Peddapalli
-
ప్రైవేట్ ఓబీలో కొనసాగిన సమ్మె
గోదావరిఖని: ప్రయివేట్ ఓబీలో మూడోరోజు మంగళవారం సమ్మె యథావిధిగా కొనసాగింది. రామగుండం రీజియన్లోని పీసీ పటేల్, హెచ్డీ, వీ9, సీ5, ఆర్వీఆర్ ప్రైవేట్ ఓబీల్లోని 2వేల మంది కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్ సమక్షంలో ఓబీ బాధ్యులు మంగళవా రం చర్చలు జరిపారు. కార్మికులకు రూ.4వేల వేత నం పెంచాలని, ఆరోగ్యభద్రత, ఇతర వైద్య సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. అయితే ఓబీ కాంట్రాక్టు యజమాన్యాలు రూ.2వేలు పెంచేందుకు అంగీకరించినట్లు తెలిపారు. దీంతో రూ.4వేలు పెంచడంతో పాటు అన్ని సౌకర్యాలు కల్పించాలని ఎమ్మెల్యే సూచించారు. ఓబీ యాజమాన్యాలు ముందుకు రాకపోవడంతో చర్చలు వాయిదా పడ్డాయి. కార్మికులకు న్యాయం జరిగేంతవరకు సమ్మె విరమించబోమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. -
పరీక్షలు సరే.. జాగ్రత్తలేవీ..?
● మాస్క్లు లేకుండా ఒకే చోట గుంపులుగా.. ● ఒకరి నుంచి మరొకరికి టీబీ సోకే ప్రమాదంకోల్సిటీ(రామగుండం): ‘క్షయ(టీబీ) అంటువ్యాధి. ఊపిరితిత్తులు, గొంతులో టీబీ వ్యాధి ఉన్న వ్యక్తి దగ్గినప్పుడు, ఉమ్మినప్పుడు, తుమ్మినప్పుడు, మాట్లాడినప్పుడు టీబీ బ్యాక్టీరియా గాలిలోకి ప్రవేశిస్తుంది. ఇలా ఒకరి నుంచి మరొకరికి గాలి ద్వారా వ్యాపిస్తుంది’. టీబీ వ్యాపించకుండా వ్యక్తిగత జా గ్రత్తలు తీసుకోండి అంటూ ప్రభుత్వాలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. కానీ రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన టీబీ నిర్థారణ ఎక్స్రే పరీక్షా కేంద్రానికి వ చ్చిన వారందరినీ ఇలా ఒక హాల్లో గుంపులు గుంపులుగా ఒకే దగ్గర కూర్చొబెట్టారు. ఇందులో చాలా మంది వ్యక్తిగత జాగ్రత్తలు పాటించలేదు. కనీసం మాస్కులు కూడా పెట్టుకోలేదు. వైద్య సిబ్బంది కూడా జాగ్రత్తలు పాటించకపోగా, కనీసం అక్కడున్న వారికి అవగాహన కల్పించకపోవడంతో ఎవరినుంచైనా టీబీ వ్యాపిస్తే ఎలా? అంటూ పలువురు ఆందోళన చెందుతున్నారు. టీబీ ఎక్స్రే నిర్థారణ పరీక్షలు నిర్వహిస్తున్న కేంద్రం ఎదురుగానే ఎస్బీఐ బ్యాక్ ఉంది. దీనికి తోడు బల్దియా కార్యాలయానికి వివిధ సేవల కోసం చాలా మంది ప్రజలు వస్తూ పోతుంటారు. అలాగే వందలాది బల్దియా సిబ్బంది కూడా ప్రతిరోజూ కార్యాలయానికి వస్తుంటారు. జాగ్రత్తలు పాటించని టీబీ పేషెంట్ల ద్వారా ఇతరులకు టీబీ సోకకముందే అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. -
...అనే నేను!
● ఎమ్మెల్సీ ఎన్నికల్లో చర్చనీయాంశంగా అభ్యర్థుల పేర్లు ● విద్యాసంస్థ పేరుతో నరేందర్ రెడ్డి ● భార్యపేరు జత చేసుకుని హరికృష్ణ గెజిట్ ● తనకు కావాలనే ప్రాధాన్యం తగ్గించారని సింగ్ ఆరోపణ ● సాధారణంగానే టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లుసాక్షిప్రతినిధి,కరీంనగర్●: కరీంనగర్– మెదక్– నిజామాబాద్– ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల గ్రాడ్యుయేట్స్, టీచర్స్ నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థుల పేర్లపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఈ మండలి ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల పేర్లు ఇంతకాలం ఒకలా.. ఇప్పుడు ఒకలా కనిపిస్తుండటమే ఇందుకు కారణం. సాధారణంగా తెలుగు రాష్ట్రాల్లో ఇంటిపేరు ముందుండి, ఆ తరువాత ఒంటి పేర్లు ఉండటం సహజం. అదే తెలుగు ఎన్ఆర్ఐలు అయితే కాస్త వైరెటీగా ఇంటి పేరును.. ఒంటి పేరు తరువాత పెట్టుకుంటారు. ఇక ఉత్తర భారతంలో అసలు పేరు తరువాతే ఇంటి పేరు ఉంటుంది. తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఈ పేర్ల విషయంలో అభ్యర్థులు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. తమ రంగంలో తమకు గుర్తింపు తెచ్చిన పేర్లతోనే బరిలో దిగుతుండటం విశేషం. ఈ అంశంపై ప్రజల్లో, నేతల్లో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. కొందరు పేర్ల మార్పు విషయాన్ని వివాదంగా చూస్తున్నారు.. ఇదంతా పోలింగ్ బ్యాలెట్ వరుస క్రమంలో ముందుకు వచ్చేందుకు వేసిన ఎత్తుగడగా అభివర్ణిస్తున్నారు. మరికొందరు ఇందులో అసలు వివాదం ఏముంది? అని ప్రశ్నిస్తున్నారు. మార్పు కనిపించింది వీరిలోనే.. గ్రాడ్యుయేట్ నియోజకవర్గానికి పోటీ చేస్తున్న ప్రధాన అభ్యర్థులందరికీ పేర్లలో చెప్పుకోదగ్గ మార్పులు చోటుచేసుకున్నాయి. ఉదాహరణకు కాంగ్రెస్ అభ్యర్థి వుట్కూరి నరేందర్ రెడ్డి పేరును.. అల్ఫోర్స్ నరేందర్రెడ్డి వుట్కూరిగా ముద్రించారు. ఇందుకోసం ఆయన ఎలాంటి గెజిట్ను విడుదల చేయలేదు. అదే సమయంలో తాజాగా నరేందర్రెడ్డి తన సతీమణి వనజా పేరును.. వనజారెడ్డిగా మారుస్తూ ఇటీవల గెజిట్ విడుదల చేయడం గమనార్హం. ఆల్ఫోర్స్ అనేది నరేందర్రెడ్డికి ఉనికి అని, ఆ విద్యాసంస్థలతోనే ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ప్రాచుర్యం పొందారు కాబట్టి.. పేరు అలా వచ్చేలా జాగ్రత్తలు తీసుకున్నారని సమాచారం. అదే సమయంలో బీఎస్పీ అభ్యర్థి పులి హరికృష్ణ పేరును ప్రసన్న హరికృష్ణగా పబ్లిష్ చేశారు. వాస్తవానికి ఆయన పులి హరికృష్ణ అయినప్పటికీ.. పోటీ పరీక్షలకు కంటెంట్ ఇచ్చిన క్రమంలో ప్రసన్న హరికృష్ణగానే ప్రసిద్ధి చెందారు. అందుకే, ప్రాచుర్యం పొందిన పేరుతో తన అధికారిక పేరుగా గెజిట్ తెచ్చుకుని మరీ మార్చుకున్నారు. వీరిలో ఎవరు గెలిచినా ఓడినా.. ఇకపై ఇవే పేర్లతో కొనసాగనున్నారు. ఈ విషయంపై ఏఐఎఫ్బీ బీఫామ్పై బరిలో ఉన్న మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తన పేరును 11వ స్థానానికి మార్చడంలో కుట్రదాగి ఉందని, కొందరు అభ్యర్థులకు నిబంధనలకు విరుద్ధంగా మేలు చేసినట్లుగా అధికారుల తీరు ఉందని ఆరోపిస్తున్నారు. తాను ప్రముఖ పార్టీ బీఫామ్ నుంచి పోటీ చేస్తున్నా.. తన పేరును కిందికి మార్చి ప్రాధాన్యం తగ్గించారని విమర్శించారు. అదే సమయంలో స్వతంత్ర అభ్యర్థి వేముల విక్రమ్రెడ్డి అనే అభ్యర్థి పేరుకు ముందర ‘జర్నలిస్టు’ అనే పదం వచ్చి చేరడం గమనార్హం. మరో ఇండిపెండెట్ మహమ్మద్ ముస్తాక్అలీ తన పేరుకు ముందు డాక్టర్ అని ప్రచారం జరిగినా.. తీరా పోస్టల్ బ్యాలెట్లో డాక్టర్ లేకుండానే పేరు ముద్రితమవడం గమనార్హం. టీచర్స్ ఎమ్మెల్సీలో ఇలాంటి చిత్రాలు పెద్దగా చోటు చేసుకోలేదు. -
విద్యార్థులపై ‘దృష్టి’
● ఆర్బీఎస్కే ఆధ్వర్యంలో మరోసారి కంటి పరీక్షలు ● కళ్లద్దాల పంపిణీకి సమాయత్తం ● గోదావరిఖని జీజీహెచ్, పెద్దపల్లిలో శిబిరాలు ● రోజుకు 100 మంది విద్యార్థులకు సైట్ నిర్ధారణకళ్లద్దాలు పంపిణీ చేస్తాం దృష్టిలోపం, కంటి సమస్యలున్నట్లు గుర్తించిన విద్యార్థులందరికీ 16 రోజుపాటు కంటి పరీక్షలు నిర్వహిస్తాం. మరోసారి కంటి పరీక్ష చేయడం ద్వారా సైట్ ఏవిధంగా ఉందో తెలుస్తుంది. సైట్ ఆధారంగా కళ్లద్దాలను పంపిణీ చేస్తాం. – డాక్టర్ అన్నప్రసన్న కుమారి, డీఎంహెచ్వో కోల్సిటీ(రామగుండం): పిల్లల చూపు మసకబారుతోంది. దీంతో తమ పుస్తకాలను చదవడం, రాయడంతో పాటు బ్లాక్ బోర్డుపై టీచర్లు ఏం రాస్తున్నారో కనిపించకపోవడంతో పిల్లలు ఇబ్బందులకు గురవుతున్నారు. గతేడాది జిల్లాలో ఎంపిక చేసిన పాఠశాలల్లో పరీక్షలు నిర్వహించిన వైద్యాధికారులు దృష్టిలోపాలున్న విద్యార్థులతో పాటు ఇతర కంటి సమస్యలున్న వారిని గుర్తించారు. ఇలాంటి విద్యార్థులందరికీ కళ్లద్దాలివ్వడానికి ప్రభుత్వం సమాయత్తం అవుతోంది. ఇందులో భాగంగానే జిల్లాలో దృష్టిలోపం ఉన్న విద్యార్థులకు సైట్ ఏ విధంగా ఉందో తెలుసుకునేందుకు సోమవారం నుంచి మరో సారి విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో 1,674 మందికి దృష్టిలోపం జిల్లాలో 580 ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో చదువుతున్న 29,542 మంది విద్యార్థులకు గతేడాది కంటి పరీక్షలు నిర్వహించారు. ఇందులో 1,674 మంది విద్యార్థులకు దృష్టిలోపం, 139 మంది విద్యార్థులు ఇతర కంటి సమస్యలతో బాధపడుతున్నట్లు వైద్యాధికారులు గుర్తించారు. జీజీహెచ్, పెద్దపల్లిలో టెస్టులు గోదావరిఖని జీజీహెచ్తో పాటు పెద్దపల్లి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో రెండు ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేశారు. క్యాంపుల్లో దృష్టిలోపం, ఇతర కంటి సమస్యలతో బాధపడుతున్న విద్యార్థులకు మరోసారి కంటి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఒక్కో క్యాంపులో 50 మంది చొప్పున రెండు క్యాంపుల్లో రోజుకు 100 మందికి కంటి పరీక్షలను చేస్తున్నారు. ఆర్బీఎస్కే ఆధ్వర్యంలో విద్యార్థుల తరలింపు దృష్టిలోపం ఉన్న విద్యార్థులకు కంటి సైట్ ఏమేరకు ఉందో తెలుసుకునేందుకు మరోసారి కంటి పరీక్షలు నిర్వహిస్తున్న క్యాంపులకు ఆయా పాఠశాలల నుంచి రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం(ఆర్బీఎస్కే)కు చెందిన వాహనాల్లో మెడికల్ ఆఫీసర్లు, ఏఎన్ఎంలు తరలిస్తున్నారు. టెస్టులకు వచ్చిన విద్యార్థులకు ఉచితంగా బిస్కెట్స్, వాటర్ బాటిళ్లు అందిస్తున్నారు. కంటి పరీక్షలు పూర్తయ్యాక తిరిగి వారిని వారి పాఠశాలల్లో వదిలి పెడుతున్నారు. కంటి పరీక్షలు ఇలా..వైద్య బృందాలు: 02కంటి పరీక్షలు నిర్వహించిన పాఠశాలు 580పరీక్షించిన విద్యార్థుల సంఖ్య 29,452దృష్టి సమస్యలు ఉన్న విద్యార్థులు 1,674ఇతర కంటి సమస్యలు ఉన్న విద్యార్థులు 139 -
మహాలక్ష్మి పథకంలో..
జిల్లా లబ్ధిదారులు సబ్సిడీ (రూ.కోట్లలో) జగిత్యాల 1,82,801 9.49 కరీంనగర్ 1,43,899 8.12 పెద్దపల్లి 1,05,913 5.54 సిరిసిల్ల 93,104 4.72జిల్లా కనెక్షన్లు సబ్సిడీ (రూ.కోట్లలో) కరీంనగర్ 1,33,872 594.82 పెద్దపల్లి 1,05,761 484.06 జగిత్యాల 1,71,940 719 సిరిసిల్ల 90,780 388.50 -
యూరియాను అందుబాటులో ఉంచాలి
ఓదెల: సొసైటీ గోదాముల్లో రైతులకు యూరి యాను అందుబాటులో ఉంచాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. మంగళవారం ఓదెల మండలం కొలనూర్, పొల్కపల్లి, నాంసానిపల్లె గ్రామాల్లో ని పాఠశాల, అంగన్వాడీ సెంటర్, ఓదెలలోని కస్తూరిబా బాలికల విద్యాలయం, ప్రాథమిక ఆ రోగ్య కేంద్రం, తహసీల్దార్, ఎంపీడీవో కార్యాలయాలను సందర్శించారు. రైతులకు ప్రస్తుత సీజన్లో యూరియా కొరత లేకుండా చూడాలన్నారు. సహకార సంఘాల్లో యూరియా నిల్వల ను ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలని తెలిపా రు. కొలనూర్ జెడ్పీ పాఠశాలలో మంజూరైన నిధులతో పనులు ప్రారంభించాలన్నారు. పొత్కపల్లి పాఠశాలలో డయాస్ నిర్మాణం చేపట్టాలని, కస్తూర్బా పాఠశాలలో రెండు అదనపు గదులతో పాటు అవసరమైన టాయిలెట్స్ నిర్మాణం చేపట్టాలని తెలిపారు. టీబీ లక్షణాలున్న ప్రతిఒక్కరి కీ ఎక్స్రే తీయాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో పోషకలోపంతో ఉన్న విద్యార్థులను మానిటర్ చే స్తూ వారి ఎదుగుదలకు కృషిచేయాలన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసి న సమావేశంలో పలు సమస్యలపై అధికా రులతో సమీక్షించారు. రాబోయే వేసవిలో తాగునీటి ఇబ్బందులు లేకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కలెక్టర్ వెంట ఓదెల తహసీల్దార్ సునీత, ఎంపీడీవో తిరుపతి, ఎంఈవో ఎర్ర రమేశ్, వ్యవసాయాధికారి భాస్కర్, పీఆర్ ఏఈఈ జగదీ్శ్, సీఈవో గొలి అంజిరెడ్డి, డాక్టర్లు శంజనేష్, షాబొద్దీన్, ప్రధానోపాధ్యాయుడు పాల్గొన్నారు. ● కలెక్టర్ కోయ శ్రీహర్ష -
అక్షరాస్యత శాతం
కరీంనగర్ 69.2 పెద్దపల్లి 65.6 జగిత్యాల 60.2 సిరిసిల్ల 62.7ఉపాధి హామీ కూలీలు కరీంనగర్ 1,22,862 పెద్దపల్లి 1,17,821 జగిత్యాల 1,67,355 సిరిసిల్ల 97,252సీ్త్ర, పురుష నిష్పత్తి (ప్రతీ వెయ్యి మంది పురుషులకు ఉన్న మహిళల సంఖ్య)కరీంనగర్ 993 పెద్దపల్లి 992 జగిత్యాల 1,036 సిరిసిల్ల 1014పశుసంపద (గొర్రెలు) కరీంనగర్ 6,38,706 పెద్దపల్లి 5,49,286 జగిత్యాల 6,10,985 సిరిసిల్ల 3,88,227 -
పని స్థలాల్లో భద్రత చర్యలు పాటించాలి
పాలకుర్తి: కూలీలు తప్పనిసరిగా పనిస్థలాల్లో భద్ర త చర్యలు పాటించాలని పెద్దపల్లి డీఆర్డీవో కాళిందిని అన్నారు. మంగళవారం బంసత్నగర్ శివారులో జరుగుతున్న ఉపాధి హామీ పనులను పరిశీలించి కూలీలతో మాట్లాడారు. ప్రతిఒక్కరూ వ్యక్తి గత ప్రమాదబీమా చేయించుకోవాలని సూచించారు. అ నంతరం జీడీనగర్లోని నర్సరీని తనిఖీ చేసి మొక్క ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాణాపూర్లో స్వశక్తి సంఘం సభ్యురాలు సీ్త్రనిధి ద్వారా ఏర్పాటు చేసుకున్న మదర్ యూనిట్ను, గుంటూర్పల్లిలో మెట్టు పార్వతి ఏర్పాటు చేసుకున్న పచ్చళ్ల తయారీ కేంద్రాన్ని పరిశీలించి పలు సూచనలు చేశారు. రుణాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా బలోపేతం కావాలని అన్నారు. ఆమె వెంట ఐకేపీ ఏపీఎం సదానందం, ఉపాధి హామీ విభాగం అధి కారులు, స్వశక్తి సంఘాల సభ్యులు పాల్గొన్నారు. -
శిథిలమైన నాలాల పునర్నిర్మాణానికి చర్యలు
కోల్సిటీ(రామగుండం): మురుగు నీరు నిలిచి పోకుండా శిథిలమైన నాలాలను పునర్నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు), రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్ (ఎఫ్ఏసీ) జె.అరుణశ్రీ ఆదేశించారు. నగరపాలక సంస్థ పరిధిలోని 10, 38, 39వ డివిజన్లలో మంగళవారం ఆకస్మికంగా పర్యటించి ఉపరితల కాలువలను పరి శీలించారు. 2ఏ ఇంక్లయిన్ మోరీ వద్ద శిథిలమైన నాలా కారణంగా మురుగునీరు నిలిచిపోయిన నేపథ్యంలో సాధ్యమైనంత త్వరగా పునర్నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. వర్షా కాలంలో లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురికాకుండా వరద నీటి కాలువల నిర్మాణానికి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. 39వ డివిజన్లోని డంపింగ్ యార్డ్ను పరిశీలించి చెత్త పేరుకుపోకుండా కుప్పలను ఎప్పటికప్పుడు తొలగించాలని అన్నారు. అదనపు కలెక్టర్ వెంట నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ వెంకటస్వామి, ఎస్ఈ శివానంద్, డీఈఈ జమీల్ తదితరులు పాల్గొన్నారు. హిందూస్తాన్ జింక్ సభ్యులకు సింగరేణి రెస్క్యూ శిక్షణగోదావరిఖని: రాజస్తాన్లోని హిందూస్తాన్ జింక్ లిమిటెడ్ (హెచ్జెడ్ఎల్) సంస్థ సభ్యుల కు సింగరేణి రెస్క్యూ సభ్యులు మంగళవారం నుంచి శిక్షణ ఇస్తున్నారు. శిక్షణలో పాల్గొంటున్న 14 మంది సభ్యుల బృందంలో ఏడుగురు మహిళలున్నారు. రామగుండం మెయిన్ రెస్క్యూ స్టేషన్లో 15రోజుల పాటు రెస్క్యూపై ప్రాథమిక శిక్షణ ఇస్తారు. సింగరేణి రెస్క్యూ చరిత్రలో ఇతర సంస్థలకు చెందిన మహిళా రెస్క్యూ సభ్యులకు శిక్షణ ఇవ్వడం ఇదే మొదటిసారి. ఈ కార్యక్రమంలో రెస్క్యూ జీఎం శ్రీనివాస్రెడ్డి, రెస్క్యూ సూపరింటెండెంట్ బి.మాధవరావు, ఇన్స్ట్రక్టర్ భాస్కర్రెడ్డి, ఏఎన్ మూర్తి బ్రిగేడ్ సభ్యులు పాల్గొన్నారు. మరమ్మతు పనులు త్వరగా పూర్తి చేయాలిమంథని: కలెక్టర్ ప్రత్యేకంగా మంజూరు చేసిన నిధులతో ఆస్పత్రిలో చేపట్టిన వార్డుల మరమ్మతు పనులను త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకరావాలని జిల్లా మెడికల్ సూపరింటెండెంట్ శ్రీధర్ అన్నారు. మంగళవారం మంథనిలోని సామాజిక వైద్యశాలను సందర్శించి ఆస్పత్రికి వచ్చే రోగుల వివరాలు తెలుసుకున్నారు. రోగులకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఐదు పడకల డయాలసిస్ కేంద్రాన్ని పరిశీలించి రోగుల సంఖ్య ఆధారంగా అవసరమైన పరికరాలు, స్టాక్ను ముందస్తుగా అందుబాటులో ఉంచుకోవాలన్నారు. సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. మంథని ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజశేఖర్తో పాటు తదితరులు ఉన్నారు. పన్ను వసూళ్లలో లక్ష్యం సాధించాలిజూలపల్లి: గ్రామపంచాయతీల్లో వందశాతం పన్ను వసూలు చేసి నిర్దేశించిన లక్ష్యం సాధించాలని పెద్దపల్లి డీఎల్పీవో వేణుగోపాల్ అన్నారు. మంగళవారం జూలపల్లి మండలం పెద్దాపూర్ గ్రామపంచాయతీలో రికార్డులు పరిశీలించి ఇంటి పన్ను వసూళ్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎంపీవో అనిల్రెడ్డితో కలిసి పారిశుధ్య పనులు పరిశీలించి పలు సూచనలు చేశారు. వేసవిలో తాగునీటి ఇబ్బంది రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. పారిశుధ్య నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉండొద్దని సూచించారు. డీఎల్పీవో వెంట కార్యదర్శులు ఖాజాముజీబుద్దీన్ మహ్మద్, తీగెల సతీశ్, కారోబార్ పురుషోత్తం, చంద్రమౌళి, సిబ్బంది ఉన్నారు. -
ప్రైవేట్ ఓబీ కాంట్రాక్టు కార్మికుల సమ్మె
గోదావరిఖని: వేతనాలు పెంచాలని, సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్తో రామగుండం రీజియన్లోని సింగరేణి ఓబీ కాంట్రాక్టు కార్మికులు రెండురోజులుగా సమ్మె చేస్తున్నారు. దీంతో ఓసీపీల్లో మట్టి వెలికి తీత పనులు నిలిచిపోయాయి. జీడీకే–5 ఓసీపీ పీసీ పటేల్, ఓసీపీ–3లోని ఆర్వీఆర్, ఓసీపీ–3 పేజ్–2లోని వీ–9 ఓబీ కంపెనీల్లో పనిచేస్తున్న సుమారు 2వేల మంది విధులు బహిష్కరించారు. తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించేంత వరకూ సమ్మె కొనసాగిస్తామని హెచ్చరించారు. మూడేళ్లుగా వేతనాలు పెంచలే డ్రైవర్లు, బ్లాస్టింగ్ హెల్పర్లు, మెకానికల్ హెల్పర్లకు వేతాలు పెంచాలని కొంతకాలంగా కోరుతున్నారు. వీరితోపాటు వివిధ విభాగాల్లో పనిచేసేత కార్మికులకు మూడేళ్ల నుంచి వేతనాలు పెంచడం లేదు. ఈసారి డ్రైవర్లకు రూ.6వేలు, బ్లాస్టింగ్ హెల్పర్లకు రూ.4వేలు, మెకానికల్ హెల్పర్లకు రూ.3వేల చొప్పున పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఈవిషయంలో గతంలో ఒప్పందం జరిగినా.. అమలు చేయడం లేదంటున్నారు. సమ్మె విచ్ఛిన్నానికి యత్నాలు.. నిబంధనల ప్రకారం తమకు వేతనాలు చెల్లించాలనే డిమాండ్తో సమ్మె చేస్తున్నామని, అయితే, దీనిని విచ్ఛిన్నం చేసేందుకు పోలీసులను రంగంలోకి దించారని ఆరోపణలు వస్తున్నాయి. ఇతర రాష్ట్రాలకు చెందిన కార్మికులను ఇక్కడకు తీసుకొచ్చి బందోబస్తు మధ్య ఓబీ పనులు చేయించాలని చూస్తున్నారని ఆరోపించారు. సమ్మె నేపథ్యంలో ఓబీ క్యాంపు కార్యాలయాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. సింగరేణి సంస్థ బాధ్యత తీసుకుని తమ సమస్యలు పరిష్కరించాలి కార్మికులు కోరుతున్నారు. మిగిలింది 40 రోజులే.. ఈ ఆర్థిక సంవత్సరంలో సింగరేణి 72 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ప్రస్తుతం సింగరేణి ఆధ్వర్యంలో ఓబీ పనులు కొనసాగుతున్నా.. పూర్తిగా ప్రైవేట్పై ఆధారపడిన జీడీకే–5 ఓసీపీలో మట్టి వెలికితీత పనులు స్తంభించాయి. దీని ప్రభావం బొగ్గు ఉంటుందని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. నిర్దేశిత బొగ్గు ఉత్పత్తి లక్ష్య సాధనకు మరో 40రోజుల గడువు మాత్రమే ఉంది. వేతనాలు పెంచాలని డిమాండ్ నిలిచిన మట్టి వెలికితీత పనులు కోలిండియా వేతనాలు అమలు చేయాలి వేతనాలు పెంచాలని కార్మికులు అనేక సార్లు విన్నవించినా ప్రైవేట్ ఓబీ యాజమాన్యం పట్టించుకోలేదు. దీంతోనే స మ్మెకు దిగాల్సి వచ్చింది. కాంట్రాక్టు కార్మికులకు కోలిండియా వేతనాలు అమలు చేయాలి. – కుమారస్వామి, అధ్యక్షుడు, సీఐటీయూ జోక్యం చేసుకోవాలి కాంట్రాక్టు కార్మికుల సమస్యల పరిష్కారానికి సింగరేణి జోక్యం చేసుకోవాలి. మూడేళ్లుగా వేతనాలు పెంచుతామని చెప్పినా.. ఇప్పటివరకు పెంచలేదు. దీంతో ఇబ్బంది పడుతు న్నాం. విధుల విషయంలో కచ్చితంగా వ్యవహరిస్తు కాంట్రా క్ట్ ఓబీ యాజమాన్యం వేతనాలు పెంచడంలేదు. – సిరాజుద్దీన్, కాంట్రాక్టు కార్మికుడు,ఆర్వీఆర్ కంపెనీ -
గ్రాడ్యుయేట్స్ 3,55,159, టీచర్స్ 27,088
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ – మెదక్ – నిజామాబాద్ – ఆదిలాబాద్ జిల్లాల పట్టభద్రులు, ఉపాధ్యాయ స్థానాలకు తుది ఓటర్ల జాబితా ఖరారైంది. సోమవారం ఎన్నికల కమిషన్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. పట్టభద్రుల ఓటర్లుగా ఇప్పటివరకు 3,55,159 మంది, ఉపాధ్యాయ ఓటర్లు 27,088 మంది ఎన్రోల్ చేసుకున్నారు. ఈనెల 3న నామినేషన్ ప్రక్రియ మొదలైంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి మొత్తం 100 మంది అభ్యర్థులు 192 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి 17 మంది అభ్యర్థులు 38 సెట్ల నామినేషన్లు వేశారు. ఉపసహంరణల అనంతరం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బరిలో 56 మంది, టీచర్స్ బరిలో 15 మంది నిలిచారు. ఇప్పటికే ఇటు గ్రాడ్యుయేట్స్, టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈనెల 27న జరిగే ఎన్నిక కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా టాప్ ఓటర్ల జాబితాలో కొత్త, పాత జిల్లాలవారీగా చూసినా ఉమ్మడి కరీంనగర్ జిల్లా ముందంజలో ఉంది. మొత్తంగా 4 ఉమ్మడి జిల్లాలు, 15 కొత్త జిల్లాలలోని 3.55 లక్షల ఓటర్లలో పాత కరీంనగర్ జిల్లాలోనే 1,60,260 మంది గ్రాడ్యుయేట్లు ఎన్రోల్ అయి ఉన్నారు. ఇక టీచర్స్ నియోజకవర్గంలో మొత్తం 27,088 ఓటర్లకు 18,953మంది నమోదు చేసుకున్నారు. ఏ రకంగా చూసినా.. కొత్త, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఓటర్ల పరంగా అగ్రభాగాన ఉన్న నేపథ్యంలో నాయకులంతా ఈ జిల్లాపైనే ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. టీచర్స్, గ్రాడ్యుయేట్స్ నియోజవర్గాల్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లా అత్యల్ప ఓట్లతో చివరి స్థానంలో నిలిచింది. ఈనెల 27న పోలింగ్ జరగనుండగా.. మార్చి 3న ఓట్ల లెక్కింపు, 08న ప్రక్రియ పూర్తికానుంది. ఎమ్మెల్సీ ఎన్నిక తుది ఓటర్లు ఖరారు ఓటర్లలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా టాప్ అందరి నేతల దృష్టి కన్నారంపైనే.. -
● వండర్ బుక్ ఆఫ్ రికార్డు అందుకున్న కోరుకంటి
వండర్ బుక్ ఆఫ్ రికార్డు అందుకుంటున్న చందర్ కేక్ కట్ చేస్తున్న టీబీజీకేఎస్ నాయకులుగోదావరిఖని: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పుట్టినరోజు వేడుకలను జిల్లాలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో వినూత్నంగా వేడుకలు నిర్వహించిన బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ వండర్ బుక్ ఆఫ్ రికార్డు సాధించారు. స్థానిక తిలక్నగర్లో నిర్వహించిన కార్యక్రమంలో వండర్ బుక్ ఆఫ్ రికార్డు కో ఆర్డినేటర్ నుంచి అవార్డు అందుకున్నారు. అనంతరం ఈశ్వరకృప ఆశ్రమంలో అన్నదానం చేశారు. కార్యక్రమంలో నాయకులు మూల విజయారెడ్డి, పీటీ స్వామి, నడిపెల్లి మురళీధర్రావు, చల్ల రవీందర్రెడ్డి, గోపు అయిలయ్యయాదవ్ తదితరులు పాల్గొన్నారు. టీబీజీకేఎస్ కేంద్ర కార్యాలయంలో.. బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మనదిన వేడుకలు స్థానిక టీబీజీకేఎస్ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి మి ఠాయిలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో నా యకులు మాదాసు రాంమూర్తి, నూనె కొమురయ్య, వడ్డెపల్లి శంకర్, చెల్పూరి సతీశ్, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. -
పదెకరాల్లో ఐటీ పార్క్
సాక్షి, పెద్దపల్లి: రూరల్ టెక్నాలజీలో భాగంగా పె ద్దపల్లిలో ఐటీ పార్క్ నిర్మిస్తామని ఐటీ, పరిశ్రమ ల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు వెల్లడించా రు. ఇందుకోసం పట్టణంలో పదెకరాలు కేటాయించామని, త్వరలో భవన నిర్మాణం ప్రారంభిస్తామన్నారు. పట్టణ శివారలోని స్వరూప గార్డెన్స్ లో సోమవారం నిర్వహించిన పట్టభద్రుల ఆత్మీ య సమ్మేళనంలో మంత్రి మాట్లాడారు. ఇంజినీరింగ్, ఐటీ విద్యార్థుల నైపుణ్యం పెంచేందుకు టాస్క్ సెంటర్ను ఏర్పాటు చేసి 250మందికి శిక్షణ ఇస్తున్నామన్నారు. అనేక ఏళ్లుగా పెండింగ్లో ఉన్న టీచర్ల బదీలీలు, పదోన్నతులను తమ ఏడాది పాలనలోనే నిజాయతీగా, పారదర్శకంగా చేపట్టామని మంత్రి తెలిపారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఉపాధ్యాయులు నరేందర్రెడ్డికే ఓటువేసి గెలిపించాలని ఆయన కోరారు. జీవో నంబర్ 317తో ఇబ్బంది పడేవారికి న్యాయం చేస్తున్నామని, ఇందుకోసం మంత్రి రాజనరసింహ ఆధ్వర్యంలో సబ్కమిటీ ఏర్పాటు చేసి స్పౌజ్, మ్యూచువల్, మెడికల్ ఆధారంగా బదిలీలు చేశామన్నారు. ఏ రాష్ట్రంలో చేయని విధంగా 1931 తర్వాత దేశంలోనే తొలిసారి మనరాష్ట్రంలో బీసీ గణన చేపట్టామని అన్నారు. బీజేపీ నేతలకు చిత్తశుద్ధి ఉంటే రాజ్యాంగ సవరణ చేసి బీసీలకు న్యాయం చేయాలన్నారు. రాహుల్ గాంధీ గురించి బండి సంజయ్ తెలిసోతెలియకో అడ్డగోలుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. చివరి ఆ యకట్టుకు సాగునీరు అందించేందుకు పత్తిపాక రిజర్వాయర్ నిర్మిస్తామన్నారు. ప్రభుత్వ విప్, ఎ మ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, డీసీసీ అధ్యక్షు డు, రామగుండం, పెద్దపల్లి ఎమ్మెల్యేలు మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్, విజయరమణారావు మాట్లాడారు. ఎమ్మెల్సీ భానుప్రసాదరావు, ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్చార్జి బండారి శ్రీకాంత్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్యగౌడ్, కాంగ్రెస్ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. త్వరలో జాబ్ క్యాలెండర్ ఆవిష్కరణఫెర్టిలైజర్సిటీ(రామగుండం): యువతకు ఉద్యోగాల కల్పనకు త్వరలోనే జాబ్ క్యాలెండర్ ఆవిష్కరిస్తామని మంత్రి శ్రీధర్బాబు తెలిపారు. స్థానిక మాతంగికాలనీలో జరిగిన పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ అభ్యర్థి వుట్కూరి నరేందర్రెడ్డిని ఎమ్మెల్సీగా మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్రెడ్డి, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఐఎన్టీయూసీ నాయకులు జనక్ ప్రసాద్, ఆరెపల్లి మోహన్, బొంతల రాజేశ్, మహంకాళి స్వామి, మాజీ మేయర్ బింగి అనిల్ కుమార్, రాజమణి, గౌస్, రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మాటపై నిలబడేది కాంగ్రెస్సే మంథని: పేదల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ పని చేస్తుందని, ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి పాలించే ఏకై క పార్టీ కాంగ్రెస్ అని మంత్రి శ్రీధర్బాబు అన్నారు. స్థానిక ఎస్ఎల్బీ గార్డెన్లో నిర్వహించిన పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్రెడ్డితో కలిసి మంత్రి మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో న రేందర్రెడ్డి మద్దతుగా నిలబడాలని కోరారు. త న వస్తున్న ఆరోపణలు అవాస్తమవి, పేదవి ద్యా ర్థులకు ఫీజులో ఐదు శాతం రాయితీ కల్పిస్తామ ని నరేందర్రెడ్డి తెలిపారు. నాయకులు ఐత ప్రకా శ్రెడ్డి, ఐలి ప్రసాద్, పెండ్రు రమ, కొత్త శ్రీనివా స్, కొండ శంకర్, ఆకుల కిరణ్ పాల్గొన్నారు. పత్తిపాక రిజర్వాయర్ నిర్మిస్తాం కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించాలి ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు -
విద్యార్థుల హాజరు పకడ్బందీగా నమోదు చేయాలి
పెద్దపల్లిరూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ప్రతీ విద్యార్థి హాజరును ఎఫ్ఆర్ఎస్ ద్వారా కట్టుదిట్టంగా నమోదు చేయాలని కలెక్టర్ కో య శ్రీహర్ష ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని జెడ్పీ బాలికల హైస్కూల్ను కలెక్టర్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. బాలికల హాజరు శాతం, మధ్యాహ్న భోజన పథకం అమలు తీరు, విద్యాబోధన తదితర అంశాలపై కలెక్టర్ ఆరా తీశారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరును ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించారు. పదో తరగతి విద్యార్థులు మంచి మార్కులు సాధించేందుకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని పేర్కొన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి మాధవి, ఎంఈవో సురేందర్, ప్రధానోపాధ్యాయురాలు అరుణ తదితరులు పాల్గొన్నారు. గైర్హాజరైన విద్యార్థులకు నేటి నుంచి ప్రాక్టికల్స్జ్యోతినగర్(రామగుండం): గైర్హాజరైన విద్యార్థుల కోసం మంగళవారం నుంచి ఈనెల 22వ తేదీ వరకు మళ్లీ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నట్లు జిల్లా ఇంటర్ విద్య నోడల్ అధికారి కల్పన సోమవారం తెలిపారు. ఈనెల 3వ తేదీ నుంచి ఇంటర్ విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తున్నామని ఆమె తెలిపారు. మొదటి, రెండు, మూడో విడత పరీక్షలకు గైర్హాజరైన విద్యార్థుల కోసం మరో అవకాశంగా ఈనెల 18 నుంచి పెద్దపల్లి ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆమె వివరించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కల్పన సూచించారు. టైంటేబుల్ కోసం ప్రిన్సిపాల్స్ను సంప్రదించాలని విద్యార్థులకు సూచించారు. రత్నాపూర్ పంచాయతీ ఆకస్మిక తనిఖీ రామగిరి(మంథని): రత్నాపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని జిల్లా పంచాయతీ అధికారి(డీపీవో) వీరబుచ్చయ్య సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రామాల్లో 100 శాతం ఆస్తిపన్ను వసూలు చేయాలని సూచించారు. పారిశుధ్యం నిర్వహణ, తాగునీటి సరఫరా తదితర అంశాలపై పంచాయతీ కార్యదర్శికి సూచనలు చేశారు. పంచాయతీ కార్యదర్శి సంతోష్, కారోబార్ శ్రీనివాస్ ఉన్నారు. 20న ‘చలో విద్యుత్ సౌధ’ పెద్దపల్లిరూరల్/రామగుండం: సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్తో ఈనెల 20న హై దరాబాద్లో చేపట్టే చలో విద్యుత్ సౌధ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టీవీఏసీ జేఏ సీ జిల్లా కో చైర్మన్ దుర్గం విశ్వనాథ్ కోరారు. రామగుండం డీఈఈ కార్యాలయంలో సోమ వారం ప్రచార పోస్టర్ ఆయన ఆవిష్కరించా రు. అనంతరం జరిగిన కార్యమ్రంలో ఆయన మాట్లాడారు. చలో విద్యుత్ సౌధ కార్యక్రమా నికి వేలాది మంది తరలిరావాలని, వీరితో కలి సి సీఎండీకి వినతిపత్రం అందజేస్తామని విశ్వనాథ్ తెలిపారు. ఆర్టిజన్లను కన్వర్షన్ చేయకపోతే భవిష్యత్లో జరిగే పరిణామాలకు ప్రభుత్వం, యాజమాన్యమే బాధ్యత వహించాలని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వం తమ సమ స్యలు పరిష్కరించే వరకూ దశలవారీగా ఆందోళనలు చేపడతామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆవుల మహేశ్, సందిప్, కిరణ్, శ్యాం, అంజద్ ప్రసాద్, నాగరాజు, కృష్ణ, శ్రీనివాస్, శంకర్, సాంబనర్సయ్య, మురళి తదితరులు పాల్గొన్నారు. -
ఏఐ నిర్ధారిస్తోంది!
● జిల్లాలో తొలిసారి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్స్రే సేవలు ● రెండు నెలల్లోనే 200 టీబీ కేసుల గుర్తింపు ● జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి అన్నప్రసన్న కుమారి వెల్లడికోల్సిటీ(రామగుండం): జిల్లాలో క్షయ(టీబీ) చా పకింద నీరులా విస్తరిస్తోంది. భారత్ను క్షయ రహి త దేశంగా ప్రకటించడానికి 347 జిల్లాల్లో ‘ని–క్షయ్ శివర్’ పేరిట గతేడాది డిసెంబరు 7న వంద రోజు ల టీబీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో తొమ్మిది జిల్లాలను ఎంపిక చేయగా, ఇందులో పెద్దపల్లి జిల్లాపై ‘రాష్ట్ర క్షయ విభాగం’ప్రత్యేక దృష్టి సారించింది. టీబీ కట్టడికి మొబైల్ వ్యాన్ల ద్వారా విస్తృతంగా వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. నియంత్రణపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. అవగాహన లోపమా, అలసత్వమా తెలియదు కా నీ.. వ్యాధి లక్షణాలు ఉన్నా కొందరు పట్టించుకోవడం లేదు. వ్యాధి ముదిరి.. ఒకరి నుంచి మరొకరి కి వ్యాపిస్తోంది. వ్యాధిని త్వరగా గుర్తిస్తే వ్యాప్తిని నివారించవచ్చని అధికారులు చెబుతున్నారు. డీఎంహెచ్వో పరిశీలన.. రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలో టీబీ నిర్ధారణ పరీక్షలను అత్యాధినిక ఏఐ(ఆర్టిఫిషియల్) ఎక్స్రే ద్వారా నిర్వహిస్తున్న తీరును డీఎంహెచ్వో అన్న ప్రసన్న కుమారి సోమవారం పరిశీలించారు. అనుమానితులకు వ్యాధి నిర్మూలనపై ఇదే సమయంలో అవగాహన కల్పించారు. తొలిసారి ఏఐ ఎక్స్రే.. జిల్లాలో తొలిసారి టీబీ నిర్ధారణకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన పోర్టబుల్ ఎక్స్రే మిషన్ వినియోగిస్తున్నారు. రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలో ఇటీవల ఏర్పాటు చేసిన ప్రత్యేక కేంద్రంలో ఏఐ పోర్టబుల్ ఎక్స్రే మిషన్ వ్యాధి ద్వారా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. ఏడు నిమిషాల్లోనే పరీక్ష పూర్తిచేస్తున్నారు. రోజూ 350 – 400 మందికి ఏఐ పోర్టబుల్ ఎక్స్రే తీస్తున్నారు. అలాగే జీజీహెచ్తోపాటు పెద్దపల్లి, మంథని, సుల్తానాబాద్ ఆస్పత్రుల్లో పాత పద్ధతిలోనే ఎక్స్రేలతో వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. రిస్క్లో 93,300 మంది.. జిల్లాలో సుమారు 93,300 మందికి టీబీ సోకే అవకాశం ఉన్నట్లు వైద్యాధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటివరకు సుమారు 12 వేల మందికి వ్యాధి నిర్థారణ పరీక్షలు చేశారు. గత డిసెంబర్ నుంచి శనివారం వరకు సుమారు 200 మందికిపైగా వ్యాధి నిర్ధారణ జరిగింది. అంతకు ముందు గుర్తించిన వారితో కలిపితే ప్రస్తుతం 700 మంది వ్యాధిగ్రస్తులు వైద్య చికిత్సలు తీసుకుంటున్నారు. లక్షణాలు ఇవే.. నిరంతరం దగ్గు, సాయత్రం జ్వరం రావడం, ఆకలి మందగించడం, వికారంగా ఉండడం, ఛాతిలో నొప్పిరావడం, బరువు తగ్గడం క్షయ లక్షణాలని డాక్టర్లు చెబుతున్నారు. మైక్రోబ్యాక్టీరియా క్యుబర్ క్యూలోసిస్ అనే బాక్టీరియాతో క్షయ వ్యాప్తి చెందుతుందని అంటున్నారు. గాలిద్వారా ఇతరులకూ వ్యాపిస్తుంది. పేషెంట్ దగ్గినా, తుమ్మినా తుంపర్ల ద్వారా బ్యాక్టీరియా ఇతరులకు వ్యాపిస్తుంది. వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసుకోవాలి.. రెండు వారాలకు మించి దగ్గు, జ్వరం, ఛాతిలో నొప్పి, బరువు తగ్గడం వంటి లక్షణాలు ఉంటే సమీప ప్రభుత్వ ఆస్పత్రుల్లో కఫం పరీక్ష చేసుకోవాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. జిల్లాలో ఈ పరీక్ష కేంద్రాలు నాలుగు ఉన్నాయి. పీహెచ్సీల్లోనూ 18 టీబీ నిర్ధారణ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో ఏ కేంద్రానికి వెళ్లినా ఉచితంగా టీబీ నిర్ధారణ పరీక్ష చేసి ఉచితంగా మందులు అందజేస్తారు.నిపుణుల సూచనలు ఇవీ.. క్షయ బారినపడకుండా వ్యవసనాలకు దూరంగా ఉండాలి. ధూమపానం, మద్యపానం, సురిక్షతం కాని లైంగిక సంబంధాలు వంటి వాటికి దూరంగా ఉండాలి. టీబీ వ్యాధి నిర్ధారణ అయిన వెంటనే పూర్తికాలం పాటు మందులు వాడాలి. సాధారణ క్షయకు ఆర్నెల్లు, మధ్యలో మానివేసిన వారు 8 నెలలు, మొండిక్షయ బాధితులు రెండేళ్లపాటు మందులు వాడాలి. మధ్యలో మందులు మానేస్తే వ్యాధి నిరోధక శక్తి క్షీణించి మృత్యవాతపడే ప్రమాదం కూడా ఉంది. రిస్క్ ఉంటే వ్యాప్తి అధికం క్షయ వెంట్రుకలు, గోళ్లకు తప్ప శరీరంలోని ఏ అవయవాన్ని అయినా ఆశిస్తుంది. ఊపిరితిత్తులకు సంబంధించి పల్మనరీ టీబీ ఎక్కువ మందికి వ్యాపిస్తుంది. గర్భాశయం, చర్మం, ఎముకలు, కళ్లకు వచ్చే క్షయను ఎక్సట్రా పల్మనరీ టీబీ అంటారు. ఇది ఎక్కువగా హెచ్ఐవీ, మధుమేహం, రక్తహీనత, అవయవాల మార్పిడి, వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారికి వ్యాపిస్తుంది. -
తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు
● బల్దియా కమిషనర్(ఎఫ్ఏసీ) అరుణశ్రీ కోల్సిటీ(రామగుండం): వేసవిలో తాగునీటి సమ స్య తలెత్తకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్ (ఎఫ్ఏసీ) అరుణశ్రీ ఆదేశించారు. నగరపాలక సంస్థ కా ర్యాలయంలో సోమవారం వార్డు, నీటి సరఫరా వి భాగం అధికారులు, సిబ్బందితో కమిషనర్ సమావే శం నిర్వహించారు. సుమారు రూ.కోటి అంచనా వ్యయంతో వేసవి కార్యాచరణ అమలు చేస్తున్నామని, నీటి సమస్యతో ప్రజలు ఇబ్బంది పడకుండా చూడాలన్నారు. ఈఈ రామన్, డీఈఈ హన్మంతు నాయక్, శాంతిస్వరూప్, షాభాజ్, జమీల్, ఏఈలు తేజస్విని, మీర్, టెక్నికల్ ఆఫీసర్ సౌమ్య, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వందశాతం ఆస్తిపన్ను వసూలు చేయాలి జ్యోతినగర్(రామగుండం): మొండి బకాయిలు వ సూలుకు స్పెషల్ డ్రైవ్ చేపట్టామని కమిషనర్ అ రుణశ్రీ తెలిపారు. ఎన్టీపీసీ కృష్ణానగర్లో ఆమె ప ర్యటించారు. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా వందశాతం ఆస్తిపన్ను వసూలు చేయాలని సూచించారు. అనంతరం వివిధ డివిజన్లలో పర్యటించారు. -
రోడ్డునపడిన కుటుంబం
కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం బిజిగిరిషరీఫ్ గ్రామానికి చెందిన చల్ల సమ్మయ్య, కోమల దంపతులకు కూతురు, కొడుకు శివసాగర్ ఉన్నారు. తండ్రి మూగవాడు కావడంతో తల్లి కోమలతో కలిసి శివసాగర్ వ్యవసాయం చేసేవాడు. వీరికి 20 గుంటల భూమి ఉండగా మరో ఏడెకరాలు కౌలుకు తీసుకున్నారు. పత్తి, వరిసాగు పెట్టుబడికి రూ.5లక్షల వరకు అప్పు చేశాడు. దిగుబడి రాక, అప్పులు తీర్చే మార్గంలేక మనస్తాపానికి గురై గతేడాది నవంబర్ 24న ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కొడుకు మృతితో ఆ కుటుంబ పరిస్థితి దయనీయంగా మారింది. 20 గుంటల భూమి సమ్మయ్య పేరున ఉండడంతో శివసాగర్కు రైతుబీమా వర్తించలేదు. సమ్మయ్య బిజిగిరిషరీఫ్ దర్గా వద్ద భిక్షాటన చేస్తుండగా.. తల్లి వ్యవసాయ కూలీ పనులకు వెళ్తోంది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఇందిరమ్మ ఇంట్లో ఉంటున్నారు. -
చావు శరణ్యమై..
ప్రభుత్వం సాయం చేయాలి రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం జవారిపేట గ్రామానికి చెందిన రైతు కోమటి నాగరాజు (49) అప్పుల బాధ తాళలేక 2024 నవంబర్ 30న తనపొలం వద్ద క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. భర్త మరణానంతరం భార్య లక్ష్మి తన కొడుకు రంజిత్తో కలిసి తనకున్న నాలుగెకరాలతోపాటు మరికొంత కౌలుకు తీసుకుని పత్తి, వరి సాగు చేస్తున్నారు. ముగ్గురు కూతుళ్లలో పెద్దమ్మాయి వివాహమైంది. రెండో కూతురు హైదరాబాద్లో ప్రైవేటు ఉద్యోగిని. చిన్న కూతురు కరీంనగర్లో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. తమకు రైతు రుణమాఫీ కాలేదని లక్ష్మి తెలిపింది. తన భర్త పేరిట రైతుబీమా వచ్చినట్లు పేర్కొంది. బ్యాంకుల్లో అప్పులు ఉన్నాయని, ప్రభుత్వం సాయం చేసి తమ కుటుంబాన్ని ఆదుకోవాలని వేడుకుంటోంది. -
రోడ్డునపడిన కుటుంబం
కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం బిజిగిరిషరీఫ్ గ్రామానికి చెందిన చల్ల సమ్మయ్య, కోమల దంపతులకు కూతురు, కొడుకు శివసాగర్ ఉన్నారు. తండ్రి మూగవాడు కావడంతో తల్లి కోమలతో కలిసి శివసాగర్ వ్యవసాయం చేసేవాడు. వీరికి 20 గుంటల భూమి ఉండగా మరో ఏడెకరాలు కౌలుకు తీసుకున్నారు. పత్తి, వరిసాగు పెట్టుబడికి రూ.5లక్షల వరకు అప్పు చేశాడు. దిగుబడి రాక, అప్పులు తీర్చే మార్గంలేక మనస్తాపానికి గురై గతేడాది నవంబర్ 24న ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కొడుకు మృతితో ఆ కుటుంబ పరిస్థితి దయనీయంగా మారింది. 20 గుంటల భూమి సమ్మయ్య పేరున ఉండడంతో శివసాగర్కు రైతుబీమా వర్తించలేదు. సమ్మయ్య బిజిగిరిషరీఫ్ దర్గా వద్ద భిక్షాటన చేస్తుండగా.. తల్లి వ్యవసాయ కూలీ పనులకు వెళ్తోంది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఇందిరమ్మ ఇంట్లో ఉంటున్నారు. -
పుస్తక పఠనం.. భవితకు నిర్దేశం
జ్యోతినగర్(రామగుండం): పుస్తక పఠనం భవిత్ను నిర్దేశిస్తుందని రామగుండం ఎన్టీపీసీ ఏజీఎం(హెచ్ఆర్)బిజయ్ కుమార్ సిగ్దర్ అన్నారు. అధికారిక భా షను ప్రోత్సహించడానికి పర్మినెంట్ టౌన్షిప్లో ఆదివారం మొబైల్ హిందీ పుస్తక గ్రంథాలయం ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులకు విభిన్న సాహిత్య, విద్యావనరులను మొబైల్ గ్రంథాలయం అందుబాటులో ఉంచుతుందన్నారు. సామాజిక, విద్యాభివృద్ధికి ఎన్టీపీసీ ఎంతో కృషి చేస్తోందని తెలిపారు. హిందీ, తెలుగు, ఆంగ్ల భాషల్లో నాణ్యమైన పుస్తకాలను అందుబాటులో ఉంచడమే లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు. కార్యక్రమంలో వివిధ సంఘాల ప్రతినిధులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. చలివేంద్రాలు ఏర్పాటు చేయండి రామగుండం: వేసవిలో ప్రజల దాహం తీర్చేందు కు ముఖ్య కూడళ్లలో చలివేంద్రాలు ఏర్పాటు చేసేందుకు స్వచ్ఛంద సంఘాలు, సేవా సమితులు ముందుకు రావాలని ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్ కోరారు. ఆదివారం స్థానిక సంతలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఎమ్మెల్యేతోపాటు ఆయన సోదరుడు అయోధ్యసింగ్ ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, వేసవిలో చల్లని నీటిని ప్రజలకు అందించాలని సూచించారు. సమస్యలు పరిష్కరించాలని వినతి సండే మార్కెట్లో సమస్యలను పరిష్కరించాలని పలువురు వ్యాపారులు ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్కు విన్నవించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గాలిపెల్లి తిరుపతి, ప్రతినిధులు ఈదునూరి హరిప్రసాద్, సింగం కిరణ్కుమార్గౌడ్, ఎండీ గౌస్బాబా, అప్పాసి శ్రీనివాస్, ఉరిమెట్ల రాజలింగం తదితరులు పాల్గొన్నారు.‘సెక్యూరిటీ’ వాహనం ఏమైంది? జ్యోతినగర్(రామగుండం): ఎన్టీపీసీ అధికారులు, ఉద్యోగులు నివాసం ఉండే పర్మినెంట్ టౌన్షిప్ భ ద్రతా సిబ్బంది అధీనంలో ఉంటుంది. దీనికి ఉన్న రెండు మెయిన్ గేట్ల వద్ద వీరు విధులు నిర్వహిస్తారు. ముఖ్యమైన కేంద్రాల వద్ద కూడా రోజూ ఉదయం, మధ్యాహ్నం, రాత్రి వేళ వాహనంలో గస్తీ తిరుగుతారు. అయితే, ఐదు నెలల క్రితం సెక్యూరిటీ వాహనం టెండర్ గడువు పూర్తికావడంతో అందుబాటులో లేకుండాపోయింది. కొత్త టెండర్ నిర్వహణలో జాప్యం కావడంతో వాహనం లేక సెక్యూరిటీ సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. -
బతుకు భారమై..
సోమవారం శ్రీ 17 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025అప్పులు చెల్లించలేక..జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలకేంద్రానికి చెందిన పిట్ల లింగన్నకు తోకల లక్ష్మితో 16 ఏళ్ల క్రితం వివాహమైంది. లింగన్న వ్యవసాయం, లక్ష్మీ బీడీలు చేసేవారు. లింగన్నకున్న మూడెకరాల్లో పసుపు, మొక్కజొన్న, సజ్జ, వరి పండించాడు. దిగుబడి సరిగా రాక రూ.16 లక్షలు అప్పు చేశాడు. అది వడ్డీతో కలిపి రూ.20 లక్షల వరకు అయ్యింది. ఈ సీజన్లో పసుపు రెండెకరాల్లో వేయగా దుంపకుళ్లు రోగం వచ్చింది. దీనికితోడు బ్యాంకులో తీసుకున్న రుణం రూ.2లక్షలు మాఫీ కాలేదు. రైతు భరోసా సమయానికి అందలేదు. ఆ ఆవేదనతో లింగన్న ఈ ఏడాది జనవరి 14న పురుగుల మందు తాగాడు. చికిత్స పొందుతూ 20వ తేదీన మృతిచెందాడు. లింగన్న కొడుకు హర్షవర్దన్ 8వ తరగతి, కూతురు నైనిక 2వ తరగతి చదువుతున్నారు. పెంకుటింట్లో నివసిస్తూ, బీడీలు చుడుతూ లక్ష్మి ఇద్దరు పిల్లలను పోషిస్తోంది. ఉన్న మూడెకరాలు అమ్మినా.. తన భర్త చేసిన అప్పులు తీరవని ఆవేదన వ్యక్తం చేస్తోంది లక్ష్మి. న్యూస్రీల్ -
● కలవరం రేపుతున్న రైతు ఆత్మహత్యలు ● ఏడాదిలో ఉమ్మడి జిల్లాలో దాదాపు 30 మంది బలవన్మరణం ● పంటలు సరిగా పండక పెరుగుతున్న అప్పులు ● వడ్డీలు కట్టలేక ప్రాణాలు తీసుకుంటున్న రైతులు ● రైతు భరోసా, రుణమాఫీ జాప్యంతో ఇబ్బందులు
సాక్షిప్రతినిధి, కరీంనగర్: ఆరుగాలం శ్రమించి.. నలుగురికి పట్టెడన్నం పెట్టే అన్నదాత అలసిపోతున్నాడు. ఎంత కష్టపడ్డా.. ఫలితం రాకపోగా.. చేసిన అప్పులకు వడ్డీలు పెరిగి కట్టలేకపోతున్నాడు. రుణభారం భరించలేక జీవిత పోరాటంలో ఓడి ప్రాణాలు తీసుకుంటున్నాడు. నేలతల్లిని నమ్ముకున్న రైతుబిడ్డ మధ్యలోనే ఆ తల్లితో బంధం తెంచుకుని తిరిగిరాని లోకాలకు వెళ్లిపోతున్నాడు. దిగుబడి రాని పంటలు, పెరిగిన వడ్డీలకు భయపడి అప్పులోళ్లకు ముఖం చెల్లక ప్రాణాలు తీసుకుంటున్నాడు. ఉమ్మడి జిల్లాలో ఏడాది కాలంలో దాదాపు 30 మంది వరకు రైతులు ఆత్మహత్య చేసుకున్నారని సమాచారం. వరుసగా జరుగుతున్న ఆత్మహత్యలు అన్నదాత దయనీయ స్థితిని చెప్పకనే చెబుతున్నాయి. దీనికితోడు రైతు భరోసా, రుణమాఫీ సమయానికి కాకుండా జాప్యమవడం రైతుల ఆర్థిక ఇబ్బందులను మరింత పెంచేలా చేస్తున్నాయన్న విమర్శలు పెరుగుతున్నాయి. పాత జిల్లాలో కలకలం ఉమ్మడి జిల్లాలో రైతుల ఆత్మహత్యలు కలవరపెడుతున్నాయి. సాగును నమ్ముకుని అప్పులు చేసి పొలాలు కౌలుకు తీసుకుని మరీ సేద్యం చేస్తే.. చివరికి వడ్డీలు పెరిగి ప్రాణాలు తీసుకుంటున్నారు. ప్రాణాలు తీసుకుంటున్న రైతుల్లో 50 ఏళ్లలోపు వారే అధికంగా ఉండటం కలవరపెడుతోంది. చేసిన అప్పులు తీర్చే మార్గం కనిపించక వేదనతో ప్రాణాలు తీసుకోవడంతో ఆ రైతుల కుటుంబాలు మరింత ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోతున్నాయి. ఉమ్మడి జిల్లాలో ఏడాది కాలంలో కరీంనగర్లో 10 మంది, జగిత్యాలలో 6 మంది, సిరిసిల్లలో 10 మంది, పెద్దపల్లిలో నలుగురు రైతులు ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. ప్రాణాలు తీసుకుంటున్న రైతుల్లో మెజారిటీ సాగు కోసం అధిక పొలం కౌలుకు తీసుకున్న వారే కావడం గమనార్హం. వీటికితోడు పిల్లల పెళ్లిళ్లు, చదువులకు అయ్యే ఖర్చ అదనం. ఫలితంగా రైతు చేస్తున్న అప్పులకు వడ్డీలు అమాంతం పెరిగిపోతున్నాయి. అన్ని కష్టాలకు ఓర్చి పండించిన పంట సరైన దిగుబడి రాక, అనుకున్న మేర గిట్టుబాట ధర రాకపోవడంతో రైతు కలత చెందుతున్నాడు. ముందున్న బాధ్యతలు, అప్పులు, వాటికి వడ్డీలు తలచుకుని ఈ లోకం నుంచి వెళ్లిపోతున్నాడు. ఉమ్మడి జిల్లాలో మరణించిన రైతులకు చెల్లించిన రైతు బీమా వివరాలుజిల్లా రైతులు బీమా కరీంనగర్ 234 రూ.11 కోట్లు రాజన్నసిరిసిల్ల 186 రూ.9.30 కోట్లు జగిత్యాల 378 రూ.18.90 కోట్లు పెద్దపల్లి 183 రూ.9.15 కోట్లు -
వసూలు 20 శాతమే
కోల్సిటీ(రామగుండం): రామగుండం నగరంలో నల్లా బిల్లులు వసూలు కావడం లేదు. బకాయిలు భారీగా ఉండడంతో ఎలా వసూలు చేయాలనేదానిపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. పా లకవర్గం ఇంటింటికీ మిషన్ భగీరథ తాగునీటిని స రఫరా చేస్తున్నా.. బిల్లులు చెల్లించేందుకు వినియోగదారులు ముందుకు రావడం లేదు. భారీ బకాయిలే ఇందుకు నిదర్శనమని పేర్కొంటున్నారు. 31 మార్చితో 2024–25 ఆర్థిక సంవత్సరం ముగియనుంది. ఈనెల 14వ తేదీ వరకు కేవలం 20 శాతం మాత్రమే నల్లా బిల్లులు వసూలు చేయగలిగారు. ఆర్థిక సంవత్సరం ముగిసే దశకు వచ్చినా నల్లా బిల్లుల వసూళ్లలో పురోగతి కనిపించడం లేదు. డిమాండ్ రూ.11.97 కోట్లు.. రామగుండం నగరంలో మొత్తం 40,728 వరకు నల్లా కనెక్షన్లు ఉన్నాయి. వీటిపై రూ.11.97 కోట్ల వరకు డిమాండ్ ఉంది. నగరంలో కేవలం 12 మాత్రమే కమర్శియల్ నల్లా కనెక్షన్లు ఉండగా, ఇందులో తొమ్మిది కనెక్షన్ల నుంచి మాత్రమే ప్రతినెలా రూ.400 చొప్పున బిల్లులు వసూలు చేస్తున్నారు. సుమారు 4,800 నల్లా కనెక్షన్ల వినియోగదారులు నల్లా బిల్లులు చెల్లించడం లేదు. వసూలు చేసింది రూ.2.08 కోట్లు ఈ ఆర్థిక సంవత్సరం చివరి దశకు చేరుతున్నా నల్లా బిల్లుల బకాయిల వసూళ్లలో పురోగతి కనిపించడం లేదు. తాగునీటి విభాగంలో ప్రతీనెల నల్లా బిల్లులు వసూలు చేయడానికి ప్రత్యేకంగా బిల్ కలెక్టర్లు పనిచేస్తున్నారు. అధికారుల ఆదేశాలతో డివిజన్లలో వారు స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నారు. ఇటీవల విధుల్లో చేరిన జూనియర్ అసిస్టెంట్లకు వార్డు ఆఫీసర్లుగా బాధ్యతలు కూడా కేటాయించారు. ఈనెల 15వ తేదీ వరకు కేవలం రూ.2.08కోట్ల వరకే వసూలు చేయడంపై బల్దియా కమిషనర్(ఎఫ్ఏసీ) అరుణశ్రీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏళ్లుగా వసూలు కానివి రూ.4.41 కోట్లు.. రామగుండం బల్దియాలో నల్లా కనెక్షన్ల ద్వారా సుమారు రూ.4.41కోట్ల వరకు బకాయిలు వసూలు కావడం లేదు. ఇవి ఏళ్లుగా పేరుకుపోతున్నాయి. తాగునీటి సరఫరాలో తరచూ ఏర్పడుతున్న లోపాలు, పైప్లైన్లు నిర్మించిన కొద్దిరోజులకే లీకేజీలు, నీటి ప్రవాహం వేగం తక్కువగా ఉండడం, నల్లా కనెక్షన్లు ఇచ్చిన వాటికి నీటిని సరఫరా చేయకపోవడం, చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ నల్లా కనెక్షన్లు ఇవ్వకపోడం తదితర కారణాలతో వినియోగదారులు బిల్లలు చెల్లించడానికి ముందుకు రావడం లేదని తెలుస్తోంది. నల్లా బిల్లుల వసూలు తీరు ఇలా..సంవత్సరం డిమాండ్ వసూలు శాతం రూ.కోట్లలో రూ.కోట్లలో 2018–19 3.31 1.72 52 2019–20 4.07 1.77 44 2020–21 2.29 1.75 37 2021–22 5.75 2.32 40 2022–23 7.68 2.31 30 2023–24 9.72 2.31 25 2024–25 11.97 2.08 20 (ఈనెల 14వరకు) డిమాండ్ రూ.11.97 కోట్లు వసూలైంది రూ.2.08 కోట్లు నత్తనడకన నల్లాబిల్లుల వసూలు బల్దియాలో కనెక్షన్లు 40,728 లక్ష్యం సాధిస్తాం బల్దియాలో ఆస్తిపన్నుతోపాటు నల్లాబిల్లుల వసూలుపై ప్రత్యేక కార్యాచరణ రూపొందించాం. ఇందుకోసం ప్రత్యేకంగా 25 యంత్రాలు తెప్పిస్తున్నాం. లక్ష్యం మేరకు బిల్లులు వసూలు చేసేలా ప్రతీరోజు పర్యవేక్షిస్తాం. – అరుణశ్రీ, కమిషనర్(ఎఫ్ఏసీ) -
హద్దులు లేక అన్యాక్రాంతం
రామగుండం: పారిశ్రామిక ప్రాంతంలో వివిధ పరిశ్రమలు ఉన్నాయి. ఇందులో వేలాది మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారు. ఈక్రమంలోనే దళితుల అభ్యున్నతికి ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. ఇందులో భాగంగానే లెదర్ పార్క్/ఇండస్ట్రీ (లిడ్క్యాప్/తోలు పరిశ్రమ) స్థాపించాలని నిర్ణయించింది. ఇందులో పాదరక్షలు తయారు చేస్తూ దళిత యువతకు ఉపాధి కల్పించాలని సంకల్పించింది. ఈక్రమంలోనే 2003 నవంబర్ 27న అప్పటి ఉమ్మడి రామగుండం మండలంలోని లింగాపూర్ గ్రామ శివారు సర్వే నంబరు 132లో సుమారు 25 ఎకరాలను లెదర్ పార్క్ కోసం ప్రభుత్వం కేటాయించింది. 22 ఏళ్లు గడిచినా.. తోలు పరిశ్రమ ఏర్పాటుకు తొలుత ప్రభుత్వం అవసరమైన చర్యలు ప్రారంభించినా.. ఆ తర్వాత పాలకులు దీనిపై తీవ్రనిర్లక్ష్యం ప్రదర్శించారు. దీంతో సుమారు 22 ఏళ్లుగా లెదర్ పరిశ్రమ ఏర్పాటుకు అడుగు ముందుకు పడడంలేదు. పరిశ్రమ ఏర్పాటులో ఆనాడు ప్రాతినిధ్యం వహించిన దళిత సంఘాల ప్రతినిధులు.. లిడ్ క్యాప్ పరిశ్రమ స్థాపనలో విశేషంగా కృషి చేసినా చివరకు ఏమీ సాధించలేక విఫలమయ్యారు. భూములు కబ్జా పాలు.. లెదర్ పార్క్ కోసం కేటాయించిన స్థలంలో సగం ఇప్పటికే అన్యాక్రాంతమైంది. అందులోని సుమా రు ఐదెకరాల విస్తీర్ణంలో మోడల్(ఆదర్శ విద్యాలయం) స్కూల్ భవనం నిర్మించారు. మరో ఐదెకరాల విస్తీర్ణంలో గౌడకులస్తులు ఈతవనం పెంచుకునేందుకు ప్రభుత్వం కేటాయించింది. ఇలా లెదర్ పార్క్ భూములను వివిధ సంఘాలు, ప్రభుత్వ అవసరాలకు కేటాయించడంతో దళిత సంఘాలు ఆందోళన చెందుతున్నాయి. అంతేకాదు.. లెదర్ పార్క్ కోసం కేటాయించిన భూముల ను పరిరక్షించుకునేందుకు ఆలిండియా అంబేడ్క ర్ సంఘం ఆధ్వర్యంలో భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకుంటున్నారు. తొలిదశలో లెదర్ పార్క్ స్థలానికి హద్దులు ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఆ తర్వాత లెదర్ పార్క్ ఏర్పాటు చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు రావాలని ప్రణాళిక రూపొందించారు. దళితుల భూములపై అక్రమార్కుల కన్ను రెండు దశాబ్దాలు గడిచినా దృష్టి సారించని అధికారులు కబ్జాదారుల చేతుల్లోకి చేరుతున్న లెదర్ పార్క్ భూములు ఉద్యమాలకు సిద్ధమవుతున్న దళిత సంఘాల నాయకులు -
ఆలయం నిర్మిస్తాం
ధర్మారం(ధర్మపురి): సేవాలాల్ మహరాజ్ ఆలయ నిర్మాణానికి సహకరిస్తామని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. బంజేరుపల్లి తండా–బీ గ్రామంలో ఆదివారం సేవాలా ల్ మహరాజ్ జయంతి ఘనంగా నిర్వహించారు. విప్ హాజరై తొలుత పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, గిరిజనుల కోసమే సేవాలాల్ జయంతి సందర్భంగా ప్రభుత్వం సెలవు ప్రకటించిందన్నారు. బంజేరుపల్లి తండా–బీలో చేపట్టిన సేవాలాల్ ఆలయ నిర్మాణం పూర్తిచేయిస్తామని విప్ హామీ ఇచ్చారు. మార్కెట్ కమిటీ చైర్మన్ లావుడ్య రూప్లానాయక్, మాజీ సర్పంచ్ భూక్య చంద్రానాయక్, మాజీ ఎంపీటీసీ భూక్య రాజునాయక్, మాజీ ఉపసర్పంచ్ రమేశ్నాయక్, నాయకులు చంద్రానాయక్, జితేందర్నాయక్ తదితరులు పాల్గొన్నారు. కోటీశ్వరులతో బీసీ బిడ్డ పోటీ సుల్తానాబాద్(పెద్దపల్లి): పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ బిడ్డ ప్రసన్న హరికృష్ణ కోటీశ్వరులతో పోటీ పడుతున్నారని బీఎస్పీ జిల్లా ఉపాధ్యక్షుడు నార్ల గోపాల్యాదవ్, కార్యదర్శి కాంపల్లి బాపు అన్నారు. స్థానిక ఆర్ అండ్ బీ అతి థి గృహంలో ఆదివారం వారు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తమ పార్టీ బలపర్చిన ప్రసన్న హరికృష్ణను మెదక్, ఆదిలాబాద్, నిజామబాద్, కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపించాలని వారు కోరారు. నాయకులు గోట్టె రాజు, బోంకురి దుర్గయ్య, సాతురి అనిల్, బోయిని రంజిత్, రామీళ్ల శారద తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్లో చేరికలు ఎలిగేడు/జూలపల్లి(పెద్దపల్లి): జూలపల్లి మా జీ ఎంపీపీ కూసుకుంట్ల రమాదేవి, రాంగోపాల్రెడ్డి దంపతులు, రామకృష్ణారెడ్డి, గాండ్ల చంద్రయ్య, ముప్పిడి శ్రీనివాస్ తదితర బీఆర్ఎస్ నాయకులు ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరా రు. ఎలిగేడు మండలం శివపల్లిలోని ఎమ్మెల్యే విజయరమణారావు నివాసంలో వారు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈనెల 27న నిర్వహించే పట్టబధ్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్రెడ్డికి ఓటువేసి గెలిపించాలని ఎమ్మెల్యే విజయరమణారావు కోరారు. ఈనెల 17న పెద్దపల్లి సమీపంలోని బందంపల్లి స్వరూప గార్డెన్లో నిర్వహించే సమావేశానికి పట్టభద్రులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలి రావాలని ఆయన కోరారు. ధూళికట్ట సింగిల్విండో చైర్మన్ పుల్లూరి వేణుగోపాల్రావు, నాయకులు రాజారాంరెడ్డి, గంగిపల్లి చొక్కయ్య, అలకొండ అనంతరెడ్డి, దాడికుమార్ తదితరులు పాల్గొన్నారు. బీసీల గొంతు వినిపించే అవకాశం వచ్చింది..సుల్తానాబాద్(పెద్దపల్లి): శాసన మండలిలో బీసీల గొంతు వినిపించేందుకు ఎమ్మెల్సీ ఎన్నికల రూపంలో మంచి అవకాశం వచ్చిందని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పడాల రవీందర్ అన్నారు. పట్టణంలో ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ అభ్యర్థిని గెలిపించాలని ఆయన కోరారు. ఎమ్మెల్సీ ఎన్నికలు రాజకీయ నిరుద్యోగులకు వేదిక కావొద్దని, ప్రజాపోరాటాలతోనే పాలకుల మైండ్ సెట్ మార్చుతావనాయన అన్నారు. టీచర్స్ ఎమ్మెల్సీలుగా రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను పోటీ చేయించడం తగదని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజల తరఫున గళం వినిపించగలిగే సత్తా కలిగిన నేతలే మండలిలో అడుగు పెట్టాలని ఆయన అభిప్రాయపడ్డారు. నాయకుల పాల్గొన్నారు. -
ప్రతీ విద్యార్థికి ‘అపార్’
పెద్దపల్లిరూరల్: ప్రతీ వ్యక్తికి ఆధార్ నంబరు ఎంతముఖ్యమో, ప్రతీ విద్యార్థికి ఏపీఏఆర్(అపార్) నంబరు అంతే ముఖ్యమని కలెక్టర్ కో య శ్రీహర్ష అన్నారు. కలెక్టరేట్లో శనివారం ఆ యన అధికారులతో అపార్పై సమీక్షించారు. ఆటోమేటెడ్ పర్మినెంట్ అకౌంట్ రిజిస్ట్రీ(ఏపీఏఆర్–ఆపార్) నంబర్ ద్వారా విద్యార్థుల విద్యార్హత సర్టిఫికెట్లు ఆన్లైన్లో భద్రపర్చుతారన్నా రు. ఇంటర్ వరకు ప్రతీవిద్యార్థికి అపార్ నంబ రు జనరేట్ చేయాలని, జిల్లాలో ఇప్పటివరకు 54శాతం మంది విద్యార్థులకు ఈ నంబరు కేటాయించామని తెలిపారు. మరోరెండు, మూడు రోజుల్లో 75శాతం నమోదు చేయాలని, ఇందుకోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలన్నారు. దీనిద్వారా వరదలు, అగ్ని ప్రమాదాలు, ఇతర ప్రమాదాల్లో సర్టిఫికెట్లు కోల్పోతే.. ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకునే అవకా శం ఉంటుందని కలెక్టర్ వివరించారు. డీఈవో మాధవి తదితరులు పాల్గొన్నారు. పరిశుభ్రతపై నిర్లక్ష్యం వద్దు యైటింక్లయిన్కాలనీ(రామగుండం): పారిశు ద్య పనుల్లో నిర్లక్ష్యం వద్దని బల్దియా కమిషనర్(ఎఫ్ఏసీ) అరుణశ్రీ ఆదేశించారు. పలు డివిజన్లలో చేపట్టిన పారిశుధ్య పనులను శనివారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్థానిక నాయకులతో కలిసి రోజువారీ మార్కెట్ను సందర్శించారు. అల్లూరులోని శ్మశానవాటిక వరకు రో డ్డు నిర్మిస్తామని తెలిపారు. శానిటరీ ఇన్స్పెక్టర్ రామన్, సూపర్వైజర్లు కుమారస్వామి, సార య్య, నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. నీటి సమస్య తలెత్తవద్దుఎలిగేడు/జూలపల్లి(పెద్దపల్లి): వేసవిలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా పంచాయతీ అధికారి వీరబుచ్చయ్య సూచించారు. మండల కేంద్రంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను శనివా రం ఆయన పరిశీలించారు. స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయంలో ఎలిగేడు, జూలపల్లి మండలాల పంచాయతీ కార్యదర్శులు, ఈ– పంచాయతీ ఆపరేటర్లతో సమావేశమయ్యారు. 100 శాతం ఆస్తిపన్ను వసూలు చేయాలని సూ చించారు. ఎంపీడీవో భాస్కర్రావు, ఎంపీవో లు అరిఫ్, అనిల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నేటినుంచి కులగణన కోల్సిటీ(రామగుండం): రామగుండం నగరంలో ఆదివారం నుంచి ఈనెల 28వ తేదీ వరకు మరోసారి కులగణన సర్వే నిర్వహిస్తామని క మిషనర్(ఎఫ్ఏసీ) అరుణశ్రీ తెలిపారు. సర్వే సందర్భంగా తాళం వేసిన ఇళ్లు, ఆసక్తి లేకపోవడం తదితర కారణాలతో వివరాలు ఇవ్వని కుటుంబాలకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించిందన్నారు. రోజూ ఉదయం 9గంటల – సాయంత్రం 5గంటల వరకు జరిగే ప్రజాపాలన సేవా కేంద్రాల్లో దరఖాస్తులు సమర్పించాలని కమిషనర్ అరుణశ్రీ కోరారు. యువతకు ఉచిత శిక్షణ ఎలిగేడు(పెద్దపల్లి): యువత కోసం అందుబాటులోకి తీసుకొచ్చిన ఉచిత కంప్యూటర్ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు సూచించారు. నా నేస్తం చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో అర్షనపల్లి నర్సింగరావు స్మారక ఉచిత కంప్యూటర్ శిక్షణను శనివారం మండల కేంద్రంలో ఎమ్మె ల్యే ప్రారంభించి మాట్లాడారు. ట్రస్టు సేవల కోసం తన వంతుగా రూ.50వేలు విరాళం అందిస్తున్నానని తెలిపారు. ట్రస్టు గౌరవ అధ్యక్షుడు అర్షనపల్లి రాజేశ్వర్రావు, అధ్యక్షుడు కట్ల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి వీరగోని లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
బాల్యం.. బానిసెల్!
● అన్నం తినాలన్నా, హోంవర్క్ చేయాలన్నా స్మార్ట్ఫోన్ ఇవ్వాల్సిందే ● వీడియోలు, రీల్స్ చూడకపోతే ముద్ద దిగదు ● తల పట్టుకుంటున్న తల్లిదండ్రులు ● అలవాటు మానకపోతే ఆరోగ్యానికి హానికరం ● హెచ్చరిస్తున్న నిపుణులుకరీంనగర్ జిల్లాకు చెందిన ఓ బాలుడు నాలుగో తరగతి చదువుతున్నాడు. కరోనాకు ముందు వరకు చదువులో చురుగ్గా ఉండేవాడు. వైరస్ విజృంభిస్తున్న సమయంలో అందరూ ఇంటికే పరిమితమవడంతో ఆ చిన్నారి స్మార్ట్ఫోన్ చూడటం మొదలు పెట్టాడు. గంటల తరబడి చూశాడు. ఇప్పుడు స్కూల్ నుంచి వచ్చాక ఫోన్లోనే లీనమవుతుండటంతో చదువుపై ధ్యాస లేక పూర్తిగా వెనకబడి పోయాడు. జగిత్యాల జిల్లాకు చెందిన ఓ బాలికదీ ఇదే పరిస్థితి. స్మార్ట్ఫోన్కు బానిసగా మారి, ఇవ్వకపోతే ఏడవడం, చెప్పినట్లు వినకపోవడం వంటివి చేస్తోంది. ఫోన్ ఇస్తేనే అన్నం తింటానంటూ భీష్మించుకు కూర్చుంటోంది. తల్లిదండ్రులు ఏమీ చేయలేక ఫోన్ ఇచ్చేస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగితే పాప ఆరోగ్యం, భవిష్యత్ ఏమవుతుందోనని ఆందోళన చెందుతున్నారు. సిరిసిల్ల జిల్లాకు చెందిన బాలుడు ఆరో తరగతి చదువుతున్నాడు. ఇంట్లో తల్లిఫోన్ చూడడం మొదలు పెట్టాడు. యూట్యూబ్లో చానెల్ క్రియేట్ చేశాడు. సొంతంగా రీల్స్ చేస్తూ సెల్కు బానిసయ్యాడు. ఇంటివద్దే కాదు.. స్కూల్లోనూ ఫోన్పైనే దృష్టిపెడుతూ.. చదువు పక్కన పెట్టాడు. గమనించిన క్లాస్ టీచర్ విద్యార్థితో పాటు తల్లిదండ్రులను మందలించింది. ఫోన్ ఇస్తే స్కూల్కు పంపొద్దని గట్టిగా హెచ్చరించింది. -
రీచ్ల వద్ద 360 డిగ్రీల కెమెరాలు
ముత్తారం(మంథని): ఇసుక అక్రమ రవాణా నియంత్రణకు రీచ్ల వద్ద 360 డిగ్రీల కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర మైనింగ్ శాఖ కార్యదర్శి ఎన్. శ్రీధర్ వెల్లడించారు. టీజీఎండీసీ వైస్ చైర్మన్ బీఆర్వీ సుశీల్ కుమార్, కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి శనివారం ఆయన మా నేరు తీరంలోని ఖమ్మంపల్లి, జిల్లాలపల్లి ఇసుక రీచ్లను పరిశీలించారు. శ్రీధర్ మాట్లాడుతూ, రీచ్ల వద్ద 400 మీటర్ల మేర సీసీ రోడ్డు నిర్మించాలని, స్టాక్ యార్డు చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి ఒకేదారి ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. పర్యవేక్షణకు ప్రత్యేకాధికారులను నియమించా లని ఆదేశించారు. పేదలకు ఇసుక అందుబాటు లో ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఇసు క వాహనాలకు ట్రాకింగ్ సిస్టం ఏర్పాటు చేసి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయలని సూచించా రు. అంతకుముందు కలెక్టర్ కోయ శ్రీహర్ష జిల్లాలపల్లి ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేశారు. విద్యార్థులకు పాఠాలు చెబుతూ కాసేపు ముచ్చటించారు. మంథని ఆర్డీ వో సురేశ్, మైనింగ్ అస్టిటెంట్ డైరెక్టర్ శ్రీనివాస్, తహసీల్దార్ మధుసూదన్రెడ్డి పాల్గొన్నారు. ఇసుక అక్రమ రవాణా నియంత్రణకు చర్యలు రాష్ట్ర మైనింగ్ శాఖ కార్యదర్శి ఎన్.శ్రీధర్ వెల్లడి -
ఆశలు ఆవిరి
సాక్షి, పెద్దపల్లి: స్థానిక ఎన్నికల నిర్వహణకు అధి కార యంత్రాంగం అన్నిఏర్పాట్లు చేసింది. మరోవారం రోజుల్లో పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుందని భావించిన ఆశావహులు.. అప్పుడే ప్రచారం, విందులతో ఎన్నికల సందడి షురూ చేశారు. మరోసారి కులగణన చేపట్టడంతోపాటు, బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాకే ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంతో ఇక ఇప్పట్లోఎన్నికలు జరగవని తేలిపోయింది. ఈ మొత్తం ప్రక్రియ పూర్తయ్యేందుకు సుమారు మూ డు నెలలకుపైగా సమయం తీసుకునే అవకాశం ఉండడంతోఎన్నికల వేడి తగ్గిపోయింది. ఆశావాహుల ఆశలపై నీళ్లు చల్లినట్లయ్యింది. 140 ఎంపీటీసీ స్థానాలు.. 755 పోలింగ్ కేంద్రాలు పరిషత్ ఎన్నికలు నిర్వహించి, ఆ తర్వాత పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీనికి అనుగుణంగా జిల్లా యంత్రాంగం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఇప్పటికే ఓటరు జాబితా, పోలింగ్ బాక్సులు, బ్యాలెట్ పేపర్ల ముద్రణ, సిబ్బందికి శిక్షణ తదితర వాటిని పూర్తి చేసింది. పోలింగ్ కేంద్రాల జాబితా కూడా ప్రదర్శించింది. గత ఎన్నికల్లో 138 ఎంపీటీసీ స్థానాలు ఉండగా, ఈసారి మూడు స్థానాలు పెరిగాయి. రామగుండం కార్పొరేషన్లో వీలినమైన కుందనపల్లి, లింగాపూర్, వెంకట్రావుపల్లి గ్రామాల ను ఎంపీటీసీ స్థానాలుగా గుర్తించగా, అదే సమయంలో జగిత్యాల జిల్లాలో కలిసిన పాలకుర్తి మండలంలోని గ్రామాలతో ఒక ఎంపీటీసీ స్థానం తగ్గింది. దీంతో మొత్తంగా జిల్లాలో ఎంపీటీసీ స్థానాల సంఖ్య 140కి చేరుకోగా, వీటి పరిధిలో 755 పోలింగ్ కేంద్రాలను అధికారులు గుర్తించారు. మహిళా ఓటర్లే అధికం జిల్లాలో 266 గ్రామపంచాయతీలు, 2,462 వార్డు లు ఉన్నాయి. 140 ఎంపీటీసీ, 13 జెడ్పీటీసీ స్థానా లు ఉన్నాయి. వీటి పరిధిలో 4,13,306 మంది ఓట ర్లు ఉన్నారు. వీరిలో 2,03,336 మంది పురుషులు, 2,09,927 మంది మహిళలు, 13 మంది ఇతర ఓట ర్లు ఉన్నారు. పురుషుల కన్నా మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. అత్యధికంగా ధర్మారం మండలంలో 43,606మంది ఓటర్లు ఉండగా, అత్యల్ఫంగా ఎలిగేడులో 18,537 మంది ఓటర్లు ఉన్నారు. రిజర్వేషన్ల కోసం ఎదురుచూపులు స్థానిక సంస్థల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు క ల్పించేందుకు ప్రభుత్వం కులగణన చేపట్టింది. స ర్వేలో పాల్గొనని వారికోసం మరో అవకాశం కల్పి స్తూ ఈనెల 16 నుంచి 28 వరకు సర్వే చేపడుతోంది. ఆన్లైన్ సర్వేతోపాటు టోల్ఫ్రీ నంబరు ద్వారా ఎంపీడీవో కార్యాలయంలో ప్రజాపాలన అధికారుల వద్ద కూడా నమోదు చేసుకునేలా అవకాశం కల్పించారు. దీంతో ఎన్నికల ప్రక్రియకు మరోమూడు నెలల సమయం పట్టే అవకాశం ఉందని అంటున్నారు. కులగణన సర్వే నివేదిక ఆధారంగా రిజర్వేషన్లు ఖరారు చేయనుండడంతో ఆశావహుల్లో రిజర్వేషన్లపై ఉత్కంఠ నెలకొంది. ఎన్నికల్లో తాము బరిలో ఉంటామని చెబుతూ ప్రజల మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. పంచాయతీ ఎన్నికల కోసం జోరుగా ఖర్చు పెడుతూ, రాజకీయాలు వేడేక్కించిన ఆశావాహులు.. ప్రభుత్వ నిర్ణయంతో కొంతవెనక్కి తగ్గారు. ఇప్పట్లో ‘స్థానికం’ లేనట్లే..! కులగణన, బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం స్థానిక పోరు వాయిదా -
కలెక్టరేట్లో క్యాంటీన్ వివాదం
సాక్షి,పెద్దపల్లి: లీజు గడువు ముగియక ముందే మ రోమహిళా సంఘానికి క్యాంటీన్ నిర్వహణ బాధ్య తలు అప్పగించడంతో వివాదం చేలరేగింది. లీజు గడువు ముగియకుండానే వేరేవారికి ఎలా కేటాయిస్తారని నిర్వాహకులు కోర్టు మెట్లు ఎక్కడం కలక లం రేపుతోంది. అంతేకాదు.. మహిళా సంఘం సభ్యులు కలెక్టరేట్లోని క్యాంటీన్ వద్ద మీడియా సమావేశం నిర్వహిండంతో ఈ వ్యవహారం రచ్చకెక్కింది. బాధితురాలి కథనం ప్రకారం.. సిబ్బంది, సందర్శకుల కోసం కలెక్టరేట్లో క్యాంటీన్ ఏర్పాటు చేశారు. గత కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ 1 ఏప్రిల్ 2024 నుంచి 31 మార్చి 2027వ తేదీ వరకు గడువు ఉండేలా రంగంపల్లికి చెందిన మహతి మహిళా గ్రూప్ సభ్యురాలు బొంతు తారలక్ష్మికి లీజుకు ఇ చ్చారు. ఆ మహిళా గ్రూప్ ఒప్పందం గడువు పూర్తికాకముందే ప్రస్తుత కలెక్టర్.. క్యాంటీన్ను ఖాళీ చే యాలని సదరు మహిళా సంఘానికి నోటీసులు జా రీచేశారు. ఇదేసమయంలో రాఘవాపూర్ గ్రామాని కి చెందిన పద్మావతి స్వశక్తి మహిళా సంఘానికి డీఆర్డీఏ అధికారులు క్యాంటీన్ నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. దీంతో కొత్తవారు 15రోజులుగా క్యాంటీన్ ఆవరణలో టీ, స్నాక్స్ విక్రయిస్తున్నారు. తమను అర్ధంతరంగా ఖాళీ చేయించడంతో తారల క్ష్మి మహిళా సంఘం స్థానిక కోర్టును ఆశ్రయించింది. అయితే, క్యాంటీన్ నిర్వహణ బాధ్యతలు తమ కు వర్తించేలా కోర్టు ఆదేశాలు ఇచ్చిందని, దీంతో తాము క్యాంటీన్లో సామాన్లు నిల్వచేసి తాళం వేసు కున్నట్లు తారలక్ష్మి తెలిపారు. శనివారం వెళ్లి చూడ గా తాళం పగుగొట్టి సామాన్లు చిందరవందర చేసి నట్లు వివరించింది. ఈ విషయంపై ఠాణాలో ఫిర్యా దు చేశామని మీడియాకు తెలిపింది. మరోవైపు.. తాము తాళం పగులగొట్టలేదని, క్యాంటీన్ వెలుపల టేబుల్ వేసుకుని టీ, స్నాక్స్ విక్రయిస్తున్నామని కొ త్త మహిళా సంఘం ప్రతినిధులు చెబుతున్నారు. కోర్టును ఆశ్రయించిన మహిళా సంఘం -
ప్రైవేట్ బ్లడ్బ్యాంకుల ఇష్టారాజ్యం!
● కానరాని 30శాతం రక్తం ఇవ్వాలన్న నిబంధన ● ప్రభుత్వ బ్లడ్ బ్యాంకుకు ఎగనామం ● ఇతర అవసరాలకు విక్రయాలు ● పట్టనట్లు వ్యవహరిస్తున్న ఉన్నతాధికారులు కరీంనగర్టౌన్: రక్తం ఆపదలో ఉన్నవారికి అత్యవసరం.. రక్తం అందని సందర్భంలో ప్రాణాలు కోల్పోయినవారు ఎందరో ఉన్నారు. రక్తహీనత, తలసేమియాతో బాధపడేవారు చాలామంది రక్తదాతల కోసం ఎదురుచూస్తున్నారు. ఆపదలో ఉన్నవారితో పాటు దీర్ఘకాలికంగా రక్తం అవసరం ఉన్నవారి కోసం ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకుల పుట్టినరోజుల సందర్భంగా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తుంటారు. స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేటు బ్లడ్బ్యాంకుల ద్వారా రక్తాన్ని సేకరిస్తారు. ఇలా సేకరించిన రక్తంలో ప్రైవేట్ బ్లడ్బ్యాంక్లు 30శాతం అదేరోజు ప్రభుత్వ బ్లడ్బ్యాంకుకు ఇవ్వాలి. కానీ ఇది జిల్లాలో సక్రమంగా అమలు కావడం లేదు. దీంతో పేదలకు అత్యవసరం అయిన సమయంలో రక్తం అందక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఉన్నతాధికారులు సైతం ఈ విషయమై పట్టనట్లు వ్యవహరిస్తుండడంతో ప్రైవేటు బ్లడ్బ్యాంకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి.ప్రభుత్వాస్పత్రిలో ఉచితంగా..పేద రోగులు ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న క్రమంలో అసరమైనవారికి ప్రభుత్వ బ్లడ్బ్యాంక్ నుంచి ఉచితంగా రక్తం అందిస్తారు. కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యం కోసం కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుంచే కాకుండా ఆదిలాబాద్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలకు చెందిన నిరుపేదలు వస్తుంటారు. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారు, రక్తహీనతతో బాధపడేవారు, డెలివరీల కోసం వచ్చేవారికి రక్తం అవసరం అవుతుంది. డిమాండ్కు సరిపడా డోనర్స్ నుంచి రక్తం అందకపోవడంతో రక్తం కొరత ఏర్పడుతోంది. ప్రస్తుతానికి పరిస్థితి బాగానే ఉన్నా.. వేసవిలో ఇబ్బందికరంగా మారే ప్రమాదం ఉంది.15 బ్లడ్బ్యాంకులుజిల్లాలో 15 బ్లడ్బ్యాంకులు ఉన్నాయి. వాటిలో ప్రభుత్వాసుపత్రి బ్లడ్బ్యాంకు, ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ, మైత్రి, జీవన్ధార వాలంటరీ, ప్రతిమ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, చల్మెడ ఆనందరావు ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, అపోలో రీచ్ హాస్పిటల్, ప్రజా బ్లడ్ సెంటర్, ఎంజీఆర్ వలంటరీ, ఆయుష్, ఆరోగ్య, లైఫ్కేర్, స్పందన, మదర్ థెరిస్సా వలంటరీ బ్లడ్ సెంటర్ కరీంనగర్లో కొనసాగుతున్నాయి.ఒక్క రెడ్క్రాస్ నుంచేజిల్లాలో ఉన్న 15బ్లడ్సెంటర్లలో ఒక్క రెడ్క్రాస్ బ్లడ్బ్యాంకు నుంచి మాత్రమే ప్రభుత్వ బ్లడ్బ్యాంకుకు రక్తం అందిస్తున్నారు. 30శాతం కాకపోయినా రక్తదాన శిబిరాలు నిర్వహించిన ప్రతిసారి ఎంతోకొంత ప్రభుత్వ ఆస్పత్రిలోని బ్లడ్బ్యాంకుకు పంపిస్తున్నారు. ఇటీవల ఒక ప్రైవేటు బ్లడ్బ్యాంకు నుంచి మూడు యూనిట్ల రక్తం అందినట్లు అధికారులు వెల్లడించారు.సహకరించాలిప్రభుత్వాసుపత్రికి నిరుపేదలైన రోగులు ఎక్కువగా వస్తుంటారు. వారికి రక్తం అందించేందుకు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, రక్తదాతలు, రాజకీయ నేతల జయంతి, జన్మదినాల పేరిట జరిపేవారు ప్రభుత్వాసుపత్రి బ్లడ్బ్యాంకును సందర్శిస్తే క్యాంపులు నిర్వహిస్తాం. ఆ విధంగా నిరుపేదలకు ఎంతగానో ఉపయోగం జరుగుతుంది.– డాక్టర్ ఉషాకండల్,బ్లడ్ బ్యాంకు ఇన్చార్జి -
పొలానికి ఎట్ల పోవాలె?
● మహిళా అగ్రికల్చర్ ఆఫీసర్ల అగచాట్లు ● డీటెయిల్ క్రాప్ సర్వే కోసం పడరాని పాట్లు ● నిర్మానుష్య ప్రాంతాల్లో భయంభయంగా.. ● పురుగులు, పుట్టలు, రైలుపట్టాలు దాటుతూ సర్వే ● యాప్, సర్వర్ సతాయింపులు ● ఇతర రాష్ట్రాల్లో మహిళలు దూరం ● ప్రాణాలకు తెగించి, ఆత్మగౌరవాన్ని చంపుకుంటున్నామని ఆవేదన ● గర్భిణులు, బాలింతలకూ దొరకని మినహాయింపు పెద్దపల్లి: బురదలో కూరుకుపోయిన బండితో ఏఈవో ఆపసోపాలుజగిత్యాల జిల్లా పరిధిలోని ఓ గ్రామంలో ఊరికి దూరంగా పొలం ఉంది. వెళ్లేందుకు సరైన దారిలేదు. పొలానికి వెళ్లాలంటే కల్లు కాంపౌండ్ దాటాలి. అక్కడ కల్లు తాగేవాళ్లు ఒంటరిగా వస్తున్న మహిళా ఏఈవోను చూసి వెకిలిగా నవ్వారు.. అవేమీ పట్టించుకోకుండా ముందుకెళ్తే.. పొలంగట్టుపై బుసలు కొడుతూ నాగుపాము అంతెత్తున లేచింది. ఆ మహిళా ఏఈవోకు ప్రాణాలు పోయినంత పనైంది.జిల్లా ఏఈవోలు మహిళలు సాగుచేసినభూమి డీసీఎస్(ఎకరాల్లో) (ఎకరాల్లో)సిరిసిల్ల 53 28 2,34,000 24,499జగిత్యాల 71 34 1,39,000 19,000కరీంనగర్ 75 13 3,03,000 59,005పెద్దపల్లి 55 21 2,10,975 18,692 -
రామగుండంలో నూతన విద్యుత్ కేంద్రంపై ముందడుగు
రామగుండం: రామగుండంలో మూతపడిన 62.5 మెగావాట్ల సామర్థ్యం గల బీ–థర్మల్ విద్యుత్ కేంద్రం స్థానంలో నూతనంగా 800 మెగావాట్ల సామర్థ్యం గల నూతన విద్యుత్ కేంద్రం స్థాపించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. తొలుత సింగరేణి, జెన్కో సంయుక్త భాగస్వామ్యంతో నిర్మించాలని తలపెట్టినప్పటికీ జెన్కో ఇంజినీర్లు, ఉద్యోగుల జేఏసీ సంయుక్తంగా జెన్కో ఉనికిని కాపాడుతూ సింగరేణి భాగస్వామ్యం నిర్ణయాన్ని ఉపసంహరించుకోవా లని ప్రభుత్వ నిర్ణయంపై వివిధ రకాలుగా నిరసనలు చేపట్టారు. దీంతో సింగరేణి భాగస్వామ్యం ఉపసంహరించుకొని పూర్తిస్థాయిలో నూతన విద్యుత్ కేంద్రం స్థాపనను జెన్కోకు అప్పగిస్తున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారికంగా ప్రకటించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.పాలక మండలి సమావేశంలో నిర్ణయంహైదరాబాద్లోని విద్యుత్ సౌధలో గురువారం ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి, జెన్కో సీఎండీ సందీప్కుమార్ సుల్తానియా అధ్యక్షతన జరిగిన జెన్కో పాలకమండలి సమావేశం నిర్వహించారు. ఇందులో రామగుండంలో థర్మల్ విద్యుత్ కేంద్రంస్థానంలో నూతన విద్యుత్ కేంద్రం స్థాపనకు న్యూఢిల్లీకి చెందిన డిసిగ్ సంస్థతో తయారు చేయించిన డీపీఆర్కు ఆమోద ముద్ర పడింది. మెగావాట్కు రూ.16.7 కోట్లు చొప్పున 800 మెగావాట్లకు రూ.13,300 కోట్ల అంచనాతో నిర్మించేందుకు అధికార వర్గాలు నిర్ణయించాయి. వద్యుత్ కేంద్రానికి అవసరమయ్యే బొగ్గు కేటాయింపు, పర్యావరణ అనుమతుల విషయమై రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర బొగ్గు గనుల మంత్రిత్వ శాఖకు లేఖ రాయాలని నిర్ణయించారు. ఏది ఏమైనా ఆర్థిక సంవత్సరాంతంలో మూడిన బీథర్మల్ను కూల్చి నూతన కేంద్రం స్థాపనకు శంకుస్థాపన చేసే అవకాశాలున్నట్లు తెలిసింది.ఇంధన శాఖ కార్యదర్శి, జెన్కో సీఎండీతో ప్రభుత్వం చర్చలు -
ఆర్ఆర్ఆర్ నిరంతర ప్రక్రియ
కరీంనగర్ కార్పొరేషన్: ఆర్ఆర్ఆర్ (రెడ్యూజ్, రీయూజ్, రీసైకిల్) విధానాన్ని నిరంతరం కొనసాగించాలని నగరపాలక సంస్థ కమిషనర్ చాహత్ బాజ్పేయ్ అన్నారు. శుక్రవారం నగరంలోని హౌసింగ్బోర్డుకాలనీలో ఉన్న రిసోర్స్ పార్క్ను సందర్శించారు. రెడ్యూజ్, రీయూజ్, రీసైకిల్ పద్ధతిలో చెత్తను వ్యర్థాలను వేరు చేయాలని ఆదేశించారు. రిసోర్స్పార్క్లోని ఆర్ఆర్ఆర్ సెంటర్ను వినియోగంలోకి తేవా లన్నారు. ప్రస్తుతం ఉన్న వర్మీ కంపోస్ట్ పిట్స్కు అదనంగా మరోమూడు కంపోస్ట్ పిట్స్ కట్టించాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించా రు. ఆర్ఆర్ఆర్ సెంటర్కు ప్రతీరోజు స్వచ్ఛ ఆటోలను తరలించి వ్యర్థాలను వేరుచేసే ప్రక్రియను కొనసాగించాలన్నారు. అంతకుముందు బొమ్మకల్లో పారిశుధ్య పనులు, వార్డు కా ర్యాలయాన్ని పరిశీలించారు. సహాయ కమిషనర్ వేణుమాదవ్, ఎస్ఈ రాజ్కుమార్, పర్యావరణ ఇంజినీర్ స్వామి, ఏఈ సతీశ్ ఉన్నారు.జీవనశైలిలో మార్పుతో ఎన్సీడీ వ్యాధులు దూరంకరీంనగర్టౌన్: జీవనశైలిలో మార్పు, సమతుల్య ఆహారం, వ్యాయామం, యోగా, ధ్యానం ద్వారా ఎన్సీడీ వ్యాధులు దూరమవుతాయని డీఎంహెచ్వో వెంకటరమణ పేర్కొన్నారు. శుక్రవారం డీఎంహెచ్వో కార్యాలయంలో ఆశాకార్యకర్తలకు ఎస్సీడీ వ్యాధులపై ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. డీఎంహెచ్వో మాట్లాడుతూ ప్రజలు ఆరోగ్యంగా ఉండేలా అవగాహన కల్పించాలని అన్నారు. ప్రతిరోజూ తీసుకునే ఆహారంలో తృణధాన్యాలు చేర్చుకుని, తగినంత శ్రమిస్తూ.. ఆరోగ్యంగా ఉండేలా వివరించాలని ఆశా కార్యకర్తలకు సూచించారు. పీవోడీటీటీ ఉమా శ్రీరెడ్డి, డీపీహెచ్ఎన్వో విమల, హెచ్ఈఈవో రాజ గోపాల్, రవీందర్ రెడ్డి పాల్గొన్నారు.మహిళలు ఆర్థిక వ్యవస్థకు మూల స్తంభాలుకరీంనగర్టౌన్: ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మహిళలు మూల స్తంభాల్లాంటివారని మహిళా సాధికారత, వ్యాపార వ్యవస్థాపక కమిటీ చైర్మన్ బెల్లం మాధవి పేర్కొన్నారు. స్వదేశీ మేళాలో భాగంగా శుక్రవారం మహిళా ఆర్థిక స్వావలంబన, అభివృద్ధి అంశంపై స్వశక్తి మహిళలకు సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాధవి మాట్లాడుతూ.. నేడు మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, గృహిణిగా ఉంటూనే వ్యాపారాలు, వృత్తులు, ఉద్యోగాలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని అ న్నారు. మధ్యాహ్నం పాడిపంట, రైతు ఆర్థిక స్వావలంబన సెమినార్కు ముఖ్యవక్తగా ఎన్నారై సామ ఎల్లారెడ్డి హాజరై మాట్లాడారు. గ్రామీణ జనాభాలో ఎక్కువమంది ఏదో రూపంలో వ్యవసాయంలో నిమగ్నమై ఉన్నారన్నారు. కళ్లెం స్వప్న, బల్ల స్వప్న, విజయలక్ష్మి, కామారపు మంజుల, కళ్లెం కవిత పాల్గొన్నారు. -
బైలకుప్పే సందర్శన
కరీంనగర్టౌన్: కేంద్ర హోంశాఖ సహా య మంత్రి బండి సంజయ్ కుమార్ రెండ్రోజుల పర్యటనలో భాగంగా కర్నాటకలోని మైసూర్ జిల్లాలోని టిబెటియన్ శరణార్థుల పునరావాస కేంద్రమైన బైలకుప్పేను సందర్శించారు. టిబెటియన్ శరణార్థుల స్థితిగతులు, సమస్యలను తెలు సుకునేందుకు బైలకుప్పేకు వెళ్లిన కేంద్ర మంత్రి బండి సంజయ్కి బౌద్ద మత గురువు 14వ దలైలామా ప్రతినిధి జుగ్మే జిగ్నే, మైసూర్ కాలనీల ప్రధాన ప్రతినిధి జూనియర్ జుగ్మే సుల్ట్రాన్, జిల్లా మైనారిటీ అధికారి శిల్ప, స్థానిక అధికారులు ఘన స్వాగతం పలికారు. స్థానిక గోల్డెన్ టెంపుల్, పద్మ సంభవ, బుద్ధ, అమితాయుస్ల ఎత్తయిన (40 అడుగుల) భవ్య విగ్రహాలను, ఫిలాసఫీ యూనివర్శిటీ టెంపుల్, ఆర్గానిక్ రీసెర్చ్ ట్రైనింగ్ సెంటర్, ఓల్డెజ్ హోంను సందర్శించారు. శుక్రవారం ఉద యం బండి సంజయ్ 14వ బౌద్ద మతగురువు దలైలామాతో భేటీ కానున్నారు. -
ప్రజల హక్కుల కోసం పోరాటం
సాక్షి, పెద్దపల్లి: ప్రజల హక్కుల సాధన, ప్రజా స మస్యల పరిష్కారం కోసం తమ పార్టీ నిరంతర పో రాటాలు చేస్తోందని సీపీఐ జాతీయ కార్యవర్గ దర్శి సభ్యుడు చాడ వెంకటరెడ్డి అన్నారు. గురువారం జి ల్లాకేంద్రంలోని సీపీఐ జిల్లాస్థాయి సమావేశం కార్యదర్శి తాండ్రా సదానందం అధ్యక్షతన జరిగింది. ఆ యన మాట్లాడుతూ, కుల గణనలో పాల్గొనని వారి కి ప్రభుత్వం మరొక అవకాశం కల్పించడం న్యాయబద్ధమేనన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ అ భ్యర్థుల విజయానికి కృషిచేయాలని జిల్లా కార్యవర్గ సభ్యులకు సూచించారు. పొత్తుపై త్వరలోనే తమ విధివిధానాలను ప్రకటిస్తామని అన్నారు. సీపీఐ రా ష్ట్ర కార్యవర్గ సభ్యుడు కలవేన శంకర్ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలన్నారు. నాయకులు గోసిక మోహన్, గౌ తమ్ గోవర్ధన్, కడారి సునీల్, కనకరాజ్ ఉన్నారు. -
రాచపుండు సలుపుతోంది..
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): రాచపుండు(క్యాన్సర్) ప్రాణాలను కబళిస్తోంది. వ్యాధి గురించి తెలుసుకునేలోపే ప్రాణాలు హరించుకుపోతున్నాయి. జిల్లాలో ఇటీవల క్యాన్సర్ రోగుల సంఖ్య భారీగా పెరిగిపోవడం ఆందోళనకు గురిచేస్తుంది. అసలు క్యాన్సర్కు కారణాలు తెలియక ప్రజలు భయపడుతున్నారు. ప్రధానంగా ఈ వ్యాధి మహిళలో ఎక్కువ వస్తోంది. రాజన్నసిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా అధికారుల లెక్కల ప్రకారం 160 మంది రోగులు ఉంటే.. క్షేత్రస్థాయిలో వాస్తవంగా బాధితులు వెయ్యికి పైగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ 160 మంది రోగుల్లో 120 మందికి ప్రభుత్వం ఆధ్వర్యంలోనే వైద్యం అందుతోంది. మిగతా వారు ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. జిల్లాలో విస్తరిస్తున్న క్యాన్సర్ వ్యాధిపై ‘సాక్షి’ ఫోకస్. నారాయణపూర్, లింగన్నపేటల్లోనే అత్యధికం జిల్లా వ్యాప్తంగా అధికారుల లెక్కల ప్రకారం 160 మంది రోగులు ఉంటే నారాయణపూర్ గ్రామంలో 10కి పైగా, లింగన్నపేటల్లో 67 మందికి పైగా బాధితులు ఉన్నారు. అయితే ఈ సంఖ్య వాస్తవంగా మూడింతలకు పైగానే బాధితులు ఉన్నట్లు గ్రామస్తుల ద్వారా తెలిసింది. ఇటీవల ఆయా గ్రామాల్లో వరుస మరణాలు సంభవించడం భయాందోళనకు గురిచేస్తుంది. కారణాలు తెలియక అయోమయం క్యాన్సర్ వ్యాధి రావడానికి గల కారణాలు తెలియక ప్రజలు అయోమయానికి గురవుతున్నారు. అత్యధిక కేసులు గల గ్రామాలలో కనీసం ఫాస్డ్ఫుడ్ సెంటర్లు కూడా లేవు. ఇప్పటి వరకు క్యాన్సర్లతో మరణించిన వారు సైతం దురలవాట్లు లేని వారే. అయినా మరణిస్తుండడంతో ఆయా గ్రామాల్లో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఇప్పటికై నా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు జిల్లాలో ఎక్కువగా క్యాన్సర్తో ఇబ్బంది పడుతున్న గ్రామాల్లో పర్యటిస్తే కారణాలు తెలియవచ్చనే భావన గ్రామస్తుల్లో వ్యక్తమవుతుంది. ఎక్కువగా ఇవే.. ● మహిళల్లో ఎక్కువగా బ్రెస్డ్, సర్వైకల్ క్యాన్సర్లు సోకుతున్నాయి. ఈ రెండు రకాల క్యాన్సర్లతో జిల్లాలో 87 మంది బాధపడుతున్నారు. ● నోటిక్యాన్సర్తో 26 మంది ఇబ్బంది పడుతున్నారు. ● ఇతర క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న వారు 47 మంది ఉన్నారు. గుర్తిస్తే కాపాడవచ్చు ఎలాంటి క్యాన్సర్లను అయినా మొదటి స్టేజీలో గుర్తిస్తే ప్రాణాలు కాపాడవచ్చని వైద్యులు తెలుపుతున్నారు. మన శరీరంలో కొత్తగా మార్పులు వస్తున్నాయంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. మహిళల్లో ఎక్కువగా వచ్చే బ్రెస్ట్ క్యాన్సర్లను వారే సులభంగా గుర్తించవచ్చంటున్నారు. బ్రెస్ట్లో చిన్న సైజులో గడ్డలు కొత్తగా ఏర్పడితే వెంటనే వైద్యపరీక్షలు చేయించుకోవాలంటున్నారు. అదే సమయంలో ఎక్కువగా దగ్గు రావడం, రక్తం వాంతులు కావడం, తరచూ రక్తహీనతతో బాధపడుతుంటే క్యాన్సర్లకు దారి తీయవచ్చని వైద్యులు పేర్కొంటున్నారు. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. కబళిస్తున్న క్యాన్సర్ గుర్తించేలోపు మృత్యువాత లింగన్నపేట, నారాయణపూర్లలో అత్యధిక మరణాలు అధికారికంగా జిల్లాలో 160 మంది బాధితులు అనధికారికంగా వెయ్యికి పైగా కేసులు అవగాహనతోనే నివారించవచ్చంటున్న వైద్యులు ఇది గంభీరావుపేట మండలం లింగన్నపేట గ్రామం. ఈ ఊరిలో జిల్లా వైద్యశాఖ అధికారుల లెక్కల ప్రకారం క్యాన్సర్ రోగులు 67 మంది వరకు ఉన్నారు. అసలు క్యాన్సర్ వ్యాధి ఎందుకొస్తుందో తెలియక గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. అధికారుల లెక్కల ప్రకారం జిల్లా వ్యాప్తంగా 160 క్యాన్సర్ కేసులుంటే ఒక్క ఈ గ్రామంలోనే 67 మంది బాధితులు ఉన్నారు. వ్యాధి గురించి తెలుసుకొని, వైద్యులకు చూయించుకునేలోపే తీవ్రమై ప్రాణాలు పోతున్నాయి. వైద్యులకు అన్ని చెప్పుకోవాలి ఎలాంటి ఆరోగ్య ఇబ్బందులు ఉన్నా వైద్యులకు అన్ని చెప్పుకుంటేనే సమస్య పరిష్కారమవుతుంది. ఫస్ట్ స్టేజీలో ఉంటే వందశాతం బతికించవచ్చు. రెండో స్టేజీలో ఉన్నప్పుడు గుర్తిస్తే చికిత్సతో 80 శాతం వరకు వ్యాధిని నయం చేసే అవకాశాలు ఉన్నాయి. మూడు, నాలుగు స్టేజీలలో ఆరోగ్య పరిస్థితి క్లిష్టంగా ఉంటుంది. ప్రధానంగా జంక్ఫుడ్కు దూరంగా ఉండాలి. మాడిపోయిన, పాసిపోయిన ఆహారపదార్థాలు అసలే తీసుకోవద్దు. శరీరంలో కొత్తగా ఏదైనా గడ్డలు ఏర్పడితే వెంటనే వైద్యులను సంప్రదించాలి. మహిళల్లో ఎక్కువగా బ్రె స్ట్, పురుషుల్లో లివర్ క్యాన్సర్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. – డాక్టర్ రామకృష్ణ, క్యాన్సర్ జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ -
పెద్దలను ఒప్పించి..
కోల్సిటీ(రామగుండం): గోదావరిఖనికి చెందిన గొడిశల శారద– నరేశ్ పెద్దలను ఒప్పించి ప్రేమ వివాహం చేసుకున్నారు. శారదను ఉన్నత విద్యనభ్యసిస్తున్న సమయంలో నరేశ్ ప్రేమించాడు. తొలత వీరిప్రేమను ఇరుకుటుంబాలు వ్యతిరేకించాయి. వారి కుటుంబాలను ఈ ప్రేమికులు ఒప్పించి 2013లో ప్రేమ వివాహం చేసుకున్నారు. నరేశ్ ఎంబీఏ చదవగా, శారద డిగ్రీ పూర్తి చేసింది. వీరి ప్రేమకు గుర్తుగా మొదటిసారి కూతురు అక్షితరాయ్ జన్మించగా, ఆ తర్వాత కుమారుడు అమోగ్, కూతురు ఆరూహ్య అనే ఇద్దరు కవలలు పుట్టారు. నరేశ్ విద్యార్థి ఉద్యమాలతోపాటు, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో సైతం విస్తృత స్థాయిలో పాల్గొన్నారు. 2016లో సింగరేణిలో ఉద్యోగం పొందిన నరేశ్, ప్రస్తుతం జీడీకే 11వ ఇంక్లయిన్ గనిలో పని చేస్తూనే, ఏఐటీయూసీ యూనియన్ అసిస్టెంట్ పిట్ సెక్రటరీగా వ్యవహరిస్తున్నాడు. -
వేధింపులకు గురిచేస్తే చర్యలు
కరీంనగర్క్రైం: యువకులు మహిళలను, యువతులను వేధింపులకు గురిచేస్తే చట్టపరంగా చర్యలు తప్పవు. ఇబ్బందులకు గురైనవారు షీటీంనంబర్ 8712670759 లేదా డయల్ 100కు సమాచారం ఇస్తే నిమిషాల వ్యవధిలోనే మీ ముందు ఉంటాం. కరీంనగర్ షీటీంకు నెలకు 25 నుంచి 30 ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు రెండు ఎఫ్ఐఆర్లు కాగా, గతేడాది 40 ఎఫ్ఐఆర్లు నమోదు చేశాం. ఫిర్యాదు వచ్చిన వెంటనే నిందితుడిని పిలిపించి బాధితులు కోరుకుంటే సంబంధిత పోలీస్స్టేషన్లోకేసు నమోదు చేస్తున్నాం. ఉన్నతాధికారుల ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ ఇస్తున్నాం. – శ్రీలత, ఉమెన్ టౌన్ సీఐ, షీటీం ఇన్చార్జి, కరీంనగర్ప్రేమ.. రెండక్షరాలు.. రెండు హృదయాల కలయిక.. ఇద్దరి జీవితాల్లో వెలుగుల దీపిక. మనసులు కలిశాక.. ఎన్ని కష్టాలొచ్చినా.. తోడునీడగా ఉండి, జీవితాంతం కలిసి నడిస్తేనే అసలైన ప్రేమ. అలాంటి ప్రేమకు ఎందరో అక్షరరూపంగా నిలిచారు. ఆదర్శవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. పదేళ్ల క్రితం ప్రేమంటే అద్భుతం.. అదో ఆనందం.. ప్రేమించి, పెళ్లి చేసుకుంటే ఆశ్చర్యం. కానీ, కాలం మారుతుంటే అందులో అర్థం మారుతోంది. ప్రస్తుతం.. ప్రేమంటే అంత టైం లేదంటున్నారు యువత. చదువు, కెరియర్ ఫస్ట్ అని, ఆ తర్వాతే ప్రేమైనా.. పెళ్లయినా అని చెప్పుకొస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కొన్ని గ్రామాలు ప్రేమ వివాహాలకు కేరాఫ్గా నిలుస్తుండగా.. పలువురు లవ్ మ్యారేజ్ చేసుకొని, కుటుంబాలతో ఆనందంగా గడుపుతున్నారు. నేడు ప్రేమికుల దినోత్సవం సందర్భంగా అలాంటి వారిపై ప్రత్యేక కథనాలు.● ప్రేమించి, పెళ్లి చేసుకుని ఆదర్శంగా నిలుస్తున్న జంటలు ● ప్రేమ వివాహాలకు కేరాఫ్గా నిలుస్తున్న కొన్ని గ్రామాలు ● ముందు కెరియర్.. తర్వాతే ప్రేమైనా.. పెళ్లయినా అంటున్న నేటి యువత ● నేడు ప్రేమికుల దినోత్సవంఆకర్షణకు లోనుకావొద్దు చాలామంది ఆకర్షణనే ప్రేమగా భావిస్తున్నారు. ప్రేమ అంటే అనుభవం, ఆలోచన, నమ్మకం. దాని విలువ కొందరికే తెలుస్తుంది. యువత ఆకర్షణకు లోనుకావొద్దు. చదువు పూర్తయిన వెంటనే పెళ్లి వద్దు. భవిష్యత్ ఏర్పరుచుకున్నాకే.. ప్రేమ, లేదా పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకోవాలి. – అశోక్కుమార్, లెక్చరర్అర్థం చేసుకోవాలి ప్రేమ పెళ్లి అయినా, పెద్దలు కుదిర్చి న పెళ్లి అయినా రెండు అంశాలు ము ఖ్యం. ఒకటి ఇద్దరి మధ్య ప్రేమ, రెండోది ఇద్దరి మధ్య అండర్ స్టాడింగ్. ఇవి లేకపోతే ఏ పెళ్లయినా ఎక్కువకాలం నిలవదు. పరస్పరం గౌరవించుకోవాలి. – స్నేహిత, విద్యార్థిని ఇది విడాకుల ట్రెండ్ ప్రస్తుత సమాజంలో విడాకుల ట్రెండ్ నడుస్తోంది. ఎందుకంటే ఒకరిపై ఒకరికి నమ్మకం లేక విడిపోతున్నారు. ఒకసారి పెళ్లి చేసుకుంటే జీవితాంతం ఇద్దరూ నమ్మకంతో కలిసి బతకాలి. అలాంటి పార్ట్నర్ను అందరూ ఎంచుకోవాలి. – ఐశ్వర్య, విద్యార్థినిబతకడానికి డబ్బు కావాలి కెరీర్, పేరెంట్స్కు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. జీవిత భాగస్వామి ఎంపికలో అన్నీ ఆలోచించాలి. ప్రేమను గుడ్డిగా నమ్మకుండా ప్రాక్టికల్గా ఆలోచించాలి. ఇద్దరూ కలిసి బతకాలి అంటే ప్రేమతోపాటు డబ్బు కూడా చాలా అవసరం. – సౌమ్య విద్యార్థిని పెళ్లి తర్వాత ప్రేమే బెటర్ నా దృష్టిలో పెళ్లి తర్వాతి ప్రేమే స్వచ్ఛమైనది. మనపెద్దలు వెనుకాముందు ఆలోచించి పెళ్లి చేస్తారు. వారి అనుభవంతో కూడిన నిర్ణయాలు భవిష్యత్లో ఇబ్బందులు రాకుండా చేస్తాయి. సమస్యలు వస్తే వారే పరిష్కరిస్తారు. – రమ్య, విద్యార్థినిసాక్షి: బర్డ్ఫ్లూ కట్టడికి తీసుకున్న చర్యలేమిటి? డీవీహెచ్వో : ఇతర ప్రాంతాలు, రాష్ట్రాల నుంచి జిల్లాకు కోళ్ల దిగుమతిని ఇప్పటికే కట్టడి చేశాం. సరిహద్దు ప్రాంతాల్లోనే నియంత్రించేలా చెక్పోస్టులు ఏర్పాటు చేశాం. సాక్షి: బర్డ్ఫ్లూను ఎలా నిర్ధారిస్తారు? డీవీహెచ్వో : జిల్లాలోని కోళ్ల ఫారాలను తనిఖీ చే సేందుకు ర్యాపిడ్ రెస్పాన్స్ టీంలను ఏర్పాటు చే శాం. ఆ బృందాలు పరీక్షలు నిర్వహించి సూచనలు ఇస్తాయి. సాక్షి: పౌల్ట్రీ యజమానులకు ఏమైనా సూచనలు ఇస్తున్నారా? డీవీహెచ్వో : జిల్లాలో ఇప్పటివరకు బర్డ్ఫ్లూ కేసులేమీ నమోదు కాలేదు. అయినా పౌల్ట్రీ యజమానుల్లోని ఆందోళనలు తొలగించేందుకు అవగాహన కల్పిస్తున్నాం. సాక్షి: చికెన్, కోడిగుడ్లు తినొచ్చా?లేదా? డీవీహెచ్వో : నిర్భయంగా చికెన్, కోడిగుడ్లు తినొ చ్చు. సాధారణంగా బర్డ్ఫ్లూ 32 – 34 ఫారన్హీట్ టెంపరేచర్ ఉన్నపుడే వస్తుంది. కానీ మనం చికెన్, కోడిగుడ్లను తినేందుకు 70 డిగ్రీల ఫారన్ హీట్ ఉష్ణోగ్రతలు గల వేడిలో ఉడికిస్తాం. ఇంతటి వేడికి వ్యాధి కారక క్రిములు చనిపోతాయి. సాక్షి: జిల్లాలో పశుగణన పూర్తయిందా? డీవీహెచ్వో : జిల్లాలో ఇప్పటివరకు పశుగణన 62శాతం వరకు పూర్తయింది. డిజిటల్ పద్ధతిన చేపట్టిన పశుగణన దాదాపు అన్ని గ్రామాల్లో మొదలైంది. జిల్లాలోని 2,20,063 ఇళ్లకు 1,36,559 ఇళ్లలో పశుగణన నిర్వహించాం. న్యూస్రీల్ముగిసిన ఎమ్మెల్సీ నామినేషన్ల ఉపసంహరణ పట్టభద్రుల్లో 12 మంది, ఉపాధ్యాయుల్లో ఒకరు విత్డ్రాసాక్షి ప్రతినిధి, కరీంనగర్: మెదక్, నిజామా బాద్, కరీంనగర్, ఆదిలాబాద్ పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్లు వేసిన 13 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ఇందులో 12 మంది గ్రాడ్యుయేట్ ఎ మ్మెల్సీ అభ్యర్థులు కాగా ఒకరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి కావడం గమనార్హం. తాజా ఉపసహంరణలు పోగా.. గ్రాడ్యుయేట్స్ ఎన్నికల పోటీలో 56 మంది అభ్యర్థులు మిగిలా రు. ఇక టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒకరు ఉపసంహరించుకోగా.. 15 మంది బరిలో నిలిచా రు. విత్డ్రా చేసుకున్న గ్రాడ్యుయేట్స్ అభ్యర్థు ల్లో.. గవ్వల లక్ష్మి, ఎడ్ల సాయి కృష్ణప్రియ, కా వూరి సత్యనారాయణగౌడ్, ఆలగొండ కృష్ణ హరి, నాలకంటి యాదగిరి, బడే నరసయ్య, లింగాల శ్రీనివాస్, రేకల సైదులు, మదనం గంగాధర్, లింగం కృష్ణ, సోమగాని నరేందర్, దార మనోహర్ ఉన్నారు. అదేవిధంగా టీచ ర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థుల్లో గవ్వల శ్రీకాంత్ తన నామినేషన్ను ఉపసంహరించుకున్నారు.నేటి నుంచి రైల్వేగేట్ మూసివేత పెద్దపల్లిరూరల్: గౌరెడ్డిపేట – పెద్దపల్లి మధ్య ఉన్న(ఎల్సీ–40టీ) రైల్వేగేటు నేటినుంచి నాలుగు రోజుల పాటు మూసిఉంచనున్నట్లు రైల్వే అధికారులు గురువారం తెలిపా రు. రైల్వేట్రాక్ పునరుద్ధరణ పనుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నా రు. శుక్రవారం నుంచి సోమవారం వరకు గే టు మూసివేయనున్నట్లు వివరించారు. ప్ర యాణికులు సహకరించాలని వారు కోరారు.సాక్షి: జిల్లావ్యాప్తంగా క్కల దాడులు మితిమీరాయి. వాటిని ఎలా నియంత్రిస్తారు? డీవీహెచ్వో : మనుషులు, జంతువులపై కుక్కలు దాడులు చేస్తున్న మాట వాస్తవమే. అయితే, మున్సిపల్, పంచాయతీ అధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నారు. వాటి సంతానోత్పత్తిని నియంత్రించేందుకు రామగుండంలో యానిమల్ బర్త్ కంట్రోల్ (ఏబీసీ) సెంటర్ ఏర్పాటు చేసి శస్త్రచికిత్సలు చేయిస్తున్నాం. సుల్తానాబాద్లోనూ ఏర్పాటు చేస్తున్నాం. -
ఉడికించిన చికెన్ తినొచ్చు
● ‘బర్డ్ప్లూ’ పై అప్రమత్తంగా ఉన్నాం ● వ్యాధి నిర్ధారణకు ప్రత్యేక బృందాలు ● పొరుగు ప్రాంతాల నుంచి కోళ్ల దిగుమతిపై నియంత్రణ ● ‘సాక్షి’తో జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి శంకర్ పెద్దపల్లిరూరల్: ‘పొరుగున ఉన్న మహారాష్ట్రలో కోళ్లకు వ్యాపిస్తున్న బర్డ్ఫ్లూ జిల్లాలోకి ప్రవేశించకుండా అప్రమత్తమయ్యాం. ఇందుకోసం ఊరూరా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. అనుమానిత ప్రాంతాల్లో తనిఖీలు ముమ్మరం చేశాం’ అని జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి బర్ల శంకర్ అన్నారు. జిల్లాలో 16,02,676 పశుసంపద ఉందని, అందులో 9,88,540 కోళ్లు ఉన్నాయని ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన వెల్లడించారు. మహారాష్ట్రలోని మాంగ్లీ ప్రాంతంలో కోళ్లకు బర్డ్ఫ్లూ సోకడంతో ప్రజల్లో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయని ఆయన వివరించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. మాటల్లోనే.. -
కుటుంబాన్ని ప్రేమించాలి
ప్రేమించడమంటే అబ్బాయి, అమ్మాయి ప్రేమలు కా దు. మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు, ప్రయోజకులను చేసిన గురువులను స్ఫూర్తిగా తీసుకుని ప్రేమించడం కూడా మర్చిపోకూడదు. కుటుంబాన్ని ప్రేమించిన వారే గొప్ప. – రావికంటి వంశీ, విద్యార్థి లక్ష్యం నిర్దేశించుకోవాలి జీవితంలో ఉన్నతమై న లక్ష్యం నిర్దేశించకోవాలి. దాని సాధనకు నిరంతరం కృషి చే యాలి. లక్ష్యాన్ని ప్రేమిస్తూ ముందుకు సాగాలి. మన కాళ్లపై మనం నిలబడిన తర్వాత ఏ నిర్ణయం తీసుకున్నా భవిష్యత్ ఉజ్వలంగా ఉంటుంది. – సాముకుమార్, విద్యార్థి -
సెటిలయ్యాకే వివాహం
‘సాక్షి’ డిబేట్లో ట్రినిటి ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థులు ● ఏ పెళ్లికై నా అన్యోన్యతే ముఖ్యం ● ‘సాక్షి’ డిబేట్లో యువత మనోగతం సాక్షి, పెద్దపల్లి: కాలం మారుతోంది. దానికి అనుగుణంగా యువత ఆలోచనా ధోరణిలో మార్పు వస్తోంది. ప్రేమ, పెళ్లి కన్నా లైఫ్లో సెటిల్కావడమే అత్యంత ముఖ్యమంటున్నారు. శుక్రవారం వాలంటైన్స్ డే సందర్భంగా స్థానిక ట్రినిటి ఇంజినీరింగ్ కళాశాలలో ‘సాక్షి’ ఆధ్వర్యంలో ‘పెళ్లికి ముందు ప్రేమ.. పెళ్లి తర్వాత ప్రేమ’ అంశంపై డిబేట్ నిర్వహించారు. ఆకర్షణకు లోనుకావొద్దని, ప్రేమిస్తే పెద్దలను ఒప్పించి, వారి అంగీకారంతోనే పెళ్లి చేసుకుంటే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. మరికొందరు ఇలా అన్నారు.. -
ప్రజల హక్కుల కోసం పోరాటం
సాక్షి, పెద్దపల్లి: ప్రజల హక్కుల సాధన, ప్రజా స మస్యల పరిష్కారం కోసం తమ పార్టీ నిరంతర పో రాటాలు చేస్తోందని సీపీఐ జాతీయ కార్యవర్గ దర్శి సభ్యుడు చాడ వెంకటరెడ్డి అన్నారు. గురువారం జి ల్లాకేంద్రంలోని సీపీఐ జిల్లాస్థాయి సమావేశం కార్యదర్శి తాండ్రా సదానందం అధ్యక్షతన జరిగింది. ఆ యన మాట్లాడుతూ, కుల గణనలో పాల్గొనని వారి కి ప్రభుత్వం మరొక అవకాశం కల్పించడం న్యాయబద్ధమేనన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ అ భ్యర్థుల విజయానికి కృషిచేయాలని జిల్లా కార్యవర్గ సభ్యులకు సూచించారు. పొత్తుపై త్వరలోనే తమ విధివిధానాలను ప్రకటిస్తామని అన్నారు. సీపీఐ రా ష్ట్ర కార్యవర్గ సభ్యుడు కలవేన శంకర్ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలన్నారు. నాయకులు గోసిక మోహన్, గౌ తమ్ గోవర్ధన్, కడారి సునీల్, కనకరాజ్ ఉన్నారు. -
బీసీల సంక్షేమానికే రిజర్వేషన్లు
గోదావరిఖని: బీసీల సంక్షేమం కోసమే రాష్ట్రప్రభుత్వం 42శాతం రిజర్వేషన్లు అమలుచేసేందుకు నిర్ణయించిందని రామగుండం ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు ఎంఎస్ రాజ్ఠాకూర్ అన్నా రు. స్థానిక ప్రెస్క్లబ్లో గురువారం ఏర్పాటు చే సిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీలను హీనంగా చూసిన చరిత్ర బీఆ ర్ఎస్, బీజేపీకి ఉందని విమర్శించారు. అభివృద్ధి ప్రణాళికలో భాగంగానే కుల గణనను చేప ట్టామని, సర్వేలో మిగిలిన వారి వివరాలను చే పడతామని తెలిపారు. నియోజకవర్గ ప్రజలకు ఇసుక, బూడిద, మట్టిని ఉచితంగా అందించా లని నిర్ణయించామని తెలిపారు. మాజీ మే యర్ బంగి అనిల్కుమార్, నాయకులు మ హంకాళి స్వామి, కాల్వ లింగస్వామి, తిప్పార పు శ్రీనివాస్, పెద్దెల్లి ప్రకాశ్, బాలరాజ్, బొమ్మక రాజేశ్, బదావత్ శంకర్నాయక్, మారెల్లి రాజిరెడ్డి, గట్ల రమేశ్, ధర్మపురి, సదానందం, కొలిపాక సుజాత, దాసరి ఉమ, గుండేటి రాజేశ్, నాచగోని దశరథంగౌడ్ పాల్గొన్నారు. ‘కాంగ్రెస్కు ఓటమి భయం’ కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): స్థానిక ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే కాంగ్రెస్ ప్రభు త్వం పంచాయతీ ఎన్నికలు నిర్వహించడం లేదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కర్ర సంజీవరెడ్డి విమర్శించారు. జిల్లా అధ్యక్షుడుగా బాధ్యతలు స్వీకరించాక తొలిసారి గురువారం మండల కేంద్రానికి వచ్చిన ఆయనను బీజేపీ మండల అధ్యక్షుడు చిలువేరు సంపత్, మాజీ వైస్ ఎంపీ పీ చకినెపల్లి శంకరాచారి సన్మానించారు. అనంతరం సంజీవరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ, బీసీల్లో ముస్లింలను కలిపి చూపించిన ప్రభుత్వం.. క్రిస్టియన్ల జనాభాను వెల్లడించలేకపోయిందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులు అంజిరెడ్డి, మల్క కొమురయ్యను గెలిపించాలని కోరారు. నాయకులు ఈర్ల శంకర్, చల్లా చంద్రమౌళి, ఓర్పుల శీను, గరిడె కిషన్, దాసరి కృష్ణ, రాజేందర్ పాల్గొన్నారు. కుష్ఠుపై అవగాహన అవసరం ముత్తారం(మంథని): కుష్ఠు నివారణకు పాటించాల్సిన జాగ్రత్తలపై అవగాహన అవసరమని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి అన్న ప్రస న్న కుమారి సూచించారు. స్థానిక ప్రభుత్వ ఆ స్పత్రిలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. వ్యాధ్రిస్తులు సకాలంలో, సరైన వైద్యం తీసుకుంటే వ్యాధిని నిర్మూలించే అవకాశం ఉందని తెలిపారు. లెప్ర సీ ప్రోగామ్ ఆఫీసర్ సుధాకర్రెడ్డి, వైద్యులు శ్రీరాములు, కిరణ్కుమార్, అమరేందర్రావు, డీపీవోఎంలు సువార్త, రమేశ్ పాల్గొన్నారు. రుణ వాయిదాలు చెల్లించాలి సుల్తానాబాద్(పెద్దపల్లి): బ్యాంకు నుంచి తీసుకున్న రుణాలను సద్వినియోగం చేసుకుంటూ, వాయిదాలు సకాలంలో, సక్రమంగా చెల్లించా లని మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ నియా జ్ సూచించారు. మున్సిపల్ కార్యాలయంలో గురువారం మెప్మా సిబ్బందితో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. మార్చి 31వ తేదీలోగా రుణ వాయిదా బకాయిలు చెల్లించేలా రిసోర్స్ పర్సన్లు కృషి చేయాలని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ప్రతినిధులు స్వరూప తదితరులు పాల్గొన్నారు. గోదావరి నదిలో వ్యర్థాలు రామగుండం: గోదావరిఖని నగరంలోని పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థాలతో గోదావరి న ది కలుషితమవుతోంది. నీళ్లపై నురగ తేలుతోంది. పిచ్చిమొక్కలు, పూజాసామగ్రి, దహన సంస్కారాలకు వినియోగించే వ్యవర్థాలు, దేవతామూర్తుల చిత్రపటాలు గోదావరిలోనే వదిలే స్తున్నారు. పండుగలు, సమ్మక్క, సారలమ్మను దర్శించుకునే ముందు భక్తులు గోదావరి స్నా నాలు ఆచరించడం ఆనవాయితీ. అయితే, నది లో కలుషితనీరు ఉండడంతో గత్యంతరం లేక అందులోనే స్నానాలు ఆచరిస్తున్నారు. -
కష్టపడేవారికి గుర్తింపు
గోదావరిఖని: సంస్థ అభివృద్ధి కోసం కష్టించి పని చేసే ఉద్యోగులకు గుర్తింపు ఉంటుందని సింగరేణి చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్(సీఎండీ) బలరాం అన్నా రు. ఆర్జీ–2 ఏరియా ఓసీపీ–3లో డైరెక్టర్లు ఎల్వీ సూర్యనారాయణ, వెంకటేశ్వర్లుతో కలిసి గురువా రం ఆయన మాట్లాడారు. ఉద్యోగులు తమ కేటాయించిన విధులను బాధ్యతగా నిర్వహించాలన్నా రు. భారీ యంత్రాల వినియోగాన్ని మరింత పెంచా లని, రక్షణతో కూడిన మెరుగైన ఉత్పత్తి లక్ష్యం సా ధించాలని సూచించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించిన 72 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధనలో అందరూ పాలుపంచుకోవాలని ఆయన కోరారు. అధికారులు గుప్తా, భైధ్యా, ప్రతినిధులు రాజ్కుమార్, మధుసూదన్, రవీందర్, నరసింహారావ్, సంతోష్కుమార్, ఎర్రన్న, ధనుంజయ, రాజాజీ, అనిల్కుమార్, రాముడు పాల్గొన్నారు. సీఎండీకి సన్మానం సీఎండీ బలరాంతోపాటు డైరెక్టర్లు ఎల్వీ సూర్యనారాయణ, వెంకటేశ్వర్లును ఏఐటీయూసీ నాయకులు శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో నాయకులు ఎల్.ప్రకాశ్, రాజరత్నం, జిగురు రవీందర్, అన్నారావు శ్యాంసన్ తదితరులు ఉన్నారు. కార్మిక కాలనీలకు మంచినీరు ఇవ్వండి కార్మిక కాలనీలకు రోజూ మంచినీరు అందించాలని ఐఎన్టీయూసీ ఆర్జీ–2 ఉపాధ్యక్షుడు బదావత్ శంకర్నాయక్ సీఎండీకి వినతిపత్రం అందజేశారు. ఇన్సెంటివ్ అందించాలి బొగ్గు ఉత్పత్తిలో కీలకపాత్ర వహిస్తున్న ఓసీపీ–1 కార్మికులకు ప్రత్యేక ఇన్సెంటివ్ చెల్లించాలని ఐఎన్టీయూసీ నాయకులు సీఎండీకి విన్నవించారు. సీఎండీని కలిసిన కాంగ్రెస్ నాయకులు యైటింక్లయిన్కాలనీ(రామగుండం): సీఎండీ బలరాంను కాంగ్రెస్ నాయకులు మారెల్లి రాజిరెడ్డి, గుండేటి రాజేశ్, సత్యనారాయణరెడ్డి, శ్రీనివాస్, సారయ్య నాయక్, ఆకుల రాజిరెడ్డి తదితరులు మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. ఏపీఏలో సీఎండీ పర్యటన రామగిరి(మంథని): సీఎండీ బలరాం అడ్రియాల లాంగ్వాల్ ప్రాజెక్టులో పర్యటించారు. లాంగ్వాల్ పనితీరు, 3వ సీమ్ పంచ్ ఎంట్రీ పనులపై ఆరా తీ శారు. పనిస్థలాల్లో భద్రతాపరంగా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు సూచనలు చేశారు. అధికారులు సూర్యనారాయణ, వెంకటేశ్వర్లు ఉన్నారు.● సింగరేణి సీఎండీ బలరాం -
మొండి బకాయిదారులపై చట్టపరమైన చర్యలు
కరీంనగర్ కార్పొరేషన్: నగరపాలకసంస్థకు పన్నులు చెల్లించని మొండి బకాయిదారులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని కమిషనర్ చాహత్ బాజ్పేయి హెచ్చరించారు. గురువారం నగరపాలకసంస్థ కార్యాలయంలో పన్నుల వసూళ్లపై ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అధికారులు ప్రభుత్వ,ప్రైవేట్ సంస్థలకు సంబంధించిన పన్నుల వసూళ్లపైనా దృష్టి పెట్టాలన్నారు. కొద్ది సంవత్సరాలుగా ఆస్తి పన్నులు చెల్లించని మొండి బకాయిదారులకు నోటీసులు జారీ చేయాలని ఆర్ఐలను ఆదేశించారు. ఇటీవల డ్రాలో షెట్టర్లు పొంది, ఒప్పందం చేసుకోని వ్యాపారులకు నోటీసులు ఇవ్వాలన్నారు. -
‘చనిపోతా’నంటూనే..
కాలువలో దూకి వృద్ధురాలి ఆత్మహత్య ఎలిగేడు(పెద్దపల్లి): సుల్తాన్పూర్ గ్రామానికి చెందిన పొన్నం కనకమ్మ(78) గురువారం ఎస్సారెస్పీ కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై సదన్ కుమార్ తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం.. కొంతకాలం క్రితం మతిస్థిమితం కోల్పోయిన కనకయ్య.. తాను చనిపోతా అంటూ గ్రామస్తులకు చెబుతూ వస్తోంది. ఈ క్రమంలోనే కాలువ వెంట తిరుగుతూ అందులో దూకింది. అటుగా వెళ్తున్న ఉపాధ్యాయుడు, అదే గ్రామానికి చెందిన కొండ తిరుపతిగౌడ్ ఆమెను కాపాడి ఇంటికి తీసుకెళ్లారు. ఆ తర్వాత కాసేపటికే వృద్ధురాలు చనిపోయింది. మృతురాలి కుమారుడు పొన్నం మల్లయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై వివరించారు. మృతురాలి భర్త కొమురయ్య గతంలోనే చనిపోయాడు. వారికి ఒక కొడుకు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. వృద్ధురాలి ఆత్మహత్య కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): పెద్దరాతుపల్లి గ్రామానికి చెందిన బొజ్జం రాజమ్మ(75) వృద్ధాప్యం బాధ భరించలేక పురుగులమందు తాగి ఆత్మహ్యత్య చేసుకుందని పోలీసులు తెలిపారు. బుధవారం ఇంట్లో ఎవరూలేని సమయంలో పురుగుల మందుతాగింది. ఆ తర్వాత కరీంనగర్ ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పోలీసులు కేసునమోదు చేసుకున్నారు. పశువుల పాక దగ్ధం ● పాడి గేదె సజీవ దహనం జగిత్యాలరూరల్: జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్ గ్రామంలో గురువారం ఉదయం ప్రమాదవశాత్తు నిప్పంటుకుని ఓ పశువుల పాక దగ్ధం కావడంతో పాటు, అందులో ఉన్న పాడి గేదె సజీవ దహనమైంది. వివరాలిలా ఉన్నాయి. జాబితాపూర్లోని అదె మోహన్కుచెందిన పశువుల పాకలో గురువారం ఉదయం ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయి. స్థానికులు గమనించి అందులోని పశువులను వదిలిపెట్టగా ఒక పాడిగేడె సజీవ దహనమైంది. పక్కనే ఉన్న రాజిరెడ్డి, మత్తయ్య, రాజేందర్లకు చెందిన సుమారు రూ.లక్ష విలువైన పశుగ్రాసం కూడా దగ్ధమైంది. విషయం తెలుసుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది అక్కడకు చేరుకొని మంట లు ఆర్పేసి పెను ప్రమాదాన్ని నివారించారు. అడవికి నిప్పువీర్నపల్లి: కంచర్ల అల్మాస్పూర్ గ్రామాల మధ్య గుర్తు తెలియని వ్యక్తులు అడవికి నిప్పటించారు. స్థానికులు గమనించి వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా అల్మాస్పూర్ సెక్షన్ ఆఫీ సర్ పద్మలత, ఎఫ్బీవో సతీశ్తో కలిసి మంటలు ఆర్పివేశారు. ఈ సందర్భంగా కంచర్ల గ్రామస్తులు మాట్లాడుతూ.. వారం క్రితం గ్రామంలోని కోతులను గ్రామస్తులంతా అడవిలోకి కోతులను తరిమా రు. ఇప్పుడు అడవికి నిప్పంటుకోవడంతో మళ్లీ కోతులు గ్రామంలోకి వచ్చి హంగామా చేస్తాయని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి అడవికి నిప్పుపెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. -
కోరుట్ల బస్టాండ్లో చోరీ
కోరుట్ల: కోరుట్ల ఆర్టీసి బస్టాండ్లో గురువారం వెలిచాల రుచిత బ్యాగులోని పర్సును గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారు. బాదితురాలి కథనం ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన రుచిత మూడు రోజుల క్రితం కథలాపూర్ మండలం తాండ్రియాల గ్రామామైన తన తల్లి గారింటికి వెళ్లి తిరుగు ప్రయాణంలో ఆదిలాబాద్ వెళ్లేందుకు కోరుట్ల బస్లాండ్లో దిగింది. మళ్లీ వెరే బస్సు ఎక్కి తన బ్యాగును చూడగా బ్యాగులో ఉన్న పర్సు కనిపించలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. బస్సు ఎక్కే క్రమంలో రద్దీ ఉండటంతో తన బ్యాగులో ఉన్న పర్సును ఎవరో దొంగిలించారని, అందులో నాలుగు తులాల బంగారం, రూ.700 ఉన్నట్లు తెలిపింది. బస్టాండ్లోని సీసీ కెమెరా ఫుటేజ్లను సీఐ సురేశ్బాబు, ఎస్సై శ్రీకాంత్లు పరిశీలించగా ఇద్దరు మహిళలు దొంగతనానికి పాల్పడినట్లు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ● నాలుగు తులాల బంగారం, నగదు అపహరణ -
హత్యకేసులో ఇద్దరికి జీవిత ఖైదు
కరీంనగర్క్రైం: వ్యవసాయ భూమి హద్దుల విషయ ంలో చెలరేగిన వివాదంలో ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసిన తండ్రి,కొడుకులు బోనగిరి ఓదేలు(60), బోనగిరి జంపయ్య(32)కు జీవితఖైదుతో పా టు రూ.2,500 చొప్పున జరిమానా విధిస్తూ కరీంనగర్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.ప్రతిమ గురువారం తీర్పునిచ్చారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకా రం.. శంకరపట్నం మండలం మెట్పల్లి గ్రామానికి చెందిన రాచమల్ల రామలింగు, రాచమల్ల సంపత్ తండ్రీకొడుకులు. ఈరికి గ్రామశివారులో ఐదెకరాలకు పైగా వ్యవసాయ భూమి ఉంది. వీరి భూ మి పక్కనే శంకరపట్నం మండలం కేశవపట్నానికి చెందిన బోనగిరి జంపయ్య, ఓదేలు వ్యవసాయ భూమి ఉంది. వీరి ఇరువురి మధ్య హద్దుల విషయ ంలో గొడవలు జరుగుతున్నాయి. 2020 డిసెంబర్ 10న ఉదయం 11గంటల ప్రాంతంలో రాచమల్ల సంపత్(40) తన వ్యవసాయ భూమి వద్ద ఒంటరి గా ఉండగా జంపయ్య, ఓదేలు గొడ్డలి, రాడ్డు, కర్రలతో దాడి చేయగా.. సంపత్ అక్కడికక్కడే చనిపోయాడు. మృతుడి భార్య రజిత ఇచ్చిన ఫిర్యాదుతో శంకరపట్నం పోలీసులు జంపయ్య, ఓదేలుపై కే సు నమోదు చేశారు. అప్పటి సీఐ ఈ.కిరణ్ దర్యా ప్తు చేశారు. ఈ కేసులో సాక్ష్యులను అడిషనల్ పబ్లి క్ ప్రాసిక్యూటర్ జూలూరు శ్రీరాములు విచారించా రు. సాక్ష్యాధారాలు పరిశీలించిన జడ్జి ప్రతిమ నేరస్తులకు జీవితఖైదు, జరిమానా విధించారు. -
ప్రేమనగర్.. మరిమడ్ల
కోనరావుపేట(వేములవాడ)/ఇల్లంతకుంట: ప్రేమ పెళ్లిళ్లకు నిలయంగా నిలుస్తోంది కోనరావుపేట మండలం మరిమడ్ల. ఈ గ్రామంలో 30కి పైగా జంటలు కులాంతర వివాహాలు చేసుకున్నాయి. ఊరి జనాభా నాలుగు వేలు ఉండగా.. దశాబ్దకాలంగా పదుల సంఖ్యలో జంటలు ఒక్కటయ్యాయి. కట్నాలు లేకుండా ఆదర్శ పెళ్లిళ్లు సైతం చేసుకున్నారు. ప్రభుత్వం జరిపించే కల్యాణమస్తు సామూహిక వివాహ వేదికలో నిజామాబాద్ జిల్లాకు చెందిన రవికుమార్తో ముంబయికి చెందిన రజిత వివాహాన్ని మరిమడ్లవాసులు దగ్గరుండి జరిపించారు. జింక నరేందర్ అనే యువకుడు ముంబయికి చెందిన మరో సామాజికవర్గానికి చెందిన అమ్మాయిని ప్రేమించాడు. అమ్మాయిని మరిమడ్లకు తీసుకొచ్చి పెళ్లి చేసుకున్నాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని వెల్జిపూర్లో 1,620 జనాభా ఉంటుంది. గ్రామంలో 17 మంది యువతీయువకులు ప్రేమపెళ్లిళ్లు చేసుకున్నారు. -
గ్రామాల వారీగా క్యాన్సర్ రోగుల వివరాలు
లింగన్నపేట 67 ఎల్లారెడ్డిపేటల 10 పోతుగల్ 04 ఇల్లంతకుంట 13 కోనరావుపేట 20 తంగళ్లపల్లి 01 నేరెళ్ల 03 చీర్లవంచ 03 హన్మాజీపేట 15 చందుర్తి 03 బోయినపల్లి 01 కొదురుపాక 07 పీఎస్ నగర్ 05 ఏబీ నగర్ 02నోట్ : ఇవి అధికారిక లెక్కలు మాత్రమే. అనధికారికంగా ఇంతకు ఏడు రెట్లకు పైగా క్యాన్సర్ రోగులు ఉన్నారు. -
నిర్దేశిత బొగ్గు ఉత్పత్తి లక్ష్యం సాధించాల్సిందే..
గోదావరిఖని: రక్షణతో కూడిన వార్షిక బొగ్గు ఉత్పత్తి సాధించాల్సిందేనని సింగరేణి చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్(సీఎండీ) బలరాం సూచించారు. డైరెక్టర్లు ఎల్వీ సూర్యనారాయణ, కె.వెంకటేశ్వర్లుతో పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని ఆర్జీ–1 ఏరియా జీడీకే–5 ఓసీపీ, జీడీకే–11గనిని గురువారం సీఎండీ సందర్శించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో నిర్దేశిత బొగ్గు ఉత్పత్తి సాధించేందుకు అనుసరించాల్సిన ప్రణాళికపై కార్మికులతో ముఖాముఖి నిర్వహించారు. ఉద్యోగులు ఎనిమిది గంటలపాటు విధులు నిర్వహించాలన్నారు. భారీ యంత్రాల వినియోగ సమయాన్ని పెంచాలని అన్నారు. కాలం చెల్లించిన యంత్రాల స్థానంలో కొత్తవాటిని కొనుగోలు చేయాలని ఆదేశించారు. ఈ ఆర్థిక సంవత్సరం నిర్దేశించిన 72 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించడంలో ప్రతీఒక్కరు పట్టుదలతో ముందుకు సాగాలని ఆయన సూచించారు. గైర్హాజర్ లేకుండా నిర్దేశిత ఉత్పత్తి లక్ష్య సాధనలో పాలుపంచుకోవాలని పేర్కొన్నారు. ఈసందర్భంగా సూపర్వైజర్లు, మైనింగ్ సిబ్బంది, కోల్కట్టర్, సపోర్ట్మెన్తోపాటు కంటిన్యూస్ మైనర్ ఆపరేటర్లు తదితరుల సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జనరల్ సెక్రటరీ కొరిమి రాజ్కుమార్, ఆర్జీ–1 జీఎం లలిత్కుమార్, సేఫ్టీ జీఎం గుపాత, క్వాలిటీ జీఎం భైద్యా, ఏజెంట్ శ్రీనివాస్, ప్రాజెక్టు ఆఫీసర్ చంద్రశేఖర్, ఏసీఎంవో కిరణ్ రాజ్కుమార్, డీజీఎం(పర్సనల్) కిరణ్ బాబు తదితరులు పాల్గొన్నారు. లాభాలు సాధిస్తేనే మనుగడ సింగరేణి సీఎండీ బలరాం -
పెద్దలను ఒప్పించి..
కోల్సిటీ(రామగుండం): గోదావరిఖనికి చెందిన గొడిశల శారద– నరేశ్ పెద్దలను ఒప్పించి ప్రేమ వివాహం చేసుకున్నారు. శారదను ఉన్నత విద్యనభ్యసిస్తున్న సమయంలో నరేశ్ ప్రేమించాడు. తొలత వీరిప్రేమను ఇరుకుటుంబాలు వ్యతిరేకించాయి. వారి కుటుంబాలను ఈ ప్రేమికులు ఒప్పించి 2013లో ప్రేమ వివాహం చేసుకున్నారు. నరేశ్ ఎంబీఏ చదవగా, శారద డిగ్రీ పూర్తి చేసింది. వీరి ప్రేమకు గుర్తుగా మొదటిసారి కూతురు అక్షితరాయ్ జన్మించగా, ఆ తర్వాత కుమారుడు అమోగ్, కూతురు ఆరూహ్య అనే ఇద్దరు కవలలు పుట్టారు. నరేశ్ విద్యార్థి ఉద్యమాలతోపాటు, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో సైతం విస్తృత స్థాయిలో పాల్గొన్నారు. 2016లో సింగరేణిలో ఉద్యోగం పొందిన నరేశ్, ప్రస్తుతం జీడీకే 11వ ఇంక్లయిన్ గనిలో పని చేస్తూనే, ఏఐటీయూసీ యూనియన్ అసిస్టెంట్ పిట్ సెక్రటరీగా వ్యవహరిస్తున్నాడు. -
రాచపుండు సలుపుతోంది..
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): రాచపుండు(క్యాన్సర్) ప్రాణాలను కబళిస్తోంది. వ్యాధి గురించి తెలుసుకునేలోపే ప్రాణాలు హరించుకుపోతున్నాయి. జిల్లాలో ఇటీవల క్యాన్సర్ రోగుల సంఖ్య భారీగా పెరిగిపోవడం ఆందోళనకు గురిచేస్తుంది. అసలు క్యాన్సర్కు కారణాలు తెలియక ప్రజలు భయపడుతున్నారు. ప్రధానంగా ఈ వ్యాధి మహిళలో ఎక్కువ వస్తోంది. రాజన్నసిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా అధికారుల లెక్కల ప్రకారం 160 మంది రోగులు ఉంటే.. క్షేత్రస్థాయిలో వాస్తవంగా బాధితులు వెయ్యికి పైగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ 160 మంది రోగుల్లో 120 మందికి ప్రభుత్వం ఆధ్వర్యంలోనే వైద్యం అందుతోంది. మిగతా వారు ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. జిల్లాలో విస్తరిస్తున్న క్యాన్సర్ వ్యాధిపై ‘సాక్షి’ ఫోకస్. నారాయణపూర్, లింగన్నపేటల్లోనే అత్యధికం జిల్లా వ్యాప్తంగా అధికారుల లెక్కల ప్రకారం 160 మంది రోగులు ఉంటే నారాయణపూర్ గ్రామంలో 10కి పైగా, లింగన్నపేటల్లో 67 మందికి పైగా బాధితులు ఉన్నారు. అయితే ఈ సంఖ్య వాస్తవంగా మూడింతలకు పైగానే బాధితులు ఉన్నట్లు గ్రామస్తుల ద్వారా తెలిసింది. ఇటీవల ఆయా గ్రామాల్లో వరుస మరణాలు సంభవించడం భయాందోళనకు గురిచేస్తుంది. కారణాలు తెలియక అయోమయం క్యాన్సర్ వ్యాధి రావడానికి గల కారణాలు తెలియక ప్రజలు అయోమయానికి గురవుతున్నారు. అత్యధిక కేసులు గల గ్రామాలలో కనీసం ఫాస్డ్ఫుడ్ సెంటర్లు కూడా లేవు. ఇప్పటి వరకు క్యాన్సర్లతో మరణించిన వారు సైతం దురలవాట్లు లేని వారే. అయినా మరణిస్తుండడంతో ఆయా గ్రామాల్లో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఇప్పటికై నా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు జిల్లాలో ఎక్కువగా క్యాన్సర్తో ఇబ్బంది పడుతున్న గ్రామాల్లో పర్యటిస్తే కారణాలు తెలియవచ్చనే భావన గ్రామస్తుల్లో వ్యక్తమవుతుంది. ఎక్కువగా ఇవే.. ● మహిళల్లో ఎక్కువగా బ్రెస్డ్, సర్వైకల్ క్యాన్సర్లు సోకుతున్నాయి. ఈ రెండు రకాల క్యాన్సర్లతో జిల్లాలో 87 మంది బాధపడుతున్నారు. ● నోటిక్యాన్సర్తో 26 మంది ఇబ్బంది పడుతున్నారు. ● ఇతర క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న వారు 47 మంది ఉన్నారు. గుర్తిస్తే కాపాడవచ్చు ఎలాంటి క్యాన్సర్లను అయినా మొదటి స్టేజీలో గుర్తిస్తే ప్రాణాలు కాపాడవచ్చని వైద్యులు తెలుపుతున్నారు. మన శరీరంలో కొత్తగా మార్పులు వస్తున్నాయంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. మహిళల్లో ఎక్కువగా వచ్చే బ్రెస్ట్ క్యాన్సర్లను వారే సులభంగా గుర్తించవచ్చంటున్నారు. బ్రెస్ట్లో చిన్న సైజులో గడ్డలు కొత్తగా ఏర్పడితే వెంటనే వైద్యపరీక్షలు చేయించుకోవాలంటున్నారు. అదే సమయంలో ఎక్కువగా దగ్గు రావడం, రక్తం వాంతులు కావడం, తరచూ రక్తహీనతతో బాధపడుతుంటే క్యాన్సర్లకు దారి తీయవచ్చని వైద్యులు పేర్కొంటున్నారు. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. కబళిస్తున్న క్యాన్సర్ గుర్తించేలోపు మృత్యువాత లింగన్నపేట, నారాయణపూర్లలో అత్యధిక మరణాలు అధికారికంగా జిల్లాలో 160 మంది బాధితులు అనధికారికంగా వెయ్యికి పైగా కేసులు అవగాహనతోనే నివారించవచ్చంటున్న వైద్యులు ఇది గంభీరావుపేట మండలం లింగన్నపేట గ్రామం. ఈ ఊరిలో జిల్లా వైద్యశాఖ అధికారుల లెక్కల ప్రకారం క్యాన్సర్ రోగులు 67 మంది వరకు ఉన్నారు. అసలు క్యాన్సర్ వ్యాధి ఎందుకొస్తుందో తెలియక గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. అధికారుల లెక్కల ప్రకారం జిల్లా వ్యాప్తంగా 160 క్యాన్సర్ కేసులుంటే ఒక్క ఈ గ్రామంలోనే 67 మంది బాధితులు ఉన్నారు. వ్యాధి గురించి తెలుసుకొని, వైద్యులకు చూయించుకునేలోపే తీవ్రమై ప్రాణాలు పోతున్నాయి. వైద్యులకు అన్ని చెప్పుకోవాలి ఎలాంటి ఆరోగ్య ఇబ్బందులు ఉన్నా వైద్యులకు అన్ని చెప్పుకుంటేనే సమస్య పరిష్కారమవుతుంది. ఫస్ట్ స్టేజీలో ఉంటే వందశాతం బతికించవచ్చు. రెండో స్టేజీలో ఉన్నప్పుడు గుర్తిస్తే చికిత్సతో 80 శాతం వరకు వ్యాధిని నయం చేసే అవకాశాలు ఉన్నాయి. మూడు, నాలుగు స్టేజీలలో ఆరోగ్య పరిస్థితి క్లిష్టంగా ఉంటుంది. ప్రధానంగా జంక్ఫుడ్కు దూరంగా ఉండాలి. మాడిపోయిన, పాసిపోయిన ఆహారపదార్థాలు అసలే తీసుకోవద్దు. శరీరంలో కొత్తగా ఏదైనా గడ్డలు ఏర్పడితే వెంటనే వైద్యులను సంప్రదించాలి. మహిళల్లో ఎక్కువగా బ్రె స్ట్, పురుషుల్లో లివర్ క్యాన్సర్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. – డాక్టర్ రామకృష్ణ, క్యాన్సర్ జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ -
ముదిరాజ్ల అభివృద్ధికి కృషి
● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ముదిరాజ్ల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లతిమ్మాపూర్లో ముదిరాజ్ సంఘం నూతన భవనాన్ని గురువారం ప్రారంభించి, మాట్లాడారు. బీసీ కులాల అభివృద్ధి కోసం 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెడతామన్నారు. ఇప్పటివరకు కులగణన సర్వేలో పాల్గొనని వారు ఈ నెల 16 నుంచి 28 వరకు చేపట్టే సర్వేలో పాల్గొనాలని సూచించారు. పంటలను కాపాడుతాం ఎగువ మానేరుకు మల్కపేట రిజర్వాయర్ నుంచి నీటిని వదిలి, ఆయకట్టు పంటలను కాపాడుతామని ప్రభుత్వ శ్రీనివాస్ హామీ ఇచ్చారు. నాగంపేటలో రూ.8 కోట్లతో పంపుసెట్లను అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. కాల్వల్లో మట్టి తొలగింపు పనులు ముమ్మరంగా సాగుతున్నాయని పేర్కొన్నారు. ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షుడు చొక్కాల రాము, జిల్లా గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్, ఏఎంసీ చైర్మన్ సాబేర బేగం, మత్స్యకారుల సంఘం జిల్లా అధ్యక్షుడు చొప్పరి రామచంద్రం, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య, పార్టీ మండల అధ్యక్షుడు సద్ది లక్ష్మారెడ్డి, నాయకులు పాల్గొన్నారు. -
ఏమిటంటే!
ప్రేమంటే..పెద్దల అంగీకారంతో... ఇల్లందకుంట: కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం సిరిసేడు గ్రామానికి చెందిన జవ్వాజి అనిల్– కల్యాణి దంపతులు. వీరు జమ్మికుంట ప్రభుత్వ ఆదర్శ డిగ్రీ కళాశాలలో చదువుతున్న కాలంలో 2012లో ఇరువురు ప్రేమలో పడ్డారు. పెద్దలను ఒప్పంచి 2018లో వివాహం చేసుకున్నారు. అనిల్ వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ‘మా వైవాహిక జీవితం అన్యోన్యంగా సాగుతోంది. ప్రేమపెళ్లి అందంగా ఉంటుంది. ఒకరికి ఒకరు తెలిసిన తర్వాత వివాహం చేసుకుంటే ఆ బంధం బలంగా ఉంటుంది. ఏమైనా సమస్యలు తలెత్తినా అర్థంచేసుకుని సర్దుకుంటాం. ప్రేమించిన వారిని పెళ్లి చేసుకుంటే జీవితం సంతోషంగా ఉంటుంది’ అని అనిల్ చెప్పుకొచ్చాడు. -
ఇష్టపడ్డాం.. కష్టపడ్డాం
కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం కనగర్తి గ్రామానికి చెందిన పర్లపల్లి శ్రీనివాస్, స్రవంతి దంపతులు వీరు. జమ్మికుంటలోని ప్రైవేటు జూనియర్ కళాశాలలో 2008లో ఇంటర్ చదివే రోజుల్లో ప్రేమలో పడ్డారు. ఐదేళ్ల తర్వాత స్నేహితుల సహకారంతో 2012లో ప్రేమపెళ్లి చేసుకొని ఒకటయ్యారు. కులాలు వేరు కావడంతో పెళ్లికి అమ్మాయి కుటుంబసభ్యులు ఒప్పుకోలేదు. ఇందుకోసం చాలా కష్టపడ్డారు. అయినా ఇద్దరూ అన్యోన్యంగా జీవిస్తున్నారు. శ్రీనివాస్ ప్రస్తుతం కారు నడుపుకుంటూ కుటంబాన్ని పోషిస్తున్నాడు. స్రవంతి గృహిణి. వీరికి ఒక కుమార్తె ఉంది. ‘మా జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఎదురైనా.. ప్రస్తుతం మా పాపతో ప్రయాణం గర్వంగా కొనసాగుతోంది’ అని శ్రీనివాస్ చెప్పుకొచ్చాడు. -
అనుమానాస్పదస్థితిలో యువకుడి మృతి
కథలాపూర్(వేములవాడ): కథలాపూర్ మండలం పోసానిపేట గ్రామశివారులో సాయికుమార్(26) అనే యువకుడు అనుమానాస్పదస్థితిలో మృతి చెందినట్లు ఎస్సై నవీన్కుమార్ తెలిపారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండల కేంద్రానికి చెందిన జక్కుల సాయికుమార్కు పోసానిపేటకు చెందిన మానసతో ఆరేళ్ల క్రితం వివాహమైందన్నారు. సాయికుమార్ ఐదు రోజుల క్రితం అత్తగారింటికి వచ్చి వెళ్లరని తెలిపారు. అప్పటి నుంచి కనిపించకపోవడంతో ఈనెల 12న కథలాపూర్ పోలీస్స్టేషన్లో అతడి కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారన్నారు. గురువారం ఉదయం పోసానిపేట గ్రామశివారులోని వ్యవసాయబావిలో సాయికుమార్ మృత దేహం కనిపించిందన్నారు. మృతుడి తండ్రి జక్కుల మల్లేశ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్ల ఎస్సై వివరించారు. కారు ఢీకొని గీత కార్మికుడి దుర్మరణం ఓదెల(పెద్దపల్లి): మడక గ్రామంలో గురువారం కారు ఢీకొని గీతకార్మికుడు మ్యాడగొని శంకర్య(52) మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. కల్లుగీసేందుకు తాటిచెట్టు ఎక్కిన శంకరయ్య.. తన బైక్పై ఇంటకి బయలు దేరాడు. ఈ క్రమంలో అజాగ్రత్తగా కారునడుపుకుంటూ వచ్చిన సాయిశ్వేతన్ వెనుక నుంచి శంకరయ్యను ఢీకొట్టాడు. తీవ్రగాయాలు కావడంతో స్థానికులు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే శంకరయ్య మృతిచెందాడు. మృతుడికి భార్య రాధ, కుమారుడు మ్యాడగొని శ్రీకాంత్గౌడ్, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొన్నారు. మతిస్థిమితంలేని వ్యక్తి మృతి కరీంనగర్రూరల్: కరీంనగర్ పరిధిలోని తీగలగుట్టపల్లి రైల్వేగేట్ సమీపంలో గత నెల 30న ఓ వ్యక్తి ఎడమ కాలికి తీవ్రగాయం కావడంతో స్థానికుల సమాచారంతో పోలీసులు చికిత్స కోసం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆ వ్యక్తి చికిత్స పొందుతూ బుధవారం అర్ధరాత్రి 12గంటలకు మృతిచెందాడు. అయితే మృతుడికి మతిస్థిమితం లేదని, పేరు అడిగితే రాజయ్య అని, ఊరు బోనగిరి అని చెప్పాడని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రిలో భద్రపరిచారు. కుటుంబసభ్యులు, బంధువులు మృతుడిని గుర్తించినట్లయితే కరీంనగర్రూరల్ పోలీసులను సంప్రదించాలని సీఐ ప్రదీప్కుమార్ సూచించారు. కుక్కల దాడిలో బాలుడికి తీవ్ర గాయాలుతంగళ్లపల్లి(సిరిసిల్ల): కుక్కల దాడిలో తంగళ్లపల్లి మండలం ఇందిరమ్మకాలనీకి చెందిన బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల వివరాల ప్రకారం.. ఓబులాపూర్కు చెందిన చెల్ల శ్రీవర్దన్ కుటుంబం గురువారం ఇందిరమ్మకాలనీలోని బంధువుల ఇంటికి వెళ్లింది. ఆ బాలుడు ఇంటి బయట ఆడుకుంటుండగా కుక్కలు దాడి చేశాయి. కుటుంబసభ్యులు వాటిని తరిమికొట్టి, తీవ్రంగా గాయపడిన శ్రీవర్దన్ను ఆస్పత్రికి తీసుకెళ్లారు. కుక్కల బెడద తీవ్రంగా ఉందని, అధికారులు దూరంగా తరలించాలని స్థానికులు కోరుతున్నారు. బైక్ దొంగల అరెస్టుకరీంనగర్రూరల్: కరీంనగర్ రైల్వేస్టేషన్లో బైక్ దొంగతనం చేసిన ఇద్దరు వ్యక్తులను గురువారం అరెస్టు చేసినట్లు కరీంనగర్రూరల్ పోలీస్స్టేషన్ సీఐ ప్రదీప్కుమార్ తెలిపారు. సీఐ వివరాల ప్రకారం ఈ నెల 4న సుభాశ్నగర్కు చెందిన తిరుపతి తన స్నేహితుడిని రైలు ఎక్కించేందుకు బైక్పై కరీంనగర్ రైల్వేస్టేషన్కు వెళ్లాడు. బైక్ను పార్కింగ్ చేసి రైలు ఎక్కించి తిరిగి వచ్చి చూసేసరికి బైక్ కన్పించకపోవడంతో పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. గురువారం ఉదయం 8గంటలకు అపోలోరీచ్ ఆస్పత్రి వద్ద పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టగా మెట్పల్లికి చెందిన షేక్మదర్, పవన్కుమార్లు దొంగిలించిన బైక్పై వస్తుండగా పట్టుకున్నారు. రైల్వేస్టేషన్లో మరోబైక్ను దొంగిలించేందుకు వస్తున్న ఇద్దరిని అరెస్టు చేసినట్లు సీఐ ప్రదీప్కుమార్ తెలిపారు. కారు బోల్తామల్యాల(చొప్పదండి): మల్యాల మండలం రాంపూర్ గ్రామశివారులో గురువారం కారు బోల్తా పడిండి. రాంపూర్కు చెందిన బత్తుల రమేశ్తో పాటు మరో ముగ్గురు మహిళలు కాసారం వెళ్లి, రాంపూర్కు తిరిగి వస్తుండగా.. వడ్డెర కాలనీ సమీపంలో కారు అదుపు తప్పి బోల్తా పడింది. కారు దెబ్బతినగా, అదృష్టవశాత్తు ఎవరికీ గాయాలు కాలేదు. యువకుడిపై దాడి.. నలుగురిపై కేసుఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): కల్లు చోరీకి వచ్చాడన్న అనుమానంతో ఓ యువకుడి పై స్థానిక గౌడ కులస్తులు దాడి చేసిన ఘటన ఎల్లారెడ్డిపేట మండలం సింగా రంలో చోటుచేసుకుంది. ఎస్సై రమాకాంత్ వివరాల ప్రకారం.. సింగారానికి చెందిన వాసరి భరత్కుమార్(26)కు పుట్టుకతోనే కంటిచూపు సరిగా కనిపించదు. ఈ నెల 8న రాత్రి 11.30 గంటలకు కల్లు డిపో వద్ద ఉండగా.. గౌడ కులస్తులు ముస్లిం కిష్టయ్య, గుడిసె నాగరాజు, జాగిరి సంతోష్, గనగోని శ్రీనివాస్ కల్లు దొంగతనానికి వచ్చాడేమోనన్న అనుమానంతో అతన్ని తాడుతో కట్టేసి, కర్రలతో తీవ్రంగా కొట్టారు. బాధితుడి తల్లి లత ఫిర్యాదు మేరకు ఆ నలుగురిపై కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
ముంచుకొస్తున్న గడువు
● జిల్లాలో ఆస్తిపన్ను వసూలు పూర్ ● నిర్లక్ష్యం వీడని బల్దియా అధికారులు ● వెనుకబడిన మున్సిపాలిటీలు ● మంథని రాష్ట్రంలోనే 16వ స్థానం ● రామగుండం బల్దియా 38వ స్థానం ● బకాయిదారులకు రెడ్ నోటీసులు ● రెవెన్యూ రికవరీ యాక్ట్తో గుబులుకోల్సిటీ(రామగుండం): జిల్లాలోని మున్సిపల్ ఉద్యోగులు, సిబ్బంది వేతనాలతోపాటు ఇతర అభివృద్ధి పనుల నిర్వహణకు ఆస్తిపన్ను(ప్రాపర్టీ ట్యాక్స్) ప్రధాన ఆదాయవనరు. ఈ ఆర్థిక సంవత్సరం చివరి దశకు వస్తున్నా ఇప్పటికీ అధికారులు ఉదాసీనత వీడడం లేదు. జిల్లాలోని రామగుండం నగరపాలక సంస్థతోపాటు పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథని మున్సిపాలిటీల్లో ఆశించినస్థాయిలో ఆస్తిపన్ను వసూలు కావడంలేదు. కనీసం పూరోగతి కానరావడం లేదు. రామగుండం నగరపాలక సంస్థలో కేవలం 52.59 శాతం మాత్రమే ఆస్తిపన్ను నమోదు కావడం గమనార్హం. మంథని ముందు.. సుల్తానాబాద్ వెనుకంజ.. రాష్ట్రంలో మొత్తం 139 మున్సిపాలిటీలు ఉండగా ఈనెల 6వ తేదీ వరకు ఆస్తిపన్ను వసూలు చేసిన బల్దియా జాబితాలో జిల్లాలోని రామగుండం, పెద్దపల్లి, సుల్తానాబాద్ మున్సిపాలిటీల్లో ఆశించిన పు రోగతి కానరావడంలేదు. మంథని ఆస్తిపన్ను వసూ ళ్లలో రాష్ట్రంలో 16వ స్థానంలో నిలవగా రామగుండం 38వ స్థానం, పెద్దపల్లి 24వ స్థానం, సుల్తానాబాద్ 111వ స్థానంలో నిలిచి వెనుకపడిపోయాయి. కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంట మున్సిపాలిటీ 77. 14 శాతంతో రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచింది. రామగుండం నగరంలో 52.59 శాతమే.. రామగుండం నగరపాలక సంస్థలో మొత్తం 50,956 ప్రైవేట్, 16,262 ప్రభుత్వ అసెస్మెంట్స్ ఉన్నాయి. ప్రైవేట్ అసెస్మెంట్స్ నుంచి ప్రాపర్టీ ట్యాక్స్ డిమాండ్ రూ.16.16కోట్ల వరకు ఉండగా, ఈనెల 10వ తేదీ వరకు రూ.8.50కోట్ల వరకు వసూలయ్యాయి. దీంతో 52.59 శాతమే వసూలు నమోదైంది. ప్రభుత్వ అసెస్మెంట్స్ నుంచి ప్రాపర్టీ ట్యాక్స్ రూ.5.21కోట్లు ఉండగా, రూ.4.77 కోట్లు వసూలై.. 91.47 శాతం నమోదైంది. బకాయిదారులకు రెడ్ నోటీసులు.. 2024–25 ఆర్థిక సంవత్సరం గడువు సమీపిస్తుండడంతో మొండి బకాయిదారుల నుంచి ఆస్తిపన్ను వసూలు చేయడంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఈక్రమంలో ఇప్పటికే చాలామందికి రెడ్ నోటీసులు జారీచేశారు. రెవెన్యూ రికవరీ యాక్ట్ గుబులు.. రామగుండం నగరంలో తొలిసారి కలెక్టర్ శ్రీహర్ష ఆదేశాలతో కొద్దిరోజులుగా రెవెన్యూ రివకరీ యాక్ట్ అమలు చేస్తున్నారు. దీనిద్వారా బకాయిదారుల్లో గుబులు పుడుతోంది. ఇటీవల 10 మంది మొండి బకాయిదారులకు తహసీల్దార్ ఆధ్వర్యంలో రెవెన్యూ రివకరీ యాక్ట్ నోటీసులు జారీ చేశారు. బకాయిలు చెల్లించకుంటే ఆస్తి జప్తు చేసి వేలం పాట నిర్వహిస్తామని పేర్కొన్నారు. దీంతో చాలామందిలో స్పందన వచ్చింది. కొందరు బకాయిలు చెల్లించడానికి ముందకు రాగా, మరికొందరు కోర్టును ఆశ్రయించారు. ఈనెల 6 వరకు వసూలైన ఆస్తిపన్ను నిర్దేశిత లక్ష్యం సాధిస్తాం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్తోపాటు పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథని మున్సిపాలిటీల్లో నిర్దేశిత ఆస్తిపన్ను లక్ష్య సాధనకు రోజూ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నాం. మొండి బకాయిదారుల పేర్లను బహిర్గతం చేస్తాం. రెవెన్యూ రికవరీ యాక్ట్ ద్వారా ఏళ్లుగా ఆస్తిపన్ను చెల్లించని వారి ఆస్తులను జప్తు చేస్తాం. – అరుణశ్రీ, బల్దియా కమిషనర్ (ఎఫ్ఏసీ), రామగుండం బల్దియా వార్డులు అసెస్మెంట్స్ డిమాండ్ వసూలు శాతం (రూ.కోట్లలో) (రూ.కోట్లలో)రామగుండం 50 50,956 16.1 8.50 52.59 పెద్దపల్లి 36 12,058 5.42 3.06 54.46 సుల్తానాబాద్ 15 5,425 2.78 0.94 33.80 మంథని 13 5,089 1.74 1.04 59.77 -
మహిళాభివృద్ధికి కృషి
జ్యోతినగర్(రామగుండం): ఎన్టీపీసీ దీప్తి మహిళా సమితి మహిళాభివృద్ధికి కృషి చేస్తోందని ఆ సంస్థ అధ్యక్షురాలు రాఖీ సామంత అన్నారు. ఎన్టీపీసీ పర్మినెంట్ టౌన్షిప్లోని దీప్తి మహిళా సమితి భవనంలో ఆనంద మేళా సందర్భంగా నిర్వహించిన లక్కీ డ్రా విజేతలకు బుధవారం అతిథులు బహుమతులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సామంత మాట్లాడారు. సామాజిక అభివృద్ధికి.. ప్రత్యేకంగా మహిళలు, శిశు సంక్షేమానికి మేళాతో ప్రత్యేక అనుబంధం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏజీఎం బిజయ్కుమార్ సిగ్దర్, ఎన్టీపీసీ రామగుండం ఉద్యోగ గుర్తింపు సంఘం ప్రధానకార్యదర్శి ఆరెపల్లి రాజేశ్వర్, సచ్దేవ స్కూల్ ఆఫ్ ఎక్స్లెన్స్ ప్రిన్సిపాల్ జ్ఞాన్చంద్తోపాటు మహిళా సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లు కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తిచేసినట్లు ఓదెల, కాల్వశ్రీరాంపూర్ మండలాల సెక్టోరల్ ఆఫీసర్ జగదీశ్వర్రావు తెలిపారు. బుధవారం ఆయన మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకునేందుకు వీలుగా కాల్వశ్రీరాంపూర్లో రెండు, ఓదెలలో రెండు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఆస్తిపన్ను వసూలుకు బల్దియాలో స్పెషల్ డ్రైవ్ కోల్సిటీ(రామగుండం): రామగుండం నగరంలో ఆస్తిపన్ను బకాయిల వసూలుకు డిప్యూటీ కమిషనర్ వెంకటస్వామి నేతృత్వంలో ఆర్వో ఆంజనేయులు, ఆర్ఐ శంకర్రావు ఆధ్వర్యంలో బుధవారం స్పెషల్ డ్రైవ్ ప్రారంభించారు. డిప్యూటీ కమిషనర్ స్వయంగా మొండిబకాయిదారుల ఇళ్లకు వెళ్లి ఆస్తిపన్ను చెల్లించాలని అవగాహన కల్పిస్తున్నారు. వాహనాలకు మైకులు అమర్చి ప్రతీ డివిజన్లో ప్రచారం చేస్తున్నారు. మొండిబకాయిదారులకు చట్టం ప్రకారం నోటీసులు జారీ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. గర్రెపల్లి సింగిల్విండో సీఈవోపై ఫిర్యాదు సుల్తానాబాద్రూరల్: గర్రెపల్లి సింగిల్విండో భవనం కోసం కొనుగోలు చేసిన స్థలం విషయంలో సీఈవో అవినీతికి పాల్పడ్డారని పేర్కొంటూ బీసీ యువజన సంఘం రాష్ట్ర కన్వీనర్ తంగళ్లపల్లి రాజ్కుమార్, స్థలం విక్రేత శ్రీనివాస్ బుధవారం కరీంనగర్లోని కేడీసీసీబీ సీఈవో సత్యనారాయణకు ఫిర్యాదు చేశారు. స్థలం కొనుగోలులో పాలకవర్గం, సీఈవో అవినీతికి పాల్పడ్డారని వారు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. భూ విక్రేయత శ్రీనివాస్కు రావాల్సిన రూ.2లక్షలు ఇప్పించాలని అందులో పేర్కొన్నారు. ఈ కార్య క్రమంలో నాయకులు ఆత్మకూరి తిరుపతి, కవ్వంపెల్లి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. -
సెక్యూరిటీ సిబ్బంది భద్రతపై ఫోకస్
గోదావరిఖని: సింగరేణి ఆస్తుల పరిరక్షణలో అహర్నిశలు శ్రమిస్తున్న సెక్యూరిటీ సిబ్బంది సంక్షేమంపై యాజమాన్యం దృష్టి సారించింది. రాబోయే వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశానిర్దేశం చేసింది. ఈమేరకు అన్ని ఏరియాల అధికారులకు ఆదేశాలు జారీచేసింది. సెక్యూరిటీ పోస్టుల వద్ద భద్రతా ఏర్పాట్లు చేయాలని అధికారులు సూచించారు. విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండేలా చల్లటి మంచినీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందించాలని, చెక్పోస్టులు మరమ్మతు చేయాలని వారు ఆదేశించారు. వేడి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోని సెక్యూరిటీ పోస్టుల పైకప్పును చాపలతో కప్పాలన్నారు. ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలను అవసరం మేరకు ఏర్పాటు చేయాలని అధికారులు సూచించారు. వేసవిలో జాగ్రత్తలపై సింగరేణి దిశానిర్దేశం అప్రమత్తంగా ఉండాలి సిబ్బంది భద్రత కోసం యాజమాన్యం చర్యలు చేపట్టింది. సామాజిక మాధ్యమాలతో కాలక్షేపం చేయకుండా చుట్టుపక్క ప్రాంతాలపై దృష్టి సారించాలి. దొంగతనాల నివారణలో సెక్యూరిటీ సిబ్బంది కీలకపాత్ర పోషించాలి. సంస్థ ఆస్తుల పరిరక్షణలో అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి. సమస్యలుంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలి. – లక్ష్మీనారాయణ, సెక్యూరిటీ జీఎం, సింగరేణి -
అందరూ సుభిక్షంగా ఉండాలి
పెద్దపల్లిరూరల్: ఎల్లమ్మదేవత ఆశీర్వాదంతో అందరూ సుభిక్షంగా ఉండాలని ఎమ్మెల్యే విజయరమణారావు ఆకాంక్షించారు. మారేడుగొండలో బుధవారం నిర్వహించిన రేణుకా ఎల్లమ్మతల్లి ఉత్సవాల్లో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఆయన మాట్లాడుతూ, గౌడకులస్తుల కులదైవం అనుగ్రహంతో అందరూ చల్లంగా ఉండాలన్నారు. అనంతరం పట్టణంలోని శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. తర్వాత నూతన డయాగ్నోసిస్ సెంటర్ను ప్రారంభించారు. రవాణా సౌకర్యం మరింత మెరుగు ఓదెల(పెద్దపల్లి): రోడ్ల నిర్మాణంతో గ్రామస్తులకు ప్రయాణ సౌకర్యం మరింత మెరుగుపడుతుందని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. స్థానిక రైల్వేగేట్ నుంచి ప్రభుత్వ కార్యాలయాల వరకు చేపట్టిన రోడ్డు విస్తరణ, ఓదెల మల్లన్నగుడి – అబ్బిడిపల్లి వరకు చేపట్టిన బీటీ రోడ్డుతోపాటు పలు లింక్రోడ్ల పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పల్లెవాసులకు రవాణా సౌకర్యం మెరుగుపర్చేందుకు రోడ్లు ని ర్మిస్తున్నామని తెలిపారు. పొత్కపల్లి సింగిల్విండో చైర్మన్ ఆళ్ల సుమన్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మూల ప్రేంసాగర్రెడ్డి, నాయకులు చీకట్ల మొండయ్య, ఆకుల మహేందర్, బొడకుంట చిన్నస్వామి, తీర్థాల వీరన్న పాల్గొన్నారు. ఎమ్మెల్యే విజయరమణారావు -
స్థలం సరిపోత లేదు
మల్లన్న గుడిలో భక్తులకు సరిపడా గదులు నిర్మించాలి. రద్దీకి అనుగుణంగా స్థలం సరిపోవడం లేదు. ఎండాకాలం, వర్షాకాలంలో ఇబ్బందులు పడుతున్నాం. ఆలయ పరిసరాల్లోని చెట్లు కూడా సరిపోవడం లేదు. అదనంగా నీటి ట్యాంకులు నిర్మించాలి. – వాసర్ల శ్రీనివాస్, భక్తుడు, ఎలబోతారం సౌకర్యాలు కల్పించాలి ఆలయం పరిధిలో మరుగుదొడ్లు లేక చుట్టుపక్కల పరిసరాలకు వెళ్లాల్సి వస్తుంది. 50 ఏళ్ల నుంచి మల్లన్న దర్శనం కోసం వస్తున్న. మహిళలకు సౌకర్యాలు కల్పిస్తలేరు. – వేల్పుల ఎల్లవ్వ, భక్తురాలు, తుర్కలమద్దికుంట గదులు నిర్మించాలి మల్లన్నకు 72 మంది ఒగ్గుపూజారులం పట్నాలు, బోనాల మొక్కులు చెల్లిస్తున్నాం. స్వామివారి పేరిట నిత్యం పూజలు చేసే ఒగ్గువాళ్లకు వెంటనే గదులు నిర్మించాలి. – ముత్యాల మొండయ్య, ఒగ్గుపూజారి, కొమిర -
జలవెల..
గురువారం శ్రీ 13 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025చామనపల్లిలో నీళ్లందక ఎండిపోయిన వరికథలాపూర్ మండలం కలిగోట శివారులో అడుగంటిన సూరమ్మ చెరువుకరీంనగర్రూరల్: ఈ ఫొటో కరీంనగర్ మండలం చామనపల్లిలోనిది. ఓ వైపు ఎస్సారెస్పీ నీళ్లు అందక, మరోవైపు వ్యవసాయబావుల్లోని నీరు సరిపోక వేసిన వరి ఇలా ఎండిపోతోంది. పెట్టిన పెట్టుబడి అయినా చేతికొస్తుందా అని రైతులు ఆందోళన చెందుతున్నారు. వేసవిని దృష్టిలో పెట్టుకుని పలువురు రైతులు మొక్కజొన్న సాగు చేసినప్పటికీ ప్రయోజనం లేకుండా పోతోంది. ఎండిపోతున్న పంటలను కాపాడుకునేందుకు కొంతమంది కొత్తగా బోర్లను వేయిస్తుండగా.. మరికొందరు బావుల్లో పూడిక తీయిస్తున్నారు. భూగర్భజలాలు అడుగంటడంతో రైతులు చేస్తున్న చివరి ప్రయత్నాలు ఫలించడంలేదు.కథలాపూర్/రుద్రంగి: జగిత్యాల జిల్లా కథలా పూర్ మండలంలోని చాలా గ్రామాలకు ప్రధాన సాగునీటి వనరు అయిన కలిగోట శివారులోని సూరమ్మ చెరువు అడుగంటిపోయింది. మండలంలోని బొమ్మెన ప్రాజెక్టు, తాండ్య్రాల ఊరచెరువు, దుంపేట గ్రామాల చెరువులకు ఈ చెరువు నీరే ప్రధానం కాగా.. వాటికింద వేసిన పంటలు ఎండిపోతున్నాయి. కలిగోట, అంబారిపేట, పోతారం, తాండ్య్రాల గ్రామాల్లోని బోరుబావుల్లో నీరు కొద్దిగానే వస్తోందని రైతులు తెలిపారు. వచ్చే రెండునెలలు పంటలు కాపాడుకోవడం ఎలా అని ఆందోళన చెందుతున్నారు. ఎల్లంపల్లి ఎత్తిపోతలతో సూరమ్మ చెరువు నింపాలని కోరుతున్నారు.సూరమ్మ చెరువు నింపాలి వర్షాలు బాగా కురిశాయని కలిగోట గ్రామంలో ఎక్కువగా వరి సాగు చేసినం. సూరమ్మ చెరువులో నీళ్లు అడుగంటిపోయాయి. మా గ్రామ శివారులోని సగం బోరుబావుల్లో ఇప్పుడు కొద్దిగానే నీళ్లు వస్తున్నాయి. ఇట్లుంటే వరికి నీళ్లందడం కష్టం. పంటలు ఎండిపోయి పెట్టుబడి కూడా రాని పరిస్థితి. సూరమ్మ చెరువు నింపాలి. – గంగం గంగారెడ్డి, రైతు, కలిగోట, కథలాపూర్బోరు వేసినా లాభం లేదు నాలుగు ఎకరాల్లో మొక్కజొన్న వేశాను. బాయిల నీళ్లు లేకపోవడంతో రూ.2లక్షలతో కొత్తగా బోరు వేయించిన. అయినా నీళ్లు అందడంలేదు. ఇప్పటికే నీరు లేకపోవడంతో రెండు ఎకరాల్లో మొక్కజొన్న పంట ఎండిపోగా మిగితా పంటకూడా ఎండిపోయేలా ఉంది. – బోగొండ రాజు, రైతు, చామనపల్లి, కరీంనగర్ఆశల యాసంగి అన్నదాతను ఉసూరుమనిపిస్తోంది. లక్షల రూపాయల పెట్టుబడి పెట్టి పంటవేస్తే ఆదిలోనే నీటిగోస ఎదురవుతోంది. శివరాత్రికి ముందే ఎండలు దంచికొడుతుండగా.. వాగుల్లో నీరు ఆవిరవుతోంది. ఫిబ్రవరి రెండోవారంలోనే చెరువులు వెలవెలబోతున్నాయి. బోర్లు వట్టిపోయి.. గుంటభూమి కూడా తడవని పరిస్థితి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నెలకొంది. జిల్లాలో వరి, మొక్కజొన్న ఎక్కువగా సాగు చేయగా.. చాలా ప్రాంతాల్లో పీచుపెట్టక ముందే మొక్కజొన్న ఎండిపోతోంది. దీంతో పంట పశువుల పాలవుతోంది. కలుపు దశలో ఉన్న వరికి నీరందకపోవడంతో పంట ఎదుగుదల లోపించింది. భూమి బీటలుబారి పొలాలు ఎండిపోతున్నాయి. ఎస్సారెస్పీ నీరు చివరి ఆయకట్టుకు అందకపోతుండగా.. ఉమ్మడి జిల్లాలోని ప్రధాన జలాశయాల్లో సైతం నీటిమట్టం తగ్గుతోంది. ఫిబ్రవరిలోనే ఇలా ఉంటే.. పంటలు చేతికందుతాయో.. లేదోనని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. – వివరాలు 8లోu●విలవిల ముదురుతున్న ఎండలు.. ఎండుతున్న పంటలు అడుగంటుతున్న జలవనరులు..వట్టిపోతున్న బోర్లు ఉమ్మడి జిల్లాలో పశువుల మేతగా పంటలు ఆందోళన చెందుతున్న అన్నదాతలు వేసవికి ముందే ప్రమాద ఘంటికలు -
ఎండకు ఎండుడే.. వానకు తడుసుడే
ఓదెల(పెద్దపల్లి): భక్తుల కొంగుబంగారంగా ప్రసిద్ధిగాంచిన ఓదెల మల్లన్న సన్నిధిలో సౌకర్యాలు లేక భక్తులు ఇబ్బందులకు గురువుతున్నారు. ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు మహారాష్ట్ర నుంచి తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. ప్రతీ ఆది, బుధవారాల్లో లక్ష వరకు భక్తులు వస్తుంటారు. కేవలం ఐదు మరుగుదొడ్లు ఉండటంతో మహిళల పరిస్థితి చెప్పనక్కరలేదు. సరిపడా మరగుదొడ్లు లేక భక్తులు రోడ్ల వెంట, పంటపొలాల్లో బహిర్భూమికి వెళ్లాల్సి వస్తోంది. దీంతో రోడ్ల వెంట దుర్గంధం వెదజల్లుతోంది. సౌకర్యాలు అంతంతే.. ● మల్లన్న సన్నిధిలో మరుగుదొడ్ల నిర్మాణానికి గతంలో కలెక్టర్ పలుమార్లు విన్నవించినా ఫలితం లేకుండాపోయింది. ● భక్తులకు సరిపడా షెడ్లు లేక చెట్ల కింద సేద తీరాల్సి వస్తోంది. వర్షంలో తడుస్తూ, ఎండలో ఎండుతూ ఇబ్బందులు పడుతున్నారు. ● చాలా ఏళ్ల క్రితం తాగునీటి ట్యాంకులు నిర్మించడంతో భక్తులకు నీరు సరిపోవడంలో లేదు. ప్రతీ ఆది, బుధవారాల్లో వాహన పూజలకు వచ్చేవారు రోడ్డుపై పార్కింగ్ చేస్తుండటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ● కోనేరును అసంపూర్తిగా నిర్మించడంతో భక్తులకు ఉపయోగపడటం లేదు. ● ఆలయంలో స్వామివారికి పట్నాలు వేసే ఒగ్గు పూజారులకు గదులు లేవు. 72 మంది ఒగ్గు పూజారులకు గదులు నిర్మించాలని పలుసార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ● ఆలయం ద్వారా దేవాదాయశాఖకు ఆదాయం సమకూరినా అభివృద్ధి పనులకు నిధులు కేటాయించడం లేదని భక్తులు ఆరోపిస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం వసతులు కల్పించాలని కోరుతున్నారు. ఓదెల మల్లన్న సన్నిధిలో వసతుల లేమి కనీస సౌకర్యాలు లేక భక్తుల ఇబ్బందులుప్రతిపాదనలు పంపించాం ఓదెల ఆలయంలో భక్తులకు సరిపడా సౌకర్యాల కల్పనకు సంబంధిత అధికారులకు ప్రతిపాదనలు పంపించాం. నిధులు మంజూ రు కాగానే అభివృద్ధి పనులు చేపడుతాం. – బొడ్క సదయ్య, ఆలయ ఈవో -
మేధావులకు జ్ఞానోదయం కావాలి
మంథని: అంబేడ్కర్ రచించిన భారత రాజ్యాంగంపై చిలుకూరి బాలాజీ ఆలయ పూజారి రంగరాజన్ చేసిన వ్యాఖ్యలతో మేధావులకు జ్ఞానోదయం కావాలని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ అన్నారు. పట్టణంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి సుమారు ఏడు దశాబ్దాలకుపైగా గడుస్తున్నా.. మన భారత రాజ్యాంగం గురించి తెలియక పోవడం శోచనీయమన్నారు. రంగరాజన్పై వీరరాఘవరెడ్డి చేసిన దాడిని ప్రజలు, బీఆర్ఎస్ పక్షాన ఖండిస్తున్నవతాయన అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఏగోలపు శంకర్గౌడ్, గుజ్జుల రాజిరెడ్డి, తగరం శంకర్లాల్, కన్నూరి శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు. సమస్యలు పరిష్కరిస్తాం గోదావరిఖని: వివిధ విభాగాల ఉద్యోగుల సమస్యలను సత్వరమే పరిష్కరిస్తామని సీఎంపీఎఫ్ రీజినల్ కమిషనర్ శ్రీహరి పచౌరీ అన్నారు. సింగరేణి ఆర్జీ–2 జీఎం కార్యాలయంలో బుధవారం సీఎంపీఎఫ్ కో ఆర్డినేషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంట్రాక్టు కార్మికుల సభ్యత్వం, మాస్టర్ డేటా నమోదు చేయాలన్నారు. ఏరియా ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో ఎస్వోటూ జీఎం రాముడు, పర్సనల్ డీజీఎం అనిల్కుమార్, ఫైనాన్స్ డీజీఎం వెంకటరామచంద్ర, ఏరియా సెక్యూరిటీ అధికారి షరీఫ్ మహమ్మద్, గుర్తింపు సంఘం నాయకులు జిగురు రవీందర్, శ్యాంసన్ తదితరులు పాల్గొన్నారు. -
స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుతాం
జూలపల్లి(పెద్దపల్లి): స్థానిక ఎన్నికల్లో సత్తా చాటుతామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి అన్నారు. జిల్లా అధ్యక్షుడిగా బాధ్య తలు స్వీకరించిన సంజీవరెడ్డి.. పార్టీ కుద్బుల్లాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి జేకే శేఖర్ యాదవ్తో కలిసి పెద్దాపూర్ శ్రీయోగానంద లక్ష్మీనర్సింహుని ఆలయంలో మంగళవారం పూజలు చేశారు. అనంతరం మండల కేంద్రంలో దీన్దయాళ్ ఉపాధ్యాయ వర్ధతి సభలో పాల్గొన్నారు. బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రతీ కార్యకర్త పట్టుదల, సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు కొప్పుల మహేశ్, నాయకులు జ్యోతిబసు, ప్రదీప్కుమార్గౌడ్, మోహన్రెడ్డి, రవీందర్గౌడ్, అశోక్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
బాడీ బిల్డింగ్ ప్రయాణమే..
జ్యోతినగర్(రామగుండం): బాడీ బిల్డింగ్ అనే ది ఒక ప్రయాణమేనని, గమ్యం కాదని బీజేపీ రామగుండం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి కందుల సంధ్యారాణి అన్నారు. కృష్ణానగర్లోని ట్రూ ఫిట్ జిమ్లో మంగళవారం నిర్వహించిన రాష్ట్రస్థాయి బాడీ బిల్డింగ్ చాంపియన్షిప్లో బా డీ బిల్డర్ ముజమ్మిల్ ఐదోస్థానం సాధించారు. దీంతో ఆయనను సంధ్యారాణి సన్మానించారు. శారీరక, మానసిక దృఢత్వం ఉంటేనే చాంపియన్షిప్ సాధ్యమని ఆమె తెలిపారు. ప్రతినిధులు షకీల్, సుధాకర్, దాసరి రాయలింగు, సింగం కి రణ్, ఆముల శ్రీనివాస్, ఆముల చరణ్, ప్రణయ్ గౌడ్, సమీర, ప్రవళిక, స్మిత, ప్రణయ ఉన్నారు. -
నామినేషన్ల పరిశీలన పూర్తి
● గ్రాడ్యుయేట్స్ స్థానానికి బరిలో 68.. టీచర్స స్థానానికి 16 మందిసాక్షిప్రతినిధి,కరీంనగర్: కరీంనగర్–మెదక్–నిజామాబాద్–ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్స్, టీ చర్స్ ఎమ్మెల్సీ స్థానాలకు దాఖలైన నామినేషన్ల పరిశీలన ముగిసింది. గ్రాడ్యుయేట్స్ స్థా నానికి 100 మంది అభ్యర్థులు 192 నామినేషన్లు దాఖలు చేశారు. వీరిలో వివిధ కారణాల వల్ల 32 మంది నామినేషన్లు తిరస్కరణకు గురికాగా, 68 మందివి ఆమోదించారు. టీ చర్స్ స్థానానికి 17 మంది 38 నామినేషన్లు దాఖలు చేయగా ఒకరి నామినేషన్ రిజెక్ట్ అ యింది. ఈ సందర్భంగా ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడు తూ అభ్యర్థులు నామినేషన్ల సమర్పించిన సందర్భంలో ఏవైనా లోపాలు ఉంటే గుర్తించి అ భ్యర్థులకు షార్ట్ మెమోలు ఇచ్చి సరిచేసుకునేందుకు అవకాశం కల్పించామన్నారు. సరైన ఫార్మాట్లో సమర్పించని నామినేషన్లను తిరస్కరించినట్లు వివరించారు. ఎమ్మెల్సీ ఎన్నిక ల పరిశీలకులు, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సంజయ్ రామన్, అడిషనల్ కలెక్టర్లు ప్రపుల్ దేశాయ్, లక్ష్మీకిరణ్, డీఆర్వో వెంకటేశ్వర్లు, ఆర్డీవోలు మహేశ్వర్, రమేశ్, ఏవో నరేందర్, తహసీల్దార్లు, రెవెన్యూ ఉద్యోగులు పాల్గొన్నా రు. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులు సంజయ్ కుమార్, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులు బెన్హర్ మహేశ్ దూత్ ఎక్క తదితరులు హాజరయ్యారు. -
జాతీయ పార్టీలే!
మండలి బరిలోసాక్షిప్రతినిధి, కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్–ఆదిలాబాద్–మెదక్–నిజామాబాద్ మండలి ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియ ముగింపు రోజు నాటకీయ పరిణామం చోటుచేసుకుంది. ప్రస్తుతం పోటీ చేస్తున్న ప్రధా న పార్టీ అభ్యర్థులంతా జాతీయ పార్టీల తరఫున బరిలోకి దిగుతుండటం గమనార్హం. గ్రాడ్యుయేట్స్ బరిలో నలుగురు అభ్యర్థులు ఉండగా.. టీచర్స్ బరిలో ఇద్దరు పోటీ చేస్తున్నారు. వీరిలో గ్రాడ్యుయేట్స్ స్థానానికి కాంగ్రెస్ పార్టీ నుంచి అ ల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్రెడ్డి, బీజే పీ నుంచి చిన్నమైల్ అంజిరెడ్డి ముందే బీఫాంలు ఖరారు చేసుకుని ప్రచారం ప్రారంభించారు. కానీ.. రవీందర్సింగ్, ప్రసన్నహరికృష్ణలు బీఆర్ఎస్ టికెట్ కోసం చివరి వరకు ప్రయత్నించి భంగపడ్డారు. నామినేషన్ ఆఖరురోజైన సోమవా రం నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నా యి. ఎలాగోలా పోటీకి సిద్ధమైన సింగ్ ఏఐఎఫ్ బీ నుంచి, హరికృష్ణ బీఎస్పీ తరఫున బీఫాంలు సమర్పించడం చర్చనీయాంశంగా మారింది. ముందుకు వచ్చేందుకే.. చివరి నిమిషం వరకు రవీందర్సింగ్, ప్రసన్న హరికృష్ణ స్వతంత్రంగానే బరిలో ఉంటారన్న ప్రచారం జరిగింది. అయితే వీరిద్దరూ బీఫాం సమర్పించే వరకు ఇతర పార్టీలో చేరిన విషయం గోప్యంగా ఉంచారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పదుల సంఖ్యలో అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. స్వతంత్రులుగా ఉంటే ఎక్కడో ఆఖరున పేరుంటుంది. కానీ.. జాతీయ పార్టీ అభ్యర్థులు బ్యాలెట్లో ముందు ఉంటారు. అందుకే.. ఆయాపార్టీల అ భ్యర్థులుగా బరిలోకి దిగితే.. తమకు బ్యాలెట్లో ప్రాధాన్యం దక్కుతుందన్న ఆలోచనతో జాతీయ పార్టీల బీ ఫాం పొందారు. సోమవారం రవీందర్సింగ్ తన అనుచరులతో కలిసి కేసీఆర్ చిత్రపటంతో వెళ్లి మరీ నామినేషన్ వేశారు. దీంతో రవీందర్సింగ్ బీఆర్ఎస్లో ఉన్నట్టా? లేనట్లా? అన్న విషయమై పార్టీలో గందరగోళం నెలకొంది. దీరనిపై సింగ్ మాట్లాడుతూ.. పార్టీ టికెట్ ఇస్తుందని ఎంతో ఆశపడ్డానన్నారు. ఇప్పటికై నా ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తనకు మద్దతుగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కొత్తేమీ కాదు.. ఆఖరు నిమిషంలో అసంతృప్తులు ఏఐఎఫ్బీ టికెట్ తెచ్చుకోవడం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కొత్తేం కాదు. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ రెబల్ కోరుకంటి చందర్ రామగుండం ఎమ్మెల్యేగా ఏఐఎఫ్బీపైనే గెలిచిన విషయం తెలిసిందే. ఆ తరువాత పాత జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏఐఎఫ్బీ తన సత్తాచాటింది. అలాగే బీఎస్పీ 2014 ఎన్నికల్లో అసెంబ్లీలో రెండు ఎమ్మెల్యే సీట్లు గెలుచుకుంది. 2018 ఎన్నికల్లోనూ బీఎస్పీ నుంచి పలువురు సీనియర్ లీడర్లు పోటీ చేశారు. టీచర్స్లో ఇద్దరే.. టీచర్స్ ఎమ్మెల్సీ విషయానికి వస్తే.. బీజేపీ నుంచి మల్క కొమురయ్య పోటీ చేస్తుండగా, బీఎస్పీ నుంచి యటకారి సాయన్న బరిలో ఉన్నారు. వీరి ద్దరూ ప్రచారం స్పీడ్ పెంచారు. టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో వీరిద్దరే జాతీ య పార్టీల నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండటం గమనార్హం. ఇక ఎస్టీయూ, టీపీఆర్టీయూ బలపరిచిన సిట్టింగ్ ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి, యూటీఎఫ్, ఉపాధ్యాయ అధ్యాపక సంఘాలు, టీపీటీఎఫ్ బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి వై.అశో క్ కుమార్ కూడా ప్రచారం ముమ్మరం చేశారు. అకస్మాత్తుగా తెరమీదికి రెండు నేషనల్ పార్టీలు ఏఐఎఫ్బీ నుంచి రవీందర్ సింగ్, బీఎస్పీ నుంచి ప్రసన్న హరికృష్ణ వీరికి టికెట్ నిరాకరించిన బీఆర్ఎస్ అధిష్టానం కేసీఆర్ బొమ్మతో వెళ్లి ఏఐఎఫ్బీ బీఫాం ఇచ్చిన సింగ్ ప్రచారంలో దూకుడు పెంచిన నరేందర్రెడ్డి, అంజిరెడ్డి టీచర్స్లో జాతీయ పార్టీల అభ్యర్థులు ఇద్దరుదూకుడు పెంచిన నరేందర్రెడ్డి, అంజిరెడ్డి..కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి ప్రచారంలో దూకుడు పెంచారు. సోమవారం మంత్రులు ఉత్తమ్కుమార్ రెడ్డి, శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్, పీసీసీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్తోపాటు ఉమ్మడి జిల్లా విప్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేగా పోటీచేసిన అభ్యర్థులంతా మద్దతుతో భారీర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ తో కాంగ్రెస్ నాయకుల్లో కొత్తజోష్ నెలకొంది. ఇదే ఉత్సాహంతో నరేందర్రెడ్డి ప్రచా రం స్పీడ్ పెంచారు. కరీంనగర్, ఆదిలా బాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రులపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. కాలేజీలకు వెళ్తూ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నియామకాలు, నోటిఫికేషన్లు వివరిస్తున్నారు. బీజేపీ నుంచి పోటీ చేస్తున్న చిన్నమైల్ అంజిరెడ్డి కూడా ప్రచారంపై దృష్టి సారించారు. ఆయన సతీమణి గోదావరి కూడా అంజిరెడ్డి తరఫున ప్రచారం ముమ్మరం చేశారు. -
అప్పుడే మంచినీటి గోస
● కార్మిక కాలనీల్లో తిప్పలు ● గోదావరిలో తగ్గిన పారకంగోదావరిఖని: వేసవికి ముందే గోదారి తడారుతోంది. నీటి నిల్వలు లేక ఎండిపోతోంది. సింగరేణి కా ర్మిక కాలనీల్లో మంచినీటి గోస మొదలైంది. కొన్ని ప్రాంతాల్లో రెండ్రోజులకోసారి తాగునీరు సరఫరా అవుతోది. ఫిబ్రవరిలోనే పరిస్థితి ఇలాఉంటే వేసవిలో దాహం తీర్చుకునేదెలా? అని కార్మిక కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. సమస్య పరిష్కారం కోసం యాజమాన్యం కసర్తు చేస్తోంది. రోజూ 35 ఎంఎల్డీ నీరు సరఫరా.. రామగుండం రీజియన్లోని మూడు ఏరియాలకు ప్రతీరోజు 35 మెగా లీటర్స్ ఫర్ డే(ఎంఎల్డీ) నీటిని గోదావరి నది నుంచి కార్మిక కాలనీలకు సింగరేణి యాజమాన్యం సరఫరా చేస్తోంది. గోదావరిఖని, యైటింక్లయిన్కాలనీ, పోతనకాలనీ, సెంటినరీకాలనీల్లోని సింగరేణి క్వార్టర్లు, ప్రైవేట్ నివాసాలకు కూడా సింగరేణి నల్లాల ద్వారా తాగునీరు అందిస్తోంది. ఈసారి సుందిళ్ల ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయడంతో నీటినిల్వలు లేక గోదావరి నది బోసిపోయి కనిపిస్తోంది. సింగరేణి యాజమాన్యం గోదావరిలో తవ్వించిన వాటర్ ఫిల్టర్లు ఇసుకతెన్నల మధ్యలో కనిపిస్తున్నాయి. కొద్దిపాటి నీటిని నిల్వ చేసేందుకు బండ్లాగా ఏర్పాటు చేసింది. అయినా నీటి సమస్యకు పరిష్కారం లభించడంలేదు. గోదావరి నదిలో వ్యర్థ జలాలే.. రామగుండం నగరం నుంచి వెలుబడే వ్యర్థాలు మల్కాపూర్ సమీపంలోని గోదావరి నదిలో నేరుగా కలుస్తున్నాయి. ఇదేనీరు ఫిల్టర్ బెడ్వరకు చేరుతోంది. ఇసుకలో ఫిల్టర్ అయిన నీటిని పంపింగ్ చేస్తున్నారని చెబుతున్నారు. గోదావరిలో ఇసుక మేటలు తేలాయి. ఇన్ఫిల్టరేషన్ గ్యాలరీ వద్ద కూడా నీటి పారకం లేకుండా పోయింది. ఫిబ్రవరి తొలివారంలోనే గోదావరి పరిస్థితి ఇలా ఉంటే రాబోయే నాలుగు నెలలు ఎలా నెట్టుకు వచ్చేదని సింగరేణి యాజమాన్యం తల పట్టుకుంటోంది. రోజువారీ నీటిసరఫరా(ఎంఎల్డీలో) సమాచారం ఆర్జీ–1 ఆర్జీ–2 ఆర్జీ–3 నీటిసరఫరా 20 10 05 సింగరేణి 7,500 6,000 1,000 ప్రైవేట్ 15,000 6,000 1,000 -
నవోదయ పాఠశాలలు ఏర్పాటు చేయాలని వినతి
గోదావరిఖని: పార్లమెంట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో నవోదయ పాఠశాలలు ఏర్పాటు చేయాలని ఎంపీ గడ్డం వంశీకృష్ణ కోరారు. మంగళవారం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్ను కలిసి వినతిపత్రం అందజేశారు. వీటిద్వారా ప్రతీ పాఠశాలలో సుమారు 240 మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు. ఎంపీ వెంట విప్ అడ్లూరి లక్ష్మణ్కుమార్ ఉన్నారు. విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుతో నష్టం.. రామగుండంలో కొత్త విద్యుత్ ప్లాంట్ ఏర్పా టు చేయడం ద్వారా చాలామంది నష్టపోతున్నార ని ఎంపీ వంశీకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన పార్లమెంట్లో మాట్లాడారు. విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుతో మాతంగికాలనీ వాసులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆయన అన్నారు. నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అమలు చేయాలని గడ్డం వంశీకృష్ణ డిమాండ్ చేశారు. -
ఇసుక తోడేళ్లు
సాక్షి, పెద్దపల్లి: నిర్మాణాల్లో ఇసుక కీలకమైనది. ఈ సహజవనరు అక్రమార్కులకు ఆదాయ వనరుగా మారింది. ప్రధానంగా రామగుండంలో ఇసుక దందా అనుమతులు లేకుండానే జోరుగా సాగుతోంది. అక్రమార్కులు రూ.కోట్లలో దండుకుంటున్నారు. అనధికార రీచ్ల్లో ఇష్టారీతిన వెలికితీస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారు. ఈ దందాలో అధికార పార్టీ నేతలే బుక్ పెట్టి తరలిస్తూ ట్రాక్టర్ల వివరాలు నమోదు చేస్తున్నారు. పట్టపగలే వందలాది వాహనాల్లో తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. అయినా, అక్రమ రవాణాను పట్టించుకునే వారే లేకుండా పోయారు. నిబంధనల ప్రకారం ఇలా జరగాలి.. సామాన్యులకు ఇసుక అవసరమైతే అందుబాటులోని అనుమతిగల రీచ్ నుంచి తీసుకెళ్లాలనేది ప్రభుత్వం ఉద్దేశం. అవసరం ఉన్నవారు తొలుత మీసేవా కేంద్రాల్లో బుక్ చేసుకోవాలి. దూరాన్ని బట్టి ధర నిర్ణయించి ఎక్కడ నుంచి ఎక్కడకు, ఎన్నిగంటల్లోగా రవాణా చేయాలనే నిబంధనలతో జనవరి 16 నుంచి సామాన్యులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇందుకోసం జిల్లాలోని 6 రీచ్ల నుంచి ఉచితంగా ఇసుక తీసుకునేందుకు అవకాశం కల్పించారు. సుల్తానాబాద్ సమీప నీరుకుల్ల, గట్టెపల్లి, ముత్తారంలోని ముత్తారం, అడవి శ్రీరాంపూర్, మంథనిలోని విలోచవరం, అంతర్గాంలోని గోలివాడ రీచ్లలో ఎక్కడినుంచైనా ట్రాక్టర్లలో ఇసుక తీసుకు వెళ్లవచ్చు. సొంత అవసరాలకే ఉచితం.. రీచ్ల నుంచి ఉచితంగా తీసుకెళ్లే ఇసుకను సొంత అవసరాలకే వినియోగించాలి. అదికూడా మనజిల్లా పరిధిలోనే వాడాలి. ఎక్కడ కూడా ఇసుక డంప్లు చేయడానికి వీలు లేదు. ఇతర ప్రాంతాలకూ తరలించవద్దనేది అధికారుల సూచనలు. ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకే ఇసుక తరలించాలి. ఆ తర్వాత ఇసుక తరలిస్తే వాహనాలు సీజ్చేస్తారు. తొలిసారి పట్టుబడితే రూ.25 వేల జరిమానా విధిస్తారు. రెండోసారి చిక్కితే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తారు. ఇలా జరుగుతోంది.. రామగుండం పరిధిలోని గోలివాడలోనే ఇసుక రీచ్కు అనుమతి ఇచ్చారు. అధికార పార్టీ నేతల కనుసన్నల్లో అనుమతి లేకుండానే ఎఫ్సీఐ ఫిల్టర్ బెడ్ ఏరియా, మేడిపల్లి శివారులోని గోదావరి నది నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నారు. స్యాండ్ ట్యాక్సీ ద్వారా రామగుండం పరిఽధిలో ఎక్కడైనా ట్రాక్టర్కు రూ.2,600 ధరతో సరఫరా చేయాలి. అక్రమార్కులు అనుమతులు లేకుండానే రూ.1,800 చొప్పున సరఫరా చేస్తున్నారు. విషయం తెలిసినా.. అధికార పార్టీ నేతలు ప్రమేయం ఉండడంతో రెవెన్యూ, మైనింగ్ శాఖ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. యథేచ్చగా రవాణా అనుమతి లేకున్నా భారీగా తరలింపు మామూళ్ల మత్తులో మైనింగ్, రెవెన్యూ శాఖ అధికారులుచర్యలు తీసుకుంటాం ఇది రామగుండం సమీపంలోని గోదావరి నదిలో గల ఎఫ్సీఐ ఫిల్ట్ర్బెడ్. పట్టపగలే ట్రాక్టర్లలో ఇలా ఇసుక నింపుతున్నారు. అధికార పార్టీ నేతలు కొందరు ఒక్కో ట్రాక్టర్కు రూ.300 వసూలు చేస్తున్నారు. ఓ పుస్తకంలో రాసుకుంటూ అక్రమంగా ఇసుక తరలిస్తున్నారు. స్యాండ్ ట్యాక్సీ ద్వారా ట్రాక్టర్ రూ.2,600 చొప్పున ధరతో పోయాల్సి ఉండగా, లెక్కాపత్రం లేకుండా రూ.1,800కే పోస్తూ అక్రమార్కులు జేబులు నింపుకుంటున్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారు. మేడిపల్లి రీచ్లోనూ ఇదే దందా చేస్తున్నారు. రామగుండం పరిధిలోని ఎఫ్సీఐ ఫిల్టర్ బెడ్, మేడిపల్లి వద్ద గోదావరి నుంచి అక్రమంగా ఇసుక తవ్వకాలు చేస్తున్నారు. దేవాలయం నిర్మాణం కోసమని ఇసుక తవ్వకాలు చేపట్టి, అక్రమంగా డంపులు ఏర్పాటు చేయడం, సరఫరా చేయడం నేరం. ఇలాంటివారిపై చర్యలు తీసుకుంటాం. – శ్రీనివాస్, మైనింగ్ ఏడీ -
కమలంలో తగ్గని పోటాపోటీ
పెద్దపల్లిరూరల్: జిల్లా భారతీయ జనతా పార్టీ(బీజేపీ)కి కొత్త రథసారథి వచ్చినా గ్రూపు రాజకీయాలు ఆగడంలేదు. జిల్లా అధ్యక్షుడిగా నియమితుడైన కర్రె సంజీవరెడ్డి విలేకరుల సమావేశం పేరిట నిర్వహించిన కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి మాత్రమే హాజరయ్యారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్రావు హాజరవుతారని ప్రచా రం చేసినా స్థానికంగా ఉన్న ఆయన వర్గీయులు కూడా సమావేశానికి రాలేదు. దుగ్యాల, గుజ్జుల వర్గాలకు అంటిముట్టనట్టు ఉంటున్న మరోనేత, రాష్ట్రకార్యవర్గ సభ్యుడు గొట్టిముక్కుల సురేశ్రెడ్డి.. జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన సంజీవరెడ్డికి శాలువా కప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఢిల్లీ రాష్ట్రాన్ని బీజేపీ కై వసం చేసుకోవడంతో కమలం నేతలు పోటాపోటీగా సంబరాలు జరుపుకుని వర్గపోరు సమసిపోలేదని చెప్పకనే చెప్పారు. జిల్లా కార్యాలయంలో ఫ్లెక్సీల లొల్లి.. పట్టణంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి వర్గీయులే ఇప్పటిదాకా కార్యక్రమాలు నిర్వహించుకున్నారు. గుజ్జుల రామకృష్ణారెడ్డి వర్గీయులు ఆయన నివాసంలోనే కార్యక్రమాలను జరుపుకుంటూ వస్తున్నారు. కానీ, కర్రె సంజీవరెడ్డి జిల్లా అధ్యక్షుడిగా నియామకమయ్యాక మాజీ ఎమ్మెల్యే గుజ్జుల ఫొటోతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని జిల్లా పార్టీ కార్యాలయంపై ఏర్పాటు చేశారు. అందులో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రదీప్రావు, రాష్ట్ర కార్యవర్గసభ్యులు చిలారపు పర్వతాలు, సురేశ్రెడ్డి ఫొటోలు ముద్రించకపోవడంపై ఆగ్రహించిన దుగ్యాల వర్గీయులు.. ఈ విషయాన్ని జిల్లా కొత్త అధ్యక్షుడు సంజీవరెడ్డితోపాటు పార్టీ రాష్ట్ర కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. పార్టీలో అందరినీ కలుపుకుని పోతామంటూనే గ్రూపు రాజకీయాలు నడుపుతూ పార్టీని నియోజకవర్గంలో భ్రష్టు పట్టిస్తున్నారని సీనియర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాకు రానున్న ‘బండి’..! వర్గపోరును కట్టడి చేసేందుకు కొద్దిరోజుల్లోనే కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ పెద్దపల్లికి రానున్నట్టు ఆ పార్టీ శ్రేణుల ద్వారా తెలిసింది. బీజేపీకి ప్రజల నుంచి మంచి ఆదరణ వస్తున్నా.. నేతల అనైక్యతతోనే ఆశించిన ఫలితాలు పొందలేకపోతున్నామనే భావనలో అధిష్టానం ఉందని అంటున్నారు. బండి సంజయ్ చొరవతోనే బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా సంజీవరెడ్డి నియామకమయ్యారని పేర్కొంటున్నారు. జిల్లా కేంద్రంలో పార్టీ సమావేశాన్ని ఏర్పాటు చేసి కేంద్రమంత్రి బండి సంజయ్ని ఆహ్వానించి.. జిల్లా నేతలందరినీ ఏకతాటిపైకి తెచ్చేలా కార్యాచరణ చేపడుతున్నట్లు సమాచారం. ● కొత్త సారథి ప్రయత్నాలపై సర్వత్రా ఆసక్తి -
ఇబ్బంది పడుతున్నం
వారం రోజులుగా మంచినీళ్లు సరిగా రాక ఇబ్బంది పడుతున్నం. వచ్చేవి కూడా సరిగా ఉంటలేవు. మూడ్రోజుకోసారి వస్తున్నయి. గిప్పుడే గిట్లయితే.. అసలు ఎండకాలంలో మాపరిస్థితి ఏమిటి? – పులి మౌనిక, గోదావరిఖని మిషన్ భగీరథ నీళ్లివ్వాలి ఎండకాలంలో నీళ్లవాడం ఎక్కువ ఉంటది. గోదావరి లో నీళ్లులేవు. ప్రత్యామ్నాయంగా మిషన్ భగీరధ నీళ్లు ఇప్పించాలి. నీళ్ల గోస తీర్చాలె. ఎండకాలం వరకు ప్రత్యామ్నాయం చూడాలె. – ముస్కుల ప్రతిభ, యైటింక్లయిన్కాలనీ ప్రత్యామ్నాయంపై దృష్టి గోదావరి నదిలో నీటి పారకం తక్కువగా ఉంది. వేసవిలో నీటి వినియోగం పెరుగుతుంది. నదిలోనీటి నిల్వలు తగ్గుతాయి. అందుకే ప్రత్యామ్నాయ చర్యలు చేపడతాం. నీటిని పొదుపుగా వాడుకోవాలి. – లలిత్కుమార్, జీఎం, ఆర్జీ –1 -
సైబర్ నేరాల కట్టడిపై ప్రత్యేక దృష్టి
● రామగుండం సీపీ ఎం.శ్రీనివాస్ గోదావరిఖని(రామగుండం): సైబర్ నేరాల కట్టడిపై ప్రత్యేక దృష్టి సారించాలని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం.శ్రీనివాస్ పేర్కొన్నారు. సోమవారం కమిషనరేట్ పరిధిలోని రెండు జిల్లాల సైబర్ వారియర్స్తో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ప్రజలు సైబర్ నేరానికి గురైతే కంగారు పడకుండా 1930 నంబర్కు ఫోన్ చేయాలన్నారు. పోలీస్స్టేషన్, టీఎస్సీఎస్బీ మధ్య సైబర్ వారియర్లు సమన్వయకర్తలుగా పనిచేస్తారని పేర్కొన్నారు. సైబర్ నేరం ద్వారా పోగొట్టుకున్న డబ్బును త్వరగా ఇప్పించేలా నూతన పద్ధతిపై వారియర్స్కు శిక్షణ ఇచ్చినట్లు వెల్లడించారు. ఇది వరకే మోసపోయిన వారి డబ్బు బ్యాంకులో ఫ్రీజ్ అయితే వీలైనంత త్వరగా తిరిగి వచ్చేలా కృషి చేస్తారని వివరించారు. పోలీసులు నేరుగా వాట్సాప్, వీడియో కాల్స్ చేయరని, డిజిటల్ అరెస్టులు అని కాల్స్ వస్తే సంబంధిత పోలీస్స్టేషన్లో వెంటనే సమాచారం ఇవ్వాలన్నారు. ఈ సమావేశంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి.రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్రరావు, సైబర్ క్రైం సీఐ శ్రీనివాస్, సిబ్బంది చిరంజీవి, నరేశ్, కోటేశ్ తదితరులు పాల్గొన్నారు. -
యూరియా కొరత లేదు
● రైతులు ఆందోళన చెందొద్దు ● అవసరమైన నిల్వలున్నాయ్ ● వరి సాగులో సస్యరక్షణ పద్ధతులు పాటించాలి ● జిల్లా వ్యవసాయాధికారి ఆదిరెడ్డిపెద్దపల్లిరూరల్: జిల్లాలో ఎరువుల కొరత లేదని, అసత్య ప్రచారాలు విని రైతులు ఆందోళన పడొద్దని జిల్లా వ్యవసాయాధికారి ఆదిరెడ్డి అన్నారు. జిల్లా వ్యాప్తంగా రైతులు 2,16,500 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు చేశారని, పంటలకు అవసరమైనన్ని ఎరువుల నిల్వలు ఉన్నాయని తెలిపారు. ఈ నెల, మార్చిలో మరిన్ని యూరియా నిల్వలు అందుతాయని సోమవారం ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.సాక్షి: జిల్లాలో ఏయే పంటలు, ఎంత మేరకు సాగయ్యాయి? డీఏవో: జిల్లాలోని 14 మండలాల్లో రైతులు 2,16,500 ఎకరాల్లో పంటలు సాగుచేశారు. ఇందులో 1,98,000 ఎకరాల్లో వరిపంట సాగైంది. 16 వేల ఎకరాల విస్తీర్ణంలో మొక్కజొన్న, 2వేల ఎకరాల్లో కూరగాయలు, ఇతర పంటలు సాగయ్యాయి. సాక్షి: రైతులకు అందుబాటులో నిల్వలు ఉన్నాయా? డీఏవో: జిల్లాలోని రైతులకు అందుబాటులో యూరియా నిల్వలు ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో నిల్వలు నిండుకున్నట్లు అసత్యపు ప్రచారాలు చేస్తున్నారు. వాటిని రైతులు నమ్మొద్దు. 5,573 మెట్రిక్ టన్నుల యూరియా డీలర్ల వద్ద, 2,059 మెట్రిక్ టన్నులు మార్క్ఫెడ్, 2,600 మెట్రిక్ టన్నులు సొసైటీల వద్ద నిల్వలు ఉన్నాయి. సాక్షి: ఇంకా యూరియా జిల్లాకు వచ్చే అవకాశముందా? డీఏవో: జిల్లాకు మరో 11వేల మెట్రిక్ టన్నుల యూరియా రావాల్సి ఉంది. ఈ నెలలో 4వేల మెట్రిక్ టన్నుల వరకు, మార్చిలో ఏడు వేల మెట్రిక్ టన్నుల యూరియా వచ్చే అవకాశం ఉంది. సాక్షి: వరి పంట సాగుపై బోనస్ ప్రభావం ఉందా? డీఏవో: ప్రభుత్వం సన్నరకం వరి ధాన్యం క్వింటాల్కు రూ.500 చొప్పున బోనస్ అందించింది. ఆ ప్రభావం ఈసారి పంట సాగుపై స్పష్టంగా కనిపిస్తోంది. జిల్లాలో 1,98,000 ఎకరాల్లో వరి పంట సాగైతే అందులో లక్షా 10వేల ఎకరాల్లో సన్నరకాలను సాగు చేశారు. మిగతా 88వేల ఎకరాల్లో దొడ్డురకం పంట సాగయింది. సాక్షి: సాగైన పంటలకు యూరియా ఎంత మేర అవసరముంటుంది? డీఏవో: జిల్లాలో సాగుచేసిన పంటలకు 37వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని అంచనా వేశాం. గతేడాది ఇదే సీజన్లో 33వేల మెట్రిక్ టన్నులనే రైతులు కొనుగోలు చేశారు. ఈ సీజన్లో ఇప్పటివరకు 28,900 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చింది.సాక్షి: ప్రభుత్వం గత నెల ఆరంభించిన రైతుభరోసా లబ్ధిదారులకు అందిందా? డీఏవో: జిల్లాలో గ్రామసభలు నిర్వహించగా, 84వేల మంది లబ్ధిదారులు ఎంపికయ్యారు. అందులో ఎకరంలోపు ఉన్న లబ్ధిదారుల ఖాతాకు సొమ్ము జమ చేశారు. మిగతావారికి కూడా అందుతాయి. -
భూగర్భ జలాల నాణ్యత పరీక్షించాలి
● కలెక్టర్ కోయ శ్రీహర్షపెద్దపల్లిరూరల్: జిల్లాలో భూగర్భ జలాల నాణ్యతను పరిశీలించి నివేదిక అందించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. కలెక్టరేట్లో సోమవారం సంచార భూగర్భ జలాల నాణ్యత ప్రయోగశాల వాహనాన్ని పరిశీలించి పలు సూచనలు చేశారు. నేషనల్ హైడ్రాలజీ ప్రాజెక్టు కింద భూగర్భజలాల నాణ్యత ప్రయోగశాల (మొబైల్ క్వాలిటీ ల్యాబ్ ఆన్ వీల్స్)ను సమర్థవంతంగా వినియోగించాలని ఆదేశించారు. ముఖ్యంగా రామగుండం పరిసర ప్రాంతాలు, ఎస్సారెస్పీ ఆయకట్టు ప్రాంతంలో భూగర్భ జలాల నాణ్యతపై అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని పేర్కొన్నారు. జిల్లా భూగర్భ జల అధికారి లావణ్య తదితరులు పాల్గొన్నారు. పీఎం శ్రీ పథకం అభివృద్ధి పనులు పూర్తి చేయాలి కేంద్ర ప్రభుత్వ పథకం పీఎంశ్రీ లో చేపట్టిన అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. పీఎంశ్రీ కి ఎంపికై న పాఠశాలల హెచ్ఎంలతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో పీఎం స్కూల్ ఫర్ రైసింగ్ ఇండియా రెండో విడతలో 16 పాఠశాలలు ఎంపికై నట్లు వివరించారు. ఆయా పాఠశాలల్లో పనులను ఈనెల ఆఖరులోపు పూర్తి చేయాలని ఆదేశించారు. పదో తరగతి పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించడమే లక్ష్యంగా కార్యచరణ రూపొందించుకోవాలని సూచించారు. సమావేశంలో డీఈవో మాధవి, అధికారులు తదితరులు పాల్గొన్నారు. సింగరేణి డైరెక్టర్లకు సన్మానం గోదావరిఖని(రామగుండం): సింగరేణి నూతన డైరెక్టర్లుగా నియమితులైన డైరెక్టర్ ఆపరేషన్స్ ఎల్వీ సూర్యనారాయణ, డైరెక్టర్ పీపీ కొప్పుల వెంకటేశ్వర్లును ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్ప్రసాద్ సోమవారం సన్మానించారు. సీఅండ్ఎండీ కార్యాలయంలో ఇద్దరినీ కలిసి శాలువాతో సన్మానించారు. -
ఎమ్మెల్సీ ఎన్నికను సీరియస్గా తీసుకోండి
కరీంనగర్ కార్పొరేషన్: ‘ఎమ్మెల్సీ ఎన్నిక మనకు ప్రతిష్టాత్మకం. ఈ ఎన్నికల్లో విజయంతోనే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల విజయానికి బాటలు పడతాయి. అలసత్వం వద్దు...సీరియస్గా తీసుకోండి. ఆరు నియోజకవర్గాలకో మంత్రి ఇన్చార్జిగా ఉంటారు. ఓటింగ్కు అసెంబ్లీ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్చార్జిలదే బాధ్యత’ అంటూ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్కుమార్గౌడ్ పార్టీ శ్రేణులు, నాయకులకు దిశానిర్దేశం చేశారు. సోమవారం కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలా బాద్ పట్టభద్రుల నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి వి.నరేందర్రెడ్డి నామినేషన్ ప్రక్రియలో ఆయన పాల్గొన్నారు. అనంతరం రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులతో ఓ హోటల్లో అంతర్గత సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలపై ఈ ఎన్నిక ఫలితం ప్రభావం చూపుతుందన్నారు. ఎమ్మెల్సీ నియోజకవర్గం పరిధిలోని 42అసెంబ్లీ నియోజకవర్గాల బాధ్యతలను ఏడుగురు మంత్రులకు అప్పగిస్తున్నట్లు తెలిపారు. మరో పదిహేను రోజులే గడువు ఉన్నందున మంగళవారం నుంచి క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని ఉదృతం చేయాలని సూచించారు. పట్టభద్రుల అభ్యర్థి వి.నరేందర్రెడ్డి మాట్లాడుతూ తనకు ఎమ్మెల్సీ టి.జీవన్రెడ్డి రోల్ మాడల్ అన్నారు. అన్ని రకాల సర్వే చేసి, తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారన్నారు. మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్, ఉత్తమ్కుమార్రెడ్డి, జూపల్లి కృష్ణారావు, సీతక్క, కొండా సురేఖ్, ప్రభుత్వ విప్లు ఆది శ్రీనివాస్, అడ్లూరి లక్ష్మణ్కుమార్, ఎమ్మెల్సీ టి.జీవన్రెడ్డి,ఎమ్మెల్యేలు చింతకుంట విజయరమణారావు, కవ్వంపల్లి సత్యనారాయణ, మక్కాన్సింగ్రాజ్ఠాకూర్, మేడిపల్లి సత్యం, ఎడమ బొజ్జ, మైనంపల్లి రోహిత్, మాజీ ఎమ్మెల్సీ షబ్బీర్అలీ, తూర్పు నిర్మల జగ్గారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు సత్తు మల్లేశం, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి పాల్గొన్నారు. భారీ ర్యాలీ నరేందర్రెడ్డి నామినేషన్ సందర్భంగా నగరంలో కాంగ్రెస్ పార్టీ భారీ ర్యాలీ నిర్వహించింది. ఉమ్మడి కరీంనగర్, మెదక్, నిజామాబాద్, అదిలాబాద్ జిల్లాల నుంచి నేతలంతా తరలిరాగా, కోలాటాలు,ఒగ్గుడోలు వాయిద్యాలు, కళాకారుల నృత్యాలతో నగరంలోని ఎస్ఆర్ఆర్ కళాశాల నుంచి కోర్టు చౌరస్తా, తెలంగాణ చౌక్ మీదుగా కలెక్టరేట్ వరకు సాగింది. ర్యాలీ తెలంగాణ చౌక్కు చేరుకొన్న సమయంలో మంత్రులు ఉత్తమ్, సురేఖలు వచ్చి చేరారు. అంతకుముందు నగరానికి వచ్చిన పీసీసీ చీఫ్ మహేశ్గౌడ్కు మంత్రి పొన్నం ప్రభాకర్, నాయకులు స్వాగతం పలికారు. ఇంతకీ ఎన్ని వేల ఉద్యోగాలు? పట్టభద్రుల ఎన్నికల వేళ ఉద్యోగాల భర్తీ అంశం కీలకం కావడంతో, ర్యాలీలో మాట్లాడిన వారంతా తమ ప్రభుత్వం వచ్చాక వేల ఉద్యోగాలు భర్తీ చేసిందని చెప్పడానికి ప్రాధాన్యం ఇచ్చారు. అయితే ఒక్కొక్కరు ఒక్కో రకమైన సంఖ్య చెప్పడం ప్రాధాన్యతను సంతరించుకొంది. ఒకరు 53 వేల ఉద్యోగాలని....మరొకరు 54 వేలని...55 వేలని...56 వేల ఉద్యోగాలు భర్తీ చేసామని మంత్రులు, నాయకులు చెప్పడంతో పార్టీ శ్రేణులు గందరగోళానికి గురయ్యారు. ఈ ఫలితం స్థానిక సంస్థలపై ప్రభావం ఏడుగురు మంత్రులకు 42 నియోజకవర్గాల బాధ్యతలు పీసీసీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్ -
ఆఖరిరోజు అట్టహాసంగా..
● ముగిసిన గ్రాడ్యుయేట్స్, టీచర్స్ ఎమ్మెల్సీ నామినేషన్లు ● ఒకేరోజు నామినేషన్ వేసిన 59 మంది అభ్యర్థులు ● రెండుస్థానాలకు కలిపి మొత్తం 117 దాఖలు ● ప్రధాన పోటీదారులంతా మిలియనీర్లే ● రూ.120 కోట్లతో ముందంజలో అంజిరెడ్డి ● జనసంద్రమైన కరీంనగర్ వీధులుసాక్షిప్రతినిధి,కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్– మెదక్– ఆదిలాబాద్– నిజామాబాద్ జిల్లాల గ్రాడ్యుయేట్స్, టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలకు నామినేషన్ ప్రక్రియ ముగిసింది. సో మవారం ఆఖరురోజు కావడంతో అభ్యర్థులు భారీగా వచ్చారు. అనుచరులు, కార్యకర్తలు వెంట రాగా వివిధ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు వేశారు. చివరిరోజు 59 నామినేషన్లు వచ్చిన ట్లు అధికారులు తెలిపారు. ఇందులో 51 గ్రాడ్యుయేట్స్ కోసం రాగా.. మిగిలిన 8 టీచర్స్ స్థానానికి వచ్చినట్లు వివరించారు. ఇప్పటి వరకూ గ్రాడ్యుయేట్స్కు 100మంది అభ్యర్థులు 192సెట్లు, టీచర్స్ ఎమ్మెల్సీకి 17మంది 38సెట్ల నామినేషన్లు వేసినట్లు తెలిపారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కరీంనగర్ నగర వీధులన్నీ ర్యాలీలతో నిండిపోయాయి. కాంగ్రెస్ తరఫున పలువురు మంత్రులు హాజరు కాగా.. ఆఖరి రోజు ప్రధాన అభ్యర్థులు ర్యాలీల కోసం భారీగా జనసమీకరణ చేయడంతో నగర వీధులన్నీ సందడిగా మారాయి. కళాకారుల ఆటపాటలు, డప్పువాయిద్యాలతో హోరెత్తాయి. ● కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్రెడ్డి రెండోసెట్ నామి నేషన్ దాఖలు చేశారు. ఆయన వెంట పీసీసీ మహేశ్కుమార్ గౌడ్, మంత్రులు శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్, ఉత్తమ్కుమార్ రెడ్డి, సీతక్క, కొండా సురేఖ, విప్లు ఆదిశ్రీనివాస్, అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్సీ జీవన్రెడ్డి, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, విజయరమణరావు, మక్కాన్సింగ్ పాల్గొన్నారు. ● బీఎస్పీ నుంచి ప్రసన్న హరికృష్ణ నామినేషన్ దాఖలు చేశారు. మాజీ మేయర్ రవీందర్సింగ్, ట్రస్మా శేఖర్రావులు భారీగా అనుచరులు తరలిరాగా స్వతంత్రులుగా నామినేషన్ వేశారు. రవీందర్సింగ్ కేసీఆర్ చిత్రపటంతో వెళ్లి నామి నేషన్ వేయడం గమనార్హం. వీరిద్దరూ బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారే అయినా.. ఈసారి స్వతంత్రులుగా బరిలోకి దిగడం విశేషం. ● ఎస్టీయూ, టీపీఆర్టీయూ బలపరిచిన సిట్టింగ్ ఎమ్మెల్సీ కూర రఘోత్తం రెడ్డి టీచర్ ఎమ్మెల్సీకి నామినేషన్ వేశారు. ఆయన వెంట హర్షవర్దన్రెడ్డి, సత్యనారాయణ, షాబీర్, తిరుపతి, గజేందర్, రవి ఉన్నారు. ● టీఎస్యూటీఎఫ్, ఉపాధ్యాయ అధ్యాపక సంఘాలు బలపరిచిన కరీంనగర్ నియోజకవర్గ టీపీటీఎఫ్ టీచర్ల ఎమ్మెల్సీ అభ్యర్థి వై.అశోక్ కుమార్ నామినేషన్ వేశారు. నల్గొండ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.బరిలో మిలియనీర్లే..చిన్నమైల్ అంజిరెడ్డి వ్యక్తిగత ఆస్తులు: రూ.120,40,41,274 భార్య ఆస్తులు : రూ.54,79,63023 మొత్తం రూ.175 కోట్లపై చిలుకు బంగారం వ్యక్తిగతం: 250 గ్రాములు (విలువ రూ.19.32 లక్షలు) భార్య పేరిట 1,850 గ్రాములు (విలువ రూ.1.43 కోట్లు)అల్ఫోర్స్ నరేందర్రెడ్డి వ్యక్తిగత ఆస్తులు: రూ.30,00,59,840 భార్య పేరిట: రూ.13,38,36,263 (ఆయన భార్యకు క్రిస్టా కారు, అరకిలో బంగారం) ఉమ్మడి ఆస్తులు రూ. రెండు కోట్లు మొత్తం రూ.45.50 కోట్లుమల్క కొమురయ్య వ్యక్తిగత ఆస్తులు: రూ.32,08,62,420, ఆయన భార్యకు: రూ.29,55,03,158 మొత్తం కలిపి: రూ.61,63,65,578 భార్య వద్ద 4,457 గ్రాముల బంగారం (విలువ.రూ.17,93 కోట్లు) వంగ మహేందర్ రెడ్డి చరాస్తులు రూ.1,19,14,753, స్థిరాస్తులు రూ.8,56,90,056 మొత్తం రూ.20,48,04,809 ప్రసన్న హరికృష్ణ వ్యక్తిగత ఆస్తులు: రూ.49.07 లక్షలు భార్య పేరిట: రూ.2.16 కోట్లు మొత్తం రూ.2.65 కోట్లు భార్యవద్ద 300 గ్రాముల బంగారం సర్దార్ రవీందర్ సింగ్ చరాస్తులు రూ.1,10,09,802, స్థిరాస్తులు రూ. 73,81,000 మొత్తం: 1.83 కోట్లు