breaking news
Peddapalli
-
ఓటరు జాబితాలో పొరపాట్లు ఉండొద్దు
పెద్దపల్లిరూరల్/జూలపల్లి/కాల్వశ్రీరాంపూర్: ఓటరు జాబితాలో పొరపాట్లకు అవకాశం లేకుండా రూపొందించాలని ఆర్డీవో గంగయ్య అన్నారు. గురువారం పెద్దపల్లి, జూలపల్లి, కాల్వశ్రీరాంపూర్లో బీఎల్వోలకు నిర్వహించిన బూత్స్థాయి శిక్షణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఫాం 6,7,8 విచారణ, నివేదిక సమర్పించే విధానాలపై బీఎల్వో యాప్ వాడకం, ఓటరు జాబితా శుద్ధీకరణపై అవగాహన కల్పించారు. తహసీల్దార్లు రాజయ్య, జె.స్వర్ణ, జగదీశ్వర్రావు, డీటీ విజేందర్, సిబ్బంది, ట్రైనర్లు పాల్గొన్నారు. పెద్దపల్లికి అడిషనల్ మున్సిఫ్ కోర్టు మంజూరుపెద్దపల్లిరూరల్: పెద్దపల్లిలో అడిషనల్ మున్సిఫ్ కోర్టును మంజూరు చేస్తూ న్యాయశాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. కోర్టు ఏర్పాటు కానుండడంతో ఈ ప్రాంతంలో న్యాయస్థానాల్లో కేసులు పెండింగ్లో ఉండకుండా సత్వర సేవలందుతాయని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లకిడి భాస్కర్ పేర్కొన్నారు. ఇప్పటికే జిల్లా కోర్టు, పోక్సో, సబ్కోర్టు, మున్సిఫ్కోర్టులు పెద్దపల్లి ప్రాంత ప్రజలకు న్యాయసేవలందిస్తున్నాయని వివరించారు. త్వరలోనే కోర్టు సముదాయాల భవన పనులు కూడా ప్రారంభం అవుతాయని తెలిపారు. అడిషనల్ మున్సిఫ్కోర్టు మంజూరుపై ఏజీపీ ఉప్పు రాజు, బార్ అసోసియేషన్ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. సౌండ్పొల్యూషన్ చేసేవారిపై కఠిన చర్యలుగోదావరిఖని(రామగుండం): ఇష్టారీతిన సైలెన్సర్లు బిగించుకుని సౌండ్ పొల్యూషన్ చేసే వాహనదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని రామగుండం ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ హెచ్చరించారు. గురువారం స్థానిక మున్సిపల్ టీజంక్షన్ వద్ద స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. వాహనానికి నంబర్ ప్లేట్లు సరిగా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. భారీ శబ్దాలు చేసే సైలెన్సర్లను తీసివేయాలన్నారు. ఫోర్వీలర్ వాహనదారులు సీట్బెల్ట్ పెట్టుకోవాలని, వాహనానికి సంబంధించిన పత్రాలను కలిగిఉండాలన్నారు. స్పీడ్గా డ్రైవ్ చేస్తే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. గోదావరిఖని, పెద్దపల్లి, మంచిర్యాల ట్రాఫిక్ సీఐలు రాజేశ్వరరావు, అనిల్, సత్యనారాయణ, ఎస్సైలు హరిశేఖర్, సిబ్బంది పాల్గొన్నారు. బయోమెట్రిక్తోనే వైద్యులకు వేతనాలుమంథని: బయోమెట్రిక్ అటెండెన్స్ ఆధారంగానే వేతనాలు అందిస్తామని వైద్య విధాన పరిషత్ ఆస్పత్రుల జిల్లా పర్యవేక్షణ అధికారి (డీసీహెచ్ఎస్) డాక్టర్ శ్రీధర్ తెలిపారు. గురువారం మంథని సామాజిక వైద్యశాల, మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. రోగులతో మాట్లాడి సేవలపై ఆరా తీశారు. వైద్యులు, సిబ్బందితో సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఇక్కడి ఆస్పత్రి నుంచి ఇతర ఆస్పత్రులకు రెఫరల్ ఎందుకు జరుగుతున్నాయనే విషయంపై సమాచారం సేకరించామని అందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. వైద్యులు అందుబాటులో ఉండేలా బయోమెట్రిక్ విధానం అమలులోకి తీసుకొచ్చినట్లు వివరించారు. అలాగే సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, తాను పర్యవేక్షణ చేసేలా చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. అలాగే మాతాశిశు ఆస్పత్రిలో గర్భిణుల సౌకర్యార్థం అల్ట్రాసౌండ్ స్కాన్, నవజాత శిశువులకు ఫొటో థెరపీ, వార్మర్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పెద్దపల్లి నుంచి రెడియోలజీ సేవలను వినియోగిస్తామని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో మంథని ఆస్పత్రి పనిచేస్తుందని, తాను నిత్యం ఆస్పత్రిని సందర్శిస్తామని తెలిపారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజశేఖర్ తదితరులు ఉన్నారు. -
విద్యాప్రమాణాలు పెంపొందించాలి
పాలకుర్తి(రామగుండం): ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో విద్యా ప్రమాణాల మెరుగుకు ప్రతీ ఉపాధ్యాయుడు కృషి చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. గురువారం మండలంలోని కొత్తపల్లి, రామారావుపల్లి, పుట్నూర్, జయ్యారం, కన్నాల గ్రామాల్లోని ప్రాథమిక, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, ఎస్సీ బాలుర సంక్షేమ వసతి గృహం, కస్తూరిబాగాంధీ బాలికల విద్యాలయం, పుట్నూర్ ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వచ్చే మార్చి నాటికి ప్రతీ ప్రాథమికస్థాయి విద్యార్థి చదవడం, రాయడం, గణిత చతుర్విద ప్రక్రియలను చేసేలా తయారు చేయాలని, వెనుకబడిన విద్యార్థులపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. అలాగే జయ్యారం ఉన్నత పాఠశాలలో గ్రౌండ్ లెవలింగ్, స్టేజీ నిర్మాణం కోసం ప్రతిపాదనలు పంపించాలన్నారు. రామారావుపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. ఇంటి నిర్మాణం 400– 600 చదరపు గజాల లోపు మాత్రమే నిర్మించాలని, బిల్లులు సక్రమంగా అందేలా తగిన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పుట్నూర్ పీహెచ్సీలో చేపట్టిన అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలని, సాధారణ ప్రసవాలు జరిగేలా చర్యలు చేపట్టాలని సూచించారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయం ఆవరణలోని ఈజీఎస్ భవనంలో పలు విభాగల మండలస్థాయి అధికారులతో వివిధ అంశాలపై చర్చించారు. మండలవ్యాప్తంగా ఎస్సారెస్పీ కాలువల్లో పూడికతీత పనులు పూర్తి చేయాలని, పుట్నూర్లోని డబుల్బెడ్రూం ఇళ్ల నిర్మాణాల స్థితిగతులపై నివేదిక అందజేయాలని అధికారులను ఆదేశించారు. మండలంలో లక్ష్యానికి అనుగుణంగా ఆయిల్పాం సాగు జరిగేలా వ్యవసాయాధికారులు చర్యలు తీసుకోవాలని, వనమహోత్సవం కార్యక్రమం ద్వారా మొక్కలు నాటేందుకు గుంతల తవ్వకాల పనులు వేగవంతం చేయాలని సూచించారు. ఎంపీడీవో రామ్మోహనచారి, ఎంపీవో సుదర్శన్, ఏవో ప్రమోద్కుమార్, ఎంఈవో విమల, హౌజింగ్ డీఈ దస్తగిరి, పంచాయతీరాజ్ ఏఈ రుషికేష్, వైద్యాధికారి సాయిసూర్య, కేజీబీవి ప్రత్యేక అధికారి స్వరూప తదితరులు పాల్గొన్నారు. ● కలెక్టర్ కోయ శ్రీహర్ష -
బొట్టుపెట్టి చెబుతున్నా.. రోడ్డుపై చెత్త వేయొద్దు
కోల్సిటీ(రామగుండం): ‘మీకు బొట్టిపెట్టి చెబుతున్నాం.. ఇంట్లోని చెత్తను రోడ్డుపై, కాలువల్లో పోయకండీ.. పరిసరాలను అపరిశుభ్రంగా మార్చకండీ..’ అంటూ రామగుండం బల్దియాలో పారిశుధ్యంపై అధికారులు, సిబ్బంది వినూత్నంగా అవగాహన కల్పిస్తున్నారు. గురువారం పాత 11వ డివిజన్లో ఇంటింటా తడి, పొడి చెత్త వేరు చేసి ఇంటి ముందుకు వచ్చే మున్సిపల్ సిబ్బందికి మాత్రమే ఇవ్వాలని వార్డు ఆఫీసర్ మంగ, పారిశుధ్య విభాగం సహాయ పర్యవేక్షకుడు ఆడెపు శ్రీనివాస్ అవగాహన కల్పించారు. ఇంటింటికీ వెళ్లి మహిళలకు బొట్టుపెట్టి విజ్ఞప్తి చేశారు. అలాగే చెత్త పోసిన ప్రాంతాల్లో మరోసారి పోయవద్దని కోరుతూ ముగ్గులు వేశారు. -
కమిషనరేట్ను జాతీయస్థాయిలో నిలపాలి
● రామగుండం సీపీ అంబర్కిషోర్ ఝా గోదావరిఖని(రామగుండం): క్రీడల్లో సత్తా చాటి రామగుండం పోలీస్ కమిషనరేట్ను జాతీయస్థాయిలో నిలపాలని సీపీ అంబర్కిషోర్ఝా పేర్కొన్నారు. గురువారం పోలీస్హెడ్ క్వార్టర్స్లో కాళేశ్వరం జోన్స్థాయి పోలీస్డ్యూటీ మీట్ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. ఆర్మ్డ్రిజర్వ్ విభాగాలైన డాగ్ స్క్వాడ్, బాంబ్ డిస్పోజల్ టీం పనితీరును పరిశీలించారు. పోలీసు జాగిలాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. నేర స్థలంలో బాంబులు, గంజాయిని గుర్తించడంపై పోటీలు నిర్వహించారు. బాంబు డిస్పోజల్ టీంల సెర్చ్, డీప్ సెర్చ్ మెటల్ డిటెక్టర్ ద్వారా భూమిలోపల పాతిపెట్టిన మందుగుండు సామగ్రి తదితర పోటీలు ఆకట్టుకున్నాయి. పోలీసు అధికారులు, సిబ్బందిలో ప్రతిభను వెలికితీసేందుకు పోలీసు డ్యూటీ మీట్ ఎంతగానో ఉపయోగపడుతుందఅన్నారు. విధుల్లో రాణించాలంటే వృత్తి నైపుణ్యం చాలా కీలకమన్నారు. డ్యూటీమీట్లో 91మంది అధికారులు పాల్గొన్నారు. ప్రతిభ కనబర్చిన వారిని వరంగల్లో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు. అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి.రాజు, గోదావరిఖని ఏసీపీ రమేశ్, ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్, ఏఆర్ ఏసీపీ ప్రతాప్, ఏవో శ్రీనివాస్, సీసీఎస్ సీఐ బాబురావు, ఆర్ఐలు దామోదర్, వామనమూర్తి, శ్రీనివాస్, మల్లేశం, సిబ్బంది పాల్గొన్నారు. -
ఇందిరమ్మపై ధరాభారం!
● ఒక్కసారిగా పెరిగిన నిర్మాణ సామగ్రి ధరలు ● ఇందిరమ్మ పథకం మొదలవగానే పెంచిన వ్యాపారులు ● సగటున ప్రతీ ఇంటిపై రూ.55 వేలకుపైగా భారం ● ప్రభుత్వం విడుదల చేసేది రూ.5 లక్షలు ● ఇంటి నిర్మాణానికి కావాల్సింది కనీసం రూ.10 లక్షలుసాక్షిప్రతినిధి,కరీంనగర్: ఇందిరమ్మ ఇంటిపై ధరాఘాతం అశనిపాతంలా మారింది. సామాన్యుడికి సొంతింటి కల నెరవేర్చేందుకు ప్రభుత్వం తీసుకువచ్చిన సంక్షేమ పథకంపై ధరల పెరుగుదల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన దరిమిలా.. ప్రభుత్వం వేలాది మంది లబ్ధిదారుల ఖాతాలకు డబ్బులు విడుదల చేయగానే.. ఇంటి నిర్మాణ సామగ్రికి అమాంతం డిమాండ్ ఏర్పడింది. ఇదే అదనుగా నిర్మాణ సామగ్రి ధరలు పెంచేశారు. ఇందిరమ్మ ఇళ్లు అంటే ఇపుడున్న నిబంధనల ప్రకారం.. 600 నుంచి 800 చదరపు అడుగుల మేర నిర్మించుకునే అవకాశం ఉంది. ప్రతీ నియోజకవర్గానికి 3500 చొప్పున లబ్ధిదారులను ప్రభుత్వం ఎంపిక చేసేందుకు సిద్ధపడటాన్ని దళారులు అదనుగా తీసుకున్నారు. ఫలితంగా ప్రతీ ఇంటి నిర్మాణం మీద అదనపు భారం పడనుంది. ప్రతీ ఇంటిపై రూ.55 వేలకుపైగా భారం ఇందిరమ్మ ఇంటికి నిర్మాణ సామగ్రి కీలకం. కట్రౌ తు ట్రాక్టర్ ట్రిప్పుకు రూ.1200, కంకర ట్రిప్పుకు రూ.1000, స్టీలు టన్నుకు రూ.2వేలు, ఇసుక ట్రిప్పుకు రూ.1000, మొరం ట్రిప్పుకు రూ.200 చొప్పున ధరలు పెంచేశారు. ఈ నిర్మాణ సామగ్రి లేకుండా ఏ ఇల్లూ పూర్తికాదు. సగటున చూసుకుంటే ప్రతీ ఇంటిపైనా తక్కువలో తక్కువ రూ.55 వేల నుంచి రూ.60 వేల పైచిలుకు ధరాభారం పడుతోంది. సిమెంట్ ధరలు కూడా పెరుగుతాయని అని ప్రచారం ఇప్పటికే ఊపందుకుంది. అయితే, దీన్ని వ్యాపారులు, అటు వినియోగదారులు కొట్టిపారేస్తున్నారు. ఇప్పట్లో సిమెంటు ధరలు పెరిగే సూచనలేమీ కనిపించడం లేదు. అయితే, స్థానికంగా లభించే నిర్మాణ సామగ్రిపైనే వ్యాపారులు, దళారులు, మధ్యవర్తులు ధరలు పెంచి ప్రజల అవసరాలను సొమ్ము చేసుకుంటున్నారు. వాస్తవానికి ప్రతీ లబ్ధిదారునికి ప్రభుత్వం రూ.5లక్షల వరకు ఆర్థిక సాయం చేస్తోంది. కానీ, వాస్తవ పరిస్థితుల కారణంగా ఆ ఖర్చు రూ.10 లక్షల వరకు వెళ్తోంది. జిల్లా ఇందిరమ్మ ఇళ్ల మంజూరైనవి లబ్దిదారుల బేస్మెంట్ స్లాబ్లెవల్ దరఖాస్తుల సంఖ్య సంఖ్య స్థాయి కరీంనగర్ 204504 8219 8219 742 129 జగిత్యాల 1,99,965 7601 7601 209 30 పెద్దపల్లి 1,63,000 9421 6018 542 42 రాజన్నసిరిసిల్ల 1,26,124 7826 7826 317 90 మొత్తం 6,93,593 33,067 29,664 1810 291సామగ్రి గతం ప్రస్తుతం పెరిగింది కట్రౌతు(ట్రిప్పు) రూ. 2700 రూ. 3900 రూ.1200 కంకర(ట్రిప్పు) రూ. 2500 రూ. 3500 రూ. 1000 ఐరన్(టన్ను) రూ. 55000 రూ. 57000 రూ. 2000 ఇసుక(ట్రిప్పు) రూ. 2500 రూ. 3500 రూ. 1000 మొరం(ట్రిప్పు) రూ. 1000 రూ. 1200 రూ. 200 -
రింగ్రోడ్తో ప్రజాధనం వృథా
మంథని: ప్రజాధనాన్ని వృథా చేయడానికే రూ.300 కోట్లు వెచ్చించి రింగ్రోడ్ నిర్మాణం చేపడుతున్నారని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ఆరోపించారు. మున్సిపల్ పరిధిలోని కూచిరాజ్పల్లి సమీపంలో రెండురోజుల క్రితం రింగ్రోడ్ నిర్మాణానికి మంత్రి భూమిపూజ చేసిన స్థలంలో గురువారం మీడియాతో మాట్లాడారు. కూచిరాజ్పల్లి సమీపంలో రియల్ ఎస్టేట్ను ప్రోత్సహించేందుకే రింగ్రోడ్ను తీసుకువచ్చారని అనుమానం వ్యక్తం చేశారు. ఇప్పటికే నియోజకవర్గంలో 38 కి.మీ మేర గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణానికి పనులు జరుగుతున్నాయని, అడవిశ్రీరాంపూర్, బేగంపేట, పుట్టపాక, పోతారంలో ఇంటర్చేంజ్లు ఏర్పాటు చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ క్రమంలో రింగ్రోడ్తో ప్రయోజనం ఏంటో ఆలోచన చేయాలన్నారు. హైవే నిర్మాణం జరిగితే పెద్దపల్లి నుంచి వచ్చేవారు హైవే ద్వారా గోదావరినది అవతలికి వెళ్లే అవకాశాలు ఉ న్నాయని, రింగ్రోడ్డు మాత్రం శివ్వారం వరకు మా త్రమే ఉంటుందని, మళ్లీ చెన్నూర్లాంటి ప్రాంతా లకు వెళ్లాలంటే 20–30 కి.మీ ప్రయాణం చేయాల్సి వస్తుందని వివరించారు. తాము అభివృద్ధికి వ్య తిరేకం కాదని, ప్రజలకు ఉపయోగపడేలా పనులు చేయాలని పేర్కొన్నారు. నాయకులు ఏగోళపు శంకర్గౌడ్, మాచిడి రాజుగౌడ్ తదితరులు ఉన్నారు. -
నీరు కలుషితం.. జనం సతమతం
‘ఇది రామగుండం బల్దియా గోదావరిఖని అశోక్నగర్లోని ఓ వీధి. ఇక్కడ తరుచూ తాగునీటి పైప్లైన్ లీకవుతోంది. 45 రోజుల క్రితమే సీసీ రోడ్డు వేయగా పైప్లైన్ పగిలింది. గత్యంతరం లేక బల్దియా అధికారులు వేసిన కొత్త రోడ్డును తవ్వించి పైప్లైన్కు మరమ్మతు చేయించారు. కానీ, ఇదే పైప్లైన్కు మరో చోట పగుళ్లుచూపడంతో తాగునీరంతా కలుషితమవుతోంది. మరోసారి లీకేజీకి మరమ్మతులు చేపట్టారు. పాత పైపును తొలగించి కొంత భాగం కొత్త పైప్లను ఏర్పాటు చేసి నీటి సరఫరాను పునరుద్ధరించారు. అయినా సమస్య పరిష్కారానికి నోచుకోలేదు. మిగిలిన పాతపైప్లైన్కు మరోచోట లీకేజీ ఏర్పడింది. దీంతో మూడురోజులుగా అధికారులు మరమ్మతు చేయిస్తున్నారు. తరుచూ లీకేజీలతో తాగునీరంతా కలుషితం అవుతుండడంతో, స్థానిక కుటుంబాలు ప్రైవేట్ వాటర్ ప్లాంట్ల నుంచి నీటిని కొనుగోలు చేసి తెచ్చుకుంటున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలే వర్షాకాలం, ఇలా లీకేజీలతో తాగునీరంతా కలుషితమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. ఇలా ఒక్క అశోక్నగర్లోనే కాదు.. చాలా డివిజన్లలో తాగునీటి పైప్లైన్ల లీకేజీలతో జనం పరేషాన్ అవుతున్నారు’. ‘ఈ ఫొటో మార్కండేయకాలనీలోని రెయిన్బో స్కూల్ పక్కనున్న కల్వర్టు ప్రాంతం. నగరపాలక సంస్థకు చెందిన తాగునీటి పైప్లైన్కు ఏర్పాటు చేసిన వాల్వ్ నుంచి తాగునీరు భారీగా లీకవుతోంది. దీనికి తోడు భారీ వర్షాలు కురిసినప్పుడల్లా కల్వర్టు వరకు వరద, మురుగునీరు నాలా నుంచి ప్రవహిస్తోంది. ఇలాంటి సందర్భాల్లో వాల్వ్ లీకేజీతో తాగునీరు కూడా కలుషితమయ్యే అవకాశాలున్నాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. బల్దియా అధికారులు స్పందించి మరమ్మతు చేపట్టాలని కోరుతున్నారు’. వాటర్ ప్లాంట్లో కొంటున్నాం పైప్లైన్ల లీకేజీతో తాగునీరు కలుషితమవుతోంది. మా వాడలో నెల రోజులుగా తరుచూ పైప్లైన్లు పగులుతున్నాయి. పాత పైపులను తొలగించి, కొత్త పైప్లైన్లు వేస్తేనే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. అసలే వానకాలం, కలుషితమైన నీళ్లను ఎలా తాగేది..?. వాటర్ ప్లాంట్ల నుంచి రోజూ తాగునీటి కొనుక్కోవాల్సి వస్తోంది. మున్సిపల్ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలి. – తోట రవి, అశోక్నగర్, గోదావరిఖని● మున్సిపాలిటీల్లో పైప్లైన్ల మరమ్మతుపై నిర్లక్ష్యం పొంచిఉన్న సీజనల్ వ్యాధుల ముప్పు -
ఇటుక బట్టీలకు చెరువుమట్టి
● 9,185 టిప్పర్లలో రవాణా ● రూ.2.47 కోట్ల ఆదాయం ● కలెక్టర్ కోయ శ్రీహర్ష వెల్లడి పెద్దపల్లిరూరల్: జిల్లాలోని చెరువుల ద్వారా ఇటుక బట్టీలకు 9,185 టిప్పర్లలో మట్టి తరలించడంతో రూ.2,47,99,500 ఆదాయం సమకూరిందని కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. మట్టి తరలింపు ద్వారా సమకూరిన ఈ ఆదాయంలో రూ.2.44కోట్లు వెచ్చించి మంథని, ఓదెల, పెద్దపల్లి, కాల్వశ్రీరాంపూర్, సుల్తానాబాద్ మండలా ల్లో సీసీ రోడ్లు, ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీల్లో సౌకర్యాలు కల్పిస్తామన్నారు. కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో బుధవారం ఆయన పలు అంశాలపై సమీక్షించారు. పెద్దపల్లి, సుల్తానాబాద్లో పారిశుధ్యం మెరుగుపడాలని ఆదేశించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా, ప్లాస్టిక్ నియంత్రణకు చర్యలు తీసుకోవాలన్నారు. పారిశుధ్యం, నీటి సరఫరాపై దృష్టి సారిస్తూనే వనమహోత్సవంలో మొక్కలు నాటి సంరక్షించాలని పేర్కొన్నారు. ఈనెలాఖరు వరకు సుల్తానాబాద్లో డంప్యార్డు సమస్యకు పరిష్కారం చూపాలని, కాంట్రాక్టర్ పని చేయకుంటే పారిశుధ్య పనులను వేరొకరికి అప్పగించాలని కలెక్టర్ సూచించారు. తర్వాత మంథని మండలంలోని హెచ్ఎంలతో సమావేశమైన కలెక్టర్.. మండలంలో 59 పాఠశాలలున్నాయని, రోజూ ఫేషియల్ రికగ్నేషన్ హాజరు నమోదు చేయాలని ఆయన ఆదేశించారు. డీఈవో మాధవి తదితరులు ఉన్నారు. గుణాత్మక విద్య అందించాలి ఎలిగేడు(పెద్దపల్లి): ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు గుణాత్మక విద్య అందించాలని కలెక్టర్ కో య శ్రీహర్ష సూచించారు. సుల్తాన్పూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు మాజీ సర్పంచ్, దివంగత తానిపర్తి కాంతారావు జ్ఞాపకార్థం ఆయన కుమారులు సత్యనారాయణరావు, రవీందర్రావు, దామోదర్రావు, మహేందర్రావు, రంగారావు, వెంగళరావు రూ.5లక్షల విలువైన ఎలక్ట్రిక్ ఆటో, రూ.2.16లక్షల విలువైన డైనింగ్ టెబుళ్లు అందించగా కలెక్టర్ శ్రీహర్ష పాఠశాలకు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. సర్కారు బడుల్లో నాణ్యమైన విద్యా బోధనకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. తహసీల్దార్ యాకయ్య, ఎంపీడీవో భాస్కర్రావు, ఎంఈవో నరేంద్రచారి, మాజీ సర్పంచ్ వెంకటేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు. -
‘బహుళ’ ప్రమాదాలు
గోదావరిఖని శ్రీనగర్కాలనీలోని సింగరేణి ఉద్యోగి ఇంట్లో గతనెల 29న వంటగ్యాస్ లీకై ంది. ఇళ్లంతా మంటలు వ్యాపించాయి. వస్తుసామగ్రి అగ్నికి ఆహుతయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అప్పటికే పొగ వ్యాపించడంతో ఇంటి యజమాని స్వల్ప అస్వస్థకు గురయ్యాడు.గోదావరిఖని: జిల్లాలో బహుళ అంతస్తుల భవన నిర్మాణాలు వేగంగా వెలుస్తున్నాయి. ప్రస్తుత జనాభా అవసరాలకు అనుగుణంగా అపార్ట్మెంట్లు అనేకం నిర్మిస్తున్నారు. లిఫ్ట్లు, స్పెషల్ డిజైన్లలో నిర్మిస్తున్న అందమైన అంతస్తులు సరికొత్త శోభ తెచ్చిపెడుతున్నాయి. ఇదేసమయంలో భద్రతా చర్యలు విస్మరించడంతో తరచూ అగ్నిప్రమాదాలు, దొంగతనాలు, ఇతరత్రా ప్రమాదాలు చోటుచేసుకోవడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. తక్కువ ఎత్తులో నిర్మిస్తూ.. నిబంధనల ప్రకారం నివాస యోగ్యమైన అపార్ట్మెంట్లు 15 మీటర్లు, వాణిజ్య భవనాల ఎత్తు 18 మీటర్లు ఎత్తు ఉంటే ఫైర్సేఫ్టీ అధికారుల అనుమతి తప్పనిసరి. కానీ, ఇంతకన్నా తక్కువ ఎత్తులో నిర్మిస్తున్న భవనాలకు అనుమతి అవసరం లేకపోవడంతో కొందరు ఇష్టానుసారంగా నిర్మిస్తున్నారు. కానీ, ప్రమాదాలు చోటుచేసుకుంటే హైరానా పడడం తప్ప చేసేదేమీ ఉండడంలేదు. వంట గ్యాస్ లీక్.. షార్ట్ సర్క్యూట్.. బహుళ అంతస్తుల్లో ప్రధానంగా వంటగ్యాస్ లీక్, షార్ట్షర్క్యూట్తోనే అధికంగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని చెబుతున్నారు. దీంతోనే అగ్నిమాపక సిబ్బంది చేరుకునేలోగా జరిగే నష్టం జరిగిపోతోంది. అనుమతితో సంబంధం లేకుండా రక్షణ చర్యలు పాటించడం, భద్రతా చర్యలు తీసుకోవడం అవసరమని అధికారులు సూచిస్తున్నారు. మున్సిపల్ అధికారులు చొరవ తీసుకుంటే ప్రమాదాల నివారణ సాధ్యమని అంటున్నారు. నివాసాల్లో అగ్ని ప్రమాదాల నివారణ ఇలా.. ● పిల్లలకు అగ్గిపెట్టెలు, లైటర్లు, టపాకాయలు, మండే పదార్థాలు అందుబాటులో ఉంచవద్దు ● సిగిరెట్లు, బీడీలు, అగ్గిపుల్లలు ఆర్పకుండా పారేయరాదు ● ఐఎస్ఐ ఎలక్ట్రికల్ పరికరాలనే ఉపయోగించాలి ● పాడైన విద్యుత్ తీగలు తాకొద్దు. ఓవర్ లోడ్ వేయవద్దు. నాణ్యమైన ప్లగ్ మాత్రమే వాడాలి. ● మంచంపై పడుకుని బీడీలు, సిగరెట్లు తాగొద్దు. ● ఎక్కువరోజులు బయటకు వెళ్లాల్సి వస్తే విద్యుత్ మెయిన్ ఆఫ్ చేయాలి ● నీటి నిల్వలు అందుబాటులో ఉంచుకోవాలి ● వంటింటి కింద, పైభాగంలో గాలి, వెలుతురు ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలి ● పిల్లలను వంటగదుల్లో వదలరాదు ● ఐఎస్ఐ మార్కు గల కొత్త గ్యాస్పైపు వాడాలి ● వంటలు పూర్తయ్యాక వెంటనే రెగ్యులేటర్ వాల్వ్ ఆఫ్చేయాలి ● గ్యాస్ లీకవుతున్నట్లు అనుమానం వస్తే వెంటనే రెగ్యులేటర్ వాల్వ్ ఆపేయాలి. ఆ వెంటనే విద్యుత్ స్విచ్లు ఆన్, ఆఫ్ చేయవద్దు ● తాటాకు, గడ్డితో తయారు చేసిన పైకప్పును స్కూళ్లు, ఆస్పత్రుల్లో వాడవద్దు ● ఫ్లేమ్ప్రూఫ్ మోటార్ స్పార్క్ స్విచ్లనే ఉపయోగించాలి ● స్కూళ్లు, ఆస్పత్రులు, షాపింగ్ మాల్స్లో ఫైర్ఫైటింగ్ ఎగ్జిష్టర్లను అందుబాటులో ఉంచాలి ● ఫైర్ ఎవాక్యుయేషన్ డ్రిల్లును ప్రతీ మూడునెలలకోసారి ప్రాక్టీసు చేయాలి ● వంటగదిలో కిరోసిన్, డీజిల్, పెట్రోల్, అదనపు గ్యాస్ సిలిండర్ వంటివి ఉంచరాదు ● వంట చేస్తున్నప్పుడు నూలు వస్త్రాలు, ఆఫ్రిన్ ధరించాలి. వ్యక్తిగత జాగ్రత్తలు.. ● దుస్తులకు నిప్పు అంటుకుంటే పరుగెత్తవద్దు. నేలపై దొర్లండి లేదా దుప్పటి చుట్టుకోవాలి ● కాలిన శరీరపై చల్లని నీరు పోయరాదు ● పొగతో నిండిన గదుల్లో మోచేతులు. మోకాళ్లపై పాకరాదు. ముక్కు, నోటికి అడ్డుగా తడిగుడ్డ పెట్టుకోవాలి. గ్రామాల్లో.. ● ఎండిన గడ్డినే వాముగా వేయాలి ● నివాసాలకు 60 అడుగుల దూరంలో వాములు వేయాలి ● పెద్దగడ్డివాములకు బదులుగా చిన్నవి వేయాలి ● గుడిసెలకు మధ్య కనీసం 30 అడుగుల దూరం పాటించండి ● విద్యుత్ ప్రమాదాలపై నీటిని ఉపయోగించరాదు. పొడి ఇసుకను మాత్రమే వాడాలి. నిబంధనలకు తిలోదకాలు అపార్ట్మెంట్లలో భద్రత చర్యలు గాలికిఅగ్నిమాపక కేంద్రాల ఫోన్ నంబర్లు పెద్దపల్లి 87126 99202 గోదావరిఖని 87126 99206 మంథని 87126 99204 జాగ్రత్తలు తీసుకోవాలి వర్షాకాలంలో కుంటలు, జలపాతాల వద్దకు స్నానాలకు వెళ్లవద్దు. వరదల సందర్భంగా అజాగ్రత్తగా ఉండొద్దు. ఇంట్లో దేవునికి దీపం వెలిగించి ఊరికి వెళ్తే ఎలుకలతో అగ్నిప్రమాదం జరిగే అవకాశం ఉంది. నూనెను తాగిదీపం వత్తిని ఎలుకలు తీసుకెళ్తాయి. ఈవిషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. కింద బట్టలు ఉంటే పైన అగర్బత్తులు వెలిగించరాదు. ఏ ప్రమాదం జరిగినా అగ్నిమాపక సిబ్బందిని వెంటనే సంప్రదించాలి. – అనిల్కుమార్, జిల్లా అగ్నిమాపక అధికారి -
ప్రజలు సుభిక్షంగా ఉండాలి
● ఎంపీ వంశీకృష్ణ రామగిరి(మంథని): అమ్మవారి దయతో అందరూ సుభిక్షంగా ఉండాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఆకాంక్షించారు. అడ్రియాల గని ఆవరణలో బుధవారం చేపట్టిన పోచమ్మ బోనాల ఉత్సవం సందర్భంగా ఎంపీ ప్రత్యేక పూజలు చేశారు. పోచమ్మకు సమర్పించే బోనం తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని అన్నారు. కాంగ్రెస్, ఐఎన్టీయూసీ నాయకులు పాల్గొన్నారు. సేవలతోనే మంచిగుర్తింపు పెద్దపల్లిరూరల్: ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్ తప్పదని, అయితే అంకితభావంతో పనిచేస్తే మంచిగుర్తింపు లభిస్తుందని ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. ప్రధానోపాధ్యాయురాలిగా పనిచేస్తూ ఉద్యోగ విరమణ పొందిన శోభారాణి వీడ్కోలు సమావేశం బుధవారం నిర్వహించారు. జిల్లా విద్యాధికారి మాధవి, ఎంపీ వంశీకృష్ణ తదితరులు హాజరయ్యారు. భావిభారత పౌరులను ఉత్తములుగా తీర్చిదిద్దే అవకాశం ఉపాధ్యాయులకే దక్కుతుందన్నారు. ఈ సందర్భంగా శోభారాణి– ఈర్ల కొమురయ్య దంపతులను సత్కరించారు. ఎంఈవో సురేందర్, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు జీవన్రాజు తదితరులు పాల్గొన్నారు. -
హోంగార్డులకు రెయిన్కోట్లు
గోదావరిఖని: రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని హోంగార్డులకు సీపీ అంబర్ కిశోర్ ఝా బుధవారం రెయిన్కోట్లు పంపిణీ చేశారు. వర్షాకాలం ప్రారంభం కావడంతో విధి నిర్వహణలో ఇబ్బందులు పడకుండా రెయిన్కోట్స్ అందజేసినట్లు సీపీ పేర్కొన్నారు. వర్షాకాలంలో ట్రాఫిక్ నియంత్రణ, రాత్రి విధులు, బందోబస్తులో రెయిన్ కోట్లు సహాయపడుతాయని అన్నారు. కార్యక్రమంలో అడ్మిన్ అడిషనల్ డీసీపీ రాజు, ఏఆర్ ఏసీపీ ప్రతాప్, హోంగార్డు ఆర్ఐ వామనమూర్తి పాల్గొన్నారు. ట్రేడ్ లైసెన్స్ ఆదాయంపై దృష్టి కోల్సిటీ(రామగుండం): ట్రేడ్ లైసెన్స్పై ఆదాయంపై బల్దియా అధికారులు ఫోకస్ పెట్టారు. నిర్వహణకు సాధారణ నిధులతోపాటు ఆస్తిప న్ను తర్వాత ట్రేడ్ లైసెన్స్ల ద్వారా వచ్చే ఆదాయంపైనే దృష్టి సారిస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో 3,036 వరకు అసెస్మెంట్లు ఉండగా, వీటిపై రూ.55.89లక్షల డిమాండ్ ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అసెస్మెంట్ల సంఖ్య 3,782 వరకు పెరిగింది. డిమాండ్ కూడా రూ.71.93లక్షలకు చేరుకుంది. గత ఆర్థిక సంవత్సరాంతానికి ట్రేడ్లైసెన్స్ డిమాండ్ మొత్తంలో 72.16 శాతం వసూలు కాగా, ఈ ఆర్థిక సంవత్సరం త్రైమాసికంలోపే 50 శాతానికిపైగా వసూలు కావడం విశేషం. ప్రస్తుతం చేపట్టిన 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక ద్వారా డీ అండ్ వో ట్రేడ్ లైసెన్స్లపై ప్రత్యేక దృష్టి సారించిన అధికారులు.. వ్యాపారులకు అవగాహన కల్పిస్తున్నారు. ఏకకాలంలో కొత్తలైసెన్స్లూ జారీచేస్తున్నారు. ప్రతీవ్యాపార సంస్థను డీ అండ్ వో ట్రేడ్ లైసెన్స్ పరిధిలోకి తీసుకొచ్చి మెరుగైన ఆదాయం వచ్చేలా కృషి చేస్తున్నారు. చురుగ్గా పనిచేయాలి కోల్సిటీ(రామగుండం): మెప్మా సిబ్బంది చు రుగ్గా పనిచేయాలని రామగండం నగరపాలక సంస్థ కమిషనర్ అరుణశ్రీ సూచించారు. తన కార్యాలయంలో బుధవారం మెప్మా సిబ్బంది తో వివిధ అంశాలపై సమీక్షించారు. 100 రోజు ల కార్యాచరణ ప్రణాళిక లక్ష్యాన్ని నెరవేర్చాల ని, వీధి వ్యాపారుల కామన్ ఇంటరెస్ట్ గ్రూప్ లు, నూతన స్వయం సహాయక సంఘాలు, స్ల మ్ లెవెల్ ఫెడరేషన్లు ఏర్పాటు చేయాలన్నా రు. రుణాలను రికవరీలోనూ చొరవ తీసుకోవాలని కోరారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు త్వరితగతిన నిర్మాణం పూర్తిచేసుకోవడానికి బ్యాంకుల ద్వారా ఆర్థిక సహకారం అందేలా చూడాలన్నారు. ఇందిరమ్మ మోడల్ కాలనీ నిర్మించడానికి అనువుగా ఉండే ప్రాంతాలను గుర్తించి సమాచారం ఇవ్వాలని సూచించారు. డిప్యూటీ కమిషనర్ వెంకటస్వామి, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రామన్, మెప్మా టీఎంసీ మౌనిక, సీవోలు, ఆర్పీలు పాల్గొన్నారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తం గోదావరిఖని: సీజనల్ వ్యాధులపై కార్మిక కుటుంబాలు అప్రమత్తంగా ఉండాలని సింగరేణి ఏరియా ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ పద్మ కోరారు. బుధవారం ఆర్జీ–1 ఏరియాలోని జీడీకే–5 ఓసీపీపై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో మాట్లాడారు. ప్రతీఒక్కరు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, దోమలు రాకుండా జాగ్రత్త పడాలని, కలుషిత ఆహారం తీసుకోవద్దని, కలుషిత నీటిని తాగవద్దని ఆమె సూచించారు. నీటిని మరిగించి చల్లారాక వడిపోసి తాగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గని మేనేజర్ అనిల్గబాలే, రక్షణాధికారి రాములు, ఇంజినీర్ వేణుగోపాల్, సీనియర్ సర్వే ఆఫీసర్ చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు. అరుణాచలానికి ఆర్టీసీ బస్సు మంథని: ఆషాఢ శుక్ల పౌర్ణమి(గురుపౌర్ణమి) సందర్భంగ అరుణాచల గిరి ప్రదక్షిణకు మంథని డిపో నుంచి ఈనెల 8న సూపర్ లగ్జరీ బ స్సు బయలు దేరుతుందని డీఎం శ్రావణ్కుమార్ తెలిపారు. పెద్దపల్లి, కరీంనగర్, హైదరాబాద్ నుంచి వెళ్లే బస్సు కాణిపాకం, గోల్డెన్ టెంపుల్ దర్శనం తర్వాత ఈనెల 9న రాత్రి అరుణాచలం చేరుకుంటుందన్నారు. ప్రదక్షిణ అ నంతరం సాయంత్రం అరుణాచలంలో బస్సు బయలుదేరి ఈనెల 11న గద్వాల జోగులాంబ టెంపుల్కు చేరుకుంటుందని పేర్కొన్నారు. అమ్మవారి దర్శనం అనంతరం గద్వాలలో బయలుదేరి హైదరాబాద్, కరీంనగర్, పెద్దపల్లి నుంచి మంథనికి చేరుకుంటుందన్నారు. మంథని నుంచి పెద్దలకు రూ.5,040, పిల్లలకు రూ.3,790, పెద్దపల్లి నుంచి పెద్దలకు రూ.4,940, పిల్లలకు రూ.3,720 చార్జీ ఉంటుందని పేర్కొన్నారు. అడ్వాన్స్ బుకింగ్ కోసం 99592 25923, 94913 24172 నంబర్లలో సంప్రదించాలని డీఎం కోరారు. -
పేదల సంక్షేమమే లక్ష్యం
జ్యోతినగర్(రామగుండం): పేదల సంక్షేమమే ప్ర జాప్రభుత్వ లక్ష్యమని రామగుండం ఎమ్మెల్యే రాజ్ఠాకూర్ మక్కాన్సింగ్ అన్నారు. జంగాలపల్లె శివారులోని డబుల్బెడ్రూమ్ ఇళ్ల సముదాయంలో రూ. 10 కోట్ల వ్యయంతో చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, తాగునీటి సరఫరా తదితర పనులకు బల్దియా కమిసనర్ అరుణశ్రీతో కలిసి బుధవారం ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. మహంకాళి స్వామి, రహీం, ఈదునూరి రవి తదితరులు పాల్గొన్నారు. కాగా, నర్రాశాలపల్లె, మల్కాపూర్ ప్రాంతాల్లో ఇటీవల మృతి చెందిన చిలుముల గట్టయ్య, శ్రీరాముల రవి కుటుంబసభ్యులను ఎమ్మెల్యే మక్కాన్సింగ్ పరామర్శించారు. కాంగ్రెస్ మద్దతుదారుల గెలుపు కోసం కృషి ఫెర్టిలైజర్సిటీ(రామగుండం): వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారుల గెలుపుకోసం కృషి చేస్తానని ఎమ్మెల్యే రాజ్ఠాకూర్ మక్కాన్సింగ్ అ న్నారు. ఖాజీపల్లిలో నిర్వహించిన ముఖ్య నాయకు లు, కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడా రు. అర్హులకు సంక్షేమ ఫలాలు అందేలా పనిచేయా లని సూచించారు. నియోజకవర్గ ఎన్నికల పరిశీల కులు అజ్మతుల్లా హుస్సేన్, సంగీతం శ్రీనివాస్ ము ఖ్య అతిథులుగా హాజరయ్యారు. నాయకులు బొంతల రాజేశ్, మహంకాళి స్వామి, కొలిపాక సుజాత, పెద్దెల్లి ప్రకాశ్, అనిల్కూమార్, మహేశ్, ముస్తఫా, ఎల్లయ్య, రహీం, శంకర్ నాయక్ పాల్గొన్నారు. -
దోమ కుడుతోంది!
● దోమల మోత – ప్రజల వెత ● కానరాని నియంత్రణ చర్యలు ● మూలనపడిన ఫాగింగ్ యంత్రాలు ● మొక్కుబడిగా పారిశుధ్య పనులు ● జ్వరాల బారిన జిల్లావాసులు ● జిల్లాలోని బల్దియాల్లో దుస్థితి సాక్షి, పెద్దపల్లి: వివిధ వ్యాధులు, జ్వరాలకు దోమలు కారణమువుతున్నాయి. వాటి బారినపడకుండా పుట్టకనే అడ్డుకోవాలి. ఆ తర్వాత అవి కుట్టకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. దురదృష్టవశాత్తు పట్టణాలు, పల్లెల్లోనేకాదు.. రామగుండం నగరంలోనూ క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఇందుకు విరుద్ధంగా ఉన్నాయి. వాతావరణంలో మార్పులకుతోడు పారిశుధ్య నిర్వహణలో లోపం ప్రజల్ని ఆందోళనకు గురిచేస్తోంది. వర్షాలతో లోతట్టు కాలనీల్లోని నివాసాల నడుమ రోజుల తరబడి నీరు నిలిచి ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడుతున్నారు. దోమ కాటుతో ఆస్పత్రుల పాలవుతున్నారు. జ్వర పీడితులు ఆస్పత్రులకు క్యూ కడుతున్నారని వైద్యులు చెబుతున్నారు. అటకెక్కిన ఫాగింగ్ ప్రక్రియ దోమల నివారణకు మూడు పద్ధతుల్లో చర్యలు తీసుకోవాలి. నీటి నిల్వల్లో దోమల నిరోధక మందు చల్లాలి. లార్వా వృద్ధి చెందకుండా రెండోసారి మందు పిచికారీ, మూడోసారి ఫాగింగ్ చేయాలి. ఖాళీ స్థలాలు, రహదారులపై మురుగు నిల్వ ఉండడంతో దోమలు విజృంభిస్తున్నాయి. ఫాగింగ్తోపాటు బ్లీచింగ్ పౌడర్ చల్లడం, కాలువల్లో మందు పిచీకారీ చేయడం క్రమం తప్పకుండా జరగాలి. వర్షాకాలం మొదలైన వెంటనే డ్రైనేజీల్లో గంబూషి యా చేపలు విడుదల చేయాలి. కానీ, క్షేత్రస్థాయిలో ఇలాంటి చర్యలు తీసుకుంటున్న దాఖలాలు ఎక్క డా కనిపించడంలేదు. దోమల నివారణకు మున్సిపాలిటీలు ఏటా రూ.లక్షలు ఖర్చు చేస్తున్నట్లు చెబుతున్నా.. ప్రయోజనం చేకూరడం లేదు. దోమల నివారణ ఇలా.. ఇళ్ల పరిసరాలు, వ్యక్తిగత, కుటుంబపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రధానంగా నీటినిల్వ ప్రదేశాలు గుర్తించారు. నీటిని తొలగించాలి. పనికిరాని పాత్రలు, టైర్లు, పగిలిన బకెట్లు, నీటి తొట్టెలు ఇళ్ల పరిసరాల్లో లేకుండా చూడాలి. ఓవర్ హెడ్ ట్యాంకులు, సంపులు, డ్రమ్ములు, నీటితొట్టెలపై మూతలు ఉంచాలి. వాటిని తరచూ శుభ్రం చేయాలి. ఇంటి పైకప్పు, టెర్రస్పైనా నీటి నిల్వలు ఉంచొద్దు. ప్రతీ శుక్రవారం డ్రైడేగా పాటించాలి. ఒకసారి వినియోగించి పారేసిన ప్లాస్టిక్ సంచులు, కప్పులు, గ్లాసులు డ్రైనేజీల్లో వేయరాదు. సెప్టిక్ ట్యాంకుల గాలిగొట్టాలకు నైలాన్ జాలి, ఇంటి కిటికీలు, గుమ్మాలకు జాలి, ఇనుప తెరలు అమర్చుకోవాలి. దోమతెరలు తప్పనిసరి వినియోగించాలి.దోమల కాటు వ్యాధులు ఇవే.. దోమరకం వ్యాధి అనాఫిలిస్ మలేరియా క్యూలెక్స్ బోదకాలు, మెదడువాపు ఏడీస్ డెంగీ, చికున్గున్యా మాక్యోనియా బోదకాలు ఇవి హ్యాండ్ ఫాగింగ్ మిషన్లు. సుమారు రూ.5లక్షలు వెచ్చించి రామగుండం నగరపాలక సంస్థ అధికారులు కొనుగోలు చేశారు. దోమల నివారణ కోసం వీటిని వినియోగిస్తారు. ఈ ఏడాది మార్చి 11న ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్ లాంఛ నంగా ప్రారంభించారు. అంతే.. అప్పట్నుంచి వినియోగించడంలేదు. ఇప్పటికే ఉన్న పాతవాటిని కూడా ఇలాగే మూలన పడేశారు. ఆటోట్రాలీలో ఏర్పాటు చేసిన రెండు పెద్దఫాగింగ్ మిషన్లలో ఒక్కదానితోనే.. అదికూడా మొక్కుబడిగా నగరంలో ఫాగింగ్ చేస్తున్నారు. దోమల నివారణ జరక్కపోగా.. అవి మరింత వృద్ధి చెంది ప్రజల కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథని మున్సిపాలిటీల్లోనూ ఇదే దుస్థితి కొనసాగుతోంది.ఫాగింగ్ చేయాలి గోదావరిఖనిలో దోమలు వృద్ధి చెందా యి. విపరీతంగా కుడుతున్నాయి. అధికారులు దోమల నివారణకు గతంలో వేగంగా చర్యలు తీసుకునేళ్లు. ఇప్పుడు ఫాగింగ్ కూడా చేయడం లేదు. – బోళ్ల చంద్రశేఖర్, గోదావరిఖని గంబూషియా చేపలు వదలాలి ఇండ్ల నడుమ ఉన్న ఖాళీప్లాట్లు, గుంతల్లో వర్షపునీరు నిలిచి దోమలు వృద్ధి చెందుతున్నాయి. ప్లాట్లను శుభ్రం చేసి నీటిగుంతల్లో గంబూషియా చేపలు వదిలి దోమల వృద్ధిని అరికట్టాలి. – పిట్ట వినయ్, పెద్దపల్లి -
కంపుకొడుతున్నాయి..
● ఓపెన్ ప్లాట్లు.. తప్పని పాట్లు ● అపరిశుభ్రతకు నిలయాలుగా ఖాళీ స్థలాలు ● జనావాసాల్లోనే వర్షపునీరు, డ్రైనేజీ నిల్వలు ● చెత్తాచెదారం, పిచ్చిమొక్కలతో వెలువడుతున్న దుర్గంధం ● పట్టించుకోని బల్దియా అధికార యంత్రాంగం సాక్షి పెద్దపల్లి: రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరందుకుంటోంది. దీంతో మున్సిపాలిటీల్లో ఇళ్లు నిర్మించుకోవాలనే ఉద్దేశంతో కొందరు, భవిష్యత్లో భూమి విలువ పెరుగుతుందన్న ఆశతో మరికొందరు విరివిగా ప్లాట్లు కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జిల్లాలోని రాముగుండం మున్సిపల్ కార్పొరేషన్తోపాటు పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథని మున్సిపాలిటీల్లో ఖాళీస్థలాలు బాగానే ఉండిపోతున్నాయి. కానీ, వాటి నిర్వహణపై యజమానులు పట్టనట్లు వ్యవహరించడంతో పిచ్చిమొక్కలతో నిండి, మురుగునీరు చేరి చెరువులను తలపిస్తున్నాయి. వీటిని శుభ్రం చేయాలని స్థానికుల నుంచి అధికారులకు ఫిర్యాదులు వస్తున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు ఖాళీస్థలాల్లో నీరు నిలిచి దోమలకు ఆవాసంగా మారాయి. పిచ్చిమెక్కలు, చెట్లు, చెత్తాచెదారంతో అధ్వానంగా తయారయ్యాయి. దుర్గంధం వెలువడడంతో స్థానికులు వ్యాధుల బారినపడుతున్నారు. నోటీసులకే పరిమితం నిబంధనల ప్రకారం ఓపెన్ ప్లాట్లలో పిచ్చిమొక్కలు, మురుగు, వర్షపునీరు చేరకుండా చూసుకోవాల్సిన బాధ్యత స్థల యజమానులదే. కానీ, వారు పట్టించుకోవడంలేదు. చెత్త, మురుగునీరు చేరి ఓపెన్ ప్లాట్లు మురికికూపాలుగా మారుతున్నాయి. గత పట్టణ ప్రగతిలో వీటిని గుర్తించినా చర్యలు తీసుకున్న దాఖలాలులేవు. కేవలం నోటీసులతోనే సరిపెట్టారు. కొందరు స్పందించినా.. చాలామంది తమకేం పట్టనట్లు వ్యహరిస్తున్నారు. అసలు ఖాళీప్లాట్లు ఎన్ని ఉన్నాయో కూడా యంత్రాంగం వద్ద సమాచారం లేదు. ఆదేశాలు బేఖాతరు! ఖాళీ స్థలాలకు వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ విధించాల ని ప్రభుత్వ ఆదేశాలున్నాయి. అయితే, కొత్తగా రి జిస్ట్రేషన్ చేసుకున్న వాటికే ఈ పన్ను వసూలు చే స్తున్నారు. వందల సంఖ్యలోని పాత ప్లాట్ల యజమానుల సమాచారం తెలియక అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించాల్సి వస్తోంది. అయితే, ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని యంత్రాంగమే ఖాళీ స్థలాలను శుభ్రం చేయించాల్సి ఉంది. భవన నిర్మాణం, ఇతర అనుమతుల కోసం దరఖాస్తు చే సుకునే సమయంలో అధికారులు ప్లాట్లను చదును చేసేందుకు అయిన ఖర్చును వసూలు చేయాల్సి ఉంది. ఈవిషయంలో ఎన్ని ఓపెన్ ప్లాట్లు అపరిశుభ్రంగా ఉన్నాయి? ఎంతమంది యజమానులకు నోటీసులు ఇచ్చారు? ఎన్ని ప్లాట్లను శుభ్రం చేయించారు? ఎంత జరిమానా విధించారు? అనే సమాచారం కోసం అధికారులను వివరణ కోరగా.. కొందరికే నోటీసులు జారీచేశామన్నారు. మరికొందరి చిరునామా తెలియదని సమాధానమిస్తున్నారు. -
చర్యలు తీసుకోవాలి
ఓపెన్ ప్లాట్లలోని పిచ్చిమొక్కలతో దోమలు వృద్ధి చెందుతున్నాయి. వర్షాకాలానికి ముందే ప్లాట్ల యజమానులను గుర్తించి నోటీసులు ఇవ్వాలి. వారు స్పందించకుంటే జరిమానా విధించాలి. కానీ, ఇలాంటి నిబంధనలు ఎక్కడా అమలుకు నోచుకోవడం లేదు. మార్కండేయకాలనీలో పిచ్చిమొక్కలు వెంటనే తొలగించాలి. – నామని మల్లేశ్, గోదావరిఖని మురికికూపాలతో వ్యాధులు పెద్దపల్లిలో కొత్త ఇండ్ల నిర్మాణం పెరిగింది. కాలనీల్లో డ్రైనేజీలు కట్టడంలేదు. వ్యర్థపు నీరు, చెత్తాచెదారం ఇండ్ల నడుమ ఖాళీ జాగాల్లో చేరుతోంది. సమీప ప్రజలకు వ్యాధులను అంటగడుతున్నాయి. అధికారులు చొరవచూపి ప్లాట్ యజమానులతో ఖాళీ స్థలాలను శుభ్రం చేయించాలి. పారిశుధ్యం మెరుగుపర్చాలి. – ఉప్పు కిరణ్, పెద్దపల్లి -
నీటిగుంతలు.. అసంపూర్తి డివైడర్లు
● రహదారిపైనే సిమెంట్ వ్యర్థాలు ● కానరాని సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ ● రోడ్లపైనే పశువులు – తరచూ ప్రమాదాలు ● అస్తవ్యస్తంగా మేడిపల్లి – భరత్నగర్ మార్గం జ్యోతినగర్(రామగుండం): రామగుండం నగరపాలక సంస్థ అభివృద్ధి పథంలో పయనిస్తున్నా.. అందులో భాగమైన ఎన్టీపీసీ మేడిపల్లి రోడ్డు సమస్యలకు నిలయంగా మారింది. మున్సిపల్ కార్పొరేషన్లోనే అతిపెద్ద పారిశ్రామిక ప్రాంతం మేడిపల్లి సెంటర్. ఇప్పటికీ అభివృద్ధికి నోచుకోవడంలేదు. గతేడాది గ్రీన్బెల్ట్ నిర్మాణం పేరిట సర్వీసు రోడ్డు సమీపంలోని కమర్షియల్ దుకాణాలను తొలగించారు. ఖాళీ స్థలాల్లో ఇప్పటివరకు పచ్చదనం కోసం ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. ఫలితంగా చిరువ్యాపారులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. టౌన్ ప్లానింగ్ అధికారులు ఇటీవల రోడ్డు విస్తరణ కోసం మరికొన్ని నిర్మాణాలు తొలగించారు. ఇంకా కొన్నింటికి మార్కింగ్ చేసి కూల్చివేశారు. వాటితాలూకు వ్యర్థాలను రోడ్డుపైనే వదిలివేశారు. దీంతో రాకపోకలకు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సెంట్రల్ లైటింగ్ పనుల్లోనూ జాప్యం.. మేడిపల్లి సెంటర్ నుంచి భరత్నగర్ బోర్డు వరకు సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేసేందుకు మధ్యలో గుంతలు తవ్వి అలాగే వదిలివేశారు. పాత స్తంభాలను రోడ్డు మధ్యలోనే వదిలేశారు. ఫలితంగా రాత్రివేళ వాహనదారులు వాటిని ఢీకొని ప్రమాదాల బారిన పడుతున్నారు. గుంతల వద్ద సూచికలు లేక స్థానికులు అందులోపడి గాయాలపాలవుతున్నారు. డివైడర్లు లేక రోడ్డు దాటేందుకు స్థానికులు సాహసించడంలేదు. బురదమయంగా రోడ్డు.. మేడిపల్లి సెంటర్ నుంచి భరత్నగర్ బోర్డు వరకు రోడ్డు విస్తరణ కోసం అక్రమ నిర్మాణాలను అధికారులు తొలగించి వ్యర్థాలను అలాగే వదిలివేశారు. సిమెంట్ వ్యర్థాలతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల కురిసిన వర్షానికి రోడ్డుపై బురదగుంతలు ఏర్పడ్డాయి. గుంతల్లో నీరు నిలిచి వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగిస్తున్నాయి. పశువుల సంచారంతో ఆందోళన మేడిపల్లి రోడ్డు మధ్యలోనే పశువులు సంచరిస్తున్నాయి. రాత్రివేళ అక్కడే సేదదీరుతుండడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని పశువులు కొట్లాడుకోవడంతో తమకు ఎలాంటి ముప్పు వాటిల్లుతుందోనని స్థానికులు వణికిపోతున్నారు. రోడ్డుపై పశువుల సంచారాన్ని నియంత్రిస్తామని అధికారులు చెప్పినా ఇంకా అమలుకు నోచుకోవడం లేదు. -
మద్యపానంపై నిషేధాజ్ఞలు
గోదావరిఖని: బహిరంగ ప్ర దేశాల్లో మద్యపానంపై నిషేధాజ్ఞలు కొనసాగిస్తున్నట్లు రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా తెలిపారు. అనుమతిలేని డ్రోన్, డీజే సౌండ్స్పైనా కఠిన చర్యలు ఉంటాయన్నారు. కమిషనరేట్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందన్నారు. మహిళలు, పౌరుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కమిషరేట్ పరిధిలోని మంచిర్యాల, పెద్దపల్లి జోన్లలో ఈనెలాఖరు వరకు నిషేధాజ్ఞలు కొనసాగిస్తామన్నారు. ఎన్టీపీసీ జీఎంకు పదోన్నతి జ్యోతినగర్(రామగుండం): ఎన్టీపీసీ ప్రాజెక్ట్ ఆ పరేషన్, మెయింటనెన్స్ జనరల్ మేనేజర్ అలో క్ త్రిపాఠి చీఫ్ జనరల్ మేనేజర్గా పదోన్నతి పొందారు. మంగళవారం స్థానిక పరిపాలన భ వనంలో అలోక్ త్రిపాఠిని ఐఎన్టీయూసీ అనుబంధ ఎన్టీపీసీ మజ్దూర్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ వేముల కృష్ణయ్య, జనరల్ సెక్రటరీ ఆరెపల్లి రాజేశ్వర్, గోపాలరావు, కొలని వెంకటరెడ్డి, రమేశ్, రాజేశం సన్మానించారు. ఆర్ఎఫ్సీఎల్ ఇన్చార్జిగా ఖుల్బే ఫెర్టిలైజర్సిటీ(రామగుండం) : రామగుండం ఎరువుల కర్మాగారం సీజీఎం, ప్రాజెక్ట్ హెచ్వోడీ ఉదయ్ రాజహంస జూన్ 30న ఉద్యోగ విరమ ణ పొందారు. దీంతో ఆర్ఎఫ్సీఎల్ ఇన్చార్జిగా రాజీవ్ ఖుల్బేను నియమిస్తూ యాజమాన్యం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. ఫెర్టిలై జర్స్ లిమిటెడ్ కర్మాగారంలో 1988లో మేనేజ్మెంట్ ట్రైనీగా ప్రస్థానం ప్రారంభించారు. ఖు ల్బేకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.ఎన్టీపీసీలో ఏఐ ఆధారిత సేవలు జ్యోతినగర్(రామగుండం): ప్రాజెక్టులోని జీ ఎంలు, ఏజీఎంల స్థాయి అధికారులు ఏఐ ఆ ధారిత సేవలను అందిపుచ్చుకుని విధులు ని ర్వర్తించాలని రామగుండం ఎన్టీపీసీ – తెలంగా ణ ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చందన్ కు మార్ సామంత సూచించారు. ఎన్టీపీసీ మిలీని యం హాల్లో ఏఐపై మంగళవారం చేపట్టిన స దస్సులో ఆయన మాట్లాడారు. భవిష్యత్లో ఏఐ ఆధారంగా విధుల నిర్వహణకు సిద్ధంగా ఉండాలని, ఇందుకోసం తమ విజ్ఞానం నవీకరించుకోవాలన్నారు. ఏఐ వక్త కిరుబా శంకర్ ప్రొఫెషనల్ కమ్యూనికేషన్, డిజిటల్ వ్యూహా ల్లో ఏఐ పరివర్తన– ప్రభావం గురించి వివరించారు. ఏజీఎం(హెచ్ఆర్) బిజయ్కుమార్ సిగ్ద ర్, ఏజీఎం మనోజ్ ఝా, కార్పొరేట్ కమ్యూని కేషన్ ఎగ్జిక్యూటివ్ రూపాలి రంజన్ ఉన్నారు. సమ్మె విజయవంతం చేయాలి గోదావరిఖని: కార్మికుల హక్కుల పరిరక్షణ కో సం ఈనెల 9న దేశవ్యాప్తంగా చేపట్టే సమ్మెలో సింగరేణి కార్మికులు పాల్గొనాలని కార్మిక సంఘాల జేఏసీ నాయకులు వాసిరెడ్డి సీతారామ య్య, అక్రమ్, టి.రాజారెడ్డి, మిర్యాల రాజిరె డ్డి, కె.విశ్వనాథ్ కోరారు. ఆర్జీ–2 ఏరియా ఓ సీపీ–3పై మంగళవారం ఏర్పాటు చేసిన గేట్మీటింగ్లో వారు మాట్లాడారు. బీజేపీ ప్రభు త్వం కార్మిక, కర్షక, ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతోందన్నారు. నాయకులు వైవీ రావు, జిగురు రవీందర్, ప్రకాశ్, అన్నారావు, రాజర త్నం, రాంచందర్, శ్యాంసన్, రవికుమార్, మ హేందర్, రవీందర్, సాగర్, కుమారస్వా మి, సత్యనారాయణరెడ్డి, సంపత్రెడ్డి పాల్గొన్నారు. ఇకనుంచి బయోమెట్రిక్ హాజరు పెద్దపల్లిరూరల్: జిల్లా, మండల పరిషత్ కా ర్యాలయాల్లో ఫేషియల్ రికగ్నేషన్ హాజరు (బ యోమెట్రిక్ అటెండెన్సు) విధానాన్ని అమల్లోకి తెస్తున్నట్లు జెడ్పీ సీఈవో నరేందర్ తెలిపారు. సమయపాలన, విధుల్లో పారదర్శకత కోసం ఈ విధానాన్ని అమలు చేయాలని ఉన్నతాధికా రులు ఆదేశాలిచ్చారని ఆయన వివరించారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తం పెద్దపల్లిరూరల్: సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్యాధికారి అన్న ప్రసన్నకుమారి ఆదేశించారు. తన కార్యాలయంలో మంగళవారం సమీక్ష నిర్వహించా రు. ఆరోగ్య, అంగన్వాడీ కేంద్రాలు, పంచాయ తీ కార్యాలయాల వద్ద ఓఆర్ఎస్ పాకెట్లు అందుబాటులో ఉంచాలని, స్కూళ్లలో ఓఆర్ఎస్ తయారీపై అవగాహన కల్పించాలని అన్నారు. -
బర్తన్ బ్యాంకులు ఏర్పాటు చేయండి
కోల్సిటీ/జ్యోతినగర్: ప్లాస్టిక్ వస్తువుల వినియోగా న్ని నియంత్రించడానికి స్టీల్ వస్తువులను అందుబాటులో ఉంచే బర్తన్ బ్యాంకుల ఏర్పాటుకు స్వశక్తి సంఘాల మహిళలు ముందుకు రావాలని నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ వెంకటస్వామి కోరా రు. వందరోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా మంగళవారం బర్తన్ బ్యాంకును ఆయన సంద ర్శించారు. ప్లాస్టిక్కు ప్రత్యామ్నాయంగా స్టీల్ వస్తువులను వినియోగించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసే బర్తన్ బ్యాంకులతో స్వశక్తి మహిళలకు ఉపాధి కూ డా లభిస్తుందన్నారు. అనంతరం గోదావరిఖని బ స్టాండ్ వద్ద చేపట్టిన రోడ్డు విస్తరణ పనులను పరిశీలించారు. బస్టాండ్లోని మరుగుదొడ్లపై ఆరా తీశా రు. గాంధీనగర్ వంకబెండు సమీపంలో కూరగా యలు, వీధివ్యాపారుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పీఎం స్వనిధి గురించి అవగాహన కల్పించారు. ఓల్డ్ అశోక టాకీస్ ప్రాంతంలో గోడలపై చి త్రీకరిస్తున్న సందేశాత్మక చిత్రాలను పరిశీలించారు. శానిటరీ ఇన్స్పెక్టర్ కుమారస్వామి, మెప్మా టీఎంసీ మౌనిక, సీవోలు ఊర్మిళ, ప్రియదర్శిని ఉన్నారు. బల్దియా డిప్యూటీ కమిషనర్ వెంకటస్వామి -
అర్హులందరికీ రేషన్కార్డులు
సుల్తానాబాద్రూరల్(పెద్దపల్లి): గత ప్రభుత్వం ప దేళ్లపాలనతో ఒక్కరేషన్ కార్డు ఇవ్వలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులందరికీ అందిస్తోందని పెద్దపల్లి ఎ మ్మెల్యే విజయరమణారావు అన్నారు. సర్సయ్యపల్లిలో మంగళవారం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి, సీసీ రోడ్లు ప్రారంభించారు. ఇందిర మ్మ ఇళ్లకు ముగ్గు పోశారు. కాంగ్రెస్ నాయకుడు జూపల్లి తిరుమల్రావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి న సమావేశంలో మాట్లాడారు. నియోజకవర్గ అభి వృద్ధికి 18 గంటల పాటు పనిచేస్తున్నాని అన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అన్నయ్యగౌడ్, ఏ ఎంసీ చైర్మన్ ప్రకాశ్రావు, సింగిల్విండో చైర్మన్ సందీప్రావు, తహసీల్దార్ బషీరొద్దీన్, ఎంపీడీవో దివ్య దర్శన్రావు, నాయకులు సతీశ్, రాములు, జానీ, రాజ్కుమార్, వెంకటరమణ పాల్గొన్నారు. -
డివైడర్లు నిర్మించాలి
మేడిపల్లి రోడ్డు నుంచి అన్నపూర్ణకాలనీ వరకు రోడ్డు మధ్య కొంతవరకే డివైడర్లు ఉన్నాయి. మిగతా రోడ్డుకు లేవు. వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. పశువులు రోడ్డుపై ఉండటంతో చీకట్లో ఢీకొట్టి వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. – తోట రవి, అన్నపూర్ణకాలనీ, ఎన్టీపీసీ సెంట్రల్ లైటింగ్ అవసరం మేడిపల్లి సెంటర్ – భరత్నగర్ బోర్డు మధ్య సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ పనులు వెంటనే పూర్తిచేయాలి. విద్యుత్ స్తంభాల ఏర్పాటుకు తవ్విన గుంతలతో రాత్రి వేళ కార్మికులు ప్రమాదాలకు గురవుతున్నారు. రోడ్డు మధ్య డివైడర్లు లేక ప్రమాదాలు జరుగుతున్నాయి. – గీట్ల లక్ష్మారెడ్డి, సీఐటీయూ నాయకుడు రహదారి పరిశీలిస్తాం మేడిపల్లి రోడ్డు ప్రాంతంలోని సమస్యలు పరిశీలిస్తాం. రోడ్డుపై పశువులను వదల కూడదు. యజమానులు పద్ధతులు మార్చుకోవాలి. లేకుంటే చర్యలు తీసుకుంటాం. రోడ్డు విస్తరణకు చర్యలు తీసుకుంటాం. త్వరలోనే సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేస్తాం. – అరుణశ్రీ, కమిషనర్, రామగుండం బల్దియా -
యువతకు నైపుణ్య శిక్షణ
● టాస్క్ సెంటర్ను సద్వినియోగం చేసుకోండి ● కలెక్టర్ కోయ శ్రీహర్ష పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ‘టాస్క్’ సెంటర్లో అందిస్తున్న నైపుణ్యశిక్షణను యువత సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కో య శ్రీహర్ష సూచించారు. టాస్క్ సెంటర్లో టాలీ విత్ జీఎస్టీ కోర్సు పూర్తిచేసిన యువతకు ఆయన మంగళవారం సర్టిఫికెట్లు అందించారు. టాస్క్తో వివిధ రంగాల్లో నైపుణ్యాభివృద్ధి శిక్షణ, ప్లేస్మెంట్ అవకాశాలు లభిస్తున్నాయని ఆయన తెలిపారు. మిషన్భగీరథ పనుల్లో జాప్యమెందుకు? పెండింగ్ మిషన్భగీరథ(ఇంట్రా) పనుల్లో జాప్య మెందుకు జరుగుతోందని కలెక్టర్ ప్రశ్నించారు. ఫిబ్రవరిలో మంజూరు చేసిన పనులు ఇంకా పూర్తికాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వారం రోజుల్లో ఇళ్లకు పైప్లైన్ వేసి తాగునీరు సరఫరా చేయాలని ఆదేశించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా నీటి నాణ్యత పరీక్షలు చేయాలన్నారు. వాటర్ ట్యాంకులను శుభ్రం చేయించాలని, డ్రైనేజీల సమీపంలో తాగునీటి పైపులైన్ లీకేజీలు అరికట్టాలని, ప్రభుత్వ, రెసిడెన్షియల్ స్కూళ్లకు తాగునీరు సరఫరా చేయాలని పేర్కొన్నారు. డీపీవో వీరబుచ్చయ్య, మిషన్భగీరథ అధికారులు ఉన్నారు. మంథని ఆస్పత్రిలో ప్రసవాలసంఖ్య పెంచాలి మంథని ప్రభుత్వ ఆస్పత్రిలో సేవలు మెరుగుపడాలని కలెక్టర్ శ్రీహర్ష ఆదేశించారు. ఆస్పత్రిలో 14మంది వైద్యసిబ్బంది ఉన్నా అందుబాటులో ఉండడం లేదనే ఫిర్యాదులొస్తున్నాయన్నారు. మంథని ఎంసీహెచ్లో ప్రసవాలు కనీసం 25 జరిగేలా చూ డాలని అన్నారు. సబ్సెంటర్ల వారీగా గర్భిణులను గుర్తించి ఎంసీహెచ్కు వచ్చేలా ప్రోత్సహించాలన్నా రు. సకాలంలో విధులకు హాజరుకావాలని ఆయన ఆదేశించారు. డీఎంహెచ్వో అన్న ప్రసన్నకుమారి, డీసీహెచ్వో శ్రీధర్ తదితరులు ఉన్నారు. -
డాక్టర్లను గౌరవించాలి
● ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్ గోదావరిఖని: ఆపదలోని పేషెంట్లకు పునర్జన్మ ఇస్తున్న వైద్యులను గౌరవించాలని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్ అన్నారు. వైద్యుల దినోత్సవం సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మంగళవారం వైద్యులతో కలిసి కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. డాక్టర్లను శా లువాలతో సన్మానించారు. అనంతరం ఆయన మా ట్లాడారు. ప్రజలకు ప్రాణం పోస్తున్న వైద్యులతో అనుచితంగా ప్రవర్తిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. వైద్యవృత్తి అనేది నిరంతర సేవా మార్గమని, మానవత్వాన్ని కాపాడే గొప్ప బాధ్యత డాక్టర్లది అని ఆయన అన్నారు. కార్యక్రమంలో మాజీ మేయర్ బంగి అనిల్కుమార్, వైద్యుల సంఘం నాయకులు క్యాస శ్రీనివాస్, నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ పనులు ప్రారంభం ఫెర్టిలైజర్సిటీ(రామగుండం): గౌతమినగర్ రైల్వే ట్రాక్ – ఎన్టీపీసీ సర్కిల్ వరకు రూ.2కోట్ల20 లక్షల వ్యయంతో చేపట్టిన సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ పనులను ఎమ్మెల్యే రాజ్ఠాకూర్ మక్కాన్సింగ్ ప్రారంభించారు. ఈ మార్గంలో అనేక ప్రమాదాలు జరగడంతో వీధి దీపాలు ఏర్పాటు చేయాలని ‘సాక్షి’ వరుస కథనాలు ప్రచురించింది. ఎట్టకేలకు బల్దియా అధికారులు సెంట్రల్ లైటింగ్ పనులు చేపట్టడంతో స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు. ఈసాలతక్కళ్లపల్లిలో రూ.15కోట్లతో అభివృద్ధి పనులు పాలకుర్తి(రామగుండం): ఈసాలతక్కళ్లపల్లిలో రూ.15కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్ అన్నారు. ఇందిరమ్మ ఇళ్లకు ఆయన ముగ్గు పోశారు. అనంతరం ఆయన మాట్లాడారు. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారులను గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ముక్కెర శ్రీనివాస్, నాయకులు మల్లెత్తుల శ్రీనివాస్, తుంగ నర్సయ్య, ఓడ్నాల రాజు, సాయితిరుమల్ తదితరులు పాల్గొన్నారు. -
నాన్న వెంటే పిల్లలు
కరీంనగర్స్పోర్ట్స్: తాము పనిచేస్తున్న ప్రభుత్వ పాఠశాలలకు తమ పిల్లలను తీసుకెళ్తున్నారు ఈ తండ్రులు. వీరిని చూసి గ్రామంలోని తల్లిదండ్రులు సైతం తమ పిల్లలను సర్కార్ బడులకు పంపుతున్నారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం ఒద్యారం గ్రామానికి చెందిన సత్యనారాయణ ప్రస్తుతం వేములవాడలోని జెడ్పీ హైస్కూల్(బాలికలు)లో విధులు నిర్వర్తిస్తున్నారు. కరోనా సంక్షోభానికి ముందు కరీంనగర్లోని ఓ ప్రైవేటు పాఠశాలలో టీచర్గా పనిచేస్తూ పిల్లలనూ అక్కడే చదివిపించేవారు. అనంతరం ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం రావడంతో తాను పనిచేస్తున్న స్కూల్కే తన పిల్లలను తీసుకెళ్తున్నారు. పెద్ద కూతురు అనన్య ప్రభాస 8వ తరగతి, చిన్నకూతురు ప్రవస్థి 5వ తరగతి చదువుతున్నారు. -
మెరుగైన బోధన చేయాలి
పెద్దపల్లిరూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన ఫలితాలను సాధించేందుకు నాణ్యమైన బోధన చేయాలని కలెక్టర్ శ్రీహర్ష ఆదేశించా రు. పలువురు హెచ్ఎంలతో ఆయన సోమవా రం కలెక్టరేట్లో సమావేశమై పలు సూచనలిచ్చారు. విద్యాప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా పనిచేయాలని అన్నారు. కనీసం 90శాతం విద్యార్థులకు చదవడం, రాయడం, బేసిక్ మ్యాథ్స్ అర్థం కావాలని తెలిపారు. మధ్యాహ్నభోజనం నాణ్యంగా ఉండేలా చూడాలని సూచించారు. డీఈవో మాధవి, సమన్వయ అధికారి పీఎంషేక్ తదితరులు పాల్గొన్నారు. పోలీస్ అధికారులకు సన్మానంగోదావరిఖని: ఉద్యోగ విరమణ పొందిన పో లీసు అధికారులను రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా సోమవారం తన కా ర్యాలయంలో సన్మానించారు. ఇందులో ఎస్ఐ వెంకటేశ్వర్రావు, ఎన్.చంద్రశేఖర్, ఎం.అంజయ్య ఉన్నారు. అడిషనల్ డీసీపీ రాజు, స్పెషల్ బ్రాంచ్, ఏఆర్ ఏసీపీలు మల్లారెడ్డి, ప్రతాప్, ఏవో శ్రీనివాస్, సీసీఆర్బీ సీఐ సతీశ్, ఆర్ఐలు దామోదర్, మల్లేశం, వామనమూర్తి ఉన్నారు.గోరింటాకు సంబురం మంథని: ఆషాఢ మాసంలో తొలివారం సందర్భంగా మంత్రపురిలోని శ్రీలక్ష్మీనారాయణస్వా మి ఆలయంలో సోమవారం గోరింటాకు సంబురాలు ఘనంగా జరుకున్నారు. పట్టణానికి చెందిన బండారి సునీత ఆధ్వర్యంలో విష్ణులలిత పారాయణ మహిళలు ప్రత్యేకంగా గోరింటాకు తయారు చేసుకున్నారు. లక్ష్మీనారాయణస్వామి, లక్ష్మీదేవి, గోదాదేవి అమ్మవార్ల చేతులకు గోరింటాకు అలకరించారు. ఆషాఢంలో గోరింటాకు అలంకరించుకుంటే అనేక ప్రయోజనాలు ఉంటాయని ఆమె పేర్కొన్నారు. స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలిసుల్తానాబాద్రూరల్(పెద్దపల్లి): స్థానిక ఎన్నిక ల్లో కాంగ్రెస్ మద్దతుదారులను గెలిపించి సత్తా చాటాలని ఎమ్మెల్యే విజయరమణారావు కోరా రు. ఐతరాజుపల్లి, భూపతిపూర్, గొల్లపల్లి, నా రాయణారావుపల్లి, సాంబయ్యపల్లి గ్రామాల్లో ఎమ్మెల్యే సోమవారం సుడిగాలి పర్యటన చేశా రు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు ముగ్గు పోశా రు. ప్రొసీడింగ్స్ అందజేసి మాట్లాడారు. కాంగ్రెస్ మద్దతుదారులను గెలిపిస్తే గ్రామాలు సంపూర్ణ అభివృద్ధి చెందుతాయని తెలిపారు. జి ల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అన్నయ్యగౌడ్, ఏఎంసీ చైర్మన్ ప్రకాశ్రావు, ఎంపీడీవో దివ్వదర్శన్, నాయకులు సతీశ్, రాములు, తిరుమల్రావు, జాని, వెంకన్న, రాజిరెడ్డి, చక్రపాణి, రాజు, బక్కయ్య, శ్రీనివాస్ పాల్గొన్నారు. రేపు క్రికెట్ జిల్లా జట్టు ఎంపికగోదావరిఖనిటౌన్: మహిళా క్రికెట్ జిల్లా జట్టు ఎంపిక పోటీలు ఈనెల 2న ఉదయం 9 గంట లకు గోదావరిఖని జీఎంకాలనీ గ్రౌండ్లో నిర్వహించనున్నట్టు క్యాంప్ జిల్లా ఇన్చార్జి కిరణ్కుమార్ యాదవ్ తెలిపారు. సుధాకర్ ఆధ్వర్యంలో ఎంపిక పోటీలు ఉంటాయని పేర్కొన్నారు. -
ప్రజాసమస్యలు పరిష్కరించాలి
గోదావరిఖని: ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్ సూచించారు. సోమవారం క్యాంపు కార్యాల యంలో ప్రజలను నుంచి విజ్ఞప్తులు స్వీకరించారు. తాగునీటి ఇబ్బందులు, రోడ్ల మరమ్మతులు, డ్రైనేజ్ సమస్యలు, ఆరోగ్యసేవలు, విద్య తదితర అంశాలపై అందిన ఫిర్యాదులను ఆయన పరిశీలించారు. పేదల సంక్షేమమే ధ్యేయం పాలకుర్తి(రామగుండం): పేదల సంక్షేమమే ధ్యే యంగా ప్రభుత్వం పనిచేస్తున్నదని ఎమ్మెల్యే మక్కాన్సింగ్ అన్నారు. మండల కేంద్రంతోపాటు కొత్తపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఆయన ముగ్గు పోశారు. అనంతరం ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని అన్నారు. కన్నాల సింగిల్విండో చైర్మన్ బయ్యపు మనోహర్రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ముక్కె ర శ్రీనివాస్, మాజీ ఎంపీపీ గంగాధర రమేశ్ మాజీ సర్పంచ్ మల్లెత్తుల శ్రీనివాస్ పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభం ఫెర్టిలైజర్సిటీ(రామగుండం): పాలకుర్తి మండలం ఎల్కలపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే రాజ్ఠాకూర్ భూమిపూజ చేశారు. మాజీ సర్పంచ్ చిట్టబోయిన రాజకుమార్, 14వ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు బూర్ల శ్రీనివాస్, రాజిరెడ్డి, బండ రమేశ్రెడ్డి, రాకేశ్, స్థానిక నాయకులు పాల్గొన్నారు. -
సర్కార్ బడికే జై
బడిపై నమ్మకం కల్పించాలని● తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించిన టీచర్లు ● తాము పనిచేస్తున్న స్కూళ్లకు తీసుకెళ్తున్న వైనం ● స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్న ప్రభుత్వ టీచర్లుప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం.. గవర్నమెంట్ టీచర్లపై భరోసా పెంచాలనే పలువురు ఉపాధ్యాయులు తమ పిల్లలను సర్కార్ బడికి పంపుతున్నారు. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా విద్యాబోధన ఉంటుందని చెప్పేందుకే తాము పనిచేస్తున్న స్కూళ్లకు పిల్లలను తీసుకెళ్తున్నారు. సార్లే.. తమ పిల్లలను ఊరిలోని బడికి తీసుకొస్తుంటే.. మిగతా తల్లిదండ్రులు తమ పిల్లలనూ చేర్పిస్తున్నారు. ఇటీవల ఉపాధ్యాయులు చేపట్టిన బడిబాటలో విద్యార్థుల సంఖ్య పెరగడానికి ఇదే కారణం. తమ పిల్లలను సర్కార్ బడికి పంపుతున్న ఉపాధ్యాయులు ఆదర్శంగా నిలుస్తున్నారు.రుద్రంగి(వేములవాడ): తాను పనిచేస్తున్న ప్రభు త్వ బడిపై నమ్మకం కల్పించాలనే తన ముగ్గురు పిల్లలనూ సర్కార్ స్కూళ్లలోనే చదివిపిస్తున్నారు రాజన్నసిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం వీరునితండాకు చెందిన టీచర్ భూక్య తిరుపతి. రుద్రంగి ప్రైమరీ స్కూల్లో టీచర్గా విధులు నిర్వర్తిస్తున్న భూక్య తిరుపతికి భూక్య ప్రీతి జ, భూక్య నిహారిక, భూక్య అయాన్ అద్వైత్ పిల్లలు. నిహారి కను గతంలో తాను పనిచేసిన రుద్రంగి ప్రైమరీ స్కూల్కు తీసుకెళ్లేవారు. ప్రస్తుతం మానాలలోని స్కూల్లో విధులు నిర్వర్తిస్తున్న తిరుపతి తన కొడుకు అయాన్ అద్వైత్ను అదే పాఠశాలకు వెంట తీసుకెళ్తున్నారు. ఇద్దరు కూతుళ్లు భూక్య ప్రీతిజ 10వ తరగతి, భూక్య నిహారిక 7వ తరగతి.. గురుకులాల్లో చదువుతున్నారు. కథలాపూర్(వేములవాడ): కథలాపూర్ మండలం దుంపేటకు చెందిన గుండేటి రవికుమార్–పద్మలత దంపతులు ఇద్దరు ప్రభుత్వ ఉపాధ్యాయులు. వీరు మండలంలోని పోసానిపే ట ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ దంపతుల చిన్నకుమారుడు లౌకిక్ 4వ తరగతి వారు పనిచేస్తున్న పోసానిపేట ప్రభుత్వ పాఠశాలలోనే చదువుతున్నాడు. నిత్యం తమ వెంటే స్కూల్కు తీసుకెళ్తున్నారు. వీరిని చూసి గ్రామంలోని తల్లి దండ్రులు సైతం తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపడంతో విద్యార్థుల సంఖ్య పెరిగింది. తల్లిదండ్రుల బడికి కొడుకు -
పిల్లల చేయిపట్టి.. సర్కార్ బడికి జైకొట్టి
తాము పనిచేస్తున్న సర్కార్ స్కూళ్లపై నమ్మకం పెంపొందించడం.. విద్యార్థుల సంఖ్య పెంచడమే లక్ష్యంగా టీచర్లు తమ పిల్లలను తమతోపాటే తీసుకెళ్తున్నారు. ప్రభుత్వ కొలువు చేస్తూ ప్రైవేట్ స్కూళ్లకు పంపడం సరికాదని.. సర్కార్ స్కూళ్లలో చేర్పించారు. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని.. ప్రైవేట్కు దీటుగా విద్యాబోధన సాగుతోందంటూ టీచర్లు చాటిచెబుతున్నారు. పిల్లలను తాము పనిచేస్తున్న స్కూళ్లకు తీసుకెళ్తూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ ఉపాధ్యాయులు. ● ప్రభుత్వ పాఠశాలకు పంతుళ్ల పిల్లలు ● నమ్మకం కల్పిస్తున్న టీచర్లు ● స్ఫూర్తి పొందుతున్న తల్లిదండ్రులు ● సర్కార్ స్కూళ్లలో పెరుగుతున్న ప్రవేశాలు తమతోనే పిల్లలు రాయికల్: జగిత్యాల జిల్లా రాయికల్కు చెందిన పుర్రె రమేశ్, కవిత దంపతులు ప్రభుత్వ ఉపాధ్యాయులు. రమేశ్ రాయికల్ హైస్కూల్లో పీడీగా, కవిత రాయికల్ మండలం ఇటిక్యాలలోని ప్రైమరీ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నారు. వీరి కూతురు ఆరాధ్యను వారు పనిచేస్తున్న స్కూల్లో చేర్పించారు. మొదట్లో కవిత పనిచేసిన భూపతిపూర్లో 1 నుంచి 3వ తరగతి, ప్రస్తుతం ఇటిక్యాలలో 4వ తరగతిలో చేర్పించారు. పిల్లలనూ సర్కార్ బడికే.. ఇల్లంతకుంట: మండలంలోని వంతడుపుల గ్రామానికి చెందిన రెవెన్యూ ఉద్యోగి యామ రాజు తన ఇద్దరు కూతుళ్లను ప్రభుత్వ బడిలోనే చేర్పించారు. రాజు కూతుళ్లు యామ ధీరజ, తనూజ మండలంలోని రహీంఖాన్పేట ప్రభుత్వ మోడల్ స్కూల్లో చదువుతున్నారు. పెద్ద కూతురు ఇంటర్లో 987 మార్కులు సాధించి ప్రస్తుతం కోటిలోని ఉమెన్స్ డిగ్రీ కాలేజీలో చేరింది. చిన్నకూతురు తనూజ మోడల్స్కూల్లో పదో తరగతి చదువుతోంది.కోనరావుపేట: కోనరావుపేట మండల కేంద్రానికి చెందిన తీపిరి సంజీవ్ స్థానిక మండల పరిషత్ పాఠశాలలో పనిచేస్తున్నారు. తన కుమారుడు జయసూర్యని కూడా అదే పాఠశాలలో రెండో తరగతి చదివిస్తున్నారు. ప్రతి రోజూ తండ్రీకొడుకులు బైక్పై స్కూల్కు వెళ్లి వస్తున్నారు. కథలాపూర్(వేములవాడ): మండలంలోని దుంపేట ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో పనిచేస్తున్న లింగంపేట సతీశ్ తన కొడుకు వరుణ్తేజ్ అదే స్కూల్లో 8వ తరగతి చదువుతున్నారు. తల్లీకొడుకులు ఒకే బడికి.. కోరుట్ల: ఈ తల్లులు ప్రభుత్వ టీచర్లు. తమ పిల్లలను సైతం వారు పనిచేస్తున్న స్కూళ్లకు తీసుకెళ్తూ విద్యాబుద్ధులు నేర్పుతున్నారు. కోరుట్ల మండలం అయిలాపూర్లో ప్రాథమికోన్నత పాఠశాలలో ఎస్జీటీగా పనిచేస్తున్న సీహెచ్ శ్రీలక్ష్మీ తన కుమారుడు శ్రీయాన్ను అదే స్కూల్లో 4వ తరగతిలో చదివిపిస్తున్నారు. నిత్యం తనతోపాటు స్కూల్కు తీసుకెళ్తున్నారు. శ్రీలక్ష్మీ మాట్లాడుతూ.. ప్రభుత్వ స్కూళ్లలో స్వేచ్ఛాపూరిత వాతావరణంలో విద్యాభ్యాసం సాగుతోందని, అప్పుడే విద్యార్థుల్లో సృజనాత్మకశక్తి పెరుగుతుందన్నారు. కోరుట్లరూరల్: కోరుట్ల మండలం మాదాపూర్ ప్రాథమిక పాఠశాల ఎస్జీటీ ఎలిగేటి రాజమణి తన కుమారుడిని అదే పాఠశాలలో చదివిస్తోంది. కోరుట్లకు చెందిన రాజమణి తన కొడుకు హిమాన్ష్ను తాను పనిచేస్తున్న స్కూల్లోనే 3వ తరగతిలో చేర్పించింది. నిత్యం బైక్పై కొడుకును తీసుకొని స్కూల్కు వెళ్లి వస్తోంది. రెండేళ్ల క్రితం ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండిలో పనిచేసే సమయంలోనూ తన కొడుకును తీసుకెళ్లేవారు. ప్రభుత్వ పాఠశాలలో ఉత్తమ బోధన అందుతుండడంతోనే తీసుకెళ్తున్నట్లు రాజమణి తెలిపారు. జ్యోతినగర్: ఎన్టీపీసీ రామగుండం టెంపరరీ టౌన్షిప్లోని జెడ్పీ హైస్కూల్లో ఫిజికల్ డైరెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్న జావెద్ తన పిల్లలను అదే బడిలో చదివిపిస్తున్నారు. తన పెద్ద కొడుకు నవీదుల్ రెహమాన్ను అదే స్కూల్లో 7వ తరగతి, చిన్న కొడుకు టిప్పు ఉల్ రహమాన్ను దుర్గయ్యపల్లి స్కూల్లో 4వ తరగతిలో చేర్పించాడు. ధర్మపురి: ధర్మపురి మండలం రాయపట్నం స్కూల్లో పనిచేస్తున్న బండారు రాజు తన కొడుకు రోహన్ను అదే బడిలో 3వ తరగతిలో చేర్పించారు. గతంలో వెల్గటూర్ మండలం కిషన్రావుపేటలో పనిచేసిన సమయంలో తన వెంటే కొడుకును తీసుకెళ్లారు. బోధనపై నమ్మకంతో.. వేములవాడ: కథలాపూర్ స్కూల్లో పనిచేస్తున్న టీచర్ కిష్టయ్య తన కూతురు మధురిమను వేములవాడలోని బాలికల హైస్కూల్లో చేర్పించారు. ప్రస్తుతం 9వ తరగతి చదువుతోంది. ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య అందుతుందనే చేర్పించినట్లు కిష్టయ్య పేర్కొన్నారు. జమ్మికుంట: ప్రభుత్వ పాఠశాలలో బోధనపై నమ్మకం కల్పించేందుకు తన కుమారుడిని చేర్పించినట్లు టీచర్ బానోత్ సత్యజోస్ తెలిపారు. భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం పర్లపల్లిలోని స్కూల్లో సత్యజోస్ టీచర్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. జమ్మికుంటలో ఉంటున్నారు. ఏడాది క్రితం బదిలీపై పర్లపల్లి పాఠశాలకు వచ్చారు. తన కొడుకు బానోతు సుశాంత్ను జమ్మికుంట హైస్కూల్లో 9వ తరగతిలో చేర్పించారు. విద్య వ్యాపారం కాదని.. సారంగాపూర్: ప్రస్తుతం విద్యను వ్యాపారం చేసేశారని.. కాదని చెప్పేందుకే తన పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చదివిపిస్తున్నట్లు గొడుగు మధుసూదన్ తెలిపారు. బీర్పూర్ మండలం నర్సింహులపల్లికి చెందిన మధుసూదన్ కండ్లపల్లిలో టీచర్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. పెద్ద కుమార్తె నిత్య 10వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలో చదివి ప్రస్తుతం ఇంటర్మీడియెట్లో చేరింది. చిన్న కూతురు శ్రీనిధి నర్సింహులపల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. కండ్లపల్లిలో విధులు నిర్వహిస్తూనే నర్సింహులపల్లిలోని స్కూల్కు వెళ్లి అదనంగా ఒక పీరియడ్ బోధిస్తున్నారు. -
అర్హులందరికీ సంక్షేమ ఫలాలు
ధర్మారం(ధర్మపురి): ఇందిరమ్మ ప్రభుత్వ పాలన లో అర్హులైన ప్రతీఒక్కరి సంక్షేమ ఫలాలు అందు తాయని ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. బొమ్మారెడ్డిపల్లి, చామనపల్లిలో ప్రమాదవాశాత్తు మృతిచెందిన గొ ర్రెలకు రూ.8లక్షల 70వేల పరిహారం చెక్కులను కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి సోమవారం మంత్రి బాధితులకు అందజేశారు. మేడారంలో విద్యు త్ మరమ్మతులు, అభివృద్ధి పనులు, ఇందిరమ్మ ఇళ్లకు మంజూరు పత్రాలు అందజేశారు. ధర్మారంలో ఇందిరమ్మ మోడల్ హౌస్ను ప్రారంభించి మాట్లాడారు. నందిమేడారంలో విద్యుత్ లూస్వైర్లు, ట్రాన్స్ఫార్మర్ల సమస్యలు, ఇళ్లపై విద్యుత్ తీగల తొలగింపు కోసం రూ.26లక్షలు మంజూరు చేశామని, రూ.80లక్షలతో సీసీ రోడ్లు నిర్మించా మని తెలిపారు. ధర్మారంలో ఐటీఐ ఏర్పాటుకు జీ వో విడుదల చేశామని తెలిపారు. వ్యవసాయ మా ర్కెట్ కమిటీ చైర్మన్ లావుడ్య రూప్లానాయక్, వైస్ చైర్మన్ అరిగే లింగయ్య, ఆర్డీవో గంగయ్య, హౌ సింగ్ పీడీ రాజేశ్వర్రావు, ఇన్చార్జి తహసీల్దార్ ఉ దయ్కుమార్, ఎంపీడీవో ప్రవీణ్కుమార్ పాల్గొన్నారు. మంత్రికి యాదవసంఘంస్వాగతం పలు కగా, ఆర్యవైశ్య సంఘం నేతలు సన్మానించారు.● మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ -
కుక్కలతో జాగ్రత్త
కోల్సిటీ(రామగుండం): నగరవాసులు కు క్కకాటు బారిన పడకుండా జాగ్రత్త పడాలని రామగుండం నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ వెంకటస్వామి సూచించారు. 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా సోమవారం స్థానిక తిలక్నగర్ ప్రాంతంలో ఇంటింటా అవగాహన కల్పించారు. వీధికుక్కలు, పిచ్చికుక్కల బారిన పడకుండా తీసుకోవల్సిన జాగ్రత్తలను పోస్టర్ల ద్వారా ప్రదర్శించారు. శానిటరీ ఇన్స్పెక్టర్లు నాగభూషణం, కుమారస్వామి, హెల్త్అసిస్టెంట్ సంపత్, మెప్మా సీవోలు ప్రియదర్శిని, శమంతకమణి తదితరులు పాల్గొన్నారు.పోలీస్స్టేషన్ తనిఖీకమాన్పూర్(మంథ ని): పెద్దపల్లి డీసీపీ కరుణాకర్ సోమవా రం స్థానిక పోలీస్స్టేషన్ను తనిఖీ చేశా రు. రికార్డులను పరి శీలించారు. పాత కే సుల గురించి ఎస్సై ప్రసాద్ను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం పోలీస్స్టేషన్ అవరణలో మొక్క లు నాటారు. గోదావరిఖని టూటౌన్ సీఐ ప్రసాదరావు తదదితరులు ఉన్నారు.అన్నిరంగాల్లో రాణించాలిరామగిరి(మంథని): మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని డీఎంహెచ్వో అన్న ప్రసన్నకుమారి సూచించారు. కల్వచర్ల గ్రామపంచాయతీ పరిధి మారుతీనగర్లో రేండ్ల శారద– కుమార్స్వామి దంపతులు ఆర్ఎస్కే ఆపన్నహస్తం ద్వారా ఏర్పాటు చేసిన ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని ఆమె సోమవారం ప్రారంభించి మాట్లాడారు. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి సాధించేందుకు కుట్టు శిక్షణ ఎంతో దోహదపడుతుందన్నారు. కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
మురికికూపాలు
సాక్షి, పెద్దపల్లి: బల్దియాల్లో మురుగునీటి పారుదల వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. చాలాకాలనీల్లో మురుగునీరు బయటకు వెళ్లేమార్గం లేకుండా పో యింది. దీంతో పల్లపు ప్రాంతాల్లో నిలిచి కాలనీలు మురికూపాలుగా మారుతున్నాయి. ప్రధాన కాలువల్లో పూడిక తొలగించక, పలుచోట్ల కబ్జాకు గురవ డ, మరికొన్నిచోట్ల కాలువలే లేక మురుగు రోడ్లపై కి వస్తోంది. ఫలితంగా దోమలు, దుర్వాసన భరించలేకపోతున్నారు. వర్షాకాలం కావడంతో జ్వరాలు, డెంగీ తదితర వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. కనిపించని కాలువలు రామగుండం నగరంతోపాటు పట్టణాల్లో ప్రధానంగా డ్రైనేజీల సమస్య వేధిస్తోంది. మున్సిపాలిటీల్లో ని పాత వార్డుల్లో డ్రైనేజీలు ఉన్నా.. పూడిక తీయక సమస్యలు వస్తున్నాయి. ఐదేళ్లు గడిచినా.. విలీన కాలనీల్లో పారిశుధ్యం మెరుగుపడలేదు. కొత్త కా ల నీల్లో వీటి ఊసేలేదు. జనావాసాలు, ఖాళీస్థలాల్లో నీరు నిలిచి ఉంటోంది. కాలువలు ఉన్నచోట నిర్వహణ కరువై, ధ్వంసంమైన చోట మరమ్మతులు లేక వ్యర్థ జలాలు రోడ్డుపైకి చేరుతున్నాయి. భూగర్భ మురుగునీటి కాలువలులేక ఇబ్బందులు తప్పడం లేదు. పలుచోట్ల కాలువలు శిథిలమవడం, ఇరుగ్గా ఉండటంతో రోడ్లపైనే మురుగు పారుతూ అపరిశుభ్రత తాండవిస్తోంది. ప్రజాప్రతినిధులు, అధికారు లు దృష్టి సారించక ఇబ్బందులు తప్పడం లేదు. జ నాభాకు అనుగుణంగా బల్దియాల్లో పారిశుధ్య కార్మికలు లేక సమస్య మరింత జటిలమవుతోంది.డ్రైనేజీల పొడవు(కి.మీ.లలో) రామగుండం 32.5 సుల్తానాబాద్ 15.0 మంథని 12.5 పెద్దపల్లి 4.5 బల్దియాల్లో అస్తవ్యస్తంగా డ్రైనేజీ వ్యవస్థ రోడ్లపై నీరు పారుతున్నా పట్టించుకోని వైనం ఏటా వర్షాకాలంలో ప్రజలకు తప్పని తంటాలు వ్యాధులకాలంలో కనిపించని ముందస్తు చర్యలు ఈ చిత్రం మురికివాడలోది అనుకుంటే పొరపాటే. రామగుండం బల్దియాలో నిర్మించిన ఖరీదైన భవనాల ఎదుట పారుతున్న మురుగు. గోదావరిఖని శ్రీదుర్గానగర్కాలనీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పైపులు, మ్యాన్హోల్స్ పగిలి మురుగు సాఫీగా పారడం లేదు. జనావాసాల్లోనే వరదలా పారుతోంది. ఇది ఒకరోజు, వారంరోజుల సమస్య కాదు.. ఏడాదిగా కాలనీవాసులు నరకయాతన పడుతూనే ఉన్నారు. దీనిద్వారా దోమలు, ఈగలు వృద్ధి చెంది కాలనీ కంపు కొడుతోంది. వర్షాలతో పరిస్థితి మరింత అధ్వానంగా మారింది. ఇది మంథని మున్సిపల్లోని పద్మశాలీ వీధిలోని మురుగునీటి కాలువ. పూడిక తీయక.. రోడ్డు వెంట వెళ్లే వర్షపునీరు ఇలా ఇళ్లలోకి చేరుతోంది. కొన్ని వీధుల్లో ఇటీవల అండర్ గ్రౌండ్, ఓపెన్ డ్రైనేజీలు నిర్మించినా.. సక్రమంగా లేవు. చిన్నవర్షానికే వర్షపునీరు రోడ్ల వెంట పారుతోంది. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని కాలువలు సక్రమంగా లేవు. వర్షపునీరు బస్టాండ్లోకి చేరుతోంది. ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. అధ్వానంగా ఉన్న మురుగు లీకేజీతోపాటు పందులు స్వైరవిహారం చేస్తున్న ఈ చిత్రం గోదావరిఖని ఇందిరానగర్ కల్లు డిపో ఎదుటి ప్రాంతం. మ్యాన్హోల్ పగిలి మురుగు రోడ్డుపై ఇలా పారుతోంది. ఇందులోనే పందులు స్వైరవిహారం చేస్తున్నాయి. వీటిద్వారా మెదడువాపు వ్యాధితోపాటు మురుగుతో డెంగీ, మలేరియా ప్రబలే ప్రమాదం పొంచి ఉంది. ఇది సుల్తానాబాద్ శాసీ్త్రనగర్లోనిది. మురుగునీటి కాలువలేదు. రాజీవ్రహదారిపైనే మురుగు పారుతోంది. కాలువలు నిర్మించక ఈ దుస్థితి తలెత్తింది. తరచూ బురద చేరుతుండడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇది గోదావరిఖని మార్కండేయకాలనీ శివాలయం సమీపంలోని మేజర్ నాలా. నాలా నిర్మాణానికి గతంలోనే టెండర్ కూడా పిలిచారు. పనులు పూర్తి చేయకుండా ఇలా నిర్లక్ష్యంగా వదిలేశారు. ఫలితంగా సమీప కుటుంబాలు మురుగు దుర్వాసనతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. కాలువలోంచి పాములు, తేళ్లు ఇళ్లలోకి వస్తున్నాయని స్థానికులు ఆందో ళన చెందుతున్నారు. అధికారులు ఇటీవల పిచ్చిమొక్కలు మొక్కుబడిగా తొలగించి చేతులు దులుపుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. డ్రైనేజీ నిండి పొంగిపారుతున్న ఈ దృశ్యం జిల్లా కేంద్రంలోని భూమ్నగర్లోనిది. పలుకాలనీల్లోని డ్రైనేజీల్లో రోజూ పూడికతీయక, ము రుగు ఇలా రోడ్లు, ఇళ్లలోకి చేరుతోంది. దుర్వాసన రావడంతో స్థానికులు భరించలేకపోతున్నారు. -
డిగ్రీ సీట్ల నిర్ధారణ నేటితో ఆఖరు
శాతవాహన యూనివర్సిటీలో అందుబాటులో ఉన్న సీట్లు, భర్తీ వివరాలు... శాతవాహనలో అందుబాటులో ఉన్న మొత్తం సీట్లు: 36,060 విద్యా సంవత్సరం సీట్ల భర్తీ 2022–23 20218 2023–24 16419 2024–25 16500 2025–26 7629 (రెండు దశలు పూర్తయ్యాక)శాతవాహన యూనివర్సిటీ కరీంనగర్క్రైం: డిగ్రీ ప్రవేశాల ప్రక్రియ మూడు దశలు పూర్తయ్యాయి. మూడో దశ సీట్ల కేటాయింపు చేపట్టారు. ఇందులో శాతవాహన యూనివర్సిటీ పరిధిలోని మొత్తం కళాశాలల్లో 36,060 సీట్లకు గాను మొదటి, రెండో విడతలో 9,455 సీట్లు కేటాయించగా, 6,730 మంది విద్యార్థులు అడ్మిషన్ ఖరారు చేసుకున్నారు, ఇంకా 29,330 సీట్లు ఖాళీగా ఉండగా మూడో విడతలో 7,629 సీట్లు కేటాయించింది. మూడో విడతలో 13 ప్రభుత్వ కళాశాలలో 1,060 మంది విద్యార్థులకు సీట్లు కేటాయించడం జరిగింది. అలాగే మూడు ప్రభుత్వ అటానమస్ డిగ్రీ కళాశాలలో 1,046 మంది విద్యార్థులకు సీట్లు కేటాయించారు. 60 ప్రైవేట్ కళాశాలల్లో 5,523 మంది విద్యార్థులకు సీట్లు కేటాయించారు. నేటితో ఆఖరు ఇప్పటికీ మూడు దఫాల్లో సీట్లు కేటాయింపు కాగా ఆయా విద్యార్థులు ప్రవేశాలు ఆన్లైన్లో చూసుకోవాల్సి ఉంటుంది. దీనికి జూలై 1వతేదీ వరకు అవకాశం ఉంది. సీటు కన్ఫార్మ్ చేసుకోలేకపోతే రద్దవుతుందని శాతవాహన దోస్త్ అధికారులు తెలుపుతున్నారు. గతంలో కంటే తక్కువగానే సీట్ల భర్తీ జరుగుతుందని తెలుస్తోంది. మిగిలింది స్పాట్ అడ్మిషన్లతోనే... శాతవాహన యూనివర్సిటీలో మూడు దఫాల్లో అడ్మిషన్ల కేటాయింపు పూర్తికాగా మూడో దశలో సీటు కన్ఫార్మ్ చేసుకున్న తర్వాత ఎన్ని సీట్లు మిగిలాయో పూర్తిస్థాయిలో తెలుస్తుంది. తర్వాత మిగిలిన సీట్లు స్పాట్ అడ్మిషన్ల ద్వారా భర్తీ చేసుకునే అవకాశం కల్పించనున్నట్లు సమాచారం. విద్యార్థులు మొత్తం బీటెక్, మెడిసిన్తో పాటు వివిధ కోర్సుల వైపు ఆసక్తి చూపడంతో డిగ్రీ సీట్ల భర్తీ పడిపోతుందని విద్యావేత్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మూడోదశ సీట్ల కేటాయింపు పూర్తి మిగిలిన సీట్లు స్పాట్ అడ్మిషన్లతో భర్తీ తగ్గుతున్న డిగ్రీ సీట్ల భర్తీ శాతవాహన యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల వివరాలు... ప్రభుత్వ కళాశాలలు – 13 ప్రభుత్వ అటానమస్ కళాశాలలు – 02 ప్రైవేట్ ఎయిడెడ్ – 02 ప్రైవేట్ ఆన్ ఎయిడెడ్ – 58 సోషల్ వెల్ఫేర్ – 03 ట్రైబల్ వెల్ఫేర్ – 02 బీసీ వెల్ఫేర్ – 03 -
సమస్యలకు సత్వర పరిష్కారం
● అడిషనల్ కలెక్టర్ వేణు ● ప్రజావాణిలో అర్జీలు స్వీకరణ పెద్దపల్లిరూరల్: జిల్లాలోని పలు మండలాలు, గ్రామాలకు చెందిన ప్రజలు ప్రతీ సోమవారం నిర్వహిస్తున్న ప్రజావాణిలో ఇచ్చిన ఫిర్యాదులకు సత్వర పరిష్కారం చూపాలని అడిషనల్ కలెక్టర్ వేణు సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం జిల్లాలోని మండలాలు, గ్రామాలనుంచి వచ్చిన ప్రజల నుంచి ఆయన దరఖాస్తులను స్వీకరించారు. అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడారు. ప్రజావాణిలో స్వీకరించిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించి ప్రభుత్వ సేవలపై నమ్మకం కలిగించాలని ఆయన సూచించారు. -
సిమ్స్లో వసతులపై ఆరా
కోల్సిటీ(రామగుండం): గోదావరిఖనిలోని సింగరేణి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ కాలేజీ(సిమ్స్)తోపాటు జీజీహెచ్ టీచింగ్ ఆస్పత్రిని నేషనల్ మెడికల్ కౌన్సిల్ నియమించిన రాష్ట్ర కమిటీ సోమవారం సందర్శించింది. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(అకడమిక్) శివరాంప్రసాద్, టీఎస్ఎండీసీ ఈఈ విశ్వప్రసాద్ తదితరులు మెడికోల హాస్టల్, టీచింగ్ ఆస్పత్రిలో మౌలిక వసతులు, ఫ్యాకల్టీ, సౌకర్యాలపై ఆరా తీశారు. అనంతరం కలెక్టర్ కోయ శ్రీహర్షతో చర్చించారు. కలెక్టర్ మాట్లాడుతూ, మెడికల్ కాలేజీతోపాటు జీజీహెచ్ టీచింగ్ ఆస్పత్రిలో మౌలిక వసతుల కల్పన, ఫ్యాకల్టీ వివరాలపై రాష్ట్ర ప్రభుత్వం నివేదిక తయారు చేయడానికి ప్రత్యేక కమిటీని రూపొందించిందన్నారు. జీజీహెచ్ సూపరింటెండెంట్ దయాల్సింగ్, మెడికల్ కాలేజీ వైస్ ప్రిన్సిపాల్ నరేందర్, ఆర్ఎంవో రాజు, ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు తదితరులు పాల్గొన్నారు. -
తల్లిదండ్రులకు విశ్వాసం కల్పించాలని..
సప్తగిరికాలనీ(కరీంనగర్): కరీంనగర్ జిల్లా కేంద్రంలోని రాంనగర్కు చెందిన స్రవంతి కరీంనగర్రూరల్ మండలం చెర్లబూత్కూర్లోని జెడ్పీ హైస్కూల్లో మ్యాథ్స్ టీచర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. స్వస్థలం పెద్దపల్లి జిల్లా ధూళికట్ట కాగా కరీంనగర్లో నివాసముంటున్నారు. భర్త శ్రీకాంత్ ల్యాబ్ టెక్నీషీయన్. కూతురు అమూల్య 6వ తరగతి, కుమారుడు సాయిమోక్షిత్ 4వ తరగతి చదువుతున్నారు. గతంలో వీరు కరీంనగర్లోని ఓ ప్రైవేటు స్కూల్లో చదువగా.. ప్రస్తుతం తల్లి వెంటే చెర్లభూత్కూర్ ప్రభుత్వ బడికి వెళ్తున్నారు. గ్రామంలోని తల్లిదండ్రులకు ప్రభుత్వ బడిపై నమ్మకం కల్పించేందుకు తన పిల్లలనూ అక్కడే చదివిపిస్తున్నట్లు టీచర్ స్రవంతి తెలిపారు. -
ప్రభుత్వ పాఠశాలలోనే పిల్లలు
యైటింక్లయిన్కాలనీ: రామగుండం మండలం న్యూమారేడుపాకలోని నర్సింహపురం(ఎంపీపీఎస్) ప్రభుత్వ పాఠశాలలో విధులు నిర్వర్తిస్తున్న ఉపాధ్యాయుడు వి.అనిల్కుమార్ తన ఇద్దరు కుమారులను అదే పాఠశాలలో చదివిపిస్తున్నారు. పెద్దకుమారుడు శ్రీహన్ 5వ తరగతి, చిన్నకుమారుడు 2వ తరగతి చదువుతున్నారు. వారిద్దరిని నిత్యం తనతోపాటు బైక్పై ప్రభుత్వ బడికి తీసుకొస్తున్నాడు. తను పనిచేస్తున్న పాఠశాలలోనే ఇద్దరు పిల్లలను చదివిపిస్తూ.. గ్రామంలోని తల్లిదండ్రుల్లో నమ్మకం పెంచినట్లు టీచర్ అనిల్కుమార్ తెలిపారు. -
‘స్థానిక’ పోరులో మనమే గెలవాలి
● ప్రభుత్వ పథకాలపై ప్రచారం చేయండి ● కాంగ్రెస్ పార్టీ పరిశీలకులు సంగీతం శ్రీనివాస్ పెద్దపల్లిరూరల్: స్థానిక సంస్థలకు జరుగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే విజయం సాధించాలని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ పరిశీలకులు సంగీతం శ్రీనివాస్, అజ్మతుల్లాఖాన్ అన్నారు. ఆదివారం పెద్దపల్లిలో ఎమ్మెల్యే విజయరమణారావు అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గస్థాయి సమావేశంలో మాట్లాడారు. సీఎం రేవంత్రెడ్డి సారథ్యంలోని ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి పనిచేస్తోందన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల ఫలాలను విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. ఎమ్మెల్యే విజయరమణారావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ఫలాలను అర్హులైన వారందరికీ అందేలా చూడాల్సిన బాధ్యత నాయకులు, కార్యకర్తలదేనని అన్నారు. పార్టీ కోసం పనిచేసే నాయకులను గుర్తించి తగిన ప్రాతినిధ్యం కల్పిస్తామని తెలిపారు. రానున్న స్థానిక సమరంలో పోరాడి విజయం సాధించే నాయకులకే అవకాశం కల్పిస్తామని స్పష్టం చేశారు. ఎన్నికల్లో గెలుపే ముఖ్యమని అందుకు పార్టీనేతలంతా సమిష్టిగా పనిచేయాలని సూచించారు. విజ్జన్నకు మంత్రి పదవి ఇవ్వాలి పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావుకు మంత్రిమండలిలో స్థానం కల్పించాలని నాయకులు మహేందర్, అన్నయ్యగౌడ్, ప్రేంసాగర్రావు తదితరులు కోరారు. రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై న విజయరమణారావు ప్రజానాయకుడని అన్నారు. సమావేశంలో మార్కెట్కమిటీ చైర్మన్లు ఈర్ల స్వరూప, ప్రకాశ్రావు, సంజీవ్లతో పాటు నాయకులు మల్లన్న, రామ్మూర్తి, అవినాష్, ఆరె సంతోష్, సంతోష్, సురేశ్గౌడ్, తిరుపతిరెడ్డి, నర్సింహరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
జిల్లా కేంద్రం.. మారని తీరు
దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకోని ప్రధాన కూడళ్లు.. ప్రగతి కనపించని ఆర్టీసీ బస్టాండ్.. అదే కమాన్ చౌరస్తా.. వ్యాపార కూడలి జెండా చౌరస్తా.. పెద్దపల్లి జిల్లాగా ఆవిర్భవించి సుమారు తొమ్మిదేళ్లు గడుస్తున్నా పట్టణ రూపురేఖలు మారలేదు. పెద్దపల్లి జిల్లాగా ఆవిర్భవించిందని ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తంచేసినా.. మౌలిక వసతులు, అభివృద్ధి, కూడళ్ల సుందరీకరణకు నోచుకోవడం లేదు. పదవుల కోసం పాకులాటలు తప్ప రాజకీయ నాయకులు అభివృద్ధి వైపు దృష్టి సారించడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఇందుకు నిదర్శనమే పెద్దపల్లిలోని ప్రధాన చౌరస్తాల దుస్థితి ఇది. – సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి -
పనులు నాణ్యతతో వేగంగా పూర్తిచేయాలి
గోదావరిఖని: పనులు నాణ్యతతో వేగంగా పూర్తి చేయాలని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్ అన్నారు. రోజువారీ మార్కెట్లో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆదివారం పరిశీలించారు. శివాజీనగర్ డైలీమార్కెట్ పురోగతి తెలుసుకున్నారు. టీయూఎఫ్ఐడీసీ ద్వారా మంజూరైన రూ.2.50 కోట్లతో చేపట్టిన పనుల తీరును సమీక్షించారు. ఈనిధులతో రోడ్లు, డ్రైనేజీ, షెడ్ల నిర్మాణం జరుగుతోందన్నారు. ఎమ్మెల్యే వెంట నాయకులు మహంకాళిస్వామి, బొంతల రాజేశ్ తదితరులున్నారు. భారీ హనుమాన్ విగ్రహ పనుల పరిశీలన రామగుండం: రామగుండం బైపాస్ రోడ్డు ఎదుట శ్రీరామునిగుండాల కొండపై గల శ్రీధనుర్భారామాంజనేయ ఆలయ ప్రాంగణంలో నిర్మిస్తున్న భారీ పంచముఖ హనుమాన్ విగ్రహ నిర్మాణ పనులను ఆదివారం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ ఠాకూర్ పరిశీలించారు. రాష్ట్రంలోనే అత్యాధునికమైన ఆధ్యాత్మిక కేంద్రంగా గుర్తించబడుతుందని అన్నారు. -
క్వార్టర్లు కాదు.. సొంతింటి పథకం కావాలి
గోదావరిఖని: కార్మికులకు క్వార్టర్లు కాదని, సొంతింటి పథకం అమలు చేయాలని సీఐటీయూ అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి అన్నారు. ఆదివారం గోదావరిఖనిలోని యూనియన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. మూడేళ్ల నుంచి సింగరేణి కార్మికులందరికీ నయాపైసా ఖర్చు లేకుండా కంపెనీకి భారం పడకుండా ప్రభుత్వానికి లాభం చేకూర్చేలా సొంతిల్లు అమలు చేయొచ్చని చెప్తున్నా యాజమాన్యం పట్టించుకోవడం లేదన్నారు. సొంతిల్లు అమలు చేయకుండా రూ.450 కోట్లతో 1,003 క్వాటర్లు నిర్మిస్తామని, అందుకు 50 ఏళ్ల పైబడిన క్వాటర్లు కూల్చేసి వాటి స్థానంలో డబుల్ బెడ్రూం క్వాటర్లు నిర్మిస్తామని అంటోందన్నారు. వెయ్యి క్వార్టర్ల నిర్మాణానికి రూ.450 కోట్లు ఖర్చు అవుతుందని, ఇలా సంస్థ వ్యాప్తంగా 60 ఏళ్లు నాటిన వాటిని కూల్చివేసి కొత్తవి నిర్మిస్తే ఇంకా ఎన్ని కోట్లు అవుతాయని ప్రశ్నించారు. కంపెనీకి, కార్మికుడికి ఎలాంటి భారం పడకుండా ప్రభుత్వానికి పేరు వచ్చేలా కార్మికులందరికీ ఇల్లు వచ్చేలా మా దగ్గర ప్లాన్ ఉందన్నారు. సమావేశంలో నాయకులు రాజమౌళి, మెండె శ్రీనివాస్, సాయిరెడ్డి, గౌస్, సురేష్, రవి, వెంకటేశ్వర్లు, శివరాంరెడ్డి, సత్యనారాయణ, శశికిరణ్, రవి, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు. -
స్కానింగ్ కేంద్రాల ఇష్టారాజ్యం
పెద్దపల్లిరూరల్: జిల్లాలో గర్భస్థశిశు నిర్ధారణ దందా యథేచ్ఛగా సాగుతోంది. చట్టాలు, నిబంధనల ప్రకారం వ్యవహరించాలనే అధికారుల సూచనలను పట్టించుకోవడంలేదు. కొందరు స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. 150 ఆస్పత్రులు.. 32 స్కానింగ్ సెంటర్లు.. జిల్లాలో దాదాపు 150 వరకు ప్రైవేట్ ఆస్పత్రులు ఉన్నాయి. 32 స్కానింగ్ సెంటర్లు పనిచేస్తున్నట్లు అధికారుల రికార్డులు చెబుతున్నాయి. ఈ కేంద్రాల్లో ఎన్ని పరీక్షలు చేశారు, కారణాలు ఏమిటనే వివరాలను నమోదు చేయాలి. నెలకోసారి డీఎంహెచ్వో కార్యాలయంలో నివేదిక అందజేయాలి. గైనకాలజిస్ట్లు ఉన్న ఆస్పత్రులతో పాటు డయాగ్నొస్టిక్ సెంటర్లలో వీటిని ఏర్పాటు చేశారు. అయితే, గర్భిణుల కుటుంబీకులు కొందరు.. కడుపులోని పిండం ఆడనా, మగనా? అనే విషయాన్ని తెలుసుకునేందుకు స్కానింగ్ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు. దీనిని ఆసరాగా చేసుకున్న కొందరు స్కానింగ్ సెంటర్ నిర్వాహకులు వైద్యులు రెఫర్ చేయకున్నా స్కానింగ్ చేస్తూ అధిక మొత్తంలో వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. లింగనిర్ధారణ చట్టవిరుద్ధం గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ, గర్భస్రావాలు చేసే వారిపై పీసీ పీఎన్డీటీ(ప్రీ కాన్సెప్షన్ అండ్ ప్రీనాటల్ డయాగ్నొస్టిక్స్ చట్టం–1994) ప్రకారం శిక్షార్హులు. ఈచట్టం ప్రకారం కనీసం మూడేళ్లజైలు, రూ.10వేల జరిమానా విధించే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. మరోవైపు.. డీఎంహెచ్వో అధ్యక్షతన రెడ్క్రాస్ సొసైటీ, మహిళా సమాఖ్య అధ్యక్షురాలు, గైనకాలజిస్ట్లతో సమావేశమై లింగనిర్ధారణ వ్యతిరేక చట్టంపై అవగాహన కల్పిస్తున్నారు. విచ్చలవిడిగా గర్భస్రావాలు లింగ నిర్ధారణ చేశాక ఆడపిల్ల అని తెలిస్తే స్థానికంగా ఉన్న ఆర్ఎంపీల సాయంతో గర్భస్రావాలు చేయిస్తున్నారు. వాస్తవానికి కడుపులో శిశువు మృతి చెందడం, ఇతర సమస్య ఉన్నట్లు స్కానింగ్లో తేలితే అర్హులైన వైద్యుల సమక్షంలో గర్భస్రావం చేయాలి. కానీ ఆర్ఎంపీల సాయంతో స్కానింగ్ కేంద్రాల్లో ఇష్టానుసారంగా గర్భస్రావాలు చేస్తున్నారు. గర్భస్రావం చేసుకోలేని వారికి ఆర్ఎంపీలే గర్భవతి నెలలను బట్టి మాత్రలు ఇస్తూ నెలకు ఇంత అని వసూలు చేస్తున్నట్లు సమాచారం. గోదావరిఖనిలో స్కానింగ్ సెంటర్లను తనిఖీ చేస్తున్న డీఎంహెచ్వో అన్నప్రసన్న కుమారి (ఫైల్)మెడికల్ ‘దందా’ ప్రైవేట్ ఆస్పత్రులు, నర్సింగ్హోంలకు అనుబంధంగా ఏర్పాటు చేసిన యాజమాన్యాలు మెడికల్ దందా సాగిస్తున్నాయి. ఆస్పత్రిలో వైద్యసేవలు పొందితే దాని అనుబంధ మెడికల్ షాపులోనే మందులు కొనుగోలు చేయాలనే నిబంధన అమలు చేస్తున్నారు. గర్భస్రావం మాత్రలు, సూదిమందులను ప్రిస్కిప్షన్ ఉంటేనే ఇవ్వాలి. కానీ, అవేమీ పట్టించుకోవడం లేదనే ఫిర్యాదులు ఉన్నాయి. మెడికల్ షాపుల వాళ్లే గర్భస్రావం మాత్రలను ఆర్ఎంపీలకు ఇస్తూ ఎక్కువ మొత్తం వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కొన్ని సందర్భాల్లో గర్భస్రావం మాత్రలు మింగి ప్రాణాలమీదికి తెచ్చుకుంటున్నా.. ఇలాంటి ఘటనలను కప్పిపుచ్చుతున్నట్లు తెలిసింది. పెద్దపల్లి మండలం భోజన్నపేటకు చెందిన వివాహిత గర్భస్రావం కోసం ఇటీవల మెడికల్ షాపు నుంచి తెచ్చుకున్న మాత్రలు మింగింది. తీవ్ర రక్తస్రావమై మరణించింది. అప్పటికే ముగ్గురు పిల్లలున్న ఆ యువతి.. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకోలేదు. దీంతో ఆమె మళ్లీ గర్భం దాల్చింది. ఆర్థిక పరిస్థితి అంతంతగానే ఉండడంతో గర్భస్రావం కోసం ట్యాబ్లెట్లు మింగింది. దీనిపై పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. గోదావరిఖనిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి స్కానింగ్ సెంటర్లో రికార్డులు నిర్వహించడం లేదు. ఇష్టానుసారంగా స్కానింగ్ చేస్తున్నట్లు డీఎంహెచ్వో తనిఖీల్లో వెలుగుచూసింది. స్కానింగ్ కోసం వెళ్లేవారి వివరాలను రికార్డులో నమోదు చేయని కారణంగా ధర్మారంలోని ఓ స్కానింగ్ సెంటర్ను డీఎంహెచ్వో ఇటీవల సీజ్ చేశారు. -
మల్లన్న సన్నిధిలో భక్తుల రద్దీ
ఓదెల: ఓదెల మల్లికార్జున స్వామి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచే కాకుండా మహారాష్ట్ర నుంచి భక్తులు అధికంగా వచ్చి దర్శనం చేసుకున్నారు. ఒగ్గుపూజాలతో పట్నాలు వేసి బోనాలు చెల్లించుకున్నారు. శివసత్తుల పూనకాలతో ఆలయంలో నెలకొంది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆలయ ఈవో సదయ్య ఏర్పాట్లు చేశారు. ఓదెల మల్లికార్జున స్వామిని ఆదివారం పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణ కుటుంబసమేతంగా దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఈవో సదయ్యపూర్ణకుంభంతో స్వాగతం పలికి శాలువ, మెమొంటోతో సత్కరించారు. -
రూ.200 కోట్లతో అభివృద్ధి పనులు
● పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు ఓదెల: సీఎం రేవంత్రెడ్డి మంజూరు చేసిన రూ.200 కోట్లతో నియోజకవర్గంలో చురుకుగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నా రు. ఆదివారం ఓదెలలో కల్యాణలక్ష్మి, రేషన్కార్డులను పంపిణీ చేసి మాట్లాడారు. రిటైర్డ్ సింగరేణి కార్మికులతో పాటు అర్హులైన వారందరికీ రేషన్కార్డులు పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు. రూపునారాయణపేట మానేరుపై మూ డు జిల్లాల వారధికి రూ.80 కోట్లతో పనుల ప్రా రంభానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. మంచినీటి పైపులైన్టు పూర్తి చేసి ఓదెలకు మంచినీటి ఎద్దడి లేకుండా చేస్తామన్నారు. విజ్జన్న ఎమ్మెల్యేగా ఉన్నన్ని రోజులు రైతులకు ఢోకాలేదని తెలిపారు. ఓదెలలో ఓదెల, కాల్వశ్రీరాంపూర్ రెండు మండలాలకు సబ్కోర్టు త్వరలో ప్రారంభమవుతుందని అన్నారు. కోర్టుకు పక్కాభవనం నిర్మిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఓదెల తహసీల్దార్ దీరజ్కుమార్, పొత్కపల్లి సింగిల్విండో చైర్మన్ సుమన్రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ప్రేంసాగర్రెడ్డి, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రాహుల్గౌడ్ పాల్గొన్నారు. -
సుల్తానాబాద్కు అదనపు జూనియర్ సివిల్ కోర్టు
సుల్తానాబాద్: సుల్తానాబాద్కు అదనపు జూనియర్ సివిల్ కం అదనపు జ్యూడిషియల్ ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టును ప్రభుత్వం మంజూరు చేసింది. ఈమేరకు ఈనెల 27న ప్రభుత్వ న్యాయశాఖ కార్యదర్శి రేండ్ల తిరుపతి ఉత్తర్వులు జారీ చేశారు. అదనపు కోర్టు మంజూరుకు కృషి చేసిన మంత్రి శ్రీధర్బాబు, ఎమ్మెల్యే విజయరమణరావులకు బార్ అసోసియేషన్ కృతజ్ఞతలు తెలిపింది. బోనాల జాతరగోదావరిఖని: ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం మైసమ్మ బోనాల జాతర ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే సతీమణి మనాలీఠాగూర్ నెత్తిపై బోనం ఎత్తుకొని డప్పు చప్పుళ్లతో క్యాంపు కార్యాలయం ఎదురుగా ఉన్న మైసమ్మ ఆలయం వద్దకు వెళ్లి మొక్కులు చెల్లించుకున్నారు. ఎమ్మెల్యే రాజ్ఠాకూర్ మైసమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బొంతల రాజేశ్, గుండేటి రాజేశ్ తదితరులు పాల్గొన్నారు. ‘ఖని’ నుంచి అరుణాచలంకు ఆర్టీసీ ప్రత్యేక బస్సుగోదావరిఖనిటౌన్: గురుపౌర్ణమి సందర్భంగా అరుణాచలంకు ప్రత్యేక రాజధాని ఏసీ బస్ సౌకర్యం కల్పిస్తున్నట్లు గోదావరిఖని ఆర్టీసీ డిపో మేనేజర్ ఎం.నాగభూషణం తెలిపారు. బస్సు జూలై 8న గోదావరిఖని నుంచి మధ్యాహ్నం 3 గంటలకు బయలు దేరి కాణిపాకం, వెల్లూరు గోల్డెన్టెంపుల్ దర్శనం అనంతరం అరుణాచలం చేరుకుంటుందని అన్నారు. 10న గురుపౌర్ణమి రోజు అరుణాచలం గిరి ప్రదక్షణ అనంతరం తిరుగు ప్రయాణంలో జోగులాంబ శక్తిపీఠం దర్శనం ఉంటుందని తెలిపారు. టికెట్ ధర అప్ అండ్ డౌన్ కలిపి ఒకరికి కేవలం రూ.5,900గా నిర్ణయించామన్నారు. ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. పూర్తి వివరాలకు 7013504982, 7382847427 నంబర్లలో సంప్రదించాలని డీఎం కోరారు. పెండింగ్ బిల్లులు చెల్లించాలిపెద్దపల్లిరూరల్: ఉపాధ్యాయ, ఉద్యోగ పెన్షన్ల పెండింగ్ బిల్లులు చెల్లించాలని తెలంగాణ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర నాయకుడు రమేశ్ డిమాండ్ చేశారు. పెద్దపల్లిలోని సరస్వతి శిశుమందిర్ ఉన్నత పాఠశాలలో ఆదివారం నిర్వహించిన జిల్లాశాఖ సమావేశంలో మాట్లాడారు. పీఆర్సీ నివేదికలను బట్టి కొత్త పీఆర్సీ అమలు చేయాలన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు హెల్త్కార్డులు అందించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో నాయకులు సునీల్రెడ్డి, శ్రీనివాసరావు, కనకయ్య, అంజయ్య, వీరస్వామి, వెంకటేశ్వర్లు, అనిల్, ప్రసాద్, సురేందర్ పాల్గొన్నారు. మొబైల్ పంక్చర్ వాహనంమంథనిరూరల్: సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన నేపథ్యంలో మొబైల్ బిజినెస్లు పెరిగిపోయాయి. మొబైల్ ఫోన్లో ఆర్డర్ పెడితే చాలు క్షణాల్లో ఇంటి గుమ్మం ముందు ఉంటుంది. ఈక్రమంలోనే మంథనికి చెందిన మాజిద్ ఏకంగా మొబైల్పంక్చర్ సర్వీస్ ప్రారంభించాడు. ఓ చిన్న ట్రాలీ ఆటోలో ఏర్ ట్యాంకును ఏర్పాటు చేసుకుని పంక్చర్సామగ్రితో పల్లెల్లో తిరుగుతున్నాడు. ఎక్కడైనా వాహనం పంక్చర్ అయితే అక్కడికి వెళ్లి పంక్చర్ చేస్తున్నాడు. మంథని మండలం వెంకటాపూర్లో ఓ ట్రాక్టర్ టైర్కు మొబైల్పంక్చర్ వాహనంతో పంక్చర్ వేస్తుండగా ‘సాక్షి’ కెమెరా క్లిక్ మనిపించింది. -
గడ్డి మందును నిషేధించాలి
కరీంనగర్అర్బన్: పారా క్వాట్ హెర్బిసైడ్ (గడ్డిమందు)పై దేశవ్యాప్తంగా నిషేధం విధించేలా చర్యలు తీసుకోవాలని హెల్త్కేర్ రిఫార్మ్స్ డాక్టర్స్ అసోసియేషన్ (హెచ్ఆర్డీఏ) జిల్లా శాఖ, డాక్టర్స్ అగైన్ట్స్ పెరాక్విడ్ పాయిజన్ (డీఏపీపీ) శనివారం కలెక్టర్ పమేలా సత్పతికి ఫిర్యాదు చేసింది. పారాక్వాట్ అత్యంత విషపూరితమైన ఔషధమని, 10–15 మి.లీ తాగినా మృతిచెందడమేనని, ఇది చాలా వేగంగా గుండె, మూత్రపిండాలు, ఊపిరితిత్తుల్ని దెబ్బతీసి మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్కు దారితీస్తుందని వివరించారు. సదరు గడ్డి మందు తీసుకొని దేశంలో చాలామంది అత్యంత సాధారణంగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. దీనికి విరుగుడు మందు లేకపోవడం వల్ల 50 శాతం నుంచి 90 శాతం వరకు మృత్యువాత పడుతున్నారని, పొలాలపై వేసే క్రమంలో తెలియకుండానే రైతుల ఊపిరితిత్తుల్లోకి వెళ్లి తీవ్రమైన అనారోగ్యాలకు గురి అవుతున్నారని తెలిపారు. పారా క్వాట్ ఉత్పత్తి, అమ్మకం, నిల్వ, వినియోగంపై తక్షణ నిషేధం విధించాలని, మార్కెట్లో ఉన్న స్టాక్ను వెనక్కి తీసుకొని సురక్షితంగా నిర్వీర్యం చేయాలన్నారు. పారాక్వాట్ విష ప్రయోగాలను పర్యవేక్షించేందుకు శ్రీపాయిజన్ రిజిస్ట్ఙ్రీ ఏర్పాటు చేయాలని, యూరప్, బ్రిటన్, బ్రెజిల్, చైనా, శ్రీలంక, దక్షిణకొరియా లాంటి దేశాలు ఇప్పటికే నిషేధించాయని పేర్కొన్నారు. హెల్త్ కేర్ రిఫార్మ్స్ డాక్టర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు డా.బండారి రాజ్కుమార్, ఉపాధ్యక్షుడు డా.పి.గౌతమ్, ప్రధాన కార్యదర్శి డా.జిఎస్.శరణ్ పాల్గొన్నారు. -
అంజన్న గర్భగుడి దర్శనం సులభం
మల్యాల: కొండగట్టు అంజన్నను భక్తులు దర్శించుకునేందుకు ఆలయ అధికారులు కొన్ని మార్పులు చేపట్టారు. భక్తులకు గర్భగుడి దర్శనం కల్పించేలా ధర్మదర్శనం క్యూ లైన్ను పది అడుగుల దూరం పెంచారు. ఆలయ ఆదాయం పెంపు కోసం గర్భగుడి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య పెంచేందుకు.. వారు గర్భగుడి వద్ద కూర్చుని స్వామివారిని దర్శించుకునేలా ఏర్పాట్లు చేశారు. గతంలో సాధారణ క్యూలైన్ల ద్వారా స్వామివారిని అతి సమీపం నుంచి దర్శించుకునే వెసులుబాటు ఉండేది. ప్రస్తుతం మరో పది అడుగుల దూరం నుంచి స్వామివారి దర్శనం ఉండనుంది. ప్రస్తుతం గర్భగుడి దర్శనం టికెట్ ధర రూ.400 నుంచి రూ.800కు పెంచే యోచనలో ఉన్నట్లు తెలిసింది. ఆలయ ఆదాయం పెంపుపై దృష్టి సారించిన అధికారులు.. భక్తులకు వసతి సౌకర్యాల ఏర్పాట్లపైనా దృష్టి సారించాలని కోరుతున్నారు. ధర్మదర్శనం క్యూలైన్ దూరం పెంపు -
మట్టి టిప్పర్ల పట్టివేత
వేములవాడఅర్బన్: వేములవాడ మండలం కొడుముంజ శివారులోని రామప్ప ఆలయం గుట్టల నుంచి అక్రమంగా మట్టి తరలిస్తున్న 10 టిప్పర్లు, 2 హిటాచ్చి జేసీబీలు, ఒక కారును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ మహేశ్ బీ గీతే తెలిపారు. గుట్ట నుంచి అనుమతులు లేకుండా మట్టి తరలిస్తున్నారనే సమాచారంతో వేములవాడ టౌన్ సీఐ వీరప్రసాద్, జిల్లా టాస్క్ఫోర్స్ సీఐ నటేశ్ ఆధ్వర్యంలో దాడులు చేశారు. ముగ్గురు ఉత్తమ్ కరుణాకర్, భువనగిరి మహేశ్, లంబ ప్రశాంత్లపై కేసు నమోదు చేశారు. 10 టిప్పర్లు, 2 హిటాచీలు స్వాధీనం ఎస్పీ మహేశ్ బీ గీతే -
ట్రాఫిక్ నిబంధనలు బేఖాతరు
రామగుండం: హైదరాబాద్ – కరీంనగర్ – రామగుండం(హెచ్కేఆర్) మధ్యగల రోడ్డును రాజీవ్ రహదారిగా వ్యవహరిస్తున్నారు. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ), రాష్ట్రప్ర భుత్వం, కాంట్రాక్టర్ సంయుక్త భాగస్వామ్యం(పబ్లిక్, ప్రైవేట్ పార్టనర్ షిప్–పీపీపీ విధానం)లో ఈ రోడ్డు నిర్మించారు. డిజైన్, బిల్ట్, ఫైనాన్స్, ఆపరేట్, ట్రాన్స్ఫర్ (డీబీఎఫ్ఓటీ) మోడల్లో దీనికి ఒప్పందం కుదిరింది. నిర్వహణ బాధ్యతలు హెచ్కేఆర్ రోడ్డు వేస్ చేపట్టింది. భారతదేశంలోని మోటారు వాహన చట్టం, 1988, కేంద్ర మోటారు వాహన నియమాలు, 1989లో పేర్కొన్న నిబంధనలు వర్తించనున్నాయి. హెచ్కేఆర్ సమగ్ర సమాచారం.. రాజీవ్ రహదారి నిర్మాణం కోసం 1995లో ప్రపంచ బ్యాంకు రుణం తీసుకున్నారు. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఆలోచన విధానంతో రెండు లేన్లు, పది మీటర్ల వెడల్పుతో స్టేట్ హైవేగా నిర్మించారు. 2011లో పనులు ప్రారంభమై 2013లో పూర్తయ్యాయి. షామీర్పేట ఓఆర్ఆర్ ప్రవేశం నుంచి మంచిర్యాల జిల్లాలోని చెన్నూర్ ఎక్స్రోడ్డు హైవే–63కు రాజీవ్ రహదారిని అనుసంధానించారు. దీని పొడవు సుమారు 206.85 కి.మీ. 22.5 సంవత్సరాలు నిర్వహణ బాధ్యతలు ఉంటాయి. 2035 వరకు హెచ్కేఆర్ రోడ్డు నిర్వహణ బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుంది. బాధ్యతలు విస్మరిస్తున్న సంస్థ.. రహదారిపై గతుకులు, పగుళ్లు, శిథిలాలను గుర్తించి సకాలంలో మరమ్మతు చేయడం, ట్రాఫిక్ సిగ్న ల్స్, రోడ్డుకు ఇరువైపులా సైన్బోర్డులు, లైన్ మా ర్కింగ్స్, జీబ్రా క్రాసింగ్స్ ఉండేలా పర్యవేక్షణ చేయ డం, రోడ్డు డివైడర్లు, రిఫ్లెక్టర్లు, హైవే లైటింగ్, భద్ర తా సౌకర్యాలను కల్పించాల్సిన బాధ్యత హెచకేఆర్దే. యాక్సిడెంట్ బ్లాక్ స్పాట్లను గుర్తించి, రోడ్డు ప్రమాదాల నియంత్రణకూ చర్యలు చేపట్టడం, ఎమర్జెన్సీ సర్వీస్ (అంబులెన్స్, క్రేన్ సర్వీస్) అందుబాటులో ఉండం ప్రధాన విధి. రహదారి పక్కన పచ్చదనం, చెట్లు నాటడం, రోడ్డుకు ఇరువైపులా డ్రైనేజీ నిర్వహించడం,వర్షాకాలంలో నీటినిల్వ లేకుండా చూడడం, రహదారి పక్కన విశ్రాంతి స్థలాలు, టా యిలెట్ సౌకర్యాలు అందుబాటులో ఉంచాల్సి ఉంది. రాజీవ్ రహదారిపై అస్తవ్యస్తంగా ప్రయాణం రోడ్డుపై వరద నిలుస్తున్నా పట్టించుకోని వైనం మూలమలుపుల వద్ద కనిపించని రక్షణ స్తంభాలు కానరాని హెచ్చరిక బోర్డులు.. తరచూ రోడ్డు ప్రమాదాలు -
పొంచిఉన్న ప్రమాదాలు
మల్యాలపల్లి సబ్స్టేషన్ నుంచి రామగుండం బైపా స్ మధ్య తరచూ రోడ్డు ప్ర మాదాలు జరుగుతున్నా యి. ఇప్పటికే పలువు రు మృత్యువాతపడ్డారు. రోడ్డు పక్కన డ్రైనేజీ మట్టితో నిండిపోయింది. రోడ్డుకు చివరగా రక్షణ సిమెంట్ దిమ్మెలు విరిగిపోయినా పునరుద్ధరించలేదు. రోడ్డు మధ్య లో వరద నిలిచి ఉంది. వర్షాకాలంలో రోడ్డుపైనే వరద ప్రవహిస్తుండడంతో వాహనదారు లు ఆందోళన చెందుతున్నారు. మూలమలుపు లు, బ్లాక్ స్పాట్స్ వద్ద కనీసం ప్రమాద హెచ్చరిక బోర్డులు లేవు. కానీ, టోల్గేట్ ఫీజు వసూ లు చేస్తూనే ఉన్నారు. – సురేశ్వర్మ, గ్రామస్తుడు, మల్యాలపల్లి -
పల్లెతల్లీ.. ప్రణమిల్లి
విద్యానగర్ (కరీంనగర్)/సిరిసిల్లకల్చరల్: బోనం అంటే భోజనం. అమ్మ ప్రసాదించిన ఆహారాన్ని అమ్మకే నివేదించడం బోనాల సంప్రదాయం. జగన్మాత ఉత్సవంలో ఘటం, బోనం, రంగం.. అంటూ మూడు అంకాలుంటాయి. శక్తి పూజకు సీ్త్రమూర్తులే ప్రధానమైన భూమిక పోషించడం బోనాల ప్రత్యేకత. కొత్త కుండకి సున్నం, పసుపు రాసి, కుంకుమ అద్దుతారు. చందనం చల్లుతారు. వరి లేదా జొన్నతో నింపిన ఘటానికి మామిడాకులు, వేపరెమ్మలు కడతారు. దీపం వెలిగించడానికి అనుకూలంగా కుండపైన మట్టి మూకుడు పెడతారు. అలా ఘటాలను అలంకరించి, ఊరేగింపుగా వెళ్లి అమ్మవారలకు బోనాలు సమర్పిస్తారు. దేహదారుఢ్యం కలిగిన వ్యక్తిని పోతురాజుగా ముందు నిలబెడతారు. అన్ని ఇళ్ల నుంచి బోనాన్ని సేకరించడం పోతురాజు బాధ్యత. బోనాల సమర్పణకు ముగింపుగా ఆ ఏటి భవిష్యత్తును ప్రకటించడమే ‘రంగం’. ఓ భక్తురాలే భవిష్యవాణిని వినిపిస్తుంది.● విశ్వవ్యాప్తం తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టి జనపదాల్లో పుట్టిన ఈ వేడుక నేడు విశ్వవ్యాప్తమైంది. ఆషాఢమాసంలో జగన్మాతకు భక్తితో సమర్పించే భోజన నైవేద్యాలలే బోనాలు. భోజన పదమే జనవ్యవహారంలో బోనంగా మారింది. ప్రతీ ఇల్లు సిరులతో నిండి అందరూ ఆయురారోగ్య భాగ్యాలతో విలసిల్లాలని వేడుకోవడం బోనాల పండుగలోని ప్రత్యేకత. ● తెలంగాణ తల్లికి బోనం మెట్లకు బొట్లు, గట్లకు పూజ. గోపురాల కొత్త పరిమళ గుబాలింపు. అమ్మ రుణం తీర్చుకునే వేడుకల్లో ఇవన్నీ భాగమే. అమ్మవారు ఆప్యాయతల అన్నప్రసాదాన్ని స్వీకరిస్తుందోనని.. అంబారీనెక్కి ఆశీర్వాదాలు పలుకుతుందోనని.. రంగమెత్తి సందేశమిస్తుందోనని ‘అమ్మా.. తల్లీ.. కాపాడమ్మా’ అని వేడుకునే మనుసులు ఆషాఢమాసం నెల పాటు ఉత్సవాలు చేసుకుంటారు. ఊరుగాచే ఆ తల్లికి బోనం పెట్టే బిడ్డలు ఉన్నది ప్రపంచంలో ఒక్క తెలంగాణలోనే. ● గోల్కొండలో తొలి బోనం ఆషాఢమాసంలో గోల్కొండ ఖిల్లా వేదికగా, ఉజ్జయినీ తల్లి సాక్షిగా అమ్మకు బిడ్డలు తొలి వీరబోనమెత్తుకుంటే రాష్ట్రమంతటా బోనాల నగారా మోగుతుంది. గోల్కొండ కోటలోని శ్రీజగదాంబికా ఆలయంలో జరిగే ఉత్సవాలకు ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. ఇది తరాలు మారినా తరగని తెలంగాణ సంస్కృతికి నిదర్శనం. ● బోనంతో అనుబంధం ఆషాఢానికి బోనాలు ఆరంభమై శ్రావణానికి గ్రామాలకు చేరి గ్రామదేవతలైన మైసమ్మ, పోచమ్మ, పెద్దమ్మ, రేణుక ఎల్లమ్మల రుణం తీర్చుకుంటాయి. అదే ఆ అమ్మలకు ఈ బిడ్డలకు ఉన్న అనుబంధం. 500 ఏళ్ల క్రితం మలేరియా వల్ల ప్రాణాలు పోతున్న వేళ జనాన్ని రక్షించేందుకు పెట్టిన తొలి బోనం ఆనవాయితీ ఇప్పటికీ కొనసాగడం అంటే అమ్మ– బిడ్డల అనుబంధానికి నిదర్శనం. ● చరిత్ర వైభవం పురాణగాథలు, చారిత్రక నేపథ్యాలతో సంబంధం లేకుండా ఆయా ప్రాంతాల ప్రజలు బంధుమిత్రులు, కుటుంబాలతో కలిసిమెలిసి ఈ పండుగ జరుపుకుంటున్నారు. గోల్కొండ జగదాంబిక (ఎల్లమ్మ) ఆలయంలో మొదలయ్యే బోనాలు లష్కర్ ఉజ్జయినీ మహంకాళి, లాల్దర్వాజ సింహవాహిని, హరిబౌలి మహంకాళి ఆలయాల్లో జాతర వేడుకలు జరుగుతాయి. గోల్కొండ బోనాలకు 500 ఏళ్లు, ఉజ్జయినీ బోనాలది 200 ఏళ్ల చరిత్ర. లాల్దర్వాజ బోనాలకు వందేళ్ల చరిత్ర ఉంది. అమ్మవారికి బోనం సమర్పిస్తాం ఏటా ఆషాఢమాసంలో మా ఇంటి నుంచి పోచమ్మతల్లికి బోనం సమర్పిస్తాం. వాడలోని వారందరితో డప్పుచప్పుల్లతో ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి నైవేద్యం పెట్టి, మొక్కులు చెల్లించి సల్లంగా చూడాలని వేడుకుంటాం. – చొప్పరి జయశ్రీ, మాజీ కార్పొరేటర్, కరీంనగర్ -
తాళం వేసిన ఇంట్లో చోరీ కేసులో అరెస్ట్
మంథని: వరుస దొంగతనాలతో పట్టణ ప్రజల్లో నెలకొన్న భయాందోళనకు పోలీసులు తెరదించారు. కేవలం నాలుగు రోజుల్లోనే రెండు చోరీలను ఛేదించారు. ఈ నెల 22న ఇంటికి తాళం వేసి కుటుంబసభ్యులతో గ్రామానికి వెళ్లిన ఇల్లెందుల వెంకటేశ్వర్లు ఇంట్లో చోరీచేసిన స్థానికుడు తిరునహరి రాజనర్సింహస్వామిని శనివారం అరెస్టు చేసినట్లు సీఐ రాజు తెలిపారు. సీసీ కెమెరాల ద్వారా కేసును ఛేదించి, టీవీ, వెండివస్తువులను స్వాధీనం చేసుకుని, నిందితుడిని రిమాండ్కు తరలించనట్లు పేర్కొన్నారు.. కేసును ఛేదించిన ఎస్సై రమేశ్, ఏఎస్సై స్వామి, కానిస్టేబుళ్లు రమేశ్, రాజ్కుమార్, శివ, అశోక్ను సీఐ అభినందించారు. అలాగే కరీంనగర్కు చెందిన చీర్ల తిరుపతిరెడ్డి స్థానిక పెట్రోల్ బంక్లో ద్విచక్రవాహనం పార్క్ చేసి వెళ్లగా.. ఈనెల 27న అదృశ్యమైంది. ఈ కేసులో మంథని మండలం అడవిసోమన్పల్లి గ్రామానికి చెందిన రత్నం రాజ్కుమార్ను అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు. -
ఏసీబీ వలలో మున్సిపల్ ఔట్సోర్సింగ్ ఉద్యోగి
● ఇంటి నంబర్ కోసం లంచం ● రూ.5 వేలు తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు సుల్తానాబాద్(పెద్దపల్లి): ఇంటి నంబరు కేటాయించాలని దరఖాస్తు చేసిన వ్యక్తి నుంచి రూ.5 వేలు లంచం తీసుకుంటూ మున్సిపల్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి నాంపల్లి విజయ్కుమార్ను ఏసీబీ అధికారులు శనివారం రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ విజయ్కుమార్ కథనం ప్రకారం.. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని ఆర్నకొండ ప్రసాద్ ఇటీవల ఇల్లు నిర్మించుకున్నారు. దానికి ఇంటి నంబరు కేటాయించాలని అధికారులను ఆశ్రయించారు. అయితే, రూ.10 వేలు లంచం ఇస్తేనే ఇంటి నంబరు కేటాయిస్తామని అధికారులు డిమాండ్ చేశారు. తాను రూ.3 వేలు చెల్లిస్తానని బతిమిలాడినా వినలేదు. చివరకు రూ.5 వేలకు ఒప్పందం కుదిరింది. శనివారం పట్టణంలోని ఓ దుకాణంలో ఆర్నకొండ ప్రసాద్ రూ.5 వేలు ఇస్తుండగా మున్సిపల్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి నాంపల్లి విజయ్ కుమార్ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ వ్యవహారంలో మున్సిపల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ వినోద్ కుమార్నూ అదుపులో తీసుకున్నారు. ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్, సీఐ కృష్ణకుమార్, సిబ్బంది పున్నం చందర్, తిరుపతి పాల్గొన్నారు. నిందితులను ఆదివారం కోర్టులో హాజరు పర్చనున్నామని అధికారులు తెలిపారు. కాగా, ఇంటి నంబరు కేటాయించాలని బాధితుడు రెండేళ్లుగా తిరుగుతున్నాడని ఏసీబీ అధికారులు పేర్కొన్నారు. -
ముంబయ్లో పొరండ్ల వాసి ఆత్మహత్య
జగిత్యాలక్రైం: జగిత్యాల రూరల్ మండలం పొరండ్లకు చెందిన పర్స రమేశ్ (40) ముంబయ్లో శనివారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రమేశ్ కొద్దికాలంగా ముంబయ్లోని కామటిపూర్ కల్లు దుకాణంలో పనిచేస్తున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం కుటుంబ సభ్యులకు ఫోన్ మాట్లాడాడు. అనంతరం ఉరేసుకున్నాడు. కల్లు దుకాణం నిర్వాహకుడు రమేశ్ మృతదేహాన్ని స్వగ్రామానికి పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. రమేశ్కు భార్య భాగ్య, ఇద్దరు కుమార్తెలున్నారు. ఆర్థిక ఇబ్బందులతో యువకుడు.. తంగళ్లపల్లి(సిరిసిల్ల): ఆర్థిక ఇబ్బందులతో యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన తంగళ్లపల్లి మండలం లక్ష్మీపూర్లో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాలు. లక్ష్మీపూర్కు చెందిన ముగ్ధం అశోక్(25) పెళ్లి కాకపోవడంతో ఒంటరిగా జీవిస్తున్నాడు. తన అవసరాల కోసం పలువురి వద్ద అప్పులు చేశాడు. వాటిని తీర్చే మార్గం కనిపించకపోవడంతో మనస్థాపానికి గురై శుక్రవారం రాత్రి పురుగుల మందుతాగి కుటుంబ సభ్యులకు ఫోన్చేసి చెప్పాడు. దీంతో అశోక్ను హుటాహుటిన సిరిసిల్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో శనివారం వరంగల్ ఎంజీఎంకు తరలిస్తుండగా ప్రాణాలు పోయాయి. మృతుడికి తండ్రి రాజయ్య, అన్నలు మహేశ్, సురేశ్ ఉన్నారు. మృతుడి చిన్నాన్న రవి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తంగళ్లపల్లి ఎస్సై ఎం.ఉపేంద్రచారి తెలిపారు. చికిత్సపొందుతూ విద్యార్థి మృతిగన్నేరువరం: గన్నేరువరంకు చెందిన కూన వైష్ణవి(14) అనే విద్యార్థి చికిత్స పొందుతూ శనివారం మృతిచెందినట్లు ఎస్సై నరేందర్రెడ్డి తెలిపారు. కూన సంపత్– అనిత కూతురు వైష్ణవి గన్నేరువరంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుకుంది. 8వతరగతి చదివేందుకు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని ఒక గురుకుల పాఠశాలలో ఇటీవల సీటు లభించింది. దీంతో ఈ ఏడాది విద్యాభ్యాసానికి తల్లిదండ్రులు హాస్టల్ పంపించారు. అక్కడ ఉండి చదువుకోవడానికి వైష్ణవి నిరాకరించడంతో తండ్రి ఇంటికి తీసుకొచ్చాడు. హాస్టల్లో ఉంటూ చదువుకోవాలని తల్లిదండ్రులు కోరగా.. చదువుకోనని మనస్తాపం చెంది ఈనెల 23న పురుగు ల మందు తాగింది. గమనించిన కుటుంబ స భ్యులు కరీంనగర్లోని ఓ ఆసుపత్రికి తరలించగా.. పరిస్థితి తీవ్రంగా ఉండడంతో మెరుగైన చి కిత్స కోసం హైదరాబాద్లోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందినట్లు మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
ఎంత పనిజేస్తివి కొడుకా..
ముస్తాబాద్(సిరిసిల్ల): ఎంత పనిజేస్తివి కొడుకా.. పిల్లలు లేరని నిన్ను సాదుకుంటే మధ్యలో అన్యాయం చేస్తివా.. అంటూ ఆ మాతృమూర్తి రోదనలు స్థానికులు కన్నీరు పెట్టేలా చేశాయి. కట్టుకున్న భర్త ఆరేళ్ల క్రితం ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడితే.. సంతానం లేక ఆసరాగా ఉంటాడనుకున్న దత్తకొడుకు సైతం ఆత్మహత్యకు పాల్పడడంతో ఆ తల్లి ఒంటరైంది. పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్న తెల్ల వారే యువకుడు ఆత్మహత్యకు పాల్పడడంతో ఆ తల్లి రోదనలు మిన్నంటాయి. పోలీసులు, కుటుంబీకులు తెలిపిన వివరాలు. ముస్తాబాద్ మండల కేంద్రానికి చెందిన బద్దిపడిగె మల్లారెడ్డి, విజయ దంపతులకు సంతానం కలగకపోవడంతో అజయ్రెడ్డిని దత్తత తీసుకుని పెంచుకుంటున్నారు. ఆరేళ్ల క్రితం తండ్రి మల్లారెడ్డి ఆత్మహత్య చేసుకోగా, తల్లి విజయ అన్నీ తానై కొడుకును పోషిస్తోంది. ముస్తాబాద్లోని ఓ పెట్రోల్బంకులో పనిచేస్తున్నాడు. శుక్రవారం పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న మరుసటి రోజే ఆత్మహత్యకు పాల్పడడంతో తల్లి విజయ రోదనలు మిన్నంటాయి. ఆరేళ్ల క్రితం భర్త ఆత్మహత్య చేసుకోగా, ఇప్పుడు కుమారుడు అజయ్రెడ్డి(22) కూడా ప్రాణాలు తీసుకోవడంతో విజయ ఒంటరైంది. యువకుడి మృతికి గల కారణాలపై విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు. దత్తపుత్రుడి మృతితో ఒంటరైన తల్లి ఆరేళ్ల క్రితం తండ్రి.. నేడు కొడుకు మృతి -
సీపీకి ఉత్కృష్ట సేవా పతకం
గోదావరిఖని: రామగుండం పోలీస్కమిషనర్ అంబర్ కిశోర్ ఝా ఉ త్కృష్ట సేవా పతకానికి ఎంపికయ్యారు. పోలీస్శాఖలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులకు కేంద్ర ప్రభుత్వం ఈపతకం అందజేస్తుంది. 2009 ఐపీఎస్ బ్యాచ్కి చెందిన అంబర్ కిశోర్ ఝా వివిధ హోదాల్లో సుదీర్ఘకాలం పా టు వృత్తి నైపుణ్యంతో విధులు నిర్వర్తించినందుకు ఈపతకానికి ఎంపికచేశారు. ఈసందర్భంగా పలువురు పోలీసు అధికారులు ఆయనను కలిసి అభినందనలు తెలిపారు. ‘సిమ్స్’కు 150 ఎంబీబీఎస్ సీట్లు కోల్సిటీ(రామగుండం): గోదావరిఖనిలోని సింగరేణి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(సిమ్స్) కాలేజీలో కొత్తగా 150 ఎంబీబీఎస్ సీ ట్ల ఏర్పాటుకు ఆమోదం లభించిందని ప్రిన్సిపాల్ హిమబింద్సింగ్ తెలిపారు. శనివారం నే షనల్ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ) ఈ సీట్లకు అనుమతి మంజూరు చేస్తూ ఉత్తర్వులిచ్చిందని వెల్లడించారు. నాలుగో సంవత్సరంలోకి అడుగుపెట్టిన సిమ్స్లో మెరుగైన విద్యాబోధనతోపాటు సౌకర్యాలను కల్పిస్తున్నట్లు తెలిపారు.పాలిసెట్ సర్టిఫికెట్ల పరిశీలన గోదావరిఖనిటౌన్: స్థానిక యూనివర్సిటీ పీజీ కళాశాలలో పాలిసెట్–2025 అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన శనివారం ప్రారంభమైందని ప్రిన్సిపాల్ రమాకాంత్, కో ఆర్డినేటర్ సురేశ్కుమార్ తెలిపారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు హాజరయ్యే విద్యార్థులు పాలిసెట్ ర్యాంక్ కార్డు, ప దో తరగతి మెమో, టీసీ, నాలుగు నుంచి పదో తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్, కులం, ఆదా యం సర్టిఫికెట్లు(1–1–2024 తర్వాత తీసుకు న్నవి), ఆధార్కార్డు, ఈడబ్ల్యూఎస్ ఓరిజినల్, జిరాక్స్లతో హాజరు కావాలని సూచించారు. ‘భట్టి’ ప్రకటనతో ఆశలు రామగుండం: సుమారు ఏడాది క్రితం మూతపబడిన రామగుండంలోని 62.5 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ స్థానంలో 800 మెగావాట్ల థ ర్మల్ విద్యుత్ ప్రాజెక్టు నిర్మించాలని విద్యుత్ శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్ర మార్క చేసిన ప్రకటన నియోజకర్గ ప్రజల్లో ఆశ లు రేకెత్తిస్తున్నాయి. వచ్చే ఐదేళ్లలో విద్యుత్ వి నియోగం పెరుగుతుందని, ఇందుకు అనుగుణంగా జెన్కోలోని నిష్ణాతులైన ఇంజినీర్ల సేవ లు వినియోగించుకుంటూ అత్యాధునిక పరిజ్ఞానంతో 800 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేయాలని శనివారం హై దరాబాద్లో జరిగిన డైరెక్టర్ల సమావేశంలో ఎనర్జీ కార్యదర్శి, డైరెక్టర్లను భట్టి ఆదేశించారు. దీంతో కొత్త పవర్ ప్లాంట్ ఏర్పాటు కాబోతోందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కమిషనర్తో రజక నేతల భేటీ సుల్తానాబాద్(పెద్దపల్లి): సుల్తానాబాద్ మున్సిపల్ కమిషనర్ తిప్పరాజు రమేశ్ను రజక సంఘం నాయకులు శనివారం ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. పూల బొకే అందించి శాలువాతో సన్మానించారు. ర జక సంఘం నాయకులు నిట్టూరి శ్రీనివాస్, నిట్టూరి రాజేశం, నిట్టూరి అంజయ్య, దీపక్, కొత్తకొండ శ్రీనివాస్, తోటపల్లి సంతోష్, నిట్టూరి మైసయ్య, నిట్టూరి కృష్ణ, నిట్టూరి శ్రీనివాస్, చాతల శివ, బుత్కూరి శంకర్, నిట్టూరి ఓదెలు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రస్థాయి పోటీలకు 9మంది పెద్దపల్లిరూరల్: స్పోర్ట్స్ స్కూళ్లలో ప్రవేశం కో సం చేపట్టిన ఎంపిక పోటీల్లో జిల్లాకు చెందిన 9 మంది విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారని జిల్లా యువజన, క్రీడలశాఖ అధికారి సురేశ్ తెలిపారు. కాల్వశ్రీరాంపూర్కు చెందిన విహాన్వర్ధన్, మెహన్నత్, రామగిరికి చెందిన ఈశ్వర్, జూలపల్లికి చెందిన అద్విత్చంద్ర, పాలకుర్తికి చెందిన కుశ్వంత్, కమాన్పూర్కు చెందిన మణిరిత్విక్, మంథని కి చెందిన రహమత్అలీ, సుల్తానాబాద్కు చెందిన రుషికే శ్, తేజిస్వి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై న వారి లో ఉన్నారని పేర్కొన్నారు. హకీంపేటలో జరి గే పోటీల్లో పాల్గొనే విద్యార్థులకు ఎస్కార్ట్గా ప్రణయ్, వెంకటేశ్ వ్యవహరిస్తారన్నారు. -
సమన్వయంతో పనిచేయాలి
మంథని: అభివృద్ధి కోసం అధికారులు సమన్వయంతో పనిచేయాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బా బు సూచించారు. స్థానిక శివకిరణ్ గార్డెన్స్లో కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులతో అభివృద్ధి పనులపై శ నివారం ఆయన సమీక్షించారు. భవిష్యత్ అవసరాలు, పీక్ డిమాండ్ను దృష్టిలో ఉంచుకొని వి ద్యుత్ సబ్స్టేషన్లు, అదనపు లైన్లు ఏర్పాటు చే యాలని సూచించారు. గంగదేవిపల్లిలో సబ్స్టేషన్ నిర్మాణానికి వారంలోగా శంకుస్థాపన చేయాలని, మచ్చుపేటలో 132 కేవీ సబ్స్టేషన్ ఏర్పాటు చేయాలన్నారు. విద్యుత్ సరఫరాలో సమస్యలను ఎస్ఈ పరిష్కరించాలన్నారు. వచ్చే మూడు నెలలపాటు విద్యుత్ సరఫరా చాలాకీలకమని, అధికారులు అప్రమత్తం ఉండాలని సూచించారు. ఎ రువులు, విత్తనాలు రైతులకు అవసరమైనన్ని ఉ న్నాయని తెలిపారు. అర్హులకు రేషన్కార్డులు జారీచేయాలని, పైలెట్ ప్రాజెక్టు కింద ఒకరేషన్ షాప్ వద్ద సూపర్ మార్కెట్ ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేయాలని మంత్రి సూచించారు. మంథని ఆస్పత్రికి వచ్చే పేషెంట్లకు ఇక్కడే వైద్యసేవలు అందించాలని, గోదావరిఖని, పెద్దపల్లి లాంటి ప్రాంతాలకు రెఫర్ చేయొద్దని ఆదేశించారు. బ యోమెట్రిక్ హాజరు నమోదు చేయాలని అన్నా రు. సబ్సెంటర్ల భవన నిర్మాణ పురోగతి, సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాలని డీఎంహెచ్వోకు సూచించారు. పీహెచ్సీల్లో పరికరాలు, సామగ్రి అందుబాటులో ఉంచాలని కలెక్టర్కు సూచించారు. తాగునీటి కోసం వారంరోజుల్లోగా మిషన్ భగీరథ, పాతవ్యవస్థ పునరుద్ధరించాలన్నారు. ఎస్సారెస్పీ కాలువల్లో ఈజీఎస్ ద్వారా ఏటా పూడిక తొలగించాలని అన్నారు. పెండింగ్ ఇరిగేషన్ ప్రాజెక్టుల డీపీఆర్ పూర్తిచేయాలని, పో డు భూముల పట్టాలు ఉన్న రైతులను ఇబ్బందులకు గురిచేయవద్దని ఆదేశించారు. గ్రామాల్లో కొ త్త రూట్ల కనీసం 10 రోజులు బస్సులు నడపా లని అన్నారు. మంథని బస్టాండ్ ఆధునికీకరణ ప్రారంభించాలని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల ని ర్మాణ సామగ్రి ధరలు పెరగకుండా చూడాలన్నారు. కలెక్టర్ శ్రీహర్ష మాట్లాడుతూ, రామగిరి మండలం సుందిళ్లలో సింగరేణి మైనింగ్ లీజ్ భూముల పరిహారం అర్హులకు అందించేందుకు ఎంజాయ్మెంట్ సర్వే చేశామన్నారు. జాతీయ ర హదారి పెండింగ్ భూ సేకరణ 80 శాతం అవార్డు పాస్ చేశామని తెలిపారు. అంతకుముందు రామగిరి, ముత్తారం, మంథని, మండలాల్లోని లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు నివాళి అర్పించారు. విద్యుత్ సమస్యలు తలెత్తవద్దు పేషెంట్లను రెఫర్ చేసే పద్ధతి మానుకోండి ఎరువులు, విత్తనాలపై రైతులు ఆందోళన చెందవద్దు పైలెట్ ప్రాజెక్టుగా రేషన్ షాపు వద్ద సూపర్ మార్కెట్ జిల్లా అధికారులతో మంత్రి శ్రీధర్బాబు సమీక్ష -
పేదలకు ప్రజాప్రభుత్వం అండ
ఎలిగేడు/జూలపల్లి/సుల్తానాబాద్(పెద్దపల్లి): అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందిస్తూ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం వారికి అండ గా ఉంటోందని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. ఎలిగేడు, జూల పల్లి మండలాల్లోని వివిధ ప్రాంతాల్లో చేపట్టిన పలు అభివృద్ధి పనుల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. రేషన్కార్డులు, సీఎంఆర్ఎఫ్, కల్యాణలక్ష్మి చెక్కు లు అందజేశారు. ఇందిరమ్మ ఇళ్లకు ముగ్గులు పోశారు. రహదారులు, కుల సంఘ భవన నిర్మాణాలకు ఆయన శంకుస్థాపన చేశారు. సుల్తానాబాద్ ఎస్వీఆర్ గార్డెన్లో కొత్త రేషన్ కార్డులు, కల్యాణలక్ష్మి, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే మాట్లాడారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక్క రేషన్కార్డు, ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదన్నారు. తహసీల్దార్లు యాకన్న, స్వర్ణ, బషీరొద్దీన్, ఎంపీవో కిరణ్, ఏపీఎం సుధాకర్, ఆర్ఐలు చంద్రశేఖర్, జయలక్ష్మి, ఎంపీడీవోలు పద్మజ, దివ్యదర్శన్రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అన్నయ్యగౌడ్, ఏఎంసీ చైర్మన్లు గండు సంజీవ్, ప్రకాశ్రావు, నాయకులు వేణుగోపాలరావు, సామ రాజేశ్వర్రెడ్డి, దుగ్యాల సంతోష్రావు, వెంకటేశ్వర్రావు, పుల్లారావు, పరుశరాములుగౌడ్, కొండ తిరుపతిగౌడ్, కొడయ్య, పెద్ది కుమార్, వెంకటసత్యం, రమేశ్, వెంకట్రెడ్డి, పూరెల్ల శ్రావణ్, బొద్దుల లక్ష్మణ్, నర్సింహ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యేను కలిసిన మున్సిపల్ కమిషనర్ సుల్తానాబాద్/ఎలిగేడు: సుల్తానాబాద్ మున్సిపల్ కమిషనర్ తిప్పరాజు రమేశ్ ఎమ్మెల్యే విజయరమణారావును శివపల్లిలో కలిసి బొకే అందజేశారు. పలు విషయాలపై చర్చించారు. ● పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు -
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
● రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా గోదావరిఖని: శాంతిభద్రతలు, నేరాల నియంత్రణ లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా హెచ్చరించారు. కమిషరేట్ కార్యాలయంలో శనివా రం ఆయన నేరసమీక్ష నిర్వహించారు. కేసుల ద ర్యాప్తులో ఆధునిక సాంకేతికత వినియోగిస్తూ, శాసీ్త్ర య పద్ధతి అవలంబించాలన్నారు. ప్రతీరోజు ఒక గంట పెండింగ్ కేసులపై సమీక్షించాలన్నారు. మ హిళలపై జరిగే నేరాల్లో దర్యాప్తు వేగవంతం చేయాలన్నారు. రౌడీషీటర్లపై కఠినంగా వ్యవహరించాలన్నారు. విధుల్లో చాకచక్యంగా వ్యవహరించిన అధికారులు, సిబ్బందిని సీపీ అభినందించారు. కార్యక్రమంలో మంచిర్యాల, పెద్దపల్లి డీసీపీలు భా స్కర్, కరుణాకర్, అడిషనల్ డీసీపీ(అడ్మిన్) రాజు, స్పెషల్ బ్రాంచ్, మంచిర్యాల, పెద్దపల్లి, జైపూర్, బెల్లంపల్లి, ట్రాఫిక్, ఏఆర్ ఏసీపీలు మల్లారెడ్డి, ప్రకాశ్, కృష్ణ, వెంకటేశ్వర్లు, రవికుమార్, శ్రీనివాస్, ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. -
అభివృద్ధి పనులకు నిధులివ్వాలి
● సీఎస్కు ఎమ్మెల్యే రాజ్ఠాకూర్ విజ్ఞప్తి ● రాష్ట్ర మంత్రిని కలిసిన మక్కాన్సింగ్ గోదావరిఖని: రామగుండం నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్ కోరారు. శనివారం హైదరాబాద్లో చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావును ఆయన కలిసి వినతిపత్రం అందజేశారు. తాగునీటి సమస్య పరిష్కారం కోసం మిషన్ భగీరథ పథకం ద్వారా అదనపు నిధులు మంజూరు చేయాలన్నారు. రోడ్ల ఆధునికీకరణకు రూ.120 కోట్లు, డ్రైనేజీ నిర్మాణానికి మరో రూ.80 కోట్లు, డిగ్రీ కాలేజీ భవనం, ల్యాబ్, కంప్యూటర్ సౌకర్యం, మహిళలు, విద్యార్థుల రక్షణ దృష్ట్యా ప్రత్యేక బాలికల హాస్టల్స్ నిర్మాణానికి నిధులు కేటాయించాలన్నారు. రామగుండంలో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి రూ.250 కోట్లు అవసరం ఉంటుందన్నారు. ఎంఎస్ ఏఈ పరిశ్రమల ఏర్పాటుకు స్థలాల కేటాయించాలన్నారు. విద్యుత్, నీటి సౌకర్యం కల్పన కోసం ప్రత్యేకంగా రూ.వంద కోట్లు అవసరమన్నారు. హరితహారం, పచ్చదారుల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా రూ.25 కోట్లు కేటాయించాలని ఆయన కోరారు. ఎమ్మెల్యే అభ్యర్థనపై చీఫ్ సెక్రటరీ సానుకూలంగా స్పందించినట్లు వివరించారు. అదేవిధంగా ప్రభు త్వ ఆస్పత్రి అభివృద్ధికి నిధులు కేటాయించాలని ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి దామోదర రాజనరసింహను ఎమ్మెల్యే ఠాకూర్ కలిసి విన్నవించారు. జనాభా, నగర విస్తరణ, ఆస్పత్రిపై అధిక భారాన్ని దృష్టిలో ఉంచుకొని తగిన చర్యలు తీసుకోవాలన్నారు. 108 వాహనాల సంఖ్య పెంచాలన్నా రు. వైద్యసిబ్బంది ఖాళీలు భర్తీ చేయాలని కోరారు. పీరియాడ్రిక్, గైనకాలజీ, ట్రామాకేర్ విభాగాలు ఏర్పాటు చేయాలని, ముఖ్యంగా సిమ్స్ వద్ద రాజీవ్ రహదారిపై పాదచారుల కోసం ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మించాలని అన్నారు. వీటిపై మంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే వివరించారు. -
ఉత్కంఠకు తెర
● 60 డివిజన్ల పునర్విభజన తుది జాబితా విడుదల ● ఇంకా వెల్లడించని ఇంటి నంబర్లు, కాలనీల పేర్లు ● హద్దులు మాత్రమే ప్రకటించిన బల్దియా అధికారులు కోల్సిటీ(రామగుండం): రామగుండం నగరంలో ఎట్టకేలకు 60 డివిజన్ల పునర్విభజన ఉత్కంఠకు తెరపడింది. షెడ్యూల్ ప్రకారం ఈనెల 21న తుది జాబితా ప్రకటించాల్సి ఉంది. కానీ, వారం తర్వాత 21వ తేదీతోనే జీవో ఎంఎస్ నంబర్ 145 ద్వారా శనివారం రాష్ట్ర పురపాలక శాఖ ఉత్తర్వులు విడుదల చేయడం గమనార్హం. నగరంలో ఇటీవల విలీనమైన లింగాపూర్, వెంకట్రావుపల్లి, ఎల్కలపల్లిగేట్, అక్బర్నగర్ గ్రామాలను కలిపి 60 డివిజన్లుగా విభజిస్తూ హద్దులతో కూడిన తుది జాబితా విడుదల చేశారు. డివిజన్ల సరిహద్దుల ముసాయిదాకు, తుదిజాబితాకు మధ్య భారీమార్పులు చోటు చేసుకున్నాయి. తుది జాబితాలో ఇంటి నంబర్లు, కాలనీల పేర్లకు చోటివ్వలేదు. ఒక్కో డివిజన్కు కేటాయించిన హద్దుల్లో పొందుపర్చిన ఇంటి నంబర్లు, కాలనీల పేర్లను వెల్లడిస్తేనే 60 డివిజన్లపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. తుదిజాబితా ప్రకటనపై జాప్యం? రామగుండం నగరంలో 60 డివిజన్ల విభజనపై సీడీఎంఏ నుంచి తుది జాబితా విడుదలైనా.. మీడియాకు సమాచారం ఇవ్వడంలో అధికారులు జాప్యం చేశారు. శుక్రవారమే కరీంనగర్ నగర అధికారులు డివిజన్ల విభజనపై జీవో విడుదల చేస్తే.. శనివారం మధ్యాహ్నం వరకు కూడా రామగుండం బల్దియా అధికారులు జీవోను బహిర్గతం చేయలేదు. మీడియా ప్రతినిధులు.. పునర్విభజన జీవో సమాచారం కోసం ప్రశ్నల వర్షం కురిపించడంతో ఎట్టకేలకు సాయంత్రం జీవో విడుదల చేశారు. అయోమయం.. గందరోళం.. తుదిజాబితాలో డివిజన్ల హద్దులు మాత్రమే ఇవ్వడం గందరగోళం, అయోమయానికి దారితీసింది. ఉత్తరం నుంచి తూర్పు, దక్షిణం, పడమర, తిరిగి ఉత్తరానికి హద్దులు మాత్రమే ప్రకటించడంతో చాలామంది నగరవాసులు డివిజన్లను అంచనా వేయలేకపోతున్నారు. ఏ ఇంటి నంబర్ నుంచి ఏ ఇంటినంబర్ వరకు, ఏ కాలనీ అనేది ప్రకటిస్తేనే తుది జాబితాపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. తుది జాబితా కూడా తప్పులతడకగా ఉందంటూ సోషల్ మీడియాలోనూ కామెంట్లు చేస్తున్నారు. హద్దులు మాత్రమే ప్రకటన.. డివిజన్ల పునర్విభజనకు సంబంధించి శనివారం హద్దులు మాత్రమే విడుదల చేయడంతో పూర్తిస్థాయిలో స్పష్టత రాలేదు. ఈనెల 4న జారీ చేసిన ముసాయిదాలో ఇంటి నంబర్లు, కాలనీల పేర్లతో 60 డివిజన్ల వివరాలను ప్రకటించారు. తుదిజాబితాలో డివిజన్ల హద్దులతోనే సరిపెట్టడం గందరగోళానికి దారితీసింది. ముసాయిదా తరహాలోనే ఇంటినంబర్లు, కాలనీల పేర్లతో కూడిన డివిజన్ల వివరాలను వెల్లడిస్తేనే అర్థం చేసుకోవడానికి సులువుగా ఉంటుందని నగర ప్రజలు అభిప్రాయపడు తున్నారు. రాష్ట్రంలో వార్డుల విభజన చేపట్టిన 30 మున్సిపాలిటీలకు ఇదే తరహాలోనే తుదిజాబితా విడుదల చేసినట్లు తెసింది. కాగా, సోమవారం డివి జన్ల కాలనీలు, ఇంటి నంబర్లు ప్రకటించే అవకాశం ఉన్నట్లు కొందరు అధికారులు వెల్లడించారు. ఆశావాహుల డివిజన్ల బాట.. మరోవైపు.. డివిజన్ల పునర్విభజన తుది జాబితా విడుదల కావడంతో మాజీ కార్పొరేటర్లు, ఆశావాహులు అప్పుడే కొత్త డివిజన్ల బాటపట్టారు. ముసాయిదా జాబితా తర్వాత తుదిజాబితాను సీడీఎంఏకు బల్దియా అధికారులు పంపించారు. ఈక్రమంలో ఓ జాబితా బల్దియా ఆఫీస్ నుంచి లీక్ అయ్యింది. ఈ జాబితా సోషల్ మీడియాలో చెక్కర్లు కొట్టింది. ఇదే జాబితాను ఫైనల్గా భావించిన చాలామంది ఆశావాహులు.. తాము కోరుకున్న డివిజన్లలో వారం రోజులుగా బస్తీపెద్దమనుషులతో టచ్లో ఉంటున్నారు. హద్దులతో కూడిన తుదిజాబితా మా త్రమే విడుదల కావడంతో మరికొందరు అర్థంకాక తలలుపట్టుకుంటున్నారు. -
కాంగ్రెస్తోనే రాష్ట్రాభివృద్ధి
ఫెర్టిలైజర్సిటీ(రామగుండం): కాంగ్రెస్తోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని ఆ పార్టీ ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు పెండ్యాల మహేశ్ అన్నారు. పాలకుర్తి మండ లం ఎల్కలపల్లిలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ముక్కెర శ్రీనివాస్ ఆధ్వర్యంలో శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘కేసీఆర్ పా లన.. శ్రీరామరక్ష’ పేరిట బీఆర్ఎస్ నాయకులు గ్రామాల్లో తిరిగే ప్రయత్నం చేస్తున్నారని, అయితే, దెయ్యాలు వేదాలు వల్లించినట్లు.. మాజీ ఎమ్మెల్యే కోరుకుంటి చందర్ ఆర్ఎఫ్సీఎల్లో ఉద్యోగాల పే రిట ఎంతమందిని మోసం చేశారో ప్రజలు చూశార న్నారు. ఐదేళ్లపాటు రాక్షస పాలన సాగించిన కోరుకంటి చందర్ చేసిన అభివృద్ధి, 18 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు సి ద్ధమా అని ఆయన సవాల్ విసిరారు. బయ్యపు మ నోహర్రెడ్డి, రాజ్కుమార్ యాదవ్ -
పల్లెతల్లీ.. ప్రణమిల్లి
ఆదివారం శ్రీ 29 శ్రీ జూన్ శ్రీ 2025బోనం.. ఆగమనం●● ఆషాఢ మాసంలో బోనాల వైభవం ● తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక ● పల్లె తల్లులకు పట్టాభిషేకం ● ఇయ్యాల్టి నుంచి బోనాల వేడుకలుఆషాఢ మాసం.. శుభకార్యాలకు దూరంగా ఉంటూనే పుణ్య కార్యాలకు, ఆధ్యాత్మిక వేడుకలకు ఆలవాలమైన మాసం. ఈమాసంలో తెలంగాణ పల్లె, పట్టణం బోనాల వేడుకలతో హోర్తెతిపోతుంది. ముల్లోకాలు కాపాడే అమ్మవారిని ఆరాధించడం బోనాల వెనుక సిసలైన నేపథ్యం. పోచమ్మ, పెద్దమ్మ, మైసమ్మ, ఎల్లమ్మ వంటి గ్రామ దేవతలకు కొత్త కుండలో బోనం (భోజనం) నివేదన చేసి పిల్లాపాపల్ని చల్లగా చూడాలంటూ కోరుకుంటారు. డప్పుచప్పుళ్లు, శివసత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాలు, మేళతాళాలతో మహిళలు నెత్తిన బోనాలతో ఊరేగింపుగా వెళ్లి అమ్మవారలకు నైవేద్యం సమర్పిస్తారు. ఆదివారం వివిధ కులసంఘాల ఆధ్వర్యంలో బోనాల ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. – విద్యానగర్(కరీంనగర్)/సిరిసిల్లకల్చరల్– వివరాలు 8లోuన్యూస్రీల్ -
అంగన్వాడీలు మరింత బలోపేతం
● వారంలో రెండ్రోజులు ఎగ్బిర్యానీ ● జిల్లాలో 41 వేల మందికి లబ్ధి టీచర్లు 706 ఆయాలు 706 గర్భిణులు 3,737 బాలింతలు2,932జిల్లా సమాచారం ఏడాదిలోపు పిల్లలు 17,382 మూడు నుంచి ఆరేళ్లలోపువారు 15,744 -
సొసైటీలకు నగదు అందజేయాలి
ప్రభుత్వం చేపపిల్లలకు మత్స్యకార సొసైటీలకు నగదు ఇవ్వాలి. దీంతో మత్య్యకారులే నాణ్యమైన చేపపిల్లలు కొనుగోలు చేసుకుంటారు. ప్రభుత్వం టెండర్లు పిలిచి కాంట్రాక్టర్లుకు అప్పజెప్పితే వారు నాణ్యతలేని, చిన్నసైజ్ పిల్లలను సరఫరా చేస్తున్నారు. దీంతో అవి ఎదగక ఆశించిన ఫలితం వస్తలేదు. – గంధం వెంకటస్వామి, మత్స్యకారుడు ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి చేపపిల్లల పంపిణీ పథకం అమలు చేస్తుందా? లేదా అనే విషయంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. ఆలస్యంగా చేపపిల్లలు పంపిణీ చేస్తే సర్కారు లక్ష్యం నెరవేరదు. సకాలంలో పంపిణీ, సరఫరా చేయని కారణంగా ప్రైవేటుగా కొనుగోలు చేసుకోవాల్సి వస్తుంది. ప్రభు త్వం వెంటనే స్పందించి చేపపిల్లలకు బదులు నగదు అందజేయాలి. – గుండా రాజు, మత్స్యకారుడు -
యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ
పెద్దపల్లిరూరల్: పట్టణ శివారులోని పెద్దపల్లి – కూనారం మధ్య రైల్వే లెవల్ క్రాసింగ్ గేట్ వద్ద చేపట్టిన రైల్వే వంతెన నిర్మాణంలో శుక్రవారం అపశ్రుతి చోటుచేసుకుంది. గడ్డర్ ఏర్పాటు చేసేందుకు అమర్చిన క్లస్టర్ విరిగి అధికారులు, కార్మికులు ఆందోళనకు గురైనా.. వెంటనే అప్రమత్తమయ్యారు. తక్షణమే రైల్వే ఉన్నతాధికారులకు సమాచారం అందించి ఆగమేఘాలపై విద్యుత్ సరఫరా నిలిపివేయించారు. ఎక్కడిరైళ్లు అక్కడే.. కాజీపేట – బల్హార్ష సెక్షన్లో విద్యుత్ తీగలకు సరఫరా నిలిపివేయడంతో ఈ మార్గంలోని గూడ్స్, ఎక్స్ప్రెస్ రైళ్లు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. రాఘవాపూర్ రైల్వేస్టేషన్లో భాగ్యనగర్, జమ్మికుంటలో తెలంగాణ, ఉప్పల్లో ఇంటర్సిటీ, కొలనూర్లో అనువ్రత్ ఎక్స్ప్రెస్ రైళ్లు నిలిచిపోయాయి. గంటలకొద్దీ రైళ్లు నిలిచిపోవడంతో గమ్యస్థానాలు చేరుకునేందుకు ప్రయాణికులు నానాఇబ్బందులు పడ్డారు. అత్యవసరమైనవారు సమీపంలోని రోడ్లపైకి చేరి బస్సులు, ఇతర వాహనాలను ఆశ్రయించారు. శరవేగంగా పనులు.. రైల్వేవంతెన వద్ద గడ్డర్కు అమర్చిన క్లస్టర్ విరిగిపోవడంతో ఇతర పరికరాల సాయంతో దానిని తొలగించి మరో క్లస్టర్ అమర్చారు. అనంతరం విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడంతో మధ్యా హ్నం నుంచి రైళ్లరాకపోకలు యథావిధిగా కొనసాగాయి. పనులు సాగుతుండగానే డౌన్లైన్(కాజీపేట వైపు) ఉదయం 11.30 గంటలకు విద్యుత్ సరఫరా పునరుద్ధరించి రైళ్లను నడిపించారు. అప్ (బల్హార్షా వైపు) మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో రైళ్ల రాకపోకలు ప్రారంభించారు. ప్రయాణికులకు ఇబ్బందులు బల్హార్ష, కాగజ్నగర్ నుంచి ఉదయం సికింద్రాబాద్ వెళ్లేందుకు భాగ్యనగర్ రైలు ఒక్కటే ఉంది. వివిధ పనుల కోసం అత్యధిక మంది ఈ రైలులో నే ప్రయాణిస్తారు. అయితే, రాఘవాపూర్ రైల్వే స్టేషన్లో నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇ బ్బందులకు గురయ్యారు. పనులు ఎప్పటికి పూ ర్తవుతాయో, రైలు ఎప్పుడు కదులుతుందోననే దానిపై స్పష్టత లేక ఆందోళనకు గురయ్యారు. రైల్వేబ్రిడ్జి పనుల్లో విరిగిన ‘క్లస్టర్’ విద్యుత్ సరఫరా నిలిపివేత ఎక్కడికక్కడే ఆగిన రైళ్లు ప్రయాణికులకు తప్పని అవస్థలు -
ఘనంగా జగన్నాథ రథయాత్ర
జ్యోతినగర్(రామగుండం): ఎన్టీపీసీ పీటీఎస్ లో శుక్రవారం జగన్నాథస్వామి రథయాత్ర సందడి మొదలైంది. వైకుంఠపురంలోని జగన్నాథుని ఆలయంలో జరిగిన కార్యక్రమంలో ఎన్టీపీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చందన్కుమార్ సామంత ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం జగన్నాథునిడి రథంలో పీటీఎస్ వీధులలో కో లాట బృందాల నృత్యాలతో ఊరేగించారు. ఆలయ అర్చకులు రామాచార్యులు, ఎన్టీపీసీ ఉద్యోగ గుర్తింపు సంఘం ప్రధాన కార్యదర్శి ఆరెపల్లి రాజేశ్వర్, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. లింగ నిర్ధారణ చట్టరీత్యా నేరం పెద్దపల్లిరూరల్: గర్భస్థ శిశువు లింగనిర్ధారణ చేయడం చట్టరీత్యా నేరమని, నిబంధనలు పా టించని స్కానింగ్ కేంద్రాలపై చర్యలు తప్ప వని జిల్లా వైద్యాధికారి అన్న ప్రసన్నకుమారి హెచ్చరించారు. శుక్రవారం నిర్వహించిన జిల్లాస్థాయి సమావేశంలో ఆమె మాట్లాడారు. లింగ నిర్ధారణ చేసినా, చేయించుకున్న వారికీ మూడే ళ్ల జైలు, రూ.10వేల జరిమానా విధిస్తామన్నా రు. జిల్లాలో 32 స్కానింగ్ కేంద్రాలు నమోదయ్యాయని పేర్కొన్నారు. రెడ్క్రాస్ సొసైటీ జి ల్లా అధ్యక్షుడు రాజగోపాల్తో పాటు వాణిశ్రీ, స్రవంతి, శ్రీదేవి, స్నేహ పాల్గొన్నారు. సీఈగా బాధ్యతలు స్వీకరణ పెద్దపల్లిరూరల్: ఎన్పీడీసీఎల్ ఎస్ఈగా పనిచేస్తున్న కంకటి మాధవరావుకు వరంగల్ జోన్ చీఫ్ ఇంజినీర్ (సీఈ)గా అదనపు బాధ్యతలు అప్పగించారు. దీంతో ఆయన శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. సీఈగా బాధ్యతలు చేపట్టిన మాధవరావును జిల్లాకు చెందిన విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది శుక్రవారం పూలమాల, శాలువాతో సత్కరించారు. బల్దియా ఇంజినీర్పై ఫిర్యాదు కోల్సిటీ(రామగుండం): అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న బల్దియా ఈఈ పీవీ రామన్పై చర్యలు తీసుకోవాలని కాంట్రాక్టర్లు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. టెండర్ల ప్రక్రియను పారద్శకంగా నిర్వహించడం లేదని, స్థానికులను కాద ని స్థానికేతర కాంట్రాక్టర్లకు నామినేషన్ పద్ధతి న పనులు అప్పగిస్తున్నారని పేర్కొన్నారు. ఇత ర మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో బ్లీచింగ్ పౌడర్ కొనుగోలుకు టెండర్లు పిలిస్తే రామగుండంలో నామినేషన్ పద్ధతిలో అప్పగించడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. చెట్లు కట్ చే యడం, ట్రీగార్డ్స్ సరఫరా చేయడానికి కూడా ఇలాంటి పద్ధతులు అమలు చేస్తున్నారన్నారు. స్థానిక కాంట్రాక్టర్లకు పనులు దక్కకుండా వ్యవ హరిస్తున్న ఈఈపై చర్యలు తీసుకోవాలని ఫి ర్యాదు చేసినట్లు కాంట్రాక్టర్లు తెలిపారు. దీనిపై ఈఈ రామన్ను వివరణ కోరగా, కాంట్రాక్టర్లు చేసిన ఆరోపణలు అవాస్తవమన్నారు. అన్ని ప నులను టెండర్ల ద్వారానే అప్పగిస్తున్నామని తెలిపారు. బ్లీచింగ్ పౌడర్ సరఫరాను కలెక్టర్ అప్రోవల్తోనే అప్పగించామని వెల్లడించారు. రేపు జిల్లాస్థాయి పోటీలు సుల్తానాబాద్(పెద్దపల్లి): స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో ఈనెల 29వ తేదీన జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలు నిర్వహిస్తామని అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు కొలిపాక శ్రీనివాస్, కొమ్మ గట్టయ్య తెలిపారు. ప్రతిభ కనబర్చిన 20మందిన వరంగల్లో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేస్తామన్నారు. ఆసక్తి గలవారు వయసు ధ్రువీకరణపత్రం, ఆధార్కార్డుతో అదేరోజు ఉదయం ప్ర భుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో హాజరు కావాలని కోరారు. వివరాల కోసం 96183 36976 నంబరులో సంప్రదించాలన్నారు.3, 4వ తేదీల్లో కాలేజీల బంద్ పెద్దపల్లిరూరల్: విద్యార్థుల ఫీజురీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలనే డి మాండ్తో జూలై 3, 4వ తేదీల్లో డిగ్రీ, పీజీ, ప్రొ ఫెషనల్ విద్యాసంస్థల బంద్ పాటిస్తున్నట్టు జా ర్జిరెడ్డి పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు నరేశ్ తెలిపారు. కాలేజీ యాజమాన్యాల తీరుతో విద్యార్థులు మానసిక వేదనకు గురవుతున్నారన్నా రు. ఖమ్మం జిల్లా కేంద్రంగా ప్రభుత్వ జనరల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. నాయకులు రమేశ్, శివ, చరణ్, సా యి, శ్రీకాంత్, రాజు, మహేశ్, రాకేశ్ ఉన్నారు. -
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
● ఎమ్మెల్యే విజయరమణారావు కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): ప్రజాసంక్షేమం, పారదర్శక పాలనే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అ న్నారు. జాఫర్ఖాన్పేట, పెద్దరాతుపల్లి, ఇదులా పూర్, ఎన్నంపల్లి గ్రామాల్లో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శుక్రవారం ఆయన శంకుస్థాపన, ప్రా రంభోత్సవం చేశారు. రేషన్కార్డులు, ఇందిరమ్మ ఇ ళ్ల పత్రాలను అందజేశారు. ఇందిరమ్మ ఇళ్ల పనుల కు ముగ్గు పోశారు. జాఫర్ఖాన్పేట కొత్త గ్రామపంచాయతీ భవనం, పెద్దరాతుపల్లిలో పల్లెదవాఖా ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు. మహిళా శిశు సంక్షేమం, విద్య, వైద్యం, ఆరోగ్యంపై సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభు త్వం ప్రత్యేక దృష్టిని సారించిందన్నారు. ఈకార్యక్రమంలో మాజీ ఎంపీపీ గోపగాని సారయ్యగౌడ్, ఏఎంసీ చైర్మన్ రామిడి తిరుపతిరెడ్డి, సింగిల్విండో చైర్మన్ రామచంద్రారెడ్డి, తహసీల్దార్ జగదీశ్వర్రావు, ఎంపీడీవో పూర్ణచందర్రావు, రిటైర్డ్ హెచ్ ఎం నర్సింహారెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గాజనవేన సదయ్య తదితరులు పాల్గొన్నారు. ‘రామగుండంలో విధ్వంస పాలన’గోదావరిఖని: రామగుండం నియోజకవర్గంలో ప్రజాపాలన పేరుతో విధ్వంసం కొనసాగుతోందని మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ విమర్శించారు. ప్రధాన చౌరస్తా సమీపంలో కూల్చివేసిన షాపులను శుక్రవారం ఆయన పరిశీలించారు. సుందరీకరణ, అభివృద్ధి పేరిట చిరువ్యాపారుల దుకాణాలు తొలగిస్తూ జీవనోపాధిపై దెబ్బతీస్తున్నారన్నారు. పేదల జీవితాలను కాంగ్రెస్ పాలకులు రోడ్డున పడవేస్తున్నారని అన్నారు. రోడ్డు విస్తరణ, షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణంలో షాపులను కోల్పోయిన వారికి ప్రత్యామ్నాయం కల్పించిన స్థలంలోనే వేసుకున్న షెడ్లను మళ్లీ కూల్చివేయడం ఏమిటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు గోపు ఐలయ్యయాదవ్, నారాయణదాసు మారుతి, జేవీ రాజు, కల్వచర్ల కృష్ణవేణి, ఐత శివకుమార్, బొడ్డుపల్లి శ్రీనివాస్, అచ్చె వేణు, తోట వేణు, బొబ్బిలి సతీశ్, దొమ్మేటి వాసు, సట్టు శ్రీనివాస్, కుమార్నాయక్ తదితరులు ఉన్నారు. -
మొరాయిస్తున్న అంబులెన్స్లు
● అత్యవసర సమయాల్లో ఉద్యోగులకు తప్పని ఇబ్బందులు ● ప్రైవేట్ వాహనాలే దిక్కవతున్న వైనం ● పట్టించుకోని సింగరేణి అధికారులు గోదావరిఖని: సింగరేణి బొగ్గు గనులపై అందుబాటులోకి తీసుకొచ్చిన అంబులెన్స్లు ప్రచారానికే పరిమితం అవుతున్నాయి. అత్యవసర సమయాల్లో కార్మికులను ఆస్పత్రులకు తీసుకెళ్లేందుకు ఏర్పాటు చేసిన వాహనాలు వివిధ కారణాలతో మొరాయిస్తున్నాయి. ఆపదలో ఉన్న ఉద్యోగులు గోల్డెన్ ఆవర్లో ఆస్పత్రికి చేర్చడం అత్యంత కీలకం. ఈక్రమంలో గురువారం జీడీకే–11గనిలో పనిచేస్తున్న ఉద్యోగురాలు చాతీ నొప్పితో ఆస్వస్థతకు గురైంది. దీంతో గనిపై ఉన్న అంబులెన్స్లో ఆస్పత్రికి తరలించేందుకు సమాయత్తం చేయగా అది స్టార్ట్కాలేదు. దీంతో గనిపై ఉన్న ఓ బొలేరో వాహనంలో సింగరేణి ప్రధాన ఆస్పత్రికి తీసుకెళ్లారు. జేబీసీసీఐ ఒప్పందం ప్రకారం ప్రతీ మైన్పై అంబులెన్స్ అందుబాటులో ఉండాలని నిర్ణయించారు. అయితే గనిపై అంబులె న్స్ ఏర్పాటు చేసినప్పటికీ అది కండీషన్లో లేకపోవడంతో అవసరానికి ఉపయోగ పడడం లేదని, ఉద్యోగులు, కార్మికులు విమర్శలు గుప్పిస్తున్నారు. రెండు సంఘటనల్లో ఇబ్బందులు ఆర్జీ–1 ఏరియా జీడీకే–11గనిలో ఈనెల 24న అండర్గ్రౌండ్ ఎల్హెచ్డీ సెక్షన్లో గ్రూప్ ఇంజినీర్ రాందాస్ అస్వస్థకు గురయ్యారు. అత్యవసరంగా ఆయనను ఆస్పత్రికి తరలించాల్సి వచ్చింది. గనిపై ఉన్న అంబులెన్స్ మొరాయించడంతో బొలెరో వాహనంలో బాధితుడిని సింగరేణి ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈనెల 26న ఉదయం7గంటల షిఫ్ట్లో కంటిన్యూస్ మైనర్–2లో పనిచేస్తున్న మహిళా ట్రెయినీ ఫిట్టర్ చాతిలో నొప్పి వస్తుందని అధికారులకు చెప్పారు. ఆమెను వెంటనే అండర్ గ్రౌండ్ నుంచి గనిపైకి తీసుకొచ్చి అంబులెన్స్లో తరలించాలని ప్రయత్నించారు. ఆ సమయంలో వాహనం స్టార్ట్ కాలేదు. దీంతో బొలేరో వాహనంలో ఏరియా హాస్పిటల్కి తీసుకెళ్లారు. మారుతున్న పరిస్థితుల దృష్ట్యా హార్ట్ ఎటాక్లు ఎక్కువ అవుతున్నాయని, గనిపై అంబులెన్స్లు ఏర్పాటు చేయాలని కార్మిక సంఘాలు కోరాయి. ఇప్పటికై నా అధికారులు స్పందించి కండిషన్లో ఉన్న అంబులెన్స్లను ఏర్పాటు చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు. కండీషన్లోనే ఉండాలి కండీషన్లో ఉన్న అంబులెన్స్లను గనిపై ఏర్పాటు చేయాలని సీఐటీయూ నాయకులు తుమ్మల రాజారెడ్డి, మెండె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. అత్యవసర సమయాల్లో పనిచేయని అంబులెన్స్లు గనిపై ఉండి ఏం ప్రయోజనమని వారు ప్రశ్నించారు. -
చిన్నబోతున్న చెరువు
● జిల్లాలో చేపపిల్లల పంపిణీపై నీలినీడలు ● పథకం అమలుపై స్పష్టత ఇవ్వని ప్రభుత్వం ● నగదు అందజేస్తే తామే కొనుగోలు చేస్తామంటున్న మత్స్యకారులు ● సొసైటీలకు నిధులు విడుదల చేయాలని ప్రతిపాదనలుసాక్షి,పెద్దపల్లి: మత్స్యకార్మికులకు ఆర్థిక స్వావలంబన చేకూర్చాలనే లక్ష్యంతో గత ప్రభుత్వం చేపట్టిన ఉచిత చేపపిల్లల పంపిణీ పథకంపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. వర్షకాలం ప్రారంభమై జూలై సమీపిస్తున్నా ఇంతవరకు ప్రభత్వం నుంచి ఎలాంటి స్పష్టత వెలువడలేదు. దీంతో అసలు ఈపథకం ఈ ఏడాది ఉంటుందా? లేదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జూన్లోపే టెండర్ల ప్రక్రియ పూర్తిచేయాల్సి ఉంది. ఇప్పటివరకు ఎటువంటి కసరత్తు మొదలుపెట్టలేదు. ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తయితే జూలై నుంచి సెప్టెంబర్ వరకు జలాశయాల్లో చేపలు, రొయ్య విత్తనాలను మత్స్య శాఖ అధికారులు సొసైటీల సహకారంతో వదలా ల్సి ఉంది. అయితే, సకాలంలో చేప విత్తనాల్ని వద లకుంటే ఆశించిన మేర ఎదిగే అవకాశం ఉండదని మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతేడాది మధ్యలోనే.. జిల్లాలో 281 మత్స్య సొసైటీలుండగా, అందులో 13,450 మంది సభ్యులు ఉన్నారు. గతేడాది అన్నారం, సుందిళ్ల, ఎల్లంపల్లి ప్రాజెక్టులతోపాటు 1,073 చెరువులు, 79 కుంటల్లో 31లక్షల చేపపిల్లలు పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఇందులో పెద్దసైజ్ (80 మి.మీ. నుంచి 100 మి.మీ.) చేపపిల్లలను రిజర్వాయర్లు, చిన్నసైజ్(35 మి.మీ. నుంచి 40 మి.మీ.) చేపపిల్లలను కుంటలు, చెరువుల్లో వదలాలని నిర్ణయించారు. టెండర్లు ఆలస్యంగా పిలవడం, టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లు చిన్నసైజ్ చేపపిల్లలను సరఫరా చేస్తుండడంతో మత్స్య కారులు వాటిని అడ్డుకున్నారు. దీంతో మొత్తంగా గర్రెపల్లి, సుల్తానాబాద్లో 1.30లక్షల చేపపిల్లలు పంపిణీ చేసి ఆ తర్వాత మధ్యలోనే వదిలేశారు. ఉచిత చేపపిల్లలకు బదులు నగదు విడుదల చేస్తే సొసైటీలు నాణ్యమైన చేపపిల్లలు కొనుగోలు చేస్తాయని, వాటిద్వారా తమకు అందుతాయని మ త్స్యకారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. తద్వారా పిల్లల ఉత్పత్తి పెరుగుతుందని, తమ కుటుంబాలు ఆర్థికంగా బలోపేతం అవుతాయని చెబుతున్నారు. అదనుదాటిన తర్వాత నిర్ణయం తీసుకోకుండా, అదనులోపే ప్రభుత్వం ఈపథకం అమలుపై స్పష్టత ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కాగా, చేపపిల్లల పంపిణీ ప్రక్రియలో పెద్దఎత్తున అవకతవకలు జరిగాయనే ఆరోపణల నేపథ్యంలోనే ప్రభుత్వం పథకం అమలుపై ఆచూతూచి వ్యవహరిస్తున్నట్లు సమాచారం. జిల్లామత్స్యకార అధికారి నరేశ్ నాయుడును ఈ విషయంపై వివరణ కోరగా.. ప్రభుత్వం నుంచి తమకు ఎటువంటి ఆదేశాలు రాలేదన్నారు. ఆదేశాలు వచ్చిన వెంటనే చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. -
ప్రభుత్వ ఆస్పత్రిలో కార్పొరేట్ సేవలు
● కలెక్టర్ కోయ శ్రీహర్ష పెద్దపల్లిరూరల్: జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి, మాతాశిశు సంరక్షణ కేంద్రంలో కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందించాలని, ఇందుకోసం మౌలిక వసతులు కల్పించాలని కలెక్టర్ శ్రీహర్ష సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి, ఎంసీహెచ్ను కలెక్టర్ శుక్రవారం ఆకస్మికంగా సందర్శించారు. సమస్యలపై ఆరా తీశారు. బ్లడ్శాంపిల్ సేకరించే ల్యాబ్ వద్ద రద్దీ ఎక్కువగా ఉండడా న్ని గమనించారు. అవసరాన్ని బట్టి సెంటర్లను పెంచాలన్నారు. పేషేంట్లు కూర్చునేందుకు కుర్చీలు, కర్టెన్లు, ఇతర సామగ్రి కోసం ప్రతిపాదనలిస్తే ని ధులు మంజూరు చేస్తానన్నారు. ఆహ్లాదకర వాతావరణం కోసం ఇండోర్ప్లాంట్లు ఏర్పాటు చేయాలని సూచించారు. సూపరింటెండెంట్ శ్రీధర్, ఆర్ఎంవో విజయ్ తదితరులు ఉన్నారు. అంతకుముందు సుభాష్ విగ్రహం వద్ద గల ఎంఈవో కార్యాలయాన్ని కలెక్టర్ శ్రీహర్ష సందర్శించారు. మండల రిసోర్స్ కేంద్రం పనితీరుపై ఆరా తీశారు. సర్కారు బడుల పనితీరు మెరుగుపడాలి ప్రభుత్వ పాఠశాలల పనితీరు మెరుగుపడాలని, సీఆర్పీలు విధులను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ శ్రీహర్ష ఆదేశించారు. కలెక్టరేట్లో పాఠశాలల నిర్వహణపై సమీక్షించారు. ఉపాధ్యాయుల వర్క్ అడ్జస్ట్మెంట్ పారదర్శకంగా జరగాలన్నారు. విద్యార్థుల సంఖ్య పెరిగిన స్కూళ్లలో వసతులు మెరుగుపర్చాలని, అదనపు గదుల నిర్మాణం కోసం ప్రతిపాదనలు ఇవ్వాలన్నారు. వారంలో ఒకరోజు విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేయాలని సూచించారు. జీసీడీవో కవిత, ఎస్వో మల్లేశ్, పీఎం షేక్ తదితరులు పాల్గొన్నారు. పీఎం సూర్యఘర్పై ప్రచారం ఇంటి కప్పుపై సోలార్ విద్యుత్ ప్యానెల్తో విద్యుత్ ఉత్పత్తి చేసుకునేందుకు అమలు చేస్తున్న పీఎం సూర్యఘర్ యోజన పథకంపై విస్తృత ప్రచారం చేయాలని కలెక్టర్ శ్రీహర్ష ఆదేశించారు. కలెక్టరేట్లో సౌరశక్తిపై సమీక్షించారు. ప్రతీ మండలంలో కనీసం 500 ఇళ్లపై ఈ పథకం అమలయ్యేలా చూడాలని కలెక్టర్ పేర్కొన్నారు. డీఆర్డీవో కాళిందిని, డీపీవో వీరబుచ్చయ్య తదితరులు ఉన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పనుల్లో వేగం పెంచాలి జిల్లాలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలని కలెక్టర్ శ్రీహర్ష అన్నారు. కలెక్టరేట్లో వనమహోత్సవం, ఇందిరమ్మ ఇళ్లు, ఉపాధిహామీ పథకం పనులపై ఎబపీడీవో, ఎంపీవో తదితర అధికారులతో సమీక్ష నిర్వహించారు. -
సింగరేణిలో సమ్మె సైరన్
● వచ్చేనెల 9న నిర్వహణకు ఏర్పాట్లు ● ప్రణాళిక సిద్ధం చేసిన కార్మిక సంఘాల జేఏసీగోదావరిఖని: సింగరేణిలో సమ్మె మేఘాలు అలు ముకుంటున్నాయి. కార్మిక చట్టాలను యథా విధి గా కొనసాగించాలని, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటుపరం చేయవద్దని జాతీయ కార్మిక సంఘాలు వచ్చేనెల 9న ఒక్కరోజు సమ్మెకు పిలుపునిచ్చాయి. ఒక్కరోజు టోకెన్ సమ్మె పారిశ్రామిక ప్రాంతంలో ఎఫెక్ట్ చూపించనుంది. ఈ మేరకు బుధవారం గోదావరిఖనిలో కార్మిక సంఘాల జేఏసీ సమావేశం నిర్వహించి సమ్మెను విజయవంతం చేయాలని నిర్ణయించాయి. అన్ని బొగ్గుగనులపై విస్తృతంగా ప్రచారం చేయాలని తీర్మానించాయి. వాస్తవానికి మే20న టోకెన్ సమ్మె చేయాలని భావించినా, పాకిస్థాన్తో యుద్ధం నేపథ్యంలో వాయిదా వేశాయి. కార్మిక సంఘాల జేఏసీ భేటీ సింగరేణిలో సమ్మె విజయవంతం చేయాలని కార్మిక సంఘాల జేఏసీ సమావేశమైంది. టోకెన్ సమ్మెను విజయవంతం చేయడానికి అన్ని సంఘాలు ఏకమై విస్తృతంగా ప్రచారం చేయాలని నిర్ణయించాయి. అన్ని గనులపైకి వెళ్లి గేట్మీటింగ్తో సమ్మె చేయాలని కోరుతున్నాయి. వచ్చేనెల 9న నిర్వహించే సమ్మె విజయవంతం చేయాలనే పట్టుదలతో కార్మిక సంఘాలున్నాయి. ప్రధాన డిమాండ్లు ఇవే రద్దు చేసిన కార్మిక చట్టాలను కొనసాగించాలి. కొత్త లేబర్కోడ్లను రద్దు చేయాలి. కోల్ ఆపరేషన్ ప్రయివేటువారితో చేయించడం పూర్తిగా మానుకోవాలి. సత్తుపల్లి ఓసీపీ ప్రయివేట్ సంస్థ ఓబీని సింగరేణి భూమిలో పోయడానికి అవకాశం ఇవ్వద్దు. తాడిచర్ల–2, వెంకటాపూర్ గనులను సింగరేణికే ఇవ్వాలి. సింగరేణికి రావాల్సిన రూ.40 వేల కోట్ల బకాయిలు ప్రభుత్వం చెల్లించి సంస్థను ఆదుకోవాలి. సింగరేణిలో నూతన గనులు ఏర్పాటు చేసి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలి.లేబర్కోడ్లకు వ్యతిరేకంగా సమ్మెగోదావరిఖని: నాలుగు లేబర్ కోడ్ల రదు కు జూలై9న నిర్వహించే దేశవ్యాప్త సమ్మె ను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య కోరా రు. గురువారం జీడీకే–11గనిలో ఏర్పా టు చేసిన గేట్మీటింగ్లో మాట్లాడారు. సింగరేణి బొగ్గు, విద్యుత్తును వాడుకున్న రాష్ట్ర ప్రభుత్వం రూ.26 వేల కోట్లు బకా యి పడిందని, వెంటనే చెల్లించాలన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.19 వేల కోట్లు బకాయి పెడితే, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దాదాపు ఏడు వేల కోట్ల రూపాయలు బకాయి పడిందన్నారు. కనీసం రూ.10వేల కోట్లు సింగరేణి కార్మికుల సంక్షేమం, కొత్త గనులు, మెటీరియల్, యంత్రాల కొనుగోలు కు వినియోగించే అవకాశం ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి బకాయిలు రాకపోవడం వల్ల సింగరేణి సంస్థ అనేక ఆర్థిక ఇబ్బందుల్లో ఉందన్నారు. నాయకులు మడ్డి ఎల్లాగౌడ్, కవ్వంపల్లి స్వామి, రంగు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
గ్రామ పంచాయతీలకు సొంత భవనాలు
● కలెక్టర్ కోయ శ్రీహర్షపెద్దపల్లిరూరల్: జిల్లాలోని గ్రామ పంచాయతీలకు సొంతభవనాలు నిర్మించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. కలెక్టరేట్లో గురువారం సమీక్షించారు. జిల్లాలో 24 పంచాయతీలకు సొంతభవనాలను నిర్మించాల్సి ఉందని, అనువైన స్థలాలను ఎంపిక చేయాలని పేర్కొన్నారు. ఆయా గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించి ఎంపిక చేయాలన్నారు. డీఎల్పీవో వేణుగోపాల్ పాల్గొన్నారు. కేజీవీల్స్తో రోడ్డెక్కొద్దు కేజీవీల్స్ ట్రాక్టర్లు రోడ్లపై తిరగడం వల్ల రోడ్లు పాడైపోతున్నాయని, కేజీవీల్స్తో రోడ్డెక్కితే జరిమానా చెల్లించాల్సిందేనని కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. కేజీవీల్స్తో నడుపుతూ తొలిసారి పట్టుబడితే రూ.5వేల జరిమానా విధిస్తామన్నారు. రెండోసారి రూ.10వేలు, మూడోసారి రూ.20వేల జరిమానా విధిస్తామన్నారు. తహసీల్దార్లు, ఎంపీడీవోలు, మండల వ్యవసాయాధికారులు, పోలీసులు రోడ్లపై కేజీవీల్స్తో తిరిగే ట్రాక్టర్లపై కేసులు నమోదు చేసి జరిమానా విధించేలా చర్యలు తీసుకోవాలన్నారు. -
మత్తుతో జీవితాలు చిత్తు
● రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా రామగిరి: మత్తు పదార్థాల వినియోగంతో యువత భవిష్యత్ ప్రమాదంలో ఉందని, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని రామగుండం పోలీసు కమిషనర్ అంబర్ కిషోర్ ఝా సూచించారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినం సందర్భంగా గురువారం సెంటినరీకాలనీ జేఎన్టీయూలో అవగా హన సదస్సు నిర్వహించారు. ముందుగా ప్రిన్సిపా ల్ డాక్టర్ బులుసు విష్ణువర్ధన్ పూలమొక్క అందించి సీపీకి స్వాగతం పలికారు. మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా విద్యార్థులతో ప్రమాణం చేయించి, పోస్టర్ ఆవిష్కరించారు. యువత గంజాయి, మత్తు పదార్థాలకు బానిసలై భవిష్యత్ నాశనం చేసుకోవద్దని అన్నారు. ఎవరైనా మత్తు పదార్థాలు అమ్మితే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. పెద్దపల్లి డీసీపీ కరుణాకర్, గోదావరిఖని ఏసీపీ మడత రమేశ్, మంథని, గోదావరిఖని టూటౌన్ సీఐలు బొల్లపల్లి రాజుగౌడ్, ప్రసాద్రావు, రామగిరి, ముత్తారం, మంథని ఎస్సైలు తాడవేన శ్రీనివాస్, పురుషోత్తం దివ్యగౌడ్, నరేశ్, రమేశ్, నార్కొటిక్ ఎస్సై రాజేశ్ పాల్గొన్నారు. డ్రగ్స్ నియంత్రణకు పాటుపడదాం పెద్దపల్లిరూరల్: యువత వక్రమార్గంలో పయనించి భవిష్యత్ను పాడు చేసుకోవద్దని అడిషనల్ కలెక్టర్ వేణు అన్నారు. పెద్దపల్లిలో గురువారం అంతర్జాతీయ మాదకద్రవ్యాల నిర్మూలన దినోత్సవం సందర్భంగా చేపట్టిన ర్యాలీని డీసీపీ కరుణాకర్తో కలిసి ప్రారంభించారు. యువత చెడు అలవాట్లకు బానిసలైతే తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవడమే కాకుండా తల్లిదండ్రులను క్షోభ పెట్టినవారవుతారనే విషయాన్ని గ్రహించాలన్నారు. ఏసీపీ గజ్జికృష్ణ, జిల్లా సంక్షేమశాఖ అధికారి వేణుగోపాల్రావు, డీఎంవో ప్రవీణ్రెడ్డి, ఆర్టీవో రంగారావు పాల్గొన్నారు. -
మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి
జూలపల్లి: యువత, విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని జిల్లా లీగల్ సర్వీసెస్ సెక్రటరీ, సీనియర్ సివిల్ జడ్జి స్వప్నరాణి సూచించారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మండలంలోని పెద్దాపూర్ ఆదర్శ పాఠశాలలో చట్టాలపై అవగాహన కల్పించారు. పోక్సో, గృహహింస, బాల్య వివాహ నిరోధక చట్టాలను గురించి వివరించారు. ప్రిన్సిపాల్ షాదూల్, న్యాయవాదులు ఉద్దండ నవీన్, బర్ల రమేశ్, ర్యాకం ఝాన్సీరాణి, సంకీర్తన పాల్గొన్నారు. ఎల్లంపల్లిలో 8.60 టీఎంసీలు రామగుండం: ఎల్లంపల్లి ప్రాజెక్టులో 8.60 టీ ఎంసీల నీరుందని నీటిపారుదలశాఖ అధికా రులు గురువారం తెలిపారు. ప్రాజెక్టు సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా ప్రస్తుతం 8.60 టీఎంసీలు ఉందని పేర్కొన్నారు. గతేడాది జూన్ 26వ తేదీన 139.05 అడుగుల ఎత్తులో కేవలం 3.96 టీఎంసీలు మాత్రమే వరద నిల్వ ఉందన్నారు. ప్రస్తుతం 477 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా, ఎన్టీపీసీకి 102 క్యూసెక్కులు, హైదరాబాద్ మెట్రోకు 331 క్యూసెక్కులు, మొత్తంగా 653 క్యూసెక్కులు ఔట్ఫ్లో ఉంది. రైతులకు సాగు నీటి అవసరం వచ్చే నాటికి భారీ వర్షాలు కురిసి ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రైల్వేస్టేషన్ ఆదాయం పెంచేలా చర్యలు చేపట్టండి రామగుండం: రామగుండం రైల్వేస్టేషన్కు రెవెన్యూ పెంచేందుకు చర్యలు చేపట్టాలని సికింద్రాబాద్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ (డీసీఎం) సిఫాలికి డీఆర్యూసీసీ ప్రతినిధి అనుమాస శ్రీనివాస్ విన్నవించారు. గురువారం డీసీఎం రామగుండం రైల్వేస్టేషన్ను ఆకస్మికంగా సందర్శించారు. సికింద్రాబాద్ డివి జనల్ రైల్వే ప్రజాసంబంధాల ప్రతినిధి అనుమాస శ్రీనివాస్ డీసీఎంను రైల్వే అతిఽథి గృహంలో మర్యాద పూర్వకంగా కలిశారు. రామగుండం రైల్వేస్టేషన్ ప్రవేశద్వారంలో టికెట్ కలెక్టర్ లేకపోవడంతో పలువురు టికెట్ లేకుండా ప్రయాణిస్తున్నారని, ప్లాట్ఫారం టికెట్ తీసుకోవడం లేదని అన్నారు. ఫలితంగా రైల్వేస్టేషన్ రెవెన్యూ కోల్పోతుందని తెలిపారు. డీసీఎం స్పందిస్తూ అతి త్వరలోనే టికెట్ కలెక్టర్ను ఏర్పాటు చేయాలని రామగుండం కమర్షియల్ ఇన్స్పెక్టర్కు ఆదేశాలు జారీ చేశారు. సాంప్రదాయ పంటలకు స్వస్తి పలకాలి పాలకుర్తి: రైతులు వాణిజ్య పంటల సాగువైపు దృష్టి సారించాలని కేవీకే రామగిరిఖిల్లా శాస్త్రవేత్త భాస్కర్ సూచించారు. పాలకుర్తి మండలం ఈసాలతక్కళ్లపల్లి గ్రామంలో గురువారం మండల వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ఆయిల్పాం సాగుపై అవగాహన సదస్సు నిర్వహించా రు. ఉద్యానవనశాఖ ఆధ్వర్యంలో ఆయిల్పాం సాగుకు రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తోందని, రైతులు ఆయిల్ఫాం సాగుకు మొగ్గు చూపాల ని కోరారు. హార్టికల్చర్ అధికారి జ్యోతి, ఆయిల్పాం ఫీల్డ్ ఆఫీసర్ ప్రశాంత్ పాల్గొన్నారు. విద్యుత్ సమస్యలా.. 1912ను సంప్రదించండి పెద్దపల్లిరూరల్: విద్యుత్ సమస్యలను గుర్తిస్తే వెంటనే 1912 టోల్ఫ్రీ నంబరుకు సమాచారం ఇస్తే సత్వరమే పరిష్కారం చూపుతామని ఎన్పీడీసీఎల్ ఎస్ఈ మాధవరావు తెలిపారు. తెగిన, వేలాడుతున్న, లూజుగా ఉన్న తీగలను గమనిస్తే విద్యుత్ సిబ్బందికి సమాచారం అందించాలన్నారు. ఇళ్లలో బట్టలు ఆరేసేందుకు జీఐ వైర్లు కాకుండా వీలైనంత వరకు ప్లాస్టిక్ తాళ్లనే వాడాలని సూచించారు. -
చిన్నారుల బడిబాట
ప్రభుత్వ పాఠశాలల్లో పెరిగిన ఎన్రోల్మెంట్ ● అత్యధిక విద్యార్థుల నమోదుతో జగిత్యాల టాప్ ● తక్కువ నమోదుతో సిరిసిల్ల లాస్ట్ ● గతేడాది కన్నా పెరిగిన విద్యార్థుల నమోదుసాక్షిప్రతినిధి, కరీంనగర్: బడిబాట కార్యక్రమం సత్ఫలితాలిస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో చేరాలంటూ విద్యాశాఖాధికారులు, ఉ పాధ్యాయులు చేసిన ప్రచారం ఫలించింది. 2024– 25 విద్యా సంవత్సరం కన్నా ఈసారి విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. విద్యార్థుల ఎన్రో ల్మెంట్లో పురోగతి కనిపించింది. కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల్లో పెరుగుదల నమోదవడాన్ని అంతా స్వాగతిస్తున్నారు. జగిత్యా ల 39శాతం పెరుగుదలతో తొలిస్థానంలో నిలవగా కరీంనగర్ 32శాతంతో రెండోస్థానం దక్కించుకుంది. పెద్దపల్లి 19శాతంతో మూడోస్థానంలో నిలవగా సిరిసిల్ల 10శాతంతో నాలుగోస్థానం దక్కించుకుంది. ఈ పురోగతిలో జిల్లాల కలెక్టర్లు, విద్యాశాఖాధికారులు, ఎంఈవో, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల కృషి ఉంది. అన్ని ప్రభుత్వ పాఠశాలల సిబ్బంది తమ పరిధిలో విద్యార్థులను ప్రభుత్వపాఠశాలలో చేర్చాలని ఇంటింటి ప్రచారం నిర్వహించడం కలిసొచ్చింది. కొందరు ఉపాధ్యాయులు సొంతఖర్చులు వెచ్చించి ప్లెక్సీలు, పోస్టర్లు, రీల్స్, వీడియోలు, సోషల్ మీడియా ద్వారా విరివిగా ప్ర చారం చేశారు. ఆ ప్రయత్నాల ఫలితాలే ఈ ఏడాది విద్యార్థుల ఎన్రోల్మెంట్ పెరిగేలా చేశాయి. అగ్రభాగాన జగిత్యాల.. బడిబాటను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. జగిత్యాల అగ్రభాగన నిలవడం వెనక పలు కారణాలు ఉన్నాయి. భౌగోళిక విస్తీర్ణంలో పెద్దది. ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలు, విద్యార్థుల సంఖ్య అధికంగా ఉండటం, గ్రామీణ జనాభా అధికంగా ఉండటం వంటి అంశాలు కలిసి వచ్చాయి. కలెక్టర్, డీఈవో, ఎంఈవోలు క్రమశిక్షణతో పనిచేయడం ఎన్రోల్మెంట్ పెరుగుదలకు దోహదం చేసింది. ఇక మిగిలిన జిల్లాలు విస్తీర్ణం, జనాభా పరంగా చిన్నవి కావడంతో ఎన్రోల్మెంట్లోనూ జగిత్యాల తరువాత స్థానంలో నిలిచాయి. కరీంనగర్తోపాటు సిరిసిల్లకు ఇన్చార్జిగా ఉండే డీఈవోను ఇటీవల వివాదాస్పద ప్రవర్తనతో ఉన్నతాధికారులు తప్పించారు. అనంతరం కామారెడ్డి డీఈవోకు సిరిసిల్ల అదనపు బాధ్యతలు ఇచ్చినా.. ఆయన విధుల్లో చేరలేదు. దీంతో జెడ్పీ సీఈవోకు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. టీచర్ల విషయంలో పర్యవేక్షణ కొరవడి ఎన్రోల్మెంట్లో కాస్త వెనకబడింది. సిరిసిల్ల చిన్న జిల్లా కావడం, విస్తీర్ణపరంగా, జనాభాపరంగా చిన్నది కావడం కూడా కారణాలే.ప్రభుత్వ పాఠశాలల్లో పెరిగిన విద్యార్థుల వివరాలు జిల్లా గతేడాది ఈ ఏడాది పెరుగుదల (శాతం) జగిత్యాల 3,690 5,147 39కరీంనగర్ 4,831 6,393 32పెద్దపల్లి 3,612 4,295 19సిరిసిల్ల 6,280 6,901 10 తల్లిదండ్రులను ఒప్పించాంబాలల బలోపేతం కోసం బడిబాటలో ప్రతీ ఇంటి తలుపుతట్టి తల్లిదండ్రులకు అవగాహన కల్పించాం. ఉచిత యూనిఫారాలు, పుస్తకాలు, స్టేషనరీ పంపిణీ చేశాం. నాణ్యమైన భోజనం, ప్రత్యేక తరగతుల గురించి వివరించాం. ఖర్చుల భారం తగ్గడంతో తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడం ప్రారంభించారు. – కె.రాము, డీఈవో, జగిత్యాల -
ప్రశ్నించే వారిపై దాడులా?
● అక్రమ కేసులు నమోదు చేస్తే ఎలా? ● మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ ధ్వజం ● రామగుండం పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు గోదావరిఖని: ప్రశ్నించే వారిపై అధికార పార్టీ నేతల దాడులు కొనసాగుతున్నాయని, దాడిలో గాయపడిన తమ నాయకులపైనే పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారని మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. మాజీ ఎమ్మెల్యేలు దివాకర్రావు, దుర్గం చిన్నయ్యతో కలిసి రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝాకు బుధవారం ఫిర్యాదు చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ పాలనలో లా అండ ఆర్డర్ ఉన్నట్టా? లేనట్టా? అని ప్రశ్నించారు. దాడికి గురై తీవ్రంగా గాయపడిన వారిపైనే కేసులు పెట్టడం దారుణమన్నారు. ప్రజల పక్షాన నిలబడి ప్రశ్నిస్తే పోలీసుల ద్వారా నిర్బంధాన్ని పెంచుతున్నారని ధ్వజమెత్తారు. మంచిర్యాల పట్టణంలో మధు అనే తమ పార్టీ కార్యకర్తను తీవ్రంగా కొట్టి గాయపర్చారన్నారు. బాధితుడిపైనే కేసు నమోదు చేసి దాడిచేసిన వారిని విస్మరించారని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, సోషల్ మీడియాపైనా కేసులు పెడుతున్నారన్నారు. మంచిర్యాలలో 20 మందిపై ఇలా తప్పుడు కేసులు నమోదు చేశారన్నారు. కాంగ్రెస్ గూండాలు బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. వారి దాడులను చూస్తే.. శాంతిభద్రతలు అదుపు తప్పాయనే దానికి సంకేతంగా నిలుస్తున్నాయన్నారు. అదే బీఆర్ఎస్ హయాం ఫ్రెండ్లీ పోలీసింగ్తో ప్రజలందరికీ పోలీసులు అందుబాటులో ఉండేలా చేశామని గుర్తుచేశారు. ఈవిషయంలో సీపీకి అన్ని విషయాలు వివరించామని, కిందిస్థాయి అధికారులకు తగిన ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేశామని ఈశ్వర్ తెలిపారు. -
ఆస్పత్రి ఆధునికీకరణకు చర్యలు
కోల్సిటీ(రామగుండం): గోదావరిఖనిలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి(జీజీహెచ్)లోని నవజాత శిశు సంరక్షణ ప్రత్యేక యూనిట్(ఎస్ఎన్సీయూ) ఆధునికీకరణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. జీజీహెచ్ను ఆయన బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కాంట్రాక్ట్ సూపర్వైజర్ వేధింపులపై నర్సింగ్ ఆఫీసర్లు కలెక్టర్కు విన్నవించారు. స్పందించిన కలెక్టర్ పరిశీస్తానన్నారు. డ్రగ్స్స్టోర్, ల్యాబ్ వైద్య పరీక్ష రికార్డులను పూర్తిస్థాయిలో డిజిటలైజ్ చే యాలన్నారు. గంట సమయంలోనే వ్యాధి నిర్ధారణ ఫలితాలు ఇవ్వాలని ఆదేశించారు. జీజీహెచ్ ఆవరణలో రూ.142 కోట్లతో నిర్మిస్తున్న 355 పడకల భవనం పనులను నవంబర్ వరకు పూర్తి చే యాలని సూచించారు. సిమ్స్ ప్రిన్సిపాల్ హిమబిందుసింగ్, ఆర్ఎంవో రాజు పాల్గొన్నారు. ఇళ్ల పట్టాలు సిద్ధం చేయండి రామగుండంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపు, ఇళ్లపట్టాలు సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. అదనపు కలెక్టర్ అరుణశ్రీతో కలిసి డబుల్బెడ్రూమ్ ఇళ్లపై సమీక్షించారు. టీయూఎఫ్ఐడీసీ ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులను సకాలంలో పూర్తిచేయాలని సూచించారు. ఉర్దూ మీడియం పాఠశాల అభివృద్ధి పూర్తి కావాలని ఆయన అన్నారు. ఆర్డీవో గంగయ్య, బల్దియా ఈఈ రామన్ పాల్గొన్నారు. యాంటీ డ్రగ్ సోల్జర్ పెద్దపల్లిరూరల్: మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. కలెక్టరేట్లో చేపట్టిన మత్తు పదార్థాల వ్యతిరేక ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఫొటో పాయింట్ వద్ద ‘ఐ యాం యాంటీ డ్రగ్ సోల్జర్’గా ఫొటో దిగారు. మత్తు పదార్థాలకు బానిసలుగా మారిన వారికోసం ప్రభుత్వం పునరావాసకేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు. సమాచారం తెలిస్తే టోల్ఫ్రీ నంబరు14446కు సమాచారం అందించాని ఆయన కోరారు. పాఠశాలల సమగ్రాభివృద్ధికి పటిష్ట చర్యలు సుల్తానాబాద్(పెద్దపల్లి): పాఠశాలల సమగ్రాభివృద్ధికి పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎంపీడీవో దివ్యదర్శన్రావు, ఎంఈవో రాజయ్య, పంచాయతీరాజ్ డిప్యూటీ ఈఈ దేవేందర్, ఏఈ సచిన్, హెడ్మాస్టర్ శారద తదితరులు పాల్గొన్నారు. డ్రగ్స్ స్టోర్, ల్యాబ్ రికార్డుల డిజిటలైజేషన్ గంటలోగా వ్యాధి నిర్ధారణ నివేదికలు కలెక్టర్ కోయ శ్రీహర్ష : జీజీహెచ్ ఆకస్మిక తనిఖీ -
నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేసేవరకూ పోరాటం
● ఐఎఫ్టీయూ జాతీయ ప్రధాన కార్యదర్శి టి.శ్రీనివాస్ గోదావరిఖని: కార్మికులకు నష్టం కలిగించే నాలుగు లేబర్కోడ్స్ రద్దు చేసేవరకూ పోరాటం చేయాలని ఐఎఫ్టీయూ జాతీయ ప్రధాన కార్యదర్శి టి.శ్రీనివాస్ కోరారు. బుధవారం స్థానిక యూనియన్ కా ర్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయ న మాట్లాడారు. దీనికి వ్యతిరేకంగా వచ్చేనెల 9న నిర్వహించే దేశవ్యాప్త సమ్మెను సింగరేణిలో జయప్రదం చేయాలని కోరారు. బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా, కార్మిక వర్గానికి నష్టం చేసేలా వ్యవహరిస్తోందని విమర్శించారు. అన్నిగనులపై గేట్ మీటింగ్లను నిర్వహించి విస్తృతంగా ప్రచారం చేయాలని కోరారు. సమావేశంలో నాయ కులు సీతారామయ్య, ఈదునూరి నరేశ్, రామకృష్ణ, గౌని నాగేశ్వరరావు, టి.శ్రీనివాస్, మేకల రామ న్న, సంతోష్, దేవన్న, నర్సింగ్ పాల్గొన్నారు. -
బహిరంగ చర్చకు సిద్ధమా?
సుల్తానాబాద్(పెద్దపల్లి): బీఆర్ఎస్ ఎమ్మెల్యే లు పాడి కౌశిక్రెడ్డి, గంగుల కమలాకర్, మాజీ ఎంపీ వినోద్ కుమార్, శ్రావణ్ ఇటీవల కేంద్రమంత్రి బండి సంజయ్పై చేసిన ఆరోపణలు నిరూపించేందుకు బహిరంగ చర్చకు సిద్ధమా? అని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి సవాల్ చేశారు. స్థానిక ఆర్యవైశ్య భవనంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేంద్రమంత్రి బండి సంజయ్పై చేసిన అనుచిత వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆ ఆరోపణలు నిరూపించేందుకు బహిరంగ చర్చకు సిద్ధపడాలన్నారు. తేదీని బీఆర్ఎస్ నాయకులే నిర్ణయించాలన్నారు. కరీంనగర్ కమాన్ చౌర స్తా, హుజూరాబాద్ చౌరస్తాలో ఎక్కడైనా చర్చ కు తాము సిద్ధమని ప్రకటించారు. నాయకులు కూకట్ల నాగరాజు, కందుల శ్రీనివాస్, కందుల సంధ్యరాణి, కడారి అశోక్రావు, సౌదరి మ హేందర్, మహేశ్, అమరగాని ప్రదీప్కుమార్, లంక శంకర్, చాతరాజు రమేశ్, కామని రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ‘బెస్ట్ అవైలెబుల్’ బకాయిలు చెల్లించాలి పెద్దపల్లిరూరల్: బెస్ట్ అవైలెబుల్ స్కూల్ ప థకం కింద ప్రవేశాలకు ఎంపికైన విద్యా ర్థుల ను యాజమాన్యాలు తమ పాఠశాలల్లో చేర్చుకోవడంలేదని కేవీఎస్ జిల్లా కార్యర్శి కల్లెపల్లి అశోక్ ఆరోపించారు. ఫీజు చెల్లించి, పుస్తకా లు, యూనిఫామ్స్ను సొంత డబ్బులతోనే కొ నుగోలు చేయాలని మనోవేదనకు గురిచేస్తున్నాయని ధ్వజమెత్తారు. ఈమేరకు కలెక్టరేట్ ఎదుట బుధవారం నిరసన కార్యక్రమం చేప ట్టారు. ఆయన మాట్లాడుతూ, మూడేళ్లుగా బ కాయిల గురించి పట్టించుకోవడం లేదని, దీంతో దళిత, గిరిజన విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. తక్షణమే బకాయి లు విడుదల చేయాలని ఆయన కోరారు. నా యకులు మొదుంపల్లి శ్రావణ్, సురేశ్, లావణ్య, రమేశ్, శ్రీనివాస్, రవి, సంతోష్, గీత, వినోద్ తదితరులు పాల్గొన్నారు. నామినేటెడ్ పదవులిప్పించండి పెద్దపల్లిరూరల్: నామినేటేడ్ పదవుల్లో యాద వులకు ప్రాధాన్యం కల్పించాలని అఖిల భార త యాదవ మహాసభ జిల్లా అధ్యక్షుడు మేకల మల్లేశం కోరారు. యాదవచారిటబుల్ ట్రస్టు కార్యాలయంలో గొర్రెకాపరుల సంఘం జిల్లా అధ్యక్షుడు సలేంద్ర రాములు అధ్యక్షతన బుధవారం జరిగిన సమావేశంలో రాష్ట్ర నాయకులు చిలారపు పర్వతాలు, మారం తిరుపతితో కలి సి ఆయన మాట్లాడారు. రెండేళ్లుగా జీవాలకు మందులు ఇవ్వడంలేదన్న విషయాన్ని ప్రభు త్వం దృష్టికి తీసుకెళ్లేందుకే గాంధీభవన్కు గొ ర్రెలను తోలుకొచ్చామని, అంతేతప్ప, ఎలాంటి దురుద్దేశం లేదని తెలిపారు. జిల్లాకు చెంది న యాదవ నాయకులకే గొర్రెల పెంపకందారుల కార్పొరేషన్ చైర్మన్ పదవి కేటాయించాలని, ఇందుకు మంత్రి శ్రీధర్బాబు సహకారం అందించాలని కోరారు. నాయకులు నాగరాజు, ఉప్పరి శ్రీనివాస్, మేకల నర్సయ్య, చంద్రమౌళి, సదయ్య తదితరులు ఉన్నారు. నేడు ఎంపిక పోటీలు సుల్తానాబాద్(పెద్దపల్లి): జిల్లా కేంద్రంలోని ప్ర భుత్వ ఐటీఐ గ్రౌండ్లో గురువారం స్పోర్ట్స్ పాఠశాలలకు విద్యార్థులను ఎంపికచేయనున్నారు. రాష్ట్రంలోని కరీంనగర్, ఆదిలాబాద్, హకీంపేటలో స్పోర్ట్స్ స్కూళ్లలో ఎంపిక కోసం అర్హులైన విద్యార్థులను ఎంపిక చేయనున్నా రు. ఆసక్తిగల విద్యార్థులు ఆధార్కార్డుతో పా టు స్టడీ సర్టిఫికెట్లు వెంట తీసుకు రావాలని డీవైఎస్వో సురేశ్ సూచించారు. ఎంపిక పోటీలకు అన్ని ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. టెక్నీషియన్ పోస్టుల భర్తీ గోదావరిఖని: రామగుండం డివిజన్–1 పరిధిలోని సర్ఫేస్ టెక్నీషియన్ల పోస్టులను బుధవారం భర్తీ చేశారు. ఇందుకోసం జీఎం కార్యాలయంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. ఫిట్టర్ సర్ఫేస్ పోస్టుల కోసం 47 మంది దరఖాస్తు చేసుకోగా సీనియారిటీ ప్రాతిపదికన 8 పో స్టులు భర్తీ చేశారు. అలాగే 44 మంది ఎలక్ట్రీ షియన్ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోగా 7 పోస్టులకు ఎంపిక చేశారు. ఎస్వోటూ జీఎం గోపాల్సింగ్, ఇంజినీర్ వెంకటేశ్వర్రావు, ఏజీఎం ఆంజనేయులు, పర్సనల్ మేనేజర్ రవీందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బందీలను చేసి.. హక్కులు హరించి
● పౌరహక్కుల సంఘం నేతల నిరసన పెద్దపల్లిరూరల్: ఎమర్జెన్సీ నిర్బంధపు చీకటి రోజులకు 50 ఏళ్లు నిండాయని, ఆనాటి భారత ప్రధాని ఇందిరాగాంధీ 1975 జూన్ 25న అర్ధరాత్రి ఎమ ర్జెన్సీ ప్రకటించి 21 నెలల పాటు కొనసాగించారని పౌరహక్కుల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్ర ధానకార్యదర్శి బొడ్డుపల్లి రవి అన్నారు. జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్తూపం వద్ద బుధవారం ని రసన చేపట్టారు. ఎమర్జెన్సీతో ప్రజలను బందీలుగా చేసి హక్కులను హరించారని ఆరోపించారు. ఇప్పటి పాలకులు సైతం క్రూరమైన చట్టాలను అమలు చేస్తూనే ఉన్నారని విమర్శించారు. 1985లో టాడా, 2002లో పోటా, 2004 నుంచి ఉపా చట్టాన్ని తెచ్చి 2024 వరకు ప్రజలు, కళాకారులు, విద్యార్థులు, జర్నలిస్టులు, మేధావులను నిర్బంధించారని పేర్కొన్నారు. ఆపరేషన్ గ్రీన్హంట్, సమాధాన్, ఆపరేషన్ పహార్ కొనసాగించిన పాలకులు.. 2025 జనవరి 1నుంచి ఆపరేషన్ కగార్ పేరుతో 560 మంది ఆదివాసీ అమాయక ప్రజలను, విప్లవకారులను ఎన్కౌంటర్ల పేరిట హతమర్చారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షుడు నార వినోద్, సహాయ కార్యదర్శి రెడ్డిరాజుల సంపత్ తదితరులు పాల్గొన్నారు. -
రేషన్.. పరేషాన్
● సర్వర్ డౌన్తో పంపిణీలో ఆలస్యం ● సాంకేతిక సమస్యలతోనూ తిప్పలు ● గంటల తరబడి తప్పని పడిగాపులు ● ఇబ్బందులు పడుతున్న డీలర్లు, రేషన్ లబ్ధిదారులు ● జిల్లాలో 86శాతం వరకే బియ్యం పంపిణీ సాక్షి పెద్దపల్లి: వర్షాకాలంలో పేదల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకున్న కేంద్రప్రభుత్వం.. జూన్, జూ లై, ఆగస్టు నెలల కోటా బియ్యాన్ని ఒకేసారి.. ఈ జూన్లోనే పంపిణీ చేయాలని రాష్ట్రాలను ఆదేశించింది. ఈనేపథ్యంలో మూడు నెలలకు సరిపడా బియ్యాన్ని డీలర్లు ఒకేసారి పంపిణీ చేస్తున్నారు. అ యితే, కనీస సౌకర్యాలు కరువై, సాంకేతిక సమస్య లు తలెత్తి, అధికమొత్తంలో ఒకేసారి బియ్యం పంపిణీ చేయడం తదితర కారణాలతో లబ్ధిదారులు క్షేత్రస్థాయిలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏర్పాట్లు చేయక ఇబ్బందులు.. మూడు నెలలకు సంబంధించిన బియ్యాన్ని ఒకే సారి పంపిణీ చేస్తున్న ప్రభుత్వం.. అందుకు తగిన ఏర్పాట్లు చేయలేదనే విమర్శలు వస్తున్నాయి. దీంతో జిల్లావ్యాప్తంగా తెల్లరేషన్కార్డుదారులు రేషన్ దుకాణాల వద్ద అవస్థలు పడుతున్నారు. సన్నరకం బియ్యం అందుతాయో లేదోనన్న ఆందోళనతో బారులు తీరుతున్నారు. గంటల తరబడి నిరీక్షిస్తున్నారు. మరోవైపు సర్వర్లో తలెత్తిన లోపంతో రోజంతా పడిగాపులు కాస్తున్నారు. కొందరు ఓపిక నశించి నిరాశతో ఇంటిదారి పడుతున్నారు. ఇలాంటి అవరోధాలను అధిగమిస్తున్న అధికార యంత్రాంగం ఇప్పటివరకు 86శాతం బియ్యం పంపిణీ పూర్తిచేసింది. కానీ, ఈనెలాఖరు వరకు లక్ష్యం చేరుకోవడం కష్టమేనని డీలర్లు అంటున్నారు. బియ్యం నిల్వలకు స్థలం కొరత.. జిల్లాలోని రేషన్షాపులు చాలావరకు ఇరుకై న అద్దెగదుల్లో నడుస్తున్నాయి. ఏ నెలకు సరిపడా బియ్యం ఆ నెలలోనే పంపిణీ చేసి, నిల్వచేసేందుకే డీలర్లు అవస్థలు పడుతున్నారు. ఇక ఒకేసారి మూడు నెల ల బియ్యం నిల్వచేయాల్సి రావడంతో ఇబ్బందులు పడుతున్నారు. దీంతో కొంతమొత్తంలోనే స్టాక్ తీసుకుంటున్నారు. ఆ బియ్యం పంపిణీ పూర్తయ్యాక మరికొంత తెచ్చుకుంటున్నారు. దీంతో చాలాషాపులు ‘నోస్టాక్’ బోర్డులతో దర్శనమిస్తున్నాయి. దీనికితోడు రేషన్ బియ్యం ఎక్కడైనా తీసుకునే అవకాశం ఉండటంతో పట్టణ కేంద్రంలో నివాసం ఉండి, గ్రామాల్లో రేషన్కార్డులు ఉన్నవారు సైతం పట్టణాల్లోని దుకాణాల్లో బియ్యం తీసుకుంటున్నారు. ఇలా వచ్చేవారితో స్థానిక లబ్ధిదారులకు బియ్యం కొరత ఏర్పడుతోంది. ఈ –పాస్ సాఫ్ట్వేర్లోనూ సమస్యలు.. ఒక్కో యూనిట్కు ఆరు కిలోల బియ్యం పంపిణీ చేస్తుండగా, ఇందులో కేంద్రప్రభుత్వం 5 కేజీలు, రాష్ట్రప్రభుత్వం మరో కేజీ అందిస్తోంది. మొత్తంగా ఒక కుటుంబంలో ఐదుగురు సభ్యులు ఉంటే వారికిచ్చే 30 కేజీల బియ్యానికి లబ్ధిదారు మూడు నెలల రేషన్ కోసం ఆరుసార్లు వేలిముద్ర వేయాల్సి వస్తోంది. కొన్నిసార్లు వేలిముద్ర తీసుకునే క్రమంలో సర్వర్లో సమస్య తలెత్తుతోంది. దీంతో బియ్యం పంపిణీలో మరింత ఆలస్యమవుతోంది. ఒక్కొక్కరికి బియ్యం ఇవ్వడానికి కనీసం 20 నిమిషాల వరకు సమయం పడుతోంది. సర్వర్ సమస్యతోపాటు వేలిముద్రలు త్వరగా రాకపోవడం, సాంకేతిక సమస్యలతో రోజుకు 100 మందికి మించి బియ్యం పంపిణీ చేయలేకపోతున్నామని రేషన్ డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో రేషన్ సమాచారం రేషన్ షాపులు 413 మొత్తం రేషన్కార్డులు 2,23,553 లబ్ధిదారుల సంఖ్య 6,66,912 మూడు నెలల కోటాబియ్యం (మెట్రిక్ టన్నుల్లో) 12,046 పంపిణీ చేసింది(శాతంలో) 86.22 చివరిదశకు పంపిణీ జిల్లాలో రేషన్ బియ్యం పంపిణీ ప్రక్రియ సజావుగా సాగుతోంది. మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ చేయాల్సి రావడం, ఒకేసారి ఆరుసార్లు బయోమెట్రిక్ తీసుకోవడంలో కొంతజాప్యమవుతోంది. అంతకుమించి ఎలాంటి సమస్యలు లేవు. రేషన్ షాపుల్లో స్టాక్ అయిపోతే వెంటనే సరఫరా చేస్తున్నాం. ప్రస్తుతం బియ్యం పంపిణీ చివరిదశకు చేరింది. – రాజేందర్, డీఎస్వో -
గోదావరిఖనిలో డీఎంహెచ్వో ఆకస్మిక తనిఖీలు
● డాక్టర్ లేని కంటి ఆస్పత్రి నిర్వహణపై ఆగ్రహం ● ఆస్పత్రిని మూసివేయించిన జిల్లా వైద్యాధికారి కోల్సిటీ(రామగుండం): గోదావరిఖనిలోని పలు ప్రైవేట్ ఆస్పత్రులను జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి(డీఎంహెచ్ఓ) అన్న ప్రసన్నకుమారి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్థానిక మార్కండేయకాలనీలోని ఐ మాక్స్ విజన్ కేర్ కంటి ఆస్పత్రిలో డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో దానిని మూసివేయించారు. అలాగే జనని ఆస్పత్రిలో డాక్టర్ కె.స్రవంతి 24గంటపాటు అందుబాటులో లేరని, ఆ డాక్టర్ పనిచేయడం లేదని సిబ్బంది వెల్లడించారని, ఆస్పత్రిలో పనిచేస్తున్న నర్సింగ్ సిబ్బందికి కూడా తగిన విద్యార్హతలు లేవని గుర్తించారు. సెల్లార్లో ల్యాబ్, ఇన్ పేషంట్లతో వార్డు నడుపుతుండడం, ఆపరేషన్ థియేటర్, కారిడార్, ఆస్పత్రి ఆవరణ అపరిశుభ్రంగా ఉండడం చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. రిజిష్టర్డ్ కన్సల్టెంట్ డాక్టర్లు కాకుండా, వేరే డాక్టర్లను నమోదు చేసుకున్నా.. బేసిక్ కాకుండా స్పెషాలిటీ ఆస్పత్రి నడుపుతున్నారని డీఎంహెచ్వో వెల్లడించారు. ఇలా నిర్వహించడం క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ నిబంధనలకు విరుద్ధమన్నారు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ఆస్పత్రి రిజిస్ట్రేషన్ను రద్దు చేసి నోటీసు పంపుతామని డీఎంహెచ్వో స్పష్టం చేశారు. అపెండ్సెక్టమి చేయించుకున్న ఓ పేషెంట్ను డిశ్చార్జ్ అయ్యే వరకూ ఆస్పత్రి తెరిచి ఉంచడానికి అవకాశం కల్పించినట్లు ఆమె తెలిపారు. ఆస్పత్రి మేనేజ్మెంట్ మార్పులతోపాటు ఇతర ఎలాంటి మార్పులు చేసినా తప్పనిసరిగా డిస్ట్రిక్ రిజిస్ట్రేషన్ అథారిటీ అనుమతి తీసుకోవాలని, లేకుంటే నిబంధనల ఉల్లంఘన అవుతుందని వివరించారు. ప్రైవేట్ ఆస్పత్రుల నిర్వాహకులు నిబంధనలకు కట్టుబడి ఉండాలని ఆమె సూచించారు. -
ఆస్తిపన్ను చెల్లించండి
కోల్సిటీ(రామగుండం): అపరాధ రుసుం లేకుండా 2025–26 ఆర్థిక సంవత్సరానికి చెందిన ఆస్తిపన్ను చెల్లించడానికి ఈనెల 30వ తేదీ వరకు అవకాశం ఉందని రామగుండం నగరపాలక కమిషనర్(ఎఫ్ఏసీ) అరుణశ్రీ బుధవారం తెలిపారు. జూలై ఒకటినుంచి పన్నుమొత్తంపై నెలకు రెండుశాతం చొప్పున అపరాధ రుసుం విధిస్తామన్నారు. ఇళ్ల యజమానులు ఈనెలాఖరులోగా అపరాధ రుసుం లేకుండా ఆస్తిపన్ను చెల్లించి, ఈ అకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. అవి చీకటిరోజులు ● ఆదిలాబాద్ ఎంపీ జి.నగేశ్ పెద్దపల్లిరూరల్: ఇందిరాగాంధీ భారత ప్రధానిగా ఉన్నకాలంలో ఎమర్జెన్సీ విధించి సాగించిన చీకటి పాలనకు 50 ఏళ్లు నిండాయని ఆదిలాబాద్ ఎంపీ నగేశ్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి అధ్యక్షతన జరిగి న సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమర్జెన్సీని అమల్లోకి తెచ్చిన 1975 జూన్ 25 దేశచరిత్రలో మరచిపోలేని చీకటిరోజన్నారు. కాంగ్రెస్ హయాంలో సాగిన ప్రజావ్యతిరేక విధానాలను ప్రజలకు.. ము ఖ్యంగా యువతకు వివరించాలని పార్టీ నేతలకు సూచించారు. సమావేశంలో నాయకులు మోహన్రెడ్డి, కందుల సంధ్యారాణి, సత్యప్రకాశ్, వెల్లంపల్లి శ్రీనివాసరావు, జంగ చక్రధర్రెడ్డి, జ్యోతిబసు, సదానందం, ఓదెలు, దిలీప్, మౌటం నర్సింగం, సదయ్య, కుమార్ తదితరులు పాల్గొన్నారు. డయేరియా నియంత్రణకు చర్యలు పెద్దపల్లిరూరల్: సీజనల్ వ్యాధులను కట్టడి చేసే చర్యల్లో భాగంగా ‘డయేరియా కో రోక్తాం’ కార్యక్రమాన్ని జూలై 31వ తేదీవరకు నిర్వహిస్తున్నట్లు రాఘవాపూర్ పీహెచ్సీ వైద్యురాలు మమత అన్నా రు. బుధవారం ఆస్పత్రిలో ఈ కార్యక్రమంపై సిబ్బందికి ఆమె అవగాహన కల్పించారు. -
9న సింగరేణిలో సమ్మె
● కార్మికులందరూ పాల్గొనాలి ● కార్మిక సంఘాల జేఏసీ నేతల పిలుపు గోదావరిఖని: వచ్చేనెల 9న నిర్వహించే దేశవ్యాప్త సమ్మెలో సింగరేణి కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని కార్మిక సంఘాల జేఏసీ నాయకులు కోరారు. బుధవారం స్థానిక భాస్కర్రావుభవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో నాయకులు మాట్లాడారు. నాలుగు కొత్త లేబర్ కోడ్స్ రద్దు చేయాలని, పాతవాటినే కొనసాగించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షించాలని, ప్రైవేటీకరణను ఎత్తివేయాలని అన్నారు. సింగరేణిలో కొత్త గనులు కేటాయించి సంస్థ భవిష్యత్ పెంచాలని పేర్కొన్నారు. సమ్మైపె విస్తృతంగా ప్రచారం చేయాలని, అన్నిగనులపై గేట్మీటింగ్లను నిర్వహించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. సమావేశంలో ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, సీఐటీయూ, టీబీజీకేఎస్, ఐఎఫ్టీయూ నాయకులు వాసిరెడ్డి సీతారామయ్య, ధర్మపురి, తుమ్మల రాజారెడ్డి, మిర్యాల రాజిరెడ్డి, కె.విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు. -
సీఈఐఆర్ పోర్టల్ను సద్వినియోగం చేసుకోవాలి
● రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా ● బాధితులకు 120 మొబైల్ఫోన్లు అప్పగింత గోదావరిఖని: సీఈఐఆర్ పోర్టల్ను సద్విని యోగం చేసుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా సూచించారు. మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న వారికి బుధవారం తన కార్యాలయంలో రూ.18లక్షల విలువైన 120 మొబైల్ ఫోన్లు అందజేశారు. అనంతరం సీపీ మాట్లాడారు. పోగొట్టుకున్న సెల్ఫోన్ల ఆచూకీ కోసం సీసీఎస్తోపాటు ప్రతీపోలీస్స్టేషన్లో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేశామన్నారు. ఈక్రమంలో సీఈఐఆర్ పోర్టల్లో 6,683 ఫిర్యాదులు అందగా.. ఇప్పటివరకు 2,020 సెల్ఫోన్లు స్వాధీ నం చేసుకొని యజమానులకు అప్పగించామని తెలిపారు. సీసీఎస్, ఐటీ సెల్ పోలీసులు శ్రమించి మరో 120 సెల్ఫోన్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారన్నారు. రామగుండం పోలీస్ కమిషనరేట్లో 2023 ఏప్రిల్ 19 నుంచి సీఈఐఆర్ పోర్టల్ను అందుబాటులోకి తేగా, మంచి ఫలితాలు రాబట్టామని అన్నారు. మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్నవారు, చోరీకి గురైనా వెంటనే సీఈఐఆర్ పోర్టల్ https://www.ceir.gov.in లో వివరాలు నమోదు చేసి సమీప ఠాణాకు సమాచారం ఇవ్వాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ(అడ్మిన్) రాజు, స్పెషల్ బ్రాంచ్, ట్రాఫిక్ ఏసీపీలు మల్లారెడ్డి, శ్రీనివాస్, సీపీఎస్ ఇన్స్పెక్టర్ బాబురావు, ఎస్సైలు మధుసూదన్రావు, నరేశ్, జీవన్, చంద్రశేఖర్, శివకేశవులు తదితరులు పాల్గొన్నారు. -
దుర్వాసన వస్తంది
మా ఇంటి సమీపంలో మేజర్ నాలా నిర్మించాలని అధికారులకు అనేక విజ్ఞప్తులు చేస్తూ వస్తున్నాం. ఏళ్లు గడుస్తున్నా స్పందన లేదు. కాలువలో మురుగునీరు నిలిచి పిచ్చిమొక్కలు పెరిగాయి. దుర్వాసన వస్తున్నది. దోమల బాధ భరించలేకున్నం. – కె.ప్రకాశ్రెడ్డి, మార్కండేయకాలనీ పూడిక తీసేదెన్నడు? వందన హైస్కూల్ సమీప కాలువల్లో పూడిక తీయడంలేదు. మట్టి పేరుకుపోయింది. రోడ్లపై చెత్త వేయకుండా డస్ట్బిన్లు ఏర్పాటు చేయాలి. పారిశుధ్యం మెరుగుపర్చాలి. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి. – కనకం గణేశ్ మహరాజ్, విఠల్నగర్ స్పెషల్ డ్రైవ్ చేపట్టాం అంటువ్యాధులు ప్రబలకుండా నగరంలో స్పెషల్ డ్రైవ్ చేపట్టాం. బ్లీచింగ్ పౌడర్తోపాటు దోమల నివారణకు మెటీరియల్ తెప్పించడానికి ఆర్డర్ ఇచ్చాం. డివిజన్లలో శానిటేషన్పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. – అరుణశ్రీ, రామగుండం బల్దియా కమిషనర్ అప్రమత్తంగా ఉన్నాం సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉన్నాం. డెంగీ, టైఫాయిడ్, వైరల్ ఫీవర్స్పై అవగాహన కల్పిస్తున్నాం. ఈగలు, దోమలు, కొత్తనీటితో అతిసారం, కలరా, పచ్చకామెర్లు ప్రబలే అవకాశం ఉంది. ప్రజలు తగిన జాగ్రత్తలు పాటిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. – అన్న ప్రసన్నకుమారి, డీఎంహెచ్వో -
● మొక్కలు నాటడంపై ప్రత్యేక దృష్టి ● వార్డు అధికారులు కార్యాచరణ చేట్టాలి ● అదనపు కలెక్టర్ అరుణశ్రీ ఆదేశాలు
రైతువేదికలకు డబ్బులు● విడుదల చేసిన వ్యవసాయ శాఖ సాక్షిప్రతినిధి,కరీంనగర్: రైతు భరోసా నిధులు విడుదల సందర్భంగా రైతు వేదికల వద్ద సంబరాల కోసం ఎట్టకేలకు నిధులు విడుదలయ్యాయి. వాస్తవానికి రైతు భరోసా పథకం ప్రారంభం, ముగింపు సందర్భంగా రైతు వేదికల వద్ద సీఎంతో ముఖాముఖి కార్యక్రమాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇందుకోసం ప్రతీ రైతు వేదికకు 200 మంది రైతులను తరలించాలని ఏఈవో (అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్)లకు టార్గెట్లు విధించింది. ఇటీవల జరిగిన కార్యక్రమానికి రైతులను తరలించడం, వారికి టీ, స్నాక్స్ ఖ ర్చులను భరించడం వంటి పనులు ఏఈవోలే చూ సుకున్నారు. తాజాగా ముగింపు వేడుకులకు సైతం ఏఈవోలు నిర్వహించాలని చెప్పడంతో వారంతా తలలు పట్టుకున్నారు. గత వేడుక డబ్బులే రాకపోగా, మరోసారి చేతి నుంచి డబ్బులు ఎలా పెట్టుకోవాలో తెలియక సతమతమయ్యారు. ఈ విషయాన్ని మంగళవారం ‘సాక్షి’ దినపత్రికలో ‘అన్నదాతా.. రైతువేదికకు రావా?’ శీర్షికన ప్రచురితమైన కథనంపై ప్రభుత్వం స్పందించింది. మంగళవారం మధ్యాహ్నం అన్ని రైతు వేదికల వద్ద సంబరాలు నిర్వహించేందుకు ఏఈవోలకు కావాల్సిన నిధులు విడుదల చేసింది. వన మహోత్సవ లక్ష్యం 4.80 లక్షల మొక్కలుకోల్సిటీ(రామగుండం): రామగుండం నగరంలో ఈ ఏడాది 4.80 లక్షలు నాటడం లక్ష్యంగా ప్రభు త్వం నిర్దేశించిందని అదనపు కలెక్టర్, నగరపాలక సంస్థ కమిషనర్(ఎఫ్ఏసీ) అరుణశ్రీ అన్నారు. రా మగుండం మున్సిపల్ కార్యాలయంలో మంగళవా రం వార్డు అధికారులతో కమిషనర్ వన మహోత్సవంపై సమీక్షించారు. నిర్దేశిత లక్ష్యం మేరకు మొ క్కలు నాటడానికి అనువైన స్థలాలను గుర్తించి నివేదిక ఇవ్వాలన్నారు. ఆర్పీల సహకారంతో ఇంటింటి సర్వే చేసి అవసరమైన పండ్లు, పూలజా తిమొక్క లను నర్సరీల నుంచి తెప్పించాలని ఆమె సూచించారు. వర్షాకాలంలో అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ప్రజలను అప్రమత్తం చేయా లని కమిషనర్ ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను చైతన్యపరిచి ఇంటి నిర్మాణం వేగంగా పూర్తి చేసుకునేలా చూడాలని ఆమె సూచించారు. బల్దియా డిప్యూటీ కమిషనర్ వెంకటస్వామి, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రామన్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ షాభాజ్, అధికారులు హనుమంతరావు నాయక్, తేజస్విని, ఆంజనేయులు, నాగభూషణం, కుమారస్వామి, శ్రీనివా్ పాల్గొన్నారు. -
ఎరువుల కొరత తీర్చిన ఘనత బీజేపీ ప్రభుత్వానిదే..
గోదావరిఖని: ఆర్ఎఫ్సీఎల్ను ప్రారంభించి తెలంగాణ వ్యవసాయ రంగంలో ఎరువుల కొరత తీర్చిన ఘనత బీజేపీ ప్రభుత్వానికే దక్కిందని ఆ పార్టీ జి ల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి అన్నారు. స్థానిక 28వ డివిజన్ హనుమాన్ దేవాలయం ఆవరణలో అమ్మపేరుతో మంగళవారం ఆయన మొక్క నాటా రు. అనంతరం మాట్లాడారు. నాయకులు గుండబోయిన భూమయ్య, కోమల మహేశ్, ముస్కుల భాస్కర్రెడ్డి, ఐత పవన్కుమార్, అపర్ణ, సిలివెరీ అంజి, కల్లేపల్లి శ్రీనివాస్, మాదరబోయిన రాకేశ్, ఆకాశ్గౌడ్, పల్లె రాజయ్య, పల్లె లింగయ్య, మేకల శ్రీనివాస్, కల్లేపల్లి తిరుపతి, సుశీల, సుమిత్ర, కిష్టమ్మ, స్వాతి, సుజాత తదితరులు పాల్గొన్నారు. సహజ సంపదను దోచుకుంటున్న కాంగ్రెస్ ఓదెల(పెద్దపల్లి): గ్రామాల్లోని సహజ సంపదను కాంగ్రెస్ ప్రభుత్వం దోచుకుంటోందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి ఆరోపించారు. కొలనూ ర్లో అమ్మపేరుతో ఒక మొక్క నాటిన ఆయన అ నంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చె రువుల మట్టిని ఒకేసామాజిక వర్గానికి చెందిన వ్యా పారులు తరలిస్తున్నారని అన్నారు. ఖైరున్నీసా, అనిల్, పృథ్వీరాజ్, నిర్మల, సదయ్యగౌడ్ ఉన్నారు. -
రైతులకు అవగాహన కల్పిస్తాం
పెద్దపల్లిరూరల్: రాష్ట్రంలోని రైతులందరికీ పెట్టుబ డి సాయం అందించిన ప్రభుత్వం మంగళవారం రైతుభరోసా విజయోత్సవం నిర్వహించింది. రైతులతో సీఎం రేవంత్రెడ్డి ముఖాముఖి కార్యక్రమం చేపట్టారు. రాఘవాపూర్లోని రైతువేదిక నుంచి కలెక్టర్ కోయ శ్రీహర్ష ఈ కార్యక్రమానికి హాజరయ్యా రు. రైతును రాజును చేయడమే లక్ష్యంగా ప్రభు త్వం ముందుకు సాగుతోందని సీఎం అన్నారు. పంట కాలానికి పెట్టుబడి అందించాలనే ఆలోచనతోనే కేవలం 9రోజుల్లోనే రూ.9వేల కోట్లు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమచేశామని అన్నారు. ఈ విషయంపై జిల్లా రైతులకు అవగాహన కల్పిస్తామని కలెక్టర్ శ్రీహర్ష తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఈర్ల స్వరూప, ఏడీఏ కాంతారావు, మండల వ్యవసాయాధికారి అలివేణి, పెద్దపల్లి సింగిల్విండో చైర్మన్ నర్సింహారెడ్డితోపాటు పలువురు నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. రైతునేస్తం ప్రయోజనకరం రామగిరి(మంథని): రైతులకు సలహాలు, సూచనలు ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతునేస్తం కార్యక్రమం ఎంతో ఉపయోగకరం కానున్నదని అడిషనల్ కలెక్టర్ వేణు అన్నారు. రత్నాపూర్ రైతువేదికలో సీఎం రేవంత్రెడ్డి రైతు భరోసా లబ్ధిదారులతో వీడియో కాన్ఫిరెన్స్లో మాట్లాడగా, అదనపు కలెక్టర్ వేణు హాజరయ్యారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ రైతులు సాగుచేసి లాభాలు సాధించాలని అన్నారు. రైతు దుక్కి దున్నిన దగ్గర నుంచి పంట వేసే వరకూ పంటలపై వచ్చే సమస్యలను పరిష్కరించేందుకు ఇదోక వేదికలా ఉపయోగపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సుమన్, మండల వ్యవసాయ అధికారి శ్రీకాంత్, ఏఈవో అరవింద్, నవీన్, మౌనిక, రైతులు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ కోయ శ్రీహర్ష రాఘవాపూర్లో రైతుభరోసా వేడుకలు -
సమ్మె నోటీసు అందజేత
ఫెర్టిలైజర్సిటీ(రామగుండం): దేశవ్యాప్తంగా జూలై 9న చేపట్టే సమ్మెలో పాల్గొంటామంటూ ఆర్ఎఫ్సీఎల్ మజ్దూర్ యూనియన్ అధ్యక్షుడు అంబటి నరేశ్ మంగళవారం యాజమాన్యానికి సమ్మె నోటీస్ అందజేశారు. బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈనిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. కార్మికులకు నష్టం కలిగించేలా ఉన్న నాలుగు కార్మిక చట్టాలను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈక్రమంలో చేపట్టి న సమ్మెలో కార్మికులు పాల్గొనాలని ఆయన కో రారు. ఈ కార్యక్రమంలో నాయకులు భూమల చందర్, వేల్పుల కుమారస్వామి, రమేశ్, నరేశ్, విశ్వనాథ్, రత్నకుమార్ పాల్గొన్నారు. 28న కలెక్టరేట్లో జాబ్మేళా పెద్దపల్లిరూరల్: కలెక్టరేట్లోని జిల్లా ఉపాధిక ల్పనాధికారి కార్యాలయంలో ఈనెల 28న జా బ్మేళా నిర్వహించనున్నట్లు ఇన్చార్జి అధికారి తిరుపతిరావు మంగళవారం తెలిపారు. అపోలో ఫార్మసీలో 40 ఫార్మసిస్టు, 20 ట్రెయినీ ఫార్మసిస్టు పోస్టుల భర్తీకోసం ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అర్హత, ఆసక్తిగలవారు ఉదయం 11 గంటలకు సర్టిఫికెట్ల జిరాక్స్లతో నేరుగా హాజరు కావాలన్నారు. వివరాలకు 72079 17714, 81212 62441 నంబర్లలో సంప్రదించాలని ఆయన సూచించారు. స్పోర్ట్స్ స్కూళ్లలో ప్రవేశాలు పెద్దపల్లిరూరల్: రాష్ట్రంలోని క్రీడాపాఠశాలల్లో ప్రవేశాలు పొందేందుకు ఆసక్తిగల జిల్లా విద్యార్థులకు ఈనెల 26న జిల్లాస్థాయి పోటీలను ని ర్వహించనున్నట్లు జిల్లా యువజన, క్రీడల శా ఖ అధికారి సురేశ్ మంగళవారం తెలిపారు. స్థానిక ప్రభుత్వ ఐటీఐ ఆవరణలోని మైదానంలో ఈ పోటీలు జరుగుతాయన్నారు. మండల స్థాయిపోటీల్లో ఎంపిౖకైన విద్యార్థులు జిల్లాస్థా యి పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. ఆర్ఎంపీలు సేవాభావంతో చికిత్స అందించాలి పెద్దపల్లిరూరల్: జిల్లాలోని ఆర్ఎంపీలు సేవాభావంతో ప్రథమ చికిత్స అందించాలని డీఎంహెచ్వో అన్న ప్రసన్నకుమారి సూచించారు. కలెక్టరేట్లో మంగళవారం ఆర్ఎంపీలతో సమావేశమై పలు సూచనలిచ్చారు. వానాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశాలున్నందున పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. డెంగీ, మలేరియా, టైఫాయిడ్లాంటి జ్వరాలతో క్లినిక్లకు వచ్చేవారికి ఫ్లూయిడ్స్, ఇంజక్షన్ చేయవద్దన్నారు. అలాంటి వారిని సమీపంలోని పీహెచ్సీ, ప్రభుత్వాసుపత్రులకు వెళ్లేలా సూచించాలని అన్నారు. గర్భస్రావం కోసం మందులు ఇవ్వొద్దన్నారు. 12 వారాల గర్భానికి ఉచితంగానే ప్రభుత్వాసుపత్రుల్లో గర్భస్రావాలు చేస్తారని అన్నారు. బయోవ్యర్థాల తరలింపునకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, పంచాయతీ సిబ్బంది తీసుకెళ్లే చెత్తలో వేయవద్దని ఆమె సూచించారు. జీజీహెచ్లో వివాదం కోల్సిటీ(రామగుండం): గోదావరిఖని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్(జీజీహెచ్)లో కాంట్రాక్ట్ సూపర్వైజర్, నర్సింగ్ ఆఫీసర్ల మధ్య చెలరేగిన వివాదం ఇంకా వీడడం లేదు. మంగళవారం మరోసారి ఇరువర్గాలు మధ్య వాగ్వావాదం చోటుచేసుకుంది. సూపర్వైజర్పై న ర్సింగ్ ఆఫీసర్లు ఇప్పటికే సూపరింటెండెంట్పై ఫిర్యాదు చేశారని చెబుతున్నారు. మంగళవారం మరోసారి గొడవ చోటుచేసుకోవడంతో విషయం తెలిసిన ఆర్ఎంవో రాజు స్పందించా రు. ఇరువర్గాలతో మాట్లాడి వివాదం ముదురకుండా శాంతింపజేశారు. తమ మనోభావాలకు భంగం కలిగించేలా మాట్లాడారని పలువురు నర్సింగ్ ఆఫీసర్లు ఆరోపిస్తున్నారు. మొక్కలు నాటి కాపాడాలి పెద్దపల్లిరూరల్: భారత ప్రధాని నరేంద్రమోదీ అమ్మ పేరుతో ఒక మొక్క(ఏక్ పేడ్ మా కే నామ్) నాటాలని ఇచ్చిన పిలుపులో భాగంగా మంగళవారం జిల్లా ఇన్చార్జి సోమారపు లావ ణ్య స్థానిక నేతలతో కలిసి మంగళవారం జిల్లా కేంద్రంలో మొక్కలు నాటారు. మానవ మనుగడకు ఆధారమైన ప్రకృతిని కలుషితం కాకుండా కాపాడుకునేందుకు విరివిగా మొక్కలను నాటి సంరక్షించాల్సిన అవసరముందని ఆమె అన్నారు. కార్యక్రమంలో నాయకులు తంగెడ రాజేశ్వర్రావు, రాజగోపాల్, పెంజర్ల రాకేశ్, ఎ ర్రోళ్ల శ్రీకాంత్, ఉమేశ్, వేల్పుల శ్రీనివాస్, శ్రీధర్రెడ్డి, మొగిలి, తిరుపతి, వెంకటస్వామి, మహేశ్, కిరణ్, అజయ్ పాల్గొన్నారు. -
ముసురు ముప్పు
● పల్లెలు, పట్టణాల్లో పారిశుధ్య లోపం ● కలుషితనీరు, అపరిశుభ్ర వాతావరణం ● జిల్లావాసులకు పొంచిఉన్న సీజనల్ వ్యాధుల ముప్పుగత మూడేళ్లలో జిల్లాలో నమోదైన సీజనల్ వ్యాధులు సాక్షి, పెద్దపల్లి/కోల్సిటీ: అప్పుడే ఎండ.. కాసేపటికే వాన.. ఆ తర్వాతే ఉక్కపోత.. ఇలా ఒకేరోజు భిన్న వాతావరణం నెలకొడంతో జిల్లావాసులు సీజనల్ వ్యాధులు బారిన పడుతున్నారు. జ్వరాలు, దగ్గు, జలుబు వంటివాటితో బాధపడుతూ ఆస్ప త్రుల పాలవుతున్నారు. గ్రామాల్లో ప్రత్యేకాధికారు ల పాలన, బల్దియాల్లో వందరోజుల ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తున్నా పారిశుధ్యం లోపిస్తోంది. వర్షపు నీరునిలిచి దోమలు వృద్ధి చెందుతున్నాయి. 29 హైరిస్క్ ప్రాంతాల గుర్తింపు జిల్లాలో ఇప్పటికే కొన్ని గ్రామాల్లో వ్యాధులు ముసురుకున్నాయి. ఈఏడాది మొత్తం 29 హైరిస్క్ గ్రామాలను గుర్తించినట్లు అధికారులు చెబుతున్నారు. గతంలో నమోదైన డయేరియా, మలేరియా, టైఫాయిడ్, డెంగీ కేసులను పరిగణనలోకి తీసుకొని హైరిస్క్ గ్రామాలుగా గుర్తించారు. ప్రధానంగా ధర్మారం మండలం పత్తిపాక, రామగుండం నగరంలోని మురికివాడలు ప్రమాదకరంగా ఉన్నాయని అంచనాకు వచ్చారు. ఆయా ప్రాంతాల్లో దోమ తెరలు పంపిణీ చేయాల్సి ఉంది. మురుగునీటి గుతంతల్లో గంబూషియా చేపలు వదలాల్సి ఉంది. యాంటీ లార్వా, ఆయిల్బాల్స్, క్లోరినేషన్ ప్రక్రియ, ఫాగింగ్ చేపట్టాల్సి ఉంది. కానీ, ఇవేమీ చేపట్టడం లేదనే విమర్శలున్నాయి. అధికారులు, ప్రజలు ఇలా చేయాలి ● నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి ● పైపులైన్ లీకేజీలకు మరమ్మతు చేయాలి ● డ్రైనేజీల్లో రసాయనాలు పిచికారీ చేయించాలి ● లార్వా నివారణకు మురుగునీటిగుంతల్లో ఆయిల్బాల్ వేయాలి ● నీటి గుంతల్లో గంబూషియా చేపలు వదలాలి. వీధుల్లో ఫాగింగ్ చేయాలి ● డెంగీ కారక దోమ కాటువేయకుండా మోకాళ్ల వరకు నూనె రాసుకోవాలి ● పాత సామగ్రి, పాత టైర్లలో నీటినిల్వలు ఉండకుండా చూసుకోవాలి ● నీటి డ్రమ్ములను రెండ్రోజులకోసారి కచ్చితంగా శుభ్రం చేయాలి ● ఇళ్ల కిటికీలకు జాలీలు, దోమతెరలు అమర్చుకోవాలి. రామగుండంలో లోపించిన పారిశుధ్యం.. రామగుండం నగరంలో పారిశుధ్యం లోపించింది. చెత్త సేకరణ సాఫీగా సాగడంలేదు. చాలాచోట్ల రోడ్ల పక్కనే కుప్పలుగా దర్శనమిస్తోంది. కొందరు కాలనీవాసులు మురుగునీటి కాలువలు, ఖాళీ స్థలాల్లో పడేస్తున్నారు. కొన్నిరోజులుగా అడపాదడపా కురుస్తున్న చిరుజల్లులతో చెత్త కుళ్లి కంపుకొడుతోంది. దోమలకు ఆవాసాలుగా మారుతున్నాయి. నగరవాసుల్ని ఎడాపెడా కుట్టేస్తూ ప్రత్యక్ష నరకం చూపిస్తున్నాయి. రక్తాన్ని పీల్చేసి ఆస్పత్రులపాలు చేస్తున్నాయి. పరిస్థితిని చక్కదిద్దడానికి అధికార యంత్రాంగం యాక్షన్ ప్లాన్ అమలు చేయకుంటే డెంగీ, మలేరియా, డయేరియా, వైరల్, విషజ్వరాలు విజృంభించే ప్రమాదం ఉందని నగరవాసులు ఆందోళన చెందుతున్నారు. పారిశుధ్యంపై పట్టింపే లేదు నివాసాల మధ్య ఖాళీ ప్లాట్లలో ఏపుగా పెరిగిన పిచ్చిమొక్కలు, వ్యర్థాలు దోమలు, ఈగలు, ప్రాణాంతక వైరస్కు ఆవాసాలుగా మారుతున్నాయి. ప్లాట్లను శుభ్రం చేసి జరిమానా విధించి వసూలు చేసే అధికారం బల్దియా అధికారులకు ఉన్నా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వర్షపునీరు రోజుల తరబడి నిల్వ ఉండడంతో లార్వా పుట్టుకొచ్చి దోమల బెడద అధికమైంది. ఏటా దోమల నివారణకు సుమారు రూ.30లక్షల నుంచి రూ.70 లక్షలకుపైగా నిధులు వెచ్చిస్తున్నా.. పరిస్థితి మెరుగుపడకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. మొక్కుబడిగా ఫాగింగ్.. దోమల నివారణకు అవసరమైన ఫాగింగ్ యంత్రాలు ఉన్నా.. అధికారులు మొక్కుబడి చర్యలు తీసుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఫాగింగ్కు వినియోగించే ఆటోట్రాలీ గౌతమినగర్లో ఆర్నెల్ల క్రితం కాలిపోయింది. ఇప్పటికీ వినియోగంలోకి తీసుకురాలేదు. ప్రస్తుతం ఒక వాహనంతోనే ఫాగింగ్ చేస్తున్నారు. ఏడు హ్యాండ్ ఫాగింగ్ యంత్రాలు ఉన్నా నిరుపయోగమే అయ్యాయి. నీటినిల్వ ప్రాంతాల్లో యాంటి లార్యా ఆయిల్బాల్స్ వేయడం లేదు. బ్లీచింగ్ పౌడర్, ఆయిల్ స్ప్రే, ఫాగింగ్ చేయించడం లేదు. కాలువల్లో పూడికను మొక్కుబడిగా తీస్తూ ఈ దృశ్యాలను ఫొటోలు తీసి గ్రూపుల్లో పోస్ట్ చేసి మిన్నకుంటున్నారు. రోడ్డుపైనే చెత్తతో దర్శనమిస్తున్న ఈ రోడ్డు పెద్దపల్లి హనుమాన్నగర్లోనిది. ఇదేకాదు.. ప్రధాన రహదారులు, వీధుల్లో చెత్తకుప్పులు పేరుకు పోయాయి. పారిశుధ్యం మెరుగు, పట్టణ రూపురేఖలు మార్చడానికి ఈనెల 2 నుంచి సెప్టెంబర్ 9వ తేదీ వరకు అధికారులు రోజుకో కార్యక్రమం చేపడుతున్నారు. నిధుల కొరత, శాఖల మధ్య సమన్వయలోపంతో ఈ కార్యక్రమం నామమాత్రానికే పరిమితమైంది.సంవత్సరం మలేరియా డెంగీ చికున్గున్యా 2022 5 215 0 2023 0 151 0 2024 0 115 12ఇది గోదావరిఖని విఠల్నగర్లోని ఓపెన్ నాలా. మురుగునీరు వెళ్లకుండా పూడికతో ఇలా నిండిపోయింది. ఒకవైపు వర్షాలు కురుస్తున్నా.. పూడిక తీయడంలేదు. వాస్తవంగా ఏప్రిల్, మే వరకు పూడిక తీయాల్సి ఉంది. అధికారుల నిర్లక్ష్యానికి ఈ చిత్రమే అద్దంపడుతోంది. ప్రస్తుతం 100 రోజుల కార్యాచరణ చేపట్టినా ఆశించిన స్థాయిలో పూడికతీత పనులు ముందుకు సాగడంలేదు. -
డిప్యూటీ కమిషనర్కు గ్రేడ్–1 హోదా
కోల్సిటీ(రామగుండం): రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో డిప్యూటీ కమిషనర్ నాయిని వెంకటస్వామికి ప్రభుత్వం గ్రేడ్–1 హోదా కల్పించింది. మళ్లీ రామ గుండంలోనే డిప్యూటీ కమిషనర్గా పోస్టింగ్ ఇస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. మంథని మున్సిపల్ కమిషనర్గా వెంకన్న మంథని: మంథని మున్సిపల్కు ఎట్టకేలకు కమిషనర్(గ్రేడ్–3) నియామకమయ్యారు. మేజర్ పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా మారిన మంథనికి ఇంతకాలం ఇన్చార్జి కమిషనర్లే పాలకులుగా వ్యవహరించారు. రాష్ట్రంలోని పలు మున్సిపాలిటీలకు ప్రభుత్వం 56 మంది కమిషనర్లకు పోస్టింగ్లు ఇచ్చింది. ఇందులో మంథని బల్దియాకు సీహెచ్. వెంకన్నను పదోన్నతిపై నియమించింది. ప్రస్తుతం మంథని మున్సిపల్ ఇన్చార్జి కమిషనర్గా కార్యాలయ సూపరింటెండెంట్ మనోహర్ వ్యవహరిస్తున్నారు. -
కంపుకొడుతున్న కాలనీలు
ఇది రామగుండం నగరంలోని ఇందిరానగర్ కల్లు డిపో ఎదుట గల ఓపెన్ ప్లాట్. పిచ్చిమొక్కలు ఏపుగా పెరిగాయి. సమీపంలోని ఇళ్ల నుంచి వెలువడే చెత్తను ఇందులోనే పడేస్తున్నారు. దోమలు వృద్ధి చెంది స్థానికులపై దాడులు చేస్తున్నాయి. ఆహారం కోసం ఇక్కడకు వస్తున్న పందులు స్వైర విహారం చేస్తున్నాయి. ఇది గోదావరిఖని శారదానగర్లోని బల్దియా వాటర్ ట్యాంకు ఎదుట రోడ్డు. దీనిపక్కనే చెత్త ఇలా పేరుకుపోయింది. వాటర్ ట్యాంక్ ఆవరణలోని క్యాంపు కార్యాలయానికి రోజూ ఉదయం, మధ్యాహ్నం, రాత్రి భోజనం చేయడానికి వెళ్లే ఎస్ఈ స్థాయి అధికారి నుంచి మొదలు శానిటరీ ఇన్స్పెక్టర్ వరకు చాలా మంది వచ్చిపోతుంటారు. వాటర్ ట్యాంక్ గేటు సమీపంలోనే చెత్త ఇలా కుప్పలుగా పేరుకుపోతున్నా ఎవరూపట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు.ఇది జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి ఓపీ వద్ద తీసిన చిత్రం. వర్షాలు ప్రారంభమవడం జలుబు, ఒళ్లునొప్పులు, జ్వరాలతో బాధపడుతున్నవారు ఇలా ఆస్పత్రికి వస్తున్నారు. ఈఏడాదిలో ఇప్పటివరకు ఒక్క డెంగీ కేసు నమోదుకాకున్నా.. 29 టైఫాయిడ్ కేసులు నమోదయ్యాయి. -
ఇది ప్రజల ప్రభుత్వం
● ఎమ్మెల్యే విజయరమణారావుపెద్దపల్లిరూరల్/జూలపల్లి: పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్ర జాసంక్షేమాన్ని విస్మరించారని ఎమ్మెల్యే విజయరమణారావు విమర్శించారు. పలువురు లబ్ధి దారులకు మంగళవారం జిల్లా కేంద్రంలో ఆయన రేషన్కార్డులు పంపిణీ చేశారు. జూలపల్లి మండలంలో చేపట్టిన వివి ధ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. సీఎం రేవంత్రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్కార్డులు, ఇందిరమ్మ, డబుల్బెడ్రూమ్ ఇళ్లు మంజూరు చే స్తోందని తెలిపారు. కోతల్లేకుండా ధాన్యం కొనుగోలు, సన్నరకం క్వింటాల్కు రూ. 500 బోనస్ చెల్లిస్తోందన్నారు. అనంతరం ఏడుగురు దివ్యాంగులకు రూ.3,37,000 విలువైన చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి ఆదిరె డ్డి, ఎంపీడీవో పద్మ, తహసీల్దార్లు రాజయ్య, స్వర్ణ, పెద్దపల్లి మార్కెట్ కమిటీ చైర్పర్సన్ స్వరూప, వైస్చైర్మన్ మల్లారెడ్డి, నాయకులు రామ్మూర్తి, మల్ల య్య, సంతోష్, శ్రీనివాస్, నర్సింహారెడ్డి, సంపత్, శంకర్, సంతోష్, నరేశ్ తదితరులు పాల్గొన్నారు. -
ఎడ్ల నాగలికి భలే గిరాకీ
● పసుపు విత్తనానికి రోజుకు రూ.3500కిరాయి ● ప్రతి గ్రామంలో ఐదారు జతల కాడెద్దులే దిక్కు జగిత్యాలఅగ్రికల్చర్: వ్యవసాయంలో ట్రాక్టర్లు, ఆధునిక యంత్రాలు రావడంతో కాడెద్దులు కనుమరుగయ్యాయి. గ్రామానికి కేవలం ఐదారు జతల కాడెడ్లు మాత్రమే ఉన్నాయి. విత్తనాలు వేసే సమయంలో వాటికి భలే డిమాండ్ పెరిగింది. పసుపు వంటి విత్తనం వేసేందుకు కాడెడ్లతో వచ్చే రైతుకు రూ.3,500 నుంచి రూ.4వేల వరకు చెల్లించాల్సి వస్తోందంటే గ్రామాల్లో పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. పోషణ భారమై.. ఒకప్పుడు గ్రామాల్లో ప్రతి రైతుకు కనీసం నాలుగైదు కాడెడ్లు ఉండేవి. జత కాడెడ్లు లేని రైతులు ఉండేవారు కాదంటే అతిశయోక్తికాదు. సాగులో ట్రాక్టర్ల రాకతో ప్రతి పనికీ యంత్రాలనే వినియోగిస్తున్నారు. చిన్న గ్రామంలోనూ సుమారు 20 నుంచి 30 ట్రాక్టర్లు వచ్చాయి. దీంతో కాడెడ్లను పోషించే స్థోమత రైతులకున్నా.. వాటికి నీరు పెట్టడం, మేత వేయడం వంటి పనులు చేయలేక అమ్ముకుంటున్నారు. నాలుగైదు ఎకరాలు ఉన్న రైతు కూడా ట్రాక్టర్ కొంటున్నాడు. కాడెడ్లకు గిరాకీ వాస్తవానికి విత్తనం వేసేందుకు కాడెడ్లు తప్పనిసరి. గతంలో ఇరుగుపొరుగు రైతులు అదలుబదలు రూపంలో విత్తనాలు వేసుకునేవారు. ప్రస్తుతం ఆ విధానం మారింది. కాడెడ్ల నాగలితో విత్తనం వేస్తే బాగా మొలకెత్తే అవకాశం ఉంటుంది. దీంతో పసుపు విత్తనం వేసేందుకు రైతులు కాడెడ్లపైనే ఆధారపడుతున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఎడ్లనాగలితో వెళ్తే రూ.3,500 ఇస్తున్నారు. కొందరు రైతులు విత్తనం వేశాక అమ్ముకుంటున్నారు. కాడెడ్ల జతకు రూ.80వేల నుంచి రూ.90వేల వరకు ఉంది. -
ఖైదీల యోగక్షేమాలు తెలుసుకున్న జడ్జి
కరీంనగర్క్రైం: కరీంనగర్ జిల్లా జైలును సోమవారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి శివకుమార్, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కె.వెంకటేశ్తో కలిసి సందర్శించారు. ఖైదీల యోగ క్షేమాలు, భోజన వసతులు, న్యాయసేవా, ఆరోగ్య సమస్యల గురించి తెలుసుకున్నారు. క్యాంటీన్, ఆసుపత్రి, ములాఖత్, ఫోన్, లైబ్రరీ, వంటశాల, ఇండస్ట్రీలలో పనితీరు పరిశీలించారు. కొత్త చట్టాలు వివరించా రు. మహిళా జైలును కూడా సందర్శించి కేసుల వి వరాలు, బాగోగులు, సౌకర్యాలు అడిగి తెలుసుకున్నారు. లాయర్లను పెట్టుకునే స్థోమత లేనివారికి ప్రభుత్వం తరఫున లాయర్లను నియమిస్తామని చె ప్పారు. జైలు సూపరింటెండెంట్ విజయడేని, జైలర్లు పి.శ్రీనివాస్, బి.రమేశ్ ఉన్నారు. -
డీపీఆర్ తయారీలో అగ్రగామి
రామగుండం: వ్యాప్కోస్ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో మరోసారి చర్చకు వచ్చిన పేరు. జీవితకాలం ముగిసిన మేడిపల్లి ఓపెన్కాస్టు గనిలో సింగరేణి 500 మెగావాట్ల సామర్థ్యం గల పంప్డ్ స్టోరేజీ పవర్ ప్లాంట్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అంతేకాదు.. ప్రాజెక్టు సమగ్ర నివేదిక (డీపీఆర్) తయారీ బాధ్యతలను వ్యాప్కోస్కు అప్పగించడం చర్చనీయాంశం కావడానికి కారణమైంది. ప్రఖ్యాతిగాంచిన కాళేశ్వరం ప్రాజెక్టు సమగ్ర నివేదిక(డీపీఆర్)తయారీలోనూ నిర్దేశిత గడువులోగా అత్యధిక కచ్చితత్వంతో ఈ సంస్థ ప్రత్యేకత చాటుకుంది. డ్యాంలు, పంపుహౌస్లు డిజైన్ చేసి అప్పగించడంలోనూ సత్తా నిరూపించుకుంది. మేడిపల్లి ఓసీపీలో చేపట్టిన పంప్డ్ స్టోరేజీ పవర్ ప్లాంట్ నిర్మాణానికి జియాలాజికల్, జియో టెక్నికల్, హైడ్రాలజీ, సివిల్, ఉత్పత్తి సామర్థ్యం, మెకానికల్, ఎలక్ట్రికల్, పర్యావరణ, పవర్ డిస్ట్రిబ్యూషన్, రక్షణ తదితర అంశాలపై డీపీఆర్ ఇవ్వాలని సింగరేణి వ్యాప్కోస్ను కోరింది. వ్యాప్కోస్ అంటే.. వాటర్ అండ్ పవర్ కన్సల్టెన్సీ సర్వీసెస్ (ఇండియా) లిమిటెడ్ను చిన్నగా వ్యాప్కోస్గా పిలుస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ నీటి వనరులు, విద్యుత్, మౌలిక సదుపాయాల అభివృద్ధి, పర్యావరణ అధ్యయన రంగాల్లో సేవలు అందించే ఒక ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ ఇది. దీనిని 1969లో స్థాపించారు. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. వ్యాప్కోస్కు మినీరత్న సంస్థగా గుర్తింపు వచ్చింది. దేశ, విదేశాల్లో చేపట్టే ప్రాజెక్టులకు సాంకేతిక సలహాలు, ఇంజనీరింగ్ సేవలు అందిచడంలో దిట్ట. ఐఎస్వో 9001:2015 సర్టిఫికేషన్ కలిగిన సంస్థగా, గుణాత్మక సేవలకు నిదర్శనంగా పేరుంది. దేశ, విదేశాల్లో కీలకపాత్ర.. ● అఫ్ఘనిస్తాన్ హెరాత్ ప్రావిన్స్లోని సల్మాడ్యామ్ జలవిద్యుత్ ఆనకట్టను వ్యాప్కోస్ డిజైన్ చేసింది. ● భారతదేశ గ్రామీణ ప్రాంతాల్లో సురక్షిత తాగునీటి సరఫరాకు జలజీవన్ మిషన్, మిషన్ భగీరథ ప్రాజెక్టులూ డిజైన్ చేసింది. ● ఉత్తరప్రదేశ్లోని నమామి గంగానది సంరక్షణ, కాలుష్య నియంత్రణ, ల్యాండ్ స్కేపింగ్ డిజైన్ చేసింది. విద్యుత్ రంగంలోనూ.. ● రువాండాలోని ఎగైజన్ జలవిద్యుత్ పవర్ ప్రాజెక్టు (బురుండి) డిజైన్ ● రామగుండం మేడిపల్లి ఓపెన్కాస్టు తరహాలో నిర్మించే పంప్డ్ స్టోరేజీ విధానానికి గతంలోనే 600 మెగావాట్ల సామర్థ్యం గల అప్పర్ ఇంద్రావతి పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టుకు మేనేజ్మెంట్ కన్సల్టెన్సీగా సేవలు అందిస్తోంది. ● భూటాన్లోని మంగ్దేచు జలవిద్యుత్ ప్రాజెక్టుకు డిజైన్ సాంకేతిక సలహాదారుగా వ్యవహ రించింది. ● స్వచ్ఛభారత్ మిషన్, రివాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్ కింద గ్రామీణ విద్యుదీకరణ ప్రాజెక్టులకు రూపకల్పన చేసింది. మౌలిక సదుపాయాల రంగం.. ● ఫిజీదేశంలో రెండు కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు సాంకేతిక సలహా సేవలు అందిస్తోంది. ● అటల్ మిషన్ ఫర్ రిజువనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ (అమృత్), స్మార్ట్ సిటీ మిషన్ పథకంలో భాగంగా నీటి సరఫరా, డ్రైనేజీ, రోడ్ల రూపకల్పన డిజైన్ చేసింది. ● మనదేశంలోని ఓడరేవులు, హార్బర్లు, ఇన్ల్యాండ్ వాటర్ వేస్ అభివృద్ధికి డిజైన్, కన్సల్టెన్సీ సేవలు అందించింది. ● ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద గ్రామీణ రోడ్ల నిర్మాణంలో కీలకపాత్ర పోషిస్తోంది. ప్రాజెక్టు రూపకల్పనలో అనుసరించే విధానం.. ● ప్రాజెక్టు ఆర్థిక, సాంకేతిక సాధ్యాసాధ్యాలను అంచనా వేయడం, హైడ్రాలిక్ డిజైన్, వ్యయ అంచనా, డ్రాయింగ్ తయారీ, భౌగోళిక, హైడ్రాలజీ అధ్యయనాలతో క్షేత్ర సర్వేలు, ప్రాజెక్టు రూపకల్పన నుంచి అమలు, నిర్వహణ వరకు సమగ్ర సేవలు అందించడం దీని ప్రధాన లక్ష్యం. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు.. వ్యాప్కోస్ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో సేవలను అందిస్తోంది. ముఖ్యంగా అంగోలా, బంగ్లాదేశ్, భూటాన్, కంబోడియా, ఇథియోపియా, ఫిజీ, మంగోలియా, నేపాల్, రువాండా, శ్రీలంక, ఉగాండా, జింబాబ్వే తదితర 30 దేశాల్లో వ్యాప్కోస్ సేవలు అందించడం మనదేశానికి గర్వకారణమని అంటున్నారు. దేశ, విదేశాల్లోనూ ప్రత్యేక గుర్తింపు మినీరత్న హోదా సాధించిన ‘వ్యాప్కోస్’ -
ఆహ్లాదం.. ఆరోగ్యం
● కనువిందు చేస్తున్న అటవీ ప్రాంతం ● అడవుల రక్షణకు అధికారుల చర్యలు ● సేదతీరుతున్న పర్యావరణ ప్రియులు మంథని: వేసవి ముగిసింది. తొలకరి పలకరించింది. అడవులు ఆకుపచ్చదనం సంతరించుకున్నాయి. నిన్నామొన్నటి వరకు మోడువారిన చెట్లు చిగురిస్తున్నాయి. చిగురించిన ఆకులతో పచ్చదనం కనువిందు చేస్తోంది. తూర్పు అటవీ ప్రాంతమైన మంథని అడవులు ఆహ్లాదం పంచుతున్నాయి. పర్యావరణ ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మంథని నుంచి మహదేవపూర్ వరకు.. మంథని మండలం ఎక్లాస్పూర్ శివారు మొదలు అటవీ ప్రాంతంలో మహదేవ్పూర్ మండలం బూర్గుగూడెం వరకు సుమారు 120 కి.మీ. మేర అడవి విస్తరించి ఉంది. రామగిరి, కమాన్పూర్ మండలాలు మినహా నియోజకవర్గంలోని ఎనిమిది మండలాలు, పెద్దపల్లి, రామగిరి మండలాల్లో సైతం అడవులు విస్తరించి ఉన్నాయి. ఒకప్పుడు అంతరించిపోయిన అడవులకు హరితహరం పేరిట ప్రభుత్వాలు మొక్కలు నాటుతూ జీవం పోశాయి. ప్రస్తుతం పచ్చదనం ఉట్టిపడుతుండగా అటువైపు వెళ్లే వాహనదారులు పచ్చని చెట్లఒడిలో సేద తీరుతున్నారు. స్మగ్లర్ల గొడ్డలి వేటుకు దూరంగా.. ఒకప్పుడు దట్టమైన అడవులపై స్మగ్లర్ల గొడ్డలి వేటు పడటంతో పెద్దచెట్లు అంతరించిపోయాయి. కలప అక్రమ రవాణా చేస్తూ అడవులను నాశనం చేశారు. దీంతో ఎటుచూసినా పచ్చదనం ఉట్టిపడే అడవులు కానరాకుండా పోయాయి. కానీ ప్రస్తుతం అడవులు మళ్లీ పచ్చదనంతో కనువిందు చేస్తున్నాయి. అడవుల రక్షణకు పటిష్ట చర్యలు.. గత ప్రభుత్వాలు అడవుల రక్షణకు పటిష్ట చర్యలు చేపట్టాయి. ఇటు ఫారెస్ట్, అటు పోలీసులు సంయుక్తంగా అడవుల రక్షణపై ప్రత్యేక దృష్టి సారించారు. కలప స్మగ్లర్ల అక్రమ రవాణాను అడ్డుకోవడంతోపాటు వంటచెరుకును కూడా తీసుకుపోకుండా కందకాలు తవ్వారు. అడవిలో అడుగుపెట్టకుండా చర్యలు తీసుకున్నారు. దీంతో అడవులు మళ్లీ చిగురించాయి. హరితహారం పేరుతో అడవుల్లో మొక్కలు నాటి వాటిని సంరక్షించడంతో అడవులకు పూర్వవైభవం వచ్చినట్లయ్యింది. కనువిందు చేస్తున్న పచ్చదనం.. తూర్పు అడవుల్లో చిగురించిన పచ్చని ఆకులు, చెట్లు కనువిందు చేస్తున్నాయి. నిత్యం వందలాది మంది భక్తులు కాళేశ్వరం, మేడారం, నాగులమ్మలాంటి ఆలయాలను దర్శించుకునేందుకు వెళ్తూ అటవీ ప్రాంతాల్లోని పచ్చని చెట్లకింద సేద తీరుతున్నారు. కాసేపు ఆహ్లాదకరమైన వాతావరణ అనుభూతిని పొందుతూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబంతో కలిసి ప్రకృతిని ఆస్వాదిస్తున్నారు. చెట్ల నీడన సేదదీరుతూ ఆటాపాటనతో ఎంజాయ్ చేస్తున్నారు. -
పసుపు వేసేందుకు..
వ్యవసాయంలో ట్రాక్టర్లతోనే అన్ని పనులు చేస్తున్నారు. ఆధునిక యంత్రాల రాకతో నాకున్న ఎడ్లను అమ్మిన. ఇప్పుడు పసుపు విత్తనం వేసేందుకు రూ.3,500 ఇస్తున్నాం. వారంముందే ఎడ్ల నాగలి మనిషికి అడ్వాన్స్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. చాలా గ్రామాల్లో రైతుల పరిస్థితి ఇలాగే ఉంది. – గడ్డం గంగారెడ్డి, చల్గల్ ఎడ్లు దొరికే పరిస్థితి లేదు ఎడ్ల నాగలితో విత్తనం వేస్తేనే బాగా మొలకెత్తుతుంది. ఇందుకోసం ఎడ్లు కొందామన్నా.. ఎక్కడా దొరికే పరిస్థితి లేదు. ఒక్కో జతకు రూ.80వేల పలుకుతోంది. విత్తనం వేసే వారంముందే ఎడ్ల నాగలిని కిరాయి తీసుకుంటున్నాం. మిగతా పనులు చేయడానికి ట్రాక్టర్ ఉపయోగిస్తాను. – రాంకిషన్, వెల్దుర్తి -
ఫలించిన ఓపెన్ చాలెంజ్
● నెరవేరిన ప్రధానోపాధ్యాయుడి లక్ష్యం ● రచ్చపల్లి సర్కార్ స్కూల్లో వందశాతం ప్రవేశాలు ధర్మారం(ధర్మపురి): ‘ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు మా పిల్లలకన్నా బాగా చదవగలరా? అలా ఒక్కరు చదివినా రూ.500 నజరానా ఇస్తాం’ అని రచ్చపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వంశీమోహానాచార్యులు చేసిన ఓపెన్ చాలెంజ్ సత్పలితాలిచ్చింది. బడీడు విద్యార్థులందరూ ప్రభుత్వ పాఠశాలలోనే కనిపిస్తున్నారు. హెచ్ఎం, ఉపాధ్యాయులు చాలెంజ్తోపాటు తల్లిదండ్రులకు నమ్మకం కలిగించారు. గతేడాది 36 మంది విద్యార్థులు ఉంటే అందులో నుంచి ఆరుగురు బయటకు వెళ్లారు. తద్వారా 30 మంది మాత్రమే మిగిలారు. దీనిని సవాల్గా తీసుకున్న హెచ్ఎం గత ఫిబ్రవరి 21న బడిబాట ప్రారంభించారు. ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు సవాల్ చేస్తూ పోస్టర్లు ముద్రించి ఇంటింటా పంచారు. ప్రైవేటు పాఠశాలలకు వెళ్లే విద్యార్థుల ఇంటికి వెళ్లి సర్కారు బడి విద్యార్థులతో పోటీపెట్టించి భేష్ అనిపించుకున్నారు. దీంతో ఆ గ్రామ తల్లిదండ్రులకు ఉపాధ్యాయులపై నమ్మకం ఏర్పడింది. ఈ ఏడాది ప్రైవేటు పాఠశాలలకు ఒక్కవిద్యార్థి కూడా వెళ్లకుండా తీర్మానించారు. వందశాతం మంది విద్యార్థులకు ప్రభుత్వ బడిలోనే ప్రవేశం కల్పించారు. 30 మందికి మరో 20 మంది కొత్తగా అడ్మిషన్ పొందడంతో ఇప్పుడా పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 50కి చేరింది. వారిరాకతో కళకళలాడుతోంది. -
బల్దియాలో అక్రమ కట్టడాల కూల్చివేత
కోల్సిటీ(రామగుండం): రామగుండం నగరపాలక సంస్థ పరిధిలో సోమవారం టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు పలు అక్రమ కట్టడాలను జేసీబీ వాహనంతో కూల్చివేశారు. గాంధీచౌక్ చౌరస్తాలో ఇటీవల అనుమతి లేకుండా సుమారు 10 దుకాణాలను నిర్మించారని, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వాటిని కూల్చివేశామని టౌన్ప్లానింగ్ టీపీఎస్ నవీన్ తెలిపారు. ఇటీవల శివాజీనగర్ రోడ్డు పక్కనున్న సింగరేణి క్వార్టర్లను తొలగించి షాపింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తున్న నేపథ్యంలో, రోడ్డుకు అడ్డుగా ఉన్న దుకాణాలనూ తొలగించారు. ఈ దుకాణాల నిర్వాహకులే ఉపాధి కోసం చౌరస్తాలో తాత్కాలికంగా దుకాణాలు నిర్మించుకున్నట్లు వ్యాపారస్తులు వెల్లడిస్తుండగా, వీటికి ఎలాంటి అనుమతుల్లేవని బల్దియా టౌన్ప్లానింగ్ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇదిలాఉంటే, స్థానిక కల్యాణ్నగర్ చౌరస్తాలోని బీఆర్ఎస్కు చెందిన ఓ నాయకుని ఇంటిని ఇటీవల రోడ్డు విస్తరణ కోసం కూల్చివేత చేపట్టగా, భవన యజమాని విజ్ఞప్తి మేరకు కూల్చివేతను నిలిపివేశారు. సోమవారం మరోసారి మిగిలిన భాగాన్ని టౌన్ప్లానింగ్ విభాగం అధికారులు కూల్చివేశారు. -
ఇంకుడుగుంతల శుభ్రం
కోల్సిటీ(రామగుండం): ఎట్టకేలకు బల్దియా అధికారులు ఇంకుడుగుంతలపై దృష్టి పెట్టారు. ‘ఇంకని నీరు.. ఆనవాళ్లు కోల్పోతున్న ఇంకుడుగుంతలు’ శీర్షికన గతనెల 19న ‘సాక్షి’ కథనం ప్రచురించింది. దీంతో స్పందించిన రామగుండం బల్దియా అధికారులు, వందరోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఆనవాళ్లు కోల్పోయిన ఇంకుడుగుంతలను వినియోగంలోకి తీసుకురావడంపై దృష్టి సారించారు. సోమవారం గోదావరిఖని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల ఆవరణలోని రెండు ఇంకుడుగుంతలతోపాటు నగరపాలక సంస్థ కార్యాలయం వెనకాల మరో రెండింటింటిని శుభ్రం చేసి వినియోగంలోకి తీసుకువచ్చారు. శానిటరీ ఇన్స్పెక్టర్ కుమారస్వామి, ఎన్విరాన్మెంట్ ఇంజినీర్ మధుకర్, ఎంఐఎస్ ఆపరేటర్ శ్రీకాంత్, మెప్మా సీవో శ్వేత, ఊర్మిళ, ప్రియదర్శిని పాల్గొన్నారు. సింగరేణి పాలిటెక్నిక్లో ప్రవేశాలు యైటింక్లయిన్కాలనీ(రామగుండం): మంచిర్యాల జిల్లా సీసీసీ– నస్పూర్లోని సింగరేణి పాలిటెక్నిక్లో 2025–26 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని సింగరేణి ఎడ్యుకేషనల్ సొసైటీ కార్యదర్శి గుండా శ్రీనివాస్ సోమవారం తెలిపారు. కళాశాలలో మొత్తం 300 సీట్లు భర్తీచేస్తామన్నారు. సివిల్, కంప్యూటర్స్, ఎలిక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, మెకానికల్, మైని ంగ్ కోర్సుల్లో 60 చొప్పున సీట్లు ఖాళీగా ఉన్నాయని, పాలిసెట్–2025లో ర్యాంకుల ఆధారంగా సీట్లు కేటాయిస్తామన్నారు. ఇందులో 150 సీట్లు సింగరేణి ఉద్యోగులు, మాజీ ఉద్యోగుల పిల్లలకు కేటాయించామన్నారు. ఆసక్తి, అర్హత గలవారు ఈనెల 28 నుంచి జూలై 3వ తేదీ వరకు సింగరేణి వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. మిగిలిన సీట్లను కన్వీనర్ కోటా కింద ఇతరులకు కేటాయిస్తామని, వీరు తెలంగాణ ప్రభుత్వ ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా ఈనెల 24నుంచి 28వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని వివరించారు. ఇతర వివరాల కోసం 90102 22161, 87901 12515, 94911 44168 ఫోన్నంబర్లలో సంప్రదించాలని ఆయన సూచించారు. రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతికరీంనగర్రూరల్: చొప్పదండి మండలం వెదురుగట్టకు చెందిన విష్ణువర్థన్(29) బహుదూర్ఖాన్పేట శివారులో ద్విచక్ర అదుపు తప్పి కింద పడడంతో మృతి చెందాడు. కరీంనగర్రూరల్ సీఐ ఏ.నిరంజన్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నగునూర్లోని ఓ ఆస్పత్రిలో పనిచేస్తున్న విష్ణువర్ధన్ సోమవారం వెదురుగట్ట నుంచి ప్రతిమ ఆసుపత్రికి వస్తుండగా మార్గ మధ్యలోని బహుదూర్ఖాన్పేట వద్ద ద్విచక్ర వాహనం అదుపు తప్పి సమీపంలోని చెట్టుకు ఢీకొంది. తలకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. తండ్రి పర్శరాములు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. హుజూరాబాద్లో..హుజూరాబాద్: పట్టణానికి చెందిన ఓ న్యూస్ పేపర్ రిపోర్టర్ చిర్ర సుదర్శన్గౌడ్ (55) ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. హుస్నాబాద్లో ఓ శుభకార్యానికి హాజరై తిరిగి వస్తుండగా భీమదేవరపల్లి మండలం గట్ల నర్సింగాపూర్ గ్రామ శివారులో బైక్ అదుపు తప్పడంతో కందకంలో పడి మృతి చెందాడని. మృతుడి కుటుంబానికి తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో రూ.పదివేలు అందజేశారు. మృతుడి కుటుంబ సభ్యులను టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి గాండ్ల శ్రీనివాస్, చంద్రశేఖర్, హుజూరాబాద్ ప్రెస్క్లబ్ అధ్యక్షుడు కాయిత రాములు, పలువురు జర్నలిస్టులు పరామర్శించారు. 27న పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సువిద్యానగర్(కరీంనగర్): ఆర్టీసీ కరీంనగర్ 1డిపో నుంచి ఈనెల 27న వన్ డే టూర్ ప్యాకేజీ ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ విజయమాధురి తెలిపారు. టూర్ ప్యాకేజీలో చిలుకూరు బాలాజీ, అనంత పద్మనాభ స్వామి, ఏడుపాయల దేవాలయం, అనంతగిరి హిల్స్ను సందర్శించేందుకు సూపర్ లగ్జరీ బస్సును ఏర్పాటు చేశామని అన్నారు. 27న ఉదయం 4గంటలకు కరీంనగర్ నుంచి బయలుదేరి అదే రోజు రాత్రి 9గంటలకు తిరిగి కరీంనగర్కు చేరుకుంటుందని, పెద్దలకు రూ.1.430. పిల్లలకు రూ.900 టికెట్ ఉంటుందని డిపో మేనేజర్ తెలిపారు. -
అన్నదాతా.. రైతు వేదికకు రావా?
● కర్షకులను బతిమాలుకుంటున్న ఏఈవోలు ● సీఎం కార్యక్రమం కోసం ఏఈవోలకు టార్గెట్లు ● ప్రతీ ఆర్వీకి 200 మంది రైతులను తరలించాలని ఆదేశాలు ● ఉమ్మడి జిల్లాలో 50 వేలకుపైగా రైతుల తరలింపు ● టీ, స్నాక్స్ డబ్బులు మాత్రం ఇవ్వరట ● మొన్నటి కార్యక్రమానికి పెట్టిన డబ్బులే రాలేదుసాక్షిప్రతినిధి,కరీంనగర్: రైతు వేదికల్లో ముఖ్యమంత్రితో ఏర్పాటు చేసిన ముఖాముఖి కార్యక్రమంతో ఏఈవో (అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్)లు ఇబ్బందులు పడుతున్నారు. సీఎం కార్యక్రమానికి రైతు వేదిక(ఆర్వీ)ల వద్దకు రైతులను తరలించాలని జిల్లా వ్యవసాయాధికారులు టార్గెట్లు విధించడంతో ఇబ్బందులు మొదలయ్యాయి. ప్రతీ ఆర్వీలో కనీసం 200 మందికి తగ్గకుండా రైతులను తరలించాలని ఆదేశాల్లో స్పష్టం చేయడంతో ఏఈవోలు అదేపనిలో తలమునకలయ్యారు. వాస్తవానికి ఈ కార్యక్రమానికి వచ్చేందు కు మెజారిటీ రైతులు సుముఖంగా లేరు. ప్రస్తుతం చాలాచోట్ల వ్యవసాయ పనులు మొదలవుతున్నా యి. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం 5 గంటలకు సీఎంతో జరిగే ముఖాముఖిలో తప్పకుండా రైతుభరోసా లబ్ధిదారులతో సీఎం మాట్లాడనున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు 50 వేలమంది రైతులకు ఏఈ వోలు ఫోన్లు చేసి కార్యక్రమానికి రావాల్సిందిగా బతిమాలుతున్నారు. మొన్నామధ్య రైతుభరోసా ప్రారంభం సందర్భంగా కూడా రైతులతో ముఖ్యమంత్రితో ఇలాంటి కార్యక్రమాన్నే నిర్వహించారు. అప్పుడు ప్రతీ ఏఈవోకు నిర్వహణ ఖర్చుల కింద రూ.5 వేలు చెల్లిస్తామని చెప్పారు. దీంతో ఆ కార్యక్రమంలో హాజరైన ప్రతీ రైతుకు టీ, స్నాక్స్ను ఏఈవోలే అందించారు. ఇందుకోసం వారే చేతి నుంచి డబ్బులు పెట్టుకున్నారు. ఆ డబ్బులు ఎప్పుడు వస్తాయా? అని ఎదురుచూస్తుంటే.. తీరా మరోసారి అలాంటి కార్యక్రమమే నిర్వహించాలని ఉన్నతాధికారులు ఆదేశించడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. చేసేది లేక మళ్లీ రైతులకు ఫోన్లు చేస్తూ.. చేతి చమురు వదిలించేందుకు సిద్ధమవుతున్నారు. రైతు వేదికల్లో ఇబ్బందులివీ! చాలాచోట్ల తాగునీరు సదుపాయం లేదు కుర్చీలు వేసే సిబ్బంది లేరు టీ, స్నాక్స్ ఇచ్చే దిక్కు లేదు మరుగుదొడ్లు శుభ్రం చేసే వారు లేరు రైతు వేదికకు కనీసం ఊడ్చే సిబ్బంది లేరు టెక్నికల్ ఎక్విప్మెంట్కు డబ్బులు రావు, నిర్వహణకు సిబ్బంది లేరు..జిల్లా రైతు వేదికలు ఏఈవోలు కరీంనగర్ 75 71జగిత్యాల 52 71పెద్దపల్లి 54 52సిరిసిల్ల 57 53 -
30 లక్షల మొక్కలు లక్ష్యం
పెద్దపల్లిరూరల్: జిల్లాలో చేపట్టే వనమహోత్సవంలో 30 లక్షల మొక్కలు నాటాలనేది లక్ష్యమ ని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. అడిషనల్ కలె క్టర్ అరుణశ్రీతో కలిసి వివిధ శాఖల అధికారులతో కలెక్టరేట్లో ఆయన సోమవారం సమీక్షించారు. 2 మీటర్లకన్నా ఎక్కువ ఎత్తు ఉన్న మొక్కలనే నాటేలా స్థలాలు ఎంపిక చేసుకోవాలన్నారు. ప్రజలను ఇంలులో భాగస్వాములను చేయాలని సూచించారు. అదేవిధంగా జిల్లాలో ఇప్పటివర కు 880 మంది రైతులు ఆయిల్పామ్ సాగు చే సేందుకు ముందుకొచ్చారని అన్నారు. ఇప్పటికే సాగు చేసిన పంట దిగుబడిపై కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచాలని ఆదేశించా రు. రైతువేదికల వద్ద మంగళవారం నిర్వహించే రైతునేస్తం కార్యక్రమాన్ని రైతులు వినియోగించుకునేలా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రతీరైతువేదికలో కనీసం 300 మంది రైతులు హాజరయ్యేలా చూడాలన్నారు. డీఏవో ఆదిరెడ్డి, ఉద్యా నవన అధికారి జగన్మోహన్రెడ్డి పాల్గొన్నారు. కలెక్టర్ కోయ శ్రీహర్ష -
‘నీట్’గా క్లాసులు
కమాన్పూర్(మంథని): జిల్లాలోని గుండారం ప్ర భుత్వ జూనియర్ కళాశాల ఈ ఏడాది నుంచి ఎప్ సెట్, నీట్లో విద్యార్థులకు తర్ఫీదు ఇచ్చేందుకు స ర్వం సిద్ధం చేసింది. ఇదే విషయంపై ఇటీవల విస్త త ప్రచారం చేయడంతో ప్రవేశాల సంఖ్య భారీగా పెరిగింది. ప్రైవేటు కళాశాలల్లో ఫీజుల భారం మో యలేని తల్లిదండ్రులు.. ప్రభుత్వ కళాశాలల్లో అందుబాటులోకి వస్తున్న ఆధునిక బోధన పద్ధతులుపై ఆసక్తి చూపుతున్నారు. అంతేకాదు.. తమ పిల్లలను అందులో చేర్పిస్తూ ఉచిత విద్య పొందుతున్నారు. జిల్లావాసులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. పెరిగిన అడ్మిషన్లు.. ఈ విద్యాసంవత్సరంలో ప్రతీ ప్రభుత్వ కళాశాలలో 30 శాతం ప్రవేశాలు పెంచాలని విద్యాశాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో అడ్మిషన్లు పెంచాలనే లక్ష్యంతో గుండారం కళాశాల అధ్యాపకులు, సిబ్బంది సమీప గ్రామాల్లోకి వెళ్లారు. పదో తరగతి లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశమయ్యారు. వారిపిల్లలు ప్రభుత్వ కళాశాలలో చేరేలా ప్రోత్సహించారు. కళాశాలలో కల్పిస్తు న్న సౌకర్యాలు, విద్యాబోధన, అందుబాటులోకి వ స్తున్న బోధన తీరు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. దీంతో ఈ విద్యా సంవత్సరంలో 110 మంది విద్యార్థులు గుండారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రవేశాలు పొందారని ప్రిన్సిపాల్ తెలిపారు. వారంతా రోజూ క్లాసులకు హారవుతున్నా రు. అత్యధికంగా డిమాండ్ ఉన్న ఎంపీసీ, బైపీసీ కోర్సుల్లో విద్యార్థులు చేరారు. ఈ ఏడాది నుంచి ఎప్సెట్, నీట్ క్లాస్లు ఈ ఏడాది నుంచి కళాశాలలో ప్రథమ సంవత్సరం ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు ఎప్సెట్, నీట్ క్లాసులను ప్రా రంభించారు. ఈ తరగతులు భవిష్యత్లో విద్యార్థులకు ఉపయోగపడతాయని అధ్యాపకు లు తెలిపారు. ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ, వైద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం ఇది పునాది లాంటిదని విద్యార్థులు అభిప్రాయపడుతున్నారు. ఎప్సెట్లోనూ ప్రత్యేక తర్ఫీదు ఈ ఏడాది నుంచే అందుబాటులోకి గుండారం ప్రభుత్వ జూనియర్ కాలేజీ ప్రత్యేకత నిర్దేశిత 30శాతం ప్రవేశాలు అధిగమించిన వైనం బోధన బాగుంది గుండారం ప్రభుత్వ కళాశాలలో విద్యా బోధన బాగుందని తెలిసింది. ప్రతీ ఏడాది ఈ కళాశాలలో మంచి ఫలితాలు వస్తున్నాయి. ఈ విషయాన్ని తెలుసుకొని ఎంపీసీలో అడ్మిషన్ తీసుకున్న. – సుంచు అశ్విత, సబ్బితం సౌకర్యాలున్నాయి ప్రభుత్వ కళాశాలలో ఈ ఏడాది నుంచి నీట్, ఎప్సెట్ క్లాస్ ప్రారంభిస్తున్నామని లెక్చరర్లు మా ఇంటికి వచ్చి చెప్పారు. దీంతో నేను బైపీసీలో అడ్మిషన్ తీసుకున్నా. విద్యా బోధన, సౌకర్యాలు బాగున్నాయి. – జి.వెన్నల, పేంచికల్పేట తరగతులు ప్రారంభించాం ఈ విద్యా సంవత్సరం నుంచి కళాశాలలో ఎంపీసీ, బైపీసీ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ఎప్సెట్, నీట్ క్లాసులు ప్రారంభించాం. 30 శాతం అడ్మిషన్లు పెంచాలనే ఉన్నతాధికారుల ఆదేశాలను అధిగమించాం. – సుధాకర్, ప్రిన్సిపాల్, గుండారం ప్రభుత్వ జూనియర్ కళాశాల -
పింఛన్ ఇప్పించండి
మా ఆయన చనిపో యాడు. కుటుంబ పోష ణ భారంగా ఉంది. ఆర్థిక ఇబ్బందులతో అవస్థలు పడుతున్న. వితంతు పింఛన్ మంజూరు చేసి ఆదుకోండి. నా కుటుంబాన్ని ఆదుకోండి. – రేచర్ల లత, పెద్దపల్లి ఉపాధి కల్పించండి ఎంఎస్సీ (ఆర్గానిక్ కెమి స్ట్రీ) చదివా. కుటుంబ పెద్ద (మా మయ్య) అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. వైద్యం కోసం చేసిన ఖర్చుతో అప్పుల పాలయ్యాం. నాకు ఇద్దరు పిల్లలు. కుటుంబ పో ష ణ కష్టంగా ఉంది. ఉపాధి అవకాశం కల్పించి ఆదుకోండి. – రజిత, గోదావరిఖని -
సమస్యలు.. విన్నపాలు
పెద్దపల్లిరూరల్: జిల్లాలోని వివిధ మండలాలు, గ్రామాలకు చెందిన ప్రజలు తరలివచ్చి ప్రజావాణిలో సమస్యలపై అందించిన దరఖాస్తులకు సత్వర పరిష్కారం చూపాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో అడిషనల్ కలెక్టర్ వేణుతో కలిసి దరఖాస్తులను స్వీకరించారు. ప్రజావాణి ఫిర్యాదులపై నిర్లక్ష్యం చేయొద్దని హెచ్చరించారు. సమస్యలను పరిష్కరించేందుకు తొలి ప్రాధాన్యమివ్వాలని సంబంధిత శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ● సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశం -
పనిదొంగలపై నిఘా
మస్టర్ మరింత కఠినం ● విధులకు ఆలస్యమైనా, మధ్యలో పనివదిలేసి వెళ్లినా చర్యలు ● సింగరేణి యాజమాన్యం ఆదేశాలతో ముందుకు సాగుతున్న ఉన్నతాధికారులుగోదావరిఖని: పనులు తప్పించుకుని తిరిగే ఉద్యో గులపై సింగరేణి కఠిన చర్యలు చేపడుతోంది. విధులకు హాజరై పనిమధ్యలోనే ఇంటికి వెళ్లే వారిపై ప్ర త్యేక దృష్టి సారించింది. సంస్థ వ్యాప్తంగా గైర్హాజర్ సంఖ్య పెరుగుతుండగా, విధులకు హాజరై మధ్యలోనే వెళ్తున్న వారిపై నిఘా పెట్టింది. యూనియ న్లు, రాజకీయ నాయకులతో సంబంధం లేకుండా చర్యలకు సిద్ధమవుతోంది. భారీ యంత్రాలు పనిచే సే ఓసీపీల్లో పనిగంటలు పెరిగితే ఉత్పత్తిపై ప్రతికూల ప్రభావం చూపుతుందని అధికారులు భావిస్తున్నారు. ఇదే ఓసీపీల్లో పనిచేస్తున్న ప్రైవేట్ ఓబీల్లో షిఫ్టులో 8గంటల పాటు పనిచేస్తుండగా, అదేసింగ రేణి సంస్థకు చెందిన డిపార్ట్మెంట్ పనులు నిర్వహిస్తున్న ఉద్యోగులు సరాసరి రోజుకు 6గంటలు మా త్రమే విధులు నిర్వహిస్తున్నట్లుగా అధికారులు చె బున్నారు. అంతే కాకుండా రక్షణతో కూడిన ఉత్పత్తి కి ప్రాధాన్యం ఇవ్వాలంటోంది. అయితే సింగరేణిలో రాజకీయ జోక్యం విపరీతంగా పెరిగిపోవడంతో లైట్జాబ్లు, ఉచిత మస్టర్లు, విధుల మధ్యలో వెళ్లిపోతున్నట్లుగా యాజమాన్యం గుర్తించింది. ఓసీపీలపై ప్రత్యేక నిఘా.. సింగరేణిలో అత్యధిక బొగ్గు ఉత్పత్తి చేస్తున్న ఓసీపీలపై యాజమాన్యం దృష్టి సారించింది. ఒకకార్మికుడు విధుల మధ్యలో వెళ్లినా ఆ ప్రభావం షిఫ్టుపై ప్రభావం చూపుతోంది. కొన్ని సందర్భాల్లో పెద్దసంఖ్యలో కార్మికులు బయటకు వెళ్తుండటంతో చట్టపరమైన చర్యలకు వెళ్తోంది. ఈక్రమంలో అధికారులకు కూడా తలనొప్పిగా మారుతోంది.ఉచిత మస్టర్లు ఇకబంద్.. ఉద్యోగుల ఉచిత మస్టర్లపై యాజమాన్యం దృష్టి సారించింది. మస్టర్పడి ఇంటికి వెళ్లేవారిపై డేగకన్ను వేసింది. సెక్యూరిటీ సిబ్బందితోపాటు సీసీ కెమెరాల నిఘా ఉంచింది. డ్యూటీ మధ్యలో వెళ్తున్న కార్మికుల పేర్లను అవుట్పోస్టులో ఉన్న సెక్యూరిటీ సిబ్బంది నమోదు చేసుకుంటూ ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు నివేదికలు అందజే స్తున్నారు. దీంతో చార్జిషీట్, సస్పెండ్, నోటీసు జారీ చేయడంలాంటి పనిష్మెంట్ కొనసాగుతోంది. ఉత్పత్తికి సహకరించాలి పోటీ యుగంలో ధీటుగా రాణించాలి. పక్కనే ఉన్న ఓబీలో షిఫ్టుకు 8 గంటలు పనిచేస్తుండగా, సింగరేణిలో 6 గంటల వరకు యంత్రాలు వినియోగిస్తున్నారు. దీంతో ఉత్పాదకత ఖర్చు పెరుగతోంది. ఈవిషయంలో ఉద్యోగులందరూ సహకరించాలి. మస్టర్ పడి ఇంటికి వెళ్లినా, డ్యూటీ మధ్యలో వెళ్లినా చర్యలు తప్పవు. – లలిత్కుమార్, ఆర్జీ–1 జీఎం -
పట్టా ఇప్పించండి
పెద్దపల్లి శివారు చందపల్లిలోని ప్రభుత్వ భూమిని గీత పారిశ్రామిక సంఘానికి కేటాయించారు. ఆ భూమి వివరాలను ఆన్లైన్లో నమోదు చేసి పట్టా పాసుపుస్తకం ఇప్పించండి. – పెద్దపల్లి గీత పారిశ్రామిక సంఘం నాయకులు కూలీలకు వర్తింపజేయండి ఉపాధిహామీ కూలీలకు కార్మిక సంక్షేమ పథకాలను వర్తింపజేయాలి. భవన నిర్మాణ రంగ కార్మికులకు వర్తింపజేస్తున్న సంక్షేమ పథకాలను ఉపాధి కూలీలకు కూడా వర్తింపజేసి ఆదుకోవాలి. – ఆవుల ముత్తయ్య, మడక, ఓదెల -
సాగు చేసుకుంటున్నాం
మా ఊరులోని ప్రభుత్వ భూమిని సాగు చేసుకుంటున్నం. మోకాపై సర్వే చేయించి సాగులో ఉన్న అర్హులైన పేదరైతులకు పట్టాలు ఇప్పించి ఆదుకోవాలి. – బిట్టుపల్లి రైతులు, మంథని ఇల్లు ఇప్పించండి నిరుపేదరాలినైన నాకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయండి. ఏ ఆధారం లేని స్థితిలో ఉన్నా. ఇండ్లలో పాచీపని చేస్తూ బతుకుతున్న. ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు అన్ని అర్హతలు ఉన్నయి. దయచేసి ఆదుకోండి. – రాజేశ్వరి, పెద్దపల్లి -
సంక్షేమానికి ప్రాధాన్యం
పెద్దపల్లిరూరల్/ఎలిగేడు: సీఎం రేవంత్రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాసంక్షేమానికే ప్రాధాన్యం ఇస్తోందని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. పెద్దపల్లి మండలం పెద్దకల్వల, పెద్దబొంకూర్, ఎలిగేడు మండ లంలో సీసీ రోడ్డు నిర్మాణాలను ప్రారంభించా రు. ఇందిరమ్మ ఇళ్ల పనులకు శ్రీకారం చుట్టి మాట్లాడారు. గత పాలకులు ప్రజాసంక్షేమాన్ని విస్మరించారని విమర్శించారు. రైతుల సంక్షే మానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ స్వరూ ప, నాయకులు రామ్మూర్తి, మల్లన్న, రాజేంద ర్, మహేందర్, అర్కుటి సంతోష్, పెగడ రమే శ్, సరోత్తంరెడ్డి, శ్రీకాంత్, కనకయ్య, శ్రీనివాసరెడ్డి, రమేశ్, తిరుపతి, రాజయ్య సామ రాజేశ్వర్రెడ్డి, దుగ్యాల సంతోష్రావు, అర్షనపల్లి వెంకటేశ్వర్రావు, కోరుకంటి వెంకటేశ్వర్రావు, బూ ర్ల వెంకటసత్యం, నరహరి సుధాకర్రెడ్డి, బాలు సాని పరుశరాములుగౌడ్, పోల్సాని పుల్లారావు,పూరెల్ల శ్రావణ్, కొండయ్య పాల్గొన్నారు. మహిళా కళాశాలలో చేరండి గోదావరిఖని: సింగరేణి మహిళా డిగ్రీ, పీజీ కళాశాలో విద్యార్థులు చేరాలని అద్యాపకులు దేవిక, ఆషాజ్యోతి, టి.నాగమ్మ కోరారు. సోమ వారం ఆర్జీ–2 ఏరియాలో పర్యటించారు. కొత్తగూడెంలో సింగరేణి కళాశాల విశిష్టతలు, వి ద్యాబోధన, సౌకర్యాలు తదితర విషయా ల ను విద్యార్థులకు వివరించారు. సుశిక్షితులు, అ నుభవజ్ఞులైన అధ్యాపకులతో అత్యుత్తమ వి ద్యాబోధన, నాణ్యమైన విద్యాప్రమాణాలు, ఆ హ్లాదకరమైన వాతావరణం ఉందని తెలిపా రు. కార్మికులు, కార్మికేతరుల పిల్లలు కూడా ఇందులో ప్రవేశాలు పొందాలని వారు కోరారు. ‘మోడల్’ ఇళ్ల పరిశీలన కోల్సిటీ(రామగుండం): అంతర్గాం, మద్దిర్యా లో నిర్మించిన ఇందిరమ్మ మోడల్ హౌస్లను బల్దియా అధికారులు సోమవారం పరిశీలించా రు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రామన్ మా ట్లాడు తూ.. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి తక్కువ ఖర్చుతో త్వరితగతిన ఇళ్ల ని ర్మాణం పూర్తిచేశామన్నారు. డిప్యూటీ ఎగ్జిక్యూ టివ్ ఇంజినీర్ హన్మంతరావు నాయక్, గృహ నిర్మాణ శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ దస్తగిరి, ఏఈ భవనేశ్వరి పాల్గొన్నారు. సమ్మె నోటీసు అందజేత పాలకుర్తి: బసంత్నగర్ అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీ హెచ్ఆర్ మేనేజర్ పార్థసారథికి కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం స మ్మె నోటీసు అందజేశారు. బీజేపీ ప్రభుత్వం కార్మిక చట్టాలను రద్దుచేసి 4 లేబర్ కోడ్లను అమలు చేయడం ద్వారా కార్మిక రంగం అనేక సవాళ్లు ఎదుర్కొంటుందన్నారు. కేంద్ర ప్రభు త్వ చర్యలను నిరసిస్తూ జూలై 9వ తేదీన చేపట్టిన సార్వత్రిక సమ్మెను సంఘటిత, అసంఘటిత కార్మికులు విజయవంతం చేయాలని నా యకులు కోరారు. ఈకార్యక్రమంలో ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు వి.చందర్, ఉపాధ్యక్షుడు మేకల సతీశ్, సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి సీపెల్లి రవీందర్, కృష్ణ పాల్గొన్నారు. ఎఫ్ఎల్ఎన్ను విజయవంతం చేయాలి ధర్మారం(ధర్మపురి): ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమా న్ని విజయవంతం చేయాలని జిల్లా విద్యాధికా రి మాధవి కోరారు. వివిధ గ్రామాల్లోని ప్రభు త్వ, ప్రైవేటు పాఠశాలలను సోమవారం ఆమె తనిఖీ చేశారు. విద్యా బోధన విధానం, ఎఫ్ఎ ల్ఎన్, యూనిఫామ్స్, పాఠ్యపుస్తకాలు పంపి ణీ గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నా రు. మాధవి మాట్లాడుతూ, విద్యార్థులతో కథ ల పుస్తకాలు చదివించాలన్నారు. లైబ్రరీ పీరియడ్స్ అన్ని స్కూళ్లలో నిర్వహించాలని సూచించారు. మంచిగా చదివిన పిల్లలను వెనుకబడి పిల్లలతో గ్రూప్లుగా విభజించి చదివించాలని సూచించారు. ఎంఈవో ప్రభాకర్, సీఆర్పీలు కవలిత, కుమారస్వామి పాల్గొన్నారు. -
న్యాయవాద శిక్షణకు ఊతం
● ఉపకార వేతనం, గ్రాంట్ అందజేయనున్న ప్రభుత్వం ● ఎస్సీలకు సదావకాశం ● 36 నెలలపాటు నెలకు రూ.3వేల చొప్పున చెల్లింపు ● బార్ కౌన్సిల్ అడ్మిషన్ ఫీజు సైతం.. కరీంనగర్: షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో 2025–26 సంవత్సరంలో అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్లో మూడు సంవత్సరాల శిక్షణ పొందేందుకు ఎంపిక చేసిన లా–పట్టుభద్రులు సీనియర్ల వద్ద శిక్షణ పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ఉపకార వేతనం, గ్రాంట్ ఎంతో దోహదపడుతుంది. ఎస్సీ కులాలకు చెందిన న్యాయవాదులకు ఆర్థిక సహకారమందించే ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. కోర్సు పూర్తి చేయడమే కాకుండా.. కేసులు ఎలా వాదించాలి.. దానికి సంబంధించిన పత్రాలను ఎలా సిద్ధం చేయాలి.. పేషీల అనుశీలన.. న్యాయమూర్తి తీర్పు ప్రతి గురించి తెలుసుకోవడం ఇవన్నీ న్యాయవాద వృత్తిలో భాగాలే. వీటి గురించి సమగ్రంగా తెలుసుకోవాలంటే జూనియర్లు సీనియర్ న్యాయవాదుల వద్ద శిక్షణ పొందడం తప్పనిసరి. తద్వారా పట్టు సాధించడానికి అవకాశం కలుగుతుంది. ఇలా శిక్షణ పొందడం కొంత ఖర్చుతో కూడుకున్న పని. ప్రభుత్వం ఎస్సీ కులాలకు చెందిన న్యాయవాదులకు తగిన స్లయిఫండ్, గ్రాంట్ను అందిస్తోంది. ఇటీవల ఈ మొత్తాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. తద్వారా న్యాయవాదులు తగిన శిక్షణ పొందేందుకు దోహదపడుతుంది. న్యాయవాద వృత్తి చేపట్టే వారి సంఖ్య ఇటీవల క్రమంగా పెరుగుతోంది. ఇంటర్ తర్వాత ఐదేళ్లు, డిగ్రీ తర్వాత మూడేళ్ల కోర్సు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ప్రత్యేకత కోసం ఎల్ఎల్ఎం కోర్సును అభ్యసిస్తారు. ఎల్ఎల్బీ పూర్తి చేసిన వారు న్యాయవాద వృత్తిలో రాణించాలంటే సీనియర్ల వద్ద శిక్షణ తప్పనిసరి. కొన్ని నెలలపాటు వారి వద్ద సెక్షన్లు, కేసులు, వాటి పూర్వాపరాలు, బెయిల్ మంజూరు, శిక్ష, జరిమానాలు ఇలా అన్ని అంశాలపై అవగాహన పెంచుకునేందుకు వీలు కలుగుతుంది. పెరిగిన సహకారం న్యాయవాది వృత్తిలోకి అడుగుపెట్టిన వారు సీనియర్ల వద్ద శిక్షణ పొందేందుకు ఖర్చవుతుంది. పుస్తకాలు, నల్ల కోటు, కంప్యూటర్ తదితర వాటిని కొనుగోలు చేయాల్సిందే. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం షెడ్యూల్డ్ కులాలకు చెందినవారికి ఆర్థిక సహకారమందించాలని నిర్ణయించి కొన్నేళ్లుగా ఆ శాఖ ఆధ్వర్యంలో అమలు చేస్తున్నారు. ఈక్రమంలో ఇచ్చే గ్రాంట్, ఉపకార వేతనాన్ని పెంచారు. గత సంవత్సరం వరకు ప్రతి నెలా రూ.వెయ్యి ఉపకార వేతనాన్ని 36 నెలలపాటు అందజేసేవారు. దీనికితోడు వన్ టైం గ్రాంట్ పేరిట రూ.6వేలు చెల్లించేవారు. ఇటీవల ఉపకార వేతనాన్ని రూ.వెయ్యి నుంచి రూ.3వేలకు పెంచారు. వన్టైం గ్రాంటును ఏకంగా రూ.50వేలకు పెంచారు. దీనికితోడు బార్ కౌన్సిల్ నిర్ణయించిన రూ.585 అడ్మిషన్ ఫీజును సైతం షెడ్యూల్డ్ కులాల సంక్షేమ శాఖ చెల్లిస్తుంది. ఆన్లైన్లో దరఖాస్తుకు అవకాశం ప్రభుత్వమందిస్తున్న ఉపకార వేతనం, గ్రాంట్ కోసం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా షెడ్యూల్డ్ కులాలకు చెందిన న్యాయవాదులు అర్హులు. ఇందుకు గాను షెడ్యూల్డ్ కులాలకు చెందిన న్యాయవాదులు.. సీనియర్ల వద్ద శిక్షణ పొందేందుకు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ రోడ్డులో గల అంబేడ్కర్ భవన్లోని షెడ్యూల్డ్ కులాల సంక్షేమ శాఖ కార్యాలయంలో జూలై 31 లోగా దరఖాస్తు చేసుకో వాలి. వచ్చిన దరఖాస్తులను జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఏర్పాటైన కమిటీ పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటుంది. కమిటీలో జిల్లా జడ్జి, ఎస్సీ వెల్ఫేర్ డీడీ సభ్యులుగా ఉంటారు. మూడు సంవత్సరాలు సర్వీసు పైబడిన జూనియర్ న్యాయవాదులను సీనియార్టీ ప్రాతిపదికన ఎంపిక చేయనున్నారు. ఆగస్టు 10న అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 1 జూలై 2025 నాటికి 23 నుంచి 35 ఏళ్ల లోపు వయస్సుండి, సంవత్సర ఆదాయం రూ.2లక్షలకు మించొద్దు. కులం, ఆదాయం, గ్రాడ్యుయేషన్ లా సర్టిఫికెట్లు, బార్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ పాస్ పుస్తకం జిరాక్స్ కాపీలతో దరఖాస్తు చేసుకోవాలి. ఎంపికై న వారి ఖాతాల్లో ట్రెజరీ ద్వారా డబ్బులు అందజేయనున్నారు. -
పసుపు పంటతో ఆదాయం
పసుపు ఇంటి పంట. జిల్లాలో ప్రతీ రైతు కనీసం ఎకరం నుంచి నాలుగెకరాల వరకు సాగు చేస్తారు. నేను 3 ఎకరాల్లో సాగు చేశా. ప్రస్తుతం రైతుల వద్ద లేనప్పుడు క్వింటాల్ ధర రూ.16 వేలకు చేరింది. పసుపు బోర్డు ఏర్పాటైనందున, ఈ ఏడాదైనా ధర వస్తుందనే ఆశతో పంట సాగు చేస్తున్నాం. – సత్యంరెడ్డి, ముత్యంపేట, మల్లాపూర్ ఇక్కడి భూములు అనుకూలం పసుపు పంటకు జిల్లాలోని ఎర్రనేలలు అనుకూలం. సాగులోనే కాకుండా దిగుబడి తీయడంలోనూ జిల్లా రైతులదే పైచేయి. ఇటీవల పంట వేసేందుకు, తవ్వేందుకు యంత్రాలు, సాగు నీరు, ఎరువుల కోసం డ్రిప్ ఉపయోగిస్తున్నారు. పెరుగుతున్న ధరలు మళ్లీ ఆశలు రేకెత్తిస్తున్నాయి. – శ్యాంప్రసాద్, జిల్లా ఉద్యానశాఖ అధికారి, జగిత్యాల -
కోటిలింగాలలో పురాతన నాణేలు లభ్యం
వెల్గటూర్(ధర్మపురి): శాతవాహనుల తొలి రాజధానిగా ప్రసిద్ధి చెందిన కోటిలింగాలలో పురాతన నాణేలు లక్ష్యమైన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రెండురోజుల క్రితం కోటిలింగాల గోదావరిలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారునికి గోదావరి తీరంలో 1911 సంవత్సరానికి చెందిన ఓవైపు విక్టోరియా మహారాణి ఫొటోతో, మరోవైపు రాజు గుర్రాన్ని తోలుతున్న ఫొటోతో ఉన్న సుమారు 22 నాణేలు లభ్యమయ్యాయి. వాటిని చూసి ఆశ్చర్యపోయిన మత్స్యకారుడు మాజీ సర్పంచ్ ముత్తయ్యకు తెలుపగా ఆదివారం విషయం వెలుగుచూసింది. కోటిలింగాల గ్రామంలో గతంలో జరిపిన తవ్వకాలలో శాతవాహనులకు సంబంధించిన అనేక నాణేలు, చారిత్రక అవశేషాలు వెలుగులోకి వచ్చాయి. అప్పటి ప్రభుత్వం తవ్వకాలను మధ్యలో ఆపేయడంతో చాలా వరకు కోటిలింగాల చరిత్ర మరుగున పడిపోయింది. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి కోటిలింగాలలో తవ్వకాలు చేపడితే ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన చారిత్రక అవశేషాలు బయటపడతాయని, కోటిలింగాల గొప్ప పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతుందని చరిత్రకారులు చెబుతున్నారు. -
ఠాణాలో వీఆర్ఏ ఆత్మహత్యాయత్నం
తంగళ్లపల్లి(సిరిసిల్ల): తంగళ్లపల్లి పోలీస్స్టేషన్లో ఓ వీఆర్ఏ పురుగుల మందు తాగడం కలకలం రేపింది. ఎస్సై రామ్మోహన్ తెలిపిన వివరాలు.. మండలంలోని చీర్లవంచకు చెందిన వేల్పుల సత్తవ్వ భర్త బలరాం 15 ఏళ్ల క్రితం తన తమ్ముళ్లు వేల్పుల కృష్ణ, వేల్పుల బాలకిషన్తో కలిసి సర్వేనంబర్ 586లో 7 ఎకరాల భూమి కొనుగోలు చేశారు. అందులో రో డ్డుకు 1.10 ఎకరాలు పోగా మిగతా భూమిని సమానంగా పంచుకున్నారు. ఐదేళ్ల క్రితం బలరాం మరణించగా వీఆర్ఏగా పనిచేస్తున్న అతడి తమ్ముడు వేల్పుల కృష్ణ మొత్తం భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించాడు. తనకు అనుకూలంగా హద్దురాళ్లను మార్చుకున్నాడు. 20 రోజుల క్రితం సత్తవ్వను ఆమె భూమిలోకి వెళ్లకుండా అడ్డుకోవడంతోపాటు చంపుతానని బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో సత్తవ్వ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా కృష్ణపై కేసు నమోదైంది. కాగా ఆదివారం మధ్యాహ్నం 12.35 గంటలకు కృష్ణ పురుగులమందుతో పోలీస్స్టేషన్కు వచ్చాడు. పోలీసులపై ఒత్తిడి తెచ్చి కేసు నుంచి బయటపడాలనే ఉద్దేశంతో పురుగులమందు తాగాడు. వెంటనే అతడిని జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ప్రాణాపాయం తప్పింది. కాగా ఈ ఘటనపై ఎస్సై రామ్మోహన్ను వివరణ కోరగా, చట్టప్రకారమే కేసు నమోదు చేశామన్నారు. వేధింపులకు పాల్పడ్డామనడం అవాస్తవమని స్పష్టం చేశారు. న్యాయం చేయండి : వీఆర్ఏ బాధితులు వీఆర్ఏ కృష్ణ నుంచి తమ భూమిని ఇప్పించాలని బాధితులైన అతడి బంధువులు వేల్పుల సత్తవ్వ, అ నిల్కుమార్, రవీందర్ కోరారు. ఆదివారం మీడి యా ఎదుట తమ గోడు వెల్లబోసుకున్నారు. కృష్ణ రె వెన్యూశాఖలో పనిచేస్తుండగా తన పలుకుబడిని ఉ పయోగించి సర్వే నంబర్ 586లో రెండు గుంటల భూమికిగాను రెండెకరాల భూమి మ్యుటేషన్ చే యించుకున్నాడని ఆరోపించారు. గతంలో రవీందర్పై హత్యాయత్నానికి పాల్పడగా కేసు నమోదై, ఏ డేళ్ల జైలుశిక్ష కూడా పడిందన్నారు. కానీ, అప్పీల్కు వెళ్లి బెయిల్పై బయట తిరుగుతున్నాడని తెలిపా రు. కలెక్టర్, ఎస్పీ స్పందించి విచారణ చేపట్టి తమ కు న్యాయం చేయాలని బాధితులు వేడుకున్నారు. -
పసుపు వైపే రైతన్న చూపు
జగిత్యాలఅగ్రికల్చర్: పసుపు పంటకు ఓ వైపు ప్రభుత్వ మద్దతు ధర లేకపోవడం, మరో వైపు వ్యాపారులు సిండికేట్గా మారి బహిరంగ మార్కెట్లో రేటు తగ్గించినా, పసుపు సాగుపై జిల్లా రైతుల ఆసక్తి మాత్రం తగ్గడం లేదు. ఏయేటికాయేడు ధర వస్తుందిలే అనే ఆశతో సాగు చేస్తున్నారు. అలాగే, పసుపు క్వింటాల్కు రూ.15 వేల మద్దతు ధర చెల్లించాలంటూ రైతులు ఏటా పోరాటం చేస్తూనే ఉన్నారు. అయితే, రైతుల వద్ద ఉన్న పసుపు వ్యాపారుల చేతుల్లోకి పోయిన తర్వాత క్వింటాల్కు రూ.16–17 వేల వరకు ధర పలకడంతో, మళ్లీ అన్నదాతల్లో ఆశలు చిగురిస్తున్నాయి. దీనికి తోడు నిజమాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటుతో ధరల్లో కదలిక వస్తుందనే ఆశతో ప్రస్తుతం జగిత్యాల జిల్లాలో దాదాపు 40 వేల ఎకరాల్లో పంట సాగు చేస్తున్నారు. ఇంటి పంటగా భావించి.. పసుపు పంటకు ధర ఉన్నా, లేకున్నా ఇంటి పంటగా భావించి జిల్లాలో పలువురు రైతులు కనీసం ఎకరం నుంచి ఐదెకరాల వరకు సాగు చేస్తున్నారు. ఇక్కడి రైతులను ఆర్థికంగా స్థితిమంతులను చేసింది కూడా పసుపు పంటే కావడం విశేషం. అనుకూలమైన ఎర్ర నేలలు, డ్రిప్ ద్వారా సాగునీరు, రసాయన ఎరువులు అందించే వెసులుబాటు ఉండటంతో రైతులు పంట వైపు ఆసక్తి చూసుతున్నారు. ఇక్కడి రైతులు అధిక దిగుబడి ఇచ్చే గుంటూర్, ఆర్మూర్, కుర్కుమిన్ శాతం ఎక్కువ ఉండే సుగుణ, సుదర్శన్ వంటి రకాలు సాగు చేస్తున్నారు. ఇటీవల కొందరు అభ్యుదయ రైతులు కుర్కుమిన్ శాతం ఎక్కువగా ఉండే కేరళ రకాలను కూడా సాగు చేస్తున్నారు. అయితే, పలువురు రైతులు విత్తనాన్ని కొనుగోలు చేయకుండా, గతేడాది పంట నుంచి నాణ్యమైన విత్తనాన్ని సేకరించుకుని వేస్తుంటారు. పెరిగిన సాగు ఖర్చు పసుపు ఏడాది పంట. దాదాపు 9–10 నెలల పాటు భూమిలోనే ఉంటుంది. పంటకాలంలో అన్నీ ఖర్చులు కలుపుకుని ఎకరాకు రూ.లక్ష నుంచి రూ.1.25 లక్షల ఖర్చు వస్తుంది. ఎకరాకు ఒక లారీ కోడి ఎరువు(దాదాపు రూ.25 వేలు) వేస్తారు. రెండుమూడు సార్లు దున్నడానికి రూ.5 వేలు, విత్తనం వేసేటప్పుడు రూ.5 వేలు, రసాయన ఎరువులు రూ.8 వేలు, మూడుసార్లు కలుపు తీసేందుకు కూలీల ఖర్చు రూ.5 వేలు, తవ్వకం సమయంలో రూ.40 వేలు, ఉడకబెట్టి, ఆరబెట్టేందుకు రూ.6 వేలు, విత్తనాల ఖర్చు రూ.15 వేలు.. ఇలా అన్నీ కలుపుకుంటే రూ.లక్ష వరకు దాటుతుంది. మార్కెట్కు తరలించేందుకు రవాణా, అడ్తి, కమీషన్, క్యాష్ కటింగ్ వంటి చార్జీలు లెక్కలోకి తీసుకుంటే మరింత ఖర్చు వస్తుంది. ధరలు పెరుగుతాయనే ఆశతో.. ఒకప్పుడు పసుపు ధరలు బంగారంతో పోటీ పడ్డాయి. రెండేళ్ల నుంచి పసుపు ధరలు కొంత మేర ఆశాజనకంగా ఉన్నాయి. క్వింటాల్కు రూ.10–12 వేల ధరలు పలుకుతున్నాయి. ఇటీవల క్వింటాల్కు రూ.16 వేల వరకు పలకడంతో రైతులు ఉత్సాహంగా సాగుకు ఉపక్రమిస్తున్నారు. పసుపు బోర్డు ఏర్పాటు కావడం, అంతర్జాతీయంగా డిమాండ్ పెరిగి రానున్న రోజుల్లో ఎగుమతులు పెరుగుతాయనే ఆశతో జిల్లాలోని మెట్పల్లి, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్, జగిత్యాల రూరల్, కోరుట్ల, కథలాపూర్, రాయికల్, మేడిపల్లి మండలాల్లో అత్యధికంగా సాగు చేస్తున్నారు. ధర ఉన్నా.. లేకున్నా జగిత్యాల జిల్లాలో 40 వేల ఎకరాల్లో సాగు పెరుగుతున్న పసుపు ధరలతో రైతుల్లో ఆశలు -
జాతరలో ఇరువర్గాల ఘర్షణ
మెట్పల్లి(కోరుట్ల): పట్టణంలోని మఠంవాడలో ఆదివారం జరిగిన పెద్దమ్మతల్లి జాతర ఉత్సవాల సందర్భంగా రెండువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఎస్సై కిరణ్కుమార్ కథనం ప్రకారం.. ఉత్సవాలు జరుగుతున్న సమయంలో జక్కం రమేశ్, జక్కం పెద్దరాజం, జక్కం నడ్పిరాజం, జక్కం పవన్, జక్కం శేఖర్, జక్కం రాములుకు.. యామ రాజయ్య, యామ రంజిత్, యామ ప్రకాశ్, యామ మారుతి, యామ గంగాధర్తో గొడవ జరిగింది. ఈ క్రమంలోనే పరస్పరం దాడి చేసుకున్నారు. ఇందులో పలువురికి గాయాలయ్యాయి. అనంతరం ఇరు వర్గాలు పోలీస్స్టేషన్కు వెళ్లి అక్కడ కూడా గొడవపడ్డారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకొని వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇందులో గాయపడినవారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇరువర్గాల ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు. -
బీటీఆర్ ఫౌండేషన్తో పేదలకు సాయం
ఇల్లంతకుంట(మానకొండూర్): పేదలకు సేవ చేయాలనే సంకల్పంతో ముందుకెళ్తున్నారు బీ టీఆర్ ఫౌండేషన్ బాధ్యులు. ఇ ల్లంతకుంట మండలం నర్సక్కపేట గ్రామానికి చెందిన బెంద్రం తిరుపతిరెడ్డి 2020లో స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేశారు. సంస్థ పేరిట ఇప్పటి వరకు ఎవరి నుంచి విరాళాలు సేకరించలేదని, తన సొంత పొల ం 7 ఎకరాలు అమ్మి పేదలకు సాయం చేస్తున్నట్టు తిరుపతిరెడ్డి పేర్కొన్నారు. కరోనా సమయంలో 505 కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ.2 వేల చొప్పున 12 రకాల ఆహార వస్తువులు అందించారు. చనిపోయిన వ్యక్తుల కుటుంబాలకు (దాదా పు 965) 50 కిలోల చొప్పున బియ్యం అందజేశారు. 520 మంది ఆడపిల్లల వివాహానికి రెండు టే కు మంచాల చొప్పున అందజేశారు. ఐదేళ్ల నుంచి వి నాయక మండపాలకు ధూప దీప నైవేద్య ఖర్చులకు గాను మండలంలోని ప్రతి మండపానికి రూ. 5వేలు అందజేస్తున్నారు. 2010 నుంచి వేసవిలో ఇల్లంతకుంట బస్టాండ్ ఆవరణలో చలివేంద్రం ఏ ర్పాటు చేసి ప్రయాణికుల దప్పిక తీరుస్తున్నారు. అ ంతేకాకుండా మండలంలోని విద్యార్థులకు బస్సు పాసులు అందించడంలో సాయం చేస్తుంటారు. ఇ లా మండలంలోని పేదలకు తిరుపతిరెడ్డి సహాయ సహకారాలు అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. -
ఎస్యూలో అలరించిన క్రీడా వార్షికోత్సవం
కరీంనగర్క్రైం: కరీంనగర్లోని శాతవాహన యూనివర్సిటీలో వార్షిక క్రీడా దినోత్సవం ఆదివారం ఉత్సాహంగా జరిగింది. ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ ఉమేశ్కుమార్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ చదువుతో పాటు ఆటల్లోనూ యూనివర్సిటీని అభివృద్ధి చేస్తామన్నారు. వందేమాతరం శ్రీనివాస్, మధుప్రియలు హాజరై విద్యార్థులను ఆటపాటల్లో ఆనందపరిచారు. విద్యార్థులు హుషారుగా నృత్యాలు చేసి వేదికను హోరెత్తించారు. విశిష్ట అతిథి ఐఐసీటీ డైరెక్టర్ శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులు లక్ష్యంతో ముందుకు సాగాలన్నారు. పీజీ తర్వాత ఉద్యోగాన్ని సాధించే విధంగా లక్ష్యాన్ని ఏర్పరుచుకోవాలని ఆకాంక్షించారు. ప్రత్యేక అతిధి కిరణ్ మాట్లాడుతూ విశ్వవిద్యాలయ విద్యార్థులకు చదువుతోపాటు ఆటపాటలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయన్నారు. అనంతరం వివిధ క్రీడల్లో విజేతలకు బహుమతులు అందించారు. -
సేవామూర్తులు
ప్రజా సేవే పరమార్థంగా పలువురు స్వచ్ఛంద సంస్థల బాధ్యులు పేదలకు సహాయ సహకారాలు అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. సోమవారం ప్రజాసేవ దినం సందర్భంగా కథనం. దివ్యాంగుల సేవలో.. జమ్మికుంట(హుజూరాబాద్): మున్సిపల్ పరిధిలోని మారుతీనగర్లో మానసిక దివ్యాంగ విద్యార్థుల ప్రత్యేక పాఠశాలను మానసిక దివ్యాంగ విద్యార్థుల తల్లిదండ్రుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం 50 మంది విద్యార్థులతో పాఠశాల కొనసాగుతుంది. 1995లో ఐదుగురు దివ్యాంగ పిల్లలతో పాఠశాల ప్రారంభమై మానసిక దివ్యాంగ సేవా సంస్థగా రూపాంతరం చెందింది. 1997లో అప్పటి కరీంనగర్ జిల్లా కలెక్టర్ బీఆర్ మీనా రెండెకరాల ప్రభుత్వ స్థలం కేటాయించగా, దాతల సాయంతో స్కూల్ నిర్మాణం జరిగింది. సంతృప్తినిచ్చింది నా ఇద్దరు పిల్లలు దివ్యాంగులు కావడంతో వారి పనులు వారు చేసుకునేలా శిక్షణ, విద్యాబుద్ధులు నేర్పించాలనే సంకల్పంతో 1995లో నా సొంత ఇంట్లో పాఠశాల ప్రారంభించా. తర్వాత ప్రత్యేక పాఠశాల ఏర్పాటుతో 185 మంది వరకు విద్యాబుద్ధులు, శిక్షణ అందించగా ఉపాధితోపాటు వారి పనులు వారి ఇంటి వద్ద చేసుకుంటూ తల్లిదండ్రులకు చేదోడుగా ఉండడం సంతోషం కలిగించింది. దివ్యాంగులకు విద్య అందించడంతోపాటు సేవ చేయడం సంతృప్తినిచ్చింది. ప్రస్తుతం దాతల సాయంతో పాఠశాల నిర్వహిస్తున్నం. ప్రభుత్వం గ్రాంట్ మంజూరు చేస్తే దివ్యాంగులకు మెరుగైన శిక్షణతో వారి భవిషత్తుకు బాటలు పడుతాచి. – బచ్చిరాములు, దివ్యాంగ పేరెంట్స్ సంఘం అధ్యక్షుడు, జమ్మికుంట -
మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి
జ్యోతినగర్(రామగుండం): యువత మత్తు పదా ర్థాలకు దూరంగా ఉండాలని ఎన్టీపీసీ ఎస్సై ఉదయ్కిరణ్ సూచించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మత్తు పదార్థాలపై ఎన్టీపీసీ పోలీసుస్టేషన్లో ఆదివారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ, మత్తు పదార్థాలకు బానిసలుగా మారితే జీవితం అర్ధంతరంగా ముగిసిపోతుందని అన్నారు. అనారోగ్య సమస్యలతోపాటు కుటుంబం, సమాజంపై ప్రతికూల ప్రభావం చూపుతాయని అన్నారు. యువత మానసిక, శారీరక అనర్థాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మత్తు పదార్థాలతో కలిగే అనర్థాలు, వాటి నుంచి ఎలా బయటపడాలో వివరిస్తూ వివిధ రూపాల్లో ప్రదర్శనలు నిర్వహించారు. ఉద్యోగులు, విద్యార్థులు, స్థానిక ప్రజలు సదస్సుకు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఏఎస్సైలు నా యుడు, తిరుపతి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. గడువు పొడిగింపు సుల్తానాబాద్(పెద్దపల్లి): దివ్యాంగులు ఉపకరణాల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసేందుకు ఈనెల 27వ తేదీ వరకు గడువు పొడించారని జిల్లా సంక్షేమ అధికారి వేణుగోపాల్ తెలిపారు. ఆధునికీకరించిన ఉపకరణాలను 100 శాతం రాయితీపై అర్హులైన దివ్యాంగులకు అందిస్తారన్నారు. వివరాలకు https://tsobmms.cgg.gov.in// వెబ్సైట్లో దరఖాస్తు చేయాలని ఆయన కోరారు. -
సమ్మెలో పాల్గొనాలి
జూలపల్లి(పెద్దపల్లి): కార్మికులకు నష్టం చేస్తూ యజమానులకు లాభం చేకూర్చేలా రూపొందించిన నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేయాలనే డిమాండ్తో జూలై 9న చేపట్టే దేశవ్యాప్త సమ్మె లో అన్నిరంగాల కార్మికులు పాల్గొనాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి జ్యోతి కోరా రు. సమ్మె ప్రచార పోస్టర్ను పంచాయతీ కార్మి కులతో కలిసి మండల కేంద్రంలో ఆదివారం ఆమె ఆవిష్కరించి మాట్లాడారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని, ప్రతీ కార్మికుడికి కనీస వేతనం రూ.26వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి నగేశ్, నాయకులు సంకెన్ల చంద్రమౌళి, న్యాతరి లచ్చయ్య, ఆంజయ్య, హన్మంతు, ప్రవాంత్, కనుకయ్య తదితరులు పాల్గొన్నారు. కార్యకర్తలకు బీఆర్ఎస్ అండ జూలపల్లి(పెద్దపల్లి): వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటాలని మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి ఆకాంక్షించారు. కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందన్నారు. పెద్దాపూర్ గ్రామంలో ఆదివారం బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా దాసరి మనోహర్రెడ్డి మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయమే లక్ష్యంగా పనిచేయాలని కోరారు. అనంతరం ఇటీవల నిర్మించిన పోచమ్మ తల్లి ఆలయంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠాపనలో ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్తో కలిసి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రఘువీర్సింగ్ తదితరులు పాల్గొన్నారు. ఎన్టీపీసీలో నియామకాలు చేపట్టాలి జ్యోతినగర్(రామగుండం): ఎన్టీపీసీలో నూత న నియామకాలు చేపట్టాలని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు వడ్డెపల్లి రాంచందర్ అన్నారు. ఎన్టీపీసీ పర్మినెంట్ టౌన్షిప్లోని జ్యోతి భవన్లో ఆదివారం జరిగిన జాతీయ ఎన్టీపీసీ మజ్దూర్ సంఘ్ త్రైపాక్షిక సదస్సులో పాల్గొని ఆయన మాట్లాడారు. భారతీయ మజ్దూర్ సంఘ్ దేశంలోని కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందన్నారు. అనంతరం సదస్సులో పలు తీర్మానాలు చేశారు. పీఎఫ్పై వార్షిక వడ్డీ రూ.2.5 లక్షలకు పైగా ఉంటే వడ్డీరేటు తగ్గించాలని, కాంట్రాక్ట్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం చెల్లించేలా చర్యలు తీసుకోవాలని, ఇందుకోసం యూనియన్ కృషి చేయాలని తీర్మానాలు చేశారు. కార్యక్రమంలో టఎన్టీపీసీ ఎన్బీసీ సభ్యులు మల్లేశం, రాంనాథ్ గణేశ్, సాగర్రాజు, చల్లా సత్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కుల రహిత సమాజ నిర్మాణమే లక్ష్యం సుల్తానాబాద్(పెద్దపల్లి): కుల రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఏఐఎ ఫ్బీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా కార్యదర్శి బొంకూరి సురేందర్ సన్నీ అన్నారు. ఆదివారం జి ల్లా కేంద్రంలోని ప్రెస్క్లబ్లో ఆల్ ఇండియా ఫా ర్వర్డ్ బ్లాక్ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా ని ర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్చేసి మి ఠాయిలు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, అంతరాలు లేని దృఢమైన నూ తన భారతవని నిర్మాణమే లక్ష్యంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ పార్టీ ప్రారంభించారన్నారు. దేశంలోని అన్నివర్గాల హక్కుల కోసం నిత్యం పోరాటాలు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండ సురేందర్రెడ్డి నాయకత్వంలో రానున్న స్ధానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులను పోటీలో నిలుపుతామని ఆయన ప్రకటించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పులిపాక అనూష, కల్లేపల్లి రవి, కందుల మౌనిక, ప్రశాంత్, బొంకూరి నవీన్, సింగారపు భవాని, పల్లె రాజేందర్, భూమయ్య, వినయ్, శ్యాం, జోగు అవినాష్ తదితరులు పాల్గొన్నారు. -
సరిహద్దులో హై అలెర్ట్
● అటు మావోయిస్టులు.. ఇటు పోలీసులు ● భయం భయంగా అటవీ గ్రామాల ప్రజలుమంథని: సరిహద్దు రా ష్ట్రాలైన ఛత్తీష్గఢ్, మహారాష్ట్ర, ఆంధ్రా రాష్ట్రాల్లో మావోయిస్టులు, పోలీసుల మధ్య జరుగుతున్న యుద్ధంతో మావోయిస్టు ప్రభావిత ప్రాంతంగా పేరున్న తూర్పు డివిజన్లో ఎప్పుడు ఏం జరుగుతుందోననే భయాందోళనలు అటవీప్రాంతవాసుల్లో నెలకొన్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ని తూర్పు, పశ్చిమ డివిజన్లో రెండు దశాబ్దాలకుపైగా మావోయిస్టుల ప్రభావం పెద్దగా కనిపించలేదు. అడపాదడపా తూర్పు డివిజన్లో మా టవోయిస్టులు తమ ఉనికి కోసం ఆరాటపడుతుంటే.. పోలీసులు తిప్పుకొడుతున్నట్లు సమాచారం. ఇటీవల కేంద్రప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ క టటగార్తో మావోయిస్టు పార్టీకి చెందిన పెద్ద క్యాడర్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోతోంది. తాజాగా ఆంధ్రా, ఒడిశా సరహద్దుల్లో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీ కీలక నేత గాజర్ల రవి ఉరఫ్ గణేశ్ మరణించిన విషయం తెలిసిందే. అయితే, తూర్పు డివిజన్లో చాలాఏళ్లపాటు పనిచేసి.. అనేక ఘనటలకు పాల్పడిన గాజర్ల రవి ఎన్కౌంటర్కు ప్రతీకారంగా మావోయిస్టు పార్టీ హింసాత్మక చర్యలకు పాల్పడుకుండా పోలీసులు గట్టి నిఘా పెట్టినట్లు సమాచారం. తెలంగాణ– ఛత్తీష్గఢ్ సరిహద్దుల్లోని బీజాపూర్ జిల్లా పామేడు పోలీస్స్టేషన్ పరిధిలో ఇన్ఫార్మర్ నెపంతో మావోయిస్టులు ఇటీవల ఇద్దరిని హత్య చేశారు. ఈ క్రమంలో ఇటు మావోయిస్టులు, అటు పోలీసుల చర్యలతో సరిహద్దు గ్రామాల్లో భయానక వాతావరణం నెలకొంది. ఏ క్షణాన ఏం జరుగుతుందోననే ఆందోళన వ్యక్తమవుతోంది. సరిహద్దుల్లోకి మావోయిస్టు దళాల చొరబాటు లేకుండా పోలీసుల నిఘా గట్టిగానే ఉన్నట్లు సమాచారం. ఏదిఏమైనా పోలీసులు, మావోయిస్టుల చర్యలతో సరిహద్దు గ్రామాల్లో ఆందోళనకర వాతావరణం నెలకొంది. -
‘బోనస్’ కోసం రైతుల నిరీక్షణ
● అన్నదాతల బ్యాంకు ఖాతాల్లో జమకాని సొమ్ము ● వానాకాలం పంట పెట్టుబడికి అన్నదాత తిప్పలు సుల్తానాబాద్(పెద్దపల్లి): సన్నవడ్ల సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అందిస్తున్న బోనస్ సొమ్ము అన్నదాతల బ్యాంకు ఖాతాల్లో ఇంకా జమకాలేదు. వసతి గృహాలు, రేషన్షాపులు, ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్న రాష్ట్రప్రభుత్వం.. ఇందుకు అవసరమైన సన్నవడ్లు అధిక విస్తీర్ణంలో పండించేలా రైతులకు ప్రోత్సాహకంగా బోనస్ అందిస్తోంది. ఒక్కో క్వింటాల్కు రూ.500 చొప్పున బోనస్ చెల్లిస్తామని సీఎం రేవంత్రెడ్డి గతంలో హామీ ఇచ్చారు. అందు లో భాగంగానే గతేడాది వానకాలంలో బోనస్ సకాలంలో, సజావుగా పంపిణీ చేశారు. ఈఏడాది యా సంగి ధాన్యం కొనుగోళ్లు ముగిసి 20 రోజులు కావొస్తున్నా.. బోనస్ నిధులు ఇంకా విడుదల కాలేదు. వానాకాలం పంట పెట్టుబడికి.. మొన్నటి యాసంగి సీజన్లో జిల్లావ్యాప్తంగా సుమారు 3,98,006 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. ధాన్యం విక్రయించిన రైతుల వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమచేశారు. కానీ, బోనస్ ఎప్పుడు చెల్లిస్తారోనని రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. దుక్కిదున్నడం, విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల కొనుగోళ్లకు బోనస్ డబ్బులు అక్కరకు వస్తాయని రైతులు ఎంతోఆశతో ఉన్నారు. కానీ, సుమారు ఇరవై రోజులు గడుస్తున్నా బోనస్ పైసలు పడకపోవడంతో అన్నదాతలు నిరాశ చెందుతున్నారు. -
రక్షణపై పట్టింపు లేదు!
● వరుస ప్రమాదాలతో ఓసీపీ–3 కార్మికుల ఆందోళన ● హాలేజీ రోడ్ల వెంట రక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ గోదావరిఖని: సింగరేణి బొగ్గు గనుల సంస్థ రామగుండం డివిజన్–2 పరిధిలోని ఓసీపీ–3లో వరుసగా చోటుచేసుకుంటున్న ప్రమాదాలు కార్మికుల్లో ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ప్రధానంగా క్వారీలో హాలేజీ రోడ్లు సరిగా లేక తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని కార్మికులు పేర్కొంటున్నారు. ఈనెలలో మూడు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. అదృష్టవశాత్తు ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ప్రణాళికలేమితోనే.. సింగరేణిలోనే అత్యధిక బొగ్గు ఉత్పత్తి చేసే ఓపెన్కాస్ట్ ప్రాజెక్టు–3(ఓసీపీ)లో అధికారులు ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. దీంతోనే తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని అంటున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత విషయం బయటకు తెలియకుండా అధికారులు జాగ్రత్త పడుతున్నారు. ఈనెల మొదటి వారంలో జనతా గ్యారేజీ సమీప మూలమలుపు వద్ద రెండు డంపర్లు ఢీకొన్నాయి. సరైన విజన్ లేక ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అదృష్టవశాత్తు ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. అలాగే ఇదే గ్యారేజీ సమీపంలో మెటీరియల్ తరలిస్తున్న క్రేన్ పల్టీపడింది. రోడ్డు సరిగా లేక మెటీరియల్ లోడ్తో వస్తున్న క్రమంలో బ్యాలెన్స్ తప్పి పడిపోయిందని అంటున్నారు. ఆపరేటర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో గాయాలు కాకుండా తప్పించుకున్నాడు. అలాగే ఈనెల 17న సాంకేతిక కారణాలతో క్వారీలో డీజిల్ బోజర్(ట్యాంకర్) నిలిచిపోయింది. వాహనానికి టోషన్ తగిలించి తీసుకొస్తుండగా కట్టిన టోషన్ ఊడిపోయి పల్టీపడింది. డీజిల్ బోజర్లో ముగ్గురు కార్మికులు ఉండగా అదృష్టవశాత్తు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఏమాత్రం అదుపుతప్పినా లోతులోని క్వారీలో పడేదని అంటున్నారు. సీహెచ్పీలో ఇద్దరికి గాయాలు ఓసీపీ–3 సీహెచ్పీలో ఇద్దరు కార్మికులు గాయపడ్డారు. ఫైర్కోల్ కన్వేర్బెల్ట్పై రవాణా చేస్తున్న క్రమంలో ఒక కన్వేయర్ ఆపరేటర్ మెడపై, మరో కన్వేయర్ తొడపై వేడి బొగ్గులు పడడంతో గా యాలైనట్లు చెబుతున్నారు. ఈవిషయాన్ని బయటకు పొక్కకుండా బాధితులకు చికిత్స చేయించినట్లు చెబుతున్నారు. రక్షణపై దృష్టి సారించక.. ఉత్పత్తి, రక్షణ రెండు కళ్లలాంటివని చెబుతున్న సింగరేణి యాజమాన్యం.. బొగ్గు ఉత్పత్తిపై కార్మికులు, ఉద్యోగులను ఉరుకులు, పరుగులు పెట్టిస్తోంది. రక్షణ విషయంలో సరిగా వ్యవహరించడం లేదని వాపోతున్నారు. ఇప్పటిౖకైనా యాజమాన్యం స్పందించి తప్పిదాలపై పునఃసమీక్షించి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. -
సమగ్ర అభివృద్ధికి బాటలు వేద్దాం
● పథకాల అమలులో పారదర్శకత పాటించాలి ● కష్టకాలంలోనూ పథకాలు అమలు చేస్తున్నాం ● విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు అధిక ప్రాధాన్యం ● జిల్లా ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ● మూడు శాఖలపై నాలుగు గంటలపాటు సమీక్షకరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లా సమగ్ర అభివృద్ధికి బాసటగా నిలవాలని జిల్లా ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు పిలుపునిచ్చారు. ఆదివారం కరీంనగర్ కలెక్టరేట్లో వ్యవసాయం, విద్య, హౌసింగ్ శాఖలపై మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్బాబుతో కలిసి నాలుగు గంటలపాటు సమీక్షించారు. వర్షాభావ పరిస్థితులు, క్రాప్ బుకింగ్, సాగు వివరాలు, విత్తనాలు, ఎరువుల లభ్యత, రైతుభరోసా, ఆయిల్ పాం సాగు, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, గ్రౌండింగ్తీరును ఆయా జిల్లాల కలెక్టర్లు మంత్రికి వివరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో అస్తవ్యస్త పరిస్థితులను సరిచేస్తూ.. పాలన సాగిస్తున్నామని, ఎక్కడా ఎటువంటి అవినీతికి ఆస్కారం లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. జూలై వరకు అవసరమైన విత్తనాలు, ఎరువుల స్టాక్ అందుబాటులో ఉంచుకోవాలన్నారు. అవసరమైన మేరకే యూరి యా వాడాలన్నారు. ఆయిల్పాం సాగుపై మరింత శ్రద్ధ చూపి జిల్లాలకు కేటాయించిన లక్ష్యాన్ని మించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచాలన్నారు. పంచాయతీరాజ్, ఆర్అండ్బీ, విద్యాశాఖ అధికారులు శిథిలావస్థలో ఉన్న భవనాలను ఖాళీ చేయించాలన్నారు. ● రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ నిరుపేదలందరికీ ఇందిర మ్మ ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. ఎమ్మెల్యేల దృష్టిలో ఉన్న నిరుపేదల జాబితాను కలెక్టర్లకు అందిస్తే ఇందిరమ్మ కమిటీలో చర్చించి పార్టీలకతీతంగా మంజూరు చేస్తామన్నారు. కూరగాయ ల సాగు విస్తరించాలని, కల్తీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. ● మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ రైతు భరోసా రైతుల ఖాతాలో జమ చేస్తున్నందుకు మంత్రి తుమ్మలకు కృతజ్ఞతలు తెలిపారు. రైతులు ఆయిల్ పాం సాగువైపు దృష్టి సారించాలన్నారు. క్యాష్ క్రాప్స్, హార్టికల్చర్ పంటలను ప్రోత్సహించాలని సూచించారు. ప్రభుత్వ బడులను బలోపేతం చేయాలన్నారు. ● వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో ఎరువుల కొరత లేదన్నారు. రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు పూర్తి చేశామని, రైతుభరోసా ఖాతాల్లో జమ అవుతోందని తెలిపారు. వేములవాడలో సూరమ్మ ప్రాజెక్టు, శ్రీపాద నారాయణపురం ప్రాజెక్టుల భూ సేకరణ నిధులు విడుదల చేయాలని కోరారు. ● కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ ఆయిల్ పాం సాగును ప్రోత్సహించాలన్నారు. తాను 48 ఎకరాల్లో ఆయిల్ పాం సాగు చేస్తున్నట్లు తెలిపారు. ఆయిల్ పాం ప్రాసెస్ యూనిట్ను చిగురుమామిడిలో ఏర్పాటు చే యాలని కోరారు. కరీంనగర్లో గతంలో సీఎం స్పెషల్ ఫండ్ కింద రూ.350 కోట్లతో 120రోడ్ల పనులు ప్రారంభించామని, వాటిని పూర్తి చేయి ంచాలని విజ్ఞప్తి చేశారు. కేబుల్ బ్రిడ్జి డైనమిక్ లైటింగ్ వ్యవస్థ పనితీరు పర్యవేక్షించాలన్నారు. ● జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ సీడ్ ప్రాసెసింగ్ ప్లాంట్ జగిత్యాల ప్రాంతంలో ఏర్పాటు చేయాలని కోరారు. ఆయిల్పాం సాగుపై అవగాహన కల్పిస్తున్నామని, పంటకు ధర పెంచేలా చూడాలని అన్నారు. ● కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో ఎమ్మెల్యేల జాబితాను పరిగణనలోకి తీసుకోవాలని కోరా రు. మెట్పల్లి హైస్కూల్ శిథిలావస్థలో ఉందని, పక్కనే జూనియర్ కళాశాల భవనం 80శాతం పూర్తయిందని, దానిని పూర్తి చేసి స్కూల్ పిల్లలను ఆ భవనానికి తరలించాలని అన్నారు. ఉర్దూ ప్రభుత్వ పాఠశాల పనులు పూర్తిచేయాలని కోరారు. ● పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణా రావు మాట్లాడుతూ వ్యవసాయంపై గ్రామాల్లో సదస్సులు పెట్టి రైతులకు సలహాలు, సూచనలను శాస్త్రవేత్తల ద్వారా ఇప్పించామన్నారు. పంట మార్పిడిపై ప్రచారం చేయాల్సిన అవస రం ఉందన్నారు. ఐదేళ్లుగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పత్తి పంట తగ్గిపోతోందని, వరి, మొక్కజొన్న సాగు పెరుగుతోందని అన్నారు. ● రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్ మాట్లాడుతూ తమ ప్రాంతంలో ఎత్తిపోతలు పూర్తి చేయడంతో అంతర్గాం, పాలకుర్తి మండలాలకు తొలిసారి సాగునీరు వచ్చిందని, గతం కంటే రెండింతల పంట పండుతోందని తెలిపారు. సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సీఎల్, కేశోరాం సిమెంట్ వంటి సంస్థల డీఎంఎఫ్టీ నిధులు జిల్లాకు రావడం లేదని అన్నారు. ● మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ పాఠశాలల్లో విద్యార్థులకు చదవడం, రాయడం, సామాన్య, గణితం వంటి విద్యా ప్రమాణాలు పెంచేలా చూడాలన్నారు. వృత్తి విద్యా కోర్సుల ద్వారా యువతను ప్రయోజకులను చేసేందుకు స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటును స్వాగతించారు. ● చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ చొప్పదండి ప్రాంతంలోని చేనేత కార్మికుల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని, గంగాధర మండలానికి డిగ్రీ కళాశాల మంజూరు చేయాలని కోరారు. ● సమీక్ష సమావేశంలో రాష్ట్రప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాలరావు, కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల కలెక్టర్లు పమేలా సత్పతి, కోయ శ్రీహర్ష, సందీప్ కుమార్ ఝా, సత్యప్రసాద్, రాష్ట్ర కనీస వేతన సలహా మండలి చైర్మన్ జనక్ప్రసాద్, కరీంనగర్, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల జిల్లాల గ్రంథాలయ సంస్థ చైర్మన్లు సత్తు మల్లేశం, కేడం లింగమూర్తి, నాగుల సత్యనారాయణ, ఆర్టీఏ మెంబర్ పడాల రాహుల్, అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలు, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
108 మందికి ప్రయోజనం
● ఉద్యోగ విరమణ వయసు పెంపు ● అంగన్వాడీ టీచర్లు, ఆయాల హర్షం సుల్తానాబాద్(పెద్దపల్లి): అంగన్వాడీ టీచర్లు, ఆయాల ఉద్యోగ విరమణ వయసు పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో జిల్లాలో సుమారు 108 మందికి ప్రయోజనం చేకూరుతుందని అధికారులు అంచనా వేశారు. ప్రస్తుతం ఉద్యోగ విరమణ వయసును 61ఏళ్ల నుంచి 65ఏళ్ల వరకు పెంచుతూ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీచేసింది. ఇదేసమయంలో టీచర్లు, ఆయాల ఖాళీల భర్తీ కోసం కసరత్తు చేస్తోంది. సిబ్బందికి ప్రోత్సాహకాలు.. అంగన్వాడీ కేంద్రాల పనితీరు ఆధారంగా గ్రేడింగ్ అమలు చేస్తున్న ప్రభుత్వం.. విధుల్లో ప్రతిభ చూపిన టీచర్లకు నగదు ప్రోత్సాహకాలు అందించాలని నిర్ణయించింది. ఎన్నికల హామీ మేరకు కాంగ్రెస్ ప్రోత్సాహాలను సైతం పెంచింది. జిల్లాలో పెద్దపల్లి, రామగుండం, మంథనిలో ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉన్నాయి. 17 టీచర్.. 96 ఆయా పోస్టుల భర్తీ.. జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల్లో 17 టీచర్, 96 సహాయకుల పోస్టుల భర్తీకి ఐసీడీఎస్ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇంటర్మీడియెట్ పాసై 18 – 35 ఏళ్ల వయసు ఉన్నవారు ఈ పోస్టులకు అర్హులని అధికారులు తెలిపారు. గతంలో మార్కుల ఆధారంగా పోస్టులు భర్తీ చేసిన అధికారులు.. ఈసారి మార్కులను ప్రామాణికంగా తీసుకుంటారా, లేక రాతపరీక్ష ఆధారంగా ఎంపికచేస్తారా? అనేదాంట్లో స్పష్టత ఇవ్వడంలేదు. -
బ్యాంకు ఖాతాలో జమ కాలేదు
సన్నవడ్లు అమ్మిన నాకు పదిరోజుల్లోనే డబ్బులు బ్యాంకు ఖాతాలో జమయ్యాయి. కానీ, క్వింటాల్కు రూ.500 చొప్పున బోనస్ సుమారు రూ.16,500 జమకాలేదు. వెంటనే నిధులు మంజూరు చేయాలి. – తిరుపతి యాదవ్, రైతు, కదంబాపూర్ త్వరలోనే మంజూరవుతాయి సన్నరకం ధాన్యం బోనస్పై నివేదిక తయారు చేసి ప్ర భుత్వానికి గతంలోనే అందజేశాం. వడ్లు విక్రయించిన రైతుల వివరాలు కూడా అందులో నమోదు చేశాం. సర్కారు నిధులు విడుదల చేయాల్సి ఉంది. – శ్రీకాంత్, డీఎస్వో -
చిగురిస్తున్న ఆశలు
● భూ సమస్యల పరిష్కారానికి మార్గం ● జిల్లాలో ముగిసిన భూభారతి సదస్సులు ● సమస్యలపై 15,916మంది దరఖాస్తు ● మిస్సింగ్ సర్వే నంబర్లు, అసైన్డ్ల్యాండ్ కేసులే అధికం ● ఆగస్టు 15లోగా పరిష్కరిస్తాం : కలెక్టర్ కోయ శ్రీహర్ష జిల్లాలో భూభారతి అర్జీల వివరాలు సాక్షి పెద్దపల్లి: అనేకఏళ్లుగా పరిష్కారానికి నోచుకోని భూసమస్యలపై జిల్లాలోని వివిధ గ్రామాల్లో నిర్వహించిన భూభారతి అవగాహన సదస్సులకు రైతుల నుంచి దరఖాస్తులు వెలువెత్తాయి. తొలుత పైలెట్ మండలంగా ఎలిగేడును ఎంపిక చేసిన జిల్లా ఉన్నతాధికారులు.. ఆ తర్వాత జిల్లావ్యాప్తంగా అమలు చేశారు. ఈక్రమంలో జూన్ 3 నుంచి శుక్రవారం వరకు 200 రెవెన్యూ గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా పల్లెవాసుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. అర్జీల ఆన్లైన్కు ఇద్దరేసి ఆపరేటర్లు.. ప్రతీ మండలంలో ఇద్దరేసి ఆపరేటర్లను నియమించిన ప్రభుత్వం.. రైతులు ఫిర్యాదుకు జతచేసిన ధ్రువీకరణపత్రాలు, జతపరిచిన ఆధార పత్రాలను స్కాన్ చేసి, తహసీల్దార్ లాగిన్లో ఆన్లైన్ చేశారు. ఇలా ఏరోజుకారోజు కలెక్టర్కు ఆ జాబితా నివేదించారు. కలెక్టర్ స్థాయిలో సమస్యల వారీగా మరో నివేదిక రూపొందించి సీసీఎల్కు పంపించారు. సదస్సుల్లో స్వీకరించిన దరఖాస్తుల ఆధారంగా ఫిర్యాదు సమర్పించిన రైతుతోపాటు సమీపంలోని రైతులకు అఽధికారులు నోటీసులు జారీ చేయనున్నారు. ఇద్దరి వద్దనున్న రికార్డులతోపాటు ఆధారాలను సమర్పించేందుకు ఏడు రోజుల గడువు ఇస్తారు. నిర్దేశిత గడువులోగా సమర్పించిన ఆధారాలు, రికార్డులను అధికారులు పరిశీలిస్తారు. రెవెన్యూ కార్యాయంలోని రికార్డులతో వాటిని పోల్చిచూస్తారు. అనంతరం ఆ దరఖాస్తు వాస్తవికతను తేల్చి సమస్యకు పరిష్కారం చూపుతారని చెబుతున్నారు. తద్వారా భూభారతితోనైనా తమ భూ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని అన్నదాతల్లో ఆశలు చిగురిస్తున్నాయి. పెద్దపల్లిలో 2,508.. రామగుండంలో 124 జిల్లావ్యాప్తంగా అత్యధికంగా పెద్దపల్లి మండలంలో 2,508 దరఖాస్తులు అందాయి. అత్యల్పంగా రామగుండంలో 124 దరఖాస్తులు అధికారులకు అందాయి. వచ్చిన దరఖాస్తుల్లో సాదాబైనామాలు పక్కన పెడితే.. అత్యధికంగా మిస్సింగ్ సర్వే నంబర్లు, భూ విస్తీర్ణంలో హెచ్చుతగ్గులు, అసైన్డ్ల్యాండ్ కేసులే ఉండడం గమనార్హం. మండలాల వారీగా అర్జీలు..మండలం అర్జీలు జూలపల్లి 2,061 ఓదెల 1,267 సుల్తానాబాద్ 1,438 ధర్మారం 1,675 అంతర్గాం 940 పాలకుర్తి 617 కాల్వశ్రీరాంపూర్ 1,381 కమాన్పూర్ 393 రామగిరి 353 మంథని 1,681 ముత్తారం 1,478 రామగుండం 124 రెవెన్యూ గ్రామాలు 200 అందిన దరఖాస్తులు 15,916 మిస్సింగ్ సర్వే నంబర్లు 2,715 పెండింగ్ మ్యూటేషన్, కోర్టు కేసులు 630 డిజిటల్ సైన్ పెండింగ్ 745 విస్తీర్ణంలో వ్యత్యాసం 1,048 భూ స్వరూపం మార్పు 213 పాసుపుస్తకంలో పొరపాట్లు 218 నిషేధిత జాబితా 91 అసైన్డ్ల్యాండ్ 2,154 ఓఆర్సీ జారీ 20 సక్సేషన్ 1,367 భూసేకరణ 83 ఇతర 6,632 45 రోజుల్లో పరిష్కారం వచ్చే 45 రోజుల్లో భూభారతి దరఖాస్తులు పరిష్కరించేలా కార్యాచరణ అమలు చేస్తాం. ప్రతీదరఖాస్తు పరిష్కారానికి మండలంలో తహసీల్దార్ బాధ్యత వహించేలా, ప్రతీదరఖాస్తుదారుకు నోటీస్ ఇచ్చి పరిష్కరిస్తాం. ప్రతీ మండలంలో పెండింగ్ భూ భారతి దరఖాస్తుల సంఖ్య ఆధారంగా ఈనెల 23 నుంచి ఆగస్టు 14వ తేదీ వరకు రోజుకు ఎన్నిపరిష్కారం కావాలి? ఎన్ని బృందాలను ఏర్పాటు చేయాలనే దానిపై ప్రణాళిక రూపొందిస్తాం. అందుకు అనుగుణంగా సిబ్బందికి బాధ్యతలు కేటాయించి పరిష్కరిస్తాం. రెవెన్యూ సదస్సుల్లో అందిన దరఖాస్తులకు పరిష్కారం చూపలేనిపక్షంలో దానికిగల కారణాలను తెలియజేస్తూ స్పష్టంగా జవాబు తెలియజేస్తాం. దరఖాస్తుదారును కార్యాలయాల చుట్టూ తిప్పుకునే ధోరణి ఉండదు. – కోయ శ్రీహర్ష, కలెక్టర్ -
తేలని లాభాలా వాటా!
● గతేడాది చరిత్రలో అత్యధిక లాభాలు ● 2023–24లో కార్మికుల వాటా 33శాతం ● ఉద్యోగులకు రూ.788.20 కోట్ల చెల్లింపు ● గతేడాది కాంట్రాక్టు కార్మికులకూ రూ.5వేల వాటా గోదావరిఖని: గత ఆర్థిక సంవత్సరం పూర్తయింది. ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభమై రెండు నెలలు కావస్తోంది. గతేడాది సింగరేణి నిర్దేశిత 70 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించింది. బొగ్గు ఉత్పత్తిపై స్పష్టమైన ప్రకటన చేసిన సింగరేణి యాజమాన్యం.. లాభాలపై ఇప్పటివరకు స్పష్టత ఇవ్వడంలేదు. ఆధునిక సాంకేతికను విరివిగా వినియోగిస్తున్న సింగరేణి.. సాధ్యమైనంత త్వరగా లాభాల వాటా ప్రకటిస్తుందని కార్మికులు ఎదురుచూస్తున్నారు. అంతేకాకుండా సీఎండీ ఎండీ బలరాం ఫైనాన్స్ డైరెక్టర్గానూ బాధ్యతలు నిర్వహిస్తుండడంతో లాభాల విషయాన్ని త్వరగానే తేల్చేస్తారని భావిస్తున్నారు. వ్యాపార విస్తరణలో వేగంగా.. బొగ్గు, విద్యుత్ ఉత్పత్తి తదితర రంగాల్లో వేగంగా దూసుకెళ్తున్న సింగరేణి సంస్థ.. దేశంలో ఏ సంస్థలో లేనివిధంగా కార్మికులను వాటాదారులుగా చేర్చి తను సాధించిన లాభాల్లో ఏటా వా టా చెల్లిస్తూ వస్తోంది. దేశానికే సింగరేణి తలమానికంగా నిలుస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సింగరేణి సంస్థ ఏటా బొగ్గు ఉత్పత్తి, విద్యుత్ ఉత్పత్తిపై ఆర్థిక నివేదికలు సమర్పిస్తూ వస్తోంది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి సంస్థ 70 మిలియన్ ట న్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యానికి 70.02 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించింది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో 2,388.50 కోట్ల లాభాలు సాధించింది. అందులో కార్మికుల వాటాగా 33 శాతం ప్రకటించారు. ఈలెక్కన గత ఆర్థిక సంవత్సరంలో రూ.788.20 కోట్లు కార్మికులకు వా టాగా ప్రకటించారు. గతేడాదికన్నా ఈసారి బొగ్గు ఉత్పత్తితోపాటు టర్నోవర్ పెరగడంతో సంస్థకు లాభాలు కూడా అధికంగానే ఉంటా యని ఉద్యోగులు భావిస్తున్నారు. ఈక్రమంలో కార్మికులకు లాభాల ఎక్కువగా వస్తాయని ఆశగా ఎదురు చూస్తున్నారు. లాభాల వాటా ఎంత..? ఏటా సింగరేణి యాజమాన్యం లాభాలను ప్రకటించి నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిస్తుంది. అందులో కార్మికులకు లాభాల వాటా ముఖ్యమంత్రి ఖరారు చేసి ప్రకటన ఇస్తారు. ఈక్రమంలో ఈసారి లాభాలు ఖరారు అయితే లాభాల వాటా సీఎం ప్రకటించే అవకాశం ఉంది. గతేడాది 33శాతం కార్మికుల లాభాల వాటా ఉండగా, ఈసారి వాటా మరింత పెంచే అవకాశాలుంటాయని కార్మికులు భావిస్తున్నారు. వేగంగా ఇంటర్నల్ అడిట్.. సింగరేణి సీఎండీ బలరాం స్వతహాగా ఫైనాన్స్ డైరెక్టర్ కావడంతో లాభాలు తేల్చడంపై ప్రత్యే కంగా దృష్టి సారించారు. ఈక్రమంలోనే సాధ్యమైనంత త్వరగా లాభాలను తేల్చే పనిలో అధికారులు కసరత్తు చేస్తున్నారు. దీనికోసం ఇంటర్నల్ ఆడిట్ నిర్వహిస్తున్నారు. స్టాట్యుటరీ అడిట్ ద్వారా విచారణ కొనసాగుతోంది. గత తొమ్మిదేళ్లలో సింగరేణి సాధించిన వాస్తవ లాభాలు(రూ.కోట్లలో)ఏడాది లాభాలు కార్మికుల వాటా చెల్లింపు చెల్లింపు తేదీ 2015–16 1,066.13 23 245.20 07–10–2016 2016–17 395.38 25 98.84 29–09–2017 2017–18 1,212.75 27 327.27 29–08–2018 2018–19 1,766.00 28 493.00 04–10–2019 2019–20 993.00 28 278.04 14–10–2020 2020–21 272.20 29 79.06 11–10–2021 2021–22 1,227.00 30 368.00 10–10–2022 2022–23 2,222.00 32 711.00 22–10–2023 2023–24 2,388.50 33 788.20 20–09–2024 వేగంగా ఆడిట్ సింగరేణి సాధించిన లాభాలపై ఆడిట్ వేగంగా సాగుతోంది. త్వరలోనే ముఖ్యమంత్రికి వార్షిక నివేదిక సమర్పిస్తాం. సీఎం ఆదేశాల ప్రకారం లాభాల వాటా ఉద్యోగులకు అందజేస్తాం. సాధ్యమైనంత త్వరగా లాభాలను తేల్చేందుకు ఆర్థిక శాఖ వేగంగా ముందుకు సాగుతోంది. గతం కన్నా ఈసారి లాభాలు ఎక్కువగానే వచ్చే అవకాశం ఉంది. – ఎన్.బలరాం, సీఎండీ, సింగరేణి -
ఆదివారం శ్రీ 22 శ్రీ జూన్ శ్రీ 2025
యోగా సాధన ఇలా..పెద్దపల్లిరూరల్/జ్యోతినగర్/సుల్తానాబాద్: యోగా దినోత్సవం సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో శనివారం వేడుకలు ఘనంగా నిర్వహించారు. రామగుండం పోలీస్ కమిషరేట్, సింగరేణి, ఎన్టీపీసీ, కలెక్టరేట్, జిల్లా కోర్టు, వైద్య, ఆరోగ్యశాఖ, పోలీసుస్టేషన్లు, తదితర కార్యాలయాల్లో ఉన్నతాధికారులు, అధికారుల ఆధ్వర్యంలో యోగా సాధన చేశారు. యోగా ప్రాముఖ్యత గురించి పలువురు ప్రముఖులు వివరించారు. న్యూస్రీల్ -
డివిజన్ల పునర్విభజనపై ఉత్కంఠ
● ఇంకా విడుదలకాని తుది నోటిఫికేషన్ ● అందుబాటులో లేని బల్దియా అధికారులు ● మీడియాకు సైతం సమాచారం వెల్లడించని వైనం కోల్సిటీ(రామగుండం): రామగుండం నగరపాలక సంస్థలో డివిజన్ల పునర్విభజన ఉత్కంఠంగా మారింది. 50 నుంచి 60 డివిజన్లకు పెంచుతూ బల్దియా అధికారులు రూపొందించిన పునర్విభజన ముసాయిదాను ఈనెల 4న విడుదల చేశారు. దీనిపై నగరవాసుల నుంచి అభిప్రాయాలను స్వీకరించిన అధికారులు.. మార్పులు చేర్పులతోపాటు డివిజన్ల స్వరూపంపై మ్యాప్లు, వైశాల్యం, హద్దులు, ఓటర్ల సంఖ్యతో తయారు చేసిన 60 డివిజన్ల తుది నోటిఫికేషన్ను శనివారం విడుదల చేయాల్సి ఉంది. కానీ.. రాత్రి 7గంటల వరకు కూడా బల్దియా అధికారులు పునర్విభజనపై ఎలాంటి ప్రకటనా చేయలేదు. ఇదే విషయంపై మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్తోపాటు టౌన్ప్లానింగ్ తదితర విభాగాల్లో సమాచారం కోసం ప్రయత్నించగా, అధికారులు కార్యాలయంలో అందుబాటులో లేరు. డివిజన్ల పునర్విభజన తుది నోటిఫికేషన్పై డిప్యూటీ కమిషనర్ వెంటకస్వామిని వివరణ కోరగా, తనకు వివరాలు తెలియవన్నారు. కమిషనర్తోపాటు టౌన్ప్లానింగ్ విభాగం అధికారులను ఫోన్లో సంప్రదించడానికి ప్రయత్నంచినా.. వారు ఫోన్లను లిఫ్ట్ చేయలేదు. దీంతో డివిజన్ల పునర్విభజన తుది నోటిఫికేషన్ ప్రకటన విడుదలలో జాప్యంపై ఉత్కంఠ నెలకొంది. డివిజన్ల స్వరూపంపై అయోమయం, ఆందోళనతో ఉన్న మాజీ కార్పొరేటర్లు, ఆశావహులు.. తుది నోఫికేషన్పై ఆరా తీస్తున్నారు. హైదరాబాద్లోని సీడీఎంఏ కార్యాలయంలో తమకు పరిచయం ఉన్న అధికారులు, సిబ్బంది నుంచి వివరాలు తెలుసుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. శనివారం ఫైనల్ నోటిఫికేషన్ వస్తుందని ఆశపడినవారు, మాజీ కార్పొరేటర్లల్లో ఉత్కంఠ తారస్థాయికి చేరింది. అయితే, డివిజన్ల పునర్విభజన తుది జాబితా ప్రభుత్వ పరిశీలనలో ఉందని, అధికారికంగా అక్కడి నుంచే ఫైనల్ నోటిఫికేషన్తోపాటు గెజిట్ను విడుదల చేయవచ్చనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. -
పరిశ్రమలతోనే దేశ ప్రగతి
జ్యోతినగర్(రామగుండం): పరిశ్రమలు పురోగతిలో ఉంటేనే దేశం ప్రగతి సాధిస్తుందని జా తీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు వడ్డెపల్లి రాంచందర్ అన్నారు. ఎన్టీపీసీ జ్యోతిక ఆడిటోరియంలో బీఎంఎస్ అనుబంధ ఎన్టీపీసీ మజ్దూర్ సంఘ్ 12వ త్రైపాక్షిక జాతీయ సదస్సు శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడారు. ఎన్టీపీసీ ఎన్బీసీ సభ్యుడు సుంకరి మ ల్లేశం, ప్రతినిధులు రాంరెడ్డి, సురేంద్ర రాథోడ్, బీరేంద్ర, సాగర్రాజు, సత్యనారాయణరెడ్డి, రా ములు, గిరి, నరేందర్ పాల్గొన్నారు. ఐఎన్టీయూసీకి రాజీనామా చేసిన బండారి కనకయ్య బీఎంఎస్లో చేరగా ఆహ్వానించారు. సంపూర్ణ అక్షరాస్యత లక్ష్యంసుల్తానాబాద్(పెద్దపల్లి): సంపూర్ణ అక్షరాస్యత సాధించడం సామాజిక బాధ్యతని అదనపు డీ ఆర్డీవో రవీందర్ తెలిపారు. కలెక్టరేట్లో సెర్ప్, మెప్మా సిబ్బందికి శనివారం ఉల్లాస్ యాప్పై అవగాహన కల్పించారు. జిల్లాలోని స్వశక్తి సంఘా మహిళలు అక్షరాస్యతపై 90శాతం సర్వేచే శారని, మరో రెండుమూడ్రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తిచేసి ‘ఉల్లావ్’ యాప్లో నమోదు చేయా లని కోరారు. చదవడం, రాయడం నేర్చుకున్న మహిళల్ని ఓపెన్ టెన్త్, ఇంటర్లో ప్రవేశాల కో సం పరీక్షలు రాయించాలని సూచించారు. అ డల్ట్ ఎడ్యుకేషన్ ఏపీవో శ్రీనివాస్, జిల్లా ఉమ్మ డి పరీక్షల బోర్డు కార్యదర్శి హన్మంతు, జీసీడీవో కవిత, అధికారి రవి పాల్గొన్నారు. ఆస్పత్రిలో క్యాంటీన్ ప్రారంభం పెద్దపల్లిరూరల్: జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో చై తన్య జ్యోతి మహిళా సంఘం ఏర్పాటు చేసిన క్యాంటీన్ను అడిషనల్ డీర్డీవో రవీందర్ ప్రారంభించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో పేషెంట్లకు అవసరమైన ఆహారం సరఫరా చేసేందుకు చైతన్య జ్యోతి జిల్లా మహిళా సమాఖ్యకు డైట్ కాంట్రాక్టు అప్పగించారన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలు ప్రకారం నాణ్యమైన భోజనం పేషెంట్లకు అందించాలని ఆయన సూచించా రు. అనంతరం అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందజేశారు. కార్యక్రమంలో మహిళా సమాఖ్య సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. నియామకం పెద్దపల్లిరూరల్: జమాతే ఇస్లామీ హింద్ జిల్లా అధ్యక్షుడిగా ఎంఏహెచ్ జావెద్ను నియమించారు. ఈమేరకు పట్టణ అధ్యక్షుడు ఎంఏ మో హిద్ శనివారం ఉత్తర్వులు జారీచేశారు. జమాతే ఇస్లామీ హింద్ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో జావెద్కు ఈ పదవి అప్పగించినట్లు ఆయన వివరించారు. గడువు పొడిగింపు సుల్తానాబాద్(పెద్దపల్లి): అసంఘటిత రంగంలోని కార్మికులు పరిహారం కోసం దరఖాస్తు చేసుకునే గడువును ఈనెల 30వ తేదీ వరకు పొడిగించారని సహాయ కార్మిక అధికారి ఎంకే హేమలత తెలిపారు. ఈ– శ్రమ్ పోర్టల్లో పేరు, ఇతర వివరాలు నమోదు చేయాలన్నారు. ప్రమాదవశాత్తు చనిపోయిన, శాశ్వతంగా అంగవైకల్యం కలిగినా కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ నుంచి పరిహారం మంజూరవుతుందని హెమలత పేర్కొన్నారు. 2న షిర్డీకి ఆర్టీసీ బస్సు గోదావరిఖనిటౌన్: వచ్చే జూలై 2వ తేదీన షి ర్డీకి ఆర్టీసీ బస్సు సర్వీసు నడుపుతామని డీఎం నాగభూషణం తెలిపారు. ఉదయం 10 గంటలకు గోదావరిఖనిలో సూపర్ లగ్జరీ బస్సు ప్రా రంభమవుతుందని, యాత్రలో భాగంగా తొ లుత బాసర సరస్వతీదేవి ఆలయం, త్రయంబకేశ్వరాలయం, షిర్డీ సాయి బాబా దర్శనం ఉంటుందన్నారు. తిరుగు ప్రయాణంలో శనిసింగాపూర్ ఆలయాల దర్శనం ఉంటుందని తెలిపారు. జూలై 5వ తేదీన బస్సు గోదావరిఖనికి చేరుకుంటుందన్నారు. పెద్దలకు రూ.4,300, పిల్లలకు రూ. 3,500 ప్రయాణ చార్జీలు నిర్ణయించినట్టు పేర్కొన్నారు. వివరాలకు 70135 04982, 73828 47427 నంబర్లలో సంప్రదించాలని ఆయన కోరారు. సార్ ఆశయాలతో ముందుకు మంథని: తెలంగాణ రాష్ట్ర సాధనకోసం తుది శ్వాస వరకూ ఉ ద్యమించిన ప్రొ ఫెసర్ జయశంకర్ మలిదశ ఉ ద్యమానికీ ఊపి రి పోశారని మా జీ ఎమ్మెల్యే పుట్ట మధు అన్నారు. శనివారం ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం మధు మాట్లాడుతూ, ఆనాడు ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం జయశంకర్ సారథ్యంలో మాజీ సీఎం కేసీఆర్ ఉద్యమా న్ని ముందుకు తీసుకెళ్లారన్నారు. శంకర్గౌడ్, తిరుపతి, రాజబాపు, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
● సీపీఐ(ఎంఎల్) న్యూడెమొక్రసీ జిల్లా నేత ఇ.నరేశ్
ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలి గోదావరిఖని: ఆపరేషన్ కగార్ పేరిట కేంద్రప్రభుత్వం చేపట్టిన హత్యాకాండను వెంటనే నిలిపివేయాలని సీపీఐ(ఎంఎల్) న్యూడెమొక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి ఇ.నరేశ్ డిమాండ్ చేశారు. స్థానిక పైలాన్ చౌరస్తా వద్ద శనివారం పార్టీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. కాల్పుల విరమణ ప్రకటించి మావోయిస్టు పార్టీతో శాంతిచర్చలు జరపాలని డిమాండ్ చేశారు. కేంద్రంలోని ఆర్ఎస్ఎస్, బీజేపీ నరేంద్రమోదీ ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరిట 2026 కల్లా మావోయిస్టులను అంతం చేస్తామని ప్రకటించిందన్నారు. అప్పటి నుంచి కొనసాగిస్తున్న యుద్ధం.. అమాయక ఆదివాసీలతోపాటు మావోయిస్టు పార్టీ నాయకులను బూటకపు ఎన్కౌంటర్ల పేరిట హత్య చేస్తున్నారని ఆరోపించారు. బూటకపు ఎన్కౌంటర్లలో ఆదివాసీలే ఎక్కువ మంది మృతి చెందారని అన్నారు. ఖనిజ సంపదను స్వదేశీ, విదేశీ కార్పొరేట్లకు అప్పగించే లక్ష్యంగా ఈహత్యాకాండ సాగుతోందని ఆయన ధ్వజమెత్తారు. కాల్పుల విరమణ ప్రకటించి మావోయిస్టు పార్టీతో శాంతిచర్చలను వెంటనే ప్రారంభించాలనే డిమాండ్తో ఈనెల 25న వరంగల్లో జరిగే సదస్సును జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఐ.కృష్ణ, నాయకులు రాజేశం, దుర్గయ్య, మల్లేశం, రాజన్న, కొమురయ్య, ప్రసాద్, రవికుమార్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో వీఆర్ఏకు గాయాలు
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): రాజన్నసిరిసిల్ల ఎల్లారెడ్డిపేట తహసీల్దార్ ఆఫీస్ ఎదుట శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వీఆర్ఏతోపాటు మరొకరు తీవ్రంగా గాయపడ్డాడు. వీఆర్ఏ పరిస్థితి విషమంగా ఉంది. ఎస్సై రమాకాంత్ తెలిపిన వివరాలు. మండల కేంద్రానికి చెందిన బాధ పెద్దరాములు తహసీల్దార్ ఆఫీస్లో వీఆర్ఏగా పనిచేస్తున్నారు. శనివారం విధులకు హాజరయ్యేందుకు తన ద్విచక్రవాహనంపై వెళ్తుండగా.. రాజన్నపేటకు చెందిన తిమోతి అనే యువకుడు బైక్పై వేగంగా వస్తూ ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో రాములు కుడికాలు విరిగింది. తిమోతి స్వల్పంగా గాయపడ్డాడు. క్షతగాత్రులను 108 వాహనంలో స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. రాములను బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, రెడ్డి సంఘం జిల్లా అధ్యక్షుడు గుండారపు కృష్ణారెడ్డి, కాంగ్రెస్ నాయకులు నంది కిషన్, బండారి బాల్రెడ్డి, బాధ రమేశ్ పరామర్శించారు. తహసీల్దార్ సుజాత రాములును పరామర్శించి, పరిస్థితి గురించి తెలుసుకున్నారు. రెవెన్యూశాఖ తరఫున తక్షణసాయంగా రూ.20వేలు ఆర్ఐ శ్రావణ్మార్ రాములు కుటుంబానికి అందజేశారు. పరిస్థితి విషమం -
తూకంలో తేడాపై రోడ్డెక్కిన రైతులు
సిరిసిల్లఅర్బన్: ఐకేపీ ద్వారా విక్రయించిన సన్ఫ్లవర్ పంట తూకంలో తేడాపై ఇల్లంతకుంట మండలానికి చెందిన రైతులు శనివారం కలెక్టరేట్ వద్ద ఆందోళనకు దిగారు. మండలంలోని ముస్కానిపేట, గాలిపల్లి, చిన్నకేసన్నపల్లి, పత్తికుంటపల్లి, తాళ్లపల్లి గ్రామాలకు చెందిన సుమారు 50 మంది రైతులు కలెక్టరేట్కు తరలివచ్చారు. వారు మాట్లాడుతూ ఐకేపీ ద్వారా విక్రయించిన సన్ఫ్లవర్ పంట తూకంలో వచ్చిన క్వింటాళ్లు మార్క్ఫెడ్ తీసుకున్న తూకానికి తేడా వస్తుందన్నారు. ఒక్కో రైతుకు మూడు క్వింటాళ్ల వరకు నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని కలెక్టర్ సందీప్కుమార్ ఝా దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించి డీఆర్డీవో శేషాద్రిని పిలిపించి తూకంలో తేడాలపై విచారణ చేపట్టి రిపోర్టు ఇవ్వాలని ఆదేశించారు. అనంతరం రైతులు డీఆర్డీవోకు వివరాలతో కూడిన వినతిపత్రం అందించారు. సుధాకర్రెడ్డి, ఐదు గ్రామాల రైతులు తదితరులు పాల్గొన్నారు. డీఆర్డీవోకు వినతిపత్రం -
సగం సీట్లు ఖాళీ
● గంభీరావుపేటలో ఇంటర్, డిగ్రీ, పీజీ కళాశాల విద్యార్థినుల హాస్టల్ ● పాఠశాల విద్యార్థుల కోసం ఎస్సీ బాలుర వసతి గృహం ● రెండింటిలోనూ వంద చొప్పున సీట్లు ● అడ్మిషన్ల కోసం ప్రచారబాటలో అధికారులు గంభీరావుపేట(సిరిసిల్ల): విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన హాస్టళ్లలో సగం సీట్లు కూడా భర్తీ కావడం లేదు. అధికారుల ప్రచారం చేసినా చాలా మంది ఆసక్తి చూపడం లేదు. ఫలితంగా సగంలోపే సీట్లు భర్తీ అవుతున్నాయి. షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ కళాశాలలు, పాఠశాలల విద్యార్థుల కోసం గంభీరావుపేట మండల కేంద్రంలో రెండు వసతి గృహాలను వేర్వేరుగా ఏర్పాటు చేశారు. ఆరో తరగతి నుంచి పదో తరగతి విద్యార్థుల కోసం ఎస్సీ బాలుర వసతి గృహం. ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ కళాశాలల విద్యార్థినుల కోసం మరో హాస్టల్ ఏర్పాటు చేశారు. రెండు హాస్టళ్లలో వంద సీట్ల చొప్పున కేటాయించారు. సగం సీట్లు ఖాళీ ప్రస్తుతానికి రెండు హాస్టళ్లలో సగం సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. దాదాపు 50 విద్యార్థుల్లోపే ఉన్నారు. గతేడాది పొడవునా ఆ సీట్లు ఖాళీగానే ఉన్నాయి. ఈ విద్యాసంవత్సరంలో విద్యార్థుల సంఖ్య పూర్తిస్థాయిలో భర్తీ చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. అన్ని రకాల వసతులు ఉన్నా వసతిగృహంలో సీట్లు ఎందుకు ఖాళీగా ఉంటున్నాయో చర్చిస్తూ.. విద్యార్థుల సంఖ్య పెంచాలనే ఉద్దేశంతో అధికారులు వసతిగృహంలో చేరాలని, చేర్పించాలని ప్రచారం చేస్తున్నారు. ఇటు కళాశాల అధ్యాపకులతో.. అటు పాఠశాలల ఉపాధ్యాయులతో కలిసి ప్రచారబాటలో పాల్గొంటున్నారు. వసతిగృహాల్లో కల్పిస్తున్న సదుపాయాలపై తల్లిదండ్రులకు వివరిస్తున్నారు. ఇతర మండలాలకు చెందిన విద్యార్థులకు సైతం ప్రవేశాలు కల్పించడం జరుగుతుందని అధికారులు పేర్కొంటున్నారు. వసతిగృహానికి కేటాయించిన వందసీట్లలో ఎస్సీలకు 75 శాతం, బీసీలకు 12, ఎస్టీలకు 6 శాతం చొప్పున సీట్లు కేటాయిస్తున్నారు. రెండు హాస్టళ్లలోనూ ప్రస్తుతం సగానికి పైగా సీట్లు ఖాళీగానే ఉన్నాయి. హాస్టళ్లలో పౌష్టికాహారం విద్యార్థులకు అన్ని రకాల సదుపాయాలతోపాటు నాణ్యమైన పౌష్టికాహారం అందిస్తున్నారు. ఉదయం 7 గంటలకు రాగిజావ, పాలు ఇస్తారు. అనంతరం గంట తర్వాత బ్రేక్ఫాస్ట్లో భాగంగా ఉప్మా, పులిహోర, కిచిడి, చపాతి, పూరీ, ఇడ్లి, జీర రైస్, టమాట అన్నం.. ఇలా రోజుకో రకంగా ఇస్తారు. మధ్యాహ్నం పాఠశాలలో భోజనం ఉంటుంది. సాయంత్రం 5 గంటలకు స్నాక్స్ కింద పల్లీపట్టీలు, అటుకులు, బిస్కెట్స్, శనగలు, బబ్బర్లు, స్వీట్స్తోపాటు ప్రతి ఆదివారం మధ్యాహ్నం చికెన్రైస్, గుడ్డు ప్రత్యేకంగా అందిస్తారు. వారంలో రెండు రోజులు గుడ్డుతోపాటు అరటిపళ్లు, ఇతర పళ్లు విద్యార్థులకు అందించనున్నారు. అవగాహన కల్పిస్తున్నాం గంభీరావుపేటలోని కళాశాల, పాఠశాల విద్యార్థుల కోసం ఏర్పాటుచేసిన ఎస్సీ బాలుర, బాలికల వసతిగృహాల్లో అడ్మిషన్ల కోసం ప్రచారం నిర్వహిస్తున్నాం. వసతిగృహాల్లో ఉండి చదువుకునేలా అవగాహన కల్పిస్తున్నాం. ఇప్పుడిప్పుడే పాఠశాలలు, కళాశాలలు ప్రారంభమయ్యాయి. వంద సీట్లు భర్తీ చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. గంభీరావుపేట మండలంతోపాటు చుట్టుపక్కల మండలాల్లోనూ విద్యార్థుల తల్లిదండ్రులకు హాస్టల్ ప్రత్యేకతలను, ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాల గురించి అవగాహన కల్పిస్తున్నాం. – భూదేవి, వసతిగృహాల సంక్షేమాధికారి, గంభీరావుపేట -
అప్పులబాధతో నేతకార్మికుడి ఆత్మహత్య
సిరిసిల్లక్రైం: ప్రమాదంలో కాలువిరగడంతో పని చేయలేక.. అప్పులు తీర్చే మార్గం కనిపించక సిరిసిల్లలో నేతకార్మికుడు శనివారం ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాలు. రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సుందరయ్యనగర్కు చెందిన నేతకార్మికుడు వలస రమేశ్(48) పవర్లూమ్స్ నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. రెండేళ్ల క్రితం రమేశ్ కాలుకు దెబ్బతగిలి పనికి దురయ్యాడు. సరైన ఉపాధి లేక.. కుటుంబ పోషణ కోసం చేసిన అప్పులు రూ.5లక్షలు ఎలా తీర్చాలో తెలియక మనోవేదనకు గురయ్యాడు. ఈ క్రమంలో స్థానిక కార్గిల్లేక్లో శనివారం దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని భార్య లావణ్య, కుమారులు సాయిచరణ్, సచిన్ ఉన్నారు. మృతుని భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. -
జీతం.. సతమతం
కరీంనగర్ అర్బన్: పాడి పరిశ్రమ వృద్ధిలో కీలక పాత్ర పోషించే గోపాలమిత్రలు వేతనాలు అందక మదనపడుతున్నారు. గౌరవ వేతనంతో సేవలందిస్తుండగా 9నెలలుగా సదరు వేతనం లేక ఆందోళన చెందుతున్నారు. కేంద్ర ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అందించే 9నెలల గౌరవ వేతనం రాకపోవడంతో అప్పులతో కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. పశు సంపద అభివృద్ధి కోసం గ్రామాల్లో విస్తృతంగా సేవలందిస్తున్నా సక్రమంగా వేతనాలు రాక సతమతమవుతున్నారు. ఆర్ఎంపీల్లా గోపాలమిత్రలు 2000 సంవత్సరంలో జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ (డిస్ట్రిక్ లైవ్ స్టాక్ డెవలప్ మెంట్ ఏజెన్సీ (డీఎల్డీఏ)) ద్వారా గోపాలమిత్ర వ్యవస్థను ఏర్పాటు చేశారు. జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పశువులకు కృత్రిమ గర్భధారణ చేయడంతో పాటు పాడి రైతులకు అందుబాటులో ఉంటూ పశువులకు ప్రథమ చికిత్స అందిస్తున్నారు. నట్టల నివారణ మందులు, వాక్సినేషన్, బీమా చేయడం పశువైద్యుల సూచనల మేరకు అన్ని రకాల వైద్య సేవలను అందిస్తున్నారు. వేతనంలో 40 చొప్పున కట్ ఆయా మండలాల్లో ఉన్న గోపాలమిత్ర సిబ్బంది నెలకు 80నుంచి 120 పశువులకు కృత్రిమ గర్భధారణ (నేమన్) చేయాలి. దీనికి గోపాలమిత్ర సిబ్బంది రూ.40 చొప్పున రైతుల నుంచి వసూలు చేసి ప్రభుత్వ ఖాతాలో జమ చేయాల్సి ఉంటుంది. ప్రతి నెలా నిర్ధేశించిన లక్ష్యాన్ని గోపాలమిత్రలు పూర్తి చేయాల్సిందే. లేదంటే నెల జీతంలో కోత తప్పదు. ఒక్కో పశువుకు రూ.40 చొప్పున వారి వేతనం నుంచి కట్ చేస్తారు. ఒక్కోనెల అనుకున్న లక్ష్యం పూర్తి చేయకపోవడంతో ప్రభుత్వం ఇస్తున్న గౌరవ వేతనం కనీసం రెండు వేలు కూడా రావడం లేదని గోపాలమిత్రలు అవేదన వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ పోషణ భారం జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ(డీఎల్డీఏ) ద్వారా పశు సంవర్థకశాఖలో ఉమ్మడి జిల్లాలో 135 మంది గోపాలమిత్ర సిబ్బంది పని చేస్తున్నారు. వీరికి రాష్ట్ర ప్రభుత్వం రూ.11,050 చొప్పున గౌరవవేతనం అందిస్తోంది. చాలీచాలనీ వేతనం కూడా ప్రతినెలా అందడం లేదు. జిల్లాలో ఇప్పటికే గోపాలమిత్రలకు ఏడు నెలల వేతనం చెల్లించాల్సి ఉంది. రెండేళ్లుగా కేంద్ర ప్రభుత్వం అందించాల్సిన పారితోషికం సైతం రాలేదు. దీంతో కుటుంబ పోషణ భారంగా మారిందని, ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు గోపాలమిత్ర సిబ్బంది వాపోతున్నారు. గోపాలమిత్రలకు 9నెలలుగా అందని వేతనం కృత్రిమ గర్భధారణ లక్ష్యం పూర్తికాకుంటే జీతంలో కోత -
చట్టాలు తెలియక కటకటాల్లోకి..
సిరిసిల్ల: బతుకుదెరువు కోసం ఉన్న ఊరిని, కన్నవారిని, కట్టుకున్న భార్యను వదిలి గల్ఫ్ దేశం వెళ్తే.. అక్కడి చట్టాలు తెలియక జైలుపాలైన ఘటన వెలుగులోకి వచ్చింది. రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం మండెపల్లికి చెందిన నక్క బాలనర్సు సౌదీ అరేబియాలో జైలుపాలయ్యాడు. తన భర్తను విడిపించాలని కోరుతూ అతని భార్య దేవేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించింది. సౌదీ చట్టాలపై అవగాహన లేకపోవడంతో మూడున్నర ఏళ్ల జైలుశిక్ష పడింది. ప్రస్తుతం రియాద్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరి 1న జైలుపాలైన బాలనర్సుకు సౌదీలోని ఇండియన్ ఎంబసీ ద్వారా న్యాయ సహాయం అందించి, క్షమాభిక్ష ఇప్పించాలని అతని భార్య నక్క దేవేంద్ర హైదరాబాద్ ప్రజాభవన్లోని ‘ప్రవాసీ ప్రజావాణి’ని ఆశ్రయించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నారై అడ్వయిజరీ కమిటీ వైస్చైర్మన్ మంద భీంరెడ్డి, సెలవుపై సౌదీ నుంచి వచ్చిన సామాజిక సేవకులు ఆసాని రాజిరెడ్డి, మహ్మద్ నవీద్లతో కలిసి సీఎం ప్రజావాణి ఇన్చార్జి, సీనియర్ ఐఏఎస్ అధికారిణి దివ్యదేవారాజన్ను కలిసి గోడు వినిపించారు. ఇంటి డ్రైవర్ ఉద్యోగ బాధ్యతల్లో భాగంగా బాలనర్సు తన అరబ్ యజమాని పిల్లలను పాఠశాలకు తీసుకెళ్లేవాడని తెలిపింది. పిల్లలతో స్నేహపూర్వక ప్రవర్తనను యజమాని అపార్థం చేసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. స్థానిక ఆచార వ్యవహారాలు, సున్నితత్వం తెలియకపోవడంతో అపోహలకు దారితీసి జైలుపాలయ్యాడని ఆమె తెలిపారు. వెంటనే స్పందించిన సీనియర్ ఐఏఎస్ అధికారిణి దివ్యదేవారాజన్, రాష్ట్ర ఎన్నారై విభాగం ఐఏఎస్ అధికారి సీహెచ్ శివలింగయ్యతో మాట్లాడారు. రియాద్లోని భారత రాయబార కార్యాలయంతో సమన్వయం చేస్తూ, సౌదీ అధికారుల వద్దకు క్షమాభిక్ష అభ్యర్థనను పంపడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గల్ఫ్ బాటలో జైలుపాలైన బాలనర్సు విడుదల కోసం అతని కుటుంబం నిరీక్షిస్తోంది. సౌదీ జైలులో మండెపల్లివాసి విడుదల చేయాలని ప్రవాసీ ప్రజావాణిని ఆశ్రయించిన వలసజీవి భార్య మూడున్నరేళ్ల జైలుశిక్ష క్షమాభిక్ష కోసం రాష్ట్ర ప్రభుత్వ సహాయం కోరిన కుటుంబం స్పందించిన ఐఏఎస్ అధికారిణి దివ్యదేవరాజన్ -
బాలికా విద్యకు ఎన్టీపీసీ భరోసా
● జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు వడ్డెపల్లి రాంచందర్ జ్యోతినగర్(రామగుండం): ఎన్టీపీసీ బాలికల విద్య కు భరోసా కల్పించడం అభినందనీయమని జాతీ య ఎస్సీ కమిషన్ సభ్యుడు వడ్డెపల్లి రాంచందర్ అన్నారు. శనివారం రాత్రి ఎన్టీపీసీ రామగుండం పీ టీఎస్లోని వికాస కేంద్రం హాల్లో ఎన్టీపీసీ ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న బాలికలకు ఆయన సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎన్టీపీసీ విద్యుత్ ఉ త్పత్తి పాటు ప్రభావిత, పునరావాస గ్రామాల ప్రజ ల జీవితాల్లో వెలుగులు నింపేందుకు మరింత కృషి చేయాలని సూచించారు. ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చందన్ కుమార్ సామంత, దీప్తి మహిళా సమి తి అధ్యక్షురాలు రాకీ సామంత, ఎన్టీపీసీ ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు న వనీత్ రాథోడ్, కార్యదర్శి మహేందర్, అంజయ్య, ఉద్యోగ గుర్తింపు సంఘం ప్రతినిధులు ఉన్నారు. -
అర్హులందరికీ పరిహారం
● కలెక్టర్ కోయ శ్రీహర్ష సుల్తానాబాద్/యైటింక్లయిన్కాలనీ: సింగరేణి ప్రభావిత రామగిరి మండలం సుందిళ్ల గ్రామంలో సింగరేణి మైన్స్ కోసం భూములు కోల్పోతున్న అర్హులైన నిర్వాసితులందరికీ పరిహారం అందిస్తామని కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. సింగరేణి లీజు భూముల పరిహారం ప్రక్రియపై శనివారం సుందిళ్ల గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో కలెక్టర్ మాట్లాడారు. ఆర్జీ–1లో బొగ్గు గనులకు అవస రమైన లీజు కోసం 269 ఎకరాల్లో సర్వే చేశారని, రికార్డుల ప్రకారం ఇవి సింగరేణి లీజు భూములన్నారు. ఒక్కో సర్వే నంబరులో నలుగురైదుగురు రైతులు యాజమాన్య హక్కు క్లెయిమ్ చేస్తున్నారని కలెక్టర్ వివరించారు. అధికారికంగా పట్టాలు లేకు న్నా కబ్జాలోనివారు నష్ట్రపోతారనే ఉద్దేశంతో మానవతా దృక్పథంతో ఎకరాకి రూ.6.50 లక్షల చొప్పు న పరిహారం చెల్లించేలా సింగరేణి యాజమాన్యా న్ని ఒప్పించామని ఆయన వెల్లడించారు. ఈక్రమంలోనే అర్హులైన జాబితానే రూపొందించామని కలెక్టర్ తెలిపారు. అనర్హులు ఉంటే తమకు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు. ఈకార్యక్రమంలో రెవెన్యూ డివిజన్ అధికారి సురేశ్, ఆర్జీ–1 జీఎం లలిత్ కుమార్, తహసీల్దార్ సుమన్ పాల్గొన్నారు. నిరంతరంగా విద్యుత్ సరఫరా పెద్దపల్లిరూరల్: జిల్లాలో వినియోగదారులకు నిరంతరం విద్యుత్ సరఫరా చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. విద్యుత్ శాఖ పనితీరుపై కలెక్టరేట్లో శనివారం ఆయన సమీక్షించారు. జిల్లాలోని 7 సబ్ డివిజన్లలో అవసరం మేరకు విద్యుత్ స్తంభాలు అందుబాటులో ఉంచాలని, లైన్మెన్ అప్రమత్తంగా ఉండాలని, లూస్ వైర్లు సరిచేయాలని, ఇళ్లనుంచి వెళ్లే, వేలాడే విద్యుత్ తీగలు సరిచేయాలని ఆదేశించారు. జిల్లాలోని ఒక మండలాన్ని ఎంపిక చేసుకొని సోలార్ విద్యుత్ ఉత్పత్తికి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎస్ఈ మాధవరావు, డీఈలు తదితరులు పాల్గొన్నారు. -
రాగి తీగ దొంగల అరెస్ట్
మెట్పల్లి: ట్రాన్స్ఫార్మర్ల నుంచి రాగి తీగ, ఆయిల్ను ఎత్తుకెళ్తూ.. రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్న ఇద్దరు దొంగలను మెట్పల్లి పోలీసులు పట్టుకున్నారు. ఎస్సై కిరణ్కుమార్ కథనం ప్రకారం.. మోతె సాయి(22), పల్లపు మల్లేశం(32) ఆర్థిక ఇబ్బందుల కారణంగా దొంగతనాలు చేయాలని నిర్ణయించుకున్నారు. ఇద్దరు కలిసి పలుచోట్ల ట్రాన్స్ఫార్మర్ల నుంచి రాగి తీగ, ఆయిల్ అపహరించి అమ్ముతూ వచ్చిన సొమ్ముతో జల్సాలు చేస్తున్నారు. రైతుల ఫిర్యాదు మేరకు పక్కా సమాచారంతో ఇద్దరిని పట్టుకొని వారి నుంచి వంద కిలోల రాగి వైరు, ద్విచక్రవాహనం, చోరీలకు ఉపయోగించే సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి ఇద్దరి అరెస్ట్ చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు. కొత్తపల్లిలో రెండు లారీల ఢీ ● ఓ డ్రైవర్కు విరిగిన కాలు.. మరో డ్రైవర్, క్లీనర్కు గాయాలు కొత్తపల్లి(కరీంనగర్): కొత్తపల్లిలో శనివారం వేకువజామున రెండు లారీలు ఢీకొన్నాయి. కరీంనగర్– జగిత్యాల ప్రధాన రహదారి కొత్తపల్లి చెరువు స మీపంలో ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్లు నిద్రమత్తులో ఉండడంతోనే ప్రమాదం జరిగినట్లు స్థానికులు వెల్లడించారు. స్థానికులు, బ్లూకోల్ట్స్ పోలీసుల వివరాల మేరకు.. నిజామాబాద్లో రైస్మిల్లు సా మగ్రి ఖాళీ చేసి కరీంనగర్ వైపు వస్తున్న లారీ ఖ మ్మం నుంచి గ్రానైట్ లోడ్తో గంగాధర వైపు వెళ్తు న్న మరో లారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ముందు భాగాలు దెబ్బతిన్నాయి. గ్రానైట్ లోడ్తో ఉన్న లారీ కొత్తపల్లి చెరువులో పడిపోయింది. ఓ లారీ డ్రైవర్ పురుషోత్తంరెడ్డి, క్లీనర్లు లారీ నుంచి బయట పడగా తలకు గాయాలయ్యాయి. లారీ యజమాని సూచనల మేరకు హైదరాబాద్ వెళ్లిపోయారు. రాజస్థాన్ రిజిస్ట్రేషన్ గల డ్రైవర్ భన్సీలాల్కు గాయాలు అధికంగా కావడంతో పాటు కాలు విరిగడంతో కరీంనగర్లోని ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేర్చాడు. స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న కొత్తపల్లి పోలీసులు లారీలను పోలీస్స్టేషన్కు తరలించారు. -
న్యాయం చేయండి
మంథని: పోలీసులకు భయపడి తన కుమారుడు ఆత్మాహత్యకు యత్నించి ఇప్పుడు అచేతనా స్థితిలోకి వెళ్లాడని, తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబం, స్థానికులతో కలిసి శనివారం పట్టణంలోని ప్రధాన చౌరస్తాలో ధర్నాకు దిగింది. అచేతనా స్థితిలో తన కుమారుడిని అంబులెన్స్లో ఉంచి ఆవేదన వ్యక్తం చేశారు. యువకుడి తల్లి శీలం రాజేశ్వరి కథనం ప్రకారం.. మంథని పట్టణంలోని శ్రీపాదకాలనీకి చెందిన తన కుమారుడు రాజ్కుమార్ ఎంగేజ్మెంట్కు వెళ్లి ఇంటికి వస్తుండగా వడ్లకల్లం వద్ద ఇద్దరు దోస్తులు మాట్లాడుకొని ఒకరినొకరు చిన్నగా కొట్టుకున్నారు. మరుసటి రోజు 30 మంది దాకా వచ్చి కేసు పెట్టారు. దీంతో రాజ్కుమార్ను పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి కొట్టడంతో మనస్తాంపం చెందాడు. తన కుమారుడిని అన్యాయంగా పోలీస్స్టేషన్ తీసుకెళ్లారని, కొంతమంది ప్రజాప్రతినిధుల పేర్లు చెబుతూ పోలీసులు కొట్టారని ఆమె వివరించింది. ఈ క్రమంలో అవమానంతో మనదపడుతూ స్నానానికి వెళ్లి బాత్రూంలేనే ఉరివేసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో ఎనిమిది నెలలుగా చికిత్స పొందుతున్నాడు. అయినా, ఇంకా కోలుకోలేదు. దీంతో రాజ్కుమార్ను అంబులెన్స్ లోనే తల్లిదండ్రులు, బంధువులు పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తాకు తీసుకొచ్చారు. మంథని ఎస్సై, కానిస్టేబుల్, స్థానిక మాజీ కౌన్సిలర్, ప్రజాప్రతినిధులు, మరికొందరు హమాలీ కార్మికులపై చర్యలు తీసుకోవాలని బంధువులు ఆందోళన చేశారు. సమాచారం అందుకున్న మంథని సీఐ, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బాధితులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని నచ్చజెప్పారు. అచేతనా స్థితిలోని కుమారుడితో ధర్నా పోలీసులు, ప్రజాప్రతినిధులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ -
మా ఊరికి ప్రైవేట్ స్కూల్ బస్సులు రావొద్దు
కాల్వశ్రీరాంపూర్ (పెద్దపల్లి): పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం ఊశన్నపల్లిలో శుక్రవారం ప్రైవేటు స్కూళ్ల బస్సులను గ్రామస్తులు అడ్డుకున్నారు. తమ ఊరికి ప్రైవేటు స్కూల్ బస్సులు రావద్దని, గ్రామంలోని పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలోనే చదివించాలని తల్లిదండ్రులను కోరారు. ఉదయం స్కూల్ బస్సులు వచ్చే సమయానికి గ్రామంలోని ఆంజనేయస్వామి ఆలయం వద్ద గుమికూడిన కొందరు గ్రామస్తులు.. బస్సులు ఎక్కుతున్న పిల్లలను దించివేశారు. దీంతో గ్రామస్తులంతా అక్కడికి చేరుకున్నారు.పాఠశాల హెచ్ఎం ఈర్ల సమ్మయ్య ఈ విషయాన్ని ఎంఈఓ మహేశ్కు తెలపటంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని ప్రైవేటు స్కూళ్లకు వెళ్తున్న పిల్లల తల్లిదండ్రులతో ఆయన మాట్లాడారు. పిల్లలను ప్రభుత్వ బడికి పంపించాలని కోరారు. అనుమతులు లేకుండా పిల్లలను తరలిస్తున్న వ్యాన్ల డ్రైవర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఊశన్నపల్లి పాఠశాల ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేస్తూ, విద్యార్థులను అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారని, కలెక్టర్ చేతుల మీదుగా ‘బెస్ట్ స్కూల్’‘ఛాంపియన్ స్కూల్’అవార్డులు పొందారని ఎంఈఓ గుర్తు చేశారు. తల్లిదండ్రులు నిజం తెలుసుకొని తమ పిల్లలను ప్రభుత్వ బడికి పంపాలని కోరారు. -
ఒక రోజు.. ఒక ఊరు.. కదిలిన యంత్రాంగం
పెద్దపల్లి: ఒకే ఒక్కడు సినిమాలో ఒక్కరోజు ముఖ్యమంత్రి సహా అధికార యంత్రాంగమంతా కదిలి అర్హులకు సంక్షేమ పథకాలు అందించినట్లు.. పెద్దపల్లి జిల్లాలో కలెక్టర్తోపాటు అధికార యంత్రాంగం మొత్తం శుక్రవారం మంథని మండలం బట్టుపల్లి గ్రామానికి చేరింది. మీసేవ, ఆధార్ సేవలు ఏర్పాటు చేసి ఆన్లైన్లో నమోదు చేస్తూ అర్హులకు రేషన్, ఆధార్కార్డులు, కులం, ఆదాయ సర్టిఫికెట్స్, పోస్టల్ ఇన్సూరెన్స్లు, బ్యాంక్ అకౌంట్స్, హెల్త్ చెకప్స్.. ఇలా అన్నీ ఒకే చోట ఏర్పాటు చేశారు. పీఎం ధర్తీ ఆబాజన్ జాతీయ గ్రామ్ ఉత్కర్ష అభియాన్లో భాగంగా ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ కోయ శ్రీహర్ష పాల్గొన్నారు. అర్హులందరికీ కేంద్ర ప్రభుత్వ పథకాలు అందిస్తామని తెలిపారు. -
దళారులను నమ్మి మోసపోవద్దు
ఫెర్టిలైజర్సిటీ(రామగుండం): రామగుండం ఫర్టిలైజర్స్ కెమికల్ లిమిటెడ్లో కాంట్రాక్టు ఉద్యోగాల పేరుతో జరిగిన దందా గతంలో రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ఎమ్మెల్యే రాజ్ఠాకూర్ మక్కాన్సింగ్ చొరవతో ఆర్ఎఫ్సీఎల్ ప్రభావిత ప్రాంతాల నిరుద్యోగ యువతీయువకులకు కర్మాగారంలో ఖాళీగా ఉన్న కాంట్రాక్టు ఉద్యోగాలను కేటాయించేలా ఆర్ఎఫ్సీఎల్ అధికారులపై ఒత్తిడి తెచ్చారు. స్పందించిన అధికారులు కర్మాగారంలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న కాంట్రాక్టు ఉద్యోగాలను భర్తీ చేశారు. దీన్ని అదనుగా చేసుకున్న కొందరు నాయకులు దళారుల అవతారమెత్తి రామగుండం ఎరువుల కర్మాగారంలో కాంట్రాక్టు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ దళారి దందాకు తెరలేపారు. కాగా, ఉద్యోగాల పేరుతో దళారులను నమ్మి మోసపోవద్దని ఆర్ఎఫ్సీఎల్ యాజమాన్యం ప్రకటనలో తెలిపింది. దుబ్బ ఇసుక లారీల అడ్డగింత ముత్తారం(మంథని): మండలంలోని ఓడేడు మానేరు పరివాహక ప్రాంతంలో పంట పొలాల్లోని ఇసుకమేటలను తరలిస్తున్న దుబ్బ ఇసుక లారీలను శుక్రవారం ముత్తారం, అడవి శ్రీరాంపూర్ చౌరస్తాలో స్థానికులు అడ్డుకున్నారు. రోజూ ఉదయం నుంచి రాత్రి వరకు వందలాది లారీలు నడవడంతో దుమ్ము, ధూళి ఇళ్లలోకి చేరి అనారోగ్యాల బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. దుమ్ము లేవకుండా సంబంధిత కాంట్రాక్టర్ కనీసం రోడ్డుపై నీరు కూడా చల్లించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. లారీలు అతివేగంగా వెళ్తూ మిగతా వాహనదారులకు సైడ్ ఇవ్వడం లేదని వాపోయారు. సుమారు గంట సేపు లారీలను రోడ్డుపై నిలిపివేయడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కార్యక్రమంలో బత్తుల రాముడు, గోపగాని తిరుపతి, నగేశ్, రమేశ్ పాల్గొన్నారు. ప్రసూతి సేవలు సద్వినియోగం చేసుకోవాలిమంథని: మంథని మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో సీ్త్రవైద్య నిపుణురాలు అందుబాటులో ఉంటున్నారని, ప్రసూతి సేవలను సద్వినియోగం చేసుకోవాలని డీఎంహెచ్వో అన్నప్రసన్న కుమారి అన్నారు. శుక్రవారం మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి ప్రసూతి సేవలపై ఆరా తీశారు. ప్రైవేట్ ఆసుపత్రి తనిఖీ సుల్తానాబాద్రూరల్: పెద్దపల్లిలోని రేని ఆసుపత్రిని శుక్రవారం డీఎంహెచ్వో అన్నప్రసన్నకుమారి తనిఖీ చేశారు. ఆసుపత్రిలో రికార్డులు సరిగా నిర్వహించడం లేదని, కన్సల్టెంట్ సమయంలో డాక్టర్ పేర్లకు అనుగుణంగా అందుబాటులో లేకపోవడంతో ఆసుపత్రి సిబ్బందిని హెచ్చరించారు. నిబంధనల ప్రకారం ఉన్నప్పుడే రెన్యూవల్ చేయడం జరుగుతుందని తేల్చి చెప్పారు. -
పల్లెపోరు కలిసొచ్చేనా..
● స్థానిక సమరంపై మంత్రుల ప్రకటనలతో.. ● ఆశావహుల చూపు.. రిజర్వేషన్ల వైపు ● రిజర్వేషన్ కొనసాగింపుపై స్పష్టత కరువు ● పోటీ చేసేందుకు సన్నద్ధమవుతున్న ఆశావహులుసాక్షిపెద్దపల్లి: ‘అన్న.. ఎన్నికలు నోటిఫికేషన్ వస్తుందంటావా? ముందు పరిషత్ ఎన్నికలు వస్తాయా? లేదా సర్పంచ్ ఎన్నికలు వస్తాయా? పాత రిజర్వేషన్లు కొనసాగిస్తారా.. లేక కొత్తవి ప్రకటిస్తారా..? రిజర్వేషన్ మారితే కలిసొచ్చేనా’.. అంటూ గ్రామాల్లో ఎక్కడ చూసినా స్థానిక సంస్థల ఎన్నికల ముచ్చట్లే వినిపిస్తున్నాయి. పల్లె పోరుకు ఎప్పుడు తెర లేస్తుందన్న దానిపై గ్రామాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. పంచాయతీలను కొద్దికాలంగా ప్రత్యేకాధికారుల పాలనతో నెట్టుకొస్తుండగా.. తాజాగా కొందరు మంత్రులు చేస్తున్న ప్రకటనలతో ఆశావహుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తున్నది. రైతుభరోసా, దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ, రూ.10లక్షల లోపు పనులకు నిధుల మంజూరు, ఇందరమ్మ ఇళ్ల పంపిణీ తదితరలు చూస్తుంటే ఎన్నికల వాతావరణం దగ్గరపడుతోందని ఆశావహులు విశ్లేషించుకుంటున్నారు. ఇప్పటికే మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి లీకులు ఇవ్వడంతో స్థానిక పోరు ఖాయమైనట్లేనని, వచ్చే నెల మొదటివారంలో పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జోరుగా సాగుతుంది. రిజర్వేషన్లపైనే చర్చ.. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం స్థానిక సంస్థల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు అన్నీ కలిపి 50 శాతాన్ని దాటకూడదు అనే నిబంధన ఉంది. పంచాయతీ ఎన్నికలు 2019లో 27 శాతం బీసీలకు, 15 శాతం ఎస్సీలు, 6శాతం ఎస్టీలకు కేటాయించారు. మొత్తం స్థానాల్లో మహిళలకు సగం సీట్లు కేటాయించారు. గత ప్రభుత్వం పంచాయతీ రిజర్వేషన్లపై తెచ్చిన చట్టం ప్రకారం పదేళ్ల పాటు రిజర్వేషన్లు అమలులో ఉంచుకోవచ్చు. దీని ప్రకారం మరో ఐదేళ్లు పాత రిజర్వేషన్లు కొనసాగించే అవకాశం ఉంది. కానీ, కాంగ్రెస్ సర్కారు బీసీలకు 42శాతం రిజర్వేషన్ కల్పిస్తామని ప్రకటించింది. దీనికి అనుగుణంగా కులగణన చేపట్టింది. చట్టం రూపొందించి కేంద్ర ప్రభుత్వ ఆమోదానికి పంపింది. కేంద్రం ఆమోదం తెలిపే అవకాశాలు లేకపోవడం, ఇప్పటికే స్థానిక సంస్థల్లో ప్రత్యేక పాలనతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈనేపథ్యంలో ప్రభుత్వం పార్టీవారీగా బీసీలకు రిజర్వేషన్లు కల్పించి ఎన్నికలకు పోయే అవకాశాలున్నాయనే ప్రచారంతో ఆశావహుల్లో రిజర్వేషన్లపై ఉత్కంఠ నెలకొంది. రంగంలోకి ఆశావహులు ప్రధానంగా యువతరం ఈ సారి స్థానిక బరిలో ఉండేందుకు ఊవ్విళ్లూరుతోంది. పార్టీల పరంగా సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ పదవిని ఆశించేవారంతా యాక్టివ్ అవుతున్నారు. తమ గ్రూపులు, వర్గాలను కూడగట్టుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వార్డుల వారీగా ఫ్యానల్స్ను ఏర్పాటు చేసుకొని తమకు అనుకూలంగా వ్యవహరించే నేతలను ఆయా వార్డుల్లో గెలిపించుకోవడానికి అనుగుణంగా పావులు కదుపుతున్నారు. సిద్ధంగా యంత్రాంగం జిల్లాలో 13 జెడ్పీటీసీ, 140 ఎంపీటీసీ, 263 సర్పంచ్, 2,474 వార్డులున్నాయి. అధికారులంతా పంచాయతీ ఎన్నికల కోసం ఓటరు జాబితాల మార్పుచేర్పు ప్రక్రియను ఇప్పటికే పూర్తి చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో అధికారులు పోలింగ్ నిర్వహణకు రెడీగా ఉన్నారు. ఇప్పటికే ఓటరు జాబితా, బ్యాలెట్ బాక్సులతోపాటు నామినేషన్ల స్వీరణలో పాల్గొనే అధికారులకు శిక్షణ కార్యక్రమాలు పూర్తిచేశారు. ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సన్నద్ధమవుతుండటంతో ఆశావహుల్లో రిజర్వేషన్ అంశం హాట్ టాపిక్గా మారింది. బీసీల రిజర్వేషన్పై సందిగ్ధం వీడితే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశాలున్నాయి. -
బట్టీ యజమానిపై చర్యలు తీసుకోవాలి
సుల్తానాబాద్/ఎలిగేడు: చిన్నపిల్లలతో వెట్టిచాకిరి చేయిస్తున్న ఇటుకబట్టీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని దళిత బహుజన సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు బొంకూరి కై లాసం శుక్రవారం ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడు వడ్డేపల్లి రాంచందర్కు విన్నవించారు. పెద్దపల్లి మండలం రాంపల్లి గ్రామంలో పీవీసీ ఇటుకబట్టీలో యజమాని వెంకన్న చిన్నపిల్లలతో వెట్టిచాకిరీ చేయిస్తున్నారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. బట్టీలో బాలలతో ఎందుకు పని చేయిస్తున్నారని ప్రశ్నించినందుకు తనను కులంపేరుతో దూషించడమే కాకుండా బెదిరింపులకు పాల్పడ్డాడని సభ్యుడికి తెలిపారు. కమిషన్ సభ్యులు సానుకూలంగా స్పందించినట్లు కై లాసం తెలిపారు. అలాగే కమిషన్ సభ్యుడు రాంచందర్ను ఎలిగేడులో మాజీ ఎంపీపీ కవ్వంపల్లి లక్ష్మీదుర్గయ్య, లాలపల్లి మాజీ సర్పంచ్ బాసంపల్లి కొండయ్య, బాలి శ్రీనివాస్ సన్మానించారు. -
యోగానందం
● నిత్య సాధనతో ఆరోగ్యం ● యోగాసనాలు వేస్తున్న జనం ● ఆరోగ్యస్పృహతో జీవనం ● నేడు యోగా దినోత్సవంయోగా.. ప్రపంచం పాటిస్తున్న ఆరోగ్యసూత్రం. శరీరం.. మనసును ఒకతాటికిపై తెచ్చి ఆరోగ్య ప్రయోజనాలు చేకూర్చే ప్రక్రియ. ప్రస్తుత ఉరుకులు.. పరుగుల జీవితంలో యోగా సాధన ఆరోగ్యమంత్రంగా మారింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కరోనా తర్వాత ప్రజలు పూర్తిగా ఆరోగ్యస్పృహతో జీవిస్తున్నారు. నిత్యం ఆసనాలు వేస్తూ మానసికంగా.. శారీరకంగా ఆరోగ్యంగా జీవిస్తున్నారు. దీని ప్రాధాన్యతను గుర్తించిన ఐక్యరాజ్యసమితి పదేళ్ల క్రితమే జూన్ 21న ప్రపంచ యోగా దినోత్సవంగా ప్రకటించింది. నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. – వివరాలు 8లోu పెద్దపల్లిలో యోగాసనాలు వేస్తున్న అశ్వినియోగాతో నయమైంది కరీంనగర్స్పోర్ట్స్: 2013 నుంచి 2016 వరకు అనారోగ్యంతో బాధపడ్డాను. యోగా చేయాలని పలువురు చెప్పడంతో ప్రతీ రోజు సాధన చేస్తున్నాను. ప్రస్తుతం ఎలాంటి రోగాలు లేకుండా చాలా సంతోషంగా గడుపుతున్నాను. – కె.వందన ఆస్తమా, బీపీ పోయాయి కరీంనగర్స్పోర్ట్స్: సర్వరోగ నివారణి యోగా అనే దానికి నేనే నిదర్శనం. యోగాసనాలు చేయకముందు బీపీ, ఆస్తమాతో బాధపడ్డాను. ఇక్కడ డేకేర్ సెంటర్కు వచ్చినప్పటి నుంచి అన్ని నయమయ్యాయి. ఇప్పుడు చాలా చురుకుగా ఉండగలుగుతున్నాను. – కె.అరుణ -
‘సుందిళ్ల’ అభివృద్ధి పనులకు కృషి
● పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణమంథనిరూరల్/యైటింక్లయిన్కాలనీ: రైతులకు జీవనాధారంగా నిలిచిన కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని సుందిళ్ల బరాజ్ ఉపయోపడేలా అవసరమైన అభివృద్ధి పనులకు తనవంతు కృషి చేస్తానని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. శుక్రవారం మంథని మండలం సిరిపురం సమీపంలోని సుందిళ్ల బరాజ్ను సందర్శించారు. బరాజ్ ప్రాంగణాన్ని పరిశీలించి నీటి నిల్వ, ఉపయోగం, ప్రయోజనాలు, సాగు విస్తీర్ణం గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, బరాజ్ రైతులకు ఉపయోగపడే రీతిలో అవసరమైన చర్యలు తీసుకుంటానని అన్నారు. ఆయన వెంట స్థానిక నాయకులు, అధికారులు ఉన్నారు. అలాగే రామగిరి మండలం సుందిళ్ల గ్రామంలోని శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఎంపీ ప్రత్యేక పూజలు చేశారు. అంతకముందు ఎంపీకి ఆలయ ఈవో రాజ్కుమార్, అర్చకులు జయంత్శర్మ పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. 108 కొబ్బరికాయలు కొట్టి మొక్కు చెల్లించుకున్నారు. మల్లన్న సన్నిధిలో ఎంపీ పూజలుఓదెల(పెద్దపల్లి): ఓదెల మల్లికార్జునస్వామి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని ఎంపీ వంశీకృష్ణ పేర్కొన్నారు. శుక్రవారం స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ఈవో సదయ్య ఆధ్వర్యంలో అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అంతకుముందు కొలనూర్లో ఎంపీని నాయకులు దొడ్డె స్వామి, కుంచం మల్లయ్య ఆధ్వర్యంలో సన్మానించారు.