breaking news
Peddapalli
-
సీజనల్ వ్యాధులపై అప్రమత్తం
● డెంగీ ప్రబలకుండా పకడ్బందీ చర్యలు ● డ్రై డే.. ఫ్రై డే రోజు ఇంటింటా సర్వే ● పరిసరాల శుభ్రతపై అవగాహన ● ‘సాక్షి’తో జిల్లా వైద్యాధికారి అన్నప్రసన్నకుమారిపెద్దపల్లిరూరల్: వానాకాలమంటేనే వ్యాధుల కాలం.. వ్యర్థపు వస్తువుల్లో నీరు నిలిస్తే దోమలు, ఈగలు ఇతర క్రిములు వృద్ధి చెంది రోగాలు ప్రబలే అవకాశముంటుంది. అందుకే ప్రతి ఒక్కరూ తమ ఇంటిని, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అన్నప్రసన్నకుమారి పేర్కొన్నారు. ఇందుకోసం ఊరూరా ఆశావర్కర్లు, ఏఎన్ఎంలు ఇంటింటికీ వెళ్లి ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారని, వ్యాధులను కట్టడి చేసేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. జిల్లా కలెక్టర్ నిత్యం సమీక్షలు నిర్వహిస్తూ ప్రత్యేక చర్యలు తీసుకునేలా ఆదేశాలిస్తున్నారని వివరించారు. ఈసందర్భంగా గురువారం ‘సాక్షి’తో మాట్లాడారు.సాక్షి: సీజనల్ వ్యాధుల కట్టడికి తీసుకుంటున్న చర్యలు.?డీఎంహెచ్వో: వానాకాలంలో వ్యాధులబారిన పడకుండా అప్రమత్తంగా ఉండేలా అవగాహన కల్పిస్తున్నాం. ఇళ్ల ఆవరణలోని వ్యర్థాలలో వర్షపు నీరు నిలిచి దోమలు వృద్ధి చెందకుండా తమ సిబ్బంది అవగాహన కల్పిస్తున్నారు. సాక్షి: జిల్లాలో ఫీవర్ సర్వే నిర్వహిస్తున్నారా.?డీఎంహెచ్వో: జిల్లాలో రోజూ ఫీవర్ సర్వే జరుగుతోంది. సాయంత్రం వరకు సిబ్బంది వివరాలతో కూడిన నివేదిక ఇస్తున్నారు. సాక్షి : జ్వరపీడితులను గుర్తించి అందిస్తున్న సేవలు.?డీఎంహెచ్వో: ఇంటింటా సర్వేకు వెళ్లిన సమయంలో జ్వరంతో బాధపడుతున్నవారిని గుర్తిస్తే వారినుంచి రక్తనమూనాలు సేకరించి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయిస్తున్నాం. వ్యాధిని బట్టి వారికి సేవలందిస్తూనే ఆ ఇంటి పరిసరాల ప్రజలకు వ్యాధులు సోకకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. సాక్షి: ఫ్రై డే, డ్రై డే రోజున చేపట్టే కార్యక్రమాలు.?డీఎంహెచ్వో: ఆశావర్కర్లు ఫ్రై డే, డ్రై డే రోజు ఇంటింటికీ వెళ్లి ఆరోగ్య సమస్యలపై ఆరా తీస్తారు. ఆ రోజు కనీసం 30 ఇళ్లు సందర్శించి కుటుంబసభ్యుల ఆరోగ్యస్థితి తెలుసుకుని వారి నుంచి సంతకం తీసుకుంటారు.సాక్షి: డెంగీ, విషజ్వరాలబారిన పడ్డవారికి అందించే సేవలు.?డీఎంహెచ్వో: డెంగీ, విషజ్వరాల బాధితులకు పల్లె ప్రాంతాల్లోని పీహెచ్సీ, సబ్సెంటర్లు, పట్టణాల్లో ఆసుపత్రులు, బస్తీ దవాఖానాల్లో సిబ్బంది అందుబాటులో ఉండిి సేవలందిస్తున్నారు. అవసరమైన మందులన్నీ అందుబాటులో ఉన్నాయి. దోమలబారిన పడకుండా జాగ్రత్తలు పాటించాలి. దోమతెరలు వాడడం మేలు. సాక్షి: ఇప్పటివరకు డెంగీ కేసులు గుర్తించారా.?డీఎంహెచ్వో: జిల్లాలో ఇప్పటివరకు 10 డెంగీ కేసులు గుర్తించాం. అందులో కొన్ని వలసవచ్చిన వారివే. రాఘవాపూర్, గుంపుల, కొలనూర్ ప్రాంతాల్లో గుర్తించి వైద్యమందించాం. వారి ఇంటి పరిసరాల్లో ఉండే వారికి ౖపరీక్షలు చేయించాం. సాక్షి: దోమల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు.?డీఎంహెచ్వో: పంచాయతీ అధికారుల సమన్వయంతో దోమలను నిర్మూలించేలా చూస్తున్నాం. నీరు నిలవకుండా గుంతలు పూడ్చడం, డ్రైనేజీల్లో ఆయిల్బాల్స్ వేయడం, అవసరమైన ప్రాంతాల్లో ఫాగింగ్ చేయిస్తున్నారు. సాక్షి: వైద్యసిబ్బందిని అప్రమత్తం చేసేందుకు అనుసరిస్తున్న పద్ధ్దతులేంటి.?డీఎంహెచ్వో: వ్యాధులు ప్రబలకుండా ఎప్పటికప్పుడు తమ సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నాం. ఇందుకోసం ప్రత్యేక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేశాం. ప్రత్యేక బృందాలను సిద్ధంగా ఉంచాం. ఎప్పటికప్పుడు అందుతున్న సమాచారాన్ని బట్టి తమ సిబ్బంది సేవలందిస్తున్నారు. -
విద్యార్థులకు రోబోటిక్స్ శిక్షణ
పెద్దపల్లిరూరల్/రామగుండం/కమాన్పూర్: జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో 8,9వ తరగతుల విద్యార్థులకు గురువారం సోహం అకాడమీ ఆఫ్ హ్యుమన్ ఎక్సలెన్స్ సంస్థ ఆధ్వర్యంలో రోబోటిక్స్ శిక్షణ ప్రారంభించారు. పెద్దపల్లిలోని జిల్లా పరిషత్ (బాలుర)ఉన్నత పాఠశాల, రామగుండం పరిధిలోని లింగాపూర్ ఆదర్శ విద్యాలయం, కమాన్పూర్ జెడ్పీ స్కూల్లో ఆధునిక సాంకేతికతపై అవగాహన కల్పించారు. పాఠశాలకు రోబోటిక్ కిట్ అందించి విద్యార్థులు ఆధునిక సాంకేతికతపై ఆవిష్కరణలు చేసేలా ఆసక్తి పెంపొందిస్తున్నారని జెడ్పీహెచ్ఎస్ ఇన్చార్జి హెచ్ఎం సురేంద్రప్రసాద్, ఎంఈవో సురేందర్కుమార్ తెలిపారు. శిక్షణకు లింగాపూర్ ఆదర్శ విద్యాలయం నుంచి 35 మందిని ఎంపిక చేసినట్లు ప్రిన్సిపాల్ సదానందం వివరించారు. కమాన్పూర్ జెడ్పీ స్కూల్ నుంచి 21 మంది విద్యార్థులు ఎంపికై నట్లు ఎంఈవో విజయ్కుమార్ పేర్కొన్నారు. విమానాశ్రయం ఏర్పాటు చేయాలని వినతి గోదావరిఖని(రామగుండం): అంతర్గాం మండలంలో విమానాశ్రయం ఏర్పాటు చేయాలని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్ కోరారు. గురువారం పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావుతో కలిసి కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి రామ్మోహన్నాయుడుకు వినతిపత్రం అందజేశారు. పెద్దపల్లి జిల్లా భౌగోళికం, పరిశ్రమలు, జనాభా వృద్ధి, రవాణా అవసరాలు తదితర అంశాలను దృష్టిలో ఉంచుకుని విమానశ్రయం ఏర్పాటు చేయాలని కోరినట్లు తెలిపారు. దీనిపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్లు పేర్కొన్నారు. సాంకేతిక పరిశీలనల అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని వివరించారు. శిక్షణను వినియోగించుకోవాలి సుల్తానాబాద్(పెద్దపల్లి): అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పరీక్షకు హాజరుకానున్న న్యాయవాదులు రెండునెలల ఉచిత ఆన్లైన్ శిక్షణను వినియోగించుకోవాలని లీగల్సెల్ కన్వీనర్ వరలక్ష్మి కోరారు. గురువారం మండలకేంద్రంలోని కోర్టు ఆవరణలో ఉచిత శిక్షణ పోస్టర్ ఆవిష్కరించి మాట్లాడారు. ఆసక్తిగలవారు ప్రోగ్రాం కో ఆర్డినేటర్ అభిలాష్ ఆశ్రిత్ (91330 35555)ను సంప్రదించాలన్నారు. తెలంగాణ బార్ కౌన్సిల్ గుర్తింపు కార్డుతో ఈ నెల 10 లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మేకల తిరుపతిరెడ్డి, జనరల్ సెక్రటరీ బోయిని భూమయ్య న్యాయవాదులు పాల్గొన్నారు. చేనేతరంగాన్ని బలోపేతం చేద్దాం పెద్దపల్లిరూరల్: చేనేత రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని అదనపు కలెక్టర్ వేణు అన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా గురువారం కలెక్టరేట్లో నిర్వహించిన కార్యక్రమంలో కొండ లక్ష్మణ్బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కలెక్టరేట్ నుంచి ప్రధాన ద్వారం వరకు చేనేత కార్మికులతో కలిసి ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా బాపూజీ అవార్డు గ్రహీతలను సత్కరించారు. వ్యాసరచన పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ప్రభుత్వ సంస్థల్లో వినియోగించే విద్యార్థుల యూనిఫాం, మహిళా సంఘాలకు అందించే చీరలు తయారీకి నేతన్నలకే ఆర్డర్ ఇచ్చినట్టు పేర్కొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలన్నారు. జెడ్పీసీఈవో నరేందర్, హౌజింగ్ పీడీ రాజేశ్వర్, డీఎంవో ప్రవీణ్రెడ్డి తదితరులున్నారు. -
ిఫీవర్.. ఫియర్
విషాదంలో మృతుడి కుటుంబం ఇళ్ల మధ్య పిచ్చిమొక్కలు గోదావరిఖని కేసీఆర్కాలనీలో ఎక్కడ చూసినా ఇళ్ల మధ్య ఖాళీ స్థలాల్లో పిచ్చిమొక్కలు ఏపుగా పెరిగాయి. ప్లాట్ యజమానులను రామగుండం బల్దియా అధికారులు గుర్తించి ఇప్పటి వరకు నోటీసులు కూడా జారీ చేయలేదని ఆరోపణలున్నాయి. ఖాళీ స్థలాల్లో నిత్యం పాములు సంచరిస్తుండడంతో కాలనీవాసులు భయందోళనలకు గురవుతున్నారు. పారిశుధ్య లోపంతో పందులు స్వైరవిహారం చేస్తున్నాయి.టెంటువేసిన ఇంటి ఎదుట విషాదంతో విలపిస్తున్న ఈ కుటుంబం గోదావరిఖని కేసీఆర్కాలనీకి చెందినది. చింతల దీపక్ అనే టెన్త్ స్టూడెంట్ ఈనెల 5న జ్వరం, జాండీస్ లక్షణాలతోపాటు గుండెపోటుతో మృతిచెందాడని వైద్య బృందం చెబుతోంది. ఐదేళ్ల క్రితం భర్తను కోల్పోయిన పుష్పలత అనే నిరుపేద మహిళ, ఇప్పుడు 15 ఏళ్ల కొడుకును కోల్పోయి పుట్టెడు దుఃఖంతో రోదిస్తోంది. తాను నివాసం ఉంటున్న కాలనీలో లోపించిన పారిశుధ్య సమస్యలతోనా..? తీవ్ర అనారోగ్యంతో తన కొడుకు మృతి చెందాడా..? తేల్చుకోలేక ఆవేదన చెందుతోంది. డివిజన్లలో పారిశుధ్యం మెరుగుపర్చడానికి వందరోజుల ప్రత్యేక కార్యాచరణతో రోజుకో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కానీ, కేసీఆర్కాలనీలో పర్యటిస్తే అందుకు భిన్నంగా పారిశుధ్యం లోపాలు దర్శనమిస్తున్నాయి. ప్రధాన కాలువలు చెత్తచెదారంతో నిండి కనిపిస్తున్నాయి. కేసీఆర్కాలనీ, ప్రగతినగర్, సాయినగర్లో దోమల బెడద కంటిమీద కునుకులేకుండా చేస్తోందని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఫాగింగ్ కూడా చేపట్టడం లేదని ఆరోపిస్తున్నారు. గతంలో ఈ కాలనీలో ఒకరికి డెంగీ పాజిటీవ్ వచ్చింది.కదిలిన యంత్రాంగం -
క్రమశిక్షణకు కానుక
గోదావరిఖని(రామగుండం): ‘బైక్ ఆపి పక్కన పెట్టమ్మా.. అనగానే ఆడపడుచు ముఖంలో ఆందో ళన.. ఎక్కడ ఫైన్ వేస్తారో.. పాత చలాన్లు కట్టమంటారోనని అనుమానంతో అక్కడే నిల్చుంది.. మీరు హెల్మెట్ పెట్టుకుని బైక్ నడుపుతున్నందుకు అభినందిస్తున్నాం.. మీకు చీర బహుమతిగా ఇస్తున్నాం’.. అని ట్రాఫిక్ ఏసీపీ చెప్పడంతో సంబ్రమాశ్చర్యాలకు లోనయ్యారు మహిళా బైక్రైడర్లు. ట్రాఫిక్ నియమాలు కచ్చితంగా పాటిస్తున్న మహిళలకు చీర బహూకరించి గౌరవించారు. పవిత్ర శ్రావణ మాసం కావడం.. ట్రాఫిక్ పోలీసుల నుంచి చీర అందుకోవడంతో వారి సంతోషానికి అవధులు లేవు. నిబంధనలపై చైతన్యం గోదావరిఖని ట్రాఫిక్ పోలీసులు వినూత్న శైలిలో బైక్ రైడర్లను ట్రాఫిక్ నిబంధనలపై చైతన్య పరుస్తున్నారు. ఫైన్వేయడం, చలాన్లు కట్టమనడం, డ్రంకెన్డ్రైవ్ చేపట్టడమే కాదు. నిబంధనల ప్రకారం డ్రైవ్ చేసే వారిని అభినందిస్తామని నిరూపించారు. గురువారం స్థానిక ట్రాఫిక్ జంక్షన్ వద్ద రామగుండం ఏసీపీ సీహెచ్.శ్రీనివాస్ ఆధ్వర్యంలో సీఐ రాజేశ్వర్రావు, ఎస్సై హరిశేఖర్ తనిఖీలు చేపట్టారు. ఈక్రమంలో హెల్మెట్ ధరించి, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తున్న పలువురు మహిళలను అభినందించడంతో పాటు చీర బహుమతిగా అందజేశారు. అతివల ఆనందం ట్రాఫిక్ పోలీసుల నుంచి చీర బహుమతిగా అందుకున్న మహిళలు సంభ్రమాశ్చర్యానికి లోనయ్యారు. ‘మా క్రమశిక్షణకు ఈస్థాయిలో గుర్తింపు లభించడమనేది ఎంతో గౌరవంగా ఉందన్నారు. ఇది మరింత బాధ్యతతో ట్రాఫిక్ నియమాలు పాటించేలా చైతన్యం కలిగిస్తుంది’ అని పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమాలు యువతతో పాటు అన్ని వయస్సుల వారికి సురక్షిత ప్రయాణంపై అవగాహన పెంచుతుందని అంటున్నారు. బట్టలషాపు యజమానుల ప్రోత్సాహంతో.. ట్రాఫిక్ పోలీసుల సూచనల మేరకు కొంతమంది బట్టషాపుల యజమానులు ఉచితంగా చీరలు అందజేసేందుకు ముందుకు వచ్చారు. వేలకు వేలు పెట్టి ప్రచారం కన్నా ఓ మంచి పనికి తమకు సహకరించాలని కోరడంతో గోదావరిఖని లక్ష్మీనగర్లోని పలు షాపుల యజమానులు అంగీకరించారు. దీనిలో భాగంగా స్థానిక భువనేశ్వరి సిల్క్ నుంచి పది చీరలు తీసుకువచ్చి ట్రాఫిక్ నియమాలు పాటించిన ఆడపడుచులకు అందజేశారు. హెల్మెట్ పెట్టుకో.. గిఫ్ట్ పట్టుకో.. మహిళా బైక్రైడర్లకు శ్రావణం చీర ఆఫర్ గోదావరిఖని ట్రాఫిక్ పోలీసుల వినూత్న అవగాహనఇదే విధానం కొనసాగిస్తాం ట్రాఫిక్ నియమాలు పాటించే వారిని అభినందించాలని నిర్ణయించాం. గతంలో గులాబీ పువ్వు ఇచ్చే పద్ధతి కొనసాగేది. దీనివల్ల చాలామంది బాధపడిన సందర్భాలున్నాయి. శ్రావణమాసం కావడంతో ఆడపడుచులకు చీరలు అందించాలని ఆలోచించాం. ఈమేరకు బట్టల షాపు నుంచి స్పాన్సర్ తీసుకున్నాం. షాపు యజమాని ఇచ్చిన చీరలను షాప్ పేరుతో ఉన్న కవర్తో సహా అందజేశాం. ఇదే పద్ధతి రాబోయే రోజుల్లో కూడా కొనసాగిస్తాం. నిబంధనలు పాటించి ప్రతీఒక్కరు సురక్షితంగా గమ్యం చేరడమే మా లక్ష్యం. – సీహెచ్.శ్రీనివాస్, ఏసీపీ, ట్రాఫిక్ రామగుండం -
దోమలతో నరకం
దోమలతో భరించలేకపోతున్నాం. సూదులతో పొడిచినట్లు కుడుతున్నాయి. పగలు, రాత్రి నిద్రలేకుండా చేస్తున్నాయి. అందరికీ జ్వరాలే వస్తున్నాయి. పాముల భయంతో రోడ్డుమీద అడుపెట్టలేకపోతున్నాం. చిత్తడిగా పెరిగిన పిచ్చిచెట్లను తొలగించాలి. – కత్తరమల్ల శంకరమ్మ, కేసీఆర్కాలనీ, గోదావరిఖనిస్పెషల్డ్రైవ్ చేపట్టాలి కేసీఆర్కాలనీ, ప్రగతినగర్, సాయినగర్లో బల్దియా అధికారులు స్పెషల్ డ్రైవ్ చేపట్టాలి. దోమలతో విషజ్వరాలు ప్రబలకముందే అప్రమత్తం కావాలి. ఇప్పటికే టెన్త్ స్టూడెంట్ చనిపోవడంతో స్థానికులు భయంతో వణుకుతున్నారు. పారిశుధ్యం మెరుగుకు వారం పాటు ప్రత్యేక చర్యలు చేపట్టాలి. – మిట్టపెల్లి మహేందర్, కేసీఆర్కాలనీ, గోదావరిఖని -
చిన్నారుల చదువుపై శ్రద్ధ చూపాలి
పెద్దపల్లిరూరల్: పెద్దపల్లిలోని బాలసదనం కేంద్రాన్ని గురువారం కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆకస్మికంగా సందర్శించారు. చిన్నారులతో కాసేపు ముచ్చటించారు. వారంతా బడికి వెళ్లేలా చూడాలని, చిన్నారుల చదువుపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. చందపల్లిలోని బస్తీ దవాఖానాలో ఒపీ సేవలపై ఆరా తీశారు. సఖి కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్ సమస్యలతో కేంద్రాన్ని ఆశ్రయించే వారికి సంపూర్ణ సహకారం అందించాలన్నారు. ‘టాస్క్’ శిక్షణకు ప్రచారం కల్పించాలి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ‘టాస్క్’ శిక్షణ కేంద్రంపై విస్తృత ప్రచారం కల్పించాలని కలెక్టర్ అన్నారు. గురువారం కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాబోయే 6నెలల్లో కనీసం వెయ్యిమందికి ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ముందుకు సాగాలన్నారు. ఇతర పనులపై దృష్టిసారించాలి వ్యవసాయం, సినిమాటోగ్రఫీ రంగాల్లో ఉపాధి పొందేందుకు వీలుగా శిక్షణ ఇచ్చేందుకుగల అవకా శాలను పరిశీలించాలని కలెక్టర్ సంబంధిత అధి కారులకు సూచించారు. పంటల సాగులో వచ్చిన ఆధునిక సాంకేతికతపై శిక్షణ ఇవ్వాలన్నారు. అక్రమంగా ఇసుక తరలిస్తే చర్యలు జిల్లాలోని ఇసుక రీచ్ల నుంచి అక్రమంగా ఇసుక తరలించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ కోయ శ్రీహర్ష హెచ్చరించారు. కాల్వశ్రీరాంపూర్ మండలం పెగడపల్లి శివారులో గురువారం అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ను సీజ్ చేసినట్టు తెలిపారు. 15రోజుల్లోగా రికవరీ చేయాలి జిల్లాలోని సీ్త్రనిధిలో దుర్వినియోగం చేసిన నిధులను సంబంధిత వీఓఏ, ఓబీల నుంచి 15రోజుల్లోగా రికవరీ చేయాలని, లేదంటే చట్ట ప్రకారం ఆస్తులను జప్తు చేస్తామని కలెక్టర్ హెచ్చరించారు. గురువారం కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. ప్రతి గ్రామంలో స్వశక్తి సంఘాల సభ్యుల లావాదేవీల రికార్డులు స్పష్టంగా ఉండాలన్నారు. పీహెచ్సీ తనిఖీ ఓదెల(పెద్దపల్లి): ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష పేర్కొన్నా రు. గురువారం మండలంలోని కొలనూర్ పీహెచ్సీని తనిఖీ చేశారు. సిబ్బంది సమయపాలన పాటించాలని సూచించారు. జిల్లా సంక్షేమ అధికారి వేణుగోపాల్, డాక్టర్ సంజనేశ్ పాల్గొన్నారు. కలెక్టర్ కోయ శ్రీహర్ష -
నిబంధనలు పాటించినందుకు శ్రావణం చీర
గోదావరిఖని(రామగుండం): మహిళా బైక్రైడర్లకు ట్రాఫిక్ పోలీసులు శ్రావణం చీర కానుక ప్రకటించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ హెల్మెట్ ధరించిన మహిళలకు చీర, జాకెట్ అందజేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని మున్సిపల్ ఆఫీస్ చౌరస్తా వద్ద గురువారం పోలీసులు ప్రత్యేక తనిఖీ చేపట్టారు. హెల్మెట్ ధరించి.. నిబంధనలకు అనుగుణంగా బైక్ డ్రైవ్ చేస్తున్న మహిళలను గుర్తించి చీరలు అందజేసి సత్కరించారు. ట్రాఫిక్ చలాన్లు, డ్రంకెన్ డ్రైవ్, రాంగ్ పార్కింగ్ ఫైన్లే కాదు.. నిబంధనలు పాటించే వారిని గుర్తించి గౌరవిస్తామని రామగుండం ఏసీపీ సీహెచ్.శ్రీనివాస్ స్పష్టం చేశారు. మొదటి దఫాగా పదిమంది మహిళలను గుర్తించి చీరలు అందజేసినట్లు తెలిపారు. భర్త హెల్మెట్తో బైక్ నడుపుతుంటే.. వెనకాల కూర్చున్న భార్యకు కూడా చీర, జాకెట్ అందజేసి.. హెల్మెట్ పెట్టుకునేలా ప్రోత్సహించాలని ఏసీపీ కోరారు. బట్టల దుకాణాల యజమానుల సహకారంతో ఈ కార్యక్రమం కొనసాగిస్తామని వివరించారు. గతంలో పూలు అందజేసి అభినందిస్తే చాలామంది బాధపడ్డారని, దాన్ని దృష్టిలో పెట్టుకుని మహిళలకు చీర, జాకెట్, బైక్ నడిపే పురుషులకు ప్యాంట్, షర్ట్ దాతల సహకారంతో అందిస్తామని వివరించారు. కార్యక్రమంలో ట్రాఫిక్ సీఐ రాజేశ్వర్రావు, ఎస్ఐ హరిశేఖర్, సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రొఫె‘సార్’కు ఘననివాళి
పెద్దపల్లిరూరల్: తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతిని కలెక్టరేట్లో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి కలెక్టర్ కోయ శ్రీహర్ష పూలమాల వేసి ని వాళి అర్పించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో సార్ పాత్ర మరువలేనిదని ఆయన అన్నారు. ఆయన ఆశయ సాధనకోసం అందరూ కృషి చేయాలని కలెక్టర్ కోరారు. పలువురు జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. జాతిపితగా గుర్తించాలి మంథని: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సర్వం త్యాగం చేసిన ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ను తెలంగాణ జాతిపితగా గుర్తించాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మంథని విజయ్కుమార్ కోరారు. జయశంకర్ సార్ జయంతి సందర్భంగా పట్టణంలోని ఆయన విగ్రహానికి బుధవారం పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం విజయ్కుమార్ మాట్లాడుతూ, సార్ ఆశయ సాధనకు కృషి చేయాలన్నారు. నాయకులు గోగుల రాజిరెడ్డి, గుర్రం దేవేందర్గౌడ్, బెజ్జింకి డిగంబర్, జాడి జంపన్న తదితరులు పాల్గొన్నారు. అలాగే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో నాయకులు ఏగోళపు శంకర్గౌడ్, ఆరెపల్లి కుమార్, తగరం శంకర్లాల్, మాచిడి రాజుగౌడ్, ఆసిఫ్ఖాన్, పుప్పాల తిరుపతి తదితరులు పాల్గొన్నారు. మహిళా సాధికారత లక్ష్యం జ్యోతినగర్(రామగుండం): మహిళా సాధికార త లక్ష్యంగా అందరూ బాధ్యతతో పనిచేయా లని మహిళా సాధికారత జిల్లా కో ఆర్టినేటర్ దయా అరుణ కోరారు. ఎన్టీపీసీ కృష్ణానగర్లో బుధవారం ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. మహిళల హక్కు లు, అంగన్వాడీ కార్యకర్తల సేవలు, పనిప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపులు, సఖి కేంద్రం సేవలు, టోల్ ఫ్రీ నంబర్లు, ఉన్నత విద్య, లింగ వివక్ష, బాలసదనం సేవలు తదితర అంశాలపై ఆమె అవగాహన కల్పించారు. విక్టరీ ఇన్స్టిట్యూట్ నిర్వాహకురాలు వరలక్ష్మీ, అధ్యాపకురాలు శ్రీజ, అనూష, శిక్షణ పొందుతున్న మహిళలు తదితరులు పాల్గొన్నారు. తల్లిపాలు అమృతంతో సమానం జ్యోతినగర్(రామగుండం): తల్లిపాలు శిశువుకు అమృతం లాంటివని రామగుండం ఐసీడీఎస్ ప్రాజెక్టు సీడీపీవో అలేఖ్య అన్నారు. తల్లిపాల వారోత్సవాల సందర్భంగా ఎన్టీపీసీ అన్న పూర్ణకాలనీ అంబేడ్కర్హాల్లో గర్భిణులకు బుధవారం సీమంతం జరిపించారు. అలేఖ్య మాట్లాడుతూ, ప్రస్తుత ఆధునిక శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం తల్లిపాల కన్నా మెరుగైన ఆహా రం తయారు చేయలేకపోయిందని అన్నారు. అందుకే తల్లిపాల విష్ఠతను వివరిస్తూ ఏటా ఆగస్టు ఒకటినుంచి ఏడోతేదీ వరకు తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తున్నామని ఆమె తెలిపారు. కార్యక్రమంలో సూపర్వైజర్ లక్ష్మి, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు మామిడిపల్లి శ్రీధర్, కార్యదర్శి కొల్లూరు విజేందర్, ప్రతినిధులు కొలిపాక సతీశ్, కజాంపురం రాజేందర్, నార్ల ప్రసాద్, గుంత వినోద్, రంగారావు గోపాలరావు, రమణారావు తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్ ఢిల్లీ ధర్నా భూటకం
గోదావరిఖని: సీఎం రేవంత్రెడ్డి బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో చేస్తున్నదంతా నాటకమని, అది ఓ భూటకమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు విమర్శించారు. స్థానిక గంగానగర్లోని బీ జేపీ నేత అమరేందర్రావు నివాసంలో బుధవారం రాంచందర్రావు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ డైరెక్టరైతే.. మిగతా వాళ్లు యాక్షన్ చేశారని ఆయన ఎద్దేవా చేశారు. బీసీలను బీజేపీకి దూరం చేయాలనేది వారి నటన అని దుయ్యబట్టారు. 42 శాతం బీసీ రిజర్వేషన్లకు తమ పార్టీలోని ఎనిమిది మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలో మద్దతు ఇచ్చారని ఆయన గుర్తుచేశారు. విద్య, ఉద్యోగాల్లో మాత్రమే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించారని, అందులో రాజకీయంగా ఏమాత్రం లేదని స్పష్టం చేశారు. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు నిర్మిస్తే కేంద్రప్రభుత్వం సహకరిస్తుందని వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్టును తామెప్పుడూ వ్యతిరేకించలేదని, అందులో జరిగిన అవినీతి, నాణ్యత లోపంపైనే ప్రశ్నించామని తెలిపారు. తమ పార్టీలోకి చాలామంది వచ్చే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. బీజేపీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకునే అవకాశంలేదని వెల్లడించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి, మాజీ ఎంపీ వెంకటేశ్ నేత, నాయకులు కాసిపేట లింగయ్య, ఎస్.కుమార్, కందుల సంధ్యారాణి, గోమాస శ్రీనివాస్, బల్మూరి అమరేందర్రావు, బల్మూరి వనిత, సోమారపు లావణ్య తదితరులు పాల్గొన్నారు. ● బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు -
డిజిటల్ అరెస్ట్పై అవగాహన
గోదావరిఖనిటౌన్: సైబర్ క్రైమ్ డీఎస్పీ వెంకట్రెడ్డి, సీఐ కృష్ణమూర్తి ఆదేశాల మేరకు స్థానిక అశోక్నగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు డిజిటల్ అరెస్ట్పై బుధవారం అవగాహన కల్పించారు. కొందరు విద్యార్థులు సైబర్ క్రైమ్ పోలీసుల వేషధారణలో స్క్రిప్ట్ రూపొందించుకొని తోటి విద్యార్థులకు అర్థమయ్యేలా డిజిటల్ అరెస్ట్పై ప్రదర్శనలు ఇచ్చారు. గుర్తు తెలియని వ్యక్తులు అధికారుల పేరిట ఫోన్చేసి కేసులు ఉన్నాయని భయాందోళనకు గురిచేస్తారని తెలిపారు. ఆ వ్యక్తి అడిగినంత డబ్బులు ఇచ్చి ఆ తర్వాత మోసపోయానని గుర్తించడం తరచూ చోటుచేసుకుంటున్నాయని విద్యార్థులు తమ ప్రదర్శనల ద్వారా అవగాహన కల్పించారు. స్క్రిప్ట్లో పాల్గొన్న విద్యార్థులకు సర్టిఫికెట్స్ అందించారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుళ్లు వెంకటేశ్, శ్రీనివాస్, సంతోష్కుమార్, మౌనిక, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
ఉచితం మాటున అక్రమం
● రహస్య ప్రాంతాల్లో నిల్వలు ● రాత్రిపూట రాజధానికి తరలింపు ● జోరుగా ఇసుక అక్రమ రవాణా గోదావరిఖని: రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసా గు తోంది. స్థానికులకు ఉచితం మాటున అడ్డగోలుగా తరలిస్తూ రూ.లక్షలు ఆర్జిస్తున్నారు. తొలుత గోదా వరి నది నుంచి ట్రాక్టర్ల ద్వారా తీసుకొచ్చి పలు రహస్య ప్రాంతాల్లో డంప్ చేస్తున్నారు. ఇలా డంప్చేసిన ఇసుకను లారీల ద్వారా హైదరాబాద్కు తరలించి పెద్దఎత్తున సొమ్ము చేసుకుంటున్నారు. ఎక్కడ చూసినా డంప్లే.. గోదావరిఖనిలోని పలు ప్రాంతాల్లో ఎక్కడ చూసి నా ఇసుక డంప్లే దర్శనమిస్తున్నాయి. ప్రధానంగా నగర శివారు కేంద్రాలుగా ఈ వ్యవహారం మూడు పువ్వులు.. ఆరు కాయలుగా సాగుతోంది. గృహావసరాల కోసమని చెప్పి తీసుకొస్తున్న ఇసుక ను కొందరు ఒకచోట కుప్పగా పోసి, పెద్దఎత్తున నిల్వ చేసి.. ఆ తర్వాత లారీల ద్వారా దూర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇలా తరలించి ఒక్కో ట్రిప్పును సుమారు రూ.50వేల వరకు విక్రయిస్తున్నారు. మంగళవారం పోలీసులు జరిపిన దాడిలో సప్తగిరికాలనీలో పెద్ద డంప్ లభించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. అలాగే శాంతినగర్లో రెండు ఇసుక డంప్లను గుర్తించి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇంకా మల్లుస్వరాజ్యం కాలనీ, ఐబీకాలనీ, వాగువెంట ఉన్న ఏరియాల్లో డంప్ చేసుకుని హైదరాబాద్ తరలిస్తున్నారని సమాచారం. స్థానిక అవసరాలు.. వాణిజ్యానికి తరలింపు స్థానిక అవసరాల పేరుతో ట్రాక్టర్ల ద్వారా గోదావరి నుంచి తీసుకొస్తున్న వ్యాపారులు.. అనేకచోట్ల డంప్లు ఏర్పాటు చేసి వాణిజ్య అవసరాల కోసం విక్రయిస్తున్నారు. ఇలా నిబంధనలు అతిక్రమిస్తూ ఆర్నెల్లుగా ఈవ్యవహారం జోరుగా సాగిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్కు తరలిస్తే పెద్దఎత్తున సొమ్ము చేసుకోవచ్చనే అత్యాశతో కొందరు ఈదందాకు తెరలేపారు. స్థానిక అవసరాలకు ఉచితంగా.. రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పారిశ్రామిక ప్రాంతంలోని ప్రజల అవసరాల కోసం ఉచితంగా ఇసుక ఇచ్చేలా ఏర్పాట్లు చేశారు. దీంతో చాలామంది ఇసుకను ఉచితంగా తెచ్చుకుంటున్నారు. ఇదేఅదనుగా భావించి అక్రమార్కులు తమదైన శైలిలో ముందుకు సాగుతూ డంప్లు ఏర్పాటు చేసి అందినంత దండుకుంటున్నారు. కఠిన చర్యలు తీసుకుంటాం గృహావసరాల కోసం తీసుకొచ్చిన ఇసుకను అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. స్థానికులకు ఇసుక అందుబాటులో ఉండాలనే ఆలోచనతో కలెక్టర్, ఎమ్మెల్యే ఉచితంగా అందజేయాలని నిర్ణయించారు. కొందరు దుర్వినియోగం చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. ఇలా దుర్వినియోగం చేస్తే ఊరుకునేదిలేదు. – ఇంద్రసేనారెడ్డి, వన్టౌన్ సీఐ, గోదావరిఖని -
తల్లిపాలకు మించిన పౌష్టికాహారం లేదు
● డీఎంహెచ్వో అన్న ప్రసన్నకుమారి ● మెడికో, నర్సింగ్ స్టూడెంట్లతో అవగాహన ర్యాలీ కోల్సిటీ(రామగుండం): తల్లిపాలు పిల్లలకు వరమని, తల్లిపాలకు మించిన పౌష్టికాహారం బిడ్డకు ప్రపంచంలో ఎక్కడా లభించదని డీఎంహెచ్వో అన్న ప్రసన్నకుమారి, సింగరేణి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(సిమ్స్) ప్రిన్సిపాల్ హిమబింద్సింగ్ అన్నారు. తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా బుధవారం సిమ్స్, నర్సింగ్ కాలేజీల విద్యార్థులకు నగరంలోని కాలేజీలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కాలేజీ నుంచి మున్సిపల్ టీ జంక్షన్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. డీఎంహెచ్వో, సిమ్స్ ప్రిన్సిపాల్ మాట్లాడుతూ, ఆరు నెలల వయసు వచ్చేవరకూ బిడ్డకు కచ్చితంగా తల్లిపాలే తాగించాలని సూచించారు. కొందరు తల్లిదండ్రులు రసాయన మిశ్రమాలతో తయారు చేసిన కృత్రిమ పాలు తాగించి పిల్లల ఆరోగ్యాన్ని చేజేతుల్లా పాడుచేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పుట్టిన గంటలోపు బిడ్డకు ముర్రుపాలు తాగించాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్లు అరుణ, అశోక్, శిరీష తదితరులు పాల్గొన్నారు. -
రూ.33 కోట్లతో అభివృద్ధి పనులు
● పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్ ● బీటీ రోడ్డు పనుల పరిశీలన పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రంలో చేపట్టిన రహదారులు, డ్రైనేజీల నిర్మాణాలకు రూ.33 కోట్లు వెచ్చిస్తున్నామని పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్ అన్నారు. పట్టణంలోని మసీదు చౌరస్తా నుంచి అమర్నగర్ వరకు సాగుతున్న బీటీ రోడ్డు పనులను ఏఈ సతీశ్తో కలిసి బుధవారం ఆయన పరిశీలించారు. ప్రజాసౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని పనులను చేపట్టినట్లు పేర్కొన్నారు. పట్టణంలో అభివృద్ధి పనులు దాదాపు చివరిదశలో ఉన్నాయని ఆయన వివరించారు. వర్క్ ఇన్స్పెక్టర్లు అనిల్కుమార్, వాణి, రాముడు ఇతర సిబ్బంది ఉన్నారు. -
నిందారోపణలు మానండి
● నిజాలు మాట్లాడండి ● బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు చందర్ పెద్దపల్లిరూరల్: కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ నాయకులు నిజాలను దాచి, తమ పార్టీ నేతలపై నిందారోపణలకు దిగుతున్నారని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్, జెడ్పీ మాజీ చైర్మన్ పుట్ట మధుకర్ ధ్వజమెత్తారు. జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ భవన్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ సారథ్యంలో కన్నెపల్లి పంప్హౌస్ను సందర్శించి ఎందుకు ప్రారంభించలేదని ప్రశ్నిస్తే.. కాంగ్రెస్ నేతలకు ఉలుకెందుకని నిలదీశారు. ఈశ్వర్పై మంత్రి లక్ష్మణ్కుమార్ విమర్శలు చేయడం సరికాదన్నారు. రైతుల సంక్షేమానికి బీఆర్ఎస్ సర్కార్ అనేక పథకాలు చేపట్టిందని గుర్తుచేశారు. దివంగత సీఎం వైఎస్సార్ తర్వాత రైతుసంక్షేమం గురించి ఆలోచించే నాయకులే కాంగ్రెస్ పార్టీలో లేరని వారు స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమయ్యారని అన్నారు. అంతకుముందు ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో నాయకులు గంట రాములు, గోపు ఐలయ్య, రఘువీర్సింగ్, ఉప్పు రాజ్కుమార్, నారాయణదాస్ మారుతి, శ్రీనివాస్, శ్రీధర్, చంద్రశేఖర్, వెన్న రవీందర్, పల్లె మధు, మనోజ్, శ్రీధర్, లక్ష్మణ్, కొమురయ్య, శ్రావణ్, రామరాజు, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. -
విధులకు సకాలంలో హాజరు కావాలి
● ‘బయోమెట్రిక్’ను అందుబాటులోకి తేవాలి ● పేషెంట్లతో మర్యాదగా ప్రవర్తించాలి ● వైద్య సిబ్బందికి కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశాలు పెద్దపల్లిరూరల్: అది జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి.. బుధవారం ఉదయం 9 గంటల సమయంలో కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆస్పత్రికి చేరుకున్నారు.. ఆవరణ అంతా కలియతిరిగారు.. వైద్యులు, సిబ్బంది హాజరు రిజిష్టర్ తనిఖీ చేశారు. ఉదయం 9.30 గంటల తర్వాత ఆరుగురు వైద్యులు విధులకు రావడా న్ని గమనించారు.. ఇకముందు ఇలా ఆలస్యం కా కుండా సకాలంలో డ్యూటీకి వచ్చేందుకు వీలుగా బ యోమెట్రిక్ పద్ధతి పాటించేలా ఏర్పాట్లు చేయాలని ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీధర్ను ఆదేశించారు. డ్యూటీ టైంలో ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తామంటే కుదరదని, ఇకనుంచి కచ్చితంగా సమయపాలన పాటించ ని వారిపై చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. కొత్త ఆస్పత్రి భవన నిర్మాణంలో వేగం పెంచాలని ఆదేశించారు. ఇన్పేషెంట్లతో కాసేపు మాట్లాడారు. వైద్యసిబ్బంది అందిస్తున్న సేవలు, ప్రవర్తిస్తున్న తీరుపై ఆరా తీశారు. పేషెంట్లతో మర్యాదగా వ్యవహరించాలని సిబ్బందికి సూచించారు. ఇదే ఆవరణలోని ఆయుష్ ఆస్పత్రిలోని వైద్యుడు మారుతితోనూ కలెక్టర్ మాట్లాడారు. వైద్యసేవలు, మందులపై ఆరా తీశారు. నెలరోజులకు సరిపడా మందులు కొనుగోలు చేసి పేషెంట్లకు అందుబాటులో ఉంచామని కలెక్టర్ తెలిపారు. కలెక్టరేట్లో సమీక్ష.. జిల్లాలో టీబీ ముక్త్భారత్, సీజనల్ వ్యాధులు, ఈనెల 11న చేపట్టే నులిపురుగుల నివారణ తదితర అంశాలపై కలెక్టర్ శ్రీహర్ష కలెక్టరేట్లో సమీక్షించారు. హెల్త్ సబ్ సెంటర్ల వారీగా లక్ష్యం ఎంచుకు ని వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయాలని ఆదేశించా రు. జిల్లావ్యాప్తంగా ఫీవర్ సర్వే నిర్వహించాలని సూచించారు. గర్భిణులకు మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్ అన్నారు. ఆపరేషన్లు కాకుండా సాధారణ ప్రసవాలను పెంచేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్వో అన్న ప్రసన్నకుమారి, ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. -
రక్షా బంధన్.. పోషణ బంధం
ఆడపిల్లలను రక్షిద్దాం, ఆడపిల్లలను చదివిద్దాం అంటూ పోషణ బంధం రాఖీ.. వ్యసనాలకు లోనుకాకు, మత్తువదులూ అంటూ సోదరబంధం రాఖీలతో కొత్త రాఖీలకు శ్రీకారం చుట్టింది పెద్దపల్లి జిల్లా స్త్రీ శిశుసంక్షేమ శాఖ. పోషకాహారం, మత్తు పదార్థాలపై అవగాహన కార్యక్రమాలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తనదైన శైలిలో సరికొత్త మార్గంలో రాఖీ వేడుకలకు సన్నద్ధమవుతోంది. జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల్లో పోషణ్ అభియాన్ (poshan abhiyaan) పథకంలో భాగంగా చిన్నారులకు పోషణ బంధం రాఖీల పంపిణీ.. ప్రభుత్వ కళాశాలల్లోని యువతకు మిషన్ పరివర్తన నషాముక్త్భారత్ అభియాన్ పథకంలో భాగంగా సోదరబంధం రాఖీలు పంపిణీ చేసి రక్షాబంధన్ వేడుకలు నిర్వహించనుంది. జిల్లా సంక్షేమ శాఖ అధికారి వేణుగోపాల్ వీటికి సోదరబంధం, పోషణ బంధం రాఖీలుగా నామకరణం చేసి ఈ ఏడాది ప్రతీ అంగన్వాడీ బడిలోనూ, కళాశాలల్లోనూ రాఖీ వేడుకలు జరిగేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.ఇదీ చదవండి: Raksha Bandhan 2025 పర్వాల పూర్ణిమ, రాఖీ పరమార్థం ఇదే! -
రైతులకు అందుబాటులో యూరియా
● ఆర్ఎఫ్సీఎల్ ద్వారా సరఫరా ● కలెక్టర్ కోయ శ్రీహర్ష పెద్దపల్లిరూరల్: జిల్లాలో ప్రస్తుతం 2,270 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని, బుధవారం (ఈనెల 6న) ఆర్ఎఫ్సీఎల్ నుంచి మరో 3వేల మెట్రిక్ టన్నులు జిల్లాకు చేరుతుందని కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. రైతులు ఆందోళన పడాల్సిన అవసరం లేదన్నారు. అవసరం మేరకే కొనుగోలు చేయాలని, నిల్వ చేసి నష్టపోవద్దని ఆయన సూచించారు. బస్తీదవాఖానాలో షుగర్ నిర్ధారణ పరీక్షలకు అవసరమైన గ్లుకోమీటర్ పరికరాలను ఇప్పిస్తామన్నారు. పెద్దపల్లి శివారు రంగంపల్లిలోని బస్తీదవాఖానాను మంగళవారం ఆయన ఆకస్మికంగా సందర్శించి పలు సూచనలు చేశారు. ఎన్సీడీ బాధితులకు ప్రతినెలా అవసరమైన మందులు అందించాలని, సీజనల్ వ్యాధులతో అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ తెలిపారు. మెరుగైన వైద్యసేవలు అందించాలి సుల్తానాబాద్రూరల్(పెద్దపల్లి): ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యసేవలు అందించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. గర్రెపల్లి పీహెచ్సీని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సీబీపీ మిషిన్ను వెంటనే మరమ్మతు చేయిచాలని సూచించారు. డాక్టర్లు రామకృష్ణ, స్వప్న, సింధూజ, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 15 వరకు లక్ష్యం పూర్తిచేయాలి పెద్దపల్లిరూరల్: వన మహోత్సవం లక్ష్యాన్ని ఈనెల 15వ తేదీ వరకు పూర్తిచేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల పురోగతిని తరచూ పర్యవేక్షించాలని, ఉపాధి పనుల్లో వేగం పెంచాలన్నారు. డీఆర్డీవో కాళిందిని, హౌసిగ్ పీడీ రాజేశ్వర్, జెడ్పీ సీఈవో నరేందర్, డీపీవో వీరబుచ్చయ్య పాల్గొన్నారు. -
ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలి
పెద్దపల్లిరూరల్: ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట సమితి రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యుడు శ్యాం డిమాండ్ చేశారు. కలెక్టరేట్ ఎదుట మంగళవారం జరిగిన ధర్నాలో ఆయన మాట్లాడారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ను అమలు చేయాలన్నారు. ప్రతీపాఠశాలలో కనీసం ఇద్దరు ఉపాధ్యాయులు ఉండేలా చూడాలని అన్నారు. సమ్మె కాలపు వేతనం చెల్లించాలని కోరారు. నాయకులు కుమారస్వా మి, పోచయ్య, రాంకిషన్రావు, లక్ష్మణ్, సంతోష్ రెడ్డి, పర్శరాములు, శంషొద్దీన్, కిరణ్, కొముర య్య, రాజు, ప్రకాశ్రావు, జనార్దన్, రాజ్కుమా ర్, వెంకటేశ్వర్రెడ్డి, వసుంధర, పద్మావతి, వాసవి, స్వప్న, ప్రతాప్చారి తదితరులు ఉన్నారు. -
కాళేశ్వరంపై కాంగ్రెస్ కుట్ర
● ప్రాజెక్టు నుంచి నీళ్లివ్వకనే పంటలు ఎండుతున్నయ్ ● వచ్చే ఎన్నికల్లో ఓటుతోనే గుణపాఠం చెప్పాలి ● బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్పెద్దపల్లిరూరల్: కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ సర్కార్ కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని, ఆ ప్రాజెక్టులోని నీరంతా వృథాగా పోతోందని, ఇక్కడేమో సాగునీరందక, వానలు కురవక పంటలు ఎండుతున్నా పాలకులు పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్, జెడ్పీ మాజీ చైర్మన్ పుట్ట మధుకర్ ధ్వజమెత్తారు. మాజీమంత్రి హరీశ్రావు మంగళవారం చేపట్టిన పవర్ పాయింట్ ప్రజంటేషన్ను బీఆర్ఎస్ జిల్లా భవన్లో ఎల్ఈడీ ద్వారా లైవ్ టెలికాస్ట్ చేశారు. బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఆ కార్యక్రమాన్ని తిలకించారు. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయాలన్న దురాలోచనతోనే కాంగ్రెస్ నాయకులు సాగిస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొడుతూ వాస్తవాలను ప్రజలకు వివరించాలని కోరుకంటి చందర్ అన్నారు. మాజీ సీఎం కేసీఆర్పై కోపంతోనే రైతులు సాగుచేసే పంటలకు నీరు ఇవ్వకుండా గోదావరి జలాలను వృథా చేస్తున్నారని పుట్ట మధుకర్ ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై వాస్తవాలను మాజీమంత్రి హరీశ్రావు ఆధారాలతో సహా వివరిస్తున్నా పట్టించుకోవడం లేదని అన్నారు. రెండు పిల్లర్లు కుంగితే వాటికి తాత్కాలిక మరమ్మతులు చేసి నీళ్లను ఆపాల్సిందిపోయి రైతులను అవస్థల పాలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీ పాలకులు కుమ్మకై ్క పాలన సాగిస్తున్నారని ఆయన విమర్శించారు. నాయకులు కౌశిక హరి, గంట రాములు, రఘువీర్సింగ్, ఉప్పు రాజ్ కుమార్, గోపు ఐలయ్యయాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
వైభవంగా ఆదివరాహస్వామి జయంతి వేడుకలు
కమాన్పూర్(మంథని): ప్రముఖ పుణ్యకేత్రం శ్రీఆదివరాహస్వామి జయంతి మంగళవారం ప్రారంభమైంది. అర్చకులు ఉదయం ప్రత్యేకపూజలు చేశారు. బుధవారం స్వామివారి కల్యాణ మహోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో కాంతరెడ్డి, అర్చకుడు కలకుంట్ల వరప్రసాదచార్యులు తెలిపారు. ఉత్సవాలకు తరలివచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించామని అన్నారు. తహసీల్దార్ వాసంతి, ప్రతినిధులు బొల్లపెల్లి శంకర్గౌడ్, ముస్త్యాల దామోదర్, పిన్రెడ్డి కిషన్రెడ్డి, భక్తులు పాల్గొన్నారు. పింఛన్ పెంచాలి కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): ఆసరా పింఛన్లు పెంచాలని, కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు చేయాలనే డిమాండ్తో ఈనెల 13న చలో హైదరాబాద్ కార్యక్రమం చేపట్టామని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు అంబాల రాజేందర్ తెలిపారు. వికలాంగుల, వితంతువులు, వృద్ధులతో మండల కేంద్రంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పింఛన్లు పెంచి చెల్లించాలని ఆయన కోరారు. నాయకులు ఏవూరి వెంకటేశ్వర్రావు, ఐరెడ్డి నారాయణరెడ్డి, బైరి రామ్మూర్తి, జయ, స్వరూప, మమత, శంకర్, రజాక్ తదితరులు పాల్గొన్నారు. రోబోటిక్స్పై అవగాహన గోదావరిఖనిటౌన్: జిల్లాలోని గోదావరిఖని, పెద్దపల్లి, మంథని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల విద్యార్థులకు రోబోటిక్స్పై స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం ఒకరోజు శిక్షణ శిబిరం ఏర్పాటు చేశారు. సోహం అకాడమీ సౌజన్యంతో ఈ కార్యక్రమం చేపట్టారు. గోదావరిఖని, పెద్దపల్లి ప్రిన్సిపాల్స్ జైకిషన్ ఓజ, ఎంఏ శుకూర్ మాట్లాడుతూ, పుస్తకాల్లోని జ్ఞానమేకాకుండా.. దాని వినియోగం, విశ్లేషణ, అ న్వయ సామర్థ్యాల గురించి తెలుసుకోవాలన్నారు. సోహం అకాడమీ శిక్షకుడు సంతోష్, టీఎస్కేసీ కో ఆర్డినేటర్ సుబ్బారావు, మెంటర్ ఉషారాణి, విద్యార్థులు పాల్గొన్నారు. గోదాముల్లో బ్యాలెట్ బాక్స్లు భద్రంపెద్దపల్లిరూరల్: స్థానిక సంస్థల ఎన్నికలకు అధికారులు సర్వసన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే బ్యాలెట్ పేపర్లు ముద్రించి భద్రపర్చారు. పోలింగ్కు అవసరమైన బ్యాలెట్ బాక్స్లను సైతం సిద్ధం చేశారు. ఈక్రమంలో జిల్లాకు 1,650 బ్యాలెట్ బాక్స్లు అవసరం కాగా.. గుజరాత్ నుంచి తెచ్చేందుకు ఎంపీవో సు దర్శన్ తదితరులు అక్కడకు వెళ్లారు. మంగళవారం 1,469 బ్యాలెట్ బాక్స్లను తీసుకొచ్చారు. వాటిని స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ గోదాముల్లో భద్రపర్చినట్లు జిల్లా పంచాయతీ అధికారి వీరబుచ్చయ్య తెలిపారు. 11న గెస్ట్ టీచర్ల ఇంటర్వ్యూలు పెద్దపల్లిరూరల్: జిల్లాలోని 11 మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల పాఠశాలలు, కాలేజీల్లో ఇంగ్లిష్ మీడియంలో బోధించేందుకు ఉపాధ్యాయులు, అధ్యాపకులకు డెమో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు ఉమ్మడి జిల్లా కన్వీనర్ అంజలి మంగళవారం తెలిపారు. జువాలజీ, కెమిస్ట్రీ, ఇంగ్లిష్, పీజీటీ మ్యాథ్స్, పీజీటీ ఫిజికల్ సైన్స్, పీజీటీ ఇంగ్లిష్, టీజీటీ ఇంగ్లిష్ సబ్జెక్టులు బోధించే అధ్యాపకులు, ఉపాధ్యాయులు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ (ఎల్ఎండీ కాలనీ) జ్యోతిబా పూలే పాఠశాలలో ఈనెల 11న ఉదయం 10 గంట వరకు హాజరుకావాలని సూచించారు. -
జిల్లా అభివృద్ధికి కేంద్రం నిధులు
● రూ.20 కోట్లతో పనులు, ప్రజాసంక్షేమం ● హామీల అమలులో కాంగ్రెస్ సర్కార్ విఫలం ● బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు పెద్దపల్లిరూరల్/సుల్తానాబాద్/ధర్మారం: జిల్లాలో చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనుల కోసం కేంద్రప్రభుత్వం రూ.20 కోట్లు వెచ్చించిందని బీ జేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు తెలిపారు. జి ల్లా కేంద్రంలో మంగళవారం జరిగిన బీజేపీ జిల్లాస్థాయి పార్టీ శ్రేణుల విస్తృతస్థాయి సమావేశానికి హాజరయ్యారు. తొలుత సుల్తానాబాద్లో ఆయన కు ఘనస్వాగతం లభించింది. ఆ తర్వాత లక్సెట్టిపే టలో జరిగే సభకు వెళ్తూ ధర్మారంలో కాసేపు ఆగా రు. ఆయా ప్రాంతాల్లో పలువురు పార్టీ నేతలు రాంచందర్రావుకు ఘనస్వాగతం పలికారు. ఆయా కా ర్యక్రమాల్లో ఆయన మాట్లాడుతూ, ప్రాజెక్టుల పేరి ట బీఆర్ఎస్ నేతలు రూ.వేల కోట్లు దండుకుంటే.. కాంగ్రెస్ సర్కార్.. అవినీతి పేరిట అధికారులను జైళ్లకు పంపండం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కాగా, బీఆర్ఎస్కు చెందిన నల్ల మనోహర్రెడ్డితోపాటు ఎర్రోళ్ల రాములు, వేల్పుల లక్ష్మీనారాయణ తదితరులు బీజేపీలో చేరారు. ఎమ్మెల్సీలు మల్క కొమురయ్య, అంజిరెడ్డి, నాయకులు కర్రె సంజీవరెడ్డి, గుజ్జుల రామకృష్ణారెడ్డి, దుగ్యాల ప్ర దీ ప్కుమార్, వెంకటేశ్నేత, మీస అర్జున్రావు, కడారి అశోక్రావు, సురేశ్రెడ్డి, కన్నం అంజయ్య, కామణి రాజేంద్రప్రసాద్, మహేందర్ యాదవ్, కందుల శ్రీ నివాస్, ప్రవీణ్ కుమార్, నాగరాజు యాదవ్, తిరుపతి, నారాయణస్వామి, రంజిత్రెడ్డి, రాజు, రాంబాబు, సతీశ్రెడ్డి, శ్రీనివాస్, తిరుపతిరెడ్డి ఉన్నారు. -
బాల్యానికి భరోసా
● ముగిసిన ఆపరేషన్ ముస్కాన్ – 11 ● 193 మంది చిన్నారుల గుర్తింపు గోదావరిఖని: బడికి వెళ్లాల్సిన వయసులో బాలకార్మికులుగా పనులు చేయడాన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ఇలాంటివారిని గుర్తించి, సంరక్షించేందుకు ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమం చేపట్టింది. ఈక్రమంలోనే ఈసారి చేపట్టిన ఆపరేషన్ ముస్కాన్ –11తో సత్ఫలితాలు సాధించింది. జిల్లావ్యాప్తంగా నెలరోజుల పాటు నిర్వహించిన స్పెషల్ డ్రైవ్లో రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో 193 మంది చిన్నారులను గుర్తించి బాలకార్మిక వ్యవస్థ నుంచి విముక్తి కల్పించింది. రెండు జిల్లాలు.. 193 మంది చిన్నారులు.. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో గుర్తించిన మొత్తం 193 మంది చిన్నారుల్లో 71 మంది మంచిర్యాల, 122 మంది పెద్దపల్లి జిల్లాకు చెందిన వారు ఉన్నారు. ఇందులో 21మంది బాలకార్మికులు ఉన్నారు. నిరాశ్రయులైన పిల్లలు, బాలకార్మికులు, భిక్షాటనలో చిక్కుకు పోయిన వారికోసం గత జూలై ఒకటి నుంచి 31వ తేదీ వరకు స్పెషల్డ్రైవ్ నిర్వహించారు. పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా నేతృత్వంలో ఓ ఏసీపీకి బాధ్యతలు అప్పగించారు. సబ్ డివిజన్కు ఒక ఎస్సై చొప్పున ఐదుగురిని నియమించారు. ఆధునిక సాంకేతికతతో.. ఆపరేషన్ ముస్కాన్ కోసం ఈసారి సరికొత్త సాంకేతికతను వినియోగించారు. దర్పన్ అనే ఫేస్ రికగ్నిషన్ యాప్ ద్వారా తప్పిపోయిన పిల్లలను గుర్తించారు. ఒడిశా, బిహార్ తదితర రాష్ట్రాల నుంచి వలస వచ్చి కూలీలుగా పనిచేస్తున్న వారి పిల్లలను గుర్తించి స్కూళ్లలో చేర్పించారు. తల్లిదండ్రుల చెంతకు చేర్చి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఇటుకబట్టీలు, హోటళ్లు, షాపులు, మెకానిక్ షెడ్లు తదితర ప్రదేశాల్లో పనిచేస్తున్న బాలకార్మికులనూ గుర్తించి బడిలో చేర్పించారు. చైల్డ్వెల్ఫేర్ కమిటీ, లేబర్, ఎడ్యుకేషన్, చైల్డ్ప్రొటెక్షన్, హెల్త్డిపార్ట్మెంట్ల అధికారులు, సిబ్బందితో స్పెషల్ టీమ్లు ఏర్పాటు చేశారు. హోటళ్లు, రెస్టారెంట్లు, లాడ్జిలు, షాపులు, మెకానిక్ షెడ్లు, ఇటుక బట్టీలు తదితర ప్రదేశాల్లో తనిఖీలు చేస్తూ చిన్నారులను గుర్తించి బాల్యానికి భరోసా కల్పించారు. 2017 నుంచి ఇప్పటిదాకా పోలీసులు గుర్తించిన చిన్నారులు ఏడాది బాలురు బాలికలు మొత్తం 2017 206 48 254 2018 88 04 92 2019 116 39 155 2020 66 05 71 2021 88 13 101 2022 21 11 32 2023 33 04 37 2024 56 14 70 2025 136 57 193 ‘ముస్కాన్ –11’లో గుర్తించిన పిల్లలు బాలురు 136 బాలికలు 57 విముక్తి పొందిన చిన్నారులు 193 నమోదైన కేసులు 180 ప్రణాళిక పక్కాగా అమలు చేశాం బాలకార్మిక వ్యవస్థ నుంచి చిన్నారులకు విముక్తి కల్పించేందుకు కమిషనరేట్ పరిధిలో చేపట్టిన ఆపరేషన్ ముస్కాన్–11 విజయవంతమైంది. ఏసీపీ ఆధ్వర్యంలో ఒక్కో సబ్ డివిజన్కు ఒక ఎస్సైని నియమించి ప్రత్యేక బృందాలతో నిరంతరం తనిఖీలు చేశాం. బయట తిరుగుతున్న వారిని గుర్తించి స్కూళ్లలో చేర్పించాం. ఇందుకోసం పక్కా ప్రణాళిక అమలు చేశాం. – అంబర్ కిశోర్ ఝా, పోలీస్ కమిషనర్, రామగుండం -
డ్రామాలకు తెరతీస్తున్న బీఆర్ఎస్
గోదావరిఖని: ప్రాజెక్టుల పే రిట కమీషన్లు దండుకున్న బీఆర్ఎస్ నాయకులు.. పాత డ్రామాలకు తెరలేపుతున్నారని మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ విమర్శించారు. ప్రాజెక్టుల పేరిట ఉమ్మడి జిల్లాలో ఒక్క ఎకరాకు సాగునీరు ఇచ్చిన పాపానపోలేదన్నారు. స్థానిక తిలక్నగర్లో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. డ్యాం సేఫ్టీ కమిటీ నిపుణులు ప్రాజెక్టును పరిశీలించి నివేదిక ఇచ్చారని, అందులో నీటిని నిల్వచేస్తే ప్రాజెక్టు కూలిపోతుందని తేల్చి చెప్పారన్నారు. సుందిళ్ల, అన్నారం, కన్నెపల్లి బరాజ్ల నుంచి పంటలకు చుక్కనీరు ఇవ్వలేదని ఆరోపించారు. బీఆర్ఎస్ పాలనతో ప్రజలు విసిగిపోయి గత ఎన్నికల్లో తిరస్కరించారని అన్నారు. కన్నెపల్లి వద్ద మాజీమంత్రులు చేసిన వ్యాఖ్యలు నిరాధారమైనవన్నారు. బీఆర్ఎస్ హయాంలో కాళేశ్వరం పేరిట జరిగిన అవినీతిని కాంగ్రెస్ ప్రభుత్వం బహిర్గతం చేస్తోందని అన్నారు. కన్నెపల్లి గేట్లు బద్ధలు కొడతామంటూ కమలహాసన్ డైలాగులు చెప్పడం దేనికి సూచిక అని విమర్శించారు. అప్పులు చేసి రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టారని దుయ్యబట్టారు. ధాన్యం కొనుగోళ్లలో గతంలో జరిగిన పొరపాట్లను గుర్తించి తగిన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. కాంగ్రెస్ నాయకులు కాల్వ లింగస్వామి, మహంకాళి స్వామి, పెద్దెల్లి ప్రకాశ్, తిప్పారపు శ్రీనివాస్, గట్ల రమేశ్, బొమ్మక రాజేశ్, కల్యాణి సింహాచలం, ధూళికట్ట సతీశ్ తదితరులు పాల్గొన్నారు. ఒక్క ఎకరాకూ సాగునీరు ఇవ్వలేదు అందుకే ఆ పార్టీని తిరస్కరించారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ -
కలహాల కమలం
● బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి పర్యటనలో భగ్గుమన్న విభేదాలు ● పదవులు, పెత్తనం కోసం బాహాబాహీ ● స్థానిక ఎన్నికల వేళ వర్గపోరుతో కార్యకర్తల్లో నైరాశ్యం గాడిన పడేదెలా? అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటలేకపోయినా గత పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి గణనీయంగా ఓట్లు వచ్చి రెండోస్థానంలో నిలిచారు. ఇటీవల జరిగిన టీచర్స్, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. దీంతో బీఆర్ఎస్కు ధీటుగా, కాంగ్రెస్ను గద్దె దించి, వచ్చే ఎన్ని కల్లో అధికారంలోకి వస్తామని రాష్ట్రస్థాయి నేతలు తరచూ చెబుతున్నారు. కానీ, జిల్లాలో గ్రూప్ రాజకీయాలతో పార్టీ బలహీనపడుతోంది. మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్రావు, గొట్టెముక్కల సురేశ్రెడ్డి ఎవరికివారు కార్యక్రమాలు నిర్వహిస్తుండగా, తాజాగా బీఆర్ఎస్ నుంచి నల్ల మనోహర్రెడ్డి బీజేపీ కండువా కప్పుకున్నారు. ఇప్పటికే గ్రూప్లుగా మారిన పెద్దపల్లి నియోజకవర్గ బీజేపీ నేతలు.. పదవులు, పెత్తనం కోసం పోటీపడుతున్నారు తప్ప పార్టీ పటిష్టత కోసం శ్రమించడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మంథని, రామగుండంలో సైతం పాత, కొత్త నేతల మధ్య వర్గపోరు నడుస్తోంది. తాజాగా రాష్ట్ర అధ్యక్షుడి పర్యటనతోనైనా పార్టీ గాడినపడుతుందని ఆశించిన కార్యకర్తలకు.. ఇరువర్గాల మధ్య విభే దాలు మరింత రచ్చకెక్కడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికై రాష్ట్ర నాయకత్వం అందరినీ పిలిపించుకుని, గ్రూప్ రాజకీయాలకు తావులేకుండా పార్టీని గాడిన పెట్టేలా చర్యలు తీసుకోవాలని కార్యకర్తలు కోరుతున్నారు. తద్వా రా వచ్చే స్థానిక సంస్థల్లో.. గత ఎమ్మెల్సీ ఎన్నిక సందర్భంగా సాధించిన విజయాన్ని కొనసాగించవచ్చని అంటున్నారు.సాక్షి పెద్దపల్లి: బీజేపీ అంటే క్రమశిక్షణకు మారుపేరు. కానీ జిల్లా కమలం పార్టీలో అందుకు భిన్న సంస్కృతి నెలకొంది. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి ఎదుటే నేతల పోటాపోటీ నినాదాలు, నిరసనల తీరుతో అగ్రనాయకత్వం విస్తుపోయేలా గూపు రాజకీయం రచ్చ తారస్థాయికి చేరింది. సాధారణంగా ప్రతీఅంశాన్ని అంతర్గతంగా చర్చించుకునే కమల దళంలో నాయ కు లు బహిరంగంగానే విమర్శనాస్త్రాలు సంధిస్తుండడం పార్టీకి నష్టదాయకంగా మారుతున్నాయని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజల్లో పార్టీకి సానుకూల స్పందన ఉన్నా.. దానిని ఓట్లరూపంలో మార్చుకోవాల్సిన నేతలు.. బహిరంగంగా కామెంట్లు చేసుకోవడం.. అంతర్గతంగా ఫిర్యాదు చేసుకోవడం ఎక్కువై కమల శిబిరంలో ఏంజరుగుతుందో కేడర్కు అంతుచిక్కడం లేదు. వెరిసి జిల్లాలో పార్టీ బలహీనపడేందుకు దారితీస్తుందని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా లీడర్ బండెక్కనిదే ఇంచు కదలదు.. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా కార్యకర్తలను సన్నద్ధం చేసేందుకు జిల్లాకేంద్రంలో బీజేపీ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఇ టీవల నియమితులైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. పె ద్దపల్లి కమాన్ వద్ద నిర్వహించిన ర్యాలీలో కాన్వా య్పై ఉన్న అధ్యక్షుడికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్రావు పూలదండ వేయగా, మా నేత, మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డిని బండిపైకి ఆహ్వానించరా? అని గుజ్జుల వర్గీయులు ప్రచార రథానికి అడ్డుగా నిల్చొని ఘర్షణకు దిగారు. దుగ్యాల ప్రదీప్రావు దిగిపోవాలని గుజ్జుల వర్గీయులు ఆందోళన చేశారు. దీంతో ఇరువర్గాలు తోపులాడుకున్నాయి. పోలీసుల జోక్యం, నేతలు సర్థిచెప్పడంతో గొడవ సద్దుమనిగింది. జిల్లా అధ్యక్షుడు డౌన్ డౌన్ అంటూ.. తీరా వేదికపైకి వెళ్లాక ఇరువర్గాల నేతల అనుచరులు స్టేజీ ఎదుట ఇరువైపులా నిల్చొన్నారు. సభకు అంతరాయం కలిగించేలా ఎవరికి వారు నినాదాలు చేశారు. దీంతో సమావేశం రసాభాసగా మారింది. పార్టీ చీఫ్ రాంచందర్రావు వేదికపై ఉండగా, బీజేపీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవ్రెడ్డి మాట్లాడుతుండగా వేదిక ఎదుట నిల్చున్న కార్యకర్తలు.. ‘జిల్లా అధ్యక్షుడు డౌన్ డౌన్’ అని పెద్దఎత్తున నినాదాలు చేయడం సంచలనంగా మారింది. వేదికపై ఉన్న మాజీ ఎమ్మెల్యే గుజ్జుల పరోక్షంగా దుగ్యాల వర్గంపై మాటలు సంధించారు. తర్వాత మాట్లాడిన దుగ్యాల ప్రదీప్రావు సైతం ‘చేసేది చెప్పాలి.. చెప్పేదే చేయాలని’ చురకలు అంటించారు. జిల్లా అధ్యక్షుడు కలుగజేసుకుని నియోజకవర్గంలో గ్రూప్లు లేవని కార్యకర్తలకు తెలియజేసేలా గుజ్జుల, దుగ్యాలను పరస్పరం చేతులు కలిపి సర్థిచెప్పాలని రాష్ట్ర అధ్యక్షుడిని వేదికపై నుంచి కోరడం జిల్లాలో గ్రూప్ రాజకీయాలు ఏస్థాయిలో ఉన్నా యో తెలియజేస్తోంది. మాజీ ఎమ్మెల్యే కాసిపేట లింగయ్య మాట్లాడుతూ క్రమశిక్షణ కలిగిన బీజేపీలో స్టేజీపైనే పోలీసులను పెట్టుకొని ప్రశాంతంగా సమావేశం నిర్వహించుకోవాల్సిన పరిస్థితి తలెత్త డం ఎంతవరకు సమంజసమని గ్రూప్ రాజకీయాలతో పార్టీకి జరుగుతున్న నష్టం గురించి తెలియజేశారు. పైకి నాయకులంతా కలిసి కట్టుగా ఉన్నట్లు కనిపిస్తున్నా.. వాళ్ల మధ్య పూడ్చలేనంత గ్యాప్ ఉందన్నది పార్టీలో వరుసుగా చోటుచేసుకుంటున్న ఘటనలతో తేటతెల్లమవుతోందని సామా న్య కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. -
చదవాలి.. రాయాలి
● మహిళా సంఘాల్లో నిరక్షరాస్యుల కోసం ‘ఉల్లాస్’ ● మహిళలను అక్షరాస్యులుగా తీర్చిదిద్దడమే లక్ష్యం ● కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో కార్యక్రమం ● జిల్లా విద్యాశాఖ, సెర్ప్ ఆధ్వర్యంలో నిర్వహణకు ప్రత్యేక ప్రణాళిక రామగిరి(రామగుండం): మహిళా సంఘాల్లో నిరక్ష రాస్యులైన మహిళలను సంపూర్ణ అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు జిల్లా విద్యాశాఖ, సెర్ప్ అధికారులు సమన్వయంతో ‘ఉల్లాస్’ పథకాన్ని పకడ్బందీగా అమలు చేసేలా కార్యాచరణ రూపొందించా రు. అందరికీ విద్య అందించాలనే లక్ష్యంతో కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు అండర్ స్టాండింగ్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఫర్ అన్ ఇన్ సొసైటీ(ఉల్లాస్) పథకాన్ని అమలులోకి తీసుకొచ్చాయి. దీనిని జిల్లావ్యాప్తంగా దశల వారీగా అమలు చేసేలా జిల్లా ఉన్నతాధికారులు ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. తొలుత మ హిళా సంఘాల్లో నిరక్షరాస్యులను గుర్తించి అక్షరాస్యులుగా తీర్చిదిద్దుతారు. రెండోదశలో మధ్యలో బడిమానేసిన వారిని గుర్తించి ఓపెన్ స్కూల్ ద్వారా నేరుగా పదో తరగతి చదివిస్తారు. ఆసక్తినిబట్టి ఓపె న్ డిగ్రీ వరకూ చదివించాలనేది ప్రభుత్వ లక్ష్యం. ఉల్లాస్ కార్యక్రమం లక్ష్యం ఇదే.. సామాజిక సాధికారతలో భాగంగా ఉల్లాస్ కార్యక్రమం ద్వారా చదువురాని వారందరికీ చదవడం, రాయడం నేర్పించడమే ప్రధాన లక్ష్యం. మహిళా సంఘాల్లోని సభ్యుల్లో కేవలం 50 శాతం మందికే సంతకం చేయడం వచ్చని, మిగిలినవారు వేలిముద్ర వేస్తున్నారని ప్రభుత్వం గుర్తించింది. ఈక్రమంలోనే మహిళలు అందరికీ చదవడం, రాయడం నేర్పించాలనే లక్ష్యంతో ఉల్లాస్ను అమలులోకి తీసుకొస్తున్నారు. ఓపెన్ టెన్త్, ఓపెన్ డిగ్రీ వరకు చదివించడమే కాదు.. ఆసక్తిని బట్టి స్కిల్డెవలప్మెంట్, టెక్నికల్ కోర్సుల్లోనూ చేర్పించి ఉపాధి, అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నారు. బ్యాంకింగ్ రంగంలో ఆర్థిక క్రమశిక్షణ, పౌష్టికాహారం, వ్యక్తిగత పరిశుభ్రత తదితర అంశాలను సైతం ఈ సందర్భంగా నేర్పిస్తారు. కార్యక్రమ నిర్వహణకు జిల్లా, మండలస్థాయి కమిటీలను ఇప్పటికే ఏర్పాటు చేశారు. కలెక్టర్ చైర్మన్గా, డీఈవో కన్వీనర్గా, డీపీవో, ఇతర శాఖల అధికారులు సభ్యులుగా ఉంటారు. అదేవిధంగా మండల కమిటీలో చైర్మన్గా ఎంపీడీవో, ఎంఈవో, హెచ్ఎం, సీఆర్సీలు సభ్యులుగా కొనసాగుతారు. తల్లి చదువుతో కుటుంబంలో వెలుగులు.. తల్లి చదవడం ద్వారా ఆ కుటుంబంలో వెలుగులు ప్రసరిస్తాయని, ఇలాంటి కుటుంబాల ద్వారా ఆ గ్రామం అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతుందని సర్కార్ భావిస్తోంది. బడికి వెళ్లే పిల్లల సంఖ్య పెరగడంతోపాటు డ్రాపౌట్స్ తగ్గితే బాల్య వివాహాలపై అవగాహన పెరుగుతుందని చెబుతోంది. అక్షరాస్యులుగా మారడం ద్వారా ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలపై అవగాహన పెరిగి అర్హులంద రి కీ ప్రయోజనాలు చేకూరుతాయని పేర్కొంటోంది. వలంటీర్లుగా మహిళా సంఘాల్లోని అక్షరాస్యులైన సభ్యులు.. డీఆర్డీవో, సెర్ప్ ఆధ్వర్యంలో నిరక్షరాస్యులను గుర్తించే ప్రక్రియ జిల్లాలో ఇప్పటికే పూర్తిచేశారు. 15 మంది నుంచి 20 మందితో గ్రూపును ఏర్పాటు చేశారు. మహిళా సంఘాల్లోని అక్షరాస్యులైన వారిని వలంటీర్లుగా ఎంపిక చేసి గ్రూపులను కేటాయించి చదువు చెప్పిస్తారు. గ్రూపు సభ్యులు చదవడం, రాయడం వచ్చే వరకు చదువు చెప్పే బాధ్యత వలంటీర్లకే అప్పగించారు. ఇందుకోసం పారితోషికం, గౌరవ వేతనం లేకుండానే కేవలం స్వచ్ఛందంగానే చదువు చెప్పాల్సి ఉంటుంది. అవసరమైన పుస్తకాలను విద్యాశాఖ అందిస్తుంది. ఉపాధ్యాయుల ద్వారా వలంటీర్లకు సహకారం అందిస్తుంది. మహిళా సంఘాల్లో నిరక్షరాస్యులు జిల్లాలోని వివిధ మండలాల్లో గల మహిళా సంఘాల్లో ఇంకా చదవడం, రాయడం రాని మహిళలను అధికారులు ఇటీవల గుర్తించారు. అంతర్గాం మండలంలో 2,017 మంది, రామగుండం మండలంలో 1,711 మంది, పాలకుర్తి మండలంలో 2,609 మంది, మంథని మండలంలో 3,818 మంది, ముత్తారం మండలంలో 2,617 మంది, రామగిరి మండలంలో 2,317 మంది, కమాన్పూర్ మండలంలో 2,277 మంది, ధర్మారం మండలంలో 4,813 మంది, జూలపల్లి మండలంలో 2,349 మంది, ఎలిగేడు మండలంలో 2,642 మంది, సుల్తాన్బాద్ మండలంలో 3,727 మంది, ఓదెల మండలంలో 3,056 మంది, కాల్వశ్రీరాంపూర్ మండలంలో 2,192 మంది, పెద్దపల్లి మండలంలో 5,311 మంది ఉన్నారని అధికారులు సర్వేలో తేల్చారు. ఇలా జిల్లావ్యాప్తంగా ఉన్న మహిళా సంఘాల్లో మొత్తం నిరక్షరాస్యులైన మహిళలు 41,456 మంది ఉన్నారని అధికారులు గుర్తించారు.లక్ష్యం 28వేల మంది.. తొలిదశలో సుమారు 28 వేల మంది నిరక్షరాస్యులైన మహిళా సంఘాల్లోని సభ్యులను అక్షరాస్యులు గా మార్చాలని లక్ష్యంగా నిర్దేశించారు. ఇందుకోసం వచ్చే ఏడాది మార్చి వరకు గడువు విధించారు. ఇందులో భాగంగానే ఈనెల 7న నిర్వహించే సమావేశంలో వలంటీర్లకు శిక్షణ ఇవ్వాలనే అంశంపై నిర్ణయం తీసుకుంటారు. శిక్షణ పూర్తయ్యాక మండలాల వారీగా బోధన తరగతులు ప్రారంభిస్తారు. -
లక్ష్యానికి మించి మొక్కలు నాటాలి
● రామగుండం బల్దియా కమిషనర్ అరుణశ్రీ ఆదేశాలు కోల్సిటీ(రామగుండం): వన మహోత్సవం ద్వారా రామగుండం నగరంలో లక్ష్యానికి మించి మొక్కలు నాటాలని నగరపాలక సంస్థ కమిషనర్(ఎఫ్ఏసీ) అరుణశ్రీ సూచించారు. బల్దియా కార్యాలయంలో సోమవారం వన మహోత్సవం నిర్వహణపై వార్డు అధికారులతో వివిధ అంశాలపై సమీక్షించారు. కమిషనర్ మాట్లాడుతూ, డివిజన్లలో స్థలం లభ్యత ఆధారంగా వార్డు అధికారులకు మొక్కల సంఖ్య, లక్ష్యం నిర్దేశిచామన్నారు. మొక్కలు నాటే కార్యక్రమంలో స్థానికులను భాగస్వాములను చేయాలని అన్నారు. పశువుల నుంచి పరిరక్షించడానికి అవసరమైనచోట ట్రీ గార్డులను ఏర్పాటు చేయించాలని అన్నారు. ప్రస్తుత వాతావరణ అనుకూలతలను దృష్టిలో ఉంచుకొని ఎక్కువసంఖ్యలో మొక్కలు నాటాలని ఆదేశించారు. మెప్మా ఆర్పీల సహకారం తీసుకొని ఇంటింటికీ మొక్కలు పంపిణీ చేయాలని కమిషనర్ సూచించారు. డిప్యూటీ కమిషనర్ వెంకటస్వామి, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రామన్, డీఈఈ షాబాజ్, ఏఈ తేజస్విని, మెప్మా టీఎంసీ మౌనిక, సీవోలు ఊర్మిళ, శ్వేత, ప్రియదర్శిని, శమంత తదితరులు పాల్గొన్నారు. -
సత్తాచాటిన సింబా నార్కోటిక్ డాగ్
● రాష్ట్రస్థాయి డ్యూటీ మీట్లో గోల్డ్మెడల్ గోదావరిఖని: సింబా నార్కోటిక్ డాగ్ రాష్ట్రస్థాయి పోటీల్లో సత్తాచాటి బంగారు పతకం సాధించింది. వరంగల్ జిల్లా మామునూరు పీటీసీలో జరిగిన తెలంగాణ రాష్ట్రరెండో పోలీస్ డ్యూటీ మీట్లో కాళేశ్వరం జోన్ నుంచి నార్కోటిక్ డాగ్ విభాగంలో సింబా పాల్గొని గంజాయి, మత్తు పదార్థాలను గుర్తించడంలో సత్తా చాటింది. పోలీసు జాగిలం సింబా, డాగ్ హ్యాండ్లర్ ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ ఎం.వేణుగోపాల్కృష్ణ గోల్డ్ మెడల్ సాధించారు. రాష్ట్రస్థాయిలో ఉత్తమ పోలీస్ డాగ్గా ‘సింబా’ ఎంపికై ంది. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా సింబా, డాగ్ హ్యాండ్లర్ వేణుగోపాలకృష్ణను అభినందించారు. మంచిర్యాల, పెద్దపల్లి డీసీపీలు భాస్క ర్, కరుణాకర్, ట్రాఫిక్, ఏఆర్ ఏసీపీలు శ్రీనివాస్, ప్రతాప్, ఆర్ఐలు దామోదర్, శ్రీనివాస్, వామనమూర్తి, సంపత్, మల్లేశం పాల్గొన్నారు. -
వినతులు స్వీకరించి..పరిష్కార మార్గం చూపి..
● ప్రజావాణిలో అర్జీలు స్వీకరించిన అడిషనల్ కలెక్టర్ వేణు పెద్దపల్లిరూరల్: జిల్లా ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువస్తే పరిశీలించి సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకునేందుకే ప్రతీ సోమవారం కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అడిషనల్ కలెక్టర్ వేణు తెలిపారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి తరలివచ్చిన జిల్లావాసుల నుంచి ఆయన సోమవారం ప్రజావాణి ద్వారా అర్జీలను స్వీకరించారు. వాటిని పరిష్కరించాలని సంబంధిత శా ఖల అధికారులను ఆయన ఆదేశించారు. ఈ సందర్భంగా కొందరిని ‘సాక్షి’ పలుకరించగా తమ వేదనను ఇలా వెల్లడించారు.. -
మృత్యుంజయ హోమం
జ్యోతినగర్(రామగుండం): ఎన్టీపీసీ పీటీఎస్ ఆలయంలో సోమవారం మహా మృత్యుంజ య హోమం ఘనంగా నిర్వహించారు. అర్చకు లు వామనశర్మ, రుధ్రభట్ల శ్రీకాంత్ తదితరు లు ప్రత్యేక పూజలు చేశారు. ఎన్టీపీసీ రామగుండం – తెలంగాణ ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చందన్ కుమార్ సామంత, దీప్తి మహిళా సమితి అధ్యక్షురాలు రాఖీ సామంత హాజరయ్యారు. లోక కల్యాణం కోసం హోమం నిర్వహించారు. ఉన్నతాధికారులు, అధికారులు, అధికార సంఘం ప్రతినిధులతోపాటు ఉద్యోగ గుర్తింపు సంఘం ప్రధాన కార్యదర్శి ఆరెపల్లి రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. ఇంటి వద్దే రీసైక్లింగ్తో అనేక ప్రయోజనాలు కోల్సిటీ/ఫెర్టిలైజర్సిటీ: ఇంటి వద్దే రీసైక్లింగ్తో డంప్ యార్డ్కు వెళ్లే చెత్తను తగ్గించడానికి అవకాశం ఉంటుందని రామగుండం బల్దియా డిప్యూటీ కమిషనర్ వెంకటస్వామి అన్నారు. 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా సోమవారం నగరంలో పలు కార్యక్రమాలు చేపట్టగా, డిప్యూటీ కమిషనర్ పర్యవేక్షించారు. గౌతమినగర్లోని డీఆర్సీసీతోపాటు కంపోస్ట్యార్డ్, మల్కాపూర్ శివారులోని డంపింగ్యా ర్డ్లను వెంకటస్వామి సందర్శించారు. ఆయన మాట్లాడుతూ, చెత్తను ఇంటి వద్దనే తడి, పొడిచెత్తగా వేరుచేసి కంపోస్టింగ్ చేయాలన్నారు. అలాగే 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా రెవెన్యూ విభాగం ఆధ్వర్యంలో ఆస్తిపన్ను మదిపు చేయడం, పునఃపరిశీలించడం చేపట్టారు. ఆయా కార్యక్రమాల్లో నగరపాలక సంస్థ ఆర్వో ఆంజనేయులు, ఆర్ఐలు శంకర్రావు, ఖాజా, శానిటరీ ఇన్స్పెక్టర్లు, జవాన్లు, ఆర్పీలు, స్వశక్తి సంఘాల మహిళలు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్కే హక్కు ఉంది రామగుండం: బ్రాహ్మణపల్లి/ముర్మూర్ ఎత్తిపోతలను ప్రారంభించే హక్కు కాంగ్రెస్ ప్రభుత్వానికే ఉందని ఆ పార్టీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు పెండ్యాల మహేశ్ అన్నారు. అంతర్గాంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే ఎ ల్లంపల్లి ప్రాజెక్టు నిర్మించారని, దానికి అనుసంధానంగా ఎత్తిపోతల ఉందనే విషయాన్ని బీఆర్ఎస్ శ్రేణులు గుర్తించాలని సూచించారు. ఎత్తిపోతలను మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ప్రారంభించడాన్ని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ తప్పుపట్టడం శోచీనయమన్నా రు. కాంగ్రెస్ ప్రతినిధులు ఉరిమెట్ల రాజలింగం, గాదె సుధాకర్, గుంట లక్ష్మణ్, కనకయ్య, శ్రీనివాస్గౌడ్, అప్పాల రాజేందర్, ఇండిబిల్లి రవి, ఒల్లెపు స్వామి, బాణాల రాములు, జూల లింగయ్య, జలీల్, అక్షయ్ పాల్గొన్నారు.వార్షిక లాభాలు ప్రకటించాలి గోదావరిఖని: సింగరేణి బొగ్గు గనుల సంస్థ 2024–25 ఆర్థిక సంవత్సరంలో సాధించిన వార్షిక లాభాలు ప్రకటించి, అందులో కార్మికులకు 30 శాతం వాటా చెల్లించాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భూపాల్, ఎస్సీఈయూ అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక ప్రధాన చౌరస్తాలో జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశంలో వారు మాట్లాడారు. కంపెనీలో రాజకీయ జోక్యం పెరిగి నిధులు దుర్వినియోగమవుతున్నాయని ఆరోపించారు. ఈక్రమంలోనే సంస్థ ఆర్థిక పరిస్థితి గురించి కార్మికులకు తెలియజేయాల్సిన బాధ్యత యాజమాన్యంపై ఉందని అన్నారు. నాయకులు వైవీ రావు, ఎరవెల్లి ముత్యంరావు, ఆరేపల్లి రాజమౌళి, మెండె శ్రీనివాస్, బానోతు వినయ్, కుంట ప్రవీణ్, కొమురయ్య, బాలాజీ తదితరులు పాల్గొన్నారు. -
సాగు అంతంతే..
● పది మండలాల్లో లోటువర్షపాతం ● జిల్లాలో సాధారణం కన్నా తక్కువ నమోదు ● ఎల్లంపల్లి ప్రాజెక్టులో పూర్తిస్థాయిలో చేరని నీరు ● కుంటలు, చెరువులదీ అదేపరిస్థితి ● ఆందోళనలో అన్నదాతలు సాక్షి పెద్దపల్లి: ‘వానమ్మ.. వానమ్మ.. ఒక్కసారన్నా వచ్చిపోవే’ అంటూ జిల్లా రైతాంగం వర్షాల కోసం ఎంతోఆశతో ఎదురుచూస్తోంది. ఆరంభంలో మురిపించినా ఆ తర్వాత జాడలేకుండా పోయింది. జిల్లాలో ఇప్పటివరకు లోటు వర్షపాతమే నమోదైంది. ఫలితంగా జిల్లాలో వర్షాభావ పరిస్థితులు కనిపిస్తున్నాయి. నిత్యం సెంటీ మీటర్లలో కురవాల్సిన వర్షం.. మి.మీ.లలో కూడా నమోదు కావడంలేదు. సాగుకు అదను దాటుతోంది.. పంటలు పండించేందుకు అదను దాటుతోంది. ఈ వర్షాకాలం సీజన్లో జూన్, జూలైలో పెద్దగా వర్షా లు కురవలేదు. ఆగస్టు మొదటివారం గడుస్తున్నా వానజాడ లేదు. వర్షాలు లేక సాగుబాట పట్టకుండా చాలామంది రైతులు మిన్నకుండిపోయారు. చె రువులు, కుంటల్లో నీరున్న ప్రాంతాల్లో తప్ప ఎక్క డా పెద్దగా సాగులేదు. తొలకరిలో కురిసిన వర్షాలకు విత్తిన మెట్ట పంటలు కూడా ఎండిపోయాయి. ఇటీవల వారంపాటు ముసురు కురవడంతో మెట్ట పంటలు చిగురించాయి. ఆ వానలకు రైతులు కొంత ధైర్యం చేసి సాగుబాట పట్టారు. సాగు పుంజుకుంటున్న ఈ తరుణంలో వరుణుడు మళ్లీ ము ఖం చాటేయగా.. సాగు మళ్లీ డీలా పడిపోయింది. సగానికి పడిపోయింది.. జిల్లాలో ఈ ఏడాది వర్షాభావంతో అన్నిమండలాల్లో సా గు విస్తీర్ణం సగానికి పడిపోయింది. గతవారంలో కురిసిన వర్షాలకు చెరువు లు, కుంటల్లోకి నీరు వచ్చిన దాఖాలా లు కనిపించ డం లేదు. ఆ రుతడి పంటలకు మాత్రం జీవం పోసినట్లయ్యింది తప్పితే.. సా గు ఊపందుకో లేదు. ఈ సీజన్లో 2.40 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేయాల్సి ఉండగా, ఇప్పటివరకు కేవలం 1.91లక్షల ఎకరాల్లోనే సాగు చేశారు. ఈనెల 15వ తేదీ వరకు వరినాట్లు వేసుకోవచ్చని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. 10 మండాల్లో లోటు వర్షపాతమే ఈ వానాకలం సీజన్లో ఇప్పటివరకు 479.9 మి.మీ. వర్షాపాతం నమోదుకావాల్సి ఉండగా, 31 మి.మీ. లోటు వర్షపాతంతో 329.9 మి.మీ.గా నమోదైంది. జిల్లాలో 14 మండలాలు ఉండగా.. కేవలం మంథని, కాల్వశ్రీరాంపూర్, ఓదెల, సుల్తానాబాద్లోనే సాధారణ వర్షపాతం నమోదైంది. మిగిలిన 10 మండలాల్లో లోటు వర్షపాతమే ఉంది. జూన్ 1 నుంచి ఆగస్టు 4వ తేదీ వరకు నమోదైన వర్షపాతం(మి.మీ.లలో) జిల్లాలోని చెరువుల్లో నీటినిల్వలు మొత్తం చెరువులు 1,018 0–25 శాతంలోపు 327 25–50 శాతంలోపు 199 50–75 శాతంలోపు 176 75–100శాతంలోపు 272 మత్తడి పడినవి 44 బోసిపోతున్న చెరువులు, ప్రాజెక్టులు జిల్లాలో 1,018 చెరువులు ఉండగా 44 చెరువులు మత్తడి పోయగా, 25శాతం కూడా నిండని చెరువులు 327 ఉన్నాయి. మరోపక్క.. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు సైతం వచ్చిచేరే వరద తక్కువగానే ఉంది. ప్రాజెక్టు గరిష్ట ఎత్తు 148 మీటర్లు కాగా ప్రస్తుతం 144 మీటర్ల ఎత్తు వరకు నీరు ఉంది. ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా 12.32 టీఎంసీలే ఉంది. గతేడాది ఇదేరోజు 15.75 టీఎంసీల నీరు నిల్వ ఉండేది. ప్రాజెక్టులోకి ఎగువ నుంచి 435 క్యూసెక్కుల నీరు ఇన్ఫ్లోగా వచ్చి చేరుతోంది. అలాగే అవుట్ఫ్లో 435 క్యూసెక్కులుగా ఉంది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ స్కీం కోసం 314 క్యూసెక్కులు తరలిస్తుండగా.. ఎన్టీపీసీ అవసరాల కోసం మరో 121 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. 2024– 2025లో సాగు ఇలా.. (ఎకరాల్లో) పంట 2024 2025 వరి 2,10,027 1,43,153 మొక్కజొన్న 705 377 పత్తి 52,670 48,215 కందులు 169 87కురవాల్సింది 474.9 కురిసింది 329.9 వ్యత్యాసం(శాతంలో) 31 వర్షం కురిసిన రోజులు 24ఇంకా గడువుంది వర్షాలు సమృద్ధిగా కురవకపోవడంతో ఈసారి సాగు అంతంతంగానే ఉంది. ఈనెల 15వ తేదీ వరకూ వరి సాగుచేయొచ్చు. రెండు, మూడు భారీవర్షాలు పడితే పంటలకు ఢోకా ఉండదు. – శ్రీనివాస్, డీఎవో -
నేడు బీజేపీ అధ్యక్షుడి రాక
పెద్దపల్లిరూరల్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు జిల్లా పర్యటనకు వస్తున్నారు. జిల్లా కేంద్రంలో మంగళవారం జరిగే ముఖ్యకార్యకర్తల స మావేశంలో ఆయన పాల్గొంటారు. ఈ విషయాన్ని వెల్లడించేందుకు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్కుమార్ వర్గీయులు చిలారపు పర్వతాలు, రాజగోపా ల్ తదితరులు సోమవారం వేర్వేరుగా సమావేశాలు ఏర్పాటు చేశారు. కార్యక్రమ వివరాలపై చర్చించుకుంటూనే పరస్పర దూషణలకు దిగినట్లు ప్రచారం సాగుతోంది. అయితే, కొత్త రథసారథితోనైనా అసంతృప్తులకు చెక్పెట్టి పార్టీని బలోపేతం చేయాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. కాషాయజెండాలు.. ఫ్లెక్సీలు.. పట్టణంలోని ఏ రోడ్డులో చూసినా కాషాయ జెండా లు, నేతల ఫ్లెక్సీలతో నిండిపోయి కనిపిస్తున్నాయి. కాగా, మొన్నటివరకు బీఆర్ఎస్లో ఉన్న నల్ల మనో హర్రెడ్డి తన అనుచరులతో కలిసి బీజేపీ సభ్యత్వం పొందేందుకు ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. -
లోకేశ్ మాటలు పట్టించుకోం: మంత్రి ఉత్తమ్
సాక్షి పెద్దపల్లి: ‘నారా లోకేశ్ సహా ఏపీ మంత్రుల మాటలు పట్టించుకోం. ఏపీ ప్రతిపాదిత బనకచర్ల ప్రాజెక్టును పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. అది తెలంగాణ నీటిహక్కుల ఉల్లంఘనే అవుతుందని సీఎం రేవంత్రెడ్డి, నేను పలుమార్లు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాం. మా ఫిర్యాదుతోనే బనకచర్లను కేంద్ర జలసంఘం తిరస్కరించింది. ఏపీ సీఎంతో జరిగిన సమావేశంలోనూ మేం బనకచర్లను వ్యతిరేకించాం’అని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి చెప్పారు. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం గోలివాడ వద్ద రామగుండం ఎత్తిపోతల పథకాన్ని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దుదిళ్ల శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్తో కలిసి ఉత్తమ్ ఆదివారం ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ ఏపీ మంత్రుల మాటలను పట్టుకొని బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతూ ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పంపుతున్నారని విమర్శించారు. గోదావరి జలాలను రాయలసీమకు తీసుకువెళ్తానని కేసీఆర్ గతంలో అన్నారని ఆయన గుర్తుచేశారు. గోదావరిలో రాష్ట్రానికి ఉన్న 968 టీఎంసీల నీటి వాటాను సంపూర్ణంగా వినియోగించుకునెలా ప్రాజెక్టులు నిర్మిస్తామని తెలిపారు. తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీని పునఃప్రారంభిస్తాం.. గత ప్రభుత్వం దోపిడీ కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిందని మంత్రి ఉత్తమ్ ఆరోపించారు. సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డలో నీరు నిల్వ చేస్తే దిగువన ఉన్న 44 ఊళ్లు, భద్రాచలం వరదలో కొట్టుకుపోతాయని జాతీయ డ్యామ్ల భద్రత ప్రాధికార సంస్థ నివేదిక అందించిందని చెప్పారు. అందుకే మూడు బ్యారేజీల మరమ్మతులకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. రూ. 38 వేల కోట్లతో ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు కట్టి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. కాళేశ్వరం ఉపయోగంలో లేకపోయినా రికార్డుస్థాయిలో వరి పండిందని స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలపై జస్టిస్ ఘోష్ కమిషన్ అందించిన నివేదికను కేబినెట్ ముందు పెడతామని.. దీనిపై అసెంబ్లీ చర్చిస్తామని మంత్రి వెల్లడించారు. తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మాణాన్ని పునఃప్రారంభిస్తామన్నారు. ఇచ్చంపల్లి వద్ద కూడా మరో ప్రాజెక్టు నిర్మిస్తామని తెలిపారు. కార్యక్రమంలో పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష, రామగుండం, పెద్దపల్లి ఎమ్మెల్యేలు మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్, విజయ రమణారావు తదితరులు పాల్గొన్నారు. -
మూడు పంటలకు సాగునీరు
రామగుండం/ధర్మారం: రామగుండం ఎత్తిపోతలు అందుబాటులోకి రావడంతో ఏటా మూడు పంటలకు సాగునీరు అందుతుందని నీటిపారుదల శాఖమంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. అంతర్గాం మండలం ముర్మూర్/బ్రాహ్మణపల్లి శి వారులో రూ.75 కోట్ల వ్యయంతో నిర్మించిన ఎత్తిపోతలను మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, దుద్దిళ్ల శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్కుమార్తో కలిసి ఆదివారం రిమోట్ సా యంతో ప్రారంభించారు. ధర్మారంలో రూ. 45.15 కోట్లతో చేపట్టిన ఐటీఐ భవన సముదా యం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కొత్త రే షన్కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జ రిగిన సభలో మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి మా ట్లా డుతూ, మంథని నియోజకవర్గంలో కాళేశ్వరం ప్రాజెక్టు, బ్యారేజీ, పంపుహౌస్లను రామగుండం, పెద్దపల్లి నియోజకవర్గాల్లో నిర్మించారని, అ యినా, ఒక్కఎకరాకూ నీటిని వినియోగించుకోలేదన్నారు. రామగుండం నియోజకవర్గంలో 67 వే ల రేషన్కార్డులు ఉంటే.. కొత్తగా 6,500 రేషన్కార్డులు జారీచేశామని మంత్రి తెలిపారు. పారిశ్రామిక కారిడార్గా అభివృద్ధి చేస్తాం.. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు మాట్లాడుతూ, అనేక పరిశ్రమలకు నిలయమైన రామగుండాన్ని పారిశ్రామిక కారిడార్గా గుర్తించి అభివృద్ధి చేస్తామన్నారు. ఇందిరా మహిళాశక్తి సభ్యులకు ఆర్టీసీ బ స్సు అప్పగించడం ద్వారా వారిని ఆర్థికంగా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. సింగరేణిలో కార్మికుల మారుపేర్ల సమస్య ప్రభుత్వ పరిశీలనలో ఉందని తెలిపారు. జిల్లా ఇన్చార్జి మంత్రి తుమ్మ ల నాగేశ్వరరావు మాట్లాడుతూ, ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్తో కలిసి గత ఎన్నికల సందర్భంగా ఇక్కడ బస్సుయాత్ర చేపట్టామన్నారు. ప్రతిపాదనలు పంపిస్తే అంతర్గాంలో గోదాముల నిర్మాణానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. రవాణా శాఖమంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, మహాలక్ష్మి పథకం రామగుండం నియోజకవర్గంలో సంపూర్ణంగా అమలవుతోందన్నారు. ప్రయాణికుల అవసరం మేరకు మరో 16 బస్సులను కేటాయించాలని మక్కాన్సింగ్ కోరగా మంత్రి సానుకూలంగా స్పందించారు. ఎయిర్పోర్ట్ రాకుంటే.. ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్ మాట్లాడు తూ, అంతర్గాం భూముల్లో ఎయిర్పోర్ట్ రాకుంటే ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయాలన్నారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి జలయజ్ఞం ద్వారా ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మించారని, ఆయన అకాల మృతితో నిర్వాసిత గ్రామాలు, రామగుండం ఉమ్మడి మండలంలోని ఆయకట్టుకు సాగునీరు అందించాలనే లక్ష్యం కార్యారూపం దాల్చలేదనే ఠాకూర్ గుర్తు చేశారు. పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు మాట్లాడుతూ, జిల్లాలో 2.40 లక్షల ఆయకట్టు ఉందని, దీనిని స్థిరీకరించేందుకు పత్తిపాక రిజర్వాయరే ఆధారమన్నారు. కాందీశీకుల సమస్యలు పరిష్కరించండి.. ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాలరావు మాట్లాడుతూ, బర్మా, శ్రీలంక, కాందీశీకుల భూ ములు, పరిహారం సమస్యలు పరిష్కరించాలని మంత్రులను కోరారు. కలెక్టర్ కోయ శ్రీహర్ష, పెద్దపల్లి ఆర్డీవో గంగయ్య, తహసీల్దార్ రవీందర్పటేల్, కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు. ధర్మారంలో ఏర్పాటు చేసిన మరో కార్యక్రమంలో మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి మాట్లాడుతూ, ధర్మపురి ని యోజకవర్గ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. పత్తిపాక శివారులో శ్రీలక్ష్మీనర్సింహస్వామి రిజర్వాయర్ నిర్మిస్తామని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించినా అమలు చేయలేదని మండిపడ్డారు. ధర్మపురి ఎమ్మెల్యే, మంత్రి లక్ష్మణ్కుమార్ విన్నపం మేరకు తమ ప్రభుత్వం లక్ష్మీనర్సింహ రిజర్వాయర్ నిర్మాణం డీపీఆర్ తయా రీ కోసం రూ.1.10కోట్లు కేటాయించిందని మంత్రి స్పష్టం చేశారు. రైతుల కోసం బొమ్మారెడ్డిపల్లి – కొత్తపల్లి మైనర్ కాలువ పెండింగ్ పనుల కోసం రూ.5కోట్లు, మేడారం రిజర్వాయర్ నుంచి డీ – 83 బీ లింక్ కెనాల్ పనుల పూర్తికి రూ.3. 26 కోట్లు మంజూరు చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్లు లావుడ్య రూప్లానాయక్, భీమ సంతోష్, బుర్ర రాములుగౌడ్, లక్ష్మణ్ లావణ్య, సివిల్ సప్లయ్ ఎండీ చౌహన్, అదనపు కలెక్టర్ వేణు, ఇన్చార్జి తహసీల్దార్ ఉదయ్కుమార్ పాల్గొన్నారు. రామగుండాన్ని పరిశ్రమల కారిడార్గా అభివృద్ధి చేస్తాం అంతర్గాంలో గోదాములు నిర్మిస్తాం మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అభయం రామగుండం ఎత్తిపోతల ప్రారంభం ధర్మారంలో రేషన్కార్డులు పంపిణీ హాజరైన మంత్రులు తుమ్మల, దుద్దిళ్ల, పొన్నం, అడ్లూరి లక్ష్మణ్ -
మల్లన్నకు బోనం మొక్కులు
ఓదెల: ఓదెల మల్లికార్జునస్వామి సన్నిధిలో ఆదివారం భక్తుల రద్దీ పెరిగింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఓదెల మల్లన్నను దర్శించుకున్నారు. స్వామివారికి పట్నాలు వేయించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆర్యవైశ్యుల వన భోజనాలు ఎలిగేడు: రాములపల్లి(ర్యాకల్దేవుపల్లి) నాగలింగేశ్వర ఆలయంలో శ్రావణ మాసం సందర్భంగా ఆదివారం సుల్తానాబాద్ పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వనభోజనాలతోపాటు స్నేహితుల దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. తొలుత ప్రత్యేకపూజలు చేశారు. పూజారి అభిషేక్శర్మ తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు వెంకట్ నారాయణ, మంచాల జ్యోతి, కోలేటి రమేశ్ తదితరులు పాల్గొన్నారు. బీజీడీకేఎస్ డివిజన్ కార్యవర్గం సుల్తానాబాద్(పెద్దపల్లి): భారతీయ గ్రామీణ డాక్ కర్మచారి సంఘ్ పెద్దపల్లి డివిజన్ అధ్యక్షుడిగా ఎన్.మల్లేశం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండల కేంద్రంలో ఆదివారం సర్కిల్ కార్యదర్శి వినయ్ సుధీర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. బీ ఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్గౌడ్ హాజరయ్యా రు. కార్యదర్శిగా ఎం.సమ్మయ్య, కోశాధికారిగా కె.శ్రావణ్ కుమార్, డిప్యూటీ కార్యదర్శిగా బి.హరిహరన్ ఎన్నికయ్యారు. జిల్లా అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ప్రశాంతంగా నీట్ పీజీ ప్రవేశ పరీక్ష రామగిరి(మంథని): సెంటినరీకాలనీలోని మంథని జేఎన్టీయూలో ఆదివారం నీట్ పీజీ ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. మొత్తం 99 మంది విద్యార్థులకు 87 మంది హాజరయ్యారని ప్రిన్సిపాల్ విష్ణువర్ధన్ తెలిపారు. రామగిరి ఎస్సై శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు చేపట్టారు. -
స్టేడియం నిర్మాణానికి నిధులు
పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రంలో బ్యాడ్మింటన్ ఇండోర్ స్టేడియం నిర్మాణానికి ప్రభుత్వం రూ. 2.30కోట్లు కేటాయించిందని ఎమ్మెల్యే విజయరమణారావు తెలిపారు. జిల్లా కేంద్రంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. స్థా నిక వ్యవసాయ మార్కెట్ యార్డులో స్టేడియం నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. త్వరలోనే టెండర్ల ప్రక్రియ పూర్తిచేసి పనులు ప్రారంభించేలా చూస్తామని ఆయన అన్నారు. నాయకులు కొట్టె సదానందం, లకిడి భాస్కర్, నూగిల్ల మల్లయ్య, సరోత్తంరెడ్డి తదితరులు ఉన్నారు. అప్పుల్లో ఉన్నా పథకాలు అమలు సుల్తానాబాద్రూరల్(పెద్దపల్లి): గత ప్రభుత్వం చేసిన అప్పులు చెల్లిస్తూనే ప్రజలపై భారం పడకుండా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘ నత కాంగ్రెస్ సర్కారుకే దక్కిందని ఎమ్మెల్యే వి జయరమణారావు అన్నారు. రెబ్బల్దేవ్పల్లి, చిన్నబొంకూర్, మియ్యాపూర్ గ్రామాల్లో అభివృద్ధి పనులు ప్రారంభించారు. ఇందిరమ్మ ఇళ్లకు ముగ్గుపోసి మాట్లాడారు. జిల్లా గ్రంథాల య సంస్థ చైర్మన్ అన్నయ్యగౌడ్, ఏఎంసీ చైర్మన్ ప్రకాశ్రావు, ఎంపీడీవో దివ్యదర్శన్రావు, నా యకులు పన్నాల రాములు, సాగర్ ఉన్నారు. మొక్కలు నాటిన ‘హర్కర’ రామగుండం: అంతర్గాం మండల పరిషత్ కా ర్యాలయ ఆవరణలో ఆదివారం వనమహోత్స వం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదా రు హర్కర వేణుగోపాల్రావు, జిల్లా అటవీశా ఖ అధికారి శివయ్య, ఎంపీడీవో వేణుమాధవ్ తదితరులు మొక్కలు నాటారు. కార్యక్రమంలో మండల పరి షత్ సూపరింటెండెంట్ కరుణాకర్, అధికారు లు కొమురయ్య, రమేశ్, ఇర్షద్బేగ్, రవంతి, లీల తదితరులు పాల్గొన్నారు. యూరియా ఉత్పత్తి ప్రారంభం ఫెర్టిలైజర్సిటీ(రామగుండం): రామగుండం ఎ రువుల కర్మాగారంలో యూరియా ఉత్పత్తి ప్రా రంభమైంది. కర్మాగారం అమ్మోనియా పైప్లై న్ లీక్ కావడంతో జూలై 16న ప్లాంట్ షట్డౌన్ చేసిన విషయం విదితమే. మరమ్మతులు అనంతరం శుక్రవారం ప్లాంట్ ప్రారంభం కాగా ఆది వారం యూరియా ఉత్పత్తి పునరుద్ధరించారు. కర్మాగారం యూరియా ఉత్పత్తి సామర్థ్యం రోజూ 3,850 మెట్రిక్ టన్నులు. వార్షిక మరమ్మతులు, హెచ్టీఆర్ మార్పుతో సామర్థ్యానికి అనుగుణంగా ఉత్పత్తి చేయలేకపోతున్నారు. రేపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి రాకసుల్తానాబాద్/ఎలిగేడు/కాల్వశ్రీరాంపూర్: బీ జేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రారావు ఈనెల 5న జిల్లా కేంద్రంలో పర్యటిస్తారని ఆ పార్టీ నేతలు కర్రె సంజీవరెడ్డి, కంకణాల జ్యోతిబసు, ముక్కోజు వెంకటేశ్వర్లు, చాతరాజు రమేశ్ తెలిపారు. ఆదివారం ఆయా ప్రాంతాల్లో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. రా ష్ట్ర అధ్యక్షుడిగా నియామకమైన రామచంద్రారావు తొలిసారి జిల్లాకు వస్తున్నందున పర్యటనను విజయవంతం చేయాలని కోరారు. నా యకులు గాదె రంజిత్రెడ్డి, అడ్డ గుంట తిరుపతిగౌడ్, గుజ్జుల మల్లారెడ్డి, గోపు సురేందర్రెడ్డి, రాయపాక మనోహర్, మల్లారపు అంజయ్య, గంగయ్య, చౌదరి తిరుపతి, బత్తిని శ్రీనివాస్, రవి, కోడూరి శ్రీనివాస్, రాజేందర్, సతీశ్రెడ్డి, భోగె కిరణ్, ఎడ్ల సతీశ్ పాల్గొన్నారు. పనుల్లో వేగం పెంచండి గోదావరిఖని: సింగరేణి చేపట్టిన ర్యాపిడ్ గ్రా విటీ నిర్మాణంలో వేగం పెంచి సకాలంలో పూ ర్తిచేయాలని సీఐటీయూ అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి డిమాండ్ చేశారు. ఆర్జీ– వన్ ఏరియా లో జీడీకే–1వ గని ఫ్యాన్హౌస్ వద్ద చేపట్టిన ర్యాపిడ్ గ్రావిటీ పనులను ఆయన ఆదివారం పరిశీలించారు. అనంతరం మాట్లాడారు. కార్మి క కుటుంబాలకు నాణ్యమైన తాగునీరు అందించాలనే లక్ష్యంతో తాము పోరాటం చేశామని, దీంతోనే సింగరేణి రూ.20కోట్లతో ర్యాపిడ్ గ్రావిటీ పనులు చేపట్టిందన్నారు. ఉన్నతాధికారులు చొరవ తీసుకుని దీనిని త్వరగా అందుబాటులోకి తేవాలని ఆయన కోరారు. నాయకులు ఆరేపల్లి రాజమౌళి, మెండె శ్రీనివాస్, ఆసరి మహేశ్, దాసరి సురేశ్, అనబోయిన శంకర్, సానం రవి, ఈద వెంకటేశ్వర్లు, పెరుమళ్ల శ్రీనివాస్, తిప్పారపు రాజు, జనార్దన్రెడ్డి, పెద్దపల్లి శశికుమార్, రాజ్కుమార్, శివరామకృష్ణ, శివారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
‘కిసాన్’ సంబురం
● రైతుల బ్యాంకు ఖాతాల్లో పెట్టుబడి సాయం ● ఒక్కో అన్నదాత అకౌంట్లో రూ.2వేల చొప్పున జమ సుల్తానాబాద్(పెద్దపల్లి): చిన్న, సన్నకారు రైతులను ఆదుకునేందుకు కేంద్రప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం అమలు చేస్తోంది. ఇందులో భాగంగా ఈఏడాది తొలివిడతలో నిధులు మంజూరు చేసింది. జిల్లాలోని అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో శనివారం నుంచి రూ.2వేల చొప్పున జమచేస్తోంది. కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా ఏటా మూడు విడతల్లో (నాలుగు నెలలకోసారి) రూ.2 వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామని కేంద్ర ప్రభు త్వం గతంలోనే ప్రకటించింది. అయితే, ఈసారి వచ్చిన తొలివిడత డబ్బులు వరినాట్లకు ఉపయోగపడతాయని రైతులు భావిస్తున్నారు. జిల్లాలో తగ్గిన రైతుల సంఖ్య.. జిల్లావ్యాప్తంగా 73,400 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో శనివారం నుంచి కిసాన్ సమ్మాన్ నిధు లు జమచేస్తున్నారు. మొత్తం 82,219 మంది రైతులు ఉంటే.. అందులో 73,400 మందిని అర్హులుగా గుర్తించారు. ఐదెకరాల్లోపు వ్యవసా య భూమి గల చిన్న, సన్నకారు రైతులు పథకానికి అర్హులని ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం 82,219 మంది రైతులకు 73,400 మందిని అర్హులుగా గుర్తించగా, మిగిలినవారి బ్యాంకు ఖాతా లు, ఆధార్ వివరాల్లో పొరపాట్లు ఉండడంతో అ నర్హులుగా తేలారని అధికారులు చెబుతున్నారు. ఇలాంటివారి వివరాలు సక్రమంగా ఉంటే తమ కు అందజేయాలని, తద్వారా ఆన్లైన్లో అప్లోడ్ చేస్తామని వారు పేర్కొంటున్నారు. వివరాలు అందిస్తే అప్లోడ్ చేస్తాం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా తొలివిడత నిధులు మంజూరయ్యాయి. జిల్లాలోని 73,400 మంది బ్యాంకు ఖాతాల్లో శనివారం నుంచి జమచేస్తున్నారు. నిధులు జమకానివారు బ్యాంకు ఖాతా నంబర్లు, ఆధార్ వివరాలు మాకు సమర్పించండి. ఆన్లైన్లో నమోదు చేస్తాం. – శ్రీనివాస్, జిల్లా వ్యవసాయాధికారి -
‘పత్తిపాక’కు అడుగులు
● డీపీఆర్ తయారీకి రూ.1.10కోట్లు ● 2.40 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణకు అవకాశం ● 10 వేల ఎకరాల కొత్త ఆయకట్టు అందుబాటులోకి ● చివరి ఆయకట్టు రైతులకు తప్పనున్న సాగునీటి కష్టాలు సాక్షి పెద్దపల్లి: ఎల్లంపల్లి ప్రాజెక్టు నీటిని జిల్లాకు అందించేందుకు ప్రతిపాదనలో ఉన్న పత్తిపాక రిజర్వాయర్ నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సాగునీటి స్థిరీకరణ, కొత్త ఆయకట్టు కోసం ప్రతిపాదించిన పత్తిపాక రిజర్వాయర్ డీపీఆర్(డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్) తయారీకి ప్రభుత్వం రూ.1.10 కోట్లు మంజూరు చేసింది. 7.78 టీఎంసీల నీటినిల్వ సామర్థ్యంతో నిర్మించే ఈ ప్రాజెక్టులోకి ఎల్లంపల్లి నుంచి ఎత్తిపోతల ద్వారా నీటిని తరలిస్తారు. అక్కడినుంచి నేరుగా కాకతీయ కాలువలోకి పంపిస్తారు. రేవెల్లి సమీప హెడ్రెగ్యులేటర్ ద్వారా ఎస్సారెస్సీ డీ–83, డీ–86 కాలవలకు అందిస్తారు. తద్వారా ఉమ్మడి జిల్లాలోని పెద్దపల్లి, మంథని, రామగుండం, థర్మపురి, చొప్పదండి, కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధి లోని 2.40 లక్షల ఎకరా ల ఎస్సారెస్సీ ఆయ కట్టు స్థిరీకరణతో పాటు, కొత్తగా సుమారు 10 వేల ఎకరాలకు సాగు నీరు సమృద్ధిగా అందించే వీలుందని అధికారులు చెబుతున్నారు. గతంలో ప్రతిపాదనలకే పరిమితం ఎస్సారెస్సీ ద్వారా జిల్లాలో ప్రస్తుతం 1.80 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోంది. వారబందీ పద్థతిలో నీటిని విడుదల చేస్తుండడంతో ఓదెల, కాల్వశ్రీరాంపూర్, ముత్తారం, రామగిరి, మంథని, రామగుండం మండలాల్లోని చివరి ఆయకట్టుకు నీరు అందక పంటలు ఎండిపోతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టుతో ఎస్సారెస్పీ ఆయకట్టుకు నీరు అందించి స్థిరీకరించేందుకు ధర్మారం మండలం పత్తిపాక వద్ద 1.56 టీఎంసీల సామర్థ్యంతో ఒకటి, 7 టీఎంసీల సామర్థ్యంతో మరో ప్రతిపాదనను నీటిపారుదల అధికారులు రూపొందించినా అక్కడికే పరిమితమయ్యాయి. దీనికి ప్రత్యామ్నాయంగా వరదకాలువ నుంచి ఎస్సారెస్పీ కాలువకు మధ్య 3 కి.మీ. వరకు కెనాల్ నిర్మించారు. దీంతో గాయత్రి పంప్హౌస్ నుంచి వరదకాలువ ద్వారా మిడ్మానేరుకు నీటిని తరలించినప్పుడు మాత్రమే లింక్కాలువ ద్వారా సాగునీరు అందతుంది. రైతులకు శాశ్వత పరిష్కారం లభించాలంటే పత్తిపాక రిజర్వాయర్ ని ర్మాణం తప్పనిసరిగా మారింది. దీంతో గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పత్తిపాక రిజర్వాయర్ నిర్మిస్తామని కాంగ్రెస్ నేతలు హామీలు ఇచ్చారు. ప్రస్తుతం డీపీఆర్ తయారీకి నిధులు మంజూరు కావడంతో ప్రాజెక్టు కార్యరూపం దాల్చుతుందని అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చివరి ఆయకట్టు రైతుల సాగుకష్టాలు తొలగనున్నాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రాథమిక అంచనాలు సిద్ధం.. ప్రతిపాదిత పత్తిపాక ప్రాజెక్టును అధికారులతో కలిసి మంత్రులు శ్రీధర్బాబు, అడ్లూరి లక్ష్మణ్కుమార్, ఎమ్మెల్యేలు విజయరమణారావు, మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్ గతంలోనే పరిశీలించారు. సమీక్షలు సైతం నిర్వహించారు. రిజర్వాయర్ ఎంత సామర్థ్యంతో నిర్మించాలి, ఎన్ని ఎకరాలు ముంపునకు గురవుతాయి? ఇందు లో ప్రభుత్వ భూములు, పట్టా భూములు ఎన్ని? తదితర అంశాలపై ఇప్పటికే నీటి పారుదల శాఖాధికారులు ప్రాథమికంగా ప్రతిపాదనలు రూపొందించారు. 7.78 టీఎంసీల నీటినిల్వ సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మిస్తే, 1,700 ఎకరాలు ముంపునకు గురవుతాయని అంచనాకు వచ్చారు. ఇందులో 400 ఎకరాలు అటవీ, 1,300 ఎకరాలు పట్టా భూములు సేకరించాల్సి ఉంటుంది. -
4 నెలలు.. 20 మిలియన్ టన్నులు
● సింగరేణిలో 97శాతం బొగ్గు ఉత్పత్తి ● అగ్రస్థానంలో ఆర్జీ–2 ఏరియాగోదావరిఖని: బొగ్గు ఉత్పత్తి లక్ష్య సాధనలో సింగరేణి పకడ్బందీగా ముందుకు సాగుతోంది. గత నాలుగు నెలల్లో 20 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించింది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో 72 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యంగా నిర్దేశించుకుంది. అయితే, జూలై నాటికి 20.81 మిలియన్ టన్నుల ఉత్పత్తి సాధించాల్సి ఉండగా, 20.18మిలియన్ టన్నులు నమోదు చేసి నిర్దేశిత లక్ష్య సాధనలో 97 శాతం నమోదు చేసింది. జూలైలో వర్షాలు దంచి కొట్టినా.. అత్యధిక బొగ్గు ఉత్పత్తి సాధించే ఓసీపీల్లో రవాణాకు ఆటంకం లేకుండా చర్యలు చేపట్టింది. ముందుగా ఏర్పాటు చేసుకున్న స్టాక్కోల్ నుంచి రైల్వే మార్గం ద్వారా వినియోగదారుల డిమాండ్కు అనుగుణంగా బొగ్గు సరఫరా చేసింది. దీంతో ఉత్పత్తిలో లోటు పెద్దగా కనిపించడం లేదు. అయితే వర్షాలు అధికంగా కురవడంతో జూలైలో సంస్థవ్యాప్తంగా ఉన్న 11ఏరియాల్లో 87శాతం బొగ్గు ఉత్పత్తి మాత్రమే నమోదు చేయాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. నంబర్ వన్గా ఆర్జీ–2 ఏరియా గత నాలుగు నెలల్లో సింగరేణి వ్యాప్తంగా ఉన్న 11 ఏరియాల్లో అత్యధిక బొగ్గు ఉత్పత్తి సాధించి ఆర్జీ–2 ఏరియా అగ్రస్థానంలో నిలిచింది. 19.87లక్షల టన్నుల లక్ష్యానికి 26.57లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించి నిర్దేశిత లక్ష్యాన్ని అధిగమించి 134 శాతం బొగ్గు ఉత్పత్తి నమోదు చేసింది. అలాగే 108 శాతంతో మణుగూరు ఏరియా రెండోస్థానంలో, 103 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించి కొత్తగూడెం మూడోస్థానంలో నిలిచింది. మిగతా ఎనిమిది ఏరియాలు నిర్దేశిత లక్ష్య సాధనకు వెనుకబడ్డాయి. కేవలం 20 శాతం బొగ్గు ఉత్పత్తితో ఏపీఏ ఏరియా చివరి స్థానంలో నిచిలింది. -
మెడికల్ బోర్డులో కార్మికులకు అన్యాయం
● టీబీజీకేఎస్ ఇన్చార్జి కొప్పుల ఈశ్వర్ గోదావరిఖని: గతనెలలో నిర్వహించిన మెడికల్బోర్డులో కార్మికులకు తీవ్ర అన్యాయం జరిగిందని, దీనికి నిరసనగా సింగరేణిలో ఉద్యమాలు చేస్తామని టీబీజీకేఎస్ ఇన్చార్జి కొప్పుల ఈశ్వర్ అన్నారు. స్థానిక ప్రెస్క్లబ్లో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 9 నెలల తర్వాత.. జూలై 30, 31న చేపట్టిన మెడికల్ బోర్డుకు 55 మందిని పిలిస్తే.. అందులో ఐదుగురినే అన్ఫిట్ చేయడం అన్యాయమన్నారు. ఇది గుర్తింపు, ప్రాతినిధ్య కార్మిక సంఘాల వైఫల్య మేనని ఆయన విమర్శించారు. మాజీ సీఎం కేసీఆర్ వందశాతం మెడికల్ బోర్డులో ఉద్యోగాలివ్వాలని సూచించారని, ఇలా 19వేల మందికి ఉద్యోగాలిచ్చారని తెలిపారు. రాబోయే రోజుల్లో కారుణ్య నియామకాలు కనుమరుగైయ్యే పరిస్థితి కనబడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. సింగరేణిలో మంత్రులు, ఎమ్మెల్యేల ఆధిపత్యమే న డుస్తోందని విమర్శించారు. టీబీజీకేస్ నాయకులను ఇబ్బంది పెట్టే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. రాజకీయ బదిలీ ఉత్తర్వులు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. మందమర్రిలో ఎస్డీఎల్ యాక్టింగ్ ఆపరేటర్ రాచపల్లి శ్రావణ్కుమార్ మరణించడం దురదృష్టకరమన్నారు. మాజీ ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్, పుట్ట మధూకర్, టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి, నాయకులు మాదాసు రామమూర్తి, నూనె కొమురయ్య, వడ్డేపల్లి శంకర్, నాగెల్లి సాంబయ్య, వాసర్ల జోసఫ్, సురేందర్రెడ్డి, మేడిపల్లి సంపత్, చెల్పూరి సతీశ్, అన్వేష్రెడ్డి, చల్లా రవీందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
గొర్రెల స్కాంపై విజిలెన్స్ విచారణ
పెద్దపల్లిరూరల్: బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన గొర్రెల పంపిణీ పథకంలో జరిగిన అక్రమాలపై రాష్ట్రంలో విచారణ చేపట్టిన విజిలెన్స్ అధికారులు.. శనివారం జిల్లాకు చేరుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా పశు సంవర్ధక శాఖ కా ర్యాలయంలో విస్తృతంగా తనిఖీలు చేశారు. ల బ్ధిదారులకు గొర్రెలు పంపిణీ చేయడం, దాని రికార్డులు పరిశీలించారు. కొన్నింటిని జిరాక్స్ తీసుకుని వెంట తీసుకెళ్లినట్లు సమాచారం.మేడిపల్లి ఓసీపీ సందర్శన గోదావరిఖని: సింగరేణి సంస్థ రామగుండం డివిజన్–1 పరిధిలోని మూసివేసిన మేడిపల్లి ఓసీపీని టీజీ ఎన్డీపీఎల్ సీఎండీ వరుణ్రెడ్డి శనివారం సందర్శించారు. ఓసీపీలో చేపట్టిన పంపుడ్ స్టోరేజ్ హైడ్రో పవర్ప్రాజెక్ట్ గురించి వివరాలను సింగరేణి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆర్జీ –వన్ జీఎం లలిత్కుమార్ ప్రాజెక్టు వ్యూపాయింట్ వద్ద మ్యాప్ చూపించారు. పంప్డ్ స్టోరేజ్ ప్లాంట్లో ఉత్పత్తి అయ్యే విద్యుత్ తరలింపు, ఖర్చు, గ్రిడ్ కనెక్టివిటీపై అధికారులతో చర్చించారు. అధికారులు ఆంజనేయప్రసాద్, జితేందర్సింగ్, రమేశ్, వీరారెడ్డి, మల్లికార్జున్ యాదవ్, గంగాధర్, వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు. రోడ్డుపైనే ఇసుక లారీలు ముత్తారం(మంథని): ఖమ్మంపల్లి – తాడిచెర్ల మానేరు క్వారీ నుంచి ఇసుక తరలించే లారీలు శనివారం రోడ్డుపైనే నిలిచాయి. దీంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తి ప్రయాణికులు ఇబ్బంది ప డ్డారు. దుమ్ము, ధూళితో స్థానికులు అనారో గ్యం బారినపడుతున్నారు. రోడ్డుపై లారీలు ఎందుకు నిలుపుతున్నరని స్థానికులు ప్రశ్నిస్తే.. క్వారీ నిర్వాహకులు లారీల్లో ఇసుక నింపడం లేదని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. కంపెనీ పేరిట అక్రమంగా వస్తున్న లారీల్లో ఇసుక నింపుతూ, రోజుల తరబడి వేచిఉన్న తమ లారీల్లో ఇసుక నింపడం లేదని డ్రైవర్లు ఆందోళన వ్య క్తం చేశారు. క్వారీ బాధ్యులు అదనంగా డబ్బు లు తీసుకుంటూ అక్రమంగా ఇసుక అమ్ముకుంటున్నారని డ్రైవర్లు ఆరోపించారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. సక్సెస్ సాధించాలి మంథనిరూరల్: విద్యార్ధి దశలో విజయం సా ధించాలంటే ఒక లక్ష్యాన్ని ఎంచుకుని ముందుకుసాగాలని జిల్లా విద్యాధికారి మాధవి సూ చించారు. ఎగ్లాస్పూర్ జెడ్పీ హైస్కూల్ను శనివారం ఆమె సందర్శించారు. తొలుత విద్యార్థులతో కలిసి ప్రార్థన చేశారు. అనంతరం మాట్లాడుతూ, విద్యార్థుల సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందన్నారు. పదోతరగతి పరీక్షల్లో వందశాతం మార్కులు సాధించేలా కష్టపడాలని డీఈవో సూచించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం జి.జ్యోతి, ఉపాధ్యాయులు దొమ్మటి రవి, సంతోష్కుమార్, సుచిత్ర, శ్రీనివాస్, రాజశేఖర్, మంజుల పాల్గొన్నారు. తప్పుడు డీఎస్ఆర్ పంపించొద్దుధర్మారం(ధర్మపురి): గ్రా మ పంచాయతీ కార్యదర్శు లు డైలీ శానిటేషన్ రిపోర్టు(డీఎస్ఆర్) పంపిస్తే కఠిన చ ర్యలు తీసుకుంటామని జి ల్లా పంచాయతీ అధికారి వీ రబుచ్చయ్య హెచ్చరించా రు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో 263 మంది పంచాయతీ కార్యదర్శులు ఉన్నారని, ఇందులో ఆరుగురు తప్పుడు డీఎస్ఆర్ అప్లోడ్ చేశారని ప్రాథమి కంగా తేలిందని తెలిపారు. వీరికి షోకాజ్ నోటీసులు జారీచేశామన్నారు. గ్రామాల్లో చేపట్టే అ భివృద్ధి పనులపై 4 ఫొటోలు తీసుకుని ఆన్లైన్లో పారదర్శకంగా అప్లోడ్ చేయాలని సూ చించారు. జిల్లాలో పనిచేసే 1,485 మంది పా రిశుధ్య కార్మికులు ఉదయం 6 గంటలకే విధు లకు హాజరు కావాలని ఆదేశించారు. ట్రేడ్లైసెన్స్ లేని దుకాణాలను సీజ్ చేస్తామని హె చ్చరించారు. ఎంపీడీవో ప్రవీణ్కుమార్, మండల పంచాయతీ అధికారి రమేశ్ పాల్గొన్నారు. -
ఆప్తమిత్రుడి స్ఫూర్తితో..
జగిత్యాల: స్నేహబంధం గొప్పది. ఆ బాండింగే వేరు. స్నేహితులు మంచి కోరుతుంటారు. సూచనలు ఇస్తుంటారు. నాకు కడలి జయకృష్ణ మంచి స్నేహితుడు. బీటెక్ పూర్తయ్యాక అమెరికా వెళ్లి స్థిరపడదామని అనుకున్న. జయకృష్ణ వాళ్ల అక్కయ్య ఢిల్లీలో సివిల్స్కు ప్రిపేర్ అవుతున్నారు. ఆ సమయంలో జయకృష్ణ ఐఏఎస్కు ప్రిపేర్ కావాలని సలహాలు, సూచనలు ఇచ్చాడు. అమెరికాకు వెళ్లకుండా ఢిల్లీ వెళ్లి జయకృష్ణ వాళ్ల అక్కయ్య ప్రోత్సాహంతో సివిల్స్కు ప్రిపేర్ అయ్యాను. ఐఏఎస్ రావడంలో ఒకింత జయకృష్ణ పాత్ర ఉంది. ఐఏఎస్ అయిన తర్వాత ఎంతో మంది స్నేహితుల్లాగా కొలీగ్స్గా ఉంటారు. కానీ చిన్నతనంలో ఉన్న స్నేహితులను ఎప్పటికీ మరిచిపోం. – సత్యప్రసాద్, కలెక్టర్, జగిత్యాల -
బెస్ట్ ఫ్రెండ్ శివం ఉపాధ్యాయ
సిరిసిల్ల: నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. అందులో బెస్ట్ ఫ్రెండ్ ఎవరో చెప్పడం చాలా కష్టం. చిన్నప్పుడు చదువుకునే రోజుల్లో, కెరీర్లో అనేక మంది ఫ్రెండ్స్ అయ్యారు. నా కంటే సీనియర్ ఆఫీసర్ అయిన రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్కుమార్ ఝా చాలా క్లోజ్గా ఉంటారు. నాకు మంచి ఫ్రెండే. ఇంకా బెస్ట్ ఫ్రెండ్ ఎవరంటే.. 2021 ఐపీఎస్ బ్యాచ్మెట్ శివం ఉపాధ్యాయ. అతను నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పవచ్చు. అతనితో ఐదేళ్లుగా ఫ్రెండ్షిప్ కొనసాగుతోంది. చాలా మంచి సలహాలు ఇస్తారు. ములుగు జిల్లా ఏటూరు నాగారంలో ఏఎస్పీగా పని చేస్తున్నారు. – మహేశ్ బి గితే, ఎస్పీ, రాజన్న సిరిసిల్ల -
పేదల జీవితాల్లో మార్పు తెస్తాం
● మంత్రి శ్రీధర్బాబు మంథని: నమ్మకంతో అధికారం కట్టబెట్టిన పేదలకు అండగా ఉండి వారిజీవితాల్లో మార్పు తీసుకొస్తామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్బాబు స్పష్టం చేశారు. మంథని, రామగిరి, కమాన్పూర్ మండలాల్లో కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి శనివారం పలు అభివృద్ధి పనులు ప్రారంభించారు. స్థానిక ఆర్ఆర్ గార్డెన్స్లో కొత్త రేషన్కార్డులు పంపిణీ చేశారు. మహిళాశక్తి సంబురాల్లో పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ, ప్రజలకు ఇచ్చినమాట ప్రకారం అర్హులకు కొత్త రే షన్కార్డులతోపాటు సన్నబియ్యం సరఫరా చేస్తున్నామన్నారు. మహిళలు వ్యాపారంలో రాణించేందుకు ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. నైపుణ్యం పెంచేందుకు పెద్దపల్లిలో ఏర్పాటు చేసిన వీ – హబ్ ఉప కేంద్రం ద్వారా శిక్షణ ఇస్తామన్నారు. ఇందిరా మహిళాశక్తి ద్వారా డెయిరీ, పౌల్ట్రీఫారమ్స్ ఏర్పాటుకు ప్రణాళిక తయారు చేయాలని సూచించారు. చివరి లబ్ధిదారు వరకూ ఇల్లు చేరేలా ఇందిరమ్మ ఇంటి పథకం కొనసాగుతుందని స్పష్టం చేశారు. లక్షల మొక్కలు నాటామని గత పాలకులు చెబుతున్నారని, ఇలాగైతే పచ్చని తెలంగాణగా ఆవిర్భవించాలని, ఇప్పుడా పరిస్థితి లేదని మంత్రి అన్నారు. వన మహోత్సవం పేరిట నాటే మొక్కలపై ట్రీ ఆడిట్ జరుగాలని అన్నారు. కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ, 20 నెలల్లోనే ప్రభుత్వం మహిళలకు అన్ని రంగాల్లో ప్రాధా న్యం కల్పిస్తోందన్నారు. కొత్త రేషన్ కార్డుల ద్వారా జిల్లాలో 25వేల మందికిపైగా పేదలు లబ్ధి పొందుతారని తెలిపారు. అనంతరం రామగిరి, మంథని, ముత్తారం, కమాన్పూర్ మండలాలకు చెందిన 2,389 స్వశక్తి మహిళా సంఘాలకు రూ.2.37 కోట్ల విలువైన వడ్డీ రాయితీ చెక్కులతోపాటు పలు పథకాలు, ప్రయోజనాలకు సంబంధించిన చెక్కులు, రుణాలు, ఆర్థికసాయాన్ని మంత్రి పంపిణీ చేశారు. అటవీ – మున్సిపల్ శాఖలు చేపట్టిన వనమహోత్సవంలో మొక్కలు నాటారు. అదనపు కలెక్టర్ వేణు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అన్నయ్యగౌడ్, ఆర్డీవో సురేశ్ తదితరులు పాల్గొన్నారు. -
స్నేహితుడా..
● తోటి మిత్రులకు సాయంగా.. ● దూరమైనవారి జ్ఞాపకంగా.. ● సేవలు చేస్తూ.. అండగా నిలుస్తూ.. ● ఉమ్మడి జిల్లాలో ఆదర్శంగా పలువురు ● నేడు స్నేహితుల దినోత్సవం‘బృందావనంలో గోపాలురతో కన్నయ్య చేసిన దోస్తీ.. కుచేలుడితో కృష్ణుడి స్నేహం.. రామాయణంలో శ్రీరాముడు.. సుగ్రీవుల మైత్రి. అశోకవనంలో కాపలాగా ఉన్న త్రిజట సీతమ్మతల్లికి ఎన్నోవిధాలుగా ఊరడించి స్నేహానికి ప్రతీకగా నిలువగా.. దశరథుడితో ఉన్న మైత్రితో జటాయువు సీతమ్మ తల్లిని రక్షించేందుకు రావణుడితో ప్రాణాలొడ్డి పోరాడింది. కర్ణుడు, దుర్యోధనుడి స్నేహం మంచీ చెడు, విచక్షణ, కీర్తి, అపకీర్తికి తావులేదని మహాభారతం వివరించింది’. స్నేహం.. అనిర్వచనీయం.. అద్వితీయం.. అమ్మ అనే పదం తరువాత ఆత్మీయతను పంచే ఏకై క బంధం స్నేహం. కంటికి దూరమైనా మనసుకు దగ్గరగా ఉండేది స్నేహం. ఆపదలో ఉన్నప్పుడు ధైర్యం.. ఓదార్పునిచ్చేది నేస్తం.. విజయం సాధించినప్పుడు చప్పట్లు కొట్టేవారు.. విషాదంలో ఉన్నప్పుడు వెన్నుతట్టి ఓదార్చే నలుగురు స్నేహితులు లేని జీవితాన్ని ఎవరూ ఊహించరు. అందుకే మనిషికి తలా ఓ పేరున్నప్పటికీ.. అందరినీ దగ్గరకు చేర్చేది స్నేహబంధం మాత్రమే. స్నేహంకోసం ఏదైనా చేయాలనిపిస్తుంది. కష్టమైనా.. నష్టమైనా.. మన ఫ్రెండ్ కోసమే కదా అనిపిస్తుంది. ఇలా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అనేకమంది తమ స్నేహితుల కోసం ఎన్నోరకాల సేవలందిస్తున్నారు. జీవితాలను నిలబెడుతున్నారు. కష్టాల్లో తోడునీడగా నిలుస్తున్నారు. వారి నుంచి దూరమైన స్నేహితుల పేరిట సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. స్నేహితుల పేరిట మరికొందరికి సాయంగా నిలుస్తున్నారు. నేడు స్నేహితుల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనాలు..!! – విద్యానగర్/సప్తగిరికాలనీస్నేహితుల దినోత్సవం సందర్భంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 100మందిని పలుకరించగా.. అభిప్రాయాలు ఇలా..12స్నేహం అంటే..? అవసరాలు తీర్చేది కల్మషం లేనిది 88ఫ్రెండ్షిప్ కలుషితమైందా? అవును కాలేదు 3862నీకు ఎంతమంది నిజమైన ఫ్రెండ్స్ ఉన్నారు? ఒకరు ఇద్దరికి మించి 2872నీ ఫ్రెండ్కు ఇచ్చేస్థానం?అమ్మానాన్న తరువాత ఫ్రెండ్ ఫస్ట్ నాన్న తరువాత ఫ్రెండ్, అమ్మ ఫ్రెండ్ తరువాత అమ్మ,నాన్న 5814 -
కమ్ముకుంటున్న కాలుష్యం
● పర్యావరణానికి పెనుముప్పు ● వాయు, జలకాలుష్యంతోనూ ఇబ్బంది ● ఈఎస్ఐ ఆస్పత్రిపై కార్మికుల ఆశలు ● నేడు మంత్రులు ఉత్తమ్, తుమ్మల, దుద్దిళ్ల శ్రీధర్బాబు పర్యటనగోదావరిఖని: రామగుండం పారిశ్రామిక ప్రాంతం అనేక సమస్యలతో సతమతమవుతోంది. ప్రధానంగా వాయు, జల, శబ్ద కాలుష్యం, నిరుగ్యోగంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అవగాహన లేకచాలామంది రోడ్డు ప్రమాదాలకూ గురవుతున్నారు. వేలాదిమంది శాశ్వత అంగవైకల్యం పాలవుతున్నారు. నిరుద్యోగ యువత తప్పుదారి పడుతోంది. తక్కువ ధరకు వస్తున్న మత్తుతో విలువైన జీవితం నాశనం చేసుకుంటున్నారు. గంజాయిలాంటి మత్తుపదార్థాల బారినపడి కొందరు వ్యస నపరులుగా మారుతున్నారు. మరికొందరు నేరస్తులుగా, ఇంకొందరు మత్తుమందు సరఫరా చేస్తూ కేసుల్లో ఇరుక్కుని జైళ్లలో మగ్గిపోతున్నారు. ఆదివా రం రాష్ట్ర మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు, దుద్దిళ్ల శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్కుమా ముర్మూరు ఎత్తిపోతల ప్రారంభానికి వస్తున్న సందర్భంగా సమస్యలు పరిష్కరించాలని ఈ ప్రాంతవాసులు కోరుతున్నారు. జిల్లాలో కీలక పరిశ్రమలు ఇక్కడే.. సింగరేణి బొగ్గు గనులు, ఎన్టీపీసీ విద్యుత్ సంస్థ, ఆర్ఎఫ్సీఎల్ ప్లాంట్, కేశోరాం పరిశ్రమ లాంటి కీలక ఫ్యాక్టరీలు ఈ ప్రాంతంలోనే ఉన్నాయి. వీటితోపాటే సమస్యలూ ఉన్నాయి. సింగరేణి బొగ్గు గనుల్లో నిల్వలు అడుగంటి పోవడం, భూగర్భ గను లు తగ్గిపోతుండడంతో కార్మికుల సంఖ్య శరవేగంగా పడిపోతోంది. ఇదే క్రమంలో కాంట్రాక్టు కార్మికు లు, ప్రైవేటీకరణ శరవేగంగా సాగుతోంది. విద్యుత్ ఉత్పత్తి చేస్తోన్న ఎన్టీపీసీలోనూ కాంట్రాక్టు కార్మికు ల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఎరువులు ఉత్పత్తి చేసే ఆర్ఎఫ్సీఎల్లోనూ పర్మినెంట్ కార్మికులకు బ దులు కాంట్రాక్టు కార్మికులతో ఉత్పత్తి చేస్తున్నారు. ఆందోళన కలిగిస్తున్న పర్యావరణ కాలుష్యం ఎన్టీపీసీ, సింగరేణి, ఆర్ఎఫీసీఎల్ విస్తరించిన పారిశ్రామిక ప్రాంతంలో వాయు, నీటి కాలుష్యం తీవ్రంగా ఉంది. సింగరేణి ప్రాంతంలోని రహదారులపై బొగ్గు ధూళి(కోల్డస్ట్) అధికంగా పేరుకుపోతోంది. బ్లాస్టింగ్ సమయంలో ఓసీపీల నుంచి దుమ్ము విపరీతంగా లేచి కాలనీలను ముంచెత్తుతోంది. దీంతో స్థానికులు శ్వాసకోశ, కిడ్నీ సంబంధిత వ్యాధులతో సతమతమవుతున్నారు. నిరుద్యోగ సమస్యతో సతమతం.. కొత్తగా వచ్చిన ప్రాజెక్టులు, ప్రైవేట్ ఓబీల్లో స్థానికులకు ఉద్యోగావకాశాలు పెద్దగా లభిచడం లేదు. దీంతో స్థానిక యువత తీవ్ర నిరాశకు గురవుతోంది. కాంట్రాక్టు కార్మికులకు శ్రమకు తగిన జీతభత్యాలు అందడం లేదు. సౌకర్యాల కల్పనపై ఎవరూ దృష్టి సారించడంలేదు. ఈఎస్ఐ ఆస్పత్రిపై ఆశలు.. రామగుండం కార్మిక క్షేత్రంలో ఈఎస్ఐ వందపడకల ఆస్పత్రి ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఎప్పటినుంచో ఉంది. దీనికి సంబంధించిన స్థలాన్ని కూడా ఖరారు చేసినా.. కేంద్ర ప్రభుత్వం పరిపాలనా అనుమతులు మంజూరు చేయడంలో ఆలస్యం అవుతోంది. దీంతో కాంట్రాక్టు, భవన నిర్మాణ రంగ కార్మికులు, అల్పాదాయ వర్గాలకు ఈఎస్ఐ వైద్యసేవలు అందడం లేదు. చాలీచాలని వేతనాలు.. రామగుండంలోని ఎల్లంపల్లి ప్రాజెక్టు భద్రత సిబ్బంది చాలీచాలని వేతనాలతో ఇబ్బంది పడుతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే అత్యధిక నీటి నిల్వ సామర్థ్యం కలిగిన ఎల్లంపల్లి ప్రాజెక్టులో దశాబ్దం క్రితం నియమించిన సుమారు 20 మంది భద్రతా సిబ్బందికి ఆశించిన వేతనాలు అందడం లేవు. ప్రతీనెలా రూ.10వేల వేతనం కుటుంబ పోషణకు సరిపోవడం లేదు. ఈ సొమ్ము కూడా సకాలంలో చెల్లించడం లేదని బాధితులు వాపోతున్నారు. ఎత్తిపోతల ప్రారంభ కార్యక్రమానికి హాజరయ్యే మంత్రులు తమ సమస్యలను ఆలకించాలని కార్మికులు కోరుతున్నారు. ప్రధాన డిమాండ్లు.. ● ఎన్టీపీసీ, సింగరేణి నుంచి రామగుండం నియోజకవర్గ అభివృద్ధి కోసం సీఎస్ఆర్ నిధులు కేటాయించాలి. అభివృద్ది పనులు వేగవంతం చేయాలి ● పర్యావరణ నియంత్రణ బోర్డు (పీసీబీ) పర్యవేక్షణ మళ్లీ ప్రారంభించాలి. ● స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాల్లో ప్రాధాన్యత కల్పించాలి. ● ఈఎస్ఐ, ప్రభుత్వ ఆస్పత్రుల విస్తరణ శరవేగంగా చేపట్టాలి. మంత్రుల పర్యటనకు ఏర్పాట్లు రామగుండం: అంతర్గాం మండలం ముర్మూర్/బ్రాహ్మణపల్లి ఎత్తిపోతల పథకాన్ని భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఆదివారం ప్రారంభిస్తారు. ఈమేరకు చేపట్టిన ఏర్పాట్లను ఎమ్మెల్యే మక్కాన్సింగ్ ఠాకూర్ శనివారం పర్యవేక్షించారు. అంతర్గాం జంక్షన్ కూడలిలో బహిరంగ సభ నిర్వహిస్తామని అన్నారు. ఏర్పాట్లపై అధికారులకు సూచనలు, సలహాలిచ్చారు. తహసీల్దార్ రవీందర్ పటేల్, అధికారులు, కాంగ్రెస్ శ్రేణులు తదితరులు ఉన్నారు. -
అవయవదానం సామాజిక బాధ్యత
● అదనపు కలెక్టర్ అరుణశ్రీ కోల్సిటీ(రామగుండం): రక్త, నేత్ర, అవయవ, శ రీరదానాలు సామాజిక బాధ్యతని అదనపు కలెక్టర్ అరుణశ్రీ అన్నారు. వందరోజుల కార్యాచర ణలో బల్దియా కార్యాలయంలో మెప్మా ఆర్పీలకు అవయదాన దినోత్సవం సందర్భంగా రక్త, నేత్ర, అవయవ, శరీరదానాలపై శనివారం అవగాహన కల్పించారు. ఆర్పీలు ఎస్హెచ్జీ, ఎస్ఎల్ఎఫ్ స మావేశాల్లో రక్త, నేత్ర, అవయవ, శరీర దానాల పై అవగాహన కల్పించాలని, తల్లిపాల వారోత్స వాలను విజయవంతం చేయాలని కోరారు. డీ ఎంహెచ్వో అన్న ప్రసన్నకుమారి మాట్లాడుతూ, మరణానంతరం, జీవించి ఉండగా కొన్నిఅవయవాలు దానం చేయొచ్చన్నారు. బిడ్డ పుట్టిన అర్ధగంటలోపు ముర్రుపాలు పట్టిస్తే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని తెలిపారు. ప్రభుత్వ సార్వజనిక ఆస్పత్రి ఆర్ఎంవో రాజు, సదాశయ ఫౌండేషన్ జాతీయ ప్రచార కార్యదర్శి కేఎస్ వాసు మా ట్లాడారు. కాగా, భర్త అవయవదానంతో ఎనిమి ది మందికి పునర్జన్మ ఇచ్చిన మెప్మా సీవో శమతకమణి, తండ్రి నేత్ర దానం చేసి ఇద్దరికి చూపు ప్ర సాదించిన బల్దియా ఔట్ సోర్సింగ్ ఉద్యోగి విజయ్ కుమార్ను అదనపు కలెక్టర్, ఫౌండేషన్ ప్రతినిధులు సత్కరించారు. ఫౌండేషన్ గౌరవ అధ్యక్షుడు రామకష్ణారెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి లింగమూర్తి, మెప్మా టీఎంసీ మౌనిక ఉన్నారు. -
బాల్య మిత్రుడి జ్ఞాపకాలతో స్కూల్కు శ్రీకారం
సిరిసిల్ల: ‘అరేయ్ మన మిత్రుడు దయానంద్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు. వాడిని అందరూ గుర్తుంచుకునే విధంగా ఏదైనా చేద్దాం’ అంటూ.. బాల్య స్నేహితులు ఏకమయ్యారు. ఓ స్కూల్ను ఏర్పాటు చేశారు. 19 ఏళ్ల కిందటే రూ.30లక్షలు వెచ్చించి శాశ్వత భవనాన్ని నిర్మించారు. వందలాది మంది పిల్లలకు ఉచితంగా ఇంగ్లిష్ మీడియంలో విద్యను అందిస్తున్నారు. సిరిసిల్లలోని పద్మనగర్కు చెందిన గోసికొండ దయానంద్ 2002లో ఆత్మహత్య చేసుకున్నాడు. అతని స్నేహితుడు గాజుల శ్రీనివాస్ యూఎస్ఏ సాప్ట్వేర్ ఇంజినీరు. దయానంద్పై ఉన్న అభిమానంతో స్నేహితులతో కలిసి పట్టణ శివారులో 22 గుంటల భూమిని కొనుగోలు చేశారు. 19 ఏళ్ల కిందట సుమారు రూ. 30 లక్షలు వెచ్చించి స్కూల్ను 2006లో స్థాపించారు. ఒకటో తరగతి నుంచి ఏడో తరగతి వరకు ఉచిత విద్యను అందిస్తున్నారు. రాజీవ్నగర్లోని పేదలందరూ తమ పిల్లలను దయానంద్ మెమోరియల్ స్కూల్కు పంపిస్తున్నారు. ప్రస్తుతం స్కూల్లో 65 మంది విద్యార్థులు ఉన్నారు. ఏటా 25 మంది జెడ్పీస్కూళ్లకు వెళ్తున్నారు. నిర్వహణకు ఏటా రూ.6 లక్షలు ఖర్చవుతోంది. ట్రస్ట్ అధ్యక్షుడిగా గాజుల శ్రీనివాస్ ఉన్నారు. శ్రీనివాస్ స్నేహితులు భీమేశ్వర్ అంకతి, రాంబాబు చేబ్రోలు, జి.రాజశేఖర్, ప్రసన్న పోల్సాని, విజయ్కృష్ణ భరాతం, మురళీకృష్ణ సింగారం, రవీందర్ నాగంకేరి, రవి వూరడి, గణేశ్ గోసికొండ భాగస్వాములుగా ఉన్నారు. -
రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్ సమ్మాన్ నిధులు
పెద్దపల్లిరూరల్: రైతు సంక్షేమానికి కేంద్ర, రాష్ట్రర ప్రభుత్వాలు ప్రాధాన్యతనిస్తూ అండగా నిలుస్తున్నాయని జిల్లా వ్యవసాయాధికారి శ్రీనివాస్ అన్నారు. బ్రాహ్మణపల్లి రైతువేదికలో శనివారం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 20వ విడత నిధులను ప్రధాని నరేంద్రమోదీ విడుదల చేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సంక్షేమ పథకాలను రైతులు సద్వినియోగం చేసుకుంటున్నారని తెలిపారు. జిల్లాలోని 73,400 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.14.68కోట్లను కేంద్ర ప్రభుత్వం జమచేసిందని ఆయన అన్నారు. కేవీకే శాస్త్రవేత్తలు శ్రీనివాస్, వెంకన్న, నవ్య, ఏవో అలివేణి, ఏఈవోలు వినయ్, సువర్చల, పూర్ణచందర్, రచన, కల్పన, ప్రశాంత్ తదితరులు ఉన్నారు. -
స్నేహబంధమే శాశ్వతం
సాక్షి, పెద్దపల్లి: స్నేహబంధమే అన్నింటికన్నా శాశ్వతమైనది. నేను ఇప్పటికీ నా స్కూల్మేట్స్ను కలుస్తుంటా. చిన్నప్పుడు ఖమ్మం పాఠశాలలో పదో తరగతి వరకు కలిసి చదువుకున్నం. చదువులు పూర్తయ్యాక చిన్ననాటి మిత్రులందరూ వివిధ దేశాలు, పట్టణాల్లో డాక్టర్లు, సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, ఉద్యోగులు, వ్యాపారులుగా స్థిరపడ్డారు. ఎవరెక్కడ ఉన్నా మేమంతా ఒకరికొకరు తోడుగా ఉన్నామన్న భరోసా ఇస్తూ కష్టసుఖాల్లో పాలుపంచుకుంటాం. 30 ఏళ్లుగా మా స్నేహం కొనసాగుతోంది. వాట్సప్ గ్రూప్ ద్వారా నిత్యం టచ్లో ఉంటాం. ఏడాదికోసారి ఒకచోట కలిసి యోగక్షేమాలు తెలుసుకుంటాం. – కోయ శ్రీహర్ష, కలెక్టర్, పెద్దపల్లి -
ఆహ్లాదం.. అధ్వానం
పెద్దపల్లి జిల్లాగా మారి సుమారు పదేళ్లు గడించింది. అయినా, పట్టణ రూపురేఖలు మారడం లేదు. ప్రధానంగా సుందరీ కరణకు ఆమడ దూరంలో ఉండిపోయింది. కొత్త ఉద్యానవనాల మాట దేవుడెరుగు.. ఉన్న పార్క్లు నిర్వహణ, పర్యవేక్షణ లోపంతో శిథిలావస్థకు చేరాయి. ఆటవిడుపు కోసం జిల్లా కేంద్రంలో అనేక ఉద్యానవనాలు ఉన్నాయని మున్సిపల్ సిబ్బంది, అధికారులు నిర్వహణ కోసం నిధులు వెచ్చిస్తున్నామని ఖర్చులు చూపుతున్నారని, పార్క్ల్లో ఆహ్లాదం ఎక్కడా కనిపించడం లేదని కొందరు మాజీ కౌన్సిలర్లు బాహాటంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని చంద్రకాకనగర్ తదితర ప్రాంతాల్లోని పిల్లల పార్క్ల దుస్థితి ఇది. – సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి -
చెత్త సేకరణలో నిర్లక్ష్యంపై నిరసన
● వినూత్న రీతిలో నిరసన తెలిపిన మహిళా మాజీ కార్పొరేటర్ ● అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించలేదని ఆగ్రహంకోల్సిటీ(రామగుండం): తన డివిజన్లో చెత్త సే కరణలో నిర్లక్ష్యం వహిస్తున్న రామగుండం బల్ది యా అధికారుల తీరుపై మాజీ కార్పొరేటర్ నగు నూరి సుమలత శుక్రవారం వినూత్న రీతిలో నిరసన తెలిపారు. కొత్తగా 48వ డివిజన్గా మారిన ఆర్టీసీ కాలనీలో తానే స్వయంగా ద్విచక్ర వాహ నం నడుపుతూ ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరించా రు. వాహనానికి ఇరువైపులా ప్లాస్టిక్ డబ్బాలు క ట్టి తడి, పొడి చెత్తను వేర్వేరుగా పోగుచేశారు. కా లనీకి దూరంగా తరలించి నిరసన వ్యక్తం చేశా రు. సుమలత మాట్లాడుతూ.. నెల రోజులుగా చెత్త సేకరించే ఆటోట్రాలీలు రావడం లేదన్నారు. డివిజన్కు కేటాయించిన రెండు ఆటోట్రాలీలను ఇతర ప్రాంతాలకు కేటాయించారని ఆరోపించా రు. ఇళ్లలో చెత్త పేరుకుపో దుర్వాసన వస్తోందని, దోమలు వృద్ధి చెంది అనారోగ్య సమస్యలు తలె త్తే ప్రమాదం ఆమె తెలిపారు. శానిటరీ ఇన్స్పెక్టర్లు, జవాన్లతోపాటు కమిషనర్, డిప్యూటీ కమిషనర్కు ఫిర్యాదు చేశామని, కలెక్టర్ ఫిర్యాదు చేసి నా స్పందన లేదని పేర్కొన్నారు. అధికార పార్టీ నాయకుల డివిజన్లకు క్రమం తప్పకుండా ఆటోట్రాలీలను తరలిస్తున్న అధికారులు.. తన డివిజన్పై ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని నిలదీశారు. ఫాగింగ్ కూడా చేపట్టడం లేదని, డ్రెయినేజీలు కంపుకొడుతున్నాయన్నారు. శానిటేషన్ సిబ్బంది స్పందించకుంటే రోజుకోతీరున నిరస న తెలుపుతానని ఆమె హెచ్చరించారు. కాగా, చెత్త సేకరణలో తలెత్తిన సమస్యలపై బల్దియా కమిషనర్ అరుణశ్రీ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. బాధ్యులను సస్పెండ్ చేయాల్సి వస్తుందని హెచ్చరించినట్లు సమాచారం. -
పర్యావరణ పరిరక్షణకు కృషి
రామగిరి(మంథని): గనుల విస్తరణ సందర్భంగా తలెత్తే సమస్యల నుంచి బయట పడేందుకు పర్యావరణ పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని కేంద్రప్రభుత్వ పర్యావరణ సలహాదారు, హైద రాబాద్ రీజియన్ శాస్త్రవేత్త కె.తరుణ్ కుమార్ సూచించారు. శుక్రవారం ఆర్జీ–3, ఏపీఏ ఏరియా లో పర్యటించారు. జీఎం కార్యాలయంలో ఎన్విరాన్మెంట్ జీఎంలు సుధాకర్రావు, నాగేశ్వరరా వు, సైదులుతో కలిసి సమీక్షించారు. జీడీకే–10 ఇంక్లయిన్, ఏపీఏ, ఓసీపీ–2 గనుల విస్తరణ సందర్భంగా తలెత్తే పర్యావరణ సమస్యలను పరిష్కరించాలన్నారు. ఎస్వోటూ జీఎం రామ్మోహన్, పీవోలు వెంకటరమణ, రాజశేఖర్ ఉన్నారు. -
వార్డు ఆఫీసర్లు క్షేత్రస్థాయిలో పర్యటించాలి
కోల్సిటీ(రామగుండం): పౌరులకు మెరుగైన సే వలు అందేలా క్షేత్రస్థాయిలో పర్యటించాలని రా మగుండం నగరపాలక సంస్థ కమిషనర్ (ఎఫ్ఏ) అరుణశ్రీ వార్డు అధికారులకు సూచించారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో శుక్రవారం వార్డు అధికారులతో నిర్వహించిన సమీక్షలో కమిషనర్ మాట్లాడారు. పౌర సేవలకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. ఆస్తిపన్ను, ట్రేడ్ లైసెన్స్ వసూళ్లను లక్ష్యానికి అనుగుణంగా పెంచాలని కమిషనర్ ఆదేశించారు. మొండిబకాయల వసూళ్లకు రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇందులో మంచి పనితీరు కనబరిస్తే 15వ ఆర్థిక సంఘం పెర్ఫార్మెన్స్ గ్రాంట్స్ కూడా నగరపాలక సంస్థకు మంజూరయ్యే అవకాశం ఉందని తెలిపారు. సమావేశంలో నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ వెంకటస్వామి, ఆర్వో ఆంజనేయులు, ఆర్ఐలు శంకర్రావు, ఖాజా, వార్డు అధికారులు పాల్గొన్నారు. పౌరులకు సేవలు అందించండి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అరుణశ్రీ ఆదేశాలు -
ఏఐ టూల్స్ వినియోగంపై శ్రద్ధ
● కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచన పెద్దపల్లిరూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మెరుగైన విద్య అందిస్తూనే.. ఏఐ టూల్స్ వినియోగంపై అవగాహన పెంచుకోవాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఉపాధ్యాయులకు సూచించారు. కలెక్టరేట్లో శుక్రవారం రామగుండం మండల ఉపాధ్యాయులతో సమావేశమై పలు సూచనలు చేశారు. విద్యార్థులకు మరింత మెరుగైన విద్య అందించేందుకు అనుసరించాల్సిన పద్ధతులపై ఉపాధ్యాయుల నుంచి సలహాలు, సూచలు అడిగి తెలుసుకున్నారు. ప్రైమరీ పాఠశాల విద్యార్థులు రోజూ 20 నిమిషాలపాటు హాజరయ్యేలా షెడ్యూల్ రూపొందించుకోవాలన్నారు. వచ్చే ఐదేళ్లలో అమల్లో ఉండేలా చూడాలన్నారు. తరగదిలో విద్యా బోధనలో విద్యార్థులను భాగస్వాములను చేయాలని అన్నారు. ఎఫ్ఆర్ఎస్ విధానంలో తప్పనిసరిగా నమోదు చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. సంపూర్ణ వివరాలను యూఐడైస్ పోర్టల్లో నమోదు చేయాలని, విద్యార్థులు వర్క్ బుక్ వినియోగించేలా చూడాలని ఆయన సూచించారు. డీఈవో మాధవితోపాటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మెరుగైన సేవలు అందించాలి సుల్తానాబాద్(పెద్దపల్లి): పేషెంట్లకు అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్యసేవలు అందించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్, తహసీల్దార్ కార్యాలయాలను కలెక్టర్ తనిఖీ చేశారు. పరిసరాలు, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూ చించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. భూభారతి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. ఎంపీడీవో దివ్యదర్శన్రావు, తహసీల్దార్ బషీరొద్దీన్, పంచాయతీ అధికారి సమ్మిరెడ్డి, ఆస్పత్రి సూపరింటెండెంట్ రమాదేవి, మున్సిపల్ కమిషనర్ రమేశ్, ఏఈ సచిన్, ఎంఈవో రాజయ్య, వ్యవసాయాధికారి నాగార్జున తదితరులు పాల్గొన్నారు. -
మంథనికి ఎల్ఈడీ వెలుగులు
మంథని: మున్సిపల్ పరిధిలోని పట్టణ ప్రవేశ ప్రధాన రహదారుల్లో ఇకనుంచిఎల్ఈడీ వెలుగులు విరజిమ్మనున్నాయి. పెద్దపల్లి – కాటారం మెయిన్ రోడ్డుతోపాటు గోదావరిఖని ప్రధాన రహదారికి ఇరువైపులా రూ.6 కోట్ల 70లక్షల వ్యయంతో సెంట్రల్ లైంటింగ్ సిస్టమ్, పాతపెట్రోల్ బంక్ కూడలిలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేశారు. పెద్దపల్లి రోడ్డులో శ్రీరాంనగర్ నుంచి, కాటారం రోడ్డులో మతాశిశు ఆరోగ్య కేంద్రం నుంచి, గోదావరిఖని రోడ్డులో పోచమ్మవాడకు వెళ్లే పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి ఇలా.. పట్టణానికి ఇరువైపులా ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేశారు. అలాగే పోచమ్మవాడకు వెళ్లే ప్రధాన కూడలి, గంగాపురి, ఆర్టీసీ బస్డిపో సమీపంలో సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. పట్టణంలోకి ప్రవేశించే ప్రధానదారిలో రాత్రి వేళ చీకటి ఉండేది. నూతనంగా అమర్చిన ఎల్ఈడీ లైట్లతో ఆ సమస్య పరిష్కారం కానుంది. ట్రాఫిక్ సిగ్నల్స్తో సమస్యలకు చెక్.. పట్టణంలో ట్రాఫిక్ అస్తవ్యస్తంగా ఉంది. ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయాలని పట్టణవాసులు చాలాకాలంగా డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు పాతపెట్రోల్ బంక్ కూడలిలో రెండుచోట్ల ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేశారు. బస్సుడిపో సమీపంలో, అంబేడ్కర్ కూడలి, శ్రీపాదచౌక్ ఏరియాలో సైతం ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు. పైగా వాహనదారులు ఇష్టారీతిన వెళ్లడం, వాహనాలను ఎక్కడపడితే అక్కడ పార్కింగ్ చేయడంతో పట్టణ ప్రజలకు తీవ్రఅసౌకర్యం కలుగుతోంది. ట్రాఫిక్ సమస్య ఉన్నప్రాంతాల్లో సిగ్నల్స్తోపాటు ట్రాఫిక్ కానిస్టేబుళ్లను నియమించాలని చేయాలని పట్టణ ప్రజలు కోరురుతున్నారు. కాగా మున్సిపల్ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ సిస్టమ్, ట్రాఫిక్ సిగ్నల్స్ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు శనివారం ప్రారంభించనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేశారు. రూ.6.70 కోట్లతో సెంట్రల్ లైటింగ్ .. ట్రాఫిక్ సిగ్నల్స్ నేడు ప్రారంభించనున్న మంత్రి శ్రీధర్బాబు -
మా భూములు తీసుకుంటే బతికేదెట్లా?
● రత్నాపూర్ గ్రామస్తుల ఆగ్రహం ● ఇండస్ట్రియల్ పార్క్ వద్దని నిరసన రామగిరి(మంథని): ‘ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పా టు మా గ్రామంలోనే ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు..? మా జీవనధారమైన పార్క్ ఏర్పాటు చేయొద్దు’ అని పలువురు రైతులు పేర్కొన్నారు. రత్నాపూర్ గ్రామంలోని మేడిపల్లి శివారులో ఇండ స్ట్రియల్ పార్క్ ఏర్పాటు కోసం 203.31 ఎకరాల భూ సేకరణ కోసం శుక్రవారం రత్నాపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రజాభిప్రా య సేకరణ చేపట్టారు. అభివృద్ధి పేరిట సింగరే ణి సుమారు 400 ఎకరాలు, కృషి విజ్ఞాన కేంద్రం పేరిట 170 ఎకరాలు ఇప్పటికే సేకరించారని, అభివృద్ధి పేరిట ఇప్పుడు మళ్లీ తమ భూములు లాక్కోవడం సమంజసం కాదని అన్నారు. విలు వైన భూములను తాము వదుకోలేమని పేర్కొ న్నారు. వ్యవసాయాన్ని నమ్ముకున్న తాము భూ ములు కోల్పోతే కుటుంబాలను ఎలా పోషించుకోవాలని ప్రశ్నించారు. అయితే, కొందరు రైతు లు భూములు ఇచ్చేందుకు అంగీకరించి, కుటుంబసభ్యులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. మరోవైపు.. తమ భూములు ఇచ్చే ప్రస క్తే లేదని, మళ్లీ తమ ఊరికి రావొద్దని మహిళా రైతులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. దీంతో సభలో కాస్త గందరగోళం ఏర్పడింది. అయి తే, నివేదికను కలెక్టర్ అందజేస్తామని మంథని ఆర్డీవో సురేశ్ తెలిపారు. సీఐలు ఇంద్రసేనారెడ్డి, ప్రసాద్రావు, ఎస్సైలు శ్రీనివాస్, దివ్య, ప్రసాద్, నరేశ్ ఆధ్వర్యంలో బందోబస్తు చేపట్టారు. కరీంనగర్ టీజీ ఐఐసీ జనరల్ మేనేజర్ మహేశ్వర్, తహసీల్దార్ సుమన్, ఇండస్ట్రియల్ మేనేజర్ సురేశ్, గ్రామప్రత్యేకాధికారి శ్రీకాంత్, పంచాయతీ కార్యదర్శి సంతోష్ పాల్గొన్నారు. -
యువతలోనే నిర్లక్ష్యం
● సింగరేణిలో పెరుగుతున్న గైర్హాజరు ● భూగర్బ గనుల్లో చేసేందుకు విముఖత ● ఏడాదిలో వందమస్టర్లు చేయని ఉద్యోగులపై యాజమాన్యం దృష్టి ● కుటుంబ సభ్యులకు అధికారుల కౌన్సెలింగ్గోదావరిఖని: ఉద్యోగుల గైర్హాజర్పై సింగరేణి సీరియస్గా ఉంది. ఉద్యోగం లభించడమే కష్టమైన ప్రస్తుత పరిస్థితుల్లో విధులకు గైర్హాజర్ అవుతూ కొందరు ఉన్న ఉద్యోగానికి ఎసరుతెచ్చుకుంటున్నారు. ఇటీవల మహిళా ఉద్యోగులు కూడా భూగర్భగనుల్లోకి వెళ్లి ఉద్యోగాలు చేస్తున్నారు. కానీ, కొందరు యువ ఉద్యోగులు విధులకు గైర్హాజర్ కావడం ఆందోళన కలిగిస్తోంది. పెరిగిన యువత.. సింగరేణిలో యువ ఉద్యోగుల సంఖ్య భారీగా పెరిగింది. గైర్హాజర్ కూడా అదే స్థాయిలో నమోదు అవుతోంది. యువతతో బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకత పెరిగి సంస్థ మరింత వృద్ధి చెందుతుందని యాజమాన్యం భావించినా.. క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంటోంది. రంగంలోకి దిగిన ఉన్నతాధికారులు.. గతేడాది వంద మస్టర్లు నిండని, ఈఏడాది జూన్ వరకు 50 మస్టర్లు పూర్తిచేయని ఉద్యోగులకు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. కారుణ్య నియామకాలతో.. కారుణ్య నియామకాలతో యువ ఉద్యోగుల సంఖ్య పెరుగుతోంది. మెడికల్ ఇన్వాలిడియేషన్ ద్వారా రైటర్ అయిన కార్మికుల స్థానంలో వారి వారసులకు ఉద్యోగలు వస్తున్నాయి. ఈక్రమంలో వీరి సంఖ్య ఇప్పటివరకు 16 వేలకుపైగా చేరింది. పాత తరం కార్మికులు బాగానే పనిచేస్తున్నా.. యువతఆశించిన మేరకు విధులకు హాజరు కావడం లేదని అధికారులు అంటున్నారు. ఉన్నత చదువులు చదివి భూ గర్భగనుల్లో పనిచేసేందు కొందరు నామోషీగా ఫీలవుతున్నారు. సాఫ్ట్వేర్ రంగంలో ఏసీల కింద కూర్చుని అత్యధిక ప్యాకేజీలతో ఉల్లాసంగా బతికిన యువత.. బొగ్గు గనుల్లో పనులు చేసేందుకు ఉక్కి రిబిక్కిరవుతున్నారని అంటున్నారు. కష్టమైన పనులకు పురమాయిస్తే గైర్హాజరవుతున్నారు. పర్మినెంట్ పోస్టులకు ఎసరు.. సింగరేణిలో పర్మినెంట్ పోస్టుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. భూగర్భగనుల్లో సపోర్టింగ్, రూఫ్బోల్టింగ్, గనులపై క్యాంటీన్లలో పనిచేసే ఉద్యోగులు, కొన్నిచోట్ల క్యాంటీన్ల నిర్వహణ ప్రైవేట్ సంస్థలకు అప్పగించారు. పర్మినెంట్ కార్మికులు ఈ పనులు చేసేందుకు ఇష్టపడటం లేదు. మరోవైపు కాంట్రాక్టీకరణ, ప్రైవేటీకరణ వేగంగా సాగుతోంది. కన్వేయన్స్ వాహనాలు, ఓబీ వెలికితీత, సివిల్, సివిక్ విభాగాల్లో ప్రైవేటీకరణ ఊపందుకుంది. మూడేళ్లలో వందలోపు మస్లర్లుంటే డిస్మిస్ గైర్హాజర్ కార్మికుల గురించి సింగరేణి మానవీ య కోణంలోనే వ్యవహరిస్తోంది. డ్యూటీలు తక్కువగా చేసే కార్మికుల కోసం ఏరియాల వారీగా కౌన్సెలింగ్ ఇస్తోంది. కుటుంబ సభ్యులతో సహా కౌన్సెలింగ్ ఇచ్చి.. సంతృప్తికరమైన సమాధానాలు చెప్పిన వారికి కొన్ని సడలింపులు ఇస్తోంది. అయితే, చాలామంది చిన్న కారణాలతోనే విధులకు రావడం లేదని అధికారులు చెబుతున్నారు. ఏరియా గైర్హాజర్ ఆర్జీ–1 118 ఆర్జీ–2 66 ఆర్జీ–3 14 ఏపీఏ 67 -
భక్తిశ్రద్ధలతో సామూహిక కుంకుమపూజలు
మంథని: పట్టణంలోని శ్రీకన్యకాపరమేశ్వరీ అమ్మవారి ఆలయంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా 108 కిలోల కుంకుమతో అర్చనలు, ప్రత్యేక పూజలు చేశారు. సుమారు 300 మంది ఆర్యవైశ్య మహిళలు పూజలకు హాజరయ్యారు. అదేవిధంగా మహాలక్ష్మీ, లలితాదేవీ తదితర దేవతామూర్తుల ఆలయాలు భక్తులతో సందడిగా మారాయి. ఆర్యవైశ్య సంఘం పట్టణ అధ్యక్షుడు ఎల్లంకి వంశీకృష్ణ, జిల్లా అధ్యక్షుడు నలమూసు ప్రభాకర్, ఆలయ కమిటీ అధ్యక్షుడు కొత్త శ్రీనివాస్, మహిళా విభాగం అధ్యక్షురాలు రాచర్ల తిరుమల, రావికంటి మనోహర్, జయన్న, కిశోర్, నాగరాజు, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. 5 నుంచి ఆదివరాహస్వామి జయంతి ఉత్సవాలు కమాన్పూర్(మంథని ): ప్రసిద్ధ శ్రీఆదివరా హస్వామి జయంతి ఉ త్సవాలు ఈనెల 5 నుంచి 7వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ఆ లయ ఈవో కాంతరెడ్డి, ప్రధాన అర్చకుడు కల కుంట్ల వరప్రసాద్ తెలిపారు. ఈనెల 5న ఆదివరాహ హవనం, 6న శ్రీభూఆదివరాహస్వామి కల్యాణం, 7న అష్టోత్తర శతఘటాభిషేకం, 108 కలశాలతో అభిషేకం నిర్వహిస్తామని పేర్కొన్నారు. ముగిసిన రెస్క్యూ శిక్షణ గోదావరిఖని: మహిళా రెస్క్యూ రెండోబ్యాచ్ శిక్షణ శుక్రవారం ముగిసింది. ఆర్జీ–2 ఏరియా మెయిన్ రెస్క్యూ స్టేషన్లో 61రోజుల పాటు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. శిక్షణ పూర్తిచేసుకున్న అండర్ మేనేజర్లకు రెస్క్యూ జీఎం శ్రీనివాస్రెడ్డి సర్టిఫికెట్లు, డ్రెస్స్కోడ్ అందజేశారు. మై నింగ్ థియరీ, గ్యాస్, గ్యాస్ డిటెక్టర్స్, ఫస్ట్ ఎ యిడ్, రెస్క్యూ రికవరీ, ఫైర్ ఫైటింగ్, ఫైర్ ఎ గ్జిస్టర్, స్పెషలిజెడ్ ఎక్విప్మెంట్స్ తదితర అంశాలపై ప్రతినిధులకు శిక్షణ ఇచ్చారు. రెస్క్యూ సూపరిండెంట్ రాజేందర్రెడ్డి, ఇన్స్ట్రక్టర్లు కిషన్రావు, శ్రవణ్, సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్ర అథ్లెటిక్స్ పోటీలకు ‘మోడల్’ విద్యార్థుల ఎంపిక ధర్మారం(ధర్మపురి): స్థానిక మోడల్ స్కూల్(ఆదర్శ పాఠశాల) విద్యార్థులు రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికై నట్లు ప్రిన్సిపాల్ ఈర వేని రాజ్కుమార్ తెలిపారు. గోదావరిఖనిలో ఇటీవల జరిగిన జిల్లాస్థాయి పోటీల్లో ఇంటర్ ఫస్టియర్కు చెందిన అఖిల 200 మీటర్లు, శ్రీజ 100 మీటర్లు, పందెం శ్రీవాణి 400 మీటర్లు, శరణ్య 200 మీటర్ల పరుగు పందంలో ప్రతిభ చూపారని పేర్కొన్నారు. అదేవిధంగా పదోతరగతి విద్యార్థి మనోజ్ఞ లాంగ్ జంప్, తొమ్మిదో తరగతి విద్యార్థి సౌజ్ఞశ్రీ 600 మీటర్లు, ఎనిమిదో తరగతి విద్యార్థి 100 మీటర్ల పరుగు పందెంలో రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై నట్లు వివరించారు. విద్యార్థులను ప్రిన్సిపాల్తోపాటు పీఈటీలు బైకని కొమురయ్య, మేకల సంజీవరావు తదితరులు అభినందించారు. ఆర్ఎఫ్సీఎల్ ప్లాంట్లో మరమ్మతులు పూర్తిఫెర్టిలైజర్సిటీ(రామగుండం): రామగుండం ఎరువుల కర్మాగారాన్ని(ఆర్ఎఫ్సీఎల్) శుక్రవా రం పునరుద్ధరించారు. జూలై 16న అమ్మో నియా పైప్లైన్ లీక్ కావడంతో ప్లాంట్ను షట్డౌన్ చేశారు. కర్మాగారంలో మరమ్మతులు పూర్తిచేయడంతో ప్లాంట్ను పునరుద్ధరించారు. మరోరెండు రోజుల్లో యూరియా ఉత్పత్తి ప్రారంభం అవుతుందని ఆర్ఎఫ్సీఎల్ అధికారులు తెలిపారు. ప్లాంట్ షట్డౌన్ కావడంతో సుమారు 69,300 మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. సుమారు రూ.600 కోట్ల వరకు నష్టం వాటిల్లిందని అధికారులు వివరించారు. -
రోగనిరోధక శక్తి..
తల్లిపాలు రోగనిరోధకశక్తిని పెంచుతాయి. శిశువును అనేకరకాల ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తాయి. వారి మెదడు అభివృద్ధికి అవసరమైన కొవ్వు ఆమ్లాలు తల్లిపాలలో పుష్కలంగా ఉంటాయి. – డా.అన్నప్రసన్నకుమారి, జిల్లా వైద్యాధికారిచైతన్యవంతం చేస్తున్నాం పిల్లలకు ముర్రుపాలు పట్టించేలా బాలింతలను చైతన్యవంతం చేస్తున్నాం. గర్భిణి మొదలు ప్రసవం అయ్యేవరకు ప్రభుత్వ ఆస్పత్రిలోనే సేవలు అందించి, తల్లీబిడ్డ క్షేమంపై ప్రభుత్వం తీసుకుంటున్న ప్రత్యేక శ్రద్ధను వివరిస్తున్నం. – కొండూరి కవితగౌడ్, ఏఎన్ఎం, కాట్నపల్లి -
కుటుంబం కోసం శ్రమించినవారిని గౌరవించాలి
కోల్సిటీ(రామగుండం): ఉద్యోగ విరమణ ప్రయోజనాలను ఉద్యోగి ఆఖరి పని దినం రోజే అందజేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్ జె.అరుణశ్రీ తెలిపారు. పబ్లిక్ హెల్త్ వర్కర్లుగా పని చేసి గురువారం ఉద్యోగ విరమణ పొందిన ఆవునూరి మల్ల య్య, రేణికుంట్ల పోచయ్య, కుమ్మరి రాయపోషమ్మను సన్మానించి మాట్లాడారు. ఉద్యోగ విరమణ తర్వాత ఆర్థిక ఇబ్బందులు పడకుండా ఈఎల్(లీవ్ ఎన్క్యాష్మెంట్) ప్రయోజనం ప్రొసీడింగ్స్ అందిస్తున్నట్లు తెలిపారు. ఇంతకాలం కుటుంబం కోసం శ్రమించిన వారిని కుటుంబ సభ్యులు గౌరవంగా చూసుకోవాలన్నారు. కాగా, కమిషనర్ ఆదేశాల మేరకు సదరు ఉద్యోగులను తొలిసారి బల్దియాకు చెందిన కార్లలో వారి ఇంటికి గౌరవంగా సాగనంపిన తీరుపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రామన్, ఏసీపీ శ్రీహరి, డీఈ జమీల్, ఏఈ మీర్, ఆర్ఓ ఆంజనేయులు, అకౌంట్స్ ఆఫీసర్ రాజు, సూపరింటెండెంట్ పబ్బాల శ్రీనివాస్ తదితరులున్నారు. -
ఆయిల్పామ్ సాగుకు ముందుకు రావాలి
ధర్మారం(ధర్మపురి): లాభాసాటి దిగుబడి వస్తున్న ఆయిల్పామ్ సాగుకు రైతులు ముందుకు రావాలని జిల్లా ఉద్యానశాఖ అధికారి జగన్మోహన్రెడ్డి కోరారు. గురువారం ధర్మారం మండలం పత్తిపాక, చామనపల్లి గ్రామాల్లోని రైతులు గంగం రాజేశ్వర్రెడ్డి, వేల్పుల కొమురయ్యకు చెందిన 7 ఎకరాల్లో ఆయిల్పామ్ మొక్కలు నాటారు. . మోతాదుకు మించి మందులు వాడరాదన్నారు. దేశంలో ఆయిల్పామ్ పంటకు ఉన్న డిమాండ్ మరే పంటలకు లేదని రైతులు ముందుకు వచ్చి సాగుచేయాలని సూచించారు. ఆయిల్ కంపెనీ సీఈవో కేశు కళ్యాణ్కర్, ఫీల్డ్ అధికారి మహేశ్ పాల్గొన్నారు. వినికిడి పరికరాలు అందజేతపెద్దపల్లిరూరల్: ఆర్బీఎస్కే వారి వైద్యపరీక్షల్లో వినికిడి లోపం ఉన్నట్టు గుర్తించిన 10మంది విద్యార్థులకు గురువారం డీఎంహెచ్వో అన్నప్రసన్నకుమారి వినికియంత్రాలను అందజేశారు. కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమంలో అలీంకో ట్రస్ట్వారు పరికరాలు అందించారు. అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ముందుగానే తేదీలను ఖ రారు చేసి ఆ షెడ్యూల్ ప్రకారం ఆర్బీఎస్కే వై ద్యాధికారులు, సిబ్బంది వెళ్లి వారి ఆరోగ్యస్థితిగతులు తెలుసుకుని అవసరమైన సేవలందేలా చూడాలని ఆదేశించారు. పాఠశాల ఆవరణలో కచ్చితంగా మునగ, కరివేపాకు చెట్లు పెంచా లని, వాటి ఆకులను వండే కూరలలో వేయాలన్నారు. సదరు ఆకులతో పోషకాలు మెండుగా అందుతాయన్నారు. ఆర్బీఎస్కే ప్రోగ్రాం అధికారి కిరణ్కుమార్ తదితరులున్నారు. మల్లన్న ఆలయ అభివృద్ధికి కృషి చేయాలి ఎలిగేడు/ఓదెల: ఓదెల మల్లన్న ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే విజయరమణారావు పేర్కొన్నారు. మల్లన్న ఆలయ నూతన పాలకవర్గాన్ని ఎలిగేడు మండలం శివపల్లిలోని తన నివాసంలో సన్మానించి మాట్లాడారు. భక్తులకు మెరుగైన వసతులు కల్పించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఆలయ చైర్మన్ చీకట్ల మొండయ్య, సభ్యులు జంగం కొమురయ్య, కోదాటి మనోహర్రావు, జీలుక రవీందర్, కట్కూరి సమ్మిరెడ్డి, కొండ శ్రీనివాస్గౌడ్, తాళ్లపల్లి శ్రీనివాస్, నాగపురి రవిగౌడ్, చీకట్ల మొండయ్య, తీర్థాల రాజారాం, వీరనేని రవి, ఉప్పుల శ్రావణ్కుమార్, గంటా రమేశ్, సామల యమునను ఎమ్మెల్యే శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. పాలక వర్గసభ్యులు సేవాభావంతో పనిచేస్తూ ఆధ్యాత్మికతను పెంపొందించేందుకు, ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. బిల్లుల గోల్మాల్పై ఆందోళనముత్తారం(మంథని): మండలంలోని అడవిశ్రీరాంవూర్ జెడ్పీ పాఠశాలలో చేసిన పనులకు బిల్లులు ఇవ్వకపోవడం, సదరు బిల్లులు గోల్మాల్ అయ్యాయని గురువారం స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. వివరాలు.. ముత్తారానికి చెందిన చేరాలు గతంలో జెడ్పీ పాఠశాలలో పని చేయగా, రూ.40వేలకు పైగా బిల్లులు ఇవ్వాలని పంచాయతీరాజ్ అధికారులు లిఖితపూర్వకంగా ఇచ్చినా, బిల్లులు చెల్లించడంలో హెచ్ఎం నిర్లక్ష్యం చేయడంపై స్థానికులు ఆందోళనకు దిగారు. పాఠశాలలో ఇప్పటికే అమ్మ ఆదర్శ కమిటీ కింద రూ.12లక్షల వరకు నిధులు డ్రా చేశారని ఆరోపించారు. అమ్మ ఆదర్శ కమిటీలో జరిగిన పనులు, నిధుల డ్రా పై ఉన్నతాధికారులు విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై హెచ్ఎం ఓదెలును వివరణ కోరగా, గతంలో పని చేసిన చేరాలుకు బిల్లు ఇవ్వాలని పీఆర్ అధికారులు రాసిచ్చిన విషయం వాస్తవమేనని, ప్రస్తుత అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్ తన హయాంలో పనులు జరగలేదని, ఒప్పుకోవడం లేదన్నారు. చివరి బిల్లు రాగానే ఇస్తామని పేర్కొన్నారు. ఆందోళన చేసినవారిలో చేరాలు, పింగిలి దేవేందర్రెడ్డి, బిరుదు గట్టయ్య, భూపెల్లి మొగిళి, రవి, సది, మధుకర్, స్వామి తదితరులు ఉన్నారు. -
కొత్త కోర్సులు.. కాలేజీలు.. హాస్టళ్లు
● శాతవాహన యూనివర్సిటీ పరిధిలో అభివృద్ధి పనులు షురూ ● హుస్నాబాద్లో ఇంజినీరింగ్, క్యాంపస్లో లా కళాశాల ● ఎల్ఎండీ, క్యాంపస్లో ఎంసీఏ కోర్సు మంజూరు ● మూడు ఆడిటోరియంల ఆధునీకరణ ● ఫార్మసీ కాలేజీ, గోదావరిఖని క్యాంపస్ భూముల రక్షణకు ప్రహరీ ● మరో రెండు హాస్టళ్ల నిర్మాణానికి ఈ నెల 4న శంకుస్థాపనసాక్షిప్రతినిధి,కరీంనగర్: గత వైస్ చాన్స్లర్ హయాంలో అనేక వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన శాతవాహన యూనివర్సిటీ.. ఇప్పుడు అభివృద్ధి పథంలో అడుగులు వేస్తోంది. కొత్త కళాశాలలు, కోర్సులతో మరింత విస్తరిస్తోంది. శాతవాహన యూనివర్సిటీ వైస్ చాన్స్లర్గా ప్రొఫెసర్ ఉమేశ్ కుమార్ బాధ్యతలు చేపట్టిన 9 నెలల్లోనే కొత్త కళాశాలలు, కోర్సులకు అనుమతులు పొందడంతోపాటు అనేక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. జిల్లాకు చెందిన మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, కేంద్ర మంత్రి బండి సంజయ్ సహకారంతో హుస్నాబాద్లో ఇంజినీరింగ్ కాలేజీ, క్యాంపస్లో లా కాలేజీతోపాటు ఫార్మసీ కాలేజీలో ఎంఫార్మసీ కోర్సు, క్యాంపస్లో ఎంసీఏ కోర్సు, అకడమిక్ బ్లాక్, రెండు కొత్త హాస్టళ్లు మంజూరయ్యాయి. ఇంజినీరింగ్, లా కాలేజీ నిర్వహణకు 120 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ‘బండి’ సహకారంతో లా కాలేజీకి గుర్తింపు ఎస్యూ క్యాంపస్లో మూడేళ్ల ఎల్ఎల్బీ, రెండేళ్ల ఎల్ఎల్ఎం కోర్సులతో లా కాలేజీ ప్రారంభం కాబోతోంది. మూడేళ్ల లా కోర్సులో ఒక్కో సెక్షన్లో 60 అడ్మిషన్ల చొప్పున 120 సీట్లు(2 సెక్షన్లు), ఎల్ఎల్ఎం(ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ లా)లో 20 సీట్లు మంజూరు చేశారు. లా కాలేజీలో బోధనకు 14 టీచింగ్, 19 నాన్ టీచింగ్ పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. లా కాలేజీకి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(బీసీఐ) గుర్తింపు తప్పనిసరి కావడంతో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సహకారంతో అతి తక్కువ కాలంలో అనుమతులు లభించాయి. ఫార్మసీ కళాశాలకు మహర్దశ ఎల్ఎండీ సమీపంలోని ఫార్మసీ కళాశాలలో ఇ న్నాళ్లు బీఫార్మసీ కోర్సు మాత్రమే ఉండేది. తాజాగా ఎంఫార్మసీ ప్రారంభించేందుకు ఫార్మసీ కౌన్సిల్ ఆ ఫ్ ఇండియా అనుమతిచ్చింది. ఫార్మసీ కళాశాలలో పీఎం ఉష నిధులు రూ.7.28 కోట్లతో చేపట్టిన అకడమిక్ బ్లాక్ నిర్మాణ పనులకు గత నెల 22న మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వర్రావు శంకుస్థాపన చేశారు. ఫార్మసీ కళాశాల భూములు ఆక్రమణకు గురికాకుండా రూ.2.85 కోట్ల వర్సిటీ నిధులతో ప్రహరీ పనులు ప్రారంభించారు. సదుపాయాలకు పెద్దపీట వర్సిటీలో సదుపాయాలకు పెద్దపీట వేస్తున్నాం. కొత్తకాలేజీలు, హాస్టళ్లు, ఆడిటోరియాలు నిర్మిస్తున్నాం. క్యాంపస్లో శాతవాహన విగ్రహం ప్రతిష్టించనున్నాం. కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు యూనివర్సిటీ విషయంలో సానుకూలంగా అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తున్నారు. త్వరలో వర్సిటీకి న్యాక్ గుర్తింపు కోసం దరఖాస్తు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. – ఉమేశ్ కుమార్, వీసీ, శాతవాహన యూనివర్సిటీహుస్నాబాద్లో ఇంజినీరింగ్ కాలేజీ శాతవాహన యూనివర్సిటీ పరిధిలో ఈ విద్యాసంవత్సరంలో హుస్నాబాద్లో ఇంజినీరింగ్ కళాశాల ప్రారంభం కాబోతోంది. ఇందులో సీఎస్ఈ, ఈసీఈ, ఐటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సులు మంజూరు చేశారు. ఇందుకోసం 54 టీచింగ్ పోస్టులు, 33 నాన్ టీచింగ్ పోస్టులు మంజూరు చేశారు. బీటెక్లో ఒక్కోబ్రాంచ్లో 60అడ్మిషన్ల చొప్పున 240 సీట్లకు ప్రవేశాలు కల్పించనున్నారు. ఎప్సెట్ కౌన్సెలింగ్లో ఇప్పటికే 110మంది విద్యార్థులు రిపోర్ట్ చేశారు.మరెన్నో పనులు గోదావరిఖని పీజీ కాలేజీలో అకడమిక్ బ్లాక్, ప్రహరీ, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ నుంచి ఎంబీఏ బ్లాక్ వరకు అప్రోచ్ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్సెస్ కళాశాలలో గతంలో ఉన్న పాత సెమినార్ హాల్ను సరికొత్త సీటింగ్, సౌండ్ సిస్టంతో ఆధునీకరించి మంత్రి పొన్నం చేతుల మీదుగా ప్రారంభించారు. కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కాలేజీ, ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్సెస్ కాలేజీలో కొత్త కంప్యూటర్ ల్యాబ్, అన్ని డిపార్ట్మెంట్లు, ఫార్మసీ కాలేజీ, గోదావరిఖని పీజీ కాలేజీలో డిజిటల్ స్మార్ట్ క్లాస్రూమ్స్ ఏర్పాటు చేశారు.మరో రెండు కొత్త హాస్టళ్లు శాతవాహన యూనివర్సిటీ విద్యార్థులకు మరో రెండు కొత్త హాస్టళ్లు అందుబాటులోకి రాబోతున్నాయి. యూనివర్సిటీలో అడ్మిషన్లు పెరుగుతున్న నేపథ్యంలో క్యాంపస్లో ఒకటి, ఫార్మసీ కాలేజీలో మరొకటి గర్ల్స్ హాస్టల్ నిర్మించాలని నిర్ణయించారు. ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మంజూరు చేసిన రూ.20 కోట్ల నిధులతో ఈ హాస్టళ్ల పనులకు ఈ నెల 4న శంకుస్థాపన చేసేందుకు జిల్లా ఇన్చార్జీ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ను ఆహ్వానించినట్లు వీసీ ఉమేశ్ కుమార్ వెల్లడించారు. త్వరలో రూ.18 కోట్లతో లా కాలేజీతో పాటు, సెంట్రల్ లైబ్రరీలో సెమినార్ హాల్ ఆధునీకరణ, పరిపాలన భవనంలోని మొదటి అంతస్తులో ఉన్న నూతన సెమినార్ హాల్ పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. -
విద్యార్థుల్లో విద్యాప్రమాణాలు పెంచాలి
పెద్దపల్లిరూరల్: అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు పౌష్టికాహారం అందించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. పెద్దపల్లిలోని శాంతినగర్లో గల అంగన్వాడీ కేంద్రం, ప్రైమరీస్కూల్ను గురువారం ఆకస్మికంగా సందర్శించారు. విద్యాప్రమాణాలు పెంచేలా ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేయాలన్నారు. హైదరాబాద్ పబ్లిక్స్కూల్ ప్రవేశానికి.. హైదరాబాద్లోని బేగంపేట, రామంతపూర్ పబ్లిక్స్కూల్లో ప్రవేశం పొందాలనుకునే విద్యార్థులు ఈనెల 8లోగా దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. 1వ తరగతిలో చేరేందుకు ఎస్సీలకు రెండు సీట్లు కేటాయించారని, ఈనెల10న లాటరీ పద్ధతిన సీట్ల కేటాయి స్తారన్నారు. వివరాలకు కలెక్టరేట్లోని ఎస్సీ సంక్షేమ శాఖ కార్యాలయంలో సంప్రదించాలన్నారు. లక్ష్యాలను పూర్తి చేయాలి పాలకుర్తి(రామగుండం): జిల్లావ్యాప్తంగా నవంబర్ చివరివరకు టీబీ పరీక్ష నిర్వహణ లక్ష్యాలను పూర్తి చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. గురువారం పాలకుర్తి మండల పరిధిలోని బసంత్నగర్ ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని తనిఖీ చేశారు. ఓపీ రిజిస్టర్, రోజువారీ పేషెంట్ల వివరాలు పరిశీలించారు. కార్యక్రమంలో డాక్టర్ సరళి, డాక్టర్ లక్ష్మీభవాని, సిబ్బంది ఉన్నారు. -
అమ్మపాలు అమృతం
● నేటి నుంచి 7వరకు తల్లిపాల వారోత్సవాలు సుల్తానాబాద్(పెద్దపల్లి): అమ్మపాలు అమృతంతో సమానం. నవజాత శిశువులకు వెలకట్టలేని సంపద. పిల్లల ఆరోగ్యం, మనుగడ, పోషణ, అభివృద్ధితో పాటు తల్లి ఆరోగ్యానికీ తల్లిపాలే కీలకం. ఈ విషయాన్ని తల్లుల గుర్తిస్తేనే పిల్లలు ఆరోగ్యంగా ఎదుగుతారు. ఉరుకులు పరుగుల జీవితంతో కొందరు తల్లులకు పాలుపట్టే సమయం దొరకడంలేదు. తల్లిపాల విశిష్ఠత, ప్రాధాన్యం గురించి క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించేందుకు ఏటా ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను నిర్వహిస్తున్నారు. శుక్రవారం నుంచి 7 వరకు వారోత్సవాలు నిర్వహించనున్నారు. జిల్లాలో.. జిల్లావ్యాప్తంగా 3 ఐసీడీఎస్ ప్రాజెక్టులు, 706 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఆయాకేంద్రాల పరిధిలో 3,902 మంది గర్భిణులు, 2,588 మంది బాలింతలు ఉన్నారు. వీరందరికీ మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్లు పౌష్టికాహారం పంపిణీ చేస్తున్నారు. కాగా, ముర్రుపాలు తాగిస్తేనే పిల్లల్లో రోగనిరోధకశక్తి పెరిగేందుకు వీలుంటుందని వైద్య ఆరోగ్యశాఖ, సీ్త్ర, శిశు సంక్షేమాధికారులు అవగాహన కల్పిస్తున్నా కొందరిలో మార్పు రావడంలేదు. అవగాహన కార్యక్రమాలు ఇలా.. ● బిడ్డపుట్టిన వెంటనే ముర్రుపాలు ఇవ్వడం వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించడం. పిల్లల ఎదుగుదలకు పోషణ ప్రాధాన్యతను వివరించడం. ● గర్భిణుల ఇంటికి వెళ్లి ఆరోగ్య జాగ్రత్తలు సూచించడం. గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందేలా చూడడం. 7–24 నెలల పిల్లలకు తల్లిపాలతో అదనంగా ఆహారం అందించాలని కుటుంబ సభ్యులకు వివరించడం. ● బాలింతలు, గర్భిణులకు కౌన్సెలింగ్ ఇవ్వడం. వారి వివరాలు పుస్తకంలో నమోదు చేయడం. ● ఆరునెలలలోపు చిన్నారులకు తల్లిపాలు అందుతున్నాయో లేదో తెలుసుకోవడం. తల్లిపాలె ఉత్తమమని సూచించడం. -
సివిల్ సెటిల్మెంట్
సాక్షి, పెద్దపల్లి: ‘ఇక్కడ భూపంచాయితీలు, సివిల్ కేసులు నమోదు చేసుకోం.. వివాదాలు పరిష్కరించబడవు.. అనే బోర్డులు ప్రతీ పోలీస్స్టేషన్లో కనిపిస్తుంటాయి. కాగా, సివిల్ కేసులు నమోదు చేసుకోరు.. కానీ, సెటిల్మెంట్ చేస్తారు’ అనే విధంగా జిల్లాలోని పలు ఠాణాల పోలీసులు వచ్చిన ప్రతీ సివిల్ కేసును అనధికారికంగా సెటిల్ చేస్తున్నారు. ఇరువర్గాల్లో ఏవరో ఒకరికి వంతపాడుతూ మిగితావారిని సెటిల్ చేసుకునేలా ఒప్పిస్తున్నారు. కొందరు పోలీసుల తీరు మొత్తం ఆ వ్యవస్థకే మచ్చతెస్తోంది. సామాన్యులు న్యాయం కోసం వెళ్తే ఎఫ్ఐఆర్ నమోదు చేయడం మాని స్టేషన్లోనే పంచాయితీలు చేస్తున్నారు. విచారణ చేయకుండా ముడుపులు తీసుకుని పెదరాయుడి తీర్పులిస్తున్నారు.నిబంధనల ప్రకారంఒక స్థలాన్ని ఎవరైనా కబ్జా చేస్తే అది సివిల్ కేసు అవుతుంది. దీన్ని కోర్టులో తేల్చుకోవాలి. అదే వ్యక్తి స్థలాన్ని ఆక్రమించే క్రమంలో కూల్చివేతలు, బెదిరింపులు, దాడులకు దిగితే అది క్రిమినల్ కేసు పరిధిలోకి వస్తుంది. సివిల్, క్రిమినల్ కేసుల మధ్య ఉన్న ఈ చిన్న విభజన రేఖ ఆధారంగా పోలీసులు భూపంచాయితీల్లో ఎంటర్ అవుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 2009లో ఇచ్చిన ఆదేశాల మేరకు పోలీసులు సివిల్ వ్యవహారాల పర్యవేక్షణకు మానిటరింగ్ కమిటీలను ఏర్పాటు చేస్తూ 2010 నవంబర్లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏదైనా ఆరోపణ, ఫిర్యాదు వచ్చిన నేపథ్యంలో 15రోజుల్లో విచారణ పూర్తి చేసి అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆ ఉత్తర్వులో స్పష్టం చేసింది. కానీ, కాలక్రమేణ ఇవన్నీ అటకెక్కిపోవడంతో ఠాణాల్లో సెటిల్మెంట్లు యథేచ్ఛగా కొనసాగతున్నాయి.సివిల్ కేసులంటేనే మక్కువఇటీవలి కాలంలో రియల్ఎస్టేట్ రంగం ఊపందుకుని ప్లాట్ల ధరలు పెరిగాయి. దీంతో ఎక్కువ మంది వ్యవసాయ భూములపైన పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో వ్యవసాయ భూముల ధరలూ విపరీతంగా పెరుగుతున్నాయి. ధరలు పెరుగుతుంటే వాటికి సంబంధించిన వివాదాలు కూడా గతంలో కంటే రెట్టింపయ్యాయి. సాధారణంగా భూ లావాదేవీలకు సంబంధించిన విషయాల్లో పోలీసులు కలుగజేసుకోకూడదు. కానీ, మెజారిటీ పోలీస్స్టేషన్లలో సివిల్ పంచాయితీల సెటిల్మెంట్లకు పోలీసులు ప్రాధాన్యం ఇస్తున్నారు. అర్ధ, అంగబలం ఉన్నవారితో మిలాఖత్ అవుతూ.. పేదలకు అన్యాయం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పోలీస్స్టేషన్ పరిధిలో వచ్చే క్రైం, శాంతిభద్రత కేసుల కంటే భూపంచాయితీల కేసులపైనే ఖాకీలు మక్కువ చూపిస్తున్నారు. తమ పోస్టింగ్ కోసం రూ.లక్షలు వెచ్చిస్తుండడంతో, వాటిని భర్తీ చేసుకునేందుకు సివిల్ పంచాయితీల్లో తలదూరుస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.కఠిన చర్యలు తప్పవుభూతగాదాల్లో తలదూరిస్తే సదరు పోలీస్ అధికారులపై కఠిన చర్యలు తప్పవు. ఈ విషయంలో ఇప్పటికే కచ్చితమైన ఆదేశాలు ఇచ్చాం. ఎవరైనా అక్రమాలకు పాల్పడినట్లు బాధితులు ఫిర్యాదు చేస్తే విచారణ చేసి బాధ్యులైన అధికారులపై తప్పక చర్యలు తీసుకుంటాం.– కరుణాకర్, డీసీపీ, పెద్దపల్లి -
అవస్థల ప్రయాణం
పెద్దపల్లిరూరల్: నిత్యం వాహనాల రాకపోకలతో రద్దీ గా ఉండే పెద్దపల్లి – కూనారం మ ధ్యలోని రైల్వే లె వల్ క్రాసింగ్ గేట్ కష్టాలు ప్రయాణికులకు నరకం చూపుతున్నాయి. దాదాపు మూడేళ్లుగా సా..గుతు న్న రైల్వే వంతెన పనుల్లో మరింత వేగం పెంచితేనే అవస్థల ప్రయాణానికి ముగింపు ఉంటుందని జిల్లావాసులు అభి ప్రాయపడుతున్నారు. జిల్లా కేంద్రమైన పెద్దపల్లి నుంచి కూనారం, కాల్వశ్రీరాంపూర్, పెగడపల్లి మీ దుగా హుజూరాబాద్, హన్మకొండ, మంథని ప్రాంతాలకు వెళ్లే ప్రజలు, వాహనదారులకు ఈ మార్గం ఎంతో ప్రయోజనకరంగా ఉండేలా ప్రభుత్వం రైల్వే వంతెన నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. రూ.119.50 కోట్లతో పనులు పెద్దపల్లి – కూనారం మార్గంలోని 39వ నంబరు రై ల్వే క్రాసింగ్ట్ వద్ద వంతెన పనులను రూ.119.50 కోట్ల అంచనా వ్యయంతో 10 అక్టోబర్ 2022 న ప్రారంభించారు. నిర్మాణం ప్రారంభించి దాదాపు మూడేళ్లు కావస్తున్నా.. ఇంక అసంపూర్తిగానే ఉంది. దీంతో ఈ ప్రాంత ప్రజలు, ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పనుల్లో మరింత వేగం పెంచి వీలైనంత త్వరగా పూర్తిచేసి వంతెనను అందుబాటులోకి తేవాలని కోరుతున్నారు. అప్రోచ్ రోడ్డుపై గుంతలు.. రైల్వేవంతెన పనులు చేపట్టిన ప్రాంతంలో వాహనాల రాకపోకల కోసం తాత్కాలికంగా మట్టితో నిర్మించిన రోడ్డు గుంతలమయమైంది. ప్రస్తుతం వానలు కురుస్తుండడంతో నీళ్లుచేరి కుంటలను తలపిస్తున్నాయి. బురదమయమైన గుంతల రోడ్డుపై అవస్థల ప్రయాణం సాగించాల్సి వస్తోందని వాహనదారులు, ప్రయాణికులు వాపోతున్నారు. గుంతలను గుర్తించక ప్రమాదాల బారిన పడిన సందర్భాలు కూడా లేకపోలేదు. అధికారులు స్పందించి కనీసం అప్రోచ్ రోడ్డుపై గుంతలు పూడ్పి వేయించాలని కోరుతున్నారు. ఎక్స్ప్రెస్, గూడ్స్ రైళ్ల రద్దీ ఖాజీపేట – బల్హార్ష సెక్షన్లోని ప్రధాన రైలు మా ర్గం కావడంతో ఎక్స్ప్రెస్, గూడ్స్ రైళ్ల రాకపోకలు అధిక సంఖ్యలో రాకపోకలు సాగిస్తున్నాయి. ప్రతీ అరగంటకో రైలు వచ్చి పోతుండడం, ఒక్కోసారి వరుసగా రైళ్లు వస్తూ, పోతుండడంతో గంటల తరబడి గేట్ వేస్తున్నారు. దీంతో ట్రాక్కు ఇరువైపులా వాహనదారులు, ప్రయాణికులు నిరీక్షించాల్సి వ స్తోంది. దాదాపు చివరిదశకు చేరిన రైలు వంతెన పను లను వీలైనంత త్వరగా పూర్తిచేసి అందుబాటులోకి తేవా లని జిల్లావాసులు కోరుతున్నారు. రైల్వే వంతెన సమాచారం నిర్మాణం స్థలం 39వ నంబరు రైల్వేగేట్ మార్గం : పెద్దపల్లి – కూనారం మధ్య మంజూరైన నిధులు రూ.119.50 కోట్లు పనులు ప్రారంభమైన తేదీ 10 అక్టోబర్ 2022 రైల్వేగేట్ దాటేదెలా? సా.. గుతున్న వంతెన పనులు గుంతలమయమైన అప్రోచ్ రోడ్డు నరకం చూపుతున్న రాకపోకలు -
నగరంలో స్ట్రీట్బోర్డులు
● తొలిసారి ఏర్పాటుకు బల్దియా శ్రీకారం ● తొలగనున్న చిరునామా సమస్యలు ● రూ.50 లక్షలతో టెండర్ల ఆహ్వానం ● తొలివిడతలో 380 బోర్డులకు ఆర్డర్ ● స్టెయిన్లెస్ స్టీల్తో తయారీకోల్సిటీ(రామగుండం): రామగుండం నగరంలో చిరునామా తెలుసుకోవడం అంతసులువేమీకాదు. ఒకచోట నుంచి ఇంకోచోటకు వెళ్లాలన్నా.. కొత్తవారు పలానా ప్రదేశానికి పోవాలన్నా ప్రయాసే.. ఇట్లాంటి ఈ ఇబ్బందులను శాశ్వతంగా తొలగించేందుకు రామగుండం బల్దియా అధికారులు తొలి సారి స్ట్రీట్ సైన్ బోర్డుల(వీధి సూచిక బోర్డు) ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. నగరంలోని మొత్తం 60 డివిజన్లలో కొత్తగా స్ట్రీట్సైన్ బోర్డులు ఏర్పాటు చేయడానికి ప్రణాళిక రూందించారు. ఇటీవల నగరంలో 50 డివిజన్ల నుంచి 60 డివిజన్ల కు పెంచుతూ పునర్విభజన చేసిన విషయం విదిత మే. ఈనేపథ్యంలో కొత్త ప్రాంతాలు, ప్రదేశాలు, కూడళ్లను తెలుసుకోవడం కష్టతరంగా మారింది. డివిజన్ల వారీగా ప్రజలు సులభంగా చిరునామా తెలుసుకునేలా స్టెయిన్లెస్ స్టీల్ మెటీరియల్తో స్ట్రీట్సైన్ బోర్డులు ఏర్పాటు చేయిస్తున్నారు. రూ.50లక్షలతో టెండర్.. రామగుండం నగరంలో స్ట్రీట్సైన్ బోర్డుల ఏర్పాటుకు 20 రోజుల క్రితం రూ.50లక్షల అంచనా వ్యయంతో టెండర్లు పిలిచిన అధికారులు.. ఓ కాంట్రాక్టర్కు పనులు కూడా అప్పగించారు. తొలివిడతలో మొత్తం 380 స్ట్రీట్ సైన్బోర్డులు ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. వీటిని హైదరాబాద్లో తయారు చేయిస్తున్నారు. తొలగనున్న సమస్యలు.. రామగుండం బల్దియాలోని 60 డివిజన్లలో తొలిసారి ఏర్పాటు చేయనున్న స్ట్రీట్సైన్ బోర్డులతో కూడళ్లు, ముఖ్యమైన ప్రదేశాలు, దిశలను తెలుసుకోవడం అందరికీ సులభతరం కానుంది. వేములవాడ మున్సిపాలిటీలో ఇప్పటికే ఏర్పాటు చేసిన రెండు రకాల స్ట్రీట్సైన్ బోర్డుల తరహాలోనే రామగుండంలోనూ ఏర్పాటు చేయడానికి డిజైన్లను ఎంపిక చేశారు. ఈస్ట్రీట్సైన్ బోర్డులతో ఏ డివిజన్ ఎక్కడుంటుంది? ఆ డివిజన్లో ఏ ప్రాంతం ఉందనే సమాచారం సులభంగా తెలుసుకోవచ్చు. జంక్షన్లలో సైన్బోర్డులు.. ఒకటో డివిజన్ నుంచి 60వ డివిజన్ వరకు ఆయా డివిజన్ల పరిధిలోని వీధుల పేర్లు, కాలనీలు, ఇంటినంబర్లు, రోడ్డు నంబర్లు, కూడళ్లు, ముఖ్యమైన ప్రాంతాలు.. తదితర వివరాలను ఇప్పటికే బిల్కలెక్టర్ల ద్వారా బల్దియా టౌన్ప్లానింగ్, ఇంజినీరింగ్ విభా గం అధికారులు సేకరించారు. ఒక్కోడివిజన్ లో ఎక్కడెక్కడ సైన్ బోర్డులు పెట్టాలి? వాటి పై డివిజన్ల నంబర్లు, కాలనీల పేర్లతోపాటు ఎటువైపు ఏ ప్రాంతం ఉంటుందో తెలుసుకునేలా సూచికలు పొందుపర్చడానికి నివేదికలను సైతం తయారు చేసినట్లు తెలిసింది. దీనిఆధారంగా స్టెయిన్లెస్ స్టీల్ మెటీరియల్తో స్ట్రీట్సైన్ బోర్డులను సిద్ధం చేస్తున్నారు. చిరునామా తెలుసుకోవడం సులభం కొత్తగా 60 డివిజన్లుగా ఏర్పడిన రామగుండం నగరంలో ప్రజలకు అడ్రస్ తెలుసుకోవడంలో ఇబ్బందులు తలెత్తకూడదనే ఉద్దేశంతో స్ట్రీట్ సైన్బోర్డులను ఏర్పాటు చేయిస్తున్నాం. కూడళ్లు, రోడ్లు, ముఖ్యమైన ప్రాంతాలు, ఇంటి నంబ ర్లను సైన్బోర్డులపై పొందుపరుస్తాం. 15రోజుల్లో సైన్బోర్డుల తయారీ పనులు పూర్తవుతాయి. వాటి ఏర్పాటులో సమస్యలు తలెత్తకుండా టౌన్ ప్లానింగ్ విభాగం ద్వారా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. – అరుణశ్రీ, బల్దియా కమిషనర్, రామగుండం -
పనులు పూర్తిచేయాలి
రైల్వే వంతెన పనులను వీలైనంత త్వరగా పూర్తిచేసి ప్రజల ఇబ్బందులను దూరం చేయాలి. ఈ వంతె న వినియోగంలోకి వస్తేనే అందరికీ మేలు కలుగుతుంది. పనులను పూర్తిచేయడంపై దృష్టి సారించాలి. – కనుకుంట్ల సదానందం, స్థానికుడు జాప్యం ఎందుకో? కేంద్ర ప్రభుత్వం ప్రజావసరాలను గుర్తించి రైల్వేవంతెన పనులకు నిధులు కేటాయించింది. మూడేళ్ల క్రితం మొదలైన పనులు పూర్తికావడం లేదు. అధికారులు పనుల్లో వేగం పెంచేలా చూసి రైల్వేగేట్ కష్టాలు తీర్చాలి. – జంగ చక్రధర్రెడ్డి, బీజేపీ నేత వినియోగంలోకి తేవాలి పెద్దపల్లి – కూనారం మధ్య చేపట్టిన రైల్వే వంతెన పనులు పూర్తయితేనే వాహనదారులు, ప్రజలకు మేలు కలుగుతుంది. పనులు దాదాపు చివరిదశకు వచ్చాయి. మిగిలిన పనులను వీలైనంత త్వరగా పూర్తిచేసి వినియోగంలోకి తేవాలి. – బొడ్డుపల్లి శ్రీనివాస్, పెద్దపల్లి -
పరిహారం చెల్లించే వరకూ పనులు సాగనివ్వం
మంథనిరూరల్: సింగరేణి ఓసీపీ– 3 విస్తరణ కోస సర్వం కోల్పోతున్న తమకు పూర్తిస్థాయిలో పరిహా రం చెల్లించే వరకు పనులు సాగనివ్వమని అక్కెపల్లి గ్రామస్తులు హెచ్చరించారు. బుధవారం ఎల్ – 6 కాలువ కోసం సిద్దపల్లిలో సింగరేణి ఇళ్ల కూల్చివేత చేపట్టగా గ్రామస్తులు అడ్డుకున్నారు. 2015లో తమ గ్రామాన్ని స్వాధీనం చేసుకునేందుకు నిర్ణయిందని, పరిహారం చెల్లించడంలో జాప్యం చేస్తోందన్నారు. తొలిసారి చేపట్టిన సర్వే ఆధారంగా పరిహారం చె ల్లించకుండా ప్రైవేటుగా సర్వే చేయించి సగం పరిహారమే ఇచ్చిందన్నారు. తాము కోర్టుకు వెళ్తే.. తొమ్మిదేళ్ల తర్వాత తమకు అనుకూలంగానే తీర్పు వచ్చిందని, ఏడాది గడిచినా సింగరేణి పట్టించుకోవడం లేదని ఆరోపించారు. పూర్తిపరిహారం చెల్లించే వరకు పనులను అడ్డుకుంటామని తేల్చిచెప్పారు. ఉన్నతాధికారులకు సమాచారం చేరవేసిన స్థానిక అధికారులు వెనుదిరిగి వెళ్లిపోయారు. పోలీసులు ఘటనా స్థలంలో వివరాలు సేకరించారు. స్థానిక నాయకులు, నిర్వాసితులు పాల్గొన్నారు. -
మధ్యవర్తిత్వంతో సమస్యల పరిష్కారం
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి కుంచాల సునీత పెద్దపల్లిరూరల్: చిన్నసమస్యలతో పంతాలు, పట్టింపులకు వెళ్లి వివాదాన్ని జటిలం చేసుకుని కోర్టుల వరకూ వెళ్లడం కన్నా మధ్యవర్తి సాయంతో అక్కడికక్కడే పరిష్కరించుకోవడం మేలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి కుంచాల సునీత సూ చించారు. జిల్లా కోర్టు ఆవరణలో బుధవారం మ ధ్యవర్తిత్వంపై నిర్వహించిన అవగాహన సదస్సు లో జడ్జి మాట్లాడారు. ఈ సందర్భంగా జడ్జి సునీ త, న్యాయసేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి స్వరూపరాణి, పెద్దపల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లకిడి భాస్కర్ తదితరులు ‘మధ్యవర్తిత్వం’ అంశానికి అనుకూలంగా సంతకాలు చేశారు. భార్యాభర్తలు చిన్న విషయాలకే పెద్దగొడవలు చేసుకుని విడిపోతున్నారని, అలాంటి సమస్యలను మధ్యవర్తి సమక్షంలో పరిష్కరించుకోవాలని జడ్జి సునీత సూచించారు. గతంలో తాను హైదరాబాద్లో పనిచేసినప్పుడు 32 జంటలకు ఇద్దరి అంగీకారంతో విడాకులు మంజూరు చేశానని జడ్జి సునీత గుర్తుచేశారు. విడిపోయిన భార్యాభర్తలు వేర్వేరుగా బాగానే ఉంటారని, కానీ వారిపిల్లల భవిష్యత్ను ఊహించడమే కష్టమని ఆందోళన వ్యక్తం చేశారు. ఆస్తి పంపకాల్లోనూ గజం స్థలం కోసం కూడా కోర్టుమెట్లెక్కిన వారుఉన్నారని, ఇలా చేయడంతో ఆర్థికంగా నష్టపోవడం, సమయం వృథా చేసుకోవడం తప్ప ప్రయోజనం ఏమీ ఉండదని తెలిపారు. న్యాయవాదులు కూడా మధ్యవర్తిత్వం ద్వారా కేసుల పరిష్కారాన్ని ప్రోత్సహించాలని జడ్జి సూచించారు. పెద్దపల్లి బార్ అసోసియేషన్ ప్రధానకార్యదర్శి శ్రీనివాస్, గవర్నమెంట్ ప్లీడర్ కిశోర్తోపాటు శ్రీధర్, రవీందర్, న్యాయవాదులు, కక్షిదారులు తదితరులు పాల్గొన్నారు. -
నమ్మించి.. గొంతుకోసి
● వృద్ధురాలిపై మహిళ హత్యాయత్నం ● బంగారం, నగదు కోసం ఘాతుకం సైదాపూర్: ‘నా భర్తతో గొడవ జరిగింది. ఈ రాత్రికి మీ ఇంట్లో పడుకుంటాను’ అంటూ ఓ వృద్ధురాలిని నమ్మించింది. వృద్ధురాలు నిద్రపోయాక, హత్యాయత్నం చేసింది. ఆపై బంగారం, నగదుతో ఉడాయించిందో మహిళ. ఈ ఘటన కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం ఆకునూర్లో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. గ్రామస్తులు, బాధితురాలి వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రావుల ప్రమీల(70) ఒంటరిగా ఉంటోంది. పెద్ద కొడుకు రావుల రాజిరెడ్డి కరీంనగర్లో, చిన్న కొడుకు దేవేందర్రెడ్డి సిద్దిపేటలో నివాసం ఉంటున్నారు. ఇదే గ్రామానికి చెందిన మిట్టపల్లి స్వరూప(50) మంగళవారం మధ్యాహ్నం నుంచి ప్రమీల ఇంటికి తరుచూ వచ్చి మాట్లాడుతోంది. రాత్రి పూట కూడా వచ్చింది. భర్తతో గొడవ జరిగిందని, రాత్రికి మీ ఇంట్లోనే పడుకుంటానని నమ్మబలికింది. ప్రమీల నిద్రపోయిన తర్వాత దిండుతో ముఖంపై అదిమిపట్టింది. కత్తితో గొంతు, శరీరభాగాలపై గాయపరిచింది. చనిపోయిందని అనుకుని వృద్ధురాలిపై ఉన్న బంగారం, నగదుతో పారిపోయింది. బుధవారం వేకువజామున స్పృహ వచ్చిన ప్రమీల చిన్న కొడుకు దేవేందర్రెడ్డికి ఫోన్చేసి విషయం చెప్పింది. వెంటనే ఇంటికి వచ్చిన కొడుకులిద్దరూ వృద్ధురాలిని ఆస్పత్రిలో చేర్పించారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితురాలు కూడా పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. -
‘గృహజ్యోతి’కి ఎడిట్ కష్టాలు
● ఆన్లైన్లో తప్పిదాలు ● యథేచ్ఛగా కరెంట్ బిల్లులు ● అయోమయంలో లబ్ధిదారులు రామగిరి(రామగుండం): ప్రభుత్వం అమలు చేస్తున్న గృహజ్యోతి పథకం(జీరో కరెంట్ బిల్) కొందరు అర్హులకు అందడం లేదు. ప్రజాపాలన దరఖాస్తులను ఆన్లైన్ చేసే సమయంలో చోటుచేసుకున్న పొరపాట్లతో ఈ సమస్య తలెత్తింది. మరికొందరు వివిధ కారణాలతో ఇబ్బంది పడుతున్నారు. ప్రజల నుంచి అధికారులు స్వీకరించిన దరఖాస్తులను ప్రజాపాలన పోర్టల్ ద్వారా ఆన్లైన్లో నమోదు చేశారు. ఇలా నమోదు చేసే ప్రక్రియలో మీటర్ నంబర్లు తప్పు గా వేయడం, పథకానికి దరఖాస్తు చేసుకోలేదు(నాట్ ఆప్లైడ్) అని నమోదు చేయడంతో అర్హులైన పేదలు ఈ పథకానికి దూరమవుతున్నారు. చేతులెత్తేస్తున్న అధికారులు దరఖాస్తుదారులు మండల ప్రజాపరిషత్ కా ర్యాలయాలకు వెళ్లి ఎంపీడీవోల దృష్టికి సమస్య తీసుకెళ్లగా తమ చేతిలో ఏమీలేదంటున్నారు. ప్రజాపాలన ఆన్లైన్ పోర్టల్లో తమకు ఎడిట్ ఆప్షన్ ఇవ్వలేదని వారు చెబుతున్నారు. కొత్తగా కరెంట్ మీటర్ తీసుకున్న పేదలకు కూడా ఈ పథకం వర్తించడం లేదు. అమలుకు నోచుకోని హామీ దరఖాస్తుల ప్రక్రియ నిరంతరం కొనసాగిస్తామని ప్రభుత్వం ప్రకటించినా.. అది క్షేత్రస్థాయిలో అమలుకు నోచుకోవడం లేదు. అర్హులైన పేదలు కార్యాలయాల చుట్టూ తిరిగి వేసారడం తప్ప పరిష్కారం లభించడం లేదు. అధికారులు స్పందించి ప్రజాపాలన పోర్టల్లో ఎడిట్ ఆప్షన్ ఇస్తేనే అర్హులైన పేదలకు ప్రభుత్వం అందించే పథకం వర్తిస్తుందని లబ్దిదారులు కొరుతున్నారు. -
కాంట్రాక్టు కార్మికులపై పట్టింపేది?
● ఈఎస్ఐ సేవలకు దూరం ● పట్టించుకోని యాజమాన్యం, కార్మిక సంఘాలు గోదావరిఖని: సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ స్కీం ఆఫ్ ఇండియా(ఈఎస్ఐసీ) సౌకర్యం అందని ద్రాక్షే అవుతోంది. సంస్థలో సుమారు 35 వేల మంది కాంట్రాక్టు కార్మికులు ఉన్నారు. రామగుండం ప్రాంతంలోనే దాదా పు 10వేల మందికిపైగా పనిచేస్తున్నారు. వీరిలో కేవలం 600 మందికే ఈఎస్ఐ సౌకర్యం ఉంది. సింగరేణి యాజమాన్యం చొరవ చూపితేనే వీరు ఈఎస్ఐ సౌకర్యం పొందే వీలుంది. ఇలాంటి వారికే ఉచితంగా వైద్య సౌకర్యం అందుబాటులోకి వస్తాయి. ఏదైనా కారణంతో శాశ్వత అంగవైకల్యానికి గురైనా, మృతి చెందినా అనేక ప్రయోజనాలు వర్తిస్తాయి. అనేక విభాగాల్లో.. సింగరేణిలోని స్వీపింగ్, హౌస్కీపింగ్, తోటమాలి, సివిల్, సివిక్, సేల్ పిక్కింగ్, బెల్ట్ క్లీనింగ్, షాంప్లింగ్, కన్వేయన్స్ వాహనాలు.. ఇలా పలు విభాగాల్లో కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారు. ప్రతినెలా ఒక్కోకార్మికుడికి రూ.21 వేల వేతనం ఉంటుంది. అయినా, వీరిని ఈఎస్ఐ సౌకర్యం వరించడంలేదు. ఈఎస్ఐసీ వ్యవీస్థీకృత రంగంలోని ఉద్యోగులకు సామాజిక, ఆర్థిక రక్షణ అందించే సామాజిక భద్రత పథకం. ఉద్యోగులకు అనారోగ్యం, ప్రసూతి, వైకల్యం, పని సమయంలో ప్రమాదాలతో ఏర్పడే గాయాలు, మృతి వంటివి సంభవిస్తే ఆర్థిక రక్షణ కల్పిస్తుంది. ఉద్యోగులతోపాటు వారి కుటుంబ సభ్యులకూ ఉచిత వైద్యం అందిస్తుంది. వీరే అర్హులు.. పది లేదా అంతకన్నా ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్న సంస్థలు, కర్మాగారాలు, దుకాణాలు, కార్యాలయాల్లో ఆఫీసుల్లో పనిచేస్తూ నెలకు రూ.21 వేలు అంతకన్నా తక్కువ వేతనం ఉన్న వారు ఈఎస్ఐసీకి అర్హులు. ఇలాంటి వారిని ఈఎస్ఐసీ కింద నమోదు చేయడం సంస్థ యజమాని బాధ్యత. ఈపథకంలో చేరే ఉద్యోగి వేతనంలో 3.25శాతం యజమాని, 0.75శాతం ఉద్యోగి సమానమైన మొత్తాన్ని చందాగా జమచేస్తారు. మెటర్నిటీ బెనిఫిట్: ● 26 వారాల పాటు మెటర్నీటీ బెనిఫిట్ లభిస్తుంది. వైద్యుడి సలహాపై మరో నెల పొడిగించుకోవచ్చు. పూర్తి వేతనం వస్తుంది. తాత్కాలిక వైకల్యం: ● ఉద్యోగంలో ఉన్నప్పుడు గాయపడితే కాంట్రిబ్యూషన్తో సంబంధం లేకండా అంగవైకల్యం కొనసాగినంతకాలం వేతనంలో 90శాతం చెల్లిస్తారు. శాశ్వత అంగవైక్యం: మెడికల్ బోర్డు ధ్రువీకరణపై ప్రమాదంతో సంపాదన సామర్థ్యా ుఽన్ని కోల్పోయిన స్థాయిని బట్టి వేతనంలో 90శాతం ప్రయోజనం చెల్లిస్తారు. డిపెండెంట్ బెనిఫిట్: ఉద్యోగంలో గాయం లేదా వృత్తిపరంగా ప్రమాదంతో మరణం సంభవిస్తే ఉద్యోగిపై ఆధారపడిన వారికి జీతంలో 90శాతం డిపెండెంట్కి చెల్లిస్తారు. ఇతర ప్రయోజనాలు: ● ఉద్యోగి మరణిస్తే ఖర్మల కోసం రూ.15వేలు చెల్లిస్తారు ● ఈఎస్ఐ ఉన్న మహిళ లేదా సభ్యుడి భార్య.. ఈఎస్ఐ కింద తగిన వైద్య సేవలు అందుబాటులో లేనిప్రదేశంలో ఉంటే కన్ఫైన్మెంట్ ప్రయోజనాన్ని అందజేస్తారు. కమాన్పూర్ మండలం పిల్లిపల్లెకు చెందిన పిట్టల రమేశ్ సింగరేణి కాంట్రాక్టు కార్మికుడు. ఇటీవల ప్రమాదవశాత్తు చెట్టు పైనుంచిపడి మృతి చెందాడు. దీంతో మృతుడి భార్యకు కార్మిక రాజ్యబీమా(ఈఎస్ఐ) సంస్థ ద్వారా ప్రతినెలా రూ.7,400 పింఛన్ మంజూరవుతోంది. కమాన్పూర్ ప్రాంతానికి చెందిన బండ అర్జయ్య సింగరేణి ఓసీపీ–1 జరిగిన పేలుడులో చనిపోయాడు. ఈఎస్ఐ సభ్యత్వం ఉండడంతో అతడి కుటుంబానికి ప్రతినెలా రూ.13,681 పింఛన్ వస్తోంది. వైద్య ప్రయోజనాలు.. కుటుంబసభ్యులకు కార్పొరేట్స్థాయి వైద్యం కాంట్రిబ్యూషన్తో సంబంధం లేకుండా అందరికీ ఒకేరకమైన వైద్యం చికిత్సకు అయ్యే ఖర్చుపై గరిష్ట పరిమితి లేదు రిటైర్డ్, శాశ్వత వికలాంగులు, జీవిత భాగస్వామ్యులకు టోకెన్ ప్రీమియం రూ.120 చెల్లింపుపై వైద్య సంరక్షణ వర్తిస్తుంది. అనారోగ్య ప్రయోజనాలు.. ధ్రువీకరించిన కొన్ని వ్యాధులకు సిక్లీవ్ తీసుకోవచ్చు ఏడాదిలో 91రోజుల పాటు ఈ సెలవులు తీసుకునే అవకాశం ఉంది అనారోగ్యకాలంలో సిక్ బెనిఫిట్ కింద నగదురూపంలో పరిహారం ఇస్తారు కార్మికుడి వేతనంలో 70శాతం చొప్పున పరిహారం ఉంటుంది ఈ ప్రయోజనం కోసం ఆర్నెల్లలో కనీసం 78రోజులు కాంట్రిబ్యూట్ చేయాలి రామగుండం ఈఎస్ఐ డిస్పెన్సనరీ పరిధిలో కాంట్రాక్టు కార్మికులు ఎన్టీపీసీ 9,600 రామగుండం బల్దియా 800 కేశోరాం 1,200 ఆర్ఎఫ్సీఎల్ 1,900 సింగరేణి 600 -
మతోన్మాదం రేపడమే బీజేపీ లక్ష్యం
సిరిసిల్లటౌన్: దేశంలో మతోన్మాదం రేపుతూ, ఓట్లు దండుకోవడమే బీజేపీ లక్ష్యమని కాంగ్రెస్ ఓబీసీ జాతీయ కన్వీనర్ వి.హన్మంతరావు అన్నారు. బీసీల కులగణన చేయాలని ఉద్యమిస్తున్న రాహుల్గాంధీ ఆకాంక్షను హర్షిస్తూ బుధవారం సిరిసిల్ల అంబేద్కర్ చౌరస్తాలో ఆయన చిత్రపటానికి క్షీరాభిషేకం చేసిన అనంతరం మాట్లాడారు. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటివరకు కులగణన జరగలేదని, బీసీలకు అనేక బాధలు ఉన్నాయని, ఒక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని తాము ప్రధాని మోదీని కోరినా పట్టించుకోలేదన్నారు. అన్నివర్గాల ప్రజలకు న్యాయం జరగాలంటే బీసీ కులగణన జరగాలని రాహుల్గాంధీ ప్రగాఢంగా నమ్మి ఆ దిశగా ఉద్యమిస్తున్నారని, ఇందుకు అన్నివర్గాల ప్రజలు సహకరించాలని కోరారు. దేశంలో యాభైశాతం రిజర్వేషన్ల సీలింగ్ ఎత్తివేస్తే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు అన్నిరంగాల్లో అభివృద్ధి సాధిస్తారని ఇది కేవలం కాంగ్రెస్తోనే సాధ్యమన్నారు. రాహుల్గాంధీ ఇచ్చిన హామీ మేరకు సీఎం రేవంత్రెడ్డి బీసీ డిక్లరేషన్కు తగ్గట్టుగా అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపించారన్నారు. ఆర్ఎస్ఎస్, బీజేపీలు ముస్లిం రిజర్వేషన్ను వ్యతిరేకిస్తూ హిందూదేశంగా మార్చాలని కుట్రపూరితంగా ఉన్నాయన్నారు. బీసీ కులగణన కోసం ఆగస్టులో జంతర్మంతర్ వద్ద జరిగే మహాధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్, పీసీసీ కార్యవర్గ సభ్యుడు సంగీతం శ్రీనివాస్, గడ్డం నరసయ్య, ఆకునూరి బాలరాజు, సూర్య దేవరాజు, వెలుముల స్వరూపరెడ్డి, బొప్ప దేవయ్య, రాపల్లి కళ్యాణ్, గుండ్లపెళ్లి గౌతమ్, ఆడెపు చంద్రకళ, మడుపు శ్రీదేవి, కల్లూరి చందన తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ఓబీసీ జాతీయ కన్వీనర్ హనుమంతరావు -
డాబాపై కూరగాయల సాగు
జగిత్యాలఅగ్రికల్చర్: రసాయనాల నుంచి తప్పించుకునేందుకు చాలామంది పట్టణవాసులు ఇంటిపై.. ఇంటి చుట్టూ ఉన్న ఖాళీ ప్రదేశాల్లో కూరగాయలు పండించుకుంటున్నారు. తద్వారా ఆరోగ్యమైన ఆహారం పొందడంతోపాటు మనస్సుకు ఆనందం, ఆహ్లాదం అందించుకుంటున్నారు. గృహిణులు ఒకప్పుడు ఖాళీ ప్రదేశాల్లో పువ్వులు, అలంకరణ మొక్కలకు ప్రాధాన్యమిస్తే.. ఇప్పుడు రోజువారీ ఆహారంలో ఉపయోగించే ఆకుకూరలు, కూరగాయలు పండిస్తున్నారు. ● ఆహ్లాదకర వాతావరణంలో.. కూరగాయలు పండిస్తున్న రైతులు ఎక్కువగా క్రిమిసంహారక మందులు వినియోగిస్తుండటంతో ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి. కొందరు వ్యాధుల బారిన పడి ఆస్పత్రుల పాలవుతున్నారు. ఈ క్రమంలో ఎలాంటి రసాయనాలు లేకుండా.. ఇంటికి అవసరమైన కూరగాయలను ఇంటి డాబాపై, ఖాళీ ప్రదేశాల్లో పండించుకునేందుకు గృహిణులు ముందుకొస్తున్నారు. ఇంటి వాతావరణం మారిపోవడంతోపాటు చల్లని గాలి, పచ్చని మొక్కల మధ్య సేద తీరుతున్నారు. ● తేలికపాటి కుండీల ఎంపిక డాబాపై కూరగాయల పెంపకానికి తేలికపాటి కుండీలను ఎంపిక చేసుకుంటున్నారు. ప్లాస్టిక్ కుండీలు, పైబర్తో తయారు చేసిన గ్రోబ్యాగ్స్ ఉపయోగిస్తున్నారు. ప్లాస్టిక్ బకెట్లు, వాటర్ క్యాన్లు, సింక్ తొట్టీలు, పాత టైర్లు.. ఇలా అన్నింటిని కూరగాయల పెంపకానికి ఎంపిక చేసుకుంటున్నారు. నిటారుగా ఉండే అంతస్తుల కుండీలు, వేలాడేదీసే కుండీలను కూడా వాడుకోవచ్చు. ఇనుపకుండీలైతే మొక్క వేరు వ్యవస్థ దెబ్బతింటుంది. లోతు వేరు వ్యవస్థ గల మొక్కలకు ఎక్కువ లోతు కుండీలు.. తక్కువ వేరు వ్యవస్థ గల మొక్కలకు తక్కువ లోతు కుండీలను ఎంచుకోవాలి. బొప్పాయి, అరటి వంటి పెద్ద మొక్కలకు పెద్ద పరిమాణం గల ప్లాస్టిక్ డ్రమ్ములను ఉపయోగించవచ్చు. ● గ్రోబ్యాగ్స్ అనుకూలం గ్రో బ్యాగ్స్.. తక్కువ బరువు ఉండి, డాబాపై కూరగాయల పెంపకానికి అనుకూలంగా ఉంటాయి. ఎంచుకున్న మొక్కలకు అనుగుణంగా గ్రోబ్యాగ్స్ వినియోగించాలి. మార్కెట్లో వివిధ పరిమాణాలు, ఆకారాల్లో దొరుకుతాయి. వీటిలో మట్టి పరిమాణం తక్కువ బరువు ఉండేలా చూసుకోవాలి. మట్టి మిశ్రమం అధికంగా ఉంటే డాబాపై బరువు పెరుగుతుంది. ఎర్రమట్టి, కోకోపీట్, పశువుల ఎరువు లేదా వర్మి కంపోస్టు వంటి తేలికపాటి మట్టి మిశ్రమాన్ని తయారు చేసుకుని కుండీల్లో నింపాలి. మార్కెట్లో రెడీమేడ్ కుండీ మిశ్రమం కూడా దొరకుతోంది. మట్టి మిశ్రమాన్ని నింపేటప్పుడు పైభాగంలో కొంత ఖాళీ వదలాలి, ● మొక్కల ఎంపిక ప్రధానం డాబాపై మొక్కల పెంపకానికి కూరగాయల ఎంపిక ప్రధానం. కాలానుగుణంగా పండే కూరగాయలను ఎంపిక చేసుకోవాలి. శీతాకాలంలో దాదాపుగా అన్ని రకాల కూరగాయలను పండించవచ్చు. వేసవిలో క్యాబేజీ, కాలీప్లవర్, క్యారెట్, ఆలుగడ్డ మినహాయించి మిగతా కూరగాయలు పండించవచ్చు. తీగజాతి వాటికి పందిరి వేసుకోవాలి. వేసవిలో అధిక ఉష్ణోగ్రతలను తట్టుకోవడానికి షేడ్నెట్ వేసుకోవాలి. ఈ పద్ధతిలో కుటుంబ అవసరాలకు అనుగుణంగా నాలుగు రకాల కూరగాయలు, రెండు లేదా మూడు రకాల ఆకుకూరలు పండించవచ్చు. ● నీటి యాజమాన్యం కీలకం దాబా తోటల్లో నీటిని క్యాన్ ద్వారా అందించవచ్చు. స్వయంగా మొక్క వయస్సు, ఎదుగుదలను బట్టి ఎంత నీరు అవసరముంటే అంత నీరు ఇవ్వవచ్చు. ఇంట్లోని వ్యర్థాల నుంచి కంపోస్టు తయారు చేసి మొక్కలకు పోషకాలు అందించవచ్చు. మొక్కల సంఖ్య తక్కువగా ఉంటుంది కాబట్టి చీడపీడలు వస్తే చేతి ద్వారా తీసివేయవచ్చు. తీగజాతి కూరగాయల్లో పండు ఈగ వస్తే లింగాకర్షక బుట్టలు వాడి నివారించవచ్చు. ఎక్కువ చీడపీడలు వస్తే వేప నూనెను లీటర్ నీటికి 5 మి.లీ పిచికారీ చేస్తే సరిపోతుంది. రసాయనాలు లేని ఆకుకూరలు, కూరగాయలు అవగాహనతో ఆరోగ్యం కాపాడుకుంటున్న జనం కొన్నేళ్లుగా సాగు చేస్తున్న కొన్నేళ్లుగా ఇంటి పరిసరాలతోపాటు డాబాపై కూరగాయలు సాగు చేస్తున్నాను. మార్కెట్కు వెళ్లే అవసరం లేకుండాపోయింది. పూత నుంచి పిందె, కాత వరకు జరిగే చర్యలు కూడా ఆసక్తికరంగా ఉంటుండటంతో ప్రతిరోజు ప్రతి మొక్కనూ పరిశీలిస్తాను. – సముద్రాల జ్యోతి, గృహిణి, జగిత్యాల చాలా కూరగాయలు పెంచొచ్చు ఇంటి ఖాళీ ప్రదేశాలు, డాబాలపై కూరగాయలు పెంచుకోవచ్చు. ఆసక్తి గల గృహిణులు గ్రూపుగా ముందుకొస్తే ఉద్యానశాఖ ఆధ్వర్యంలో శిక్షణ ఇస్తాం. కొత్తిమీర, పాలకూర వంటి ఆకుకూరలతోపాటు చిన్నపాటి సంచుల్లో టమాట, మిర్చి వంటి కూరగాయలు సాగు చేయవచ్చు. మా శాఖ తరఫున అవగాహన కల్పిస్తున్నాం. – స్వాతి, ఉద్యానశాఖాధికారి, జగిత్యాల -
సౌదీలో భూషణరావుపేట యువకుడు ఆత్మహత్య
కథలాపూర్(వేములవాడ): కథలాపూర్ మండలం భూ షణరావుపేటకు చెందిన స ంగెం వినోద్ (30) సౌదీ అరేబియా దేశంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు గ్రా మస్తులు తెలిపారు. గ్రామానికి చెందిన సంగెం గంగరా జం– సరోజన దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. వినోద్ పెద్ద కుమారుడు. ఆయన కొంతకాలంగా గల్ఫ్ దేశం వెళ్లి వస్తున్నా డు. ఏడాదిన్నర క్రితం సౌదీ వెళ్లాడు. ఈనెల 22న వినోద్ తన గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు అక్కడి వారు కుటుంబసభ్యులకు బుధవారం ఫోన్లో సమాచారం ఇచ్చారు. వినోద్కు ఇంకా పెళ్లి కాలేదు. అతడి ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉందని బంధువులు పేర్కొన్నారు. మృతదేహాన్ని త్వరగా స్వగ్రామానికి పంపించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాలని మృతుడి బంధువులు కోరుతున్నారు. భార్యను హత్య చేసిన భర్తకు జీవిత ఖైదుజగిత్యాలక్రైం: భార్యను హత్య చేసిన భర్తకు జీ విత ఖైదుతోపాటు, రూ.2 వేల జరిమానా విధి స్తూ మొదటి అదనపు జిల్లా సెషన్స్ జడ్జి నారా యణ బుధవారం తీర్పునిచ్చారు. కోరుట్ల మండలం యెకిన్పూర్కు చెందిన ఎర్ర చంద్రయ్య, భార్య గంగరాజు కూలీలు. చంద్రయ్య మద్యాని కి బానిసై గంగరాజుతోపాటు కొడుకును వేధించేవాడు. 2022 అక్టోబర్ 29న ఇంట్లో ఎవరూ లేని సమయంలో మద్యం మత్తులో భార్యతో ఘర్షణ పడి ఆమెను హత్య చేసి.. ఆమె ఒంటిపై ఉన్న బంగారాన్ని తీసుకుని మృతదేహాన్ని మూ టకట్టి యెకిన్పూర్ శివారులో పడేశాడు. మృతురాలి కుమారుడు సుధీర్ ఫిర్యాదు మేరకు కోరుట్ల పోలీసులు కేసు నమోదు చేసి చంద్రయ్యను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు కోర్టులో సాక్షులను హాజరుపర్చారు. దీంతో చంద్రయ్యకు జడ్జి శిక్ష ఖరారు చేశారు. హాస్టల్ నుంచి పారిపోయిన విద్యార్థులు● స్థానికులు పట్టుకుని తిరిగి అప్పగింత మల్యాల: మండలకేంద్రం శివారులోని జగిత్యా ల అర్బన్ గురుకులం విద్యార్థులు హాస్టల్ గోడ దూకి పారిపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గురుకులాన్ని గతేడాది జగిత్యాల నుంచి మండలకేంద్రంలోని ఇంటిగ్రేటెడ్ హాస్టల్కు తరలించారు. ప్రస్తుతం ఇక్కడ 6, 7, 8 తరగతుల విద్యార్థులు 40మంది ఉన్నారు. ఈ ఏడా ది అడ్మిషన్ తీసుకున్న ఇద్దరు ఆరు, ఎనిమిదో తరగతి విద్యార్థులు సోమవారం రాత్రి హాస్టల్ గోడ దూకి పారిపోయారు. వారిని మండలకేంద్రంలో గుర్తించి తిరిగి వార్డెన్కు అప్పగించారు. హాస్టల్ వార్డెన్ విద్యార్థులకు కౌన్సెలింగ్ నిర్వహించి బుధవారం తల్లిదండ్రులకు అప్పగించారు. ఇరువర్గాలపై కేసు సుల్తానాబాద్రూరల్(పెద్దపల్లి): భూ సమస్యపై గొడవపడగా ఇరువర్గాలపై కేసు నమోదు చే సిన ట్లు ఎస్సై శ్రావణ్కుమార్ తెలిపారు. ఎస్సై కథ నం ప్రకారం.. సుల్తానాబాద్ మండలం అల్లిపూ ర్ గ్రామానికి చెందిన ఏరుకొండ సరోజన, భర్త తిరుపతి, కరీంనగర్ జిల్లా చర్లబూత్కూర్కు చెందిన బుర్ర రేణుక, భర్త రాములు, అల్లిపూర్కు చెందిన బండ రాణి, భర్త భూమయ్య, రేగడిమద్దికుంటకు చెందిన ముంజాల అశోక్, ఏరుకొండ వినోద్తోపాటు మరోవర్గం ముంజల శ్యామల, భర్త సతీశ్ భూసమస్యపై మంగళవారం గొడవ పడ్డారు. ఇదేసమయంలో పెట్రోలింగ్కు వెళ్లిన బ్లూకోల్ట్స్ సిబ్బంది వారిని సముదాయించినా వినకుండా పోలీస్స్టేషన్లో పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. బుధవారం ఇరువర్గాలను సీఐ సు బ్బారెడ్డి ఠాణాకు పిలిపించి నోటీసులు అందించారు. గొడవ పడొద్దని కౌన్సెలింగ్ ఇస్తుండగా, ఏరుకొండ వినోద్ పోలీసులపై దురుసుగా ప్రవర్తించి, అసభ్యపదజాలంతో దూషించాడు. దీంతో వినోద్పై కేసు నమోదు చేశారు. ఈ విషయ మై సీఐని సంప్రదించగా భూసమస్యపై ఇరువర్గాల ఫిర్యాదుతో కేసు నమోదు చేశామన్నారు. -
ట్రాక్టర్ యజమానుల బైండోవర్
కరీంనగర్రూరల్: కరీంనగర్ మండలం నగునూరు వాగునుంచి ఇసుక అక్రమ రవాణా చేస్తున్న మహేశ్, అశోక్ను బుధవారం తహసీల్దార్ రాజేశ్ ఎదుట బైండోవర్ చేసినట్లు కరీంనగర్రూరల్ సీఐ నిరంజన్రెడ్డి తెలిపారు. మరోసారి చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడినట్లయితే రూ.లక్ష జరిమానా లేదా ఆరు నెలల జైలు శిక్ష విధించేలా సొంత పూచీకత్తుపై బైండోవర్ చేసినట్లు వివరించారు. ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే చట్టప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు. సెల్ఫోన్ అప్పగింత కరీంనగర్ గోదాంగడ్డకు చెందిన బోయిని రాజేశ్ పోగోట్టుకున్న సెల్ఫోన్ను సీఈఐఆర్ టెక్నాలజీ ద్వారా పట్టుకుని బుధవారం బాధితుడికి అప్పగించినట్లు సీఐ నిరంజన్రెడ్డి తెలిపారు. జనవరి 6న మొగ్ధుంపూర్లో రాజేశ్ సెల్ఫోన్ పోగొట్టుకోగా పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. సీఈఐఆర్ టెక్నాలజీతో నిజామాబాద్లో గుర్తించి పట్టుకున్నట్లు వివరించారు. -
3న ఎత్తిపోతల ప్రారంభం
రామగుండం: అంతర్గాం మండలం ముర్మూర్/బ్రహ్మణపల్లి శివారులో నిర్మించిన ఎత్తిపోతలను ప్రారంభించే విషయంపై ఎమ్మెల్యే మక్కాన్సింగ్ ఠాకూర్ బుధవారం కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలి సి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఎత్తిపోతల ద్వా రా పాలకుర్తి, అంతర్గాం మండలాల పరిధిలోని సుమారు 20వేల ఎకరాల ఆయకట్టులో రెండు పంటలకు సాగు నీరు అందుతుందని ఠాకూర్ తెలిపారు. ఆగస్టు 3న మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఆర్డీవో గంగయ్య, అంతర్గాం తహసీల్దార్ రవీందర్పటేల్, పెద్దపల్లి డీసీపీ కరుణాకర్, అంతర్గాం ఎస్సై వెంకటస్వామి పాల్గొన్నారు. విద్యార్థులు ఇష్టంతో చదవాలి జ్యోతినగర్/ఫెర్టిలైజర్సిటీ/పాలకుర్తి: విద్యార్థు లు ఇష్టంతో చదవాలని ఎమ్మెల్యే మక్కాన్సింగ్ సూచించారు. సింగరేణి సీఎస్సార్ ద్వారా క్యూ ఆర్ కోడ్ ముద్రించిన బుక్స్ను టెన్త్క్లాస్ విద్యార్థులకు అందించి మాట్లాడారు. ఆర్జీ–1 జీఎం లలిత్ కుమార్, ఏసీపీ రమేశ్, ఎంఈవో మల్లేశం, హెచ్ఎం జయరాజ్ పాల్గొన్నారు. కాగా, గౌతమినగర్లోని ఓ స్కూల్ను ఎమ్మెల్యే రాజ్ఠాకూర్ ప్రా రంభిచారు. పాలకుర్తి మండల కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం బసంత్నగర్లోని అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీ వర్కర్స్ క్లబ్లో నిర్వహించగా, ఎమ్మెల్యే మక్కాన్సింగ్ హాజరయ్యారు.● ఎమ్మెల్యే మక్కాన్సింగ్ -
ఏసీబీకి చిక్కిన పీఆర్ ఏఈ
జగిత్యాలక్రైం: ప్రభుత్వ పనులు చేపట్టిన సివిల్ కాంట్రాక్టర్కు క్వాలిటీ కంట్రోల్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు డబ్బులు డిమాండ్ చేసిన జగిత్యాల పంచాయతీ రాజ్ శాఖలో విజిలెన్స్ క్వాలిటీకంట్రోల్ విభాగం ఏఈ అనిల్ బుధవారం లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. కోరుట్ల మండలం చిన్నమెట్పల్లికి చెందిన పంచరి వెంకటేశ్ సవిల్ కాంట్రాక్టర్. ఐదేళ్ల క్రితం కోరుట్లలో రూ.13.80 లక్షలతో ఎల్లమ్మ (గౌడ) కమ్యునిటీ హాల్ నిర్మించాడు. ఎంబీ రికార్డు కూడా పూర్తయింది. అలాగే రెండేళ్ల క్రితం రూ.4.50 లక్షలతో చిన్నమెట్పల్లిలో హనుమాన్ కమ్యునిటీ హాల్ నిర్మించాడు. కోరుట్లలోని ఆర్డీవో కార్యాలయం ప్రహరీని రూ.5లక్షలతో పూర్తి చేసి ఎంబీ రికార్డు పూర్తి చేయించాడు. మొత్తం మూడు పనులను రూ.23.30లక్షలతో పూర్తి చేశాడు. వాటికి సంబంధించిన బిల్లుల కోసం ధ్రువీకరణ పత్రం ఇవ్వాలని ఏఈ అనిల్కుమార్ను కొన్నాళ్లుగా కోరుతున్నాడు. రేపుమాపు అంటూ కాలం వెళ్లదీస్తూ వచ్చిన అనిల్.. గత శనివారం రూ.18 వేలు డిమాండ్ చేశాడు. దీనికి వెంకటేశ్ రూ.10 వేలు ఇచ్చేందుకు ఒప్పుకుని అదేరోజు రూ.3వేలు అడ్వాన్స్గా ఇచ్చాడు. అనంతరం ఏసీబీ అధికారులను సంప్రదించాడు. ఏసీబీ అధికారులు బుధవారం సాయంత్రం కరీంనగర్రోడ్లో ఉన్న పంచాయతీరాజ్ శాఖ విజిలెన్స్ క్వాలిటీ కంట్రోల్ కార్యాలయం వద్ద కాపుకాశారు. వెంకటేశ్ నుంచి అనిల్ రూ.7వేలు తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ విజయ్కుమార్ రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. అనంతరం అతడిపై కేసు నమోదు చేశారు. అనిల్ను కరీంనగర్ ఏసీబీ కోర్టుకు తరలించారు. ప్రభుత్వ ఉద్యోగులెవరైనా లంచం డిమాండ్ చేస్తే ఏసీబీ టోల్ఫ్రీ నంబరు 1064లో సంప్రదించాలని డీఎస్పీ వివరించారు. దాడుల్లో ఏసీబీ సీఐలు పున్నం చందర్, కృష్ణకుమార్, తిరుపతి, సిబ్బంది శ్రీకాంత్, విష్ణు, బాలు, మొగిలయ్య పాల్గొన్నారు. రూ.7వేలు లంచం తీసుకుంటుండగా రెడ్హ్యాండెడ్గా పట్టివేత క్వాలిటీ కంట్రోల్ సర్టిఫికెట్తో డబ్బుల డిమాండ్ ఏసీడీ డీఎస్పీ విజయ్కుమార్ వెల్లడి -
కొడుకు, కోడలు మధ్య మనస్పర్థలు
జూలపల్లి(పెద్దపల్లి): తన కొ డుకు, కోడలు మధ్య మనస్పర్థలు తలెత్తాయనే మనస్తాప ంతో జెన్కో ఉద్యోగి మేడుదుల రాజన్న (49) బుధవారం తను పనిచేస్తున్న జలవిద్యుత్ కేంద్ర ం లోనే ఉరివేసుకుని ఆత్మ హ త్య చేసుకున్నాడు. ఎస్సై సనత్కుమార్ కథనం ప్రకారం.. పెద్దపల్లికి చెందిన రా జన్న జూలపల్లి మండలం కాచాపూర్ 14వ మైలురా యి వద్ద గల జెన్కో జలవిద్యుత్ కేంద్రంలో జూనియర్ ప్లాంట్ అసిస్టెంట్గా పనిచేస్తున్నారు. ఆయనకు కుమారుడు సాయికుమార్, ఒక కూతురు ఉన్నారు. సాయికుమార్ 2020లో మేకల కావ్యను ప్రేమించి వివాహం చేసుకున్నాడు. వారికి కుమారుడు(3) ఉన్నాడు. అయితే, ఎంబీఏ చదువుకునేందు కు సాయికుమార్ 2022లో యూకేకు వెళ్లాడు. ఆ త ర్వాత ఆయన భార్య కావ్య తనతల్లిదండ్రుల వద్దకు వెళ్లి అక్కడే ఉంటోంది. 2024లో ఇండియాకు తిరిగి వచ్చిన సాయికుమార్.. తన భార్యను కాపురానికి రమ్మని అనేకసార్లు కోరినా ఆమె తిరస్కరించింది. దీంతో వారి మధ్య మనస్పర్థలు ఏర్పడి పంచాయితీలు జరుగుతున్నాయి. ఈక్రమంలోనే తన కుమారుడి సంసారం సాఫీగా సాగడం లేదనే మనస్తాపానికి గురైన తండ్రి రాజన్న.. తను పనిచేస్తున్న జలవిద్యుత్ కేంద్రంలోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య కవిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసు కేసు నమోదు చేశారు. మనస్తాపంతో తండ్రి ఆత్మహత్య జలవిద్యుత్ కేంద్రంలో బలవన్మరణం -
వాసవీమాతకు అభిషేకాలు
కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): స్థానిక శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరీ అమ్మవారి ఆలయంలో ఆ ర్యవైశ్య సంఘం నేతృత్వంలో శ్రావణమాసం సందర్భంగా బుధవారం ప్రత్యేకపూజలు చేశా రు. పంచామృతాలతో అభిషేకాలు, పసుపుకొమ్ములతో కుంకుమ పూజలు చేశారు. సింగరేణి ఆస్పత్రికి వైద్యనిపుణుల రాకగోదావరిఖని: హైదరాబాద్లోని కేర్ ఆస్పత్రికి చెందిన సూపర్ స్పెషాలిటీ వైద్యులు వచ్చే నెల 3న గోదావరిఖని సింగరేణి ఏరియా ఆస్పత్రికి రానున్నట్లు ఆర్జీ –1 అధికార ప్రతినిధి రవీందర్రెడ్డి తెలిపారు. కార్డియాలజీ, న్యూరాలజీ, మెడికల్ గ్యాస్ట్రోలజిస్ట్, యూరోలజీ నిపుణులు ఇందులో ఉంటారని పేర్కొన్నారు. సింగరేణి ఉద్యోగులు, వారికుటుంబ సభ్యులు ఈనెల 31 నుంచి వచ్చేనెల 2వ తేదీ వరకు సింగరేణి ఏరియా ఆస్పత్రిలో తమ పేర్లు నమోదు చేయించుకోవాలని ఆయన సూచించారు. రైతు సంక్షేమమే లక్ష్యం మంథని: రైతుల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తామని మంథని మార్కెట్ కమిటీ చైర్మన్ కుడుదుల వెంకన్న అన్నారు. బుధవారం స్థానిక ఏ ఎంసీ కార్యాలయంలో చైర్మన్ కుడుదుల వెంక న్న, వైస్ చైర్మన్ ముస్కుల ప్రశాంత్రెడ్డితోపా టు పాలకవర్గ సభ్యులు బాధ్యతలు స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభు త్వం రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తోందన్నా రు. అనంతరం పదవీ బాధ్యతలు స్వీకరించిన పాలకవర్గాన్ని స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకు లు, కార్యకర్తలు, మాజీ ప్రజాప్రతినిధులు శా లువాలు, పూలమాలలతో సన్మానించారు. స్కూల్ బస్సుల్లో సీసీ కెమెరాలు బిగించాలిగోదావరిఖనిటౌన్: పాఠశాల, కళాశాల బస్సు ల్లో సీసీ కెమెరాలు అమర్చుకోవాలని పెద్దపల్లి డీసీపీ కరుణాకర్ సూచించారు. నగరంలోని అ డ్డగుంటపల్లిలో బుధవారం సబ్ డివిజన్లోని పాఠశాలు, కళాశాలల యజమానులు, బస్సు డ్రైవర్లతో సదస్సు నిర్వహించారు. డ్రైవర్లు పొ రపాటు చేసినా స్కూల్ యాజమాన్యమే బా ధ్యత వహించాలన్నారు. నైపుణ్యం కలిగిన డ్రై వర్లనే నియమించుకోవాలని యాజమాన్యాలకుసూచించారు. సీట్లకు సరిపడా విద్యార్థులనే తరలించాలని పేర్కొన్నారు. ఏసీపీ రమేశ్, సీఐ లు ఇంద్రసేనారెడ్డి, ప్రసాదరావు, రాజు, రాజేశ్వరరావు, అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ మధు, ఎస్సైలు రమేశ్, భూమేశ్, అనూ ష, ఉదయ్కిరణ్, సంధ్యారాణి, వెంకటేశ్, ప్రసాద్, శ్రీనివాస్, రమేశ్, నరేశ్ పాల్గొన్నారు. నిరంతరం విషయ పరిజ్ఞానం నేర్చుకోవాలి రామగిరి(మంథని): లక్ష్యం, విజయం సాధించేందుకు విషయపరిజ్ఞానాన్ని నిరంతరం నే ర్చుకుంటూనే ఉండాలని గ్లోబల్ స్పీకర్, కార్పొరేట్ ట్రెయినర్ వేముకంటి రమేశ్ అన్నారు. మంథని జేఎన్టీయూలో బీ టెక్ ఎ రివార్డింగ్ క్యారియర్ అంశంపై బుధవారం నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. కమ్యూనికేషన్, సాఫ్ట్ స్కిల్స్, సమయపాలన, మోటివేషన్ లాంటి అంశాలపై ఆయన సుదీర్ఘంగా వివరించారు. సబ్జెక్టుల పరిజ్ఞానం, జనరల్ స్టడీస్, ప్రొడక్ట్, మార్కెట్, మారుతున్న ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్పై అవగాహన పెంచుకోవాలని ఆ యన సూచించారు. నిత్యం ఏదోఒక ఆట కనీ సం గంటసేపైనా ఆడాలని, తద్వారానే శారీరక దృఢత్వం, మానసిక ఆరోగ్యం లభిస్తుందన్నారు. ప్రిన్సిపాల్ విష్ణువర్ధన్, వైస్ ప్రిన్సిపాల్ ఉదయకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
వైద్యులు, సిబ్బందికి ‘బయోమెట్రిక్’
మంథని: ఇకనుంచి ఆస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది హాజరు నమోదును బయోమెట్రిక్ పద్ధతిన నమోదు చేస్తారని, అందరూ సమయపాలన పాటించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. పేషెంట్లకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. స్థానిక సామాజిక వైద్యశాల, మాతాశిశు ఆస్పత్రి, గోపాల్పూర్ ప్రభుత్వ పాఠశాల, గద్దలపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పేషెంట్ల కోసం ఇటీవల నిర్మించిన షెడ్ను పరిశీలించారు. మాతాశిశు ఆరోగ్య కేంద్రంలో గర్భిణులు, మహిళలకు నాణ్యమైన వైద్యం అందించాలని ఆదేశించారు. గోపాల్పూర్ పాఠశాల పనులు త్వరగా పూర్తిచేయాలని అన్నారు. పీహెచ్సీలో ఏఎంసీ ప్రొఫైల్ సక్రమంగా నిర్వహించాలని, ఎన్సీడీ స్క్రీనింగ్, ఎక్స్రే, టీబీ, ముక్త్ భారత్, ఆరోగ్య మహిళ తదితర అంశాలపై ఆరా తీశారు. ఓపీ సేవలు పెంచాలని ఆదేశించారు. ఎంపీడీవో శశికళ, ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి పనులు సకాలంలో పూర్తిచేయాలి పెద్దపల్లిరూరల్: జిల్లాలోని రామగుండం నగరంలో చేపట్టిన అభివృద్ధి పనులను సకాలంలో పూర్తిచేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. వివిధ శాఖల అధికారులతో పనుల ప్రగతిపై తన కార్యాలయంలో సమీక్షించారు. పెండింగ్లోని సంప్ పనులు పూర్తిచేయాలన్నారు. శుక్రవారం వరకు తాగునీటి సరఫరా మరింత మెరుగుపర్చాలని ఆదేశించారు. ఆర్ అండ్ బీ అధికారులు చేపట్టిన రోడ్ల విస్తరణ, ఇతర అభివృద్ధి పనులకు ఆటంకం కలుగకుండా తాగునీటి పైప్లైన్ షిప్టింగ్ పనులు చేపట్టాలన్నారు. పంచాయతీరాజ్ పనులు పురోగతిలో ఉన్నాయని అన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో తాగునీటి సరఫరా పనులను పర్యవేక్షించాలని ఆదేశించారు. ఆర్ అండ్ బీ ఈఈ భావ్సింగ్, మిషన్ భగీరథ ఇంట్రా ఈఈ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సకాలంలో విధులకు హాజరు కావాల్సిందే.. వైద్యులూ.. పేషెంట్లకు మెరుగైన వైద్యసేవలు అందించాలి కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశాలు -
నాణ్యమైన విద్యుత్ అందించాలి
కొత్తపల్లి(కరీంనగర్): వినియోగదారులు, రైతుల కు నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యంగా ఉ ద్యోగులు పనిచేయాలని టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ కర్ణాటి వరుణ్రెడ్డి పిలుపునిచ్చారు. కరీంనగర్ విద్యుత్ భవన్లోని ఎస్ఈ చాంబర్లో మంగళవా రం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. వి ద్యుత్ సిబ్బంది తప్పనిసరిగా భద్రత పరికరాలు వాడాలన్నారు. లేకుంటే పెనాల్టీ విధించాలని ఆదేశించారు. ట్రాన్స్ఫార్మర్లు చెడిపోకుండా చర్యలు చేపట్టాలని, ఒకవేళ కాలిపోతే వెంటనే ఎస్పీఎం సెంటర్కు పంపించి రిపేర్లు చేయించాలని సూ చించారు. విద్యుత్ మీటర్లను తనిఖీ చేయడంతో పాటు చౌర్యాన్ని అరికట్టాలని ఆదేశించారు. బకా యిలు వసూలు చేస్తూ రెవెన్యూ పెంచాలన్నారు. కరీంనగర్ సర్కిల్ ఎస్ఈ రమేశ్బాబు, డీఈలు తిరుపతి, లక్ష్మారెడ్డి, చంద్రమౌళి, రమణారెడ్డి, ఎస్ఏవో రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు. టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్ణాటి వరుణ్రెడ్డి -
కలెక్టర్ను నేరుగా కలవొచ్చు
పెద్దపల్లిరూరల్: జిల్లా ప్రజలు తమ సమస్యల ను నేరుగా కలెక్టర్ కోయ శ్రీహర్షను కలిసి విన్నవించుకోవచ్చు. ఇందుకోసం బుధవారం నుంచి శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు అందుబాటులో ఉంటానని కలెక్టర్ శ్రీహర్ష తెలిపారు. సమస్యలు, ఇతర అంశాలపై తనతో నేరుగా చర్చించవచ్చన్నారు. సందర్శకులు, ఫిర్యాదుదారులు తమకు కేటా యించిన సమయాల్లోనే కలెక్టరేట్కు రావాలని ఆయన సూచించారు. మిగతా రోజుల్లో అత్యవసర పనులకోసం అడిషనల్ కలెక్టర్, జిల్లా అధికారులను సంప్రదించాలని తెలిపారు.పఠనా నైపుణ్యం పెంచాలి ముత్తారం(మంథని): విద్యార్థుల్లో పఠన, నైపుణ్యత, సామర్థ్యం పెంచాలని జిల్లా అకడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ పీఎం షేక్ తెలిపారు. ల క్కారం జెడ్పీ కాంప్లెక్స్ పరిధిలోని మచ్చుపేట, కాజీపల్లి, శుక్రవారంపేట, మైదంబండ, హరిపురం, పోతారం, కేశనపల్లి, ధరియాపూర్ ప్రా థమిక పాఠశాలలను షేక్ ఆధ్వర్యంలోని జిల్లా రిసోర్స్ బృందం మంగళవారం ఆకస్మికంగా త నిఖీ చేసింది. ఎఫ్ఎల్ఎన్ తరగతులు పరిశీలించింది. సభ్యులు ప్రవీణ్, సంపత్రెడ్డి, సమద్, రవి, ప్రభాకర్రెడ్డి, కిరణ్, దేవేందర్రెడ్డి, ఎంఈవో హరిప్రసాద్, కాంప్లెక్స్ హెచ్ఎంలు సు హాసిని, పద్మాదేవి, రాజేఽశ్వర్రావు ఉన్నారు. నేడు, రేపు కేజీబీవీల్లో స్పాట్ అడ్మిషన్లు పెద్దపల్లిరూరల్: జిల్లాలోని 8 కస్తూరిబా గాంధీ బాలికల(కేజీబీవీ) కాలేజీల్లో ఇంటర్మీడియట్ కోర్సుల్లో చేరేందుకు ఆసక్తిగల వారు ఈనెల 30, 31వ తేదీల్లో చేపట్టే స్పాట్ అడ్మిషన్లకు హాజరు కావాలని డీఈవో మాధవి తెలిపారు. అంతర్గాంలో 10 బైపీసీ, జూలపల్లిలో 15 బైపీ సీ, ముత్తారం (మంథని)లో 16 సీఈసీ, 19 ఎంపీహెచ్డబ్ల్యూ, ఓదెలలో 18 ఎంపీసీ, 27 బైపీసీ, పాలకుర్తిలో 19 ఎంఎల్టీ, 19 బైపీసీ, రామగిరిలో 10 ఎంపీసీ, కంప్యూటర్ సైన్స్ 25, కాల్వశ్రీరాంపూర్లో 20 సీఈసీ, 2 ఎంపీహెచ్డబ్ల్యూ సీట్లు ఖాళీగా ఉన్నాయని వివరించారు. 31న గురుకులాల్లో..ధర్మారం(ధర్మపురి): జిల్లాలోని సాంఘిక సంక్షే మ గురుకుల విద్యాలయాల్లో ఇంటర్మీడీయెట్ కోర్సుల్లో మిగిలిన సీట్ల భర్తీకి ఈనెల 31న స్పాట్ అడ్మిషన్ చేపట్టామని గురుకుల విద్యాలయాల కో ఆర్డినేటర్ దేవసేన తెలిపారు. ఆస క్తి, అర్హత కలిగిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఒకటిన రాష్ట్రస్థాయి గ్రాండ్ టెస్ట్ పెద్దపల్లిరూరల్: స్థానిక ప్రభుత్వడిగ్రీ కాలేజీలో ఆగస్టు ఒకటిన జంతుశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో జువాలజీ సబ్జెక్టుపై రాష్ట్రస్థాయి గ్రాండ్టెస్ట్ నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ లక్ష్మీనర్సయ్య తెలిపారు. ఆసక్తి గలవారు ఆన్లైన్లో గూగుల్ఫామ్ ద్వారా పేర్లు నమోదు చేసుకోవాలన్నా రు. ఆగస్టు 7న నిర్వహించే ఎమ్మెస్సీ జువాలజీ ప్రవేశ పరీక్షకు గ్రాండ్టెస్ట్ ఎంతోఉపకరిస్తుందన్నారు. ఈమేరకు ఏర్పాట్లు చేసిన హెచ్వోడీ తిరుపతిని ప్రిన్సిపాల్ లక్ష్మీనర్సయ్య, వైస్ ప్రిన్సిపాల్ సతీశ్కుమార్, అకడమిక్ కో ఆర్డినేటర్ పురుషోత్తం, మురళి అభినందించారు. 31న గొర్రెలకాపరుల సదస్సు పెద్దపల్లిరూరల్: ఉమ్మడి కరీంనగర్ జిల్లా గొ ర్రెల పెంపకందారుల సదస్సు ఈనెల 31న క రీంనగర్లోని ఇందిరా ఫంక్షన్హాల్లో నిర్వహించనున్నామని సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధా న కార్యదర్శి మారం తిరుపతితోపాటు ప్రతినిధి చిలారపు పర్వతాలు తెలిపారు. ఈ సందర్భంగా చేపట్టిన 18వ వార్షికోత్సవ సభకు హాజరు కావాలని వారు కోరారు. నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం గోదావరిఖనిటౌన్: స్థానిక విఠల్నగర్ ఫీడర్ ప రిధిలో చెట్ల కొమ్మలను తొలగించే పనులు చేపడుతున్నందున బుధవారం విద్యుత్ సరఫరా లో అంతరాయం కలుగుతుందని ఏఈ నారాయణ తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఫైవింక్లయిన్, భగత్సింగ్నగర్, సెవెన్బీకాలనీ, సిక్ హాస్పిటర్, తిలక్నగర్ ఏరియాల్లో విద్యుత్ సరఫరా కు అంతరాయం ఉంటుందని వివరించారు. వార్షిక లాభాలు ప్రకటించాలి గోదావరిఖని: సింగరేణి సాధించిన లాభాలను ప్రకటించాలని ఐఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు కె.విశ్వనాథ్ డిమాండ్ చేశారు. మంగళవారం తిలక్నగర్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నాయకులు ఖాసిం, ముత్తన్న, ఎల్లయ్య, రాజలింగం, మల్లేశ్ పాల్గొన్నారు. -
కార్మికుల హక్కుల కోసం రాజీలేని పోరాటాలు
మంథని: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలపై రాజీలేని పోరా టాలు చేస్తామని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యద ర్శి ఎరవెల్లి ముత్యంరావు అన్నారు. మంగళవారం పట్టణంలోని ఫ్రెండ్స్ క్లబ్లో మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్ నాలుగో మహాసభ నిర్వహించారు. తొలుత మున్సిపల్ సీనియర్ కార్మికుడు వడ్లకొండ రాజయ్య జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ముత్యంరావు మాట్లాడారు. రానున్నకాలంలో మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కా రానికి రాజీలేని పోరాటాలు చేస్తామని, ఇందుకో సం కార్మిక వర్గం మద్దతు ప్రకటించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్, ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా కార్యదర్శి శ్రావణపల్లి వెంకటస్వామి, సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యుడు బూడిద గణేశ్, ఎస్ఎఫ్ఐ అధ్యక్షుడు ఆర్ల సందీప్, కేవీపీఎస్ ఉపాధ్యక్షుడు మంథని లింగయ్య, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. సీఐటియూ నేత ముత్యంరావు -
భాష.. యాసతోనే గుర్తింపు
● తెలంగాణ ఉద్యమంతో గౌరవం దక్కింది ● సంస్కృతీసంప్రదాయాలకు ప్రాచుర్యం ● ఉత్తరాది కల్చర్ మనపై దాడి చేస్తుంది ● అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది ● దాశరథి పురస్కార గ్రహీత అన్నవరం దేవేందర్ తెలంగాణ మాండలికం తెలంగాణ మాండలికంలో కవితలు, రచనలు చేయడంతో నన్ను గుర్తించారు. నేను ఎక్కువగా పల్లెటూళ్లు, అక్కడి జీవనవిధానం, పల్లెప్రజలు వాడుకునే పనిముట్లు.. వాటిపైనే ఎక్కువగా రాశాను. తెలంగాణ భాష అనేది నా భాష అని రాసిన. మొదట్లో కొంత ఇబ్బంది ఎదురైంది. గిదేం భాష అని ఎక్కిరించిన్రు. అయినా మన తాతలు, తండ్రులు మాట్లాడిన భాషలోనే రాసిన. తెలంగాణ ఉద్యమ ఫలితంగా మన సంస్కృతి, సంప్రదాయాలకు గుర్తింపు దక్కింది. తెలంగాణ మాండలికంలో వచ్చిన సినిమా పాటలు, జానపద గేయాలు సక్సెస్ అవుతున్నాయి.మొదట ఎక్కిరించిన్రు -
శిథిల భవనాలు ఖాళీ చేయండి
కోల్సిటీ(రామగుండం): నగరంలో శిథిలావస్థలో ఉ న్న భవనాల్లో నివాసం ఉండేవారు వెంటనే ఖాళీ చే యాలని, పరిసరాల్లో కూడా ఎవరూ సంచరించరా దని బల్దియా అధికారులు మంగళవారం హెచ్చరిక నోటీసులు జారీచేశారు. 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. టెయిల్ ఎండ్ ప్రాంతాల్లో నల్లా నీటికి క్లోరిన్ పరీక్షలు చేశా రు. డిప్యూటీ కమిషనర్ వెంకటస్వామి గాంధీనగర్ లోని కమ్యూనిటీ టాయిలెట్స్లో వసతులు పరిశీలించారు. ఆవరణను పరిశుభ్రం చేయించారు. పరిసరాల పరిశుభ్రత, తడి, పొడిచెత్త వేరు చేయడం, దోమల నిర్మూలన, కుక్కకాటు బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించా రు. తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులతో ప్రదర్శన నిర్వహించారు. శానిటరీ ఇన్స్పెక్టర్లు కిర ణ్, నాగభూషణం, మెప్మా సీవో ప్రియదర్శిని, ఎన్విరాన్మెంట్ ఇంజినీర్ మధుకర్, ఎంఐఎస్ ఆపరేట ర్ శ్రీకాంత్, వార్డు అధికారులు, శానిటరీ జవాన్లు, మెప్మా ఆర్పీలు, స్వశక్తి మహిళలు పాల్గొన్నారు. రామగుండం బల్దియా డిప్యూటీ కమిషనర్ వెంకటస్వామి -
ట్రై సైకిల్ ఇప్పించండి
నిరుపేద కుటుంబానికి చెందిన దివ్యాంగుడిని నేను. నా అవసరాలు తీర్చుకునేందుకు మూడు చక్రాల బ్యాటరీ సైకిల్ ఇప్పించాలి. ఎటైనా వచ్చి పోయి వచ్చేందుకు వీలుగా ఉంటుంది. అధికారులు చొరవ చూపి ట్రైసైకిల్ మంజూరయ్యేలా చూడాలి. – అఫ్సర్ హుస్సేన్, ఎల్కలపల్లిగేట్ భూమి పట్టా ఇప్పించండి ఓదెల మండలం కొలనూర్ గ్రామ శివారులో ఉన్న పదిహేనున్నర గుంటల భూమిని కొనుగోలు చేసుకున్న. 1982 నుంచి మోకాపై ఉన్న. కానీ ఆ భూమికి సంబంధించిన పట్టాదారు పాసుపుస్తకం రాలేదు. నాకు పాసుపుస్తకం ఇప్పించాలి. – పల్లె లచ్చమ్మ, కొలనూర్ -
గృహజ్యోతి వర్తింపజేయాలి
మా ఇంటికి గృహజ్యోతి వర్తింపజేయాలని దరఖాస్తు చేసుకున్నా. అన్ని అర్హతలున్న నాకు పథకం వర్తింపజేయడం లేదు. అధికారులు చర్యలు తీసుకునేలా చూడాలి. – అరికిల్ల సత్తయ్య, బొంపల్లి కూతురుకు ఉద్యోగం ఇప్పించండి నా భర్త వాసు రాఘవాపూర్లో విద్యుత్ హెల్పర్గా పనిచేస్తూ మరణించాడు. ఆ ఉద్యోగాన్ని నా కొడుక్కు ఇచ్చారు. ఆయన కూడా 9 నెలల క్రితం కరెంట్ షాక్ తో చనిపోయాడు. నా కూతురుకు ఉద్యోగం ఇప్పించండి. – గుండ శారద, రాఘవాపూర్ -
మెడికల్ దందా
● ప్రిస్క్రిప్షన్ లేకుండానే విక్రయాలు ● ఫిజీషియన్ శాంపిళ్లు, కాలంచెల్లిన మందుల అమ్మకాలు ● షాపుల్లో బినామీల దందా.. కానరాని ఫార్మసిస్టు ● అధికారుల నామమాత్రపు తనిఖీలుసాక్షి, పెద్దపల్లి: మీకు తల నిప్పి వస్తుందా? జ్వరం వస్తోందా? కడుపు, ఒళ్లు నొప్పులతో భరించలేన్నారా? నిద్ర పట్టడం లేదా? మీకు భయమేమీలేదు. అనారోగ్య సమస్యలపై డాక్టర్ను సంప్రదించాల్సిన అవసరమే లేదు. సమస్య గురించి చెబితే చాలు.. మెడికల్ షాపుల్లో అన్నిరకాల మందులూ ఇస్తారు. ఎంత మొత్తంలో కావాలన్నా విక్రయిస్తారు. ఏ మందు ఎ వేసుకోవాలో.. రోజుకు ఎన్ని వేసుకోవాలో.. ఎన్నిరోజులు వాడాలో కూడా వారే సూచిస్తారు. ఇలా జిల్లాలో మెడికల్ షాపుల నిర్వాహకులు అడ్డగోలు వ్యాపారం చేస్తున్నారు. అధికారులు ఏదోఓసారి తనిఖీ చేయడం, నామమాత్రంగా కేసులు నమోదు చేయడంతోనే చేతులు దులిపేసుకుంటున్నారు. సేమ్ ఫార్ములా.. కంపెనీయే వేరు.. డ్రగ్స్, కాలపరిమితి దాటిన, నకిలీ మందుల విక్రయాలు సైతం జిల్లాలో జోరుగా సాగుతున్నాయి. డాక్టర్ రాసిన కంపెనీ ఔషధాలు లేకుంటే, వాటికి బదులు వేరే కంపెనీ మందులు అంటగడుతున్నారు. ఇదేమని ప్రశ్నిస్తే.. శ్రీసేమ్ ఫార్ములా.. కంపెనీ మాత్రమే వేరు.. ఇది కూడా దానిలాగే పనిచేస్తుంది.శ్రీ అని చెబుతున్నారు. జిల్లాలో సుమారు 800 వరకు రిటైల్, హోల్సేల్ మెడికల్ షాపులు ఉన్నాయి. రోజూ ప్రతీ చిన్న, పెద్ద దుకాణాల్లో రూ.5వేల నుంచి రూ.లక్ష వ్యాపారం సాగుతోంది. జిల్లాలోని డ్రగ్ ఇన్స్పెక్టర్ల అడ్రసే లేదు. వారు ఎక్కడ ఉంటారో? ఏ ప్రాంతంలో తనిఖీ చేస్తున్నారో ఎవరికీ తెలియదు. లైసెన్స్ ఒకరిది.. నిర్వహణ మరొకరిది డ్రగ్స్ అండ్ కాస్మొటిక్స్ యాక్టు–1940, ఫార్మసీ యాక్టు–1948 ప్రకారంగా బీ – ఫార్మసీ లేదా ఎం – ఫార్మసీ పూర్తిచేసిన వారే మెడికల్ షాపులు నిర్వహించాలి. షాపు పర్మిషన్ తీసుకునే సందర్భంలో సంబంధిత ఫార్మసిస్టుల సర్టిఫికెట్లతోపాటు వ్యక్తిగత గుర్తింపుకార్డు ప్రతులు, చిరునామా తదితర వివరాలు దరఖాస్తుతో జతచేసి డ్రగ్ ఇన్స్పెక్టర్కు సమర్పించాలి. అనుమతి మంజూరైన తర్వాతే షాపులు నిర్వహించాలి. జిల్లాలో మెడికల్ షాపులు చాలామంది బినామీలే నిర్వహిస్తున్నారు. ప్రొఫెషనల్ ఫార్మసిస్టు ఆధ్వర్యంలో అవగాహన ఉన్న సిబ్బందితోనే దుకాణాలను నిర్వహించాలి. చాలామంది తక్కువ వేతనంతో యువకులకు పనిలో పెట్టుకుంటున్నారు. మెడికల్పై పరిజ్ఞానం లేనివ్యక్తులు షాపులను నడుపుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. రామగుండానికి చెందిన సింగరేణి కార్మికుడి కాలికి ఇటీవల గాయమైంది. బాధితుడు ఓ మెడికల్ షాపుకు వెళ్లి ఆయింట్మెంట్ కావాలని అడిగి తీసుకుని ఇంటికి వెళ్లాడు. అతడి కూమరుడు ఆయింట్మెంట్ను పరిశీలించి శాంపిల్గా గుర్తించిండు. ఇదేవిషయంపై మెడికల్ షాపు నిర్వాహకుడిని ప్రశ్నించగా.. దానికి చెల్లించిన డబ్బు తిరిగి ఇచ్చేశాడు.పర్సంటేజీలు మాట్లాడుకొని.. జనరిక్, నాన్ జనరిక్ తేడా లేకుండా షాపుల నిర్వాహకులు ఔషధ కంపెనీలతో పర్సంటేజీలు మాట్లాడుకొని వైద్యులతో కుమ్మక్కై ప్రజలను నిలువుదోపిడీ చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. కొనుగోలు చేసిన మందులకు కనీసం బిల్లులు కూడా ఇవ్వకుండా విక్రయాలు చేస్తున్నారు. యాంటిబయాటిక్ మందులను డాక్టర్ల సూచనల మేరకు మాత్రమే ఇవ్వాలి. కానీ షాపుల నిర్వాహకులు ఇష్టారీతిన వ్యవహరిస్తూ యాంటిబయాటిక్ మందులను ఇస్తున్నట్లు సమాచారం. దీంతో అనవసరంగా యాంటిబయాటిక్ మందులు వాడిన వారు సైడ్ ఎఫెక్ట్లతో కొత్తరోగాల బారిన పడుతున్నారు. జిల్లాలో మెడికల్ దందాపై డ్రగ్ ఇన్స్పెక్టర్ వివరణ కోరగా జిల్లాలో తరచూ మెడికల్ షాపులను తనిఖీ చేస్తున్నామన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహిరంచే షాపుల లెసెన్సులను రద్దు చేస్తామని ఆయన తెలిపారు. కొన్ని సిర్ప్లలో మత్తు ప్రభావం కూడా ఉంటుంది. మాదక ద్రవ్యాలు వినియోగించే వారు ఈ సిరప్లు వాడుతున్నారు. డాక్టర్ చీటీపై రాసిస్తేనే వీటిని పేషెంట్కు విక్రయించాలి. మెడికల్ షాప్ నిర్వాహకులు ఇవేమీ పట్టించుకోవడంలేదు. నిషేధిత డ్రగ్స్, మత్తు కలిగించే సిరప్లనూ విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు. -
శ్రావణ పూజలు
పండుగలను మోసుకొచ్చేది శ్రావణం. శివభక్తులకు ప్రీతికరమైన మాసం. భక్తి, మనసుతో భగవానుడిని స్మరిస్తే సకల శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. ఉపవాసాలు పాటించి, వ్రతాలు చేస్తే విశేష ఫలితాలు ఉంటాయని విశ్వాసం. అందుకే శ్రావణాన్ని సౌభాగ్యాన్ని ప్రసాదించే నెలగా మహి ళలు కొలుస్తారు. ఈ సందర్భంగా శుభకార్యాలు, వివాహాలు, వ్యాపారాలు.. ఇలా మంచి పనులు అన్నీ కూడా శ్రావణంలో చేపడితే శుభాలు కలుగుతాయని నమ్మకం. శివపూజలకు విశిష్టమైన మాసం కావడంతో పెద్దపల్లిలోని శివాలయం, హనుమాన్ ఆలయంలో శ్రావణ సోమవారం సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. అవే ఈ చిత్రాలు.. – సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి -
సీజనల్ వ్యాధులపై అప్రమత్తం
పెద్దపల్లిరూరల్: జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, ఆరోగ్య ఉప కేంద్రాల ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ రవీంద్రనాయక్ ఆదేశించారు. జిల్లాలో సీజనల్ వ్యాధుల నియంత్రణకు చేపట్టిన చర్యలపై ఆయన సోమవారం ఆరా తీశారు. స్థానిక ఆర్ అండ్ బీ అతిథి గృహంలో జిల్లా వైద్యాఽధికారి, ఇతర వైద్యాధికారులతో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. ఆస్పత్రుల్లో మందులు, వైద్య పరికరాలు, సిబ్బంది గురించి ఆరా తీశారు. డీఎంహెచ్వో అన్న ప్రసన్నకుమారి మాట్లాడుతూ, వైద్యసేవలు, అనుసరిస్తున్న పద్ధతుల గురించి వివరించారు. రవీంద్రనాయక్ మాట్లాడుతూ, నిబంధనల మేరకు ప్రైవేట్ ఆస్పత్రులు ఫీజు వసూలు చేయాలన్నారు. ఆస్పత్రుల్లో టారిఫ్ బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. ప్రోగ్రాం అధికారులు రాజమౌళి, వాణిశ్రీ, సుధాకర్రెడ్డి, కిరణ్కుమార్ ఉన్నారు. వైద్యసేవలపై ఆరా.. సుల్తానాబాద్/సుల్తానాబాద్రూరల్: స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రం, గర్రెపల్లి పీహెచ్సీని కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ రవీంద్రనాయక్, డీఎంహెచ్వో అన్న ప్రసన్నకుమారి సందర్శించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. గర్రెపల్లి పీహెచ్సీ పరిధిలో నమోదైన డెంగీ కేసులు, నియంత్రణకు తీసుకున్న చర్యలపై సిబ్బందిని అడిగి వివరాలు సేకరించారు. సుల్తానాబాద్ ప్రభుత్వ ఆస్పత్రి అందిస్తున్న వైద్యసేవలు భేష్గ్గా ఉన్నాయని కితాబిచ్చారు. టెన్త్ టాపర్లకు ప్రోత్సాహకం పెద్దపల్లిరూరల్: ఉన్న ఊరిపై మమకారంతో ప్ర భుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు అమెరికా లో స్థిరపడ్డ సోదరులు వావిలాల రవీందర్రావు, వెంకటరమణారావు ఏటా ప్రోత్సాహక బహుమ తులు అందిస్తున్నారు. అత్యధిక మార్కులు సాధించిన ముగ్గురు విద్యార్థులకు రూ.10వేల చొప్పున, 500కుపైగా మార్కులు సాధించిన మరో 9మందికి రూ.వెయ్యి చొప్పున ప్రోత్సాహకాలు అందిస్తున్నా రు. సోమవారం కూడా నిట్టూరు జెడ్పీ హైస్కూల్ లో విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందజేశారు. పంద్రాగస్టు, రిపబ్లిక్ డే సందర్భంగా క్రీడాపోటీల్లో విజేతలకు బహుమతులు అందించడం అభినందనీయమని ఎంఈవో సురేంద్రకుమార్ అన్నారు. -
ఆటలతోపాటే సంగీతం
● జిల్లాలో 16 ప్రభుత్వ పాఠశాలలు ఎంపిక ● ఇప్పటికే స్కూళ్లకు చేరిన వాయిద్యాలు ● విద్యార్థులు సత్ఫలితాలు సాధించడమే లక్ష్యం సుల్తానాబాద్(పెద్దపల్లి): జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఆటాపాటలు, సంగీతం నేర్చుకోవడం ద్వారా చదువులో సత్ఫలితాలు సాధిస్తారనే ఆశయంతో సర్కారు సంగీత వాయిద్యాలను సరఫరా చేస్తోంది. ఈమేరకు జిల్లాలో ఇప్పటివరకు 16 ప్రభుత్వ పాఠశాలలను పీఎంశ్రీ పథకం కింద ఎంపిక చేశారు. స్కూళ్లకు చేరిన వాయిద్యాలు.. జిల్లాలో ప్రధానమంత్రి స్కూల్ ఫర్ రైజింగ్ (పీఎంశ్రీ) ఎంపిక చేసిన 16 సర్కారు స్కూళ్లలో సంగీత తరగతులు నిర్వహించడానికి ఇప్పటికే సంగీత వాయిద్యాలను సరఫరా చేశారు. ఇందులో వయోలిన్, తబలా, మృదంగం, హార్మోనియం, బ్యాండ్ ఉన్నాయి. ఆరో తరగతి నుంచే.. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు ,రెసిడెన్షియల్ స్కూళ్లలో ఆసక్తిగల విద్యార్థులకు సంగీతం నేర్పి స్తారు. ఇందులో ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివే విద్యార్థులు ఉంటారు. విద్యార్థుల్లో మానసిక ఒత్తిడి తగ్గించాలనే లక్ష్యం మేరకు పాఠశాల దశ నుంచే కళారంగంలో రాణించేందుకు సంగీతం నేర్పిస్తున్నామని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. త్వరలో ట్రెయినర్ల నియామకం సంగీత పాఠాలు బోధించే ఒక్కో పాఠశాలకు ఒ క్కో ట్రెయినర్ను కాంట్రాక్టు పద్ధతిన నియమించాలని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు. ఇందుకోసం అనుభవం కలిగిన వారికి, రిటైర్డ్ ఆర్మీ సైనికులకు ప్రాధాన్యం ఇస్తారని తెలిసింది. ట్రెయినర్లను ఎంపిక చేస్తాం పీఎంశ్రీ పథకం ద్వారా విద్యార్థులకు సంగీతం నేర్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఇందుకు అవసరమైన సంగీత వాయిద్యాలు పాఠశాలలకు చేరాయి. శిక్షణ ఇచ్చేవారి ఎంపికే మిగిలి ఉంది. – మాధవి, డీఈవో -
ఇళ్ల సర్వే పూర్తిచేయండి
రామగిరి(మంథని): రత్నాపూర్లో చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల సర్వేను త్వరగా పూర్తిచేయా లని జెడ్పీ సీఈవో నరేందర్ ఆదేశించారు. స్థా నిక మండల ప్రజాపరిషత్ కార్యాలయాన్ని ఆ యన సోమవారం తనిఖీ చేశారు. ఇళ్లసర్వేతోపాటు ఓటరు జాబితా సవరణ పూర్తిచేయాలని సూచించారు. ఎంపీడీవో శైలజారాణి, ఎంపీవో ఉమేశ్, సీనియర్ అసిస్టెంట్ రామకృష్ణ, జూనియర్ అసిస్టెంట్ కవిత పాల్గొన్నారు. స్థానిక యువతకు ప్లేస్మెంట్ జ్యోతినగర్(రామగుండం): ఎన్టీపీసీ ప్రభావిత గ్రామాల యువ తకు శిక్షణ కమ్ ప్లేస్మెంట్ అవకాశం కల్పిస్తున్నామని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రో కెమికల్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ(సీఐపీఈటీ) ప్రతినిధి ధర్మరా జు తెలిపారు. రామగుండంలోని ఎన్టీపీసీ తె లంగాణ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చందన్కుమార్ సమంతను సోమవారం ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. మెషీన్ ఆపరేటర్ ప్లాస్టిక్ మోల్డింగ్ ప్రొఫెషనల్ అర్హత కలిగిన స్థానిక అ భ్యర్థులకు వందశాతం ప్లేస్మెంట్ కల్పిస్తామ ని హామీ ఇచ్చారు. ఆసక్తి గలవారు ధర్మరాజు ను 94412 47207 నంబరులో సంప్రదించండి . భద్రత చర్యలు చేపట్టాలి కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): రాత్రనక, పగలన క పొలం పనులకు వెళ్లే రైతులు విద్యుత్ వినియోగం సందర్భంగా భద్రత చర్యలు పాటించి సురక్షితంగా ఉండాలని ట్రాన్స్కో డీఈ సూ చించారు. కూనారం సోమవారం చేపట్టిన పొ లంబాటలో ఆయన విద్యుత్ భద్రతపై రైతు లకు అవగాహన కల్పించారు. వ్యవసాయ మో టార్ల వద్ద స్టార్టర్ల కోసం ఇనుపవాటికి బదులు ప్లాస్టిక్ డబ్బాలే అమర్చుకోవాలని సూచించారు. ఏడీఈ మధుకర్, ఏఈ శ్రీనివాస్, లైన్ ఇన్స్పెక్టర్ దస్తగిరి, రైతులు పాల్గొన్నారు. హక్కులు కల్పించాలి యైటింక్లయిన్కాలనీ(రామగుండం): సింగరేణి లోని కాంట్రాక్ట్ కార్మికులకు చట్టబద్ధత హక్కు లు, కనీస సౌకర్యాలు కల్పించాలని ఐఎఫ్టీ యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.అశోక్ డిమాండ్ చే శారు. ఆర్జీ–2 ఏరియా పరిధి యైటింక్లయిన్కా లనీ, పోతనకాలనీ జోన్లో పనిచేస్తున్న కార్మికులతో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సమాన పనికి సమా న వేతనం చెల్లించకుండా కాంట్రాక్ట్ కార్మికుల ను శ్రమదొపిడీకి గురిచేస్తున్నారని ఆయన ఆరోపించారు. నాయకులు రాజేశం, సులోచన, సుగుణ, మల్లేశ్, శంకర్, నగేశ్, ఎల్లక్క, పద్మ, కమల తదితరులు పాల్గొన్నారు. జాతీయ కరాటే పోటీల్లో సత్తా గోదావరిఖనిటౌ న్: ఇటీవల మే డ్చల్లో నిర్వహించిన నేషనల్ ఓపెన్ టు ఆల్ క రాటే చాంపియన్షిప్ పోటీల్లో స్థానిక ఒకినోవా రెడ్ డ్రాగన్ కరా టే ఇన్స్టిట్యూట్ క్రీడాకారులు ప్రతిభ కనబరిచారు. ఇందులో జి.శాన్వి, ఎస్.సృరాష, ఆర్.రాజా, ఎస్కే అభన్, ఇ.వర్షిత్, టి.రిషిత, మహా లక్ష్మి, కె.క్రాంతి, ఎం.అమృత్సాయి వివిధ విభాగాల్లో గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ సాధించారు. జాతీయ గ్రాండ్ చాంపియన్గా జి.సాన్వి నిలిచింది. వీరిని ఇన్స్ట్రక్టర్ మొండయ్య తదితరులు అభినందించారు. బీజేపీదే బాధ్యతగోదావరిఖని: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల కు 42శాతం రిజర్వేషన్లు అమలు కాకుంటే ఆ పాపం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానిదే అవుతుందని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు వీ రయ్య హెచ్చరించారు. స్థానిక సీఐటీయూ కా ర్యాలయంలో సీపీఎం జిల్లాస్థాయి శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమం సోమవారం జరిగింది. ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం పంపించిన రిజర్వేషన్ బిల్లును మోదీ ప్రభుత్వం, రాష్ట్రపతి ఆమోదించాలన్నారు. వై.యాకయ్య, ముత్యంరావు, మహేశ్వరి, కుమారస్వామి, రామాచారి, బిక్షపతి, గణేశ్, శ్రీనివాస్, రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
భూ భారతి దరఖాస్తులు పరిష్కరిస్తాం
● మంథని ఆర్డీవో సురేశ్ ముత్తారం(మంథని): భూభారతి దరఖాస్తులను ఆగస్టు 15లోగా పరిష్కరిస్తామని మంథని ఆర్డీవో సురేశ్ తెలిపారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయాన్ని ఆర్డీవో సోమవారం తనిఖీ చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. జూన్ మూడో తేదీ నుంచి 20వ తేదీ వరకు వివిధ గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించి భూభారతి దరఖాస్తులు స్వీకరించామని తెలిపారు. తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్, ఆర్ఐలతో మూడు బృందాలుగా విభజించి సదస్సలు నిర్వహించామని అన్నారు. ఈ సందర్భంగా రైతుల నుంచి 1,478 దరఖాస్తులు వచ్చాయని, వాటిని క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరిస్తామని పేర్కొన్నారు. ఇప్పటి వరకు మోకాపైకి వెళ్లి 608 దరఖాస్తులపై విచారణ చేశామని, మోకాపై పంచనామా చేసి ఉన్న రైతులను గుర్తించి, లేనివారికి నోటీసులు అందజేస్తున్నామన్నా రు. భూభారతి దరఖాస్తుదారులు గ్రామాలకు అధికారులు వస్తే సహకరించాలని కోరారు. తహ సీల్దార్ మధుసూదన్రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ షఫీ, ఆర్ఐ రాజబాబు, సిబ్బంది పాల్గొన్నారు. -
పింఛన్ మంజూరు చేయండి
నాకు పింఛన్ మంజూరు చేయాలని అధికారులకు దరఖాస్తు చేసుకున్న. ఆఫీసుల చుట్టూ తిరిగిన. అన్ని అర్హతలు ఉన్న నాకు పింఛన్ మంజూరు చేయడం లేదు. వృద్ధాప్య పింఛన్ ఇప్పించి ఆదుకోవాలి. – బత్తిని లక్ష్మయ్య, చందపల్లి ఏ ఆధారమూ లేదు కొంతకాలం క్రితం మా నాన్న చనిపోయాడు. ఇప్పుడు నాకు ఏ ఆధారం లేదు. కుటుంబ పోషణ కష్టంగా ఉంది. అన్నిఅర్హతలున్న నాకు దివ్యాంగుల పింఛన్ మంజూరు చేయాలని దరఖాస్తు చేసుకున్న. – బరిపట్ల భారతి, గోదావరిఖని -
మీ సేవకుడిని.. మీ సంక్షేమమే ధ్యేయం
పెద్దపల్లిరూరల్: తనను ఆశీర్వదించి ఎమ్మెల్యేగా ఎన్నుకున్న మీ అందరి సంక్షేమమే తన ధ్యేయంగా రోజూ 18 గంటల పాటు పనిచేస్తూ సేవకుడిగా ఉంటున్నానని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. గౌరెడ్డిపేట, ముత్తారంలో సోమ వారం రూ.90 లక్షల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలన లో రేషన్కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల జాడేలేదన్నా రు. సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వం ఏర్పడ్డాక అర్హులందరికీ రేషన్కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు అందిస్తున్నామని అన్నారు. రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారులకే అండగా నిలవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్తోపాటు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఈర్ల స్వరూప, నాయకులు మాదిరెడ్డి నర్సింహారెడ్డి, మల్లయ్య, రాజేందర్, మస్రత్, మహేందర్, ఎడెల్లి శంకర్, నరేశ్, కొ మ్ము శ్రీనివాస్, మల్లేశ్, మోహన్, నల్లగొండ కు మార్, రమేశ్, ఎద్దుకుమార్, శరత్ పాల్గొన్నారు. రేషన్కార్డులు, ఇందిరమ్మ ఇళ్లిచ్చాం వచ్చే ఎన్నికల్లోనూ కాంగ్రెస్కే అండగా ఉండాలి పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు -
అన్నదాతకు కూలీల కొరత
మంథనిరూరల్: పత్తి సాగు చేసే రైతుకు ఏటా పరేషాన్ తప్పడం లేదు. విత్తనాలు నాటిన తర్వాత వర్షాభావ పరిస్థితులు నెలకొనడమో.. అవసరానికి మించి వానలు కురువడమో.. లేదా ఇతర పరిస్థితులో తెలియదు కానీ.. పంటలో ఏపుగా పెరుగుతున్న కలుపు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ఓ వైపు కూలీల కొరత.. మ రోవైపు అవసరాన్ని మించి వానలు పత్తి రైతును ఆగం చేస్తూనే ఉన్నాయి. నాలుగు రోజులపాటు కురిసిన ఎడతెరిపిలేని వానలు కూడా ప్రస్తుతం జిల్లారైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. కూలీల కొరతతో.. జిల్లాలోని పలు ప్రాంతాల్లో ప్రస్తుతం పత్తి పంటలో కలుపు పెరుగుతోంది. దానిని తొలగించడం రైతులకు తలకు మించిన భారమవుతోంది. వర్షాకాలంలో కూలీల కొరత వారిని ఆందోళనలకు గురిచేస్తోంది. ఇదే సీజన్లో ఉపాధిహామీ ద్వారా ప్రభుత్వం చేపట్టే వనమహోత్సవంలో మొక్కలు నాటేందుకు కూలీలు వెళ్తుంటారు. వరినాట్లు సైతం ముమ్మరం అవుతాయి. ఈ క్రమంలో పత్తిలో కలుపు తీసేందుకు కూలీల కొరత ఏర్పడుతూనే ఉంటుంది. ఇతర ప్రాంతాల నుంచి.. స్థానికంగా కూలీలు దొరకక ఇతర ప్రాంతాల నుంచి తీసుకువస్తున్నారు. పత్తి పంటలో కలుపు తీస్తే ఒక్కొక్క కూలీకి రోజూ రూ.300 కూలి చెల్లిస్తారు. స్థానికేతర కూలీలను తీసుకొస్తే రవాణా చార్జీలు భరించాల్సి వస్తోంది. ఇది రైతులకు అదనపు ఆర్థిక భారమే. ముసురువానలతో.. మోతాదులోనే వర్షం కురిస్తేనే పత్తి పంటకు మేలు కలుగుతుంది. అతిగా కురిసినా నష్టమే వస్తుందని అన్నదాతలు అంటున్నారు. నాలుగు రోజులపాటు కురిసిన ముసురుతో జిల్లాలోని అనేక గ్రామాల్లో పత్తి చేనుల్లో వరద నిలిచి చేను జాలువారి పోతోంది. మొక్కలు ఎర్రబారిపోతున్నాయి. రోజుల తరబడి నీళ్లలోనే మొక్క ఉండడం ఇందుకు కారణమని వ్యవసాయాధికారులు అంటున్నారు. కాగా, యాజమాన్య పద్ధతులు పాటిస్తే ముసురు వానల ముప్పు నుంచి పత్తి పంటను కాపాడుకోవచ్చని వ్యవసాయాధికారులు వివరిస్తున్నారు. కలుపుతీత వేళ తీవ్రమైన సమస్య ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి మంథని మండలంలోసాగువివరాలు(ఎకరాల్లో) సాగు అంచనా 8,000 సాగైంది 5,000 ఎర్రబడినది(సుమారు) 50 కూలీలు దొరుకతలేరు పత్తిలో కలుపు ఏరేందు కు కూలీలు దొరుకతలే దు. ఇతర ప్రాంతాల నుంచి తీసుకురావాలంటే రవాణా ఖర్చు మీద పడుతంది. నేను ఐదెకరాలు కౌలుకు తీసుకుని పత్తి వేసిన. కలు పు బాగా పెరిగింది. కలుపు తీసేందుకు కూలీలు దొరకక ఇబ్బంది అయితాంది. – తాళ్లపల్లి సత్యవతి, రైతు, గుంజపడుగు -
రవాణా సౌకర్యం ఉండాలి
సింగరేణిలో కాంట్రాక్టు కార్మికుల సంఖ్య భారీగా పెరిగింది. ఈఎస్ఐలో వారికి పూర్తిస్థాయి వైద్యం లభిస్తుంది. అందుకే రాజీవ్ రహదారి వెంట కార్మికులకు అనుకూలంగా ఉండే ప్రాంతంలో ఈఎస్ఐ ఆస్పత్రి నిర్మించాలి. – తుమ్మల రాజారెడ్డి, అధ్యక్షుడు, సీఐటీయూ సింగరేణి భవనం కేటాయించాలి మూసి వేసిన సింగరేణి ఆస్పత్రి భవనాన్ని ఈఎస్ ఐ ఆస్పత్రి కోసం కేటాయించాలి. ఈ విషయంలో సింగరేణి యాజమాన్యంతో మాట్లాడాం. వంద పడకల ఆస్పత్రి నిర్మాణంతో కాంట్రాక్టు కార్మికులకు ప్రయోజనం చేకూరుతుంది. – వాసిరెడ్డి సీతారామయ్య, అధ్యక్షుడు, ఏఐటీయూసీ ప్రతిపాదిత స్థలంలోనే.. ఈఎస్ఐకి చెందిన 3.30 ఎకరాల్లోనే వంద పడకల ఆస్పత్రి నిర్మించేలా చూస్తాం. దీనిపై ప్రిన్సిపల్ సెక్రటరీ ద్వారా కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నాం. సీఎం రేవంత్రెడ్డి దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లాం. – రాజ్ఠాకూర్, ఎమ్మెల్యే, రామగుండం -
చిగురిస్తున్న ఆశలు
● టెండర్ దశలో ఈఎస్ఐ వంద పడకల ఆస్పత్రి ● రెండేళ్లలో అందుబాటులోకి వచ్చే అవకాశం ● కాంట్రాక్ట్ కార్మికులకు త్వరలోనే మల్టీ స్పెషాలిటీ వైద్యసేవలు ● కేంద్రప్రభుత్వం ప్రకటనతో సర్వత్రా హర్షంగోదావరిఖని: రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో వంద పడకల మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణంపై కేంద్రప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ఆస్పత్రి టెండర్ దశలో ఉందని వెల్లడించింది. రెండేళ్లలో వైద్యసేవలు అందుబాటులోకి వస్తాయని ప్రకటించడంతో ఈ ప్రాంతంలోని సంఘటిత, అసంఘటిత కార్మిక రంగం హర్షం వ్యక్తం చేస్తోంది. ఉమ్మడి జిల్లా కార్మికులకు ప్రయోజనం.. పెద్దపల్లి జిల్లాలో సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సీఎల్, కేశోరాం పరిశ్రమలతోపాటు పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథని మున్సిపాలిటీలు, రామగండం మున్సిపల్ కార్పొరేషన్లోని వివిధ విభాగాల్లో వేలాది మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సుమారు 20 వేల మందికిపైగా కాంట్రాక్టు కార్మికులు ఉన్నారు. ఈఎస్ఐ వందపడకల ఆస్పత్రి నిర్మిస్తే వీరందరికీ సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయి. 2018లోనే ఆమోదం.. రామగుండంలో వంద పడకల ఈఎస్ఐ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి 2018 సెప్టెంబర్ 20న ఈఎస్ఐసీ ఇన్ ప్రిన్సిపల్ ఆమోదం తెలిపిందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. రామగుండం – లింగాపూర్ మధ్యలోని పాత ఈఎస్ఐ ఆస్పత్రి స్థలంలో దీనిని నిర్మించనున్నారు. ప్రాజెక్టు ప్రస్తుతం టెండర్ దశలో ఉందని, ఒప్పందం కుదిరాక నిర్మాణం పూర్తికావడానికి సుమారు రెండేళ్లు పడుతుందని అధికారులు తెలిపారు. అందుబాటులోకి వచ్చే సేవలు ఇవే.. ఈఎస్ఐ ఆస్పత్రి అందుబాటులోకి వస్తే.. అనేకమంది వైద్య నిపుణులు అందుబాటులోకి వస్తారు. జనరల్ మెడిసిన్, సర్జరీ, గైనకాలజీ, ఆర్థోపెడిక్స్, ఐ, డెంటల్, పీడియాట్రిక్స్ వంటి వైద్యసేవలు కార్మికులకు అందనున్నాయి. మాడ్యూలర్ ఆపరేషన్ థియేటర్, సీఎస్ఎస్వో, మెడికల్ గ్యాస్ ౖపైపెన్ వంటి ఆధునిక సదుపాయాలూ అందుబాటులోకి వస్తాయి. ఔట్ పేషంట్, ఇన్ పేషంట్ సేవలు రెండూ అందించనున్నారు. కాగా, వైద్య సిబ్బంది నియామకానికి 2023 డిసెంబర్ 15న జరిగిన 192వ కార్పొరేషన్ సమావేశంలో ఆమోదించిన కొత్త నిబంధనలు అమలులో ఉంటాయని కేంద్రమంత్రిత్వ శాఖ తెలిపింది. రాజీవ్ రహదారి వెంట నిర్మిస్తే.. గోదావరిఖని ప్రాంతంలోని రాజీవ్ రహదారి సమీపంలోనే ఈఎస్ఐ వంద పడకల మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మిస్తే కార్మికులకు అనేక విధాలుగా ప్రయోజనం ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సింగరేణి మూసివేసిన పవర్హౌస్ ప్రాంతం ఇందుకు పూర్తిగా అనుకూలంగా ఉంటుంద ని అంటున్నారు. రామగుండంలో నిర్మిస్తే రోడ్డు, రవాణా తదితర సౌకర్యాలు ఉండవని పేర్కొంటున్నారు. పైగా గోదావరిఖని, ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సీఎల్తో పాటు మంచిర్యాలలోని కాంట్రాక్టు కార్మికులకూ అందుబాటులో ఉంటుందని వారు వివరిస్తున్నారు. -
శిక్షణ పూర్తయ్యాక ఉద్యోగావకాశాలు
రామగిరి(మంథని): మంథని జేఎన్టీయూలో చేప ట్టిన టీసీఎస్ శిక్షణ తరగతులను న్యూ ఢిల్లీకి చెంది న టీసీఎస్ అధిపతి ఇందిరా బసు ఆదివారం పరిశీలించారు. వంద మంది విద్యార్థులకు 20 వారాలపాటు వివిధ అంశాల్లో శిక్షణ ఇచ్చి ఐటీ కంపెనీల్లో ఉద్యోగావకాశాలు కల్పిస్తుంది. శిక్షణ తీరు, సౌకర్యాలపై ఇందిరా బసు ఆరా తీశారు. ప్రతిభ కలిగిన వంద మందిని ఎంపికసి శిక్షణ ఇస్తున్నామని, ప్రతీ శనివారం మౌఖిక తరగతులు నిర్వహిస్తామని ఆమె తెలిపారు. 18 వారాల పాటు లెర్నింగ్ ఇస్తామని, మిగతా రెండు వారాలు పరీక్షలు నిర్వహించి ఉత్తీర్ణులైన వారికి ఐటీ కంపెనీల్లో ఉద్యోగావకాశాలు కల్పి స్తామని తెలిపారు. విద్యార్థుల వద్దకు వెళ్లి మాట్లాడి సహపంక్తి భోజనం చేశారు. వైస్ ప్రిన్సిపాల్ ఎం.ఉదయ్కుమార్, టీసీఎస్ ప్రోగ్రాం మేనేజర్ సుబోత్ చంద్ర, సబ్జెక్టు నిపుణులు సిమాంటిసేన్, ఆపరేషన్ లీడర్ వంశీ, ప్రాజెక్టు మేనేజర్ రఘువీర్, బోధకులు రవితేజ, త్రినాథ్, సీఎస్ఈ అధిపతి తిరుపతి, పరిపాలనాధికారి సుమన్ పాల్గొన్నారు. -
ఏకాగ్రతతో చదివి లక్ష్యం అధిగమించాలి
పెద్దపల్లిరూరల్: విద్యార్థులు ఏకాగ్రతతో చదివి ల క్ష్యం అధిగమించాలని ఎమ్మెల్యే విజయరమణారా వు సూచించారు. స్థానిక అమర్చంద్ కల్యాణ మండపంలో పద్మశాలీ సంఘం జిల్లా అడ్హక్ కమిటీ ఆధ్వర్యంలో టెన్త్లో ఉత్తమ మార్కులు సాధించిన 35 మంది విద్యార్థులను ఆదివారం సత్కరించారు. ఎమ్మెల్యే మాటాడుతూ, పద్మశాలీ సంఘ భవన నిర్మాణానికి స్థలం కేటాయిస్తామన్నారు. ఆర్డీవో గంగయ్య, అడ్హక్ కమిటీ కన్వీనర్ నీలయ్య, నాయకు లు వాసాల రమేశ్, సుధాకర్, రాజేశ్, లక్ష్మీనారా యణ, సదానందం, చందు, బత్తుల రమేశ్, రాయమల్లు పాల్గొన్నారు. కాగా, కలెక్టరేట్ సమీపంలోని ఫిర్దౌస్ మసీదు షాపింగ్ కాంప్లెక్స్ను జిల్లా మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్ రంగారెడ్డి, నాయకులు జావీద్, ఎంఏ మొయిద్, హాదీతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించా రు. ఏఎంసీ చైర్పర్సన్ ఈర్ల స్వరూప, టీఎన్జీవోల సంఘం జిల్లా అధ్యక్షుడు శంకర్ పాల్గొన్నారు. పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం ఓదెల(పెద్దపల్లి): పేదల సంక్షేమమే లక్ష్యంగా ప్ర జాప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే విజయరమ ణారావు అన్నారు. ఇందుర్తి, గుంపుల, గూడెం గ్రా మాల్లో ఇందిరమ్మ ఇళ్లకు ఆయన ముగ్గు పోశారు. అభివృద్ధి పనులకు శంకుస్తాపన చేసి మాట్లాడారు. ఇందిరమ్మ ఇళ్లను పారదర్శకంగా మంజూరు చేశామని తెలిపారు. నాయకులు మూల ప్రేంసాగర్రెడ్డి, సిరిశేటి రాహుల్గౌడ్, శ్రీనివాస్ పాల్గొన్నారు. పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు -
స్కూల్ విద్యార్థులకు వేడి భోజనం వడ్డించాలి
సుల్తానాబాద్రూరల్(పెద్దపల్లి): విద్యార్థులకు వేడి భోజనం వడ్డించాలని గురుకుల విద్యాలయాల జాయింట్ సెక్రటరీ తిరుపతి సూచించారు. భూపతిపూర్ మహాత్మా జ్యోతిబాపూలే బాలుర విద్యాలయాన్ని ఆదివారం అయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. కిచెన్, డైనింగ్ హాల్, టాయిలెట్స్, స్టోర్ రూం, తరగతి గదులు ఆయన పరిశీలించారు. భోజనంపై విద్యార్థులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ప్రతీరోజు విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు. ప్రిన్సిపాల్ రాజేశం, సిబ్బంది ఉన్నారు. -
బొగ్గు రవాణాపై ప్రత్యేక దృష్టి
గోదావరిఖని: సింగరేణి యాజమాన్యం బొగ్గు రవాణాను మరింత వేగవంతం చేయడంపై దృష్టి సారించింది. బొగ్గు ఉత్పత్తి చేయడం ఒక ఎత్తయితే.. వెలికితీసిన బొగ్గును వినియోగదారులకు సకాలంలో అందించడం మరోటాస్క్గా మారుతోంది. రవాణా లక్ష్యం 70 మిలియన్ టన్నులు సింగరేణి యాజమాన్యం ఈఏడాది 70 మిలియన్ టన్నుల బొగ్గును రైల్వే మార్గం ద్వారా రవాణా చే యాలని నిర్ణయించింది. సంస్థ సాధించే ఉత్పత్తిలో అత్యధికశాతం రైల్వే మార్గం ద్వారా వినియోగదారులకు చేరవేస్తోంది. ఈక్రమంలో రైల్వే, సింగరేణి మధ్య అనుసంధానంగా ఉండేందుకు రైల్వేట్రాఫిక్ సర్వీస్(ఐఆర్టీఎస్) అధికారిగా బి.వెంకన్నను కో ల్మూమెంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(ఈడీ)గా నియమించింది. డిప్యూటేషన్పై క్యాబినెట్ అపాయింట్మెంట్ కమిటీ ఈమేరకు ఆమోదించింది. ఆయన ఈ పదవిలో మూడేళ్లపాటు కొనసాగుతారు. విద్యుత్ సంస్థలకు అధికంగా.. దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన విద్యుత్ సంస్థలకు సింగరేణి సంస్థ బొగ్గు అందిస్తోంది. దీనిని రైల్వేరేక్ల ద్వారా వినియోగదారులకు వేగంగానే సరఫరా చేస్తోంది. ఈక్రమంలో సింగరేణిలో కోల్మూమెంట్ ఈడీ పోస్టు కీలకంగా మారింది. ప్రస్తుతం సంస్థ వ్యాప్తంగా రవాణా అవుతున్న బొగ్గును రైల్వే ద్వారా అందించడం, రైల్వేతో అనుసంధానంగా ఉంటూ రైల్వే రేక్లను కేటాయించాల్సి ఉంటోంది. ఈ పనులన్నీ కోల్మూమెంట్ ఈడీ పర్యవేక్షణలోనే కొనసాగుతాయి. ఈఏడాదిలో 98శాతం రవాణా సింగరేణి సంస్థ గనుల్లో తవ్వితీసిన బొగ్గులో 98 శాతం బొగ్గును రైల్వే ద్వారా రవాణా చేసింది. ఇప్పటివరకు 19.23 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయగా, 18.98 మిలియన్ టన్నుల బొగ్గు రవాణా చేసింది. నిర్దేశిత లక్ష్యాల్లో 98శాతంగా నమోదు చేసింది. ఇదే క్రమంలో గతేడాది 19.93 మిలియన్ టన్నులు బొగ్గు రవాణా చేయగా ఈసారి 9.50 లక్షల టన్నులు వెనుకబడింది. గతేడాదికన్నా బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలు పెంచడం, రవాణాలో గతేడాదికన్నా తగ్గడంపై యాజమాన్యం దృష్టి సారించింది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో 72 మిలియన్ టన్నుల బొగ్గు రవాణా లక్ష్యంగా నిర్దేశించగా, 69 మిలియన్ టన్నులు సరఫరా చేసి నిర్దేశిత లక్ష్యాల్లో 95శాతం నమోదు చేసింది. వర్షాకాలం.. గడ్డుపరిస్థితులు.. సింగరేణి సంస్థలో 80శాతం బొగ్గును ఓసీపీల ద్వారానే ఉత్పత్తి చేస్తున్నారు. ప్రస్తుతం వర్షాకాలం నేపథ్యంలో ఓపెన్కాస్ట్ ప్రాజెక్టు(ఓసీపీ)ల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయే అవకాశం ఉంది. అంతేకాకుండా లక్ష్యాలకు అనుగుణంగా బొగ్గు రవాణా చేయడం కూడా కష్టంగా మారుతుంది. ఈక్రమంలో వినియోగదారులకు నాణ్యమైన బొగ్గును సకాలంలో అందించడమే లక్ష్యంగా యాజమాన్యం ముందుకు సాగడం కొంత కష్టంగానే ఉంటుందని విశ్లేషిస్తున్నారు. ఈ సమస్య వర్షాకాలం ముగిసేదాకా.. అంటే.. సుమారు మూడు నెలలపాటు ఉంటుందని భావిస్తున్నారు. సింగరేణిలో 2025–26 ఆర్థిక సంవత్సరంలో బొగ్గు రవాణా(మిలియన్ టన్నుల్లో) లక్ష్యం మేరకు తరలింపు జోరుగా కురుస్తున్న వర్షాలు ఓసీపీల్లో ఉత్పత్తి తగ్గే అవకాశం మూడు నెలలపాటు ఇదే పరిస్థితి లక్ష్యం రవాణా శాతం 19.23 18.98 98 -
భూమిపూజకు వేళాయె
● నేటినుంచి ఇందిరమ్మ ఇళ్లకు ముగ్గు ● పనులు చేపట్టేందుకు సన్నద్ధమైన లబ్ధిదారులు ● మంచిముహూర్తాలు ఉండడమే కారణమంటున్న పేదలుసుల్తానాబాద్(పెద్దపల్లి): జిల్లాలో ఇందిరమ్మ ఇళ్లకు సోమవారం నుంచి ముగ్గుపోసే కార్యక్రమాలు చేపట్టేందుకు లబ్ధిదారులు సిద్ధమయ్యారు. మొన్నటివరకు ఆషాడ మాసం కొనసాగడంతో మంచిముహూర్తాలు లేవని కొందరు ఇందిరమ్మ ఇళ్ల పనులు ప్రారంభించలేదు. అయితే, సోమవారం నుంచి అన్నీమంచి రోజులేనని వేదపండితులు సూచించడంతో ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్ అందుకున్న లబ్ధిదారులు ముగ్గు పోసేందుకు సిద్ధమవుతున్నారు. నియోజవర్గానికి 3,500 ఇళ్లు.. జిల్లాలో మూడు నియోజకవర్గాలు ఉండగా, ఒక్కో నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇందిరమ్మ ఇళ్లు కేటాయించారు. లబ్ధిదారులను ఎంపికచేసిన అధికారులు.. ఇటీవల వారికి ప్రొసీడింగ్స్ కూడా అందజేశారు. ఇంటి నిర్మాణ పత్రం అందుకున్న లబ్ధిదారులు 45 రోజుల్లో పనులు ప్రారంభించాల్సి ఉంటుంది. మూడు విడతల్లో డబ్బులు జమ ఇందిరమ్మ ఇంటి నిర్మాణ విస్తీర్ణం 400 చదరపు అడుగుల నుంచి 600 చదరపు అడుగుల లోపే ఉండాలనే నిబంధన ఉంది. ఇంటి నిర్మాణం తొలిదశ నుంచి చివరివరకూ ప్రతీస్థాయి వివరాలను ప్రత్యేక యాప్లో నమోదు చేస్తామని హౌసింగ్ పీడీ రాజేశ్వర్ తెలిపారు. తొలివిడత బేస్మెంట్ స్థాయిలో రూ.లక్ష, రెండోదశ పిల్లర్ స్థా యిలో రూ.లక్ష, మూడోదశలో బిల్డింగ్ స్లాబ్ స్థా యిలో రూ.2 లక్షలు. నాలుగో విడతలో భవన ని ర్మాణం పూర్తయ్యాక.. చివరగా రూ.లక్షను లబ్ధిదారుల వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లో జమచేస్తారు. -
స్టేటస్ తెలుసుకోవడమిలా..
జ్యోతినగర్(రామగుండం): కొత్త రేషన్కార్డుల దరఖాస్తుదారులు తమకార్డు ఆమోదం పొందిన విషయం తెలుసుకోవడం ఇక సులువే. తెల్లరేషన్ కార్డు మంజూరు అయిందో లేదో తెలుసుకునేందుకు వెబ్సైట్ https://epds. telangana.gov.in/FoodSecurityAct/ని క్లిక్ చేయండి. ఆ తర్వాత తొలిఆప్షన్ FSC Sear chపై క్లిక్ చేయండి. స్క్రీన్పై కనిపించే రేషన్ కార్డు సర్చ్ పైక్లిక్ చేయాలి. ఆ తర్వాత FSC Application Search పై క్లిక్ చేయాలి. మీసేవ దరఖాస్తు నంబర్, జిల్లా పేరు నమోదు చేయగానే మీ రేషన్ కార్డు స్టేటస్ గురించిన పూర్తి సమాచారం తెలుస్తుంది. పొలాలకు బాటలు వేయాలి కమాన్పూర్(మంథని): కమాన్పూర్ పెద్దచెరు వు, జూలపల్లి, ముల్కలపల్లి గ్రామాల్లోని పంట పొలాలకు రోడ్లు నిర్మించాలని పీఏసీఎస్ చై ర్మన్ ఇనగంటి భాస్కర్రావు కోరారు. మంత్రి శ్రీధర్బాబును హైదరాబాద్లో ఆయన కలిసి వినతిపత్రం అందజేశారు. రోడ్ల నిర్మాణానికి నిధులు కేటాయించాలని కోరారు. ఆయన వెంట పలువురు కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. సర్వేయర్ పరీక్ష ప్రశాంతం రామగిరి(మంథని): సెంటినరీకాలనీలోని మంథని జేఎన్టీయూలో ఆదివారం లైసెన్స్డ్ సర్వేయర్ పరీక్ష నిర్వహించారు. రెండు నెలల పా టు శిక్షణ పొందిన 112 మంది అభ్యర్థుల్లో 89 మంది పరీక్షకు హాజరయ్యారు. అదనపు కలెక్టర్ వేణు పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఎస్సై శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు చే పట్టారు. పరీక్షల నోడల్ అధికారిగా సర్వే అసి స్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసులు, డిప్యూటి నోడల్ అధికారిగా రామగిరి తహసీల్దార్ సుమన్, పరిశీలకులుగా పెద్దపల్లి జిల్లా ట్రైజరీ అధికారి కొండ కరుణాకర్, ఇన్చార్జి చీఫ్ సూపరింటెండెంట్గా బాలనాగమణి వ్యవహరించారు. బొగ్గు గనుల పరిరక్షణకు పోరుయైటింక్లయిన్కాలనీ(రామగుండం): బొగ్గు ప రిశ్రమ, కార్మిక హక్కుల పరిరక్షణ లక్ష్యంగా ఉ ద్యమాలు చేపడతామని, సింగరేణి కార్మికులు ఇందులో భాగస్వాములు కావాలని బీఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య కోరారు. స్థానిక బీఎంఎస్ కార్యాలయంలో ఆదివారం బొగ్గు గనుల పరిరక్షణ ప్రచార వాల్పోస్టర్ను యూనియన్ ప్రధాన కార్యదర్శి సారంగపాణితో కలిసి ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. కాంట్రాక్ట్ హక్కుల పరిరక్షణ కోసం సెప్టంబర్ వరకు చేపట్టే ఆందోళనలను విజయవంతం చేయాలని ఆయన కోరారు. కార్యక్ర మంలో నాయకులు వడ్డేపల్లి కుమారస్వామి, వేణుగోపాల్రావు, రవీందర్, గట్టు శ్రీనివాస్, రవి, సత్తయ్య, మల్లారెడ్డి, కోటయ్య, లింగం నాయక్ తదితరులు పాల్గొన్నారు. నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రంలోని రంగంపల్లి, ఇండేన్ గ్యాస్ గోదాం, బీసీ హాస్టల్ ఏరియాలో సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని ఏఈ శ్రీనివాస్ తెలిపారు. విద్యుత్ తీగలు, స్తంభా లు, ఇతరత్రా మరమ్మతుల దృష్ట్యా విద్యుత్ స రఫరా నిలిపివేస్తున్నామని పేర్కొన్నారు. విని యోగదారులు సహకరించాలని కోరారు. జోరుగా వరినాట్లు పెద్దపల్లిరూరల్: జిల్లాలో నాలుగు రోజుల పాటు ఎడతెరిపి లేకుండా వానలు కురిశాయి. ఆదివారం కాస్త తెరిపించ్చింది. దీంతో వరినారు నాటేందుకు ఎదురు చూస్తున్న రైతులు వరినాట్లు వేయడంలో నిమగ్నమయ్యారు. అంతేకాదు.. ఒకవేళ వర్షం కురిసినా కూలీలు తడవకుండా రెయిన్కోట్లు ధరించి పొలం మడుల్లో నాట్లు వేస్తూ ఇలా కనిపించారు. -
రాముడు నడయాడిన రామగిరి ఖిల్లా
రామగిరి(మంథని): రాముడు నడయాడిన నేలగా రామగిరి ఖిల్లా పర్యాటకులను ఆకర్షిస్తోంది. ఒకప్పుడు నక్సలైట్లకు ఆవాసంగా ఉండేది. అలనాటి చారిత్రక కట్టడాలు, ఆయుర్వేద వనమూలికల భాండాగారంగా ప్రసిద్ధి చెందింది. విభిన్న జాతుల వృక్షాలతో.. ప్రకృతి ప్రేమికుల్ని ఆకట్టుకుంటోంది. అద్భుత కళాసంపదకు నిలయమైన రామగిరి ఖిల్లా.. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం బేగంపేట గ్రామం నుంచి కల్వచర్ల గ్రామం వరకు విస్తరించి ఉంది. శ్రీరాముడు వనవాస సమయంలో ఇక్కడికి వచ్చి తపస్సు చేసి శివలింగం ప్రతిష్టించినట్లు కథనం ప్రచారంలో ఉంది. వనవాసం సమయంలో కొద్ది రోజులు కుటీరం ఏర్పరచుకొని సీతాలక్ష్మణులతో ఉన్నారని, ఖిల్లాపై సీతారామలక్ష్మణులు సంచరించినట్లు కొన్ని ఆనవాళ్లు ఇప్పటికీ దర్శనమిస్తాయి. ఖిల్లా బండరాతిపై శ్రీరాముని పాదాలు, సీతాదేవి స్నానమాచరించిన కొలనుతో పాటు ఆంజనేయుని విగ్రహాలు ఉన్నాయి. ఏటా శ్రావణమాసంలో కోటపై సీతాసమేత శ్రీరాముడు, హనుమాన్ విగ్రహల ఊరేగింపు నిర్వహించి పూజలు చేస్తారు. చూడాల్సిన ప్రదేశాలు ఖిల్లాలో ఏడు కోట ప్రవేశ దర్వాజాలు, 15 ఎత్తయిన శత్రు సైన్యాన్ని పసిగట్టే బురుజులున్నాయి. మొదటి దర్వాజాకి కుడి వైపు వెళ్తే జలపాతం, రెండో దర్వాజా ప్రవేశంలో కుడివైపు గోడలపైన క్రీ.శ.1556 కాలం నాటి పది పంక్తులున్న తెలుగు శాసనం కనిపిస్తాయి. దర్వాజా ప్రవేశించిన తర్వాత ఎడమవైపు అద్భుతమైన పచ్చని కోట, 25 మీటర్ల పొడవున్న అతిపెద్ద ఫిరంగి, నాలుగో దర్వాజాపై అతిపెద్ద ఫిరంగితో పాటు ఏనుగుతో పోరాడుతున్న యోధుడి శిల్పం, రెండు తలల గరుత్మంతుడి శిల్పం ఉంటాయి. పదిహేను మీటర్ల పొడవున్న పిల్లల ఫిరంగి ఉంటుంది. ఆరో దర్వాజా నుంచి 21 మెట్లు ఎక్కితే కోటపై నుంచి మానేరువాగు వయ్యారాలతో పాటు ఖిల్లాపై వివిధ చారిత్రక స్థలాలైన సీతమ్మ స్నానమాడిన కొలను, పసరు బావులు, పసుపు, కుంకుమ భరణి, సవతుల బావులు, మాధవీ మండపం, రాముడు ప్రతిష్టించిన శివలింగాలు, హనుమంతుడి విగ్రహం, చరశాలలు, గజశాలలు, అశ్వశాలలు, రాజమందిరానికి రాతి నీటి గొట్టాలు, చివరగా సీతారాముల వారిని దర్శించుకోవచ్చు. శ్రావణమాసంలో సందడి ప్రతి శ్రావణమాసంలో రామగిరి ఖిల్లాపై పర్యాటకుల సందడి ఉంటుంది. ఈ దుర్గంపై నుంచి ప్రకృతి అందచందాలను తిలకిస్తూ పర్యాటకులు మైమరిచిపోతారు. ఆయుర్వేద వైద్యులు ఈ ఖిల్లాపై వనమూలికలను సేకరిస్తారు. పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దుతామని గతంలో ప్రభుత్వం రూ.5 కోట్లు కేటాయించింది. ప్రాచీన కళలకు నిలయమైన రామగిరిఖిల్లా అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వం మరిన్ని నిధులు కేటాయించి పనులు నిర్వహిస్తే పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి చెందుతుంది. ఖిల్లాకు వెళ్లే దారి పెద్దపల్లి జిల్లా కేంద్రం నుంచి మంథని ప్రధాన రహదారిలో సుమారు 20 కిలోమీటర్లు ప్రయాణించి బేగంపేట ఎక్స్రోడ్ (నాగెపల్లి) వద్ద దిగాలి. ఆటోద్వారా బేగంపేట గ్రామానికి చేరుకుని సుమారు 3 కిలోమీటర్లు కాలినడకన ఖిల్లాకు చేరుకోవచ్చు. ఖిల్లాకు ఉదయం 8 గంటల వరకు వెళ్తే.. సాయంత్రం 5 గంటల వరకు అన్ని ప్రదేశాలు చూడవచ్చు. -
● జిల్లావ్యాప్తంగా విస్తారంగా వానలు ● ఊపందుకున్న సాగు పనులు ● ఇంకా అదను దాటలేదు ● ఆగస్టు వరకూ వరినాట్లకు అవకాశం ● జిల్లా వ్యవసాయ అధికారుల వెల్లడి
సాక్షి, పెద్దపల్లి: అదనుదాటుతున్నా సమృద్ధి వర్షా లు కురవక కలవరపడిన అన్నదాతలు.. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా కురుస్తున్న మోస్తరు వానలతో ఊరట చెందుతున్నారు. కుంటలు, చెరువులు, ప్రాజక్టుల్లోకి వర్షపునీరు వచ్చి చేరుతుండటంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. విత్తనాలు నాటి ఎదురుచూస్తున్న రైతుల కళ్లల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. వ్యవసాయ సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి ఆశించిన వానలు కురవక అన్నదాతలు మొన్నటిదాకా నిరాశలో ఉన్నారు. నేలలో పెట్టిన పత్తి విత్తనాలు మొలకెత్తక భయంగా ఉన్న రైతులు.. నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఊపిరిపీల్చుకుంటున్నారు. మరో వారంపాటు ఇదేరీతిలో వానలు కొడితే వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతాయని రైతులు చెబుతున్నారు. పలు మండలాల్లో ఇంకా లోటు వర్షాపాతమే జిల్లాలో 387.6 మి.మీ. వర్షపాతం కురువాల్సి ఉండగా, ఇప్పటివరకు 287.5 మి.మీ. వర్షపాతమే కురిసింది. జిల్లాలో 13 మండలాలు ఉండగా.. అందులోని కొన్ని మండలాల్లో ఇంకా లోటు వర్షపాతమే నమోదైంది. కమాన్పూర్, సుల్తానాబాద్, ఓదె ల, కాల్వశ్రీరాంపూర్, ముత్తారం మండలాల్లో సా ధారణ వర్షపాతం కురవగా, మిగిలిన మండలాలు లోటు వర్షపాతం నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. రామగిరి, మంథని, రామగుండం, పాలకుర్తి మండలాల్లో వర్షపాతం లోటు తీవ్రంగా ఉంది. జిల్లాలో 1,017 చెరువులు ఉండగా ఇప్పటి వరకు 6 చెరువులే మత్తడి పోస్తున్నాయి. మరో 42 చెరువులు మత్తడి పోసేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఎల్లంపల్లి ప్రాజెక్టు వెలవెల.. జిల్లాలోని ఎల్లంపల్లి ప్రాజెక్టకు ఇంకా ఆశించిన స్థాయిలో ఇన్ఫ్లో రావడంలేదు. ఎగువన ఉన్న ప్రాజెక్టులు నిండక, మహారాష్ట్రలో భారీ వర్షాలు లేక నాలుగు రోజుల నుంచి కురుస్తున్న మోస్తరు వర్షాలతో కొంత వరద మాత్రమే వస్తోంది. 3,651 క్యూసెక్కుల ప్రవాహం ఉండడంతో 20.17టీఎంసీల నిల్వసామర్థ్యం గల ఎల్లంపల్లికి ఇప్పటివరకు 9.32 టీఎంసీల నీరు మాత్రమే నీరు నిల్వ ఉంది. గతేడాది 13.53 టీఎంసీలుండగా, ఈయేడాది లోటు వర్షపాతంతో గతేడాదిలో పోల్చితే 4.21 టీఎంసీల నీరు తక్కువగా నమోదైంది. పెద్దపల్లి మండలం కొత్తపల్లి శివారులోని చెరువు కింద పొలాల్లో వరినాట్లు వేస్తున్న కూలీలు, రైతులుజిల్లాలో వర్షాపాతం(మి.మీ.లలో) ధర్మారం 18 పాలకుర్తి 9.8 అంతర్గాం 0.6 రామగిరి 23.7 కమాన్పూర్ 19.9 పెద్దపల్లి 10.8 జూలపల్లి 16.3 ఎలిగేడు 12.2 సుల్తానాబాద్ 11.6 ఒదెల 12.7 ముత్తారం 25.9 మంథని 22.1 వానాకాలం సాగు వివరాలు(ఎకరాల్లో) సాగు అంచనా 2,76,076 ఇప్పటివరకు సాగైన వరి 93,380 మొక్కజొన్న 241 పత్తి 47,555 ఇతర 73 -
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోండి
కోల్సిటీ(రామగుండం): పరిసరాల్లో నిల్వ ఉన్న నీటిని తొలగించి పరిశుభ్రంగా ఉంచుకోవాలని నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ వెంకటస్వామి సూచించారు. 100రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా శుక్రవారం నగరంలోని పలు డివిజన్లలో డ్రై డే – ఫ్రైడే కార్యక్రమం నిర్వహించారు. గోళాల్లు, పాత టైర్లు, కొబ్బరి చిప్పల్లో నిల్వ ఉన్న నీటిని తొలగించారు. స్థానిక పల్లెదవాఖానను సందర్శించి జ్వర పీడితుల వివరాలు సేకరించారు. పలు డివిజన్లలో పిచ్చిచెట్లు, పొదలు తొలగించారు. నిల్వ ఉన్న నీటిలో ఆయిల్బాల్స్ వేయడంతోపాటు డివిజన్లలో ఫాగింగ్ చేశారు. గోదావరిఖని బస్టాండ్ ఏరియా పరిసరాలు పరిశుభ్రం చేశారు. శానిటరీ ఇన్స్పెక్టర్లు నాగభూషణం, కిరణ్, మెప్మా సీవో ఊర్మిళ, ఎన్విరాన్మెంట్ ఇంజినీర్ మధుకర్, ఎంఐఎస్ ఆపరేటర్ శ్రీకాంత్, వార్డు అధికారులు, ఆర్పీలు, స్వశక్తి మహిళలు తదితరులు పాల్గొన్నారు. -
జూనియర్ మైనింగ్ ఇంజినీర్ల నిరీక్షణకు తెర
● తొలగించిన 43 మంది జేఎంఈటీలకు మళ్లీ ఉద్యోగాలు ● యాజమాన్యం గ్రీన్సిగ్నల్తో కుదిరిన అంగీకారం ● నియామక లేఖ అందించిన డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ గోదావరిఖని: ఎన్నాళ్లుగానో నిరీక్షిస్తున్న డిస్మిస్డ్ జే ఎంఈటీలకు శుభవార్త అందింది. గుర్తింపు కార్మిక సంఘం, సింగరేణి యాజమాన్యం అంగీకారం మే రకు విధుల నుంచి తొలగించిన 43 మందికి జూనియర్ మైనింగ్ ఇంజినీర్ ట్రైనీ(జేఎంఈటీ)ల పునర్నియామకానికి గ్రీన్సిగ్నల్ లభించింది. సంస్థలో జూనియర్ మైనింగ్ ఇంజినీర్ ట్రైనీలుగా చేరి వివిధ కారణాలతో డిస్మిస్ అయ్యారు. వీరి అభ్యర్థన మే రకు హైదరాబాద్లోని డిప్యూటీ చీఫ్ లేబర్ కమిష నర్ కార్యాలయంలో సింగరేణి యాజమాన్యం, గు ర్తింపు కార్మిక సంఘం ఏఐటీయూసీ మధ్య ఈనెల 24న అంగీకారం కుదిరింది. జేఎంఈటీలు సరైన విధంగా విధులకు హాజరు కాకపోవడం, విధుల్లో చేరిన తర్వాత ఓవర్మెన్ సర్టిఫికెట్, గ్యాస్ సర్టిఫికె ట్ సకాలంలో సమర్పించకపోవడంతో యాజమా న్యం వారిని విధుల నుంచి తొలగించింది. వీరి విషయంలో మానవతా దృక్పథంతో ఆలోచించి తిరిగి ఉద్యోగావకాశాలు కల్పించాలని గుర్తింపు కార్మిక సంఘం కోరింది. ఈమేరకు గతేడాది నవంబర్లో జరిగిన డైరెక్టర్(పా) స్థాయి నిర్మాణాత్మక సమావేశం, ఆ తర్వాత.. ఈఏడాది మార్చిలో జ రిగిన సీఎండీ స్థాయి స్ట్రక్చరల్ సమావేశంలో అజెండాగా చేర్చి చర్చించారు. దీనిపై గత నెల27న డైరె క్టర్(పా)స్థాయిలో జరిగిన 51వ నిర్మాణాత్మక సమావేశంలోనూ చర్చించి ఒక ద్వైపాక్షిక అంగీకారానికి వచ్చారు. ఆ తర్వాత యూనియన్ నాయకులు, డి ప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ సమక్షంలో మరోసారి చర్చల అనంతరం త్రైపాక్షిక ఒప్పందానికి అంగీకరించారు. ఈ అంగీకార కార్యక్రమంలో డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ (సెంట్రల్) డి.శ్రీనివాసులు, సింగరేణి యాజమాన్యం తరఫున సీపీపీ జీఎం మ నోహర్, జీఎం(పర్సనల్) కవితానాయుడు, హెచ్ వోడీ(ఎంఎస్) రవి బొజ్జా, గుర్తింపు కార్మిక సంఘం తరఫున యూనియన్ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కె.రాజ్కుమార్, నాయకులు కె.వీరభద్రయ్య, ఎం.సమ్మయ్య, మడ్డి ఎల్లయ్య, వైవీ రావు పాల్గొన్నారు. సర్టిఫికెట్లు సమర్పించాల్సిందే.. ఉద్యోగం నుంచి తొలగింపుకు గురై పునర్నియామకం అయిన 43 మంది జూనియర్ మైనింగ్ ఇంజినీరింగ్ ట్రైనీలను తాజా నియామకం చేసినట్లు గుర్తించనున్నారు. సంస్థ ఏర్పాటు చేసే హైపవర్ కమిటీ ముందు తమ సర్వీసు విషయాలు, ఓవర్మెన్ సర్టిఫికెట్, గ్యాస్ టెస్టింగ్ ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికెట్లు సమర్పించాలి. కమిటీ సూచన మేరకు మెడికల్ ఫిట్నెస్ పరీక్షలకు హాజరు కావాల్సి ఉంటుంది. వాటి ఆధారంగా ప్రాథమిక అపాయింట్మెంట్ ఆర్డర్లు జారీ చేయనున్నారు. ఉద్యోగంలో తొలిఏడాదిలో తప్పనిసరిగా 190 మస్టర్లు తగ్గకుండా విధులు నిర్వహించాల్సి ఉంటుంది. -
ప్రణాళిక ప్రకారం డిజిటల్ క్లాస్లు
జూలపల్లి(పెద్దపల్లి): పదోతరగతి విద్యార్థుల కు డిజిటల్ క్లాసులను ప్రణాళిక ప్రకారం నిర్వహించాలని జిల్లా విధ్యాధికారి మాధవి సూచించారు. తెలుకుంట ప్రభుత్వ ఉన్నత పాఠశాలను శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు క్రీడాదుస్తులు అందజేశారు. ప్రధానోపాధ్యాయుడు రవీందర్ ఉన్నారు. ఏఎంసీ పాలకవర్గాలు ఖరారు మంథని/కమాన్పూ ర్: మంథ ని డివిజన్ లోని మంథని, క మాన్పూ ర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ(ఏఎంసీ)లకు ప్రభుత్వం పాలకవర్గాలను నియమించింది. మంథని ఏఎంసీ చైర్మన్గా వెంకటాపూర్ గ్రా మానికి చెందిన మాజీ ఎంపీటీసీ, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కుడుదుల వెంకన్న, కమాన్పూర్ ఏఎంసీ చైర్మన్గా వైనాల రాజుకు చోటు కల్పించారు. రాజు కమాన్పూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. కాగా మంథని మండలం కన్నాల గ్రామానికి చెందిన ము స్కుల ప్రశాంత్రెడ్డికి వైస్ చైర్మన్గా, కమాన్పూ ర్ ఏఎంసీలో ముత్తారం మండలానికి చెందిన మద్దెల రాజయ్యను వైస్చైర్మన్గా నియమించారు. ఒక్కో మార్కెట్ కమిటీకి 16 మంది చొప్పున సభ్యులను నియమించారు. కాగా రెండు మార్కెట్ కమిటీలు జనరల్ రిజర్వు ఉండగా బీసీలకు అవకాశం కల్పించారు. నూతన కార్యవర్గం సుల్తానాబాద్(పెద్దపల్లి): ఎస్సీ, ఎస్టీ ఎలక్ట్రిసిటీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా భోగ శ్రీ నివాస్ను ఎన్నుకున్నారని టీఎస్ ఎన్పీడీసీఎల్ అధ్యక్షుడు ఆనంద్, ప్రధాన కార్యదర్శి కుమా రస్వామి తెలిపారు. మండల కేంద్రంలో శుక్ర వారం ఎన్నికలు నిర్వహించారన్నారు. ప్రధాన కార్యదర్శిగా గసిగంటి ఆనంద్, వర్కింగ్ ప్రెసిడెంట్గా భూక్య గ్యాంగ్య నాయక్, కోశాధికారిగా పి.రవీందర్, డివిజన్ అధ్యక్షుడిగా కనుమల్ల రాజ్కుమార్, ప్రధాన కార్యదర్శిగా సిపల్లి నర్సయ్య, ఉపాధ్యక్షుడిగా కాంపల్లి సుధాకర్, వర్కింగ్ ప్రెసిడెంట్గా నేరుపట్ల నర్సింగంను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని పేర్కొన్నారు. ‘నానో’ యూరియాతో మేలు పెద్దపల్లిరూరల్: నానో యూరియా ఎంతోమే లు చేస్తుందని జిల్లా వ్యవసాయాధికారి శ్రీనివా స్ అన్నారు. రాఘవాపూర్ రైతువేదికలో శుక్రవారం ఇఫ్కో ఏర్పాటు చేసిన సమావేశంలో ఏ డీఏ శ్రీ నాథ్, ఏవో అలివేణితో కలిసి పాల్గొన్నా రు. 500 మి.లీ. నానో యూరియా 45 కిలోల యూరియాకు సమానమన్నారు. ధర కూడా త క్కువగానే ఉంటుందని తెలిపారు. పెద్దపల్లి, ఓదెల, కాల్వశ్రీరాంపూర్, జూలపల్లి, ఎలిగేడు మండలాల వ్యవసాయాధికారులు ఉన్నారు. ప్రియాంకను కలిసిన నేతలు ధర్మారం(ధర్మపురి): కరెన్సీపై అంబేడ్కర్ ఫొ టో ముద్రించేలా చూడాలని అంబేడ్కర్ ఫొటో సాధన సమితి నాయకులు కోరారు. ఈమేరకు సాధన సమితి జాతీయ ఉపాధ్యక్షుడు బొల్లి ఆ ధ్వర్యంలో పార్లమెంట్ భవనం ఎదుట ప్రి యాంకను శుక్రవారం నాయకులు కలిశారు. పింఛన్ పెంపుకోసం పోరు పెద్దపల్లిరూరల్/గోదావరిఖనిటౌన్: అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ దివ్యాంగులకు ఇచ్చిన హామీలను విస్మరిస్తోందని ఎ మ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ఆరోపించారు. పెద్దపల్లి దివ్యాంగుల హక్కుల పోరాట సమితి, గోదావరిఖనిలో సింగరేణి మాదిగ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఏ ర్పాటు చేసిన కార్యక్రమాల్లో ఆయన మాట్లాడా రు. దివ్యాంగులను కాంగ్రెస్ ప్రభుత్వం మో సం చేస్తూనే ఉందని ధ్వజమెత్తారు. దివ్యాంగులకు చెల్లించాల్సిన సొమ్మును రైతుభరోసాకు మళ్లించడం అన్యాయమని దుయ్యబట్టారు. దళిత, బీసీ, మైనారిటీల హక్కుల కోసం ప ఉంటానని అభయం ఇచ్చారు. వెంకటేశ్నేత, కాసిపేట లింగయ్య పాల్గొన్నారు. -
ఇబ్బందుల్లేకుండా ఇళ్ల నిర్మాణం
● ‘ఇందిరమ్మ’ పనుల్లో వేగం ● లబ్ధిదారులకు ప్రోత్సాహం ● నిర్మాణ దశను బట్టి చెల్లింపులు ● వెసులుబాటు కోసమే విస్తీర్ణం నిబంధన ● ‘సాక్షి’తో హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ రాజేశ్వర్ ‘కమిటీ సభ్యులు రూపొందించిన జాబితాను కలెక్టర్ ఆధ్వర్యంలో ఇన్చార్జి మంత్రి ఆమోదంతోనే ఇందిరమ్మ ఇళ్లు మంజూరవుతున్నా యి. జిల్లాకు 9,427 ఇందిరమ్మ ఇళ్లు మంజూరుకాగా, అందులో 6,018 మందికి మంజూరు ఉత్తర్వులు అందజేశారు. ఇందులో 3,747 ఇళ్ల నిర్మాణం వివిధ దశల్లో ఉంది. ఇందిరమ్మ పథకం ద్వారా ఇల్లు కట్టుకునే పేదలు వేగంగా నిర్మాణాలు పూర్తి చేసుకునేలా కలెక్టర్ కోయ శ్రీహర్ష, అధికారులు చొరవ తీసుకుంటున్నారు. అందుకోసమే ఇటుక(ఒక్కోదాని ధర రూ.5.50), ఇసుక ధరలు తగ్గించారు. మేస్త్రీ, సెంట్రింగ్ చార్జీలు నియంత్రణలో ఉండేలా చర్యలు చేపట్టారు. నిర్మాణంలో లబ్ధిదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు పరిష్కరించేందుకు ఆర్డీవో, హౌసింగ్ పీడీలు ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనిద్వారా బిల్లుల చెల్లింపులు, ఇతర సందేహాలు నివృత్తి చేస్తున్నాం.. పనుల్లో వేగం పెంచుతున్నాం’ అని హౌసింగ్ ప్రాజెక్టు డైరెక్టర్ రాజేశ్వర్ తెలిపారు. శుక్రవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. ఆ వివరాలు.. – పెద్దపల్లిరూరల్ -
మా పోరాట ఫలితమే..
సుమారు ఏడేళ్లుగా జేఎంఈటీలు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. మేం గుర్తింపు యూనియన్గా ఎన్నికై న తర్వాత యాజమాన్యంతో పట్టుపట్టడంతో మార్గం సుగమమమైంది. వచ్చిన ఉద్యోగాలు కాపాడుకోవాల్సిన బాధ్యత జేఎంఈటీలపైనే ఉంది. – వాసిరెడ్డి సీతారామయ్య, అధ్యక్షుడు, ఏఐటీయూసీ సంతోషంగా ఉంది 2013లో జేఎంఈటీగా జాయిన్ అయి 2023 వరకు కాసిపేట–2 గనిలో పనిచేశా. తిర్యాణి మండలం గంభీరావుపేట స్వగ్రామం. వృత్తి లో అనుభవం ఉన్నా సర్టిఫికెట్లు సమర్పించడంలో ఆలస్యమై ఉద్యోగం కోల్పోయా. ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటా. – దానెపల్లి నిశాంత్, తిర్యాణి, మందమర్రి సర్టిఫికెట్లు లేక పోయింది మైనింగ్ డిప్లొమాచేసి 2016లో జేఎంఈటీగా ఉద్యోగం సాధించా. ఐదేళ్లపాటు ఆర్కే న్యూటెక్లో యాక్టింగ్ ఓవర్మెన్గా పనిచేశా. సకాలంలో సర్టిఫికెట్లు అందించక ఉద్యోగం పోయింది. ఐదేళ్లుగా ఉద్యోగం లేదు. మళ్లీ ఉద్యోగం రావడం ఆనందంగా ఉంది.– మాదరబోయిన దీక్షిత్, జేఎంఈటీ, గోదావరిఖని -
నేటి నుంచి ఎల్హెచ్బీ బోగీలు
● తిరుపతి– కరీంనగర్ ఎక్స్ప్రెస్కు మారనున్న బోగీలు ● ఒకప్పుడు నీలి, ప్రస్తుతం పసుపు, రేపటి నుంచి ఎరుపు బోగీలు ● ప్రమాద తీవ్రత తగ్గించేందుకు ఈ బోగీలుసాక్షి ప్రతినిధి, కరీంనగర్: నేటి నుంచి తిరుపతి– కరీంనగర్ బైవీక్లీ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అత్యాధునిక ఎల్హెచ్బీ బోగీలతో నడవనుంది. శనివారం రాత్రి తిరుపతిలో ఎగువ మార్గంలో ఈ రైలు 12761 ఎల్హెచ్బీ బోగీలతో మొదటిసారిగా కరీంనగర్ వైపు పరుగులు తీయనుంది. ఆదివారం రాత్రి ఇదే రైలు కరీంనగర్ నుంచి తిరుపతికి 12762 ఇదే బోగీలతో దిగువమార్గంలో నడవనుంది. ఈ అధునాతన ఎల్హెచ్బీ రైలు బోగీల సంఖ్య మొత్తం 19. ఇందులో ఆరు స్లీపర్ బోగీలు, ఐదు తృతీయ శ్రేణి శీతల బోగీలు, రెండు ద్వితీయ శ్రేణి శీతల బోగీలు, నాలుగు సాధారణ (జనరల్ ) బోగీలు, ఒక వికలాంగుల బోగీలతో నడవనుంది. ఈ రైలుకు 12769/70 తిరుపతి– సికింద్రాబాద్– తిరుపతి సెవెన్ హిల్స్ బై వీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్తో రేక్ షేరింగ్ ఉంది. కాగా.. తిరుపత్తి– కరీంనగర్ రైలు ఇప్పటి వరకు పసుపు రంగులో ఉండే 22 బోగీలతో నడిచింది. ఇదే రైలు ప్రారంభించిన కొత్తలో నీలి రంగు బోగీలతో నడిచింది. ఎల్హెచ్బీ బోగీలు అంటే? ఎల్హెచ్బీ అంటే లింక్మన్ హాఫ్మన్ బుష్ బోగీలు. ఇవి తేలికపాటి స్టీల్తో తయారు చేస్తారు. జర్మన్ దేశ సాంకేతిక పరిజ్ఞానంతో తయారుచేసినవి. మొట్టమొదటి సారి వీటిని మన దేశంలో తీసుకురావాలని అప్పటి దేశ ప్రధాని పీవీ.నరసింహారావు నిర్ణయించారు. ప్రమాదాలు జరిగినపుడు తక్కువ నష్టం జరిగేలా ఈ కోచ్లను రూపొందించారు. తొలుత ఈ ఎల్హెచ్బీ బోగీలను అప్పటి యూపీఏ ప్రభుత్వం కేవలం రాజధాని లాంటి ప్రీమియర్ రైళ్లకు మాత్రమే ఉపయోగించింది. -
అవును.. ఇది ఉప కాల్వే..
కమాన్పూర్(మంథని): అవును ఈ ఫొటోలో ఉన్నది కాల్వే..మండలపరిధిలో పంటలకు సాగునీరు అందించే ఎస్సారెస్పీ కాల్వలు పిచ్చిమొక్కలతో చిట్టడవిని తలపిస్తున్నాయి. ఎస్సారెస్పీ నుంచి సాగునీరు అందించే డీ–83 కెనాల్ పరిధిలోని ఎల్–36, ఎల్–37 ఉపకాల్వల్లో చెట్లు, పిచ్చిమొక్కలు ఏపుగా పెరిగిపోయాయి. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో డీ–83 కెనాల్కు నీరు విడుదల చేస్తే ఉపకాల్వల ద్వారా ఆయకట్టు చివరి వరకు సాగునీరు అందే పరిస్థితి లేదని రైతులు పేర్కొంటున్నారు. వేసవిలో ఉప కాల్వల్లో చెట్ల తొలగింపు, పూడిక తీయించాల్సి ఉండగా ఆ పనులు చేపట్టకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. -
సైబర్ నేరాల నియంత్రణపై దృష్టి పెట్టండి
● సీపీ అంబర్కిషోర్ఝా గోదావరిఖని(రామగుండం): సైబర్నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని రామగుండం సీపీ అంబర్కిషోర్ఝా ఆదేశించారు. గురువారం రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి, మంచిర్యాల జోన్ పోలీస్ అధికారులతో నేరసమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం సైబర్ నేరాలు పెద్ద సమస్యగా మారాయని, వీటిని సమర్థవంతంగా ఎదుర్కొంటూనే ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. అందుబాటులో ఉన్న టెక్నాలజీని అనుసరిస్తూ దర్యాప్తు చేపట్టాలన్నారు. మహిళలపై జరిగిన నేరాలకు సంబంధించి కేసుల్లో దర్యాప్తు వేగవంతం చేయడంతో పాటు, నిందితులకు కోర్టులో శిక్ష పడేలా తగు సాక్ష్యాధారాలను అందజేయాలన్నారు. రానున్న పంచాయతీ ఎన్నికలకు పోలీసు అధికారులు, సిబ్బంది సన్నద్ధం కావాలన్నారు. ప్రతీ గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేలా చూడాలన్నారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేవారి పట్ల కఠినంగా వ్యవహరించాలని సూచించారు. గంజాయి రవాణాపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తే సహించేది లేదని, శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో మంచిర్యాల, పెద్దపల్లి డీసీపీలు ఎ.భాస్కర్, కరుణాకర్, అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి.రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ మల్లారెడ్డి, మంచిర్యాల, జైపూర్, బెల్లంపల్లి ఏసీపీలు ప్రకాష్, వెంకటేశ్వర్లు, రవికుమార్, ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్, ఏఆర్ ఏసీపీ ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. -
భళా.. హస్తకళ మేళా
కోల్సిటీ(రామగుండం): చూడచక్కని బొమ్మలు, ఆకట్టుకునే ధర్మవరం, వెంకటగిరి, గద్వాల్, పోచంపల్లి చీరలు, ఉడన్ హ్యాండీ క్రాఫ్ట్స్, ఒడిశా పేయింటింగ్, జైపూర్ స్టోన్ జ్యూవెల్లరి, హరియాణా బెడ్ కవర్స్, కోల్కత్తా బ్యాగ్స్.. కళ్లు మిరుమిట్లు గొలిపే వస్తువులకు గోదావరిఖని వేదికయింది. ఆధునిక సొబగులద్దుకుంటున్న సంప్రదాయ హస్తకళను హైదరాబాద్కు చెందిన ‘కళా సిల్క్ చేనేత హస్తకళా సొసైటీ’ ప్రత్యేక మేళాను గురువారం గోదావరిఖనిలో ప్రారంభించింది. సింగరేణి కమ్యూనిటీ హాల్లో హస్తకళ, చేనేత వస్త్ర ప్రదర్శన, అమ్మకాల స్టాల్స్ను ఏర్పాటు చేయగా, పలు రాష్ట్రాలకు చెందిన కళాకారులు తయా రు చేసిన హస్తకళలను ప్రదర్శనకు పెట్టారు. ఆకట్టుకుంటున్న చీరలు తెలంగాణలో ప్రఖ్యాతిగాంచిన పోచంపల్లి, గద్వాల, నారాయణపేట పట్టు చీరలతోపాటు ఏపీలోని ధర్మవరం, వెంకటగిరి, మంగళగిరి, కళంకారి, ఉప్పాడ, అస్సాం మూగా, బిహార్ బాగల్పుర సిల్క్స్, టస్సర్, జమ్మూకశ్మీర్లోని ఎంబ్రాయిడరీ చీరలు, గుజరాత్లోని బాందని, కచ్చ ఎంబ్రాయిడరీ శారీస్, రాజాస్థాన్లోని కోటా, బంధాని, ఉత్తరప్రదేశ్లోని జమ్దాని, బనారస్, లక్నో డ్రెస్ మెటీరియల్స్, ఛత్తీస్గఢ్ ట్రిబిల్ వర్క్స్ కోసా సిల్క్, ఫ్యాన్సీ చీరలు, చుడీదార్స్, హ్యాండి క్రాఫ్ట్స్, హ్యాండ్లూమ్స్ ఆకట్టుకుంటున్నాయి. మేళాలో చేనేత, హస్తకళ స్టాల్స్కళాకారులను ప్రోత్సహించాలి చేనేత వస్త్రాలు, హస్తకళలు, హ్యాండ్లూమ్స్ కళాకారులను ప్రోత్సహించాలి. మా సొసైటీ ద్వారా పలు రాష్ట్రాల్లోని చేనేత, హ్యాండ్రీక్రాఫ్ట్స్ కళాకారులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పించేందుకు ఇలా ఎగ్జిబిషన్లను ఏర్పాటు చేస్తున్నాం. – వినోద్సింగ్ నెగి, కళాసిల్క్ సొసైటీ మేనేజర్ -
మెనూ ప్రకారం భోజనం పెట్టాలి
ధర్మారం(ధర్మపురి): గురుకులం విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ సూచించారు. గురువారం ధర్మారం మండలం మల్లాపూర్ సాంఘిక సంక్షేమ బాలికల గురుకులం విద్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా డైనింగ్హాల్, టాయిలెట్స్, పరిసరాల శుభ్రతను పరిశీలించారు. పరిసరాల్లో ఏపుగా పెరిగిన చెట్లను తొలగించాలని ఆదేశించారు. శిథిలావస్థలో ఉన్న డైనింగ్హాల్కు నిధులు మంజూరు చేస్తానని వెంటనే మరమ్మతు చేపట్టాలని సూచించారు. జిల్లా కలెక్టర్తో ఫోన్లో మాట్లాడి నిధులు కేటాయించాలని కోరారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని, నాలుగు నెలల పాటు నెలలో రెండుసార్లు వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి విద్యార్థులకు పరీక్షలు చేయించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను కోరారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. రాష్ట్రంలోనే మల్లాపూర్ గురుకులం విద్యాలయానికి మంచి పేరుందని, ఆ పేరును ఉపాధ్యాయులు కాపాడాలని కోరారు. ఇన్చార్జి ప్రిన్సిపాల్ మాధవి, మెస్ ఇన్చార్జి రత్నాప్రసూన్న, నియోజకవర్గ యువకాంగ్రెస్ అధ్యక్షుడు అసోద అజయ్, గందం మల్లయ్య, గందం మహిపాల్, రామడుగు గంగారెడ్డి, రాజు, శివ పాల్గొన్నారు. ● మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ -
ఆదర్శ పాఠశాల సందర్శన
ధర్మారం(ధర్మపురి): మండల కేంద్రంలోని ఆదర్శ విద్యాలయాన్ని గురువారం జిల్లా విద్యాధికారి మాధవి సందర్శించారు. ఈ సందర్భంగా తరగతి గదులను పరిశీలించారు. టీచింగ్ డైరీ, సెలన్ ప్లాన్స్, పీరియడ్ ప్లాన్స్, బేస్లైన్ టెస్టుకు సంబంధించిన డైరీలను తనిఖీ చేశారు. విద్యాలయంలో నిర్వహిస్తున్న ఎఫ్ఎం రేడియో ప్రోగ్రాం, మంత్లీ మ్యాగ్జిన్ గురించి ప్రిన్సిపాల్ రాజ్కుమార్ డీఈవోకు వివరించారు. కాగా ఈ ప్రోగ్రాం కొత్త ఓరవడిని సృష్టించి విద్యార్థులకు లాభదాయకంగా ఉంటుందని ప్రిన్సిపాల్ను డీఈవో అభినందించారు. ఈ కార్యక్రమాన్ని ప్రతీ పాఠశాలలో ప్రవేశపెట్టాలని సూచించారు. మండల విద్యాధికారి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ‘ఎల్లంపల్లి’కి స్వల్ప ఇన్ఫ్లోరామగుండం: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి క్రమంగా ఇన్ఫ్లో పెరుగుతోంది. నీటిపారుదలశాఖ అధికారులు గురువారం తెలిపిన వివరాల ప్రకారం.. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 20.175 టీఎంసీలు కాగా ప్రస్తుతం 9.0655 టీఎంసీలున్నాయి. ప్రాజెక్టులోకి 3,665 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా, హైదరాబాద్ మెట్రో 331 క్యూసెక్కులు, ఎన్టీపీసీ 121 క్యూసెక్కులు ఔట్ఫ్లో చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. సుందిళ్ల గ్రామస్తులకు ఎక్స్గ్రేషియా చెల్లింపు గోదావరిఖని(రామగుండం): సింగరేణి మైనింగ్ లీజు భూముల ఎక్స్గ్రేషియా సుందిళ్ల రైతులకు చెల్లించామని ఆర్జీ–1 జీఎం లలిత్కుమార్ తెలిపారు. జీఎం కార్యాలయంలోని మీటింగ్ హాల్లో గురువారం జరిగిన సమావేశంలో ఆయన గ్రామస్తులకు చెక్కులు అందజేశారు. జీఎం మాట్లాడుతూ జీడీకే–5 ఓసీ పరిధిలోని సింగరేణి మైనింగ్ లీజు భూములను సుందిళ్ల గ్రామ రైతులు తాత్కాలికంగా కొంతకాలం జీవనోపాధి కోసం ఉపయోగించుకున్నారని పేర్కొన్నారు. ఇప్పుడు ఆ భూమిలో ఓసీపీ విస్తరణ పనులు చేపడుతున్న క్రమంలో రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు, కలెక్టర్ కోయ శ్రీహర్ష, సంస్థ సీఎండీ ఆదేశాల మేరకు ఎక్స్గ్రేషియా అందజేస్తున్నట్లు తెలిపారు. ఎకరానికి రూ.6.50లక్షల చొప్పున 16.04 ఎకరాలకు ఏడు చెక్కులు అందజేసినట్లు వెల్లడించారు. ఈ ఎక్స్గ్రేషియా చెల్లింపు పక్రియ కొనసాగుతుందన్నారు. ఎస్వోటూ జీఎం ఆంజనేయప్రసాద్, ప్రాజెక్ట్ అధికారి డి.రమేశ్, డీజీఎం సర్వే జీఎల్రాజు, డీజీఎం ఫైనాన్స్ ధనలక్ష్మిబాయి, ఎస్టేట్ అధికారి సాంబశివరావు, లా ఆఫీసర్ అఫ్రిన్ సుల్తానా పాల్గొన్నారు. ఆపరేషన్ ముస్కాన్.. బడిలో చేరిక కాల్వశ్రీరాంపూర్: మండలంలోని పెద్దరాతుపల్లి లోని చెంచు బాలికను గురువారం అధికారులు గుర్తించి మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో చేర్పించారు. కార్మికశాఖ, పోలీసుశాఖ సంయుక్తంగా ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా బడికి వెళ్లకుండా కూలీపనికి వెళ్తున్న బాలబాలికలను గుర్తించి బడిలో చేర్పిస్తున్నట్లు ఎంఈవో మహేశ్కుమార్ పేర్కొన్నారు. స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం సునీత, కేజీబీవీ ప్రిన్సిపాల్ శ్రీదేవి, సీఆర్పీలు కుమారస్వామి, చందర్, వీరయ్య, చంద్రకళ పాల్గొన్నారు. అందుబాటులో ఉండాలిమంథని: హాస్టల్ వార్డెన్లు విద్యార్థులకు అందుబాటులో ఉండాలని జిల్లా సంక్షేమ అధికారి వినోద్కుమార్ అన్నారు. గురువారం మంథనిలోని బాలుర కళాశాల హాస్టల్ విద్యార్థులు ఆందోళన చేపట్టగా ఆయన సందర్శించారు. విద్యార్థుల సమస్యలు తెలుసుకున్నారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని వార్డెన్ రమేశ్ను ఆదేశించారు. హాస్టల్లోని సమస్యలపై విచారణ జరిపి జిల్లా కలెక్టర్, రాష్ట్ర కమిషనర్కు నివేదిక పంపడం జరిగిందన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. -
వానొచ్చింది.. వరదొచ్చింది
పెద్దపల్లిరూరల్/సుల్తానాబాద్/ఎలిగేడు/ఓదెల: జిల్లాలో రెండురోజులుగా కురుస్తున్న వర్షానికి పలుచోట్ల పంటలు నీటమునిగాయి. పెద్దపల్లి మండలం కొత్తపల్లి గ్రామంలోని రైల్వే క్రాసింగ్ గేటును మూసివేసి అండర్బ్రిడ్జి నిర్మించగా, బ్రిడ్జి వద్ద మోకాలిలోతు నీటిలో వాహనదారులు రాకపోకలు సాగించడం కష్టంగా మారింది. ఎలిగేడు మండలంలో పంటపొలాలు నీటమునిగాయి. ఓదెల మండలంలో గోపరపల్లె చెరువు మత్తడి పడడంతో మత్స్యకారులు చేపలు పట్టారు. అలాగే ఓదెల–కొలనూర్ గ్రామాల మధ్యలో తారురోడ్డు కొట్టుకుపోయి ప్రమాదకరంగా మారింది. అధికారులు స్పందించి రోడ్డుకు మరమ్మతు చేయాలని స్థానికులు కోరుతున్నారు. -
మొక్కల పెంపకంతో కాలుష్య నివారణ
● రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్కోల్సిటీ(రామగుండం): రామగుండం నగరంలో కాలుష్య నివారణకు మొక్కల పెంపకమే ఏకై క పరిష్కారమని ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్ అన్నారు. గురువారం గోదావరిఖని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల మైదానంలో బల్దియా నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మె ల్యే మొక్కలు నాటి మాట్లాడారు. నగరంలో పచ్చదనం పెంపొందించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ముగ్గులువేసి చెత్తపై అవగాహన గోదావరిఖనిలోని చంద్రశేఖర్నగర్లో చెత్త జమయ్యే ప్రాంతాలను పారిశుధ్య విభాగం సిబ్బంది శుభ్రం చేసి ముగ్గులు వేశారు. బయట చెత్త వేయకుండా మున్సిపల్ వాహనాలకు అందించాలని అవగాహన కల్పించారు. మల్లికార్జున్నగర్లోని మేజర్ కాలువలో పూడిక తొలగించే పనులు చేపట్టారు. కేసీఆర్కాలనీలో పిచ్చిచెట్లు తొలగించారు. నగరపాలక డిప్యూటీ కమిషనర్ నాయిని వెంకటస్వామి, డీఈ షాభాజ్, ఏఈ తేజస్విని, ప్రిన్సిపాల్ సంజీవ్ పాల్గొన్నారు. -
విద్యాప్రమాణాలు పెంచాలి
కమాన్పూర్(మంథని): ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు కనీస విద్యాప్రమాణాలు అందించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. కమాన్పూర్ జెడ్పీ హైస్కూల్లో బుధవారం ఆయన గణిత ప్రయోగశాల ప్రారంభించారు. పేరపల్లిలో ప్రభుత్వ పాఠశా ల, ఆరోగ్య ఉపకేంద్రం, రొంపికుంట ప్రభుత్వ పా ఠశాలలు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, కమాన్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పీఏసీఎస్ కార్యాల యాలను సందర్శించారు. విద్యా బోధన తీరుపై ఆ రా తీశారు. పదో తరగతి చాలా కీలకమని, ప్రతీ విద్యార్థి బాగా చదివి ఉన్నతంగా స్థాయికి ఎదగా లని సూచించారు. వర్షాలు కురుస్తున్నందున సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఎరువుల కొరత రా కుండా వ్యవసాయాధికారులు చర్యలు తీసుకోవా లని సూచించారు. జిల్లా సహకార అధికారి శ్రీమా ల, మంథని డీఎల్పీవో సతీశ్, డిప్యూటి డీఎంహెచ్వో రవిసింగ్, ఎంపీడీవో లలిత, ఎంపీవో మారుతి, ఎంఈవో విజయ్కుమార్, ఏవో రామకృష్ణ, డీఈలు రాజ్కుమార్, దస్తగిరి, ఏఈ మధు, కార్యదర్శులు ప్రసాద్, తిరుపతి, ఉపాధ్యాయులు భరత్కుమార్, గసిగంటి రమేశ్, రాజేశ్వరరావు, సతీశ్, శంకర్, రజినివందన, రజితకుమారి, రేణుక, స్రవంతి, ఈశ్వరయ్య, నంబయ్య తదితరులు ఖలీక్ ఉన్నారు. ● కలెక్టర్ కోయ శ్రీహర్ష -
ముసురుతున్న వ్యాధులు
● బాధిస్తున్న జ్వరం.. దగ్గు.. టైపాయిడ్ ● వైరల్ ఫీవర్, వాంతులు, విరోచనాలతో జనం విలవిల ● ఆస్పత్రులకు పేషెంట్ల బారులు ● టెస్ట్ల పేరిట ప్రైవేట్ ఆస్పత్రుల బాదుడు ● పరిసరాల పరిశుభ్రత పాటించాలి ● జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ సూచన సాక్షి పెద్దపల్లి: వాతావరణం మారుతోంది. వైర ల్ఫీవర్, టైఫాయిడ్ జ్వరాలు పంజా విసురుతున్నా యి. కొన్నిరోజులుగా కురుస్తున్న ముసురు, మంగళవారం రాత్రి, బుధవారం కురిసిన భారీ వర్షంతో జిల్లావాసులు సీజనల్ వ్యాధుల బారినపడుతున్నా రు. జలుబు, దగ్గు, ఒంటి నొప్పులతో బాధపడు తూ వైద్యం కోసం వస్తున్న వారితో పెద్దపల్లి, గోదావరిఖని, మంథని ఏరియా ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు రద్దీగా మారాయి. సర్కారు దవాఖానాల్లో ఓ పీ కేసులు అధికంగా నమోదవుతుండగా.. ప్రైవేట్ ఆస్పత్రులు వైద్యపరీక్షల పేరిట పేషెంట్ల జేబులు గుళ్లచేస్తున్నాయి. జిల్లాలో ఇప్పటివరకు 24 టైపా యిడ్ కేసులు, 2 డెంగీ కేసులు నమోదయ్యాయి. ఫీవర్ తగ్గుతోంది.. దగ్గు వెంటాడుతోంది.. వైరల్ ఫీవర్ నాలుగైదు రోజుల్లో తగ్గుతున్నా దగ్గు, జలుబు రెండు వారాలకుపైగా బాధితులను పట్టి పీడిస్తున్నాయి. దీంతో జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోజూ 2 వేలు, ప్రైవేట్లో 1,500 నుంచి 2 వేల వరకు ఓపీ కేసులు నమోదవుతున్నాయి. ఇందులో 100 నుంచి 150 వరకు జ్వరంతో బాధపడుతున్న పిల్లలు ఉంటున్నారు. నిత్యం 500కుపైగా రక్తనమూనాలు సేకరించి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. జ్వరపీడితుల్లో పలు లక్షణాలు కనిపిస్తుండడంతో అప్రమత్తంగా ఉండాలని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఇష్టానుసారంగా వైద్యపరీక్షలు.. ఆస్పత్రులను ఆశ్రయించేవారిలో అత్యధికులు జ్వరపీడితులే ఉంటున్నారు. పది రోజులుగా ఏ ఆస్పత్రిలో చూసినా సాధారణం కన్నా అధికంగా ఓపీలు నమోదవుతున్నాయి. దీంతో ప్రైవేట్ ఆస్పత్రుల్లో అవసరం ఉన్నా, లేకున్నా బాధితుల నుంచి శాంపిళ్లు సేకరిస్తూ రక్తం, మూత్ర పరీక్షలు చేస్తూ, అడ్మి ట్ చేసుకుంటూ రూ.వేలల్లో వసూలు చేస్తున్నారు. టైపాయిడ్ లక్షణాలు.. ● తలనొప్పి, చలి, ఆకలి లేకపోవడం, కడుపునొప్పి, దగ్గు రావడం, శరీరంపై గులాబీ మచ్చలు కనిపిస్తాయి. ● కండరాల నొప్పి, వికారం, వాంతులు, అతిసారం, మలబద్ధకం ఉంటాయి. కారణాలు.. కలుషితనీరు తాగడం, అపరిశుభ్రత వాతావరణం, ఈగలు ముసిరిన రోడ్డుపక్కన ఉండే తినుబండారాలతో టైఫాయిడ్ జ్వరం వస్తుందని వైద్యులు చెబుతున్నారు. అంతేకాదు.. ఈగల ద్వారా వ్యాపించే బ్యాక్టీరియాతో టైఫాయిడ్ వస్తుంది. బాధితుల పేగుల్లోకి అది చేరుతుంది. బాధితులు బహిరంగ ప్రదేశాల్లో విసర్జించిన మల, మూత్రాలపై వాలిన ఈగలతో ఇతరులకూ టైఫాయిడ్ సోకుతుంది.గోదావరిఖని జనరల్ ఆస్పత్రిలో నమోదైన ఓపీ కేసులుజాగ్రత్తలు తీసుకుంటున్నాం సీజనల్ వ్యాధుల నివారణకు చర్యలు తీసుకుంటున్నాం. తొలివిడతలో ఇంటింటి సర్వే చేశాం. అవసరమైన వారికి వెంటనే మందు లు పంపిణీ చేశాం. జ్వర బాధితులు సమీప సబ్ సెంటర్, పీహెచ్సీలను సంప్రదించండి. డాక్టర్లు అందుబాటులో ఉన్నారు. రక్తపరీక్షలు చేసి అత్యవసరమైతే పెద్దాస్పత్రులకు రెఫర్ చేస్తారు. అందరూ పరిసరాలు, వ్యక్తిగత పరిశుభ్రత, ప్రతీ శుక్రవారం డ్రైడే పాటించాలి. – అన్న ప్రసన్నకుమారి, డీఎంహెచ్వో తేదీ ఓపీ 23 1,052 22 1,332 21 1,035 19 1,071 18 1,117 17 1,025 16 1,154 15 1,304 -
దంచికొడుతున్న వాన
బల్దియాలో హెల్ప్లైన్ కోల్సిటీ(రామగుండం): భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అత్యవసర పరిస్థితుల్లో స హాయక చర్యల కోసం రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయం హెల్ప్లైన్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. బాధితులు 93924 83959 లేదా 96036 66444 నంబర్లలో సంప్రదించాలని బల్దియా కమిషనర్ అరుణశ్రీ తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు. పెద్దపల్లిలో టోల్ఫ్రీ నంబరు పెద్దపల్లిరూరల్: జిల్లాలో కురుస్తున్న వానలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు సహాయం కోసం టోల్ఫ్రీ నంబరు 63031 27484కు ఫోన్ చేసి సమాచారం అందించాలని మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్ కోరారు. పురాతన ఇళ్లు వాననీటికి తడిసి కూలే ప్రమాదం ఉందని, అందులో నివాసం ఉండేవారు ఖాళీచేసి వెంటనే ఇతర ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. -
అభివృద్ధే ధ్యేయం : ఠాకూర్
గోదావరిఖని: నగర అభివృద్ధే ధ్యేయంగా ముందు కు సాగుతున్నామని రామగుండం ఎమ్మెల్యే ఎంఎ స్ రాజ్ఠాకూర్ అన్నారు. స్థానిక లక్ష్మీనగర్లో ఆ యన బుధవారం పర్యటించారు. రోడ్ల విస్తరణ, డ్రై నేజీ వ్యవస్థ, వీధిదీపాల మరమ్మతు, తాగునీటి సరఫరా తదితర అంశాలపై అధికారులకు సూచనలు చేశారు. నాయకులు మహంకాళి స్వామి, తిప్పారపు శ్రీనివాస్, శంకర్నాయక్, ముస్తాఫా ఉన్నారు. ‘మహాలక్ష్మి’ మహిళల గౌరవానికి సూచిక గోదావరిఖనిటౌన్: మహాలక్ష్మి పథకం మహిళల గౌరవానికి, సమాజంలో సమాన హక్కులకు మార్గదర్శకంగా నిలుస్తుందని ఎమ్మెల్యే రాజ్ఠాకూర్ మక్కాన్సింగ్ అన్నారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మహాలక్ష్మి పథకం ద్వారా 200 కోట్ల ఉచిత ప్రయాణాలు చేసి రూ.6,680 కోట్ల ప్రయాణ చార్జీలను ఆదా చేసుకున్న సందర్భంగా ఈ వేడుక నిర్వహించామని తెలిపారు. ఆర్టీసీ డిపో మేనేజర్ నాగభూషణం పాల్గొన్నారు. అంతకుముందు ఆషా ఢ మాసం బోనాల్లో ఎమ్మెల్యే ఠాకూర్ పాల్గొన్నారు. విద్యా సంస్థల బంద్ ప్రశాంతంపెద్దపల్లిరూరల్: విద్యారంగ సమస్యలను పరిష్కరించాలనే డిమాండ్తో బుధవారం వామపక్ష విద్యార్థి సంఘాలు జిల్లాలో చేపట్టిన విద్యాసంస్థల బంద్ ప్రశాంతంగా ముగిసింది. ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ నాయకులు సందీప్, ప్రశాంత్, ప్రీతం, సాయిరాం మాట్లాడుతూ, బంద్ విజవంతమైందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యాశాఖ మంత్రిని నియమించకపోవడం శోచనీయమన్నారు. విద్యార్థుల పెండింగ్ ఫీజురీయింబర్స్మెంట్, స్కాలర్షిపు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల దోపిడీని నియంత్రించాలని కోరారు. నాయకులు అరవింద్, ఆదిత్య, సాయి, మధుకర్, నితిన్, వినయ్, రాజు, మనోహర్, నరేశ్, శివ, ప్రణయ్, అభినయ్ తదితరులు పాల్గొన్నారు. -
● లోతట్టు ప్రాంతాలు జలమయం ● ఓసీపీల్లో నిలిచిన బొగ్గు ఉత్పత్తి ● అప్రమత్తమైన జిల్లా అధికార యంత్రాంగం ● బాధితుల సహాయం కోసం అందుబాటులో టోల్ఫ్రీ నంబర్లు
గోదావరిఖని: జిల్లాలో మంగళవారం రాత్రి ప్రారంభమైన భారీవర్షం బుధవారం రాత్రివరకూ కొనసాగుతూనే ఉంది. అప్పుడప్పుడు తెరిపిచ్చినా.. ఆ తర్వాత దంచికొడుతోంది. ఫలితంగా జిల్లాలోని కొన్నిపల్లపు ప్రాంతాల్లోకి వర్షపునీరు వచ్చిచేరింది. చెరువులు, కుంటల్లోకి వర్షపునీరు రావడం ఆరంభమైంది. బొగ్గు ఉత్పత్తికి అంతరాయం.. భారీవర్షాలతో సింగరేణిలోని ఓసీపీల్లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. మంగళవారం పాక్షింగా, బుధవారం పూర్తిగా బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. మొత్తం 18 ఓసీపీల్లో 1.70 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తికి నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు. ప్రైవేట్, సింగరే ణి యంత్రాల ద్వారా ఓసీపీల్లో రోజూ 13 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి వెలికితీయాల్సి ఉండగా ఆ పనులు ముందుకు సాగడంలేదు. ఓసీపీ క్వారీల్లోకి వర్షపు నీరు వచ్చిచేరడంతో భారీపంప్ల ద్వారా బయటకు తోడేస్తున్నారు. ఓసీపీల్లో సుమారు 62 మి.మీ. వర్షపాతం నమోదు అయినట్లు సింగరేణి అధికారులు తెలిపారు. మరోవైపు.. గ్రౌండ్స్టాక్ కోల్ను సీహెచ్పీల ద్వారా రైల్వే నుంచి కస్టమర్లకు రవాణా చేస్తోంది. అధికారులు అప్రమత్తం సుల్తానాబాద్(పెద్దపల్లి): పట్టణంలోని పలు లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు చేరింది. జేసీబీ సాయంతో నీటిని తొలగించారు. తహసీల్దార్ బషీరొద్దీన్, ఎంపీడీవో దివ్యదర్శన్రావు, ఎస్సై శ్రవణ్ కుమార్, మున్సిపల్ కమిషనర్ రమేశ్ పరిస్థితి సమీక్షిస్తున్నారు. ఇళ్లను ముంచెత్తిన వరద.. కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): మల్యాలగూడెం, కొత్తపల్లి– మల్యాల మధ్య కల్వర్టులు పొంగి రాకపోకలు నిలిచిపోయాయి. పెగడపల్లిలోని పలువురి ఇళ్లలోకి వర్షపునీరు వచ్చిచేరింది. ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. వర్షపునీళ్లు తొలగించాలని పలువురు మహిళలు అధికారులకు మొరపెట్టుకున్నారు. వర్షాలతో రైతులు, ప్రజల అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకి రావద్దని తహసీల్దార్ జగదీశ్వరరావు, ఏఎస్సై నీలిమ సూచించారు. ఓదెలలో భారీవర్షం ఓదెల(పెద్దపల్లి): కొలనూర్, ఓదెల, గుంపుల, గూడెం, పొత్కపల్లి గ్రామాల్లోని చెరువుల్లోకి వర్షపునీరు వచ్చి చేరుతోంది. గూడెంలో పంటలు నీట మునిగాయి. కాజీపేట – బల్హార్షా సెక్షన్ల మధ్యలోని ఓదెల రైల్వే అండర్బ్రిడ్జి వర్షపునీటితో నిండిపోయింది. రాకపోకలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. జూలపల్లిలో 74.2మి.మీ. వర్షం ధర్మారం/జూలపల్లి/ఎలిగేడు(పెద్దపల్లి): జూలపల్లిలో 74.2 మి.మీ., ధర్మారంలో 79.6 మి.మీ. వర్షపాతం నమోదైంది. రైతులు వ్యవసాయ పనులకు సిద్ధమయ్యారు. ఎలిగేడు మండలంలో తెల్లవారుజామున ప్రారంభమైన జోరువాన ఉదయం 7 గంటల వరకూ ఏకధాటిగా కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మానేరు ఉధృతి.. తెగిన తాత్కాలిక రోడ్డు ముత్తారం(మంథని): ముత్తారం మండలం ఓడేడు సమీపంలోని మానేరులో పోసిన తాత్కాలిక మట్టి రోడ్డు వరద ఉధృతికి తెగిపోయింది. దీంతో పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా మధ్య రాకపోకలు స్తంభించాయి. ప్రయాణికులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. -
నాలుగు రోజులైతంది
కాళ్లకు పుండ్లు అ యినయి. వాంతులవుతున్నయి. పెద్దపల్లి ఆస్పత్రికి తీసుకొచ్చిండ్రు. నాలుగు రోజులైతంది. ఐనా జెరం తగ్గుతలేదు. పరీక్షలు చేసిన వైద్యులు జెరం తగ్గేవరకు ఆస్పత్రిలోనే ఉండాలన్నరు. – కలవేని రాయమల్లు, కొత్తపల్లి వారం నుంచి జ్వరం వారంరోజుల కింద జెరం వచ్చింది. స్థాని క వైద్యుడి కాడికిపో యిన. మందులిచ్చిండ్రు. వాడినా తగ్గలే దు. అందుకే పెద్దపల్లి ఆస్పత్రిలో చేరిన. అన్ని పరీక్షలు చేసిండ్రు. ఇ క్కడే ఉంచి చికిత్స అందిస్తున్నరు. జెరం కొ ద్దిగా జారింది. – బోయిని లచ్చమ్మ, వెన్నంపల్లి వాంతులు.. విరోచనాలు ఎన్టీపీసీలో కాంట్రాక్ట్ కార్మికునిగా పనిచేస్తున్న. వాంతులు, విరోచనాలతో స్థాని క ఆస్పత్రిలో చేరిన. తగ్గలే. అందుకే గోదావరిఖని జనరల్ ఆస్పత్రికి వచ్చిన. ఆ తర్వాత జ్వరం వచ్చింది. ఎంతకీ తగ్గుతలేదు. అలసటగా ఉంది. – కనుకుంట్ల శ్రీనివాస్, గోదావరిఖని -
వేతనాలు అందక ఇబ్బందులు
● జీతాలు ఇప్పించాలని డీపీవోకు విన్నవించిన సిబ్బందిపెద్దపల్లిరూరల్/సుల్తానాబాద్: జిల్లాలో పనిచే స్తున్న ఈ – పంచాయతీ ఆపరేటర్లకు మూడు నె లలుగా వేతనాలు అందడంలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి గ్రామాలకు వచ్చే ప్రతీఉత్తరాన్ని, ప్రత్యుత్తరాన్ని వీరి ద్వారానే ఆన్లైన్, ఆఫ్లైన్లో నివేదిస్తారు. అయితే, ప్రభుత్వాల ద్వారా నిధులు విడుదల కాకపోవడంతో వేతనాల చెల్లింపులు ఆగిపోయాయని అంటున్నారు. గతేడాది వరకు నెలకు రూ.22,750 ఉండగా, ఈ ఏడాది జనవరి నుంచి రూ.19,500 వేతనం వస్తోందని ఆపరేటర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఇవికూడా మూడునెలలుగా అందడం లేదంటున్నారు. 20 15 నుంచి విధులు నిర్వర్తిస్తున్న తమకు వెంటనే మూడు నెలల బకాయిలు విడుదల చేయాలని బుధవారం డీపీవోతోపాటు ఎంపీడీవోలకు వినతిపత్రాలు అందజేశారు. -
క్రీడాకారుడికి కాంపౌండ్బో
పెద్దపల్లిరూరల్: నైపుణ్యం గల క్రీడాకారుల ఆసక్తికి అనుగుణంగా ప్రభుత్వం తోడ్పాటు అందిస్తుందని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నా రు. కలెక్టరేట్లో బుధవారం ఆర్చరీ క్రీడాకారుడు తానిపర్తి యశ్వంత్కు రూ.4,30,800 వెచ్చించి కొనుగోలు చేసిన అంతర్జాతీయ నైపుణ్యాలతో కూడిన కాంపౌండ్బో పంపిణీ చేశారు. జిల్లా క్రీడల అధికారి సురేశ్, కుమార్, శ్రీనివాస్ పాల్గొన్నారు.సాంకేతిక నైపుణ్యం అవసరం రామగిరి(మంథని): ఇంజినీరింగ్ విద్యార్థులతోపాటు అధ్యాపకులు కూడా ఆధునిక సాంకేతిక నైపుణ్యం పెంపొందించుకోవాలని జే ఎన్టీయూ ప్రిన్సిపాల్ బులు సు విష్ణువర్ధన్ సూచించా రు. ఎడ్యునెట్ ఒప్పందంలో భాగంగా కాలేజీలోని 18 మంది అధ్యాపకులకు సాంకేతికత, బోధన నైపుణ్యం మెరుగుపర్చేందుకు మంథని జేఎన్టీయూలో చేపట్టిన ఐదురోజుల శిక్షణ తరగతులను ఆయన బుధవారం ప్రారంభించి మాట్లాడారు. ఎడ్యునెట్ కింద ఎంపికై న 40 మంది వి ద్యార్థులకు శిక్షణ పొందిన అధ్యాపకులు తర్ఫీ దు ఇస్తారని వివరించారు. ఉద్యోగాలు, ఇంటెర్న్షిప్కు దరఖాస్తు చేసుకునే వారికి సహాయ, సహకారాలు అందిస్తామని ప్రోగ్రాం ఇన్చార్జి తిరుపతి తెలిపారు. ఎడ్యునెట్ ప్రతినిధులు సుమిత్, పవన్, అధ్యాపకులు పాల్గొన్నారు. ఐటీఐలో మలివిడత ప్రవేశాలుపెద్దపల్లిరూరల్: జిల్లాలోని ప్రభుత్వ ఐటీఐల లో మలివిడత ప్రవేశాలకోసం ఆన్లైన్లో దర ఖాస్తు చేయాలని ప్రిన్సిపాల్ వెంకటరెడ్డి తెలి పారు. ఆగస్టు 1 నాటికి 14 ఏళ్ల వయసు నిండి టెన్త్, ఎనిమిదో తరగతి చదివి ఉండాలన్నారు. రూ.100 ఫీజు చెల్లించి దరఖాస్తు పొందాలన్నారు. వెబ్ ఆప్షన్ల ఽఆధారంగా సీట్లు కేటాయిస్తారన్నారు. వివరాల కోసం 85004 63969 నంబరులో సంప్రదించాలని సూచించారు. కాంగ్రెస్తోనే సొంతిల్లుసుల్తానాబాద్రూరల్(పెద్దపల్లి): కాంగ్రెస్ ప్రభుత్వంతోనే పేదల సొంతింటికల సాకారం అవుతుందని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నా రు. రామునిపల్లి, కనుకుల, మంచిరామి గ్రా మాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు బుధవా రం ఆయన ముగ్గు పోశారు. అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. పీఏసీఎస్ జిల్లా డైర్టెకర్ కల్లెపల్లి జానీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. వచ్చే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారులను గెలిపించాలని కోరారు. గట్టుసింగారం.. ఇక పర్యాటకంపెద్దపల్లిరూరల్: సబ్బితం గ్రామశివారు గట్టుసింగా రం జలపాతం ప ర్యాటకంగా మారనుంది. జలపాతా న్ని అభివృద్ధి చే సేందుకు ప్రభు త్వం రూ.6కోట్లు కేటాయిస్తూ బుధ వారం ఉత్తర్వులుజారీ చేసింది. స్థానిక ఎమ్మె ల్యే విజయరమణారావు విన్నపం మేరకు హై దరాబాద్లోని పర్యాటక శాఖ ఉన్నతాధికారు లు సబ్బితం జలపాతానికి గతంలోనే చేరుకుని ప్రతిపాదనలు రూపొందించారు. ఆ మేరకు ప్ర భుత్వం నిధులు మంజూరు చేసింది. టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా రూ.4.50 కోట్లతో పర్యాటక అభివృద్ధి, రూ.1.50కోట్లతో అటవీశాఖ ఆధ్వర్యంలో మరిన్ని పనులు చేపట్టనున్నారు. నిధులు మంజూరు చేసిన సీఎం రేవంత్రెడ్డి, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, మంత్రి శ్రీధర్బాబుకు ఎమ్మెల్యే విజయరమణారావు కృతజ్ఞతలు తెలిపారు. ‘స్థానికం’లో బీజేపీదే విజయంపెద్దపల్లిరూరల్: ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీజేపీదే అధికారమని మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి, ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి అన్నారు. పెద్దకల్వలకు చెందిన వివిధ పార్టీల నాయకులు బుధవారం జిల్లా కేంద్రంలో బీజేపీలో చేరారు. రామకృష్ణారెడ్డి, సంజీవరెడ్డి వారికి కండువా కప్పి పార్టీలోకి ఆ హ్వానించారు. అనంతరం మాట్లాడారు. -
కార్మికులను ఆదుకోవాలి
గోదావరిఖని: సింగరేణి మెడికల్ బోర్డును వెంటనే నిర్వహించి కార్మిక కుటుంబాలను ఆదుకోవాలని రాష్ట్రమాజీ మంత్రి, టీబీజీకేఎస్ ఇన్చార్జి కొప్పుల ఈశ్వర్ కోరారు. హైదరాబాద్లో సీఎండీడ్ఎండీ బలరాంతో బుధవారం భేటీ అయ్యా రు. మెడికల్ బోర్డుకు రెఫర్చేసిన ఉద్యోగులను ఏడాదిగా అన్ఫిట్ చేయడంలేదని, కనీసం విధులకు అనుమతించడం లేదన్నారు. కార్మికులకు మెరుగైన వైద్యం అందించాలని, బీపీ, షుగర్ త దితర మందులను అందుబాటులో ఉంచాలన్నా రు. కొత్త గనులు ఏర్పాటు చేయాలని, భూగర్భ గనులు, ఓసీపీల్లో యంత్రాలను కొనుగోలు చేసి ఉత్పత్తి, ఉత్పాదకత పెంచాలని విన్నవించారు. పాతయంత్రాలతో ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు గతేడాది సాధించిన లాభాలు ప్రకటించి, కార్మికుల వాటా చెల్లించాలని కోరారు. స్పందించిన సీఎండీ.. కార్మికులకు గతం కన్నా ఎక్కు వ లాభాలే వస్తాయని వెల్లడించారు. మాజీ ఎ మ్మెల్యేలు హరిప్రియ నాయక్, పుట్ట మధు, కోరుకంటి చందర్, దుర్గం చిన్నయ్య, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కోలేటి దామోదర్, టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మిరియాల రాజిరె డ్డి, ముఖ్య ప్రధాన కార్యదర్శి కె.కృష్ణ, వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసు రామమూర్తి పాల్గొన్నారు. టీబీజీకేఎస్ ఇన్చార్జి కొప్పుల ఈశ్వర్ -
పట్టుకోసం టీబీజీకేఎస్ వ్యూహం
● పూర్వవైభవం సాధించడమే లక్ష్యం ● ఇన్చార్జి కొప్పుల ఈశ్వర్ నజర్ గోదావరిఖని: సింగరేణి బొగ్గు గనుల సంస్థలో పూర్వవైభవం సాధించడం లక్ష్యంగా తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం(టీబీజీకేఎస్) ముమ్మ ర ప్రయత్నాలు చేస్తోంది. ఉమ్మడి కరీంనగర్, ఆ దిలాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో విస్తరించి న ఈ సంస్థలో సుమారు 40 వేల మంది పర్మినెంట్, మరో 30 వేల మంది కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తుండగా, ఇందకో 30వేల మంది వరకు పరోక్షంగా ఆధారపడి ఉన్నారు. వీరి సమస్యల పరిష్కారం, హక్కుల సాధన, యాజమాన్యంతో సమన్వయం కోసం గుర్తింపు కార్మిక సంఘంగా వ్యవహరించిన సమయంలో అనేక పోరాలు చే సింది. ఆ తర్వాత పరిణామాల నేపథ్యంలో అనే క ఒడిదొడుకులు ఎదుర్కొంటోంది. ‘గుర్తింపు’ ఎన్నికలు టార్గెట్గా.. సింగరేణిలో పట్టు సాధించడం, ఆ తర్వాత వచ్చే గుర్తింపు కార్మిక సంఘం, అసెంబ్లీ ఎన్నికల్లో విజయబావుటా ఎగురేయాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే యూనియన్ ఇన్చార్జిగా మాజీ మంత్రి, సింగరేణి కార్మిక వారసుడైన కొప్పుల ఈశ్వర్కు ఇటీవల బాధ్యతలు అప్పగించారు. పోటీనుంచి తప్పుకుని.. మళ్లీ తహతహ.. 2023 డిసెంబర్ 27 జరిగిన సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో టీబీజీకేఎస్ పోటీ నుంచి అకస్మాత్తుగా తప్పుకుంది. దీంతో కీలక నేత లు ఇతర యూనియన్లకు వలసబాట పట్టగా, యూనియన్ నీరుగారిపోయింది. ఇదేఅదనుగా ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ ప్రచారంలో దూ సుకెళ్లాయి. దీంతో ఏఐటీయూసీ గుర్తింపు కార్మి క సంఘంగా, ఐఎన్టీయూసీ ప్రాతినిధ్య సంఘంగా విజయం సాధించాయి. అప్పటినుంచి బీఆర్ఎస్ అధిష్టానం యూనియన్పై పెద్దగా ఆసక్తిచూపలేదు. టీబీజీకేఎస్ కార్యకలాపాలు కూడా సాగిన దాఖలాలు కనిపించలేదు. కొంతకాలం తర్వాత యూనియన్ అధ్యక్షుడిగా మిర్యాల రాజిరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ముఖ్య నేతలతో మళ్లీ కార్యకలాపాలు ప్రారంభించారు. కల్వకుంట్ల కవిత అరంగేట్రం.. ఎమ్మెల్సీ కవిత సింగరేణిలో జాగృతి సైన్యం పేరిట ఇటీవల డివిజన్ ఇన్చార్జిలను నియమించింది. జాగృతి, టీబీజీకేఎస్లోని తనకు అనుకూలమైన కొందరు నేతలతో ఇటీవల హైదరాబాద్లో సమావేశమయ్యారు. ఆ తర్వాత ఏరియా ఇన్చార్జిలనూ ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. టీబీజీకేఎస్ నేతలతో కేటీఆర్ భేటీ.. ఈ పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోల్బెల్ట్లోని మాజీ ప్రజాప్రతినిధులు, యూనియన్ ముఖ్య నేతలతో ఇటీవల సమావేశమయ్యారు. యూనియన్ బలోపేతంపై చర్చించి టీబీజీకేఎస్ ఇన్చార్జిగా కొప్పుల ఈశ్వర్ను నియమించారు. ఇప్పటివరకు గౌరవ అధ్యక్షురాలిగా కవిత ఉండగా.. ఈశ్వర్ను ప్రకటించి యూనియన్కు పూర్వవైభవం తేవా లని నేతలను సూచించడం చర్చకు దారితీసింది. పెరిగిన నిర్బంధం.. యూనియన్ ఇన్చార్జిగా నియమితులై తొలిసారి గోదావరిఖని పర్యటనకు వచ్చిన కొప్పుల ఈశ్వర్.. ఓ ప్రైవేట్ ఫంక్షన్హాల్లో సోమవారం సమావేశమయ్యారు. ఆత్మీయ సన్మానం పేరిట జరిగిన ఈ కార్యక్రమానికి హాజరయ్యే నాయకులపై పోలీసు నిర్బంధం పెంచారని ఈశ్వర్ విమర్శలు చేయడం చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు.. టీబీజీకేఎస్ నేతలను అక్రమంగా బదిలీ చేశారని, వాటిని రద్దు చేయాలని, ఇదేవిషయంపై కోల్బెల్ట్ మాజీ ఎమ్మెల్యేలతో సింగరేణి సీఎండీని కలిసి విన్నవిస్తామన్నారు. అంతేకాదు.. యూనియన్ బలోపేతానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో బహిరంగ సభ నిర్వహిస్తామని ప్రకటించడం ద్వారా యూనియన్నుకు పూర్వవైభవం తేవాలని యోచిస్తున్నారు. మరోవైపు.. స్థానిక ఎన్నికలకు ప్రభుత్వం సన్నద్ధమవుతున్న వేళ.. యూనియన్ శ్రేణుల్లో చైతన్యం తెచ్చి బీఆర్ఎస్నూ కోల్బెల్ట్లో పటిష్టం చేయాలని కేటీఆర్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఒకవైపు ఇంటిపోరు, మరోవైపు బయటి పోరుకు చెక్పెట్టేలా సింగరేణి నుంచి కార్యాచరణ అమలు చేస్తున్నట్లు చర్చించుకుంటున్నారు. -
అర్హులందరికీ రేషన్కార్డులు
● కారు, ట్రాక్టరు ఉందంటూ నిరాకరించొద్దు ● పేద కుటుంబాలకు న్యాయం చేయాలి ● మహిళల ముఖంలో చిరునవ్వే లక్ష్యం ● ఎమ్మెల్యే విజయరమణారావు ● కొత్తరేషన్కార్డులు పంపిణీ పెద్దపల్లిరూరల్: మహిళల ముఖంలో చిరునవ్వు చూడాలన్నదే సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. అడిషనల్ కలెక్టర్ వేణుతో కలిసి నియోజకవర్గంలోని పెద్దపల్లి, సుల్తానాబాద్, కాల్వశ్రీరాంపూర్, ఓదెల, జూలపల్లి, ఎలిగేడు మండలాలకు చెందిన 4,847మందికి కొత్త రేషన్కార్డులను జిల్లా కేంద్రంలో మంగళవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కారు, ట్రాక్టర్ ఉందనే నిబంధనతో అర్హులైన కొందరు పేదలకు అన్యాయం జరుగుతోందని తన దృష్టికి వచ్చిందని, దానిని పరిగణనలోకి తీసుకోకుండా రేషన్కార్డు జారీచేయాలని అధికారులకు సూచించారు. డీఎస్వో శ్రీనాథ్, తహసీల్దార్లు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అన్నయ్యగౌడ్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్లు ప్రకాశ్రావు, స్వరూప తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో కార్పొరేట్ వైద్యం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో అన్నిరకాల వైద్య సేవలు కార్పొరేట్ స్థాయిలో ఉచితంగా అందిస్తున్నామని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో చేపట్టిన ఉచిత కళ్లద్దాల పంపిణీని ఆయన డీసీహెచ్ఎస్ శ్రీధర్తో కలిసి మంగళవారం ప్రారంభించారు. పెద్దపల్లి సర్కారు ఆస్పత్రిలోనే ఆర్నెల్లుగా కంటి ఆపరేషన్లు చేస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు. ఏఎంసీ చైర్పర్సన్ ఈర్ల స్వరూప, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు అన్నయ్యగౌడ్ పాల్గొన్నారు. -
ఆపరేషన్లు విజయవంతం
సేవలు ఉచితం..● పెద్దపల్లిలోనే కంటి ఆపరేషన్లు ● కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా సేవలు ● దూరప్రాంతాల నుంచి కూడా తరలివస్తున్న పేషెంట్లు ● శస్త్రచికిత్సలు చేసుకున్న వారికి ఉచితంగా కళ్లద్దాలు పంపిణీపెద్దపల్లిరూరల్: మానవ శరీరంలోని అవయవాలు అన్నింటిలోనూ కళ్లు అత్యంత ప్రధానమైనవి. మనచుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూడటానికి ఇవే మూలకారణం. అలాంటి నేత్రాలు సమస్యల్లో చి క్కుకుంటే.. కార్పొరేట్స్థాయికి మించి నాణ్యమైన వైద్యం అందిస్తున్నారు స్థానిక ప్రభుత్వ వైద్యులు. పేదలకు ఇలాంటి ఖరీదైన వైద్యసేవలను అందుబాటులోకి తేవాలనే కలెక్టర్ కోయ శ్రీహర్ష ప్రత్యేక చొరవతోనే ఇది సాధ్యమైంది. కంటి సమస్యలతో ఆస్పత్రికి వచ్చేవారికి శస్త్ర చికిత్సలు అవసరమైతే కరీంనగర్ లాంటి ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని గుర్తించి, జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలోనే కంటి ఆపరేషన్లు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించి అవసరమైన పరికరాలు సమకూర్చారు. ఆర్నెల్ల క్రితమే ఆపరేషన్ థియేటర్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. అప్పట్నుంచి జిల్లా ఆస్పత్రిలోనే అవసరమైన వారంరికీ కంటి ఆపరేషన్లు చేస్తున్నారు. ఆపరేషన్లు వందశాతం విజయవంతమవుతుండడంతో జిల్లా ప్రజలే కా కుండా పొరుగు జిల్లాల నుంచి కూడా బాధితులు ఇక్కడికి ఆపరేషన్ల కోసం భారీగా తరలివస్తున్నారు. జిల్లా ఆస్పత్రిలో కంటి ఆపరేషన్లు చేయించుకున్న వారికి ఉచితంగా కళ్లద్దాలు అందించేందుకు లయన్స్క్లబ్ ప్రతినిధులు కూడా ముందుకొచ్చారు. దీంతో పేదలకు పైసా ఖర్చులేకుండా ఉచితంగా కంటి ఆపరేషన్లు సాగుతున్నాయి. స్వచ్ఛంద సంస్థల సహకారంతో.. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో కంటి ఆపరేషన్లు చేయకముందు కంటి సమస్యలతో బాధపడే పేషెంట్లు శస్త్రచికిత్సల కోసం లయన్స్క్లబ్, ఇతర స్వచ్ఛంద సంస్థలు నిర్వహించే ఉచిత వైద్యశిబిరాలపై ఆధారపడేవారు. అందులో కంటి ఆపరేషన్ తప్పనిసరని నిర్ధారిస్తే.. సుదూరంలోని రేకుర్తి కంటి ఆస్పత్రికో, లేదా, కరీంనగర్లోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి ఆపరేషన్లు చేయించుకునేవారు. ఇందుకోసం అధిక వ్యయప్రయాసలు పడేవారు. ఆరు నెలలుగా ఇక్కడే సేవలు.. జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో ఈ ఏడాది జనవరి నుంచి కంటి ఆపరేషన్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. గతేడాది అక్టోబర్లోనే ఆపరేషన్లకు అవసరమైన వైద్య పరికరాలు కొనుగోలు చేసినా.. అవసరమైన గది అందుబాటులోకి రాలే దు. ఆ తర్వాత దానిని అందుబాటులోకి తీసుకొచ్చి జనవరి నుంచి శస్త్రచికిత్సలు చేస్తున్నట్లు వైద్యాధికారులు తెలిపారు. ప్రతీనెల కనీసం 100 వరకు కంటి ఆపరేషన్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ఆస్పత్రిలో ఆపరేషన్లు చేయించుకున్న వారికి ఉచితంగానే కళ్లద్దాలు కూడా అందించేందుకు లయన్స్క్లబ్ స్వచ్ఛందంగా ముందుకొచ్చింది. -
యాగంలో పీఠాధిపతులు
గోదావరిఖనిటౌన్: రాష్ట్రీయ సాధు సంరక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు తుడి శ్రావణ్కుమార్ ఆధ్వర్యంలో స్థానిక సత్యసాయి మందిరంలో రెండోరోజు మంగళవారం మహాసుదర్శన యాగం, కుంకుమార్చన నిర్వహించారు. కేదారనాథ్ క్షేత్ర పీఠాధిపతి రుద్రస్వామితోపాటు పీఠాధిపతులు అంబికేశ్వరాస్వామి, కరుణనందగిరిస్వామి, కల్యాణనంద భారతీస్వామి, రాఘవేంద్రస్వామి, త్రిశక్తి షణ్ముఖస్వామి, మాతా మహేశ్వరిదేవిజీ, శివ ప్రియానందస్వామి, భక్తులు తదితరులు పాల్గొన్నారు. రైల్వే స్టేషన్లో తనిఖీలు రామగుండం: స్థానిక రైల్వేస్టేషన్లో మంగళవారం డాగ్స్క్వాడ్తో సోదాలు చేశారు. య శ్వంత్పూర్–గోరఖ్పూర్ వెళ్తున్న రైలు ప్లాట్ఫారంపై నిలిచి ఉన్న సమయంలో క్షుణ్ణంగా తని ఖీ చేశారు. సంఘ విద్రోహక శక్తులు రైళ్లు టార్గెట్గా విధ్వంసాలకు పాల్పడే అవకాశం ఉందనే కేంద్ర నిఘా సంస్థ ఆదేశాల మేరకు ఆకస్మికంగా సోదాలు చేశారు. స్థానికులకే అవకాశం ఇవ్వాలి జ్యోతినగర్(రామగుండం): స్థానిక లారీలకే ర వాణా అవకాశం కల్పించాలని గోదావరిఖని లారీ యజమానులు కోరారు. ఈమేరకు ఎన్టీపీ సీ ప్రాజెక్టు లేబర్ గేట్ వద్ద మంగళవారం నిరసన తెలిపారు. లోడ్తో వచ్చే స్థానికేతర లారీ లను నిలిపివేశారు. చాలామంది నిరుద్యోగులు ఉపాధి కోసం లారీలు కొనుగోలు చేశారని, స్థా నికేతర లారీలతో స్థానికులకు లోడింగ్ సౌక ర్యం ఉండడంలేదు, తద్వారా ఆర్థిక ఇబ్బందు లు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశా రు. అధికారులు జోక్యం చేసుకోవాలని వారు కోరారు. లారీ యజమానుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు శ్రీనివాసరెడ్డి, దామోదర్రెడ్డి. బాపన్న తదితరులు పాల్గొన్నారు. సమస్యల పరిష్కారంపై దృష్టి యైటింక్లయిన్కాలనీ(రామగుండం): కార్మికుల సమస్యల పరిష్కారంపై దృష్టి సారిస్తున్నామని బీఎంఎస్ రాష్ట్ర అద్యక్షుడు యాదగిరి సత్తయ్య అన్నారు. స్థానిక యూనియన్ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీఎంఎస్ ఆవిర్భవించి 70 ఏళ్లు పూర్తికావొస్తున్నందున ఈనెల 23న బొగ్గు గనులు, డిపార్ట్మెంట్లు, యూనియన్ కార్యాలయాల్లో వేడుకలు నిర్వహిస్తామని తెలిపారు. నాయకులు సారంగపాణి, వేణుగోపాల్రావు, వడ్డెపల్లి కుమారస్వామి, గట్టు శ్రీనివాస్, రవీందర్, లింగం నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఓపీ రిజిస్ట్రేషన్కు ప్రత్యేక షెడ్డు కోల్సిటీ(రామగుండం): గోదావరిఖని ప్రభు త్వ జనరల్ ఆస్పత్రి(జీజీహెచ్)లో ఓపీ రిజిస్ట్రే షన్ కౌంటర్ల వద్ద పేషెంట్ల రద్దీని అధిగమించ డానికి కలెక్టర్ ఆదేశాలతో అధికారులు చర్యలు చేపట్టారు. ఒకేచోట ఓపీ రిజిస్ట్రేషన్ చేసేలా రేకులతో షెడ్డు నిర్మిస్తున్నారు. ఈ పనులను వేగవంతంగా పూర్తి చేయడానికి అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. రేపు సికింద్రాబాద్లో జాబ్మేళాపెద్దపల్లిరూరల్: జిల్లాలోని విద్యావంతులైన నిరుద్యోగ యువకులకు ఈనెల 24న (గురువారం) సికింద్రాబాద్లో జాబ్మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి తిరుపతిరావు తెలిపారు. సీతారామ స్పిన్నర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో కోర్స్పిన్ యార్న్ తయారీ చేస్తోందని, విస్తరణలో భాగంగా 300 పోస్టులను భర్తీ చేస్తారని పేర్కొన్నారు. ఆసక్తి గలవారు సికింద్రాబాద్లోని మినర్వాకాంప్లెక్స్ ఆరోఅంతస్తు ఆఫీసు నంబరు 608లో తమ పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. వివరాలకు 90631 73935, 73374 59857 నంబర్లలో సంప్రదించాలని ఆయన సూచించారు. -
క్రమశిక్షణతో పనిచేయాలి
ఓదెల(పెద్దపల్లి): పోలీస్ సిబ్బంది క్రమశిక్షణతో పనిచేయాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా సూచించారు. పొత్కపల్లి పో లీస్స్టేషన్ను సీపీ మంగళవారం తనిఖీ చేశారు. సీజ్ చేసిన వాహనాలు, పరిసరాలు పరిశీలించా రు. ఠాణా ఆవరణలో మొక్క నాటారు. అనంత రం మాట్లాడుతూ, విధి నిర్వహణలో ప్రతిభ చూ పిన సిబ్బందికి రివార్డులు అందజేస్తామని అన్నా రు. మావోయిస్టుల కదలికలు, వారి కుటుంబ నేపథ్యం గురించి ఆరా తీశారు. అసాంఘిక కార్యకలాపాలను కట్టడి చేయాలని సూచించారు. ఇన్చార్జి ఏసీపీ శ్రీనివాస్, సీఐ సుబ్బారెడ్డి, పొ త్కపల్లి, ఎస్సైలు రమేశ్, వెంకటేశ్ పాల్గొన్నారు. -
సీజనల్ వ్యాధుల నియంత్రణకు చర్యలు
● పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి ● మురుగునీటి నిల్వలు తొలగించాలి ● దోమలను నివారించాలి ● కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశాలు పెద్దపల్లిరూరల్: సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా గ్రామస్థాయిలోనే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. కలెక్టరేట్లో మంగళవారం అడిషనల్ కలెక్టర్ అరుణశ్రీతో కలి సి సీజనల్ వ్యాధుల నియంత్రణకు తీసుకోవాల్సి న చర్యలపై సమీక్షించారు. అధికారులు, సిబ్బంది పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యమివ్వాలన్నారు. రోడ్లు, డ్రైనేజీల్లో చెత్తాచెదారం లేకుండా చూడాలన్నారు. డ్రైనేజీల్లో ఆయిల్బాల్స్ వేసి దో మలను నియంత్రించాలన్నారు. డెంగీ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యసేవలు అందించేలా ఏర్పా ట్లు చేసుకోవాలన్నారు. డీఎంహెచ్వో అన్నప్రసన్నకుమారి, డీఎల్పీవో వేణుగోపాల్, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్ ఉన్నారు. ఈ సందర్భంగా రె వెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో జరిగిన వీడియో కాన్ఫరెన్స్కు కలెక్టర్ హాజరయ్యా రు. భూసంబంధ సమస్యలపై అందిన దరఖా స్తులు పరిష్కరించాలని మంత్రి సూచించారు. భూభారతి ప్రకారం దరఖాస్తులను 4 కేటగిరీలు గా విభజించి పరిష్కరించాలన్నారు. రెసిడెన్షియ ల్ స్కూల్ విద్యార్థులకు మెరుగైన వసతి, నాణ్యమైన భోజనం అందించాలని అన్నారు. ఆర్డీవో గంగయ్య, డీఈవో మాధవి, డీఎంహెచ్వో అన్న ప్రసన్నకుమారి, డీఎఫ్వో శివయ్య ఉన్నారు. -
భూపాలపల్లి నుంచి వచ్చిన
పెద్దపల్లి సర్కార్ దవాఖానలో మంచిగ చూస్తుండ్ర ని తెలుసుకున్న. నాకు కంటి ఆపరేషన్ అవస రం కావడంతో భూపాలపల్లి నుంచి వచ్చిన. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆపరేషన్ చేసిండ్రు. ప్రైవేట్ దవాఖాన కన్నా సర్కార్ ఆస్పత్రిల మంచిసౌలతులున్నయ్. – తుపాకుల లక్ష్మి, భూపాలపల్లి పేషెంట్ల సంఖ్య పెరిగింది జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో కంటి వైద్యం కోసం వచ్చే పేషంట్ల సంఖ్య పెరిగింది. డాక్టర్ సబిహతో కలిసి అవసరమైన వారికి ఆపరేషన్లు ఇక్కడే చేస్తున్నాం. జిల్లానుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా పేషెంట్లు వస్తున్నారు. నాణ్యమైన ఇంపోర్టెడ్ లెన్స్లనే ఆపరేషన్లలో ఉపయోగిస్తున్నాం. – సింధూర, నేత్రవైద్య నిపుణురాలు మెరుగైన సేవలందిస్తున్నాం జిల్లా ప్రధాన ఆస్పత్రికి వచ్చే పేషెంట్లకు మెరుగైన సేవలు అందిస్తున్నాం. కంటి జబ్జుతో బాధపడేవారికి ఇతర ప్రాంతాల్లో శస్త్రచికిత్సలు జరిగేవి. కలెక్టర్ ప్రత్యేక చొరవతో ఇక్కడే ఆపరేషన్లు చేస్తున్నాం. ప్రతీనెల 100 నుంచి 120 దాకా ఆపరేషన్లు జరుగుతున్నాయి. – శ్రీధర్, జిల్లా ఆస్పత్రుల సూపరింటెండెంట్ -
ఇంటర్ లాకింగ్ స్టార్ట్!
● పెద్దపల్లి–కరీంనగర్ లైన్ల అనుసంధానం షురూ ● 24 నుంచి 27 వరకు పనులు చేపట్టనున్న దక్షిణ మధ్య రైల్వే ● కాజీపేట బల్హర్షా మార్గంలో పలు రైళ్ల మళ్లింపు ● కొన్ని పూర్తిగా రద్దు, మరి కొన్ని ఆలస్యం ● బైపాస్ స్టేషన్ నిర్మించే వరకూ పెద్దపల్లిలోనే రైళ్ల హాల్టింగ్సాక్షిప్రతినిధి,కరీంనగర్: ఎట్టకేలకు పెద్దపల్లి–జగిత్యాల సెక్షన్, కాజీపేట–బల్హార్షా సెక్షన్ ఇంటర్లాకింగ్ పనులు మొదలు కానున్నాయి. ఉమ్మడి జిల్లా ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రయాణికుల కలనెరవేరనుంది. పెద్దపల్లి రైల్వే జంక్షన్కు సమీపంలో బైపాస్ రైల్వే మార్గాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి ఈ నెల 24 నుంచి 27 వరకు ఇంటర్ లాకింగ్ పనులను దక్షిణమధ్య రైల్వే చేపట్టనుంది. దీంతో కాజీపేట–బల్లార్షా సెక్షన్, పెద్దపల్లి–జగిత్యాల మార్గాలను అనుసంధానం పూర్తికానుంది. ఈ కారణంగా కాజీపేట నుంచి బల్లార్షా మార్గంలో నడిచే పలు రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు, కొన్ని రైళ్లను పూర్తిగా రద్దు చేశారు.రద్దయిన రైళ్లు 67771/72 కరీంనగర్–సిర్పూర్ టౌన్ నుంచి కరీంనగర్ మెము ఎక్స్ ప్రెస్ ( 25 నుంచి 27 వ తేదీలో ) 17003/04 రామగిరి మెము ఎక్స్ ప్రెస్ ( 25 నుంచి 27 వ తేదీల్లో) 17035/36 బల్లార్షా నుంచి కాజీపేట నుంచి బల్లార్షా ఎక్స్ ప్రెస్ ( 24 నుంచి 26 తేదీల్లో ఎగువ మార్గంలో బల్లార్షా వైపు , 25 నుంచి 27 తేదీల్లో దిగువ మార్గంలో కాజీపేట వైపు ) 12757/58 సికింద్రాబాద్ నుంచి సిర్పూర్ కాగజ్ నగర్ నుంచి సికింద్రాబాద్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైళ్లను ఈ నెల 25 నుంచి 27 తేదీల్లో పూర్తిగా రద్దుచేశారు. -
సుదర్శన హోమం ప్రారంభం
గోదావరిఖనిటౌన్: రాష్ట్రీయ సాధు సంరక్షణ సమితి జిల్లా శాఖ ఆధ్వర్యంలో స్థానిక జీఎంకాలనీ శ్రీసత్యసాయి మందిరంలో సోమవారం నుంచి బుధవారం వరకు నిర్వహించే మహాసుదర్శన హోమం సోమవారం ప్రారంభమైంది. సంస్థ జిల్లా అధ్యక్షుడు తుడి శ్రావణ్ కుమార్ స్వామీజీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. పలు రాష్ట్రాల పీఠాధిపతులు హాజరయ్యారు. తొలిరోజు మహాగణపతి పూజ, హోమం, స్వస్తిపుణ్య హవచనం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. లోక కల్యాణార్ధం ఈ కార్యక్రమం చేపట్టారు. రాజరాజేశ్వర పీఠాధిపతి అంబికేశ్వరానంద స్వామి, త్రిశక్తి షణ్ముఖానందస్వామి, కరుణానందగిరి స్వామి, మాతా మహేశ్వరి, అభినవ కల్యాణనంద భారతీస్వామి, రాఘవేంద్రస్వామి, భక్తులు అరవింద్, కోమల మహేశ్, మచ్చ విశ్వాస్, మీసాల కృష్ణ, కుమారస్వామి, అమ్మ రాజు, మల్లేశ్వర్రావు, శంకరయ్య, బంగారి సునీల్ తదితరులు పాల్గొన్నారు. -
● వన్టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి
గోదావరిఖని: అనుమానితులు సంచరిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని గోదావరిఖని వన్టౌన్ సీఐలు ఇంద్రసేనారెడ్డి, రవీందర్ సూచించారు. స్థానిక ఇందిరానగర్లో సోమవారం కమ్యూనిటీ కాంట్రాక్ట్ పోగ్రాం నిర్వహించారు. పలు ఇళ్లలో సోదాలు చేశారు. ధ్రువీకరణపత్రాలు లేని వాహనాలను సీజ్చేసి యజమానులకు జరిమానా విధించారు. ఇతర రాష్టాలు, ప్రాంతాల నుంచి వచ్చి కూలీ పనులు చేసేవారు ఎక్కువమంది ఈప్రాంతంలోనే నివాసం ఉంటున్నారని, ఇళ్లు అద్దెకు ఇచ్చే వారు వలసవచ్చే వారిపూర్తి వివరాలు, ఎక్కడ నుంచి వచ్చారు, గతంలో ఎక్కడ ఉన్నారు, వారి కుటుంబ సభ్యులు, ఆధార్ వివరాలు తెలుసుకోవాలని సూచించారు. గంజాయి లాంటి మత్తు పదార్థాల విక్రయాలు, రవాణా, వినియోగం లాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930 నంబరుకు ఫోన్ చేసి సమాచారం అందిస్తే డబ్బులు తిరిగి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని అన్నారు. ప్రతీఒక్కరు ట్రాఫిక్ రూల్స్, రోడ్ సేఫ్టీ నిబంధనలు పాటించాలన్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకొని నేరాలు నియంత్రణకు సహకరించాలని వారు కోరారు. కార్యక్రమంలో గోదావరిఖని వన్టౌన్ ఎస్సై రమేశ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
కల్యాణ వైభోగమే
● తలంబ్రాలకు వేళాయె ● 25 నుంచి పెళ్లి సందడి ● ఉమ్మడి జిల్లాలో సుమారు 5 వేల జంటల పెళ్లిళ్లు ● ఫంక్షన్ హాళ్లు, ఫొటోగ్రాఫర్లు బిజీ బిజీ ● పెరిగిన వస్త్రాలు, బంగారం కొనుగోళ్లుపెళ్లి బాజాలు మోగనున్నాయి. ఈనెల 25 శ్రావణమాసం మొదలు నవంబర్ చివరి వరకు ఊరువాడ పెళ్లి సందడి నెలకొననుంది. బంగారు నగల దుకాణాలు, పెళ్లివస్త్రాలయాలు కొనుగోలుదారులతో సందడిగా మారుతున్నాయి. ఉమ్మడి కరీంనగర్తో పాటు సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి వంటి జిల్లాల్లో సుమారు 5వేలకు పైగా పెళ్లిళ్లు జరిగే అవకాశం ఉందని ముహూర్తాలు నిర్ణయించే పురోహితులు చెప్తున్నారు. కాగా, మారిన కాలానికి అనుగుణంగా సంగీత్, మెహెందీ, ప్రీ వెడ్డింగ్, పోస్ట్ వెడ్డింగ్ షూటింగ్ వంటి అదనపు కార్యాలు చోటు చేసుకుంటూ వివాహ వ్యయాన్ని భారీగా పెంచేశాయి. జీవితంలో ఒకేసారి జరిగే వేడుకనే కారణంగా సామాన్య, మధ్య తరగతి ప్రజలు కూడా వివాహాలకు భారీగా ఖర్చు చేస్తున్నారు. సగటున ఒక్కో పెళ్లికి రూ.10 లక్షలకు తగ్గకుండా ఖర్చు పెడుతుండడం ఇప్పుడు సర్వసాధారణమైంది. – సిరిసిల్లకల్చరల్/విద్యానగర్(కరీంనగర్) -
ఓ మనిషి ఒత్తిడికి చిక్కకు!
● పెరుగుతున్న బ్రెయిన్ సంబంధ వ్యాధులు ● జాగ్రత్తలు పాటిస్తే ప్రమాదం లేదంటున్న వైద్యులు ● నేడు ప్రపంచ మెదడు దినోత్సవం‘గతం గురించి ఆలోచించను. భవిష్యత్తుపై బెంగపెట్టుకోను. వర్తమానంలోనే జీవిస్తా. అందుకు తగ్గట్టు ప్రణాళికలు రచిస్తా. ఫలితం కంటే ప్రక్రియపై దృష్టిసారిస్తా. ప్రక్రియ ఉప ఉత్పత్తే ఫలితం’ అని అంటాడు మహేంద్రసింగ్ ధోని. మనిషి శరీరంలో మెదడు అద్భుత శక్తివంతమైన భాగం. ప్రశాంతతకు, మన భవితను నిర్ణయించే నిర్ణయాలు తీసుకోవడంలో మెదడుపాత్ర అత్యంత కీలకం. సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందినకొద్దీ మెదడుపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ తరుణంలో మనిషి మెదడుకు మరింత పదును పెట్టాల్సిన పరిస్థితి. సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసేవారు రోజుకు 12 గంటలు కంప్యూటర్లకే అతుక్కుని పోతుండగా.. ఏ పనీపాట లేనివారు రోజుకు 18 గంటలు సెల్ఫోన్లో గడుపుతున్నారు. మెదడు ఒత్తిడికి గురై న్యూరో సమస్యలు పెరుగుతున్నాయి. బ్రెయిన్ స్ట్రోక్, డిమెన్షియా, అల్జీమర్స్, బ్రెయిన్ ట్యూమర్ వంటి మెదడు వ్యాధులతో బాధపడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఏటా జూలై 22న జాతీయ మెదడు దినోత్సవం నిర్వహిస్తున్న సందర్భంగా కథనం.. –కరీంనగర్టౌన్ -
● అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు ● ఎమ్మెల్యే విజయరమణారావు ● పెద్దపల్లి, ఓదెల మండలాల్లో ఆకస్మిక పర్యటన ● పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
పెద్దపల్లిరూరల్: నియోజకవర్గంలోని అన్ని పల్లె ల్లో ప్రజలకు కనీస మౌలిక వసతులను కల్పించ డం లక్ష్యమని ఎమ్మెల్యే విజయరమణారావు అ న్నారు. పెద్దపల్లి మండలం మూలసాలలో రూ. 59లక్షల అంచనా వ్యయంతో చేపట్టిన పనులను ఆయన సోమవారం ప్రారంభించి మాట్లాడారు. పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ ప్రజాసంక్షేమాన్ని వి స్మరించిందని ఆరోపించారు. సీఎం రేవంత్రెడ్డి సారథ్యంలోని ప్రజాప్రభుత్వం అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు పంపిణీ చేయడంతోపాటు రేషన్కార్డులు జారీ చేస్తోందని తెలిపారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఈర్ల స్వరూప, నాయకులు వెంకటేశ్, శ్రీనివాస్, ఆరె సంతోష్, రాజేందర్, ముత్యాల నరేశ్, శంకర్, కొమురయ్య, అశోక్, రవి తదితరులు పాల్గొన్నారు. రూ.200 కోట్లతో అభివృద్ధి పనులు ఓదెల(పెద్దపల్లి): వివిధ గ్రామాల్లో రూ.200 కో ట్లతో చేపట్టిన అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయని ఎమ్మెల్యే విజయరమణరావు అన్నా రు. మండల కేంద్రంతోపాటు పలు గ్రామాల్లో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశాక మాట్లాడారు. అంగన్వాడీ కేంద్రాలకు సొంతభవనాలు నిర్మించేందుకు నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఓదెల మల్లికార్జునస్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు చేశారు. నాయకులు మూల ప్రేంసాగర్రెడ్డి, ఆళ్ల సుమన్రెడ్డి, బైరి రవిగౌడ్, సిరిశేటి రాహుల్గౌడ్, పిట్టల రవికుమార్, చీకట్ల మొండయ్య, గుండేటి మధు యాదవ్, ఎంపీడీవో తిరుపతి, ఆలయ ఈవో సదయ్య పాల్గొన్నారు. -
● త్వరలోనే ఏర్పాటుకు చర్యలు ● మైనార్టీల సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ ● మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్
పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రమైన పెద్దపల్లిలో ఉర్దూ మీడియం డిగ్రీ కాలేజీ ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని ఎస్సీ, ఎస్టీ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ అభయం ఇచ్చారు. జిల్లా కేంద్రంలోని మీర్జా అహమద్ బేగ్ నివాసంలో సోమవారం రాత్రి మైనార్టీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే విజయరమణారావుతో కలిసి మంత్రి అడ్లూరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, మైనార్టీల సంక్షేమానికి సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మైనార్టీలకు మీర్జా మహమ్మద్ బేగ్ కుటుంబం ఐదేళ్లుగా ఉచిత కంప్యూటర్ శిక్షణ కేంద్రం నిర్వహించడం సంతోషకరమన్నారు. ఉర్దూ మీడియం డిగ్రీ కాలేజీ ఏ ర్పాటు కోసం ఎమ్మెల్యే విజయరమణారావుతో కలిసి సీఎం దృష్టికి తీసుకెళ్తానని అడ్లూరి హామీ ఇచాచరు. మీర్జా మహమ్మద్ బేగ్తోపాటు మోహిబ్బేగ్, ట్రాన్స్కో ఎస్ఈ బొంకూరి సుదర్శన్, ఏఈ రవీందర్, ప్రతినిధులు మున్నాభాయి, జావీద్, మొయిద్, హాదీ సంజీవ్, అజీజ్, సారయ్య, శ్రీమాన్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
వీడియో కాన్ఫరెన్స్కు హాజరు
పెద్దపల్లిరూరల్: రాష్ట్రంలోని వివిధ జిల్లాల కలెక్టర్లతో సీఎం రేవంత్రెడ్డి సోమవారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్కు మన జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, పలువురు జిల్లాస్థాయి అధికారులు హాజరయ్యారు. సీఎం మాట్లాడుతూ, సాగుకు అవసరమైనంత మేరకే యూరియా తీసుకోవాలని, ఇతర అవస రాల కోసం పక్కదారి పట్టిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. వీడియో కా న్ఫరెన్స్లో కలెక్టర్తోపాటు అడిషనల్ కలెక్టర్ వేణు, డీఎంహెచ్వో అన్న ప్రసన్నకుమారి, డీఎస్వో శ్రీనాథ్, డీఏవో శ్రీనివాస్, ఆర్డీవో గంగయ్య, సురేశ్ తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగ భద్రత కల్పించండి రామగిరి(మంథని): సుమారు 18 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్న తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని సింగరేణిలోని ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు డిమాండ్ చేశారు. సోమ వారం ఆర్జీ–3 ఏరియాలోని ఎస్అండ్పీసీ కార్యాలయంలో సెక్యూరిటీ అధికారి షబ్బీరుద్దీన్కు వినతిపత్రాన్ని అందజేశారు. యాజమా న్యం ప్రకటించిన టెండర్ల ద్వారా వస్తున్న సెక్యూరిటీ ఏజెన్సీలు కొత్తగా నలుగురిని నియమించుకుంటున్నాయని, వారిరాకతో నెలకు 15 – 20 మస్టర్లు తమకు అందడంలేదన్నారు. తక్కువ మస్టర్లతో కుటుంబ పోషణ కష్టంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతీఒక్కరికి కనీసం 26 మస్టర్లు వచ్చేలా చర్యలు తీసుకోవాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ నాయకులు రాజేందర్, ఉడుత శంకర్, ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది పాల్గొన్నారు. నూతన కార్యవర్గం పెద్దపల్లిరూరల్: జిల్లాలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల అసోసియేషన్ జిల్లా కార్యవర్గాన్ని సోమవారం ఖరారు చేశారు. జిల్లా కేంద్రంలో జరిగిన సమావేశంలో అధ్యక్షుడిగా అత్తె రాజారాం(కాల్వశ్రీరాంపూర్), ప్రధాన కార్యదర్శిగా తాళ్లపల్లి రమేశ్(అంతర్గాం టీటీఎస్)ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడిగా వెంకటస్వామి(అప్పన్నపేట) అసోసియేట్ ప్రె సిడెంట్గా రాచర్ల శ్రీనివాస్, ఆర్థిక కార్యదర్శిగా పులి శ్రీనివాస్రెడ్డి, ప్రచార కార్యదర్శులుగా పి ల్లలమర్రి సత్తయ్య, దూస మల్లయ్య, రాచకొండ శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా వెంకటేశం, కృష్ణారెడ్డి, అంజనీదేవి, మంజులత, ఎస్తర్, కార్యదర్శులుగా సముద్రాల ప్రవీణ్కుమార్, రాజమ ణి, శ్యాంకుమార్, రమేశ్రెడ్డి ఎన్నికయ్యారు. రా ష్ట్ర నాయకులు శ్రవణ్రెడ్డి, మల్లన్న, మధుసూదన్రెడ్డి ఎన్నికల పరిశీలకులుగా వ్యవహరించా రు. కార్యవర్గాన్ని పలువురు అభినందించారు. యువతకు ఉచిత శిక్షణ పెద్దపల్లిరూరల్: ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీసీ స్టడీ సర్కిల్ ద్వారా గ్రూప్ 1, 2, 3, 4తోపాటు ఆర్ఆర్బీ, ఎస్సెస్సీ, బ్యాంకింగ్ రిక్రూట్మెంట్ పరీక్షలకు ఆగస్టు 25 నుంచి ఉచిత కోచింగ్ అందిస్తామని జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి రంగారెడ్డి సోమవారం తెలిపారు. 150 రోజుల పాటు శిక్షణ ఉంటుందని, అభ్యర్థులకు నెలకు రూ.1,000 స్టైఫండ్ చెల్లిస్తారన్నారు. ఆసక్తిగలవారు ఆగస్టు 11లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని, వివరాలకు 0878–2268686 నంబరులో సంప్రదించాలని పేర్కొన్నారు. మైనార్టీ విద్యార్థుల స్కాలర్షిప్ కోసం... పోస్ట్మెట్రిక్, జూనియర్, డిగ్రీ, ఇంజినీరింగ్, వృత్తివిద్యా కాలేజీల్లో చదివే మైనార్టీ విద్యార్థులు స్కాలర్షిప్ల కోసం ఈనెల 30లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని మైనార్టీ వెల్ఫేర్ ఇన్చార్జి అధికారి రంగారెడ్డి కోరారు. ప్రెష్, రెన్యూవల్ కోసం దరఖాస్తుచేసిన వారు హార్డుకాపీలను సంబంధిత కాలేజీలో అందించాలని ఆయన సూచించారు.సుల్తానాబాద్లో భారీవర్షం సుల్తానాబాద్(పెద్దపల్లి): మండల కేంద్రంతోపాటు సమీపంలోని పలు గ్రామాల్లో సోమవారం మధ్యాహ్నం భారీవర్షం కురిసింది. వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుంచి ఇంత భారీవర్షం కురవడం ఇదే తొలిసారి. ఇప్పటిదాకా ఉక్కపోతతో ఇబ్బంది ఎదుర్కొన్న మండల ప్రజలు.. వర్షంతో వాతారవణం చల్లబడడంతో ఊపిరి పీల్చుకుంటున్నారు. రైతులు వ్యవసాయ పనులు ముమ్మరం చేశారు. -
కాలువకు జీవం
మంథనిరూరల్: ఒకవైపు మట్టితో నిండి.. మరోవైపు తుమ్మచెట్లు, ముళ్లపొదలతో కమ్ముకుని ఆనవాళ్లు కోల్పోయిన ఎస్సారెస్పీ డీ–83 కాలువకు ఎట్టకేలకు జీవం పోస్తున్నారు. సుమారు రెండు దశాబ్దాల తర్వాత కెనాల్కు మోక్షం లభిండంతో చివరి ఆయకట్టుకూ సాగునీరు అందుతుందని రైతాంగం హర్షం వ్యక్తం చేస్తోంది. ఎగ్లాస్పూర్ సమీపంలోని డీ – 83 కాలువ పూడికతీత పనులు ఐదురోజుల క్రితం ప్రారంభించారు. గతంలోనూ పలుమార్లు పూడిక తీసినా.. పనులు నామమాత్రంగా చేపట్టడంతో కొన్నిరోజులకే పూడుకుపోయింది. చివరి ఆయకట్టుకు చుక్కనీరు చేరేది కాదు. ఈసారి ఆనవాళ్లు బయటపడేలా సంపూర్ణంగా పూడిక తీస్తుండడంతో సాగునీటికి ఢోకా లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇరవై ఏళ్ల తర్వాత.. ఇరవై ఏళ్ల తర్వాత మంథని మండలం రచ్చపల్లి నుంచి ఖానాపూర్ వరకు సుమారు 3 కి.మీ పొడవున డీ– 83 కెనాల్ పూడికతీత పనులు చేపట్టారు. సుమారు 20 ఏళ్లక్రితం కాలువ ని ర్మించారు. ఆ తర్వాత పూడికతో నిండిపోయింది. ప్రతీ సంవత్సరం పూడికతీత నామమాత్రంగా చేపట్టడంతో మట్టి, ముళ్లపొదలతో నిండిపోతూ వస్తోంది. ఈసారి సంపూర్ణంగా పనులు చేపట్టేందుకు రూ.6లక్షలు వెచ్చించారు. 1,500 ఎకరాలకు సాగునీరు.. ఎస్సారెస్పీ డీ– 83 కెనాల్ పూడికతీతతో ఆయకట్టు పరిధిలోని దాదాపు 1,500 ఎకరాలకు సంపూర్ణంగా సాగునీరు అందే అవకాశాలు ఉంటాయని భావిస్తున్నారు. గతంలో పూడికతో నిండిపోవడంతో చివరి ఆయకట్టుకు నీరు అందేది కాదు. రచ్చపల్లి, ఎగ్లాస్పూర్, ఖానాపూర్, శాస్త్రులపల్లి గ్రామాల్లోని చివరి ఆయకట్టు పంటలు నీళ్లు అందక ఏటా ఎండిపోయేవి. ఈసారి ఆ భూములకు కాలువ ద్వారా సాగునీరు అందనుంది. నివాసాల్లోకి.. రోడ్లపైకి.. దిగువన కాలువ పూడికతో నిండిపోవడంతో నీళ్లు వెళ్లే పరిస్థితి ఉండేది కాదు.. ప్రత్యామ్నాయంగా ఊళ్లలోకి సాగునీరు ప్రవేశించేది. కాలువ ద్వారా నీళ్లు వదిలితే ఏటా ఎగ్లాస్పూర్ గ్రామపంచాయతీ పరిధిలోని బైరన్గడ్డలో నీళ్లు వరదలా ప్రవహించేవి. కొన్ని నివాసాలను ముంచెత్తేవి. మరికొన్ని పంట పొలాల్లోకి చేరి పంటలకు నష్టం కలిగించేవి. అంతేకాదు.. కాలువలో పూడిక నిండి దుర్గంధం వెదజల్లేది. విషపురుగులు, సర్పాలకు నిలయంగా మారేది. ఈసారి పూడికతీతతో ఆ పరిస్థితి ఉండదని స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రెండు దశాబ్దాల తర్వాత పూడికతీత 1,500ఎకరాలకు సాగునీరు అందే అవకాశం రూ.6లక్షలతో పనులు చేపట్టిన అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్న ఆయకట్టు రైతులు -
టార్గెట్ టీబీజీకేఎస్
● చురుకై న నేతలపై బదిలీ వేటు ● మరికొందరిపైనా ఇదే అస్త్రం? ● ఉద్యోగ విరమణ చేసేవారిని కూడా వదలని యాజమాన్యం ● రాజకీయ కోణంలోనే ట్రాన్స్ఫర్లని విమర్శలు ● పాలనాపరమైన చర్యల్లో భాగమే అంటున్న సింగరేణి ● బదిలీలను రద్దు చేయాలని కార్మికుల డిమాండ్ గోదావరిఖని: సింగరేణి బొగ్గు గనుల సంస్థలో పదేళ్లపాటు గుర్తింపు కార్మిక సంఘంగా వ్యహరించి అనేక సమస్యలు పరిష్కరించి, ఎన్నో హక్కులు సాధించి పెట్టిన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం(టీబీజీకేఎస్) టార్గెట్గా రాజకీయ బదిలీలు చోటుచేసుకుంటున్నాయనే చర్చ కోల్బెల్ట్లో ప్రా రంభమైంది. యూనియన్ ఇన్చార్జిగా మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ను నియమించిన క్రమంలోనే ముఖ్య నాయకుల బదిలీ కావడం సర్వత్రా ఆందోళనకు దారితీస్తోంది. ఉద్యోగ విరమణకు ఏడాది గడువున్న నాయకులను కూడా వదిలిపెట్టకుండా మణుగూరు, ఇల్లెందు తదితర సుదూర ఏరియాలకు బదిలీ చేయడం రాజకీయ కోణంలో భాగమేనని కార్మికులు, నాయకులు అంటున్నారు. రాజకీయ కక్షే అంటూ ప్రచారం.. టీబీజీకేఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసు రామమూర్తిని ఆర్జీ–2 ఏరియా నుంచి మణుగూరుకు, ఆర్జీ–2 ఏరియా వర్క్షాప్లో పనిచేస్తున్న బాలసాని కొమురయ్యను ఇల్లెందుకు బదిలీ చేశారు. ఆర్జీ–1 ఏరియా జీడీకే–5 ఓసీపీలో ఈపీ ఆపరేటర్గా పనిచేస్తున్న జాహిద్పాషాను మణుగూరు బదిలీ చేస్తూ యాజమాన్యం ఆదేశాలు జారీచేసింది. అయితే, రాజకీయ కక్షతోనే బదిలీలు వెలుబడ్డాయని ప్రచారం జరుగుతోంది. సింగరేణి వ్యాప్తంగా రామగుండం రీజియన్లో టీబీజీకేఎస్ బలంగా ఉందని, ఇక్కడ నాయకులను బదిలీ చేసి వారిలో ఆత్మస్థైర్యం దెబ్బతీయాలనే ఆలోచనతో అధికార కాంగ్రెస్ పార్టీ, దాని అనుబంధ ఐఎన్టీయూసీ.. సింగరేణి ద్వారా బదిలీ ఉత్తర్వులు ఇప్పించినట్లు ప్రచారం సాగుతోంది. అయితే వీరిలో కొమురయ్య యూనియన్ కార్యాకలాపాలకు దూరంగా ఉన్నప్పటికీ బదిలీ ఎందుకు చేశారో అర్థం కావడం లేదని కార్మికులు చర్చించుకుంటున్నారు. ముగ్గురిలో జావిద్ పాషాకు ఒక్కరికే 13 ఏళ్ల సర్వీస్ ఉందని వారు అంటున్నారు. హెచ్ఎంఎస్ నేతలకూ ఇదే అనుభవం.. రామగుండం రీజియన్లో పనిచేసిన హెచ్ఎంఎస్ నాయకులను కూడా గతంలో ఇదేవిధంగా సుదూర ప్రాంతాలకు సింగరేణి బదిలీ చేసిందని అంటున్నారు. అప్పటి గుర్తింపు కార్మిక సంఘంగా ఉన్న టీబీజీకేఎస్ మాతృ పార్టీ బీఆర్ఎస్ ఆకస్మిక బదిలీలకు తెరలేపిందని కార్మికులు గుర్తుచేసుకుంటున్నారు. అప్పుడు ముగ్గురు నాయకులను బదిలీచేసినా.. అక్కడకు వెళ్లలేక.. ఇక్కడ ఉండలేక సతమతమయ్యారు. అయితే, ఆనాడు ఆ బదిలీలపై ఎందుకు మాట్లాడలేదని హెచ్ఎంఎస్ అధ్యక్షుడు రియాజ్అహ్మద్.. అప్పుడు ‘సాక్షి’లో ప్రచురితమై బదిలీల కథనాన్ని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ చేయడం చర్చనీయాంశంగా మారింది. రద్దుకాని బదిలీ ఉత్తర్వులు.. బదిలీ ఉత్తర్వులతో నాయకులు ఆందోళనకు గురైనా.. ఏడాదిలోపే సర్వీస్ ఉండడంతో కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకోవాలని యత్నిస్తున్నారు. నిబంధనల ప్రకారం రెండేళ్ల సర్వీసు ఉన్న ఉద్యోగులను బదిలీ చేయొద్దని గతంలో హైకోర్టు తీర్పు ఇచ్చినట్లు కొందరు పేర్కొంటున్నారు. మరోవైపు.. ఒకవేళ బదిలీ ఉత్తర్వులు తీసుకుంటే బదిలీ అయిన వారికి రూ. 2లక్షల మేర రవాణా భత్యం వచ్చే అవకాశం ఉందని జీఎం కార్యాలయం సిబ్బంది పేర్కొంటున్నారు. మరో పదిమంది బదిలీకి రంగం సిద్ధం! సింగరేణిలోని మరో పదిమంది నేతలకూ బదిలీ తప్పకపోవచ్చనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే, ఎవరెవరు బదిలీ అవుతారు? కక్ష సాధింపు చర్యలు ఎక్కడ వరకు వెళ్తాయనే చర్చ జోరందుకుంది. నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన బదిలీల రద్దుకు కార్మిక సంఘాలు జేఏసీగా ఏర్పడి ఉద్యమించాలని నిర్ణయించాయి. నేడు గోదావరిఖనికి టీబీజీకేఎస్ ఇన్చార్జి టీబీజీకేఎస్ ఇన్చార్జి, మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ సోమవారం గోదావరిఖనికి రానున్నారు. ఇన్చార్జిగా నియామకమయ్యాక తొలిసారి వస్తున్న ఆయనకు ఘనస్వాగతం పలికేందుకు ఆ యూనియన్ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. యాజమాన్యం ఆదేశాల మేరకే బదిలీలు పాలనా పరమైన ఆదేశాల మేరకు బదిలీ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇందులో రాజకీయ కోణాలు ఏమీలేవు. అన్నీ నిబంధనల ప్రకారమే కొనసాగుతాయి. – లలిత్కుమార్, జీఎం, ఆర్జీ–1 -
బోనాల జాతరలో ఎమ్మెల్యే
గోదావరిఖని: రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్ ఆదివారం జరిగిన బోనా ల ఉత్సవంలో పాల్గొన్నారు. హైదరాబాద్లో జరిగిన ఉత్సవాల సందర్భంగా విజయదుర్గామాత ఆలయంలో పూజలు చేశారు.ముందస్తు పరీక్షలే మేలు రామగుండం: క్యాన్సర్ మహమ్మారి బారినప డకుండా ముందస్తు నిర్ధారణ పరీక్షలు చేయించడమే మేలని కాంగ్రెస్ ఓబీసీ సెల్ జిల్లా అ ధ్యక్షుడు పెండ్యాల మహేశ్, సీఐ ప్రవీణ్కు మార్ అన్నారు. అంతర్గాం మండలం పెద్దంపేటలో త్రిదండి చిన్నజీయర్స్వామి వికాస త రంగిణి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం గ్రామీ ణ మహిళలకు గర్భకోశ, సర్వైకల్ క్యాన్సర్ తదితర వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేశారు. ఆ హారపు అలవాట్లు, జీవనశైలిలో మార్పులతో నే ప్రాణాంతక వ్యాధులు ప్రబలుతున్నాయన్నారు. మహిళలు ఏటా క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకుంటూ సంపూర్ణ ఆ రోగ్యంగా ఉండాలని సూచించారు. మహిళా ఆరోగ్య వికాస్ సేవకులు పద్మ, లక్ష్మీ, ప్రసన్నలక్ష్మీ, మధుమిత, స్థానిక ప్రతినిధులు దీపిక, మాధవి, కవిత, లక్ష్మీ, సుకన్య, శారద, రమ, అంజలి, ప్రేమలత, పెద్దంపేట మాజీ సర్పంచ్ ఆముల శ్రీనివాస్ పాల్గొన్నారు. మొక్కలు నాటుదాం పెద్దపల్లిరూరల్: పర్యావరణాన్ని పరిరక్షించేందుకు విరివిగా మొక్కలను నాటాలని బీజేపీ పర్యావరణ పరిరక్షణ విభాగం జిల్లా అధ్యక్షు డు జంగ చక్రధర్రెడ్డి అన్నారు. పలువురు నా యకులతో కలిసి ఆయన ఆదివారం జిల్లా కేంద్రంలో మొక్కలు నాటారు. ప్లాస్టిక్ వినియోగంతో పెరుగుతున్న కాలుష్యాన్ని నియంత్రించేందుకు మొక్కలను నాటి కాపాడడమే పరిష్కారమన్నారు. కాలుష్యకారకాలను నియంత్రించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు దో హదపడే మొక్కలను నాటాలని కోరారు. మో దీ ప్రోగ్రాం జిల్లా కన్వీనర్ పల్లె సదానందం, నాయకులు మౌఠం నర్సింగం, మేరుగు రవీందర్, గనెబోయిన రాజేందర్, ముస్త్యాల సంతోష్, కాసనగొట్టు విజయ్, రాజం కొముర య్య, బూతగడ్డ నరేశ్, సారయ్య ఉన్నారు. చదరంగంతో మేధస్సు పెద్దపల్లిరూరల్: మేధాశక్తిని పెంపొందించే చ దరంగం అని, దీనిపై ఆసక్తి పెంచేందుకు జి ల్లా చదరంగ సమాఖ్య పాటుపడుతోందని స మాఖ్య జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గడ్డాల శ్రీ నివాస్, భానువిజయానంద్ అన్నారు. జిల్లా కేంద్రంలోని గాయత్రీ విద్యానికేతన్లో ఆదివారం జిల్లాస్థాయి చదరంగ పోటీలు నిర్వహించారు. మెదడుకు మేత పెట్టే చదరంగం పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులు గెలుపోటములను స్ఫూర్తిగా తీసుకోవాలని విద్యాసంస్థల చైర్మన్ అల్లెంకి శ్రీనివాస్ అన్నారు. సెల్ఫోన్ వినియోగం తగ్గించి మేధస్సును పెంచే చెస్పై దృష్టి సారించాలని ఆయన సూచించారు. విజేతలుగా నిలిచిన వారికి నగదు పా రితోషకం అందించారు. నూగూరి మహేందర్, ఉమామహేశ్వర్ తదితరులు ఉన్నారు. 3న బీసీ రాష్ట్ర సదస్సు సుల్తానాబాద్(పెద్దపల్లి): స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలనే డిమాండ్తో ఆగస్టు 3న హైదరాబాద్ విద్యానగర్లోని బీసీ భవన్ రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహించనున్నట్లు బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు తాళ్లపల్లి మనోజ్గౌడ్ తెలిపారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రా జ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య హాజరుకాను న్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లా ల నుంచి బీసీ సంఘాల నాయకులు, కుల సంఘాల నాయకులు, యువకులు, విద్యావేత్తలు, సామాజీకవేత్తలు, మహిళా నేతలు పెద్దఎత్తున తరలి రావాలని ఆయన కోరారు. -
ఆరుతడి పంటలే వేసేటోడిని
కాలువ నీళ్లు వస్తే వరి సాగయ్యేది. చివరి ఆయకట్టుకు నీళ్లు రాక అనేక ఏండ్లుగా నాకున్న మూడెకరాల్లో ఆరుతడి పంటలే వేసేటోడిని. ఇన్నేండ్లలో ఒక్కసారి కూడా కాలువ నీళ్లు రాలేదు. పూడికతీతతోనైనా ఈసారి వరి సాగు చేస్తా. – ఆర్తం సదానందం, రైతు, ఎగ్లాస్పూర్ చివరి ఆయకట్టుకూ సాగునీరు ఎస్సారెస్పీ డీ– 83 కెనాల్ చివరి ఆయకట్టుకు సాగునీరు అందేలా చర్యలు చేపట్టాం. ఇరవై ఏళ్లకుపైబడి కాలువలో పూడిక తీత చేపట్టకపోవడంతో పూర్తిగా మట్టితో నిండింది. నీళ్లు పారేవి కావు. ఈసారి పూర్తిస్థాయిలో మట్టి తొలగిస్తున్నాం. చివరను ఉన్న ఖానాపూర్ శివారు భూములకూ కాలువ ద్వారా సాగునీళ్లు అందిస్తాం. – రమేశ్బాబు, డీఈ, ఐబీ, మంథని -
మురుగునీటి ప్రవాహం ఇక సాఫీగా..
● ఎట్టకేలకు నాలాల్లో పూడికతీత పనులు ప్రారంభం ● కలెక్టర్ చొరవతో రూ.5 లక్షలు మంజూరు ● పనుల్లో వేగం పెంచిన అధికారులు ● సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు సుల్తానాబాద్(పెద్దపల్లి): సుల్తానాబాద్ మేజర్ గ్రామపంచాయతీగా దినదినాభివృద్ధి చెంది మున్సిపల్గా ఆవిర్భవించింది. ఆ తర్వాత సమీపంలోని పూసాల, సుగ్లాంపల్లి గ్రామాలను ఇందులో విలీనం చేశారు. దీంతో బల్దియా భౌగోళిక విస్తీర్ణం బాగా పెరిగింది. కొత్తకాలనీలు ఆవిర్భవిస్తున్నాయి. జనా భా కూడా పెరుగుతూ వస్తోంది. ఇదేసమయంలో ముగునీటి కాలువల నిర్మాణం అత్యవసరమైంది. పూడికతీయక.. రోడ్లపైకి మురుగు.. రోజురోజుకూ అభివృద్ధి చెందుతున్న మున్సిపల్ ప్రాంతంలో కొత్తగా మురుగునీటి కాలువలు ఆశించిన స్థాయిలో నిర్మించక.. ఉన్నకాలువల్లో పూడిక తీయక మురుగంతా రోడ్లపైకి వచ్చే చేరుతోంది. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండడంతో సమస్య జటిలమైంది. దోమలకు నిలయంగా మారే ప్రమాదం ఏర్పడింది. దీంతో మున్సిపల్ అధికారులు రంగంలోకి దిగారు. పారిశుధ్య కార్మికులు, వాహనాలతో పట్టణంలోని పలు ప్రధాన మురుగునీటి కాలువల్లో పూడికతీత ప్రారంభించారు. అయితే, వర్షాకాలం వచ్చిందంటేనే పనులు చేసి చేతులు దులుపుకోవడం పాలకవర్గాలు, అధికారులకు అలవాటై పోయిందని, మిగతా సమయాల్లో పూడికతీత సక్రమంగా ఎందుకు చేయడం లేదని పట్టణవాసులు మండిపడుతున్నారు. 15 వార్డులు.. సమస్యలు అనేకం.. మున్సిపాలిటీలో 15 వార్డులు ఉన్నాయి. ఆయా వార్డుల్లో అనేక సమస్యలు తీవ్రంగా ఉన్నట్టు గుర్తించినట్లు మున్సిపల్ కమిషనర్ రమేశ్ తెలిపారు. ప్రధానంగా శాస్త్రినగర్, స్వప్నకాలనీ, మార్కండేయకాలనీ, జవహర్నగర్, సుభాష్నగర్, ఆరేపల్లి, పూసాల, సుగ్లాంపల్లి, పోచమ్మవాడ, గౌడవీధి, జెండా ఏరియా తదితర ప్రాంతాల్లో మురుగునీటితోపాటు పారిశుధ్య సమస్యలు తీవ్రంగా ఉన్నట్లు గుర్తించావని పేర్కొన్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు వర్షపునీరు కాలువల్లో చేరుతోంది. అయితే, డ్రైనేజీలు సక్రమంగా లేక వరదతోపాటు మురుగునీరు సాఫీగా వెళ్లే పరిస్థితులు లేవు. కొందరు నాలాలు ఆక్రమించి నిర్మాణం చేపట్టడం ప్రధాన సమస్యగా ఏర్పడిందని అధికారులు గుర్తించారు. ఇలాంటి ఆక్రమణాలు తొలగిస్తే డ్రైనేజీ సమస్య తలెత్తేది కాదంటున్నారు. కలెక్టర్ చొరవతో నిధులు మంజూరు.. కలెక్టర్ కోయ శ్రీహర్ష ఇటీవల మున్సిపల్ కార్యాల యాన్ని తనిఖీ చేశారు. బల్దియా అధికారులతో వివిధ సమస్యలపై సమీక్షించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తగిన చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు. ఇందు కోసం రూ.5 లక్షలు తక్షణమే మంజూరు చేస్తూ ఉత్తర్వులిచ్చారు. జోరందుకున్న పూడికతీత పనులు.. కలెక్టర్ నిధులు మంజూరు చేయడంతో బల్దియా అధికారులు తొలుత డ్రైనేజీల్లో పూడికతీత పనులను ఈనెల 16న ప్రారంభించారు. వర్షాకాలం కావడంతో రహదారులపై నీరు నిల్వ ఉండకుండా పనుల్లో వేగం పెంచారు. ఇప్పటికే నీరు నిల్వఉన్న ప్రాంతాల్లో ఆయిల్బాల్స్ వేస్తున్నారు. మరుగునీటి కాలువల్లోనూ ఆయిల్బాల్స్ వేయాలని సిబ్బందికి సూచించారు. రక్షిత మంచినీటి పథకంలోనూ నిత్యం బ్లీచింగ్ పౌడర్ చల్లాలని ఆదేశించారు. ప్రజలు సైతం తమ ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉందని అధికారులు సూచిస్తున్నారు. వ్యాధుల కట్టడికి చర్యలు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రత్యేకంగా దృష్టి సారించాం. చాలాకాలంగా పూడికతో నిండిపోయిన డ్రైనేజీలను గుర్తించాం. ఇలా పట్టణవ్యాప్తంగా సుమారు 24 డ్రైనేజీలు గుర్తించాం. వాటిలోని పూడికను శరవేగంగా తొలగిస్తున్నాం. కొన్నిడ్రైనేజీల్లో ఆయిల్బాల్స్ వేశాం. ప్రజలు కూడా పరిసరాలు, వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ మాతో సహకరించాలి. – తిప్పరాజు రమేశ్, మున్సిపల్ కమిషనర్, సుల్తానాబాద్