breaking news
Peddapalli
-
మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి
పెద్దపల్లిరూరల్: మహిళలకు మెరుగైన ఆరోగ్యసేవ లు అందించేందుకు స్వస్థ్నారీ స్వశక్త్ పరివార్ అభియాన్ అమలు చేస్తున్నామని కలెక్టర్ శ్రీహర్ష, ఎంపీ వంశీకృష్ణ అన్నారు. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో బుధవారం పథకం ప్రారంభించి మాట్లాడారు. మహిళ లు ఆరోగ్యంగా ఉంటే ఆ కుటుంబం సంతోషంగా ఉంటుందన్నారు. డీఎంహెచ్వో వాణిశ్రీ, సూపరింటెండెంట్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.గోపాలమిత్రలకు సన్మానం గోపాలమిత్రల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడిగా వునుకొండ శ్రీధర్, అధ్యక్షుడిగా కల్వల శ్రీనివాస్ను నియమించగా.. వారిని ఎంపీ సన్మానించారు. పాడిరైతులకు అండగా ఉండాలని సూచించారు. -
కలెక్టరేట్లో విశ్వకర్మ జయంతి
పెద్దపల్లిరూరల్: విరాట్ విశ్వకర్మ యజ్ఙమహోత్సవ్ను కలెక్టరేట్లో బుధవారం ఘనంగా నిర్వహించారు. విశ్వకర్మ చిత్రపటం వద్ద మైనారిటీస్ ఫైనా న్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబెదుల్లా కొత్వాల్ సాహె బ్, కలెక్టర్ కోయ శ్రీహర్ష, ఎమ్మెల్యే విజయరమణారావు.. అడిషనల్ కలెక్టర్లు అరుణశ్రీ, వేణుతో కలిసి ప్రత్యేకపూజలు చేశారు. ప్రభుత్వాదేశాలతో విశ్వకర్మ ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తున్నామ ని కలెక్టర్ శ్రీహర్ష తెలిపారు. విశ్వకర్మ జయంతి సందర్భంగా సెలవు ప్రకటించాలని సంఘం జిల్లా అ ధ్యక్షుడు కట్ట రాజానందం, నాయకులు కోరారు. బీసీ సంక్షేమశాఖ అధికారి రంగారెడ్డి పాల్గొన్నారు. -
ఎన్టీపీసీలో విశ్వకర్మ జయంతి
జ్యోతినగర్(రామగుండం): రామగుండం ఎన్టీపీసీ – తెలంగాణ ప్రాజెక్టులో బుధవారం శ్రీవిశ్వకర్మ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీపీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఈడీ) చందన్కుమార్ సామంత ప్రత్యేక పూ జలు చేశారు. అనంతరం సుమారు 2వేల మంది కార్మికులకు ప్రసాదం పంపిణీ చేశారు. కా ర్యక్రమంలో జనరల్ మేనేజర్లు ముకుల్ రా య్, మనీశ్అగర్వాల్, అవిజిత్ దత్తా, బినోయ్జోస్, అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.సైబర్ నేరాలపై అవగాహన అవసరంజ్యోతినగర్(రామగుండం): సైబర్ నేరాలపై ప్రజలను అప్రమత్తం చేసేందుకు అంగన్వాడీ టీచర్లు బాధ్యతగా వ్యవహరించాలని సైబర్ క్రై మ్ ఎస్సై కృష్ణమూర్తి సూచించారు. ఎన్టీపీసీ మిలీనియం హాల్లో బుధవారం ఏర్పాటు చే సిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడా రు. అనుమాతులు ఫోన్కాల్ చేస్తే బ్యాంక్, ఆ ధార్ తదితర వివరాలు తెలియజేయవద్దన్నా రు. ఓటీపీ, ఓఎల్ఎక్స్, పేటీఎం, ఫోన్ పే, గూ గుల్ పే, ఈ కేవైసీ అప్డేట్ తదితర సమాచా రం అడిగినా సమాధానం ఇవ్వొద్దని ఆయన సూచించారు. సైబర్ నేరాల బారినపడితే వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్చేసి ఫిర్యా దు అందించాలని ఆయన కోరారు. అంగన్వాడీ టీచర్ల అసోసియేషన్ జిల్లా కో ఆర్డినేటర్ అనిల్, రామగుండం ప్రాజెక్ట్ సీడీపీవో అలేఖ్య పటేల్ తదితరులు పాల్గొన్నారు. వైద్య సిబ్బందికి టీకాలు పెద్దపల్లిరూరల్: జిల్లా ప్రధాన ఆస్పత్రిలో బుధవారం వైద్యసిబ్బందికి హైపటైటిస్– బీవ్యాధి నిరోధక టీకాలు వేశారు. ఈవ్యాధితో రక్తం, శరీరద్రవ్యాలు వ్యాప్తి చెందుతాయని డీఎంహెచ్వో వాణిశ్రీ, సూపరింటెండెంట్ శ్రీధర్ అన్నా రు. జీరో డోస్ తీసుకున్నాక నెలకు ఒక డోస్, ఆరునెలల తర్వాత రెండోడోస్ తీసుకోవాలని వారు సూచించారు. ప్రోగ్రాం అధికారి కిరణ్, ఆర్ఎంవో విజయ్, నర్సింగ్ సూపరింటెండెంట్ జమున తదితరులు పాల్గొన్నారు.బీజేపీ జిల్లా కార్యవర్గంలో పలువురికి చోటు సుల్తానాబాద్(పెద్దపల్లి): బీజేపీ జిల్లా కార్యవర్గంలో పలువురికి చోటు కల్పించినట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి బుధవారం తెలిపారు. ఉపాధ్యక్షులుగా అమరగాని ప్రదీప్ కుమార్, ముస్కూల భాస్కర్రెడ్డి, శనిగరపు రమేశ్, సౌదరి మహేందర్, మచ్చగిరి రాము, కాసాగోని నిర్మలగౌడ్, ప్రధాన కార్యదర్శులు గా కోమల మహేశ్ కుమార్, పల్లె సదానందం, కడారి అశోక్రావు, కార్యదర్శులుగా సో మా రపు లావణ్య, బిరుదు గట్టయ్య, మోటం న ర్సింగం, గర్రెపల్లి నారాయణస్వామి, దాడి సంతోష్, శివంగారి సతీశ్, కోశాధికారిగా కామని రాజేంద్రప్రసాద్ను నియమించామన్నారు. ఆ ఫీస్ కార్యదర్శిగా ఎస్ఎంసీ వనజ, సోషల్ మీ డియా ఇన్చార్జిగా కుమ్మ వెంకటకృషష్ణ, మీ డియా కన్వీనర్గా వెన్నంపల్లి శ్రీనివాస్రావు, ఐటీ ఇన్చార్జిగా అక్కపల్లి క్రాంతిని నియమించామన్నారు. ఈ సందర్భంగా విలేకరులతో సంజీవరెడ్డి మాట్లాడుతూ, బీజేపీని మరింత బలోపేం చేసి వచ్చే అసంబ్లీ ఎన్నికల్లో విజ యమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. కబడ్డీపోటీలకు ఎంపిక ఎలిగేడు(పెద్దపల్లి): స్థానిక జెడ్పీ హైస్కూల్ విద్యార్థిని మీనుగు భూలక్ష్మి రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికై నట్లు హెచ్ఎం దేవేందర్రావు బుధవారం తెలిపారు. జిల్లా కేంద్రంలో ఇటీవల జరిగిన సబ్ జూనియర్ కబడ్డీ ఎంపిక పో టీల్లో భూలక్ష్మి ప్రతిభ చూపిందన్నారు. ఈనెల 25న నిజామాబాద్లో నిర్వహించే రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ కబడ్డీ పోటీల్లో ఆమె పాల్గొంటుందని పేర్కొన్నారు. బాలికను హెచ్ఎం, ఉపాధ్యాయులతోపాటు ఫిజికల్ డైరెక్టర్ ప్రణయ్కుమార్, గ్రామస్తులు అభినందించారు. -
అభివృద్ధి..సంక్షేమమే ధ్యేయం
పెద్దపల్లిరూరల్: అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సారథ్యంలోని ప్రజాప్రభుత్వం పాలన సాగిస్తోందని మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మహమ్మద్ ఒబెదుల్లా కొత్వాల్ సాహెబ్ అన్నారు. కలెక్టరేట్లో బుధవారం నిర్వహించిన తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంలో కలెక్టర్ కోయ శ్రీహర్ష, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు, అడిషనల్ కలెక్టర్లు అరుణశ్రీ, వేణుతో కలిసి ఆయన పాల్గొన్నారు. డీసీ పీ కరుణాకర్ ఆధ్వర్యంలో పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జాతీయ జెండా ఆవిష్కరించి మాట్లాడారు. ఆరు గ్యారంటీల అమలు.. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే పదేళ్లపాటు పాలించిన తొలిపాలకుల తీరుతోనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారిందని కొత్వాల్ విమర్శించారు. అయినా ఆరు గ్యారంటీల అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని అన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్ర యాణం, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రూ. 500కే సిలిండర్, గృహజ్యోతి ద్వారా ఉచిత విద్యుత్ తదితర పథకాలు అందిస్తున్నట్లు వివరించారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు సీఎం రేవంత్రెడ్డి చిత్తశుద్ధితో ఉన్నారని ఒబెదుల్లా కొత్వాల్ అన్నారు. ఇందుకోసం కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఢిల్లీలో నిరసన చేపట్టారని ఆయన గుర్తుచేశారు. ఎస్సీ వర్గీకరణకు ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకుందన్నారు. జిల్లాలో ఆయకట్టు స్థిరీకరణ జిల్లా రైతులకు సాగునీటి ఇబ్బందులు రాకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని మహ్మద్ ఒబెదుల్లా కొత్వాల్ అన్నారు. 2 లక్షల 30 వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరించి, 10వేల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరందించేలా శ్రీలక్ష్మీనర్సింహాస్వామి పత్తిపా క రిజర్వాయర్ను 3 టీఎంసీల నుంచి 5 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తున్నామని అన్నారు. రూ.కోటి 10 లక్షలను డీపీఆర్ తయారీకి మంజూరు చేసిన ట్లు ఆయన తెలిపారు. 13 వేల 396 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ చేసే రామగుండం ఎత్తిపోతల పెండింగ్ పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వివరించారు. అర్హులందరికీ రేషన్కార్డులు, సన్నబియ్యం.. అర్హులైన పేదలు పదేళ్లుగా రేషన్కార్డుల కోసం ఎదురుచూసి విసిగిపోయారని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక జిల్లాలో 12,168మందికి రేషన్కార్డులు అందించామని ఒబెదుల్లా కొత్వాల్ తెలిపారు. ప్రభుత్వ ఖజానాపై భారం పడుతున్నా ఉగాది పండుగ నుంచి సన్నబియ్యం పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల ఆధునికీకరణ ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించేందు కు జిల్లా ప్రధాన ఆస్పత్రిని రూ.52కోట్లతో ఆధునికీకరిస్తున్నామని ఒబెదుల్లా తెలిపారు. గోదావరిఖని జనరల్ ఆస్పత్రిని రూ.160కోట్లతో నిర్మిస్తన్నామన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా అందించే సేవలను రూ.5లక్షల నుంచి రూ.10లక్షల వరకు ప్రభుత్వం పెంచిందని ఆయన తెలిపారు. పెద్దపల్లిలో 100 పడకలు, మంథనిలో 50 పడకలు ఆస్పత్రుల నిర్మాణం పురోగతిలో ఉందన్నారు. రూ.173కోట్లతో అభివృద్ధి పనులు జిల్లాలో రూ.173 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులు పురోగతిలో ఉన్నాయని కొత్వాల్ అన్నారు. ఇందులో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, బీటీ రోడ్లు ఉన్నాయన్నారు. మత్స్యకారులు, మహిళా సంఘా లు ఆర్థికాభ్యున్నతి సాధించేలా రాయితీ రుణాలు అందిస్తున్నామని ఆయన వివరించారు. ఆర్డీవో గంగయ్య, కలెక్టరేట్ ఏవో శ్రీనివాస్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అన్నయ్యగౌడ్తోపాటు వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. వేడుకలకు హాజరైన ప్రముఖులుపోలీసుల గౌరవ వందనంమాట్లాడుతున్న మహ్మద్ ఒబెదుల్లా కొత్వాల్రామగుండం సీపీ కార్యాలయంలో.. -
స్వేచ్ఛావాయువులు పీల్చుకున్న రోజు..
గోదావరిఖని: నిజాం నిరంకుశ పాలన నుంచి స్వేచ్ఛావాయువులు పీల్చుకున్న రోజును తెలంగాణ ప్రజాపాలన దినంగా నిర్వహిస్తున్నామని సింగరేణి ఆర్జీ –వన్ జీఎం లలిత్కుమార్ అన్నారు. గోదావరిఖనిలోని ఆర్జీ – వన్ జీఎం కార్యాలయంలో ప్రజాపాలన దినోత్సవం నిర్వహించగా, జీఎం జాతీయ జెండా ఎగురవేసి మాట్లాడారు. ఐఈడీ ఏజీఎం ఆంజనేయులు, క్వాలిటీ అధికారి బ్రహ్మాజీ, సెక్యూరిటీ అధికారి వీరారెడ్డి, సర్వే డీజీఎం జీఎల్రాజు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఆర్జీ–2 ఏరియాలో జరిగిన కార్యక్రమంలో ఎస్వోటూ జీఎం రా ముడు, ఐఈడీ డీజీఎం మురళీకృష్ణ, సివిల్ డీజీఎం ధనుంజయ్, ఏరియా రక్షణాధికారి సంతోష్కుమార్, ఎస్టేట్ అధికారి సునీత, పర్సనల్అధికారి సాధన్ తదితరులు పాల్గొన్నారు. -
స్వచ్ఛతా హీ సేవలో భాగస్వాములు కావాలి
కోల్సిటీ(రామగుండం): స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా బుధవారం నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు చేపట్టే స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాల్లో అందరూ భాగస్వాములు కావాలని రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్ అరుణశ్రీ కోరారు. బల్దియా కార్యాలయంలో బుధవారం ప్రజాపాలన సందర్భంగా జాతీయ పతాకం ఎగురవేసి మాట్లాడారు. నిజాం పాలన నుంచి తెలంగాణ విముక్తి పొందిన రోజు సందర్భంగా ప్రజాపాలన దినోత్సవంగా జరుపుకుంటున్నామన్నారు. పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు రెండువారాల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అనంతరం పచ్చజెండా ఊపి స్వచ్ఛతా హీ సేవా ర్యాలీ ప్రారంభించారు. డిప్యూటీ కమిషనర్ వెంకటస్వామి, అసిస్టెంట్ కమిషనర్ వెంకటేశ్వర్లు, కార్యదర్శి ఉమామహేశ్వర్రావు, ఈఈ రామన్, అకౌంట్స్ ఆఫీసర్ రాజు, టీపీఎస్ నవీన్, సూపరింటెండెంట్ శ్రీనివాస్, ఆర్ఐ శంకర్రావు, శానిటరీ ఇన్స్పెక్టర్ శంకర్రావు, ఎన్విరాన్మెంట్ ఇంజినీర్ మధుకర్, మెప్మా టీఎంసీ మౌనిక పాల్గొన్నారు. -
రక్తదానంతో మరొకరికి ప్రాణదానం
సుల్తానాబాద్(పెద్దపల్లి): రక్తదానం ద్వారా మరొక రికి ప్రాణదానం చేసిన వారవుతారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి, సేవా పక్వాడ జిల్లా క న్వీనర్ నల్ల మనోహర్రెడ్డి అన్నారు. ప్రధానమంత్రి మోదీ జన్మదినం సందర్భంగా రెడ్క్రాస్ సొసైటీ ఆ ధ్వర్యంలో స్థానిక ఆర్యవైశ్య భవనంలో బుధవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. సంజీవరెడ్డి, మనోహర్రెడ్డి శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. దేశా న్ని అన్నిరంగాల్లో తీర్చిదిద్దిన ఘనత ప్రధాని మో దీకే దక్కుతుందన్నారు. అంతకుముందు పట్టణంలోని పూసాల రోడ్డులో తెలంగాణ విమోచన దినోత్సవం జరిపారు. నాయకులు కందుల శ్రీనివాస్, మీస అర్జున్రావు, కడారి అశోక్రావు, సౌదరి మ హేందర్యాదవ్, కామని రాజేంద్రప్రసాద్, చింతల లింగారెడ్డి, రఘుపతిరావు, చాతరాజు రమేశ్, గుంటి కుమార్, కోట నాగేశ్వర్, ఎళ్లేంకి రాజు, కొల్లూరి సంతోష్ కుమార్, కందునూరి కుమార్, గుడ్ల వెంకటేశ్, సతీశ్, సమ్మిరెడ్డి పాల్గొన్నారు. 2 వరకు సేవా కార్యక్రమాలు పెద్దపల్లిరూరల్: ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా అక్టోబర్ 2వ తేదీవరకు వివిధ సేవా కార్యక్రమాలు చేపడతామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి, సేవా పక్వాడ కన్వీనర్ నల్ల మనోహర్రెడ్డి తెలిపారు. మోదీ జన్మదినం సందర్భంగా జిల్లా కేంద్రంలో కేక్కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశా రు. రెడ్క్రాస్ సొసైటీ రక్తదాన శిబిరం నిర్వహించా రు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ దేశాన్ని అన్నిరంగాల్లో ముందుకు తీసుకుపోతున్నారన్నారు. కార్యక్రమంలో నా యకులు రాకేశ్, పల్లె సదానందం, అశోక్రావు, ప్ర దీప్, నిర్మల, శివంగారి సతీశ్, నర్సింగం, నారాయణస్వామి, చిలారపు పర్వతాలు, క్రాంతి, సంపత్, దిలీప్, రాజగోపాల్, మహంతకృష్ణ, సురేందర్, ఉమేశ్, రాజవీరు, హరీశ్ తదితరులు పాల్గొన్నారు. -
నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యం
● మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ ధర్మారం(ధర్మపురి): ధర్మపురి నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. ఇటీవల మృతి చెందిన మార్కెట్ యార్డులోని హమాలీ మెడవేని రాజేశంకు మార్కెటింగ్శాఖ ద్వారా మంజూరైన రూ.లక్ష విలువైన చెక్కును మృతుడి కుటుంబసభ్యులకు బుధవారం మంత్రి అందజేసి మాట్లాడా రు. మార్కెట్లో అదనపు షెడ్ నిర్మాణానికి రూ.1.40కోట్లు, యార్డు చదును చేసేందుకు మరో రూ.28 లక్షలు, ధర్మారం మెడవేనివాడ – ఎండపల్లిక్రాస్ రోడ్డు వరకు బైపాస్ నిర్మాణానికి రూ.3.20కోట్లు మంజూరైనట్లు ఆయన వివరించారు. వీటితోపాటు వివిధ అభివృద్ధి పనులకు అవసరమైన నిధులు మంజూరు చేయించిన ఘనత తనదేనని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ లావుడ్య రూప్లానాయక్, వైస్ చైర్మన్ అరిగే లింగయ్య, మాజీ వైస్ చైర్మన్ పాలకుర్తి రాజేశంగౌడ్, డైరెక్టర్లు బద్దం గంగారెడ్డి, కాంపెల్లి రాజేశం, అల్వాల రాజేశం, కోల శ్రీనివాస్, గందం మహిపాల్, జనగామ తిరుపతి, ఈదుల శ్రీనివాస్, ఎలగందుల అశోక్, నాయకులు ఓరం చిరంజీవి, కాంసాని ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు. -
లక్ష్యానికి మించి బొగ్గు ఉత్పత్తి
● సింగరేణిలోనే ద్వితీయస్థానం ● దూకుడు పెంచిన ఆర్జీ–2 ఏరియా గోదావరిఖని: వార్షిక బొగ్గు ఉత్పత్తి లక్ష్య సాధనలో సింగరేణిలోని ఆర్జీ–2 ఏరియా దూకుడుగా ముందుకు సాగుతోంది. సంస్థలోనే అతిపెద్ద ఓసీపీ–3 ఉత్పత్తి సాధనలో అగ్రస్థానంలో ఉంది. ఓబీ వెలికితీత, బొగ్గు ఉత్పత్తి, రవాణాలో ముందుకు సాగుతోంది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో ఆగస్టు చివరి నాటి 129 శాతం బొగ్గు ఉత్పత్తి నమోదుచేసి సింగరేణిలోనే నంబర్వన్గా నిలిచింది. ఉత్పత్తి లక్ష్య సాధనకు ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తోంది. ఇదేసమయంలో ఉద్యోగులను అప్రమత్తం చేస్తోంది. రక్షణ, ఉత్పత్తిపై ప్రత్యేక దృష్టి సారించడంతో లక్ష్య సాధన సులభమవుతోంది. స్థితిగతులను వివరిస్తూ.. సింగరేణి సంస్థ స్థితిగతులను ఉద్యోగులకు వివరిస్తూ లక్ష్య సాధనలో కార్మోన్ముఖులను చేయడంలో అధికారులు విజయం సాధించారు. దీంతో బొగ్గు వెలికితీయడంతో సంస్థలోనే ఆర్జీ–2 ఏరియా నంబర్వన్గా నిలిచింది. ప్రాజెక్టులోని ప్రైవేట్ ఓబీ కంపెనీల్లో మట్టి వెలికితీత లక్ష్యానికి అనుగుణంగా ముందుకు సాగడం, డిపార్ట్మెంట్ పరంగా ఉత్ప త్తి, ఓబీ వెలికితీత పెరగడంతో బొగ్గు ఉత్పత్తి లక్ష్యానికి అడ్డంకి లేకుండా పోయింది. అంతేకాకుండా డిపార్ట్మెంటల్ ఓబీ, బొగ్గు వెలికితీత కోసం భారీ యంత్రాలను యాజమాన్యం కొనుగోలు చేసింది. దీంతో ఉత్పత్తికి అనుకూల మార్గాలు ఏర్పడ్డాయి. వకీల్పల్లి గని కూడా ఉత్పత్తిలో దూసుకుపోతోంది. ఏరియాలోని ఓసీపీ–3, వకీల్పల్లి గనులు పోటాపోటీగా ఉత్పత్తి చేస్తూ లక్ష్య సాధనలో పాలుపంచుకుంటున్నాయి. ఆదినుంచీ దూకుడుగానే.. ఆర్జీ–2 ఏరియా బొగ్గు ఉత్పత్తి లక్ష్య సాధనలో ఆదినుంచీ దూకుడుగానే సాగుతోంది. గత ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు నిర్దేశిత లక్ష్యానికి మించి 129 శాతం బొగ్గు ఉతత్తి చేసింది. వర్షాలు కురిసి.. తెరిపి ఇవ్వగానే ఉత్పత్తిని వేగవంతం చేస్తోంది.నెల వారీగా..(టన్నుల్లో) నెల లక్ష్యం సాధించింది శాతం ఏప్రిల్ 2,28,400 4,99,986 218 మే 5,29,000 7,05,271 133 జూన్ 5,50,000 7,20,574 131 జూలై 6,80,500 7,31,703 107 ఆగస్టు 5,78,400 6,44,656 111 -
అతడికి 22, ఆమెకు 35.. పోలీస్ స్టేషన్కు చేరిన పంచాయతీ
పెద్దపల్లి జిల్లా: సుల్తానాబాద్ మండలం చిన్నకల్వలకు చెందిన ఓ మహిళకు పెద్దపల్లి మండలం అప్పన్న పేటలో నివసించే అరవింద్తో స్నాప్ చాట్లో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా కొన్నాళ్లకు ప్రేమగా మారింది. అయితే అతడికి 22, ఆమెకు 35 సంవత్సరాలు. అంతే కాదు ఆమె ఓ వివాహిత. తనకు 12 సంవత్సరాల వయసున్న పిల్లలు కూడా ఉన్నారు.వీరి ప్రేమ వ్యవహారం క్రమంగా వివాహేతర సంబంధంగా మారింది. విషయం తెలియడంతో భార్యను ఇంటి నుంచి గెంటేశాడు ఆ మహిళ భర్త. ఏం చేయాలో పాలుపోక ప్రియుడు అరవింద్ ఇంటి ముందు బైఠాయించి పెళ్లి చేసుకోవాలని వేడుకున్న ప్రియురాలు. 12 సంవత్సరాల వయసు గల పిల్లలున్న మహిళతో పెండ్లి ఎలాగని తలలు పట్టుకుంటున్న అరవింద్ కుటుంబ సభ్యులు. ఇరు కుటుంబాల్లో చిచ్చు పెట్టిన స్నాప్ చాట్ వ్యవహారం. పోలీస్ స్టేషన్కు చేరిన స్నాప్ చాట్ ప్రేమ పంచాయతీ. ఇరు కుటుంబాలను కౌన్సిలింగ్ కోసం పోలీస్ స్టేషన్కు తరలించిన పోలీసులు -
‘పుట్ట’ ఇంటి ఎదుట కాంగ్రెస్ ధర్నా
● శ్రీపాదరావు, శ్రీధర్బాబుపై వ్యాఖ్యలకు నిరసన మంథని: మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ఇంటి ఎదుట కాంగ్రెస్ నాయకులు మంగళవారం ధర్నా చేశారు. దివంగత మాజీ స్పీకర్ శ్రీపాదరావు, మంత్రి శ్రీధర్బాబుపై పుట్ట మధు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఆందోళనకు దిగారు. రాజకీయ భిక్ష పెట్టిన శ్రీపాదరావుపై వ్యాఖ్యలు చేస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దుద్దిళ్ల కుటుంబానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆ సమయంలో మధు ఇంట్లో లే రు. ఆయన భార్య, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ పు ట్ట శైలజ ఇంట్లో బయటకు వచ్చి మాట్లాడారు. రెండు గంటలకుపైగా తన ఇంటిఎదుట ధర్నా చేస్తుంటే పోలీసులు చూస్తూ ఊరుకుంటారా? అంటూ ఆ గ్రహం వ్యక్తం చేశారు. పోలీసులే దగ్గరుండి ధర్నా చేయిస్తారా? అని ప్రశ్నించారు. ఈ క్రమంలో స్పల్ప ఘర్షణ చోటుచేసుకుంది. పోలీసులు బీఆర్ఎస్ శ్రే ణులను అక్కడినుంచి పంపించి వేశశారు. అనంతరం అంబేడ్కర్, శ్రీపాదరావు విగ్రహాలకు క్షీరాభిషేకం చేశారు. కాసేపటి తర్వాత పుట్ట మధు స్థానిక ప్రధాన చౌరస్తాలోని ఓ దుకాణంలో కూర్చుకున్నారు. బీఆర్ఎస్ శ్రేణులు నిరసన తెలుపుతారేమోననే అనుమానంతో ప్రధాన చౌరస్తాతో పాటు ప్రధాన కూడళ్లలో పోలీసులు భారీగా మోహరించారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఐలి ప్రసాద్, విద్యుత్ నియంత్రణ మండల సలహా కమిటీ సభ్యుడు శశిభూషణ్ కాచే, మార్కెట్ కమిటీ చైర్మన్ కుడుదుల వెంకన్న, సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్, నాయకులు ఎరుకల ప్రవీణ్, కొండ శంకర్, ఆరెల్లి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. అంబేడ్కర్ విగ్రహావిష్కరణ తప్పా? కమాన్పూర్ మండలం పెంచికల్పేటలో అంబే డ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం పుట్ట మధు చేసిన తప్పా? అని మున్సిపల్ మాజీ చైర్పర్సన్ పుట్ట శైలజ ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడవక ముందే దాడులకు దిగుతారా? అని నిలదీశారు. కాంగ్రెస్ నాయకులు తమ ఇంటిపై దాడికి పూనుకున్నారని పుట్ట శైలజ ఎస్సైకి ఇచ్చిన ఫిర్యా దులో పేర్కొన్నారు. పుట్ట మధును చంపడానికి ప్రయత్నించారని అందులో పేర్కొన్నారు. -
ఆరోగ్యశ్రీ నిలిపివేయడం బాధాకరం
నిరుపేదలకు మెరుగైన వైద్య చికిత్సలు అందించేందుకు ప్రారంభించిన ఆరోగ్యశ్రీ పథకం నిలిపివేయడం బాధాకరం. డబ్బులు చెల్లించి వైద్యం చేయించుకోలేని నిరుపేదలు చాలా ఇబ్బంది పడతారు. ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. బకాయిలను కూడా విడుదల చేసి ఆస్పత్రులకు చేయూత ఇవ్వాలి. – బి.రాజాకిషన్గౌడ్, కరీంనగర్ బకాయిల భారం పెరగడంతోనే.. ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తు న్న ఆసుపత్రులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన బ కాయిలు పెరిగిపోయాయి. నిర్వహణ భారంగా మారింది. వేతనాలు, మెయింటెనెన్స్ కష్టంగా మారడంతోనే ఉమ్మడి జిల్లా ఆసుపత్రుల యాజమాన్యాలు సమష్టిగా ఆలోచన చేసి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేసే నిర్ణయం తీసుకున్నాం. – విష్ణువర్ధన్రెడ్డి, ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల అధ్యక్షుడు, ఉమ్మడి జిల్లా -
విస్తరిస్తున్న క్షయ!
● మధ్యలో మందులు మానేస్తున్న పేషెంట్ల ● చిన్న పిల్లల్లోనూ బయటపడుతున్న వ్యాధి లక్షణాలుసాక్షి, పెద్దపల్లి: జిల్లాలో క్షయ చాపకింద నీరులా విస్తరిస్తోంది. వయోవృద్ధుల నుంచి చిన్నపిల్లల వరకూ వ్యాధి బారిన పడుతున్నారు. గతంలో 50 ఏళ్లకు పైబడిన వారే టీబీ బారిన పడుతుండే వారు. మారుతున్న జీవన విధానం, తగ్గుతున్న వ్యాధి నిరోధకశక్తితో కొన్నేళ్లుగా చిన్నారులు కూడా క్షయ పీడితులవుతున్నారు. బాధితుల్లో కొంతమంది మధ్యలో చికిత్స ఆపేస్తుండడంతో వ్యాధి మళ్లీ తిరగబెడుతోందంటున్నారు. తర్వాత ముదిరి మొండిగా మారి ప్రాణాలు తీస్తోంది. క్షయ నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నా పూర్తిస్థాయిలో నిరోధించలేకపోతున్నాయి. క్షయబారిన 87 మంది చిన్నారులు జిల్లాలో గత నాలుగేళ్లలో 4,805 మంది క్షయ బారినపడగా, అందులో 87 మంది చిన్నారులు ఉండడం ఆందోళన కలిగిస్తోంది. శిశువు పుట్టిన 24 గంటల్లోపు క్షయను నివారించే బీసీజీ టీకా ఇస్తారు. లేదా పుట్టిన రెండేళ్లలోపు ఎప్పుడైనా టీకా ఇప్పించవచ్చు. పుట్టే శిశువుల్లో దాదాపు 99 శాతం మందికి బీసీజీ ఇస్తున్నట్లు అధికారిక గణాంకాలు చెబుతుండగా.. క్షయ బాధిత పిల్లలు ఇంకా ఉండడమేమిట న్నది జవాబులేఇ ప్రశ్నగా మారింది. ప్రభుత్వ, ప్రై వేట్ ఆస్పత్రులతోపాటు ఇళ్లవద్ద కాన్పు జరిగిన శి శువులకు కచ్చితంగా బీసీజీ టీకా అందించేలా సర్కార్ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. చాపకింద నీరులా.. జిల్లాలో క్షయ నిర్మూలన కోసం అధికారులు క్షేత్రస్థాయిలో క్రమం తప్పకుండా వైద్యశిబిరాలు నిర్వహిస్తూ వ్యాధిగ్రస్తులను గుర్తించి, చికిత్స అందిస్తున్నారు. అయినా కేసులు తగ్గుముఖం పట్టడం లే దు. వేళకు మందులు వేసుకోవడం, పౌష్టికాహారం తీసుకోవడం, డాక్టర్ల సూచనల మేరకు నడక, వ్యా యామం చేయడం వంటివి క్రమం తప్పకుండా చే సిన వారు చాలావరకు ఆరోగ్యవంతులుగా మారుతున్నారు. మరికొందరు రెండు, మూడు నెలల్లో వ్యాధి లక్షణాలు తగ్గగానే మందులు మానేస్తున్నారు. దీంతో చాలామందిలో వ్యా ధి తిరగబెడుతోంది. తీవ్రత ఆధారంగా డ్రగ్ సెన్సిటివ్ టీబీ, డ్రగ్ రెసిస్టెంట్ టీబీ గా విభజించారు. డ్రగ్ సె న్సిటివ్ టీబీకి ఆరునెలల పాటు చికిత్స తీసుకోవాల్సి ఉండగా, డ్రగ్ రెసిస్టెంట్ టీబీకి వ్యాధి తీవ్రత ఆధారంగా ఆరు నెలల నుంచి 18 నెలల వరకు చికిత్స తీసుకోవాల్సి ఉంటుందని వైద్యనిపుణులు చెబుతున్నారు. వ్యాధి లక్షణాలివే.. క్షయ ఒక అంటువ్యాధి. పేషెంట్ దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు క్రిములు ఇతరులకు వ్యాపిస్తాయి. ఎవరికై నా వ్యాధి సోకితే రెండువారాలకు మించి దగ్గు, జ్వరం, బరువు, ఆకలి తగ్గుదల ఉంటుంది. దగ్గినప్పుడు క్రిములు గాలి ద్వారా వ్యాపిస్తాయి. ఉమ్మినప్పుడు రక్తం పడటం వంటి లక్షణాలు గుర్తి స్తే వెంటనే ప్రభుత్వ ఆస్పత్రిలో సంప్రదించాలి. పిల్లల్లో లక్షణాలు పెద్దల్లో మాదిరిగా తీవ్రదగ్గు ఉండదు. ఆకలి తగ్గిపోతుంది. అన్నం తినాలని బలవంతం చేస్తే ఏడుస్తా రు. పిల్లల్లో వయస్సుకు తగ్గట్లుగా ఎదుగుదల ఉండదు. బరువు పెరగరు. సాయంత్రం వేళల్లో జ్వరం వస్తుంది. మెడ పక్కన లింపు గ్రంథుల్లో వాపు, గడ్డల్లాగా వస్తుంది. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించి చికిత్స తీసుకోవాలి.జిల్లా సమాచారం ఏడాది 2022 2020 2024 2025 (ఇప్పటివరకు) టెస్టులు 23,880 23,694 22,956 14,670 కేసులు 1,291 1,426 1,246 842 15ఏళ్లలోపు 32 29 13 13 మరణాలు 73 41 43 12 సకాలంలో గుర్తించాలి క్షయ అనుమానితులకు ఎప్పటికప్పుడు వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తున్నాం. మందుల పంపిణీతోపాటు కౌన్సెలింగ్ ఇస్తున్నాం. వ్యాధి వ్యాప్తిని అడ్డుకునేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాం. బాధితులు త్వరగా రికవరీ అవుతున్నారు. క్షయను సకాలంలో గుర్తించి క్రమంగా మందులు వాడితే తప్పకుండా అదుపులోకి వస్తుంది. – సుధాకర్రెడ్డి, జిల్లా క్షయ నివారణ అధికారి -
తలవంచిన నిరంకుశత్వం
బాంచెన్ కాల్మొక్త అన్న సామాన్యులే.. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరీ విముక్తి కోసం బందుకూతో గడి పునాదులను పెకిలించారు.. నిజాం నిరంకుశ పాలనలో మగ్గిపోతున్న తెలంగాణ ప్రజల విముక్తి కోసం కదంతొక్కారు.. జాగిరీదారులు, మక్తేదారులు, ఇనాందారులు, వతన్దారుల దుర్మార్గాలు, దౌర్జన్యాలపై పోరాటం సాగించారు..ఎందరో రజకార్లను తరిమికొట్టారు.. తెలంగాణ సాయుధ పోరాటంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా కీలక పాత్ర పోషించింది. అందులో ఇప్పటి రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రాంతం మడమతిప్పని పోరాటం సాగించింది.. బానిస సంకెళ్ల విముక్తి కోసం ఎందరో తమ ప్రాణాలను తృణప్రాయంగా వదిలారు. నేడు సెప్టెంబర్ 17 సందర్భంగా పలువురు యోధుల కథనాలు. – పెద్దపల్లి రూరల్ / మంథని రూరల్ / కరీంనగర్ / సిరిసిల్ల / ఇల్లంతకుంట / బోయినపల్లి -
ప్రభుత్వమే నిర్వహించాలి
● సీపీఐ జిల్లా కార్యదర్శి సదానందంపెద్దపల్లిరూరల్: తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవాలను ప్రభుత్వమే నిర్వహించాలని సీపీఐ జి ల్లా కార్యదర్శి తాండ్ర సదానందం డిమాండ్ చేశా రు. స్థానిక బస్టాండ్ వద్ద మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నాయకులు గౌతం గోవర్ధన్ తో కలిసి మాట్లాడారు. తెలంగాణ సాయుధ పోరా ట చరిత్రను భావితరాలకు తెలిసేలా పాఠ్యపుస్తకా ల్లో సిలబస్ చేర్చాలన్నారు. నిజాం నిరంకుశ పాలనకు చరమ గీతం పాడేందుకు నాయకులు రావి నా రాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, మఖ్దూం మొహియుద్దీన్ ఇచ్చిన పిలుపు మేరకు వీరోచితంగా పోరాడి అనేకమంది అమరులయ్యారని అన్నారు. పూసాల రమేశ్, మానస్, నవీన్, ఉదయ్, అంజి, సదానందం, శంకర్, తిరుమల్, ఎల్లయ్య, రాజేశ్ ఉన్నారు. -
నేటి నుంచి వైద్యశిబిరాలు
పెద్దపల్లిరూరల్: మహిళల ఆరోగ్యం కోసం ఈ నెల 17 నుంచి ప్రత్యేక వైద్యశిబిరాలను నిర్వహించాలని కలెక్టర్ శ్రీహర్ష ఆదేశించారు. కలెక్టరేట్లో మంగళవారం అడిషనల్ కలెక్టర్ అరుణ శ్రీతో కలిసి స్వస్థ్ నారీ స్వశక్తి అభియాన్ పథ కం అమలుపై సమీక్షించారు. బుధవారం నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు ఈ పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలన్నారు. బాలికల స్కూళ్లు, కాలేజీల్లోనూ ప్రత్యేక వైద్యశిబిరాలు నిర్వహించాలన్నారు. డయాబెటిస్, బ్రెస్ట్క్యా న్సర్, హైపర్ టెన్షన్, సర్వికల్ క్యాన్సర్, ఎనీమి యా, టీబీ లాంటి వ్యాధుల నిర్ధారణకు పరీక్ష లు నిర్వహిస్తారని వివరించారు. డీఎంహెచ్వో వాణిశ్రీ, డీపీవో వీరబుచ్చయ్య, డీఈవో మాధ వి, డీడబ్ల్యూవో వేణుగోపాల్ పాల్గొన్నారు. ‘ఎల్లంపల్లి’కి భారీ ఇన్ఫ్లో రామగుండం: ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో భారీగా వచ్చి చేరుతోంది. దీంతో మంగళవా రం ప్రాజెక్టు 38 గేట్లు ఎత్తి దిగువకు నీటిని వి డుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా ప్ర స్తుతం 19.20 టీఎంసీలు ఉందని నీటి పారు దల శాఖ అధికారులు తెలిపారు. ప్రాజెక్టులోకి 4.60 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉందని, దిగు వన ఉన్న గోదావరి నదిలోకి 4.91 లక్షల క్యూ సెక్కులు విడుదల చేస్తున్నామన్నారు. ఎస్సారెస్పీ నుంచి అత్యధికంగా 2.32 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉందని వారు వివరించారు. పోలీస్ స్పోర్ట్స్ మీట్కు ఎంపికకమాన్పూర్(మంథని): పోలీస్ కానిస్టేబుల్ కూరపాటి శ్రీలత ఆల్ ఇండియా పోలీస్ స్పో ర్ట్స్ మీట్లో యోగా పోటీలకు ఎంపికయ్యారు. ఇందుకోసం పోలీస్ అకాడమీలో శిక్షణ తీసుకు నేందుకు వెళ్తున్నారు. ఆమెను రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝూ, ఏఆర్ ఏసీపీ ప్రతాప్, ఆర్ఐ శ్రీనివాస్ మంగళవారం అభినందించారు. ఆంధ్రప్రదేశ్లో అక్టోబర్ 13 నుంచి 17వ తేదీ వరకు ఆల్ ఇండియా పోలీస్ స్పోర్ట్స్ మీట్ నిర్వహించనున్నారు. యూరియా అందించాలి రామగుండం: అన్నదాతలకు సరిపడా యూ రియా అందజేయాలని అఖిల భారత రైతు కూ లీ సంఘం రాష్ట్ర నాయకుడు ఎం.చంద్రయ్య డిమాండ్ చేశారు. అంతర్గాం మండలం పెద్దంపేటలోని రైతు కూలీ సంఘం కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్ర భుత్వం రాష్ట్రానికి 9.80 లక్షల మెట్రిక్ టన్ను ల యూరియా ఇవ్వాల్సి ఉండగా.. 5.30 లక్షల మెట్రిక్ టన్నులే ఇవ్వడంతోనే కొరత ఏర్పడిందని విమర్శించారు. యూరియా కొరత తీర్చాలని, భారీవర్షాలతో పంటలు నష్టపోయిన రై తులకు ఎకరాకు రూ.50వేల పరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. నాయకులు ఇ.నరేశ్, కొల్లూరి మల్లేశ్, ఎడ్ల రవికుమార్, బోనాల లింగయ్య, తూళ్ల లింగయ్య, ఆరుముళ్ల శంకర్, గట్టయ్య తదితరులు ఉన్నారు. నియామకం జ్యోతినగర్(రామగుండం): తె లంగాణ నేషన ల్ గ్రీన్కార్ప్స్ పర్యావరణ వి ద్య జిల్లా బ్రాండ్ అంబాసిడర్ గా అంజన్కుమార్ను నియమించారు. ఈ మేరకు ఎన్జీసీ డైరెక్టర్ ప్రసన్నకుమార్ ఉత్తర్వులు జారీచేశా రు. ఎన్టీపీసీ జెడ్పీ హైస్కూల్లో జీవశాస్త్ర ఉపాధ్యాయుడు గూళ్ల అంజన్కుమార్.. పర్యావరణ పరిరక్షణ, స్థిరత్వం, విద్యపై నిబద్ధత గురించి యువతకు అవగాహన కల్పించాలని, పర్యావరణ పరిరక్షణ కోసం సమష్టి చర్యలు తీసుకోవాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
గోద్ ఫౌండేషన్ బ్రాండ్ అంబాసిడర్గా రష్మీ ఠాకూర్
జ్యోతినగర్(రామగుండం): గోద్ ఫౌండేషన్ జాతీయ బ్రాండ్ అంబాసిడర్గా మిస్ ప్లానెట్ ఇండియా రష్మీ ఠాకూర్ను నియమించారు. ఈమేరకు ఫౌండేషన్ చైర్పర్సన్, రాజ్యసభ సభ్యురాలు మ మతా మెహంతా, వైస్ చైర్మన్ నిజామొద్దీన్ మంగళవారం ఉత్తర్వులను జారీ చేశారు. ఎన్టీపీసీ ప్రాంతానికి చెందిన రష్మీ ఠాకూర్ సేవా, సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, భ్రూణహత్యల నివారణ, ఆడపిల్లల సంరక్షణపై అవగాహన పెంచడమే ఫౌండేషన్ లక్ష్యమన్నారు. చట్టాలను బలోపేతం చేయడం, మహిళా చట్టాల అమలుకు కృషి చేయడం, ఉల్లంఘించిన వారికి కఠిన శిక్షలు పడేలా అవగాహన కల్పించడం తన బాధ్యతని రష్మీ ఠాకూర్ వివరించారు. -
దేశ నిర్మాణంలో ఇంజినీర్లపాత్ర అద్వితీయం
● రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా జ్యోతినగర్(రామగుండం): దేశ నిర్వాణంలో ఇంజి నీర్లపాత్ర అద్వితీయమని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా అన్నారు. ఇంజినీర్స్ డే సందర్భంగా ఎన్టీపీసీ పర్మినెంట్ టౌన్షిప్లోని కాకతీయ ఆడిటోరియంలో ఎన్టీపీసీ ఎగ్జిక్యూటివ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఎన్టీపీసీ ఎగిక్యూటివ్ డైరెక్టర్ చందన్ కుమార్ సామంతతో కలిసి సీపీ జ్యోతి ప్రజ్వలన చేశారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య చిత్రపటానికి పూలమాల వేశారు. సీపీ మాట్లాడుతూ, ఎన్టీపీసీ వెలుగులు అందించడంలో దేశంలో అగ్రభాగాన నిలిచిందన్నారు. నూతన సాంకేతిక విధానాలతో విద్యుత్ ఉత్పత్తిని చేపట్టేందుకు ఇంజినీర్లు చేస్తున్న కృషి అమోఘమని అన్నారు. సీపీని ఎన్టీపీసీ ఈడీ చందన్కుమార్ సా మంత శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. అ నంతరం జరిగిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ అసోసియేషన్ ప్రతినిధులు నితీశ్కుమార్, మహేంద్రకుమార్లతో పాటు పలువురు పాల్గొన్నారు. -
చేయిపట్టి చూడరు.. ఆపరేషన్ చేయరు!
● ఇయ్యాల్టి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్● ఉమ్మడి జిల్లాలో నెట్వర్క్ నిలిపివేత ● బోధనాసుపత్రులు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో యథావిధిగా సేవలుకరీంనగర్టౌన్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆరోగ్యశ్రీ సేవలు బుధవారం నుంచి పూర్తిస్థాయిలో నిలిచిపోనున్నాయి. ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడం కారణంగానే సేవలు నిలిపివేస్తున్నట్లు ఆసుపత్రుల యాజమాన్యాలు ప్రకటించా యి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పుణ్యమా అని 17 సంవత్సరాలుగా నిరుపేద, మ ధ్య తరగతి ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందుతుండగా.. ఈ ఏడాదిలోనే జనవరిలో ఒకసారి సేవలు నిలిపివేశారు. అయినప్పటికీ బిల్లుల పంచాయితీ తేలకపోవడంతో మరోమారు సేవల నిలిపివేతకు నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో పేషెంట్లు తీవ్ర ఇబ్బందులు పడనున్నారు. రోడ్డు ప్రమాదాలు, గుండె సమస్యలు, అపెండిసైటిస లాంటి అత్యవసర సేవలకు తీవ్ర అవస్థలుపడే పరిస్థితి ఏర్పడనుంది. గతంలో ఈ పథకం కింద ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేసి పేదలకు ఉచితంగా ఓపీ, రక్తపరీక్షలు, ఆపరేషన్లు నిర్వహించే వారు. ఇందుకోసం ప్రభుత్వం నిర్ణయించిన ఫీజును నేరుగా ఆసుపత్రుల ఖాతాల్లోకే జమచేసేవారు. కొంత కాలంగా బకాయిలు పెరిగిపోవడంతో నిర్వహణ భారమైన ఆసుపత్రులు ఈ నిర్ణయం తీసుకోవడంతో వైద్యం నిరుపేదలకు అందని ద్రాక్షగా మారనుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 49 ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులు ఉండగా, అందులో 32 ప్రైవేటు ఆసుపత్రులు ఉన్నాయి. ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రభుత్వ, ప్రైవేటు బోధనాసుపత్రులు, కార్పొరేట్ ఆసుపత్రులైన అపోలో రీచ్, మెడికవర్ మినహా అన్ని ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేయనున్నాయి. దీంతో పేషెంట్లు ప్రైవేటు బోధనాసుపత్రులకు పరుగులు తీసే అవకాశం ఉంది. ఆసుపత్రులన్నీ ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయడంతో ప్రైవేటు బోధనాసుపత్రులకు, కార్పొరేట్ ఆసుపత్రులకు పేషెంట్ల తాకిడి పెరగనుంది. ఉమ్మడి జిల్లాలో ప్రతీరోజు సుమారు 70 మందికిపైగా ఆరోగ్యశ్రీ పథకం కింద ఆసుపత్రులలో చికిత్స పొందేవారు. సేవలు నిలిపివేస్తుండడంతో ప్రభుత్వ తీరు, ఆసుపత్రుల వ్యవహారశైలిపై పేషెంట్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. -
మత్తు పదార్థాలను తరిమేద్దాం
● యువత డ్రగ్స్కు బానిసలు కావొద్దు ● పెద్దపల్లి ఎమెల్యే విజయరమణారావు పెద్దపల్లిరూరల్: యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కేంద్రంలో మత్తు పదార్థాల ని వారణపై అవగాహ ర్యాలీ నిర్వహించారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కాలేజీ మైదానంలో ఎమ్మెల్యే విజయరమణారావు ర్యాలీని ప్రారంభించారు. అ మర్నగర్, మేన్రోడ్డు, జెండా, సుభాష్నగర్ మీదు గా ర్యాలీ సాగింది. అనంతరం యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బొంకూరి అవినాష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడా రు. యువత తమ భవిష్యత్ను బంగారుమయం చేసుకోవాలన్నారు. మత్తు పదార్థాలను అంటగట్టి బానిసలు చేసేందుకు పన్నే కుట్రలో బందీ కా వొద్దని సూచించారు. సీఎం రేవంత్రెడ్డి సారథ్యంలోని ప్రభుత్వం డ్రగ్స్, గంజాయి లాంటి మత్తు ప దార్థాలను ఉక్కుపాదంతో అణచివేసేందుకు ఈగల్ నినాదంతో ముందుకు సాగుతోందని తెలిపారు. మత్తు పదార్థాల వినియోగంతో కలిగే నష్టాలపై అందరికీ అర్థమయ్యేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో డీసీపీ కరుణాకర్, ఏసీపీ కృష్ణ, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ స్వరూప, టీఎన్జీవోల సంఘం జిల్లా అధ్యక్షుడు బొంకూరి శంకర్, నాయకులు జడల సురేందర్, కొట్టె సదానందం, మస్రత్, ముత్యాల నరేశ్ తదితరులు పాల్గొన్నారు. -
సింగరేణి అధికారులకు పీఆర్పీ
● గ్రీన్సిగ్నల్ ఇచ్చిన సీఎం కార్యాలయం ఏడాది చెల్లింపులు(రూ.కోట్లలో) 2022–23 110 2023–24 170 గోదావరిఖని: సింగరేణిలోని 2,500 మంది అధికారులకు రెండేళ్ల పీఆర్పీ చెల్లించేందుకు గ్రీన్సిగ్నల్ లభించింది. ఈమేరకు ఫెర్ఫార్మెన్స్ రిలేటెడ్ పేమెంట్(పీఆర్పీ) చెల్లింపులకు ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఈ ఫైల్పై సోమవారం సీఎం సంతకం చేసినట్లు చెబుతున్నారు. పీఆర్పీ కోసం అధికారుల సంఘం నాయకులు సింగరేణిలో కొద్దిరోజులుగా దశలవారీగా నల్లబ్యాడ్జీలతో నిరసన తెలుపుతున్నారు. ఈ క్రమంలో ఇటీవల మంచిర్యాల జిల్లాలో జరిగిన రక్షణ వార్షికోత్సవంలో అధికారులకు అతి త్వరలో పీఆర్పీ చెల్లిస్తామని సింగరేణీ సీఎండీ బలరాం హామీ ఇచ్చారు. దీనిపై దృష్టి సారించిన ఆయన.. ఫైల్ కదలికలో వేగం పెంచారు. మూడు రోజుల క్రితం డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క వద్ద ఫైల్కు క్లియరెన్స్ లభించింది. మరో రెండు రోజుల్లో యాజమాన్యం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనుంది. కాగా, ఒక్కో అధికారి సీనియార్టీ, హోదాను బట్టి సుమారు రూ.2 లక్షల నుంచి రూ. రూ.10లక్షల వరకు పీఆర్పీ వచ్చే అవకాశం ఉన్నట్లుగా అధికారులు చెబుతున్నారు. కాగా 2007–2014 ఆర్థిక సంవత్సరంలో రావాల్సిన పీఆర్పీ రూ.35కోట్లు కూడా చెల్లించేందుకు యాజమాన్యం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. -
ఇక ‘ఏఐ’తో పశువైద్యం!
పెద్దపల్లిరూరల్: ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(ఏఐ) సాంకేతికతను వినియోగించి రూపొందించిన యాప్ ద్వారా పాడిరైతు పశువు ఫొటోతీసి ఆన్లైన్లో అప్లోడ్ చేస్తే చాలు.. ఆ పశువుకు ఏ రకమైన వ్యాధి సోకింది, దాని నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే వివరాలన్నీ వెల్లడిస్తుంది. దేశంలోనే తొలిసారి.. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధానాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తొలిసారి అమలుకు శ్రీకారం చుడుతోంది. జిల్లాకు చెందిన మంత్రి శ్రీధర్బాబు ప్రాతినిధ్యం వహిస్తున్న మంథని నియోజకవర్గంలోని మంథని, ముత్తారం, రామగిరి, కమాన్పూర్ మండలాల్లో ప్రయోగాత్మకంగా దీనిని అమలు చేసేందుకు నిర్ణయించింది. సుమారు ఏడెనిమిది నెలల క్రితం ఈ ప్రక్రియ చేపట్టారు. మంత్రి శ్రీధర్బాబు, కలెక్టర్ చొరవతో ఏఐ సాంకేతికతతో మూగజీవాలకు నాణ్యమైన వైద్యం సకాలంలో అందించేందుకు కొత్త విధానం ఉపకరిస్తుందని భావిస్తున్నారు. ఆ నాలుగు మండలాల్లోని 132 మంది పాడిరైతులకు చెందిన 451 పశువులకు సంబంధించిన 1,600 ఫొటోలను ఇప్పటికే ఆన్లైన్లో అప్లోడ్ చేశారని అధికారులు తెలిపారు. ‘ఆరోగ్య వైద్యరేఖ’ యాప్ రూపకల్పన జిల్లాలో ప్రయోగాత్మకంగా పశుసంవర్థక శాఖ ద్వారా మూగజీవాలకు మెరుగైన వైద్యం అందించేందుకు ఏఐ సాంకేతికతతో 9 నెలల్లో ఆరోగ్య వైద్యరేఖ యాప్ రూపొందించారు. క్యాటిల్ హెల్త్ మానిటరింగ్ ఇంటలిజెన్స్(సీహెచ్ఎం ఐటీ) పశు వుల సమాచారాన్ని ఏ మేర సేకరించి యాప్లో నమోదు చేయగలిగితే ఏఐ టూల్స్ అంత మెరుగ్గా సమాచారం అందిస్తుందని జిల్లాస్థాయి అధికారులు చెబుతున్నారు. మేలుజాతి పశువుల సంతానోత్పత్తికి.. ఈ యాప్ ద్వారా పశువు ఎదను సకాలంలో గుర్తించి కృత్రిమ గర్భాధారణ చేస్తే మేలుజాతి ఆడదూడలను ఉత్పత్తి చేయడం సులువని పశువైద్యాధికారులు అంటున్నారు. గర్భకోశవ్యాధులను గుర్తించి గొడ్డుమోతుతనాన్ని కూడా నియంత్రించి పశువు ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఈ విధానం దోహపడుతుందని అంటున్నారు. సకాలంలో వైద్యసేవలు అందించేలా.. పశువులు, గొర్రెలు, ఇతర మూగజీవాలు వ్యాధుల బారిన పడితే వాటి ఫొటోను యాప్ ద్వారా అప్లోడ్ చేయాలి. ఆ వెంటనే గోపాలమిత్ర, పశువైద్యాధికారులు, ఏఐ బృందం, కలెక్టర్కు సమాచారం చేరుతుంది. ఇంటర్నెట్ లేని ఫోన్లలోనూ ఫొటో తీస్తే లొకేషన్ మారదని, ఇంటర్నెట్ ఉన్న స్థలం నుంచి అప్లోడ్ చేసుకోవచ్చని అధికారులు వివరించారు. ఈ విధానం సమర్థవంతంగా అమలు చేసేందుకు అఽధికార యంత్రాంగం ప్రణాళికాబద్ధంగా కార్యాచరణకు సిద్ధమవుతోంది. లోగో ఆవిష్కరణ పశువులకు సోకిన వ్యాధిని గుర్తించి సకాలంలో వైద్యం అందించేందుకు రూపొందించిన ఆరోగ్యవైద్యరేఖ యాప్ను కలెక్టర్ శ్రీహర్ష, నీర్ సంస్థ సీఈవో జయశంకర్, రాంచందర్, జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి విజయభాస్కర్ సోమవారం ఆవిష్కరించారు.జిల్లా సమాచారం -
సమస్యలకు సత్వర పరిష్కారం
● కలెక్టర్ కోయ శ్రీహర్ష ● ప్రజావాణి ద్వారా అర్జీల స్వీకరణ పెద్దపల్లిరూరల్: జిల్లాలోని పలు మండలాలు, గ్రామాల నుంచి తరలివచ్చే ప్రజలు అందించిన సమస్యలకు సత్వర పరిష్కారం చూపాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమం ద్వారా జిల్లావాసులు అందించిన వినతులను కలెక్టర్ శ్రీహర్ష, అడిషనల్ కలెక్టర్ వేణు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజావాణి ఫిర్యాదులకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు. వాటి పరిష్కారంలో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. కార్యక్రమంలో పలు శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
17న ‘ప్రజాపాలన’ వేడుకలు
పెద్దపల్లిరూరల్: కలెక్టరేట్లో ఈనెల 17న ప్ర జాపాలన దినోత్సవం నిర్వహిస్తారు. ఇందు కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముఖ్యఅ తిథిగా మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మహమ్మద్ ఒబెదుల్లా కొత్వాల్ హాజరవుతార ని ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది.అంబేడ్కర్ ఆశయాలు సాధిస్తాంకమాన్పూర్(మంథని): అంబేడ్కర్ ఆశయ సా ధనకు కృషి చేయాలని మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ కోరారు. పేంచికల్పేటలో పుట్ట లింగ మ్మ చారిటబుల్ ట్రస్ట్, ఏఐఐవైఎస్ రాష్ట్ర కార్య వర్గ సభ్యుడు ఇరుగురాల కిష్టయ్య ఏర్పాటు చేసిన అంబేడ్కర్ విగ్రహాన్ని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుతో కలిసి కొప్పుల సోమవారం ప్రా రంభించి మాట్లాడారు. బహుజనులకు 82శా తం రాజ్యాధికారం కావాలని కలలు గన్నారన్నారు. పుట మధు మాట్లాడుతూ, విగ్రహాల విగ్రహాల ఏర్పాటులో అవంతరాలు సృష్టిస్తే శ్రీపాదరావు విగ్రహాల స్థానాల్లో అంబేడ్కర్ విగ్రహాలు ఏర్పాటు చేస్తామని హెచ్చరించారు. బీఆర్ఎస్ మండల కన్వీనర్ శంకర్, మాజీ సర్పంచ్ వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. ఆకట్టుకున్న నృత్య ప్రదర్శన సుల్తానాబాద్(పెద్దపల్లి): స్థానిక ప్రభుత్వ జూ నియర్ కళాశాలలో సోమవారం ఇంటర్ ప్ర థమ సంవత్సరం విద్యార్థులతో ఫ్రెషర్స్ డే ని ర్వహించారు. జిల్లా ఇంటర్ విద్య నోడల్ అధి కారి కల్పన మాట్లాడుతూ, విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకోవాలన్నారు. అనంతరం వి ద్యార్థులు చేపట్టిన సంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. మిమిక్రీ ఆర్టిస్ట్ రాజ్కుమార్, ప్రిన్సిపాల్ శ్రీధర్, అధ్యాపకులు పాల్గొన్నారు. హిందీ భాషా దినోత్సవం పెద్దపల్లిరూరల్: రాఘవాపూర్ జెడ్పీ హైస్కూ ల్లో సోమవారం హిందీభాషా దినోత్సవం ని ర్వహించారు. విద్యార్థులకు వ్యాసరచన, ఉపన్యాస, పద్యపఠనం, చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతులను ప్రదా నం చేశారు. హెచ్ఎం హన్మంతు, ఉపాధ్యాయులు జీలుగ రవీందర్ పాల్గొన్నారు. గోపాలమిత్ర కార్యవర్గం పెద్దపల్లిరూరల్: గోపాలమిత్రల సంఘం జిల్లా అ ధ్యక్షుడిగా కల్వల శ్రీనివా స్, ప్రధాన కార్యదర్శిగా మీసాల తిరుపతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పశుసంవర్థక శాఖ ఆ ధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్లో సమావేశ మై కార్యవర్గాన్ని ఖరారు చేశారు. ఉపాధ్యక్షులు గా తిరుమల్ రాజేశం, మంద మల్లేశం, కుంబా ల చంద్రయ్య, సహాయ కార్యదర్శులుగా కుంట కుమార్, శ్రీపతి ఉమామహేశ్, కోశాధికారిగా పంజాల సురేశ్తోపాటు ఐదుగురిని కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకున్నారు. ఎస్సారెస్పీ ఉపకాలువకు బుంగపెద్దపల్లిరూరల్: హన్మంతునిపేట శివారు (స మ్మక్క – సారలమ్మ గద్దె) ప్రాంతంలోని ఎస్సారెస్పీ డీ–83, ఎం – 22ఆర్ ఉపకాలువకు ఇటీ వల కురిసిన వర్షాలతో బుంగ పడింది. నీరంతా వృథాగా పోతుండడంతో స్థానిక రైతులు ఇ రిగేషన్ అధికారులకు సమాచారం అందించా రు. స్పందించిన అధికారులు.. ఇసుక బస్తాల తో తాత్కాలికంగా అడ్డుకట్ట వేశారు. ప్రైవేట్ కాలేజీల నిరసన -
మంగళవారం శ్రీ 16 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: క్రిప్టో కరెన్సీ వ్యవహారం రానురాను తీవ్ర రూపం దాల్చేలా కనిపిస్తోంది. తాజాగా ఈ కేసు విషయంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కూడా స్పందించడం గమనార్హం. మెటా ఫండ్ క్రిప్టో కరెన్సీ వ్యవహారంలో నిందితులను ఎవరినీ వదలవద్దని డిపార్ట్మెంట్కు బండి సంజయ్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఈ కేసును కరీంనగర్ పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకుని మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం నిందితులు డబ్బులు వసూలు చేసిన తీరుపై పోలీసులు దృష్టి సారించారు. టూ టౌన్, రూరల్ ఠాణాల్లో కేసులు నమోదైనా.. సీసీఎస్ సాయంతో కేసును సీపీ గౌస్ ఆలం స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. బాధితులు, నిందితుల నుంచి డబ్బుల లావాదేవీలకు సంబంధించిన ఆధారాలు సేకరిస్తున్నారు. మరోవైపు ఫిర్యాదు చేసేందుకు మరిన్ని బృందాలు ముందుకు వస్తుండగా.. మరికొందరు కేసు నమోదుకు వెనకాడుతున్నా.. దర్యాప్తునకు దోహదపడేలా ఆధారాలు మాత్రం పోలీసులకు ఇస్తున్నారు. ఓ వైపు నిందితులు బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తుండగా.. మరోవైపు కస్టడీ పిటిషన్ వేయడంలో పోలీసులు నిమగ్నమయ్యారు. పోలీసులు, మాజీ మంత్రి పాత్రపై ఆరా మెటా క్రిప్టో స్కాంలో రాష్ట్ర, కేంద్ర నిఘా వర్గాలు నాలుగు నెలల క్రితమే వేర్వేరుగా వివరాలు సేకరించాయి. ఇప్పటి వరకూ అరైస్టెన ఐదుగురు నిందితుల్లో ఒకరికి మాజీ మంత్రి, ప్రస్తుతం పార్లమెంటు సభ్యుడితో గతంలో బాగా సఖ్యత ఉండేది. సదరు వ్యక్తి మంత్రి హోదాలో తరచుగా కరీంనగర్ వచ్చిన ప్రతీసారీ, అతని ఇంటికి తప్పకుండా వెళ్లేవారు. ఈ క్రమంలోనే కేంద్ర దర్యాప్తు సంస్థలు సదరు మాజీ మంత్రి పాత్రపై ఆరా తీశాయి. వసూలు చేసిన డబ్బును నిందితులు దేశం దాటించారని బాధితులు ఆరోపిస్తున్న క్రమంలో సదరు మాజీ మంత్రికి, నిందితుడికి ఏమైనా లావాదేవీలు జరిగాయా? అన్న కోణంలో తనిఖీలు చేశాయి. అదే సమయంలో బాధితులు (ప్రభుత్వ ఉద్యోగులు) నిందితుడిని డబ్బుల కోసం నిలదీసిన ప్రతీసారి సదరు మాజీ మంత్రి పేరు చెప్పి వారిని బెదిరించినట్లు సమాచారం. అదే సమయంలో క్రిప్టోలో పెట్టుబడులు పెట్టిన నలుగురు సీఐల వివరాలు కూడా నిఘా వర్గాలు సేకరించాయి. వారికి డబ్బులు ఇవ్వకుండా జాప్యం చేయడమే కాకుండా.. పైపెచ్చు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లిన వైనంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని వేధిస్తున్న విధానాన్ని కూడా గుర్తించినట్లు తెలిసింది. అదే సమయంలో క్రిప్టో కేసులో మోసపోయిన బాధితులను బెదిరించి, నిందితులకు సహకరించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ ఎస్హెచ్వో పాత్రపైనా ఉన్నతాధికారులకు అన్ని వివరాలు అందాయి. -
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట ధర్నా
మంథని: తమ డిమాండ్లు పరిష్కరించాలని అంగన్ వాడీ టీచర్లు, హెల్పర్లు సో మవారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదు ట ధర్నా చేశారు. యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జ్యోతి మాట్లాడుతూ నూత న జాతీయ విద్యా విధానంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ విద్యను ప్రవేశపెట్టాలనే ప్రభుత్వ నిర్ణయం సరికాదన్నారు. దీనిద్వారా అంగన్వాడీ కేంద్రాలు నీరుగారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో ప్రభుత్వం పునరాలోచన చేయాలని ఆమె కోరారు. ధర్నా సమాచారం మంత్రి శ్రీధర్బాబు దృష్టికి తీసుకెళ్లడంతో సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాల అధ్యక్షులు సత్యవాణి, వనజారాణి, నాయకులు పద్మ, బూడిద గణేశ్, శ్యామల, రామలక్ష్మి, శ్రీకళ, శాలిని, మంజు తదితరులు ఉన్నారు. -
సులభంగా అప్లోడ్
మూగజీవాలకు మెరుగైన వైద్యాన్ని సకాలంలో అందించేందుకు ఏఐ టెక్నాలజీ ద్వారా రూపొందించిన ఆరోగ్యరేఖ యాప్ ఉపకరిస్తుంది. పశువు ఫొటో తీసి అప్లోడ్ చేస్తే వ్యాధి వివరాలు, నివారణ చర్యలు, సమీపంలోని పశువైద్యాధికారి సెల్ నంబరు సహా పూర్తిసమాచారం వస్తుంది. – కుమార్, గోపాలమిత్ర, రామగిరి అవగాహన కల్పిస్తాం రాష్ట్రంలోనే తొలిసారి మంత్రి శ్రీధర్బాబు, కలెక్టర్ శ్రీహర్ష చొరవ చూపడంతోనే ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా చేపట్టాం. సత్ఫలితాలు రావడంతో జిల్లా వ్యాప్తంగా అమలు చేసేందుకు నిర్ణయించాం. పాడిరైతుల్లో అవగాహన కల్పిస్తాం. – విజయభాస్కర్, జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి పాడిరైతుకు మేలు పశువులకు వ్యాధి వస్తే పాడిరైతుకు వ్యయ, ప్రయాసలు లేకుండా మెరుగైన వైద్యసేవలు సకాలంలో అందించాలన్నదే లక్ష్యం. ఎదకొచ్చిన పశువులకు మేలుజాతి పశువులు ఉత్పత్తి అయ్యేలా కృత్రిమ గర్భాధారణ చేసేందుకూ అవకాశం ఉంది. ఏఐ వినియోగంపై విస్తృత ప్రచారం కల్పించాలి. – కోయ శ్రీహర్ష, కలెక్టర్ -
వ్యాపారాభివృద్ధికే రోడ్ల విస్తరణ
● ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్ కోల్సిటీ/యైటింక్లయిన్కాలనీ/రామగుండం: వ్యా పారాభివృద్ధి కోసమే నగరంలో రోడ్ల విస్తరణ చేపట్టామని ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్ అన్నా రు. రామగుండం నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో రూ.4.83 కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే సోమవారం శంకుస్థాపన చేశారు. భూగర్భ డ్రైనేజీలు, అదనపు తరగతి గదులు, అ సంపూర్తి పనులు ఇందులో ఉన్నాయి. బల్దియా క మిషనర్ అరుణశ్రీ ఎమ్మెల్యే వెంట ఉన్నారు. ఠాకూ ర్ మాట్లాడుతూ, సింగరేణి క్వార్టర్లతో సంబంధం లేకుండా పేద, మధ్య, ధనిక వర్గాలు, రిటైర్డ్ కార్మికులు అధికంగా ఉండే మార్కండేయకాలనీలో కనీ స సదుపాయాల కోసం నిధులు మంజూరు చేయించామన్నారు. అందరికీ అన్నివ్యాధులకు వైద్యసేవలు అందుబాటులో ఉండేలా గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో మరోరెండు భవన బ్లాకులు సిద్ధం చేయిస్తున్నామని అన్నారు. గోదావరిఖని – సెంటినరీకాలనీ మధ్య ఫోర్లేన్ రోడ్డు నిర్మాణానికి టెండర్ ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. బల్దియా డీఈలు షాభాజ్, శాంతి స్వరూప్, జమీల్, ఏఈలు మీర్, శానిటరీ ఇన్స్పెక్టర్ సంపత్, ఎంఈవో మల్లేశం, మాజీ కార్పొరేటర్లు మహంకాళి స్వామి, బొంతల రాజేశ్, శంకర్ నాయక్, సాగంటి శంకర్, కొలిపాక సుజాత, మెప్మా టీఎంసీ మౌనిక, సీవోలు ఊర్మిళ, శ్వేత, శమంత పాల్గొన్నారు. -
ఉత్సాహంగా రోలార్ స్కేటింగ్ పోటీలు
కరీంనగర్స్పోర్ట్స్/కరీంనగర్రూరల్: అంబేడ్క ర్ స్టేడియంలో ఆదివారం నిర్వహించిన ఉ మ్మ డి జిల్లాస్థాయి రోలార్ స్కేటింగ్ పోటీలకు స్పందన వచ్చింది. అల్ఫోర్స్ విద్యాసంస్థల అ ధినేత వి.నరేందర్రెడ్డి పోటీలు ప్రారంభించా రు. క్రీడలతో విద్యార్థులకు మానసిక ఉల్లాసం కలుగుతుందన్నారు. అలాగే బొమ్మకల్లోని బిర్లా ఇంటర్నేషనల్ స్కూల్లో రోడ్ ఈవెంట్ స్టేట్ సెలక్షన్ పోటీలు నిర్వహించారు. స్కేటింగ్ బాధ్యులు విజయభాస్కర్, గట్టు అనిల్కుమార్గౌడ్, డి.వీరన్న, కృష్ణమూర్తిగౌడ్, సాయినరహరి తదితరులు పాల్గొన్నారు. కబడ్డీ పోటీలకు స్పందనకరీంనగర్స్పోర్ట్స్: అంబేడ్కర్ స్టేడియంలో ఆది వారం నిర్వహించిన జిల్లాస్థాయి కబడ్డీ పోటీలకు స్పందన వచ్చింది. వివిధ మండలాల నుంచి సుమారు 150 మందికి పైగా క్రీడాకారులు హాజరయ్యారు. అంతకుముందు తెలంగాణ కబడ్డీ సంఘం ఉపాధ్యక్షుడు సీహెచ్.సంపత్రావు పోటీలను ప్రారంభించి మాట్లాడారు. ఈ పోటీల్లో రాణించిన క్రీడాకారులను ఈ నెల 25 నుంచి నిజామాబాద్ జిల్లా ముప్కల్ మండలంలో జరిగే రాష్ట్రస్థాయికి ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. కబడ్డీ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బుర్ర ఎల్లయ్యగౌడ్, సీహెచ్.మల్లేశ్, ప్రధాన కార్యదర్శి బుర్ర మల్లేశ్గౌడ్, పెటా కార్యదర్శి ఆడెపు శ్రీనివాస్, సీనియర్ క్రీడాకారులు మాధవరెడ్డి, నరేశ్, తదితరులు పాల్గొన్నారు. -
రాయికల్ శివాలయంలో చోరీ
పోలీస్ల అదుపులో నిందితుడు? రాయికల్: రాయికల్ పట్టణంలోని శివాలయంలో శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తి ఆలయంలోని హుండిని పగలగొట్టి నగదును దొంగలించారు. దొంగ ముందస్తుగా సీసీ కెమెరాలు పగలగొట్టి దొంగతనానికి ప్రయత్నించాడు. దానికి ముందు రికార్డయిన వీడియో ఆధారంగా ఆదివారం సదరు నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఇల్లంతకుంట(మానకొండూర్):ఓ మైనర్ బాలిక నగ్న వీడియోలు చిత్రీకరించి, ఇతరులకు పంపించిన యువకుడు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. బాలిక నగ్న వీడియోలు తీసిన యువకుడు గతంలో గంజాయి కేసులో నిందితుడు అని ప్రచారంలో ఉంది. ఈ వీడియోలు ప్రస్తుతం వెలుగుచూడడంతో బాధిత బాలిక తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించినట్లు తెలిసింది. సదరు యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని, కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఇటీవల మండలానికి చెందిన ఓ మైనర్ బాలిక ఆత్మహత్య ఉదంతం మరిచిపోకముందే మరో మైనర్ నగ్న వీడియోలు చిత్రీకరించినట్లు వెలుగులోకి రావడం మండలంలో చర్చకు దారితీసింది. పిడుగుపాటుకు కాలిపోయిన ట్రాక్టర్ సుల్తానాబాద్రూరల్: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కొదురుపాక గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున భారీవర్షం కురిసింది. ఈక్రమంలో పిడుగుపడి ట్రాక్టర్ స్ట్రీరింగ్ కాలిపోయింది. గ్రామంలోని చెట్టుపై పిడుగుపడగా దానికిందనే పార్క్చేసిఉన్న గ్రామపంచాయతీకి చెందిన ట్రాక్టర్ కాలిపోయింది. -
అద్భుత కట్టడం.. నాగులపేట సైఫన్
● ఆసియాలోనే అరుదైన కట్టడంగా గుర్తింపు కోరుట్ల రూరల్: ఇంజినీరింగ్ పనితీరుకు అద్భుత కట్టడంగా నిలుస్తుంది కోరుట్ల మండలం నాగులపేట వద్దగల సైఫన్. ఇది ఆసియాలో అరుదైన కట్టడాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు అప్పటి సూపరింటెండెంట్ ఇంజనీర్ పీఎస్.రామకృష్ణారాజు సైఫన్ నిర్మాణానికి డిజైనింగ్ చేశారు. నాగులపేట వద్ద కాకతీయ కాలువ సుమారు 100 మీటర్ల వెడల్పుతో ప్రవహించే పెద్దవాగు దాటాల్సి ఉంటుంది. వాగుకు అడ్డంగా కాలువ నిర్మించడం కష్టం కావటంతో వాగుపై నుంచే 100 మీటర్ల సొరంగమార్గం తవ్వి.. ఎప్పటిలాగే వాగు ప్రవహించేలా డిజైన్ చేశారు. 100 మీటర్ల పొడవు.. సుమారు 30 ఫీట్ల లోతు.. 25 ఫీట్ల వెడల్పుతో సైఫన్ నిర్మాణం చేపట్టారు. సైఫన్ సొరంగమార్గం ద్వారా కాలువ నీరు.. వాగులో వరద ప్రవాహం.. ఈ అద్భుత కట్టడం ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉంది. -
ప్రాజెక్టుల ల్యాండ్మార్క్ మిడ్మానేరు
బోయినపల్లి(చొప్పదండి): తెలంగాణ ప్రాజెక్టులకు ల్యాండ్మార్క్లా మధ్యమానేరు నిలుస్తోంది. ఎగువ మానేరు, దిగువ మానేరుకు మధ్యలో ఉన్న మిడ్మానేరు 5.8 లక్షల క్యూసెక్కుల వరదపోటును తట్టుకుంటుంది. రాజన్నసిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మాన్వాడ వద్ద శ్రీరాజరాజేశ్వర(మధ్యమానేరు) ప్రాజెక్టును 27.5 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించారు. సుమారు రూ.750 కోట్ల అంచనాలతో నిర్మించారు. ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాలో సుమారు 2లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందకు 2006లో దివంగత సీఎం వైఎస్సార్ ఈ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ప్రాజెక్టు నిర్మాణంలో పాలుపంచుకున్న ఇంజినీర్లందరూ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వారే. ప్రాజెక్టు మొత్తం 32 సీసీ కెమెరాల నిఘాలో ఉంటుంది. 25 రేడియల్ గేట్లు, పవర్ ప్యాక్స్, లోకల్ కంట్రోల్ ప్యానల్, రిమోట్ కంట్రోల్ ప్యానల్స్ వంటి కొత్త పద్ధతులు ఉన్నాయి. ప్రాజెక్టులో 4 రివర్స్ స్లూయిస్లు ఏర్పాటు చేశారు. ప్రాజెక్టులో చేరిన సిల్ట్ రివర్స్స్లూయిస్ల ద్వారా బయటకు వెళ్తుంది. ప్రాజెక్టు నిర్మాణంలో సిమెంట్, కాంక్రిట్, మట్టి, రౌతు, స్టీల్, వాడారు. ప్రాజెక్టు అడుగు భాగానికి వెళ్లడానికి గ్యాలరీని ఏర్పాటు చేశారు. దీనిలోకి వెళ్లడానికి మెట్లు, అధునాతన లిఫ్ట్ ఏర్పాటు చేశారు. ప్రాజెక్టులోకి వచ్చే నీరు నిల్వ చేయడం వల్ల ఎయిర్ వెళ్లడానికి గ్యాలరీలో పరికరాలు అమర్చారు. 500 మీటర్ల మేర స్పిల్వే, 10 కిలోమీటర్ల మేర కట్టను నిర్మించారు. -
బీరుసీసాలతో యువకుల దాడులు
సుల్తానాబాద్రూరల్: మద్యం మత్తులో యువకులు బీరుసీసాలతో స్పరస్పరం దా డులు చేసుకున్నారు. ఈ సంఘటన ఆదివారం రాత్రి పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని ఓ వైన్స్ వద్ద చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. సుల్తానాబాద్లోని మార్కెండేయకాలనీకి చెందిన యువకులు అనిల్, టోన్ ఓ వైన్స్ వద్ద మద్యం తాగారు. మద్యం మత్తులో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆగ్రహంతో ఇద్దరూ బీరుసీసాలతో దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరికీ గాయాలుకాగా స్థానికులు సుల్తానాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు వైద్యచికిత్స అందిస్తున్నారు. ● మద్యం మత్తులో వీరంగం ● ఇద్దరికి తీవ్రగాయాలు -
కనుపాపను కాపాడండి
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఇంట్లో చలాకిగా తిరగాల్సిన చిన్నారి ఆస్పత్రి బెడ్పై కదలలేని స్థితిలో ఉంది. ఆడపిల్ల పుట్టగానే సంతోషించిన తల్లిదండ్రులకు ఆమెకు వచ్చిన అనారోగ్య సమస్యతో వేదన మొదలైంది. చక్కగా బడికి వెళ్లే చిన్నారి వెన్నుముక సమస్యతో కాళ్లు చేతులు పడిపోవడంతో మంచానికే పరిమితమైంది. ఆపరేషన్ చేస్తే నడుస్తుందన్న వైద్యుల సూచనలతో హైదరాబాద్లోని నిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్సకు రూ.4లక్షలు అవసరం ఉంటాయని వైద్యులు తెలపడంతో ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లబొప్పాపూర్కు చెందిన మిడిదొడ్డి భాగ్య–మల్లేశం దంపతులకు ఐదో తరగతి చదువుతున్న కూతురు సాత్విక ఉంది. నిత్యం చలాకీగా బడికి వెళ్లే చిన్నారి హఠాత్తుగా అనారోగ్యానికి గురైంది. నడవలేని స్థితిలో మంచానికే పరిమితం కావడంతో వైద్యులను సంప్రదించారు. పరీక్షలు చేసిన వైద్యులు వెన్నుపూసలో సమస్య ఉన్నట్లు గుర్తించారు. ఆపరేషన్కు రూ.4లక్షలు ఖర్చు అవుతుందని తెలపడంతో చేతిలో చిల్లిగవ్వలేని వారు ఆ డబ్బులు ఎలా సమకూర్చాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. ఈక్రమంలోనే కలెక్టర్ సందీప్కుమార్ ఝాను కలవగా.. స్పందించిన కలెక్టర్ రూ.74,938 చెక్కును అందించారు. దీంతో వారు చిన్నారిని నిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. శస్త్రచికిత్సకు ఈ మొత్తం సరిపోకపోవడంతో దాతలు ఆదుకోవాలని వేడుకుంటున్నారు. సాయం చేయాల్సిన దాతలు మిడిదొడ్డి భాగ్యకు 96181 51488లో సాయం చేయాలని వేడుకుంటున్నారు. వెన్నుపూస సమస్యతో బాధపడుతున్న విద్యార్థిని బడిలో ఉండాల్సిన చిన్నారి ఆస్పత్రిలో.. నిమ్స్లో చికిత్స పొందుతున్న సాత్విక శస్త్రచికిత్సకు రూ.4లక్షలు అవసరం ఆపన్నహస్తం కోసం ఎదురుచూపులు -
పట్టపగలు వివాహిత దారుణ హత్య
● కుటుంబ కలహాలే కారణం ● భార్యను చంపిన భర్త రామగిరి(మంథని): పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం పన్నూర్ గ్రామపంచాయతీ పరిధి వకీల్పల్లి ప్లా ట్స్ లో ఆదివారం పూసల రమాదేవి ఉర ఫ్ ప్రశాంతి(35) దారుణ హత్యకు గు రైంది. స్థానికుల కథనం ప్రకారం.. మంచిర్యాల జిల్లా రెడ్డికాలనీకి చెందిన రమాదేవి ఉరఫ్ ప్ర శాంతిని పన్నూర్ గ్రామపంచాయతీ పరిధిలోని వకీల్పల్లి ప్లాట్స్కాలనీలో నివాసం ఉండే పూసల కృపాకర్ సుమారు 13 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కు మారుడు జాన్సన్, కుమార్తెలు జోషిత(9), జ్యోత్స్న ఉన్నా రు. ఏడాదిగా వీరి మధ్య కుటుంబ కలహాలు జరుగుతున్నా యి. అప్పటినుంచి భార్యాభర్తలు వేర్వేరుగా ఉంటున్నారు. రమాదేవి ఆదివారం కృపాకర్ ఇంటికి చేరుకుంది. ఈక్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆగ్రహంతో కత్తితో రమాదేవిపై కృపాకర్ దాడి చేయగా అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికుల సమాచారంతో ఎస్సై శ్రీనివాస్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వివరాలు సేకరించారు. గోదావరిఖని ఏసీపీ రమేశ్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. హత్య అనంతరం కృపాకర్, అతడి తల్లిదండ్రులు పరారయ్యారు. అయితే, తల్లిదండ్రులు మంథని పోలీసుస్టేషన్లో ఉన్నట్లు సమాచారం. పోలీసులు కృపాకర్ కోసం ఆరా తీస్తున్నారు. కుటుంబ కలహాలే హత్యకు కారణామని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని ఎస్సై వివరించారు. పంచాయితీయే ప్రాణం తీసిందా? ఏడాదిగా వేర్వేరుగా ఉంటున్న రమాదేవి ఆదివారం అత్తగారింటికి వచ్చి ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపింది. సెంటినరికాలనీకి చెందిన ఒకమతపెద్ద ద్వారా కృపాకర్ రాయబరం చేయడంతో రమాదేవిని అక్కడకు వచ్చిందని, మతపెద్ద సమక్షంలో పంచాయితీ జరిగిందని తెలిసింది. ఆ తర్వాత రమాదేవి వకీల్పల్లి ప్లాట్స్కాలనీకి చేరుగా.. భార్యాభర్తల మధ్య గొడవ జరిగిందని, ఈక్రమంలోన అత్తగారింటి ఎదుట రోడ్డుపై విగతజీవిగా పడిపోయిందని స్థానికులు కంటతడి పెట్టారు. క్షణికావేశంలో భార్యను చంపండంతో ముగ్గురు పిల్లలు రోడ్డున పడ్డారని ఆవేదన చెందారు. కుటుంబ కలహాలు పచ్చనికాపురంలో చిచ్చుపెట్టడంతో పిల్లలు దిక్కులేనివారయ్యారు. -
చరిత్రకు సాక్ష్యం ఎలగందుల ఖిలా
కొత్తపల్లి(కరీంనగర్): చరిత్రకు సాక్ష్యంగా కొత్తపల్లి మండలంలోని ఎలగందుల ఖిలా నిలుస్తోంది. కాకతీయులు, కులీకుతుబ్షాహీల శిల్ప కళావైభవానికి ప్రతీకగా ఖిలాలోని కట్టడాలు నిలుస్తున్నాయి. ఈ కోటలో టర్కీ, ఫ్రెంచ్ ఇంజినీర్ల ప్రభావం కనిపిస్తోంది. ఫ్రెంచి, టర్కీ ఇంజినీర్ల ప్రభావంతో ఈ కోట అనేక విషయాల్లో మధ్యయుగపు ఐరోపా శైలిని పోలి ఉంది. 200 అడుగుల ఎత్తు, 2.5 మైళ్ల విస్తీర్ణంలో మానేరునదిని ఆనుకొని ఉంది. ఎలగందుల కోటను కాకతీయులు 1083– 1323 మధ్య నిర్మించారు. ఈ కోటకు మొదటి పేరు ‘వెలిగుండుల’. దీనిని ముసునూరి నాయకులు, రాచర్ల పద్మనాయకులు ధృడంగా తయారు చేశారు. కోట చుట్టూ సుమారు 5 కిలోమీటర్ల వెడల్పు, 4 మీటర్ల లోతు నీటి కందకాన్ని తవ్వించి మొసళ్లతో నింపి శత్రువుల నుంచి రక్షణగా ఏర్పాటు చేశారు. 16వ శతాబ్దంలో ఈ కోటను కుతుబ్షాహీలు ఆక్రమించారు. తర్వాత మొఘల్ సామ్రాజ్యాధీనంలోకి వచ్చింది. హైదరాబాద్ నిజాం పాలనలో నిజాం ఉల్ ముల్క్ అసఫ్జాహి (1724–1748) కాలంలో అమీన్ఖాన్ ఈ కోట ఖిలేదార్గా బాధ్యతలు చేపట్టారు. 1754లో నవాబ్ సలాబత్ జంగ్ కాలంలో మీర్జా ఇబ్రహీం దంసా ఈ కోటను పునర్నిర్మించారు. 1905లో ఆరో నిజాం మహబూబ్ అలీఖాన్ జిల్లా కేంద్రాన్ని ఎలగందుల్ నుంచి కరీంనగర్కు మార్చారు. కోటలో నీలకంఠస్వామి, లక్ష్మీనరసింహస్వామి ఆలయాలతోపాటు మసీదు హిందూ, ముస్లింల ఐక్యతకు ప్రతీకగా నిలుస్తున్నాయి. ఎలగందుల ఖిలా -
అనంతారం అద్భుతం
ఇల్లంతకుంట(మానకొండూర్): ఇల్లంతకుంట మండలం అనంతరం ప్రాజెక్టు 500 ఏళ్ల క్రితం నిర్మించారు. ప్రాజెక్టు ఆయకట్టు దాదాపు 800 ఎకరాల వరకు ఉంటుంది. అనంతారం ప్రాజె క్టు నీటితో నిండితే బిక్కవాగు పరివాహక ప్రాంతమైన అనంతారం, రహీంఖాన్పేట, ఇల్లంతకుంట, వంతడుపుల, నర్సక్కపేట గ్రామాల్లోని పంటలకు సమృద్ధిగా సాగునీరు లభిస్తుంది. డాక్ బంగ్లా అనంతారం ప్రాజెక్టు పరిధిలోని డాక్ బంగ్లాను రెండెరాల విస్తీర్ణంలో నిర్మించారు. ప్రాజెక్టు పరి శీలనకు వచ్చిన ఇరిగేషన్ అధికారులు ఇక్కడే సే ద తీరేవారు. డాక్బంగ్లా ఇల్లంతకుంట మండలంలో ప్రాముఖ్యత సంతరించుకుని ఉంది. -
ప్రభుత్వ పాఠశాలలకు రేటింగ్
● ప్రతిభ చూపిన స్కూల్కు రూ.లక్ష సాయం సుల్తానాబాద్(పెద్దపల్లి): నాణ్యమైన బోధన, పరిసరాల పరిశుభ్రత, విద్యార్థుల్లో క్రమశిక్షణ, ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ.. ఇలాంటి అంశాల్లో ప్రతిభ చూపిన ప్రభుత్వ పాఠశాలలకు ప్రభుత్వం రేటింగ్ ఇస్తోంది. సుమారు ఐదేళ్లక్రితం నిలిచిన ఈ పథకాన్ని ఇటీవల మళ్లీ పునరుద్ధరించింది. జిల్లాలో 543 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, అందులో 85,785 మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రభుత్వం నియమించిన కమిటీలు స్కూళ్లలో తనిఖీలు చేసి మార్కులు కేటాయిస్తాయి. ఐదు పాయింట్లు సాధించిన పాఠశాలలకు కేంద్రప్రభుత్వం నేరుగా పురస్కారాలు అందింస్తుంది. జిల్లాస్థాయిలో కలెక్టర్, డీఈవో, జిల్లా వైద్యాధికారి, డీఈఈ, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి, ఉపాధ్యాయులతో కమిటీ ఏర్పాటు చేస్తారు. వచ్చే అక్టోబర్లో ఈ కమిటీ స్కూళ్లను తనిఖీ చేసి మార్కులు కేటాయిస్తుంది. 30 వరకు గడువు రేటింగ్ సాధించి పురస్కారాలు అందుకునేందుకు ప్రభుత్వ పాఠశాలలు ఆన్లైన్లో దరఖాస్తు చేయాలి. ఇందుకోసం ఈనెల 30వ తేదీ వరకు గడువు ఉంది. దరఖాస్తులను జిల్లాస్థాయిలో కమిటీ పరిశీలించి రేటింగ్ ఇస్తుంది. జాతీయస్థాయిలో ఎంపికై తే రూ.లక్ష ప్రోత్సాహకం అందుతుంది. – మాధవి, డీఈవో -
కంపెనీ విత్తనాలు వేసిన
గోపరపల్లిలో వరుణ్ సీడ్ కంపెనీ విత్తనాలతో పంట వేసిన. బోనస్ ఇస్తాం అంటేనే దొడ్డువడ్లు పక్కకు పెట్టి సీడ్ వడ్లు సాగు చేసిన. కింటాల్కు బోనస్ రూ.500 ఇస్తానన్నారు. ప్రభుత్వం బోనస్ ఇవ్వకపోవడంతో కంపెనీ వాళ్లు సైతం బోనస్ ఎగవేయడానికి ప్రయత్నిస్తున్నారు. – కర్రే ప్రభాకర్రెడ్డి, రైతు, గోపరపల్లి అధికారులు ఇప్పించాలి నాకున్న పదెకరాల్లో వరుణ్ కంపెనీ సీడ్ వరి సాగు చేసిన. పెట్టుబడి రూ.3.60లక్షలు అయ్యింది. క్వింటాల్కు బోనస్తో కలిపి రూ.2,820 ఇస్తామన్నరు. ఇప్పుడేమో ప్రభుత్వం బోనస్ ఇవ్వడం లేదు కాబట్టి మేము ఇవ్వమంటున్నరు. అధికారులే బోనస్ ఇప్పించాలె. – అమ్ముల మల్లేశ్, రైతు, హరిపురం -
ఉద్యోగుల సంక్షేమానికి కృషి
● ఎన్టీపీసీ ఎన్బీసీ సభ్యుడు సుంకరి మల్లేశం జ్యోతినగర్(రామగుండం): ఎన్టీపీసీ ఉద్యోగుల సంక్షేమానికి బీఎంఎస్ అనుబంధ ఎన్టీపీసీ కార్మిక సంఘ్ కృషి చేస్తుందని ఎన్టీపీసీ ఎన్బీసీ సభ్యుడు, బీఎంఎస్ జాతీయ ఉపాధ్యక్షుడు సుంకరి మల్లేశం అన్నారు. ఎన్టీపీసీ పర్మినెంట్ టౌన్షిప్ జ్యోతిభవన్లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. భూ నిర్వాసిత కోటాలో ఉద్యోగం పొందిన ఉద్యోగులకు పీఆర్ఎంఎస్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. కేరీర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం(సీడీపీ)లో ప్రత్యేక శిక్షణ అందించి పదోన్నతులు కల్పించాలని కోరారు. గతంలో ఉద్యోగుల సంఖ్య అధికంగా ఉండేదని, ప్రస్తుతం ఆ సంఖ్య వందలకు పడిపోయిందని అన్నారు. ఉద్యోగ నియామకాలు చేపట్టాలని ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన సమావేశంలో యాజమాన్యానికి తెలియజేశామని ఆయన వెల్లడించారు. 2027లో జరిగే వేతన సవరణలో ప్రత్యేక భాగస్వామిగా నిలిచేందుకు బీఎంఎస్ను గెలిపించాలని ఆయన కోరారు. సమావేశంలో బీఎంఎస్ అనుభంధ ఎన్టీపీసీ కార్మిక సంఘ్ అధ్యక్షుడు కేతిరెడ్డి భాస్కర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి సాగర్ రాజు, నాయకులు బండారి కనకయ్య, పోగుల స్వామి, చల్లా సత్యనారాయణరెడ్డి, శ్రీనివాస్, సతీశ్కుమార్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
హక్కుల సాధనలో ఐఎన్టీయూసీ విఫలం
జ్యోతినగర్(రామగుండం): ఎన్టీపీసీ ఉద్యోగుల హ క్కుల సాధనలో ఐఎన్టీయూసీ విఫలమైందని సీ ఐటీయూ అనుబంధ ఎన్టీపీసీ యునైటెడ్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు ఎన్.భిక్షపతి విమర్శించారు. పీటీఎస్లోని యూనియన్ కార్యాలయంలో ఆదివారం జరిగిన సమావేశంలో ఆయన మా ట్లాడారు. ఈనెల 25న ఎన్టీపీసీ ఉద్యోగ గుర్తింపు సంఘం ఎన్నికల్లో సీఐటీయూ నక్షత్రం గుర్తుకుఓ టు వేయాలని అభ్యర్థించారు. ఇప్పటికే రెండుసార్లు గెలిచిన ఐఎన్టీయూసీ అనుబంధ ఎన్టీపీసీ మజ్దూ ర్ యూనియన్.. అవినీతి, అక్రమాలకు పాల్పడు తోందని ధ్వజమెత్తారు. ఉద్యోగానంతరం వైద్య సౌ కర్యం, పీఆర్ఎంఎస్ వర్తింపజేసేలా మార్పులు తీ సుకొస్తామని, విద్యార్హతలను బట్టి ఫాస్ట్ట్రాక్ ప్ర మోషన్ పాలసీ అమలు చేయిస్తామని, కిందిస్థాయి ఉద్యోగులకు కేరీర్ ప్రోగ్రాం అమలు చేయిస్తామని హామీ ఇచ్చారు. ఎన్టీపీసీ యునైటెడ్ ఎంప్లాయీస్ యూనియన్ కార్యనిర్వాక అధ్యక్షుడు భూమయ్య, ప్రధాన కార్యదర్శి ఈదునూరి రాజేశ్వర్, కోశాధికా రి భిక్షపతి, హెచ్ఎంఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సీహెచ్ ఉపేందర్, సీఐటీయూ జిల్లా కోశాధికారి రామాచారి, నాయకులు రాజు, అశోక్ పాల్గొన్నారు. -
తెల్లవారకముందే క్యూలైన్లో..
సుల్తానాబాద్లో..కాల్వశ్రీరాంపూర్: కూనారంలో.. కాల్వశ్రీరాంపూర్/సుల్తానాబాద్/ ఓదెల (పెద్దపల్లి): యూరియా కోసం రైతులు తెల్లవారక ముందే సింగిల్విండో కార్యాలయాలు, ఆగ్రోస్ కేంద్రాలు, ప్రైవేట్ ఎరువుల దుకాణాల ఎదుట బారులు తీరుతున్నారు. ఆదివారం కూడా అన్నదాతలు అన్ని పనులు వదిలేసి మండల కేంద్రాలకు పరుగులు తీశారు. కాల్వశ్రీరాంపూర్ మండలం కూనారం, ఓదెల మండలం గూడెం, సుల్తానాబాద్ మండలం పూసాలలో అన్నదాతలు ఎరువుల కోసం గంటల తరబడి బారులు తీరి కనిపించారు. -
అవగాహన లేక.. సాయం అందక
రామగుండం: కుటుంబాన్ని పోషించే యజమాని ఆకస్మికంగా మరణిస్తే.. ఆ కుటుంబానికి ఆర్థికంగా బాసటగా నిలిచేందుకు జాతీయ కుటుంబ ప్రయోజన పథకం (నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీం – ఎన్ఎఫ్బీఎస్)ను కేంద్రప్రభుత్వం అమలు చేస్తోంది. దీనిద్వారా బాధిత కుటుంబానికి రూ.ఇరవై వేల సాయం అందుతుంది. 2017లోనే ఈ పథకం అమలులోకి వచ్చింది. అయితే, దీనిపై క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన లేక ప్రభుత్వ ఆశయం నెరవేరడంలేదు. అంతేకాదు.. ఆ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు బాధితులూ ఆసక్తి చూపడంలేదు. కుటుంబ సభ్యుల ధ్రువీకరణపత్రం జారీ విషయంలో రెవెన్యూ అధికారుల ద్వారా ఎదురయ్యే ఇబ్బందులు ఇందుకు కారణమవుతోంది. ఏటా రూ.7వేల మందికి ప్రయోజనం కలిగేలా ఎన్ఎఫ్బీఎస్ ద్వారా ఏటా 7,794 మంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూర్చేలా కేంద్రప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని స్థానికంగా ఉండే ఐకేపీ ప్రతినిధులు చెబుతున్నారు. వివిధ ప్రమాదాల్లో ఏటా లక్షల మంది మృత్యువాత పడుతున్నా.. కేవలం అవగాహన లేక బాధిత కుటుంబాలు ఈ పథకానికి దరఖాస్తు చేయలేకపోతున్నాయి. దీనికి గడువు అంటూ ఏమీ ఉండదని, అర్హులైన వారు దరఖాస్తు చేయాలని అంతర్గాం ఐకేపీ ఏపీఎం సదానందం, సీసీ రాంబాబు తెలిపారు. ఎవరు అర్హులంటే.. -
వైకల్యాన్ని జయించి.. స్వయం ఉపాధి ఎంచుకుని ..
● విధిరాతను అధిగమిస్తూ ముందుకు.. ● ఊరూరా తిరుగుతూ పగ్గాల విక్రయం ● ఆదర్శంగా నిలుస్తున్న ‘ఆరుపదుల వ్యక్తి’మంథనిరూరల్: చిన్నతనంలోనే పోలియో బారినపడ్డాడు.. రెండుకాళ్లు చచ్చుబడిపోయినా ఏమాత్రం ధైర్యం కోల్పోలేదు.. విధిరాతను ఎదురించాడు.. ఆత్మస్థైర్యాన్ని ఆయుధంగా చేసుకున్నాడు.. అడుగు ముందుకు వేశాడు.. ఆరుపదుల వయసులోనూ ఉపాధి మార్గం ఎంచుకున్నాడు.. ఎంతోకొంత సంపాదిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు ఉప్పట్ల గ్రామానికి చెందిన కాసిపేట రాయమల్లు. చిన్నతనంలోనే పోలియో బారినపడి.. రాయమల్లు చిన్నతనంలోనే పోలియో బారినపడ్డాడు. కాళ్లు చచ్చుబడిపోయినా మొక్కవోని ధైర్యం నింపుకుని స్వయం ఉపాధి ఎంచుకున్నాడు. పెళ్లి చేసుకున్నాక కూడా ఎవరిపైనా ఆధారడకుండా కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఆయనకు ఒక కూతురు, ఒక కుమారుడు ఉండగా పదేళ్ల క్రితమే కూతురుకు వివాహం చేశాడు. కొడుకు హైదరాబాద్లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. పగ్గాలు, బుట్టలు తయారు చేస్తూ.. ఒకప్పుడు సింగరేణి సంస్థలో కార్డు ద్వారా ఇచ్చే బొగ్గును తీసుకువచ్చి అమ్ముకుని కుటుంబాన్ని పోషించేవాడు రాయమల్లు. ఆ తర్వాత చిన్నాచితక పనులు చేసేవాడు. ఇరవై ఆరేళ్లుగా ప్లాస్టిక్ సంచుల దారాలతో పగ్గాలు, బుట్టలు తయారు చేస్తూ విక్రయిస్తున్నాడు. వ్యవసాయం చేసే రైతులు తమ ఎడ్లకు అవసరమైన పగ్గాలు, బుట్టలను రాయమల్లు వద్దే కొనుగోలు చేస్తున్నారు. జతపగ్గం ధర రూ.250తో విక్రయం.. నాలుగు రోజులు కష్టపడితే ఒకజత పగ్గం తయారు అవుతుంది. ప్లాస్టిక్ సంచులను చీరి, దారాలను వేరుచేసి పేని తయారు చేసిన జతపగ్గాలను రూ. 250కు విక్రయిస్తున్నాడు. ఇలా నెలలో పదిజతల పగ్గాలు, పది జతల బుట్టలు తయారు చేస్తేనే కూలి గిట్టుబాటు అవుతుందని రాయమల్లు తెలిపాడు. ఐదు కిలో మీటర్ల పరిధిలో.. సుమారు ఐదు కిలోమీటర్ల పరిధిలోని గ్రామాలకు రాయమల్లు తన మూడు చక్రాల సైకిల్ సాయంతో తిరుగుతూ పగ్గాలు, బుట్టలు అమ్ముతున్నాడు. ఎడ్లకు పగ్గాలు, మూతికి కట్టే బుట్టలనే ఎక్కువగా వాడుతుంటారు. రాయమల్లు తయారు చేసిన పగ్గాలు, బుట్టలు నాణ్యంగా ఉంటాయని, అందుకే కొనుగోలు చేస్తుంటారని స్థానికులు చెబుతున్నారు. ఆర్థికసాయం అందించాలి రెండుకాళ్లు చచ్చుబడిపోయినా కుటుంబాన్ని సాకేందుకు ఎంతో కష్టపడుతున్న. ఏ పనులకూ నన్ను ఎవరూ పిలువరు. చేసేదేమీలేక ఉపాధి కోసం పగ్గాలు, బుట్టలు తయారు చేస్తున్న. ప్రభుత్వం, అధికారులు రుణం మంజూరు చేస్తే మరింత పనితనం మెరుగుపర్చుకుంట. మూడు చక్రల సైకిల్ పనిచేయడంలేదు. ప్రభుత్వం సాయం అందించి ఆదుకోవాలి. – కాసిపేట రాయమల్లు, ఉప్పట్ల -
బోనస్ కోసం నిరీక్షణ
సాక్షి పెద్దపల్లి: యాసంగి ధాన్యం కొనుగోళ్లు పూర్తయి సుమారు మూడు నెలలు దాటింది. అయినా, సన్నరకం ధాన్యం తాలూకు బోనస్ రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమకాలేదు. ఇదే అదనుగా రైతుల నుంచి సీడ్ వడ్లు కొనుగోలు చేసిన పలు కంపెనీలు, మిల్లర్లు సైతం బోనస్ చెల్లించడం లేదు. దీంతో చేతిలో డబ్బుల్లేక అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో విక్రయిస్తే బస్తాపై రెండు కేజీల నుంచి మూడు కేజీల వరకు కోత పెట్టి అడ్డగోలుగా దోచుకుంటున్న రైస్ మిల్లర్ల బారినుంచి తప్పించుకునేందుకు రైతులు సీడ్వడ్లు సాగుచేసైనా లబ్ధిపొందుతామనుకుంటే.. ఇక్కడ కూడా మోసానికి గురికాక తప్పడం లేదు. సీడ్ సాగు చేసిన రైతులకు బోనస్ చెల్లిస్తామని మూడు నెలల క్రితమే సన్నవడ్లు సేకరించిన మిల్లర్లు.. ఇప్పటివరకు డబ్బులు చెల్లించకుండా ఎగనామం పెట్టేందుకు సిద్ధమవుతున్నారని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లాభం సీడ్ మిల్లర్లకే. సాధారణంగా రైతుల నుంచి సేకరించిన సన్నరకం ధాన్యాన్ని శుద్ధి చేసి 25 కిలోల చొప్పున బ్యాగుల్లో నింపి బస్తాకు కొంత లాభం చూసుకొని వ్యాపారు లు ధర నిర్ణయించి విక్రయిస్తుంటారు. గతేడాది 25 కిలోల విత్తన సంచిని లోకల్ మార్కెట్లో రూ.900 నుంచి రూ.950 ధరతో విక్రయించగా ఇతర రాష్ట్రాలకు రూ.1,249 ధర ముద్రించి విక్రయించారు. గతేడాది ప్రభుత్వం బోనస్ ప్రకటించలేదు. ఈ ఏడాది బోనస్ ప్రకటించింది. దీంతో రైతులు సీడ్ మిల్లు యజమానులతో ప్రభుత్వం ఇస్తున్నట్లు బోనస్ ఇవ్వాలని, క్వింటాల్కు రూ.2,820 చెల్లిస్తేనే ధాన్యం విక్రయిస్తామని రైతులు తేల్చి చెప్పారు. దీంతో రైస్మిల్లు యజమానులు ధర పెంచారు. వ్యాపారులకు 25 కిలోల విత్తన సంచికి ధర పెంచి రూ.1,050 నుంచి రూ.1,100 వరకు విక్రయించారు. అంటే.. క్వింటాల్కు రూ.600 లాభంతో అమ్మకాలు సాగిస్తున్నారు. కానీ, రైతులకు ఇచ్చే బోనస్ మాత్రం చెల్లించడం లేదు. ఎగవేతకు యత్నం.. ముందుగా క్వింటాల్కు రూ.2,820 ధర ఇస్తానని చెప్పి ఇప్పుడేమో తగ్గించి ఇస్తామంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓ వైపు అమ్మిన వడ్లకు డబ్బులు ఇవ్వకుండా నెలల తరబడి జాప్యం చేస్తుండగా.. మరోవైపు బోనస్ విషయంలో స్పష్టత ఇవ్వకపోవడంతో ఆందోళనకు గురవుతున్నారు. క్వింటాల్కు రూ.2,820కి బదులు రూ.2,500 మాత్రమే ఇస్తామని అంటున్నారని, మరికొందరు మద్దతు ధర రూ.2,320 ఇస్తామంటున్నారని పేర్కొంటున్నారు. జిల్లాలోని పలు మండలాల్లో సీడ్ వరి సాగవుతోంది. ఇక్కడ పండిన సన్నవడ్ల విత్తనాలకు నాణ్యతపరంగా ఇతర రాష్ట్రాల్లో మంచి డిమాండ్ ఉంది. ఏటా ఇక్కడి సీడ్మిల్లు వ్యాపారులు రైతుల నుంచి ధాన్యం సేకరించి, మిల్లుల్లో శుద్ధి చేసి విత్తనాలుగా విక్రయిస్తుంటారు. ఈఏడాది యాసంగిలోనూ సాగు చేసిన వరిలో సగానికిపైగా విత్తనాల కోసం ధాన్యం సేకరించారు. అయితే, ప్రభుత్వం సన్నాలకు రూ.500 బోనస్ ఇస్తామని ప్రకటించడంతో మద్దతు ధర రూ.2,320కు బోనస్ కలిపి రూ.2,820 ఇస్తామని చెప్పి సుమారు 5 వేల మంది రైతుల నుంచి దాదాపు 40 వేల టన్నుల వరకు ధాన్యం తీసుకున్నారు. డబ్బులు అత్యవసరం ఉన్న కొందరు రైతులకు క్వింటాల్కు రూ.2,500 చొప్పున చెల్లించగా.. మిగతా రైతులకు ఇప్పటివరకు రూపాయి కూడా ఇవ్వలేదు. జిల్లా యంత్రాంగం చొరవ చూపితేనే తమకు న్యాయం జరుగుతుందని పలువురు అన్నదాతలు వేడుకుంటున్నారు.జిల్లా సమాచారం.. ధాన్యం కొనుగోలు కేంద్రాలు 315 సన్నధాన్యం విక్రయించిన రైతులు 77,761 జమకావాల్సిన బోనస్(రూ.కోట్లలో) 39.8 సీడ్ సాగు చేసిన రైతులు(సుమారు) 5,000 మిలర్లకు విక్రయించిన ధాన్యం 40,000 (మెట్రిక్ టన్నుల్లో) -
‘సర్కార్ వైఫల్యమే కారణం’
పెద్దపల్లిరూరల్: రైతు సంక్షేమమే ధ్యేయమంటూ గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ పాలకులు.. కేంద్రంలోని బీజేపీ సర్కార్ సరిపడా యూరియా అందించినా రైతులకు పంపిణీ చే యలేని నిస్సహాయస్థితిలో ఉన్నారని బీజేపీ రా ష్ట్ర నాయకుడు గొట్టిముక్కుల సురేశ్రెడ్డి విమర్శించారు. జిల్లా కేంద్రంలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వరి సా గు చేస్తున్న రైతుల కోసం 6.12లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని రాష్ట్రం వి న్నవించగానే కేంద్రప్రభుత్వం సమకూర్చిందన్నారు. రాష్ట్రంలో 1.76లక్షల నిల్వలు ఉన్నా కొరత ఏర్పడడం సందేహాలకు తావిస్తోందని అన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకని రైతులకు సరిపడా యూరియా అందించాలని ఆయన డిమాండ్ చేశారు. సమావేశంలో బీజేపీ సుల్తానాబాద్ మండల అధ్యక్షుడు కందుల శ్రీనివాస్, జీఎస్ఆర్ ఫౌండేషన్ అధ్యక్షుడు కనుకుంట్ల జోగేందర్, నాయకుడు బొడ్డుపల్లి కుమార్ పాల్గొన్నారు. ఐక్య ఉద్యమాలే శరణ్యం గోదావరిఖని: కార్మికుల హక్కుల సాధన కో సం గుర్తింపు యూనియన్ ఏఐటీయూసీ ఐక్య ఉద్యమాలకు ముందుకు రావాలని జీఎల్బీకేఎస్ గౌరవ సలహాదారు టి.శ్రీనివాస్ కోరారు. స్థానిక ఫంక్షన్ హాల్లో ఆదివారం జరిగిన ము ఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. గుర్తింపు ఎన్నికల సందర్భంగా ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ నేతలు.. కార్మికులకు ఆదాయ పన్ను, పెర్క్స్పై ఇన్కంట్యాక్స్ రద్దు, సొంత ఇంటి పథకం, నూతన గనుల ఏర్పాటు, వారసత్వ ఉద్యోగాలు తదితర సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చాయని గుర్తుచేశారు. ఆ హామీలు ఇప్పటికీ అమలుకు నోచుకోలేదన్నారు. హామీల అమలుకు ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని ఆయన కోరారు. నాయకులు జె.సీతారామయ్య, ఎ.వెంకన్న, డి.బ్రహ్మానందం, ఎండీ రాసుద్దీన్, గౌని నాగేశ్వరరావు, ఇ.నరేశ్, టి.శ్రీనివాసు, జి.మల్లేశ్, ఎస్.నర్సింగం, ఐ.రాజేశం, ఎం.సిద్దయ్య, కొండపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నేడు బంద్ పాటించాలి జ్యోతినగర్(రామగుండం): మేడిపల్లి సెంటర్లోని నిర్మాణాల కూల్చివేతల్లో పారదర్శకత పాటించాలనే డిమాండ్తో సోమవారం చేపట్టిన పట్టణ బంద్ను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కోరారు. తొలుత మెయిన్ రోడ్డు వెడల్పు 40 అడుగులు విస్తరించాలని మార్కింగ్ ఇవ్వగా, దానిని 35 అడుగులకు కుదించి మార్కింగ్ ఇచ్చారన్నారు. మున్సిపల్ సిబ్బంది మళ్లీ 40 అడుగుల వరకు విస్తరించాలని, ఈక్రమంలో అవరోధంగా ఉ న్న కట్టటడాలను కూల్చివేయాలనడంతో వ్యా పారులు భయబ్రాంతులకు గురవుతున్నారని మండిపడ్డారు. బల్దియా సిబ్బంది తీరు సరికాదన్నారు. ఈమేరకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన పట్టణ బంద్ను విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా ప్రచార పోస్టర్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో స్థానికులు, నాయకులు పాల్గొన్నారు. మిలాద్ ఉన్ నబీ ర్యాలీ గోదావరిఖనిటౌన్: మిలాద్ ఉన్ నబీ సందర్భంగా నగరంలో ఆదివారం ముస్లింలు ర్యాలీ నిర్వహించారు. స్థానిక గాంధీనగర్ మదర్సా నుంచి ప్రధాన చౌరస్తా వరకు ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మసీదు కమిటీ నాయకులు మహమ్మద్ నసీర్, షేక్ హజీ అలీ, మహమ్మద్ షరీఫ్, ఉమర్, హబీబ్, గులాం సాబ్రి, గౌస్, కలీమ్, నజీమొద్దీన్, షేక్ అలీ, రియాజ్, ముబీన్, జానీ పాల్గొన్నారు. -
క్రీడాస్థలం అభివృద్ధికి కృషి
● మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ ధర్మారం(ధర్మపురి): మండల కేంద్రంలోని క్రీడా స్థలాన్ని అభివృద్ధి చేస్తామని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ హామీ ఇచ్చారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయ సమీపంలోని క్రీడా స్థలాన్ని ఆయన ఆదివారం పరిశీలించారు. మంత్రి మాట్లా డుతూ, క్రీడామైదానం లేక యువకులు ఇబ్బందు లు పడుతున్నారన్నారు. ఈ స్థలాన్ని మైనింగ్శాఖ ద్వారా అభివృద్ధి చేయిస్తానని మంత్రి అన్నారు. చుట్టూ ఉన్న బండలు, చెట్లను తొలగించి స్థలం చదును చేయించి అందుబాటులోకి తీసుకొస్తానని తెలిపారు. క్రీడా మైదానం పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తే గ్రామస్తులు వాకింగ్ చేసేందుకు అనువుగా ఉంటుందని అడ్లూరి వివరించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ లావుడ్య రూప్లానాయక్, వైస్ చైర్మన్ అరిగే లింగయ్య, మాజీ వైస్ చైర్మన్ కాడే సూర్యనారాయణ, మాజీ ఎంపీటీసీ సభ్యుడు తోడేటి రాజలింగయ్య, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సోగాల తిరుపతి, నాయకులు జంగ మహేందర్యాదవ్, ఓరం చిరంజీవి, పాలకుర్తి సాయిగౌడ్, ఎల్లయ్య, పొనవేని స్వామి తదితరులు పాల్గొన్నారు. -
జర్నలిస్ట్లపై దాడితో సమాజానికి నష్టం
పత్రికలు, జర్నలిస్ట్లను సమాజం కాపాడుకోవాలని కార్మిక సంఘాల నేతలు అభిప్రాయపడ్డారు. ప్రజాసమస్యలను వెలుగులోకి తీసుకొస్తున్న సాక్షి దినపత్రికపై ఏపీ ప్రభు త్వ కక్ష సాధింపు సరికాదన్నారు. ‘సాక్షి’ ఎడి టర్ ధనంజయరెడ్డితోపాటు జర్నలిస్ట్లపై అక్రమ కేసులు పెట్టి భయాందోళనకు గురి చేస్తోందని, ఏపీ ప్రభుత్వ నిరంకుశవైఖరిని ప్రజాస్వామ్యవాదులు, కార్మిక సంఘాలు ఖండించాలంటున్నారు. – గోదావరిఖని ప్రజాస్వామ్యానికి పట్టుగొమ్మలు ప్రజాస్వామ్యంలో పత్రికలపాత్ర కీలకం. వ్యతిరేకంగా వార్తలు రాశారని పోలీ సులు కేసులు నమోదు చేసి ఇబ్బందులకు గురిచేయడం సరికాదు. ఏపీ ప్రభుత్వం నిరంకుశ ధోరణి మానుకోవాలి. సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డి, జర్నలిస్ట్లపై కేసులు విరమించుకోవాలి. – వాసిరెడ్డి సీతారామయ్య, అధ్యక్షుడు, ఏఐటీయూసీ వాస్తవాలు వెలికితీసేవి పత్రికలు వాస్తవాలను వెలికితీసి ప్రజల ముందు ఉంచే పత్రికలకు గౌరవం, స్వేచ్ఛ ఇవ్వాలి. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీలు, ప్రజల స్వరాన్ని వినిపించే అవకాశం పత్రికలకు మాత్రమే ఉంది. సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డిపై కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలి. – తుమ్మల రాజారెడ్డి, అధ్యక్షుడు, సీఐటీయూ వేధింపులు సరికాదు నిజాలను నిర్భయంగా రాసే సాక్షి దినపత్రికపై వేధింపులు తగవు. అన్నిపార్టీలు, ప్రజల మనోగతాన్ని ప్రజలకు తెలియజెప్పాల్సిన బాధ్యత పత్రికలపై ఉంది. తమకు వ్యతిరేకంగా వార్తలు రాశారని ఎడిటర్పై కేసులు నమోదు చేయడం సరికాదు. – జనక్ప్రసాద్, సెక్రటరీ జనరల్, ఐఎన్టీయూసీ వాస్తవాలు బయట పెట్టేవే.. వాస్తవాలను బయట పెట్టేవే పత్రికలు. వాటిని బతికించుకోవాల్సిన అవసరం సమాజానికి ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో పత్రికలతోనే ప్రజలకు అనేక విషయాలు తెలుస్తున్నాయి. సాక్షి ఎడిటర్, జర్నలిస్ట్లపై ఏపీ ప్రభుత్వం పెట్టిన కేసులను బేషరతుగా ఉపసంహరించుకోవాలి. – రియాజ్ అహ్మద్, అధ్యక్షుడు, హెచ్ఎంఎస్ పత్రికా స్వేచ్ఛను కాపాడాలి పత్రికా స్వేచ్ఛను కాపాడాల్సిన బాధ్యత ప్రతీఒక్కరి పై ఉంది. ప్రతీఅంశంపై ప్రజలను చైతన్యవంతం చేయడమే మీడియా ఉద్దేశం. ఏపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతున్నారనే అక్కసుతోనే కేసులు నమోదు చేయడం సరికాదు. ప్రజాస్వామ్య పద్ధతిలో వ్యవహరించాలి. – మిర్యాల రాజిరెడ్డి, అధ్యక్షుడు, టీబీజీకేఎస్ కేంద్ర ప్రభుత్వం స్పందించాలి ఏపీ ప్రభుత్వం సాక్షి ఎడిటర్, జర్నలిస్ట్లపై కేసులు నమోదు చేసి బెదిరింపులకు దిగుతోంది. ఈవిషయంలో కేంద్రప్రభుత్వం స్పందించాలి. పత్రికాస్వేచ్ఛను కాపాడాలి. అన్యాయాల్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు నమోదు చేయడం సిగ్గు చేటు. – యాదగిరి సత్తయ్య, అధ్యక్షుడు, బీఎంఎస్ -
ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే!
సాక్షిప్రతినిధి,కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సంచలనం రేపిన మె టా క్రిప్టో కరెన్సీ కేసులో పోలీసులు దూకుడు పెంచారు. ఈ వ్యవహారంలో మొదటి నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ కార్పొరేటర్, కాంగ్రెస్ పార్టీ నాయకుడు కట్ల సతీశ్ను పోలీసులు గురువారం అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. కీలక నిందితులుగా ఉన్న దాసరి రాజు, దాసరి రమేశ్, బూర శ్రీధర్, తులసీ ప్రకాశ్ను సీసీఎస్ పోలీసులు అదే రోజు ఉదయం అరెస్టు చేశారు. ఇదిలా ఉంటే క్రిప్టోలో అధికలాభాలు అంటూ ఉమ్మడి జిల్లాలో దాదాపు రూ.100 కోట్లు కొల్లగొట్టారనే ఆరోపణలు ఉన్నాయి. లాభాల ఆశచూపి.. అధికలాభాల ఆశచూపగానే పోలీసులు, రెవెన్యూ, ప్రభుత్వ టీచర్లు భారీగా పెట్టుబడులు పెట్టారు. వీరిని గతేడాది పలుమార్లు బ్యాంకాక్, మలేషియా, సింగపూర్ తదితర దేశాలకు తీసుకెళ్లారు. ఇలా దాదాపు రూ.100 కోట్ల వరకు వసూలు చేశారని, ఈ డబ్బుతో సూత్రధారుల్లో లోకేశ్ అనే వ్యక్తి ద్వా రా దుబాయ్ తదితర దేశాల్లో పలు వ్యాపారాలు స్థాపించారని బాధితులు ఆరోపించారు. ‘నష్టపోయాం మహాప్రభో.. మా డబ్బులు మాకివ్వాలని’ బాధితులు కోరినా.. ఎవరికీ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను వేధించేందుకు లీగల్ టీంను ఏర్పాటు చేసుకున్నట్లు పేర్కొంటున్నారు. బెదిరింపులు... బ్లాక్మెయిల్ మెటా క్రిప్టోలో చేరిన వారిలో సాధారణ వ్యక్తులు నిలదీస్తే కోర్టుల్లో ప్రైవేటు కేసులు వేశారు. దీనికి కొందరు పోలీసులు కూడా సహకరించడం గమనార్హం. బాధితులు ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగులైతే బ్లాక్మెయిల్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు విదేశాలకు వెళ్తే ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలి. కానీ...అది ఎక్కడా జరగలేదు. అంతేకాదు వారికి విదేశాల్లో అమ్మాయిలతో మసాజ్లు చేయించి వారి వీడియోలు దగ్గర పెట్టుకున్నారు. తమ డబ్బులు తమకు ఇవ్వమని అడిగితే.. ‘నా మీద కేసులు పెడితే.. మీరు అక్రమంగా విదేశాలకు వెళ్లడం, అక్కడ చేసిన పనుల మీద ఎదురుకేసులు పెట్టాల్సి వస్తుందని’ బెదిరింపులకు దిగారు. ఏయే చట్టాల కింద కేసు పెట్టారంటే? మాజీ కార్పొరేటర్ కట్ల సతీశ్ మాటలు నమ్మి నూనావత్ భాస్కర్ మరో 16మంది కలిసి దాదాపు రూ.1.20 కోట్లు డబ్బును మెటాలో పెట్టుబడులుగా పెట్టారు. బాధితుల ఫిర్యాదుతో కరీంనగర్ త్రీటౌన్లో గురువారం రాత్రి ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది. అనంతరం అతన్ని రిమాండ్కు తరలించారు. తెలంగాణ ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ ఆఫ్ ఫైనాన్సియల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1999 సెక్షన్ (5) కింద కట్ల సతీశ్పై కేసు నమోదు చేశారు. ఇది నాన్బెయిలబుల్. డిపాజిటర్ల నుంచి వసూలు చేసిన సొమ్మును దుర్వినియోగం చేసిన సందర్భాల్లో ఈ సెక్షన్ను పోలీసులు ప్రయోగిస్తారు. పోలీసుల అభియోగాలు రుజువైతే రూ.లక్ష జరిమానాతోపాటు పదేళ్ల కఠిన కారాగార శిక్ష కూడా పడే అవకాశాలు ఉన్నాయి. ఈ సెక్షన్ ప్రకారం దర్యాప్తులో భాగంగా డిపాజిటర్ల నుంచి సేకరించిన పెట్టుబడులతో కొన్న ఆస్తులను స్వాధీనం చేసుకుని, వాటిని వేలం వేసి బాధితులకు అందజేసే వీలుంది. అదే సమయంలో ఈ కేసు విచారణకు ప్రత్యేక కోర్టు కూడా ఏర్పాటు చేసే అవకాశాలు ఉంటాయి. వీటితోపాటు ద ప్రైజ్ చిట్స్ అండ్ మనీ సర్కులేషన్ స్కీమ్స్ బ్యానింగ్ యాక్ట్ 1978 సెక్షన్ (3), (4) కూడా పెట్టడం గమనార్హం.దక్షిణ మధ్య రైల్వే జీఎం పర్యటన క్రిప్టో నిందితులపై కఠిన చర్య తీసుకోవాలికరీంనగర్ కార్పొరేషన్: క్రిప్టో కరెన్సీ పేరిట మోసం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని కాంగ్రెస్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్రావు ఒక ప్రకటనలో కోరారు. ఈ వ్యవహారంలో ఎంత పెద్దవాళ్లు ఉన్నా విడిచి పెట్టవద్దన్నారు. మెటా ఫండ్ క్రిప్టో కరెన్సీ కేసులో అరెస్టయిన మాజీ కార్పొరేటర్ కట్ల సతీశ్ను కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించాలని పీసీసీ, డీసీసీ అధ్యక్షులకు లేఖ రాసినట్లు తెలిపారు. సతీశ్ బీఆర్ఎస్లో ఉన్నప్పుడే క్రిప్టో పేరిట డబ్బులు వసూలు చేశాడని అన్నారు. బీఆర్ఎస్ హయాంలోనే కఠిన చర్యలు తీసుకుంటే చాలామంది మోసపోకుండా ఉండేవారని అన్నారు. క్రిప్టో నిందితులపై కఠిన చర్యలు తీసుకుని, ప్రజలకు న్యాయం చేయాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. -
● సమస్యలు పరిష్కరించాలని పలువురి విన్నపం
రామగుండం: దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్కుమార్ శ్రీవాస్తవ, సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ గోపాలకృష్ణణ్ శనివా రం స్థానిక రైల్వేస్టేషన్ను సందర్శించారు. అధికారులతో కలిసి ప్రత్యేక రైలులో వారు రామగుండం చేరుకున్నారు. రూ.24 కోట్లతో చేపట్టిన రైల్వేస్టేషన్ ఆధునికీకరణ పనులు పరిశీలించారు. ఆ ర్జీ–2లోని ఓసీపీ–3ని సందర్శించారు. బొగ్గు ర వాణాపై సింగరేణి అధికారులతో సమీక్షించారు. కాగా, ఈనెల 25న రైల్వేస్టేషన్ను ప్రారంభిస్తార ని తెలిసింది. బీజేపీ నియోజకవర్గ ఇన్చార్జి కందుల సంధ్యారాణి, రైల్వే ప్రజా సంబంధాల ప్ర తినిధి అనుమాస శ్రీనివాస్ తదితరులు జీఎం శ్రీవాస్తవకు సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. కుందనపల్లి, పెద్దంపేట రైల్వే ఫ్లైఓవర్లు, ఎక్స్ప్రెస్ రైళ్ల హాల్టింగ్ల విషయమై వినతిపత్రం అందజేశారు. కుందనపల్లి రైల్వేగేట్ టెండర్ పూర్తిచేయించాలని కోరారు. ఆటోల పార్కింగ్ ఫీజు మినహాయించాలని విన్నవించారు. నవజీవన్, స్వర్ణజయంతి, మిలీనియం, గంగా – కావేరి, గరీబ్రథ్, కర్ణాటక సంపర్క్ క్రాంతి, జైపూర్ తదితర సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైళ్లకు హాల్టింగ్ క ల్పించాలని కోరారు. పలు యూనియన్ల ప్రతినిధులు ఓవై స్వామి, రాథోడ్ ఆనంద్, వీరన్న, మోజెస్, అజ్మీరా వీరన్ననాయక్ పాల్గొన్నారు. పెద్దపల్లి రైల్వేస్టేషన్ సందర్శన పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి జంక్షన్ను సౌత్ సెంట్ర ల్ రైల్వే జీఎం సంజయ్కుమార్ శ్రీవాత్సవ, డీఆర్ఎం రాధాకృష్ణ సందర్శించారు. అభివృద్ధి పను లను పరిశీలించారు. డీఆర్యూసీసీ సభ్యుడు నారాయణదాస్ తివారీ తదితరులు జీఎం శ్రీవాత్సవను సత్కరించి సమస్యలను విన్నవించారు. -
అభివృద్ధిపై ఆందోళన వద్దు
రామగుండం: అభివృద్ధి పనులపై ఆందోళన వద్దని ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్ అ న్నారు. చిరువ్యాపారుల అభ్యున్నతికి పాటుపడతానన్నారు. అభివృద్ధికి అడ్డుగా ఉన్న జెన్కో క్వార్టర్లను కూల్చివేస్తామన్నారు. పట్టణంలోని ప్రధాన వీధిలో చేపట్టిన అభివృద్ధి పనులను శనివారం జెన్కో ఎస్ఈ శంకరయ్యతో కలిసి పరిశీలించారు. తనతల్లిదండ్రులతో కలిసి నివా సం ఉన్న జెన్కో క్వార్టర్ను పరిశీలించి బాల్యం జ్ఞాపకాలను ఆయన గుర్తు చేసుకున్నారు.‘ప్రశ్నిస్తే కేసులు పెడతారా?’గోదావరిఖని: ప్రశ్నిస్తే కేసులు, అడిగితే కూల్చివేతలు.. ఇలా రామగుండంలో రాక్షసపాలన సాగుతోందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరు కంటి చందర్ ఆరోపించారు. శనివారం స్థానిక ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చట్టాలు ఎమ్మెల్యే కు చుట్టాలుగా మారాయన్నారు. 21నెలలుగా అరాచకపాలన సాగుతోందన్నారు. కూల్చివేత ల పేరిట చిరువ్యాపారులను రోడ్డున పడేస్తున్నారని ధ్వజమెత్తారు. నేపాల్లోఅరాచక పాలనను భరించలేక ప్రధానిని గద్దె దింపారని, రా మగుండంలోనూ ఆ పరిస్థితి రాకుండా జాగ్రత్త పడాలని చందర్ సూచించారు. కూల్చివేతల నేపథ్యంలో ఈనెల15న పట్టణ బంద్ పాటిస్తామని, చలో కలెక్టరేట్ చేపడతామని ఆయన ప్ర కటించారు. కార్యక్రమంలో నాయకులు కౌశిక్ హరి, కుమ్మరి శ్రీనివాస్, గాధం విజయ, బాదె అంజలి, బొడ్డు రవీందర్, నారాయణదాసు మారుతి, బొడ్డుపల్లి శ్రీనివాస్, గుంపుల లక్ష్మి, నూతి తిరుపతి తదితరులు పాల్గొన్నారు. ‘అది అవినీతి యూనియన్’ జ్యోతినగర్(రామగుండం): రెండు పర్యాయా లు గుర్తింపు యూనియన్గా ప్రాతినిధ్యం వహిస్తున్న ఎన్టీపీసీ మజ్దూర్ యూనియన్ అవినీతి, అక్రమాలకు పాల్పడిందని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ఎ.ముత్యంరావు ఆరోపించారు. ప్ర తీపనికి ఒక రేటు నిర్ణయించే దౌర్భాగ్య స్థితికి దిగజారిందన్నారు. ఐఎన్టీయూసీ, ఎన్టీపీసీ యాజమాన్యం చేతులు కలిపి అవినీతిలో కూ రుకుపోయారని మండిపడ్డారు. ఎన్టీపీసీ పర్మి నెంట్ టౌన్షిప్లో శనివారం ఆయన ఎన్నికల కార్యాలయం ప్రారంభించి మాట్లాడారు. ఈనె ల 25న జరిగే ఎన్టీపీసీ ఉద్యో గుర్తింపు సంఘం ఎన్నికల్లో సీఐటీయూను గెలిపించాలని కోరా రు. నాయకులు ఎన్.భిక్షపతి, సీహెచ్ ఉపేంద ర్, రామాచారి, గీట్ల లక్ష్మారెడ్డి, నాంసాని శంక ర్, భూమయ్య, రాజేశ్వర్, సారయ్య, కుమార్, వీరయ్య, గణేశ్, అశోక్, కృష్ణారెడ్డి పాల్గొన్నారు. జిల్లాకు పీఎం విశ్వకర్మ కిట్లు పెద్దపల్లిరూరల్: చేతివృత్తి పనులు చేసుకునేందుకు అవసరమైన పనిముట్లను అందించేందు కు కేంద్రప్రభుత్వం అమల్లోకి తెచ్చిన పీఎం వి శ్వకర్మ యోజన పథకం ద్వారా ఎంపికై న లబ్ధి దారులకు కిట్లను అందిస్తోంది. జిల్లాలో ఎంపికై న వారికి అవసరమైన కిట్లు స్థానిక హెడ్పోస్టాపీసుకు చేరాయి. వాటిని త్వరలోనే అందించనున్నట్లు అధికారులు తెలిపారు. చేతివృత్తుల (వడ్రంగి, సుతారి, స్వర్ణకారులు, కుమ్మరి, క మ్మరి తదితర) పనివాళ్లకు పీఎం విశ్వకర్మ ద్వారా రూ.3లక్షలను (తొలివిడత రూ.లక్ష, మ లివిడతలో రూ.2లక్షలు) రుణంగా తక్కువ వ డ్డీకే అందిస్తున్న విషయం తెలిసిందే. విశ్వకర్మ జయంతి సందర్భంగా గతేడాది సెప్టెంబర్ 17న ఈ పథకాన్ని ప్రధాని ప్రారంభించారు. 17 నుంచి సేవా పక్వాడా సుల్తానాబాద్(పెద్దపల్లి): ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా ఈనెల 17 నుంచి అక్టోబ రు 2వ తేదీ వరకు చేపట్టే సేవా పక్వాడా కార్యక్రమాలను విజయవంతం చేయాలని బీజేపీ జి ల్లా అధ్యక్షుడు సంజీవరెడ్డి కోరారు. మండల కేంద్రంలో శనివారం జరిగిన బీజేపీ ముఖ్య కా ర్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. రక్తదాన శిబిరాలు, మొక్కలు నాటడం తదితర కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. నాయ కులు కందుల శ్రీనివాస్, మిట్టపల్లి ప్రవీణ్, క డారి అశోక్రావు, సౌదరి మహేందర్ యాదవ్, కొమ్ము తిరుపతియాదవ్, రఘుపతిరావు, చా తరాజు రమేశ్, సంతోష్, నాగేశ్వర్ ఉన్నారు. -
భయం పోయింది
రేడియో జాకీగా మారిన తర్వాత స్టేజీ ఫియర్ పోయి ంది. మాట్లాడేటప్పుడు ఎలాంటి భయం లేకుండా సార్లు చెప్పిన అంశాలను క్లియర్ చెబుతున్న. దీనిద్వారా తెలియని విషయాలు తెలుస్తున్నాయి. – జ్యోత్స్న, 9వ తరగతిఎఫ్ఎం రేడియో ప్రసారాలతో విద్యార్థుల హా జరుశాతం పెరిగింది. క్రమశిక్షణ మెరుగైంది. స్టేజీ ఫియర్ తగ్గింది. చిన్నారులు బాగా మాట్లాడుతున్నారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల మధ్య స్నేహపూరిత వాతావరణ ఏర్పడింది. సమయం వృథా కాకుండా ఎఫ్ఎం ప్రసారాలు చేస్తున్నాం. – రాజ్కుమార్, ప్రిన్సిపాల్ఎఫ్ఎం ఎంతో ఉపయోగపడుతోంది. మ ధ్యాహ్న భోజ న సమయంలో పాఠశాల అంతా చిందరవందరగా ఉండేది. ఎఫ్ఎంతో మంచి వాతావరణం ఏర్పడింది. వివిధ అంశాలపైనా అవగాహన వస్తోంది. – శ్రీనిధి, 9వ తరగతి -
రాజీ పడితేనే మంచిది
మంథని: రాజీకి అవకాశం ఉన్న కే సులను కక్షిదారు లు రాజీ చేసుకోవచ్చని, ఒకసారి లోక్ అదాలత్లో కేసు రాజీ చేసుకుంటే ఇరుపక్షాలు పైకోర్టుకు వెళ్లే అ వకాశం ఉండదని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీ త కుంచాల అన్నారు. స్థానిక కోర్టులో శనివారం నిర్వహించిన లోక్ అదాలత్తో జడ్జి మాట్లాడారు. క్రిమినల్, కుటుంబ తగాదాలు, సివిల్ దావాలు, చెక్బౌన్స్, అన్నదమ్ముల ఆస్తి తగాదాలు వంటి కే సులు లోక్అదాలత్లో పరిష్కరించుకోవచ్చన్నారు. కేసు పరిష్కారమైతే మానసికంగా ప్రశాంతంగా ఉంటారని తెలిపారు. ఈ సందర్భంగా మంథనిలో 271 కేసులు పరిష్కారమయ్యాయి. నందిమేడారంలో 154తోపాటు పెద్దపల్లి, గోదావరిఖని, జూలప ల్లిలోనూ పలు కేసులు పరిష్కారమయ్యాయి. సీని యర్ సివిల్ జడ్జి భవాని, అడిషనల్ జూనియర్ సివి ల్ జడ్జి సుధారాణి, ద్వితీయ శ్రేణి న్యాయాధికారి అ నురాధ, ఆర్డీవో సురేశ్, గోదావరిఖని ఏసీపీ రమేశ్, మంథని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు హరిబాబు, తహసీల్దార్ కుమారస్వామి పాల్గొన్నారు. -
ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాలి
పెద్దపల్లిరూరల్: జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులు పనులు వెంటనే ప్రారంభించేలా అధికారు లు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ శ్రీహర్ష ఆదేశించారు. కలెక్టరేట్లో శుక్రవారం ఇందిరమ్మ ఇళ్ల ని ర్మాణంపై సమీక్షించారు. జిల్లాలో చేపట్టిన నిర్మాణాలను నూరుశాతం పూర్తిచేయాలన్నారు. ఈజీ ఎస్ ద్వారా చేపట్టిన పంచాయతీ భవనాలు, అంగన్వాడీ కేంద్రాల పనులు వేగవంతం చేయాలని ఆయన అన్నారు. ఇదేసమయంలో స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలని ఆదేశించారు. అనంతరం స్వచ్ఛతా హీ సేవ పోస్టర్ ఆవిష్కరించారు. యువతకు ఉపాధి అవకాశాలు.. యువత స్వయం ఉపాధి అవకాశాలు మెరుగుపర్చాలని కలెక్టర్ శ్రీహర్ష అన్నారు. టీజీ ఐ పాస్ కింద పరిశ్రమల స్థాపనకు దరఖాస్తు చేస్తే పరిశీలించి గడువులోగా అనుమతులివ్వాలని ఆదేశించారు. టామ్కామ్ ద్వారా విదేశాల్లో ఉద్యోగా వకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈనెల 17నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు స్వస్థ్ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని ప కడ్బందీ అమలు చేయాలని ఆదేశించారు. వానాకాలం వడ్ల కొనుగోలుకు ఇప్పట్నుంచే ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. ఏ– గ్రేడ్ రకం ధాన్యం క్వింటాలుకు రూ.2,389, సాధారణ రకానికి రూ.2,369 మద్దతు ధర చెల్లిస్తామన్నారు. రామగుండం అభివృద్ధిపై సమీక్ష రామగుండంలో చేపట్టిన అభివృద్ధి పనులను గడువులోగా పూర్తిచేయాలని కలెక్టర్ శ్రీహర్ష ఆదేశించారు. అడిషనల్ కలెక్టర్ అరుణశ్రీతో కలిసి ప నుల ప్రగతిపై ఆయన సమీక్షించారు. జెడ్పీ సీఈ వో నరేందర్, డీపీవో వీరబుచ్చయ్య, హౌసీంగ్ పీడీ రాజేశ్వర్రావు, డీఎస్వో శ్రీనాథ్, జిల్లా సహ కార అధికారి శ్రీమాల, డీఎంవో ప్రవీణ్రెడ్డి, అడిషనల్ డీఆర్డీవో రవీందర్, ఆర్అండ్బీ ఈఈ భా వ్సింగ్, డీపీవో వీరబుచ్చయ్య, ఈఈ గిరీశ్బాబు, ఈఈ రామన్ తదితరులు పాల్గొన్నారు. -
స్ట్రక్చర్ సమావేశం బహిష్కరణ
గోదావరిఖని: గుర్తింపు కార్మిక సంఘంతో చేసుకున్న ఒప్పందాలను సింగరేణి అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ స్ట్రక్చర్ సమావేశాన్ని బహిష్కరించినట్లు ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య తెలిపారు. హైదరాబాద్లో శుక్రవారం జరిగిన సమావేశంలో ఈవిషయాన్ని ప్రకటించారు. కార్మికుల సొంతింటి పథకంపై కమిటీ ముందుకు సాగలేదని, వాస్తవ లాభాలు ప్రకటించి అందు 35శాతం వాటా ఇవ్వాలని, నూతన ట్రాన్స్ఫర్ పాలసీ రద్దు చేయాలని చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు. డిస్మిస్ కార్మికులకు మరోసారి అవకాశం ఇవ్వాలని కోరగా నాన్చివేత ధోరణి అవలంబిస్తున్నారని, అన్ని క్యాడర్ స్కీంలను పరిష్కరించాలని చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు. మారుపేర్ల సమస్య కూడా ఇప్పటికీ కొలిక్కి రాలేదన్నారు. అడ్వకేట్ జనరల్ నుంచి అభిప్రాయం రావాలని పేర్కొంటూ కాలయా పన చేస్తున్నారన్నారు. 2018 నుంచి పెండింగ్లో ఉన్న, తిరస్కరించిన డిపెండెంట్ ఎంప్లాయిమెంట్ 2024 సర్క్యూలర్ ప్రకారం అందరికీ ఉద్యో గాలు ఇవ్వాలన్నారు. కాంట్రాక్టు కార్మికులకు హైపవర్ వేతనాలను ఇవ్వాలని, అర్హత కలిగిన ఓవర్మెన్లకు ప్రమోషన్ ఇవ్వాలని, మైనింగ్/ట్రేడ్స్మెన్ల సూటబుల్ జాబ్ విషయంపై నిర్ణయం తీసుకోవడం లేదని అన్నారు. క్లరికల్ ఖాళీలు భర్తీలో జాప్యం చేస్తోందన్నారు. ఇప్పటికై నా సమస్యలు పరిష్కరించకుంటే సంస్థవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్కుమార్, నాయకులు మిరియాల రంగయ్య, కె.సారయ్య, వైవీరావు. కె.వీరభద్రయ్య, ముస్కె సమ్మయ్య, మడ్డి ఎల్లాగౌడ్, వంగ వెంకట్, మోటపలుకుల రమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
పింఛన్ పోరు
తప్పని తిప్పలు కమాన్పూర్ పీఏసీఎస్ ఎదుట.. సుల్తానాబాద్ ప్యాక్స్ ఎదుట బారులు తీరిన రైతులు ఎలిగేడు మండలం ధూళికట్టలో.. కమాన్పూర్(మంథని): జిల్లారైతులకు యూరియా తిప్పలు తప్పడంలేదు. వరి పంటకు ప్రస్తుతం యూరియా వేయడం తప్పనిసరైంది. గడువు మీరితే దిగుబడిపై తీవ్రప్రభావం చూపే అవకాశం ఉంది. అందుకే అన్నదాతలు నిద్రలేచింది మొదలు సింగిల్విండోలు, గ్రోమోర్ సెంటర్లు, ప్రైవేట్ దుకాణాల ఎదుట బారులు తీరుతున్నారు. శుక్రవారం కూడా ఆయా ప్రాంతాల్లో రైతులు పడిగాపులు కాయడం కనిపించింది. ప్రజాసమస్యల్ని వెలుగులోకి తెస్తున్న సాక్షి దినపత్రికపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. ఇందులో భాగంగానే సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనంజయరెడ్డితోపాటు పలువురు జర్నలిస్ట్లపై అక్రమంగా కేసులు బనాయిస్తూ భయాందోళనలకు గురిచేస్తోంది. ఏపీ ప్రభుత్వ దురాగతాలను ప్రజలు, ప్రజాస్వామికవాదులు ఖండించాలని పలువురు సీనియర్ జర్నలిస్ట్లు కోరుతున్నారు. – గోదావరిఖనిగోదావరిఖని: పింఛన్ పెంచా లనే డిమాండ్తో సింగరేణితో పాటు దేశంలోని బొగ్గుగని రిటై ర్డ్ కార్మికులు ఉద్యమానికి సిద్ధమయ్యారు. ఈనెల 15న కోల్కతా లోని కోలిండియా ప్రధాన కార్యాల యం ఎదుట ధర్నా చేసేందుకు నిర్ణయించారు. ఈ మేరకు అక్కడకు తరలివెళ్తున్నారు. తమకు ఆర్థిక భద్రత, వైద్య సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఇందుకోసం బొగ్గు గనుల రిటైర్డ్ ఉద్యోగులకు కోల్మైన్స్ పింఛన్ స్కీం–1998 ప్రకారం 27 ఏళ్ల క్రితం కనీస పింఛన్ రూ.350గా నిర్ణయించా రు. అనేక ఉద్యమాల తర్వాత గతేడాది మార్చి 9 నుంచి కనీస పింఛన్ రూ.వెయ్యికి పెంచారు. సింగరేణివ్యాప్తంగా రూ.వెయ్యి పింఛన్ పొందే రిటైర్డ్ కార్మికులు సుమారు 8వేల మంది వరకు ఉన్నారు. ప్రస్తుత ధరలకు అనుగుణంగా కరువు భత్యం లేని పింఛన్ పెరగకపోవడంతో దేశవ్యాప్తంగా ఉమారు ఐదు లక్షల మంది పింఛన్దారులు దారిద్య్రరేఖకు దిగువున బతుకుతున్నారని అంచనా. విన్నవించినా ప్రయోజనం లేకనే.. పింఛన్ మొత్తం పెంచాలని, మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించాలని కేంద్ర మంత్రులు, రాజకీయ నాయకులకు అనేకసార్లు వినతిపత్రాలు సమర్పించారు. అయినా ప్రయోజనం లేదంటూ రిటైర్డ్ కార్మికులకు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పార్లమెంట్ ప్రతిపాదించిన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సిఫారుసులు కూడా అమలు కావడం లేదంటున్నారు. 2007కు ముందు రిటైర్డ్ ఉద్యోగులకు 500శాతం పింఛన్ పెంచాలని, వినియోగదారుల ధర సూచికను బట్టి కరువు భత్యంతో కూడిన పింఛన్ కోసం ప్రతీఐదేళ్లకోసారి పింఛన్ సవరణ చేయాలని, కోల్మైన్స్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ను రద్దు చేసి బొగ్గు మంత్రిత్వ శాఖ, ఆర్థిక మంత్రిత్వశాఖ, కో లిండియా, సింగరేణి, పింఛన్ ఫండ్ రెగ్యులేరిటీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో జాతీ య పింఛన్ ఫండ్ ఏర్పాటు చేయాలని రిటైర్డ్ బొగ్గు గని కార్మికులు కోరుతున్నారు. కోల్ఇండియా, సింగరేణి వార్షిక లాభాల్లో 2 శాతం నుంచి 3 శాతం, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, కేంద్ర బడ్జెట్లో కోల్ పింఛన్ ఫండ్ కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. కోల్మైన్స్ పింఛన్ పెంచాలని, రిటైర్డ్ ఉద్యో గులు, అధికారులకు ఒకేరకమైన వైద్యావిధానం అమలుపర్చాలని, మెడికల్ బిల్లుల్లో రీయింబర్స్మెంట్ చెల్లింపులో జాప్యం నివారించాలని రిటైర్డ్ ఉద్యోగులుకోరుతున్నారు. ఇవేడిమాండ్లపై ఈనెల 15న కోల్ ఇండియా ప్రధాన కార్యాలయం ఎదుట భారీ ప్రదర్శనకు సమాయత్తమవుతున్నారు. దీనికి సింగరేణి నుంచి రిటైర్డ్ ఉద్యోగులు పెద్దసంఖ్యలో తరలివెళ్లడానికి సిద్ధమవుతున్నారు. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంభారత రాజ్యాంగం ఆర్టికల్ 19 ప్రకారం పత్రికా స్వేచ్ఛను కల్పించింది. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, ప్రజలను చైతన్యవంతం చేయడమే మీడియా ఉద్దేశం. ఇందు లో భాగంగానే సాక్షి దినపత్రిక ఏపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతోంది. ఈనేపథ్యంలో ‘సాక్షి’పై క్షక్షగట్టి కేసులు కేసులు నమోదు చేస్తూ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. – గుడ్ల శ్రీనివాస్,అధ్యక్షుడు, ప్రెస్క్లబ్, పెద్దపల్లి ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలి ప్రజాస్వామ్యానికి పత్రికలు మూలస్తంభాలు. ప్ర జలు, ప్రభుత్వానికి వార ధిగా ఉంటాయి. వాటిని ప్రజాస్వామ్యవాదులు గౌ రవించాలి. ప్రజల కోసం పనిచేస్తున్న పత్రికల గొంతు నొక్కడం సరికాదు. పత్రికలు నిర్భయంగా వాస్తవాలు వెల్లడిస్తేనే ప్రజాసమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ప్రజాసమస్యలను వెలుగులోకి తీసుకొస్తున్న ‘సాక్షి’ఎడిటర్పై అక్రమ కేసులు నమోదు చేయడం శ్రేయస్కరం కాదు. – మల్లావఝుల వంశీ, జిల్లా అధ్యక్షుడు, టీయూడబ్ల్యూజే కేసులతో భయపెట్టలేరు సాక్షి దినపత్రిక ఎడిటర ధనంజయరెడ్డిపై ఏపీ ప్రభుత్వం అక్రమ కేసులు నమోదు చేసి పత్రికా స్వేచ్ఛపై దాడి చేస్తోంది. దీనిద్వారా ఒక్క్కసిరా చుక్క లక్ష మెదళ్లను కదిలిస్తుందని కాళోజీ చెప్పిన మాటలు గుర్తుకు వస్తున్నాయి. తప్పులను సరిద్దిద్దుకోవాల్సిన ప్రభుత్వం.. అక్రమ కేసులతో భయపెట్టాలని చూడడం దుర్మార్గం. – అంకరి కుమార్, అధ్యక్షుడు, ప్రెస్క్లబ్, మంథని కక్షసాధింపు సరికాదు ప్రజాస్వామ్యానికి పట్టుగొమ్మలు పత్రికలు. వాటిపై కక్షసాధింపు సరికాదు. సాక్షి దినపత్రిక ఎడిటర్ తోపాటు జర్నలిస్టులపై పోలీసులు కేసు నమోదు చేయడం శోచనీయం. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా పనిచేస్తున్న పత్రికలను గౌరవించాలి. – పూదరి కుమార్, అధ్యక్షుడు, ప్రెస్క్లబ్, గోదావరిఖని -
ఆలిండియా రెస్క్యూ పోటీలకు ఎంపిక
గోదావరిఖని: రెండు రోజులపాటు నిర్వహించిన సింగరేణిస్థాయి రెస్క్యూ పోటీల్లో సత్తా చాటిన సభ్యులను ఆలిండియా రెస్క్యూ పోటీలకు ఎంపిక చేశారు. ఈమేరకు శుక్రవారం రెండు పురుషుల జట్లలో 16మంది, ఒక మహిళా జట్టులో 8మంది పేర్లతో కూడిన జాబితాను అధికారులు విడుదల చేశారు. పురుషుల జట్టులో.. ఆలిండియా రెస్క్యూ పోటీల్లో పాల్గొనే పురుషుల జట్టులోని సభ్యులు : చీర్లంచ రమేశ్(ఫిట్టర్), ఎన్.భానుప్రసాద్(ఓవర్మెన్), గుజ్జుల రాకేశ్(జేఎంఈటీ), పిక్కల కుమారస్వామి(జనరల్ అసిస్టెంట్), ఆబాల శ్యాంకుమార్(జేఎంఈటీ), జె.మురళి(సీనియర్ మైనింగ్ సర్ధార్), జి.శషాంక్(ఓఎం), గెల్లు పరమేశ్(సీనియర్ అండర్ మేనేజర్), సీహెచ్ శ్రీవిఘ్నాన్(బదిలీ వర్కర్), సామల మధుసూదన్రెడ్డి(ఓవర్మెన్), జి.ప్రమోద్కుమార్(ఎంజీటీ), ఆర్.అజయ్(సీనియర్ మైనింగ్ సర్ధార్), గౌస్పాషా(ఎంజీటీ), ఆర్.సురేశ్(జనరల్ అసిస్టెంట్), బి.నితిన్కుమార్(ఎంజీటీ), ఎస్.శ్రీనివాస్రెడ్డి(షార్ట్ఫైరర్) ఉన్నారు. మహిళా జట్టులో.. ఎంజీటీ ట్రెయినీలు: అంబటి మౌనిక, మాలోతు అనూష, వీసం కృష్ణవేణి, లక్కం స్వాతి, శ్రీరాం స్వాతి, బానోతు చందన జవేరి, చల్లా గాయత్రి, డి.షైనీ. -
సొంతిల్లే కావాలి
రామగిరి(మంథని): సింగరేణి నిర్మించనున్న డబు ల్ బెడ్రూమ్ ఇళ్లు వద్దని, తమకు సొంతింటి పథక మే అవసరమని మెజారిటీ కార్మికులు తమ అభి ప్రాయం వెల్లడించినట్లు సీఐటీయూ నేతలు ప్రకటించారు. సింగరేణి కార్మికుల సొంతింటి కల సాకా రం కోసం సీఐటీయూ శుక్రవారం ఆర్జీ–3 ఏరియా లో బ్యాలెట్ ఉద్యమం చేపట్టింది. ‘సొంత ఇల్లు కావాలా, సింరేణి క్వార్టర్ కావాలా’ అనే విషయంపై బ్యాలెట్ పద్ధతిన ఓటింగ్ ద్వారా కార్మికుల నుంచి అభిప్రాయాలను సేకరించింది. ఈ సందర్భంగా మొత్తం 1,927 ఓట్లు పోలయ్యాయి. అందులో 1,910 మంది కార్మికులు సొంత ఇళ్లు కావాలని, 15 మంది క్వార్టర్లు కావాలని తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. మరో ఇద్దరి ఓట్లు చెల్లుబాటు కాలేదు. యూనియన్లకు అతీతంగా ‘నివాస క్వార్టర్ వద్దు.. సొంతిల్లు ముద్దు’ నినాదంతో చేపట్టిన ఓటింగ్లో పెద్దసంఖ్యలో పాల్గొంటున్న కార్మికులకు అభినందనలని సీఐటీయూ నాయకులు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు డివిడెంట్ రూపంలో రూ.కోట్లు చెల్లిస్తున్నా కార్మికుల సొంతిళ్లు అమలు విషయంలో నిర్లక్ష్యం చేస్తున్నందుకే కార్మికుల అభిప్రాయ సేకరణ, బ్యాలెట్ ఓటింగ్ చేపట్టామని వారు వివరించారు. నాయకులు కుమార్, వేణుగోపాల్, ప్రభాకర్, సత్తయ్య, శ్రీనివాస్, గోపాల్, విజయకుమార్రెడ్డి, రాజేశ్, విజేందర్రెడ్డి, రాజేశం పాల్గొన్నారు. -
మహిళల ఆరోగ్యంపై దృష్టి
సుల్తానాబాద్(పెద్దపల్లి): మారిన జీవనశైలి, వాతావరణ కాలుష్యం మహిళలకు శాపంగా మారుతోంది. ఈ విషయం తెలియక చాలామంది వ్యాధుల బారిన పడుతున్నారు. ముఖ్యంగా బీపీ, షుగర్, క్యాన్సర్ వంటి ప్రాణాంత వ్యాధులతో సతమతమవుతున్నారు. సకాలంలో, సరైన వైద్యం అందక చాలామంది ప్రాణాలమీదికి తెచ్చుకుంటున్నారు. ఇలాంటి వారి ఆరోగ్య సంరక్షణ కోసం కేంద్రప్రభుత్వం స్వస్థ్ నారీ శక్త్ పరివార్ అభియాన్ పథకం ప్రవేశ పెట్టింది. దీనిద్వారా మహిళలకు అన్నిరకాల వైద్య పరీక్షలు చేయాలని నిర్ణయించింది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ, సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈనెల 17నుంచి అక్టోబర్ 3వ తేదీ వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తుంది. ఇందుకోసం జిల్లాలో ప్రత్యేకవైద్య శిబిరాలు నిర్వహించేలా జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ప్రణాళిక రూపొందించింది. జిల్లా మహిళలు 2,22,580 మంది జిల్లాలో 30ఏళ్ల వయసు పైబడిన మహిళలు 2,22,250 మంది ఉన్నట్లు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి, 18 ప్రాథమిక ఆరోగ్య, 6 అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సుల్తానాబాద్, మంథని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రత్యేక వైద్యశిబిరాలు నిర్వహించనున్నారు. గురుకులాల్లో బాలికలకు కూడా.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాల్లోని బాలికలకూ ప్రత్యేక వైద్యశిబిరాల ద్వారా వైద్య పరీక్షలు చేస్తారు. ఇందులో మహిళలతోపాటు బాలికలకూ బీపీ, షుగర్, బ్రెస్ట్, సర్వైకల్, ఓరల్ క్యాన్సర్లు, అనీమియా, టీబీ వంటి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తారు. ఇందుకోసం గైనకాలజిస్ట్, కంటివైద్య నిపుణులు, డేర్మటాలజిస్ట్, డెంటల్ సర్జన్ నిపుణులు ఉంటారు. -
ఆగని అమృత్ భారత్ రైలు
సాక్షిప్రతినిధి, కరీంనగర్: దేశంలోని వలస కూలీలను మాతృభూమికి చేర్చేందుకు ప్రవేశపెట్టిన రైలు అమత్ భారత్ ఎక్స్ప్రెస్. దేశంలో నలుమూలలా పనిచేస్తున్న కూలీలను తక్కువ ఖర్చుతో స్వస్థలాకు చేరుస్తుంది. ఇటీవల ఉమ్మడి కరీంనగర్ జిల్లా మీదుగా నడిపించే ఈరోడ్– జోగ్భనీ 16601/02 అమృత్ భారత్ రైలుకు స్థానికంగా ఎక్కడా స్టాప్ దక్కలేదు. ముందున్న వరంగల్, పొరుగున ఉన్న మంచిర్యాలలో ఈ రైలుకు హాల్టింగ్ ఇవ్వడం గమనార్హం. రైల్వేశాఖ తీసుకున్న ఈ నిర్ణయం పెద్దపల్లి, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్లోని పలు పరిశ్రమల్లో పనిచేస్తున్న ఉత్తరాధి కూలీలను తీవ్రంగా నిరాశపరిచింది. త్వరలో సేవలు ప్రారంభం ప్రస్తుతం బిహార్లో ఎన్నికల దష్ట్యా ఆ రాష్ట్రానికి రైల్వేశాఖ ఇప్పటి వరకు ఆరు అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్రైళ్లను ప్రవేశ పెట్టింది. అందులో అతి త్వరలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా మీదుగా బిహార్లోని జోగ్భనీ నుంచి తమిళనాడు రాష్ట్రంలోని ఈరోడ్ వరకు 16601/02 అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలును ప్రారంభించనున్నారు. మన రాష్ట్రం మీదుగా ప్రవేశ పెట్టబోయే తొలి అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ ఇదే. ఇటీవల వెలువడిన రైలు షెడ్యూల్లో ఉమ్మడి జిల్లాలోని ఏ ఒక్క రైల్వేస్టేషన్లో స్టాప్ లేకపోవడం స్థానిక, వలస కార్మికులను ఎంతో నిరాశ పరిచింది. హాల్టింగ్ ఇవ్వాలి అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలుకు వరంగల్ నుంచి బల్లార్షా మధ్య కేవలం మంచిర్యాల రైల్వేస్టేషన్లోనే హాల్టింగ్ ఇచ్చారు. జోగ్భని నుంచి నేపాల్ సరిహద్దు కేవలం 10 కిలోమీటర్ల దూరమే. ఈ రైలుకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంట, పెద్దపల్లి జంక్షన్, రామగుండం రైల్వే స్టేషన్లో స్టాప్ కల్పించాలని ఇక్కడి ప్రయాణికులు కోరుతున్నారు. నాలుగు నెలల్లో పెద్దపల్లి జంక్షన్ మీదుగా ప్రారంభించిన మూడు రైళ్లకు స్టాప్ కల్పించలేదు. – ఫణి, నార్త్ తెలంగాణ రైల్వే ఫోరం -
అడవి కాదు.. ఏఐ శ్రీరాంపూర్
ముత్తారం(మంథని): అంతర్జాతీయస్థాయిలో గుర్తింపు వచ్చేలా అడవిశ్రీరాంపూర్ను ఏఐ శ్రీరాంపూర్గా మారుస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు పేర్కొన్నారు. గురువారం రాత్రి ముత్తారం మండలంలో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలోనే మొదటగా అడవిశ్రీరాంపూర్ జెడ్పీ పాఠశాలలో టీ ఫైబర్ ద్వారా అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ల్యాబ్, సీసీటీవీ సర్వేలెన్స్ సిస్టమ్ను టీ ఫైబర్ ఎండీ వేణుప్రసాద్, కలెక్టర్ కోయ శ్రీ హర్షతో కలిసి ప్రారంభించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఇంటింటికీ ఇంటర్నెట్ సౌకర్యం కోసం రాష్ట్రంలో ఎంపిక చేసిన నాలుగు గ్రామాల్లో అడవిశ్రీరాంపూర్ ఏఐ ఫర్ప్లెక్సిటీ టూల్స్ ద్వారా సాంకేతిక పరిజ్ఞానంతో ముందుకెళ్లడానికి కార్యాచరణ రూపొందించి అమలు చేశామన్నారు. టీవీలే స్మార్ట్ కంప్యూటర్లుగా మారి ఏఐ టూల్స్ ద్వారా సాంకేతి విద్య బోధనతో అమెరికా లాంటి దేశాలకు దీటుగా ఇక్కడి పిల్లలు ఆదర్శంగా నిలవాలన్నారు. జిల్లాలోని ఉపాధ్యాయులను, విద్యార్థులను ఏఐగా మారుస్తానని కలెక్టర్ చాలెంజ్గా తీసుకోవడం అభినందనీయమన్నారు. గ్రామంలో టీ ఫైబర్ ద్వారా రూ.1.28 కోట్లతో ఇంటర్నెట్ సౌకర్యం కల్పించామన్నారు. రాష్ట్రంలో మిగతా మూడు ప్రాజెక్టు గ్రామాల్లో ఏఐని పూర్తి చేస్తామన్నారు. అడవిశ్రీరాంపూర్ పాఠశాలలో అదనపు తరగతుల భవనం, మరమ్మతు, సౌకర్యాల కోసం రూ.30లక్షల నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. అంతకు ముందు ధర్యపూర్ విద్యుత్తు సబ్స్టేషన్, తదితర పనులకు శంకుస్థాపన చేశారు. డీఈవో మాధవి, ఆర్డీవో సురేశ్, గ్రంథాలయ చైర్మన్ అన్నయ్యగౌడ్, ఎంఈవో హరిప్రసాద్, తహసీల్దార్ మధుసూదన్రెడ్డి, ఎంపీడీవో సురేశ్, హెచ్ఎం ఓదెలు తదితరులు పాల్గొన్నారు. -
పత్రికా స్వేచ్ఛకు ప్రాధాన్యమివ్వాలి
ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛకు ప్రాధాన్యమివ్వాలి. సాక్షి ఎడిటర్ ధనంజయ్రెడ్డిపై అక్రమ కేసులు నమోదు చేయ డం అన్యాయం. ఎవరో అన్నది రాస్తే.. దాన్ని పత్రికకు ఆపాదించి ఎడిటర్పై కేసు పెట్టడం సరికాదు.ఏపీలో మీడియాను లొంగదీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. – రాజ్ఠాకూర్, ఎమ్మెల్యే, రామగుండం ఏపీలో పత్రికా స్వేచ్ఛపై దాడిచేసి రాజ్యాంగ హక్కులను కాలరాస్తున్నారు. సాక్షి ఎడిటర్ను లక్ష్యంగా చేసుకుని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం అన్యాయం. పత్రికల్లో వచ్చిన వార్తల్లో ఏదైన తప్పు ఉంటే వివరణ కోరాలే తప్ప ఇలా అక్రమ కేసులు పెట్టి బెదిరించడం సరికాదు. – కోరుకంటి చందర్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, పెద్దపల్లి నిరంకుశత్వమే..సాక్షి పత్రికలో వచ్చిన వార్తల విషయంలో ఎడిటర్పై కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి చర్యలు ఏపీ ప్రభుత్వ నిరంకుశత్వానికి నిదర్శనం. రాజకీయ నాయకుల విమర్శలను ప్రచురిస్తే కేసులు పెట్టడం పత్రికా స్వేచ్ఛను హరించడమే. – కోమటిరెడ్డి నరేందర్రెడ్డి, సుడా చైర్మన్ ముమ్మాటికీ కక్ష సాధింపేఅన్ని పత్రికలమాదిరిగానే సాక్షిలో అమరావతి పేరిట పొన్నూరును ముంచేశారనే వార్త వచ్చింది. దీనిపై పోలీసులు సాక్షి ఎడిటర్పై కేసు పెట్టడం ఏంటి?కక్షసాధింపు చర్యల్లో భాగంగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేసులు పెడుతోంది. ప్రచురించిన వార్తలపై అభ్యంతరాలుంటే.. ప్రభుత్వాలు ఖండించడం, రిజాయిండర్లు జారీ చేసే వీలుంది. – పంజాల శ్రీనివాస్, సీపీఐ జిల్లా కార్యదర్శి, కరీంనగర్ప్రజాస్వామ్యానికి మచ్చసాక్షిపై ఏపీ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలను ప్రజలు గమనిస్తున్నారు. కేవలం వ్యతిరేఖ వార్తలు రాసారన్న కారణంతో ఎడిటర్, పాత్రికేయులపై కేసులు నమోదు చేయడం సిగ్గుచేటు. ప్రెస్ మీట్ వార్త ప్రచురించిన సాక్షి పత్రిక ఎడిటర్ ధనంజయరెడ్డిపై అక్రమ కేసులు పెట్టడం సిగ్గు చేటు. – మణికంఠరెడ్డి, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడుఏపీలో కూటమి ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని ఆయా రాజకీయ పార్టీల నాయకులు మండిపడ్డారు. ప్రతికా స్వేచ్ఛకు విఘాతం కలిగేలా ప్రజాస్వామ్య విలువలకు భంగం వాటిల్లేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నడుచుకుంటోందన్నారు. ‘సాక్షి’ ఎడిటర్ ధనంజయరెడ్డితో పాటు విలేకరులపై పెట్టిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. -
అటవీ అమరుల సేవలు మరువలేనివి
పెద్దపల్లిరూరల్: అడవులను కాపాడేందుకు అమరులైన వారందరి సేవలు మరువలేనివని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. కలెక్టరేట్లో గురువారం నిర్వహించిన అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమంలో కలెక్టర్, జిల్లా అటవీ అధికారి శివయ్య పాల్గొన్నారు. అడవుల సంరక్షణ కోసం అసువులు బాసి అమరులైన అధికారులను స్మరిస్తూ భవిష్యత్తు తరాలకోసం పాటుపడేలా అంకితభావంతో పనిచేయాలన్నారు. కలెక్టరేట్ నుంచి పెద్దపల్లి పట్టణ పురవీధుల మీదుగా ర్యాలీ సాగింది. కార్యక్రమంలో పలువురు అటవీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. స్థానిక ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ చర్యలుజూలపల్లి(పెద్దపల్లి): రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా సూచించారు. గురువారం మండల కేంద్రంలోని పోలీస్ స్టేష న్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఠాణా పరిసరాలను పరిశీలించి, ఆవరణలో మొక్క నాటారు. అనంతరం రికార్డులు తనిఖీ చేసి పలు సూచనలు చేశారు. ఫిర్యాదుదారులతో ఫ్రెండ్లీ పోలీసింగ్తో పాటు కేసులు పెండింగ్ లేకుండా చూసుకోవాలని ఆదేశించా రు. పెద్దపల్లి డీసీపీ కరుణాకర్, ఏసీపీ కృష్ణ, సీఐ సుబ్బారెడ్డి, ఎస్సై సనత్కుమార్ పాల్గొన్నారు.రాష్ట్రస్థాయి టీఎల్ఎంకు ఎంపిక రామగిరి(మంథని): రాష్ట్రస్థాయి టీచర్ లెర్నింగ్ మెథడ్ (టీఎల్ఎం)కు రామగిరి మండలం నుంచి ఇద్దరు ఉపాధ్యాయులు ఎంపికయ్యారు. గురువారం జిల్లాలో 140 మంది ఉపాధ్యాయులు టీఎల్ఎంను ప్రదర్శించారు. వీరిలో 8 మంది రాష్ట్రస్థాయికి ఎంపిక కాగా, రామగిరి మండలం పన్నూరు ప్రభుత్వ పాఠశాల గణితం టీచర్ కందునూరి కవిత, వెంకట్రావుపల్లె పాఠశాల టీచర్ మయూర్ఆలం ఎంపికయ్యారు. వీరిని డీఈవో మాధవి, ఎంఈవో కొమురయ్య అభినందించారు. రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చాటి మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. విజయోత్సవ సభ ఏర్పాటు అభినందనీయంకమాన్పూర్(మంథని): మండలంలోని గుండారం రిజర్వాయర్ వద్ద ఇటీవల జరిగిన గణనాథుల నిమజ్జనాన్ని విజయవంతం చేసి విజయోత్స సభ నిర్వహించడం అభినందనీయమని జిల్లా పంచాయతీ అధికారి వీరబుచ్చయ్య అన్నారు. మండలకేంద్రంలోని ఆదివరాహస్వామి కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన సభలో మాట్లాడారు. కొన్నేళ్లుగా రిజర్వాయర్లో ప్రశాంతంగా నిమజ్జన వేడుకలు నిర్వహిస్తున్న అధికారులు, గ్రామస్తులకు అభినందనలు తెలిపి సన్మానం చేశారు. ఎంపీడీవో లలిత, తహసీల్దార్ వాసంతి తదితరులు పాల్గొన్నారు. లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలిగోదావరిఖని(రామగుండం): లోక్ అదాలత్ ద్వారా సత్వర న్యాయం జరుగుతుందని, ఈ నెల 13న జరిగే జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని సీపీ అంబర్ కిశోర్ ఝా పేర్కొన్నారు. చిన్నచిన్న కేసులతో కక్షలు పెంచుకుని కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయాన్ని, డబ్బును వృథా చేసుకోవద్దని సూచించారు. రాజీపడదగిన కేసులను పోలీస్ అధికారులు, కోర్టు విధులు నిర్వహించే కానిస్టేబుళ్లు గుర్తించి ఇరువర్గాలకు కౌన్సెలింగ్ నిర్వహించాలన్నారు. -
మార్కెట్యార్డు ఆదాయం పెంపునకు చర్యలు
● ఎమ్మెల్యే విజయరమణారావు పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్యార్డు ఆదాయం పెంపునకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. గురువారం మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఈర్ల స్వరూప అధ్యక్షతన జరిగిన పాలకమండలి సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గతంలో మార్కెట్ షాపింగ్కాంప్లెక్సు గదులను అద్దెకు ఇవ్వడం కోసం ఓపెన్ యాక్షన్ నిర్వహించినా.. అద్దెకు తీసుకునేందుకు ముందుకు రావడం లేదని జిల్లా మార్కెటింగ్ అధికారి ప్రవీణ్రెడ్డి పేర్కొన్నారు. ఇప్పుడు మళ్లీ అద్దె ప్రాతిపదికన ఇచ్చేందుకు అనుమతి ఇవ్వాలని తీర్మానించారు. అలాగే మహిళా సంఘ సభ్యులు పెట్రోల్బంకు ఏర్పాటు చేసుకునేందుకు వీలుగా మార్కెట్యార్డు ఆవరణలో స్థలం కేటాయించాలని తీర్మానించారు. అలాగే మార్కెట్ యార్డులో వర్షానికి తడిసి పాడైన ధాన్యంతో నష్టపోయిన రైతులకు ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ సమకూర్చిన ప రిహారం చెక్కులను ఎమ్మెల్యే అందించారు. మార్కె ట్ యార్డులో వర్షానికి తడిసిన ధాన్యానికి పరి హారం అందించడం ఇదే తొలిసారి అని పేర్కొన్నా రు. వైస్ చైర్మన్ మల్లారెడ్డి, సభ్యులు పాల్గొన్నారు. -
సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం
● బల్దియా కమిషనర్ అరుణశ్రీ కోల్సిటీ(రామగుండం): ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రాధాన్యం ఇవ్వాలని రామగుండం నగరపాలక కమిషనర్ జె.అరుణశ్రీ అన్నారు. జూన్ 2 నుంచి ఈనెల 10 వరకు వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక ముగింపు సమావేశాన్ని గురువారం బల్దియా కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, కార్యాచరణ ప్రణాళిక విజయవంతం చేయడంలో నగరపాలక అధికారులు, సిబ్బంది భాగస్వాములయ్యారని అభినందించారు. ప్రణాళికను విజయవంతం చేయడంలో కీలపాత్ర పోషించిన అధికారులు, సిబ్బందికి జ్ఞాపికలు ప్రదానం చేశారు. కార్యక్రమాన్ని పర్యవేక్షించిన డిప్యూటీ కమిషనర్ నాయిని వెంకటస్వామిని సత్కరించారు. అదనపు కమిషనర్ మారుతిప్రసాద్, అసిస్టెంట్ కమిషనర్ వెంకటేశ్వర్లు, సిబ్బంది పాల్గొన్నారు. చెత్త సేకరణ వాహనాలకు రూట్మ్యాప్ వార్డు ఆఫీసర్లతో గురువారం కమిషనర్ అరుణశ్రీ సమావేశం నిర్వహించారు. చెత్త సేకరించే వాహనాలకు రూట్మ్యాప్ రూపొందించాలని, ప్రతి ఇంటిని అస్సెస్మెంట్ చేసి ఇంటి నంబర్ కేటాయించాలన్నారు. పనులను క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. -
‘మెటా’ నిందితుల అరెస్టు
సాక్షిప్రతినిధి,కరీంనగర్: క్రిప్టో కరెన్సీ పేరిట పాత జిల్లావాసులకు రూ.100 కోట్లు కుచ్చుటోపీ పెట్టిన మెటా ఫండ్ యాప్ కథ కొలిక్కి వచ్చింది. రోజుకు రూ.లక్షలు సంపాదించవచ్చని ఆశచూపి రూ.కోట్లు వసూలు చేసిన సూత్రధారుల్లో నలుగురుని కరీంనగర్ సీసీఎస్ పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. జూలైలో కశ్మీర్గడ్డకు చెందిన పుప్పాల శ్రీకర్ తనను మెటా ఫండ్ పేరిట రూ.54 లక్షల మేర మోసం చేశారని దాసరి రమేశ్, దాసరి రాజులపై ఫిర్యాదు చేశారు. ఈ కేసులో పరారీలో ఉన్న దాసరి రమేశ్, దాసరి రాజులతోపాటు బూర శ్రీధర్, తులసీ ప్రకాశ్ను పోలీసులు అరెస్టు చేశారు. వీరితోపాటు లోకేశ్, సతీశ్ను అరెస్టు చేయాల్సి ఉంది. లోకేశ్ థాయ్లాండ్లో తలదాచుకుంటుండగా, సతీశ్ దుబాయ్ వెళ్లేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ కేసులో జాతీయ నిఘా సంస్థలు, రాష్ట్ర నిఘా సంస్థలు నిందితుల పాత్రపై ఎప్పుడో పూర్తిగా సమాచారం సేకరించాయి. ఈ విషయంలో జూన్ నుంచి ‘సాక్షి’ రాస్తున్న కథనాలు వాస్తవరూపం దాలుస్తుండటం గమనార్హం. దుబాయ్లో ఆస్తులు మెటా ఫండ్ నిర్వాహకులు ఎంతమంది అన్నది ఇప్పటికీ స్పష్టత లేదు. నిందితులు ఇక్కడ వసూలు చేసిన డబ్బును హవాలా మార్గంలో విదేశాలకు పంపారు. దుబాయ్లో దాదాపు రూ.40 కోట్లు ఖర్చు చేసి వరల్డ్ ట్రేడ్ సెంటర్, షేక్ జాహిద్ రోడ్లో ఈ ఏడాది జనవరిలో పబ్ ప్రారంభించారు. వీరి బినామీల పేర్లతో అక్కడ పలు వ్యాపారాలు కూడా మొదలు పెట్టారని, లక్కీ భాస్కర్ సినిమాలో మాదిరిగా పరిస్థితులు అనుకూలించకపోతే ఉన్నపలంగా వీసా తీసుకుని దేశం వదిలి పారిపోయేందుకు సిద్ధంగా ఉన్నారని సమాచారం. వీరు ఏడాదిన్నరగా పలువురి వద్ద నుంచి రూ.కోట్లు వసూలు చేశారు. వీరిలో సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి, పెద్దపల్లి జిల్లాలకు చెందిన టీచర్లు, లెక్చరర్లు, పోలీసులు, రెవెన్యూ ఉద్యోగులు ఉన్నారు. వీరు ఇంతకాలం మౌనంగా ఉన్నా.. ఇప్పుడిప్పుడే ముందుకొస్తున్నారు. సీపీకి లీగల్ నోటీసులు.. సీఐలకు దమ్కీలు మెటా నిర్వాహకుల్లో కొందరు పాత నేరస్తులు కావడంతో పోలీసులతో మంచి పరిచయాలు ఉన్నాయి. భారీగా లంచాలు ఎరవేసి ఇంతకాలం తమపై కేసులు కాకుండా జాగ్రత్త పడ్డారు. పైగా ఫిర్యాదుదారులనే పోలీసుల చేత బెదిరింపులకు గురిచేయించారు. కరీంనగర్ సీపీకి సైతం లీగల్ నోటీసులు పంపారు. తమపై ఫిర్యాదు చేసిన వారిపై కోర్టులో ప్రైవేటు కేసు నడిపిస్తున్నారు. వీరు అంతటితో ఆగలేదు. తమ యాప్లో పెట్టుబడులు పెట్టిన నలుగురు సీఐలు డబ్బులు అడుగుతుంటే దమ్కీలు ఇస్తుండటం గమనార్హం. విదేశీ యాత్ర సమయంలో మీరు ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోలేదని, విదేశాల్లో మీరు రహస్యంగా దేశ విద్రోహ శక్తులతో సమావేశం అయ్యారని, వ్యభిచారం చేసి డిపార్ట్మెంట్ రహస్యాలు అమ్ముకున్నారని, కోర్టుల్లో ప్రైవేటు కేసు వేసి ఉద్యోగాలు పోగొడతామని బెదిరింపులకు గురిచేస్తున్నారు. రూ.కోట్లాది డబ్బు విదేశాలకు తరలిపోయిన నేపథ్యలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగప్రవేశం చేస్తేనే వీరి ఆస్తుల చిట్టాలో అసలు విషయాలు వెలుగులోకి వస్తాయి. -
కరెంట్ ‘తీగ’లు తాకేలా..
కరెంట్ వైర్లను తాకేలా తీగజాతి మొక్కలు స్తంభాలను అల్లుకుపోతున్నాయి. ట్రాన్స్ఫార్మర్లను సైతం కమ్మేసి ఎగబాకుతున్నాయి. అసలే వర్షాకాలం.. రైతులు, పశువులకు ప్రమాదం పొంచి ఉంది. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్ల వద్ద పిచ్చిమొక్కలు లేకుండా చూడాలని కోరుతున్నారు రైతన్నలు. కాల్వశ్రీరాంపూర్ మండలం గంగారం నుంచి ఓదెల, సుల్తానాబాద్కు వచ్చేదారిలో ఇలా తీగలు అల్లుకుపోయిన ట్రాన్స్ఫార్మర్లు, స్తంభాలు ‘సాక్షి’ కెమెరాకు కనిపించాయి.– సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి -
పశువుల పాక నివాసమై..
ఇల్లందకుంట(హుజూరాబాద్): కని పెంచిన తల్లి కొడుకులకు భారమైంది. కనికరం లేని కొడుకులు తల్లిని ఎడ్లపాకలో నివాసం ఉంచారు. దీంతో ఆ తల్లి కలెక్టర్కు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం బోగంపాడు గ్రామంలో జరిగింది. కలెక్టర్ ఆదేశాలతో ఆర్డీవో రమేశ్బాబు, అధికారులు స్పందించారు. ఐసీడీఎస్ సూపర్వైజర్ జ్యోతి, సఖి కౌన్సిలర్ పద్మావతి భోగంపాడులో ఎడ్లపాకలో నివాసం ఉంటున్న వృద్ధురాలు కళ్లెం అమృతమ్మను కలిసి వివరాలు సేకరించారు. అమృతమ్మ భర్త పదేళ్ల క్రితం మృతిచెందగా, అప్పటినుంచి కొడుకుల ఆదరణ కరువైందని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. అనంతరం బాధితురాలి కుమారులు తిరుపతిరెడ్డి, శ్రీనివాస్రెడ్డికి అధికారులు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ ఘటనపై పూర్తి నివేదికను ఉన్నతాధికారులకు అందజేసి, అమృతమ్మకు తగిన సాయం చేసేందుకు చర్యలు తీసుకోనున్నట్లు ఆర్ఐ నాగరాజు తెలిపారు. -
అన్నం పెట్టని కొడుకు
జగిత్యాలక్రైం: కొడుకు అన్నం పెట్టడంలేదని, అడిగినా పట్టించుకోవడంలేదని జగిత్యాల అర్బన్ మండలం మోతె గ్రామానికి చెందిన బొల్లె భూమయ్య, కొమురవ్వ దంపతులు బుధవారం పోలీసులను ఆశ్రయించారు. భూమయ్య దంపతులకు ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు గతంలో మరణించాడు. పెద్ద కుమారుడు రెండు నెలలుగా అన్నం పెట్టకపోవడంతో దంపతులిద్దరూ బంధువులు, తెలిసిన వారి ఇళ్లలో కాలం వెళ్లదీశారు. తమకు అన్నం పెట్టడం లేదని, న్యాయం చేయాలని కోరుతూ రూరల్ ఎస్సై సదాకర్కు ఫిర్యాదు చేశారు. స్పందించిన ఆయన వారి పెద్ద కొడుకు, చిన్న కొడుకు కుటుంబ సభ్యులను పిలిచించి కౌన్సెలింగ్ ఇచ్చారు. వృద్ధుల పోషణభారం చూసుకోవాలని, మరోసారి విస్మరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
పాఠశాలల నిర్వహణకు నిధులు
కరీంనగర్: ప్రభుత్వ బడుల నిర్వహణకు నిధులు విడుదల చేస్తూ పాఠశాల విద్యాశాఖ ఈనెల 8న ఉత్తర్వులు జారీచేసింది. ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, ఆదర్శ పాఠశాలతో పాటు కస్తూరిబాగాంధీ విద్యాలయాలు, గిరిజన సంక్షేమ పాఠశాలలకు కంపోజిట్ స్కూల్ గ్రాంట్, స్పోర్ట్స్ గ్రాంట్ మంజూరు చేశారు. పాఠశాలల్లో కనీస మౌలిక వసతులు, స్వచ్ఛత, ఇతరత్రా పనులకు నిధులు వినియోగించుకునేందుకు అమ్మ ఆదర్శ కమిటీ ఖాతాల్లో త్వరలో జమకానున్నాయి. మార్గదర్శకాలకు అనుగుణంగా అమ్మ ఆదర్శ కమిటీ తీర్మానంతో ఈ నిధులు వినియోగించాల్సి ఉంటుంది. ప్రధానోపాధ్యాయులు నిధులను సద్వినియోగం చేసి యుటిలైజేషన్ సర్టిఫికెట్(యూసీ)లను సమర్పించాలి. నిధుల వినియోగంపై ఆడిట్ ఉంటుంది. ఇలా ఖర్చు పెట్టాలి పాఠశాల ప్రధానోపాధ్యాయులు, అమ్మ ఆదర్శ కమిటీలు సంయుక్తంగా వారి పేరున ఉన్న జాయింట్ ఖాతాలో నిధులు జమవుతాయి. కమిటీ తీర్మానం మేరకు చాక్పీస్లు, తెల్లకాగితాలు, రిజిస్టర్లు తదితర స్టేషనరీ సామగ్రి, పరీక్షల నిర్వహణ, జాతీయ పండగల నిర్వహణ, విద్యుత్ బిల్లుల చెల్లింపు, కంప్యూటర్లు, ప్రొజెక్టర్లు, కేయాన్, టీవీ మరమ్మతులు, కొనుగోలు, కేబుల్, ఇంటర్నెట్ చార్జీలు, డిజిటల్ తరగతుల నిర్వహణ ఖర్చులు, ప్రయోగశాలల పరికరాల కొనుగోలు, పాఠశాల భవనాల చిన్నచిన్న మరమ్మతులకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. నిధుల్లో 10 శాతం పాఠశాల ఆవరణలో స్వచ్ఛత కార్యక్రమానికి విధిగా ఖర్చు చేయాలన్న నిబంధన ఉంది. విద్యార్థుల సంఖ్య ఆధారంగా.. ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల నిర్వహణ నిమిత్తం విద్యార్థుల సంఖ్య ప్రాతిపదికన ఈ నిధులు విడుదల చేస్తారు. గతంలో ఎన్ఎస్ఏ, ఆర్ఎంఎస్ఏ నిధులు వేర్వేరుగా వచ్చేవి. ఈ రెండింటినీ కలిపి సమగ్రశిక్షగా మార్చి విలీనం చేశారు. సమగ్ర శిక్ష నుంచే నిధులు కేటాయిస్తున్నారు. 1–30 మంది విద్యార్థులుంటే రూ.10 వేలు, 31–100 మందికి రూ.25 వేలు, 101 నుంచి 250 మంది ఉంటే రూ.50 వేలు, 251 నుంచి వెయ్యి మందికి రూ.75 వేలు, వెయ్యికిపైగా విద్యార్థులు ఉన్న పాఠశాలలకు రూ.లక్ష నిధులు మంజూరు చేశారు. వీటిలో తొలివిడతగా 50 శాతం నిధులు విడుదల చేస్తూ అమ్మ ఆదర్శ కమిటీ ఖాతాల్లోకి నేరుగా జమ అయ్యేలా చర్యలు చేపట్టారు. కాగా, కొన్ని నెలలుగా పాఠశాలల ఆవరణ శుభ్రం చేయించడం, శానిటైజేషన్, ఇతర వాటికి గతంలో ఇచ్చిన నిధులు సరిపోక కొందరు ప్రధానోపాధ్యాయులు సొంతంగా ఖర్చు చేశారు. ఎట్టకేలకు స్కూల్ గ్రాంట్ నిర్వహణ నిధులు విడుదల కావడంతో ప్రధానోపాధ్యాయుల్లో సంతోషం వ్యక్తమవుతుంది. కనీస వసతుల కల్పన, స్వచ్ఛతపై దృష్టి అమ్మ ఆదర్శ కమిటీ తీర్మానాలతో వినియోగం ఉమ్మడి జిల్లాకు రూ.5.32 కోట్లు జిల్లాల వారీగా విడుదలైన నిధులు జిల్లా పాఠశాలలు నిధులు కరీంనగర్ 542 1,25,95,000 జగిత్యాల 677 1,81,75,000 పెద్దపల్లి 450 1,03,01000 రాజన్నసిరిసిల్ల 446 1,22,02000 మొత్తం 2,115 5,32,73,000 -
గోదావరి పుష్కరాలకు ప్రణాళిక సిద్ధం చేయండి
ధర్మపురి: రానున్న గోదావరి పుష్కరాలకు ప్రణాళిక సిద్ధం చేయాలని జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. గోదావరిలోగల పుష్కరఘాట్లను బుధవారం దేవాదాయశాఖ కమిషనర్ శైలజారామయ్యర్తో కలిసి పరిశీలించారు. 2027లో జరిగే గోదావరి పుష్కరాలకు లక్షలాది మంది భక్తులు రానున్నందున సరిపడా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. పుష్కరాల పనులపై ప్రణాళిక సిద్ధం చేసి త్వరగా పంపించాలని అన్నారు. గోదావరిలో గతంలో ఏర్పాటు చేసిన పుష్కరఘాట్లతో పాటు మరికొని ఘాట్లు ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలో పరిశీలన చేసి ముందుకుసాగాలన్నారు. మంగళిగడ్డ, సంతోషిమాత, సోమవిహార్ పుష్కర్ఘాట్లతోపాటు గడ్డ హన్మాండ్ల ఆలయం వద్ద పరిశీలించారు. కార్యక్రమంలో ఆర్డీవో మధుసూదన్, ఆలయ ఈవో శ్రీనివాస్, ట్రస్ట్బోర్డు చైర్మన్ జక్కు రవీందర్, తహసీల్దార్ శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావ్ తదితరులున్నారు. కిడ్నాపర్ల అరెస్ట్కొత్తపల్లి(కరీంనగర్): కొత్తపల్లిలోని మైత్రీ హోటల్ సమీపంలో కిడ్నాపర్లను బుధవారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు కొత్తపల్లి పోలీస్ స్టేషన్ ఎస్హెచ్వో బిల్ల కోటేశ్వర్ తెలిపారు. సీఐ వివరాల మేరకు.. నిష్ఠూరి యశ్వంత్(ఛత్తీస్గఢ్)కు రెండేళ్ల క్రితం నల్లపాటి నరేశ్తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతో గ్రానైట్కు సంబంధించిన వ్యాపారం చేసేందుకు ఒరిస్సాకు చెందిన వ్యక్తిని యశ్వంత్ పరిచయం చేశాడు. దీంతో రూ.3లక్షలు ఒరిస్సాకు చెందిన వ్యక్తికి మధు ఇచ్చాడు. అతడు ఆ డబ్బులు ఎంతకు తిరిగి ఇవ్వకపోగా.. మధ్యవర్తిగా ఉన్న నువ్వే ఇవ్వాలని యశ్వంత్పై ఒత్తిడి తెచ్చాడు. కరీంనగర్కు వస్తున్నానని అక్కడ మాట్లాడుకుందామని చెప్పాడు. అనుకున్నట్లే ఈనెల 7న కరీంనగర్కు వచ్చిన యశ్వంత్ను భోజనం చేసుకుంటూ మాట్లాడుకుందాం రమ్మని కొత్తపల్లికి నరేశ్ పిలిచాడు. దీంతో యశ్వంత్, ముద్దుల మధు(భద్రాచలం) కొత్తపల్లికి రాగా.. వారిని నల్లపాటి నరేశ్తోపాటు మరో నలుగురు గుడిమల్ల సివిల్, తునికిపాటి శేఖర్, ఆలకుంట ఉపేందర్, ఆలకుంట అశోక్ కిడ్నాప్ చేసి హైదరాబాద్కు తీసుకెళ్లారు. అక్కడి నుంచి మధు, ఖమ్మం వెళ్లే క్రమంలో యశ్వంత్ తప్పించుకున్నారు. కిడ్నాప్తో భయపడ్డ యశ్వంత్, మధు కొంత డబ్బును చెల్లించారు. ఈ విషయాన్ని యశ్వంత్ అల్లుడు కొత్తపల్లి పోలీసులకు సమాచారమివ్వగా.. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. కిడ్నాప్కు పాల్పడ్డ నల్లపాటి నరేశ్, గుడిమల్ల సివిల్, తునికిపాటి శేఖర్, ఆలకుంట ఉపేందర్, ఆలకుంట అశోక్ అనే నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 2 కార్లు, 5 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ కిడ్నాప్ వ్యవహారంలో ఉన్న మరికొంతమందిని కూడా పట్టుకుంటామని సీఐ కోటేశ్వర్ పేర్కొన్నారు. 48 గంటల్లో కేసును ఛేదించి నేరస్తులను అదుపులోకి తీసుకున్న ఇన్స్పెక్టర్ కోటేశ్వర్, ఎస్సైలు సాంబమూర్తి, సంజీవ్ను ఉన్నతాధికారులు అభినందించారు. -
బోయినపల్లి కేజీబీవీలో ఏసీబీ తనిఖీలు
బోయినపల్లి(చొప్పదండి): రాజన్నసిరిసిల్ల జిల్లా బోయినపల్లి కేజీవీబీలో బుధవారం ఏసీబీ డీఎస్పీ విజయ్కుమార్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 4:20 గంటల వరకు తనిఖీలు కొనసాగాయి. లీగల్ మెట్రాలజీ, శానిటరీ, ఫుడ్, ఆడిటర్ అధికారులు అధికారులు పాల్గొన్నారు. కేజీబీవీలో ఆహార నాణ్యత, పరిమాణం, పారిశుధ్య పరిస్థితులు, విద్యార్థులు, ఉపాధ్యాయుల వివరాలు, టీచింగ్, నాన్ టీచింగ్ రికార్డులు తనిఖీ చేశారు. వంటగది అపరిశుభ్రంగా ఉండడంపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రికార్డుల నిర్వహణ సరిగా లేదని, పాఠశాల క్యాష్ బుక్ ఎంట్రీలను అప్డేట్ చేయలేదని గుర్తించారు. కొన్ని అనవసర కొనుగోళ్లు చేయడంతో పలు అవకతవకలు వెలుగులోకి వచ్చాయి. కాగా బోయినపల్లి కేజీబీలో అవకతవకలు జరుగుతున్నాయని, అమ్మ ఆదర్శ కమిటీ నిధులు గోల్మాల్ చేశారని ఫిర్యాదులు అందడంతో తనిఖీలు చేసినట్లు తెలిసింది. పలు టెండర్లను కేజీబీవీలో పనిచేసే ఉద్యోగుల బంధువులకే ఇచ్చారని ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. తనిఖీల్లో వెలుగుచూసిన అంశాలపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామని ఏసీబీ అధికారులు ప్రకటనలో తెలిపారు. -
ఆ ఒక్కడే.. అధిపతి
● కోరుట్ల నుంచి ఐదుగురు కీలక మావో నేతలు ● చివరికి మిగిలింది తిప్పిరి తిరుపతే ● దక్కిన దళపతి పీఠం కోరుట్ల: పీపుల్స్వార్ నుంచి మావోయిస్టులుగా రూపు మార్చుకున్న నక్సల్ ఉద్యమ పంథాతో కోరుట్లకు 50 ఏళ్ల విడదీయరాని అనుబంధం ఉంది. 1980–85 మధ్యకాలం కోరుట్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల వేదికగా భారతీయ విద్యార్థి పరిషత్, రాడికల్ స్టూడెంట్స్ యూనియన్లు విద్యార్థి వర్గాల్లో తమ ఊపును కొనసాగించాయి. ఈ రెండు విద్యార్థి సంఘాల మధ్య పరస్పర వైరుధ్యాలు, గొడవలు, కొట్లాటలు, ఓ దశలో కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ సమయంలోనే ఐదుగురు ఆర్ఎస్యూ నాయకులు పీపుల్స్వార్ వైపు మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లారు. ఆ ఐదుగురు కీలక నేతలుగా ఎదగగా.. వారిలో ఇద్దరి ఆచూకీ లేదు. మరో ఇద్దరు వివిధ ప్రాంతాల్లో జరిగిన ఎన్కౌంటర్లలో చనిపోయారు. ఇక మిగిలింది..తిప్పిరి తిరుపతి. ఆ ఒక్కనికే మావోయిస్టు దళపతి పీఠం దక్కింది. ఐదుగురు కీలక నేతలే.. 1980–90 దశకంలో కోరుట్లకు చెందిన ఆర్ఎస్యూ నేతలు తిప్పిరి తిరుపతి, ముక్కా వెంకటేశం, నిజాముద్దీన్, బెజ్జారపు కిషన్, పసుల రాంరెడ్డి కీలకంగా వ్యవహరించేవారు. ఇంటర్, డిగ్రీ పూర్తి అయ్యే సమయంలో వీరిపై పోలీసు నిర్భంధం పెరగడంతో సిద్ధాంతపరమైన భావజాలంతో అజ్ఞాతంలోకి వెళ్లారు. పీపుల్స్వార్లో కీలక నేతలుగా ఎదిగారు. ముక్కా వెంకటేశం నల్గొండ జిల్లా పీపుల్స్వార్ కార్యదర్శిగా పనిచేస్తూ 1996 అక్టోబర్లో యాదగిరిగుట్ట పోలీస్స్టేషన్పై దాడి చేసి ఆయుధాలు ఎత్తుకెళ్తున్న సమయంలో పోలీసుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయాడు. పసుల రాంరెడ్డి ఉత్తర తెలంగాణ స్పెషల్ జోన్ కార్యదర్శి హోదాలో 2001లో సిరిసిల్ల జిల్లా మద్దిమల్ల ఎన్కౌంటర్లో మృతి చెందాడు. నిజాముద్దీన్ మావోయిస్టు డెన్ కీపర్గా చాలారోజులు వ్యవహరించినట్లు సమాచారం. ఈ మధ్యకాలంలో నిజాముద్దీన్ ఆచూకీ ఎవరికీ తెలియడం లేదు. అసలు ఉద్యమంలో ఉన్నాడా..? లేడా..? అనే వివరాలు లేవు. బెజ్జారపు కిషన్ 1980–85లో బుల్లెట్ మోటార్సైకిల్ మెకానిక్గా కోరుట్ల, జగిత్యాల ప్రాంతాల్లో గుర్తింపు పొందారు. పీపుల్స్వార్లో చేరిన ఈయన మావోయిస్టు కేంద్ర కమిటీలో టెక్ విభాగం కార్యకలాపాలను పర్యవేక్షించారని పోలీసులకు సమాచారం ఉన్నప్పటికీ ప్రస్తుతం ఆయన ఆచూకీ లేదు. ఇక మిగిలిన తిప్పిరి తిరుపతి మహారాష్ట్ర, ఒడిశాల్లో దేవ్జీగా మావోయిస్టు కార్యకలాపాలు నిర్వహణలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబుపై అలిపిరి వద్ద దాడి, దంతెవాడ సమీపంలో పోలీసులను హతమార్చిన సంఘటనలకు వ్యూహాకర్తగా తిరుపతి పేరు పలుమార్లు వినవచ్చింది. కోరుట్లలో తమ్ముడు వెంకటి చనిపోయిన సమయంలోనూ తిరుపతి ఇటువైపు కన్నెత్తి చూడలేదు. కరోనా సమయంలో ఒడిశా పరిసరాల్లోని ఆదివాసీబిడ్డ, ఉద్యమ సహచరి సృజనను ఆయన జీవిత భాగస్వామిగా చేసుకున్నట్లు సమాచారం. 2019–20లో కరోనా సమయంలో మహారాష్ట్రలోని గడ్చిరోలి సమీపంలో జరిగిన ఎన్కౌంటర్లో ఆమె మృతి చెందింది. అట్టడుగు స్థాయి నుంచి అఽధిపతి వరకు ఎన్నో ఆటుపోట్లు ఎదురైనా మావో సిద్ధాంతలక్ష్యాలను వీడని తిరుపతికి మావోయిస్టు దళపతి పీఠం దక్కడంతో స్థానికంగా చర్చనీయాంశమైంది. నిజాముద్దీన్ (ఫైల్) బెజ్జారపు కిషన్(ఫైల్) పసుల రాంరెడ్డి(ఫైల్) -
వృద్ధురాలి మెడలోంచి పుస్తెలతాడు చోరీ
జగిత్యాలక్రైం: జగిత్యాల రూరల్ మండలం పొరండ్ల గ్రామానికి చెందిన గొల్లపల్లి వెంకవ్వ అనే వృద్ధురాలి మెడలోంచి గుర్తుతెలియని దొంగలు రెండుంపావు తులాల పుస్తెలతాడును ఎత్తుకెళ్లారు. వెంకవ్వ బుధవారం మధ్యాహ్నం భోజనం చేసి ఇంటి ముందు ప్లేట్ కడుగుతుండగా ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వచ్చి ఆమెను మాటల్లో దింపి మెడలో ఉన్న పుస్తెలతాడును లాక్కుని పారిపోయారు. ఆమె కేకలు వేయడంతో స్థానికులు గాలింపు చర్యలు చేపట్టారు. రూరల్ ఎస్సై సదాకర్ సంఘటన స్థలానికి చేరుకుని ఆ ప్రాంతంలోని సీసీ పుటేజీలను పరిశీలించారు. ద్విచక్ర వాహనంపై ఇద్దరు వ్యక్తులు వచ్చినట్లు సీసీపుటేజీలో రికార్డు అయింది. ఆ దిశగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
కాళేశ్వరం దోపిడీ రూ.లక్షా 15 వేల కోట్లు
కరీంనగర్కార్పొరేషన్: కాళేశ్వరం ప్రాజెక్టు పేరిట కేసీఆర్ కుటుంబం రూ.లక్షా 15 వేల కోట్లు దోచుకుందని పీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జెల కాంతం ధ్వజమెత్తారు. బుధవారం నగరంలోని డీసీసీ కార్యాలయంలో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు రూ.35 వేల కోట్లతో పూర్తయితే, రూ.1లక్షా 50 వేల కోట్లు ఖర్చు చేసినట్లు కేసీఆర్ చెబుతున్నారన్నారు. హరీశ్రావు, సంతోష్రావు వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని కవిత చెప్పారని, అవినీతి వాస్తవాలు సొంత కుటుంబం నుంచే వస్తుంటే, కేటీఆర్ సీఎంపై మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సచివాలయం నిర్మిస్తున్న సమయంలో దొరికిన నిజాంకు చెందిన బంగారం, వజ్రాలు, హైదరాబాద్ చుట్టూ కేసీఆర్ బినామీ పేరిట ఉన్న 30 వేల ఎకరాల భూములు, ఆస్తుల పంపకాల్లో కేటీఆర్తో సమానంగా తనకు వాటా కావాలనే కవిత పంచాయితీ మొదలైందని ఆరోపించారు. తెలంగాణ వస్తే ఉద్యమకారులకు ఉద్యోగాలు రాలేదని, కేసీఆర్ కుటుంబం మాత్రం రూ.3 లక్షల కోట్లు దండుకుందని మండిపడ్డారు. గతంలో ఇళ్లు కూడా సరిగాలేని కేసీఆర్ కుటుంబానికి అమెరికా, దుబాయి, లండన్, సింగాపూర్లో రూ.వేలకోట్ల ఆస్తులు, వ్యాపారాలు ఎక్కడివని ప్రశ్నించారు. సమావేశంలో నాయకులు సముద్రాల అజయ్, గోష్కి శంకర్ పాల్గొన్నారు. సంఘటితంగా ముందుకెళ్లాలికరీంనగర్: అంబేద్కర్ ఆశయ సాధనే లక్ష్యంగా రాజ్యాంగ ఫలాలను పునికి పుచ్చుకునేందుకు సంఘటిత శక్తితో ముందుకు సాగాలని తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గజ్జెల కాంతం పిలుపునిచ్చారు. ఉమ్మడి జిల్లా అంబేద్కర్ సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశం జిల్లా అధ్యక్షుడు క్యాదాసి ప్రభాకర్ అధ్యక్షతన జరిగింది. రాజకీయ పార్టీల్లో ఉన్న దళిత వర్గాలు దళిత శ్రేయస్సే లక్ష్యంగా పనిచేయాలని, పొరపచ్చాలు లేకుండా ముందుకు సాగా లని పిలుపునిచ్చారు. నాయకులు గజ్జల ఆనంద్రావు, సుద్దాల లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. పీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జెల కాంతం -
వివాహేతర సంబంధం బహిర్గతం.. అవమానంతో ఆత్మహత్య
ముత్తారం(మంథని): వివాహేతర సంబంధం బయటపడిందనే అవమానభారంతో మచ్చ నరేశ్(32) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన బుధవారం మండల కేంద్రంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నరేశ్ – స్వాతి దంపతులు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. నరేశ్ ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. భార్యతో తరచూ గొడవపడుతున్నాడు. ఇటీవల భార్యను కొట్టి పిల్లలతో పుట్టింటికి పంపించాడు. ఆ తర్వాత వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళతో ఉండగా.. విషయం తెలుసుకున్న స్వాతి తన సోదరుడితో కలిసి మంగళవారం రాత్రి తన భర్తను, ఆ మహిళను పట్టుకుంది. ఆ తర్వాత స్థానిక పోలీస్స్టేషన్ భర్త, మహిళపై ఫిర్యాదు చేసింది. పోలీసులు కౌన్సెఇంగ్ ఇచ్చి ఇంటికి పంపించివేశారు. అయితే, భర్త తనకు వద్దని భావించిన స్వాతి.. పెద్దపల్లిలోని మహిళా పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి బుధవారం ఉదయం వెళ్లింది. ఈ విషయం తెలుసుకున్న నరేశ్.. అవమానం భరించలేక మధ్యాహ్నం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తన భర్త చావుకు కారణమైన మహిళపై చర్యలు తీసుకోవాలని మృతుడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు హెడ్ కానిస్టేబుల్ మధునయ్య తెలిపారు. బుగ్గారం: న్నాపూర్కు చెందిన పరుమాల గంగా రాజం (58) అనారోగ్యంతో ఆత్మహత్య చేసుకున్నాడు. గంగారాం కొంతకాలంగా పక్షవాతంతో బాధపడుతున్నాడు. విరక్తి చెందిన ఆయన బుధవారం ఉరేసుకున్నాడు. విషజ్వరంతో యువకుడు..రామగిరి(మంథని): రత్నాపూర్ గ్రామానికి చెందిన జక్కుల సతీశ్(28) విషజ్వరంతో మృతి చెందాడు. స్థానికుల కథ నం ప్రకారం.. వారంరోజు ల క్రితం సతీశ్కు జ్వరంరా గా కమాన్పూర్లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందాడు. అయినా జ్వరం తగ్గలేదు. దీంతో కరీంనగర్ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. కరీంనగర్: తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ(టీఎంఆర్ఈఐఎస్) రీజనల్ లెవల్ కో ఆర్డినేటర్గా కొనసాగుతున్న కనపర్తి సురేశ్ను బుధవారం ఆర్ఎల్సీ బాధ్యతల నుంచి తొలగిస్తూ టీఎంఆర్ఈఐఎస్ రాష్ట్ర సెక్రటరీ షఫిఉల్లా ఉత్తర్వులు జారీ చేశారు. సురేశ్పై నిధుల దుర్వినియోగం, ఉద్యోగుల పట్ల సరిగా వ్యవహరించకపోవడం తదితర ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో.. ఆరోపణలు నిజమేనన్న నివేదికను జిల్లా కలెక్టర్.. రాష్ట్ర మైనార్టీ సెక్రటరీకి పంపడంతో సురేశ్ను తొలగించి కరీంనగర్ పట్టణంలోని బాలురు–2 మైనార్టీ పాఠశాల ప్రిన్సిపాల్గా నియమించారు. -
అట్టహాసంగా రెస్క్యూ పోటీలు
గోదావరిఖని: సింగరేణి 54వ జోనల్ స్థాయి మైన్స్ రెస్క్యూ పోటీలు బుధవారం మెయిన్ రెస్క్యూస్టేషన్లో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. మొత్తం 6 పురుషులు, 2 మహిళా జట్లు హాజరయ్యాయి. సింగరేణి డైరెక్టర్ కె.వెంకటేశ్వర్లు, డీఎంఎస్ ఉమేశ్ సావర్కర్ పోటీలు ప్రారంభించారు. అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన ప్రతినిధులను నాగ్పూర్ జరిగే జాతీయస్థాయి పోటీలకు ఎంపిక చేస్తారు. కార్యక్రమంలో కార్పొరేట్ సేఫ్టీ జీఎం శ్రీనివాస్, రెస్క్యూ జీఎం శ్రీనివాస్రెడ్డి, ఆర్జీ –1, 3 జీఎంలు లలిత్కుమార్, సుధాకర్రావు, డీడీఎంఎస్లు తదితరులు పాల్గొన్నారు. -
నరేందర్రెడ్డికి అవార్డు
కొత్తపల్లి(కరీంనగర్): ముప్పై ఐదేళ్లుగా విద్యారంగ అభివృద్ధికి కృషి చేస్తున్న అల్ఫోర్ప్ విద్యా సంస్థల చైర్మన్ డా.నరేందర్రెడ్డికి ప్రతిష్టాత్మక ‘అవుట్స్టాండింగ్ ఎడ్యూకేషన్ అడ్మినిస్ట్రేటర్’ అవార్డు వరించింది. ఢిల్లీకి చెందిన ఇండియన్ స్కూల్ అవార్డ్స్, వరల్డ్ ట్రేడ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంయుక్తంగా అవార్డు ప్రకటించాయి. హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో వీఎన్ఆర్ తరుఫున అల్ఫోర్స్ విద్యా సంస్థల ప్రతినిధి అవార్డును అందుకున్నారు. అవార్డు వచ్చిన సందర్భంగా బుధవారం కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఇ టెక్నో స్కూల్లో నరేందర్రెడ్డిని ఘనంగా సన్మానించారు. ఈసందర్భంగా అవార్డు బాధ్యత పెంచిందని, రానున్న రోజుల్లో అల్ఫోర్స్ విద్యాసంస్థలు మరిన్ని అత్యుత్తమ ఫలితాలు సాధించడమే కాకుండా రాష్ట్ర విద్యారంగానికి గొప్ప మార్గదర్శకంగా నిలిచేలా కృషి చేస్తానని నరేందర్రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
సింగరేణిలో మహిళాగార్డులు
● యువతులను నియమించే అవకాశం ● తొలిదశలో 150 మంది ఎంపిక ● త్వరలోనే నోటిఫికేషన్ జారీ గోదావరిఖని: సింగరేణి యాజమాన్యం మళ్లీ మహిళా సెక్యూరిటీ గార్డుల నియామకానికి రంగం సిద్ధం చేస్తోంది. సంస్థలో ప్రస్తుతం సుమారు 2వేల మందికిపైగా మహిళా ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. వీరందరికీ జనరల్ అసిస్టెంట్లుగా బాధ్యతలు అప్పగించింది. చదువుతో నిమిత్తం లేకుండా వీరు వివిధ విభాగాల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రధానంగా వర్క్షాప్లు, జీఎం కార్యాలయాలు, భూగర్భ గనులు, స్టోర్స్, డిపార్ట్మెంట్లలో పనిచేస్తున్నారు. తాజాగా 150 మంది మహిళా కార్మికులను విధుల్లోకి తీసుకునేందుకు యాజమాన్యం ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. దీనిపై నోట్ఫైల్ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. సింగరేణి సంస్థ ఆమోదం తర్వాత నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత ఆసక్తిగల మహిళలను ఎంపికచేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఐదేళ్ల క్రితం వరకు సెక్యూరిటీ గార్డులుగా.. ఐదేళ్లక్రితం వరకు మహిళలు సెక్యూరిటీ విభాగంలో పనిచేశారు. అయితే ఉద్యోగవిరమణ పొందడంతో వారిస్థానంలో కొత్తవారిని నియమించలేదు. గతంలో ఉద్యోగం చేస్తూ మరణించిన కార్మికుడి భార్య, వారి కుటుంబంలోని మహిళలకు సింగరేణి యాజమాన్యం ఉద్యోగం ఇచ్చే ఆనవాయితీ కొనసాగింది. వీరిని తొలుత గుట్కా(క్లెఫిల్)షెడ్లలో నియమించింది. ఆ తర్వాత జనరల్ మజ్దూర్లుగా విధులు అప్పగించింది. క్లెఫిల్ షెడ్లు ఎత్తివేయడంతో అందులో పనిచేస్తున్న మహిళా కార్మికులను సెక్యూరిటీ విభాగంలోకి తీసుకుంది. ఇలా ప్రతీ ఏరియాలో ఐదు నుంచి పది మంది వరకు మహిళలు సెక్యూరిటీ విభాగంలో కొనసాగారు. ప్రస్తుతం మహిళా కార్మికుల్లో కొందరిని సెక్యూరిటీ గార్డులుగా ఎంపిక చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. -
రాధాకృష్ణన్ గెలుపుపై సంబురాలు
సుల్తానాబాద్(పెద్దపల్లి): భారత ఉపరాష్ట్రపతిగా రా ధాకృష్ణన్ ఎన్నిక కావడంపై బీజేపీ ఆధ్వర్యంలో ప ట్టణంలో బుధవారం సంబురాలు నిర్వహించారు. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి మాట్లాడు తూ, అవినీతిపై నీతి విజయం సాధించిందన్నారు. అనంతరం చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. నాయకులు గుర్రాల మల్లేశం, కడారి అశోక్రావు, నల్ల మనోహర్రెడ్డి, మిట్టపల్లి ప్రవీణ్కుమార్, చాతరాజు రమేశ్, తిరుపతి, రా జన్న, కుమార్, నాగరాజు, భాగ్యలక్ష్మి, వనజ, నాగే శ్వర్, ఏగోళం సదయ్యగౌడ్, వెంకటేశ్ పాల్గొన్నారు. -
ప్రముఖ విద్యాలయంగా శాతవాహనకు గుర్తింపు
● వీసీ ఉమేశ్కుమార్ సప్తగిరికాలనీ(కరీంనగర్): శాతవాహన యూనివర్సిటీ 2008లో స్థాపించబడి ఉత్తర తెలంగాణలోనే ప్రముఖ విద్యాలయంగా గుర్తించబడుతుందని వీ సీ ఉమేశ్కుమార్ ఉన్నారు. యూనివర్సిటీ గురించి ప్రపంచానికి తెలిసేలా తన పర్యటన కొనసాగింద ని వివరించారు. ఆగస్టు 17 నుంచి 31 వరకు అమెరికా పర్యటన వివరాలను బుధవారం వెల్లడించా రు. భిన్న కోర్సులతో నాలుగు పీజీ సెంటర్లతో కొనసాగుతున్న యూనివర్సిటీలో ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఏ ర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. శిక్షణ, పరిశోధన, విద్యారంగంలో మెరుగైన అవకాశాలకు ఎన్ఆర్ఐ సాయం కోసం అమెరికాలోని 7 ప్రముఖ నగరాల ను సందర్శించి విరాళాలు సేకరించామన్నారు. 8 బంగారు పతకాలతో పాటు రూ.అర కోటికి పైగా విరాళాలు సేకరించినట్లు తెలిపారు. సాంకేతిక అభివృద్ధి కోసం కంప్యూటర్లు, డిజిటల్ పరికరాలు అందజేసేందుకు ఎన్ఆర్ఐలు ముందుకొచ్చినట్లు ఆయన తెలిపారు. నవంబర్ రెండోవారంలో విశ్వవిద్యాలయంలో 2వ స్నాతకోత్సవ వేడుకలను నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. -
జీజీహెచ్ వర్సెస్ ‘సిమ్స్’
కోల్సిటీ(రామగుండం): జిల్లాకు గుండెకాయలాంటి గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి(జీజీహెచ్)వైద్యాధికారులు, సింగరేణి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(సిమ్స్) కాలేజీ ప్రిన్సిపాల్ మధ్య కోల్డ్వార్ కొనసాగుతోందని తెలుస్తోంది. జీజీహెచ్ పరిపాలనా విభాగంలో ప్రిన్సిపాల్ జోక్యం మితిమీరుతోందని సుమారు 33 మంది ఫ్యాకల్టీ డాక్టర్లు తప్పుపడుతున్నారు. దీనిపై బుధవారం మెడికల్ సూపరింటెండెంట్ను వారు నేరుగా కలిసి వినతి పత్రం సమర్పించడం రామగుండం నగరంతోపా టు జిల్లా వ్యాప్తంగా హాట్టాపిక్గా మారింది. జీజీహెచ్లో పనిచేస్తున్న ఫ్యాకల్టీ డాక్టర్ల సమస్యల పరిష్కారంతోపాటు తమ విధుల నిర్వహణకు ఇబ్బందులు కలిగిస్తున్న మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ వ్యవహారంపై కూడా చర్యలు తీసుకోవాలని వినతిత్రంలో పేర్కొనడం కలకలం రేపుతోంది. టీజీజీడీఏకూ ఫిర్యాదు.. జీజీహెచ్ మెడికల్ సూపరింటెండెంట్తోపాటు తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ (టీజీజీడీఏ), కరీంనగర్ టీజీజీడీఏ యూనిట్, రాష్ట్ర టీజీజీడీఏ, డీఎంఈకి కూడా ఫ్యాకల్టీ వైద్యులు ఫిర్యాదు చేయడం సమస్య తీవ్రతకు అద్దంపడుతోంది. జీజీహెచ్ అడ్మినిస్ట్రేషన్లో సిమ్స్ ప్రిన్సిపాల్ అనవసరంగా జోక్యం చేసుకుంటున్నారని వినతిపత్రంలో పేర్కొనడం ఆసక్తి రేపుతోంది. ఆస్పత్రిలో మితిమీరుతున్న ప్రిన్సిపాల్ జోక్యం సూపరింటెండెంట్ సామర్థ్యాన్ని అగౌరవపరుస్తోందని, ఆ స్పత్రిలో విధులు నిర్వహిస్తున్న ఫ్యాకల్టీ డాక్లర్లకు ఇబ్బందులు కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖగుర్తింపు హాజరు అమలులో ఉన్నా.. రిజిష్టర్లు ఎందుకు? గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ముఖగుర్తింపు హాజరు పద్ధతి అమలులో ఉన్నా.. అటెండె న్స్ రిజిష్టర్ ఎందుకనే వాదనలూ వినిపిస్తున్నాయి. ఈ విషయంలో రిజిష్టర్ తొలగించాలని ఫ్యాకల్టీ వైద్యులు కోరుతున్నారు. ప్రతీవిభాగం హెచ్వోడీలే అటెండెన్స్ రిజిష్టర్ నిర్వహించి ప్రతీనెల 20వ తేదీ లోగా సమర్పించాలని విన్నవిస్తున్నారు. ఆస్పత్రిలో ని ప్రధాన వర్క్ స్టేషన్లలో ఇంటర్కం టెలిఫోన్ సౌ కర్యం కల్పించాలని, ఎస్ఆర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ల వివరాలను ఈఎండీ డ్యూటీ రిజిష్టర్లో నమోదు చేయాలని వైద్యులు డిమాండ్ చేస్తున్నారు. అవమానం.. అగౌరవం.. పేషెంట్లు, మెడికల్ స్టూడెంట్స్, వైద్య సిబ్బంది ఎదుట అసిస్టెంట్ ప్రొఫెసర్లను అవమానిస్తున్నా రని, అగౌరవ పర్చుతున్నారనే విమర్శలూ వ్యక్తమవుతున్నాయి. తమను బ్లాక్మెయిల్ చేసేలా చర్యలు ఉండకూడదని డిమాండ్ చేస్తున్నారు. వివక్ష లేకుండా సమస్యలను పరిష్కరించాలని ఉన్నతాధికారులను ఫ్యాకల్టీ వైద్యులు కోరుతున్నారు. ఫ్యాకల్టీలపై పనిభారం.. ప్రస్తుత ఫ్యాకల్టీపై పనిభారం పెరుగుతోంది. దానిని తగ్గించడానికి ఎన్ఎంయూ నిబంధనల మేరకు వీలైనంత త్వరగా ఫ్యాకల్టీలు, సీనియర్ రెసిడెంట్లను నియమించాలనే డిమాండ్ వస్తోంది. సీజనల్ వ్యాధులతో పేషెంట్ల సంఖ్య పెరిగిందని, బెడ్ల కొరత వేధిస్తోందని, వెంటనే బెడ్ల సంఖ్య పెంచడానికి చర్యలు తీసుకోవాలనే డిమాండ్ ఉంది. కొందరు అసిస్టెంట్ ప్రొఫెసర్లకు రెగ్యులర్ వేతనాలు సమయానికి అందడం లేదని వాపోతున్నారు. అన్ని విభాగాల్లో వైద్యులకు తాగునీటి సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. -
చదువు నేర్పిన బడి అభివృద్ధికి కృషి
పెద్దపల్లిరూరల్: ‘నేను చదువు నేర్చుకున్నది ఈ పాఠశాలలోనే.. కష్టపడి చదివితే ఉన్నతంగా ఎదగొచ్చు.. మీరంతా క్రమశిక్షణతో లక్ష్య సాధనకు పాటుపడాలి’ అని ఎమ్మెల్సీ మల్క కొమురయ్య విద్యార్థులకు సూచించారు. అ ప్పన్నపేట జెడ్పీ హైస్కూల్ను బుధవారం ఆ యన సందర్శించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులతో తన జ్ఞాపకాలు పంచుకున్నారు. బందంపల్లి నుంచి అప్పన్నపేట వరకు నడుచుకుంటూ వచ్చిన ఆనాటి జ్ఞాపకాలను వివరించారు. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయ ని, విద్యార్థులు సెల్ఫోన్లతో కాలయాపన చే యకుండా ఉన్నత లక్ష్యాలు ఎంచుకోవాలని సూచించారు. ఓ విద్యార్థిని మీరు.. పూర్తిస్థా యి రాజకీయ నాయకుడిగా ఎందుకు ఉండ డం లేదని అడగ్గా.. కష్టాల నుంచి ఒక్కోమెట్టు ఎక్కుతూ ఉన్నతంగా ఎదిగానని, ఆ కారణంగా జాతీయ పార్టీ నాయకులు తనకు ఎమ్మెల్సీ గా పోటీచేసేందుకు అవకాశం ఇచ్చారని కొ మురయ్య బదులిచ్చారు. తాను చదువుకున్న బడిలో మీరు చదువుకుంటున్నారని, మీకు అవసరమైన వసతుల కల్పనకు సహకారం అందిస్తానని ఆయన అన్నారు. పాఠశాల మైదానం చదును చేయించడంతోపాటు ఇంగ్లిష్ సబ్జెక్టు బోధనకు ట్యూటర్ కావాలని విద్యార్థులు విన్నవించగా.. సానుకూలంగా స్పందించారని, విద్యార్థులకు డ్యూయల్ డెస్క్లను కూడా సమకూరుస్తానని హామీ ఇచ్చారని హెచ్ఎం పురుషోత్తం తెలిపారు. 17 నుంచి మహిళా వైద్య శిబిరాలు పెద్దపల్లిరూరల్: జిల్లాలోని మహిళల ఆరోగ్యం కోసం ఈనెల 17నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు ప్రత్యేక వైద్య శిబిరాలను స్వస్థ్ నారీ శక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమం పేరిట నిర్వహిస్తామని జిల్లా వైద్యాధికారి వాణిశ్రీ బుధవారం తెలిపారు. మహిళలు, యుక్తవయసుగల వారికే వైద్య పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. జిల్లా ప్రధాన ఆస్పత్రి నుంచి గైనకాలజిస్ట్, డెంటల్ తదితర వైద్య నిపుణులు వైద్య పరీక్షలు చేస్తారని వివరించారు. -
అర్ధాకలితో చదువుకునేదెలా?
● జూనియర్ కాలేజీల్లో అమలుకు నోచుకోని ‘మధ్యాహ్న భోజనం’సుల్తానాబాద్(పెద్దపల్లి): ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు పేద, మధ్య తర గతికి చెందినవారే ఉంటారు. వీరు మారుమూల ప్రాంతాల నుంచి బస్సులు, ఇతర వాహనాల ద్వా రా కళాశాలలకు చేరుకుంటున్నారు. చదువుపై ఆసక్తితో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చేరుతున్న గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఆకలి బాధలు తప్ప డం లేదు. గురుకులాలు, కేజీబీవీలు, మోడల్ స్కూ ళ్ల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్నారు. కానీ, ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులకు ఇంకా అందుబాటులో తేవడం లేదు. వీరికోసం ప్రభుత్వం గతేడాది ఇచ్చిన హామీని అమలు చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. 14 కళాశాలలు.. 3,286 మంది విద్యార్థులు జిల్లాలో 14 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నా యి. అందులో 3,286 మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. మారుమూల ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు వచ్చి చదువు పూర్తయ్యాక ఇళ్లకు వెళ్తుంటారు. ఉదయం ఎనిమిది గంటలకు గ్రామీణ ప్రాంతాల్లోని తమ ఇళ్ల నుంచి బయలు దే రే విద్యార్థులు.. ఉదయం తొమ్మిది గంటలకు ఆర్టీసీ బస్సుల్లో కాలేజీలకు చేరుకుంటున్నారు. అప్పటికే ఫస్ట్పీరియడ్ ముగుస్తోంది. దీంతో విద్యార్థులు అంతకన్నా ముందుగానే తయారై కాలేజీ బాటపట్టడంతో ఇంటివద్ద భోజనం కానీ, అల్పాహారం కానీ చేసే అవకాశం ఉండడంలేదు. సాయంత్రం కాలేజీ ముగిశాక సకాలంలో బస్సులు రాక రాత్రి ఏడు గంటల వరకు ఇళ్లకు చేరుకోవాల్సి వస్తోంది. దీంతో చాలామంది మధ్యాహ్న భోజన తినక ఖాళీకడుపుతోనే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. కొందరు బిస్కెట్లు, స్నాక్స్తో ఆకలి తీర్చుకుంటున్నారు. టిఫిన్ బాక్స్ తెచ్చుకునే కొందరు స్నేహితులతో పంచుకొని తింటున్నారు. అర్ధాకలితో బాధపడే విద్యార్థుల ఆరోగ్యంపై ఇది ప్రభావం చూపే అవకాశం ఉందని న్యూట్రిషన్లు చెబుతున్నారు. ఆకలి తట్టుకోలేక కొందరు ఇంటికి వెళ్లి పోతే.. ఏకాగ్రత దెబ్బతింటుందని అధ్యాపకులు వివరిస్తున్నారు. -
గోదావరి పుష్కరాలకు కార్యాచరణ
● కలెక్టర్ కోయ శ్రీహర్షపెద్దపల్లిరూరల్: జిల్లాలో జరిగే గోదావరి పుష్కరాల నిర్వహణ పకడ్బందీగా ఉండేలా కార్యాచరణ సిద్ధం చేయాలని కలెక్టర్ శ్రీహర్ష ఆదేశించారు. కలెక్టరేట్లో బుధవారం అడిషనల్ కలెక్టర్లు అరుణశ్రీ, వేణుతో కలిసి ఏర్పాట్లపై సమీక్షించారు. పుణ్యస్నానాలు ఆచరించేందుకు భక్తులు వచ్చే ప్రదేశాలను గుర్తించి స్నానఘాట్ల నిర్మా ణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. సుందిళ్ల, గోదావరిఖని సమ్మక్క, సారలమ్మ, మంథనిలోని గౌతమేశ్వర ఆలయం, గోయిల్వాడ ప్రాంతాలకు భక్తులు ఎక్కువగా వచ్చే అవకాశముందన్నారు. అంగన్వాడీ సూపర్వైజర్ల పనితీరు సరిగ్గాలేదని, పనితీరు మెరుగుపర్చుకోకుంటే చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. అంగన్వాడీ కేంద్రాలు అపరిశుభ్రంగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. విధులు సక్రమంగా చేస్తే ఉండాలని, లేదంటే సెలవుపై వెళ్లాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈవో నరేందర్, గోదావరిఖని ఏసీపీ రమేశ్, ఆర్డీవో గంగయ్య, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సుప్రియ, జిల్లా సంక్షేమశాఖ ఇన్చార్జి అధికారి వేణుగోపాల్రావు, సీడీపీవోలు అలేఖ్య, పుష్ప తదితరులు పాల్గొన్నారు. ఓదెల మల్లికార్జునస్వామి ఆలయ అభివృద్ధికి మాస్టర్ప్లాన్ ఓదెల(పెద్దపల్లి): ఓదెల మల్లికార్జునస్వామి ఆలయ అభివృద్ధికి మాస్టర్ప్లాన్ అమలు చేస్తామని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. ఎమ్మెల్యే విజయరమణారావుతో కలిసి ఆయన ఓదెల మల్లికార్జునస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా వసతి గదులు నిర్మిస్తామన్నారు. ఈ విషయాన్ని సీఎం రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. ఎమ్మెల్యే విజయరమణారావు మాట్లాడుతూ, ఓదెల నుంచి పెగడపల్లి గ్రామం వరకు తారురోడ్డు నిర్మిస్తామన్నారు. మల్లన్న గుడికి ఫోర్లేన్తోపాటు సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ఆలయ ఏసీ సుప్రీయ, టెంపుల్ చైర్మన్ చీకట్ల మొండయ్య, ప్రతినిధులు ఆళ్ల సుమన్రెడ్డి, తిరుపతి, ధీరజ్కుమార్ పాల్గొన్నారు. ఆలయ ప్రధాన అర్చకుడు వీరభద్రయ్య ఆధ్వర్యంలో కలెక్టర్, ఎమ్మెల్యేకు ఘనస్వాగతం పలికారు. అందుబాటులో యూరియా రైతులకు యూరియా అందుబాటులో ఉందని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. కొలనూర్లో యూరియా గోదామును ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. కార్యక్రమంలో పొత్కపల్లి సింగిల్విండో చైర్మన్ ఆళ్ల సుమన్రెడ్డి, నాయకులు మూల ప్రేంసాగర్రెడ్డి, గోలి అంజిరెడ్డి, బైరి రవిగౌడ్, బొంగోని రాజయ్యగౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
యూరియా కొరత.. తీరని వ్యథ
సుల్తానాబాద్/ఎలిగేడు/మంథనిరూరల్ : జిల్లా రైతులకు యూరియా కష్టాలు తప్పడంలేదు. బుధవారం కూడా వివిధ ప్రాంతాల్లో యూరియా కోసం ఉదయమే రైతులు బారులు తీరారు. అయినా, సరిపడా అందక చాలామంది వెనుదిరిగారు. సుల్తానాబాద్ ప్యాక్స్ గోదాం ఎదుట రైతులు చెప్పులు, రాళ్లు, చెట్లకొమ్మలను క్యూలో ఉంచారు. యూరియా వస్తుందనే సమాచారంతో మహిళా రైతులు కూడా భోజనాలు పట్టుకుని వచ్చారు. వరి పంట పొట్టదశకు వచ్చిందని, ఇప్పుడు యూరియా వేయా ల్సి ఉంటుందని రైతులు తెలిపారు. మంథని మండలం గుంజపడుగు, ఎలిగేడు మండలం ధూళికట్టలోనూ అన్నదాతలు బారులు తీరారు. -
రైతు సంక్షేమంటే ఇదేనా?
● యూరియా కోసం అన్నదాతలు రోడ్డెక్కాలా? ● పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి పెద్దపల్లిరూరల్: కాంగ్రెస్ పాలకులు మాయమాటలు చెప్పి రైతులు, ప్రజలను మోసంచేసి అధికారం చేజిక్కించుకుని సంక్షేమ పథకాలు అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి మండిపడ్డారు. యూ రియా కొరతను సత్వరమే తీర్చాలనే డిమాండ్తో జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో బుధ వారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. రాజీవ్ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. రైతు సంక్షేమం కోసం పాటుపడుతున్నామని గొప్పలు చెప్పుకుంటున్న పాలకులు.. యూరియా కావాలంటూ రైతులు రోడ్డెక్కే పరిస్థితి ఎందుకొచ్చిందో చెప్పాలన్నారు. కేసీఆర్ పాలనలో విత్తనాలు, ఎరువులు, విద్యుత్ను ఇబ్బందులు లేకుండా అందించామని గుర్తుచేశారు. కాంగ్రెస్ నేతలకు పాలించ డం చేతకాదని దుయ్యబట్టారు. సన్నవడ్లకు బోనస్ ఇస్తామని చెప్పి ఇప్పటికీ ఇవ్వడంలేదని, వెంటనే రైతుల బ్యాంకు ఖాతాల్లో జమచేయాలని డిమాండ్ చేశారు. పంటలకు యూరియా వేసే సమయం ఇదే అనువైందని, వెంటనే అవసరమైనంత యూరియా అందించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నాయకులు ఉప్పు రాజ్కుమార్, మర్కు లక్ష్మణ్, రఘువీర్సింగ్, గంట రాములు, తిరుపతిరెడ్డి, సంపత్, మోహన్రావు, గుణపతి, వెంకటరెడ్డి, మొబిన్, రాములు, ముత్యాల రాజయ్య, దేవయ్య, మనోజ్, శ్రీధర్, మల్లేశం, ఖదీర్, విక్రమ్ పాల్గొన్నారు. -
వీరవనతికు ఘననివాళి
పెద్దపల్లిరూరల్: తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీరవనిత, ధీరశాలి చాకలి ఐల మ్మ అని అడిషనల్ కలెక్టర్ వేణు అన్నారు. కలెక్టరేట్లో బుధవారం చాకలి ఐలమ్మ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఐలమ్మ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కా ర్యక్రమంలో బీసీ వెల్పేర్ ఆఫీసర్ రంగారెడ్డి, రజక సంఘం నాయకులు పాల్గొన్నారు. పారిశుధ్యంపై నిర్లక్ష్యం వద్దు రామగిరి(మంథని): పంచాయతీ అధికారు లు, కార్యదర్శులు పారిశుధ్యంపై నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా పంచా యతీ అధికారి(డీపీవో) వీరబుచ్చయ్య హెచ్చరించారు. కల్వచర్ల గ్రామంలో బుధవారం ఆయన పర్యటించారు. పారిశుధ్య పనులు పరిశీలించారు. క్లోరినేషన్ చేపట్టాలని, మురుగునీటికాలువలు, పరిసరాలు శుభ్రంగా ఉండేలా రోజూ పారిశుధ్య పనులు చేపట్టాలని సూచించారు. ప్రతీవారం చేపట్టే డ్రై డేలో అధి కారులు పాల్గొనాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీవో ఉమేశ్కుమార్, పంచాయతీ కార్యదర్శి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. ముగిసిన ఎస్జీఎఫ్ పోటీలు సుల్తానాబాద్(పెద్దపల్లి): స్థానిక ప్రభుత్వ జూ నియర్ కళాశాల మైదానంలో చేపట్టిన జోనల్ స్థాయి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు బుధవారం ము గిశాయి. ఈ సందర్భంగా డీవైఎస్వో సురేశ్ మాట్లాడుతూ, క్రీడాకారులు గెలుపోటముల ను సమానంగా తీసుకోవాలన్నారు. విద్యార్థు లు చదువుతోపాటు క్రీడా నైపుణ్యం పెంచుకోవాలని ఆయన సూచించారు. సుల్తానాబాద్, ఓదెల, జూలపల్లి, ఎలిగేడు మండలాలకు చెందిన 800 మంది క్రీడాకారులు పోటీలకు హాజరయ్యారు. విజేతలకు సుల్తానాబాద్ స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షుడు ముస్త్యాల రవీందర్ బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ప్రతినిధులు అమిరిశెట్టి తిరుపతి, దాసరి రమేశ్, ప్రణయ్, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. నేడు టీఎల్ఎం మేళా పెద్దపల్లిరూరల్: జిల్లాలోని సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం జిల్లాస్థాయి టీఎల్ఎం మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి మాధవి తెలిపారు. మండలస్థాయి మేళాలో ప్రతిభ కనబర్చిన 10మంది ఉపాధ్యాయులు(ప్రతీ మండలం నుంచి) జిల్లాస్థాయి మేళాలో పా ల్గొంటారని డీఈవో పేర్కొన్నారు. జిల్లాస్థాయిలో ప్రతిభ చూపిన 8 మందిని రాష్ట్రస్థాయి మేళాకు ఎంపిక చేస్తామని వివరించారు. గూగుల్ పేలో ఉద్యోగాలుపెద్దపల్లిరూరల్: జిల్లాలోని నిరుద్యోగ యువకులకు గూగుల్ పే హైరింగ్ రిక్వెస్ట్ కంపెనీలో ఉద్యోగాలు కల్పించేందుకు ఈనెల 16న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఇన్చార్జి ఉపాధికల్పనాధికారి తిరుపతిరావు తెలిపారు. కలెక్టరేట్ లోని రూం నంబరు 225లో నిర్వహించే ఈ మేళాకు హాజరయ్యే అభ్యర్థులు సర్టిఫికెట్ల జి రాక్స్ వెంట తీసుకు రావాలని సూచించారు. వివరాలకు 80964 34123, 81212 62441 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. రైల్వే ట్రాక్ పనుల పరిశీలన ఓదెల(పెద్దపల్లి): కాజీపేట, ఓదెల, పొత్కపల్లి, కొలనూర్ రైల్వేస్టేషన్ల మధ్య చేపట్టిన రైల్వేట్రాక్ పనులను దక్షిణ మధ్య రైల్వే డీఆర్ఎం గోపాలకృష్ణ బుధవారం పరిశీలించారు. రైళ్ల వేగం పెంచేందుకు కొద్దిరోజులుగా ట్రాక్కింద కొత్త సిమెంట్ స్లీపర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఈ పనుల ప్రగతి తెలుసుకునేందుకు డీఆర్ఎం ఓదెలకు ప్రత్యేక రైలులో చేరుకున్నారు. స్లీపర్ మార్చే పనులను ఆయన పర్యవేక్షించారు. ఆటోమేటిక్ సిగ్నలింగ్ సిస్టం అమలు కోసం చేపట్టిన కొత్త పట్టాలు, స్లీపర్ పనులను వేగవంతం చేయాలని డీఆర్ఎం సిబ్బందికి సూచించారు. ఆయన వెంట పలువురు అధికారులు తదితరులు ఉన్నారు. -
సింగరేణికి సెక్యూరిటీ బెంగ
గోదావరిఖని: సింగరేణి ఆస్తులను కంటికి రెప్పలా కాపాడాల్సి సెక్యూరిటీ విభాగం ప్రైవేట్ వ్యవస్థల చేతుల్లోకి వెళ్తోంది. లాభాల పేరిట వాస్తవాలను వి స్మరిస్తూ ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది సంఖ్య పెంచుతూ, పర్మినెంట్ గార్డుల సంఖ్య తగ్గిస్తున్నారు. త ద్వారా ఆస్తులకు రక్షణ లేకుండా పోతుందని పలు కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. వాస్తవం ఇలా.. వాస్తవానికి అవుట్సోర్సింగ్ ప్రారంభించిన సమయంలో 70 శాతం పర్మినెంట్ సెక్యూరిటీ సిబ్బంది, 30 శాతం కాంట్రాక్ట్ సిబ్బంది ఉండాలని నిర్ణయించారు. ఈ నిబంధనను ఇప్పుడు పూర్తి విస్మరించారు. సింగరేణిలో ప్రస్తుతం 60 శాతం కాంట్రాక్టు కార్మికులు, 40 శాతం పర్మినెంట్ కార్మికులు ఉన్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే భవిష్యత్లో పర్మినెంట్ సెక్యూరిటీ సిబ్బంది వ్యవస్థ కనుమరుగు అయ్యే ప్రమాదం ఉందంటున్నారు. పర్మినెంట్ సిబ్బందిని తగ్గిస్తూ.. సింగరేణి పర్మినెంట్ కార్మికుల సంఖ్య తగ్గిస్తూ వస్తోంది. ప్రస్తుతం సంస్థలో 935మంది పర్మినెంట్ సెక్యూరిటీ సిబ్బంది ఉంటే, 1,367మంది కాంట్రా క్టు సిబ్బంది ఉన్నారు. వీరితోపాటు ప్రైవేట్ సెక్యూరిటీ సూపర్వైజర్లు 28మంది ఉన్నారు. ఫలితంగా పర్మినెంట్ ఉద్యోగులపై వీరిదే పెత్తనం కొనసాగుతోందనే విమర్శలు వస్తున్నాయి. పర్మినెంట్తో సంస్థకు రక్షణ.. పర్మినెంట్ సెక్యూరిటీ సిబ్బంది సింగరేణి ఆస్తుల పరిరక్షణ ధ్యేయంగా పనిచేస్తారు. ఏదైనా తప్పుచే సినా, అక్రమాలు చోటుచేసుకున్నా.. చార్జిషీట్ ఇవ్వడం, విచారణ జరపడం, మరీ ఎక్కువైతే విజిలెన్స్ విచారణ ఉంటుంది. కాంట్రాక్టు(అవుట్సోర్సింగ్) సిబ్బంది తప్పుచేస్తే ఉద్యోగంలోంచి తీసివేయడం తప్ప పెద్దగా జరిగేది ఏమీ ఉండదు. కొంతకాలంగా చోరీలు చోటుచేసుకోవడం ఈకోవలోనే ఉంటున్నాయని కార్మిక నాయకులు అంటున్నారు. యువ కార్మికులకు అవకాశం? సింగరేణిలో యువకార్మికుల సంఖ్య భారీగా పెరిగింది. ఖాళీలను బట్టి వీరిని సెక్యూరిటీ వింగ్లో నియమించాలనే డిమాండ్ వస్తోంది. ఈవిషయంలో సీఎండీ దృష్టి సారించాలని పలు కార్మిక సంఘాలు కోరుతున్నాయి. సింగరేణిలో మహిళా సెక్యూరిటీ ఉద్యోగాలు? సింగరేణిలో మహిళా కార్మికుల సంఖ్య కూడా పెరుగుతోంది. దీంతో వారిని కూడా సెక్యూరిటీ విభాగంలో నియమించాలనే యోచనలో సింగరేణి ఉందని చెబుతున్నారు. త్వరలోనే సుమారు 150 మంది మహిళా సెక్యూరిటీ గార్డులుగా పర్మినెంట్ ఉద్యోగులుగా నియమించే అవకాశం ఉంది. భూగర్భ గనుల్లోకి దొంగలు.. భూ గర్భగనుల్లోకి కూడా దొంగలు చొరబడడం సంచలనంగా మారింది. ఓసీపీ క్వారీలోకి వెళ్లి కాపర్ కేబుల్ ఎత్తుకెళ్తున్న దొంగలు.. తాజాగా ప్రమాదకరమైన భూగర్భ గనిలో చోరీ చేసేందుకు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. ఖాళీల సమాచారం హోదా మంజూరైన ఉన్నవి పోస్టులు సీనియర్ ఇన్స్పెక్టర్ 14 4 జూనియర్ ఇన్స్పెక్టర్ 16 13 జూనియర్ అసిస్టెంట్ 15 10 జమేదార్లు 76 65 సెక్యూరిటీ గార్డులు 1,038 935 ఏరియా పర్మినెంట్ కాంట్రాక్టు కార్పొరేట్ 73 75 హైదరాబాద్ 15 – కొత్తగూడెం 66 204 ఇల్లెందు 67 70 మణుగూరు 28 127 ఆర్జీ–1 112 111 ఆర్జీ–2 77 94 ఆర్జీ–3 127 118 భూపాలపల్లి 64 116 శ్రీరాంపూర్ 157 138 మందమర్రి 106 147 బెల్లంపల్లి 29 119 ఎస్టీపీపీ 03 54 విజిలెన్స్ 10 – మొత్తం 935 1,367 ఏరియాల వారీగా సెక్యూరిటీ సిబ్బంది సెక్యూరిటీ సిబ్బంది సమాచారం పర్మినెంట్ 935 ప్రైవేట్ 1,367 సీఐఎస్ఎఫ్ 406 -
ఇళ్ల నిర్మాణం వేగవంతం
సంకీర్తనకు ఎల్వోసీ చెక్కు కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): ఆ రెపల్లె గ్రామాని కి చెందిన వి ద్యార్థిని కాంటాల సంకీర్తన వైద్య చికిత్సల కోసం ఎమ్మెల్యే విజయరమ ణారావు మంగళవారం రూ. 2.50 లక్షల ఎ ల్వోసీ చెక్కు అందజేశారు. ‘అంతుచిక్కని వ్యాధి.. అస్వస్థతలో విద్యార్థిని’ శీర్షికన గతనెల 23న ‘సాక్షి’ కథ నం ప్రచురించింది. కాంగ్రెస్ మాజీ ఎంపీపీ సారయ్యగౌడ్ ఈ విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఎ మ్మెల్యే చొరవతో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఎల్వోసీ చెక్కు మంజూరైంది. దీంతో ఆమె కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే చెక్కు అందజేశారు. ఎమ్మెల్యే, సారయ్యగౌడ్, రావి సదానందం, ‘సాక్షి’కి సంకీర్తన తల్లిదండ్రులు లావణ్య – వీరన్న కృతజ్ఞతలు తెలిపారు. -
యూరియా కొరతపై బీఆర్ఎస్ నిరసన
● కాల్వశ్రీరాంపూర్, ఓదెలలో ధర్నాకాల్వశ్రీరాంపూర్/ఓదెల(పెద్దపల్లి): జిల్లాలో యూ రియా కొరతను నిరసిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు మంగళవారం కాల్వశ్రీరాంపూర్లో ధర్నా చేశారు. ఓదె ల మండల కేంద్రంలో రైతులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో మాజీఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి మాట్లాడుతూ, రైతులకు సరిపడా యూరియా తెప్పిండంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. వానాకాలం పంటలకు సరిపడా ని ల్వలు తెప్పించకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తా మని ఆయన హెచ్చరించారు. పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళనకారులను శాంతింపజేశారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయాల్లో నాయకులు వినతిపత్రాలు అందజేశారు. ఆయా కార్యక్రమాల్లో నాయకులు కొట్టె సుజాత, నూనేటి సంపత్ యాదవ్, వంగళ తిరుపతిరెడ్డి, నాగార్జున్రావు, సదానందంగౌడ్, దొమ్మటి సీను, బండ రవీందర్రెడ్డి, బైరం రమేశ్, శ్రీదేవి, శ్యాం, తీగల స్వప్న, జక్కె రవీందర్గౌడ్, కొంకటి మల్లారెడ్డి, మిట్టపెల్లి కొమురయ్య, ఐరెడ్డి వెంకటరెడ్డి, గంట రాములుయాదవ్, గట్టు రమాదేవి, కుమార్, శ్రీకాంత్, శివ తదితరులు పాల్గొన్నారు. -
సమన్వయంతో ఫ్యామిలీ కౌన్సెలింగ్
● కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశం పెద్దపల్లిరూరల్: సఖి కేంద్రాలకు వచ్చే గృహహింస, మహిళల రక్షణ, పోక్సో కేసుల్లో చేపట్టే ఫ్యామిలీ కౌన్సెలింగ్ను మహిళా ఠాణా, సఖి కేంద్రాల నిర్వాహకులు సమన్వయంతో నిర్వహించాలని కలెక్టర్ శ్రీహర్ష సూచించారు. మంగళవారం వివిధ అంశాలపై కలెక్టరేట్లో ఆయన సమీక్షించారు. ప్రతీ కేసును ఆరునెలల దాకా ఫాలోఅప్ చేయాలని ఆదేశించారు. భరోసా సెంటర్కు వచ్చే పోక్సో కేసుల్లో బాలికలకు రక్షణ కల్పించాల పేర్కొన్నారు. ‘సే నో టు డ్రగ్స్’ పోస్టర్ ఆవిష్కరణ సెంటినరీకాలనీకి చెందిన మహిపాల్రెడ్డి లడఖ్ ప్రాంతంలోని ఎత్తయిన శిఖరం మౌంట్ కియాగర్ రి (6,100మీ., 20,026 అడుగులు) పర్వతాన్ని అధిరోహించేందుకు నిర్ణయించారు. దానిపై ప్రదర్శించే సే నో టు డ్రగ్స్ త్రివర్ణపతాకంతో కూడిన బ్యానర్ ప్రదర్శిస్తారు. ఈ పోస్టర్ను డీఎంవో ప్రవీణ్రెడ్డితో కలిసి కలెక్టర్ శ్రీహర్ష కలెక్టరేట్లో ఆవిష్కరించారు. అదేవిధంగా ఎయిర్ రైఫిల్ షూటింగ్లో జిల్లాస్థాయి పోటీల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులను కలెక్టర్ అభినందించారు. ఇందులో సాత్విక్, షానాజ్, అనుపమ ఉన్నారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ శాఖ ఇన్చార్జి అధికారి వేణుగోపాల్, ఏసీపీ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
కేసీఆరే ప్రాజెక్టులు పూర్తిచేశారు
మంథని: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 23 నెలల్లో సీఎం రేవంత్రెడ్డి దూషించడం తప్ప ఒక్కమంచి మాట మాట్లాడలేదని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు విమర్శించారు. స్థానిక రాజగృహలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎ ల్లంపల్లి ప్రాజెక్టు కట్టింది శ్రీపాదరావు అని, కాళేశ్వ రం ప్రాజెక్టు కూలిపోయిందంటూ మాట్లాడారని, అసలు ఎల్లంపల్లి ప్రాజెక్టుపై సీఎంకు పూర్తిగా అవగాహన లేకపోవడం బాధాకరమన్నారు. 2004లో ఎల్లంపల్లి పనులు ప్రారంభిస్తే 2016లో అప్పటి సీఎం కేసీఆర్ పూర్తిచేశారని గుర్తుచేశారు. -
ఆగ్రహించి రోడ్డెక్కారు..
పెద్దపల్లిలో రాజీవ్ రహదారిపై రైతుల నిరసనసుల్తానాబాద్లో బారులు తీరిన రైతులు పెద్దపల్లిరూరల్: జిల్లాలో యూరియా లొల్లి ఇంకా ముదురుతూనే ఉంది. రైతులు తమకు అవసరమైన యూరియా కోసం గోదాములు, ఆగ్రోస్, గ్రోమోర్, సహకార సంఘాల ఎదుట బారులు తీరుతూనే ఉన్నారు. వరి పంటకు ఇప్పుడు యూరియా చల్లాల్సిన సమయమొచ్చిందని మొత్తుకుంటున్నా అధికార యంత్రాంగం పట్టించుకోవడంలేదు. జిల్లా కేంద్రంలోని శాంతినగర్ మన గ్రోమోర్ కేంద్రం వద్ద రాఘవాపూర్, రంగాపూర్, గౌరెడ్డిపేట తదితర గ్రామాలకు చెందిన రైతులు మంగళవారం ఉదయమే బారులు తీరారు. నిల్వను బట్టి నిర్వాహకులు వారికి రసీదులు ఇచ్చారు. అయితే, రేపు వస్తే యూరియా ఇస్తామని సిబ్బంది చెప్పడంతో కంగుతిని వారితో వాగ్వాదానికి దిగారు. సిబ్బంది నిలదీత.. యూరియా కోసం రసీదులు ఇచ్చి తీరా రేపు రావా లని ఎందుకు చెబుతున్నారని రైతులు సిబ్బందిని నిలదీశారు. వెంటనే ఇవ్వాలనే డిమాండ్తో రాజీవ్రోడ్డెక్కారు. వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. సీపీఎం మండల అధ్యక్షుడు కల్లెపల్లి అశో క్, నాయకులు ప్రశాంత్, సందీప్, శ్రావణ్, సురేశ్ తదితరులు రైతులకు మద్దతుగా నిలిచారు. ఎస్సై లు లక్ష్మణ్రావు, మల్లేశ్ సిబ్బంది రైతులకు నచ్చ జెప్పారు. నిర్వాహకులతో మాట్లాడి యూరియా ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో రైతులు రాస్తారోకో విరమించారు. జూలపల్లి, ఎలిగేడు, సుల్తానాబాద్లో.. జూలపల్ల/ఎలిగేడు/సుల్తానాబాద్(పెద్దపల్లి): ఎలి గేడు మండలం ధూళికట్ట సహకార సంఘం పరిధిలోలని ముప్పిరితోటలో ఒక్కో రైతుకు ఒక్కో యూరియా సంచి చొప్పున 200 బస్తాలు పంపిణీ చేసినట్లు ఏఈవో శరణ్య తెలిపారు. ధూళికట్టలో గంటల తరబడి వేచిచూసినా యూరియా లోడ్రాక రైతులు నిరాశతో వెనుదిరిగారు. సుల్తానాబాద్లోని ఓ ప్రైవేట్ దుకాణం, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి యూరియా లోడ్ వచ్చిందని స మాచారంతో రైతులు భారీగా తరలివచ్చి బారులు తీరారు. పట్టాదారు పాసుపుస్తకం ఆధారంగా ఒక్కో రైతుకు ఒకట్రెండు యూరియా బస్తాలు ఇవ్వడంతో రానివారు నిరాశతో వెనుదిరిగారు. జూలపల్లిలో మహిళా రైతులు యూరియా లారీని అడ్డుకుని నిరసన తెలిపారు.నేటి నుంచి రైతుల వద్దకే.. సుల్తానాబాద్(పెద్దపల్లి): జిల్లాలోని 25 రైతువేదికల ద్వారా బుధవారం నుంచి యూరియా పంపిణీ చేస్తామని జిల్లా వ్యవసాయాధికారి శ్రీనివాస్ తెలిపారు. జిల్లాలో 54 రైతులు వేదికలు ఉండగా.. ఇందులో 25 వేదికల ద్వారా పంపిణీ చేస్తామని, ఇందుకోసం పీఏసీఎస్ ఉద్యోగులకు ఈ పాస్ యంత్రాలు అందజేశామన్నారు. పంపిణీపై వారికి శిక్షణ కూడా ఇచ్చామని వివరించారు. పంపిణీలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లాకు వెయ్యి టన్నుల యూరియా వచ్చినట్లు ఆయన తెలిపారు. -
సమస్యలు పరిష్కరించండి
పెద్దపల్లిరూరల్: ప్రజావాణి ద్వారా అందిన సమస్యలతో కూడిన వినతులను సత్వరమే పరిష్కరించేలా సంబంధిత శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కలెక్టర్ శ్రీహర్ష, అడిషనల్ కలెక్టర్ వేణుతో కలిసి వినతులు స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజావాణి ద్వారా తమ సమస్యలకు సత్వర పరిష్కారం లభిస్తుందనే నమ్మకంతో జిల్లావాసులు తరలివస్తారని, వారినమ్మకాన్ని వమ్ము చేయకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ శ్రీహర్ష సూచించారు. -
యూరియా.. ఏదయా
పెద్దపల్లిరూరల్: సాగుకు అవసరమైన యూరియా కోసం జిల్లా రైతాంగం ఇంకా తిప్పలు పడుతోంది. జిల్లాలో ప్రధానంగా వరి, పత్తి అత్యధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. పంటను కాపాడుకోవడంతోపాటు మంచి దిగుబడి సాధించేందుకు యూరియా చల్లే సమయం ప్రస్తుతం ఆసన్నమైంది. దీంతో యూరియా కోసం రైతులు దుకాణాలు, గోదాముల ఎదుట బారులు తీరుతున్నారు. అవసరమైన నిల్వలు లేక వారిలో ఆత్రుత పెరుగుతోంది. ఇలా రాగానే.. అలా ఖాళీ.. జిల్లాకు చేరుతున్న యూరియా నిల్వలను అవసరమైన ప్రాంతాలను గుర్తించి సరఫరా చేస్తున్నట్లు వ్యవసాయశాఖ అధికారి ఒకరు తెలిపారు. అయితే నిల్వలు చేరుకునే సరికే అక్కడ బారులు దీరిఉన్న రైతులకు పంపిణీ చేస్తున్నారు అధికారులు, సిబ్బంది. దీంతో ఇలా రాగానే.. అలా ఖాళీ అయిపోతోంది. పాలకుర్తి మండలానికి సోమవారం 340 సంచుల యూరియా రాగా గుడిపల్లి, జయ్యారం, కుక్కలగూడూరు గ్రామాల్లోని 191మంది రైతులకు పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు. చెక్పోస్టులతో నిఽఘా.. జిల్లాకు చేరిన యూరియాను పొరుగు జిల్లాలకు దొ డ్డిదారుల్లో తరలించుకుపోతున్నారని తొలుత ఆరోపణలు వచ్చాయి. దీంతో అక్రమ రవాణాను ని యంత్రించేందుకు జిల్లావ్యాప్తంగా ఐదు చెక్ పోస్టు లు ఏర్పాటు చేసి నిఘా పెంచారు. జిల్లాలోని సుందిళ్ల, అడవిసోమన్పల్లి, ఖమ్మంపల్లి, రామగుండం, గుంపులలో చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. వాటివ ద్ద 220 బస్తాలను పొరుగు జిల్లాలకు తరలిస్తుండ గా అధికారులు పట్టుకున్నారు. ఒక్కో వాహనానికి రూ.10వేల చొప్పున జరిమానా విధించారు. ఈ పాస్ నమోదులో అంతంతే.. యూరియా పంపిణీ సరైన పద్ధతిలో సాగడం లేదన్న వాదనలు ఉన్నాయి. ఏ రైతుకు ఎంతభూమి ఉంది, ఏ పంట సాగు చేశారు, ఎంత యూరియా అవసరం, ఇప్పటివరకు ఎంత తీసుకున్నాడనే వివరాలను ఈ పాస్ మిషన్లో నమోదై లేకపోవడంతో పంపిణీ ప్రక్రియ లోపభూయిష్టంగా మారుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రైతు ఆధార్కార్డుతో రాగానే నంబరు రాసుకుని యూరియా ఇస్తుండడంతో మరుసటిరోజే మళ్లీ వచ్చినా ఇవ్వాల్సి వస్తోందని సమాచారం. అయితే ఈ పాస్లోనే నిల్వల వివరాలతోపాటు పంపిణీ సమాచారం కూడా వివరంగా ఉంటే కొంత కట్టడి చేయవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.3,200 టన్నులు వస్తుంది నాలుగైదు రోజుల్లో జిల్లాకు మరో 3,200 మెట్రిక్ టన్నుల యూరియా వస్తుంది. ఆర్ఎఫ్సీఎల్లో ఉత్పత్తి నిలిచిపోవడంతో కొంత ఇబ్బందిగా మారింది. నానో యూరియాపై అవగాహన కల్పించినా రైతులు ఆసక్తి చూపడం లేదు. యూరియాల పంపిణీలో ఇబ్బందులు తొలగిస్తాం. – శ్రీనివాస్, జిల్లా వ్యవసాయాధికారి జిల్లా సమాచారం వరి సాగు విస్తీర్ణం(ఎకరాల్లో) 2,11,780 పత్తి(ఎకరాల్లో) 49,280 మొక్కజొన్న(ఎకరాల్లో) 501 ఉద్యానవన(ఎకరాల్లో) 9,000 యూరియా వివరాలు(మెట్రిక్ టన్నుల్లో) జిల్లాకు కేటాయింపులు 30,000 చేరిన యూరియా 7,000 ప్రస్తుత నిల్వలు 1,100 ఇంకా రావాల్సింది 3,200 -
పాసుపుస్తకం ఇప్పించండి
వంతెన నిర్మించాలి మా ఊరు కొత్తపల్లి(తెనుగుపల్లి) – వెంకటేశ్వరునిపల్లి మధ్య ఉన్న హుస్సేనిమి యా వాగుపై వంతెన నిర్మించాలి. ఇది అందుబాటులోకి వస్తే రంగంపల్లి, చీకురాయి, పెద్దపల్లికి దూరభారం తగ్గుతుంది. అధికారులు, ప్రజాప్రతినిధులు దీనిపై దృష్టి సారించాలి. – కనుకుంట్ల సదానందం, కొత్తపల్లి మా ఊరు శివారులో వ్యవసాయ భూమిని సాదాబైనామాతో కొనుగోలు చేసిన. దాదాపు 40 ఏళ్లుగా మొకాపై ఉండి సాగు చేసుకుంటున్న. నాకు పట్టాదారు పాసుపుస్తకం ఇప్పించి ప్రభుత్వ పథకాలు వర్తింపజేయాలె. అధికారులు వెంటనే జోక్యం చేసుకోవాలె. – దాసరి చంద్రయ్య, మూలసాల -
ఉపాధ్యాయుల పాత్ర కీలకం
పెద్దపల్లిరూరల్: భావిభారత పౌరులను క్రమశి క్షణ గలవారిగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులపాత్ర కీలకమైందని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నా రు. కలెక్టరేట్లో సోమవారం గురుపూజోత్సవం నిర్వహించారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఉత్తమ ఉపాధ్యాయులను అడిషనల్ కలెక్టర్ వే ణు, డీఈవో మాధవితో కలిసి ప్రశంసాపత్రాలు అందించి సత్కరించారు. విద్యార్థులకు సులువుగా అర్థమయ్యేలా బోధన చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈవో నరేందర్ తదితరులు పాల్గొన్నారు. రెండు రోజుల పాటు వర్షాలు.. వచ్చే రెండురోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షా లు కురిసే అవకాశం ఉందని కలెక్టర్ శ్రీహర్ష తెలిపారు. వాతావరణ శాఖ సూచన మేరకు జిల్లాకు ఆరెంజ్ అలర్డ్ జారీ చేశామని ఆయన అన్నారు. -
ఓదెల మల్లన్నకు పూజలు
ఓదెల(పెద్దపల్లి): చంద్రగ్రహణం సందర్భంగా ఆదివారం మూసివేసిన ఓదెల మల్లికార్జున స్వామి ఆలయాన్ని సోమవారం తెరిచారు. తొలుత ఆలయంలో సంప్రోక్షణ చేశారు. ఆ త ర్వాత భక్తులకు దర్శన అవకాశం కల్పించారు.రేపు ఓటరు తుది జాబితాపెద్దపల్లిరూరల్: జిల్లాలో 137 ఎంపీటీసీ, 13 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయని, ఈమేరకు ఓటరు తుదిజాబితా బుధవారం ప్రచురిస్తామని కలెక్టర్ శ్రీహర్ష తెలిపారు. కలెక్టరేట్లో సోమవారం గుర్తింపు రాజకీయ పార్టీల నాయకులతో సమావేశమయ్యారు. ఓటరు జా బితాపై అభ్యంతరాలుంటే మంగళవారంలోగా పరిష్కరిస్తామన్నారు. మున్సిపాలిటీల్లో గ్రా మాలు విలీనం కావడంతో మూడు ఎంపీటీసీ స్థానాలు తగ్గాయన్నారు. మేజర్ పంచాయతీ రెండు ఎంపీటీసీ స్థానాల పరిధిలో ఉంటే ఒక కుటుంబంలోని సభ్యులందరూ ఒకే ఎంపీటీసీ పరిధిలో ఉండేలా చూస్తామని తెలిపారు. జెడ్పీ సీఈవో నరేందర్, డీఎల్పీవో వేణుగోపాల్, నాయకులు ఉప్పు రాజ్కమార్, ముత్యంరావు, బొంకూరి సురేందర్సన్నీ, పల్లె సదానందం, అక్కపాక తిరుపతి తదితరులు ఉన్నారు.గోదావరి తీరంలో నిఘామంథని: గోదావరి పరీవాహక ప్రాంతాలపై నిఘా ఉంచాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా సూచించారు. సోమ వారం స్థానిక పోలీస్ స్టేషన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. నేరాల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను సీఐ రాజు, ఎస్సై రమేశ్ను అడిగి సమాచారం తెలుసుకున్నారు.వినియోగదారులే ముఖ్యంజ్యోతినగర్(రామగుండం): టీజీ ఎన్పీడీసీఎల్ విద్యుత్ వినియోగదారులకు మెరుగైన సేవలు అందిస్తోందని గోదావరిఖని ఈడీ ప్రభాకర్ అ న్నారు. స్థానిక ఎఫ్సీఐ క్రాస్రోడ్డులోని 33 కేవీ జీడీకే సర్క్యూట్–2ఫీడర్ విద్యుత్ లైన్ ఆదివా రం అర్ధరాత్రి పెద్దచెట్టు పడిపోయి లైన్ దెబ్బతిన్నది. స్పందించిన సిబ్బంది యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టగా.. డీఈ సోమవా రం పరిశీలించారు. గోదావరిఖని – గౌతమిన గర్కు మధ్య చెట్టు విరిగి పడడంతో విద్యుత్ తీ గెలు తెగిపడ్డాయన్నారు. తమ సిబ్బంది యుద్ధప్రాతిపదికన పనులు పూర్తిచేశారని అన్నారు. ఏడీఈ వెంకటేశ్వర్లు, ఏఈ రామస్వామి, లైన్ ఇన్స్పెక్టర్ సీబీ రాజు తదితరులు పాల్గొన్నారు.అందరికీ అక్షరజ్ఞానంపెద్దపల్లిరూరల్: ప్రతీఒక్కరు చదువు నేర్చుకోవాలని వయోజన విద్యా శాఖ అసిస్టెంట్ ప్రా జెక్టు అధికారి శ్రీనివాస్ అన్నారు. అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలో సో మవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. మహిళలు చదువుకునేందుకు ముందుకు రావా లని కోరారు. ఎంఈవో సురేందర్కుమార్, హెచ్ఎం నర్సింగరావు, పెద్దపల్లి క్లస్టర్ సీఆర్పీ బాలసాని వెంకటేశం తదితరులు ఉన్నారు.ప్లాంటేషన్ పనుల పరిశీలనకమాన్పూర్: గుండారం సమీపంలోని మంథని–పెద్దపల్లి మెయిన్ రోడ్డుకు ఇరువైపులా చేపట్టిన ప్లాంటేషన్ పనులను డీఆర్డీవో కాళిందిని పరిశీలించారు. అధికారులకు సూచనలిచ్చారు.ఏఈవోల నిరసనపెద్దపల్లిరూరల్: తమపై పనిభారం అధికమైందంటూ ఏఈవోలు సోమవారం కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. పలువురు వ్యవసాయ విస్తీర్ణాధికారులు తదితరులు పాల్గొన్నారు -
రైతులను గోసపెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం
సుల్తానాబాద్(పెద్దపల్లి): రైతులను గోసపెడుతున్న ప్రభుత్వం ప్రజాక్షేత్రంలో మూల్యం చెల్లించక తప్ప దని మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి హెచ్చరించారు. యూరియా కొరత తీర్చాలనే డిమాండ్ తో స్థానిక అంబేడ్కర్ విగ్రహం ఎదుట రైతులతో క లిసి ధర్నా చేశారు. కొందరు బీఆర్ఎస్ నాయకులు సీఎం రేవంత్రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేసేందుకు యత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం ర్యాలీగా వెళ్లి డిప్యూటీ తహసీల్దార్ రాకేశ్కు వినతిపత్రం అందజేశారు. దాసరి మాట్లాడుతూ, రైతులకు సరిపడా యూరియా అందించకుంటే అధికారులు, నాయకులను గ్రామాల్లోకి రాకుండా అడ్డుకుంటామన్నారు. జూపల్లి సందీప్రావు, సూర శ్యా మ్, గుణపతి, భూమేశ్, రాజమల్లు, వంగల తిరుపతిరెడ్డి, గంట రాములు, మనోజ్గౌడ్, రమణ, చంద్రమౌళి, మహేశ్యాదవ్, గోపి పాల్గొన్నారు. -
పింఛన్ ఇప్పించాలి
జీరోబిల్లు రావడం లేదు మేం నిరుపేదలం. 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ పథకం పొందేందుకు అర్హులం. కానీ జీరో బిల్లు రావడం లేదు. అధికారులు స్పందించి మాకు జీరో బిల్లు వచ్చేలా చూడాలి. – సమ్మక్క, జమున, రాధ, ఇందుర్తి, ఓదెల రైలు నుంచి కిందపడ్డ ప్రమాదంలో కాలు పోయింది. నాలుగేళ్లుగా పింఛన్ కోసం దరఖాస్తు చేసుకుంటున్న. ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న. అధికారులు కనికరించి దివ్యాంగుల పింఛన్ ఇప్పించాలి. – సుమన్ శంకర్, కమాన్పూర్ -
కట్టుదాటుతున్న ఖాకీలు
గోదావరిఖని: ఖాకీలు కట్టుదాటుతున్నారు. ఉన్నతాధికారులు ఫ్రెండ్లీ పోలీసింగ్ పాటిస్తూ ఉంటే.. కొందరు పోలీస్ అధికారుల తొందరపాటు వారికి సమస్యలు తెచ్చిపెడుతున్నాయి. సివిల్ వివాదాల్లో తలదూర్చవద్దని, హద్దుమీరొద్దని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా తరచూ సూ చిస్తున్నా కొన్ని అనూహ్య ఘటనలు చోటుచేసు కోవడం వివాదాస్పదమవుతున్నాయి. ఆలస్యంగా రావడమే నేరమా? గణేశ్ ఉత్సవాల సందర్భంగా ఓ ఠాణాలో డీజే ని ర్వాహకులతో అక్కడి ఎస్సై సమావేశమయ్యారు. అంతవరకు బాగానే ఉన్నా.. ఒకరు ఆలస్యంగా రావడంతో.. ‘నేను చెప్పినా పట్టించుకోకుండా ఆలస్యంగా వచ్చావా’ అని ఎస్సై తన బెల్ట్తో డీజే ని ర్వాహకున్ని కొట్టినట్లు కమిషరేట్లో ఫిర్యాదు అందింది. ఎస్సైపై ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కేసు నమో దు చేసి, స్వతంత్రంగా దర్యాప్తు చేయాలని కోరా రు. ఆదివారం వేకువజామున సింగరేణి క్రేన్ ఆపరేటర్ గండు శ్రావణ్కుమార్ను ఓ సీఐ దుర్బాషలాడుతూ చేయిచేసుకున్నారు. క్రేన్ ఆపివేయడంతో ట్రాఫిక్ జామ్ అవుతోందని సీఐ ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండురోజులు రాత్రి విధులు నిర్వహించడంతో అలసిపోయానని బాధితుడు చెప్పినా పట్టించుకోకుండా సీఐ చేయిచేసుకున్నారని బాధితుడు వాపోయాడు. అంతేకాదు.. క్రేన్ ఆపరేటర్పై చేయిచేసుకున్న చెన్నూర్ రూరల్ సీఐ బన్సీలాల్పై చర్య తీసుకోవాలని సింగరేణి ఆర్జీ – వన్ జీఎం లలిత్కుమార్కు ఫిర్యాదు చేశారు. పోలీస్ కమిషనర్కూ ఫిర్యాదు.. క్రేన్ ఆపరేటర్పై చేయిచేసుకున్న సీఐపై చర్య తీసుకోవాలని కోరుతూ ఆర్జీ –వన్ జీఎం లలిత్కుమార్ రామగుండం సీపీ అంబర్ కిశోర్ ఝాకు ఫిర్యాదు చేశారు. రామగుండం మున్సిపల్ అధికారుల విన తి మేరకు 10 క్రేన్లను విగ్రహాల నిమజ్జనం కోసం కేటాయించామని, సుమారు 2వేల విగ్రహాలను ఆపరేటర్లు నిమజ్జనం చేశారని జీఎం తెలిపారు. ఈక్రమంలో జీడీకే–11గనిలో క్రేన్ ఆపరేటర్గా పనిచేస్తున్న గండు శ్రావణ్కుమార్పై సీఐ చేయి చేసుకున్నారని జీఎం తన ఫిర్యాదులో పేర్కొన్నారు. పారిశ్రామిక సంబంధాల సమస్య తలెత్తకుండా సీఐపై చర్య తీసుకోవాలని జీఎం కోరారు.ఠాణాలో డీసీపీ, ఏసీపీ విచారణపాలకుర్తి(రామగుండం): పుట్నూర్ గ్రామానికి చెందిన డీజే నిర్వాహకుడు మంచినీళ్ల రాకేశ్ను బసంత్నగర్ ఎస్సై స్వామి ఇటీవల కొట్టిన ఘటనపై సోమవారం బసంత్నగర్ ఠాణాలో పెద్దపల్లి డీసీపీ కరుణాకర్, ఏసీపీ కృష్ణ విచారణ జరిపారు. గణేశ్ ఉత్సవాల్లో భాగంగా డీజేలపై నిషేధం నేపథ్యంలో బైండోవర్ నిమిత్తం తనను ఠాణాకు రావాలని ఎస్సై ఆదేశించారని, తాను ఆలస్యంగా వెళ్లినందుకు బెల్ట్తో దాడిచేశారని బాధితుడు ఈనెల 4వ తేదీన రామగుండం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు. సీపీ ఆదేశాల మేరకు.. డీసీపీ, ఏసీపీలు.. బాధితులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. సీసీ కెమెరా ఫుటేజీలను సైతం పరిశీలించినట్లు సమాచారం. అనంతరం పెద్దపల్లిలోని సీపీఐ కార్యాలయంలో మరోసారి బాధితులతో మాట్లాడి వివరాలు సేకరించినట్లు తెలిసింది. విచారణకు ఆదేశించాం సింగరేణి కార్మికుడిపై సీఐ చేయిచేసుకున్న సంఘటనపై ఫిర్యాదు అందింది. దీనిపై మంచిర్యాల డీసీపీని విచారణకు ఆదేశించాం. పూర్తివిషయాలు తెలిసిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటాం. – అంబర్ కిశోర్ ఝా, పోలీస్ కమిషనర్, రామగుండం -
హైకోర్టుకు మెటా నిందితులు
సాక్షిప్రతినిధి,కరీంనగర్: మెటా ఫండ్ క్రిప్టో కరెన్సీ పేరిట ఉమ్మడి జిల్లాలో రూ.కోట్లు వసూలు చేసిన నిందితుల విషయంలో కరీంనగర్ పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. అధిక లాభాలు ఆశ చూపించి రూ.లక్షలు పెట్టుబడుల కింద తీసుకుని, బో ర్డు తిప్పేసిన కంపెనీ విషయంలో పోలీసులు మె తక వైఖరి అవలంబిస్తున్నారని బాధితులు మండిపడుతున్నారు. అరెస్టు నుంచి తప్పించుకునేందుకు ముందస్తు బెయిల్కు హైకోర్టును ఆశ్రయించడమే ఇందుకు ఉదాహరణ అని ఆరోపిస్తున్నా రు. అధిక లాభాల పేరిట పలువురు ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, వ్యాపారుల నుంచి ఒక్క క రీంనగర్ జిల్లాలోనే రూ.30 కోట్లు, సిరిసిల్ల, జగి త్యాల, పెద్దపల్లి జిల్లాలు రాష్ట్రవ్యాప్తంగా రూ. 100 కోట్ల వరకు వసూలు చేసిన మెటా ఫండ్ ప్ర తినిధుల్లో ఒక్కరిని కూడా అరెస్టు చేయకపోవడం, నిందితులు యఽథేచ్ఛగా తిరుగుతుండటంపై బాధితులు తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేస్తున్నారు. రెండుసార్లు పిటిషన్, ఒకకేసు మెటా కుంభకోణం కొత్తదేం కాదు. మే, జూన్లో కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని రూరల్, టూ టౌన్, కొత్తపల్లి పీఎస్ పరిధిల్లో పలువురు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయా ఠా ణాల్లో ఎస్హెచ్వోలు ఈ కేసు గ్రావిటీ తెలిసినప్పటికీ నిందితులతో చేతులు కలిపారని బాధితులు ఆరోపిస్తున్నారు. రూ.కోట్లు మోసం చేసిన వారికి అనుకూలంగా వ్యవహరించి, పిటిషన్ వె నక్కు తీసుకునేలా చేయడంలో పోలీసులు సఫ లీకృతమయ్యారని అంటున్నారు. జూలైలో ఇదే మెటా ఫండ్ కేసులో దాసరి రమేశ్, దాసరి రాజు పై పిటిషన్లు ఇచ్చినా.. ఈ రూ.కోట్ల కుంభకోణం గురించి వార్తాపత్రికల్లో కథనాలు వస్తున్నా.. నిందితులపై కేసుగా నమోదు చేయడంలో పోలీసులు తాత్సారం ప్రదర్శించారు. పిటిషనర్లు కూడా కేసు పెట్టేందుకు వెనకాడారు. తిరిగి అదే వ్యక్తుల పై మూడోసారి పిటిషన్ రావడం, ఈసారి పిటిషనర్ బలంగా నిలబడటంతో విధిలేక కేసు నమో దు చేసి, దర్యాప్తుకు మీన మేషాలు లెక్కించారు. బాధితులు ఉన్నతాధికారులను కలిసేందుకు సి ద్ధపడ్డారు. కేసు దర్యాప్తులో జాప్యాన్ని నివారించేందుకు కేసును సీసీఎస్కు అప్పగించారు. ఈ వి షయం లీకవడంతో నిందితులు విజయవాడకు పరారై అక్కడ నుంచి ముందస్తు బెయిల్కోసం హై కోర్టును ఆశ్రయించారు. దీనికి కరీంనగర్ పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. -
నంబర్ వన్ ఏరియా.. ఉత్పత్తిలో వెనుకంజ
గోదావరిఖని: సింగరేణిలోని ఏరియా పేరు నంబ ర్ – వన్గా ఉన్నా.. బొగ్గు ఉత్పత్తి లక్ష్య సాధనలో వెనకపడుతోంది. మూడు భూగర్భగనులు, ఒక ఓపెన్కాస్ట్ ప్రాజెక్టుతో ఆర్జీ –వన్ ఏరియా వార్షిక ఉత్పత్తి లక్ష్యం అందుకోలేకపోతోంది. 2025 – 26 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 18.07లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యానికి 15.94 లక్షల టన్నుల ఉత్పత్తి సాధించింది. నిర్దేశిత లక్ష్య సాధనలో 88 శాతం నమోదు చేసింది. మేడిపల్లి ఓసీపీ మూసివేత తర్వాత.. సింగరేణిలోనే ప్రత్యేక స్థానం ఉన్న ఆర్జీ–1 ఏరియాలో మేడిపల్లి ఓసీపీ మూతపడిన తర్వాత జీడీకే–5 ఓసీపీ ద్వారా లక్ష్య సాధనలో అగ్రగామిగా నిలుస్తోంది. ఓసీపీలో పూర్తిస్థాయిలో ఓవర్ బర్డెన్(మట్టి తవ్వకం)ను అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ద్వారా వెలికితీస్తోంది. కేవలం బొగ్గు ఉత్పత్తి మాత్రమే సింగరేణి ద్వారా కొనసాగుతోంది. ఈక్రమంలో ఓసీపీలో నిర్దేశిత లక్ష్యానికి మించి బొగ్గు ఉత్పత్తి జరుగుతోంది. మూడు భూగర్భ గనుల్లో మాత్రం లక్ష్యానికి అనుగుణంగా ఉత్పత్తి రావడం లేదు. గడిచిన మూడు నెలల్లో ఉత్పత్తి లక్ష్యం నిరాశాజనకంగా ఉంది. జూలై, ఆగస్టులో ఉత్పత్తి పూర్తిస్థాయిలో సాధించినా.. ఏప్రిల్, మే, జూన్లో ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది. భూగర్భగనుల వెనకంజ వార్షిక బొగ్గు ఉత్పత్తి లక్ష్య సాధనలో ఆర్జీ–1 ఏరియాలోని భూగర్భ గనులు వెనుకంజలో ఉన్నాయి. జీడీకే–1,3 గని 78శాతం, జీడీకే–2,2ఏ గని 61శాతం, జీడీకే–11గని 61శాతం బొగ్గు ఉత్పత్తి సాధించాయి. మరోవైపు.. జీడీకే–5 ఓసీపీ భారీగా బొగ్గు ఉత్పత్తి సాధించి నిర్దేశిత లక్ష్యానికి మంచి.. 140శాతం బొగ్గు ఉత్పత్తి సాధించింది. భూగర్భగనుల్లో ఉత్పత్తి లక్ష్యం పెంచడంతోపాటు, జీడీకే–5 ఓసీపీలో అత్యధిక బొగ్గు ఉత్పత్తి సాధిస్తే రాబోయే రోజుల్లో లక్ష్యానికి అనుగుణంగా ముందుకు వెళ్లవచ్చని భావిస్తున్నారు. 2025–26 ఆర్థిక సంవత్సరం బొగ్గు ఉత్పత్తి(టన్నుల్లో) నెల లక్ష్యం సాధించింది శాతం ఏప్రిల్ 4,06,400 2,06,439 51 మే 4,09,900 3,63,871 89 జూన్ 3,77,100 3,56,262 94 జూలై 3,20,900 3,33,925 104 ఆగస్ట్ 2,93,500 3,33,515 114 మొత్తం 18,07,800 15,94,012 88 రప్రణాళికతో ముందుకు.. వార్షిక బొగ్గు ఉత్పత్తి లక్ష్య సాధనకు ప్రణాళిక బద్ధంగా ముందుకు వెళ్తున్నాం. గత ఆర్థిక సంవత్సరం సర్దుబా టుతో ఏప్రిల్లో ఉత్పత్తి ఆశాజనకంగా కనిపిస్తోంది. జీడీకే–11గనిలో కొత్త ప్యానెల్ ప్రిపరేటివ్ పనులతో ఉత్పత్తి తక్కు వగా వస్తోంది. ఉత్పత్తి పెంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ ఏడాది చివరి వరకు ఉత్పత్తి లక్ష్యం సాధించేందుకు ఉన్న అడ్డంకులు అధిగమిస్తాం. ఆర్థిక సంవత్సరంలో లక్ష్యానికి మించి బొగ్గు ఉత్పత్తి సాధిస్తాం. – లలిత్కుమార్, జీఎం, సింగరేణి ఆర్జీ –1 -
నైపుణ్య శిక్షణ.. ఉపాధి కల్పన
పెద్దపల్లిరూరల్: విద్యావంతులైన యువతలో వృత్తి నైపుణ్యం పెంపొందించి ఉద్యోగావకాశాలు దక్కించుకునేలా ప్రోత్సహించేందుకు వీలుగా రాష్ట్రంలోనే తొలి ‘టాస్క్’ (తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్ అండ్ నాలెడ్జ్) కేంద్రం జిల్లా కేంద్రంలో ఇటీవల ఏర్పాటైంది. జిల్లాకు చెందిన ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ప్రత్యేక చొరవతో అందుబాటులోకి వచ్చిన టాస్క్ సెంటర్ను సద్వినియోగం చేసుకునేందుకు విద్యావంతులైన యువత ముందుకు రావాలని అధికారులు సూచిస్తున్నారు. నైపుణ్యం పెంచుకునేలా.. ప్రస్తుతం ఉద్యోగావకాశాలు దక్కించుకునేందుకు తీవ్రమైన పోటీ ఉంది. ఇందులో నెగ్గేందుకు ప్రతిభానైపుణ్యాలు తప్పనిసరిగా మారాయి. కార్పొరేట్ కంపెనీల్లో పనిచేసేందుకు డిగ్రీ, ఇంజినీరింగ్, ఎంబీఏ, ఫార్మసీ, పాలిటెక్నిక్ తదితర ఉన్నత విద్యావంతులను టాస్క్ ద్వారా వృత్తి నైపుణ్య శిక్షణ ఇప్పించి ఉద్యోగావకాశాలు కల్పించాలనే ప్రధానలక్ష్యంతో టాస్క్ కేంద్రం పనిచేస్తోంది. ప్రస్తుతం వివిధ కాలేజీల్లో చదివే, చదువు పూర్తయిన యువతకు స్పోకెన్ ఇంగ్లిష్లో మెలకువలు నేర్పించి ఇంటర్వ్యూలను ఎలా ఎదుర్కోవాలో ఇందులో తర్ఫీదు ఇస్తారు. జిల్లా యువతకు మేలు.. జిల్లాకు చెందిన విద్యావంతులైన యువతకు మంచి భవిష్యత్ అందించాలనే ఆలోచనతో ప్రభుత్వం జిల్లా కేంద్రంలో టాస్క్ సెంటర్ ఏర్పాటు చేసింది. దీంతో ఈ ప్రాంత యువత వృత్తి నైపుణ్య శిక్షణ పొందేందుకు దూరప్రాంతాలకు వెళ్లే బాధ, ఆర్థికభారం తప్పింది. పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన యువతీయువకులకు టాస్క్ సెంటర్తో ఎంతో ప్రయోజనం చేకూరనుంది. 10లోగా పేర్లు నమోదు చేసుకోవాలి జిల్లా కేంద్రంలోని టాస్క్ సెంటర్లో డిగ్రీ, ఇంజినీరింగ్ పూర్తిచేసిన విద్యార్థులు నైపుణ్య శిక్షణ ఉచితంగా పొందేందుకు ఈనెల 10లోగా తమ పేర్లను నమోదు చేసుకోవాలి. శిక్షణ అనంతరం మల్టీ నేషనల్ కంపెనీల్లో ఉద్యోగావకాశాలు పొందేందుకు అవకాశం ఉంది. శిక్షణ పూర్తిచేసుకున్న అభ్యర్థులకు మంచి వేతనంతో కూడిన ప్యాకేజీలతో కంపెనీల్లో ఉపాధి కల్పిస్తారు. అందుబాటులో ఉన్న కోర్సులివే.. జిల్లా కేంద్రంలోని టాస్క్ సెంటర్లో ఉపాధి అవకాశాలు కల్పించే అనేక కోర్సులు ఉన్నాయి. ఇందులో జావా వెబ్ డెవలప్మెంట్ ఫైథాన్, సీ, సీ++, హెచ్టీఎంఎల్, సీఎస్ఎస్, జువాస్క్రిప్ట్, టాలీవిత్ జీఎస్టీ, అప్టిట్యూడ్, రీజనింగ్, సాఫ్ట్స్కిల్స్ లాంటి ముఖ్యమైన కోర్సులు అందుబాటులో ఉన్నాయని రీజినల్ సెంటర్ ఇన్చార్జి కౌసల్య తెలిపారు. ఉద్యోగావకాశాల కోసం ఎదురుచూస్తున్న వారు ఈకోర్సుల్లో చేరి ఉపాధి పొందవచ్చని పేర్కొన్నారు. ఆసక్తిగవారు వివరాల కోసం 90595 06807 నంబరులో సంప్రదించాలని కౌసల్య కోరారు. – జిల్లా ఉపాధి కల్పనాధికారి తిరుపతిరావు సద్వినియోగం చేసుకోండి జిల్లా కేంద్రంలోని టాస్క్ సెంటర్ను సద్వినియోగం చేసుకోవాలి. యువత ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంచుకోవాలి. ప్రస్తుతం 30 శాతమే ఉన్న ఉపాధి లక్ష్యాలను 60 శాతానికి పెంచేలా టాస్క్ నిర్వాహకులు అవగాహన సదస్సులు నిర్వహించాలి. ఇక్కడ శిక్షణ పొందినవారు మల్టీనేషనల్ కంపెనీల్లో రూ.7లక్షల ప్యాకేజీలతో ఉద్యోగాలు చేస్తున్నారు. – కోయశ్రీహర్ష, కలెక్టర్ -
రోడ్డుపై గొయ్యి.. జరభద్రం
కోల్సిటీ(రామగుండం): గోదావరిఖని వన్టౌ న్ పోలీస్ సమీపంలోని సాక్రెడ్ హార్ట్ హైస్కూల్ ఎదుట ప్రధాన రహదారి గుంతలమయమైంది. పూర్తిగా అధ్వానంగా మారి రాకపోకలకు వాహనదారులు, ప్రయాణికులు తీవ్రఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెద్దగుంతలు ఏర్పడడంతో తరచూ రోడ్డు ప్రమాదాలూ చోటుచేసుకుంటున్నాయి. అయినా, అధికారులెవరూ దీనిపై దృష్టి సారించడంలేదు. స్థానికులే రోడ్డుపై కర్రపాతి, హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. ప్రమాదకరంగా మారిన ఈ ప్రధాన రహదారిపై అటు రామగుండం బల్దియా అధికారులు, ఇటు సింగరేణి యాజమాన్యం దృష్టి సారించకపోవడంపై నగర ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి ప్రమాదం చోటుచేసుకోకముందే చర్య లు చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. -
రూ.వంద కోట్లతో గర్రెపల్లి – సుద్దాల రోడ్డు
ఎలిగేడు /సుల్తానాబాద్(పెద్దపల్లి): గర్రెపల్లి – సుద్దాల ఎక్స్రోడ్డు మధ్య రూ.100 కోట్లతో డ బుల్ రోడ్డు నిర్మిస్తామని, ఇందుకోసం పదిరోజు ల్లో శంకుస్థాపన చేస్తామని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. ఎలిగేడు మండలం శివపల్లిలోని ఎమ్మెల్యే నివాసంలో ఆదివారం సుల్తానాబాద్ మండలంలోని కాంగ్రెస్ కా ర్యకర్తలు, ముఖ్య నాయకులతో ఆయన సమావేశమయ్యారు. గర్రెపల్లి నుంచి బొంతకుంటపల్లి, నీరుకుల్ల, గట్టెపల్లి, కదంబాపూర్ ద్వారా సుద్దాల ఎక్స్రోడ్డు వరకు డబుల్ రోడ్డు నిర్మిస్తే ప్రజారవాణా మరింత మెరుగవుతుందన్నారు. కరీంనగర్ కు దూరభారం తగ్గుతుందని తెలిపారు. భవిష్యత్తులో ఆర్టీసీ సౌకర్యం అందుబాటులోకి వస్తుంద ని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ మద్దతుదారులు విజయం సాధించేలా అందరూ పని చేయాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మినుపాల ప్రకావ్రావు, కాంగ్రెస్ నాయకులు ధనమనేని ఆ నందరావు, చీటి సతీశ్రావు, మాజీ సర్పంచులు బండారి రమేశ్, ఏరుకొండ రమేశ్గౌడ్, జూపల్లి తిరుమల్రావు తదితరులు పాల్గొన్నారు. -
పల్లెపాలనపై పట్టుకు..
సుల్తానాబాద్(పెద్దపల్లి): గ్రామస్థాయిలో రెవె న్యూ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగానే వీఆర్వోల స్థానంలో గ్రామ పంచాయతీ ఆఫీసర్(జీపీవో)లను నియమించింది. ఈమేరకు ఈనెల 5వ తేదీన సీఎం రేవంత్రెడ్డి జీపీవోలకు హైదరాబాద్లో నియామక పత్రాలు అంద జేశారు. ఇందులో జిల్లాకు 75 మంది జీపీవోల ను కేటాయించారు. ఇందులో 71 మంది స్థాని కులు కాగా మరో నలుగురు ఇతర జిల్లాకు చెంది నవారు ఉన్నారని అధికారులు తెలిపారు. నియా మకపత్రాలు అందుకున్న వారు వెంటనే విధుల్లో చేరాల్సి ఉంటుందని వారు వివరిస్తున్నారు. సర్దుబాటు కోసం.. జిల్లావ్యాప్తంగా గతంలో గ్రామ రెవెన్యూ అధికారులు(వీఆర్వో)గా పనిచేసిన వారిని వివిధ ప్రభుత్వ శాఖల్లో సర్దుబాటు చేసేందుకు అర్హతలను బట్టి పరీక్ష నిర్వహించాలని సర్కారు గతంలో నిర్ణయింది. ఇందుకోసం జిల్లానుంచి 100 మంది దరఖాస్తు చేసుకున్నారు. గత మే 25, జూలై 27వ తేదీల్లో రెండు విడతలుగా అధికారు లు పరీక్షలు నిర్వహించారు. ఇందులో 71 మంది ఉత్తీర్ణత సాధించారు. వీరికి పోస్టింగ్ ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలో 212 రెవెన్యూ విలేజీలు ఉండగా, 135 క్లస్టర్లు ఉన్నాయి. భూ సమస్యల పరిష్కారం లక్ష్యంగా.. జిల్లాలో రెవెన్యూ, భూ సంబంధిత సమస్యల పరిష్కారం, రికార్డుల క్లియరెన్స్, ప్రజల్లో ఘర్షణలకు తావు లేకుండా జీపీవో వ్యవస్థను తీసుకొస్తున్నారని జిల్లా అధికారులు వివరిస్తున్నారు. వీఆర్ఏ, వీఆర్వో వ్యవస్థను రద్దు చేసిన తర్వాత గ్రామాల్లోని సమాచారం ఉన్నతాధికారులకు చేరడంలేదు. దీంతో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే గ్రామ పరిపాలన కోసం జీపీవోలను నియమించేందుకు నిర్ణయించిందని అంటున్నారు. ప్రజలకు మెరుగైన సేవల కోసం.. జీపీవోల నియామకంతో గ్రామీణులకు రెవెన్యూ సేవలు మరింత అందుబాటులోకి వస్తాయని భావిస్తున్నారు. ప్రధానంగా జనన, మరణాలు, ప్రమాదాలు, ఆత్మహత్యలు, సంక్షేమ పథకాలు, ఇతరత్రా కార్యకలాపాల సమాచారం, సర్వేలు, విచారణ నివేదికలను గ్రామ పంచాయతీ అధికా రి ద్వారా ఉన్నతాధికారులకు చేరుతాయని అంటున్నారు. కులం, ఆదాయం, నివాసం తదితర సేవల కోసం పంచనామా చేయడం, భూ రికార్డుల భద్రత, ప్రభుత్వ భూముల పరిరక్షణ, చెరువులు, నీటివనరుల గుర్తింపు, విపత్తు సమయంలో సహాయక చర్యలు అందుబాటులోకి వస్తాయని అంటున్నారు. 135 క్లస్టర్లు.. 75 మంది జీపీవోలు జిల్లాలో 135 క్లస్టర్లు ఉన్నాయి. జిల్లాకు 75 మంది జీపీవోలను నియమించారు. ఒక్కో క్లస్టర్కు ఒక జీపీవోను నియమించినా ఇంకా సగం ఖాళీలు ఉంటాయి. అయితే, ఒక్కొక్కరికి ఒకటి కేటాయిస్తారా, ఇంకా ఇన్చార్జిలుగా అదనంగా పంచాయతీల బాధ్యతలు అప్పగిస్తారా? అనేది తెలియరావడంలేదు. -
పక్కా సమాచారం
పారదర్శకం.. పెద్దపల్లిరూరల్: పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు రాష్ట్రప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మేలుచేసేందుకు ప్రత్యేక యాప్ రూపొందించింది. ప్రస్తుతం దీనిని లబ్ధిదారులకు అందుబాటులోకి తీ సుకొచ్చింది. దీనిద్వారా పూర్తిపారదర్శకంగా, అవి నీతికి తావులేకుండా పేదలకు ప్రయోజనం చేకూరుతుందని చెబుతోంది. జిల్లాలో ఇందిరమ్మ ఇళ్లు 5,986 మంజూరు కాగా, అందులో 4,048 ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించారు. బేస్మెంట్ స్థాయిలో 1,505 ఇళ్లు, గోడలస్థాయిలో 200 ఇళ్లు, స్లాబ్ పూర్తయినవి మరో 220 ఇళ్లు ఉన్నాయని అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అవినీతికి చెక్ పెట్టేలా.. ఇందిరమ్మ పథకం ద్వారా ఇంటి నిర్మాణం చేపట్టిన లబ్ధిదారుకు బిల్లు మంజూరు కావాలంటే సంబంధి త అధికారులు ఎంతోకొంత ముట్టజెప్పాలని ఒత్తిడి చేస్తున్నారనే ఫిర్యాదులు అధికారులు, ప్రజాప్రతినిధులకు అందుతున్నాయి. ఎంతోకొంత ఇవ్వకుంటే బిల్లు చెల్లింపులో జాప్యమవుతోందని అంటున్నారు. దీంతో లబ్ధిదారులు కార్యాలయాల చుట్టూ తిరిగి వేసారిపోయే పరిస్థితులు ఉన్నట్లు గుర్తించిన ఉన్నతాధికారులు.. లబ్ధిదారుల ఇబ్బందులు దూరం చేసేలా ‘యాప్’ అమల్లోకి తీసుకొచ్చారు. లబ్ధిదారే అప్లోడ్ చేసుకునే అవకాశం.. ఇందిరమ్మ ఇంటి ఫొటోలను లబ్ధిదారు స్వయంగా ఆన్లైన్లో అప్లోడ్ చేసుకునే అవకాశాన్ని గృహ నిర్మాణ శాఖ అధికారులు కల్పించారు. సంబంధిత అధికారులు బిల్లులను అప్లోడ్ చేయడంలో ఉద్దేశపూర్వకంగా జాప్యం చేయడం తదితర సమస్యలకు ఈ విధానంతో చెక్ పడుతుందని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. అంతేకాకుండా ఏ సమస్యకై నా అధికారులు, కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదని అంటున్నారు. సమాచారమంతా ఆన్లైన్లోనే.. ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు, లబ్ధిదారు వివరాలు, బిల్లుల చెల్లింపు తదితర సమాచారమంతా ఆన్లైన్లో అందుబాటులో ఉంచారు. లబ్ధిదారు ఎ క్కడ ఉన్నా సమాచారాన్ని క్షణంలో యూ నివర్సల్ సెర్చ్తో తెలుసుకునేందుకు వీలు కల్పించడం సత్ఫలితాలను ఇస్తోందని అధికారులు పేర్కొంటున్నారు. తమ బిల్లు ఎవరి వద్ద పెండింగ్లో ఉంది, ఏ రోజున ఎంతమొత్తం బ్యాంకు ఖాతాకు బదిలీ చేశారనే వివరాలను ఉన్నచోటు నుంచే తెలుసుకోవచ్చు. అప్లోడ్ ఎలా చేయాలంటే.. ఇబ్బంది ఉండొద్దనే.. ఇందిరమ్మ లబ్ధిదారులు తమ ఇంటి నిర్మాణ ఫొటో, వివరాలను అప్లోడ్ చేసే విధానంపై అవగాహన కల్పించేలా అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. మొబైల్ ఫోన్లో ఇందిరమ్మ ఇళ్ల యాప్ను ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత లబ్ధిదారు తన లాగిన్లో సెల్ నంబరు ఎంటర్చేస్తే ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి పేరు, సెల్ నంబరు తదితర వివరాలతోపాటు ఫొటో అప్లోడ్చేయగానే.. ఇంటినిర్మాణ స్థాయి వివరాలు అందుబాటులోకి వస్తాయి. అయితే ఇల్లు నిర్మించే ప్రాంతంలోనే సెల్ ఫోన్తో ఫొటో తీయాల్సి ఉంటుంది. అక్కడ కెమెరాలో జియోట్యాగింగ్ విధానంతో వివరాలను నమోదు చేసి సరిచూసుకుని సబ్మిట్ చేయాలి. లబ్ధిదారు సమర్పించిన వివరాలన్నీ సరైనవేనా..? అని సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో సరిచూసుకున్న తర్వాత లబ్ధిదారుడి బ్యాంకు ఖాతాలో బిల్లు మొత్తాన్ని జమచేస్తారని అధికారులు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఇబ్బందులు పడొద్దనే ఆలోచనతోనే ఉన్నతాధికారులు సాంకేతికతను అందుబాటులోకి తీసుకొచ్చారు. లబ్ధిదారులే వాస్తవ వివరాలు అప్లోడ్ చేయాలి. ఈ విధానంపై అవగాహన కల్పిస్తున్నాం. ఏమైనా సమస్యలు ఉంటే టోల్ఫ్రీ నంబరు 1800 5995 991 ద్వారా కూడా నివృత్తి చేసుకోవచ్చు. బిల్లుల స్టేటస్ కోసం ఇకనుంచి ఆఫీసులకు వెళ్లాల్సిన అవసరం కూడా లేదు. – రాజేశ్వర్, పీడీ, హౌసింగ్ -
జేఎన్టీయూ.. అరకొర వసతులు
వేములవాడఅర్బన్: రాజన్నసిరిసిల్ల జిల్లాకు జేఎన్టీయూ ఇంజినీరింగ్ కాలేజీ మంజూరుతోనే సరిపెట్టారు. ఇంజినీరింగ్ కాలేజీ మంజూరు చేసిన ప్రభుత్వం పక్కా భవనం నిర్మాణం మరిచిపోయింది. దీంతో తాత్కాలికంగా అగ్రహారం డిగ్రీ కాలేజీలో నిర్వహిస్తున్నారు. డిగ్రీ కాలేజీలో ఉన్న వసతులు ఇంజినీరింగ్ విద్యార్థులకు సరిపోయేలా లేవు. అయినా తరగతులు నిర్వహిస్తున్నారు. జిల్లాలో 2021–02 విద్యాసంవత్సరంలో జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలను ప్రారంభించారు. అప్పటి నుంచి అగ్రహారం డిగ్రీ కాలేజీలోనే తరగతులు నిర్వహిస్తున్నారు. చాలీచాలని తరగతి గదులు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని తరగతి గదుల్లోని సగం గదులను తాత్కాలికంగా జేన్టీయూ కళాశాలకు వినియోగిస్తున్నారు. నాలుగేళ్లుగా అరకొర గదుల్లోనే తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఎనిమిది గదుల్లో తరగతులు కొనసాగుతున్నాయి. అగ్రహారం జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలలో ఐదు కోర్సుల్లో 1,032 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరందరికీ దాదాపుగా 20 తరగతి గదులు అవసరం ఉంటుంది. కానీ అరకొర గదులతోనే నెట్టుకొస్తున్నారు. కొండగట్టులో ప్రాక్టికల్స్ కళాశాలలో కంప్యూటర్ ల్యాబ్ మాత్రమే ఉంది. ఈసీఈ, మెకానికల్ కోర్సు విద్యార్థులకు ప్రాక్టికల్స్ కోసం కొండగట్టు జేఎన్టీయూ కళాశాలకు తీసుకెళ్తున్నారు. సివిల్ కోర్సు విద్యార్థులను సమీపంలోని ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలోని ల్యాబ్కు తీసుకెళ్తున్నారు. మిగతా కోర్సులకు అంతంతే ల్యాబ్ సౌకర్యం ఉంది. అద్దె భవనాల్లో హాస్టల్ వసతి అగ్రహారంలోని ఎనిమిది అద్దె భవనాల్లో విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పించారు. ఉదయం, మధ్యాహ్నం కళాశాలలోని మెస్లో టిఫిన్, భోజనం అందుబాటులో ఉంటుంది. రాత్రి కొందరు మెస్లో తింటున్నారు. దూరంగా ఉన్న హాస్టల్ విద్యార్థులకు అక్కడికి భోజనం పంపుతున్నారు. హాస్టల్ నుంచి కాలేజీకి దాదాపు కిలోమీటర్ దూరం ఉంది. హాస్టల్ నుంచి కాలేజీకి నడుచుకుంటూ రావాల్సిందే. ఇద్దరే ప్రభుత్వ ప్రొఫెసర్లు కళాశాల ప్రారంభించి నాలుగేళ్లు అవుతున్నా ఇద్దరే రెగ్యులర్ ప్రభుత్వ ప్రొఫెసర్లు ఉన్నారు. ఒకరు ప్రిన్సిపాల్, మకొకరు ఈసీఈ ప్రొఫెసర్. కాంట్రాక్ట్ పద్ధతిన ఐదుగురు అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 40 మంది గెస్ట్ ఫ్యాకల్టీ విధులు నిర్వర్తిస్తున్నారు. అగ్రహారం డిగ్రీ కాలేజీలో తరగతులు సరిపోని తరగతి గదులు కిలోమీటర్ దూరంలో హాస్టల్ అద్దె భవనం.. అసౌకర్యాలు ఇబ్బందిపడుతున్న విద్యార్థులుకళాశాలలో కోర్సులు, విద్యార్థులు కోర్సు ఫస్టియర్ సెకండియర్ థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ సివిల్ 14 61 60 59 ఈఈఈ 16 62 60 63 మెకానికల్ 0 01 59 56 ఈసీఈ 54 68 66 64 సీఎస్ఈ 67 65 69 68 మొత్తం 151 257 314 310 -
మట్టి మహాగణపతి నిమజ్జనం
పెద్దపల్లిరూరల్: రాష్ట్రంలోనే ఖైరతాబాద్ తర్వాతి స్థానంలో నిలిచిన జిల్లా కేంద్రంలోని మట్టి మహాగణపతి (61 అడుగుల ఎత్తు) నిమజ్జనోత్సవం శనివారం రాత్రి నిరాడంబరంగా జరిగింది. నవరాత్రులపాటు పూజలు అందుకున్న పే..ద్దగణపతి నిమజ్జనోత్సవాలను తిలకించేందుకు పట్టణంతోపాటు పరిసర ప్రాంతాల నుంచి పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కాలేజీ మైదానంలో ఏర్పాటు చేసిన గణపయ్యను ఫైరింజన్ల సాయంతో అగ్నిమాపకఅధికారులు, సిబ్బంది నిమజ్జనం చేయడంలో సహకరించారు. లడ్డూ వేలం రూ.2,02,000 మట్టి మహాగణపతి చేతిలోని లడ్డూను రూ.2,02,000లకు అనుదీప్సింగ్ బృందం వేలంలో పాటపాట దక్కించుకుంది. అలాగే బ్రహ్మకలశాన్ని పట్టణానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు ఠాకూర్ విజయ్సింగ్ (బాషా) రూ.47వేలకు దక్కించుకున్నారు. -
రాజన్నకు భక్తుల నీరాజనం
వేములవాడ: రాజన్నను శనివారం 15వేల మంది భక్తులు దర్శించుకున్నారు. అభిషేకాలు, అన్నపూజలు, కల్యాణాలు, సత్యనారాయణ వ్రతాల మొక్కులు చెల్లించుకున్నారు. రాజన్నను సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ(సెర్ప్) అడిషనల్ సీఈవో కాత్యాయనిదేవి, రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ కమిషనర్ సీతాలక్ష్మి వేర్వేరుగా దర్శించుకున్నారు. నాగిరెడ్డి మండపంలో వేదపండితులు ఆశీర్వచనం అందజేశారు. ఆలయ ఈవో రమాదేవి, పర్యవేక్షకులు జి.శ్రీనివాస్శర్మ, ఆలయ ఇన్స్పెక్టర్ నూగూరి నరేందర్, ప్రొటోకాల్ అధికారులు అశోక్, సింహాచార్యులు పాల్గొన్నారు. అలరించిన ‘ట్రినిటి’ ఫ్రెషర్స్ డేకరీంనగర్కల్చరల్: నగరంలోని శుభం గార్డెన్లో శుక్రవారం రాత్రి నిర్వహించిన ట్రినిటి జూనియర్ కళాశాల (గర్ల్స్) ఫ్రెషర్స్ డే వేడుకలు అలరించాయి. ట్రినిటి వ్యవస్థాపక చైర్మన్ దాసరి మనోహర్రెడ్డి, ట్రినిటి గ్రూప్ చైర్మన్ దాసరి ప్రశాంత్రెడ్డిలు జ్యోతిప్రజ్వలన చేసి మాట్లాడుతూ ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలు ముందుఆ నిర్వహించే ఆలోచన ఉన్నందున ఆ దిశగా విద్యార్థులు ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలని సూచించారు. మీ ప్రయాణం ఆధ్యాత్మికత, విద్య, క్రీడా, సాంస్కృతిక అభివృద్ధితో నిండి ఉండాలని అన్నారు. ఇంటర్లో రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించిన సర్టిఫికెట్లు, ట్రోఫీలు అందజేశారు. విద్యార్థుల నృత్యాలు ఆకట్టుకున్నాయి. నలుగురిపై కేసు జమ్మికుంట: దాడికి పాల్పడిన నలుగురిపై కేసు నమోదు చేసినట్టు టౌన్ సీఐ రామకృష్ణ శనివారం తెలిపారు. పట్టణంలోని కొండూరి కాంప్లెక్స్లో శుక్రవారం రాత్రి గణపతి ఉరేగింపు జరిగింది. శాలవాడకు చెందిన యువసేన యూత్క్లబ్ సభ్యులు శ్యామ్, సందీప్, రాకేశ్, హేమంత్ శోభాయాత్రలో గెల్లు రాజశేఖర్, గౌడ శ్రీనివాస్పై దాడి చేశారు. ఇద్దిరికి తీవ్రగాయాలయ్యాయి. బాధితుడి ఫిర్యాదుతో నలుగురిపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. కాత్యాయనిదేవికి స్వామి వారి ప్రసాదాలు అందజేస్తున్న అర్చకులుసోషల్ వెల్ఫేర్ కమిషనర్ సీతాలక్ష్మికి ప్రసాదాలు అందిస్తున్న అర్చకులు -
చాలా ఇబ్బందులు
కళాశాలలో మె స్ చిన్నగా ఉండటంతో ఇ బ్బందిగా ఉంది. షిప్టుల వారీ గా తింటున్నాం. హాస్టల్ నుంచి కళాశాల కి లోమీటరుకు పైగా దూరం ఉంటుంది. రోజు నడుచుకుంటూ వ స్తున్నాం. సెలవు రోజు కళాశాలకు వచ్చి తిని వెళ్లాలి. కళాశాలలో హా స్టల్ వసతిలేక ఇబ్బందిగా ఉంది. – సాయివర్ధన్, విద్యార్థి తరగతిగదులు సరిపోతలేవు కళాశాలలో మొత్తం ఎనిమిది తరగతి గదులు మాత్రమే ఉన్నాయి. ఆ గదుల్లోనే షిప్టుల వారీగా తరగతులు నిర్వహిస్తున్నారు. సరిపోయే సంఖ్యలో గదులు లేక ఇబ్బందులు పడుతున్నాము. – అంజలి, విద్యార్థినిల్యాబ్, లైబ్రరీ లేదు ఇంజినీరింగ్ కళాశాలలో లైబ్రరీ లేదు. ల్యాబ్లు మాత్రం కొన్ని కోర్సులకే ఉన్నాయి. ల్యాబ్ అవసరం ఉంటే కొండగట్టు జేఎన్టీయూకు, దగ్గరలోని ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలకు వెళ్లాల్సి వస్తుంది. – సాయిచరణ్య, విద్యార్థిని నిధులు ఇస్తే బాగు తంగళ్లపల్లి మండలం మండెపల్లి గ్రామ శివారులో 20 ఎకరాల భూమిని జేఎన్టీయూ కళాశాల కోసం కేటాయించారు. కానీ నిధులు మాంజూరు చేయలేదు. అధ్యాపకుల పోస్టులు కూడా మంజూరు చేయలేదు. – వేణుగోపాల్, జేఎన్టీయూ ప్రిన్సిపాల్, అగ్రహారం -
తీరని యూరియా కష్టాలు
కాల్వశ్రీరాంపూర్/సుల్తానాబాద్/ఎలిగేడు(పెద్దపల్లి): యూరియా కోసం అన్నదాతలు అన్నిపనులూ వదిలేసి మండల కేంద్రాలు, పట్టణాలకు పరుగులు పెడుతున్నారు. వరి, పత్తి తదితర పంటలకు ప్రస్తుతం యూరియా ఎంతోఅవసరమని, అదను దాటితే ఎంతవేసినా ప్రయోజనం ఉండదనే ఆతృతతో అన్నదాతలు వేకువజాము నుంచే దుకాణాల ఎదుట బారులు తీరుతున్నారు. వచ్చే ఒకట్రెండు లోడ్లో వరుసలో ముందున్న వారికే సరిపోవడం లేదని, వెనుకాల ఉన్నవారి వంతు వచ్చేవరయే స్టాక్ ఖాళీ అవుతోందని రైతులు వాపోతున్నారు. శనివారం కూడా జిల్లావ్యాప్తంగా యూరియా కోసం రైతులు ఉదయమే సింగిల్విండోలు, దుకాణాలు, గ్రోమోర్ తదితర గోదాముల ఎదుట బారులు తీరి కనిపించారు. పోలీస్ బందోబస్తు మధ్య పంపిణీ సుల్తానాబాద్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి యూరియా వచ్చిందనే సమాచారంతో పలు గ్రామాల రైతులు ఉదయమే గోదాము వద్దకు చేరుకుని బారులు తీరారు. లారీలోడ్లో 340 బస్తాల యూరియా రావడంతో పట్టాదారుపాస్ పుస్తకాలు, సాగు విస్తీర్ణం ఆధారంగా ఒక్కో రైతుకు ఒకట్రెండు యూరియా బ్యాగులు అందజేశారు. రైతుల సంఖ్య అధికంగా ఉండడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఎస్సై శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు మధ్య యూరియా పంపిణీ చేశారు. మిగతా వారికి సోమవారం యూరియా స్టాక్ వస్తుందని చెప్పి పంపించి వేశారు. రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని పీఏసీఎస్ కార్యదర్శి సంతోష్కుమార్, ఇన్చార్జి చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్ తెలిపారు. క్యూలైన్లో చెప్పులు.. రైతుల పాట్లు కాల్వశ్రీరాంపూర్ మండలం పెగడపల్లిలోని ఆగ్రోస్ కేంద్రం వద్దకు రైతులు ఉదయమే చేరుకున్నారు. అదేవిధంగా ఇదేగ్రామంలోని సాయికృష్ణ ఫెర్టిలైజర్స్ దుకాణం ఎదుట కూడా వందల సంఖ్యలో క్యూలో నిల్చున్నారు. యూరియా స్టాక్ రాక ఆలస్యం కావడంతో తమవంతు లైన్లో చెప్పులు ఉంచారు. రైతులు భారీ సంఖ్యలో తరలి రావడంతో పాస్బుక్కు జిరాక్స్ ఆధారంగా ఒక్కో రైతుకు ఒక బస్తా యూరియా, నానో లిక్విడ్ బాటిల్ ఇస్తున్నారు. పొద్దంతా పడిగాపులు కాస్తే.. ఒకబస్తా సైతం అందలేని, వరి పొట్టదశకు వచ్చిందని, పత్తి పూతపూసి గుంజర వచ్చేందుకు సిద్ధంగా ఉందని, ఈ సమయంలో యూరియా వేయాల్సి ఉన్నా.. దొరకడంలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తీరని యూరియా కష్టాలు ఎలిగేడు మండలం ధూళికట్ట సహకార సంఘానికి యూరియా లోడ్ వచ్చిందనే సమాచారంతో ఎండను సైతం లెక్కచేయకుండా రైతులు ఉదయమే తరలివచ్చారు. క్యూలైన్లో ఒక్కసారిగా గందరగోళం నెలకొనడంతో పంపిణీని కాసేపే ఆపివేసారు. సాయంత్రం 5గంటలకు పోలీసులు రావడంతో పంపిణీని మళ్లీ ప్రారంభించారు. ధూళికట్టలో ఎకరాకు ఒకబస్తా చొప్పున 340 బస్తాలు, ఎలిగేడులో టోకెన్కు రెండు బస్తాల చొప్పున 540 బస్తాల యూరియా పంపిణీ చేసినట్లు ఏవో ఉమాపతి తెలిపారు. ఏఈవో శరణ్య పాల్గొన్నారు. మూడు రోజులు బారులు తీరినా.. వీర్నపల్లి: మండల కేంద్రంలో మూడురోజులుగా రైతులు బారులు తీరుతున్నా యూరియా లభించ డం లేదు. శనివారం ఉదయం నుంచి రైతువేదికకు 220 యూరియా బస్తాలు రాగా.. క్యూలో నిలబడితే.. ఒకేఒక్క యూరియా బస్తా ఇవ్వడంతో ఇవేమీ కష్టాలని రైతులు ఆవేదన చెందారు. రైతులపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఆవేదన చెందారు. టోకెన్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారు.. చందుర్తి: విప్ ఆది శ్రీనివాస్ ఆదేశాలకు మేరకు శనివారం 330 యూరియా బస్తాలను సరఫరా చేశారు. సమాచారం అందుకున్న రైతులు ఉదయం నుంచే బారులు తీరారు. 156 మంది రైతులకు రెండు బస్తాల చొప్పన సిబ్బంది పంపిణీ చేశారు. సగం మందికి కూడా సరిపడా యూరియా అందలేదు. దీంతోవారు నిరాశతో వెనుదిరిగారు. మరికొందరు రైతులకు వ్యవసాయాధికారులు టోకెన్లు ఇచ్చారు. మరోలోడ్ వచ్చేక ప్రాధాన్యత ప్రకారం యూరియా అందిస్తామని చెప్పి అక్కడి నుంచి పంపించివేశారు. గూడెంలో రైతుల జాగరణ ఓదెల(పెద్దపల్లి): గూడెం గ్రామంలో రైతులు యూరియా కోసం జాగరణ చేశారు. రాత్రి సమయంలో 140 బస్తాల యూరియా లోడ్ రాగా.. 400 మంది దాకా రైతులు గుమిగూడారు. తమకు ఇవ్వాలని ఆందోళనకు దిగారు. పరిస్థితి గందరగోళంగా మారడంతో ఎస్సై రమేశ్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఒక్కో రైతుకు ఒక యూరియా బ్యాగ్ పంపిణీ చేయడంతో ఆందోళన విరమించారు. దుకాణాల ఎదుట ఉదయం నుంచే బారులు అయినా, అందరికీ సరిపడా అందని బ్యాగులు నిరాశతో వెనుదిరుగుతున్న అన్నదాతలు అదను దాటిపోతుందనే ఆందోళనలో రైతులు -
కొడుకు పుట్టనో..చెట్టునో పట్టుకుని ఉంటడు
● జాడ కోసం గోదావరిలో గాలించండి ● రాజేశ్ యాదవ్ తల్లిదండ్రుల ఆవేదన ● వినాయక నిమజ్జన ప్రదేశంలో కన్నీటి పర్యంతం ● నదిలో కొనసాగుతున్న గాలింపు చర్యలు రామగుండం/యైటింక్లయిన్కాలనీ: ‘నా కొ డుకు చెట్టునో పుట్టనో పట్టుకొని ఉంటడు.. ఒక్కగానొక్క కొడుకు.. ఓ కన్ను పోయినా సాదుకుంటా.. ఓ కాలు తెగినా సాదుకుంటా దేవుడా.. ఎంతో అందంగా ఉన్న సక్కనోడు.. అమ్మా.. నాన్న ఒక్కడు పనిచేస్తే డబ్బులు సరిపోతలేవు.. దసరా పోయినంకా నేను కూడా పనికి పోతనే.. నీకు ఆరోగ్యం బాగాలేకపోవడంతో నీవు పనిచేసే పరిస్థితి లేదు కదా.. నేను, నాన్న ఇద్దరం కలిసి పనికి పోతమే.. ఏడాదిలో రెండు గదులతో ఇల్లు కట్టుకుందామే.. అంటివి బిడ్డా.. మొన్ననే సెల్ఫోన్ కొనిత్తిని.. వినాయకుడా.. నాకు కడుపుకోత పెట్టకు.. గోదారమ్మ తల్లీ.. నా కొడుకును నువ్వు తీసుకుంటే నేను, మా ఆయన ఇద్దరం కలిసి నీ ఒడిలోకి చేరుతం’ అని ఆ తల్లి రోదించిన తీరు స్థానికులను కంట తడిపెట్టించింది. వివరాలు.. స్థానిక అక్బర్నగర్ కాలనీలో నివాసం ఉంటున్న నారకట్ల మహేశ్వ రి – సత్యం దంపతుల కుమారుడు రాజేశ్యా దవ్ ఉన్నాడు. అదేకాలనీలో గణపతి విగ్రహాన్ని శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత గోదావరిఖని గంగానగర్ సమీప గోదావరిలో నిమజ్జనం చేసేందుకు మండప నిర్వాహకులతో కలిసి వెళ్లాడు. శనివారం వేకువజామున విగ్రహం నిమజ్జనం కోసం క్రేన్ కొక్కేనికి తగిలించే క్రమంలో టేబుల్పైకి రాజేశ్యాదవ్ ఎక్కాడు. దానిపై అడ్డుగా ఉన్నతీగలు కాలికి తగలడంతో అదుపుతప్పి ప్రమాదవాశాత్తు గోదావరిలో పడిపోయాడు. మధ్యాహ్నం 12 గంటల వరకూ యువకుడి ఆచూకీ లభించలేదు. ఈ ఘటనను నిరసిస్తూ అక్బర్నగర్ కాలనీవాసులు నది వంతెనపై బైఠాయించి నిరసన తెలిపారు. వినాయక నిమజ్జనం ప్రశాంతంగా పూర్తియ్యిందనుకునే సమయంలోనే గో దావరిలో యువకుడు గల్లంతుకావడంతో విషా దం నెలకొంది. ఎమ్మెల్యే మక్కాన్సింగ్ ఠాకూ ర్, బీఆర్ఎస్ కార్మిక సంఘం నేత కౌశిక హరి, కాంగ్రెస్ నేత అయోధ్యసింగ్ఠాకూర్, ఏసీపీ రమేశ్, సీఐలు ప్రసాదరావు, ఇంద్రసేనారెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వంతెన పిల్లర్ల నుంచి సుందిళ్ల బ్యారేజీ వరకు రెండు స్పీడ్ బోట్లు, నాలుగు నాటు పడవలు, ఇరవై మందితో గా లింపు చర్యలు చేపట్టామని ఏసీపీ రమేశ్ తెలి పారు. కాగా, మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్ మా ట్లాడుతూ, రాజేశ్యాదవ్ కుటుంబానికి రూ. 2లక్షల నగదు పరిహారంగా అందిస్తామని, ఇందిరమ్మ పథకంలో ఇల్లు ఇప్పిస్తామన్నారు. ఊహించని పరిణామమని బీఆర్ఎస్ కార్మిక సంఘం నేత కౌశిక హరి అన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
బ్యాలెట్ పోరులో పాల్గొనండి
యైటింక్లయిన్కాలనీ(రామగుండం): సింగరేణిలో రూ.450కోట్ల వ్యయంతో చేట్టిన 1,008 నివాస క్వార్టర్లకు బదులు కార్మికుల సొంతింటి కల సా కారం చేయాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు తు మ్మల రాజిరెడ్డి కోరారు. స్థానిక ప్రెస్భవన్లో శని వారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడా రు. సింగరేణిలో 70శాతం వరకు శిథిలమైన క్వా ర్టర్లు ఉన్నాయని, సింగరేణియేతరులకు కేటాయించినవి 20 శాతం ఉండగా.. కేవలం 10 శాతమే సింగరేణి కార్మికులకు కేటాయించారని వివరించారు. ఈ క్రమంలోనే సింగరేణి కార్మికుల సొంతింటి కల సాకారం చేయాలనే డిమాండ్తో ఈనెల11, 12వ తేదీల్లో కార్మికుల అభిప్రాయ సేకరణ చేపట్టామని అన్నారు. సొంతిల్లు కావాలా, కొత్త క్వార్టర్ కావాలా నినాదంతో బ్యాలెట్ బాక్స్లు ఏర్పాటు చేశామని, యూనిన్లు, రాజకీయాలకు అతీతంగా కార్మికులు ఓ టువేసి తమ అభిప్రాయం వెల్లడించాలని కోరారు. ఈనెల 15న జీఎం కార్యాలయాల ఎదుట ధర్నా చేస్తామని ఆయన తెలిపారు. వినయ్, కుంట ప్ర వీణ్కుమార్, వెంకన్న, నర్సింహ, శివకుమార్, తిరుపతి, ప్రేమ్కుమార్, రాజశేఖర్, రాజయ్య, స్వామి, రాంప్రసాద్, సంపత్ తదితరులు పాల్గొన్నారు. -
డ్రగ్స్ బాధితులకు పారా లీగల్ క్లినిక్ అండ
కోల్సిటీ(రామగుండం): డ్రగ్స్ బాధితులకు అండగా నిలిచి, న్యాయ సేవలు అందించేందుకు పా రా లీగల్ క్లినిక్ దోహదపడుతుందని గోదావరిఖ ని అదనపు జిల్లా న్యాయమూర్తి డాక్టర్ టి.శ్రీనివాసరావు అన్నారు. గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి(జీజీహెచ్)లో శనివారం ఏర్పాటు చే సిన పారా లీగల్ క్లినిక్ను జడ్జి ప్రారంభించి మా ట్లాడారు. డ్రగ్స్తో విలువైన జీవితాన్ని కోల్పోతున్నారన్నారు. బాధితుల్లో పరివర్తన తీసుకురావడానికి, న్యాయ సేవలు అందించేందుకు జాతీ య న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మ త్తు పదార్థాల నివారణ అవగాహన కేంద్రాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ఇందులో పారా లీ గల్ న్యాయవాదితోపాటు వలంటీర్లు ప్రతీశనివా రం అందుబాటులో ఉంటారని తెలిపారు. బాధితుల హక్కులు, న్యాయ పరిరక్షణపై అవగాహన కల్పించారు. సీనియర్ సివిల్ జడ్జి స్వప్నరాణి, ఆ స్పత్రి సూపరింటెండెంట్ దయాల్సింగ్, డాక్టర్ అప్పారావు, పారాలీగల్ న్యాయవాది ముక్కెర అంజలి, పారా వలంటీర్ బానమ్మ, న్యాయవా దులు ముచ్చకుర్తి కుమార్, శిరీష పాల్గొన్నారు. -
గజాల్లో విక్రయం.. గుంటల్లో రిజిస్ట్రేషన్
సాక్షి పెద్దపల్లి: పేద, మధ్యతరగతి ప్రజలు తమకు కూడా ఎంతోకొంత భూమి ఉంటే బాగుంటుందని ఆశపడుతుంటారు. వీరిఆశను రియల్ ఎస్టేట్ వ్యాపారు లు పామ్ల్యాండ్స్ పేరిట సొమ్ము చేసుకుంటున్నా రు. గజాల్లో భూములను విక్రయించి గుంటల్లో రిజిస్ట్రేషన్ చేసి ఇస్తున్నారు. రైతుబంధు, రైతుబీమా కూడా వర్తిస్తుందని చెప్పడంతో భూములు కొనుగో లు చేసేందుకు పట్టణవాసులు ఎగబడుతున్నారు. భూముల ధరలు విపరీతంగా పెరగడంతో ఎకరా ల్లో వ్యవసాయ భూములను కొనుగోలుచేసే పరి స్థితి లేదు. పిల్లల భవిష్యత్ కోసం ఉపయోగపడుతుందని దూరంగానైనా కొంత భూమి కొనుగోలు చేసేందుకు పేద, మధ్యతరగతి ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. దీనిని అవకాశంగా తీసుకున్న రియల్టర్లు కొత్త వ్యాపారానికి తెరలేపుతున్నారు. జిల్లాలోని పలు మండలాల్లో నూతన అంకం తెరలేపగా, పలువురు తహసీల్దార్లు వ్యాపారులకు వత్తా సు పలుకుతున్నారు. వెంచర్లలో విక్రయాలు చేస్తు న్న ప్లాట్లలో భవిష్యత్లో నిర్మాణ అనుమతులు రా వని తెలిసి మరీ అంటగడుతుండటం గమనార్హం. నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్లు.. అనాధికార లే అవుట్లను అదుపు చేయడంతోపాటు, ఆదాయానికి గండి పడకుండా, ప్రజలు రియల్లర్లు మోసాల బారినపడకుండా ప్రభుత్వం మెమో జారీ చేసింది. తెలంగాణ మున్సిపల్ యాక్ట్–2019, పంచాయతీరాజ్ చట్టం–2018 ప్రకారం పామ్ ప్లాట్లు అమ్మవద్దని స్పష్టమైన నిబంధనలు ఉన్నాయి. రెండు వేల చదరపు మీటర్లు లేదా 20 గుంటలు ఉంటే నే వ్యవసాయ భూమిగా పరిగణించాలంటూ గతంలో ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. అలాగే వ్యవసాయ ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయవద్దని స్టాంపులు, రిజిస్ట్రేష న్ల శాఖకూ ఆదేశాలు ఉన్నాయి. అయినా నిబంధనలకు విరుద్ధంగా కొన్ని తహసీల్దార్ కార్యాలయాలు, సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ఫార్మ్ ప్లాట్లకు యథేచ్ఛగా రిజిస్ట్రేషన్లు చేస్తుండడం గమనార్హం. మరోవైపు.. జీ వో నంబరు 131 ప్రకారం 2020 ఆగస్టు 31 తర్వాత అక్రమ లే అవుట్లలోని ప్లాట్లకు అనుమతులు ఇచ్చే దని లేదని కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టం చేసింది. 10 శాతం పార్కులు, 30 శాతం రహదారుల కోసం స్థలాలు కేటాయించి లే అవుట్లు అభివృద్ధి చేయాలన్న నిబంధనలు పాటించకుండా కొందరు ఫార్మ్ ప్లాట్లు, అక్రమ లే అవుట్లు చేసి అమ్మకాలు జరుపుతున్నా పట్టించుకునేవారు కరువయ్యారు. 0.20ఎకరాల కంటే తక్కువగా ఉన్న వ్యవసాయ భూమి అయితే ఆర్ఐ, తహసీల్దార్ క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి, ఫొటో దిగి అప్లోడ్ చేయాలి. కానీ గుంట, రెండు, మూడు గుంటల భూమిని కూడా ఎటువంటి పరిశీలన లేకుండా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. వ్యాపారుల మాటలకు ఆకర్షితులవుతున్న కస్టమర్లు రూ.లక్షలు వెచ్చిస్తూ భవిష్యత్లో ఎటువంటి అనుమతులు రావని తెలియక పెద్దమొత్తంలో ఫార్మ్ ప్లాట్లు కొనుగోలు చేస్తూ మోసపోతున్నారు.నష్టాలను గుర్తించడం లేదు అనుమతి లేని లేఅవుట్లలో స్థలాలను కొనుగోలు చేస్తున్న ప్రజలు ఇళ్లు కట్టుకునేందుకు భవిష్యత్ లో ఎదురయ్యేకష్టనష్టాలను గుర్తించడం లేదు. ఇలాంటి వాటిలో ఇంటి నిర్మా ణానికి బ్యాంకులు, ఇతర సంస్థలేవీ రుణా లు మంజూరు చేసేందుకు ముందుకురావు. డ్రైనేజీ నిర్మాణాలు, తాగునీరు, రోడ్లు, వి ద్యుత్ తదితర సౌకర్యాలు ఏమీ ఉండవు. కానీ, తక్కువ ధరకు సులువుగా రిజిస్ట్రేషన్లు అవుతున్నాయని చాలామంది రిజిస్ట్రేషన్లు చే సుకుంటూ మోసపోతున్నారు. ఇదేవిషయ మై ఉన్నతాధికారులను సంప్రదించగా.. అ లా చేయడానికి వీలులేదని, అలాంటి వాటి ని గుర్తించి చర్యలు తీసుకుంటామన్నారు. -
22 తర్వాత కొందాం
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: కారు, బైక్ షోరూంలు కొనుగోళ్లు లేక వెలవెలబోతున్నాయి. జీఎస్టీ శ్లాబులు తగ్గుతాయని కేంద్రం ప్రకటన దరిమిలా.. ఇప్పటికిప్పుడు బండి (కారు లేదా బైక్) కొందామనుకున్న ప్రతీ ఒక్కరూ వాయిదా వేశారు. సెప్టెంబరు 22 తరువాత తగ్గించి న జీఎస్టీ అమలులోకి రానుండటంతో కారు, బైకుల ధరలు 10శాతం వరకు తగ్గనున్నాయి. ఫలితంగా మధ్యతరగతికి భారీ ఊరట కానుంది. ప్రతీ బైకుపై కనిష్టంగా రూ.8,000 నుంచి గరిష్టంగా రూ.20వేల వరకు ధరలు తగ్గనున్నాయి. కార్లపైనా రూ.60వేల నుంచి రూ.1.50లక్షల వరకు తగ్గనున్నాయి. దీంతో ప్రస్తుతం షోరూముల్లో బుకింగులు నిలిచిపోయాయి. కొనుగోళ్లు లేక వెలవెలబోతున్నాయి. సెకండ్ హ్యాండ్ మార్కెట్కు కుదుపు జీఎస్టీ కొత్త శ్లాబులు అమలు కానుండటంతో షోరూంల్లోనే కాదు, ఇటు సెకండ్ హ్యాండ్ మార్కెట్పైనా ప్రభావం పడింది. బైకుల ధరలు పెట్రోల్ వేరియంట్లలో రూ.8000 నుంచి రూ.20,000 వర కు తగ్గింపు వర్తించనుండడం, కార్లకు రూ.60వేల నుంచి రూ.1.50లక్షల వరకు తగ్గనుండడంతో ఇంతకాలం సెకండ్ హ్యాండ్ కొందామనుకున్న వారంతా కొత్త బండ్ల వైపు చూస్తున్నారు. ఫలితంగా సెకండ్ హ్యాండ్ మార్కెట్ వెలవెలబోతోంది. ఆగస్టు 13 నుంచే కటకట సెప్టెంబరు 3వ తేదీన కొత్త జీఎస్టీ శ్లాబులను కేంద్రం ప్రకటించింది. దాంతో 4వ తేదీ నుంచి షో రూంలు, సెకండ్ హాండ్ మార్కెట్లు బోసిపోతున్నా యి. ఆటోమొబైల్ రంగానికి ఈ కుదుపు ఆగస్టు 13నే తాకింది. ఆ రోజు రాత్రి ప్రతీ వాహనంపై 2శాతం ట్యాక్స్ను పెంచుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంతో మరునాటి నుంచి కొనుగోళ్లపై ప్రభావం కనిపించిందని షోరూం నిర్వాహకులు తెలిపారు. ఆగస్టు 15న కేంద్రం జీఎస్టీ విషయంలో దీపావళికి తీపి కబురు చెబుతానడటంతో ఆటోమొబైల్ రంగం ఆందోళన చెందింది. దీపావళి వరకు కొనుగోళ్లు బోసిపోతాయని కేంద్రంపై ఒత్తిడి తెచ్చారు. దీంతో ఈనెల 3న ప్రకటన రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కొత్త ఆఫర్లు.. డిస్కౌంట్లు ప్రస్తుతం షోరూం నిర్వాహకులు వాహనాలు బుకింగ్ చేసుకోవచ్చని, డెలివరీ సెప్టెంబరు 22 తరువాతే ఇస్తామని సరికొత్త ఆఫర్లు ప్రకటిస్తూ.. కొనుగోళ్లు పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు. మరికొందరు తమ పాత వాహనాలను క్లియర్ చేసేందుకు 10శాతం వరకు డిస్కౌంట్ ఇస్తామని కస్టమర్లను ఆకర్షించేందుకు యత్నిస్తున్నారు. అయినా, పెద్దగా కొనుగోళ్లు పుంజుకోవడం లేదని షోరూం నిర్వాహకులు వాపోతున్నారు.ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వాహనాల కొనుగోళ్లు అధికంగానే జరుగుతాయి. మధ్యతరగతి వారు అధికంగా వినియోగించే 350 సీసీలోపు బైకులపై జీఎస్టీని 28శాతం నుంచి 18శాతానికి తగ్గించారు. అంటే దాదాపు 10శాతం వరకు తగ్గింపు ఉంది. ప్రస్తుతం ప్రతీ 100 సీసీ ఆపై సామర్థ్యం ఉన్న బైకులు రూ.లక్షకుపైనే పలుకుతున్నాయి. ఎలక్ట్రిక్ బైకుల ధర రూ.30వేల నుంచి మొదలవుతుంది. వీటికి సైతం 10శాతం జీఎస్టీ తగ్గింపు వర్తిస్తుంది. ప్రతీ నెలా కరీంనగర్, సిరిసిల్ల, పెద్దపల్లి, జగిత్యాల షోరూముల్లో కలిపి దాదాపు 3000కుపైగా బైకులను విక్రయిస్తారు. ఈ లెక్కన ఎలక్ట్రిక్ బైకులపై రూ.3000, పెట్రోల్ బైకులపై రూ.8000 వరకు కనిష్టంగా ధరలు తగ్గనున్నాయి. ఉమ్మడి జిల్లాలో మొత్తంగా నెలకు రూ.2.40కోట్ల వరకు వినియోగదారులకు లబ్ధి చేకూరతుందని అంచనా వేస్తున్నారు. ఇక పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ కార్లు నెలకు 500 నుంచి 550 వరకు కార్లు అమ్ముడుపోతాయి. 1200 సీసీ లోపు సామర్థ్యం ఉన్న కార్లపై జీఎస్టీని 18శాతానికి తగ్గించారు. ప్రతీ నెలా రూ.2.6 కోట్ల చొప్పున ఏటా రూ.31.2 కోట్ల వరకు వినియోగదారులకు కలిసి రానుంది. బైక్, కార్ల కొనుగోళ్లలో ఉమ్మడిజిల్లా కస్టమర్లకు దాదాపుగా రూ.60 కోట్ల వరకు కలిసి రానుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. -
ప్రభుత్వ యంత్రాంగం ఆరా
సాక్షి, పెద్దపల్లి: ‘పనికో రే టు.. ఊరురికో ఏజెంట్’ శీర్షి కన ‘సాక్షి’లో శనివారం ప్ర చురితమైన కథనం జిల్లాలో చర్చనీయాంశమైంది. లంచం ఇవ్వనిదే పనులు చేయరనే అపవాదు ఎదుర్కొంటు న్న ఆ అధికారి ఎవరనే విషయమై యంత్రాంగంతోపాటు ఇంటలిజెన్స్ అధికారులు శనివా రం ఆరా తీశారు. సదరు మండలానికి సంబంధించిన కొందరు మాజీ ప్రజాప్రతినిధులను సంప్రదించి సదరు అధికార వ్యవహారశైలిపై వి వరాలు సేకరించి ఉన్నతాధికారులకు నివేదించినట్లు తెలిసింది. ఒకట్రెండురోజుల్లో ఆ అధికారితోపాటు సహకరిస్తున్న కలెక్టరేట్లోని ఓ అధికారిపైనా చర్యలకు ఉన్నతాధికారులు సమాయత్తం అవుతున్నట్లు సమాచారం. 8న ఉపాధ్యాయులకు సన్మానంపెద్దపల్లిరూరల్: జిల్లాలో ఉత్తమ ఉపాధ్యాయలుగా ఎంపికైన 48 మందిని సోమవారం (ఈనెల 8న) సత్కరించనున్నట్లు జిల్లా విద్యాధికారి మాధవి తెలిపారు. జాతీయ ఉపాధ్యా య దినోత్సవం సందర్భంగా జిల్లా పాఠశాల విద్యాశాఖ పరిధిలో పనిచేస్తున్న ఉపాధ్యాయు ల జాబితా సిద్ధం చేశామన్నారు. వీరు ఈనెల 8న మధ్యాహ్నం 3గంటలకు కలెక్టరేట్కు హాజరు కావాలని డీఈవో కోరారు. ప్రాదేశిక ఎన్నికలకు సిద్ధం కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): జెడ్పీటీసీ, ఎంపీ టీసీ ఎన్నికల కోసం సిద్ధంగా ఉన్నామని జెడ్పీ సీఈవో నరేందర్ తెలిపారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎన్నికల నిర్వహణపై అధికారులతో శనివారం సమీక్షించారు. ఎన్ని కల సంఘం ఆదేశాల మేరకు ఏర్పాట్లు చేశామన్నారు. ఎంపీడీవో పూర్ణచందర్రావు, ఎంపీవో ఆరిఫ్హుస్సేన్, సూపరింటెండెంట్ శ్రీధర్, సీనియర్ అసిస్టెంట్ రవి, జూనియర్ అసిస్టెంట్ భాగ్యలక్ష్మి, టైపిస్ట్ లక్ష్మణ్, జెడ్పీ సూపరింటెండెంట్ రమేశ్ తదితరులు పాల్గొన్నారు. రేపు అప్రెంటిస్షిప్ మేళా పెద్దపల్లిరూరల్: స్థానిక ప్రభుత్వ ఐటీఐ ఆవరణలో సోమవారం అప్రెంటిస్షిప్ మేళా నిర్వహిస్తున్నట్లు ఐటీఐ జిల్లా కన్వీనర్ వెంకటరెడ్డి తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐల్లోఎలక్ట్రీషియన్, ఫిట్టర్, వెల్డర్, టర్నర్, మిషినిస్ట్, డీజిల్ మెకానిక్, మెకానిక్ మోటార్ వెహికల్, ఎలక్ట్రా నిక్స్, మెకానిక్, కోపా ట్రేడ్ పూర్తిచేసిన అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి గలవారు ఉదయం 10.30 గంటల వరకు తమ పేర్లను వెబ్సైట్లో నమోదు చేసుకుని సర్టిఫికెట్లు, ఆధార్కార్డు, రెండు పాస్పోర్ట్సైజ్ ఫొటోలతో నేరుగా హాజరు కావాలని ఆయన కోరారు. పింఛన్ పెంపు కోసం పోరాటంపెద్దపల్లిరూరల్: దివ్యాంగుల పింఛన్ పెంపు కోసం పోరాటం చేస్తామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, వికలాంగ హక్కుల పోరాట సమితి నాయకుడు మంద కృష్ణమాదిగ అన్నా రు. జిల్లా కేంద్రంలో శనివారం రాత్రి కాంగ్రెస్ నాయకుడు శ్యాంతో కలిసి పలువురు నాయకులతో సమావేశమయ్యారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు దివ్యాంగుల పింఛన్ పెంచేలా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు పోరాటం సాగిస్తామని ఆయన అన్నారు.ప్రభుత్వ భూమిలో బోర్డుముత్తారం(మంథని): ఖమ్మంపల్లి గ్రామ శివారులోని 617 సర్వే నంబరు ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తే కఠిన చర్యలు ఉంటయని తహసీల్దార్ మధుసూదన్రెడ్డి శనివారం హెచ్చరించారు. ఆ భూమిని కబ్జా కొందరు చేస్తున్నారనే స్థానికుల ఫిర్యాదు మేరకు శనివారం అక్కడ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. పట్టా ధ్రువీకరణపత్రాలు లేకుండా ఆ భూమి ఆక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. -
విద్యార్థులతోనే దేశభవిష్యత్
గోదావరిఖనిటౌన్: విద్యార్థులు దేశభవిష్యత్కు దిక్సూచిలాంటి వారని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్ అన్నారు. యువత ఉ న్నత విద్య అభ్యసించి రాజకీయాల్లో చేరి దేశ సే వలో పాలుపంచుకోవాలన్నారు. స్థానిక యూనివర్సిటీ పీజీ కళాశాలలో చేపట్టిన ఎన్ఎస్ఎస్ మె గా ప్రత్యేక శిబిరం ముగింపు సమావేశం శనివా రం జరిగింది. ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు ఉన్నత చదువులు చదివి లక్ష్యం నెరవేర్చుకోవాలని సూచించారు. శాతవాహన యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం కో ఆర్డినేటర్, పీజీ కళాశాల ప్రిన్సిపాల్ మనోహర్ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమానికి నాయకులు మహంకాళి స్వామి, పెద్దెల్లి ప్రకాశ్, వైస్ ప్రిన్సిపాల్ ఎ.సాంబశివరావు, ఎన్ఎస్ఎస్ నోడల్ ఆఫీసర్ ప్రసాద్బాబు, ప్రోగ్రాం ఆఫీసర్లు ఎం.నరేశ్, కిరణ్మయి, దామరకొండ శంకర్, వలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. -
యూరియాపై విపక్షాలది విషప్రచారం
పెద్దపల్లిరూరల్: యూరియా సరఫరా సక్రమంగానే సాగుతున్నా విపక్ష పార్టీల నాయకులు విషప్రచారం చేస్తూ రైతుల్లో అయోమయాన్ని సృష్టిస్తున్నారని ఎమ్మెల్యే విజయరమణారావు ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జిల్లా వ్యవసాయాధికారి శ్రీనివాస్ తదితరులతో శనివారం ఆయన సమావేశమయ్యారు. యూరియా నిల్వలు, సరఫరా తదితర అంశాలపై చర్చించారు. రైతులకు ఇబ్బందులు రాకుండా యూరియా అందిస్తామన్నారు. పెద్దపల్లిలోని డీలర్ల వద్ద ఉన్న నిల్వలపై ఆరా తీశారు. కొందరు రైతులు అవసరానికి మించి యూరియా తీసుకెళ్లి ఇంట్లోనిల్వ చేసుకోవడం కూడా కొరతకు మరో కారణమని అధికారులు తెలిపారు. కేంద్రం నుంచి ఆశించిన స్థాయిలో నిల్వలు చేరలేదని, అయినా ఇబ్బందులు రాకుండా చూడగలిగామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రైతులు యూరియా కోసం ఆందోళన పడాల్సిన అవసరం లేదన్నారు. యూరియా సరఫరా విషయమై వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావుతో ఫోన్లో మాట్లాడారు. ఈప్రాంత అవసరాల కోసం యూరియా సరఫరా జరిగేలా చూడాలని కోరగా, మంత్రి సానుకూలంగ స్పందించారని ఎమ్మెల్యే వివరించారు. -
భుక్తికి లేకున్నా.. భక్తిలో మిన్న
కోల్సిటీ (రామగుండం): పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ఎల్బీనగర్ మాతంగి కాంప్లెక్స్ ఎదుట రోడ్డు పక్కన ప్లాస్టిక్ కవర్లను పైకప్పుగా వేసుకున్న చిన్న గుడిసెలు కనిపిస్తాయి. మట్టి నేలలు, మూటలు, చీపుర్లు, గిన్నెలతో నిండిన చిన్నగదులే అక్కడివారికి నివాసాలు. తాము కడు బీదలమైనా.. మనసు ఎంత గొప్పదో ఓ గుడిసెలోని తొమ్మిదో తరగతి విద్యార్థి చరణ్ నిరూపించాడు. తమ గుడిసెల ముందు గణపతి విగ్రహం ప్రతిష్టించి నవరాత్రులు పూజించాలని భావించాడు. కానీ కూలిపని చేసుకునే తల్లిదండ్రులకు స్తోమత లేదు. అయినా, ఆ బాలుడు వెనకడుగు వేయలేదు. పాఠశాలకు సెలవులు వచ్చినప్పుడల్లా ఓ దుకాణంలో పనిచేసి కొంతడబ్బు కూడగట్టుకున్నాడు. ఇందులోంచి రూ.1,500 వెచ్చించి వినాయకుడి విగ్రహాన్ని కొనుగోలు చేశాడు. ఇంటి ఎదుట తడకలతో మండపం నిర్మించాడు. వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్టించాడు. అర్చకుడిగా అవతారం ఎత్తాడు. తొమ్మిది రాత్రులపాటు గణపతికి ప్రత్యేక పూజలు చేశాడు. భగవంతుడు విగ్రహంలో కాదు.. భావంలో ఉంటాడు. భక్తికి సామర్థ్యం అవసరం లేదు.. హృదయం చాలు.. అని చరణ్ నిరూపించాడు. నవరాత్రులకు తగ్గ ఏర్పాట్లు, అలంకరణలు చేసే స్తోమత లేకపోయినా.. ఆ బాలుడి భక్తి ముందు అవన్నీ దిగదుడుపే అయ్యాయి. తొమ్మిదిరోజుల పాటు రోజూ పూజలు చేసి, నైవేద్యం సమర్పించాడు. నిత్యం భక్తిపాటలతో అర్చించాడు. చివరకు శుక్రవారం శోభాయత్ర ఘనంగా నిర్వహించాడు. సమీపంలోని నీటి వనరుల్లో నిమజ్జనం చేశాడు. ఈ సందర్భంగా పులిహోర, మిఠాయిలు కూడా గుడిసెలోనే తయారు చేసి అందరికీ పంచిపెట్టాడు. ఇది చూసిన ప్రతీఒక్కరూ కదిలిపోయారు. ఇది డబ్బుతో చేసేది కాదు.. మనసుతో చేసిన పూజ.. ఈ దృశ్యం మానవాళికి, సమాజానికి ఒక శిక్షణ.. ఈ బాలుడు చూపించిన భక్తి, ధనసామర్థ్యానికి మించిన ఆధ్యాతి్మక సంపదని ప్రశంసలు కురిపించారు. -
మహిళా సంఘం ప్రతినిధికి సన్మానం
జూలపల్లి(పెద్దపల్లి): పెద్దాపూర్ గ్రామానికి చెందిన లక్ష్మీనర్సింహ గ్రామైక్య సంఘం అధ్యక్షురా లు, గంగమహిళా సంఘం సభ్యురాలు దొమ్మటి విజయను సీఎం రేవంత్రెడ్డి శుక్రావరం ప్రసంసాపత్రం అందించి సన్మానించారు. అతి తక్కువ సమయంలో అమ్మ ఆదర్శ పాఠశాలను ఆధునీకరించడం, 2024లో జిల్లాలోనే అత్యధికంగా ధా న్యం సేకరించడంతో, గడువులోగా స్కూల్ యు నిఫాం అందజేయడం, సంక్షేమ పథకాల అమ లు, వనమహోత్సవం, అక్షరాస్యతలో చురుగ్గా వ్యహరిస్తున్నందుకు విజయ ఈ పురస్కారానికి ఎంపికై ంది. ఆమెను పలువురు అభినందించారు. -
ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం
మంథని: రాష్ట్రస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికై న వారిని హైదరాబాద్లో శుక్రవారం పలువురు ప్రముఖులు ఘనంగా సన్మానించారు. రాష్ట్ర రాజధానిలో జరిగిన ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా పురస్కారం అందుకున్నవారిలో జిల్లాకు చెందిన పలువురు ఉపాధ్యాయులు ఉన్నారు. మంథనిలోని బాలికల ఉన్నత పాఠశాల గణితం ఉపాధ్యాయుడు గీట్ల భరత్రెడ్డి విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన మీదుగా ప్రశంసాపత్రం అందుకున్నారు. ఆయనను ఉపాధ్యాయులు, విద్యార్థులు, మంథనివాసులు అభినందనలు తెలిపారు. ఓదెల లెక్చరర్కు ఓదెల(పెద్దపల్లి): కొలనూర్ గ్రామానికి చెందిన ఉత్తమ లెక్చరర్ మద్దెల రామకృష్ణను కరీంనగర్లో హాస్యనటుడు సదానందం, లెక్చరర్లు, ఉపాధ్యాయులు సన్మానించారు. అవార్డు అందుకున్న కోడూరి శ్రీనివాణి ఎలిగేడు(పెద్దపల్లి): అర్ధశాస్త్రం ఉన్నత విద్యావిభాగంలో రాష్ట్రస్థాయిలో ఎంపికైన డాక్టర్ కోడూరి శ్రీవాణి ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లో విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా, ఎమ్మెల్సీ శ్రీపాల్రెడ్డి తదితరుల నుంచి ఉత్తమ ఆచార్యులు అవార్డు అందుకున్నారు. ఆమెను పలువురు అభినందించారు. -
ఘనంగా ‘సర్వేపల్లి’ జయంతి
పెద్దపల్లిరూరల్: డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని జిల్లా కేంద్రంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. రాధాకృష్ణన్ విగ్రహానికి ఎ మ్మెల్యే విజయరమణారావు, రెసిడెన్షియల్ టీ చర్స్ అసోసియేషన్ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. విద్యాశాఖ అధికారు లు హనుమంతు, సురేందర్కుమార్, రాంరెడ్డి, చాట్ల ఆగయ్య, సాదుల వెంకటేశ్వర్లు, సత్యనారాయణ, ప్రవీణ్, మహేందర్రెడ్డి, రామస్వా మి, కిషన్రెడ్డి, సంపత్రెడ్డి, కనకయ్య ఉన్నారు. అందరూ మొక్కలు నాటాలి జ్యోతినగర్(రామగుండం): పర్యావరణ పరిరక్షణ కోసం కుటుంబ సభ్యుల పేరిట మొక్కలు నాటాలని రామగుండంలోని ఎన్టీపీసీ తెలంగా ణ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చందన్కుమార్ సామంత సూచించారు. ఎన్టీపీసీ పీటీఎస్లో శుక్రవారం ఏక్ పేడ్ మా కే నామ్ ప్లాంటేషన్ డ్రైవ్ చేపట్టారు. ఈడీ మొక్కలు నాటి మాట్లాడారు. మొక్కల సంరక్షణతో పర్యావరణం మెరుగుపడుతుందని ఆయన తెలిపారు.ఆర్జీ–3లో సీసీఎఫ్ పర్యటన రామగిరి(మంథని): అటవీ శాఖ చీఫ్ కన్జర్వేట ర్(కాళేశ్వరం సర్కిల్) ప్రభాకర్ శుక్రవారం సింగరేణి ఆర్జీ–3 ఏరియాలో పర్యటించారు. ఓసీ పీ ఓవర్ బర్డెన్ డంపుపై 65 హెక్టార్లను అటవీ శాఖకు అప్పగించడానికి చేపట్టిన ఏర్పాట్లు పరి శీలించారు. రామగిరి అతిథి గృహంలో సమీక్షించారు. జీఎం సుధాకర్రావు, డీఎఫ్వో శివ య్య, ప్రాజెక్ట్ ఆఫీసర్ వెంకటరమణ, ఎస్టేట్స్ విభాగాధిపతి ఐలయ్య, సర్వే విభాగాధిపతి జ నార్దనరెడ్డి, ఎఫ్ఆర్వో రమేశ్, జూనియర్ ఫా రెస్ట్రీ అధికారి మేఘన పాల్గొన్నారు. రేపు ఓదెల మల్లన్న ఆలయం మూసివేత ఓదెల(పెద్దపల్లి): ఓదెల మల్లికార్జునస్వామి ఆ లయాన్ని ఆదివారం మూసివేస్తామని ఈవో స దయ్య తెలిపారు. చంద్రగ్రహణం సందర్భంగా ఉదయం 11.30 గంటలకు ఆలయాన్ని మూసివేస్తామని, ఆలయ సంప్రోక్షణ తర్వాత సోమవారం ఉదయం 9 గంటలకు భక్తులకు దర్శన అవకాశం కల్పిస్తాయని వివరించారు. అప్రమత్తంగా ఉండాలి సుల్తానాబాద్(పెద్దపల్లి): సీజనల్ వ్యాధులతో అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యాధికారి వాణిశ్రీ సూచించారు. పట్టణంలోని ఊర చెరు వు వద్ద శుక్రవారం చేపట్టిన వైద్య శిబిరాన్ని ఆమె తనిఖీ చేశారు. జ్వరబాధితులు ప్రభుత్వ ఆస్పత్రులను ఆశ్రయించి ఉచితంగా వైద్యసేవలు పొందాలని సూచించారు. డిప్యూటీ డీఎంహెచ్వో రాములు, సుధాకర్, కిరణ్కుమార్, ఉదయ్కుమార్, సిబ్బంది సౌందర్య, రోజా, ఎలిజిబెత్, దివ్య తదితరులు పాల్గొన్నారు. కనీస వేతనం చెల్లించాలి జ్యోతినగర్(రామగుండం): కాంట్రాక్ట్, అవు ట్ సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేసి, కనీస వేతనం నెలకు రూ.26వేలు చెల్లించాలని కాంట్రాక్టు కార్మికుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చిలుక శంకర్ డిమాండ్ చేశారు. ఇందుకో సం కార్మికులు చేసే సమ్మె వారిజన్మహక్కు అ న్నారు. ఎన్టీపీసీ పర్మినెంట్ టౌన్షిప్లో శుక్రవారం జరిగిన సమావేశంలోమాట్లాడారు. కాంట్రాక్టు, 8గంటల పనివిధానం అమలు చేయా లని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోసం ఈనెల 7న హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో చేపట్టే ఐఎఫ్టీయూ రాష్ట్ర సదస్సుకు హాజరు కావాలని ఆయన కోరారు. అనంతరం పోస్టర్ ఆవిష్కరించారు. నాయకు లు పుట్ట స్వామి, గుండు రాజయ్య, దుర్గం ర వీందర్, సుధాకర్, నర్సయ్య, సత్యం, చిరంజీవి, రాయమల్లమ్మ, పద్మ, కవిత, ఓదెమ్మ, సంధ్య, శంకరమ్మ, భాగ్య, స్వరూప, సూరమ్మ, కనకమ్మలతో పాటు తదితరులు పాల్గొన్నారు. -
జ్యూట్ బ్యాగుల వినియోగాన్ని ప్రోత్సహించాలి
కోల్సిటీ(రామగుండం): పర్యావరణ పరిరక్షణ కోసం ప్లాస్టిక్ వస్తువుల వినియోగాన్ని తగ్గించి, జ్యూట్ బ్యాగుల వాడకాన్ని ప్రోత్సహించాలని స దాశయ ఫౌండేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి సీహెచ్ లింగమూర్తి, జిల్లా గౌరవ అధ్యక్షుడు లగిశెట్టి చంద్రమౌళి, ప్రచార కార్యదర్శి కేఎస్ వాసు అన్నారు. గోదావరిఖని కల్యాణ్నగర్ని శ్రీనిధి ట వర్స్ అపార్మెంట్లో శుక్రవారం గణేశ్ నవరాత్రు ల ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన కార్య క్రమంలో ఫౌండేషన్ గౌరవ అధ్యక్షుడు సానా రా మకృష్ణారెడ్డి సహకారంతో స్థానికులకు జ్యూట్ బ్యాగులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నే త్ర, అవయవ, శరీర దానాలపై అవగాహన కల్పించారు. అపార్మెంట్ కమిటీ అధ్యక్షుడు లగిశెట్టి చంద్రమౌళి ఆధ్వర్యంలో ప్రతినిధులను సత్కరించారు. పిల్లలు, మహిళలు భక్తి శ్రద్ధలతో నిమజ్జనానికి నృత్యాలు చేస్తూ గణనాథుని శోభాయాత్ర నిర్వహించారు. కార్యక్రమంలో టవర్స్ గౌరవ అధ్యక్షుడు విశ్వనాథం, సలహాదారులు విజయ్ కుమార్గౌడ్, వెంకటేశ్వర్లు, కార్యదర్శి రామచంద్రం, కోశాధికారి నాగరాజు, వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు శ్రీనివాస్, బ్రహ్మచారి, సమ్మయ్య, స్వామి, సత్తయ్య, సురేందర్ తిరుపతిరెడ్డి, కోటేశ్వర్, దేవదర్శన్రెడ్డి, సత్తయ్య, రామ్మూర్తి, రంగజ్యోతి, స్వరూప, సునీత, సుమతి, శ్రీలత తదితరులు పాల్గొన్నారు. -
లడ్డూలు అందజేత
కోల్సిటీ(రామగుండం): గాంధీచౌక్ చౌరస్తా లో గణేశ్ నవరాత్రుల సందర్భంగా ట్యాక్సీ ఓ నర్స్, డ్రైవర్స్ అసోసియేషన్ ప్రతినిధి ఎస్కే ఇంతియాజ్ 250 లడ్డూలను మండప నిర్వాహకులకు అందజేశారు. నగదు విరాళంగా ఇచ్చి మతసామరస్యాన్ని చాటుకున్నారు. పేదలకు కేంద్రం అండ సుల్తానాబాద్(పెద్దపల్లి): పేదలకు అండగా ని లిచేందుకు కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని తగ్గించిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరె డ్డి అన్నారు. స్థానిక నెహ్రూ విగ్రహం వద్ద ప్ర ధాని మోదీ చిత్రపటానికి శుక్రవారం క్షీరాభిషే కం చేశారు. ఆయన మాట్లాడుతూ, జీఎస్టీ త గ్గించడం హర్షణీయమన్నారు. కడారి అశోక్ రావు, సౌదరి మహేందర్ యాదవ్, కందుల శ్రీనివాస్, కొమ్ము తిరుపతి యాదవ్, మిట్టపల్లి ప్రవీణ్ కుమార్, శంకర్ పాల్గొన్నారు. -
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియోలతో..
క్రమశిక్షణతో కూడిన నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా వట్టెంల జెడ్పీ స్కూల్ గెజిటెడ్ హెచ్ఎం కడార్ల సూర్యనారాయణ కృషి చేస్తున్నారు. బడిబాటలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియోను ప్రచారం చేసి ఆకర్షణగా నిలిచారు. ప్రభుత్వ నిర్ణయానికి ముందే పాఠశాలను ఆంగ్ల మాధ్యమ స్కూల్గా మార్చి ఇంగ్లిష్ మీడియం బోధన ప్రారంభించారు. సిరిసిల్ల టీచర్ వెబ్సైట్ ద్వారా హెచ్ఎంలు, ఉపాధ్యాయులకు ఉపయుక్తమైన సమాచారం అందిస్తున్నారు. జిల్లాస్థాయిలో ఉత్తమ ప్రధానోపాధ్యాయుడు, అంతర్జాతీయంగా గ్లోబల్ టీచర్ అవార్డు అందుకున్నారు. -
గూగుల్ కన్నా గురువే మిన్న
జ్యోతినగర్(రామగుండం): ప్రస్తుతం ఏదైనా ప్రశ్నకు సమాధానం కావాలంటే గూగుల్ను సంప్రదిస్తున్నారు. కానీ, గూగుల్ కంటే గురువే మిన్న అని అన్నారు ఎన్టీపీసీ రామగుండం దుర్గయ్యపల్లె ప్రభుత్వ పాఠశాల మ్యాథ్స్ టీచర్ కె.అనిత అన్నారు. పలు గణితోపకరణాలు తయారు చేసి విద్యార్థులకు వినూత్న రీతిలో బోధిస్తున్నారు. శ్రీనివాస రామానుజన్ జయంతి సందర్భంగా 2024లో ఎస్సీఈఆర్టీ హైదరాబాద్ నందు నిర్వహించిన రాష్ట్రస్థాయి గణిత సెమినార్లో పరిశోధన పత్రం సమర్పించినందుకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నరసింహారెడ్డి చేతుల మీదుగా సర్టిఫికెట్ అందుకున్నారు. విద్యార్థులకు నేర్చుకోవాలనే తపన ఉండాలని పేర్కొన్నారు. గూగుల్ మనం ఏది అడిగితే ఆ జవాబు ఇస్తుంది కానీ.. గురువు అది తప్పా, ఒప్పా చెప్పి సరైన మార్గంలో వెళ్లేలా దిశానిర్దేశం చేస్తారని తెలిపారు. పేద విద్యార్థుల మాస్టారు.. గంగాధర్కోరుట్ల: కోరుట్ల పట్టణానికి చెందిన సోమ గంగాధర్ పేద విద్యార్థుల మాస్టారుగా పేరు సంపాందించారు. కథలాపూర్ మండలం చింతకుంట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 2002లో ఉద్యోగ బాధ్యతలు చేపట్టాడు. అక్కడ పేద విద్యార్థులను పాఠశాలకు తీసువచ్చి చదువు చెప్పాడు. విద్యాకమిటీ ప్రోత్సాహంతో పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచారు. మెట్పల్లి మండలం ఆరపేటలో గణిత బోధన చేసి, మంచి లెక్కల మాస్టార్గా పేరు సంపాధించాడు. ప్రస్తుతం ఎంపీపీఎస్ అయ్యప్పగుట్ట పాఠశాలలో పని చేస్తున్నాడు. పేద విద్యార్థులను అక్కున చేర్చుకుని, పుస్తకాలు, కాపీలు, పెన్నులు, బ్యాగులతోపాటు ఆర్థిక సాయం అందించి చదువుకునేందుకు సహకరించాడు. -
కొడుకు, కోడలు ఇంటి నుంచి గెంటేశారని..
జగిత్యాలరూరల్: జగిత్యాల అర్బన్ మండలం ధరూర్ గ్రామానికి చెందిన వృద్ధురాలు తన కొడుకు, కోడలు ఇంటి నుంచి గెంటేశారని, భిక్షాటన చేసుకుంటూ జీవిస్తున్నానని, తనకు సంరక్షణ కల్పించాలని సంక్షేమాధికారి కార్యాలయంలో గురువారం ఫిర్యాదు చేశారు. గ్రామానికి చెందిన కిష్టమ్మను మూడు రోజుల క్రితం కొడుకు, కోడలు ఇంటి నుంచి గెంటేశారు. విద్యానగర్లోని రామాలయం వద్ద కాలం వెళ్లదీస్తోంది. స్థానికులు ఆమె పరిస్థితిని సంక్షేమ శాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో సఖీ కేంద్రం నిర్వాహకులు ఆమెను గురువారం సాయంత్రం చేరదీసి కౌన్సెలింగ్ నిర్వహించారు. తన పేరున ఉన్న ఇల్లును కొడుకు పేరిట చేసుకుని ఇప్పుడు పోషించడం లేదని అధికారులకు వివరించింది. -
గురుకుల విద్యార్థినులకు అస్వస్థత
గంభీరావుపేట(సిరిసిల్ల): రాజన్నసిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల విద్యాలయం విద్యార్థులు బుధవారం రాత్రి అస్వస్తతకు గురయ్యారు. పలువురు విద్యార్థులకు మండల కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రిలో బుధవారం రాత్రి వైద్యం అందించారు. గురువారం ఉదయం లింగన్నపేట పీహెచ్సీ అధికారులు, సిబ్బంది పాఠశాలలో విద్యార్థులకు వైద్యపరీక్షలు చేశారు. 446 మందికి వైద్యపరీక్షలు చేయగా.. 48 మంది విద్యార్థినులు జలుబు, దగ్గు, చర్మ సంబంధిత వ్యాధులు, కడుపునొప్పి, జ్వరం, పసిరికలతో బాధపడుతున్నట్లు గుర్తించారు. వారికి మందులు అందజేశారు. సీహెచ్వో రమేశ్, వైద్య సిబ్బంది భారతి, శిల్ప, హేమలత, కల్పలత, ఆశకార్యకర్తలు పాల్గొన్నారు. వైద్యపరీక్షలు నిర్వహించిన పీహెచ్సీ సిబ్బంది -
ఎత్తివేసిన రైళ్లకు హాల్టింగ్ పునరుద్ధరణ
● పెద్దపల్లి ఎంపీ ఒత్తిడితో దిగివచ్చిన రైల్వేశాఖ రామగుండం: కొన్నినెలల క్రితం ప్రయాణికుల నుంచి అంతగా స్పందన లేదనే కారణంతో పాటు దాని ముందే ఓ రైలుకు హాల్టింగ్ కల్పించామనే సాకు, వీటన్నింటి కంటే పలు సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైళ్లకు ఎగువ వైపు వెళ్లే క్రమంలో హాల్టింగ్, దిగువ వైపు వెళ్లే వాటికి నాన్స్టాప్ ఇలా గందరగోళంగా అర్థం కాని నిర్ణయాలను దక్షిణ మధ్య రైల్వే అమలు చేసింది. దీంతో రామగుండం కేంద్రంగా రాకపోకలు సాగించే ప్రయాణికులు రైల్వేశాఖ నిర్ణయంపై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమయ్యాయి. కాగా పలుమార్లు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ రైల్వే జీఎం దృష్టికి తీసుకెళ్లి 11 రైళ్లకు హాల్టింగ్స్ కల్పించాలని కోరగా కేవలం ఐదు రైళ్లకు మాత్రమే హాల్టింగ్ కల్పించినట్లు పేర్కొన్నారు. పెద్దపల్లి రైల్వేస్టేషన్లో రెండు రైళ్లకు హాల్టింగ్ కల్పించాలని కోరగా కేవలం ఒక రైలుకు మాత్రమే హాల్టింగ్ కల్పించారు. గురువారం పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ హాల్టింగ్ కల్పించిన రైళ్ల వివరాలను ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హాల్టింగ్ కల్పించడంపై ప్రయాణికుల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. రామగుండంలో హాల్టింగ్ కల్పించిన రైళ్ల వివరాలు.. రైలు నం.12295 బెంగళూరు–దానాపూర్ (సంఘమిత్ర సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్) రైలు నం.12578 ధర్భాంగా–మైసూర్ (బాగ్మతి సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్) రైలు నం.12721 హైదరాబాద్–హజ్రత్ నిజాముద్దీన్ (దక్షిణ్) రైలు నం.22535 రామేశ్వరం–భరౌణి (రామేశ్వరం) రైలు నం.22669 ఎర్నాకులం–పాట్నా (పాట్నా సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్) పెద్దపల్లి రైల్వేస్టేషన్లో రైలు నెం.12722 దక్షిణ్ ఎక్స్ప్రెస్కు హాల్టింగ్ కల్పించారు. -
భక్తులూ.. జరభద్రం
కోల్సిటీ(రామగుండం): జిల్లాలో శుక్రవారం నిమజ్జనోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. నిమజ్జన సమయంలో అప్రమత్తంగా ఉండకపోతే అపశ్రుతులు చోటు చేసుకునే అవకాశాలున్నాయి. వాగులు, వంతెనల వద్ద భద్రం... ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నదులు, చెరువులు, వాగులు నిండిపోయి పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ ప్రాంతాల్లో గణనాథులను నీటిలో నిమజ్జనం చేసే సమయంలో తగు జాగ్రత్తలు పాటించాలి. ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా పట్టుతప్పి నీటిలో పడిపోయే ప్రమాదం ఉంది. నిమజ్జన సమయంలో విద్యుత్ తీగలపట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలి. విగ్రహాలకు అడ్డుగా ఉన్న తీగలను చేతులతో పట్టుకోవద్దు. వైరును పైకి ఎత్తేందుకు ఎండిన కర్రను ఉపయోగించాలి. వాహన చోదకులు జాగ్రత్తలు పాటించాలి నిమజ్జన శోభాయాత్రలో వినాయక ప్రతిమలను ఊరేగించే వాహనాల డ్రైవర్లు జాగ్రత్తగా ఉండాలి. కండీషన్ కలిగిన వాహనాలను మాత్రమే ఎంచుకోవాలి. అనుభవం, డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన డ్రైవర్ల ను మాత్రమే ఎంచుకోవాలి. డ్రైవర్లు మద్యం, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి. సూచనలు పాటించాలి నిమజ్జన సమయంలో అధికారిక యంత్రాంగం ఏర్పాటు చేసిన క్రేన్లు, తదితర వాటి సమీపంలోకి వెళ్లకూడదు. పోలీసులు, మున్సిపల్తోపాటు సంబంధిత అధికారులు, ఉత్సవ కమిటీ నిర్వాహకులు, సిబ్బంది సూచనలు పాటించాలి. పోలీసులు, నిమజ్జనం చేసే నిర్వాహకుల హెచ్చరికలను కాదని నది, చెరువులు, కుంటలు, వాగుల్లోకి వెళ్లేందుకు సాహసం చేయొద్దు. ఈతరాని వారు, పిల్లల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నీటిలోకి వెళ్లకుండా చూసుకోవాలి. -
నైపుణ్యానికి గుర్తింపు..సేవలకు సలాం
గోదావరిఖనిటౌన్/మంథని: నైపుణ్యానికి గుర్తింపు లభించింది. సేవలకు ప్రశంస దక్కింది. గోదావరిఖని ప్రభుత్వ డిగ్రీ కాలేజీ లైబ్రేరియన్ పల్లెర్ల శంకరయ్య, మంథని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల మ్యాథ్స్ టీచర్ గీట్ల భరత్రెడ్డికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు వరించాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగ గ్రామానికి చెందిన శంకరయ్య విద్యార్థులలో విద్యా నైపుణ్యాన్ని పెంపొందించడం..వినూత్న రీతిలో పాఠలు బోధిస్తారు. 2019లో జిల్లా, 2020లో వర్సిటీ స్థాయిలో ఉత్తమ పురస్కారాలు అందుకున్నారు. 2021లో రాష్ట్రస్థాయి బెస్ట్ ఎన్ఎస్ఎస్ ప్రొగ్రాం అధికారిగా అవార్డు సొంతంచేసుకున్నారు. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, పౌర సమాచార హక్కు అధికారిగా, స్టూడెంట్ కెరీర్ గైడెన్స్ అధికారిగా సేవలందించారు. మంథనికి చెందిన గీట్ల భరత్రెడ్డికి 2018లో జిల్లా స్థాయి ఉత్తమ అవార్డు దక్కింది. మ్యాథ్స్ టీచర్గా పనిచేస్తున్న ఈయన విద్యార్థుల్లో దాగిఉన్న ప్రతిభ వెలికితీసేందుకు కృషిచేశారు. చదువుపట్ల శ్రద్ధ పెంచేలా చర్యలు తీసుకున్నారు. -
మావోల తల్లి మృతి
హుజూరాబాద్: మావోయిస్టులు గోపగాని ఐలన్న, కుమరస్వామి తల్లి గోపగాని కొమరమ్మ(92)మండలంలోని తుమ్మన్నపల్లి గ్రామంలో గురువారం ఉదయం మృతి చెందారు. కొమరమ్మకు ఐదుగురు కుమారులు, ఒక కుమార్తె. గోపగాని బలన్న, గోపగాని కుమరస్వామి నాటి పీపుల్స్వార్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేశారు. కుమారస్వామి 1979లో కమలాపూర్ మండలం గూడూరులో ఏర్పడిన తొలిదళంలో సభ్యుడిగా చేరాడు. దళంలో పనిచేస్తున్న సమయంలోనే గ్రానైట్ ప్రమాదంలో మృతి చెందాడు. ఐలన్న పీపుల్స్ వార్ పార్టీకి ఉత్తర తెలంగాణ రీజనల్ కార్యదర్శిగా పనిచేస్తున్న సమయంలో కిడ్నాప్నకు గురై 37 ఏళ్లు దాటినా ఆచూకీ లభించలేదు. కుమారుడి ఆచూకీకి ఎదురుచూసిన తల్లికి చివరికి నిరాశే మిగిలి మృతి చెందింది. బావిలో పడి వృద్ధురాలు..తిమ్మాపూర్: ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి వృద్ధురాలు మృతిచెందింది. తిమ్మాపూర్ మండలం ఇందిరానగర్ కు చెందిన అల్వాల లచ్చమ్మ (80) గురువారం మధ్యాహ్నం నుంచి కనిపించకుండా పోయింది. కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వెతికినా ఆచూకీ దొరకలేదు. సాయంత్రం గ్రామంలోని ఓ రైతుకు చెందిన వ్యవసాయ బావిలో మృతిచెంది కనిపించింది. విషయాన్ని స్థానికులు ఎల్ఎండీ పోలీసులకు సమాచారం అందించారు. మృతురాలు లచ్చమ్మగా పోలీసులు గుర్తించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. కాల్వశ్రీరాంపూర్: అంత్యక్రియలకు వెళ్లి చెరువులో స్నానం చేస్తూ వ్యక్తి గల్లంతైన ఘటన మండలంలో జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాలు.. మండలంలోని పందిల్లకు చెందిన దబ్బెట రాధ కరీంనగర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందగా, గురువారం స్వగ్రామంలో అంత్యక్రియలు చేశారు. అనంతరం చెరువులో స్నానానికి వెళ్లిన అదే గ్రామానికి చెందిన దబ్బెట అనిల్(31) ఈత కొడుతూ గల్లంతయ్యాడు. స్థానిక మత్స్యకారులు గాలించినా ఫలితం లేదు. ఎస్సై వెంకటేశ్ పెద్దపల్లి నుంచి గజఈతగాళ్లను రప్పించి రాత్రిపూట సైతం గాలింపు చర్యలు చేపట్టినా అనిల్ ఆచూకీ లభించలేదు. మృతుడికి భార్య ఉమ, కూతుర్లు అన్విత, వినూత్న, తండ్రి రాజయ్య ఉన్నారు. అనిల్ గల్లంతు కావడంతో కుటుంబ సభ్యులు రోదనలు మిన్నంటాయి. మానసిక వికలాంగురాలిపై లైంగిక వేధింపులుజూలపల్లి: మానసిక వికలాంగురాలిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై సనత్కుమార్ తెలిపారు. మండలానికి చెందిన మానసిక వికలాంగురాలిపై కొప్పుల మహేందర్గత నెల 30న మధ్యాన్నం 2 గంటల సమయంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంట్లోకి ప్రవేశించి లైంగిక వేధింపులకు గురిచేసినట్లు బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు. -
ప్రయోగాలతో గుర్తింపు
ఇల్లంతకుంట(మానకొండూర్): లో కాస్ట్.. నో కాస్ట్ మెటీరియల్స్తో విద్యార్థులచే ప్రయోగాలు చేయిస్తూ జిల్లా, రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు అందుకున్న ఇల్లంతకుంట హైస్కూల్ బయాలజీ టీచర్ వుడుత మహేశ్చంద్ర. ఇప్పటివరకు విద్యార్థులతో 760 ప్రాజెక్టులు తయారు చేయించారు. 2002లో సైన్స్టీచర్గా విధుల్లో చేరారు. ఇల్లంతకుంట స్కూల్లో ఎనిమిదేళ్ల నుంచి పనిచేస్తున్నారు. 2023లో రాష్ట్ర, 2019లో జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు వరించాయి. అలాగే విద్యార్థులతో ప్రయోగాలు తయారు చేయించి జిల్లా, రాష్ట్ర, అంతర్జాతీయస్థాయి పోటీల్లో గోల్డ్, సిల్వర్, ఉత్తమ ప్రశంస పత్రాలు అందుకునేలా చేశారు. ఇల్లంతకుంట మండలం కందికట్కూర్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు బద్దం రవీందర్రెడ్డి 2025– జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. 2002లో విధుల్లో చేరి, రెండేళ్లుగా కందికట్కూరులో పని చేస్తున్నారు. పాఠశాలలో గతేడాది 20 మంది విద్యార్థులు ఉండగా వేసవి సెలవుల్లో ఇంటింటా తిరిగి సంఖ్య 40 మందికి చేరేలా కృషి చేశారు. గ్రామస్తుల సాయంతో స్కూల్ భవనాన్ని రైలు థీమ్ పాఠశాలగా తీర్చిదిద్దారు. మెరుగైన విద్య అందించడంతోపాటు విద్యార్థులచే పలు యాక్టివిటీస్ చేయిస్తుంటారు. -
జాతీయపోటీలకు నవోదయ విద్యార్థులు
చొప్పదండి: జవహర్ నవోదయ విద్యాలయానికి చెందిన ఇద్దరు విద్యార్థులు రీజియన్ పోటీలలో ప్రతిభ కనబరిచి జాతీయస్థాయికి ఎంపికయ్యారు. ఏపీలోని ఒంగోలులో జరిగిన రీజనల్ లెవల్ కళా ఉత్సవ్–2025 పోటీల్లో విద్యాలయం నుంచి పాల్గొన్న గురునాథం వంశీ, ఎం.కార్తికేయ ప్రతిభ కనబరిచి జాతీయస్థాయిలో ఢిల్లీలో జరిగే పోటీలకు ఎంపికయ్యారు. టాయ్స్ తయారీలో చూపిన ప్రతిభతో మొదటిస్థానంలో నిలిచారు. విద్యార్థులతో పాటు ఆర్ట్ టీచర్ గోకా నాగేశ్వర్రావును ఇన్చార్జి ప్రిన్సిపాల్ కె.బ్రహ్మానందరెడ్డి, రాయుడు అభినందించారు. -
వినూత్నం.. విజ్ఞానం
సిరిసిల్ల ఎడ్యుకేషన్: పుస్తకాల్లో ఉన్న విజ్ఞానాన్ని విద్యార్థులకు బోధించడం పరిపాటి. కానీ మిషన్–100 లక్ష్యంగా విద్యార్థులతో నూతన ఆవిష్కరణలు చేయిస్తున్నాడు రాజన్న సిరిసిల్ల జిల్లా దమ్మన్నపేట జిల్లా పరిషత్ హైస్కూల్ భౌతికశాస్త్రం ఉపాధ్యాయుడు తాడూరి సంపత్కుమార్. తన ఉద్యోగ విరమణలోపు కనీసం 100మంది గ్రామీణ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను ఆవిష్కరణకర్తలుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో మిషన్–100 కార్యక్రమం నిర్వహిస్తున్నాడు. ఇప్పటివరకు 61మంది వివిధ ఆవిష్కరణలు ప్రదర్శించగా.. వీరిలో 8మంది అంతర్జాతీయస్థాయి, 16మంది జాతీయస్థాయి, 30మందికి పైగా రాష్ట్రస్థాయి బహుమతులు గెలుచుకున్నారు. 2021, 2023లో ఇద్దరు విద్యార్థుల ఆవిష్కరణలు హై రేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు దక్కించుకున్నాయి. బోచ్, ఎన్ఐఎఫ్, టీజీఐసీ సంస్థలు పిల్లల ఆవిష్కరణలకు పేటెంట్ హక్కులు పొందేందుకు సహకారం అందిస్తున్నాయి. సంపత్ కుమార్ సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం 2024లో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందించింది.● నూతనంగా ఆలోచిస్తున్న ఉపాధ్యాయులు ● విభిన్న బోధనలతో ఆకట్టుకుంటున్న వైనం ● ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ఉత్తమ అవార్డులకు పలువురి ఎంపిక ● నేడు టీచర్స్ డేఅమ్మ జన్మనిస్తుంది.. నాన్న జీవితాన్ని ఇస్తాడు. ఆ జీవితాన్ని సక్రమ దారిలో నిలబెట్టే ఏకై క వ్యక్తి గురువు. బుడిబుడి అడుగులు వేస్తూ ఓనమాలు దిద్దే వయసు నుంచి డిగ్రీ, పీజీలు పూర్తిచేసి ఉద్యోగం, వ్యాపారంలో స్థిరపడే వరకు మార్గదర్శిగా నిలుస్తారు. మారుతున్న కాలానికి అనుగుణంగా పాఠశాల, కళాశాల, యూనివర్సిటీల్లోని గురువురు వినూత్నంగా విద్యాబోధన అందిస్తున్నారు. పుస్తకాల్లోని పాఠాలను అర్థమయ్యే రీతిలో ప్రత్యక్షంగా వివరిస్తూ శభాష్ అనిపించుకుంటున్నారు. ప్రపంచీకరణ వేగాన్ని అందుకునే విధంగా సలహాలు.. సూచనలు ఇస్తూ.. విద్యార్థులు వివిధ రంగాల్లో రాణించేలా తీర్చిదిద్దుతున్నారు. వివిధ రకాల ప్రయోగాలు చేయిస్తూ.. జాతీయస్థాయిలో పేరుపొందేలా ప్రోత్సహిస్తున్నారు. ఇలా ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని పలువురు పాఠశాల ఉపాధ్యాయులు, కళాశాల అధ్యాపకులు ఉత్తమ గురువులుగా ప్రశంసలు పొందుతున్నారు. నేడు దేశ తొలి ఉపరాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ప్రత్యేక కథనాలు..కాల్వశ్రీరాంపూర్: విద్యార్థుల్లో ఒకరిగా ఫ్రెండ్లీ బోధనతో వినూత్నంగా ఆలోచిస్తున్నారు ఉపాధ్యాయురాలు కోయాల్కర్ స్వప్న. 13 ఏళ్లుగా కాల్వశ్రీరాంపూర్ మండలంలోని వివిధ పాఠశాలల్లో విద్యాబోధన చేస్తున్నా రు. ప్రస్తుతం కాల్వశ్రీరాంపూర్ ఎస్సీకాలనీ ప్రాథమిక పాఠశాలలో హెచ్ఎంగా కొనసాగుతున్నారు. 2008లో శంకరపట్నం మండలం రాజాపూర్లో విధులు ప్రారంభించారు. ముస్తాబాద్ మండలం కొండాపూర్, కాల్వ శ్రీరాంపూర్ మండలం మల్యాలలో పనిచేశారు. ఉత్తమ విద్యాబోధన, విద్యార్థులతో ఫ్రెండ్లీగా ఉంటూ ఆటపాటలతోపాటు కృత్యాధారణ బోధన (టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్) చేస్తూనే మండలస్థాయిలో నిర్వహించే ఎఫ్ఎల్ఎన్లో రిసోర్స్ పర్సన్గా ప్రశంసలు అందుకుంటున్నారు. కాల్వశ్రీరాంపూర్ ఎస్సీ కాలనీకి గతేడాది బదిలీపై వచ్చిన స్వప్న 50మంది నుంచి 60మందికి విద్యార్థుల సంఖ్యను పెంచారు. -
‘ఇగురం’గా బోధిస్తూ..
మండలంలో సెకండరీ గ్రేడ్ టీచరుగా పనిచేస్తున్న కపిల నరేశ్ విద్య బోధన చేస్తూనే, నిరుద్యోగులకు అండగా ఉండి, పోటీ పరీక్షల్లో నెగ్గేందుకు అవసరమైన మెలకువలను ‘ఇగురుం’ యూట్యూబ్ చానల్లో అందిస్తున్నారు. ప్రస్తుతం చందుర్తి మండలంలో పోస్టింగ్ రావడంతో తన కూతురును అదే పాఠశాలలో చదివించేందుకు ప్రవేశం తీసుకుని ఆదర్శంగా నిలిచారు. తన జీవన గమనానికి ఆర్థిక వనరులు అందిస్తున్న ప్రభుత్వ బడిని దక్కించుకునేందుకు తన కూతురిని ప్రభుత్వ బడిలో చేర్పించినట్లు తెలిపారు. ఉత్తమ ఉపాధ్యాయుడిగా విద్యాశాఖ నుంచి అవకాశాలు రానప్పటికీ వివిధ సంస్థలు 2 రాష్ట్రస్థాయి అవార్డులతో పాటు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశాయి. -
రాష్ట్ర ఉత్తమ లెక్చరర్గా శ్రీవాణి
ఎలిగేడు(పెద్దపల్లి): శాతవాహన విశ్వవిద్యాలయంలో అర్థశాస్త్ర విభాగం అధిపతిగా, అదనపు పరీక్షల నియంత్రణ అధికారిగా విధులు నిర్వర్తిస్తున్న డాక్టర్ కోడూరి శ్రీవాణి 2025 సంవత్సరానికి రాష్ట్ర ఉత్తమ అధ్యాపకురాలిగా ఎంపికయింది. ఎలిగేడు మండలకేంద్రానికి చెందిన శ్రీవాణిది నిరుపేద చేనేత కుటుంబం. తల్లి బీడీ కార్మికురాలు. శ్రీవాణి చదువుకుంటూనే తల్లికి చేదోడువాదోడుగా బీడీలు చుడుతూ తన విద్యాభ్యాసాన్ని కొనసాగించింది. తన విద్యాప్రయాణమంతా ర్యాంకులు, బంగారు పతకాలతో సాగింది. ఎలిగేడు జెడ్పీహెచ్ పాఠశాలలో 10వ తరగతి ప్రథమ శ్రేణిలో, సాంఘీక సంక్షేమ గురుకుల కళాశాల కరీంనగర్లో ఇంటర్లో మొదటిర్యాంకు, కరీంనగర్ ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాలలో బీఏలో కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలో 9వ ర్యాంకు, ఎంఏ ఎకానమిక్స్లో మొదటి ర్యాంకుతో పాటు మూడు బంగారు పతకాలు, కాకతీయ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్లో బీఈడీ, ఎంఈడీలో ప్రథమ ర్యాంకు సాధించారు. ఒకే సంవత్సరంలో ఆరు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. కాగా, గ్రామీణప్రాంతాల్లో ఆర్థిక, సామాజిక కారణాలతో చాలామంది మట్టిలో మాణిక్యాలు బయటి ప్రపంచానికి రాలేకపోతున్నారని, అలాంటి వారి సామర్థ్యాలను గుర్తించి విద్యాపరిశోధనా రంగంలో తీర్చిదిద్దుతానని శ్రీవాణి పేర్కొన్నారు. శాతవాహన యూనివర్సిటీ అభివృద్ధికి అహర్నిషలు కృషిచేస్తానని తెలిపారు. -
ఎఫ్ఆర్ఎస్ ద్వారా హాజరు నమోదుచేయాలి
● కలెక్టర్ కోయ శ్రీహర్ష పెద్దపల్లిరూరల్: ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే విద్యార్థులు, ఉపాధ్యాయులు తప్పనిసరిగా ఎఫ్ఆర్ఎస్ (ఫేస్ రికగ్నిషన్ సిస్టం)ద్వారానే హాజరు నమోదు చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. కలెక్టరేట్లో గురువారం విద్యాశాఖపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు విద్యార్థుల హాజరు 60 నుంచి 65శాతం మాత్రమే ఉంటోందన్నారు. సాంకేతిక సమస్యలుంటే సత్వరం పరిష్కరించుకోవాలన్నారు. ఈ నెల 10 వరకు ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు ఎఫ్ఆర్ఎస్ ద్వారానే జరగాలన్నారు. ఈ వ్యవహారాన్ని తానే స్వయంగా పర్యవేక్షిస్తానని స్పష్టం చేశారు. సమన్వయ కర్త పీఎం షేక్, ఎంఈఓలు తదితరులున్నారు. నాణ్యమైన విద్యనందించాలి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేలా ప్రణాళికలను సిద్ధం చేయాలని కలెక్టర్ శ్రీహర్ష అన్నారు. క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టరేట్లో గురువారం సమావేశమయ్యారు. విద్యాశాఖలో పదోన్నతుల కారణంగా ఉపాధ్యాయలు కొరత రాకుండా సమన్వయం చేసుకోవాలన్నారు. అవసరమైతే హెల్పర్లను నియమించుకోవాలని, అందుకు అవసరమైన ప్రతిపాదనలను ఇవ్వాలన్నారు. జెడ్పీ సీఈవో నరేందర్, సమన్వయకర్తలు పీఎం షేక్, మల్లేశ్ తదితరులున్నారు. -
నిమజ్జనంపై నిఘా
జిల్లాలో.. నిమజ్జనానికి వెళ్లే గణపతి విగ్రహాలు: 2,524 బందోబస్తు.. ఏసీపీలు : ముగ్గురు సీఐ/ఆర్ఐలు : 8 మంది ఎస్సై/ఆర్ఎస్సై : 24 మంది హెడ్/కానిస్టేబుళ్లు : 180 మంది స్పెషల్పార్టీ : 30 మంది హోంగార్డులు : 32 మంది ట్రాఫిక్,ఎన్సీసీ,ఎన్ఎస్ఎస్ : 40 మంది సింగరేణి సెక్యూరిటీ : 100 మంది గోదావరిఖని(రామగుండం): జిల్లాలోని పలు కూడళ్లలో ప్రతిష్టించిన గణనాథుల నిమజ్జనోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నారు. నిమజ్జనానికి వెళ్లే గణనాథులకు విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికి పూజలు చేసిన అనంతరం వీడ్కోలు పలికేందుకు, పోలీసుశాఖ ఆధ్వర్యంలో నిమజ్జనోత్సవం ప్రశాంతంగా జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నారు. గోదావరిఖని, యైటింక్లయిన్కాలనీ, ఎన్టీపీసీ, రామగుండం, మంథని, పెద్దపల్లి, సుల్తానాబాద్ ప్రాంతాల్లో నిమజ్జన ప్రాంతాల వద్ద అంతా సిద్ధం చేస్తున్నారు. నిమజ్జనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రెవెన్యూ, మున్సిపల్, పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. సాధ్యమైనంత మేర చీకటిపడేలోగా నిమజ్జన వేడుకలు జరుపుకోవాలని పోలీసుశాఖ సూచిస్తోంది. ● నిమజ్జనం కోసం ఏర్పాటు చేసుకున్న వాహనం కండీషన్, డాక్యుమెంట్లు చెక్ చేసుకోవాలి. ● వాహనాన్ని నడిపే డ్రైవర్ పూర్తి వివరాలు కమిటీకి తెలిసి ఉండాలి. ● డ్రైవర్ మద్యం సేవించరాదు. మద్యం సేవించి భక్తులు నిమజ్జన కార్యక్రమంలో పాల్గొనరాదు. ● నిమజ్జనంలో దేవుడి పాటలు మాత్రమే ఉపయోగించాలి. డీజే సౌండ్స్ వినియోగించొద్దు. ● డీజే వాడితే సీజ్చేసి చట్టప్రకారం చర్యలుంటాయి. చీకటి పడేలోగా నిమజ్జనం పూర్తి చేయాలి. ● నిమజ్జనం ప్రదేశంలో ఫొటోలు, సెల్ఫీల కోసం గుమికూడరాదు. నిమజ్జన ప్రాంతాల పరిశీలన జిల్లాలో నిమజ్జనం జరిగే గోదావరిఖని, మంథని, పెద్దపల్లి, సుల్తానాబాద్ ప్రాంతాలను గురువారం రామగుండం సీపీ అంబర్కిషోర్ఝా పరిశీలించారు. ప్రధానంగా గోదావరిఖని గోదావరి బ్రిడ్జివద్ద విగ్రహాల నిమజ్జనం ఎక్కువగా జరుగనుంది. సింగరేణి, ఆర్ఎఫ్సీఎల్, ఎన్టీపీసీ, మున్సిపల్ సమన్వయంతో రోడ్ల మరమ్మతు, ప్లడ్ లైట్లు, క్రేన్లు, గోదావరిబ్రిడ్జిపై ఫ్లాట్ఫాంలు, తాగునీటి వసతి ఏర్పాటు చేస్తున్నారు. గజ ఈతగాళ్లు అందుబాటులో ఉంటారని, ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశారు. సీసీ, డ్రోన్ కెమెరాల పర్యవేక్షణలో గణేశ్ నిమజ్జన శోభాయాత్ర కొనసాగనుంది. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా శోభాయాత్రలో వాహనాల మూమెంట్ను ఎప్పటికప్పుడు పోలీసులు పర్యవేక్షించనున్నారు. గోదావరిబ్రిడ్జి వద్ద ట్రాఫిక్ మళ్లింపు విగ్రహాల నిమజ్జనం నేపథ్యంలో గోదావరిఖని సమీపంలోని గోదావరినదిపై మంచిర్యాల వైపు వెళ్లే వాహనాలను మళ్లిస్తారు. మంచిర్యాల వైపు వెళ్లే, గోదావరిఖని వైపు వచ్చే వాహనాలను ఒకేవైపు నుంచి పంపించనున్నారు. గోదావరిఖని మిలీనియం క్వార్టర్ల సమీపం నుంచి వాహనాల మళ్లింపు కొనసాగనుంది. జిల్లాలో ప్రధాన నిమజ్జన ప్రాంతాలు గోదావరిఖని సమీపంలోని గోదావరి బ్రిడ్జి మంథని పట్టణంలో గోదావరినది తీరం పెద్దపల్లిలో ఎల్లమ్మ చెరువు మినీ ట్యాంక్బండ్ సుల్తానాబాద్లో చెరువు గణపతి విగ్రహాలు నిమజ్జనానికి తరలివెళ్లే ప్రధాన రోడ్ల వెంట తాత్కాలిక మరమ్మతులు పూర్తి చేశారు. నిమజ్జన ప్రాంతాల్లో ప్లడ్ లైట్లు, క్రేన్లు, తాగునీటి వసతి కల్పించారు. గోదావరినదిలో గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచారు. నిమజ్జన శోభాయాత్ర రూట్మ్యాప్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. డ్రోన్కెమెరా ద్వారా శోభాయాత్ర పర్యవేక్షణ కమిషనరేట్లోని పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో అన్ని నిమజ్జన ప్రాంతాలను పరిశీలించాం. భక్తులు ప్రశాంతంగా నిమజ్జనోత్సవంలో పాల్గొనేలా చూడాలని పోలీసు అధికారులకు ఆదేశాలిచ్చాం. ప్రధానంగా గోదావరినదిపై నిమజ్జన కార్యక్రమం ఎక్కువగా ఉంటుంది. సింగరేణి రెస్క్యూ సిబ్బంది, గజఈతగాళ్లను అందుబాటులో ఉంచాం. అన్ని శాఖల సమన్వయంతో నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా నిర్వహించేలా చూస్తాం. – అంబర్కిషోర్ఝా, సీపీ, రామగుండం -
ఏర్పాట్లు పరిశీలించిన ఎమ్మెల్యేలు
గోదావరిబ్రిడ్జిపై ఏర్పాట్లను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే రాజ్ఠాకూర్, ఏసీపీ రమేశ్ సుల్తానాబాద్ చెరువు వద్ద పరిశీలిస్తున్న ఎమ్మెల్యే విజయరమణారావు గోదావరిఖని/పెద్దపల్లిరూరల్/సుల్తానాబాద్: గోదావరిబ్రిడ్జి వద్ద గణేశ్ నిమజ్జన ఏర్పాట్లను గురువారం రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్ పరిశీలించారు. బ్రిడ్జిపై సింగరేణి యాజమాన్యం, మున్సిపల్యంత్రాంగం, ఆర్ఎఫ్సీఎల్ చేసిన ఏర్పాట్లను తెలుసుకున్నారు. గోదావరిఖని ఏసీపీ రమేశ్, అదనపు కలెక్టర్ అరుణశ్రీ తదితరులున్నారు. అలాగే సుల్తానాబాద్ చెరువువద్ద నిమజ్జన ప్రాంతాన్ని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు పరిశీలించారు. సుల్తానాబాద్, పెద్దపల్లిలో మినీట్యాంక్ బండ్ వద్ద క్రేన్లు, గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు. గ్రంథాలయ అధ్యక్షుడు అంతటి అన్నయ్య గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ మునిపాల ప్రకాశ్రావు, విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్ తదితరులున్నారు. పెద్దపల్లి మండలం అప్పన్నపేట చెరువులో నిమజ్జన ఏర్పాట్లను అధికారులు పరిశీలించారు. తహసీల్దార్ రాజయ్య, ఎంపీడీవో శ్రీనివాస్ తదితరులున్నారు. -
కేంద్ర ప్రభుత్వ వైఫల్యం వల్లే యూరియా కొరత
పెద్దపల్లిరూరల్: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుతోనే రాష్ట్రంలో యూరియా కొరత ఏర్పడిందని సీపీఐ జాతీయ కౌన్సిల్ సభ్యుడు చాడ వెంకటరెడ్డి అన్నారు. బుధవారం పెద్దపల్లిలో పార్టీ జిల్లా కౌన్సిల్ సమావేశం జిల్లా కార్యదర్శి సదానందం అధ్యక్షతన జరిగింది. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతాంగానికి అవసరమైన యూరియా తెప్పించేందుకు రాష్ట్రానికి చెందిన ప్రజాప్రతినిధులు కేంద్రంపై ఒత్తిడి పెంచాలన్నారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించి సత్తా చూపాలని కోరారు. అనంతరం సురవరం సుధాకర్రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గౌతం గోవర్ధన్, ఎల్లాగౌడ్, వైవీ రావు, స్వామి, గౌస్, రాంచందర్, రాజారత్నం, సునీల్, సూర్య, బాలసాని లెనిన్, చంద్రశేఖర్, శంకర్, రమేశ్, శ్రీనివాస్, లక్ష్మణ్, నవీన్ తదితరులున్నారు. నేడు రేషన్ పంపిణీ బంద్ఓదెల(పెద్దపల్లి): తమ సమస్యలు పరిష్కరించకపోవడాన్ని నిరసిస్తూ శుక్రవారం జిల్లాలోని 413 రేషన్ దుకాణాల్లో సరుకుల పంపిణీ బంద్ చేస్తున్నట్లు డీలర్ల సంఘం జిల్లా కమిటీ ప్రతినిధి మద్దెల నర్సయ్య తెలిపారు. ఈసందర్భంగా జిల్లా సీవిల్సప్లయ్ అధికారికి వినతిపత్రం సమర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా కమీషన్ పెంచాలని కోరారు. లంపీస్కిన్ వ్యాధి నివారణకు చర్యలుకోల్సిటీ(రామగుండం): జిల్లాలో పశువులకు సోకుతున్న లంపీస్కిన్ డిసీస్(ఎల్ఎస్డీ) నివారణకు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా పశువైద్యాధికారి కె.విజయభాస్కర్ తెలిపారు. ఇటీవల విధుల్లో చేరిన ఆయన గురువారం తొలిసారి గోదావరిఖని పశువైద్యశాలను పరిశీలించారు. పశువులకు వ్యాక్సిన్లు వేస్తున్న తీరును పరిశీలించారు. వీధి పశువుల్లో లంపీస్కిన్ వ్యాధి తీవ్రంగా ఉందని, రైతులు తమ పశువులను ఇంటిలోనే కట్టివేసి ఉంచాలని సూచించారు. పశువుల ఒంటిపై దద్దుర్లు కనిపించిన వెంటనే లంపీ స్కిన్ వ్యాధిగా గ్రహించాలని, వెంటనే పశువైద్యశాలకు తరలించి చికిత్స అందించాలని వెల్లడించారు. పారవేట్స్ జిల్లా కార్యదర్శి డి.చంద్రశేఖర్, ఎస్ఎల్ఏ రామ్కిరణ్ తదితరులు పాల్గొన్నారు. మైనింగ్ భూసేకరణలో వేగంపెంచాలిపెద్దపల్లిరూరల్: జిల్లాలోని సింగరేణి మైనింగ్కు సంబంధించి పెండింగ్లో ఉన్న భూసేకరణ ప్రక్రియలో వేగం పెంచాలని కలెక్టర్ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. రామగిరి మండలం బుధవారంపేటలో సింగరేణి ఆర్జీ–2 ఓపెన్కాస్ట్ మైనింగ్ కోసం 86ఎకరాలు సేకరించాల్సి ఉండగా 76 ఎకరాలకు అవార్డు పాసయిందన్నారు. మిగతా 10 ఎకరాలకు సత్వరమే పాస్ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆర్జీ–3 కి సంబంధించి లద్నాపూర్లో పోచమ్మ ఆలయ పనులు ఈనెల 10 వరకు పూర్తికావాలన్నారు. మంథని ఆర్డీవో సురేశ్, స్పెషల్ డెప్యూటీ కలెక్టర్, సింగరేణి మేనేజర్లు, తదితరులున్నారు. టాస్క్ శిక్షణకు 10లోగా నమోదు చేసుకోండి టాస్క్ సెంటర్లో శిక్షణ పొందేందుకు ఆసక్తిగల యువత ఈనెల 10లోగా తమపేర్లు నమోదు చేసుకోవాలని కలెక్టర్ శ్రీహర్ష కోరారు. వృత్తి నైపుణ్యశిక్షణ పొందినవారిలో 30శాతం మందికే ఉద్యోగావకాశాలు దక్కుతున్నాయని, ఆ శాతాన్ని 60కి పెంచేలా టాస్క్, టిహబ్, టీవర్క్స్ సంస్థలు పనిచేస్తున్నాయన్నారు. టాస్క్ ప్రతినిధులు ప్రదీప్రెడ్డి, సుధీర్ తదితరులున్నారు. -
సురవరం ఆశయాలు, లక్ష్యాలు కొనసాగించాలి
కరీంనగర్: పేద ప్రజల పక్షపాతిగా, ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న మహోన్నతమైన గొప్ప కమ్యూనిస్టు యోధుడుగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వ్యక్తి సురవరం సుధాకర్రెడ్డి అని, ఆయన ఆశయాలు, లక్ష్యాలను కొనసాగించాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి అన్నారు. గురువారం కరీంనగర్లోని ఫిల్మ్ భవన్లో సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సురవరం సంస్మరణ సభలో పలువురు నేతలు హాజరై ఆయన చిత్రపటానికి పూలమాలలు వేశారు. నివాళి అర్పించి మౌనం పాటించారు. మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు మాట్లాడుతూ.. సుధాకర్రెడ్డి మృతిచెందడం రాజకీయాలకే అత్యంత బాధాకరమని అన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కలవేన శంకర్ మాట్లాడుతూ.. పేదల సమస్యలపై అనేక పోరాటాలు చేశారన్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, అల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ వుట్కూరి నరేందర్రెడ్డి మాట్లాడుతూ.. నేటితరం యువత ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి పల్లె నర్సింహ ఆలపించిన విప్లవ గేయాలు ఆలోచింపజేశాయి. సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి, సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పోనగంటి కేదారి, అందె స్వామి, కసిరెడ్డి మణికంఠరెడ్డి, నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు గూడెం లక్ష్మి, బత్తుల బాబు, నాగెల్లి లక్ష్మారెడ్డి, పిట్టల సమ్మయ్య, జిల్లా కౌన్సిల్ సభ్యులు ఉమ్మెంతల రవీందర్రెడ్డి, బండ రాజిరెడ్డి, కటికరెడ్డి బుచ్చన్నయాదవ్, గోవిందుల రవి, చొక్కల శ్రీశైలం, పైడిపల్లి రాజు, చాడ శ్రీధర్రెడ్డి, అందె చిన్నస్వామి, న్యాలపట్ల రాజు, కంది రవీందర్రెడ్డి, బీర్ల పద్మ, కొట్టే అంజలి, బామండ్లపెల్లి యుగేందర్, మచ్చ రమేశ్ తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి -
చిట్టీ డబ్బులతో ఉడాయించిన వ్యక్తిపై కేసు
కోరుట్ల రూరల్: మండలంలోని పైడిమడుగుకు చెందిన గుగ్గిళ్ల రమేశ్ చిట్టీల పేరుతో డబ్బులు వసూలు చేసి పారిపోయినట్టు అదే గ్రామానికి చెందిన ఆడె రవిచందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. ఎస్సై చిరంజీవి కథనం ప్రకారం గుగ్గిళ్ల రమేశ్, ఆయన భార్య గాయత్రి చిట్టీల పేరుతో గ్రామంలో పది మంది నుంచి రూ.32.57లక్షలు వసూలు చేశారు. వాటిని తిరిగి ఇవ్వకుండా గ్రామం నుంచి పారిపోయారు. రవిచందర్ ఫిర్యాదు మేరకు రమేశ్, గాయత్రిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు. గ్రామంలో సుమారు రూ.కోటిన్నర వరకూ రమేశ్ చిట్టీల పేరిట వసూలు చేసి తిరిగి ఇవ్వలేదని గ్రామస్తుల ద్వారా తెలిసింది. కరీంనగర్స్పోర్ట్స్: జూని యర్ కళాశాలల క్రీడా సమాఖ్య (ఎస్జీఎఫ్) ఉ మ్మడి జిల్లా కార్యదర్శిగా గుమ్మడి మధు జాన్సన్ నియామకమయ్యారు. కరీంనగర్లోని ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ కామర్స్ జూ నియర్ కళాశాలలో ఫిజికల్ డైరెక్టర్గా పనిచేస్తున్న మధు జాన్సన్ను 2025–26 సంవత్సరానికి క్రీడా సమాఖ్య కార్యదర్శిగా నియమిస్తూ జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి గంగాధర్ ఉత్తర్వులు జారీ చే శారు. ఈ సందర్భంగా మధు జాన్సన్ను సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి, ప్రిన్సిపాల్ సత్యవర్ధన్రావు, ఆంజనేయరావు, వెంకటరమణచారి, శశిధర్ శర్మ, నిర్మల, సుధాకర్, బల్బీర్ సింగ్, అల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి, ఒలింపిక్ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు నందెల్లి మహిపాల్, గసిరెడ్డి జనార్దన్రెడ్డిలు అభినందించారు. -
వినూత్నం.. విజ్ఞానం
పాఠ్యపుస్తకాల్లోని సిలబస్ పూర్తి చేయడమే పరమావధిగా పనిచేస్తున్న నేటి కాలంలో కొందరు ఉపాధ్యాయులు వినూత్న రీతిలో విద్యాబోధన చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. కొందరు పాఠశాలల్లో మెరుగైన సౌకర్యాల కల్పనకు కృషి చేయగా.. ఇంకొందరు నిరుద్యోగులకు అండగా ఉంటూ ఉద్యోగాన్వేషణలో బాసటగా నిలుస్తున్నారు.. పలువురు విద్యాభ్యాసం వయసుతో కూడినది కాదని నిత్య విద్యార్థిగా అభ్యసన చేయాలంటూ ముందుకెళ్తున్నారు.. మరికొందరు విద్యార్థుల్లో సామాజిక సేవ దృక్పథం నింపేందుకు తమదైన శైలిలో ప్రయత్నిస్తున్నారు.. శుక్రవారం ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా కథనాలు..తాను పనిచేసే బడిలో సౌకర్యాల కల్పనకు ప్రయత్నిస్తూనే నిత్య విద్యార్థిగా వందల సంఖ్యలో ఆన్లైన్ కోర్సులు చేస్తూ ముందుకెళ్తున్నారు సిరిసిల్ల పట్టణం శివనగర్ కుసుమరామయ్య జిల్లా పరిషత్ హైస్కూల్ ఇంగ్లిష్ టీచర్ పాతూరి మహేందర్రెడ్డి. 1996లో ఉపాధ్యాయ వృత్తిలో చేరిన పాతూరి పని చేసిన ప్రతీ స్కూల్లో అంకితభావంతో విద్యార్థుల సంఖ్య పెంచారు. పదో తరగతిలో ప్రతిభచాటిన విద్యార్థులకు తన తండ్రి పేరిట గోల్డ్, సిల్వర్ మెడల్స్ అందించారు. విద్యార్థుల్లో మానవతా విలువలు, మంచి లక్షణాలను పెంపొందించే ఉద్దేశంతో పాఠశాలల్లో నిజాయితి దుకాణం, మానవత్వపు గోడ, పెన్ బ్యాంకులను ప్రవేశపెట్టి పిల్లలను ప్రోత్సహించారు. మానవతా సేవలు అందిస్తున్న మహేందర్రెడ్డి ఇప్పటికే ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపిక కాగా, రెండురోజుల క్రితం తెలుగు యూనివర్సిటీ నుంచి ఉత్తమ ఉపాధ్యాయ కీర్తిపురస్కారాన్ని అందుకున్నారు. జ్ఞానాన్ని పెంచుకునేందుకు ఏ వయసులోనైనా చదువుకోవచ్చని పేర్కొన్నారు. సిరిసిల్లఎడ్యుకేషన్: పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచుతూ, సౌకర్యాలు కల్పిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు హెచ్ఎం చకినాల శ్రీనివాస్. సిరిసిల్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో హెచ్ఎంగా 2018లో విధుల్లో చేరారు. అప్పుడు ఉన్న విద్యార్థులు 31 మంది కాగా ప్రస్తుతం 306కు చేరింది. రెండేళ్లుగా పదో తరగతిలో 100 శాతం ఉత్తీర్ణత సాధిస్తున్నారు. పాఠశాలలో వసతుల కల్పనకు పూర్వ విద్యార్థులతో చర్చించి కంప్యూటర్ ల్యాబ్, గ్రంథాలయం, సీసీ కెమెరాలు, వాటర్ ఫిల్టర్ ఏర్పాటుకు కృషి చేశారు. విద్యార్థుల సౌకర్యార్థం పలువరికి సైకిళ్లు అందజేశారు. విద్యార్థులను తమ బడికి రప్పించేలా వేసవి సెలవుల్లో ఉచిత కంప్యూటర్ శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేసి మన్ననలు పొందారు. 2022లో రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్నారు. విద్యార్థుల ప్రవేశాలను గణనీయంగా పెంచి, మెరుగైన ఫలితాలు సాధిస్తున్న గణాంకాల ప్రాతిపదికన కలెక్టర్ సందీప్కుమార్ఝా ప్రత్యేక చొరవతో ఈ ఏడాది జిల్లా ఉత్తమ ప్రధానోపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పని చేసుకుంటూ పోతే అవార్డులు రివార్డులు వస్తుంటాయని, విద్యార్థులకు మరింత మెరుగైన బోధన అందించేందుకు మద్రాస్ ఐఐటీతో అవకాశాలు కల్పించడం సంతోషంగా ఉందన్నారు. -
పిల్లల ఆరోగ్యంపై శ్రద్ధ
పెద్దపల్లిరూరల్: ఆర్బీఎస్కే బృందాలు విద్యార్థులకు వైద్యపరీక్షలు చేస్తూ, మెరుగైన చికిత్స అందించాలని డీఎంహెచ్వో వాణిశ్రీ సూచించారు. ఆర్బీఎస్కే మొబైల్టీం, మల్టీపర్సస్ హెల్త్ అసిస్టెంట్, ల్యాబ్ టెక్నీషియన్లతో డీఎంహెచ్వో బుధవారం సమావేశమయ్యారు. గుండె సమస్యలు ఉన్నాయనే అనుమానంతో 30 మంది చిన్నారులను గుర్తించామని, వారికి పీడి యాట్రిక్ శిబిరంలో నిర్ధారణ పరీక్షలు చే స్తామని తెలిపారు. ప్రోగ్రాం అధికారులు శ్రీరాములు, కిరణ్కుమార్, ఉమామహేశ్వర్, రవీందర్, అంజయ్య తదితరులు ఉన్నారు. సిలబస్ పూర్తిచేయండి సుల్తానాబాద్రూరల్(పెద్దపల్లి): నిర్దేశిత సమయంలో సిలబస్ పూర్తిచేయాలని జిల్లా ఇంటర్ విద్య నోడల్ అధికారి కల్పన సూచించారు. గ ర్రెపల్లి మోడల్ స్కూల్ను బుధవారం ఆమె త నిఖీ చేశారు. నిబంధన ప్రకారం సిలబస్ పూర్తి చేయడంతోపాటు సకాలంలో ప్రాక్టికల్స్ నిర్వ హించాలని సూచించారు. ప్రిన్సిపాల్ గోల్డి బ ల్బీర్కౌర్, అధ్యాపకులు పాల్గొన్నారు. ట్రీగార్డులు అమర్చాలి పెద్దపల్లిరూరల్: వనమహోత్సవం ద్వారా రో డ్లకు ఇరువైపులా నాటిన ప్రతీమొక్కను కాపాడేందుకు ట్రీగార్డులు అమర్చాలని జిల్లా పంచాయతీ అధికారి వీరబుచ్చయ్య సూచించారు. పెద్దబొంకూర్, కొత్తపల్లి గ్రామాల్లో మొక్కలను నాటే పనులను ఎంపీడీవో శ్రీనివాస్తో కలిసి బుధవారం ఆయన పరిశీలించారు. ఎండిపోయిన మొక్క స్థానంల వెంటనే మరో మొక్క నాటాలని ఆయన సూచించారు. జిల్లాస్థాయి పోటీల్లో ప్రతిభ పెద్దపల్లిరూరల్: స్థానిక జెడ్పీ బాలికోన్నత పా ఠశాలలో బుధవారం జిల్లాస్థాయి గణిత, సైన్స్ క్విజ్క్లబ్ టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. మండలస్థాయిలో విజేతలుగా నిలిచిన విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొని 10 మంది ప్రతిభ చూపా రు. విజేతలకు అకడమిక్ కో ఆర్డినేటర్ పీఎం షేక్, డీసీఈబీ కార్యదర్శి హనుమంతు, ఎంఈ వో సురేందర్, హెచ్ఎం అరుణ ప్రశంసాపత్రాలను అందించారు. విజేతలు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని వారు పేర్కొన్నారు. విద్యుత్ బకాయిలపై దృష్టి పెద్దపల్లిరూరల్: వినియోగదారులు సకాలంలో బిల్లులు చెల్లించేలా చూడాలని ఎన్పీడీసీఎ ల్ ఎస్ఈ గంగాధర్ సూచించారు. రాఘవాపూ ర్ విద్యుత్ సబ్స్టేషన్లో బుధవారం పలు అంశాలపై సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ కనెక్షన్లు నాణ్యమైన సామగ్రితో ఉండేలా చూ డాలని ఆయన అన్నారు. గణేశుని నిమజ్జనోత్సవం సందర్భంగా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, అంతరాయం కలుగకుండా చర్యలు చేపట్టాలని ఆయన అన్నారు. అప్రమత్తంగా ఉండాలి పెద్దపల్లిరూరల్: గణపతి నవరాత్రులు, నిమజ్జనం సందర్భంగా మండప నిర్వాహకులు అ ప్రమత్తంగా ఉండాలని అగ్నిమాపక శాఖ అధి కారి రాజేందర్ సూచించారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కాలేజీ భారీగణేశుడితోపాటు పలు మండపాల నిర్వాహకులకు బుధవారం ఆయ న అవగాహన కల్పించారు. వినాయక విగ్రహాల శోభాయాత్ర సందర్భంగా విద్యుత్ తీగలతో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. -
ప్రత్యామ్నాయంపై ప్రత్యేక దృష్టి
గోదావరిఖని: భారీవర్షాలు కురుస్తున్నా.. పనులకు అంతరాయం కలుగుతున్నా.. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ, ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతూ సింగరేణి నిర్దేశిత బొగ్గు ఉత్పత్తి వైపు పయనిస్తోంది. ప్రధానంగా ఓసీపీల్లో ప్రతికూల ప్రభావం చూపుతున్నా.. భూగర్భ గనుల్లో అధిక ఉత్పత్తి తీసేలా యాజమాన్యం ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఐదు నెలలు.. 24.19 మిలియన్ టన్నులు.. ఈ ఆర్థిక సంవత్సరంలోని గత ఐదు నెలల్లో 25.64 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి తీయాలనే లక్ష్యానికి 24.19 మిలియన్ టన్నులు సాధించింది. ఇది నిర్దేశిత లక్ష్య సాధనలో 94 శాతంగా నమోదు అయ్యింది. అయితే, సింగరేణి వ్యాప్తంగా పరిశీలిస్తే.. ఆర్జీ–2 ఏరియా 129 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించి అగ్రస్థానంలో నిలిచింది. అదేవిధంగా ఏపీఏ ఏరియా కేవలం 15 శాతం ఉత్పత్తితో చివరి స్థానంలో ఉండిపోయింది. కీలక ఓసీపీలపై ప్రత్యేక దృష్టి.. భారీవర్షాల నేపథ్యంలో 80 శాతం బొగ్గు ఉత్పత్తి చేసే కీలక ఓసీపీలపైనే సింగరేణి యాజమాన్యం దృష్టి సారించింది. వర్షాలు కురిసి.. ఆ తర్వాత తగ్గుముఖం పట్టిన వెంటనే బొగ్గు రవాణా ప్రా రంభం కావాలని యాజమాన్యం సీరియస్గా ఆ దేశాలు జారీచేసింది. భారీవర్షాలతో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలుగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది. ఈక్రమంలో కొత్తగూడెం, బెల్లంపల్లి రీజియన్లోని గనుల్లో 95శాతం బొగ్గు ఉత్పత్తి సాధించగా, రామగుండం రీజియన్లో 94శాతం బొగ్గు ఉత్పత్తి నమోదు చేసింది. లక్ష్య సాధనపై దిశానిర్దేశం.. వార్షిక బొగ్గు ఉత్పత్తి లక్ష్య సాధనపై సింగరేణి యాజమాన్యం తరచూ సమీక్ష సమావేశాలు నిర్వహిస్తోంది. ఈక్రమంలో గత మంగళవారం అన్ని ఏరియాల జీఎంలతో సీఎండీ బలరాం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ అంశాలపై సమీక్షించారు. ప్రతీరోజు 1.80 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించాలని, 2.10 లక్షల టన్నులు రవాణా చేయాలని ఆదేశించారు. అన్నిఏరియాల్లోనూ పొదుపు చర్యలు పాటించాలని సూచించారు. భారీవర్షాలతో ఓసీపీల్లో బొగ్గు ఉత్పత్తి తగ్గే అవకాశం ఉన్నక్రమంలో భూ గర్భగనుల్లో ఉత్పత్తి పెంచాలని ఆదేశించారు.