Peddapalli
-
అంతిమంగా సష్టపోయేది కార్మికులే..
గోదావరిఖని(రామగుండం): సంస్థ అప్పుల ఊబిలో కూరుకుపోయిందని, స్కాం పేరుతో మరింత నష్టపరుస్తున్నారని.. దీంతో సింగరేణి భవిష్యత్ అగమ్యగోచరంగా మారిందని.. ఏది ఏమైనా అంతిమంగా నష్టపోయేది కార్మికులేనని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు పేర్కొన్నారు. ఆదివారం ఎన్టీపీసీలోని ఓ ఫంక్షన్హాల్లో జరిగిన సింగరేణి పరిరక్షణ సదస్సులో మాట్లాడారు. మంత్రి శ్రీధర్బాబు మేనిఫెస్టో సభ్యుడిగా ఉండి తయారు చేసిన సింగరేణి హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. తాము అధికారంలో ఉండగా పదేళ్లలో రూ.7,350కోట్లు అప్పు ఉంటే ప్రస్తుతం రెండేళ్లలో రూ.12,377కోట్లు అప్పుచేశారన్నారు. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ, సింగరేణిలో పొగొట్టిన డిపెండెంట్ను తిరిగి కేసీఆర్ ప్రభుత్వం సాధించిందన్నారు. గైర్హాజర్ పేరుతో కార్మికులను తొలగించే కుట్ర చేస్తున్నారని, సంస్థ ప్రమాదంలో ఉందన్నారు. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ, రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో సింగరేణి తీరుపై ప్రశ్నిస్తామని పేర్కొన్నారు. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి మాట్లాడుతూ, ప్రజలు బీఆర్ఎస్ ప్రభుత్వం కోసం వేచి చూస్తున్నారని పేర్కొన్నారు. సింగరేణిని కాంగ్రెస్ దోచుకుంటుందని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే దివాకర్రావు ఆరోపించారు. అప్పుల ఊబిలో కూరుకుపోయి సింగరేణిని కాపాడుకునేందుకు సమష్టిగా ఉద్యమించే సమయం ఆసన్నమైందని పుట్ట మధు అన్నారు. అప్పులు తెచ్చి కార్మికులకు జీతాలకు చెల్లించే పరిస్థితిలో సింగరేణి నెట్టివేయబడిందని మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పేర్కొన్నారు. సదస్సులో టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి, నాయకులు మాదాసి రామ్మూర్తి, వ్యాళ్ల హరీశ్రెడ్డి, మూల విజయారెడ్డి, జక్కు శ్రీహర్షిణి, నూనె కొమురయ్య, నడిపెల్లి మురళీధర్రావు, కౌశికహరి పాల్గొన్నారు. రేవంత్రెడ్డికి హిట్లర్ గతే పడుతుంది పెద్దపల్లి: రానున్న రోజుల్లో సీఎం రేవంత్రెడ్డికి హిట్లర్కు పట్టిన గతే పడుతుందని హరీశ్రావు అన్నారు. ఆదివారం పెద్దపల్లిలోని ఓ ఫంక్షన్ హాల్లో కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. కార్యకర్తలే పార్టీకి దేవుళ్లని, బీఆర్ఎస్ను అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. కాగా, మాజీ ఎమ్మెల్యే మనోహర్రెడ్డి నుంచి రూ.23 లక్షలు ఇప్పించాలని బీఆర్ఎస్ నాయకుడు తాళ్లపల్లి మనోజ్గౌడ్ సమావేశం ప్రారంభంలో మాజీ మంత్రి హరీశ్రావును వేడుకున్నారు. ఈక్రమంలో నాయకులు, మనోజ్ మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు అతడిని అక్కడి నుంచి తీసుకెళ్లారు. -
బస్షెల్టర్ లేక ప్రయాణికుల పాట్లు
పెద్దపల్లిరూరల్: బస్సుల కోసం వేచిచూసేందుకు ప్రయాణికులకు బస్షెల్టర్లు కరువయ్యాయి. పెద్దపల్లి నుంచి ధర్మారం వెళ్లే వారంతా ఇలా దుకాణాల ఎదుట నిరీక్షించాల్సి రావడంతో ఆయా దుకాణాల యజమానుల నుంచి చీత్కారాలు ఎదుర్కోవాల్సి వస్తోందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎండలు మండిపోతుండడంతో ఇలా నీడకోసం దుకాణాల ఎదుట నిరీక్షించక తప్పని పరిస్థితి నెలకొందని వారు వాపోతున్నారు. అధికారులు కనీసం చలువపందిర్లు వేసినా బాగుండేదని అంటున్నారు.సహజ కవయిత్రికి సత్కారంపెద్దపల్లిరూరల్: పట్టణానికి చెందిన సహజ కవయిత్రి బొమ్మిదేని రాజేశ్వరిని ఆంధ్రప్రదేశ్లోని రాజమహేంద్రవరం గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ ఆవరణలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో అంతర్జాతీయ సాహిత్యసంస్థ శ్రీశ్రీకళావేదిక ప్రతినిధులు సత్కరించారు. 7వ ప్రపంచ తెలుగు సాహిత్య మహాసభల సందర్భంగా రాజేశ్వరి ఆలపించిన ‘ప్రకృతి పరిరక్షణకు ప్రతినబూనుదాం’.. ప్లాస్టిక్ మయం మన ప్రాణాలకు భయం.., విషపూరిత వాయువులు జీవితానికి శత్రు సాయుధులు’.. ఇలా సాగిన రాజేశ్వరి కవితాగానం పలువురి మన్ననలు పొందింది. గ్లోబల్ యూనివర్సిటీ అధినేత కేవీవీ సత్యనారాయణరాజు, కళావేదిక సీఈవో కళారత్న కత్తిమండ ప్రతాప్ తదితరులు సత్కరించారు. రేపు శ్రీసీతారామాలయ భూమి కౌలు వేలం పెద్దపల్లిరూరల్: పెద్దపల్లిలోని శ్రీసీతారామచంద్రస్వామి ఆలయానికి చెందిన సర్వే నంబరు 934లోని 11.24ఎకరాల భూమికి ఈనెల 9న కౌలు వేలం నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో ముద్దసాని శంకరయ్య తెలిపారు. ఆలయంలో మధ్యాహ్నం ఒంటిగంటకు నిర్వహించే వేలంలో పాల్గొనేందుకు ఆసక్తి గల వారు రూ.50వేల ధరావత్ చెల్లించి పాల్గొనాలని సూచించారు. -
ముగిసిన కస్టడీ.. వీడని మిస్టరీ
కరీంనగర్క్రైం: పీఎంజే జువెల్లరీ దోపిడీ కేసు దర్యాప్తులో కీలక మలుపు చోటుచేసుకుంది. ప్రధాన నిందితుడు సుభోద్సింగ్, రఘునాథ్ కర్మాకర్, రవీష్కుమార్ను నాలుగు రోజుల పాటు కస్టడీలో విచారించిన పోలీసులు కీలక ఆధారాలు స్వాధీనం చేసుకోగా.. బంగారం ఆచూకీ మిస్టరీగానే మిగిలింది. ఇదే సమయంలో పరా రీలో ఉన్న మరో నిందితుడిని బిహా ర్లో అరెస్టు చేయ డం కేసు దర్యాప్తునకు బలం చేకూర్చింది. కరీంనగర్ పోలీ సు కమిషనరేట్లో ఆదివారం సీపీ గౌస్ ఆలం కేసు దర్యాప్తు, పురోగతి అంశాలను వివరించారు. బంగారం ఆచూకీపై గందరగోళం దోపిడీకి గురైన సొత్తు ఆచూకీ విషయంలో నిందితులు సహకరించడం లేదని సీపీ స్పష్టం చేశారు ఆభరణాలు ఎక్కడ దాచారు..? ఎవరికి విక్రయించారు..? ఎవరి ద్వారా తరలించారు..? ఆర్థిక లావాదేవీలు ఎలా జరిగాయి..? వంటి అంశాలను నిందితులు వివరించడం లేదని అన్నారు. విచారణలో పరస్పర విరుద్ధమైన వాంగ్మూలాలు ఇవ్వడంతో పాటు పోలీసులను తప్పుదారి పట్టించే ప్రయత్నాలు చేస్తున్నట్లు వెల్లడించారు. మాట మార్చిన రఘునాథ్ కర్మాకర్ కేసు దర్యాప్తులో రఘునాథ్ కర్మాకర్ వ్యవహారం అనుమానాస్పదంగా మారింది. గతంలో గుండాల అటవీ ప్రాంతంలో దోపిడీ సొత్తును దాచిపెట్టినట్లు తెలిపిన నిందితుడు, ప్రస్తుతం ఆ సమాచారం సరైంది కాదని చెబుతున్నాడు. దీంతో నిందితులు ఉద్దేశపూర్వకంగానే నిజాన్ని దాచిపెడుతున్నారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ కస్టడీ కోరనున్న పోలీసులు నిందితుల నాలుగు రోజుల కస్టడీ ఆదివారంతో ముగిసింది. దర్యాప్తునకు అవసరమైన పూర్తి సమాచారం లభించకపోవడంతో మరికొన్ని రోజులు కస్టడీకి కోరుతూ కోర్టును ఆశ్రయించనున్నట్లు సీపీ వెల్లడించారు. పరారీలో ఉన్న మరో కీలక నిందితుడు అమర్సింగ్ అలియాస్ పహిల్వాన్ అలియాస్ ఆమరేంద్ర సింగ్ను బిహార్లోని సలింపూర్ ప్రాంతంలో జూన్ 4న అరెస్టు చేశామని సీపీ వెల్లడించారు. ట్రాన్సిట్ వారెంట్ ద్వారా ఆదివారం కరీంనగర్కు తీసుకొచ్చినట్లు సమాచారం. వెలిచాల వద్ద తుపాకులు స్వాధీనంనిందితులు వెలిచాల బైపాస్ రోడ్డుకు సమీపంలో చెట్ల పొదల్లో రెండు తుపాకులు దాచినట్లు అంగీకరించారని, వాటిని స్వాధీనం చేసుకున్నామని సీపీ వెల్లడించారు. దోపిడీ అనంతరం ధర్మపురి వైపు వెళ్లి బుగ్గారం అటవీ ప్రాంతంలో మొబైల్ పడేసినట్లు చెప్పడంతో స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ వస్తువులు కేసు దర్యాప్తులో కీలక ఆధారాలుగా మారనున్నాయని, ఫోన్లోని కాల్ డేటా, లొకేషన్, ఇతర డిజిటల్ ఆధారాలు నిందితుల నెట్వర్క్ను బయటపెట్టే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. -
‘ప్రత్యామ్నాయం’ ఫలించేనా..?
వానాకాలం సీజన్లో జిల్లా వ్యాప్తంగా పంటల సాగు ప్రణాళికలను వ్యవసాయ అధికారులు సిద్ధం చేశారు. ఈసారి జిల్లాలో 2.15లక్షల ఎకరాల్లో వరి, 52వేల ఎకరాల్లో పత్తి పంటతో పాటు మొక్కజొన్న, కంది, మిరప, పసుపు పంటలను వందల ఎకరాల్లో సాగు చేయనున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. పంట మార్పిడి విధానానికి స్వస్తి ఏటా పంట మార్పిడి విధానం పాటించాలంటూ వ్యవసాయ అధికారులు అవగాహన కల్పిస్తున్నా రైతుల్లో మాత్రం మార్పు రావడం లేదు. భూమిలో ఎప్పుడూ ఒకే రకం పంట వేయడం ద్వారా భూసారం తగ్గి దిగుబడిపై ప్రభావం చూపుతుంది. ఆధునిక పద్ధతులతో వ్యవసాయం రాకముందు గ్రామాల్లో ఖరీఫ్లో వరి పంట సాగు చేసి రబీ సీజన్లో ఆరుతడి పంటలను సాగు చేస్తుండేవారు. కానీ, ప్రస్తుతం రెండు సీజన్లలో కేవలం వరి పంటను మాత్రమే సాగు చేస్తున్నారు. ఎల్నినో ప్రభావంతో.. ఈసారి సాధారణ వర్షాపాతం కంటే తక్కువగా పడే అవకాశం ఉందని ప్రభుత్వం, వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. జూన్, జూలై మాసాల్లో సమృద్ధిగా వర్షాలు కురిస్తేనే వరి పంటలు సాగు చేసుకునే అవకాశం ఉంటుందని రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ క్రమంలో తక్కువ సమయంలో పంట వచ్చే స్వల్పకాలిక వరిని ఎంచుకోవాలని, తద్వారా రైతులకు నష్టం జరిగే అవకాశం ఉండదని అధికారులు చెబుతున్నారు. ఖరీఫ్లోనూ ఆరుతడి పంటలు సాధారణంగా ఆరుతడి పంటలు తక్కువ నీటితోనే సాగు చేస్తుంటారు. వేసవికాలంలో తక్కువ నీరు ఉండటం, పంట చేతికందే సమయానికి సాగు నీరు అందకపోవడంలాంటివి జరుగుతుంటాయి. ఈ క్రమంలో వేసవికాలం సీజన్లో మాత్రమే ఆరుతడి పంటలు సాగు చేసేవారు. కానీ, ఈసారి ఖరీఫ్ సీజన్లో ఆరుతడి పంటలను సాగు చేసుకోవాలంటూ అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ఎల్నినో వరి సాగుపై ప్రభావం చూపుతుందని, ఈ క్రమంలో వరి కాకుండా పెసర, మినుములు, కంది, టమాట, తీగజాతి కూరగాయ పంటలు, ఆకుకూరలు పండిండచమే మేలని పేర్కొంటున్నారు.మంథనిరూరల్: వర్షాకాలం సీజన్లో రైతులు ప్రత్యామ్నాయ పంటలు వేసేలా కసరత్తు చేస్తున్నారు. సమృద్ధిగా వర్షాలు కురిసే అవకాశాలు తక్కువగా ఉండడంతో ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకోవాలంటూ ప్రభుత్వం, వ్యవసాయ అధికారులు సూచిస్తున్నా ఆ దిశగా రైతులు అడుగులు వేస్తారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏటా వానాకాలం సీజన్లో అత్యధికంగా వరి సాగు చేయడం అలవాటుగా మారింది. కనీసం పంట మార్పిడి లేకుండానే వరి సాగు చేస్తున్నారు. అయితే ఈసారి ఎల్నినో ప్రభావం ఉంటుందని, ఈ క్రమంలో ఆరుతడి, స్వల్ప కాలిక వరి పంటలు సాగు చేసుకోవాలంటూ వ్యవసాయ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. -
ఆస్పత్రుల ప్రైవేట్ ఆర్మీ!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స సమయంలో ఏదైనా జరగరానిది జరిగి, రోగులు ఆందోళన చేస్తే పోలీసులు వచ్చి ఇరువర్గాలతో మాట్లాడి ఫిర్యాదులు తీసుకుంటారు. వీలును బట్టి కేసులు నమోదు చేయడం లేదా హెచ్చరించి వదిలేయడం చూస్తుంటాం. ఇది చట్టబద్ధంగా జరిగే ప్రక్రియ. కానీ.. కరీంనగర్లో కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు చట్టాన్ని దాటి ఒకడుగు ముందుకేశాయి. ప్రైవేటు ఆస్పత్రుల ప్రొటెక్షన్ ఆర్మీ పేరిట ప్రత్యేక దళాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. ఆస్పత్రుల్లో ఏదైనా విపత్కర పరిస్థితులు ఏర్పడినప్పుడు ఈ ఆర్మీకి వెంటనే సమాచారం వెళ్తుంది. వెంటనే ఈ ఆర్మీ రంగప్రవేశం చేస్తుంది. రోగులతో మాట్లాడటం, వారిని ఆందోళన చేయకుండా వారిని నయానో, భయానో బెదిరించి ఆస్పత్రి ప్రాంగణాన్ని ఖాళీ చేయించడం వీరి ప్రాథమిక విధిగా పెట్టుకున్నారు. ఈ ప్రైవేటు ఆస్పత్రుల రక్షక దళం విషయంలో కరీంనగర్ జిల్లాలో ప్రాక్టీస్ చేస్తున్న వైద్యులు రెండుగా చీలిపోయారు. కొందరు ఈ ఆర్మీని సమర్థిస్తుండగా.. ఇది వైద్యుల వృత్తి ధర్మానికి విరుద్ధమని, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఇలాంటి వారిని నియమించడం చట్టానికి వ్యతిరేకమని కుండబద్దలు కొడుతున్నారు. సీపీ మందలింపు ప్రైవేటు హాస్పిటల్స్ ప్రొటెక్షన్ ఆర్మీ పేరుతో ప్రత్యేక దళం ఏర్పాటు విషయం నిఘా వర్గాల ద్వారా పోలీసులకు తెలిసింది. సీపీ కార్యాలయం, ఏసీపీ కార్యాలయాలు ఐఎంఏ ప్రతినిధులను పిలిచి ఆర్మీపై వివరణ కోరగా.. వారు తమకు ఎలాంటి సమాచారం లేదని, తాము కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. చట్టానికి విరుద్ధంగా ఏర్పడిన ఈ ఆర్మీ కొనసాగడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. దీంతో సదరు ఆర్మీని నిర్వహిస్తున్న రెండు ప్రముఖ ఆసుపత్రుల వైద్యులకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. శాంతి భద్రతల సమస్యలను పరిష్కరించేందుకు పోలీసులు ఉండగా.. ప్రైవేటు హాస్పిటల్స్ ప్రొటెక్షన్ ఆర్మీ పేరుతో సెటిల్మెంట్లు చేయడమేంటి? అని పోలీసులు నోటీసుల్లో అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై వెంటనే వివరణ ఇవ్వాలని, ఇలాంటి ఆర్మీల ఏర్పాటు చట్టవిరుద్ధమని నోటీసుల్లో స్పష్టంచేశారు.నోటీసులు ఇచ్చాం ప్రైవేటు హాస్పిటల్స్ ప్రొటెక్షన్ ఆర్మీ విషయం మా దృష్టికి వచ్చింది. ఈ విషయంలో ఐఎంఏ ప్రతినిధులతోపాటు, ఈ ఆర్మీని నిర్వహిస్తున్న వైద్యులతో మాట్లాడాం. ఆసుపత్రుల్లో సమస్యలు తలెత్తితే పోలీసులు, ఐఎంఏ ప్రతినిధులు, ఇతర ప్రభుత్వ విభాగాలతో సమన్వయ కమిటీని రూపొందించుకోవాలని సూచించాం. ఎవరికి వారు ప్రైవేటు ఆర్మీని ఏర్పాటు చేసుకోవడం తగదని, వెంటనే ఆర్మీని నిలిపివేయాలని ఆదేశించాం. – గౌస్ ఆలం, సీపీ, కరీంనగర్ ఎందుకు పుట్టిందీ ఈ ఆర్మీ? కొంతకాలంగా కొన్ని ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్సలో తప్పులు జరిగాయని, వైద్యుల నిర్లక్ష్యంతో రోగులు చనిపోయారంటూ వారి బంధువులు ఆందోళనకు దిగడం చూస్తూ ఉన్నాం. వైద్యుల తప్పు లేకుంటే ఆసుపత్రుల నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేసి రక్షణ కోరతారు. కానీ, ఆసుపత్రుల తప్పులు ఉంటే.. రోగుల బంధువులకు తృణమో, పణమో ఇచ్చి వివాదాన్ని సర్దుమణిగింపజేస్తారు. ఇకపై ఆసుపత్రుల్లో వైద్యం వికటించినా, చికిత్స సమయంలో రోగి మరణించినా, ఫీజు విషయంలో వివాదం చెలరేగినా.. రోగుల బంధువులను అదుపు చేసేందుకు ప్రత్యేకంగా హాస్పిటల్స్ ప్రొటెక్షన్ ఆర్మీని రూపకల్పన చేశాయి. ఇందులో పలు ఆసుపత్రులు నిర్వహిస్తున్న దాదాపు 40 నుంచి 50 మంది వైద్యులు దీనికి మద్దతు తెలిపారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ఈ ఆలోచనను తోసిపుచ్చింది. ఇది వైద్య వృత్తికి, ప్రమాణాలకు పూర్తి విరుద్ధమని తేల్చిచెప్పింది. అయినా, వీరు మాత్రం ఆర్మీని ఏర్పాటు చేసుకున్నారు. ఇటీవలకాలంలో రెండు ఘటనల్లో చికిత్స పొందుతూ మృతిచెందిన రోగుల కుటుంబాలను ఆందోళన చేయకుండా బెదిరించి పంపినట్లు తెలిసింది. -
ఆరోగ్యకర జీవనానికి ‘హ్యాపీ సండే’
కోల్ సిటీ(రామగుండం): ప్రజల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిని పెంపొందించేందుకు ‘హ్యాపీ సండే’ కార్యక్రమం ఉపయోగపడుతుందని రామగుండం మేయర్ మహంకాళి స్వామి అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా ఆదివారం నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు. మార్చిలో గోదావరినది పరిసరాల్లో శుభ్రత కార్యక్రమం చేపట్టిన అనంతరం హ్యాపీ సండేను ఘనంగా నిర్వహించామని గుర్తుచేశారు. ప్రస్తుతం ప్రజలు డిజిటల్ స్క్రీన్లకు ఎక్కువగా అలవాటు పడటంతో యోగా, క్రీడలు వంటి ఆరోగ్యకర కార్యక్రమాల్లో పాల్గొనడం తగ్గుతోందన్నారు. దీంతో అనారోగ్య సమస్యలు పెరిగి ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు. ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన పెరుగుతోందని, నగరంలోని మైదానాల్లో వ్యాయామం, వాకింగ్ చేసే వారి సంఖ్య పెరగడం శుభపరిణామమన్నారు. రామగుండాన్ని ఆరోగ్యవంతమైన నగరంగా తీర్చిదిద్దే లక్ష్యానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. డిప్యూటీ మేయర్ పాతపెల్లి ఎల్ల య్య మాట్లాడుతూ, అభిదృద్ధి, సంక్షేమంతో పాటు ప్రజల ఆరోగ్యం కూడా ముఖ్యమనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోందన్నారు. యోగా ప్రదర్శన, కబడ్డీ, మ్యూజికల్ చైర్ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. అదనపు కలెక్టర్, కమిషనర్ జె.అరుణశ్రీ, టీపీఎస్ నవీన్, సూపరింటెండెంట్ పబ్బాల శ్రీనివాస్, సీనియర్ అసిస్టెంట్ పాల్, ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్ మధుకర్, మెప్మా టీఎంసీ మౌనిక, యోగా గురు గణేశ్, వ్యాయామ ఉపాధ్యాయులు శోభారాణి, తిరుపతి, దావీద్ తదితరులు పాల్గొన్నారు. -
పోలీసులపై నమ్మకం పెంచాలి
కోర్టు కానిస్టేబుళ్లను సన్మానిస్తున్న సీపీ, అధికారులు శ్రీలతను సన్మానిస్తున్న సీపీ అంబర్ కిశోర్ ఝా గోదావరిఖని: బాధితులకు తరఫున ఉంటూ నేరస్తులకు శిక్షపడేలా కృషిచేసి పోలీస్ వ్యవస్థపై ప్రజ ల్లో నమ్మకం, విశ్వాసం పెంపొందించాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా సూ చించారు. సీపీ కార్యాలయంలో శనివారం కోర్టు లై జనింగ్ పోలీస్ అధికారులతో నేరాలు, కేసులు, శిక్షలపై సమీక్షించారు. అనంతరం పలు కేసుల్లో నేరాలు రుజువు చేయడంలో కీలకపాత్ర పోషించిన కోర్టు డ్యూటీ సిబ్బంది, లైజనింగ్ అధికారులను సీపీ శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ(అడ్మిన్) శ్రీనివాస్, వర్టికల్ ఇన్చార్జి సీఐ చంద్రశేఖర్గౌడ్, సీసీఆర్బీ సీఐ అనిల్కుమార్, బాబురావు, ఎస్ఐ వినీత తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు ఆలిండియా పోలీస్ స్పోర్ట్స్ మీట్ యోగాలో ప్రతిభ చూపిన కానిస్టేబుల్ శ్రీలతను సీపీ అంబర్ కిశోర్ ఝా సన్మానించారు. గోదావరిఖని ఏసీపీ రమేశ్, కమాన్పూర్ ఎస్ఐ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మత్తు పదార్థాలను నిర్మూలిస్తాం మత్తు పదార్థాల నిర్మూలనకు ప్రత్యే క బృందాలను ఏర్పాటు చేస్తున్న రామగుండం సీపీ అంబర్ కిశోర్ ఝా తెలిపారు. తన చాంబర్లో పాత్రికేయులతో కాసేపు మాట్లాడారు. సీఐ ఆధ్వర్యంలో ఇప్పటికే రెండు యాంటీ నార్కోటిక్ బృందాలు పనిచేస్తుండగా, వాటికి అదనంగా ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. మత్తు పదార్థాల గురించి తెలిస్తే వెంటనే 87126 56597 నంబరుకు సమాచారం అందించాలని కోరారు. కాగా, కేసీఆర్ కాలనీలో శనివారం రాత్రి సీపీ ఆధ్వర్యంలో నిర్బంధ తనిఖీలు చేశారు. పోలీస్ అధికారులు ఉన్నారు. -
కెమెరా చూస్తోంది!
పెద్దపల్లిరూరల్: నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసు శాఖ ఆధునిక సాంకేతికతతో ముందుకు సాగుతోంది. గతంలో కొన్ని నేరాల్లో సరైన ఆధారాలు లభించక నేరస్తులను పట్టుకోవడంలో పోలీసు అధికారులకు సవాల్గా ఉండేది. ఆధునిక సాంకేతికత అందుబాటులోకి వచ్చిన తర్వాత పెద్దపల్లిలోని ప్రధాన రహదారులతో పాటు ముఖ్యమైన కాలనీలు, గల్లీల్లోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వీటిని దాతల సహకారంతో అందుబాటులోకి తీసుకొచ్చేలా ప్రోత్సహించడం సత్పలితాలనే ఇస్తోంది. కేసుల ఛేదనలో.. కొంతకాలం క్రితం పెద్దపల్లిలోని పాతబజార్లో గల ఓ నగల దుకాణానికి పట్టగొలుసులు కొనుగోలు చేసేందుకు వెళ్లిన మహిళలు.. వెండి అభరణాలను ఎత్తుకెళ్లారు. ఆభరణాలు మాయమయ్యాయని గుర్తించిన షాపు యజమాని వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ ఫుటేజీలు పరిశీలించిన పోలీసులు.. నిందితుల జాడ కొనుగోలు చేసి అదుపులోకి తీసుకున్నారు. ఇలా అనేక నేరాలను సీసీ కెమెరాల ద్వారా పోలీసులు ఛేదించారు. నిందితులను అదుపులోకి తీసుకోవడంలో సత్ఫలితాలు సాధిస్తున్నారు. దాతలకు ప్రోత్సాహం జిల్లా కేంద్రంతోపాటు వివిధ గ్రామాల్లోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు విస్తతంగా అవగాహన కల్పిస్తున్నారు. అంతేకాదు.. దాతల సహకారంతో ముఖ్యప్రాంతాల్లో ఏర్పాటు చేసేలా చొరవ చూపుతున్నారు. పెద్దపల్లిలోని ప్రధాన రోడ్లు, కూడళ్లలో హైఫ్రీకెన్వ్సీ గల కెమెరాలు ఉండడంతో నేరస్తుల ఆగడాలకు కళ్లెం వేసినట్టు అయింది. ట్రాఫిక్ కూడళ్లలోనూ.. పెద్దపల్లి పట్టణంలోని ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద నిబంధనలను ఉల్లంఘించే వాహనదారులను గుర్తించి కౌన్సెలింగ్ ఇస్తున్నారు. కొన్నిసందర్భాల్లో జరిమానా విధిస్తున్నారు. దీంతో నిబంధనలు అతిక్రమించేందుకు వాహనదారులు సాహసించడం లేదు. జిల్లా కేంద్రంలో 135 సీసీలు జిల్లాకేంద్రమైన పెద్దపల్లిలో ఇప్పటివరకు 70 సీసీ కెమెరాలు నిఘాలో పాలుపంచుకోగా.. రిక్రియేషన్ క్లబ్ ప్రధాన కార్యదర్శి కొట్టె సదానందం, కౌన్సిలర్ ఇల్లందుల రజని– కృష్ణమూర్తి, రంగు శ్రీనివాస్ తదితరుల సహకారంతో ఇటీవల మరో 65 సీసీ కెమెరాలను బుధవారం (ఈనెల3న) ప్రభుత్వ విప్ విజయరమణారావు, రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా ప్రారంభించిన విషయం విదితమే. డీజీపీ కార్యాలయం నుంచి పర్యవేక్షణ జిల్లా కేంద్రాలు, ప్రధాన నగరాలు, పట్టణాలు, పోలీస్స్టేషన్లలో అమర్చిన సీసీ కెమెరాలను హైదరాబాద్లోని డీజీపీ కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్కు అనుసంధానం చేశారు. ఆయా ప్రాంతాల్లో జరిగే ఘటనలను ఉన్నతాధికారులు నిత్యం పర్యవేక్షించేందుకు వీలుగా ఈ ఏర్పాటు చేశారు. ముఖ్యమైన ఘటనల సమగ్ర సమాచారాన్ని అధికారులు నేరుగా పర్యవేక్షించేందుకు అవకాశం ఉండేలా ఏర్పాట్లు చేశారు. తమగోడు చెప్పుకుని ఫిర్యాదు చేసేందుకు ఠాణాలకు వచ్చేవారితోనూ పోలీసు అధికారులు, సిబ్బంది వ్యవహరించే తీరును ఉన్నతాధికారులు పర్యవేక్షించేందుకు ఆస్కారం దీని ద్వారా ఉంటుంది. మరిన్ని ఏర్పాటు చేయిస్తా నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల పాత్రకీలకంగా ఉంది. ఆధునిక సాంకేతికత అందుబాటులోకి వచ్చింది. వ్యాపారులు, ఆర్థికంగా ఉన్నవారు తమ కాలనీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి. రాంపల్లి, చందపల్లిలోని డబుల్బెడ్రూమ్ ఇళ్లకాలనీల్లోనూ వీటి ఏర్పాటుకు నిధులు కేటాయిస్తాం. – విజయరమణారావు, ప్రభుత్వ విప్ -
ఆకలి తీర్చేలా.. హాజరు పెంచేలా
పెద్దపల్లి: జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ల్లో ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులు పేద, మధ్య తరగతి వర్గాలకు చెందినవారే. వీరు ఉదయం పూట అల్పాహారం లేదా భోజనం చేయడం చాలా అరుదు. అప్పటికే కాలేజీ సమయం సమీపిస్తుండడంతో చాలామంది పస్తులతోనే కళాశాలలకు చేరు కుంటున్నారు. మధ్యాహ్నం ఇళ్లకు వెళ్లి భోజనం చేసి మళ్లీ తరగతులకు హాజరు కావడం సాహసంతో కూడుకున్నది. ఒకవేళ ఇళ్లకు వెళ్లిన విద్యార్థులు మళ్లీ కాలేజీలకు హాజరు కాలేకపోతున్నారు. తద్వారా హాజరు శాతం కూడా పడిపోతోంది. వీటన్నిటికీ పరిష్కారం చూపుతూ రాష్ట్ర ప్రభుత్వం సర్కారు జూనియర్ కాలేజీల్లోనూ మధ్యాహ్నం భోజనం అందించాలని నిర్ణయించింది. ఎస్సీ, ఎస్టీ బీసీ, మైనార్టీల్లోని పేద విద్యార్థుల కోసం ఇప్పటికే మోడల్ స్కూళ్లు, కేజీబీవీలు, మహాత్మా జ్యోతిబా పూలేతోపాటు పలు హాస్టళ్ల మాదిరిగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని నిర్ణయించింది. జిల్లాలో పదివేల మందికిపైగా లబ్ధి జిల్లాలో 14 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. ఇందులో బాలికల కోసం ప్రత్యేక కాలేజీలూ నిర్వహిస్తున్నారు. ఇంటర్లో ప్రస్తుతం ప్రథమ, ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు దాదాపు పది వేల మందికిపైగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. గతేడాది ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణారావు సౌజన్యంతో సుల్తానాబాద్ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు ప్రత్యేకంగా మధ్యాహ్నం భోజనం అందజేశారు. హాజరు మెరుగుపడేలా.. పేద విద్యార్థులు కళాశాలలకు గైర్హాజరవుతున్నారని ప్రభుత్వం గుర్తించింది. హాజరు శాతం పెంచడంతోపాటు మధ్యాహ్న భోజనం అందిస్తే ఆకలి తీరి విద్యార్థుల ఉత్తీర్ణత శాతం సైతం పెరుగుతుందని భావిస్తోంది. ఇటీవల అధికారులు నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెలుగులోకి రావడంతో ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. తద్వారా 2026– 27 విద్యా సంవత్సరం నుంచే మధ్యాహ్నం భోజన పథకం ప్రారంభించేలా అధికారులు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వ కాలేజీల్లోనే చేరాలి ప్రభుత్వ కళాశాలల్లో చేరాలని ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణారావు కోరుతున్నారు. ఈమేరకు ప్రచార పోస్టర్ను ఆయన ఇటీవల ఆవిష్కరించారు. సర్కారు కాలేజీల్లో చదివే విద్యార్థులకు నోట్బుక్స్ ఉచితంగా పంపిణీ చేస్తున్నామని, పీఈసెట్, నీట్, జేఈఈ మెయిన్స్ తదితర పోటీ పరీక్షలకు ప్రథమ సంవత్సరం నుంచే ఉచితంగా కోచింగ్ ఇస్తున్నామని వివరించారు. జూనియర్ కాలేజీల్లో ‘మధ్యాహ్న భోజనం’ ఈ విద్యా సంవత్సరం నుంచే అమలుకు నిర్ణయం పది వేల మందికి పైగా విద్యార్థులకు ప్రయోజనం -
బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేస్తే జరిమానా
కోల్సిటీ: బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేస్తే జరిమానా విధించాలని రామగుండం మేయర్ మహంకాళి స్వామి సూచించారు. నగరంలోని 56వ డివిజన్లో డిప్యూటీ మేయర్ పాతపెల్లి ఎల్లయ్య, కార్పొరేటర్ కొమ్ము స్వప్న– వేణుతో కలిసి శనివారం ఆయన పర్యటించారు. మేయర్ మాట్లాడుతూ, ఇళ్లనుంచి వెలువడే చెత్తే కాలువల్లో ఎక్కువగా కనిపిస్తోందని, పరుపులు, టైర్లు, ఇతర వస్తువులు కూడా పడవేస్తుండడంతో మురుగునీరు సాఫీగా వెళ్లడం లేదన్నారు. తద్వారా వర్షాకాలంలో నివాసాల్లోకి వరద వస్తోందని, లోతట్టు ప్రాంతాల్లో వరద ముప్పు నివారించడానికి రూ.కోట్లు ఖర్చు పెట్టి డ్రెయిన్లు నిర్మిస్తున్నా ప్రయోజనం లేకుండా పోతోందని తెలిపారు. చెత్త బయట పడవేయకుండా మెప్మా ఆర్పీలు, స్వశక్తి మహిళలు ఇంటింటా అవగాహన కల్పించాలని కోరారు. స్పెషల్ డ్రైవ్ ద్వారా తిలక్నగర్లోని మేజర్ నాలాలో పూడిక తొలగించారు. కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు, నగరపాలక సంస్థ టీపీఎస్ నవీన్, సూపర్వైజర్ సంపత్, మెప్మా సిబ్బంది పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత యైటింక్లయిన్కాలనీ: పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతని మేయర్ మహంకాళి స్వామి అన్నారు. సింగరేణి ఎన్సీవోఏ క్లబ్లో నిర్వహించిన క్లస్టర్స్థాయి ప్రత్యేక వార్డు సభ్యుల సమావేశంలో డిప్యూటి మేయర్ పాతిపెల్లి ఎల్లయ్యతో కలిసి మాట్లాడారు. వర్షాకాలంలో రోడ్లపై నీటినిల్వలు లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రతీడివిజన్లో ఇంకుడుగుంతలు ఏర్పాటు చేయాలన్నారు. ఏమెనా సమస్యలు ఉంటే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. కార్సొరేటర్లు, క్లస్టర్లు, మున్సిపల్ అధికారులు, వార్డు ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు. -
రోడ్ల అభివృద్ధిపై సమీక్ష
గోదావరిఖని: రామగుండం నియోజకవర్గంలో రహదారుల అభివృద్ధి, ఆధునికీకరణ, మెరుగైన రవాణా సౌకర్యం కల్పన లక్ష్యంగా ఎమ్మెల్యే రాజ్ఠాకూర్ శనివారం హైదరాబాద్ ఎర్రమంజిల్లోని రోడ్లు, భవనాల శాఖ ప్రధాన కార్యాలయంలో సమీక్షించారు. ఆర్ అండ్ బీ ఇంజినీర్ ఇన్ చీఫ్(ఈఎన్సీ) మోహన్నాయక్ అధ్యక్ష తవహించారు. రామగుండంలో కొనసాగుతున్న రోడ్ల అభివృద్ధి, ప్రతిపాదిత రహదారుల నిర్మాణం, మరమ్మతు, విస్తరణకు నిధుల కేటాయింపుపై చర్చించారు. ఎమ్మెల్యే రాజ్ఠాకూర్ మాట్లాడుతూ, మెరుగైన రవాణా సౌకర్యం కల్పించేందుకు చర్యలు చేపట్టాలని కోరారు. పెరిగిన ఎరువుల ధరలు పెరిగిన ధరల వివరాలు(రూ.లలో) ఎరువు ప్రస్తుత ధర కొత్త ధర కాంప్లెక్స్ 1,900 2,450 ఎంవోపీ 1,850 1,975 ఎస్ఎస్పీ 615 1,000 పెద్దపల్లి: వర్షాకాలం ప్రారంభానికి ముందే ఎరువుల ధరలు భారీగా పెరిగాయి. ఇది తమకు ఆర్థికంగా భారమేనని రైతులు ఆందోళన చెందుతున్నారు. యాసంగిలో అధిక దిగుబడి రావడంతో ఉత్సాహంగా ఉన్న అన్నదాతలు.. వానాకాలంలో వరి, పత్తి, మొక్కజొన్న పండించేందుకు సిద్ధమయ్యారు. కానీ, పెరిగిన ఎరువుల ధరలతో అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తుందని ఆవేదన చెందుతున్నారు. పశ్చిమాసియాలొ నెలకొన్న యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో ముడిపదార్థాల ధరలు పెరుగుదల ఎరువులపై పడిందని అంటున్నారు. ఒక్కో బ్యాగుపై రూ.125 నుంచి రూ.500 వరకు పెరిగిందని వ్యాపారులు చెబుతున్నారు. తద్వారా జిల్లా రైతులపై ఈ ఒక్క సీజన్లోనే సుమారు రూ.100 కోట్ల వరకు భారం పడుతుందని అంటున్నారు. యూరియా, డీఏపీ ధరలను పెంచకపోవడం అన్నదాతలకు కాస్త ఊరటనిచ్చే విషయం. జీవ వైవిధ్యాన్ని పరిరక్షించాలి ముత్తారం: జీవవైధ్య పరిరక్షణతో భవితరాలకు ఆరోగ్యమైన పర్యవరణం అందుతుందని మంథని అటవీశాఖ రేంజర్ వినయ్నాయక్ అన్నారు. పారుపల్లి పెద్దచెరువు వద్ద శనివారం నిర్వహించిన బర్డ్ వాక్స్, వైల్డ్లైఫ్ అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. పక్షుల సంరక్షణలో ప్రజల భాగస్వామ్యం కీలకమన్నారు. వన్యప్రాణులు, పక్షులు, జీవవైధ్యం ప్రాధన్యతపై స్థానికులకు అవగాహన కల్పించాలని బీట్ అధికారులకు సూచించారు. సర్పంచ్ చోప్పరి సంపత్, డిప్యూటీ రేంజర్ తిరుపతి, బేగంపేట సెక్షన్ ఆఫీసర్ నహిదా, రహమ్తుల్లా, అమీరుద్దీన్, బీట్ అధికారులు మేఘరాజ్, రాంసింగ్, మాధురి, రంజిత, బయాలజిస్ట్ చంద్రకాంత్ తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛ పెద్దపల్లికి సహకరించాలి పెద్దపల్లిరూరల్: పట్టణంలో స్వచ్ఛత, పరిశుభ్రత పాటించి స్వచ్ఛ పెద్దపల్లిగా తీర్చిదిద్దేందుకు ప్రజలు సహకరించాలని మున్సిపల్ చైర్మన్ నూగిల్ల మల్లయ్య కోరారు. జిల్లా కేంద్రంలోని భూంనగర్కాలనీలో శనివారం ఆయన పర్యటించారు. కాలనీ సమస్యల గురించి స్థానికులను అడిగి తెలుసుకున్నారు. డ్రైనేజీలు లేక నీరు నిలిచే ప్రాంతాల్లో అత్యవసరంగా కచ్చాకాలువ నిర్మించేలా చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. కొత్తగా ఇంటి నిర్మాణం చేసేవారు తప్పనిసరిగా సెట్బ్యాక్ నిబంధనలు పాటించాలని సూచించారు. వార్డు ఆఫీసర్ అశ్విత, శానిటరీ ఇన్స్పెక్టర్ రామ్మోహన్రెడ్డి, ప్రతినిధులు జయరాజ్, శంకర్, భూమేశ్, నరేశ్, సంపత్ ఉన్నారు. -
రెస్క్యూ సిబ్బందికి అభినందన
గోదావరిఖని: అంతర్జాతీయ రెస్క్యూ పోటీల్లో స త్తా చాటిన సింగరేణి రెస్క్యూని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శనివారం అభినందించారు. హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో సీఎండీ బుద్ధ ప్రకాశ్ జ్యోతి, డైరెక్టర్ వెంకటేశ్వర్లు, రెస్క్యూ జీఎం శ్రీనివాస్రెడ్డి, జీఎం (కో ఆర్డినేషన్) శ్రీనివాస్, రెస్క్యూ సూపరింటెండెంట్ రాజేందర్రెడ్డి పాల్గొన్నారు. నేడు కోల్బెల్ట్కు హరీశ్రావు గోదావరిఖని: టీబీజీకేఎస్ నిర్వహించ నున్న సింగరేణి పరిరక్షణ సదస్సుకు మాజీమంత్రి హరీశ్రావు ఆదివారం కోల్బెల్ట్ ప్రాంతానికి రానున్నారు. ఎన్టీపీసీలోని శ్రీమయి కన్వెన్షన్ హాల్లో నిర్వహించే సదస్సుకు హాజరవుతారు. యూనియన్ గౌరవ అధ్యక్షుడు కొప్పుల ఈశ్వర్, అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డితోపాటు పెద్దసంఖ్యలో యూనియన్ శ్రేణులు హాజరుకానున్నారు. -
నేలకు సారం.. దిగుబడి అధికం
మంథనిరూరల్: పంట దిగుబడిలో పచ్చిరొట్ట పా త్ర అంత్యంత కీలకం. పంటకాలం ముగిశాక భూసారం పెంచుకుని మంచి దిగుబడి కోసం పచ్చిరొట్టను పొలాల్లో వేసుకునేందుకు ప్రభుత్వం ప్రోత్సాహం కూడా అందిస్తోంది. వానాకాలం సాగుకు సన్నద్ధమవుతున్న క్రమంలో రైతులకు జీలుగ, జనుము విత్తనాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో పీఏసీఎస్లు, ఆగ్రో కేంద్రాల ద్వారా విత్తనాలు పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టింది. రసాయన ఎరువుల వినియోగం తగ్గించేలా.. ఆధునిక పద్ధతుల్లో వివిధ పంటలు పండిస్తున్న అన్నదాతలు.. రసాయన ఎరువులను సైతం ఎక్కువగానే వినియోగిస్తున్నారు. అధికారుల సూచనలు పాటించకపోవడం, మోతాదుకు మించి రసాయనాలు వాడటం, పంట అవశేషాలను పొలాలు, చేన్లలోనే కాల్చివేయడంతో సారవంతమైన భూము ల్లో సైతం దిగుబడి అంతంత మాత్రంగానే వస్తోంది. ముఖ్యంగా పంట మార్పిడి విధానం పాటించకపోవడం కూడా దిగుబడిపై ప్ర భావం చూపుతోందని అధికారులు చెబుతున్నారు. ఈక్రమంలో భూమిలో సారం పెంచేలా వ్యవసాయ అధికారులు రైతులకు అవగాహన కల్పి స్తూ పచ్చిరొట్ట వినియోగించుకునేలా చర్యలు చేపట్టారు. 50 శాతం రాయితీపై విత్తనాలు వానాకాలం సాగుకు సన్నద్ధమవుతున్న నేపథ్యంలో రైతులకు 50శాతం రాయితీపై జీలుగ, జనుము విత్తనాలను అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జిల్లాలోని మంథని మండలానికి 500 క్వింటాళ్ల జీలుగ విత్తనాలను అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు. జీలుగ కిలో రూ.163.50 ఉండగా రాయితీపై రూ.81.75, జనుము కిలోకు రూ.155.50 ఉండగా రాయితీపై రూ.77.75కు అందించనున్నారు. ఇందులో 30 కిలోల బ్యాగులు ఉంటాయని వ్యవసాయ అధికారులు తెలిపారు. జీలుగ విత్తనాలు కావాల్సిన రైతులు పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్ జిరాక్స్లతో వ్యవసాయాధికారి కార్యాలయంలో సంప్రదించాలని వారు రైతులకు సూచించారు. ఇవీ ప్రయోజనాలు అవగాహన కల్పిస్తున్నాం వానాకాలం సాగు సిద్ధమవుతున్న రైతులు పచ్చిరొట్ట ఎరువును వినియోగించుకునేలా అవగాహన కల్పిస్తున్నాం. ఇప్పటికే జీలుగ విత్తనాలను అందుబాటులో ఉంచాం. ప్రతీరైతుకు విత్తనాలు అందించేలా చర్యలు తీసుకుంటున్నాం. పచ్చిరొట్ట వినియోగంతో అనేకలాభాలు ఉన్నాయి. ముఖ్యంగా భూమిసారం పెరిగి అధిక దిగుబడి వచ్చే అవకాశం ఉంది. రైతులు సద్వినియోగం చేసుకోవాలి. – నవ్య, మండల వ్యవసాయ అధికారి, మంథనిపచ్చిరొట్టతో అనేక ప్రయోజనాలు -
మూడు రోజుల్లో ధాన్యం తరలింపు పూర్తి
పెద్దపల్లి/పెద్దపల్లిరూరల్: నియోజకవర్గంలోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తూకం పూర్తయినా.. గోదాముల తరలింపులో అక్కడక్కడా కొంత జాప్యం జరిగిందని, మూడురోజుల్లోగా తరలింపు ప్రక్రియ పూర్తవుతుందని ప్రభుత్వ విప్ విజయరమణారావు అన్నారు. పట్టణ శివారు చీకురాయిరోడ్డులోని గోదాములో ధాన్యం నిల్వలను శుక్రవారం ఆయన పరిశీలించి మాట్లాడారు. ఈ సమస్య పెద్దపలి, కాల్వశ్రీరాంపూర్ మండలాల పరిధిలోనే ఉందన్నారు. ధాన్యం తరలింపు కోసం అవసరమైన లారీలు, హమాలీల కొరతను అధిగమించేందుకు అధికారులు సహకరించాలని కోరారు. మొక్కల కొనుగోళ్ల ప్రక్రియ పూర్తయిందని, రైతుల ఖాతాకు డబ్బులు సైతం జయచేశామని తెలిపారు. మున్సిపల్ చైర్మన్ మల్లయ్య, లారీ అసోసియేషన్ నాయకులు అబ్దుల్బారీ, తిరుపతి, శ్రీనివాస్, సతీశ్, సీఐలు ప్రవీణ్, రంజిత్ తదితరులు పాల్గొన్నారు. పెద్దమ్మతల్లి ఆశీస్సులతో సుభిక్షంగా ఉండాలి కాల్వశ్రీరాంపూర్: పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలు సుభిక్షంగా ఉండాలని ప్రభుత్వ విప్ విజయరమణారావు ఆకాంక్షించారు. గంగారం గ్రామంలోని పెద్దమ్మతల్లి ఆలయంలో ఆయన ప్రత్యేక ప్రత్యేకపూజలు చేశారు. ముదిరాజ్ కులస్తులు ఆయనను శాలువాలతో సన్మానించారు. సర్పంచ్ రేకుల జ్యోతి, ఉప సర్పంచ్ మేడి అశోక్గౌడ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గాజనవేన సదయ్య, ముదిరాజ్ కులస్తులు పాల్గొన్నారు. -
పర్యావరణ పరిరక్షణకు పురస్కారాలు
ఎలిగేడు: పర్యావరణ పరిరక్షణలో ఉత్తమ పనితీరు ప్రదర్శించిన సుల్తాన్పూర్ గ్రామపంచాయతీకి రాష్ట్రప్రభుత్వం అవార్డు ప్రకటించగా.. శుక్రవారం హైదరాబాద్లో సర్పంచ్ కవ్వంపల్లి బాపయ్య, పంచాయతీ కార్యదర్శి జూపాక శివకుమార్ పురస్కా రం అందుకున్నారు. పర్యావరణ దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీ రాష్ట్రసాయిలో ఉత్తమంగా ఎంపికై న విషయం విదితమే. ఈమేరకు హైదరాబాద్లో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ, అతిథుల నుంచి వారు అవార్డు అందుకున్నారు. ఉపర్పంచ్ తానిపర్తి రమేశ్రావు, వా ర్డు సభ్యులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఎన్టీపీసీ ధన్వంతరి ఆస్పత్రికి..జ్యోతినగర్: ఎన్టీపీసీ ధన్వంతరి ఆస్పత్రి పర్యావ రణ అవార్డు అందుకుంది. పర్యావరణ పరిరక్షణ, సుస్థిర పద్ధతులకు చేసిన కృషికి గుర్తింపుగా ఎన్టీపీసీ – తెలంగాణ ప్రాజెక్టుకు చెందిన ధన్వంతరి ఆస్ప త్రి నిర్వాహకులను కాలుష్య నియంత్రణ మండలి అవార్డుతో సత్కరించారు. మంత్రి కొండా సురేఖ ఈ పురస్కారాన్ని డాక్టర్ లహరికి అందజేశారు. వైద్యులను, సిబ్బందిని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చందన్ కుమార్ సామంత అభినందించారు. అవార్డు అందుకున్న సుల్తాన్పూర్ సర్పంచ్ ధన్వంతరి ఆస్పత్రికి కూడా పురస్కారం -
నిర్వాసితులతో సమావేశం
రామగిరి: సింగరేణి ఆర్జీ–3 ఓసీపీ–2 విస్తరణ కో సం 2015లో అక్కేపల్లి, లద్నాపూర్, రచ్చపల్లిలో భూసేకరణ కోసం అవార్డు పాస్ చేశారు. కొందరు రైతులు మెరుగైన పరిహారం కోసం హైకోర్టుకు వెళ్లా రు. ఈమేరకు శుక్రవారం సెంటినరీకాలనీ సీఎన్సీవోఏ క్లబ్లో లోక్ అదాలత్ ద్వారా సమావేశం నిర్వహించారు. రెండు గ్రామాల నుంచి రైతులు, సర్పంచులు, న్యాయవాదులు హాజరై మెరుగైన పరిహారం చెల్లింపుపై చర్చించారు. కమిటీ చైర్మన్, సింగరేణి ఎస్టేట్స్ జనరల్ మేనేజర్ లక్ష్మీపతిగౌడ్ అధ్యక్షత వ హించారు. కోర్టు ఆదేశాల మేరకు మెరుగైన పరిహా రం అందిస్తామని, సమస్య పరిష్కారమయ్యేలా ని ర్వాసితులు సహకరించాలని కోరారు. ఆర్జీ–3 జీ ఎం మధుసూదన్, ఫైనాన్స్ జీఎం శ్రీనివాసులు, లా డీజీఎం శిరీషరెడ్డి, ప్రాజెక్ట్ ఆఫీసర్ రాజశేఖర్, ఫైనాన్స్ డీజీఎం సురేఖ, ఎస్టేట్స్ అధికారులు తేజా వత్ హీర్యా, శ్రీనివాస్, ఐలయ్య పాల్గొన్నారు. -
విద్యార్థులకు ఆత్మవిశ్వాసం ముఖ్యం
జ్యోతినగర్: బాలికలు విజయం సాధించడం కోసం విద్య, ఆత్మ విశ్వాసం, పట్టుదల ఎంతో ముఖ్యమని ఎన్టీపీసీ ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చందన్ కుమార్ సామంత అన్నారు. ఎన్టీపీసీ పర్మినెంట్ టౌన్షిప్ కాకతీయ ఆడిటోరియంలో బాలికా సాధికారత మిషన్–2026 ముగింపు కార్యక్రమం శుక్రవారం జరిగింది. దీప్తి మహిళా సమితి అధ్యక్షురాలు రాఖీ సామంతతో కలిసి ఆయన మాట్లాడా రు. ఎన్టీపీసీ బాలికల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు నెలరోజుల పాటు అత్యుత్తమ శిక్షణ అందించిందన్నారు. ఇందులో ప్రతిభ కనభర్చిన 10 మంది విద్యార్థులకు ఉచిత విద్య కూడా అందించనున్నామని ఆయన వెల్లడించారు. అనంతరం విద్యార్థులకు ప్రశంసపత్రాలను అందించారు. శిక్షణ పొందిన పలు అంశాలను విద్యార్థులు ప్రదర్శించారు. కమాన్పూర్, రామగుండం, అంతర్గాం, పాలకుర్తి మండలాలకు చెందిన 140 మంది విద్యార్థులు శిక్షణలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, ఉద్యోగులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణకు కృషి పర్యావరణ పరిరక్షణకు ఎన్టీపీసీ కృషి చేస్తోందని ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చందన్ కుమార్ సామంత అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా బాలికా సాధికారత మిషన్–2026లో శిక్షణ పొందుతున్న విద్యార్థినులతో కలిసి ప్రభాత భేరికి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం మొక్కలు నాటి మాట్లాడారు. -
అవయవదానంపై అవగాహన
‘రక్తదానం చేయండి.. ప్రాణదాతలు అవ్వండి.. అవయవదానం చేయండి.. మరోసారి జీవించండి.. శరీరదానం చేద్దాం.. వైద్యవిద్య అధ్యయనానికి చేయూతనిద్దాం.. బ్రెయిన్ డెడ్ అయితే అవయదానం చేసి పునర్జన్మనివ్వండి’ ఇలాంటి నినాదాలు బాగానే ఉన్నా ఆచరణకు నోచుకోవడంలేదు. మనిషి తలరాత ఎలా ఉన్నా.. గోడలపై రాతలతోనైనా మనుషుల్లో పరివర్తన వస్తుందని అవయవదానంపై అవగాహనకు శ్రీకారం చుట్టింది రామగుండం మున్సిపాలిటీ. ప్రమాదవశాత్తు మరణించిన వారి శరీరదానాలు, అవయవ దానాల ప్రాముఖ్యతను తెలియజేస్తూ గోదావరిఖని జనరల్ ప్రభుత్వ ఆస్పత్రి(జీజీహెచ్) పోస్ట్మార్టం గోడలపై బొమ్మలు గీసి చైతన్య పరచడం ‘సాక్షి’ కెమెరాకు కళారూపంలో కనిపించింది. – సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి -
‘రాజన్న’కు సేవకులు కావలెను
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: దక్షిణ కాశీగా పేరొందిన ఎములాడ రాజన్న సేవకు ఉద్యోగుల కొరత వేధిస్తోంది. కోరిన కోరికలు తీర్చే ఇలవేల్పుగా పేరొందిన వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి సన్నిధానంలో సిబ్బంది కొరత పనిభారానికి కారణమవుతోంది. కనీసం వారాంతంలో సెలవు దొరికే అవకాశం కూడా కొన్నిసార్లు దక్కకపోవడం ప్రస్తుత పరిస్థితికి నిదర్శనం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ఆలయంలో క్యాడర్ స్ట్రెంత్ ప్రకారం మొత్తం 320 రెగ్యులర్ పోస్టులు ఉండగా, ప్రస్తుతం కేవలం 185 మంది మాత్రమే విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. దాదాపు 135 పోస్టులు ఖాళీగా ఉండటంతో ఉన్న సిబ్బందిపైనే అదనపు భారం పడుతున్నట్లు తెలుస్తోంది. అర్చకుల విభాగంలోనే సుమారు 35 పోస్టులు ఖాళీగా ఉండగా, లాస్ట్ గ్రేడ్ సర్వీస్ (ఎల్జీఎస్) విభాగంలో దాదాపు 60 పోస్టులు భర్తీ కాలేదు. జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్ విభాగాల్లో 10 పోస్టులు, డ్రైవర్ విభాగంలో 3 పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఉద్యోగ సంఘాలు పేర్కొంటున్నాయి. ఔట్ సోర్సింగ్లోనూ ఇదేతీరు ఇక ఔట్సోర్సింగ్ సిబ్బంది పరిస్థితి ఇందుకు భిన్నంగా లేదని అంటున్నారు. మొత్తం 290 ఔట్సోర్సింగ్ పోస్టులకు గాను ప్రస్తుతం 250 మంది మాత్రమే పనిచేస్తుండగా, మరో 40 పోస్టులు ఖాళీగా ఉన్నాయని సమాచారం. ఈ పరిస్థితుల్లో భక్తులకు సేవలు అందించడమే కాకుండా, నిత్య కై ంకర్యాలు, పరిపాలనా కార్యక్రమాలను నిర్వహించడం ఉద్యోగులకు సవాలుగా మారిందని సిబ్బంది వాపోతున్నారు. మరోవైపు పదవీ విరమణ పొందిన ఒక ఏఈవోను అకౌంట్స్ అధికారిగా కొనసాగిస్తుండగా, సంవత్సరాలుగా ఔట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న ఉద్యోగులకు మాత్రం రెగ్యులరైజేషన్ లేదా పదోన్నతుల విషయంలో స్పష్టత లేకపోవడంతో ఆలయ ఉద్యోగ సంఘాలు ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. సిబ్బంది కొరత కారణంగా ఉద్యోగులు వారానికి ఒక రోజు సెలవు కూడా తీసుకోలేని పరిస్థితి నెలకొన్నదని, అనేక మంది నిరంతర విధులు నిర్వర్తించడం వల్ల మానసిక, శారీరక ఒత్తిడికి గురవుతున్నారని ఉద్యోగ సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సెలవులు మంజూరు చేయడంలో ఇబ్బందులు తలెత్తడంతో కుటుంబ జీవితం కూడా ప్రభావితమవుతోందని వారు పేర్కొంటున్నారు. రాజన్న భక్తుల రద్దీ రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ఖాళీ పోస్టులను తక్షణమే భర్తీ చేయకపోతే భవిష్యత్తులో ఆలయ సేవల నిర్వహణపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని ఉద్యోగ సంఘాలు హెచ్చరిస్తున్నాయి. ప్రభుత్వం, దేవాదాయశాఖ అధికారులు వెంటనే స్పందించి ఖాళీల భర్తీపై చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు.పోస్టుల వివరాలు మొత్తం క్యాడర్ పోస్టులు : 320 ప్రస్తుతం పనిచేస్తున్న వారు: 185ఖాళీగా ఉన్న పోస్టులు : 135ఖాళీల్లో ఉన్న అర్చక పోస్టుల సంఖ్య: 35లాస్ట్ గ్రేడ్ సర్వీస్ పోస్టులు సుమారుగా : 60 జూనియర్ అసిస్టెంట్ , రికార్డ్ అసిస్టెంట్ల పోస్టులు: 10 డ్రైవర్ పోస్టులు : 3మొత్తం ఔట్ సోర్సింగ్ పోస్టులు: 290ప్రస్తుతం పనిచేస్తున్న వారి సంఖ్య: 250ఔట్ సోర్సింగ్లో ఖాళీ పోస్టులు: 40 -
వర్షం కురిసింది.. తూకం ఆగింది
కాల్వశ్రీరాంపూర్: రోహిణి కార్తెలో వర్షాలు కురుస్తాయని, ధాన్యం త్వరగా తూకం వేసి రైస్మిల్లులకు తరలించాలని అన్నదాతలు నెత్తీనోరు బాదుకున్నా అధికారులు, నిర్వాహకులు నిర్లక్ష్యం చేశారు. రైతులు భయపడినట్లే గురువారం సాయంత్రం హఠాత్తుగా కురిసిన వర్షానికి కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసి ముద్దయ్యింది. ఆయా ప్రాంతాల్లో బురద పేరుకుపోవడంతో లారీలు వెళ్లలేకపోయాయి. దీంతో శుక్రవారం ధాన్యం తూకం ఆగిపోయింది. ఏం చేయాలో దిక్కుతోచక రైతులు అయోమయంలో పడ్డారు. ధాన్యం కుప్ప నుంచి వర్షపు నీటిని తొలగిస్తున్న రైతుకూనారంలో వరదనీటిలో కొట్టుకు పోయిన ధాన్యం -
నకిలీపై నజర్
సాక్షి పెద్దపల్లి: వానాకాలం సాగుకు సమయం ఆసన్నమైంది. జిల్లాలో 2,78,290 ఎకరాల్లో రైతులు వివిధ పంటలు సాగు చేస్తారని అధికారులు అంచనా వేశారు. రోహిణి కార్తెలో దుక్కులు దున్నడం వంటి పనులు చేస్తూ సాగుకు సిద్ధమవుతున్నారు. ఈ సీజన్లో చా లామంది పత్తి, మొక్కజొన్న, వరి అధికంగా సాగు చేస్తుంటారు. ఇదేసమయంలో అనుమతి లేనివిత్తనాలు, బీటీ–3 విత్తనాలు, నకిలీ విత్తనాలను వ్యాపారులు మార్కెటింగ్ చేసుకోవడానికి రంగంలోకి దిగారు. రంగురంగుల ప్యాకెట్లలో నింపి రైతులకు అంటగట్టే పనిలోపడ్డారు. పల్లెల్లో స్థానికులను ఏజెంట్లుగా నియమించి నకిలీ విత్తనాలను అంటగడుతున్నారు. కంపెనీ పేరు, చిరునామా లేకుండా మంచివని, అధిక దిగుబడి ఇస్తాయని నమ్మబలుకుతున్నారు. ఈ నేపథ్యంలో రైతులు విత్తనాలు, ఎ రువుల కొనుగోళ్లలో జాగ్రత్తలు పాటించాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. టాస్క్ఫోర్స్ బృందాలతో అన్నదాతలను నిండా ముంచుతున్న నకిలీ విత్తనాలు, ఎరువుల వ్యాపారులపై టాస్క్ఫోర్స్, పోలీసులు, వ్యవసాయశాఖాధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లా, డివిజన్, మండల స్థాయిల్లో కమిటీలు ఏర్పాటు చేసి దుకాణాలు, గోదాముల్లో తనిఖీలు చేస్తున్నారు. మండలానికో టాస్క్ఫోర్స్ కమిటీ చొప్పున ఏర్పాటు చేసి.. వ్యవసాయ, పోలీ సు అధికారులు, సీడ్ సర్టిఫయింగ్ ఆఫీసర్ (ఏసీసీవో) ఉండనున్నారు. నకిలీ విత్తనాలను విక్రయిస్తున్నట్లు తేలితే బాధ్యులపై పీడీ యాక్ట్ నమోదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. అధికారులు దాడులు చేస్తున్నా.. ప్రతీసీజన్లో అధికారులు దాడులు చేస్తున్నా కొంద రు డీలర్లు అధిక డబ్బుకు ఆశపడి నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు విక్రయిస్తున్నారు. వీరికి అడ్డుకట్ట వేసేందుకు డీలర్లందరూ క్రయవిక్రయాలు, స్టాక్ సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీచేసింది. విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసినప్పుడు తప్పనిసరిగా రసీదు తీసుకోవాలని, ప్యాకెట్లపై తయారీ, మొలకశాతం, జన్యు స్వచ్ఛత తదితర విషయాలను పరిశీలించాలని అధికారులు అన్నదాతలకు సూచిస్తున్నారు. విత్తన ఎంపికలో జాగ్రత్త.. లైసెన్స్డ్ డీలర్ల నుంచే విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు కొనుగోలు చేయాలని, డీలర్ల సంతకంతో కూడిన రసీదు తీసుకోవాలని సూచించారు. కొనుగోలు చేసిన తేదీ, విత్తన రకం, పరిమాణం, ధర, లాట్ నంబర్ తదితర వివరాలు పూర్తిస్థాయిలో నమోదు చేయించుకుని సరిచూసుకోవాలని సలహా ఇస్తున్నారు. రంగు రంగుల ప్యాకెట్లను చూసి మోస పోవద్దని, కంపెనీ విశ్వసనీయత, విత్తనాల నాణ్య త, మొలక శాతం వివరాలను పరిశీలించుకోవాలని వివరిస్తున్నారు. విత్తనాలు కొనుగోలు చేసి సాగు చే సిన తర్వాత ఖాళీ విత్తనాల సంచులను పంట చేతికొచ్చే చివరిదశ వరకు జాగ్రత్తగా భద్రపరచాలని సూచిస్తున్నారు. సీజన్ ప్రారంభం అవుతుండడంతో కొందరు బిల్లులు లేకుండా తక్కువ ధరలకు వి త్తనాలు అమ్ముతుంటారని, వారిపై వ్యవసాయ, పోలీసు అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు. విత్తన మార్కెట్ను పెంచడం, అధికంగా విత్తనాలు అమ్మకం కోసం వివిధ కంపెనీలు వ్యాపారులకు బహుమతులు, టూర్లు ఆఫర్లను ప్రకటిస్తుండడంతో పలువురు వ్యాపారులు, డీలర్లు నకిలీ వ్యాపారం వైపు మొగ్గుచూపే అవకాశాలుంటాయని, అప్రమత్తంగా ఉండాలని వివరిస్తున్నారు. జిల్లా సమాచారం డీలర్లు 350 సీడ్ ప్రాసెసింగ్ యూనిట్లు 6 సబ్సిడీ విత్తన విక్రయ కేంద్రాలు 51 సాగు విస్తీర్ణం(ఎకరాల్లో) 2,78,290 కఠిన చర్యలు తప్పవు జిల్లాలో నకిలీ విత్తనాలు విక్రయించే యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటాం. రైతులు విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసేటప్పుడు తప్పకుండా రసీదు తీసుకోవాలి. జిల్లాలో నకిలీ విత్తనాలను సరఫరా చేస్తున్నట్ల మా దృష్టికి వస్తే పీడీ యాక్ట్ ప్రయోగించడంతో పాటు కఠిన చర్యలు తీసుకుంటాం. ఈవిషయంలో రైతులు అప్రమత్తంగా ఉండాలి. – శ్రీనివాస్, డీఏవో -
పర్యావరణాన్ని కాపాడాలి
పెద్దపల్లిరూరల్: పర్యావరణాన్ని కాపాడుకోవడంలో అందరూ భాగస్వాములు కావాలని అ దనపు జిల్లా జడ్జి స్వప్నరాణి అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శుక్ర వారం జిల్లా కోర్టు సముదాయంలో జూనియర్ జడ్జి మంజులతో కలిసి మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతీఒక్కరు తమవంతుగా సహకరించాలని జడ్జి సూచించారు.విరివిగా మొక్కలు నాటాలి పెద్దపల్లి: పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటాలని సుల్తానాబాద్ జూనియర్ సివిల్ జడ్జి గణేశ్ కోరారు. కోర్టులో జడ్జి మొక్కలు నాటి మాట్లాడారు. సుల్తానాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వొడ్నాల రవీందర్, ప్రధాన కా ర్యదర్శి ఆవు నూరి సత్యనారాయణ, వైస్ ప్రెసిడెంట్ ఆవుల శివకృష్ణ, ఏజీపీ ఆంజనేయులు, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. టెన్త్ సప్లిమెంటరీ ప్రశాంతం పెద్దపల్లి: జిల్లాలో పదో తరగతి అడ్వాన్స్డ్ స ప్లిమెంటరీ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతు న్నాయని డీఈవో శారద శుక్రవారం తెలిపారు. తెలుగు పరీక్షకు 43 మందికి 33 మంది విద్యార్థులు హాజరయ్యారని డీఈవో పేర్కొన్నారు. మైనర్లకు వాహనాలివ్వొద్దు పెద్దపల్లిరూరల్: రోడ్డు భద్ర త నియమాలు పాటించాలని, ముఖ్యంగా మైనర్లకు వా హనాలు ఇవ్వొద్దని ట్రాఫిక్ సీఐ శ్రీనివాస్ అన్నారు. తమ పిల్లలకు వాహనాలు ఇచ్చిన తల్లిదండ్రులపై చర్యలు తీసుకుంటామని హె చ్చరించారు. జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రమాదాల నియంత్రణకు రోడ్డు సేఫ్టీ నిబంధనలు పాటించాలనే విషయమై అరైవ్.. అలైవ్ పేరిట అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. మద్యం మత్తులో వాహనాలను నడిపి ప్రమాదాలకు కారకులు కావొద్దని ఆయన సూచించారు.ఘనంగా మాస కల్యాణం కమాన్పూర్: ప్రసిద్ధ శ్రీఆదివరాహస్వామి స న్నిధిలో శుక్రవారం మాస కల్యాణం వైభవంగా జరిపించారు. భక్తులు భారీ సంఖ్యలో తర లివచ్చారు. కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమి టీ చైర్మన్ ముస్త్యాల దామోదర్, ఈవో కాంతారెడ్డి, డైరెక్టర్ తీగల రాజయ్య పాల్గొన్నారు. రేపు బీఆర్ఎస్ సమావేశం పెద్దపల్లి: బీఆర్ఎస్ పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశం ఈనెల 7 వ తేదీన నిర్వహించనున్నట్లు ఆ పార్టీ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి తెలిపా రు. మధ్యాహ్నం 2 గంటలకు రంగంపల్లి మె యిన్ రోడ్డులోని తిరుమల గార్డెన్లో నిర్వహించనున్నామని, మాజీ మంత్రి హరీశ్రావు ము ఖ్య అతిథిగా హాజరవుతారన్నారు. పార్టీ బలో పేతం, భవిష్యత్ కార్యాచరణ, సంస్థాగత అంశాలపై చర్చించనున్నట్లు వివరించారు. సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరారు. సమస్యలు పరిష్కరిస్తాంఫెర్టిలైజర్సిటీ: చైతన్యపురిని సమస్యల రహిత కాలనీగా తీర్చిదిద్దుతామని రామగుండం మే యర్ మహంకాళి స్వామి అన్నారు. 22వ డివిజన్ చైతన్యపురి కాలనీలో ఆయన శుక్రవారం స్వామి పర్యటించారు. మురుగునీటి కాలువల్లో చెత్త తొలగింపు పనులు పరిశీలించారు. కా ర్యక్రమంలో కార్పొరేటర్లు కన్నూరి భాగ్యలక్ష్మి, వడ్లూరి రవి, డిప్యూటీ కమిషనర్ వెంకటస్వా మి, నాయకుడు సతీశ్ పాల్గొన్నారు. సామర్థ్యం మెరుగుపర్చుకోవాలిగోదావరిఖని: నేర పరిశోధనలో నైపుణ్యం, కచ్చితత్వం పెంపు కోసం దర్యాప్తు సామర్థ్యా న్ని మెరుగుపర్చుకోవాలని అడిషనల్ డీసీపీ(అడ్మిన్) శ్రీనివాస్ సూచించారు. శుక్రవారం రా మగుండం పోలీస్కమినరేట్లో ఏర్పాటు చేసి న సమావేశంలో మాట్లాడారు. సాంకేతిక పరి జ్ఞానానికి అనుగుణంగా నేరాలను త్వరితగతి న ఛేదించేందుకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. -
తేలు బుద్ధి
అడవిలో ఒకతేలు ఆకలితో పడుకున్నది కదలలేక మెదలలేక కన్నీరును ఒలుకుతుండే అది చూసిన ఓ కోడి ఆహారం దొరికిందని పరుగు పరుగున అచటి కొచ్చి ముక్కుతోని పొడవ చూసే ప్రాణ భయంతో తేలు కోడి బావ కోడి బావ ఒక్కమాట చెబుతాను ఆలకించుమని కోరే నాకు ఆరోగ్యం బాగులేదు ఆహారం అసలు దొరకలేదు నాతో స్నేహంగా ఉండి చూడు హాని చేయబోను ఎవరికెపుడు తేలు మాట నమ్మి కోడి తన ఇంటికి తీసుకెళ్లి ఆహారం తెచ్చి ఇచ్చి ఆతిథ్యం మంచి గిచ్చి చెలిమి తోడ వుండమంటూ సలహాలను మెండు గిచ్చే తనకు దోస్తు దొరికాడని సంబరపడి పోయే కోడి పొద్దు పొద్దు గాలనే కొక్కోర కో అంటూ లేచి తన పిల్లలను చూడ మంటూ బయటకు పోయే తల్లి కోడి బలం పుంజుకున్న తేలు కపట బుద్ధి దాచుకుంటూ కత్తెర చేతులు చాచి కస్సు బుస్సుమని లేచే అమ్మదోస్తు ఈ తేలని ప్రేమగ దరి చేరినాయి పిల్ల కోళ్లు తన తోక కొండి లేపి మరీ చిటుకు చిటుకున కుట్టే తేలు లబో దిబోమంటూ బుజ్జి బుజ్జి పిల్ల కోళ్లు తల్లి చెంతకు పరుగు తీసి బోరుమంటూ ఏడ్వసాగే తేలు బుద్ధి తెలుసుకున్న తల్లికోడి కోపంతో రయ్యిన ఉరుకురికి వచ్చి తెలుపైన ఎగిరి దూకే తన ముక్కుతో తేలును ముక్కలు ముక్కలుగ చీల్చి స్నేహ ద్రోహి దేహాన్ని కసితీరా ఆరగించే... ఎప్పుడైనా ఈ జగాన బుద్ధిలేని ప్రబుద్ధులతో జాగ్రత్తగా మెదలమంటూ తల్లికోడి హితము చెప్పే..! డా.కటుకోఝ్వల రమేశ్ కవి, రచయిత ఖమ్మం జిల్లా -
నిబంధనలకు లోబడే నడుపుతున్నాం
పెద్దపల్లి/పెద్దపల్లిరూరల్: తాము ఇటుకల వ్యాపా రం చేసుకుంటున్నామని, అందుకు అవసరమైన ముడిసరుకులను నిబంధనలకు లోబడే తీసుకుంటున్నామని, అయినా తమపై మట్టిమాఫియా అని నిందారోపణలు చేయడం తగదని ఇటుకబట్టీ య జమానులు శ్యాం, ఆనందరావు, ఆడెపు వెంకటేశం, లక్ష్మణ్రావు, జాఫర్, సిద్దయ్య, కొండయ్య, ప్ర దీ ప్, అవినాష్ తదితరులు అన్నారు. జిల్లా కేంద్రంలో గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇటుకల వ్యా పారంలో అన్నిరాజకీయ పార్టీలకు సంబంధించినవారు ఉన్నారని, వారి రాజకీయాల తో వ్యాపారా నికి సంబంధం లేదన్నారు. గతంలో క్యూబిక్ మీటర్కు రూ.42.85 ఉంటే ఇప్పుడు 12 టైర్ల టిప్పర్కు రూ.3,200 చెల్లించి కలెక్టర్ నుంచి అనుమతి పొందామని తెలిపారు. తాము అధికారు లు, ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులకు డబ్బులు ఇస్తున్నట్టు కొందరు దుష్ప్రచారం సాగిస్తున్నారని, ఇలాంటివి మానుకోవాలని కోరా రు. యజమానులు సుధాకర్, వెంకటేశ్వర్లు, సాగర్రావు, చైతన్య తదితరులు పాల్గొన్నారు. వ్యాపారుల ప్రెస్మీట్.. అధికారుల సైలెంట్! జిల్లాలో కొద్దిరోజులుగా సాగుతున్న మట్టి దందాపై పత్రికల్లో వస్తున్న కథనాలపై వ్యాపారులు ప్రెస్మీ ట్ నిర్వహించడం చర్చనీయాంశమైంది. వాస్తవాని కి మట్టి దందా కథనాలపై అధికారులు స్పందించాలి. తనిఖీలు చేయాలి. ముఖ్యంగా ఇరిగేషన్, రెవె న్యూ, ఆర్టీవోలు క్షేత్రస్థాయిలో పరిశీలించి, అక్రమ రవాణాపై తనిఖీలు చేయాలి. అక్రమాలకు తావులేకుండా తాము తీసుకుంటున్న చర్యల గురించి వివరించాలి. అందుకు విరుద్ధంగా ఇటుకబట్టీ యజమానులు ప్రెస్మీట్ పెట్టి అక్రమాలకు పాల్పడటం లేదని, అధికారులు సక్రమంగానే పనిచేస్తున్నారని ప్రకటించడం ప్రజల్లో చర్చకు దారితీసింది. ఇటుకబట్టీ యజమానుల స్పష్టీకరణ -
తెలుగు అంకెల దండ
1=1 ఒకటి 10¹ = 10 పది 10² = 100 వంద 10³ = 1000 వేయి 104 = 10000 పదివేలు 105 = 100000 లక్ష 106 = 1000000 పది లక్షలు 107 = 10000000 కోటి 108 = 100000000 పది కోట్లు 109 = 1000000000 వంద కోట్లు 1010 = 10000000000 అర్భుదం 10¹¹ = 100000000000 న్యర్భుదం 10¹² = 1000000000000 ఖర్వం 10¹³ = 10000000000000 మహా ఖర్వం 1014 = 100000000000000 పద్మం 1015 = 1000000000000000 మహాపద్మం 1016 = 10000000000000000 క్షోని 1017 = 100000000000000000 మహాక్షోనీ 1018 = 1000000000000000000 శంఖం 1019 = 10000000000000000000 మహా శంఖం 1020 = 100000000000000000000 క్షితి 10²¹ = 1000000000000000000000 మహా క్షితి 10²² = 10000000000000000000000 క్షోభం 10²³ = 100000000000000000000000 మహాక్షోభం ఇలా సున్నాలు చేర్చుతూ పోతే 1024 = నిధి 1025 = మహానిధి 1026 = పరకం 1027 = పరార్థం 1028 = అనంతం 1029 = సాగరం 1030 = అవ్యయం 10³¹ = అమృతం 10³² = ఆచింత్యం 10³³ = అమేయం 1034 = భూరి 1035 = మహాభూరి 10366 = పద్మం 1037 = మహాపద్మం 1038 = ఖర్వం 1039 = మహాఖర్వం 1040= శంఖంఇలా పేర్లు ఉన్నాయి.ఒక సారి రాసి గుర్తుంచుకోండి పిల్లలు.గడప రఘుపతిరావు. ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు. గ్రా: మర్రిగడ్డ, మండలం: చందుర్తి, జిల్లా: రాజన్న సిరిసిల్ల, 9963499282 -
ప్రతీ ఇంటికి యోగా
ఈ రోజుల్లో వయసుతో నిమిత్తం లేకుండా ప్రతీ ఒక్కరు ఒత్తిడి, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కరీంనగర్ జిల్లా యోగా అసోసియేషన్ ద్వారా మేము ప్రతీ ఇంటికి యోగాను తీసుకెళ్లాలని సంకల్పించాం. ప్రతీ ఒక్కరు తమ దినచర్యలో యోగాను భాగం చేసుకోవాలి. కరీంనగర్ యోగా అసోసియేషన్ ఆధ్వర్యంలో 20 ఏళ్లుగా ఎందరో జాతీయ, అంతర్జాతీయస్థాయి క్రీడాకారులను తయారు చేయడం మాకు గర్వకారణం. – నాగిరెడ్డి సిద్దారెడ్డి, యోగా సంఘం జిల్లా అధ్యక్షులు యోగా అనేది అంతర్గత శక్తిని మేల్కొలిపే సాధనం. శరీరానికే కాదు.. మనస్సుకు కూడా వ్యాయామం. ముఖ్యంగా పాఠశాల విద్యార్థులకు యోగా ఎంతో అవసరం. వారిలో ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, మానసిక ప్రశాంతత పెరుగుతాయి. సరైన పద్ధతిలో నిత్యం ప్రాణాయామం, ధ్యానం చేస్తే ఒత్తిడి దూరమై సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుంది. – మల్లిక, యోగా కోచ్ -
కాంగ్రెస్ నిర్వాకంతో అప్పుల ఊబిలో సింగరేణి
● టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షుడు కొప్పుల ఈశ్వర్ గోదావరిఖని: కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వాహకంతోనే సింగరేణి అప్పుల ఊబిలో కూరుకపోయిందని టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షుడు, మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. గురువారం స్థానిక యూనియన్ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సింగరేణిలో కుంభకోణాలు మొదలయ్యాయని ధ్వజమెత్తారు. ప్రభుత్వ సంస్థల బకా యిలు రూ.54వేల కోట్లను వెంటనే సింగరేణికి చెల్లించాలని ఆయన డిమాండ్చేశారు. ప్రభుత్వ మోసాలపై కార్మికులు, వారి కుటుంబాలకు అవగాహన కల్పించేందుకు మాజీమంత్రి హరీశ్రావు ఈనెల 7న గోదావరిఖనికి రానున్నట్లు ఈశ్వర్ తెలిపారు. ఎన్టీపీసీ శ్రీమయి ఫంక్షన్హాల్లో జరిగే సదస్సును విజయవంతం చేయాలని ఆయన కోరారు. మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, టీబీజీకేఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసి రామమూర్తి, కేంద్ర కోశాధికారి చెల్పూరి సతీశ్, బీఆర్ఎస్ నాయకులు నడిపల్లి మురళీధర్రావు, బొడ్డు రవీందర్, కార్పొరేటర్ మేకల సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు. సుల్తాన్పూర్ గ్రామ పంచాయతీకి అవార్డు ఎలిగేడు: సుల్తాన్పూర్ గ్రామ పంచాయతీ ఉత్తమ పర్యావరణ పనితీరు అవార్డుకు ఎంపికై నట్లు పంచాయతీ కార్యదర్శి శివ గురువారం తెలిపారు. వ్యర్థాల నిర్వహణ, పర్యావరణ పరిరక్షణలో విశిష్ట సేవలు అందిస్తున్నందుకు గుర్తించి ఈ అవార్డుకు ఎంపిక చేశారని పేర్కొన్నారు. ఈనెల 5న హైదరాబాద్లో తె లంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో సర్పంచ్ కవ్వంపల్లి బాపయ్య, పంచాయతీ కార్యదర్శి శివకు అవార్డు అందిస్తారని పేర్కొన్నారు. -
రైతులపై ప్రతిపక్షాల కుట్ర
పెద్దపల్లి: రైతులు ఇబ్బందులు పడితే సొమ్ము చేసుకోవాలని ప్రతిపక్షాలు కుట్ర చేస్తున్నాయని ప్రభు త్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు విమర్శించారు. సుల్తానాబాద్ ఆర్యవై శ్య భవన్లో బుధవారం 2, 3, 4, 5 వార్డుల గ్రామసభలు నిర్వహించారు. విప్ మాట్లాడుతూ, రైతులకు మేలు జరిగితే ఓర్వలేక పోతున్నారన్నారు. గ తంలో బస్తాకు 10 కిలోల చొప్పున ధాన్యం కోతలు పెట్టి ముంచిన బీఆర్ఎస్ నేతలు.. ఇప్పుడు రైతులపై మొసలికన్నీరు కార్చుతున్నారని దుయ్యబట్టారు. నియోజకవర్గంలో ఇప్పటివరకు 98శాతం ధాన్యం కొనుగోలు పూర్తిచేసినట్టు చెప్పారు. పంట మార్పిడి పద్ధతి పాటిస్తే భూసారం పెరుగుతుందని అన్నారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులపై అప్ర మత్తంగా ఉండాలని కోరారు. మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధాకృష్ణ, మార్కెట్ కమిటీ చైర్మన్ మినుపాల ప్రకాశ్రావు, సింగిల్విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ రమేశ్, డీఏవో శ్రీనివాస్, తహసిల్దార్ బషీరోద్దీన్ పాల్గొన్నారు. ప్రభుత్వ విప్ విజయరమణారావు -
వర్షం కురిసింది.. ధాన్యం తడిసింది
పెద్దపల్లిరూరల్/పెద్దపల్లి/ఓదెల/కాల్వశ్రీరాంపూ ర్: పొద్దంతా ఉక్కపోతతో జిల్లావాసులను ఉక్కిరిబిక్కిరి చేసిన వాతావరణం.. గురువారం సాయంత్రం ఒక్కసారిగా మారిపోయింది. హఠాత్తుగా కురిసిన వానతో కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసి ముద్దయ్యింది. ఆరబోసి విక్రయిచేందుకు సిద్ధం చేస్తున్న వడ్లు వర్షపునీటిలో కొట్టుకుపోయాయి. ఈదురుగాలలు ధాటికి కొన్నిచోట్ల చెట్లు విరిగి పడడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. చివరిదశలో ధాన్యం, మక్కల కొనుగోలు జిల్లాలోని పలు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం, మక్కజొన్న కొనుగోళ్లు దాదాపు పూర్తయ్యాయి. తూకం వేసిన సంచులను గోదాములకు తరలించేందుకు లారీలురాక వాటిపై టార్పాలిన్లు కప్పేందుకు రైతులు ఇబ్బందులు పడ్డారు. కప్పిన టార్పాలిన్లు సైతం భారీ గాలులకు కొట్టుకు పోయి ధాన్యం సంచులు తడిశాయని రైతులు ఆవేదన చెందారు. పెద్దపల్లి మార్కెట్లో మక్కజొన్నలను లోడ్ చేసిన లారీ తడవకుండా షెడ్లో నిలిపిఉంచగా పైకప్పు కూలి దానిపైనే పడింది. ఆ సమయంలో ఎవరూ లేకపోవడం తో ప్రమాదం తప్పింది. చెట్లు విరిగిపడ్డాయి. మహిళా పోలీస్స్టేషన్లో కారుపై చెట్టు విరిగిపడగా వెంటనే తొలగించారు. పెద్దపల్లి మండలం కొత్తపల్లి కొనుగోలు కేంద్రంలోని ధాన్యం తడిసి ముద్దయ్యింది. కాల్వశ్రీరాంపూర్ మండలం కూనారంలోనూ ధాన్యం వర్షపునీటిలో తడిసి ముద్దయ్యింది. భోజన్నపేట, కనుకులలోనే అధికం పెద్దపల్లి మండం భోజన్నపేట, సుల్తానాబాద్ మండలం కనుకులలోనే అత్యధికంగా 27 మి.మీ. వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు. ఓదెలలో 22మి.మీ., పెద్దపల్లి మండలం రంగంపల్లిలో 14.5మి.మీ., మండల కేంద్రమైన ముత్తారం, సుల్తానాబాద్ మండలం సుగ్లాంపల్లిలో 1.8మి.మీ. చొప్పున వర్షం కురవగా.. కాల్వశ్రీరాంపూర్లో 0.8 మి.మీ. వర్షపాతం నమోదైందని వివరించారు. పొలాల్లోకి చేరిన వర్షపునీరు ఓదెల మండలం గోపరపల్లె, ఓదెల, పొత్కపల్లి, కొలనూర్, నాంసానిపల్లె, మడక, ఇందుర్తి తదితర గ్రామాల్లో అకస్మాత్తుగా కురిసిన భారీవర్షంతో పంట పొలాల్లోకి పెద్దఎత్తున వర్షపు నీరు వచ్చి చేరింది. దీంతో రేగడిభూముల్లో దుక్కులు దున్నటానికి రైతులు సిద్ధమయ్యారు. కాల్వశ్రీరాంపూర్ మండ లం కూనారం, కాల్వశ్రీరాంపూర్, పెగడపల్లి, గంగారం గ్రామాల్లోని ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి రైతులు ఆగమయ్యారు. కూనారంలో టార్పాలిన్ కవర్లు ఇవ్వలేదని ఆరోపించారు. గాలిదుమారానికి టార్పాలిన్ కవర్లు ఎగిరి పోవడంతో కొన్నికేంద్రాల్లో ధాన్యం తడిసింది. కవర్లు ఇచ్చేవారే లేరు కూనారం ఐకేపీ కొనుగోలు కేంద్రంలో టార్పాలిన్ కవర్లు ఇచ్చే వారేలేరు. నిర్వాహకులు రాకపోవడంతో ఒక్కసారిగి వచ్చిన గాలివానకు ధాన్యం తడిసి పోయింది. రైతులపై అందరికీ చిన్నచూపే. – పసుల ఐలు, రైతు, కూనారం జిల్లావ్యాప్తంగా దంచికొట్టిన వాన కొనుగోలు కేంద్రాల్లో నీటమునిగిన వడ్లు లబోదిబోమంటున్న అన్నదాతలు -
బన్నీ వేసవి యాత్ర–25
‘చిప్స్ వద్దు – నువ్వుల ముద్ద, బెల్లం లడ్డు ముద్దు’ ఇంటి బయట బండి: బన్నీ, రామ్ చిప్స్ ప్యాకెట్ కోసం గొడవ. తాతయ్య వాళ్లని దగ్గరకు పిలిచాడు. చుక్క, స్వప్న కూడా వచ్చారు. ‘రోజూ చిప్స్ తింటే పొట్ట నొప్పి, దగ్గు వస్తుంది. బలం ఉండదు’ అన్నాడు తాతయ్య. జేబులో నుంచి నువ్వుల ముద్ద, బెల్లం లడ్డు తీసి అందరికీ ఒక్కొక్కటి ఇచ్చాడు. స్వప్న కొరికింది: ‘అబ్బా తాతయ్య , ఇది చాలా తియ్యగా ఉంది.’ తాతయ్య చెప్పాడు: ‘నువ్వులు ఎముకలకు బలం. బెల్లం రక్తానికి మంచిది. జలుబు రాదు.’ చుక్క అడిగింది: ‘మరి చిప్స్లో ఏముంది?’ తాతయ్య నవ్వాడు: ‘ఉప్పు, నూనె, జబ్బు.’ రామ్ అన్నాడు: ‘ఇక చిప్స్ వద్దు. నానమ్మతో లడ్డు చేయించుకుంటాను.’ తాతయ్య: ‘మన పాత తిండే మనకు మెడిసిన్. ప్యాకెట్ ఫుడ్ కాదు.’ బన్నీ అరిచాడు: ‘చిప్స్ బై బై, నువ్వుల ముద్ద హాయ్ హాయ్!’ పిల్లలకి మాట : ప్యాకెట్ తిండి రుచి కొద్దిసేపు. నానమ్మ చేతి లడ్డు జీవితాంతం ఆరోగ్యం. డాక్టర్ కోట లక్ష్మణ్ ప్రభుత్వ ఉపాధ్యాయులు గ్రామం: కాకర్లపల్లి, మంథని జిల్లా: పెద్దపల్లి -
వ్యాయామ వృత్తి విద్య కోర్సులకు తగ్గుతున్న క్రేజ్
కరీంనగర్స్పోర్ట్స్: కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీలో నాలుగు రోజుల పాటు జరిగిన రాష్ట్ర వ్యాయామ విద్యా ప్రవేశ శారీరక దారుఢ్య (టీజీపీఈసెట్ 2026) పరీక్షలు ముగిశాయి. ఈ పరీక్షల హాజరుశాతం, సీట్ల లభ్యతను పరిశీలిస్తే వ్యాయామ ఉపాధ్యాయ కోర్సులకు క్రేజ్ పడిపోతోందని స్పష్టమవుతోంది. తెలంగాణ ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తున్నట్లే ఖాళీగా ఉన్న పీఈటీ పోస్టుల భర్తీతో పాటు ప్రతి పాఠశాలలో పీఈటీ ఉండేలా చేయాలని పలువురు క్రీడా విశ్లేషకులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. గైర్హాజరుల పరంపర ఈ ఏడాది బీపీఈడీ, డీపీఈడీ కోర్సులకు 3,362 మంది దరఖాస్తు చేసుకోగా 2,435మంది (72.42 శాతం) పరీక్షలకు హాజరయ్యారు. 927 మంది అభ్యర్థులు శారీరక దారుఢ్య పరీక్షలకు రాకపోవడం గమనార్హం. బీపీఈడీ కోర్సుకు మొత్తం 2,386 మంది దరఖాస్తు చేయగా 1,788 మంది హాజరయ్యారు. 598 మంది గైర్హాజరయ్యారు. డీపీఈడీ కోర్సుకు 976 మంది దరఖాస్తు చేయగా 647 మంది హాజరయ్యారు. 329 మంది గైర్హాజరయ్యారు. బీపీఈడీ సీటుకు 1.15 మంది, డీపీఈడీ సీటుకు 2.16 మంది పోటీ ప్రతివంద మందిలో 87 మందికి బీపీఈడీ సీటు ఖాయం కావడం విశేషం. బీపీఈడీ పరీక్షకు హాజరైన అభ్యర్థులు 1,788 మంది కాగా, సీట్లు 1,560 ఉన్నాయి. ప్రతి సీటుకు కేవలం 1.15 మంది మాత్రమే పోటీ పడుతున్నారు. శారీరక దారుఢ్య పరీక్షల్లో క్వాలిఫై అయితే చాలు సీటు ఖాయమనే పరిస్థితి కనిపిస్తోంది. డీపీఈడీ పరీక్షకు హాజరైన అభ్యర్థులు 647 మంది కాగా, సీట్లు 300 ఉన్నాయి. అందుబాటులో ఉన్న సీట్లు హాజరైన అభ్యర్థులలో 46.37 శాతం మందికి సరిపోతాయి. ప్రతి సీటుకు 2.16 మంది పోటీ పడుతున్నారు. వ్యాయామ విద్యపై క్రేజ్ తగ్గడానికి అభ్యర్థుల లోపం కాదు, రాష్ట్రంలో నెలకొన్న విద్యా, క్రీడా విధానాలే కారణమని నిపుణులు తేల్చి చెబుతున్నారు స్కూళ్లలో పీఈటీ పోస్టుల కొరత తెలంగాణలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పీఈటీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇటీవల సుమారు 1,800 పోస్టులు భర్తీ చేస్తామని చెప్పినా యువతలో నమ్మకం కలగక పోవడం విశేషం. తెలంగాణలో ఒ కవైపు యూత్ అండ్ స్పోర్ట్స్ పాలసీ, స్పోర్ట్స్ యూని వర్సిటీ ఏర్పాటు వంటి చర్చలు జరుగుతున్నా పీఈ టీ కోర్సులకు ప్రాధాన్యత లేకపోవడం విడ్డూరం. బీపీఈడీలో హాజరైన 87 శాతం మందికి సీటు వచ్చే అవకాశం కోర్సు అభ్యర్థులు హాజరైనవారు గైర్హాజరు బీపీఈడీ 2,386 1,788 598 డీపీఈడీ 976 647 329 కోర్సు కళాశాలలు అందుబాటులో ఉన్న సీట్లు బీపీఈడీ 15 1,560 డీపీఈడీ 03 300 -
కనిపించని గాయం
మనసులో మిగిలిన మాటలే కనిపించని గాయాలవుతాయి నవ్వుల వెనుక దాగిన బాధ నిశ్శబ్దంగా కన్నీరు కారుస్తుంది ఎవరూ చూడని ఆ వేదన హృదయంలో అలలై ఎగసిపడుతుంది ఒక మాట గుచ్చినప్పుడు గుండె లోతుల్లో ముద్రపడుతుంది కాలం గడిచినా కొన్ని జ్ఞాపకాలు గాయాన్ని మళ్లీ మేల్కొలుపుతాయి బయటకు బలంగా కనిపించినా లోపల మనసు విరిగిపోతుంది ఆత్మీయుల నిర్లక్ష్యం ఆ గాయానికి మరింత నొప్పి ఇస్తుంది ఆశలు చినిగిన ప్రతిసారి మనసు మౌనంగా రోదిస్తుంది కన్నీటి చుక్కలకే తెలుసు ఆ బాధ ఎంత లోతైనదో చెప్పలేని క్షణాలన్నీ గుండెలో గుహలై నిలిచిపోతాయి అయినా జీవితం ముందుకు నడుస్తుంది కొత్త వెలుగులను వెతుకుతూ కనిపించని గాయాలకూ ఒక రోజు మాన్పు అనే ఉదయం వస్తుంది ఆశ అనే చిన్న దీపమే మనసుకు మళ్లీ బలం ఇస్తుంది – నక్క శ్రీకర్ ఊరు: ఊటూరు మానకొండూర్ కరీంనగర్ -
విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన మట్టిలారీ
● లారీని అడ్డుకున్న గ్రామస్తులు ● పోలీసు లాఠీచార్జి చేశారని ఆరోపణ పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి మండలం నిట్టూరు గ్రామంలో బుధవారం రాత్రి మట్టి తరలించే టిప్పర్ ఢీకొనడంతో విద్యుత్ స్తంభం విరిగింది. సమాచారం అందుకున్న సర్పంచ్ భర్త ఆకుల శ్రీనివాస్తోపాటు కొందరు గ్రామస్తులు టిప్పర్ను అడ్డుకున్నారు. స్తంభాన్ని ఢీకొట్టి ఆపకుండా ఎందుకు వెళ్తున్నావని డ్రైవర్ను నిలదీశారు. ఈక్రమంలో ఇరువర్గాల మధ్య మాటామాట పెరిగింది. దీంతో కొందరు టిప్పర్ అద్దాలు పగులగొట్టారు. సమాచారం అందుకున్న రూరల్ ఎస్సై మల్లేశ్, సీఐ ప్రవీణ్కుమార్ తమ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దేందుకు యత్నించారు. మరోవైపు.. ప్రతీరోజు ఇలాగే ఇబ్బందులను సృష్టిస్తున్నారని పోలీసులు తమపై లాఠీచార్జి చేశారని ఆకుల శ్రావణ్, కందుల శ్రీనివాస్ తదితరులు ఆరోపించారు. కాగా, రోడ్లపై లారీలను ఆపి అద్దాలు పగులగొట్టిన పలువురిపై కేసు నమోదు చేసినట్టు సీఐ ప్రవీణ్కుమార్ తెలిపారు. -
మేము గీసిన బొమ్మలు
పేరు: బెల్లంకొండ సహస్త్ర రెడ్డి తరగతి: 7వ తరగతి గ్రామం: నాగారం, మంథని జిల్లా: పెద్దపల్లి పేరు: చిందం విహాన్ తరగతి: యూకేజీ గ్రామం: అలుగునూర్, కరీంనగర్ -
గాలి ఓ మా చిరుగాలి
గాలి గాలి ఓ చిరుగాలి పవనాలుగా నీవిక తేలి నీవస్తావులే మా ఇంటికి నచ్చావులే మా కంటికి ! నీ వల్లే మాకు ఊపిరి ఉంది నీవు లేకుంటే కలుగు ఇబ్బంది మమ్ము అంటిపెట్టుకొని ఉంటావు అవునా కాదా ఇక ఏమంటావు ? నీ సమాధానం ఇక ఏదైనా నీవు లేకుండా పోదు పొద్దైనా ఓ గాలితల్లి మా చిరుగాలి మళ్లీ నీవు లేక ప్రాణం ఉండదులే మళ్లీ చెట్లు ఊగితే నీ ఉనికి తెలుసు అట్లనే చేయకు నీవిక అలుసు బొగ్గు పులుసు గాలి నీలో ఉంది దానితో మాకు కలుగు ఇబ్బంది ! గాలి తల్లి మా చిరుగాలి మల్లి మమ్ము విడిచి ఉండకు నీ వెళ్లి నీవు లేకుండా ఉండదు ఏ గల్లి నీవు వస్తేనే బాగుంటుంది మళ్లీ! గాలి తల్లి ఓ చిరుగాలి మల్లి హోరుగాలితో చేయకు లొల్లి చల్లగా తగిలితే కలుగు హాయి మెల్లెగ మది ఉప్పొంగు నోయి ! – గుర్రాల లక్ష్మారెడ్డి కవి రచయిత కల్వకుర్తి, నాగర్ కర్నూల్ -
సొంతింటి కల.. నెరవేర్చేలా..
సాక్షి పెద్దపల్లి: పేదల సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసమే ఇందిరమ్మ ఇళ్ల పథకం తీసుకొచ్చింది. జిల్లాలో తొలివిడతలో నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇళ్లు కేటాయించింది. వివిధ కారణాలతో అప్పుడు పదుల సంఖ్యలో లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణానికి ఆసక్తి చూపలేదు. వాటిని రద్దు చేసేందుకు అధికారులు ప్రభుత్వానికి సిఫారసు చేశారు. రద్దుచేసిన వాటిని మిగతా పేదలకు కేటాయించేందుకు సర్కారు నిర్ణయం తీసుకుంది. దీనికితోడు తెలంగాణ ఆవిర్భావం సందర్భంగా ప్రతీ నియోజకవర్గానికి మరోరెండు వేల చొప్పున ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తూ నిర్ణయించింది. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీకి సన్నద్ధం అర్హులైన లబ్ధిదారుల ఎంపికతోపాటు పనులు ప్రారంభమైన నాటినుంచి ఇటు ప్రజాప్రతినిధులు, అటు అధికారులు స్వీయ పర్యవేక్షణ చేస్తూ ఇళ్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నారు. ఇంటి నిర్మాణం మొదలైన స్వల్ప వ్యవధిలోనే నిధులు మంజూరై, గృహ ప్రవేశాలు చేస్తుండడం విశేషం. దీనికితోడు ఇప్పటికే నిర్మాణాలు పూర్తయి, పంపి ణీకి సిద్ధంగా ఉన్న డబుల్బెడ్రూమ్ ఇళ్లను సైతం పంపిణీ చేసేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. అసంపూర్తిగా ఉన్న డబుల్బెడ్రూమ్ ఇళ్లను పూర్తిచేసి, విద్యుత్, మంచినీటి, డ్రైనేజీ, రోడ్లు వంటి వసతులు కల్పించాలని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. గతంలో కేటాయించిన వాటిల్లో అనర్హులు ఉంటే తొలగించి, అర్హులకు కేటాయించేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో అనేకఏళ్లుగా సొంతింటి కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారుల కల ఫలించనుంది. పంపిణీకి సిద్ధంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లు రెండోవిడతలో 2 వేల చొప్పున ఇందిరమ్మ ఇళ్లు కేటాయింపు శరవేగంగా సాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు జిల్లాలో ఇప్పటికే పలుచోట్ల గృహ ప్రవేశాలు పూర్తి -
లారీ ఢీకొని యువకుడి మృతి
రామగిరి: పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్లలో జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. కల్వచర్లకు చెందిన మారుపాక రమేశ్(36) సింగరేని ఆర్జీ–3 ఏరియా ఓసీపీ–1లో ప్రైవేట్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. తన వ్యక్తిగత పనుల నిమిత్తం గురువారం పెద్దపల్లికి వెళ్తుండగా కల్వచర్ల హనుమాన్ అలయం వద్ద ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. తీవ్రగాయాలు కావడంతో స్థానికులు సెంటినరీకాలనీ డిస్పెన్సరీకి తరలించగా చికిత్స పొందుతు మృతి చెందాడు. మృతుడికి భార్య శ్యామల, కుమార్తె హర్షిత, కుమారుడు వైభవ్ ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. -
పునాది లేని చోట శిఖరాలు ఎలా సాధ్యం?
మనం 2036 ఒలింపిక్స్లో పతకాలు సాధించాలని కలలు కంటున్నాం. కానీ ఒలింపియన్లను తయారు చేసే ప్రాథమిక కేంద్రాలైన పాఠశాలల్లోనే పీఈటీలు లేకపోవడం దారుణం. పాఠశాల స్థాయిలోనే ప్రతిభను గుర్తించకపోతే అంతర్జాతీయ స్థాయి అథ్లెట్లు ఎలా వస్తారు. బీపీఈడీ, డీపీఈడీ కోర్సులకు పూర్వ వైభవం రావాలంటే పీఈటీ పోస్టులను భర్తీ చేయాలి. – దూడం రమేశ్, రిటైర్డ్ ఫిజికల్ డైరెక్టర్ తెలంగాణ ఏర్పడిన తర్వాత క్రీడలకు పెద్దపీట వేస్తామన్నారు. క్షేత్రస్థాయిలో స్కూళ్లలో పీఈటీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రెగ్యులర్ డీఎస్సీ ద్వారా నోటిఫికేషన్లు రాకపోవడం వల్లే విద్యార్థులు బీపీఈడీ, డీపీఈడీ కోర్సుల వైపు రావడానికి భయపడుతున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం తెలంగాణలోని అన్ని ప్రభుత్వ, మోడల్, గురుకుల పాఠశాలల్లో ఉన్న వ్యాయామ ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలి. – కంకటి అనూప్ కుమార్, కరీంనగర్ జిల్లా ప్రైవేట్ పీఈటీల సంఘం ప్రతినిధి -
బీజేపీ కోసం కలిసి పనిచేద్దాం
సుల్తానాబాద్రూరల్: కాషాయ జెండా కోసం కలిసి పనిచేద్దామని ఎమ్మెల్సీ మల్క కొము ర య్య అన్నారు. నర్సయ్యపల్లి గ్రామంలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న ప్రశిక్షణ కార్యక్రమానికి గురువారం ఎమ్మెల్సీ మల్క కొముర య్య హాజరై మాట్లాడారు. తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే అని, దానికి అనుగుణంగా కార్యకర్తలు, నాయకులు సైనికుల్లా పనిచేయా లని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయ కులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నిబంధనలు పాటించాలి పెద్దపల్లిరూరల్: డ్రైవర్లు రోడ్డు భద్రత నియ మావళిపై అవగాహన పెంచుకోవాలని ట్రాఫిక్ సీఐ శ్రీనివాస్ సూచించారు. జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ప్రాంతంలో ఆటో, కారు, డీసీఎం త దితర వాహన డ్రైవర్లకు గురువారం అవగాహన కల్పించారు. పోలీసుశాఖ ఇప్పటికే అరైవ్..అలైవ్ ద్వారా అనేక కార్యక్రమాలను నిర్వహించిందని ఆయన తెలిపారు. మద్యం తాగి వాహనాలను నడపొద్దని, అతివేగం, నిర్లక్ష్యపు డ్రై వింగ్తోనే అనేక ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని తెలిపారు. కుటుంబసభ్యుల భవిష్యత్ను దృష్టిలో ఉంచుకుని నిబంధనలకు లో బడి డ్రైవింగ్ చేయాలని సూచించారు. ఈ కా ర్యక్రమంలో ఎస్ఐ రవీందర్, ఏఎస్ఐ రవి, వేణుగోపాల్తో పాటు సిబ్బంది శ్రీనివాస్, మ ల్లేశ్, వేణు, వినయ్ తదితరులు పాల్గొన్నారు. కానిస్టేబుల్కు అభినందన కమాన్పూర్(మంథని): కమాన్పూర్ పోలీస్ స్టేషన్లోని కానిస్టేబుల్ కూరపాటి శ్రీలతను డీజీపీ కార్యాలయంలో గురువారం డీజీపీ సీవీ ఆనంద్, ఐజీ గజారావ్ భూపాల్ అభినందించారు. గతనెల 23 నుంచి 27వ తేదీ వరకు హరియాణ రాష్ట్రంలోని కర్నాల్ వచ్చేర్ స్టేడియంలో నిర్వహించిన మూడో ఆల్ ఇండియా పోలీస్ యోగా పోటీల్లో తెలంగాణ నుంచి ఎంపికై న శ్రీలత అత్యంత ప్రతిభ కనబర్చి కాంస్య పతకం సాధించిన విషయం విదితమే. 9న జాబ్మేళా పెద్దపల్లి: జిల్లాలోని నిరుద్యోగుల కోసం ఈ నెల 9న జాబ్మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి రాజశేఖర్ తెలిపారు. ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో లోన్ ఆఫీసర్, కస్టమర్ రిలేషన్ అసోసియేట్ పోస్టులు భర్తీ చేస్తారని ఆయన పేర్కొన్నారు. ఎంపికైనవారు పెద్దపల్లి, కరీంనగర్, మంచిర్యాల, హుజూరాబాద్, జనగాం, నల్గొండ, మిర్యాల గూడ, సూర్యాపేట, నర్సంపేట, పరకాల, మహబూబాబాద్, నిజామాబాద్, ఆదిలాబాద్, బోధన్, ఇచ్చోడ, ఆర్మూర్, నిర్మల్ ప్రాంతాల్లో పనిచే యాల్సి ఉంటుందని, 19 నుంచి 25ఏళ్ల మధ్య వయసుగలవారు అర్హులన్నారు. వివరాలకు 89853 36947, 81212 62441 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని ఆయన కోరారు. రెస్క్యూ రికవరీలో ప్రాఽథమిక శిక్షణ గోదావరిఖని: రెస్క్యూ రికవరీలో ప్రాథమిక శి క్షణ కోసం భూగర్భగనుల్లో పనిచేస్తున్న కార్మి కుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని రెస్క్యూ జీఎం శ్రీనివాస్రెడ్డి తెలిపారు. వృత్తిప రమైన భద్రత, పనిపరిస్థితుల ప్రకారం గను ల్లో భద్రతప్రమాణాలు మరింత బలోపేతం చేయడానికి తీసుకున్న పరిపాలన చర్యల్లో భాగంగా రెస్క్యూ శిక్షణ పొందిన సిబ్బంది సంఖ్యను పెంచడానికి నిర్ణయించామని పేర్కొ న్నారు. 21 నుంచి 40ఏళ్ల వయసులోపు ఉండి, కనీసం టెన్ట్ ఉత్తీర్ణత సాధించినవారు అర్హులన్నారు. వీరికి ప్రథమ చికిత్స సర్టిఫికెట్ ఉండాలని, భూగర్భగనిలో పనిచేయాలని సూచించా రు. షార్ట్లిస్ట్ చేసిన అభ్యర్థి ఎంపిక పరీక్ష, వైద్యపరీక్ష ఉంటుందని వివరించారు. అర్హత సాధించిన కార్మికులకు రామగుండం మెయిన్రెస్క్యూ స్టేషన్లో రెస్క్యూ రికవరీలో శిక్షణ ఇవ్వనున్న ట్లు వెల్లడించారు. ఈనెల 15లోగా దరఖాస్తు చేసుకోవాలని ఉత్తర్వులు జారీ చేశారు. -
బాలల కథ : అక్షర సేద్యం
రామాపురంలో సోమయ్య అనే మధ్య తరగతి రైతు ఉన్నాడు. అతని కుమారుడు రాజు అదే ఊరిలో ఏడోతరగతి చదువుచున్నాడు. రాజుకు చదువు అంటే చాలా ఇష్టం. శ్రద్ధగా చదువుకుని, ఏదైనా ఉద్యోగం సాధించాలని ఆశ. సోమయ్య కు మూడు ఎకరాల పొలం ఉంది. రాజుని తనతో పాటు పొలం పనులకు తీసుకెళ్లి, ఇద్దరం పనిచేస్తూ మరో మూడు ఎకరాల పొలం కొనుగోలు చేసి ఊరిలో మంచి రైతు గా పేరు సంపాదించి, పెద్ద ఇల్లు నిర్మించుకోవాలని సోమయ్య ఆలోచన. చదువుపై ఉన్న మమకారంతో రాజు పొలం పనులు చేయడానికి ఇష్టపడలేదు. అతన్ని ఎలాగైనా చదువు మాన్పించాలని సోమయ్య ప్రయత్నాలు చేసాడు. చదువుకోవాలనే పట్టుదలను రాజు వదిలిపెట్టలేదు.సోమయ్య కూడా పంతం వీడలేదు. తోటి విద్యార్థులు బడికి వెళ్తుంటే రాజు మనసు గాయపడింది.అమ్మానాన్నలను ఒప్పించడానికి అన్నాహారాలు మాని నిరాహారదీక్ష చేసాడు . తల్లి దండ్రుల మనసు కరిగింది కాని ఒక షరతు పెట్టారు. శ్రీప్రతి రోజూ ఉదయం రెండు గంటలు పొలం పనులు చేయాలి. సాయంత్రం ఇంటి పనులు చేయాలి.సెలవు రోజుల్లో సేద్యపు పనులు చేయాలిశ్రీ. ఇదే మంచి అవకాశమనుకుని రాజు పొలం పనులు చేసుకుంటూ, కష్ట పడి చదవడం మొదలెట్టాడు.పరీక్షల సమయంలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా,చదువు పై ఉన్న మక్కువతో సంతోషంగా స్వీకరించాడు. తన తోటి పిల్లలు సెలవు రోజుల్లో సరదా ఆటలు ఆడుతున్నా,తను బాధపడలేదు. కొన్ని సంవత్సరాలు గడిచాయి. రాజు చదువు పూర్తి చేసి, ఉద్యోగం సాధించాడు. నీతి: సాధించాలనే తపన ఉంటే ఏదైనా సాధ్యమే.. – దుర్గమ్ భైతి రామునిపట్ల, సిద్దిపేట జిల్లా -
అభివృద్ధిని ప్రజలకు చేరవేయాలి
కోల్సిటీ/గోదావరిఖనిటౌన్/పాలకుర్తి: అభివృద్ధి, సంక్షేమ పథకాల సమాచారాన్ని నియోజకవర్గ ప్రజలకు చేరవేయాలని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ఠాకూర్ కోరారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక వార్డుసభలను గోదావరిఖని ఆర్సీవోఏ క్లబ్లో గురువారం నిర్వహించారు. మేయర్ మ హంకాళి స్వామి అధ్యక్షత వహించారు. అనంతరం 57వ డివిజన్లో వార్డు సందర్శన చేపట్టారు. ఆర్టీసీ బస్టాండ్ ఆధునికీకరణ పనులు ప్రారంభించారు. పాలకుర్తి మండలం కొత్తపల్లిలో ఉపాధిహామీ పను లు పరిశీలించారు. ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే రాజ్ఠాకూర్ మాట్లాడారు. నగరంలో లోతట్టు ప్రాంతాలు వరద ప్రభావానికి గురికాకుండా మూడు నెలల ముందే కాలువల్లో పూడికతీత ప్రారంభించామని అన్నారు. స్వచ్ఛ రామగుండంగా మార్చేందుకు అందరూ సహకరించాలని ఆయన కోరారు. భూగర్భ జలాల వృద్ధికి ఇంకుడుగుంతలు నిర్మించుకోవాలని సూచించారు. ఓటరు జాబితా సర్పై రామగుండం తహసీల్దార్ రవీందర్ అవగాహన కల్పించారు. ఉపాధిహామీ పనులతో పేద కూలీలకు ఆర్థిక భరోసా లభిస్తుందని చెప్పారు. ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే సతీమణి మనాలీ ఠాకూర్, డిప్యూటీ మేయర్ పాతపెల్లి ఎల్లయ్య, మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ సంపత్, ఏసీపీ శ్రీహరి, డి ప్యూటీ కమిషనర్ వెంకటస్వామి, టీపీఎస్ నవీన్, ఆర్వో ఆంజనేయులు, సూపరింటెండెంట్ శ్రీనివా స్, ఏఈ తేజస్విని, మెడికల్ ఆఫీసర్ అతుల్య నా యర్, మెప్మా టీఎంసీ మౌనిక, కార్పొరేటర్లు ము స్తఫా, చిదురాల నాగరాజు, గట్ల రమేశ్, ధూళికట్ట సతీశ్, మున్సిపల్ ఏఈ మనోజ్, టీపీఎస్ నవీన్, మెప్మా సీవో శమంత, ఆర్టీసీ డీఎం నాగభూషణం, కాంగ్రెస్ నగర అధ్యక్షుడు బొంతల రాజేశ్, కార్పొరేటర్లు కల్వల పద్మావతి, గడ్డం రమాదేవి, నెలకంటి రాము, తాళ్లపల్లి యుగంధర్, చిదురాల నాగరాజు, చుక్కల లావణ్య, కర్రావుల డేవిడ్ రాజు, కొత్తపల్లి సర్పంచ్ తోట స్వప్న తదితరులు పాల్గొన్నారు. రామగుండం ఎమ్మెల్యే రాజ్ఠాకూర్ -
ఎస్సైల బదిలీ
గోదావరిఖని: జిల్లాలో నలుగురు ఎస్ఐలను బదిలీ చేస్తూ రామగుండం పోలీస్కమిషనర్ అంబర్ కిశోర్ ఝా గురువారం ఉత్తర్వులు జారీచేశారు. జూలపల్లి ఎస్హెచ్వో సీహెచ్ సనత్కుమార్ను పొత్కపల్లికి, పెద్దపల్లి ఎస్ఐ–2 బుద్దె మల్లేశ్ను జూలపల్లి ఎస్హెచ్వోగా, పెద్దపల్లి సీసీఎస్ ఎస్ఐ బి.జీవన్ను పెద్దపల్లి పోలీస్స్టేషన్ ఎస్హెచ్వోగా, సుల్తానాబాద్ ఎస్ఐ జె.నరేశ్ను పెద్దపల్లి రూరల్ ఎస్ఐగా బదిలీ చేశారు. ఈమేరకు సీపీ ఆదేశాలు జారీచేశారు.హరిపురం సమీపంలో ఫ్లైఓవర్ ఓదెల: హరిపురం గ్రామ శివారులోని అండర్బ్రిడ్జి ప్రదేశంలో రైల్వేఫ్లై ఓవర్ నిర్మించాలని ఆ గ్రామ సర్పంచ్ గ్యారవేని విజయ కోరారు. ఈమేరకు కలెక్టర్ కోయ శ్రీహర్షకు గురువారం ఒక వినతిపత్రం అందజేశారు. స్పందించిన కలెక్టర్.. ఫ్లైఓవర్ నిర్మాణానికి గ్రీన్సిగ్నల్ ఇచ్చారని సర్పంచ్ వివరించారు. మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గుండేటి ఐలయ్యయాదవ్, నాయకులు తదితరులు ఉన్నారు. స్వర్ణగిరి టెంపుల్కు ఆర్టీసీ బస్సు మంథని: మంథని నుంచి యాదగిరిగుట్ట, స్వర్ణగిరి పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక టూర్ ప్యాకేజీతో బస్సు నడిపిస్తామని ఆర్టీసీ డిపో మేనేజర్ శ్రవణ్ కుమార్ గురువారం తెలిపారు. సూపర్ లగ్జరీ బస్సు ఈనెల 7వ తేదీన ఉదయం 6.00 గంటలకు మంథనిలో బయలుదేరుతుందన్నారు. అదేరోజు రాత్రి 10 గంటలకు తిరిగి మంథని చేరుకుంటుందన్నారు. యా దగిరిగుట్ట, స్వర్ణగిరి, భద్రకాళి టెంపుల్, వెయ్యి స్తంభాల గుడి దర్శించుకోవచ్చని తెలిపారు. పెద్దలకు రూ.1,200, పిల్లలకు రూ.900 చార్జి ఉంటుందని, సీటు బుకింగ్కు 99486 71514, 99592 25923 నంబర్లలో సంప్రదించాలని ఆయన కోరారు. సనత్ మల్లేశ్ జీవన్ -
ప్రకృతి సంరక్షణలో భాగస్వామ్యం కావాలి
మంథని: విద్యార్థులు చిన్నవయసు నుంచే ప్రకృతి పరిరక్షణలో భాగస్వాములు కావా లని పెద్దపల్లి అటవీరేంజ్ ఆఫీసర్ సతీశ్ కుమార్ సూచించారు. ప్రజాపాలన – ప్ర గతి ప్రణాళిక –99 రోజుల కార్యాచరణ ప్ర ణాళికలో భాగంగా జిల్లా అటవీ ఇన్చార్జి అధికారి నవీన్రెడ్డి, మంథని రేంజ్లోని జెడ్పీహెచ్ఎస్లో అడవుల ప్రాధాన్యంపై గురువారం అవగాహన కల్పించారు. విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ, పర్యావరణ సమతుల్యతను కాపాడడంలో అడవులు కీలకపాత్ర పోషిస్తాయన్నారు. ప్రతీఒక్కరు మొక్కలు నాటి సంరక్షించాలని కోరారు. పర్యావరణ పరిరక్షణలో అడవుల ప్రాధాన్యం అంశంపై నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నా రు. ఇందులో ప్రతిభ కనబర్చిన వారికి ఆయన బ హుమతులు అందజేశారు. డిప్యూటీ రేంజ్ అధికారి కొమురయ్య, స్ట్రైక్ఫోర్స్ ఎఫ్ఎస్వో రహీమతుల్లా, ఫారెస్ట్ బీట్ అధికారులు శ్రావంతి, ప్రదీప్, సహా య శాస్త్రవేత్త కనకజ్యోతి, ఇంటర్ విద్య జిల్లా నో డల్ధికారి కల్పన, ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ రమేశ్, ఎన్ఎస్ఎస్ కో ఆర్డినేటర్ శంకర్ తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి అటవీ రేంజ్ ఆఫీసర్ సతీశ్ కుమార్ -
పాలనపై సింగరేణి సీఎండీ పట్టు
గోదావరిఖని: పాలనాపరంగా పట్టు సాధించేందుకు సింగరేణి సీఎండీ, ఐఏఎస్ అధికారి దృష్టి సారించారు. ఒకవైపు సంస్థ స్థితిగతులపై అధ్యయనం చేస్తూనే, మరోవైపు ఉద్యోగులతో నేరుగా భేటీ అవుతున్నారు. క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు. అధికారుల ఆకస్మిక బదిలీతోనూ వారిపై పట్టు బిగించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవలే సంస్థ సీఎండీగా బాఽ ద్యతలు చేపట్టిన బుద్ధ ప్రకాశ్ జ్యోతి సంస్థపై పూర్తిస్థాయిలో పట్టుసాధించేందుకు అన్నిఏరియాల్లో పర్యటించి కార్మికులతో మమేకం అవుతున్నారు. రామగుండంపై ప్రత్యేక దృష్టి.. రామగుండంలో ఇటీవల పర్యటనకు వచ్చిన క్ర మంలో ఆర్జీ–1 జీడీకే–11గనిలో కార్మికులతో నేరు గా సమావేశమయ్యారు. సంస్థ పరిస్థితులు, కార్మికులకు సంస్థ నుంచి కావాల్సిన అవసరాలు, ఉద్యోగులు చేయాల్సి పనివిధానంపై దిశానిర్దేశం చేశారు. అన్ని ఏరియాల్లో పర్యటించి గనులు, ఓసీల్లో ఉత్పత్తి, ఉత్పాదకత, రక్షణ, సంక్షేమం తదితర అంశాలపై పూర్తి స్థాయిలో సమీక్షించారు. రాబోయే రోజుల్లో సంస్థ ఎదుర్కొనే పరిస్థితులు, ఉద్యోగుల నుంచి అందాల్సి సహకారం గురించి చర్చించారు. అధికారుల బదిలీలపై చర్చ సింగరేణిలో తన మార్కు చూపించేందుకు సీఎండీ అధికారుల బదిలీపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ప్రధానంగా చాలాఏళ్లుగా ఒకేఏరియాలో పనిచేయడం, రిక్వెస్ట్ బదిలీలు, పదోన్నతి బదిలీలు ఎక్కువగా జరిగాయి. మైనింగ్, ఈఅండ్ఎం, హెల్త్, ఐఈడీ, పర్సనల్ విభాగంలో ఒకేసారి పెద్దఎత్తున బదిలీలు కావడం చర్చనీయాంశంగా మారింది. త్వరలో మరికొంత మంది అధికారుల బదిలీలు కూడా ఉండచ్చొనే చర్చ సాగుతోంది. పాలనాపరంగా పట్టుబిగించేందుకు పెద్దఎత్తున బదిలీలు జరిగినట్లు చర్చ సాగుతోంది. క్షేత్రస్థాయి పర్యటనతో మరింత లోతుగా సీఎండీగా బాధ్యతలు స్వీకరించాక కొద్దిరోజులపాటు కార్యాలయంలో ఉంటూనే సంస్థ స్థితిగతులపై అధ్యయనం చేశారు. అన్ని ఏరియాల్లో పర్యటించి అధ్యయనం చేస్తున్నారు. స్థానికంగా ఉన్న పరిస్థితులు, సంక్షేమ కార్యక్రమాలపై దృషి సారిస్తున్నారు. రాబోయే రోజుల్లో మరింత లోతుగా ముందుకెళ్లి ఉద్యోగులను కార్మోణుఖుల ను చేసి సంస్థను లాభాల బాటలో తీసుకెళ్లాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. -
సంక్షేమ పథకాలకు సరికొత్త డిజిటల్ రూపం
జ్యోతినగర్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద పౌరుల కోసం అమలు చేస్తున్న వివిధ రకాల సంక్షేమ పథకాల పంపిణీ విధానంలో ఒక విప్లవాత్మక మార్పునకు శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలోని ప్రతీ పౌరుడికి ఒకే ఒక మల్టీపర్పస్ యూనిఫైడ్ కార్డును జారీ చేసేందుకు ఐటీ శాఖ వేగంగా కసరత్తు చేస్తోంది. అన్ని శాఖల సంక్షేమం ఒకేచోట.. ప్రస్తుతం లబ్ధిదారులకు వేర్వేరు పథకాల కోసం విడివిడిగా కార్డులున్నాయి. కానీ ప్రభుత్వం తీసుకురాబోతున్న కొత్త ఏఐ ప్రొఫైలింగ్ సిస్టమ్ ద్వారా ఆరోగ్యశ్రీ, చేయూత పెన్షన్లు, ఫీజు రీయింబర్స్మెంట్, ముఖ్యమంత్రి సహాయ నిధి, కార్మిక శాఖ పరిధిలోని అన్ని ప్రయోజనాలు ఒకే డిజిటల్ కార్డు కిందకు రానున్నాయి. దీనికోసం ఇటీవల సేకరించిన సమగ్ర సామాజిక, ఆర్థిక, కుల సర్వే డేటాను కూడా ఈ కార్డుతో అనుసంధానించనున్నారు. ఒకే కార్డు.. బహుళ ప్రయోజనాలు ఒకే డిజిటల్ కార్డు ద్వారా రేషన్, పెన్షన్, ఫ్రీ హెల్త్ కేర్ వంటి అన్ని రకాల సంక్షేమ ప్రయోజనాలను అర్హులు పొందొచ్చు. పారదర్శకత.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడడం వల్ల ఒకే లబ్ధిదారుడు ఒకేరకమైన లబ్ధిని రెండుసార్లు పొందకుండా అరికట్టడం సులువవుతుంది. గల్ఫ్ వలసదారులకు ప్రత్యేక ప్రొఫైల్ కేరళ రాష్ట్ర ఉత్తమ విధానాల తరహాలోనే తెలంగాణ నుంచి గల్ఫ్ దేశాలకు వలస వెళ్లే కార్మికుల నైపుణ్యాలు, పాస్పోర్ట్, వీసా వివరాలను కూడా ఈ కేంద్రీకృత వ్యవస్థలో చేర్చనున్నారు. రాష్ట్రస్థాయి ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఈ ప్రాజెక్టును మరింత పటిష్టం చేయడానికి జాతీయస్థాయి గుర్తింపు కార్డుల తరహాలోనే రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్యను కేటాయించే అంశాన్ని కూడా పరిశీలిస్తోంది. ఒక వ్యక్తి మరణించినప్పుడు జారీ అయ్యే డెత్ సర్టిఫికెట్ డేటా ఆటోమేటిక్గా చేయూత పెన్షన్ డేటాబేస్కు లింక్ అయ్యేలా ఏఐ రూటింగ్ సిస్టమ్ను డిజైన్ చేస్తున్నారు. ప్రభుత్వ కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ప్రొఫైలింగ్ను కూడా ఇందులో చేర్చడం ద్వారా అర్హులైన నిజమైన పేదలకు మరింత వేగంగా అందుతాయని ప్రభుత్వం భావిస్తోంది. -
వృత్తి నైపుణ్యం పెంపొందించుకోవాలి
కోల్సిటీ: స్వశక్తి మహిళలు వృత్తి నైపుణ్యం పెంపొందించుకొని తమ కుటుంబానికి, సమాజానికి ఉపయోగపడేలా వ్యాపార కార్యకలాపాలు చేపట్టాలని రామగుండం మేయర్ మహంకాళి స్వామి కోరారు. ధనశ్రీ పట్టణ మహిళా సమాఖ్యలో భాగమైన ఎస్ఎల్ఎఫ్లకు కొత్తగా ఎన్నికై న అధ్యక్షులతో బుధవా రం బల్దియా కార్యాలయంలో సమావేశమయ్యారు. స్వశక్తి మహిళలకు ప్రభుత్వ పథకాల ద్వారా సబ్సిడీ లు, తక్కువ వడ్డీరేట్లతో రుణాలు ఇప్పించి వ్యాపార యూనిట్లు స్థాపించుకునేందుకు ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్ సహకకారం అందిస్తున్నారని తెలిపా రు. పట్టణ ప్రాంత స్వశక్తి మహిళలతో సోలార్ ప్లాంట్లు, ఎంఎస్ఎంఈ యూనిట్లు ఏర్పాటు చేయించే యోచనలో ఉన్నారని వెల్లడించారు. ధనశ్రీ పట్టణ సమాఖ్య కార్యకలాపాలు ఆరేళ్లుగా స్తంభించిన నేపధ్యంలో పునరుద్ధరించేందుకు ఎస్ఎల్ఎఫ్లకు ఎన్నికలు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపా రు. త్వరలో పట్టణ సమాఖ్యకు కూడా కొత్త కార్యవ ర్గం ఎన్నుకోవాలని సూచించారు. కమిషనర్ అరుణ శ్రీ మాట్లాడారు. టీపీఎస్ నవీన్, సూపరింటెండెంట్ శ్రీనివాస్, మెప్మా టీఎంసీ మౌనిక, సీవోలు ఊర్మిళ, శ్వేత, ప్రియదర్శిని, శమంత పాల్గొన్నారు. -
సమస్యల పరిష్కారానికి దశలవారీగా పోరాటం
పెద్దపల్లి: మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం దశలవారీగా పోరు చేస్తామని సీఐటీయూ జిల్లా గౌరవ అధ్యక్షుడు ఎరవెల్లి ముత్యంరావు అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ఈనెల 4 నుంచి 15 వరకు కార్మికుల సంతకాలతో లేఖలు రాయాలని, 18, 19వ తేదీల్లో మున్సిపల్ కార్యాలయా ఎదుట నిరాహార దీక్ష చేపట్టాలని, 22న చలో కలెక్టరేట్ చేపట్టాలని, 29, 30వ తేదీల్లో మంత్రులు, ఎమ్మెల్యేల క్యాంప్ ఆఫీసుల ఎదుట ధర్నా చేయాలని, అయినా, సమస్యలు పరిష్కారం కాకుంటే నిరవధిక సమ్మెకు సిద్ధం కావాలని నిర్ణయించినట్లు ముత్యంరావు తెలిపారు. ఇందుకు ప్రభుత్వ పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి సావనపల్లి వెంకటస్వామి, నాయకులు సింగారపు గట్టయ్య, చిప్పకుర్తి చందు, బొంకూరి సాగర్, దూడపాక చుక్కమ్మ, బొంకూరు శంకర్, మంచినీళ్ల భారతి తదితరులు పాల్గొన్నారు. ● వరి విత్తనాల పేర్ల ప్రకటన -
ముగిసిన టీజీపీఈసెట్–2026
కరీంనగర్స్పోర్ట్స్: శారీరక విద్యాకోర్సుల్లో ప్రవేశాలకు కరీంనగర్లో నిర్వహించిన టీజీపీఈసెట్ –2026 బుధవారంతో ప్రశాంతంగా ముగిసింది. భానుడి భగభగలను లెక్కచేయకుండా అభ్యర్థులు శారీరక, నైపుణ్య పరీక్షల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ ఏడాది బీపీఈడీ, డీపీఈడీ కోర్సులకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,436 మంది హాజరయ్యారు. ఇందులో బీపీఈడీ కోర్సుకు 1,788 మంది, డీపీఈడీ కోర్సుకు 648 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. వ్యాయామ విద్యా రంగంలో స్థిరపడాలనే పట్టుదలతో క్రీడాకారులు శారీరకదారుఢ్య పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. పరీక్షల ఫలితాలను ఈనెల 6న విడుదల చేయనున్నట్లు టీజీపీఈసెట్ 2026 చైర్మన్, శాతవాహన యూనివర్సిటీ వీసీ ఉమేశ్ కుమార్, కన్వీనర్ రాజేష్ కుమార్ తెలిపారు.ఇంధన డిపో సందర్శన రామగుండం: కుందనపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(హెచ్పీసీఎల్) ఇంధన డిపోను రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. అగ్ని ప్రమాదాల నివారణ, భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించారు. డిపో మేనేజర్ మనీశ్ తదితరులు ఉన్నారు. నియామకం పెద్దపల్లి: జిల్లా కేంద్రానికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు ఆకుల స్వామి వివేక్ పటేల్ను తెలంగాణ ఉద్యమకారుల ఫోరం సోషల్ మీడియా జిల్లా ఇన్చార్జిగా నియమించారు. ఈమేరకు ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు ఒరగంటి ఆనంద్ బుధవారం ఆయనకు నియామకపత్రం అందజేశారు. తెలంగాణ ఉద్యమంలో ఆకుల స్వామి వివేక్ పటేల్ విశిష్ట పాత్ర పోషించారని గుర్తుచేశారు. ఆయనను పలువురు అభినందించారు. -
గుండెపోటుతో బీఆర్ఎస్ నేత మృతి
ఫెర్టిలైజర్సిటీ: పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ 22వ డివిజన్ గౌతమిన గర్ చెందిన బీఆర్ఎస్ నాయకుడు, కాంట్రాక్టర్ గోపు ఐలయ్య యాదవ్(70) గుండెపోటుతో కోల్కతాలో మృతి చెందారు. వ్యాపార పనుల నిమిత్తం కోల్క తాకు వెళ్లిన ఆయన.. మంగళవారం మ ధ్యాహ్నం హఠాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. కు టుంబ సభ్యులు వెంటనే అక్కడి ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ మృతి చెందారు. గోపు ఐలయ్య యాదవ్ రామగుండం నియోజకవర్గ ప్రజలకు సుపరిచితులు. ఆయనకు భార్య గోపు పద్మావతి, ముగ్గురు కుమార్తెలు రూప, రేఖ, రమ్య ఉన్నారు. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, బీఆర్ఎస్ నాయకులు కౌశిక హరి, లత బుధవారం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. -
రూ.3కోట్లతో మల్లికార్జునస్వామి ఆలయ నిర్మాణం
రామగుండం: అంతర్గాం మండలం ముర్మూర్ గ్రామానికి చెందిన గోపు అయిలయ్య యాదవ్ తన ఐదేళ్ల ప్రాయంలోనే తండ్రిని కోల్పోయారు. అప్పట్నుంచే కష్టాన్ని నమ్ముకుని ఆత్మవిశ్వాసంతో చదువుకున్నారు. ఉపాధి, కుటుంబ బాధ్యతలు సమన్వయం చేస్తూ పారిశ్రామికవేత్తగా, కాంట్రాక్టర్గా ఎదిగారు. కాంట్రాక్టరుగా తన జీవితంలో 1990ల్లోనే విజయవాడ బస్టాండ్ నిర్మాణం చెప్పుకోదగ్గ విషయమని ఆయన ఎప్పుడూ చెబుతుండేవారు. అంతేకాదు.. సుమారు రెండెకరాల విస్తీర్ణంలో రూ.3 కోట్ల వ్యయంతో తన భాగస్వామ్యంతో, గోపు వంశీయుల సహకారంతో శ్రీమల్లికార్జునస్వామి ఆలయం నిర్మించారు. గత ఫిబ్రవరి 27, 28వ తేదీల్లో కుటుంబసమేతంగా దేవతామూర్తుల విగ్రహ ప్రతిష్ఠాపన వేడుకలు నిర్వహించి తన తండ్రి ఆశయం నెరవేర్చారు. -
నేరాల కట్టడిలో సీసీ కెమెరాలు కీలకం
పెద్దపల్లిరూరల్: నేరాలను కట్టడి చేయడంలో సీసీ కెమెరాల పాత్ర కీలకమని ప్రభుత్వ విప్ విజయరమణారావు అన్నారు. దాతల సహకారంతో స్థానిక పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన 65 సీసీ కెమెరాలు, ప్రహరీ అభివృద్ధి పనులను రామగుండం పోలీస్ క మిషనర్ అంబర్ కిశోర్ ఝా, డీసీపీ రాంరెడ్డినాయక్తో కలిసి బుధవారం విప్ ప్రారంభించారు. సీసీ కె మెరాలతో పటిష్ట నిఘా ఏర్పాటైన పట్టణాల్లో పెద్దపల్లి అగ్రస్థానంలో ఉందని సీపీ అన్నారు. కరీంనగర్ నగల దుకాణంలో చోరీకి వచ్చినవారు తొలుత పెద్దపల్లినే ఎంచుకున్నా.. ఇక్కడి పటిష్ట నిఘా వ్య వస్థను అంచనా వేసి తమ ప్రణాళిక మార్చుకున్నా రని తెలిపారు. పెద్దపల్లిలోని రూరల్, మహిళా, ట్రా ఫిక్, ఎలిగేడులోని పోలీస్స్టేషన్లకు సొంత భవనా లు నిర్మించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు ఇచ్చామని చెప్పారు. పెద్దపల్లి ఏసీపీ కార్యాలయానికి సైతం భవనాన్ని నిర్మిస్తామని హామీ ఇచ్చారు. పెద్దపల్లిలో చందపల్లి, రాంపల్లిరోడ్డులో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రాంగణాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వ విప్ పేర్కొన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన రిక్రియేషన్క్లబ్ ప్రధానకార్యదర్శి కొట్టె సదానందం, కౌన్సిలర్ రజనీకృష్ణమూర్తితోపాటు రంగు శ్రీనివాస్ను అభినందించి సత్కరించారు. అనంతరం పోలీసులకు హెల్మెట్లు అందజేశారు. ఏసీపీ కృష్ణ, సీఐ ప్రవీణ్కుమార్, ఎస్సైలు లక్ష్మణ్రావు, నరేశ్, శ్వేతతోపాటు కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు. -
చెరువులను చెరబడుతున్నారు!
సాక్షి పెద్దపల్లి: జిల్లాలో ఇటుకబట్టీల అవసరాల కోసం చెరువుల నుంచి మట్టి తవ్వకాలు, రవాణాపై అధికార యంత్రాంగం కఠిన నిబంధనలు అమలు చేస్తున్న ట్లు ప్రకటించినా.. క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఇందుకు విరుద్ధంగా ఉన్నాయనే ఆరోపణలు వెల్లువె త్తుతున్నాయి. చెరువుల్లోంచి మట్టి రవాణాపై కలెక్టర్ స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసినా అమలుకాకపోవడం గమనార్హం. జిల్లాలోని కొదురుపాక, ఇందుర్తి, ముత్తారం చెరువుల నుంచే మట్టి తవ్వకాలకు అనుమతులు జారీచేశారు. ప్రతీ వాహనానికి ఫొటోగ్రఫీ, రసీదు తప్పనిసరి చేశారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకే మట్టి రవాణా చేయాలని సూచించారు. జిల్లాలోని పలు ప్రాంతా ల్లో నిబంధనలకు విరుద్ధంగా మట్టి తరలిపోతోందని గ్రామస్తులు, రైతులు ఆరోపిస్తున్నారు. దందాకు ఊతం ఇలా.. నిబంధనల ప్రకారం చెరువు మట్టి తవ్వకానికి క్యూ బిక్ మీటర్ లెక్కన అనుమతి ఇవ్వాల్సిన అధికారులు.. టిప్పర్ల లెక్కన పర్మిషన్లు ఇస్తూ అక్రమాలకు బీజం వేశారు. అదికూడా ఎన్నిౖ టెర్ల వాహనం అనే ది స్పష్టత లేదు. మట్టి తరలించేది 12 లేదా 14 లేదా 16 టైర్ల లారీ కావచ్చు. ఈ లోపాన్ని అదనుగా తీసుకున్న అక్రమార్కులు.. వే బిల్లులు లేకుండానే ఓవర్లోడ్తో చెరువు మట్టి తవ్వుతూ, తరలిస్తూ కాసులు దండుకుంటున్నారు. ‘చెరువు మట్టి గ్రామానిది.. ఆదాయం ఎవరికి? మట్టి రవాణా కోసం 12 టైర్ల వరకు ఉన్న వాహనాలకే అనుమతి ఉన్నా.. కొన్నిప్రాంతాల్లో 16 టైర్ల టి ప్పర్లనూ వినియోగిస్తున్నట్లు ఆరోపిస్తున్నారు. వీటి రాకపోకలతో రోడ్లు దెబ్బతింటుండగా, దుమ్ము, ధూళి సమస్యలు పెరుగుతున్నాయి. రోడ్ల మరమ్మతుకు భారీగా ప్రజాధనం వెచ్చించాల్సి వస్తోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.పెరుగుతున్న ప్రజా వ్యతిరేకత మట్టి అక్రమ రవాణా, చెరువుల పరిరక్షణ, గ్రామీణ రోడ్ల ధ్వంసం వంటి అంశాలపై పలు గ్రామాల్లో ప్రజల నుంచి వ్యతిరేకత పెరుగుతోంది. చెరువుల్లో మట్టి తీసినందుకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు తక్కువ ధరకు ఇటుకలు ఇస్తారని అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు చెబుతన్నా.. క్షేత్రస్థాయిలో ఎక్కడా అమలుకావడం లేదు. వ్యవసాయం, భూగర్భ జలాల పరిరక్షణకు కీలకమైన వనరులని, వాటిసహజ స్వరూపం దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. చోద్యం చూస్తున్న యంత్రాంగం జిల్లాలో విచ్చలవిడిగా, ఇష్టారీతిన మట్టి అక్రమ దందా కొనసాగుతున్నా రెవెన్యూ, మైనింగ్, నీటిపారుదల, ఆర్టీఏ, పోలీస్ విభాగాలు కనీసం అటువైపు కన్నెత్తి చూడకపోవడం అనేక అను మానాలకు తావిస్తోంది. జిల్లాకు చెందిన ఓ కీలకప్రజాప్రతినిధి, మరోకీలక ఉన్నతాధికారి కనుసన్నల్లోనే ఈ తతంగం కొనసాగుతోందని, అందుకే అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదనే విమర్శలు ఉన్నాయి. -
కిక్బాక్సింగ్లో గురువీర్సింగ్కు బంగారు పతకం
పెద్దపల్లి: ఒడిశాలో నిర్వహించిన జూనియర్ నేషనల్ కిక్బాక్సింగ్ చాంపియన్షిప్ పోటీల్లో పెద్దపల్లి బీఎంఆర్ కరాటే, కిక్బాక్సింగ్ అకాడమీ విద్యార్థి గురువీర్సింగ్ బంగారు పతకం సాధించాడు. 51 కేజీల కె–1 ఫైట్ విభాగంలో పోటీపడి అద్భుత ప్రతిభ కనబర్చాడని కోచ్ కర్ర వెంకటేశ్ తెలిపారు. వాకోఇండియా కిక్బాక్సింగ్ ప్రెసిడెంట్ సంతోష్ అగర్వాల్, తెలంగాణ కిక్బాక్సింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు రామాంజనేయులు, జనరల్ సెక్రటరీ మహిపాల్, జిల్లా కార్యదర్శి కుమార్, బీఎంఆర్ అకాడమీ వ్యవస్థాపకుడు సంతోష్, కోచ్ వెంకటేశ్ తదితరులు గురువీర్సింగ్ను అభినందించారు. -
కాంగ్రెస్ బలోపేతానికి కృషి
గోదావరిఖని: సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్ సూచించారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా నూతన కమిటీ నాయకులతో స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం ఆయన తొలిసారి సమీక్షించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, కాంగ్రెస్ సంస్థాగత నిర్మాణాన్ని మరింత బలోపేతం చేయడంతోపాటు పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలన్నారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, అనుబంధ విభాగాల ప్రతినిధులు, మండల అధ్యక్షులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. రామగుండం నవీకరణ లక్ష్యం రామగుండం: పట్టణ నవీకరణ తన ప్రధాన లక్ష్య మని ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్ అన్నారు. పట్టణంలోని 25, 26, 27, 28వ డివిజన్కాలనీల్లో ఆయన పర్యటించారు. మేయర్ మహంకాళి స్వా మి, కమిషనర్ అరుణశ్రీ, కార్పొరేటర్లు సిరిశెట్టి సతీశ్, ఇసంపెల్లి అంజయ్య, డిప్యూటీ కమిషనర్ వెంకటస్వామి, టీపీఎస్ నవీన్, ఏఈ తేజస్విని, శా నిటరీ జవాన్ తిరుపతి, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు ఈదునూరి హరిప్రసాద్ తదితరులు ఉన్నారు. కా గా, ఈసాలతక్కళ్లపల్లిలో హార్టికల్చర్ అధికారులు నిర్వహించిన ఆయిల్పామ్ సాగుపై అవగాహన సదస్సుకు ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. ఉద్యానవన అధికారులు శ్యామ్ప్రసాద్, జ్యోతి, తిరుమల ఆయిల్కేన్ కంపెనీ సీఈవో కేషు కల్యాణ్, ఏఎంసీ చైర్మన్ గడ్డం తిరుపతి, సర్పంచ్ బండి శ్రీనివాస్, ఉప సర్పంచ్ వొడ్నాల జ్యోతి పాల్గొన్నారు. -
ఏమో.. తెలియదు సార్
సాక్షిప్రతినిధి, కరీంనగర్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పీఎంజే జువెల్లరీస్ దోపిడీ కేసు మాస్టర్మైండ్ సుబోధ్ సింగ్ కస్టడీలో నోరు మెదపడం లేదు. మే 3వ తేదీన కరీంనగర్లోని పీఎంజే జువెల్లరీస్లో దోపిడీకి పాల్పడిన సుబోధ్ గ్యాంగ్.. అడ్డువచ్చిన సిబ్బందిపై కాల్పులు జరిపి పరారైన విషయం తెలిసిందే. రంగంలోకి దిగిన పోలీసులు ఈ కేసులో సూత్రధారి సుబోధ్సింగ్గా తేల్చారు. దేశవ్యాప్తంగా బంగారం దుకాణాల్లో ఆరితేరిన సుబోధ్ ముఠాసభ్యులు ఇప్పటివరకు బిహార్, పశ్చిమబెంగాల్, మధ్యప్రదేశ్, జార్ఖండ్లో దోపిడీ చేశారు. ఈ గ్యాంగ్కు దక్షిణాదిన ఇదే తొలినేరం కావడం గమనార్హం. మే 28న బిహార్ నుంచి సుబోధ్ను తెలంగాణకు తీసుకొచ్చిన పోలీసులు అదే రోజురాత్రి కరీంనగర్కు తరలించారు. బుధవారం ఉదయం కరీంనగర్ జైలు నుంచి కస్టడీకి తరలించిన పోలీసులు వేసిన పలు పశ్నలకు సుబోధ్ మౌనం వహించినట్లు సమాచారం. అదే సమయంలో తన పాత కేసులకు సంబంధించి విషయాలను మాత్రం వెల్లడించినట్లు తెలిసింది. పోలీసు కస్టడీలో సుబోధ్సింగ్ ఏమాత్రం బెరుకు లేకుండా నవ్వుతూ సమాధానాలు చెప్పినట్లు సమాచారం. పోలీసులు మాత్రం పలు సాంకేతిక వివరాలు అతని ముందుంచి ప్రశ్నించినట్లు తెలిసింది. పోలీసులకు సవాల్.. వాస్తవానికి దోపిడీ జరిగిన విధానం పోలీసులకు సవాల్గా మారింది. అయినప్పటికీ కరీంనగర్ పోలీసులు కేసును తక్కువ వ్యవధిలో ఛేదించారు. ఇప్పటికే బంగారం దేశందాటి నేపాల్కు వెళ్లినా సరే దోపిడీలో పాల్గొన్న దాదాపు అందరి వివరాలు సేకరించగలిగారు. ఇటీవల పోలీసులు పట్టుకొచ్చిన రఘునాథ్ కర్మాకర్, రావిశ్కుమార్, మెహతాబ్ఖాన్ను అరెస్టు చేయగలిగారు. వారిచ్చిన సమాచారం ఆధారంగా సుబోధ్ సింగ్ను మాస్టర్మైండ్గా తేల్చిన పోలీసులు అతని కోసం ఇటీవల బిహార్ వెళ్లారు. అక్కడ సుబోధ్ కోసం న్యాయపోరాటమే చేయాల్సి వచ్చింది. ఆరు కోర్టులు.. అనేక సవాళ్లు.. సుబోధ్సింగ్ నెట్వర్క్లో లాయర్లు కూడా ఉన్నారు. అతడిని రాష్ట్రానికి తరలించాలని కరీంనగర్ పోలీసులు వేసిన ప్రిజనర్ ట్రాన్సిట్ (పీటీ) వారంట్ను సవాలు చేస్తూ సుబోద్ లాయర్లు అడుగడుగునా అడ్డుపడ్డారు. మొత్త ఆరు కోర్టుల్లో అతడిని లాయర్లు తమ వాదనలతో పోలీసులకు చుక్కలు చూపించారు. అయినప్పటికీ పోలీసులు చూ పిన ఆధారాలకు న్యాయస్థానాలు సమ్మతించి సు బోధ్సింగ్ను అప్పగించడం అనివార్యంగా మారింది. సుబోధ్ను తరలించడంలో సీపీ గౌస్ ఆలం అత్యంత చాకచక్యంగా వ్యవహరించారు. న్యాయని పుణులు, బిహార్కు చెందిన పలువురు ఐపీఎస్ ఆఫీ సర్లను సంప్రదిస్తూ.. పోలీసులకు ఎప్పటికపుడు సూచనలు చేశారు. బిహార్లో గడ్డాలు పెంచుకుని.. మాసినబట్టలతో పోలీసులు పూర్తిగా ఆహార్యం మార్చుకుని సంచరించారు. పలువురు అధికారులు సుబోధ్ తరలింపునకు అనేక అడ్డుపుల్లలు వేశారు. బేడీలు తీసి విమానంలోకి.. సుబోధ్ తరలింపునకు మార్గం సుగమం అయిన తరువాత అతడిని విమానాశ్రయానికి తరలించడం పోలీసులకు సవాలుగా మారింది. దారి వెంట అతడి అనుచరులు దాడిచేస్తారన్న సమాచారంతో కట్టుదిట్టమైన భద్రత మధ్య తీసుకురావాల్సి వచ్చింది. అతడికి బేడీలు వేయకుండా విమానం ఎక్కించడానికి చాలా శ్రమించాల్సి వచ్చింది. మే 28న సుబోధ్ని తరలిస్తున్నారన్న సమాచారం ముందుగా ఏవియేషన్ అధికారులకు తెలిపి వారి సాయం తీసుకున్నారు. అందులో భాగంగా ప్రయాణికులకంటే ముందే సుబోధ్కు బేడీలు తీసివేసి విమానం ఎక్కించారు. అతడికి ఎస్క్రా్ట్గా సీఐ తిరుమల్, ఎస్సై రాజన్న కూర్చున్నారు. విమానం శంషాబాద్లో దిగాక సీపీ గౌస్ ఆలంతో సహా అంతా ఊపిరి పీల్చుకున్నారు. -
శాంతిభద్రతలు పరిరక్షిస్తాం
గోదావరిఖని: శాంతిభద్రతల పరిరక్షణలో బ్లూ కోల్ట్స్, పెట్రో సిబ్బంది పాత్ర అత్యంత కీలక మని రామగుండం కమిషనరేట్ అడిషనల్ డీ సీపీ(అడ్మిన్) శ్రీనివాస్ అన్నారు. కమిషనరేట్ లో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫిర్యాదుదారులకు మెరుగైన సేవలు అందించేందుకు తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై సిబ్బందికి పలు సూచనలు చేశారు. ప్రజలతో మర్యాదపూర్వకంగా, సున్నితంగా వ్యవహరించాలని సూచించారు. సమావేశంలో సీఐ చంద్రశేఖర్గౌడ్, అనిల్కుమార్, బాబురావు, సిబ్బంది పాల్గొన్నారు. క్రమశిక్షణే బీజేపీకి బలం సుల్తానాబాద్రూరల్: బీజేపీ కార్యకర్తల క్రమశిక్షణే పార్టీకి బలమని ఆ పార్టీ ఎమ్మెల్సీ చిన్న మల్ అంజిరెడ్డి అన్నారు. నర్సయ్యపల్లిలోని విజయ గార్డెన్లో రెండురోజుల పాటు జరిగే జి ల్లాస్థాయి ప్రశిక్షణ శిబిరాన్ని జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డితో కలిసి బుధవారం ఆయన ప్రారంభించారు. కార్యకర్తలు క్రమశిక్షణ, నిబ ద్ధతతో పనిచేయాలని సూచించారు. ఇన్చార్జి రాజమౌళిగౌడ్, ప్రశిక్షణ జిల్లా ఇన్చార్జి పరినీత, మాజీ ఎంపీ వెంకటేశ్నేత, జిల్లా ప్రశిక్షణ కన్వీ నర్ గొట్టిముక్కల సురేశ్రెడ్డి, నాయకులు గోమాస శ్రీనివాస్, నల్ల మనోహర్రెడ్డి, నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.పుణ్యక్షేత్రాలకు ఆర్టీసీ బస్సు గోదావరిఖనిటౌన్: స్థానిక ఆర్టీసీ డిపో నుంచి పుణ్యక్షేత్రాలకు బస్సు నడిపిస్తామని డీఎం నాగభూషణం తెలిపారు. ఈనెల 10వ తేదీన మధ్యాహ్నం ఒంటిగంటకు గోదావరిఖని నుంచి బస్సు బయలు దేరుతుందని పేర్కొన్నారు. ఈయాత్రలో హంపీ, గోవా, గోకర్ణ, మురుడేశ్వర్, ఉడిపి, ధర్మస్థల, కుక్కేసుబ్రహ్మణ్య, మంత్రాలయం పుణ్య క్షేత్రాల సందర్శన ఉంటుందన్నారు. సీటు రిజర్వేషన్, వివరాలకు 70135 04982, 73828 47596 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని ఆయన కోరారు.ప్రీప్రైమరీ ఇన్ స్ట్రక్టర్ల నియామకం పెద్దపల్లి: జిల్లాలోని 48 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతుల నిర్వహణకు అవసరమైన ఇన్స్ట్రక్టర్లు, ఆయాల నియామకానికి ఆసక్తి, అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని డీఈవో శారద తెలిపారు. తాత్కాలిక ప్రాతిపదికన 10 నెలల గౌరవ వేతనం చెల్లిస్తారన్నారు. ఆసక్తిగలవారు ఈనెల 9వతేదీ వరకు దరఖాస్తులు సమర్పించాలని కోరారు. మట్టి దందాపై చర్యలేవి? పెద్దపల్లి: జిల్లాలో వివిధ చెరువుల నుంచి మట్టి తరలించే టిప్పర్లు ఓవర్లోడ్తో వెళ్లడంతో రహదారులు దెబ్బతింటున్నాయని, ప్రభుత్వ ఖజానాకు భారీగా గండిపడుతోందని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యేదాసరి మనోహర్రెడ్డి ఆరోపించారు. కలెక్టరేట్ ఎదుట రైతులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి బుధవారం ఆయన ధర్నా చేశారు. అనంతరం కలెక్టరేట్ అడ్మినిస్ట్రేషన్ అధికారి ప్రకాశ్కు ఒక వినతిపత్రం అందజేశారు. అనంతరం దాసరి మాట్లాడుతూ, ప్రభుత్వ అధికారుల అండతో సాగుతున్న మట్టి మాఫియా, ధాన్యం కొనుగోళ్లలో తరుగు పేరిట సాగుతున్న మిల్లర్ల దోపిడీని అరికట్టాలన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిననాటి నుంచి అక్రమ దందాలు అడ్డగోలుగా సాగుతున్నాయని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఠాకూర్ రఘువీర్సింగ్, ఉప్పు రాజ్కుమార్, గుణపతి, వంగల తిరుపతిరెడ్డి, మోహన్రావు, సందీప్రావు, కొయ్యడ సతీశ్గౌడ్, పెంచాల శ్రీధర్, వెన్నం రవీందర్, రాజ కొమురయ్య, దేవయ్య, మార్కు లక్ష్మణ్, సలేంద్ర రాములు యాదవ్, వెంకట్రెడ్డి, శ్రీకాంత్గౌడ్, బైరెడ్డి రాంరెడ్డి, బాలసాని ఈశ్వర్గౌడ్, శ్రీనివాస్ ముదిరాజ్, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు. -
సింగరేణిలో పొలిటికల్ హీట్
గోదావరిఖని: తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) చీఫ్ కల్వకుంట్ల కవిత కోల్బెల్ట్ పర్యటన ఖరారైంది. ‘బాయిబాట’ పేరిట సింగరేణి అండర్ గ్రౌండ్, ఓపెన్కాస్ట్ గనుల్లో కార్మికులతో ఆమె సమావేశమవుతారు. కల్వకుంట్ల కవిత పర్యటన సింగరేణిలో పొలిటికల్ హీటెక్కిస్తోంది. ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో విస్తరించిన సింగరేణి బొగ్గు గనుల్లో పర్మినెంట్ కార్మికులు సుమారు 40వేల మంది, కాంట్రాక్టు కార్మికులు దాదాపు 30వేల మందికిపైగా ఉన్నారు. పరోక్షంగా మరో 20 వేల కుటుంబాలు సింగరేణి సంస్థపై ఆధారపడి జీవిస్తున్నాయి. కార్మికుల ఓట్లే కీలకం.. ప్రతీ అసెంబ్లీ ఎన్నికల్లో సింగరేణి కార్మికుల ఓట్లు కీలకంగా మారుతున్నాయి. గత ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటర్లు పట్టంకట్టారు. గతంలో బీఆర్ఎస్ను ఆదరించారు. ఈక్రమంలో సింగరేణి ఉద్యోగుల ఓ ట్లు రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారాయి. ప్ర స్తుతం సంస్థలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల కాలపరిమితి ముగియడం, మెడికల్ ఇన్వాలిడేషన్ నిలిచిపోవడం, మెడికల్ పూర్తయిన అభ్యర్థులకు పోస్టింగ్ ఇవ్వకపోవడం, విజిలెన్స్ విచారణ పేరిట మారుపేరు ఉద్యోగుల డిపెండెంట్ల ఉద్యోగాలు ని లిపివేయడంతో పాటు అనేక సమస్యలు ఉన్నాయి. గుర్తింపు, ప్రాతినిధ్య సంఘంతోపాటు జాతీయ కార్మిక సంఘాలు సింగరేణి తీరుపై ఆందోళన చేపట్టాయి. అన్నిగనులపై టీబీజీకేఎస్ నల్లబ్యాడ్జీలతో నిరసన నిర్వహించింది. సీఐటీయూ నాయకులు జీఎం కార్యాలయాల ఎదుట ఆందోళనలు చేసింది. టీబీజీకేఎస్ కార్యాచరణ సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ అనుబంధ టీబీజీకేఎస్ ఆందోళనకు సిద్ధమైంది. యూనియన్ గౌరవ అధ్యక్షుడు కొప్పుల ఈశ్వర్ రెండ్రోజు క్రితం సమావేశమై యూనియన్ శ్రేణులను అప్రమత్తంచేశారు. ఇందులో భాగంగా బుధవారం నల్లబ్యాడ్జీలతో గనులపై నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఆందోళన బాటలో కార్మిక సంఘాలు ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ యాజమాన్యం హా మీతో కొంత మెత్తబడినా మిగతా కార్మిక సంఘాలు ఉధ్యమానికి సిద్ధమయ్యాయి. సీఐటీయూ, హెచ్ఎంఎస్, బీఎంఎస్ తమ పోరాటానికి పదును పెడుతున్నాయి. ఈక్రమంలో ప్రతినెల రెండు మెడికల్ ఇన్వాలిడేషన్ నిర్వహించి కార్మికుల పిల్లలకు ఉద్యోగాలివ్వాలనే డిమాండ్ పెరుగుతోంది.డిప్యూటీ సీఎం హామీ ఇచ్చినా.. సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క కోల్బెల్ట్ప్రాంత ఎమ్మెల్యేలతో సమావేశమై కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అయినా.. కార్యాచరణలో ముందుకు సాగకపోవడంతో కార్మికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా మారుపేర్ల మార్పు, మెడికల్ ఇన్వాలిడేషన్ కార్మికుల పిల్లలు ప్రభుత్వం తీరుపై ఆగ్రహంతో ఉన్నారు. -
పకడ్బందీగా ‘సురక్షిత జలవాయు’ అమలు
పెద్దపల్లి: జిల్లాలో స్వచ్ఛ గావ్, సురక్షిత జలవాయు కార్యక్రమాలను పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ బుధవారం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన స్వచ్ఛ గావ్, సురక్షిత జలవాయు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంపై విస్తృత అవగాహన కల్పించేందుకు ఈనెల 5వ తేదీ వరకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాలో అర్హులైన జర్నలిస్టులు అందరికీ అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేసినట్లు కలెక్టర్ శ్రీహర్ష తెలిపారు. తొలివిడతలో 150, రెండోవిడతలో 305 మంది జర్నలిస్టులకు అక్రిడిటేషన్కార్డులు మంజూరు చేసినట్లు కమిటీ సభ్యులు తెలిపారు. మూడో విడతలో మరింతమందికి వచ్చేలా చొరవ తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆయా కార్యక్రమాల్లో జెడ్పీ సీఈవో నరేందర్, డీఆర్డీవో కాళిందిని, బీసీ అభివృద్ధి అధికారి రంగారెడ్డి, ఐజేయూ – టీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షుడు బుర్ర సంపత్ కుమార్, డీపీఆర్వో జగన్, అక్రిడిటేషన్ కమిటీ సభ్యులు నారాయణదాసు అశోక్, కుమార్ యా దవ్, రంజిత్ కుమార్, అంకరి ప్రకాశ్, హాకిం, మోహన్, కుమార్ తదితరులుపాల్గొన్నారు. ప్రభుత్వ సందేశం ప్రతీఇంటికి చేరాలి జ్యోతినగర్/పెద్దపల్లి: జిల్లాలో నిర్వహించనున్న గ్రామ, వార్డు సభల ద్వారా ప్రభుత్వ కార్యక్రమాలు, సంక్షేమ పథకాల సందేశం ప్రతీ ఇంటికి చేరేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ శ్రీహర్ష ఆదేశించారు. ఎన్టీపీసీలో అదనపు కలెక్టర్ అరుణశ్రీతో కలిసి ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక– 99 రోజుల కార్యక్రమంపై వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. వడదెబ్బ మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.4 లక్షల పరిహారం అందిస్తుందని, ఇందుకోసం ఎఫ్ఐఆర్, పోస్టుమార్టం, మరణధ్రవీకరణ పత్రం ఉండాలని ఆయన పేర్కొన్నారు. తక్కువ వర్షపాతం పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటలు, నీటి నిర్వహణ, విద్యుత్ రంగ అవసరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆయన సూచించారు. ఎస్ఐఆర్పై అవగాహన కల్పించాలని చెప్పారు. ప్రతీశుక్రవారం చేపట్టే డ్రైడేలో ప్రజల భాగస్వామ్యం పెంచాలని అన్నారు. జెడ్పీ సీఈవో నరేందర్, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాస్, ఆర్డీవోలు గంగయ్య, సురేశ్, ఏసీపీ రమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
బంగారు తెలంగాణకు బాటలు
గోదావరిఖని: బంగారు తెలంగాణకు బాటలు వేసేందుకు సింగరేణిలో నిర్దేశిత బొగ్గు ఉత్పత్తి చేయాలని ఆర్జీవన్ జీఎం లలిత్కుమార్ కోరా రు. జీఎం కార్యాలయంలో జెండా ఎగురవేసిన ఆయన.. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమా ల వేశారు. అనంతరం మాట్లాడారు. ఈసందర్భంగా తెలంగాణ రన్ నిర్వహించారు. కళకారు ల నృత్యాలు, భవానీపోతురాజుల వేషాలు, మ హిళల డప్పు చప్పుళ్లు, బోనాలు, కోలాటం, బ తుకమ్మల మధ్య తెలంగాణ రన్ కొనసాగింది. కార్యక్రమంలో క్వాలిటీ జీఎం సుజోయ్మజుందర్, ఎస్వోటూ చంద్రశేఖర్, సీఎంవోఏఐ కోలా మల్లేశ్, ఏజీఎం రామ్మోహన్రావు, ఆంజనేయు లు, ప్రాజెక్ట్ అధికారి రమేశ్, ఏజెంట్లు రమేశ్, శ్రీనివాస్, అధికారులు ధనలక్ష్మీభాయి, జితేందర్సింగ్, వరప్రసాద్, పర్సనల్ అధికారులు రవీందర్రెడ్డి, వేణు తదితరులు పాల్గొన్నారు. -
జీజీహెచ్లో అరుదైన శస్త్రచికిత్స
కోల్సిటీ: గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి(జీజీహెచ్) వైద్యులు జిల్లాలోనే తొలిసారి అత్యాధునిక ఐపీవోఎం(పొత్తికడుపు పొరలో వచ్చే హెర్నియా సమస్య) శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. గోదావరిఖనికి చెందిన దీప(27) కడుపునొప్పితోపాటు బొడ్డు భాగంలో ఉబ్బుగా కనిపిస్తోందని జీజీహెచ్ను ఆశ్రయించింది. వైద్యులు పరీక్షించగా బొడ్డు భాగం పొరలో హెర్నియా సమస్య ఉన్నట్లు తేలింది. ఈనెల 1న ఆస్పత్రిలో అడ్మిట్ చేసుకుని వైద్య పరీక్షలు చేశారు. రోగి ఆరోగ్య పరిస్థితిని సమగ్రంగా పరిశీలించిన అనంతరం అత్యాధునిక లాపరోస్కోపిక్ విధానంలో ఐపీవోఎం శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించారు. మంగళవారం డాక్టర్లు మంజూష, అనిల్కుమార్ పర్యవేక్షణలో శస్త్రచికిత్స విజయవంతమైంది. వైద్యుల్లో లుబ్నా, సందీప్, శుభమ్, కిరణ్తోపాటు ఆపరేషన్ థియేటర్ సిబ్బంది సమన్వయంతో పనిచేశారు. మత్తుమందు విభాగాధిపతి లక్ష్మీనర్సయ్య నేతృత్వంలో డాక్టర్లు శ్రీనివాస్, దినేశ్, సంజన, తేజస్విని పేషెంట్కు మత్తుమందు సేవలు అందించారు. సాధారణంగా కార్పొరేట్ ఆస్పత్రుల్లోనే ఈ తరహా శస్త్రచికిత్స చేస్తారు. దీనిని జీజీహెచ్లో విజయవంతంగా పూర్తి చేయడం విశేషమని వైద్య వర్గాలు పేర్కొంటున్నాయి. జిల్లాలోనే తొలిసారి ఈ విధమైన శస్త్రచికిత్స నిర్వహించడంపై ఆస్పత్రి సూపరింటెండెంట్ దయాల్సింగ్, డిప్యూటీ సూపరింటెండెంట్ అరుణ, ఆర్ఎంవోలు కృపాభాయి, దండె రాజు తదితరులు వైద్య బృందాన్ని అభినందించారు. ప్రజలకు అత్యాధునిక వైద్యసేవలు అందించాలనే లక్ష్యం నిర్దేశించుకుని ఈ శస్త్రచికిత్సను విజయవంతం చేసినట్లు వివరించారు. -
యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తాం : ఎంపీ వంశీకృష్ణ
పెద్దపల్లిరూరల్: యు వతకు కాంగ్రెస్ ప్ర భుత్వం ఉపాధి, ఉ ద్యోగావకాశాలు క ల్పించేలా అనేక చర్య లు చేపట్టిందని పెద్దపల్లి పార్లమెంట్ స భ్యుడు గడ్డం వంశీకృష్ణ అన్నారు. జిల్లా కేంద్రంలోని కమాన్వద్ద మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సీఎం రేవంత్రెడ్డి సారథ్యంలోని ప్రజాప్రభుత్వం పారిశ్రామిక ప్రగతికి పెద్దపీ ట వేస్తూనే వృత్తినైపుణ్యశిక్షణ ఇప్పించేలా ఏటీసీలు ఏర్పాటు చేస్తోందని తెలిపారు. మంత్రి వివేక్ ఆధ్వర్యంలో ఏటీసీల్లో శిక్షణ పూర్తిచేసుకున్న వారికి నేరు గా ఉద్యోగావకాశాలు దక్కుతున్నాయని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని పదేళ్లపాటు పాలించిన బీఆర్ఎస్ నేతలు తమ స్వార్థప్రయోజనాలకే ప్రాధాన్యత ఇచ్చుకున్నారని ఎంపీ ఆరోపించారు. కార్యక్రమంలో నాయకులు బండారి సునీల్గౌడ్, సజ్జద్, బాలసాని సతీశ్ తదితరులు పాల్గొన్నారు. ప్రహరీ నిర్మాణం ప్రారంభం మంథని: మున్సిపల్లోని నాలుగో వార్డులో నగరాభివృద్ధి నిధుల ద్వారా చేపట్టనున్న ఖబ్రస్తాన్ ప్రహరీ పనులను మున్సిపల్ చైర్మన్ వొడ్నాల శ్రీనివాస్ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మైనారిటీల అవసరాలను దృష్టిలో ఉంచుకొని అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని ఆయన తెలిపారు. ప్రహరీ నిర్మాణం పూర్తయిన తర్వాత ఖబ్రస్తాన్లో మరిన్ని సౌకర్యా లు కల్పించనున్నట్లు ఆయన చెప్పారు. ఈ కా ర్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ మద్దికట్ల స్రవంతి, మైనారిటీ నాయకులు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు తదిరతులు పాల్గొన్నారు. -
‘అగ్నివీర్’లకు అభినందన
పెద్దపల్లి: అగ్నివీర్ వాయు విభాగానికి ఎంపికై న యువతులను కలెక్టర్ కోయ శ్రీహర్ష అభినందించారు. యువశక్తి ప్రోగ్రామ్లో శిక్షణ పొందిన యువతులు సిలివెరి శ్రీజ, చిప్ప శశివర్షిణి అగ్నివీర్ వాయు విభాగానికి ఎంపికయ్యారు. వీరిని కలెక్టరేట్లో ఆయన మంగళవారం స న్మానించి మాట్లాడారు. దేశ సేవకోసం భారత సైన్యం, వైమానిక దళంలో చేరడం ఎంతో గౌ రవప్రదమైన విషయమన్నారు. వీరిని యువత స్ఫూర్తిగా తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో యువశక్తి ప్రోగ్రామ్ కో ఆర్డినేటర్ లెంకల మహిపాల్రెడ్డి, జిల్లా మార్కెటింగ్ అధికారి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. పోలీసులకు సేవా పతకాలు గోదావరిఖని: రామగుండం పోలీస్ కమిషనరే ట్లోని ఉత్తమ పోలీసు అధికారులు, సిబ్బంది కి సీపీ అంబర్ కిశోర్ ఝా పతకాలతో సత్కరించారు. ఉత్తమ సేవా పతకం సాధించిన సీసీఆ ర్బీ ఎస్ఐ మహేందర్రెడ్డి, సీసీఎస్ మంచిర్యా ల ఎస్ఐ డి.లలిత, బెల్లంపల్లి వన్టౌన్ ఏఎస్ఐ ఎస్.మహేంద్రపలన్, సేవాపతకాలు సాఽఽధించి న సీసీఎస్ మంచిర్యాల ఎస్ఐ సామ్యూల్పాల్, మందమర్రి ఎస్ఐ ఎన్.శ్రీనివాస్, బెల్లంపల్లి కా ర్ ఆర్ఎస్ఐ ఎస్.మల్లేశ్, గోదావరిఖని వన్టౌ న్ ఏఎస్ఐ హెచ్.వెంకటేశ్వరబాబు, ఏఎస్ఐ సీ హెచ్ తిరుపతిరెడ్డి, జూలపల్లి హెడ్కానిస్టేబుల్ ఎం.విజేందర్రెడ్డి, నీల్వాయి హెడ్కానిస్టేబుల్ బి.రాజయ్యకు సీపీ పతకాలు అందజేశారు. ఎన్టీపీసీ చేతికి ‘బీ–థర్మల్’? రామగుండం: రెండేళ్ల క్రితం మూతపడిన స్థానిక 62.5 మెగావాట్ల బీ–థర్మల్ విద్యుత్ కేంద్రం స్థానంలో 800 మెగావాట్ల సామర్థ్యంతో కొత్త పవర్ ప్లాంట్ నిర్మాణ బాధ్యల్ని ఎన్టీపీసీ దక్కించుకున్నట్లు సమాచారం. రామగుండం బీ థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని ఢిల్లీలోని కార్పొరేట్ కార్యాలయం, ఎన్టీపీసీ–నోయిడా, హైదరాబాద్లోని ఉన్నతాధికారులు మంగళవారం ఈ ప్లాంట్ను సందర్శించడం ఇందుకు బలాన్ని చేకూర్చుతోది. రామగుండంలోని జెన్కో ఇంజినీర్లు వారితో కలిసి పవర్ ప్లాంట్ ఏరియా, యాష్పాండ్, కోల్ప్లాంట్, మార్షలింగ్ యార్డు, ఉద్యోగ నివాసాలు తదితర ప్రాంతాలు సందర్శించినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ విషయమై పలుమార్లు జెన్కో ఎస్ఈని వివరణ కోరగా స్పందించలేదు. ఫిట్నెస్ నిరాకరణ సరికాదు జ్యోతినగర్: రామగుండంలోని ఎన్టీపీసీ – తె లంగాణ ప్రాజెక్టు కాంట్రాక్టు కార్మికులను అనారోగ్య సమస్యల సాకుతో ఫిట్నెస్కు నిరాకరించడాన్ని మానుకోవాలని కాంట్రాక్టు కార్మికుల సంఘాల జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం ఎన్టీపీసీ పర్మినెంట్ టౌన్షిప్ ధ న్వంతరి ఆస్పత్రిలోని సీఎంవోకు వినతిపత్రం అందజేశారు. ప్రాజెక్ట్తోపాటు పలు లొకేషన్ల లో అనేకమంది కాంట్రాక్ట్ కార్మికులు సంస్థ అ భివృద్ధికి రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారని అ న్నారు. ఐదేళ్లుగా వైద్య పరీక్షల పేరుతో కార్మికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న విష యం యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా స్పందించడం లేదని పేర్కొన్నారు. తక్షణమే అధికారులు స్పందించాలని వారు కోరారు. క్షయ నిర్ధారణ పరీక్షలు పెద్దపల్లిరూరల్: కొత్తపల్లి గ్రామంలో మంగళవారం టీబీ నిర్ధారణ పరీక్షలు చేశారు. పెద్దపల్లి మండలం రాఘవాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్య సిబ్బంది పాల్గొన్నారు. జాతీయ క్షయ నిర్మూలన కార్యక్రమంలో భాగంగా గ్రామంలో ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా తెమడ, చాతీ ఎక్స్రే పరీక్షలు చేసి అవసరమైన వారికి పలు సూచనలిచ్చారు. -
నిమ్మనపల్లిలో మట్టి లారీల అడ్డగింత
పెద్దపల్లి/పెద్దపల్లిరూరల్: సామర్థ్యానికి మించి మట్టి తరలిస్తున్న లారీలను నిమ్మనపల్లి సర్పంచ్ వేల్పుల రమేశ్ ఆధ్వర్యంలో మంగళవారం అడ్డుకున్నారు. సుమా రు మూడు గంటలపాటు గ్రామస్తులు రో డ్డుపై బైఠాయించారు. దీంతో కిలోమీట రుకుపైగా వాహనాలు నిలిచిపోయాయి. సామర్థ్యానికి మించి లారీల్లో మట్టి తరలించడంతో రోడ్లు దెబ్బతింటున్నాయని ఆరోపించారు. దెబ్బతిన్న రోడ్లను మర మ్మతు చేయడమే కాకుండా ఇందిరమ్మ ఇళ్లకోసం సగం ధరకే ఇటుకలు సరఫరా చేయాలని బట్టీ యజమానులను డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళన విరమింపజేశారు. -
బల్దియా క్లీన్పై క్యూసీఐ నజర్
కోల్సిటీ: స్వచ్ఛ సర్వేక్షణ్లో భాగంగా రామగుండం నగరంలో స్వచ్ఛ తీరు నేరుగా తనిఖీ చేయడానికి ఢిల్లీ నుంచి క్యాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (క్యూసీఐ) ద్వారా ఇప్సోస్ అసెసర్ సంస్థ ప్రతినిధు లు ప్రదీప్, సాయి, మనీష్, ప్రదీప్ మంగళవారం బల్దియాకు చేరుకున్నారు. వారంపాటు వీరు పర్యటించనున్నారు. తొలిరోజు ఎస్ఎల్పీ(సర్వీస్ లెవల్ ప్రోగ్రేస్)పై క్షేత్రస్థాయిలో వివరాలు సేకరించారు. స్వచ్ఛ సర్వేక్షణ్ పోటీల్లో ఎస్ఎల్పీకి 10,500 మా ర్కులు ఉంటాయి. ఇంటింటా చెత్త సేకరణ, తడి, పొడి చెత్తను వేరు చేస్తున్న వైనంతోపాటు కంపోస్టు యార్డు, డీఆర్సీసీ కేంద్రాల పనితీరు, రోడ్ల పరిశుభ్రత, చెత్త వాహనాల వినియోగం తదితర అంశాల పై ఆరా తీశారు. ఇంటింటికీ వెళ్లి శానిటేషన్పై పౌ రుల అభిప్రాయాలూ సేకరిస్తున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన సంకేతాల ఆధారంగా ఆన్లైన్లోనే వివరా లు, ఫొటోలను అప్లోడ్ చేస్తున్నారు. వీరి వెంట ఎన్వరాల్మెంట్ ఇంజినీరు మధూకర్, శ్రీకాంత్తోపాటు ఏకో వారియర్స్ ప్రతినిధులు ఉన్నారు. -
ప్రజల ఆకాంక్ష, ఐక్యతకు ప్రతీక
జ్యోతినగర్: ప్రజల ఐక్యత, పురోగతి, ఆ కాంక్షల స్ఫూ ర్తికి ప్రతీక తె లంగాణ అని ఎన్టీపీసీ జనరల్ మేనేజర్ ముకుల్ రాయ్ అన్నారు. పీటీఎస్ జ్యోతి ఫంక్షన్హాల్లో జరిగిన తెలంగాణ వేడుకల్లో కేక్ కట్చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. సంస్థ పురోగతికి ఉద్యోగులు చేసిన కృషి ప్రశంసనీయమన్నారు. ఎన్టీపీ సీ ఎన్బీసీ సభ్యుడు బాబర్ సలీంపాషా, ఎన్టీపీసీ కార్మిక యూనియన్ల ప్రతినిధులు పాల్గొన్నారు. తెలంగాణకు గర్వకారణం ఫెర్టిలైజర్సిటీ: తెలంగాణలోనే ఏకైక యూరి యా ఉత్పత్తి క ర్మాగారం రా మగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ అని ఆ సంస్థ యూనిట్ హెడ్ ఎస్కే జిందాల్ అన్నారు. ప్లాంట్లో జాతీయ జెండా ఆవిష్కరించి మాట్లాడారు. ఆరు రాష్ట్రాల రైతులకు ఏటా సుమారు 12.7 లక్షల మెట్రిక్ టన్నుల నీమ్ కో టెడ్ యూరియా అందిస్తూ వ్యవసాయ రంగానికి వెన్నుముకగా నిలుస్తోందని ఆయన తెలిపారు. త్యాగధనులను స్మరించుకోవాలిపెద్దపల్లిరూర ల్: తెలంగాణ ఉద్యమంలో అ నేకమంది అమరులయ్యారని, వారి త్యాగాలను స్మరించుకోవాలని పెద్దపల్లి మున్సిపల్ చైర్మన్ మల్లయ్య అన్నారు. స్థానిక బస్టాండ్ సమీప అమరవీరుల స్థూపం వద్ద కమిషనర్ వెంకటేశ్ తదితరులతో కలిసి ఆయన నివాళి అర్పించారు. మున్సిపల్ ఆఫీసులో జాతీయజెండా ఆవిష్కరించి మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో అనేకమంది పాల్గొన్నారని అన్నారు. -
పెద్దపల్లి
7బుధవారం శ్రీ 3 శ్రీ జూన్ శ్రీ 2026ప్రజాపాలనలో ప్రగతి పరుగులుజిల్లావ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్ చదివే విద్యార్థులకు అల్పాహార పథకం ప్రారంభిస్తున్నామని ప్రభుత్వ విప్ విజరమణారావు తెలిపారు. జిల్లాలోని 547 పాఠశాలల ద్వారా సుమారు 37 వేల మందికి విద్య అందుతోందని ఆయన చెప్పారు. ఎఫ్ఆర్ఎస్ విధానంలో 96 శాతం హాజరు నమోదవుతోందన్నారు. రెండోవిడతలో రెండు వేల ఇళ్లు.. ఇందిరమ్మ తొలివిడతలో జిల్లాకు మంజూరైన 6,451 ఇళ్ల నిర్మాణాలు వేగంగా కొనసాగుతున్నాయని, లబ్ధిదారుల ఖాతాల్లో ఇప్పటివరకు రూ.126 కోట్లు జమచేశామని ప్రభుత్వ విప్ తెలిపారు. రెండోవిడతలో ప్రతీఅసెంబ్లీ నియోజకవర్గానికి 2 వేల చొప్పున 6 వేల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయనున్నామని ఆయన చెప్పారు. మహిళలకు ఆర్థిక తోడ్పాటు మహిళాశక్తి మిషన్ ద్వారా జిల్లావ్యాప్తంగా 6,851 స్వయం సహాయక సంఘాలకు రూ.454.66 కోట్ల బ్యాంక్ లింకేజీ, 1,642 సంఘాలకు రూ.52.90 కో ట్ల సీ్త్రనిధి రుణాలు అందించామని విజరమణారావు అన్నారు. 8,909 సంఘాలకు రూ.18.03 కోట్ల వడ్డీ రాయితీ విడుదల చేశామని, మహిళా సంఘాల ద్వారా 15 అద్దె ఆర్టీసీ బస్సులు, ఒక మెగావాట్ సోలార్ పవర్ ప్లాంట్, ఒక పెట్రోల్ బంక్ ఏర్పాటు చేశామని తెలిపారు. రంగంపల్లిలోని వీ–హబ్ ద్వా రా 376 మందికి శిక్షణ అందించామని అన్నారు. రైతులకు భరోసా వ్యవసాయ యాంత్రీకరణ ద్వారా జిల్లావ్యాప్తంగా 456 మంది రైతులకు రూ.1.92 కోట్ల సబ్సిడీతో వ్యవసాయ పరికరాలు పంపిణీ చేశామని, రైతుభరోసా ద్వారా 1,54,598 మంది రైతులకు రూ. 114.04 కోట్లు విడుదల చేశామని, 2025–26 యా సంగిలో 334 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా రూ.767.09 కోట్ల విలువైన 3,23,773 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని చెప్పారు. మోడల్ సోలార్ గ్రామంగా నందిమేడారం పీఎం కుసుమ్ పథకం కింద 9.5 మెగావాట్ల సామర్థ్యంతో విద్యుత్ ఉత్పత్తి యూనిట్ల ఏర్పాటుకు ఒప్పందాలు కుదుర్చుకున్నామని ప్రభుత్వ విప్ విజరమణారావు చెప్పారు. పీఎం సూర్యఘర్ ద్వా రా 1,094 సోలార్ రూఫ్టాప్లను 7.287 మెగావాట్ల సామర్థ్యంతో ఏర్పాటు చేశామని అన్నారు. జిల్లాలో 9 ఈవీ చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశామని, నందిమేడారాన్ని మోడల్ సోలార్ గ్రామంగా అభివృద్ధి చేస్తూ రూ.51.28 కోట్లతో 1,486 గృహా లు, 628 వ్యవసాయ పంపుసెట్లకు సోలార్ వ్యవస్థలు ఏర్పాటు చేస్తున్నామని ఆయన వివరించారు. నిరుద్యోగులకు అండగా మెగా జాబ్మేళాల్లో 3,515 మంది యువత పాల్గొనగా 933 మందికి ఉద్యోగ అవకాశాలు లభించా యని విప్ అన్నారు. అగ్నివీర్ శిక్షణ ద్వారా 47 మంది ఎంపికై నట్లు చెప్పారు. అనంతరం కలెక్టరేట్లోని తెలంగాణ తల్లి విగ్రహానికి విజయరమణరావు కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి పూలమాలలు వేశారు. రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్, అదనపు కలెక్టర్ అరుణశ్రీ, డీసీపీ రాంరెడ్డి, డీఆర్వో రాజేశ్వరి, మేయర్ మహంకాళి స్వామి, మున్సిపల్ చైర్మన్లు నూగిళ్ల మల్లయ్య, బిరుదు రాధాకృష్ణ, ఆర్డీ వో గంగయ్య, కలెక్టరేట్ ఏవో ప్రకాశ్ పాల్గొన్నారు. సాక్షి పెద్దపల్లి/పెద్దపల్లి: సంక్షేమం, అభివృద్ధి, సామాజిక న్యాయం అనే మూడు ప్రధాన లక్ష్యాలతో రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగుతోందని, ప్రగతిని పరుగులు పెట్టిస్తూ తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దుతున్నామని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. అదే లక్ష్యంగా జిల్లాను ముందుకు తీసుకెళ్లేలా పనిచేస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్లో మంగళవారం నిర్వహించిన వేడుకలకు విజయరమణారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అమరవీరుల స్థూపం వద్ద నివాళి అర్పించారు. అనంతరం జాతీయ పతాకం ఎగురవేశారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమం, అభివృద్ధి తదితర కార్యక్రమాల గురించి వివరించారు.అమరుల త్యాగఫలం గోదావరిఖని: అమరుల త్యాగాల ఫలితమే తె లంగాణ రాష్ట్ర ఆవిర్బావమని రామగుండం పోలీస్కమిషనర్ అంబర్ కిశోర్ ఝా అన్నారు. కమిషనరేట్లో జాతీయ జెండా ఎగరవేసిన ఆయన.. పోలీసు సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం సీపీ మాట్లాడారు. శాంతిభ ద్రతల పరిరక్షణలో తెలంగాణ పోలీసు మూడు దశాబ్దాలుగా అంకితభావంతో పనిచేస్తోందని అ న్నారు. ఒకప్పుడు సమస్యాత్మకంగా ఉన్న అనేక ప్రాంతాల్లో ప్రస్తుతం ప్రశాంతత నెలకొందని తె లిపారు. అడిషనల్ డీసీపీ(అడ్మిన్) శ్రీనివాస్, గో దావరిఖని, మంచిర్యాల, స్పెషల్ బ్రాంచ్, ట్రాఫి క్ ఏసీపీలు రమేశ్, ప్రకాశ్, నాగేంద్రగౌడ్, శ్రీనివాస్, ఏవో శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
హామీ అమలు చేయాలి
జ్యోతినగర్: ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీ మేరకు ముదిరాజ్లను బీసీ ఏ జాబితాలో చేర్చాలని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్ ముదిరాజ్ కోరారు. మంగళవారం ఆసిఫాబాద్ పర్యటన ముగించుకుని ఎన్టీపీసీ జ్యోతిభవన్కు చేరుకున్న ఆయన.. పలువురు నాయకులతో కలిసి మాట్లాడారు. రాష్ట్రంలోనే తమది అత్యధిక జనాభా అని అన్నారు. నాయకులు బల్ల సత్తయ్య, పిల్లి శివయ్య, సోమన్న, పిడుగు కృష్ణ ముదిరాజ్, దబ్బెట శంకర్ ముదిరాజ్, అప్పరాజు ప్రభాకర్ ముదిరాజ్, గొలుసు జ్యోతి, ముదిరాజ్, మంద రాజేశ్, రాజు ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. -
రైతుల గోస పట్టదా?
ధర్మారం: ‘వ్యవసాయ మార్కెట్కు రైతులు తీసుకొవచ్చిన మక్కలను ఎందుకు ఖాళీ చేయడంలేదు.. రోజుల తరబడి మక్కల వద్దే పడిగాపులు పడుతుంటే వారి గోస పట్టదా.. ఈరోజు మక్కలు మొత్తం ఖాళీ చేయాలి.. అందుకు సరిపడా లారీలు సమకూర్చాలి.. హమాలీల కొరత ఉంటే కూలీలు, హమాలీలను నియమిస్తాం.. రైతులపై భారం పడకుండా ప్రభుత్వం నుంచే డబ్బులు ఇప్పిస్తా’ అని సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. తాను కాళేశ్వరం వెళ్లివచ్చేలోగా సగం మక్కలు తరలించాలని సూచించారు. ఆదివారం రాత్రి ధర్మారంలో కురిసిన వర్షాలకు దెబ్బతిన్న పాన్టేలాలు, ధ్వంసమైన ఇళ్ల మంత్రి సోమవారం సందర్శించారు. స్థానిక మార్కెట్లో మక్కల కుప్ప లు ఆయన పరిశీలించారు. కాంటా పూర్తయినా లారీలు రావడం లేదని పలువురు రైతులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన మంత్రి.. సంబంధిత అధికారికి వెంటనే ఫోన్ చేశారు. సరిపడా లారీలు సమకూర్చాలని సూచించారు. డబ్బులు తీసుకున్నట్లు నిరూపిస్తే రాజీనామా ఇసుక దందాలో తాను డబ్బులు తీసుకున్నట్లు నిరూపిస్తే తన పదవికి రాజీమానా చేస్తానని మంత్రి లక్ష్మణ్కుమార్ సవాల్ చేశారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ, మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ తనపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ హయాంలోనే ఇసుక దందా సాగిందని, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని నేరేళ్ల మానేరు నుంచి నిత్యం వందలాది లారీలతో కేటీఆర్, సంతోష్రావు అక్రమంగా ఇసుక తరలిస్తున్న క్రమంలో దళితులపై జరిగిన ఘోరాల గురించి మంత్రిగా కొనసాగిన ఈశ్వర్ ఎందుకు స్పందించలేదని ఆయన ప్రశ్నించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ లావుడ్య రూప్లానాయక్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గాగిరెడ్డి తిరుపతిరెడ్డి, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు సోగాల తిరుపతి, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ పాలకుర్తి రాజేశంగౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
విద్యారంగంలో పురోగతి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కరీంనగర్ జిల్లా విద్యారంగంలో మంచిస్థాయిలో ఉన్నప్పటికీ, ఉన్నత విద్య, వృత్తివిద్య, వైద్య విద్యలో అవకాశాలు పరిమితంగా ఉండేవి. ప్రభుత్వ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలే ఆధారంగా ఉండగా, గ్రామీణ ప్రాంతాల్లో డిగ్రీ, జూనియర్ కాలేజీల కొరత స్పష్టంగా ఉండేది. స్వరాష్ట్రంలో కొత్త జిల్లాల వారీగా ప్రభుత్వ జూనియర్, డిగ్రీ, గురుకుల, రెసిడెన్షియల్, పాలిటెక్నిక్ కాలేజీలు విస్తరించాయి. ముఖ్యంగా ఇంజినీరింగ్ విద్యలో అభివృద్ధి జరిగింది. కొత్తపల్లి– మనోహరాబాద్ రైల్వే లైన్కు రూ.2,821 కోట్లు మంజూరయ్యాయి. సిది పేట వరకు 75 కిలో మీటర్లు రైల్వేలైన్ పూర్తయి రైలు నడుస్తోంది. మానేరు రివర్ ఫ్రంట్ మంజూరైంది. దీనికి రూ. 610 కోట్లు నిధులు కేటాయించారు. నదిపై 3 కిలో మీటర్ల మేర ఎంఆర్ఎఫ్ను ఏర్పాటు చేసేందుకు కొంత మేర సైడ్వాల్స్ ఏర్పాటు చేశారు. మానేరు నదిపై తీగల వంతెనకు రూ. 224 కోట్ల నిధులు మంజూరయ్యాయి. దేశంలోనే రెండో తీగల వంతెనగా కరీంనగర్కు ఐకాన్గా నిలిచింది. స్మార్ట్ సిటీగా దేశంలోని వంద నగరాలతో పాటు కరీంనగర్ను అభివృద్ధి చేశారు. కేంద్రం రూ.845 కోట్లు నిధులు మంజూరు చేసింది. ఈ ప్రాజెక్టుతో నగరంలో రోడ్లు, డ్రెయినేజీలు, పార్కులు, కమాండ్కంట్రోల్ సెంటర్ వంటి సౌకర్యాలు మెరుగుపడ్డాయి. కరీంనగర్కు ప్రభుత్వ మెడికల్ కళాశాల మంజూరైంది. దీనికి రూ. 200 కోట్లు నిధులుమంజూరయ్యాయి. మానేరు డ్యాం సమీపంలో ఐటీ టవర్ ఏ ర్పాటు చేశారు. దీనికి రూ. 25 కోట్లు నిధులు మంజూరయ్యాయి. ఆర్అండ్బీ గెస్ట్హౌజ్ను పాత భవనంస్థానంలో అధునాతనంగా మార్చారు. దీనికి రూ.15 కోట్ల నిధులు మంజూరు చేశారు. పరిపాలన సౌలభ్యం కోసం పాత భవనంస్థానంలో కొత్త కలెక్టరేట్ భవనం ఏర్పాటు చేశారు. దీనికి రూ.45 కోట్లు మంజూరుచేశారు. నిర్మాణం పూర్తయి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది. పెద్దపల్లి జిల్లాలో రూ.400 కోట్లతో రామగుండం మెడికల్ కాలేజీ, జిల్లా ఆసుపత్రి అప్గ్రేడ్, పెద్దపల్లి, మంథనిలో కొత్తగా మాతశిశుఆరోగ్య కేంద్రాలు, కొత్త కలెక్టరేట్, రామగుండం కమిషనరేట్, మహిళ, సైబర్ పోలీస్స్టేషన్లు ఏర్పాటు చేశారు. పెద్దపల్లి బస్డిపో, బైపాస్ ఏర్పాటు దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన సరస్వతి, పార్వతి బరాజ్లు, నంది పంపుహౌజ్, గాయిత్రీ పంపుహౌజ్, మిడ్మానేరులతో ఉమ్మడి జిల్లాలో సాగునీరుకు డోకాలేకుండా పోయింది. వేములవాడలో సుమారు 166కోట్లతో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేశారు. మూలవాగు బ్రిడ్జి నుంచి వేములవాడ దేవస్థానం వరకు రూ.45 కోట్లతో రోడ్డు విస్తరణ పనులు సాగుతున్నాయి. సిరిసిల్ల టెక్స్టైల్ పరిశ్రమకు మద్దతుగా యారాన్ డిపో(నూలు) ఏర్పాటు, జిల్లాలో 11వేలకు పైగా పాత పవర్లూమ్లను ఆధునీకరించారు. 126చేనేత సహకార సంఘాలు, 1600 చిన్న పవర్లూమ్ యూనిట్లకు ప్రోత్సాహం, టెక్స్టైల్ పార్కు, గార్మెంట్ ట్రైనింగ్ సెంటర్ల ఏర్పాటు చేశారు. రాజన్న ఆలయ పరిసరాల అభివృద్ధికి సుమారు రూ.76 కోట్లు, అన్నప్రసాద భవన నిర్మాణానికి రూ.35 కోట్లు పైగా నిధుల కేటాయించారు. వీటీడీఏ ఏర్పాటుతో వేములవాడ సరికొత్తగా రూపుదిద్దుకోనుంది. జగిత్యాలలో మెడికల్ కాలేజీ ఏర్పాటు, పా రామెడికల్ విద్యా అవకాశాలు పెరిగాయి. నేషనల్ హైవే–563 విస్తరణ పనులు, రాళ్లవాగు ప్రాజెక్టు నిర్మాణాలు పూర్తయ్యాయి. బసంత్నగర్ ఎయిర్పోర్టు, రామగుండం–మణుగూర్ను కలిపే కోల్కారిడార్, ఈఎస్ఐ ఆసుపత్రి, పత్తిపాక రిజర్వాయర్, నిజాం షుగర్ ఫ్యాక్టరీ తదితర దీర్ఘకాలిక ప్రాజెక్టులు స్వరాష్ట్రంలో సైతం నెరవేరకపోవడంపై ప్రజానీకం అసహనం వ్యక్తం చేస్తున్నారు. -
ఆవిర్భావ వేడుకలకు పటిష్ట ఏర్పాట్లు
పెద్దపల్లి: తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు పటిష్ట ఏర్పాట్లు చేశామని కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. కలెక్టరేట్ ప్రాంగణంలో మంగళవారం జరిగే వేడుకలకు చేపట్టిన ఏర్పాట్లను ఆయన సోమవారం పరిశీలించారు. ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణారావు ముఖ్యఅతిథిగా హాజవువుతారన్నారు. ఉదయం 7.50 గంటలకే వేడుకలు ప్రారంభమవుతాయని తెలిపారు. అదనపు డీసీపీ రాంరెడ్డి, పౌర సరఫరాల అధికారులు శ్రీనాథ్, శ్రీకాంత్, ఆర్డీవో గంగయ్య, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్, తహసీల్దార్ రాజయ్య పాల్గొన్నారు.స్వరాష్ట్రంలో ఉమ్మడి జిల్లా అభివృద్ధి దిశగా దూసుకెళ్తోంది. ఒకప్పుడు ఉన్నత విద్య, వైద్య సేవల కోసం ఇతర ప్రాంతాలపై ఆధారపడిన ఈ ప్రాంతం నేడు విద్యా,వైద్య రంగాల్లో స్వయం సమృద్ధి వైపు అడుగులు వేస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో పరిమిత స్థాయిలో ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడికల్ కాలేజీలుండగా, ప్రస్తుతం కొత్తజిల్లాల వారీగా ఆధునిక వైద్యసేవలు, మెడికల్ కాలేజీలు, మాతాశిశు ఆరోగ్యకేంద్రాలు, గురుకుల విద్యాసంస్థలు, కార్పొరేట్ ఇంజినీరింగ్ కాలేజీలు, డిజిటల్ విద్యావసతులు అందుబాటులోకి వచ్చాయి. నీటిపారుదల, సాగు రంగంలో వచ్చిన కీలకమార్పులతో ప్రజలకు ఆర్థిక స్థిరత్వం కలిగి, తలసరి ఆదాయం మెరుగుపడింది. –సాక్షిప్రతినిధి, కరీంనగర్ -
● స్వరాష్ట్రంలో అభివృద్ధి పథంలో ఉమ్మడి జిల్లా ● మెరుగైన వైద్యం, విద్య మౌలిక వసతులు ● నీటిపారుదల ప్రాజెక్టులతో పెరిగిన సాగువిస్తీర్ణం ● పుష్కరకాలంలో ఉమ్మడి జిల్లాలో అనేక మార్పులు
ఉమ్మడి రాష్ట్రంలోని 23 జిల్లాల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా రూ.90,859 తలసరి ఆదాయంతో రాష్ట్రంలోనే 5వ స్థానంలో ఉండేది. 2013–14లో ఉమ్మడి రాష్ట్రం యొక్క తలసరి ఆదాయం రూ.85,797 ఉండగా, నేడు పెద్దపల్లి రూ.2,31,766, కరీంనగర్ రూ.2,22,628, రాజన్న సిరిసిల్ల రూ.1,95,479, జగిత్యాల రూ.1,83,094గా నమోదైంది. పదేళ్లలో ఈ ప్రాంతాల తలసరి ఆదాయం సుమారు 2నుంచి 2.5 రెట్లు పెరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో 9లక్షల ఎకరాల సాగు విస్తీర్ణం కలిగి ఉండేది. ప్రధానంగా పత్తి, వరి, మొక్కజొన్న, కందులు, పెసలు పండించేవారు. స్వరాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు, శ్రీరాంసాగర్ కాకతీయ కాలువ, మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణ వల్ల సాగునీరు గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం కరీంనగర్లో 3,31,252 ఎకరాలు, పెద్దపల్లిలో 2,83,876 ఎకరాలు, జగిత్యాలలో 3,74,645 ఎకరాలు, సిరిసిల్లలో 2,43,292 ఎకరాలు సాగవుతున్నాయి. మొత్తంగా 12లక్షల ఎకరాలు సాగవుతుంది. నీటి వసతి పెరగటంతో 20శాతం నుంచి 35శాతం వరకు సాగు విస్తీర్ణం పెరిగింది.స్వరాష్ట్రంలో పరిపాలన విక్రేందీకరణతో పెనుమార్పులు చోటుచేసుకున్నాయి. ఉమ్మడి జిల్లా కాస్తా కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల జిల్లాలుగా మారాయి. 57 మండలాలు ప్రస్తుతం 61 మండలాలుగా విస్తరించాయి. ఐదు రెవెన్యూ డివిజన్లు 9 రెవెన్యూ డివిజన్లుగా, 6 మున్సిపాలిటీలుండగా, మరో 8 కొత్తగా ఏర్పడ్డాయి. ప్రతి జిల్లాలో కొత్తగా కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలు అందుబాటులోకి వచ్చాయి. ఉమ్మడి రాష్ట్రంలో సూపర్ స్పెషాలిటీ సేవల కోసం హైదరాబాద్ లేదా వరంగల్ వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. ఉమ్మడి జిల్లాకు కరీంనగర్ ప్రధాన ఆసుపత్రి ప్రధాన ఆధారంగా ఉండేది. స్వరాష్ట్రంలో కొత్త జిల్లాల వారీగా మెడికల్ కాలేజీల ఏర్పాటు, జిల్లా ఆసుపత్రుల అప్గ్రేడేషన్, మాతాశిశు సంరక్షణ కేంద్రాలు, డయాలసిస్ కేంద్రాల విస్తరణ, ఐసీయూ, ఎన్ఐసీయూ, పీఐసీయూ సేవల పెంపు, ఆరోగ్య శ్రీసేవల విస్తరణ, పల్లెదవాఖానాల ఏర్పాటుతో ప్రజలకు మెరుగైన వైద్యం అందుబాటులోకి వచ్చింది. -
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
సుల్తానాబాద్రూరల్: అర్హులందరికీ త్వరలోనే రెండోదశ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామ ని ప్రభుత్వ విప్ విజయరమణారావు తెలిపా రు. భూపతిపూర్లో సోమవారం ఇందిరమ్మ గృహప్రవేశాలు చేయించారు. కాంగ్రెస్ ప్రభు త్వం ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడంతోపాటు గృహప్రవేశాలు చేయిస్తోందని అన్నారు. సర్పంచులు పోచంపల్లి పోచాలు, తిరుమల్రా వు, శ్రీరంగరావు, ఏఎంసీ చైర్మన్ ప్రకాశ్రావు, ఎంపీడీవో దివ్యదర్శన్రావు, మాజీ ప్రజాప్రతినిధులు పులి వెంకటేశం, జానీ పాల్గొన్నారు. పేదలకు సంక్షేమ ఫలాలుపాలకుర్తి: అర్హులైన ప్రతీకుటుంబానికి సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నా మని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రా జ్ఠాకూర్ అన్నారు. సోమవారం పాలకురితోపాటు బసంత్నగర్, కొత్తపల్లి, రామారావుపల్లిలో ఇందిరమ్మ ఇళ్లు ప్రారంభించి మాట్లాడా రు. సర్పంచులు, ఇతర ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. పోలీసులకు సేవా పతకాలు పెద్దపల్లిరూరల్/జ్యోతినగర్: జిల్లాలోని పలువురు పోలీసులు, పోలీస్ అధికారులకు ప్రతిష్టాత్మక పో లీస్ సేవా పురస్కారాలు లభించాయి. తెలంగాణ ఆవిర్భావం సందర్భంగా పోలీస్ శాఖలో అందించిన సేవలకు గుర్తింపు గా ఈ అవార్డులను ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో ఎన్టీపీసీలోని ఏఎస్సై తిరుపతికి ఉ త్తమ సేవా, మరో ఏఎస్ఐ బుచ్చినాయుడుకు సేవా పురస్కారం దక్కింది. కాగా, పెద్దపల్లి సీఐ కె.ప్రవీణ్కుమార్ పోలీసు సేవాపతకానికి ఎంపికయ్యారు. శాంతిభద్రతల పరిరక్షణతోపాటు నేరాల నియంత్రణకు పాటుపడుతున్న సీఐని పోలీసు సేవాపతకానికి ఎంపిక చేశారు. మొక్కలు నాటిన అధికారులుపెద్దపల్లి: ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా, తెలంగాణ అటవీ శాఖ ఆధ్వర్యంలో పర్యావరణ వారోత్సవాలను ఈనెల ఒకటినుంచి 12వ తేదీ వరకు నిర్వహిస్తున్నామని జిల్లా రెవెన్యూ అధికారి రాజేశ్వరి తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో మొక్కనాటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కలెక్టరేట్ పరిపాలన అధికారి ప్రకాశ్, అటవీ అధికారులు సతీశ్ కుమార్, వినయ్ నాయక్, దేవదాస్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు. ఆర్ఎఫ్సీఎల్లో యూరియా ఉత్పత్తిఫెర్టిలైజర్సిటీ: రామగుండం ఫెర్టిలైజర్స్, కెమికల్ లిమిటెడ్ కర్మాగారం మేలో 1,07,883.45 మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి చేసిందని యూనిట్ హెడ్ ఎస్కే జిందాల్ తెలిపారు. తె లంగాణతోపాటు ఆరు రాష్ట్రాలకు యూరి యా సరఫరా చేశామన్నారు. ఇందులో 64 శా తం తెలంగాణకు కేటాయించామన్నారు. రవాణా శాఖలో బదిలీలు పెద్దపల్లిరూరల్: జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో బదిలీలు జరిగాయి. జిల్లా రవాణశాఖ అధికారి రంగారావును వరంగల్ డీటీవో బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ఉన్నతాధికారు లు.. పెద్దపల్లి జిల్లా అధికారిగా ఎవరినీ నియమించలేదు. ఎంవీఐలు మసూద్అలీని కొమురంభీం ఆసిఫాబాద్కు, శివస్వప్నను సిద్దిపేట జిల్లాకు బదిలీ చేశారు. డెప్యూటేషన్పై ములుగులో విధులను నిర్వర్తిస్తున్న బి.శ్రీనివాస్ను భూపాలపల్లి జిల్లాకు బదిలీ చేసినట్టు ఆ ఉ త్తర్వుల్లో పేర్కొన్నారు. కరీంనగర్ డీటీవో కా ర్యాలయంలో పనిచేసే ఎంవీఐ రవికుమార్, మంచిర్యాలలో పనిచేసే రంజిత్కుమార్, చంద్ర కిశోర్రెడ్డిని పెద్దపల్లికి బదిలీ చేశారు. ఏఎంవీఐలుగా ఆదిలాబాద్ నుంచి రవీందర్, కొ మురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా నుంచి రాజమ ల్లు పెద్దపల్లికి బదిలీపై వచ్చారు. పెద్దపల్లి ఏవో గా వ్యవహరించిన అరుణను కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాకు, అక్కడి అరుణబాయిని పెద్దపల్లికి బదిలీ చేశారు. సింగరేణి పరిరక్షణ లక్ష్యం గోదావరిఖని: సింగరేణి సంస్థ కోసం జూలై 7వ తేదీన సింగరేణి పరిరక్షణ సదస్సు నిర్వహిస్తామని టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షుడు, మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. నగరంలో సోమవారం జరిగిన ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మిర్యాల రాజిరె డ్డి, కోరుకంటి చందర్, కేతిరెడ్డి సురేందర్రెడ్డి, మాదాసు రామ్మూర్తి, నూనె కొమురయ్య, పర్లపెల్లి రవి, చెల్పూరి సతీశ్ పాల్గొన్నారు. -
జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు ఇవ్వాలి
పెద్దపల్లి: అర్హులైన వర్కింగ్ జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలని టీయూడబ్ల్యూజే–ఐజే యూ నాయకులు కోరారు. కలెక్టరేట్లో సోమవా రం కలెక్టర్ కోయ శ్రీహర్షకు వినతిపత్రం అందజేశా రు. యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బుర్ర సంపత్ కుమార్, జిల్లా అధ్యక్షుడు వంశీ, ప్రధాన కార్యదర్శి నారాయణదాసు అశోక్ మాట్లాడుతూ, సీఏ సర్టిఫికెట్తో సంబంధం లేకుండా అర్హులందరికీ అక్కిడిటేషన్ కార్డులు ఇవ్వాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించేలా ప్ర భుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. టీకే శ్రీనివా స్, సామల హరికృష్ణ, వీరమల్ల విద్యాసాగర్రావు, ఆకుల రమేశ్, రాజు, నర్సయ్య పాల్గొన్నారు. -
క్రమశిక్షణ అలవడుతుంది
పిల్లల్లో క్రీడలపై ఆసక్తిని ప్రోత్సహిస్తే వారిలో ఫిట్నెస్ పెరుగుతుంది. ఆటగాళ్లుగా క్రీడాస్ఫూర్తి పెరిగి చదువుల్లోనూ రాణిస్తారు. క్రమశిక్షణ గల జీవితాన్ని అలవాటు చేసుకుంటారు. క్రికెట్ నేర్చుకుంటున్న పిల్లల్లో ఆన్లైన్ గేమ్స్, ఫోన్ ఫోబియా తగ్గిందని తల్లిదండ్రులు చెబుతున్నారు. చిన్నారుల్లో దాగి ఉన్న క్రీడాసక్తిని గమనించి వారికి సరైన శిక్షణ ఇప్పించాలి. జిల్లాలో చాలామంది క్రీడాకారులు జాతీయస్థాయిలో రాణించారు. – దొబ్బల ప్రేమ్కుమార్, ఫిట్నెస్ కోచ్ -
బాలల గణపతి
శుభ వినాయక నమో నమామి మొదటి పూజలు నీకే స్వామి నిన్ను మ్రొక్కిన తొలగు విఘ్నములు నీ చూపు సోకిన మంచి శకునములు పిల్లల మంతా నిన్ను కొలిచెదము విద్యా బుద్ధులు చక్కగ నొసగుము తల్లి దండ్రులను పూజించావట మాకు చూపుమా ఆ చక్కని బాట నీ చల్లని కరుణ మాపై చూపుము మా అజ్ఞానాన్ని రూపుమాపుము నీ రూపం మాకు ఎంతో ఇష్టం మా పిల్లలకు నీవే ప్రియదైవం నిత్యము నిన్నే కొలుచెదము నీ పూజలు చేసి మురిసెదము – బూర దేవానందం కవి, రచయిత, సిరిసిల్ల -
హైదరాబాద్ డివిజన్లోకి ‘పెద్దపల్లి’
రామగుండం: విశాఖపట్నం కేంద్రంగా కొత్తగా సౌత్ కోస్ట్ రైల్వేజోన్(ఎస్సీవోఆర్) జూన్ ఒకటో తేదీన ఆవిర్భవించనుంది. దక్షిణ మధ్య రైల్వేజోన్లోని ఆరింటిలో మూడు డివిజన్లు ఎస్సీవోఆర్లో విలీనం కానున్నాయి. మిగిలేవి సికింద్రాబాద్, హైదరాబాద్, నాందేడ్ డివిజన్లు మాత్రమే. డివిజన్ల సరిహద్దులు మారడంతో పెద్దపల్లి జంక్షన్ హైదరాబాద్ డివిజన్లో విలీనం కానుంది. రైల్వేట్రాక్ నెట్వర్క్ విస్తరణ 204 కి.మీ.కు పెరగనుంది. తద్వారా సికింద్రాబాద్ డివిజన్లో 40శాతం ఆదాయం తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు. ఆర్థికపరమైన లాభాలు కొత్త జోన్ ఏర్పాటుతో సికింద్రాబాద్ డివిజన్లోకి రాయచూర్–వాడీ, పగిడిపల్లి–జాన్పహాడ్ సెక్షన్లు విలీనమవుతాయి. దీనిద్వారా అదనంగా 204 కి.మీ. రైల్వే ట్రాక్ పెరగనుంది. బొగ్గు, సిమెంట్ తదితర పారిశ్రామిక సరుకు రవాణా పెరుగుతుంది. ఈ డివిజన్లో రామగుండం, మంచిర్యాల ద్వారా సింగరేణి బొగ్గు ఎగుమతితో ఆదాయం సమకూరుతుంది. పెరగనున్న జోన్స్థాయిలో ప్రాధాన్యత దక్షిణ మధ్య రైల్వేలో సికింద్రాబాద్ డివిజన్ అతిపెద్దదిగా.. 1,800 కిలోమీటర్ల నెట్వర్క్ ఉంటుంది. ఫండింగ్, ప్రాజెక్టులు వచ్చే అవకాశం అధికంగా ఉంటుంది. హైదరాబాద్ మెట్రోపాలిటిన్ ఏరియా, ఉత్తర తెలంగాణలో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. వీటితోపాటు తెలంగాణ ఇండస్ట్రియల్ ఫార్మా, ఐటీ, లాజిస్టిక్స్ ఎగుమతులతో ఫ్రైట్, ప్యాసింజర్ ఆదాయం పెరుగుతుంది. ఆర్థికపరమైన నష్టాలు దక్షిణ మధ్య రైల్వే మొత్తం ఆదాయం గతేడాది గరిష్టంగా రూ.23వేల కోట్లు ఉండగా, కొత్త జోన్ ఏర్పాటుతో 40శాతం కోత పడనుందని అధికారులు చెబుతున్నారు. ఫ్రైట్ ఆదాయం రూ.13వేల కోట్ల నుంచి రూ.7వేల కోట్లకు పడిపోయే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. పెద్దపల్లి–నిజామాబాద్ లైన్ మరో డివిజన్లోకి.. పెద్దపల్లి జంక్షన్ నుంచి నిజామాబాద్ వరకు 177 కి.మీ. ట్రాక్ హైదరాబాద్ డివిజన్లోకి మారుతుంది. తద్వారా ఫ్రైట్, ప్యాసింజర్ ఆదాయం తగ్గుతుంది. వీటితో పాటు కొండపల్లి–మోటమర్రి సెక్షన్ కొత్త జోన్లోకి వెళ్తాయి. తద్వారా ఫ్రైట్ ఆదాయానికి గండిపడుతుంది. రెండు సెక్షన్లు సికింద్రాబాద్ డివిజన్లో చేర్చడం ద్వారా 204 కి.మీ. నెట్వర్క్ పెరిగినా.. సిగ్నలింగ్, సిబ్బంది, ఇంధనం, ట్రాక్ నిర్వహణ వ్యయం భారం కానుంది. కాజీపేట–బల్హర్షా మధ్య.. కాజీపేట, హసన్పర్తి, ఉప్పల్, రామగుండం, పెద్దంపేట, మంచిర్యాల, రవీంద్రఖని, బెల్లంపల్లి, రేచ్నిరోడ్, సిర్పూర్ కాగజ్నగర్, ఆసిఫాబాద్ రైల్వేస్టేషన్లు సికింద్రాబాద్ డివిజన్లోనే ఉంటాయి. జమ్మికుంట, పెద్దపల్లి జంక్షన్, రాఘవపురం మాత్రమే హైదరాబాద్ డివిజన్లోకి వెళ్తాయి. దక్షిణ మధ్య రైల్వేలో డివిజన్ల పునర్వ్యస్థీకరణ ఫలితం జూన్ ఒకటో తేదీనుంచి అమలులోకి పరిపాలనా వ్యవస్థ -
8 బంతులు.. 24 పరుగులు
విరాట్ కోహ్లీ స్ఫూర్తితో క్రికెట్ ఆడుతున్నా. రాష్ట్రస్థాయి క్రికెట్లో చివరి మ్యాచ్లో అవకాశం వచ్చింది. 8 బంతుల్లో 24 పరుగులు చేశాను. మంచి బ్యాట్స్మెన్ కావాలన్నదే లక్ష్యం. సిరిసిల్లలో కోచ్లు బాగానే శిక్షణ ఇస్తున్నారు. మౌలిక వసతులున్న క్రికెట్ మైదానాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలి. – చేర్ల దీపక్, ఇంటర్ సెకండియర్ మహిళా క్రికెటర్ దీప్తిశర్మ అంటే ఇష్టం. అమ్మానాన్న క్రికెట్పై నాకున్న ఇష్టానికి ప్రాధాన్యమిచ్చి శిక్షణ ఇప్పిస్తున్నారు. మా ఇద్దరు కోచ్లు మెలకువలు నేర్పుతున్నారు. వేసవి సెలవుల్లో క్రికెట్ శిబిరాన్ని వినియోగించుకుంటున్నా. జాతీయస్థాయి పోటీల్లో రాణించి జీవితంలో డాక్టర్గా స్థిరపడాలన్నదే లక్ష్యం. – మోర హిమాని, 5వతరగతి -
తమాషా లెక్కలు
లెక్కలనగానే కంగారు పడకండి. ఈ లెక్కలు చేస్తే మీకు భలే సరదాగా ఉంటుంది. సెలవులు ఇచ్చారు కదా.. కాలిక్యులేటర్ అందుకుని చేసి చూడండి. మీకే తెలుస్తుంది. 1. 1 X 1=? 2. 11 X 11=? 3. 111 X 111=? 4. 1111 X 1111=? 5. 11111 X 11111=? 6. 111111 X 111111=? 7. 1111111 X 1111111=? 8. 11111111 X 11111111=? ఇంకొక్క లెక్క కూడా చేసేయండి. జవాబులు బాగా వస్తున్నాయి కదా. 1.9 × 0 + 8 = 2. 9 × 9 + 7 = 3.9 X 98 + 6 = 4. 9 X 987 + 5 = 5. 9 X 9876+4=? 6.9 X 98765+3=? 7. 9 X 987654+2=? 8. 9 X 9876543+1=? 9. 9 X 98765432+0=? ఇలాంటిదే మరో లెక్క కూడా ఉంది. ఇది కూడా చేయండే?1. 1 × 8 + 1 = 2. 12 × 8 + 2 = 3. 123 × 8 + 3 = 4. 1234 X8+4=? 5. 12345 X 8+5=? 6. 123456 X 8 + 6 =? 7. 1234567 X8 8 + 7 = 8. 12345678 X 8 + 8 = 9. 123456789 X 8 + 9 = ఇలాంటివి చేయడం వల్ల చక్కని సాధనతోపాటు లెక్కల మీద ఆసక్తి పెరుగుతుంది. ఇంకెందుకు ఆలస్యం చేయండి. పంపినవారు: గడప రఘపతిరావు, పీఎస్ హెచ్ఎం మర్రిగడ్డ, ఎంపీపీఎస్, మండలం : చందుర్తి జిల్లా : రాజన్నసిరిసిల్ల -
త్వరలోనే బస్సు డిపో ప్రారంభిస్తాం
పెద్దపల్లి/పెద్దపల్లి రూరల్: జిల్లా కేంద్రంలో త్వరలోనే ఆర్టీసీ బస్సు డిపో ప్రారంభిస్తామని రోడ్డు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. పెద్దపల్లిలో ప్రతిపాదిత బస్సు డిపో స్థలాన్ని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు, ప్రభుత్వ విప్ విజయరమణారావుతో కలిసి ఆదివారం ఆ యన పరిశీలించి మాట్లాడారు. డిపో పనులు కొంత ఆలస్యమైనా.. వేగవంతం చేస్తామన్నారు. గ్రామాలకు బస్సు కనెక్టివిటీని మరింత మెరుగుపర్చుతున్నామనిమంత్రి చెప్పారు. ప్రజావసరాలకు అనుగుణంగా కొత్త బస్సుల కొనుగోలు ప్రక్రియ కూడా కొనసాగుతోందని అన్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఉప ముఖ్యమంత్రి నాయకత్వంలో ఐదుగురు మంత్రులు, సీనియర్ అధికారులు, 40 మంది ఆర్టీసీ ప్ర తినిధులతో చర్చలు జరిపి కార్మికులకు 11 శాతం పీఆర్సీ మంజూరు చేసినట్లు వివరించారు. అనంతరం మంత్రులు పొన్నం ప్రభాకర్గౌడ్, దుద్దిళ్ల్ల శ్రీధర్బాబు, ప్రభుత్వ విప్ విజయరమణారావును మున్సిపల్ చైర్మన్ నూగిల్ల మల్లయ్య సన్మానించారు. అంతకుముందు సుల్తానాబాద్లో కాంగ్రెస్ నా యకులు, సర్పంచులు, కౌన్సిలర్లు మంత్రి పొన్నం ప్రభాకర్కు స్వాగతం పలికి సన్మానించారు. ఆయా కార్యక్రమాల్లో ఆర్టీసీ మేనేజర్ కేఆర్రెడ్డి, సుల్తానాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మినుపాల ప్రకాశ్రావు, మాజీ జెడ్పీటీసీ ఐల రమేశ్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు అబ్బయ్య గౌడ్, మండల అధ్యక్షుడు చిలుక సతీశ్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మహిళలకు 310 కోట్లకుపైగా జీరో టికెట్లు మంథని: ఉచిత బస్సు ప్రయాణ పథకం కింద ఇప్పటివరకు మహిళలకు 310కోట్ల జీరో టికెట్లు జారీచేసినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ తెలిపారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్లో రూ.93లక్షల వ్యయంతో చేపట్టనున్న అదనపు ప్లాట్ఫారాలు, ఇతర అభివృద్ధి పనులకు ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు, కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి శంకుస్థాపన చేశారు. మంత్రి శ్రీధర్బాబు సూచనల మేరకు మంథని, కాళేశ్వరం బస్టాండ్ల అభివృద్ధికి నిధులు మంజూ రు చేశామన్నారు. ఉచిత బస్సు ప్రయాణం ద్వారా ప్రతీరోజు 65లక్షల మంది మహిళలు ఆర్టీసీ సేవలు పొందుతున్నారని, ప్రతీ గ్రామానికి మెరుగైన కనెక్టివిటీ కల్పించే దిశగా బస్సులు పెంచుతామని తెలిపారు. 2027 గోదావరి పుష్కరాల నిర్వహణకు ప్రభుత్వం క్యాబినెట్ సబ్ కమిటీని నియమించిందని, కుంభమేళాను తలపించే స్థాయిలో పుష్కరాలు నిర్వహించేందుకు సమగ్ర కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని ఆయన చెప్పారు. మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ, మంథని బస్టాండ్ ఆధునికీకరణతోపాటు పెద్దపల్లి బస్డిపోను త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు. మున్సిపల్ చైర్మన్ వొడ్నాల శ్రీనివాస్, ఆర్టీసీ రీజనల్ మేనేజర్ రాజు, డెప్యూటీ ఆర్ఎం మల్లేశం, డిపో మేనేజర్ శ్రావణ్ కుమార్, ఆర్డీవో సురేశ్ తదితరులు పాల్గొన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ -
బన్నీ వేసవి యాత్ర–23 పంచుకు తిందాము
మధ్యాహ్నం మర్రిచెట్టు కింద లంచ్ బాక్స్లు ఓపెన్ చేశారు బన్నీ, రామ్, చుక్క , స్వప్న. బన్నీ బాక్స్లో 4 గులాబ్ జామ్లు ఉన్నాయి. రామ్ బాక్స్లో ఒక్క బిస్కెట్ కూడా లేదు. రామ్ బాధగా మూలకు కూర్చున్నాడు. చుక్క చూసి తాతయ్యను పిలిచింది. తాతయ్య: ‘తిండి ఉన్నోడు లేనోడికి పెడితేనే దానికి రుచి.’ బన్నీ ఆలోచించి రెండు గులాబ్ జామ్లు తీసి రామ్కి ఇచ్చాడు. స్వప్న తన పులిహోరలో సగం చుక్కకు పెట్టింది. ‘ఇద్దరం తిందాం’ అంది. తాతయ్య నవ్వాడు: ‘పంచుకుంటే ఆకలి తీరుతుంది, ప్రేమ పెరుగుతుంది.’ రామ్ లేచి అన్నాడు: ‘థాంక్స్ రా బన్నీ. రేపు నా లడ్డు నీకు.’ చుక్క చెప్పింది: ‘మనం నలుగురం ఒక టీమ్. ఒకరి బాధ ఒకరికి తెలుసు.’ తాతయ్య: ‘ఒంటరిగా తింటే కడుపు నిండుతుంది. పంచుకుంటే మనసు నిండుతుంది.’ పిల్లలకి మాట : నీ దగ్గర ఉన్నది చిన్నదైనా, పంచితే అది పెద్దది అవుతుంది. – డాక్టర్ కోట లక్ష్మణ్, ప్రభుత్వ ఉపాధ్యాయుడు, గ్రామం: కాకర్లపల్లి, మంథని, జిల్లా: పెద్దపల్లి -
అభినవ ‘సూర్యవంశీ’లు
క్రికెట్పై ఉన్న ఆసక్తితో సిరిసిల్ల కాలేజీ మైదానంలో రెండేళ్లుగా శిక్షణ తీసుకుంటున్నా. అండర్–14 విభాగంలో జనవరి–2026లో రాజస్థాన్లో జరిగిన నేషనల్ పోటీల్లో పాల్గొన్నా. డిసెంబర్ 2025లో భద్రాచలంలో రాష్ట్రీయ పోటీల్లో ఆడాను. క్రికెట్లో ఆల్రౌండర్గా రాణించడం లక్ష్యం. – బంధం వర్షిత్, 9వతరగతి మా కోచ్ల శిక్షణలో నిత్యం రెండు పూటలా ప్రాక్టీస్ చేస్తున్నా. క్రికెట్లో టీం కలిసికట్టుగా ఆడి గెలవడం అంటే ఇష్టం. ఉదయం 5.45 గంటల నుంచి 8 గంటల వరకు, సాయంత్రం 4.30 నుంచి 6.45 గంటల వరకు కోచ్లు వంగల సాయితేజ్, దొబ్బల ప్రేమ్కుమార్ వద్ద శిక్షణ పొందుతున్నాం. రాష్ట్ర పోటీల్లో జిల్లాకు ట్రోఫీ సాధిస్తాం. – తిప్పవరం నిశాంక్, మండేపల్లి మోడల్ స్కూల్ సిరిసిల్లలో మంచి క్రికెట్ మైదానం కావాలి. టర్ఫ్ పిచ్ ఏర్పాటు చేస్తే దానిపై శిక్షణ బాగుంటుంది. చుట్టుపక్కల జిల్లాల్లో టర్ఫ్ పిచ్పై పిల్లలు ఆడుతున్నారు. సిరిసిల్లలో ప్రత్యేకంగా క్రికెట్ మైదాన ఏర్పాటు అత్యవసరం. గ్రౌండులో క్రికెట్ శిక్షణకు కావాల్సిన పరికరాలు అందించాలి. ప్రాక్టీస్ నెట్లు, చీకట్లో ఆడేలా ఫ్లడ్లైట్లు ఏర్పాటు చేయాలి. -
వడగాలులు.. ఉక్కపోత
పెద్దపల్లి: జిల్లాలో ఎండల తీవ్రత పెరుగుతోంది. వడగాలులు జిల్లావాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్లనుంచి బయటకు రావొద్దని అధికారులు సూచిస్తున్నారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇళ్లకే పరిమితం కావాలని చెబుతున్నారు. దీంతో జిల్లాలో ఎక్కడ చూసినా జనసంచారం లేక రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఇటీవల కురిసిన మోస్తరువాన అగ్నికి ఆజ్యం పోసినట్లయ్యింది. వర్షంతో ఉక్కపోత మరింత పెరిగింది. భూమినుంచి వేడి వస్తోందని ప్రజలు వాపోతున్నారు. తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అత్యవసరమైతే బయటకు వెళ్లేవారు తప్పనిసరిగా తెల్లని రుమాలు, తలపాగా ధరించాలి. తరచూ ద్రవపదార్థాలు తీసుకోవాలి. ఓఆర్ఎస్ లాంటివి వెంట తీసుకెళ్లాలి. వడదెబ్బకు గురైతే వెంటనే సమీపంలోని ఆస్పత్రిని ఆశ్రయించాలి. 108ని సంప్రదించండి అత్యవసర పరిస్థితుల్లో 108ని సంప్రదించాలి. ఎండల తీవ్రత అధికంగా ఉన్నందున ఇళ్లనుంచి బయటకు వెళ్లకపోవడమే మంచి ది. శారీరక శ్రమ ఉన్న పనులకు అస్సలు వెళ్లవద్దు. బయటకు వెళితే తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. దాహం వేయకుండా తరచూ మంచినీరు తాగాలి. – ప్రమోద్ కుమార్, జిల్లా వైద్యాధికారి -
అంతర్గత పోస్టుల భర్తీకి గ్రీన్సిగ్నల్
గోదావరిఖని: సింగరేణి బొగ్గు గనుల సంస్థలో అంతర్గత ఉద్యోగాల భర్తీకి యాజమాన్యం నిర్ణయించింది. మెడికల్ ఇన్వాలిడేషన్ ప్రారంభమైన క్రమంలో సుమారు 17వేల మంది ఉన్నత విద్యావంతులు సంస్థలో చేరారు. ఇలాంటి వారి సేవలను సంపూర్ణంగా వినియోగించుకునేందుకు నిర్ణయించింది. ఇందులో 50 మందిని విద్యార్హతలు, ఆసక్తిగలవారిని ఎంపిక చేయాలని గతనెల 30న సీఆర్పీ/పీఈఆర్/ఆర్/2026/309 పేరిట ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈనెల 3న నుంచి ఈనెల 16వ తేదీ వరకు www.scclmines.com వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఉద్యోగ వివరాలు ఫిజియోథెరపిస్ట్ 02 డైటీషియన్ 02 ఫార్మాసిస్ట్ 19 రెఫ్రాక్షనిస్ట్ 01 జూనియర్ ఎక్స్రే టెక్సీషియన్ 06 జూనియర్ ల్యాబ్ టెక్నీషియన్ 15 ఈసీజీ/టూడీ ఈకో/టీఎంటీ టెక్నీషియన్ 03 హెల్త్ ఎడ్యుకేటర్ 02 50 పోస్టుల భర్తీకి సింగరేణి కసరత్తు -
ఉద్యోగం రావడం లేదని యువకుడి బలవన్మరణం
కాల్వశ్రీరాంపూర్: పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం పెగడపల్లి గ్రామానికి చెందిన ఆరెల్లి సాయిరాం(24) బీటెక్ విద్యార్థి చేసి ఉద్యోగం రావడంలేదనే మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. మే 29న పురుగులమందు తాగిన సాయిరాంను కరీంనగర్లోని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. మృతుడి తల్లి సుజాత మాజీ సర్పంచ్, తండ్రి రమేశ్ సర్పంచ్గా కొనసాగుతున్నారు. సాయిరాం మృతితో గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై వెంకటేశ్ తెలిపారు. సాయిరాం కుటుంబ సభ్యులను ప్రభుత్వ విప్ విజయరమణారావు పరామర్శించారు. అంత్యక్రియలకు హాజరయ్యారు. మాజీ ఎంపీపీ సారయ్యగౌడ్, ఏఎంసీ చైర్మన్ రామిడి తిరుపతిరెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గాజనవేన సదయ్య, గ్రామస్తులు పాల్గొన్నారు. ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య ఫెర్టిలైజర్సిటీ: పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ 23వ డివిజన్ మాతంగికాలనీకి చెందిన సింహరాజు శివకుమార్(45) శనివారం రాత్రి ఇంట్లో ఇనుపరాడ్కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు కథనం ప్రకారం.. సింహరాజు శివకుమార్ మాతంగికాలనీలో పదేళ్లక్రితం ఇల్లు కొనుగోలు చేశాడు. ఇందుకోసం కొంత అప్పు చేశాడు. వాటిని తీర్చేదారిలేక, ఆర్థిక ఇబ్బందులు అధికమై మద్యానికి బానిసయ్యాడు. ఈక్రమంలో జీవితంపై విరక్తితో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈమేరకు మృతుడి భార్య భాగ్యలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతడికి భార్య, ఇద్దరు కుమారులు వీణాచారి, రానాచారి ఉన్నారు. ఎస్సై ఉదయ్ కిరణ్ కేసు నమోదు చేసుకున్నారు. -
బాధ్యతలు భారం
మంథనిరూరల్: గ్రామ పంంచాయతీ కార్యదర్శల కు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఇ టీవల ఉత్తర్వులు జారీచేసింది. ఇప్పటికే గ్రామపాలన, పారిఽశుధ్యం పర్యవేక్షణ, రికార్డుల నిర్వహణ, సంక్షేమ పథకాల పరిశీలన, ప్రత్యేక సమావేశాలు నిర్వహించే పంచాయతీ కార్యదర్శులకు తాజాగా మరికొన్ని బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్త ర్వులు జారీచేసింది. ఇప్పటి వరకు ఉపాధిహామీ అమలులో భాగస్వాములైన పంచాయతీ కార్యదర్శులకు పనుల పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించింది. తాజా సర్క్యూర్తో పంచాయతీ కార్యదర్శులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని 263 గ్రామపంచాయతీల్లో.. జిల్లాలో 14 మండలాలు, 263 గ్రామ పంచాయతీ ల్లో ఉపాధిహామీ పనులు కొనసాగుతున్నాయి. ఒక్కో పంచాయతీకి ఒక్కోఫీల్డ్ అసిస్టెంట్ ఉండాలి. అనేక పంయతీల్లో వారు లేక మేట్లు నిర్వహణ బాధ్యతలు చూస్తున్నారు. పనులపై పర్యవేక్షణ కొరవడటంతో పంచాయతీ కార్యదర్శులకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. ఫీల్డ్ అసిస్టెంట్ల తొలగింపుతో.. గత ప్రభుత్వం ఉపాధిహామీ ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించింది. పనుల పర్యవేక్షణ బాధ్యతలను పంచాయతీ కార్యదర్శులకు అప్పగించింది. టెక్నికల్ అసిస్టెంట్లతో కలిసి కార్యదర్శులు పనులు నిర్వహించేవారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకోవడంతో పంచాయతీ కార్యదర్శులు రెగ్యులర్ విధులకే పరిమితమయ్యారు. ఈ క్రమంలో అనేక గ్రామాల్లో ఉపాధిపనులపై పర్యవేక్షణ లోపించినట్లు గుర్తించిన ప్రభుత్వం తాజా ఉత్తర్వులు జారీచేసింది. భారమవుతున్న బాధ్యతలు పంచాయతీ కార్యదర్శులకు ఉపాధిహామీ పనుల పర్యవేక్షణ బాధ్యతలు భారమవుతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పంచాయతీల్లో వివిధ బాధ్యతలు నిర్వహించే తమకు పనుల పర్యవేక్షణ అదనపు భారమంటున్నారు. నిత్యం గ్రామాల్లో ప్రజలకు అవసరమయ్యే కార్యక్రమాలతో పాటు వివిధ అభివృద్ది పనులు చేస్తున్నామని వారు చెబుతున్నారు. తాజాగా ప్రభుత్వ తీసుకున్న నిర్ణయంతో ఇటు అభివృద్ది, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమా లు కుంటుపడే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. తాజా సర్క్యూలర్లో.. ప్రభుత్వం తాజాగా జారీ చేసిన ఉత్తర్వులతో గ్రామ పంచాయతీ కార్యదర్శుల పర్యవేక్షణ బాధ్యతలను వెల్లడించారు. వంద రోజుల పనులు, వనమహో త్సవ కార్యక్రమ పర్యవేక్షణ, మేట్ల నియామకం, ఉపాధిహామీ కూలీల నుంచి పని డిమాండ్ వివరాల సేకరణ, కూలీల మస్టర్ల నమోదు, వారం చివరలో మస్టర్ల కౌంటర్ సైన్ చేసి టెక్నికల్ అసిస్టెంట్లకు అప్పగించాలి. అలాగే ఎన్ఎంఎంఎస్ యాప్లో కూలీల ఫేస్ అథెంటికేషన్ ద్వారా హాజరు అప్లోడ్ కూడా చేయాలి.చెరువులో బంటాల పనిచేస్తున్న ఉపాధి కూలీలు పింఛన్దారు ఫొటో తీసుకుంటున్న కార్యదర్శి -
ఆర్ఎఫ్సీఎల్లో బ్యాగుల కొరత
ఫెర్టిలైజర్సిటీ: రామగుండం ఫెర్టిలైజర్స్, కెమికల్ లిమిటెడ్ కర్మాగారంలో యూరియా బస్తాలు లోడ్ చేసేందుకు అవసరమైన ప్లాస్టిక్ బ్యాగుల కొరత ఏర్పడడంతో ఆదివారం గూడ్స్ రైలును అధికారులు వెనక్కి పంపించారు. కర్మాగారంలో 90శాతం వరకు యూరియా ఉత్పత్తి అవుతోంది. రోహిణి కార్తె ప్రారంభం కావడంతో వర్షాకాలం పనులు ఊపందుకున్నాయి. రైతులకు సకాలంలో యూరియా సరఫరా చేసేందుకు రాష్ట్ర వ్యవసాయ, ఆర్ఎఫ్సీఎల్ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఖాళీ సంచుల కొరతతో యూరియా తరలించేందుకు కర్మాగారానికి చేరిన రేకు వెనుదిరిగే దుస్థితి నెలకొంది. ఒక రేకులో సుమారు 1,156 బస్తాల యూరియా తరలిస్తారు. వెనుదిరిగిన యూరియా కోసం వచ్చిన గూడ్స్ రైలు -
అంజన్నకు కలెక్టర్ మొక్కులు
మల్యాల: జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేట శ్రీకొండగట్టు ఆంజనేయస్వా మిని కలెక్టర్ కోయ శ్రీహర్ష కుటుంబ ఆదివా రం దర్శించుకుంది. స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు కలెక్టర్కు సాదర స్వాగతం పలికారు. వసతులు కల్పించాలి మంథని: విద్యార్ధులకు మెరుగైన క్రీడా, సంగీ త, విద్యా వసతులు అందుబాటులోకి తీసుకురావాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. స్థానిక గంగాపురిలోని ఎంపీపీఎస్, క్రీడా మై దానం, సంగీత పాఠశాలను ఆదివారం పరిశీలించారు. రావుల చెరువు, అయ్యగారి చెరువు సందర్శించి పరిస్థితులను పర్యవేక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ, గంగాపురి ఎంపీపీఎస్ క్రీ డా మైదానం అభివృద్ధికి అవసరమైన అంచనా లు సిద్ధం చేయాలన్నారు. సంగీత పాఠశాల రెనోవేషన్ పనులు పూర్తిచేసి రాబోయే విద్యా సంవత్సరంలో ప్రారంభించాలని అన్నారు. ప్ర జల రాకపోకలకు అనుగుణంగా చెరువు రోడ్డు విస్తరణ పనులు చేపట్లాని సూచించారు. ము న్సిపల్ కమిషనర్ మనోహర్ పాల్గొన్నారు. ఓదెల మల్లన్నకు పట్నాలు ఓదెల: ఓదెల మల్లికార్జునస్వామి దేవస్థానంలో ఆదివారం భక్తులు మల్లన్న పట్నాలు వేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. కోనేరులో స్నానాలు ఆచరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశా రు. మల్లికార్జునస్వామి, ఖండేలరాయుడు, శ్రీ సీతారామచంద్రస్వామిని దర్శనం చేసుకున్నా రు. ఈవో సదయ్య ఏర్పాట్లు పర్యవేక్షించారు. న్యాయం చేయాలి పెద్దపల్లి: తెలంగాణ ఉద్యమకారులకు గుర్తింపు, గౌరవం, సంక్షేమం ఫలాలు వర్తింపజేయా లని తెలంగాణ ఉద్యమకారుల సంఘం ఉమ్మ డి కరీంనగర్ జిల్లా ఇన్చార్జి కావటి సతీశ్యాదవ్ కోరారు. స్థానిక ప్రెస్క్లబ్లో ఆదివారం ఏ ర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో జూన్ 21న హై దరాబాద్ ఇందిరాపార్క్ వద్ద ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. నాయకులు మొలుగూరి కమల్, అరె తిరుపతి, కొంకటి లింగమూర్తి, కటకం హర్షవ ర్ధన్, గంగుల నరేశ్ తదితరులు పాల్గొన్నారు. ధర్మారంలో వడగళ్లవాన ధర్మారం: మండల కేంద్రంతోపాటు వివిధ గ్రా మాల్లో ఆదివారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వడగళ్లవాన కురిసింది. ఈదురు గాలులతో దుకాణాల ఎదుట ఏర్పాటు చేసిన నేమ్ బోర్టులు కుప్పకూలిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో పాన్టేలాలు కిందపడ్డాయి. ధర్మా రం – పెద్దపల్లి మధ్య రోడ్డు వెంట చెట్లు విరిగిపడి రాకపోకలకు అంతరాయం కలిగింది. మామిడికాయలు నేలరాలాయి. కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం కుప్పల కిందికి నీరు చేరి తడిసి ముద్దయ్యింది. నృసింహునికి పూజలు పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి మండలం దేవునిపల్లిలోని శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో పౌర్ణమి సందర్భంగా ఆదివారం స్వామివారికి పంచామృతాభిషేకం, చందనోత్సవం ఘనంగా నిర్వహించారు. పలు ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం అన్నదానం చేశారు. సింగరేణిలో జీఎంల బదిలీ గోదావరిఖని: సింగరేణి బొగ్గు గనుల సంస్థలో నలుగురు జీఎంలను బదిలీ చేస్తూ ఆదివారం ఆదేశాలు జారీ అయ్యాయి. ఐఅండ్పీఎం కా ర్పొరేట్ జీఎం మిర్యాల శ్రీహరిని కాంటాక్ట్ మే నేజ్మెంట్ సెల్కు బదిలీ చేశారు. మందమర్రి కేకే ఓసీపీలోని ఎం.మల్లేశంను రామగుండం రీజియన్ సేఫ్టీకి, ఆర్కే–7గ్రూప్ ఏజెంట్ కుర్మ రాజేందర్ను పాలిటెక్నిక్ ప్రిన్సిపల్గా నియమించారు. మణుగూరు పీకే ఓసీపీ అధికారి శ్రీరమేశ్ను బెల్లంపల్లికి బదిలీ చేశారు. -
మీటర్లు గిరగిర
సోమవారం శ్రీ 1 శ్రీ జూన్ శ్రీ 2026సాక్షి పెద్దపల్లి: ప్రచండ భానుడు ప్రతాపం ఇంకా చూపిస్తూనే ఉన్నాడు. జిల్లాపై నిప్పుల వర్షం కురిపిస్తూనే ఉన్నాడు. సూరీడి వేడి, ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఉక్కపోతతో ఇళ్లలో ఉండలేక, బయటకు రాలేక నరకయాతన అనుభవిస్తున్నారు. ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు, ఫ్రిజ్డ్లను అధికంగా వినియోగిస్తున్నారు. ఫలితంగా విద్యుత్ వినియోగం రోజురోజుకూ పెరుగుతూ వస్తోంది. వినియోగం పెరుగుతున్నా.. అంతరాయం లేకుండా నిరంతరం వి ద్యుత్ సరఫరా చేస్తున్నామని ట్రాన్స్కో అధికారులు చెబుతున్నారు. ప్రత్యామ్నాయ లైన్లు ఏర్పాటు చేయడం, కొత్త విద్యుత్ సబ్స్టేషన్లు నిర్మించడం, ఫీడర్ల విభజన, పవర్ ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యం పెంచడం వంటి చర్యలతో కోతలులేని నాణ్యమైన కరెంట్ అందిస్తున్నామని వారు వివరిస్తున్నారు. ఉక్కపోత నుంచి ఉపశమనం కోసం.. ఎండల తీవ్రతతో ఉక్కపోత నుంచి ఉపశమనం కోసం ప్రజలు కూలర్లు, ఏసీల వినియోగం పెంచేస్తున్నారు. అలాగే అవసరాకు అనుగుణంగా ప్రతీఇంట్లో విద్యుత్ గృపకరణాల వినియోగం పెరిగింది. ఫ్యాన్లు, కూలర్లు, ఏసీల వాడకం ఎక్కువ కావడంతో గ్రీడ్పై ఒత్తిడి పెరుగుతోంది. అలాగే జిల్లాలో యాసంగి సాగు గతంతో పోల్చితే గణనీయంగా పెరిగింది. చివరి అయకట్టు రైతులు అవసరమైన సాగునీరందక రాత్రిపూట బోర్లు అధికంగా వినియోగిస్తున్నారు. దీంతో కూడా విద్యుత్కు డిమాండ్ పెరిగింది. జిల్లాలో గృహజ్యోతి లబ్ధిదారులు జిల్లావ్యాప్తంగా 3,24,276 కరెంట్ కనెక్షన్లు ఉన్నాయి. 2,21,956 గృహ వినియోగదారులుండగా అందులో 200 యూనిట్ల ఉచిత విద్యుత్ను వినియోగించే 1,39,803 మంది గృహజ్యోతి లబ్ధిదారులున్నారు. వీరందరికీ జీరోబిల్లులు వచ్చేవి. ప్రతీరోజు సగటున 45 డిగ్రీల సెల్సియస్కుపైగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండడంతో విద్యుత్ వినియోగం పెరిగింది. 201యూనిట్ల విద్యుత్ కాల్చినా రూ.1,200 నుంచి రూ.1,300 వరకు కరెంట్ బిల్లు వస్తోంది. ఫిబ్రవరిలో గృహజ్యోతి లబ్ధిదారుల సంఖ్య వీరిలో నుంచి దాదాపు 10 వేల మంది 200 యూనిట్లకు మించి విద్యుత్ వినియోగించడంతో అధికారులు బిల్లులు అందజేశారు. వర్షాలకు కురిసి వాతావరణం చల్లబడితే వినియోగం కాస్త తగ్గే అవకాశం లేకపోలేదు. వినియోగాన్ని నియంత్రించేందుకు ప్రతీఇంట్లోనూ ఎల్ఈడీ బల్బులు వాడాలని అధికారులు సూచిస్తున్నారు. అవసరం లేనప్పుడు ఫ్యాన్లు, ఏసీలు, టీవీలు ఆఫ్ చేయడం, రాత్రి సమయంలో వినియోగం తగ్గించాలని సూచిస్తున్నారు. అన్నదాతలు తమ వ్యవసాయ పంపుసెట్లను ఉదయం లేదా మధ్యాహ్నం వినియోగించుకోవాలని అధికారులు చెబుతున్నారు.తేదీ గతేడాది ప్రస్తుతం 23 2.97 3.09 24 2.82 3.16 25 2.89 3.12 26 3.13 3.02 27 2.78 .060 28 2.8 3.09 29 2.98 3.08 ఎండల తీవ్రతతో పెరిగిన విద్యుత్ వినియోగం వడగాలులతో ఇళ్లకే పరిమితంఅవుతున్న ప్రజలు జిల్లాలో తగ్గుతున్న ‘గృహజ్యోతి’ లబ్ధిదారులు ఈ ఏడాది ఏనెలలో ఎంతమంది గృహజ్యోతి లబ్ధిదారులు? మే 1,36,384 ఏప్రిల్ 1,38,984 మార్చి 1,39,576 ఫిబ్రవరి 1,39,803 డిమాండ్కు తగినట్లు ఏర్పాట్లు విద్యుత్ డిమాండ్కు తగినట్లుగా ఏర్పాట్లు చేస్తున్నాం. ఉష్ణోగ్రతలు పెరగడం, గృహ వినియోగం, వ్యవసాయ అవసరాలు అధికం కావడం వంటి కారణాలతో విద్యుత్ వినియోగం రోజురోజుకూ పెరుగుతూ వస్తోంది. ఈ డిమాండ్ను దృష్టిలో ఉంచుకొని ఫీడర్లు, సబ్స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లు నిరంతరం పర్యవేక్షిస్తూ సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. – గంగాధర్, ఎస్ఈ, ట్రాన్స్కో -
ప్రోత్సాహం లభించింది
మా ఊరులో ఇలాంటి అవకాశాలు తక్కువ. ఇక్కడ చదువుతోపాటు ఆరోగ్యం, పరిశుభ్రత, వ్యక్తిత్వ వికాసంపై శిక్షణ ఇస్తున్నరు. పెద్దయ్యాక నేను ఏం కావాలనే నా లక్ష్యానికి ఇది ఉపయోగపడుతుంది. – రక్షిత, కుక్కలగూడూరు అందరి ముందు మాట్లాడాలంటే భయపడేదాన్ని. ప్రతిరోజూ ప్రసంగాలు, గ్రూప్ డిస్కషన్స్తో ధైర్యంగా మాట్లాడుతున్న. నా మీద నాకు నమ్మకం బాగా పెరిగింది. – సాహితి, గాంధీపార్కు పాఠశాల మా స్కూల్లో కంప్యూటర్లను దగ్గరగా చూసే అవకాశం తక్కువ. ఇక్కడ కంప్యూటర్ ప్రాథమిక అంశాలు నేర్పిస్తున్నరు. ఇంజినీర్ కావాలనే ఆసక్తి మరింత పెరిగింది. – అక్షర, మేడిపల్లి -
రైలులో చోరీ.. నిందితుడి అరెస్ట్
రామగుండం: రైలులో చోరీకి పాల్పడిన నిందితుడి ని అదుపులోకి తీసుకొని సొత్తు స్వాధీనం చేసుకు న్న ఘటన శనివారం మంచిర్యాలలో జరిగింది. రా మగుండం రైల్వే ఆర్పీఎఫ్ సీఐ రాజేంద్రప్రసాద్ వి వరాల ప్రకారం.. ఈనెల 25న స్వర్ణజయంతి ఎక్స్ప్రెస్ రైలులో ఓ ప్రయాణికురాలు బల్హర్షాలో రైలు ఎక్కి నిద్రిస్తున్న క్రమంలో.. బ్యాగ్ను సిర్పూర్ కాగజ్నగర్ వద్ద దొంగిలించి అందులో ఉన్న బంగారు లాకెట్, రూ.1,300 నగదు తీసుకొని బ్యాగ్ను పడేశాడు. మంచిర్యాల రైల్వే స్టేషన్లో అనుమానాస్పదంగా తిరుగుతుండగా.. రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా చోరీ చేసిన విషయం వెలుగు చూసింది. సిర్పూర్ కాగజ్నగర్కు చెందిన దుర్గం ప్రేమ్కుమార్ నుంచి 8 గ్రాముల బంగారు లాకెట్ను స్వాధీనపరచుకున్నారు. కాజీపేట రైల్వే కోర్టుకు రిమాండ్కు తరలించారు. ఈ కేసును ఛేదించిన రైల్వే ఏఎస్ఐ బి.రామకృష్ణ, హెడ్ కానిస్టేబుల్ చంద్రమౌళి, బి.స్వామి, జీఆర్పీ కానిస్టేబుళ్లు ఎస్.కుమార్, కె.శంకర్, టి.మల్లాగౌడ్ తదితరులను అభినందించారు. కాజీపేట ఆర్పీఎఫ్ సీఐ వి.నరేశ్, మంచిర్యాల, బెల్లంపల్లి జీఆర్పీ ఎస్సైలు మహేందర్, సుధాకర్ తదితరులు ఉన్నారు. -
ఆవిర్భావ వేడుకల అతిథిగా ‘విప్’
పెద్దపల్లి: జిల్లా కేంద్రంలో జూన్ 2వ తేదీన నిర్వహించే రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు శనివారం ఉత్తర్వులు జారీచేశారు. విప్ జెండా ఆవిష్కరించి సభికులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. వాణిజ్య కార్యకలాపాలు షురూజ్యోతినగర్: రామగుండంలోని ఎన్టీపీసీలో ని ర్మించిన 176 మెగావాట్ల సోలార్ ఫొటో వొల్టాయిక్(పీవీ) ప్రాజెక్టులో 34.4 మెగావాట్ల సా మర్థ్యం గల రెండోవిడత ప్లాంట్ వాణిజ్య కార్యకలాపాల్లోకి అడుగుపెట్టింది. శుక్రవారం అర్ధరాత్రి తన వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించిందని అధికారులు వెల్లడించారు. రామగుండంలోని తన 176 మెగావాట్ల సోలార్ పీవీ ప్రాజెక్టులో రెండో విడత సామర్థ్యం 34.4 మెగావాట్ల విద్యుత్ వాణిజ్య కార్యకలాపాలు మే 29న అమల్లోకి వచ్చాయని వివరించారు. గతనెల 2న తొలివిడతలో 100 మెగావాట్ల వా ణిజ్య కార్యకలాపాలను ప్రారభించిన విష యం విదితమే. ఎన్టీపీసీ గ్రూప్ మొత్తం స్థాపిత సామర్థ్యం 90,807 మెగావాట్లకు పెరిగిందని, దానివాణిజ్య సామర్థ్యం ప్రస్తుతం 88,927 మెగావాట్లుగా ఉందని పేర్కొన్నారు. వైద్యులను నియమించాలి మంథని: ఆడబిడ్డల కాన్పు కష్టాలు తీర్చేందు కు గత ప్రభుత్వం పట్టణంలో నిర్మించిన మా తా శిశు ఆస్పత్రిపై మంథని ఎమ్మెల్యే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, వెంటనే వైద్యులను ని యమించాలని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ డిమాండ్ చేశారు. శనివారం మాతాశిశు ఆస్పత్రిని సందర్శించిన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. రెండున్నరేళ్లలో ఆస్పత్రిని నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. ఆస్పత్రి లో అన్ని సౌకర్యాలు ఉన్నా వైద్యులను నియమించడం లేదని, ఈ విషయంలో కలెక్టర్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. భూ పాలపల్లి జెడ్పీ మాజీ చైర్పర్సన్ జక్కు శ్రీహర్షిణి– రాకేశ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఏ గోళపు శంకర్గౌడ్, రెండోవార్డు కౌన్సిలర్ రాజు గౌడ్, మాజీ జెడ్పీటీసీ తగరం సుమలత – శంకర్లాల్, నాయకులు పుప్పాల తిరుపతి, జంజర్ల శేఖర్, కనవేన శ్రీనివాస్, విజయ్కుమార్, శంకేషి రవీందర్ తదితరులు పాల్గొన్నారు. బాధ్యతలు స్వీకరణ పెద్దపల్లి: డీఆర్వో గా రాజేశ్వరి శనివారం బాధ్యతలు స్వీకరించారు. అ నంతరం కలెక్టర్ కోయ శ్రీహర్షను మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్క అందజేశారు. రాజేశ్వరి కరీంనగర్ నుంచి బదిలీపై ఇక్కడకు వచ్చారు. రీకౌంటింగ్కు దరఖాస్తులు పెద్దపల్లి: ఓపెన్ టెన్త్, ఇంటర్ రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం జూన్ 7వ తేదీలోగా దర ఖా స్తు చేసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి శా రద తెలిపారు. ఓపెన్ టెన్త్ పరీక్షకు 991 మంది హాజరుకాగా 840మంది ఉత్తీర్ణులయ్యారని, ఇంటర్కు 1,584 మంది హాజరు కాగా1,084 మంది ఉత్తీర్ణులయ్యారన్నారు. జవాబు పత్రా ల రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం గడువులో గా www.telanganaopenschool.org వెబ్సై ట్, లేదా మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని డీఈవో సూచించారు. ‘ధాన్యం కొనుగోళ్లలో విఫలం’పెద్దపల్లిరూరల్: ధాన్యం, మక్కల కొనుగోళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని బీజేపీ జి ్లా అధ్యక్షుడు కర్రెసంజీవరెడ్డి విమర్శించారు. స్థా నిక బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర నాయకుడు గొట్టిముక్కుల సురేశ్రెడ్డితో కలిసి శనివారం వి లేకరులతో మాట్లాడారు. బీజేపీ ప్రజాప్రతిని ధుల బస్సుయా త్ర వస్తుందని తెలిసి రాత్రికిరాత్రే బిహార్ కూలీలతో కొనుగోళ్లు చేశారన్నా రు. ఎమ్మెల్యేలకు చెరువు మట్టి, ఇసుక తరలింపుపై ఉన్న శ్రద్ధ రైతుల సంక్షేమంపై లేదని దు య్యబట్టారు. సీఎమ్మార్ బకాయిలు రూ.కోట్ల లో ఉన్న 70 మంది రైస్మిల్లర్లను బ్లాక్ లిస్టులో పెట్టాల్సింది పోయి వారికే మళ్లీ అనుమతులు ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. శివంగారి సతీ శ్, బెజ్జంకి దిలీప్కుమార్, కందుల శ్రీనివాస్, రాజ్కుమార్, విజయ్, అఖిల్, ప్రవీణ్కుమార్, వెంకటకృష్ణ, రాకేశ్, వంశీ పాల్గొన్నారు. -
వడదెబ్బతో ముగ్గురు మృతి
కాల్వశ్రీరాంపూర్/పెద్దపల్లిరూరల్/కోనరావుపేట: పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో శనివారం వడదెబ్బకు గురై ముగ్గురు చనిపోయారు. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం పెగడపల్లి గ్రామానికి చెందన తూముల శ్రావణ్ కుమార్(37)ఉదయం పొలం వద్దకు వెళ్లి అస్వస్థతకు గురయ్యాడు. ఇంటికి వచ్చి, మంచంలో పడుకుని నిద్రలోనే చనిపోయాడు. పెద్దపల్లిలో లారీ క్లీనర్గా పనిచేసేందుకు వచ్చిన మహమ్మద్ ఇక్రం(48) ఎండదెబ్బతో మూడు రోజులుగా చికిత్సపొందుతూ శనివారం మరణించాడు. ఉత్తరప్రదేశ్లోని జగ్దల్పూర్కు చెందిన ఇక్రం నాలుగు నెలలుగా లారీ క్లీనర్గా పనిచేస్తున్నాడు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కోనరావుపేట మండలం మామిడిపల్లికి చెందిన షేక్ హైదర్(57) ఉపాధి పనులకు వెళ్లి అస్వస్థతకు గురై, వడదెబ్బతో చనిపోయాడు. -
కాళేశ్వరంపై ప్రజా ఉద్యమం
గోదావరిఖని: కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రజా ఉద్యమానికి సిద్దమని మాజీ గవర్నర్, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. గోదావరిఖనిలోని బీజేపీ నాయకులు బల్మూరి అమరేందర్రావు నివాసంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమా వేశంలో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతు చేపట్టి వినియోగంలోకి తీసుకు రావాలని డిమాండ్ చేశారు. 19.83 లక్షల ఎకరాలకు సాగునీరందిస్తామని కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారని తెలిపారు. అప్పట్లో బీఆర్ఎస్ ప్రభు త్వం రూ.లక్ష కోట్లతో నిర్మించినా.. మరమ్మతుల పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం గాలికొదిలేసిందని వి మర్శించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను ఎలా మరమ్మతు చేయాలనే విషయంపై నిపుణులు నివేదికలు కూడా ఇచ్చారని గుర్తుచేశారు. కా ళేశ్వరం ప్రాజెక్టు బాధ్యులపై చర్యలు తీసుకోవాల ని, తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు ఆలోచన సరికాదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రజలకు కాంగ్రెస్ పార్టీ భరోసా ఇస్తుందో లేదో స్పష్టం చేయాలన్నారు. కొత్త గనుల కోసం సానుకూలంగా స్పందిస్తాం సింగరేణిలో కొత్త గనుల ఏర్పాటు కోసం అన్వేషణ చేస్తే కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని దత్తాత్రేయ అన్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉందని, అయినా.. 49 శాతం వాటా ఉన్న కేంద్రప్రభుత్వం కూడా కీలకంగా వ్యవహరిస్తుందన్నారు. గతంలో వేలంపాటపై అవినీతి దుమారం లేపడంతో ఒక పద్ధతి ప్రకారంగా బొగ్గు బ్లాకుల వేలం కొనసాగుతోందన్నారు. నాయకులు సంజీవరెడ్డి, బల్మూరి వనిత, బల్మూరి అమరేందర్రావు, కోమళ్ల మహేశ్, సురేశ్రెడ్డి, మేర్గు హన్మంతుగౌడ్, పిడుగు కృష్ణ, తోట మమత, సుల్వ లక్ష్మీనర్సయ్య పాల్గొన్నారు. దత్తాత్రేయకు వీడ్కోలు రామగుండం: బీజేపీ నాయకులు బల్మూరి వనతి నివాసానికి చేరుకున్న మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ హైదరాబాద్కు కాగజ్నగర్ ఎక్స్ప్రెస్ రైలులో పయనమయ్యారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి, మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ, నాయకులు బల్మూరి అమరేందర్రావు, మీస అర్జున్రావు తదితరులు ఆయనకు రామగుండం రైల్వేస్టేషన్లో వీడ్కోలు పలికారు. -
పెద్దపల్లి.. బాల్యవివాహ రహిత జిల్లా
పెద్దపల్లి: పెద్దపల్లి బాల్య వివాహరిత జిల్లాగా ఆవిర్భవించిందని కలెక్టర్ కోయ శ్రీహర్ష ప్రకటించారు. కలెక్టరేట్లో శనివారం స్నేహ కిశోర బాలికల సంఘం ఆధ్వర్యంలో మాక్ పార్లమెంట్– 99 రోజుల ప్రజా –పాలనప్రగతి ప్రణాళిక మహిళా వారోత్సవాలు నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ, పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథని మున్సిపాలిటీలు, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్తోపాటు మొత్తం 14 మండలాల్లోగల గ్రామ పంచాయతీల్లో ఎక్కడా బాల్య వివాహాలు చోటుచేసుకోవడం లేదన్నారు. ఈమేరకు ధ్రువీకరిస్తూ పెద్దపల్లిని బాల్య వివాహ రహిత జిల్లాగా ప్రకటిస్తున్నామని వెల్లడించారు. మహిళలపై అఘాయిత్యాలు, వేధింపులు, వివక్షను అరికట్టేందుకు ప్రతీఒక్కరు బాధ్యతతో కృషి చేయాలని ఆయన కోరారు. ఉల్లాస్.. సక్సెస్ మహిళా సంఘాల్లో నిరాక్షరాస్యులను ఉల్లాస్ కా ర్యక్రమం కింద నమోదు చేసి 5 వేల మంది వలంటీర్ల సహకారంతో చదువు చెప్పిస్తున్నామని కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. కలెక్టరేట్లో శనివారం వివిధ అంశాలపై సంబంధిత శాఖల అధికారులతో ఆయన సమీక్షించారు. గత మార్చిలో నిర్వహించిన పరీక్షలకు 34,620 మంది మహిళలు హాజరై 100 శాతం ఉత్తీర్ణత సాధించడం గర్వకారణమన్నారు. జనగణన–2027లో చేపట్టిన హౌస్లిస్టింగ్ సర్వేకు వచ్చే ఎన్యూమరేటర్లకు ప్రజలు వాస్తవ సమాచా రం అందించి సహకరించాలని ఆయన కోరారు. 2026–27 విద్యా సంవత్సరానికి బెస్ట్ అవైలేబుల్ స్కూల్స్(రెసిడెన్షియల్, నాన్ రెసిడెన్షియల్) పాఠశాలల్లో ఒకటి, ఐదో తరగతుల్లో ప్రవేశాల కోసం అర్హులైన షెడ్యూల్డ్ కులాల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. వివరాలకు 90143 27045, 99893 54155 నంబర్లలో సంప్రదించాలని కలెక్టర్ కోరారు. కార్యక్రమంలో డీఆర్డీవో కాళిందిని, అదనపు అధికారి రవీందర్, సంక్షేమాధికారి వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. ప్రకటించిన కలెక్టర్ కోయ శ్రీహర్ష -
జాతి ఐక్యత–దేశ భద్రత!
ఈ పవిత్ర భారతదేశం నా దేశం నే పుట్టి పెరిగిన నా జన్మ ప్రదేశం అందిస్తుంది ఇది ఓ శుభ సందేశం బంధిస్తుంది మనలను ఆ ఆదేశం! స్పందిద్దాం భారతీయులకు అందిద్దాం విందిద్దాం మన ఐక్యతను చిందిద్దాం మన దేశ భద్రత మనందరకు ముఖ్యం అప్పుడే మనందరకు కలుగు సౌఖ్యం ! కలసికట్టుగా మనమంతా ఇక ఉందాం అలసినట్టున్న బలం పుంజుకుందాం దేశ భద్రతకు మనం కట్టుబడి ఉందాం దేశ ఐక్యతయే ఘనం పెట్టుబడి అందాం ! పరాయి ముష్కరుల పెంచి పోషిస్తున్న తురాయి ఎగిరేసి మనల ద్వేషిస్తున్న చైనా పాకిస్తానులకు చెప్పాలిక బుద్ధి అంతర్జాతీయ వేదికపై మనం బల్ల గుద్ది ! మన దేశ భద్రత మనందరి బాధ్యత ఘన సైనికులకే ఉంది ఆ యోగ్యత అయినా మనందరం పాలు పంచుకుందాం స్వయానా సరిహద్దు వివాదం తెంచుకుందాం ! ప్రజలందరకు కంటినిండా నిద్రించే భరోసానిద్దాం సైనిక రక్షణ వ్యవస్థను చక్కదిద్దు ధిలాసా చిందిద్దాం భరతజాతి సమైక్యతను పటిష్టం చేసేద్దాం భరతఖండం భద్రతను పరిపుష్టం గావిద్దాం! గుర్రాల లక్ష్మారెడ్డి – కవి, రచయిత – కల్వకుర్తి, నాగర్కర్నూల్ జిల్లా -
చదువు.. చైతన్యం.. సాధికారత
జ్యోతినగర్: భారతావనికి వెలుగులు ప్రసరింపజేస్తున్న ఎన్టీపీసీ తమ పరిధిలోని ప్రజల జీవితాలను ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు శ్రీకారం చుట్టింది. ప్రభావిత, పునరావాస ప్రాంతాలు అంతర్గాం, పాలకుర్తి, రామగుండం, కమాన్పూర్ మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఐదో తరగతి పూర్తిచేసిన 140 మంది బాలికలకు బాలికా సాధికారత మిషన్–2026 ద్వారా వివిధ అంశాల్లో శిక్షణ ఇస్తోంది. కేంద్ర ప్రభుత్వ బేటీ బచావో.. బేటీ పడావోకు అనుగుణంగా ఎన్టీపీసీ నడుచుకుంటోంది. ఇందుకోసం రామగుండం ప్రాజెక్టులోని శ్రీచైతన్య కళాశాల భవనంలో బాలికా సాధికారత అంశంపై 10 నుంచి 12 ఏళ్ల వయసు లోపు ప్రభుత్వ పాఠశాలల్లో ఐదో తరగతి పూర్తిచేసిన 140 మంది బాలికలను శిక్షణకు ఎంపిక చేసింది. వీరికి 28 రోజుల పాటు రెసిడెన్షియల్ విధానంలో శిక్షణ ఇస్తోంది. ● కార్యక్రమం ప్రధాన ఉద్దేశం.. ● బాలికలకు వివిధ అంశాలపై అవగాహన కల్పించడం ● వ్యక్తిగత ఆరోగ్యం, శారీరిక సమస్యలు, ఇంటర్నెట్, సైబర్ నేరాలు, భవిష్యత్ గురించి గొప్ప కలలు, ఆలోచనలు కలిగింపజేయడం. ● జీవితంలో సమున్నత లక్ష్యాలు చేరుకోవాలనే ఆలోచన, తపన కల్పించడం ● పాఠ్యాంశాల్లో శిక్షణ ● సరళమైన తెలుగు, ఆంగ్ల భాషపై పట్టు, యోగా, గణితశాస్త్రంలో ప్రాథమిక సూత్రాలు, మెలకువలు, పర్యావరణశాస్త్రం, ఆత్మరక్షణ, క్రీడలు, కంప్యూటర్స్ వినియోగం, పౌష్టికాహారంతో ఉపయోగాలు, 5ఎస్ విధానాలు ● శిక్షణ ఇచ్చే అంశాలు ● అగ్నిమాపక భద్రతా చర్యలు, సివిల్ సర్వీసెస్ ● కంప్యూటర్స్, ఇంటర్నెట్, మొబైల్స్ ఆధారంగా జరిగే సైబర్ నేరాలపై అవగాహన ● సామూహిక చర్చలు ● సంగీతం, నృత్యం, చిత్రలేఖనం, నాటకరంగం ● మార్షల్ ఆర్ట్స్లో ప్రత్యేక శిక్షణ ● యోగా ● శిక్షణ సమయంలో తీసుకుంటున్న జాగ్రత్తలు ● వసతి గృహం వద్ద 24 గంటలు మహిళా సెక్యూరిటీ గార్డులతో రక్షణ ● ప్రత్యేకంగా శిక్షణ పొందిన మహిళా వార్డెన్లు ● కంట్రోల్ రూమ్ నుంచి నిరంతర పర్యవేక్షణ ● సీసీ కెమెరాలతో నిఘా బాలికా సాధికారతే దేశాభివృద్ధికి పునాది బాలికల కోసం ఎన్టీపీసీ వినూత్న కార్యక్రమం 140 మంది విద్యార్థినులకు వేసవి శిక్షణ శిబిరం -
బన్నీ వేసవి యాత్ర –22 లేత ముంజకాయల పండుగ
ఎండాకాలం మధ్యాహ్నం. తాతయ్య వచ్చాడు. చేతిలో దాసరి రఘు గౌడ్ గారు ఇచ్చిన లేత ముంజకాయల గెల. పైన తడి గుడ్డ కప్పి తెచ్చాడు. వాకిట్లో ఆడుకుంటున్న బన్నీ, వాడి స్నేహితులు పరుగున వచ్చారు. ‘తాతయ్య... మాకు కూడా’ అని చుట్టూ మూగారు. తాతయ్య నవ్వుతూ కత్తి తెచ్చి ఒక్కొక్కటిగా కోశాడు. లోపల తెల్లని జిగేలు మంచులా మెరుస్తున్నాయి. బన్నీకి మొదట ఇచ్చాడు. తర్వాత రామ్కి, చుక్కకి, స్వప్నకి ఇచ్చాడు. అందరి అరచేతుల్లో చల్లటి ముంజ జిగురు నిండింది. ఒక్క ముక్క నోట్లో వేసుకుంటే దాహం తీరింది. వేడి తగ్గింది. పిల్లల మొహాల్లో తియ్యటి నవ్వులు విరిశాయి. తాతయ్య వాళ్ళ ఆనందం చూసి మురిసిపోయాడు. ‘తినండి, ఇంకా ఉన్నాయి’ అన్నాడు. ఆ రోజు ముంజకాయలు కాదు, తాతయ్య ప్రేమే అందరికీ పంచాడు. పిల్లలకి మాట: లేత ముంజకాయల రుచి మమతలకు సురుచి గౌడన్నలకు అభివందనం – డాక్టర్ కోట లక్ష్మణ్, ప్రభుత్వ ఉపాధ్యాయుడు, గ్రామం: కాకర్లపల్లి, మంథని జిల్లా: పెద్దపల్లి -
నైపుణ్యం ఉంటే తిరుగుండదు
ఈ రోజుల్లో విద్యకు తోడుగా నైపుణ్యం ఉంటే యువత భవితకు తిరుగులేదు. సొంత ఆలోచన, వినూత్న ప్రయత్నాలు, మార్కెట్ అధ్యయనం చాలా ముఖ్యం. ఆధునిక సాంకేతికతను వాడుకొని ముందుకు వెళ్లే వాళ్లకు ఓటమి ఉండదు . ముఖ్యంగా ఆన్లైన్ అవకాశాల ద్వారా స్వతంత్రంగా ఎదిగే అవకాశాలున్నాయి. పుస్తకాలకే పరిమితం కాకుండా నాయకత్వ లక్షణాలు, సమగ్ర వికాసాన్ని పెంపొందించుకుని మీ రంగంలో సగర్వంగా నిలబడండి. – బూర్ల వెంకటేశ్వర్లు, అసిస్టెంట్ప్రొఫెసర్, ఎస్సారార్ కళాశాల, కరీంనగర్ -
నేరస్తులకు శిక్ష పడాలి
గోదావరిఖని: నేరస్తులకు శిక్షపడితేనే నేరాలు తగ్గి ప్రజలు సంతోషంగా ఉంటారని రామగుండం పో లీస్కమిషనర్ అంబర్ కిశోర్ ఝా అన్నారు. రామగుండం పోలీస్కమిషనరేట్లో పోలీస్ అధికారుల తో కలిసి శనివారం నేర సమీక్ష చేశారు. నేరస్తులకు శిక్ష పడేలా సాక్షులను ప్రవేశపెట్టి ట్రయల్ సజావు గా జరిగేలా చొరవ తీసుకోవాలన్నారు. దోషులకు శిక్షపడే ప్రక్రియలో కోర్టు కానిస్టేబుళ్ల బాధ్యత ఎంతో కీలకమైందని ఆయన అన్నారు. కోర్టు ప్రాసిక్యూషన్కు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పు డు సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్కు తెలియజేయాలని, పబ్లిక్ ప్రాసిక్యూటర్ సూచనలు, సలహా లను పాటించాలని సీపీ సూచించారు. బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటే పోలీసులపై ప్రజల్లో నమ్మకం మరింత పెరుగుతుందని చెప్పారు. సమావేశంలో పోలీసు అధికారులు, స్టేషన్హౌస్ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు. -
ప్రతిభ చూపు!
మార్గం వెతుకు..పెద్దపల్లి/కరీంనగర్ స్పోర్ట్స్ : బహుళ నైపుణ్యాలు ఎప్పుడైనా పనికొస్తాయి. బంగారు బాటవేస్తాయి. సాధన చేస్తే ఏదైనా సులభమే. అభ్యాసమే ఏదో ఒకనైపుణ్య సాధనకు మందు. ఇంటర్మీడియట్, డిగ్రీ పూర్తయిన విద్యార్థులు ప్రతిభ.. ఆలోచన.. ఆచరణతో ముందుకెళ్తే భవిష్యత్తు బంగారంలా ఉంటుంది. దొరికిన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ నైపుణ్యాలపై పట్టు పెంచుకుంటే భవిష్యత్ బాగుంటుంది. దూసుకెళ్తున్న ఐటీ.. తోటి వారితో పోటీ.. వీటన్నింటిని నెగ్గుకు రావాలంటే పట్టుదల ముఖ్యం.ఉమ్మడి జిల్లాలో ఇటీవల ఇంటర్ పూర్తిచేసిన వారుభావ వ్యక్తీకరణతో విజయం విద్యార్హత, మార్కులకు తోడు ఉద్యోగ ఇంటర్వ్యూల్లో భావవ్యక్తీకరణ అంశాన్ని ప్రత్యేకంగా పరిగణిస్తున్నారు. తెలిసిన అంశాన్ని, చేసిన ప్రయోగాన్ని స్పష్టంగా చెప్పగలగడం.. భాష నైపుణ్యంతో వివరించగలగడం.. అవతలి వ్యక్తులను ఆకట్టుకుంటాయి. వీటిని నేర్పడానికి శిక్షణ కేంద్రాలూ ఉంటాయి. వాటిలో చేరి సాధన చేయవచ్చు. ట్రైనింగ్తో ముందుకు.. సమయం విలువను గుర్తిస్తే ఇంజినీరింగ్, మెడిసిన్ దేనిలోనైనా సీటు తెచ్చుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇంటర్లో చేరిన విద్యార్థులు, ఇప్పటికే ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైవారు ఆ దిశగా కసరత్తు చేయాలి. లక్ష్యం.. గుర్తుంచుకోవాలి.. మెహందీ డిజైన్, వంటలతో వ్యాపారం, అల్లికలు, కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వంటి కోర్సులు ఇంట్లోనే ఉండి ఆన్లైన్ ద్వారా నేర్చుకోవచ్చు. లక్ష్యంతో నేర్చుకుంటే ఆర్థికంగా ఎదిగేందుకు వీలుంటుంది. భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు వచ్చినా గట్టెక్కవచ్చు. ఈ కోర్సులకు ప్రభుత్వ పరంగా శిక్షణ కేంద్రాలు గురుకులాల్లో, సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్లో పేద విద్యార్థులకు వెసులుబాటు ఉంటుంది. ఎలాంటి శిక్షణ లేకుండా సొంతంగా చదివి ర్యాంకుతో సీటు పొందిన వారి స్పూర్తిని అంది పుచ్చుకోవాలి. సమయం వృథా.. జీవితాంతం వ్యథ పుస్తకాలతో పనేమీ లేదని ఫోన్లు, టీవీలతో ఎంజాయ్ చేద్దామనుకుంటే మాత్రం భవితను ముంచి వేసుకున్నట్లే. వేళాపాళా లేకుండా కాలక్షేపం చేస్తే శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలు వస్తాయి. కొత్త విద్యాసంవత్సరంలో ఏ కోర్సులో చేరితే భవిష్యత్ బాగుంటుందో ఇంటర్నెట్లో పరిశీలించవచ్చు. ప్రణాళికతో ఉండాలి. విద్యాసంబంధ అంశాలు ఉచిత పుస్తకాలు, పాఠాలు అందుబాటులో ఉంటాయి. సద్వినియోగం చేసుకోవాలి.నైపుణ్యాలు పెంచుకునేందుకు పట్టుదల పెంచుకోవాలి. ప్రాధాన్యం ఇవ్వాలి. సమయం దొరికినప్పుడల్లా ఆయా సమావేశాలు, నైపుణ్య కేంద్రాలు, లైబ్రరీలను సందర్శించాలి. అకడమిక్ చదువులే కాకుండా నృత్యం, సంగీతం, చిత్రలేఖనం లాంటివాటిపై పట్టుసాధించాలి. ఎంఎస్ ఆఫీస్, జావా, పైథాన్, సీప్లస్ వంటి కంప్యూటర్ ఆధారిత కోర్సులు నేటితరానికి ఎంతో ఉపయోగం. వీటిలో రాణిస్తే ఉపాధికి కొదువ ఉండదు. ఎప్పుడు సమయం దొరికినా వాటిపై పట్టుసాధించాలి. భవిష్యత్తుపై భరోసా పెంచుకోవాలి. నిర్మాణరంగం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. ఎలక్ట్రికల్ పనుల వృత్తికి డిమాండ్ ఉంటోంది. ఇవి నేర్చుకుంటే కొత్తగా నిర్మిస్తున్న భవనాలకు వైరింగ్, స్విచ్ బోర్డులు, ఎలక్ట్రిక్ ఉపకరణాల బిగింపు పనులు తెలిసిన వారికి చేతినిండా పని, కడుపు నిండా తిండి అన్నట్టుగా సంపాదించుకోవచ్చు 1,968పరీక్ష రాసినవారుఉత్తీర్ణత సాధించిన వారు3,35314,94311,9612,5624,3383,7625,796కరీంనగర్జగిత్యాలపెద్దపల్లిరాజన్న సిరిసిల్ల -
కొత్త అనుభవాలు
ఊళ్లనుంచి చి వచ్చిన విద్యార్థినులతో కలిసి ఉండటం ఎంతో ఆనందంగా ఉంది. యోగా, క్రీడలు, పాటలు, నృత్యాలు నేర్చుకుంటున్నం. ప్రతీరోజు కొత్త విషయాలు తెలుసుకుంటున్నాం. సంతోషంగా ఉంది. – సహస్ర, నర్రాశాలపల్లె బాలికలు విద్యలోనే కాకుండా అన్ని రంగాల్లో రాణించాలనే ఉద్దేశంతో ఎన్టీపీసీ శిక్షణ ఇస్తోంది. గ్రామీణ విద్యార్థినుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడానికి ఇది దోహదపడుతుంది. – చందన్కుమార్ సామంత, ఈడీ, ఎన్టీపీసీ బాలికలకు పాఠ్యాంశాలతోపాటు ఆరోగ్యం, పరిశుభ్రత, యోగా, కంప్యూటర్ పరిజ్ఞానం, కమ్యూనికేషన్ నైపుణ్యాలపై శిక్షణ ఇస్తున్నాం. తద్వారా బాలికల్లో కొత్త ఆలోచనలు, ఉన్నత లక్ష్యాలు ఏర్పడుతున్నాయి. – సాగర్ రంజన్ సాహూ, ఏజీఎం(హెచ్ఆర్), ఎన్టీపీసీ -
సిబ్బంది సేవలు అభినందనీయం
జ్యోతినగర్: నగరంలో శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్న సిబ్బంది సేవలు అభినందనీయమని మేయర్ మహంకాళి స్వామి అన్నారు. ఒకటో డివిజన్లో శనివారం వార్డు సందర్శన చేపట్టారు. డిప్యూటీ మేయర్ పాతిపెల్లి ఎల్లయ్య, కమిషనర్ అరుణశ్రీ, కార్పొరేటర్ మడిపల్లి విజయతో కలిసి ఆయన పనులు పరిశీలించారు. కాలువల్లో యుద్ధ ప్రాతిపదికన పూడిక తొలగించి వరద ముప్పు నివారించాలని మేయర్ సూచించారు. యంత్రాలు, సిబ్బంది సాయంతో న్యూపీకే రామయ్యకాలనీ ప ట్టణ ప్రకృతి వనం సమీప వీధుల్లోని కాలువల్లో పూడిక తొలగించామని ఆయన చెప్పారు. ఇందిరమ్మ కాలనీ ఏర్పడిన నాటినుంచి పూడిక తీ యలేదన్నారు. మిగిలిన యూజీడీ పనులు, రోడ్లను పూర్తిచేస్తామని ప్రకటించారు. కార్యక్రమంలో కా ర్పొరేటర్ వెంగళ బాపు, ఎస్ఈ గురువీర, డిప్యూటీ కమిషనర్ వెంకటస్వామి, తేజస్విని, శానిటరీ ఇన్స్పెక్టర్ సంపత్, సీనియర్ అకౌంటెంట్ రాజ్కుమార్, జవాన్ సూర్య తదితరులు పాల్గొన్నారు. మేయర్ మహంకాళి స్వామి -
పొడుపు కథలు
01. గోధుమ వన్నె దేహం సోగ కన్నుల విత్తనం తింటే నోటికి జిగట 02.అమ్మాయి పేరున్న పండు సింధూరంలా మెరిసే పండు సిట్రన్ జాతి తినే పండు 03. పండ్లన్నింటికీ రారాజు రుచిని తూచలేదు తరాజు 04. ఒళ్లంతా ముళ్లుంటాయి నెత్తి మీద ఆకులుంటాయి పులుపు తీపి రుచులుంటాయి 05. కాటుక రంగు పిల్లల్ని కడుపుపున దాచుకున్న (మోస్తున్న) మిసిమి దేహపు అమ్మ 06. బాలిక నామం పెట్టుకున్నది దేహమంతా కన్నులు కలది విత్తుల చుట్టూ కండ కలిగినది ! 07. ఎండాకాలంలో ఎర్రని రసాలు నేలన పాకే తీగాలకే కాయలు దీని పొట్ట నిండా నీటి నిల్వలు 08. రంగేమో మేలిమి బంగారం రుచేమో మధురాతి మధురం పిల్లేమో ముదురు నీటి టెంక ఫలం 09. ఒళ్లంతా పసుపు పూసుకున్న ముత్తైదువ పూజలకూ వ్రతాలకూ ముందుండే ముత్తైదువ 10. ఈ పండును రోజూ తింటే డాక్టరు వద్దకు వెళ్ళే పని లేదు ఈ చెట్టు కింద కూర్చుంటేనే భూమ్యాకర్షణ తెలిసింది ! 11. సపోటా వుర్ల గడ్డలతో పోలికలు అడ్డుకోతలో సూర్యకిరణాల చిత్రాలు తింటే బీపీ, ఎల్ డీఎల్ ల తగ్గుదల 12. గుత్తులు గుత్తులుగా పండ్లు కానీ ద్రాక్ష గుత్తులు కాదు మెత్తని జెల్లీ లాంటి కండలు కానీ తాటి ముంజలు కాదు 13. ఉసిరిలా కాండానికి కాస్తాయి ద్రాక్షలా గుత్తులుగా కాస్తాయి చైనా దేశంలో అధికంగా కాస్తాయి 14. ఎరుపు తెలుపులలో ఉంటుంది చలి కాలంలో ఎక్కువ కాస్తుంది దాదాపు ప్రతి ఇంట్లో కనిపిస్తుంది 15. పైన సన్నగా కింద లావుగా నీటి చుక్క వలే బుడగగా వగరు తీపి పులుపు కలగలుపుగా 16. ఆకుపచ్చని గుండ్రని బంతులు గర్భాన దాచి పెట్టుకున్న ముత్యాలు రసం పిండామంటే గ్లాసులు 17. పొట్ట నిండా రత్నాల రాసులు పెట్టి కనపడకుండా ఎర్రని తోలు కప్పారు 18. కాయలన్నింటిలో చాలా పెద్దది పసిమి ఛాయ పిల్లలు కలది ఘాటైన సువాసన కలది చిటారు కొమ్మన కాస్తుంది 19. ఇల్లేమో ముళ్లకంప పళ్ళేమో డ్రూప్ జాతి రుచేమో తీపి పులుపు రంగేమో ముదురు ఎరుపు 20. చూపుకు మేలిమి దేహాలు పొట్ట విప్పితే పురుగులు చెట్టు కాండానికి గుత్తులు జావాబు: 01.సపోటా, 02.కమలా కాయ, 03.మామిడి, 04.అనాసకాయ, 05.బొప్పాయి, 06. సీతాఫలం, 07.పుచ్చ కాయ, 08.మామిడి, 09.అరటి కాయ, 10.యాపిల్, 11.కివి, 12. లిచి, 13.మల్బరీ, 14. జామ, 15.పియర్, 16. బత్తాయి, 17.దానిమ్మ, 18. పనస కాయ, 19. రేగి పండు, 20. మేడి పండుడాక్టర్ కందేపి రాణిప్రసాద్ మేనేజింగ్ డైరెక్టర్, సృజన్ చిల్డ్రన్స్ హాస్పిటల్, సిరిసిల్ల -
ఐటీలో మేటి మంత్రి శ్రీధర్బాబు
పెద్దపల్లి: ఐటీ రంగంలో మంత్రి శ్రీధర్బాబు దూసుకు వెళ్తున్నారని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. సుల్తానాబాద్ అంబేడ్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. విప్ కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ, శ్రీధర్బాబు మంథని నియోజకవర్గం నుంచి ఐదుసార్లు శాసనసభ్యుడిగా, రెండుసార్లు మంత్రిగా సేవలు అందించారన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అభ్యున్నతి కోసం నిరంతరం శ్రమించారని విప్ అన్నారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రాభివృద్ధి కోసం ఆయన చేస్తున్న సేవలు అమోఘమన్నారు. ఐటీ కంపెనీలు, పరిశ్రమలు తెప్పిస్తూ అనేకమంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో శ్రీధర్బాబు కృషి ఎనలేదనిదని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్యగౌడ్, మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధాకష్ణ, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మినుపాల ప్రకాశ్రావు, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ అంతటి పుష్పలత, కాంగ్రెస్ పట్టణ, మండల అధ్యక్షులు వేగోళం అబ్బయ్యగౌడ్, చిలుక సతీశ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు డి.దామోదర్రావు, డీసీసీ కార్యదర్శి మోబిన్, నాయకులు సాయిరి మహేందర్, పన్నాల రాములు, డి.శ్రీనివాసరావు, పల్లా సురేశ్, సర్పంచులు, కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ విప్ విజయరమణారావు ఘనంగా మంత్రి శ్రీధర్బాబు పుట్టినరోజు వేడుకలు -
బాల్యపు ఊసుల ఉయ్యాల
నాన్నను పట్టుకు తిరిగిన లోగిలి అమ్మను తాకితే తీరిన ఆకలి బుడి బుడి అడుగుల జాబిలి విహార యాత్రపు జాలీ జాలీ నా మదిలో బాల్యపు రంగుల హోలీ సోపతి గాళ్లతో గోలీలాట.. భూపతి గానితో జలకాలాట.. సీతాపతితో జాతర పాట.. యాకుబ్ తోటలో కోతి కొమ్మచ్చీ జేకే వాడలో కాల్ చిచ్చి ముచ్చీ బాల్యపు ఊసుల ఉయ్యాలా..! సొంటి తెచ్చినా కంట్లో మంట చంటి తెచ్చినా ఇంట్లో తంట గద్యం చదవక కోదండాలు పద్యం చదవక అరదండాలు బాల్యం నేర్పిన గుణ పాఠాలు.. అయ్యోరిచ్చిన ఐదు పైసలు పూజారిచ్చిన పూత రేకులు ఇసుకలో కట్టిన పిచ్చుక గూళ్లూ కాగితప్పడవల వర్షపు నీళ్లూ మరచిపోనివీ మరలి రానివీ.. బాల్యం ఇచ్చిన బహుమతులు చెరువులో పట్టిన చేప పిల్లలు చేతిలో కాలిన అగ్గి పుల్లలు బడి మానేసి చూసిన చిత్రం బిర బిర గీసిన నల్లని ఛత్రం గిర గిర తిరిగిన రంగుల రాట్నం బిర బిర ఉరికిన హంగుల పట్నం ఇంకా ఇంకా గుర్తున్నాయి. ఇంపుగ మదిలో దాగున్నాయి! డాక్టర్ కటుకోఝ్వల రమేశ్ కవి, రచయిత జిల్లా: ఖమ్మం -
అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి
మార్కుల కాగితాలు ఇంటర్వ్యూ గేటు వరకే నడిపిస్తాయి, మీలోని ప్రాక్టికల్ నైపుణ్యాలు మాత్రమే ఉద్యోగాన్ని సాధించి పెడతాయి. నేటి ఆధునిక పరిశ్రమలకు పుస్తకాల పురుగులు కాదు, సమస్యలను ధైర్యంగా పరిష్కరించే సృజనాత్మక ఆలోచనలు ఉన్నవారే అత్యవసరం. మీ కమ్యూనికేషన్ స్కిల్స్ను, ని రంతర అభ్యాసన తత్వాన్ని ఆయుధాలుగా మార్చుకుని ఏ రంగంలోనైనా అగ్రస్థానానికి దూసుకుపోవచ్చు. ర్యాంకులు రాలేదని నిరాశ పడకుండా, మీలోని విశిష్ట ప్రతిభకు పదును పెడితే అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. – వై.తిరుపతిరావు, ఉపాధి కల్పనాధికారి, కరీంనగర్ -
పబ్లిక్ ప్రాసిక్యూటర్ల పాత్ర కీలకం
గోదావరిఖని: నిందితులకు శిక్షపడే వి షయంలో పోలీసులతోపాటు పబ్లిక్ ప్రాసిక్యూటర్ల పాత్ర కూడా కీలకమని రామగుండం పోలీస్ కమిషనర్ అంబ ర్ కిశోర్ ఝా అన్నారు. సీపీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన స మావేశంలో మాట్లాడారు కేసుల విచారణలో నిందితులకు త్వరితగతిన శిక్షలు పడేలా పోలీసు అధికారులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ల మధ్య సమన్వయం మరింత బలోపేతం కావాలన్నారు. ఎఫ్ఐఆర్ నమోదు నుంచి చార్జ్షీట్ దాఖలు చేసేవరకూ పొరపాట్లు చోటుచేసుకోకుండా జాగ్రత్తలు తీ సుకోవాలని సూచించారు. నిందితులకు శిక్షలు పడేలా చర్యలు చేపడితేనే బాధితుల కు నిజమైన న్యాయం దక్కుతుందని అన్నారు. అడిషనల్ డీసీపీ(అడ్మిన్) శ్రీనివాస్, సీసీఆర్బీ సీఐలు అనిల్కుమార్, బాబురావు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు పాల్గొన్నారు. -
ఏపీపీగా కుమార్
మంథని: మంథని అడిషనల్ కోర్టు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్(ఏపీపీ)గా ఆర్ధ కుమార్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. అంతర్గాం మండలం రా యదండి గ్రామానికి చెందిన కుమార్.. పరకా ల అడిషనల్ మెజిస్ట్రేట్ కోర్టులో ఏపీపీగా పనిచేశారు. సాధారణ బదిలీల్లో భాగంగా పరకాల నుంచి మంథని కోర్టుకు ఆయన బదిలీపై వచ్చారు. కుమార్కు కోర్టు సిబ్బంది పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు. వ్యర్థాల శుభ్రత ఇక సులభం పెద్దపల్లి: ప్రభుత్వ పాఠశాలల్లో వ్యర్థాలను శు భ్రం చేయడం ఇకనుంచి మరింత సులభతరం కానున్నాయి. ఇందుకోసం ప్రభుత్వ హైస్కూ ళ్లకు ఇన్సినరేటర్ అందించనున్నారు. చెత్తను అధిక ఉష్ణోగ్రతలో కాల్చి సురక్షితంగా నిర్వర్తించే యంత్రమే ఇది. ముఖ్యంగా స్కూళ్లలో శా ని టరీ నాప్కిన్లు, పేపర్లు వంటి వ్యర్థాలను శు భ్రంగా నిర్వహించడానికి దోహదపడు తుంది. జిల్లాలో 2026– 27 విద్యా సంవత్సరంలో పా ఠశాలల ప్రారంభం రోజే దీనిని పంపిణీ చేసేందుకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. -
రైతులపై రాజకీయమా?
మంథని: బీజేపీ, బీఆర్ఎస్ నేతలు రైతులపై రాజకీయం చేస్తున్నారని, ప్రభుత్వం ధాన్యం సేకరణలో కచ్చితమైన ప్రణాళికతో ముందుకు సాగుతోందని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నా రు. పెద్దపల్లి జిల్లా మంథని మార్కెట్ను శుక్రవారం మంత్రి సందర్శించారు. రైతులతో మాట్లాడి సౌకర్యాలపై ఆరా తీశారు. అనంతరం మంత్రి శ్రీధర్బాబు మీడియాతో మాట్లాడారు. రైతులు అధైర్యపడవద్దని, ప్రతీధాన్యపు గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. ఇప్పటికే అధిక సంఖ్యలో పంట చేతికి వచ్చిందని, ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేసిందని ఆయన అన్నారు. ప్రభుత్వ గోదాములు సరిపోకపోతే ప్రైవేట్ గోదాములు ఉపయోగిస్తామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో వ్యవసాయం అంటే పండుగ అన్నారు. వరి పంట వేయకూడదనిలో సామాజిక మధ్యమాల్లో వస్తున్న వార్తలకు ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. వాణిజ్య పంటలు పండించడం ద్వా రా రైతులకు అధిక లాభం వస్తుందని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారని చెప్పారు. మంథని మున్సిపల్ చైర్మన్ వొడ్నాల శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ కుడుదుల వెంకన్న, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తొట్ల తిరుపతి యాదవ్, మండల అధ్యక్షుడు ఐలి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
వరి వైపే మొగ్గు
సాక్షి పెద్దపల్లి: బోనస్ చెల్లిస్తుండడంతో.. జిల్లాలో ఏటా వరిసాగు విస్తీర్ణం పెరుగుతూ వస్తోంది. ఇతర పంటల సాగు తగ్గుతూ వస్తోంది. ఇందు కు కారణం.. వరినాటు సమయంలో తప్పితే మిగ తా పనులన్నీ సులువుగా పూర్తవుతుండడం, ప్రభు త్వం సన్నవడ్లకు క్వింటాలుపై రూ.500 బోనస్ చె ల్లిస్తుండటంతో రైతులు వరి సాగుకే మొగ్గు చూపుతున్నారు. ఇదేసమయంలో ఇతర పంటలకు సస్యరక్షణ చర్యలు ప్రహసనంగా మారండంతో విత్తడం తగ్గించేస్తున్నారు. కాలం కలిసి వస్తే దిగుబడులు భారీగా రావడంతోపాటు వ్యక్తిగత అవసరాల కో సం మొత్తం సాగులో సగభాగం సన్నరకం వరి సాగు చేసేందుకు మొగ్గు చూపుతుండడం సాగు విస్తీర్ణం పెరగడానికి కారణంగా నిలుస్తున్నది. వానాకాలం సాగు వివరాలు(ఎకరాల్లో) వరి 2,15,500 పత్తి 52,094 మొక్కజొన్న 886 కంది 208 పెసర 10 మినుములు 11 పప్పుధాన్యాలు 12 వేరుశెనగ 2 నువ్వులు 16 ఆయిల్పామ్ 3,179 మిరప 133 పసుపు 295 ఆహార 376 ఉద్యాన 5125 ఆహారేతర 415అవసరమైన విత్తనాలు, ఎరువులు(క్వింటాళ్లలో) వరి 53,125 మొక్కజొన్న 70.5 కంది 30 పప్పుధాన్యాలు 1.6 యూరియా 31,138 డీఏపీ 3,767 పత్తి(ప్యాకెట్లు) 1,31,250 పంట మార్పిడి పద్ధతి పాటిస్తేనే మేలు వానాకాలం సీజన్ మరికొద్దిరోజుల్లోనే ప్రారంభం కానున్నది. ఈమేరకు జిల్లాలో సాగు ప్రణాళిక సిద్ధం చేశాం. వరి సాగుకే రైతులు మొగ్గుచూపుతున్నారు. ఎప్పుడూ ఒకే పంట కాకుండా ఏటా పంట మార్పిడి పద్ధతి పాటిస్తే అధిక దిగుబడి సాధించవచ్చు. జిల్లా రైతులకు అవసరమైన విత్తనాలను అందుబాటులో ఉంచుతున్నాం. ఎవరికై నా ఏదైనా సమస్య ఉంటే స్థానిక వ్యవసాయ విస్తరణ అధికారులకు ఫోన్చేసి సలహాలు, సూచనలు పొందవచ్చు. – శ్రీనివాస్, జిల్లా వ్యవసాయాధికారి -
పేషెంట్లను వెనక్కి పంపించొద్దు
● జీజీహెచ్ వైద్యులకు కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశాలు కోల్సిటీ(రామగుండం): సమయం ముసిగిందని బ్లడ్శాంపిళ్లు ఇచ్చేందుకు వచ్చే పేషెంట్లను వెనక్కి పంపించొద్దని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిని కలెక్టర్ శుక్రవారం తనిఖీ చేశారు. వైద్య సేవలపై ఆరా తీశారు. డిప్యూటీ సూపరింటెండెంట్ అరుణ, ఆర్ఎంవోలు కృపాభాయి, రాజు పాల్గొన్నారు. ధాన్యం కొనుగోళ్లలో కోతలు వద్దు ెపద్దపల్లి: ధాన్యం కొనుగోళ్లలో కోతలు పెట్టొద్దని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించా రు. వివిధ అంశాలపై కలెక్టరేట్లో శుక్రవారం సమీక్షించారు. జూన్ 2వ తేదీ వరకు ధాన్యం కొనుగోళ్లు పూర్తిచేయాలని సూచించారు. ఉపాధిహామీ ద్వారా జిల్లాకు మంజూరైన నిధులను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని ఆదేశించారు. జూన్ చివరివరకు పనుల గ్రౌండింగ్ పూర్తిచేయాలన్నారు. జిల్లాలో రోడ్డు భద్రత చర్యలు పటిష్టంగా అమలు చేయాలని సూచించారు. విద్యాసంస్థలు, హాస్టళ్ల సమీపంలో పొగాకు విక్రయాలపై ప్రత్యేక తనిఖీలు చేయాలన్నారు. ఎన్టీసీపీ – కోప్టా చట్టం పటిష్టంగా అమలు చేయాలని కోరారు. అదనపు కలెక్టర్ అరుణశ్రీతోపాటు అధికారులు శ్రీమాల, శంకరయ్య, కాళిందిని, ప్రకాశ్, భావ్సింగ్, ప్రమోద్ కుమార్ పాల్గొన్నారు. 2 వరకు ఇందిరాశక్తి భవనం సిద్ధం పెద్దపల్లిరూరల్: జిల్లాస్థాయి ఇందిరాశక్తి భవన నిర్మాణం పూర్తిచేసి జూన్ 2న రాష్ట ఆవిర్భావ వేడుకల వరకు సిద్ధం చేయాలని కలెక్టర్ శ్రీహర్ష ఆదేశించారు. రాఘవాపూర్లోని భవన నిర్మాణం పనులను ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీవో కాళిందిని, పంచాయతీరాజ్ ఈఈ శంకరయ్య తదితరులు పాల్గొన్నారు. -
నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతా
పెద్దపల్లి: పెద్దపల్లి అసెంబ్లీ నియో జకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతా నని ప్రభుత్వ విప్ విజయరమణా రా వు అన్నారు. సుల్తానాబాద్లోని వృద్ధా శ్రమం, బాలసదన్ను శుక్రవారం ప్రా రంభించి మాట్లాడారు. రూ.2.8 కోట్ల తో నిర్మించిన భవనాలను ఏడాదిలో పే పూర్తిచేసి అనాధ పిల్లలకు భరోసా కల్పించారన్నారు. కొందరు కావాలని రెచ్చగొట్టేలా వ్యవహరించడం వారికే చెల్లుబాటవుతుందని, రైతులు, ప్రజలు పార్టీల కతీతంగా ద్వితీయ శ్రేణి నాయకులు గమనిస్తున్నారని చెప్పి భావోద్వేగానికి గురయ్యా రు. అధికారులు వేణుగోపాల్రావు, కవిత, వనిత, ప్రతినిధులు అన్నయ్యగౌడ్, బిరు దు రాధాకృష్ణ, అంతటి పుష్పలత, మినుపాల ప్రకాశ్రావు, రమేశ్ శ్రీగిరి శ్రీనివాస్, సాయిరీ మహేందర్, రాజమల్లయ్య, వరప్రదీప్, మంజుల, రాజు, తిరుపతి, రాజలింగం, రవీందర్, అబ్బయ్యగౌడ్, సతీశ్, రఫిక్, రాజయ్య, కిరణ్ పాల్గొన్నారు. -
సమష్టిగా పనిచేయాలి : సింగరేణి సీఎండీ
గోదావరిఖని: క్రమశిక్షణ, సమష్టి పనివిధానంతో ముందుకు సాగి సంస్థను అగ్రభాగాన నిలబెట్టాలని సింగరేణి సీఎండీ బుద్ధ ప్రకాశ్ జ్యోతి సూచించా రు. ఆర్జీ–వన్లోని జీడీకే–11గనిలో కా ర్మికులతో శుక్రవారం ముఖాముఖి ని ర్వహించారు. కార్మికుల ఆలోచనలు, సలహాలు తీసుకున్నారు. గనిలో 5వ మ్యాన్ రైడింగ్ సిస్టం ప్రారంభించారు. సంస్థ అభివృద్ధిలో కీలకపాత్ర పోషించిన ఉద్యోగులను అభినందించారు. డైరెక్టర్లు ఎల్వీ సూర్యనారాయణ, కె.వెంకటేశ్వర్లు, జీఎం లలిత్కుమార్ పాల్గొన్నారు. అనంతరం జీడీకే–5 ఓసీపీ సందర్శించారు. గోదావరిఖనిలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల కోసం ఏర్పాటు చేసిన క్రీడా, వినోద సౌకర్యాలు పరిశీలించారు. ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, డైరెక్టర్ (ఈఅండ్ఎం) ఎం.తిరుమలరావు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకన్న, జీఎం(సీడీఎన్), మార్కెటింగ్ టి.శ్రీనివాస్, ఆర్జీ–3 జీఎం, మధుసూదన్, ఆర్జీ–2 ఇన్చార్జి జీఎం రాముడు పాల్గొన్నారు. -
బొగ్గు నాణ్యతకు ప్రాధాన్యమివ్వాలి
గోదారిఖని(రామగుండం): బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకతతో పాటు నాణ్యతకు అత్యంత ప్రాధాన్యమివ్వాలని సింగరేణి సీఎండీ బుద్ధప్రకాశ్జ్యోతి సూచించారు. గురువారం రామగుండం రీజియన్లో పర్యటించారు. పారిశ్రామిక ప్రాంతానికి చేరుకున్న సీఎండీకి డైరెక్టర్లు, జీఎంలు పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. రెండురోజుల పర్యటనలో భాగంగా గురువారం ఆర్జీ–1, 2 ఏరియాల్లో పర్యటించారు. ఆర్జీ–2 ఏరియాలోని సీహెచ్పీని సందర్శించి బొగ్గు రవాణా, నాణ్యత ప్రమాణాల నిర్వహణపై అధికారులు, ఉద్యోగులతో సమీక్ష నిర్వహించారు. నిర్మాణంలో ఉన్న కొత్త సీహెచ్పీ బంకర్ పనులను పరిశీలించి, బంకర్ సామర్థ్యం, బొగ్గు రవాణా విధానం గురించి తెలుసుకున్నారు. నిర్మాణ పనులను నిర్దేశిత గడువులోగా వేగంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం ఓసీపీ–3 ప్రాజెక్టును వ్యూపాయింట్ ద్వారా సందర్శించారు. గని జీవితకాలం, ఉత్పత్తి ప్రక్రియ, నాణ్యత ప్రమాణాలు తదితర అంశాలపై డైరెక్టర్లు, ఏరియా జీఎం, ఇతర అధికారులతో చర్చించారు. బొగ్గు ఉత్పత్తితో పాటు ఓవర్బర్డెన్ తొలగింపులో కూడా నిర్దేశిత లక్ష్యాలను అధిగమించాలని సూచించారు. రెస్క్యూ సిబ్బందికి అభినందన మైన్స్ రెస్క్యూ స్టేషన్ను సందర్శించిన సీఎండీ, ఇటీవల అంతర్జాతీయ స్థాయిలో బహుమతులు సాధించిన రెస్క్యూ జట్టు సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు. జీడీకే–5 ఓపెన్కాస్ట్ గనిని సందర్శించి ఉత్పత్తి తీరును వ్యూపాయింట్ ద్వారా పరిశీలించారు. ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. సీఎండీ వెంట డైరెక్టర్లు ఎల్వీ సూర్యనారాయణ, కె.వెంకటేశ్వర్లు, ఎం.తిరుమలరావు, ఈడీ (కోల్ మూవ్మెంట్) బి.వెంకన్న, జీఎం (కోఆర్డినేషన్– మార్కెటింగ్) టి. శ్రీనివాస్, ఆర్జీ1,2,3, అడ్రియాల ప్రాజెక్టు జీఎంలు లలిత్కుమార్, బండి వెంకటయ్య, మధుసూదన్, కొలిపాక నాగేశ్వరరావు, జీఎం(రెస్క్యూ) శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సింగరేణి సీఎండీ బుద్ధప్రకాశ్ జ్యోతి రామగుండం రీజియన్లో పర్యటన రెస్క్యూ జట్టుకు అభినందన -
రచ్చగుట్ట మట్టిపై రాజకీయ రగడ
రామగుండం: అంతర్గాం మండలం పెద్దంపేట గ్రామ పరిధిలోని రచ్చగుట్ట మట్టి తరలింపుపై పంచాయతీ పాలకవర్గం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇప్పటికే పెద్దంపేట బైపాస్ రోడ్డు విస్తరణకు స్థానిక కాంట్రాక్టర్ మట్టిని తరలించినప్పటికీ తమ గ్రామాభివృద్ధి రహదారి కావడంతో పాటు ఎమ్మెల్యే మక్కాన్సింగ్ఠాకూర్ సైతం తమ గ్రామానికి బైపాస్ రోడ్డు నిర్మాణావసరాలకు మాత్రమేనంటూ సర్ది చెప్పడం, అప్పటికే పనులు చివరి దశకు చేరడంతో గ్రామస్తులు ఉదాసీనంగా వ్యవహరించారు. పెద్దంపేట రైల్వేస్టేషన్ నుంచి గోదావరినది వంతెన వరకు సుమారు 9 కిలోమీటర్ల దూరం రైల్వే ట్రాక్ విస్తరణకు రచ్చగుట్ట నుంచి భారీ పరిమాణంతో మట్టి తరలించుకునేందుకు ప్రభుత్వానికి రాయల్టీ చెల్లించి అనుమతులు పొందారు. కాగా, మట్టి తరలించుకునేందుకు రెవెన్యూ, మైనింగ్ శాఖలు అనుమతులు మంజూరు చేయడంపై గ్రామస్తులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. కనీసం పంచాయతీ పాలకవర్గానికి రైల్వేశాఖ విన్నవించుకోకపోవడం, రెవెన్యూ, మైనింగ్ అధికారులు సైతం సమాచారమివ్వకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తమ గ్రామ సంపదగా భావించే రచ్చగుట్ట మట్టి తరలింపుపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ విషయమై కలెక్టర్ను కలిసి మట్టి తరలింపు అనుమతులు రద్దు చేయాలని పాలకవర్గం కోరింది. ఆధిపత్యం కోసం ఎత్తుగడలు గ్రామ సంపదగా భావించే రచ్చగుట్టను తవ్వి మట్టిని తరలించుకోవడానికి రైల్వేశాఖ అనుమతులు పొందడంపై గ్రామస్తుల నుంచి ఆగ్రహావేశాలు పెల్లుబికుతున్నాయి. సుమారు ఆరెకరాల విస్తీర్ణంలో ఉండే రచ్చగుట్టకు చుట్టు పక్కల పట్టా భూములు ఉండగా, కనీసం పట్టాదారులకు సైతం సమాచారం ఇవ్వకపోవడం గమనార్హం. ఏకంగా మట్టిని తవ్వేందుకు రైల్వేశాఖ భారీ యంత్రాలను మొహరించిన క్షణంలోనే గ్రామ పాలకవర్గం, వివిధ రాజకీయ పార్టీల నేతలు, ప్రజలు చుట్టుముట్టి మట్టి తరలింపును అడ్డుకున్నారు. మట్టి తరలింపును వ్యతిరేకిస్తూ అధికార పార్టీ కాంగ్రెస్, బీఆర్ఎస్, న్యూడెమోక్రసీ, గ్రామస్తులు ఎవరికి వారే రాజకీయ ఆధిపత్యం కాపాడుకునేందుకు చర్యలు చేపడుతున్నారు. అవసరమైతే పార్టీలకతీతంగా జేఏసీ ఏర్పాటు చేసుకొని ఉద్యమించేందుకు సిద్ధమంటూ కాంగ్రెస్ నేతలు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. కాగా, మట్టి తరలింపు విషయమై మైనింగ్ అధికారిని వివరణ కోరేందుకు పలుమార్లు సంప్రదించగా స్పందించలేదు. ఇదే విషయమై రైల్వేశాఖ కాంట్రాక్టర్ ప్రతినిధిని వివరణ కోరగా, మట్టి తరలింపుపై తమకు అన్ని రకాల అనుమతులు పొందినట్లు స్పష్టం చేశారు. గ్రామ సంపదను పరిరక్షించుకోవడమే పార్టీల లక్ష్యం ఎవరికి వారు ఆధిపత్యం కోసం ఎత్తుకు పైఎత్తులు మట్టి తరలింపు నిలిపివేతకు కలెక్టర్ను కలిసిన పాలకవర్గంకోర్టును ఆశ్రయించాం గ్రామ సంపదగా భావించే రచ్చగుట్ట నుంచి మట్టి తరలింపును నిలిపివేయాలని కోరుతూ కోర్టును ఆశ్రయించగా స్టే ఉత్తర్వులు జారీ చేసింది. నెల క్రితం గ్రామ పాలకవర్గం అత్యవసర సమావేశం నిర్వహించి మట్టి తరలింపును అడ్డుకోవాలని నిర్ణయిస్తూ గ్రామంలో కూడా చాటింపు వేయించాం. పాలకవర్గానికి సమాచారం లేకుండా సంబంధిత అధికారులు అనుమతులు జారీ చేయడం శోచనీయం. – ఆముల శ్రీనివాస్, సర్పంచ్, పెద్దంపేట -
ప్రతిపక్షాల ఉచ్చులో చిక్కొద్దు
సాక్షి పెద్దపల్లి: ధాన్యం కొనుగోళ్లపై ప్రతిపక్షాలు చేసే రాజకీయాల్లో రైతులు చిక్కుకోవద్దని, దేశంలోనే రికార్డు స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం వరి, మొక్కజొన్నలు కొంటుందని పౌరసరఫరాల మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి రైతులకు సూచించారు. గురువారం జిల్లాలో పర్యటించిన మంత్రుల బృందం, మొదట పెద్దక ల్వల గ్రామంలోని కేంద్రంలో రెతులతో మాట్లా డారు. ఏమైనా సమస్యలు ఉన్నాయా? అని తెలుసుకున్నారు. అనంతరం కలెక్టరేట్లో నిర్వహించిన పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల సమీక్ష సమావేశంలో మాట్లాడారు. ఈ నెలాఖరులోపు ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలని అధికారులు సూచించారు. అవసరమైతే ఇసుక, మైనింగ్ కార్యకలాపాలను తగ్గించి, ఆయా లారీలను సైతం ధాన్యం తరలించేందుకు వినియోగించుకోవాలని సూచించారు. వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కూడా ఎలాంటి కోతలు లేకుండా పూర్తి మద్దతు ధరతోనే కొనుగోలు చేసి బాయిలర్ మిల్లులకు తరలిస్తామని తెలిపారు. మిల్లర్లకు ఏవైనా నష్టాలు వచ్చినా ప్రభుత్వం భరిస్తుందని, రైతులకు మాత్రం నష్టం జరగనివ్వమన్నారు. ఆన్లైన్ ఎంట్రీలు, ట్రక్ షీట్ జనరేషన్, రైతుల చెల్లింపుల్లో పెద్దపల్లి జిల్లా రాష్ట్రంలోనే అగ్రస్థానంలో ఉందని, ఇలాగే కొనసాగించాలని మంత్రి జిల్లాయంత్రాంగాన్ని అభినందించారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్కుమార్, పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, పెద్దపల్లి, భూపాలపల్లి కలెక్టర్లు కోయ శ్రీహర్ష, రాహుల్ శర్మ, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్, ఆర్డీవోలు గంగయ్య, సురేశ్, సివిల్ సప్లయ్ డీఎం శ్రీకాంత్రెడ్డి, డీసీఎస్వో శ్రీనాథ్, జిల్లా సహకార అధికారి శ్రీమాల, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి కాళిందిని, జిల్లా మార్కెటింగ్ అధికారి ప్రవీణ్రెడ్డి, సంబంధిత అధికారులు, రైస్ మిల్లర్లు తదితరులు పాల్గొన్నారు. వర్షాలకు తడిసినా చివరి గింజ వరకు మద్దతు ధరతో కొనుగోలు చేస్తాం ఇసుక లారీలను ధాన్యం రవాణాకు వినియోగించాలి డిఫాల్ట్ రైస్ మిల్లులు బకాయిలు చెల్లిస్తే ధాన్యం కేటాయింపు సమీక్ష సమావేశంలో మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి -
సర్కారు బడుల బలోపేతంపై దృష్టి
మంథనిరూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పెంచి మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా ప్రొ.జయశంకర్ బడిబాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. జిల్లాలోని ప్రభుత్వ ఉన్నత, ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో బడిబాట చేపట్టడంతో పాటు ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తూ పాఠశాలల బలోపేతంలో గ్రామస్తులను భాగస్వామ్యం చేసేలా అడుగులు వేస్తోంది. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో.. జిల్లాలోని 14 మండలాల్లో 545 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఇందులో అనేక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తక్కువ శాతమే ఉంది. ఒకరిద్దరు విద్యార్థులతోనే పాఠశాలలను నడిపించే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈక్రమంలో ప్రతీ పాఠశాలలో అడ్మిషన్ల సంఖ్య పెంచేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలలను బలో పేతం చేసేలా ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టినా విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండటంతో ఈసారి అడ్మిషన్లు పెంచేలా చర్యలు చేపట్టింది. అవగాహన ర్యాలీలు.. ఇంటింటా ప్రచారాలు ప్రొ.జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా ప్రతీ గ్రామంలో అవగాహన ర్యాలీలతో పాటు ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు, సౌకర్యాలపై ప్రచారం చేస్తున్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుని ఉన్నత స్థాయికి ఎదిగి విద్యార్థుల విజయాలను వివరిస్తూ అడ్మిషన్ల సంఖ్య పెంపుపై దృష్టిసారించారు. విద్యార్థులను గుర్తించి.. బడిబాట కార్యక్రమంలో భాగంగా క్షేత్రస్థాయిలో ఉపాధ్యాయులు విద్యార్ధులను గుర్తించి వారిని పాఠశాలల్లో చేర్పించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా అంగన్వాడీ కేంద్రాల్లో చదువుతున్న చిన్నారులను ప్రాథమిక, ప్రాథమికలో చదివినవారిని ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో చేర్పించేలా చర్యలు చేపడతారు. అలాగే పని ప్రదేశాలు, నివాస ప్రాంతాల్లోని చిన్నారులను గుర్తించి వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తారు. ప్రభుత్వ పాఠశాలల్లో అందే వసతులు, సౌకర్యాలు, మధ్యాహ్న భోజనం వంటి సదుపాయాలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు. జనగణన.. విద్యావారోత్సవాల్లో టీచర్లు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జనగణన, ప్రజాప్రాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న విద్యావారోత్సవాల్లో ప్రభుత్వ ఉపాధ్యాయులకు బాధ్యతలు అప్పగించారు. జిల్లాలోని సుమారు 90శాతం మంది ఉపాధ్యాయులు ఈ విధుల్లో బిజిబిజీగా ఉన్న క్రమంలోనే బడిబాట ప్రారంభించడం తమకు భారమవుతుందనే అభిప్రాయాలు ఉపాధ్యాయులు వ్యక్తం చేస్తున్నారు. వేసవికాలం ఎండ తీవ్రత నేపథ్యంలో ఏ విధులకు ఎలా హాజరు కావాలో అర్థం కావడం లేదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అడ్మిషన్ల పెంపే లక్ష్యంగా.. పల్లెల్లో ప్రారంభమైన బడిబాట అవగాహన ర్యాలీలు.. ఇంటింటా ప్రచారాలు జనగణన.. విద్యావారోత్సవాల్లో ప్రభుత్వ టీచర్లు అడ్మిషన్లు పెంచేలా కృషి ప్రభుత్వ పాఠశాలల్లో అడిష్మన్లు పెంచేలా కృషి చేస్తున్నం. ఇప్పటికే విద్యాశాఖ ఆదేశాల మేరకు ప్రతీ పాఠశాల పరిధిలో బడిబాట కార్యక్రమాలను ప్రారంభించాం. షెడ్యూల్ ప్రకారం అన్ని కార్యక్రమాలు నిర్వహించి ప్రభుత్వ లక్ష్యాన్ని చేరుకునేలా ప్రయత్నం చేస్తున్నం. బడిబాటలో గ్రామస్తులను భాగస్వామ్యం చేసేలా చర్యలు చేపట్టాం. – దాసరి లక్ష్మి, మండల విద్యాధికారి, మంథని -
బొగ్గు నిల్వలపై విచారణ చేపట్టాలి
గోదావరిఖని(రామగుండం): సింగరేణి బొగ్గు నిల్వ లపై సీబీఐ విచారణ జరపాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మా దాసి రామ్మూర్తి డిమాండ్ చేశారు. గురువారం రా మగుండం రీజియన్లోని పలు బొగ్గు గనులపై ఉ న్న బొగ్గు నిల్వలను టీబీజీకేఎస్ బృందం పరిశీలించింది. యాజమాన్యం ప్రకటించిన విధంగా బొగ్గు నిల్వలు లేవని, కోల్ డంపింగ్ యార్డ్ ఖాళీగా కనబడుతోందన్నారు. జీడీకే–5 ఓసీపీలో అత్యధికంగా బొగ్గు నిలువలు ఉన్నాయని యాజమాన్యం పేర్కొన్నప్పటికీ, సందర్శించడానికి మాత్రం అనుమతించలేదన్నారు. బొగ్గు నిల్వచేసే ప్రాంతాల్లో షేల్ బొగ్గు, బండలు, కాలిపోయిన బొగ్గు బూడిద మాత్రమే దర్శనమిస్తున్నాయని, రామగుండం రీజియన్లో బొగ్గు నిల్వలు లేవని తమ పరిశీలనలోనూ తేలిందన్నారు. బొగ్గు నిల్వలపై యాజమాన్యం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నాయకులు పోలాడి శ్రీనివాసరావు, వడ్డేపల్లి శంకర్ తదితరులు ఉన్నారు. -
బస్టాండ్లో విచారణ కేంద్రం
పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి బస్టాండ్ ఆవరణలో ప్రయాణికుల సౌకర్యార్థం విచారణ కేంద్రాన్ని ప్రారంభించి సెల్నంబరును అందుబాటులో కి తెచ్చారు. పెద్దపల్లి నుంచి ఇతర ప్రాంతాలకు బస్సుల్లో ప్రయాణించాలకునే వారు బస్సుల సమాచారాన్ని తెలుసుకునేందుకు 90631 56348 నంబర్కు కాల్ చేయాలని బస్స్టేషన్ మేనేజర్ రాంగోపాల్రెడ్డి తెలిపా రు. ఈ నంబరు రోజూ ఉదయం 6 నుంచి రా త్రి 9గంటల వరకు అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. ప్రయాణికులు ఈ అవకా శాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ‘రజకుల ఆత్మగౌరవంపై ఎమ్మెల్యే పేరుతో దాడి’ పెద్దపల్లి: జిల్లాకేంద్రంలో రజకుల భూమి వద్ద ఎమ్మెల్యే విజయరమణారావును కీర్తిస్తూ విజ్జన్ననగర్ బోర్డు ఏర్పాటు చేయడం యావత్ రజక సమాజాన్ని అవమానించడమేనని రజక సంఘం జిల్లా అధ్యక్షుడు బొడ్డుపల్లి రమేశ్ అన్నారు. తెలంగాణ పోరాట యోధురాలు చిట్యాల ఐలమ్మ పేరు పెట్టాల్సింది పోయి, రాజకీయ నాయకుల పేర్లతో బోర్డులు పెట్టడాన్ని వ్యతిరేకించారు. ఎమ్మెల్యే మెప్పుకోసం కాంగ్రెస్ ముసుగులో ఉన్న రజకసంఘం నాయకుడు, తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం రజక జాతిని వాడుకోవడం సిగ్గుచేటన్నారు. ఎమ్మెల్యే భజన చేయాలనుకుంటే ఇతర మార్గాలను ఎన్నుకోవచ్చని, కానీ, రజకజాతి పేరును వాడుకునే హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. రజక సమాజాన్ని తక్కువ అంచనా వేస్తే ఊరుకునేది లేదని, ఎమ్మెల్యే పేరుతో ఉన్న అనధికారిక బోర్డులను వెంటనే తొలగించి, ఐలమ్మ పేరుతో నామకరణం చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే రజక సంఘం ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మహాధర్నా జయప్రదం చేయండి పెద్దపల్లి: గ్రామ పంచాయతీ కార్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జూన్ 1న మండల కేంద్రాల్లో నిర్వహించే మహాధర్నా జయప్రదం చేయాలని గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ పిలుపునిచ్చింది. జిల్లా కేంద్రంలో గురువారం సమావేశం నిర్వహించారు. జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సీపెల్లి రవీందర్, ఎండీ ఖాజా మాట్లాడుతూ గ్రామ పంచాయతీల్లో ప్రజలకు సేవలందిస్తున్న పంచాయతీ కార్మికులపై ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వీడాలని డిమాండ్ చేశారు. జూన్ 1న జరిగే ధర్నాను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. మండల అధ్యక్ష, కార్యదర్శులు దొంత కనుకయ్య, జంగంపల్లి నరేశ్, నాయకులు, ముస్తఫా, ప్రభాకర్, మల్లేశ్, పరశురాం, రాజేశం, శేఖర్, నాగరాజు, శంకర్, దేవేందర్, శ్రీధర్, సది, రమేశ్, శ్రీనివాస్, పంచాయతీ కార్మికులు పాల్గొన్నారు. గ్రావిటీ వాటర్ ఫిల్టర్ ప్లాంట్ ప్రారంభించాలిగోదావరిఖని(రామగుండం): గ్రావిటీ ఫిల్టర్ ఫ్లాంట్కు రూ.2కోట్లు విడుదల చేసి వెంటనే ప్రారంభించాలని సీఐటీయూ అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి పేర్కొన్నారు. గురువారం ఆర్జీ–1 ఏరియాలోని గ్రావిటీ వాటర్ఫిల్టర్ ప్లాంట్, ఫిల్టర్బెడ్ను పరిశీలించి మాట్లాడారు. కార్మిక కాలనీలకు స్వచ్ఛమైన నీరు సరఫరా కావడం లేదన్నారు. నల్లాల ద్వారా వచ్చే నీరు నీచు వాసన వస్తోందని, తాగేందుకు ఏమాత్రం అనుకూలంగా లేవన్నారు. ఫిల్టర్ బెడ్లో ఇంకో ఇంచు వరకు పాత ఇసుక తీసి కొత్త ఇసుక వేస్తే బాగుంటుందన్నారు. గ్రావిటీ ఫిల్టర్ బెడ్ నిర్మాణం చివరి దశలో ఉందని ఇంకో రూ.2 కోట్లు బడ్జెట్ కేటాయిస్తే సరిపోతుందన్నారు. కార్యక్రమంలో నాయకులు ఆరెపల్లి రాజమౌళి, వంగల శివరామ్రెడ్డి, వేణుగోపాల్రెడ్డి, జెల్ల గజేంద్ర, అన్నబోయిన శంకర్, పెద్దపల్లి శశికిరణ్, ఈదుల సాగర్, విప్రవ్, జంగపల్లి మల్లేశ్, ఓద్నాల సాగర్, కొమ్మ రమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
గన్నీసంచులు, సుతిలి రైతే కొనుక్కోవాల్నా?
పెద్దపల్లి: మార్కెట్కు మొక్కజొన్న తీసుకువస్తే బార్దాన్, సుతిలి రైతే కొనుక్కొని రావాలా అని మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి అధికారులను ప్రశ్నించారు. గురువారం జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో తడిసిన వరి ధాన్యం, మొక్కజొన్నను పరిశీలించి మాట్లాడారు. రైతులు మార్కెట్లో ధాన్యం పోసి నెల రోజులుగా పడిగాపులు కాస్తున్నా కాంటా వేయరా అని అధికారులను నిలదీశారు. ఆరుగాలం కష్టపడి పంటపండించిన అన్నదాతలకు కాంగ్రెస్ హయాంలో అన్యాయమే జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి కాలయాపన చేయకుండా కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు ఉప్పు రాజ్కుమార్, మండల అధ్యక్షుడు మార్కు లక్ష్మణ్, నాయకులు వెన్నం రవీందర్, సలేంద్ర రాములుయాదవ్, పెంచాల శ్రీధర్, రేవెల్లి స్వామి, మేకల కుమార్యాదవ్, ముత్యాల రాజయ్య, జుబేర్, పల్లె మధు, వైద శ్రీనివాస్, గండు రంగయ్య, లవన్ కుమార్, నుగిళ్ళ వీరేశం, బొడ్డుపల్లి రమేశ్, కుక్క మనోజ్కుమార్, రమేశ్, వేణుగోపాలరావు, తీగల సదయ్య, కారుపాకల సంపత్, ధర్మపురి, నర్ల అంజయ్య, చిట్టవేన వినీత్, బి.లింగయ్య, తోటపల్లి సంపత్ కుమార్ పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఉప సర్పంచ్ మృతి
సుల్తానాబాద్రూరల్/పెద్దపల్లి/ఓదెల: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి శివారులోని రాజీవ్ రహదారిపై బుధవారం ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొట్టగా ఉప సర్పంచ్ కోట నిరంజన్రెడ్డి((39) మృతి చెందాడు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. ఓదెల మండలం మడక గ్రామానికి చెందిన ఉప సర్పంచ్ కోట నిరంజన్రెడ్డి, నాంసానిపల్లెకు చెందిన పోతగంటి రాజు కలిసి ద్విచక్ర వాహనంపై కరీంనగర్కు పనినిమిత్తం వెళ్తున్నాడు. ఈక్రమంలో కాట్నపల్లి శివారులో వెనుక నుంచి లారీ ఢీకొట్టింది. ముందు టైర్ ఎక్కగా నిరంజన్రెడ్డి మృతి చెందాడు. రాజుకు తీవ్ర గాయాలు కావడంతో సుల్తానాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. పోలీసుల అదుపులో లారీ డ్రైవర్ ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. మృతుడి కుటుంబసభ్యులను విప్ విజయరమణరావు పరామర్శించారు. ఉప సర్పంచ్ మృతితో ఆయన స్వగ్రామం మడకలో విషాదం అలముకుంది. -
ప్రాణాలు కాపాడేది గోల్డెన్ అవర్
కోల్సిటీ(రామగుండం): ప్రమాదం జరిగిన గంటలోపు(గోల్డెన్ అవర్) చికిత్స అందితే ప్రాణాలు ద క్కుతాయని గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి(జీజీహెచ్) ఎమర్జెన్సీ విభాగం ఫిజీషియన్ స్వర్ణలత, వైద్య బృందం మనోహర్, మహేశ్, కిరణ్, సౌ మ్య వెల్లడించారు. ‘వరల్డ్ ఎమర్జెన్సీ మెడిసిన్ డే’ సందర్భంగా బుధవారం జీజీహెచ్లో వైద్య, సి బ్బంది, పేషెంట్లు, బంధువులకు అవగాహన క ల్పించారు. రోడ్డు ప్రమాదాలు, గుండెపోటు, విష ప్రయోగాలు, కాలినగాయాలు వంటి అత్యవసర పరిస్థితుల్లో తొలి గంటను ‘గోల్డెన్ అవర్’గా పరిగణిస్తారని, ఈ సమయంలో సరైన వైద్యం అందితే ప్రాణాపాయం తప్పుందని అన్నారు. గాయపడిన వ్యక్తిని అనవసరంగా కదిలించకూడదని, వెంటనే 108కు సమాచారం ఇవ్వాలని, రక్తస్రావం ఉంటే శుభ్రమైన గుడ్డతో ఒత్తిడి చేయాలని, గుండెపోటు లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాలని డాక్టర్ స్వర్ణలత వివరించారు. -
తూకం వేయకనే తడిసినయ్
మార్కెట్కు ధాన్యం తెచ్చి 20 రోజులైంది. నాలుగు రోజుల కింద సంచుల్లో నింపిండ్రు. తూకం వేస్తలేరు. కాంటా పెట్టి మిల్లుకు పంపిచాలని అడిగితే రేపు, మాపు అంటున్నరు. వానకు ధాన్యం తడిసింది. మళ్ల కింద పోసి ఆరబెట్టినం. మా గోస పట్టించుకునేదెవరు? – మామిడి లక్ష్మి, పెద్దపల్లి పట్టించుకునేటోళ్లేలేరు ఏప్రిల్ 18న మార్కెట్లో ధాన్యం కుప్పగా పోసిన. అధికారులు, సిబ్బంది రోజూ తిరుగుతున్న. నన్ను ఎవలు పట్టించుకుంటలేరు. నా పక్క కుప్ప ఆసామి ఫోన్పే ద్వారా రూ.2వేలు పంపంగనే తూకం అయింది. ఇదేందని అడిగితే.. ఎవలకు చెప్పుకున్నా ఏంకాదంటున్నరు. ఇట్లా జేసేత మేం ఏం చేయాలె? – పొలం రమేశ్, చందపల్లి పైసలిస్తేనే సంచులిస్తరట వడ్లను అమ్ముకుందామని నెలకింద మార్కెట్కు తెచ్చి న. నా తర్వాత వచ్చినోళ్లు పైసలిస్తే తూకం వేసి ఇళ్లకు పంపిండ్రు. ఇదేమని అడిగితే పైసలిస్తేనే తొందరగా తూకం అయితదంటున్నరు. గిదెక్కడి న్యాయం? – బొంకూరి అశోక్, పెద్దపల్లి అన్ని నేనే సమకూర్చుకున్న మక్కలకు మద్దతు ధర వస్తదని నెల కింద మార్కెట్ల పోసిన. తూకం అయితలేదు. మంగళవారం వాన పడ్డది. ఇంకా వానలు ఉన్నయంటున్నరు. అందుకే గన్నీ సంచులు, సుతిలితోపాటు హమాలీలను బయటినుంచి తీసుకొచ్చి తూకం వేయించిన. రూ.3వేలు పెట్టి ట్రాక్టర్ కిరాయికి తెచ్చి గోదాం తరలించుకున్న. – వెంకట్రామిరెడ్డి, కొత్తపల్లి -
మధ్యవర్తులకు చోటులేదు
పెద్దపల్లి: తహసీల్దార్ కార్యాలయాల్లో మధ్యవర్తులకు చోటులేదని కలెక్టర్ కోయ శ్రీహర్ష స్ప ష్టం చేిశారు. సుల్తానాబాద్లోని బాలసదనం, వృద్ధాశ్రమం, తహసీల్దార్ కార్యాలయాలను కలెక్టర్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈనెల 29న ప్రభుత్వ విప్ విజయరమణారావుతో బాలసదనం ప్రారంభిస్తామని, ఏర్పాట్లు పూర్తిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. వృద్ధులకు అసౌకర్యం కలగకుండా సేవలు అందించాలని సూచించారు. అధికారులు వేణుగోపాల్, బషీరోద్దీన్ తదితరులు పాల్గొన్నారు. వేడుకలకు పటిష్ట ఏర్పాట్లు పెద్దపల్లి: తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు అ న్నిఏర్పాట్లు చేయాలని ఆర్డీవో గంగయ్య ఆదేశించారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో రాష్ట్ర ఆవిర్భావ వేడుకల ఏర్పాట్లపై అధికారులతో బుధవారం సమీక్షించారు. కలెక్టరేట్లో వేడుకలు జరుగుతాయని తెలిపారు. ఈ సమావేశంలో ఏసీపీ కృష్ణ, కలెక్టరేట్ పరిపాలన అధికారి ప్రకాశ్, సీ– విభాగం సూపరింటెండెంట్ కుమారస్వామి, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్, తహసీల్దార్ రాజయ్య పాల్గొన్నారు. చిన్నారులకు క్రీడల్లో శిక్షణ జ్యోతినగర్: ఎన్టీపీసీ పర్మినెంట్ టౌన్షిప్లోని చిన్నారులకు క్రీడల్లో శిక్షణ ఇవనున్నట్లు ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చందన్కుమార్ సామంత అన్నారు. మంగళవారం రాత్రి జ్యోతిక ర్రి యేషన్ క్లబ్లో వేసవి ప్రత్యేక క్రీడాపోటీల శిక్ష ణ శిబిరం ప్రారంభించి మాట్లాడారు. వేసవి సె లవుల్లో క్రీడల్లో ప్రావీణ్యం పొందాలని సూచించారు. శిక్షణ శిబిరం జూన్ 8వ తేదీ వరకు కొనసాగనున్నట్లు ఆయన పేర్కొన్నారు, దీప్తి మహి ళా సమితి అధ్యక్షురాలు రాఖీ సామంత, ఏజీ ఎం సాగర్ రంజన్ సాహూ, క్లబ్ సెక్రటరీ రంజిత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నేడు సింగరేణీ సీఎండీ రాకగోదావరిఖని: సింగరేణి సీఎండీ బుద్ధ ప్రకాశ్జ్యోతి గురువారం రామగుండం ప్రాంతంలో పర్యటించనున్నారు. సీఎండీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈప్రాంతంలో పర్యటించడం ఇదే తొలిసారి. ఆయన పర్యటన నేపథ్యంలో రామగుండం రీజియన్లోని నాలుగు ఏరియాల్లో అధికారులు అప్రమత్తమైయ్యారు. పర్యటన ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. పొగాకు ఉత్పత్తులు వాడొద్దు పెద్దపల్లి: పొగాకు ఉత్పత్తులు వాడొద్దని జిల్లా వైద్యాధికారి ప్రమోద్కుమార్ సూచించారు. జి ల్లాకేంద్రంలోని ఐటీఐలో బుధవారం ప్రపంచ పొగాకు వ్యతిరేక దినం నిర్వహించారు. పొగా కు ఉత్పత్తులు.. వినియోగం .. పొగపీల్చడం ద్వారా కలిగే దుష్ప్రభావలపై అవగాహన క ల్పించారు. పొగాకుతో క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉందని తె లిపారు. ప్రోగ్రాం అధికారులు రాజమౌళి, ర వీంద్రారెడ్డి, సిబ్బంది మధుసూదన్ ఉన్నారు. దరఖాస్తులు ఆహ్వానం పెద్దపల్లి: ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ కోసం జూలై 31వ తేదీ లోగా దరఖాస్తు చేయాలని జిల్లా సంక్షేమ అధికారి వేణుగోపాల్రావు తెలిపారు. ఆవిష్కరణ, సృజనాత్మక, సామాజిక సేవ, పర్యావరణం, క్రీడలు, కళలు, సంస్కృతి, సైన్స్, టెక్నాలజీ తదితర రంగాల్లో ప్రతిభ చూపిన 18ఏళ్ల వయసు లోపు బాల, బాలికలు అర్హులన్నారు. ఆసక్తిగలవారు http://awards.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని, వివరాలకు 99666 76181 నంబరులో సంప్రదించాలని కోరారు. ఇబ్బంది లేకుండా అండర్ బ్రిడ్జి మరమ్మతు ఓదెల: ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఓదెల రైల్వేస్టేషన్ సమీపంలోని అండర్ బ్రిడ్జి మరమ్మతులు చేపట్టామని దక్షిణ మధ్య రైల్వే ఏడీఎన్ శ్రీవాస్తవ, ఐవోడబ్ల్యూ లోకేశ్ కుమార్ అన్నారు. ఓదెల అండర్బ్రిడ్జి మరమ్మతులను వారు పరిశీలించారు. త్వరితగతిగా మరమ్మతులు పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. సర్పంచ్ సతీశ్తోపాటు పంచాయతీ కార్యదర్శి వెంకటలక్ష్మణ్గౌడ్, నాయకులు పాల్గొన్నారు. -
కొనుగోళ్లలో దళారుల పెత్తనమా?
పెద్దపల్లిరూరల్: రైతులు కష్టపడి పండించిన పంట లు కొనుగోలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని బీజేపీ శాసనసభాపక్ష నేత మహేశ్వర్రెడ్డి ఆరోపించారు. రైతుగోస–బీజేపీ భరోసా పేరిట బీ జేపీ ప్రజాప్రనిధులు చేపట్టిన బస్సుయాత్ర బుధవారం పెద్దపల్లి మార్కెట్కు చేరింది. మహేశ్వర్రెడ్డితోపాటు ఎమ్మెల్యేలు వెంకటరమణారెడ్డి, రామారావు పటేల్, రాకేశ్రెడ్డి, ఎంపీ ఈటెల రాజేందర్, ఎ మ్మెల్సీలు మల్క కొమురయ్య, అంజిరెడ్డి తదితరు లు స్థానిక మార్కెట్ను సందర్శించారు. రైతుల స మస్యలపై ఆరా తీశారు. రైతు కష్టాన్ని మార్కెట్లో రకరకాలుగా దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. తూకంలో జాప్యం చేస్తూ ఇబ్బంది పెడుతున్నారని, ఇలాంటి వాళ్ల సంగతి తేలుస్తామన్నారు. మార్కెట్ లో నెలరోజులుగా పడిగాపులు పడుతున్నా కొనుగోళ్లలో వేగం పెంచకపోవడమేంటని ప్రశ్నించారు. బీజేపీ ప్రజాప్రతినిధుల బృందం మార్కెట్కు వ స్తుందని తెలిసి మంగళవారం అర్ధరాత్రి దాకా పొ రుగు రాష్ట్ర కూలీలతో పనులు చేయించి పెద్దఎత్తున ధాన్యాన్ని మిల్లులు, గోదాములకు తరలించడం సంతోషకరమేనన్నారు. ఈ పని ఇప్పటికే చేస్తే రైతులు ఇంతగోస పడేవారుకాదని అన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జి దుగ్యాల ప్రదీప్కుమార్, నాయకులు జి.సురేశ్రెడ్డి, సంధ్యారాణి తదితరులు ఉన్నారు. రైతులపై అక్రమ కేసుల చరిత్ర కాంగ్రెస్దే మంథనిరూరల్: దేశానికి అన్నం పెట్టే రైతులపై అక్రమ కేసులు పెట్టిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందని బీజేపీ తెలంగాణ అసెంబ్లీ ఫ్లోర్ లీడర్, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి ధ్వజమెత్తారు. రైతు గోస–బీజేపీ భరోసా యాత్ర బుధవారం గుంజపడుగుకు చేరింది. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎంపీలు ఈటెల రాజేందర్, రఘనందన్రావుతో కలిసి ఆయన సందర్శించారు. మహేశ్వర్రెడ్డి మాట్లాడుతూ, రైతులు పండించిన పంటను అమ్ముకోవడం కోసం అష్టకష్టాలు పడుతున్నారని, యాత్రలో తాము వస్తుంటే దారి వెంట కన్నీరు పెట్టుకుంటున్నారన్నారు. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్పై ఉన్న శ్రద్ధ రైతుల కష్టాలు తీర్చడంలో సీఎం రేవంత్రెడ్డికి లేదన్నారు. రెండురోజుల క్రితం కాటారంలో ధాన్యం కొనుగోలు చేయాలని ఆందోళన చేసిన రైతులపై అక్రమ కేసులు పెట్టించారని, ఓ వృద్ధుడు చెప్పుతో కొట్టుకుంటే అతడి ఇంటిపై దాడి చేశారని, ఆ కుటుంబాన్ని పరామర్శించామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు చందుపట్ల సునీల్రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చల్లా నారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, మాజీ జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి, పార్టీ మండల అధ్యక్షుడు వీరబోయిన రాజేందర్, పట్టణ అధ్యక్షుడు సబ్బని సంతోష్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ శాసనసభాపక్ష నేత మహేశ్వర్రెడ్డి పెద్దపల్లి మార్కెట్లో ధాన్యం, మక్కల కొనుగోళ్లు పరిశీలన -
అన్నదాత.. అరిగోస
పెద్దపల్లిరూరల్: మక్క పండించుడే పాపమా.. ఈసారి ధాన్యం దిగుబడి కొద్దిగా పెరిగితే అమ్ముకునేందుకు అవస్థలు తప్పవా? అని అన్నదాతలు ఆవేదన వ్య క్తం చేస్తున్నారు. అనేక కష్టాలకు ఓర్చి పంట పండించి విక్రయించేందుకు కొనుగోలు కేంద్రాల్లోనే నెలరోజులుగా గోసపడుతున్నా ఎవరూ పట్టించుకో రా? అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వడ్లు, మ క్కలు కొనుగోలు కేంద్రాల్లోనే నిల్వ ఉండగా మంగళవారం రాత్రి అకస్మాత్తుగా ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో వాటిని కాపాడుకునేందుకు రైతులు నానాతంటాలు పడ్డారు. పెద్దపల్లి వ్య వసాయ మార్కెట్ను బుధవారం పరిశీలించగా ధా న్యం, మక్కలు తడవకుండా కప్పిన టార్పాలిన్ల చుట్టూ చేరినవర్షపు నీటిని ఎత్తిపోస్తు కనిపించారు. వర్షానికి తడిసిన ధాన్యం తూకం వేసేందుకు సంచుల్లో నింపి మార్కెట్లో సిద్ధంగా ఉంచిన ధాన్యం వర్షానికి తడిసింది. బుధవారం ఉదయం రైతులు సంచుల్లో నుంచి ధాన్యం కిందపోసి ఆరబెట్టాల్సిన పరిస్థితులేర్పడ్డాయి. నెలరోజులు దాటినా తూకం వేయకపోవడంతో ఈ పరిస్థితులు తలెత్తాయని రైతులు ఆవేదన చెందారు. యార్డులో పనిచేసే వారికి కొంతముట్టజెబితే వెంటనే తూకం వేస్తున్నారని, పైసలు ఇవ్వని రైతుల వైపు చూసేవారే లేరని ఆవేదన చెందుతున్నారు. మక్కరైతు పరిస్థితి మరీ దయనీయం మక్కలను అమ్ముకుందామని కొనుగోలు కేంద్రాని కి వచ్చిన రైతుల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. కౌలురైతుల బాధలైతే చెప్పనలవికాదు. మక్క లు తూకం వేసేందుకు రూ.2 వేల నుంచి రూ.5వేల వరకు ఇవ్వాల్సిందేనని సదరు అధికారి డిమాండ్ చే స్తున్నారని, లేదంటే వేలిముద్ర వేసేందుకు కొర్రీలు పెడుతున్నాడని అన్నదాతలు ఆరోపించారు. డీసీఎంఎస్ అధికారిని రైతులకు సౌకర్యంగా ఉండేలా మార్కెట్యార్డులో ఉండేలా చూడాల్సింది పోయి తమను ఎండలో ఎందుకు తిప్పుతున్నారని అడిగినా గోడు వినేవారే లేరని పేర్కొంటున్నారు. గన్నీ సంచులు, సుతిలిదారం కూడా రైతులే తెచ్చుకోవాల్సిన దుస్థితి ఉందంటున్నారు. కలెక్టర్ ఇతర ఉన్నతాధికారులు మక్క రైతుల బాధలపై ఆరా తీస్తే మార్కెట్లో జరిగే అవినీతి బాగోతం బయటపడుతుందని అంటున్నారు. విరిగిపడిన చెట్లు, విద్యుత్ స్తంభాలు పెద్దపల్లి: సుల్తానాబాద్ పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలు, వరషానికి రేకుల షెడ్లు నేలమట్టమయ్యాయి. చెట్లు విరిగి విద్యుత్ స్తంభాలపై ప డడంతో కరెంట్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. బుధవారం ఉదయం వరకు విద్యుత్ సరఫరా లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మున్సిప ల్ చైర్మన్ బిరుదు రాధాకష్ణ, కమిషనర్ రమేశ్ ఆయా ప్రాంతలను పరిశీలించారు. కౌన్సిలర్లు సిద్ధ తిరుపతి, వేగోళం అబ్బయ్యగౌడ్ పాల్గొన్నారు. అర్ధరాత్రి కురిసిన భారీవర్షం ఈదురుగాలులతో అతలాకుతలం కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం వర్షపు నీటిలో కొట్టుకుపోయిన మక్కలు దిగుబడులను కాపాడుకునేందుకు రైతుల తంటాలు -
ట్రాన్స్ఫార్మర్.. ఫియర్
గురువారం శ్రీ 28 శ్రీ మే శ్రీ 2026కూనారం చౌరస్తాలో ఇలా.. కమాన్ వద్ద ఎస్బీఐ ఎదుట రక్షణ కంచె లేక చీకురాయి చౌరస్తాలో వాణిజ్య సముదాయం మధ్య జిల్లా కేంద్రం పెద్దపల్లిలోని విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు రక్షణ కవచాలు లేక స్థానికులను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. కొన్ని నివాసాలకు ఆనుకొని ప్రమాదకరంగా మారాయి. ఉరుములు, మెరుపుల సమయంలో అకాల వర్షాలు, గాలిదుమారంతో ఎప్పుడు ఎలాంటి ప్రమాదం సంభవిస్తుందోనని స్థానికులు భయంతో వణుకుతున్నారు. సమస్యాత్మక విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల వద్ద తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి -
కేంద్రాల్లో వడ్లు తూర్పార
మంథనిరూరల్: చెత్తా చెదారం లేకుండా నాణ్యమైన ధాన్యం కొనుగోలు చేయాలని ప్రభుత్వం ఆదేశించిన క్రమంలో జిల్లాలోని పలువురు అన్నదాత లు శుభ్రతపై ఆసక్తి చూపుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో ప్యాడీ క్లీనర్లు అందుబాటులో ఉంచినా కూలీలతో వడ్లు శుభ్రం చేయించే పనిలో నిమగ్నమవుతున్నారు. కేంద్రాల్లో ప్యాడీక్లీనర్ల నిర్వహణకు సదుపాయాలు లేకపోవడంతో రైతులు కూలీ చెల్లించి మరీ తూర్పార పట్టిస్తున్నారు. అయితే మధ్యా హ్నం సమయంలో వేడి గాలులు రావడంతోఉదయంపూటనే గాలి వస్తేనే తూర్పార పట్టుకుంటున్నామని పలువురు రైతులు తెలిపారు. ప్రతి కేంద్రంలో ప్యాడీ క్లీనర్.. జిల్లాలో ఐకేపీ, పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 334 కొనుగోలు కేంద్రాలకు ప్యాడీ క్లీనర్లను అందజేశారు. గతంలో మాన్యువల్ ప్యాడీ క్లీనర్లు ఉండగా తాజాగా ఆటోమెటిక్ ప్యాడీ క్లీనర్లను అందుబాటులోకి తీసుకువచ్చారు. అయితే వీటికి విద్యుత్ కనెక్షన్లు రైతులే ఏర్పాటు చేసుకోవాల్సి ఉండగా అందుకు రైతులు ఆసక్తి చూపడం లేదు. దూరప్రాంతం నుంచి వైర్లను లాగి అమర్చుకోవ డం కష్టంగా మారుతుందని రైతులు చెబుతున్నారు. గాలొస్తుంటే తూర్పార... ప్రస్తుతం వేసవికాలం కావడంతో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వడగాలులు వీస్తుంంటాయి. ఈ సమయంలో రైతులు కల్లాల్లోకి వెళ్లి తమ వరి ధాన్యం తూర్పార పట్టుకుంటున్నారు. రెండు, మూ డు ఎకరాల్లో పంట సాగు చేసిన సన్నకారు రైతులు ప్యాడీ క్లీనర్లను ఉపయోగించుకునేందుకు ముందుకు రావడం లేదు. తమ పంటను తామే శుభ్రం చేసుకుంటున్నామని చెబుతుంటే మరికొంత మంది రైతులు పాత పదతిలో వడ్లలోంచి తాలు పోయేలా కూలీలతో చాటేయిస్తున్నామని తెలిపారు. ట్రాక్టర్ లోడ్ వడ్లకు రూ.600 కై కికి కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చిన పంటను శుభ్రం చేసేందుకు సైతం కూలీల సేవలు వాడుకుంటున్నారు. ఒక ట్రాక్టర్ లోడ్ వడ్లను శుభ్రం చేసేందుకు రూ.600 వరకు కూకిలి(కూలి) తీసుకుంటున్నారని రైతులు చెబుతున్నారు. వడ్లలోంచి తాలు పోయేలా తూర్పార పట్టడం మొదలు.. కుప్పలోంచి చెత్తాచెదారం పోయేలా చాటేయడం వరకు కూలీలకే అప్పగిస్తున్నారు. వేసవికాలం కావడం వడగాలులు వస్తుండటంతో ఉదయం పూటనే ఈ పనులు చేస్తున్నట్లు రైతులు చెబుతున్నారు. ట్రాక్టర్ లోడ్కు రూ.600 కూలి శుభ్రం చేసినవడ్లు విక్రయించేందుకు రైతుల ఆసక్తి కేంద్రాల్లో అలంకారప్రాయంగా ప్యాడీ క్లీనర్లు కూలీలతోనే చాటేయిస్తున్న అన్నదాతలు -
రామగుండంలో హరిత హోటల్
కోల్సిటీ(రామగుండం): రామగుండం నగరంలో హరిత హోటల్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్ అన్నారు. నివాసయోగ్యమైన నగరంగా, విద్యా, ఉపాధి కేంద్రం మార్చడానికి కృషి చేస్తున్నామన్నారు. రూ.4.18 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు, మేయర్ మహంకాళి స్వామితో కలిసి బుధవారం గోదావరిఖని టీచర్స్ కాలనీలో ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ప్రతీ వీధిలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు నిధులు సమకూరుస్తుమన్నారు. నిధుల కొరతతో నిలిచిన కోర్టు భవన నిర్మాణాన్ని పూర్తి చేయిస్తామని ఆయన అభయం ఇచ్చా రు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పించాలని సూచించారు. కబ్జాకు గురైన ప్రభుత్వ భూములను అంగుళం కూడా తగ్గకుండా స్వాధీనం చేసుకోవాలని సూచించారు. మేయర్ మహంకాళి స్వామి మాట్లాడారు. కార్యక్రమంలో డిప్యూటీ మే యర్ పాతపెల్లి ఎల్లయ్య, అదనపు కలెక్టర్ అరుణ శ్రీ, కార్పొరేటర్లు రేణికుంట్ల నిర్మల, సాగి సంతోష్రావు, వెంగళ బాపు, బాలసాని తిరుపతి, దాసరి సాంబమూర్తి, బదావత్ నర్సమ్మ, భాగ్యలక్ష్మి, సత్య ప్రసాద్, ఎస్ఈ గురువీర తదితరులు పాల్గొన్నారు. కార్యకర్తలకు అండగా ఉంటాం జ్యోతినగర్: కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కష్టపడే ప్రతీ కార్యకర్తకు అండగా ఉంటానని రామగుండం ఎమ్మెల్యే రాజ్ఠాకూర్ మక్కాన్సింగ్ అన్నారు. స్థానిక ఎన్టీపీసీ టీటీఎస్లో ఏర్పాటు చేసిన ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. రామగుండం నియోజకవర్గ అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని ఆమర తెలిపారు. మేయర్ మహంకాళి స్వామి, నాయకులు బొంతల రాజేశ్, కాల్వ లింగస్వామి, దీటి బాలరాజు, ముస్తఫా, అసిఫ్ పాషా, పెండ్యాల మహేశ్, పీక అరుణ్ కుమార్, గుండేటి రాజేష్శ్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్ -
తడిసిన ధాన్యం కొంటాం
పెద్దపల్లి/పెద్దపల్లిరూరల్: వర్షాలతో తడిసిన, రంగుమారిన ధాన్యం కొనుగోలు చేస్తామని, రైతులు ఆందోళన పడొద్దని ప్రభుత్వ విప్ విజయరమణారావు అన్నారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారాన్ని నమ్మవద్దని కోరారు. జి ల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం అధికారులతో ధాన్యం సేకరణపై సమీక్షించారు. నియోజకవర్గంలో ఇప్పటివరకు 80 శా తం వరకు ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యాయని అధికారులు తెలుపగా.. మిగతా ధాన్యాన్ని త్వరగా తూ కం వేయించి కొనుగోళ్ల ప్రక్రియ పూర్తిచేయాలని విప్ సూచించారు. రైస్మిల్లర్లు కొర్రీలు పెట్టకుండా సహకరించాలని, లారీ యజమానుల సంఘం కూ డా తమవంతు సహకారం అందించాలని కోరారు. పౌర సరఫరాల డీఎం శ్రీకాంత్రెడ్డి, డీఎస్వో శ్రీనాథ్, రైస్మిల్లర్లు తదితరులు పాల్గొన్నారు. ధాన్యం రవాణాలో వేగం పెంచాలి కాల్వశ్రీరాంపూర్: ధాన్యం తూకం, లారీల్లో లోడింగ్, మిల్లుల్లో అన్లోడింగ్ ప్రక్రియలు వేగవంతం చే యాలని, మొక్కజొన్నలను గోదాముల్లోకి తరలించాలని ప్రభుత్వ విప్ విజయరమణారావు కోరారు. కాల్వశ్రీరాంపూర్లో రైతులు ట్రాక్టర్లను రోడ్డపై నిలి పి మంగళవారం నిరసన తెలుపగా.. విప్ బుధవా రం వ్యవసాయ మార్కెట్ను సందర్శించారు. మాజీ ఎంపీపీ సారయ్యగౌడ్, ఏఎంసీ చైర్మన్ రామిడి తిరుపతిరెడ్డి, సర్పంచ్ బంగారి రమేశ్, సింగిల్విండో చైర్మన్ చదువు రాంచంద్రారెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గాజనవేన సదయ్య, మార్కెట్ డైరెక్టర్ రవి, మాజీ సర్పంచ్ మాదాసు సతీశ్, నాయకుడు కలువల శ్యాంగౌడ్, రైతులు పాల్గొన్నారు. నేడు జిల్లాకు మంత్రుల రాక పెద్దపల్లి: పౌరసరఫరాల మంత్రి ఉత్తమ్ కుమార్రె డ్డి, ఐటీ మంత్రి శ్రీధర్బాబు గురువారం పెద్దకల్వ ల, అప్పన్నపేటలోని కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్ల తీరు పరిశీలిస్తారని, తర్వాత కలెక్టరేట్లో సమీక్షిస్తారని విప్ విజయరమణారావు తెలిపారు. అన్నదాతలు ఆందోళన పడొద్దు ప్రభుత్వ విప్ విజయరమణారావు -
మస్టర్లు తక్కువుంటే వేటే
గోదావరిఖని: అసలే ఉద్యోగాలు దొరక్క యువత ఇబ్బంది పడుతుంటే.. దొరికిన జాబ్కు ఎగనామం పెడుతూ ఉద్యోగాన్ని పీకల మీదకు తెచ్చుకుంటున్నారు సింగరేణి కార్మికులు. ఏడాదిలోగా వంద మస్టర్ల లోపుంటే యాజమాన్యం చర్యలకు సిద్ధమైంది. గతంలో ఏరియాల వారీగా ఉన్న చర్యలు ఇప్పుడు సింగరేణి అంతా ఒకే విధానానికి తీసుకవచ్చారు. యువ ఉద్యోగులే ఎక్కువ సంస్థ వ్యాప్తంగా సుమారు 39వేల మంది కార్మికులు పనిచేస్తుండగా, సుమారు 16వేల మందికి పైగా యువ కార్మికులు ఉద్యోగాలు చేస్తున్నారు. మెడికల్ ఇన్వాలిడేషన్ ద్వారా పెద్ద సంఖ్యలో యువ విద్యాధిక కార్మికులు విధుల్లో చేరారు. చాలా మంది సాఫ్ట్వేర్, ఎంబీఏ, ఎంబీబీఎస్ ఉద్యోగాలు వదిలిపెట్టుకుని సింగరేణిలో జాయిన్ అయ్యారు. వీరికి సంక్షేమం, సౌకర్యాలు కల్పిస్తున్నా కార్మికులు డ్యూటీల కు రాకపోవడం సంస్థపై ప్రతికూల ప్రభావం చూ పుతోందని యాజమాన్యం గమనించింది. గైర్హాజరవుతున్న కార్మికుల్లో యువ ఉద్యోగులే ఎక్కువగా ఉంటున్నారని అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. తగ్గించుకోని వ్యాపకాలు సింగరేణి ఉద్యోగాల్లో చేరుతున్న యువత పాత వ్యాపకాలు వదులుకోవడం లేదని తెలుస్తోంది. చాలా మంది సాఫ్ట్వేర్, పాత వ్యాపారాలకు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నట్లుగా యాజమాన్యం గుర్తించింది. ఈక్రమంలో డ్యూటీలకు ఎగనామం పెట్టి గత వ్యాపకాల వైపు దృష్టిపెట్టడంతో గైర్హాజర్ పెరుగుతున్నట్లుగా చెబుతున్నారు. సింగరేణి యాజమాన్యం సీరియస్ సంస్థవ్యాప్తంగా సుమారు 1600మందికి పైగా గైర్హాజరవుతున్నట్లు యాజమాన్యం జాబితా తయారు చేసింది. వారందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని డైరెక్టర్(పా) అన్ని ఏరియాల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సర్క్యులర్ ప్రకారం మొదటి వంద మస్టర్ల లోపుంటే రెండు ఇంక్రిమెంట్లు కట్, రెండో ఏడాది కూడా అలానే ఉంటే లోయర్ గ్రేడ్లోకి రివర్షన్, మూడో ఏడాది వందకన్నా తక్కువ ఉంటే ఉద్యోగంలోంచి తీసెయ్యమని ఆదేశాలు రావడంతో ఏరియా వారీగా అధికారులు చర్యలు చేపట్టారు. ఏడాదిలో వంద మస్టర్ల లోపు ఉంటే చర్యలు సస్పెండ్, చార్జిషీట్, రివర్షన్, డిస్మిస్ -
రైతులను ఇబ్బందికి గురిచేస్తే సహించం
పాలకుర్తి: ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులను ఇబ్బందికి గురిచేస్తే సహించమని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్ అన్నారు. మంగళవారం పాలకుర్తి మండలం జీడీనగర్ గ్రామపంచాయతీ పరిధిలోని గణపతి ఇండస్ట్రీస్ రైస్మిల్లును తనిఖీ చేసి ధాన్యం నిల్వలను పరిశీలించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు మిల్లర్లు సహకరించాలని, తాలు, తేమ పేరుతో రైతులను ఇబ్బంది పెడితే చర్యలుంటాయని హెచ్చరించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సహకరించకున్నా రాష్ట్ర ప్రభుత్వం రైతులు పండించిన ప్రతీ ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందన్నారు. ఈ విషయంలో రైతులు ఎవరూ అధైర్యపడొద్దని సూచించారు. మండలంలో 40వేల మెట్రిక్ టన్నుల గోదాముల నిర్మాణం చేపట్టి ఇబ్బందులకు లేకుండా చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే వెంట జీడీనగర్ సర్పంచ్ సూర రమ, మాజీ ఎంపీపీ రమేశ్, డీసీసీ ప్రధాన కార్యదర్శి సూర సమ్మయ్య, పార్టీ మండల అధ్యక్షుడు శ్రీనివాస్, తదితరులున్నారు. -
పెట్రో ధరలు తగ్గించాలి
ధర్మారం: కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజి ల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ ధర్మారం మండల కేంద్రంలో మంగళవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో, ధర్నా నిర్వహించారు. రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్కుమార్ ధర్నాలో పాల్గొని మాట్లాడుతూ పెట్రోల్ ఉత్పత్తుల పెరుగుదలతో సామాన్యులపై మోయలేని భారం పడుతు ందన్నారు. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్కు నోరు ఉందని ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే తీవ్ర పరిణా మాలు ఉంటాయని, ప్రజల కోసం పనిచేస్తున్న తన పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని తెలిపారు. గత ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగిన ఈశ్వర్ సంక్షేమానికి ఒక్క వసతి గృహం నిర్మించలేదని ఆ రోపించారు. తాను చేస్తున్న అభివృద్ధి పనులను ఓర్వలేక తనపై వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారన్నా రు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి డిప్యూటీ తహసీల్దార్ ఉదయ్కుమార్కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గాగిరెడ్డి తిరుపతిరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రూప్లానాయక్, వైస్ చైర్మన్ లింగయ్య, లక్ష్మీనర్సింహస్వామి ఆలయ కమిటీ చైర్మన్ సంతోశ్ తదితరులు పాల్గొన్నారు. -
గులాబీలో సంస్థాగత సందడి
సాక్షి,పెద్దపల్లి: భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్)లో సంస్థాగత సందడి మొదలైంది. నాలుగేళ్లుగా సంస్థాగత ఎన్నికలు లేక స్తబ్థతగా ఉన్న గులాబీ పార్టీ ఇటీవల జిల్లా, మండల కమిటీలు, అనుబంధ సంఘాల కార్యవర్గాలను రద్దు చేసింది. దీంతో పాటు కేసీఆర్ అధ్యక్షతన జరిగిన సన్నాహక సమావేశంలో తీసుకున్న నిర్ణయాల మేరకు బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శుల ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు ప్రక్రియకు చకచక అడుగులు పడుతున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ జీవన్రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. పెద్దపల్లి నియోజకవర్గ ఇన్చార్జిగా ఎమ్మెల్సీ వెంకట్రెడ్డి, రామగుండం ఇన్చార్జిగా ఎనుగు రవీందర్రెడ్డి, మంథనికి వీర్ల వెంకటేశ్వర్రావు, థర్మపురికి మూల విజయారెడ్డిలను నియమించారు. వీరి ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదుకు బూత్స్థాయి ఇన్చార్జీల నియామక ప్రక్రియ వేగంగా సాగుతోంది. జిల్లాలో మొత్తం 4 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటి పరిధిలో ఉన్న వేలాది పోలింగ్ బూత్లకు ఇద్దరేసి చురుకై న కార్యకర్తలను ఇందుకోసం నియమిస్తున్నారు. బూత్ స్థాయి తర్వాత మండల స్థాయిలో సభ్యత్వ నమోదు ప్రక్రియ వేగంగా జరిగేందుకు ఐదుగురు ముఖ్య నాయకులతోనే కమిటీ ఏర్పాటు చేస్తున్నారు. సభ్యత్వ నమోదు ప్రక్రియను సీరియస్గా తీసుకుని ముందుకు సాగుతోంది. గతం మాదిరిగానే పెద్ద ఎత్తున సభ్యత్వాల నమోదుకు దూసుకు పోయేలా కసరత్తు చేస్తోంది. డిజిటల్ రూపంలో సభ్యత్వాలు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియతో పాటు ఓటర్ లిస్ట్ సవరణ, తదితర కార్యాచరణ మొత్తం డిజిటల్ ప్రక్రియలో జరుగుతున్న నేపథ్యంలో పార్టీ సభ్యత్వం కూడా డిజిటలైజేషన్ పద్ధతిలో జరపాలని నిర్ణయించింది. గతంలో నియోజకవర్గాల ఇన్చార్జీలకు బుక్కులు పంపించి వాటిలో సభ్యత్వం తీసుకునే కార్యకర్త పేరు, వివరాలు నమోదు చేసేవారు. ఇలా సేకరించిన సమాచారాన్ని కంప్యూటర్లో నిక్షిప్తం చేసి కేంద్ర కార్యాలయానికి పంపించేది. కాని ఇప్పుడు అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని కొత్త సదుపాయాన్ని తీసుకువచ్చారు. డిజిటల్ రూపంలో సభ్యత్వాల నమోదుకు బీఆర్ఎస్ నిర్ణయించింది. కార్యకర్త పేరు, చిరునామా వివరాలు నేరుగా ఆన్లైన్లో నమోదు చేసి వారికి రిజిస్ట్రేషన్ నంబర్ను కేటాయిస్తారు. ఈ విధానంలో సభ్యత్వాల నమోదు సులువుగా మారడంతో పాటు త్వరగా పూర్తి చేయడానికి అవకాశం ఏర్పడుతుందని బీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. గతంలో చేపట్టిన సభ్యత్వాల నమోదు రికార్డు స్థాయిలో జరిగింది. నియోజకవర్గానికి 50వేలు సభ్యత్వాలు తగ్గకుండా చేపట్టారు. ఇప్పుడు అదే స్థాయిలో సభ్యత్వ నమోదుకు శ్రీకారం చుడుతున్నారు. అసంతృప్తవాదులే లక్ష్యం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ అసంతృప్తితో ఉన్న నాయకులు, కార్యకర్తలందరినీ లక్ష్యంగా చేసుకొని ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టబోతున్నారు. దీనికి గ్రామస్థాయి నుంచి అసంతృప్తితో ఉన్న నాయకులు, కార్యకర్తల జాబితాను సిద్ధం చేస్తున్నారు. సభ్యత్వ నమోదు ప్రారంభం కాగానే ఆయా నియోజకవర్గాల ఇన్చార్జిలతో అసంతృప్తవాదులందరికీ సభ్యత్వం కట్టబెట్టాలని లక్ష్యంగా పెట్టుకుంటున్నారు. గణనీయంగా సభ్యత్వాన్ని నమోదు చేసి బీజేపీ, కాంగ్రెస్లకు గట్టి షాక్నివ్వాలని బీఆర్ఎస్ నేతలు యోచిస్తున్నారు. జిల్లాలో పట్టు నిలుపుకునే ప్రయత్నం డిజిటల్ రూపంలో జరుగనున్న సభ్యత్వాలు తదనంతరం పార్టీ కార్యవర్గాల నియామకం ప్రతీ సెగ్మెంట్కు 50వేల సభ్యత్వం టార్గెట్ టార్గెట్ బీజేపీ, కాంగ్రెస్ కొద్దిరోజుల నుంచి బీజేపీ, కాంగ్రెస్లు తమ రాజకీయ కార్యకలాపాలను ముమ్మరం చేస్తూ బీఆర్ఎస్ పార్టీని లక్ష్యంగా చేసుకొని ఎదురుదాడి కొనసాగిస్తున్న క్రమంలో ఆ రెండు పార్టీలకు దీటైన సమాధానం చెప్పేందుకు వ్యూహాత్మకంగా బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని తెరపైకి తెచ్చింది. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 50 వేల నుంచి లక్ష వరకు పార్టీ సభ్యత్వాన్ని చేపట్టాలని నిర్ణయించారు. దీని కోసం జిల్లాలపై పార్టీ పరంగానే కాకుండా, కేడర్ నాయకులతో సన్నిహిత సంబంధాలు, చనువు ఉన్న నాయకులను సభ్యత్వ ఇన్చార్జీలుగా అధి ష్టానం నియమించింది. ఈ ఇన్చార్జీల దిశానిర్దేశంతోనే సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని గ్రామస్థాయి నుంచి చేపట్టబోతున్నారు. -
ఆధునిక సాంకేతిక విద్యలో ముందుండాలి
పెద్దపల్లి: భవిష్యత్ సాంకేతిక ఆధారిత ప్రపంచంగా మారుతున్న నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు కూడా ఆధునిక సాంకేతిక విద్యలో ముందుండాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో నిర్వహించిన ఏఐ, రోబోటిక్స్ స్టూడెంట్ ఫోకస్ 2026లో మాట్లాడారు. ఏప్రిల్ 27నుంచి ఈనెల 26వరకు జిల్లాలోని పెద్దపల్లి, మంథని, రామగుండం, సుల్తానాబాద్లలో టీఫైబర్ సహకారంతో ప్రత్యేక శిక్షణ అందించినట్లు తెలిపారు. విద్యార్థుల్లో సాంకేతిక పరి జ్ఞానం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటి క్స్ డిజిటల్ నైపుణ్యాల అభివృద్ధికి నిర్వహించిన ఈ శిక్షణ దోహదపడిందన్నారు.ఉత్తమ ప్రతిభకనబర్చిన విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. జిల్లా పరిపాలన, విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. వరికొయ్యలను కాల్చొద్దుకమాన్పూర్(మంథని): వరికోతల అనంతరం పంట పొలాల్లో వరికొయ్యలను కాల్చొద్దని జిల్లా వ్యవసాయాధికారి బత్తిన శ్రీనివాస్ అన్నారు. కమాన్పూర్ మండలం గుండారం రైతు వేదికలో మంగళవారం పంట సాగు విధానంపై రైతులకు అవగాహన కల్పించారు. వరికొయ్యలు కాల్చడం వల్ల సేంద్రియ కర్బనం గాలిలో కలుషితవాయువుగా మారిపోతుందన్నారు. వరికొయ్యలను రోటోవేటర్తో దుక్కిదున్నించి నీరు పెట్టి పచ్చిరొట్టె విత్తనాలు చల్లుకుంటే పంట దిగుబడి పెంచుకోవచ్చని సూచించారు. ఏడీఏ అంజని, ఏవో రామకృష్ణ, ఏఈవో అనూష, మాజీ సర్పంచులు ఆకుల ఓదెలు, కట్కం రవీందర్ పాల్గొన్నారు. 31వరకు ఉపకార వేతనాల దరఖాస్తు గడువుపెద్దపల్లి: ఉపకార వేతనాల దరఖాస్తు గడువు ఈనెల 31వరకు పొడిగించినట్లు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి రవీందర్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో చదువుతున్న అర్హులైన ఎస్సీ విద్యార్థులు 2025–26 సంవత్సరానికి ప్రభుత్వం అందించే ఉపకార వేతనాల కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు. వివరాలకు 8790153484 నంబర్లో సంప్రదించాలని పేర్కొన్నారు. 31న జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీలుపెద్దపల్లి/జ్యోతినగర్: సుల్తానాబాద్లోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఈనెల 31న జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీలు నిర్వహిస్తున్నట్లు అథ్లెటిక్స్ అసోసియేషన్ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి కొమ్ము గట్టయ్య ఒక ప్రకటనలో తెలిపారు. అండర్ 16, 18, 20 విభాగాల్లో బాలబాలికలు, మహిళలు, పురుషులకు వేర్వేరుగా పోటీలు నిర్వహిస్తామన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు సంబంధిత ధ్రువపత్రాలతో ఉదయం 6గంటలకు క్రీడామైదానంకు రావాలని కోరారు. పూర్తి వివరాలకు అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా సంయుక్త కార్యదర్శి ప్రణయ్(96183 36976)ని సంప్రదించాలని పేర్కొన్నారు. కాంటా లేక తూకంలో జాప్యంపెద్దపల్లిరూరల్: పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్యార్డులో మంగళవారం తూకం వేసే కాంటాలు పనిచేయక కొద్దిగంటల పాటు అంతరాయం కలిగింది. సమాచారం అందుకున్న అధికారులు సుల్తాబాద్ మార్కెట్ యార్డు నుంచి రెండు కాంటాలు తెప్పించి కొనుగోళ్లను ప్రారంభించారు. జిల్లా కేంద్రమైన పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్యార్డులో ఎలక్ట్రానిక్ కాంటాలకు మరమ్మతు చేయించి తూకంలో వేగం పెంచేలా చూడాలని రైతులు కోరుతున్నారు. -
అటు అనుమతులు.. ఇటు అడ్డగింతలు
పెద్దపల్లిరూరల్: ఇటుక తయారీకి అవసరమయ్యే ముడిసరుకులో ఒకటైన చెరువుమట్టిని ఇటుక బట్టీ ప్రాంతానికి తరలించేందు కు అధికారుల నుంచి బట్టీ యజమానులు అనుమతులు పొందినా.. దారి పొడవునా ఉన్న ఊళ్ల ప్రజలు, నాయకుల నుంచి అడ్డగింతలు తప్పడం లేదు. చెరువులో పూడికతీత తీ యడం వల్ల చెరువులో నీటిమట్టం పెరిగి భూగర్భజలాలు పెంపొందుతాయని అధికారులు, ప్రజాప్రతినిధులు చెబుతున్నా.. చెరువుమట్టి టిప్పర్కు రూ.3200కే ఇవ్వడం చాలా చౌక అని, బహిరంగ మార్కెట్లో టిప్పర్కు రూ.10నుంచి 12వేలదాకా ఉంటుందని పలువురు పేర్కొంటున్నారు. అదీ కాక టిప్పర్లో ఓవర్లోడ్ మట్టితో తమ గ్రామాల మీదుగా రాకపోకలు సాగించడం వల్ల రోడ్లు, వంతెనలు దెబ్బతింటున్నాయంటూ గ్రామాల్లో అడ్డగిస్తున్నా రు. సుల్తానాబాద్ మండలం కొదురుపాక నుంచి వచ్చే టిప్పర్లను నిట్టూరు గ్రామస్తులు అడ్డుకుని రో డ్డుపై మంచాలు వేసుకుని బైఠాయించారు. మంగళవారం పెద్దపల్లి మండలం రాఘవాపూర్లో మట్టిటిప్పర్లను అడ్డుకోగా పోలీసులు జోక్యం చేసుకొని ఇబ్బందులుంటే చర్చించి పరిష్కరించుకోవాలని సూచించడంతో వెనుదిరిగారు. ప్రభుత్వం నుంచి అనుమతులు పొందినా అనధికారిక ఖర్చులు తమకు భారంగా పరిణమిస్తున్నాయని పలువురు బట్టీయజమానులు పేర్కొంటున్నారు. మట్టి తరలింపులో తిప్పలు -
పారదర్శకంగా కొనుగోళ్లు
● 31లోగా ధాన్యం కొనుగోళ్లు పూర్తి ● ‘సాక్షి ఫోన్ ఇన్’లో సివిల్ సప్లయి డీఎం శ్రీకాంత్రెడ్డి పెద్దపల్లి: జిల్లావ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు పారదర్శకంగా జరుగుతున్నాయని సివిల్ సప్లయి డీఎం శ్రీకాంత్రెడ్డి అన్నారు. మంగళవారం ‘సాక్షి’ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోళ్లలో సమస్యలపై నిర్వహించిన ‘ఫోన్ ఇన్’ కార్యక్రమంలో పలువురు రైతులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. జిల్లాలో 4లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యం పెట్టుకోగా ఇప్పటివరకు 3లక్షల 23వేల 597 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. రైతుల ఖాతాల్లో రూ.604 కోట్లు జమ చేసినట్లు తెలిపారు. 128 రైస్మిల్లులకు ధాన్యాన్ని సరఫరా చేస్తున్నారన్నారు. జిల్లావ్యాప్తంగా 334 కేంద్రాలను ప్రారంభించగా 30 కేంద్రాల్లో కొనుగోళ్లు పూర్తి చేసి మూసివేసినట్లు తెలిపారు. ఈనెల 31లోగా కొనుగోళ్లు పూర్తి కానున్నట్లు వివరించారు. -
ఆర్ఎఫ్సీఎల్ బాధితులకు న్యాయం చేయాలి
గోదావరిఖని: ఆర్ఎఫ్సీఎల్ బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ నాయకులు మంగళవారం ఆందోళన నిర్వహించారు. కార్మిక సంఘం నాయకులు అంబటి నరేశ్ ఆధ్వర్యంలో స్థానిక ప్రధాన చౌరస్తా నుంచి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడికోసం ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. విషయం తెలుసుకున్న గోదావరిఖని వన్టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించి వారిని అడ్డుకుని పోలీస్స్టేషన్కు తరలించి కేసు నమోదు చేశారు. దీనికి ముందు స్థానిక ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నరేశ్ మాట్లాడారు. ఆర్ఎఫ్సీఎల్ కార్మికుల నుంచి వసూలు చేసిన డబ్బులతో కొనుగోలు చేసిన భూమి డీటీసీపీ లేఅవుట్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు భూమి సీజ్చేసి బాధితులకు న్యాయం చేయాలన్నారు. బాధితుల మొదటి విడత 100మంది లిస్ట్ తయారు చేశామని, మొత్తం 400మంది బాధితులు ఉన్నారని, ఒక్కొక్కరికి సుమారు రూ.4లక్షల వరకు రావాల్సి ఉందన్నారు. బాధితులకు పరిహారం అందించకపోతే రిలే నిరాహార దీక్ష చేపడతామన్నారు. నాయకులు రమేశ్, పూర్ణచందర్, సతీశ్, క్రాంతి, ప్రశాంత్, శ్రావణ్, రమేశ్, శ్రీకాంత్, రాంకీ పాల్గొన్నారు. -
మత సామరస్యంతో బక్రీద్ జరుపుకోవాలి
కోల్సిటీ(రామగుండం): బక్రీద్ పండుగను మత సామరస్యంతో శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని రామగుండం మేయర్ మహంకాళి స్వా మి అన్నారు. మంగళవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో బక్రీద్ పండుగ ఏర్పాట్లపై వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, కార్పొరేటర్లు, ము స్లిం మత పెద్దలతో నిర్వహించిన సమన్వయ సమావేశంలో మాట్లాడారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో రూ.12లక్షలు వెచ్చించి ఈద్గాల వద్ద టెంట్లు, తాగునీరు, మైక్ తదితర సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. పశువధ విషయంలో ప్రభుత్వ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. సమావేశంలో నగరపాలక సంస్థ కమిషనర్ జె.అరుణశ్రీ, డిప్యూటీ మేయర్ ఎల్లయ్య, ఏసీపీ రమేశ్, పశువైద్యాధికారి ప్రసాద్, సీఐలు ఇంద్రసేనారెడ్డి, ప్రసాదరా వు, రాజేశ్వర్రావు, పలువురు కార్పొరేటర్లు, ముస్లిం మత పెద్దలు, నగరపాలక సంస్థ, ఎన్టీపీసీ, సింగరేణి, ఆర్ఎఫ్సీఎల్ అధికారులు పాల్గొన్నారు. మొక్కజొన్న రైతుల ఆందోళనకాల్వశ్రీరాంపూర్: కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు తిప్పలు పెడుతున్నారని ఓపిక నశించిన మొక్కజొన్న రైతులు మంగళవారం ఆగ్రహంతో రహదారి పై ట్రాక్టర్లను అడ్డుగా పెట్టి ఆందోళనకు దిగారు. ఓదెల మండలం పొత్కపల్లిలో డీసీఎంఎస్ ఆధ్వర్వంలో కొనుగోలు చేసిన మొక్కజొన్నలను సోమవారం కాల్వశ్రీరాంపూర్ వ్యవసాయ మార్కెట్ డీసీఎంఎస్ గోదాంలో అన్లోడ్ చేసుకోవాలని పంపించారు. ఈరోజు అన్లోడ్ కాదని మంగళవారం దించుకుంటామని ఇన్చార్జి అనడంతో రైతులు ఓపికతో వేచి ఉన్నారు. తీరా మంగళవారం ఇక్కడ గో దాంలో ఖాళీ లేదని అన్లోడ్ చేసుకోలేమని తిరస్కరించారు. మంథని, పెద్దపల్లి, సుల్తానాబాద్, మద్ది కుంటకి తీసుకువెళ్లండంటూ ఇన్చార్జి పేర్కొనడంతో ఆగ్రహించిన రైతులు కాల్వశ్రీరాంపూర్లో మొ క్కజొన్నల లోడ్తో ఉన్న ట్రాక్టర్లను రోడ్డుకు అడ్డంగా పెట్టి ఆందోళనకు దిగారు. రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతో ఎస్సై వెంకటేశ్ చేరుకొని ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడి రైతులను సముదాయించి శాంతింప జేశారు. -
రిటైర్డ్ బెనిఫిట్స్ ఇప్పించండి
ఉద్యోగ విరమణ పొందిన తర్వాత ఆర్టీసీ నుంచి బెనిఫిట్స్ ఇప్పించాలి. సామాన్య, మధ్య తరగతికి చెందిన మేము రిటైరైన తర్వాత బతికేందుకు ఇబ్బందులు పడుతున్నాం. పీఎఫ్, 2017 నుంచి బకాయిలన్నీ విడుదల చేయాలి. – ఆర్టీసీ ఉద్యోగులు అక్రిడిటేషన్లు ఇవ్వాలి అర్హులైన వారందరికీ అక్రిడిటేషన్లు ఈనెలలోగా ఇ ప్పించాలని జర్నలిస్టుల సంక్షేమ సంఘం రాష్ట్ర వ ర్కింగ్ ప్రెసిడెంట్ బందెల రాజశేఖర్, జిల్లా అధ్యక్షు డు వెన్నంపల్లి శ్రీనివాస్ కోరారు. కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. అనంతరం కలెక్టరేట్లో అడిషనల్ కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు. -
పింఛన్ మంజూరు చేయండి
దివ్యాంగుల పింఛన్ మంజూ రు చేయాలని ప్రతీ ప్రజావాణిలో వినతిపత్రం ఇస్తూనే ఉన్న. హైదరాబాదు వెళ్లమంటున్నరు. ఆర్థిక ఇబ్బందులతో అంతదూరం వెళ్లలేకపోతున్న. అధికారులు స్పందించడం లేదు. – జన్నే రవి, గుంజపడుగు ఆడపడుచులు వేధిస్తున్నరు మా ఆయన చనిపోయారు. వ్యవసాయ భూములు రిజిస్ట్రేషన్ కాకుండా ఆడపడుచులు వేధిస్తున్నరు. నాకు ఇద్దరు పిల్లలు ఉన్నరు. జీవనోపాధి లేదు. బతికేది ఎలా? వ్యవసాయ భూమి మాది మాకు ఇప్పించాలె. – ఆరెల్లి నందిని, కన్నాల -
ధాన్యం కొనుగోళ్లలో సమస్యలా?
పెద్దపల్లి: ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఎదురవుతున్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు ‘సాక్షి’ మంగళవారం ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహించనుంది. కొనుగోలు కేంద్రాల్లో అన్నదాతల ఇబ్బంబదులు, తాలు, తరుగు పేరిట ధాన్యంలో కోతలు, హమాలీల కొరత, లోడింగ్, అన్లోడింగ్ తదితర సమస్యలపై జిల్లా సివిల్ సప్లయ్ డీఎం శ్రీకాంత్రెడ్డి సమాధానాలు ఇస్తారు. మీరు చేయాల్సిందల్లా కేవలం కింది ఫోన్ నంబరులో సంప్రదించి మీ సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లడమే.. శ్రీకాంత్రెడ్డి -
మండుతున్న రామగుండం
కోల్సిటీ(రామగుండం): రో హిణీ కార్తె సో మవారం ప్రా రంభమైంది. ఇదేసమయంలో ఎండలు తీ వ్రస్థాయికి చేరా యి. ఉదయం నుంచే మండి పోయిన సూ ర్యుడు మధ్యాహ్నానికి నిప్పు లు కక్కుతూ ప్ర జల్ని ఉక్కిరిబిక్కిరి చేశాడు. వడగాలులు, ఉక్కపోత, భానుడి భగభగలకు నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రోడ్లపై వేడిసెగలు ఎగసిపడుతుండగా, ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు ప్రజలు జంకుతున్నారు. ఎండల నుంచి ఉపశమనం కోసం కొందరు గొడుగులు పట్టుకొని బయటకు వచ్చారు. ఇంకొందరు తలకు రుమాలు, కర్చీఫ్లు చుట్టుకొని ప్రయాణించారు. మహిళలు చీర కొంగులతో తలపై, ముఖాలను కప్పుకొని ఎండను తట్టుకునే ప్ర యత్నం చేశారు. మధ్యాహ్న వేళల్లో ప్రధాన రహదారులు నిర్మానుష్యంగా మారగా, చల్లని పానీయాల దుకాణాలు జనంతో కిక్కిరిశాయి. -
మట్టి టిప్పర్ల అడ్డగింత
పెద్దపల్లిరూరల్/పెద్దపల్లి: వే బిల్లులు లేకుండా చె రువు మట్టిని ఇటుక బట్టీలకు తరలిస్తున్న ఆరు టి ప్పర్లను అధికార కాంగ్రెస్ నాయకుడు బొంకూరి అవినాష్, కౌన్సిలర్ నాంసాని శ్రీనివాస్ తదితరులు సోమవారం అడ్డుకున్నారు. తహసీల్దార్ రాజయ్య కు ఫిర్యాదు చేయగా.. డిప్యూటీ తహసీల్దార్ విజేందర్ ఎల్లమ్మగుడి ప్రాంతంలో ఆపిన టిప్పర్లను తని ఖీ చేశారు. సుల్తానాబాద్ మండలం కొదురుపాక చె రువు నుంచి మట్టి తరలిస్తున్న 21 టిప్పర్లు నిలిచి ఉండగా అందులో 15 టిప్పర్లకు వేబిల్లులు ఉన్నాయని, వాటిని వదిలేశారు. మిగతా ఆరు టిప్పర్లలో చెరువుమట్టి అక్రమంగా తరలిస్తున్నారని నిర్ధారించి సీజ్ చేసినట్లు డిప్యూటీ తహసీల్దార్ తెలిపారు. అవినీతికి ఆస్కారం లేదు ప్రభుత్వ విప్ విజయరమణారావు సారథ్యంలో నీతివంతమైన పాలన సాగుతోందని యూత్కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బొంకూరి అవినాష్ అన్నారు. నిబంధనలు పాటించకుండా చెరువు మట్టి తరలిస్తున్న టిప్పర్లను తామే పట్టుకుని అధికారులకు అప్పగించి సీజ్ చేయించడమే ఇందుకు నిదర్శనమన్నారు. మాజీ ఎమ్మెల్యే మనోహర్రెడ్డి ఆయన మద్దతుదారులు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యేపై నిందారోపణలకు దిగడం సరికాదని ఆయన పేర్కొన్నారు. -
శ్రమించాడు.. సాధించాడు
● డీజీఎంఎస్గా ప్రేమ్కుమార్ ● ఉద్యోగం చేస్తూనే యూపీఎస్సీలో విజయం జ్యోతినగర్: సాధారణ కార్మిక కుటుంబం నుంచి ఎదగి.. బొగ్గు గనుల భద్రతా రంగంలో గుర్తింపు పొందిన యువ అధికారి కనకం ప్రేమ్కుమార్ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ(డీజీఎంఎస్)లో డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ మైన్స్సేఫ్టీ (డీడీఎంఎంస్)గా విధులు నిర్వహిస్తున్న ఆయన.. తాజాగా అసోం ప్రాంతానికి బదిలీ అయ్యారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతానికి చెందిన ప్రేమ్కుమార్ తండ్రి కనకం మోహన్ సింగరేణిలో డంపర్ ఆపరేటర్గా పనిచేస్తున్నారు. తల్లి ఎమీలియా గృహిణి. ఆయనకు ఒక తమ్ముడు, ఒక చెల్లెలు ఉన్నారు. ఉద్యోగ ప్రయాణం.. ప్రేమ్కుమార్ నాగ్పూర్లోని వీఎన్ఐటీలో మైనింగ్ ఇంజినీరింగ్ పూర్తిచేశారు. 2011–12 బ్యాచ్లో ఉత్తీర్ణులయ్యారు. క్యాంపస్ ప్లేస్మెంట్ ద్వారా కోల్ఇండియా కంపెనీలో ఉద్యోగం సాధించారు. మహారాష్ట్రలోని చంద్రాపూర్ ప్రాంతంలో అండర్ గ్రౌండ్ మైన్స్లో డిప్యూటీ మేనేజర్గా పనిచేశారు. గోదావరిఖనిలో విద్యాభ్యాసం గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో విద్యాభ్యాసం పూర్తిచేశారు ప్రేమ్కుమార్. కరీంనగర్ జిల్లా మానకొండూర్ ఆయన స్వస్థలం. సింగరేణి గనికార్మికుడిగా తన తండ్రి మార్గదర్శకత్వంలో కష్టపడేతత్వం అవర్చుకున్నారు. యూపీఎస్సీలో విజయం యూపీఎస్సీలో విజయం సాధించడం లక్ష్యంగా ప్రిపేరైన ప్రేమ్కుమార్.. 2021లో విజయం సాధించారు. అనంతరం 2022లో డీజీఎంఎస్ దక్షిణ ప్రాంతంలో డీడీఎంఎస్గా నియమితులయ్యారు. తెలంగాణ ప్రాంతంలో పలు బొగ్గు గనుల భద్రత అవగాహన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు. ఈదురుగాలులు.. కొట్టం కూలి వృద్ధుడి మృతిసింగరేణి సంస్థ నాకు జన్మభూమి. మా కుటుంబంలో నాన్న సింగరేణిలో విధులు నిర్వహిస్తుండటంతోనే నాకు ఉన్నత విద్య చదువుకునే అవకాశం లభించింది. కష్టపడితే సాధారణ కుటుంబం నుంచైనా మంచి స్థాయికి ఎదగవచ్చు. – ప్రేమ్కుమార్, ఎన్టీపీసీ, రామగుండం -
బన్నీ వేసవి యాత్ర –17 Simple English Daily Uses
ఉదయం లేవగానే బన్నీ తాతయ్యతో “ Good morning, Tatayya” అన్నాడు. తాతయ్య నవ్వుతూ “ Good morning, Bunny. Have you brush your teeth?” అని అడిగాడు. బన్నీ “ Yes... I have Tatayya అని సమాధానం చెప్పాడు. టిఫిన్ టేబుల్ దగ్గర తాతయ్య “ Hand me a glass of water” అన్నాడు. బన్నీ వాటర్ బాటిల్ ఇస్తూ “ Here you are” అన్నాడు. తాతయ్య “ Thank you, Bunny” అనగానే, బన్నీ వెంటనే “ It’ s my pleasure “ అన్నాడు. Park కి వెళ్తూ బన్నీ “ I am going to park now” అని చెప్పాడు. తాతయ్య “ Come home quickly...” అని జాగ్రత్త చెప్పాడు. సాయంత్రం వచ్చాక బన్నీ “ I am tired, Tatayya. Can I have some milk?” అని అడిగాడు. తాతయ్య పాలు ఇస్తూ “ Certainly, you should take a bath after drinking milk అన్నాడు. పిల్లలకి మాట: ప్రతీరోజూ మాట్లాడితే ఇంగ్లిష్ తేలికగా వచ్చేస్తుంది. డాక్టర్ కోట లక్ష్మణ్, ప్రభుత్వ ఉపాధ్యాయుడు గ్రామం: కాకర్లపల్లి, మంథని, జిల్లా: పెద్దపల్లి -
పాలిటెక్నిక్తో ఉజ్వల భవిష్యత్తు
సప్తగిరికాలనీ(కరీంనగర్): నేటి వేగవంతమైన ప్రపంచంలో కేవలం డిగ్రీలు ఉండడం కంటే చేతిలో నైపుణ్యం ఉండడమే అసలైన విజయం. పదోతరగతి పూర్తి కాగానే విద్యార్థుల ముందున్న అత్యుత్తమ మార్గం పాలిటెక్నిక్ అని పలువురు విద్యావిశ్లేషకులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇది కేవలం ఒక కోర్సు మాత్రమే కాదు.. తక్కువ కాలంలోనే ఒక ఇంజనీర్గా విద్యార్థులను తీర్చిదిద్దే అద్భుతమైన వేదిక. డిగ్రీలు దాహాన్ని తీర్చవు.. నైపుణ్యం మాత్రమే ఆకలిని తీరుస్తుంది అనే నినాదంతో సాంకేతిక విద్య వైపు అడుగులు వేయడం విద్యార్థుల తక్షణ అవసరమంటున్నారు. రేపటి నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో అర్హత సాధించిన అభ్యర్థులు కౌన్సెలింగ్ ప్రక్రియపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి. ముఖ్యంగా ఆన్లైన్ స్లాట్ బుకింగ్ తదితర వాటిపై కూడా అవగాహన కలిగి ఉండాలి. ఈ నేపథ్యంలో విద్యార్థుల కోసం సాక్షి ప్రత్యేక కథనం. ● తక్కువ వయసులోనే స్థిరత్వం 18–19 ఏళ్లకే టెక్నికల్ డిప్లొమా పూర్తి చేసి ఉద్యోగంలో చేరే అవకాశం పాలిటెక్నిక్ కల్పిస్తుంది. ● ప్రాక్టికల్ నాలెడ్జ్పుస్తకాల్లోని పాఠాల కంటే ల్యాబుల్లో ప్రయోగాత్మక విద్యకు ఇక్కడ పెద్దపీట వేస్తారు. ● ఇంజనీరింగ్ సులభంపాలిటెక్నిక్ పూర్తి చేసిన వారు నేరుగా బీటెక్ రెండో సంవత్సరంలో చేరొచ్చు. ● ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలు రైల్వేలు, పీఎస్యూ, రక్షణ రంగాల్లో డిప్లొమా ట్రెయినీ హోదాలో అత్యుత్తమ జీతంతో కొలువులు సాధించొచ్చు. ● స్లాట్ బుకింగ్.. కౌన్సెలింగ్లో పాల్గొనడానికి తొలుత స్లాట్ బుకింగ్ వెబ్సైట్లో లాగిన్ అవ్వాలి. హాల్ టికెట్ నంబర్, ర్యాంక్, పుట్టిన తేదీ నమోదు చేయాలి. మీకు దగ్గరలోని హెల్ప్లైన్ సెంటర్ తేదీ, సమయాన్ని ఎంచుకొని బుక్ చేసుకోవాలి. బుకింగ్ పూర్తయ్యాక వచ్చే రసీదును తప్పనిసరిగా ప్రింట్ తీసుకోవాలి. ● ఫీజు వివరాలు.. ప్రాసెసింగ్ ఫీజును ఆన్లైన్ ద్వారా మాత్రమే చెల్లించాలి. ఓసీ, బీసీ అభ్యర్థులు రూ.600, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.300 చెల్లించాలి. ● సర్టిఫికెట్లు.. సర్టిఫికెట్ వెరిఫికేషన్కు ఒరిజినల్ పత్రాలతోపాటు 2 సెట్ల జిరాక్స్ కాపీలు తీసుకెళ్లాలి. పాలిసెట్ హాల్ టికెట్, ర్యాంక్ కార్డ్, ఎస్సెస్సీ మార్కుల మెమో, టీసీ, 4వతరగతి నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు, కుల ధ్రువీకరణ పత్రం(బీసీ, ఎస్సీ, ఎస్టీ), ఆదాయ ధ్రువీకరణ పత్రం(01.01.2026 తర్వాత పొంది ఉండాలి). ● వెబ్ ఆప్షన్.. విద్యార్థులు కోరుకున్న సీటు రావాలంటే ఆప్షన్లు ఇచ్చేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. ఆప్షన్లు పరిమితంగా కాకుండా ఎక్కువ సంఖ్యలో కాలేజీలను ఎంచుకోవాలి. నచ్చిన బ్రాంచి, కాలేజీని మొదటి వరుసలో ఉంచాలి. ఆప్షన్లు సేవ్ చేసే ముందు ఒకటికి రెండుసార్లు సరి చూసుకోవాలి. ● ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలు ● డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ప్రభుత్వ మోడల్ రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్, కరీంనగర్. ● ఎస్ఆర్ఆర్ఎస్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, అగ్రహారం, రాజన్న సిరిసిల్ల. ● ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, కోరుట్ల. ● ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, హుస్నాబాద్. ● జ్యోతిష్మతి పాలిటెక్నిక్ కళాశాల, కరీంనగర్ ● వాగేశ్వరి పాలిటెక్నిక్ కళాశాల, కరీంనగర్ ● ట్రినిటీ పాలిటెక్నిక్ కళాశాల, పెద్దపల్లి ● మదర్ థెరిసా పాలిటెక్నిక్ కళాశాల, పెద్దపల్లి ● ఉమ్మడి జిల్లాలో హెల్ప్లైన్ కేంద్రాలు ● డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ప్రభుత్వ మోడల్ రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్, కరీంనగర్. ● ఎస్ఆర్ఆర్ఎస్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, అగ్రహారం, రాజన్న సిరిసిల్ల. ● ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, కోరుట్ల. ● ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, హుస్నాబాద్. ● ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, రాజగోపాల్పేట్, సిద్దిపేట. ● ప్రభుత్వ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్, చిన్నకోడూరు, సిద్దిపేట. ● పాలిసెట్ 2026 మొదటి దశ కౌన్సెలింగ్ షెడ్యూల్ ● స్లాట్ బుకింగ్ సర్టిఫికెట్ల ధ్రువీకరణ మే 27 నుంచి మే 31 వరకు. ● స్లాట్ బుక్ చేసుకున్న అభ్యర్థుల సర్టిఫికెట్ పరిశీలన మే 29 నుంచి జూన్ 1 వరకు. ● సర్టిఫికెట్ ధ్రువీకరణ అనంతరం ఎంపికలను వినియోగించుకోవడం మే 29 నుంచి జూన్ 3 వరకు. ● ఎంపికలను స్తంభింపజేయడం జూన్ 3. ● సీట్ల కేటాయింపు జూన్ 6 లేదా అంతకుముందు. ● వెబ్సైట్ ద్వారా ఫీజు చెల్లింపు, స్వీయ నివేదన జూన్ 6 నుంచి జూన్ 9 వరకు. ● కేటాయించిన కళాశాలలో రిపోర్టింగ్ జూన్ 8 నుంచి జూన్ 9 వరకు. ● విద్యాసంవత్సరం ప్రారంభం జూన్ 9 నుంచి. ● ఓరియంటేషన్ జూన్ 8 నుంచి జూన్ 10 వరకు. రేపటి నుంచి కౌన్సెలింగ్ ఉమ్మడి జిల్లాలో 6 హెల్ప్లైన్ కేంద్రాలు -
వడదెబ్బతో 8 మంది మృతి
జగిత్యాలక్రైం/గోదావరిఖని/ రామడుగు/వీణవంక/జమ్మికుంట/పెద్దపల్లి/కాల్వశ్రీరాంపూర్: ఉమ్మ డి జిల్లావ్యాప్తంగా సోమవారం వడదెబ్బతో 8 మంది మృతిచెందారు. జగిత్యాలలోని మంచినీళ్లబావి ప్రాంతానికి చెందిన గొల్లపల్లి శివప్రసాద్గౌడ్ (50), కరీంనగర్ జిల్లా రామడుగుకు చెందిన లక్ష్మీరాజం(48), గోపాల్రావుపేటకు చెందిన షేర్ల నరేశ్ (30), వీణవంక మండలం ఘన్ముక్కుల గ్రామానికి చెందిన బొంగోని రాజవీరు(65), జమ్మికుంటలోని 28వ వార్డు ఎంప్లాయీస్ కాలనీకి చెందిన దాసార పు కాంతమ్మ (59), సుల్తానాబాద్కు చెందిన తోడే టి లక్ష్మి (44), కాల్వశ్రీరాంపూర్ మండలం వెన్నంపల్లి గ్రామానికి చెందిన ఉపాధిహామీ కూలి గోస్కు ల గట్టయ్య(52), సింగరేణి సంస్థ రామగుండం డివిజన్–2లోని ఓసీపీ–3 ప్రయివేట్ ఓబీ వీ–9 కాంట్రాక్టర్ వద్ద క్యాంటీన్మెస్లో కుక్గా పనిచేస్తున్న కుమార్(40) వడదెబ్బతో మృతిచెందారు.కుమార్ మృతదేహంశివప్రసాద్(ఫైల్)తోడేటి లక్ష్మి (ఫైల్)కాంతమ్మ(ఫైల్)షేర్ల నరేశ్(ఫైల్) -
పొడుపు కథలు
01. ‘డెన్’లకు మార్కు లేసే దేశం ఏది? 02. ‘పాన్’లు వేసుకునే దేశం? 03. బీదదైన సింహం ఉండే దేశం? 04. బంగళాలు మాత్రమే ఉండే దేశం? 05. ‘జెర్మన్స్’ ఎక్కువగా ఉండే దేశం? 06. ఒక దీవిని మర్యాదగా పిలిచే దేశం? 07. ‘బాయ్’ మాత్రమే ఉండి ‘గర్ల్’ లేని దేశం? 08. ఈ దేశంలో ఏదైనా ‘ఈజీ’ నే? 09. ‘ఖ’కు మేనియా వచ్చిన దేశం? 10. ‘షియా’ తెగ మనుషులు ఎక్కువగా ఉండే దేశం? 11. మెరికల్లాంటి ప్రజలు ఉండే దేశం? 12. ఫిలిప్ ఉండే దేశం? 13. దారి లేని దేశమేది? 14. ‘రాక్’లున్న దేశమేది? 15. రమ్మని పిలిచి ‘బోడి’ అని ఎగతాళి చేసే దేశమేది? 16. ‘వి’ కోసం ప్రయత్నించే దేశమేది? 17. ‘టాన్’ కలిగిన దేశమేది? 18. త్వరగా రమ్మని పిలిచే దేశమేది? 19. తీగల్ని పందిరికి పాకిస్తా అనే దేశమేది? 20. పేరులో పాలున్న దేశమేది? పేరు: దూపాటి చేతన్ హర్షిత్ తరగతి: 7వ తరగతి పాఠశాల: ఇన్నోవేటివ్ హైస్కూల్, షాపూర్నగర్ స్వస్థలం: కరీంనగర్ డాక్టర్ కందేపి రాణిప్రసాద్ మేనేజింగ్ డైరెక్టర్, సృజన్ చిల్డ్రన్స్ హాస్పిటల్, సిరిసిల్ల పేరు: పెరుక సిద్ధార్థ తరగతి: 9వ తరగతి పాఠశాల: జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాల గ్రామం: కొత్తపల్లి జిల్లా: పెద్దపల్లి పేరు: దేవరాజ్ ఆరాధ్య తరగతి: ఒకటో తరగతి పాఠశాల: బ్రిలియంట్ మోడల్ స్కూల్ గ్రామం: నస్పూర్ జిల్లా: మంచిర్యాల పేరు: తుమ్మనపల్లి శ్రీయాన్ తరగతి: 6వ తరగతి పాఠశాల: శ్రీచైతన్య స్కూల్ గ్రామం: జగిత్యాల పేరు: జి.అక్షర తరగతి: 8వ తరగతి పాఠశాల: లెజెండ్ హైస్కూల్ ఊరు: భగత్ నగర్, కరీంన గర్ పేరు: దండు అంజనాశ్రీ తరగతి: 8వ తరగతి పాఠశా: గర్రెపల్లి మోడల్ స్కూల్ గ్రామం: బొమ్మకల్ జిల్లా: కరీంనగర్ పేరు: జి.వర్షిత్ తరగతి: 8వ తరగతి పాఠశాల: శ్రీసాయిరాం హైస్కూల్, గ్రామం: ఇందిరా పార్క్, హైదరా బాద్ జవాబులు: 01. డెన్మార్క్, 02.జపాన్, 03.సింగపూర్, 04.బంగ్లాదేశ్, 05.జర్మనీ, 06.శ్రీలంక, 07.దుబాయ్, 08.ఈజిప్టు, 09.ఆర్మేనియా, 10.మలేషియా,11.అమెరికా, 12.ఫిలిప్పీన్, 13.నార్వే, 14.ఇరాక్, 15.కంబోడియా, 16.వియత్నాం, 17.భూటాన్,టాంజానియా, 18.అర్జెంటీనా, 19.పాకిస్తాన్, 20. నేపాల్, పాలస్తీనా వేసవి సెలవుల్లో మీ కలానికి పదునుపెట్టి బొమ్మలు గీస్తున్నారా? చిట్టి కథలు రాస్తున్నారా? ఏదైనా పర్యాటక ప్రదేశం సందర్శించారా? ఆటపాటల్లో విజయం సాధించి పతకాలు అందుకున్నారా? ఈ విషయాలను మీ స్నేహితులు, పాఠకులతో పంచుకోవాలనుకుంటే వాట్సప్ నెం: 8500786474 ద్వారా మాకు పంపండి. మేము ప్రచురిస్తాం. మీ ఫొటో కూడా జతచేయండి. ఊరు..పేరు.. జిల్లా రాయడం మరువొద్దు సుమా... -
పిల్లలం–బడి పిల్లలం
మేం పిల్లలం బడి పిల్లలం మా భరతమాత మల్లెలం రోజు వెళతాం మా బడికి జీవిత పాఠం నేర్పే గుడికి ! జాతీయ గీతం పఠిస్తం వందేమాతరం జపిస్తం ప్రతిజ్ఞ పాలన పాటిస్తం త్రికరణ శుధ్ధికి చోటిస్తం ఆటలు అంటే మాకెంతో ప్రేమ! ఆ ఆటలకై మేం పడతాం శ్రమ పాటలంటే మాకెంతో ప్రాణం వినిపిస్తాం మేం గంధర్వ గానం పాటలకు పల్లవియే ప్రాణం ఆటలకు చెల్లదు నిస్త్రాణం గురువు చెప్పిన ఈ మాట మరువం మేము ఏ పూట ! ఆటపాటల ఆయువును పట్టి తెలివితేటలతో మేం జతకట్టి మైదానంలో ఆడుతాం నిత్యం నిదానం పాటించుట సత్యం! పాటల పల్లకి వెంటనే ఎక్కి పాటల పల్లవికే ఉంటేనే చిక్కి పాట స్ఫూర్తిని పెంచుకుంటం గెలుపు బాటను ఎంచుకుంటం ! గుర్రాల లక్ష్మారెడ్డి, కవి రచయిత ఊరు: కల్వకుర్తి జిల్లా: నాగర్ కర్నూల్


