ఓసీలు విద్యా, ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాలకు వలసపోవడంలో ముందంజలో ఉన్నారు. 3,948మంది తమకు ఎలాంటి కులం లేదని చెప్పారు. 2024లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ కుల సర్వే ఈ వివరాలు తేల్చింది. జిల్లా జనాభాలో మాదిగలు అధికం 62.51శాతం బీసీలు.. 3,948 మందికి నోక్యాస్ట్ బీసీ–డీలో ఆందోళనకరంగా లింగనిష్పత్తి భూమి వాటాలో అగ్రవర్ణాలదే పైచేయి దినసరి కూలీల్లో ఎస్సీలు, సొంతగూడులేని వారిలో ఎస్టీలు సమగ్ర సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే వెల్లడి సామాజిక వర్గాల వారీగా జనాభా కేటగిరీ గృహాలు జనాభా శాతం ఎస్సీ 52,629 1,56,154 21.41 ఎస్టీ 5,562 16,888 2.32 బీసీలు 1,56,554 4,55,584 62.51 ముస్లింలు 13,831 46,210 6.3 ఓసీలు 19,512 58,712 8.06 -
నిప్పుల కొలిమి.. జాగ్రత్త సుమీ
కరీంనగర్ అర్బన్: ప్రచండ భానుడి ప్రతాపానికి సకల వర్గాలు సతమతమవుతున్నాయి. అప్రకటిత కర్ఫ్యూతో మానవులతో పాటు జంతువులు, పంటలకు ప్రతికూల పరిస్థితి ఏర్పడుతోంది. జిల్లాలో ఇప్పటికే పలువురు వడదెబ్బతో మరణించారు. గతకొన్ని రోజులుగా 40–43డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవగా అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం అరెంజ్ అలర్ట్ జోన్లో ఉండగా రానున్న రోజుల్లో రెడ్ అలర్ట్ ప్రకటించే అవకాశముందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. తీసుకోవాల్సిన పదార్థాలేంటీ వంటి వివరాలను వివరించారు. ఉష్ణోగ్రతలు హెచ్చరిక స్థాయికి చేరినందున రైతులు జాగ్రత్తగా వ్యవహరించాలి. కూరగాయల తోటలకు ఉదయం, సాయంత్రం వేళలో మాత్రమే నీరు కట్టాలి. టమాట తోటకు నీడ సౌకర్యం ఏర్పాటు చేసుకోవాలి. షెడ్నెట్ వేసుకుంటే మరీ మంచిది. పండ్ల తోటలకు పెద్దగా ఇబ్బంది లేదు. మామిడికి కోతకు ఒక నెల ముందు నుంచే నీటి సరఫరా నిలిపివేయాలి. ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటే కాయ నాణ్యతగా పెరుగుతుంది. రుచికరంగా ఉంటుంది. తీగజాతి కూరగాయలు, ఆకు కూరలకు ఉదయం, సాయంత్రం వేళలో నీటిని అందించాలి. ఉదయం 10నుంచి సాయంత్రం 4గంటల వరకు నీటిని ఇవ్వకూడదు. – పల్లె కమలాకర్రెడ్డి, జిల్లా పట్టుపరిశ్రమ, ఉద్యాన శాఖ అధికారి ఎండల వేళ పాడి రైతులు జాగ్రత్తలు తీసుకోవాలి. మూడు పూటలు నీరు అందించాలి. మధ్యాహ్నం వేళలో పశువులపై నీటిని జలకరించాలి. నీడ ఉండే ప్రాంతాల్లోనే పశువులను ఉంచాలి. గ్రామాల్లో ఉండే నీటి తొట్లలో ఎప్పటికప్పుడు ఫ్రెష్ వాటర్తో నింపాలి. మూడు భాగాలు ఎండు గడ్డితో పాటు ఒక భాగం పచ్చిగడ్డి వేయాలి. పెంపుడు కుక్కలు అధిక ఉష్ణోగ్రతలకు చిరాకు పడుతుంటాయి. ఆయాసం, ఆకలి ఉంటుంది. ఫుడ్, వాటర్ సకాలంలో ఇవ్వాలి. వాటికి నీడ చల్లగా ఉండేలా చూడాలి. కోళ్ల ఫారాల్లో గన్నీసంచులను చుట్టూ కట్టడంతో పాటు పైన గడ్డి లేదా తుంగను కప్పాలి. రెండు గంటలకోసారి నీటితో తడపాలి. – తుమ్మల కిరణ్కుమార్రెడ్డి, పశు వైద్యుడు మండుటెండలో స్వీయ జాగ్రత్తలే రక్ష -
అయ్యప్ప సమాజ సేవలో ఏబీఏపీ
గోదావరిఖని: అయ్యప్ప సమాజ సేవలో అఖిల భారతీయ అ య్యప్ప ధర్మ ప్రచార సభ(ఏబీఏపీ) ముందుందని సభ రాష్ట్ర గౌ రవ అధ్యక్షుడు చల్లా రవీందర్రెడ్డి అన్నారు. మార్కండేయకాల నీ శ్రీలక్ష్మి ఫంక్షన్హాల్లో ఏబీఏపీ జిల్లా జనరల్ బాడీ సమావేశం ఆదివారం నిర్వహించారు. ట్రస్ట్ మెంబర్ బేతి తిరుమల్రావు, ప్రతినిధులు భూతం రాజేశ్, జనగామ తిరుపతి, వడ్డేపల్లి దినేశ్, తుమ్మ సురేశ్, పర్స రామస్వామి, కుమార్, లక్ష్మణ్, వామ న్శర్మ, ఆడెపు లక్ష్మీనారాయణ, రాములుగౌడ్ పాల్గొన్నారు. జిల్లా అధ్యక్షుడిగా గంగాధర్ ఏబీఏపీ జిల్లా అధ్యక్షుడిగా అబ్బ గంగాధర్ను ఎన్నుకున్నారు. ఉ పాధ్యక్షులుగా పర్శ రామస్వామి, మారం బిక్షపతి, జనరల్ సెక్రటరీగా కలవేని సర్వేశ్, గౌరవ అధ్యక్షుడిగా వామన్శర్మ, పీఆర్ వోగా దినేశ్ వడ్డేపల్లి, జాయింట్ సెక్రటరీలుగా తిరుమలాచారి, పెగడ శ్రీనివాస్, వలంటరీ కమాండెంట్గా కొమరవెల్లి రాకేశ్, ట్రెజరర్గా కోటరాజు, కార్యవర్గ సభ్యులుగా బయ్యపు ప్రభంజన్రెడ్డి, జక్కుల సతీశ్, పిల్లి సంపత్, నాగండ్ల రవికుమార్, సిద్ధ రాధాకృష్ణ, చల్లా రవీందర్రెడ్డి, భూతం రాజేశ్, జనగామ తిరుపతి, కెక్కర్ల లింగయ్య ఎన్నికయ్యారు. -
తూర్పున సీఎం.. పశ్చిమాన మాజీ సీఎం
సాక్షిప్రతినిధి, కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లా తెలంగాణ ఉద్యమానికి కేంద్రబిందువు. ఈ ప్రాంతంలో రాజకీయ చైతన్యం ఎప్పుడూ ఎక్కువగానే ఉంటుంది. ఇక్కడ జరిగే ప్రతీ చిన్న పరిణామం రాష్ట్రవ్యాప్తంగా ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లా కేంద్రంగా తెలంగాణ రాజకీయాల్లో ఈనెల 20న సోమవారం ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకోనుంది. సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ ఉమ్మడి జిల్లా పర్యటనలు కేవలం స్థానిక రాజకీయాలకే పరిమితం కాకుండా, రాష్ట్ర రాజకీయ దిశను ప్రభావితం చేసే అవకాశముంది. ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తూర్పు ప్రాంతాల్లో పర్యటిస్తూ పాలన, ప్రాజెక్టుల స్థితిగతులను పరిశీలించనుండగా, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు పశ్చిమ ప్రాంతమైన జగిత్యాలలో జరిగే పార్టీ బహిరంగసభలో రాజకీయంగా కీలకమైన సందేశం ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. ఈ సమాంతర పర్యటనలు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తి రేపుతున్నాయి.రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తి...సీఎం, మాజీ సీఎం పర్యటనలు ఒకేరోజు ఉండడంతో ప్రజల దృష్టి పూర్తిగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాపైనే ఉంది. ఇది రాజకీయంగా శక్తి ప్రదర్శనగా మారింది. ఒకవైపు అధికార పార్టీ తన పరిపాలనను సమర్థించుకుంటూ, గత ప్రభుత్వాన్ని విమర్శించేందుకు సిద్ధమవుతుండగా, ప్రతిపక్షంగా బీఆర్ఎస్ తన బలాన్ని చాటుకునేందుకు ప్రయత్నించే అవకాశముంది. ఇద్దరు నేతల పర్యటన భవిష్యత్ ఎన్నికలకు పునాదులు వేసుకునేందుకేనని స్పష్టమవుతోంది. జీవన్రెడ్డి లాంటి సీనియర్ నేత బీఆర్ఎస్లో చేరిక ఆ పార్టీకి మోరల్ బూస్ట్, కాంగ్రెస్కు పరీక్షగా మారనుంది. ఒక్కటవుతున్న ప్రత్యర్థులుతెలంగాణ మలి దశ ఉద్యమం కరీంనగర్ నుంచే ప్రారంభమైంది. కరీంనగర్ నుంచి మూడుసార్లు ఎంపీగా గెలిచిన కేసీఆర్.. తనపై రెండుసార్లు పోటీ చేసిన జీవన్రెడ్డిని బీఆర్ఎస్లో చేర్చుకోవడానికి ఈనెల 20న సోమవారం జగిత్యాలకు వస్తున్నారు. ఇన్నాళ్లు మౌనంగా ఉన్న కేసీఆర్ ఈసారి తనదైన శైలిలో రాష్ట్రపరిస్థితులపై మాట్లాడే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో జగిత్యాలలో కేసీఆర్ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ముఖ్యంగా కాంగ్రెస్ సీనియర్ నేత అయిన జీవన్రెడ్డిని బీఆర్ఎస్లో చేర్చుకునే ప్రయత్నం రాజకీయ సమీకరణాలను మార్చే అవకాశముంది. కాంగ్రెస్లో నాలుగు దశాబ్దాల పాటు పనిచేసిన నాయకులు బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపడంతో పార్టీలో కొంత కలకలం రేపుతోంది. కేసీఆర్ జగిత్యాలలో చేసే ప్రసంగం, పార్టీ భవిష్యత్ వ్యూహాన్ని వెల్లడించే అవకాశముంది. ఆయన ప్రభుత్వం మీద చేసే విమర్శలు, కాంగ్రెస్ పాలనలో లోపాలను ఎత్తిచూపే ప్రయత్నం చేస్తారని అంచనా.ఆసక్తికరంగా సీఎం పర్యటనఉమ్మడి జిల్లా పరిధిలోని మంథని నియోజకవర్గంలో ఉన్న మేడిగడ్డ బారేజ్ అంశం ఇప్పుడు కేవలం ఇంజినీరింగ్ సమస్య కాదు.. రాజకీయ ఆయుధంగా మారింది. మేడిగడ్డ బారేజ్ కుంగిన ఘటనను పరిశీలించడానికి సీఎం రేవంత్రెడ్డి వెళ్లున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరుపై విమర్శలు గుప్పించనున్నారు. మేడిగడ్డ బారేజ్, కాలేశ్వరం ప్రాజెక్టులో కీలక భాగం కావడం 2023 ఎన్నికల్లో ప్రచారం సందర్భంగా అది కుంగిన విషయం బయటకు రావడంతో బీఆర్ఎస్ ప్రభుత్వం కమీషన్ల కోసమే ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టిందని కాంగ్రెస్ ప్రచారం చేసి ఎన్నికల్లో లబ్ధి పొందింది. కాటారం సభలో రేవంత్ రెడ్డి ప్రసంగం కీలకంగా మారనుంది. ఆయన బీఆర్ఎస్పై మాటల దాడి చేయడం, అవినీతి ఆరోపణలను పునరుద్ఘాటించడం, అభివృద్ధి వాగ్దానాలను ముందుకు తెచ్చే అవకాశముంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అంశాన్ని ప్రజల ముందు తీసుకెళ్లి, బీఆర్ఎస్ పాలనలో జరిగిన లోపాలను ఎత్తిచూపే ప్రయత్నం చేస్తోంది. -
ప్రమాదాలపై అప్రమత్తం
పెద్దపల్లి : వేసవిలో అగ్నిప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలని అగ్నిమాపక అధికారి మ హేందర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఇండియ న్ గ్యాస్ గోదాంతోపాటు పలు పరిశ్రమలల్లో అగ్నిప్రమాదల నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. పరిశ్రమ లు, నివాసాల్లో అనూహ్యంగా ప్రమాదాలు జ రిగితే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. అధికారులు కిశోర్, శ్రీనివాస్, అనిల్ కుమార్, కోటేశ్ తదితరులు ఉన్నారు. ఎన్నికలు నిర్వహించాలి పాలకుర్తి: బసంత్నగర్ అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీలో పర్మినెంట్ కార్మికసంఘం ఎన్నికలు ని ర్వహించాలనే డిమాండ్తో కన్నాల సర్పంచ్ మల్క రామస్వామి ఆధ్వర్యంలో శనివారం నా యకులు, కార్మికులు ఆందోళన నిర్వహించా రు. ప్రస్తుత యూనియన్ మూడేళ్ల పదవీకాలం ముగిసి నెలరోజులు దాటిందన్నారు. అయినా, యాజమాన్యం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించ డం లేదని అన్నారు. యూనియన్ నాయకులు కార్మికుల హక్కులను యాజమాన్యం ఎదుట తాకట్టు పెట్టి కాంట్రాక్ట్లు పొందుతూ సహకరిస్తున్నారని ఆరోపించారు. పోలీసులు తగిన హా మీ ఇవ్వడంతో ఆందోళనకారులు శాంతించా రు. నాయకులు నల్ల మనోహర్రెడ్డి, తంగెడ అ నిల్రావు, పీట్ల గోపాల్, సూర అంజికుమార్, కుడిక్యాల సురేశ్, చాంద్పాషా, దండుగుల లక్ష్మణ్, ఆడెపు శ్రీనివాస్, సందవేన పోషమ ల్లు, జేసీబీ శ్రీను తదితరులు పాల్గొన్నారు. ‘కేంద్రీయ’లో ప్రవేశాలు జ్యోతినగర్: రామగుండంలోని ఎన్టీపీసీ కేంద్రీ య విద్యాలయంలో 11వ తరగతిలో ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఇన్చార్జి ప్రిన్సిపల్ సర్దార్ బాషా శనివారం తెలిపారు. ఈనెల 20వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. కేంద్రీయ విద్యాలయం(కేవీ)లో చదివిన వారికి తొలిప్రాధాన్యం ఉంటుందని పేర్కొన్నారు. కేంద్రీయ విద్యాలయంలో పదో తరగతి ఉత్తీర్ణులైన వారుకూడా రిజిస్ట్రేషన్ చే సుకోవాలని సూచించారు. దరఖాస్తులను ఈ నెల 30వ తేదీలోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని పేర్కొన్నారు. వివరాలకు మధ్యాహ్నం 1 గంటల నుంచి మధ్యాహం 3 గంటల వరకు కా ర్యాలయంలో సంప్రదించాలని కోరారు. మాదిగలకు 11శాతం రిజర్వేషన్లు పెద్దపల్లి: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 15 శాతం రిజర్వేషన్లలో మాదిగలకు 11 శాతం వ ర్తింజేయాలని ఎమ్మార్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షుడు మామిడిపల్లి బాపన్న, జిల్లా అధ్యక్షుడు అంబాల రాజేందర్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో శనివారం వారు విలేకరుల సమావే శంలో మాట్లాడారు. మాదిగల జనాభా 10 నుంచి 11శాతం వరకు ఉంటుందని మందకృష్ణ మాదిగ ఆదినుంచీ చెబుతున్నారని, కులగణన సర్వేతో ఆ విషయం స్పష్టమైందన్నారు. నాయకులు కొంకటి లింగమూర్తి, మంథని చందుమాదిగ, మడిపల్లి దశరథం మాదిగ, కాసి పేట రాజయ్య మాదిగ, అగ్గిమల్లా కొముర య్య మాదిగ, కాసిపేట సదానందం, రాచర్ల రాజేశం, శ్రావణ్ మాదిగ, వివేక్ పాల్గొన్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి సుల్తానాబాద్రూరల్: ట్రాఫిక్ నిబంధనలు పా టిస్తేనే ప్రయాణం సురక్షితంగా, సుఖవంతం ఉంటుందని పెద్దపల్లి డీసీపీ రాంరెడ్డి అన్నారు. స్థానిక అంబేడ్కర్ చౌరస్తాలో శనివారం అరైవ్ –అలైవ్ కార్యక్రమం నిర్వహించారు. డీసీపీ మాట్లాడుతూ హెల్మెట్, సీట్బెల్డ్ వినియోగం, అతివేగం, ప్రమాదాలు, గోల్డెన్ అవర్ తదితర అంశాలపై అవగాహన ఉండాలన్నారు. అనంతరం వాహనాదారులకు హెల్మెట్లను పంపిణీ చేశారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్యగౌడ్, మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధాకృష్ణ, వైస్ చైర్మన్ పుష్పలత, సీఐ సుబ్బారెడ్డి, ఏఎంసీ చైర్మన్ ప్రకాశ్రావు, ఎస్సై చంద్రకుమార్ తదితరులు పాన్నారు. -
నిబద్ధతతో పనిచేస్తున్నాం
మంథని: రైతుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తోందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. ఈనెల 20న కాటా రం మండలం నస్తూరిపల్లిలో నిర్వహించే రైతుభరోసా విడుదల సభకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితోపాటు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు హాజరవుతారని ఆయన చెప్పారు. ఈ మేరకు శనివారం మంథనిలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో డివిజన్లోని ఆయా మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో మంత్రి సమావేశమయ్యారు. ప్రభుత్వం రైతులతోపాటు అన్నివర్గాలకు మేలుచేసే కార్యక్రమాలు చేస్తోందని అన్నారు. సీఎం సభ విజయవంతం కోసం అందరూ సమన్వయంతో పనిచేయాలని కోరారు. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తొట్ల తిరుపతి యాదవ్, విద్యుత్ నియంత్రణ మండలి సభ్యుడు శశిభూషణ్ కాచే, మంథని మున్సిపల్ చైర్మన్ వొడ్నాల శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్లు, మండల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. -
ఫైర్సేఫ్టీపై విద్యార్థులకు అవగాహన
అద్దె ఇవ్వడం లేదని యూపీహెచ్సీకి తాళం కోల్సిటీ(రామగుండం): అద్దె చెల్లించడం లేదనే ఆగ్రహంతో పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(యూపీహెచ్సీ)కు ఇంటి యజమాని తాళం వేసిన ఘటన గోదావరిఖని ఫైవింక్లయిన్కాలనీలో శనివా రం చోటుచేసుకుంది. ఆదర్శ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్జీవో నిర్వాహకుడు నరసింహులు ఓ రేకుల షెడ్డు లో యూపీహెచ్సీ నిర్వహిస్తున్నారు. అద్దె ఎంతకీ ఇవ్వకపోవడంతో యజమాని రాజేశ్ శనివారం షెడ్డుకు తాళం వేశారు. వైద్య సిబ్బంది ఎన్జీవో ప్రతినిధులకు సమాచారం అందించారు. ఎన్జీవో నిర్వాహకుడు వెంటనే వచ్చి ఇంటి యజమానితో చర్చలు జరిపారు. రెండురోజుల్లో బకాయిలు చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో తాళం తొలగించారు. కాగా, కలెక్టర్ చొరవతో రెండేళ్లక్రితం షెడ్డుకు సమీపంలోనే రూ.1.45 కోట్ల వ్యయంతో యూపీహెచ్సీ కోసం రెండతస్తుల భవనం నిర్మించారు. ఆస్పత్రికి అవసరమైన సామగ్రి సమకూర్చకపోవడంతో భవనం వినియోగంలోకి రాలేదు. -
ఇదేమి పారిశుధ్యం నిర్వహణ?
కోల్సిటీ(రామగుండం): గోదావరిఖని జనరల్ ప్రభుత్వ ఆస్పత్రి(జీజీహెచ్)ను కలెక్టర్ కోయ శ్రీహర్ష శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పారిశుధ్యం నిర్వహణ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మెడికల్ ఓపీ, న్యూబ్లాక్, ఐసీయూ బ్లాక్, ఎమర్జెన్సీ విభాగం, డ్యూటీ డాక్టర్ గదులను పరిశీలించారు. పేషెంట్లకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ఆస్పత్రిలో చేపట్టిన సీసీ రోడ్డు పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. శానిటేషన్ పనితీరును మెరుగుపరచాలని చెప్పారు. డిప్యూటీ సూపరింటెండెంట్ అరుణ, ఆర్ఎంవోలు కృపాబాయ్, రాజు తదితరులు పాల్గొన్నారు. మెరుగైన వైద్యసేవలు అందించాలి పెద్దపల్లి: జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, ఇందుకోసం అన్నిశాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సూ చించారు. కలెక్టరేట్లో శుక్రవారం వైద్య, ఆరోగ్య శాఖ పనితీరుపై సమీక్షించారు. ఆయుర్వేదం, హోమియోపతి తదితర సేవలపై ప్రజల స్పందన, రోజువారీ ఓపీ సంఖ్య వివరాలపై ఆరా తీశారు. యోగా కేంద్రాలఏర్పాటు కోసం స్థలాలు అన్వేషించాలని అన్నారు. హెచ్పీవీ టీకా ప్రగతి తక్కువగా ఉందని, వచ్చే రెండు నెలల్లో 6 వేల టీకాలు పూర్తిచేయాలని అన్నారు. అబార్షన్ ఆడిట్ తప్పనిసరిగా నిర్వహించాలని చెప్పారు. డయాలిసిస్ పేషెంట్లకు నిరంతర సేవలు అందించాలన్నారు. జిల్లా వైద్యాధికారి ప్రమోద్ కుమార్, డీసీహెచ్వో శ్రీధర్, డాక్టర్లు వాణిశ్రీ , శ్రీరాములు, రాజమౌళి, సుధాకర్రెడ్డి, కృష్ణమోహన్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
‘కొత్త మండలి’ పై దుమారం
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: శాతవాహన యూనివర్సిటీని వివాదాలు ఇప్పట్లో వీడేలా లేవు. తాజాగా వెలువడిన కొత్త పాలకమండలి సభ్యుల విషయం యూనివర్సిటీలో చర్చనీయాంశంగా మారింది. అర్హతలు లేని వారికి పాలకమండలిలో చోటు కల్పించారని, అర్హత ఉన్నవారిని పక్కన బెట్టారన్న వాదనలు వర్సిటీలోని ప్రతీ విభాగంలో మార్మోగుతున్నాయి. తాజాగా వెలువడిన పాలకమండలిలో సీనియర్ ప్రొఫెసర్ స్థానంలో అసోసియేట్ ప్రొఫెసర్కు చోటు కల్పించారు. యూనివర్సిటీలో ప్రస్తుతం ఇద్దరే ప్రొఫెసర్లు ఉన్నారు. అందులో ఒకరు వరప్రసాద్, మరొకరు సూరేపల్లి సుజాత. ఇటీవల సుజాతకు ఇప్పటికే నాలుగు పదవుల్లో కోతపెట్టిన వీసీ ఉమేశ్ కుమార్ ఈసారి పాలకమండలిలో చోటు ఇవ్వకపోగా వారి కన్నా జూనియర్, అసోసియేట్ ప్రొఫెసర్ అయిన జాఫర్ జారీకి చోటు కల్పించడం చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి ఆయనకు ఇంకా ప్రొఫెసర్ హోదా రాలేదు. అయినా ఉన్నత విద్యామండలికి ఆయన్ను సీనియర్ ప్రొఫెసర్గా చూపించడం విడ్డూరంగా ఉందని వర్సిటీ సిబ్బందే వాపోతున్నారు. ఇప్పటికీ శాతవాహన యూనివర్సిటీ అధికారిక వెబ్సైట్లోనూ మహమ్మద్ జాఫర్ అసోసియేట్ ప్రొఫెసర్ అనే పేర్కొనడం గమనార్హం. ఎస్ఆర్ఆర్ కాలేజీకి దక్కని ప్రాధాన్యం ఉమ్మడి జిల్లాలోనే కాదు.. ఉత్తర తెలంగాణలోనే శ్రీ రాజరాజేశ్వర కాలేజీకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ప్రస్తుతం హాస్టల్ సదుపాయంతో అటామనస్ హోదా కలిగి ఉంది. అలాంటి ఈ కళాశాలకు ఈసారి పాలకమండలిలో సభ్యత్వం దక్కకపోవడం హాట్ టాపిక్గామారింది. గత వీసీ మల్లేశం ఉన్న సమయంలో 2024 మార్చిలో పాలకమండలిని ప్రతిపాదించినా అది అమలులోకి రాలేదు. ఆ జాబితాలో ఎస్ఆర్ఆర్ కాలేజీతోపాటు, ప్రొఫెసర్ సూరేపల్లి సుజాతకు చోటు దక్కడం విశేషం. అదే జాబితాలో తాజా ఈసీ జాబితాలో ప్రొఫెసర్గా చూపించిన మహమ్మద్ జాఫర్ని అసోసియేట్ ప్రొఫెసర్గా పేర్కొనడం గమనార్హం. మొత్తానికి తాజా జాబితాలో సభ్యుల ఎంపిక, చూపించిన సమాచారంలో లోపాలపై ఇటు విద్యార్థులు, అటు వర్సిటీ సిబ్బంది మండిపడుతున్నారు. బెయిల్ రద్దుకు న్యాయపోరాటం ఇటీవల తమ వర్సిటీలో దళిత ప్రొఫెసర్లు, విద్యార్థులను అర్బన్ నక్సలైట్లంటూ ప్రచారం చేస్తున్న ఓ పార్ట్టైం ఫ్యాకల్టీ బెయిల్ రద్దుకు న్యాయపోరాటానికి దిగుతున్నామని శాతవాహన విద్యార్థి సంఘాల జేఏసీ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. గతంలో శాతవాహన వైస్ చాన్స్లర్గా పనిచేసిన ప్రొఫెసర్ మల్లేశంను కూడా ఇదే తరహాలో సోషల్ మీడియాలో కించపరిచిన కేసులో ఆ ఫాకల్టీపై అట్రాసిటీ కేసు నమోదైందని గుర్తుచేశారు. ఇదేకాకుండ పలు కేసుల్లో రిమాండ్ ఖైదీగా జైలు జీవితం గడిపి.. ప్రస్తుతం బెయిల్ మీద ఉన్నాడని పేర్కొన్నారు. వర్సిటీలో అశాంతి.. ఆందోళనలకు కారణం అవుతున్న సదరు ఫాకల్టీ బెయిల్ రద్దుకు తాము కోర్టును ఆశ్రయిస్తామని వెల్లడించారు. బ్యాంకులను మోసం చేసిన వ్యక్తికి మా వర్సిటీలో స్థానం లేదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో విద్యార్థులు కరికె మహేశ్, శివాజీ, లక్ష్మణ్, సాయి, ప్రవీణ్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. వీసీతో ఎమ్మార్పీఎస్ నేతల సమావేశం జిల్లా ఎమ్మార్పీఎస్ నేతలు వీసీ ఉమేశ్కుమార్ను ఆయన ఛాంబర్లో శుక్రవారం కలిశారు. యూనివర్సిటీలో ప్రొఫెసర్ సూరేపల్లి సుజా తను అర్బన్ నక్సలైట్గా చిత్రీకరించడం, ఆమెకు ఉన్న పదవులను వరుసగా తొలగించడంపై వీసీతో ఆరా తీశారు. సుజాత విషయంలో ఎ లాంటి కక్షసాధింపు చర్యలు లేవని, వీసీ వారికి వివరణ ఇచ్చినట్లు తెలిసింది. అనంతరం ఎమ్మార్పీఎస్ నేతలు ప్రొఫెసర్ సుజాతను కలిసి సంఘీభావం తెలిపారు. దళితులపై అకారణంగా దు ష్ప్రచారానికి దిగితే.. ఉద్యమిస్తామని స్పష్టంచేశారు. జిల్లా అధ్యక్షులు అనిల్, రేణుకుంట్ల సాగర్, తునికి వసంత్, చెంచాల నవీన్ పాల్గొన్నారు. -
స్వచ్ఛ రామగుండం లక్ష్యం
జ్యోతినగర్: స్వచ్ఛ రామగుండం లక్ష్యంగా నగరంలో చేపట్టిన అభివృద్ధి పనుల్లో ప్రతీఒక్కరు భాగ స్వాములు కావాలని మేయర్ మహంకాళి స్వామి కోరారు. 33వ డివిజన్లో డిప్యూటి మేయర్ పాతిపెల్లి ఎల్లయ్య, కార్పొరేటర్ మేరుగు భూలక్ష్మీ తదితరులతో కలిసి శుక్రవారం ఆయన వార్డుబాట చేపట్టారు. అత్యవసర సమయాల్లో వీధుల్లోకి అంబులె న్స్ వచ్చేలా తమఇంటి ఎదుట రోడ్డు విస్తరించాలని కోరారు. బల్దియాకు సహకరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లతోపాటు డిప్యూటీ కమిషనర్ వెంకటస్వామి, ఎస్ఈ గురువీర, అధికారులు రామన్, షాబాజ్, ఆఫ్తాబ్, తేజస్విని, మీర్, నవీన్, సూపరింటెండెంట్ శ్రీనివాస్, శానిటరీ ఇన్స్పెక్టర్ సంపత్ తదితరులు పాల్గొన్నారు. -
‘గోల్డెన్ అవర్’లో స్పందించాలి
జ్యోతినగర్: గోల్డెన్ అవర్లో స్పందిస్తే రోడ్డు ప్రమా ద బాధితుల ప్రాణాలు కాపాడవచ్చని పెద్దపల్లి డీ సీపీ రాంరెడ్డి అన్నారు. రామగుండం ఎన్టీపీసీ ధ న్వంతరి ఆస్పత్రిలో శుక్రవారం నిర్వహించిన అరైవ్ – అలైవ్పై గోదావరిఖని ఏసీపీ రమేశ్, రామగుండం సీఐ ప్రవీణ్ కుమార్, ఎన్టీపీసీ ఎస్ఐ ఉదయ్ కిరణ్, ధన్వంతరి ఆస్పత్రి వైద్య బృందంతో అంబులెన్స్ డ్రైవర్లు, స్వయంసేవకులకు ఫస్ట్ ఎయిడ్, గోల్డెన్ అవర్ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ప్రమాదం జరిగిన వెంటనే తొలిగంట అ త్యంత కీలకమని డీసీపీ తెలిపారు. గంటలోపే ఆస్పత్రులకు తరలించాలి యైటింక్లయిన్కాలనీ: రోడ్డు ప్రమాదాల్లో గోల్డెన్ అ వర్ చాలాముఖ్యమని డీసీపీ రాంరెడ్డి తెలిపారు. ఆర్జీ–2ఏరియా వృత్తి శిక్షణ కేంద్రంలో గోల్డెన్ అవర్ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. గోదావరిఖని ఏసీపీ రమేశ్తో కలిసి మాట్లాడారు. ప్రమాదం జరిగిన గంటలోపే బాధితులను ఆస్పత్రులకు తరలించాలని కోరారు. ఈకార్యక్రమంలో టూటౌన్ సీ ఐ ప్రసాద్రావు, పోలీస్ సిబ్బంది, ఎంవీటీసీ ట్రైన ర్, సింగరేణి ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. -
20న సీఎం రేవంత్రెడ్డి పర్యటన
పెద్దపల్లి/ఎలిగేడు: మంథని నియోజకవర్గంలోని కాటారంలో ఈనెల 20వ తేదీన జరిగే సీఎం రేవంత్రెడ్డి బహిరంగసభకు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎ మ్మెల్యే విజయరమణారావు కోరారు. ఎలిగేడు మండలం శివపల్లిలోని తన నివాసంలో జూలపల్లి, ఎలిగేడు మండలా కాంగ్రెస్ పార్టీ నాయకులతో శుక్రవా రం విప్ సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభు త్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అర్హులైన పేదలందరికీ చేరేలా కార్యకర్తలు కృషి చేయాలని కోరా రు. కార్యక్రమంలో ఎలిగేడు, జూలపల్లి మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, వ్యవసాయ మార్కెట్ చైర్మన్లు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ కళాశాలల్లో చేరండి
పెద్దపల్లి: కార్పొరేట్ కళాశాలలకు ఏమాత్రం తీసి పోని విధంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల అ త్యుత్తమ ఫలితాలు సాధిస్తున్నాయి. విద్యార్థులు అత్యధిక మార్పులు సాధిస్తున్నారు. వీటితోపాటు అన్నికాలేజీల్లో మెరుగైన సౌకర్యాలు ఉన్నాయి. ఎ స్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఆర్థికంగా వెనుకబడిన అగ్రకుల విద్యార్థులకు ఉచితంగా విద్య అందిస్తున్నాయి. అందుకోసమే ఈసారి కూడా సర్కారు కళాశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు పెంచేందుకు అధ్యాపకులు, ప్రిన్సిపాల్స్ ప్రచారం చేస్తున్నారు. పేదలకు ఉచిత విద్య జిల్లాలో వ్యాప్తంగా 14 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. వీటిలోని 5,079 మంది ప్రథమ సంవత్సరం విద్యార్థులు ప్రస్తుతం ద్వితీయ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నారు. ప్రభుత్వ, కేజీబీవీలు, జెడ్పీ హైస్కూళ్లు, గురుకులాల్లోనూ ప్రవేశాలకోసం అధ్యాపకులు ఇంటింటా ప్రచారం చేస్తున్నారు. ఈఏడాది ప్రభుత్వ కళాశాలల్లో ఉత్తీర్ణత 68.29 శాతం నమోదుచేశాయి. ఎంసెట్, నీట్లో ప్రత్యేక శిక్షణ విద్యాసంవత్సరం ప్రారంభంలోనే ఎంపీసీ, బైపీసీ విద్యార్థుల కోసం ఎంసెట్, నీట్, జేఈఈ మెయిన్స్ వంటి పరీక్షల కోసం శిక్షణ ఇస్తున్నారు. ఉచిత పాఠ్య పుస్తకాలు అందిస్తున్నారు. ప్రణాళిక బద్ధంగా విద్యార్థులను ప్రిపేర్ చేస్తున్నారు. తరగతి గదుల్లో సీసీ కెమెరాల ఏర్పాటు ఇంటర్ బోర్డు కమాండ్ కంట్రోల్ రూమ్తో ప్రతీ తరగతి గదిని అనుసంధానించారు. ఇందుకోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అన్ని సామాజిక వర్గాలకు ఉన్నతాధికారులు స్కాలర్షిప్ సౌకర్యం కల్పిస్తున్నారు. మధ్యాహ్న భోజనం, అల్పాహారం అమలుకు చర్యలు తీసుకుంటున్నారు. క్రీడలకు ప్రాముఖ్యత ఇస్తున్నారు. బాలికల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రభుత్వ కాలేజీలో చేరుతా నేను పదో తరగతి పాసైన. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేరు తా. ప్రభుత్వం ఉచితంగా పాఠ్యపుస్తకాలు, విద్య అందిస్తుంది. మాలాంటి పేదలకు ఇది ఒక వరం. – జాన్, సుల్తానాబాద్కళాశాలలో చేరండి ఇంటర్ బోర్డు ఆదేశం మేరకు ప దోతరగతి పూర్తిచేసిన విద్యార్థులు ఇంటర్లో చేరేలా ప్రచారం చేస్తున్నాం. తల్లిదండ్రులు, విద్యార్థుల ఇళ్లకు వెళ్లి అవగాహన కల్పిస్తున్నారు. వారినుంచి మంచిస్పందన వస్తోంది. – రామచంద్రారెడ్డి, ప్రిన్సిపాల్, సుల్తానాబాద్ -
బ్లాక్లో వంటగ్యాస్
పెద్దపల్లిరూరల్: గ్యాస్ సిలిండర్లకు కృత్రిమ కొరత ఏర్పడింది. దీంతో బ్లాక్మార్కెట్లో ఒక్కో సిలిండర్ ధర రూ.5వేలకు పైగా పలుకుతోంది. జిల్లా కేంద్రమైన పెద్దపల్లితోపాటు వివిధ ప్రాంతాల్లో గ్యాస్ సిలిండర్ల బ్లాక్ దందా సాగుతున్నా అధికార యంత్రాంగం మొక్కుబడి తనిఖీలతోనే సరిపెడుతోందనే విమర్శలున్నాయి. హోటళ్లు, టిఫిన్, ఫాస్ట్పుడ్ సెంటర్లలో వాణిజ్య అవసరాల కోసం వినియోగించాల్సిన సిలిండర్లకు బదులుగా గృహవినియోగ సిలిండర్లనే వాడుతుండడం గమనార్హం. వ్యాపారులు, ఇతరుల అవసరాలను బట్టి కొంతమంది గ్యాస్స్టౌ రిపేరర్లు సిలిండర్ల బ్లాక్దందా కొనసాగిస్తున్నట్టు సమాచారం. ధరలు పెరిగాయంటూ హోటల్, టిఫిన్ సెంటర్ల యజమానులు సైతం ఆహార పదార్థాల ధరలను పెంచేశారు. యథేచ్ఛగా రీఫిల్లింగ్ పెద్దపల్లితోపాటు వివిధ ప్రాంతాల్లో గ్యాస్ రీఫిల్లింగ్ దందా కొనసాగుతోంది. కొందరు గ్యాస్ స్టౌ రిపేరర్లు తమవద్ద ఉన్నసిలిండర్లో నుంచి చిన్న సిలిండర్ (కిలోల కొద్దీ)లోకి గ్యాస్ను అవసరమున్నంత రీఫిల్లింగ్ చేస్తున్నట్టు సమాచారం. కిలోకు రూ.350 నుంచి రూ.400 వకఎ వసూలు చేస్తున్నట్టు తెలుస్తోంది. బ్యాచిలర్లు, అత్యవసరమున్న వారు వీరిని ఆశ్రయించి ఆర్థికంగా నష్టపోతున్నారు. ఇళ్లలోనే గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తుండడంతో ఏ క్షణాన ఏ ఉపద్రవం ముంచుకొస్తుందోననే ఆందోళన పరిసర ప్రాంత ప్రజల్లో వ్యక్తమవుతోంది. జిల్లాకేంద్రంలోని సాగర్రోడ్డు, కోఠి ప్రాంతాల్లో రీఫిల్లింగ్ దందా సాగుతున్నట్టు సమాచారం. సంబంధిత శాఖల అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. -
ప్రమాదాలపై అప్రమత్తం
పెద్దపల్లి: ఆస్పత్రుల నిర్వాహకులు, సిబ్బంది అగ్నిప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలని ఫైర్ఆఫీసర్ మహేందర్ సూచించారు. జిల్లా కేంద్రంలోని పలు ఆస్పత్రల్లో అగ్ని, ఇతర ప్ర మాదాల నియంత్రణపై శుక్రవారం ఆయన అ వగాహన కల్పించారు. అనూహ్యంగా ప్రమా దం జరిగితే అప్రమత్తంగా ఉండే విధానం, మంటలను ఆర్పే పద్ధతి గురించి వివరించా రు. వేసవిలో అగ్నిప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, వాటిని నియంత్రించడంతోపాటు జా గ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు శ్రీనివాస్, పవన్, సాయివిగ్నేశ్ తదితరులు పాల్గొన్నారు.కేటీఆర్ను కలిసిన ‘కోలేటి’గోదావరిఖని: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను పో లీస్ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కోలేటి దామోదర్ శుక్రవారం కలిశారు. హైదరాబాద్లోని కేటీఆర్ నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. భవిష్యత్ రాజకీయాలపై చర్చించారు. నియామకం పెద్దపల్లి: టీపీసీసీ డాక్టర్స్ సెల్, మెడికల్ అండ్ హెల్త్ విభాగం జిల్లా చైర్మన్గా ఇటుకల మహేశ్ కుమార్ నియమితులయ్యారు. హై దరాబాద్ గాంధీ భవన్లో మహేశ్ కుమార్కు శుక్రవారం రాష్ట్ర చైర్మన్ రాజీవ్ నియామక పత్రాన్ని అందజేశారు. 62 మందికి ఉద్యోగాలు పెద్దపల్లి: స్థానిక టాస్క్ సెంటర్లో నిర్వహించి న జాబ్మేళాలో 62 మంది వివిధ ఉద్యోగాల కు ఎంపికయ్యారని జిల్లా ఉపాధి కల్పనాధికారి తిరుపతిరావు తెలిపారు. జిల్లా కేంద్రంలో శుక్ర వారం నిర్వహించిన జాబ్మేళాకు 380 మంది అభ్యర్థులు హాజరయ్యారన్నారు. మరో 9 మంది షార్ట్లిస్ట్ అయినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో టాస్క్ మేనేజర్ గంగాప్రసాద్, ఇన్చార్జి కౌసల్య, కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. పీఆర్సీ అమలు చేయాలి పెద్దపల్లి: వచ్చేజూన్ 2న పీఆర్సీ అమలుచేయాలని ఉద్యోగ జేఏసీ అధ్యక్ష, కార్యదర్శులు బొంకూరి శంకర్, తూము రవీందర్పటేల్ కోరారు. శుక్రవారం భోజన విరామ సమయంలో కలెక్టరేట్ ఎదుట నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. నగదు రహిత ఆరోగ్య భద్రత కార్యక్రమాన్ని మే ఒకటో తేదీ నుంచి నిబంధన లేకుండా అందరికీ వర్తింపజేయాలన్నారు. ప్రతినిధులు రంగారెడ్డి, కరుణాకర్, రవీందర్, గంప రవీందర్, బ్రహ్మానందరెడ్డి, సాజిద్ అలీ, రవీంద్రనాథ్, ఉమాదేవి, ఆడెపు శ్రీనివాస్, అయిరెడ్డి సందీప్రెడ్డి, అనిత, శిల్పారెడ్డి, సౌమ్య, స్వప్న కుమారి, రమ్య, హారిక, దివ్య, మంగ, రాజమణి, ప్రవీణ్, రాజమహేందర్, గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. బాలికా సాధికారతకు కృషి జ్యోతినగర్: బాలికా సాధికారతకు ఎన్టీపీసీ ఎంతోకృషి చేస్తోందని ప్రాజెక్టు ఏజీఎం(హెచ్ఆర్) సాగర్రంజన్ సాహూ అన్నారు. కాకతీయ ఆడిటోరియంలో శుక్రవారం బాలికా సాధికారత మిషన్ –2026 ద్వారా చేపట్టిన సమగ్ర వైద్య పరీక్ష శిబిరంలో ఆయన మాట్లాడారు. బాలికల సంపూర్ణ ఆరోగ్యం, శ్రేయస్సును నిర్ధారించడం, ఆరోగ్య సమస్యలను తొలిదశలోనే గుర్తించడం శిబిరం ముఖ్య ఉద్దేశమన్నారు. ఎంపికై న 120 మంది బాలికలకు వేసవిలో ప్రత్యేక శిబిరంలో పూర్తిసౌకర్యాలను కల్పిస్తామని చెప్పారు. కార్యక్రమంలో డీజీఎం ప్రవీణ్ కే చౌదరితోపాటు వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. -
త్వరలోనే క్యాథ్ల్యాబ్ సేవలు
గోదావరిఖని: కోల్బెల్ట్వాసులకు త్వరలోనే క్యాథ్ల్యాబ్ సేవలు అందుబాటులోకి వస్తాయని, ఈమేరకు పనులు శరవేగంగా సాగుతున్నాయని సింగరేణి చీఫ్ మెడికల్ ఆఫీసర్ కిరణ్రాజ్కుమార్ అన్నారు. గోదావరిఖని ఏరియా ఆస్పత్రిలో చేపట్టిన క్యాథ్ల్యాబ్ విభాగాన్ని ఆర్జీ–వన్ జీఎం లలిత్కుమార్తో కలిసి శుక్రవారం ఆయన పరిశీలించారు. గుండె సంబంధిత వ్యాధులను నిర్ధారించడం, చికిత్స చేయడంలో ఈవిభాగం కీలకంగా పనిచేస్తుందన్నారు. క్యాథ్లాబ్తో పాటు కార్డియాలజిస్టులు(గుండె వైద్య నిపుణులు), ప్రత్యేక శిక్షణ పొందిన నర్సింగ్ స్టాఫ్ అందుబాటులో ఉండేలా చర్య లు తీసుకుంటున్నామని ఆయన అన్నారు. రామగుండం సింగరేణి ఏరియా ఆస్పత్రి సాధారణ వైద్యానికే కాకుండా, సూపర్ స్పెషాలిటీ సేవల కేంద్రంగా కూడా మారుతుందని చెప్పారు. ఎస్వోటూ జీఎం చంద్రశేఖర్, సివిల్ డీజీఎం వరప్రసాద్, వర్క్షాప్ ఇంజినీర్ చంద్రశేఖర్, హాస్పటల్ ఏసీఎంవో అంబిక, సీనియర్ సెక్యూరిటీ ఆఫీసర్ వీరారెడ్డి, డాక్టర్ రమేశ్, రెనీ హాస్పిటల్ చైర్మన్ బంగారు స్వా మి, డైరెక్టర్ అరవింద్, వైద్య సిబ్బంది, క్యాథ్లాబ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం
పాలకుర్తి: ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నామని జిల్లా వైద్యాధికారి ప్రమోద్కుమార్ అన్నారు. గురువారం జీడీనగర్లోని ఓప్రైవేటు ఫంక్షన్హాల్లో నిర్వహించిన మండలస్థాయి 99రోజుల ప్రణాళిక సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 130రకాల వ్యాధి నిర్థారణ పరీక్షలు ఉచితంగా చేస్తున్నట్లు వివరించారు. ఎస్సై శ్రీధర్ అరైవ్ – అలైవ్ కార్యక్రమం గురించి వి వరించారు. మండల ప్రత్యేకాధికారి జగన్మోహన్రెడ్డి, తహసల్దార్ సునీత, ఎంపీడీవో శశికళ, ఏఎంసీ చైర్మన్ తిరుపతి తదితరులు పాల్గొన్నారు. కాగా, ప్రజా పాలన–ప్రగతి నివేదిక సమావేశం మొక్కుబడిగా సాగిందనే విమర్శలు వచ్చాయి. మరోవైపు.. సమావేశంలో అధికారులు ప్రొటోకాల్ పాటించలేదని ఉపసర్పంచులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈమేరకు ఉపసర్పంచులు ముత్యాల ఉదయ్కుమార్, ఓడ్నాల జ్యోతి, ఇస్లావత్ రాజేశ్వరి తదితరులు ఎంపీడీవోకు వినతిపత్రం సవమర్పించారు. -
ఆర్టీసీ డిపోలో ఏం జరుగుతోంది?
● డీఎంపై కార్మికుల్లో అసంతృప్తి ● కొందరికి అనుకూలంగా.. ● మరికొందరిపై కక్షసాధింపు మంథని: మంథని ఆర్టీసీ డిపో గతంలో ఎన్నడూ లేనివిధంగా పత్రికలకు ఎక్కుతోంది. ప్రస్తుత డిపో మేనేజర్ కార్మికుల సమస్యలను పరిష్కరించకుండా కొంతమందిని తప్ప అన్నిస్థాయిల్లో పనిచేస్తున్న కా ర్మికులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారనే అరో పణలు వినిపిస్తున్నాయి. తనపై జరిగిన కుట్రకు సంబంధించి సమస్య పరిష్కరించమని అర్జీ పెట్టు కుంటే సరైన జవాబు ఇవ్వకుండా తన హక్కును డిపో మేనేజర్ కాలరాశారని ఏడీసీ(ఈ) కె.నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ స్పీకర్ డి.శ్రీపాదరావు 31 సంవత్సరాల క్రితం మంథని ప్రజల అవసరాలను గుర్తించి 1997లో మంథనిలో డిపో ప్రారంభించారని అన్నారు. 320 మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించారని గుర్తుచేశారు. కానీ చరిత్ర తెలుసుకోకుండా కొంతమంది మాటలు విని ప్రజాపాలనకు వ్యతిరేకంగా అఽధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఉద్యోగాలు ఊడగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని నారాయణ పేర్కొన్నారు. ఒక్క నారాయణ అనే ఉద్యోగి కాకుండా చాలామంది కార్మికులను వేధిస్తున్న డిపో మేనేజర్ వ్యవహార శైలిపై ‘సాక్షి’ ఆరా తీయగా అనేక విషయాలను వెల్లడించారు. తమపేర్లను బయటకు రాకుండా చూడాలని, లేకపోతే తమ ఉద్యోగాలు పోతాయనే భయాన్ని వారు వ్యక్తం చేశారు. డిపో పరిధిలో ప్రజారవాణా మెరుగు, సంస్థకు ఆదాయం, డిపో అభివృద్ధి, కార్మికుల శ్రేయస్సు తదితర అంశాలపై అధికారులు, కార్మికులు సమన్వయంతో దృష్టి సారించాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ అందుకు విరుద్ధంగా జరుగుతుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంలో జిల్లా ఉన్నతాధికారులు దృష్టి సారించి నిజానిజాలు బయట పెడితేనే అసలు విషయం తెలిసే అవకాశం ఉంది. ఈ విషయంపై డిపో మేనేజర్ శ్రావణ్కుమార్ మాట్లాడుతూ ఏడీసీ నారాయణ ఆరోపణలు నిరాధారమన్నారు. సదరు విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. -
వనమహోత్సవానికి కార్యాచరణ
● అధికారులతో బల్దియా కమిషనర్ సమీక్ష కోల్సిటీ: వన మహోత్సవం విజయవంతం చేయడానికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్ అరుణ శ్రీ ఆదేశించారు. బల్దియా కార్యాలయంలో గురువా రం వార్డు అధికారులకు శిక్షణ ఇచ్చారు. ఆమె మా ట్లాడుతూ, మొక్కలు నాటి సంరక్షించడంపై అటవీ శాఖాధికారుల సమన్వయంతో పనిచేయాలన్నారు. వర్షాకాలం ప్రారంభంలోనే 1,80,000 మొక్కలు నాటేలా ప్రణాళిక రూపొందించాలని అన్నారు. మొక్కలు నాటాడానికి అనువైన స్థలాల గుర్తింపుతోపాటు ఎలాంటి రకాలు, ఎన్ని నాటాలో సవివరంగా జాబితాలో పొందుపర్చాలన్నారు. ఎవెన్యూ ప్లాంటేషన్కు సంబంధించి రోడ్డు వెడల్పు, విద్యుత్ తీగలు, పైప్లైన్లు అన్నీ పరిగణనలోకి తీసుకోవాల ని సూచించారు. జనగణన, ఇందిరమ్మ ఇళ్లు, ఆస్తిపన్ను వసూళ్ల పురోగతి, పారిశుధ్యం నిర్వహణపైనా సమీక్షించారు. సమావేశంలో ఈఈ పీవీ రామన్, డీఈ షాభాజ్, ఏఈ తేజస్విని, అటవీ శాఖ సెక్షన్ ఆఫీసర్ రహమతుల్లా, డీఆర్వో కొమురయ్య, బీట్ ఆఫీసర్ వరప్రసాద్ పాల్గొన్నారు. -
అర్హులందరికీ సంక్షేమ ఫలాలు
పెద్దపల్లిరూరల్: సంక్షేమ ఫలాలు అర్హులందరికీ అందేలా యంత్రాంగం కృషి చేస్తోందని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. జిల్లా కేంద్రంలో గురువా రం నిర్వహించిన మున్సిపల్స్థాయి ప్రజాపాలన – ప్రగతిప్రణాళిక సమావేశంలో ఆయన మాట్లాడా రు. రేషన్కార్డుల జారీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతుభరోసా, ఇందిరమ్మ ఇళ్లు, పింఛ న్లు, గృహజ్యోతి, రూ.500కే గ్యాస్, వడ్డీలేని రుణాలు.. ఇలా అనేక పథకాలు అమలవుతున్నాయ న్నా రు. వీటిఅమలులో లోపాలను అధికారుల దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తారని తెలిపారు. సమస్యలను గుర్తించి క్షేత్రస్థాయిలోనే పరిష్కరించేలా అధికారు లు, సిబ్బంది పనిచేయాలని సూచించారు. రహవీర్ పథకం కింద రూ.25వేల నజరానా రహదారులపై తరచూ రోడ్డు ప్రమాదాలు జరిగి అనేకమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని, గంటలోపే బాధితులను ఆస్పత్రికి తరలించే వారికి రహవీర్ పథకం కింద రూ.25వేల నజరానా అందిస్తామని కలెక్టర్ ప్రకటించారు. డీసీపీ రాంరెడ్డి, ఏసీపీ కృష్ణ మాట్లాడారు. మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు. వందశాతం లక్ష్యం సాధించాలి పెద్దపల్లి: స్వశక్తి సంఘాల ఆదాయాభివృద్ధికి ప్రభుత్వం నిర్ణయించిన లక్ష్యాలను వంద శాతం సాధించడానికి సెర్ప్ సిబ్బంది కృషి చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. సెర్ప్ కార్యకలాపాలపై అధికారులతో కలెక్టరేట్లో గురువారం ఆయన సమీక్షించారు. గత ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్ లింకేజీలో జిల్లా రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచిందన్నారు. ఇందుకు కృషిచేసిన సిబ్బందిని కలెక్టర్ అభినందించారు. ఇదే స్ఫూర్తితో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ రుణాల పంపిణీ, రికవరీలో ముందంజలో ఉంచాలని ఆయన కోరారు. మహిళ శిక్షణ సంస్థ వీ హబ్ ఆధ్వర్యంలో పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి కాళిందిని, అదనపు డీఆర్డీవో రవీందర్, డీపీఎంలు వెంకటరమణ, సంజీవ్, సీ్త్రనిధి ఆర్ఎం దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
ఎంపీని కలిసిన విప్, ఎమ్మెల్యే
పెద్దపల్లి/గోదావరిఖని: రాజ్యసభ సభ్యుడిగా వేంనరేందర్రెడ్డి పార్లమెంటులో ప్రమాణస్వీకారం చేశారు. ఈమేరకు గురువారం తెలంగా ణ భవన్లో వేంనరేందర్ రెడ్డిని ప్రభుత్వ విప్ విజయరమణారావుతోపాటు రామగుండం ఎ మ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్ కలిసి పుష్పగుచ్ఛం అందించి ఘనంగా సన్మానించారు. ఆయన వెంట ఎమ్మెల్యేలు గండ్ర సత్యనారాయణరావు, బొజ్జు పటేల్ తదితరులు ఉన్నారు. వరికోతలు షురూ పాలకుర్తి: యాసంగి వరి కోతలు ప్రారంభమయ్యాయి. పాలకుర్తి, కొత్తపల్లి, బసంత్నగర్ గ్రామాల్లో రైతులు వారం రోజులుగా వరికోతలు చేపట్టారు. పాలకుర్తి, బసంత్నగర్, కొత్తపల్లితోపాటు పెద్దపల్లి మండలంలోని కురుమపల్లి గ్రామాల రైతులు బసంత్నగర్ విమానశ్రయ ప్రతిపాదిత స్థలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తుంటారు. వీటిని కన్నా ల, అప్పన్పపేట సొసైటీలు నిర్వహిస్తున్నాయి. ప్రస్తుతం వరికోతలు ప్రారంభమైనా కొనుగోలు కేంద్రాల నిర్వహణ ఏర్పాట్లు చేయకపోవడంపై విస్మయం వ్యక్తమవుతోంది. గ్యాస్ ప్రమాదాలపై అప్రమత్తం పెద్దపల్లి: వంటగ్యాస్ ప్రమాదాల నియంత్రణ విధానంపై ప్రతీ మహిళకు అవగాహన ఉండా లని అగ్నిమాపక శాఖ అధికారి మహేందర్రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని జెండా చౌరస్తా ట వర్స్లో గురువారం అగ్నిప్రమాదాల నివారణ పై అవగాహన కల్పించారు. వేసవిలో ప్రమాదాలు జరిగే అవకాశాలు అధికంగా ఉంటాయని, నివారించేందుకు జాగ్రత్తలు పాటించాలని వివరించారు. అధికారులు శ్రీనివాస్, అనిల్ కు మార్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. సెల్లార్లో వ్యాపారం పెద్దపల్లిరూరల్: స్థానిక కమాన్ ప్రాంతంలోని కాంప్లెక్స్లోని రెండు బ్యాంకుల ఎదుట వాహనాలను రోడ్డుపైనే నిలుపుతున్నారు. భవనంలో వాహనాల పార్కింగ్ కోసం సెల్లార్ ఉన్నా అందులో వ్యాపారం సాగిస్తున్నారు. దీంతో వాహనాలను ఇలా రోడ్లపైనే నిలపాల్సి వస్తోంది. బ్యాంకు లావాదేవీల కోసం వచ్చే ఖాతాదారులు లోనికి వెళ్లేందుకు నానా తంటాలు పడుతున్నారు. మున్సిపల్, పోలీసు అధికారులు సెల్లార్ల వినియోగంపై దృష్టి సారించాలని ఖాతాదారులు కోరుతున్నారు. తహసీల్దార్గా రవీందర్రావు జ్యోతినగర్: రామగుండం తహసీల్దార్గా కొలు గూరి రవీందర్రావు గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ, రెవెన్యూ సేవలు పారదర్శకంగా కొనసాగుతాయన్నా రు. కాగా, 20 రోజులుగా తహసీల్దార్ లేక పలు సంఘాలు నిరసన చేపట్టాయి. ఎట్టకేలకు కలెక్టరేట్లో డిప్యుటేషన్పై పనిచేస్తున్న రవీందర్రావును నియమిస్తూ ఉత్తర్వులు విడుదల చేశా రు. అధికారులు, సిబ్బంది ఆయనకు పుష్పగు చ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. కా గా, పాలకుర్తి తహసీల్దార్ సునీతను తొలుత రామగుండానికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. కానీ, గురువారం రవీందర్రావును నియమించడం గమనార్హం. రామగుండం: ఎన్పీడీసీఎల్ పర్మినెంట్ ఉద్యోగులు, ఆర్టిజన్లకు ఒకేసర్వీస్ రూల్స్ అమలు చే యాలని సీపీఐ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం డిమాండ్చేశారు. మల్యాలపల్లి విద్యుత్ సబ్స్టేషన్లో ఆర్టిజన్ల దీక్ష తొమ్మిదోరోజుకు చే రింది. సదానందంతోపాటు బీసీ సంఘాల ఐ క్యవేదిక జిల్లా చైర్పర్సన్ దాసరి ఉష సంఘీభావం ప్రకటించారు. సదానందం మాట్లాడు తూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అ మలు చేయాలని డిమాండ్ చేశారు. ఆర్టిజన్లు శ్రీనివాస్, సురేశ్, మహేశ్, విశ్వనాథ్ ఉన్నారు. -
కో – ఆప్షన్ ఎన్నికలకు నోటిఫికేషన్
కోల్సిటీ(రామగుండం): నగరపాలక పరిపాలనలో అనుభవం, ప్రత్యేక పరిజ్ఞానం కలిగిన వారితోపాటు మైనారిటీలకు ప్రాతినిధ్యం కల్పించేలా కో ఆప్షన్ సభ్యుల ఎన్నికలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రామగుండం బల్దియా కమిషనర్ అరుణశ్రీ తెలిపారు. ఈమేరకు గురువారం నోటిఫికేషన్ జారీచేశారు. తెలంగాణ మున్సిపాలిటీస్ కో ఆప్షన్ మెంబర్ రూల్స్ ప్రకారం మొత్తం ఐదుగురు సభ్యులను ఎంపిక చేయనున్నట్లు వెల్లడించారు. ఇందులో పురపాలక పరిపాలనలో ప్రత్యేక అనుభవం కలిగిన ముగ్గురు సభ్యులు ఉంటారని, వీరిలో ఒకరు మహిళ తప్పనిసరి అని ఆమె అన్నా రు. మైనారిటీలకు చెందిన ఇద్దరు సభ్యులుగా ఉంటుండగా, ఈ ఇద్దరిలో ఒకరు తప్పనిసరిగా మహిళ ఉంటారని పేర్కొన్నారు. కో ఆప్షన్ సభ్యులుగా ఎన్నికలో పాల్గొనేవారు మున్సిపల్ కార్పొరేషన్ ఓటరు జాబితాలో నమోదు అయి ఉండడంతోపాటు కనీసం 21 సంవత్సరాల వయస్సు పూర్తిచేసి ఉండాలని తెలిపారు. ప్రత్యేక పరిజ్ఞానం వర్గానికి చెందిన అభ్యర్థులు మున్సిపాలిటీ లేదా మున్సిపల్ కార్పొరేషన్లలో కనీసం ఐదేళ్లపాటు మేయర్, డిప్యూ టీ మేయర్, చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ లేదా సభ్యుడిగా పనిచేసి ఉండాలన్నారు. లేదా గ్రామపంచాయతీల్లో సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులుగా ఐదేళ్ల అనుభవం ఉండాలని పేర్కొన్నారు. ఇక మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్గా కనీసం మూడు సంవత్సరాలు పనిచేసిన న్యాయవాదులు లేదా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో గెజిటెడ్ హోదాలో పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన వారూ అర్హులన్నారు. అర్హతలు, ఆసక్తి గలఅభ్యర్థులు అవసరమైన ధ్రువపత్రాలతో ఈనెల 23వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలోని టౌన్ ప్లానింగ్ విభాగంలో దరఖాస్తులు సమర్పించాలని కమిషనర్ సూచించారు. -
నిధులు ఆదా చేయండి
● బల్దియా వాహనాలతో పూడిక తీయండి ● రామగుండం మేయర్ మహంకాళి స్వామి కోల్సిటీ(రామగుండం): బల్దియా సొంత వాహనాలతోనే కాలువల్లో పూడిక తీయిస్తూ నిధులు ఆదా చేయాలని మేయర్ మహంకాళి స్వామి కోరారు. కాంట్రాక్ట్ పేరిట రూ.కోట్లు దుర్వినియోగం కాకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. 40వ డివిజన్లో గురువారం కార్పొరేటర్ కజంపురం జయప్రద– రాజేందర్తో కలిసి మేయర్ వార్డు సందర్శన చేపట్టారు. ఏటా పూడిక తీతకు రూ.లక్షలు కేటాయిస్తూ తూతూమంత్రంగా పనులు చేపట్టడం ఆనవాయితీగా వస్తోందన్నారు. దీనికి చరమగీతం పా డుతూ నిధులు వృథాకాకుండా బల్దియా సొంత వాహనాలు, పారిశుధ్య సిబ్బందితోనే ప్రధాన కాలువల్లో పూడికతీత చేపట్టామని ఆయన అన్నారు. ఉల్లిగడ్డల బజార్లో రామన్ వారధికి ఇరువైపులా పెద్ద మురుగునీటి కాలువలో ఏళ్ల తరబడి నిలిచిపోయిన పూడికను యంత్రాలతో తొలగించారు. ఆయన పనులను పర్యవేక్షించారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ వెంకటస్వామి, ఈఈ పీవీ రామన్, టీపీఎస్ నవీన్, డీఈ అఫ్తాబ్, ఏఈ జమీల్, శానిటరీ ఇన్స్పెక్టర్ సంపత్ పాల్గొన్నారు. -
బాహుబలులు
బహుజనులే...సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జనాభాపరంగా బీసీలు, ఎస్సీలే అధికంగా ఉన్నారు. ఈ విషయం రాష్ట్ర ప్రభుత్వం తాజాగా వెల్లడించిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ కులగణన (ఎస్ఈఈఈ పీసీ–2024) సర్వేలో వెల్లడించింది. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ కులాల గణన వారి సామాజిక ఆర్థిక స్థితిగతులను తెలుసుకునేందుకు ప్రభుత్వం గతేడాది కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్లలో చేసిన ఎస్ఈఈఈపీసీ సర్వే ఉమ్మడి జిల్లా గణాంకాలు పలు ఆసక్తికర విషయాలను వెల్లడిస్తున్నాయి. జనాభాపరంగా బీసీలు, ఎస్సీలు అగ్రభాగాన నిలిచారు. ఎస్టీ, బీసీ జనాభాలో అగ్రభాగంలో జగిత్యాల ఉంది. ఎస్సీ, ఓసీ పాపులేషన్లో అగ్రభాగాన కరీంనగర్ నిలిచింది. -
సమస్యలపై స్పందన అంతంతే
రామగుండం: తెలంగాణ నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ గురువారం స్థానిక సబ్ డివిజన్ కా ర్యాలయలో వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక నిర్వహించింది. వినియోగదారుల నుంచి స్పందన అంతంత మాత్రంగానే వచ్చింది. రామగుండం, అంతర్గాం, పాలకుర్తి మండలాల్లోని విని యోగదారులు ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యలపై ఫిర్యాదు చేసే అవకాశం కల్పించినా ఆశించిన స్పందన రాలేదు. విద్యుత్ బిల్లుల్లో హెచ్చుతగ్గులు, లోఓల్టేజీ తదితర సమస్యలపైనే నలుగురైదుగురు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఏఈ గడ్డం సునీల్సాయినాథ్రెడ్డితోపాటు రమేశ్ (టెక్నికల్), దేవేందర్ (ఫైనాన్స్), తిరుపతయ్య(ఎస్ఏవో, పెద్దపల్లి), అంతర్గాం, పాలకుర్తి ఏఈలు ఆశ శంకర్, ప్రసాద్ తదితరులు హాజరయ్యారు. -
ఆపదలో ఆస్పత్రికి తరలిస్తే ప్రోత్సాహకం
● పెద్దపల్లి డీసీపీ రాంరెడ్డి గోదావరిఖని: ప్రమాదంలో గాయపడిన వారిని ఆ స్పత్రికి తరలిస్తే రహవీర్పథకం కింద రూ.25వేలు పోత్సాహకంగా అందిస్తామని పెద్దపల్లి డీసీపీ రాంరెడ్డి అన్నారు. గురువారం అడ్డగుంటపల్లి కెమిస్ట్భవన్లో వన్టౌన్సీఐ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించారు. గోదావరిఖని ఏసీపీ రమేశ్, ట్రాఫిక్ సీఐ రాజేశ్వర్రావు, ఎస్సై రమేశ్, ఐఎంఏ అధ్యక్షుడు శ్రీనివాస్, మెడికల్ షాప్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజేందర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రోడ్డు సేఫ్టీ నిబంధనలు పాటించాలి పెద్దపల్లిరూరల్: వాహనదారులు రోడ్సేఫ్టీ నిబంధ నలను కచ్చితంగా పాటించి సురక్షితంగా తిరిగి చే రుకోవాలని డీసీపీ రాంరెడ్డి అన్నారు. రూరల్ ఎస్సై మల్లేశ్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో నిర్వహించిన అరైవ్ .. అలైవ్ కార్యక్రమంలో ఏసీపీ కృష్ణ, సీఐ ప్రవీణ్కుమార్, ఇన్చార్జి డీపీవో నరేందర్, స్పెషల్ఆఫీసర్ రాజేశ్వర్తో కలిసి మాట్లాడారు. వాహనాలను నిర్లక్ష్యంగా, మత్తులో నడిపి ప్రమాదాలకు గురికావొద్దని సూచించారు. బైక్పై ప్రయాణించేవారు తప్పకుండా హెల్మెట్, కారు నడిపేవారు సీటుబెల్ట్ ధరించాలని ఆయన సూచించారు. సమావేశానికి హాజరైన సర్పంచులు, ఉపసర్పంచులు, కార్యదర్శులతో రోడ్డు భద్రతపై ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రాజయ్య, ఎంపీడీవో శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
‘అమ్మా.. నీకేమైందమ్మా!
కోల్సిటీ (రామగుండం): మరికాసేపట్లో చిట్టి చెల్లినో లేక తమ్ముడినో ఎత్తుకుంటానని ఆశపడిన ఓ చిన్నారి.. తన తల్లి మృత శిశువును ప్రసవించి కన్నుమూయడంతో హతాశురాలైంది. ‘అమ్మా.. నీకేమైంది అమ్మా..’ అంటూ ఆస్పత్రి మెట్లపై కూర్చొని తండ్రిని హత్తుకొని విలపించింది. ఈ విషాద ఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రిలో జరిగింది. మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలం నాగపూర్ గ్రామానికి చెందిన శారద (26), హరికృష్ణ దంపతులకు ఏడేళ్ల కుమార్తె ఉంది. మూడేళ్ల క్రితం ఓ శిశువు పుట్టి మరణించగా 6 నెలల క్రితం శారద మళ్లీ గర్భం దాల్చింది. ఆమె ఆరోగ్యం క్షీణించడంతో బుధవారం గోదావరిఖనిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా పరిస్థితి విషమంగా ఉందని జీజీహెచ్కు రెఫర్ చేశారు. దీంతో వెంటనే ఆమె అక్కడ అడ్మిట్ చేశారు. శారదను పరీక్షించిన వైద్య బృందం ఆమెకు తీవ్ర రక్తహీనత ఉన్నట్లు గుర్తించింది. పరిస్థితి అత్యంత క్లిష్టంగా మారడంతో అత్యవసర శస్త్రచికిత్స చేసింది. తక్కువ బరువుతో బుధవారం రాత్రి శారద మృత ఆడశిశువుకు జన్మనిచ్చింది.అయితే రక్తస్రావం, ఇతర సమస్యలతో ఆమె గురువారం కన్నుమూసింది. తల్లి మృతదేహాన్ని చూసిన కుమార్తె గుండెలవిసేలా రోదించింది. రోగిని బతికించేందుకు ప్రయత్నించినప్పటికీ రక్తహీనత, గర్భసంచిలో రక్తస్రావం, అవయవాల వైఫల్యంతో శారద మరణించిందని గైనకాలజీ హెచ్వోడీ అరుణ చెప్పారు. -
గడువులోగా పనులు పూర్తిచేయాలి
పెద్దపల్లి: జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులను గడువులోగా పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. ఇంజినీరింగ్ అధికారులతో అభివృద్ధి పనుల పురోగతిపై కలెక్టరేట్లో బుధవారం ఆయన సమీక్షించారు. వి ద్యా సంస్థల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, నూతన తరగతి గదుల నిర్మాణం, మౌలిక వసతుల కల్పన వేగవంతం చేసి వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే పూర్తిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. నిర్మాణంలో ఉన్న తహసీల్దార్ కార్యాలయాల పనులను జూన్ నాటికి పూర్తిచేయాలని అన్నారు. అంగన్వాడీ కేంద్రాల మరమ్మతులను మే 15లోగా పూర్తిచేయాలని కలెక్టర్ శ్రీహర్ష స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఈఈ పీఆర్ శంకరయ్య తదితరులు పాల్గొన్నారు. భూసమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు కాల్వశ్రీరాంపూర్: భూ, రెవెన్యూ సమస్యల సత్వర పరిష్కారానికి చర్యలు చేపట్టాలని కలెక్టర్ శ్రీహర్ష ఆదేశించారు. వెన్నంపల్లి, కూనారంలోని వ్యవసా య భూములను కలెక్టర్ పరిశీలించారు. ఆన్లైన్ ద్వారా అందిన భూభారతి దరఖాస్తులు పెండింగ్ లో లేకుండా వెంటనే పరిష్కరించాలని రెవెన్యూ అ ధికారులకు సూచించారు. కలెక్టర్ వెంట తహసీల్దా ర్ రాముడు, రెవెన్యూ అధికారులు ఉన్నారు. కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశాలు -
రోడ్డు నిబంధనలపై అవగాహన
సుల్తానాబాద్రూరల్: విద్యార్థి దశలోనే రోడ్డు నియమ నిబంధనలపై అవగాహన ఉండాలని డీసీపీ రాంరెడ్డి సూచించారు. భూపతిపూర్ మహాత్మా జ్యోతిబాపూలే గురుకులంలో బుధవారం అరైవ్–అలైన్ నిర్వహించారు. డీసీపీ మాట్లాడుతూ మైనర్లు డ్రైవింగ్ చేయడం నేరమన్నారు. హెల్మెట్ లేకుండా, సీట్బెల్డ్ ధరించకుండా వాహనం నడుపురాదని తెలిపారు. నిబంధనలు పాటిస్తేనే రోడ్డు ప్రమాదాలను నియంత్రించవచ్చుని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ కృష్ణ, సీఐ సుబ్బారెడ్డి, ఎస్సై అశోక్రెడ్డి, ప్రిన్సిపాల్ శ్రీనివాస్, ఏంవీఐ, పోలీస్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.సాగునీరు విడుదల పెద్దపల్లి: శ్రీరాంసాగర్ కాకతీయ కాలువ డీ–83, –86 ద్వారా జిల్లా వ్యవసాయ భూ ములకు ఎనిమిదో విడతగా బుధవారం సాగునీరు విడుదల చేసినట్లు నీటిపారుదల శాఖ జిల్లా అధికారి శ్రీనివాస్ తెలిపారు. యాసంగి పంటలకు ఇది చివరివిడత అని ఆయన అ న్నారు. మొక్కజొన్నతోపాటు ఆలస్యంగా సా గుచేసిన వరి పంటను కాపాడేందుకు చివరితడిని అందిస్తున్నామన్నారు. చివరి ఆయకట్టు వరకు సాగునీరు చేరేలా ఇరిగేషన్ సిబ్బంది నిరంతరం విధుల్లో ఉంటారని తెలిపారు. విద్యార్థి దశ నుంచే అవగాహన ఉండాలిపెద్దపల్లిరూరల్: డ్రైవింగ్ సమయంలో రోడ్డు సేఫ్టీ నిబంధనలను కచ్చితంగా పాటించాలని ట్రాఫిక్ సీఐ అనిల్కుమార్ సూచించారు. జిల్లా కేంద్రంలోని ప్రగతినగర్ చౌరస్తా వద్ద బుధవారం సీఐ ప్రవీణ్కుమార్ తదితర పోలీస్ సిబ్బందితో కలిసి విద్యార్థులు మానవహారంగా ఏర్పడ్డారు. రోడ్డుభద్రత నియమాలపై సీఐ ప్రజలకు అవగాహన కల్పించారు. అరైవ్.. అలైవ్ కార్యక్రమంలో భాగంగా రోడ్డు ప్రమాదాలకు దారితీసే పరిస్థితులు, మద్యం మత్తులో వాహనాలను అజాగ్రత్తగా నడపడంతో కలిగే అనర్థాలపై విద్యార్థులకు సులువుగా అర్థమయ్యేలా వివరించారు. ఈ విషయపరిజ్ఞానాన్ని తల్లిదండ్రులకు వివరించాలని సూచించారు. బైక్ డ్రైవింగ్ సమయంలో హెల్మెట్ ధరించాలని అన్నారు. కారు నడిపే సమయంలో సీట్బెల్ట్ ధరించేలా కుటుంబీకుల్లో అవగాహన పెంచే బాధ్యతను పిల్లలు తీసుకోవాలని ఆయన సూచించారు. డిష్ ఆపరేటర్లకు నోటీసులు కోల్సిటీ(రామగుండం): రామగుండం నగరంలో విద్యుత్ స్తంభాలపై ప్రమాదకరంగా వేళాడుతున్న ఇంటర్నెట్, డిష్ కేబుళ్లను వెంటనే తొలగించాలని నగరపాలక సంస్థ ఉన్నతాధికారులు బుధవారం నిర్వాహకులకు నోటీసు లు జారీచేశారు. ముఖ్యంగా బీ– పవర్హౌస్ హనుమాన్ జంక్షన్ నుంచి గోదావరి వంతెన వరకు హెచ్కేఆర్ రాజీవ్ రహదారిపై స్తంభాల ఆధారంగా లాగిన ఇంటర్నెట్, డిష్ కేబుళ్లను వెంటనే తొలగించి ప్రత్యామ్నాయం చూసుకోవాలని కమిషనర్ అరుణశ్రీ కోరారు. తీగలను తొలగించడానికి రామగుండం నగరపాలక సంస్థ సన్నాహాలు చేస్తుందని తెలిపారు. రేపు మెగా ఉద్యోగ మేళా పెద్దపల్లి: జిల్లా కేంద్రంలోఈనెల 17న ప్రత్యేక జాబ్మేళా నిర్వహిస్తామని కలెక్టర్ కోయ శ్రీహర్ష బుధవారం తెలిపారు. దీనికోసం టాస్క్ రీజినల్ సెంటర్ ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ చేపట్టామని పేర్కొన్నారు. డిప్లొమా, ఐటీఐ, ఎంబీఏ పూర్తి చేసినవారు అర్హులన్నారు. ఆసక్తి గలవారు తగిన ధ్రువీకరణ పత్రాలతో హాజరు కావాలనిని సూచించారు. వివరాల కోసం పెద్దపల్లిలోని టాస్క్ రీజినల్ సెంటర్లో సంప్రదించాలని కలెక్టర్ కోరారు. పెరిగిన పత్తి ధర పెద్దపల్లిరూరల్: స్థానిక వ్యవసాయ మార్కెట్యార్డులో బుధవారం పత్తి క్వింటాల్కు గరిష్టంగా రూ.8,014 ధర పలికింది. కనిష్టంగా రూ.6,424గా, సగటు రూ.7,684గా ధర ఉందని మార్కెట్కమిటీ చైర్మన్ కూర మల్లారెద్డి, కార్యదర్శి ప్రవీణ్రెడ్డి తెలిపారు. -
సీబీఎస్ఈ ఫలితాల్లో కేవీ ప్రభంజనం
జ్యోతినగర్: రామగుండంలోని ఎన్టీపీసీ కేంద్రీయ విద్యాలయం విద్యార్థులు సీబీఎస్ఈ పదో తరగతి ఫలితాల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించి ప్రభంజనం సృష్టించినట్లు ఇన్చార్జి ప్రిన్సిపల్ సర్దార్ బాషా తెలిపారు. బుధవారం సాయంత్రం విడుదలైన సీబీఎస్ఈ ఫలితాల్లో 50 మంది విద్యార్థులకు 50 మంది ఉత్తీర్ణత సాధించారని ఆయన పేర్కొన్నారు. బైరం నీలొత్పల 468/500తో 93.6 శాతం, జోషన్ జాబీ 452/500తో 90.4 శాతం, ఇషితా గ్రేసీ 445/500తో 89 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించారన్నారు. 2025–26 విద్యా సంవత్సరంలో కేంద్రీయ విద్యాలయ విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించడంపై ఇన్చార్జి ప్రిన్సిపల్తోపాటు ఉపాధ్యాయులు అభినందించారు. ఇషితా గ్రేసీ నీలోత్పల జోషన్జాబీ వందశాతం ఉత్తీర్ణత నమోదు -
‘టేకాఫ్’కు మరో ముందడుగు
రామగుండం: అంతర్గాం ప్రాంతంలో విమానాశ్రయం ఏర్పాటుకు మరోఅడుగు పడింది. ఎయిర్పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) ప్రతినిధులు ఇచ్చిన ప్రీ ఫిజిబిలిటీ నివేదికపై కేంద్రప్రభుత్వం సానకూలంగా స్పందించడం ఇందుకు కారణమైంది. కేంద్ర పౌర విమానయానశాఖ సూచనలతో ఏఏఐ, వివిధ ప్రభుత్వ శాఖల అత్యున్నతస్థాయి ప్రతినిధులు గతేడాది డిసెంబరులో అంతర్గాంలో పర్యటించారు. ప్రభుత్వ స్థలాలు పరిశీలించారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం గతేడాది అక్టోబర్ 11న రూ.40.53 లక్షలు కేటాయించింది. ప్రతికూలంగా బసంత్నగర్.. ఏఏఐ ప్రతినిధులు, వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు తొలుత పాలకుర్తి మండలం బసంత్నగర్లోని స్థలాలు పరిశీలించారు. అక్కడ విమానాశ్రయం ఏర్పాటుకు స్థలాలు అనుకూలంగా లేవని తేల్చారు. ఆ తర్వాతే ఏఏఐ అధికారులు అంతర్గాంలో పర్యటించి ప్రీ ఫిజిబిలిటీ నివేదిక రూపొందించారు. దీనిని కేంద్ర విమానయాన శాఖకు అందజేశారు. దీనిపై కేంద్ర విమానయాన శాఖ సానుకూలత వ్యక్తం చేస్తూ గత ఫిబ్రవరి 13న రాష్ట్ర ప్రభుత్వానికి లేఖరాసింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై కేంద్ర విమానయానశాఖ తదుపరి చర్యలు తీసుకుంటుందని విశ్వసనీయ సమాచారం. ప్రీ ఫిజిబిలిటీ నివేదికలో పొందుపరిచిన ముఖ్యాంశాలు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇస్తే.. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నివేదిక ఆధారంగా అంత ర్గాం ఎయిర్పోర్టుపై ముందడుగు పడనుంది. ఎయిర్ పోర్టు ఏర్పాటుకు రాష్ట్ర సర్కార్ గ్రీన్సిగ్నల్ ఇచ్చిన తక్షణమే ఇక్కడ రియల్ ఎస్టేట్ పుంజుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. మరోవైపు.. ఎయిర్పోర్టు ఏర్పాటుతో భవన నిర్మాణాలు ఎన్నిఅంతస్తుల్లో నిర్మించే అవకాశం ఉంటుందనే దానిపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ‘ప్రీ ఫిజిబిలిటీ’పై కేంద్ర ప్రభుత్వం సానుకూలత ఇక మిగిలింది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమే అంతర్గాంలో ఎయిర్పోర్టు ఏర్పాటుకు మార్గం సుగమం! -
వడగాలులు.. ఉక్కపోత
సాక్షి ప్రతినిధి, కరీంనగర్/కరీంనగర్/గోదావరిఖని: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఉమ్మడి జిల్లాలోనూ ఈనెల 16 నుంచి 22వరకు హీట్వేవ్స్ (వడగాలులు) కొనసాగుతాయని వాతా వరణశాఖ (ఐఎండీ) తెలిపింది. మొన్నటిదాకా 30 డిగ్రీలకుపైగా నమోదైన ఉష్ణోగ్రతలు 12వ తేదీ నుంచి 35 డిగ్రీలపైగా నమోదవడం మొదలైంది. వేసవి మొదలయ్యాక ఈ స్థాయిలో ఎండలు ముదరడం ఇదే తొలిసారి. 40 డిగ్రీలకుపైగా ఎండలు దంచుతున్న నేపథ్యంలో వడదెబ్బ తగిలే ప్రమాదముందని ఐఎండీ హెచ్చరించింది. 16 నుంచి 22 తేదీ వరకు రాజన్నసిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో 41 నుంచి 44 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు చేరుకుంటాయని వెల్లడించింది. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు బయట సంచారాన్ని వీలైనంత తగ్గించుకోవాలని సూచించింది. శిశువులు, దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న వారు మధ్యాహ్నం తరువాత అసలు బయటికి రాకూడదు. బహిరంగ ప్రదేశాల్లో పనిచేసే కూలీలు, వ్యవసాయం చేసేవారు, ట్రాఫిక్ పోలీసులు, సింగరేణి ఓపెన్కాస్టు ఉద్యోగులు అంతా అప్రమత్తంగా ఉండాలి.మండుతున్న కోల్బెల్ట్ రామగుండంలో సింగరేణి ఓసీపీలు భగ్గుమంటున్నాయి. ఎండల తీవ్రతకు కార్మికులు ఆగమాగమవుతున్నారు. రెండోషిఫ్టు కార్మికులు విధులకు గైర్హాజర్ క్రమంగా పెరుగుతోంది. ఒకరోజు డ్యూటీకి వస్తే రెండోరోజు జంకుతున్నారు. గతంలో మే నెలలో ఎండవేడి అధికంగా ఉండేది. ఈసారి ఏప్రి ల్ రెండోవారం నుంచే ఎండలు దంచికొడుతున్నాయి. మిగతా ప్రాంతాలతో పోల్చితే క్వారీల్లో కనీసం 3 నుంచి 5 డిగ్రీల సెల్సియస్ అధికంగా ఉష్ణోగ్రతలు నమోదు కావడం గమనార్హం. ప్రస్తుతం క్వారీల్లో సుమారు 45డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు చెబుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే మేలో ఓసీపీల్లో డ్యూటీలు చేయడం, భూగర్భగనుల్లోకి వెళ్లడం, మండుటెండలో ఇళ్లకు రావడం కష్టంగా ఉంటుందని కార్మికులు పేర్కొంటున్నారు. ఎండల తీవ్రత నేపథ్యంలో ఉదయం షిఫ్టు మధ్యాహ్నం 1గంట వరకు, రెండో షిఫ్టు సాయత్రం 4 గంటల నుంచి రాత్రి 11గంటల వరకు కొనసాగించాలనే డిమాండ్ ఓసీపీ కార్మికుల నుంచి వస్తోంది. ఎండవేడిలో పనిచేసే కార్మికులకు చలవపందిళ్లు ఏర్పాటు చేస్తున్నారు. రెస్ట్హాళ్లు, క్యాంటీన్లు, ఆఫీస్ కార్యాలయాల్లో కూలర్లు ఏర్పాటు చేస్తున్నారు. రంజన్ల ద్వారా చల్లటినీటిని అందిస్తున్నారు. షిఫ్టు కార్మికులకు మజ్జిగ ప్యాకెట్లను యాజమాన్యం అందిస్తోంది. -
‘రైజింగ్ రామగుండం’ లక్ష్యం
కోల్సిటీ: రైజింగ్ రామగుండంగా అభివృద్ధి చేసేందుకు ప్రతీపౌరుడు కదిలి రావాలని, ఊరంటే రామగుండంలా ఉండాలనేలా నగరాన్ని రూపుదిద్దుకోవడానికి సహకారాన్ని అందించాలని ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్ కోరారు. ప్రజాపాలన .. ప్రగ తి ప్రణాళికలో భాగంగా బుధవారం 9వ డివిజన్ లో నిర్వహించిన వార్డుసందర్శనలో మేయర్ మ హంకాళి స్వామితో కలిసి ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఆ యన మాట్లాడుతూ, రామగుండాన్ని స్వచ్ఛమైన, అద్భుత నగరంగా తీర్చిదిద్దడం పౌరుల భాగస్వామ్యంతోనే సాధ్యమన్నారు. నాలాల పూడికతీత ద శాబ్దాలుగా లేదని, ప్రస్తుతం సమర్ధత, అనుభవం కలిగిన పాలకవర్గం ఏర్పడిందని, శానిటేషన్తోపా టు అన్నిసమస్యలూ తీరిపోతాయని తెలిపారు. వ రద ముప్పుతోపాటు దుర్గంధం నుంచి విముక్తి క ల్పించేందుకు త్వరలో కాంక్రీట్ కాలువలు నిర్మిస్తా మని చెప్పారు. మేయర్ మహంకాళి స్వామి మాట్లాడుతూ, కాలువలో చెత్త వేయకుండా ప్రజలు సహకరించాలన్నారు. ఈ సందర్భంగా వినోభానగర్, రెల్లివాడలోని మురుగునీటి కాలువలో పూడిక తొలగించారు. డిప్యూటీ మేయర్ పాతపెల్లి ఎల్లయ్య, కార్పొరేటర్ తాళ్లపెల్లి యుగంధర్తోపాటు పలువురు కా ర్పొరేటర్లు, డిప్యూటీ కమిషనర్ వెంకటస్వామి, ఈ ఈ పీవీ రామన్, టీపీఎస్ నవీన్, ఏఈ జమీల్, శాని టరీ ఇన్స్పెక్టర్ నాగభూషణం, సూపర్వైజర్ రవికుమార్, ఎలక్ట్రికల్ ఏఈ రాంజీ పాల్గొన్నారు. అభివృద్ధి చేసేందుకు అందరూ కలిసి రావాలి ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్ పిలుపు మేయర్తో కలిసి తొమ్మిదో డివిజన్లో వార్డుబాట -
గూగుల్ పేలో ‘పాకెట్మనీ’ క్లిక్ చేస్తే ఖాతా ఖాళీ..!
పెద్దపల్లిరూరల్: సైబర్ నేరగాళ్లు సరికొత్త ఎత్తులు వేస్తూ అమాయకుల బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. నిత్యజీవితంలో డిజిటల్ చెల్లింపులు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో గూగుల్ పే ద్వారా చెల్లింపులు చేసేందుకు యాప్ ఓపెన్ చేయగానే తొలుత ‘పాకెట్మనీ’ అనే సింబల్ కనిపిస్తోంది. దానిని నొక్కితే బ్యాంకు ఖాతాలోని డబ్బులు ఖాళీ అవుతున్నాయట. డిజిటల్ పేమేంట్ చేసే వారంతా తమకు అవసరం లేనియాప్, లింకుల జోలికి వెళ్లక పోవడమే మంచిదని పోలీసు అధికారులు పల్లెలు, పట్టణాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. -
రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పటిష్ట చర్యలు
● కలెక్టర్ కోయ శ్రీహర్ష పెద్దపల్లి: జిల్లా కేంద్రంలోని కమాన్ ఏరియాలో ప్రమాదాల నియంత్రణకు తక్షణ చర్యలు చేపట్టాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. కమాన్ ఏరియాలో రోడ్డు ప్రమాదాలు అధికంగా జరిగే వివిధ ప్రాంతాలను డీసీపీ రాంరెడ్డితో కలిసి మంగళవారం కలెక్టర్ పరిశీలించారు. రోడ్డు ప్రమాదం కుటుంబానికి తీవ్ర మానసిక, ఆర్థికభారం కలిగిస్తుందన్నారు. ప్రతీ ప్రమాదాన్ని అ త్యంత తీవ్రంగా పరిగణించి నియంత్రణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ట్రాఫిక్ నియంత్రణ కో సం సిగ్నల్స్ ఏర్పాటు చేయాలని, వాహనాల వే గాన్ని తగ్గించేందుకు రబ్బర్ స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. రాత్రివేళ స్పష్టంగా కనిపించే రిఫ్లెక్టివ్ స్టిక్కర్లు అమర్చడం ద్వారా విజిబిలిటీ పెంచాలని తెలిపారు. మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్, ఏసీపీ కృష్ణ, ట్రాఫిక్ సీఐ అనిల్ కుమార్, ఎస్ఐ లక్ష్మణ్రావు తదితరులు పాల్గొన్నారు. -
రాజ్యాంగ విలువల పరిరక్షణే లక్ష్యం
పెద్దపల్లి/మంథని/గోదావరిఖని: రాజ్యాంగ విలువల పరిరక్షణే లక్ష్యమని ఐటీ, పరిశ్రమలు, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. మంగళవారం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా పెద్దపల్లి, గోదావరిఖని, మంథని ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. పెద్దపల్లి బస్టాండ్ వద్ద ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణారావు, కలెక్టర్ కోయ శ్రీహర్ష, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్తో కలిసి అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. మంథనిలోనూ అంబేడ్కర్ విగ్రహం ఎదుట నివాళి అర్పించారు. ఆయా ప్రాంతాల్లో జరిగిన వేడుకల్లో మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ, రాజ్యాంగం రచనలో అంబేడ్కర్ కీలకపాత్ర పోషించారన్నారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకుని పనిచేయాలని సూచించారు. అంబేడ్కర్ నాలెడ్జ్ సెంటర్ నిర్మాణ ప్రక్రియ ప్రారంభించాలని కలెక్టర్కు సూ చించారు. రాజ్యాంగ స్ఫూర్తితో ప్రభుత్వ పాలన సా గుతోందని, అంబేడ్కర్ ఆలోచన ఆదర్శనీయమని మంత్రి అన్నారు. మంథనిలో అంబేడ్కర్ స్టడీ సెంటర్ ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. నిష్ణాతులైన ప్రొఫెసర్లతో శిక్షణ అందించి పోటీ పరీక్షలకు తయారు చేస్తామని శ్రీధర్బాబు చెప్పారు. మహిళలను కోటీశ్వరులను చేస్తాం మహిళలను కోటీశ్వరులను చేయడమే కాంగ్రెస్ ప్ర భుత్వ లక్ష్యమని మంత్రి శ్రీధర్బాబు అన్నారు. ప్ర భుత్వ విప్ విజయరమణారావు, రామగుండం ఎ మ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్, కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి జిల్లా కేంద్రంలో వీ హబ్ సెంటర్ ప్రారంభించిన అనంతరం మంత్రి శ్రీధర్బాబు మాట్లాడారు. పెద్దపల్లికి వీ హబ్ తీసుకురావడంలో ప్రభుత్వ విప్ విజయరమణారావు కృషి ఎంతగానో ఉందన్నారు. రోబోటిక్స్, ఏఐ సాంకేతికతలు అతివేగంగా అభివృద్ధి చెందుతున్నాయని, భవిష్యత్లో వీ టిద్వారా విస్తృత ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. డిజిటల్ లిటరసీ సమ్మర్ క్యాంపులకు పైలట్ ప్రాజెక్టుగా రామగుండం, పెద్దపల్లి, మంథని, సుల్తానాబాద్ను ఎంపిక చేస్తామని మంత్రి చెప్పారు. కలెక్టర్ శ్రీహర్ష మాట్లాడుతూ, అడవిశ్రీరాంపూర్, కాల్వశ్రీరాంపూర్లో ప్రారంభించిన ఏఐ ల్యాబ్ అన్ని పాఠశాలలకు విస్తరిస్తామన్నారు. ప్ర భుత్వ విప్ విజయరమణారావు మాట్లాడుతూ, అంబేడ్కర్ నాలెడ్జ్ సెంటర్కు రూ.5 కోట్లు మంజూ రు చేయాలని మంత్రి శ్రీధర్బాబును కోరారు. రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్, కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ, అంబ్కేడ్కర్ ను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఆయా ప్రాంతా ల్లో జరిగిన కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్ వేణు, డీసీపీ రాంరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్యగౌడ్, ఎస్సీ సంక్షేమశాఖ అధికారి ర వీందర్, టీ ఫైబర్ ఎండీ శివప్రసాద్, వీ హబ్ సీఈ వో సీత, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కాళిందిని, మంథని మున్సిపల్ చైర్మన్ వొడ్నాల శ్రీనివాస్, వైస్ చైర్మన్ ముస్కుల సహేందర్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ కుడుదుల వెంకన్న, ఎస్సీసెల్ డివిజన్ అ ధ్యక్షుడు మంథని సత్యం, మాజీ ఎంపీపీ కొండ శంకర్, నాయకులు తోకల మల్లేశ్, నూకల బానయ్య, కమల్, బూడిద శంకర్, ఎరుకల ప్రవీణ్, శశిభూష ణ్ కాచే, ఎల్లంకీ వంశీ తదితరులు పాల్గొన్నారు. అంబేడ్కర్ విగ్రహాలు విరాళం తన సొంతంగా రాష్ట్రంలో 100 అంబేడ్కర్ విగ్రహా లు దానం చేశానని మంత్రి గడ్డం వివేక్ అన్నారు. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఆయన మాట్లాడుతూ, బడుగు, బలహీనవర్గాల ఆశాజ్యోతి అంబేడ్కర్ అని అన్నారు. అనంతరం మంత్రిని స్థానికులు సన్మానించారు. స్ఫూర్తి ప్రదాత అంబేడ్కర్ ప్రతీవర్గానికి స్ఫూర్తి ప్రదాత అంబేడ్కర్ అని పెద్దప ల్లి ఎంపీ వంశీకృష్ణ అన్నారు. అంబేడ్కర్ విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఆ యన మాట్లాడుతూ, బడుగు, బలహీనవర్గాల ఆ శాజ్యోతి అంబేడ్కర్ అని అన్నారు. డీలిమిటేషన్ ప్ర క్రియతో దక్షిణాది రాష్ట్రాలపై కుట్ర జరుగుతోంద ని, అలాకాకుండా అందరికీ సమాన న్యాయం క ల్పించాలని అన్నారు. బీజేపీ స్వలాభం కోసం డీలిమిటేషన్ను ఉపయోగించుకుంటోందన్నారు. అంబేడ్కర్కు నివాళి గోదావరిఖని: ఆర్జీ–1 జీఎం లలిత్ కుమార్ ఆధ్వర్యంలో అంబేడ్కర్కు నివాళిఅర్పించారు. అంబేడ్కర్ ఆదర్శప్రాయుడు జ్యోతినగర్: అంబేడ్కర్ ఆదర్శప్రాయుడని ఎన్టీపీసీ ఈడీ చందన్ కుమార్ సామంత అన్నారు. అంబేడ్క ర్కు నివాళి అర్పించారు. ప్రధాన దుకాణ సముదాయంలో ప్రభాత్ భేరీ వేడుకలను ప్రారంభించి మాట్లాడారు. కాకతీయ ఫంక్షన్ హాల్లో జరిగిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. నివాళి అర్పిస్తున్న ఎంపీ వంశీకృష్ణ అంబేడ్కర్ విగ్రహం వద్ద నివాళి అర్పిస్తున్న మంత్రి వివేక్పెద్దపల్లిలో జరిగిన వేడుకలకు హాజరైన ప్రజలు, ప్రముఖులు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు ఘనంగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి నివాళి అర్పించిన ప్రముఖులు, ప్రజాప్రతినిధులు -
మందు.. బిర్యానీతో విందు
గోదావరిఖని: నగరంలోని సింగరేణి ఏరియా ఆస్పత్రిని కార్పొరేట్స్థాయిలో అభివృద్ధి చేస్తున్నారు. కానీ, నిర్వహణపై నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. ఆస్పత్రిలోకి ఎవరు వస్తున్నారు, ఎందుకు వస్తున్నారనేదానిపై నిఘా పెట్టడంలేదు. ప్రధానంగా ఇన్పేషెంట్లు ఎలా వ్యవహరిస్తున్నారు, వారి తాలూకు అటెండెంట్లు ఏం చేస్తున్నారనే దానిపైనా నిఘా కరువైంది. సింగరేణి సంస్థకే గుండెకాయగా ఉన్న గోదావరిఖని సింగరేణి ఏరియా ఆస్పత్రిలో రామగుండం రీజియన్తోపాటు, బెల్లంపల్లి రీజియన్లోని కార్మిక కుటుంబాలకు వైద్యం అందిస్తోంది. ఈక్రమంలో ఈ ఆస్పత్రి నిత్యం బిజీగా మారింది. కార్డియాలజీ సెంటర్ ఏర్పాటుకు చర్యలు వేగవంతం చేస్తున్నారు. దీంతో సందర్శకుల రాకపోకలను నియంత్రించాల్సి అవసరం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. నియంత్రణపై నిఘా ఏది..? ఇన్ పెషేంట్, అవుట్ పేషెంట్, సందర్శకుల రాకపోకలతో సింగరేణి ఏరియా ఆస్పత్రి నిత్యం బిజీగా ఉంటోంది. అయితే చెక్పోస్టుల ఏర్పాటు, వచ్చే, వెళ్లేమార్గం, ఎంతమంది వస్తున్నారనే అంశాలపై నియంత్రణ లేకుండాపోతోంది. సెక్యూరిటీ గార్డులపై దాడితో.. సింగరేణి ఏరియా ఆస్పత్రి వద్ద విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ గార్డులపై దాడికి పాల్పడిన సంఘటతో పేషెంట్ల భద్రత తీరు ప్రశ్నార్థకంగామారింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఇన్పె షేంట్లకు మద్యం తీసుకురావడం, బిర్యానీలతో విందు చేసుకోవడం కూడా చర్చనీయాంశంగా మారింది. సింగరేణి సెక్యూరిటీ సిబ్బందితోపాటు వైద్యసిబ్బందితో కూడా దురుసుగా ప్రవర్తించిన తీరు ఆందోళనకు గురిచేస్తోంది. మార్గదర్శకాలు రూపొందించాలి సింగరేణి ఏరియా ఆస్పత్రి కార్పొరేట్స్థాయి వైద్యం అందించేందుకు సిద్ధమవుతోంది. త్వరలోనే కార్డియాలజీ సెంటర్ను ప్రారంభించనున్నారు. డయాలసిస్ యూనిట్తోపాటు ఎక్విప్మెంట్ను యాజమాన్యం కొనుగోలు చేసింది. కానీ, పరిశుభ్రత నిర్వహణ, షేపెంట్ల అటెండెంట్ల రాకలో నియంత్రణ కోల్పోతోంది. ఇన్పేషెంట్లకు మార్గదర్శకాలు తదితర అంశాలపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి నిబంధనలు రూపొందించాలని కోరుతున్నారు. సింగరేణి ఏరియా ఆస్పత్రిలో ఇష్టారాజ్యం సందర్శకులు, పేషెంట్ల వ్యవహారంపై పర్యవేక్షణ లోపం సెక్యూరిటీ గార్డులు, వైద్య సిబ్బందిపై దుండగుల దాడులు ఆందోళన కలిగిస్తున్న వరుస సంఘటనలుసింగరేణి ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ పేషెంట్ను పరామర్శించేందుకు బంధువులు వెళ్లారు. అంతటితో ఆగకుండా మందు, బిర్యానీతో విందు చేసుకున్నారు. ఇదేమని ప్రశ్నించిన సెక్యూరిటీ గార్డులపై దాడి చేశారు. గొడవను ఆపేందుకు వెళ్లిన పోలీసులతోనూ దురుసుగా ప్రవర్తించారు. గోదావరిఖని సింగరేణి ఏరియా ఆస్పత్రిలో రెండ్రోరోజుల క్రితం ఈఘటన చోటు చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేశారు. -
‘మత్తు’కు చికిత్స
కోల్సిటీ(రామగుండం): మద్యపానం, ధూమపా నం, డ్రగ్స్, గంజాయి తదితర మత్తు పదార్థాలు బ లమైనవి. మనిషిని బలహీనుడిని చేసేవి. ఒకసారి అలవాటుపడితే మానుకోవవడం అతికష్టం. ‘మ త్తు’ జీవితాలను చిత్తు చేస్తున్నది. ఆ మైకంలోపడి యువత బంగారు భవిష్యత్ను నాశనం చేసుకుంటోంది. అంతేకాదు.. వారి కుటుంబాలు ఛిద్రమవుతున్నాయి. మత్తుకు బానిసలుగా మారిన వారిని వ్యసనం మాన్పించేందుకు ప్రభుత్వం జిల్లాకో అ డిక్షన్ ట్రీట్మెంట్ ఫెసిలిటీ(ఏటీఎఫ్) కేంద్రాన్ని ఏ ర్పాటు చేస్తోంది. గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి(జీజీహెచ్)లో ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్ ఏటీఎఫ్ కేంద్రాన్ని ప్రారంభించారు. చికిత్స రెండు విధాలుగా.. మత్తుకు బానిసలైన వారిని మాన్పించేందుకు జీజీహెచ్లో ఏర్పాటు చేసిన అడిక్షన్ ట్రీట్మెంట్ ఫెసిలిటీ కేంద్రంలో అక్యూట్, క్రానిక్ అనే రెండు పద్ధతుల్లో చికిత్స అందిస్తున్నా రు. అక్యూట్ పద్ధతిలో సబ్స్టెన్స్ ఇన్టాక్సికేషన్ కేర్ యూనిట్(ఎస్ఐసీయూ)ద్వారా ఇన్పేషెంట్లకు చికి త్స అందిస్తుండగా, క్రానిక్ విధానంలో డ్రగ్ అడిక్షన్ కౌన్సెలింగ్ సెంటర్(డీఏసీసీ) ద్వారా ఔట్ పేషెంట్లకు చికిత్స అందిస్తున్నారు. డీ అడిక్షన్ కేంద్రాన్ని ఏడాది క్రితమే జీజీహెచ్లో ఏర్పాటు చేయగా, ప్రస్తుతం సేవలు విస్తృతమయ్యాయి. 10 పడకలతో ఏటీఎఫ్ వార్డు జీజీహెచ్లో ఏటీఎఫ్ కేంద్రం కోసం 10 పడకలతో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశారు. మానసిక సమస్యలతో బాధపడుతున్న వారికి రూమ్ నంబర్ –6లో ప్రత్యేక ఓపీ కేంద్రం నిర్వహిస్తున్నారు. ఇన్పేషెంట్లుగా చేర్చుకుని చికిత్స అందిస్తున్నారు. ఇందుకోసం సిబ్బందిని నియమించారు. ప్రతీనెల బాధి తుల సంఖ్య పెరుగుతోంది. కొందరు వ్యసనపరు లు చికిత్సతో సాధారణ జీవితం గడుపుతుండగా, మరికొందరు నెల, రెండు, మూడు నెలల తర్వాత మళ్లీ వ్యసనాలకు బానిసవుతున్నారు. మానసిక చికిత్స విభాగం ఓపీకి ప్రతీ నెల 300 నుంచి 250 మంది వరకు ఇన్పేషెంట్లు వస్తుండగా, ఇందులో 50 నుంచి 70 మంది వరకు మత్తుబానిసలు ఇన్పేషెంట్లుగా చేరి ట్రీట్మెంట్ పొందుతున్నారు. చికిత్స పొందిన ఇన్పేషెంట్లు మార్చి 45 ఏప్రిల్ (ఇప్పటివరకు) 05 జనవరి 55 ఫిబ్రవరి 69 జీజీహెచ్లో ఏటీఎఫ్ కేంద్రం 10 పడకలతో మానసిక చికిత్సవార్డు వ్యసనపరులకు ఉచిత వైద్యసేవలు తల్లిదండ్రుల పర్యవేక్షణ ముఖ్యం పుట్టుకతోనే ఎవరూ మత్తుకు బానిసలుకారు. చుట్టూ ఉన్న వాతావరణం, చెడు స్నేహాలు, మానసికస్థితి, కుటుంబ చరిత్ర.. ఇలా అన్నీ కలిసి ఆ ఊబిలోకి నెట్టేస్తాయి. చిన్నారులు కూడా మత్తుకు బానిసలవుతున్నారు. దీనికి తల్లిదండ్రుల పర్యవేక్షణ లోపమే ప్రధాన కారణం. చిన్న అనుమానం వచ్చినా ప్రాథమిక స్థాయిలోనే అడ్డుకట్ట వేయాలి. కౌమారంలో పిల్లలకు వ్యక్తిత్వం, ఆరోగ్యకరమైన జీవన శైలిని ఇవ్వాలి. మత్తుకు బానిసలైన వారికి జీజీహెచ్లో ఉచితంగా చికిత్స, కౌన్సెలింగ్ ఇచ్చి పునర్జన్మ కల్పిస్తున్నాం. ఏటీఎఫ్ కేంద్రాలు మత్తు వ్యసనపరులకు ఒక వరం. – సైకియాట్రిస్ట్ రవివర్మ, జీజీహెచ్ -
‘అరైవ్ – అలైవ్’ ప్రతిజ్ఞ చేసిన మంత్రి
గోదావరిఖని: అంబేడ్కర్ జయంతి సందర్భంగా మంగళవారం నగరంలో నిర్వహించిన అరై వ్–అలైవ్ కార్యక్రమంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు, ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్, పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా, రామగుండం మేయర్ మహంకాళి స్వామి, ఏసీపీ రమేశ్ రక్షణ ప్రతిజ్ఞ చేశారు. ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్, వన్ టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి, ఎస్సైలు రమేశ్, అనూష తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ ధర్మారం: స్థానిక మోడల్ స్కూల్లో ఇంటర్ విద్యార్థి సంపతి రక్షిత రాష్ట్రస్థాయి సీనియర్ ఫెడరేషన్ కప్ అథ్లెటిక్స్ హైమార్త్రో పోటీల్లో మూడోస్థానంలో నిలిచి కాంస్య పతకం సాధించినట్లు పీఈటీ కొమురయ్య తెలిపారు. ఈనెల 11, 12వ తేదీల్లో హన్మకొండలో జరిగిన రాష్ట్ర స్థాయి అండర్ –20లో ప్రతిభ చూపినట్లు వివరించారు. రక్షితను ప్రిన్సిపాల్ ఈరవేని రాజ్కుమార్ అభినందించారు. వ్యాయామ ఉపాధ్యాయులు బైకని కొమురయ్య, మేకల సంజీవరావు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ప్రభుత్వ కాలేజీకి ప్రశంసలు రామగుండం: ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల్లో అత్యధిక ఫలితాలు సాధించిన స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలను రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి యోగితారాణా ప్రశంసించారు. మంగళవారం జరిగిన జూమ్ మీటింగ్ ద్వారా ప్రిన్సిపాల్ చింతల మోహన్తోపాటు అధ్యాపకులను అభినందించారు. ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో 98.3శాతం ఉత్తీర్ణత సాధించగా.. రాష్ట్రస్థాయిలో మూడోస్థానం దక్కించుకుంది. కంప్యూటర్ సైన్స్లో రఘుమున్ను స్వామి 992/1000, ఫస్టియర్లో రామ్ దివ్యశ్రీ 491/500, ఎంపీసీలో బుష్రా తహరీమ్ 974/1000, హెచ్ఈసీలో పల్లె జశ్వంత్ 910/1000 మార్కులు సాధించడంపై యోగితారాణా సంతృప్తి వ్యక్తం చేశారు. శభాష్ సతీశ్ మంథనిరూరల్: సాధార ణంగా మహనీయుల వ ర్ధంతి, జ యంతి సందర్భంగా వారి చిత్రపటాలు, విగ్రహాలకు పూలదండలు వేసి నివాళి అ ర్పించడం ఆ నవాయితీ. అందుకు భిన్నంగా ఉప్పట్ల గ్రామానికి చెందిన యువకుడు బడికెల సతీశ్.. అంబేడ్కర్ జయంతి సందర్భంగా మంగళవారం తన స్కూటీపై అంబేడ్కర్ ఫొటో పెట్టి, పూలదండ వేసి నివాళి అర్పించాడు. వాహనంపై తిరుగుతూ విస్తృత ప్రచారం చేశాడు. ‘పాకెట్మనీ’ నొక్కితే ఖాతా ఖాళీ పెద్దపల్లిరూరల్: సైబర్ నేరగాళ్లు సరికొత్త ఎత్తులు వేస్తూ అమాయకుల బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. నిత్యజీవితంలో డిజిటల్ చెల్లింపులు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో గూగుల్ పే ద్వారా చెల్లింపులు చేసేందుకు యాప్ ఓపెన్ చేయగానే తొలుత ‘పాకెట్మనీ’ అనే సింబల్ కనిపిస్తోంది. దానిని నొక్కితే బ్యాంకు ఖాతాలోని డబ్బులు ఖాళీ అవుతున్నాయట. డిజిటల్ పేమేంట్ చేసే వారంతా తమకు అవసరం లేనియాప్, లింకుల జోలికి వెళ్లక పోవడమే మంచిదని పోలీసు అధికారులు పల్లెలు, పట్టణాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. -
సత్వరమే అర్జీల పరిష్కారం
పెద్దపల్లి: ప్రజావాణి ద్వారా అందిన దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చి సత్వరమే పరిష్కరించా లని అదనపు కలెక్టర్ వేణు ఆదేశించారు. కలెక్టరేట్ లో సోమవారం జరిగిన ప్రజావాణి ద్వారా ఆయన దరఖాస్తులు స్వీకరించారు. ధర్మారం మండలం కటికనపల్లికి చెందిన ఎండీ ఖాసిం.. సర్వే నంబర్ 1211/2లోని 14 గుంటలు ఆన్లైన్లో వేరే వ్యక్తి పేరిట ఉందని, తన పేరిట రిజిస్ట్రేషన్ చేయాలని, పెద్దపల్లి మండలం రంగాపూర్ గ్రామానికి చెందిన గండు రాజయ్య.. వీఎస్బీ బ్రిక్స్ నుంచి దుమ్ము, ధూళి, బూడిద తమ వ్యవసాయ భూమిలోకి రా కుండా చూడాలని, జూలపల్లి మండలం కుమ్మంకుంటకు చెందిన తమ్మననేని మధుకర్ యాదవ్.. తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరైందని, రేకులషె డ్డు నిర్మాణానికి అనుమతించాలని కోరారు. కాల్వశ్రీరాంపూర్ మండలం వెన్నంపల్లిలో పాతపట్టాదార్ పాస్ పుస్తకం ఉన్నా ధరణి పట్టాదార్ పాస్పుస్తకం రాక ఇబ్బందులు ఎదురవుతున్నాయని స ర్పంచ్, పాలకవర్గం వినతిపత్రం అందజేసింది. జిల్లాలోని సహజ వనరులను కాపాడాలని జాతీయ బీసీ సంఘం నేషనల్ కో ఆర్డినేటర్ ఆకుల స్వామి వినతిపత్రం అందజేశారు. ఆయా అర్జీలపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులను వేణు ఆదేశించారు. -
బడికి బైబై
పరీక్షలు ముగియడంతో విజయకేతనం ఎగురవేస్తున్న విద్యార్థినులుసామగ్రి పట్టుకుని ఇంటిదారి పట్టిన విద్యార్థులునెలరోజుల పాటు పదో తరగతి పరీక్షలు జరిగిన దాఖలాలు ఇప్పటివరకు లేవు. ఈసారి పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ముగియడంతో హమ్మయ్య.. పరీక్షలు ముగిశాయంటూ విద్యార్థులు, తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. ఇంతకాలం పుస్తకాలతో కుస్తీ పట్టిన విద్యార్థులు.. ఇప్పుడు ఎగిరి గంతులేశారు. ఒకరికొకరు బైబై చెప్పుకుంటూ ఇంటిదారి పట్టారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కనిపించిన దృశ్యాలు ఇవి. – సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి -
శ్రీపాదరావు ఆశయ సాధనకు కృషి
మంథని: అసెంబ్లీ మాజీ స్పీకర్, దివంగత దుద్దిళ్ల శ్రీపాదరావు నిత్యం ప్రజల శ్రేయస్సు కోసం పాటుపడిన మహనీయుడని, అభివృద్ధి, సంక్షేమంతో ముందుకు సాగారని, ఆయన మార్గంలో నడుద్దా మని సాంఘిక సంక్షేమ, గిరిజన, దివ్యాంగుల శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. సోమవా రం శ్రీపాదరావు 27వ వర్ధంతి సందర్భంగా శ్రీపాదకాలనీలో గోవిందుల రమేశ్తోపాటు కాలనీవా సులు ఏర్పాటు చేసిన శ్రీపాదరావు విగ్రహాన్ని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు, ప్రభు త్వ విప్ విజయరమణారావు, రామగుండం ఎమ్మె ల్యే, డీసీసీ అధ్యక్షుడు రాజ్ఠాకూర్ మక్కాన్సింగ్ ప లువురు ప్రముఖులతో కలిసి ఆయన ఆవిష్కరించా రు. లక్ష్మణ్కుమార్ మాట్లాడుతూ, పేద, బడుగు, బ లహీన వర్గాల అభ్యున్నతికి నిరంతరం కృషి చేసిన నేత శ్రీపాదరావు అని అన్నారు. అనేకమందికి మా ర్గనిర్దేశకులన్నారు. మంత్రి శ్రీధర్బాబు నాయకత్వంతో పెద్దపల్లి జిల్లా అన్నిరంగాల్లో అభివృద్ధి సా ధిస్తోందని తెలిపారు. గోదావరి పుష్కరాల సంద ర్భంగా ధర్మపురితోపాటు గోదావరి పరీవాహక ప్రాంతాల్లో అభివృద్ధికి అత్యధిక నిధులు కేటాయించేలా సీఎం రేవంత్రెడ్డికి విజ్ఞప్తి చేస్తామని, ఇందుకు సహకరించాలని మంత్రి శ్రీధర్బాబును కోరారు. అభివృద్ధికి నిర్వచనం మంథని పదేళ్లు ప్రభుత్వాన్ని నడిపిన బీఆర్ఎస్ ప్రజల్ని ప ట్టించుకోలేదని, తాము అధికారంలోకి వచ్చి రెండే ళ్లలో ఏంచేశారని ప్రశ్నిస్తున్నారని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. వచ్చేమూడేళ్లలో సంక్షేమ కార్యక్రమాలు ఒక్కొక్కటిగా పూర్తిచేస్తామన్నారు. అభివృద్ధికి నిర్వచనం ఇవ్వాల నే కాంక్షతో ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. పే దవారికి గూడు కల్పించాలని దివంగత మాజీ స్పీ కర్ శ్రీపాదరావు 25 ఎకరాలు కేటాయించారని అ న్నారు. పేదలు ఆయన పేరిట ఏర్పాటు చేసుకున్న కాలనీ పేరును మార్చాలని కొందరు యత్నించారని, కానీ, స్థానికులు స్వచ్ఛందంగా శ్రీపాదరావు విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నారని తెలిపారు. పార్టీ.. ప్రభుత్వానికి ప్రజల అండ శ్రీపాదరావు ఆశయాలను ఆయన తనయుడు శ్రీధ ర్బాబు ముందుకు తీసుకెళ్తున్నారని, ఆయన నా యకత్వంలో జిల్లాలో పార్టీ, ప్రభుత్వం ప్రజల అండతో మోడల్ జిల్లాగా రూపురేఖలు మారుతాయని ఎమ్మెల్యే రాజ్ఠాకూర్ మక్కాన్సింగ్ అన్నారు. అభి వృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయని చెప్పారు. జిల్లాలో బలమైన నాయకత్వం తెలంగాణలోనే బలమైన నాయకత్వం జిల్లాలో పనిచేస్తోందని, శ్రీపాదరావు లాంటి మహనీయుల స్ఫూర్తి ఇందుకు నిదర్శమని ప్రభుత్వ విప్ విజయరమణారావు అన్నారు. పేదలబాగు కోసం నిరంత రం తపించిన నేత శ్రీపాదరావు అన్నారు. మంథని నియోజకవర్గంలో చేపడుతున్న నాలుగు లేన్ల రహదారి, సెంట్రల్ లైటింగ్ పనులు పెద్దపల్లి నియోజక వర్గం వరకు కూడా కొనసాగించాలని మంత్రి శ్రీధ ర్బాబును కోరారు. రామగుండం మేయర్ మహంకాళి స్వామి, పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల గ్రంథా లయ సంస్థ చైర్మన్లు అన్నయ్యగౌడ్, కోట రాజబా పు, ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాశ్రెడ్డి, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి, విద్యుత్ నియంత్రణ మండలి సభ్యుడు శశిభూషణ్ కాచే, మంథని మున్సిపల్ చైర్మన్ వొడ్నాల శ్రీనివా స్, వైస్ చైర్మన్ సహేందర్రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తొట్ల తిరుపతి యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ కుడుదుల వెంకన్న, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఐలి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
అడుగంటుతున్న నీటినిల్వలు
రామగుండం: ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తిస్థాయి నీ టినిల్వ సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా సోమ వారం 9.53 టీఎంసీలకు పడిపోయాయని అధికా రులు తెలిపారు. గతేడాది ఇదేరోజు 8.99 టీఎంసీ ల నిల్వలు ఉన్నాయన్నారు. ప్రాజెక్టులోకి 114 క్యూ సెక్కుల ఇన్ఫ్లో ఉండగా, హైదరాబాద్కు 316 క్యూ సెక్కులు, నంది పంపుహౌస్కు 2,100 క్యూసెక్కు లు, గూడెం పంపుహౌస్కు 290 క్యూసెక్కులు, వేంనూర్ పంపుహౌస్కు 247 క్యూసెక్కులు, రామగుండం ఎత్తిపోతలకు 90 క్యూసెక్కులు, మిషన్ భగీరథకు 58 క్యూసెక్కులు సరఫరా చేస్తున్నామని అధికారులు వివరించారు. క్వింటాల్ పత్తి రూ.7,979 పెద్దపల్లిరూరల్: స్థానిక వ్యవసాయ మార్కెట్యా ర్డు ఆవరణలో సోమవారం క్వింటాల్ పత్తి గరిష్టంగా రూ.7,979 ధర నమోదైందని చైర్మన్ కూరమల్లారెడ్డి, కార్యదర్శి ప్రవీణ్రెడ్డి తెలిపారు. కనిష్టంగా రూ.6,016గా, సగటు రూ.7,679గా ధర ఉందని వారు పేర్కొన్నారు. -
భద్రత నియమాలు పాటించాలి
గోదావరిఖని/యైటింక్లయిన్కాలనీ: త్రీఒక్కరు బాధ్యతతో డ్రైవింగ్ చేస్తే రోడ్డు ప్రమాదాల ని యంత్రణ సాధ్యమని పెద్దపలి డీసీపీ రాంరెడ్డి అన్నారు. గోదావరిఖని, రామగిరి మండలం జల్లారం – సింగిరెడ్డిపల్లిలో సోమవారం నిర్వహించిన అరైవ్–అలైవ్ కార్యక్రమంలో గోదావ రిఖని ఏసీపీ రమేశ్తో కలిసి డీసీపీ మాట్లాడా రు. రాంగ్రూట్, మద్యం తాగి వాహనాలు న డపడం, సెల్ఫోన్ ఉపయోగించడం వంటి చ ర్యలను నివారించాలన్నారు. సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రామగుండం మేయర్ మహంకాళి స్వామి మాట్లాడా రు. గోదావరిఖని వన్టౌన్ సీఐ ఇంద్రసేనారె డ్డి, సీఐ ప్రసాద్రావు, సర్పంచ్ యమున–శ్రీనివాస్, ఉప సర్పంచ్ రమేశ్ పాల్గొన్నారు. ప్రశాంతంగా టెన్త్ పరీక్షలు పెద్దపల్లి: జిల్లాలో పదోతరగతి పరీక్షలు ప్ర శాంతంగా జరిగాయని జిల్లా విద్యాశాఖ అధి కారి శారద తెలిపారు. సోమవారం చివరిరోజు సాంఘికశాస్త్రం పరీక్ష నిర్వహించామన్నారు. 7,495 మంది విద్యార్థులకు 7485 మంది హాజరయ్యారని ఆమె వివరించారు. డిగ్రీ కాలేజీలో ప్రేరణ సదస్సు పెద్దపల్లిరూరల్: పల్లె ప్రాంత విద్యార్థులు జా తీయస్థాయి రక్షణదళాల్లో రాణించడం గర్వకారణమని ప్రభుత్వ డిగ్రీకాలేజీ ప్రిన్సిపాల్ లక్ష్మీనర్సయ్య అన్నారు. కాలేజీలో సోమవారం ఎన్సీసీ కెరీర్ గైడెన్స్ విభాగాల ఆధ్వర్యంలో ప్రేర ణ సదస్సు నిర్వహించారు. పూర్వవిద్యార్థిని, ప్రస్తుత ఇండోటిబెటిన్ బోర్డర్ పోలీస్ కానిస్టేబుల్ మీనాక్షికుమారి తన అనుభవాలను పంచుకున్నారు. జాతీయస్థాయిలో జరిగిన కఠిన శి క్షణ కాలంలో దాదాపు 700మంది శిక్షణార్థుల కు పరేడ్కమాండర్గా వ్యవహరించానని గుర్తుచేసుకున్నారు. క్రమశిక్షణ, పట్టుదల ఉంటే ల క్ష్యసాధన పెద్ద కష్టమేమీ కాదన్నారు. ఎన్సీసీ అధికారి లెఫ్టినెంట్ కంజర్ల శ్రీలత, కెరీర్గైడెన్స్ కన్వీనర్ షుకూర్, వైస్ప్రిన్సిపాల్ సతీశ్కుమార్ తదితరులు మీనాక్షికుమారిని సత్కరించారు. గురుకులం.. ప్రభంజనం సుల్తానాబాద్రూరల్: దుబ్బపల్లి మైనార్టీ గురు కుల కళాశాల(కరీంనగర్ బాలురు– 3) ఇంట ర్ ఫస్టియర్లో 95శాతం, సెకండియర్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించి ప్రభంజనం సృష్టించారు. ఫస్టియర్ ఎంఎల్టీలో ఎండీ షాదబుద్దీన్487, ఈటీలో షేక్ ఇర్ఫాన్ పాషా 493, సెకండియర్ ఎంఎల్టీలో ఎండీ రహేమాన్ 987, ఈటీలో అక్షిత్రెడ్డి 986 మార్కులు సాధించార ని ప్రిన్సిపాల్ చంద్రమోహన్ తెలిపారు. నాలుగేళ్లుగా ఇంటర్లో వందశాతం ఫలితాలను సా ధిస్తున్నట్లు ప్రిన్సిపాల్ పేర్కొన్నారు. విద్యార్థులను పలువురు అభినంధించారు. జాగ్రత్తలు తీసుకోవాలి పెద్దపల్లి: జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు ఎండదెబ్బ తగల కుండా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా వైద్యాధికారి ప్రవీణ్ కుమార్ కోరారు. మధ్యాహ్నం 12 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అత్యవసరమైతే తప్ప ఇళ్లనుంచి బయటకు వెళ్లొద్దన్నారు. అత్యవసరమైతే తలపై టోపీ ధరించాలని, గొడుగు వాడాలని, తరచూ నీరు, ఓఆర్ఎస్, మజ్జిగ, కొబ్బరినీరు వంటి ద్రవాలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఎన్టీపీసీకి ఫైర్ సర్వీస్ జ్యోతినగర్: రామగుండంలోని ఎన్టీపీసీ భద్ర త, అత్యవసర సామర్థ్యాలను పెంపు కోసం మ రో ఫైర్ సర్వీస్ను ప్రారంభించామని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చందన్ కుమార్ సామంత అన్నా రు. సీఐఎస్ఎఫ్ అగ్నిమాపక విభాగానికి కొత్త ఫైర్ సర్వీస్ను కేటాయించగా సోమవారం ఆ యన ప్రారంభించి మాట్లాడారు. ప్లాంట్ ప్రాంగణంలో భద్రత, మౌలిక సదుపాయాలను మె రుగుపరచడానికి, అగ్నిప్రమాదాలను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ఇది ముఖ్యమైన ముందడుగు అని అన్నారు. కమాండెంట్ నవనీత్కౌర్తో పాటు అధికారులు పాల్గొన్నారు. -
ఆస్పత్రికి తరలిస్తే రూ.25వేలు
సుల్తానాబాద్రూరల్: రోడ్డు ప్రమాదాల సమయంలో గోల్డెన్ అవర్ను సద్వినియోగం చేసుకుంటే బాధితుల ప్రాణాలను కాపాడవచ్చని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. పోలీసులు, సర్పంచ్ వీరగోని ర మేశ్గౌడ్ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై గర్రెపల్లిలో సోమవారం అవగాహన కల్పించారు. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝాతో కలిసి కలెక్టర్ కలెక్టర్ మాట్లాడారు. హిట్ అండ్ రన్ కేసులు, రోడ్డు ప్రమాదాల్లో బాధితులకు ప్రభుత్వం రూ.2 లక్షల సాయం అందిస్తోందన్నారు. గతేడాది జిల్లా లో దాదాపు 30మందికి సాయం అందించినట్లు కలెక్టర్ తెలిపారు. రోడ్డు ప్రమాద బాధితులను ఆస్పత్రులకు తరలించేవారికి రూ.25వేల ప్రోత్సాహకం అందించనున్నట్లు ఆయన వివరించారు. చిన్ననిర్లక్ష్యంతో రోడ్డు ప్రమాదాల బారినపడుతున్న కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని రామగుండం సీపీ అంబర్ కిశోర్ ఝా అన్నారు. ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తే రోడ్డు ప్రమాదాలు నియంత్రణలో ఉంటాయని అన్నారు. అనంతరం రోడ్డు భద్రత పోస్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్, తహసీల్దార్ బషీరొద్దీన్, సీఐ సుబ్బారెడ్డి, అనిల్కుమార్, ఎస్సై చంద్రకుమా ర్, ఎంవీఐ మధు తదితరులు పాల్గొన్నారు. -
తహసీల్దార్ను నియమించాలి
జ్యోతినగర్: రామగుండం తహసీల్దార్ కుర్చీ 20 రోజులుగా ఖాళీగా ఉండడంతో ప్రజలు.. ముఖ్యంగా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ రామగుండం నియోజకవర్గ ఇన్చార్జి కందు ల సంధ్యారాణి అన్నారు. రామగుండం తహసీల్దార్ కార్యాలయం ఎదుట సోమవారం నిరసన తెలిపా రు. ఖాళీ కుర్చీకి వినతిపత్రం అంటించారు. అనంతరం కలెక్టర్ కోయ శ్రీహర్షని కలిసి విన్నవించారు. నియోజకవర్గంలో పాలన గాడి తప్పిందన్నారు. సా మాన్యుడి గోడు వినే నాథుడే కరువయ్యారని ఆరోపించారు. ప్రజాసమస్యలను పరిష్కరించాల్సిన త హసీల్దార్ కార్యాలయం తహసీల్దార్ లేక వెలవెలబోతోందన్నారు. అంతర్గాం తహసీల్దార్ కార్యాల యం అవినీతి, అక్రమాలకు కేరాఫ్గా మారిందని ధ్వజమెత్తారు. ఈ దారుణ పరిస్థితులను తొలగించేందుకు ఎమ్మెల్యే జోక్యం చేసుకుని తహసీల్దార్ను నియమించాలని డిమాండ్ చేశారు. నాయకులు సు ల్వ లక్ష్మీనరసయ్య, పద్మ, నరసయ్య, బోడకుంటి సుభాష్, ఊరకొండ అపర్ణ పాల్గొన్నారు. -
యూనిక్ టోకరా!
సాక్షిప్రతినిధి,కరీంనగర్ ●: మొన్న సహారా, నిన్న మెటా ఫండ్, నేడు యూనిక్.. సంస్థల పేరు ఏదైనా అందరి లక్ష్యం ఒకటే.. ఏదో ఒకరకంగా ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించడం ఆపై మొహం చాటేయడం. తాజాగా యూనిక్ అనే ఉత్తారాదికి చెందిన సంస్థ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భారీ స్కాంకు పాల్పడిందని ఖాతాదారులు, ఏజెంట్లు నెత్తీనోరు బాదుకుంటున్నారు. ఒకటి కాదు రెండు కాదు ఒక్క ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే ఏకంగా రూ.500 కోట్ల వరకు ఖాతాదారుల నుంచి డబ్బులు సేకరించి ఇప్పుడు వారిని రేపు..మాపు.. అంటూ తిప్పుకుంటుందని బాధితులు వాపోతున్నారు. ఆరేళ్లలో డబ్బులు రెట్టింపు చేస్తామంటూ తీయని మాటలు చెప్పిన సంస్థ తీరా గడువు ముగిసి నాలుగేళ్లు గడుస్తున్నా ఎలాంటి డబ్బు చెల్లించకపోవడంతో బాధితులంతా ఏజెంట్ల ఇళ్ల మీదకు వస్తున్నారు. దీంతో ఏజెంట్లంతా కంగారుపడి యూనిక్ సంస్థపై న్యాయపోరాటం చేయాలని తీర్మానించుకున్నారు. వీరంతా కలిసి ఇటీవల కరీంనగర్లో సమావేశం పెట్టుకుని డిపాజిటర్ల డబ్బులు వెనక్కి తీసుకురావాలని నిర్ణయించారు. అసలేం జరిగింది? వాస్తవానికి ఇది ఫైనాన్స్ సంస్థ కాదు. దీని వ్యవహారం చూస్తుంటే మల్టీలెవల్ మార్కెటింగ్ను తలపిస్తోంది. పదకొండేళ్ల క్రితం అంటే 2015 నుంచి ఇది తెలుగు రాష్ట్రాల్లో కార్యకలాపాలు ప్రారంభించింది. కేవలం ఆరేళ్లలో మీ డబ్బులు రెట్టింపు చేస్తామంటూ కస్టమర్లకు ఎరవేసింది. తెలంగాణలో ఉమ్మడి వరంగల్, కరీంనగర్తోపాటు, నల్లగొండ జిల్లాలో భారీగా డిపాజిట్లు సేకరించింది. సంస్థ కార్యకలాపాలు, హామీలకు ఆకర్షితులైన పలువురు ఈ సంస్థలో ఏజెంట్లుగా చేరారు. సంస్థ లక్ష్యాలు సామాన్యులకు వివరించి.. కేవలం ఆరేళ్లలో డబ్బులు రెట్టింపు అవుతాయని నమ్మించారు. 24 గంటలు అదే పనిలో ఉండి డిపాజిటర్ల నుంచి భారీగా డబ్బులు కట్టించారు. దీంతో ఉమ్మడి జిల్లాలో రూ.500 కోట్ల వరకు సేకరించినట్లు సమాచారం. కరోనా నాటికి డిపాజిటర్ల మెచ్యూరిటీ గడువు పూర్తయింది. అయినా యూనిక్ సంస్థ డబ్బులు చెల్లించకుండా రేపు మాపు అంటూ కాలయాపన చేస్తోంది. దీంతో బాధితులు, ఏజెంట్లు అంతా కలిసి పోరాటానికి సిద్ధమవుతున్నారు. మెటాను మించిన యూనిక్.. ఇంత భారీ మొత్తంలో డిపాజిట్లు సేకరించిన సంస్థ ఇటీవలి కాలంలో మరోటి లేదంటే అతిశయోక్తి కాదు.. గతంలో కరీంనగర్ కేంద్రంగా వెలుగుచూసిన జీబీఆర్ క్రిప్టో కరెన్సీ రూ.100 కోట్ల వరకు కరీంనగర్ నుంచి వసూలు చేసింది. అనంతరం ఇదే కరీంనగర్ కేంద్రంగా ఓ మాజీ కార్పొరేటర్ ఏకంగా మెటాఫండ్ పేరుతో రూ.300 కోట్ల వరకు ప్రజల నుంచి సేకరించారు. ఈ డబ్బులు ఏకంగా దేశం దాటి పోయాయి. ఈ కేసులో సూత్రధారులు, పాత్రధారులు అందరినీ పోలీసులు అరెస్టు చేసినా.. డబ్బుల రికవరీలో మాత్రం ఎలాంటి పురోగతి లేదు. తాజాగా ‘యూనిక్’ కేసులో రూ.500 కోట్ల వరకు డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తుతుండటం ఆసక్తి రేపుతోంది. ఈ విషయమై జిల్లాలో పలు స్టేషన్లలో ఇప్పటికే కేసులు నమోదయ్యాయి. కేసులు పెడితే.. డబ్బులు వెనక్కి రావంటూ నేటికీ యూనిక్ సంస్థ ప్రతినిధులు డిపాజిటర్లను మభ్యపెడుతున్నారు. -
మల్లన్న సన్నిధిలో భక్తుల రద్దీ
ఓదెల: ఓదెల మల్లికార్జున స్వామి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి దర్శనం చేసుకున్నారు. కోనేరులో స్నానాలు ఆచరించి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి మల్లికార్జున స్వామి, సీతారామచంద్రస్వామి, నందీశ్వరులను దర్శించుకున్నారు. ఒగ్గుపూజాలతో పట్నాలు వేసి బోనాలు చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆలయ జూనియర్ అసిస్టెంట్ ముద్దసాని కుమరస్వామి ఏర్పాట్లు చేశారు. ఏపీఎస్ఈబీ రూల్స్ అమలు చేయాలిరామగుండం: ఆర్టిజన్ కార్మికులకు పూర్వపు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డ్ (ఏపీఎస్ఈబీ) సర్వీస్ రూల్స్ అమలు చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు వాగునాయక్ అన్నారు. మల్యాలపల్లి సబ్స్టేషన్ వద్ద ఐదురోజులుగా ఆర్జిజన్ కార్మికులు చేస్తున్న నిరవధిక దీక్ష శిబిరాన్ని ఆదివారం సందర్శించి సంఘీభా వం తెలిపారు. అత్యవసర విభాగాల్లో విధులు నిర్వహించే ఆర్టిజన్ కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కోరారు. దీక్షలో ఆర్టిజన్ కార్మికులు కొంకటి శ్రీనివాస్, వడ్డెపల్లి సురేష్, లగిశెట్టి మధు, ఆవుల మహేశ్, దుర్గం విశ్వనాథ్, బోరె శ్రీని వాస్, సందీప్, ప్రణయ్, జనార్దన్, రమేశ్, తేజ, కుమార్, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లిలో.. పెద్దపల్లిరూరల్: తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలంటూ విద్యుత్ ఆర్టిజన్లు పెద్దపల్లి మండలం రాఘవాపూర్లోని విద్యుత్ సర్కిల్ ఆఫీసు వద్ద చేపట్టిన నిరసన దీక్ష ఆదివారం ఐదోరోజుకు చేరింది. దీక్షా శిబిరాన్ని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎరవెల్లి ముత్యంరావు, సహాయ కార్యదర్శి సీపెల్లి రవీందర్, ఎండీ ఖాజా, ప్రశాంత్ సందర్శించి సంఘీభావం ప్రకటించారు. జీవో నంబర్ 11 ప్రకారం కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. నేడు మంథనిలో మంత్రి శ్రీధర్బాబు పర్యటనమంథని: మంథని నియోజకవర్గంలో సోమవా రం రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు పర్యటించనున్నారు. మాజీ స్పీకర్ దివంగత దుద్దిళ్ల శ్రీపాదరావు వర్ధంతి సందర్భంగా మంథనిలోని శ్రీపాదరావు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళి అర్పిస్తారు. ప్రతిమ ఆస్పత్రి ఆధ్వర్యంలో నిర్వహించే బ్లడ్ డొనేషన్ క్యాంపును ప్రారంభిస్తారు. శ్రీలక్ష్మీనారాయణ ఆలయం వద్ద 13వ వార్డు కార్యాలయం ప్రారంభోత్సవం, రూ.1.98కోట్ల టూరిజం నిధులతో రావుల చెరువు కట్ట అభివృద్ది పనులకు శంఖుస్థాపన చేయనున్నారు. మార్కెట్యార్డులో పీఏసీఎస్ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తారు. అదే విధంగా ముత్తారం, రామగిరి, కమాన్పూర్ మండలాలతో పాటు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలంలో జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ధ్వజస్తంభ ప్రతిష్ఠాపనజ్యోతినగర్: రామగుండం కార్పొరేషన్ జంగాలపల్లెలోని నృసింహస్వామి ఆలయంలో ఆదివారం సంప్రోక్షణ సహిత ధ్వజస్తంభ, నవగ్రహ, నాగదేవత ప్రతిష్ఠాపన మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. మేయర్ మహంకాళి స్వామి, కార్పొరేటర్ వెంగల బాపు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. కాంట్రాక్టర్ ఏబీసీ రెడ్డి, కార్పొరేటర్ మారెల్లి రాజిరెడ్డి, మాజీ కార్పొరేటర్ వెంగల పద్మలత, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
ప్రజా సంక్షేమమే ధ్యేయం
ఎలిగేడు: ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ప్ర భుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఆదివారం బుర్హాన్మియాపేటలో గుజ్జుల రవళి–విజేందర్రెడ్డి, బొంగోని రమ–సంపత్, గుజ్జుల లావణ్య–ప్రశాంత్రెడ్డిలు నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశంలో పాల్గొని ఇళ్లను ప్రారంభించారు. అనంతరం రూ.10లక్షలతో గ్రామంలోని అంతర్గత సీసీ రోడ్లను ప్రారంభించారు. నర్సాపూర్లో ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశంలో పాల్గొని అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం పేద, మధ్యతరగతి ప్రజలను మభ్యపెట్టి ఇళ్లు ఇవ్వకుండా అన్యాయం చేసిందన్నారు. సర్పంచులు గోపు లక్ష్మారెడ్డి–రజిత, పల్లెర్ల వెంకటేశ్గౌడ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రాజేశ్వర్రెడ్డి, నాయకులు సంతోష్రావు, ఉప సర్పంచులు, వార్డుసభ్యులు, కాంగ్రెస్పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులు పాల్గొన్నారు అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఓదెల: అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరవుతాయని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. ఆదివారం రాత్రి బాయమ్మపల్లెలలో సీసీ రోడ్ల నిర్మాణాలు, కంపౌండ్వాల్, బ స్టాండ్ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయరమణారావు -
‘ఎర్లీబర్డ్’ టార్గెట్ రూ.9 కోట్లు
కోల్సిటీ(రామగుండం): జిల్లాలోని మున్సిపాలిటీలు ఆస్తిపన్ను వసూళ్లే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయి. ఈనెల 30వ తేదీ వరకు 2026–27 ఆర్థిక సంత్సరానికి సంబంధించిన ఆస్తిపన్ను ముందుగా చెల్లించే వారికి ఎర్లీబర్డ్ ఆఫర్ పేరిట ఆస్తిపన్నులో ఐదు శాతం రాయితీ వర్తింపజేస్తున్నాయి. తద్వారా నిర్దేశిత లక్ష్యం కన్నా అధికంగా వసూలు చేయాలని ప్రణాళిక రూపింంచాయి. జిల్లాలోని రామగుండం నగరపాలక సంస్థతోపాటు పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథని మున్సిపాలిటీల్లో ఎర్లీబర్డ్ ఆఫర్ ద్వారా ముందస్తు ఆస్తిపన్ను రికార్డుస్థాయిలో వసూలు చేయాలనే లక్ష్యంతో మున్సిపల్ కమిషనర్లు ప్రత్యేక కార్యక్రమాలను సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ఆయా మున్సిపాలిటీల్లో ఎర్లీబర్డ్ ఆఫర్ స్కీంపై విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. కార్పొరేషన్ కేటగిరీలో అగ్రస్థానం రామగుండం కార్పొరేషన్ రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్ల ఆస్తిపన్ను వసూళ్లలో అత్యధిక శాతం వసూలు సాధిం కార్పొరేషన్ కేటగిరీలో అగ్రస్థానంలో నిలిచింది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో ఆస్తిపన్ను డిమాండ్ రూ.19 కోట్ల 22 లక్షల 97 వేలు ఉండగా, రూ.14కోట్ల 47 లక్షల 67వేలు వసూలయ్యాయి. దీంతో ఆర్థిక సంఘం పెర్ఫార్మెన్స్ గ్రాంట్ పొందడానికి అర్హత సాధించినట్లయింది. ప్రజలకు అవగాహన రామగుండం నగరపాలక సంస్థ అధికారులు ఎర్లీబర్డ్ స్కీం ద్వారా 2026–27 ఆర్థిక సంవత్సరానికి రూ.9కోట్ల వరకు ముందస్తు ఆస్తిపన్ను వసూలు చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. దీనిపై విస్తృతంగా ప్రచారం చేయడానికి కసరత్తు చేస్తున్నారు. బిల్కలెక్టర్లు ఆస్తిపన్ను నమోదు చేయడానికి ఉపయోగించే హ్యాండ్ మిషన్లలో 5 శాతం రాయితీ కలిగిన సాఫ్ట్వేర్ అప్డేట్ చేశారు. పరిశ్రమలకు లేఖలు రామగుండం బల్దియాలో 2026–27 ఆర్థిక సంవత్సరానికి రూ.18.95 కోట్ల వరకు డిమాండ్ ఉంది. ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సీఎల్, సింగరేణి, జెన్కో తదితర ప్రభుత్వరంగ సంస్థల నుంచి ఎర్లీబర్డ్ ఆఫర్ ద్వారా ముందస్తు ఆస్తిపన్ను వసూలు చేయాలని లక్ష్యం పెట్టుకున్నారు. గతేడాది ఎన్టీపీసీ రూ.3.88కోట్లు, ఆర్ఎఫ్సీఎల్ రూ.1.8కోట్లు, సింగరేణిలోని ఆర్జీ–1 ద్వారా రూ.73.76లక్షలు, ఆర్జీ–2 ద్వారా రూ.43.37లక్షలు, జెన్కో ద్వారా రూ.5.99 లక్షల వరకు ఆస్తిపన్ను చెల్లించాయి. ఈఏడాది ఎర్లీబర్డ్ ఆఫర్లో కూడా ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సీఎల్తోపాటు సింగరేణి, జెన్కో నుంచి కూడా ముందుస్తు ఆస్తిపన్ను చెల్లించేలా ఆయా సంస్థలకు లేఖలు పంపించారు. అలాగే రైస్మిల్లులతోపాటు బడా వ్యాపారులకూ అవగాహన కల్పించి ముందస్తు ఆస్తిపన్ను వసూలు చేయాలని లక్ష్యం పెట్టుకున్నారు. రామగుండంలో ఎర్లీబర్డ్ వసూళ్లుఆర్థిక సంవత్సరం వసూలు(రూ.కోట్లలో) 2019–20 0.8292 2020–21 1.13 2021–22 1.14 2022–23 1.55 2023–24 1.54 2024–25 1.60 2025–26 9.7 పురపాలికల్లో ముందస్తు వసూలుకు కార్యాచరణ ముందుగా ఆస్తిపన్ను చెల్లించే వారికి 5శాతం రాయితీ ఈనెల 30లోగా చెల్లిస్తేనే పథకం వర్తింపు ప్రత్యేక దృష్టి సారించిన మున్సిపల్ కమిషనర్లు -
భళా.. బాలిక
పెద్దపల్లి: రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ప్రకటించిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. సెకండియర్లో 68.29, ఫస్టియర్లో 57శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రస్థాయిలో 24వ స్థానంలో నిలిచారు. ఓవరాల్గా బాలికలే పైచేయి సాధించారు. ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో గతేడాది 68శాతం ఉత్తీర్ణత నమోదు చేసుకుని రాష్ట్రంలో పెద్దపల్లి జిల్లా 16వ స్థానంలో నిలిచింది. సెకండియర్లో.. సెకండియర్లో బాలురు 1,536 మంది పరీక్షలకు హాజరు కాగా 845 మంది పాసయ్యారు. 55శాతం ఉత్తీర్ణత నమోదైంది. బాలికలు 2,226 మంది పరీక్షలకు హాజరు కాగా 1,724 మంది పాసై 77.45శాతం సాధించారు. మొత్తంగా జిల్లాలో 3,762 మంది విద్యార్థులు పరీక్ష రాస్తే 2,569 మంది విద్యార్థులు (68.29శాతం) ఉత్తీర్ణత సాధించారు. ఫస్టియర్లో.. ఫస్టియర్లో బాలురు 1,704 హాజరు కాగా 668 మంది పాసై 39శాతం సాధించారు. బాలికలు 2,412కు 1,682 ఉత్తీర్ణత సాధించి 69.73శాతం నమోదైంది. మొత్తంగా బాలికలు 4,116 మంది పరీక్షలకు హాజరు కాగా 2,350 ఉత్తీర్ణత సాధించి 57 ఉత్తీర్ణత శాతం నమోదైంది. ఒకేషనల్ విభాగంలో.. ఒకేషనల్లో జిల్లావ్యాప్తంగా బాలురు 445 పరీక్ష రాస్తే 249 ఉత్తీర్ణులయ్యారు. 55.96శాతం ఫలితాలు నమోదు చేశారు. బాలికలు 518కు 460 మంది పాసై 88.80 శాతం సాధించారు. మొత్తంగా 963 మంది పరీక్షలు రాయగా 709 మంది 73.62శాతం ఉత్తీర్ణులయ్యారు. ఫస్టియర్లో 582 మందికి 445 ఉత్తీర్ణత (76.46శాతం) సాధించారు. మే 13 నుంచి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు ఇంటర్మీడియట్లో తప్పిన విద్యార్థుల కోసం ప్రభుత్వం డిగ్రీ వెళ్లేందుకు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలను మే 13 నుంచి 21వ తేదీ వరకు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేపట్టారు. ఇంటర్ ఫలితాల్లో సత్తాచాటిన అమ్మాయిలు రాష్ట్రస్థాయిలో 24వ స్థానంలో పెద్దపల్లి జిల్లా సెకండియర్లో 68.29, ఫస్టియర్లో 57శాతం ఉత్తీర్ణతఇంటర్ ఫలితాలు ఇలాగతేడాది సెకండియర్ ఉత్తీర్ణత శాతం 68 ఈ ఏడాది సెకండియర్ ఉత్తీర్ణత శాతం 68.29 గతేడాది ఫస్టియర్ ఉత్తీర్ణత శాతం 59 ఈ ఏడాది ఫస్టియర్ ఉత్తీర్ణత శాతం 57 -
ప్రజల భాగస్వామ్యంతోనే రోడ్డు ప్రమాదాల నివారణ
● వార్డు సభ్యుడి నుంచి ముఖ్యమంత్రి వరకు భాగస్వామ్యం ● రాష్ట్ర డీజీపీ బి.శివధర్రెడ్డి గోదావరిఖని: అలైవ్ అరైవ్ కార్యక్రమంలో వార్డు సభ్యుడి నుంచి ముఖ్యమంత్రి వరకు భాగస్వామ్యులుగా చేసి రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామని రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శివధర్రెడ్డి అన్నారు. ఆదివారం రామగుండం పోలీస్ కమిషనరేట్లో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఐబీకాలనీలో రూ.12.29కోట్లతో నిర్మించిన నూతన ఏఆర్ పోలీస్ అధికారులు, సిబ్బంది క్వార్టర్లను ప్రారంభించారు. కమిషనరేట్లో సాయుధ పోలీసు సిబ్బంది గౌరవవందనం సమర్పించి డీజీపీకి స్వాగతం పలికారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని ఒక ఉద్యమంగా కొనసాగించాలని సూచించారు. ప్రస్తుతం రోడ్డు ప్రమాదాలు ఒక సామాజిక సమస్యగా మారాయన్నారు. వాటిపై విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు ట్రాఫిక్ నియమాలపై ప్రజల్లో అవగాహన పెంపొందించాలన్నారు. వేగం కన్నా ప్రాణం ముఖ్యం అనే సందేశాన్ని ప్రతీ ఒక్కరికి చేరేలా సమర్థవంతంగా అమలు చేయాలని తెలిపారు. రోడ్డు ప్రమాదాల్లో బాధితుల కుటుంబ సభ్యుల అనుభవాలు, అభిప్రాయాలను ప్రజలతో పంచుకోవడం ద్వారా అవగాహన మరింత పెరుగుతుందన్నారు. నూతన క్వార్టర్లు ప్రారంభించిన డీజీపీ గోదావరిఖని ఐబీ కాలనీలో పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో రూ.12.29 కోట్ల వ్యయంతో నిర్మించిన నూతన పోలీస్ క్వార్టర్స్ను ఆదివారం డీజీపీ శివధర్రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మల్టీజోన్–1 ఐజీ చంద్రశేఖర్రెడ్డి, రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్కిషోర్ఝా, టీజీపీఐసీఎస్ చైర్మన్ గుర్నాథ్రెడ్డి, పెద్దపల్లి డీసీపీ బి.రాంరెడ్డి, మంచిర్యాల డీసీపీ ఏ.భాస్కర్, కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ అలం, జగిత్యాల ఎస్పీ అశోక్కుమార్, రాజన్న సిరిసిల్ల ఎస్పీ మహేష్ బి.గీత్, ఎసీపీలు, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు. -
నా తొలి కవిత్వ పుస్తకాన్ని అందించాను
2007లో నా మొదటి కవిత్వ పుస్తకం వాకిలిని మలయశ్రీకి అందించాను. దాన్ని చదివిన తర్వాత ఆయన నాకు ఉత్తరం రాశారు. తెలంగాణ రచయితల వేదిక సభలలో, అనేక సమావేశాల్లో వారిని కలిసేవాళ్లం. వారి ఇంటికి వెళ్లి కలిసినప్పుడు వారు అనువాదం చేస్తున్న దమ్మపదం పద్యాలను చూపించారు. అనేకమార్లు భౌతికవాది పత్రికలను అందించారు. సాహిత్యంలో, జీవితంలోనూ నిర్మోహమాట భావ ప్రకటన, సూటిదనం ఉన్న వ్యక్తి. – బూర్ల వెంకటేశ్వర్లు, కవి, రచయిత, కరీంనగర్ విలక్షణ సాహితీవేత్త మలయశ్రీ బహు ప్రక్రియలలో రచనలు చేసి, బహు గ్రంథాలను వెలువరించిన అరుదైన, విలక్షణ సాహితీవేత్త. సామాజిక చైతన్యమే ధ్యేయంగా శాసీ్త్రయ దృక్పథంతో రచనలు చేసిన హేతువాది. తరతరాలుగా సమాజంలో నాటుకొని పోయిన మూఢనమ్మకాలు, అంధవిశ్వాసాలను తెగనాడుతూ రచనలు చేశారు. సమాజంలో సాహితీ కళారంగాల్లో ఆధిపత్య భావజాలాన్ని వ్యతిరేకించారు. మలయశ్రీ రచనలు మానవీయ సమాజాన్ని నిర్మాణం చేయడానికి దోహదం చేస్తాయి. – కూకట్ల తిరుపతి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, తెలంగాణ రచయితల వేదిక కచ్చితత్వం ఆయన జీవన విధానం మలయశ్రీ కరీంనగర్ జిల్లా సాహిత్య ప్రపంచంలో తనదైన ప్రత్యేక స్థానాన్ని సంపాదించారు. ఆయన రాసింది కేవలం కవిత్వమే కాదు.. ఆయన చేసిన విస్తృత సాహిత్య ప్రయాణంలో కరీంనగర్ చరిత్ర, భాష, సాహిత్య చరిత్ర, సామాజిక చైతన్యం అన్నీ కలగలిసిపోయాయి. నిర్మోహమాటం, సూటిదనం, కచ్చితత్వం ఆయన జీవన విధానం. అధ్యాపకుడిగా, గురువుగా ఉన్నారు కానీ సాహిత్య రంగంలో గురుస్థానాన్ని ఆశించలేదు. – వారాల ఆనంద్, సాహితీవేత్త, కరీంనగర్ గొప్ప రచయిత మలయశ్రీ విశిష్టమైన రచయిత, నవలాకారుడు, కవి, అనువాదకుడు. తెలుగు సాహిత్యంలో అన్ని ప్రక్రియల్లో రచనలు చేసిన మహనీయుడు. శతాధిక గ్రంథకర్త జీవితమంతా సాహిత్యానికి ధారపోసిండు. బౌద్ధ తాత్వికత నాస్తిక హేతువాద ధృక్పథాన్ని జీవితంలో ఆచరించిన వ్యక్తి. ఆయనతో నాకు మూడు దశాబ్దాల అనుబంధం. ఆయన పేరున నెలకొల్పిన మలయశ్రీ అవార్డు 2006లో అందుకోవడం నాకు ఒక గొప్ప జ్ఞాపకం. – అన్నవరం దేవేందర్, కవి, రచయిత, రాష్ట్ర ప్రభుత్వ దాశరధి పురస్కార గ్రహీత -
బంగారం, వెండి పోగులతో చీర
సిరిసిల్ల: సిరిసిల్ల నేతకళాకారుడు నల్ల విజయ్ మరో అద్భుతాన్ని మగ్గంపై ఆవిష్కరించారు. రెండు గ్రాముల బంగారం, వెండి పోగులతో చీరను నేశారు. హైదరాబాద్కు చెందిన వ్యాపారవేత్త చెన్నారావు కోరిక మేరకు.. రెండు గ్రాముల బంగారం, మరో రెండు గ్రాముల వెండిని ఉపయోగించి బంగారు, వెండి పోగులతో ఆకర్షణీయమైన చీరను రూపొందించారు. సుమారు 25 రోజులపాటు శ్రమించి, ఐదున్నర మీటర్ల పొడవు, 48 ఇంచుల వెడల్పుతో తీర్చిదిద్దారు. బంగారు, వెండి పోగు తీగలతో నేసిన ఈ చీరను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కె.తారక రామారావు హైదరాబాద్లో శనివారం ఆవిష్కరించారు. రూ.85వేల వ్యయంతో రూపుదిద్దుకున్న ఈ చీర మంత్రముగ్ధులను చేస్తోందని, సిరిసిల్ల నేతన్నల నైపుణ్యం మరోసారి అంతర్జాతీయ స్థాయి గుర్తింపును పొందుతోందని కేటీఆర్ అభినందించారు. అగ్గిపెట్టెలో ఇమిడేచీరను నేసి ప్రపంచానికి సిరిసిల్ల చేనేత కళావైభవాన్ని చాటిచెప్పిన నల్ల పరంధాములు తనయుడే నల్ల విజయ్. తండ్రి చేనేత వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని కళాకండాలను ఆవిష్కరిస్తున్నారు. తాను నేసిన బంగారం, వెండిపోగుల చీరను కేటీఆర్ ఆవిష్కరించడం అదృష్టంగా భావిస్తున్నానని నల్ల విజయ్ అన్నారు. భవిష్యత్లోనూ మరిన్ని వినూత్న ప్రయోగాలు చేస్తానని స్పష్టం చేశారు. సిరిసిల్ల నేతకళాకారుడి అద్భుత సృష్టి అభినందించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ -
తల్లిని హతమార్చిన తనయుడు
● మల్లాపూర్లో దారుణం ● కుటుంబ కలహాలే కారణంమల్లాపూర్ : కుటుంబ కలహాలతో కన్నతల్లినే కడతేర్చాడు కొడుకు. ఈ ఘటన మల్లాపూర్ మండలకేంద్రంలో శనివారం వెలుగుచూసింది. స్థానికులు, పోలీసుల ప్రకారం గ్రామానికి చెందిన కుడుదుల వెంకవ్వ (90)కు కుమారుడు నంబయ్య (73), కూతురు ఉన్నారు. భర్త చనిపోయినప్పటి నుంచి వెంకవ్వ కుమారుడితోనే ఉంటోంది. నంబయ్య భార్య లక్ష్మీతో తరచూ గొడవ పడుతుంటే వెంకవ్వ సర్దిచెప్పేది. శుక్రవారం రాత్రి కూడా భార్యాభర్తల మధ్య గొడవ జరగగా.. వెంకవ్వ అడ్డుకుంది. దీంతో నంబయ్య ఆమె ముఖంపై దాడికి తెగబడ్డాడు. తీవ్రంగా గాయపడిన వెంకవ్వ అక్కడికక్కడే మృతి చెందింది. మెట్పల్లి సీఐ అనిల్కుమార్, ఎస్సై అనిల్ ఘటనస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. ఆర్ఐ అశోక్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. డిప్యుటేషన్పై పంపండి రాయికల్: మండలంలోని మైతాపూర్ జెడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థి దుగ్గిళ్ల అక్షయ్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెల్సిందే. దీనికి ప్రధానోపాధ్యాయుడి వేధింపులే కారణమని ఆయన బంధువులు ఆరోపిస్తూ ఆందోళన చేయడం సరికాదని, తాము పాఠశాలలో పనిచేయడానికి ఇబ్బంది పడుతున్నామని, ఈ క్రమంలో తమను మరో పాఠశాలకు డిప్యూటేషన్పై పంపించాలని ఏడుగురు ఉపాధ్యాయులు ఎంఈవో రాఘవులుకు వినతిపత్రం సమర్పించారు. విషయాన్ని డీఈవో దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. పాఠశాలలో ఉత్తీర్ణత కోసం కృషి చేస్తున్న ఉపాధ్యాయులపై ఆరోపణలు చేయడం సరికాదని, విద్యార్థుల భవిష్యత్ కోసమే ఉపాధ్యాయులు పాటుపడతారని, తల్లిదండ్రులు గమనించాలని కోరారు. ఉపాధ్యాయుల కౌన్సెలింగ్పై అపర్థం చేసుకోవద్దని, విద్యార్థులను క్రమశిక్షణలో పెట్టేందుకే ఉపాధ్యాయులు పాటుపడతారని తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ గెజిటెడ్ హెడ్మాస్టర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు గంగనర్సయ్య, ప్రధాన కార్యదర్శి మానుపాటి బన్న, హెచ్ఎంలు బోగ రమేశ్, ఉపాధ్యాయులు గుర్రం శ్రీనివాస్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మైతాపూర్లో డీఈవో విచారణ టెన్త్ విద్యార్థి అక్షయ్ ప్రధానోపాధ్యాయుడి వేధింపులతోనే ఆత్మహత్య చేసుకున్నాడనే ఆరోపణల మేరకు శనివారం డీఈవో రాము పాఠశాలను సందర్శించారు. విచారణ చేపట్టారు. అనంతరం అక్షయ్ తల్లిదండ్రులను పరామర్శించారు. శరీరదానానికి రిటైర్డ్ హెచ్ఎం అంగీకారంకరీంనగర్/కరీంనగర్రూరల్: కరీంనగర్ మెహర్నగర్కు చెందిన రిటైర్డ్ ప్రధానోపాధ్యాయుడు సాగి రాంచందర్రావు దేహదానం చేసేందుకు ముందుకొచ్చారు. శనివారం సదాశయ ఫౌండేషన్ జాతీయ కార్యదర్శి మెరుగు భీష్మాచారి ఆధ్వర్యంలో రాంచందర్రావు కరీంనగర్ మండలం నగునూరులోని ప్రతిమ మెడికల్ కళాశాలను సంప్రదించారు. సీఏవో రాంచందర్రావు సూచనల మేరకు శరీరదానానికి సంబంధించిన దరఖాస్తుఫాంలో వివరాలు నింపి ఎనాటమీ డిపార్ట్మెంట్ ప్రిన్సిపాల్కు అందించారు. హెచ్ఎంగా ఉద్యోగ విరమణ అనంతరం సామాజిక సేవాకార్యక్రమాల్లో భాగస్వాములవుతూ ప్రస్తుతం మెడికల్ కళాశాలకు శరీరదానం చేసేందుకు రాంచందర్రావు ముందుకురావడం అభినందనీయమని పేర్కొన్నారు. ఫౌండేషన్ ప్రతినిధులు నేదునూరి కనుకయ్య, ఆడెపు రాజకనుకయ్య, శ్రీపతి ప్రభాకర్, మెరుగు దేవిక, ద్వారకామయి తదితరులు పాల్గొన్నారు. కాగా సమాజహితం కోసం శరీరదానానికి ముందుకొచ్చిన రాంచందర్రావుకు సదాశయ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షుడు శ్రవణ్కుమార్, ప్రధాన కార్యదర్శి లింగమూర్తి, గౌరవ అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి, ముఖ్యసలహాదారు రమేశ్, ప్రచార కార్యదర్శి వాసు, చంద్రమౌళి తదితరులు అభినందనలు తెలిపారు. -
బతకాలి.. విజయాన్ని వెతకాలి..!
● ఫెయిల్ అయ్యామని మనోధైర్యం కోల్పోవద్దు ● ముందుంది ఉజ్వల భవిష్యత్సప్తగిరికాలనీ(కరీంనగర్): ఫస్ట్ ర్యాంక్.. ఫస్ట్ ర్యాంక్.. ఫస్ట్ ర్యాంక్.. నేటి విద్యార్థులు ఇదేదో జీవితలక్ష్యం అనుకుంటున్నారు. ఇక్కడే వారు మానసికంగా ఇబ్బంది పడుతున్నారు. చదువు అంటే ర్యాంకులు.. మార్కులు అనే కోణంలోనే చూస్తున్నారు. చదువు అంటే ఏం నేర్చుకున్నాం.. ఎంత నేర్చుకున్నాం.. మన జీవితానికి ఎంత ఉపయోగపడుతుందనే ఆలోచన లేకుండా పోయింది. తక్కువ మార్కులు వచ్చిన తమ స్కూల్ సీనియర్ విద్యార్థులు జీవితాల్లో ఉన్నతంగా తమ కళ్లముందే ఎదుగుతున్నా వారిని స్ఫూర్తిగా తీసుకోవడం లేదు. మార్కులు వస్తేనే సక్సెస్... లేకుంటే జీవితమే లేదు.. అన్న ఆలోచనలో పడిపోయారు. అయితే ఇక్కడే ఒక్క క్షణం ఆలోచించాల్సిన తరుణం వచ్చింది. నేడు ఇంటర్ ఫలితాలు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలోనే మార్కులే జీవితం కాదనే సత్యాన్ని నేటి విద్యార్థులు గుర్తించాలి. రిజల్ట్స్ అనేవి ఒక దశ మాత్రమేనని.. అంతిమ గమ్యం కాదని విద్యానిపుణులు చెబుతున్నారు. ఒక వేళ ఫెయిల్ అయితే మళ్లీ ప్రయత్నించే అవకాశం ఉందని గుర్తుంచుకోవాలని కోరుతున్నారు. ప్రస్తుతం సక్సెస్ అయిన బిజినెస్మెన్లు.. విద్యావేత్తలు.. క్రీడాకారులు.. తమ జీవితాల్లో ఆటుపోట్లను ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చిన వారేనని గుర్తుంచుకోవాలని సూచిస్తున్నారు. మార్కులు తక్కువగా వచ్చాయనే.. ఫెయిల్ అయ్యామనో అఘాయిత్యాలకు పాల్పడవద్దని కోరుతున్నారు. ఫలితాలు ఎలా ఉన్నా మనోధైర్యంగా ముందుకెళ్తే విజయతీరాలను అందుకుంటామనే ఆలోచనతో ఉండాలని సూచిస్తున్నారు.నిలిచి గెలిచిన హీరోలు ప్రస్తుతం మన కళ్లెదుట రాణిస్తున్న వారు, ఒకప్పుడు ప్రతిభ చాటిన ప్రముఖులు పడిలేచిన కెరటాలు. నేటి ఓటమి రేపటి గెలుపునకు పునాదిని వేసుకొని గెలిచారు. మార్కులు, ర్యాంకులు జీవితం కాదని గ్రహించారు. ఇప్పుడు తక్కువ మార్కులు వచ్చిన వాళ్లే భవిష్యతులో గొప్పవాళ్లు కావచ్చుననే లక్ష్యంతో ముందుకుసాగారు. ఒక్కసారి ఆలోచించండి ఎవరి కుటుంబం వారికి ఓ అందమైన లోకం. అమ్మానాన్నలతో కలిసి ఆనందంగా గడిపిన క్షణలను గుర్తు చేసుకోండి. ఫెయిల్ అయ్యామని కుంగిపోకుండా సప్లిమెంటరీలో మంచిగా ప్రయత్నిస్తే విజయం మనదేనని గుర్తుంచుకోవాలి. మార్కులు తక్కువగా వచ్చాయని ఆత్మహత్య చేసుకుంటే.. ఆ తర్వాత ఇంకేమి మిగిలి ఉండదనే విషయాన్ని గుర్తుంచుకుంటే అందమైన జీవితం మన సొంతమవుతుందనే ఆలోచన తెచ్చుకోవాలి. విద్యార్థులు ఫలితాల గురించి తల్లిదండ్రులకు.. తోటి స్నేహితులతో పంచుకోవాల్సిన అవసరం ఉంది. ఉపాధ్యాయులు సైతం తమ కాలేజీలో చదువుకున్న విద్యార్థులతో ఒకసారి మాట్లాడి మనోధైర్యం కల్పించాలని పలువురు విద్యావేత్తలు కోరుతున్నారు. ఇదే సమయంలో తల్లిదండ్రులు పిల్లలపై ఒత్తిడి పెంచొద్దని సూచిస్తున్నారు. -
చోరీ కేసులో పాత నేరస్తుడి అరెస్టు
● బంగారం, వెండితోపాటు బైక్లు స్వాధీనం ఓదెల: పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని వివిధ ఆలయాలు, ద్విచక్ర వాహనాలు, ఆరుబయట నిద్రిస్తున్న వారి వస్తువులు చోరీచేసిన ఘటనల్లో శానగొండ గ్రామానికి చెందిన పాత నేరస్తుడు గుంటి శ్రావణ్పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రమేశ్ తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం.. పోలీసు సిబ్బందితో కలిసి ఎస్సై శానగొండ గ్రామంలో శనివారం వాహనాలను తనిఖీ చేస్తున్నారు. అటుగా బైక్పై వచ్చిన వ్యక్తిని వాహన ధ్రువీకరణ పత్రాల గురించి ఆరా తీశారు. వివరాలు చెప్పకపోవడంతో వెంటనే అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో తాను జీలకుంట, గుండ్లపల్లి, బాయమ్మపల్లె, పొత్కపల్లి ఆలయాల్లో చోరీలతోపాటు ద్విచక్రవాహనాలు అపహరించినట్లు ఒప్పుకున్నాడు. ఇతడు పాతనేరస్తుడని పోలీసులు వివరించారు. నిందితుడి నుంచి 5గ్రాముల బంగారం, 4 తులాల వెండి రింగులు, 10 తులాల రాముక్కలు, మూడు బైక్లు స్వాధీనం చేసుకొన్నారు. ఈమేరకు నిందితుడిని అరెస్టు చేసినట్లు ఎస్సై వివరించారు. -
మహిళ కళ్లలో కారం కొట్టి గొలుసు అపహరణ
వీర్నపల్లి(సిరిసిల్ల): వృద్ధురాలి కళ్లల్లో కారం చల్లి బంగారు గొలుసు లాక్కెళ్లిన ఘటన శనివారం క లకలం రేపింది. బాధితురాలి కథనం ప్రకారం.. రాజన్నసిరిసిల్ల జిల్లా వీ ర్నపల్లి మండలం బంజేరు గ్రామానికి చెందిన గుగులోతు హంసి శనివారం తెల్లవారుజాము న 5 గంటల సమయంలో తన ఇంటి బయట పనులు చేస్తుంది. ఇదే సమయంలో గుర్తు తె లియని వ్యక్తులు ఆమైపె దాడి చేసి, కళ్లలో కా రం చల్లి మెడలోని 2.5 తులాల బంగారు గొ లుసును లాక్కెళ్లారు. ఈ హఠాత్పరినామంతో హంసి గగ్గోలు పెట్టడంతో కుటుంబ సభ్యులు బయటకు వచ్చినా దుండగులు కనిపించలేదు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్సై వేముల లక్ష్మణ్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరి అరెస్టు ఓదెల: పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గుంపుల గ్రామంలో గంజాయి రవాణా చేస్తున్న గాజానవేణి రాకేశ్, అంబాల తరుణ్ను అరెస్టు చేసినట్లు పొత్కపల్లి ఎస్సై రమేశ్ తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం.. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా, పెద్దపల్లి ఏసీపీ కృష్ణ ఆదేశాల మేరకు గుంపుల గ్రామంలో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో రాకేశ్, తరుణ్ బైక్పై అటుగా వస్తూ అనుమానాస్పదంగా కనిపించారు. పోలీసులు వారిని ఆగాలని సూచించడంతో అంతలోనే పారిపోవడానికి యత్నించారు. పోలీసులు వారిని పట్టుకొని విచారించగా.. గంజాయి విక్రయించేందుకు అటుగా వచ్చినట్లు అంగీకరించారు. వారినుంచి గంజాయితో పాటు బైక్, సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసుకొన్నారు. -
మరణించి.. వెలుగులు నింపి
కోల్సిటీ(రామగుండం): వచ్చేనెలలో ఉద్యోగ విరమణ చేసే అతడొక సాధారణ వాచ్మన్.. రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినా మరొకరి జీవితంలో వెలుగులు నింపాడు. మానవత్వానికి అద్దం పట్టే ఈ ఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో హృదయాలను కదిలించింది. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో నైట్ వాచ్మన్ ఇందారపు రాయపోశం(60) కాకతీయ నగర్నివాసి. భార్య సమ్మక్క, ఇద్దరు కుమారులు ప్రశాంత్–పద్మ, కుమారస్వామి–జ్యోతి, కూతురు సత్యవతి–శ్రీనివాస్తోపాటు మనవలు, మనవరాళ్లు ఉన్నారు. ప్రమాదం.. విషాదాంతం.. ఈనెల 10న రాత్రి విధులకు హాజరైన రాయపోశం.. తోటిఉద్యోగితో కలిసి గోదావరిఖని బస్టాండ్ సమీపంలో టీ తాగి తాగడానికి బైక్పై వెళ్తుండగా టీ జంక్షన్ వద్ద కారు ఢీకొట్టింది. తీవ్రగాయాలు కావడంతో జీజీహెచ్కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. విషాదంలోనూ మానవత్వం రాయపోశం చిన్నప్పుడే ఒకకంటి చూపు కోల్పోయాడు. అయినా విధి నిర్వహణలో ఆదర్శంగా నిలిచిన ఆయన జీవితం అందరికీ స్ఫూర్తి ఇచ్చింది. విషాదంలో ఉన్న కుటుంబ సభ్యులు ఒక్కకన్ను కూడా దానం చేసి మరొకరికి చూపునివ్వాలని అంగీకరించారు. సదాశయ ఫౌండేషన్ ప్రతినిధుల సూచనతో, ఐ బ్యాంక్ టెక్నీషియన్ ప్రదీప్నాయక్ సహకారంతో శనివారం కార్నియా సేకరించి హైదరాబాద్కు తరలించారు. నివాళి రాయపోశం పార్థివదేహానికి జీజీహెచ్ మార్చురీ వద్ద బల్దియా డిప్యూటీ కమిషనర్ వెంకటస్వామి, శానిటరీ ఇన్స్పెక్టర్ సంపత్, కార్మిక సంఘాల ప్రతినిధులు నివాళి అర్పించారు. దహన సంస్కారాల కోసం మున్సిపల్ అధికారులు రూ.20 వేలు అందించారు. మేయర్ అభినందన విషాదంలోనూ మానవత్వాన్ని చాటిన రాయపోశం కుటుంబాన్ని మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతిపెల్లి ఎల్లయ్య, మున్సిపల్ కమిషనర్ అరుణశ్రీ, ఎసాబ్లిష్మ్మెంట్ సూపరింటెండెంట్ శ్రీనివాస్, సదాశయ ఫౌండేషన్, లయన్స్ క్లబ్ ప్రతినిధులు అభినందించారు. ఆయన అకాల మరణంపై సంతాపం, సానుభూతి వ్యక్తం చేశారు. చనిపోయాక కూడా ఒంటికన్ను దానం రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వాచ్మన్ కుటుంబ సభ్యుల దాతృత్వం -
భరోసా కల్పించాలి
పిల్లల ఫలితాల కంటే వారి ఆరోగ్యం, ఆనందమే ముఖ్యమని తల్లిదండ్రులు భావించాలి. వారు ఎంత కష్టపడ్డారో గుర్తించాలి. ఫలితాలు ఎలా వచ్చినా మేము అండగా ఉంటామన్న భరోసాను కల్పించాలి. పిల్లలు ఒత్తిడికి గురికాకుండా తల్లిదండ్రులు ప్రోత్సహించాలి. ప్రేమ, నమ్మకం ఇవ్వడం చాలా అవసరం. – కె.సత్యనారాయణ, పేరెంట్ పరీక్షలు ఒక భాగం మాత్రమే పరీక్షలు చదువులో ఒక భాగం మాత్రమేనని విద్యార్థులు గ్రహించాలి. మార్కులు తక్కువ వచ్చినా నిరాశ చెందాల్సిన అవసరం లేదు. లోపాలను గుర్తించి మళ్లీ ప్రయత్నిస్తే మంచి ఫలితాలు సాధించవచ్చు. ఉపాధ్యాయులు ఎప్పుడూ విద్యార్థులకు అండగా ఉంటారు. కష్టపడితే విజయం తప్పక దక్కుతుంది. – ఎ.నిర్మల, ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్, కరీంనగర్ -
‘అక్షర పౌర్ణమి’కి ఆఖరి వీడ్కోలు
మలయశ్రీ పార్థివదేహం వద్ద నివాళి అర్పిస్తున్న సాహితీవేత్తలు మలయశ్రీ రచనలు విద్యానగర్(కరీంనగర్)/కరీంనగర్ కల్చరల్: శతాధిక గ్రంథకర్త, రంగస్థల నటులు, వేమన నాటక దర్శకులు మలయశ్రీ మృతి తీరని లోటని కవులు, సాహితీవేత్తలు అన్నారు. పద్యం, గద్యం, కథ నవల, బాల సాహిత్యం, సాహితీ విమర్శ, అనువాదాలు, నాటక ప్రక్రియలో రచనలు చేసి కరీంనగర్ జిల్లా సాహిత్య చరిత్రపై పరిశోధనాత్మక గ్రంథాన్ని అందించి సాహిత్య చరిత్రలో తన పత్య్రేకతను చాటుకుంటు తన పుట్టిన రోజు అయిన కార్తీక పున్నమి సందర్భంగా పత్రి పౌర్ణమి రోజు సాటి కవులు, సాహితీవేత్తలను సాదరంగా సత్కరించే కవి, రచయిత డా.మలయశ్రీ గురించి సాహితీవేత్తల మదిలోని భావాలు. ఏటా తన పుట్టినరోజున.. కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం చెంజర్ల గ్రామంలో 1940 సంవత్సరంలో కార్తీక పున్నమి రోజు జన్మించిన డా.మలయశ్రీ కరీంనగర్లోని రేకుర్తిలో స్థిరపడ్డారు. ఎంఏ(తెలుగు), ఎంఓఎల్, పీహెచ్డీ చదివిన ఆయన తెలుగు పండిత్ ఉపాధ్యాయునిగా, ప్రభుత్వ జూనియర్ కళాశాల తెలుగు ఉపన్యాసకులుగా పనిచేసి విరమణ పొందారు. ఆయన రాసిన శాంతిపథం ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఉపవాచకంగా ఉండేది. కరీంనగర్ వెయ్యేళ్ల తెలుగు సాహిత్యంపై పరిశోధన చేసి డాక్టరేట్ పట్టా పొందారు. తన ఇద్దరు పిల్లలకు ఆదర్శ వివాహాలు చేశారు. ఏటా తన పుట్టినరోజు అయిన కార్తీక పున్నమి రోజు సాహితీవేత్తలను సత్కరించేవారు. 1960 నుంచి రచనలు ప్రారంభించి 4 భాషల్లో దాదాపు 136పైగా రచనలు చేసిన ఆయన అందుకోని అవా ర్డు, పొందని సత్కారం లేదంటే అతిశయోక్తి కాదు. అభ్యుదయవాదిగా, బౌద్ధేయవాదిగా నమ్మి న ఆశయాలు, సిద్ధాంతాలతో జీవితాన్ని చివరి వర కు సా గించిన ఆయన అనారోగ్యంతో శుక్రవారం కరీంనగర్లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో డాక్టర్ల సూచన మేరకు కు టుంబ సభ్యులు స్వగృహానికి తరలించగా శని వారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. రచయితలు వేణుశ్రీ, సరిపల్లి కృష్ణారెడ్డి, బాలసాని రాజ య్య, కూకట్ల తిరుపతి, లక్ష్మణబోధి, గండ్ర లక్ష్మణ రావు, బూర్ల వెంకటేశ్వర్లు, రంగినేని మోహనరావు, జూకంటి జగన్నాథం, కలవకుంట్ల రామకృష్ణ, సబ్బని లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ మలయశ్రీకి సాహితీవేత్తల కన్నీటి నివాళి -
టార్గెట్ 65 మిలియన్ టన్నులు
గోదావరిఖని: బొగ్గు ఉత్పత్తి లక్ష్యంపై సింగరేణి యాజమాన్యం వెనక్కి తగ్గింది. ఏటా ఉత్పత్తి పెంచుతూ వస్తున్న బొగ్గు గనుల సంస్థ.. 2026–27 ఆర్థిక సంవత్సరంలో 65 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యంగా నిర్ణయించింది. గత ఆర్థిక సంవ త్సరంలో 72 మిలియన్ టన్నులు లక్ష్యంగా నిర్దేశించింది. కానీ, 60 మిలియన్ టన్నుల ఉత్పత్తి సాధించింది. బొగ్గు గ్రేడ్పై వినియోగదారులు ఆసక్తి చూపకపోవడంతో రెండు ఏరియాల్లో ఉత్పతి భారీగా తగ్గించింది. దీని ప్రభావం మొత్తం సింగరేణిపై పడినట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఆనవాయితీకి భిన్నంగా.. వాస్తవానికి ప్రతీ ఆర్థిక సంవత్సరంలో మార్చి 15వ తేదీ నాటికి వచ్చే ఆర్థిక ఆర్థిక సంవత్సరం బొగ్గు ఉత్పత్తి లక్ష్యం ఖరారు చేయడం ఆనవాయితీ. ఈసారి ఇందుకు భిన్నంగా ఏప్పిల్ 10వ తేదీ తర్వాత టార్గెట్ ప్రకటించడం గమనార్హం. అయితే, గత లోటును పూడ్చడంతోపాటు కచ్చిమైన లక్ష్యంతో ముందుకు సాగాలనే ఆలోచనతో సింగరేణి ఈసారి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కొత్తగూడెం, మణుగూరులో తగ్గిన టార్గెట్ సింగరేణి వార్షిక బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని 12 ఏరియాల వారీగా కేటాయించింది. గతేడాదితో పోల్చి తే కొత్తగూడెం, మణుగూరులో ఉత్పత్తి బాగా తగ్గించింది. కొత్తగూడెంలో 156.50లక్షల టన్నులు కేటాయించగా ఈసారి 22.50లక్షల టన్నులకే పరిమితం చేసింది. మణుగూరులో గతేడాది 114.90లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలనేది లక్ష్యంగా నిర్దేశించగా.. ఈసారి 96.26లక్షల టన్నులకు కుదించారు. జీ–14, 15 గ్రేడ్ రకం బొగ్గు కొనుగోలు చేసేందుకు వినియోగదారులు అంతగా ఆసక్తి చూపకపోవడంతో సింగరేణి యాజమాన్యం ఈనిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. నెల ఆలస్యంగా వార్షిక లక్ష్యం 2026–27 ఆర్థిక సంవత్సరంలో నెల ఆలస్యంగా సింగరేణి వార్షిక లక్ష్యం ఖరారు చేసింది. వాస్తవానికి ఏటా మార్చి మధ్యలోనే వార్షిక లక్ష్యం ప్రకటించడం ఆనవాయితీ. టార్గెట్ కమిటీలు ఏరియాల వారీగా పర్యటించి వార్షిక లక్ష్యాన్ని ఖరారు చే స్తాయి. ఈ బృందాల పర్యటన ఈసారి సకాలంలో పూర్తయినా.. యాజమాన్యం జాప్యం చేసింది. కలగా వంద మిలియన్ టన్నులు? భవిష్యత్లో వంద మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధిస్తామని సింగరేణి యాజమాన్యం గతంలో అనేకసార్లు ప్రకటించింది. కొత్తగనులు ప్రారంభించి వార్షిక లక్ష్యం పెంచుకుంటూ పోతామని చెప్పింది. కానీ, ఈ ఆర్థిక సంవత్సరంలో నిర్దేవిత లక్ష్యం చూస్తే సంస్థ తిరోగమన దిశలో ముందుకు సాగుతోందని అంటున్నారు. -
అపరిచితుల సమాచారం ఇవ్వండి
పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రంలో అపరిచితులు కనిపిస్తే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందివ్వాలని ఏసీపీ కృష్ణ కోరారు. పట్టణంలోని సాగర్ రోడ్డు(మినీ ట్యాంకు బండ్ ఏరియా)లో శనివారం పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఏసీపీతోపాటు పెద్దపల్లి, సుల్తానాబాద్ సీఐలు ప్రవీణ్కుమార్, సుబ్బారావు, పోలీసు సిబ్బంది తనిఖీల్లో పాల్గొన్నారు. ఆధారాల్లేని 70 బైక్లు, నాలుగు ఆటోలు, ఒక ట్రాలీ, సమీపంలోని బెల్ట్ దుకాణాల్లో మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడేవారిని ఉపేక్షించబోమని ఏసీపీ హెచ్చరించారు. పొరుగు రాష్ట్రాలనుంచి వచ్చి కిరాయికి ఉండే వారిగుర్తింపు వివరాలను ఇంటి యజమానులు తీసుకోవాలని ఆయన సూచించారు. రోడ్డు ప్రమాదాలను నియంత్రించేందుకు వాహనదారులు రోడ్సేఫ్టీ నిబంధనలను పాటించాలని ఏసీపీ అన్నారు. -
ఇంటర్లో ఫెయిలైనా.. ఐఏఎస్
శంకరపట్నం: సక్సెస్కు మార్కులే కొలమానం కాదని నిరూపించారు ప్రస్తుత హైదరాబాద్ మెట్రోవాటర్బోర్డు ఎండీ కోరెం అశోక్రెడ్డి. ఇంటర్ ఫెయిలైన అశోక్రెడ్డి.. తర్వాత పట్టవదలని విక్రమార్కుడిలా పుస్తకాలతో కుస్తీ పట్టి గ్రూప్–1 సాధించారు. ప్రస్తుత కన్ఫార్మ్డ్ ఐఏఎస్ అధికారి హోదాలో సేవలందిస్తున్నారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కొత్తగట్టుకు చెందిన కోరెం అశోక్రెడ్డి మొలంగూర్ జెడ్పీ హైస్కూల్లో 10వ తరగతి వరకు చదువుకున్నారు. హుజూరాబాద్ జూనియర్ కాలేజీ ఇంటర్ చదివారు. సెకండియర్లో ఫెయిల్ అయినా సప్లిమెంటరీలో ఉత్తీర్ణులయ్యారు. జమ్మికుంటలో డిగ్రీ, ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ చేసి గ్రూప్–1 ఉద్యోగానికి ఎంపికయ్యారు. సీ్త్రశిశుసంక్షేమశాఖ పీడీగా ఉద్యోగంలో చేరి, కన్ఫార్మ్డ్ ఐఏఎస్గా ఎంపికయ్యారు. ప్రస్తుతం హైదరాబాద్ మెట్రోవాటర్ బోర్డు ఎండీగా విధులు నిర్వర్తిస్తున్నారు. మార్కులు, ర్యాంకులు కొలమానం కాదని పట్టుదలతో చదివితే విజయం సాధించవచ్చని అశోక్రెడ్డి అంటున్నారు. -
కాంగ్రెస్ పార్టీలో చేరికలు
ధర్మారం: కటికెనపల్లి బీఆర్ఎస్ పార్టీ నాయ కులు, గ్రామ పంచాయితీ వార్డు సభ్యులు ఇద్ద రు తమ అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. సర్పంచ్ చేపూరి లచ్చయ్య ఆధ్వర్యంలో శనివారం ధర్మపురిలోని మంత్రి క్యాంపు కా ర్యాయలంలో మంత్రి లక్ష్మణ్కుమార్ను వార్డు సభ్యులు అనపురం వెంకటేశ్, మల్లెత్తుల రవి, వారి అనుచరులు కాంగ్రెస్లో చేరారు. మంత్రి వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఉపసర్పంచ్ బోనగిరి అజయ్, మా జీ ఉపసర్పంచ్ గంగారెడ్డి పాల్గొన్నారు. నేడు పెద్దపల్లికి కేటీఆర్ పెద్దపల్లి: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ ఆర్ ఆదివారం జిల్లా కేంద్రానికి వస్తారని మా జీఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి తెలిపారు. మంచిర్యాల జిల్లా కేంద్రానికి వెళ్తూ మార్గమధ్యంలోని పెద్దపల్లిలో అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలవేస్తారన్నారు. అనంతరం కార్యకర్తలతో మాట్లాడతారని ఆయన పేర్కొన్నారు. బస్టాండే టీకా కేంద్రం కమాన్పూర్: స్థానిక బాపూజీనగర్లో చిన్నారులకు వ్యాక్సిన్ వేయడానికి అరోగ్య ఉప కేంద్రం లేదు. దీంతో వైద్యసిబ్బంది రోడ్డు పక్కన ఉన్న బస్టాండ్లో చిన్నారులకు టీకా వేశారు. అంగన్వాడీ కేంద్రం కూడా అందుబాటులోలేదు. దీంతో చిన్నారులకు వ్యాక్సిన్, ప్రజలకు వైద్యసేవలు అందించడానికి ఇబ్బంది పడుతున్నా మని వైద్య సిబ్బంది పేర్కొంటున్నారు. సివిల్స్ సాధించడమే లక్ష్యం పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రంలో కేబుల్ ఆపరేటర్గా పనిచేసే లైసెట్టి భిక్షపతి – అనిత దంపతుల కుమారుడు లైసెట్టి అఖిల్కృష్ణ స్టాఫ్ సె లక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) నిర్వహించిన పరీక్ష లో ప్రతిభ కనబర్చి(390కు 333 మార్కులు) క స్టమ్స్ ఇన్స్పెక్టర్ ఉద్యోగం సాధించారు. ప్రాథమిక విద్య పెద్దపల్లి, ఇంటర్ హైదరాబాద్, ఇంజినీరింగ్ చెన్సైలో పూర్తిచేసిన అఖిల్.. ప్రస్తు తం ఉస్మానియా యూనివర్సిటీలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నారు. తల్లిదండ్రులు ఇ చ్చిన ప్రోత్సాహంతో తాను ముందుకు సాగానని, కోచింగ్కు వెళ్లకుండానే కష్టపడి చదివానని అన్నారు. సివిల్స్ సాధించడమే తన లక్ష్యమని తెలిపారు. పలువురు అభినందించారు. చెరువు అభివృద్ధికి నిధులుపెద్దపల్లి: సుల్తానాబాద్లోని ఊరచెరువును మి నీ ట్యాంక్ బండ్గా అభివృద్ధి చేసేందుకు ప్ర భుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణా రావు ప్రత్యేక చొరవ తీసుకోవడంతో జీవో నంబర్ 170 ద్వారా రూ.8 కోట్ల 77 లక్షల 50 వేలు మంజూరు చేస్తూ సర్కారు శనివారం ఉత్తర్వు లు జారీచేసింది. నిధులు మంజూరు చేసిన సీ ఎం రేవంత్రెడ్డి, మంత్రులు ఉత్తమ్కుమార్రె డ్డి, శ్రీధర్బాబు, ప్రభుత్వ విప్ విజయరమణారావు చిత్రపటాలకు నాయకులు క్షీరాభిషేకం చేశారు. మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధాకృష్ణ, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు అంతటి అన్నయ్యగౌడ్, వైస్ చైర్పర్సన్ అంతటి పుష్పలత, పట్టణ అధ్యక్షుడు వేగోళం అబ్బయ్యగౌడ్ తదితరులు పాల్గొన్నారు. సమ్మర్ ఇంటర్న్షిప్ రామగుండం: అంతర్గాం మండలం లింగాపూ ర్ మోడల్ స్కూల్ ఒకేషనల్ విద్యార్థులు స మ్మర్ ఇంటర్న్షిప్ విజయవంతంగా పూర్తిచేశా రని ప్రిన్సిపాల్ పంబాల సదానందం తెలిపా రు. 10రోజులు ఇంటర్న్షిప్ జరిగిందన్నారు. -
పదో తరగతి విద్యార్థులు
మార్కులు..ర్యాంకులే చదువుకు కొలమానం అనుకుంటున్న నేటితరం విద్యార్థులు ఒక్కక్షణం ఆగండి.. వీరి విజయగాథలు చదవండి. పదో తరగతిలో ఫెయిలైన వారు.. ఇంటర్లో అత్తెసరు మార్కులతో పాసైన వారు.. డిగ్రీ కూడా చదవని వారు.. అద్భుతాలు సృష్టించారు. వారు వేసిన మార్గంలోనే నేడు డిగ్రీ.. బీటెక్.. ఎంటెక్ విద్యార్థులు ముందుకెళ్తున్నారు. డిగ్రీ పూర్తి చేయని బిల్గేట్స్.. బోర్డు ఎగ్జామ్ రాయని సచిన్ టెండూల్కర్.. ఆటోడ్రైవర్గా జీవితాన్ని ఆరంభించిన సత్యశంకర్ విజయాలే మనకు మార్గంకావాలి. అంతెందుకు మన జిల్లా వాసి.. కొత్తగట్టుకు చెందిన కోరెం అశోక్రెడ్డి ఇంటర్ ఫెయిలయ్యానని కుంగిపోయి ఉంటే ఈరోజు ఐఏఎస్ అయ్యేవారే కాదు.. అందుకే ఒక్క క్షణం ఆలోచించండి.. పదో తరగతిలో తక్కువ మార్కులు వచ్చాయని.. ఇంటర్ ఫెయిల్ అయ్యామని కుంగిపోకండి. దీని తర్వాత జీవితం చాలా ఉంది. ధైర్యంతో ముందుకెళ్తే మీలో నుంచే ఓ బిల్గేట్స్.. సత్యశంకర్.. మనోజ్కుమార్శర్మ.. కోరెం అశోక్రెడ్డి వారసులు రావచ్చు. ఇంటర్ ఫలితాలు ఎలా ఉన్నా.. ధైర్యంగా ముందుకెళ్దాం.. – సప్తగిరికాలనీ(కరీంనగర్) – వివరాలు 8లో...36,4268,10618,2514,06018,175కరీంనగర్రాజన్నసిరిసిల్ల‘మనోజ్కుమార్శర్మ.. మధ్యప్రదేశ్లోని ఒక పేద కుటుంబంలో జన్మించాడు. 12వ తరగతిలో ఫెయిల్ అయ్యాడు. కానీ నిరాశ చెందలేదు. ఐపీఎస్ అయ్యారు. ప్రస్తుతం ఆయన మహారాష్ట్ర పోలీస్లో ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ హోదాలో పనిచేస్తున్నారు.’‘సత్యశంకర్.. ఓ పానీయం ఉత్పత్తి చేసే బిందు కంపెనీ యజమాని. ఆయన ఇంటర్ వరకు చదువుకుని ఆటో డ్రైవర్గా తన ప్రస్థానం మొదలుపెట్టారు. అవకాశాలు సద్వినియోగం చేసుకుని ఇప్పుడు రూ.800 కోట్ల వ్యాపారానికి యజమాని అయ్యారు. ఆయనే వందలాది మందికి ఉపాధి కల్పిస్తున్నారు.’ -
వేజ్బోర్డు ఏర్పాటు చేయాలి
గోదావరిఖని: బొగ్గు గని కార్మికులకు 12వ వేజ్బో ర్డు కోసం జేబీసీసీఐ ఏర్పాటు చేయాలని బీఎంఎస్ అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య డిమాండ్ చేశారు. స్థానిక ప్రెస్క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఎంఎస్ 113వ వర్కింగ్ కమిటీ సమావేశం ఈనెల 9, 10వ తేదీల్లో ఒడిశాలోని తాల్చేర్ అంగుల్ ప్రాంతంలో నిర్వహించినట్లు తెలిపారు. కోల్ ఇండియా, సింగరే ణి యాజమాన్యం కార్మిక వ్యతిరేక విధానాలు అ మలు చేస్తున్నాయని, వీటిని ఉపసంహరించుకోవాలని సభ డిమాండ్ చేసినట్లు వెల్లడించారు. అధికారుల వేతన సవరణను నిబంధనలకు విరుద్ధంగా ముందుగానే అమలు చేయడానికి యత్నించారని, కార్మికుల విషయంలో నోటిఫికేషన్ విడుదల చేయ కపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసిందన్నారు. నా యకులు యతిపతి సారంగపాణి, మాదాసి రవీంద ర్, ఆకుల హరిణ్, తాట్ల లక్ష్మయ్య, ఎల్లావుల కోట య్య, తుమ్మ గట్టయ్య, పుప్పాల నాగేంద్రప్రసాద్, సురేశ్, సమ్మయ్య, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. -
మత్తు పదార్థాలతో ముప్పు
కోల్సిటీ(రామగుండం): యువత మత్తుపదార్థాల కు దూరంగా ఉండాలని పెద్దపల్లి డీసీపీ రాంరెడ్డి సూచించారు. 99 రోజుల ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గోదావరిఖని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్(జీజీహెచ్)లో ఏర్పాటు చేసిన ‘అడిక్షన్ ట్రీట్మెంట్ ఫెసిలిటీ’ కేంద్రాన్ని గోదావరిఖని ఏసీపీ రమేశ్తో కలిసి డీసీపీ శనివారం ప్రారంభించారు. సిమ్స్ విద్యార్థులకు మ త్తు పదార్థాల వినియోగం, నష్టాలపై నిర్వహించిన ఆర్ట్స్, క్విజ్ పోటీల్లో విజేతలుగా నిలిచిన మెడికో లకు డీసీపీ సర్టిఫికెట్లను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, మత్తు పదార్థాల వినియోగా న్ని అరికట్టడంతోపాటు వ్యసన బాధితులకు స మగ్ర వైద్య సేవలు అందించేందుకే జీజీహెచ్లో ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేశారన్నారు. పెరుగుతున్న మత్తు పదార్థాల వినియోగం సమాజానికి ముప్పుగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశా రు. అలాంటి వ్యసనాల నుంచి బయటపడేందుకు ఇలాంటి చికిత్స కేంద్రాలు ఎంతో దోహదపడుతాయని పేర్కొన్నారు. ఆస్పత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ అరుణ మాట్లాడుతూ, డ్రగ్ అడిక్షన్ కౌన్సెలింగ్ సెంటర్, సబ్స్టాన్స్ ఇంటాక్సికేషన్ కేర్ యూ నిట్తోపాటు ఔషధ చికిత్స, పునరావాస సేవలు ఇందులో అందుబాటులో ఉంటాయన్నారు. ఆర్ఎంవోలు కృపాభాయి, దండె రాజు, సైకియాట్రిస్ట్ రవివర్మ మాట్లాడుతూ, వ్యసనాలతో శారీరక, మా నసిక సమస్యలు తీవ్రంగా ప్రభావితం అవుతాయన్నారు. సమయానికి సరైన చికిత్స తీసుకుంటే బాధితులు పూర్తిగా కోలుకునే అవకాశం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గోదావరిఖని వన్టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి, మెడికల్ విద్యార్థులు, నర్సింగ్ ఆఫీసర్లు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. -
పూలే ఆశయాలు సాధించాలి
పెద్దపల్లి: సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిబా పూ లే ఆశయాలు, ఆలోచనలను అదరూ ఆచరించాల ని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. జిల్లా వెనుకబ డిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో శనివా రం కలెక్టరేట్లో మహాత్మా జ్యోతిబా పూలే జయంతి ఘనంగా నిర్వహించారు. అదనపు కలెక్టర్ వేణు తో కలిసి కలెక్టర్.. జ్యోతిబా పూలే చిత్రపటానికి పూ లమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం క లెక్టర్ మాట్లాడుతూ, సమాజంలోని అసమానతల ను తొలగించడంలో పూలే చేసిన సేవలు అమోఘమన్నారు. సామాజిక సమానత్వం కోసం పోరాటం చేశారని గుర్తుచేశారు. బాలికల విద్యపై పూలే దంపతులు చిత్తశుద్ధితో పనిచేశారని అన్నారు. అంతకుముందు పెద్దపల్లిలోని మహాత్మా జ్యోతిబా పూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థినులు ప్రదర్శించిన కూచిపూడి నృత్యం ఆకట్టుకుంది. జిల్లా బీసీ అభివృద్ధి శాఖ అధికారి రంగారెడ్డి, కలెక్టరేట్ పరిపాలన అధికారి ప్రకాశ్, జిల్లా వైద్యాధికారి ప్రమోద్కుమార్, బీసీ సంఘాల నాయకులు సారయ్యగౌడ్, దాసరి ఉష, ఆకుల స్వామి వివేక్ పటేల్, శంకర్, కొండి సతీశ్, శ్రీమాన్, అంబేడ్కర్ జయంతి ఉత్సవ కమిటీ చైర్మన్ బాపయ్య తదితరులు పాల్గొన్నారు. హౌస్లిస్టింగ్లో కచ్చితత్వం జనగనణలో భాగంగా చేపట్టిన హౌస్ లిస్టింగ్ బ్లాక్ ల వివరాలు కచ్చితత్వంతో, సమగ్రంగా పూర్తి చే యాలన కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయం, సుల్తానాబాద్ పురపాలక సంఘంలో చేపట్టిన జనగణన ప్రక్రియను శనివారం కలెక్టర్ పరిశీలించి పలు సూచనలు చే శారు. హౌస్ లిస్టింగ్ బ్లాక్ల ఫిజికల్ వెరిఫికేషన్ను తప్పనిసరి నిర్వహించాలన్నారు. ల్యాండ్మార్క్లు, పాఠశాలలు, దేవాలయాలు, కార్యాలయాలు తదితర గుర్తులను బ్లాక్ వారీగా స్పష్టంగా నమోదు చేయాలని సూచించారు. పెద్దపల్లి డిప్యూటీ తహసీల్దార్ విజయ్, అధికారులు పాల్గొన్నారు. -
శ్లోకాల పఠనంలో ప్రతిభ
కాల్వశ్రీరాంపూర్: గణపతి సచ్చితానంద మైసూర్ దత్త పీఠం కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్టా ల్లో ఇటీవల నిర్వహించిన భగవత్ గీత ఆన్లైన్ శ్లో కాల పోటీల్లో కోలేటి రమాదేవి గోల్డ్ మెడల్ సాధించారు. 700 శ్లోకాలు కంఠస్థం చేసిన రమాదేవి అలవోకగా ఆన్లైన్లో పఠించి పురస్కారానికి ఎంపికయ్యారు. శ్రీలలితా పారాయణం గ్రూపు మహిళలు, ఆర్యవైశ్య సంఘం నాయకులు కోలేటి రమాదేవి–రామయ్య దంపతులను శనివారం మండల కేంద్రంలో శాలువాలు కప్పి సన్మానించారు. ఈకార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం మండల అధ్యక్ష, కార్యదర్శులు రాఘవులు, అశోక్, మహిళా సంఘం అధ్యక్షురాలు జ్యోతి, లలితా పారాయణం గ్రూపు మహి ళలు, ఆర్యవైశ్య సంఘం నాయకులు పాల్గొన్నారు. -
అదనపు జిల్లా జడ్జిగా లావణ్య
గోదావరి టౌన్: గో దావరిఖని అదనపు జి ల్లా న్యాయమూర్తి శ్రీనివాసరావు బదిలీ అయ్యారు. హన్మకొండ లేబ ర్ కోర్టుకు బదిలీ చేయగా ఆయన స్థానంలో సంగారెడ్డి నాలుగో అదనపు జిల్లా న్యాయమూర్తి లావణ్యను నియమించారు. మొత్తం రాష్ట్రవ్యాప్తంగా 35 మంది జిల్లా న్యాయమూర్తులను హైకోర్టు రిజిస్ట్రార్ బదిలీ చేశారు. క్యూఆర్ కోడ్తో దరఖాస్తు జ్యోతినగర్: రామగుండం ఎన్టీపీసీ ప్రాజెక్టు ప రిధిలోని నిరుద్యోగ యువత పోటీపరీక్షల శిక్షణకు క్యూ ఆర్ కోడ్ తో దరఖాస్తు చేసుకోవాలని సీఎస్సార్ అధికారులు తెలిపారు. ప్రాజెక్టు ప్రభావిత, పునరావాస ప్రాంతాలకు చెందిన యువత కోసం దీప్తి మహిళా సమితి సహకారంతో ఆర్నెల్లపాటు ఉచితంగా కోచింగ్ అందించనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గలవారు క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి దరఖాస్తు చేసుకోవాలని కోరారు. సౌకర్యాలు కల్పించాలి ఓదెల: పనిప్రదేశాల్లో కూలీలకు సౌకర్యాలు క ల్పించాలని డీఆర్డీవో కాళిందిని సూచించారు. కొలనూర్లో చేపట్టిన పంట కాలువ పనులను డీఆర్డీవో శుక్రవారం పరిశీలించారు. ఆమె మా ట్లాడుతూ, పనిప్రదేశాల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లు, నీడకోసం టెంట్, దప్పిక తీర్చడం కోసం మంచినీటి వసతి కల్పించాలన్నారు. ఎంపీడీవో అనిల్రెడ్డి, కార్యదర్శి శంకర్, టెక్నికల్ అసిస్టెంట్ జనార్దన్, మేట్ స్పప్న పాల్గొన్నారు. భద్రత ప్రమాణాలు పాటించాలి గోదావరిఖని: విద్యుత్ సరఫరాలో అత్యున్నత భద్రత ప్రమాణాలు పాటించి ప్రమాదాలను నివారించాలని డీడీఎంఎస్(ఎలక్ట్రికల్) కమలేశ్చౌదరి సూచించారు. సింగరేణి ఆర్జీ–వన్ ఏరి యాలోని గనుల్లో విద్యుత్ భద్రత, హైటెన్షన్ విద్యుత్ సరఫరా, సబ్స్టేషనన్ల నిర్వహణపై శు క్రవారం సదస్సు నిర్వహించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోచించాలని అన్నా రు. క్షేత్రస్థాయి సిబ్బంది నిరంతరం అప్రమ త్తంగా ఉండడం ద్వారానే ప్రమాదాలు నివారించవచ్చని తెలిపారు. ఏరియా ఇంజినీర్ రాంమోహనరావు, టీటీసీ మేనేజర్ అశోక్రావు, ప్రాజెక్ట్ ఇంజినీర్లు, డీజీఎంలు, గనుల గ్రూప్, పిట్ ఇంజినీర్లు, సేఫ్టీ ఆఫీసర్లు, ఎలక్ట్రికల్ ఇంజినీర్లు, ఎలక్ట్రికల్ సూపర్వైజర్లు పాల్గొన్నారు. మట్టి తరలింపు అడ్డగింత పెద్దపల్లిరూరల్: పాలితంలో శుక్రవారం మట్టి తరలిస్తున్న టిప్పర్లను గ్రామస్తులు అడ్డుకున్నా రు. తమ గ్రామశివారు నుంచి అక్రమంగా మ ట్టి తరలించుకుపోతున్నారని ఆరోపిస్తూ మ హిళలతో సహా గ్రామస్తులు అడ్డుకున్నారు. స మచారం అందుకున్న రూరల్ పోలీసులు ఘట నా స్థలికి చేరుకుని సమస్యపై ఆరా తీశారు. మట్టి తరలింపునకు ప్రభుత్వ అనుమతులు ఉన్నాయని, వేబిల్లులను చూపించినా గ్రామస్తులు ససేమిరా అన్నారు. నిబంధనల మేరకు తరలించుకుపోతున్నా అడ్డుకోవడం సరికాదని పోలీసులు గ్రామస్తులను సముదాయించారు. అధికారులతో చర్చించి వాస్తవాలు తెలుసుకో వాలని సూచించి ఆందోళన విరమింపజేశారు. ప్రశ్నించే గొంతుకగా టీఎన్జీవోపెద్దపల్లి: ఉద్యోగుల సమస్యలపై ప్రశ్నించే గొంతుకగా మారాలని, ఇందులో టీఎన్జీఓ నా యకత్వం ఎప్పుడూ ముందుంటుందని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు శంకర్ అన్నారు. ప్రభు త్వ ఉద్యోగులకు శుక్రవారం చేపట్టిన సభ్యత్వ నమోదు సందర్భంగా మాట్లాడారు. ప్రతిని ధులు కొమురయ్య, అయిరెడ్డి సందీప్రెడ్డి, ప్రవీణ్, ప్రేమ్సాగర్, పురుషోత్తంరెడ్డి, వెంకటేశం, హరీశ్, సంగీత, మోహన్, వెంకటహన్మంతు, శంకర్, అనిత, రాకేశ్, రమేశ్, సౌమ్య, సాధిక్, జహీర్ తదితరులు పాల్గొన్నారు. క్వింటాల్ పత్తి రూ.7,968 పెద్దపల్లిరూరల్: స్థానిక వ్యవసాయ మార్కెట్ లో శుక్రవారం పత్తి క్వింటాల్కు గరిష్టంగా రూ. 7,968 ధర పలికింది. కనిష్టంగా రూ.6,161, సగటు రూ.7,658గా ధర నమోదైంది. -
పుష్కరఘాట్లకు రోడ్డు సౌకర్యం
పెద్దపల్లి: వచ్చే ఏడాది నిర్వహించే గోదావరి పుష్కరాలకు ఏర్పాట్లు వేగంగా చేయాలని, ప్రధానంగా ఘాట్ల వరకు రోడ్లు సకాలంలో నిర్మించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. ఇంజినీరింగ్ చీఫ్ మోహన్నాయక్తో కలిసి కలెక్టరేట్లో శుక్రవారం ఆయన ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్, నీటిపారుదల శాఖల అధికారులతో గోదావరి పుష్కర ఏర్పాట్లపై సమీక్షించారు. జిల్లాలోని మంథని, గోలివాడ, గోదావరిఖని పుష్కరఘాట్లకు రహదారులు నిర్మించాలని ఆయన అన్నారు. గోదావరిఖని సమ్మక్క– సారలమ్మ జాతర వద్ద 50 శాతం శాశ్వత పనులు పూర్తయ్యాయని తెలిపారు. ఆర్ అండ్ బీ ఈఈ భావ్సింగ్, మంథని మున్సిపల్ కమిషనర్ మనోహర్ తదితరులు పాల్గొన్నారు. ఆయుర్వేద సేవలు సద్వినియోగం చేసుకోవాలి ఆయుర్వేదం, యునాని, హోమియోపతి సేవలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ శ్రీహర్ష కోరా రు. జిల్లా వైద్యశాఖ ఆధ్వర్యంలో జిల్లా ఆస్పత్రి ఆవరణలో ఉచిత ఆయుష్ వైద్యశిబిరం నిర్వహించగా కలెక్టర్ మాట్లాడారు. ఆయుష్ ఆస్పత్రిలో రోజూ 100 నుంచి 120 మంది అవుట్ పేషెంట్లు వైద్యసేవలు వినియోగించుకుంటున్నారని తెలిపారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి ప్రమోద్కుమార్, జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీధర్ పాల్గొన్నారు. యోగాతో సంపూర్ణ ఆరోగ్యం రోజూ యోగా సాధన చేస్తే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని ఆయుష్ జిల్లా ఇన్చార్జి డాక్టర్ అరుణ అ న్నారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ని ర్వహించిన యోగా కార్యక్రమంలో ఆమె మాట్లాడా రు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి ప్రమోద్ కుమార్, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఓసీపీ–1లో సినిమా షూటింగ్
గోదావరిఖని: ఓసీపీ–1లో శుక్రవారం కోల్గోల్డ్ సి నిమా షూటింగ్ జరిగింది. సంయుక్త మీనన్ హీరోయిన్గా ఈ సినిమా చిత్రీకరిస్తున్నారు. ఓసీపీ–2లో, బెల్లంపల్లి, మందమర్రి, కాగజ్నగర్ తదితర ప్రాంతాల్లో ఈ సినిమా చిత్రీకరణ చేశారు. హామీలు నెరవేర్చాలి పెద్దపల్లి: ఆర్టిజన్ల సమ్మైపె ప్రభుత్వం స్పందించకపోవడం శోచనీయమని ఆర్టిజన్ కార్మికుల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా జేఏసీ చైర్మన్ తూళ్ల నాగరాజు అన్నారు. స్థానిక ప్రెస్క్లబ్లో శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కార్మికులను చర్చలకు పిలిచి, హామీలు నేరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా జేఏసీ కో కన్వీనర్ ఇ.ప్రసాద్, పెద్దపల్లి జిల్లా కన్వీనర్ ఎస్డీ కలీమొద్దీన్, ఎన్.సతీశ్రావు, ఎస్.రవి, ఎస్.నర్సింగం, సింగమల్ల తదితరులు పాల్గొన్నారు. -
● మంత్రి అడ్లూరికి శాతవాహన విద్యార్థుల ఫిర్యాదు ● విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితా రాణాకు ఫోన్ ● మొత్తం వివాదంపై విచారణ చేపట్టాలని కోరిన మంత్రి ● ఘటనపై పోలీసులకు ప్రొఫెసర్ సుజాత ఫిర్యాదు ● అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కంప్లైంట్
సాక్షిప్రతినిధి,కరీంనగర్: శాతవాహన యూనివర్సిటీ వివాదం రోజురోజుకు ముదిరి పతాకస్థాయికి చేరుకుంది. ఇంతకాలం కరీంనగర్కే పరిమితమైన ఈ వ్యవహారం తాజాగా రాజధానికి చేరుకుంది. తమను అర్బన్ నక్సలైట్లంటూ వేధిస్తున్నారంటూ ఎస్సీ సంక్షేమ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్కి శాతవాహన విద్యార్థులు ఫిర్యాదు చేశారు. శుక్రవారం శాతవాహన యూనివర్సిటీ జాక్ విద్యార్థులు మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ను ధర్మారంలో కలిశారు. అక్కడ వీసీ ఉమేశ్ కుమార్, బాటనీ పార్ట్టైం అసిస్టెంట్ ప్రొఫెసర్ పెంచాల శ్రీనివాస్ తమను అర్బన్ నక్సలైట్లంటూ వేధిస్తున్నారని ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన మంత్రి లక్ష్మణ్ అక్కడ నుంచే విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణాకు ఫోన్ చేశారు. అసలు యూనివర్సిటీలో ఏం జరగుతుందో? తెలుసుకోవాలని కోరారు. వెంటనే ఈ వ్యవహారంలో నిజనిజాలు నిర్ధారించేందుకు విచారణ కమిటీని ఏర్పాటు చేయాలని మంత్రి కోరారు. దీనికి యోగితా రాణా సానుకూలంగా స్పందించడంతో విద్యార్థులు మంత్రికి ధన్యవాదాలు తెలిపారు.‘శాతవాహన యూనివర్సిటీలో దళిత ప్రొఫెసర్లు, విద్యార్థులను అర్బన్ నక్సలైట్లంటూ జరుగుతున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ విషయంలో ప్రొఫెసర్ సుజాత, ఇతర దళిత విద్యార్థులకు ఎమ్మార్పీఎస్ అండగా నిలుస్తుంది. ఈ విషయంలో న్యాయం జరిగే వరకు త్వరలోనే ఎమ్మార్పీఎస్ పక్షాన ఉద్యమిస్తాం’ అని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు బెజ్జంకి అనిల్ మాదిగ, ఉపాధ్యక్షుడు కనకం అంజిబాబు, సీనియర్ నాయకుడు పొత్తూరి రాజన్న, ఎంఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు చెంచాల నవీన్ మాదిగ శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. కరీంనగర్ పోలీసులు నిస్పక్షపాతంగా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. వీసీ ఉమేశ్కుమార్ తనను వ్యక్తిగతంగా వేధిస్తుండగా.. బాటనీ విభాగం పార్ట్టైం అసిస్టెంట్ ప్రొఫెసర్ పెంచాల శ్రీనివాస్ తనను అర్బన్ నక్సలైటంటూ ప్రచారం చేస్తున్నారంటూ తెలంగాణ విద్యా కమిషన్ అడ్వైజరీ మెంబర్, సోషియాలజీ విభాగాధిపతి డాక్టర్ సూరేపల్లి సుజాత కొత్తపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో వారిపై వేసిన విచారణ కమిటీ రిపోర్టు కాపీలను కూడా పోలీసులను అందజేశారు. దీంతోపాటు కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో చేసిన కామెంట్లు, రాష్ట్రవ్యాప్తంగా వివిధ వాట్సప్ గ్రూపుల్లో శాతవాహన వర్సిటీలో తనను అర్బన్ నక్సలైట్గా చిత్రీకరిస్తూ.. చేసిన పోస్టుల స్క్రీన్షాట్లు, వారి ఫోన్ నంబర్లు ఫిర్యాదుకు జతచేశారు. కొన్నిరోజులుగా దళిత మహిళా ప్రొఫెసర్నైన తనను అసభ్యపదజాలంతో సోషల్ మీడియాలో వేధిస్తోన్న వారిపైన కూడా అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఆమె ఫిర్యాదులో కోరారు. బుధవారం రాత్రి జరిగిన ఈ ఘటనను పోలీసులు గోప్యంగా ఉంచడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే ఈ వ్యవహారం జరుగుతున్న తీరు, సోషల్ మీడియాలో జరుగుతున్న యుద్ధంపై ఇంటెలిజెన్స్ పోలీసులు వివరాలు సేకరించి నివేదిక ఇచ్చారు. -
కాంగ్రెస్ను విమర్శించే అర్హత లేదు
ధర్మారం: పదేళ్లపాటు అధికారంలో ఉన్న బీఆర్ఎ స్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులకు అపాయింట్మెంట్ ఇవ్వకుండా ప్రజలను, కార్యకర్తలను పట్టించుకోని కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను పట్టించుకోలేదని ఆరోపించడం విడ్డూరంగా ఉందని మంత్రి లక్ష్మణ్కుమార్ విమర్శించారు. నందిమేడారంలో 30 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి మంత్రి శుక్రవారం ప్రారంభించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మా ట్లాడారు. కవులు, కళాకారులు, ప్రజలు తమ ప్రా ణాలను పణంగా పెట్టి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో పోరాడిన వారికి దక్కిన గౌరవం ఏమిటో తెలుసన్నారు. కేసీఆర్ కుటుంబంలోని కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావు, కవిత, సంతోష్రావుకు మాత్రమే స్వరాష్ట్రంలో రాజకీయ ఉద్యోగాలు లభించాయని అన్నారు. తాను కాంగ్రెస్ పార్టీలో సామాన్య కార్యకర్తగా ఉంటూ నేడు క్యాబినేట్ మంత్రి వరకు పార్టీ గుర్తింపు నిచ్చిందని ఆయన అన్నారు. పేదలకు ఉచితవైద్యం ప్రభుత్వ ఆస్పత్రుల్లో పేదలకు అత్యాధునిక వైద్యసేవలు ఉచితంగా అందుబాటులోకి తెస్తున్నామని మంత్రి లక్ష్మణ్కుమార్ అన్నారు. అన్నిగ్రామాల ప్ర జలకు అందుబాటులో ఉండేలా మేడారంలో ఆస్ప త్రి నిర్మించామన్నారు. వైద్యులు, సిబ్బంది, మందుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. కలెక్టర్తోపాటు వైద్య, ఆరోగ్య అధికారులు క్రమం తప్పకుండా ఆస్పత్రిని సందర్శించి వైద్యసేవలపై ఆరా తీయాలని సూచించారు. ఈసందర్భంగా ఆస్పత్రి స్థలదాత పొనుగోటి నర్సింగరావును మంత్రి శాలువాతో సన్మానించారు. అనంతరం నర్సింగరావు మాట్లాడుతూ, ప్రజలకు ఆరోగ్య సేవలు అందించాలనే తపనతో 1968లో సర్పంచ్గా కొనసాగిన తన తండ్రి మురళీధర్రావు నాలుగు ఎకరాలను ఆస్పత్రి నిర్మాణం కోసం విరాళంగా ఇచ్చారన్నారు. సర్పంచ్ మ్యాడా రం వీర్పాల్, ఉపసర్పంచ్ రవి, మార్కెట్ కమిటీ చైర్మన్ లావుడ్య రూప్లానాయక్, వైస్ చైర్మన్ అరిగే లింగయ్య, జిల్లా వైద్యాధికారి ప్రమో ద్కుమార్, సూపరెండెంట్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. -
13 నుంచి మొబైల్ఫోన్ల పంపిణీ
పెద్దపల్లి: జిల్లాలోని అంగన్వాడీ టీచర్లకు ఈనెల 13 నుంచి మొబైల్ఫోన్లు పంపిణీ చేయాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. ఇప్పటికే ఫోన్లు జిల్లా కేంద్ర కార్యాలయానికి చేరాయి. గత ప్రభుత్వం 3–జీ మొబైల్ఫోన్లను పంపిణీ చేసింది. అవి ఇప్పు డు పనిచేయక ఇబ్బంది పడుతున్నారు. ఈమేరకు 5జీ, ఎయిర్ఫోన్స్, డాటా కేబుల్, పౌచ్, సిమ్ కా ర్డులు పంపిణీ చేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లావ్యాప్తంగా 706 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా, టీచర్లు 706 మంది ఉండాలి. ఇందులో కొన్ని ఖాళీలు ఉన్నాయి. ఈ విషయంపై జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారి వేణుగోపాల్రావు మాట్లాడుతూ, అంగన్ వాడీ టీచర్లకు ఈనెల 13న మొబైల్ఫోన్లు పంపిణీ చేస్తామన్నారు. 17, 18వ తేదీల్లో మహాసభలు పెద్దపల్లి : వరంగల్లో ఈనెల 17, 18వ తేదీల్లో దళిత హక్కుల పోరాట సమితి రెండో మహాసభలు నిర్వహిస్తామని సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తాళ్లపల్లి లక్ష్మణ్ అన్నారు. సుల్తానాబాద్ పట్టణంలో స్థానిక నాయకులతో కలిసి శుక్రవారం ఆయన మహాసభ ప్రచార పోస్టర్ ఆవిష్కరించి మాట్లాడా రు. సభలను విజయవంతం చేయాలని ఆయన కోరారు. నాయకులు పేరుక లక్ష్మణ్, పేరుక సతీశ్, క్యాదాసి రాజు, మోల్గూరి కల్యాణ్, ఇంజపురి దేవదాస్, కల్వల మహేశ్ తదితరులు పాల్గొన్నారు. -
ఖాళీ చేయించారు సరే..
పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రమైన పెద్దపల్లి పట్టణంలో జిల్లా గ్రంథాలయానికి ఆధునిక హంగులు జోడించి కొత్త భవనం నిర్మించేందుకు పాలకులు చర్యలు చేపట్టారు. స్థానిక ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ ఆవరణలోని ప్రభుత్వ భవనంలోనే ఇప్పటివరకు జిల్లా గ్రంథాలయం కొనసాగింది. అదేస్థలంలో రూ.6కోట్ల వ్యయంతో ఆధునిక హంగులతో సొంత భవనం నిర్మించేందుకు పాలకులు, అధికారులు సన్నద్ధమవుతున్నారు. పాత భవనం కూల్చివేత.. అద్దె భవనంలో లైబ్రరీ.. కొత్త భవన నిర్మాణం కోసం జిల్లా గ్రంథాలయాన్ని శాంతినగర్ ప్రాంతంలోని ఓ అద్దెభవనంలోకి ఇటీవల మార్చారు. కింది భవనంలో జిల్లా గ్రంథాల య సంస్థ కార్యాలయం ఉండగా, పైఅంతస్తులో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. సీనియర్ సిటిజ న్లు మెట్లు ఎక్కి పైకివెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారు. పాఠకులకు సౌకర్యంగా ఉండేల గ్రంథాలయసంస్థ పాలకమండలి, ప్రజాప్రతినిధులు దృష్టి సారించాలని పాఠకులు కోరుతున్నారు. కూలనున్న భవనం ఇదే.. జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బీ అతిథి గృహాన్ని ఆనుకుని ఉన్న భవనాన్ని కూల్చి అదేస్థలంలో రూ.6 కోట్ల వ్యయంతో బహుళ అంతస్తుల భవనం నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు గ్రంథాలయ సంస్థ అధికారులు తెలిపారు. ఈ భవనంలో మంత్రి శ్రీధర్బాబు, ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు సహకారంతో డిజిటల్ లైబ్రరీ తదితర సౌకర్యాలు కల్పిస్తారు. పోటీపరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు అనుకూలంగా అన్ని వసతులు కల్పించేలా దృష్టి సారిస్తామని జిల్లా గ్రంధాలయసంస్థ అధ్యక్షుడు అంతటి అన్నయ్యగౌడ్ తెలిపారు. వీలైనంత త్వరలోనే భవన నిర్మాణం ప్రారంభిస్తామని ఆయన వివరించారు. శాంతినగర్లోని అద్దెభవనంలో జిల్లా గ్రంథాలయంకొత్త భవన నిర్మాణం కోసం కూల్చివేసే పాత భవనం -
● సాదాబైనామాలకు ఎట్టకేలకు మోక్షం ● అమ్మకందారు అఫిడవిట్ ఎత్తివేత ● జిల్లావ్యాప్తంగా 35,323 అర్జీలు
సాక్షి పెద్దపల్లి: తెల్లకాగితంపై ఒప్పందం చేసుకొ ని(సాదాబైనామా) భూములు కొనుగోలు చేసిన వారి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా ప్రభు త్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. జిల్లాలో దాదాపు 70 నుంచి 90శాతం వరకు చిన్న, సన్నకారు రైతులు తాము సాగు చేస్తున్న భూములు త మవే అయినా వాటి స్వరూపం, క్రమబద్ధీకరణకాక నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ రాయితీలు, సంక్షేమ ఫలాలు, బ్యాంకు రుణాలు పొందలేకపోతున్నారు. రైతుబంధు సాయం, రైతుబీమా వర్తించడంలేదు. ధాన్యం కొనుగోలు సందర్భంలోనూ ఇబ్బందులు తప్పడంలేదు. భూవివాదాలకు ప్రధాన కారణమిదే.. సుమారు నాలుగైదు దశాబ్దాల క్రితం వ్యవసాయ భూములు, ఇళ్లస్థలాల క్రయ, విక్రయాలు తెల్లకాగితాలపైనే జరిగాయి. ఆ తర్వాత కొన్నాళ్లకు స్టాంపు పేపర్లపై ఒప్పందాలు రాసుకునేవారు. తమ పూర్వీ కులు ఇతరులకు భూముల విక్రయించినట్లు చిన్నకాగితం ఉన్నా వారి వారసులు ఆ భూముల జోలికి వెళ్లేవారు కారు. ఆ పరిస్థితులు ఇప్పుడు మారిపో యాయి. భూముల ధరలు పెరగడంతో రియల్ వ్యాపారం జోరందుకుంది. దీంతో రికార్డుల్లో తమ పేర్లు ఉన్నాయంటూ కొందరు వారసులు తిరగబడుతున్నారు. ఏళ్లతరబడి సాగు చేసుకుంటున్నామని, ఇప్పుడు వచ్చి ఆ భూములు తమవి అంటే ఎ లా అని బాధితులు లబోదిబోమంటున్నారు. ఇలా వివాదాలు ప్రారంభమవుతున్నాయి. అనేకమంది రైతులు నిత్యం ప్రభుత్వ కార్యాలయాలు, అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. తాజా నిబంధనల ప్రకారం.. తాజా నిబంధనలో కొనుగోలుదారు ఒకరే అఫిడవిట్ సమర్పిస్తే సరిపోతుంది. ఆ తర్వాత అర్జీలోని వివరాల ప్రకారం.. దరఖాస్తుదారు మోఖాపై ఉ న్నారా? లేరా? అని తహసీల్దార్ విచారణ చేస్తారు. సర్కారు, అసైన్డ్, అటవీ, పట్టాభూమి, విస్తీర్ణం తదితర వివరాలను పరిశీలించి పంచనామా చేస్తారు. నివేదికను ఆన్లైన్లో ఆర్డీవోకు పంపిస్తే ఆయన తిరస్కరించడమో, లేక ఆమోదించడమో చేస్తారు. దరఖాస్తును భూభారతి పోర్టల్లో నమోదు చేసి 30 రోజుల పాటు అభ్యంతరాల స్వీకరణ కోసం గడవు ఇస్తారు. గడువులోగా ఎవరైనా అభ్యంతరాలు వ్యక్తం చేస్తే ఆ భూమికి హక్కుల నమోదు ప్రక్రియను నిలిపివేస్తారు. దరఖాస్తుదారు సమర్పించే అఫిడివిట్లో సమాచారం తప్పుగా తేలితే చెల్లించిన ఫీజులు, స్టాంపు డ్యూటీ జప్తు చేయడంతోపాటు, క్రిమినల్ కేసు నమోదు చేస్తారు. దీంతో ఆరేళ్లుగా హక్కులు లేక సాగులోనే ఉన్న రైతులకు భూయజమాన్య హక్కులు పొంది పట్టాలు పొందేందుకు వీలు కలుగనుంది. సాదాబైనామా దరఖాస్తులు మండలం దరఖాస్తులు సర్వే నంబరు అంతర్గాం 903 1075 ధర్మారం 2,294 2685 ఎలిగేడు 1,215 1471 జూలపల్లి 1,220 1408 ఓదెల 3,557 4334 పాలకుర్తి 1,385 1523 పెద్దపల్లి 5,939 6822 రామగుండం 412 478 కాల్వశ్రీరాంపూర్ 5,670 6461 సుల్తానాబాద్ 3,556 4107 కమాన్పూర్ 532 655 మంథని 4,563 5211 ముత్తారం 2,834 3194 రామగిరి 1,243 1431 30 రోజుల్లో అభ్యంతరాలు లేకపోతే.. నాదాబైనామా నిబంధనల్లో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలోని 6(3) నిబంధన ప్రకారం.. భూహక్కుల కోసం దరఖాస్తు చేసే సమయంలో దరఖాస్తుదారుతోపాటు భూమి విక్రయించిన వ్యక్తి సైతం అఫిడవిట్ సమర్పించాల్సి ఉండేది. దీంతో క్షేత్రస్థాయిలో అనేక ఇబ్బందులు ఎదురై సమస్యలు అలాగే ఉండిపోయాయి. -
చలివేంద్రాలు ఏర్పాటు చేయండి
కోల్సిటీ(రామగుండం): రామగుండం నగరంలో చలివేంద్రాలు ఏర్పాటు చేయడానికి స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని బల్దియా కమిషనర్ అరుణశ్రీ కోరారు. వార్డు అధికారులతో శుక్రవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో కమిషనర్ మాట్లాడుతూ.. స్వచ్ఛంద సంస్థలు, వివిధ అసోసియేషన్ల సహకారంతో చలివేంద్రాలు ఏర్పాటు చేయడానికి చొరవ తీసుకోవాలన్నారు. ఎవరూ ముందుకు రానిచోట బల్దియా ద్వారా చలివేంద్రాలు ఏర్పాటు చేద్దామని అన్నారు. ఆస్తిపన్నుపై రాయితీ.. ఈనెల 30వ తేదీలోగా చెల్లించిన వారికి ఆస్తిపన్నుపై 5 శాతం రాయితీపై ప్రచారం కల్పించాలని అరుణశ్రీ అన్నారు. మొక్కలు నాటడానికి అనువైన ప్రాంతాల జాబితా ఇవ్వాలని కోరారు. ఇందిరమ్మ ఇళ్ల స్థలాలు కేటాయించిఉన్న వారిని ఎల్ –2 నుంచి ఎల్ –1 కేటగిరీలో చేర్చాలని అన్నారు. జనగణన హెచ్ఎల్బీ పూర్తి చేయాలని కోరారు. అమృతం యాప్లో నల్లా కనెక్షన్ వివరాలు అప్లోడ్ చే యాలని చెప్పారు. డిప్యూటీ కమిషనర్ వెంకటస్వా మి, ఎస్ఈ గురువీర, ఈఈ రామన్, అసిస్టెంట్ క మిషనర్ వెంకటేశ్వర్లు, ఏసీపీ శ్రీహరి పాల్గొన్నారు. -
శుక్రవారం శ్రీ 10 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
పరిసరాలను శుభ్రం చేస్తున్న ఉద్యోగులుభగ్గుమంటున్న భానుడుభానుడు భగ్గుమంటున్నాడు. రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇప్పుడే ఇలాఉంటే రానున్న ఎండలను ఊహించుకుని జంకుతున్నారు. ఉక్కపోతకు చిన్నా పెద్ద తేడా లేకుండా అల్లాడుతున్నారు. గురువారం ఎండ తీవ్రతకు పెద్దపల్లిలో వాహనదారులు అవస్థలు పడుతూ, పాదచారులు గొడుగు నీడన ప్రయాణాలు సాగిస్తూ ‘సాక్షి’కి కనిపించారు. కాగా, ఎండ తీవ్రతకు బస్టాండ్, అయ్యప్పగుడి, కూనారం చౌరస్తాల్లో సిగ్నల్స్ వద్ద వేచి ఉండేందుకు వాహనదారులు విసిగిపోయారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి -
పట్టుబడినా ఆగని అక్రమార్కులు
ఈఏడాది ఫిబ్రవరి 20న మంథని సబ్రిజిస్ట్రార్ ఆఫీస్పై ఏసీబీ అధికారులు దాడి చేసి సబ్రిజిస్ట్రార్ కసర్లి రాజేందర్ లంచం తీసుకుంటుండగా రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. అతడితో పాటు ప్రైవేట్ డ్యాక్యుమెంట్ రైటర్ ఎండీ రీషీద్ను కూడా అదుపులోకి తీసుకున్నారు. మంథని మండలం పుట్టపాక గ్రామానికి చెందిన రైతు కన్నూరి బాపు వద్ద భూమి రిజిస్ట్రేషన్ కోసం రూ.16,500 లంచం డిమాండ్ చేయగా, బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. అధికారులు ట్రాప్ చేసి పట్టుకున్నారు.● జిల్లాలో కొనసాగుతున్న ఏసీబీ దాడులు ● అయినా మారని అవినీతి తిమింగలాలుపెద్దపల్లి మండల అగ్రికల్చర్ అధికారి కార్యాలయంలో ఈఏడాది ఫిబ్రవరి 24న ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. స్పూరియస్ (నకిలీ) విత్తనాలు, యూరియా అక్రమ నిల్వ, స్టాక్ రిజిస్టర్లు అప్డేట్ చేయకపోవడం, ఫార్మ్ మెకనైజేషన్ అప్లికేషన్లు ఆలస్యం చేయడం వంటి అంశాలు బయటపడటంతో ఎంఓఏ అలివేణిని సస్పెండ్ చేశారు.తాజాగా గురువారం అంతర్గాం మండల తహసీల్దార్ కార్యాలయం ఆర్ఐ శ్రీమాన్, రాయదండి గ్రామానికి చెందిన మాచర్ల వెంకటస్వామి అనే సింగరేణి ఉద్యోగి నుంచి రూ.10వేలు లంచం డిమాండ్ చేశాడు. లంచం డబ్బులు ఇస్తున్న క్రమంలో ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. తండ్రి చనిపోతే తల్లిపేరుమీద ఽభూభారతిలో పేరు మార్చడానికి ఆరునెలలుగా తిప్పలు పెడుతుండడంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించగా వలపన్ని పట్టుకున్నారు. గోదావరిఖని(రామగుండం): పట్టుబడుతున్నా అక్రమార్కుల అవినీతి దందా ఆగడం లేదు. వచ్చిన జీతంతో సంతృప్తి చెందక బల్లకింద చేతులు చాపుతున్నారు. అవినీతి సొమ్ముకు అలవాటు పడిన ప్రభుత్వాధికారులు వరుసగా ఏసీబీ అధికారులకు చిక్కుతున్నారు. బాధితుల ఫిర్యాదుతో రంగంలో దిగుతున్న ఏసీబీ అధికారులు పక్కాస్కెచ్తో లంచావతారులను పట్టుకుంటున్నారు. వివిధ శాఖల్లోని అధికారులతో పాటు క్షేత్రస్థాయి సిబ్బందిపై వస్తున్న ఫిర్యాదులతో ప్రత్యేకంగా నిఘా పెడుతున్నారు. జిల్లాలో గడిచిన నాలుగునెలల్లో ఇలాంటి ఘటనలు మూడు జరిగాయి. అయినా ఏదో ఒక ప్రాంతంలో లంచావతారులు తమ విశ్వరూపం చూపిస్తూనే ఉన్నారు. అన్యాయంగా డబ్బులు డిమాండ్ చేస్తూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడుతున్నారు. ప్రధానంగా తహసీల్ కార్యాలయం, రిజిస్ట్రేషన్లశాఖ, మున్సిపల్ కార్యాలయాల్లో అవినీతి ఎక్కువగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈమేరకు ఆయా కార్యాలయాలపై దృష్టి సారించారు. ఈక్రమంలో నాలుగు నెలల్లో ముగ్గురు ఏసీబీకి చిక్కారు. పట్టుబడుతున్నా మారని తీరు.. బల్లకింద చేయిచాచడం, ఇష్టానుసారంగా దోచుకోవడం కొంతమంది అధికారుల నైజంగా మారింది. పనిచేయాలంటేనే చేతులు తడపాల్సి రావడంతో అడిగినంత చెల్లించలేక ఏసీబీని ఆశ్రయిస్తున్నారు. ఫిర్యాదు అందిన వెంటనే ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి అవినీతి తిమింగలాలను రెడ్హ్యాండెడ్గా పట్టుకుంటున్నారు. జిల్లాలో వరుస దాడులు జరుగుతున్నా లంచావతారుల్లో మాత్రం మార్పు రావడం లేదు. ఫిర్యాదు చేస్తే రంగంలోకి.. అవినీతి తిమింగలాలను పట్టుకునేందుకు ఏసీబీ శాఖ ప్రత్యేక టోల్ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసింది. ఎవరైనా ప్రభుత్వ అధికారులు చేయాల్సిన పని కోసం లంచం డిమాండ్ చేస్తే 1064టోల్ఫ్రీ నంబర్ కు ఫిర్యాదు చేయాలని కోరుతోంది. ఫిర్యాదుదారు ల వివరాలు గోప్యంగా ఉంచడంతో పాటు సత్వరమే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేస్తోంది.రెండేళ్లకోసారి.. అధికారుల తప్పుదారిరామగుండం: అంతర్గాం తహసీల్దార్ కార్యాలయంలో రెండేళ్లకోసారి అధికారులు ఏసీబీ చిక్కడం చర్చనీయాంశంగా మారింది. అంతర్గాం ప్రత్యేక మండలంగా ఆవిర్భవించిన ఎనిమిదేళ్లలో ఇద్దరు తహసీల్దార్లు, ముగ్గురు ఆర్ఐలు రెండేళ్లకు ఒకరు చొప్పున ఏసీబీకి చిక్కడం రెవెన్యూ అధికారుల అవినీతికి అద్దం పడుతోంది. ప్రధానంగా రెవెన్యూ రికార్డుల్లో పేర్లు మార్చడం, తప్పొప్పులను సవరించడం, భూముల హద్దు పంచాయితీలు, సర్వే పనులను అధికారులు నిస్వార్థంగా చేపట్టి అసలైన పట్టాదారులకు న్యాయం చేయాల్సి ఉండగా, సంపాదనే లక్ష్యంగా రెవెన్యూ అధికారులు సాధారణ ప్రజలను వేధిస్తున్నారు. 2022లో తహసీల్దార్, ఆర్ఐతో పాటు కార్యాలయ సహాయకుడు ఏసీబీ వలకు చిక్కగా, 2024లో మరో తహసీల్దార్, ఆర్ఐ, ప్రస్తుతం ఆర్ఐ ఏసీబీకి చిక్కడం స్థానికంగా చర్చనీయాంశమైంది. కాగా, ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో సైతం అధికారులు విపరీతంగా లంచాలు వసూలు చేస్తున్నట్లు స్థానికంగా చర్చించుకుంటున్నారు. ప్రభుత్వ పథకాల కోసం లబ్ధిదారులకు సంబంధించి వివిధ రకాల ధ్రువీకరణపత్రాలు, ఇతర ఉద్యోగాలకు అందించే క్లియరెన్స్ పత్రాలకు సంబంధిత శాఖల అధికారులు భారీ అవినీతికి పాల్పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. -
ఆర్టిజన్ల సేవలను గుర్తించని ప్రభుత్వం
రామగుండం: ఆర్టిజన్ కార్మికుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించడం సరికాదని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీ కార్మిక నేత కౌశికహరి మండిపడ్డారు. మల్యాలపల్లి సబ్స్టేషన్ వద్ద నిరవధిక సమ్మె చేస్తున్న ఆర్టిజన్లకు గురువారం సంఘీభావం ప్రకటించారు. తమ గోడును రాష్ట్ర ప్రభుత్వానికి వివిధ రకాలుగా వినిపించినా నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తూనే ఉందని తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్స్ ఎంప్లాయీస్ జేఏసీ ఉమ్మడి జిల్లా కన్వీనర్ తూళ్ళ నాగరాజు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలోకి రాగానే ఆర్టిజన్ల డిమాండ్లను పరిష్కరిస్తామని హామీ ఇచ్చి తుంగలో తొక్కారన్నారని విమర్శించారు. ఆర్టిజన్లు చేపట్టే వివిధ రకాల ఆందోళన కార్యక్రమాలకు బీఆర్ఎస్ మద్దతుగా ఉంటుందని చందర్ స్పష్టం చేశారు. కొంకటి శ్రీనివాస్, వడ్డెపల్లి సురేశ్, ఆవుల మహేశ్, మాటూరి రవీందర్, మల్లారపు ప్రభాకర్, రవి, ధర్మానాయక్, లగిశెట్టి మధు, జ్యోతి, కాటం రమేశ్ తదితరులున్నారు.


