Peddapalli
-
స్టడీ సర్కిల్కు రూ.5కోట్లు హర్షణీయం
పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రంలో అంబేడ్కర్ స్టడీ సర్కిల్ భవనాన్ని రూ.5 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేస్తున్నట్టు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ విజయరమణారావు ప్రకటించడం సంతోషకరమని అంబేడ్కర్ ఉత్సవ కమిటీ చైర్మన్ మామిడిపల్లి బాపయ్య అన్నారు. బ్రాహ్మణపల్లిలో సోమవారం వైస్చైర్మన్ కొంకటి లింగమూర్తి, నారాయణతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. పోటీపరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు ఈ భవనం ఎంతోఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. ఈనెల 14లోపే స్టడీ సర్కిల్ పనులు ప్రారంభిస్తానని ఎమ్మెల్యే విజయరమణారావు తెలిపారని వారు పేర్కొన్నారు. ‘రామాయణం’పై అవగాహన పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రంలోని శ్రీసరస్వతీ శిశుమందిర్ ఉన్నత పాఠశాలలో సోమవారం జిల్లాస్థాయి రామాయణం పరీక్షలు నిర్వహించారు. వేదపండితుడు కొండపాక శ్రీనివాసాచార్యులు రామాయణం విశిష్టత తదితర అంశాలపై అవగాహన కల్పించారు. శ్రీరాముని జీవితం మానవాళికి ఆదర్శమని, ఆయన చూపినబాటలో ముందుకు సాగాలని సూచించారు. పరీలక్షకు 22 పాఠశాలలకు చెందిన 134 మంది విద్యార్థులు హాజరయ్యారని విశ్వహిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి నాగులమల్యాల సత్యం తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ జడల సురేందర్, నగర సంయోజక్ మణిదీప్, చందు, జాగర్ల సతీశ్చంద్ర తదితరులు పాల్గొన్నారు. -
బాధితులకు ఊరట
పెద్దపల్లి: వ్యవసాయ బావులు, నివాసాల్లో విద్యుత్ ప్రమాదాలతో మృతిచెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం ఊరట కలిగించింది. గతంలో చెల్లించే పరిహారాన్ని పెంచుతూ విద్యుత్ నియంత్రణ మండలి తాజాగా ఆదేశాలు జారీ చేసింది. మృతుల కుటుంబాలకు ఇప్పటివరకు రూ.5లక్షల చొప్పున పరిహారం ఇస్తుండగా దానిని రూ.8 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పశువులకు చెల్లించే పరిహారరాన్ని గతంలో మాదిరిగా రూ.40 వేలు చెల్లించాలని నిర్ణయించిందని ట్రాన్స్కో ఎస్ఈ గంగాధర్ తలిపారు. అర్ధంటపాటు నడవాలి పెద్దపల్లి: సంపూర్ణ ఆరోగ్యం కోసం అందరూ రోజూ కనీసం 30 నిమిషాల పాటు నడవా లని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి ప్రమో ద్ కుమార్ కోరారు. ప్రజా పాలన.. ప్రగతి ప్ర ణాళికలో భాగంగా జిల్లా కేంద్రంలోని ఐటీఐ మైదానం నుంచి జిల్లా కేంద్ర ఆస్పత్రి వరకు సోమవారం వాక్థాన్ నిర్వహించారు. డీఎంహెచ్వో మాట్లాడుతూ, సరైన సమయంలో, సరైన మోతాదులో ఆహారం తీసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు. మున్సిపల్ క మిషనర్ వెంకటేశ్, ఇండియన్ రెడ్క్రాస్ సొ సైటీ జిల్లా అధ్యక్షుడు కావేటి రాజగోపాల్, స భ్యులు బోడకుంట రామకృష్ణ, మీచాల సత్య నారాయణ, రేకులపల్లి శశాంక్, ప్రతినిధులు రాజమౌళి, కొట్టె లక్ష్మయ్య, శ్రవణ్, మమత, సంయుక్త, విద్యార్థులు పాల్గొన్నారు. బీజేపీ జెండా ఎగురవేస్తాం పెద్దపల్లి: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ జెండా ఎగురవేస్తామని బీజేపీ జిల్లా అధ్యక్షు డు కర్ర సంజీవరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సు ల్తానాబాద్, శాసీ్త్రనగర్, పూసాలలో సోమరవారం నిర్వహించిన బీజేపీ ఆవిర్భావ కార్యక్రమాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఆ యా ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమాల్లో జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి అశోక్రావు, నాయకులు గొట్టిముక్కుల సురేశ్రెడ్డి, నల్ల మనోహర్రెడ్డి, సౌదరి మహేందర్ యాదవ్, మిట్టపల్లి ప్రవీణ్, కామని రాజేంద్ర ప్రసాద్, చాతరాజు రమేశ్, కోట నాగేశ్వర్, కొల్లూరి సంతోష్, కొ మ్మిడి రాజేందర్రెడ్డి, వడ్లకొండ శశివర్ధన్, మ ల్క భాగ్యలక్ష్మి, పెరక రమేశ్, మారం రమేశ్, ఏనుగు రాజిరెడ్డి, వి.కిరణ్ పాల్గొన్నారు. ప్రథమ చికిత్స పోటీలు గోదావరిఖని: ఆర్జీ–1లోని జీడీకే–1, 3గనిపై సోమవారం ప్రథమ చికిత్స పోటీలు నిర్వ హించారు. గాయపడినవారికి సీపీఆర్, చికిత్స చేయడం, వారిని అంబులెన్స్లో సకాలంలో ఆస్పత్రికి తరలించే అంశాలపై పోటీ నిర్వహించారు. కార్యక్రమములో ప్రథమ చికిత్స తనిఖీ బృందం ఎస్.సాయిప్రసాద్, కె.ఉదయ్కుమార్, జి.మధుబాబు, గని ఏజెంట్ ఎల్.రమేశ్, గనిమేనేజర్ సుధీర్జక్కుల్వార్, రక్షణ అధికారి శ్రీను పాల్గొన్నారు. -
మీడియాపై వీసీ చిందులు
సాక్షిప్రతినిధి,కరీంనగర్: శాతవాహన యూనివర్సిటీలో అర్బన్ నక్సలైట్లు ఉన్నారంటూ రేగిన చిచ్చు ఇప్పట్లో ఆరేలా లేదు. ఒకవైపు పోలీసులు అలాంటి వ్యక్తులు ఎవరూ లేరని ప్రకటనలు జారీ చేస్తున్నా.. కొందరు మాత్రం ఈ ప్రచారాన్ని ఆపడం లేదు. ప్రొఫెసర్ సుజాత, వైస్ చాన్స్లర్ వర్గాల మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంది. ఇందులో భాగంగా సోమవారం వర్సిటీలో పలు నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. యూనివర్సిటీపై వస్తున్న ఆరోపణలను కవర్ చేసేందుకు వెళ్లిన మీడియాపై వీసీ చిందులు తొక్కడం, పోలీసులతో బెదిరించేందుకు యత్నించడం, విద్యార్థులపై కేసులు పెడతా అంటూ హెచ్చరిస్తున్నట్లుగా ఉన్న వీడియోలు, ఆడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వర్సిటీ రాజకీయాలు మరింత వేడెక్కాయి. సాయంత్రానికి యూనివర్సిటీ విద్యార్థులు సీపీ గౌస్ ఆలం చిత్రపటానికి క్షీరాభిషేకం చేయడం విశేషం. మీడియాతో వీసీ వాగ్వాదం శాతవాహన గాథల పేరుతో ఔట్సోర్సింగ్ పోస్టులను అమ్ముకుంటున్నారంటూ ‘కొలువులమ్మా.. కొలువులు’ అన్న శీర్షికన సాక్షి దినపత్రికలో సోమవారం ప్రచురితమైన కథనానికి స్పందన వచ్చింది. అర్బన్ నక్సలైట్లు, కొలువుల విక్రయాలపై వార్తలను కవర్ చేసేందుకు సోమవారం సాక్షి టీవీతోపాటు, ఇతర ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు శాతవాహన వర్సిటీకి వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న వైస్ చాన్స్లర్ ఉమేశ్కుమార్ వారిపై చిందులు తొక్కారు. అసలు మీరెవరు? మిమ్మల్ని ఎవరు లోనికి రానిచ్చారు? ఎవరి అనుమతి తీసుకున్నారు? అని వాగ్వాదానికి దిగారు. దీనికి మీడియా ప్రతినిధులు దీటుగానే స్పందించారు. యూనివర్సిటీ పౌరుల ఆస్తి అని, ఇక్కడకు వచ్చేందుకు తాము ఎవరినీ అనుమతి కోరనవసరం లేదని బదులిచ్చారు. ఈ లోపు వీసీ ఎప్పటిలాగే కొత్తపల్లి పోలీసులను క్యాంపస్లోకి దింపి మీడియాను నియంత్రించేందుకు విఫలయత్నం చేశారు. సోషల్ మీడియాలో వైరల్ సీసీ కెమెరాల ద్వారా క్యాంపస్ను పర్యవేక్షిస్తూ.. త నకు అనుమానం వచ్చిన ప్రతీ విద్యార్థిని తన ఛాంబర్కి పిలిపించుకుని కేసులు పెడతామంటూ వీసీ హెచ్చరించే వారని విద్యార్థులు తొలినుంచి ఆరోపిస్తున్నారు. ఇప్పుడు ఆ ఆరోపణలకు బలం చేకూర్చేలా వీసీ ఉమేశ్కుమార్ పలువురు విద్యార్థులను త న ఛాంబర్కి పిలిపించి కేసులు పెట్టి లోపలేస్తానంటూ మాట్లాడిన వీడియోలు, ఆడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇవే ఆడియోలు, వీడియోలను త్వరలోనే రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్కు కూడా వర్సిటీలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ రు సమర్పించనున్నారు. అదేవిధంగా బాధితులు తమ ను అర్బన్ నక్సలైట్లంటూ చిత్రీకరిస్తున్న వారిపై జా తీయ మహిళా కమిషన్, జాతీయ ఎస్సీ కమిషన్కు కూడా ఫిర్యాదు చేయనున్నారు. శాతవాహన వర్సి టీలో ఎలాంటి అర్బన్ నక్సలైట్లు లేరని స్పష్టం చే స్తూ ప్రకటించిన కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం చిత్రపటానికి విద్యార్థులు వర్సిటీ ప్రధానద్వారం ఎదుట క్షీరాభిషేకం చేయడం విశేషం.కరీంనగర్సిటీ: తమపై తప్పుడు ప్రచారం చేసినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని శాతవాహన విద్యార్థులు డిమాండ్ చేశారు. సోమవారం సీపీ గౌస్ఆలం చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి మాట్లాడారు. 10 రోజుల నుంచి విద్యార్థులు, పలువురు ప్రొఫెసర్లపై వస్తున్న ఆరోపణలపై సీపీ స్పందించి వర్సిటీలో చట్టవ్యతిరేక కార్యకలాపాలు జరగ డం లేదని తెలుపడంతో తమ ఆత్మవిశ్వాసం పెరి గిందన్నారు. పోలీస్శాఖ ఇప్పటికే విచారణ చేసి విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేద ని భరోసా ఇవ్వడంపై ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో అశోక్, రోహిత్, మహేశ్, లక్ష్మ ణ్సాయి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
నిర్లక్ష్యం.. గందరగోళం
కోల్సిటీ(రామగుండం): గోదావరిఖనిలోని ప్రభు త్వ జనరల్ ఆస్పత్రి(జీజీహెచ్)తోపాటు సింగరేణి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(సిమ్స్)లో పా లన లోపాలు ముదురుతున్నాయి. బాధ్యతా రాహిత్యం, సమన్వయాలోపం పేషెంట్లకు నరకం చూ పుతున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం జరిగే ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. లోపించిన జవాబుదారీతనం మెడికల్ సూపరింటెండెంట్ విభాగం జవాబుదారీతనం కోల్పోయిందనే ఆరోపణలు ఉన్నాయి. సూపరింటెండెంట్ సంతకాలు, చాంబర్కే పరిమితమవుతున్నారని, నిర్వహణ బాధ్యతలు ఆర్ఎంవోలపై పడుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. కొందరు వైద్యులు, సిబ్బంది వారంలో రెండు, మూడుసార్లే విధులకు హాజరువుతున్నారని స మాచారం. హైదరాబాద్ నుంచి వచ్చిపోయే వైద్యాధికారులపై చర్యలకు వెనుకాడుతున్నారని విమర్శలు ఉన్నాయి. ఇది ఆస్పత్రిలోని పలువురు వైద్యుల మధ్య మనస్పర్థలకు దారితీస్తోంది. మందులు, స్కానింగ్కు ప్రైవేటుకే.. పేషెంట్లకు మందులు లేవని చెబుతూ బయట కొ నుగోలు చేయాలని సూచిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. స్కానింగ్ పరీక్షలు ఆస్పత్రిలో అందుబా టులో ఉన్నా.. తాము సూచించిన ప్రైవేట్ సెంట ర్లకు రెఫర్ చేస్తున్నారని విమర్శలు ఉన్నాయి. దేహదాత కుటుంబాలకు అవస్థలు మెడికల్ కాలేజీకి పార్థివదేహాలు దానం చేసేందుకు వస్తున్న అనేక కుటుంబాలకు అనవసరమైన నిబంధనలు విధిస్తూ ఇబ్బందులు కలిగిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. నిబంధనల ప్రకారం గౌరవవందనం చేపట్టకుండా, మార్చురీలో రోజుల తరబడి నిల్వచేస్తూ అవమానిస్తున్నారని అంటున్నారు. అనాటమీ, ఆస్పత్రి అధికారుల మధ్య సమన్వయ లోపం సమస్యను మరింత జటిలం చేస్తోంది. రక్తదాతలకు అందని అభినందన పత్రాలు? బ్లడ్బ్యాంకులో స్వచ్ఛందంగా రక్తదానం చేసిన వారికి అభినందన పత్రాలు ఇవ్వడంలోనూ నిర్లక్ష్యం వహిస్తున్నారు. సర్టిఫికెట్లపై ఆలస్యంగా సంతకాలు చేయడంతో దాతలు మరోసారి ఆస్పత్రికి రావాల్సి వస్తోంది. కొందరు అధికారులు దాతలను అవమానిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. సీసీ కెమెరాలు నిర్వీర్యం ఆస్పత్రి భద్రతలో అ త్యంత కీలకమైన సీసీ కె మెరాల నిర్వహణలో తీ వ్ర నిర్లక్ష్యం కనిపిస్తోంది. పలు విభాగాల్లో కెమెరాలు పనిచేయక ఆందోళన కలిగిస్తోంది. గాడి తప్పిన శానిటేషన్ ప్రభుత్వ ఆస్పత్రి పరిసరాల్లో పరిశుభ్రత లోపించింది. ఎక్కడ చూసినా చెత్తాచెదారం పేరుకుపోయి దుర్వాసన వస్తోంది. మరోవైపు.. సిబ్బంది పేషంట్లతో దురుసుగా ప్రవర్తిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సేవలు మెరుగుపడేనా? జీజీహెచ్లో వైద్యసేవలపై దృష్టి సారించడంతోపాటు పలు స మస్యలు పరిష్కారం, అభివృద్ధి తదితర అంశాలపై ఆస్పత్రి అభివృద్ధి కమిటీ మంగళవారం కలెక్టరేట్లో సమావేశం కానుంది. బోధనాస్పత్రి, మెడికల్ కాలేజీ అభివృద్ధి తదితర అంశాలకు సంబంధించిన అంశాలపై సమగ్రంగా సమీక్షిస్తారని తెలిసింది. ముఖ్యంగా వసతుల కల్పన, వైద్య సేవల విస్తరణ, సమస్యల పరిష్కారం, బిల్లుల చెల్లింపులు వంటి కీలక అంశాలు చర్చకు వస్తాయని సమాచారం. ఆస్పత్రి నిర్వహణలోని లోపాలను గుర్తించి, పరిష్కారానికి తగిన చర్యలు చేపట్టే దిశగా అధికారులకు సూ చనలు జారీ చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. -
సమస్యలు వింటూ.. పరిష్కారం చూపుతూ..
పెద్దపల్లి: అభాగ్యుల సమస్యలు వింటూ అక్కడిక క్కడే పరిష్కరించేందుకు కలెక్టర్ కోయ శ్రీహర్ష ప్ర త్యేక చొరవ తీసుకున్నారు. కలెక్టరేట్లో సోమవా రం నిర్వహించిన ప్రజావాణి ద్వారా వివిధ ప్రాంతాల ప్రజల నుంచి ఆయన దరఖాస్తులు స్వీకరించారు. పాలకవర్గం తీర్మానం ప్రకారం మట్టి తీయొ ద్దని పెద్దపల్లి మండలం తురకలమద్దికుంట సర్పంచ్ రాజయ్య కోరారు. అకాల వర్షానికి దెబ్బతిన్న పంట నష్టంపై వ్యవసాయాధికారులు సర్వే చేయా లని బీసీ సంక్షేమ సంఘం జాతీయ కో ఆర్డినేటర్ ఆ కుల స్వామి వివేక్ పటేల్ విన్నవించారు. కన్నాలలో ఫ్లై ఓవర్ ఒకవైపు ఉంటే మరోవైపు రోడ్డు నిర్మిస్తున్నారని రైతులు ఫిర్యాదు చేశారు. పెద్దపల్లి రాజీవ్నగర్లోని ఆర్.రాధ.. తనకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేయాలని కోరింది. అంతర్గాం మండలం విస్సంపేటకు చెందిన పి.కిట్టయ్య.. తాము బర్రెలు కాసుకుంటూ బతుకుతున్నామని, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని విన్నవించాడు. అర్జీలు స్వీకరించిన కలెక్టర్.. వాటిని పెండింగ్లో ఉంచకుండా తక్షణమే పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి జిల్లాలోని రెసిడెన్షియల్ స్కూళ్లలో చదువుతున్న సుమారు 12 వేల మంది విద్యార్థులకు రాజీ లేకుండా నాణ్యమైన ఆహారం అందించాలని కలెక్టర్ శ్రీహర్ష సూచించారు. కేజీబీవీ, గురుకుల విద్యా సంస్థలు, ఆదర్శ పాఠశాలల వంట మనుషులతో తన కార్యాలయంలో సమీక్షించారు. ఇటీవల మంచిర్యాల జిల్లాలో విద్యార్థులు బయటి ఆహారం తీసుకొని అస్వస్థతకు గురయ్యారని, అయినా ప్రభుత్వ పాఠశాలలపై విమర్శలు వస్తున్నాయని, ఇలాంటి వాటికి తావివ్వరాదని పేర్కొన్నారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి ప్రమోద్ కుమార్, ఫుడ్ ఇన్స్పెక్టర్ అరవింద్రెడ్డి పాల్గొన్నారు. -
రోడ్లపై కంకర, ఇసుక పోస్తే చర్యలు
కోల్సిటీ: వాహనాల రాకపోకలకు ఆటంకం కలిగేలా రోడ్లపై ఇసుక, కంకర పోస్తే తగిన చర్జీ వసూలు చేయడంతోపాటు జరిమానా విధిస్తామని రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి హెచ్చరించారు. డిప్యూటీ మేయర్ పాతపెల్లి ఎల్లయ్య, 52వ డివిజన్ కార్పొరేటర్ చిదురాల నాగరాజుతో కలిసి సోమవారం ఆయన కాకతీయనగర్లో పర్యటించారు. కంకర, ఇసుక రోజుల తరబడి రోడ్లపై ఉండడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. దుకాణ యజమానులు సామగ్రిని రోడ్డుపై పెట్టొద్దని సూచించారు. జేసీబీ, బ్లేడ్ ట్రాక్టర్, బాబ్కార్ట్లు, 15 మంది సిబ్బందితో మురుగునీటి కాలువలో సుమారు కిలో మీటర్ దూరం వరకు పూడిక తీశారు. పిచ్చిమొక్కలు, చెట్లకొమ్మలు తొలగించారు. డిప్యూటీ కమిషనర్ వెంకటస్వామి, ఏఈ జమీల్, టీపీఎస్ నవీన్, సూపరింటెండెంట్ శ్రీనివాస్, శానిటరీ ఇన్స్పెక్టర్ సంపత్, జవాన్ దయాకర్ తదితరులు పాల్గొన్నారు. సౌకర్యాల కల్పనకు రూ.20 కోట్లు రామగుండం: సదుపాయాల కల్పనకు ఎమ్మెల్యే మక్కాన్సింగ్ఠాకూర్ రూ.20 కోట్లు వెచ్చించాలనే ఆదేశాల మేరకు ప్రతీవీధిలో రహదారుల విస్తరణతో ఊహించని అభివృద్ధి సాగుతోందని మేయర్ మహంకాళి స్వామి అన్నారు. 25వ డివిజన్ మల్యాలపల్లిలో రూ.మూడు కోట్ల వ్యయంతో చేపట్టిన భూగర్భ డ్రైనేజీ, సీసీ రోడ్ల నిర్మాణాన్ని ప్రారంభించి మాట్లాడారు. ప్రతీవీధిలోని చివరి ఇంటివరకు అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ వెళ్లేలా విస్తరిస్తున్నామన్నారు. కార్పొరేటర్ సిరిశెట్టి సతీశ్గౌడ్, కాంగ్రెస్ నాయకులు అయోధ్యసింగ్ఠాకూర్, ఈదునూరి హరిప్రసాద్, కార్పొరేటర్లు ఇసంపెల్లి అంజులు, దాసరి సాంబమూర్తి, వడ్లూరి రవి, అప్పాసి శ్రీనివాస్, బల్వన్సింగ్ఠాకూర్, యాసిన్, జబ్బార్, మోసం పృఽథ్వీ తదితరులు ఉన్నారు. -
స్కూల్ను సందర్శించిన జర్మనీ బృందం
ధర్మారం: జర్మనీ దేశానికి చెందిన మై వాయిస్ ఫర్ పూర్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు ఓడేట్టే మేజమే కల్డవెల్ పత్తిపాక ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు, బోధన విధానాలు, మౌలిక వసతులపై ఆరా తీశారు. ప్రధానోపాధ్యాయుడు నూతి మల్లన్న పాఠశాల ప్రగతి గురించి పవర్ పాయింట్ ప్రజంటేషన్ చేశారు. సుమారు 70 ఏళ్లక్రితం ప్రారంభించిన ఈపాఠశాలకు కాలినడకన వచ్చిన వేలాది మంది విద్యార్థులకు అక్షరజ్ఞానం అందించిందని వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రతినిధులు నూతి మల్లన్న, జమునరాణి, విఠల్, విద్యార్థులు పాల్గొన్నారు. -
బాధ్యతలు స్వీకరించిన సాగర్ రంజన్ సాహూ
జ్యోతినగర్: రామగుండంలోని ఎన్టీపీసీ –తెలంగాణ ప్రాజెక్టు ఏజీఎం(హెచ్ఆర్)గా సాగర్ రంజన్ సాహూ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చందన్ కుమార్ సామంతను కలిసి మొక్క అందజేశారు. ప్రాజెక్టు ఏజీఎం బిజయ్ కుమార్ సిగ్దర్ గతనెల ఉద్యోగ విరమణ పొందడంతో ఎన్టీపీసీ మౌదా ప్రాజెక్టు నుంచి సాగర్ రంజన్ సాహూను రామగుండం బదిలీ అయ్యారు. రామగుండంలో డీడీఎంఎస్ పర్యటన గోదావరిఖని: సింగరేణి రా మగుండం రీజియన్లో ఎ లక్ట్రికల్ డీడీఎంఎస్ కమలేశ్చౌదరి సోమవారం పర్యటించారు. ఇల్లెందు గెస్ట్హౌస్కు చేరుకున్న ఆయన కు జీఎం లలిత్కుమార్ స్వాగతం పలికి శాలువాతో సన్మానించారు. నాలుగురోజుల పాటు గనుల్లో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. అధికారులు రామమోహనరావు, రమేశ్ తదితరులు పాల్గొన్నారు. క్వింటాల్ పత్తి రూ.7,968 పెద్దపల్లిరూరల్: స్థానిక వ్యవసాయ మార్కెట్యార్డు ఆవరణలో సోమవారం పత్తి క్వింటాల్కు గరిష్టంగా రూ.7,968 పలికింది. కనిష్టంగా రూ.5,826గా, సగటు రూ.7,468గా నిర్ధారించినట్టు మార్కెట్ చైర్మన్ కూర మల్లారెడ్డి, కార్యదర్శి ప్రవీణ్రెడ్డి వివరించారు. -
రుణాల పంపిణీలో నంబర్ వన్
పెద్దపల్లి: మహిళా సాధికారత, ఆర్థిక స్వావలంబనకు ప్రభుత్వం మహిళలకు రుణాలు అందిస్తోంది. వీటిని సద్వినియోగం చేసుకుంటున్న మహిళలు ఆర్థికంగా ఎదురగుతున్నారు. ఈక్రమంలోనే రుణాల పంపిణీ, రికవరీలో జిల్లా తెలంగాణకే ఆదర్శంగా నిలిచింది. సీ్త్రనిధి క్రెడిట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ ద్వారా మెప్మా పరిధిలో అందించిన సేవలకు గుర్తింపుగా 2025–26 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానం దక్కించుకుంది. 96శాతం రికవరీ రేటు, రూ.22.19 కోట్ల రుణ పంపిణీతో జిల్లా యంత్రాంగం చరిత్ర సష్టించింది. రాష్ట్రంలో అగ్రస్థానం జిల్లా సాధించిన విజయం కేవలం సంఖ్యల వరకే కాదు.. మహిళల నమ్మకం, అధికారుల కృషి కలగలిపిన ఫలితం. 96శాతం రికవరీ రేటు రాష్ట్రంలోనే అత్యధికం. మహిళా సంఘాల సభ్యులు క్రమశిక్షణతో సకాలంలో వాయిదాలు చెల్లించడమే ఇందుకు కారణం. జిల్లాలోని మహిళల ఆర్థిక పురోభివద్ధి కోసం రికార్డుస్థాయిలో రూ.22.19 కోట్ల రుణాలు మంజూరు చేశారు. చిన్న వ్యాపారాలు, గృహ, పరిశ్రమలు, వ్యవసాయ కార్యకలాపాలకు ఇవి ఊతమిచ్చాయి. ఈ ఘనతకు గుర్తింపుగా మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్, అరుణశ్రీ రాష్ట్రస్థాయి అవార్డు అందుకున్నారు. 2025–26 జిల్లాలో డిమాండ్ రూ.18 కోట్ల 43 లక్షల రూ.22 కోట్ల 19 లక్షలు(120) శాతం పంపిణీ చేసినట్లు ఆర్ఎం దుర్గాప్రసాద్ తెలిపారు. రికవరీ చేయాల్సింది రూ.15 కోట్ల 25 లక్షలకు రూ.14 కోట్ల 53 లక్షలు రికవరీ చేశారు. జిల్లాలో ఎస్ఎస్జీలు 4,644 ఉండగా 44,172 మంది సభ్యులు ఉన్నారు. మహిళలకు ఆర్థిక ఊతం సీ్త్రనిధి ద్వారా అందించే రుణాలు మహిళలకు ఊరటనిస్తున్నాయి. కేవలం 92 పైసల వడ్డీకే(సంవత్సరానికి 11.04శాతం) రుణాలు అందుబాటులో ఉన్నాయి. ఇది బ్యాంకుల వడ్డీరేట్ల కన్నా చాలాతక్కువ. చిన్నతరహా పరిశ్రమలు, వ్యాపారాలు చేసే మహిళలకు ఈ తక్కువ వడ్డీరేటు ఎంతో ప్రయోజనకరంగా మారింది. డిజిటల్ విప్లవంతో పారదర్శకత రుణాల పంపిణీ, వసూళ్లలో పారదర్శకత సాధించడానికి జిల్లా యంత్రాంగం శ్రీమన సీ్త్రనిధిశ్రీ యాప్ను విరివిగా ప్రోత్సహిస్తోంది. ప్రతీసభ్యురాలు తన వ్యక్తిగత రుణ వివరాలు, వాయిదాలు, బ్యాలెన్స్ను నేరుగా యాప్లో చూసుకోవచ్చు. తద్వారా ఎవరూ మోసపోయే అవకాశం లేదు. స్వయం సహాయక సంఘం ఆర్థిక స్థితిగతులు, గ్రూపు లెడ్జర్ వివరాలు పారదర్శకంగా తెలుస్తాయి. అధికారుల కృషి, మహిళల క్రమశిక్షణ అధికారుల చొరవ, మహిళల క్రమశిక్షణ అవార్డు సాధించడానికి దోహదం చేశాయి. అదనపు కలెక్టర్ అరుణశ్రీ నేతత్వంలోని మెప్మా సిబ్బంది, మున్సిపల్ కమిషనర్ల సహకారం కీలకమైంది. ‘మన సీ్త్రనిధి’ యాప్పై అవగాహన కల్పించడంతో మహిళలు డిజిటల్ పద్ధతిని అలవర్చుకున్నారు. సీ్త్రనిధి బ్యాంకు సిబ్బంది సహకారం రుణాల పంపిణీ, వసూళ్లలో వేగం పెంచింది. ఇది కొత్త అధ్యాయం జిల్లా సాధించిన విజయం కేవలం అవార్డు కాదు.. మహిళా సాధికారతలో కొత్త అధ్యాయం. రుణాలు పొందిన మహిళలు స్వయం ఉపాధి పొంది, కు టుంబ ఆదాయాలు పెంచుకున్నారు. ఆర్థిక స్వావలంబన సాధించారు. ఆర్థికంగా నిలదొక్కుకోవడంతో మహిళల్లో ఆత్మవిశ్వాసం, సమాజంలో గౌరవం పెరిగాయి. భవిష్యత్లో కూడా ఇదే స్ఫూర్తితో మహిళా సంక్షేమంలో ముందంజలో ఉంటామని జిల్లా యంత్రాంగం ప్రకటించింది. -
కర్ణాటక వాటర్ ఫాల్స్లో యువకుడి మృతి
కోరుట్ల: కర్ణాటకలోని అంకోలా పోలీస్ స్టేషన్ పరిధిలో విభూత వాటర్ ఫాల్స్లో ప్రమాదవశాత్తు పడి కోరుట్ల మున్సిపల్ వీలిన గ్రామం ఎఖీన్పూర్కు చెందిన శీలం అజయ్గౌడ్(25) మృతిచెందాడు. వివరాలు.. ఎఖీన్పూర్కు చెందిన శీలం వెంకటేశ్–లక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కొడుకు అజయ్గౌడ్ 15 రోజుల క్రితం దుబాయ్ నుంచి వచ్చాడు. ఆదివారం సరదాగా హైదరాబాద్లో ఉండే ఇద్దరు స్నేహితులతో కలిసి కర్ణాటక టూర్ వెళ్లాడు. సోమవారం ఉదయం అంకోలా పోలీస్ స్టేషన్ పరిధిలోని విభూత వాటర్ ఫాల్స్లో స్నానానికి దిగి ప్రమాదవశాత్తు నీటిలో ఉన్న రాయి తాకి శ్వాస ఆడక మృతిచెందినట్లు సమాచారం. ఆయన వెంట ఉన్న స్నేహితులు ఆజయ్గౌడ్కు తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. సోమవారం సాయంత్రం కర్ణాటక వెళ్లారు. అంకోలా పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిసింది. -
తాగుతూ.. చిక్కుతూ..
సాక్షి పెద్దపల్లి: 35,78,108, 152.. ఈ అంకెలు చూడగానే ఓ విద్యాసంస్థ సాధించిన ర్యాంకులు అనుకుంటున్నారా.. కానేకాదు.. ఇటీవల మద్యం మత్తులో పోలీసుల కు చిక్కి ఊదిన వారి రీడింగ్లు. డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు పెరుగు తున్నా కొందరు మందుబాబు లు ఏ మాత్రం బెదరడం లేదు. మద్యం మత్తులో వాహనాలు న డుపుతూనే ఉన్నారు. గతంలో మాదిరిగా మద్యం తాగి పట్టుబడితే ఎంతోకొంత జరిమానా చె ల్లించో లేదా ఏదైనా సిఫారసుతోనో అక్కడి నుంచి బయటప డే అవకాశం లేదు. కొన్ని సందర్భాల్లో జైలు శిక్ష పడొచ్చు. అయి నా చాలామంది నిర్లక్ష్యం చేస్తున్నారు. తనిఖీ సమయంలో పక్కా ఆధారాలతో పోలీసులు కేసులు నమోదు చేసి కోర్టులో హాజరు పర్చుతున్నారు. మో టారు వాహన చట్టం 185 ప్రకారం కేసు నమోదు చేస్తారు. ఒకసారి కేసు నమోదైతే కోర్టులో రూ.500 నుంచి రూ.10 వేల వరకు జరిమానా లేదా జైలుశిక్ష లేదా రెండూ విధించే అవకాశాలున్నాయి. మద్యం తాగి పట్టుబడే వారి విషయంలో కోర్టులు సైతం కఠిన వైఖరి అవలంబిస్తున్నాయి. తప్పించుకునేందుకు ప్రయత్నాలు డ్రంకెన్ డ్రైవ్ స్పెషల్ డ్రైవ్స్లో పోలీసులకు చిక్కకుండా మందుబాబులు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. మొదట్లో తా ము ప్రయాణించేదారిలో ఎక్కడైనా డ్రంకెన్ డ్రైవ్ తనిఖీ ఉంటే వాహనాలు వెనక్కి తిప్పి జారుకునేవారు. అయితే పోలీసులు అటువంటి అవకాశం లేకుండా మూడు వైపులా దారి లేకుండా.. నాలుగో వైపు తాము ఉండి చెకింగ్స్ చేస్తున్నారు. దీంతో ప్రత్యామ్నాయ మార్గాల కోసం మందుబాబులు వెతుకుతున్నారు. ఏరియాల వారీగా వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి ప్రతిరోజూ ఎక్కడికక్కడ చెకింగ్స్ అవుతున్నాయో పోస్ట్ చేస్తూ ప్పించుకుంటున్నారు. మత్తుతో నియంత్రణ కోల్పోయి మద్యం తాగి వాహనాలు నడపడంతో శరీరంపై పట్టుకోల్పోతారు. వాహనాలపై నియంత్రణ ఉండదు. మద్యం మత్తులో తూలుతూనే వాహనాలు నడుపుతూ ప్రమాదాల బారిన పడి తీవ్ర గాయాలపాలవుతున్నారు. లేదంటే ప్రాణాల మీదకు వచ్చిన పరిస్థితులు ఉన్నాయి. మద్యం తాగితే ప్రయాణాలకు వీలైనంత దూరంగా ఉండాలి. డ్రంకెన్ డ్రైవ్ కేసులు వివరాలు 2025 2026లో(ఇప్పటివరకు) కేసులు 9,674 1,915జైలుశిక్ష 30 15 జరిమానా(రూ.లో) 1,01,39,700 13,64,906‘ఒక్కటే బీరు తాగినా.. రెండు పెగ్గుల విస్కీ తాగాను.. ఇంతశాతం ఎలా వచ్చింది.? అంత రాకూడదు అసలు..’ ఇలా సాధారణంగా మద్యం తాగి వాహనాలు నడిపి పోలీసులకు పట్టుబడిన వారిమధ్య సాగే చర్చ. కానీ వాహనదారుల రక్త నమూనాల్లో 30 మి.గ్రా. మద్యం మోతాదు దాటితే కేసు నమోదవుతోంది. ఇది తెలియకుండా కొందరు వాహనదారు లు కొద్దిగానే తాగాం కదా అనుకుంటూ మత్తులో ఊగుతూ ప్రమాదాలకు కారణమవుతూ పోలీసులకు చిక్కుతున్నారు. మరికొందరు ‘పోలీసు మామల స్క్వాడ్’, ‘చెకింగ్ పాయింట్స్’.. ఇలా పలు పేర్లతో వాట్సప్ గ్రూప్ క్రియేట్ చేసుకొని పోలీసుల చిక్కకుండా తప్పించుకుంటున్నారు.మదం్య తాగి నడిపితే చర్యలు మద్యం తాగి వాహనాలు నడపడంతో ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంటుంది. డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో పట్టుబడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. మద్యం మత్తులో వాహనాలు నడిపితే డ్రైవింగ్ లైసెన్స్ రద్దుకు సిఫారసు చేస్తున్నాం. – రమేశ్, ఏసీపీ, గోదావరిఖని -
సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి
ఎస్యూ వీసీ ఉమేశ్ కుమార్ ఔట్ సోర్సింగ్, పార్ట్ టైం, ఉద్యోగాల నియామకం, అభివృద్ధి పనుల్లో అక్రమాలకు పాల్పడ్డారు. కొలువుల ఆశ చూపించి పేదల వద్ద రూ.లక్షలు వసూలు చేయడం హేయం. ఆయన వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. ఫుల్ టైం ఈసీ లేకుండా ప్రొఫెసర్లు నియమించడంపైనా విచారణ జరిపించాలి. – మణికంఠ రెడ్డి, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు అవన్నీ నిరాధార ఆరోపణలు శాతవాహన వర్సిటీలో బ్రహ్మాండమైన అభివృద్ధి జరుగుతోంది. నేను వచ్చాక వర్సిటీలో అనేక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టాను. లా, ఇంజినీరింగ్ కాలేజీలు వచ్చాయి. ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నడుస్తున్నాయి. క్యాంపస్లో ఔట్సోర్సింగ్ పోస్టులు అమ్ముకుంటున్నారన్నది కేవలం నిరాధార ఆరోపణలు. అందులో ఎలాంటి వాస్తవమూ లేదు. – ఉమేశ్కుమార్, వైస్ చాన్స్లర్ -
మహనీయుల ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలి
పెద్దపల్లి: మహనీయుల ఆశయాలను మనమంతా ముందుకు తీసుకెళ్లాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. ఆదివారం జగ్జీవన్రామ్ జయంతి సందర్భంగా బస్టాండ్ సమీపంలోని విగ్రహానికి కలెక్టర్, అదనపు కలెక్టర్ డి.వేణు నివాళి అర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, జగ్జీవన్రామ్ చిన్నతనంలో అంటరానితనం సమస్యతో అనేక బాధలు అనుభవించారని, 29 ఏళ్ల వయస్సులో శాసన మండలి సభ్యునిగా, 1937లో బిహార్ అసెంబ్లీకి ఎన్నికయ్యారని తెలిపారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వంలో 30 ఏళ్ల పాటు వివిధ మంత్రిత్వ శాఖలలో పని చేశారని వివరించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, తన జీవితాన్ని దేశానికి అంకితం చేసిన మహనీయుడు జగ్జీవన్రామ్ అని కొనియాడారు. రాజ్యాంగ సవరణలో అణగారిన వర్గాలకు న్యాయం చేస్తూ అనేక మార్పులు తీసుకొచ్చారని తెలిపారు. అంతకు ముందు వివిధ సంఘా ల నాయకులు, ప్రతినిధులు మాట్లాడారు. ఆర్డీ వోలు గంగయ్య, సురేశ్, జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి ఎం.రవీందర్, వివిధ సంఘాల నాయకులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు చర్యలు రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షలో మాట్లాడారు. రాంగ్రూట్ ప్రమాదాలు జరుగుతున్నందున, వాటి నివారణకు సాంకేతిక పరిజ్ఞానం వాడుకోవాలని, రాంగ్రూట్లో ప్రయాణించే వాహనదారులకు భారీ జరిమానా విధించాలన్నారు. రాఘవపూర్, సబ్బితం గ్రామాల వద్ద మెయిన్ రోడ్డుకు జీబ్రా క్రాసింగ్, మంథని ఫ్లైఓవర్ వద్ద అవసరమైన చోట కాన్వెక్స్ మిర్రర్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆర్అండ్బీ ఈఈ భావ్సింగ్, ట్రాఫిక్ సీఐ రమేశ్ పాల్గొన్నారు. కలెక్టర్ కోయ శ్రీహర్ష -
లింగ నిర్ధారణ చేస్తే కఠిన చర్యలు
గోదావరిఖని(రామగుండం): లింగనిర్ధారణ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రామగుండం సీపీ అంబర్కిషోర్ఝా ఆదివారం ప్రకటనలో హెచ్చరించారు. గర్భిణులకు లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం చట్టవిరుద్ధమన్నారు. కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో అన్ని అల్ట్రాసౌండ్ స్కానింగ్ కేంద్రాలు చట్టబద్ధమైన నమోదు ద్వారా మాత్రమే నిర్వహించాలని సూచించారు. మొదటిసారి నేరం చేస్తే మూడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.10 వేల వరకు జరిమానా విధిస్తారని, పునరావృతం అయితే ఐదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.50 వేలు లేదా అంతకుమించి జరిమానా విధిస్తారన్నారు. సంబంధిత వైద్యులు, సిబ్బంది చట్టాన్ని ఉల్లంఘిస్తే వారి వైద్య అనుమతిపత్రాన్ని సస్పెండ్ చేయడం, పూర్తిగా రద్దు చేస్తారని పేర్కొన్నారు. సింగరేణిని నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వం యైటింక్లయిన్కాలనీ(రామగుండం): సింగరేణిని రాష్ట్ర ప్రభుత్వం ఏటీఎంగా వాడుకుంటూ నిర్వీర్యం చేస్తుందని టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి అన్నారు. ఆదివారం ఆర్జీ–2 ఏరియా యైటింక్లయిన్కాలనీ టీబీజీకేఎస్ కార్యాలయంలో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభత్వం రెండున్నరేళ్లలో సింగరేణి కార్మికులకు ఇచ్చిన ఒక్క హామీని అమలు చేయకపోగా కారుణ్య నియామకాలను తొలగించే కుట్ర చేస్తుందని ఆరోపించారు. రూ.56కోట్ల బకాయిలు చెల్లించకపోవడంతో కార్మికులకు ఇంక్రిమెంట్లు రాకుండా నష్టం జరుగుతుందన్నారు. ఇప్పటికై నా కొంత మేర బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. రాబోయే రోజుల్లో సంస్థను రక్షించుకునేందుకు కార్మికులను చైతన్యం చేసేలా ‘కాంగ్రెస్ హటావో.. సింగరేణి బచావో’ నినాదంతో బీఆర్ఎస్ పార్టీ సహకారంతో సింగరేణిని రక్షించుకుందామని పిలుపునిచ్చారు. ఆర్జీ–2 వైస్ ప్రెసిడెంట్ ఐలి శ్రీనివాస్, సంపత్, శ్రీనివాస్, రామ్చంద్రారెడ్డి, శంకర్, రవి, రామ్చరణ్, జీవన్, కుమారస్వామి, నారాయణరెడ్డి, వెంకట్, రాజు పాల్గొన్నారు. సీఎంను సొంత పార్టీ కార్యకర్తలే గుర్తిస్తలేరు మంథని: సీఎం రేవంత్రెడ్డిని సొంత పార్టీ కార్యకర్తలే గుర్తిస్తలేరని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ ఎద్దేవా చేశారు. ఆదివారం మంథనిలోని రాజగృహాలో మాట్లాడారు. రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్లో చులకనైందని, ప్రజల చివాట్ల నుంచి దృష్టి మళ్లించేందుకే బీఆర్ఎస్ ఆఫీసులపై దాడులకు పాల్పడుతోందని అన్నారు. గజ్వేల్లోని మాజీ సీఎం కేసీఆర్ ఆఫీస్పై దాడి చేయడం ప్రజాస్వామ్యానికే అవమానమన్నారు. రాష్ట్రంలో సంపాదన సృష్టించకుండా ధ్వంసం చేస్తున్నారని, అన్ని వ్యాపారాలు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. రాబోయే రోజుల్లో ప్రజలే కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు. అనంతరం జగ్జీవన్రామ్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. పార్టీ మండల అధ్యక్షుడు ఏగోళపు శంకర్గౌడ్, నాయకులు తగరం శంకర్లాల్, వేల్పుల గట్టయ్య, కనవేన శ్రీనివాస్, పుప్పాల తిరుపతి, లొడారి రాములు, గొబ్బూరి వంశీ తదితరులు పాల్గొన్నారు. క్రీడా పాఠశాల పోటీలకు ఎంపిక ధర్మారం: మండలంలోని పత్తిపాక ప్రాథమిక పాఠశాల విద్యార్థి ఎదుల్ల ప్రజ్వల్ రాష్ట్రస్థాయి క్రీడా పాఠశాల పోటీలకు ఎంపికై నట్లు హెచ్ఎం మల్లన్న తెలిపారు. జిల్లా స్థాయిలో జరిగిన తొమ్మిది రకాల ఈవెంట్స్లో ప్రతిభ కనపర్చి రాష్ట్ర స్థాయికి ఎంపికై నట్లు జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి సురేశ్ ప్రకటించినట్లు పేర్కొన్నారు. ఈ నెల చివరి వారంలో హైదరాబాద్లో జరిగే రాష్ట్ర పోటీల్లో పాల్గొంటాడని వివరించారు. ఈసందర్భంగా ప్రజ్వల్ను సర్పంచ్ మాందాల శ్రావణి, ఉపాధ్యాయులు అభినందించారు. -
సకల విద్యార్థి సమీకృతం
మంథనిరూరల్: కుల, మత, వర్గ వివక్ష లేకుండా ఒకేచోట పేద విద్యార్థులకు విద్య బోధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు నెలకొల్పేందుకు శ్రీకారం చుట్టింది. ఆధునిక కాలానికి అనుగుణంగా బోధనలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలన్న సంకల్పంతో సకల విద్యార్థి సమీకృతం వైపు అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా మంథని మండలం అడవిసోమన్పల్లి గ్రామంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి గతేడాది మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు శంకుస్థాపన చేయగా పనులు కొనసాగుతున్నాయి. 25ఎకరాలు.. రూ.145కోట్ల వ్యయంతో.. అడవిసోమన్పల్లి శివారులో సుమారు 25ఎకరాల విస్తీర్ణంలో రూ.145కోట్ల వ్యయంతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ ఏడాదిలో పూర్తి చేయాలన్న లక్ష్యంతో పనులు శరవేగంగా సాగుతున్నాయి. 4వ తరగతి నుంచి.. నూతనంగా నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్లో 4వ తరగతి నుంచి 12వ తరగతి వరకు అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యాబోధన అందించనున్నారు. తరగతి గదుల్లో డిజిటల్ స్మార్ట్ బోర్డు, కంప్యూటర్ ల్యాబ్, లైబ్రరీలు ఏర్పాటు చేయనున్నారు. అలాగే క్రీడా ప్రాంగణం, సౌకర్యాలు కల్పించనున్నారు. విద్యుత్ సమస్యలు రాకుండా సోలార్ విద్యుత్తో లిఫ్ట్లు, ఇతర ఉపకరణాల నిర్వహణ జరిగేలా ఏర్పాట్లు చేయనున్నారు. 2,500మంది విద్యార్థులకు.. ఇంటిగ్రేటెడ్ స్కూల్లో 2,500 మంది విద్యార్థులకు విద్యాబోధన అందించనున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు సమీకృత భవనంలో చదువుకోనున్నారు. సమీకృత భవనంలో వివిధ బ్లాకులుగా విభజించి విద్యాబోధన చేస్తారు. ఒక్కో బ్లాక్లో 640 మంది విద్యార్థుల చొప్పున కేటాయిస్తారు. ప్రత్యేక నివాస సముదాయాలు విద్యార్థులతో పాటు విద్యాబోధన అందించేందుకు జీ ప్లస్ 2 భవనాలు నిర్మించనున్నారు. ఇందులో పాఠశాల ప్రిన్సిపాల్స్, బోధన సిబ్బంది, వసతి గృహా వార్డెన్ల కోసం ప్రత్యేక భవన సముదాయం ఏర్పాటు చేస్తారు. విద్యార్థులకు సైతం ప్రత్యేక బెడ్లు, ఒకేసారి 1,200 మంది భోజనం చేసేలా డైనింగ్ హాల్ నిర్మించున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే విద్యార్థుల ఆరోగ్యం కోసం ఆరోగ్య సంరక్షణ కేంద్రం, తల్లిదండ్రులు, సందర్శకుల కోసం ప్రత్యేక గదులు ఏర్పాటు చేయనున్నారు. విద్యాహబ్గా మారనున్న అడవిసోమన్పల్లి మంత్రి శ్రీధర్బాబు చొరవతో జిల్లా సరిహద్దు మానేరు నది తీరంలోని అడవిసోమన్పల్లి విద్యాహబ్గా మారనుంది. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాలతో గ్రామం రూపురేఖలు మారనున్నాయి. ఈ పాఠశాల పూర్తయితే వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థులు ఇక్కడే చదువుకునే అవకాశాలుంటాయి. దీంతో మంథని– కాటారం ప్రధాన రహదారిలోని ఈ గ్రామానికి ఇన్నేళ్ల తర్వాత మంత్రి చొరవతో మహర్దశ సంతరించుకోనుందని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆధునిక హంగులతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం 25 ఎకరాల విస్తీర్ణంలో రూ.145కోట్లతో పనులు షురూ కార్పొరేట్కు దీటుగా సకల సౌకర్యాల కల్పనకు ఏర్పాట్లు అడవిసోమన్పల్లిలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ పేద విద్యార్థులకు ప్రయోజనం మా ఊరిలో నిర్మించే ఇంటిగ్రేటెడ్ స్కూల్తో పేద విద్యార్థులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు మంచి బోధన అందుతుంది. గ్రామీణ ప్రాంతాల్లోని పేద విద్యార్థులకు ఉన్నత విద్యను అందించేలా మంత్రి చర్యలు తీసుకోవడం అభినందనీయం. – గట్టు జనార్ధన్, అడవిసోమన్పల్లి మంత్రి శ్రీధర్బాబు చొరవతో.. మంత్రి శ్రీధర్బాబు చొరవతోనే మా గ్రామానికి అభివృద్ధి బాటలు పడుతున్నాయి. కొత్తగా ఏర్పాటు చేసే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్తో గ్రామం మరింత అభివృద్ధి చెందుతుంది. వివిధ ప్రాంతాల నుంచి పేద విద్యార్థులు ఇక్కడే చదువుకునే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో మా ఊరికి అన్ని సౌకర్యాలు మెరుగుపడుతాయి. మా ఊరి అభివృద్ధికి కృషి చేస్తున్న మంత్రికి కృతజ్ఞతలు. – గట్టు దామోదర్, సర్పంచ్, అడవిసోమన్పల్లి -
కొలువులమ్మా.. కొలువులు!
శాతవాహన గాథలు–3సాక్షి ప్రతినిధి, కరీంనగర్: అర్బన్ నక్సలైట్లు, విద్యార్థుల ఆందోళనలు, దళితులపై వివక్ష తదితర వరుస వివాదాలతో వార్తల్లో నిలుస్తున్న శాతవాహన యూనివర్సిటీలో మరో దుమారం చెలరేగుతోంది. యూనివర్సిటీలో అంతా తానై షాడో వీసీలా వ్యవహరిస్తున్న ఓ వ్యక్తి ఔట్ సోర్సింగ్ నియామకాల్లో చక్రం తిప్పుతున్నాడన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. పోస్టుకు ఇంత రేటు అంటూ ఫిక్స్ చేసి మరీ నియామకాల్లో అంతా తానై వ్యవహరిస్తున్నాడంటూ పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే అర్బన్ నక్సలైట్లు, దళితులపై వివక్ష అన్న ఆరోపణలపై యూనివర్సిటీ మొత్తం రాజకీయ రణంగంగా మారింది. ప్రొఫెసర్ సుజాత వైపు కొందరు.. వీసీ ఉమేశ్ వైపు మరికొందరు చేరి ఎవరికి వారు మద్దతుగా ప్రకటనలు జారీ చేస్తున్నారు. సంతోషంగా విక్రయం.. అతను రాజకీయ పలుకుబడితో వర్సిటీలో చేరా డు. ఒక రకంగా అతనే షాడో వీసీ అన్న పేరుంది. అందుకే శాతవాహన యూనివర్సిటీలో ఎంత సీని యర్ ప్రొఫెసర్ అయినా సరే అతని జోలికి వెళ్లరు. అతను ఏం చెప్పినా.. స్థాయి మరిచి తూ.చా తప్పకుండా పాటిస్తారు. చిన్నస్థాయి ఉద్యోగుల విష యం చెప్పనక్కర్లేదు. పొరపాటున అతనికి వ్యతిరేకంగా స్వరం పెంచితే ఇక అంతే.. మరో విభాగాని కి బదిలీ చేసి తన ప్రతీకారం తీర్చుకుంటాడు. అతని వ్యవహారం, పలుకుబడి తెలిశాక.. అతనితో అంతా అనివార్యంగా సఖ్యతగా ఉండాల్సి వస్తోంది. అలాంటి వ్యక్తి కొంతకాలంగా ఔట్సోర్సింగ్ కొలువుల భర్తీని సొమ్ము చేసుకుంటున్నాడు. వాస్తవానికి ఇవేమీ పర్మినెంట్ పోస్టులు కావు. కాకపోతే నెల తిరిగే నాటికి జీతం ఠంఛన్గా వస్తుందన్న భరోసా ఉంది. అందుకే ఈ పోస్టులకు ఉన్న డిమాండ్తో పోస్టుకు రూ.2 లక్షల నుంచి రూ.3లక్షల వరకు తీసుకుని కొలువులు పెట్టిస్తున్నాడు. ఇప్పటి వరకూ దాదాపు 15కుపైగా పోస్టులు ఇలా తన పరపతితో సంతోషంగా అమ్ముకున్నాడన్న విమర్శలున్నాయి. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్–4 ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసింది. అయినా కీలక పోస్టుల్లో ఔట్సోర్సింగ్ ఉద్యోగులను ఉంచడంతో అక్రమాలు జరుగుతున్నాయని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. కీలక పోస్టుల్లో రెగ్యులర్ ఎంప్లాయీస్ ఉండాలని డిమాండ్ చేస్తున్నారు.నేటి నుంచి ఎస్సీ, ఎస్టీ కమిషన్ విచారణ మరోవైపు తనపై వ్యక్తిగత కక్షలతో అర్బన్ నక్సల్ అంటూ వేధించడం, వరుసగా పదవుల నుంచి తప్పించడంపై కలత చెందిన సోషియాలజీ విభాగాధిపతి ప్రొఫెసర్ సూరేపల్లి సుజాత ఇటీవల ఎస్సీ కమిషన్ను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఆదివారం వరకు వరుస సెలవుల నేపథ్యంలో ఈ విచారణ ఇంకా ప్రారంభం కాలేదు. సోమవారం నుంచి ఈ ఫిర్యాదుపై ఎస్సీ కమిషన్ విచారణ జరిపి, చర్యలు చేపట్టనుంది. తొలుత కరీంనగర్ కలెక్టర్, సీపీకి నోటీసులు జారీ చేయనున్నామని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య పీఏ శ్రీధర్ ఆదివారం ‘సాక్షి’కి తెలిపారు. ప్రస్తుతం యూనివర్సిటీలో నెలకొన్న ఉత్కంఠ పరిస్థితుల నేపథ్యంలో అవసరమైతే ఈ వారంలో ఎస్సీ కమిషన్ సభ్యులు యూనివర్సిటీని సందర్శించే అవకాశాలు ఉన్నాయని తెలిసింది. -
ఆక్రందన.. ఆందోళన
● కవలల హత్యతో జూబ్లీనగర్లో విషాదం ● నిందితుడిని శిక్షించాలంటూ ఆందోళన ● పోస్ట్మార్టం కోసం ప్రభుత్వాస్పత్రి వద్ద పడిగాపులు ● పోలీస్ బందోబస్తు మధ్య రాత్రి 9గంటలకు అంత్యక్రియలు కరీంనగర్రూరల్: కన్నతండ్రి కాలయముడుగా మారి కవల ఆడబిడ్డలను బావిలో పడేసి చంపిన సంఘటన పలువురిని కలచివేసింది. చిన్నారుల మృతితో జూబ్లీనగర్ గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. కుటుంబసభ్యులు, బంధువుల్లో తీరని ఆగ్రహాన్ని రగిలించింది. శనివారం నగరంలోని ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో నిందితులను కఠినంగా శిక్షించి, న్యాయం చేయాలంటూ చిన్నారుల తల్లితోపాటు బంధువులు ఆందోళనకు దిగారు. దీంతో పోస్ట్మార్టం ఆలస్యమైంది. రాత్రి 8.30గంటలకు చిన్నారుల మృతదేహాలను అంబులెన్స్లో గ్రామానికి తీసుకరావడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసు బందోబస్తు నడుమ అంత్యక్రియలు పూర్తి చేశారు. పిల్లలను చంపి బావిలో పడ్డారంటూ డ్రామా కరీంనగర్ మండలం జూబ్లీనగర్కు చెందిన కచ్చు శ్రీశైలం ఐదేళ్లక్రితం మానకొండూరు మండలం లక్ష్మిపూర్కు చెందిన మౌనికను వివాహం చేసుకున్నాడు. 2021లో కవల ఆడపిల్లలు గీతాన్శ్రీ, గీతాన్వికలు జన్మించగా అప్పటి నుంచి శ్రీశైలం మౌనికను ఆడపిల్లలను ఎందుకు కన్నావంటూ వేధింపులకు గురిచేశాడు. శుక్రవారం మధ్యాహ్నం 3గంటలకు ఇద్దరు పిల్లలను బైక్పై ఎక్కించుకుని పొలం వద్దకు తీసుకెళ్లాడు. పిల్లలను చంపి వ్యవసాయబావిలో పడేసిన, తనపై అనుమానం రాకుండా కాపాడుతున్నట్లుగా బావిలో దూకాడు. ఒక పాప మృతదేహాన్ని బావిలోని దరికి చేర్చి అరుస్తుండగా మౌనిక అక్కడికి రావడంతో సమీపంలో ఉన్న వాళ్లందరూ వచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి వచ్చి గజ ఈతగాళ్ల సాయంతో మరో పాప మృతదేహాన్ని బయటకు తీసి పోస్ట్మార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. స్థానికుల శ్రీశైలంకు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ప్రభుత్వ ఆస్పత్రిలో బంధువుల ఆందోళన శ్రీశైలంను శిక్షించాలంటూ శనివారం ప్రభుత్వ ఆస్పత్రిలో మౌనికతో పాటు తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం జరిగేంత వరకు పోస్ట్మార్టం నిర్వహించేది లేదంటూ పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. పలు దఫాలుగా సాగిన చర్చల అనంతరం చట్టప్రకారం నిందితులపై చర్యలు తీసుకుంటామని సీఐ నిరంజన్రెడ్డి నచ్చచెప్పడంతో రాత్రి 8.30గంటలకు మృతదేహాలకు పోస్ట్మార్టం నిర్వహించి అంబులెన్స్లో జూబ్లీనగర్కు తరలించారు. చిన్నారుల మృతదేహాలను చూడటంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులేర్పడ్డాయి. మహిళలందరూ కంటతడిపెట్టారు. ఏసీపీ విజయ్కుమార్, సీఐలు నిరంజన్రెడ్డి, కోటేశ్వర్ ఆధ్వర్యంలో పటిష్టమైన బందోబస్తు నడుమ రాత్రి 9గంటలకు అంత్యక్రియలను పూర్తి చేశారు. -
అప్పుల బాధతో ఆటోడ్రైవర్ ఆత్మహత్య
ముస్తాబాద్(సిరిసిల్ల): ఆర్థిక ఇబ్బందులు తాళలేని ఓ ఆటో డ్రైవర్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆటో నడవక సరైన ఉపాధి లేక కటుంబాన్ని పోషించేందుకు అప్పులు చేసిన ఆటోడ్రైవర్ తీర్చే మార్గం లేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ముస్తాబాద్ ఎస్సై గణేశ్ తెలిపిన వివరాలు. రాజన్నసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రానికి చెందిన మారెల్లి శ్రీనివాస్(52) అద్దె ఇంట్లో ఉరివేసుకుని శనివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొన్నెళ్లుగా ఆటో నడుపుతున్న శ్రీనివాస్ ఏడాది క్రితమే కూతురు వివాహనికి అప్పులు చేశాడు. ఆటోకు సరైన గిరాకీలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. అప్పులు తీరేమార్గం కనిపించక, ఆటో నడిపిన సరైన గిరాకీలు లేవని తీవ్ర మనోవేదనకు గురైన శ్రీనివాస్ జీవితంపై విరక్తి చెంది ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శ్రీనివాస్ మృతితో భార్య స్వరూప, ఇద్దరు కూతుళ్లు, కుమారుడు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. అద్దె ఇంట్లో ఉంటూ ఆటో నడుపుతున్న శ్రీనివాస్ చివరికి ఆత్మహత్యకు పాల్పడడంతో కుటుంబం వీధిన పడింది. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
సీపీ ప్రకటనను స్వాగతిస్తున్నాం
వర్సిటీలో సమస్యలపై ప్రశ్నిస్తే అర్బన్ నక్సలైట్ల నిందలు వేస్తున్నారు. నిరాధార ఆరోపణలతో యూనివర్సిటీ అకడమిక్ వాతావరణాన్ని దెబ్బ తీస్తున్న వ్యక్తులపై వీసీ, రిజిస్ట్రార్ ఎందుకు మౌనంగా ఉంటున్నారు. జిల్లాలో అర్బన్ నక్సలైట్లు లేరని సీపీ గౌస్ ఆలం ప్రకటనను స్వాగతిస్తున్నాం. పోలీస్ ఉన్నతాధికారులు ఒకవైపు కరీంనగర్ లో అర్బన్ నక్సలైట్లు ఎవరూ లేరని చెప్తుంటే.. విద్యార్థుల్లో గందరగోళం సృష్టిస్తూ యూనివర్సిటీ ప్రతిష్టను దెబ్బతీస్తున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలి. – అరవింద్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడువర్సిటీ ప్రతిష్టకు విఘాతం పోలీస్ ఉన్నతాధికారులు కరీంనగర్లో అర్బన్ నక్సలైట్లు లేరని చెప్తుంటే.. విద్యార్థుల్లో గందరగోళం సృష్టిస్తూ యూనివర్సిటీ ప్రతిష్టను దెబ్బతీస్తున్న వ్యక్తులపై యూనివర్సిటీ ఆఫీసర్లు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. వర్సిటీలో ఇష్టానుసార నియామకాలు, కొత్త నిర్మాణాల్లో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. ఇలాంటి అవకతవకలను ప్రశ్నిస్తే ఇలా అర్బన్ నక్సలైట్లు ఉన్నారంటూ ప్రకటనలు చేయడం వల్ల యూనివర్సిటీ ప్రతిష్ట దిగజారే ప్రమాదం ఉంది. – మణికంఠరెడ్డి, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు లీగల్ నోటీసులు పంపుతున్నాం కొందరు పనిగట్టుకుని వర్సి టీలో దళిత సిబ్బంది, విద్యార్థులపై అర్బన్ నక్సలైట్లంటూ విషప్రచారం చేస్తున్నా రు. అందుకే, ఎస్సీ కమిషన్ కు ఫిర్యాదు చేశాను. ఈ దుష్ప్రచారానికి కారకులను గుర్తించి లీగల్ నోటీసులు పంపుతున్నాం. సివిల్, క్రిమినల్ చర్యలకూ వెనకాడేది లేదు. ఇది మా ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం, వ్యక్తిత్వ హననంపై వెనక్కి తగ్గేది లే దు. వర్సిటీలో దళితులపై జరుగుతున్న అకృత్యాలపై సోమవారం పోలీసులకు కూడా ఫి ర్యాదు చేస్తాం. – ప్రొఫెసర్ సుజాత, సోషియాలజీ విభాగాధిపతి -
మెడికల్ బోర్డు కొనసాగించాలి
● బీఎంఎస్ అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య గోదావరిఖని: సింగరేణిలో మెడికల్ బోర్డును య థావిధిగా కొనసాగించాలని బీఎంఎస్ అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య డిమాండ్ చేశారు. శనివారం ఆర్జీ–1 ఏరియాలోని జీడీకే–2ఏ గనిపై ఏర్పాటు చేసిన గేట్మీటింగ్లో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సింగరేణి సంస్థకు రావాల్సిన విద్యుత్, బొగ్గు బకాయిలు తక్షణమే చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. గతంలో మాదిరిగా నెలకు రెండుసార్లు మెడికల్ బోర్డు నిర్వహించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు కర్రావుల మహేశ్, మాదాసు రవీందర్, సంగాని సాంబయ్య, ఎల్లావుల కోటయ్య, బోడకుంట రాజేశం, ఆరెల్లి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృతి
కరీంనగర్రూరల్: కరీంనగర్ మండలం గుంటూరుపల్లి రాజీవ్ రహదారిపై శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ తీవ్రంగా గాయపడి హైదరాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. కరీంనగర్రూరల్ సీఐ నిరంజన్రెడ్డి కథనం మేరకు మానకొండూరు మండలం అన్నారం గ్రామానికి చెందిన పోతర్ల అశోక్(31) సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్నాడు. శుక్రవారం వ్యక్తిగత పనినిమిత్తం పల్సర్ బైక్పై ఇరుకుల్లకు వచ్చాడు. రాత్రి 9గంటలకు కరీంనగర్కు బైక్పై వెళ్తుండగా గుంటూరుపల్లి రైల్వే అండర్బ్రిడ్జి సమీపంలో ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టింది. తీవ్ర గాయాలు కావడంతో వెంటనే చల్మెడ ఆనందరావు ఆస్పత్రికి తరలించగా వైద్యుల సలహామేరకు హైదరాబాద్లోని నిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యులు పరీక్షించి మృతిచెందినట్లు నిర్ధారించడంతో శనివారం మృతదేహాన్ని కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి పోస్ట్మార్టం నిర్వహించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు లారీడ్రైవర్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నిరంజన్రెడ్డి తెలిపారు. గీతకార్మికుడికి గాయాలు పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి మండలం మూలసాల గ్రామంలో తాటిచెట్టు పైకి ఎక్కి కల్లుగీస్తుండగా ప్రమాదవశాత్తు జారి కిందపడడంతో బాలసాని రాజయ్య గాయాలపాలయ్యాడు. వెంటనే గమనించిన స్థానికులు పెద్దపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నిరుపేద అయిన రాజయ్యకు ప్రభుత్వపరంగా సాయమందించాలని సర్పంచ్ జూపాక శ్వేత, గీతకార్మికసంఘ నాయకులు కోరారు. కిరీటం, నగలు మాయంకోనరావుపేట(వేములవాడ): రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం వట్టిమల్లలోని శివసాయి ఆలయంలో సాయిబాబా కిరీటం, ఉత్సవ విగ్రహాల పుస్తెలు కని పించడం లేదు. భక్తులు సమర్పించిన ఈ కానుకలు కనిపించకపోవడంపై గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఆలయంలోని నగలు అపహరణకు గురయ్యాయా, లేక ఎవరైనా భద్రపరిచారా అన్న విషయాలు తెలియాలని నవచైతన్య యూత్ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.25 ఏళ్లుగా రోడ్లపైనే తిరిగి..● కలెక్టర్ చొరవతో కుటుంబం చెంతకు కామారెడ్డిఅర్బన్: కామారెడ్డి పట్టణంలో రోడ్ల వెంట తిరుగుతున్న మానసిక వైకల్యం గల వ్యక్తి 25 ఏళ్ల తర్వాత తన కుటుంబాన్ని కలుసుకున్నాడు. పట్టణంలో గుర్తు తెలియని వ్యక్తి (50) మానసిక వైకల్యంతో రోడ్ల వెంబడి తిరుగుతున్న విషయం ఇటీవల కలెక్టర్ ఆశిష్సంగ్వాన్ దృష్టికి వచ్చింది. వెంటనే ఆయన స్పందించి జిల్లా సంక్షేమాధికారులను ఆదేశించడంతో శనివారం అతన్ని వృద్ధాశ్రమానికి తరలించి వైద్యసేవలు, ఆహారం అందించారు. తాను జగిత్యాల జిల్లాకు చెందిన వాడినని చెప్పడంతో అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కుటుంబసభ్యులు కామారెడ్డికి రాగా, అధికారులు అతడిని అప్పగించారు. 25ఏళ్ల తర్వాత తమ కుటుంబ సభ్యుడిని కలుసుకోవడం ఆనందంగా ఉందని వారు పేర్కొన్నారు. కలెక్టర్, జిల్లా సంక్షేమాధికారులకు ధన్యవాదాలు తెలిపారు. కాగా కలెక్టర్ ఆదేశం ప్రకారం మానసిక వైలక్యం వ్యక్తి వివరాలు, కుటుంబసభ్యుల వివరాలు గోప్యంగా ఉంచారు. వాకిలి శుద్ధి చేస్తుండగా బావిలో పడ్డ మహిళ ముత్తారం: పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఇప్పలపల్లి(రామకృష్ణాపూర్)కు చెందిన తూండ్ల సుమతి శనివారం ఉదయన వాకిలి శుద్ధి చేసే క్రమంలో కాలు జారి వ్యవసాయ బావిలో పడి తీవ్రగాయాలపాలైంది. బాధితురాలి కేకలు విన్న కుటుంబ సభ్యులు వెంటనే బయటకు తీశారు. 108 అంబులెన్స్కు సమాచారం ఇవ్వగా టెక్నీషియన్ నిమ్మతి శ్రీనివాస్, ఫైలెట్ హబీబ్ ప్రఽథమ చికిత్స అందించారు. ఆ తర్వాత మంథని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
అతివేగం.. అదుపుతప్పిన కారు
గోదావరిఖని: అతి వేగం.. లిప్తపాటులో జరిగిన ప్రమాదంతో ఒకరు మృతి చెందగా, ముగ్గురు తీవ్రగాయాల పాలయ్యారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో శుక్రవారం అర్ధరాత్రి ఘటన జరిగింది. గోదావరిఖని వన్టౌన్ పోలీసుల కథనం ప్రకారం.. ఓ వేడుకకు హాజరై చౌరస్తా నుంచి మున్సిపల్ కార్యాలయం వైపు నలుగురు కారులో ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలో రాజేశ్ టాకీష్ సమీపంలో కారు అదుపుతప్పింది. ఎడమవైపు ఉన్న ఓ షాపుతోపాటు, విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈప్రమాదంలో జీడీకే–11గనిలో అసిస్టెంట్చైన్మెన్గా పనిచేస్తున్న ఏల్పుల శ్రీధర్(39) అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ముగ్గురు తీవ్ర గాయాలపాలయ్యారు. గాయపడిన వారిలో లక్ష్మణ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వీరందరినీ స్థానిక సింగరేణి ఏరియా లాస్పత్రికి తరలించిచారు. ప్రథమ చికిత్స అనంతరం కరీంనగర్ రెఫర్ చేశారు. ఈసంఘటనలో జీడీకే–1వగనిలో జనరల్అసిస్టెంట్గా పనిచేస్తున్న తడకల మహేందర్, నామిని లక్ష్మణ్, మాలోతు శ్రీకాంత్ తీవ్రంగా గాయపడ్డారు. బాధితుల ఫిర్యాదు మేరకు వన్టౌన్ ఎస్ఐ రమేశ్ కేసు నమోదు చేసుకున్నారు. ఏల్పుల శ్రీధర్ మార్కండేయకాలనీలో నివాసముంటున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు సంతానం ఉన్నారు. రోడ్డు పక్కన విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న కారు సింగరేణి కార్మికుడు మృతి, మరో ముగ్గురికి తీవ్రగాయాలు -
శాంతియుతంగా ఉండాలి
పెద్దపల్లి: విద్యార్థులు శాంతియుతంగా ఉండాలని, ముఖ్యంగా ప్రపంచ శాంతి కోరుకోవాలని జిల్లా విద్యా ధికారి శారద సూచించారు. జిల్లా సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో 2025–26 పీఎంశ్రీ పాఠశాలల పోటీలు శనివారం కలెక్టరేట్లో నిర్వహించారు. విద్యార్థుల స మగ్ర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ మోడల్ యునైటెడ్ నేషన్స్ పేరిట ఈ కార్యక్రమం నిర్వహించారు. డీఈవో మాట్లాడుతూ, అంతర్జాతీయ సమస్యలు, న్యాయం, పర్యావరణ పరిరక్షణ, మానవ హక్కులు తదితర అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించడం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమన్నారు. జిల్లా అకడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ పీఎం షేక్, రిసోర్స్ పర్సన్, ప్రోగ్రాం సమన్వయకర్త జగదీశ్వర్ మాట్లాడారు. ప్రధానోపాధ్యాయులు అగయ్య, పురుషోత్తం పాల్గొన్నారు. అనంతరం జరిగిన పోటీల్లో సీహెచ్ కీర్తి ప్రథమ, బి.అద్వైత ద్వితీయ, టి.రిషిత తృతీయ బహుమతులు సాధించారు. జిల్లానుంచి 11 మంది రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారని డీఈవో వివరించారు. -
సొంత జిల్లాల్లో పనిచేయొద్దొన్న నిబంధన ఎత్తివేయాలి
పెద్దపల్లి: ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ డిపార్టుమెంటులో కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లు, వారి సొంత జిల్లాల్లో పనిచేయకూడదన్న నిబంధన ఎత్తివేయాలని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావును జిల్లా ఎకై ్సజ్ కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లు శనివారం కలిసి వినతిపత్రం సమర్పించారు. ఎకై ్సజ్ కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లు ఇప్పటివరకు పని చేస్తున్న జిల్లాలో వారి సొంత జిల్లాలో పనిచేయకూడదు అంటూ 8(ఎఫ్ ) క్లాజ్ చేర్చారని, వాటిని సవరించేలా చూడాలని కోరారు. ప్రభుత్వం పునరాలోచన చేసేలా చొరవ తీసుకొని న్యాయం చేయాలని విన్నవించారు. సీఎం రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారని వారు తెలిపారు. శ్రావణి, తిరుపతి, రాజు, రాజకుమార్, నరేశ్, శ్రీనివాస్, నిరంజన్, రమేశ్ ఉన్నారు. -
విద్యార్థులు ఇష్టపడి చదవాలి
పెద్దపల్లి: విద్యార్థులు ఇష్టపడి చదువుతూ తల్లిదండ్రుల కలలు, లక్ష్యాన్ని నెరవేర్చాలని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. సుల్తానాబాద్ పట్టణంలోని అల్ఫోర్స్ హైస్కూల్లో శనివారం రాత్రి నిర్వహించిన ఫేర్వెల్ డే వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. గ్రామీణ స్థాయిలో కార్పొరేట్ విద్యను అందిస్తూ నరేందర్రెడ్డి అందరికీ ఆదర్శప్రాయుడు అయ్యాడని కొనియాడారు. అంతకుముందు విద్యార్థులు పలు రకాల సంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. ఆటల పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ నరేందర్రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు అన్నయ్యగౌడ్, మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధాకృష్ణ, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మినుపాల ప్రకాశ్రావు, వైస్చైర్మన్ అంతటి పుష్పలత, కౌన్సిలర్లు గాదాసు మంజుల, రవి, గరిగె శ్రీనివాస్, చింతల రాజు, టీకే ప్రభాకర్, మహేందర్, పెద్దన్న, ఐల రమేశ్, అబ్బయ్యగౌడ్, కుమార్ పాల్గొన్నారు. నృత్యం చేస్తున్న విద్యార్థినులు మాట్లాడుతున్న ప్రభుత్వ విప్ విజయరమణారావు -
నిరంతర నిఘా!
శాతవాహన గాథలు–2సాక్షి ప్రతినిధి, కరీంనగర్: శాతవాహన యూనివర్సిటీలో దళితులపై అర్బన్ నక్సలైట్లంటూ జరుగుతున్న దుమారం చినికి చినికి గాలివానగా మారుతోంది. ఈ విషయంలో వైస్ చాన్స్లర్ వర్గం, సోషియాలజీ విభాగాధిపతి సూరేపల్లి సుజాతల వర్గాలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. వైస్ చాన్స్లర్కు అనుకూలంగా కొందరు పీహెచ్డీ స్కాలర్స్ ముందుకు వస్తుండగా.. ఫ్రొఫెసర్ సుజాతకు దళిత సంఘాలు, మేధావులు, విద్యార్థి నాయకులు అండగా నిలుస్తున్నారు. కొంతకాలంగా యూనివర్సిటీలో వీసీ తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలపై చర్చ జరగాలంటూ, అవసరమైతే జరుగుతున్న పరిణామాలు, వస్తున్న అవినీతి, అక్రమాల ఆరోపణలపై విచారణ జరిపించాలంటూ విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. వింత నిర్ణయాలపై విస్మయం క్యాంపస్లోని కొన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్న సీసీ కెమెరాలపై ఇటు సిబ్బంది, అటు విద్యార్థులు మండిపడుతున్నారు. సీసీ టీవీల్లో పరిశీలిస్తూ వీసీ పలువురు విద్యార్థులు, సిబ్బందిని నేరుగా తన చాంబర్కు పిలిపిస్తూ నియంత్రించే ప్రయత్నం చేస్తున్నారని విద్యార్థి నేతలు ఆరోపిస్తున్నారు. క్యాంపస్లో 800మంది విద్యార్థులు ఉంటే దాదాపు 200కుపై సీసీ కెమెరాలు ఉన్నాయని అంటున్నారు. చివరికి క్యాంటీన్లోనూ ఆడియో రికార్డ్ చేసే కెమెరాలు పెట్టారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. డిసెంబరు మొదటివారంలో హాజరుశాతం, లైబ్రరీ పనివేళలపై ఆంక్షలపై క్యాంపస్లో వందలాది విద్యార్థులు నిరసన తెలిపిన సంగతి తెలిసిందే. పదే పదే పోలీసులను క్యాంపస్లోకి తీసుకువచ్చి తమలో భయానక వాతావరణ సృష్టిస్తున్నారని విద్యార్థులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో వీసీ ఉమేశ్కుమార్ను వివరణ కోరగా.. క్యాంపస్లో సీసీ కెమెరాలు కేవలం విద్యార్థుల భద్రత కోసమే ఏర్పాటు చేశాం. వర్సిటీలో వేధింపులు, అక్రమాలు అంటూ కొందరు చేస్తున్న ప్రచారం కేవలం నిరాధారం’ అని ఖండించారు. ఎస్యూ క్యాంపస్లో సీసీ కెమెరాల ద్వారా నియంత్రణ క్యాంటీన్లోనూ ఆడియో రికార్డింగ్ కెమెరాలు హాజరు శాతం, లైబ్రరీ నిబంధనలపై కన్నెర్ర వీసీ వింత నిర్ణయాలపై విద్యార్థుల ఆగ్రహం విచారణ జరగాలంటున్న విద్యార్థి సంఘాలు -
చెట్టును ఢీకొని వ్యక్తి మృతి
రాయికల్(జగిత్యాల): మండలంలోని అల్లీపూర్ గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. ఎస్సై సుధీర్రావు తెలిపిన వివరాలు.. జగిత్యాల మండలం లింగంపేట గ్రామానికి చెందిన సిరికొండ చంద్రశేఖర్ (25) శుక్రవారం ద్విచక్రవాహనంపై తన తల్లి గంగుతో కలిసి రాయికల్ మండలం తాట్లవాయి గ్రామంలోని సీతారాముల జాతరకు వెళ్లాడు. తర్వాత తల్లిని లింగంపేటలో దింపాడు. అనంతరం తన స్నేహితులు ఫోన్ చేయడంతో చంద్రశేఖర్ మళ్లీ వారితో కలిసి జాతరలో పాల్గొన్నాడు. రాత్రి ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తుండగా అల్లీపూర్ శివారులో వేగంగా చెట్టును ఢీకొని అక్కడికక్కడే మృతిచెందాడు. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. చికిత్స పొందుతూ..జగిత్యాలక్రైం: జగిత్యాల రూరల్ మండలం చల్గల్ గ్రామానికి చెందిన బొల్లారం రాజం (67) చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతిచెందాడు. ఎస్సై ఉమాసాగర్ తెలిపిన వివరాలు.. రాజం కొంతకాలంగా వయోభారం, అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నాడు. దీంతో మనస్తాపం చెంది గత నెల 30న సాయంత్రం పొలం వద్ద పురుగులమందు తాగగా కుటుంబ సభ్యులు గమనించి కరీంనగర్లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మళ్లీ జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడి భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. కరీంనగర్లో..కరీంనగర్క్రైం: నగరంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి పోలీస్ అవుట్ పోస్టు వెనకాల శనివారం మధ్యాహ్నం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైందని పోలీసులు తెలిపారు. అనారోగ్యంతో మృతి చెందినట్లు తెలిపారు. సుమారుగా వయసు 40 ఏళ్ల వయసు ఉంటుందని, బిచ్చగాడిగా ఆస్పత్రి పరిసరాల్లో తిరుగుతూ ఉండేవాడని తెలిపారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీ గదిలో భద్రపరిచినట్లు తెలిపారు. ఎవరైనా గుర్తిస్తే టూటౌన్ పోలీసులను సంప్రదించాలని సూచించారు. అనుమానాస్పందంగా..కరీంనగర్క్రైం: ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెందినట్లు కరీంనగర్ టూటౌన్ పోలీసులు తెలిపారు. రామడుగు మండలం గోపాలరావుపేటకు చెందిన అలువాల రవి(48)కి 27 ఏళ్ల క్రితం లలితతో వివాహమైంది. ఇద్దరు కుమారులున్నారు. రెండేళ్ల క్రితం లలితతో గొడవపడి కరీంనగర్లోని రాంనగర్లో అద్దె ఇంట్లో ఒంటరిగా ఉంటూ ఉల్లిగడ్డల వ్యాపారం చేస్తున్నాడు. శుక్రవారం అర్ధరాత్రి భార్యకు ఫోన్ చేసి మాట్లాడాడు. శనివారం అతని భార్య ఫోన్ చేయగా, రూం పక్కన అద్దెకు ఉండే ఓ మహిళ ఎత్తింది. ఎంతపిలిచినా రవి కదలడం లేదని చెప్పింది. వెంటనే 108కు ఫోన్చేయగా వారు వచ్చి పరీక్షించి, మృతిచెందినట్లు తెలిపారు. శరీరంపై రక్తపు మరకలున్నాయని, రవి మృతిపై అనుమానం ఉందని లలిత పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టూటౌన్ పోలీసులు తెలిపారు. -
జనగణనలో పొరపాట్లు జరగొద్దు
పెద్దపల్లిరూరల్: జనగణన నమోదు పక్కాగా ఉండాలని, కచ్చితమైన సమాచారం నమోదు చేయాలని, గ్రామాల వారీగా పాఠశాలలు, దేవాలయాలు, పంచాయతీ ఆఫీసులు తదితర గుర్తులను బ్లాక్ వారీగా నమోదు చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. కొత్తపల్లి గ్రామంలో చేపట్టిన జనగణన నమోదు తీరును ఆయన శనివారం పరిశీలించారు. జనగణన సమయంలో ఎదురవుతున్న సమస్యలు, ఇబ్బందులపై తహసీల్దార్ రాజయ్య, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. జనగణనను కచ్చితత్వంతో పూర్తిచేయాలి సుల్తానాబాద్రూరల్: జనగణన సర్వేను కచ్చితత్వంతో పూర్తిచేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. దుబ్బపల్లి, చిన్నకల్వలలో చేపట్టిన జనగణన సర్వేను కలెక్టర్ పరిశీలించి పలు సూచనలు చేశారు. తహసీల్దార్ బషీరుద్దీన్, ఎంపీడీవో దివ్యదర్శన్రావు, అధికారులు ఉన్నారు. కలెక్టర్ కోయ శ్రీహర్ష సర్వే తీరు పరిశీలన -
ఐఎన్టీయూసీ నేతకు డాక్టరేట్
గోదావరిఖని: రాష్ట్ర కనీస వేతన సలహా మండలి చైర్మన్, ఐఎన్యూటీసీ సెక్రటరీ జనరల్ జనక్ప్రసాద్కు అరుదైన గౌరవం లభించింది. కార్మికుల హక్కుల పరిరక్షణ, ట్రేడ్ యూనియన్ ఉద్యమంలో చేసిన విశేష సేవలకు గుర్తింపుగా గౌరవ డాక్టరేట్ అవార్డు లభించింది. జీహెఆర్టీ ఇండియా సంస్థ, వెబ్బైక్ యూనివర్సిటీ, ఏఐయూ యూనివర్సిటీ సంయుక్త ఆధ్వర్యంలో ఈ డాక్టరేట్ ప్రదానం చేశారు. న్యూఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాలో శనివారం కార్యక్రమం నిర్వహించారు. పెద్దపల్లి: జిల్లా కేంద్రంలోని ప్రధాన ఆసుపత్రిలో క్లిష్టమైన ఆర్థో ఆపరేషన్ను వైద్యులు విజయవంతంగా పూర్తి చేశారు. వివరాల్లోకి వెళ్తే.. ఓదెల మండలం పొత్కపల్లికి చెందిన గంగారం గంగమ్మ(80) ప్రమాదవశాత్తు జారిపడి తొంటి ఎముక విరిగింది. తీవ్రగాయమైన గంగమ్మను బంధువులు జిల్లా కేంద్రంలోని ఆసుపత్రికి తరలించారు. శనివారం బాధితురాలికి డాక్టర్ కుమార్ ఆర్థో సర్జన్ 4గంటలు శ్రమించి శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తి చేశారు. పేషెంట్ బంధువులు ప్రభుత్వ విప్ విజయరమణారావు, కలెక్టర్ కోయ శ్రీహర్ష, ఆర్థో సర్జన్ కుమార్కు కృతజ్ఞతలు తెలిపారు. అన్నివర్గాల ప్రజల భాగస్వామ్యంతో ముందుకు గోదావరిఖని: అన్నివర్గాల ప్రజలను భాగస్వామ్యం చేస్తూ ముందుకు వెళ్లడమే ధ్యేయంగా సామాజిక సమతా వేదిక ఉద్దేశమని నాయకులు అన్నారు. స్థానిక ప్రెస్క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. 5న జగ్జీవన్రావు, సాయంత్రం అంబేడ్కర్ జీవిత చరిత్ర నాటిక ప్రదర్శన ఉంటుందన్నారు. అంబేడ్కర్ 135వ జయంతి ఉత్సవాలు, మహనీయుల జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి సామాజిక సమతా వేదిక ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. అంబేడ్కర్ ప్రీమియర్ లీగ్ పేరిట క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తామన్నారు. నాయకులు కె.స్వామి, గుమ్మడి కుమారస్వామి, పెంట రాజేశ్, మాదాసు రామ్మూర్తి, కోటగిరి పాపయ్య, పర్లపల్లి రవి, జేవీరాజు, రాసపెల్లి రవికుమార్, పులి మోహన్, కాసిపేట శివాజీ, కల్వల సంజీవ్, చింటూ, శ్రావణ్, గన్నాల శ్రీధర్గౌడ్ పాల్గొన్నారు. -
శ్రీపాద ట్రస్ట్ కంటి వైద్యశిబిరానికి విశేష స్పందన
ముత్తారం: సాథనిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శ్రీపాద ట్రస్టు ఆధ్వర్యంలో హైదరాబాద్ పుష్పగిరి కంటి వైద్య బృందం నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. దివంగత అసెంబ్లీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు వర్ధంతి సందర్భంగా చేపట్టిన శిబిరంలో 1536 మందికి కంటి పరీక్షలు చేశారు. 717మందికి అద్దాలు, 491 మంది శస్త్ర చికిత్సకు ఎంపికయ్యారు. శిబిరాన్ని త హసీల్దార్ మధుసూదన్రెడ్డి సందర్శించారు. సేవలు అందించిన కంటి వైద్యులు, సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలు, ఎస్సైలు రవికుమార్, శ్రీనివాస్, పోలీ సు సిబ్బందిని కాంగ్రెస్ ఆధ్వర్యంలో సన్మానించా రు. డీసీసీ ఉపాధ్యక్షుడు చొప్పరి సదానందం, అధి కార ప్రతినిధి సెగ్గం రాజేశ్, పార్టీ మండల అధ్యక్షుడు దొడ్డ బాలాజీ, మాజీ జెడ్పీటీసీ నాగినేని జగన్మోహన్రావు తదితరులు పాల్గొన్నారు. -
నోరూరేనంట.. యాదమ్మ వంట
విద్యానగర్(కరీంనగర్): యాదమ్మది సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం గౌరవెల్లి. చిగురుమామిడి మండలం కొండాపూర్కు చెందిన చంద్రయ్యతో పదిహేనేళ్ల వయసులోనే వివాహమైంది. కొడుకు పుట్టిన మూడు నెలలకే చంద్రయ్య ఓ ప్రమాదంలో మరణించాడు. దీంతో కొడుకును తీసుకుని కరీంనగర్కు వలసొచ్చారు. కొన్ని రోజులు స్కూల్లో ఆయాగా పని చేశారు. తరువాత మంకమ్మతోటకు చెందిన వెంకన్న వద్ద వంటపనిలో హెల్పర్గా చేరారు. అందుకు రోజూ రూ.15 కూలీ తీసుకునేవారు. కాలక్రమేణ చిన్నచిన్న ఫంక్షన్లలో వంటచేస్తూ మన్ననలు పొందారు. క్రమేనా పెద్దపెద్ద ఫంక్షన్లకు క్యాటరింగ్ నిర్వహిస్తున్నారు. ఇప్పుడు 50 వేల మందికై నా ఒంటిచేత్తో వంటచేసేలా ప్రావీణ్యం సంపాదించారు. 2022లో హైదరాబాద్లో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ప్రధాని మోదీతో పాటు పాల్గొన్న వందలాది మంది ప్రముఖులకు యాదమ్మ తన చేతి వంటలు రుచి చూపించి శభాష్ అనిపించుకున్నారు. హైదరాబాద్లోని నోవాటెల్ హోటల్లో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ వంటలు రుచిచూసిన ప్రధాని యాదమ్మను ప్రత్యేకంగా అభినందించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం పలుమార్లు యాదమ్మ వంటలను మెచ్చుకున్నారు. కేటీఆర్ నిర్వహించిన మూడు బహిరంగసభలు, వేములవాడ శివరాత్రి ఉత్సవాలు, కొండగట్టు హనుమాన్ జయంతి, గోదావరి పుష్కరాల్లో వేలాది మందికి వంటలు చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూతురు పెళ్లిలో 30వేల మందికి, కరీంనగర్ తీగల వంతెన ప్రారంభం అప్పుడు 20వేల మందికి వంటలు చేశారు. కేంద్రమంత్రి బండి సంజయ్, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నివాసాల్లో జరిగిన ఫంక్షన్లకూ యాదమ్మ క్యాటరింగ్ చేశారు. గతనెల 27న కరీంనగర్లోని మహాశక్తి ఆలయంలో జరిగిన శ్రీరామనవమి వేడుకల్లో 25వేల మందికి రుచికరమైన వంటకాలు చేసిపెట్టారు. కిరాయి పెంకుటిళ్లు నుంచి ఇప్పుడు సప్తగిరికాలనీలో తనకంటూ ఒక మంచి సొంతిళ్లు నిర్మించుకుని దుర్గా నిలయంగా పేరు పెట్టుకున్నారు. ఒక్కగానొక్క కొడుకును చదివించి రూ.12 లక్షలు ఖర్చు చేసి అమెరికా పంపింపారు. అక్కడి వాతావరణం పడక అనారోగ్యం పాలు కావడంతో స్వదేశానికి వచ్చి అతనూ క్యాటరింగ్ చేస్తున్నాడు. యాదమ్మ వద్ద దాదాపు 200 మంది వంటలు నేర్చుకుని సొంతంగా క్యాటరింగ్లు నిర్వహిస్తున్నారు. మీర్జాపూర్కు చెందిన 20 మంది మహిళలు వంటలు నేర్చుకుని స్వయం ఉపాధి పొందుతున్నారు. సీజన్లో 200మందికి ఉపాధి కల్పిస్తున్నారు. మిగతా రోజుల్లో నిత్యం 10 నుంచి 20 మంది యాదమ్మ వంటకు సాయంగా ఉంటారు. కరీంనగర్లోని మారుమూల పల్లెలో పుట్టిన నేను ఈ దేశ ప్రధానికి నా చేతి వంట రుచి చూపిస్తానని కలలో కూడ అనుకోలేదు. శాకాహారమే కాకుండా నాన్ వెజ్ వంటకాలు కూడా బాగా చేస్తాను. గంగుల కమలాకర్, బండి సంజయ్లు నన్ను బాగా ప్రోత్సహిస్తున్నారు. వారి ఇంట్లో, రాజకీయ పార్టీలకు, కాలేజీ ఫంక్షన్లకు, రాజకీయ సభలకు దాదాపు 20 నుంచి 30వేల మందికి వంట చేయగలను. నా వద్ద ప్రస్తుతం 40మంది వరకు పని చేస్తారు. నా దగ్గర పని నేర్చుకున్న వారు స్వయంగా క్యాటరింగ్ నిర్వహిస్తున్నారు. వారి పిల్లలను అమెరికా సైతం పంపించారు. – గూళ్ల యాదమ్మ -
రైల్వేవంతెనల పరిశీలన
పెద్దపల్లిరూరల్: గౌరెడ్డిపేట, చీకురాయి ప్రాంతాల్లోని రైల్వే లెవల్క్రాసింగ్ గేట్ల వద్ద వంతెనల నిర్మాణం కోసం శనివారం ఆర్డీవో గంగయ్య పలు శాఖల అధికారులతో కలిసి స్థల పరిశీలన చేశారు. పనులు ప్రారంభమైతే గేట్ల నుంచి రాకపోకలు నిలిపి వేసి ఇతర మార్గాల ద్వార వెళ్లేలా సూచనలివ్వాలన్నారు. డిప్యూటీ తహసీల్దార్ విజేందర్, రైల్వే ఇంజినీరింగ్, విద్యుత్, మిషన్భగీరథ, ఆర్అండ్బీ, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. పనితీరుకు పురస్కారం పెద్దపల్లి: ప్రతీనెల మాదిరిగానే ఈనెలలోనూ పనితీరు ఆధారంగా పర్ఫార్మెన్స్ అవార్డును అందజేసినట్లు జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీధర్ తెలిపారు. ఈనెలలో మంచిపనితీరు కనబర్చిన ఫార్మసిస్ట్ జి.కవిత, సిబ్బంది ఎస్.శైలజకు పురస్కారం ప్రదానం చేస్తున్నట్లు వివరించారు. శనివారం ఆస్పత్రిలో జరిగిన కార్య క్రమంలో ఆర్ఎంవో విజయ్ కుమార్, నర్సింగ్ సూపరింటెండెంట్ జమున పాల్గొన్నారు. చికితకు ‘విప్’ అభినందన ఎలిగేడు: సుల్తాన్పూర్ గ్రామానికి చెందిన ఆర్చరీ క్రీడాకారిణి, వరల్డ్ చాంపియన్ తానిపర్తి చికిత ఇటీవల బ్యాంకాక్లో జరిగిన ఆసియాకప్ వరల్డ్ ర్యాకింగ్ టోర్నీలో గోల్డ్మెడల్, ఉమెన్స్ టీం విభాగంలో సిల్వర్ మెడల్ సాధించింది. దీంతో శివపల్లిలోని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయరమణారణారావు తన నివాసంలో శనివారం చికితను సన్మానించారు. చికిత తండ్రి తానిపర్తి శ్రీనివాసరావు, యూత్ కాంగ్రెస్ నాయకుడు దుగ్యాల సంతోష్రావు, కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు, మాజీ సర్పంచ్ అర్షనపల్లి వెంకటేశ్వర్రావు, మాజీ ఉపసర్పంచులు కోరుకంటి వెంకటేశ్వర్రావు, వెంకటేశ్వర్రావు, బూర్ల వెంకటసత్యం, తానిపర్తి మహిపాల్రావు తదితరులు పాల్గొన్నారు. 8న జాబ్మేళా పెద్దపల్లి: శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్, ఫైనాన్స్ కంపెనీలో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈనెల 8న జాబ్మేళా నిర్వహించనున్నట్లు జి ల్లా ఉపాధి కల్పనాధికారి తిరుపతిరావు తెలిపా రు. ఈకంపెనీలో 15 మార్కెటింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. ఏదైనా డిగ్రీ కలిగిఉండి 25– నుంచి 40ఏళ్ల వయసు ఉన్నవారు బుధవారం ఉదయం 11 గంటలకు సర్టిఫికెట్లతో కలెక్టరేట్లోని రూమ్నంబరు 233లో సంప్రదించాలని సూచించారు. వివరాలకు 89853 36947, 81212 62441 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని ఆయన కోరారు. నేడు జగ్జీవన్రాం జయంతి పెద్దపల్లి: జిల్లావ్యాప్తంగా ఆదివారం బాబూ జగ్జీవన్రామ్ జయంతి నిర్వహించనున్నట్లు జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి రవీందర్ తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఎస్సీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వేడుకలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. వేదపాఠశాలలో ప్రవేశాలు కాల్వశ్రీరాంపూర్: పాండవులగుట్ట శ్రీజగత్ మౌనీశ్వరస్వామి ఆశ్రమంలోని వేదసంస్కృత పాఠశాలలో ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆ హ్వానిస్తున్నట్లు ప్రధానాచార్యులు సత్యాచార్యు లు తెలిపారు. కోర్సు శిక్షణకాలం మూడేళ్లు, వయస్సు 12 – 18 మధ్య ఉండాలన్నారు. వివరాలకు 95059 25999, 99484 18410 నంబర్లలో సంప్రదించాలని ఆయన కోరారు. నగరంలో పోలీసుల తనిఖీలు గోదావరిఖని: వన్ టౌన్ పోలీసులు శనివారం రాత్రి నగరంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించా రు. జీఎం ఆఫీస్, ఫైవింక్లయిన్చౌరస్తా, అడ్డగుంటపల్లి తదితర ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. నిషేధిత పదార్థాల రవాణా, అనుమానితుల కట్టడి, నేరాల నియంత్రణ, అవాంఛనీ య ఘటనలను అరికట్టడంపై దృష్టి పెట్టారు. -
క్రమశిక్షణతో చదువుకోవాలి
రామగిరి: విద్యార్థులు క్రమశిక్షణతో విద్యనభ్యసించి భవిష్యత్లో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మంథని జేఎన్టీయూ ప్రిన్సిపాల్ బులుసు విష్ణువర్ధన్ సూచించారు. శుక్రవారం సెంటినరీకాలనీ క మ్యూనిటీహాల్లో కల్వచర్ల ప్రగతి పాఠశాల విద్యార్థులకు ఏర్పాటు చేసిన గ్రాడ్యుయేషన్ డేలో మాట్లాడారు. తొలుత టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మిర్యా ల రాజిరెడ్డి, పాఠశాల కరస్పాండెంట్ అబ్బు కేశవరెడ్డితో కలిసి విద్యార్థులకు ప్రశంసపత్రాలు, జ్ఞాపిక లు అందజేశారు. విద్యార్థులకు చిన్నతనం నుంచే నైతిక విలువలు, క్రమశిక్షణ, శ్రద్ధ వంటి లక్షణాలు నేర్పుతూ ఉత్తములుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత తల్లిదండ్రులు తీసుకోవాలని ఆయన కోరారు. జిల్లాస్థాయిలో అద్భుత ప్రతిభ అంగుళీయ అబాకస్ పోటీల్లో జిల్లాస్థాయిలో ప్రతి భ కనబర్చిన విద్యార్థులకు టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి ప్రశంసపత్రాలు అందజేశారు. అబాకస్ శిక్షణతో పిల్లల్లో జ్ఞాపకశక్తి, తార్కిక ఆలోచన పెరుగుతాయని తెలిపారు. వీరిప్రతిభ భ విష్యత్లో గొప్పగణిత శాస్త్రవేత్తలుగా ఎదిగేందుకు దోహదపడుతుందని ప్రశంసించారు. పాఠశాల కరస్పాడెంట్ అబ్బు కేశవరెడ్డి మాట్లాడుతూ పోటీ ప్ర పంచంలో గణితంపై పట్టు సాధించేందుకు అంగు ళీయ అబాకస్ ఒకసంజీవనిలా పనిచేస్తుందన్నారు. తమ పాఠశాల విద్యార్థులు జిల్లా స్థాయిలో మెడల్స్ సాధించడం గర్వకారణమన్నారు. పాఠశాల ఇన్చా ర్జి కొప్పుల గోవర్ధన్రావు, అధ్యాపకులు, విద్యార్థు లు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. జేఎన్టీయూ ప్రిన్సిపాల్ విష్ణువర్ధన్ -
ఆధ్యాత్మిక కేంద్రాల సందర్శన
రామగుండం: రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా శుక్రవారం పలు ఆధ్యాత్మిక కేంద్రాలను సందర్శించారు. తొలుత రామునిగుండాల, ఆబాది రామగుండంలోని స్వయంభూ శ్రీకాశీవిశ్వేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. స్థానికుడు తిప్పని సత్తయ్య రామునిగుండాల విశిష్టతను వివరించారు. ఆబాది రామగుండంలోని శ్రీకాశీవిశ్వేశ్వరాలయంలో పూజారి విజయ్కుమార్ ఆచార్య, ఆలయ కమిటీ ప్రతినిధి సాయి తదితరులు సీపీ దంపతులకు స్వాగతం పలికారు. అనంతరం వారు ప్రత్యేక పూజలు చేశారు. గ్రామానికి చేరుకున్న సీపీ దంపతులకు ఎస్ఆర్ఎం కన్స్ట్రక్షన్ అధినేత మాచిడి మహేందర్గౌడ్ మూలవిరాట్ చిత్రపటాన్ని బహూకరించి శాలువా, పూలమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ దాత మంగీలాల్, కోల కు సుమకుమారి, రామగుండం సీఐ ప్రవీణ్కుమార్, ఎస్సై సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు. -
కమలం బలపడేనా?
సాక్షి పెద్దపల్లి: బీజేపీ రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని ఆ పార్టీ అధ్యక్షుడు ప్రకటించారు. అందులో జిల్లాకు పెద్దపీట దక్కింది. శాశ్వత ఆహ్వానితులుగా, రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా, ప్రత్యేక ఆహ్వానితులతో ఏర్పాటు చేసిన రాష్ట్ర కమిటీలో జిల్లానుంచి ఏకంగా ఏడుగురికి చోటుకల్పించారు. పార్టీని బలోపేతం చేసేందుకు ప్రతీఒక్కరు కృషి చేయాలని కమలం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు నేతలకు పిలుపునిచ్చారు. అయితే జిల్లాలో బీజేపీ పరిస్థితి అల్లకల్లోలంగా ఉంది. బీజేపీలోని నలుగురైదుగురు నాయకులు కూడా ‘తలోదారి’ అన్నట్లు తయారైంది. కొత్త, పాత నేతలు గ్రూపులుగా విడిపోవడంతో పార్టీ అస్తవ్యస్తంగా మారింది. నాయకుల మధ్య సయోధ్య కుదరడం లేదు. ‘ఎవరికివారు.. యము నా తీరు’ అన్న చందంగా వ్యవహరిస్తున్నారనే విమ ర్శలు ఉన్నాయి.. దీంతో ఇటీవల జరిగిన పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో ఘోర పరాభావం పాలైంది. స్థానిక ఎన్నికల్లో ఓటమి పాలైనా.. రాష్ట్ర కార్యవర్గంలో పలువురు నేతలకు చోటు లభించడంతో బీజేపీ జిల్లా నేతల్లో జోష్ కనిపిస్తోంది. మనోళ్లే ఏడుగురు బీజేపీ రాష్ట్ర కార్యవర్గంలో పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి, గోదావరిఖనికి చెందిన కాసిపేట లింగయ్య, మాజీ ఎంపీ వెంకటేశ్ నేతలకు ప్రత్యేక ఆహ్వానితులుగా చోటు లభించింది. రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా గోదావరిఖనికి చెందిన బల్మూరి వనిత, జూలపల్లికి చెందిన నల్లా మనోహర్రెడ్డి, మంథని నుంచి చందుపట్ల సునీల్రెడ్డి, పెద్దపల్లి నుంచి దుగ్యాల ప్రదీప్రావులకు రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా అవకాశం కల్పించారు. కలిసి నడిస్తేనే.. గత పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ను వెనక్కి నెట్టి రెండోస్థానంలో నిలిచిన బీజేపీ.. ఆ తర్వాత జరిగిన టీచర్స్, పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో రెండు ఎమ్మెల్సీ స్థానాలనూ కై వసం చేసుకుని సత్తా చాటింది. ఆ తర్వాత జరిగిన స్థానిక సంస్థల్లో అభ్యర్థుల త రఫున ప్రచారం, దిశానిర్దేశం చేసే నేతలు లేక చతికిలబడ్డారు. దీనికి ప్రధానంగా నేతల మధ్య నెలకొన్న అనైక్యతే కారణమని సొంతపార్టీ నేతలే బాహాటంగా ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం రెండున్నరేళ్ల పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో.. ఇప్పటి నుంచైనా పార్టీ పదవులు పొందిన బీజేపీ నేతలు కలిసికట్టుగా శ్రమించాలంటున్నారు. కేడర్కు మార్గనిర్దేశనం చేస్తూ, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడితే వచ్చే జిల్లా పరిషత్ ఎన్నికల్లో సత్తా చాటవచ్చని భావిస్తున్నారు. తద్వారా అసెంబ్లీ ఎన్నికల నాటికి బలపడవచ్చని కమలం శ్రేణులు అభిప్రాయపడుతున్నారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గంలో ఏడుగురు జిల్లావాసులకు చోటు పదవుల పందేరంతో పువ్వుగుర్తు పార్టీలో నయా జోష్ పార్టీ బలోపేతానికి సమష్టిగా పనిచేయాలంటున్న కేడర్ -
శ్రీపాదరావు సేవలు చిరస్మరణీయం
ముత్తారం: దివంగత అసెంబ్లీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు సేవలు చిరస్మరణీయమని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శ్రీపాద ట్రస్ట్ ఆధ్వర్యంలో హైదరాబాద్కు చెందిన పుష్పగిరి కంటి ఆస్పత్రి శుక్రవారం ఉచిత కంటివైద్య, శస్త్రచికిత్స శిబిరం ఏర్పాటు చేసింది. టీ పీసీపీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల ఽశ్రీనుబాబు, డీసీపీ రాంరెడ్డి, డీఎంహెచ్వో ప్రమోద్కుమార్తో కలిసి క లెక్టర్ శుక్రవారం శిబిరం ప్రారంభించారు. అనంత రం మాట్లాడుతూ, సర్పంచ్ నుంచి శాసనసభ స్పీక ర్ వరకు ఎదిగిన శ్రీపాదరావు నమ్ముకున్న సిద్ధాతా లకు కట్టుబడి సేవలు అందించారన్నారు. ఆయన వర్ధంతి సందర్భంగా మారుమూల ప్రాంతాల పేద ల కోసం ఉచిత కంటి వైద్యపరీక్షలతోపాటు శస్త్రచికిత్సలు అందించేందుకు దుద్దిళ్ల కుటుంబం ముందు కు రావడం అభినందనీయమన్నారు. తండ్రి బాట లో తనయులు శ్రీధర్బాబు, శ్రీనుబాబు సమాజ సేవ చేపట్టడం ప్రశంసనీయమన్నారు. మంథని ప్రజలకు సేవ చేయడమే లక్ష్యం సుమారు 40 ఏళ్లుగా తమను నమ్ముకుని అధికారం ఇస్తున్న మంథని ప్రజలకు సేవచేయడం తమ దు ద్దిళ్ల కుటుంబం లక్ష్యమని టీపీసీసీ ప్రధాన కార్యద ర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు అన్నారు. తమ తండ్రి శ్రీపాదరావు ఆశయ సాధన కోసం సంక్షేమ పథకాల ఫ లాలను పేదలకు అందిస్తామని తెలిపారు. తొలిరో జు 1,030 కంటి పరీక్షలు చేయగా.. అందులో 300 మందికి కళ్లద్దాలు, 250 మందిని శస్త్రచికిత్స కోసం హైదరాబాద్కు తరలిస్తున్నట్లు వివరించారు. శనివారం కూడా ఉచిత కంటి వైద్యశిబిరం నిర్వహిస్తామని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. డీఎంహెచ్వో ప్రమోద్కుమార్, గోదావరిఖని ఏసీపీ రమేశ్, సీఐలు రాజు, ప్రసాద్రావు, ఎ స్సై రవికుమార్, పుష్పగిరి కంటి వైద్యుడు ప్రదీప్, ఆప్తాలిక్ వేణుబృందం, సందరవేన మహేందర్ యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్లు అన్నయ్యగౌడ్, రాజాబాబు, డీసీసీ ఉపాధ్యక్షుడు చోప్పరి సదానందం, మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తోట్ల తిరుపతి యాదవ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు దొడ్డ బాలాజీ, మాజీ జెడ్పీటీసీ నాగినేని జగన్మోహన్రావు, కమాన్పూర్ ఏఏంసీ చైర్మన్, వైస్ ఛైర్మన్ వైనాల రాజు, మద్దెల రాజయ్య, సర్పంచుల ఫోరం మండల కన్వీనర్ బియ్యని శివకుమార్, నాయకులు తూటి రఫీ, బోల్నేనేని బుచ్చాంరావు, సుదాడి సంపత్రావు, బక్కతట్ల వీనిత్, నూనేటి కృష్ణ, కేవీ చారి, తాటిపాముల ఽశంకర్, కొల విజయ్, అనుము ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ కోయ శ్రీహర్ష శ్రీపాద ట్రస్టు ఆధ్వర్యంలో వైద్యశిబిరం -
దొడ్డి కొమురయ్య పోరాటం స్ఫూర్తిదాయకం
పెద్దపల్లి: తెలంగాణ తొలిఅమరుడు దొడ్డి కొమురయ్య పోరాట స్ఫూర్తి అందరికీ ఆదర్శమని బీసీ సంక్షేమ అధికారి రంగారెడ్డి అన్నారు. కలెక్టరేట్లో శుక్రవారం దొడ్డి కొమురయ్య జయంతి నిర్వహించారు. తొలుత దొడ్డి కొమురయ్య చిత్రపటానికి ఆయన పూలమాలలు వేసి నివాళి అర్పించారు. రంగారెడ్డి మా ట్లాడుతూ, నిరంకుశ పాలన నుంచి స్వేచ్ఛ కో సం సాయుధపోరు సాగించిన దొడ్డి కొమురయ్య నేటి తరానికి ఆదర్శమన్నారు. బీసీ సంక్షేమ సంఘం నేషనల్ కో ఆర్డినేటర్ ఆకుల స్వామి వివేక్ పటేల్, కురుమ సంఘం జిల్లా అధ్యక్షుడు మల్లేశం, ప్రధాన కార్యదర్శి కర్రె కుమారస్వామి, సర్పంచ్ గుంటి బాపు, ఉపసర్పంచ్ తొంటి మధుకర్, సామాజిక కార్యకర్త కోమటిపల్లి రాజేందర్ నేత పాల్గొన్నారు. అక్రమ కేసులు నమోదు చేస్తారా? పెద్దపల్లి: ప్రజలకు అండగా నిలవాల్సిన పోలీసులు.. శాంతియుతంగా ధర్నా చేస్తున్న ప్రజలపైనే అక్రమ కేసులు నమోదు చేసి రాజకీయ నాయకులకు అండగా ఎలా నిలుస్తారని సీపీఐ(ఎం) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాన్వెస్లీ ప్ర శ్నించారు. జిల్లా కేంద్రంలోని బస్టాండ్ వద్ద శు క్రవారం జరిగిన కార్యక్రమంలో ఆయన మా ట్లాడారు. రాఘవపూర్లోని శ్మశానవాటిక వద్ద సోలార్ పవర్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతామని ముందస్తు సమాచారం ఇచ్చిన తమ పార్టీ నాయకులు అశోక్, నవీన్ను జైలుకు ఎలా పంపుతారని ప్రశ్నించారు. కమ్యూనిస్టు నాయకులపై అక్రమ కేసులు నమోదు చేయ డం సరైనది కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాయకులు భూపాల్, బండ రవికుమార్, శోభన్, ముత్యంరావు, రవీందర్ పాల్గొన్నారు. దళారులను నమ్మొద్దు పెద్దపల్లి: వైద్య, విధాన పరిషత్ ఆస్పత్రుల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామనే దళారులను నమ్మి మోసపోవద్దని పెద్దపల్లి ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీధర్ సూచించారు. అంతేకాకుండా పెండింగ్ బిల్లులు మంజూరు చేయిస్తామనే ఏజెంట్ల మాటలూ నమ్మవద్దని సూచించారు. కేంద్ర కార్యాలయాన్ని తరలించేదిలేదు ఫెర్టిలైజర్సిటీ: రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్ లిమిటెడ్(ఆర్ఎఫ్సీఎల్) కర్మాగారం కార్పొరేట్ కార్యాలయం నోయిడా నుంచి రామగుండం తరలించాలని పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ 16 ఆగస్టు 2025న కేంద్రప్రభుత్వానికి వినతిపపత్రం అందజేశారు. స్పందించిన కేంద్ర ఎరువులు, రసాయనాల మంత్రి జగత్ ప్రకాశ్నడ్డా రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్ లిమిటెడ్ కర్మాగారం కార్పొరేట్ కార్యాలయాన్ని నోయిడాలోనే కొనసాగిస్తామని వివరణ ఇచ్చారు. ఆర్ఎఫ్సీఎఫ్ ప్లాంట్ హెడ్, మె కానికల్, ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంటేషన్, సివిల్, ఫైనాన్స్ విభాగం అధికారులు రామగుండంలోనే ఉంటారని బదులిచ్చారు. నోయిడాలోని కార్పొరేట్ కార్యాలయం ఎరుగ శాఖ ప్రమోటర్లు ఈక్విటీ భాగస్వాములతో సమన్వయం చేసుకోవడానికి, ఢిల్లీలో చట్టపరమైన మధ్యవర్తిత్వ విషయాలను నిర్వహించడానికి అత్యంత అవసరమని మంత్రి వివరించారు. సెప్టిక్ ట్యాంక్లు శుభ్రం చేయించండి ● నోటిఫికేషన్ జారీ చేసిన రామగుండం బల్దియా కమిషనర్ కోల్సిటీ(రామగుండం): ప్రతీ సెప్టిక్ ట్యాంక్ను మూడేళ్లకోసారి తప్పనిసరిగా శుభ్రం చేయించాలని రామగుండం నగర పాలక సంస్థ కమిషనర్ అరుణశ్రీ సూచించారు. ఈమేరకు శుక్రవారం నోటిఫికేషన్ జారీచేశారు. ప్రొ హిబిషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ యాస్ మా న్యూవల్ స్కావెంజర్స్ అండ్ దెయిర్ రిహాబిలిటేషన్(పీఈఎంఎస్ఆర్) చట్టం–2013 ప్రకా రం సెప్టిక్ ట్యాంక్లోకి మనుషులు ప్రవేశించి శుభ్రం చేయడం నిషేధించారని గుర్తుచేశారు. సెప్టిక్ టాంక్ శుభ్రం చేసే సేవలు పొందడానికి టోల్ ఫ్రీ నంబరు 14420 లేదా, కాల్సెంటర్ నంబరు 93924 83959కు ఫోన్ లేదా వా ట్సాప్ సందేశం ద్వారా సమాచారం ఇవ్వాలని సూచించరు. సెప్టిక్ ట్యాంకుల రూపకల్పన, నిర్మాణం, ఇండియన్ స్టాండర్డ్స్ ‘ఐఎస్ 2470’ ప్రకారం చేపట్టాలని కమిషనర్ తెలిపారు. నగరవాసులు, మేషన్లు, కాంట్రాక్టర్లు ఈ నిబంధనలను అతిక్రమిస్తే చట్ట ప్రకారం శిక్షార్హులవుతారని నోటిఫికేషన్లో ఆమె పేర్కొన్నారు. -
వైభవంగా నృసింహుని రథోత్సవం
శ్రీలక్ష్మీనర్సింహస్వామి రథోత్సవంలో భక్తులు, స్వామివారి సన్నిధిలో పూజలు చేస్తున్న ప్రభుత్వ విప్ విజయరమణారావు, నాయకులుజూలపల్లి: పెద్దాపూర్ శ్రీయోగానంద లక్ష్మీనర్సింహస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నా యి. ఇందులో భాగంగా శుక్రవారం రథోత్సవం, జాతర ఘనంగా నిర్వహించారు. ఉదయం ఆల యంలో ప్రత్యేకపూజలు చేశారు. అనంతరం స్వా మివారి ఉత్సవమూర్తులను పల్లకీలో తీసుకొచ్చి రథంపై ఆశీనులను చేశారు. అనంతరం పువీధుల్లో శోభాయాత్ర నిర్వహించారు. ఉమ్మడి జిల్లాలోని భక్తులు భారీగా తరలి వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు హాజరుకాగా ఆలయ ఈవో సదయ్య, అర్చకులు, ధర్మకర్తలు, సర్పంచ్ తొగరు శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ రజని– రవీందర్రెడ్డి, సభ్యులు ఘనస్వాగతం పలికారు. ధర్మకర్తలు రాజభాస్కర్రెడ్డి, నరేశ్రెడ్డి, బీజేపీ నాయకుడు సురేశ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వీరితోపాటు మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి, ఆర్డీవో గంగయ్య, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నల్ల మనోహర్రెడ్డి, మాజీ జెడ్పీటీసీ బొద్దుల లక్ష్మణ్ తదితరులు వేడుకలకు హాజరయ్యారు. సుల్తానాబాద్ సీఐ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో ఎస్సైలు సనత్కుమార్, మధుకర్, సిబ్బంది పటిష్ట బందో బస్తు చేపట్టారు. ప్రత్యేకపూజలు చేసిన ప్రముఖులు -
17 నుంచి మహాసభలు
పెద్దపల్లి: వరంగల్లో ఈనెల 17, 18వ తేదీల్లో చేప ట్టే దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తాళ్లపల్లి లక్ష్మణ్ కోరారు. జిల్లా కేంద్రంలో మహాసభల ప్రచార పోస్టర్ను సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి తాండ్ర సదానందంతో కలిసి శు క్రవారం ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ, వివిధ కేంద్రప్రభుత్వ శాఖల్లో 45 శాతం ఎస్సీ రిజర్వ్డ్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, వాటిని భర్తీ చేయడంలో పాలకులు విఫలమయ్యారన్నారు. 45 యూనివర్సిటీల్లోగల 42 శాతం వివిధ పోస్టులను భర్తీ చేయాలన్నారు. కందుకూరి రాజారత్నం, పెరు క లక్ష్మణ్, పెరిక సతీశ్, అరికిల్ల గణపతి, కల్లపల్లి న వీన్, ఆరెపల్లి మానస, ప్రశాంత్ పాల్గొన్నారు. -
వివాదాల వర్సిటీ..!
వర్సిటీ గాథలు–1సాక్షిప్రతినిధి,కరీంనగర్: శాతవాహన యూనివర్సిటీ వివాదాలకు ని లయంగా మారుతోంది. క్రమశిక్షణ పేరిట కొంతకాలంగా వీసీ ఉమేశ్కుమార్ తీసుకుంటున్న చర్యల పై విద్యార్థులు నిరసన బాట పట్టగా.. తాజాగా ద ళితులను లక్ష్యంగా చేసుకుని వేధిస్తున్నారంటూ ఏ కంగా ప్రొఫెసర్లు బయటికి రావడం చర్చనీయాంశంగా మారింది. దళిత మహిళనైన తనను అసంబద్ధ చర్యలతో వేధిస్తున్నారంటూ తెలంగాణ విద్యా కమిషన్ సలహా కమిటీ సభ్యురాలు, సోషియాలజీ విభాగాధిపతి సూరేపల్లి సుజాత రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్కి ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. అకారణంగా తనను, మరికొందరు దళిత విద్యార్థులను అర్బన్ నక్సలైట్లు అంటూ ప్రచారం చేయ డం తన మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసిందని కమిషన్కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఓవైపు తెలంగాణలో మావోయిస్టులు లేరంటూ డీజీపీ ప్రకటిస్తుంటే.. తమను అర్బన్ నక్సలైట్లంటూ కొందరు ఆరోపణలు చేస్తున్నారని, వారిని ప్రోత్సహిస్తున్న వీ సీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. గతంలో వర్సిటీ వివిధ ఆరోపణలపై తొలగించిన ఇద్దరు అధ్యాపకులను మళ్లీ విధుల్లోకి తీసుకోవడం ఈ వివాదానికి ఆజ్యం పోసింది. వర్సిటీకి 12–బీ హోదా ఇవ్వకూడదంటూ యూజీసీకి అధ్యాపకులు కొందరు లేఖ రాశారు. విచారణ జరిపిన వర్సిటీ ఐ దుగురు అధ్యాపకులను బాధ్యులుగా గుర్తించి వి ధుల నుంచి తప్పించింది. ఆ ఐదుగురిలో ఇద్దరిని ఇటీవల వీసీ విధుల్లోకి తీసుకున్నారు. ఇక్కడే సి బ్బంది రెండు వర్గాలుగా చీలిపోయారు. వీరి ని యామకాన్ని కొందరు విద్యార్థులు, సిబ్బంది వ్యతి రేకిస్తున్నారు. మరోవైపు వర్సిటీలో కొందరు అర్బన్ నక్సలైట్లు చేరారంటూ ఆరోపిస్తూ.. మరోవర్గం కలెక్టర్కు ఫిర్యాదు చేసింది. ఇందులో ప్రొఫెసర్ సుజా త పేరు ఉండటంతో ఆమె ఎస్సీ కమిషన్ను ఆశ్రయించారు. గతంలో రిజిస్ట్రార్గా పనిచేసిన సమయంలో జరిగిన పరిణామాలను దృష్టిలో ఉంచుకు ని ఉమేశ్కుమార్ కొంతకాలంగా ప్రతీకార చర్యల కు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు. 12–బీ వ్య వహారంలో బహిష్కరణకు గురైన అధ్యాపకుడు పెంచాల శ్రీనివాస్తో కలిసి ఆయన తనపై దుష్ప్రచారానికి తెరతీశారని మండిపడుతున్నారు. కనీసం నోటిఫికేషన్ లేకుండా వారిద్దరిని ఎలా నియమిస్తారంటూ విద్యార్థులు ధర్నా చేయడంతో వారంపా టు వారికి క్లాసులు ఇవ్వమంటూ వీసీ హామీ ఇవ్వడంతో శాంతించారు. వసతులు, హక్కుల కోసం ప్రశ్నిస్తే.. తమను అర్బన్ నక్సల్స్ అని ముద్ర వేసి బెదిరిస్తున్నారని వాపోతున్నారు. ఫ్రొఫెసర్ సుజాత ను పదవుల నుంచి తప్పించడంపై వీసీ స్పంది స్తూ .. ఆమెను ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్గా తొలగించినందుకే తనపై ఆరోపణలు చేస్తున్నారని వివరించారు.గతేడాది వర్సిటీలో ఎస్సీ సంక్షేమ నిధులతో చేపట్టిన భవన నిర్మాణ పనుల ప్రారంభ సమయంలో మంత్రి లక్ష్మణ్కు ప్రాధాన్యం తగ్గించిన విషయం అప్పట్లో వివాదాస్పదమైంది. ఇది ఇద్దరు రాష్ట్ర మంత్రుల మధ్య మాటల చిచ్చు పెట్టింది. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఆ సమయంలో వీసీ తీరును తీవ్రంగా తప్పుబట్టారు. తన శాఖ నిధులతో జరిగే పనులలో తనకు ప్రాధాన్యం తగ్గించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రొటోకాల్ విషయంలో పొరపాట్లు పునరావృతం కాకూడదని మందలించారు. తాజాగా తనను వరుసగా పదవుల నుంచి తప్పించడంపైనా ప్రొఫెసర్ సూరేపల్లి సుజాత మంత్రి లక్ష్మణ్కుమార్కు ఫిర్యాదు చేశారు. ఆ సమయంలో దళితులపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్న తీరు మార్చుకోవాలని మంత్రి లక్ష్మణ్ ఫోన్లో వీసీకి హితవు పలికారు. సాక్షాత్తూ ఎస్సీ సంక్షేమ మంత్రి చెప్పినా వీసీ తనను వేధించడం ఆపడం లేదంటూ, అందుకే, అతనిపై అట్రాసిటీ కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలంటూ ఎస్సీ కమిషన్ను ఆశ్రయించానని సుజాత ‘సాక్షి’కి వెల్లడించారు.కరీంనగర్లో అర్బన్ నక్సల్స్ ఉన్నారంటూ మాకు ఎలాంటి సమాచారం లేదు. దీనిపై మా నిఘా విభాగాలు ఎలాంటి ఇన్పుట్స్ ఇవ్వలేదు. దీనిపై విద్యార్థులు ఎలాటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కమిషనరేట్ పరిధిలో అర్బన్ నక్సలైట్లు ఎవరూ లేరు. – గౌస్ ఆలం, పోలీస్ కమిషనర్ -
అత్యుత్సాహం.. అతివేగం
కరీంనగర్రూరల్: ఇంజినీరింగ్ విద్యార్థుల అత్యుహ్సం, అతివేగం రెండు నిండుప్రాణాలను బలితీ సుకుంది. బొమ్మకల్ బైపాస్రోడ్డులో గురువారం రాత్రి ఈ ఘటన జరిగింది. అతివేగంగా వెళ్తున్న కా రు అదుపుతప్పి ఎదురుగా ఆగిఉన్న లారీని ఢీకొ ట్ట డంతో ఇద్దరు విద్యార్థులు మృతిచెందగా మరో ఇ ద్దరు గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నా రు. కరీంనగర్రూరల్ పోలీసుల కథనం మేరకు క రీంనగర్లోని అజ్మత్పురాకు చెందిన సయ్యద్ అ త్యాబ్(21) తన స్నేహితులైన అబ్దుల్ రహమాన్(19), అద్నాన్, అబ్రార్ హౌసింగ్బోర్డు కాలనీ నుంచి స్విఫ్ట్ డిజైర్ కారులో గురువారం రాత్రి 10.30గంటలకు టీ తాగేందుకు బొమ్మకల్ బైపాస్రోడ్డులో బయల్దేరారు. అత్యాబ్ వేగంగా కారు నడుపుతూ వీ కన్వెన్షన్ సమీపంలో ఎదురుగా రోడ్డుపై ఆగిన లారీ ని బలంగా ఢీకొట్టాడు. కారులోని నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని స్థానికులు, పోలీసులు కారులోంచి బయటకు తీశారు. అత్యాబ్ను చల్మెడ ఆనందరావు ఆస్పత్రికి తరలించగా రాత్రి 11గంటలకు మృతిచెందాడు. మిగితా ముగ్గురిని ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ అబ్ధుల్ రహమాన్ అర్ధరాత్రి ఒంటిగంటకు మృతిచెందాడు. మిగితా ఇద్దరిని మెరుగైన చికిత్స కోసం ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. మృతులు ఇద్దరు బీటెక్, గాయపడిన వారు ఇంటర్ చదువుతున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని శుక్రవారం కరీంనగర్ సీపీ గౌస్ఆలం, రూరల్ ఏసీపీ విజయ్కుమార్, సీఐ నిరంజన్రెడ్డిలు పరిశీలించారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. సయ్యద్ అత్యాబ్(ఫైల్)అబ్దుల్ రహమాన్(ఫైల్) -
భట్టి గారు.. ఈ సమస్యకు పరిష్కారం చూపండి
● ‘సాక్షి’ కథనాన్ని ‘ఎక్స్’ ద్వారా డిప్యూటీ సీఎంకు ట్వీట్మల్లాపూర్: మల్లాపూర్కు చెందిన వృద్ధురాలు ముష్కరి గంగామణి గ్రామసభలో నా 20 గుంటల వ్యవసాయ భూమిలో ఎలాంటి సమాచారం ఇవ్వకుండా 8విద్యుత్ స్తంభాలు వేసిండ్రు అంటూ తన ఆవేదనను వెల్లడిస్తూ ట్రాన్స్కో ఏఈ వినీత్రెడ్డిని వేడుకుంటున్న కథనం శుక్రవారం ‘సాక్షి’లో ‘‘కాల్మొక్త సారూ.. కనికరించండి’ శీర్షికన ప్రచురితమైంది. ఈ కథనాన్ని టీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు ఎక్స్ వేదికగా డిప్యూటీ సీఎం, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్కకు ట్విట్ చేశారు. విద్యుత్శాఖ మంత్రి భట్టి గారూ.. ఈ సమస్యకు పరిష్కారం చూపండి అంటూ 20 గుంటల భూమిలో ఇష్టరీతిన స్తంభాలు వేస్తే సాగుకి నాగలి ఎట్టా తిరుగుతది? పంట ఎట్ల పండుతది? అంటూ డిప్యూటీ సీఎం బట్టితో పాటు మాజీ మంత్రి కేటీఆర్కు, సీఎంవో కార్యలయానికి పోస్టు చేశారు. -
5న గూడూరి పురస్కారం
● పురస్కారానికి ఎంపికై న స్వర్ణ కిలారిసిరిసిల్ల అర్బన్: ప్రసిద్ధ తెలంగాణ కథా రచయిత గూడూరి సీతారాం యాదిలో గూడూరి ఫౌండేషన్–మారసం కథా పురష్కారం ఏటా అందజేస్తున్నారు. ఇందులో భాగంగానే 2024 పురస్కారానికి రచయిత్రి, అనువాదకులు స్వర్ణ కిలారి రాసిన ‘నల్ల బంగారం’ కథల పుస్తకం ఎంపికై ందని గూడూరి ఫౌండేషన్ నిర్వాహకులు ఎలగొండ రవి, మారసం కార్యదర్శి ఆడెపుల లక్ష్మణ్ తెలిపారు. ఈ పురస్కారాన్ని 5 ఏప్రిల్, 2026న సిరిసిల్లలోని డాక్టర్ సినారె విజ్ఞాన మందిరం, జిల్లా గ్రంథాలయంలో జరిగే సభలో పురస్కారం ప్రధానం చేయనున్నారు. తెలంగాణ జీవితాలు, బొగ్గుబాయి బతుకులను ‘స్వర్ణ కిలారి’ నల్లబంగారం కథలుగా రాసినట్లు తెలిపారు. గతంలో ఈ పురస్కారాలు వరుసగా పూడూరి రాజిరెడ్డి, డాక్టర్ సూర్య ధనంజయ్, పిన్నమశెట్టి కిషన్ అందుకున్నట్లు తెలిపారు. -
గ్యాస్ కొరతతో ఇబ్బందులు
మల్లాపూర్: పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో జగిత్యాల జిల్లాలో గ్యాస్ కొరతతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలోని ఇండెన్ గ్యాస్ ఏజెన్సీ వద్ద శుక్రవారం ఖాళీ సిలిండర్లతో వినియోగదారులు బారులుతీరారు. గ్యాస్ సిలిండర్ల స్టాక్ వచ్చిందనే సమాచారంతో వినియోగదారులు ఉదయాన్నే ఏజెన్సీ కార్యాలయానికి చేరుకున్నారు. అందరూ ఒకేసారి గ్యాస్ బుక్ చేసుకోవడంతో అందరికీ సరిపడా సిలిండర్లు అందక ఇబ్బందులు పడుతున్నారు. గంటల వ్యవధిలోనే పంపిణీ పూర్తవుతుండడంతో నో స్టాక్ బోర్డును పెట్టడంతో అప్పటి వరకు నీరిక్షించిన వినియోగదారులు ఖాళీ సిలిండర్లతోనే నిరసన వ్యక్తం చేశారు. ఏజెన్సీ నిర్వాహకులు రసీదులు ఇచ్చి స్టాక్ వచ్చిన తర్వాత తీసుకెళ్లాలనడంతో చేసేదేమి లేక వెనుదిరుతున్నారు. సిలిండర్ల సరఫరాలో అక్రమాలపై దృష్టి సారించి ఏజెన్సీలపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. -
‘ఎల్లంపల్లి’లో పడిపోతున్న నీటినిల్వలు
● ఎగువ పంపుహౌస్లకు కొనసాగుతున్న ఎత్తిపోతలు రామగుండం: పెద్దపల్లి జిల్లా ఎల్లంపల్లి శ్రీపాద ప్రాజెక్టులో నీటినిల్వలు సగానికిపైగా పడిపోయాయి. కాళేశ్వరం ఎత్తిపోతలు మూడేళ్లుగా నిలిచిపోవడంతో ఏటా మే చివరినాటికి ప్రాజెక్టులో నీటి మట్టం అడుగంటిపోతోంది. ఈసారి కూడా అదేపరిస్థితి పునరావృతమవుతోంది. అయితే, రెండేళ్లక్రితం ప్రాజెక్టు డెడ్ స్టోరేజీకి చేరుకోవడంతో అధికారులు ఆగమేఘాలపై ప్రత్యామ్నాయ చర్యలు తీసుకున్నారు. ఈసారి అలాంటి పరిస్థితి తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం మెరుగైన పరిస్థితి హైదరాబాద్ ప్రజల తాగునీటి అవరాల కోసం అంతర్గాం మండలం బ్రాహ్మణపల్లి పంపుహౌస్ నుంచి 6.6 కేవీ సామర్థ్య కలిగిన ఆరు విద్యుత్ మోటార్లతో ప్రతీరోజు 56 క్యూసెక్కులు(0.03 టీఎంసీ)లు తరలిస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 148 మీటర్లు కాగా శుక్రవారం 144.50 మీటర్ల ఉంది. 11.65 టీఎంసీలు నీరునిల్వ ఉంది. గతేడాది ఇదేరోజు నీటిమట్టం 143.42 మీటర్లు, నీటినిల్వలు 9.67 టీఎంసీలు ఉన్నాయి. గతేడాదితో పోల్చితే రెండు టీఎంసీలు అధికంగా ఉండడం ఊరటనిచ్చే అంశం. కొనసాగుతున్న ఎత్తిపోతలు ఎల్లంపల్లి నుంచి ఎన్టీపీసీ 242 క్యూసెక్కులు, గూడెం పంపుహౌస్కు 290 క్యూసెక్కులు, హైదరాబాద్కు 300 క్యూసెక్కులు పంపింగ్ చేస్తున్నారు. ప్రాజెక్టులోకి 1,251 క్యూసెక్కులు ఇన్ఫ్లో ఉంది. అధికారుల ప్రత్యేక దృష్టి ఎల్లంపల్లిలో నీటినిల్వల లభ్యతపై హైదరాబాద్ మెట్రో అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. రెండేళ్ల క్రితం డ్యాంలో నీటినిల్వలు అడుగంటిపోయాయి. పంపుహౌస్లోని విద్యుత్ మోటార్లకు నీరు అందలేదు. లోతట్టులోని నీటి నిల్వల నుంచి ప్రత్యేక పైపులైన్ నిర్మించి మోటార్లకు అనుసంధానించారు. తద్వారా తాగునీటి పంపింగ్ సులువయ్యింది. ఈసారి ఆ పరిస్థితి తలెత్తకుండా అప్రమత్తంగా ఉన్నారు. -
కాలువలోపడి యువకుడి మృతి
పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి మండలం బొంపల్లి గ్రా మానికి చెందిన కొంతం నాగరాజు(28) ఎస్సారెస్పీ కాలువలో పడి దుర్మరణం పాలయ్యాడు. నాగరాజు ద్విచక్రవాహనం, చెప్పులు చందపల్లి కెనాల్ వద్ద లభించగా.. మృతదేహం ముత్తారం గ్రామశివారులో కనుగొన్నట్టు ఎస్సై మల్లేశ్ తెలిపారు. మృతుడి తల్లి రాధమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు పేర్కొన్నారు. కాగా, తన కుమారుడి మృతిపై అనుమానాలు ఉన్నట్టు రాధమ్మ పేర్కొనగా.. పూర్తిస్థాయి పోలీసుల విచారణలో వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశముందని గ్రామస్తులు చెబుతున్నారు. చిగురుమామిడి: హైనా దాడిలో లేగదూడలు, మేక పిల్లలు మృతిచెందాయి. మండలంలోని సుందరగిరి గ్రామానికి చెందిన రైతు గండికోట పెద్దశ్రీనివాస్ వ్యవసాయ బావి వద్ద రోజు మాదిరిగానే గురువారం సాయంత్రం పాడిఆవులు, లేగదూడలు, మేక పిల్లలను కట్టేసి ఇంటికి వచ్చాడు. శుక్రవారం ఉదయం వెళ్లేసరికి లేగదూడలు, మేక పిల్లలు మృతి చెంది ఉన్నాయి. సమాచారం అందుకున్న ఫారెస్టు సెక్షన్ అధికారి శేఖర్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. హైనా దాడిలో మృతిచెందవచ్చని పరిహారం కోసం మీసేవాలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కాగా బాధిత రైతును ప్రభుత్వం ఆదుకోవాలని పలువురు కోరారు.ఆకట్టుకున్న ‘అగ్గిపెట్టెలో చీర’సిరిసిల్ల: సిరిసిల్ల చేనేత కళాకారుడు విజయ్కుమార్ నేసిన అగ్గిపెట్టెలో ఇమిడే చీర ఆకట్టుకుంది. హైదరాబాద్లోని ఏషియన్ టెక్స్టైల్ కాన్ఫరెన్స్లో సిరిసిల్ల చేనేత కళాకారుడు నల్ల విజయ్కుమార్ నేసిన అగ్గిపెట్టెలో ఇమిడిపోయే ఇక్కత్ పట్టు చీరలను ప్రదర్శించారు. వివిధ దేశాల నుంచి ప్రముఖులు ఈ కాన్ఫరెన్స్కు రాగా.. సిరిసిల్ల చేనేత కళా వైభవాన్ని మరోసారి ప్రపంచానికి పరిచయం చేశారు. చీర పొడవు ఆరు మీటర్లు, వెడల్పు 48 ఇంచులు. దీన్ని పూర్తి పట్టు దారాలు, జరీతో తయారు చేశారు. బరువు 250 గ్రాములు ఉంది. రెగ్యులర్గా వీక్లీ ఎక్స్ప్రెస్ రైళ్లు రామగుండం: పెద్దపల్లి–నిజామాబాద్ నుంచి నడిచే నాందేడ్–తిరుపతి(07015/16), నాందేడ్–ధర్మవరం(07189/90) వారాంతపు ఎక్స్ప్రెస్ రైళ్లను క్రమబద్ధీకరిస్తూ దక్షిణ మధ్య రైల్వే అధికారులు శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. రైళ్లకు కొత్త నంబర్లు కేటాయించారు. ప్రస్తుత రైలు నంబరు 17633/34(నాందేడ్–తిరుచానూరు –తిరుపతి) ఇరువైపులా వారాంతపు రైలుగా రాకపోకలు సాగించనుంది. దీనికి బాసర, నిజామాబాద్, కోరుట్ల, లింగంపేట, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జమ్మికుంట, వరంగల్, మహబూబ్బాద్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట, తిరుపతి స్టేషన్లలో హాల్టింగ్ సౌకర్యం కల్పించారు.టాటాఏస్లో మంటలుతిమ్మాపూర్: కరీంనగర్ నుంచి సిద్దిపేటకు ప్రయాణికులతో వెళ్తున్న టాటాఏస్ ఆటో తిమ్మాపూర్ మండలం ఇందిరానగర్ వద్ద మంటల్లో కాలిపోయింది. ఆటోలో ఇంజిన్ నుంచి పొగలు రావడంతో డ్రైవర్ హైమద్ పాషా ఆటోను పక్కకు ఆపి, అందులోని ప్రయాణికులను సురక్షితంగా దింపాడు. ఇంజిన్ను పరిశీలిస్తుండగా మంటలు మరింత ఎక్కువయ్యాయి. వెంటనే పోలీసులకు, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. కరీంనగర్ నుంచి వచ్చిన ఫైర్ ఇంజిన్ మంటలను ఆర్పేసింది. అప్పటికే ఆటో పూర్తిగా కాలిపోయిందని డ్రైవర్ అహ్మద్ పాషా తెలిపారు. ప్రమాద సమయంలో ఆటోలో ఆరుగురు ప్రయాణికులు ఉన్నారు. -
గుండెపోటుతో సీనియర్ పాత్రికేయుడి మృతి
చొప్పదండి: పట్టణానికి చెందిన సీనియర్ పాత్రికేయుడు సంబోజి శేఖర్ (48) శుక్రవారం ఉదయం గుండెపోటుకు గురై మృతి చెందాడు. వేకువజామున మూడు గంటలకు గుండెపోటుకు గురవగా కుటుంబ సభ్యులు కరీంనగర్లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతుండగా, ఉదయం ఆరు గంటలకు మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. అన్నకు కూడా గుండెపోటే.. శేఖర్ సోదరుడు సంబోజి విజయ్ కూడా గతంలో గుండెపోటుతో మృతి చెందాడు. 90వ దశకంలో పాత్రికేయ వృత్తిలో పని చేసిన విజయ్ అనంతరం న్యాయవాద వృత్తిలో కొనసాగుతూ 2002లో గుండెపోటుకు గురై మృతి చెందాడు. అన్నదమ్ములిద్దరు గుండెపోటుకు గురై మృతి చెందడంతో వృద్ధ తల్లిదండ్రులు కన్నీరు, మున్నీరుగా విలపిస్తున్నారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్లో శేఖర్ భౌతిక కాయానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సాయంత్రం జరిగిన అంత్యక్రియల్లో ప్రజా ప్రతినిధులు, అంబేద్కర్ సంఘాల నాయకులు, పాత్రికేయులు, పాఠశాలల ఉపాధ్యాయులు, కరస్పాండెంట్లు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు. -
నిజాయతీ చాటుకున్న వ్యాపారి
యైటింక్లయిన్కాలనీ: పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్లోని యైటింక్లయిన్కాలనీలో రెగ్జిన్ బ్యాగులు కుట్టే హాపిజిల్లాఖాన్ ఓ బ్యాగులో లభించిన దాదాపు 5 తులాల బంగారు నెక్లెస్ను యజమానికి అందించి నిజాయతీ చాటుకున్నారు. బ్యాగు కుట్టుమని తోటపల్లి యాదగిరిరావు ఆయనకు ఇటీవల అప్పగించాడు. దానిని కుడుతున్న క్రమంలో 5 తులాల నెక్లెస్ లభ్యమైంది. దానిని వెంటనే యాదగిరి రావుకు ఫోన్చేసి అప్పగించారు. ఖాన్కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈమేరకు స్థానిక అబ్దుల్ కలాం స్టేడియంలో వాకర్స్, యోగా సోసియేషన్ సభ్యులు శుక్రవారం ఖాన్ను అభినందించి సన్మానించారు. ఈకార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రేసవేన కేశవులు, ఉపాధ్యక్షుడు సంపత్, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో మాజీ కౌన్సిలర్ దుర్మరణం రామగుండం: పెద్దపల్లి జిల్లా రామగుండం రైల్వే వంతెన సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మాజీ కౌన్సిలర్ రంగు భారతి(50) దుర్మరణం చెందారు. అంతర్గాం నుంచి గోదావరిఖని వెళ్తుండగా స్థానిక రైల్వే వంతెనపై ద్విచక్ర వాహనం అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. దీంతో రంగు భారతి–బ్రహ్మం దంపతులు కిందపడిపోయారు. భారతి ఎగిరి కిందపడడంతో తలకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే హైదరాబాద్కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందారు. భర్త బ్రహ్మం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొన్నట్లు ఎస్సై సంధ్యారాణి తెలిపారు. రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి మండలం రాఘవాపూర్ గ్రామానికి చెందిన రెహనా(56) శుక్రవారం రోడ్డు దాటుతుండగా ద్విచక్రవాహనం ఢీకొని అక్కడికక్కడే మృతి చెందింది. తనకు అవసరమైన కిరాణ సామగ్రి కొనుగోలు చేసి తిరిగి ఇంటికి వచ్చేందుకు రోడ్డు దాటుతుండగా బైక్ ఢీకొట్టిందని స్థానికులు తెలిపారు. హుజూరాబాద్రూరల్: ఇప్పలనర్సింగాపూర్కు చెందిన కస్తూరి రాధ(47) శుక్రవారం ప్రమాదవశాత్తు కాకతీయ ప్రధాన కాలువలో పడి మృతి చెందిందని సీఐ కరుణాకర్ తెలిపారు. బట్ట లు ఉతికేందుకు కెనాల్ వద్దకు వెళ్లగా కాలు జారి రాధ కాలువలో పడిపోయింది. నీటి ఉధృతికి కొట్టుకపోయి పెద్దపాపయ్యపల్లి శివారులో తేలడంతో గ్రామస్తులు పైకి తీసుకువచ్చారు. అప్పటికే ఆమె మృతి చెందిందని, కుమారుడు హరికృష్ణ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. -
ఆర్టీసీ డ్రైవర్పై ఆటో డ్రైవర్ దాడి
జగిత్యాలక్రైం: జగిత్యాల కొత్తబస్టాండ్లో సైడ్ ఇవ్వలేదని ఆర్టీసీ డ్రైవర్పై ఆటో డ్రైవర్ దాడిచేశాడు. వరంగల్ పెర్కవాడకు చెందిన మహ్మద్ జలీల్ ఆర్టీ సీ డ్రైవర్ శుక్రవారం విధుల్లో భాగంగా వరంగల్ డి పో నుంచి నిజామాబాద్కు బస్సు తీసుకుని వెళ్తుండగా జగిత్యాలలో ఆటో నడుపుతున్న ముస్కు ప్రదీ ప్ బస్సు వెనుక నుంచి హారన్ కొట్టగా సైడ్ ఇవ్వలేదు. దీంతో ప్రదీప్ ఆగ్రహం చెందుతూ బస్సును వెంబడించి కొత్తబస్టాండ్లోకి వచ్చిన తర్వాత బ స్సు డ్రైవర్ మహ్మద్ జలీల్ను దుర్భాషలాడుతూ దాడిచేశాడు. దీంతో అతడి ముఖానికి బలమైన గా యాలవడంతో ఆర్టీసీ అధికారులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఆటో డ్రైవర్ ముస్కు ప్రదీప్పై కేసు నమోదు చేసినట్లు పట్టణ ఎస్సై సుప్రియ తెలిపారు. -
తండ్రికి తనయల కన్నీటి వీడ్కోలు
● మద్దిమల్లలో విషాదం ● మా నాన్నలా అర్ధంతరంగా వెళ్లొద్దు : రిషిక కన్నీటి విన్నపంవీర్నపల్లి(సిరిసిల్ల): ఆ కుటుంబానికి అతడే ఆధారం. ఆ పిల్లలకు అతడే సర్వస్వం. కానీ విధి ఆడిన నాటకంలో ఆ ముగ్గురు ఆడపిల్లలు అనాథలయ్యారు. అనారోగ్యంతో తండ్రి మరణించగా.. కూతురే తండ్రికి తలకొరివి పెట్టి కన్నీటి వీడ్కోలు పలికిన ఘటన రాజన్నసిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం మద్దిమల్లలో విషాదం నింపింది. మద్దిమల్లకు చెందిన కడవ శ్రీబాబు(35) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. పరిస్థితి విషమించడంతో కరీంనగర్లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున మృతిచెందాడు. శ్రీబాబుకు భార్య అనిత, ముగ్గురు కుమార్తెలు రిషిక(8వ తరగతి), లాస్య(7వ తరగతి), నిత్యశ్రీ(3వ తరగతి) ఉన్నారు. తండ్రి మరణంతో ఆ కుటుంబం వీధినపడింది. కలచివేసిన కూతుళ్ల రోదనలు శ్రీబాబుకు కుమారులు లేకపోవడంతో పెద్దకూతురు రిషిక తలకొరివి పెట్టింది. తమకు అండగా ఉంటాడనుకున్న తండ్రి ఇలా మధ్యలోనే వదిలివెళ్లడంతో ఆ చిన్నారుల రోదనలు మిన్నంటాయి. అంత్యక్రియల సమయంలో శ్రీబాబు పెద్దకుమార్తె రిషిక రోదించిన తీరు కలచివేసింది. ‘నాన్న.. ఒక్కసారి లేచి చూడు నాన్న. మేము ఎంత ఏడుస్తున్నామో. మా వంటి పిల్లలకు తండ్రి ప్రేమను దూరం చేయకండి.’ అంటూ రోదించిన తీరు కలచివేసింది. -
త్వరలో ప్రారంభిస్తాం
సింగరేణి కార్మిక కుటుంబాలకు కార్పొరేట్ వైద్యం అందించడమే లక్ష్యం. ఇప్పటికే అత్యాధునిక వైద్యం అందుబాటులోకి వచ్చింది. గుండె సంబంధిత వ్యాధులకు వైద్యం, మోకాలిచిప్ప మార్పిడి ఆపరేషన్ కూడా చేయాలని నిర్ణయించాం. దశలవారీగా మిగతా ఆస్పత్రుల్లో కార్పొరేట్ వైద్య సేవలు అందిస్తాం. గోదావరిఖని సింగరేణి ఏరియా ఆస్పత్రిలో సాధ్యమైనంత త్వరగా క్యాథ్ల్యాబ్ ప్రారంభిస్తాం. ఇటీవల దీనిపై సమీక్షించాం. – కిరణ్రాజ్కుమార్, చీఫ్ మెడికల్ ఆఫీసర్, సింగరేణి -
పరిశీలిస్తూ.. పరిష్కరిస్తూ..
● డివిజన్ బాటకు శ్రీకారం చుట్టిన మేయర్ మహంకాళి స్వామికోల్సిటీ: రామగుండం మేయర్ మహంకాళి స్వామి బుధవారం డివిజన్ బాటకు శ్రీకారం చుట్టారు. స్థానిక 3వ డివిజన్లోని ప్రశాంత్ నగర్, వినాయకనగర్, దొడ్డి కొమురయ్యనగర్, శ్రీనగర్ కాలనీ తదితర ప్రాంతాల్లో కార్పొరేటర్ వడ్లూరి రవి, అధికారులతో కలిసి పర్యటించారు. ప్రజలను పలకరిస్తూ, సమస్యలపై ఆరా తీస్తూ ముందుకు సాగారు. స్థానికులు తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఆయన సూచన మేరకు అధికారులు.. శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. మురుగునీటి కాలువల్లో యంత్రాలతో పూడిక తొలగించారు. సుమారు 10 వీధిదీపాలు వెలిగేలా చర్యలు తీసుకున్నారు. తాగునీటి సరఫరాలో సమస్యలనూ పరిష్కరించారు. నివాసాలపై వేలాడుతున్న కరెంట్ తీగలను సవరించాలని ట్రాన్స్కో అధికారులకు సూచించారు. కాలువల్లో చెత్త పడవేస్తున్నారనే ఫిర్యాదు మేరకు హోటల్ నిర్వాహకులకు నోటీసులు జారీచేశారు. డిప్యూటీ కమిషనర్ వెంకటస్వామి, ఎస్ఈ గురువీర, ఈఈ పీవీ రామన్, డీఈఈ మనోజ్, చంద్రమౌళి, రాంజీ, పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ అధికారులు మౌనిక, కిశోర్, టీపీఎస్ నవీన్, సూపరింటెండెంట్ శ్రీనివాస్, శానిటరీ ఇన్స్పెక్టర్లు నాగ భూషణం, సంపత్ పాల్గొన్నారు. -
రైల్వే టికెట్ బుకింగ్కు కొత్త నిబంధనలు
రామగుండం: భారతీయ రైల్వేలో టికెట్ బుకింగ్, రద్దు, రిఫండ్ తదితర సేవల్లో చేసిన మార్పులు ఈనెల ఒకటో తేదీ నుంచి అమలులోకి వచ్చాయి. తద్వారా టికెట్ బ్లాక్ మార్కెటింగ్ను అరికట్టడం, ప్రయాణికులకు సరిపడా సీట్లు అందించడం సులభతరం కానున్నాయి. కొత్త నిబంధనలు ఇవీ.. ● రైలు బయలుదేరడానికి 8 గంటల్లోపు కన్ఫర్మ్ అయిన టికెట్లను రద్దు చేస్తే రిఫండ్ ఉండదు. రైలు బయలుదేరు సమయానికి 8–24 గంటల మధ్య రద్దు చేసుకుంటే 50 శాతం, 24–72 గంటలకు ముందు రద్దు చేసుకుంటే రద్దు చార్జి మినహా మొత్తం రిఫండ్ చేస్తారు. ● రైల్వే రిజర్వేషన్ చార్ట్ ప్రిపరేషన్ సమయాన్ని 4 గంటల నుంచి 9–18 గంటలకు పెంచారు. ఫలితంగా ప్రయాణానికి 18 గంటల ముందే రిజర్వేషన్ సీటింగ్ పొజిషన్ తెలుస్తుంది. ఒకవేళ టికెట్ కన్ఫర్మ్ కాకపోతే ప్రత్యామ్నాయం చూసుకునే వీలుంటుంది. ● బోర్డింగ్ స్టేషన్ మార్పు చేసుకునేందుకు రైలు బయలుదేరడానికి 30 నిమిషాల ముందు వరకు తాము ఎక్కబోయే రైల్వేస్టేషన్ను మార్పు చేసుకునే వీలు కల్పించారు. ఇది ప్రయాణికులకు ఎంతోసౌకర్యంగా ఉంటుంది. ఉదా: శబరిమలై యాత్రికులు ఢిల్లీ నుంచి త్రివేండ్రం రిజర్వేషన్ చేసుకుని బోర్డింగ్ రామగుండం నమోదు చేస్తారు. తద్వారా రైల్వేశాఖ ఢిల్లీ నుంచి రామగుండం వరకు మరో ప్రయాణికుడికి సీటు కన్ఫర్మ్ చేసుకోవడంతో రైల్వేశాఖకు అదనపు ఆదాయం సమకూరుతుంది. ● గతంలో ప్రయాణికుడు తీసుకున్న బుకింగ్ కౌంటర్లోనే తమ టికెట్లను రద్దు చేసుకునే అవకాశం ఉండేది. నూతన విధానం ద్వారా ఏ రైల్వేస్టేషన్లోనైనా రద్దు అవకాశం ఉంటుంది. నిమిషం వ్యవధిలో బుకింగ్ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచారు. అమలులోకి వచ్చిన రూల్స్ -
ఉద్యోగ విరమణ సన్మానం
కాల్వశ్రీరాంపూర్: మండలంలోని గంగారం గ్రామానికి చెందిన వరంగల్ పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ డాక్టర్ బైరి ప్రభాకర్ మార్చి 31న ఉద్యోగ విరమణ పొందారు. ఈ సందర్భంగా వరంగల్ పాలిటెక్నిక్ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో ప్రభాకర్–వసంతాదేవి దంపతులను కాల్వశ్రీరాంపూర్ మాజీ ఎంపీపీ గోపగోని సారయ్యగౌడ్ సన్మానించారు. మాజీ సర్పంచులు సత్యనారాయణరెడ్డి, సతీశ్, నాయకులు, గుడ్ల శ్రీనివాస్, బైరి రాజవీరు. సంపత్, ఓదెలు, మండలంలోని వివిధ గ్రామాల ప్రజా ప్రతినిధులు, గంగారం ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు ఉన్నారు. -
రైల్వే కార్మికుల నిరసన
రామగుండం: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న లేబర్ కోడ్లను వ్యతిరేకిస్తూ రామగుండంలో రైల్వే కాంట్రాక్టు కార్మికులు బుధవారం నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు భిక్షపతి మాట్లాడుతూ, కేంద్రప్రభుత్వం 29 కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్కోడ్లు అమలులోకి తీసుకు రావడం సరికాదన్నారు. వీటిని రద్దు చేయకేంటే పోరాటాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. తెలంగాణ రైల్వే కాంట్రాక్ట్, క్యాజువల్ అండ్ ఆల్ హమాలీ వర్కర్స్ యూనియన్ అనుబంధ సీఐటీయూ ప్రధాన కార్యదర్శి బొంకూరి మహేశ్, కోశాధికారి తిరుపతి, సరళ, రాధ, ఈదునూరి బాబు, అవినాష్, శ్రీకాంత్, దేవేందర్, సుక్క కుమార్, బాలాజీ, సుమన్, అమృత, పద్మ, మహేశ్వరి తదితరులు ఉన్నారు. లేబర్ కోడ్లు ఎత్తివేయాలి పెద్దపల్లి: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్లు ఎత్తివేసే వరకు ఉద్యమం ఆగదని సీఐటీయూ, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శులు ఎరవెల్లి ముత్యంరావు, కడారి సునీల్, బి.అశోక్ అన్నారు. లేబర్ కోడ్లను రద్దుచేయాలనే డిమాండ్తో తొలుత జిల్లాకేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. లేబర్ కోడ్లు రద్దుచేయాలని, లేనిపక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నాయకులు బిక్షపతి, సీపెల్లి రవీందర్, జ్యోతి, తాండ్ర అంజయ్య, పూసల రమేశ్, పేర్క రాయమల్లు, మేకల సతీశ్, శివరామకృష్ణ, యాకుబ్, సాగర్, నరేశ్, మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు. టీపీసీసీ సాంస్కృతిక సేన కార్యవర్గం పెద్దపల్లి: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సాంస్కృతిక సేన జిల్లా అధ్యక్షుడిగా పిట్ట రమేశ్, ప్రధాన కార్యదర్శిగా తూండ్ల రాజయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. స్థానిక ప్రెస్క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రమేశ్, రాజయ్య మాట్లాడుతూ, రాష్ట్ర అధ్యక్షుడు చక్రాల రఘు ఆదేశాల మేరకు జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నామన్నారు. గౌరవ అధ్యక్షుడిగా బుర్రగడ్డ రవి, ఉపాధ్యక్షుడిగా పోలివేణి శ్రీనివాస్, కోశాధికారిగా దాసరి శ్రీనివాస్, ప్రచార కార్యదర్శిగా పూసాల రమణాచారి, ముఖ్య సలహాదారుగా మంద భాస్కర్ యాదవ్, సహాయక కార్యదర్శి బియ్యన్న తిరుపతి, మహిళా విభాగం అధ్యక్షురాలిగా కమేర పద్మ, ప్రధాన కార్యదర్శి కోండ్ర సునీత, కార్యవర్గ సభ్యులుగా కన్నూరి రాజయ్య, తాండ్ర మహేశ్, భర్ల తిరుపతిని ఎన్నుకున్నామని తెలిపారు. పెద్దపల్లి: సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలో 20 గుంటల భూమిని మున్నూరుకాపు సంఘం భవనానికి కేటాయించాలని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావును బుధవారం కలిసి వినతిపత్రం అందజేశారు. మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధాకృష్ణ, సింగిల్విండో మాజీ చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, మున్నూరుకాపు సంఘం అధ్యక్షుడు కందుకూరి ముత్యాలు, ప్రధాన కార్యదర్శి అమిరిశెట్టి రాజలింగం, వార్డు కౌన్సిలర్ గాజుల రాజమల్లయ్య, కామ సంపత్ ఉన్నారు. -
అయ్యప్ప ఆలయంలో పూజలు
పెద్దపల్లి: సుల్తానాబాద్ పట్టణంలోని శాస్త్రినగర్ అయ్యప్ప స్వామి ఆలయంలో బుధవారం ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు గూడ రమేశ్శర్మ, సాయినాథ్ ఆధ్వర్యంలో పత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నప్రసాద వితరణ చేశారు. మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధాకృష్ణ, ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు సాయిరి మహేందర్, మిట్టపల్లి మురళి, మార్కెట్ కమిటీ చైర్మన్ మినుపాల ప్రకాశ్రావు, కందుకూరి ప్రకాశ్, ముస్త్యాల రవీందర్, వేగోళం అబ్బయ్య,రాజు, మాజీ సర్పంచ్ పద్మ, సాంబయ్య, తుమ్మ రాములు, మేరుగు వెంకటేశ్, వేగోళం శంకర్, అల్లంకి ఆనందం పాల్గొన్నారు. నీరుకుల్ల రోడ్డులో ఉన్న అయ్యప్పస్వామి ఆలయంలో అభిషేకం ప్రత్యేక పూజలు నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధాకృష్ణ, సుల్తానాబాద్ సీఐ సుబ్బారెడ్డి, ఎస్ఐ చంద్రకుమార్ను సన్మానించారు. -
పకడ్బందీగా జనగణన
● 15లోగా హెచ్ఎల్బీ నిర్ధారణ పూర్తి ● కలెక్టర్ కోయ శ్రీహర్ష పెద్దపల్లి: జిల్లాలో జనగణన – 2027 పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. హౌస్లి స్టింగ్ బ్లాక్(హెచ్ఎల్బీ) నిర్ధారణ ప్రక్రియను ఈనెల 15లోగా పూర్తిచేయాలన్నారు. జనగణన –2027పై సంబంధిత అధికారులు, అదనపు కలెక్టర్ అరుణశ్రీతో కలిసి కలెక్టరేట్లో బుధవారం సమీక్షించారు. ప్రస్తుతం హౌస్ లిస్టింగ్ బ్లాక్ మే 10న ప్రారంభమవుతుందని, ప్రతీ 300 ఇళ్ల, 800 జనాభాను ఒకబ్లాక్గా హెచ్ఎల్బీ నిర్దేశించి వివరాలు సేకరిస్తామని, ఇందుకోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయాలని సూచించారు. హెచ్ఎల్బీ పరిధిలోని నివాసాలు, ఆలయాలు, ఇతర ప్రార్థనామందిరాలు, ఆటస్థలాలు, ఆస్పత్రులు తదితర వివరాలు పకడ్బందీగా సేకరించాలని సూచించారు. జనగణన చాలాముఖ్యమైన అంశమని, నిర్లక్ష్యం చేయవద్దని హెచ్చరించారు. హౌస్ లిస్టింగ్ కోసం జిల్లావ్యాప్తంగా 1,400 మంది ఎన్యూమరేటర్లు అవసరం ఉంటుందని అంచనా వేశామని తెలిపారు. ఆర్డీవోలు గంగయ్య, సురేశ్ తదితరులు పాల్గొన్నారు. హింసకు గురయ్యే మహిళలకు సఖి సేవలు హింసకు గురవుతున్న మహిళలకు సఖి సెంటర్ ద్వారా సేవలు అందించాలని కలెక్టర్ శ్రీహర్ష సూచించారు. రంగంపల్లిలోని సఖి సెంటర్ను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. బాధితులకు అవసరమైన కౌన్సెలింగ్ ఇవ్వాలని, కేసులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని న్యాయ సలహా అందించాలని సూచించారు. -
నేడు 60 డివిజన్లలో సభలు
● బల్దియా కమిషనర్ అరుణశ్రీ కోల్సిటీ: రామగుండం నగరంలో గురువారం ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ చేపడతామని కమిషనర్ అరుణశ్రీ తెలిపారు. ఉదయం 10 గంటలకు 60 డివిజన్లలో ఏకకాలంలో వార్డు సభలు నిర్వహిస్తామన్నారు. సంక్షే పథకాలు, సమస్యలు గుర్తించి పరిష్కారంపై చర్చిస్తామన్నారు. ఇందిరమ్మ ఇళ్లు, గృహజ్యోతి, చేయూత పింఛన్లు, షాదీముబారక్, కొత్తరేషన్ కార్డులు తదితర పథకాలపై చర్చ ఉంటుందని తెలిపారు. సభలపై సమీక్ష సభల నిర్వహణపై బల్దియా అధికారులు, సిబ్బందితో నగరపాలక సంస్థ కార్యాలయంలో కమిషనర్ అరుణశ్రీ బుధవారం స్నాహక సమావేశం నిర్వహించారు. సభసజావుగా జరగడానికి ఏర్పాట్లు చేయాలని సూచించారు. సమావేశంలో డిప్యూటీ కమిషనర్ వెంకటస్వామి, ఎస్ఈ గురువీర, ఈఈ పీవీ రామన్, అసిస్టెంట్ కమిషనర్ వెంకటేశ్వర్లు, సూపరింటెండెంట్ శ్రీనివాస్ పాల్గొన్నారు. -
పోటీపడాలి.. సీటు సాధించాలి
పెద్దపల్లి: కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాల్లో ఇంటర్మీడియట్ పూర్తిచేసిన బాలికలు వివిధ పోటీపరీక్షలు రాసేందుకు రాష్ట్రప్రభుత్వం శిక్షణ ఇస్తోంది. కేజీబీవీల్లో అధిక సంఖ్యలో పేద విద్యార్థునులే విద్యాభ్యాసం చేస్తున్నారు. అర్హత, నైపుణ్యం ఉన్నా ప్రోత్సాహం లేక పోటీ పరీక్షలు రాయలేకపోతున్నారు. దీనిని గమనించి ప్రభుత్వం ఉన్నత విద్యలో కార్పొరేట్స్థాయిలో సీట్లు సాధించేలా తర్ఫీదు ఇస్తోంది. ఇందుకోసం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తోంది. ఉచితంగా నోట్బుక్కులు పంపిణీ చేస్తోంది. వైద్యం, ఇంజినీరింగ్పై ప్రత్యేక దృష్టి ఇంటర్ కోర్సులు పూర్తిచేసిన విద్యార్థులు నీట్, జేఈఈ, క్లాట్ వంటి రాష్ట్ర, జాతీయ పోటీపరీక్షల్లో ప్రతిభ చాటేందుకు నిపుణులతో శిక్షణ ఇప్పిస్తంది. వీరికోసం జూలపల్లిలో నీట్, రామగుండంలో జేఈఈ, సుల్తానాబాద్లో క్లాట్ కోచింగ్ ఇప్పిస్తోంది. ప్రతీ తరగతికి 40 మంది ఎంపిక ఎంపిక చేసిన కేజీబీవీల్లో ఆసక్తిగల విద్యార్థినులకు శిక్షణ ఇస్తారు. ఇందుకోసం ప్రతీ తరగతిలో 40 మందిని ఎంపికచేస్తారు. ఆన్లైన్, ఆఫ్లైన్ పద్ధతిన తర్ఫీదు ఇస్తారు. ఈ సందర్భంగా బాలికల అభివృద్ధి జిల్లా అధికారి కవిత మాట్లాడుతూ, గ్రామీణ విద్యార్థులు ఉన్నత విద్యలో మంచి కాలేజీల్లో సీట్లు సాధించడం లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామన్నారు. పోటీ పరీక్షల్లో రాణించేందుకు ప్రభుత్వం స్టడీ మెటీరియల్ అందిస్తోంని తెలిపారు. విద్యార్థులకు క్రమం తప్పకుండా మాక్ టెస్టులు నిర్వహిస్తూ నైపుణ్యం పెంచుతామని వివరించారు. పోటీపరీక్షలకు శిక్షణ ఎంపిక చేసిన బాలికలకు తర్ఫీదు -
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు కాసుల వర్షం
రామగుండం: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 16 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయలకు 2025–26 ఆర్థిక సంవత్సరంలో కాసుల వర్షం కురిసింది. కరీంనగర్, గంగాధర, సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్ రూరల్, భీమదేవరపల్లి, మల్యాల, కోరుట్ల, మంథని, సుల్తానాబాద్, హుస్నాబాద్, హుజూరాబాద్, రామగుండం, మెట్పల్లి, వేములవాడ, జగిత్యాలలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో 82,249 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ కాగా రూ.210.83 కోట్ల ఆదాయం సమకూరినట్లు అధికారులు తెలిపారు. నెల రిజిస్ట్రేషన్లు ఆదాయం (రూ.కోట్లలో) ఏప్రిల్ 6,754 రూ.18.64 మే 8,108 20.17 జూన్ 7,446 19.10 జూలై 6,962 16.71 ఆగస్టు 6,546 16.92 సెప్టెంబర్ 6,756 17.20 అక్టోబర్ 6,210 15.15 నవంబర్ 6,625 17.56 డిసెంబర్ 6,524 18.06 జనవరి 6,238 15.77 ఫిబ్రవరి 6,652 17.95 మార్చి 7,428 17.60 -
వలసజీవుల బతుకుచిత్రం
ఊరు లేవకముందే ఊళ్లకు పయనమై గాజులు, బొట్టుబిళ్లలు, ఇంటిసామాన్లు అమ్ముతున్నారు వలసజీవులు. జానెడు పొట్టకోసం అనేక తిప్పలు పడుతున్నారు. నాలుగు గుంజలు, నాలుగు కవర్లు ఉంటే చాలు.. గూడుగా మార్చుకొని జీవనం సాగిస్తున్నారు. సరిపడా గిన్నెలు, వంటకు కట్టెలు, నీళ్లకు క్యాన్లు, నేలపై చద్దర్లు, ఒంటిపై బట్టలు వాటిని ఆరేసేందుకు దండాలు.. ఇవీ వాళ్లగూడుకు ఆధారాలు. ఒకచోట ఆగకుండా కాలంతోపాటు పయనిస్తూ ఊరు చివరన చిన్నగుడారాలు ఏర్పాటు చేసుకుంటున్న వలసజీవుల కుటుంబాల బతుకుపోరాటం వర్ణణాతీతం. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం కుర్మపల్లి శివారులో వలసజీవన కుటుంబాల గూడు చిత్రం ‘సాక్షి’ కెమెరాకు ఇలా కనిపించింది. – సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి -
యువతకు ప్రాధాన్యం ఇవ్వాలి
పెద్దపల్లిరూరల్: రానున్న మండల, జిల్లాపరిషత్ ఎన్నికల్లో యువతకు ప్రాధాన్యం ఇవ్వాలని యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బొంకూరి అవినాష్ కోరారు. యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి ముత్యాల నరేశ్ అధ్యక్షతన జిల్లా కేంద్రంలో బుధవారం జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడారు. సంక్షేమ పథకాలను వివరిస్తూ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తున్నామని అన్నారు. ఈనెల 15న అసెంబ్లీ స్థాయి క్రికెట్ పోటీలను స్థానిక ప్రభుత్వ జూనియర్ కాలేజీలో నిర్వహిస్తున్నామని, క్రీడాకారులు పాల్గొనాలని ఆయన కోరారు. నాయకులు ప్రసాద్, రాజు, తిరుమలేశ్, అయుబ్, అభినయ్, మధుకర్, శ్రవణ్, రాజు, రాహుల్, అజయ్, దేవేందర్రెడ్డి, ఆరగొండ రాజ్కుమార్, రాకేశ్, గుర్రాల వాసు, స్వామి తదితరులు ఉన్నారు. ఆస్తిపన్నులో 5శాతం రాయితీ కోల్సిటీ: ముందస్తు ఆస్తిపన్ను చెల్లించే వారికోసం ప్రభుత్వం ఎర్లీబర్డ్ ఆఫర్ వర్తింపజేస్తోంది. 2026 –27 ఆర్థిక సంవత్సరానికి సంబందించిన ఆస్తిపన్ను ఈనెల 30వ తేదీలోగా చెల్లించిన వారికి ఎర్లీబర్డ్ పథకం ద్వారా పన్ను మొత్తంలో 5 శాతం రాయితీ కల్పిస్తున్నామని బల్దియా కమిషనర్ అరుణశ్రీ తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. జ్యోతినగర్: హేమలాంబ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయం మొదటి వార్షికోత్సవం సందర్భంగా అమ్మవారి పావనం, జోగు కార్యక్రమం బుధవారం ఘనంగా నిర్వహించారు. ఎన్టీపీసీ రామగుండం కృష్ణానగర్లోని మంథని మున్సిపాలిటీ కౌన్సిలర్ మాచిడి రాజుగౌడ్, ఎస్ఆర్ఎం కన్స్ట్రక్షన్ అధినేత మాచిడి మహేందర్గౌడ్ జోగు సమర్పించి పూజలు చేశారు. మేరుగు యాదగిరిగౌడ్, బాలసాని స్వామి గౌడ్, శ్రీనివాస్గౌడ్, విజయ్కుమార్గౌడ్, అధిక సంఖ్యలో గౌడ కులస్తులు తదితరులు పాల్గొన్నారు. సుల్తానాబాద్రూరల్: మండలంలోని మంచిరామిలో సర్పంచ్ ఉప్పు లక్ష్మి ఆధ్వర్యంలో కోతుల బెడద నియంత్రణకు బుధవారం సిబ్బందితో కొండెంగ వేషధారణ వేయించి వినూత్న ప్రయోగం చేశారు. సర్పంచ్ మాట్లాడుతూ గత సంవత్సరం కోతుల బెడద ఎక్కువగా ఉండడంతో గ్రామస్తులు భయందోళనకు గురి కాగా సొంత ఖర్చులతో కోతులను పట్టించి అడవుల్లో వదిలివేసినట్లు తెలిపారు. మళ్లీ కోతుల బెడద ఎక్కువ కావడంతో కొండెంగ వేషధారణతో తరిమివేసినట్లు చెప్పారు. ఈ సందర్భంగా గ్రామస్తులు సర్పంచ్, పాలకవర్గానికి కృతజ్ఞతలు తెలిపారు. -
నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలి
పెద్దపల్లి: సుల్తానాబాద్లోని రైస్మిల్ కెనాల్ వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో నల్లజెండాలు, బ్యాడ్జీలతో బుధవారం నిరసన తెలిపారు. సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి తాండ్ర అంజయ్య మాట్లాడుతూ లేబర్ కోడ్లను వెంటనే ఉపసమరించుకోవాలని కోరారు. మండల కోకన్వీనర్ మాతంగి రాజమల్లు, రైస్మిల్ ఆపరేటర్ల సంఘం, కార్యదర్శి నౌండ్ల బ్రహ్మచారి, ఉపాధ్యక్షులు, కల్లెపెల్లి ప్రసాద్, కొల్లూరు తిరుపతి, మంజూర్, ప్రభాకర్, శ్రీశైలం, చొప్పరి రాజు, తిరుపతి, ఓదెలు, బాలకృష్ణ, సుధాకర్రావు, రాము, కిరణ్, రాజు, రాజేశం, శీను, రమేశ్, సారయ్య, అశోక్, మహేందర్, మురళి, అనిల్, సంతోష్, సంపత్, శ్రీధర్, రవీందర్ పాల్గొన్నారు. జ్యోతినగర్: కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతూ తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని ఎన్టీపీసీ రామగుండం ప్రాజెక్టు కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ప్రాజెక్టు లేబర్ గేట్ వద్ద జేఏసీ నాయకులు బుధవారం కార్మికులకు నల్లబ్యాడ్జీలు ధరింపజేసి నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నూతన లేబర్ చట్టాలను అమలు చేయాలని జారీ చేసిన జీవోలను వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. నాయకులు చిలుక శంకర్, గీట్ల లక్ష్మారెడ్డి, నాంసాని శంకర్, భూమల్ల చందర్, ఇజ్జగిరి భూమయ్య, తోకల రమేశ్, సత్యం పాల్గొన్నారు. నల్లబ్యాడ్జీలతో నిరసన రామగిరి: కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా బుధవారం సీఐటీయూ ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. సీఐటీయూ ఆర్జీ–3 బ్రాంచ్ సెక్రటరీ డి.కొమురయ్య, నాయకులు వెంకటేశ్వర్లు, రవికుమార్, గోపాల్, సదానందం పాల్గొన్నారు. -
ఏడో తేదీలోగా వేతనాలు
సైకిళ్లు పంపిణీ చేస్తున్న మంత్రి అడ్లూరి, కలెక్టర్ శ్రీహర్ష, విద్యార్థుల సమక్షంలో కేక్ కట్చేస్తూ..ధర్మారం: సంక్షేమ గురుకులాల అవుట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉపాధ్యాయులు, నాన్టీచింగ్ స్టాఫ్కు ప్రతీనెల ఏడో తేదీలోగా వేతనాలు చెల్లించేలా చర్య లు తీసుకున్నట్లు మంత్రి లక్ష్మణ్కుమార్ చెప్పారు. స్థానిక గిరిజన మినీ గురుకుల విద్యాలయంలో బు ధవారం అదనపు గదుల నిర్మాణానికి కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు. తన పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్చేసి మిఠాయిలు పంచిపెట్టారు. రాష్ట్రంలోనే తొలిసారి విద్యార్థులకు సైకిళ్లు అందజేశారు. అనంతరం ప్రభుత్వ భూము లు పరిశీలించారు. కాంగ్రెస్ నాయకుడు జంగ మ హేందర్యాదవ్ మంత్రి చేతుల మీదుగా వి ద్యార్థులకు పుస్తకాలు, ఇతర వస్తువులు పంపి ణీ చేయించారు. మంత్రి మాట్లాడుతూ, వి ద్యార్థులకు వసతులు కల్పిస్తామన్నారు. ఐదో తరగతి నుంచి పదోతరగతి వరకు అప్గ్రేడ్ చేసేందుకు ప్రతిపాది స్తే ప్రభుత్వం నుంచి అనుమతులు జారీ చే స్తామని అభయం ఇ చ్చారు. వైఎస్సార్ హ యాంలో ఇంటర్మీడియ ట్ కళాశాల తీసుకొచ్చానని, ప్రస్తుత సీఎం రే వంత్రెడ్డి సహకారంతో ఐటీఐ మంజూరు చే యించానని గుర్తుచేశా రు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వి ద్యార్థుల కోసం ధర్మపు రికి మంజూరైన ఇంటిగ్రేటెడ్ విద్యాలయానికి 35 ఎకరాలు కేటాయించామని, మూడేళ్లలో పూర్తిచేసి విద్యార్థులకు బోధన ప్రారంభిస్తామని చెప్పారు. గిరిజన విద్యా ర్థులకు నాణ్యమైన విద్య అందించడంలో నిర్లక్ష్యం చేయరాదన్నారు. ఏప్రిల్, మేలో భవనాలకు అవసమైన మరమ్మతులు పూర్తిచేయిస్తామన్నారు. కలెక్టర్ శ్రీహర్ష మాట్లాడుతూ, రెండేళ్లలోనే మినీ గురుకు లం రూపురేఖలు మారిపోయాయన్నారు. మంత్రి ఆదేశాల మేరకు డైనింగ్హాల్, డార్మెటరీలో పడకలు అందుబాటులోకి తీసుకొచ్చామని అన్నారు. ఏఎంసీ చైర్మన్ రూప్లానాయక్, ఆర్డీవో గంగయ్య, తహసీల్దార్ శ్రీనివాస్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు సంగ రంజిత్, సర్పంచులు ఆవుల మల్లయ్య, వేల్పుల రేవతి –నాగరాజు, భూక్య సంగీత – ఆంజనేయులు, కూస శ్రీవాణి – తిరుపతి, కల్లెం గంగారెడ్డి, చేపూరి లచ్చయ్య, మ్యాడారం వీర్పాల్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గాగిరెడ్డి తిరుపతిరెడ్డి, జిల్లా కార్యదర్శి కొత్త నర్సింహం, యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు అసోద అజయ్, మండల అధ్యక్షుడు సోగాల తిరుపతి మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్లు పాలకుర్తి రాజేశంగౌడ్, కాడే సూర్యనారాయణ, నాయకులు పాల్గొన్నారు. సోషల్ వెల్ఫేర్ సిబ్బందికి ఇబ్బందుల్లేకుండా ఏర్పాట్లు ధర్మారం మినీ గురుకులాన్ని టెన్త్ వరకు అప్గ్రేడ్ చేస్తాం సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ -
ఘనంగా మహనీయుల జయంతి
పెద్దపల్లి: జిల్లాలో ఈనెల 5న బాబూ జగ్జీవన్రామ్, 14న అంబేడ్కర్ జయంతిని ఘనంగా నిర్వహించుకుందామని జయంతి ఉత్సవ కమిటీ విన్నవించింది. స్థానిక ప్రెస్క్లబ్లో బుధవారం కమిటీ ప్రతినిధులు విలేకరులతో మాట్లాడారు. కుల, మతాలకు అతీతంగా అందరూ హాజరై మహనీయుల జయంతి పండుగలను విజయవంతం చేయాలని కోరారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి ఉత్సవ కమిటీ చైర్మన్ మామిడిపల్లి బాపయ్య, బాబూ జగ్జీవన్రామ్ జయంతి ఉత్సవ కమటీ చైర్మన్ అంబాల రాజేందర్, ప్రతినిధులు ఆరెల్లి మల్లేశ్, బొంకూరి కై లాసం, బొంకూరి సురేందర్ సన్నీ, లింగమళ్ల శంకరయ్య, కోండ్ర శంకర్, కుక్క కనకరాజ్, తుల్లా నాగరాజ్, కుక్క ఆశోక్, బొంకూరి నరేందర్, బొంకూరి నవీన్బాబు, కల్లేపల్లి రవి, కొంకటి లింగమూర్తి, కల్వల మల్లేశ్, పెర్క శివకుమార్, ఈదునూరి విజయ్, కాసిపాక వాసు, కనుకుంట్ల సదానందం, కుక్క శ్రావణ్ కుమార్, బొంకూరి రమేశ్, దొమ్మటి సదయ్య, అంబాల నరేశ్, పెర్క సతీశ్, కల్లేపల్లి అశోక్, రామిళ్ల శారద, గూల్ల రాజు, సత్యనారాయణ, సలిగంటి రామలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు. -
సింగరేణి వెనుకంజ
గోదావరిఖని: సింగరేణి బొగ్గు గనుల సంస్థ గత ఆర్థిక సంవత్సరంలో నిర్దేశిత ఉత్పత్తి లక్ష్యం చేరుకోలేకపోయింది. టార్గెట్లో కేవలం 81శాతమే నమోదు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈసారి బొగ్గు ఉత్పత్తిలో సింహభాగం గతంలో ఉన్న లోటును పూడ్చేందు(బ్యాక్ ఫిల్లింగ్)కే కేటాయించారు. దీంతో గత ఆర్థిక సంవత్సరంలో బొగ్గు ఉత్పత్తి భారీగా తగ్గిందనే చర్చ సాగుతోంది. వెనుకబడిన 10 ఏరియాలు.. వార్షిక బొగ్గు ఉత్పత్తి లక్ష్య సాధనలో సింగరేణి బొగ్గు గనులు వెనకపడ్డాయి. 2025–26 ఆర్థిక సంవత్సరంలో 72 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యంగా నిర్దేశించగా 58 మిలియన్ టన్నుల ఉత్పత్తి సాధించి 81 శాతం నమోదు చేసిది. సింగరేణి వ్యాప్తంగా 12 ఏరియాల్లో 2 ఏరియాలు వందశాతం ఉత్పత్తి సాధించగా, మిగతా 10 ఏరియాలు లక్ష్యం చేరుకోలేకపోయాయి. ఈసారి బ్యాక్ఫిల్లింగ్తోనే ఉత్పత్తి లక్ష్యం అందుకోలేకపోయాయి. బొగ్గు నిల్వల లోటును పూడ్చేందుకు సీఎండీ కఠిన నిర్ణయాలు తీసుకోవడంతో మూడునెలలుగా బొగ్గు ఉత్పత్తి భారీగా సాధించినా లోటును పూడ్చడానికే సరిపోయింది. మరోవైపు.. లాభాల్లో సింగరేణి ఉద్యోగులకు వాటా వచ్చే విషయం కూడా అనుమానమే అని అధకారులు బాహాటంగానే చెబుతున్నారు. ఈక్రమంలో సింగరేణి సంస్థ ఆర్థిక గణాంకాలు పూర్తయితే తప్ప వాస్తవ లాభాలు ప్రకటించే అవకాశం లేదు. భారీగా తగ్గిన బొగ్గు ఉత్పత్తి బ్యాక్ ఫిల్లింగ్ ప్రక్రియ కారణం టార్గెట్ 72 మిలియన్ టన్నులు సాధించించి 58 మిలియన్ టన్నులు 2025–26 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి సాధించిన బొగ్గు ఉత్పత్తి(మిలియన్ టన్నుల్లో) ఏరియా లక్ష్యం సాధించింది శాతం ఆర్జీ–1 46.90 36.53 81 ఆర్జీ–2 98.70 87.56 89 ఆర్జీ–3 65.00 46.15 71 ఏపీఏ 15.50 1.71 11 భూపాలపల్లి 46.54 27.90 60 కొత్తగూడెం 92.05 84.36 92 సత్తుపల్లి 64.45 66.38 103 ఇల్లెందు 50.00 24.65 49 మణుగూరు 11.49 10.54 92 బెల్లంపల్లి 35.00 35.35 101 మందమర్రి 27.80 19.81 71 శ్రీరాంపూర్ 65.16 44.06 68 -
హైలెవల్ వంతెన పనుల్లో వేగం పెంచాలి
ఓదెల: ఓదెల మండలం రూపునారాయణ పేట – జమ్మికుంట మండలం విలాసాగర్ మధ్య మానేరుపై చేపట్టిన హైలెవల్ బ్రిడ్జి ప నుల్లో వేగం పెంచాలని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు సూచించారు. రూపునారాయణపేట మానేరుపై చేపట్టిన హైలెవల్వంతెన, డబుల్రోడ్డు నిర్మాణాన్ని బుధవారం పరిశీలించారు. వంతెన నిర్మాణానికి సీఎం రేవంత్రెడ్డి రూ.80కో ట్లు మంజూరు చేశారన్నారు. బ్రిడ్జికి అనుబంధంగా చేపట్టిన పొత్కపల్లి శివారులోని సీసీరోడ్డు, పొత్కపల్లి – కాల్వశ్రీరాంపూర్ మధ్య రూ.27కోట్లతో చేపట్టిన డబుల్రోడ్డు పనులు ప రిశీలించారు. కాంగ్రెస్ నేత ప్రేంసాగర్రెడ్డి, స ర్పంచ్ బొంగోని రమాశ్రీనివాస్గౌడ్, మాజీ స ర్పంచ్ అంకం రమేశ్, మాజీ ఎంపీటీసీ నీర్ల శ్రీనివాస్, నాయకుడు కుమార్గౌడ్ ఉన్నారు. భక్తాంజనేయస్వామి ఆలయంలో పూజలు రూపునారాయణపేట భక్తాంజనేయస్వామి ఆల యంలో చండీయాగం, హోమం కార్యక్రమాల్లో ప్ర భుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారా వు – పావని దంపతులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ విప్ విజయరమణారావు -
కదలని క్యాథ్ల్యాబ్
గోదావరిఖని(రామగుండం): డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హామీ మేరకు మార్చి 10వ తేదీలోగా క్యాథ్ల్యాబ్ అందుబాటులోకి రావాలి. కానీ, ఇప్ప టివరకు గదులు మాత్రమే సిద్ధమయ్యాయి. అతిముఖ్యమైన వైద్య పరికరాలు రాలేదు. కాంట్రాక్టర్ విన్నపం మేరకు నెలపాటు సింగరేణి గడువు పొడిగించింది. ఈలెక్కన చూసినా ఈనెల 10వ తేదీ వరకు క్యాథ్లాబ్ సేవలు అందుబాటులోకి రావాలి. అయి నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితి ఏమాత్రం పురోగతిలో లేదు. అయితే 65 కి.మీ.. లేదంటే 250 కి.మీ.. గుండె సంబంధిత సమస్యలతో బాధపడే సింగరేణి కార్మికులు, వారి కుటుంబ సభ్యులు చికిత్స కోసం సుమారు 65 కి.మీ. దూరంలోని కరీంనగర్ లేదా దాదాపు 250 కి.మీ. దూరంలోని హైదరాబాద్లోని ఆస్పత్రులను ఆశ్రయించాల్సి వస్తోంది. సకాలంలో చేరితే ప్రాణాలు దక్కుతాయి. లేదంటే మార్గమధ్య ంలోనే తుదిశ్వాస విడిచిన సందర్భాలూ ఉన్నాయి. ప్రాణాలు కాపాడడమే లక్ష్యంగా.. గోల్డెన్ అవర్లో ప్రాణాలు కాపాడే లక్ష్యంతో గోదావరిఖనిలోని సింగరేణి ఏరియా ఆస్పత్రిలో క్యాథ్ల్యాబ్ ఏర్పాటు చేస్తున్నారు. సూపర్ స్పెషాలిటీ వైద్యం కోసం సింగరేణి రూ.13కోట్లు మంజూరు చేసింది. ఇందులో రూ.7కోట్లతో క్యాత్ల్యాబ్ యంత్రం, మిగతా నిధులతో ఫర్నిచర్ కొనుగోలు, అదనపు గదులు నిర్మించాల్సి ఉంది. కార్పొరేట్ ఆస్పత్రులకు రూ.వేల కోట్లు.. కార్మికులు, ఉద్యోగులకు కార్పొరేట్ వైద్యం అందేందుకు హైదరాబాద్లోని కార్పొరేట్ ఆస్పత్రులకు సింగరేణి ఏటా రూ.వేల కోట్లు వెచ్చిస్తోంది. ఈ భారం తగ్గించడం, గోల్డెన్ అవర్లో ప్రాణాలు కాపాడడమే క్యాథ్ల్యాబ్ ఏర్పాటు లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఇప్పటివరకు రూ.26లక్షలతో బయోకెమిస్ట్రీ అనాలిసిస్, రూ.27లక్షలతో మైక్రో బయోలజీ యంత్రం అందుబాటులోకి తీసుకొచ్చింది. రూ.2 కోట్లతో 50 పడకల మాతాశిశు సంక్షేమ భవనం నిర్మిస్తోంది. ఈసీజీ సేవలకే పరిమితం గుండెపోటుకు గురైన కార్మికులు, వారి కుటుంబసభ్యులను తొలుత సమీప డిస్పెన్సరీ తీసుకెళ్తున్నారు. తర్వాత ఏరియా ఆస్పత్రికి తీసుకొస్తున్నారు. ఇక్కడ ఈసీజీ తదితర పరీక్షలు చేశాక కార్పొరేట్ ఆస్పత్రికి రెఫర్ చేస్తున్నారు. ఈప్రక్రియ పూర్తయ్యేందుకు కనీసం 3 గంటల సమయం పడుతోంది. ఈలోగా మరోసారి గుండెపోటు వస్తే ప్రాణాలు పోవడం తప్ప గత్యంతరం లేదు. గుండెపోటుకు గురైన గంటలోపే చికిత్స అందితే ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. దీనికోసమే క్యాథ్ల్యాబ్ ఏర్పాటు చేస్తున్నారు. ముందుకు సాగని పనులు నెల రోజులపాటు గడువు పొడిగించినా అందుబాటులోకి రావడం అనుమానమే.. కార్మికులకు తప్పని తిప్పలుగుండె సంబంధిత సమస్యలతో బాధపడే కార్మికులకు వైద్యసేవలు అందించేందుకు త్వరలోనే సింగరేణి ఆస్పత్రిలో క్యాథ్ల్యాబ్ ప్రారంభమవుతుంది. గుండెపోటు మరణాలు తగ్గించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. – రాజ్ఠాకూర్, ఎమ్మెల్యే, రామగుండంమూడు నెలల్లో కార్డియాలజీ ఏర్పాటు చేస్తాం. పనులు వేగంగా కొనసాగుతున్నాయి. గుండెపోటుకు గురైన కార్మికుడికి గంటలోగా చికిత్స అందిస్తాం. – అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క -
తక్కువ పీఎల్ఎఫ్ లోడ్తో విద్యుత్ ఉత్పత్తి
జ్యోతినగర్: పెద్దపల్లి జిల్లా రామగుండంలోని రెండు విద్యుత్ ప్రాజెక్టుల్లో విద్యుత్ ఉత్పత్తిని తగ్గిస్తూ వస్తున్నారు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ తగ్గించి విద్యుత్ తయారుచేయడం గమనార్హం. రామగుండం ప్రాజెక్టు ఉత్పత్తి సామర్థ్యం 2,600 మెగావాట్లు కాగా 13,757 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి సాధించింది. మార్చిలో 1,242 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి సాధించి 64 శాతం ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్(పీఎల్ఎఫ్) నమోదు చేసింది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో 13,757 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తిని 60 శాతం పీఎల్ఎఫ్తో ఉత్పత్తి చేసింది. ఇక తెలంగాణ స్టేజ్–1లోని 1,600 మెగావాట్ల సామర్థ్యంగల ప్రాజెక్టులో 2025–26లో 10,786 మిలియన్ యూనిట్ల విద్యుత్ను 58 శాతం పీఎల్ఎఫ్, గత మార్చిలో 969 మిలియన్ యూనిట్ల విద్యుత్ను 62 శాతం ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్తో సాధించింది. సోలార్ విద్యుత్ ఉత్పత్తి నేపథ్యంలో థర్మల్ విద్యుత్ ఉత్పత్తిని తగ్గించిన విషయం విదితమే. రామగుండం ప్రాజెక్టులో 13,757 మిలియన్ యూనిట్లు తెలంగాణ స్టేజ్–1 ప్రాజెక్టులో 10,786 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి -
లారీ ఢీకొని వ్యక్తి దుర్మరణం
కరీంనగర్క్రైం: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిచెందాడు. వన్టౌన్ పోలీసులు తెలిపిన వివరాలు.. న గరంలోని రాంనగర్లో నివాసముంటున్న ఇస్లావత్ కిషన్(55) మేసీ్త్ర పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. సోమవారం స్వగ్రామం సిద్దిపేట జి ల్లా కోహెడ మండలం జ్యోతిరాంనాయక్ తండాకు వెళ్లాడు. మంగళవారం సాయంత్రం కరీంనగర్కు వస్తుండగా, అల్గునూర్ బ్రిడ్జి వద్దకు చేరుకోగానే వెనకనుంచి లారీ వేగంగా వచ్చి ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి అల్లుడు రాజశేఖర్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వన్టౌన్ పోలీసులు తెలిపారు. -
డీపీవో ఉద్యోగ విరమణ
పెద్దపల్లిరూరల్: జిల్లా పంచాయతీ అధికారి వీరబు చ్చయ్య మంగళవారం ఉద్యో గ విరమణ పొందారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన వీడ్కోలు సమావేశానికి కలెక్టర్ శ్రీహర్ష హాజరయ్యారు. ఆయనకు పుష్పగుచ్ఛం అందించి అభినందించారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఉద్యోగ విరమణ తప్పనిసరన్నారు. టీఎన్జీవోల సంఘం జిల్లా అధ్యక్షుడు బొంకూరి శంకర్, అధికారులు పాల్గొన్నారు. ఉత్సాహంగా వాలీబాల్ పోటీలు జ్యోతినగర్: ఎన్టీపీసీ సదరన్ రీజియన్ స్పోర్ట్స్ మీట్లో భాగంగా వాలీబాల్ పోటీలు నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలోని ఎన్టీపీసీ పర్మినెంట్ టౌన్షిప్ మహాత్మా గాంధీ క్రీడామైదానంలో మంగళవారం రాత్రి పోటీలు జరిగాయి. రామగుండం, సింహాద్రి జట్లు పోటీపడ్డాయి. రామగుండం జట్టు 16 పాయింట్లు పొంది విజయం సాధించింది. పోటీల్లో సదరన్ రీజియన్లోని సింహాద్రి, కుడ్గి, వల్లూరు, రామగుండం, కాయంకుళం జట్లు హాజరయ్యాయి. బీజేపీ రాష్ట్ర కార్యవర్గంలో చోటుమంథని: బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా మంథనికి చెందిన చంధ్రుపట్ల సునీల్రెడ్డిని నియమించారు. తనపై నమ్మకంతో రాష్ట్ర నాయకత్వం ఇచ్చిన బాధ్యతకు అన్నివిధాలుగా కట్టుబడి ఉంటానని సునీల్రెడ్డి పేర్కొన్నారు. తన నియామకానికి కృషి చేసిన రాష్ట్ర అధ్యక్షులు, నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మదర్ థెరిసాలో అంతర్జాతీయ కాన్ఫరెన్స్ పెద్దపల్లిరూరల్: మదర్ థెరి సా ఇంజినీరింగ్ కాలేజీలో మంగళవారం ఐసీఈఎండీటీ – 2కే26 పేరిట అంతర్జాతీ య టెక్నికల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. జేఎన్టీయూ హెచ్వోడీ సతీశ్కుమార్, కేంబ్రిడ్జి యూనివర్సిటీ ప్రొఫెసర్ సంబిసన్తో కలిసి ప్రిన్సిపాల్ శ్రీనివాస్, ఏవో పవన్కుమార్ రెండురోజుల కాన్పరెన్స్లో పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లాతోపాటు పలు ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు వివిధఅంశాలపై ఇచ్చిన ప్రదర్శనలను తిలకించారు. నవసమాజ నిర్మాణంలో ఉత్తమ ఇంజినీర్ల పాత్ర కీలకమన్నారు. దేశంలోని పలు ప్రాంతాలకు చెందిన విద్యార్థుల ఆవిష్కరణలను పరిశీలిస్తూ ఆలోచనాశక్తి పెంపొందించుకునేందుకు అంతర్జాతీయ స్థా యి కాన్ఫరెన్సు ఉపకరిస్తుందని అన్నారు. ఆర్గనైజింగ్ సెక్రటరీ గాజుల కిశోర్కుమార్, హెచ్వోడీ కొంతం శ్రీధర్, రమేశ్, వంశీరాజ్, రవి, సవిత, సదానందం, సంతోష్, శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు, జయంత్రెడ్డి ఉన్నారు. స్పోర్ట్స్ స్కూల్కు ఎంపిక పోటీలు పెద్దపల్లి: స్థానిక ఐటీఐ మైదానంలో మంగళవారం స్పోర్ట్స్ స్కూల్లో ప్రవేశాల కోసం ఎంపిక పోటీలు నిర్వహించారు. జిల్లా విద్యాధికారి శారద పోటీలు ప్రారంభించారు. పోటీల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయికి ఎంపిక కావాలని డీఈవో కోరారు. జిల్లా యువజన క్రీడా అధికారి సురేశ్ మాట్లాడుతూ, జిల్లాస్థాయిలో 28 మంది బాలబాలికలు మాజరయ్యారని, ఎంపికై న వారు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. కార్యక్రమంలో ఎస్జీఎఫ్ కార్యదర్శి లక్ష్మణ్, జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు వేల్పుల సురేందర్, దాసరి రమేశ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు తుల శోభా రాణి, కొమురోజు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. జేఎన్టీయూ విద్యార్థులకు రోస్ స్కాలర్షిప్ రామగిరి: మంథని జేఎన్టీయూలోని ముగ్గురు విద్యార్థులు రోస్(రాయల్ ఆర్గనైజేషన్ ఫర్ సర్వీస్ అండ్ ఎడ్యుకేషన్) స్కాలర్షిప్కు ఎంపికయ్యారు. హైదరాబాద్కు చెందిన ఈ సామాజిక సేవా సంస్థ విద్యారంగంలో ప్రతిభ కనబరుస్తున్న ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ఏటా స్కాలర్షిప్లు అందజేస్తోంది. ఈవిద్యా సంవత్సరానికి మంథని జేఎన్టీయూలో మైనింగ్ తృతీయ సంవత్సరం చదువుతున్న ఇమ్ముడి శరత్కుమార్, ద్వితీయ సంవత్సరం చదువుతున్న సీఎన్ఎన్ విభాగానికి చెందిన బత్తుల శ్రావణి, తాటిసాయి శరణ్యను స్కాలర్షిప్కు ఎంపిక చేసినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. స్కాలర్షిప్ ద్వారా ఒక్కో విద్యార్థికి ఏటా రూ.10,000 చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్లు వెల్లడించారు. ఎంపిక పత్రాలను ప్రిన్సిపాల్ బులుసు విష్ణువర్ధన్ మంగళవారం విద్యార్థులకు అందజేశారు. వైస్ ప్రిన్సిపాల్ ఎం.ఉదయ్, పరిపాలనాదికారి సుమన్రెడ్డి, ఫిజికల్ డైరెక్టర్ పింగిలి కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. యుద్ధోన్మాదాన్ని ఖండించండి పెద్దపల్లి: అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధోన్మాదాన్ని ఖండించాలని పౌరహక్కుల సంఘం రాష్ట్ర సహాయ కార్యద ర్శి కుమారస్వామి కోరారు. విరసం జిల్లా కన్వీనర్ బాల సాని రాజయ్య అధ్యక్షతన ఇ రాన్పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధానికి నిరసనగా స్థానిక బస్టాండ్ వద్ద మంగళవారం ఆందోళన నిర్వహించారు. అమెరికా, ఇజ్రాయెల్ కూటమి ప్ర జలపై చేస్తున్న దాడులు మానవత్వానికి విఘాతంగా మారుతున్నాయన్నా రు. సామ్రాజ్యవాద ప్రయోజనాల కోసమే యుద్ధం చేస్తున్నారని ధ్వజమె త్తారు. యుద్ధం ద్వారా అంతర్జాతీయ మార్కెట్లో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధ రలు రవాణా ఖర్చులు పెరిగి ఆహార పదార్థాల ధరలపై తీవ్రప్రభావం చూపుతాయని నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇవిచవరకు సాధారణ ప్రజలకు గుదిబండగా మరుతుందని అన్నారు. ఇప్పటికై నా యుద్ధం ఆపేలా చర్యలు తీసుకోవాలని కోరారు. నాయకులు వెల్తురు సదానందం, రత్నకుమార్, తాంద్ర సదానందం, మార్వడి సుదర్శన్, కోరేఫు మల్లేశ్, రమేశ్, అరికిళ్ల లలితక్క, పెర్కా సతీశ్, బాలసాని లెనిన్, తిప్పరపు సురేశ్, పులిపాక రవీందర్, గోపాల్ యాదవ్, బొంకురి లక్ష్మణ్,రాజు, రాజగోపాల్, తాళ్లపెల్లి మల్లయ్య, తిర్రి బాలకృష్ణ, శ్రావ్య, స్మయిలి, శ్వేతా తదితరులు పాల్గొన్నారు. -
దళితుడిని చితకబాదిన ఎస్సై తీరుపై విచారణ
సైదాపూర్(హుస్నాబాద్): దళితుడిని చితకబాదిన ఎస్సై తీరుపై హుజూరాబాద్ ఏసీపీ మాధవి సోమవారం విచారణ చేపట్టారు. వివరాలు.. గతేడాది మే 8న సైదాపూర్– మొలంగూర్ రోడ్లోని సోమారం శివారులో కెనాల్ వద్ద అప్పటి ఎస్సై ఆగస్త్య భార్గవ్, సిబ్బంది డ్రంకెన్ డ్రైవ్ నిర్వహించారు. ఆ సమయంలో మండలంలోని గొల్లగూడెం గ్రామానికి చెందిన బత్తుల మహేందర్ మొలంగూర్ నుంచి సైదాపూర్ వస్తుండగా పోలీసులు ఆపారు. దీంతో పోలీసులు, మహేందర్ మధ్య గొడవ జరిగింది. పోలీసులు అకారణంగా నడిరోడ్పై చితకబాదారని, కులంపేరుతో దూషించారని, ఎస్సై భార్గవ్పై చర్యలు తీసుకోవాలని మహేందర్ జిల్లా, రాష్ట్ర ఉన్నతాధికారులు, మానవహక్కుల సంఘం, జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్కు ఫిర్యాదు చేశాడు. కోర్టును సైతం ఆశ్రయించాడు. ఈనేపథ్యంలో ఏసీపీ ఘటన స్థలాన్ని పరిశీలించారు. అప్పటి సాక్షులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాగా ఘటన జరిగి ఏడాది కావస్తున్నా ఉన్నతాధికారులు, కోర్టు, కమిషన్లకు చేసిన ఫిర్యాదులకు కదలిక వచ్చిందని, ఇప్పటికై నా పూర్తి స్థాయిలో విచారణ జరిపి న్యాయం చేయాలని బాధితుడు కోరారు. -
సమన్వయంతో పనులు
పెద్దపల్లి: బీఎస్ఎన్ఎల్ చేపట్టే భూగర్భ కే బుల్ పనులను సమన్వయంతో పూర్తిచేయా లని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. అండర్గ్రౌండ్ కేబుల్ నిర్మాణంపై సంబంధిత అధికారులు, అదనపు కలెక్టర్ అరుణశ్రీతో క లిసి కలెక్టరేట్లో మంగళవారం సమీక్షించా రు. రామగుండంలో ధ్వంసమైన చోట్ల మ రోసారి అండర్గ్రౌండ్ కేబుల్ వేస్తామన్నారు. విద్యుత్ స్తంభాలు, తాగునీటి పైప్లైన్లు, రోడ్ల నిర్మాణం తదితర అభివృద్ధి పనులు చేపట్టే సమయంలో అండర్గ్రౌండ్ ధ్వంసం కాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. డీఆర్డీవో కాళిందిని, ఆర్అండ్బీ ఈఈ భావ్సింగ్, సీ సెక్షన్ సూపరింటెండెంట్ కుమారస్వామి పాల్గొన్నారు. కేజీబీవీల్లో బాలికలకు శిక్షణ పెద్దపల్లి: కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాల్లోని విద్యార్థినులను జాతీయస్థాయి పో టీపరీక్షలకు సిద్ధం చేసేందుకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని జిల్లా బాలికల అభివృద్ధి అధికా రి కవిత తెలిపారు. జూలపల్లిలో నీట్, రామగుండంలో జేఈఈ, సుల్తానాబాద్లో క్లాట్లో నిపుణులతో శిక్షణ ఇప్పిస్తామన్నారు. అవసరమైన స్టడీ మెటీరియల్ కూడా అందిస్తామన్నా రు. పట్టణ విద్యార్థులతో సమానంగా గ్రామీ ణ బాలికలకు అన్నిరంగాల్లో అవకాశాలు క ల్పించాలనేది దీని లక్ష్యమని వివరించారు. స్వల్పంగా పెరిగిన పత్తి ధర పెద్దపల్లిరూరల్: స్థానిక వ్యవసాయ మార్కెట్లో పత్తి ధర స్వల్పంగా పెరిగింది. సోమ వారం క్వింటాల్కు రూ.7,455 ధర పలుకగా.. మంగళవారం గరిష్టంగా రూ.7,611 పలి కిందని మార్కెట్ చైర్మన్ కూర మల్లారెడ్డి, కార్యదర్శి ప్రవీణ్రెడ్డి అన్నారు. కనిష్టంగా 5,544గా, సగటు రూ.7,272గా ధర ఉందని వివరించారు. 300 క్వింటాళ్ల పత్తి కొనుగోలు జరిగినట్టు వారు పేర్కొన్నారు. మహనీయుల జయంతికి అధిక ప్రాధాన్యం పెద్దపల్లి: మహనీయుల జయంతి నిర్వహణ కు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని అదనపు కలెక్టర్ వేణు సూచించారు. జయంతి నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యలపై మంగళవా రం తన కార్యాలయంలో సమీక్షించారు. ఈ నెల 5న బాబూ జగ్జీవన్రామ్, 14న అంబేడ్కర్ జయంతి ఉంటాయని, వీటిని ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. వీరి జీవిత చరిత్ర తెలిసేలా ప్రచారం చేయాలన్నారు. నేడు బ్లాక్డే పాటించాలిపెద్దపల్లి: కేంద్రప్రభుత్వం అమలు చేసే నాలుగు లేబర్ కోడ్ల రద్దును డిమాండ్ చేస్తూ బుధవారం బ్లాక్డే నిర్వహిస్తామని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి సునీల్ డిమాండ్ తెలిపారు. ఉద్యోగులు, కార్మికులు జిల్లావ్యాప్తంగా నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపాలని ఆయన కోరారు. -
నేటినుంచి రేషన్ బియ్యం పంపిణీ
పెద్దపల్లి: కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల ఆదేశాల మేరకు మూడు నెలల కోటా రేషన్ బియ్యం పంపిణీ చేసేందుకు జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తిచేసింది. రేషన్కార్డుదారులకు బుధవారం నుంచి బియ్యం పంపిణీ చేస్తామని డీఎస్వో శ్రీనాథ్ తెలిపారు. అయితే, మూడు నెలల కోటా కోసం ఒక్కో కార్డుదారు ఈపాస్ యంత్రంలో మూడుసార్లు వేలిముద్ర వేయాల్సిందేనని అధికారులు చెబుతున్నారు. డీలర్ల వద్ద స్థలం కొరత ఇప్పటికే పలు రేషన్దుకాణాల్లో దొడ్డుబియ్యం మిగులు నిల్వలు ఉన్నాయని అధికారులు చెబుతున్నా వెనక్కి తీసుకెళ్లి గోదాముల్లో నిల్వచేయడం లేదు. దీంతో ప్రస్తుతం సరఫరా చేస్తున్న మూడు నెలల కోటా బియ్యం నిల్వచేసేందుకు తమ వద్ద స్థలం సమస్య ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని డీలర్లు అంటున్నారు. దీంతో స్టాక్ను ఎప్పకప్పుడు లారీల ద్వారా చేర్చాలని కోరుతున్నారు. -
విజయ్కుమార్ సేవలు ప్రశంసనీయం
జ్యోతినగర్: రామగుండంలోని ఎన్టీపీసీ ఏజీఎం(హెచ్ఆర్)బిజయ్కుమార్ సిగ్దర్ సేవలు ప్రశంసనీయమని ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చందన్కుమార్ సామంత అన్నారు. మంగళవారం పరిపాలనా భవనంలో జరిగిన ఎన్టీపీసీ ఉద్యోగుల ఉద్యోగ విరమణ కార్యక్రమానికి హాజరయ్యారు. ఉద్యోగ విరమ ణ పొందుతున్న ఏజీఎం బిజ్కుమార్ సిగ్దర్, రమణారెడ్డి, భీమ్రావు, రాజమహెందర్రెడ్డి, దామోదర్రావును సన్మానించారు. ఈడీ మాట్లాడుతూ, 2007 లో ఎన్టీపీసీలో ఉద్యోగంలో చేరిన సిగ్దర్ అంకితభావంతో పనిచేశారన్నారు. హెచ్ఆర్ పద్ధతులను బలోపేతం చేయడం, సానుకూల పని సంస్కృతిని పెంపొందించడం, బలమైన ఉద్యోగి సంబంధాలను ప్రోత్సహించడంలో కీలకపాత్ర పోషించారని స్పష్టం చేశారు. అనంతరం ఏజీఎం సిగ్దర్ను రామగుండం మేయర్ మహంకాళి స్వామి, కార్పొరేటర్లు శాలువాలతో సన్మానించారు. చెత్తవేస్తే మార్కెట్ నుంచి ఖాళీ చేయిస్తాం కోల్సిటీ: కాలువల్లో పళ్లు, కూరగాయలు, మాంసం వ్యర్థాలు, చెత్త పడవేస్తే రూ.500 జరిమానా విధించడంతోపాటు పునరవృతమైతే మార్కెట్ నుంచి ఖాళీ చేయిస్తామని మేయర్ మహంకాళి స్వామి వ్యాపారులను హెచ్చరించారు. సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేసి జరిమానా విధిస్తామన్నారు. గోదావరిఖని శివాజీనగర్లోని మార్కెట్ వ్యాపారులతో మంగళవారం బల్దియా కార్యాలయంలో మేయర్ సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ, ప్రతీవ్యాపారి గురువారంలోగా రెండు బకెట్లు(పచ్చ, నీలిరంగు) సమకూర్చుకుని అందులోనే వ్యర్థాలు వేయాలన్నారు. మార్కెట్ అభివృద్ధి, పరిశుభ్రతకు సహకరించాలని కోరారు. తడిచెత్తను రీసైక్లింగ్ చేసే బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటు చేసే యోచనలో ఉన్నామని వెల్లడించారు. సుమారు రూ.3కోట్ల వ్యయంతో నిర్మించిన షెడ్ ఏప్రిల్ చివరివారం వరకు అందుబాటులోకి వస్తుందని తెలిపారు. రోడ్లు, యూజీడీ, రైతులకు రెస్ట్ రూమ్స్, ఆర్వోప్లాంట్, మరుగుదొడ్లు తదితర వసతులు కల్పిస్తామని వివరించారు. అద్దె బకాయిలు సక్రమంగా చెల్లించాలని కోరారు. ఈ సమావేశంలో డిప్యూటీ కమిషనర్ వెంకటస్వామి, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పీవీ రామన్, టీపీఎస్ నవీన్, సూపరింటెండెంట్ శ్రీనివాస్, శానిటరీ ఇన్స్పెక్టర్ సంపత్ పాల్గొన్నారు. -
తెలంగాణ స్టేజ్–2కు అడుగులు
జ్యోతినగర్: తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు స్టేజ్–2 నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. ఈమేరకు ఎన్టీపీసీ నుంచి రూ.15,500 కోట్ల ఆర్డర్ను భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్(బీహెచ్ఈఎల్) దక్కించుకుంది. ఒక్కోటి 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంగల మూడు యూనిట్లను ఈ ప్రాజెక్టు ద్వారా నిర్మించనున్నారు. పనులు ప్రారంభం పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీలో తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు స్టేజ్–2 నిర్మాణం కోసం ఇప్పటికే స్థలం కేటాయించారు. పర్యావరణ అనుమతులు, కోల్లింకేజీ, బూడిద చెరువు నిర్మాణానికి భూసేకరణ తదితర పనులన్నీ సిద్ధం చేశారు. పీపీఏలోనే జాప్యం విద్యుత్ కొనుగోలు కోసం రాష్ట్రప్రభుత్వం ఇప్పటివరకు ఒప్పందం చేసుకోలేదు. దీంతో కేంద్రమంత్రి కిషన్రెడ్డి ఇటీవల దీనిపై సీఎం రేవంత్రెడ్డి లేఖ కూడా రాశారు. తెలంగాణ ప్రభుత్వం పీపీఏ(పవర్ పర్చేజ్ అగ్రిమెంట్)చేసుకోకుంటే ఇతర రాష్ట్రాలతో ఒప్పందం చేసుకోనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ప్రాజెక్టు స్వరూపం ఇది.. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ ఆవరణలోనే తెలంగాణ స్టేజ్–2 ప్రాజెక్టు నిర్మిస్తారు. ఇందులో ఒక్కోటి 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంగల మూడు యూనిట్లు ఉంటాయి. మెయిన్ ప్లాంట్ ప్యాకేజీ పనుల్లో ప్రధానంగా బాయిలర్, టర్బైన్, జనరేటర్ ఉంటాయి. ప్రాజెక్టు డిజైన్, ఇంజినీరింగ్, తయారీ, సరఫరా, నిర్మాణం, ప్రారంభించడం, పరీక్షించడం తదితర అంశాలపై ఇప్పటికే ప్రణాళిక రూపొందించారు. అయితే, నోటిఫికేషన్ ఆఫ్ అవార్డ్(ఎన్వోఏ) తేదీ నుంచి 62 నెలలోగా ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తిచేయాల్సి ఉంటుందని అధికారులు వివరించారు. రూ.15,500 కోట్లకు బీహెచ్ఈఎల్ ఆర్డర్ 62 నెలల్లో ప్రాజెక్టు నిర్మాణానికి సన్నాహాలు -
ఆశలు గాలికి..
పెద్దపల్లిబుధవారం శ్రీ 1 శ్రీ ఏప్రిల్ శ్రీ 20267పెద్దపల్లిరూరల్/జూలపల్లి/ఎలిగేడు/ధర్మారం/పాలకుర్తి/ఓదెల/కాల్వశ్రీరాంపూర్: జిల్లాలో ని ఏడు మండలాల్లో మంగళవారం వేకువజామున ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. దీంతో సుమారు 55 గ్రామాల్లో మొక్కజొన్న, వరితో కలిపి సాగుచేసిన రైతులు 1,757 మంది తీవ్రంగా నష్టపోయారు. సుల్తానాబాద్ మండలం రేగడిమద్దికుంటలో నేలవాలిన పంటలను ఇన్చార్జి డీఏవో కాంతారావు స్థానిక వ్యవసాయ అధికారులు, రైతులతో కలిసి మంగళవారం ఉదయం పరిశీలించారు. భారీగాలులతో కూడిన వర్షం భారీ గాలులకు మామిడితోటల్లో కాయలు, చింతకాయలు రాలిపోయాయి. స్థానికులు ఉచితంగా తీసుకెళ్లేందుకు పోటీపడ్డట్టు సమాచారం. ధర్మారంలో 3.3 మి.మీ., అంతర్గాంలో 17.4 మి.మీ., రామగిరిలో 3.4 మి.మీ., జూలపల్లిలో 1.0 మి.మీ., ఓదెలలో 2.3 మి.మీ. వర్షపాతం నమోదైనట్టు సీపీవో కార్యాలయ వర్గాలు తెలిపాయి. పంట నష్టంపై ప్రాథమిక అంచనా.. ఈదురుగాలులతో కూడిన వర్షంతో పంటలకు జరిగిన నష్టంపై వ్యవసాయాధికారులు ప్రాథ మిక అంచనాకు వచ్చారు. జిల్లావ్యాప్తంగా వరి 410 ఎకరాలు, మొక్కజొన్న 1,821 ఎకరాల్లో దెబ్బతిన్నట్లు ప్రాథథమిక అంచనాకు వచ్చారు. కాల్వశ్రీరాంపూర్ మండలంలో వరి అత్యధికంగా 271 ఎకరాల్లో దెబ్తిన్నట్లు అధికారులు గుర్తించారు. కాల్వశ్రీరాంపూర్లో 443 ఎకరాల్లో మొక్కజొన్న కూడా దెబ్బతిన్నట్లు వివరించారు. వంగిన ఆలయ కమాన్ రామగుండం: స్థానిక శ్రీభక్తాంజనేయస్వామి ఆలయ కమాన్ ఈదురుగాలుల ధాటికి వంగిపోయింది. కిందకు వేలాడుతూ ప్రమాదకరంగా మారింది. సుమారు రెండు దశాబ్దాల క్రితం కమాన్ నిర్మించారని స్థానికులు చెబుతున్నారు. జిల్లావ్యాప్తంగా ఈదురుగాలులు నేలవాలిన మొక్కజొన్న, వరి, మామిడి మొత్తం 2,231 ఎకరాల్లో పంటలకు నష్టం వ్యవసాయ శాఖ అంచనా -
అదుపుతప్పిన ఆర్టీసీ బస్సు
● రోడ్డుపక్కకు దూసుకెళ్లి ఆగిన వైనం జ్యోతినగర్: పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ ఒకటో డివిజన్ న్యూపీకే రామయ్య కాలనీ సమీపంలో మంగళవారం ఆర్టీసీ బస్సు అదుపుతప్పి రోడ్డుపక్కకు దూసుకెళ్లింది. ఉదయం గోదావరిఖని నుంచి లింగాపూర్ మోడల్ స్కూల్కు విద్యార్థులను తీసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. అక్కడ విద్యార్థులను దించి గోదావరిఖని వైపు వస్తోంది. ఈక్రమంలో అదుపుతప్పి రోడ్డు కిందకు దూసుకు వెళ్లి ఆగిపోయింది. ఈ ప్రమాదంలో డ్రైవర్, కండక్టర్కు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదంపై ఆర్టీసీ అధికారులు విచారణ చేపట్టినట్లు సమాచారం. ఉరేసుకొని వివాహిత ఆత్మహత్యచిగురుమామిడి(హుస్నాబాద్): చిన్నముల్కనూర్ గ్రామానికి చెందిన మెడవేని రాధిక (25) ఉరేసుకు ని ఆత్మహత్య చేసుకుంది. ఎస్సై పృథ్వీధర్గౌడ్ తెలి పిన వివరాలు.. సుందరగిరి గ్రామానికి చెందిన రా ధికను 2021లో చిన్నముల్కనూర్కు చెందిన రమేశ్కు ఇచ్చి వివాహం చేశారు. వీరికి మూడేళ్ల కూతు రు మనస్విని ఉంది. అదనపు కట్నం తేవాలంటూ రాధికను తరుచూ భర్త రమేశ్, అత్త కమలవ్వ వేధింపులకు గురిచేసేవారు. వేధింపులు తట్టుకోలేక సోమవారం రాత్రి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడగా చుట్టుపక్కల వారు గమనించి 108లో కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి మృతిచెందినట్లు నిర్ధారించారు. మృతురాలి తండ్రి చంద్రయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
చర్చనీయాంశమైన చైన్స్నాచింగ్
రామగుండం: పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్స్టేషన్ వెనకాల గల పాతబజార్లో సోమవారం రాత్రి జరిగిన చైన్స్నాచింగ్ ఘటన పాతబజార్తో పాటు పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. పట్టణంలో ఇప్పటివరకు ఇలాంటి ఘటనలు చోటుచేసుకోలేదు. దీనిని సీరియస్గా పరిగణిస్తూ పోలీసులు ఇప్పటికే గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. వాకింగ్ చేస్తుండగా.. స్వశక్తి సంఘాల ముఖ్య ప్రతినిధి కోల కుసుమకుమారి.. సోమవారం సాయంత్రం వేళ అల్పాహారం చేసింది. ఆ తర్వాత తన ఇంటి ఎదుట కాసేపు వాకింగ్ చేసింది. ఆ వీధిలోని పల్లెర్ల శ్రీనివాస్ ఇంటి ఎదుట పొరుగు మహిళలతో ముచ్చటిస్తోంది. ఈ క్రమంలో ఓ గుర్తు తెలియని యువకుడు అక్కా అని పిలుస్తూ కుసుమ వద్దకు వస్తూనే మెడలోని నాలుగున్నర తులాల పుస్తెలతాడును కట్టర్తోకట్ చేసి పట్టుకొని పరుగులుపెట్టాడు. అప్పటికే ప్రధాన రోడ్డుపై పల్సర్ బైక్తో సిద్ధంగా ఉన్న మరోవ్యక్తితో కలిసి క్షణాల్లో మాయమయ్యాడు. సినీఫక్కీగా జరిగిన ఘటనతో అర్ధగంట వరకు బాధితురాలు తేరుకోలేకపోయింది. గ్రూపు లీడర్ కావడంతో అక్కా అని పిలుస్తూ వచ్చిన వ్యక్తిని గుర్తించలేకపోయామని స్థానికులు తెలిపారు. కాలనీలో అంధకారం కాలనీలో వీధిదీపాలు వెలుగడంలేదు. చిమ్మచీకట్లు కమ్ముకున్నాయి. సీసీ కెమెరాలు లేవు. దీంతోనే నిందితుడు చాకచాక్యంగా తనపని ముగించుకొని వెళ్లిపోయాడు. ఘటనకు ముందు సదరు వ్యక్తి ఒకసారి పాతబజార్కాలనీ చివరి వరకు రెక్కీచేసినట్లు స్థానికులు చెబుతున్నారు. చైన్స్నాచింగ్పై డీసీపీ విచారణ స్థానిక పాతబజార్లో సోమవారం రాత్రి జరిగిన చైన్స్నాచింగ్పై పెద్దపల్లి డీసీపీ రాంరెడ్డి మంగళవారం విచారణ చేపట్టారు. బాధితురాలు కోల కుసుమకుమారితో మాట్లాడి వివరాలు సేకరించారు. విచారణలో గోదావరిఖని ఏసీపీ రమేశ్, రామగుండం ఎస్సై సంధ్యారాణి తదితరులు ఉన్నారు. కాగా, పోలీస్స్టేషన్ వెనకాలే చైన్స్నాచింగ్ ఘటన జరగడాన్ని పోలీసు యంత్రాంగం సీరియస్గా పరిగణిస్తోంది. విచారణ చేపట్టాం పాతబజార్కాలనీలో ఇప్పటివరకు చైన్స్నాచింగ్లు చోటుచేసుకోలేదు. ఈ ఘటనపై విచారణ చేపట్టాం. పలుప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీలు పరిశీలిస్తున్నాం. నిందితులను త్వరలోనే పట్టుకుంటాం. ఆరుబయటకు వెళ్లే మహిళలు చాలాజాగ్రత్తలు పాటించాలి. – రమేశ్, ఏసీపీ, గోదావరిఖని పాతబజార్కాలనీలో కలకలం నిందితుల వేటలో పోలీస్యంత్రాంగం -
‘కను’సన్నల్లో పొలం!
ఒకవైపు ప్రకృతి వైపరీత్యం.. మరోవైపు పశువులు, పక్షులు.. ఇంకోవైపు వన్యప్రాణులు.. కోతుల దాడులు వెరసి ఆరుగాలం శ్రమించి పంట పండిస్తున్న రైతును నిండా ముంచుతున్నాయి. అనేక కష్టనష్టాలకు ఓర్చి పంటను కాపాడుకుంటే చివరివరకు చేతికొస్తుందో? లేదో? అనే బెంగ వెంటాడుతూనే ఉంటుంది. ఈక్రమంలోనే తన పొలాన్ని కాపాడుకునేందుకు ఓ రైతు విత్ సౌండ్ సోలార్ సీసీ కెమెరాను తన వరిపొలంలో ఏర్పాటు చేసుకున్నాడు. దాని పరిసరాల్లో మనుషులు, జంతువులు, వన్యప్రాణుల జాడ కనిపిస్తే చాలు హాఠాత్తుగా శబ్దం చేస్తోంది. రైతు మొబైల్కు ఫొటోలూ పంపిస్తోంది. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం జయ్యారం అటవీ ప్రాంతంలోని పంట పొలాల్లో ఓ రైతు ఏర్పాటు చేసుకున్న సోలార్ పవర్తో కూడిన సీసీ కెమెరా ‘సాక్షి’కి కనిపించింది. – సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి -
డిమాండ్లు నెరవేర్చాలి
పెద్దపల్లి: తమ డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని ఆశ వర్కర్లు కోరారు. జిల్లా కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో రాజీవ్ రహదారిపై సోమవారం రాస్తారోకో చేశారు. బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ఉప్పు రాజ్కుమార్ తదితరులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలు స్వప్న మాట్లాడుతూ, తమ హక్కుల సాధన, కనీస వేతనం అమలు, అలవెన్స్ల కోసం పోరాటం కొనసాగిస్తామన్నారు. ప్రతినిధులు అనవేన స్వరూప, మమత, రాజేశ్వరి, ప్రేమలత, మనీద్ర, రజిత, జ్యోతి, స్వరూప, రమాదేవి, అనురాధ, జ్యోత్న, శోభా, స్వప్న తదితరులు పాల్గొన్నారు. -
కనీస వేతనాలు అమలు చేయాలి
గోదావరిఖని: అసంఘటిత రంగంలోని కార్మికులకు కనీసవేతనాలు అమలు చేయాలని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్ కోరారు. సోమవారం అసెంబ్లీలో మాట్లాడుతూ, దేశఆర్థిక వ్యవస్థలో అసంఘటిత రంగం కీలక పాత్ర పోషిస్తున్నా.. కార్మికులు ప్రాథమిక హక్కులు, భద్రత, కనీస వేతనాల విషయంలో అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. కార్మికులు, భవన నిర్మాణ రంగంలోని కార్మికులు, వ్యవసాయ కూలీలు, గృహ సేవకులు, చిన్నపరిశ్రమల కార్మికులు దేశ అభివృద్ధికి పునాది లాంటివారని, వారికి కనీస వేతనాల అమలును కచ్చితంగా నిర్ధారించాలని కోరారు.స్థానిక అధికారులు, కార్మిక సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు కలిసి పనిచేసి ఈసమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. -
ప్రజావాణి అర్జీలకు అధిక ప్రాధాన్యం
పెద్దపల్లి: ప్రజాప్రజావాణి ద్వారా అందిన దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యతం ఇచ్చి సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. అదనపు కలెక్టర్ వేణుతో కలిసి కలెక్టరేట్లో సోమవారం ప్రజావాణి నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. పెద్దపల్లి మండలం రంగాపూర్ గ్రామానికి చెందిన గండు రాజయ్య.. తనకు 1.5 ఎకరాల వ్యవసాయ భూమి ఉందని, బ్రిక్స్ నుంచి వచ్చే దుమ్ము, ధూళి, బూడిదతో పొలంలో వేసే కూరగాయల పంటకు నష్టం వస్తుందన్నారు. ఇందుకు కారణమైన బ్రిక్స్ యజమానిపై చర్యలు తీసుకోవాలని కోరారు. పెద్దపల్లి హనుమాన్నగర్కు చెందిన ఎర్రం వరలక్ష్మి.. తనకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారని, తన పోషణ ఎవరూ పట్టించుకోవడం లేదని, వృద్ధుల పోషణ సంరక్షణ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని విన్నవించారు. పట్టణానికి చెందిన కుమారస్వామి.. తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరాడు. సుల్తానాబాద్ మండలం నీరుకుల్లకు చెందిన ఎర్రబెల్లి రాజేశ్వరరావు.. సర్వే నంబరు 330 నుంచి 331లోని కాలువలో మట్టి తీయాలని అర్జీపెట్టారు. పెద్దపల్లి విద్యానగర్కు చెందిన విఠల్.. గృహజ్యోతి పథకం అమలు చేయాలని కోరాడు. ప్రభుత్వ ఆస్పత్రిలో సత్వర సేవలు ప్రభుత్వ ఆస్పత్రిలో సత్వర వైద్యసేవలు అందించాలని కలెక్టర్ శ్రీహర్ష సూచించారు. వైద్యశాఖ పనితీరుపై తన కార్యాలయంలో సమీక్షించారు. రోజూ ఉదయం 9.30 నుంచి 11.00 గంటల వరకు ఓపీ రిస్ట్రేషన్ చేయడం ద్వారా ఎక్కువమందికి సేవలు అందించలేకపోతున్నామని, ప్రతీవిభాగంలో నిర్దిష్ట సంఖ్యలో టోకెన్లు జారీచేసి ఓపీ సేవలు పెంచాలని, ఆ తర్వాత ఆన్లైన్లో నమోదుచేయాలని కలెక్టర్ సూచించారు. ఉదయం తీసుకున్న శాంపిళ్ల నివేదికను సాయంత్రం వరకు పేషెంట్లకు తెలియజేయాలని అన్నారు. ఎక్స్రే యంత్రం, సిబ్బంది నియామకానికి ప్రతిపాదనలు అందించాలని చెప్పారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి ప్రమోద్ కుమార్, డీసీహెచ్వో శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. అత్యున్నతమైనది ఉపాధ్యాయ వృత్తి ఉపాధ్యాయ వృత్తి అత్యున్నతమైనదని కలెక్టర్ శ్రీహర్ష అన్నారు. సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని పూసాల ఎంపీసీఎస్ ఉపాధ్యాయురాలు మిరియాల సుజాత– ఉద్యోగ విరమణ కార్యక్రమానికి కలెక్టర్ హాజరై మాట్లాడారు. క్రమశిక్షణతో కూడిన బోధన విద్యార్థుల భవిష్యత్కు బాటలు వేసిందని ప్రశంసించారు. ప్రజాప్రతినిధులు సిద్ధ తిరుపతి, వేగోళం పద్మ –అబ్బయ్యగౌడ్, ఎంఈవో రాజయ్య, టీఆర్టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కటకం రమేశ్, కాంప్లెక్స్ హెచ్ఎం కవిత, రత్నాకర్రెడ్డి, ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్రెడ్డి, జిల్లా అధ్యక్షుడు గుర్రం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
క్రీడలకు ఎన్టీపీసీ పెద్దపీట
జ్యోతినగర్: రామగుండంలోని ఎన్టీపీసీ క్రీడలకు పెద్దపీట వేస్తున్నట్లు ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చందన కుమార్ సామంత అన్నారు. సోమవారం రాత్రి పర్మినెంట్ టౌన్షిప్లోని మహాత్మాగాంధీ క్రీడా మైదానంలో సదరన్ రీజియన్ స్పోర్ట్స్ మీట్ 2025–26 నిర్వహించారు. ఈసందర్భంగా వాలీబాల్, బాస్కెట్బాల్ పోటీలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. విద్యుత్ ఉత్పత్తితోపాటు క్రీడలను సైతం ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జనరల్ మేనేజర్ ముకుల్ రాయ్, మనీష్ అగర్వాల్తోపాటు సదరన్ రీజియన్లోని కాయంకుళం, కుడ్డి, సింహాద్రి, వల్లూరు, రామగుండం–తెలంగాణ ప్రాజెక్టులోని క్రీడాకారులు, క్రీడా విభాగం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. -
పత్తి ధర రూ.7,455
పెద్దపల్లిరూరల్: స్థానిక వ్యవసాయ మార్కెట్యార్డు ఆవరణలో సోమవారం పత్తి క్వింటాల్కు గరిష్టంగా రూ.7,455 ధర పలికిందని మార్కెట్కమిటీ చైర్మన్ కూరమల్లారెడ్డి, కార్యదర్శి ప్రవీణ్రెడ్డి తెలిపారు. కనిష్టంగా రూ.5,526గా, సగటు రూ.7,055గా ధర ఉందని వారు పేర్కొన్నారు. మెడికల్బోర్డు పునరుద్ధరించాలి గోదావరిఖని: సింగరేణిలో మెడికల్ బోర్డు పునరుద్ధరించాలని టీబీజీకేఎస్ ఆర్జీ–2 ఉపాధ్యక్షుడు ఐలి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. సోమవారం ఆర్జీ–2 జీఎం ఆఫీస్ ఎదుట ధర్నా నిర్వహించారు. కార్మికుల పెండింగ్ సమస్యలు వెంటనే పరిష్కరించాలన్నారు. సుమారు గంటపాటు నిరసన తెలిపి అనంతరం పర్సనల్ డీజీఎం అరవిందరావుకు వినతిపత్రం అందజేశారు. నాయకులు డి.సురేందర్, మామిడి తిరుపతి, కూర తిరుపతి, రవితేజ, హరిప్రసాద్, బొడ్డు రమేశ్, దాసరి శ్రీనివాస్, శశాంక్ తదితరులు పాల్గొన్నారు.వాకింగ్ చేస్తుండగా చైన్స్నాచింగ్ పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి శివారు బందంపల్లిలో సోమవారం రాత్రి ఇంటిముందు వాకింగ్ చేస్తున్న గుండు లక్ష్మీనర్సమ్మ అనే వృద్ధురాలి మెడలో నుంచి దొంగలు బంగారు గొలుసు ఎత్తుకెళ్లారు. స్థానికుల కథనం ప్రకారం.. రాత్రి భోజనం చేసిన ఇంటిముందు కాలినడకన తిరుగుతుండడాన్ని గమనించిన యువకులు.. బైక్పై వచ్చి మూడుతులాల బంగారు గొలుసు తెంపుకుని వచ్చిన దారినే వెళ్లి పోయారని బాధితురాలు తెలిపింది. ఈ విషయమై పోలీసులకు సమాచారం అందించారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి పెద్దపల్లిరూరల్: పట్టణంలోని రాంపల్లి డబుల్ బెడ్డ్రూమ్ కాలనీలో వీధిదీపాలను ఏర్పాటు చేయడంతో పాటు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని కాలనీవాసులు కోరారు. ఈ మేరకు డీసీపీ రాంరెడ్డి, ఏసీపీ కృష్ణ, సీఐ ప్రవీణ్కుమార్, ఎస్సై మల్లేశ్కు వినతిపత్రం అందించారు. అందుకు సానుకూలంగా అధికారులు స్పందించారని వారు పేర్కొన్నారు. హత్యాయత్నం కేసులో నిందితుని అరెస్ట్జగిత్యాలక్రైం: జగిత్యాల పట్టణంలో శనివారం రాత్రి బాలాజీనగర్కు చెందిన తుమ్మల లోకేశ్పై హత్యాయత్నానికి పాల్పడిన ఓరుగంటి వివేక్ను సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు పట్టణ సీఐ కరుణాకర్ తెలిపారు. తహసీల్ చౌరస్తా వద్దనున్న అమృత విల్లాస్ హోటల్లో వంట మనిషిగా పనిచేస్తున్న లోకేశ్, అదే హోటల్లో మేనేజర్ వివేక్ మధ్య గొడవ జరిగింది. మాటామాట పెరగడంతో లోకేశ్ను చంపాలనే ఉద్దేశంతో తన వద్దనున్న సర్జికల్ బ్లేడ్తో వీపుపై పొడవగా బలమైన రక్తగాయాలయ్యాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు. -
రాములోరి పాదముద్రలు ప్రత్యక్షం
మంథని: స్థానిక శ్రీరాంనగర్ సీతారామచంద్రుల ఆలయంలో సోమవారం వరిపిండిలో రాములోరి పాదాల గుర్తులు దర్శనమిచ్చాయి. ఏటా శ్రీరామనవమి తర్వాత నిర్వహించే పట్టాభిషేకం సందర్భంగా రాత్రి వేళ శ్రీసీతారామ చంద్రస్వామి ఆలయంలోకి వస్తారని భక్తుల విశ్వాసం. ఈక్రమంలోనే ఈనెల 27న స్వామివారి కల్యాణం జరిపించగా, ఆదివారం రాత్రి పట్టాభిషేకం నిర్వహించారు. సోమవారం ఆ యలం తలుపులు తెరిచే సరికి స్వామివారి పాదాల గుర్తులు దర్శనమివ్వడంతో భక్తుల నమ్మ కం పదిలిమైంది. కాలనీవాసులతోపాటు సమీప ప్రాంతాల భక్తులు తరలివచ్చి దర్శనం చేసుకున్నారు. -
నాణ్యమైన చేపపిల్లలు ఇవ్వాలి
పెద్దపల్లిరూరల్: మత్స్యసహకార సంఘాల్లో నూతన సభ్యత్వాలను నమోదు చేసేందుకు అవకాశం ఇవ్వాలని, చెరువులు, కుంటల్లో నాణ్యమైన చేపపిల్లలను నిబంధనల ప్రకారమే అందించాలని మత్స్యసహకార సంఘం జిల్లా అధ్యక్షుడు కొలిపాక నర్సయ్య అన్నారు. జిల్లా కేంద్రలో సోమవారం జరిగిన సాధారణ సమావేశంలో జిల్లా మత్స్యశాఖ అధికారి నరేశ్, డైరెక్టర్లు పాల్గొన్నారు. సంఘం సభ్యులందరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందేలా చూడాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాల ఫలాలను అందేలా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా అధికారి నరేశ్ అన్నారు. సమావేశంలో సారయ్య, వీరస్వామి, శ్రీనివాస్, తిరుపతి, సుజాత, మొండయ్య, శ్రీకాంత్, కోటయ్య తదితరులు ఉన్నారు. -
పకడ్బందీగా ఓటరు జాబితా
జ్యోతినగర్: ఓటరు జాబితాను పగడ్బందీగా తయారు చేయాలని అడిషనల్ కలెక్టర్ అరుణశ్రీ ఆదేశించారు. ఎన్టీపీసీ పీటీఎస్ కాకతీయ ఆడిటోరియంలో సోమవారం జరిగిన బీఎల్వోల సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఓటు జాబితా ఉండాలని సూచించారు. జాబితాలో ఉన్నవారు మరణించినా, ఇతర ప్రాతాలకు వలస వెళ్లినా వారిని గుర్తించి జాబితా నుంచి పేర్లు తొలగించాలని అన్నారు. సమావేశంలో తహసీల్దార్లు రవీందర్ పటేల్, సునీత, లక్ష్మి, సీడీపీవో అలేఖ్య పటేల్ తదితరులు పాల్గొన్నారు.రైలు నుంచిపడి యువకుడి మృతి ఓదెల: పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పొత్కపల్లి రైల్వేస్టేషన్ సమీపంలోని లెవల్ క్రాసింగ్గేట్ వద్ద ఆదివారం రాత్రి సంఘమిత్ర ఎక్స్ప్రెస్ రైలునుంచి పండి బిహర్ రాష్ట్రం ఖైమూరు బాబువ జిల్లా ఆసన్ గ్రామానికి చెందిన అఫరోజ్ అన్సారీ(21) మృతిచెందాడు. రామగుండం జీఆర్ఫీఎఫ్ హెడ్కానిస్టేబుల్ తిరుపతి కథనం ప్రకారం.. సూర్యాపేటలో కూలీ పనులు చేసేందుకు దీల్దయాల్ ఉపాధ్యాయ రైల్వేస్టేషన్ నుంచి తన సోదరులతో కలిసి సంఘమిత్ర రైలులో ఖమ్మం ప్రయాణం చేస్తున్నారు. మార్గమధ్యంలోని పొత్కపల్లిలో అఫరోజ్ అన్సారీ ప్రమాదవశాత్తు కిందపడి తలపగిలి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతదేహన్ని పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరించారు. శవపరీక్ష చేయించి మృతుడి తమ్ముడికి అప్పగించారు. ఎస్సారెస్పీ కాలువలో దూకి మహిళ ఆత్మహత్యమేడిపల్లి: మండలంలోని వల్లంపల్లి పరిధి ఎస్సారెస్పీ కాలువలో దూకి మెట్పల్లి మండలం వెల్లుల్ల గ్రామానికి చెందిన సార్ల లక్ష్మీ ఆత్మహత్య చేసుకుంది. కాలువలోని తుమ్మచెట్టుకు మహిళ మృతదేహం కనిపించిందన్న బాటసారుల ద్వారా తెలుసుకున్న మేడిపల్లి పోలీస్లు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీయించారు. లక్ష్మీ కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోందని, జీవితంపై విరక్తితో ఆత్మహత్య చేసుకుందని ఆమె భర్త నారాయణ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
ప్రజాభవన్ను ముట్టడిస్తాం
గోదావరిఖని: సింగరేణిలో మెడికల్ బోర్డు వెంటనే నిర్వహించాలని, పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ప్రజాభవన్ ముట్టడిస్తామని టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి హెచ్చరించారు. సోమవారం ఆర్జీ–1 జీఎం కార్యాలయం ధర్నా నిర్వహించారు. గోల్డెన్ హ్యాండ్ షేక్ పేరిట గతంలో 20వేల మందిని, డిస్మిస్ పేరిట పది వేల మందిని నాటి ప్రభుత్వాలు తొలగించాయన్నారు. ప్రస్తుత ప్రభుత్వం కూడా అదేపోకడ కొనసాగిస్తోందన్నారు. సింగరేణిలో అవినీతి రాజ్యమేలుతోందని, కారుణ్య నియమాకాల ద్వారా నియమితులైన ఉద్యోగులను భయభ్రాంతులకు గురిచేసే విధంగా ఉద్యోగులపై ఏసీబీ, విజిలెన్స్ దాడులు చేస్తామని బెదిరింపులకు గురిచేయడం దారుణమన్నారు. సంస్థను పరిరక్షించుకోవడానికి పోరాటానికి సిద్ధ కావాలని ఆయన కోరారు. నాయకులు వడ్డేపల్లి శంకర్, మాదాసు రాంమ్మూర్తి, నూనె కొమరయ్య, చెల్పూరి సతీశ్, జావిద్పాషా, పోలాడి శ్రీనివాసరావు, చల్లా రవీందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన
జ్యోతినగర్: తెలంగాణ ఉద్యమంలో ప్రాణ త్యాగానికి సైతం సిద్ధమైన వారికి ప్రభుత్వం న్యాయం చేయాలనే డిమాండ్తో వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. ఉద్యమకారులు తోడేటి శంకర్గౌడ్, పొన్నం విజయకుమార్గౌడ్, వొల్లాల మల్లేశం తదితరులు పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ జ్యోతినగర్లోని సింధూర కళాశాల రోడ్డులోని వాటర్ ట్యాంకుపైకి ఎక్కి నిరసన తెలిపారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. 250 చ.గ. నివాసస్థలంతోపాటు సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని కోరారు. ఎన్టీపీసీ ఎస్సై ఉదయ్కిరణ్ వెంటనే అక్కడకు చేరి ఉద్యమకారులతో మాట్లాడారు. కిందికు వచ్చేలా చర్యలు చేపట్టారు. అనంతరం అదుపులోకి తీసుకుని వన్టౌన్ పోలీస్స్టేషన్కు తరలించారు. ఆ తర్వాత రోడ్డుపై ట్రాఫిక్ నిలిచిపోవడంతో క్రమద్ధీకరీంచారు. -
ఉత్తమ ర్యాంక్ సాధించడమే ధ్యేయం
కోల్సిటీ: రామగుండం బల్దియా స్వచ్ఛ సర్వేక్షణ్లో ఉత్తమ ర్యాంక్ సాధించడమే తమ ధ్యేయమని మేయర్ మహంకాళి స్వామి అన్నారు. బల్దియా కార్యాలయం – ఫైవింక్లయిన్ వరకు ప్రధాన రహదారిని స్వీపింగ్ యంత్రంతో శుభ్రపరిచే పనులను మేయర్ సోమవారం పర్యవేక్షించారు. పాత స్వీపింగ్ యంత్రం పనిచేకపోవడంతో ఎమ్మెల్యే సహకారంతో హెచ్కేఆర్ నుంచి తెప్పించిన ట్రాక్టర్ స్వీపింగ్ మిషన్తో శుభ్రం చేయిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. పారిశుధ్య సిబ్బంది కొరతను దృష్టిలో ఉంచుకొని తక్కువ ఖర్చుతో పనిచేసే ట్రాక్టర్ మౌంటెడ్ స్వీపింగ్ యంత్రాలు తెప్పించడానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. డిప్యూటీ మేయర్ పాతపెల్లి ఎల్లయ్య, కార్పొరేటర్లతోపాటు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పీవీ రామన్, టీపీఎస్ నవీన్, శానిటరీ ఇన్స్పెక్టర్ సంపత్ తదితరులు పాల్గొన్నారు. -
సీఎస్పీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
గోదావరిఖని: ఆర్జీ–1 ఏరియా సీఎస్పీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని హెచ్ఎంఎస్ అధ్యక్షుడు రియాజ్అహ్మద్ డిమాండ్ చేశారు. సోమవారం ఆర్జీ–1 ఏరియా సీఎస్పీలో జరిగిన గేట్మీటింగ్లో మాట్లాడారు. బొగ్గు దుమ్ము లేవకుండా వాటర్ స్ప్రే చేయాలన్నారు. కార్మికులను చార్జిషీట్లు, సస్పెండ్లు చేస్తామని బెదిరింపులు మానుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆరెల్లి పోశం, డేగల వరప్రసాద్రావు, మురళీధర్, నాగేందర్, మహ్మద్, మల్లేశ్, ప్రసాద్, బట్టు ప్రసాద్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. -
చేపలవేటపై శిక్షణ కరువు
పెద్దపల్లిరూరల్: జీవనోపాధికోసం చేపలవేటపై ఆధారపడిన మత్స్యకారులకు నైపుణ్య శిక్షణ కరువైంది. జిల్లాలోని చెరువులు, కుంటల్లో పెంచిన చేపలను పట్టేందుకు సరైన నైపుణ్యం లేక చాలామంది నీటమునిగిపోతున్నారు. ఇందులో చెరువులు, కుంటల్లోకి దిగిన మత్స్యకారులు ప్రమాదవశాత్తు నీట మునిగి ప్రాణాలు కోల్పోయిన సంఘటనలూ ఉన్నాయి. చేపలను పట్టే వృత్తిపై ఆధారపడి జీవించే వారికి గతంలో ఏటా అవసరమైన నైపుణ్యశిక్షణ ఇప్పించేవారు. సొసైటీలో సభ్యత్వం ఇచ్చే సమయంలోనే సంబంధిత అధికారులు పరీక్షించేశారు. చేపలు పట్టబోయి.. జిల్లాలోని పలు ప్రాంతాల్లో మత్స్యకారులు చేపలు పట్టేందుకు వెళ్లి చెరువులోనే మునిగి మృత్యువాత పడ్డ సంఘటనలు అనేకం ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 12మంది వరకు ఇలా మరణించినట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. వారికి ప్రభుత్వ పరంగా రూ.5లక్షల పరిహారం అందిస్తున్నారు. కరువైన నైపుణ్యశిక్షణ చేపలు పట్టేందుకు చెరువులోకి దిగే మత్స్యకారుల వృత్తి నైపుణ్యాన్ని పెంచేందుకు ప్రభుత్వం శిక్షణ ఇప్పించడంలో నిర్లక్ష్యం వహిస్తోంది. నాలుగేళ్లుగా శిక్షణ ఊసే కనిపించడం లేదు. దీంతో కుటుంబపోషణ కోసం చేపలను పట్టేందుకు పూర్వీకుల నుంచి నేర్చుకున్న పద్ధుతులపైనే ఆధారపడాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఆధునిక సాంకేతికపై శ్రద్ధ ఏది? సమాజంలో వస్తున్న ఆధునిక సాంకేతికతతో వివిధ వృత్తులపై ఆధాపడ్డ వారికి యాంత్రీకరణలో భాగంగా పనిముట్లను అందిస్తున్న ప్రభుత్వం.. చేపలు పట్టే వృత్తిపై ఆధారపడ్డ వారిపై ఎందుకు నిర్లక్ష్యం చేస్తోందని పలువురు ప్రశ్నిస్తున్నారు. గీత కార్మికులకు కాటమయ్యరక్షణ కవచం లాంటి పరికరాలను అందించిన సర్కారు.. తమకు చేపలను పట్టేందుకు వీలుగా పనిముట్లను రూపొందించాలని లేకుంటే కనీసం నైపుణ్యశిక్షణనైనా ఇప్పించాలని కోరుతున్నారు. చెరువులు, కుంటలు 1,076 సొసైటీలు 216 సభ్యుల సంఖ్య 15,337 మత్స్యకార సంఘాలు(పురుషులు) 147 సభ్యుల సంఖ్య 11,575 మహిళా సంఘాలు 46 సభ్యుల సంఖ్య 2,251 మార్కెటింగ్ సొసైటీలు 15 సభ్యులు 1,116 లైసెన్స్డ్ మార్కెటింగ్ సొసైటీలు 08 సభ్యులు 395 -
మానవ సంబంధాలను కాపాడుకుందాం
పెద్దపల్లిరూరల్: సమాజంలో ఆర్థిక సంబంధాల ముందు మానవ సంబంధాలు మంటగలుస్తున్నాయని, వాటిని కాపాడుకోవాల్సిన అవసరముందని బంజారా ప్రవచనకర్త, ఆధ్యాత్మిక గురువు ఎస్పీ నాయక్ అన్నారు. హన్మంతునిపేటలో సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డీసీపీ రాంరెడ్డి, ఏసీపీ కృష్ణతో కలిసి పాల్గొన్నారు. హన్మంతునిపేట, చీకురాయి, భోజన్నపేట, మూలసాల, రాంపల్లి, మారెడుగొండ, గుర్రాంపల్లి గ్రామాలకు చెందిన ప్రజలకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. వృద్ధాప్యంలో తల్లిదండ్రులను గౌరవించి వారి దీవెనలను పొందాలని ఆయన సూచించారు. సైబర్ నేరగాళ్ల వలలో పడొద్దు సైబర్నేరాలు పెరుగుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉంటూ వారి వలలో పడకుండా జాగ్రత్తలు పాటించాలని పెద్దపల్లి డీసీపీ భూక్యా రాంరెడ్డి అన్నారు. సైబర్మోసాల బారిన పడితే వెంటనే 1930 నంబరుకు సమాచారం అందించాలని ఆయన అన్నారు. రోడ్లపై వాహనాలను నడిపేటప్పుడు ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని సూచించారు. సీఐ ప్రవీణ్కుమార్, ఎస్సైలు మల్లేశ్, శ్వేతతో పాటు సర్పంచులు మ్యాడగోని శ్రీనివాస్, ఓదెల శ్రీనివాస్, త్రివేణి, తొగరి సంపత్, ఉపసర్పంచ్ మేకల కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
డబుల్ బెడ్రూమ్ ఇల్లు వాసప్
పెద్దపల్లి: జిల్లాకు చెందిన వరహగిరి శైలజ – వెంకటరావు దంపతులు తమకు కేటాయించిన డబుల్ బెడ్రూమ్ ఇల్లును కలెక్టర్ కోయ శ్రీహర్షకు సోమవా రం తిరిగి అప్పగించారు. తమ సంతానం సాఫ్ట్వేర్ ఉద్యోగంలో స్థిరపడిన నేపథ్యంలో తమకు ఈ ఇల్లు అవసరం లేదని భావించారు. దీనిని ఇతరపేద కు టుంబానికి కేటాయించాలని కలెక్టర్ను ఆయన కా ర్యాలయంలో సోమవారం కలిసి విన్నవించారు. క లెక్టర్ మాట్లాడుతూ, అవసరం లేకపోయినా ప్రభు త్వ ఆస్తిని తిరిగి ఇచ్చిన శైలజ దంపతులు నిజాయతీకి నిదర్శనమన్నారు. ఇలాంటి వ్యక్తులు సమాజానికి ఆదర్శంగా నిలుస్తారని అభినందించారు. సంక్షేమ పథకాల ప్రయోజనాలు నిజంగా అవసరమైన వారికి అందేలా ప్రతిఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్, అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
నాసిరకం ఆహారం.. నిషేధిత ప్లాస్టిక్ వినియోగం
● మూడు దుకాణాలకు బల్దియా జరిమానా కోల్సిటీ(రామగుండం): నాణ్యతలేని వస్తువులతో ఆహార పదార్థాలు తయారు చేయడంతోపాటు నిషేధిత ప్లాస్టిక్ వినియోగిస్తున్న మూడు వ్యాపార సంస్థలకు రామగుండం బల్దియా జరిమానా విధించింది. మున్సిపల్ కమిషనర్ అరుణశ్రీ ఆదేశాల మేరకు శనివారం ప్రజారోగ్య విభాగం అధికారులు లక్ష్మీనగర్ ప్రాంతంలోని పలు దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా లీలా బార్ అండ్ రెస్టారెంట్లో నాసిరకం పదార్థాలతో వంటలు తయారు చేస్తున్నట్లు గుర్తించి రూ.5,000 జరిమానా విధించారు. అలాగే నిషేధిత ప్లాస్టిక్ వస్తువులు ఉపయోగిస్తున్న వైష్ణవి స్వీట్స్ అండ్ బేకరీ సెంటర్కు రూ.3,000, లిమ్రా ఫ్రూట్ జ్యూస్ సెంటర్కు రూ.3,000 చొప్పున జరిమానా విధించారు. ఈ తనిఖీల్లో శానిటరీ ఇన్స్పెక్టర్లు నాగభూషణం, సంపత్, ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్ మధూకర్, జూనియర్ అసిస్టెంట్ చంద్రారెడ్డి, జవాన్లు దయానంద్, అశోక్ పాల్గొన్నారు. రైతులకు రాజన్న కోడెలు వేములవాడఅర్బన్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని సన్న, చిన్నకారు రైతులకు వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి దేవస్థానానికి సంబంధించిన గోశాల కోడెలు ఉచితంగా పంపిణీ చేస్తామని కలెక్టర్ గరీమా అగ్రవాల్ శనివారం తెలిపారు. తిప్పాపూర్లోని గోశాలలో 300 కోడెలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయన్నారు. ఏప్రిల్ 7న రైతులకు పంపిణీ చేస్తామని తెలిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని రైతులు కోడెలను పొందేందుకు అర్హులని స్పష్టం చేశారు. కోడెల కోసం 1.5 నుంచి 5 ఎకరాల వరకు సాగు భూమి ఉన్న సన్న, చిన్నకారు రైతులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచి ంచారు. వివిధ ధ్రువీకరణపత్రాలతో https://rajannasirici lla.telangana.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అర్హులైన రైతులకే జియో ట్యాగింగ్ కోడెలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. కోడెలు తీసుకెళ్లే రైతులు వాటి సంరక్షణ బాధ్యతను సక్రమంగా చూసుకోవాలని సూచించారు. కో డెలు పక్కదారి పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. టెన్త్ పరీక్షలు ప్రశాంతం పెద్దపల్లి: జిల్లావ్యాప్తంగా శనివారం పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని జిల్లా విద్యాశాఖ అధికారి శారద తెలిపారు. గణితం పరీక్షకు 7,495 మంది విద్యార్థులకు 7486 మంది హాజరయ్యారని, 99.9శాతం హాజరు నమోదు అయ్యిందని వివరించారు. -
‘చెత్త’ మున్సి‘పల్టీ’
పెద్దపల్లిరూరల్: పట్టణంలో ఇంటింటికీ వెళ్లి సేకరించిన చెత్తను ఇలా సంచుల్లో నింపి ట్రాక్టర్లు, ట్రాలీల్లో డంపింగ్ యార్డుకు తరలిస్తుంటారు. ఆ సమయంలో చెత్తపై కనీసం పాలితిన్ కవర్ కూడా కప్పక పోవడంతో ఇలా.. జారి ఓ చెత్తసంచి రోడ్డుపై పడిపోయింది. గమనించిన స్థానికులు అరవడంతో పారిశుధ్య సిబ్బంది వాహనాన్ని పక్కకు నిలిపి వచ్చి ఆ సంచులను మోసుకెళ్లి మళ్లీ వాహనంలో వేసుకుని వెళ్లిపోయాడు. చెత్త తరలించేటప్పుడు కనీస జాగ్రత్తలు పాటించడం లేదని, ఫలితంగా చెత్త గాలికి కింద పడుతోందని స్థానికులు పేర్కొంటున్నారు. ట్రాక్టర్పై కవర్ కప్పకుండానే తరలిస్తున్న చెత్త ట్రాక్టర్ పైనుంచి జారిపడ్డ చెత్త సంచి కిందపడ్డ చెత్త సంచులు తీసుకొస్తున్న కార్మికుడు -
రిజిస్ట్రేషన్ కార్యాలయాలు కిటకిట
రామగుండం: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని రిజిస్ట్రేషన్ కార్యాలయాలు శనివారం క్రయ, విక్రయదారులతో కిటకిటలాడాయి. మరో రెండురోజుల్లో ఆర్థిక సంవత్సరం ముగియనుండడంతో ప్రభుత్వం పనివేళలు పొడిగించిన విషయం విదితమే. ఉదయం 9.30గంటల నుంచి రాత్రి 8.30గంటల వరకు కార్యాలయాలు పనిచేస్తున్నాయి. దీంతో చాలామంది స్లాట్ బుక్ చేసుకున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యా ప్తంగా 16 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. సాయంత్రం నాలుగు గంటల వరకు 401 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ పూర్తయ్యాయని, మరోవంద వరకు ఉన్నాయని పేర్కొన్నారు. సాయంత్రం 4 గంటల వరకు నమోదైన రిజిస్ట్రేషన్లు కరీంనగర్ 27 గంగాధర 22 సిరిసిల్ల 58 పెద్దపల్లి 14 కరీంనగర్ రూరల్ 23 భీమదేవరపల్లి 21 మల్యాల 10 మంథని 7 సుల్తానాబాద్ 26 హుస్నాబాద్ 19 హుజూరాబాద్ 33 రామగుండం 21 మెట్పల్లి 21 వేములవాడ 38 జగిత్యాల 44 పెంచిన పనివేళలతో ప్రభుత్వానికి భారీగా ఆదాయం -
రాజీతో సమన్యాయం
పెద్దపల్లి: వివిధ కేసుల్లో రాజీతో కుదిరితేనే ఇరువర్గాలకు సమన్యాయం లభిస్తుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి కుంచాల సునీత అన్నారు. స్థానిక కోర్టులో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో జడ్జి మాట్లాడారు. కుటుంబ తగాదాలు, ఆస్తిగొడవలు, పిల్లల ఘర్షణలే అధికంగా ఉంటున్నాయని, వీటి పరిష్కారానికి రాజీ కుదుర్చుకోవడం ఉత్తమమన్నారు. జిల్లావ్యాప్తంగా 2,200 కేసులు రాజీ అయినట్లు వివరించారు. జిల్లా జడ్జిలు స్వప్నరాణి, మంజుల, డీసీపీ రాంరెడ్డి, పబ్లిక్ ప్రాసిక్యూటర్ డోంకై న రవీందర్, శ్రీనివాస్, కిశోర్, లీగల్ ఎయిడ్ సభ్యుడు మూర్తి, సీఐ ప్రవీణ్ కుమార్, ఎస్సైలు మల్లేశం, పురుషోత్తం పాల్గొన్నారు. కాగా సుల్తానాబాద్ కోర్టులో జరిగిన లోక్అదాలత్లో 525 కేసులు పరిష్కారమైనట్లు జడ్జి గణేశ్ తెలిపారు. సుల్తానాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మేకల తిరుపతిరెడ్డి, ప్రధాన కార్యదర్శి బోయిని భూమయ్య, ఏజీపీ ఆంజనేయులు, లోక్ అదాలత్ సభ్యుడు మాడూరి ఆంజనేయులు, ఎస్సై చంద్రకుమార్, న్యాయవాదులు ఆవుల లక్ష్మీరాజం, వొడ్నాల రవీందర్, జోగుల రమేశ్, ఆవుల శివకృష్ణ, సామల రాజేంద్రప్రసాద్, రుద్రారపు నర్సయ్య, సంతోష్, మడూరి పృథ్వీ పాల్గొన్నారు. ధర్మారంలో.. ధర్మారం: నందిమేడారం జూనియల్ సివిల్ కోర్టు లో చేపట్టిన లోక్ అదాలత్లో 211 కేసులు పరిష్కారమైనట్లు లోక్ అదాలత్ సభ్యుడు ఆకారి రాజేశం తెలిపారు. జూనియర్ సివిల్ జడ్జి సరిత ఆధ్వర్యంలో లోక్ అదాలత్ నిర్వహించారు. ఎస్సై ప్రవీణ్కుమార్, లోక్ అదాలత్ సభ్యుడు నూనె సత్యనారాయ ణ, బార్ అసోసియేషన్ కోశాధికారి భీమారపు సంపత్, స్పోర్ట్స్ కార్యదర్శి ఎంపల్లి ప్రకాశ్ పాల్గొన్నారు. రాజీ మార్గమే రాచమార్గం గోదావరిఖనిటౌన్: రాజీమార్గమే రాచమార్గమని గోదావరిఖని మున్సిఫ్ మెజిస్ట్రేట్లు నల్లాల వెంకటసచిన్రెడ్డి, స్వారిక, వెంకటేశ్ దుర్వ అన్నారు. స్థానిక కోర్టుల్లో నిర్వహించిన లోక్ అదాలత్లలో వారు మాట్లాడారు. అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సందీప్, లోక్ అదాలత్ సభ్యులు సంజయ్ కుమార్, ఉమర్, కిషన్రావు, గుజ్జేటి సత్యనారాయణ, ముచ్చకుర్తి కుమార్, ఎంచర్ల మహేశ్, నూతి సురేశ్, సబా తబుస్సం, ప్రదీప్ కుమార్, రామటెంకి శ్రీనివాస్, ఏసీపీ రమేశ్, సీఐలు ఇంద్రసేనారెడ్డి, ప్రసాదరావు, ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా జడ్జి కుంచాల సునీత -
హైరిస్క్ ప్రెగ్నెన్సీపై అప్రమత్తత అవసరం
పెద్దపల్లి: గర్భధారణ సమయంలో తల్లి, లేదా కడుపులోని శిశువుకు ఏదైనా ఆరోగ్య సమస్య తలెత్తే పరిస్థితిని ‘హైరిస్క్ ప్రెగ్నెన్సీ’గా పరిగణిస్తారని కరీంనగర్ మెడికవర్ ఆస్పత్రి గైనకాలజిస్ట్ శ్రీనయన, క్రిటికల్ కేర్ నిపుణురాలు పల్లవి తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రెస్క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. డయాబెటిస్, రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధులు, లివర్, కిడ్నీ సమస్యలు గర్భధారణ సమయంలో తీవ్రమయ్యే ప్రమాదం ఉందని, గర్భధారణతో వచ్చే థైరాయిడ్ సమస్యలు, శిశువు బలహీనత, గర్భసంచి బలహీనత వంటి అంశాలు కూడా హైరిస్క్ కేటగిరీలోకి వస్తాయని చెప్పారు. గతంలో ఎక్కువ శస్త్రచికిత్సలు చేయించుకున్న మహిళలు కూడా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. హైరిస్క్ గర్భిణులు క్రమం తప్పకుండా వైద్యులను సంప్రదిస్తూ, ప్రతి దశలో స్కానింగ్లు చేయించుకోవడం ద్వారా తల్లి, శిశువు ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడం తప్పనిసరి అని స్పష్టం చేశారు. మెడికవర్ లాంటి మల్టీస్పెషాలిటీ ఆస్పత్రుల్లో ఇలాంటి వాటికి సమగ్ర వైద్య సేవలు లభించడం వల్ల క్లిష్ట పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనవచ్చని వివరించారు. మెడికవర్ సెంటర్ హెడ్ గుర్రం కిరణ్, మార్కెటింగ్ మేనేజర్ కోట కరుణాకర్, బొంగోని హరీశ్, సంజీవ్ పాల్గొన్నారు. -
ఎల్లమ్మతల్లి ఆలయాల్లో చోరీలు
పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి మండలం రాంపల్లి, మారెడుగొండ గ్రామాల్లోని ఎల్లమ్మతల్లి ఆలయాల్లో శనివారం తెల్లవారు జామున చోరీలు జరిగాయి. అమ్మవారి విగ్రహంపై ఆభరణాలు, హుండీలు ఎత్తుకెళ్లారు. ఆలయ ప్రధాన గేటుకు వేసిన తాళాలను పగుల గొట్టి లోనికి చొరబడ్డారు. రాంపల్లి గ్రామంలో ఇటీవలే ఆలయాన్ని నిర్మించుకున్నారు. మారెడుగొండ ఆలయం వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో నిందితుడు గేటుకు వేసిన తాళం పగులగొట్టి లోనికి వెళ్లే దృశ్యాలు రికార్డయ్యాయని స్థానికులు తెలిపారు. ఈ విషయమై తమకు ఇంకా ఫిర్యాదు అందలేదని రూరల్ ఎస్సై మల్లేశ్ తెలిపారు. హామీలు అమలు చేయాలి గోదావరిఖని: తెలంగాణ ఉద్యమకారులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని తెలంగాణ ఉద్యమ వేదిక డిప్యూటీ చైర్మన్ తోడేటి శంకర్గౌడ్, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొడ్డు రవీందర్ డిమాండ్ చేశారు. శనివారం స్థానిక ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఆరు గ్యారెంటీలలో భాగంగా ఉద్యమకారులకు కూడా అనేక హామీలు ఇచ్చిందని గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడిచినా ఏఒక్క హామీ అమలు చేయలేదని విమర్శించారు. ప్రతీ ఉద్యమకారునికి గుర్తింపు కార్డులు, 250 చదరపు గజాల ఇంటి జాగ, ఇల్లు కట్టుకోడానికి రూ.10 లక్షలు ఆర్థిక సాయం, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, ప్రభుత్వ కార్యాలయాల్లో కాంట్రాక్టులకు రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి మోసం చేసిందని ధ్వజమెత్తారు. సమావేవంలో నాయకులు రాగం శీను, పొన్నం విజయ్గౌడ్, గంగారపు శాంత, లక్ష్మి, అనుముల కళావతి, తోడేటి స్వరూప తదితరులు పాల్గొన్నారు. పెన్షన్ డబ్బుల కోసం వచ్చి మృత్యువాతసిరిసిల్ల అర్బన్: పెన్షన్ తీసుకొని సంతోషంగా ఇంటికి వెళ్తున్న క్రమంలో వాహనం రూపంలో మృత్యువు ఆ వృద్ధురాలిని కానరాని లోకాలకు తీసుకెళ్లిన సంఘటన శనివారం చోటుచేసుకుంది. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పెద్దబోనాలకు చెందిన దానవేని నర్సవ్వ(80) పెన్షన్ డబ్బులు తీసుకునేందుకు స్థానిక బైపాస్రోడ్డు పక్కన ఉన్న బ్యాంకుకు వెళ్లింది. పెన్షన్ తీసుకొని ఇంటికొస్తుండగా కామారెడ్డి నుంచి వేములవాడ వైపు వెళ్తున్న కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందింది. కాలు విరిగి దూరంలో ఎగిరిపడింది. మధ్యాహ్నం ఇంటి నుంచి వెళ్లి నర్సవ్వ రాత్రయినా తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు బైపాస్ రోడ్డు వెంట గాలించడంతో మృతిచెంది కనిపించింది. నర్సవ్వకు ముగ్గురు కూతుళ్లు, ఒక కుమారుడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
జెడ్పీహెచ్ఎస్ విద్యార్ధుల ఇండస్ట్రియల్ టూర్
మంథనిరూరల్: ఎగ్లాస్పూర్ జెడ్పీహెచ్ఎస్ విద్యార్దులు శనివారం బసంత్నగర్ కేశోరాం(అల్ట్రాటెక్) సిమెంట్ ఫ్యాక్టరీ సందర్శించారు. ఇండస్ట్రియల్ టూర్లో భాగంగా ఈకార్యక్రమం చేపట్టారు. రా మెటీరియల్ ఐరన్, జిప్సం క్రషర్, బొగ్గుతో హీట్చేయడం, వీటిని కలిపి క్రషర్ చేసి పొడి చేసి సిమెంట్గా మార్చే విధానాన్ని విద్యార్ధులు ప్రత్యక్షంగా పరిశీలించారు. అలాగే సిమెంట్ బ్యాగులు నింపే విధానం, మిషన్ల సాయంతో గూడ్స్ రైలులో ఎక్కించడం, ఆటోమెటిక్ సిస్టంతో నడిచే ఫ్యాక్టరీ విడి భాగాలను పరిశీలించి సిమెంట్ తయారు చేసే పద్ధతులు ప్రాక్టికల్గా తెలుసుకున్నారు. హెచ్ఎం జ్యోతి, ఉపాధ్యాయులు సంతోష్, దొమ్మటి రవి, సుచిత్ర, రాజశేఖర్, అన్నం శ్రీనివాస్, పోచం, మల్లమ్మ తదితరులు పాల్గొన్నారు. మంథనిరూరల్: ఎగ్లాస్పూర్ జెడ్పీహెచ్ఎస్ విద్యార్దులు శనివారం బసంత్నగర్ కేసోరాం సిమెంట్ ఫ్యాక్టరీ సందర్శించారు. ఇండస్ట్రియల్ టూర్లో భాగంగా ఈకార్యక్రమం చేపట్టారు. రా మెటీరియల్ ఐరన్, జిప్సం క్రషర్, బొగ్గుతో హీట్చేయడం, వీటిని కలిపి క్రషర్ చేసి పొడి చేసి సిమెంట్గా మార్చే విధానాన్ని విద్యార్ధులు ప్రత్యక్షంగా పరిశీలించారు. అలాగే సిమెంట్ బ్యాగులు నింపే విధానం, మిషన్ల సాయంతో గూడ్స్ రైలులో ఎక్కించడం, ఆటోమెటిక్ సిస్టంతో నడిచే ఫ్యాక్టరీ విడి భాగాలను పరిశీలించి సిమెంట్ తయారు చేసే పద్ధతులు ప్రాక్టికల్గా తెలుసుకున్నారు. హెచ్ఎం జ్యోతి, ఉపాధ్యాయులు సంతోష్, దొమ్మటి రవి, సుచిత్ర, రాజశేఖర్, అన్నం శ్రీనివాస్, పోచం, మల్లమ్మ తదితరులు పాల్గొన్నారు. -
రుణాల పంపిణీలో అగ్రస్థానం
కోల్సిటీ(రామగుండం): సీ్త్రనిధి రుణాల పంపిణీ, వసూళ్లలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన జిల్లా రాష్ట్రస్థాయిలో పురస్కారాలు సాధించింది. శనివారం హైదరాబాద్లో నిర్వహించిన సీ్త్రనిధి 13వ సాధారణ సభలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి ధనసరి సీతక్క, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ప్రధాన కార్యనిర్వాహణ అధికారి దివ్య దేవరాజన్ నుంచి అవార్డులు అందుకున్నారు. పట్టణ పరిధిలో రుణాల పంపిణీ, వసూళ్లలో అగ్రస్థానంలో నిలిచినందుకు జిల్లా ప్రాజెక్టు సంచాలకురాలు, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) అరుణశ్రీ ప్రతిభా పురస్కారం అందుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సీ్త్రనిధి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేసినందుకు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారి ఎం.కాళిందిని సత్కరించారు. సీ్త్రనిధి నిర్వహణలో విశేష ప్రతిభ కనబరిచిన అదనపు గ్రామీణాభివృద్ధి అధికారి రవీందర్కు ప్రశంసలు దక్కగా, జిల్లాస్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ప్రాంతీయ నిర్వాహకుడు ఆర్.దుర్గాప్రసాద్కు అత్యున్నత పురస్కారం ప్రదానం చేశారు. కలెక్టర్ కోయ శ్రీహర్ష మార్గదర్శకత్వంలో సీ్త్రనిధి విశేష ఫలితాలు సాధించి రాష్ట్రస్థాయి గుర్తింపు పొందిందని అధికారులు వెల్లడించారు. -
అడవుల పరిరక్షణపై ఫోకస్
మంథనిరూరల్: కలప అక్రమ రవాణాను అరికట్టేలా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిన ప్రభుత్వం, అటవీశాఖ.. అడవుల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాయి. ఏటా వేసవిలో అడవి అంటుకుని చెట్లు బుగ్గిపాలయ్యేవి. అనేక వన్యప్రాణులు అగ్నికి ఆహుతి అయ్యేవి. అయితే, అగ్గివ్యాపించకుండా చెట్లు, వన్యప్రాణులను రక్షించుకునేలా అటవీశాఖ పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం ఫైర్లైన్లు ఏర్పాటు చేస్తోంది. జిల్లాలో అటవీ విస్తీర్ణం 316.55 చ.కి.మీ. జిల్లాలో 316.55 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. మంథని, ముత్తారంతోపాటు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మల్హర్, మహాముత్తారం, కాటారం, మహదేవ్పూర్ మండలాల్లో అటవీ ప్రాంతం ఉంది. పెద్దవృక్షాలు లక్షల సంఖ్యలో ఉన్నాయి. అనేక రకాల వన్యప్రాణులు జీవిస్తున్నాయి. ఏటా వేసవిలో నిప్పంటుకుని చెట్లతోపాటు వన్యప్రాణులకూ నష్టం వాటిల్లుతుండేది. ఫైర్లైన్స్ ఏర్పాటుతో కొంతవరకు అడవులను రక్షించుకుంటున్నామని అధికారులు చెబుతున్నారు. ప్రూనింగ్ పేరిట అడవికి నిప్పు ఏటా వేసవిలో అడవి అంటుకుంటోంది. వేసవి చివరి సమయంలో తునికాకు సేకరణ ఉంటున్న క్రమంలో ప్రూనింగ్పేరిట కొందరు అడవికి నిప్పు పెడుతుంటారు. రాలిపోయిన ఆకులు, చెత్తాచెదారం పూర్తిగా కాలిపోయి కొత్త ఆకులు చిగురిస్తాయి. ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో ఎలుగుడు పడుతుందని పెద్దలు చెబుతుంటారు. ఎండతీవ్రతకు చెట్లకొమ్మలు రాపిడికి గురై మంటలు చెలరేగుతాయని, దీనినే ఎలుగుడు అంటారని వారు వివరిస్తున్నారు. ఇలా ఏదోఒకవిధంగా అడవికి నిప్పు అంటుకుంటూనే ఉంటోంది. ఫైర్లైన్ల ఏర్పాటుతో.. అడవిలో మంటలు వ్యాపించకుండా రెండేళ్లుగా ఫైర్లైన్లు ఏర్పాటు చేస్తున్నారు. అటవీ ప్రాంతంలోని ప్రధాన రహదారుల గుండా వెళ్లే వాహనదారులు సిగరెట్, బీడీల్లాంటివి పడేస్తే పక్కనే ఉండే ఎండిన ఆకులు అంటుకుని అడవిలోకి మంటలు వ్యాపిస్తాయి. అలాకాకుండా రోడ్డుకు ఐదు మీటర్ల దూరంలో ఎండిన ఆకులు, చెత్తను ఒకచోటికి చేర్చి లైన్లా ఏర్పాటు చేస్తారు. ఆ లైన్కు రెండు వైపులా శుభ్రం చేస్తారు. ఎండిన ఆకులతో ఏర్పాటు చేసిన లైన్కు నిప్పు అంటిస్తారు. ఇదిపూర్తిగా కాలిపోయి బూడిద మిగులుతుంది. ఆ ప్రాంతంలో మంటలు చెలరేగినా ఆ బూడిద లైన్ దాటి లోనికి మంటలు వ్యాపించవు. అడవుల సంరక్షణపై అవగాహన అడవుల సంరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించేలా అటవీశాఖ అధికారులు వివిధ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. సమీప గ్రామాల్లోని ప్రజలకు పలు అంశాలు వివరిస్తూ వేసవిలో ఎవరూ అటవీప్రాంతానికి వెళ్లకూడదని, ముఖ్యంగా పశువుల కాపరులు సూచనలు పాటించాలని చెబుతున్నారు. అడవుల్లో అగ్నివ్యాపించేలా ఎలాంటి పనులు చేయవద్దని, అడవులను రక్షించుకోవడం అందరి బాధ్యతని అవగాహన కల్పిస్తున్నారు. ఎవరైనా అడవికి నిప్పు పెట్టినా, చెట్లు నరికినా చట్టపమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. -
పైప్లైన్ లీకేజీలకు తక్షణ మరమ్మతు
కోల్సిటీ(రామగుండం): రామగుండం నగరంలో తాగునీటి సరఫరా అంతరాయానికి కారణమవుతున్న పైప్లైన్ లీకేజీలపై బల్దియా యంత్రాంగం కదిలింది. మేయర్ మహంకాళి స్వామి స్వయంగా రంగంలోకి దిగారు. స్థానిక శారదానగర్ పీజీ కాలేజీ ఎదుట డిస్ట్రిబ్యూషన్ పైప్లైన్లలో ఏర్పడిన లీకేజీలకు చేపట్టిన మరమత్తులను మేయర్ శనివారం క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. ప్రశాంత్నగర్ నుంచి పవర్హౌస్కాలనీ వరకు నాలుగు డివిజన్లలో నీటి సరఫరా నిలిచిపోయింది. మరమ్మతుల్లో ఆలస్యం కాకుండా సాయంత్రంలోపే పూర్తిచేయాలని, ఆదివారం నుంచి తాగునీటి సరఫరా యథాతథంగా కొనసాగాలని మేయర్ సూచించారు. లీకేజీల సమస్య వస్తే 93924 83959 నంబరుకు సమాచారం ఇవ్వాలని కోరారు. వేసవి నేపథ్యంలో తాగునీటి వినియోగంపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వృథా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని ఆయన కోరారు. ప్రతీ కనెక్షన్కు వాల్వ్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా నీటి నియంత్రణ సాధ్యమవుతుందని అన్నారు. పర్యవేక్షించిన రామగుండం మేయర్ స్వామి -
సురక్షితంగా చేరుకోవాలి
గోదావరిఖని: ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ గమ్యస్థానాన్ని సురక్షితంగా చేరుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా సూచించారు. ట్రాఫిక్ నిబంధనలపై స్థానిక మున్సిపల్ చౌరస్తా వద్ద శనివారం ప్రయాణికులకు అవగాహన కల్పించారు. డీసీపీ రాంరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సీపీ మా ట్లాడుతూ, వాహనదారులు తప్పనిసరిగా సీటుబెల్ట్ ధరించాలన్నారు. ప్రస్తుతం జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో దాదాపు 70 శాతం సీటు బెల్ట్ ధరించకనే చోటుచేసుకుంటున్నాయని తెలిపారు. గోదావరిఖని ఏసీపీ రమేశ్, వన్టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి, రామగుండం ట్రాఫిక్ సీఐ రాజేశ్వరరావు, పోలీస్ అధికారులు రమేశ్, అనూష, మనోహర్, హరీశ్శేఖర్, రామరాజు సిబ్బంది పాల్గొన్నారు. -
ఎన్హెచ్ఎం జేఏసీ ఆవిర్భావం
కోల్సిటీ: జిల్లాలోని నేషనల్ హెల్త్ మిషన్(ఎన్హెచ్ఎం) ఉద్యోగులు ఐక్యంగా ముందుకు వచ్చి తమహక్కుల సాధనకు జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) ఏర్పాటు చేసుకు న్నారు. గోదావరిఖనిలోని రాజ స్తాన్ భవన్లో శనివారం నిర్వహించిన సమావేశంలో కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్హెచ్ఎం జేఏసీ జిల్లా అధ్యక్షుడిగా సీహెచ్ మహేందర్, ప్రధాన కార్యదర్శిగా బి.మణికేశ్వర్రెడ్డి, కోశాధికారిగా ఎ న్.పారిజాతం, కార్యనిర్వహణ అ ధ్యక్షురాలిగా స్కైలాబ్రాణి, ఉపాధ్యక్షుడిగా రామకృష్ణను ఎన్నుకున్నారు. నాయకులు మాట్లాడుతూ, జేఏసీ ఏర్పాటుతో ఎన్హెచ్ఎం ఉద్యోగుల ఐక్యతకు కొత్త బలం చేకూరుతుందన్నారు. -
ఆదివారం శ్రీ 29 శ్రీ మార్చి శ్రీ 2026
కట్టుదిట్టంగా హాస్టళ్ల నిర్వహణ ● కలెక్టర్ కోయ శ్రీహర్ష పెద్దపల్లి: జిల్లాలోని సంక్షేమ హాస్టళ్ల నిర్వహణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. హాస్టల్ వార్డెన్లతో శనివారం కలెక్టరేట్లో ఆయన సమీక్షించారు. భోజనం చేసే సమయం, సాయంత్రం స్టడీ అవర్స్లో వార్డెన్లు అందుబాటులో ఉండాలన్నారు. బడ్జెట్ను ఈనెలాఖరులోగా వినియోగించుకోవాలని తెలిపారు. అధికారులు రంగారెడ్డి, రవీందర్ పాల్గొన్నారు. సాక్షి పెద్దపల్లి: గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ప్రజలు చెల్లించే పన్నులే ప్రధాన ఆదాయ వనరు. ఆస్తిపన్ను, భవన నిర్మాణ, లేఅవుట్ అనుమతులు, నల్లా చార్జీలు, ట్రేడ్లైసెన్స్, అద్దెలు తదితర రూపాల్లో స్థానిక సంస్థలకు ఆదాయం సమకూరుతుంది. వీటిలో ఆస్తిపన్నుదే ప్రధాన వాటా. అయితే 2025–26 ఆర్థిక సంవత్సరం మరోమూడు రోజుల్లో ముగియనుండగా.. ఆస్తిపన్ను వసూలు అంతంత మాత్రంగానే నమోదవుతోంది. జిల్లాలోని గ్రామ పంచాయతీల కన్నా బల్దియాలు వెనుకబడడం గమనార్హం. జిల్లాలో రామగుండం కార్పొరేషన్తోపాటు పెద్దపల్లి, మంథని, సుల్తానాబాద్ మున్సిపాలిటీలు ఉన్నాయి. -
నీరులేదు.. నీడ కరువు
ఎండలు మండుతున్నాయి. తాగునీరు లభించడంలేదు. కనీసం నిలువ నీడకూడా లేక ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీకావు. పెద్దపల్లి జిల్లాగా అవతరించాక ప్రధాన కూడళ్లలో రిక్వెస్ట్ బస్స్టాప్లు ఏర్పాటు చేసినా షెల్టర్లు నిర్మించలేదు. ప్రయాణికులు బస్సుల కోసం ఎండలోనే గంటల తరబడి నిరీక్షిస్తున్నారు. అయ్యప్పగుడి చౌరస్తా, కూనారం చౌరస్తా, కమాన్ చౌరస్తా, కోర్టు చౌరస్తా, రంగంపల్లి వరకు ఎక్కడా బస్షెల్టర్ లేదు. తాగునీటి వసతి గగనంగా మారింది. అధికారులు స్పందించాలని ప్రయాణికులు కోరుతున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి -
కొండగట్టుకు శునకం పాదయాత్ర
వారు ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్కు చెందిన హనుమాన్ దీక్షాపరులు. మాల విరమణ చేసేందుకు కొండగట్టుకు బయలుదేరారు. దారిలో ఓ శునకం ఎదురుపడగా దానికి ఓ బిస్కట్ ఇచ్చారు. దీంతో ఆ శునకం దీక్షాపరులతో పాటు కొండగట్టు వరకు పాదయాత్ర చేసింది. పాదయాత్ర చేస్తున్న శునకానికి కాళ్లనొప్పులు రావడంతో సాక్స్లు సైతం తొడిగారు. ఐదురోజులుగా పాదయాత్ర చేస్తుందని, వెళ్లగొట్టినా పోవడం లేదని, సుమారు 130 కి.మీ దూరం తమతో నడిచి వచ్చిందని దీక్షాపరులు తెలిపారు. శుక్రవారం కొండగట్టుకు చేరుకున్నామని పేర్కొన్నారు. – జగిత్యాల -
11 కేవీతో 30 ఏళ్ల సమస్య పరిష్కారం
ధర్మపురి: ముప్పైఏళ్లుగా ఇబ్బందులు పడుతున్న పట్టణ ప్రజల సమస్యకు 11 కేవీ విద్యుత్ లైన్తో పరిష్కారం లభించిందని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. ధర్మపురిలో నూతనంగా ఏర్పాటు చేసిన 11 కేవీ విద్యుత్ లైన్ను శుక్రవారం ప్రారంభించి మాట్లాడారు. శ్రీరాములపల్లె నుంచి ధర్మపురి వరకు రోడ్డు పక్కనున్న ఇళ్ల మీదుగా 11 కేవీ లైన్ పోవడంతో చాలా ప్రమాదాలు జరిగాయని, బాధిత కుటుంబాలకు ఇచ్చిన మాట ప్రకారం సమస్యను పరిష్కరించామని వివరించారు. ధర్మపురిలో బస్డిపో ఏర్పాటుకు కృషి చేస్తున్నామని అన్నారు. అలాగే నియోజకవర్గంలో విద్యుత్ షాక్తో మృతిచెందిన గేదెలకు నష్ట పరిహారం కింద ఐదుగురు రైతుల కుటుంబాలకు రూ.1.67 లక్షల విలువ గల చెక్కులను మంత్రి అందజేశారు. మున్సిపల్ చైర్పర్సన్ వేముల నాగలక్ష్మి, వైస్ చైర్మన్ రామన్న, ఏఎంసీ చైర్మన్ చిలుముల లావణ్య, నాయకులు ఎస్.దినేశ్, వేముల రాజు, ట్రాన్స్కో ఎస్ఈ సుదర్శనం, కౌన్సిలర్లు తదితరులున్నారు. శ్రీరాముడిని ఆదర్శంగా తీసుకోవాలిపెగడపల్లి(ధర్మపురి): ప్రతి ఒక్కరూ శ్రీరాముడిని ఆదర్శంగా తీసుకోవాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్కమార్ అన్నారు. మండలంలోని అయితిపల్లి, ఎల్లాపూర్ రామాలయాల్లో శుక్రవారం జరిగిన శ్రీరామ నవమి వేడుకల్లో పాల్గొని పూజలు చేశారు. రాత్రి నంచర్లలో జరిగిన స్వామివారి కల్యాణంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఆలయాల అభివృద్ధికి పెద్ద మొత్తంలో నిధులు విడుదల చేయడం జరుగుతుందన్నారు. అలాగే ప్రజలపై రాముని ఆశీస్సులు ఉండి అంతా మంచి జరగాలని ఆకాంక్షించారు. ఏఎంసీ చైర్మన్ రాములుగౌడ్, ఆయా గ్రామాల సర్పంచులు అంజమ్మ, రాజేశం, రమణాకర్, మాజీ జెడ్పీటీసీ రాజేందర్రావు తదితరులు పాల్గొన్నారు. -
ఆకట్టుకున్న శోభాయాత్ర
పెద్దపల్లి హిందూ వాహినితోపాటు పలు హిందూ సంఘాల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో శుక్రవారం రాత్రి రాములోరి శోభాయాత్ర ఘనంగా నిర్వహించారు. శ్రీరామసీతాసమేత లక్ష్మణమూర్తి హనుమ విగ్రహాలతో పట్టణంలో శోభాయాత్ర నిర్వహించారు. మినీ ట్యాంక్ బండ్, జెండాకూడలి, శివాలయం చౌరస్తా, అయ్యప్పగుడి నుంచి బస్టాండ్ వరకు యాత్ర కొనసాగింది. దారి పొడవునా మహిళలు నృత్యాలు చేస్తూ, కోలాటాలు ఆడారు. దీక్షాపరులు, చిన్నారులు సీతారామలక్ష్మణ హనుమ వేషాధరణలతో సందడి చేస్తూ ముందుకు సాగారు. కోల్కతా నుంచి వచ్చిన బ్యాండ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. హిందూవాహిని పెద్దలతోపాటు లింగేశ్వర పీఠాధిపతి బాలయోగి కృష్ణ మహరాజ్ పాల్గొనగా, ఆదిబట్ల కళాపీఠం వ్యవస్థాపక అధ్యక్షురాలు, సినీనటి కల్యాణి ప్రత్యేక ఆకర్షణగా నలిచారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి -
మ్యూల్ అకౌంట్లతో రూ.138 కోట్ల స్కాం
కరీంనగర్ క్రైం: అమాయకులకు డబ్బు ఆశచూపి వారి పేరిట బ్యాంకు ఖాతాలు తెరిపించారు. ఆ ఖాతాల ద్వారా విదేశాల్లోని సైబర్ నేరగాళ్లతో లావాదేవీలు జరిపారు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా రూ.138 కోట్లు మ్యూల్ అకౌంట్లకు మళ్లించారు. కరీంనగర్లోని కిసాన్నగర్లో ఉన్న రత్నాకర్ బ్యాంకు లిమిటెడ్(ఆర్బీఎల్) కో ఆపరేటివ్ సొసైటీ ద్వారా ఆ కుంభంకోణం జరగగా.. కరెంట్ అకౌంట్లు పొంది సైబర్నేరాల్లో పాలుపంచుకున్న 13మందిని కరీంనగర్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. సీపీ గౌస్ ఆలం ఈ కేసులకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలానికి చెందిన బండారి సాయిరాం(30) అమాయకులతో పాటు డబ్బు అవసరం ఉన్నవారితో నగరంలోని ఆర్బీఎల్ బ్యాంకులో కరెంటు ఖాతాలు తీయించాడు. ఇతనికి బ్యాంకు మేనేజర్ హన్మకొండకు చెందిన భువనగిరి కల్యాణ్(52), క్యాషియర్ నగరానికి చెందిన చెందిన ఆయేషా బేగం(30) సహకరించారు. బుగ్గారం మండలం గోపాల్పూర్కు చెందిన అనుమండ్ల రంజిత్(36), పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలానికి చెందిన అలిగెటి మల్లేశం(37), జగిత్యాలకు చెందిన బోగ రాకేశ్(35), రామడుగు మండలం వెదిర గ్రామానికి చెందిన బండి ప్రణయ్(25), పెద్దపల్లి జిల్లా ధర్మారానికి చెందిన విభూది రాంకుమార్(37), జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్కు చెందిన నాతర్ల శ్రీనివాస్(39), జగిత్యాలకు చెందిన కల్లెడ మహేందర్(36), కొండ్ర నరహరి(37), కల్లెడ రాజేశ్(27), వరంగల్కు చెందిన కర్రె రాజు(35)లకు సంబంధించిన మ్యూల్ అకౌంట్ల ద్వారా రూ.138 కోట్ల లావాదేవీలు విదేశాల్లోని సైబర్ నేరగాళ్లతో జరిపినట్లు ఆపరేషన్ క్రాక్డౌన్ ద్వారా పోలీసులు గుర్తించారు. బండారి సాయిరాం కీలకంగా వ్యవహరిస్తూ.. సదరు ఖాతాదారులకు కమీషన్లు అందించినట్లు గుర్తించారు. ఈ కేసు లో మొత్తం 24 మంది ఉన్నట్లు గుర్తించి, పై 13మందిని అరెస్టు చేశారు. కేసును ఛేదించిన కరీంనగర్ టౌన్ ఏ సీపీ వెంటకస్వామి, సీఐలు తిరుమ ల్, సృజన్రెడ్డి, రాంచందర్రా వు, సరిలాల్ను సీపీ అభినందించారు. కమీషన్లకు ఆశపడి సైబర్ నేరగాళ్లకు సాయం ఆపరేషన్ క్రాక్డౌన్ ద్వారా గుట్టు రట్టు 13 మందిని అరెస్టు చేసిన కరీంనగర్ పోలీసులు వివరాలు వెల్లడించిన సీపీ గౌస్ ఆలం -
కార్మికుల తలపై భస్మాసుర హస్తం
గోదావరిఖని: కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మార్పు వస్తుందని, నెలకు మూడు మెడికల్ బోర్డులు నిర్వహిస్తామని కార్మికులను మభ్యపెట్టిన కాంగ్రెస్.. ఇప్పుడు కార్మికుల నెత్తిపై భస్మాసుర హస్తం పెట్టిందని టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి విమర్శించారు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క అసెంబ్లీ సాక్షిగా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడక ముందు 13వేల మందిని ఉద్యోగాల్లో తీసుకున్నారని, దీనిలో అవకతవకలు జరగాయని పేర్కొనడం హాస్యాస్పదమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన నియామకాలు 1,900మంది మాత్రమేనని పేర్కొన్నారు. రెండేళ్లుగా విజిలెన్స్, ఏసీబీ పేరుతో అనారోగ్యంతో ఉన్న ఉద్యోగులను మెడికల్ బోర్డుకు పిలవకుండా నిలిపివేసే ప్రయత్నం చేస్తోందన్నారు. 2వేల మంది కార్మికులు మెడికల్ బోర్డు కోసం వేచిచూస్తున్నారన్నారు. సింగరేణి కార్మిక వర్గం పోరాటాలకు సిద్ధం కావాలని ఆయన కోరారు. ఈనెల 28న గనులు, డిపార్ట్మెంట్లపై నల్లబ్యాడ్జీలతో నిరసన, 30న అన్ని జీఎం కార్యాలయాల ఎదుట నిరసన, ఆ తర్వాత సింగరేణి, ప్రజాభవన్ ముట్టడి చేపడతామని ఆయన వివరించారు. -
పెంచడమా.. తగ్గించడమా?
గోదావరిఖని: వాట్ నెక్ట్స్? బొగ్గు ఉత్పత్తి లక్ష్యం తగ్గించడమా? పెంచడమా? అనేదానిపై సింగరేణి యాజమాన్యం తర్జనభర్జన పడుతోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఉత్పత్తి లక్ష్యం భారీగా తగ్గడంతో వార్షిక లక్ష్యంపై తీవ్రప్రభావం చూపుతోంది. ఈ నేపత్యంలోనే వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఎలా ముందుకెళ్లాలనే ఆలోచనతో ఇటీవల బాధ్యతలు స్వీకరించిన సింగరేణి సీఎండీ.. అధికారులతో అధ్యయనం చేస్తున్నారు. కొత్తగనులు లేక.. నిల్వలు తగ్గి.. కొత్త బొగ్గు గనులు రాకపోవడం, ఉన్న గనుల్లో బొగ్గు నిల్వలు అడుగంటి పోవడంతో వచ్చే ఏడాదిలో బొగ్గు ఉత్పత్తి లక్ష్యం ఎలా? అనేదానిపై మల్లగుల్లాలు పడుతున్నారు. 2026–27 ఆర్థిక సంవత్సరంలో 60 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించాలనే లక్ష్యం నిర్దేశించినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 72 మిలియన్ టన్నుల లక్ష్యం కాగా.. గడువులోగా 60 మిలియన్ టన్నుల కన్నా ఎక్కువగా ఉత్పత్తి చేయడం సాధ్యం కాదనే వాదన వినిపిస్తోంది. ఇప్పటివరకు కేవలం 56.75 మిలయన్ టన్నులే సాధించి 81 శాతం నమోదు చేయడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. అన్నిఏరియాల్లోని కార్మికులు మరోనాలుగు రోజులపాటు శ్రమిస్తే 60 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధిస్తారని అంచనా వేస్తున్నారు. అయితే వాస్తవ టార్గెట్ 72 మిలియన్ టన్నులు చేరుకోవడం గగనమే అంటున్నారు. లాభాలు సాధించడం కష్టమే.. ఈసారి సింగరేణి లాభాలు భారీగా ఆర్జించడం కష్టమేనని అధికార వర్గాలు నిర్మొహమాటంగా చెబుతున్నాయి. వాస్తవానికి ఈఏడాది భారీగా బొగ్గు ఉత్పత్తి సాధించినా.. గత లోటు పూడ్చేందుకు.. ఉత్పత్తి చేసిన బొగ్గులోంచి కోత విధించినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈఎఫెక్ట్ ఈఏడాది బొగ్గు ఉత్పత్తిపై చూపుతోంది. బొగ్గు ఉత్పత్తి రానప్పుడు లాభాలు, లాభాల వాటా ఎలా వస్తుందని అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఈక్రమంలో ఈఆర్థిక సంవత్సరంలో లాభాల వాటా విషయంలో కార్మికులకు నిరాశమిగులుతుందని అంటున్నారు. -
కుక్కల దాడిలో చిన్నారికి గాయాలు
కోల్సిటీ: రామగుండం నగరంలో వరుసగా వీధికుక్కల దాడులు చోటుచేసుకుంటున్నాయి. గోదావరిఖని లక్ష్మీనగర్లోని వ్యాపార కూడళ్లల్లో రోడ్లపై సంచరిస్తూ ప్రజలను తరుముతున్నాయి. తాజాగా బోళ్లబజార్లో గురువారం ఓ చిన్నారిపై రెండు వీధికుక్కలు దాడి చేసి గాయపరిచాయి. కుటుంబ సభ్యులు, స్థానికులు స్థానిక జీజీహెచ్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. వీధికుక్కల దాడులపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. రోదిస్తున్నబాలిక, కుక్కకాటు -
వైభవం.. రాములోరి కల్యాణం
పెద్దపల్లి/పెద్దపల్లిరూరల్/ఓదెల/మంథని: ఆకాశమంత పందిళ్లు.. రంగురంగుల విద్యుత్ దీపాలు.. మామిడి తోరణాలు.. అనేకరకాల పూలదండలు.. అందంగా అలంకరించిన వేదికలు.. అశేష భక్తజనం.. వెరసి శ్రీసీతారాముల కల్యాణం అత్యంత వైభవంగా జరిపించారు. జిల్లా కేంద్రం పెద్దపల్లితోపాటు గోదావరిఖని, మంథని, సుల్తానాబాద్తోపాటు వివిధ మండల కేంద్రాలు, గ్రామాల్లో రాములోరి పరిణయ వేడుకలు శుక్రవారం కన్నులపండువగా సాగాయి. మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్తోపాటు పెద్దపల్లి, రామగుండం ఎమ్మెల్యేలు విజయరమణారావు, ఎంఎస్ రాజ్ఠాకూర్ సతీసమేతంగా హాజరై ప్రత్యేక పూజలుచేశారు. వేదపండితులు మంత్రోచ్ఛారణలతో స్వామివారల వివాహం వైభవంగా జరిపించారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. -
గురి తప్పని బాణం
● ఆసియా కప్ వరల్డ్ ర్యాంకింగ్ టోర్నీలో స్వర్ణం, రజతం సాధించిన చికిత కరీంనగర్స్పోర్ట్స్/ఎలిగేడు: పెద్దపెల్లి జిల్లా ఎలిగేడు మండలం సుల్తాన్పూర్ గ్రామానికి చెందిన యువ ఆర్చర్ తానిపర్తి చికిత శుక్రవారం బ్యాంకాక్లో జరిగిన ఆసియా కప్ వరల్డ్ ర్యాంకింగ్ టోర్నీ స్టేజ్–1లో బంగారు, రజత పతకాలు సాధించింది. మిక్స్డ్ టీమ్ విభాగంలో గోల్డ్ మెడల్, మహిళల టీమ్ విభాగంలో సిల్వర్ మెడల్ అందుకుంది. కాంపౌండ్ మిక్స్డ్ టీం విభాగంలో రజత్ చౌహాన్, తానిపర్తి చికిత జోడీ 158–156 పాయింట్ల తేడాతో మలేషియాపై విజయం సాధించి బంగారు పతకం కై వసం చేసుకున్నారు. కాంపౌండ్ మహిళల టీం విభాగంలో తానిపర్తి చికిత, రాజ్ కౌర్, తేజల్ సాల్వేలతో కూడిన జట్టు ఫైనల్లో కజకిస్థాన్పై 227–229 తేడాతో తలపడి రజత పతకాన్ని సాధించారు. కార్పొరేటర్పై కేసు యైటింక్లయిన్కాలనీ: రామగుండం కార్పొరేషన్ యైటింక్లయిన్కాలనీ 18వ డివిజన్ కార్పొ రేటర్ చక్రపాణిపై శుక్రవారం కేసు నమోదు చేసినట్లు గోదావరిఖని టూటౌన్ పోలీసులు తెలిపారు. గురువారం రాత్రి యైటింక్లయిన్కాలనీ భక్తాంజనేయ స్వామి దేవాలయం వద్ద బీఆర్ఎస్ నాయకులు గుడెల్లి రాంచందర్కు చక్రపాణికి మధ్య ఫ్లెక్సీ ఏర్పాటు విషయంలో గొడవ జరిగింది. ఈవిషయంలో రాంచందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొన్నట్లు సీఐ ప్రసాద్రావు పేర్కొన్నారు. చెరువులోపడి వృద్ధురాలి మృతి కాల్వశ్రీరాంపూర్: పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రానికి చెందిన ఇనుగాల మధునమ్మ(80) చెరువులో పడి మృతి చెందింది. పోలీసుల కథనం ప్రకారం.. మధునమ్మకు నలుగురు కుమారులు వివిధ కారణాలతో గతంలోనే మృతి చెందారు. మనుమల వద్ద ఆమె ఉంటోంది. వృద్ధాప్యంతోపాటు అనారోగ్య సమస్యలు తీవ్రం కావడంతో ఈనెల 26 నుంచి ఇంట్లోంచి బయటకు వెళ్లింది. శుక్రవారం స్థానిక నీలకంఠం చెరువులో మృతదేహం కనిపించింది. మృతిపై తమకు అనుమానం లేదని మృతురాలు మనుమడు రాకేశ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై వెంకటేశ్ తెలిపారు. -
ఆయుష్.. పనితీరు భేష్
పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో గల ఆయుష్లో యునాని, హోమియోపతి, ఆయుర్వేదిక్ వైద్యసేవలు మెరుగ్గా అందిస్తున్నారు. వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నా.. జిల్లా లోని పలు ఆస్పత్రుల నుంచి ఆయుర్వేదిక్ వైద్యం కోసం ముగ్గురు వైద్యులు, యునాని, హోమి యోపతి వైద్యం కోసం ఒక్కోవైద్యుడిని డిప్యూటేషన్పై నియమించారు. దీంతో పెద్దపల్లి ఆయుష్ ఆస్పత్రిలో వైద్య సేవలు నిరంతరం అందుతాయనే నమ్మకం పేషెంట్లలో పెరిగింది. ఫలితంగా జిల్లాలోని మండలాలు, గ్రామాల నుంచే కాకుండా పొరుగు జిల్లాల నుంచి కూడా పేషెంట్లు పెద్ద సంఖ్యలో పెద్దపల్లికి వైద్యం కోసం వస్తున్నారు. రోజూ 200 మందికి సేవలు ఆయుష్ ఆస్పత్రికి వచ్చే పేషెంట్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇక్కడ యునాని, ఆయుర్వేదిక్, హోమియోపతి సేవల కోసం ప్రతీనిత్యం సుమారు 200 మంది వరకు వస్తున్నారు. తమ వ్యాధి (బీపీ, షుగర్, కీళ్లనొప్పులు, గుండె, కిడ్నీ తదితర వ్యాధులు) నయం చేసుకునేందుకు వచ్చే పేషెంట్లకు అవసరమైన వైద్యపరీక్షలను ఇదే ఆవరణలోని టీహబ్ ద్వారా ఉచితంగానే చేయిస్తున్నారు. జబ్బు ఎలాంటిదైనా సరే.. వైద్యం అందిస్తుండడంతో పేషెంట్లకు నమ్మకం పెరుగుతోంది. కలెక్టర్ ప్రత్యేక చొరవ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆయుష్ ఆస్పత్రులకు దాదాపు ఏడాదిగా మందుల సరఫరా అరకొరగానే ఉంది. దీంతో ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకున్న వారికి అవసరమైన మందులను అందించలేకపోయారు. ఈ విషయాన్ని ఆయుష్ ఆస్పత్రి ఇన్చార్జి డాక్టర్ మారుతి.. ఇటీవల కలెక్టర్ కోయ శ్రీహర్ష దృష్టికి తీసుకెళ్లారు. కలెక్టర్ వెంటనే ఆస్పత్రిని సందర్శించి వాస్తవ పరిస్థితిని తెలుసుకున్నారు. అవసరమైన మందులను కేంద్ర ప్రభుత్వమే తయారు చేసే ఉత్తరాఖండ్ నుంచి తెప్పించేలా చర్యలు తీసుకున్నారు. రాష్ట్రంలోని ఏ ఆస్పత్రిలో మందులు లేకున్నా.. పెద్దపల్లి ఆయుష్ కేంద్రంలో మందులను అందుబాటులో ఉంచుతూ మెరుగైన వైద్యం అందించేలా ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఆస్పత్రిలో మెరుగైన వైద్యసేవలు డెప్యుటేషన్పై వైద్యుల నియమాకం ప్రత్యేక చొరవ చూపుతున్న కలెక్టర్ శ్రీహర్ష -
రెస్టారెంట్లో ఆకస్మిక తనిఖీలు
గోదావరిఖని: నగరంలోని హైకింగ్ బార్ అండ్ రెస్టారెంట్లో బుధవారం ఆకస్మికంగా తనిఖీలు చేశామని ఫుడ్ ఇన్స్పెక్టర్ అరవింద్రెడ్డి తెలిపారు. వంటగది, పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నట్లు, పిండి పదార్థాల్లో బొద్దింకలు ఉండడాన్ని అధికారులు గుర్తించారు. 35 కిలోల గోధుమపిండి, 10 కిలోల మైదాపిండిని పారబోయిచారు. నిల్వఉంచిన మాంసం, గడువు ముగిసిన పెరుగు, తందూరి చికెన్, పచ్చి చికెన్ స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశామన్నారు. నిల్వ ఉంచిన సలాడ్లను నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని గుర్తించి పారబోశామన్నారు. ఆహార తయారీలో ఉపయోగిస్తున్న సింథటిక్ ఫుడ్ కలర్స్ను(ఆహార రంగులు) గుర్తించి వాటిని తొలగించాలని నిర్వాహకులకు సూచించామని అన్నారు. ఆహార భద్రత, ప్రమాణాల చట్టం లైసెన్సింగ్ నిబంధనలు (2011) ఉల్లంఘించినందుకు రెస్టారెంట్ యజమానులపై కేసు నమోదు చేయనున్నట్లు వివరించారు. -
పశువులకు మేతగా టమాట
పెద్దపల్లిరూరల్: మార్కెట్లో టమాట ధరలు పడిపోయాయి. రిటెయిల్గా కిలో రూ.5 దరతోనే విక్రయిస్తున్నారు. హోల్సేల్ ధరలు మరింత తగ్గిపోయాయి. వాటిని తోటలోంచి ఏరితే కూలీల ధర కూడా గిట్టుబాటు కావడంలేదని రైతులు వాపోతున్నారు. మార్కెట్లోనూ అమ్మకాలు అంతంత మాత్రంగానే సాగుతుండడంతో బుధవారం టమాటలు పశువులకు మేతగా పోశారు. 28న డాక్టర్ పోస్టుల భర్తీ పెద్దపల్లి: స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యుల పోస్టుల భర్తీ కోసం ఈనెల ఉదయం 11 గంటలకు ఇంటర్వ్యూ నిర్వహించనున్నట్లు జిల్లా ఆస్పత్రుల సూపరింటెండెంట్ శ్రీధర్ తెలిపారు. గైనకాలజీ, ఆప్తామాలజీ, రేడియాలజీ, ఆర్థో, సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్(ఎంబీబీఎస్) పోస్టులను కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేస్తామన్నారు. ఆసక్తి, అర్హతగలవారు బయోడేటాతోపాటు విద్యార్హతల ఒరిజినల్ సర్టిఫికెట్లు, జిరాక్స్లతో హాజరు కావాలన్నారు. సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్టుకు నెలకు రూ.లక్ష, సివిల్ అసిస్టెంట్ సర్జన్కు రూ.52,351 వేతనం చెల్లిస్తారని, వివరాలకు 84990 61999, 94924 57809 నంబర్లలో సంప్రదించాలని ఆయన సూచించారు. క్వింటాల్ పత్తి రూ.7,368 పెద్దపల్లిరూరల్: స్థానిక వ్యవసాయ మార్కెట్యార్డు ఆవరణలో బుధవారం పత్తి క్వింటాల్కు గరిష్టంగా రూ.7,368 ధర పలికిందని మార్కెట్ కమిటీ చైర్మన్ కూర మల్లారెడ్డి, కార్యదర్శి ప్రవీణ్రెడ్డి తెలిపారు. కనిష్టంగా రూ.5,428గా, సగటు రూ.6,929గా ధర ఉందని వారు వివరించారు. రైతు తాము పండించిన పత్తిని నేరుగా మార్కెట్కు తీసుకొచ్చి మద్దతు ధర పొందాలని సూచించారు. -
కరీంనగర్లో సినీనటి మెహరిన్ సందడి
కరీంనగర్: కరీంనగర్లో ప్రముఖ సినీనటి మెహరిన్ బుధవారం సందడి చేశారు. సుభాష్నగర్లో నూతనంగా ఏర్పాటైన డాల్ఫిన్ హాస్పిటల్స్ను ప్రారంభించారు. డాల్ఫిన్ హాస్పిటల్స్ ఫర్ ఉమెన్ – చిల్డ్రెన్ సంస్థను కరీంనగర్తో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు అత్యాధునిక, నాణ్యమైన, అందుబాటు ధరల్లో వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసినట్లు హాస్పిటల్ యాజమాన్యం తెలిపారు. డాల్ఫిన్ హాస్పిటల్స్ ఫర్ ఉమెన్, చిల్డ్రెన్ ప్రారంభం -
మంచి మందులు ఇచ్చారు
కీళ్ల నొప్పులతో బాధ పడుతూ ఆయుష్ ఆస్పత్రికి వచ్చా. వైద్యులు పరీక్షలు చేసి మందులు ఇచ్చారు. రోగం నయమైంది. అవసరమైన అన్నిరకాల పరీక్షలను కూడా ఇక్కడి టీహబ్లోనే చేయించారు. ఆస్పత్రికి వస్తే అన్ని వసతులు ఉండడంతో పాటుమందులు కూడా అందిస్తున్నారు. – నిర్మల, సుల్తానాబాద్ సేవలందిస్తున్నాం జిల్లాలోని మండలాలు, గ్రామాల నుంచే కాకుండా పొరుగు జిల్లాల నుంచి కూడా పేషెంట్లు వస్తున్నారు. మందుల కొరతను అధిగమించేందుకు కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. అవసరమైన అన్నిరకాల మందులను తెప్పించి అందుబాటులో ఉంచారు. పేషెంట్లకు అన్నిరకాల వైద్యసేవలు అందుబాటులో ఉన్నాయి. – డాక్టర్ మారుతి, ఆయుష్ ఆస్పత్రి ఇన్చార్జి -
పాముకాటుతో వృద్ధురాలి మృతి
ధర్మారం: పెద్దపల్లి జిల్లా ధ ర్మారం మండలం పైడిచింతల పల్లి పంచాయతీ శివారులోని గురుపల్లికి చెందిన నాంపెల్లి ల స్మమ్మ(78) బుధవారం పాముకాటుతో మరణించినట్లు ఎస్సై ప్రవీణ్కుమార్ తెలిపారు. తన ఇంటి ఎదుట చింతపండు ఆరబెట్టి అక్కడే నిద్రకు ఉపక్రమించింది. ఈ సమయంలోనే విషపాము కుడిచేతిపై కాటు వేసింది. మెలకువ వచ్చిన వృద్ధురాలు కేకలు వేసింది. స్థానికులు వెంటనే పెద్దపల్లి, అక్కడ నుంచి కరీంనగర్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే చనిపోయింది. మృతురాలి కూతురు నీరజ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై వివరించారు. -
ఆటోడ్రైవర్లు ఉత్తమ పౌరులు
రామగుండం: స్థానిక రైల్వేస్టేషన్ ఏరియా ఆ టోడ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ, ఒంటరి మహిళలు, ప్రయాణికులను భద్రంగా గ మ్యస్థానాలకు చేర్చడం ద్వారా ఉత్తమ పౌరు లుగా గుర్తింపు తెచ్చుకున్నారని పెద్దపల్లి డీసీపీ రామ్రెడ్డి ప్రశంసించారు. గోదావరిఖని ఏసీపీ రమేశ్తో కలిసి స్థానిక రైల్వేస్టేషన్ ప్రాంతంలో బుధవారం అరైవ్.. అలైన్ నిర్వహించారు. డీసీ పీ మాట్లాడుతూ, ఆటోడ్రైవర్లపై ఇప్పటివరకు ఒక్క ఫిర్యాదు కూడా రాకపోవడం వారి ప్రవర్తనకు నిదర్శనమన్నారు. సీఐ ప్రవీణ్కుమార్, ఎస్సై సంధ్యారాణి, జీఆర్పీ ఇన్చార్జి తిరుపతి, ఆర్పీఎఫ్ ఎస్సై లింగయ్య పాల్గొన్నారు. ఏప్రిల్లో సమ్మర్ స్పెషల్ రైలు రామగుండం: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా దక్షి ణ మధ్య రైల్వే వచ్చే ఏప్రిల్లో హైదరాబాద్ – గోరఖ్పూర్ మధ్య ప్రత్యేక రైలు సౌకర్యం కల్పిస్తోంది. హైదరాబాద్ దక్కన్ నాంపల్లి–గోరఖ్పూర్ (07075) వైపు ఏప్రిల్ 3, 10, 17, 24వ తేదీల్లో, గోరఖ్పూర్ – హైదనాబా ద్(07076) వైపు ఏప్రిల్ 5, 12, 19, 26వ తే దీల్లో ప్రత్యేక రైలు రాకపోకలు సాగించనుంది. సికింద్రాబాద్, కాజీపేట, పెద్దపల్లి, మంచిర్యాలలో హాల్టింగ్ ఉంది. మరోవైపు.. ఓఖా – మధురై మధ్య గతంలో వారాంతపు పద్ధతిన రాకపోకలు సాగించిన మధురై( 19559/60) రైలును రెగ్యులర్ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్గా మార్చినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. త్వరలోనే షెడ్యూల్ ప్రకటిస్తామని పేర్కొంది. ఇది అకోలా, పూర్ణా, నాందేడ్, నిజామా బాద్, కామారెడ్డి, కాచిగూడ, మహబూబ్నగర్, కర్నూల్ సిటీ, ద్రోణాచలం, గుత్తి, కడప, ఎర్రగుంట్ల మార్గంలో రాకపోకలు సాగించ నుంది. ఇదే రూట్లో రామేశ్వరం–ఓఖా రైలు ఉండడంతో మరో రూట్ నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, రామగుండం నుంచి నడిపించాలని ప్రయాణికులు కోరుతున్నారు. ఆస్పత్రిలోకి వెళ్లేదెలా? పెద్దపల్లిరూరల్: జిల్లాలోని పలు మండలాలు, గ్రామాల నుంచి ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యసేవలు పొందేందుకు వచ్చే పేషెంట్లు లోనికి వెళ్లడానికి అష్టకష్టాలు పడుతున్నారు. గేట్ ఎదుటనే అడ్డందిడ్డంగా ఆటోలు నిలిపి ఉంచుతున్నారు. రాకపోకలకు తీవ్ర ఆటంకం కలుగుతోందని ప్రజలు వాపోతున్నారు. పోలీసులు, ఆస్పత్రి నిర్వాహకులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. హుండీ ఆదాయం రూ.6లక్షలు కమాన్పూర్(మంథని): స్థానిక శ్రీఆదివరాహస్వామి హుండీ ఆదాయం రూ.6.01 లక్షలు సమకూరినట్లు ఈవో కాంతరెడ్డి తెలిపారు. ఆర్నెల్లలో భక్తులు కానుకలుగా హుండీలో వేసి న సొమ్మును బుధవారం లెక్కించామన్నారు. సర్పంచ్ రంగు సత్యనారాయణగౌడ్, ఉప సర్పంచ్ రఫీక్ సోహెల్, దేవాదాయ, ధర్మాదా య ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, అర్చకుడు రామానుజలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
యూపీఐ లంచం!
కరీంనగర్ అర్బన్ ఎకై ్సజ్ సీఐ గుండెటి రాము వేములవాడలో పనిచేస్తున్న సమయంలో బెల్లం వ్యాపారి వద్ద రెండేళ్లపాటు తన మిత్రుడైన ఉపాధ్యాయుడు జక్కని వేణు ద్వారా యూపీఐ పేమెంట్లతో లంచం తీసుకున్నాడు. ఏసీబీ అధికారులకు ఫిర్యాదు వెళ్లగా ఈనెల 18న రాము ఇంట్లో సోదాలు చేయగా.. రూ.20 లక్షల నగదు లభ్యమైంది. ఇద్దరిపై కేసు నమోదు చేశారు. సాక్షిప్రతినిధి,కరీంనగర్/కరీంనగర్క్రైం: సాంకేతిక విప్లవం ప్రజల జీవన విధానాన్ని వేగవంతం చేయడంతో పాటు అవినీతి అధికారులకు అనుకూలంగా మారుతోంది. ఒకప్పుడు కవర్లలో, బ్యాగుల్లో దూరే నగదు, బళ్ల కింద నుంచి వెళ్లే లంచాలు ఇప్పుడు ‘స్కాన్ అండ్ పే’ రూపంలో అకౌంట్లలో చెలామణి అవుతున్నాయి. ‘నగదు దొరికితేనే కేసు’ అనే పాత భావన నుంచి తప్పించుకోవడానికి అధికారులు డిజిటల్ మార్గాలను ఎంచుకుంటున్నారు. అలాంటి మార్గాలపై నిఘా పెట్టిన అవినీతి నిరోధకశాఖ అధికారులు ఇటీవల ఉమ్మడి జిల్లాలో వరుసదాడులు చేపడుతున్నారు. యూపీఐ ద్వారా లంచం తీసుకున్న అధికారులను ఆధారాలతో సహా పట్టుకుని కటకటాలు లెక్కపెట్టిస్తున్నారు. -
సింగిల్ యూస్ ప్లాస్టిక్ వాడొద్దు
రామగిరి: సింగిల్ యూస్ ప్లాస్టిక్ వాడొ ద్దని తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి అసిస్టెంట్ సైంటి స్ట్ కనకజ్యోతి సూచించారు. పన్నూర్లోని మంథని జేఎన్టీయూలో ప్రిన్సిపాల్ విష్ణువర్ధన్తో కలిసి బుధవారం సింగిల్ యూస్ ప్లాస్టిక్ వినియోగంపై అవగాహన కల్పించారు. కనకజ్యోతి మాట్లాడుతూ, సింగిల్ యూస్ ప్లాస్టిక్తో పర్యావరణానికి హాని కలుగుతుందన్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలతో పర్యావరణం, వన్యప్రాణులు, నీటివనరులకు ముప్పు వాటిల్లుతుందని తెలిపారు. వీటికి బదులు బట్ట సంచులు, మళ్లీ ఉపయోగించే సీసాలు, జీవ విచ్ఛిన్నమయ్యే పదార్థాల వంటి సుస్థిర పద్ధతులు అవలంబిచాలని కోరారు. ఈ కార్యక్రమంలో పరిపాలనాధికారి సుమన్రెడ్డి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మద్యం మత్తులో డ్రైవింగ్ ● ప్రమాదానికి కారణమైన ఇద్దరికి జైలు పెద్దపల్లిరూరల్: మద్యం మత్తులో వాహనాలు నడిపి ప్ర మాదాలకు కారకులైన వారికి జైలుశిక్ష, జరిమానా వి ధిస్తూ సెకండ్ క్లాస్ ఇన్చార్జి జడ్జి మంజుల బుధవారం తీ ర్పునిచ్చారని ట్రాఫిక్ సీఐ అనిల్కుమార్ తెలిపారు. జి ల్లా కేంద్రంలోనిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో ప ట్టుబడ్డ 39 మందిని కోర్టులో హాజరుపర్చామన్నారు. వారిలో శాంతినగర్కు చెందిన నల్గొండ కోటేశ్వర్కు రెండు రోజులు, తమిళనాడు రాష్ట్రంలోని కరూర్కు చెందిన జగదీశ్కు మూడురోజుల శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారని వి వరించారు. మిగతా 37మందికి రూ.36,500 జరిమానా విధిస్తున్నట్లు తీర్పులో పేర్కొన్నారని సీఐ పేర్కొన్నారు. గురుకులాల్లో ప్రవేశాలు పెద్దపల్లి: టీజీ సెట్ –2026 ఫలితాలు విడుదలైన నేపథ్యంలో గురుకులాల్లో అర్హత గలవిద్యార్థులు ప్రవేశాలు పొందాలని బీసీ గురుకులాల జిల్లా కో ఆర్డినేటర్ మణిదీప్తి తెలిపారు.https://tgcet.cgg.gov.in వెబ్సైట్లో ఫలితాలు చూసుకుని, ఉత్తీర్ణులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ విద్యార్థులు ప్రవేశా లు పొందాలన్నారు. -
కారుణ్య నియామకాలు ఎత్తివేసే కుట్ర
గోదావరిఖని: సింగరేణి యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి కారుణ్య నియామకాలు ఎత్తివేసే కుట్ర చేస్తున్నాయని టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి ఆరోపించారు. స్థానిక ప్రెస్క్లబ్లో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సీఎం రేవంత్రెడ్డి చంద్రబాబు వారసత్వం కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం గోల్డెన్ హ్యాండ్షేక్ పేరిట పదివేల మంది ఉద్యోగులను విధుల్లోంచి తొలగించిందని గుర్తుచేశారు. మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు 13 వేల మందిని ఉద్యోగాల్లో తీసుకున్నారని, ఇందులో అవకతవకలు జరగాయనడం హాస్యాస్పదమన్నారు. సంస్థలో చోటుచేసుకుంటున్నఅవినీతి, అక్రమాలు, కాంగ్రెస్ ప్రభుత్వం కుంభకోణాలు, నిధుల దుర్వినియోగంపై పోరాటాలకు కార్మికులు సిద్ధం కావాలని కోరారు. టీబీజీకేఏస్ ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్రెడ్డి, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నూనె కొమరయ్య, కోశాధికారి చెల్పూరి సతీశ్, నాయకులు పానుగంటి సత్తయ్య, పోలాడి శ్రీనివాసరావు, చల్లా రవీందర్రెడ్డి, వాసర్ల జోసఫ్, జనగామ మల్లేశ్, పల్లె సురేందర్, పులిపాక సంపత్ తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగా ‘సాక్షి’ వార్షికోత్సవం
ఎలిగేడు: పెద్దపల్లి జిల్లా ఎలిగేడులోని శ్రీకోదండ రామాలయంలో మంగళశారం సాక్షి దినపత్రిక 18వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ‘సాక్షి’ పాఠకులు, అభిమానుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. సర్పంచ్ కప్పల ప్రవీణ్ మాట్లాడుతూ, నిజాలను నిర్భయంగా రాస్తూ, నిత్యం ప్రజల పక్షాన నిలుస్తూ లక్షలాది మంది పాఠకుల ఆదరణ పొంది ఉన్నతస్థాయిలో నిలిచిందన్నారు. అనంతరం స్థానిక రిపోర్టర్ రంగు తిరుపతిని సన్మానించారు. సాక్షి యాజమాన్యానికి, రిపోర్టర్లకు, సిబ్బందికి వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మాజీ సర్పంచులు మండిగ రాయనర్సయ్య, బాసంపల్లి కొండయ్య, బూర్ల వెంకటసత్యం, మాజీ ఎంపీటీసీ గొల్లే భూమేశ్, ఆర్యవైశ్య సంఘం మండల ప్రధాన కార్యదర్శి తాటిపల్లి సతీశ్బాబు, అంబేడ్కర్ సంఘం నాయకుడు కవ్వంపల్లి చంద్రయ్య, వివిధ సంఘాల నాయకులు బుర్ర అజయ్, బుర్ర గణేశ్, మహేందర్, రాకేశ్, రాంరెడ్డితోపాటు ‘సాక్షి’ పాఠకులు, అభిమానులు పాల్గొన్నారు. -
‘పారాక్వాట్’ను నిషేధించాలి
కరీంనగర్: అత్యంత విషపూరితమైన పారాక్వాట్ గడ్డిమందును నిషేధించాలని రాష్ట్రస్థాయి వైద్య నిపుణులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం నగరంలో ని ఐఎంఏ భవనంలో రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పి.కిషన్ మా ట్లాడుతూ.. పారాక్వాట్కు కచ్చితమైన విరుగుడు లే కపోవడం అత్యంత ప్రమాదకరమన్నారు. స్వల్ప పరి మాణంలో సేవించినా ప్రాణాపాయం తప్పదని, ఆసుపత్రికి చేరినా చికిత్స అందించడం కష్టమని పేర్కొన్నారు. దీనికి ప్రత్యామ్నాయ మందులను రైతులకు అందుబా టులోకి తేవాలని సూచించారు. బీఎన్.రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో గడ్డిమందు నిషేధంపై అవగాహన కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయం అన్నారు. డాక్టర్ పి.రంగారెడ్డి మాట్లాడుతూ.. వ్యవసాయంలో సులభత కోసం వాడుతున్న ఈ రసాయనం ప్రాణాంతకమైందని, రైతుల భద్రత దృష్ట్యా దీని వినియోగాన్ని నియంత్రించా లన్నారు. తానా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ అరుణ్ కటారి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంట్లో ఈ మందు అందుబాటులో ఉండటం వల్ల క్షణికావేశంలో సేవించి ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య పెరుగుతోందన్నా రు. బీఎన్.రావు మాట్లాడుతూ ఈ మందు ఊపిరితిత్తులు, కాలేయం, కిడ్నీలపై తీవ్ర ప్రభావం చూపుతుందని, ఊపిరితిత్తుల కణజాలం దెబ్బతిని శ్వాస తీసుకోవడం కష్టమవుతుందని వివరించారు. ప్రభుత్వం దీనిపై కట్టుదిట్టమైన నియంత్రణలు అమలు చేయాలని, సురక్షిత ప్రత్యామ్నాయాలపై రైతులకు అవగాహన కల్పించాలని వైద్యులు కోరారు. ఐఎంఏ జిల్లా అధ్యక్షురాలు ఆకుల శైలజ, ప్రధాన కార్యదర్శి మహేశ్ బాబు, ట్రెజరర్ నీలిమా, అలీం, కాంగ్రెస్ డాక్టర్ వింగ్ చైర్మన్ వెంకటేశ్వర్లు, వైద్యులు శ్రీధర్, కిరణ్, రాంచందర్ పాల్గొన్నారు. ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు పి.కిషన్ -
విద్యుత్ షాక్తో మేకల కాపరి మృతి
సైదాపూర్: విద్యుత్ షాక్తో మేకల కాపరి, రెండు మేకలు మృతి చెందిన ఘటన సైదాపూర్ మండలం సర్వాయిపేటలో మంగళవారం చోటు చేసుకుంది. గ్రామస్తుల వివరాల ప్రకారంగా సర్వాయిపేటకు చెందిన బొల్లి సమ్మయ్య(49) ఆకునూర్ శివారులో మేకలు మేపుతున్నాడు. హుస్నాబాద్ మండలం మహ్మదాపూర్కు చెందిన ఓ రైతు కోతుల బెడద తప్పించుకునేందుకు వరి చేను చుట్టూ కరెంట్ షాక్ పెట్టాడు. మేకలు మేపుతూ అటువైపుగా వెళ్లిన బొల్లి సమ్మయ్యకు రెండు మేకలకు కరెంట్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. హుజూరాబాద్ రూరల్ సీఐ పులి వెంకట్, సైదాపూర్ ఎస్సై స్వాతి ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతునికి భార్య సరవ్వ, కుమారుడు ఉన్నారు. సీఎంకప్లో తృతీయ స్థానంకరీంనగర్: సీఎం కప్–2025లో రాష్ట్రస్థాయిలో కరీంనగర్ జిల్లా తృతీయస్థానం సాధించింది. హైదరా బాద్ ఎల్బీ స్టేడియంలో మంగళవారం జరిగిన ముగింపు వేడుకల్లో క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహ రి, షట్లర్ సైనా నెహ్వల్ చేతుల మీదుగా డీవైఎస్వో శ్రీనివాస్ ట్రోఫీ అందుకున్నారు. ఆదిలాబాద్ ప్రథమ, రంగారెడ్డి ద్వితీయ స్థానంలో నిలవగా కరీంనగర్ 79.4పాయింట్లతో తృతీయ స్థానం సాధించింది. కలెక్టర్ చిత్రామిశ్రా, ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు నందెల్లి మహిపాల్, గసిరెడ్డి జనార్ధన్రెడ్డి, తుమ్మల రమేశ్రెడ్డి, నాగిరెడ్డి సిద్ధారెడ్డి తదితరులు హర్షం వ్యక్తం చేశారు. పేకాట ఆడుతూ పట్టుబడిన ఏఎస్సైపై వేటు?మెట్పల్లి: పేకాట ఆడుతూ పట్టుబడిన మెట్పల్లి ఏఎస్సై సత్యనారాయణను ఉన్నతాధికారులు సస్పెండ్ చేసినట్లు తెలిసింది. పట్టణంలోని రాంనగర్లో శనివారం రాత్రి ఓ ఇంట్లో పేకాట ఆడుతున్నారనే సమాచారంతో స్థానిక పోలీసులు అక్కడకు వెళ్లి దాడి చేశారు. అందులో పట్టుబడిన పలువురిలో ఏఎస్సై సత్యనారాయణ ఉన్నారు. దీనిని తీవ్రంగా పరిగణించిన ఉన్నతాధికారులు ఆయనను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం. కొన్ని నెలల్లో ఉద్యోగ విరమణ చేసే సత్యనారాయణ వ్యవహారం స్థానికంగా చర్చనీయాంశమైంది. -
భారతావనికి ఎన్టీపీసీ వెలుగులు
గోదావరిఖని/జ్యోతినగర్: దక్షిణాదితోపాటు దేశవ్యాప్తంగా విద్యుత్ అందించడంలో పెద్దపల్లి జిల్లా రామగుండంలోని తెలంగాణ ప్రాజెక్టు అగ్రభాగాన నిలిచిందని ఆ ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(ఈడీ) చందన్ కుమార్ సామంత వెల్లడించారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలోని ఎన్టీపీసీ టెంపరరీ టౌన్షిప్లో మంగళవారం ఏర్పాటు చేసిన జర్నలిస్టుల సమావేశంలో ఈడీ మాట్లాడారు. ప్రాజెక్టులోని 200 మెగావాట్ల రెండో యూనిట్, 500 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం గల రెండు యూనిట్లు(4వ, 6వ) వార్షిక మరమ్మత్తులు పూర్తిచేసుకుని విద్యుత్లోకి వచ్చాయని వెల్లడించారు. త్వరలోనే తెలంగాణ స్టేజ్–2కు రానుందని, తెలంగాణ ప్రభుత్వం పవర్ పర్చేజ్ అగ్రిమెంట్(పీపీఏ) ప్రక్రియ వేగవంతం చేసిందన్నారు. వేసవిలో డిమాండ్కు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తికి ప్రణాళిక రూపొందించామని అన్నారు. ప్రజెక్టులో బొగ్గు , ఇంధన నిల్వలు.. థర్మల్ ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన బొగ్గు, ఇంధన నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని ఈడీ సామంత అన్నారు. 100 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్, 10 మెగావాట్ల గ్రౌండ్ మౌంట్ సోలార్ విద్యుత్ ప్రాజెక్టులు ఉత్పత్తిలో ఉండగా, ఈనెలలోనే 176 మెగావాట్ల (120 మెగావాట్లు గ్రౌండ్, 56 మెగావాట్లు ఫ్లోటింగ్) సోలార్ ప్రాజెక్టులు కమిషనింగ్కు సిద్ధమయ్యాయని తెలిపారు. గ్రిడ్ నుంచి ఫస్ట్ టైమ్ చార్జింగ్ కోసం ఎదురుచూస్తున్నట్లు వివరించారు. ఆర్థిక సంవత్సరంలో రామగుండం థర్మల్ ప్రాజెక్టు 13.4 బిలియన్ యూనిట్లు(86.3 శాతం), తెలంగాణ స్టేజ్–1 ప్రాజెక్టు 9.3 బిలియన్ మెగావాట్లు(91.4శాతం ) విద్యుత్ ఉత్పత్తి చేశాయని ప్రకటించారు. పారదర్శకత, ప్రజావిశ్వాసాన్ని పెంపొందించడంలో మీడియా కీలకపాత్ర పోషిస్తోందని ప్రశంసించారు. పర్యావరణ హిత చర్యలు పటిష్టం విద్యుత్ ఉత్పత్తితోపాటు పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఈడీ స్పష్టం చేశారు. తక్కువ కార్బన్ ఉద్గారాల దిశగా బ్యాటరీ స్టోరేజ్ యూనిట్, కార్బనేటెడ్ బ్రిక్స్ తయారీ ప్రాజెక్టులు చేపట్టినట్లు వెల్లడించారు. పర్యావరణ నిబంధనల అమలులో భాగంగా ఎఫ్జీడీ వ్యవస్థ తెలంగాణ ప్రాజెక్టులో అమల్లో ఉండగా, రామగుండంలో పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ఎఫ్జీడీ ద్వారా 1.35 టన్నుల జిప్సం సేకరించామని పేర్కొన్నారు. సంస్థ ప్రభావిత, పునరావాస గ్రామాల్లో విద్య, వైద్యం, వసతుల కల్పనకు సామాజిక సేవా బాధ్యతా పథకం నిధులు రూ.7 కోట్ల నుంచి రూ.15 కోట్లకు పెంచామని వెల్లడించారు. జనరల్ మేనేజర్లు ముకుల్ రాయ్, మనీష్ అగర్వాల్, అభిజిత్ దత్తా, బినోయ్ జోస్, తెలంగాణ ప్రాజెక్టు హెచ్వోడీ డీఎస్ రావత్, ఏజీఎం బిజయ్కుమార్ సిగ్దర్, సీఎస్సార్ ప్రతినిధులు, జర్నలిస్టులు పాల్గొన్నారు. సోలార్, థర్మల్ విద్యుత్ సామర్థ్యాల పెంపు వేసవి డిమాండ్కు ముందస్తు ఏర్పాట్లు సమృద్ధిగా బొగ్గు, ఇందన నిల్వలు రామగుండం ఎన్టీపీసీ తెలంగాణ ప్రాజెక్టు ఈడీ చందన్ కుమార్ సామంత -
జాగ్రత్తలు తప్పనిసరి
ఒంటిపూట బడి..పెద్దపల్లి: ఎండల తీవ్రత పెరుగుతోంది. రాష్ట్రప్రభుత్వం పాఠశాలలను ఈనెల 16 నుంచి ఒక్కపూటే నడిపిస్తోంది. మధ్యాహ్న భోజనం చేసిన తర్వాతే విద్యార్థులను ఇంటికి పంపిస్తోంది. మధ్యాహ్నం తర్వాత బడిలేకపోవడంతో పిల్లలు ఆడుకునేందుకు బయటకు వెళ్తున్నారు. ఇలా అనేకమంది ఆటాపాటల్లో మునిగితేలుతున్నారు. ఇలాంటి ఆనంద సమయాల్లో విషాదాలు పొంచి ఉంటాయని తల్లిదండ్రులను గ్రహించాలి. పిల్లలపై శ్రద్ధ తీసుకోవాలి ఒంటిపూట బడిసమయంలోనూ ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు విద్యార్థులపై మరింత శ్రద్ధ తీసుకోవాలి. పాఠశాలలో స్వచ్ఛమైన తాగునీటి వసతితోపాటు ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ప్రాథమిక చికిత్స కిట్లు అందుబాటులో ఉండేలా చూడాలని ఉన్నతాధికారులు ఇప్పటికే ఆదేశించారు. తరగతి గదుల్లో ఫ్యాన్లు తిరిగేటట్లు శ్రద్ధ వహించాలి. మధ్యాహ్న భోజనం నీడ కింద కూర్చుని తినేలా ఏర్పాట్లు చేయాలి. ఎండలో ఆటలాడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. బావులు, చెరువుల వద్దకు వెళ్లకుండా.. పట్టణ ప్రాంతాలతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో చెరువులు, కుంటలు, ఉపాధిహామీలో మట్టి తీసిన గుంతల్లో ప్రస్తుతం నీరు నిల్వఉంది. విద్యార్థులు అటువైపు వెళ్లకుండా చూసుకోవాలి. బావుల్లో సరదా కోసం ఈత నేర్చుకునేందుకు వెళ్లిన పిల్లలు మునిగిపోయిన విషాద ఘటనలు ఏటా పదుల సంఖ్యలో ఉంటున్నాయి. డ్రైవింగ్ మోజులో.. ద్విచక్ర వాహనాలు, సైకిళ్లపై మోజుతో కొందరు విద్యార్థులు ఇళ్లలో చెప్పకుండా రోడ్డెక్కితే ప్రమాదాల బారిన పడే ఆస్కారం అధికంగా ఉంది. బడి వదలగానే కొందరు పిల్లలు సమయం దొరికిందని ఎండలో ఆడతారు. దీంతో వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉంది. ఇంట్లో ఖాళీగా వీడియో గేమ్స్, టీవీ, కంప్యూటర్లకు అతుక్కుపోతున్నారు. దృష్టిలోపాలతో పాటు మానసిక బలహీనులుగా మారే అవకాశం ఉంది. వీటి విషయాల్లో జాగ్రత్త వహించాలి. తల్లిదండ్రులు సరదాగా సమయం కేటాయించి వారితో ఉంటూ ఆటలు ఆడిపించాలి. జాగ్రత్తలు అవసరం ఉదయాన్నే కచ్చితంగా అల్పాహారం పెట్టి పాఠశాలలకు పంపించాలి. నీళ్లసీసా వెంట ఉంచాలి. ఉదయం 7.30 గంటల్లోపు బడికి పంపించేందుకు శ్రద్ధ తీసుకోవాలి. మధ్యాహ్న భోజనం 12.30 గంటలకు వడ్డిస్తారు. దూరప్రాంతాల విద్యార్థులు ఎండలో నడిచి వెళ్లకుండా ఆటోలు తదితర వాహనాలు ఏర్పాటు చేసుకోవాలి.పిల్లలు మధ్యాహ్నం బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండేలా తల్లిదండ్రులు చూసుకోవాలి. ఎండలు ఎక్కువైన కొద్దీ పిల్లలు ఆహారం తీసుకునేందుకు మారాం చేసే అవకాశముంది. వీరికి ఇష్టమైన ద్రవ పదార్థాలు, పండ్లరసాలు ఎక్కువగా తీసుకునేలా చొరవ తీసుకోవాలి. – డాక్టర్ ఉదయ్ కుమార్, పీహెచ్సీ, గర్రెపల్లి పిల్లలను కంట కనిపెట్టాల్సిందే.. ఆడుకుంటూ వెళ్లి ప్రమాదాల బారిన పడే అవకాశం ఆటలపై దృష్టి సారించేలా చూస్తే బెటర్ -
తండ్రి పేరిట ఉన్న నగదు దేశ రక్షణ నిధికి జమ
రామగుండం: ఓ రిటైర్డ్ హెచ్ఎం తండ్రి పేరిట ఉన్న నగదును దేశ రక్షణ నిధికి జమ చేసి దేశంపై ఉన్న అభిమానాన్ని చాటారు. ఆంధ్రప్రదేశ్లోని నూజివీడుకు చెందిన కోట వెంకటశివశాస్త్రి రామగుండం హైస్కూల్లో సుదీర్ఘకాలం హెచ్ఎంగా విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ పొందారు. తన తండ్రి ప్రఖ్యాత హరికథా భాగవతార్, పద్మశ్రీ అవార్డు గ్రహీత కోట సచ్చిదానందశాస్త్రి వయోభారంతో 2024 సెప్టెంబర్లో కన్నుమూశారు. ఈ నేపథ్యంలో తన తండ్రి పేరిట ఉన్న రూ.లక్ష నగదును సోమవారం భగత్సింగ్ వర్ధంతిని పురస్కరించుకొని నూజివీడు ఎస్బీఐ బ్యాంకులో దేశ రక్షణ నిధి అకౌంట్ నంబర్కు డిపాజిట్ చేశారు. ఈ విషయమై సదరు రిటైర్డ్ హెచ్ఎం తన పూర్వ విద్యార్థుల వాట్సాప్ గ్రూపులో పోస్టు చేశారు. రిటైర్డ్ హెచ్ఎంకు పూర్వ విద్యార్థులు ఫోన్ చేసి అభినందిస్తున్నారు. రిటైర్డ్ హెచ్ఎం నిర్ణయంపై హర్షం -
ప్రజాసమస్యలు చర్చకు వచ్చేనా?
కోల్సిటీ(రామగుండం): రామగుండం బల్దియా కార్యాలయంలో బుధవారం బడ్జెట్ సమావేశం నిర్వహించనున్నారు. ఈసందర్భంగా తొలిజనరల్ బాడీ సమావేశం కూడా నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. ఈమేరకు మంగళవారం కౌన్సిల్హాల్ను సిబ్బంది శుభ్రం చేశారు. బడ్జెట్ రూ.248కోట్లు.. నగర అభివృద్ధి కోసం ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.248కోట్ల 66లక్షల 51వేలతో బడ్జెట్ రూపొందించారు. అయితే, ప్రజాసమస్యలపై కార్పొరేటర్లు చర్చిస్తారా? చప్పట్లు కొట్టి అజెండా అంశాలకు ఆమోదం తెలుపుతారా? అనేది ఆశక్తిగా మారింది. అజెండీలో 8 అంశాలు పాలకర్గం ఏర్పడిన తర్వాత మేయర్ మహంకాళి స్వామి అధ్యక్షతన తొలి సమావేశం నిర్వహిస్తారు. ఇందుకోసం నాలుగు రోజుల క్రితమే కార్పొరేటర్లకు బడ్జెట్ అజెండాతోపాటు ఎనిమిది అంశాలతో కూడిన కాపీలను అందజేశారు. కార్మికులకు అందని వేతనాలు బల్దియాలోని సుమారు 125 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, కార్మికులకు ఈనెల 24వ తేదీ వరకు జీతాలు అందలేదు. మరో ఐదురోజుల్లో రెండోనెల వేతనాలు కూడా చెల్లించాల్సి ఉంటుంది. ప్రతీనెల 5వ తేదీన్నే చెల్లిస్తున్న అధికారులు ఈసారి నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపణలున్నాయి. మరోవైపు.. ఈఈ ఎస్ఎల్ ద్వారా ఏడేళ్ల నుంచి ఐదేళ్ల వరకు పనిచేసిన అవుట్సోర్సింగ్ ఎలక్ట్రీషియన్లకు ఉద్యోగ భద్రత లేక మానసిక ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం ఎలక్ట్రికల్ విభాగంలోని ఆరుగురు ఎలక్ట్రీషియన్లకు నాలుగు నెలలుగా వేతనాలు చెల్లించడం లేదు. నేడు రామగుండం బల్దియా బడ్జెట్ సమావేశం -
‘ఆపరేషన్ యాత్రి సురక్షా’లో ప్రతిభ
రామగుండం: సికింద్రాబాద్ డివిజన్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ విభాగంలో నిర్వహించే ‘ఆపరేషన్ యాత్రి సురక్షా’లో భాగంగా పలు ప్యాసింజర్, ఎక్స్ప్రెస్ రైళ్లలో ఆర్పీఎఫ్ సిబ్బంది ఆకస్మిక సోదాలు నిర్వహించడం పరిపాటి. ఈ సందర్భంగా అనుమానితులను గుర్తించి, చోరీకి గురైన సామగ్రిని స్వాధీనం చేసుకుంటోంది. ఇందులో భాగంగానే రామగుండం రైల్వే భద్రత దళానికి చెందిన ఏఎస్ఐ మాసాని నాగరాజు, హెడ్ కానిస్టేబుల్ ప్రదీప్కుమార్ నిర్వహించిన ఆపరేషన్ యాత్రి సురక్షాలో ఓ దొంగను గుర్తించి అదుపులోకి తీసుకొని విచారించారు. ఈక్రమంలో పెద్దపల్లి, మంచిర్యాల రైల్వేస్టేషన్ల మధ్య నడిచే రైళ్లలో ప్రయాణికుల మొబైల్ ఫోన్లు 8 దొంగిలించినటు్ల్ ఆర్పీఎఫ్ సిబ్బంది వెల్లడించారు. వాటి విలువ సుమారు రూ.61వేల వరకు ఉంటుందని అంచనా వేశారు. ఇందులో ప్రతిభ కనబరిచిన ఏఎస్ఐ నాగరాజు, హెచ్సీ ప్రదీప్కుమార్ను ఉత్తమ ఉద్యోగులుగా గుర్తిస్తున్నట్లు సికింద్రాబాద్ డివిజనల్ ఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమిషనర్ నరేంద్రకుమార్వర్మ ప్రకటించారు. ఈవిషయాన్ని రామగుండం సీఐ రాజేంద్రప్రసాద్ పేర్కొన్నారు. ఈ మేరకు ఉద్యోగులను డివిజనల్ కమిషనర్ ఆలకుంట నవీన్కుమార్, రామగుండం ఆర్పీఎఫ్ ఎస్సై క్రాంతి తదితరులు అభినందించారు. ఈనెలలో రూ.61వేల విలువైన వస్తువుల రికవరీ ఉత్తమ సిబ్బందిగా గుర్తించిన రైల్వే అసిస్టెంట్ కమిషనర్ -
తాళం వేసిన ఇంట్లో చోరీ
జగిత్యాలక్రైం: జగిత్యాల రూరల్ మండలం కల్లెడలో తాళం వేసిన ఇంట్లో గుర్తుతెలియని దొంగలు సోమవారం రాత్రి చోరీకి పాల్ప డ్డారు. గ్రామానికి చెందిన గాండ్ల తిరుపతి ఇంటికి తాళం వేసి ఉపాధి నిమిత్తం ముంబయ్ వెళ్లాడు. దొంగలు చొరబడి పావుతులం బంగారు ఆభరణాలు, 10 తులాల వెండి నగలు ఎత్తుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్సై ఉమాసాగర్ తెలిపారు. ఆర్టీసీకే ఎలక్ట్రిక్ బస్సులివ్వాలి గోదావరిఖనిటౌన్: ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ బాధ్యతలను ఆర్టీసీకి అప్పగించి బలోపేతం చేయాలనే డిమాండ్తో స్థానిక డిపో ఎదుట మంగళవారం ధర్నా చేశారు. ఐఎఫ్టీయూ, సీఐటీయూ ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో జిల్లా అధ్యక్షులు వేల్పుల కుమారస్వామి, నరేశ్ మాట్లాడారు. ఆర్టీసీలో కార్మిక సంఘాలను అనుమతిస్తామని, ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చి విస్మరించిందన్నారు. విద్యుత్ బస్సుల నిర్వహణలో ఆర్టీసీకి ప్రాధాన్యం లేకుండా చేసి దేశీయ, అంతర్జాతీయ ప్రైవేట్ పెట్టుబడిదారులకు లాభాలు చేకూర్చే పద్ధతులను వ్యతిరేకిస్తున్నామన్నారు. దీంతోపాటు విద్యుత్ సబ్స్టేషన్లు ఏర్పాటు, మౌలిక వసతుల కల్పన పేరుతో ఆర్టీసీలకు ఉన్న భూములను ప్రవేట్ సంస్థలకు అప్పజెప్పడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. నాయకులు నరహరిరావు, కృష్ణ, మల్లయ్య, రాజేశం, కొమురయ్య, ప్రేమ్కుమార్తోపాటు ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు పి.రంగన్న, మద్దెల శ్రీను, టి.శ్రీను, ఏబీ స్వామి, డీఆర్ స్వామి, జి.శ్రీను, సామెల్, చంద్రయ్య, ప్రసాద్, కె.రవి, రాజయ్య, రాజు, భిక్షపతి, కనకయ్య తదితరులు పాల్గొన్నారు. పోక్సో కేసులో ఒకరి అరెస్ట్ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలకేంద్రానికి చెందిన పుట్టకొక్కుల రంజిత్ను పోక్సో కేసులో అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. సిరిసిల్ల డీఏస్పీ నాగేంద్రచారి తెలిపిన వివరాలు.. రంజిత్ కొన్నినెలలుగా రాచర్ల గొల్లపల్లి గ్రామంలోని ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో పనిచేస్తున్నాడు. ఓ మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి బలవంతంగా అనుభవించాడు. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్సై రాహుల్రెడ్డి కేసు నమోదు చేశారు. డీఏస్పీ నాగేంద్రచారి కేసు దర్యాప్తు చేశారు. రంజిత్ను రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. అట్రాసిటీ కేసు నమోదు జమ్మికుంట: కులంపేరుతో దూషించిన ఇద్దరిపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు టౌన్ సీఐ రామకృష్ణ మంగళవారం తెలిపారు. పట్టణంలోని గణేశ్నగర్కు చెందిన చంద్రమౌళి ఇంటి స్థలం ఎదుట ఇసుక పోయించిన నూరి రామకృష్ణ, మేడిపల్లి సదానందంను ప్రశ్నించాడు. దీంతో వారు కులంపేరుతో దూషించి, దాడికి యత్నించారు. భాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. -
సమస్యలు పరిష్కరించకుంటే సమ్మె
పెద్దపల్లి: విద్యుత్ సంస్థలోని 23,667మంది ఆర్టిజన్లకు సర్వీస్ రూల్స్ అమలు చేయాలని, సమస్యలు పరిష్కరించాలని ఆర్టిజన్స్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా జేఏసీ చైర్మన్ తూళ్ల నాగరాజు డిమాండ్ చేశారు. స్థానిక ప్రెస్క్లబ్లో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 2016కు ముందు అన్నిఅర్హతలు ఉన్న వారందరినీ, ఆన్మ్యాన్డ్ కార్మికులను ఆర్టిజన్లుగా గుర్తించాలన్నారు. అన్నివిభాగాల వారికి జీవో నంబర్11 ప్రకారం కనీస వేతన చట్టం, ఈపీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు వర్తింపజేయాలన్నారు. లేనిపక్షంలో ఈనెల 26, 30వ తేదీల్లో డివిజన్ కార్యాలయాల వద్ద ధర్నా, ఏప్రిల్ 2న సర్కిల్ కార్యాలయాల ఎదుట వంటావార్పు చేస్తామని, ఏప్రిల్ 7న వరంగల్ డీసీఎల్ కార్యాలయం వద్ద మహాధర్నా చేస్తామని, అయినా స్పందించకుంటే ఏప్రిల్ 8న నిరవధిక సమ్మెకు వెళ్తామని స్పష్టం చేశారు. పాలకుర్తి మండలం బసంత్నగర్ధిలో పనిచేస్తున్న అర్టిజన్ గడ్డం జయదేవ్ను వేధిస్తున్న ఏఈపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నాయకులు ఖలీమొద్దీన్, ఎం.కృష్ణారెడ్డి, ఎం.ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు. ఆర్టిజన్స్ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా జేఏసీ నేత నాగరాజు -
పెట్రోల్.. నోస్టాక్
కాల్వశ్రీరాంపూర్: మండల కేంద్రంలోని పెట్రో ల్ బంకుల్లో ‘నోస్టాక్’బోర్డులు దర్శనమిస్తున్నా యి. రెండు రోజులుగా పెట్రోల్ దొరకక వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా రు. కొందరు బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఇరాన్ యుద్ధం ప్రభావం రా నున్న రోజుల్లో ఇంకెంత ఉంటుందోనని వాహనదారులు వాపోతున్నారు. వరికోతల సీజన్ ప్రారంభం కావడంతో హార్వెస్టర్లు ఎలా పనిచేస్తాయనే ఆందోళన రైతులను వెంటాడుతోంది. మరోవైపు.. ఆకాశంలో మేఘాలు కమ్ముకోవ డం కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. -
గర్భిణులకు మెరుగైన వైద్యసేవలు
పెద్దపల్లి: ఎంసీహెచ్ ద్వారా గర్భిణులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. మాతా శిశు సంరక్షణ కేంద్రం పనితీరుపై కలెక్టరేట్లో అధికారులతో మంగళవారం సమీక్షించా రు. ప్రసవం గడువు సమీపించిన గర్భిణుల వివరాలు ఈడీబీ రిజిష్టర్లో తప్పనిసరిగా నమోదు చేయాలని సూచించారు. ప్రసవం తర్వాత కూడా తల్లీబిడ్డల ఆరోగ్య సంరక్షణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. మంథని ఎంసీహెచ్ పనితీరు గతం కన్నా మెరుగైందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి ప్రమోద్ కుమార్, జిల్లా ఆస్పత్రుల సూపరింటెండెంట్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. సీఎస్సార్ నిధులు సద్వినియోగం చేసుకోవాలి సీఎస్సార్ నిధులను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ శ్రీహర్ష సూచించారు. సీఎస్సార్ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనుల పురోగతి అధికారులతో సమీక్షించారు. సింగరేణి ద్వారా రామగుండంలో రూ.ఐదు కోట్లతో అభివృద్ధి పనులకు ప్రతిపాదించామన్నారు. ఎన్టీపీసీ యాష్ పాండ్ వద్ద ప్రత్యేక పారిశుధ్య పనులు చేపట్టాలని ఆయన సూచించారు. భూ సమస్యల పరిష్కారానికి చర్యలు పాలకుర్తి: భూభారతి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ శ్రీహర్ష ఆదేశించారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయాన్ని ఆయన తనిఖీ చేశారు. స్లాట్ బుకింగ్ ప్రకారం రిజిస్ట్రేషన్లు సజావుగా సాగేలా చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలను సందర్శించారు. తహసీల్దార్ సునీత, అంగన్వాడీ కేంద్రం నిర్వాహకురాలు రజిత, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
కొత్తగా ఐదు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్/సాక్షి, పెద్దపల్లి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కొత్తగా ఐదు అసెంబ్లీ స్థానాలు ఏర్పాటయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో కరీంనగర్, చొప్పదండి, మానకొండూరు, హుజూరాబాద్, పెద్దపల్లి, రామగుండం, మంథని, రాజన్న సిరిసిల్ల, వేములవాడ, జగిత్యాల, ధర్మపురి, కోరుట్ల శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి. డీలిమిటేషన్ ప్రక్రియలో కొత్తగా సుల్తానాబాద్, కరీంనగర్ రూరల్, జగిత్యాల రూరల్, మెట్పల్లి, ఎల్లారెడ్డిపేట అసెంబ్లీ నియోజకవర్గాలు ఏర్పాటు కానున్నాయి. కొత్తవాటితో కలుపుకుంటే ఉమ్మడి జిల్లాలో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య 17కు చేరనుంది. కేంద్ర ప్రభుత్వం అసెంబ్లీ స్థానాల సంఖ్య పెంచేందుకు కసరత్తు చేస్తున్న నేపథ్యంలో కొత్త నియోజకవర్గాల ఏర్పాటు రాజకీయ సమీకరణాలను మార్చేస్తుందనే చర్చ సాగుతోంది. ఈ ప్రక్రియ ఎవరికి కలిసివస్తుంది? ఎవరికి తలనొప్పి తెస్తుందో’ అని ఎవరికి వారు అంచనాలు వేసుకుంటున్నారు. ప్రయోజనాలు ఏమిటి? మున్సిపల్, సమీప గ్రామాల ప్రజలకు ప్రత్యేక ప్రాతినిధ్యం లభించనుంది. అభివృద్ధి పనులు, నిధులు, స్థానిక సమస్యల పరిష్కారం వేగవంతమవుతుంది. జిల్లా మొత్తం సమాంతరంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. ఇప్పటిదాకా రాజకీయ అవకాశాలు రాక ఎన్నికల్లో పోటీచేయలేని వారికి బరిలో నిలిచే అవకాశాలు పెరగనున్నాయి. 33 శాతం మహిళా రిజర్వేషన్తో.. కేంద్ర ప్రభుత్వం తాజాగా చేపట్టే జనాభా లెక్కలు –2026 ఆధారంగా.. మహిళా రిజర్వేషన్ కోటా నిర్ణయించనున్నారు. పాత శాసనసభా స్థానాలతోపాటు కొత్తగా ఏర్పడే అసెంబ్లీ స్థానాలతో కలిపి రాష్ట్రంలోని అసెంబ్లీ నియోజవర్గాలు మొత్తం 179కు చేరనున్నాయి. ఇందులో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తే 59 సీట్లు దక్కనున్నాయి. అప్పుడు ఉమ్మడిలోని 17స్థానాల్లో నాలుగు నుంచి ఐదు సీట్లు మహిళలకు దక్కే అవకాశాలు ఉన్నాయి. అయితే, మహిళలకు కేటాయించేవి ఏమిటి, మహి ళా ఓటర్లు ఎక్కడ అధికంగా ఉన్నారే అంశాలపై నాయకులు లెక్కలు వేసుకుంటున్నారు. ఎస్సీ రిజర్వేడ్ స్థానాలు ఏమిటో? ప్రస్తుతం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చొప్పదండి, మానకొండూరు, ధర్మపురి నియోజకవర్గాలు ఎస్సీలకు కేటాయించారు. డీలిమిటేషన్ తర్వాత ఎస్సీలకు కేటాయించే స్థానాలపై ఎవరికి వారే జోరుగా లెక్కలేసుకుంటున్నారు.ప్రస్తుతం ఒక్కో నియోజకవర్గం రెండు, మూడు జిల్లాల్లో విస్తరించిఉంది. అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనకు జిల్లాలే ప్రాతిపదిక అని కేంద్ర ప్రభుత్వం రూపొందించిన చట్టంలో స్పష్టంగా ఉంది. దీంతో జిల్లా యూనిట్గా దేశవ్యాప్తంగా అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన ఉంటుంది. అంటే.. జిల్లాలోని మండలాల ఆధారంగానే కొత్త అసెంబ్లీ నియోజకవర్గాలకు సరిహద్దులు ఏర్పాటు చేయనున్నారు. ఉదాహరణకు.. సుల్తానాబాద్ మున్సిపల్, రూరల్తోపాటు సమీపంలోని ఎలిగేడు, కాల్వశ్రీరాంపూర్, ఓదెల మండలాలతో కలిపి సుల్తానాబాద్ నియోజకవర్గం ఏర్పాటయ్యే అవకాశం ఉంది. అలాగే రూరల్ ప్రాంతంతో కరీంనగర్ రూరల్, రాయిక ల్, సారంగాపూర్, బీర్పూర్ మండలాలతో జగి త్యాల రూరల్ నియోజకవర్గం, ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి, ముస్తాబాద్, గంభీరావుపేటతో ఎల్లారెడ్డిపేట నియోజకవర్గం, మెట్పల్లి నియోజకవర్గాలు ఏర్పాటయ్యే అవకాశాలు ఉన్నట్లు రాజకీ య విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
వైభవంగా ‘రామకోటి యజ్ఞం’
హుజూరాబాద్: పట్టణంలోని ఓ కన్వెన్షన్ హాల్లో సోమవారం రామకోటి యజ్ఞం వైభవంగా నిర్వహించారు. లోక కల్యాణార్థం చేపట్టిన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొనగా, రామనామ స్మరణతో హాల్ మారుమోగింది. ఈ యజ్ఞంలో ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ శ్వేత ప్రత్యేక చొరవ తీసుకున్నారు. సుమారు 650 మంది మహిళలను ఏకం చేసి, ఈ ఆధ్యాత్మిక క్రతువు విజయవంతం కావడంలో కీలక పాత్ర పోషించారు. గందె శ్రీనివాస్, సుద్దాల హరిశంకర్, గర్రెపల్లి శ్రీనివాస్, పుల్లూరి శ్రీకాంత్, బల్లు పున్నం, రేణుకుంట్ల సురేష్, ఆర్యవైశ్య నాయకులు నార్ల రాజేందర్, ఎస్ఆర్పీ శివనాథుని వేణుగోపాల్, కటుకం మారుతి, శివనాథుని శ్రీనివాస్, కటుకం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. యూనిఫామ్ కుట్టుపై శిక్షణ జూలపల్లి: మహిళలను అర్థికంగా బలోపేతం చేసేందుకు విద్యార్థుల యూనిఫామ్ కుట్టుపై అవగాహన కల్పించారు. స్థానిక వెలుగు సమాఖ్య కార్యాలయంలో సోమవారం శిక్షణ శిబిరం నిర్వహించగా.. సమాఖ్య అసిస్టెంట్ ప్రోగ్రాం మేనేజరు సుధాకర్ మాట్లాడారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలన్నారు. 13 పంచాయతీల నుంచి 45 మంది మహిళలు శిక్షణకు హాజరయ్యారు. ట్రెయినర్లు మసూద, సీసీలు ఆనంద్, అనిత, అకౌంటెంట్ అనిత తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు మెరుగైన వైద్యసేవలు సుల్తానాబాద్రూరల్: ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి ప్రమోద్కుమార్ అన్నారు. గర్రెపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో సోమవారం మెగా వైద్య శిబిరం నిర్వహించారు. గైనిక్, డెంటల్, ఆప్తాల్మిక్, చిల్డ్రన్, ఆర్థో, జనరల్ మెడికల్ సర్జన్ తదితర నిపుణులు వైద్య సేవలు అందించారు. పీహెచ్సీ పరిధిలోని గ్రామాలు, అనుబంధ గ్రామాలకు చెందిన దాదాపు 500 మంది ప్రజలు పరీక్షలు చేయించున్నట్లు డాక్టర్ ఉదయ్కుమార్ తెలిపారు. డిప్యూటీ డీఎంహెచ్వో రాములు, ఎంఎల్హెచ్పీఎస్, పీహెచ్ఎన్, సూపర్వైజర్, ఏఎన్ఎంలు, సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రజల సహకారంతో సుందరీకరణ
జ్యోతినగర్: రామగుండం నగర ప్రజల సహకారంతో సుందరీకరణ పనులు చేపడతామని మేయర్ మహంకాళి స్వామి అన్నారు. ఎన్టీపీసీ సింధూర కళాశాల రోడ్డు, ఎఫ్సీఐ క్రాస్రోడ్డు, రాజీవ్ రహదారి సర్వీసు రోడ్డులో కార్పొరేటర్లు వెంగల బాపు, కొలని కవితారెడ్డి, భూలక్ష్మి, స్వప్నప్రియ, ఎన్టీపీసీ ఏజీఎం బిజయ్కుమార్ సిగ్దర్తో కలిసి సోమవారం పర్యటించారు. స్వామి మాట్లాడు తూ, ఎన్టీపీసీ సోలార్ ప్రాజెక్టుకు నిర్మించిన ప్రహరీ ప్రమాదకరంగా ఉందన్నారు. ఓపెన్ డ్రైనేజీలో చెత్త పేరుకుపోయిందని, దానిని తొలగించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎఫ్సీఐ క్రాస్ రోడ్డులో కూల్చివేసిన సులభ్కాంప్లెక్స్ శిథిలాలను వెంటనే తొలగించి బస్షెల్టర్ను ప్రయాణికులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీకుకురావావాలని అన్నారు. త్వరలోనే ఎఫ్సీఐ క్రాస్ రోడ్డు సెంటర్ను విస్తరించి, సుందరీకరణ చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్, అధికారులు, ఎన్టీపీసీ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. సీస్సార్ ప్రత్యేక నిధులు కేటాయించాలి రామగుండం మేయర్ మహంకాళి స్వామి -
మార్కెట్ తరలింపు
పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రంలోని ప్రధాన కూరగాయల మార్కెట్ను కూల్చివేసి అదేస్థలంలో ఆధునిక సౌకర్యాలతో కూడిన భవన సముదాయం నిర్మించే పనులు ప్రారంభం కానున్నాయి. వ్యాపారుల కోసం స్థానిక వ్యవసాయ మార్కెట్లో తాత్కాలికంగా స్థలం కేటాయించారు. దీనిని మున్సిపల్ చైర్మన్, కమిషనర్, అధికారులు సోమవారం పరిశీలించారు. తమకు అవసరమైన స్థలాన్ని కేటాయించాలని వ్యవసాయ మార్కెట్కమిటీ చైర్మన్ కూర మల్లారెడ్డి జిల్లా మార్కెటింగ్ అఽధికారి ప్రవీణ్రెడ్డిని కోరారు. ఇందుకోసం మార్కెట్యార్డులోని ఓ షెడ్డును, ఖాళీస్థలాన్ని పరిశీలించారు. కొత్త మార్కెట్ పనులు పూర్తయ్యే వరకూ కూరగాయల మార్కెట్ను తాత్కాలికంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని కమిషనర్ వెంకటేశ్ తెలిపారు. చిరువ్యాపారులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఏఈ సతీశ్ తదితరులు ఉన్నారు. -
కులం పేరుతో దూషించిన వారిపై కేసు
చందుర్తి(వేములవాడ): సీతారామచంద్రస్వామి ఆలయ చైర్మన్ పదవి విషయంలో తలెత్తిన వివాదంలో కులం పేరుతో సర్పంచ్, ఉపసర్పంచ్తోపాటు మరో ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు చందుర్తి ఎస్సై జిల్లెల రమేశ్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాలు. రాజన్నసిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం లింగంపేటలో శ్రీసీతారామచంద్రస్వామి ఆలయ చైర్మన్ పదవి విషయంలో అదే గ్రామానికి చెందిన తర్రె శేఖర్కు సర్పంచ్ నరేశ్, ఉపసర్పంచ్ ఆకుల ఎల్లయ్య, మరో వ్యక్తి సుంకి వేణులకు శనివారం రాత్రి వివాదం తలెత్తింది. ఈ వివాదంతో తర్రె శేఖర్ను సర్పంచ్ నరేశ్, ఉపసర్పంచ్ ఆకుల ఎల్లయ్య, సుంకి వేణు కులం పేరుతో దూషించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసుపై సోమవారం వేములవాడ డీఎస్పీ శ్రీనివాసులు లింగంపేట ఆలయ ప్రాంగణంలో విచారణ చేపట్టారు. గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్, వేణులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయగా.. ఈ వివాదాన్ని ప్రోత్సహించిన డప్పుల అశోక్పై కేసు నమోదు చేశారు. డీఎస్పీ మాట్లాడుతూ శ్రీరామనవమి వేడుకలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని సూచించారు. ఉత్సవాలను పాత ఆలయ కమిటీ పర్యవేక్షణలో చేసుకోవాలని, అల్లర్లు సృష్టించి, గొడవలకు దిగితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. లింగంపేటలో విచారించిన డీఎస్పీ శ్రీనివాసులు -
రైలులో ప్రయాణికుడి హఠాన్మరణం
రామగుండం: కర్ణాటక రాష్ట్రంలోని యెలహంక నుంచి మధ్యప్రదేశ్లోని గ్వా లియర్కు వెళ్తు న్న ప్రయాణికుడు ధర్మేంద్రసింగ్ రాథోర్(42) సోమవారం అస్వస్థతతో హఠాన్మరణం చెందాడు. జీఆర్పీ ఔట్పోస్టు ఇన్చార్జి తిరుపతి కథనం ప్రకారం.. బెంగళూరులో టైల్స్ వర్క్ చేసే ధర్మేంద్రసింగ్రాథోర్ రైలు నంబరు 11085లో ఆదివారం సాయంత్రం గ్వాలియర్ వెళ్తున్న సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలులో ప్రయాణం చేస్తున్నాడు. బోగినంబరరు ఎస్–4లో పడుకున్న ప్రయాణికుడిని సోమవారం ఉదయం టికెట్ పర్యవేక్షకుడు నిద్రలేపారు. ఎంతకీ లేకపోవడంతో సెంట్రల్కు మెసేజ్ ఇచ్చాడు. అప్పటికే రైలు కాజీపేట దాటింది. బల్హార్షా వరకు హాల్టింగ్లేదు. అత్యవసరంగా రామగుండం రైల్వేస్టేషన్లో నిలిపి రైల్వే డాక్టర్తో పరీక్షించారు. అప్పటికే మృతిచెందినట్లు డాక్టర్ ధ్రువీకరించడంతో మృతదేహాన్ని గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆధార్కార్డు ఆధారంగా కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. మృతికి గల కారణాలు పూర్తిగా తెలియరాలేదు. బాలుడిని కాటేసిన కరెంట్ ● మెట్లకింద ఆడుకుంటుండగా విద్యుదాఘాతం ధర్మారం: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం కటికెనపల్లి గ్రామానికి చెందిన బొజ్జ సంపత్ కుమారుడు బొజ్జ అభిరాం(6) సోమవారం సాయంత్రం ప్రమాదవశాత్తు కరెంట్ షాక్కు గురై మరణించినట్లు ఎస్సై ప్రవీణ్కుమార్ తెలిపారు. ఇదే గ్రామంలోని అమ్మమ్మ ఇంటికి వెళ్లిన అభిరాం.. సమీపంలోని బల్ల కుమార్ ఇంటి వద్ద అడుకుంటూ ఉన్నాడు. ఈక్రమంలో మెట్ల కిందికి వెళ్లగా అక్కడఉన్న కరెంట్ ఎర్త్వైర్కు ప్రమాదవశాత్తు తగిలాడు. దానితో కరెంట్ షాక్కు గురై అక్కడకక్కడే మరణించినట్లు మృతి తండ్రి సంపత్ ఫిర్యాదు చేశాడు. ఈమేరకు కేసునమోదు చేసినట్లు ఎస్సై వివరించారు. ప్రమాదఘటన చూసి.. భయంతో సొమ్మసిల్లి● మృతి చెందిన మహిళ రఘునాథపల్లి: హన్మకొండ–హైదరాబాద్ జాతీయ రహదారిలోని వెంకటాయపాలెం వద్ద సోమవారం జరిగిన ప్రమాద ఘటనను చూసిన ఓ మహిళ తీవ్ర భయాందోళన చెంది మృతి చెందింది. పోలీసుల కథనం ప్రకారం.. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం పందిళ్ల గ్రామానికి చెందిన ఇల్లందుల పుష్పలత (45) కుటుంబ సభ్యులతో కలిసి కారులో హైదరాబాద్కు బయలుదేరారు. వెంకటయాపాలెం వద్ద టాయ్లెట్ కోసం కారు నిలిపి పుష్పలత కిందకు దిగగా, అదే సమయంలో ఓ ద్విచక్రవాహనదారుడు ప్రమాదవశాత్తు కిందపడ్డాడు. ఘటనను చూసిన పుష్పలత సొమ్మసిల్లి పడిపోగా కుటుంబ సభ్యులు వెంటనే జనగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై దూదిమెట్ల నరేశ్ తెలిపారు. త్వరలో క్యాథ్ల్యాబ్ సేవలు గోదావరిఖని: సింగరేణిలోనే తొలిసారి ఏర్పాటు చేస్తున్న క్యాథ్ ల్యాబ్ పనులపై ఆ సంస్థ చీఫ్ మెడికల్ ఆఫీసర్ కిరణ్రాజ్కుమార్ సోమవారం సమావేశమయ్యారు. రెనే హాస్పిటల్, హాస్పిటల్ వెండర్స్ మధ్య సమావేశం నిర్వహించారు. పనులు యుద్ధ ప్రాతిపదిక పూర్తిచేసి త్వరగా ప్రారంభించాలని ఆయన సూచించారు. డాక్టర్లు బాలకోటయ్య, అంబికా, రాజేశ్వర్రావు, రమేశ్, రెనే హాస్పిటల్ చైర్మన్ బంగారి స్వామి, డాక్టర్లు పాల్గొన్నారు. -
ఏఐటీయూసీపై విమర్శలు సరికాదు
● యూనియన్ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్యగోదావరిఖని: కార్మిక వర్గ శ్రేయస్సు, హక్కుల సాధన కోసం పోరాటం చేస్తున్న ఏఐటీయూసీని విమర్శిస్తే ఊరుకోబోమని ఆ యూనియన్ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరివి రాజ్కుమార్ హెచ్చరించారు. సోమవారం స్థానిక ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. తమ ఉద్యమానికి సంఘీభావం తెలిపి కార్మికుల ఐక్యతను చాటాలని వారు కోరారు. సింగరేణిలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు, యాజమాన్యం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై సేవ్ సింగరేణి పోరుజాత కార్యక్రమం ప్రారంభించామని అన్నారు. కార్మికుల సమస్యలను పరిష్కారం చేయకుండా సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. అందుకే పోరుబాట ఎంచుకున్నామని వారు అన్నారు. దీనిపై ఐఎన్టీయూసీ, సీఐటీయూ, హెచ్ఎంఎస్లు కార్మిక వర్గాన్ని బలహీన పర్చేలా విమర్శలు చేయడం సరికాదన్నారు. ఈనెల 30 వరకు జాతా కొనసాగుతుందని, చివరగా కొత్తగూడెం హెడ్ ఆఫీస్ ఎదుట వంటావార్పు, ముట్టడితో కార్యక్రమం ముగుస్తుందని తెలిపారు. సమస్యలు పరిష్కరించకుంటే ఏప్రిల్లో సమ్మె చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మడ్డి ఎల్లాగౌడ్, వీరభద్రం, ముస్కె సమ్మయ్య, సంకె అశోక్, రంగు శ్రీను, విజయలక్ష్మి, ఎంఏగౌస్ తదితరులు పాల్గొన్నారు. గనులపై గేట్ మీటింగ్లు సేవ్ సింగరేణి పోరుజాత కార్యక్రమంలో భాగంగా ఆర్జీ–1 ఏరియాలోని అన్ని గనులపై ఏఐటీయూసీ నాయకులు గేట్ మీటింగ్లు నిర్వహించారు. సంస్థ స్థితిగతులపై కార్మికులకు వివరించారు. పోరాటాల ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయని స్పష్టం చేశారు. -
ఆర్టీసీలో సమ్మె సైరన్
కరీంనగర్టౌన్: సమస్యల పరిష్కారానికి ఆర్టీసీ కార్మికులు సమ్మెకు సన్నద్ధమవుతున్నారు. రెండున్నరేళ్లుగా తమ వినతులను యాజమాన్యం పట్టించుకోకపోవడంతో ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 26 తర్వాత సమ్మెకు దిగుతామంటూ ఇటీవల హైదరాబాద్లో ఎండీ వై.నాగిరెడ్డికి సమ్మె నోటీస్ అందజేయడంతో చాలా రోజుల తర్వాత ఆర్టీసీలో జంగ్ సైరన్ మోగనుంది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని, పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జేఏసీ నాయకులు సమ్మె నోటీసు ఇవ్వడంతో కరీంనగర్ రీజినల్ పరిధిలోని 11 డిపోలలో ఉద్యోగులు, కార్మికులు సమ్మెకు సిద్ధమవుతున్నారు. 11 డిపోలు, 972 బస్సులు ఆర్టీసీ జేఏసీ పిలుపు మేరకు కరీంనగర్ రీజినల్ పరిధిలో కరీంనగర్– 1, కరీంనగర్ 2, హుస్నాబాద్, హుజురాబాద్, మంథని, గోదావరిఖని, వేములవాడ, కోరుట్ల, మెట్పల్లి, జగిత్యాల, సిరిసిల్ల డిపోలలో పని చేస్తున్న డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్లు ఇతర సిబ్బంది మొత్తం 3,236 మంది సమ్మెలోకి వెళ్లనున్నట్లు జేఏసీ నాయకులు తెలిపారు. అవసరమైతే నిరసనలు, ధర్నాలు, ర్యాలీలు చేపట్టి తమ హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. ప్రభుత్వం స్పందించి సమస్యలు పరిష్కరిస్తేనే రవాణా సేవలు అంతరాయం లేకుండా కొనసాగుతాయని, లేకుంటే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడుతుందని జేఏసీ నాయకులు పేర్కొన్నారు. ప్రభుత్వంలో విలీనానికి నోటీసు ఈనెల 26 తర్వాత ఏ క్షణమైనా సమ్మెకు సిద్ధం ఇటీవల జేఏసీ ఆధ్వర్యంలో ఎండీకి నోటీస్ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు చేయాలి. 2017 నుంచి అలవెన్స్, బెనిఫిట్స్, వేతన సవరణ బకాయిలు చెల్లించాలి. రిటైర్డ్ ఉద్యోగులకు 2017 వేతన సవరణ అమలు చేయడం, 2021 వేతన సవరణ 30 శాతం ఫిట్మెంట్ చేయడం. 2025 వేతన సవరణ అమలు చేస్తూ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు చెల్లించాలి. మహాలక్ష్మి పథకంలో జీరో టికెట్ బదులు మహిళలకు స్మార్ట్ కార్డు ఇవ్వాలి. మహాలక్ష్మి పథకం కింద ప్రభుత్వం ప్రతినెలా కోత విధించకుండా రూ.400కోట్లు ఇవ్వాలి. పాత బకాయిలు రూ.2,500 కోట్లు చెల్లించాలి. అన్ని కేటగిరిల్లో ఖాళీలు భర్తీచేసి అర్హులకు ప్రమోషన్లు ఇవ్వాలి. ప్రతీ కార్మికుడికి 21 రోజుల హాజరుతో ఇన్సెంటివ్ ఇవ్వాలి. ఉద్యోగి కుటుంబానికి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో వైద్య సౌకర్యం కల్పించాలి. రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు చెల్లించాలి. రిటైర్డ్ కాబోతున్న ఉద్యోగులకు ఆదేరోజు సెటిల్మెంట్ మొత్తం చెల్లించాలి. -
హద్దులు నిర్ణయించి.. ఆక్రమణలు ఆపండి
● గొర్రెలకాపరుల సంక్షేమ సంఘం నేతల డిమాండ్ ● కలెక్టరేట్ ఎదుట గొంగడితో కళాకారుల నిరసన పెద్దపల్లి: తమకు కేటాయించిన స్థలాలు ఆక్రమణకు గురికాకుండా చూడాలని గొ ర్రెల కాపరుల సంక్షేమ సంఘం ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈమేరకు సోమ వారం కలెక్టరేట్ ఎదుట గొంగడి ధరించి నిరసన తెలిపారు. గొర్రెలు, మేకల మార్కెట్ యార్డు స్థలాలకు హద్దులు నిర్ణయించలేదన్నారు. జిల్లా యంత్రాంగం హద్దులు నిర్ణయించి, ఆక్రమణలు ఆపాలాని కోరారు. తొలుత ఒగ్గు కళాకారుడు నర్ర సతీశ్ బృందం గొంగడితో ప్రదర్శన నిర్వహించారు. గొర్రెల కాపరుల సంక్షే మ సంఘం జిల్లా అధ్యక్షుడు సలేంద్ర రాములు యాదవ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారం తిరుపతి యాదవ్, ఉపాధ్యక్షుడు శిలారపు పర్వతాలు యాదవ్ మాట్లాడారు. ప్రతినిధులు తాత రాజుయాదవ్, మేకల్ నర్సయ్య యాదవ్, దాడి చంద్రమౌళి యాదవ్, వేల్పుల రామ్మూర్తి యాదవ్, తాత సదానందం, తమ్మిన వేణి కొమరయ్య, అట్లా లక్ష్మయ్య, నూనేటి సంపత్ యాదవ్, ఆవుల లత ఉన్నారు. -
అర్జీలపై నిర్లక్ష్యం వద్దు
మంగళవారం శ్రీ 24 శ్రీ మార్చి శ్రీ 2026పెద్దపల్లి: ప్రజావాణి ద్వారా అందిన అర్జీలకు సత్వర పరిష్కారం చూపాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. అదనపు కలెక్టర్ వేణుతో కలిసి కలెక్టరేట్లో సోమవారం ప్రజావాణి ద్వారా దరఖాస్తులు స్వీకరించారు. ఎలిగేడు మండలం సుల్తాన్పూర్ గ్రామానికి చెందిన ఎ.శ్యామల.. సర్వే నంబర్ 12/ఆ/2, 47ఆ/5లో తన భర్తకు భూమి ఉండేదని, ఆయన మరణించినందున ఆ భూమి తన పేరిట విరాసత్ చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకుంది. పెద్దపల్లి మండలం పెద్దకల్వలకు చెందిన నారసాని వెంకటేశ్.. గ్రామంలో తనకు మీసేవ కేంద్రం ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ దరఖాస్తు చేసుకున్నాడు. పకడ్బందీగా ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని కట్టుదిట్టంగా అమలు చేయాలని కలెక్టర్ శ్రీహర్ష ఆదేశించారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణపై అ దనపు కలెక్టర్ వేణుతో కలిసి కలెక్టరేట్లో ఆయన సమీక్షించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో సిబ్బంది కదలికలపై ని ఘా ఉంచాలన్నారు. పెండింగ్ ఫైళ్ల పరిష్కారంలో పురో గతి లేదన్నారు. ప్రొటోకాల్ ప్రకారం ఎంపీ, ఎమ్మెల్యేల క న్నా ప్రభుత్వ విప్ ముందువరుసలో ఉంటారని, ఈ విషయంపై అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. రూ. 25.77 కోట్లతో చేపట్టిన 398 సీసీ రోడ్లు తదితర అభివృద్ధి పనులను ఈనెల 28వరకు పూర్తిచేయాలని చెప్పారు. అనంతరం పలు విభాగాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యక్రమంలో డీఎంహెచ్వో ప్రమోద్కుమార్, డీఆర్డీవో కాళిందిని, పంచాయతీరాజ్ ఈఈ శంకరయ్య, కలెక్టరేట్ ఏవో ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు. 4.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం ఈ యాసంగిలో 4.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు ప్రణాళిక సిద్ధం చేయాలని కలెక్టర్ శ్రీహర్ష ఆదేశించారు. కలెక్టరేట్లో యాసంగి ధాన్యం కొనుగోళ్లపై సమీ క్షించారు. కూనారం రైల్వే ఫ్లైఓవర్ భూ సేకరణ పనులు వేగవంతం చేయాలని సూచించారు. ఆర్డీవో గంగయ్య, ఆర్ అండ్ బీ ఈఈ భావ్సింగ్, తహసిల్దార్ రాజ్కుమా ర్, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్ పాల్గొన్నారు. దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశాలు ప్రజావాణి ద్వారా అర్జీల స్వీకరణ


